breaking news
Mulugu
-
సమస్యలు పరిష్కరించండి మహాప్రభో!
ములుగు: ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూసమస్యలు పరిష్కరించాలని బాధితులు మొర పెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జి, ఐటీడీఏఓ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఇన్చార్జ్ ఏపీఓ ప్రతాప్లు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో 81, గిరిజన దర్బార్లో 19 వినతులు రాగా ఆయాశాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్ఓ రవికుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.బాగోగులు చూసుకోవడం లేదు..తను సంపాదించిన ఆస్తిని (భూమి) ఐదుగురు కుమారులకు సమానంగా పంచాను. భర్త కండియా 6 నెలల క్రితం చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత కొడుకులు తిండి పెట్టడం లేదు. దగ్గరికి రానివ్వక పోవడంతో ఒంటరిగా ఉంటున్న. ఇచ్చిన భూమి దున్నుకొని బతుకుతున్నారే తప్ప నన్ను పోషించడం లేదు. న్యాయం చేయాలి. – నునావత్ ముంగాలి, చింతకుంటఇందిరమ్మ ఇల్లు ఇప్పించండిచిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. నాన్నమ్మ దగ్గర పెరిగాను. ప్రస్తుతం లారీ క్లీనర్గా పనిచేస్తూ నాన్నమ్మ (వృద్ధురాలు)ను పోషించుకుంటున్న. ఇల్లు లేకపోవడంతో వర్షానికి ఇబ్బందులు పడుతున్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – పారనందుల శ్రీను, రామాంజాపూర్● ప్రజావాణి, గిరిజన దర్బార్లో బాధితుల మొర అర్జీలను స్వీకరించిన అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఎస్డీసీ ప్రతాప్ గ్రీవెన్స్లో 81, గిరిజన దర్బార్లో 19 వినతులు -
పల్లపు ప్రాంతాలను పరిశీలించిన ఏఎస్పీ
వాజేడు: గోదావరి వరదలతో ముంపునకు గురయ్యే పల్లపు ప్రాంతాలను ఏటూరునాగారం ఏఎస్పీ మనన్బట్ పరిశీలించారు. సోమవారం వాజేడు మండలపరిధిలోని టేకులగూడెం సమీపంలో ఉన్న రేగుమాకు ఒర్రె , పేరూరు పోలీస్స్టేషన్ పరిధిలోని సరిహద్దు ప్రాంతాల్లోని ముంపు ప్రాంతాలను వెంకటాపురం(కె) సీఐ ముత్యం రమేశ్తో కలిసి పరిశీలించారు. భారీ వర్షాలు కురిసి గోదావరి వరదలు వస్తే ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ చర్యలుపై చర్చించారు. ఆయన వెంట వెంకటాపురం(కె) సీఐ ముత్యం రమేష్, పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ ఉన్నారు. -
గడువులోగా గణన ఫారాల పంపిణీ పూర్తి చేయాలి
● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిములుగు: ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా గణన ఫారాల పంపిణీని నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ గణన ఫారాలను బూత్ స్థాయి అధికారులు మాత్రమే పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికార వ్యక్తులతో గణన ఫారాలను పంపిణీ చేయకూడదన్నారు. బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి గణన ఫారాలను పంపిణీ చేయాలని, అర్హత కలిగిన ఓటరు తన ఫారాన్ని తప్పనిసరిగా సమర్పించేలా అవగాహన కల్పించాలన్నారు. గణన ఫారాన్ని సమర్పించిన ఓటర్ల వివరాలు మాత్రమే ముసాయిదా ఓటరు జాబితాలో కొనసాగించబడతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నమోదు అధికారి ఆర్డీఓ కృష్ణవేణి, సహాయ ఎన్నికల నమోదు అధికారి, తహసీల్దార్ విజయభాస్కర్, అధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ములుగు/ములుగు రూరల్: డ్రగ్స్ మహమ్మరిని తరిమికొడదామని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ డ్రగ్స్, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఇతర అధికారులు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హేమంత్ సహదేవరావు హాజరై మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి లక్ష్యం చేరుకుని దేశానికి గొప్ప ఆస్తిగా ఎదగాలని సూచించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడానికి ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవిందర్, డీడబ్ల్యూఓ ప్రేమలత, నషా ముక్త్ భారత్ అభియాన్ కో ఆర్డినేటర్ నాగేంద్ర, ఎఫ్ఆర్ఓ గణేష్, డీసీపీఓ ఓంకార్, డీఎంసీ రమాదేవి, సీఏ లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన దర్బార్లో సమస్యలు ఇలా..
ఏటూరునాగారం: మహబూబాబాద్ కొత్తగూడ మండలం బత్తుపల్లికి చెందిన నిరుద్యోగురాలు ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్ ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్నారు. వాజేడు మండలం ఐటీఐ కార్యాలయంలో ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. కన్నాయిగూడెం మండలం ఐలాపురంలో గిరి వికాసం పథకం కింద వేసిన 26 బోర్లకు మోటార్లను ఇప్పించాలని కోరారు. ఖానాపురం మండలం భద్రుతండాలో కల్వర్టు మంజూరు చేయాలని కోరారు. వెంకటాపురం(ఎం) మండలం అందుగల మీది గ్రామంలో రేషన్షాపు నూతనంగా ఇప్పించాలని వేడుకున్నారు. భూపాలపల్లి మహాముత్తారం పీఎంఆర్సీలో కంప్యూటర్ ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో ఈఈ వీరభద్రం, డీటీ అనిల్, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, జీసీసీ డీఎం వాణి, జేడీఎం కొండల్రావు, జియాలజిస్ట్ కిషోర్, పెసా కోఆర్డినేటర్ ప్రభాకర్, ఐటీడీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి, ఆర్టీసీ కంట్రోలర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.వినతులు స్వీకరిస్తున్న ఎస్డీసీ ప్రతాప్ -
పెట్టుబడి సాయమెంత?
ములుగు: వానాకాలం పెట్టుబడి సాయం అందించేందుకు రంగం సిద్ధమైంది. నేడు (మంగళవారం) రైతు భరోసా నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే పెట్టుబడి సాయం ఎన్ని ఎకరాలకు అందుతుందో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చింది. మొదట్లో రెండు విడతల్లో కలిపి ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి సాయాన్ని అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి రూ.12వేల చొప్పున రెండు విడుతల్లో అందిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదు. ప్రస్తుత వానాకాలం సీజన్కు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తుందో స్పష్టత లేకపోవడంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో 86,736 మంది రైతులు జిల్లాలో మొత్తం 86,736 మంది రైతులున్నారు. పూర్తి స్థాయిలో రైతు భరోసా పథకం అమలు చేయడానికి రూ.104.38 కోట్ల నిధులు అవసరం ఉంది. గత వానాకాలం సీజన్లో రైతులందరికీ పెట్టుబడి సాయం అందించిన సర్కారు.. యాసంగికి వచ్చేసరికి రెండెకరాలకే పరిమితం చేసింది. యాసంగి సీజన్ ముగుస్తున్న సమయంలో పెట్టుబడి సాయాన్ని అందించడం గమనార్హం. ప్రస్తుత వానాకాలం సీజన్కు సంబంధించిన నిధులను జూన్ 30న విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎన్ని విడతలు, ఎన్ని ఎకరాలకు ఇస్తారో చెప్పలేదు. మళ్లీ ఒకటి, రెండు ఎకరాలకు వేసి చేతులెత్తేస్తారా, పూర్తి స్థాయిలో అమలు చేస్తారా? అనే సందేహాలు రైతుల్లో నెలకొన్నాయి. పెట్టుబడులకు ఊరట ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తే రైతాంగానికి వ్యవసాయ పెట్టుబడులకు గాను కొంత ఊరట లభించనుంది. ఇప్పటికే ఎకరానికి సుమారు రూ.10వేల వరకు పెట్టుబడి పెట్టారు. దుక్కులు దున్నడం, విత్తనాలు నాటడంతో పాటు ఎరువులు తీసుకొని నిల్వ చేసుకుంటున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభంలోనే ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించనుండడంతో పంటల పెట్టుబడికి కొంత ఉపశమనం కలుగుతుందని రైతులు భావిస్తున్నారు. స్పష్టత రావాల్సి ఉందిరైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎన్ని ఎకరాలకు ఎన్ని విడతల్లో పెట్టుబడి సాయాన్ని అందిస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పెట్టుబడి సాయం అందుతుంది. రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలోని 86,736 మంది రైతులకు రూ.104.38 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించాం. – సురేష్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి మండలాల వారీగా రైతులు, అవసరమైన నిధులు (రూ.కోట్లలో) మండలం రైతులు పెట్టుబడి సాయంనేడు ‘రైతు భరోసా’ నిధుల విడుదల ఎన్ని ఎకరాలకు అందుతుందో స్పష్టత కరువు యాసంగిలో రెండెకరాలకే అందిన సాయం జిల్లాలో 86,736 మంది రైతులకు రూ.104.38 కోట్లు -
హాస్టళ్లను తనిఖీ చేసిన కమిషనర్
ములుగు: ములుగు పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ఎస్సీ, బీసీ బాలుర వసతి గృహాలను కమిషనర్ సంపత్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, వంటగది పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ, హాస్టల్ గదుల పరిశుభ్రత, విద్యుత్, పారిశుద్ధ్య నిర్వహణ, రికార్డులతో పాటు తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు నాణ్యతతో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తనిఖీలో కమిషనర్తో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ ఉదయ్ కిరణ్, తదితరులు ఉన్నారు. -
ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి
ములుగు: వర్షాకాలంలో సంభవించే భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, విపత్తు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి జిల్లా స్థాయి అధికారులతో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, విపత్తు నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలను ముందుగానే గుర్తించి వారికి మూడు నెలలకు సరిపడే రేషన్ బియ్యాన్ని జూలై నెలలోనే అందుబాటులో ఉంచాలని, గ్రామాల పరిధిలో ముంపునకు గురయ్యే గృహాలను పంచాయతీ కార్యదర్శులు ముందుగానే గుర్తించి జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. గర్భిణులు, వృద్ధులను ముందస్తుగా గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఆకస్మికంగా నీటి ప్రవాహాలు పెరిగే ప్రాంతాల్లో పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, స్థానిక సంస్థల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ రవాణాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డీడీఆర్ఎఫ్ బృందాలు మేడారం, ఏటూరునాగారం ప్రాంతాల్లో సిద్ధంగా ఉండాలని, పడవలు, లైఫ్ జాకెట్లు, నైలాన్ రోప్స్, ఇతర సహాయక సామగ్రిని అవసరమైన మండల కేంద్రాలలో వికేంద్రీకరణ విధానంలో ముందుగానే అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, అదనపు కలెక్టర్లు సీహెచ్.మహేందర్జీ, సంపత్ రావు, ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్ఓ రవికుమార్, డీ ఎస్పీ రవీందర్, అధికారులు పాల్గొన్నారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు -
నేడు వరంగల్కు నితిన్ నబీన్
హన్మకొండ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా సోమవారం వరంగల్నగరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో గిరిజన ప్రతినిధులతో సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం 2 గంటలకు గిరిజన ప్రతినిధులతో జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. 3.10 గంటలకు సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4.40 గంటలకు హరిత కాకతీయ హోటల్కు చేరుకుంటారు. 4.40 నుంచి 5 గంటల వరకు హోటల్లో ఉంటారు. 5.10కి భద్రకాళి దేవస్థానం చేరుకుని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు సమర్పించుకుంటారు. అనంతరం హైదరాబాద్కు వెళ్తారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం పార్టీ నాయకులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుని పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేల దిశా నిర్ధేశం చేయనున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పార్టీ కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, నాయకులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, చాడా శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, డాక్టర్ పెసరు విజయ్చందర్ రెడ్డి, వన్నాల వెంకటరమణ, జలగం రంజిత్, కుసుమ సతీష్, గుజ్జ సత్యనారాయణ రావు, సండ్ర మధు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి గిరిజన ప్రతినిధులతో సహపంక్తి భోజనం.. సమావేశం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలమైదానంలో కార్యకర్తలతో సమావేశం -
ఏజెన్సీలో భారీ వర్షం
ఏటూరునాగారం: ఏజెన్సీలోని ఏటూరునాగారం, వాజేడు మండలాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈ మేరకు ఏటూరునాగారం మండలంలో 9 మిల్టీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. అలాగే వాజేడు మండల పరిధిలోని అత్యధికంగా 27.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం మండలంలోని ఎలిశెట్టిపల్లి వద్ద జంపన్నవాగును ప్రజలు బోటులో దాటారు. ఇటీవల వర్షాలకు కొండాయి– దొడ్ల మధ్యలో ఉన్న జంపన్నవాగు ఉధృతికి తాత్కాలిక రోడ్డు తెగిపోగా ప్రజల అవసరాల నిమిత్తం మళ్లీ తాత్కాలికంగా రోడ్డు వేశారు. దీంతో కొండాయి, మల్యాల, కొత్తూరు, గోవిందరాజుల కాలనీ ప్రజలకు రాకపోకలను మొదలయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు అలాగే జీసీసీ వెనుకాల ఉన్న కొత్తగుడిసెల్లోని ఇళ్లకు నీరు వచ్చి చేరింది. ఆదివారం భారీ వర్షం కురవడంతో లోతట్టులో ఉన్న ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో నివాసం ఉంటున్న ప్రజలు నీటిని బయటకు పారబోస్తున్నారు. ఎత్తిపారబోసుకున్నారు. వర్షాలు ఎక్కువైతే గోడలు కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు స్థానికులు తెలిపారు. -
మీసేవలు సులభతరం
ఏటూరునాగారం: రాష్ట్రంలోని మీసేవ కేంద్రాల ద్వారా వివిధ ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. ఆదాయం, కులం, నివాసం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలు, ఈబీసీ, ఓబీసీ వంటి రెవెన్యూ శాఖ సేవల వెరిఫికేషన్ కోసం ఇకపై ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలవరీ(ఈఎస్డీ మీసేవ) కమిషనర్ రవికిరణ్ సర్క్యూలర్ జారీ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్(లోకల్బాడీ) సంపత్రావు, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్, మేనేజర్ దేవేందర్తో కలిసి ఈ డిజిటల్ సేవలతో పాటు పలు అంశాలపై మీసేవ కేంద్రాల నిర్వహకులతో సమీక్షించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయి పరిశీలనకు దరఖాస్తుదారులపై భౌతిక పత్రాల సమర్పణకు ఎలాంటి ఒత్తిడి తీసుకురావొద్దని ఆదేశాలు ఇచ్చారు. మొబైల్ యాప్ ద్వారానే.. రెవెన్యూ సేవల ధ్రువీకరణ ప్రక్రియలో పారదర్శకత, వేగం పెంచేందుకు ఈఎస్డీ సంస్థ ‘జీపీఓ, ఎమ్మార్ఐ వెరిఫికేషన్ మొబైల్ అప్లికేషన్’ను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలో గతంలో ఈ యాప్ గురించి నిర్వహకులకు, ప్రజలకు తెలిసే విధంగా అవగాహన కల్పించారు. ఈ మొబైల్ యాప్ విధానాన్ని కేవలం ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకే పరిమితం చేసినప్పటికీ ప్రస్తుతం దీనిని రెవెన్యూశాఖలోని అన్ని కేటగిరిల సేవలకు విస్తరించారు. ఈ యాప్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులు మీసేవ కేంద్రాల్లోని దరఖాస్తు వివరాలను, ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పత్రాలను నేరుగా మొబైల్లోనే పరిశీలించి జారీ చేయవచ్చు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు దరఖాస్తుదారుల నుంచి అధికారులు పత్రాలను నేరుగా తీసుకోవద్దని జిల్లా, మండల, గ్రామ స్థాయిలోని తహసీల్దార్లు, ఎమ్మార్ఐలు, జీపీఓలందరికీ సీసీఎల్ఏతో పాటు జిల్లా యంత్రాంగం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా మీసేవ కేంద్రాల నిర్వహకులు దరఖాస్తుదారులను భౌతిక పత్రాల కోసం ఇబ్బంది పెట్టకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు తప్పితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలం కేంద్రాలు ములుగు 9 మల్లంపల్లి 2 వెంకటాపురం(కె) 7 గోవిందరావుపేట 6 ఎస్ఎస్తాడ్వాయి 5 ఏటూరునాగారం 6 కన్నాయిగూడెం 2 మంగపేట 10 వాజేడు 4 వెంకటాపురం(కె) 5 కాగితరహిత సేవలపై ఉన్నతాధికారుల సమీక్ష తహసీల్దార్లకు ఆదేశాలు జారీ మొబైల్ యాప్లో సేవలు -
కొలువులకు వేళాయె!
ములుగు: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్వాడీ ఉపాధ్యాయ, సహాయకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో అంగన్ వాడీ పోస్టుల భర్తీకి ఈ నెల 30వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం. జిల్లాలో ని ములుగు, ఎస్ఎస్ తాడ్వాయి, మంగపేట, వెంకటాపురం(కె) ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యా ప్తంగా 95 టీచర్, 349 ఆయాల పోస్టుల ఖాళీలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేయకపోవడంతో వాటి నిర్వహణ కూడా ఇబ్బందిగా మారింది. మరికొన్ని చోట్ల టీచర్లకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో రెండుచోట్ల విధులు నిర్వహించడం ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేస్తే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మెరుగుపడుతుందని ప్రజాప్రతినిధులు, అధికారులు భావిస్తున్నారు. 17వేల మందికి పౌష్టికాహారం జిల్లాలో ములుగు, ఏటూరునాగారం, తాడ్వాయి, వెంకటాపురం(కె) ప్రాజెక్టులు ఉండగా 640 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 17 వేల మంది పిల్లలు, బాలింతలు, గర్భిణులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం తీసుకుంటున్నారు. ఈ నాలుగు ప్రాజెక్టుల పరిధిలో టీచర్ పోస్టులు 95 ఖాళీగా ఉండగా ఆయా పోస్టులు 349 ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం విడతల వారీగా భర్తీ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. తొలి విడతలో ఎస్ఎస్ తాడ్వాయి, వెంకటాపురం(కె) ప్రాజెక్టు పరిధిలోని పోస్టులను, రెండు, మూడు విడతల్లో ములుగు, ఏటూరునాగారం ప్రాజెక్టులతో పాటు జిల్లాలో మిగిలిన ఖాళీలన్నీ ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు తెలిసింది. జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టుల భర్తీ కోసం కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండే సెలక్షన్ కమిటీ కీలకపాత్ర పోషించనుంది. ఈసారి అంగన్వాడీ టీచర్ పోస్టుకు ప్రభుత్వం ఇంటర్ అర్హతను ప్రామాణికంగా తీసుకోనుండడంతో టీచర్ పోస్టుల ఎంపికపై కొంత గందరగోళం నెలకొంది. ఇంటర్ను ఎత్తివేసి పదో తరగతి ఉత్తీర్ణతను ప్రామాణికంగా తీసుకోవాలని ఇప్పటికే పలువురు అధికార యంత్రాంగాన్ని కోరుతున్నారు. ఆయా పోస్టులకు మాత్రం ఇంటర్ అర్హతపై సడలింపు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. అంగన్వాడీ టీచర్ల భర్తీని ఇంటర్వ్యూ, ఇంటర్ మార్కులు, రిజర్వేషన్ అంశాల్లో వెయిటేజీ మార్కుల ఆధారంగా జిల్లా సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. అంగన్వాడీల్లో టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్ జిల్లాలో 95 టీచర్, 349 ఆయా పోస్టుల భర్తీకి కసరత్తు ఈనెలాఖరులోగా వెలువడనున్న నోటిఫికేషన్జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. తొలి విడతలో ఎస్ఎస్తాడ్వాయి, వెంకటాపురం(కె) ప్రాజెక్టుల పరిధిలోని 35 టీచర్, 103 ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాయి. రెండు, మూడో విడతలో మిగిలిన పోస్టులను భర్తీ చేయనున్నాం. అంగన్వాడీ కేంద్రాల పనితీరును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఖాళీల భర్తీ చేపడుతున్నాం. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా దరఖాస్తులు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తాం. – ప్రేమలత, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి -
డిటోనేటర్ల వినియోగాన్ని నిలిపేయాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి గనుల్లో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వినియోగం కారణంగా పలు నియర్–మిస్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని.. తాత్కాలికంగా డిటోనేటర్లను నిలిపివేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి ఆసిఫ్ పాషా డిమాండ్ చేశారు. ఆదివారం ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ డిటోనేటర్లతో మైనింగ్ సిబ్బంది, ముఖ్యంగా షార్ట్ ఫైరర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. అండర్ గ్రౌండ్లో తడి ప్రదేశాల్లో బ్లాస్టింగ్ ఆపరేషన్లు ఆలస్యమవుతున్నాయన్నారు. ఎలక్ట్రానిక్ డిటోనేటర్లలో డిజిటల్ సందేశాలు కొన్నిసార్లు తప్పుగా ప్రదర్శించబడుతున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జి శ్రీనివాస్, బ్రాంచ్ కమిటీ నాయకులు తాళ్ల పోశం పాల్గొన్నారు. -
సబ్ సెంటర్ల పరిశీలన
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ఏటూరునాగారం, గంగారం, తదితర సబ్ సెంటర్లను ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ పరిశీలించారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంతో పాటు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బంది సూచనలు చేశారు. వైద్య సిబ్బంది వర్షాకాలం ముగిసే వరకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. ఇంటింట తిరుగుతూ జ్వర పీడితులను గుర్తించాలన్నారు. రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: జిల్లాలోని కొత్త పట్టాదారులైన రైతులు రైతుభరోసా పథకం లబ్ధి పొందడానికి జూలై 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి బాబురావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 15 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు ఈ విడతలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు స్పష్టం చేశారు. అర్హులైన రైతులు భర్తీ చేసిన రైతుభరోసా దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డ్ జిరాక్స్, కొత్త పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్లను ఏఈఓలకు అందజేయాలని సూచించారు. జూలై 30 నుంచి అర్హులైన రైతులకు రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అర్హులైన కొత్త రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కోటగుళ్లలో జడ్జి ప్రత్యేక పూజలు గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షత్రం కోటగుళ్లలో పరకాల జూనియర్ సివి ల్ జడ్జి శ్రీవల్లి శైలజ ఆదివారం ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఆలయ అర్చకుడు జూపల్లి నాగరాజు సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఏకతాటిపైకి రావాలి భూపాలపల్లి రూరల్: భవిష్యత్ తరాల అభివృద్ధి, సనాతన ధర్మం కోసం హిందువులందరూ ఏకతాటిపైకి రావాలని ఎండోమెంట్ (థార్మిక) సెల్ విభాగం స్టేట్ జాయింట్ కన్వీనర్, జిల్లా ఇన్చార్జ్ మాడుగుల రవీందర్ శర్మ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జిల్లా సెల్ కన్వీనర్ కర్ర జయపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చాయ్ చర్చ కార్యక్రమానికి మాడుగుల రవీందర్ శర్మ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారిని సమాన దృష్టితో చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ విభాగం జిల్లా కో కన్వీనర్లు నరేందర్ రెడ్డి, సునీల్ చంద్ర, జాయింట్ కన్వీనర్లు పండగటి పురుషోత్తం, బండారి రమేష్, శ్రీనివాస్ చార్యులు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ముత్యాలమ్మకు బోనాలు మంగపేట : మండల పరిధిలోని బోరునర్సాపురం పంచాయతీ పరిఽధిలోని పాతనర్సాపురం గ్రామస్తులు ఆదివారం ముత్యాలమ్మ బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలో బొడ్రాయితో పాటు గ్రామ దేవతల ప్రతిష్టాపన మహోత్సవాన్ని మూడు రోజుల పాటు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం శనివారంతో ముగియడంతో గ్రామస్తులు ఆదివారం ముత్యాలమ్మకు బోనాలను సమర్పించారు. -
పోలియో రహిత జిల్లాగా మార్చాలి
ములుగు రూరల్: ములుగును పోలియో రహిత జిల్లాగా మార్చాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని, మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో మొత్తం 22,572 మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు. 312 బూతులు ఏర్పాటు చేసి 15 మొబైల్ టీంలు, 10 ట్రాన్సిట్ బూతులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే 36 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి మొబైల్ టీంల ద్వారా పోలియో చుక్కలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పల్స్పోలియో కేంద్రాలను జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు పర్యవేక్షించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి సుధీర్, మున్సిపల్ కమిషనర్ సంపత్రెడ్డి, మాస్ మీడియా అధికారి సంపత్, దుర్గారావు, నందకిశోర్, రవి, దేవమ్మ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. 14 కిలో మీటర్లు కాలినడకన.. గోవిందరావుపేట: మండల పరిధిలోని చిన్నారులకు వైద్య సిబ్బంది 14కిలో మీటర్లు కాలినడకన వెళ్లి పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఆదివారం నిర్వహించిన పల్స్పోలియో కార్యక్రమంలో భాగంగా చల్వాయి పీహెచ్సీ ఆధ్వర్యంలో గొత్తికోయగూడెం మామిడితోట సబ్ సెంటర్లో పోలియో చుక్కలు వేశారు. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో ఆరోగ్య సహాయకుడు జంపయ్య, ఆరోగ్య కార్యకర్త దేవి 14కిలో మీటర్లు నడిచివెళ్లి పోలియో చుక్కలు వేశారు. మూడు కిలోమీటర్లు.. ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని నార్లాపూర్ పరిధిలోని తక్కళ్లగూడెం గొత్తికోయ గూడెంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని కొడిశాల పీహెచ్సీ వైద్యసిబ్బంది ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. గూడెంకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి చిన్నారులకు, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేశారు. చుక్కలు వేసిన సిబ్బందిని గూడెం వాసులు అభినందించారు. డీఎంహెచ్ఓ గోపాల్రావు -
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
ములుగు రూరల్: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యక్రమంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ఆరోగ్యశాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రణాళిక ప్రకారం పోలియో కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. జిల్లాలో 22,572 మంది ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్నారని 312 బూతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 36 రూట్లు, బస్టాండ్ వద్ద బూత్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారి సుధీర్, వ్యాధి నిరోదక టీకాల నియంత్రణ అధికారి నాగఅన్వేష్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, రంజిత్, మాస్ మీడియా అధికారి సంపత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దుర్గారావు, సాంబయ్య, స్వరూప, సురేష్బాబు పాల్గొన్నారు. 30వరకు గడువు భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో 2026–27, 2027–28 విద్యా సంవత్సరాలకు వివిధ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తులకు ఈ నెల 30వ తేదీతో గడువు ముగుస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లానాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఐటీఐ తెలంగాణ వెబ్సైట్ ద్వారా ప్రవేశాలకు సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఐటీఐ భూపాలపల్లి కార్యాలయాన్ని, సెల్ నంబర్ 85004 65034ను సంప్రదించాలని సూచించారు. -
అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పంపాలి
ములుగు: తల్లిదండ్రులు చిన్న పిల్లలను మొదటగా అంగన్ వాడీ పాఠశాలలకు పంపాలని డీడబ్ల్యూఓ ప్రేమలత తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఎస్టీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పాఠశాల సంసిద్ధత మేళా కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంతో పాటు ప్రీ స్కూల్ కార్యక్రమాలను అన్ని విధాలుగా నిర్వహించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల అభివృద్ధికి తోడ్పడేలా శారీరక, భాషా, మేధాభివృద్ధి పూర్వ గణితాభివృద్ధికి సంబంధించిన ఆట, పాటలు నేర్పించాలన్నారు. కార్యక్రమంలో ములుగు ప్రాజెక్ట్ సీడీపీఓ శిరీష, ఎస్టీ కాలనీ కార్పొరేటర్ స్వాతి, ప్రథమ్ ఫౌండేషన్ మాస్టర్ ట్రైనర్ నాగేశ్వర్రావు, సూపర్వైజర్ కళావతి, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. డీడబ్లూఓ ప్రేమలత -
బీఎల్ఓలకు ప్రజలు సహకరించాలి
ములుగు: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇంటింటికీ వచ్చే బూత్ స్థాయి అధికారులకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. జిల్లాలో ప్రతి ఇంటిని సందర్శిస్తూ బీఎల్ఓలు ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ప్రతి కుటుంబానికి ఎన్యూమరేషన్ ఫారమ్ అందజేస్తారని, కుటుంబ సభ్యుల వివరాలు, పేరు, వయస్సు, చిరునామా, ఓటరు నమోదు సంబంధిత వివరాలను పరిశీలించి సరైన సమాచారం అందించాలని సూచించారు. ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదై ఉంటే తొలగించడం, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం, కొత్తగా అర్హత పొందిన ఓటర్లను చేర్చడం, తప్పులున్న వివరాలను సరిచేయడం వంటి ముఖ్యమైన ప్రక్రియలు ఈ కార్యక్రమంలో భాగమని తెలిపారు. జిల్లాలో 303 మంది బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరుగుతూ సమాచారం సేకరిస్తుండగా, వారి పనిని పర్యవేక్షించేందుకు 30 మంది సూపర్వైజర్లు పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమ నిర్వహణ కోసం 9 మంది సహాయ ఎన్నికల నమోదు అధికారులు, మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఒక ఎన్నికల నమోదు అధికారి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఎన్నికల సిబ్బందికి ప్రజలు అపోహలు లేకుండా పూర్తి వివరాలు అందించి సహకరించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
కన్నాయిగూడెం: విద్యార్థులకు మెనూ ప్రకారం ఆరోగ్యకరమైన భోజనంతో పాటు విద్యార్థుల అభ్యసన, పఠన సామర్థ్యాలను పెంచే విధంగా ఉపాధ్యాయులు పని చేయాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. శనివారం మండలకేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలుర వసతి గృహంతో పాటు గంగూడెంలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం పాఠ్య పుస్తకాలను ఉపాధ్యాయులతో కలిసి పంపిణీ చేశారు. విద్యార్థులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పీఓ లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ ముందస్తు అనుమతులు లేకుండా ఎవరైనా విధులకు గైరాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో -
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
వెంకటాపురం(కె): ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రాచం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై 26మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల ఆభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, డీటీ మహేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సైయ్యద్ ముస్సేన్, మన్నెం సునీల్, జల్లిగంపల కళాధర్, చిట్టెం వాసు పాల్గొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ -
చినుకు రాలలేదు..
లక్షా 63వేల 229 ఎకరాల్లో పంటలు సాగు ఈ వానాకాలం సీజన్లో జిల్లాలోని రైతులు లక్షా 63వేల 229 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. కానీ సాగు పనులు మాత్రం ఇప్పటి వరకు మొదలుకాలేదు. జిల్లాలోని పది మండలాల్లో ఉన్న రైతులు 8 శాతం మాత్రమే నారు మడులను ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడు సన్న రకాలను మాత్రమే సాగు చేసుకోవాలని.. వాటిని సాగు చేస్తేనే బోనస్ వస్తుందని షరతు విధించడంతో రైతులు ఆ దిశగా ఆలోచనలో పడ్డారు. ఆ రకాలను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల జిల్లాలోని వ్యవసాయశాఖ అధికారులు ఏడు రకాల విత్తనాల పేర్లను ప్రకటించారు. కొన్ని రకాలను రైతులకు కూడా అందజేశారు. ప్రభుత్వం ఏడు రకాలను అందుబాటులోకి తెచ్చింది. బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, కేఎన్ఎం 7715, డబ్ల్యూజీఎల్44, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరామ్ వంటి రకాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. మిగతా రకాలు కూడా వేసుకోవచ్చు కానీ వాటికి ప్రభుత్వం బోనస్ వచ్చే అవకాశం లేదని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువగా కేఎన్ఎం 7715కు డిమాండ్ ఉన్నట్లు అధికారులు, డీలర్లు చెబుతున్నారు. వర్షాలు పడితే నారుమడులు పోస్తాం. దుక్కులు సిద్ధం చేసుకుని ఉన్నాం. వర్షాలు ఎప్పుడు పడుతాయా అని ఎదురుచూస్తున్నాం. వర్షాలు లేకుంటే రైతులతో పాటు కూలీలు, వ్యాపారులకు నష్టం జరుగుతుంది. – గోగు విజయబాబు, రైతు, ఏటూరునాగారంమండలం ప్రస్తుతం గతేడాది వెంకటాపురం(ఎం) 5.0 16.5 ములుగు 0.0 15.5 గోవిందరావుపేట 0.0 14.0 తాడ్వాయి 0.0 10.3 ఏటూరునాగారం 0.0 3.8 కన్నాయిగూడెం 1.4 2.0 వాజేడు 13.2 2.0 వెంకటాపురం(కె) 0.0 8.0 మంగపేట 0.0 5.3 మల్లంపల్లి 1.0 11.0 ఆరు మండలాల్లో సున్నా వర్షపాతం నమోదు కాలం గడుస్తున్నా సాగు పనులు మొదలు పెట్టలేని పరిస్థితినేను మూడెకరాలు వరి పంట సాగుచేస్తా. గతేడాది ఈ పాటికి ఎప్పుడో వరినారు పోసినం. ఈ సారి వర్షాలు లేవని ఇంకా నారు పోయలేదు. వర్షాలు లేకపోవడంతో ఏం చేయాలో తోచడం లేదు. పంట నెలరోజులు వెనుకకు పోయినట్లే. – కొండాయి సమ్మయ్య, ఏటూరునాగారం, రైతు -
మీ సేవలో డిజిటల్ రశీదులు
ములుగు: పౌర సేవలను పారదర్శకంగా వేగవంతంగా అందించేందుకు ప్రభుత్వం నూతన డిజిటల్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని ఈ డిస్ట్రిక్ మేనేజర్ దేవేందర్ తెలిపారు. జిల్లా పరిధిలోని మీసేవ ఆపరేటర్లకు సదరం (యుడీఐడీ) పోర్టల్ పైన శనివారం కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించగా దేవేందర్ హాజరై మాట్లాడారు. ఇకపై పౌర సేవల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, రెవెన్యూ సిబ్బంది నివేదికల సమర్పణ మొత్తం ఆన్లైన్ విధానంలోనే కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం ఆదాయం, కులం, నివాసం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం, లేట్ రిజిస్ట్రేషన్ బర్త్, డెత్, అగ్రికల్చరల్ మార్కెట్ వాల్యూ, గ్యాప్ సర్టిఫికెట్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. సర్టిఫికెట్ల కోసం మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తుదారుడి మొబైల్కు ఎస్ఎంఎస్ ద్వారా లింక్ వస్తుందన్నారు. లింక్ ఓపెన్ చేస్తే దరఖాస్తుదారుని వివరాలతో రశీదు ఉంటుందన్నారు. సర్టిఫికెట్లు చేతికి వచ్చేవరకు ఎస్ఎంఎస్ సురక్షితంగా ఉంచుకోవాలన్నారు. ఆపరేటర్లు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాల మీసేవ, భూభారతి, మిగతా ఆన్లైన్ సర్వీస్లను ప్రజలకు అందించాలని సూచించారు. ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ను మీ సేవ ఆపరేటర్లు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మీసేవ జిల్లా మేనేజర్లు విజయ్, రాకేష్, జిల్లా మీసేవ ఆపరేటర్లు పాల్గొన్నారు. అధిక రుసుం వసూలు చేస్తే కఠిన చర్యలు ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ -
రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
ములుగు రూరల్: రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీన్కుమార్ అన్నారు. శనివారం మంత్రి సీతక్కను హైదరాబాద్లో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం నిల్వ చేయడం కష్టంగా మారుతుందన్నారు. వర్షాలకు రంగు మారి ఎఫ్సీఐ బియ్యం దిగుమతులు చేసుకోవడం లేదని చెప్పారు. స్పందించిన మంత్రి సీతక్క సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ కమిషనర్కు ఫోన్చేసి మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి సహోదర్రెడ్డి, కోశాధికారి మోహన్, సంగిరెడ్డి, రాణిశ్రవన్ కుమార్, అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి ములుగు రూరల్: గ్యాస్ వినియోగదారులు ఈ నెల 30వ తేదీ వరకు వందశాతం ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి సయ్యద్ ఫైసల్ హుస్సేని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 8 గ్యాస్ ఏజెన్సీలలో 92,289 మంది వినియోగదారులు ఉన్నారన్నారు. 20,076 మంది దీపం పథకం, 23,299 మంది ఉజ్వల యోజన పథకం, మహలక్ష్మీ పథకం ద్వారా 50,135 మంది వినియోగదారులు ఉన్నారని అన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా లబ్ధిరులకు ప్రభుత్వం రూ. 6.65 కోట్లను విడుదల చేసిందని అన్నారు. వినియోగదారులు ఈ కేవైసీని తప్పని సరిగా చేసుకొని సబ్సిడీ పొందాలని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి ములుగు రూరల్: బీజేపీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 29న హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్న బూత్ అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూక్య జవహర్లాల్, శ్రీమంతుల రవీంద్రాచారి, కృష్ణాకర్, విశ్వనాథ్, ఇమ్మడి రాకేష్, వెంకన్న, రవిరెడ్డి పాల్గొన్నారు. పూరిగుడిసె నేలమట్టం మంగపేట: మండలంలోని కమలాపురం ఆర్పీహెచ్కాలనీకి చెందిన కండల భాస్కర్కు చెందిన పూరిగుడిసె శనివారం నేలమట్టమైంది. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు శనివారం కురిసిన వర్షానికి పూరిగుడిసె పూర్తిగా కూలిపోయింది. దీంతో గుడిసెలోని గృహోపకర వస్తువులు ధ్వంసమయ్యాయి. దీంతో వారు నిరాశ్రయులయ్యారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వం ద్వార ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని.. ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. వ్యసనాలకు దూరంగా ఉండాలి ములుగు: నేటి సమాజంలో యువత మత్తు బారిన పడి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటుందని డ్రగ్స్, గంజాయి సేవించడంతో కేన్సర్కు గురయ్యే ప్రమాదముందని యువత చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. యువత తల్లిదండ్రుల ఆశయాలు నేరవేర్చుతూ ఉన్నత శిఖరాలకు చేరేవిధంగా కృషి చేయాలన్నారు. ఉచిత న్యాయ సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్న్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవద్గీత, వైస్ ప్రిన్సిపాల్ మంజుప్రద, అధ్యాపకులు నరేందర్, రామారావు, సారంగపాణి, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలి
● సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, సీతక్కసాక్షిప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్, పొట్లాపూర్ ప్రాజెక్టుతో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధ్యక్షతన ములుగు నియోజకవర్గ పరిధిలోని నీటిపారుదల శాఖ అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పాల్గొన్న ఈ సమావేశంలో రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్కు అవసరమైన భూసేకరణపై అధికారులు సమగ్ర నివేదిక సమర్పించారు. తాజా మార్కెట్ ధరల ప్రకారమే భూసేకరణ.. కాసిందేవిపేట, ఇంచెర్ల, రామచంద్రాపూర్ గ్రామాల్లో ఈ ప్రాజెక్టుకు మొత్తం 244.23 ఎకరాల భూమి అవసరమని, ఇప్పటివరకు 201.03 ఎకరాలకు మాత్రమే అవార్డులు జారీ అయినప్పటికీ భూసేకరణ పూర్తికాలేదని తెలిపారు. 2020–21లో జారీ చేసిన అవార్డుల ప్రకారం ఎకరాకు రూ.2.47 లక్షల నుంచి రూ.8.26 లక్షల వరకు మాత్రమే పరిహారం నిర్ణయించగా, ప్రస్తుతం భూముల మార్కెట్ విలువలు భారీగా పెరగడంతో ఆ ధరలకు రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మంత్రి సీతక్క 2020–21లో జారీ చేసిన పాత భూసేకరణ అవార్డును ఉపసంహరించి, తాజా మార్కెట్ విలువల ఆధారంగా కొత్త అంచనాలతో వెంటనే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లలో రామప్ప–లక్నవరం కెనాల్ పూర్తయ్యేలా.. రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రామప్ప చెరువు నుంచి లక్నవరం చెరువుకు గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యమై 8,700 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు లక్నవరం పర్యాటకాభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని వివరించారు. అదేవిధంగా పొట్లాపూర్ ప్రాజెక్టు పనులను మరింత ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించి, వచ్చే వారంలోనే శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. -
స్కావెంజర్లను తొలగించొద్దు
ఏటూరునాగారం: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లను తొలగించవద్దని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యనమల్ల ప్రవీన్కుమార్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన స్కావెంజర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని చోట్ల పార్ట్ టైం స్వీపర్లు ఉన్న వద్ద స్కావెంజర్లను తొలగిస్తామని ఎంఈఓలు తెలిపారన్నారు. స్కావెంజర్ల బదులుగా పార్ట్టైం స్వీపర్లను నియమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని ప్రవీన్ తెలిపా రు. దీంతో రాష్ట్రంలో రెండు వేల మంది స్కావెంజర్లు ఉపాధి కోల్పోవాల్సి వస్తుందన్నారు. పాఠశాలల్లో అన్ని రకాల పనులు చేస్తూ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పనిచేస్తున్న స్కావెంజర్లను తొలగించాలని చూడడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని కోరా రు. ఈ కార్యక్రమంలో రమ, కౌసల్య, నవీన్, శ్రీరా ములు, లక్ష్మీ, రాజేశ్వరి, ఉమారాణి, తిరుమల, రాధిక, ఎలేంద్ర, ఆదినారాయణ పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీన్కుమార్ -
వరంగల్ ఓసిటీలో ప్లాట్ల వేలం
● వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపిన ఏజే మిల్లు కార్మికుడు ● 17 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. ఉద్రిక్తత కాశిబుగ్గ: వరంగల్ ఓ సిటీలోని ప్లాట్ల వేలం ఉద్రిక్తతకు దారితీసింది. ఆజంజాహి మిల్లు కార్మిక సంఘం నాయకులు ర్యాలీగా రావడం, ఓ కార్మికుడు ఏకంగా వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. వరంగల్ ఓ సిటీలోని 98 ప్లాట్లకు అధికారులు శుక్రవారం ఉదయం వేలానికి ఏర్పాట్లు చేశారు. అయితే, దీనికి ముందే పలు కార్మిక సంఘాల నాయకులు పురాతన వాటర్ ట్యాంకు ప్రాంతం నుంచి ర్యాలీగా వేలం నిర్వహించే క్లబ్ వరకు తరలివచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆజంజాహిమిల్లు కార్మికులకు ప్లాట్లు కేటాయించాలని, ప్లాట్ల వేలం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గద్దల సంజీవ అనే కార్మికుడు వాటర్ ట్యాంకు ఎక్కి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తర్వాత యశోద అనే కార్మికురాలితో పాటు మరో నలుగురు ట్యాంకు ఎక్కడానికి ప్రయత్నించారు. అలాగే, పోలీసులు పైకి రాకుండా ఉండేందుకు వాటర్ ట్యాంకు మెట్ల మధ్యలో టైరు కాల్చి కార్మికులకు న్యాయం చేయాలని, లేకుంటే ట్యాంకుపై నుంచి దూకుతామంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి నిరసనకారులను కిందికి దింపారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులతో కలిసి ట్యాంకు వరకు ర్యాలీకి యత్నించారు. తాము కలెక్టర్ను కలిసి సమస్యలు విన్నవిస్తామని పోలీసులకు తెలిపారు. దీంతో హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, సీఐలు కర్రె స్వామి, షూకూర్ ఆధ్వర్యంలో 17 మందిని పోలీసు వాహనం ఎక్కించి మట్టెవాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం యథాఽవిధిగా వేలం కొనసాగించారు. -
‘రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలి’
ములుగు రూరల్: అసైన్డ్ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అసైన్డ్ భూమి సమితి రాష్ట్ర అధ్యక్షుడు కలకోటి మహేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మల్లంపల్లి మండలకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022లో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన రైతుగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఈ మేరకు అసైన్డ్ రైతులకు భూమిపై పూర్తి హక్కులు కల్పిస్తామని ఇచ్చిన హామీని మరిచారని వెల్లడించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జితేందర్, సురేందర్, రాజు, శంకర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
అవయవదానం గొప్ప నిర్ణయం
ములుగు రూరల్: అవయవ దానం గొప్ప నిర్ణయమని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవన్కుమార్ అన్నారు. ఈ మేరకు గురువారం ప్రపంచ అవయమ మార్పిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని అవయవ దాతలను ఆయన అభినందించారు. మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన గుండా కుమారస్వామి–శైలజ దంపతులు అవయవ, శరీరదానం చేయడానికి ముందుకొచ్చి సదాశయ ఫౌండేషన్కు సంబంధించిన పత్రాలను అందజేశారు. అనంతరం ఫౌండేషన్ వారు దాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోఆర్డినేటర్ దళపతి, గౌరవ అధ్యక్షుడు పురుషోత్తం, సలహదారు లక్ష్మారెడ్డి, వరంగల్ అధ్యక్షుడు వేణుమాదవ్, కుమారస్వామి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం ములుగు రూరల్ : మండలంలోని జాకారం సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ములుగు ఎస్సై–2 చంద్రశేఖర్ కథనం ప్రకారం.. జాకారం సమీపంలో జాతీయ రహదారి పక్కన సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. మృతుడి శరీరంపై నీలం రంగు టీషర్ట్, తెలుపు రంగు ప్యాంటు, చేతికి మెటల్ ఆర్మ్రింగ్, చేతికి నల్లధారం, వేళ్లకు ఉంగరాలు ఉన్నాయి. మృతదేహానికి పోలీసులు పంచనామా నిర్వహించి ములుగు జనరల్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతదేహాన్ని ఎవరైన గుర్తించినా, అతడి సమాచారం తెలిసినా ములుగు పోలీస్స్టేషన్లో సంప్రదించాలని, వివరాలకు 8712670081, 8712670111 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై పేర్కొన్నారు. కాగా, మృతుడి ముఖంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పీరీల ఊరేగింపు కాళేశ్వరం: మహదేవపూర్, కాళేశ్వరంతో పాటు పలు గ్రామాల్లో మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీరీలను డప్పుచప్పుళ్లతో వీధుల వెంట ఊరేగించారు. కులమత బేధాలు లేకుండా పీరీలకు మొక్కులు చెల్లించారు. కుడుకలు, పూల దండలు వేశారు. అనంతరం పీరీలను గోదావరిలో నిమజ్జనం చేశారు. గోదావరి వద్ద రొట్టెలు భక్తులకు పంపిణీ చేశారు. జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ బోర్హోల్స్ పూర్తికాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ బరాజ్లో ఎన్డీఎస్ఏ సూచనల మేరకు పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ సైంటిస్టుల బృందం చేపట్టిన జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ బోర్హోల్స్ శుక్రవారం పూర్తయ్యింది. మొత్తం 37 బోల్హోల్స్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు బరాజ్ ఇన్చార్జ్ ఈఈ సురేష్ తెలిపారు. బరాజ్ పునరుద్ధరణ కోసం త్వరలో నివేదికలు అందజేస్తారని తెలిసింది. పుట్టిన రోజే.. చివరి రోజు ● ఈతకెళ్లి యువకుడి మృతి ● జంపన్నవాగులో ఘటన ఏటూరునాగారం : తన పుట్టిన రోజును స్నేహితులతో ఆనందంగా జరుపుకుందామని వచ్చిన ఓ యువకుడిని మృత్యువు నీటి రూపంలో కబలించింది. జంపన్న వాగులో ఈత కొడుతున్న క్రమంలో నీట మునిగి చనిపోయాడు. ఈ ఘటన శుక్రవారం ఏటూరునాగారం మండలం కొండాయి పంచాయతీ పరిధి కొండ్రెడు సమీపంలోని మేడిమంచె వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తాడ్వాయి మండలం కన్నెపల్లికి చెందిన పోలెబోయిన నారాయణ, రాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సాయికుమార్(21) ఉన్నారు. సాయికుమార్ హైదరాబాద్లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈక్రమంలో తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు కన్నెపల్లికి వచ్చి తన స్నేహితులతో కలిసి మేడిమంచె వద్దకు చేరుకొని సరదాగా జంపన్నవాగులో ఈత కొట్టేందుకు దిగాడు. అయితే వాగులో లోతు ఎక్కువ ఉండడంతో నీట మునిగాడు. గమనించిన స్నేహితులు సాయికుమార్ కోసం వెతకసాగగా మూడు గంటల తర్వాత విగతజీవిగా కనిపించడంతో కన్నీమున్నీరుగా విలపించారు. ఈఘటనపై మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. -
ఆదివాసీల ఓట్లు తొలగించొద్దు
ఏటూరునాగారం: ఓటరు జాబితా సమగ్ర సవరణలో ఆదివాసీలు ఓట్లు తొలగించవద్దని, గోదావరిలో డిసిల్టేషన్ను వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారి రవికుమార్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఎండి దావూద్ అధ్యక్షతన పార్టీ జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రవికుమార్ మాట్లాడుతూ ఓటర్ జాబితా సమగ్ర సవరణ ద్వారా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా కార్యకర్తలు చూడాలన్నారు. కాంట్రాక్టర్ల లాభాల కోసమే గోదావరిలో ఇసుక తోడుతున్నారని తెలిపారు. వెంకటాపురం(కె) మండలం యాకన్నగూడెం నుంచి సుడిబాక వరకు గోదావరి నదికి కరకట్ట నిర్మించడంతో పాటు పాత పద్ధతుల్లోనే ఇసుక క్వారీలను కొనసాగించాలన్నారు. 2018 నుంచి పెండింగ్లో ఉన్న బోనస్ వెంటనే చెల్లించాలన్నారు. ఇసుక ద్వారా వచ్చే లాభాలను ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేశారు. వెంకటాపురం(కె) మండల పరిధిలోని గోదావరి నదిలో సుమారు 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో 4వేల ఎకరాల్లో సుమారు 3 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తీయాలనే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. దీంతో ఈ ప్రాంతానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. తాగు, సాగునీటికి అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వెంకట రెడ్డి, రత్నం రాజేందర్, చిట్టి బాబు, రఘుపతి, వాసు, జిల్లా కమిటీ సభ్యులు మల్లారెడ్డి, చిరంజీవి, దేవయ్య, చారి, దామోదర్, గపూర్, కిష్టయ్య, అశోక్ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రవికుమార్ -
ఎంజీఎం ఆస్పత్రికి స్టాఫ్ నర్సులు
● 170 మంది కేటాయింపు ● 60 మంది జాయినింగ్ కాశిబుగ్గ: ఎట్టకేలకు ఎంజీఎం ఆస్పత్రికి స్టాఫ్ నర్సులొచ్చారు. దవాఖానా నుంచి బదిలీ అయిన వారి స్థానంలో కొత్తగా ఎవరూ జాయిన్ అవకపోవడంతో తొలుత అధికారుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో నర్సింగ్ సూపరింటెండెంట్ దయాశీల, డిప్యూటీ సూపరింటెండెంట్ సుజాత అధికారుల ఆదేశాల మేరకు ఎంజీఎంలో పేషెంట్లకు ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు బీఎస్సీ, జనరల్ నర్సింగ్, పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి నర్సింగ్ స్టాఫ్ను రప్పించారు. స్టాఫ్ నర్సుల స్థానంలో వీరు ప్రత్యామ్నాయంగా సేవలందిస్తున్నారు. ఖాళీగా 284 పోస్టులు ఎంజీఎం దవాఖనాలో రోగులకు సేవలు అందించడానికి 478 మంది స్టాఫ్నర్సులు అవసరం ఉండగా.. కేవలం 194 మందితో వైద్యసేవలు అందిస్తున్నారు. మరో 284 పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. ఈనేపథ్యంలో ఎంజీఎంలో పేషెంట్ల సేవల కోసం స్టాఫ్ నర్సుల (నర్సింగ్ ఆఫీసర్లు) కొరత గుర్తించిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉన్నతాధికారులు బదిలీ అయిన వారి స్థానంలో 170 మంది నర్సింగ్ ఆఫీసర్లను కేటాయించారు. అలాగే హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి, వరంగల్ సీకేఎం ఆస్పత్రికి ఐదుగురు స్టాఫ్ నర్సులను అలాట్ చేసినట్లు తెలుస్తోంది. 2024 సంవత్సరం బ్యాచ్కు సంబంధించిన వీరు రెండు రోజుల నుంచి ఎంజీఎంలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటి వరకు 60 మంది స్టాఫ్ నర్సులు జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. మిగతావారు కూడా సోమవారం వరకు జాయిన్ కావొచ్చని నర్సింగ్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఎంజీఎంలోని అత్యవసర చికిత్సలు, పలు వార్డుల్లో నర్సింగ్ సేవలు ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది. -
పల్స్పోలియోకు సిద్ధం
ఏటూరునాగారం: చిన్నారుల నిండు జీవితానికి రెండు పల్స్పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో మహమ్మారిని నిర్మూలించవచ్చు.. ఈ మేరకు ప్రభుత్వం రేపటి(ఆదివారం) నుంచి మూడు రోజుల పాటు(మంగళవారం)పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలోని 0–5 పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. పోలియో రహిత సమాజ నిర్మాణానికి వైద్యాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7గంటలకే.. అటవీ ప్రాంతాలు, గోదావరి పరీవాహక ప్రాంతం, గొత్తికోయగూడేలు, గుట్టలపై ఉన్న గ్రామాలు, వాగు అవతల ఉన్న చిన్నారులను గుర్తించిన వైద్యాధికారులు 46 రూట్లను విభజించారు. ఈ రూట్లకు ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసింది. పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం 7 గంటలకే పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. బస్టాండ్లు.. పాఠశాలల్లో పిల్లలకు.. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వలస కూలీలు పిల్లలతో పాటు మిర్చి, ఇతర వ్యవసాయ పనులు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ కార్మికులు నివాస ప్రాంతాలకు సైతం టీంలను పంపనున్నారు. ఐరిస్క్ ఏరియాలను గుర్తించి వైద్యాధికారులు, సబ్ సెంటర్ల సిబ్బంది అక్కడికి వెళ్లే ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇదేకాకుండా ఆర్టీసీ బస్టాండ్, అంగన్వాడీ కేంద్రాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల పరిధిలోని పిల్లల వద్దకు సైతం వైద్య సిబ్బంది వెళ్లి చుక్కలు వేయనున్నారు. అయితే పోలియో చుక్కలు వేయించడం ద్వారా కలిగే లాభాలపై మూడు రోజుల పాటు కార్యక్రమం 15 పీహెచ్సీల పరిధిలో టీంల ఏర్పాటు జిల్లా వ్యాప్తంగా 22,572 మంది చిన్నారులుప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 15సబ్ సెంటర్లు 89జిల్లాలోని చిన్నారులు 22,572మొబైల్ బృందాలు 15రూట్ సూపర్వైజర్లు 46పోలియో చుక్కలు వేసే స్టాల్స్ 312పోలియో చుక్కలు వేయించడం ద్వారా చిన్నారులకు పోలియో రాదు. అంగవైకల్యాన్ని నివారించడంతో పాటు జీవితాంతం రక్షణ ఉంటుంది. సురక్షితమైన, ఉచితమైన ఈ మందును తప్పకుండా చిన్నారులందరికీ తప్పకుండా వేయించాలని సోషల్ మీడియా, వాల్పోస్టర్లు, ఇతర ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని వైద్యాధికారులు చేపట్టారు. పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలు ఉన్నా కూడా ఈ పోలియో చుక్కలను వేయించవచ్చని అధికారులు చెబుతున్నారు. -
భర్తీ ఎప్పుడు?
కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో ఆర్ఎంఓ పోస్టు భర్తీ కావట్లేదు. గత మూడు నెలల నుంచి ఈ అధికారి పోస్టు భర్తీ కాకపోవడంతో ఇన్చార్జ్ ఆర్ఎంఓలు బాధ్యతలు చూసుకోవాల్సి వస్తోంది. ఆర్ఎంఓ స్థాయి అధికారి లేకపోవడం వల్ల వైద్యసేవలు, అడ్మినిస్ట్రేషన్ పూర్తిస్థాయిలో జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. బదిలీల్లో పీజీ విద్యార్థికి ఆర్డర్.. ఇటీవల జరిగిన బదిలీల్లో సీకేఎం ఆస్పత్రి ఆర్ఎంఓగా ఓ పీజీ విద్యార్థినికి ఆర్డర్ ఇవ్వడం అయోమయానికి గురిచేసింది. సంగారెడ్డి జిల్లా ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాలలో గైనిక్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న డాక్టర్ గీతాలక్ష్మికి ఆర్ఎంఓగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ అధికారులు ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సర్వీస్ కోటాలో ఓబీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినికి ఆర్ఎంఓగా ఎలా బాధ్యతలు అప్పగిస్తారనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. డిప్యూటీ సివిల్ సర్జన్ హోదాల్లో ఆర్ఎంఓగా విధులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. గైనిక్ కోర్సు పూర్తి చేయనివారికి ఎలా ఆర్డర్ ఇచ్చారని సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమె ఇక్కడ రిపోర్టు చేయకుండానే తిరిగి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులకు వివరించినట్లు సమాచారం. -
అడుగంటిన జలాశయాలు
● వానాకాలం సాగుపై రైతుల్లో ఆందోళన ● జిల్లాలో వర్షాభావ పరిస్థితులే కారణంజిల్లాలో ఈ నెలలో రెండు, మూడు రోజుల పాటే సాధారణ వర్షాపాతం నమోదైంది. వరుణుడు ముఖం చాటేయడంతో సాగునీటి వ్యవస్థ గొలుసుకట్టుగా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. గణపసముద్రం నిండి మోరంచవాగు పారితేనే మూడు మండలాల రైతులకు నీరు అందుతుంది.. అయితే అక్కడ 40 శాతం నీరే ఉంది. అటు దేవాదుల ఎత్తిపోతల పథకానికి కీలకమైన భీంఘన్పూర్, బొగ్గులవాగు ప్రాజెక్టు పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఫలితంగా జిల్లాలో వేలాది ఎకరాల ఆయకట్టు భూములు ఎడారిగా మారుతాయేమోనని అన్నదాతలు భయపడుతున్నారు. గణపురం మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు సామర్థ్యం 380 మిలియన్ ఘనపు అడుగులు(ఎంసీఎఫ్టీ). ప్రస్తుతం చెరువులో ఉన్న నీటి పరిమాణం 151 మిలియన్ ఘనపు అడుగులు మాత్రమే. ఇప్పటి వరకు 40 శాతం నీరు మాత్రమే చెరువులో ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇంకా 60 శాతం 229 ఎంసీఎఫ్టీ వస్తే చెరువు మత్తడిపోయనుంది. ఈ చెరువుపై ఆధారపడి మూడు మండలాల ప్రజలు వ్యవసాయం చేస్తుంటారు. గణపురం మండలంలో ప్రతీ ఏటా 4వేలకు పైగా ఎకరాల సాగు జరుగుతుండగా, చెరువు నిండాక మత్తడి పడి నీరంతా మోరంచవాగులో కలుస్తుంది. ఈ మోరంచవాగుపై ఆధారపడి భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల మండలాలకు చెందిన వేలాది మంది రైతులు తమ పంట పొలాలను సాగు చేసుకుంటారు. గణపసముద్రంలో నీటి మట్టం అంతంత మాత్రంగానే ఉండటంతో మూడు మండలాల ప్రజలు తమ పంటల సాగుపై ఆందోళన చెందుతున్నారు. మల్హర్ మండలంలోని ఎడ్లపల్లి అటవీ ప్రాంతంలోని వరదనీరును వృథా కాకుండా ఆ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలనే సదుద్ధేశంతో బొగ్గులవాగు మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టును 1976లో నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మల్హర్, కాటారం మండలాల్లోని సుమారు 6వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 406.56 ఎంసీఎఫ్టీ కాగా, ప్రస్తుతం 80.10 ఎంసీఎఫ్టీ మాత్రమే నీరు నిల్వ ఉంది. దీంతో ఆయకట్టు రైతులు ఈ ఏడాది వానాకాలం సాగుపై ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్తో పాటు ఇతర జిల్లాల రైతులకు సాగునీరు అందించాలనే ఉద్ధేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ ప్రాజెక్టులో మొదటి రిజర్వాయర్ అయిన భీంఘన్పూర్ భూపాలపల్లి మండలంలో ఉంది. ఈ రిజర్వాయర్ ద్వారా భూపాలపల్లి మండలంలోని రైతులకు సాగునీరు అందుతుంది. రిజర్వాయర్ పూర్తిగా నిండాక దేవాదుల మోటార్ల ద్వారా గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు పంపింగ్ చేస్తారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్లో నీటిమట్టం ప్రమాదకరంగా ఉంది. రిజర్వాయర్ సామర్థ్యం 380 ఎంసీఎఫ్టీ కాగా 151 ఎంసీఎఫ్టీ మాత్రమే నీటి నిల్వ ఉంది. వానాకాలం సీజన్ ముంచుకొస్తున్నా జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ప్రధాన చెరువులు, రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే జలాశయాల్లో నీటిమట్టం ప్రమాదకరంగా పడిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కాకతీయుల కాలం నాటి గణపసముద్రం కేవలం 40శాతం నీటికే పరిమితం కాగా.. బొగ్గులవాగు, భీంఘన్పూర్ రిజర్వాయర్లలో సగం కూడా నీరు లేకపోవడంతో ఈ ఏడాది సాగు ప్రశ్నార్థకంగా మారేలా కనిపిస్తోంది. – భూపాలపల్లి -
డ్రగ్స్ నిర్మూలనకు పాటుపడాలి
ములుగు రూరల్: జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ నాగేంద్ర అన్నారు. ఈ మేరకు గురువారం మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ మత్తు పదార్థాలకు యువత బానిసగా మారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాలు వినియోగించడం, విక్రయించినట్లు సమాచారం తెలిస్తే వెంటనే 1098 లేదా 14446 నంబర్లకు సమాచారం అందించాలన్నారు. అనంతరం విద్యార్థినులు, ఉపాధ్యాయులు, అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బాలల సంరక్షణ జిల్లా అధికారి ఓంకార్, నషా ముక్త్ భారత్ పెసిలిటేటర్ అనూష, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ జీవనప్రియ పాల్గొన్నారు. -
సబ్స్టేషన్ నిర్మాణానికి స్థల పరిశీలన
మంగపేట: మండల పరిధిలోని రామచంద్రునిపేటలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాన్ని ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ భిక్షపతి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్రునిపేటలో నూతనంగా 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు చేసేందుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. స్థలాన్ని అప్పగించిన అనంతరం టెండర్ తర్వాత నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వివరించారు. అనంతరం వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా చుంచుపల్లి గోదావరి ఒడ్డున నూతనంగా నిర్మించనున్న పుష్కరఘాట్ ప్రదేశాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ పురుషోత్తం, అసిస్టెంట్ ఇంజనీర్ కృష్ణారావు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్
మంగపేట: ప్రజల సమస్యలను గ్రామస్థాయిలోనే తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజాదర్బార్ కార్యక్రమాలను నిర్వహిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని రాజుపేట జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి సీతక్క కలెక్టర్ సహదేవరావుతో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమానికి రాజుపేట, చుంచుపల్లి, వాడగూడెం, రమణక్కపేట, కత్తిగూడెం, బ్రాహ్మణపల్లి, వాగొడ్డుగూడెం, రామచంద్రునిపేట, నిమ్మగూడెం, దోమెడ, అకినేపల్లిమల్లారం గ్రామాల ప్రజలు హాజరై సమస్యలపై దరఖాస్తులను అందజేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారుకలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సీతక్క అందజేశారు. ఈ సందర్భంగా మంగపేటలో బతుకమ్మ ఆట స్థలం చుట్టూ ప్రహరీ, హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రికి మహిళలు వినతిపత్రం అందజేశారు. అలాగే మండల కేంద్రంలో రూ.1.50 కోట్లతో నిర్మించనున్న ఎంపీడీఓ భవన కార్యాలయ నిర్మాణ మంత్రి శంకుస్థాపన చేశారు. రాజుపేట జెడ్పీ పాఠశాలలో సైన్స్ల్యాబ్ భవనాన్ని ప్రారంభించారు. -
కల్యాణం.. కమనీయం
రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మ స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమచార్యులు, శ్రీనాధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ రేగొండ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో నకిలీ ఓటర్లకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని ఆర్డీఓ హరికృష్ణ అన్నారు. గురువారం కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకొడేపాక, చెన్నాపూర్ గ్రామాలలో ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజ్యలక్ష్మి, బీఎల్ఓ సూపర్వైజర్ రాజయ్య, వెంకటేష్, బీఎల్ఓలు పాల్గొన్నారు. 100 శాతం ఉత్తీర్ణత భూపాలపల్లి అర్బన్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో జిల్లా వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేశ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 58 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 41 మంది బాలురు, 17 మంది బాలికలు ఉన్నారు. హాజరైన విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించడం విశేషమన్నారు. 29నుంచి రిలే నిరాహార దీక్షలు భూపాలపల్లి అర్బన్: సింగరేణి అధికారుల పెండింగ్ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 29వ తేదీ నుంచి రిలే నిరహార దీక్షలు చేపట్టనున్నట్లు సీఎంఓఏఐ భూపాలపల్లి ఏరియా అధ్యక్షుడు నజీర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట అధికారులు నల్ల కండువాలు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎండీ నజీర్ మాట్లాడుతూ.. కోలిండియా లిమిటెడ్లో అమలవుతున్న పే అప్గ్రేడేషన్ను సింగరేణి అధికారులకు కూడా అమలు చేయాలని కోరారు. కోలిండియాలో చెల్లిస్తున్న అన్ని భత్యాలు, పే అప్గ్రేడేషన్, పీఆర్పీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఓఏఐ నాయకులు శ్యాంసుందర్, జోతి, అరుణ్, ట్రెజరర్ సాయికృష్ణ, మన్నాన్, చంద్రశేఖర్, మిర్జా యాసిన్ బేగ్, శ్రీనాథ్, సమ్మిరెడ్డి, మహేందర్ పాల్గొన్నారు. -
ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి
మల్హర్(కాటారం): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల పిలుపునిచ్చారు. గురువారం కాటారం మండలం గంగారంలో జరిగిన టీఎస్ఎస్ కళాకారిణి జాడి సుమలత వివాహ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతీ పౌరుడికి ఎంతో విలువైనదన్నారు. ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకొని ఎన్నికల సమయంలో తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. యువత ప్రత్యేకంగా ముందుకు వచ్చి ఓటరు నమోదు ప్రక్రియలో పాల్గొనాలని, తమ కుటుంబ సభ్యులు, పరిచయస్తులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతీ ఓటు ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల -
అందరూ ఇన్చార్జ్లే!
జిల్లా వ్యాప్తంగా మండల విద్యాశాఖ అధికారులు ఇన్చార్జ్లే కొనసాగుతున్నారు. దీంతో పాఠశాలల్లో విధులు నిర్వహిస్తూనే మండల విద్యాశాఖ బాధ్యతలు నిర్వహించడంలో కొంత మేర ఇబ్బందులు ఎదురువుతున్నాయి. కలెక్టర్తో చర్చించి ఎంఈఓల ఎంఆర్పీలకు పరిమితం చేయాలని యోచిస్తున్నాం. గెజిటెడ్ హెచ్ఎంల నియామకం ప్రభుత్వ పరిధిలో ఉంది. ప్రస్తు తం ఖాళీగా ఉన్న ఆరు స్థానాలలో సీనియర్ టీచర్లకు హెచ్ఎం బాధ్యతలు అప్పగించాం. సిద్ధార్థరెడ్డి, డీఈఓములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడం, ప్రైవేట్ పాఠశాలలు ఏ మేరకు నిబంధనలు అమలు చేస్తున్నాయో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించేందుకు జిల్లాలో మండల విద్యాశాఖ అధికారులు కరువయ్యారు. దీంతో పాఠశాలలపై పర్యవేక్షణ లేకపోవడంతో పలువురు నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతీ వారానికి 2 ప్రభుత్వ పాఠశాలలు, ఒక ప్రవేట్ పాఠశాలను తనిఖీ చేయాల్సి ఉంది. గెజిటెడ్ హెచ్ఎంలకు ఇన్చార్జ్ ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు ఇవ్వడంతో విద్యా వ్యవస్థ గాడి తప్పుతుందనే విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఉద్యోగోన్నతులు కల్పించి రెగ్యులర్ ఎంఈఓలను నియమించాలని పలువురు కోరుతున్నారు. 10 మండలాలు.. 343 పాఠశాలలు జిల్లాలోని 10 మండలాల పరిధిలో మండల విద్యాశాఖ అధికారులు అందరూ ఇన్చార్జ్లే ఉన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పరిధిలో మొత్తం 343 పాఠశాలలు ఉండగా అందులో 17,749 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో ఎంపీఎస్ పాఠశాలలు 246, యూపీఎస్ పాఠశాలలు 44, జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కేజీవీబీ, టీజీఎంఎస్ 53 ఉన్నాయి. వీటితో పాటు 38 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. పాఠశాల విధులు నిర్వహిస్తూనే మండల విద్యాశాఖ అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో వారిపై అదనపు భారం పడుతుందనే చర్చ సాగుతోంది. దీంతో మారుమూల గ్రామాల్లోని పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతుంది. గెజిటెడ్ హెచ్ఎం పోస్టుల ఖాళీలు.. జిల్లాలో మొత్తం 39 జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 39 మంది గెజిటెడ్ హెచ్ఎంలకు బదులు 33 మంది మాత్రమే ఉన్నారు. ఆరు పాఠశాలల్లో గెజిటెడ్ హెచ్ఎంలు పదవీ విరణ పొందారు. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో సుమారు 10 పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించడం, వారితో సమావేశాలు నిర్వహించి పాఠశాలల పురోగతిపై నివేదికలు ఉన్నతాధికారులకు అందించాల్సి ఉంటుంది. ఆరు పాఠశాలల్లో సీనియర్ టీచర్లకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అబ్బాపూర్, బండారుపల్లి, లక్ష్మీదేవిపేట, బీరెల్లి, కాటాపూర్, ఇందిరానగర్ జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఇన్చార్జ్ హెచ్ఎంలు కొనసాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంఈఓల కొరత గెజిటెడ్ హెచ్ఎంలకు అదనపు బాధ్యతలు పాఠశాలలపై కొరవడిన పర్యవేక్షణ -
మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
ఏటూరునాగారం: ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని ఆకులవారి ఘణపురం ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను మంత్రి సీతక్క కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి గురువారం సందర్శించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో హాస్టల్లో నూతనంగా చేరిన విద్యార్థినుల వివరాలను తెలుసుకుని వసతి గృహంలోని మరుగుదొడ్లు, వంటశాల, తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం గోదావరి నది ప్రవాహ పరిస్థితులు, కరకట్ట భద్రత, వరదల సమయంలో నది కరకట్ట దెబ్బతినకుండా చేపడుతున్న రక్షణ చర్యలను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.మ్యాప్ ఆధారంగా గోదావరి ప్రవాహ తీరు, కరకట్ట పరిస్థితులు, జియో ట్యూబ్స్ ఏర్పాటు విధానం, చేపడుతున్న రక్షణ చర్యలపై పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన ప్రతీ ఏడాది గోదావరి వరదలతో ఏటూరునాగారం, రామన్నగూడెం, మంగపేట, అకినేపల్లి మల్లారం, ఓడగూడెం తదితర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుందన్నారు. మంగపేట, రామన్నగూడెం ప్రాంతాల్లో వరద ఉధృతి ప్రభావం చూపకుండా జియో ట్యూబ్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమాల్లో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఫిరంగి, డీఈఓ సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు. గోదావరి వరదల నివారణకు చర్యలు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
వెంకటాపురం(ఎం): సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, హైరిస్క్ గ్రామాలను గుర్తించి మెడికల్ క్యాంపులు నిర్వహించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో గర్భిణులు ఇబ్బందులు పడకుండా సురక్షిత ప్రసవం పొందేలా ముందస్తుగానే తేదీలకు అనుగుణంగా ఆస్పత్రులను అనుసంధానం చేస్తూ నిరంతరం ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పర్యవేక్షించాలని తెలిపారు. ఈనెల 28న నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని 31 పోలియో కేంద్రాల ద్వారా 2,400 మంది ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. రామప్ప దేవాలయ ఆలయ ప్రాంగణంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ట్రాన్సిట్ పోలియో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పీహెచ్సీ పరిధిలోని 14 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి శ్రీకాంత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మాడిశెట్టి శ్రీనివాస్, పల్లె దవాఖాన వైద్యాధికారి అనిత, పీహెచ్ఎన్ఓ శోభ, హెల్త్ సూపర్వైజర్ పుష్పకుమారి, ఫార్మసిస్ట్ రాజమణి, నర్సింగ్ ఆఫీసర్ ఉష, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్ -
ఎకై ్సజ్ శాఖలో భారీ బదిలీలు
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ఎకై ్సజ్ శాఖలో భారీస్థాయిలో బదిలీలు చేపట్టింది. డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారుల (డీపీఈఓ) స్థాయిల్లో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అధికారులు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. అదే సమయంలో ఇతర జిల్లాల నుంచి కొందరు అధికారులు వరంగల్ అర్బ న్ (హనుమకొండ), వరంగల్ రూరల్ (వరంగల్), ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో పోస్టింగ్ పొందారు. అంజన్రావుకు ప్రమోషన్.. వరంగల్ డిప్యూటీ కమిషనర్ అంజన్రావుకు జాయింట్ కమిషనర్గా ప్రమోషన్ రాగా,, ఇన్చార్జ్ డీసీగా కూడా ఉన్నారు. ఈ బదిలీల్లో డీజీబీసీఎల్ ఆర్ఆర్–1 చీఫ్ మేనేజర్గా ఉన్న హెచ్.దత్తురాజ్గౌడ్ను వరంగల్ డిప్యూటీ కమిషనర్గా నియమించారు. మల్కాజిగిరి డీపీఈఓ కె.నవీన్కుమార్కు వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా పోస్టింగ్ లభించింది. హనుమకొండ డీపీఈఓగా పనిచేస్తున్న కె.చంద్రశేఖర్కు ఇటీవల అసిస్టెంట్ కమిషనర్గా పదోన్నతి లభించగా ఆయనను టీజీబీసీఎల్ చీఫ్ మేనేజర్గా నియమించారు. ఆయన స్థానంలో కరీంనగర్ డీపీఈఓ పి.శ్రీనివాస్రావును వరంగల్ అర్బన్ డీపీఈఓగా, వరంగల్ రూరల్ డీపీఈఓ డి.అరుణ్కుమార్ను నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో సంగారెడ్డికి చెందిన ఎం.మణెమ్మను వరంగల్ రూరల్ డీపీఈఓగా నియమించారు. భూపాలపల్లి డీపీఈఓ వి.శ్రీనివాస్ను నిర్మల్కు, ఎన్ఫోర్స్మెంట్ వరంగల్లో పనిచేస్తున్న డి.శ్రీనివాస్రెడ్డిని వికారాబాద్ డీపీఈఓగా పంపించారు. జనగామ డీపీఈఓ కె.అనితకు సూర్యాపేట బాధ్యతలు అప్పగించారు. భూపాలపల్లి (ఏపీఈఎస్) ఎం.లింగాచారి వనపర్తి డీపీఈఓగా బదిలీ చేశారు. ఐదు నెలల నిరీక్షణకు తెర... ఎట్టకేలకు పోస్టింగ్ ఐదు నెలలుగా పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్న అధికారులకు ఎట్టకేలకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జనవరి చివరన పలువురికి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ (ఏపీఈఎస్)లకు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ (డీపీఈఓ)లుగా, డీపీఈఓలకు అసిస్టెంట్ కమిషనర్(ఏసీ)లుగా, ఏసీలకు డిప్యూటీ కమిషనర్ (డీసీ)లుగా పదోన్నతి కలిగింది. అయితే, పదోన్నతులు పొందినప్పటికీ ఆ అధికారులు పాతస్థానాల్లోనే ఐదు నెలలుగా కొనసాగుతున్నారు. పదోన్నతుల తర్వాత విధుల కేటాయింపు లేకపోవడంతో పలువురు అధికారులు తాత్కాలిక ఏర్పాట్లతో కొనసాగాల్సి వచ్చింది. జిల్లాలు, విభాగాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ పోస్టింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో అసంతృప్తి వ్యక్తమైంది. అయితే, తాజాగా ప్రభుత్వం ఒకేసారి డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, డీపీఈఓ, ఏపీఈఎస్ స్థాయి అధికారులకు పోస్టింగ్ ఇవ్వడంతో ఐదు నెలలుగా ఎదురుచూస్తున్న వారికి ఊరట లభించింది. డిప్యూటీ కమిషనర్, ఏసీ, డీపీఈఓలకు స్థానచలనం వరంగల్ డీసీగా దత్తురాజ్గౌడ్.. ఏసీగా నవీన్కుమార్ హనుమకొండ డీపీఈఓగా శ్రీనివాస్రావు.. వరంగల్కు మణెమ్మ ఉమ్మడి వరంగల్లో అధికారుల రాకపోకలు.. పలువురికి కొత్త బాధ్యతలు -
రోడ్డు ధ్వంసం.. వన్వేలో రాకపోకలు
ములుగు రూరల్: మల్లంపల్లి–ములుగు జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఒకవైపున ఉన్న రోడ్డు ధ్వంసమై ప్రమాదభరితంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మల్లంపల్లి కెనాల్పై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు ఒక్క వైపు పూర్తికాగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. మరో వైపు పిల్లర్ల పనులు జోరుగా సాగుతున్నాయి. జాతీయ రహదారిపై నిత్యం ఇసుక లారీల రవాణా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో రోడ్డు ఒకవైపున గురువారం రోడ్డు ధ్వంసమైంది. గుర్తించిన అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేసి వన్వేలో వాహనాలను తరలిస్తున్నారు. రెండో పక్క పిల్లర్ల నిర్మాణంలో భాగంగా రోడ్డు అంచువరకు మట్టిని తొలగించడం,డ్రిలింగ్ చేయడంతో రోడ్డు కింది భాగంలో మట్టి కదిలి రోడ్డు బీటలువారింది. అధికారులు రోడ్డు పనులను త్వరితగతిన, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. -
ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ఏటూరునాగారం: దీర్ఘకాలిక ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ జగదీశ్వర్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోయగూడెం–ఎల్లాపూర్ శివారులోని 105 సర్వే నంబర్లో 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పేదల భూములకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. యూరియా కొరకు యాప్ తీసుకొచ్చారని యాప్లో బుక్ చేసుకోవడానికి రైతులందరి వద్ద స్మార్ట్ఫోన్లు లేవని తెలిపారు. ఒకవేళ ఉన్నా ఏజెన్సీలో సిగ్నల్స్ అంతంత మాత్రంగానే ఉంటుందని తెలిపారు. పాత పద్ధతిలోనే ఎరువులు అందజేయాలన్నారు. భూ భారతి రెవెన్యూ రికార్డులో కాస్తు కబ్జా కాలాన్ని వెంటనే పునరుద్ధరించాలని, రైతు రుణాలు మాఫీ చేయాలని కోరారు. సన్నధాన్యానికి ఇస్తానన్న క్వింటాకు రూ.500 బోనస్ అందరికీ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల కార్యదర్శి ఎండి.యాకూబ్, మండల కమిటీ సభ్యుడు బండారి నరసింహులు, కై రుల్లా, గుండపు నాగులు, పుట్ట రాజయ్య, జూపాక నరసయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎండి దావూద్ తదితరులు పాల్గొన్నారు. రైతుసంఘం జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి -
ఓటరు జాబితా సవరణకు సహకరించాలి
ములుగు: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జూన్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించాలని ములుగు రెవెన్యూ డివిజన్ అధికారి, ఈఆర్ఓ కృష్ణవేణి కోరారు. బుధవారం కలెక్టరేట్లో ములుగు నియోజకవర్గ పరిధి లో నమోదిత రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాల సేకరణ కోసం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమం జూన్ 25వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల సిబ్బందికి రాజకీయ పార్టీల నాయకులు సహకరించి అర్హులైన ప్రతి ఓటరుకు ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నమోదిత రాజకీయ పార్టీల నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్లు–1 తమ పార్టీకి సంబంధించిన బూత్ లెవల్ ఏజెంట్లు–2లకు గుర్తింపు కార్డులు జారీ చేసి అందజేయాలని తెలిపారు. ప్రత్యేక సవరణ కార్యక్రమంలో బూత్ లెవల్ ఏజెంట్లు చురుకుగా పాల్గొని ఎన్నికల సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఆర్ఓ తహసీల్దార్ విజయభాస్కర్, ఎన్నికల సూపరింటెండెంట్ సలీం, డిప్యూటీ తహసీల్దార్ నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ములుగు ఆర్డీఓ కృష్ణవేణి -
దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యం
భూపాలపల్లి అర్బన్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించా లని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక అధికారి ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై బుధవారం కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్శర్మ వివిధ శాఖలు చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి శ్రీధర్ మాట్లాడుతూ.. గ్రామసభల్లో మొత్తం 6,391 దరఖాస్తులు అందగా, వాటిలో 716 పరిష్కరించబడ్డాయని, మి గిలిన 5,674 దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, విద్యుత్, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సౌకర్యాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు సంబంధించిన దరఖాస్తులు అధికంగా వచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. 99 రోజుల కార్యక్రమాన్ని ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించామన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక అధికారి ఎన్.శ్రీధర్ -
పని ఎక్కువ.. వేతనం తక్కువ
ఎస్ఎస్తాడ్వాయి: గిరిజన సంక్షేమం, ఉపాధి కల్పనే లక్ష్యంగా ఐటీడీఏ, జీసీసీ సంయుక్తంగా ఉమ్మడి జిల్లాలో 13 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేశాయి. పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న ఆపరేటర్లు ప్రస్తుతం చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలంతా కష్టపడి పనిచేస్తున్నా అందుతున్న వేతనాలు కుటుంబ పోషణకు సరిపోవడం లేదని వాపోతున్నారు. పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉదయం నుంచి రాత్రి వరకు సేవలందిస్తూ పెట్రోల్, డీజిల్ విక్రయాలు, నగదు లావాదేవీలు, స్టాక్ నిర్వహణ వంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎండా.. వాన తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్నా వారి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల సిబ్బంది కొరత కారణంగా అదనపు పనిభారం కూడా మోయాల్సి వస్తోందని వాపోతున్నారు. వేతనాల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. కనీస వేతనాల చట్టానికి అనుగుణంగా జీతాలు చెల్లించడంతోపాటు ఉద్యోగ భద్రత, ఇతర సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు. గిరిజనులకు ఉద్యోగావకాశాలు ఏటూరునాగారం గిరిజన కోఆపరేటివ్ సోసైటీ(జీసీసీ) పరిధిలోని 5 బంకులు, ములుగులో 3, వెంకటాపూర్లో 1, నర్సంపేటలో 4 బంకులు ఉన్నాయి. ఈబంకుల్లో ఫిలింగ్ అపరేటర్లుగా 52 మంది గిరిజనులు పని చేస్తున్నారు. కాగా వారికి ఉద్యోగం ఉందన్న మాటే గాని వారి కుటుంబాలు మాత్రం సంతోషంగా లేవు. వారి వేతనాలు అతి తక్కువగా ఉండడంతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ప్రస్తుతం పెట్రోల్ ఆపరేటర్లకు నెలకు రూ.9,000 చెల్లిస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరల నేపథ్యంలో ఈ వేతనం ఏ మాత్రం సరిపోవడం లేదని కనీసం రూ.15వేలు చెల్లించాలని సిబ్బంది కోరుతున్నారు. తాడ్వాయి మండల కేంద్రంలోని కామారం(పీటీ) బంక్లో నలుగురు గిరిజనులు ఫిలింగ్ ఆపరేటర్లుగా పని చేస్తున్నారు. ఎనిమిది గంటలు పని చేయాల్సినవీరు 12 గంటల పని చేయడంతో అదనపు పని భారం పడుతుంది. బంక్లో స్వీపర్ కూడా ఏర్పాటు చేయలేదు. నైట్ వాచ్మెన్ కూడా లేరు. ఫిల్లింగ్ ఆపరేటర్లే మిగతా పనులన్నీ చేయాల్సిన పరిస్థితి. ఈ బంక్ మేడారం వెళ్లే దారిలో ఉండడంతో మేడారం దర్శనానికి వచ్చే భక్తుల వాహనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది.బంకులు ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్నాయి. ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల వేతనాలు పెంచే అవకాశం లేదు. ఉద్యోగుల సమస్యలను ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే ఉన్నాతాధికారులు వేతనాలపై పరిశీలిస్తారు. – వాణి, జీసీసీ ఇన్చార్జ్ డీఎం జీసీసీ పెట్రోల్ బంక్ ఆపరేటర్ల ఇక్కట్లు చాలీచాలని వేతనాలతో అవస్థలు -
సామాజిక సేవ అభినందనీయం
ఎస్ఎస్తాడ్వాయి: యువత పేదలు, వృద్ధులకు అండగా నిలవడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామంలో ఫ్రీవిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30 మంది వృద్ధుల కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను బుధవారం మంత్రి సీతక్క చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రజలకు చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని యువత ఫ్రీవిల్ ఫౌండేషన్ను స్థాపించి సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. పేదలకు సహాయం చేయడం దేవుడిచ్చిన వరమని పేర్కొన్నారు. సమాజంలో అవసరమైన వారికి చేయూతనివ్వడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రీవిల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆర్గనైజేషన్ సెక్రటరీ జాలిగపు జంపన్నను అభినందించారు. అంతకుముందు మంత్రికి గ్రామస్తులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మేడారం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ లచ్చు పటేల్, ఉపసర్పంచ్ కాక రంజిత్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గొంది సరిత, అనంతరెడ్డి, ఇర్ప సునీల్, కట్కూరి భాస్కర్రెడ్డి, శోభన్ పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
గోవిందరావుపేట/ములుగు రూరల్: గోవిందరావుపేట మండలంలోని చల్వాయి, ములుగు మున్సిపాలిటీ పరిధిలోని మాధవరావుపల్లి కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్లు వెంకటలక్ష్మి, జీవన ప్రియ బుధవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. గోవిందరావుపేటలో పీజీసీఆర్టీ కెమిస్ట్రీ, సీఆర్టీ బయోసైన్స్ పోస్టులకు, ములుగులో పీజీసీఆర్టీ సివిక్స్, పొలిటికల్ సైన్స్, ఎకానామిక్స్, బీఎస్సీ నర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. స్థానికులైన అర్హత గల మహిళా అభ్యర్థులు తమ విద్యార్హతలు, ఇతర ధ్రువీకరణ పత్రాలతో నేటి నుంచి 29వ తేదీ వరకు సాయంత్రం 5 గంటలోపు చల్వాయి కేజీబీవీలో దరఖాస్తులు సమర్పించాలని సూచి ంచారు. ఇతర సమాచారం కోసం గోవిందరావుపేట అభ్యర్థులు 81869 12476 నంబర్ ద్వారా ములుగు అభ్యర్థులు 80086 18668 నంబర్ ద్వారా సంప్రదించాలని కోరారు. నేడు రాజుపేటలో ప్రజాదర్బార్ మంగపేట: మండలంలోని రాజుపేట జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నేడు (గురువారం) ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ భద్రునాయక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు జరిగే ప్రజాదర్బార్ కార్యక్రమంలో పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు వివిధ శాఖల అధికారులు హాజరవుతార ని తెలిపారు. కార్యక్రమానికి రాజుపేట, చుంచుపల్లి, వాడగూడెం, రమణక్కపేట, కత్తిగూడెం, బ్రాహ్మణపల్లి, వాగొడ్డుగూడెం, రామచంద్రునిపేట, నిమ్మగూడెం, దోమెడ, అకినేపల్లిమల్లారం గ్రామాల ప్రజలు పాల్గొని సమస్యలపై ఫిర్యాదులు అందజేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై అర్జీలను సమర్పించాలని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలిభూపాలపల్లి అర్బన్: రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం పీఆర్టీయూటీఎస్ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల అత్యవసర సమావేశం జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పింగిలి శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. ఎన్నికల హామీలకు అనుగుణంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డు సేవలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను తక్షణమే మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, లేకపోతే సంఘం తరఫున ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్కుమార్, రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు. టెండర్ ప్రక్రియ వాయిదా? కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ, తొలగింపునకు ప్రభుత్వం రూ.198కోట్లు కేటాయించగా ఏప్రిల్ 20న సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈనెల 23న టెండర్ జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడ్డట్లు సమాచారం. ఇప్పటికే ప్రకారాలు, మూలవిరాట్లను తొలగిస్తున్నారు. మరో వారం పాటు టెండర్ ప్రక్రియ కోసం వేచిచూడాల్సిందేనని తెలిసింది. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ తెలిపారు. ఏరియాలోని కేటీకే 5వ గనిలో బుధవారం ఫిట్ కార్యదర్శి రాజేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సింగరేణి రక్షణకోసం కార్మికులంతా ఐక్య ఉద్యమాలు చేయాలన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలతో నిర్వహించే చర్చల్లో 31 డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. -
నిరుపేదలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేయూత
వెంకటాపురం(ఎం): మండలంలోని ఇంచెంచెరువుపల్లి గ్రామానికి చెందిన నూనావత్ మోహన్ దాస్, బండి నర్సమ్మ ఇళ్లు మంగళవారం కురిసిన వర్షానికి కూలిపోయాయి. విషయం తెలుసుకున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడు, జిల్లా ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ అల్లెం అప్పయ్య దృష్టికి తీసుకురాగా, స్పందించిన ఆయన రెండు కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవసరమైన సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎల్లప్పుడూ నిరుపేదలకు, ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు. -
రైతుల సమస్యలు పరిష్కరించాలి
గోవిందరావుపేట: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల వెంకట్రెడ్డి మాట్లాడు తూ.. ఖరీఫ్ సీజన్లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచి భారం మోపిందన్నారు. గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరాలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. రైతు భరోసా సకాలంలో అందడం లేదన్నారు. రైతుల మోటా ర్లకు స్మార్ట్ మీటర్లు అమలు చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంక్ రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే సాదా బైనామా దరఖాస్తుదారులకు పట్టా లు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గుండు రామస్వామి, తీగల ఆదిరెడ్డి, కోటేశ్వరరావు, సోమ మల్లారెడ్డి, రెడ్డి పురుషోత్తం రెడ్డి, గొర్ల శ్రీను, సోలిపురం రాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు పొదిలి చిట్టిబాబు, కందుల రాజేశ్వరీ, లకావత్ నరసింహ పాల్గొన్నారు. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్రెడ్డి -
క్రీడారంగంలో ములుగు సత్తా చాటుతోంది
● రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క ములుగు: క్రీడా రంగంలో ములుగు జిల్లా సత్తా చాటుతుందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడి క్రీడాకారులు రాణిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ములుగు ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, భారత ఒలింపిక్ సంఘం, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్– 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి సీతక్క హాజరై జ్యోతిని వెలిగించి రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందన్నారు. క్రీడాకారుల కోసం అథ్లెటిక్స్ స్టేడియం నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాకు చెందిన అనేక మంది విద్యార్థులు వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి దేశ, విదేశాల్లో ములుగు ఖ్యాతిని చాటుతున్నారని తెలిపారు. పేదరికం, వెనుకబడిన పరిస్థితులు ఉన్నప్పటికీ జిల్లాలోని పిల్లల్లో ఉన్న ప్రతిభ అపారమని, వాలీబాల్, ఇతర క్రీడల్లో ములుగు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించిన చరిత్ర ఉందన్నారు. జిల్లాలో క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అథ్లెటిక్స్ స్టేడియం ఏర్పాటు కోసం వచ్చిన ప్రతిపాదన మేరకు రూ.4 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయించామని, భవిష్యత్లో అవసరమైన అదనపు సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సహకారిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థులు శారీరకంగా ధృడంగా ఉండటంతోపాటు క్రీడలపై పూర్తి ఏకాగ్రతతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, డీఎస్పీ రవీందర్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ పగడాల వెంకటేశ్వర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.ఒలింపిక్ రన్ను ప్రారంభిస్తున్న మంత్రి సీతక్క -
ఇంటింటికీ బీఎల్ఓలు..
ములుగు: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రి య నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలో గురువారం నుంచి జూలై 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇందులో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్ఓలు) తమ పరిధిలోని ప్రతీ ఇంటి కి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించనున్నారు. 2002 ఓటరు జాబితాలో పేర్లు లేని వారు, కొత్తగా నమోదైనవారు తమ తల్లిదండ్రుల ఓటరు వివరాల ఆధారంగా లింక్ (మ్యాపింగ్) చేసుకునే అవకాశం ఉంది. మండలాల వారీగా బీఎల్వోలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చి సర్ కార్యక్రమానికి సన్నద్ధం చేశారు. సర్వేలో భాగంగా బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్తారు. ఆ ఇంట్లో 2002 జాబితా ప్రకారం ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతీ ఓటరుకు ఒక ఎన్యూమరేషన్ ఫాం అందిస్తారు. ఫాం ఇచ్చినట్లుగా వారి నుంచి ఎకనా లెడ్జ్మెంట్ను తీసుకుంటారు. ఆ ఫారాలను ఓటర్లే పూర్తి చేసి ఇవ్వాలి. ఓటర్లు నిరక్షరాస్యులైతే బీఎల్ఓలే ఫాం నింపుతారు. ప్రతీ బీఎల్ఓ తన పరిధిలో ని ప్రతీ ఇంటిని నెలరోజుల వ్యవధిలో మూడుసార్లు సందర్శించాల్సి ఉంటుంది. ప్రతీ 10 మంది బీఎల్ఓల పనితీరును పర్యవేక్షించేందుకు ఒక సూపర్వైజర్ ఉంటారు. సూపర్వైజర్ల పనితీరును తహసీల్దార్లు పర్యవేక్షించనున్నారు. 2002 నాటి ఓటరు జాబితాలో ఓటరుగా పేరు లేని వారు తల్లిదండ్రుల వివరాల ఆధారంగా మ్యాపింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకు వారు తమ తల్లి/తండ్రి 2002లో ఓటు హక్కు వినియోగించుకున్న అసెంబ్లీ నియోజకవర్గం– సంఖ్య, పోలింగ్ స్టేషన్ సంఖ్య, ఓటరుగా సీరియల్ నంబర్ వివరా లను ఎన్యూమరేషన్ ఫాంలో నమోదు చేయాలి. ఒకవేళ 2002లో లేకుండా 2025లో కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఉంటే వారు కూడా తమ తల్లిదండ్రులు ఓటరు సీరియల్ నంబర్ ఆధారంగా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. బీఎల్ఓలు ఇచ్చిన ఫారాలు తీసుకోకుంటే అర్హులైనప్పటికీ ఓటరు జా బితాలో పేరు కోల్పోయే ప్రమాదం ఉంది. వ్యాపా ర, ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లినవారు ఎన్యూమరేషన్ సమయంలో విధిగా స్వగ్రామానికి చేరుకొని వివరాలు అందజేయాలి. ఎన్యూమరేషన్ ఫారాలు పొందని అర్హులైన ఓటర్లు జూలై 30 నుంచి ఆగస్టు 30 వరకు చేపట్టనున్న క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గడువులో వివరాలను అందజేయొచ్చు. ములుగు నియోజకవర్గంలోని 10 మండలాల పరిధిలో 2,36,970 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,96,641 (82.98శాతం) మంది ఓటర్ల వివరాలు మ్యాపింగ్ పూర్తయ్యాయి. నియోజకవర్గంలో 303 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రతీ పోలింగ్ కేంద్రానికి ఒక బీఎల్ఓను నియమించారు. ప్రతి 10 మంది బీఎల్ఓల పనితీరును పర్యవేక్షించేందుకు ఒక సూపర్వైజర్ చొప్పున 32 మందిని జిల్లాలో నియమించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫాం ద్వారా వివరాలు సేకరిస్తారు. సేకరించిన సమాచారాన్ని యాప్లో అప్లోడ్ చేస్తారు. ప్రతీ బీఎల్ఓ తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల వివరాలను సరిచూసుకొని కొత్త ఓటర్ల నమోదు, మృతుల పేర్లు తొలగింపు, చిరునామాల మార్పులు చేసే అవకాశం బీఎల్ఓలకు కల్పించారు. ప్రతీ ఓటరుకు ఎన్యూమరేషన్ ఫాం అందజేత 2002లో పేరు లేకుంటే తల్లిదండ్రుల ఓటు ఆధారంగా లింక్ ములుగు నియోజకవర్గంలో 2,36,970 మంది ఓటర్లు నేటి నుంచి జూలై 24 వరకు బూత్లెవల్ అధికారుల ఇంటింటి సర్వే జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ జూలై 31 నుంచి ఆగష్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు నోటీసుల జారీ, పరిష్కారం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురణ -
భువన్ సర్వేతో ఆస్తుల నమోదు
ములుగు: పట్టణంలోని ఆస్తుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి, పన్నుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడం కోసం ములుగు మున్సిపాలిటీ పరిధిలో భువన్ సర్వే నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ తెలిపారు. ములుగు పట్టణంలో భువన్ సర్వేను ప్రారంభించిన అనంతరం ఆయన ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి భవనాల కొలతలు తీసుకోవడం, జియో ట్యాగింగ్ నిర్వహించడం, ఆస్తుల వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేస్తారని తెలిపారు. భవనాల విస్తీర్ణం, వినియోగ విధానం వంటి కీలక వివరాలను సేకరించి భువన్ పోర్టల్లో నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ములుగు పట్టణంలోని వివిధ వార్డుల్లో సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలనలు కొనసాగిస్తూ, ఆస్తుల సమాచారాన్ని నవీకరిస్తున్నాయన్నారు. సర్వేకు పట్టణ ప్రజలు మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించి, తమ ఇళ్లు, భవనాలకు సంబంధించిన సరైన వివరాలను అందించాలని కోరారు. -
ఓటరు జాబితా
సవరణపై ప్రచారం నిర్వహించాలిములుగు: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం – 2026 (ఎస్ఐఆర్)పై జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి అందిన ఆడియో, వీడియో ప్రచార సామగ్రిని అన్ని కమ్యూనికేషన్ మాద్యమాల ద్వా రా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రచారం ద్వారా ఓటరు జాబితా సవరణ షెడ్యూల్, కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, అర్హత లేని పేర్ల తొలగింపు వంటి అంశాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని తెలిపారు. గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లో ప్రతీ అర్హుడైన ఓటరుకు సమాచారం చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దార్లు, ఎలక్షన్ సెల్ అధికారులు పాల్గొన్నారు. తప్పుడు సమాచారంపై కఠిన చర్యలు తప్పవు ఓటరు జాబితా స్వచ్ఛత, ఖచ్చితత్వాన్ని పరిరక్షించేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్లు 17, 18, 31 నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటరు నమోదు నిషేధమని, సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదు కావడానికి అర్హుడు కాదని తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాలలో పేరు నమోదు అయినట్లు గుర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. తప్పుడు సమాచారం, నకిలీ పత్రాల సమర్పణ శిక్షార్హమైన నేరమని, సెక్షన్ 31 ప్రకారం ఓటరు నమోదు కోసం తప్పుడు సమాచారం ఇవ్వడం, నకిలీ పత్రాలు సమర్పించడం, అసత్య ప్రకటనలు చేయడం శిక్షార్హమైన నేరమని తెలిపారు. ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానా విధిస్తామని తెలిపారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు -
కరుణించిన వరుణుడు..
ములుగు: కొన్ని రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. గతేడాది మే మాసంలోనే వర్షాలు కురిసినప్పటికీ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. అయినప్పటికీ ఇటీవల కురిసిన చిరుజల్లులకు అన్నదాతలు పత్తి విత్తనాలు నాటి, బోర్ల కింద వరినార్లు పోశారు. ఈ నెల 22న ఆరుద్ర కార్తె ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గినప్పటికీ వర్షాలు పడలేదు. సోమవారం సాయంత్రం నుంచి మేఘాలు కమ్ముకున్నప్పటికీ మంగళవారం తెల్లవారుజామున మల్లంపల్లి మండలం మినహా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఆశించిన మేర వర్షం కురవడంతో రైతుల ఆశలు చిగురించాయి. సాగు చేసుకుంటున్న పంటలకు ప్రాణం పోసినట్లు కాగా, వ్యవసాయ పనులు ముమ్మరం చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయి. 50.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు జిల్లా వ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో 50.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 10 మండలాలు ఉండగా మల్లంపల్లి మండలం మినహా మిగిలిన 9 మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షం పడింది. వెంకటాపురం(ఎం)లో 68.8, ములుగులో 62.4, గోవిందరావుపేటలో 23.4, ఎస్ఎస్తాడ్వాయిలో 77.4, ఏటూరునాగారంలో 65.8, కన్నాయిగూడెంలో 45.2, వాజేడులో 26.2, వెంకటాపురం(కె)లో 68.6, మంగపేటలో 70.0 వర్షపాతం నమోదైంది. గోవిందరావుపేట, వాజేడు మండలాల్లో వర్షపాతం తక్కువ నమోదైనప్పటికి మిగిలిన 7 మండలాల్లో కురిసిన వర్షంతో పంటల సాగుకు పరిస్థితులు అనుకూలంగా మారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 10 మండలాలు..1,63,229 ఎకరాల్లో సాగు.. జిల్లాలోని 10 మండలాల పరిధిలో వానాకాలం సీజన్లో బోర్ల కింద వరినార్లు పోసి దుక్కులను సిద్ధం చేశారు. వర్షాలు కురిస్తే వ్యవసాయ పనులను వేగిరం చేద్దామనుకున్న రైతాంగానికి మంగళవారం కురిసిన వర్షం ప్రాణం పోసింది. దీంతో పత్తి మొక్కలు మొలకెత్తనుండగా, రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేయనున్నారు.సన్న రకాలకే మొగ్గు ప్రభుత్వం సన్నరకాల ధాన్యానికి క్వింటాలుకు రూ.500ల బోనస్ ఇస్తుందనే ఆశతో రైతులు సన్నరకం వరిపంటలు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం 7 సన్న రకాలకు చెందిన వరి పంటలను సాగు చేస్తే బోనస్ క్వింటాల్కు రూ.500 అదనంగా అందిస్తామని ప్రకటించి, విత్తనాలను రైతు వేదికల ద్వారా పంపిణీ చేస్తుంది. బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–15048, కేఎన్ఎం–1638, జైశ్రీరాం, హెచ్ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్ 44, జేజీఎల్–1798 వరి వంగడాలకు మాత్రమే ప్రభుత్వం బోనస్ అందించనుంది. సుమారు లక్ష ఎకరాల్లో సన్నరకం వరిపంట సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో పంటల సాగు అంచనా వివరాలు (ఎకరాల్లో) జిల్లా వ్యాప్తంగా కురిసిన మోస్తరు వాన వరినారు, పత్తి మొక్కలకు ప్రాణం వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టిన రైతన్నలు 50.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు1,07,70011,329 28,60015,600 పత్తిమొక్కజొన్నవరిఇతర పంటలు -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
ములుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణ, యువత డ్రగ్స్ బారిన పడకుండా అన్ని శాఖల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్జీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తర చూ ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. బ్లాక్ స్పాట్ల గుర్తింపు, రహదారులపై సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. వేగ నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు వేగంగా అందుబాటులో ఉండేలా వైద్యశాఖ, ట్రాఫిక్, పోలీస్శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్ ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్, ఎకై ్సజ్, అటవీ, విద్య, వైద్య ఆరోగ్య శాఖలు ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, ప్రజా ప్రదేశాల పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సంబంధిత శాఖలు పరస్పర సమాచారాన్ని పంచుకుంటూ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆధార్ మాని టరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆధార్ సేవల పురోగతి, చిన్నారుల ఆధార్ నమోదు, విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్, ఆధార్ వెరిఫికేషన్ పెండింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ మహేందర్జీ -
ప్రజాపాలన అమలులో ఆదర్శం
ములుగు: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక అమలులో జిల్లా ఆదర్శంగా నిలిచిందని ప్రజాపాలన ప్రత్యేకాధికారి హనుమంత్ జెండగే వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన పురోగతి, శాఖల వారీ విజయాలు, అమలు చేసిన వినూత్న కార్యక్రమాలపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు జిల్లాలో అన్ని శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రజావాణి, గ్రామసభల ద్వారా అందిన భూ సమస్యలు, ఇతర సమస్యలకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, డీఎఫ్వో వికాస్ మీనా, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, డీఆర్వో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రత్యేకాధికారి హనుమంత్ జెండగే -
బీఆర్ఎస్ హయాంలోనే అవినీతి
ములుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని, అన్నారం మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించకముందే పూడికతీత పేరుతో 6 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తరలించి వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆరోపించారు. ములుగులో మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీతమ్మ సాగర్ డీసీల్టేషన్ తీయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే మ్యాప్ రూపొందించిందన్నారు. డీసీల్టేషన్తో గిరిజన సొసైటీలు లబ్ధిపొందకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారన్నారు. మంత్రుల మీద నిందలు వేసి అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ తన సోషల్ మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని, బీఆర్ఎస్ నేతల దగ్గర ఎమైనా ఆధారాలు ఉంటే తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్గౌడ్, నాయకులు పల్లె జయపాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మామిడిశెట్టి కోటి, రాహుల్, భరత్కుమార్, మారం సుమన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్ -
అంబులెన్స్లో గర్భిణి ప్రసవం
మంగపేట : పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణి 108లో పీహెచ్సీకి తరలిస్తుండగా మార్గమధ్యలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన మండల పరిధిలోని తిమ్మాపురంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని తిమ్మాపురంకు చెందిన పూనెం సీత నిండు గర్భిణి. పురటి నొప్పులతో బాధపడుతుండగా ఆశ వర్కర్ రాణి 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. వెంటనే 108 సిబ్బంది నొప్పులతో బాధపడుతున్న మహిళను పీహెచ్సీకి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్స్ ఈఎన్టి చిరంజీవి వైద్యం అందించగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం పీహెచ్సీకి తరలించారు.తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని పీహెచ్సీ వైద్యులు తెలిపారు. ‘ఇసుక క్వారీలు నిలపకుంటే పోరాటం’మంగపేట: ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలోని గోదావరిలో డీసిల్టింగ్ ఇసుక క్వారీలను నిలుపకుంటే పోరాటం తప్పదని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరి నది భూగర్బ జలాల విధ్వంసం కోసమే ఇసుక మాఫియా డీసిల్టింగ్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఏటూరునాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఇసుకలారీలు అర్ధరాత్రి నడుస్తుంటే కలెక్టర్, జిల్లా అటవీశాఖ అధికారి ఏం చేస్తున్నారో చెప్పాలని కోరారు. అధికార పార్టీ ముఖ్యనేతలు అధికారం ఉందికదా అని గిరిజన సొసైటీల నిర్ణయాలు లేకుండా వారి అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకోకుండా వారి లాభాలను తీసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆయా నేతలు పద్ధతి మార్చుకోకుంటే త్వరలో బహిరంగ, ప్రజా పోరాటం ఉంటుందని ఆయన హెచ్చరించారు. ‘అంగన్వాడీల్లోనే విద్యను కొనసాగించాలి’ ములుగు రూరల్: ఫ్రీప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలని అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సమ్మక్క అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్రీప్రైమరీ విద్యను కొనసాగించాలని కోరుతూ మంగళవారం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లోనే పీఎంశ్రీ విద్యను యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం రాజేందర్, రేఖ, సరిత, భవాని, సౌందర్య, రజిత తదితరులు పాల్గొన్నారు. సింగరేణిపై మాట్లాడే అర్హత లేదుభూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థపై అసత్య ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీలకు సంస్థపై మాట్లాడే అర్హత లేదని ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య ఆరోపించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీ కలిసి అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ కక్ష పూరితంగా ఉందన్నారు. సింగరేణి యాజమాన్యం విడుదల చేసిన అధికారిక ప్రకటనతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. సింగరేణిలో బొగ్గు రవాణా పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందన్నారు. పటిష్టమైన భద్రతా వ్యవస్థల మధ్య భారీ స్థాయిలో బొగ్గు చోరీ జరగడం అసాధ్యమని యాజమాన్యం స్పష్టం చేసినప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ నాయకులు దుష్పచ్రారాన్ని కొనసాగించడం బాధాకరమని విమర్శించారు. -
రాజకీయ హోరుగల్లు..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : హైదరాబాద్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరంగా గ్రేటర్ వరంగల్కు ప్రత్యేక స్థానం ఉంది. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్రత్యేక దృష్టి సారించాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఆ తదుపరి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరింత బలపడేందుకు ఆ మూడు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్: అధికార బలాన్ని కేడర్ బలంగా మార్చే ప్రయత్నం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వరంగల్లో తన పట్టు మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను కేడర్కు అప్పగిస్తున్నారు. ఇటీవల జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకత్వం సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సోమవారం ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, కేడర్ సదస్సులు నిర్వహించిన జోష్ నింపారు. భవిష్యత్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పార్టీ రాష్ట్ర నాయకులతో భారీ బహిరంగ సభలు, అభివద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్: కోల్పోయిన బలాన్ని తిరిగి సాధించే యత్నం ఒకప్పుడు గ్రేటర్, ఉమ్మడి వరంగల్లో బలమైన ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్ ప్రస్తుతం తిరిగి కేడర్ను సమీకరించే పనిలో నిమగ్నమైంది. గ్రామ, వార్డు, డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి టి.హరీష్రావు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు, రైతు సమస్యలు, నిరుద్యోగం, అభివృద్ధి పనుల ఆలస్యం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయంగా లాభపడాలని పార్టీ భావిస్తోంది. సభ్యత్వ నమోదు, కేడర్ సమావేశాలు, సోషల్ మీడియా బలోపేతంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా సోమవారం హనుమకొండ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ కేడర్ను ఉత్తేజపరిచారు. బీజేపీ: ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే లక్ష్యం... ఉమ్మడి వరంగల్లో తన ఓటు బ్యాంకును పెంచుకుంటూ వస్తున్న బీజేపీ ఈసారి మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు, శిక్షణ తరగతులు, యువతపై ప్రత్యేక దృష్టితో పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లు సహా జాతీయ నాయకుల పర్యటనలకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 29న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన ఉంటుందని పార్టీ నేతలు ఇటీవల ప్రకటించారు. మోదీ ప్రభుత్వ అభివద్ధి, కేంద్ర నిధులు, జాతీయత అంశాలను ప్రధాన అజెండాగా తీసుకొని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వరుస కార్యక్రమాలతో ఎన్నికల వేడి... సభ్యత్వ నమోదు, బూత్, వార్డు స్థాయి కమిటీల ఏర్పాటు, కేడర్ శిక్షణ శిబిరాలు, సోషల్ మీడియా విభాగాల బలోపేతం, యువత, మహిళా విభాగాల విస్తరణపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వరుస కార్యక్రమాలు చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రాజకీయ పరిణామాలు ఉత్తర తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపుతాయి. అందుకే ప్రతి పార్టీ గ్రేటర్ ఎన్నికలను కేవలం స్థానిక ఎన్నికలుగా కాకుండా భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తోంది. కేడర్తో సమావేశాలు.. సభ్యత్వ నమోదు.. శిక్షణ తరగతులు బలపడేందుకు ప్రధాన పార్టీల ప్రయత్నాలు ‘గ్రేటర్’లో గెలుపే లక్ష్యంగా కసరత్తు హైదరాబాద్ తర్వాత కీలకంగా మారిన వరంగల్ -
విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి
వెంకటాపురం(ఎం)/గోవిందరావుపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. మండలంలోని జవహర్నగర్ మోడల్ స్కూల్ను కలెక్టర్ మంగళవారం సందర్శించి పాఠశాల నిర్వహణ, విద్యాబోధన విధానాలను పరిశీలించారు. పాఠశాలలోని కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ ల్యాబ్లను పరిశీలించి విద్యార్థులు ప్రయోగాత్మక విద్యపై అవగాహన పెంపొందించుకునేలా ల్యాబ్లను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. లైబ్రరీని సందర్శించి, విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపొందించేందుకు పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రణాళికతో బోధన చేయాలన్నారు. విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం గోవిందరావుపేట మండల పరిధిలోని పీహెచ్సీని మంగళవారం ఆకస్మికంగా కలెక్టర్ సందర్శించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ మలేరియా, డెంగ్యూ, డయేరియా వంటి సీజనల్ వాధుల నియంత్రణకు గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. మలేరియా, డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు -
ఇసుక మాఫియా సూత్రధారులను బయటకు లాగుతాం..
ములుగు: జిల్లాలో ఇసుక మాఫియా వెనుక ఉన్న సూత్రధారులను బయటకు లాగేవరకు ఊరుకునేది లేదని మాజీ రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి తెలిపారు. మంగళవారం మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇసుక మాఫీయాపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హేమంత్ సహదేవరావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సతీశ్రెడ్డి సోమవారం విలేకర్లతో మాట్లాడారు. వెంకటాపురం(కె), వాజేడు, మంగపేట మండలాల్లో సీతమ్మ సాగర్ పేరు మీద డిసిల్టేషన్ పేరుతో 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీసేందుకు దరఖాస్తు చేస్తే, కోటి క్యూబిక్ మీటర్లకు అధికారులు అనుమతులు ఇచ్చారని వెల్లడించారు. 4 వేల కోట్ల అక్రమార్జనకు మంత్రులు స్కెచ్ వేశారని కేటీఆర్ చెబితే తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. 72 గిరిజన, మ్యాక్స్ సొసైటీలు దరఖాస్తు చేసుకుంటే ఏ ఒక్క సొసైటీకి అధికారులు అనుమతి ఇవ్వలేదన్నారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోకుంటే సీఎస్ వరకు వెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రమేశ్రెడ్డి, రమణారెడ్డి, మహేశ్నాయక్, మల్క రమేశ్, భిక్షపతి, కోగిల మహేశ్, చంద్రమౌళి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్రెడ్డి -
కండక్టర్ నిజాయతీ..
ములుగు: హనుమకొండ డిపోకు చెందిన బస్సు మంగళవారం పత్తిపల్లి నుంచి హనుమకొండకు వెళ్తుండగా పత్తిపల్లికి చెందిన వృద్ధ దంపతులు బస్సు ఎక్కి ములుగులో దిగిపోయారు. కొంత సేపటికి వారి వెంట ఉన్న సంచిని బస్సులోనే మరిచిపోయినట్లు గమనించి స్థానికంగా విధులు నిర్వహిస్తున్న బైకని మోహన్ని కలిసి వృద్ధ దంపతులు సంచి మర్చిపోయిన విషయం తెలిపారు. అతను వెంటనే బస్ కండక్టర్ ధనలక్ష్మికి ఫోన్లో సమాచారం అందించగా ఆమె సంచిని గుర్తించారు. అనంతరం వృద్ధ దంపతులు ములుగుకు చేరుకుని రూ.20వేల నగదుతో పాటు ఇతర వస్తువులు ఉండగా కంట్రోలర్ మూర్తి సమక్షంలో సంచిని వారికి అప్పగించారు. నిజాయతీగా వ్యవహరించిన కండక్టర్ ధనలక్ష్మిని స్థానికులు, ప్రయాణికులు అభినందించారు. వృద్ధ దంపతులకు రూ.20 వేల నగదు అందజేత -
వాగుకు వరద.. రాకపోకలకు అంతరాయం
ఏటూరునాగారం : మండల పరిధిలోని కొండాయి–దొడ్ల గ్రా మాల మధ్య జంపన్నవాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు వరదలకు తెగిపోయింది. దీంతో మల్యాల, కొండాయి, ఐలాపురం, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఏడాది మేడా రం జాతర సమయంలో రూ. 30లక్షలు ఖర్చు చేసి జంపన్నవాగు బ్రిడ్జికి ఇరువైపులా తాత్కాలికంగా డై వర్షన్ రోడ్డు నిర్మించారు. ఈ క్రమంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి జంపన్నవాగు ఉప్పొంగడంతో రెండు రోడ్లు పూర్తిగా తెగిపోయాయి. ఫలితంగా వాగు అవతల గ్రామాల ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. బ్రిడ్జి పనులు పిల్లర్ల వరకు పూర్తి కాగా దానిపై గడ్డర్స్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ వర్షంతో వచ్చే వరదల కారణంగా బ్రిడ్జి పనులు కూడా నిలిచినట్లు స్థానికులు, అధికారులు చెబుతున్నారు. వర్షాలు ముగిసి వరద నిలిస్తే తప్పా పనులు చేపట్టే అవకాశం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. -
‘ఎస్ఎంఎస్ హాస్టల్ మంజూరు చేయాలి’
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్ఎంఎస్ హాస్టల్ మంజూరు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొగి బాబు అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నీచర్, తరగతి గదులకు విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఎస్ఎంఎస్ హాస్టల్ లేక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సందేశ్, కీర్తన, సింధు, ఉష, వర్ష తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతల చెంతకే విత్తనాలు..
● రైతు వేదికల్లో విత్తనాల పంపిణీకి శ్రీకారం ● నేటి నుంచి 30వ తేదీ వరకు విత్తనమేళాములుగు: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించడమే లక్ష్యంగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలోని వ్యవసాయ క్లస్టర్లలో ఉన్న రైతు వేదికల ద్వారా నేరుగా విత్తనాలు, నానో యూరియా, నానో డీఏపీ పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు రైతు వేదికల్లో విత్తనమేళా కార్యక్రమం ద్వారా అన్నదాతలకు 7 రకాల సన్నవడ్లకు చెందిన విత్తనాలను పంపిణీ చేయనుంది. ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించిన సన్నరకం వరి విత్తనాలను మంగళవారం నుంచి రైతు వేదికల ద్వారా వ్యవసాయ అధికారులు అందించనున్నారు. జిల్లాలో 31 క్లస్టర్లు.. జిల్లాలో ప్రతీ 5 వేల ఎకరాలకు ఒకటి చొప్పున 31 వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. 2020లో ప్రభుత్వం క్లస్టర్కు ఒక రైతు వేదికను నిర్మించింది. ప్రతీ రైతు వేదికలో ఏఈఓలు అందుబాటులో ఉంటారు. రైతు వేదికల్లో రైతు అవగాహన సదస్సులు, ఫార్మర్ రిజిస్ట్రీ, వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సుమారు 86 వేల మంది రైతులు ఉండగా 1.70 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అందుబాటులో ఉండే విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వం ఆరుతడి పంటలతో పాటు సన్నరకం ధాన్యం సాగును ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం ఎంపిక చేసిన సన్నరకం ధాన్యానికే రూ. 500 బోనస్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం విధితమే. దీంతో ఎంపికచేసిన సన్నరకం ధాన్యానికి సంబంధించి విత్తనాలు మాత్రమే రైతు వేదికల్లో అందుబాటులో ఉంటాయి. రైతులకు లాభదాయ కం, ఎగుమతులకు అనుకూలమైన బీపీటీ– 5204, ఆర్ఎన్ఆర్– 15048, కేఎన్ఎం–1638, జై శ్రీరాం, హెచ్ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్ 44, జేజీఎల్ 1798 వరి వంగడాలు అందుబాటులో ఉంటాయి. నేటి నుంచి పంపిణీ రైతు వేదికల్లో విత్తన మేళా కార్యక్రమం ద్వారా నేటి నుంచి ఈనెల 30 వరకు సన్నవడ్లకు చెందిన 7 రకాల విత్తనాలను అందిస్తాం. విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డీఏపీని సైతం రైతులకు అందుబాటులో ఉంచాం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – శైలజ, వ్యవసాయ అధికారి, వెంకటాపురం(ఎం) -
అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి
ములుగు: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అర్హులకు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన లబ్ధిదారులకు జీవనోపాధి అవకాశాల కల్పన, ఉత్పాదక ఆస్తుల పంపిణీ, గ్రామస్థాయిలో కార్యక్రమాల అమలు ప్రక్రియను వేగవంతం చేసి జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. లబ్ధిదారుల కుటుంబాలకు ఆధార్ నమోదు, ఉపాధిహామీ జాబ్ కార్డులు, రేషన్ కార్డులు, గృహాల మంజూరు, ఆరోగ్య సేవలు, టీకాల కార్యక్రమాలు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, అప్రోచ్ రోడ్లు వంటి మౌలిక సదుపాయాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీ ఉత్పత్తుల ఆధారంగా ఇప్పపువ్వు, తేనె సేకరణ, తేనెటీగల పెంపకం, వెదురు సాగు వంటి కార్యక్రమాలను ప్రోత్సహించి ఆదివాసీ కుటుంబాల ఆదాయాన్ని పెంపొందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, డీఆర్డీఓ చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. బాధితులకు అండగా ‘భరోసా‘ కేంద్రం ములుగు: మహిళలు, చిన్నారుల రక్షణకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ భాధితులకు భరోసా కేంద్రం అండగా నిలుస్తుందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు జిల్లా స్థాయి కన్వర్జెనన్స్ సమావేశం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. లైంగిక వేధింపులు, పొక్సో, గృహహింస వంటి కేసుల బాధితులకు వైద్యం, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పరిహారం, ఆశ్రయం, పునరావాస సేవలు సకాలంలో అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భరోసా సెంటర్ ద్వారా ఇప్పటివరకు బాధితులకు కౌన్సెలింగ్, వైద్య సహకారం, న్యాయ సహాయం, ఆశ్రయం, విద్యా సదుపాయాలు కల్పించడంతో పాటు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించినట్లు తెలిపారు. పలు పొక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా భరోసా కేంద్రం కీలక పాత్ర పోషించిందన్నారు. బాధితులకు తక్షణ న్యా యం, భద్రత, గౌరవప్రదమైన పునరావాసం కల్పించడంలో జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ఈ సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, డీఎస్పీ కిశోర్కుమార్, డిడబ్ల్యూఓ ప్రేమలత, ఎస్సై రాజ్యలక్ష్మి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, భరోసా సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. మొబైల్ డీటీఆర్ ట్రాలీ ప్రారంభం ములుగు: విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు ములుగు సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ డీటీఆర్ ట్రాలీని సోమవారం సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఆపరేషన్) బి.భిక్షపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్(డీటీఆర్) ఫెయిల్ అయినా లేదా ఓవర్లోడ్ కారణంగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడితే మరో డీటీఆర్ను ఏర్పాటు చేయడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు మొబైల్ డీటీఆర్ ట్రాలీలో అందుబాటులో ఉంచిన ట్రాన్స్ఫార్మర్ను తాత్కాలికంగా వినియోగించి వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించవచ్చని తెలిపారు. జిల్లాలోని మారుమూల అటవీ, గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాల సమయంలో వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు ఈ మొబైల్ డీటీఆర్ ట్రాలీ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఈ రాజు, ఏడీఈ వేణుగోపాల్, ములుగు డివిజన్ పరిధిలోని అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు. భారీ వర్షానికి కూలిన ఇల్లు రేగొండ: ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి ఓ ఇల్లు కూలిపోయింది. మండలంలోని రేపాక గ్రామానికి చెందిన మడప రత్నాకర్ రెడ్డి ఇల్లు సోమవారం కురిసిన భారీ వర్షానికి ఇల్లు నేలమట్టమైంది. -
ఫుడ్సేఫ్టీ ప్రమాణాలు అమలుచేయాలి
● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ములుగు: ఫుడ్సేఫ్టీ ప్రమాణాలను తప్పకుండా అమలుచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫుడ్ సేఫ్టీపై సోమవారం జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార పదార్థాలు తయారీ చేసే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పనిచేసే సిబ్బందికి ప్రతీ మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా వీధి ఆహార విక్రయ కేంద్రాలను ప్రతీ వారం కనీసం 10 నుంచి 15 వరకు తనిఖీ చేసి ప్రజలకు సురక్షితమైన ఆహారం అందేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సీహెచ్. మహేందర్జీ, సంపత్ రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగులకు హెల్త్ ప్రొఫైల్ పరీక్షలు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉచిత హెల్త్ ప్రొఫైల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఉద్యోగులు ఆరోగ్యం మెరుగ్గా ఉంటేనే ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తారని కలెక్టర్ హేమంత్ సహదేవరావు తెలిపారు. కలెక్టరేట్లో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ఉచిత హెల్త్ ప్రొఫైల్ పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపులో కలెక్టర్ సైతం ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ములుగు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సుమారు 200 మందికి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు పోలు రాజు, కందుల జీవన్కుమార్, మేడి చైతన్య, ప్రకాశ్రెడ్డి, కొమురయ్య, రాజు, శిరీష, శైలజ తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల ధరలు తగ్గించాలి
● రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజద్పాషాములుగు రూరల్: పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలిన తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజద్పాషా అన్నారు. జిల్లా కేంద్రంలో రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలన్నారు. పంటల బీమా పథకాన్ని రూపొందించి గ్రామాన్ని యూనిట్గా తీసుకోవాలని కోరారు. ప్రతీ మండలానికి ఒక సర్వేయర్ను కేటాయించి గ్రామాల్లో హద్దుల సమస్యను పరిష్కరించాలన్నారు. రైతు భరోసా డబ్బులు తక్షణమే చెల్లించాలని కోరారు. యాసంగి సన్నధాన్యం బోనస్ డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణసింగ్, నటరాజ్, కృష్ణయ్య, రమేష్, రాజయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటా..
మడికొండలోని ఓ కన్వెన్షన్లో బీఆర్ఎస్ వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తలకు ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు, సోషల్ మీడియాపై శిక్షణ కార్యక్రమం జరిగింది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి కేసీఆర్ను మరోసారి సీఎం చేద్దామని పిలుపునిచ్చారు. – హన్మకొండ● కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి కేసీఆర్ను మరోసారి సీఎం చేద్దాం ● ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదులో కార్యకర్తలు క్రియాశీలంగా పాల్గొనాలి ● బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
గిరిజన దర్బార్లో వచ్చిన వినతులు ఇలా..
స్టేషన్ఘన్పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన ఆశ్రమ పాఠశాలలో సీఆర్టీ ఉద్యోగం ఇప్పించాలని ఓ గిరిజనుడు పీఓకు విన్నవించారు. ఏటూరునాగారం మండలం గంటలకుంటలో విద్యుత్ సరఫరా, బోర్లు, మోటార్లు ఇప్పించాలని గొత్తికోయలు వేడుకున్నారు. కేసముద్రానికి చెందిన ధరావత్ కిషన్ ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూమిలో ఆయిల్ పామ్ తోటకు సోలార్, బోర్వెల్, మోటారు పంపు మంజూరు చేయాలని పీఓను వేడుకున్నారు. వెంకటాపురం(కె) మండలంలోని మరికాలలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ద్వారా రైతుల మోటార్లు సరిగా నడవడం లేదని కెపాసిటికి అనుగుణంగా మరో ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలని వేడుకున్నారు. ఇలా పలువురు బాధితులు తమ సమస్యలను పీఓకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ ప్రతాప్, డీడీ ఫిరంగి, ఈఈ వీరభద్రం, డీటీ అనిల్, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, జీసీసీ డీఎం వాణి, జేడీఎం కొండల్రావు, జియాలజిస్ట్ కిశోర్, పెసా కో ఆర్డినేటర్ ప్రభాకర్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
ఓట్ల చోరీ కోసమే ‘సర్’
హనుమకొండ హంటర్రోడ్లోని డికన్వెన్షన్హాల్లో సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)’పై బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. – హన్మకొండ చౌరస్తా● అప్రజాస్వామ్యంగా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది ● ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ● బీఆర్ఎస్ దోపిడీని ప్రజలు మరిచిపోరు ● టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ -
సవాల్ స్వీకరించాం.. ప్రత్యర్థులు రాలేదు..
● డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ములుగు/ఎస్ఎస్ తాడ్వాయి: ఇటీవల సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకుడు, రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డి ఇసుక అక్రమ రవాణాపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు.. సవాల్ స్వీకరించిన ఉదయం 11గంటలకు మేడారం చేరుకున్నా బీఆర్ఎస్ నాయకులు రాలేదని డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తెలిపారు. ఈ మేరకు మేడారంలోని వనదేవతల ఆలయ ఆవరణలో డీసీసీ అధ్యక్షుడు అశోక్ మీడియాతో మాట్లాడారు. చర్చకు సిద్ధంగా వేచి ఉన్నప్పటికీ ప్రత్యర్థులు హాజరు కాలేదని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం, రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం తప్పా వాస్తవాలపై చర్చించే ధైర్యం బీఆర్ఎస్ నాయకులకు లేదని విమర్శించారు. అనంతరం ములుగు గాంధీ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు ప్రజల సమక్షంలో చర్చకు సిద్ధంగా ఉంటామని తెలిపారని వివరించారు. మేడారం నుంచి ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్దకు చేరుకున్నా చర్చకు బీఆర్ఎస్ నేతలు రాకపోవడం సరికాదని తెలిపారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. పదేళ్లలో ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్దిపై చర్చకు రావాలని ఆశోక్ సవాల్ విసిరారు. వందల కోట్లతో ములుగు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా సీతక్క అభివృద్ది చేస్తున్నారని తెలిపారు. సీతక్క చేస్తున్న అభివృద్దిని చూస్తూ ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, కాంగ్రెస్ నాయకులు గొల్లపెల్లి రాజేందర్గౌడ్, చింతనిప్పుల భిక్షపతి, పల్లె జయపాల్రెడ్డి, వంగ రవియాదవ్, శ్రీనివాస్రెడ్డి, మామిడిశెట్టి కోటి, సుమన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ వీరభద్రియ కులసంఘం కమిటీ ఎన్నిక
ములుగు రూరల్: తెలంగాణ వీర భద్రియ కులసంఘం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎలక్షన్ కమిటీ ఎన్నికల కార్యనిర్వహణ అధికారి రాజయ్య, కన్వీనర్లు శివకుమార్, రాములు, ఎల్లయ్య, సత్తయ్య హాజరయ్యారు. వారి సమక్షంలో కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బానాల రాజ్కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్గా బానాల సాంబయ్య, గౌరవ సలహాదారులుగా చంద్రమౌళి, కొమురయ్య, కనకయ్య, ప్రధాన కార్యదర్శిగా తిరుపతి, కోశాధికారిగా రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా సంతోష్ తదితరులను ఎన్నుకున్నారు. ‘ప్రసాదాల విక్రయంలో నిర్లక్ష్యం’ మంగపేట : రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తులకు ప్రసాదాలను విక్రయించడంలో అధికారులు, సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పెసా మొబిలైజర్ తాటి విజయ్బాబు ఆదివారం ఒక్క ప్రకటనలో ఆరోపించారు. నిత్యం వందల సంఖ్యలో వచ్చే భక్తులకు ఆలయంలో విక్రయించే లడ్డు, పులిహోర ప్రసాదాలు లభించకపోవడంతో భక్తుల ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఆలయ సిబ్బందితో పాటు మల్టీపర్పస్ సిబ్బందితో కలిసి 15 మంది ఉన్నా నెలనెలా వేతనాలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారనే తప్ప ప్రసాదాల తయారీ, విక్రయాల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆలయంలో పూజ సామగ్రితో పాటు హోటళ్లు, బొమ్మల షాపులకు వేలంపాట నిర్వహించిన అధికారులు గతంలో మాదిరిగా లడ్డు, పులిహోర విక్రయాలకు వేలం పాట పెడితే ఆలయానికి ఎంతో ఆదాయం వచ్చేదని వెల్లడించారు. అధికారులు ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నీట్ ప్రశాంతం భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో రెండు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని సిటీ నీట్ కోఆర్డినేటర్ డాక్టర్ రమణారావు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:15 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 168 మంది విద్యార్థులకు 147మంది విద్యార్థులు హాజరుకాగా 21 గురు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 220 మంది విద్యార్థులకు 194 మంది హాజరు కాగా 26 గురు గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. 11 గంటల నుంచి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను క్షణంగా తనిఖీ చేసిన అనంతరం కేంద్రంలోనికి అనుమతించారు. పరీక్ష కేంద్రాలను అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్ పరిశీలించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలిరేగొండ: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ కరుణాకర్ రావు సూచించారు. ఆదివారం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో ఎస్సై సాయి త్రిలోక్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సైబర్ బాధితులు 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండి, రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తెలిపారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సెకండ్ ఎస్సై హేమ, సర్పంచ్ చల్లగురుగుల సుదర్శన్, ఉప సర్పంచ్ ఆకుతోట తిరుపతి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న విగ్రహాల తొలగింపు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలోని దక్షిణం, పడమర, ఉత్తరం వైపు వరకు ఉన్న ప్రాకార దేవతామూర్తుల విగ్రహాలను తమిళ శిల్పులు తొలిగిస్తున్నారు. గురువారం మొదలైన తొలగింపు ఆదివారం కొనసాగింది. ఉప ఆలయాల్లోని ఎలక్ట్రికల్ కనెక్షన్లు తీస్తున్నారు. ఆలయాల్లో పలు ఆభరణాలు, సామగ్రిని తీసి జాగ్రత్తగా భద్రపరిచారు. తొలగించిన సుమారుగా 50కిపైగా విగ్రహాలను శ్రీరాజరాజేశ్వరస్వామి వసతి గృహంలో భద్రపరచడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో విగ్రహాలు భద్రపరచడానికి కింద వరిధాన్యం పోసినట్లు తెలిసింది. -
రామప్ప అద్భుతం
సోమవారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2026వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయం అద్భుత కట్టడమని సెంట్రల్ జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ రాకేశ్ గోయల్ కొనియాడారు. మండలంలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప దేవాలయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమా శంకర్ లు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారి శేష వస్త్రాలను బహుకరించారు. ఆలయ చరిత్ర శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంటల విజయ్ కుమార్ వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. వారి వెంట జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రమణారెడ్డి, సూపరింటెండెంట్ సమ్మయ్య, జీఎస్టీ అధికారులు, సిబ్బంది, రామప్ప హరితహోటల్ మేనేజర్ శ్రవణ్, టూరిస్ట్ పోలీసులు, టూరిజం, దేవాదాయ, పురావాస్తు శాఖల అధికారులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులుమంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. మానవ శరీరాన్ని పోలి ఉండే స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. పూజారులు పవన్కుమార్ ఆచార్యులు, రాజీవ్ శర్మ, ఈశ్వర్చంద్రామానుజం భక్తుల గోత్రనామాలతో స్వామివారికి అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. లక్నవరంలో సందడి గోవిందరావుపేట: జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన లక్నవరం సరస్సు వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ముఖ్యంగా చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు సరస్సు అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదకరంగా గడిపారు. లక్నవరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వేలాడే వంతెనపై నడుస్తూ సందర్శకులు ప్రకృతి సోయగాలను తిలకించారు. సెల్పీలు, ఫొటోలు దిగుతూ కుటుంబ సభ్యులు, యువత ఉత్సాహంగా గడిపారు. సరస్సు చుట్టూ విస్తరించిన పచ్చని వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సరస్సులో బోటింగ్ నిర్వహించేందుకు అవసరమైన స్థాయిలో నీటిమట్టం లేకపోవడంతో అధికారులు బోటింగ్ను నిలిపివేశారు. దీంతో బోటింగ్ కోసం ప్రత్యేకంగా వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు. -
ఇప్ప.. ఆదాయం గొప్ప
ఏటూరునాగారం: జిల్లాలోని ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ పరిధిలో 50 గొత్తికోయ గూడేలు ఉన్నాయి. గిరిజనులు అడవుల్లో లభించే ఇప్ప పలుకలను వానాకాలం, ఎండాకాలంలో విరివిరిగా సేకరించి వాటిని నిల్వ చేసుకొని వేసవిలో విక్రయించి ఆదాయం పొందుతున్నారు. అలాగే పలుకులను ఎండబెట్టి పట్టించగా వచ్చే నూనెతో దీపారాధన చేయడం ఎంతో మంచిదని భక్తుల విశ్వాసం. ఈ ఇప్పనూనెకు మార్కెట్లో కిలోకు రూ.100ల నుంచి రూ.150 వరకు విక్రయించి ఆదాయం పొందుతున్నారు. ఇప్పనూనె ఇతర ప్రాంతాలకు తరలింపు ఏజెన్సీలోని గొత్తికోయలు సేకరించిన ఇప్పపలుకులను పలువురు వేసవిలో నూనెగా మార్చి వరంగల్, హైదరాబాద్, ఛత్తీస్గఢ్, భద్రాచలం ప్రాంతాలకు తరలిస్తుంటారు. అలాగే మరికొందరు సేకరించిన పలుకులకు నూనె మిల్లుల యజమానులు కిలోకు రూ.40 నుంచి రూ.50 వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా ఒక్కో కుటుంబం సుమారు 50 క్వింటాల వరకు అమ్ముతుంటుందని గొత్తికోయలు చెబుతున్నారు. ఇప్పపలుకులతో ప్రతిఏటా మంచి ఆదాయం వస్తుందని సంతోషం వెలిబుచ్చుతున్నారు.రూ.6 వేల వరకు సంపాదిస్తా.. ఇప్పపలుకులను సేకరించి నూనెగా మార్చడం వల్ల రూ.6 వేల వరకు సంపాదిస్తాను. ఇంటికొచ్చి పలువురు నూనెను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. మరికొందరు ఇప్ప పలుకులను కూడా కొనుగోలు చేస్తుంటారు. ఇలా వచ్చిన ఆదాయంతో కావాల్సిన నిత్యావసర సరుకులు తీసుకొచ్చుకుంటాం. – ఇర్ప లక్ష్మి, కొమురం భీంనగర్, ఏటూరునాగారం పలుకులు సేకరించి నిల్వచేసుకుంటున్న గొత్తికోయలు ఉత్పత్తులకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ కిలో నూనెకు రూ.100 నుంచి 150 పలుకుతున్న ధరమండలం గూడేలు క్వింటాలు ఏటూరునాగారం 6 15 ఎస్ఎస్ తాడ్వాయి 4 4 కన్నాయిగూడెం 4 6 మంగపేట 8 20 గోవిందరావుపేట 2 5 -
పూర్తయిన ఇల్లు.. జాడలేని బిల్లు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దఎత్తున ఇళ్లను మంజూరు చేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వేలాది ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే పునాది, లింటెల్, స్లాబ్ దశలు పూర్తిచేసిన లబ్ధిదారులకు బిల్లుల విడుదల ఆలస్యం అవుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు నిర్మాణాలు పూర్తిచేసి, గృహప్రవేశాలు కూడా చేశారు. అప్పుచేసి ఇళ్ల నిర్మాణం.. గృహప్రవేశం చేసినా చివరి బిల్లు పెండింగ్ ఇందిరమ్మ గృహ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం విడతల వారీగా ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, కూలీల ఖర్చులు అధికమవడంతో ప్రభుత్వం విడుదల చేసే మొత్తానికి మించి ఖర్చు అవుతోంది. దీంతో లబ్ధిదారులు ప్రైవేట్ అప్పులు, చిట్టీలు, బంగారు నగల తాకట్టు వంటి మార్గాలను ఆశ్రయించి ఇళ్లను పూర్తి చేస్తున్నారు. చాలామంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించినా తుది విడత బిల్లులు ఇంకా అందలేదని వాపోతున్నారు. అధికారులు నిర్మాణం పూర్తయినట్లు నమోదు చేసినప్పటికీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. కొందరు చెల్లింపుల కోసం మూడు నుంచి ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ‘ఇందిరమ్మ’ మొదటి విడత ఇలా.. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో మొదటి విడత 42 వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 35,417 ఇళ్లకు మార్క్ఔట్ చేసి నిర్మాణాలు మొదలు పెట్టారు. ఇప్పటివరకు దాదాపు 10,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. వీటిలో గణనీయమైన సంఖ్యలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసినప్పటికీ తుది బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వేలాది ఇళ్లు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. నిర్మాణాలకు అనుగుణంగా ఖాతాల్లోకే డబ్బులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వివిధ దశలను బట్టి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఆలస్యం జరడం లేదు. బిల్లుల చెల్లింపులకు మధ్య కాంట్రాక్టర్లు ఎవరూ ఉండరు. డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లో పడతాయి. అర్బన్లో ఇళ్ల నిర్మాణానికి పీఎంఏవైతో లింక్ అప్ అవడం వల్ల కేంద్రం నుంచి నిధుల విడుదల ఆలస్యం అవుతోంది. – సిద్ధార్థ్నాయక్, పీడీ, హౌసింగ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడత ఇళ్ల లెక్క ఇలా.. నెలలుగా ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎదురుచూపులు గృహప్రవేశం చేసినా ఖాతాల్లో జమ చేయని ప్రభుత్వం పునాదుల నుంచి పైకప్పు వరకు అప్పులు చేసి నిర్మాణం ఉమ్మడి జిల్లాలో మొదటి విడత 42 వేల ఇళ్లు మంజూరు.. పూర్తయినవి 10,500 గృహాలుదశ చెల్లింపు (రూపాయల్లో) పునాది పూర్తి 1,00,000 లెంటెల్ స్థాయి 1,50,000 స్లాబ్ పూర్తి 1,50,000 ఇల్లు పూర్తి 1,00,000 మొత్తం 5,00,000జిల్లా నియోజకవర్గాలు మంజూరు పూర్తి హనుమకొండ 2 8,000 2,400 వరంగల్ 3 9,000 1,760 జనగామ 2 5,600 1,860 మహబూబాబాద్ 2 10,148 2,750 ములుగు 1 5,100 1,165 జేఎస్ భూపాలపల్లి 1 4,152 565 11 42,000 10,500 -
వ్యవసాయ పనుల్లో రైతన్న నిమగ్నం
మహాముత్తారం: రెండు రోజుల క్రితం మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని బోర్లగూడెం, మీనాజీపేట, కనుకునూర్, సింగారం, గండికామారం గ్రామాల్లోని రైతులు బోరుబావుల కింద నారుమడులు తయారు చేసి వరినారు కోసం మొలక అలుకుతున్నారు. అదే విధంగా మరి కొన్ని గ్రామాల్లో రైతులు మొదటి దఫా వర్షాలు కురవడంతో పత్తి విత్తనాలు పెట్టడానికి చెలకల్లో దుక్కులు దున్ని సాగుబాటు చేసుకున్నారు. రెండు రోజులు కురిసిన వర్షాలతో ఆయా గ్రామాల్లోని రైతులు తమతమ పత్తి చేన్లలో కూలీలతో పత్తి విత్తనాలు వేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. జిల్లాలోనే కాకుండా ఈ సీజన్లో ఇంతవరకు భారీ వర్షం కురవడకపోవడంతో అన్నదాతలు సాగు పనులు ప్రారంభించేందుకు ఆలోచిస్తున్నారు. -
యోగాతో ఆరోగ్యం
● పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగు: యోగాతో ఆరోగ్యం, అందమైన జీవితం ఉంటుందని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల ప్రాంగణంలో ఆయుష్శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యోగాతో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమ శిక్షణతో కూడిన జీవన విధానం ఉంటుందని తెలిపారు. ప్రతిఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సాంకేతిక సౌకర్యాల పెరుగుదలకు కారణంగా మనిషి శారీరక శ్రమకు దూరం అవుతున్నాడని తెలిపారు. గతంలో పూర్వీకులు ప్రత్యేకంగా వ్యాయామం చేయకపోయినా శారీరక శ్రమ చేయడం వల్ల ఆరోగ్యంగా జీవించారని వెల్లడించారు. ప్రతిఒక్కరూ ప్రతిరోజూ యోగా, ఇతర శారీరక వ్యాయామాల కోసం సమయం కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, డీఎఫ్వో వికాష్ మీనా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, డీఈఓ సిద్ధార్థరెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ సంధ్య, డీఎస్పీ రవీందర్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
రాజీమార్గమే రాజమార్గం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్య చంద్రకళ ములుగు: రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ.సూర్య చంద్రకళ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ ఆదాలతో 588 కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ కక్షిదారులు తమ సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా సమయంతో పాటు డబ్బు కూడా ఆదా ఆవుతుందన్నారు. సివిల్, క్రిమినల్, ప్రమాదాలు, బ్యాంకు రికవరీ తదితర కేసులను పరస్పర అవగాహనతో రాజీ పద్ధతిలో కేసులు ముగిసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. గాలివాన బీభత్సం.. ● ఎగిరిపోయిన పాఠశాల పైకప్పు ఏటూరునాగారం: మండలం పరిధిలోని కొమురం భీం నగర్లో శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో ప్రభుత్వ పాఠశాల పైకప్పు ఎగిరిపోయింది. శనివారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఎగిరిపోయిన పైకప్పును చూసి ఆశ్చర్యపోయారు. గతేడాది పాఠశాల భవనం మంజూరు చేశారు. కానీ పక్కా భవనం నిర్మించకపోవడంతో తాత్కాలికంగా గొత్తికోయలు పెంకుటిల్లు ఏర్పాటు చేసి పిల్లల పెంకుటిల్లులోనే కొనసాగిస్తున్నారు. ఈ పాఠశాలలో 26 మంది విద్యార్థులకు గాను 11 మంది విద్యార్థులు చదువుతుండగా మిగతా విద్యార్థులు శనివారం హాజరు కాలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పక్కా భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులు డిమాండ్ చేస్తున్నారు. -
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
ములుగు రూరల్: నేటి 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ములుగు ఆయుష్ విభాగం నోడల్ అధికారి డాక్టర్ సంధ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, మహిళ సంఘాలు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఫీజుల దోపిడీపై కలెక్టర్కు వినతి ములుగు: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యజమానులు విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని శనివారం కలెక్టర్కు ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల నియంత్రణ పాటించడం లేదని తెలిపారు. పేద విద్యార్థులకు 25శాతం సీట్లు కేటాయించడం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఫీజుల వివరాలను వెబ్సైట్లో పెట్టడం లేదని, తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. విద్యాహక్కు చట్టం 2009, తెలంగాణ విద్యా చట్టం 1982 నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నాగపురి శ్రీకాంత్, నాయకులు నద్దునూరి రమేశ్, గడ్డం భిక్షపతి, బొచ్చు అశోక్, రవీందర్ రెడ్డి, మామిడి నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. వయో వృద్ధులకు వైద్య పరీక్షలు ములుగు: జిల్లా కేంద్రంలోని ప్రణామ్ డే కేర్ సెంటర్లో శనివారం డెంటల్ హెల్త్ క్యాంపు నిర్వహించి వయోవృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆర్ఎంఓ అల్లెం అప్పయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన 30 మంది వయో వృద్ధులకు బీపీ, షుగర్ టెస్టులు చేశారు. అనంతరం మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయోవృద్ధలందరూ ప్రతిరోజూ ఉదయం, రాత్రి బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. చక్కెర పదార్థాలు, గుట్కా, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. క్రమం తప్పకుండా బీపీ, షుగర్ టెస్టులు చేయించుకోవాలన్నారు. ఎలాంటి చిన్న సమస్య ఉన్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలని తెలిపారు. డే కేర్ సెంటర్ సభ్యులందరూ పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా ఆస్పత్రి బృందం సభ్యులు వీరమల్ల హరీశ్, నర్సింగ్ ఆఫీసర్ జి.తిరుపతి, జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సహాయకులు నాగేంద్ర, ప్రణామ్ డే కేర్ సెంటర్ సూపరింటెండెంట్ చుంచు రమేశ్, డే కేర్ సిబ్బంది పాల్గొన్నారు. ‘30లోగా ఈకేవైసీ చేయించుకోవాలి’ ములుగు రూరల్: ఎల్పీజీ వినియోగదారులు ఈ నెల 30వ తేదీలోగా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సయ్యద్ షా పైసల్ హుస్సేని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈకేవైసీ చేయించుకుని సబ్సిడీ ప్రయోజనాలు పొందాలని సూచించారు. ఎల్పీజీ వినియోగదారులు ఇప్పటి వరకు ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో వారు సంబంధిత గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి అప్డేట్ చేయి ంచుకోవాలని వెల్లడించారు. నిర్ధేశిత గడువులోపు ఈకేవైసీ పూర్తి చేయని వినియోగదారులు సబ్సిడీ కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. రాజకీయ అవకాశవాదమే భూపాలపల్లి అర్బన్: టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల అంశాలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని ఐఎన్టీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ జోగ బుచ్చయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టిన వారు ఇప్పుడు కార్మికుల హక్కుల గురించి మాట్లాడడం ప్రజలను మోసం చేసే మరో రాజకీయ నాటకమని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు కార్మికులపై ప్రేమ చూపించడం రాజకీయ మనుగడ కోసం చేస్తున్న ప్రయత్నమేనని విమర్శించారు. -
నాన్నే నాకు స్ఫూర్తి
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026జీవిత సారం తెలిపే గురువు. కష్టాల్లో ధైర్యం నూరిపోసే వైద్యుడు. మన తరఫున వాదించే లాయర్. భవిష్యత్ను నిర్మించే ఇంజినీర్. నిత్యం రక్షణ కల్పించే పోలీస్. వాస్తవాలు తెలిపే జర్నలిస్ట్. ఆకలి తీర్చే రైతు. ఇలా ఎన్ని పాత్రల్లో అయినా ఒదిగిపోయే రియల్ హీరో నాన్న. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు రియల్ హీరోల గురించి నేడు (ఆదివారం) ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. నేడు ఫాదర్స్ డేవరంగల్ క్రైం: ‘ఆడపిల్లలకు నాన్నే ధైర్యం. నాన్నంటే ఒక నమ్మకం. ఏదైనా సరే తనే చూసుకుంటాడనే ఒక భరోసా. ఇది ఏ ఆడపిల్లకై నా తండ్రి నుంచి స్వేచ్ఛగా లభించే చనువు. ఉద్యోగ సాధనకు మా నాన్నే స్ఫూర్తి’ అంటున్నారు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత. ఫా దర్స్డే సందర్భంగా తన తండ్రి గురించి ఆమె చెప్పిన మాటల్లోనే.. ప్రజలతో మమేకమై.. మానాన్న దార సాంబయ్య. ప్రకాశం జిల్లాలోని మట్టి గుంట గ్రామం. తెలుగు అధ్యాపకుడిగా జీవితం ప్రారంభించి.. ఆ తర్వాత గ్రూప్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్గా యూనిఫామ్ సర్వీస్లోకి ప్రవేశించారు. వివిధ హోదాలో పనిచేసి ఎకై ్సజ్ డీఐజీగా స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ స్ఫూర్తితో 2004–09లో సొంత నూతలపాడు (ఎస్ఎన్పాడు) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రజలతో మమేకమై వారికి సేవలందించారు. మేం నలుగురం ఆడ పిల్లలం అయినప్పటికీ ఎక్కడా మగ పిల్లలకు తీసిపోకుండా పెంచారు. ధైర్యంగా సమాజంలో ఎదిగేందుకు అవసరమైన స్వేచ్ఛ, అవకాశాలు కల్పించారు. ముఖ్యంగా ఓనమాల నుంచి ధైర్యం, నిజాయితీని నేర్పించారు. అమ్మ పద్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావడంతో క్రమశిక్షణతో కూడిన జీవితం అలవాటైంది. ఉద్యోగం, కుటుంబం, ఆర్యోగం, సేవా వీటిని సమపాళ్లలో చూడడం నాన్న నుంచి నేర్చుకున్నా. సమయం కేటాయించేవారు.. నాన్న వివిధ హోదాల్లో పనిచేసినప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించేవారు. సమాజంలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు వివరించేవారు. నా మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండడంతో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతానంటే నాన్న ప్రోత్సహించారు. ఇంట్లో నలుగురం ఆడపిల్లలం కాబట్టి అక్క పెళ్లి తర్వాత నాకు పెళ్లి చేయాల్సి వచ్చింది. నా ఇష్టానికి అనుగుణంగా పెళ్లి తర్వాత నేను చదువుకునేలా మా వారిని ఒప్పించారు. నాన్న స్ఫూర్తి, భర్త ప్రోత్సాహం ఈ రెండు నేను గ్రూప్–1 సాధించేందుకు దోహదపడ్డాయి. బాధితులకు, పేదలకు ఎలా సేవా చేయవచ్చో నాన్నను చూసి నేర్చుకున్నా. పేదలకు, బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు పోలీస్ శాఖ ఒక చక్కటి వేదిక. అన్యాయం జరిగిందని వచ్చే వారికి న్యాయం జరిగేలా చూసిన ప్రతీసారి నాన్నే గుర్తుకు వస్తారు. ఆయన చెప్పిన ‘సత్యమే మనల్ని కాపాడుతుంది.. సత్యం వైపు మాత్రమే ఉండాలి’ అనే మాటలు గుర్తొస్తాయి. నాకు మా నాన్నే హీరో.గెలుపు వెనుక దాగిన తండ్రి స్వేదంసాక్షితో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత -
రైస్మిల్లర్లు సమన్వయంతో పనిచేయాలి
● అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్జీ ములుగు: బాయిల్డ్ రైస్ మిల్లింగ్ ప్రక్రియలో రైస్మిల్లర్లు సమన్వయంతో పనిచేసి సకాలంలో పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్జీ సంబంధిత అధికారులను, రైస్ మిల్లర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమన్వయ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ధాన్యం సేకరణ, మిల్లింగ్ ప్రక్రియను ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మిల్లర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. మిల్లింగ్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఫైజల్ హుస్సేన్, డీఎం కృష్ణవేణి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్, రైస్ మిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి
● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో ఏటూరునాగారం: ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులను అధిక సంఖ్యలో చేర్పించాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో డీడీ, డీటీడీఓలు, ఏటీడీఓలు, హెచ్ఎంలతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ బడిబాట కార్యక్రమంలో భాగంగా చేర్పించిన పిల్లల వివరాలపై ఆరా తీశారు. అనంతరం పీఓ మాట్లాడుతూ గ్రామసభలను ఏర్పాటు చేసి స్థానిక సర్పంచ్, లోకల్ లీడర్స్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను భారీగా చేర్పించాలన్నారు. ఉచిత విద్య, ఆహారం, ఉచిత పుస్తకాలు, దుస్తులు విషయాలను గ్రామస్తులకు అర్ధం అయ్యేవిధంగా వివరించాలన్నారు. పదో తరగతి పరీక్షల్లో గిరిజన విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని వివరిస్తూ ఆడ్మిషన్లను పొందాలన్నారు. అంతేకాకుండా పాఠశాలలో ఉన్న సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఈ విద్యాసంవత్సరంలో డ్రాపౌట్లు లేకుండా చూడాలన్నారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులపై ఉందన్నారు. మెనూ పాటించడంతో పాటు అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే తల్లిదండ్రులకు, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఫిరంగి, డీడీ దేశిరాం, ఎన్టీటీడబ్ల్యూ నాగసాగర్, డీటీడీఓ నారాయణరెడ్డి, ఏటీడీఓలు, ఏసీఎంఓలు, డిప్యూటీ ఈఓలు పాల్గొన్నారు. -
మెడికల్ బోర్డు నిర్వహించాలి
● తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో నిలిచిపోయిన మెడికల్ బోర్డును నిర్వహించి కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాల కల్పించాలని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా శనివారం భూపాలపల్లి ఏరియాలో పర్యటించి కేటీకే–5వ గనిలో ఆవరణలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి నెల రోజుల సమయం ఇస్తున్నా.. ఈలోగా నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు ఏ రోజు నిర్వహిస్తామని ప్రకటించాలని లేకుంటే జూలై 20 నుంచే గాంధేయ మార్గంలో నిరాహార దీక్షకు దిగుతానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తుందని, ఇంతవరకు ఒక సారి కూడా మెడికల్ బోర్డు నిర్వహించలేదని ఆరోపించారు. మెడికల్ బోర్డు నిర్వహించి, పెండింగ్లో ఉన్న 1200 మంది కార్మికులకు సంబంధించిన వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. జయశంకర్, అంబేడ్కర్ విగ్రహాలకు కవిత పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకులు సారయ్య, రియాజ్ అహ్మద్, చెన్నూరు మాబోడ జనార్దన్, నాయకులు నరేష్ నేత, మల్లేష్, నర్సయ్య పాల్గొన్నారు. -
వరి, పత్తికే మొగ్గు
● రెండు పంటల వైపే రైతుల ఆసక్తి ● పప్పుధాన్యాలు, ఉద్యాన పంటలు అంతంతే ● ఆరుతడి పంటల సాగుపై ఆసక్తి చూపాలంటున్న అధికారులుగోవిందరావుపేట: జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 1,64,897 ఎకరాల్లో పంటలు సాగు కానుండగా అందులో అధిక భాగం వరి, పత్తి పంటల సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. కూరగాయలు, పప్పుధాన్యాలు, ఉద్యాన పంటల సాగుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సాగు విస్తీర్ణంలో అధికంగా వరి, పత్తి తర్వాత స్థానంలో మొక్కజొన్నపై ఆసక్తి చూపుతున్నారు. రైతులు మార్కెట్లో డిమాండ్, కొనుగోలు, సాగు అనుభవంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం వంటి కారణాలతో ఈ పంటలనే ఎంచుకుంటున్నట్లుగా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతున్నా ఆరుతడి పంటల సాగు మాత్రం పెరగడం లేదు. కూరగాయలు, పప్పుధాన్యాల పంటలు అంతంతే ప్రజల ఆహార అవసరాల్లో కీలకమైన కూరగాయలు, పప్పుధాన్యాల సాగు అత్యంత తక్కువ స్థాయిలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఏటూరునాగారం మండలంలో పచ్చి మిర్చి కేవలం 15 ఎకరాల్లో మాత్రమే సాగవుతుండగా ములుగు మండలంలో బెండకాయ, సోరకాయ, క్యాబేజీ, వంకాయ వంటి కూరగాయల సాగు కూడా 15 ఎకరాలకే పరిమితమైంది. పప్పుధాన్యాల పరిస్థితి కూడా అంతే. ఏటూరునాగారంలో మినుములు, అలసందలు, పెసర్లు, కందులు కలిపి 585 ఎకరాల్లో సాగవుతుండగా ములుగు మండలంలో ఈ పంటలు కేవలం 25 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్న పరిస్థితి నెలకొంది. 3,011 ఎకరాల్లో ఉద్యాన, ప్రత్యామ్నాయ పంటలు జిల్లా భౌగోళిక పరిస్థితులు ఉద్యాన పంటలకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ రంగం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. జిల్లాలో మామిడి, బొప్పాయి, ఆయిల్పామ్, డ్రాగన్ ఫ్రూట్, వివిధ రకాల కూరగాయలతో కూడిన ఉద్యాన పంటలు మొత్తం 3,011 ఎకరాల్లో మాత్రమే ఉన్నాయి. అదే విధంగా వెదురు, కాసురీనా, మలబార్ నీమ్, యూకలిప్టస్, గంధం, టేకు వంటి అటవీ ఆధారిత పంటలు 1,193 ఎకరాల్లో మాత్రమే సాగవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో వరి, పత్తి పంటల సాగుకే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వైవిధ్య పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. వైవిధ్య పంటల సాగుపై ఆసక్తి చూపాలి జిల్లాలో రైతులు ప్రధానంగా వరి, పత్తి పంటల సాగుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో పప్పుధాన్యాలు, ఉద్యాన పంటలు, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రోత్సాహం అందిస్తున్నాం. భవిష్యత్తులో పంటల వైవిధ్యం పెరిగేలా ప్రణాళికతో చర్యలు చేపడుతాం. – సురేశ్కుమార్, డీఏఓ -
రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం
● బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నాగజ్యోతిములుగు: ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, పంటలకు గిట్టుబాటు ధర, పెట్టుబడి సాయం అందించలేక రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను అన్నపూర్ణ రారష్ట్రంగా నిలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కష్టాల్లోకి నెట్టే పరిస్థితి తెచ్చిందన్నారు. 2013లో 40 లక్షల ఎకరాల్లో సాగు జరిగితే, 2014 తర్వాత అది 2.30 కోట్ల ఎకరాలకు పెరిగిందని తెలిపారు. పంజాబ్ను తలదన్నే స్థాయిలో పంటలు పండించిన ప్రస్తుతం కరెంట్, ఎరువులు, నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలు సాగవుతున్నాయని తెలిపారు. పంటల సాగుపై ఆధారపడే రైతులకు ప్రభుత్వం స్పష్టమైన భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ గోవింద్నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సానికొమ్ము రమేశ్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
ఉరుములు, మెరుపులు
● మంగపేటలో భారీ వర్షం ● నిలిచిన విద్యుత్ సరఫరామంగపేట: మండలవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి భారీ గాలులు, చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం 9.30 గంటల వరకు కమలాపురం, మంగపేట, మల్లూరు, రాజుపేట, తదితర గ్రామాల్లో వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం మండుటెండ, వడగాలులతో నిప్పుల కొలిమిలా మారిన వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా చల్లబడింది. తీవ్రమైన గాలుల వర్షంతో మండలవ్యాప్తంగా రాత్రి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గాలులతో కూడిన వర్షానికి రాజుపేట ప్రధాన సెంటర్లో చెట్టుకొమ్మలు విరిగి పడటంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ రెండు గంటల పాటు నిలిచి పోయింది. వర్షం నిలిచి పోవడంతో రోడ్లపై అడ్డంగా పడిన చెట్ల కొమ్మలను తొలిగించడంతో రాక పోకలు యథావిధిగా కొనసాగాయి. వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడడంతో రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీపీఎస్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు యూనిఫాం, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. అనంతరం ఉపాధ్యాయులు చైర్పర్సన్ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయురాలు ఉమాదేవి, ఉపాధ్యాయులు ముకుందరెడ్డి, స్వాతి, రజిత, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని ములుగు సీడీపీఓ శిరిష అన్నారు. శుక్రవారం మల్లంపల్లి మండలం మంచినీళ్లపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బడిబాట నిర్వహించగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధి సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారన్నారు. ఉపాధ్యాయుడు ఉమాశంకర్, అంగన్వాడీ సూపర్వైజర్ కమరున్నీస, టీచర్ ప్రియాంక, రజిత, తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీ
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ దేవేందర్, డెమో శ్రీదేవి ఈ తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని కిరణ్ హాస్పిటల్, యోదా హాస్పిటల్, మేధ హాస్పిటల్, స్మార్ట్ కేర్, శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్, ప్రధాన్ హాస్పిటల్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ, కాలుష్య నియంత్రణ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, అవసరమైన అనుమతులు, సర్టిఫికెట్లు, ధరల పట్టికలు తదితర అంశాలను పరిశీలించారు. అన్ని ఆస్పత్రుల్లోనూ దశలవారీగా తనిఖీలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం భూపాలపల్లి అర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్లో యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయుష్ వైద్యులు, నోడల్ అధికారి డాక్టర్ రాఘవేంద్రరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ‘ఎస్ఐఆర్’ను పకడ్బందీగా నిర్వహించాలిములుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)–2026 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీసీలో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారంల పంపిణీ, స్వీకరణ, ఓటరు వివరాల ధృవీకరణ తదితర ప్రక్రియలను ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించాలని సూచించారు. బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలు) ప్రక్రియకు సంబంధించిన ప్రతీ అంశంపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. జిల్లాల వారీగా ఎస్ఐఆర్ అమలుకు చేపట్టిన చర్యలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశాల వివరాలను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మొత్తం ప్రక్రియను కలెక్టర్లు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్ విజయభాస్కర్, ఎన్నికల తహసీల్దార్ సలీం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కోటంచ ఆలయ ఈఓగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ రేగొండ: కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారిగా బిల్ల శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన ప్రత్యేక పూజలలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని ఈఓ కార్యాలయంలో శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్నారు. ‘అవినీతి అనడం హాస్యాస్పదం’ కాళేశ్వరం: కాళేశ్వరాలయం టెండర్లు పూర్తికాలేదని ఇప్పుడే అవినీతి అని పుట్ట మధు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం అని కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వర క్షేత్రాన్ని రాజకీయాల్లోకి లాగడం బాధ్యతారాహిత్యమన్నారు. -
పనుల్లో పురోగతి కనిపించాలి
● పథకాలు అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి చేరాలి ● మహబూబాబాద్ ఎంపీ, దిశా కమిటీ చైర్మన్ పోరిక బలరాం నాయక్ములుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి సకాలంలో అందేవిధంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణతో పనిచేయాలని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు, దిశా కమిటీ చైర్మన్ పోరిక బలరాం నాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి బలరాం నాయక్ హాజరై మాట్లాడారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని శాఖల వారీగా సమీక్షించి, పనుల అమలులో ఎటువంటి జాప్యం లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కాన్ ఏర్పాటు కోసం తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మెడికల్ కళాశాల విద్యార్థులతో గిరిజన ప్రాంతాలలో వైద్య శిక్షణ శిబిరాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమగ్ర శిక్ష కార్యక్రమం, మధ్యాహ్న భోజన పథకం అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. యూరియా వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, ఆన్లైన్ విధానం ద్వారానే ఎరువుల కొనుగోలు, అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గుచూపేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ములుగు, ఏటూరునాగారం ప్రాంతాల్లో రింగ్ రోడ్ ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన పనుల జాబితాను రూపొందించి ప్రాధాన్యత క్రమంలో అమలు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ మూడు నెలలకు ఒకసారి దిశా సమావేశం నిర్వహిస్తూ అభివృద్ధి పనులపై సమీక్ష కొనసాగిస్తామన్నారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రాధాబాయి, ఎస్పీ సుధీర్ రామ్నాద్ కేకన్, అటవీ శాఖ జిల్లా అధికారి వికాస్ మీనా, దిశా కమిటీ సభ్యులు పూర్ణచందర్, అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా రెవెన్యూ అధికారి రవికుమార్, మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, అధికారులు పాల్గొన్నారు. -
ఎల్నినో సెగ!
జిల్లాలో పంటల సాగు అంచనా (ఎకరాల్లో) వరి 1,07,700 పత్తి 28,600 మొక్కజొన్న 11,329 వివిధ పంటలు 15,600ములుగు: వానాకాలం సాగు సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా.. ఆకాశం వైపు చూస్తున్న అన్నదాతకు నిరాశే ఎదురవుతోంది. ‘ఎల్నినో’ ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని, పంటల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ శాఖ రైతులకు సూచిస్తుంది. ఎల్నినో దెబ్బతో ఉష్ణోగ్రతలు పెరిగి భూగర్భజలాలు తగ్గే అవకాశం ఉందని, ఫలితంగా పంటల దిగుబడులు పడిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. జూన్ మొదటివారంలో అంతంతమాత్రంగా కురిసిన చిరుజల్లులకే ఇప్పటికే రైతులు పత్తి విత్తనాలను విత్తారు. రెండు మూడు రోజుల్లో వర్షాలు కురవకపోతే విత్తనాలు మొలకెత్తవని, దీంతో ఎకరానికి రూ.10 వేల మేర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అధిక శాతం రైతులు వరి, పత్తి పంటలు సాగు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. కంది, పెసర, మినుములు.. ఎల్నినో ముప్పు కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులు దృష్టి సారించాలని అధికారులు పేర్కొంటున్నారు. ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు రైతులు కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, నువ్వులు తదితర వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తుంది. ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి చేపట్టాలని, జూలై 15వ తేదీ వరకు సరిపడా వర్షాలు లేకపోతే 125 రోజుల లోపు పండే స్వల్పకాలిక వరి రకాలను ఎంచుకోవాలని వ్యవసాయ శాఖ పేర్కొంటుంది. జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలోని 10 మండలాల పరిధిలో రైతులు 1,63,229 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. సాగుకు సరిపోయే విత్తనాలను, ఎరువులను అందుబాటులో ఉంచి విక్రయిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా 1,07,700 ఎకరాల్లో వరి పంట, 28,600 ఎకరాల్లో పత్తి, 11,329 ఎకరాల్లో మొక్కజొన్న, 15,600 ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేయనున్నారు. ఇందుకోసం 26,925 క్వింటాళ్ల వరి విత్తనాలు, 906 క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలు, 54,286 పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరమున్నట్లు వ్యవసాయ అధికారులు గుర్తించి ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో విత్తనాల కోనుగోలుకు ఏర్పాట్లు చేశారు. పంటల సాగు కోసం 17,504 మెట్రిక్ టన్నుల యూరియా, 10 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 8వేల మెట్రిక్ టన్నుల ఎంఓపీ ఎరువులు అవసరమున్నట్లు ప్రణాళికలు రూపొందించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం సూచన ఉన్న నేపద్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని అధికారులు చెబుతున్నప్పటికీ రైతులు ఇప్పటికే బోర్ల కింద వరినార్లు పోయగా, మరికొంత మంది రైతులు పత్తి విత్తనాలు నాటి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎల్నినోతో ఏమి జరుగుతుంది? ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశంతో పాటు వేడి తరంగాలు పెరిగి, భూగర్భ జలాలు పడిపోయే అవకాశం ఉంది. వానాకాలం పంటలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. పంటలను సాగు చేస్తే దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. జూన్ మాసంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశంతో పాటు జూలై, ఆగస్టు మాసాల్లో అంతంతమాత్రంగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ రైతులకు హెచ్చరిస్తుంది. ప్రత్యామ్నాయ పంటలే మేలు.. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవకుండా సాగుకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలకు సాగు నీరు అందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ కాలపరిమితి కలిగిన పంటలను ఎంపిక చేసుకోవాలి. ప్రత్యామ్నాయ పంటలను రైతులు ఎంపిక చేసుకుంటే ఫలితం ఉంటుంది. – సురేష్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వర్షాల కోసం రైతన్నల ఎదురుచూపులు జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పడిపోతున్న భూగర్భజలాలు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ అధికారుల సూచన -
సోలార్ వెలుగులు
సాక్షిప్రతినిధి, వరంగల్ : మారుమూల గిరిజనగూడేల్లో విద్యుత్ వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సాంకేతిక యుగంలోనూ ఇప్పటికీ సాధారణ విద్యుత్ సరఫరా అందని, అంతరాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గొత్తికోయ గిరిజన నివాస ప్రాంతాలకు స్టోరేజ్ ఆధారిత సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అటవీ, గిరిజన గూడాలకు సోలార్ విద్యుత్ అందనుంది. సిద్ధమైన డీపీఆర్లు.. త్వరలో టెండర్లు, పనులు.. ప్రాజెక్టు అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వేలు పూర్తి చేశారు. గొత్తికోయగూడాల భౌగోళిక పరిస్థితులు, విద్యుత్ అవసరాలు, సాంకేతిక అంశాలను పరిశీలించి వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్లు) సిద్ధం చేశారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా, త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రతీగూడెంలో సోలార్ ప్యానెళ్లు, విద్యుత్ నిల్వ కోసం బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు ఏర్పాటు చేసి రాత్రివేళల్లో కూడా విద్యుత్ అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఒక్కో ఇంటికి ఎంత సామర్థ్యం గల విద్యుత్ సరఫరా అందించనున్నారనే సాంకేతిక వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని టీజీరెడ్కోకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షిప్రతినిధి’కి తెలిపారు. ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్న ఈ కార్యక్రమం సక్సెస్ తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని ఇతర అటవీ, గిరిజన ప్రాంతాలకు కూడా విస్తరించే దిశగా ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా విద్యుత్ అందుబాటులోకి రావడంతో గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు విద్య, ఆరోగ్యం, సమాచార సదుపాయాల వినియోగానికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లా.. గొత్తికోయగూడేలకు మహర్దశ 85 నివాస ప్రాంతాలు, 2,020 ఇళ్లకు సౌకర్యం... రూ.17.036 కోట్లు విడుదల.. ‘టీజీరెడ్కో’సౌజన్యంతో ఏర్పాట్లు సర్వే, డీపీఆర్లు సిద్ధం చేసిన అధికారులు... టెండర్ల దశలో ‘సోలార్’పనులు దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా అమలుఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు.. ఏటూరునాగారం డివిజన్లో గిరిజన, గొత్తికోయగూడాలున్నాయి. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, ఎస్ఎస్ తాడ్వాయి మండలాల్లో ఇప్పటికీ సాధారణ విద్యుత్ సరఫరా అందని, అంతరాయాలను ఎదుర్కొంటున్న 85 గిరిజనగూడేలను ప్రభుత్వం గుర్తించింది. ఈ గూడేల్లో ఉన్న 2,020 ఇళ్లకు ప్రయోజనం చేకూర్చేలా సోలార్ విద్యుత్ను అందించనున్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీరెడ్కో) ఆధ్వర్యంలో రూ.17.036 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పరిపాలనా, ఆర్థిక అనుమతులు ఇప్పటికే లభించగా, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ జీఓ ఆర్టీనం.5 జారీ చేశారు. అంతకుముందు మార్చి 6న ఆర్థిక శాఖ నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. -
దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
● సాదా బైనామా, రీ– సర్వే ప్రక్రియలను గడువులోగా పూర్తి చేయాలి ● వీసీలో రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ములుగు: భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, సాదా బైనామా, రీ–సర్వే ప్రక్రియలను గడువులోగా పూర్తి చేయాలని, రెవెన్యూ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీ.ఎస్.లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పలు జిల్లాల కలెక్టర్లతో భూధార్ సర్వే, భూభారతి, సాదా బైనామా, నాన్–కడాస్ట్రల్ గ్రామాల రీ–సర్వే, నక్షా కార్యక్రమం, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్ జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న భూధార్ సర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రతి భూ యజమానికి ఖచ్చితమైన భూ వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూభారతి కార్యక్రమం కింద వచ్చిన దరఖాస్తులను ఎటువంటి జాప్యం లేకుండా పరిశీలించి త్వరగా పరిష్కరించాలని, ప్రజలకు రెవెన్యూ సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న నాన్–కడాస్ట్రల్ గ్రామాల రీ–సర్వే కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, ఎంపిక చేసిన గ్రామాల్లో నక్షా డిజిటల్ భూ మ్యాపింగ్ పనులను నాణ్యతా ప్రమాణాలతో అమలు చేయాలన్నారు. భూముల హద్దుల నిర్ధారణలో పారదర్శకత పాటిస్తూ భూ రికార్డుల ఆధునీకరణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయడానికి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయభాస్కర్, సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితా సవరణకు సన్నద్ధం
ములుగు: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని, ఎస్ఐఆర్ నిర్వహణలో బూత్ లెవల్ ఆఫీసర్లు, ఏజెంట్ల పాత్ర కీలకంగా ఉంటుందని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. గురువారం ఎస్ఐఆర్ నిర్వహణ, బీఎల్ఓలు, బీఎల్ఏల శిక్షణ తరగతుల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు బూత్ లెవల్ ఆఫీసర్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటర్ జాబితాలో పొరపాట్లు లేకుండా, డూప్లికేట్ నమోదులను గుర్తించి, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించేలా బీఎల్ఓలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు నేడు(శుక్రవారం) ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాలకు చెందిన బీఎల్ఓలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో, గోవిందరావుపేట, ఎస్ఎస్తాడ్వాయి మండలాల వారికి గోవిందరావుపేట పీఎస్ఆర్ గార్డెన్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. 20న శనివారం ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల వారికి ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో, 22న సోమవారం కొత్తగూడ, గంగారం మండలాల వారికి కొత్తగూడ రైతు వేదికలో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు, పేరు, చిరునామా మార్పులు, డూప్లికేట్ నమోదుల గుర్తింపు, అభ్యంతరాల పరిశీలనతో పాటు తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి మహేందర్ జీ, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కృష్ణవేణి, ఎన్నికల సూపరింటెండెంట్ సలీం, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్ డెస్క్ను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ పేరుతో వాట్సాప్ ఫేక్ సందేశాలు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పేరుతో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ ద్వారా ఫేక్ మెసేజ్లు పంపుతూ అధికారులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఇటువంటి నకిలీ సందేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు -
బంద్ ప్రశాంతం..
ఏటూరునాగారం: మండల పరిధిలోని ఆకులవారిఘణపురం రాళ్లకుంట చెరువు శిఖం భూమిలో స్థానికేతర ఆదివాసీలు అక్రమంగా గుడిసెలు వేశారు.. దీన్ని నిరసిస్తూ ఏటూరునాగారం జేఏసీ ఇచ్చిన బంద్ గురువారం విజయవంతమైంది. మండల కేంద్రంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అక్రమదారులను శిఖం భూ ముల నుంచి తరలించడంతో స్థానికులు చేపడుతామన్న ర్యాలీని విరమించుకున్నారని నాయకుడు శ్రీనివాస్ తెలిపారు. అనంతరం రామాలయంలో ఏటూరునాగారం జేఏసీ కమిటీని ఎన్నుకున్నారు. పోలీసుల బందోబస్తు గిరిజనులు, గిరిజనేతరుల మధ్య రగులుతున్న భూ వివాదం చిచ్చును చల్లార్చేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. 164 సెక్షన్ అమలులో ఉండడంతో ఏఎస్పీ మనన్ భట్ ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాస్, ఎస్సైలు మహేశ్, సూరి, వెంకటేశ్తో పాటు స్పెషల్ పార్టీ సిబ్బంది నాఖాబంది ఏర్పాటు చేశారు. ఐటీడీఏ, క్రాస్రోడ్డు, ఐటీఐ వెనుకాల కొత్తగుడిసెల సమీపంలో పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. అలాగే చెరువు శిఖం భూమిలో వేసిన గుడిసెలను పోలీసులు ఖాళీ చేయించడంతో సమస్య సద్దుమణిగింది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాల మూసివేత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు -
రూ. వంద కోట్లు దోచుకునేందుకు కుట్ర
● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కాళేశ్వరం: దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర క్షేత్రాన్ని ఏటీఎంగా మార్చుకున్న ఎమ్మెల్యే ఆలయ పునర్నిర్మాణం పేరుతో రూ. వంద కోట్లు దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. గురువారం కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. చిరు వ్యాపారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక అధికారిని పంపించి తూతూమంత్రంగా మీటింగ్ పెట్టి సుమారుగా రూ.198 కోట్ల టెండర్ పిలిచారని, అంటే దాదాపు వంద కోట్ల మింగడానికే పునర్నిర్మాణం కార్యక్రమం చేపట్టారని అన్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని సీఎం చెబుతున్నారని.. రూ. 198కోట్లు ఎలా తీసుకువస్తాడో ఎమ్మెల్యే చెప్పాలన్నారు. ఆలయాన్ని కూలగొట్టే ముందు విధి విధానాలను చెప్పాలన్నారు. అంతకంటే ముందు భూపాలపల్లి కలెక్టర్ ఖాతాలో వంద కోట్లు జమ చేస్తేనే నమ్ముతామన్నారు. -
‘స్థలం కేటాయించాలని వినతి’
ఎస్ఎస్ తాడ్వాయి: మండల పరిధిలోని మేడారంలో లేదా పెట్రోల్ పంపు సమీపంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం కేటాయించాలని కోరుతూ అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ అధ్యక్షులు గజ్జల ప్రసాద్ కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావును మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి బొకే అందజేశారు. అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం కేటాయించాలని విన్నవించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి శ్యాంబాబు, విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ కార్యదర్శి గజ్జెల రాజశేఖర్, సహాయ కార్యదర్శి గజ్జెల మహేశ్, అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షులు గజ్జల నవీన్, అంబాల సందీప్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల డబ్బుల చెల్లింపులు పూర్తి ములుగు రూరల్: యాసంగి సీజన్లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేసిన డబ్బుల చెల్లింపులు విజయవంతంగా పూర్తి చేశామని జిల్లా పౌర సరఫరాల అధికారి సయ్యద్ షా ఫైసల్ హుస్సేని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 149 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 1,11,766 మెట్రిక్ టన్నుల ధాన్యం 14,220 మంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అందుకు గాను రూ. 265 కోట్లు చెల్లించామని వివరించారు. అలాగే ఎల్పీజీ వినియోగదారులు ఈ కేవైసీని ఈ నెల 30వ తేదీ వరకు చేసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో గ్యాస్ సబ్సిడీ కోల్పోతారని తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు ములుగు రూరల్: జాతీయ ఆరోగ్య మిషన్ విభాగం ఎన్టీఈఎఫ్ ప్రోగ్రాం నందు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయని అందుకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీ కాంట్రాక్ట్ పద్ధతిలో చేపడుతున్నట్లు తెలిపారు. అర్హులు ఈనెల 24వ తేదీ లోపు దరఖాస్తులు జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ఆన్లైన్ హెచ్టీటీపీఎస్://ములుగు.తెలంగాణ .జీఓవీ.ఇన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నైరుతి ప్రాకారం నుంచి తొలగింపు ప్రక్రియ షురూ కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం నైరుతిలో ఉన్న విజయగణపతి ఆలయం నుంచి దక్షిణ గోపురం వరకు ఉన్న ప్రాకారం విగ్రహాలను తమిళ శిల్పి రవీంద్రన్ ఆధ్వర్యంలో తొలగింపు ప్రక్రియను గురువారం ప్రారంభించారు. ముందుగా కొబ్బరికాయ, గుమ్మడికాయలు కొట్టి తొలగింపును ప్రారంభించగా.. ప్రాకారంపై ఉన్న విగ్రహాలను తొలిగించారు. బుధవారం శృంగేరి పీఠం శిష్యులు విశేష పూజలు చేసి ఆదిముక్తీశ్వరాలయంలో బాలాలయం ఏర్పాటు చేసి ఉత్సవ మూర్తులకు ప్రాణపత్రిష్ఠ చేసిన విషయం తెలిసిందే. దీంతో తొలగింపును దేవాదాయశాఖ గురువారం నుంచి ప్రారంభించింది. పూర్తి స్థాయిలో త్వరలో ప్రారంభిస్తారని తెలిసింది. ప్రమాదమని తెలిసినా.. మహాముత్తారం : మండలం మారుమూల ప్రాంతమైన కనుకునూర్ గ్రామానికి భూపాలపల్లి డిపో ఆర్టీసీ బస్సు ఉదయం, సాయంత్రం మాత్రమే నడుతున్నారు. మధ్యాహ్నం ప్రయాణం చేసేవారు ఇబ్బందులు పడుతున్నారు. విధిలేని పరిస్థితిలో కొంతమంది మండలకేంద్రానికి రావాలంటే 15కిలోమీటర్లు కాలినడకన పెగడపల్లికి వస్తున్నారు. అక్కడ నుంచి ప్రైవేట్ వాహనాల్లో మండలకేంద్రానికి చేరుకుంటున్నారు. గురువారం కాటారం మండలకేంద్రానికి వివిధ పనుల మీద వచ్చిన గ్రామస్తులు తిరుగు ప్రయాణంలో బస్సు లేకపోవడంతో ఓ ప్రైవేట్ వాహనంలో పైన వెనుక బాగంలో నిల్చొని ప్రయాణం చేశారు. ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. -
వనమహోత్సవానికి సిద్ధం
ములుగు రూరల్: గ్రామాలలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాస్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది వర్షా కాలంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 12లక్షల 305 మొక్కలను నాటేందుకు లక్ష్యం నిర్ధేశించారు. నీడ, పండ్ల మొక్కలు నాటేందుకు పంచాయతీ న ర్సరీలు, మరికొన్ని అటవీశాఖ నర్సరీలలో మొక్కల పెంపకం చేపట్టి అధికారులు నాటేందుకు సిద్ధం చేశారు. నాటిన మొక్కలను సంరక్షించేలా చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సీఎం రేవంత్రెడ్డి గురువారం వర్చువల్గా వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో జిల్లాలో అధికారులు వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటారు. జిల్లాలోని పది మండలాల పరిధిలో మొత్తం 171 పంచాయతీలు ఉండగా ప్రతీ గ్రామ పంచాయతీలో ఒక్కో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. ప్రతిఏటా జాన్ నెలలో వవనమహోత్సవ కార్యక్రమం చేపడుతున్నారు. అందుకు అనుగుణంగా జిల్లాలోని గ్రామ పంచాయతీ నర్సరీలలో 5,64,950 మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉంచారు. ఇందులో అత్యధికంగా నీడ, పండ్ల మొక్కలు, నేరేడు, వేప, చింత, సిస్సో, అర్నమెంటర్ స్లాంట్స్, మునగ, మందార, కానుగ, గుల్ మొహర్, గులాబీ మొక్కలతో పాటు ఈ ఏడాది డ్రాగన్ ప్రూట్, కర్జూర మొక్కలు పెంచుతున్నారు. ఈ మేరకు ప్రతీ ఇంటికి మొక్కలను పంపిణీ చేయనున్నారు. దీంతో పాటు అటవీశాఖ నర్సరీలలో మరికొన్ని మొక్కలను పెంచుతున్నారు. జిల్లాలో శాఖల వారీగా వనమహోత్సవ టార్గెట్ను కలెక్టర్ ఆధ్వర్యంలో కేటాయించారు. ఇందులో డీ ఆర్డీఏకు అత్యధికంగా 5 లక్షలు, అటవీ శాఖ 3.50లక్షలు, వ్యవసాయశాఖ 1.20 లక్షలు, పోలీస్ శాఖ 80 వేలు టార్గెట్ కేటాయించారు. అలాగే హ ర్టికల్చర్ 50 వేలు, ఇరిగేషన్కు 15వేలు, మున్సిపాలిటీ 80 వేలు, విద్యాశాఖకు 10 వేలు, పశుసంవర్థకశాఖ 3 వేలు, హెల్త్ డిపార్టుమెంట్ 500, ఎలక్ట్రిసిటీ వెయ్యి, ట్రైబల్ వెల్ఫేర్కు 20 వేలు, ఇతర శాఖలు వెయ్యి మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మండలం జీపీలు మొక్కలు ములుగు 19 58,600 మల్లంపల్లి 10 37,000 వెంకటాపురం(ఎం) 23 80,090 గోవిందరావుపేట 18 68,000 ఎస్ఎస్తాడ్వాయి 18 58,600 ఏటూరునాగారం 12 37,060 కన్నాయిగూడెం 11 34,000 మంగపేట 25 78,000 వెంకటాపురం(కె) 18 59,600 వాజేడు 17 54,000 శాఖల వారీగా టార్గెట్ కేటాయింపు మిగతావి అటవీశాఖ నర్సరీలలో పెంపకంవనమహోత్సవ జిల్లా లక్ష్యం పూర్తి చేస్తాం. శాఖ ఆధ్వర్యంలో 5 లక్షలు టార్గెట్ ఇచ్చారు. ఇంటింటికీ పంపిణీ చేసే మొక్కలు 2.90లక్షలు. మిగతా మొక్కలు ఖాళీ ప్రదేశాలు, గుడి, పాఠశాల ఆవరణలో నాటిస్తాం. ప్రజలు నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి. – చంద్రశేఖర్, డీఆర్డీఓ -
జాడలేని చినుకు..
సాక్షిప్రతినిధి, వరంగల్ : జూన్ మాసం ముగిసిపోతోంది. కాలం నెత్తిమీదకు వచ్చింది. అయినా వరుణుడు కరుణించడం లేదు. ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం ఆకాశం వైపు ఆశగా చూస్తోంది. గత ఖరీఫ్ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండకపోవడంతో సాగునీటి కొరత ఏర్పడింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. జూన్ 1 నుంచి 18వ తేదీ (గురువారం) వరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. 70 మండలాల్లో లోటు, భారీ లోటు.. 9 మండలాల్లో సాధారణం.. సాధారణంగా జూన్ తొలి పక్షంలోనే విస్తృతంగా వర్షాలు కురిసి ఖరీఫ్ సాగు ఊపందుకోవాలి. ఈసారి అక్కడక్కడా చిరుజల్లులు మినహా భారీ వర్షాలు నమోదు కాలేదు. ఉమ్మడి వరంగల్లో 79 మండలాలకు 43 మండలాల్లో భారీ లోటు (60 శాతం నుంచి 99 శాతం), 27 మండలాల్లో లోటు (20 శాతం నుంచి 59 శాతం), 9 మండలాల్లోనే సా ధారణ (19 శాతం అధికం, 19 శాతం మైనస్) వర్షపాతం నమోదైంది. దీంతో వానాకాలం సాగు కో సం విత్తనాలు సిద్ధం చేసుకున్న రైతులు వర్షాల కో సం ఎదురుచూస్తున్నారు. తగి నంత తేమ లేకపోవడంతో వి త్తనాలు వేయడానికి ముందు కు రావడం లేదు. వర్షాల లే మితో వ్యవసాయ పనులు మందగిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయానికి పత్తి, మొక్కజొన్న, కంది సాగు ప్రా రంభం కావాల్సి ఉన్నా అనేక ప్రాంతాల్లో రైతులు వేచి చూస్తున్నారు. మరో వారం రోజులపాటు గణనీయమైన వర్షాలు లేకుంటే ఖరీఫ్ సాగు విస్తీర్ణంపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్లో ఇదీ పరిస్థితి.. ఆరు జిల్లాల్లో తొమ్మిది మండలాలు మినహా అంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. హనుమకొండ జిల్లాలో మొత్తం 14 మండలాల్లో ఇప్పటికీ వర్షపాతం భారీ లోటుగా ఉంది. 77.1 మి.మీ.ల వర్షం కురవాల్సి ఉండగా 15.6 మి.మీ.లే నమోదు కాగా 80శాతం లోటుగా ఉంది. వరంగల్ జిల్లాలో 13 మండలాలకు ఏడు మండలాల్లో లోటు, ఐదు మండలాల్లో భారీ లోటు ఉండగా, రాయపర్తి మండలంలో 74.2 మి.మీ.లకు 60.1 (19 శాతం) మి.మీ.లతో సాధారణంగా నమోదైంది. జేఎస్ భూపాలపల్లిలో 12 మండలాలకు మహాముత్తారం, కాటారం, ములుగు గణపురంలలో సాధారణ వర్షం కురవగా, నాలుగు మండలాల్లో లోటు, 5 మండలాల్లో భారీ లోటు ఉంది. జనగామలో జనగామ, దేవరుప్పులలో నార్మల్ కాగా, 10 మండలాల్లో వర్షం లోటు, భారీ లోటు ఉండగా, మహబూబాబాద్లో 18 మండలాలకు పెద్దవంగరలో సాధారణం, నాలుగు మండలాల్లో లోటు, 13 మండలాల్లో వర్షపాతం భారీ లోటుగా ఉంది. ములుగు జిల్లాలో వెంకటాపూర్, కన్నాయుగూడెంలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, వాజేడు, మంగపేట, జేడీ మల్లంపల్లిలో లోటు, వెంకటాపురం(కె)లో భారీలోటు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.జిల్లాల వారీగా వర్షపాతం పరిస్థితి (మి.మీ.లలో) (జూన్ 1–18 వరకు) జూన్ ముగుస్తున్నా ఉమ్మడి జిల్లా అంతటా లోటు వర్షపాతం గతేడాది నిరాశపరిచిన వానలు.. ఈసారి కూడా అదే పరిస్థితా? 9 మండలాల్లోనే సాధారణం, 70 మండలాల్లో లోటు ఖరీఫ్ సాగు పనుల్లో జాప్యం.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన ఆకాశం వైపు ఆశగా చూపులు.. జిల్లా కురవాల్సింది కురిసింది లోటు (శాతం) హనుమకొండ 77.1 15.6 80.0 వరంగల్ 81.0 35.9 56.0 ములుగు 94.7 62.1 34.0 మహబూబాబాద్ 79.6 31.6 60.0 జయశంకర్ భూపాలపల్లి 84.3 40.7 52.0 జనగామ 70.7 32.8 54.0 -
బోసిపోయిన కాళేశ్వరం
కాళేశ్వరం: నిత్యం శివనామస్మరణ, భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరాలయం ప్రస్తుతం బోసిపోయింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా జీర్ణోద్దరణ పనులు ప్రారంభం కావడంతో భక్తుల సందడి తగ్గింది. నిన్నటి వరకు వేలాది మందితో కళకళలాడిన ఆలయ పరిసరాలు గురువారం నిర్మానుష్యంగా మారి నిశ్శబ్దాన్ని తలపించాయి. అడవిలోని ఆదిముక్తీశ్వరస్వామి ఆలయం వద్ద బాలాలయం ఏర్పాటు చేసి భక్తులకు దేవాదాయశాఖ దర్శనాలకు వీలు కల్పించారు. సూచిక బోర్డులు ఏర్పాటుచేయకపోవడంతో సుదూర ప్రాంతాలనుంచి వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వరం ముక్తీశ్వరస్వామి ఆలయం ప్రస్తుతం జీర్ణోద్దరణ, తొలిగింపు కార్యక్రమాలతో దేవస్థానంలో పూజలు నిలిపివేశారు. భక్తుల దర్శనాల కోసం బాలాలయం ఏర్పాటుచేశారు. ఆదిముక్తీశ్వరాలయం బాలాలయానికి మార్చబడిందని బోర్డు ఏర్పాటు చేశారు. ఇది గమనించని భక్తులు బాలాలయం ఎక్కడ అంటూ స్థానికులను అడుగుతున్నారు. సూచిక బోర్డులు ఏర్పాటుచేయకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు దారి తెలియక తికమక పడుతున్నారు. రూట్మ్యాప్ లాంటి ప్లెక్సీబోర్డు, విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంది. బాలాయలంలో పూజలు, ప్రసాదాల కోసం బోర్డులు ఏర్పాటు కాలేదు. దుకాణదారులకు నీడ కరువు.. ప్రతీ ఏడాది సుమారు రూ.కోటి ఆదాయం వచ్చే దుకాణదారులకు నిలువ నీడ కరువైంది. బాలాలయం వద్ద ప్లాట్పారం ఏర్పాటు చేశారు. అక్కడే సామగ్రి ఏర్పాటు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. వర్షాకాలం కావడంతో వర్షానికి తడిసే అవకాశం ఉందని ఈఓను కలిస్తే.. మీరే రేకులు వేయించకోవాలని హితవు పలికినట్లు తెలిసింది. దీంతో దుకాణాల నిర్వహణకు నిర్వాహకులు వెనుకడుగు వేస్తున్నారు. వారి పరిస్ధితిపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. జీర్ణోద్ధరణ పనులతో నిర్మానుష్యంగా పుణ్యక్షేత్రం బాలాలయం వద్ద దర్శనాలు సూచిక బోర్డులు లేక ఇబ్బందులు అయోమయంలో సుదూర ప్రాంత భక్తులు దుకాణదారులకు ప్లాట్ ఫారమే దిక్కు -
శని, కాలసర్ప పూజలు ఎక్కడ..
తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి నిత్యం మంగళవారం శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, శనివారం నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు అధికంగా నిర్వహిస్తారు. భక్తులు దర్శించుకొని పూజలు చేయడంతో ఆలయానికి ఆదాయం వచ్చేది. ప్రస్తుతం పూజల నిర్వహణ ఎక్కడ చేస్తారని దేవాదాయశాఖ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో భక్తులు కలవరపడుతున్నారు. దేవాదాయశాఖ అధికారులు మౌనం పాటిస్తుండడంతో భక్తులకు పాలుపోవడం లేదు. బుధవారం బాలాలయంలో ప్రాణప్రతిష్ఠ చేసిన ఉత్సవ మూర్తులను ఆసీనులు చేశారు. కాటారం నుంచి కాళేశ్వరం వరకు ఆయా బస్టాండ్ పాంతాలు, రద్దీ ప్రాంతాల్లో, హోటళ్ల వద్ద భక్తులకు, ప్రజలకు తెలిసేలా ఆలయాన్ని మార్చబడిందని, పూజల వివరాలు సూచిక బోర్డులు పెట్టాలని భక్తజనం కోరుతున్నారు. -
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
వెంకటాపురం(కె): అక్రమ అరెస్టులతో ఆదివాసీల భూ ఉద్యమాన్ని ఆపలేరని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్సా నర్సింహమూర్తి అన్నారు. ఏటూరునాగారంలోని భూ పోరాటం చేస్తున్న ఆదివాసీ మహిళలకు అండగా వెళ్తున్న ఆది వాసీ నాయకులను పోలీసులు గురువారం హౌస్ అరెస్టు చేయటం సరికాదన్నారు. పలువురు ఇరువర్గాల మధ్య ఘర్షణ పేరుతో ప్రజలను తప్పదోవ పట్టించేందుకు చూస్తున్నారని దుయ్యబట్టారు. చట్టాల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పాలకులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు గిరిజనుల గిరిజనేతరుల మధ్య గొడవ సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేశ్, శంకర్, నారా యణ, రామలక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు.ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహమూర్తి -
మొక్కలు నాటి సంరక్షించాలి
ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఈ మేరకు గురువారం జాకారంలో వనమహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా యంత్రాంగం 12లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపా రు. ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి లక్ష్యం చేరుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా అటవిశాఖ అధికారి వికాస్ మీనా మాట్లాడుతూ అటవిశాఖ ఆధ్వర్యంలో శాఖల వారి కార్యాచరణకు అనుగుణంగా నర్సరీలలో మొక్కలను అందుబాటులో ఉంచామని తెలిపారు. నాటి న ప్రతీ మొక్కను సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అటవిశాఖ అధికారులు, సర్పంచ్ సమత, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
వాజేడు: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. బుధవారం వాజేడుకు వచ్చిన ఆయన వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడే ఉన్న జిల్లా వైద్యాధికారి గోపాల రావు ద్వారా సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రజలకు అందే వైద్యం పట్ల నిర్లిప్తత ఉండవద్దన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారికి భరోసా కల్పించాలని సూచించారు. ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ గోపాలరావుకు సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విక్రాంత్, సొసైటీ ఉపాధ్యక్షుడు జగన్నాథరాజు, అచ్చ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.రేపు సమావేశం భూపాలపల్లి అర్బన్: ఏరియాలో ఈ నెల 19న నిర్వహించనున్న ట్రైపార్టైట్ సేఫ్టీ రివ్యూ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఏరియా సింగరేణి సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జీఎం కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎంఎస్) ఉన్నతాధికారులు సమావేశానికి హాజరుకానున్నందున అన్ని ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. గనుల్లో భద్రతా ప్రమాణాల అమలు, ప్రమాద నివారణ చర్యలు, కార్మికులకు అందిస్తున్న భద్రతా పరికరాలు, శిక్షణ కార్యక్రమాలు, అత్యవసర స్పందన వ్యవస్థలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. భద్రత విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రతీ ఉద్యోగి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. జీరో ప్రమాదాల లక్ష్యసాధనకు అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, వివిధ గనులు, విభాగాల అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు డాక్టర్ పద్మజ, రవికుమార్, శ్యామ్సుందర్, రాజేశ్వర్, రవీందర్, తిరుపతి, శ్యామ్సుందర్, రమేష్, హుస్సేన్ పాల్గొన్నారు. కై లాపూర్ పాఠశాల పునఃప్రారంభం చిట్యాల: మండలంలోని కై లాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థు కొరతతో గతేడాది మూతబడింది. గ్రామస్తుల చొరవతో బుధవారం పునఃప్రారంభమైంది. గ్రామంలో పాఠశాల మూతపడడంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని గమనించిన గ్రామస్తులు తిరిగి పాఠశాల తెరుచుకునే విధంగా సర్పంచ్ కొడారి ఓదేలు, ఉపాధ్యాయుడు దశరథం, గ్రామస్తులు పలు చర్యలు చేపట్టారు. దీంతో పాఠశాలకు 20 మంది విద్యార్థులు హాజరైనట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్ పల్లి పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శనిగరపు భద్రయ్య, గ్రామస్తులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
టీజీఈసెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన షురూ
కేయూ క్యాంపస్: తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో లెటర్ ఎంట్రీ అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా టీజీఈసెట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైంది. బుధవారం హనుమకొండలోని యూనివవర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైంది. పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ టీజీఈసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా ఇంజనీరింగ్ కళాశాలల్లోని కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవే శం పొందననున్నట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న అభ్యర్థులకు ధ్రువపత్రాలను జ్యోతి అందజేశారు. -
ఫీజుల మోత..
భూపాలపల్లి అర్బన్: వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు వసతులు కల్పించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. పాఠశాలల్లో నిబంధనలు పాటించకుండా, బస్సుల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను చేరవేయటంతో పాటు కొన్ని యజమాన్యాలు ఆ బస్సుల ఫిట్నెస్ను, సంరక్షకుల నియామకాన్ని పట్టించుకోవటంలేదు. వారు చెప్పిన చోటే నోట్ పుస్తకాలు, యూనిఫాంలు బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారు. అర్హత లేనివారితో విద్యాబోధన చేయిస్తున్నారు. వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా కనీసం ప్రయోగశాల, గ్రంఽథాలయం, ఆటస్థలాలు లేని పాఠశాలలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. 75 ప్రైవేట్ పాఠశాలలు.. జిల్లాలో 75 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ప్రాథమిక, హైస్కూల్ స్థాయిల్లో నడుస్తున్నాయి. సుమారు 15వేల మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఎల్కేజీ విద్యార్థులకు ఫీజు సగటున రూ.25వేలు, పదోతరగతి విద్యార్థులకు రూ.50 వేలు తీసుకుంటున్నారు. వీటితో పాటు పాఠశాలల్లోనే పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కులను కూడా పాఠశాలలోనే కొనుగోలు చేయాలనే నిబంధనలు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్లో అవే పుస్తకాలు రూ.10 నుంచి 15శాతం తగ్గింపు ధరతో దొరుకుతున్నాయి. ఈ అమ్మకాల విషయంలో కూడా పాఠశాల యాజమాన్యాలు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నాయి. పుస్తకాలు, నోటు బుక్కులతో పాటు పెన్ను నుంచి పెన్సిల్ వరకు బ్యాడ్జి నుంచి స్కూల్ డ్రెస్సు, షూస్ కూడా పాఠశాలలోనే కొనుగోలు చేయాలి. వీటన్నింటితోపాటు పాఠశాల గుర్తింపు కార్డుకు ప్రత్యేక రుసుంతో అమ్మకాలు సాగిస్తున్నారు. పుస్తకాలకు 1 నుంచి 10వ తరగతి వరకు రూ.3వేల నుంచి 8వేల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలల్లో వసతులకు సరిపడా తరగతి గదులు ఉండాలి భవన నిర్మాణ నాణ్యత ధ్రువీకరణ పత్రం ఉండాలి విద్యార్థుల మానసిక ఎదుగుదల కోసం ఆటస్థలం, లైబ్రరీ, ప్రహరీ, అగ్నిమాపక శాఖ జారీ చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉండాలి తాగునీటి వసతి, ప్రథమ చికిత్స, కంప్యూటర్ గది, సిబ్బంది గది, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఖచ్చితంగా ఉండాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వారు బోధన చేయాలి. తరగతి గదుల్లో అవసరమైనంత వెలుతురు ఉండాలి. పిల్లలు రోడ్డు దాటడానికి సౌకర్యం కల్పించాలి. పోషకుల కమిటీ, ఫీజు వివరాలు నోటీసు బోర్డుపై అతికించటం, ప్రభుత్వ పుస్తకాలతోనే విద్యాబోధన చేయటం, ఒక తరగతి గదిలో 40 మంది విద్యార్థులు దాటితే మరో సెక్షన్ కోసం అనుమతి తీసుకోవటం, ప్రీ ప్రైమరీ కోసం అనుమతి తీసుకోవటం, తదితర వసతులు ఉండాలి. ప్రైవేట్ పాఠశాలల్లో వసూళ్లు భయపెడుతున్న ఫీజులు, సామగ్రి ఖర్చు పుస్తకాలు, యూనిఫాం విక్రయాలకు సొంత కౌంటర్లు -
ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలి
ఏటూరునాగారం: తల్లిదండ్రులు నమ్మకం పెట్టుకొని ప్రభుత్వ బడికి పంపితే ప్రభుత్వ ఉపాధ్యాయులు భరోసా ఇచ్చి భవిష్యత్ను తీర్చిదిద్దుతారని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చిన్నబోయినపల్లిలో 160 మంది అడ్మిషన్లు దాటిన సందర్భంగా డీఈఓ పుస్తకాలను పంపిణీ చేసి మాట్లాడారు. గ్రామస్తులు, యువశక్తి కష్టపడి పనిచేసిందన్నారు. రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇక్కడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గదుల్లో ఫ్యాన్లు, దీపాలు, డిజిటల్ క్లాస్ రూమ్లపై దృష్టి పెడుతామని చెప్పారు. పాఠశాలకు ఒకేసారి ఆరుగురు ఉపాధ్యాయులను నియమించి విద్యాబోధన చేస్తున్నామని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి -
అటవీ విస్తీర్ణం.. రాష్ట్రంలో అగ్రస్థానం
అటవీశాఖ తాజా నివేదిక ప్రకారం వివరాలు.. సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాల్లో ములుగు అగ్రస్థానంలో నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల పర్యావరణ సమతుల్యతకు ములుగు జిల్లా అటవీ సంపద ప్రధాన ఆధారంగా ని లుస్తోంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 71.82 శాతం అడవులతో కప్పబడి ఉండటం విశేషం. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ అటవీ ప్రాంతాలు ఉన్నాయి. మరోవైపు పట్టణీకరణ, వ్యవసా య విస్తరణ కారణంగా హనుమకొండ, జనగామ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. అదే వరుసలో వరంగల్ జిల్లా కూడా నిలిచింది. ములుగు ఎందుకు ప్రత్యేకమంటే.. ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి అటవీ ప్రాంతాలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు. గోదావరి పరీవాహక ప్రాంతం జీవవైవిధ్యానికి కేంద్రబిందువు. పులులు, చిరుతలు, అడవి దున్నలు, అరుదైన వృక్షజాతులకు నిలయం. ఈ నేపథ్యంలో రోజురోజుకూ విస్తరిస్తున్న అడవులతో ములుగు అత్యధిక అడవులు ఉన్న జిల్లాగా వెలుగొందుతోంది. ఇదే సమయంలో అభివృద్ధి, పట్టణీకరణ పేరిట హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో రోజురోజుకూ కలుగుతున్న అటవీ నష్టం ఆందోళన కలిగిస్తోంది. అటవీ భూముల ఆక్రమణలు, పోడు సాగు, అటవీ అగ్నిప్రమాదాలు, రహదారి ప్రాజెక్టులు వంటి కారణాలతో అటవీ సంపదపై ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూముల ఆక్రమణల జాబితాలో జయశంకర్ భూ పాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలు కూడా ఉన్నాయని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ● భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోనూ గణనీయం ● అట్టడుగున జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాలు ● ఉమ్మడిజిల్లాకు గ్రీన్ కవచం ములుగు అటవీ సంపద ● మూడు జిల్లాలకు పర్యావరణ గండం పర్యావరణ పరిరక్షణలో అడవులే కీలకం ఉష్ణోగ్రతల నియంత్రణ, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెంపు, వన్యప్రాణుల సంరక్షణకు అటవీ సంపద కీలకం. అడవుల పరిరక్షణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గోదావరి పరీవాహక ప్రాంత రక్షణ, వన్యప్రాణుల ఆవాసం, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెరుగుదల, గిరిజనుల జీవనోపాధికి ఆధారమైన అడవులు అంతరించిపోకుండా చూడాలి. – డాక్టర్ కె.పురుషోత్తం, రిటైర్డ్ డీఎఫ్ఓ, పర్యావరణ నిపుణుడు ములుగుహనుమకొండమహబూబాబాద్భూపాలపల్లివరంగల్జనగామభౌగోళిక విస్తీర్ణం (చ.కి.మీ) అటవీ విస్తీర్ణం (చ.కి.మీ) -
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
వాజేడు: వర్షాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి గోపాలరావు సూచించారు. మండల పరిధిలోని వాజేడు, పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం పరిశీలించారు. రికార్డులు, హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. ఆస్పత్రిలోని గదులను పరిశీలించిన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ బదిలీపై వెళ్లిన వారి స్థానంలో వేరే వారిని నియమించనున్నట్లు తెలిపారు. వైద్యాధికారి ఉన్నత చదువుల కోసం వెళ్లిన కారణంగా ఖాళీగా ఉన్న వైద్యాధికారి పోస్టులో రెండు రోజుల్లో డిప్యూటేషన్పై వేరే వారిని నియమించనున్నట్లు తెలిపారు. జిల్లా వైద్యాధికారి గోపాలరావు -
అంతర్జాతీయ హ్యాండ్బాల్ పోటీల్లో శ్రీరామ్ సత్తా
వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ హ్యాండ్బాల్ టోర్నీలో వరంగల్ యువకుడు కీలక భూమిక పోషించాడు. ఈ టోర్నమెంట్లో భారత్ బంగారు పతకం సాధించింది. భారత జట్టుకు వరంగల్ నగరంలోని కొత్తవాడకు చెందిన కొడకండ్ల శ్రీరామ్ ప్రాతినిథ్యం వహిస్తూ పీవోట్ ప్లేయర్గా అద్భుత ప్రతిభతో అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు. జిల్లాకు చేరుకున్న శ్రీరామ్, డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్, కోచ్ బొడ్డు విష్ణువర్ధన్లతో కలిసి బుధవారం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ని కలిశారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్బాజ్పాయ్ యువక్రీడాకారుడు శ్రీరామ్ను అభినందించారు. అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబర్చి దేశానికి గర్వకారణంగా నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీరామ్ ఇప్పటి వరకు 20 రాష్ట్ర స్థాయి, 12 జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొని ఎన్నో విజయాలు సాధించినట్లు కోచ్ విష్ణువర్ధన్ తెలిపారు. భారత్కు గోల్డ్ మెడల్ తీసుకురావడంతో శ్రీరామ్ ప్రత్యేక కృషిగా చెప్పుకోవడం కోచ్గా తాను గర్విస్తున్నానని అన్నారు. క్రీడాకారుడిని అభినందించిన కలెక్టర్ చాహత్బాజ్పాయ్ కొత్తవాడలో శ్రీరామ్కు ఘన స్వాగతం -
యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం
ములుగు రూరల్: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్మేళా నిర్వహించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. బుధవారం ఇంచర్ల ఎంఆర్ గార్డెన్లో నిర్వహించిన జాబ్మేళాకు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యువతకు విద్యా అర్హతలు, నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. యువత అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్కు బలమైన పునాదులు వేసుకోవాలని అన్నారు. వచ్చిన అవకాశాలను యువత వినియోగించుకోవాలని సూచించారు. రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో యువతకు ప్రత్యేక వసతి గృహాలు ఏర్పాటుచేసి ఉచిత శిక్షణ కార్యక్రమాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు. జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే యువత ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధిలో ముందుండాలని అన్నారు. ఉద్యోగం రాకుంటే నిరాశకు గురికాకూడదని అవకాశాలు వస్తాయని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జాబ్ మేళాలో సుమారు 2 వేల మంది పాల్గొన్నారని తెలిపారు. జాబ్ సాధించిన అభ్యర్థులు శిక్షణ కాలాన్ని సమర్థవంతంగా పూర్తిచేసి భవిష్యత్ను నిర్మించుకోవాలని సూచించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మాట్లాడుతూ యువత సమాజానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉద్యోగ, ఉపాధి, వ్యక్తిత్వ వికాసం వైపు అడుగులు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సవ్ టోప్పో, రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, ఏఏస్పీ మమన్ భట్, పంచాయితీరాజ్ డైరెక్టర్ భగవాన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఇంచర్ల సర్పంచ్ ముసినపల్లి కుమార్గౌడ్, మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్ పాల్గొన్నారు. మంత్రి సీతక్క -
సేకరణ అంతంతే..
ఏటూరునాగారం: జిల్లాలో తునికాకు సేకరణ లక్ష్యం చేరలేదు. జిల్లాలోని ఐదు అటవీ సబ్ డివిజన్ల పరిధిలో మొత్తం 23 యూనిట్లు ఏర్పాటు చేశారు. ఆయా యూనిట్ల నుంచి 19,100 స్టాండర్డ్ బ్యాగులు సేకరణ లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటివరకు 10,600 సంచులను మాత్రమే సేకరించారు. తాడ్వాయి సబ్ డివిజన్లో 5,900 సేకరణ లక్ష్యం కాగా 1,940 స్టాండర్డ్ బ్యాగులను మాత్రమే సేకరించారు. ఏటూరునాగారం సబ్ డివిజన్లో 6,500గాను 3,980 సేకరించారు. వెంకటాపురం (కె) సబ్ డివిజన్లో 3,100 బ్యాగులకు గాను 2,700 సేకరించారు. ములుగు సబ్ డివిజన్ పరిధిలో సైతం 59 శాతం సేకరించారు. పలు కారణాలు.. వేసవిలో ఉపాధి కల్పించే తునికాకు(బీడీ ఆకు) సేకరణ లక్ష్యాన్ని చేరకపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఆకును సేకరించే కూలీలకు గతంలో రెండు, మూడు రోజులకోసారి డబ్బులను చెల్లించేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. కూలీలకు ఖాతాల్లో ఒకటి రెండు నెలలు ఆలస్యంగా డబ్బులను జమచేస్తున్నారు. కూలీలకు అంతకుముందు బ్యాంకులో ఏవైనా రుణాలు ఉంటే.. తునికాకు డబ్బులను బకాయి కింద జమ చేసుకునే అవకాశముంది. ఈ విధానంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ గ్రామాల్లో మిరప ఏరేందుకు వెళితే రోజుకు రూ.600 చెల్లిస్తున్నారని, ఏ రోజుకారోజే అందజేస్తున్నారని కూలీలు అంటున్నారు. అటవీశాఖ రెండు నెలలు ఆలస్యంగా డబ్బులు ఇస్తుండడంతో తునికాకు కోతకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపడంలేదు. మరోవైపు ఉపాధి హామీ పనులు కూడా లభిస్తుండడంతో తునికాకుకు మొండిచేయి అయింది. ప్రోత్సహించని అటవీశాఖ తునికాకు సేకరణలో అటవీ శాఖ అధికారులు కూలీలు వచ్చేందుకు ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇవ్వలేదు. బీట్ అధికారి నుంచి డివిజన్ అధికారి వరకు కూలీలను ప్రోత్సహించడం, అవగాహన కల్పించడం చేయకపోవడంతో లక్ష్యం నీరుగారిపోయిందని తునికాకు కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్యం 19,100సేకరించింది 10,994.55అత్యధిక సేకరణ పెరూరు 1314.67అతి తక్కువ సేకరణ లింగాల 41.71సున్నా సేకరణ నారాయణపూర్, కోడిశెల్ల–ఏ లక్ష్యం 19,100 స్టాండర్డ్ బ్యాగులు ఇప్పటివరకు సేకరణ 10,994 -
గొత్తికోయల అభ్యున్నతికి కృషి
ఎస్ఎస్తాడ్వాయి: ఏజెన్సీలో నివసిస్తున్న గొత్తికోయల అభ్యున్నతికి సహకారం అందిస్తామని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మండల పరిధిలోని తోగు గొత్తికోయగూడెంను ఎస్పీ మంగళవారం సందర్శించారు. స్థానిక పెద్దలతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గొత్తికోయ గూడేలకు మట్టిరోడ్డు వేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. గొత్తికోయల సమస్యలను ప్రభుత్వం, మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం గొత్తికోయ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. అలాగే గూడెంలోని పాఠశాల ఆవరణలో ఎస్పీ రాంనాథ్ కేకన్, డీఎస్పీ రవీందర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పస్రా సీఐ దయాకర్, ఎస్సైలు జగదీశ్, తాజుద్దీన్, కమలాకర్ పాల్గొన్నారు. రాజేశ్కు రాష్ట్ర సేవా పురస్కారం ములుగు రూరల్: మండల పరిధిలోని జాకారం గ్రామానికి చెందిన రేకులపల్లి రాజేశ్కు రాష్ట్ర సేవా పురస్కార నేషనల్ అవార్డు–2026 అందుకున్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో ఆసియా వేదిక ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ అకాడమి వారు ప్రదానం చేశారు. సామాజిక స్పృహ, సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యపర్చడంతో పాటు తెలంగాణ సంస్కృతి ప్రతిభింభించే బోనాలు, బతుకమ్మ సామాజిక గీతాల ఎడిటర్గా ఎన్నో సేవలందించినందుకు గాను అవార్డును ప్రదానం చేసినట్లు రాజేశ్ వెల్లడించారు. ఆత్మజిల్లా రైతు సలహాల కమిటీ ఏర్పాటు ఏటూరునాగారం: జిల్లా ఆత్మరైతు సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిటమట రఘును ఆత్మ రైతు అడ్వైజర్ కమిటీ జిల్లా చైర్మన్గా ఎన్నిక చేశారు. అలాగే ఆత్మ కమిటీ ములుగు చైర్మన్ కొండం రవీందర్రెడ్డి, ఏటూరునాగారం ఆత్మ చైర్మన్గా కర్ల అరుణ, డైరెక్టర్లుగా జక్కుల రేవంత్ యాదవ్, కొంపెల్లి రాజురెడ్డి, పూజారి సమ్మయ్య, తడకల మహేందర్లను నామినేట్ చేసినట్లు, వీరి పదవీ కాలం రెండేళ్లు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 210 గ్రాముల గంజాయి స్వాధీనం భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పట్టణంలో సీసీఎస్, భూపాలపల్లి పోలీసులు 210 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశారు. సీఐ నరేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సెగ్గంపల్లికి చెందిన దాసరి వంశీ (20), దుర్గం మహర్షి పట్టణ శివారు బాంబులగడ్డలో గంజాయి సేవిస్తున్నారు. వారి వద్ద నుంచి 210 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణలో గడ్డిగానిపల్లికి చెందిన సెగ్గం సాయి వర్ధన్, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రోయ్యూరు గ్రామానికి చెందిన జాడి మనోజ్, దుర్గం కిరణ్ గంజాయి సరఫరా చేసినట్లు గుర్తించి వారిపై కూడా కేసు నమోదు చేశారు. ఐదుగురిని అరెస్టు చేశారు. గడువు పొడిగింపు భూపాలపల్లి అర్బన్: డిగ్రీలో ప్రవేశాలకు దోస్తి మూడో దశ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 21వరకు పొడిగించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రమణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వీలైనంత త్వరగా దోస్తి పోర్టల్లో తమ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ప్రిన్సిపాల్ రమణారావు సూచించారు. -
విద్యారంగంలో జిల్లా రాష్ట్రానికే ఆదర్శం
● పది, ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ ● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్కములుగు: అటవీ ప్రాంత జిల్లాగా పేరుగాంచిన ములుగు విద్యారంగంలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని, విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్కు బలమైన పునాది వేయవచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 50 మంది విద్యార్థులకు మంత్రి సీతక్క మంగళవారం సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాలో నిరక్షరాస్యత అధికంగా ఉనప్పటికీ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థుల సమష్టి కృషి ఫలితంగా ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 99.30 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటి స్థానం, ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలో రెండో స్థానం సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ సహకారంతో 50 సైకిళ్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అదే విధంగా ప్రభుత్వం చేపట్టిన ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం రాష్ట్రంలో మహిళా అక్షరాస్యతకు కొత్త దిశానిర్దేశం చేస్తోందన్నారు. చదువురాని 12 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను గుర్తించామన్నారు. మొదటి విడతగా 6 లక్షల మందికి లిటరసీ పరీక్షలు నిర్వహించగా 83.33 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం విశేషమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హేమంత్ సహదేవరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, మున్సిపాలిటీ చైర్పర్సన్ చంద్రకళ, వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, రోటరీ క్లబ్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి సీతక్క ఆర్అండ్బీ అతిథి గృహంలో మదర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మహిళా సంఘాల సభ్యులకు కుట్టు మిషన్ శిక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై పలు సూచనలు చేశారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి కార్యకర్తలు పార్టీ అభ్యున్నతికి సైనికుల్లా పనిచేయాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి బూత్ లెవల్ ఏజెంట్లు, ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత కీలకమన్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, గిరిజనులు, అణగారిన వర్గాల ఓటర్ల నమోదు, తొలగింపుల ధృవీకరణపై దృష్టి సారించాలని సూచించారు. -
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
● డీఎంహెచ్ఓ గోపాల్రావు ములుగు రూరల్: ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో పల్స్ పోలియో, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఆశ కార్యకర్తులు ఇంటింటి సర్వే నిర్వహించి 0–5 సంవత్సరాల పిల్లలను గుర్తించాలన్నారు. హైరిస్క్ ప్రాంతాల్లో పిల్లలకు మొబైల్ టీంల ద్వారా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మొదలు ఆరోగ్య సిబ్బందికి పల్స్ పోలియో కార్యక్రమంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. వర్షాకాలం సీజన్లో వచ్చే వ్యాధులను అరికట్టేందుకు పీహెచ్సీల పరిధిలో రాపిడ్ ఫోర్స్ టీంలను తయారు చేసుకోవాలని సూచించారు. వర్షాకాలం వరద ముంపు ప్రాంతాల్లోని గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపఆరోగ్యశాఖ అధికారి సుధీర్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ అధికారి నాగ అన్వేష్, పోగ్రాం అధికారులు శ్రీకాంత్, రంజిత్, మాస్ మీడియా అధికారి సంపత్, కమ్యూనిటీ హెల్ అధికారి దుర్గారావు, శకుంతల తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ వరల్డ్ నో టొబాకో డేను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ గోపాల్రావు మాట్లాడుతూ నికోటిన్, పొగాకు వ్యసనం.. ఆకర్షణను బయట పెట్టి దాన్ని ఎదుర్కోవటం అనే నినాదంతో టోబాకోడే ప్రోగ్రాం ధీమ్ అని వివరించారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో పొగాకు, సిగరేట్, బీడీ, గుట్కాలాంటివి వాడడం వల్ల క్యాన్సర్, గుండెజబ్బు, ఊపిరితిత్తులు వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయని ప్రజలకు అవగాహన కల్పించాలచారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి రంజిత్, జిల్లా ప్రోగ్రాం అధికారులు శ్రీకాంత్, నాగగణేశ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. -
పాలెంవాగు ప్రాజెక్టు పరిశీలన
వెంకటాపురం(కె): మండల పరిధిలోని మల్లాపురం గ్రామ సమీపంలో నిర్మించిన పాలెంవాగు పాజెక్టును మంగళవారం సెంట్రల్ వాటర్ కమిషన్ బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ డిప్యూటీ డైరెక్టర్ రూపేశ్, అసిస్టెంట్ డైరెక్టర్ శరణ్యలు ప్రాజెక్టు పనుల స్థితిగతులపై ఆరా తీశారు. ప్రాజెక్టు పురోగతి, అమలులో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో నీటి సామర్ధ్యం, ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి సాగునీరు అందుతున్న అయకట్టు వివరాలు, భవిష్యత్లో నీరు అందించాల్సిన ఆయకట్టు వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు కెనాల్ ఏవిధంగా ఉంది, మరమ్మతుల వివరాలు తెలసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలెం ప్రాజెక్టు ఏఈ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు
● తీర్మానం చేసిన నల్లగుంట గ్రామ పంచాయతీ పాలకవర్గంవెంకటాపురం(ఎం): మండల పరిధిలోని నల్లగుంట గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ మేరకు గ్రామంలోని పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రభుత్వ బడికి మాత్రమే పంపాలని కోరుతూ నల్లగుంట పంచాయతీ పాలకవర్గం మంగళవారం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా సర్పంచ్ భూక్య శ్రీదేవిశంకర్నాయక్, ఉప సర్పంచ్ మోరే లింగస్వామి మాట్లాడుతూ గ్రామంలోకి ప్రైవేట్ స్కూళ్ల వాహనాలను రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామప్రజలు, జీపీ పాలకవర్గం, విద్యార్థుల తల్లిదండ్రులు ఏకమై ప్రభుత్వ బడికి వెళ్లాలని ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు మెంబర్లు పొనగంటి రవి, తంగళ్లపల్లి శ్రీధర్, రమణారెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు రామగిరి శ్రీనివాస్, మందల ప్రభాకర్ రెడ్డి, పోలుదాసరి రవి పాల్గొన్నారు. -
మహిమాన్వితం హేమాచల క్షేత్రం
● ధర్మాదాయ, దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావుమంగపేట: మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రం ఎంతో మహిమాన్వితమైందని ధర్మాదాయ, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హన్మంతరావు అన్నారు. రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని ఆయన ధార్మిక సలహాదారు గోవిందాహరితో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ ఇన్చార్జ్ వీరస్వామి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదమంత్రోచ్ఛరణ నడుమ వారి గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు. అనంతరం స్వామివారి ప్రత్యేకత, ఆలయ చరిత్రను వారికి వివరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. ఆలయ అభివృద్ధికి రూ.3కోట్లు మంజూరు హేమాచలుడిని దర్శించుకున్న అనంతరం దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు సాక్షితో మాట్లాడారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఆయా పనులకు త్వరలోనే టెండర్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులు చేపట్టేందకు ఆలయ ప్రాంతం అటవీశాఖ పరిధిలో ఉండటంతో పర్యావరణ, అటవీశాఖ అనుమతులు తప్పనిసరి కావడంతో ఉన్నదానిలో అభివృద్ధి పనులు చేపట్టాలనే విషయంపై క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ పూజారి సమ్మయ్య, యర్రంగారి సురేశ్, నూతులకంటి ముకుందం, ఆలయ పూజారులు ముక్కామల రాజశేఖర్శర్మ, పవన్కుమార్ ఆచార్యులు, ఏడునూతుల ఈశ్వర్చంద్, రామానుజం శర్మ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల నమోదు పెంచాలి
● పీఓ లెనిన్ వత్సల్ టొప్పో ములుగు రూరల్: ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని ఐటీడీఏ పీఓ లెనిల్ వత్సల్ టొప్పో అన్నారు. ఈ మేరకు మంగళవారం రాయినిగూడెం బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించి మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలన్నారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాఠశాలలో వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ములుగు రూరల్: జాబ్మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఈ మేరకు నేడు(బుధవారం) ఇంచర్ల ఎంఆర్ గార్డెన్లో నిర్వహించనున్న జాబ్మేళా ఏర్పాట్లను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాది అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్మేళాలో 70 కంపెనీలు పాల్గొని విద్యార్హతలు, నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు సులభంగా ఇంటర్వ్యూలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దార్ విజయభాస్కర్, సీఐ దయాకర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధే లక్ష్యంగా అధికారులు పనిచేయాలి
● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ములుగు: జిల్లా అభివృద్ధే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, పెండింగ్ దరఖాస్తులతో పాటు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టర్ సోమవారం రెవెన్యూ అధికారులతో భూ భారతి, భూసేకరణ, రామచంద్రపురం భూముల రీ సర్వే, మీసేవ ధ్రువీకరణ పత్రాల మంజూరు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ భారతి కార్యక్రమం అమలు పురోగతి, భూ రికార్డుల పరిశీలన, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అవసరాలకు, అభివృద్ధి పనులకు సంబంధించిన భూ సేకరణలో నిబంధనలు పాటించాలని సూచించారు. రామచంద్రపురం భూముల రీ సర్వే అంశంపై పెండింగ్లో ఉన్న భూ వివాదాలు, సర్వే ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు స్పష్టమైన హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మీసేవ ధ్రువీకరణ పత్రాలను గడువులోపు అందించేలా సంబంధిత అధికారులు పనిచేయాలని ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పురోగతిపై సమీక్షిస్తూ సంబంధిత అధికారులు సమగ్రంగా పనిచేసి అన్ని వివరాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. జిల్లా అభివృద్ది, ప్రజాసేవల అమలు, భూ సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, పెండింగ్ సమస్యలు లేకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్ఓ రవికుమార్, కలెక్టరేట్ ఏఓ రాజ్కుమార్, పర్యవేక్షకులు మంజుల, మహేష్ బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో వేగం పెంచాలి ఇందిరమ్మ ఇళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ హేమంత్ సహదేవరావు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, నూతన పింఛన్ల మంజూరు, వన మహోత్సవం, గ్రామాల్లో పారిశుద్ధ్యం, వర్షాకాలం సంసిద్ధత, అప్రమత్తం, తాగునీటి సరఫరా తదితర ఆంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ సంపత్రావు, డీపీఓ వెంకయ్య, హౌసింగ్ పీడీ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ సంపత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
కేయూ ఫిజిక్స్ విభాగం బీఓఎస్గా నరేందర్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విభాగం బోర్డు ఆఫ్స్డడీస్ చైర్మన్గా ఆ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేందర్ను నియమిస్తూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్గా బాధ్యతలను నిర్వర్తించిన డాక్టర్ వరలక్ష్మి పదవీకాలం పూర్తికావడంతో ఆమెస్థానంలో నరేందర్ను నియమించారు. ఈయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు నరేందర్కు వీసీ కె.ప్రతాప్రెడ్డి ఉత్తర్వులు అందించారు.పోలీసుల అదుపులో గంజాయి విక్రయదారులు?భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయాలు చేపడుతున్న నలుగురు వ్యక్తులను భూపాలపల్లి సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏటూరునాగారం మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు భూపాలపల్లిలో మరో ఇరువురికి విక్రయాలు చేపడుతుండగా పక్కా సమాచారంతో నిర్వహించిన తనిఖీల్లో నిందితులను పట్టుకొని వారి వద్ద నుంచి గంజాయి స్వాఽధీనం చేసుకున్నట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్న పోలీసులు గంజాయి ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే అంశాలపై దర్యాప్తు కొనసాగుస్తున్నట్లు సమాచారం. -
హాజరు అంతంతే!
మంగళవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2026ములుగు: జిల్లా వ్యాప్తంగా వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు ఘనంగా పునఃప్రారంభమయ్యాయి. ఉదయం బడిగంటలు మోగుతుండగా విద్యార్థులను ఉపాధ్యాయులు ఆత్మీయంగా ఆహ్వానించి కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలికారు. అమావాస్య ఎఫెక్ట్.. పాఠశాలలకు నిరాకరణ జిల్లాలో 363 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మొత్తంగా 14,034 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2,185 మంది మాత్రమే హాజరయ్యారు. కేవలం 15.57 శాతం మాత్రమే విద్యార్థుల హాజరు శాతం నమోదైందని డీఈఓ సిద్ధార్థరెడ్డి తెలిపారు. అమావాస్య రోజునే పాఠశాలలు ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపకపోవడంతో హాజరు శాతం తగ్గిపోయింది. సోమవారం అమవాస్య కావడంతో పాటు మంగళవారం సైతం సెంటిమెంటుగా భావించి తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బుధవారం నుంచి పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడనున్నాయి. ఈ మేరకు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సైతం అందించారు. ఎల్లారెడ్డిపల్లెలో పిల్లలకు బెలూన్స్, పుష్పగుచ్ఛాలువెంకటాపురం(ఎం): మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలకు 90 మంది పిల్లలకు కేవలం 12 మంది మాత్రమే హాజరయ్యారు. ఎల్లారెడ్డిపల్లె ప్రాథమిక పాఠశాలలో 22 మంది విద్యార్థులకు 15 మంది హాజరయ్యారు. ఈ మేరకు పిల్లలకు బెలూన్స్, పుష్పగుచ్ఛాలను ఉపాధ్యాయులు రమేశ్, స్రవంతి అందజేసి పాఠశాలలోకి ఆహ్వానించారు. ఉపాధ్యాయులకు పుష్పాలు అందజేస్తున్న పూర్వ విద్యార్థులు అమావాస్యతో తొలిరోజు పాఠశాలలకు రాని విద్యార్థులు విద్యార్థులకు వినూత్న స్వాగతం పలికిన ఉపాధ్యాయులు 14,034 మంది విద్యార్థులకు గాను 2,185 మంది రాకమండలం పాఠశాలలు మొత్తం హాజరైన విద్యార్థులు వారుములుగు 48 1,912 151 గోవిందరావుపేట 32 1,537 179 ఎస్ఎస్తాడ్వాయి 40 1,115 204 వెంకటాపురం(ఎం) 39 1,302 180 ఏటూరునాగారం 37 1,891 271 కన్నాయిగూడెం 21 1,005 171 మంగపేట 46 1,875 201 వాజేడు 45 1,361 359 వెంకటాపురం(కె) 55 2,036 469 -
భద్రకాళి దేవాలయంలో ప్రతిష్ఠాపనోత్సవ పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో మూడు రోజులపాటు జరగనున్న ధ్వజస్తంభ ప్రతిష్ఠామహోత్సవ పూజలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి ఆజ్ఞ తీసుకుని అనంతరం పూర్వంగవిధి, యాగశాల ప్రవేశం చేశారు. సర్వతోభద్రమండల రచన, దేవతాహ్వానం, మూలమంత్రనుష్టాన హోమాలు, కుటీర హోమం, జలాధివాసం చేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఎస్ఈ ఇరిగేషన్ హరివెంకటరామ ప్రసాద్, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు శివసుబ్రహ్మణ్యమ్, ధర్మకర్తలు పాల్గొన్నారు. -
మేడారంలో నలుగురు.. ఊరట్టంలో నిల్
ఎస్ఎస్తాడ్వాయి: మండలంలోని మేడారం ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో మామిడి తోరణాలు కట్టి పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దారు. కాని పాఠశాలకు నలుగురు విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. అలాగే ఊరట్టం ఆశ్రమ పాఠశాలకు ఉపాధ్యాయులు హాజరైనప్పటికీ ఒక విద్యార్థి కూడా పాఠశాలకు హాజరు కాలేదు. ఊరట్టం పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులు నూతనంగా అడ్మిషన్ తీసుకున్నట్లు హెచ్ఎం శ్రీనివాస్ తెలిపారు. పాఠశాల ప్రారంభం రోజున పాఠశాలకు వచ్చిన ఊరట్టం పాఠశాలలో పిల్లలను చేర్పించేందుకు వచ్చిన విద్యార్థినుల తల్లిదండ్రులు, సర్పంచ్ శైలజకు ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఒక విద్యార్థి.. ఇద్దరు టీచర్లు గోవిందరావుపేట: మండల పరిధిలోని గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే హాజరయ్యారు. గతేడాది పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు ఉండగా ఈ ఏడాది ప్రస్తుతం ఒకరు మాత్రమే పాఠశాలకు హాజరయ్యారు. ఆ విద్యార్థికి బోధించేందుకు పాఠశాలలో ఒక రెగ్యులర్ ఉపాధ్యాయురాలితో పాటు ఒకరు డిప్యుటేషన్ ఉపాధ్యాయురాలు విధులు నిర్వర్తిస్తున్నారు. పిల్లలు పాఠశాలలో చేరేలా చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. -
‘సాగునీరు అందించాలి’
ములుగు రూరల్: పొట్లాపూర్ పంపు హౌస్ నుంచి ములుగు మండల పరిధిలోని అన్ని చెరువులకు సాగునీరు అందించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యద్శి అంజాద్ పాషా అన్నారు. మండలంలోని అన్ని చెరువులకు సాగునీరు అందించాలని కోరుతూ కలెక్టర్కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ములుగు మండలంలోని రైతులు ఎక్కువగా వర్షాదారం పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ప్రతీ ఏడాది వర్షాలు సక్రమంగా కురువక పంటలు ఎండి పోతున్నాయని అన్నారు. పొట్లాపూర్ పంపు హౌస్ నుంచి అన్ని చెరువులకు సాగునీరు అందించి రైతుల పంటల ఎండి పోకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేశ్, కృష్ణయ్య, సమ్మయ్య, సుధాకర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రకాశ్ ఏటూరునాగారం: ఏటూరునాగారం మండలం గోగుపల్లికి చెందిన ఎట్టి ప్రకాశ్ను తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు వట్టం ఉపేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివాసీలకు సేవ చేసేందుకు ప్రకాశ్ను నియమించినట్లు వెల్లడించారు. తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన తుడుందెబ్బ జాతీయ, రాష్ట్ర నాయకులకు ప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు మధ్యలో గుంత.. ప్రయాణికులకు ఇక్కట్లు కన్నాయిగూడెం: మండల పరిధిలోని సర్వాయి గ్రామ పంచాయతీ పరిధి చిట్యాల గ్రామం ప్రధాన రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రోడ్డుపై పగలు రాత్రి తేడా లేకుండా వాహనదారులు తిరుగుతుంటారు. దీంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. పలువురు ద్విచక్రవాహనదారులు అందులో పడి గాయాలపాలయ్యారని గ్రామస్తులు చెబుతున్నారు. మరమ్మతులు చేయాలని గ్రామస్తులు పంచాయతీ అధికారులకు పలుమార్లు చెప్పినా ఫలితం లేకుండా పోతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. పాడుబడ్డబావులు.. మృత్యుపాశాలు కన్నాయిగూడెం: మండలంలోని వివిధ గ్రామాల్లో పాడుబడ్డ బావులు మూగజీవాలకు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. సర్వాయి గ్రామంలో రెండు గేదెలు సోమవారం పాడుబడ్డ బావిలో పడిపోయాయి. అవి ఎవరియో తెలియక గ్రామస్తులు వాట్సప్ గ్రూపుల్లో ఫొటోలు తీసి పెడుతున్నారు. వేసవి కావడంతో పంటలు లేకపోవడంతో మండలంలోని పశువులు, గేదెలు చేళ్లలో మేసి వాటంతట అవి తిరిగి గ్రామానికి వస్తున్నాయి. ఇదే క్రమంలో గేదెలు బావిలో పడి ఉంటాయని పలువురు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గ్రామాల్లోని పాడుబడ్డ బావులను తక్షణమే పూడ్చాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు. కోటగుళ్లలో ప్రత్యేక పూజలు గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు జాలపల్లి నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి ఉదయమే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. -
ప్రజావాణి వినతులు పరిష్కరించాలి
● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ● గ్రీవెన్స్లో 73 దరఖాస్తుల రాక ఎస్ఎస్తాడ్వాయి: కాటాపూర్ ప్రభుత్వ పాఠశాల ఆదర్శమని డీఈఓ సిద్ధార్థరెడ్డి తెలిపారు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ఆయన మండల పరిధిలోని కాటాపూర్ జెడ్పీహెచ్ఎస్ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భగా పాఠశాల హెచ్ఎం సుధాకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డీఈఓ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడుతుందనడానికి జెడ్పీహెచ్ఎస్ సాధించిన ఫలితాలే నిదర్శనమన్నారు. పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు ఐఐటీ బాసరలో సీట్లు సాధించడం అభినందనీయమన్నారు. పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం, కొత్తగా 60 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందడం ప్రభుత్వ పాఠశాలల నాణ్యతకు నిదర్శనమన్నారు. ఉపాధ్యాయుల అంకితభావంతో పనిచేసి విద్యార్థులను చేర్పించడం అభినందనీయమని కొనియాడారు. సైన్స్ బోధనను ప్రయోగాత్మకంగా నిర్వహించి, విద్యార్థులు నిజజీవితంలో అన్వయించుకునేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఉర్దూ మీడియం పాఠశాల, కాటాపూర్ పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ఏఎంఓ శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరడం సంతోషకరమన్నారు. ఎంఈఓ గడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతోనే వందశాతం ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. సర్పంచ్ దిడ్డి మోహన్ రావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి గ్రామం తరఫున పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని డీఈఓకు వినతిపత్రం అందజేశారు. వంట కార్మికుల వినతి ములుగు రూరల్: వంట కార్మికుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ సోమవారం మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు, పంచాయతీ కార్మికులకు వినతి ప్రతం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 54 వేల మంది వంట కార్మికులకు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాము, అరుణ, లలిత, సారమ్మ తదితరులు ఉన్నారు.ములుగు రూరల్/ఏటూరునాగారం: ప్రజావాణి వినతులను అధికారులు పరిశీలించి పరిష్కారం చూపాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన 73 వినతులు స్వీకరించారు. ఇందులో ఇందిరమ్మ ఇళ్లుకు సంబంధించిన వినతులు 21 రాగా పింఛన్లు 21, ఇతర శాఖలకు సంబంధించి 31 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు ఫార్వర్డు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పీఓ లెనిన్ వత్సల్ టొప్పో తెలిపారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనుల నుంచి పీఓ 32 దరఖాస్తులను స్వీకరించారు. ఏటూరునాగారం మండలం కోయగూడ ఎల్లాపురం పాఠశాలను నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ములుగు మండలం భూపాలపల్లి ఏహెచ్ఎస్ హాస్టల్ నుంచి రాయినిగూడెం ఏహెచ్ఎస్కు బదిలీ చేయాలని కోరారు. ఎస్ఎస్ తాడ్వాయి మండలం కామారంలో ఇళ్ల పట్టాలు ఇప్పించాలని.. ఇలా పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాధితులు పీఓకు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ ప్రతాప్, డీడీ ఫిరంగి, ఈఈ వీరభద్రం, డీటీ అనిల్, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, జీసీసీ డీఎం వాణి, జియాలజిస్ట్ కిశోర్, పెసా కోఆర్డినేటర్ ప్రభాకర్, శంకర్ పాల్గొన్నారు.కాటాపూర్ పాఠశాల ఆదర్శం డీఈఓ సిద్ధార్థరెడ్డి -
బాలాలయం ముస్తాబు!
● శ్రీ ఆదిముక్తీశ్వరాలయం వద్ద ఏర్పాట్లు ముమ్మరం ● రేపు పునరుద్ధరణ, తొలగింపు ప్రక్రియ షురూకాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేఽశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి దేవస్థానం ఈనెల (రేపు) 17న బుధవారం ఉదయం 8.15 గంటలకు కళాప్రకర్షణ క్రతువుతో శృంగేరి పీఠాధిపతి శిష్య బృందంచే విశేష పూజలతో ఆరంభం కానుంది. రూ.198కోట్ల వ్యయంతో ఆలయ పునరుద్ధరణ, ఆలయాల తొలిగింపు కార్యక్రమం జరుగుతుండడంతో ప్రస్తుత దేవస్థానానికి కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీఆదిముక్తీశ్వరాలయం వద్ద అభిషేక పూజలు నిర్వహించడానికి దేవాదాయశాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పక్కనే ఉన్న షెడ్డులో బాలాలయాలు ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. అందులోనే ఉత్సవ మూర్తులు శ్రీశుభానందముక్తీఽశ్వరులు, సరస్వతీ అమ్మవార్లను ఆసీనులు చేసి భక్తుల దర్శనాలకు వీలు కల్పించనున్నారు. మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. రెండు కంటెయినర్లలో కార్యాలయం, టిక్కెట్లు, ప్రసాద విక్రయాలు జరపనున్నారని తెలిసింది. ఇంకా కాలసర్ప, శని పూజలకు నిర్ణయాలు తీసుకోలేదని తెలిసింది. ఈ మేరకు మంగళవారం దేవా దాయశాఖ కమిషనర్ హనుమంతరావు స్థానికుల అభిప్రాయాలు తీసుకోనున్నారని సమాచారం. -
లోక్ అదాలత్తో కేసుల పరిష్కారం
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.కన్నయ్యలాల్ సూచించారు. సోమవారం న్యాయవాదులు, కోర్టు కానిస్టేబుళ్లతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి లోక్ అదాలత్ విజయవంతానికి అవసరమైన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో రాజీ మార్గాన్ని ప్రోత్సహించాలని కోరారు. లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాలు స్నేహపూర్వక వాతావరణంలో వివాదాలను పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందన్నారు. సివిల్ కేసుల్లో రాజీ కుదిరిన వారికి చెల్లించిన కోర్టు ఫీజు తిరిగి అందజేయబడుతుందన్నారు. ఈ సమావేశంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందరపు శివకుమార్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కంప అక్షయ, న్యాయవాదులు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: రెండోయాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు కిటకిటలాడింది. పాఠశాలలకు వేసవి సెలవులు ముగియడంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రితో పాటు తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పరవశించారు. ఆలయ అర్చకులు రాజీవ్శర్మ, ఈశ్వర్చంద్ శర్మ భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. -
ప్రభుత్వ బడికే
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026ములుగు: వేసవి సెలవుల అనంతరం జిల్లాలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు ఆటపాటలతో గడిపిన విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. దీంతో విద్యాలయాలు సందడిగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆహ్వానం పలికేలా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అలాగే చెత్తాచెదారం శుభ్రం చేశారు. మరికొన్ని పాఠశాలల్లో వర్షం నీరు నిల్వకుండా ఉండేలా మట్టిపోసి చదును చేశారు. ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, బెంచీలు, తాగునీటి సౌకర్యం, పరిశుభ్రమైన టాయిలెట్లు, డిజిటల్ క్లాసులు, ప్రత్యేక తరగతులు, నాణ్యమైన బోధన, విశాలమైన తరగతి గదులు ఉన్నాయి. అదే విధంగా ఫలితాల్లో స్థిరమైన పురోగతి, ఆటలాడేందుకు క్రీడామైదానం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, యునిఫాంలను ప్రభుత్వం సమకూర్చడంతో సర్కారు బడుల ముఖచిత్రాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో సర్కారు బడుల వైపే విద్యార్థులు మొగ్గు చూపుతుండగా.. చిన్నారుల తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు మక్కువ చూపుతున్నారు. ప్రైవేట్ నుంచి.. ప్రభుత్వ బడులకు మారుతున్న ట్రెండ్ ఒకప్పుడు సర్కారు బడులంటే చిన్నచూపు ఉండేది. దీంతో ప్రైవేట్ స్కూళ్ల వైపే పిల్లల తల్లిదండ్రులు ఆసక్తి కనబరిచేవారు. దీంతో మండల కేంద్రంతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల పరిధిలో విచ్చలవిడిగా ప్రైవేట్ పాఠశాలలు వెలిశాయి. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి చాలావరకు మూతపడ్డాయి. కాని గత కొంత కాలంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులతో పాటు డిజిటల్ బోధన కూడా మొదలు కావడంతో పరీక్ష ఫలితాల్లో సైతం సర్కారు పాఠశాలల విద్యార్థులే విజయఢంకా మోగిస్తున్నారు. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలోనే జిల్లాకు ప్రథమ స్థానం రావడంతో విద్యార్థుల్లో ఒక్కసారిగా ట్రెండ్ మారిపోయింది. ప్రైవేట్ పాఠశాలలను విడిచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో మూతపడిన కొన్ని పాఠశాలలను సైతం ఈ విద్యా సంవత్సరం విద్యాశాఖాధికారులు నూతనంగా ప్రారంభించారు. ఏటూరునాగారం మండల పరిధిలోని చిన్నబోయినపల్లి యూపీఎస్ పాఠశాలలో ఏకంగా 12 మంది విద్యార్థుల నుండి 138 మంది విద్యార్థులు ఒక్కసారిగా ఆడ్మిషన్ పొందడం జిల్లాలోనే ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే పాఠశాలను ఆదర్శంగా తీసుకొని మిగతా పాఠశాలలను సైతం బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తోంది. 374 పాఠశాలలు.. 19,653 మంది విద్యార్థులు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 374 ప్రభుత్వ పాఠశాలల్లో 19,523 మంది విద్యార్థులు బోధనను అభ్యసించనున్నారు. అలాగే 32 ప్రైవేట్ పాఠశాలల్లో 8 వేల మంది మాత్రమే అడ్మిషన్లు పొంది ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమం ద్వారా ఏటూరునాగారం మండలంలో 256, గోవిందరావుపేటలో 72, కన్నాయిగూడెంలో 126, మల్లంపల్లిలో 55, ములుగులో 163, ఎస్ఎస్ తాడ్వాయిలో 183 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. అలాగే వెంకటాపురం(ఎం)లో 91, వెంకటాపురం(కె)లో 103, వాజేడులో 63, మంగపేటలో 162 మంది పిల్లలను నూతనంగా పాఠశాలల్లో చేర్పించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1,274 మంది పిల్లలు బడిబాట కార్యక్రమం ద్వారా అడ్మిషన్లు పొందారు. వెంకటాపురం(ఎం) జెడ్పీ ఉన్నత పాఠశాల ద్వారం ఎదుట ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు వాజేడులోని పాఠశాల ఆవరణలో నీరు నిల్వకుండా పోస్తున్న మట్టినేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం జిల్లాలో మారుతున్న విద్యారంగ సమీకరణలు ప్రభుత్వ పాఠశాలలకు పెరుగుతున్న ఆదరణ గవర్నమెంట్ స్కూల్స్ వైపే విద్యార్థులు, తల్లిదండ్రుల చూపుసంవత్సరం పాఠశాలలు విద్యార్థులు 2022–23 335 16,850 2023–24 357 18,204 2024–25 352 17,549 2025–26 357 17,749 2026–27 374 19,523 -
ఐటీడీఏ ఏపీఓగా దామోదరస్వామి?
ఏటూరునాగారం: ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్గా టీవీఆర్ దామోదరస్వామిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం. ఉట్నూరు ఐటీడీఏలో పరిపాలన అధికారిగా పనిచేస్తున్న దామోదరస్వామికి పదోన్నతి కల్పిస్తూ ఏటూరునాగారానికి బదిలీ చేసినట్లు సమాచారం. ఈయన గతంలో స్థానిక ఐటీడీఏఓగా పనిచేస్తూ ఉట్నూరుకు బదిలీపై వెళ్లారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న దామోదరస్వామికి ఉద్యోగోన్నతి రావడంతో ఏటూరునాగారంలో ఏపీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో మరో రెండు రోజుల్లో ఏటూరునాగారం ఏపీఓగా ఆయన బదిలీపై వచ్చి బాధ్యతలను స్వీకరించనున్నట్లు తెలిసింది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రవి ములుగు రూరల్: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా జిల్లాలోని ఏటూరునాగారానికి చెందిన తోకల రవిని నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. 2004 నుంచి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపై పోరాటం చేయడంతో పాటు సంఘం అభివృద్ధికి పాల్పడ్డాడని తెలిపారు. అనంతరం రవి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్, జిల్లా నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. ఎంజీఎంలో డిప్యుటేషన్పై నర్సింగ్ సిబ్బంది కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో 478 మంది నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు 161 మంది ఇన్పేషంట్లకు సేవలందించడం సమస్యగా మారింది. రెండు వార్డులకు కలిపి ఒక నర్సింగ్ ఆఫీసర్తో సేవలందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈక్రమంలో అధికారులు ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని నర్సింగ్ ఆఫీసర్లను డిప్యుటేషన్పై ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. అలాగే, నర్సింగ్ స్కూల్కు చెందిన వందలాది మంది విద్యార్థినులను కూడా నర్సింగ్ ఆఫీసర్లకు అసిస్టెంట్లుగా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. నర్సింగ్ ఆఫీసర్ల సమస్య తీరాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కొత్తవారు జాయిన్ అయితేనే నర్సింగ్ సేవలు సజావుగా అందుతాయి. ఇప్పటికే ఎంజీఎంలో సూపరింటెండెంట్ పోస్టు భర్తీ కాకపోవడం, నర్సింగ్ సిబ్బంది జాయిన్ కాకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. అవగాహన కల్పించినా కాల్చేస్తున్నారు మహాముత్తారం: రైతులు పంటలు పండించిన అనంతరం వాటిని పొలంలో కలియ దున్నాలి కానీ కాల్చవద్దని వ్యవసాయ అధికారులు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించారు. కానీ మండలంలోని వివిధ గ్రామాల్లోని రైతులు వరికొయ్యలను కాల్చుతూ సారవంతమైన భూమిలోని క్రిమి కీటకాలను చంపేస్తున్నారు. దీంతో వ్యవసాయ అధికారులు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి వరికొయ్యలను కాల్వడం వలన భూమిలోని క్రిమి కీటకాలు చనిపోవడమే కాకుండా భూమిపొర వేడికి సారవంతాన్ని కోల్పోయి పంటదిగుబడి తగ్గుతుందని ఎవరైనా రైతులు కొయ్యకాళ్లను కాలబెడితే నష్టాన్ని బట్టి 5వేల నుంచి 25వేల వరకు జరిమానా విధించనున్నట్లు రైతులకు అవగాహన కల్పించారు. అయినప్పటికీ గ్రామాల్లోని రైతులు మాత్రం కొయ్యకాళ్లను తగల బెడుతున్నారు. లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీ భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని లాడ్జిల్లో సీసీఎస్ పోలీసులు ఆదివారం తెల్లవారు జామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అతిథుల రిజిస్టర్లు, సీసీ కెమెరాల పనితీరు, బస చేస్తున్న వ్యక్తుల వివరాలను సీసీఎస్ సీఐ రమేష్ పరిశీలించారు. లాడ్జిలకు వచ్చే ప్రతి అతిథి ఆధార్ వివరాలు, రాకపోకల సమయాలు, ఇతర వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రజా భద్రత, నేరాల నియంత్రణలో భాగంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. -
విద్యతోనే సామాజిక సమానత్వం సాధ్యం
విద్యతోనే సామాజిక సమానత్వం సాధ్యం అవుతుంది. చిన్నబోయినపల్లి పాఠశాల 1–8 వరకు ఉందని, దానిని 10 వరకు పెంచితే డ్రాపౌట్స్ లేకుండా నివారించవచ్చు. ఆశయం గ్రంథాలయం పేరుతో అక్కడ 2 వేల పుస్తకాలను యూపీఎస్సీ, గ్రూప్స్, డీఎస్సీ, ఎస్సై, పీసీలకు కావాల్సిన పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచాం. దాంతో నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలను పొందారు. పాఠశాలను మ రింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. –దూపాటి సతీశ్, ఆశయ గ్రంథాలయ నిర్వాహకుడు, కానిస్టేబుల్, చిన్నబోయినపల్లి -
క్రీడలతో మానసికోల్లాసం
● సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ములుగు: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అన్నారు. జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ క్రీడా మంత్రిత్వశాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆదివారం నిర్వహించిన అస్మితబాలికల సైక్లింగ్ పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన యువతులు, విద్యార్థినులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో సీనియర్ కేటగిరి విభాగంలో సంగీత, జూనియర్ విభాగంలో అలువాల సుమనశ్రీ ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచారు. కాగా వారికి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మెమోంటోలు అందజేయడంతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాదం ప్రవీణ్ మాట్లాడుతూ యువత క్రీడలపై ఆసక్తి చూపాలన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. సైక్లింగ్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మరింత మంది క్రీడాకారులు ముందుకొచ్చి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటాలన్నారు. అనంతరం కోచ్ హుస్సేన్ను బాదం ప్రవీణ్ను అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పోరిక అసిలాల్, కోచ్ శ్రీరామ్, క్రీడాకారులు, 108 సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
వెదజల్లుతున్న దుర్వాసన
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం ప్రసాదశాల నుంచి వచ్చే డ్రెయినేజీ పైప్లైన్ జామ్ కావడంతో మురుగు నీరు బయటకు పొంగిపొర్లి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. మే 21 నుంచి జూన్ 1 వరకు జరిగిన సరస్వతినది అంత్య పుష్కరాల అనంతరం ఈ సమస్య మరింత తీవ్రమైందని స్థానికులు చెబుతున్నారు. పుష్కరాలు ముగిసి 14 రోజులుగా మురుగు నీరు బయటకు రోడ్డుమీద పారుతూ దుర్గంధం వెదజల్లుతున్నా దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. స్థానికులకు, సమీపంలోని ఇళ్లకు తీవ్ర దుర్వాసనతో ముక్కుపుటాలు అదిలిపోతున్నట్లు వాపోతున్నారు. ఎన్నిసార్లు స్థానికులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పెడచెవిన పెడుతున్నారని విమర్శలు ఉన్నాయి. వెంటనే పరిష్కరించాలని కోరారు. -
‘ప్రైవేట్’కు పంపొద్దని తీర్మానం
ఏటూరునాగారం: మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో చిన్నబోయినపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయదారుల కుటుంబాలు ఉంటాయి. వారి పిల్లలను ఏటూరునాగారం, కమలాపురం, ఇతర ప్రైవేట్ పాఠశాలలకు పంపేవారు. అయితే ప్రభుత్వ బడి ఉన్న తర్వాత ప్రైవేట్ పాఠశాలల కు ఎందుకు పంపాలని గ్రామ సర్పంచ్ నల్లబోయిన నాగార్జున, హైదరాబాద్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న స్థానిక గ్రామస్తులు దూపటి సతీశ్లు కలిసి గ్రామాన్ని ఏకం చేశారు. ఇక నుంచి గ్రామంలోని చిన్నారులను ప్రైవేట్ పాఠశాలలకు పంపొద్దని గ్రామసభలో ప్రజలంతా గతనెల 31న తీర్మానం చేశారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి, ఎల్కేజీ, యూకేజీ సైతం చిన్నబోయినపల్లి డీఎన్టీ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని తీర్మానించారు. ఇదే కాకుండా చుట్టుపక్కల గ్రామాలైన గోగుపల్లి, శివాపురం, పెద్ద వెంకటాపురం, షాపెల్లి, హనుమాన్ నగర్ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ పాఠశాలకు రావడానికి ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేసి బడికి రావడం, తిరిగి ఇంటికి తీసుకెళ్లడం వంటి ఏర్పాట్లు కూడా చేశారు. డీఎన్టీ పాఠశాలలో ఆదర్శ గ్రంథాలయాన్ని కానిస్టేబుల్ సతీశ్, మరికొంత మంది యువకులు కలిసి సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఈ విషయం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుకు తెలిసి ఇటీవల సర్పంచ్ నాగార్జున, సతీశ్ను జిల్లా కేంద్రంలో సైతం సన్మానించారు. ఆ గ్రంథాలయం ఏర్పాటు విషయాన్ని కలెక్టర్కు వివరించగా ఆసక్తికనబర్చిన వెంటనే చిన్నబోయినపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రంథాలయంలో ఉన్న 2 వేల పోటీ పరీక్షల పుస్తకాలను పరిశీలించి ఆశ్చర్యపోయారు. వెంటనే జిల్లాలోని ఎంఈఓలు సైతం ఇలాంటి ఆదర్శ గ్రంథాలయాలను ప్రతీ పాఠశాలలో ఏర్పాటు చేయాలని అక్కడి నుంచే ఆదేశాలను జారీ చేశారు. అంతేకాకుండా పాఠశాల హెచ్ఎం కవితతో పాటు మరో ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను ఈ పాఠశాలకు కేటాయించడం విశేషం. ఒకే రోజు 138 మందికి అడ్మిషన్లు చిన్నబోయినపల్లి చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రీ ప్రైమరీ స్కూల్కు వేరే గ్రామాలకు వెళ్లకుండా కలెక్టర్, ప్రభుత్వంతో మాట్లాడి అదే గ్రామంలోనే ప్రీప్రైమరీ స్కూల్ను గ్రామస్తులు మంజూరు చేయించుకున్నారు. ఈ క్రమంలో 138 మంది విద్యార్థులు మే 31న ఒకే రోజు పాఠశాలలో నూతనంగా అడ్మిషన్లను పొందారు. ఇలా వారం తరబడి అడ్మిషన్ల కోసం తిరిగిన ఉపాధ్యాయులకు సాధ్యం కానిది.. ఒకే రోజు గ్రామస్తులంతా కలిసి చేశారు. ఒకేరోజు 138 మంది డీఎన్టీ ప్రభుత్వ పాఠశాలలో ఆడ్మిషన్లు పొందడంతో రాష్ట్రంలో మొదటి సారి కావడం గమనార్హం. అంతేకాకుండా ఆ విద్యార్థులకు స్థానిక సర్పంచ్ నాగార్జున సొంత ఖర్చుతో బ్యాగులు, స్టడీ మెటీరియల్ను అందజేశారు. గ్రామసభలో ప్రభుత్వ పాఠశాలకే పెద్దపీట రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిన చిన్నబోయిపల్లి పాఠశాల జిల్లా వ్యాప్తంగా ఆదర్శ గ్రంథాలయ ఏర్పాటుకు కలెక్టర్ సూచనలు ఒకే రోజు 138 అడ్మిషన్లు -
విద్యార్థులను బడిలో చేర్పించడమే లక్ష్యం
గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా కట్టుదిట్టం చేశాం. ప్రతీ విద్యార్థి చిన్నబోయినపల్లి డీఎన్టీ ప్రభుత్వ పాఠశాలకు వచ్చేవిధంగా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశాం. ఇందుకు కలెక్టర్ ద్వారా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ట్రావెలింగ్ అలవెన్సులు రానున్నాయి. సర్కారు బడిని మరింత బలోపేతం చేస్తాం. పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని మంత్రి సీతక్క, కలెక్టర్ సహదేవరావుకు విన్నవించాం. వారు కూడా సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తామన్నారు. – నల్లబోయిన నాగార్జున, చిన్నబోయినపల్లి సర్పంచ్ -
రక్తదానం మరొకరికి ప్రాణదానం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి అర్బన్: రక్తదానంతో మరొకరికి ప్రాణదానం కలుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని మిరాకిల్ వాలంటరీ ఆర్గనైజేషన్న్ఆధ్వర్యంలో ఆదివారం ఐటీ మాస్టర్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం అత్యున్నతమైన మానవతా సేవ అని, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు రక్తం ప్రాణాధారంగా నిలుస్తుందని అన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానంతో ఎలాంటి హాని ఉండదని, నిర్దిష్ట వ్యవధిలో రక్తదానం చేయడం ద్వారా సమాజానికి విలువైన సేవ చేసినవారిగా నిలుస్తారని తెలిపారు. యువత సామాజిక బాధ్యతతో రక్తదాన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ రెడ్క్రాస్ కార్యాలయం మరో ఆరు నెలల్లో పూర్తవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేసి సత్కరించారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన వేముల శంకర్తో పాటు నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, ఐటీ మాస్టర్ సభ్యులు పాల్గొన్నారు. -
అక్కడో నియంత.. ఇక్కడో నియంత
● గ్రేటర్ ఎన్నికల్లో గెలవాలంటే కార్యకర్తలు కష్టపడాలి ● బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్రావుహన్మకొండ: హైదరాబాద్లో నియంత రేవంత్ ఉంటే.. ఇక్కడో మరో నియంత ఉన్నాడని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు.అక్కడ హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చుతుంటే ఇక్కడ మరోలా పేదల ఇళ్లు కూల్చుతున్నారని మండిపడ్డారు. హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకుడు రంజిత్రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల పిల్లలకు స్కాలర్షిప్లు, స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం, ఎస్ఐఆర్పై ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన హరీశ్రావు మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయానికి ఇది కీలకమవుతుందని, ఇందుకోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని పేర్కొన్నారు. కొంతమంది పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తుంచుకుంటామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలపై బీఆర్ఎస్ అద్భుతమైన పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నామన్నారు. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యాలయం జనతా గ్యారేజీలా పని చేస్తుందన్నారు. భద్రకాళి దేవస్థానం సమీపంలోని చెరబండరాజు కాలనీవాసులపై అమానుషంగా దాడి చేశారని, దాడిని ఖండించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్యెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, మాజీ జెడ్పీ చైర్మన్ సమ్మారావు పాల్గొన్నారు. -
బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం
● మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ములుగు రూరల్: బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 ఏళ్ల సుపరిపాలనపై పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తొలుత ప్రధాని మోదీ 12 ఏళ్ల పరిపాలనలో దేశంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలిచిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టాక దేశంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని తెలిపారు. నేషనల్ హైవేలు, విమానాశ్రయాలు, బుల్లెట్ ట్రైన్లు అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు. డిజిటల్ పేమెంట్ ద్వారా ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపారని వెల్లడించారు. జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని వివరించారు. అలాగే మోదీ నాల్గోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూక్య జవహర్లాల్, అజ్మీర కృష్ణవేణి, భూక్య రాజునాయక్, కృష్ణాకర్, అల్లె శోభన్, విశ్వనాధ్, రాజ్కుమార్, సునీల్కుమార్, రవిరెడ్డి, యాదగిరి, వెంకటేశ్వర్లు, ఇమ్మడి రాకేశ్ పాల్గొన్నారు. -
‘మెగా జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలి’
ములుగు రూరల్: ఈ నెల 17వ తేదీన ఇంచర్ల ఎంఆర్ గార్డెన్లో నిర్వహిస్తున్న మెగా జాబ్మేళాను నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జిల్లా పరిపాలన యంత్రాంగం మెగా జాబ్మేళా నిర్వహిస్తుందని వెల్లడించారు. ఈ జాబ్ మేళాకు 70 కంపెనీల ప్రతినిధులు హాజరై ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరవుతారని తెలిపారు. జాబ్మేళా ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై, టెన్త్, ఇంటర్మీడియట్, డిప్లామా, ఐటీఐ, డిగ్రీ చదివిన వారు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు బయోడేటా, పాస్ఫొటోలు, ఆధార్కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకురావాలని వివరించారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్ 8712670103, 8712267011 లలో సంప్రదించాలని సూచించారు. సర్పంచ్లకు తొలి వేతనాలు ● ఐదు నెలల బకాయిలు ఒకేసారి చెల్లించనున్న ప్రభుత్వం ఏటూరునాగారం: సర్పంచులుగా గెలిచిన తర్వాత ప్రభుత్వం మొదటిసారిగా వారి ఖాతాల్లో వేతనాలు జమ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడంతో సర్పంచ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 5 నెలల 10 రోజుల కాలానికి సంబంధించిన బకాయిలు ఒకేసారి విడుదల చేయనుండడంతో వారి కష్టాలకు కొంత ఊరటనిచ్చినట్లు అయ్యింది. జిల్లాలో 146 మంది తొలి వేతనాలు అందుకోనున్నారు. అయితే జిల్లాలో 171 పంచాయతీలుండగా అందులో మంగపేట మండలంలోని 25 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. దీంతో మిగతా 146 మందికి నేరుగా వారి వారి ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ. 6,500ల చొప్పున జమ చేసేందుకు కావాల్సిన ఖాతాలు, ఆధార్, ఇతర పత్రాల వివరాలను ఆన్లైన్ చేశారు. ఖాతాల్లో నేరుగా గౌరవ వేతనం పడనుంది. పోడు భూములకు పట్టాలివ్వాలి వెంకటాపురం(ఎం): పేదలు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ఏఐకేఎంఎస్ డివిజన్ ప్రథమ మహాసభకు బొమ్మెడ సాంబయ్య అధ్యక్షత వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ములుగు, భూపాలపల్లి ప్రాంతాల్లో 40 సంవత్సరాలకు పైగా పేదలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములు సాగు చేసుకోకుండా ఆపేసి సాగుదారులపై అక్రమ కేసులు పెట్టారని పెట్టిందన్నారు. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి పోడుభూములకు పట్టాలివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం భూపాలపల్లి, ములుగు డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొమ్మెడ సాంబయ్య, ప్రధాన కార్యదర్శిగా కుర్రి ఐల య్య, కోశాధికారిగా శ్యామల రమేశ్తో పాటు తొమ్మిది మంది సభ్యులను ఎన్నుకున్నారు. శనిత్రయోదశి.. భక్తులు కిక్కిరిసి.. కాళేశ్వరం: శని త్రయోదశి, మాసశివరాత్రి పురస్కరించుకొని కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో నవగ్రహాల వద్ద శని, శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలను శనివారం భక్తులు అధికంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి ఆలయంలో బారులుదీరారు. దీంతో నవగ్రహ, కాలసర్ప పూజలు చేసిన భక్తులు స్వామివారి గర్భగుడిలో విశేష అభిషేక పూజలు నిర్వహించారు. నవగ్రహ పూజలు 435, కాలసర్పదోష పూజలు 175, స్వామివారి గర్భగుడిలో అభిషేకాలు 126, ఇతర పూజలు, ప్రసాదాలపై రూ. 4,59,200 ఆదాయం సమకూరిందని ఆలయవర్గాలు తెలిపాయి. దీంతో గోదావరి తీరం, ఆలయంలో భక్తులు కిక్కిరిసారు. -
అవగాహన కల్పిస్తూ..
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని బోరునర్సాపురం గ్రామానికి చెందిన కోడెల నరేశ్ జ్వాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. ఆయన 2017 నుంచి 2025 వరకు 17సార్లు రక్తదానం చేశారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతగా నిలవాలని యువతకు అవగాహన కల్పిస్తున్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో పలుమార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించి వెయ్యికిపైగా మందితో రక్తదానం చేయించారు. ఎక్కడైనా రక్తం కావాలని తెలిసిన వెంటనే స్పందించి అవసరమైన వారికి రక్తదానం చేసేలా నిత్యం స్పందిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. -
‘ప్రీ ప్రైమరీ విద్యను కొనసాగించాలి’
ఏటూరునాగారం: ప్రీప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. పద్మశ్రీ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ గార్డెన్స్లో కె.సరోజన అధ్యక్షతన జిల్లా స్థాయి సెమినార్ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ను ప్రైవేటీకరించే కుట్రలో భాగంగా తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఐసీడీఎస్కు తీవ్ర నష్టం కలిగించే విధంగా ప్రీ ప్రైమరీ విద్యను పాఠశాల విద్యలో కలపటం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 4,131 ప్రీ ప్రైమరీ స్కూల్స్ మంజూరు చేస్తూ సర్క్యూలర్ ఇవ్వడం దారుణమన్నారు. దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగుతున్న ప్రీప్రైమరీ విద్యను అలాగే కొనసాగించాలని కోరారు. లేని పక్షంలో పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఈ సెమినార్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, జిల్లా అధ్యక్షులు రఘుపతి, వ్యకాస జిల్లా కార్యదర్శి దావూద్, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి సమ్మక్క, పద్మారాణి, రమాదేవి, పార్వతి, లక్ష్మీ, నర్సమ్మ, సరిత, విజయలక్ష్మి, రత్నకుమారి, భిక్షపతి, భవాని, వనమాల, తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2026
ఎంత టెక్నాలజీ వచ్చినా.. ఎన్ని యుగాలు గడిచినా.. ఈ సృష్టిలో సృష్టించలేనిది.. ఏ కృత్రిమ మేధా తయారు చేయలేనిది రక్తం ఒక్కటే. అంతటి విలువైన రక్తం.. ప్రాణాపాయస్థితిలో దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆపద సమయాల్లో అది పంచుతూ రక్తబాంధవులుగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లావాసులు. వారి స్ఫూర్తికి అక్షరరూపమిస్తూ.. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని కోరుతూ నేడు (ఆదివారం) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం● అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు ● స్వచ్ఛందంగా ముందుకొస్తున్న యువత కాశిబుగ్గ: వరంగల్ మట్టెవాడకు చెందిన తోట రాజేశ్వర్రావు ఇప్పటివరకు 134 సార్లు రక్తదానం చేశారు. ఆర్య సమాజ్ కార్యకర్తగా, ఫొటోగ్రాఫర్గా జీవనం సాగిస్తున్నారు. రాజేశ్వర్రావుకు ప్రస్తుతం 52 ఏళ్లు. ఆయన 18వ ఏట నుంచి రక్తదానం చేస్తున్నారు. ఈ నెల 14న(నేడు) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా.. 135వ సారి ఆదివారం ఎంజీఎంలో ఆయన రక్తదానం చేయనున్నారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని, క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని రాజేశ్వర్రావు అంటున్నారు. విద్యార్థులు, యూత్, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి రక్తదానంపై అవగాహన పెంచుతూ రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. హన్మకొండ అర్బన్: భూగర్భ జల శాఖలో పర్యవేక్షకుడిగా పని చేస్తున్న ఠాకూర్ ధరమ్సింగ్ స్వచ్ఛంద రక్తదానంలో విశేష గుర్తింపు పొందారు. 1988లో మామునూరులో జరిగిన ఎన్సీసీ శిబిరంలో తొలిసారి రక్తదానం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 55 సార్లు రక్తం ఇచ్చారు. 50 సార్లు రక్తదానం చేసిన సందర్భంగా 2024లో జాతీయ అవార్డు, 53వ సారి రక్తదానం చేసిన సందర్భంగా 2025లో న్యూఢిల్లీలో ‘హ్యుమనిటేరియన్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్నారు. -
16 ఏళ్లు.. 15 వేల యూనిట్లు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు వేముల శంకర్ రక్తదాతలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 23 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచారు. ఆయన నిర్వహిస్తున్న ఐటీ మాస్టర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సొసైటీ, మిరాకిల్ వలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 16 ఏళ్లుగా నిరంతరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈశిబిరాల ద్వారా ఇప్పటివరకు సుమారు 15 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన రోగులకు అందించేలా కృషి చేశారు. రక్తదానం మహాదానమనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వేముల శంకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యువతలో స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు. -
తెరుచుకున్న మూత‘బడి’
● పదేళ్ల తర్వాత కన్నెపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రారంభం ● పది మంది విద్యార్థుల చేరిక ఎస్ఎస్తాడ్వాయి: ఒకప్పుడు విద్యార్థుల సందడితో కళకళలాడిన పాఠశాల.. విద్యార్థుల కొరతతో మూతపడింది. పదేళ్ల తర్వాత తలుపులు తెరుచుకుంది. మండల పరిధిలోని కన్నెపల్లికి చెందిన గ్రామస్తులు తమ పిల్లలను 10 మందిని ప్రభుత్వ పాఠశాలలో శనివారం చేర్పించారు. దీంతో పాఠశాలను జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, సర్పంచ్ కొమరం శైలజ, ఎంఈఓ గడ్డి శ్రీనివాసులు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా రేగ కల్యాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలే సమాజ ప్రగతికి పునాదులని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు. పాఠశాలకు అవసరమైన ఫర్నీచర్ను తమ సొంత ఖర్చులతో అందజేస్తామని కల్యాణి ప్రకటించారు. మంత్రి సీతక్క చొరవతో మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఎంఈఓ గడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ. గ్రామ ప్రజలు, ఉపాధ్యాయుల సహకారంతోనే మూసివేసిన పాఠశాలను మళ్లీ ప్రారంభించడం సాధ్యమైందన్నారు. ఈ మేరకు ఏటూరునాగారం మండలంలోని శంకరాజుపల్లి పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు సరితను కన్నెపల్లి పాఠశాలకు డిప్యూటేషన్పై నియమించినట్లు తెలిపారు. సర్పంచ్ శైలజ మాట్లాడుతూ పాఠశాలను పునఃప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం విద్యాసాగర్, ఉప సర్పంచ్ రంజిత్, ఉపాధ్యాయురాలు సరిత పాల్గొన్నారు. పుష్కరఘాట్ ఏర్పాటుకు స్థల పరిశీలన మంగపేట: మండల కేంద్రంలోని దొంగల ఒర్రె వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న పుష్కరఘాట్ నిర్మాణ ప్రదేశాన్ని ఆర్కెటెక్చర్ నవీన్ (డిజైనింగ్ ప్రైవేటు ఏజెన్సీ) బృందం శనివారం పరిశీలించింది. 2027లో వచ్చే గోదావరి పుష్కరాలకు మండలంలోని మంగపేట, చుంచుపల్లి రెండు ప్రాంతాల్లో పుష్కరఘాట్లను నూతనంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆయా ప్రాంతాలను పరిశీలించింది. మండల కేంద్రంలోని దొంగలఒర్రె వద్ద నిర్మాణంలో ఉన్న కరకట్ట వద్ద 62 మీటర్ల మేర పుష్కరఘాట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుత పుష్కరఘాట్ నిర్మాణ ప్రాంతంలో గోదావరి కింద నుంచి ఒడ్డుపై వరకు 17 మీటర్ల ఎత్తు ఉండటంతో కనీసం 100 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తే సౌకర్యవంతంగా ఉంటుందని.. అందుకు మంజూరైన నిధులు సరిపోవని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి నివేధించినట్లు సమాచారం. దీంతో పుష్కరఘాట్ నిర్మాణ ప్రాంతాన్ని పున పరిశీలించేందుకు ఆర్కెటెక్చర్ నవీన్ బృందం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ముందుగా పుష్కరాలను పురస్కరించుకుని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను సైతం ఆర్కెటెక్చర్ బృందం పరిశీలించింది. మంగపేట పుష్కరఘాట్ నిర్మాణానికి ప్రభుత్వం టైర్ నంబర్ వన్ కింద రూ.8 కోట్లు ఇప్పటికే మంజూరు చేయగా చుంచుపల్లి వద్ద టైర్ నంబర్ 2 కింద మరో పుష్కరఘాట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు సమాచారం. -
రాజీమార్గమే రాజమార్గం
గోవిందరావుపేట: కోర్టు గడప ఎక్కిన ప్రతీ కేసు వెనుక ఒక కథ ఉంటుంది. కొన్ని కుటుంబాల మధ్య విబేధాలు.. ఆస్తి తగాదాలు.. ఇంకొందరికి ట్రాఫిక్ ఉల్లంఘనలు. ఈ తప్పిదాలన్నీ కేసులుగా మారి కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత సంవత్సరాల తరబడి కొనసాగుతుంటాయి. ఆ సమయంలో నష్టపోయేది కేవలం డబ్బు మాత్రమే కాదు.. మనశ్శాంతి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో రాజీమార్గమే రాజమార్గమని జాతీయ లోక్ అదాలత్లు నిరూపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు కోపం, బాధ, పట్టుదలతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాయి. 20న జాతీయ లోక్ అదాలత్ జిల్లాలోని 10 మండలాల పరిధిలో గడిచిన మూడేళ్ల కాలంలో నిర్వహించిన లోక్ అదాలత్లలో మొత్తం 3,562 కేసులు పరిష్కారం అయ్యాయి. అంటే జాతీయ లోక్ అదాలత్లపై ప్రజల్లో విశ్వాసం క్రమంగా పెరుగుతోంది. అలాగే కేసుల పరిష్కారానికి న్యాయవ్యవస్థతో పాటు పోలీస్శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ కక్షిదారులను చైతన్య పరుస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 20వ తేదీన జిల్లా కేంద్రంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాజీకి అనుకూలమైన కేసులు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందాలని న్యాయ, పోలీసు శాఖ అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ కేసులే అధికం.. మూడేళ్ల కాలంలో కేసులను లోతుగా పరిశీలిస్తే ప్రతీ ఏడాది అత్యధికంగా పరిష్కారమవుతున్నవి మోటారు వెహికల్ యాక్ట్ (ఎంవి యాక్ట్) కేసులేనని తెలుస్తోంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, వాహన పత్రాల లోపాలు, జరిమానాలకు సంబంధించిన కేసులు పెద్ద సంఖ్యలో లోక్ అదాలత్ల ద్వారా ముగుస్తున్నాయి. 2024లో 883 ఎంవీ యాక్ట్ కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. 2025లో ఈ సంఖ్య మరింత పెరిగి 978కు చేరింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు కోర్టుల్లో పెండింగ్ కాకుండా వేగంగా ముగియడం వల్ల పోలీస్ శాఖ, న్యాయ వ్యవస్థతో ప్రజలకి ప్రయోజనం చేకూరుతోంది. సద్వినియోగం చేసుకోవాలి.. లోక్ అదాలత్లు కేసుల పరిష్కారానికే కాదు, మనుషుల మధ్య ఉన్న విబేధాలను తొలగించే వేదికలు. పెండింగ్లో ఉండి రాజీకి అనుకూలమైన కేసుల కక్షిదారులు ఈ నెల 20న జరిగే జాతీయ లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకుని సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందాలి. ములుగు ప్రజలు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని కోర్టు వివాదాల నుంచి విముక్తి పొంది ప్రశాంత జీవితం గడపాలి. – సుధీర్ రాంనాథ్ కేకన్, ఎస్పీ లోక్ అదాలత్లతో కోర్టు కేసుల పరిష్కారం మూడేళ్లలో 3,562 పరిష్కారం ఈ నెల 20న ములుగులో జాతీయ లోక్ అదాలత్సంవత్సరం కేసులు 2024 1,545 2025 1,685 2026(మార్చి 28 వరకు) 332 -
మరెవరూ చనిపోవద్దని..
జనగామ: రక్తం దొరకక మామ చనిపోయారు. ఆ కారణంగా మరెవరూ చనిపోవద్దని నిర్ణయించుకున్నారు జనగామ పట్టణానికి చెందిన రక్తదాత మల్లిగారి రాజు. 1997 సంక్రాంతి రోజున రైలు ప్రమాదంలో గాయపడిన తన మేనమామ సకాలంలో రక్తం అందక కన్నుమూశారు. ఆ బాధే రాజును రక్తదాతగా మార్చింది. అప్పటి నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా ఏడాదికి నాలుగుసార్లు రక్తదానం చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 99 సార్లు రక్తదానం చేసి ఎందరో ప్రాణాలు నిలబెట్టారు. ఒకసారి తన క్లాస్మేట్ అక్కకు ఆపరేషన్ సమయంలో అత్యవసరంగా రక్తం అవసరమైతే, రైలెక్కి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశారు. ఆమె ప్రాణాలు కాపాడిన ఘటనను తాను మాటల్లో వర్ణించలేనని గుర్తు చేశారు రాజు. ఆయన సేవలను గుర్తించి జూన్ 2న స్వచ్ఛంద సంస్థలు అవార్డులు, ప్రశంసపత్రాలతో సన్మానించాయి.


