Mulugu
-
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు
బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025జిల్లాలో 62 సన్నాలు, 83 దొడ్డు రకం కేంద్రాలునేడు డీపీఓతో ఫోన్ ఇన్– 8లోuములుగు: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. చెరువులు, బోరుబావుల కింద జిల్లాలోని 10మండలాల్లో ఈ సారి 55వేల ఎకరాల్లో వరిపంట సాగు అయ్యింది. మంగపేట, గోవిందరావుపేట, వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లో మరో 15 రోజుల్లో అక్కడక్కడా పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల కసరత్తును ప్రారంభించిన సివిల్ సప్లయీస్ శాఖ క్షేత్రస్థాయిలో కేంద్రాలకు అనుకూలమైన ప్రదేశాలను అన్వేషిస్తోంది. 145 కేంద్రాల ఏర్పాటు యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో ఈ సారి మొత్తం 145 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా సన్నాలు, దొడ్డురకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సన్నాలకు మద్దతు ధరతో పాటు ప్రభుత్వ ప్రకటన ప్రకారం క్వింటాల్కు రూ.500 బోనస్ ప్రభుత్వం ఇవ్వనుండడంతో కొనుగోలు, ధాన్యం తరలింపు విషయంలో అవాంతరాలు ఎదురుకాకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. సన్నాలకు 62 కేంద్రాలు, దొడ్డురకం ధాన్యం కొనుగోలుకు 83 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రెండు రకాల ధాన్యం సాగుచేసిన రైతుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని పక్కపక్కనే కేంద్రాలు ఉండేలా చూస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. అధికారులకు మూడు రోజుల అవగాహన ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధి కారులు, కేంద్రాల నిర్వహకులకు మంగళవా రం నుంచి గురువారం వరకు మూడు రోజుల పాటు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేడు(బుధవారం)ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని రైతు వేదికలో గోవిందరావుపేట, ఎస్ఎస్ తాడ్వా యి మండలాలకు, గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ములుగు, వెంకటాపురం(ఎం) మండలాలకు చెందిన అధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు సమావేశం జరగనుంది. టార్పాలిన్ల కొరత 145 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని రైతులు విక్రయించేందుకు వచ్చే సమయంలో వాతావరణ ఇబ్బందులు ఎదురైతే వినియోగించేందుకు టార్పాలిన్ కవర్ల కొరత ఉన్నట్లుగా తెలుస్తుంది. జిల్లాలో 2,900 టార్పాలిన్ కవర్లు అవసరం ఉన్నట్లుగా నివేదిక సిద్ధం చేశారు. 2,239 మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇంకా 661టార్పాలిన్ కవర్లు అవసరం ఉన్నట్లు అధికారులు ఉన్నతాధికారులకు వివరించారు. అలాగే ఆటోమెటిక్ ప్యాడీ క్లినర్లు అందుబాటులో లేని పరిస్థితి ఉంది. ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోలుకు 145కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ఎక్కడైనా వరి కోతలు ప్రారంభమైతే అక్కడ కేంద్రాన్ని నడిపించి కొనుగోలు చే స్తాం. సన్నాలకు, దొడ్డు రకానికి వేర్వేరుగా కేంద్రాలు ఉంటాయి. మరో 15నుంచి 20 రోజుల్లో కోతలు ముమ్మరం అవుతాయని అనుకుంటున్నాం. ఇప్పటి కే కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు నడుచుకుంటాం. వచ్చే నెల 2వ తేదీన పే రూరు వద్ద అంతర్రాష్ట్ర చెక్పోస్టు ఏర్పాటు చేస్తాం. – రాంపతి, సివిల్ సప్లయీస్ డీఎంసమయం : ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తేదీ : 26–03–2025(బుధవారం) ఫోన్నంబర్ : 9848792788జిల్లాలో అందుబాటులో ఉన్న టార్పాలిన్లు, పరికరాల వివరాలు..న్యూస్రీల్ మూడు రోజుల పాటు అధికారులకు అవగాహన పేరూరు వద్ద అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ ఏర్పాటు -
తరాలపల్లి నుంచి దండకారణ్యం వరకు..
సాక్షిప్రతినిధి, వరంగల్/కాజీపేట అర్బన్ : అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధీర్, ఎల్లన్న, సుధాకర్.. హనుమకొండ జిల్లా తరాలపల్లి ముద్దుబిడ్డ.. రెండు పదుల వయస్సులో ఆయిడిసి, బాయిడిసి అడవిబాట పట్టిన మావోయిస్టు నేత. దళసభ్యుడినుంచి దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడి వరకు ఎదిగిన సారయ్య అలియాస్ సుధీర్ 35 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు దంతెవాడ జిల్లా బీజాపూర్ ప్రాంతంలోని గీడం పోలీస్స్టేషన్ పరిధిలోని గిర్సాపర, నెల్గోడ, బోడ్గా, ఇకెలి గ్రామాల సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు ఎస్పీ గౌరవ్రాయ్ మంగళవారం ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్లో మొత్తం ముగ్గురు మృతిచెందగా.. మృతుల్లో సారయ్య ఉన్నట్లు వెల్లడించారు. బీజాపూర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో సారయ్య మృతి చెందాడన్న వార్తతో తరాలపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిదశ నుంచే ఉద్యమాలు.. తరాలపల్లి గ్రామానికి చెందిన సారయ్య కొండపర్తి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. 1982లో 10వ తరగతి చదువుతున్న తరుణంలోనే నాడు మావోయిస్టులు ఇచ్చిన ‘గ్రామాలకు తరలండి’ పిలుపునకు ఆకర్షితుడై, తరాలపల్లి విలేజ్ ఆర్గనైజర్ బండి ఆశాలు, హనుమకొండ సిటీ ఆర్గనైజర్ తిప్పారపు రాములు అలియాస్ తాత సారథ్యంలో తరాలపల్లి గ్రామ అధ్యక్షుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. అంచెలంచెలుగా మావోయిస్టు పార్టీలో ఎదుగుతున్న తరుణంలో 1990లో బీఎస్ఎఫ్ సిబ్బంది గ్రామాల్లోకి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 1993లో జరిగిన ఎన్కౌంటర్లో సిటీ ఆర్గనైజర్ తాత చనిపోవడంతో.. అజ్ఞాతంలోకి వెళ్లిన సారయ్య నేటి వరకు గ్రామానికి తిరిగి రాలేదు. అమరుల పల్లె తరాలపల్లి.. కాజీపేట మండలం తరాలపల్లి ఉద్యమాలకు కేరాఫ్. ఎందరో ఈ గ్రామంనుంచి విప్లవోద్యమాల వైపు ఆకర్షితులై ఎన్కౌంటర్లలో అసువులు బాశారు. 1991లో వేల్పుల జగదీశ్ అలియాస్ ఉప్పలన్న, 1992లో బండి ఆశాలు అలియాస్ శ్రీను పగిడేరు ఎన్కౌంటర్లో చనిపోయారు. 1998 నుంచి గాజుల శ్రీకాంత్, ముప్పిడి నాగేశ్వర్రావు అలియాస్ విశ్వనాథ్, చిరబోయిన సదానందం అలియాస్ కౌ ముదీ, సంపత్, కొత్తపల్లి సాంబయ్య అలియాస్ ఉప్పలన్నలు మృతిచెందగా.. మంగళవారం ఛత్తీస్ గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో సారయ్య చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా బుధ వారం ఆయన మృతదేహం తరాలపల్లికి రానుంది.ముగిసిన అంకేశ్వరపు సారయ్య ఉద్యమ ప్రస్థానం 35 ఏళ్ల అజ్ఞాతవాసం... దళసభ్యుడి నుంచి డీకేఎస్జడ్సీ వరకు దంతెవాడ ఎన్కౌంటర్లో అసువులు బాసిన సుధీర్ విషాదంలో తరాలపల్లి.. నేడు గ్రామానికి మృతదేహం -
అటవీ ఉత్పత్తుల సేకరణపై దృష్టి సారించాలి
వెంకటాపురం(కె): జీసీసీ రేషన్ షాపుల డీలర్లు, అధికారులు అటవీ ఉత్పత్తుల సేకరణపై దృష్టి సారించాలని జీసీసీ ఏటూరునాగారం డీఎం ప్రతాప్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జీసీసీ కార్యాలయం ఆవరణలో జీసీసీ 10వ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ ఏడాది ఆర్థిక లావాదేవీలపై నివేదికను వినిపించారు. భవిష్యత్లో చేయాల్సిన పనులపై ప్రణాళికలను రూపొందించున్నారు. జీసీసీ ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్లో పెట్రోల్, డీజిల్ ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంచాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీఎం దృష్టికి సభ్యులు తీసుకెళ్లడంతో స్పందించిన ఆయన తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవిలో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో అటవి ఉత్పత్తుల సేకరణపై దృష్టి సారించాలన్నారు. అదే విధంగా పెద్ద మొత్తంలో ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీసీసీ మేనేజర్ స్వామి, నర్సింహారావు, బాబు తదితరులు పాల్గొన్నారు.జీసీసీ డీఎ ప్రతాప్రెడ్డి -
ధాన్యం కొనుగోళ్లపై శిక్షణ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని రైతు వేదికలో రబీ 2024–25 సీజన్లో ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, కన్నాయిగూడెం, వెంకటాపురం(కె) మండలాలకు చెందిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ఏఓలు, ఏఈఓలు, వరికోత మిషన్ యజమానులకు ఒక రోజు శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి సయ్యద్ పైసల్ హుస్సేన్, సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి మాట్లాడుతూ జిల్లాకు నూతనంగా 40ప్యాడీ క్లినర్స్ వచ్చాయని తెలిపారు. తేమశాతం పరీక్షించే మిషనరీని అందుబాటులో పెట్టుకుని రైతులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే లారీల్లో లోడ్ చేసి తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్ సర్దార్ సింగ్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ డీఆర్డీఓ గోవింద్ చౌహన్, మండల వ్యవసాయ అధికారి వేణుగోపాల్, ఐదు మండలాల ఏఈవోలు, ఎంఏవోలు, సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ రామచందర్ పాల్గొన్నారు. -
యువతలోని నైపుణ్యాలను వెలికితీసేందుకు కృషి
సైన్స్ ఎగ్జిబిట్స్ను పరిశీలిస్తున్న న్యాయ నిర్ణేతలు ఏటూరునాగారం: విద్యార్థులు, యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసే వేదికగా నెహ్రూ యువకేంద్రం మై భారత్ కృషి చేస్తుందని తెలంగాణ గిరిజన గురుకులాల ములుగు రీజినల్ కో ఆర్డినేటర్ ఠాగూర్ హరిసింగ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువకేంద్రం మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ ఆధ్వర్యంలో మంగళవారం యువ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు విద్యా సంబంధమైన అంశాలతో పాటుగా ఇతర అంశాల్లోనూ నైపుణ్యాలు కలిగి ఉండాలని సూచించారు. యువతీ యువకులు ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోవా లని సూచించారు. యువత చదువుతో పాటుగా పోటీ పరీక్షలు, వ్యక్తిత్వ వికాసం అంశాలపైనా దృష్టి సారించాలన్నారు. డీసీఓ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం యువ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీల్లోని విజేతలకు సర్టిఫికెట్లు ప్రదా నం చేశారు. ఈ సందర్భంగా చేసిన నృత్యాలు, సైన్స్ ఎగ్జిబిట్లు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎఫ్పీఓ శ్రీధర్, సీడీపీఓ ప్రేమల త, కళాశాల ప్రిన్సిపాల్ రేణుక, జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ పాల్గొన్నారు. ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు ఐసీడీఎస్, ఐసీపీఎస్, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఐసీడీఎస్ ద్వారా చిన్నారులకు, కిశోర బాలికలకు అందుతున్న సేవలను వివరించారు. ఐసీపీఎస్ ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలనతో పాటు తదితర అంశాలను ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందిస్తున్న చికిత్సలు, సర్వేలతో పాటు తదితర అంశాలను విద్యార్థులకు, యువతీ యువకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ ప్రేమలత, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్త్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.గిరిజన గురుకులాల రీజినల్ కో ఆర్డినేటర్ ఠాగూర్ హరిసింగ్ -
ఖాతాల్లో పరిహారం జమచేయాలి
ములుగు: జిల్లాలోని వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాల్లో బాండ్ మొక్కజొన్న పేరుతో జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకుని ఆయా కంపెనీల ప్రతినిధులు, ఆర్గనైజర్లు నేరుగా నష్టపోయిన రైతుల ఖాతాల్లో పరిహారాన్ని జమ చేయాలని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి ధనసరి సీతక్క ఆదేశాలు, కలెక్టర్ సూచనల మేరకు మంగళవారం ఆయా కంపెనీల ప్రతినిధులు, అర్గనైజర్లు, రైతు ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొదండ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్ ఆయా మండలాల్లో పర్యటించి బాండ్ మొక్కజొన్న ఆకులు, కంకుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారని తెలిపారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ నెల 12, 13 తేదీలలో సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికను అందించారని తెలిపారు. దీంతో పాటు డాట్ సెంటర్ శాస్త్రవేత్త దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో మొక్కజొన్న దిగుబడి తగ్గింపుపై పూర్తిస్థాయి విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారని వివరించారు. మూడు మండలాల్లో 959మంది రైతులు 20,168 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టపోయినట్లు నివేదిక అందించారని తెలిపారు. అనంతరం ఆర్డీఓ వెంకటేశ్ ఆధ్వర్యంలో సీడ్ కంపెనీ ప్రతినిధులు, ఆర్గనైజర్లతో సమావేశం నిర్వహించి నష్టపరిహారంపై చెల్లింపుల విషయంలో వారు సానుకూలంగా స్పందించారని వివరించారు. కానీ ఆర్గనైజర్లు రైతులకు అనధికారికంగా అధిక వడ్డీలకు అప్పులిచ్చిన విషయంలో మని లెండింగ్ యాక్ట్ కింద తగిన చర్యలు తీసుకోవాలని ప్రతిపాధించినట్లు తెలిపారు. అలాగే రైతుల ఆరోగ్య విషయంలో డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో కమిటీ వేసి బాండ్ మొక్కజొన్న పంట వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. రైతు ప్రతినిధులు మాట్లాడుతూ మొక్కజొన్న విత్తన పంట వైఫల్యంపై కంపెనీలు నష్టపరిహారం చెల్లించాలని, ఏజెన్సీలో అధిక వడ్డీ రుణాల దోపిడీని నిరోధించాలని కమిషన్ సభ్యులను కోరగా వారు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం గిరిజన రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వివరించారు. బాండ్ మొక్కజొన్న విషయంలో జరిగిన విత్తన వైఫల్యంపై తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కొదండ రెడ్డితో పాటు విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, సభ్యులు రాములు నాయక్, మామ్రెడ్డి, గంగాధర్, నర్సింహారెడ్డి, వెంకన్న యాదవ్లు సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న బాధిత రైతు కుటుంబాల సభ్యులు కలెక్టరేట్కు భారీగా తరలివచ్చారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు సమీక్ష జరుగుతున్నంత సేపు చెట్ల కింద సేద తీరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, కమిషన్ అడ్వైజర్లు నర్సింహారెడ్డి, రామాంజనేయులు, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ సుచరిత, ఆర్డీఓ వెంకటేశ్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ వ్యవసాయ రైతుసంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి -
ఎంటీబీ జాతీయస్థాయి సైక్లింగ్ కోచ్గా ఆనంద్
ములుగు రూరల్: ఎంటీబీ జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు రాష్ట్ర టీంకు కోచ్, మేనేజర్గా ములుగు మండల పరిధిలోని మదనపల్లి గ్రామానికి చెందిన చిలపాక ఆనంద్ ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనసరి సూర్య ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ఈ నెల 28నుంచి 31వ తేదీ వరకు హర్యానాలో జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. అండర్ 16, 18 విభాగాలలో సైక్లింగ్, ఎంటీఎం జాతీయ స్థాయి మౌంటేన్ బైక్ 2024–25 పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరుపున క్రీడాకారులు పాల్గొంటారని వివరించారు. చోరీ కేసులను ఛేదించిన పోలీసులు ములుగు/ములుగు రూరల్ : ఈ నెల 15న రాత్రి గట్టమ్మ ఆలయం రూ. 52వేల నగదు, వెండి, ఇత్తడి వస్తువులు, 21న మల్లంపల్లిలోని మహంకాళి వైన్స్లో జరిగిన రూ. 24వేల చోరీ కేసులను ము లుగు ఎస్సై వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఛేదించారు. ఈ మేరకు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. ఎస్సై కథనం ప్రకారం.. సూర్యాపేటకు చెందిన ముంజల విష్ణు, కోడి నాగమణిలు 15న మేడారం వెళ్లి తిరుగుప్రయాణంలో గట్టమ్మ ఆలయం వద్ద ఆగారు. అమ్మవారి హుండీపై, విలువైన నగలపై కన్నేసి దొంగిలించారు. ఈ విషయంలో ఆలయ పూజారి కొత్త సదయ్య ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనాలకు పాల్పడిన వారిని గుర్తించి దొంగిలించిన వస్తువులను రికవరీ చేశారు. వైన్స్లో చెన్నూరుకు చెందిన చింతకింది సతీశ్ తాళం పగులగొట్టి నగదును దొంగిలించాడు. షాపు యజమాని ఫిర్యాదు తో కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి సొమ్మును రికవరీ చేసినట్లు వివరించారు. 27నుంచి గిరిజన ఇసుక సొసైటీల గ్రామసభలు మంగపేట : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని గోదావరిలో గిరిజన ఇసుక లేబర్ సొసైటీల్లో పెసా నిబంధనల మేరకు మెజారిటీ సొసైటీలను ఎంపిక చేసేందుకు ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదేశాల మేరకు ఈనెల 27, 28, 29 తేదీల్లో గ్రామ సభలను నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ బానోత్ భద్రు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 27న మల్లూరుపరిధిలోని రెండింటికి ఉదయం 10గంటలకు, 28న కత్తిగూడెంలో మూడో ఇసుక క్వారీ సొసైటీలకు ఉదయం 9గంటలకు, రమణక్కపేటలోని గొల్లగూడెం రెండో సొసైటీకి ఉదయం 9గంటలకు, 29న చుంచుపల్లిలో 12గంటలకు, వాడగూడెంలో రెండు సొసైటీలకు 9గంటలకు గ్రామసభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సొసైటీల ఎంపికకు రెండు రోజుల ముందు గ్రామాల్లో టాంటాం వేయించి గ్రామ సభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జీపీల అధికారులను ఆయన ఆదేశించారు. -
దరఖాస్తులు అందించాం..పరిష్కరించండి
ప్రజావాణి, గిరిజన దర్బార్లో 42 దరఖాస్తులుఈ ఫొటోలో కనిపిస్తున్న విద్యార్థిని కారుపాటు పౌర్ణమి. దివ్యాంగురాలు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన సారయ్య కుమార్తె. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. తల్లి చనిపోవడంతో నానమ్మ, తండ్రి బాగోగులు చూసుకుంటున్నారు. గతంలో చేసిన అభ్యర్థన మేరకు అధికారులు బ్యాటరీ ట్రైసైకిల్ అందించారు. అయితే గత కొన్ని నెలల క్రితం అది మరమ్మతులకు గురైంది. ఇంటి నుంచి పాఠశాల కిలోమీటర్ ఉండడంతో రోజువారీగా వెళ్లే వీలులేక చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఉపాధ్యాయులు ఇంటికి వచ్చిన సమయంలో ఇదే విషయం చెప్పారు. దీంతో గ్రామస్తుల సూచన మేరకు గ్రీవెన్స్ సెల్లో మరో బ్యాటరీ ట్రైసైకిల్ ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.● పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సిఫారసు● స్వీకరించిన అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, పీఓ చిత్రామిశ్రాములుగు/ఏటూరునాగారం:కలెక్టరేట్, ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్లో పలు రకాల సమస్యలపై దరఖాస్తులు అందించిన ప్రజలు పరిష్కారం చూపాలని అధికారులను వేడుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో 27దరఖాస్తులు రాగా వాటిని అదనపు కలెక్టర్లు పరిశీలించి ఆయా శాఖల అధికారులకు ఫార్వర్డ్ చేశారు. అదే విధంగా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో పీఓ చిత్రామిశ్రా వినతులు స్వీకరించారు. గిరిజన దర్బార్లో 15 వినతులు రాగా పరిశీలించిన పీఓ తక్షణమే వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఫార్వర్డ్ చేశారు. వినతుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తుల వివరాలు భూ సమస్యలు పరిష్కరించాలని ఎనిమిది, ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఒకరు, పింఛన్ అందించాలని ఒకరు, బ్యాటరీ ట్రైసైకిల్ అందించాలని ఒకరు, బ్యాంకు రుణం అందించాలని ఒకరు ఇలా పలు రకాల సమస్యలపై 27 వినతులు సమర్పించారు. గిరిజన దర్బార్లో.. ● వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామానికి చెందిన పాయం రాందాస్ పెట్రోల్ బంక్ మంజూరు చేయాలని వేడుకున్నారు. ● గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన బానోతు గోపిచంద్ వ్యవసాయ భూమిలో బోరు వేయించి మోటారు ఇప్పించాలని కోరారు. ● వెంకటాపురం(కె) మండలంలోని ఎదిర పీహెచ్సీలో కాంటింజెంట్ వర్కర్గా ఇప్పించాలని అదే ప్రాంతానికి చెందిన దీపిక పీఓకు మొరపెట్టుకున్నారు. అలాగే సాయిలక్ష్మి ఎదిర పీహెచ్సీలో స్టాఫ్ నర్సు పోస్టు ఇప్పించాలని విన్నవించారు. ● కన్నాయిగూడెం మండలం గంగుగూడెం ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మించాలని పొడెం బాబు వినతిపత్రాన్ని అందజేశారు. అదే మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఇర్ప కృష్ణారావు మూడు ఎకరాల్లో వరిపంట నీళ్లు లేక ఎండిపోతుందని.. బోరు వేయించి నీరు అందించాలని విన్నవించారు. ● ఐటీడీఏ గిరిజన భవనం నిర్వహణ కోసం వట్టం నర్సింహరావును నియమించాలని పీఓను పొడెం బాబు కోరారు. ● ఏటూరునాగారం మండలం రాయిబంధం ప్రాంతానికి చెందిన పద్దం జోగయ్య ఇందిర జలప్రభ కింద బోరు వేసి స్తంభాలు వేశారు కానీ విద్యుత్ తీగలు అమర్చి విద్యుత్ సరఫరా చేయాలని వేడుకున్నారు. అలాగే చిన్నబోయినపల్లి ప్రాంతానికి చెందిన పద్దం పొజ్జయ్య తన ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూములను నీలమ్మ పేరుపైకి అక్రమంగా మార్చిన అటవీశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ● భూపాలపల్లి జిల్లాలోని పోస్టుమెట్రిక్ హాస్టల్లో ఖాళీగా ఉన్న ఎంపీహెచ్డబ్ల్యూ పోస్టు ఇప్పించాలని అదే ప్రాంతానికి చెందిన జయప్రద వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే మహబూబాబాద్ స్కూల్(ఏహెచ్ఎస్) స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇప్పించాలని సుగుణ విన్నవించారు. సిబిల్ స్కోర్ లేదని లోన్ ఇవ్వడం లేదు.. గ్రామంలో చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఇటీవల పీఎం విశ్వకర్మ పథకం కింద దరఖాస్తు చేసుకుంటే రూ.లక్ష రుణం మంజూరు అయ్యింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాకు ఖాతా ఉంది. ఆదాయం ఎక్కువగా లేకపోవడంతో లావాదేవీలు జరగలేదు. దీంతో సిబిల్ స్కోర్ లేదని బ్యాంకు మేనేజర్ రుణం ఆపివేశారు. అధికారులు నాకు లోన్ ఇప్పించి ఆదుకోవాలి. – ఎనగందుల సతీశ్, చింతకుంట, ములుగు మనువరాలు 27గుంటల భూమిని పట్టా చేయించుకుంది.. నాకు ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె. ఇద్దరు కుమారులు మృతి చెందారు. పెద్ద కుమారుడు శంకర్ కుమార్తె నా మనుమరాలు రాధిక నా పేరు మీద ఉన్న 27గుంటల వ్యవసాయ భూమిని పట్టా చేయించుకుంది. రైతుబంధు కూడా తానే తీసుకుంటుంది. ఈ విషయాన్ని పెద్దమనుషుల సమక్షంలో అడిగించగా నా ఇష్టం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నా కూతురు దొంగరి స్వరూప నాకు ఇళ్లు కట్టించి బాగోగులు చూసుకుంటుంది. నా భూమి నాకు ఇప్పించి న్యాయం చేయాలి. –వంగరి నర్సమ్మ, నర్సాపూర్, వెంకటాపురం(ఎం)● -
రామప్పను సందర్శించిన రష్యా దేశస్తులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సోమవారం రష్యా దేశస్తులు సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. హిందూ మతం స్వీకరించి ఆలయాలను వారు సందర్శిస్తున్నట్లు వెల్లడించారు. 210 చలివేంద్రాలు.. 360 నీటితొట్లు ములుగు: వేసవిలోని వేడిగాలులు, ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ములుగు జిల్లా పంచాయతీశాఖ తరఫున వినూత్న ఆలోచన చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 10 మండలాల్లో 174 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రధాన కూడళ్లు, రహదారులు, షాపింగ్ ప్రాంతాలు, ఆస్పత్రుల వద్ద 210 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అదే విధంగా గ్రామ పంచాయతీ ఆవరణలు, గ్రామ సమీపంలోని ఖాళీ ప్రదేశాలు, నర్సరీలు, రహదారి వెంబడి పక్షులు, మూగజీవాలు, కోతులు నీళ్లు తాగే విధంగా 360ప్లాస్టిక్ టబ్స్, తాగునీటి తొట్లు ఏర్పాటు చేశారు. డీపీఓ ఒంటేరు దేవరాజ్ సూచనల మేరకు చిన్న గ్రామ పంచాయతీల్లో ఒకటి, మేజర్ గ్రామ పంచాయతీల్లో మూడు నుంచి 5 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. -
క్షయవ్యాధి అంతమే లక్ష్యం
ములుగు: క్షయవ్యాధి అంతమే లక్ష్యంగా ముందుకుసాగాలని జిల్లా వైద్యశాఖ అధికారి గోపాల్రావు వైద్య సిబ్బందికి సూచించారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి ఎదుట సోమవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్తో కలిసి పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపాల్రావు మాట్లాడుతూ క్షయవ్యాధిని ధ్వేషించాలే తప్పా రోగిని కాదన్నారు. సమగ్రమైన చికిత్సను తీసుకోవడం ద్వారా వ్యాధిని నిర్మూలించవచ్చని తెలిపారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు గ్రామసభలు, విలేజ్ న్యూట్రిషన్ కమిటీ, శానిటేషన్ కమిటీ, విలేజ్ జాస్ కమిటీ సమావేశాల్లో వైద్య సిబ్బంది ప్రజలకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలన్నారు. క్షయ వ్యాధికి గురైన వ్యక్తి సంవత్సరానికి 10మందికి వ్యాప్తి చేయగలడని తెలిపారు. జ్వరం, ఛాతినొప్పితో కూడిన దగ్గు, తెమడలో రక్తం పడడం, బరువు తగ్గడం లక్షణాలు ఉంటే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. నిర్ధారణ అయితే నిర్మూలనకు కోర్సును అందిస్తారని వివరించారు. క్షయ వ్యాధి బాధితులు ఆల్కహాల్, సిగరెట్ తాగడం వంటివి చేయకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి చంద్రకాంత్, వైద్యులు రాధిక, అనిల్, శ్రవణ్కుమార్, ఆర్ఎంఓ ప్రేమ్సింగ్, రాయినిగూడెం పీహెచ్సీ వైద్యాధికారి ప్రసాద్, దుర్గారావు, పూర్ణసంపత్రావు, సురేష్బాబు, వెంకట్రెడ్డి, సమ్మయ్య, రాజు, రమేష్, చంద్రమౌళి, దేవేందర్, నిర్మలమేరి, సిబ్బంది పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
మావోయిస్టుల కదలికలపై దృష్టి సారించాలి
వెంకటాపురం(కె): మావోయిస్టుల కదలికలపై అనునిత్యం దృష్టి సారించాలని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సిబ్బందికి సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్ను ఆయన సోమవారం తనిఖీ చేసి మాట్లాడారు. సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మావోయిస్టులు అమాయక ఆదివాసీ ప్రజలను ప్రభావితం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో కేసులలో అరెస్టు అయిన మావోయిస్టు పార్టీ సభ్యులను, సానుభూతి పరులను అనునిత్యం పర్యవేక్షిస్తుండాలని అదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిఽధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును కమెండ్ కంట్రోల్ రూమ్లో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సీఐ బండారి కుమార్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు, తదితరులు ఉన్నారు.ఏఎస్పీ శివం ఉపాధ్యాయ -
పంటలకు ఎస్సారెస్పీ నీళ్లు అందించాలని ధర్నా
ములుగు రూరల్: మండల పరిధిలోని లక్నవరం ముంపు గ్రామాల్లో సాగు చేసిన పంటలకు ఎస్సారెస్పీ నీళ్లు అందించాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అమ్జద్పాషా అన్నారు. ఈ మేరకు సోమవారం ఏజెన్సీ రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు గ్రామాలు రాయినిగూడెం, పంచోత్కులపల్లి, లాలయగూడెం, జగ్గన్నగూడెం, అంకన్నగూడెం, కొత్తూరు, దుబ్బగూడెం, సర్వాపూర్, కన్నాయిగూడెం గ్రామాలలో యాసంగి వరి పంట చేతికి వచ్చే సమయంలో నీరు అందక పంట ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. యాసంగి సాగు చేసిన రైతులకు 20 రోజుల పాటు ఎస్సారెస్పీ నీళ్లు అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తవిటి నారాయణ, కృష్ణ, సాంబయ్య, పాపయ్య, నాగయ్య, సమ్మయ్య, స్వామి, సురేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
మేడారంలో భక్తుల సందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేల సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల షెవర్ల కింద స్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, కానుకలు, ఎత్తు బంగారం, చీరసారె కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఓ ఎన్నారై కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లకు పూజలు చేశారు. డీజె సౌండ్ నృత్యాలతో పలువురు భక్తులు సందడి చేశారు. మొక్కుల అనంతరం భక్తులు చెట్ల కింద వంటావార్పు చేసుకుని భోజలు చేశారు. సుమారు 10వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ‘అమ్మవార్ల చరిత్ర గొప్పది’ మేడారం సమ్మక్క– సారలమ్మ చరిత్ర చాలా గొప్పదని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు కొనియాడారు. కాకతీయ యూనివర్సిటీలో రెండు రోజుల సెమినార్ ముగించుకొని అమ్మవార్ల దర్శనానికి వచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవార్లను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. వనదేవతల చరిత్ర నలుదిశలా వ్యాపించేలా తమకున్న వనరులతో పుస్తకాలను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించేలా చూస్తామన్నారు. సమ్మక్క– సారలమ్మ జాతరకు జాతీయస్థాయి గుర్తింపును తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ప్రజల మనో భావాలను గుర్తించాలన్నారు. వనదేవతలను దర్శించుకున్న వారిలో ప్రొఫెసర్లు గోవాకు చెందిన ప్రకాశ్దేశాయ్, తమిళనాడుకు చెందిన లక్ష్మణన్, కేరళ రాష్ట్రానికి చెందిన జోష్జార్జి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చెందిన అంజిరెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన శ్రీనివాసులు, కాకతీయ యూనివర్సిటీకి చెందిన సత్యనారాయణ, యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అంకిళ్ల శంకర్, కలిపిండి వినోద్, చేరాల శివప్రసాద్, అట్ల రాజిరెడ్డి ఉన్నారు. -
అక్రమంగా మట్టి తవ్వకాలు
కాటారం: మహాముత్తారం మండలం యామన్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గడ్డగూడెం సమీపంలోని ఎర్రకుంట చెరువులో ఆదివారం అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగాయి. కొందరు వ్యక్తులు జేసీబీ సహాయంతో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి రవాణా చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. ఇరిగేషన్ శాఖకు చెందిన చెరువుల నుంచి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత శాఖ అధికారుల నుంచి స్పందన లేదు. అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ మట్టి దందా జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. -
అక్రమంగా మట్టి తవ్వకాలు
కాటారం: మహాముత్తారం మండలం యామన్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గడ్డగూడెం సమీపంలోని ఎర్రకుంట చెరువులో ఆదివారం అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగాయి. కొందరు వ్యక్తులు జేసీబీ సహాయంతో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి రవాణా చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. ఇరిగేషన్ శాఖకు చెందిన చెరువుల నుంచి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత శాఖ అధికారుల నుంచి స్పందన లేదు. అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ మట్టి దందా జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. -
అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దు
మంగపేట: మండల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న గొత్తికోయలు అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. మండల పరిధిలోని తిమ్మాపురం ముసలమ్మగుట్ట అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న 60కుటుంబాలు, ప్రాజెక్టునగర్లో 22, శాంతినగర్ 18, కేశపురం 20, పాయిగూడెం 18, రాళ్లగుంపు 20, ఎస్టీ కాలనీకి చెందిన 4కుటుంబాలను ఆయన ఆదివారం సందర్శించి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. రాబిన్ ఫుడ్, సీజేఐ వారి సహకారంతో ఆయా గూడేల్లోని గొత్తికోయలకు సోలార్ లైట్లు, నిత్యావసర సరుకులు, దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎవరుకూడా మావోయిస్టులకు సహకరించవద్దన్నారు. గూడేలకు ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి మిర్చి కూలీల ముసుగులో మావోయిస్టులు వచ్చి విధ్వంసాలు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందని తెలిపారు. గూడేలకు అపరిచిత వ్యక్తులు వచ్చినా, అటవీ ప్రాంత పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్నా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. మావోయిస్టులకు ఎవరైనా ఆశ్రయం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, స్థానిక ఎస్సై సూరి, రాబిన్హుడ్, సీజేఐ సిబ్బంది, ట్రెయినీ ఎస్సైలు మహేష్, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. ఏఎస్పీ శివం ఉపాధ్యాయ -
నాంచారమ్మ జాతరలో సౌకర్యాలు కల్పించాలి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామాంజాపూర్ పరిధిలో మే12న జరిగే నాంచారమ్మ జాతరలో ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు కోరారు. ఎరుకల నాంచారమ్మ జాతర ప్రదేశాన్ని ఆయన ఆదివారం సందర్శించి నాంచారమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. 8 ఏళ్లుగా నాంచారమ్మ జాతరను నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతరలో సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. జాతరలో భక్తుల సౌకర్యార్ధం మౌలిక వసతులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం నాయకులు కోనేటి రాజు, కేతిరి భిక్షపతి, రాజశేఖర్, పల్లకొండ భాస్కర్, సుభాశ్, ప్రశాంత్, రమేష్, శ్రీనివాస్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజు -
రేపు యువజనోత్సవాల పోటీలు
ఏటూరునాగారం: మండల కేంద్రంలో రేపు ఐటీడీఏలో గల గిరిజన భవన్లో యువజనోత్సవాల పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వం యూత్ అండ్ అఫైర్స్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువకేంద్రం వరంగల్ వారు జిల్లాలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాల పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన అంశం పంచ్ ప్రాన్ అనే కార్యక్రంలో భాగంగా పద్య రచన, డ్రాయింగ్, ప్రకటన పోటీలు, ఫోక్ డ్యాన్స్ గ్రూప్, ఫోక్ డ్యాన్స్ సింగిల్, సైన్స్ మేల్ సింగిల్, సైన్స్ మేల్ గ్రూప్ ఈ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9908069469లో సంప్రదించాలని కోరారు. జాతీయ కౌమార విద్యా సదస్సుకు డాక్టర్ రామయ్య ములుగు: ప్రాంతీయ విద్యాసంస్థ(ఎన్సీఈఆర్టీ) బోపాల్లో నేడు(సోమవారం), మంగళవారం జరగనున్న జాతీ య కౌమార విద్యా సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుంచి తాను ఎంపికై నట్లు ములుగు మండలం అబ్బాపురం ప్రభు త్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, మనో విజ్ఞానవేత్త డాక్టర్ కందాల రామయ్య ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌమారదశలో బాలికలు ఒత్తిడిని ఎదుర్కునే విధానాలు అనే అంశంపై చేసిన పరిశోధన, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని తెలిపేలా వివరించనున్నట్లు వెల్లడించారు. జాతీయ మెంటర్, జాతీయ, రాష్ట్ర రీసోర్స్ పర్సన్గా మనో విజ్ఞానశాస్త్రంతో పాటు భావో ద్వేగ ప్రజ్ఞ, ఒత్తిడి, ఒత్తిడిని ఎదుర్కునే విధానాలు, మంత్రణం, మార్గదర్శనం అంశాలపై పరిశోధనలు చేస్తున్నట్లు వివరించారు. ఈ జాతీయ కౌమార విద్యా సదస్సుకు ఎంపికై న రామయ్య ను డీఈఓ పాణిని, ఏఎంఓ మల్లారెడ్డి, హెచ్ఎం భాస్కర్ తదితరులు అభినందించారు. భగత్సింగ్ ఆశయాలను కొనసాగించాలి ములుగు రూరల్: భగత్సింగ్ ఆశయాలను కొనసాగించాలని డెమోక్రటిక్ స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ జక్కుల శరత్కుమార్ అన్నారు. భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల వద్ద వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. స్వాతంత్ర పోరాటంలో భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు వీరోచితంగా పోరాడి ఉరికంబం ఎక్కిన మహోన్నత వ్యక్తులను వారి సేవలను కొనియాడారు. నేటి సమాజంలో విద్యార్థులు తమ హక్కులను తెలుసుకొని ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వరుణ్, విద్యార్థులు పాల్గొన్నారు. మతోన్మాదంపై పోరాటానికి సిద్ధంకావాలి భూపాలపల్లి అర్బన్: కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న మతోన్మాద వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు పిలుపునిచ్చారు. భగత్సింగ్ 94వ వర్ధంతిని ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ.. భారతీయుల హృదయాలను ఉత్తేజ పరచిన విప్లవకారులు భగత్సింగ్కు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసిందన్నారు. నాటి ఉద్యమ పోరాటంలో చేసిన త్యాగాలను గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితో నేటితరం యువత బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా పోరాడాలని పిలుపునిచ్చారు. -
రామప్పలో యూరప్ దేశస్తులు
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని ఆదివారం యూరప్కు చెందిన జెయో, ఇలోనాలు సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో పర్యాటకులు సైతం రామప్పకు తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రొఫెసర్లు రామప్ప దేవాలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేయూలో రెండు రోజుల సెమినార్ ముగించుకొని అమ్మవార్ల దర్శనానికి వచ్చినట్లు వెల్లడించారు. -
బోర్లు వేయడాన్ని అడ్డుకోవడం సరికాదు
గోవిందరావుపేట: రైతులు తమ పంటపొలాలను కాపాడుకునేందుకు బోర్లు వేసుకుంటుంటే పస్రా ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం సరికాదని ఎమ్మార్పీస్, ఎంఎస్పీ జాతీయ కార్యదర్శి ఇరుగు పైడి అన్నారు. మండల పరిధిలోని మొద్దులగూడెం– రాంపూర్ సమీపంలోని సర్వే నంబర్ 41, కర్లపల్లిలోని సర్వే నంబర్లు 91, 175, 94, 171లో ఉన్న 400 మంది రైతులకు చెందిన పంట పొలాలను ఆదివారం పైడి ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల బాధను మంత్రి సీతక్క అర్ధం చేసుకుని ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పస్రా ఫారెస్ట్ అధికారులు 400మంది రైతులను చాలా దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. వరి పంట పొట్టదశలో ఉందని తెలిపారు. గుండ్లవాగు ప్రాజెక్ట్లో నీరు లేకపోవడంతో వరి పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో రైతులు బోర్లు వేసుకుంటుంటే అటవీశాఖ అధికారులు అడ్డుకోవడం బాధాకరమన్నారు. ఇప్పటికై నా మంత్రి సీతక్క స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పాల్గొన్నారు.ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జాతీయ కార్యదర్శి పైడి -
మద్యపాన ప్రియులతో సమాజ సేవ
మలుగు: ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యంతాగి వాహనాలు నడిపిన వారికి జిల్లా కోర్టు సివిల్ జడ్జి కన్నయ్యలాల్ వినూత్నంగా జరిమానా వేశారు. సుమారు నాలుగు గంటలపాటు సమాజ సేవ చేయాలని ఆదేశించారు. ఎస్సై వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ సర్వీస్లో ప్రోగ్రాంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలోఉన్న ప్లాిస్టిక్ కవర్లు, చెత్తా చెదారం, పిచ్చి మొక్కల తొలగింపు పనులను చేయించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు తాగి వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదాల బారిన పడొద్దని సూచించారు. చట్టాలపై అవగాహన ఉండాలిటేకుమట్ల: మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చైల్డ్ హెల్ఫ్లైన్ జిల్లా అధికారి కళావతి అన్నారు. శనివారం మండలంలోని రామకిష్టాపూర్(టి) అంగన్వాడీ కేంద్రంలో మహిళలకు చట్టాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం సుకన్య సమృద్ధియోజన, బేటీ బచావో–బేటీ పడావో, మిషన్ వాత్సల్య, చైల్డ్ హెల్ప్లైన్, సఖి కేంద్రాలను నిర్వహింస్తుందని అన్నారు. బాలికల చదువు అనంతరం వివాహానికి సుకన్య సమృద్ధి యోజన ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. బాలికలే భవిష్యత్కు పునాదులుగా బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం కొనసాగిస్తున్నారని అన్నారు. బాలికలు సమాజంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఇబ్బందులకు గురయితే చైల్డ్ హెల్ప్లైన్ తోడ్పాటునందిస్తుందన్నారు. మహిళలు కుటుంబ పరంగా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే సఖి కేంద్రం ద్వారా న్యాయం పొందే అవకాశం ఉందని చెప్పారు. చైల్డ్ హెల్ప్లైన్, బాలికల సమస్యల కోసం 1098, వృద్ధుల సమస్యల కోసం 14567, మహిళల సమస్యల కోసం 181 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సరోజన, సఖి గాయత్రి మిషన్ శక్తి కో ఆర్డినేటర్ అనూష, మమత, అంగన్వాడీ టీచర్లు స్వరూప, వనిత, నిర్మల, విమల పాల్గొన్నారు. సోలార్తో రైతులకు ఆదాయంభూపాలపల్లి రూరల్: సోలార్ ఏర్పాటు చేసుకోవడం వలన రైతులకు అదనంగా ఆదాయం సమకూరుతుందని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. పీఎం కుసుమ్ (ప్రధానమంత్రి కిసాన్ ఉర్జ సురక్ష ఈవం ఉత్తన్ మహా అభియాన్) పథకం కింద కలెక్టరేట్లో శనివారం సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం కోసం దరఖాస్తు చేసుకున్న భూపాలపల్లి, ములుగు జిల్లా రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథకం వివరాలు తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో 115, ములుగు జిల్లాలో 49 దరఖాస్తులు వచ్చాయన్నారు. రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఒక మెగావాట్ ప్లాంట్కు సంవత్సరంలో సుమారు రూ.57లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ములుగు అదనపు కలెక్టర్ సంపత్ రావు, భూపాలపల్లి ఎస్ఈ మల్చూర్ నాయక్, టీజీ రెడ్కో డీఎం హైదరాబాద్ పండారి, డివిజనల్ ఇంజనీర్ భూపాలపల్లి పాపిరెడ్డి, ములుగు డివిజనల్ ఇంజనీర్ నాగేశ్వరరావు, డివిజనల్ ఇంజనీర్ టెక్నికల్ భూపాలపల్లి వెంకటేశం పాల్గొన్నారు. -
రామప్పలో విద్యార్థుల సందడి
విద్యార్థులకు ఆలయ విశిష్టతను వివరిస్తున్న గైడ్ వెంకటేశ్ వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మ క రామప్ప దేవాలయంలో శనివారం విద్యార్థుల సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో విద్యార్థులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శనివారం రామలింగేశ్వరున్ని త్రిశూలం, ఓంకారం ఆకారంతో ప్రత్యేకంగా అలంకరించినట్లు ఆలయ ప్రధాన ఆర్చకుడు కోమల్లపల్లి హరీష్శర్మ తెలిపారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు కట్టకు చేరుకొని సరస్సులో బోటింగ్ చేస్తూ కేరింతలు కొట్టారు. -
రేంజ్ అధికారి బాలరాజు అరెస్ట్
ఏటూరునాగారం: తునికాకు కూలీల బోనస్లో అవినీతి జరిగిందని అర్హులైన కూలీలు 2023 ఆగస్టులో సీసీఎఫ్కు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. అయితే అటవీశాఖలో పనిచేసే ఒక కంప్యూటర్ ఆపరేటర్, మిగతా ఆరుగురు వాచర్స్ ఖాతాల్లో కూలీలకు చెందిన తునికాకు బోనస్ డబ్బులు పడినట్లు ప్రత్యేక టీం గుర్తించింది. వారి రిపోర్ట్ మేరకు ఇటీవల అటవీశాఖ రేంజ్ అధికారి అఫ్సరున్నీసా స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న సీఐ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు విచారణను ముమ్మరం చేశారు. దీంతో కిషన్, వాచర్స్ వైకుంఠం, కన్నాయిగూడెంకు చెందిన మధుకర్, మహబూబ్, భిక్షపతి, నర్సింహులు, ప్రసాద్ అనే ఏడుగురి ఖాతాల్లో నగదు జమ అయినట్లు గుర్తించారు. ఈ క్రమంలో బాధితులు సాక్షిని సంప్రదించి జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో సాక్షిలో ‘అటవీశాఖ రేంజ్ అధికారి మోసం’ అనే శీర్షికన ఈనెల 19న కథనం ప్రచురితమైంది. బాధితులకు జరిగిన నష్టాన్ని వివరించగా పోలీసులు కథనాన్ని పరిగణలోకి తీసుకున్నారు. మరుసటిరోజు బాధితులు.. బాలరాజు వద్దకు వెళ్లి డబ్బులు మీరే వేయించి మీరే డ్రా చేయించారని చెప్పగా నాకు ఎలాంటి సంబంధం లేదు.. అంటూ బుకాయించాడు. ఆధారాలున్నా యా.. అంటూ దిక్కరించారు. దీంతో 20వ తేదీన ‘తునికాకు బోనస్లో చేతి వాటం’ అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. దీంతో టాస్క్ ఫోర్స్, ఇంటలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగి లోతుగా విచారణ చేయగా రేంజ్ అధికారి బాలరాజు హస్తం ఉందని తేలింది. దీంతో బాధితుల నుంచి పోలీసులు వాంగ్మూలాన్ని సేకరించి శనివారం బాలరాజుపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చారు. అసలు నిందితుడు దొరకడంతో ఈ ఏడుగురిపై కేసును తొలగించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ఘటనలో ఇంకెవరి ప్రమేయమైన ఉందా.. అనేది తెలియాల్సి ఉంది. పేదలకు అండగా నిలిచిన సాక్షి మండల కేంద్రానికి చెందిన పలువురు అటవీశాఖలో పనిచేస్తున్నారు. వారిపై అక్రమ కేసు నమోదు చేయించి తప్పించుకోవాలని చూసిన అధికారి విషయాన్ని బట్టబయలు చేసిన సాక్షికి కృతజ్ఞతలు. పేదలను ఈ కేసు నుంచి తప్పించి ఆదుకోవాలి. – ఇర్సవడ్ల సంతోష్, గ్రామస్తుడు, ఏటూరునాగారం తునికాకు కూలీల బోనస్ డబ్బుల స్వాహా రూ.2.70 లక్షల దుర్వినియోగం కేసు నుంచి బయటపడ్డ ఏడుగురు.. ‘సాక్షి’కి అభినందనలు -
ఒకే దేశం.. ఒకే ఎన్నికను స్వాగతిద్దాం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం ములుగు రూరల్ : దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఒకే దేశం ఒకే ఎన్నికను స్వాగతిద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, రాష్ట్ర నాయకుడు పల్ల బుచ్చయ్య అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒకేసారి ఎన్నికల జరగడం వల్ల ఆర్థికంగా, అభివృద్ధిపరంగా, ప్రజాధనం దుర్వినియోగం, ప్రలోభాలు లేకుండా ఎన్నికలు జరగడంతో సమర్ధవంతమైన నాయకులను ఎన్నుకునేందుకు వీలుంటుందని అన్నారు. ఎన్నికల కోడ్ ఆంక్షలు లేకుండా ఉంటుందని అన్నారు. ప్రభుత్వ అధికారులు పనులపై దృష్టి సారించి ప్రజా సమస్యల పరిష్కారానికి వీలుంటుందని అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికను స్వాతిస్తూ గ్రామాలు, మండలాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. పార్టీలకు అతీతంగా యువత, మేధావులు భాగస్వామ్యంతో ప్రజలలను చైతన్యపరచాలని అన్నారు. కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ భూక్య జవహార్లాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్రాచారి, ఇమ్మడి రాకేష్యాదవ్, కృష్ణాకర్రావు, నరేష్, రామరాజు, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు. -
మానవాళి మనుగడకు నీరే ఆధారం
గోవిందరావుపేట: మానవళి మనుడగకు నీరే ఆధారమని జిల్లా భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని చల్వాయి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో యువతరం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భూగర్భ జలశాఖ ములుగు సహకారంతో పాఠశాల విద్యార్థినులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూగర్భ జలాలను పొదుపు చేయలేకపోతే భవిష్యత్ తరాలకు ముప్పు తప్పదని అన్నారు. ఎంపీడీఓ జవహర్ రెడ్డి మాట్లాడుతూ భూగర్భ జలాల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ మాట్లాడుతూ.. భూగర్భ జలాలు, నదులను సంరక్షించుకోవడం మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యమని తెలిపారు. విద్యార్థులు వారి నిత్య జీవితంలో నీటి ప్రాముఖ్యతను గుర్తించి నీటి పొదుపును పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ శరత్ బాబు, చల్వాయి గ్రామ కార్యదర్శి చుంచు భారతి, కేజీబీవీ ప్రత్యేక అధికారి వెంకటలక్ష్మి, యువతరం యూత్ అద్యక్షుడు దశరథం, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు -
ఐటీడీఏ కార్యాలయంలో నాగుపాము కలకలం
ఎస్ఎస్తాడ్వాయి: మండలంలోని మేడారం ఐటీడీఏ కార్యాలయంలో శనివారం నాగుపాము ప్రత్యక్షమైంది. క్యాంపు కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది కార్యాలయం లోపల నాగుపామును గుర్తించారు. వెంటనే స్థానికులకు సమాచారం అందించడంతో మేడారం సమీపంలోని కొత్తూరు వైన్షాపులో పని చేస్తున్న నగేష్ కార్యాలయానికి వచ్చి ప్లాస్టిక్ డబ్బాలో నాగుపామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. నగేష్ను సమ్మక్క పూజారులు సిద్దబోయిన స్వామి, సిద్దబోయిన రమేష్, ఆదివాసీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, ఐటీడీఏ క్యాంపు కార్యాలయం సిబ్బంది అభినందించారు. -
ప్రజల రక్షణ కోసం సిద్ధంగా ఉంటాం
వాజేడు: ప్రజల రక్షణ, భద్రత కోసం జిల్లా పోలీసులు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారని ఎస్పీ డాక్టర్ శబరీశ్ అన్నారు. మండల పరిధిలోని కోయవీరాపురం గ్రామాన్ని శనివారం ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్లతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ గ్రామస్తులతో మాట్లాడారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మావోయిస్టులకు ఆశ్రయం కల్పించొద్దని, వారు చేసే సంఘ విద్రోహ చర్యల్లో పాలుపంచుకోవద్దన్నారు. వారికి సహకరిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు, మావోయిస్టులు వస్తే తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. యువత చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని, చెడు అలవాట్లకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని వివరించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెస్సేజ్, వాట్సాప్ కాల్స్కు స్పందించి మోసపోవద్దని సూచించారు. బైక్ నడిపే సమయంలో హెల్మెట్, కారు నడిపితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని రహదారిని ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి నిర్మించాలని కోరారు. తమ గ్రామంలో సీఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజల అభ్యర్థనకు స్పందించిన ఎస్పీ శబరీశ్.. కోయవీరాపురం గ్రామానికి కొత్తగా రహదారి వచ్చేలా చర్యలను తీసుకుంటామని, సీఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వాజేడు, వెంకటాపురం(కె) ఎస్సైలు రాజ్ కుమార్, తిరుపతిరావు, సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు ఉన్నారు. మావోయిస్టు కదలికలపై దృష్టి సారించాలి వెంకటాపురం(కె): జిల్లాలో మావోయిస్టు కదలికలపై అనునిత్యం దృష్టి సారించాలని, గ్రామాల్లో వారి రాకపోకలపై కన్నేసి ఉంచాలని ఎస్పీ శబరీశ్ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రక్షణ కోసం స్టేషన్ నలుమూలల ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్ గార్డులను తనికీ చేశారు. గార్డ్లో ఉన్న సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని, తమ సిబ్బంది గ్రామాలను సందర్శించినపుడు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మావో యిస్టు కదలికలపై దృష్టిసారించాలని, వారు అమాయక ఆదివాసీ ప్రజలను ప్రభావితం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో కేసులలో అరెస్టు అయిన మావోయిస్టు పార్టీ సభ్యులు, సానుభూతిపరులను నిత్యం పర్యవేక్షిస్తుండాలని అదేశించారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించాలని అక్రమంగా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇసుక క్వారీల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో వెంకటాపురం సీఐ బండారి కుమార్, ఎస్సైలు కొప్పుల తిరుపతిరావు, స్వామి ఉన్నారు. ఎస్పీ శబరీశ్బడీడు పిల్లలు బడిలోనే ఉండాలి బడీడు పిల్లలు బడిలోనే ఉండాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ అన్నారు. వాజేడు పోలీసులు కొంగాల గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నారు. వాజేడు వైద్యాధికారి మధుకర్, ఏటూరునాగారం తేజా హాస్పిటల్ వైద్యుడు రవితేజ గ్రామంలోని రోగులను పరీక్షించి మందులను ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు విద్య, వైద్యం ముఖ్య మన్నారు. అవి రెండు అందుబాటులో ఉంటే ప్రజలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తారన్నారు. మెడికల్ క్యాంపు అనంతరం ఎస్పీ శబరీశ్ దగ్గరకు వచ్చిన కొంగాల పాఠశాల ఉపాధ్యాయుడు కొంత మంది పిల్లలు ఎంత చెప్పినా బడికి రావడం లేదని ఆవేదనతో ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన పిల్లలు, వారి తల్లిదండ్రులకు చదువు ప్రాముఖ్యతను వివరించారు. ఆయన వెంట ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, వెంకటాపురం(కె) సీఐ కుమార్, ఎస్సైలు కృష్ణ ప్రసాద్, రాజ్ కుమార్, తిరుపతి రావు ఉన్నారు. -
ఎండుతున్న వరి
అడుగంటిన భూగర్భ జలాలుమంగపేట: జిల్లాలో రోజు రోజుకూ భూగర్భ జలాలు అడుగంటి పోతుండడంతో వరి పంట సాగుచేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే వివిధ మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నెల రోజుల క్రితం వరకు రెండున్నర ఇంచుల పైపు నిండా నీటిని పోసిన బోరుబావులు ప్రస్తుతం పనిచేయని పరిస్థితి నెలకొంది. పలు మండలాల్లో కొన్ని బోరుబావులు అలా పోస్తు ఇలా ఆగి పోతున్నాయి. ప్రస్తుతం వరి బిర్రు పొట్ట, గింజ పోసుకునే దశలో ఉండగా పలు మండలాల్లో ముందుగా నాట్లు వేసిన చోట గింజ పోసుకునే దశలో ఉంది. మండుతున్న ఎండలతోపాటు వరి పంటకు ఎక్కువగా నీరు అవసరమైన సమయం ఇప్పుడే కావడంతో సరిపడా నీటిని అందించడం కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు. సమయానికి నీరు అందకపోతే పొట్ట దశలో ఉన్న పైరు వడలిపోయే ప్రమాదం ఉండగా కంకి బయటకు వస్తున్న పైరు గింజ పోసుకోకపోవడంతో తాలుగా మారుతుందని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని మంగపేట మండలంలోని తిమ్మంపేటలో ఇప్పటికే బోరుబావుల్లో నీరు రాకపోవడంతో సుమారు 120 ఎకరాల మేర పైరు వడలిపోగా మరో 1,800 ఎకరాల్లో పంట పూర్తిగా ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దాదాపుగా జిల్లాలో ఇదే పపిరిస్థితి నెలకొనడంతో రబీలో వరి పంట సాగుచేసిన రైతులు ఏమీ చేయలేని పరిస్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. జిల్లాలోని 9 మండలాల్లో 56,300 ఎకరాల్లో వరి పంట సాగు చేసినట్లు అధికారులు చెపుతుండగా.. అదనంగా మరో 10 వేల ఎకరాలకు పైచిలుగా సాగు చేసినట్లు అంచనా. 15 ఎకరాలు ఎండిపోతోంది బోరు బావులు, చెరువు నీటిపై ఆధారపడి 18 ఎకారల్లో వరిపంట సాగు చేశా. ఎకరాకు పెట్టుబడి ఖర్చు రూ.40 వేల వరకు అయింది. కంకి దశలో ఉండగా బోరుబావుల్లో నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. రూ.70,000 ఖర్చు చేసి నూతనంగా బోరువేశా. నీరు పడలేదు. గింజపోసుకునే దశలో ఉన్న సుమా రు 15 ఎకరాల పైరు పూర్తిగా ఎండిపోయింది. – చిలకమర్రి భాస్కర్, రైతు, తిమ్మంపేట ఆయకట్టు పంటలకు ఇబ్బంది లేదు జిల్లాలో చెరువులు, ప్రాజెక్టుల కెనాల్ ఆయకట్లు పరిధిలో సాగు చేసిన వరి పంట ఏప్రిల్ మొదటి వారం వరకు కోత దశకు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆయా పంటలకు అవసరమైన మేర సాగునీటికి ఢోకాలేదు. బోరుబావులపై ఆధారపడి సాగుచేసిన పంటలు ఎండిపోయిన విషయం మా దృష్టికి రాలేదు. – సురేష్, జిల్లా వ్యవసాయాధికారి వట్టిపోతున్న బోరుబావులు చివరి దశలో నీరందని పరిస్థితి పంటను కాపాడుకునేందుకు రైతుల పాట్లు -
మద్యం సేవించి వాహనం నడిపినందుకు సమాజ సేవ
మలుగు: మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి ములుగు జిల్లా కోర్టు సివిల్ జడ్జి కన్నయ్య లాల్ వినుత్న శిక్ష వేశారు. సుమారు నాలుగు గంటల పాటు సమాజ సేవ చేయాలని, జరిమానా కట్టాలని ఆదేశించారు. దీంతో ఎస్సై వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కమ్యునిటీ సర్వీస్లో పోగ్రాంలో భాగంగా ఏరియా ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న ప్లాిస్టిక్ కవర్లు, చెత్తాచెదారం తొలగింపు పనులు చేయించారు. కుష్ఠు నిర్ధారణ సర్వేవాజేడు: జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలనలో భాగంగా వాజేడు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు. ములుగు జిల్లా వైద్యాధికారి గోపాలరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ చంద్ర కాంత్ ఆదేశాల మేరకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఈసర్వేలో పాల్గొన్నారు. మార్చి 30 వరకు ఈ సర్వే ఇలాగే జరుగుతుందని అనుమానితుల పేర్లను నమోదు చేసుకుని వైద్య పరీక్షలను నిర్వహించనున్నట్లు వైద్యాధికారి మధుకర్ వెల్లడించారు. సర్వేలో కోటిరెడ్డి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. కనీస వేతనం ప్రకటించాలి..ములుగు రూరల్: పార్లమెంట్ బడ్జెట్లో ఆశ వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ప్రకటించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. ఈమేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో డీఎంహెచ్ఓ కార్యలయం ఎదుట ఆశ కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన తెలిపి అనంతరం కార్యాలయ అధికారికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆశల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నీలాదేవి, రజిత, సుధా, అనిత, ఛాయాదేవి, రమాదేవి, సంధ్య, కవిత, మంజుల, పద్మ, తదితరులు పాల్గొన్నారు. రామప్పను సందర్శించిన విదేశీయుడువెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయాన్ని యూరప్లోని మాల్దోవాకు చెందిన ఓలెగ్ బివోల్ సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా.. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం అందించారు. ఆలయ విశిష్టత గురించి రాష్ట్ర టూరిజం గైడ్ సాయినాథ్ వివరించగా రామప్ప శిల్పాకళా సంపద బాగుందని కొనియాడారు. రామప్ప అందాలను తన ఫోన్లో బంధించుకున్నారు. -
శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025
స్టేజీల వారీగా ఎన్ని టికెట్లు జారీ అవుతున్నాయి.. ఇందులో డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఎన్ని, నగదు రూపేణా ఎన్ని, జీరో టికెట్లు ఎన్ని జారీ అయ్యాయో తెలుసుకునే సౌకర్యం ఉంది. ● ఆర్టీసీ డిపోలు, వరంగల్ రీజియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్యాష్ బోర్డు ద్వారా ప్రతీబస్లో జారీ అవుతున్న టికెట్ల వివరాలు స్టేజీల వారీగా అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ● ఈ టిమ్స్ పూర్తిస్థాయిలో పని చేయడానికి మరికొంత సమయం పట్టనుంది. ● ముందుగా ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (ఓపీఆర్ఎస్) వర్తింపజేస్తున్న బస్సులో వీటిని వినియోగించనున్నారు. ● కండక్టర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇచ్చిన తర్వాత పల్లె వెలుగు బస్సుల వరకు క్రమంగా అమలు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు ఆర్టీసీ ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటోంది. ప్రయాణికులకు సౌకర్యవంతంగా టికెట్ జారీకి ఇ–టిమ్స్ను ప్రవేశ పెట్టింది. దీనిలో భాగంగా ఆర్టీసీ వరంగల్ రీజియన్లోని ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈమేరకు కండకర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇస్తూ క్రమంగా ఇ–టిమ్స్ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకు ఉపయోగించిన టిమ్స్తో చూసుకుంటే మరిన్ని ఫీచర్లతో వీటిని రూపొందించారు. ఆధునిక సాంకేతిక పద్ధతులతో ఇ–టిమ్స్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇ–టిమ్స్ను రూపొందించారు. ప్రస్తుతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్న బస్సుల్లో మాత్రమే వీటిని వినియోగిస్తున్నాం. క్రమంగా పల్లె వెలుగు వరకు అమలు చేస్తాం. వీటి ద్వారా ప్రయాణికులకు సులువుగా టికెట్ జారీ చేయవచ్చు. – డి.విజయ భాను, ఆర్టీసీ వరంగల్ ఆర్ఎంవరంగల్ రీజియన్లో ప్రతిరోజూ 936 బస్సులు వివిధ రూట్లలో తిరుగుతుంటాయి. 3.76 లక్షల కిలోమీటర్లు తిరిగి సగటున రోజుకు రూ.2.20 కోట్ల ఆదాయాన్ని సంస్థ రాబట్టుకుంటుంది. 936 బస్సులకుగాను ప్రస్తుతం 750 ఇ–టిమ్స్ మాత్రమే చేరుకున్నాయి. అన్ని బస్సుల్లో అమలుచేయాలంటే మరో 186 అవసరం. ఎప్పుడైనా టిమ్ మొరాయిస్తే బాగు చేసే వరకు వినియోగించుకునేలా అదనంగా మరికొన్ని అవసరం. ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులతో టికెట్ల జారీ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న సంస్థ వరంగల్ రీజియన్కు చేరుకున్న 750 ఇ–టిమ్స్ టికెట్ జారీపై మరింత స్పష్టత ప్రతి స్టేజీ వారీగా వివరాలు తెలుసుకునే సౌకర్యం ప్రతీది ఆన్లైనే.. -
‘పది’ పరీక్షలు షురూ
ములుగులోని పరీక్ష కేంద్రానికి చేరుకుంటున్న విద్యార్థులు ములుగు: పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 3,135 మందికిగాను 3,135 మంది హాజరయ్యారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ను పకడ్బందీగా అమలు చేశారు. జిరాక్స్ సెంటర్లు తెరుచుకోకుండా చర్యలు తీసుకున్నారు. సెంటర్ తనిఖీ జిల్లా కేంద్రంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ దివాకర టీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, భద్రత, పరీక్షల నిర్వహణపై ఆరా తీశారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట సీఎస్ వజ్జ తిరుపతి. డిపార్ట్మెంట్ ఆఫీసర్ యాద నాగఝాన్సీ ఉన్నారు. చూచిరాత.. చిట్టీల అందజేత!వెంకటాపురం(ఎం): మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం మాస్ కాపీయింగ్కు కేంద్రంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. తొలిరోజు పరీక్షకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సెంటర్ల వద్ద మకాం వేసి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు యువత ద్వారా చిట్టీలు చేరవేస్తుండడంతో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు యువతను అడ్డుకొని వారి సెల్ఫోన్లు, ఆధార్కార్డు, పాన్కార్డులు తీసుకొని హెచ్చరించారు. అబ్జెక్టివ్ పేపర్ సమాధానాలు కూడా ఇన్విజిలేటర్లు తరగతి గదులు తిరుగుతూ చెప్పారని, అవన్నీ తప్పులే ఉన్నట్లు విద్యార్థులు ‘సాక్షి’కి వివరించారు. జిల్లాలో వంద శాతం హాజరైన విద్యార్థులు మూసివేసిన జిరాక్స్ సెంటర్లు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు -
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
ములుగు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం పక్కాగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ దివాకర అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు శిక్షణ, అవగాహన నిర్వహించారు. ఇందులో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 92,113 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యంగా 145 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధాన్యం కొన్న కేంద్రంలోనే రైతులకు ట్రక్ షీట్ అందించాలన్నారు. ప్యాడీ క్లీనర్తో పట్టిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం తేమను 17 శాతం కంటే తక్కువ ఉండేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి కృషి చేయాలిసమాజానికి సవాలుగా మారిన మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధకానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. కలెక్టరేట్లో మాదకద్రవ్యాల నిరోధక జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సమన్వయంగా పని చేయాలన్నారు. మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు తెలిస్తే 1908 టోల్ఫ్రీ నంబర్లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, డీసీఆర్బీ డీఎస్పీ కిషోర్కుమార్, నార్కోటిక్ అసిస్టెంట్ కమిషనర్ సైదులు, జిల్లా ఎకై ్సజ్, ప్రొబేషన్ అధికారి శ్రీనివాస్, డీఏఓ సురేశ్కుమార్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, వాణిజ్య పన్నుల అధికారి దుగ్నేశ్వర్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్రెడ్డి, జిల్లా ఇంటర్ విద్యాధికారి చంద్రకళ, విద్యాశాఖ కో–ఆర్డినేటర్ సాంబయ్య, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ పోచం పాల్గొన్నారు. కలెక్టర్ దివాకర కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ -
మౌలిక వసతుల కల్పనకు కృషి
ములుగు రూరల్: జిల్లాలోని సమ్మక్క–సారక్క గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని యూనివర్సిటీ వీసీ వైఎల్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన వర్సిటీలో ప్రస్తుతం రెండు కోర్సులు బీఏ ఎకనామిక్స్, బీఏ లిటరేచర్ ఉన్నాయని వచ్చే అకడమిక్ ఇయర్లో ఎంబీఏ, బయో టెక్నాలజీ, బీబీఏ కోర్సులు ప్రారంభించేలా కృషి చేస్తానన్నారు. విద్యార్థుల కోసం హాస్టల్ సౌకర్యం, క్లాస్ రూంల ఏర్పాటు, ములుగు ఏజెన్సీ ప్రాంతంలోని వర్సిటీకి నైపుణ్యం కలిగిన ప్రొఫెసర్ను తీసుకొస్తామన్నారు. త్వరలో ట్రైబల్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గిరిజన వర్సిటీ ప్రహరీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.25 కోట్లు కేటాయించిందని, వర్సిటీపై టోఫో గ్రాఫికల్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగిస్తామన్నారు. విద్యార్థులను ఆకర్షించేందుకు అంతర్జాతీయ స్థాయిలో హాస్టల్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయనున్నట్లు, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు త్వరలోనే బిల్డింగ్ నిర్మాణం కోసం ప్రత్యేక ప్రణాళికలను తయారు చేస్తామన్నారు.గిరిజన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ శ్రీనివాస్ -
పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి
ములుగు రూరల్: ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలని అదనపు కలెక్టర్ సంపత్రావు అన్నారు. ఈమేరకు శుక్రవారం మండలంలోని జగ్గన్నపేటలో పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క, కలెక్టర్ టీఎస్ దివాకర ఆదేశాల మేరకు గ్రామ సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, స్పెషల్ ఆఫీసర్ రహీం, పంచాయతీ కార్యదర్శి స్వాతి, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పరిహారం చెల్లించాలని రాస్తారోకో
వెంకటాపురం(కె): ఆత్మహత్య చేసుకున్న మొక్క జొన్న రైతు మధుకృష్ణ కుటుంబానికి పరిహారం చెల్లించాలని శుక్రవారం చిరుతపల్లి గ్రామస్తులు, గిరిజన సంఘాలు, సీపీఎం ఆధ్వర్యంలో మండలంలోని చిరుతపల్లి గ్రామ సమీపంలోని ఆర్ఆండ్బీ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ.. బాధిత రైతు కుటుంబానికి పరిహారం ఇచ్చి కుటంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాసిరకం విత్తనాలి చ్చిన ఆర్గనైజర్లపై కేసులు పెట్టి చర్యలు తీసుకో వాలన్నారు. పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లి పరిహారం చెల్లించేలా చర్యలు చే పడతామని తెలిపారు. కార్యక్రమంలో గ్యానం వా సు, చిట్టెం ఆదినారాయణ, నర్సింహామూర్తి, పూ నెం సాయి, కుమ్మరి శ్రీను, ఉయిక శంకర్ ఉన్నారు. -
బారులు.. బాధలు!
తల్లుల దర్శనానికి భక్తుల తంటాలుఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనానికి క్యూలైన్లో వేచి ఉండే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. తల్లుల దర్శనానికి ఎండా, వానా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒక్క జాతర సమయంలో క్యూలైన్లపై తాత్కాలికంగా తడకలు ఏర్పాటు చేస్తారు. ఆతర్వాత వాటిని తొలగిస్తారు. దీంతో భక్తులు ఏడాది పొడవునా ఎండకు ఎండుతూ.. వానకు నానుతూ అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మేడారంలోని క్యూలైన్లపై జీఐ షీట్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు క్యూలైన్లలో వచ్చే భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లపై శాశ్వతంగా జీఐ షీట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మినీ జాతరకు ముందు రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈపనుల టెండర్లు కూడా పూర్తయ్యాయి. మినీ మేడారం జాతర ముగిసినప్పటికీ పనులు కార్యరూపం దాల్చలేదు.హడావుడి పనులేనా? 2026 ఫిబ్రవరిలో జరిగే మేడారం మహాజాతరకు ఈసారి ముందుగానే పనులన్నీ పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి సీతక్క దృష్టి సారించారు. ఇప్పటికే మేడారంలో రూ.12 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు పూర్తయాయి. క్యూలైన్లపై జీఐ షీట్ల పనుల్ని కూడా మహా జాతరకు ముందుగానే పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులు కేటాయించింది. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడంతో తీరా జాతర సమయం సమీపించాక హడావిడిగా పనులేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిధులు మంజూరై టెండర్లు పూర్తయి పనులు మాత్రం ప్రారంభించకపోవడంతో అధికారుల పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదలు కాని పనులు..డిజైన్ రాగానే పనులు మొదలుపనులు త్వరగా చేపట్టాలి.. -
ఆర్థికాభివృద్ధి వైపు అడుగులు పడట్లే!
జీడీడీపీలో వెనుకబడిన ఓరుగల్లు.. అట్టడుగున ఆరు జిల్లాలు.. ● తలసరి ఆదాయంలో పుంజుకున్న భూపాలపల్లి ● 15 నుంచి 12 స్థానానికి పెరిగిన వైనం.. గతంతో పోలిస్తే పరవాలేదు ● అడవుల విస్తీర్ణంలో ములుగు ఫస్ట్.. మూడో స్థానంలో భూపాలపల్లి ● తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ – 2025లో వెల్లడిజిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలు ఈసారి కూడా వెనుకబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో విడుదల చేసిన తెలంగాణ సామాజిక–ఆర్థిక దృక్పథ నివేదిక – 2025 గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిలాలు 32, 33వ స్థానంతో అట్టడుగున నిలిచాయి. ఈ జిల్లాల వృద్ధి రేటు రాష్ట్ర వ్యాప్తంగా వెనకబడి ఉంది. 2022–23 సంవత్సరాలకు ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటికీ రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే చాలా వెనుకబడ్డాయి. ఉమ్మడి జిల్లా పరిస్థితులపై రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ విడుదల చేసిన ‘‘తెలంగాణ సామాజిక–ఆర్థిక దృక్పథ నివేదిక – 2025’’ గణాంకాల ఆధారంగా ప్రత్యేక కథనం IIలోu – సాక్షి ప్రతినిధి, వరంగల్ -
రాజకీయ పార్టీల సహకారం అవసరం
ములుగు: ఓటరు జాబితా రూపకల్పన, నవీకరణకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్జీ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఓటరు జాబితాలో పేర్లు ఉండేలా చూసుకోవాలన్నారు. గతేడాది నవంబర్ నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నూతన ఓటరుగా నమోదు చేసుకున్న 1172మంది విచారణ పూర్తి చేశామన్నారు. మరో 52 పెండిగ్లో ఉన్నాయని వివరించారు. ఫారం–7 ద్వారా 290 దరఖాస్తులకు గానూ 94 విచారణ పూర్తి చేసినట్లు తెలిపారు. కరెక్షన్ కోసం 1,257 దరఖాస్తులు రాగా అందులో 916 విచారణ పూర్తి చేశామన్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు బూతుస్థాయి ఏజెంట్లను నియమించి జాబితాను అందించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, తహసీల్దార్ విజయభాస్కర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సలీం తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ మహేందర్జీ -
మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత
ఎస్ఎస్తాడ్వాయి: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూత అందిస్తుందని డీపీఎం గోవింద్చౌహన్ అన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం క్లాత్ను మహిళా సంఘాల్లోని మహిళలకు ఇన్చార్జ్ ఎంఈఓ రేగ కేశవరావుతో కలిసి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మహిళలను ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి మహిళలతో యునిఫాంలు కుట్టిస్తుందని వివరించారు. పాఠశాలల పునర్ ప్రారంభానికి ముందుగానే యూనిఫాంలు పాఠశాలల్లోని విద్యార్థులకు అందించాలన్నారు. కార్య క్రమంలో ఏపీఓ శ్రీనివాస్రావు, మండల సమాఖ్య అధ్యక్షురాలు మానస, వీఓ సంఘం అధ్యక్షురాలు కొట్టెం మల్లికాంబ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
ములుగు: పదోతరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 10మండలాల్లో 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 30,134 మంది రెగ్యూలర్, ఇద్దరు ప్రైవేట్గా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నేటి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు కొనసాగనున్నాయి. విద్యాశాఖ, పోలీస్, వైద్య, విద్యుత్, ఆర్టీసీ శాఖలు సమన్వయంగా పనిచేయనున్నాయి. ఈ మేరకు గురువారం డీఎస్పీ నలువాల రవీందర్ ఆయా సెంటర్లను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. నిఘా నీడలో పరీక్ష పత్రాల ఓపెన్ అన్ని పరీక్ష కేంద్రాల్లోని చీఫ్ సూపరింటెండెంట్ రూంలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్లకు చేరుకున్న ప్రశ్నపత్రాలను పోలీసుల బందోబస్తు నడుమ పరీక్ష కేంద్రాలకు తరలిస్తారు, సీసీ కెమెరాల ముందు ఓపెన్ చేసి పరీక్ష ముగిసిన తర్వాత అక్కడే ప్యాకింగ్ చేసి పోస్టాఫీస్కు తరలిస్తారు. కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. పరీక్షల నిర్వహణకు జిల్లాను రెండు రూట్లుగా విభజించారు. మండలాలు 10 పరీక్ష కేంద్రాలు 21 మొత్తం విద్యార్థులు 3136 చీఫ్ సూపరింటెండెంట్లు 21 ఇన్విజిలేటర్లు 170 ఫ్లయింగ్ స్క్వాడ్లు 2 సిట్టింగ్ స్క్వాడ్లు 9 నేటి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహణ హాజరుకానున్న 3,136 మంది విద్యార్థులు -
వసతుల కల్పనపై ఆదేశాలు రాలేదు..
ఎన్ఆర్ఈజీఎస్ పని ప్రదేశాల్లో టెంట్లు, నీటి సౌకర్యం వంటి మౌలిక వసతులు కల్పించేలా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. కాకపోతే పని జరిగే ప్రదేశంలో గ్రామ పంచాయతీల తరఫున సౌకర్యాలు కల్పించాలని సూచించాం. కొన్ని చోట్ల టెంట్లకు బదులు గ్రీన్ షెడ్లు వేస్తున్నారు. కూలీలు ఉదయం 6నుంచి 11గంటల వరకు పనులు పూర్తి చేసుకొని ఇంటికి చేరుకునేలా ముందుగానే మార్కింగ్ చేయిస్తున్నాం. వ్యవసాయ కాల్వల పూడికతీత పనులు చేపడుతాం. తవ్విన మట్టిన పొలాలకు తరలించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం చేచిచూస్తున్నాం. మొత్తానికి కొలతల ప్రకారం పనిచేసే కూలీలకు పూర్తిస్థాయి కూలి గిట్టుబాటు అవుతుంది. – సంపత్రావు, డీఆర్డీఓ 15 రోజులు పనులు చేసిన ఏటూరునాగారం మండలంలోని క్రాస్ రోడ్డు నుంచి ఎర్రకుంట చెరువుకు వెళ్లి 15 రోజు లుగా ఉపాధిహామీ పనులు చేశాం. పని ప్రదేశంలో ఎలాంటి వసతులు లేవు. నీళ్లు కూడా లే వు. చేసిన 15 రోజుల డబ్బులు కూడా రాలేదు. మండుటెండల్లో కాయకష్టం చేసినప్పుడు అధికారులు స్పందించి నీడ కోసం టెంట్లు వేయాలి. కూలీలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి – వట్టం శాంత, ఏటూరునాగారం -
ఆన్లైన్ బెట్టింగ్ పెడితే చర్యలు
ములుగు: అక్రమ బెట్టింగ్ యాప్లలో బెట్టింగ్ పెట్టినా.. ఆన్లైన్ గేమింగ్ ఆడినా, ప్రోత్సహించినా చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్పీ డాక్టర్ శబరీశ్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. యువత, విద్యార్థులు గేమింగ్లకు పాల్పడి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బులు కోల్పోయి అప్పుల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. సోషల్ మీడియా వీటిని ప్రోత్సహించడం వల్ల యువత ఆసక్తి చూపుతున్నారని వివరించారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమ్ల కట్టడికి జిల్లా పోలీసు శాఖ తరఫున ఆధునిక సాంకేతికను వినియోగించి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని వివరించారు. సోషల్మీడియా వేదికగా ఎవరైనా అక్రమ బెట్టింగ్ యాప్లపై ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదని సూచించారు. ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే 100కి డయల్ చేసి సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు. రేంజ్ అధికారిపై ఇంటెలిజెన్స్ ఆరా? ఏటూరునాగారం: తునికాకు బోనస్ కూలీల డబ్బులను కాజేసిన అటవీశాఖ రేంజ్ అధికారిపై ఇంటెలిజెన్స్ పోలీసులు కూపీ లాగుతున్నారు. ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలపై అధికారులు స్పందించి చర్యలను ముమ్మరం చేశారు. ఎవరెవరి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేసి మళ్లీ డ్రా చేయించారని విచారణను చేపట్టినట్లు తెలుస్తోంది. 2023లో జరిగిన అవినీతి అక్రమాల్లో ఎవరు ఎంత డబ్బు కాజేశారని, ఆ బ్యాంకు ఖాతాలు, కూలీల పేర్ల డేటాను సేకరిస్తున్నారు. అటవీశాఖ ఉన్నతాధికారులు సైతం సదరు రేంజ్ అధికారిపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ములుగు మత్స్యకారులకు శిక్షణ ప్రారంభంకూసుమంచి: ములుగు జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ తెగల మత్స్యకారుల(రెండో బ్యాచ్)కు మూడు రోజుల పాటు ఇచ్చే శిక్షణ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరులో శ్రీ పీ.వీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చేపల పెంపకంలో పద్ధతులు, పిల్లల సంరక్షణ తదితర అంశాలపై ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ అవగాహన కల్పించారు. అనంతరం వారిని ఫిషరీస్ కేంద్రాలకు తీసుకెళ్లి వివిధ రకాల చేపలు, రొయ్యల పెంపకం, వ్యాధుల నివారణ, దాణా తయారీ విధానాన్ని వివరించారు. ఇంటింటికీ తలంబ్రాలు ఏటూరునాగారం: ఆర్టీసీ వరంగల్ –2డిపో లాజిస్టిక్ ద్వారా భక్తుల ఇంటింటికీ భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు బుకింగ్ చేసుకొనే అవకాశం కల్పించినట్లు వరంగల్ 2 డిపో మేనేజర్ వి.జోత్స్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు తలంబ్రాల కోసం ఏటూరునాగారం బస్టాండ్ కంట్రోలర్ చల్లా శ్రీనివాసు సెల్ నంబర్ 9441991706లో సంప్రదించి బుక్ చెసుకొని రశీదు తీసుకోవాలని సూచించారు. సీతారాముల కల్యాణం అనంతరం ఇంటి వద్దకు కార్గో ఏజెంట్ ద్వారా తలంబ్రాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఉత్తమ ఎస్సైగా తాజుద్దీన్ ఏటూరునాగారం: ఉత్తమ పోలీస్గా ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్ ఎంపికయ్యాడు. ఈ మేరకు తాజుద్దీన్కు రివార్డును ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఏటూరునాగారం ఏఎస్పీ కార్యాలయంలో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శివం ఉపాధ్యాయ మాట్లాడుతూ నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులు, నేరాలను చాకచక్యంగా పరిష్కరించిన పోలీసులను గుర్తించి నగదు బహుమతి రివార్డులు అందజేయనున్నట్లు వివరించారు. ఉత్తమ పోలీస్గా అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఎస్సై సేవలను కొనియాడారు. అనంతరం సీఐ శ్రీనివాస్ ఎస్సైకి అభినందనలు తెలిపారు. -
ఏర్పాట్లు పూర్తి..
పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించాం. ఈ విద్యా సంవత్సరం నుంచి 24పేజీల ఆన్సర్ బుక్లెట్ అందిచనున్నాం. ప్రశ్నపత్రంపై క్యూర్ కోడ్ ఉంటుంది. ఫ్రీఫైనల్ పరీక్షల్లో రెండు పేపర్లకు ఓఎంఆర్ షీట్లు అందించి విద్యార్థులకు అవగాహన కల్పించాం. అన్ని శాఖల అధికారులతో సమన్వయంగా ఉంటూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూస్తాం. విద్యార్థులు ఒక గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. – పాణిని, డీఈఓ -
విద్యుత్ అధికారుల ‘పొలంబాట’
గోవిందరావుపేట: విద్యుత్ అధికారులు గురువారం పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. మండల పరిధిలోని రంగాపూర్ ఎస్ఎస్–4కేవీఏ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో విద్యుత్శాఖ డీఈ టెక్నికల్ వెంకటేశ్వర్లతో పాటు విద్యుత్ అధికారులు పర్యటించారు. విద్యుత్ సరఫరా గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యవసాయ పంపుసెట్లను వినియోగించినప్పుడు విద్యుత్ మోటార్ల వాల్వులు సర్వీస్ ఇన్సులేషన్ సరిగా లేకపోవటంతో విద్యుత్ ప్రసారమై ఏమరుపాటులో వాటిని తాకితే ప్రమాదాల బారిన పడుతారని తెలిపారు. రైతులు డీఎస్ఎం పద్ధతులను పాటించి నాణ్యమైన విద్యుత్ సరఫరా పొందాలన్నారు. ఐఎస్ఐ మార్కుగల మోనో బ్లాక్ పంపు సెట్లను, సబ్ మెర్సిబుల్ పంపు సెట్లను వాడాలని, తగిన కెపాసిటర్లను బిగించుకోవాలి కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈ దేవ్సింగ్, ఇన్స్పెక్టర్ సమ్మిరెడ్డి, లైన్మెన్ ఎం.వేణు, రంజిత్, నవీన్, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
‘సికిల్సెల్’పై అవగాహన కల్పించాలి
ములుగు: సికిల్సెల్ రక్తహీనత పట్ల గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టి ప్రజలను చైతన్యవంతులను చేయాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు సూచించారు. ఈ మేరకు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ఆర్ఆండ్బీ అతిథిగృహంలో గురువారం ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల వైద్యులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లకు సికిల్సెల్ ఎనిమియాపై శిక్షణ ఇచ్చి మాట్లాడారు. 2047 నాటికి సికిల్సెల్ నిర్మూలించడానికి ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. అనువంశికంగా సంక్రమింపజేసే వ్యక్తుల వివాహాల కారణంగా సికిల్సెల్ వ్యాధికి గురికాకుండా నియంత్రణ పద్ధతులు పాటిస్తే అరికట్టవచ్చని సూచించారు. రాష్ట్రస్థాయి ట్రైనర్లు గణేశ్, శ్రవణ్, పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను వెల్లడించారు. ఎక్కువ నీటిని తీసుకుంటూ పోషకాహారం తీసుకోవడంతో పాటు ఫోలిక్యాసిడ్ ట్యాబ్లెట్లు తీసుకోవాలన్నారు. తీవ్రమైన వేడి, చలి ప్రాంతాలకు వెళ్లకూడదని తదితర సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు చంద్రకాంత్, పవన్కుమార్, రణధీర్, జయశంకర్ భూపాలపల్లి జనరల్ మెడిసిన్ నిపుణుడు పవన్కుమార్, డాక్టర్ సురేందర్, డీడీఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
రామప్పలో పోలాండ్ దేశస్తుల సందడి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని పోలాండ్ దేశానికి చెందిన ఏసియా, స్టేవిన్లు బుధవారం సందర్శించి సందడి చేశారు. రామలింగేశ్వర స్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ అంటూ కొనియాడారు. పాయబాటలు సమీపంలో మంటలు వాజేడు : మండల పరిధిలోని పాయబాటలు గ్రామ సమీపంలో రైస్ మిల్లు వద్ద బుధవారం మంటలు ఎగిసిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్ సమీపంలో మంటలు రావడంతో గుర్తించిన స్థానికులు విద్యుత్శాఖకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విద్యుత్ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లలో నీటిని తెచ్చి చల్లి మంటలను అదుపు చేశారు. హరిబాబును సస్పెండ్ చేయరా.? భూపాలపల్లి అర్బన్: నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసులో బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబు పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని రాజలింగమూర్తి భార్య సరళ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సరళ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ హత్య రాజకీయాలు చేయడం లేదని చెప్పిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త హరిబాబు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిలతోపాటు కేటీఆర్, హరీశ్రావుల పాత్ర ఉన్నట్లు దాడి జరిగిన రోజునే పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేస్తే డీఎస్పీ, సీఐలు ఫిర్యాదును రద్దు చేసి వారికి అనుకూలంగా ఫిర్యాదు రాసుకొని సంతకాలు చేయించుకున్నట్లు తెలిపారు. మేడిగడ్డ, బీఆర్ఎస్ నాయకుల అక్రమాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై పోరాటాలు నిర్వహించినందుకే హత్య చేశారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ కౌన్సిలర్గా ఉన్న తనను అకారణంగా సస్పెండ్ చేశారని, హత్య చేసిన హరిబాబును ఎందుకు ఇప్పటికీ సస్పెండ్ చేయలేదన్నారు. తప్పు చేయని హరిబాబు ఎందుకు తప్పించుకు తిరిగాడన్నారు. తనకు ప్రాణ భయం ఉందని, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఇంటి చుట్టూ కొత్త వ్యక్తులు తిరుగుతున్నారన్నారు. సీఎం రేవంత్రెడ్డి స్పందించి సీబీసీఐడీతో విచారణ జరిపించాలని కోరారు. హరిబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు? భూపాలపల్లి: సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టి వేసింది. భూపాలపల్లి పట్టణానికి చెందిన రాజలింగమూర్తి గత నెల 19న హత్యకు గురి కాగా హరిబాబు ఏ8 నిందితుడిగా ఉన్నాడు. ఈ నెల 4న ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. వాదనలు జరుగుతున్న సమయంలోనే మంగళవారం అతడిని భూపాలపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి, జడ్జి ఆదేశాల మేరకు ఖమ్మం జైలుకు తరలించారు. బుధవారం హైకోర్టులో వాదనలు జరుగగా హరిబాబు బెయిల్ పిటిషన్ను కొట్టివేసినట్లు సమాచారం. -
అందరినోటా ఆరు గ్యారంటీలు..
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారంటీ పథకాలకు ఈ బడ్జెట్లోనూ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో 8,77,173 మంది రైతులకు రైతుభరోసా పథకం ఈ ఏడాది కూడా అమలు కానుంది. ఒక కార్పొరేషన్, 9 మున్సిపాలిటీలు, 1,708 గ్రామపంచాయతీలుండగా మహాలక్ష్మి పథకం కింద సుమారు ప్రతి మహిళకు రూ.2.500 చొప్పున సుమారు 7.21 లక్షల మందికి అందే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు ఉచితంగా రాకపోకలు సాగించేందుకు ఢోకా లేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లపై రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంలో 6,10,220 మంది లబ్ధిదారులకు కొనసాగనుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే 2.50 లక్షల మందిని రెవెన్యూ అధికారులు అర్హులుగా గుర్తించగా, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడిన 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం కలగనుంది. -
క్షయ వ్యాధిపై అవగాహన ఉండాలి
ములుగు: ప్రజలు క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గోపాల్రావు అన్నారు. కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశానుసారం, టీబీ అలర్ట్ ఇండియా, సాహితీ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ములుగులోని రాయల్ ప్లాజా యందు జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్ రావు హాజరై మాట్లాడారు. జిల్లాలో క్షయవ్యాధిని గుర్తించి చికిత్సతో అంతం చేయాలన్నారు.అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులకు మొదట క్షయ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి, నిర్ధారణ, చికిత్సపై అవగాహన కల్పించాలన్నారు. అప్పుడే టీబీపై ప్రజలు చైతన్యవంతులుగా మారి తెమడ పరీక్షలకు వస్తారని తెలిపారు. దీంతో వ్యాధి నిర్మూలనకు చికిత్స సులువు అవుతుందని వెల్లడించారు. జిల్లాకు పోర్టబుల్ క్షయవ్యాధి నిర్ధారణ పరికరాన్ని త్వరగా అందించాలని జిల్లా టీబీ నియంత్రణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్రకాంత్ కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు పవన్ కుమార్, రణధీర్, శ్రీకాంత్, ప్రియాంక, శ్రవణ్, అనిల్, దుర్గారావు, టీబీ అలర్ట్ ఇండియా జిల్లా కో ఆర్డీనేటర్ రాజు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్ రావు -
తునికాకు బోనస్లో చేతివాటం
ఏటూరునాగారం: అవినీతి పేరు చెబితే అటవీశాఖలో పనిచేసే ఓ రేంజ్ అధికారి పేరు టక్కున చెబుతారు. 2023లో జరిగిన తునికాకు బోనస్ కూలీల డబ్బుల పంపిణీలో చోటుచేసుకున్న అవకతవకల్లో ఆయన కీలక పాత్ర పోషించి చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏటూరునాగారం రేంజ్ అటవీశాఖలో పనిచేసే పలువురి సిబ్బంది పేర్లపై 2023 ఆగస్టులో తునికాకు బోనస్ కూలీల డబ్బులను వారి వ్యక్తిగత ఖాతాల్లో వేయించాడు. అనంతరం వారితో తప్పుజారి మీ ఖాతాల్లోకి డబ్బులు వచ్చాయని.. వాటిని మళ్లీ ఆఫీస్కు కట్టాలని చెప్పి వారి నుంచి రూ.2.50లక్షల నగదు తీసుకున్నాడు. ఈ మోసం గురించి తెలియని సిబ్బంది నిజమే అనుకుని ఆ అధికారికి తిరిగి డబ్బులు ఇచ్చేశారు. మరి కొంతమంది పరిస్థితి ఇలా.. అటవీశాఖలో పనిచేసే ఓ కంప్యూటర్ ఆపరేటర్ కుటుంబ సభ్యులతో పాటు ఇద్దరు ఏఎన్ఎంల ఖాతాల్లో ఒక్కో లక్ష రూపాయలను జమ చేయించాడు. అలాగే మరో వ్యక్తి ఖాతాలో రూ.70వేలు, రామన్నగూడెంకు చెందిన ఓ వ్యక్తి ఖాతాలో రూ.2లక్షలు ఇలా చెప్పుకుంటూ పోతే సుమారుగా రూ.28లక్షల వరకు పేదల తునికాకు బోనస్ డబ్బులు కాజేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై జిల్లా అటవీశాఖ అధికారులు సైతం మిన్నకుండిపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ అటవీశాఖ రేంజ్ అధికారి అవినీతి అక్రమాలు శాఖలోని ఉన్నతాధికారులకు తెలియడం లేదా.. తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారా అనేది ప్రశ్నగా మారింది. ఇదేకాకుండా స్థానిక పోలీస్స్టేషన్లో ఏడుగురిపై కేసు నమోదైన విషయం విధితమే. కానీ అసలు సృష్టికర్తపై ఎందుకు చర్యలు ఎందుకు చేపట్టడం లేదనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అమాయకులైన సిబ్బందిపై పెట్టిన కేసులను పోలీసులు వెంటనే ఎత్తివేయాలని నేడు(గురువారం) మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కూలీల డబ్బులను కాజేసిన ఓ అటవీశాఖ రేంజ్ అధికారి సిబ్బందితో పాటు పలువురి ఖాతాల్లో వేయించి కాజేసిన వైనం రూ.28లక్షల వరకు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు -
ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి
ములుగు రూరల్: ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని సీఐటియూ జిల్లా అధ్యక్షుడు ఎండి దావూద్, ఆశ వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్లు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో ఆశ వర్కర్లకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కలెక్టర్ టీఎస్.దివాకరకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.18వేలు చెల్లించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఆశ వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతిపత్రాలు అందించినా లాభం లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి గఫూర్, సద్దాం హుస్సేన్, రవి, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు మంజూల, ప్రభావతి, రాధ, కవిత, రజిత, సంధ్య, శ్రావ్య, శోభ, రాజ్యలక్ష్మీ, దేవి, సత్యవతి, నాగమణి, సరూప, తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావూద్, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి కలెక్టరేట్ ఎదుట ధర్నా -
మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
● పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు: మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రంజాన్ వేడుకల్లో భాగంగా బుధవారం లాలాగార్డెన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముస్లిం మతపెద్దలు, కలెక్టర్ దివాకర, ఎస్పీ డాక్టర్ శబరీశ్తో కలిసి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముస్లింలకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైందని, నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు పాటించడం చెప్పుకోదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంపత్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ఆర్డీఓ వెంకటేశ్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్రెడ్డి, డీపీఆర్ఓ రఫీక్, డీపీఓ దేవరాజ్, ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇసుక సొసైటీలకు డీఎల్ఎస్సీ నిర్వహించాలి ఏటూరునాగారం: జిల్లాలో సర్వే పూర్తి చేసుకొని ఉన్న ఇసుక సొసైటీలకు డిస్ట్రిక్ లెవల్ సెలక్షన్ కమిటీ (డీఎల్ఎస్సీ)లను వెంటనే నియమించి సొసైటీలకు అనుమతులు ఇవ్వాలని ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ ఇసుక సొసైటీల ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని వైజంక్షన్ నుంచి ఐటీడీఏ వరకు ఇసుక సొసైటీల సభ్యులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఇసుక సొసైటీల కన్వీనర్ ఈసం రాజు మాట్లాడుతూ గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఇసుక సొసైటీల ద్వారా సాగుతున్న ఇసుక లావాదేవిలకు బిల్లులు చెల్లించకపోతే నిరసన చేస్తామన్నారు. ఇసుక సొసైటీలకు జరుగుతున్న అన్యాయాలపై కలెక్టర్, ఎస్పీ దృష్టి పెట్టాలన్నారు. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాలకు చెందిన గిరిజన సొసైటీల సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. -
విద్యారంగానికి మంచి రోజులు..
ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈసారి రూ.23,108 కోట్లు కేటాయించింది. దీంతో సర్కారు చదువులకు ఇంకా మంచి జరగనుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. 20–25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించ తలపెట్టిన ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి జిల్లాకు రూ.1400 కోట్లతో ఏడింటిని మంజూరు చేసింది. ఈ బడ్జెట్తో ఈసారి ఆ స్కూళ్లు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, వరంగల్లో మొత్తం 3,331 ప్రభుత్వ బడులు ఉండగా, అందులో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీలతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించే అవకాశం ఉంది. -
సంక్షేమం, ఐటీ, అభివృద్ధిపైన ఆశలు..
ఎస్సీ, బీసీ, ఎస్టీ, మహిళా సంక్షేమం కోసం ఈసారి భారీ కేటాయింపులే జరిగాయి. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా కలిగిన జిల్లాలో ఆ వర్గాలకు మేలు జరుగనుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ సంక్షేమం కోసం రూ.40,232, ఎస్టీలకు రూ.17,169 కోట్లు కేటాయించడం పట్ల ఉమ్మడి వరంగల్కు ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. ఐటీ, పరిశ్రమల రంగంపైన దృష్టి సారించిన నేపథ్యంలో రెండో నగరంగా వరంగల్ వృద్ధి చెందుతుందన్న ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉండగా, ఐటీ హబ్, టెక్స్టైల్ పార్కు, మడికొండ పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలపై ఆశలు రేకెత్తుతున్నాయి. ఎకో టూరిజానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు మహర్దశ రానుంది. -
లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులు
ములుగు: నిషేధిత మావోయిస్టు పార్టీలో పోరుపడలేక ఇటీవల స్వచ్ఛందంగా లొంగిపోయిన నేషన్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు ఒడిస్సా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా కలిమెల మండలానికి చెందిన అలువ స్వర్ణ అలియాస్ స్వర్ణక్క, జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకుల గూడెం గ్రామానికి చెందిన పులుసం పద్మ అలియాస్ గంగక్క (దివంగత సెంట్రల్ కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ భార్య)కు బుధవారం ములుగు ఎస్పీ డాక్టర్ శబరీశ్ ప్రభుత్వం తరఫున సరెండర్ కం రిహాబిలిటేషన్లో భాగంగా డీడీలు అందించారు. స్వర్ణక్కకు రూ.4లక్షలు, పుల్సం పద్మకు రూ.5లక్షల రివార్డులను అందించిన ఎస్పీ భవిష్యత్లో పోలీస్ శాఖ తరఫున అండగా ఉంటామని హామీనిచ్చారు. ఇప్పటికై నా వివిధ పార్టీలలో కొనసాగుతున్న వారంతా ప్రభుత్వం ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జనజీవన స్రవంతిలో కలిసి జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరారు. -
ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో ప్రాధాన్యం.. మహిళా పథకాలకు పెద్దపీట
సాక్షి ప్రతినిధి, వరంగల్: అసెంబ్లీలో ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2025–26 రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు దక్కిన ప్రాధాన్యంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. రెండో రాజధానిగా హైదరాబాద్కు పోటీగా అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం.. బడ్జెట్లో ఆ మేరకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ రంగాలకు చేసిన కేటాయింపుల్లోనే ఉమ్మడి వరంగల్కు ప్రయోజనాలు కలుగుతాయన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా మొదటిసారి వరంగల్ నగరంలో పర్యటించిన రేవంత్రెడ్డి.. నగరం అభివృద్ధి కోసం 8 అంశాలు ప్రాధాన్యంగా రూ.6,115 కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇన్నర్, ఔటర్ రింగు రోడ్లు, మామునూరు ఎయిర్పోర్టు తదితర అంశాలు అందులో ఉన్నాయి. వీటికి నేరుగా నిధులు ఇచ్చేలా ప్రతిపాదనలు చేసినట్లు బడ్జెట్లో కనిపించ లేదు. కాగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించిందన్న చర్చ ఉంది. ● విద్య, వైద్య రంగాలకు కేటాయింపులపై భిన్నస్వరాలు ● అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఎయిర్పోర్టు, ‘సూపర్’ ప్రస్తావన లేదు ● కాళేశ్వరానికి రూ.2,685 కోట్లు.. దేవాదులకు రూ.245 కోట్లు ● స్మార్ట్సిటీకి రూ.179 కోట్లు, కేయూసీ, జీడబ్ల్యూఎంసీకి రూ.100 కోట్లు ● రామప్ప, పాకాలకు రూ.ఐదేసి కోట్లు.. ‘కాళోజీ’కి రూ.రెండు కోట్లే ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఊతం ● ఎకో టూరిజం ప్రస్తావన.. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆశలు -
మోడికుంట ప్రాజెక్టు నిర్మించాలని వినతి
వాజేడు: మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామం వద్ద గతంలో మంజూరైన మోడికుంట ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించాలని కోరుతూ మంగళవారం సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్కకి ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అఖిలపక్షం నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో దివంగత వైఎస్.రాజశేఖర రెడ్డి హయాంలో మోడికుంట ప్రాజెక్టు మంజూరైనా ఇంత వరకు నిర్మాణ పనులు మొదలు పెట్టలేదని తెలిపారు. దీంతో రైతులకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని, కొప్పునూరు సమీపంలో ఉన్న గుడ్లవాగు ప్రాజెక్టు మరమ్మతులకు గురైందని దానిని బాగుచేయించాలని సీఎంను, మంత్రులను కోరినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులపై అఖిల పక్షంతో సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని వివరించినట్లు వెల్లడించారు. -
‘దేవాదుల’ గట్టెక్కించేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్/హసన్పర్తి/ధర్మసాగర్: వేసవి ఎండల తీవ్రత.. అడుగంటుతున్న భూగర్భజలాలు.. దీంతో జనగామ, హనుమకొండ జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో అక్కడక్కడ పంటలు ఎండుతున్నాయి. చేతికందే దశలో దేవాదుల ప్రాజెక్టు పరిధిలో వరి పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు కింద 50 నుంచి 60వేల ఎకరాలకు సాగునీరందించేలా దేవాదుల ప్రాజెక్టు మూడవ దశలో భాగంగా దేవన్నపేటలో నిర్మించిన పంపుహౌస్ మోటార్లను జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించేందుకు మంగళవారం సాయంత్రం పంపుహౌస్కు చేరుకున్నారు. కానీ, మోటారు మరమ్మతుకు రావడం, ఆస్ట్రియానుంచి వచ్చిన బృందం చేపట్టిన రిపేర్లు పూర్తి కాకపోవడంతో మంత్రులు రాత్రి ఎన్ఐటీ గెస్టుహౌస్లో ఉన్నారు. అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఫేజ్–3 పనులపైనే దృష్టి... చేతికందే పంటలను కాపాడేందుకు మూడో ఫేజ్ పనులపై అధికారులు దృష్టి సారించారు. దేవన్నపేట పంపుహౌస్లో ప్రస్తుతం ఒక్కో మోటారు 800 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ మూడు మోటార్లు ఏర్పాటు చేయగా.. అందులో ఒక్కటి ఆన్చేసి జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సుమారు 60వేల నుంచి 65వేల ఎకరాల వరకు సాగునీరు అందించడంపై దృష్టి పెట్టారు. మంగళవారం రాత్రి వరకు మోటారు మొరాయించడంతో ఈ యాసంగి పంట చేతికందే వరకు నీటి సరఫరా అవుతుందా? అన్న ఆందోళన ఆ నాలుగు నియోజకవర్గాల్లోని రైతుల్లో వ్యక్తమవుతోంది. హడావుడిగా సాగిన మంత్రుల పర్యటన.. దేవాదుల చివరి ఆయకట్టుకు సాగునీరందిచేందుకు యుద్ధప్రాతిపదికన ఖరారైన మంత్రుల టూర్ హడావుడిగా సాగింది. మొదట మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హసన్పర్తి మండలం దేవన్నపేటకు పంపుహౌస్కు చేరుకున్నారు. అక్కడినుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లో నీరు పంపింగ్ అయ్యేలా మోటార్ ఆన్ చేయాల్సి ఉంది. అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకుని అక్కడ పూజలు చేసి.. మీడియా సమావేశంలో మాట్లాడుతారనేది షెడ్యూల్. కానీ, అనుకున్న ప్రకారం దేవన్నపేటకు మంత్రులు చేరుకున్నప్పటికీ మోటార్ మొరాయించడంతో స్విచాన్ చేయకుండా అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద వేసిన టెంట్లు, కుర్చీల వద్దే ప్రజలు, కార్యకర్తలు ఉండిపోయారు. చివరి నిమిషంలో మీడియా సమావేశం దేవన్నపేటలోనే ఉంటుందనడంతో ధర్మసాగర్ నుంచి దేవన్నపేటకు మీడియాతోపాటు నాయకులు, కార్యకర్తలు, అధికారులు వెళ్లాల్సి వచ్చింది. కాగా దేవన్నపేట పంపుహౌస్, ధర్మసాగర్ రిజర్వాయర్తోపాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల పక్కన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మామిడాల యశస్విని రెడ్డి తదితరుల ఫొటోలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాత్రి వరకు కాని మోటార్ మరమ్మతు చివరి ఆయకట్టు రైతుల్లో ఆందోళన హడావుడిగా సాగిన మంత్రుల పర్యటన ‘ధర్మసాగర్ రిజర్వాయర్’ కార్యక్రమం రద్దు దేవన్నపేట పంపుహౌస్కు హుటాహుటిన అధికారులు అధికారులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం దేవాదుల ప్రాజెక్టు దశలు ఎప్పుడు ప్రారంభమయ్యాయని, ఇతర అంశాలపై మంత్రులు అడిగిన ప్రశ్నలకు నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. దీంతో వారిపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షకు సమాచారం లేకుండా ఉత్త చేతులతో వస్తారా అని మండిపడ్డారు. చిన్న చిన్న సమస్యలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, బల్దియా కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, పీసీసీ మాజీ కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు సురేందర్రెడ్డితోపాటు దేవాదుల ఉన్నతాఽధికారులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్పై అవగాహన తప్పనిసరి
ఏటూరునాగారం: ఎయిడ్స్ వ్యాధిపై యువత తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంతో మెదగాలని ఐసీడీఎస్ సీడీపీఓ ప్రేమలత సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో నెహ్రూ యువకేంద్ర వరంగల్ సౌజన్యంతో కస్తూరిబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని ఏటూరునాగారం డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో యువతకు లైంగిక వ్యాధులపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆధునిక సమాజంలో యువత చెడుకు దూరంగా ఉంటూ సన్మార్గంలో నడవాలన్నారు. ప్రేమ, వ్యామోహం మాటున యువత చెడు దారిలో పయనించకూడదన్నారు. జీవితంలో స్థిరపడిన తర్వాతనే వివాహం చేసుకొని జీవిత భాగస్వామితో మాత్రమే ఆనందంగా జీవించాలని కోరారు. లేకుంటే అపరిచితులతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎయిడ్స్ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నెహ్రు యువ కేంద్ర వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం యువత పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రేణుక, రిసోర్స్ పర్సన్ జ్యోతి, అధ్యాపకులు వెంకటయ్య, స్పోర్ట్స్ఆఫీసర్ శ్యామలత తదితరులు పాల్గొన్నారు.సీడీపీఓ ప్రేమలత -
మిర్చి రైతు ఆత్మహత్య
వెంకటాపురం(కె): చేతికి వచ్చిన మిర్చి ఏరేందుకు కూలీలు దొరకకపోవడం, కళ్లముందే పంట రాలిపోతుండడంతో ఓ రైతు మనస్తాపానికి గురై మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వెంకటాపురం(కె) మండలం బెస్తగూడెంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెస్తగూడెం గ్రామానికి చెందిన రైతు రామెల్ల సతీష్(39) మూడెకరాల్లో మిర్చి సాగు చేశాడు. మిర్చి ఏరే సమయం రావడంతో కూలీలు దొరకడం లేదు. దీంతో మిర్చి అంతా నేలరాలిపోతున్నది. దీంతో నష్టపోతున్నానని మనస్తాపానికి గురై 15రోజులుగా మద్యం తాగుతూ తిరుగుతున్నాడు. సోమవారం ఉదయం మిర్చి తోట వద్దకు వెళ్లి మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొప్పుల తిరుపతిరావు తెలిపారు. -
విద్యార్థినులకు పౌష్టికాహారాన్ని అందించాలి
ములుగు రూరల్: విద్యార్థినులకు పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. మండల పరిధిలోని జగ్గన్నపేట బాలికల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం చేపట్టిన రాష్ట్రీయ బాలస్వస్థ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల పరిసరాలను, విద్యార్థినులకు అందిస్తున్న ఆహారాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నందున విద్యార్థులు ఎండలో తిరగవద్దన్నారు. వడదెబ్బ తగిలితే ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలని సూచించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండాలన్నారు. విద్యార్థినులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. అనంతరం పత్తిపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్కే టీం సభ్యులు శ్రీలత, మల్లికార్జున్, ఆరోగ్య కార్యకర్తలు ఉపేంద్ర, తిరుతమ్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
‘పది’లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
ఏటూరునాగారం: పదో తరగతి విద్యార్థులు నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కలెక్టర్ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. మండలకేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల చదువు, వసతులను పరిశీలించారు. ప్రతీ ఒక్కరికి విద్యార్థి దశ కీలకమని సూచించారు. విద్యార్థులకు పాఠాలను బోధించారు. కామన్ డైట్ మెనూ ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. అనంతరం రామన్నగూడెంలోని ఓహెచ్ఆర్ ట్యాంకును కలెక్టర్ పరిశీలించారు. తాగునీటి కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముళ్లకట్టలో గ్రామసభ మండల పరిధిలోని ముళ్లకట్టలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు, పనుల గ్రౌండింగ్ కోసం గ్రామసభను కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పనులు చేపట్టే విధానంపై పలు సూచనలు చేశారు. అలాగే ఐటీఐ కళాశాలకు చేరుకున్న కలెక్టర్ అగ్నిపథ్ కింద భారత సైన్యంలో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావాలని సూచించారు. అలాగే కళాశాల ఆవరణలో కొత్త ట్రేడ్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, నూతన బిల్డింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రాంపతి, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ మోవీన్ కుమార్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రాజ్యలక్ష్మి, కార్యదర్శి రమాదేవి, గ్రామ ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
ములుగు: ములుగు జిల్లా రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మంగళవారం హైదరాబాద్లోని సివిల్ సప్లయీస్ కార్పోరేషన్ భవనంలో కమిషనర్ డీఎస్ చౌహాన్కు మంగళవారం పూలమొక్క అందించి మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూలంకషంగా చర్చించారు. ప్రతీ విషయాన్ని ఓపికగా విన్న కమిషనర్ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ప్రవీణ్ తెలిపారు.ఎస్టీ బాలుర వసతి గృహం తనిఖీ వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహాన్ని మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్ఓ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహంలోని పరిసరాలను పరిశీలించడంతో పాటు బాత్రూంలు, మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు వండుతున్న వంటలను పరిశీలించి ఆర్వో వాటర్ ప్లాంట్ను తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వార్డెన్ను ఆదేశించారు. అటవీ అధికారులకు దొరికిన కొండ గొర్రెపిల్ల గోవిందరావుపేట: మండల పరిధిలోని బుస్సాపూర్ అటవీ ప్రాంతంలోని రేగుల కుంటలో అటవీ అధికారులకు కొండ గొర్రెపిల్ల లభ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. బుస్సాపూర్ అటవీ ప్రాంతానికి ఫారెస్ట్ అధికారులు ఫీల్డ్పై రేగులకుంట వద్దకి చేరుకోగానే కాలుకి గాయమై కొండగొర్రె పిల్ల కనిపించింది. దాన్ని గమనించిన అటవీశాఖ అధికారులు తీసుకొచ్చి కాలుకి చికిత్స చేయించి పస్రా ఎఫ్ఆర్ఓ మాధవీశీతల్కు సమాచారం ఇచ్చారు. ఆమె ఆదేశాల మేరకు వరంగల్లోని జూపార్క్కు క్షేమంగా తరలించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి వేణుగోపాల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు టి.దీప్లాల్, బి.అర్జున్ పాల్గొన్నారు.రామప్పలో అమెరికా దేశస్తులు వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని మంగళవారం అమెరికాకు చెందిన షేమ్, ని సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప అందాలు బాగున్నాయని కొనియాడారు. సరిగమలు పలికే పొన్నచెట్టు శిల్పాన్ని మీటుతూ ముగ్ధులయ్యారు. రామప్ప శిల్పాలను తమ సెల్ఫోన్లో బంధించుకున్నారు. అనంతరం సరస్సు కట్టకు చేరుకొని సరస్సులో బోటింగ్ చేస్తూ అందాలను తిలకించారు. -
తాగునీరు.. విద్యుత్ ఇవ్వండి
ఏటూరునాగారం: తాగడానికి నీళ్లు, విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ వాజేడు మండల పరిధిలోని పూసూరు గ్రామ సమీపంలోని రెవెన్యూ భూమిలో గుడిసెలు వేసుకున్న గుడిసెవాసులు సోమవారం వాజేడు నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు పాదయాత్రగా ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ఎదుట సీపీఎం నాయకులు, గిరిజనులు కలిసి ధర్నాకు దిగారు. ఈ పాదయాత్రకు మద్దతుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య హాజరై మాట్లాడారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదలకు తాగునీరు, విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. అనంతరం సీపీఎం వాజేడు మండల కార్యదర్శి కొప్పుల రఘుపతిరావు మాట్లాడుతూ ఆదివాసులు, పేదలు తాగునీటి కోసం 20 కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి ఉందంటే సిగ్గుపడాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజల కష్టాలు, సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు అందజేశారు. కార్యక్రమంలో దావూద్, చిట్టిబాబు, దామోదర్, చిరంజీవి, రాజేష్, దేవయ్య, కృష్ణబాబు, చంద్రశేఖర్, సంతోష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. పూసూరు గ్రామ సమీపంలోని గుడిసెవాసుల వేడుకోలు వాజేడు నుంచి ఐటీడీఏ వరకు ఖాళీ బిందెలతో ర్యాలీ, ధర్నా -
ఏఐతో విద్యాబోధన సులభతరం
గోవిందరావుపేట: ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) కృత్రిమ మేధాను వినియోగిస్తూ విద్యార్థులకు సులభతరంగా విద్యాబోధన అందిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. మండల పరిధిలోని చల్వాయి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. గణితంలో సంఖ్య భావనలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలతో పాటు తెలుగులో విద్యార్థులు చేస్తున్న ప్రమాణాలను కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధనను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లా వ్యాప్తంగా 5ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ సహకారంతో వర్చువల్ రియాల్టీ విధానంలో పాఠాలు చెప్పేలా తరగతులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3నుంచి 5వ తరగతి విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అభ్యసన సామర్థ్యాలను పెంచే విధంగా ఏఐ ద్వారా బోధిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పదో తగరతి విద్యార్థుల స్టడీ అవర్స్ను పరిశీలించిన కలెక్టర్ వారితో మాట్లాడారు. వందశాతం ఉత్తమ ఫలితాలు సాధించాలని పలు సూచించారు. పాఠశాలలో వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెడ్పీహెచ్ఎస్, కేజీబీవీ విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ పాణిని, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జయప్రద, ఎంపీడీఓ జవహర్ రెడ్డి, తహసీల్దార్ సృజన్ కుమార్, ఏఎంఓ మల్లారెడ్డి పాల్గొన్నారు. పోషకాహారం తప్పనిసరి ములుగు: కంటి లోపాలను అధిగమించేందుకు పోషకాహారాలైన ఆకుకూరలు, గుడ్లు, చేపలు, పాలు, పండ్లను తప్పనిసరిగా తగిన మోతాదులో తీసుకోవాలని కలెక్టర్ దివాకర సూచించారు. రాష్ట్రీయ బాలస్వస్త్య కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా దృష్టిలోపం ఉన్న వారికి సోమవారం తన ఛాంబర్లో కంటి అద్దాలు అందించారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్ విద్యార్థుల వివరాలు– 8లోuఏడాదంతా చదివింది ఒక ఎత్తయితే.. దాన్ని పరీక్షల్లో ప్రజెంట్ చేయడం మరో ఎత్తు.. కొందరు విద్యార్థులు బాగా చదువుతారు. తీరా పరీక్ష సమయానికి మరిచిపోతుంటారు.. మరికొందరేమో ఎంత చదివినా హ్యాండ్ రైటింగ్ బాగోలేక మార్కులు కోల్పోతారు.. ఇంకొందరైతే పరీక్ష అంటే గాబరా పడిపోయి ప్రశ్నల కు సమాధానం తెలిసినా నిర్ణీత సమయంలో రాయలేకపోతారు.. ఇలా చాలా మంది విద్యార్థులు ఏదో ఒక సమస్యతో బాధపడేవారే. వీరంతా మంచి మార్కులు సాధించేందుకు, పరీక్షలను ఈజీగా రాసేందుకు సబ్జెక్టు నిపుణులు సూచనలిస్తున్నారు. ఈనెల 21 నుంచి పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మంచి మార్కులు సాధించడానికి ఆయా సబ్జెక్టుల నిపుణులను ‘సాక్షి’ పలకరించింది. విద్యార్థుల కోసం వారు తమ సూచనలు, సలహాలు వెల్లడించారు. – మహబూబాబాద్ అర్బన్ మొత్తం విద్యార్థులు 42,262బాలికలు 20,600బాలురు 21,662ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలిపదో తరగతి వార్షిక పరీక్షలు మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. బాగా చదివాను.. పరీక్షలు బాగా రాస్తాను.. అనే భావనతో వెళ్లాలి. నెగెటివ్ ఆలోచనలను దరిచేర నీయొద్దు. గతంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలి. టీవీ, సెల్ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్ జోలికి వెళ్లొద్దు. సాత్విక ఆహారం తీసుకుంటే తొందరగా జీర్ణమవుతుంది. తగినంతగా నీరు తాగాలి. ఎవరైనా ఒత్తిడికి లోనైనా.. పరీక్షలంటే భయం కలిగినా 93911 17100, 94408 90073 నంబర్లకు ఫోన్ చేస్తే తగిన సూచనలిస్తాం. – పోగు అశోక్, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వివరాలు 8లోu -
ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్
వెంకటాపురం(కె): మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామ సమీపంలోని రాళ్లవాగు సమీపంలో బ్రిడ్జి కుంగిపోవటంతో వాగులో నుంచి తాత్కాలికంగా రోడ్డును వేశారు. వాహనాల రాకపోకలతో వాగులో ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు గుంతలమయంగా మారటంతో పాటు వాహనాలు రోడ్డు పై దిగబడుతున్నాయి. సోమవారం రోడ్డుపై మట్టిపోసి డోజర్తో చదునుచేసే పనులు చేపట్టారు. దీంతో సుమారు గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఇసుక లారీలు భారీగా వచ్చి చేరడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. -
పంట రక్షణ చర్యలు చేపట్టాలి
ములుగు రూరల్: అడవి పందుల దాడితో వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు నష్టపోతున్నారని వెంటనే అధికారులు పంట రక్షణ చర్యలు చేపట్టాలని రైతు ఉత్పత్తి సంఘం జిల్లా కన్వీనర్ దేవిరెడ్డి అంజిరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని దేవగిరిపట్నం, పొట్లాపూర్, పులిగుండం, జగ్గన్నపేట, కొత్తూరు, పంచోత్కులపల్లిలో వరి, మిర్చి, మొక్కజొన్న పంటలను అడవి పందులు నాశనం చేస్తున్నాయని తెలిపారు. అటవీశాఖ అధికారులు పంటల వైపు రాకుండా ఫినిషింగ్ చేయాలని కోరారు. రైతు ఉత్పత్తి సంఘం జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి -
ట్రైబల్ యూనివర్సిటీని సందర్శించి వీసీ
ములుగు: మండల పరిధిలోని జాకారంలో గల సమ్మక్క–సారక్క ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ తొలి వీసీగా బాధ్యతలు స్వీకరించిన వైఎల్.శ్రీనివాస్ సోమవారం వర్సిటీని సందర్శించారు. ఓఎస్డీ వంశీకృష్ణారెడ్డి, ప్రొఫెసర్లు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. యూనివర్సిటీలోని గ్రూపులు, ఎంత మంది విద్యార్థులు. యూనివర్సిటీలోని సౌకర్యాలు తదితర అంశాలపై ఆరా తీశారు. తనకు కేటాయించిన ఛాంబర్లో కూర్చుని యూనివర్సిటీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన కలెక్టర్ దివాకరను మర్యాద పూర్వకంగా కలిశారు. యూనివర్సిటీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లి అగ్రగామిగా నిలపాలని కలెక్టర్ సూచించారు. రామప్పలో ట్రెయినీ అధికారులు వెంకటాపురం(ఎం): హైదరాబాద్లోని మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న కేంద్ర ప్రభుత్వ అధికారులు సోమవారం మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సులో బోటింగ్ చేసి సరస్సు అందాలను తిలకించారు. వారి వెంట ఎంసీహెచ్ఆర్డీఐటీ అధికారులు శ్రీనివాస్, రవి ఉన్నారు. మత్స్యకారులకు శిక్షణ ప్రారంభం కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు పీ.వీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో ములుగు జిల్లాకు చెందిన ఎస్టీ మత్స్యకారులకు మూడు రోజుల పాటు ఇవ్వనున్న శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ఈసందర్భంగా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ చేపల పెంపకంలో పద్ధతులు, చేపల సంరక్షణ, దాణా తయారీపై అవగాహన కల్పించారు. అనంతరం జుజుల్రావుపేట, నాచేపల్లిలోని ఫిషరీస్ కేంద్రాలను తీసుకెళ్లి వివిధ రకాల చేపలు, రొయ్యల పెంపకం తీరును వివరించారు. -
పరిహారం ఇవ్వడానికి అంగీకారం
ములుగు: బాండ్ మొక్కజొన్న సాగుచేసి దిగుబడిరాక నష్టపోయిన రైతులకు ఆయా కంపెనీలు నష్టపరిహారం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో బాండ్ మొక్కజొన్న సాగుచేసి నష్టపోయిన రైతులు, మొక్కజొన్న విత్తన ఉత్పత్తికి సంబంధించిన కంపెనీల రిప్రజెంటేటీవ్స్, ఆర్గనైజర్లు, రైతు ప్రతినిధులు, జిల్లా వ్యవసాయాధికారి సురేష్కుమార్తో కలిసి ఆర్డీఓ వెంకటేశ్ సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కంపెనీలు సింజంట, బేయర్ కంపెనీల ప్రతినిధులు వచ్చిన దిగుబడికి, వ్యత్యాసానికి లెక్కగట్టి మొత్తం నష్టపరిహారం ఇవ్వడానికి సూత్రపాయంగా అంగీకరించారు. రైతు ప్రతినిధులు మాత్రం అదనంగా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఐదు రోజుల్లో నిర్ణయం తీసుకుని నష్టపరిహారాన్ని నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యేలా చూస్తామని ఆర్డీఓ తెలిపారు. -
1,926
ఎకరాలుజిల్లాలో బాండ్ మొక్కజొన్న పంటనష్టంనేడు కలెక్టర్కు నివేదిక కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లో మొక్కజొన్న పంటనష్టం వాటిల్లినట్లు వచ్చిన ఆరోపణలతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 7బృందాలతో సర్వే చేపట్టాం. మొక్కజొన్న ఫీల్డ్లో నమూనాలు సేకరించాం. వాటిని వ్యవసాయశాఖ ల్యాబ్కు పంపించాం. వారం పది రోజుల్లో పూర్తిస్థాయి ఆధారాలు అందుతాయి. నేడు (సోమవారం) పూర్తి నివేదికను కలెక్టర్కు అందజేయనున్నాం. – సురేశ్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎకరాకు టన్నున్నరే దిగుబడి వచ్చింది.. ఈ ఏడాది 4 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. పెట్టుబడికి రూ.1.30లక్షల ఖర్చు వచ్చింది. పంట వేసే ముందు ఆర్గనైజర్లు ఎకరానికి 3 నుంచి 4టన్నుల దిగుబడి వస్తుందని చెప్పారు. కాని నాకు టన్నున్నర మాత్రమే దిగుబడి వచ్చింది. అధికారులు స్పందించి నష్ట పరిహారం అందించేలా చూడాలి. – రాంబాబు, యోగితానగర్ములుగు: జిల్లాలోని కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లో బాండ్ మొక్కజొన్న వ్యవసాయం పేరుతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగినట్లు వచ్చిన ఆరోపణలు నేడు కొలిక్కి రానున్నాయి. ఈ మండలాల్లోని రైతులు 7నుంచి 8ఏళ్లుగా బాండ్ వ్యవసాయం చేస్తున్నారు. గతంలో కొంతమంది రైతులకు దిగుబడి తగ్గిన సమయంలో ఆయా కంపెనీల యాజమాన్యాలు నష్ట పరిహారాన్ని అందించాయి. అయితే ఈ ఏడాది ఏకంగా వందల ఎకరాల్లో పంటనష్టం రావడంతో ఫిబ్రవరి 17న రైతులు వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించారు. ఈ మేరకు జిల్లా అధికారులు సర్వేను ప్రారంభించి.. కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు గత నెల 25న తుది నివేదిక అందించారు. తదనంతరం మరికొంతమంది రైతులు నష్టపోయామని ముందుకు రావటంతో ఈనెల 6వ తేదీ వరకు మొక్కజొన్న పంట క్షేత్రాల నుంచి సీడ్ నమూనాలను సేకరించిన అధికారులు 13వ తేదీ వరకు ప్రక్రియను పూర్తి చేశారు. ఈ క్రమంలో ఏడు బృందాలుగా ఏర్పడి కంపెనీ ప్రతినిధులు రైతులతో పంట పొలాలకు వెళ్లి నమూనాలను సేకరించారు. వీరికి ఏఓ సూపర్వైజర్గా వ్యవహరించారు. నష్టాలను చెల్లిస్తూ వచ్చిన కంపెనీలు ఏజెన్సీలో 7నుంచి 8ఏళ్లుగా బాండ్ మొక్కజొన్న పంటసాగు జరుగుతోంది. సాధారణంగా ఎకరాకు 3నుంచి 4టన్నుల దిగుబడి వస్తుంది. గతంలో ఈ లెక్క ప్రకారం దిగుబడి తక్కువగా వచ్చిన రైతులకు కంపెనీలు నష్టపరిహారం చెల్లిస్తూ వచ్చాయని తెలుస్తోంది. ఈ ఏడాది పంట నష్టపోయిన వారికి సైతం విత్తనాలను అందించిన సింజెంటా, బెయర్, హైటెక్, నూజువీడు, సీపీ సీడ్స్ ప్రతినిధులు డబ్బులను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని కంపెనీ ప్రతినిధులు కలెక్టర్ ఎదుట చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఏజెన్సీలో 1/70 చట్టం అమలులో ఉండటంతో ఆయా కంపెనీలు ఆర్గనైజర్ పేరుతో బాండ్ తీసుకున్నారు. బయట మార్కెట్లో క్వింటా మొక్కజొన్నకు రూ.2,100 ధర ఉండగా ఆర్గనైజర్లకు ప్రాంతాన్ని బట్టి రూ.2,800నుంచి 3వేల వరకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయంలో రైతులు సానుకూలంగా ఉన్నా కొన్ని సంఘాలు రెచ్చగొట్టి సమస్యను తీవ్రం చేశాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీటీ మొక్కజొన్న సీడ్తోనే నష్టమా? ఇప్పటి వరకు పత్తి విత్తనాలను మాత్రమే బీటీ(బాసిల్లసిస్ తురంజసీస్) రకాన్ని పత్తిలో మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ మొక్కజొన్నలో బీటీ పేరుతో కొత్త వంగడం మార్కెట్లోకి రావటంతో ఏజెన్సీ రైతులు సాగుచేశారు. నిబంధనల మేరకు జనిటికల్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ(జేబీఏసీ) అనుమతి తప్పనిసరిగా ఉండాల్సి ఉంది. దీంతో పాటు ఎన్వీరాల్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 2005 ప్రకారం తీవ్ర పరిణామాలు ఉంటాయని వ్యవసాయ ఉన్నతాధికారులు చెబుతున్నారు. బీటీ సీడ్స్ పేరుతో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉండే ప్రమాదం ఉంది. ఈ విషయంలో వ్యవసాయశాఖ అధికారులు 40రోజుల క్రితం నమూనాలను ల్యాబ్కు పంపించారు. త్వరలోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవటానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మండలాలు రైతులు పంటసాగు (ఎకరాల్లో)కన్నాయిగూడెం 89 214 వెంకటాపురం(కె) 541 964 వాజేడు 314 748 మూడు మండలాల్లో.. 944మంది రైతులు సాగు నేడు కలెక్టర్కు తుది నివేదిక హాజరు కానున్న ఆయా కంపెనీల ప్రతినిధులు బీటీరకం విత్తనంతోనే నష్టం వచ్చినట్లు భావిస్తున్న అధికారులు -
హైదరాబాద్తో
సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025– 8లోuసభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిబహిరంగ సభకు హాజరైన ప్రజలు, రిమోట్ ద్వారా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, ప్రజాప్రతినిధులుసాక్షి ప్రతినిధి, వరంగల్/జనగామ/స్టేషన్ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ శివారు శివునిపల్లిలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఓరుగల్లుపై వరాల జల్లు కురిపించారు. మరోవైపు బీఆర్ఎస్, కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులపై విమర్శలు గుప్పించారు. శివునిపల్లిలో ఈ కార్యక్రమం రాజకీయ పార్టీగా ఏర్పాటు చేసింది కాదని, ఓట్ల కోసం రాలేదన్న ఆయన.. స్టేషన్ఘన్పూర్ అభివృద్ధిలో భాగంగా రూ.800 కోట్ల నిధులతో ప్రగతి కోసం తలపెట్టిన బహిరంగ సభ అని స్పష్టం చేశారు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్తో పోటీ పడేలా అభివృద్ధి చేస్తామని, ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ ఇందుకోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తామని ప్రకటించారు. మరోవైపు వరంగల్ అంటే తనకు ప్రత్యేక అభిమానమన్న ముఖ్యమంత్రి.. ఉమ్మడి జిల్లాను విద్య, వైద్యం, పర్యాటక, ఐటీ హబ్లుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. సీఎం సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కడియం శ్రీహరిని నేనే రమ్మన్నా.. ఈ ప్రభుత్వం వచ్చాకే వరంగల్కు ఎయిర్పోర్టు, కాజీపేటకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, వరంగల్కు రింగ్రోడ్డు వచ్చాయని రేవంత్రెడ్డి గుర్తు చేశారు. ఎంపీ కడియం కావ్య ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా జీఎంఆర్ నుంచి క్లియరెన్స్ తీసుకుని కేంద్ర మంత్రులను కలిసి ఎయిర్పోర్టు సాధించామని తెలిపారు. అలాగే, రైల్వే కోచ్ఫ్యాక్టరీని సాధించామని, కాజీపేట రైల్వే డివిజన్ చేయడం కోసం ఎంపీ కావ్యతోపాటు తన కృషి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. వరంగల్ నగరంలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, ఔటర్ రింగ్రోడ్డు, ఇన్నర్ రింగ్రోడ్డుతోపాటు పలు అభివృద్ధి పథకాల కోసం రూ.6,500 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే ఆ పనులు మొదలవుతాయన్నారు. జయశంకర్ సర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా చేసింది ఈ ప్రభుత్వమేనన్న ఆయన.. మహిళలకు వెయ్యి బస్సులు ఇచ్చి ఆర్టీసీలో అద్దెకు తీసుకున్నామని చెప్పారు. మహిళల చేత వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయించడం ద్వారా ఉమ్మడి వరంగల్కు చెందిన మహిళలకు మేలు జరిగిందని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా ఇంటిగ్రేటెడ్ హాస్టల్, వంద పడకల ఆస్పత్రి, ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు వంటి శాశ్వత ప్రాతిపదికన స్టేషన్ఘన్పూర్ అభివృద్ధికి రూ.800 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక కడియం శ్రీహరి సేవలు గుర్తెరిగి ఆయన నిజాయితీ, అనుభవం కావాలని, తానే అక్కున చేర్చుకొని పార్టీలో చేరాలని కోరినట్లు రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మా కోరిక మేరకు ఆయన పార్టీలో చేరగా.. చెల్లెలు డాక్టర్ కావ్యను ఎంపీగా గెలిపించారన్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తికావాలంటే శ్రీహరి నాయకత్వాన్ని బలపర్చాలని ప్రజలను కోరారు. కేసీఆర్, ఆయన కుటుంబంపై ఘాటైన విమర్శలు.. జనగామ జిల్లా శివునిపల్లి వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపై సీఎం రేవంత్రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, టి.హరీశ్రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపైన ఆయన కామెంట్స్ చేశారు. ‘అధికారం ఉంటే తప్ప కేసీఆర్ ప్రజల్లోకి రాలేరా? ఆయన బయటకు రాకుండా కొడుకు, అల్లుడిని ఊరు మీదకు వదులుతున్నారు. బయటకు రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? జీతభత్యాలు ఎందుకు?.. ఇలా చేస్తేనే కదా కాంగ్రెస్ దెబ్బ ఎలా ఉంటుందో 2023లో ప్రజలు చూపించారు’ అంటూ విమర్శలు చేశారు. ‘క్యాప్సికం పండిస్తే రూ.కోట్లు వస్తాయన్న కేసీఆర్.. ఆ టెక్నిక్ ఏంటో ప్రజలకు చెప్పండి.. నీ లక్ష కోట్ల సంపాదన నైపుణ్యం ఏంటో ప్రజలకు చెప్పండి.. వెయ్యి మంది యువకులను నీ ఫామ్ హౌస్కు పంపిస్తాం. ఆ టెక్నిక్ ఏంటో వారికి నేర్పించండి’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము దోచుకుని పేపర్, టీవీ చానళ్లు పెట్టుకున్న వ్యక్తి జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించిన సీఎం రేవంత్రెడ్డి.. ఆయనతోపాటు కేటీఆర్, హరీశ్రావు, కవితకు ఫామ్హౌస్లు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్కుమార్రెడ్డి, పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్.నాగరాజు, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తెలంగాణ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, కలెక్టర్ షేక్ రిజ్వాన్బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్, నాయకులు ఝాన్సీరెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్య పాల్గొన్నారు. సీతాలు చేపను చూపిస్తున్న హరిబాబున్యూస్రీల్ పక్కాగా సంక్షేమ పథకాల అమలు మామునూరు ఎయిర్ పోర్ట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ ఘనతే.. ప్రతిష్టాత్మకంగా విమానాశ్రయాన్ని నిర్మిస్తామని స్పష్టీకరణ విద్య, వైద్యం, పర్యాటక, ఐటీ హబ్గా ఓరుగల్లుకు ప్రాధాన్యం.. ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభ విజయవంతం -
కొండాయి బ్రిడ్జి నిర్మాణానికి..
ఏటూరునాగారం: మండల పరిధిలోని కొండాయి– మల్యాల గ్రామాల బ్రిడ్జి నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్అండ్బీ శాఖ ద్వారా రూ.16కోట్లు మంజూరు చేసింది. ఆదివారం కొండాయి జంపన్నవాగులో రోడ్డు, భవనాల శాఖ ఆధ్వర్యంలో మట్టి పరీక్షల కోసం పనులను ప్రారంభించారు. గతంలో వచ్చిన వరదల కారణంగా కూలిపోయిన పాత వంతెన పక్కనే నూతన వంతెన నిర్మాణానికి అధికారులు పిల్లర్ల మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసిన వద్ద గాయత్రి కన్స్ట్రక్షన్కు చెందిన కార్మికులు ఇసుకలో పిల్లర్ మార్కింగ్ ప్రాంతంలో బోరింగ్ పైపుల ద్వారా తవ్వకాలు చేపట్టారు. 20మీటర్లు వరకు పూర్తిగా ఇసుక ఉందని, ఎలాంటి మట్టి లభించడం లేదన్నారు. కాగా 20మీటర్లలో లభించిన వివిధ ఇసుక శాంపిళ్లను హనుమకొండలోని ల్యాబ్కు ఎప్పటికప్పుడు పంపిస్తున్నట్లు తెలిపారు. గతంలోని బ్రిడ్జితో పోలిస్తే పొడవు, వెడల్పు ఎక్కువగా ఉండనుంది. ఈ సారి బ్రిడ్జి 186మీటర్ల పొడవు, 5నుంచి 7పిల్లర్లు పడే అవకాశం ఉంది. మంత్రి సీతక్క ప్రత్యేకమైన చొరవతో పనులు మరింత వేగవంతంగా చేసేందుకు అధికారులు కావాల్సిన చర్యలు చేపడుతున్నారు. వర్షాకాలం వరకు బ్రిడ్జి ని ర్మాణం పూర్తి అవుతుందా లేదా అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా 20మీటర్ల వరకు ఇసుక ఉండడంతో బ్రిడ్జి నా ణ్యతపై ఆందోళన నెలకొంది. బ్రిడ్జి నిర్మాణం పనులు మొదలు పెట్టి త్వరగా పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్పై ఒత్తిడి తెస్తున్నారు. బ్రిడ్జి లేకపోవడంతో కొండాయి, మల్యాల, ఐలాపురం, గోవిందరాజుల కాలనీతో పాటు మేడారం వెళ్లే ప్ర జలు ఇబ్బంది పడుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం తో ఆగ్రామాల ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. రూ.16 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ముమ్మరంగా మట్టి నమూనాల సేకరణ -
రేవంత్ టీ–20 మ్యాచ్ ఆడుతున్నారు..
● సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదుర్కొంటూ ప్రజాపాలన సాగిస్తున్నారు ● స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ.630.27 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు సీఎం సభలో తెలంగాణ ఉద్యమ కళాకారుల నిరసన –8లో -
మాదిగలను నమ్మించి మోసం చేసిన సీఎం
ములుగు: మాదిగలను నమ్మించి సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు ఇరుగు పైడి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఽఆధ్వర్యంలో చేపటిన నిరసన దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్ష శిబిరాన్ని ఆయన శనివారం సందర్శించి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ అమలు చేస్తానని, అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువస్తానని మాదిగలను నమ్మించి సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని తెలిపారు. సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మాదిగలకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో శ్యామ్బాబు, భిక్షపతి, సుందర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం భక్తజనంతో శనివారం కిటకిటలాడింది. వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణంతో పాటు చింతామణి జలపాతం, వనదేవత(దైత అమ్మవారి) ప్రాంతంలో భక్తజన సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బస్సులు తదితర వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి లక్ష్మీనర్సింహాస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూలు, పండ్లు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు రాజశేఖర్శర్మ, కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, ఈశ్వర రామానుజదాస్ స్వామివారికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్న భక్తులు మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. -
ప్రజాపాలనపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
ఏటూరునాగారం: ప్రజాపాలనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు అన్నారు. మండల కేంద్రంలోని తన నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీలు ఇవ్వలేక సీఎం రేవంత్రెడ్డి చేతులు ఎత్తేశాడన్నారు. స్థానిక మంత్రి సీతక్క కొండాయి బ్రిడ్జిని కట్టించలేకపోతున్నారని తెలిపారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులను కమీషన్లుగా పంచుకోవడం సరికాదన్నారు. గ్రామ సభలు నిర్వహించి పనులను గుర్తించి నాణ్యత పనులు చేపట్టాలన్నారు. అలాగే మంగపేట మండల పరిధిలోని బిల్ట్ కర్మాగారం తెరిపించే విషయంలో మంత్రి సీతక్క, సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేతనాలు అందజేసి వారి కష్టాల్లో పాలుపంచుకున్నామన్నారు. కార్మికులు వ్యవసాయ కూలీలుగా మారారని, చాలా మంది మనోవేదనతో మృత్యువాత పడ్డారని వివరించారు. బిల్ట్ ఫ్యాక్టరీని తెరిపిస్తే వారికి రుణపడి ఉంటామని తెలిపారు. అలాగే మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే కోల్డ్స్టోరేజీలు నిర్మించాలని కోరారు. గోదావరి కరకట్ట నిర్మాణంలో మంత్రి సీతక్క ఎందుకు దృష్టి పెట్టడం లేదన్నారు. అంతేకాకుండా ప్రమాదకరంగా ఉన్న ఇసుక క్వారీలను మూసివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గోవింద్నాయక్, సునీల్కుమార్, రఘు, నర్సింహులు, సమ్మ య్య, మల్లారెడ్డి, నర్సయ్య, రాజు, ఖాజాపాషా, కృష్ణ, ప్రదీప్కుమార్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు -
‘సీఎం కృతజ్ఞత సభ’కు సర్వం సిద్ధం
జనగామ: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో సీఎం రేవంత్రెడ్డి నేడు(ఆదివారం) పర్యటించనున్నారు. రూ.700 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు, అలాగే ప్రారంభోత్సవాలు చేయనుండగా.. సెల్ఫ్హెల్ప్ గ్రూపులకు రూ.100 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపాన ‘సీఎం కృతజ్ఞత సభ’కు సర్వం సిద్ధం చేశారు. బహిరంగ సభతోపాటు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేతృత్వంలో సీపీ సన్ప్రీత్ సింగ్, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, ఎంపీ కడియం కావ్య శనివారం పరిశీలించారు. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు జఫర్గఢ్ మండలం కోణాయచలం సమీపాన రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్(గురుకులం) కాంప్లెక్స్, రూ.146 కోట్లతో ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబు పేట వరకు మెయిన్ కెనాల్ లైనింగ్, రూ.46కోట్ల వ్యయంతో ఘన్పూర్లో విద్యుత్ సబ్స్టేషన్ సమీపాన 100 పడకల ఆస్పత్రి, రూ.26కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్(ప్రభుత్వ కార్యాలయాల సముదాయం), రూ.50 కోట్లతో పంచాయతీరాజ్ రహదారులు, రూ.26కోట్లతో అంతర్గత సీసీరోడ్లు, డ్రెయినేజీలు, రూ.250 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల(మొదటి విడత) నిర్మాణ పనులను సీఎం వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సెల్ఫ్హెల్ఫ్ గ్రూపులకు రూ.100కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు అందజేస్తారు. అనంతరం సీఎం మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ను సందర్శిస్తారు. అలాగే ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు మంజూరైన నాలుగు ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తారు. శంకుస్థాపనలకు సంబంధించి సభా వేదిక సమీపంలోనే ఒకే చోట శిలా ఫలకాలు ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. రెండు రూట్లలో తరలింపు సభకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో 50 వేల మందిని తరలించనున్నారు. ఇందుకు సంబంధించి వేలేరు, ధర్మసాగర్, స్టేషన్ఘన్పూర్, చిల్పూరు మండలాల నుంచి వచ్చే వారు ఘన్పూర్ టౌన్ మీదుగా.. జఫర్గఢ్, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల వారు ఇప్పగూడెం మీదుగా రానున్నారు. ఈ రెండు రూట్లలో పోలీసు నిఘా ఉంటుంది. శివునిపల్లి వ్యవసాయ మార్కెట్, విశ్వనాథపురం సమీపంలో రెండు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా బాంబు, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తుండగా, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ వర్గాలు నిరంతరం నిఘా ఉంచారు. సీఎం పర్యటన నేపథ్యంలో 850 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నారు. నేడు ఘన్పూర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన రూ.700 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మహిళా సంఘాలకు రూ.100 కోట్ల రుణాలు.. వ్యవసాయ మార్కెట్ సమీపంలో బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య, అధికారులు సీఎం టూర్ షెడ్యూల్ ఇలా.. మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటినుంచి (హైదరాబాద్లో) బయలుదేరి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. 12.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. 1 గంటకు స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లి హెలిపాడ్కు చేరుకుంటారు. 1.10 నుంచి 1.20 గంటల వరకు ఇందిర మహిళా శక్తి స్టాళ్లను పరిశీలించి, వివిధ గ్రూపులకు కేటాయించిన బస్సులను ప్రారంభిస్తారు 1.25 నుంచి 3 గంటల వరకు శివునిపల్లెలో ప్రజాపాలన కార్యక్రమాలు, కృతజ్ఞత సభలో పాల్గొంటారు. 3.10 గంటలకు శివునిపల్లి హెలిపాడ్ నుంచి బయలుదేరి 3.45 గంటలకు హెలికాప్టర్లో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.‘స్టేషన్’ అభివృద్ధికి రూ.800 కోట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రేవంత్రెడ్డి సభను అడ్డుకుంటాం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య – వివరాలు 8లోu -
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ములుగు: ప్రజలు వేసవిలో వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాయలంలోని సమావేశ మందిరంలో శనివారం మాతాశిశు సంరక్షణ సిబ్బంది, ఆర్బీఎస్కే ప్రోగ్రాం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో తగిన రక్షణ చర్యలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. గర్భిణులు, బాలింతలు, స్కూల్ పిల్లలకు వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్, ఆరోగ్య కార్యకర్త, అశ కార్యకర్తలు సమన్వయంతో గర్భిణులు, బాలింతలకు నిరంతరం పరీక్షలు నిర్వహించాలన్నారు. రక్తహీనత, పోషకాహారంపై అవగాహన కల్పించాలన్నారు. సాధారణ, సీజేరియన్ కాన్పులతో జరిగే పరిణామాలను వివరించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోకే కాన్పులకు వచ్చేలా గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్య ఆరోగ్యశాఖ అధికారి విపిన్ కుమార్, జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీకాంత్, పవన్ కుమార్, రణధీర్, ఆర్బీఎస్కే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ నరహరి, కమ్యూనిటీ హెల్త్ అధికారి పూర్ణసంపత్ రావు, తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ గోపాల్రావు -
మొక్కజొన్న పంటల పరిశీలన
వెంకటాపురం(కె): మండల పరిధిలోని బాండ్ మొక్కజొన్న పంటలను శనివారం శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని రాచపల్లి గ్రామంలో సాగుచేసిన మొక్కజొన్న పంటను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడి వివరాలను సేకరించారు. రైతులు అనుసరించిన వ్యవసాయ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై సమగ్ర నివేదికను తయారు చేసి పై అధికారులకు అందజేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్ర వేత్తలు దిలీప్ కుమార్, నాగభూషణం, విశ్వతేజ్, ఏఈవో శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రామప్పను సందర్శించిన జపాన్ దేశస్తులు వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని శనివారం జపాన్కు చెందిన ఎంబసీ అధికారి రైతా సైటో, జపాన్ యూట్యూబర్స్ మయో, ఇండో కర్రీకోలు సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. పీహెచ్సీ సందర్శన వాజేడు: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం స్టేట్ ఎంటి మాల్ టీం అసిస్టెంట్ డైరెక్టర్, ఎటమాలజిస్టు నాగయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యశాలలోని రికార్డులను పరిశీలించడంతో పాటు అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం మండల పరిధిలోని జంగాలపల్లిలో మలేరియా పాజిటివ్ కేసు నమోదు కావటంతో వైద్య సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఆర్డీటీ టెస్టులు నిర్వహించాలని, దోమల మందు పిచికారీ చేయాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటూ గ్రామాలను ఆశవర్కర్లు రోజు విడిచి రోజు సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి తరుణ్, హెచ్ఈవో అజయ్ కుమార్, ఎల్టీ మురళి, హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలి వెంకటాపురం(ఎం): విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేయాలని ములుగు డీఈ పులుసం నాగేశ్వర్రావు సిబ్బందికి సూచించారు. ఎండాకాలం యాక్షన్ ప్లాన్లో భాగంగా శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో విద్యుత్ సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఓవర్లోడ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో ఆదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజ్లు పోకుండా సిబ్బంది అప్రమత్తతో పని చేయాలన్నారు. వేసవిలో పెరిగే డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ వేణుగోపాల్, సబ్ ఇంజనీర్ సాంబమూర్తి, లైన్ ఇన్స్పెక్టర్లు మల్లారెడ్డి, రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
భూగర్భ జలాలు
ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025అడుగంటుతున్న – 8లోuమంగపేటలో నీరు తక్కువగా పోస్తున్న బోరు ఏటూరునాగారం: ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుండడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఎండాకాలంలో ఎక్కువగా వరి పంటలు సాగుచేయడం, వాగుల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేపట్టడం, వాగులకు చెక్డ్యామ్లు లేకపోవడం, పరిమితికి మించి బోర్లు వేయడం వల్ల నీరు ఆవిరైపోతోంది. దీంతో బోర్లలోని నీరు లోతుకు వెళ్తుండడంతో మరింత లోతుకు బోర్లను దింపుకోవాల్సి వస్తుంది. పలుచోట్ల బోర్లు నీరు తక్కువ మోతాదులో పోస్తుండగా వాగులు ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. జిల్లాలోని 10మండలాల్లో భూగర్బ జలాల నీటిమట్టాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం గ్రౌండ్ వాటర్శాఖ ద్వారా 40బోర్వెల్ పైజో మీటర్లను ఏర్పాటు చేసింది. ప్రతినెలా 15నుంచి 28వ తేదీలోపు అధికారులు, సిబ్బంది గ్రౌండ్ వాటర్ లెవల్స్ వివరాలు సేకరిస్తారు. ఎక్కడైతే 10 మీటర్ల లోపు అడుగులో నీరు ఉంటుందో అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదని, 11 నుంచి 15, 15 నుంచి 20కి పైగా మీటర్లలోతుల్లో నీటి మట్టం పడిపోతే డేంజర్ జోన్లోకి ఆ ప్రాంతం వెళ్లినట్లుగా అధికారులు ప్రకటిస్తారు. వెంటనే అక్కడ వాటర్ రీచార్జింగ్ పద్ధతిని చేపడుతారు. బీరెల్లి, అబ్బాపూర్, జాకారంలో స్వల్ప ప్రమాదస్థాయిలో.. జిల్లాలోని ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని బీరెల్లిలో 16.39మీటర్ల లోతుల్లోకి నీరు వెళ్లగా ములుగు మండల పరిధిలోని అబ్బాపూర్, జాకారంలో 24.11 మీటర్ల లోతుల్లోకి భూగర్భజలాలు అడుగంటాయి. దీంతో ఈ ప్రాంతాల్లో స్వల్ప ప్రమాద స్థాయికి నీటి నిల్వలు చేరాయి. నీటి నిల్వల పెంపు రికవరీ ఇలా.. వాగుల్లో ఇరిగేషన్ శాఖ ద్వారా చిన్న తరహా చెక్డ్యామ్లను నిర్మించి నీటి నిల్వలను పెంచాలి. చెరువుల్లో పూడిక తీయించి నీటి నిల్వ, లీకేజీలు లేకుండా చూడాలి. అంతేకాకుండా బోరు బావులను ఎక్కడబడితే అక్కడ వేయకుండా నిరోధించాలి. అలాగే గ్రామాల సమీపంలోని వాగుల్లో ఇసుకను తోడకుండా నివారించి వాగుల్లో నీరు ఆవిరికాకుండా చూడాలి. గోదావరిలో ఇసుక తవ్వకాలను పూర్తిగా నిలిపివేస్తే నీటిమట్టం పడిపోకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.న్యూస్రీల్గంజాయి, పశువులను రవాణా చేస్తే చర్యలు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ప్రాంతం జనవరి ఫిబ్రవరి ఏటూరునాగారం 12.40 13.11 శంకరాజుపల్లి 12.75 13.39 ముప్పనపల్లి 9.49 11.20 కమలాపురం 11.84 12.11 జాకారం 20.09 24.11 బీరెల్లి 15.61 16.39 అబ్బాపూర్ 20.09 24.11 జగన్నాథపురం 11.50 12.94 రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వట్టిపోతున్న వాగులు, చెరువులు ప్రతినెలా గ్రౌండ్ వాటర్ లెవల్స్ పరిశీలిస్తున్న అధికారులుఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలి వేసవిలో వరి పంటలను అత్యధికంగా సాగు చేయడం మూలంగా నీటిని ఎక్కువగా పంట పొలాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల భూ గర్భజలాలు పడిపోయే ప్రమాదం ఉంది. అందుకోసమని రైతులు ఆరుతడి పంటలను సాగు చేసేందుకు మొగ్గుచూపితే కొంత మేర నీటి నిల్వలను కాపాడుకోవచ్చు. – శ్రీనివాస్, భూగర్భ జలశాఖ జిల్లా అధికారి జంపన్నవాగులో చెక్డ్యామ్లు కట్టాలి.. జిల్లాలో ప్రవహిస్తున్న జంపన్నవాగులో ప్రమాదం లేకుండా నీటి నిల్వలు పెంచేందుకు చెక్డ్యామ్లను నిర్మించాలి. దీనివల్ల నీటి నిల్వలు పెరగడంతో పాటు పంటలకు నీరు అందుబాటులో ఉంటుంది. తాగునీటి, సాగునీటి సమస్యలు రాకుండా ఉంటాయి. చెల్పాక, వీరాపురం, బన్నాజీబంధం, ఎలిశెట్టిపల్లి ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికి వాగునీటినే తాగునీరుగా ఉపయోగిస్తుంటారు. – కాపుల సమ్మయ్య, రైతు, అల్లంవారిఘణపురం -
పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు
ములుగు : గంజాయి, పశువుల అక్రమ రవాణాపై పోలీసు శాఖ తరఫున కఠిన చర్యలు తీసుకుంటామని ములుగు డీఎస్పీ నలువాల రవీందర్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని తన చాంబర్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ వ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా పెంచామని అన్నారు. 2024 సంవత్సరంలో పశువులను అక్రమంగా తరలిస్తున్న వారిపై 30 కేసులు నమోదు చేసి 296 పశువులను సంరక్షించి వాటిని పలు ప్రాంతాల్లోని గోశాలలకు తరలించామని తెలిపారు. 85 మందిని అరెస్ట్ చేసి చేశామన్నారు. 2025 జనవరి 1 నుంచి మార్చి 14 వరకు ఒక కేసు నమోదు చేసి నేరస్తుడిని అరెస్ట్ చేశామని, ఎనిమిది పశువులను రక్షించామని అన్నారు. గంజాయి విషయంలో 2024లో మొత్తం నాలుగు కేసులు నమోదు చేసి రూ.1, 09,242 విలువ కలిగిన 11.413 కిలోలను గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నాలుగు కేసుల్లో మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని అన్నారు. 2025 జనవరి 1 నుంచి నేటి వరకు ఒక కేసు నమోదు చేసి రూ.62, 125 విలువ కలిగిన 2.485 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇందులో ముగ్గురు నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. గంజాయిరహిత సమాజం కోసం ములుగు సబ్ డివిజన్ పోలీసు అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. హైస్కూల్ నుంచి డిగ్రీ కళాశాల స్థాయి వరకు యాంటీ డ్రగ్ వారియర్స్ పేరుతో కమిటీలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో క్రీడాపోటీలు నిర్వహించి వారితో స్నేహపూరితంగా మెదులుతున్నామని అన్నారు. గంజాయి కేసుల పాలైన పాత నేరస్తులపై సస్పెక్ట్స్ షీట్స్ ఓపెన్ చేశామని అన్నారు. యాంటీ నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాలతో అనుమానిత ప్రదేశాల్లో మాదకద్రవ్యకాల నిర్మూలనకు నిత్యం తనిఖీలు చేస్తున్నామని అన్నారు. మాదకద్రవ్యకాల రవాణా, అమ్మకాలపై ఎవరికై నా సమాచారం ఉంటే డయల్ 100కు కానీ ప్రత్యేక టోల్ఫ్రీ 1908కి కానీ ఫోన్ చేసి వివరాలు అందించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం కృషి చేస్తున్న సబ్ డివిజన్ పోలీసులను ఎస్పీ శబరీష్ అభినందించారని అన్నారు.ములుగు డీఎస్పీ నలువాల రవీందర్ -
సభా వేదిక దేవన్నపేట!
సాక్షిప్రతినిధి, వరంగల్ : బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన రజతోత్సవ సభకు గ్రేటర్ వరంగల్ పరిధి దేవన్నపేట శివారును నాయకులు ఎంపిక చేశారు. 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటాన్ని, పదేళ్ల పరిపాలనపై ఏడాది పాటు వేడుకలు నిర్వహించాలని భావించిన బీఆర్ఎస్.. వరంగల్ సభ ద్వారా ప్రారంభించాలని తలపెట్టింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ పరిధి ఉనికిచర్ల, భట్టుపల్లి, దేవన్నపేట ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ముఖ్యనేతలు ఈనెల 10న స్థలపరిశీలన చేశారు. అయితే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా.. సభకు హాజరయ్యే జనం ఈజీగా వచ్చిపోయేలా ఉండాలని భావించి శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయభాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ తదితరులతో కలిసి హరీశ్రావు స్థల పరిశీలన చేశారు. జాతీయ రహదారి పక్కన ఉండటంతో పాటు నలుమూలల నుంచి వాహనాల ద్వారా వచ్చిపోయేందుకు దేవన్నపేట అనువుగా ఉంటుందని భావించి అధినేత కేసీఆర్ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. చివరకు దేవన్నపేటను ఫైనల్ చేసినట్లుగా చెప్పారు. స్థలపరిశీలన అనంతరం హరీశ్రావు సుమారు గంటపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో మాట్లాడారు. సుమారు 15 లక్షల మందితో భారీ సభ నిర్వహించడానికి నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇదే సమయంలో సభ సక్సెస్ కోసం ఉమ్మడి వరంగల్కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ కానున్నారని సమాచారం.● బీఆర్ఎస్ రజతోత్సవ సభా స్థలం పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్రావు, తదితరులు ● సభ సక్సెస్కు త్వరలో కమిటీలు.. ఉమ్మడి జిల్లా నేతలతో కేసీఆర్ బేటీ? -
‘చావు డప్పులు కేసీఆర్ ఇంటి ఎదుట కొట్టండి’
ములుగు: హుజురాబాద్ ఉప ఎన్నికల స్టంట్లో భాగంగా దళితబంధు పథకాన్ని అమలు చేసి అక్కడ ఓడిపోగానే మాటమార్చి దళితులను మోసం చేసిన మాజీ సీఎం కేసీఆర్ ఇంటి ఎదుట చావుడప్పులు కొట్టాలని దళితబంధు సాధన సమితి నాయకులకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ సూచించారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు వస్తున్నాయని తెలిసినా ఆనాడు కేసీఆర్ దళితబంధు పథకానికి సంభందించిన మొత్తం డబ్బులను ఎందుకు లబ్ధిదారుల ఖాతాలో జమచేయలేకపోయారని ప్రశ్నించారు. దళితబంధు ఇప్పిస్తానని జిల్లా కేంద్రానికి చెందిన ఓ బీఆర్ఎస్ నాయకుడు నిరుపేదల నుంచి లక్షల మేర డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. ప్రస్తుతం డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతుంటే ఏం చేయాలో అర్ధంకాక దళితబంధు సాధన సమితి ఉద్యమం పేరుతో మరింత డబ్బులు పోగు చేసుకొని పబ్బం గడుపుతున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతుందన్నారు. ఇప్పటికై నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పద్ధతి మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
గిరిజన యూనివర్సిటీకి మంచిరోజులు వచ్చేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్ : సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఎస్ఎస్సీటీయూ)కి మంచిరోజులు వచ్చినట్లేనా? యూనివర్సిటీని ప్రారంభించిన సుమారు ఏడాదిలో తొలి వైస్ చాన్స్లర్ను నియమించడం ద్వారా ప్రభుత్వాలు దృష్టి సారించినట్లేనా? అంటే అవుననే అంటున్నారు అధికారులు. 2023 అక్టోబర్లో ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. 500 ఎకరాల స్థలం కేటాయింపు.. రూ.900 కోట్లను ప్రకటించినా.. ఆ మేరకు హెచ్ఓడీలు, అధ్యాపకులు, మౌలిక వసతులు లేక విద్యార్థులు అడ్మిషన్ తీసుకోలేదు. తరగతులు 2024–25 నుంచే ప్రారంభింభినా స్పాట్ అడిషన్ల తర్వాత కేవలం 14 మంది చేరగా.. జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో తాత్కాలిక తరగతులు నిర్వహిస్తున్నారు. పదేళ్ల కల సాకారమైన.. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా పదేళ్ల కల సాకారమైన ఆ మేరకు తరగతుల నిర్వహణ లేకపోవడం ఇంతకాలంగా వెలితిగా కనిపిస్తోంది. యూనివర్సిటీ మంజూరు, ప్రారంభం సమయంలో రూ.900 కోట్లు, 500 ఎకరాల స్థల కేటాయింపులపై ఇంకా సందిగ్ధతే ఉంది. 2018 జనవరి 4వ తేదీన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)తో కూడిన ప్రణాళికతో పాటు ఉన్న స్థలంలోనే తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కి నివేదికను అప్పగించింది. సంప్రదించిన హెచ్సీయూ 2019వ సంవత్సరం 19వ తేదీన రాష్ట్ర ఉన్నత విద్యామండలిని కోరింది. ఇందుకుగాను ములుగు మండలంలోని అడ్మినిస్ట్రేషన్ నిర్వహణకు యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో 10 రకాల కోర్సులతో ఒక్కో కోర్సులో 20 మందితో తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. తరగతులు ప్రారంభించడానికి కనీసం 50 ఎకరాల స్థలంలో నిర్మాణం ఉండాలన్న ఆంక్షలతో పక్కనపెట్టినా.. ఎట్టకేలకు మహబూబ్నగర్ సభలో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీని మంజూరు చేస్తూ రూ.900 కోట్లను ప్రకటించారు. పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉండటంతో భవన నిర్మాణాలు లేక, వైటీసీలోనే తాత్కాలికంగా 14 మందితో తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి.వైస్ చాన్స్లర్ నియామకంతో కదలిక.. సర్వత్రా హర్షం... ఎట్టకేలకు సమ్మక్క–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఎస్ఎస్సీటీయూ) తొలి వీసీ నియామకం జరగడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తొలి వైస్ చాన్స్లర్గా ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున డిప్యూటీ సెక్రటరీ శ్రేయ భరద్వాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వైఎల్ శ్రీనివాస్ అరోరా యూనివర్సిటీ వీసీగా పని చేస్తుండగా.. ఆయన నియామకంతో ట్రైబల్ యూనివర్సిటీ పురోగతికి ముందడుగు పడినట్లేనన్న చర్చ జరుగుతోంది. కాగా 2024–25 విద్యాసంవత్సరానికి బీఏ(హానర్స్) ఇంగ్లిష్, బీఏ (హానర్స్) ఎకనామిక్స్లలో 47 సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కేవలం ముగ్గురే అడ్మిషన్లకు ముందుకు రావడంతో తేదీని పొడిగించి 2024 అక్టోబర్ 3న స్పాట్ సెలక్షన్ ద్వారా మరో 9 మందిని చేర్చుకోగా 14కు చేరింది. బీఏ ఎకనామిక్స్లో ఐదుగురు, బీఏ ఇంగ్లిష్లో 9 మందికి క్లాసులు నిర్వహిస్తున్నారు. తొలి అడ్మిషన్లు అలాగే ఉంటాయని, వచ్చే సంవత్సరం నుంచి అడ్మిషన్లు పెరుగుతాయని అధికారులు చెబుతుండగా.. ఇదే సమయంలో వైస్ ఛాన్స్లర్గా వైఎల్ శ్రీనివాస్ను నియమించడంతో యూనివర్సిటీకి మంచిరోజులు వస్తాయన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రెండు కోర్సులే.. అడ్మిషన్ తీసుకున్నది 14 మంది యూత్ ట్రైనింగ్ సెంటర్లో తరగతుల నిర్వహణ ఎట్టకేలకు తొలి వైస్చాన్స్లర్ నియామకం.. ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్కు వీసీగా బాధ్యతలు.. వీసీ నియామకంపై హర్షం -
గ్రావిటీ కెనాల్ వివరాలు ఇలా..
ములుగు: రామప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా లక్నవరం చెరువుకు నీటిని అందించడానికి ప్రభుత్వం తరఫున ముందడుగు పడింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క చొరవతో గత ఆరున్నర సంవత్సరాల నుంచి మూలన పడిన ఫైల్లో తిరిగి కదలిక వచ్చింది. ఈ మేరకు రెవెన్యూశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. కన్నాయిగూడెం మండలం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా భీం గణపూర్ మీదుగా రామప్ప సరస్సుకు నిత్యం నీటిని అందిస్తున్నారు. దీంతో 365 రోజుల పాటు 27 నుంచి 33 ఫీట్లకు తగ్గకుండా నీటి నిల్వ ఉంచుతున్న విషయం తెలిసిందే. నీటి నిల్వ ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది యాసంగి సాగుకు ఎలాంటి తడబాటు లేకుండా అధికారులు 5,180 ఎకరాలకు తైబందీ ఖరారు చేశారు. సాగుకు పోనూ నీటిని ఇక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా గణపురం మండలం గణప సముద్రంకు, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నర్సంపేట, పాకాల, నెక్కొండ వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువుకు గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని మళ్లించాలని 2018లో అప్పటి అధికారులు ఆలోచన చేశారు. అనుకున్నదే తడవుగా జే చొక్కారావు దేవాదుల లిఫ్ట్(జేసీఆర్) ఇరిగేషన్ అధికారులు క్రాస్ మాసోనరీ(సీఎం), క్రాస్ డ్రైనేజ్ డిజైన్(సీడీ)ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించారు. గ్రావిటీ కెనాల్ నిర్మాణంలో భాగంగా అప్రోచ్ కెనాల్కు 2.025 కిలో మీటర్లు 6.160 క్యూబిక్ మీటర్ ఫర్ సెకండ్ (క్యూమెక్స్) డిశ్చార్జీతో, మెయిన్ గ్రావిటీ కెనాల్కు 4.850 కిలోమీటర్ల మేర 4.840 క్యూమెక్స్ డిశ్చార్జీతో చేపట్టేందుకు సిద్ధమైంది. వీటికి అవసరమైన 145 ఎకరాల భూసేకరణ విషయం మంత్రి సీతక్క ప్రయత్నంతో ఇటీవల తెరపైకి వచ్చింది. 2019లో ఆగిన సర్వే భూ సేకరణకు గానూ ప్రభుత్వం 2018లో రూ.14.53 కోట్ల ఎస్టిమేషన్ డబ్బులు అందించడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు రూ.4కోట్లను అప్పటి కలెక్టర్ కృష్ణ ఆదిత్య అకౌంట్(ప్రభుత్వం తరఫున అధికారికంగా ఉన్న ఖాతా)కు ట్రాన్స్ఫర్ చేసింది. 2019లో సర్వే ప్రారంభించిన రెవెన్యూ అధికారులు ఎకరాకు రూ.2.45 లక్షలు చెల్లిస్తామని రైతులతో చర్చించారు. రైతులు అప్పటి రేటు ప్రకారం ప్రాంతాన్ని బట్టి ఎకరానికి రూ.9నుంచి 12లక్షలు పరిహారం అడిగారు. దీంతో డోలాయమానంలో పడ్డ అధికారులు అప్పటి మంత్రులు, కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. చివరికి రూ. 8.5 లక్షలు ఇవ్వాలని రైతులు అడిగినా అధికారులు ముందుకురాలేదు. దీంతో ప్రాజెక్టు ఫైల్ కథ కంచికి చేరింది. ఇదంతా చూసిన తర్వాత భూ సేకరణ తర్వాత తమను సంప్రదించాలని జేసీఆర్ ఇంజనీరింగ్ అధికారులు తేల్చారు. మొత్తానికి రైతులకు, రెవెన్యూ అధికారులకు మధ్య సయోధ్య కుదరక మధ్యలోనే పనులు ఆగిపోయాయి.లక్నవరం సరస్సు(ఫైల్)ప్రాజెక్టు నీటి తరలింపు రామప్ప నుంచి లక్నవరంకు అవసరమైన భూమి 145 ఎకరాలు మొత్తం గ్రావిటీ కెనాల్ 4.850కిలో మీటర్లు అప్రోచ్ కెనాల్ 2.025కిలో మీటర్లు తెరపైకి రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్ నిర్మాణం 2018లో మంజూరైన ప్రాజెక్టు ఇటీవల రైతులతో మంత్రి సీతక్క సమీక్ష భూ పరిహారంలో రైతులు, రెవెన్యూ అధికారులకు కుదరని సయోధ్య 6.875 కిలోమీటర్ల కాల్వకు ఇంజనీరింగ్ అధికారుల ప్రతిపాదనలు మంత్రి సీతక్క చొరవతోనే.. రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్ విషయమై రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుంది. ముందుగా సమస్యను ఇరిగేషన్, రెవెన్యూ మంత్రుల దృష్టికి తీసుకెళ్లి లోతుగా చర్చించారు. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం భూమి కోల్పోతున్న రైతులకు ఎంత మేర పరిహారం అందిచవచ్చేనే అంశంపై కొలిక్కి వచ్చింది. అదే విషయాన్ని ఈ నెల 9న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో రైతులతో సమీక్ష నిర్వహించారు. రైతుల అభిప్రాయాలను సేకరించి రేటు విషయమై సుమారు రెండు గంటల పాటు చర్చించారు. అయితే జిల్లా ఏర్పాటు అనంతరం భూములు రేట్లు భారీగా పెరిగాయని జాతీయ రహదారి వెంబడి ఉన్న భూములకు ఎకరానికి రూ. 20లక్షల వరకు, లోపలి భూములకు ఎకరానికి రూ.15 లక్షల వరకు చెల్లించాలని రైతులు మంత్రితో విన్నవించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా భూమిరేటు తెగాలంటే ముందుగా గ్రావిటీ కెనాల్కు సంబంధించి మార్కింగ్ చేయాలని, జాతీయ రహదారి వెంబడి ఎన్ని ఎకరాలు, లోపలి భాగంలో ఎన్ని ఎకరాల భూమి అవసరం ఉందో గుర్తించాలని మంత్రి రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. మరో రెండు, మూడు రోజుల్లో అధికారులు మార్కింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాం రామప్ప నుంచి లక్నవరం వరకు నిర్మించనున్న గ్రావిటీ కెనాల్ నిర్మాణంలో భూమి కోల్పోయే రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాం. ఎంత మేర భూమి అవసరం ఉంది. జాతీయ రహదారి వెంబడి, లోపలి ప్రాంతాల్లో ఎంత వరకు పరిహారం చెల్లించాలనే విషయంపై జంగాలపల్లి, కాసిందేవిపేట రైతులతో చర్చించాం. ముందుగా కెనాల్ నిర్మాణానికి మార్క్ చేసి ప్రతిపాదనలు అందించాలని అధికారులకు సూచించారు. తదనంతరం రైతులు అడిగిన రేటు, ప్రభుత్వం తరఫున అందించే రేటును బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకుంటాం. రైతులు సహకరించాలి. – సీతక్క, రాష్ట్ర మంత్రి -
వడదెబ్బపై అవగాహన కల్పించాలి
ములుగు: వేసవిలో ఎదురయ్యే వడదెబ్బపై విద్యార్థులు, కూలీలకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావులతో కలిసి వైద్యవిద్య, వ్యవసాయశాఖ, ఎంపీడీఓలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని ఎన్ఆర్ఈజీఎస్ పనులను వెళ్తున్న కూలీలకు పని ప్రదేశంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. ఎక్కడా చిన్న సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వడదెబ్బకు గురైన వ్యక్తికి సకాలంలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బడీడు పిల్లలను ఎట్టి పరిస్థితిలో బయటికి పంపవద్దని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకరావాలని తెలిపారు. వేసివి ముగిసేంత వరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కూలీలు వడదెబ్బకు గురైతే వెంటనే 108 సిబ్బందిని సంప్రదించి ఆస్పత్రికి తరలించాలన్నారు. ప్రతిరోజూ ఉదయం 11గంటల వరకు పనులు ముగించుకునేలా కూలీలకు సూచనలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ గోపాల్రావు, డీపీఓ దేవ్రాజ్, డీఈఓ పాణిని, జిల్లా ఇరిగేషన్ అధికారి అప్పలనాయుడు, ఎన్పీడీసీఎల్ డీఈ నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లాకేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రహరీ, వెలివేషన్, పేయింటింగ్, గ్రీనరీ, భవన సుందరీకరణ పనులను పూర్తిచేయాలని సూచించారు. అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలి వాజేడు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం మండలస్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులను గుర్తించి అందజేయాలన్నారు. ప్రత్యేకంగా ఎంపీడీఓ, ఎంపీఓలు చొరవ చూపాలని ఆదేశించారు. వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం మండల పరిధిలోని టేకులగూడెం వెళ్లిన కలెక్టర్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలపై లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. మండల కేంద్రానికి కలెక్టర్ దివాకర వచ్చిన సందర్భంగా ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పలు సమస్యలపై వినతులు అందజేశారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
ఒగరుకాల్వ బుంగ పూడ్చివేత
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప సరస్సు ప్రధానమైన ఒగరు కాల్వకు పడిన బుంగను నీటిపారుదల శాఖ అధికారులు బుధవారం పూడ్చివేశారు. గత ఆదివారం రాత్రి కాల్వకు బుంగపడి సాగునీరంతా వృథాగా పోతుండడంతో నీటి సరఫరాను నిలిపివేసిన అధికారులు మంగళవారం, బుధవారం బుంగపడిన ప్రదేశంలో 400 ఇసుక బస్తాలను వేసి పూడ్చివేశారు. బుంగను పూడ్చివేసిన అనంతరం ఒగరుకాల్వ ద్వారా ఆయకట్టు పొలాలకు సాగునీటిని విడుదల చేసినట్లు డీఈ రవీందర్రెడ్డి, ఏఈ జయంతి తెలిపారు. కూలీల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలి వాజేడు: వలస కూలీల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకోవాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు వాజేడు, పేరూరు వైద్యులు మధుకర్, రాహిల్కు సూచించారు. వాజేడు వైద్యశాలకు బుధవారం వచ్చిన ఆయన హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతీ ఆశకార్యకర్త వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి నెలవారీగా మందులను అందించాలన్నారు. ఆయన వెంట కోటిరెడ్డి, వేణుగోపాల్, కృష్ణా తదితరులు ఉన్నారు. క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన వెంకటాపురం(కె): రైతులు నష్టపోయిన మొక్కజొన్న పంటలను బుధవారం హైదరాబాద్ నుంచి వచ్చిన తెలంగాణ విత్తన ధ్రువీకరణ ఏజెన్సీ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదేశాల మేరకు వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాల్లో రైతుల పంటల వద్దకు జేడీఏ లక్ష్మణ్, హెడ్ క్వార్టర్స్ డీడీ శంకరయ్య, ఏడీఎస్సీలు సంతోష్, వేమ, ఎస్సీఓలు అపర్ణ, వేణుమాధవ్లు నేరుగా పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి ఆదేశాలతో కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. మొక్కజొన్న లీఫ్ అనాలసిస్, గింజల ఉత్పత్తిపై పరిశీలనకు నమూనాలను సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపిస్తామని తెలిపారు. మొక్కజొన్న పంట పరిశీలన నివేదికలను మంత్రి తుమ్మల నాగేశ్వరావుకు పంపించనున్నట్లు వెల్లడించారు. మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి గోవిందరావుపేట: మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పోరిక గోవింద్నాయక్ అన్నారు. మండల పరిధిలోని చల్వాయిలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లకావత్ నరసింహనాయక్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి గోవింద్ నాయక్ హాజరై మాట్లాడారు. గత కొద్ది రోజులుగా పేద, ఆదివాసీ, గిరిజన రైతులను లక్ష్యంగా చేసుకుని దళారులు పూర్తిస్థాయిలో దిగుబడి రాని నకిలీ విత్తనాలు రైతులకు ఇచ్చి వేల రూపాయలు పెట్టుబడులు పెట్టించి నిండా ముంచుతున్నారని తెలిపారు. రైతులను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న దళారులతో పాటు వారికి మద్దతు పలుకుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పూర్ణ చందర్, నాయకులు ఈసం సమ్మయ్య, మధు, ఓదెలు, సంజీవ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
బాండ్ మొక్కజొన్న విత్తన శాంపిళ్ల సేకరణ
వెంకటాపురం(కె): వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో మంగళవారం వ్యవసాయశాఖ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాండ్ మొక్కజొన్న విత్తనాల శాంపిళ్లను సేకరించారు. మండల పరిధిలోని గత కొంతకాలంగా మొక్కజొన్న బీటీ విత్తన సాగు జరుగుతుందనే రైతుల ఆందోళన నేపథ్యంలో విత్తనాలు, ఆకులను ఏటూరునాగారం ఏడీఏ అవినాష్ వర్మ ఆధ్వర్యంలో సేకరించారు. సేకరించిన విత్తనాలను సీజ్ చేసి పరీక్షల కోసం హైదరాబాద్ ల్యాబ్కు పంపించినట్లు మండల వ్యవసాయశాఖ అధికారి నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాజేడు వ్యవసాయశాఖ అధికారి మహేష్, ఏఈవోలు శ్యామ్, జాఫర్, హరీశ్, కల్యాణి తదితరులు పాల్గొన్నారు. ‘విజయ్, నాగరాజును విడుదల చేయాలి’ ములుగు: జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన ఇల్లందుల విజయ్, తీగారం గ్రామానికి చెందిన నాగరాజును పోలీసులు వెంటనే విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యర్శులు గడ్డం లక్ష్మణ్, నారాయణరావు పోలీసులను మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. మంగళవారం ఉదయం 10గంటల సమయంలో వాజేడు సమీపంలో పోలీసులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నారని వివరించారు. విజయ్, నాగరాజులను గుట్టల చుట్టూ తిప్పుతూ ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే సీతక్క చొరవ తీసుకొని వారిని విడిపించాలని డిమాండ్ చేశారు. గొత్తికోయగూడేల్లో చేతిపంపుల మరమ్మతు ఏటూరునాగారం: మండల పరిధిలోని గొత్తికోయగూడేల్లో మంగళవారం చేతి పంపులను మరమ్మతు చేసి తాగునీటిని అందజేసినట్లు పంచాయతీ కార్యదర్శి రమాదేవి తెలిపారు. సాక్షిలో ‘వేసవి ముందే వెతలు’ శిర్షీకన కథనం వెలువడింది. ఈ మేరకు పంచాయతీ అధికారులు స్పందించి గంటలకుంట గిరిజనగూడెంలో నీటి ఎద్దడిని తీర్చేందుకు చేతి పంపులకు మరమ్మతులు చేపట్టారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. అంతేకాకుండా ఎలిశెట్టిపల్లి, అల్లంవారిఘణపురం, వీరాపురం తదితర గ్రామాల్లో నల్లాలు, చేతి పంపులు మరమ్మతు చేయించి తాగునీటి సౌకర్యం కల్పించినట్లు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలిఏటూరునాగారం: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జేవీవీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మల్లయ్య, ప్రధాన కార్యదర్శి గడ్డి శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై కస్తూర్బా గాంధీ స్వచ్చంధ సంస్థ అధ్యక్షురాలు కొమరిగిరి సామ్రాజ్యాన్ని సన్మానించారు. అలాగే అంగన్వాడీలు, ఐకేపీ సభ్యులు, టీచర్లను సన్మానించి మెమెంటోలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలన్నారు. కుటుంబ, విద్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు. -
పులకించిన కొండపర్తి
ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ మంగళవారం రావడంతో గిరిజనుల్లో ఆనందం వెల్లివెరిసింది. రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి గవర్నర్ కొండపర్తికి రావడంతో ఆదివాసీల నృత్యాలు, డోలువాయిద్యాలు, మంగళహారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్కతో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన కొమురంభీం, బిర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించారు. పాఠశాలలోని డిజిటల్ క్లాస్ ప్రొజెక్టర్, కారంపొడి, మసాలా యూనిట్లతోపాటు కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు కొండపర్తికి వచ్చిన గవర్నర్ 1.40 గంటల వరకు గ్రామస్తులతో గడిపారు. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామానికి గవర్నర్ రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు గవర్నర్ చేతుల మీదుగా బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గవర్నర్ను మేడారం జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్దొర గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ వెంకటేశ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్కు సన్మానం.. జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్కు మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర పూలమొక్క అందించి శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. పోలీసుల భారీ బందోబస్తు కొండపర్తిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఎస్పీ డాక్టర్ శబరీశ్ పర్యవేక్షణలో డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ రవీందర్, ఎస్ఎస్ తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి సోమవారం సాయంత్రం నుంచే కొండపర్తి గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గవర్నర్ కాన్వాయ్తో రోడ్డు మార్గాన రావడంతో పోలీసులు పస్రా నుంచి కొండపర్తి వరకు అడుగడుగునా కట్టుదిట్టమైన భారీ భద్రత చర్యలు చేపట్టారు. మేడారానికి గవర్నర్ దర్శనానికి వెళ్లిన సందర్భంగా కొండపర్తి నుంచి మేడారం వరకు సైతం బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆదివాసీలతో మమేకమైన గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు ఘనస్వాగతం పలు ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవం భారీ పోలీసు భద్రత నడుమ సాగిన పర్యటనఅమ్మవార్లకు మొక్కులు మేడారం సమ్మక్క – సారలమ్మల గద్దెల వద్ద గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. గవర్నర్ 74కిలోల ఎత్తు బంగారం (బెల్లం) అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు. పూజలు నిర్వహించిన అనంతరం దేవాదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు గవర్నర్కు పట్టువస్త్రాలను కానుకగా అందించారు. -
రాజశేఖర్రెడ్డికి 8వ ర్యాంక్
బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన చిమ్ముల రాజశేఖర్రెడ్డి గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. చిమ్ముల అరుణ– మల్లారెడ్డి దంపతులు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు ప్రస్తుతం జనగామ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నది. కుమారుడు చిమ్ముల రాజశేఖర్రెడ్డి గ్రూప్–2 ఫలితాల్లో 423.933 మార్కులు సాఽధించి రాష్ట్ర 8వ ర్యాంక్ సాధించాడు. గతంలో రాజశేఖర్రెడ్డి వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి పదవులకు కూడా ఎంపికయ్యాడు. ఉన్నతమైన లక్ష్యంతో కష్టపడి చదివి రాష్ట్ర ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
కరకట్ట ఎత్తు పెంచడంలో ప్రభుత్వం విఫలం
ఏటూరునాగారం: గోదావరి కరకట్ట ఎత్తు పెంచడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు గండేపల్లి సత్యం అన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు చక్రవర్తి ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం ఏటూరునాగారం నుంచి రామన్నగూడెం వరకు ఉన్న గోదావరి కరకట్ట శిథిలమైన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం సత్యం మాట్లాడుతూ 20ఏళ్ల క్రితం గోదావరి జంపన్నవాగు వరద నీరు గ్రామంలోకి వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన అప్పటి ప్రభుత్వం ఏటూరునాగారం నుంచి రామన్నగూడెం వరకు కరకట్ట నిర్మాణం చేపట్టిందన్నారు. క్రమంగా అది కొట్టుకుపోవడం దానికి తోడు కరకట్ట పక్కనే ఇసుక క్వారీలు ఏర్పాటు చేయడంత్లో కరకట్ట పరిస్థితి పూర్తి అధ్వానంగా తయారైందని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన అప్పటి సీఎం కేసీఆర్ 2022లో కరకట్టను పరిశీలించి ఎత్తు పెంచుతామని హామీ ఇచ్చి మరిచారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జియోట్యూబ్స్ వేయడానికి రూ.70లక్షలు కేటాయించిందని తెలిపారు. కానీ గతంలో మరమ్మతుల కోసం రూ.6.5లక్షలు ఖర్చు చేసిన అధికారులు అప్పటి వరకే తాత్కాలిక పనులు చేసి చేతులు దులుపుకున్నారని వివరించారు. రానున్న వర్షాకాలం నాటికై నా కరకట్ట ఎత్తు పెంచితే గ్రామాల్లోకి వరదలు రాకుండా ఉంటాయని తెలిపారు. బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్యం -
ప్రణీత్ ప్రతిభ..
కొడకండ్ల: మండల కేంద్రంలోని నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రణీత్ 388 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించారు. సోమనారాయణ–నాగలక్ష్మి మూడో కుమారుడు ప్రణీత్ 2019 హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్లోని కోచింగ్ తీసుకుని గ్రూప్స్ పరీక్షలు రాశారు. డిసెంబర్లో వెలువడిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 58వ ర్యాంకు సాధించి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. గ్రూప్–1 పరీక్షలో 380 మార్కులు సాధించగా.. గ్రూప్–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించాడు. -
కష్టపడ్డారు..
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025గ్రూప్– 2 ఫలితాల్లో ఓరుగల్లు అభ్యర్థుల ప్రతిభ– 8లోuముల్కలపల్లి యువకుడు ఉపేందర్.. డోర్నకల్: గ్రూప్–2 ఫలితాల్లో ముల్కలపల్లికి చెందిన మేకల ఉపేందర్ ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన మేకల రమణయ్య–రమణమ్మ దంపతుల కుమారుడు ఉపేందర్ ప్రస్తుతం మహబూబాబాద్ కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తూ గ్రూప్–2 పరీక్షలు రాశారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉపేందర్ 423.119 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో టాప్–10లో 9వ స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన ఉపేందర్ను గ్రామస్తులు అభినందించారు. ● ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షకు సన్నద్ధం ● పలువురికి మెరుగైన ర్యాంకులు ● హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులుకొందరు ఒకపక్క ఉద్యోగం చేస్తూనే ఉన్నతస్థాయికి వెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడ్డారు. అనుకున్న లక్ష్యం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఉన్న సమయంలోనే ప్రణాళికాబద్ధంగా చదవడం, విషయాన్ని అర్థం చేసుకుని పోటీ పరీక్షలు రాయడం ద్వారా ర్యాంకులు సాధించవచ్చని ఆయా అభ్యర్థులు అంటున్నారు. – సాక్షి నెట్వర్క్భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్కుమార్ రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన శనిగరపు రాధ–భద్రయ్య దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్కుమార్. తల్లి రాధ అంగన్వాడీ హెల్పర్గా, తండ్రి భద్రయ్య సింగరేణి సంస్థలో కాంట్రాక్టు స్వీపర్గా పనిచేస్తున్నారు. ప్రవీణ్కుమార్ బీటెక్ పూర్తి చేసి 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి గణపురం మండలంలోని కర్కపల్లిలో విధులు నిర్వహించారు. 2021లో వీఆర్ఓ ఉద్యోగం సాధించి 6 నెలలపాటు మహదేవపూర్ మండలంలోని అంబటిపల్లిలో పనిచేశారు. ఆ సంవత్సరంలోనే గ్రూప్–4 పరీక్షలో ప్రతిభ కనబరిచి హైదరాబాద్లోని జీఎస్టీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేశారు. అదే శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే 2024 డిసెంబర్లో జరిగిన గ్రూప్–2 పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు, కాళేశ్వరం జోన్ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. మూడు శ్రీకాంత్ను సన్మానిస్తున్న మాజీ ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులుగూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మారుమూల ఏజెన్సీ గ్రామం జంగుతండాకు చెందిన మూడు భద్రు కుమారుడు శ్రీకాంత్ గ్రూప్–2 ఫలితాల్లో ఎస్టీ కేటగిరీలో ప్రతిభ కనబరిచారు. ఎస్టీ కేటగిరీలో ప్రథమ, జోనల్ వైస్ ఓపెన్ కేటగిరీలో మూడో ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 38వ ర్యాంకు సాధించినట్లు శ్రీకాంత్ తెలిపారు. గతంలో గ్రూప్–4 సాధించి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు, గ్రూప్–3 లో కూడా మంచి మార్కులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్ను మాజీ సర్పంచ్ అరుణమంగీలాల్నాయక్, మాజీ ఎంపీటీసీ గీతాఅమరేందర్రెడ్డి, తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు సన్మానించారు. న్యూస్రీల్కాసింపల్లి వాసి -
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
గోవిందరావుపేట: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని పస్రా, కోటగడ్డ గ్రామాలలో కోటి రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మంగళవారం మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అబివృద్ధి చేయడమే లక్ష్యమని, ఇప్పటికే ములుగు జిల్లాకు రూ.500 కోట్లకు పైగా నిధులు కేటాయించగా పనులు జరిగాయన్నారు. ములుగులో ఇప్పటికే మెడికల్ కాలేజీ, గిరిజన యూనివర్శిటీకి భూమిని కేటాయించడం, ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, మల్లంపల్లి మండలం ఏర్పాటు, జిల్లా కేంద్రంలో మోడ్రన్ బస్టాండ్, ఏటూరునాగారంలో బస్డిపో మంజూరు చేశామని తెలిపారు. మహిళల అభ్యున్నతికి పలు రకాల కార్యక్రమాలను చేపట్టి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకుసాగుతుందన్నారు. మహిళా గ్రూపులకు స్వయం ఉపాధియే లక్ష్యంగా, ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ, పన్నాల ఎల్లారెడ్డి, పీఆర్ ఈఈ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదువుతోనే మార్పు ప్రతీఒక్కరి తలరాత మార్చేది చదువేనని మంత్రి సీతక్క అన్నారు. చల్వాయి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దిశా ఫౌండేషన్ వారి సెల్ఫ్ ఇంగ్లిష్ లర్న్ టూ రీడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. విద్యార్థులు సాంకేతిక రంగాల్లో రాణించేందుకు ఇంగ్లిష్ నేర్చుకోవాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క పస్రా, కోటగడ్డ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
కరాటేలో విశాల్సాయి ప్రతిభ
ఏటూరునాగారం: రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో విశాల్స్థాయి ప్రతిభ చూపి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు కోచ్ ఎండీ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా విశాల్సాయితో పాటు కరాటే పోటీల్లో ప్రతిభ చూపిన వారిని ఆయన సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి కరాటే పోటీలు ఆదివారం హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించారని తెలిపారు. ఈ పోటీలకు ఏటూరునాగారం కరాటే అకాడమికి చెందిన క్రీడాకారులు హాజరై ప్రతిభ కనబర్చారని వివరించారు. సబ్ జూనియర్ విభాగంలో వసంత విశాల్సాయి 40 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించగా ఊరుగొండ అఖిలేష్, భూక్య అభిమార్ 25 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించారని వివరించారు. బంగారు పతకం సాధించిన విశాల్సాయి జూన్ 14వ తేదీన ఉత్తరాఖండలోని డెహ్రాడూన్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు హాజరుకానున్నట్లు హుస్సేన్ తెలిపారు. అలాగే అలువాల విఘ్నశ్రీ, అభిరామ్ బ్రాస్ పతకాన్ని సాధించారు. ఈ కార్యక్రమంలో మణిదీపిక, స్వాతిక, గణేశ్లతో పాటు కరాటే మాస్టర్ అబ్బు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు కుర్సం పుష్పలత. మంగపేట మండలం చెరుపల్లి గ్రామం. తన భర్త రాజు రెండు నెలల క్రితం ధాన్యం తూర్పాల పడుతుండగా చేయి ఫ్యాన్లో పడి విరిగిపోయింది. ఇంటికి పెద్దదిక్కు పనిచేయకుండా ఉండడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఐటీడీఏ నుంచి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని.. గత నెలలో కూడా గిరిజన దర్బార్లో వినతి అందజేసినా ఫలితం లేకుండా పోయింది.. అధికారులు ఇప్పటికై నా ఆదుకోవాలని కోరుతూ మళ్లీ గ్రీవెన్స్లో వినతి పత్రం అందజేసింది.న్యూస్రీల్ -
రామప్ప ఒగరుకాల్వకు బుంగ
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప సరస్సు ప్రధాన కాల్వ ఒగరుకాల్వకు అదివారం రాత్రి బుంగపడింది. ప్రధాన తూము సమీపంలోనే బుంగపడి పక్కనే ఉన్న పంటపొలాల్లోకి నీరంతా చేరడంతో కొంతమేర మునిగిపోయాయి. సమాచారం తెలుసుకున్న నీటి పారుదల శాఖ ఈఈ నారాయణ, డీఈ రవీందర్రెడ్డి, ఏఈ జయంతిలు బుంగ పడిన ప్రదేశాన్ని సోమవారం పరిశీలించారు. ఈ క్రమంలో ఒగరుకాల్వకు నీటి సరఫరాను నిలిపివేశారు. తొందరలోనే బుంగ పడిన ప్రదేశానికి మరమ్మతులు చేపట్టి కాల్వ ద్వారా ఆయకట్టు పంట పొలా లకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. పాఠశాలలో డిజిటల్ ప్రొజెక్టర్ ఏర్పాటు ఎస్ఎస్ తాడ్వాయి: మండల పరిధిలోని కొండపర్తి ఎంపీపీఎస్ పాఠశాలలోని తరగతి గదిలో డిజిటల్ ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు. మారుమూల గిరిజన గ్రామంలో గిరిజనులకు నాణ్యమైన ఇంగ్లిష్ విద్యను అందించాలనే సంకల్పంతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత గ్రామం కావడంతో పాఠశాలలో ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు. నేడు (మంగళవారం) ఈ డిజిటల్ ప్రొజెక్టర్ను గవర్నర్ ఆవిష్కరించనున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. వీరవనిత సావిత్రిబాయి పూలే ములుగు: మహిళలను చైతన్యపరిచిన వీరవనిత సావిత్రిబాయి పూలే అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట సోమవారం సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా, సామాజిక కార్యకర్తగా, సంఘ సేవకురాలిగా ఆమె పనిచేశారని తెలిపారు. సమాజంలోని మూఢనమ్మకాలపై నిరంతరం పోరాటం చేశారని ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జన్ను రవి, పౌడాల ఓం ప్రకాశ్, ఎండీ అహ్మద్పాషా, ఓరుగంటి అనిల్, గందె రాజు, గందె మధు, గాజె రాజు, మాదారపు రాజు, షర్పోద్ధీన్, నరేష్, పైడిమల్ల భరత్ తదితరులు పాల్గొన్నారు. ఇంటి చుట్టూ ఉచ్చుతీగలు కాటారం: మండలంలోని గూడూరులో ఓ ఇంటి చుట్టూ వన్యప్రాణుల వేటకు ఉపయోగించే ఉచ్చు తీగలను పలువురు గుర్తు తెలియని దుండగులు అమర్చిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సదాశివ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లి రాత్రి వచ్చి ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. కుటుంబ సభ్యులు ఉదయం లేచి చూసే సరికి ఇంటి ముందు ఉచ్చు తీగ అమర్చి సమీపంలోని విద్యుత్ స్తంభానికి తీగలను తగిలించి ఉంది. ఆ స్తంభానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై–2 శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎవరైనా హత్యాయత్నానికి ప్రయత్నించారా, లేక గ్రామ శివారులో ఉండటంతో వన్యప్రాణుల వేట కోసం ఉచ్చుతీగ బిగించి ఉంటారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ఆంగ్లంలో మెళకువలు నేర్చుకోవాలి
వెంకటాపురం(ఎం): ఉపాధ్యాయులు ఆంగ్లంలో మెళకువలు నేర్చుకుని విద్యార్థులకు బోధించాలని జిల్లా సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారి అర్షం రాజు పేర్కొన్నారు. మండల పరిధిలోని జవహర్నగర్ మోడల్ స్కూల్లో దిశా ఫౌండేషన్ సహకారంతో జిల్లాలోని 54ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుండగా ఆయన సో మవారం హాజరై ఉపాధ్యాయులను ఉద్దేశించి మా ట్లాడారు. విద్యార్థులకు వీడియో పాఠాల ద్వారా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతీ పాఠశాలకు వీడియో పాఠాల మెమోరీ కార్ట్స్, వర్క్బుక్లు, ప్లాష్కార్డులు, బోధనోపకరణాలు అందజేయనున్నట్లు తెలిపారు. వీడియో పాఠాల ద్వారా విద్యార్థులు 80 రోజుల్లోనే ఇంగ్లిష్లో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దిశా ఫౌండేషన్ ప్రతినిధులు ఐశ్వర్య, ప్రతిభ, ముబీన్లు పాల్గొన్నారు.జిల్లా సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారి రాజు -
రాష్ట్రస్థాయికి జంతుశాస్త్ర పరిశోధన ప్రాజెక్ట్ ఎంపిక
ములుగు: ఇంపాక్ట్ ఆఫ్ సాయిల్ ఆర్థోపోర్డ్స్ ఇన్ చిల్లీ క్రాప్ ఇన్ జాకారం విలేజ్ ఆఫ్ ములుగు డిస్ట్రిక్ అంశంపై చేసిన పరిశోధన రాష్ట్ర స్థాయికి ఎంపిక కాగా ఖైరతాబాద్లో ప్రదర్శించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం తెలిపారు. జిజ్ఞాస స్టూడెంట్ స్టడీస్ ప్రాజెక్టు పోటీలలో జంతుశాస్త్ర విద్యార్థుల ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు వివరించారు. ఈ మేరకు సోమవారం జంతుశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ అనిల్కుమార్ ఆధ్వర్యంలో పరిశోధక విద్యార్థులు పాలెం పునీత, పల్లెపు శృతి, బైరి కావ్య, సయ్యదబీబీ, రబియాలను ప్రిన్సిపాల్ అభినందించారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.25వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ.18వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ.10వేలు బహుమతిగా అందుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బాలయ్య, అకాడమీ కో ఆర్డినేటర్ భాస్కర్, న్యాక్ కో ఆర్డినేటర్ కవిత, అధ్యాపకురాలు సరిత, నాగమణి, శిరీష, రాధిక, అనిల్కుమార్, ఉదయశ్రీ, విజిత, జగదీశ్, శ్రీను, మౌలానా, అనిత, రమేష్, లక్ష్మీ, షరీఫా తదితరులు పాల్గొన్నారు. -
పశువుల అక్రమ రవాణాను అరికట్టడంలో విఫలం
ములుగు: పశువుల అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారులు విఫలం చెందారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శీలమంతుల రవీంద్రచారి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో బలరాం మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయన్నారు. ఎక్కడ చూసినా అశాంతి కనిపిస్తుందని తెలిపారు. గంజాయి అమ్మకాలు, సేవించడం విపరీతంగా పెరిగిపోతుందన్నారు. పట్టణం నుంచి పల్లెలకు గంజాయి సరఫరా మొదలయ్యిందని వివరించారు. యువత మత్తులో మునిగి తేలుతుందన్నారు. ఎప్పుడో బుద్ధిపుట్టినప్పుడు సోదాలు చేయడం తప్పా సంకల్పంతో పనిచేసే అధికారులే లేరని వాపోయారు. మంత్రి సీతక్క గ్రామాల్లో పర్యటించడం తప్పా జరుగుతున్న తతంగాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా అధికారులతో తరుచుగా సమావేశాలు ఏర్పాటు చేసి గంజాయి. పశువుల అక్రమ రవాణాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ భూక్య జవహర్, ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు జినుకల కృష్ణాకర్రావు, రవీందర్రెడ్డి, రాజ్కుమార్, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం -
సైక్లింగ్ పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ
ములుగు: ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా సైక్లింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపారు. కోచ్ శ్రీరాంనాయక్ ఆధ్వర్యంలో 24మంది పోటీలలో పాల్గొనగా అండర్–14 విభాగంలో క్రీడాకరులు ఐశు సిల్వర్, బ్రాంజ్, దివ్య బ్రాంజ్, నవీన్ సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. అండర్–16 విభాగంలో సాయి చరణ్ గోల్డ్, వర్షిణి రెండు సిల్వర్ మెడల్స్, అండర్–18 విభాగంలో కుశ్వంత్ రెండు గోల్డ్ మెడల్స్, చక్రవర్తి రెండు గోల్డ్ మెడల్స్ సాధించగా జిల్లాకు మొత్తంగా 12 మెడల్స్ వచ్చాయి. ఈ మేరకు సోమవారం జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్, డీవైఎస్ఓ తుల రవీందర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి ఎలగందుల మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమురవెళ్లి హరినాథ్లు క్రీడాకారులతో పాటు కోచ్ను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం క్రీడాకారులకు సైకిళ్లను అందిస్తానని వివరించారు. -
గవర్నర్ పర్యటనకు సర్వం సిద్ధం
ములుగు: గవర్నర్ జిష్టుదేవ్ వర్మ పర్యటనకు సర్వం సిద్ధం చేసినట్లు, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ టీఎస్.దివాకర సూచించారు. ఈ మేరకు మంగళవారం గవర్నర్ దత్తత గ్రామం ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని కొండపర్తికి వస్తున్న క్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, డీఎస్పీ రవీందర్తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో సోమవారం కలెక్టర్ మాట్లాడారు. గవర్నర్ కొండపర్తిని పరిశీలించిన అనంతరం మేడారం వనదేవతలను దర్శించుకుంటారన్నారు. పర్యటన పూర్తి అయ్యేంత వరకు ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ప్రణాళికతో విధులు నిర్వహించి అధికారులు గవర్నర్ పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు ఉండేలా చూసుకోవాలన్నారు. అతిథిగృహంలో గదులను శుభ్రం చేయాలని, శానిటేషన్ పనులు చేపట్టాలన్నారు. పోలీసు శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రత చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, ఎంపీడీఓలు, తహసీల్దార్లు ఎంపీఓలు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
● వీసీలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఏటూరునాగారం: పంటలు కాపాడేందుకు అధికా రులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు సో మవారం రాత్రి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు. హైదరాబాద్ నుంచి మంత్రులు సోమవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా తరఫున కలెక్టర్ దివాకర హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మా ట్లాడుతూ చుక్క నీరు వృథా కాకుండా సమర్థవంతంగా పంటలకు నీరు ఇవ్వాలన్నారు. రబీ పంటలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువులు, నీటి వనరులపై ఇరిగేషన్ శాఖతో సమావేశాలు నిర్వహించి నీటి పంటలకు పూర్తి స్థాయిలో అందేలా చూడాలన్నారు. ఓసీలో బ్లాస్టింగ్లతో ఇళ్లు ధ్వంసంగణపురం: మండలంలోని ఓసీ–3 ప్రాజెక్టులో నిత్యం పేలుస్తున్న బాంబులతో తమ ఇళ్లు ధ్వంసం కావడంతో పాటు తీవ్రంగా దుమ్ము ధూళి బయటకు వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నామని పరుశరాంపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఓసీ–3 ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం నుంచే ఆందోళనకు దిగారు. ఓసీ–3 ఓపెన్ కాస్టు గనిలో రోజు బొగ్గు తవ్వకాలకు ఉపయోగిస్తున్న భారీ బాంబులతో తమ ఇండ్లు పగుళ్లు పట్టడంతో పాటు గని నుంచి పెద్దఎత్తున దుమ్ము ఇండ్లలోకి చేరుకుంటుందని ఆరోపించారు. సింగరేణి అధికారులు వెంటనే తమ గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా ప్రకటించి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తుల ఆందోళనతో పెద్దఎత్తున గనిలోకి వెళ్లి వచ్చే బొగ్గు లారీలు రోడ్డుపై నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు, పోలీసులు ఆందోళన వద్దకు చేరుకొని గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ తమకు ఖచ్చితమైన హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించమని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి ఆందోళన వద్దకు వచ్చి తమకు లిఖిత పూర్వకంగా రాసిస్తే సీఎండీ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
తీసుకున్న భూమికి పరిహారం అందించాలి
వాజేడు మండల పరిధిలోని చెరుకూరు గ్రామంలో జాతీయ రహదారి పక్కన పట్టా నంబర్ 106/3లో మా నాన్న కోరం శ్రీనివాస్రావు, సోదరుడు యుగేంధర్కు 2.18 ఎకరాల భూమి ఉంది. 2013–14లో అప్పుడు ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు చేసినప్పుడు భూమిని తీసుకున్నారు తప్పా పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు అదే దారి రహదారి అయ్యింది. పట్టా భూమి తీసుకోవడం తప్పా ఎలాంటి పరిహారం చెల్లించలేదు. ఈ విషయంపై అధికారులు విచారణ చేపట్టి పరిహారం అందేలా చూడాలి. – కోరం మనోజ్, చెరుకూరు, వాజేడు పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమిని పట్టా చేయాలి.. నాకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు. నాకున్న భూమిని ముగ్గురు కుమారులకు సమానంగా పంచి ఇచ్చాను. సర్వే నంబర్ 128/ఏ లోని 34గుంటలు, 128/బి సర్వే నంబర్లోని 34గుంటలను నాపేరు పైనే ఉంచుకున్నాను. అందులో నుంచి 128/బిలో భూమిని కుమార్తె రజితకు పసుపు కుంకుమల కింద ఇచ్చాను. ఆ భూమిని నా కుమారులు బుద్దె రవి, బుద్దె శంకర్లు తమ పేర్ల మీద దొంగపట్టా చేసుకోవాలని చూస్తున్నారు. – బుద్దె పాపయ్య, బండారుపల్లి, ములుగు● -
విన్నవించాం.. పరిష్కరించండి
ప్రజావాణి, గిరిజన దర్బార్లో ప్రజల వినతులు● స్వీకరించిన అధికారులు ● కలెక్టర్, పీఓ లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగిన ప్రజలుగిరిజన దర్బార్లో.. మంగపేట మండలానికి చెందిన తొలెం నర్సయ్య 25 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేసేందుకు పెసా గ్రామ సభల ద్వారా వీడీసీలు స్థానిక ఆదివాసీలకు ఇప్పించాలని కోరారు. వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామానికి చెందిన పాయం రాందాస్ రైస్ మిల్లు మంజూరు చేయాలని వేడుకున్నారు. ఏటూరునాగారం మండలం శివాపురం ప్రాంతానికి చెందిన కృష్ణవేణి నిరుద్యోగిగా ఉన్నానని కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. వెంకటాపురం మండలం బోదాపురం ప్రాంతానికి చెందిన ఇరుప అనిత మినీ అంగన్వాడీ సెంటర్లో టీచర్గా ఉద్యోగం ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం ప్రాంతానికి చెందిన తోలెం హైమ కంటింజెంట్ వర్కర్గా విధులు నిర్వర్తించడానికి అనుమతి ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ సురేష్బాబు, మేనేజర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. అడవి పందుల నుంచి చేతికి వచ్చిన పంటలను రక్షించాలని కోరుతూ ములుగు మండలంలోని చిన్నగుంటూరుపల్లి, పులిగుండం, పొట్లాపూర్, బండారుపల్లి, పత్తిపల్లి, మదనపల్లి, జగ్గన్నపేట, పంచోత్కులపల్లి గ్రామాలకు చెందిన సుమారు 40 మంది రైతులు కర్షక సంక్షేమ సలహా సంఘం ఆధ్వర్యంలో తమగోడును కలెక్టరేట్కు వచ్చారు. గుంపులు గుంపులుగా వస్తున్న అడవిపందులు మొక్కజొన్న, వరి, మిర్చి పంటలను నాశనం చేస్తున్నాయని వాపోయారు. వాటి బారి నుంచి పంటలను కాపాడుకోవడానికి బ్యాంకు ద్వారా సబ్సిడీ కింద సోలార్ ఫెన్సింగ్ రుణం అందించాలని కోరారు. లేని పక్షంలో అడవి పందులు గ్రామాల్లోకి రాకుండా అటవీశాఖ తరఫున తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అడవి పందుల నుంచి పంటలను రక్షించాలి -
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025
ఏజెన్సీ గ్రామాల్లో తీవ్రమైన నీటిఎద్దడి ● ప్రతీ ఎండాకాలంలో తప్పనితిప్పలు ● గోదావరి, వాగునీరే గిరిజనులకు ఆధారం ● పట్టించుకోని అధికారులు, పాలకులు ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పకల మహేశ్. ఏటూరునాగారం మండలం వీరాపురం. కూలి పనులు, వ్యవసాయ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తాగునీటి కోసం ప్రతిరోజూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జంపన్నవాగుకు కాలినడకన వెళ్తున్నాడు. వాగులో చెలిమల నుంచి నీటిని తోడుకుని కావడితో నీటి బిందెలను మోసుకుంటూ ఇంటికి చేరుకుంటాడు. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కావడితో నీటిని తెస్తేగాని ఇంట్లో వారి దాహం తీరదు.ఏటూరునాగారం: ఏజెన్సీలో వంద కిలోమీటర్ల మేర గోదావరి ప్రవహిస్తున్నా వేసవికి ముందే నీటి ఎద్దడి మాత్రం తప్పడం లేదు. ప్రజలు, రైతులు నానాటికీ భగీరథ ప్రయత్నాలను ప్రతీ వేసవికాలంలో చేయడం ఆనవాయితీగా వస్తోంది. మిషన్ భగీరథ పథకం ఉన్నప్పటికీ తాగునీరు రాకపోవడంతో వాగులపైనే గిరిజనులు ఆధారపడుతున్నారు. పాలకులు, ప్రభుత్వాలు మారినా గిరిజనుల తలరాతలు, ఏజెన్సీవాసుల తాగు, సాగునీటి కష్టాలు తీరడం లేదు. న్యూస్రీల్ -
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
ములుగు: రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సీఎం రేవంత్రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. కలెక్టరేట్ ఆవరణలోని సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, డీడబ్ల్యూవో శిరీషతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ మహిళా క్యాంటిన్ వంటి పథకాలతో పాటు మరిన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. 37శాతం మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు వెల్లడించారు. ఎక్కడా లేని విధంగా రూ.21,635 కోట్లతో మహిళా సంఘాల గ్రూపులకు నిధులు కేటాయించి పలు పథకాల్లో భాగస్వాములను చేశామన్నారు. డ్వాక్రా మహిళలకు ప్రతినెలా రూ.5లక్షలు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సిబ్బంది చేసిన నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఆయా శాఖలలో ఉత్తమ విధులు నిర్వహించిన మహిళా ఉద్యోగులకు మంత్రి ప్రశంస పత్రాలను అందించారు. పాటల పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులపై సమీక్ష రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించాలన్నారు. జాతీయ రహదారి 100 కిలో మీటర్లు, గోదావరి పరివాహకం 100కిలో మీటర్లు ఉన్నందున పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవచ్చని తెలిపారు. ఐటీడీఏ ద్వారా చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. అదే విధంగా రామప్ప, లక్నవరం కెనాల్ భూ సేకరణ విషయంలో జంగాలపల్లి, కాసిందేవిపేట రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున న్యాయపరమైన పరిహారం అందిస్తామని రైతులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, ఆర్అండ్బీ, పీఆర్, ట్రైబల్ వెల్ఫేర్, నేషనల్ హైవే, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభం జిల్లాను యాక్సిడెంట్, డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చుకుంటామని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ను ఎస్పీ డాక్టర్ శబరీశ్, కలెక్టర్ దివాకరతో కలిసి ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. అతి వేగం, మద్యం మత్తులో ఉండి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వివరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి సీతక్క -
న్యాయ కళాశాల ఏర్పాటుకు ఉద్యమిస్తాం
వెంకటాపురం(కె): ఏజెన్సీలో న్యాయ కళాశాల ఏర్పాటు చేయకపోతే ఉద్యమిస్తామని గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి అన్నారు. మండల కేంద్రంలోని కాఫెడ్ స్వచ్చంధ సేవా సంస్థ కార్యాలయం ఆవరణలో న్యాయ కళాశాల ఏర్పాటుపై ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో న్యాయ కళాశాల ఏర్పాటు న్యాయమైన డిమాండ్గా ఉందన్నారు. న్యాయ కళాశాల సాధించుకునే వరకు ఉద్యమించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిమ తెగలను విస్మరిస్తుందన్నారు. దేశంలో అత్యధికంగా అన్యాయానికి గురైంందని ఆదిమ తెగలేనని వివరించారు. ఈకార్యకమంలో నాయకులు పాయం సత్యానారాయణ, కొర్స నర్సింహామూర్తి, ఉయిక శంకర్, మైపతి అరుణ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సాయి -
‘గ్రావెల్’ మాఫియా
హనుమకొండ జిల్లా దామెర మండలంలో యంత్రాలతో యథేచ్ఛగా మొరం తవ్వకాలు, తరలింపుసాక్షిప్రతినిధి, వరంగల్ : అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో అనుమతుల పేరిట సహజ వనరుల్ని అడ్డంగా దోచుకుంటున్నారు అక్రమార్కులు. అర్ధరాత్రి సమయంలో భారీ యంత్రాలతో గుట్టలు, ప్రభుత్వ భూముల్లో మొరం(గ్రావెల్) తవ్వేస్తూ కాసులవేట సాగిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ చుట్టూ ఉన్న దామెర, హసన్పర్తి, గీసుకొండ, శాయంపేట, ధర్మసాగర్ తదితర మండలాల్లో గ్రావెల్ మాఫియాకు అడ్డు లేకుండా పోయింది. కొందరు మొరం వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి టెంపరరీ పర్మిట్ల(టీపీ)తో పట్టా భూములు, గుట్టలు, ప్రభుత్వ భూముల నుంచి మొరం తవ్వేస్తున్నారు. చాలాచోట్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాల్వ గట్లను తవ్వుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దోపిడీ సాగుతోందిలా.. గ్రావెల్ మాఫియా టీఎస్ఎంఎంసీ రూల్స్ 1966–9(4) ప్రకారం పట్టాభూములు, రైతుల పేరిట రెండు నెలల గడువుతో తాత్కాలిక అనుమతులు పొందుతూ ఇష్టారాజ్యంగా మొరం దందా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి పొందిన భూమిలో ఏరియాను బట్టి 8–12 అడుగులలోపు లోతు మాత్రమే తవ్వాల్సి ఉంది. అలా చేస్తే రెండున్నర హెక్టార్లలో సుమారు 7–8 వేల మెట్రిక్ టన్నుల గ్రావెల్ మాత్రమే వస్తుందని మైనింగ్శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే గ్రావెల్ మాఫియా అందుకు భిన్నంగా 15–30 అడుగుల లోతు వరకు తవ్వి లారీలు, టిప్పర్ల ద్వారా పెద్ద మొత్తంలో మొరం తరలిస్తున్నారు. ఇందుకు సుమారు రెండున్నర హెక్టార్ల కోసం రూ.1.50 లక్షల వరకు రాయల్టీ చెల్లిస్తూ.. రూ.కోట్లల్లో సంపాదిస్తున్నారు. కళ్లెదుటే ఈ అక్రమం జరుగుతున్నా.. ఏ శాఖ కూడా ఆపే ప్రయత్నం చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంచికి చేరిన కోమటిపల్లి గుట్ట దందా.. హసన్పర్తి మండలం భీమారం శివారు 340 సర్వే నంబర్లో సుమారు 57 ఎకరాల్లో గుట్ట విస్తరించి ఉంది. అయితే ఇక్కడ అందుబాటులో ఉన్న భూమిని గతంలో కొంత గిరిజన గురుకుల కళాశాల, హోటల్ మేనేజ్మెట్ కళాశాల, ఇంటర్నేషనల్ స్డేడియం ఏర్పాటుకు కేటాయించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో గిరిజన కశాశాలతో పాటు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి ఐదెకరాల చొప్పున స్థలం కూడా కేటాయించారు. ఇదిలా ఉండగా.. ఓవైపు కళాశాలలకు కేటాయించిన సర్కార్ మరోవైపు 340/1 సర్వే నంబర్ పేరిట రెండున్నర హెక్టార్ల(3.260) భూమిని కె.నవీన్రావు పేరిట క్వారీకి అనుమతి ఇచ్చింది. 2017 జూలై 25 నుంచి 5 సంవత్సరాల పాటు నిబంధనల ప్రకారం క్వారీ నిర్వహించేలా 4097/ క్యూఎల్అండ్1/ డబ్ల్యూజీఎల్/2017 ద్వారా ఈ అనుమతులు ఇచ్చారు. క్యూబిక్ మీటర్కు రూ.30ల చొప్పున 29,90,900 క్యూబిక్ మీటర్లకు అగ్రిమెంట్ కుదుర్చుకుని గుట్టంతా ఖాళీ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. రూ.లక్షల ప్రజాధనం పక్కదారి పట్టినా.. ఈ దందాలో తెరవెనుక ఓ ప్రజాప్రతినిధి కూడా స్లీపింగ్ పార్టనర్గా ఉండటం వల్ల అప్పట్లో పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు మొరం తరలింపులో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. అక్రమంగా మొరం తరలిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఎవరైనా అనుమతులు తీసుకొని మాత్రమే మొరం తవ్వకాలు చేపట్టాలి. – జ్యోతివరలక్ష్మీదేవి, తహసీల్దార్, దామెర అంతా అనధికారమే! కొంత అనుమతి తీసుకుని గుట్టలను కరిగించడమే కాదు.. అసలు అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టడం ఉమ్మడి వరంగల్లో పరిపాటిగా మారింది. వరంగల్, జనగామ, మహబూబాబాద్, జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మొరం, మట్టి దందా జోరుగా సాగుతోంది. ఈ అక్రమ తవ్వకాల గురించి సమాచారం తెలిసినా అధికారులు ‘మాములు’గా తీసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం జంగిలిగొండలోని ప్రభుత్వ భూమిలో గతంలో తవ్వకాలు జరుగుతుండగా అధికారులు అడ్డుకుని హద్దులు ఏర్పాటు చేసినా ఆగడం లేదు. ములుగు జిల్లా ములుగు పంచాయతీ శివారు 837 సర్వే నంబర్లోని సుమారు 200 ఎకరాల భూమిని గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించగా.. అక్రమార్కులు మట్టి తవ్వకాలు ఆపడం లేదు. వరంగల్ నగరానికి సమీపాన ఉన్న ప్రాంతాల్లో వందలాది ట్రాక్టర్ల ద్వారా మొరం తరలిస్తున్నారు. ఇక్కడ ఒక్కో ట్రాక్టర్కు రూ.1500 నుంచి రూ.2500 చొప్పున సుమారు 500 ట్రిప్పుల మొరానికి రూ.7.50 లక్షల నుంచి రూ.12.50 లక్షలు ఆర్జిస్తున్నారు. జనగామ జిల్లా జనగామ మండలం వడ్లకొండ ఎన్నె చెరువు పక్కన 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టను రాత్రి పూట పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా తవ్వి మట్టిని తరలించారు. చంపక్హిల్స్ గుట్టల్లోనూ మట్టిని తోడేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొనాయమాకులు, వంచనగిరి ప్రాంతంలోని ఎస్సారెస్పీ కాల్వ పక్కన, కాల్వల నిర్మాణ సమయంలో అధికారులు వాటికి ఇరువైపులా బ్యాంకింగ్ పేరుతో పోసిన కట్టల మొరాన్ని తరలించి సొమ్ము చేసుకున్నారు. యథేచ్ఛగా మొరం తవ్వకాలు అనుమతి ఒకచోట, తవ్వకాలు మరోచోట కాల్వగట్లు, గుట్టలనూ వదలని అక్రమార్కులు ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు -
చట్టం చేసే వరకు ఉద్యమాలు ఆగవు
ఎస్ఎస్ తాడ్వాయి: ఏజెన్సీ ప్రాంతంలో జీవో నంబర్ 3ను చట్టం చేసేంత వరకు ఉద్యమాలు ఆగవని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ బోదెబోయిన స్వాతి అన్నారు. మండల పరిధిలోని మేడారంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాల్లో యువతకు సమావేశాలు ఏర్పాటు చేసి వారిని చైతన్యం చేసి సమస్యల పరిష్కారానికి ఉద్యమించేలా తయారుచేయాలన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కన్వీనర్ పర్షిక సతీష్, ఇర్ప బాలాజీ, ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోదెబోయిన సురేష్, మంగపేట మండల అధ్యక్షులు కుర్శం శివశంకర్, సున్నం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ స్వాతి -
హేమాచలక్షేత్రంలో సండే సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు వివిధ సుదూర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్లు, ప్రైవేట్ బస్సులు, ఆటోలలో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారి తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి భక్తుల గోత్రనామాలతో పూజలు జరిపించి ఆలయ పురాణం స్వామివారి విశిష్టతను వివరించారు. సంతాన ప్రాప్తి కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. -
రిజర్వు జోన్గా ప్రకటించాలి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేట పరిధిలో గల కేన్ మొక్కల ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వు జోన్గా ప్రకటించాలని నర్సాపూర్కు చెందిన ఎండి.అబ్దుల్ రజాక్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 51 ఎకరాల కేన్ ప్రాంతం అధికారుల నిర్లక్ష్యంతో అన్యాక్రాంతం అవుతుందన్నారు. జీవవైవిధ్య పరిరక్షణ ప్రాంతంగా పిలవబడే కేన్ ప్రాంతం చుట్టూ ట్రెంచ్ కొట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కేన్ ప్రాంతాన్ని ‘కేనోపి వాక్’ పేరుతో టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసి భావితరాలకు అందించాలని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. -
బాల్యవివాహాల నియంత్రణ ప్రతీఒక్కరి బాధ్యత
ఏటూరునాగారం: బాల్య వివాహాల నియంత్రణ ప్రతీఒక్కరి బాధ్యతని జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ అన్నారు. మండల కేంద్రంలో బాల్య వివాహాల నిషేధ చట్టంపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2006చట్టం ప్రకారం 18ఏళ్లు నిండని అమ్మాయిలు, 21ఏళ్లు నిండని అబ్బాయిలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా 112కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధికారి హరికృష్ణ, సిబ్బంది రాజు, సుదర్శన్, కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ -
సైక్లింగ్ పోటీల్లో ప్రతిభ చూపాలి
ములుగు: నేడు హైదరాబాద్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో అత్యంత ప్రతిభ చూపి ములుగు జిల్లాకు మంచిపేరును తీసుకురావాలని సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్కుమార్ సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయం ఎదుట 24మంది సైక్లింగ్ క్రీడాకారులకు శుక్రవారం సుమారు రూ.10వేలు విలువ చేసే టీ షర్టులను ఆయన అందజేశారు. రాష్ట్రస్థాయిలో విజయం సాధించే క్రీడాకారులకు తనవంతుగా సైకిళ్లను బహుమతిగా అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ తుల రవి, కోచ్ శ్రీరాంనాయక్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి ఎలగందుల మోహన్ పాల్గొన్నారు. ఓఎస్డీ గీతే మహేశ్ బాబాసాహెబ్ బదిలీ ములుగు: ములుగు ఓఎస్డీ గీతే మహేశ్ బాబాసాహెబ్ ప్రమోషన్పై రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా శుక్రవారం బదిలీ అయ్యారు, 2024 మార్చి 15న ఏటూరునాగారం ఏఎస్పీగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ నుంచి ములుగు ఓఎస్డీగా బదిలీ అయ్యారు. ఆయన హయాంలో 15 మంది ఆయా కేటగిరీల్లో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ కమాండర్లు, దళసభ్యులు, మిలిషియా సభ్యులు 12మంది లొంగిపోగా ముగ్గురు సానుభూతి పరులు పట్టుబడ్డారు. కొండాయి బ్రిడ్జికి రూ.16 కోట్లు మంజూరు ఏటూరునాగారం: 2023లో కూలిపోయిన కొండాయి బ్రిడ్జి ప్రాంతంలో నూతనంగా హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు ఆర్అండ్బీ శాఖ ద్వారా శుక్రవారం రూ.16 కోట్లు మంజూరు అయినట్లు ఆర్అండ్బీ అధికారులు తెలిపారు. అయితే గతంలో రూ.9 కోట్లు మంజూరు కాగా బ్రిడ్జి పొడువు, ఎత్తు పెంచడంతో ఎస్టీమేట్ కూడా పెరిగినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపడుతామని అధికారులు వివరించారు. విద్యుత్ అంతరాయానికి సహకరించాలి ములుగు రూరల్: విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్శాఖ డీఈ నాగేశ్వరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 9నుంచి 12 గంటల వరకు 33/11 కేవీ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా ములుగు, పత్తిపల్లి, మల్లంపల్లి, రాంచంద్రాపురం, పస్రా, గోవిందరావుపేట, వెల్తుర్లపల్లి, వెంకటాపురం(ఎం), ఎస్ఎస్ తాడ్వాయి, మేడారం, ఏటూరునాగారం, కమలాపూర్, కన్నాయిగూడెం, వాజేడు, మంగపేట, రాజుపేట, ఆలుబాక, మల్లూరు గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. రైస్మిల్ సీజ్ ములుగు: రూ.2,16,98,407 విలువ గల ధాన్యాన్ని యాజమాన్యం పక్కదారి పట్టించినట్లుగా గుర్తించి మల్లంపల్లి మండల పరిధిలోని రామచంద్రాపురంలో గల ఉమ బిన్ని రైస్మిల్ను సీజ్ చేసినట్లు సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి తెలిపారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు నితీష్, రాంచందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్తో కలిసి శుక్రవారం ఆయన రైస్ మిల్ను తనిఖీ చేశారు. 2023–24 వార్షిక కాలానికి రైస్మిల్ 604.628 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ రూపేణ అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు అందించలేదని తెలిపారు. దీంతో మిల్లు యజమాని భూక్య ఉమాదేవిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
వివక్ష తగ్గినా వేధింపులున్నాయి..
కుటుంబాన్ని నడిపిస్తున్న మహిళామణులు104133మహిళలపై బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు కొనసాగుతున్నాయి. పనులు చేస్తున్న మహిళలకు కార్యాలయాల్లో వేధింపులు కొంతమేర కొనసాగుతు న్నా.. సెల్ఫోన్లలో కొందరు అసభ్యపదజాలంతో పంపిస్తున్న మెసేజ్లతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ఇంట్లో చెప్పలేక సతమతమవుతున్నారు. మానసికంగా ఇబ్బంది పెడుతున్న వారిలో తెలిసిన వారితోపాటు తెలియని వారు ఉన్న ట్లు పలువురు మహిళలు చెబుతున్నారు. నాడు వంటింటికే పరిమితమైన మహిళ.. నేడు విద్య, ఉద్యోగం, నచ్చిన రంగంలో ఎదుగుతూ పురుషులతో సమానంగా పనిచేస్తోంది. మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆడ–మగ వివక్ష, పని ప్రదేశంలో వేధింపులు తదితర అంశాలపై ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ‘సాక్షి’ సర్వే నిర్వహించగా పలు విషయాలు వెలుగుచూశాయి. – సాక్షి నెట్వర్క్ 200731701101) మీ ఇంట్లో ఆడ – మగ వివక్ష ఏమైనా ఉందా..? ఎ) ఉంది బి) లేదు సి) చెప్పలేనుC78372) మీ కాలేజీ – పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా..? ఎ) లేదు బి) ఉంది సి) చెప్పలేను 623) మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశం? (ఎ) సెల్ఫోన్లో వచ్చే మెసేజ్లతో.. బి) బస్టాప్లో సి) కాలేజీ లేదా ఆఫీస్లోAB4) మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిలో అత్యధికులు ఎవరు? ఎ) తెలియని వారు బి) తెలిసిన వారేషాంపిల్స్: 310 (గ్రేటర్వరంగల్ 60మంది, మిగతా ఐదు జిల్లాలు (వరంగల్, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు 50మంది చొప్పున) అన్ని వర్గాల మహిళలను పరిగణనలోకి తీసుకుని వారి అభిప్రాయాల సేకరణ. వారి సంకల్పం గొప్పది. ఆశయం ఉన్నతమైనది. హేళనలు, అవమానాలేమీ వారు చేసే పనులకు అడ్డంకి కాలేదు. ప్రతికూల పరిస్థితులెదురైనా, పురుషాధిక్య రంగమైనా వారు పట్టు వీడలేదు. అన్ని రంగాల్లోనూ మాదే పై చేయి అంటూ ముందుకు సాగుతున్నారు. చిన్నతనంలో వివాహమై భర్తను కోల్పోయిన ఒకరు కుటుంబానికి అండగా నిలబడితే.. మరొకరు పేదరికాన్ని పారదోలేందుకు నడుంకట్టారు. ఇంకొకరు విశ్వవేదికపైన జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేశారు. నేడు(శనివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంకల్ప శక్తులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. హోటల్ నడుపుతూ.. పిల్లలను చదివిస్తూ.. చిట్యాల: మండల కేంద్రానికి చెందిన భీమారపు ఓదెలు హోటల్ నడుపుతూ జీవనం సాగించేవాడు. కట్టెల పొయ్యి కారణంగా అతడి చూపు దెబ్బతిన్నది. భార్య ప్రమీల 20 ఏళ్లుగా హోటల్ నడుపుతూ పిల్ల లను చదివిస్తోంది. గతేడాది పెద్దమ్మాయికి పెళ్లి చేసింది. మిగతా ఇద్దరు పీజీ, ఎంటెక్ చదువుతున్నారు. ఓదెలు కూరగాయలు కట్ చేసి వ్వడం, పిండి కలపడం వంటి పనుల్లో ఆమెకు సాయం చేస్తుంటాడు. తమ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని వారు కోరుతున్నారు.● విభిన్న రంగాల్లో రాణిస్తూ ఆదర్శం ● పురుషులకు దీటుగా బాధ్యతలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంసంగెం: వైకల్యం శరీరానికే కానీ మనస్సుకు కాదని నిరూపించింది సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన దామెరుప్పుల రమాదేవి. ఆమెకు ఆర్నెళ్ల వయసులోనే జ్వరం వచ్చింది. కాళ్లు చచ్చుబడిపోయాయి. వైకల్యాన్ని జయించాలంటే చదువు ఒక్కటే మార్గమని.. నమ్మింది. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 5, 6 తేదీల్లో కాంబోడియా దేశంలో ఇంటర్నేషనల్ త్రోబాల్ పోటీలకు మన దేశం తరఫున పాల్గొని మొదటి స్థానంలో నిలిచి గోల్డ్మెడల్ సాధించింది. చీకట్లో ‘వెన్నెల’ సాక్షి, మహబూబాబాద్: దంతాలపల్లి మండలం పెద్దముప్పారానికి చెందిన గొడిశాల మల్లయ్య సుగుణమ్మల కుమార్తె వెన్నెల. పుట్టిన ఎనిమిదేళ్లకే తండ్రి మరణించాడు. ఆతర్వాత వెన్నెలను నర్సింహులపేట మండల కేంద్రంలోని అక్కా, బావ తీగల వెంకన్న, సుజాత చేరదీసి చదివించా రు. పదోతరగతి చదివిన వెన్నెలకు మహబూబా బాద్ మండలం పర్వతగిరికి చెందిన నారమళ్ల సంపత్తో వివాహం జరిపించారు. చిన్నతనంలో నే ఇద్దరు ఆడపిల్లలకు తల్లయ్యింది. మిర్చి పంట కు తామర పురుగు సోకడంతో కుటుంబం అప్పు ల పాలయ్యింది. అప్పుల బాధతో భర్త సంపత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో 19 ఏళ్లకే వెన్నెల వితంతువుగా మారింది. ఆరేళ్ల సాన్విక, మూడేళ్ల తన్వికతో పాటు తల్లి సుగుణమ్మ, అత్త, మామ పోషణ ఆమైపె పడింది. మహబూ బా బాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తోంది. మూగజీవాల నేస్తం.. డాక్టర్ అనిత లింగాలఘణపురం: మండల కేంద్రంలో పశువైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఆడెపు అనిత పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారుల మన్ననలు పొందుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన అనిత 2019లో లింగాలఘణపురం పశువైద్యాధికారిగా విధుల్లో చేరారు. పశువైద్యశాల కు వచ్చే మూగ జీవాలకు వైద్యం చేస్తూనే.. వ్యవసాయబావులు దూరంగా ఉండి ఆస్పత్రికి రాలేని పశువుల వద్దకు స్వయంగా ద్విచక్రవాహనంపై వెళ్లి వైద్యం చేస్తున్నారు. పశువులకు కృత్రిమ గర్భధారణలో ప్రత్యేకత చాటుకున్నారు. 63 శాతం సక్సెస్ సాధించారు. పశువులు, గొర్రెలకు వ్యాక్సినేషన్ను నూటికి నూరు శాతం అమలు చేస్తూ రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులకు నేస్తంగా మారిపోయారు. చేయి చేయి కలిపి.. పేదరికాన్ని తరిమి ఏటూరునాగారం: మండలంలోని శివాపురంలో ట్రైకార్ సాయంతో ఐటీడీఏ ద్వారా పది మంది మహిళలు సమ్మక్క–సారలమ్మ డిటర్జెంట్ సబ్బుల తయారీ పరిశ్రమను నెలకొల్పారు. ట్రైకార్ నుంచి 60 శాతం సబ్సిడీ, బ్యాంకు నుంచి 30 శాతం రుణం తీసుకుని పరిశ్రమ నడుపు తున్నారు. తయారు చేసిన సబ్బులకు ఒక్కోదానికి రూ.10గా ధర నిర్ణయించి గిరిజన సహకార సంఘానికి(జీసీసీ) విక్రయిస్తున్నారు. రోజుకు సుమారు 4 వేల సబ్బులు తయారు చేస్తున్నారు. ఐదేళ్లుగా కోటిన్నర రూపాయల వ్యాపారం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సబ్బుల తయారీలో ఆదర్శంగా నిలుస్తున్నారు. కట్టె కోత.. బాధ్యతల మోతకట్టెకోత మిల్లులో మగవారితో సమానంగా పని చేస్తోంది వరంగల్ నగరం నాగేంద్రనగర్కు చెందిన ఎండీ రజియా. భర్త అనారోగ్యం కారణంగా కుటుంబ భారం ఆమైపె పడింది. 15 ఏళ్లుగా నగరంలోని జగన్నాథం సామిల్లులో కట్టర్గా పనిచేస్తోంది. ముగ్గురు పిల్లల పెళ్లి చేయగా.. కూతురు కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె తల్లివద్దే ఉంటోంది. వీరందరికీ రజియా పని చేస్తేనే భోజనం. సొంతిల్లు ఉంటే కొంత భారం తగ్గుతుందని రజియా అంటోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ సమాచార వారధిగా పత్రికల సేవలు భేష్‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ సంకల్పం ముందు చిన్నబోయిన వైకల్యం వరంగల్ లీగల్ : ప్రజలకు, అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి సమాచార వారధిగా వార్తా పత్రిక లు నిలవాలని సాక్షి గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి వరంగల్ యూనిట్ కార్యాలయానికి శుక్రవారం ఆమె గెస్ట్ ఎడిటర్గా వచ్చారు. ముందుగా జడ్జికి సాక్షి ఎడిషన్, బ్యూరో ఇన్చార్జులు వర్ధెల్లి లింగయ్య, గడ్డం రాజిరెడ్డి, లీగల్ రిపోర్టర్ జీవన్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. మొదట ఎడిటోరియల్ విభాగానికి చేరుకున్నారు. ఫీల్డ్ నుంచి రిపోర్టర్లు పంపిన కాపీలు డెస్క్కు ఎలా చేరుతాయో పరిశీలించారు. ఎడిటోరియల్ విభాగాన్ని పరిశీలించి సబ్ ఎడిటర్లు వార్తలు దిద్దుతున్న తీరును గమనించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన కాపీలను చూసి కావాల్సిన అదనపు అంశాలు, సమాచారాన్ని తెప్పించుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే రిపోర్ట్ను పరిశీలించి పేజీ లేఔట్పై తగిన సూచనలిచ్చారు. సర్వే అంశాలు బాగున్నాయని, వాటిని ఎలా నిర్వహించారో అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విజయవంతంగా ముందుకు సాగుతున్న మహిళలపై తెప్పించిన కథనాలను చూసి తగిన ఫొటోలు ఉన్నాయా.. లేవా? అని సరిచూసుకోవాలని, అక్షరదోషాలు లేకుండా దిద్దాలని సూచించారు. అనంతరం ఐటీ, ఏడీవీటీ, స్కానింగ్, సీటీపీ, ప్రొడక్షన్ విభాగాలను పరిశీలించారు. వాటి పనితీరును తెలుసుకున్నారు. నూతన టెక్నాలజీతో అన్ని రంగుల్లో పత్రిక వెలువడుతున్న తీరును చూసి బాగుందని కితాబిచ్చారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలివ్వాలి.. పత్రికలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే వార్తలు ఇవ్వాలని మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. న్యాయసంబంధ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రచురించాలని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలను జర్నలిజంలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ఆధారాలతో పరిశోధనాత్మక వార్తలు రాయాలని సూచించారు. మహిళా చైతన్యంలో పత్రికలు కీలకమని పేర్కొన్నారు. సాక్షి గెస్ట్ ఎడిటర్గా తనకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సాక్షి సిబ్బంది ఆమెకు శాలువా అందించి సన్మానించారు. మహిళల ‘సౌర’ సాగు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆమెకు అండగా.. పోకిరీల ఆట కట్టిస్తున్న ‘షీ’టీమ్ – 8లోuకూతుళ్లే మహారాణులు కొందరు ఒక్కరితో సరి.. ‘సాక్షి’ సర్వేలో మహిళల మనోగతం వార్తకు అనుగుణంగా శీర్షికలు ఉండాలి.. కచ్చితమైన సమాచారం ఉండేలా చూసుకోవాలి.. మహిళా దినోత్సవ కథనాలు బాగున్నాయని కితాబు -
మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్పోస్టర్లు
మంగపేట: మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ట్రైబల్ యూత్ అసోసియేషన్ పేరుతో గురువారం రాత్రి వాల్పోస్టర్లు వెలిశాయి. కోమటిపల్లి క్రాస్ రోడ్డు, పలు ప్రధాన కూడళ్లతో పాటు కమలాపురంలోని పలు ప్రాంతాల్లో సైతం పోస్టర్లు వెలిశాయి. శాంతియుత జీవనం మనహక్కు, అనుమానితుల సమాచారమిద్దాం.. పోలీసులకు సహకరిద్దాం.. అని తదితర నినా దాలు వాల్ పోస్టర్లలో ఉన్నాయి. మరి కొన్ని పోస్టర్లలో మా వోయిస్టులు, ఆది వాసీ గిరిజనుల ఫొటోలు ముద్రించి ఉన్నాయి. వాల్ పోస్టర్లు గురువారం రాత్రే వెలిశాయని,ఎవరు అంటించారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
ములుగు: మహిళా చట్టాలపై తప్పనిసరి అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మహర్షి డిగ్రీ కళాశాల ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ దశాబ్దాలుగా సామాజిక వెనుకబాటుతనం కారణంగా మహిళలు నేటికీ వివక్షత ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత న్యాయ సలహా ఎలా పొందాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాచర్ల రాజ్కుమార్, ఏజీపీ బాలుగు చంద్రయ్య, మహర్షి విద్యాసంస్థల చైర్మన్ తుమ్మ పిచ్చిరెడ్డి పాల్గొన్నారు.చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్ -
విద్యార్థినికి అభినందనలు
భూపాలపల్లి అర్బన్: ఇన్స్పైర్ అవార్డు సాధించిన జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాల విద్యార్థిని మాచర్ల ఆశ్రితను పాఠశాల యాజమాన్యం గురువారం అభినందించింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మారుతి మాట్లాడుతూ.. గత నెలలో కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, సైన్స్ టెక్నాలజీ విభాగంలో నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డులో పాఠశాల విద్యార్థిని ఎంపికై నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.10వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించినట్లు తెలిపారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో ఆశ్రితకు పూలగుచ్ఛంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జాన్సీరాణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రవాణాలో జాగ్రత్తలు పాటించాలి భూపాలపల్లి అర్బన్: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులను ప్రైవేట్ వాహనాల్లో తరలిస్తున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. ఈ మేరకు జిల్లాలోని కస్తూర్బాగాంధీ, మోడల్ స్కూళ్ల స్పెషల్ అధికారులు, ప్రిన్సిపాళ్లతో గురువారం జూమ్ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు రవాణా చేసే సందర్భాలలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తప్పనిసరిగా ఒక ఉపాధ్యాయురాలు లేదా ఉపాధ్యాయుడిని ఎస్కార్ట్గా విద్యార్థులతో పంపాలని, దూర ప్రాంతం ఉన్న పాఠశాలలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని డీఎంను ఆదేశించారు. -
నిలిచిన ఇసుక తరలింపు
ఏటూరునాగారం: మండల కేంద్రానికి సమీపాన గల సంఘంపాయ, గోదావరి శివారులో కొనసాగుతున్న ఇసుక క్వారీ ప్రారంభమైన నాలుగు రోజులకే నిలిచిపోయింది. క్వారీ నిర్వాహకులు ఇసుకను తరలించడానికి నెల రోజుల నుంచి రోడ్లను వేశారు. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తరలింపునకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో రెవెన్యూ అటవీ మైనింగ్ శాఖలకు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వేబిల్లులలో ఉన్న క్వాంటిటీ కంటే ఎక్కువ ఇసుకను తరలిస్తున్న లారీలను సీజ్ చేయాలని ఆదేశాలలో పేర్కొంది. క్వారీ నుంచి వచ్చిన ఓవర్ లోడ్ లారీలను గమనించి సీజ్ చేయాలని లేదా ఎంత ఎక్కువ ఇసుక లారీలో ఉందో దానికి తగ్గ ఫైన్ ట్రెజరీకి చెల్లించే విధంగా విధానాన్ని రూపకల్పన చేసింది. నూతన విధానం అమలయ్యాక ఆయా క్వారీల నుంచి వస్తున్న లారీలను పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులు ఓవర్ లోడ్ లారీలను నిలిపివేస్తూ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో ఈ నెల 1న ఏటూరునాగారం ఇసుక క్వారీ ప్రారంభమైంది. రెండు రోజులు క్వారీ ఆన్లైన్ డీడీలు తీసుకోవడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ మూడు రోజుల నుంచి క్వారీకి సంబంధించిన వేబిల్లుల నిర్వహణ ఆన్లైన్ నుంచి తొలగిపోయింది. అయితే ఈ మూడు రోజులుగా వారి యాజమాన్యం పాత వేబిల్లుల ప్రకారం కొనసాగించింది. రెండు రోజుల క్రితం ఏటూరునాగారం క్వారీ నుంచి వెళ్తున్న లారీలను రెవెన్యూ పోలీస్శాఖ అధికారులు గమనించి అధిక లోడ్తో వెళ్తున్నాయని ఒక లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. అటవీ శాఖ అధికారులు జోక్యం చేసుకొని ఇసుక క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతం ఫారెస్ట్ ఏరియా పరిధిలో ఉందంటూ ఇసుక తరలింపు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం నుంచి క్వారీలో ఇసుక తరలింపు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇసుక క్వారీ ఫారెస్ట్ ఏరియా పరిధిలో ఉందంటూ అటవీశాఖ ఆదేశాలు -
భక్తులకు మెరుగైన వైద్యసేవలు
రేగొండ: కొడవటంచ జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు మెరుగైన వైద్యం అందేలా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ అన్నారు. ఈనెల 9నుంచి ప్రారంభమయ్యే కోటంచ జాతర సందర్భంగా గురువారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతర సమయంలో వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అత్యవసర వైద్యానికి జాతరలో రెండు ఆంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జాతీయ సంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి, వారికి చికిత్స అందించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. -
విద్యార్థులు మేధాశక్తిని పెంపొందించుకోవాలి
ఏటూరునాగారం: విద్యార్థులు మేధాశక్తి పెంపొందించుకోవాలని హనుమకొండ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ వాసం శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో రెండు రోజులు జాతీయస్థాయిలో వర్క్షాప్ నిర్వహించారు. రెండోరోజు గురువారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆన్లైన్ సెమినార్కి ముఖ్యఅతిథిగా శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ‘ఆన్ ఇంటరాక్షన్ విత్ కెరియర్ గైడెన్స్ సెల్’, ‘కోఆర్డినేషన్ కాంపౌండ్స్’ అనే అంశాల మీద విద్యార్థినులకు అవగాహన కల్పించారు. చదువుతో పాటు సమాజంపై విజ్ఞానం పెంచుకోవాలన్నారు. అనంతరం జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆన్లైన్ వెబ్ నాట్కి గెస్ట్గా సంగారెడ్డి డిగ్రీ కళాశాల డాక్టర్ సుప్రభాపాండ మాట్లాడారు. ‘ఇన్బార్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం’ అనే అంశం పైన చర్చించారు. కళాశాలలో పోటీలను నిర్వహించే విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి, రీజినల్ కోఆర్డినేటర్ హరిసింగ్, ములుగు జిల్లా సమన్వయకర్త శ్రీనివాస్ రెడ్డి, గిరిజన బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ రాజు పాల్గొన్నారు.అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ -
డబుల్ ట్రబుల్
ఏటూరునాగారం: నిరుపేదల సొంతింటి కల నెరవేరడం లేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు వస్తాయని ఆశపడిన పేదలకు నిరాశే మిగులుతోంది. నిల్వ నీడ లేక గుడిసెల్లోనే పేదల జీవితాలు మగ్గుతున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి కంటున్న కలలు సాకారం అవుతాయన్న వారి కళ్లలో మిగిలిపోయిన కట్టడాలే కానొస్తున్నాయి. జిల్లాలోని 9మండలాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు 2016లో కేసీఆర్ ప్రభుత్వం 1238 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇల్లుకు రూ.5.30లక్షల చొప్పున నిధులు సమకూర్చి కాంట్రాక్టర్లకు నిర్మాణాల బాధ్యతలు అప్పగించింది. కానీ సకాలంలో కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయలేదు. దీంతో అధికారులు బిల్లులు ఇవ్వకపోవడంతో డబుల్ బెడ్రూం ఇళ్లు 60 శాతం మాత్రమే పూర్తి చేశారు. 40శాతం పనులు వివిధ దశల్లో.. మిగతా 40శాతం ఇళ్లు గోడలు పూర్తికాకుండా, అసంపూర్తిగా పిల్లర్లు, మెట్లు కూలిపోయి వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. డబుల్ బెడ్రూం ఇళ్లు వస్తాయని పాత ఇళ్లను తొలగించి నిరుపేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టిసారించకపోవడంతో అవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే మిగిలిపోయాయి. మంగపేట మండలం బోరునర్సాపురంలో 20 ఇళ్లు మంజూరు కాగా ఒక్కటి కూడా పూర్తి కాలేదు. 20 ఇళ్లను కేవలం పునాదులు వేసి వదిలేశారు. దాంతో ఇంటి వద్ద బర్కాలు కట్టుకొని లబ్ధిదారులు కాలం వెళ్లదీయాల్సి వస్తోంది.అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణం గుడిసెల్లోనే జీవిస్తున్న పేదలు ఎదురుచూస్తున్న లబ్ధిదారులు -
హామీలు నెరవేర్చాలని సీఎంకు పోస్టు కార్డులు
ములుగు: ఎన్నికల ముందు సీఎం రేవంత్రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మల్లంపల్లి మండల ఉద్యకారులు గురువారం సీఎంకు పోస్టు కార్డులు పంపారు. 220 చదరపు గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ. 10లక్షలు, రూ.2,500ల పెన్షన్ అందించాలని పోస్టు కార్డులో విన్నవించి రాశారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచారి, మాచర్ల ప్రభాకర్, రాజేశ్వర్రావు, హరినాధ్, బోయిని రవి, రేణుకుంట్ల సురేష్, చిదరం సంతోష్, లిండాద్రి, మనోహరస్వామి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమర్థంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ
భూపాలపల్లి రూరల్: అధికారులు సమన్వయంతో పనిచేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో యాసంగి (రబీ) 2024–25 కాలానికి ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు.ఽ ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, పంట కోత, గున్నీలు, పరికరాల లభ్యత టార్పాలిన్లు, కేలిబర్స్, పాడీ క్లీనర్లు సిద్ధంచేయాలని సూచించారు. రైతులకు గిట్టుబాటు ధర అందించే విధానాలు, పంట కోత అనంతరం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసే చర్యలపై సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ -
1,806మంది హాజరు.. 47మంది గైర్హాజరు
● ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ములుగు: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10పరీక్ష కేంద్రాల్లో 1,853 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 1,806 మంది హాజరయ్యారు. 47మంది గైర్హాజరు అయ్యారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ తరఫున భారీ బందోబస్తు నిర్వహించారు. జనరల్ విభాగంలో 1,645 మంది గాను 1,604 మంది, ఒకేషనల్ విభాగంలో 208 మందికి 202 మంది హాజరయినట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. 1,370 ఎకరాల్లో సర్వే పూర్తి ములుగు: మొక్కజొన్న పంటను సాగు చేసి ఆర్థికంగా నష్టపోయిన వెంకటాపురం(కె) మండలానికి చెందిన 616 మంది రైతులకు సంబంధించిన 1,370 ఎకరాల్లో సాగు చేసిన పంటను సర్వే చేసినట్లు ఏడీఏ సురేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల జాబితాను గ్రామ పంచాయతీలు, తహసీల్దార్ కార్యాలయాల్లో వారం రోజుల పాటు ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటే వారి పేర్లను వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎవరైనా అర్హుల పేర్లు జాబితాలో లేకపోతే సంబంధిత గ్రామాల ఏఈఓల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందేలా చూస్తామని వివరించారు. పశు వైద్యశిబిరం వాజేడు: మండల పరిధిలోని జగన్నాథపురం, చీకుపల్లి గ్రామాల్లో గురువారం వెంకటాపురం(కె) సహాయ సంచాలకులు డాక్టర్ వేణు పర్యవేక్షణలో పశు వైద్యశిబిరం నిర్వహించారు. వివిధ వ్యాధులతో బాధ పడుతున్న పశువులను వైద్యులు శ్రీనిధి, హరీశ్రెడ్డి పరీక్షించి మందులను అందించారు. దూడలకు నట్టల నివారణ మందులను తాగించారు. ఈ సందర్భంగా డాక్టర్ వేణు మాట్లాడుతూ వేసవి కాలంలో పశువుల పట్ల తీసుకో వాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ శిబిరంలో జిల్లా గోపాలమిత్ర సూపర్ వైజర్ లక్ష్మణ్, కుమారస్వామి, ఖాజాఖాన్. కృష్ణ, రాంబాబు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ ఫైలింగ్పై అవగాహన అవసరం భూపాలపల్లి అర్బన్: కేసుల ఆన్లైన్ ఫైలింగ్ నమోదుపై న్యాయవాదులు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు తెలిపారు. జిల్లా కోర్టులో గురువారం న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ లిటరసీ అనేది చాలా ముఖ్యమన్నారు. కేసుల ఈ ఫైలింగ్ విధానం తెలిసినప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడైన కేసులను వేసుకునే వీలుంటుందని తెలిపారు. విలువైన సమయం, డబ్బులు పొదుపు అవుతాయని, ప్రయాణ భారం తగ్గుతుందని తెలిపారు. రిసోర్స్ పర్సన్లు అఖిల్రెడ్డి, రవీందర్రెడ్డి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జయరాంరెడ్డి, ఏఓ అనితావని, న్యాయవాదులు పాల్గొన్నారు. -
పులికాదు.. అడవి పిల్లి
రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలోని శివార్లలోని పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు వదంతులు వచ్చాయని, అది అడవి పిల్లి (వైల్డ్ క్యాట్) అని చెల్పూర్ ఇన్చార్జ్ రేంజ్ అధికారి నరేష్ తెలిపారు. కొత్తపల్లిగోరి శివారు పంచరాయిలో ఉన్న పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు బుధవారం సాయంత్రం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దీంతో అటవీ అధికారులు గురువారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. పంట పొలాలు, బొక్కి చెరువు సమీపంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రాంతంలో లభించిన పాదముద్రలను పరిశీలించిన అధికారులు ఆ పాదముద్రలు అడవి పిల్లివని నిర్ధారించారు. వన్యప్రాణులు కనబడితే తమ దృష్టికి తీసుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎఫ్ఆర్ఓ శంకర్, ఎఫ్ఎస్ఓ గౌతమి పాల్గొన్నారు. -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
ఎస్ఎస్తాడ్వాయి: వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆయన గురువారం ఆకస్మికంగా సందర్శించి అటెండెన్స్, రోగుల ఓపీ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో డిప్యూటేషన్పై పని చేస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ వేసవి ఎండల తీవ్రతతో ఎండ దెబ్బకు గురై ఆస్పత్రి వచ్చిన వారికి సకాలంలో వైద్య సేవలందించాలని ఆదేశించారు. గ్రామాలను సందర్శించి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. విటమిన్ లోపం ఉన్న వారిని గుర్తించేందుకు ఫీల్డ్ సర్వే నిర్వహించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. ఆయన వెంట వైద్యాధికారులు చిరంజీవి, మౌనిక ఉన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
హైకోర్టును ఆశ్రయించిన హరిబాబు?
భూపాలపల్లి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భూపాలపల్లి పట్టణానికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కోర్టుకు వెళ్లిన భూపాలపల్లి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి గత నెల(ఫిబ్రవరి) 19న రాత్రి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు ఫిబ్రవరి 23న ఏడుగురు నిందితులను అరెస్ట్ చూపించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 1వ తేదీన ఏ9గా ఉన్న పుల్ల నరేష్ను సైతం అదుపులోకి తీసుకొని అరెస్ట్ చూపించారు. ఏ8గా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్చైర్మెన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబు, ఏ10గా ఉన్న పుల్ల సురేష్ కోసం పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న హరిబాబు ఇటీవల హైకోర్టును ఆశ్రయించి, ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నట్లు సమాచారం. అయితే బెయిల్ పిటిషన్పై ఈ నెల 10న వాదనలు జరుగనున్నట్లు తెలిసింది. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు రాజలింగమూర్తి హత్య కేసులో ఏ8గా అతడిపై కేసు నమోదు -
వాతావరణం
జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండ, ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి చల్లగాలులు వీస్తాయి.సత్వర వైద్యం అందుతోంది.. ఆవులు అనారోగ్యానికి గురైతే సంచార వైద్య సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రి సమయ వేళల్లో అయితే పశువులను దవాఖానకు తీసుకెళ్లేందుకు వీలుంటుంది కాని మేతకు వెళ్లిన సమయంలో అనారోగ్యానికి గురైతే 1962 సిబ్బంది సకాలంలో వైద్యం అందించి పశువులను కాపాడుతున్నారు. – జంగిలి రవితేజ, పశుపోషకుడు, ప్రేమ్నగర్ జిల్లాకు మరో అంబులెన్స్ అవసరం జిల్లాలోని 9 మండలాల్లో సంచార వైద్యం అందించేందుకు ఒకే అంబులెన్స్ ఉంది. దీంతో సమాచారం అందిన ప్రతీ కేసుకు వైద్యం అందించడం కష్టంగా మా రుతోంది. జిల్లాకు మరో అంబులెన్స్ ఏ ర్పా టు చేయడంతో పాటు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వానికి నివేదికలు అందించాం. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. – చంద్రశేఖర్, 1962 జిల్లా కోఆర్డినేటర్ -
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
ములుగు: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని అకాడమిక్ మానిటరింగ్ అధికారి(ఏఎంఓ) మల్లారెడ్డి అన్నారు. 2024 డీఎస్సీలో ఉద్యోగం సాధించిన 120మంది ఉపాధ్యాయులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం చివరి రోజు శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు ప్రతీ పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవడం శుభపరిణామం అన్నారు. విద్యార్థుల సామర్య్థాలను పెంచి ములుగు జిల్లాను రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలపాలన్నారు, ప్రభుత్వ పరీక్షల నియంత్రణాధికారి అప్పని జయదేవ్ మాట్లాడుతూ నూతన ఉపాధ్యాయులు వైవిధ్యంగా ముందుకు సాగుతూ విద్యార్థులను అన్ని అంశాల్లో ముందుండేలా చూడాలన్నారు. వారిలో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించి వృత్తి ధర్మాన్ని నెరవేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు రాజేశ్కుమార్, ఆడిచర్ల రాజయ్య, మహేందర్, మధు, దిలీప్, సురేందర్, రాంబాబు పాల్గొన్నారు.ఏఎంఓ మల్లారెడ్డి -
సైబర్ నేరాలపై అప్రమత్తం
ములుగు రూరల్: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ సందీప్రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం మండల పరిధిలోని జంగాపల్లిలో సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్, జాబ్ ప్రాడ్, సైబర్ స్టాకింగ్, సైబర్ స్లేవరి, మల్టీలెవల్ మార్కెటింగ్ ప్రాడ్ వంటి నేరాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సైబర్క్రైం. జీఓవీ. ఇన్ పోర్టల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ యాసిన్, జంగాలపల్లి సీసీ భీమా, ములుగు సీసీ చంద్రమౌళి, సిబ్బంది శ్రీకాంత్, ఉమామహేశ్వర్, తేజస్వీ, శ్వేతపాల్ తదితరులు పాల్గొన్నారు.డీఎస్పీ సందీప్రెడ్డి -
2024 14,332
2021నుంచి 2025 ఫిబ్రవరి వరకు పశువులకు అందిన వైద్యం2,011నకిలీ పురుగు మందులు.. నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా ను బుధవారం అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. డిగ్రీ ఫలితాల నిలిపివేత కేయూ అకాడమిక్ డీన్కు ఫీజు చెల్లించకపోవడంతో 121 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల పరీక్ష ఫలితాలను అధికారులు నిలిపివేశారు. – 8లోuములుగు రూరల్: మూగజీవాలకు సత్వర వైద్యం అందించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన సంచార వైద్యం సత్ఫలితాలు ఇస్తోంది. పశుపోషకులు జీవాలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా రైతులు 1962 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించి వైద్యసేవలు పొందేందుకు అవకాశం కల్పించింది. రైతులు ఫోన్లో అందించిన సమాచారం మేరకు రైతులు కోరిన ప్రాంతానికి వెళ్లి పశువులకు అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు. సంచార వాహనాల్లో పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు వైద్యానికి సంబంధించిన మందులను అందుబాటులో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాలలో వైద్యసేవలు అందిస్తున్నారు. దీంతో ములుగు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పశుమరణాలు తగ్గుముఖం పట్టాయి.జిల్లాలో పశువైద్య కేంద్రాల వివరాలుజిల్లాలోని తొమ్మిది మండలాల్లో పశువైద్య కేంద్రాలు 15 ఉన్నాయి. అదే విధంగా పశువైద్య ఉప కేంద్రాలు 16, ఏరియా ఆస్పత్రులు ములుగు, ఏటూరునాగారం, వెంకటాపురం(కె)లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 12మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు విధులు నిర్వర్తిస్తున్నారు.2021 6,846వాజేడు, వెంకటాపురం(కె) మండలాలకు లేవు.. జిల్లాలోని వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లోని పశువులకు సంచార వైద్యం అండదం లేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్లను ఏర్పాటు చేసి సిబ్బందిని కేటాయించారు. వాజేడు, వెంకటాపురం(కె) మండలాలు ఖమ్మం జిల్లా నుంచి విడిపోయి ములుగు జిల్లాలో కలిశాయి. అప్పటి నుంచి ఈ రెండు మండలాలకు 1962 సేవలు అందడం లేదు. వాజేడు, వెంకటాపురం(కె) మండలాలకు సైతం సంచార వైద్య సేవలు అందించాలని పశుపోషకులు కోరుతున్నారు. 2025 ఫిబ్రవరి వరకుపశుపోషకులకు ఉపయోగం.. ములుగు నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో సంచార వైద్యం సత్ఫలితాలు ఇస్తుంది. మండల కేంద్రాల్లో పశువైద్య కేంద్రాలు, గ్రామాలలో పశువైద్య ఉప కేంద్రాలు ఉన్నప్పటికీ సంచార వైద్యం పశుపోషకులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఆస్పత్రి పనివేళలతో సంబంధం లేకుండా మూగజీవాలకు సంచార వైద్య సేవలు అందుతున్నాయి. 2022 7,044 2023 7,012 -
సింగరేణి బకాయిలు చెల్లించాలి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీఎంఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఏరియాలోని కేటీకే 5వ గనిలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి కార్మికులతో మాట్లాడారు. 2024 డిసెంబర్ నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థకు రూ.35 వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో సింగరేణి ఆర్థికంగా దెబ్బతిన్నట్లు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.25వేల కోట్ల బకాయిలు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బొగ్గు కొనుగోలు చేసిన డబ్బులను కూడా ఇవ్వడం లేదన్నారు. కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని మోసపూరిత హామీలతో కార్మికులను మోసం చేశారని గుర్తు చేశారు. ఈ నెల 8వ తేదీన ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో సింగరేణి స్థితిగతులపై జనరల్బాడీ సమావేశం నిర్వహించి భవిష్యత్ పోరాటాలపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచీ నాయకులు సుజేందర్, మల్లేష్, రాజు, రమేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళలకు క్రీడాపోటీలుభూపాలపల్లి అర్బన్: ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో బుధవారం లేడీస్ క్లబ్ మహిళలకు క్రీడాపోటీలను నిర్వహించా రు. ఇల్లంద్ క్లబ్లో త్రో బాల్, బాంబ్ ఇన్ సి టీ, బాల్ పాసింగ్ నిర్వహించారు. క్రీడాపోటీల ప్రారంభోత్సవానికి ఏరియా సేవా అధ్యక్షురా లు సునీతరాజేశ్వర్రెడ్డి, క్లబ్ కార్యదర్శి రమణివెంకటరామిరెడ్డి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ములుగు: మార్చి 21నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్జీ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆయా శాఖల అధికారులతో బుధవా రం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో 3,134 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా 21పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాను రెండు రూట్లుగా విభజించినట్లు తెలిపారు. ఒక్కో పరీక్ష కేంద్రానికి సిట్టింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ముందస్తుగా శిక్షణ ఇ వ్వాలన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో తాగునీరు, మ రుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులు క ల్పించాలన్నారు. విద్యార్థులతో పాటు ఎగ్జామ్ ప్యా డ్, పెన్, పెన్సిల్, రబ్బర్, హాల్ టికెట్లు మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. సెంటర్కు ఇద్దరు కానిస్టేబుళ్లు బందోబస్తు విధుల్లో ఉండాలన్నారు. వైద్యశాఖ తరఫున ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఆర్టీసీ తరఫున విద్యార్థులను తరలించడానికి బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నడుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ సదానందం, డీఎంహెచ్ఓ గోపాల్రావు, విద్యుత్ డీఈ నాగేశ్వర్రావు, ఏఎంవీఐ వినోద్రెడ్డి, ఆర్టీసీ కంట్రోలర్ బైకాని మోహన్, ఎస్టీఓ సురేశ్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సురేందర్, ప్రభుత్వ పరీక్షల సహాయ నియంత్రణాధికారి అప్పని జయదేవ్, తదితరులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి ప్రత్యేక బృందాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించేలా తగిన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్జీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2022లో దరఖాస్తు చేసుకున్న వారికి అప్పటి మార్కెట్ వాల్యూ ప్రకారం ఫీజు ఉంటుందన్నారు. మార్చి 31వ తేదీ వరకు ఫీజు చెల్లించే వారికి 25శాతం తగ్గింపు ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి దేవ్రాజ్, జిల్లా ఇరిగేషన్ అధికారి అప్పలనాయుడు, తహసీల్దార్ విజయభాస్కర్, ఎంపీఓలు, ఆర్ఐలు, కార్యదర్శులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ మహేందర్జీ -
సైన్స్పై అవగాహన తప్పనిసరి
ఏటూరునాగారం: సైన్స్పై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని కాకతీయ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ రమారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో సైన్స్ వర్క్షాపును బుధవారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానం విద్యార్థులకు అవసరం అన్నారు. కంప్యూటర్, సైన్స్పై పూర్తిస్థాయిలో అవగాహన ఉండడంతో పాటు అధ్యాపకులు బోధించిన ప్రతీ విషయాన్ని ఏకాగ్రతతో ఒంట పట్టించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన విద్యాసంస్థల సమన్వకర్త శ్రీనివాస్రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రేణుక, అధ్యాపకులు నవీన్, వెంకటయ్య, జ్యోతి, జీవవేణి, గిరిజన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణిలతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.ప్రొఫెసర్ రమారెడ్డి -
ఇంటర్ పరీక్షలు షురూ..
పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ దివాకర ములుగు: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించారు. హాల్టికెట్, పరీక్ష సామగ్రితో కేంద్రాలకు వచ్చిన విద్యార్థులను ముందుగా గేటు వద్ద అధికారులు తనిఖీ చేసి లోపలికి అనుమతినిచ్చారు. ఇతరులు లోపలికి వెళ్లకుండా కేంద్రాల చుట్టూ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు 2,023 మంది హాజరుకావాల్సి ఉండగా 112 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 1,773 మందికి గాను 1,679 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 250మందికి 238 మంది హాజరయ్యారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ దివాకర ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. కేంద్రంలో విద్యార్థుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర వసతులు, వైద్యశాఖ తరఫున ఆరోగ్య శిబిరం ఏర్పాటుపై ఆరా తీశారు. సీసీ కెమెరాల పనితీరు ఎలా ఉందని అడిగారు. మాస్ కాపియింగ్కు ఆస్కారం లేకుండా పారదర్శకంగా పరీక్షలు జరిగేలా చూడాలన్నారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి ఇవ్వకూడదన్నారు. జవాబు పత్రాలను పోలీసుల భద్రత నడుమ నిర్దేశిత కేంద్రానికి తరలించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి చంద్రకళ ఉన్నారు, తొలిరోజు ప్రశాంతం -
టెన్త్ విద్యార్థులు ఒత్తిడిని అధిగమించాలి
ఏటూరునాగారం: పరీక్షలు రాసే టెన్త్ విద్యార్థులు ఒత్తిడిని అధిగమించడంతో పాటు ఏకాగ్రతతో చదివి పరీక్షలు ప్రశాంతంగా రాయాలని ఎడ్యుకేషనల్ కౌన్సిలర్లు డాక్టర్ బరుపాటి గోపి, అంబటి శ్రీధర్రాజు అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పీఆర్ఆర్ యూనిటీ, చారిటీ ట్రస్టు ఆధ్వర్యంలో టెన్త్ విద్యార్థులకు మోటీవేషన్ క్లాస్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 21నుంచి టెన్త్ పరీక్షలు మొదలు కానున్నట్లు తెలిపారు. పరీక్షలను ఏ విధంగా రాయాలి, ప్రశ్నా పత్రం అర్ధం చేసుకునే విధానం వంటి తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. టెన్త్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని ట్రస్టు ఇన్చార్జ్ మడుగూరి నాగేశ్వర్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య, హెడ్మాస్టర్ సాంబశివరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఎడ్యుకేషనల్ కౌన్సిలర్లు గోపి, శ్రీధర్రాజు -
సమస్యలు పరిష్కరించాలని మంత్రి సీతక్కకు వినతి
ములుగు: తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్కుమార్, పెరుమాండ్ల తిరుపతి సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీతక్కను కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రిని వారు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించి సమస్యలపై చర్చించారు. అక్కడి నుంచి మంత్రి సీతక్క సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ కమిషనర్కు ఫోన్ చేసి గతంలో మాదిరిగా బియ్యం డెలివరీకి సహకరించండి, ఒక జిల్లా బియ్యాన్ని వేరే జిల్లాలకు డెలివరీ చేయడానికి మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు రెండు జిల్లాల అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కోశాధికారి మోహన్, రైస్ మిల్లర్లు వాసుదేవారెడ్డి, ఆరె విజేందర్, భూపాలపల్లి జిల్లా కార్యదర్శి యాంసాని సంతోష్, కోశాధికారి రవీందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. 12నుంచి కల్యాణ మహోత్సవం ములుగు రూరల్: మండల పరిధిలోని కొత్తూరు దేవునిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి జాతర తేదీలను ఆలయ కమిటీ చైర్మన్ వీరపనేని కిషన్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12నుంచి 14వ తేదీ వరకు స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 12వ తేదీన స్వామి వారికి అభిషేకం పూజలు, 13న ఉదయం 11.30గంటలకు స్వామివారి కల్యాణం, 14న హోమం, పూర్ణ హారతి, మొక్కులు సమర్పించుట, బండ్లు తిరుగు కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. స్వామి వారి కల్యాణ మహోత్సవానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇసుక లారీ పట్టివేత ఏటూరునాగారం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి వీరాపురం క్వారీ నుంచి ఇసుకను తరలిస్తుండగా చిన్నబోయినపల్లి రెవెన్యూ అధికారులు జూనియర్ అసిస్టెంట్ గంపల శంకర్, పోలీస్ లక్ష్మణ్నాయక్లు పట్టుకున్నారు. బుధవారం చిన్నబోయినపల్లి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా లారీ కేపాసిటీకి మించి ఇసుక తరలిస్తుండడంతో అధికారులు పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించారన్నారు. ఇసుక తరలింపులో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ. పోలీస్ అధికారులు సమష్టిగా ఔట్ చెక్ పోస్ట్ చిన్న బోయినపల్లి వద్ద ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. దరఖాస్తుల ఆహ్వానంవరంగల్: హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ)లో మూడు సంవత్సరాల చేనేత, టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళిశాఖ జిల్లా సహాయ సంచాలకులు రాఘవరావు ఒక ప్రకటనలో కోరారు. 60 సీట్లు ఉన్న కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి పదో తరగతి ఉత్తీర్ణులై, జూలై 1 నాటికి బీసీ, ఓసీలు 23, ఎస్సీ, ఎస్టీలు 25 ఏళ్లు ఉండాలన్నారు. వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ మొదటి వారంలోగా హైదరాబాద్లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు ఓఎస్డీ హిమజాకుమార్ 90300 79242 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. -
నాలుగేళ్లు సాగుచేస్తే రూ.40వేల ఆదాయం
ఏటూరునాగారం: కంకవనాలను సాగు చేసి నాలుగేళ్లపాటు సంరక్షిస్తే రైతులకు సంవత్సరానికి రూ.40వేలు ఆదాయం వస్తుందని సెర్ప్ సీసీ నర్సింహారావు అన్నారు. మంగళవారం మండల పరిధి లోని శివాపురం గ్రామంలో జగదాంబ గ్రామైక్య సంఘానికి ఆయన కంకవనాల సాగుపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆమోదితమైన ఓ కంపెనీ ద్వారా 15 గుంటలు పట్టా భూమి ఉన్న మహిళా రైతుకు 60 కంక మొక్కలను ఉచితంగా అందిస్తారని తెలిపారు. ఆ తర్వాత ప్రతిరోజూ మొక్కకు నీరుపట్టి సంరక్షించినందుకు రూ.15 నాలుగేళ్లపాటు అందిస్తారని చెప్పారు. నాలుగు ఏళ్ల వరకు వనాలను కాపాడితే మొక్కలు ఇచ్చిన కంపెనీ వారు కర్రను తీసుకెళ్లి రూ.40వేలు ఇస్తారని తెలిపారు. ఇలా పంట దిగుబడి వచ్చినన్ని రోజులు కొనుగోలు చేస్తారని వివరించారు. రైతుకు ఉపాధి హామీ కార్డు ఉంటే మొక్కల సంరక్షణ, నాటడం, మట్టి పనులు చేసినందుకు కూలి డబ్బులు కూడా వస్తాయని తెలిపారు. గ్రామంలోని మహిళలు, రైతులు కంకవనం(వెదురు) పంటపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో వీఓఏ ప్రశాంతి, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు ఎట్టి రమ, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. సెర్ప్ సీసీ నర్సింహారావు కంకవనం సాగుపై అవగాహన -
పరీక్ష కేంద్రాల వద్ద హడావుడి పనులు
పరీక్ష కేంద్రం వద్ద చెత్తాచెదారం, చిందరవందరగా ఉన్న నాపరాళ్లు ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద పరీక్షల ప్రారంభానికి ఒకరోజు ముందు మంగళవారం కాంట్రాక్టర్లు హడావుడిగా పనులు మొదలు పెట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంట ర్ మొదటి, ద్వితీయ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు కావా ల్సిన విద్యుత్, ఫ్యాన్లు, కిటికీలు, తాగునీటి వసతులకు సంబంధించిన పనులను పరీక్షలకు ఒకరోజు మిగిలి ఉండగా కాంట్రాక్టర్లు మొదలు పెట్టారు. దీంతో కళాశాల ఆవరణలో నాపరాళ్లు చిందరవందరగా పడిఉన్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉందని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.అధ్వానంగా నాపరాళ్లు, చెత్తా చెదారం -
ప్రశాద్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి
వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపద గల రామప్ప ఆలయ పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న ప్రశాద్ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. ప్రాజెక్టు పనులను మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మే నెలలో హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలు జరుగనున్న నేపథ్యంలో పలు దేశాలకు చెందిన మహిళలు పర్యాటక స్థలాల ను పర్యటించే అవకాశం ఉందన్నారు. రామప్పకు వచ్చే విదేశీ పర్యాటకులకు అన్ని వసతులు కల్పించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రశాద్ స్కీం పనులు ఏప్రిల్ 20లోపు పూర్తి చేసి, రామప్ప పరిసర ప్రాంతాలను సుందరీకరించాలని తెలిపారు. కాకతీయ కట్టడాల గురించి ప్రపంచానికి చాటిచెప్పే విధంగా విదేశీ పర్యాటకులకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో తొలి సారిగా ప్రపంచ సుందరి పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా దేశాలకు చెందిన సుందరీమణులను పర్యాటక ప్రదేశాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రపంచ దేశాలకు చెందిన పర్యాటకులను ఆకట్టుకునేలా రామప్పలో ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ములుగు ఆర్డీఓ వెంకటేశ్, డీపీఓ ఒంటేరు దేవరాజ్, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, ఇంజనీరింగ్ అధికారులు ధనరాజ్, విజయ్కుమార్, తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు, ఎంపీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.కలెక్టర్ దివాకర టీఎస్ -
పరిహారం అందేనా?
గోవిందరావుపేట: చల్వాయిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) 5వ బెటాలియన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు 10 ఏళ్లు గడిచినా నేటికీ పరిహారం అందలేదు. తెలంగాణ ప్రభుత్వం బెటాలియన్ నిర్మాణానికి 105 ఎకరాలు లాక్కొని పరిహారం కూడా చెల్లించకుండా సుమారు 60 మంది కుటుంబాలను రోడ్డున పడేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోయిన రైతులు సుమారు ఐదు సంవత్సరాలపాటు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేశారు. బెటాలియన్ గేటు ఎదుట రిలే నిరాహార దీక్షలు సైతం కొనసాగించినా ఫలితం లేకుండా పోయింది. ఇలా పోరాటం చేసిన పలువురు రైతులపై పోలీసు కేసులు నమోదు కావడంతో జైలుకు సైతం వెళ్లారు. నేటికీ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
ఆత్మహత్యాయత్నం..
బెటాలియన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు తమకు న్యాయం చేయాలని అధికారులు, ప్రభుత్వం, నాయకులను కోరినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. చివరకు చల్వాయి గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో మహిళా రైతులు సైతం ఉండడం గమనార్హం. దీంతో అప్పటి అధికారులు, పోలీసులు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో రైతులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.పరిహారం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులు(ఫైల్) -
లబ్ధికోసమే రాజకీయ నాయకుల మద్దతు ?
భూ నిర్వాసితులు చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోలు, రిలే నిరాహార దీక్షలకు పలువురు రాజకీయ నాయకులు మద్దతు ప్రకటించినా.. అది కేవలం వారి రాజకీయ లబ్ధికోసమేనని రైతులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకులు నిజంగా తమ కోసం పోరాడితే ఎప్పుడో న్యాయం జరిగేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రధాన పార్టీలోని నాయకులు సీతక్క, ప్రొఫెసర్ కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ మంత్రి దివంగత అజ్మీరా చందూలాల్ వంటి వారు.. రైతులకు పరిహారం వచ్చేవరకు అండగా ఉంటామని చెప్పి మాయమాటలతో పబ్బం గడిపారని, కేసుల పాలై కోర్టు చుట్టూ తిరుగుతున్నా.. ప్రస్తుతం పట్టించుకునేవారే లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ట్రాఫిక్ జాంలో 108 అంబులెన్స్
వెంకటాపురం(కె): మండల పరిధిలోని కొండాపురం గ్రామ సమీపంలో మంగళవారం 108 అంబులెన్స్ వాహనం ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది. ఎదిర వైద్యశాల నుంచి అత్యవసరంగా ఓ పేషెంట్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరి యా ఆస్పత్రికి తరలించేందుకు వెళ్లి వెంకటాపురం వస్తున్న క్రమంలో కొండాపురం గ్రామసమీపంలో ఇసుక లారీల మధ్యలో సుమారు అరగంటపాటు అంబులెన్స్ ఇరుక్కుపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి ఇసుక లారీలు పెద్ద సంఖ్యలో వెంకటాపురం మండలం మీదుగా వెళ్తుండడంతో ఇసుక లారీల మధ్యలో 108 వాహ నం ఇరుక్కుపోయింది. అంబులెన్స్లో పేషెంట్ ఉన్నప్పుడు ఇలా ట్రాఫిక్ జాంలో ఇరుక్కుంటే పరిస్థితి ఏంటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికై నా ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలని కోరుతున్నారు. -
హామీ ఇచ్చి మోసం చేశారు..
మా తాతల నాటినుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. ఉన్న పలంగా వచ్చి ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడ బెటాలియన్ నిర్మాణం చేపడుతున్నాం.. అని భూమిని లాక్కొని, మా మీద కేసులు నమోదు చేసి జైలుకి పంపారు. ఉద్యోగం కల్పిస్తాం.. భూమికి బదులు భూమిస్తాం.. అని మోసం చేశారు. ఇప్పటికై నా భూములు కోల్పోయిన రైతులకు హామీ మేరకు పరిహారం ఇవ్వాలి. రైతులపై ఉన్న కేసులను ఎత్తేయాలి. – జంపాల అనిల్, భూ నిర్వాసితుడు కేసు కోర్టులో ఉంది చల్వాయి బెటాలియన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల కేసు ప్రస్తుతం కోర్టులో కేసు ఉంది. కోర్టు ఉత్తర్వుల మేరకు మేము ముందుకెళ్తాం. – సృజన్ కుమార్, తహసీల్దార్, గోవిందరావుపేట -
విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలి
ములుగు రూరల్: విద్యార్థులు చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ రవీందర్ అన్నారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల నియంత్రణపై మండలంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల సరఫరా లేదా తోటి విద్యార్థులు అలవాటుపడినట్లు తెలిస్తే పోలీస్లకు, యాంటీ డ్రగ్ కమిటీకి లేదా పాఠశాల ప్రిన్సిపాల్కు విషయం చెప్పాలని అన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి చదవాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు డీఎస్పీ చేతుల మీదుగా హాల్ టికెట్లను అందించారు. కార్యక్రమంలో సీఐ శంకర్, ఎస్సై వెంకటేశ్వరరావు, సీడీపీఓ ఓంకార్, ప్రిన్సిపాల్ ఝాన్సీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కొడవటంచ జాతరకు ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 9వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తిచేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, పంచా యతీరాజ్, విద్యుత్, వైద్య, ఆర్టీసీ, ఆర్డబ్ల్యూఎస్, సింగరేణి, ఆర్అండ్బీ, సమాచార, దేవాదాయ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక విధు ల నిర్వహణకు గ్రామ సిబ్బందిని డిప్యూట్ చేసి, పారిశుద్ధ్యం, పరిశుభ్రత పనులు చేపట్టాలని ఆదేశించారు. దేవాలయాన్ని విద్యుద్దీకరణ చేయడంతో పాటు పూలతో అందంగా ముస్తాబు చేయాలన్నా రు. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల సౌకర్యార్ధం గ్రామంలో వీధిలైట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. చెరువు వైపు, పార్కింగ్ స్థలాలు, భక్తులు ఉండే జాతర స్థలాలలో తాత్కాలిక లైట్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. జాతరకు వచ్చే కొడవటంచ బైపాస్, రేపాక, కొడవటంచ రోడ్, గుడెపల్లి–కొడవటంచ దారుల్లో అడ్డంగా ఉన్న ముళ్లపొదలు తొలగించి, మొరం పోసి గుంతలు పూడ్చాలన్నారు. జాతర రోజుల్లో మిషన్ భగీరథ తాగునీరు సరఫరా చేయాలని, నీళ్ల ట్యాంకుల దగ్గర ఇంకుడుగుంతలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహిళల సౌకర్యార్ధం స్నాన ఘట్టాల వద్ద బట్టలు మార్చుకునే గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల రద్దీని అనుసరించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. భక్తుల సౌకర్యార్ధం 108 అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని, భూపాలపల్లి డిపోతో పాటు ఇతర జిల్లాల నుంచి నిరంతరం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డీఎంకు సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులతో సమీక్ష -
రంజాన్కు ఏర్పాట్లు పూర్తి చేయాలి
ములుగు: రంజాన్ మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ సూచించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సీహెచ్ రవీందర్రెడ్డితో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. మసీదులు, ఈద్గాల వద్ద తాగునీరు, పారిశుద్ధ్య సమప్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రంజాన్, హోలీ పండుగల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. రంజాన్ పండుగ రోజు ములుగు ఈద్గాలో సుమారుగా 5 వేల మంది ప్రార్థనలకు హాజరవుతారని తెలిపారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని అధికారులు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు రహమతుల్లా బేగ్, హజీ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్, సయ్యద్ షకిల్, రియాజ్ మీర్జా బేగ్, కుత్బోద్దీన్, అబ్దుల్రబ్ తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి
వెంకటాపురం(ఎం): విద్యుత్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని టీజీఎన్పీడీసీఎల్ ఆపరేషన్–2 సీఈ రాజ్ చౌహాన్ తెలిపారు. మంగళవారం లైన్మెన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని వెల్తుర్లపల్లి విద్యుత్ సబ్స్టేషన్ను సందర్శించి సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారిని శాలువా లతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్ చౌహాన్ మాట్లాడుతూ.. నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరాను వినియోగదారులకు అందించాలన్నారు. వినియోగదారుల సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించాలని చెప్పారు. సమ్మర్ యాక్షన్లో భాగంగా మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు సిబ్బందికి పలు సూచనలు అందించారు. ఆనంతరం వెల్తుర్లపల్లి సబ్స్టేషన్లో ఫెయిల్ అయిన పవర్ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో నూతన ట్రాన్స్ఫార్మర్ను అమర్చారు. కార్యక్రమంలో భూపాలపల్లి డీఈ సదానందం, ములుగు ఏడీఈ ఆపరేషన్ వేణుగోపాల్, ఏడీఈ కన్స్ట్రక్షన్స్ సందీప్ పటేల్, ఏఈలు రమేశ్, బెనర్జీ, సబ్ ఇంజనీర్ సాంబరాజు పాల్గొన్నారు.రాజ్ చౌహాన్