breaking news
Mulugu
-
లెక్క చెప్పాల్సిందే..
ములుగు: సర్పంచ్గా గెలిచినా.. ఓడినా ఎన్నికల ప్రచార ఖర్చును అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికలు జరిగిన 45 రోజుల్లోగా ప్రచార ఖర్చుల వివరాలు సమర్పించని సర్పంచ్లపై ప్రభుత్వం అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. గత డిసెంబర్ నెలలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. జిల్లాలోని 9 మండలాల పరిధిలోని 146 గ్రామపంచాయతీలు ఉండగా, 11న తొలి విడతలో 48 జీపీలకు, 14న రెండవ విడతలో 52 జీపీలకు, 17న మూడవ విడతలో 46 జీపీలకు ఎన్నికలు జరిగాయి. 146 గ్రామ పంచాయతీలకు 25 ఏకగ్రీవం కాగా మిగిలిన 121 పంచాయతీలకు 435 మంది అభ్యర్థులు సర్పంచ్లుగా పోటీ చేశారు. 314 మంది అభ్యర్థులు ఎన్నికల ప్రచార ఖర్చుల వివరాలను అధికారులకు సమర్పించగా 121 మంది అభ్యర్థులు ఇంకా ప్రచార ఖర్చుల వివరాలు సమర్పించలేదు. మొదటి విడత అభ్యర్థులకు నేడే చివరిరోజు జిల్లా వ్యాప్తంగా 10 మండలాల పరిధిలో 174 గ్రామ పంచాయతీలు ఉండగా మంగపేట మండలంలో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో కేసు ఉండడంతో 25 జీపీలకు ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 9 మండలాల పరిధిలో 146 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల పరిధిలో 48 జీపీలు ఉండగా 9 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 39 పంచాయతీలకు 148 మంది అభ్యర్థులు సర్పంచ్లుగా పోటీ చేశారు. ఇందులో 128 ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించగా, మిగిలిన 20 మంది అభ్యర్థులు శనివారం లోగా అధికారులకు సమర్పించాలి. 2వ విడతలో వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాల పరిధిలో 46 జీపీలు ఉండగా ఒక జీపీ ఏకగ్రీవం అయింది. మిగిలిన 45 జీపీలకు 158 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో 88 మంది ఎన్నికల ఖర్చు వివరాలను అధికారులకు అందించారు. మిగిలిన 70 మంది ఈనెల 27లోగా ఖర్చుల వివరాలు అధికారులకు అందించాలి. మూడవ విడతలో ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) పరిధిలో 52 పంచాయతీలు ఉండగా 15 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 37 పంచాయతీలకు 129 మంది పోటీ చేయగా 98 మంది ఎన్నికల ఖర్చు వివరాలను అందించారు. మిగిలిన 31 మంది ఈనెల 30లోగా ఖర్చుల వివరాలు అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం తమ ఎన్నికల ఖర్చు వివరాలను సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారికి గడువులోగా సమర్పించాలి. సర్పంచ్గా గెలిచిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించకపోతే ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. ఓడిపోయిన అభ్యర్థులు కూడా ఖర్చు వివరాలు సమర్పించకపోతే మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. – వెంకయ్య, డీపీఓ లెక్క చూపని సర్పంచ్ అభ్యర్థులపై అనర్హత వేటు జిల్లాలో 146 జీపీల పరిధిలో 435 మంది అభ్యర్థులు పోటీ ప్రచార ఖర్చుల వివరాలు సమర్పించిన 314 మంది అభ్యర్థులు లెక్కలు చూపాల్సిన వారు 121 మంది.. -
రిపబ్లిక్ డేకు ఏర్పాట్లు చేయాలి
ములుగు: గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సిహెచ్. మహేందర్ జీ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావుతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్లో నిర్వహించే గణతంత్ర వేడుకలకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ గోపాలరావు, డీసీఎస్ఓ షా ఫైజల్ హుస్సేని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, డీసీఓ సర్దార్ సింగ్, అధికారులు పాల్గొన్నారు. అలాగే రంజాన్ మాసాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్రావు తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం మతపెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయభాస్కర్, ఫైర్ స్టేషన్ అధికారి నాగరాజు, పంచాయతీ అధికారి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ములుగు: ములుగు మున్సిపల్ కమిషనర్గా తన్నీరు రమేశ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బెల్లంపల్లి నుంచి ములుగుకు బదిలీపై రాగా, ఇక్కడ పనిచేసిన సంపత్ బెల్లంపల్లి కమిషనర్గా బదిలీపై వెళ్లారు. కాగా బాధ్యతల స్వీకరణ అనంతరం కమిషనర్ రమేశ్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్నారు. ములుగు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ములుగు రూరల్: తూకంలో మోసం చేస్తే శాఖపరమైన చర్యలు తప్పవని ఉమ్మడి భూపాలపల్లి జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీలత హెచ్చరించారు. శుక్రవారం ములుగు మండలపరిధిలోని మేడివాగు వద్ద చేపలు విక్రయిస్తున్న వారి వద్ద బాట్లను పరిశీలించారు. పస్రాలో చికెన్ సెంటర్లు, మాంసం దుకాణాలు, జవహార్నగర్, పస్రా పెట్రోల్ బంక్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిబంధనల మేరకు తూనికలు, కొలతలు సరిగా లేని కాంటాలు, బాట్లను సీజ్ చేసి కేసులు నమోదు చేశామన్నారు. కార్యక్రమంలో తూనికలు, కొలతల టెక్నికల్ అసిస్టెంట్ హఫీజ్, సిబ్బంది పాషా, శివకుమార్, సలీం, వినియోగదారులు సమాఖ్య అధ్యక్షుడు చల్లగురుగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఏటూరునాగారం: మేడారం జాతరలో అమ్మవార్ల గద్దెల వద్ద భక్తులను అదుపు చేయడంలో సంబంధిత శాఖలు ఇబ్బంది పడుతున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్హెచ్ఆర్సీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొగుళ్లభద్రయ్య అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భక్తులు తీసుకువచ్చే బెల్లం, ప్రసాదాలను గద్దెలపై విసిరేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకురావాలన్నారు. భక్తుడికి దర్శనం అనంతరం ఉచితంగా బెల్లం, ప్రసాదం అందించే కౌంటర్లు ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితి నిర్మూలించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, మనోహర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. నేడు మంత్రి పొన్నం రాక ఎస్ఎస్ తాడ్వాయి: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు (శనివారం) మేడారం రానున్నారు. మేడారంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్స్టేషన్, ప్రయాణికులు క్యూ లైన్లు, ఆర్టీసీ ఉద్యోగుల విశ్రాంతి షెడ్డులు, జాతర స్పెషల్ బస్సులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు మేడారం బస్టాండ్ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. -
నిబద్ధత, అంకితభావంతో పనిచేయాలి
ములుగు: మేడారం మహాజాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబద్ధ త, అంకితభావంతో పనిచేసి మేడారం జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ పి లుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ గార్డెన్లో మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు విధులు నిర్వహించే సెక్టోరల్ అధికారులు, సిబ్బందికి రెండో విడత శిక్షణా కార్యక్రమాన్ని ఇచ్చారు. కార్యక్రమానికి కలెక్టర్ దివాకర హాజరై మాట్లాడారు. జాతరలో విధులు నిర్వహించే అధికా రులకు శిక్షణ ముగిసిందని, జాతర విధుల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉండాలన్నారు. జంపన్నవాగు వ ద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. జాతర పరిసరాల్లో భక్తులకు అర్థమయ్యేలా ఆర్అండ్బీ శాఖ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పరిసరాలు దుర్వాసన రాకుండా ఎప్పటికప్పుడు గల్ఫర్తో శుభ్రం చేస్తుండాలని, పారిశుద్ధ్య సిబ్బందికి యూనిఫాం, గ్లౌస్లు, మా స్కులు ఇవ్వాలన్నారు. ఆరోగ్య పరంగా మందులు అందుబాటులో పెట్టుకొని సిద్ధంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆలయ అలంకరణ, లైటింగ్, పరిసరాలు గిరిజన సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం జాతర నిర్వహించాలన్నారు. సెక్టార్ అధికారుల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం అధికారులకు జాతర విధులకు సంబంధించి ప్రత్యేక గుర్తింపు కార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, నోడల్ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. 26న అధికారులు రిపోర్ట్ చేయాలి కలెక్టర్ దివాకర టీఎస్ ముగిసిన సెక్టోరల్ అధికారుల శిక్షణ -
భక్తులకు తాగునీటి వసతి
ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు తాగునీటిని అందించేందుకు ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో వసతులు కల్పించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు క్యూలైన్లో కూడా తాగునీటి వసతి కల్పించారు. ఈసారి 5,500ల నల్లాలు, 517 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, 47 మినీ వాటర్ ట్యాంక్లు, 312 సిస్టర్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల కోసం తాత్కాలికంగా 5,700 మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 285 బ్లాక్లను ఏర్పాటు చేసి వాటి శుభ్రతకు 255 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. జాతరలో పారిశుద్ధ్య పనుల కోసం 5వేల శానిటేషన్ సిబ్బంది నియమించామన్నారు. -
ప్లాస్టిక్ రహిత మేడారమే లక్ష్యం
ములుగు రూరల్: ప్లాస్టిక్ రహిత మహాజాతరగా నిర్వహించుకునేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాఽథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మేడారం జాతరలో వినాయక గ్రామైక్య సంఘం జగ్గన్నపేట ఆధ్వర్యంలో ఆకులతో తయారు చేసిన ప్లేట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకృతి ప్రసాదిస్తున్న ఆకుల తయారీ విస్తరాకులను వినియోగించడం మేలన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్స నరసింహమూర్తి, జిల్లా సమాఖ్య మేనేజర్ కిషన్రావు తదితరులు పాల్గొన్నారు. -
పదిలో మెరుగైన ఫలితాలు సాధించాలి
ములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, ఈ విద్యాసంవత్సరంలో టెన్త్లో మెరుగైన ఫలితాలు సాధించాలని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం పీఆర్టీయూ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు హట్కార్ సమ్మయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పల్లె నాగరాజు, ఉప్ప స్వామి, ఉపాధ్యాయులు దీలిఫ్, సారంగపాణి, సతీ్ష్, వైనాల స్వామి, రవీందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మేడారం.. గుడారం
మేడారంలో వెలిసిన గుడారాలుఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి: సుదూర ప్రాంతాల నుంచి మేడారం జాతరకు వచ్చే భక్తులు విడిది చేసేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున గుడారాలు ఏర్పాటు చేశారు. సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో సారలమ్మ వచ్చే ముందు రోజు స్వయంగా గుడారాలు ఏర్పాటు చేసేవారు. కానీ, ఇప్పుడు 15 రోజుల ముందు నుంచే ఏర్పాటు చేసి భక్తులకు అద్దెకిస్తున్నారు. వనదేవతలను దర్శించుకుని పిల్లాపాపలతో ఉండేలా ఇక్కడ అద్దె గదులు ఏర్పాటు చేశారు. వాటిలో సేద తీరితే 24 గంటలకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే టెంట్ సిటీ లగ్జరీతో ఏర్పాటు చేయగా మిగతా ప్రాంతాల్లో తాత్కాలిక పందిళ్లు వేశారు. తడకలు, బర్కాలు, పాలిథిన్ కవర్లు, గ్రీన్ మ్యాట్లతో అద్దె గదులు రూపొందించారు. వాటికి నంబర్లు వేసి భక్తులకు కేటాయిస్తున్నారు. మేడారం ఇప్పడు మెగాసిటీ మేడారం జాతరంటే ఒకప్పుడు చెట్లు, పుట్టలు. భ క్తులు తల్లులను దర్శించుకుని చెట్ల కింద వంటా వార్పు చేసుకొని అడవిలో మూడు రోజులపాటు గడిపేవారు. కంప్యూటర్ యుగంలో మేడారం ఇప్పుడు మెగాసిటీగా మారింది. చాలా మంది వ్యా పారులు జాతర సందర్భంగా మేడారంలోని స్థానిక భూములను గజాల చొప్పున అద్దెకు తీసుకుని గుడారాలు ఏర్పాటు చేశారు. కాంక్రీట్ భవనాలతో వందలాది అద్దె గదులు నిర్మించి కూడా భక్తులకు అద్దెకు ఇస్తున్నారు. ఇవేకాకుండా భవనాలపై తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసి అద్దెకు ఇస్తున్నారు. అద్దెకు ఉండే వారికి వేడి నీళ్లు, మొబైల్ చార్జింగ్, రెడీ టు ఫుడ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముందస్తు సందడి.. జాతరకు 15 రోజుల ముందు నుంచి మేడారంలో భక్తుల రద్దీ మొదలైంది. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా డెన్లు ఏర్పాటు చేశారు. జంపన్నవాగు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు, గద్దెల నుంచి చిలకలగుట్ట వరకు ఇరువైపులా గుడారాలు వెలిశాయి. 15 రోజుల క్రితం మూడు వేల వరకు ఉన్న జనాభా నేడు లక్ష వరకు పెరిగింది. ఏ రోడ్డు చూసినా పట్టణ ప్రాంతంగా దర్శనమిస్తోంది. భక్తుల రాకపోకలు మరింత పెరగడంతో ఏ గుడారాలు నిండుగా కనిపిస్తున్నాయి. జోరుగా వ్యాపారాలు మేడారం జాతరలో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. భక్తుల కోసం ఏర్పాటు చేసిన గూడారాలు, తాత్కాలిక షెడ్లలో అనేక వ్యాపారాలు వెలిశాయి. ఇదే జోరులో వ్యాపారులు కొనసాగుతున్నాయి. కూల్డ్రింక్స్, వాటర్, రెస్టారెంట్ స్థాయిలో ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. భక్తులు కుటుంబాలతో దర్శనం కోసం వచ్చి అన్నిరకాల సౌకర్యాలతో ఆహ్లాదాన్ని పొందుతున్నారు. రెండేళ్లకోసారి ఉపాధి మేడారం జాతర రెండేళ్లకోసారి రావడంతో వనదేవతలను దర్శించుకునే భక్తులు సేద తీరేందుకు అద్దె గదులు ఏర్పా టు చేస్తున్నాం. వాటిని ద్వారా మేం కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటాం. ప్రతీ జాతర మాకు జీవనోపాధి కల్పిస్తుంది. భక్తులను ఇంటి కుటుంబ సభ్యులు లాగానే చూసుకుంటాం. – సంకెపల్లి జైపాల్రెడ్డి, రెడ్డిగూడెం వేలాదిగా వెలిసిన తాత్కాలిక పందిళ్లు అడుగడుగునా భక్తులకు అద్దె గదుల స్వాగతం సౌకర్యాలపై ప్రత్యేక దృష్టిసారించిన వ్యాపారులుమేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం, నార్లాపురం తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు సైతం వారు ఉండే ఇళ్లను భక్తులకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటారు. భక్తులను ఆకట్టుకునేలా గుడారాలను తీర్చిదిద్దుతున్నారు. -
గోదావరి జలాలు అందించడమే లక్ష్యం
● అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ● రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ములుగు: నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు గోదావరి జలాలను అందించడమే లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. జిల్లా కేంద్రంలోని జీవంతరావుపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, రూ.5 లక్షలతో నిర్మించిన హనుమాన్ టెంపుల్ ప్రహరీని, రూ.3.50 కోట్లతో నిర్మించిన డబుల్ లైన్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులను అదనపు కలెక్టర్ సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డితో కలిసి సీతక్క గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ప్రాజెక్టు నిర్మించినప్పటికీ అప్పటి పాలకులు వారి వారి ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించుకుపోయారని తెలిపారు. జిల్లాకు మాత్రం గోదావరి జలాలు అందలేదన్నారు. గోదావరి జలాలను ములుగు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు అందించి రెండు పంటలు పండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జిల్లాలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. జీవింతరావుపల్లిలో ఇందిరమ్మ పథకంలో భాగంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం ములుగు డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడంతో పాటు వడ్డీలేని రుణాల చెక్కులను అందజేశారు. ములుగులో రూ.15 లక్షలతో నిర్మించిన ఈద్గా ప్లాట్ ఫాంను ప్రారంభించడంతో పాటు క్యాంపు కార్యాలయంలో 8 మంది లబ్దిదారులకు ీసీఎంఆర్ఎఫ్ చెక్కులను సీతక్క అందజేశారు. -
16 నుంచి 20 కిలో మీటర్లు రాకపోకలు
మంగపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రాజుపేట, రమణక్కపేట, చుంచుపల్లి, మల్లూరు, నర్సింహాసాగర్, తిమ్మంపేట గ్రామాలకు చెందిన విద్యార్థులు 16 నుంచి 20 కిలోమీటర్లు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తున్నారు. బస్టాప్ లేదనే సాకుతో పలు గ్రామాల్లో ఆర్టీసీ బస్సులు ఆపని పరిస్థితి ఉంది. నర్సింహాసాగర్కు బస్ సౌకర్యం లేదు. దీంతో విద్యార్థులు నిత్యం రూ.60 నుంచి రూ.100 వరకు ఆటో చార్జీలు చెల్లించి వచ్చి వెళ్తున్నారు. అంతే కాకుండా విద్యార్థినులు ఉచిత బస్సు సౌకర్యానికి సైతం దూరమవుతున్నారు. కళాశాల నుంచి ఇంటికి చేరుకోవడానికి గంటల తరబడి బస్సులు, ఆటోల కోసం వేచి చూడాల్సి వస్తుంది. -
అతివల మొగ్గు ఎటువైపో!
ములుగు మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే కీలకం ములుగు: ములుగు మున్సిపాలిటీలో అతివలదే ఆధిపత్యం కానుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించే కీలక భూమికలను మహిళలే పోషించనున్నారు. మున్సిపాలిటీలో 13,963 మంది ఓటర్లు ఉండగా 7,300 మంది మహిళలు ఉన్నారు. 6,661 మంది పురుషులు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. పురుషులకంటే 639 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండడంతో అన్ని పార్టీల నాయకులు మహిళలను తమవైపు తిప్పుకొనేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లాలో 20 వార్డులకు 10 వార్డులను మహిళలకే కేటాయించగా, మున్సిపాలిటీ చైర్మన్ రిజర్వేషన్ సైతం బీసీ మహిళకు కేటాయించారు. దీంతో ప్రధాన పార్టీల్లోని నేతలు తమ సతులను ఎన్నికల బరిలో దింపేందుకు సన్నద్ధమయ్యారు. ఎలాగైనా మహిళా ఓటర్లను ఆకర్షించేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో పోటీలో నిలబడే వ్యక్తులు తమకు అనుకూలమైన వార్డుల్లో ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. పార్టీపరంగా ప్రచారం కాకుండా సొంత ప్రచారమే ఎక్కువగా నిర్వహించుకుంటూ తమకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను ప్రాధేయపడుతున్నారు. పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా బరిలో ఉంటామని తమను గెలిపించాలని కోరుతూ ఓటర్లను ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. అత్యధిక వార్డుల్లో మహిళా ఓటర్లే అధికం ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా 16 వార్డుల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండగా కేవలం 4 వార్డుల్లో మాత్రమే పురుషులు అధికంగా ఉన్నారు. 1వ వార్డులో మహిళలు 350, పురుషులు 321, 2వ వార్డులో మహిళలు 404, పురుషులు 333, 3వ వార్డులో 410 మహిళలు, 342 పురుషులు, 4వ వార్డులో 393 మహిళలు, 380 పురుషులు, 5వ వార్డులో 355 మంది మహిళలు, 299 పురుషులు, 6వ వార్డులో 312 మహిళలు, పురుషులు 315, 7వ వార్డులో 364 మంది మహిళలు, 371 పురుషులు, 8వ వార్డులో 342 మహిళలు, 355 పురుషులు, 9వ వార్డులో 366 మహిళలు, 329 పురుషులు, 10వ వార్డులో 395 మంది మహిళలు ఉండగా 350 పురుషులు ఉన్నారు. అలాగే 11వ వార్డులో మహిళలు 367, పురుషులు 344, 12వ వార్డులో మహిళలు 409, పురుషులు 381, 13వ వార్డులో 362 మహిళలు, 326 పురుషులు, 14వ వార్డులో 402 మహిళలు, 354 పురుషులు, 15వ వార్డులో 379 మహిళలు, 380 పురుషులు, 16వ వార్డులో 325 మహిళలు, పురుషులు 291, 17వ వార్డులో 317 మహిళలు, 312 పురుషులు, 18వ వార్డులో 345 మహిళలు, 293 పురుషులు, 19వ వార్డులో 337 మహిళలు, 277 పురుషులు, 20వ వార్డులో 366 మహిళలు ఉండగా 308 పురుషులు ఉన్నారు. 6,7,8,15 వార్డుల్లో మినహా మిగిలిన అన్ని వార్డుల్లోని గెలుపోటముల్లో మహిళలదే తుది తీర్పు కానుంది. వారి ఓట్లకోసం నేతల యత్నాలు మహిళా సంఘాలకు ఇప్పటి నుంచే తాయిలాల ప్రకటనలుమున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా పోటీ చేయనున్న ఆశావహులు మహిళల ఓట్లు సాధించాలనే ఉద్దేశంతో మహిళా సంఘాలను కలుస్తూ వారికి కావాల్సిన పనులు చేస్తామని హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మహిళల ఓట్లకోసం కొన్ని వార్డులలో సతులతో ప్రచారం చేపిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు ఏకతాటిపై ఉంటారనే నమ్మకంతో వారి ఓట్లు గంపగుత్తగా పడే అవకాశం ఉండటంతో గ్రూపు సభ్యులతో పాటు లీడర్లను కలుస్తున్నారు. సంఘాలకు ఎలాంటి రుణాలు కావాలన్నా తాము ఇప్పిస్తామని హామీలు ఇస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా మహిళా సంఘాల్లో ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. -
రామప్పలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రమేశ్
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు రమేశ్ గురువారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఆయన వెంట ములుగు ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి కోటి ఉన్నారు. కాళేశ్వరం: గతేడాది మేలో సరస్వతి నది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని వీఐపీ ఘాటు వద్ద ఏర్పాటుచేసిన సరస్వతి మాత విగ్రహానికి దేవస్థానం అర్చకులు ముస్తాబు చేస్తున్నారు. శుక్రవారం వసంతపంచమి సందర్భంగా దేవస్థా నం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు వసంత పంచమి.. వసంత పంచమి సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీసరస్వతి అమ్మవారి ఆలయంలో ఉదయం 10గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. చిన్నారులకు అక్షర స్వీకారాలు చేస్తారు. భక్తులు పాల్గొనాలని దేవస్థానం అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ 9వ సమావేశం నిర్వహించనున్నట్లు హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం అధిపతి డాక్టర్ చిలువేరు రాజ్కుమార్ తెలిపారు. ఈమేరకు క్యాంపస్లో గురువారం పోస్టర్ను వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్, ఆచార్యులు బి.సురేశ్లాల్, ఆర్.మల్లికార్జున్రెడ్డి, చంద్రకళ, వీఎస్ నరేందర్, కుమారస్వామి, ఎంకే సుమంత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏటూరునాగారం: 800 ఏళ్ల చరిత్ర కలిగిన మేడారం జాతరపై ప్రముఖ రచయిత, ఎన్ఐటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు రచించిన సమ్మక్క–సారలమ్మ పుస్తకాన్ని మంత్రి సీతక్క గురువారం ఆవిష్కరించారు. మేడారంలోని ఐటీడీఏ గెస్ట్ హౌస్లో కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణిలతో కలిసి మంత్రి సీతక్క ఆవిష్కరించారు. అనంతరం వనదేవతలను దర్శనం చేసుకుని వారు రచించిన పుస్తకాన్ని గద్దెల వద్ద సమర్పించారు. -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
వెంకటాపురం(ఎం): ప్రతిఒక్కరూ చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్యర్యంలో శ్రీచైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్శ్రీ ప్రచారంలో భాగంగా మండలంలోని పాలంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివాహ నిషేధిత చట్టం, పోక్సో చట్టం, విద్యా హక్కు చట్టం, ర్యాగింగ్ చట్టం, మోటార్ వెహికల్ చట్టం గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాల్య వివాహం చేస్తే చట్టరీత్యా నేరమన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే సమాచారం ఇవ్వాలన్నారు. ఉచిత న్యాయ సహాయానికి టోల్ ఫ్రీ నంబర్ 15100 కి కాల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్న్స్ కౌన్సిల్ బానోత్ స్వామి దాస్, ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్, ఉపాధ్యాయులు అనిత, రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్ -
అందరికీ ఒకేరకమైన ఆహారం
● ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్ ములుగు రూరల్: ఆహార నాణ్యతలో తేడా వస్తే వేటు తప్పదని, హోంగార్డు నుంచి ఎస్పీ స్థాయి వరకు అందరికీ ఒకే రకమైన ఆహారం అందించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సూచించారు. ఈ మేరకు నార్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడారం సిబ్బందికి వండుతున్న భోజనాన్ని ఎస్పీ గురువారం పరిశీలించి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మేడారంలో అన్ని ర్యాంకుల అధికారులు, సిబ్బందికి నాణ్యమైన ఆహారం అందేలా చూడాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బందికి ఆరోగ్యం, భద్రత అత్యంత ముఖ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఏఎస్పీ మనన్ బట్, ఎస్బీ సీఐ శంకర్, ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలనుంచి వచ్చి వెళ్లే వారి కోసం కాజీపేట, వరంగల్ మీదుగా, కాజీపేట, వరంగల్ నుంచి జన్ సాధా రణ్ అన్రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. » ఈ నెల 28, 30, ఫిబ్రవరి 1వ తేదీల్లో సికింద్రాబాద్–మంచిర్యాల (07495) వెళ్లే ఎక్స్ప్రెస్, జనవరి 28, 30, ఫిబ్రవరి 1 తేదీల్లో మంచిర్యాల–సికింద్రాబాద్ (07496) వెళ్లే ఎక్స్ప్రెస్, జనవరి 29, 31వ తేదీల్లో సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ (07496) వెళ్లే ఎక్స్ప్రెస్, జనవరి 29, 31 తేదీల్లో సిర్పూర్ కాగజ్నగర్–సికింద్రాబాద్ (07497) వెళ్లే ఎక్స్ప్రెస్ కాజీపేటకు చేరుకొని వెళ్తాయి. ఈ రైళ్లకు మౌ లాలి, చర్లపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగామ, రఘునాథపల్లి, ఘన్పూర్, పెండ్యాల్, కాజీపేట, వరంగల్, హసన్పర్తి, ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరిషరీఫ్, పొత్కపల్లి, ఓదెల, కొలనూర్, పెద్దపల్లి, రాఘవపురం, రామగుండం, పెద్దంపేట్లో హాల్టింగ్ కల్పించారు. » ఈ నెల 28 నుంచి 31 తేదీల్లో నిజామాబాద్–వరంగల్ (07499) వెళ్లే ఎక్స్ప్రెస్, 28 నుంచి 31 తేదీల్లో వరంగల్–నిజమాబాద్ (07500) వెళ్లే ఎక్స్ప్రెస్లకు కామారెడ్డి, అక్కన్నపేట, మిర్జాపల్లి, వాడిరామ్, మనోహరాబాబాద్, మేడ్చల్, బొల్లారం, మౌలాలి, చర్లపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, వంగపల్లి, ఆలేరు, జనగామ, రఘునాథ్ పల్లి, ఘన్పూర్, పెండ్యాల్, కాజీపేటలో హాల్టింగ్ కల్పించారు. » ఈ నెల 28 నుంచి 31 తేదీలలో కాజీపేట–ఖమ్మం (07504) వెళ్లే ఎక్స్ప్రెస్, జనవరి 29 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఖమ్మం–కాజీపేట (07503) వెళ్లే ఎక్స్ప్రెస్లకు వరంగల్, చింతల్పల్లి, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, గుండ్రాతిమడుగు, గార్ల, డోర్నకల్, పాపట్పల్లి, మల్లెమడుగులో హాల్టింగ్ కల్పించారు. » ఈ నెల 28వ తేదీన ఆదిలాబాద్–కాజీపేట (07501) వెళ్లే ఎక్స్ప్రెస్, 29వ తేదీన కాజీపేట–ఆదిలాబాద్ (07502) ఎక్స్ప్రెస్లకు అంబరి, కిన్వాట్, ధనోరా దక్కన్, సహస్రకుండ్, హిమాయత్నగర్, హడ్గాన్రోడ్, బోకర్, ముధ్కెడ్, ఉమ్రి, ధర్మబాద్, బాసర, నిజామాబాద్, ఆర్మూర్, మోర్తాడ్, మెట్పల్లి, కోరుట్ల, లింగంపేట్ జగిత్యాల, గంగాధర, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి, కొలనూర్, జమ్మికుంట, ఉప్పల్, హసన్పర్తిలో హాల్టింగ్ కల్పించారు. -
ఖర్చు పెట్టేవారికే టికెట్లు!
ప్రజాబలం కంటే ధన బలం వైపే పార్టీల మొగ్గు● మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి ఆశావహుల ప్రయత్నాలు ● సోషల్ మీడియా వేదికగా గెలిపించాలని ప్రచారం ములుగు: ఎన్నికల బరిలో నిలవాలన్నా.. ప్రత్యర్థిపై గెలవాలన్నా.. మంది మార్బలంతో పాటు ఆర్థిక బలం ఉండాల్సిందే. ఓటుకు వేల రూపాయలిచ్చి లక్షలు ఖర్చు పెడితేనే మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేందుకు పార్టీలు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. పార్టీలలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ పార్టీకి సేవలందించిన వారిని సైతం పక్కన పెట్టి లక్షల్లో ఖర్చు చేసే అభ్యర్థుల వైపే ప్రధాన పార్టీలు మొగ్గుచూపుతున్నట్లు చర్చ సాగుతోంది. కౌన్సిలర్కు లక్షలు, చైర్మన్ పీఠానికి కోట్లు ఖర్చు చేస్తేనే టికెట్లు ఖరారు చేసే యోచనలో ప్రధాన పార్టీలు ఉన్నట్లు తెలిసింది. కౌన్సిలర్ పదవులకు ప్రధాన పార్టీలు ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులనే మున్సిపల్ ఎన్నికల బరిలో దింపాలని చూస్తున్నాయి. పార్టీ ఫండ్తో పాటు స్వయంగా ఖర్చు చేసే నేతలను వెతుకుతున్నాయి. అర్థబలం, అంగబలం ఉన్న వారిని బరిలో దింపితే ఎన్నికల ఖర్చుకు వెనుకాడరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదవి కోసం ఎంతైనా.. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.5వేల వరకు పంపిణీ చేశారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురుకానుంది. ఓటుకు రూ. 2 వేల నుంచి మొదలుకొని రూ. 5 వేల వరకు ఇచ్చే అభ్యర్థుల వైపు పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. ఈ లెక్కన ఒక్కో వార్డులో సుమారు రూ.15 లక్షల నుంచి రూ. 30 లక్షల దాకా ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటర్ల మద్దతు కోసం పాట్లు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహులు ఇప్పటికే కాలనీల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో నిలబడుతున్నామని, తమకు మద్దతు తెలపాలని ఓటర్లను వేడుకుంటున్నారు. పలాన వార్డులో నిలబడుతున్నానని సోషల్ మీడియా వేదికగా ఓటర్లకు సంకేతాలు పంపుతున్నారు. ఎలాగైనా తమను గెలిపించాలని కోరుతూ ఇప్పటి నుంచే మందు, విందులు ఇస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వారంలో నోటిఫికేషన్ వారం రోజుల్లోగా మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ములుగు మున్సిపాలిటీకి తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. జీవింతరావుపల్లి, బండారుపల్లి జీపీలను కలుపుకొని నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 20 వార్డులలో 3 ఎస్సీ, 2 ఎస్టీ, 5 బీసీ, 10 జనరల్ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించారు. 20 వార్డుల పరిధిలో 6,661 మంది పురుషులు, 7,300 మహిళలు, ఇద్దరు ఇతర ఓటర్లు ఉన్నారు.మున్సిపల్ ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ములుగు మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఎలాగైనా పోటీ చేసి గెలుపొందాలని చూస్తున్నారు. అధిష్టానం వద్ద టికెట్ల కోసం ప్రయత్నిస్తూనే డబ్బులు సమకూర్చుకునే పనిలో పడ్డారు. ఓవైపు టికెట్ల కోసం ఆరాటం మరోవైపు ఓటర్ల మద్దతు కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. -
మండమెలిగె.. జాతర మొదలాయె..
చలిగంజి, పాలు, సారా, బెల్లంపానకం, పవిత్ర శుద్ధిజలాన్ని ధూపంతో నేలపై ఆరగింపు చేస్తున్న పూజారులు బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు సమ్మక్క, సారలమ్మ పూజాసామగ్రితో మేడారం గద్దెల వద్దకు చేరుకుంటున్న పూజారులు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన మండమెలిగె పూజలతో మేడారం మహాజాతర పండుగ ఆరంభమైంది. బుధవారం మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క– సారలమ్మ పూజారులు అచారసంప్రదాయాలతో అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు జరిపారు. దిష్టి తగలకుండా ప్రధాన కూడళ్లలో సోరకాయ, కోడిపిల్ల, మామిడి ఆకులతో తోరణాలు కట్టారు. రాత్రంతా గద్దెల వద్ద జాగారాలు చేసి సంబురాలు జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. – ఎస్ఎస్తాడ్వాయి● మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో పూజలు ● అమ్మవార్ల గద్దెల వద్ద జాగారాలతో రాత్రంతా సంబురాలు -
గట్టమ్మకు ఎదురుపిల్ల పండుగ
బోనాలతో ఆలయానికి వస్తున్న ఆదివాసీ నాయకపోడులుములుగు రూరల్: మేడారం సమ్మక్క –సారలమ్మ జాతరకు అనుగుణంగా ఆదిదేవత గట్టమ్మతల్లికి ఆదివాసీ నాయకపోడులు బుధవారం ఎదురుపిల్ల పండుగను ఘనంగా నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. గట్టమ్మ ఆలయ పూజారులు అటవి ప్రాంతంలోని పూర్వపు గట్టమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీ నాయకపోడు సంస్కృతి, సాంప్రదాయాల మేరకు గట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పుసుపు–కుంకుమ, కొబ్బరికాయలు కొట్టి, యాటపోతులను బలిచ్చారు. భారీగా తరలివచ్చిన ఆదివాసీలు గట్టమ్మతల్లికి ఎదురుపిల్ల పండుగ సందర్భంగా ఆదివాసీ నాయకపోడులు భారీగా తరలివచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ నాయకపోడ్ కమ్యూనిటీహాల్ నుంచి గట్టమ్మ ఆలయం వరకు పూజారుల ఆధ్వర్యంలో డోలి వాయిద్యాల నడుమ భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా పోలీసులు వన్ వే ఏర్పాటు చేసి భక్తుల వాహనాలను తరలించారు. ఎదురుపిల్ల పండుగ సందర్భంగా శివసత్తుల పూనకాలు, లక్ష్మీదేవర నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. 101 బోనాలతో నైవేద్యం ఎదురుపిల్ల పండుగ సందర్భంగా ఆదిదేవత గట్టమ్మ తల్లికి ఆదివాసీ నాయకపోడులు, పూజారులు బోనాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఆలయ ప్రధాన పూజారి కొత్త సదయ్య ఆధ్వర్యంలో అమ్మవారికి ౖనైవేద్యం సమర్పించారు. అనంతరం అమ్మవారికి యాటపోతుల మొక్కులను సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన సమ్మక్క –సారలమ్మ గద్దెలకు పూజారులు పసుపు–కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్త లక్ష్మయ్య, పూజారులు అరిగెల సమ్మయ్య, కొత్త రాజేశ్, రాజ్కుమార్, నరేశ్, ఆకుల రఘు, రవి, నీలయ్య, సుభద్ర, మహేందర్, సంతోష్లతో పాటు 500 మంది పాల్గొన్నారు.గట్టమ్మ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలి. జిల్లా కేంద్రానికి చెందిన సుమారు 100 కుటుంబాలు గట్టమ్మ తల్లి ఆలయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. అమ్మవారి ఆలయంలో రోజు వారీగా భక్తులకు సేవలు అందిస్తున్నాం. ఆలయ ఆదాయం ఆదివాసీ నాయకపోడ్లకు చెందే విదంగా చర్యలు తీసుకోవాలి. – కొత్త సురేందర్, ఆదివాసీ నాయకపోడు సంఘం జిల్లా అధ్యక్షుడు మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా ఆదిదేవత గట్టమ్మ తల్లికి మొదటి మొక్కులు చెల్లిస్తాం. ఆదివాసీ నాయకపోడ్ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తాం. గట్టమ్మతల్లికి తొలి బోనం సమర్పించడం ఎంతో ఆనందంగా ఉంది. – కొత్త సదయ్య, గట్టమ్మ ఆలయ ప్రధాన పూజారి ● భారీగా తరలివచ్చిన ఆదివాసీ నాయకపోడులు లక్ష్మీదేవర నృత్యాలు, శివసత్తుల పూనకాలు -
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
ములుగు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై హైదరాబాద్ నుంచి ఆమె బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను త్వరలో కమిషన్ విడుదల చేస్తుందన్నారు. షెడ్యూల్ రాగానే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందన్నారు. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్ నిర్వహణ కౌంటింగ్కు అవసరమైన ఏర్పాట్లు ప్రణాళికతో సిద్ధం చేసుకోవాలన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను నియమించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్ సౌకర్యం ఉండాలని, ప్రతీ పోలింగ్ కేంద్రం బయట సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సోషల్ ఎలిమెంట్స్ను బైండోవర్ చేయాలని వివరించారు. ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి మాస్టర్ ట్రైనర్లు జిల్లాకు చేరుకుంటారని, సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ములుగులో తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటర్ జాబితా ప్రచురణ పూర్తి చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న వసతుల వివరాలను టీ– పోల్లో నమోదు చేసినట్లు కలెక్టర్ వివరించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీ పరిధిలో అన్ని చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద వెబ్కాస్టింగ్, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బ్యాలెట్ పత్రాల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్ గుర్తింపు కూడా పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులకు మున్సిపల్ ఎన్నికల సంసిద్ధతపై దిశానిర్దేశం చేశారు. వీసీలో అదనపు కలెక్టర్ సంపత్రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.వీసీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని -
గోవిందరాజుల గుడిలో మండమెలిగె పూజలు
ఏటూరునాగారం: మండల పరిధిలోని గోవిందరాజుల ఆలయాన్ని శుద్ధి చేశారు. మేడారం మహాజాతరలో భాగంగా ఈ నెల 28వ తేదీన గోవిందరాజులు కొండాయి నుంచి మేడారం చేరుకుంటారు. ఇందులో భాగంగానే బుధవారం మండమెలిగె కార్యక్రమాన్ని చేపట్టి ఆలయంలోని ఆడెరాలు, బూర, గంటలు, మువ్వలు, ఇతర పూజా సామగ్రిని శుద్ధి చేశారు. అనంతరం ఆడెరాలను కుంకుమ, పసుపుతో అలంకరించి దూపం దీపంను పూజారులు దబ్బగట్ల గోవర్ధన్, నాగేశ్వర్రావు, రాజారాం, బాబులు సమర్పించారు. అలాగే నాగులమ్మ గుడిలో సైతం పూజలు నిర్వహించారు. గ్రామంలోని ఆడ పడుచులు గుడికి చేరుకొని గుడి ఆవరణ శుభ్రం చేశారు. యువకులు మామిడితోరణాలను కట్టి అలంకరించారు. అలాగే చెట్టు కింద ఉన్న ఇతర దేవతల విగ్రహాలను సైతం శుభ్రం చేశారు. ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లిస్తున్న భక్తులకు కొబ్బరికాయలు తగిలి పలువురు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం గద్దెల ప్రాంగణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..భక్తుల రద్దీ పెరగడంతో గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. గద్దెల గ్రిల్స్ బయట నుంచి మొక్కులు చెల్లించుకునేందుకు గద్దెలపైకి కొబ్బరి కాయలు, బెల్లం విసరడంతో అవి తగిలి పలువురికి గాయాలయ్యాయి. స్పందించిన రెస్క్యూ టీం బృందాలు గాయపడిన భక్తులను టీటీడీ కల్యాణ మండపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల దాహం తీర్చేందుకు ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో బుధవారం మేడారంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. జాతరలో ఆ శాఖ తరఫున తాగునీటి కోసం బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, మినీ వాటర్ ట్యాంకులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు జాతరలో 15 ప్రాంతాల్లో చలి వేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్లు డీఈ సునీత తెలిపారు. చలి వేంద్రాలతో పాటు బ్యాటరీ ఆఫ్ ట్యాప్ నల్లాల ద్వారా కూడా భక్తులకు తాగునీటిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. భక్తులు చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ములుగు: ములుగు మున్సిపల్ కమిషనర్ జంగిలి సంపత్ బదిలీ ఆయ్యారు. 2025 జూన్ 25న ములుగు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సంపత్ 7 నెలల పాటు బాధ్యతలు నిర్వహించారు. మున్సిపల్ ఎన్ని కల ముందు కమిషనర్ల బదిలీల్లో భాగంగా సంపత్ను బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయ్యారు. బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న తన్నీరు రమేశ్ను ములుగు మున్సిపల్ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
రామప్పలో అధికారుల సందడి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 70 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ భారత్ దర్శన్ స్టడీ టూర్లో భాగంగా బుధవారం రామప్పను సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి వివరించగా రామప్ప టెంపుల్ బాగుందని కొనియాడారు. వారి వెంట ఎంసీహెచ్ఆర్డీ అధికారులు శ్రీకాంత్, రవి, ఆర్ఐ రమేశ్, టూరిస్ట్లు ఉన్నారు. అలాగే క్యూబా దేశానికి చెందిన హెక్టర్ పెలాసియస్ రామప్ప దేవాలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. -
మేడారం భక్తులకు గుడ్న్యూస్
సాక్షి, ములుగు: తెలంగాణలో మేడారం జాతరకు భక్తులకు శుభవార్త. రేపటి నుండి మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో రానున్నాయి. టూరిజం శాఖకు చెందిన జాయ్ సేవలను ములుగులో మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు.వివరాల మేరకు.. తెలంగాణ టూరిజం శాఖ మేడారంలో భక్తులకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. తాడ్వాయి మండలం ఎలుబాక నుండి మేడారం ఏరియల్ వ్యూ వీక్షించేందుకు హెలికాప్టర్ నడపనున్న టూరిజం శాఖ తాజాగా తెలిపింది. టూరిజం శాఖకు చెందిన జాయ్ సేవలను మంత్రి సీతక్క రేపు ప్రారంభించనున్నారు. కాగా, ఒక్కరికి 5000 వేల రూపాయలు చార్జీతో ఏడు నిమిషాలు హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ వీక్షించే అవకాశం కల్పించారు. -
పోటెత్తిన భక్తులు.. కిక్కిరిసిన మేడారం ప్రాంగణం
సాక్షి, ములుగు: మహా జాతరకు సమయం దగ్గర పడుతున్న వేళ.. మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం మండమెలిగే పండుగ కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ పండుగతోనే మహాజాతర పూజా కార్యక్రమాల తంతు మొదలు కానుందని తెలిసిందే.మేడారంలోని సమ్మక్క గుడిలో, కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో, ఏటూరునాగారం మండలంలోని కొండాయిలో కొలువైన గోవిందరాజుల గుడిలో ఇవాళ మండమెలిగె పండుగను ఆదివాసీల ఆచార, సంప్రదాయ పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డోలు వాయిద్యాల నడుమ పూజారులు, గ్రామస్థులు దిష్టి తోరణాలను కట్టి గ్రామాన్నంతా అష్టదిగ్బంధనం చేస్తారు. పూర్వం ప్రస్తుతం ఉన్న గుడుల స్థానాల్లో గుడిసెలుండేవి. జాతర నిర్వహించే సమయానికి అవి పాతపడడంతో ఆదివాసీ పూజారులు అడవికి వెళ్లి మండలు, వాసాలు, గడ్డి తీసుకొచ్చి కొత్త గుళ్లు నిర్మించేవారు. అలా గుడిమెలిగే.. జాతరకు వారం ముందు మండ మెలిగే పండుగ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ములుగు జిల్లాలోని మేడారంలో జరిగే సమక్క-సారలమ్మ మహా జాతర.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర. రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతర తొలిరోజు కన్నపెల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరు నాగారం మండలం కొండాయ్ నుంచి గోవిందరాజుల ఆగమనం ఉంటుంది. రెండో రోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం చేస్తారు. మూడో రోజు వనదేవతలంతా గద్దెలపై కొలువై భక్తకోటితో పూజలందుకుంటారు. నాలుగో రోజు తిరిగి తల్లుల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈసారి జనవరి 28 నుండి 31 వరకు జరగనున్నాయి. ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో.. 50 శాతం అదనపు ఛార్జీలు..మహా జాతర నేపథ్యంలో.. ఈ నెల 25 నుంచి మేడారానికి స్పెషల్ బస్సులను నడపనుంది తెలంగాణ ఆర్టీసీ. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాలు యధావిధిగా కొనసాగనున్నాయి. అయితే.. వన్వే బస్సులు నిండుగా వెళ్తాయి కాబట్టి స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఛార్జీలు అదనంగా వసూలు చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ తెలియజేశారు. రాష్ట్రం నలమూలల నుంచి మేడారం వైపు మొత్తం 4 వేల బస్సులను తిప్పుతామని.. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి 51 స్పెషల్ పాయింట్స్ ఉంటాయని తెలిపారాయన. మేడారం వద్ద ఆర్టీసీ బస్సుల కోసం 50 క్యూ లైన్స్.. ఒకేసారి వెయ్యి బస్సులు పార్కింగ్ చేసేలా వసతులు కల్పించారు. మొత్తం 10 మంది సిబ్బంది మేడారం జాతర నేపథ్యంలో పని చేస్తారని అన్నారాయన. -
భర్తీ ఎప్పుడో?
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఫ్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్చింది. ఈ మేరకు 1 నుంచి 3వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యను కొనసాగించడంతో పాటు విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేసింది. దీంతో అంగన్వాడీ కేంద్రాలలో టీచర్లు, ఆయాల కొరత కారణంగా చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఆటపాటలతో కూడిన విద్య అందని ద్రాక్షలా మారింది. అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు లేని కేంద్రాలకు అందుబాటులో ఉన్న టీచర్లకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆశించిన స్థాయిలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు విద్య అందించడం కష్టంగా మారింది. ఇటీవల ప్రభుత్వం 65 సంవత్సరాలు నిండిన ఆయాలను, టీచర్లను విధుల నుంచి తొలగించడంతో సమస్య అధికమవుతోంది. నాలుగు ప్రాజెక్టులు జిల్లాలోని పది మండలాల పరిధిలో ములుగు, ఎస్ఎస్ తాడ్వాయి, ఏటూరుగారం, వెంకటాపురం(కె), ఎస్ఎస్తాడ్వాయి మండలాలను నాలుగు ప్రాజెక్టులుగా విభజించారు. నాలుగు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 640 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలలో మొత్తం 95 టీచర్ పోస్టులు, 319 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంగన్వాడీ సూపర్వైజర్ స్థానాలు ఖాళీల కారణంగా కేంద్రాల పర్యవేక్షణ కరువవుతుంది.అంగన్వాడీ కేంద్రాలలో పూర్తి స్థాయిలో టీచర్లు, ఆయాలు లేని కారణంగా ఉన్న సిబ్బందిపై అధిక భారం పడుతుంది. ఈ క్రమంలో సిబ్బందిలేని అంగన్వాడీ కేంద్రాలకు పక్కన ఉన్న అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో టీచర్లు రెండు కేంద్రాలలో చిన్నారులకు విద్యను అందించడం, ఆయాలు రెండు కేంద్రాలలో పౌష్టికాహారం అందించడం సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి. గర్భిణులు, బాలింతలకు పూర్తిస్థాయిలో అంగన్వాడీ సేవలు అందడం లేదు. ప్రభుత్వం స్పందించి ఖాళీలను భర్తీ చేస్తే విద్య అందే అవకాశం ఉంది.జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 640 కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 545 మంది టీచర్లు విధుల్లో ఉండగా 95 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయాలు 321 మంది ఉండగా 319 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చిన్నారులు 15,023, మూడేళ్లలోపు పిల్లలు 8,235, ఐదేళ్ల లోపు పిల్లలు 6,788, గర్భిణులు 1,767, బాలింతలు 1,573 ఉన్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత 95 టీచర్, 319 ఆయా పోస్టులు ఖాళీ ఉన్నవారిపైనే పనిభారం అంగన్వాడీ కేంద్రాల్లోని టీచర్లు, ఆయాల ఖాళీల వివరాలను ప్రభుత్వానికి నివేధిక అందించాం. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేవిధంగా పక్క సెంటర్ల టీచర్లకు బాధ్యతలు అప్పగించాం. అంగన్వాడీ కేంద్రాలలో ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణ చేస్తున్నాం. – తుల రవి, జిల్లా సంక్షేమాధికారి -
మేడారంలో సింగరేణి సేవలు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియా నుంచి మేడారం సమ్మక్క–సారలరమ్మ జాతరలో విధులు నిర్వహించేందుకు సింగరేణి రెస్క్యూ, లైఫ్ సేవర్ స్విమ్మింగ్ టీం సభ్యులు మంగళవారం బయలుదేరి వెళ్లారు. పదిరోజుల పాటు మేడారంలో సేవలు అందించనున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి రెస్క్యూ, స్విమ్మింగ్ టీం సభ్యులకు పచ్చ జెండా ఊపి ప్రత్యేక వాహనాన్ని ప్రారంభించారు. గద్దెల వద్ద విధులు నిర్వహించే సమయంలో చక్కటి క్రమశిక్షణ, గౌరవం, పూర్తి సేఫ్టీతో పని చేయాలని సూచించారు. అధికారుల సూచనలను పాటిస్తూ విధులు నిర్వహించి సింగరేణి పేరును నిలబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, శ్యాంసుందర్, పూర్ణచందర్, రెస్క్యూ, స్విమ్మింగ్ సభ్యులు పాల్గొన్నారు. -
ప్రయాణికుల రద్దీ
ఏటూరునాగారం: సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు, పుట్టింటికి వచ్చిన మహిళలు తిరిగి తమ ఇళ్లకు చేరుకునేందుకు మంగళవారం బయలుదేరారు. దీంతో మంగళవారం ప్రయాణికులతో ఏటూరునాగారం బస్టాండ్ రద్దీగా మారింది. ఈ క్రమంలో బస్టాండ్లో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు పడిగాపులు పడ్డారు. అదే విధంగా భూపాలపల్లి, గోదావరి ఖని బస్సులను ఆర్టీసీ అధికారులు నిలిపివేయడంతో అటువైపు ప్రయాణించే ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలు వెళ్లేందుకు వారి సామగ్రితో బస్సు ఎక్కేందుకు కుస్తీపట్టారు. మరమ్మతుకు నోచుకోని చేతి పంపు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన చేతి పంపు మరమ్మతుకు గురైంది. దానిని చేయించే నాథుడే కరువయ్యారు. కొంత మంది అందులో విద్యుత్ మోటారు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించే క్రమంలో చేతి పంపు మరమ్మతుకు గురైందని ప్రయాణికులు వాపోతున్నారు.బస్టాండ్లో బస్సుల కోసం పడిగాపులు -
పులుల గణన ప్రారంభం
కాళేశ్వరం: మహదదేవపూర్ మండలం అటవీశాఖ రేంజ్ పరిధిలో ఐదు సెక్షన్లు, 20 బీట్లలో అఖిల భారత పులుల అంచనా (ఏఐటీఈఎస్) 2026 సర్వేను మంగళవారం ప్రారంభించారు. అటవీశాఖ అధికారులు, ఫీల్డ్ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు కలిసి మొదటి మూడు రోజుల పాటు ట్రైల్ పద్ధతిలో కార్నివోర్స్ (మాంసాహార జంతువులు), మెఘా హెర్బీవోర్స్ (పెద్ద శాఖాహార జంతువు)లపై అధ్యాయనం చేయనున్నారు. రెండు నుంచి మూడు రోజుల పాటు ట్రాన్సెక్ట్ లైన్ విధానంలో వెజిటేషన్ కవర్, జీవవైవిద్యం, శాఖాహార జంతువుల జనాభా, అడవులు ఆరోగ్యం వంటి అంశాలపై వివరాలు సేకరిస్తారు. అలాగే ట్రాక్ అండ్ సైన్ వంటి శాసీ్త్రయ పద్ధతుల ద్వారా సర్వేకొనసాగుతోంది. దీని ద్వారా పులుల సంఖ్యతో పాటు ఇతర వన్యప్రానుల ఉనికి, అడవి జీవవైవిద్యం జీవావరణ పరిస్థితులపై ఖచ్చితమైన సమాచారం అందుబాటులోకి రానుంది. సర్వే ఫలితాలు భవిష్యత్లో పులుల సంరక్షణ, అడవులు అభివృద్ధి వన్యప్రాణి రక్షణ చర్యలకు కీలకమార్గదర్శకంగా ఉపయోగపడుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
‘మండమెలిగె’కు సర్వం సిద్ధం
బుధవారం శ్రీ 21 శ్రీ జనవరి శ్రీ 2026● భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ● పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులుఎస్ఎస్ తాడ్వాయి : మహాజాతరలో భాగంగా మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో నేడు (బుధవారం) జరగనున్న మండమెలిగె పండుగకు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు వారాలముందు గుడిమెలిగె పండుగతో తొలిఘట్టం పూజలు ప్రారంభం కాగా, సరిగ్గా వారం రోజులముందు నిర్వహించే ఈ మండమెలిగె పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. బుధవారం ఉదయం మేడారం, కన్నెపల్లి వనదేవతల ఆలయాల్లో సమ్మక్క, సారలమ్మ పూజారులు ఆలయాలు, అమ్మవారి పూజా సామగ్రి (మువ్వలు, గంటలు, వస్త్రాలు, ఊత కొమ్ములు) శుద్ధి చేయనున్నారు. ముగ్గులతో ఆడపడుచులు సుందరంగా అలంకరిస్తారు. పూజారులు ఉదయాన్నే తలంటుస్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరి స్తారు. ఆలయాల్లో ప్రత్యేకంగా ధూపదీపాలు వెలిగించి ఆచారసంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు.మండమెలిగె పండుగ సందర్భంగా పూజారులు మేడారాన్ని బుధవారం అష్ట దిగ్బంధం చేయనున్నారు. ముందుగా నిష్టతో నులకతాడు తయారు చేసి దానికి మామిడి ఆకుల తోరణాలు కడతారు. మేడారం, కన్నెపల్లి గ్రామాల్లో అమ్మవార్లను తీసుకువచ్చే ప్రధాన రహదారుల వద్ద బూర్కకర్ర(ముళ్లతో కూడుకున్న పచ్చికర్రలు)లకు మామిడి తోరణాలు కట్టి నిలుపుతారు. ఎలాంటి దుష్టశక్తుల చూపు పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని పూజారులు ఆనవాయితీగా నిర్వహించనున్నారు. -
బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
ములుగు రూరల్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం అన్నారు. ఈ మేరకు మంగళవారం జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నికై న సందర్భంగా జాతీయ రహదారిపై సంబురాలు జరుపుకుని జాతీయ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీలో కార్యకర్తస్థాయి నుంచి జాతీయ అధ్యక్ష స్థాయికి ఎదగడం బీజేపీ అంతర్గత ప్రజాస్వామ్యానికి నిదర్శనన్నారు. నతిన్ నబిన్ నాలుగు సార్లు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారని వివరించారు. జాతీయ అధ్యక్షుడి నాయకత్వంలో బీజేపీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపూడి భాస్కర్రెడ్డి, భూక్య జవహార్లాల్, రవింద్రాచారి, నగరపు రమేష్, శోభన్, రాజ్కుమార్, విశ్వనాధ్, రాకేష్యాదవ్, కుమార్, రవిరెడ్డి, నాగరాజు, వెంకట్రెడ్డి, కవిరాజు, సంపత్, రాజశేఖర్, రవిందర్, సతీష్, శ్రీదర్ తదితరులు పాల్గొన్నారు.పార్టీ జిల్లా అధ్యక్షుడు బలరాం -
హక్కుల పరిరక్షణకు కృషి
భూపాలపల్లి అర్బన్: ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం నాయకులు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు చర్చించారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి సునీల్, అసోసియేట్ అధ్యక్షులు మహమ్మద్ సంధాని, కార్యవర్గ సభ్యులు రాజేందర్, ఇందిర, స్వాతి పాల్గొన్నారు. -
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన దర్శనాన్ని కల్పించాల్సిన బాధ్యత పోలీసులతో పాటు పూజారులకు, యువతకు ఉందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మేడారంలో సమ్మక్క– సారలమ్మ పూజారులు, మేడారం గిరిజన అభ్యుదయ యువతతో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎస్పీ మాట్లాడారు. ఎంతో దూరం నుంచి వచ్చే భక్తులకు అమ్మవార్ల దర్శనం అయ్యేలా చూసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుగు ప్రయాణం అయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నేడు మండమెలిగే పండుగ నుంచి జాతర ముగిసే వరకు భక్తులు భారీగా తరలివస్తారని తెలిపారు. వారి రక్షణకు పాటుపడాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్, ఎస్బీ సీఐ శంకర్, నార్లాపూర్ ఎస్సై కమలాకర్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, గిరిజన అభ్యుదయ సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన భోజరావు, పూజారులు రమేష్, అరుణ్కుమార్, దశరథం తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
మహాజాతర పనులు త్వరగా పూర్తిచేయాలి
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతరకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున తుది దశకు చేరుకున్న అన్ని పనులను నిర్ణీత సమయంలో పూర్తిచేసి, అవసరమైన మెరుగులు దిద్దాలని కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. మేడారంలోని హరిత హోటల్లో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాతో కలిసి అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇందుకోసం జంపన్నవాగులో నిరంతరం షిఫ్టుల వారీగా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా జాతర ప్రాంతంలోని కీలక ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్లను మోహరించాలని తెలిపారు. భక్తుల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 50 పడకల ఆస్పత్రిలో నిపుణులైన వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేడారం జాతరను సమర్థవంతంగా విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇటీవల సీఎం పర్యటన, కేబినెట్ సమావేశం, గద్దెల పునఃప్రారంభం కార్యక్రమాలు అంతరాయాలు లేకుండా విజయవంతంగా నిర్వహించినందుకు అధికారులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
విద్యుత్ అంతరాయానికి సహకరించాలి
ములుగు రూరల్: విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్శాఖ ఏఈ రవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పత్తిపల్లి విద్యుత్ ఉప కేంద్రం పరిధిలోని పత్తిపల్లి, పొట్లాపూర్, చింతలపల్లి, అన్నంపల్లి, చిన్నగుంటూర్పల్లి, చింతకుంట, కొడిశలకుంట, పులిగుండం, సారంగపల్లి , జగ్గన్నపేట గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. ములుగు రూరల్: గతేడాది యాసంగి సాగులో సన్నధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం బోనస్ డబ్బులు చెల్లించాలని అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కోశాధికారి గుండబోయిన చంద్రయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి సురేష్కుమార్కు వినతిపత్రం అందించి మాట్లాడారు. ప్రభుత్వం క్వింటాకు బోనస్ రూ.500 చెల్లిస్తుందనే ఆశతో రైతులు సన్నధాన్యం సాగు చేసి ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సన్నధాన్యం సాగుకు ఖర్చు ఎక్కువగా ఉండడంతో పాటు దిగుబడి తగ్గుతుందని తెలిపారు. అలాగే వర్షాకాలంలో భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ. 10వేలు చెల్లిస్తామని హామీనిచ్చి అమలు చేయడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతులు యూరియా బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా యూరియా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాస రాజన్న, కామ రవి, ముక్కాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కేటీకే 1వ గనిలో విధులు నిర్వర్తిస్తున్న అడిచర్ల శ్రీనివాస్ కోల్ ఇండియా స్థాయి కూచిపూడిలో బంగారు పతకం సాధించారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు నాగ్పూర్లోని డబ్ల్యూసీఎల్ కంపెనీలో జరిగిన కోల్ ఇండియా స్థాయి సాంస్కృతిక పోటీల్లో శ్రీనివాస్ పాల్గొని ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి మంగళవారం జీఎం కార్యాలయంలో శ్రీనివాస్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం కవీంద్ర, అధికారులు శ్యాంప్రసాద్, శ్రీనివాస్లు పాల్గొన్నారు. రేగొండ: విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజాబాట నిర్వహిస్తున్నట్లు విద్యుత్శాఖ డీఈ పాపిరెడ్డి అన్నారు. మంగళవారం కొత్తపల్లిగోరి మండలంలోని రాజక్కపల్లి గ్రామంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లూస్ లైన్స్, వంగిన పోల్స్ను సరి చేశారు. విద్యుత్ షాక్కు గురికాకుండా రైతులకు పలు జాగ్రత్తలను సూచించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉన్నా.. తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ వంగ రాజు, సిబ్బంది సురేష్, నాగరాజు పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్లో క్రీడాకారుల ప్రతిభ
ఏటూరునాగారం: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబర్చి మూడు మెడల్స్ సాధించినట్లు హ్యాండ్బాల్ కోచ్ కుమారస్వామి, కరిష్మా తెలిపారు. మండల కేంద్రానికి చెందిన సంజన(లాంగ్జంప్ గోల్డ్మెడల్), ఎం.వైష్ణవి దేవి (300 మీటర్స్ సిల్వర్ మెడల్), కార్తీక్(300 మీటర్ల సిల్వర్) మెడల్స్ సాదించారని వివరించారు. ఈ క్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని ఇంద్రప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచారని కుమారస్వామి వివరించారు. వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని బూర్గుపేట, నారాయణపూర్ గ్రామాల్లో ఉచిత కృత్రిమ గర్భధారణ శిబిరాలు నిర్వహించినట్లు పశు వైద్యాధికారి మహతి తెలిపారు. బూర్గుపేటలో 46 గేదేలకు, నారాయణపూర్లో 48 గేదెలకు ఉచిత కృత్రిమ గర్భధారణ చికిత్స అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు సేద మల్లక్క, దోంతరవేన లక్ష్మి, పశువైద్య సిబ్బంది అయిలుమల్లు, వేణు, తేజ, రాజేందర్, ప్రశాంత్ పాల్గొన్నారు. ములగు రూరల్: ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాషాయం జెండా ఎగురవేయాలని బీజేపీ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ రాజేశ్వరావు అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ నాయకులు సిరికొండ బలరాం అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని వివరించారు. బీజేపీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు అహర్నిషలు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ నాయకులు సతీష్, రత్నం, భాస్కర్ రెడ్డి, రాజ్ నాయక్, స్వరూప, రమేష్, రవీంద్రచారి, తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతలకు వరం.. పొట్లాపూర్ లిఫ్ట్
ములుగు: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ములుగు రైతాంగానికి రాష్ట్ర కేబినెట్ తీపి కబురు అందించింది. జిల్లా కేంద్రం పరిధిలోని మదనపల్లి, జగ్గన్నపేట, అన్నంపల్లి, పత్తిపల్లి, పొట్లాపూర్, ములుగు, జంగాలపల్లి, బండారుపల్లి గ్రామాల పరిధిలోని 30 చెరువులు, కుంటలకు రామప్ప రిజర్వాయర్ ద్వారా దేవాదుల నీటిని అందించనున్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ప్రత్యేక చొరవతో పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి ఆదివారం మేడారంలో నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రామప్ప సరస్సు రిజర్వాయర్ ద్వారా రంగరావుపల్లి పంపుహౌస్ వద్ద ఇంటెక్వెల్ నిర్మించి మూడు వరుసల్లో పైపులైన్ నిర్మాణం చేపట్టి గొలుసుకట్టు చెరువులకు సాగునీటిని అందించనున్నారు. రూ.143 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ జిల్లా పరిధిలోని 8 గ్రామాలకు చెందిన సుమారు నాలుగు వేల మంది రైతులు పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్తో లబ్ధిపొందనున్నారు. 8 గ్రామాల పరిధిలో సుమారు 30 చెరువులు, కుంటలు ఉండగా ప్రతిఏటా సరిగా సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయేవారు. రూ.143 కోట్లతో చేపట్టనున్న పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం (లిఫ్ట్ ఇరిగేషన్) ద్వారా రామప్ప సరస్సు నుంచి దేవాదుల నీటిని 30 చెరువులకు ప్రత్యేక పైపులైన్ ద్వారా అందించనున్నారు. దీంతో ఈ ప్రాంత రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశం రావడంతో రైతులు సంబరపడిపోతున్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు క్షీరాభిషేకం ములుగు మండల పరిధిలోని జగ్గన్నపేట గ్రామపంచాయతీ వద్ద జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ ఆధ్వర్యంలో రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క చిత్రపటాలకు సోమవారం క్షీరాభిషేకం చేశారు. సుమారు 4 వేల మంది రైతులకు మేలు జరిగే విధంగా పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చాంద్పాషా, చింతనిప్పుల భిక్షపతి, గండ్రత్ జయకర్, మర్రి రాజు, జక్కుల రేవంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.రామప్ప చెరువుపొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 15 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా కృషి చేస్తాం. కేబినెట్ మీటింగ్లో పొట్లాపూర్ ప్రాజెక్ట్కు రూ.143 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రివర్గానికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రామప్ప రిజర్వాయర్ నుంచి లక్నవరానికి కూడా దేవాదుల నీటిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సుమారు రూ.35 కోట్లతో పనులు చేపట్టేలా కేబినెట్లో చర్చించి ప్రకటించాం. – ధనసరి సీతక్క, మంత్రి పొట్లాపూర్ ప్రాజెక్టుతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు దేవాదుల నీటితో నిండనున్నాయి. పంటలు ఎండిపోతాయనే భయం పోయింది. రెండు పంటలు పండించుకునేందుకు అవకాశం రావడంతో ఆనందంగా ఉంది. చెరువుల కింద ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ ఈ ప్రాజెక్టుతో ఎంతో మేలు కలుగుతుంది. నాలుగు ఎకరాలు వరిసాగు చేసి సాగునీటికి ప్రతీసారి ఇబ్బందిపడేవాడిని. ఇక నుంచి ఎంతోమంది రైతులకు న్యాయం జరుగుతుంది. – ఇజ్జగిరి నాగన్న, పొట్లాపూర్ రైతు●పొట్లాపూర్ లిఫ్ట్ ద్వారా జిల్లా కేంద్రం సమీపంలోని రంగరావుపల్లి పంపుహౌస్ వద్ద నుంచి రామప్ప నీటిని తరలించనున్నారు. ఇందుకోసం పంపుహౌస్ నుంచి మూడు వరుసల్లో పైపులైన్ నిర్మాణం చేపట్టనున్నారు. మొదటి పైపులైన్ జంగాలపల్లి చెరువులోకి, రెండో పైపులైన్ కోమటి చెరువు, లోకం చెరువులోకి, మూడో పైపులైన్ పొట్లాపూర్ చింతల చెరువు, బుగ్గ చెరువు వరకు నిర్మాణం చేపట్టి ఆయా చెరువుల్లోకి నీటిని పంపింగ్ చేస్తారు. అక్కడి నుంచి మిగిలిన గొలుసుకట్టు చెరువులకు, కుంటలకు నీటిని తరలించనున్నారు. ఈ క్రమంలో దారిలో ఉన్న ఆయకట్టు పొలాలకు సైతం సాగునీరు అందించే విధంగా అధికారులు డిజైన్ రూపొందించారు. కంతనపల్లి నుంచి రామప్ప సరస్సుకు వచ్చే నీటిని తీసుకొని 90 రోజుల్లో 0.80 టీఎంసీల నీటిని పొట్లాపూర్ పథకంలో భాగంగా ఎత్తిపోస్తారు. 30 చెరువులకు, కుంటలను గోదావరి నీటితో నింపి ఆయకట్టు పొలాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోనున్నారు. 8 గ్రామాల పరిధిలో 30 గొలుసుకట్టు చెరువులకు గోదావరి నీరు రూ.143 కోట్లతో మూడు వరుసల్లో పైపులైన్ నిర్మాణం 7,556 ఎకరాల ఆయకట్టుకు అందనున్న సాగునీరు -
మంగళవారం శ్రీ 20 శ్రీ జనవరి శ్రీ 2026
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుటుంబ సమేతంగా సోమవారం తెల్లవారుజామున దర్శించుకుని తొలిమొక్కులు చెల్లించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులతో కలిసి గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పైలాన్ను ప్రారంభించారు. ఆదివారం రాత్రి మేడారంలో బస చేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉదయం 7 గంటలకే హరిత హోటల్నుంచి అమ్మవార్ల గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. వీరికి నూతనంగా నిర్మించిన ప్రధాన ఆర్చ్ నుంచి ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయంలో దేవాదాయ శాఖ అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా మంత్రులతో కలిసి సీఎం రేవంత్ పైలాన్ను ప్రారంభించారు. ఉదయం సూర్య కిరణాలు పడుతున్న సమయంలో సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకుని తొలి మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా అమ్మవార్లకు చీర పెట్టి, పూలమాల వేశారు. పూజారులు, మంత్రి సీతక్క.. సీఎం రేవంత్రెడ్డి, కేబినెట్ మంత్రులకు కంకణాలు కట్టగా, పూజారులు అమ్మవార్ల పసుపు, కుంకుమ బొట్టుపెట్టారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి, కుటుంబ సభ్యులు, మంత్రులకు పూజారులతో కలిసి మంత్రి సీతక్క చీర, సారె, పట్టువస్త్రాలు అందించి ప్రసాదం(బెల్లం) బహూకరించారు. సీఎం రేవంత్రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గం, అధికార గణమంతా రెండు రోజులు మేడారంలోనే పర్యటించడంతో ముందస్తుగానే జాతర మొదలైందన్న సందడి కనిపించింది. మహిళలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ చీరలు కట్టుకుని హాజరయ్యారు. పైలాన్ వద్ద మూడు రాతి శిలలు.. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ ప్రారంభోత్సవానికి మూడు రాతి శిలలతో ఆదివాసీ సంప్రదాయంగా పైలాన్ ఏర్పాటు చేశారు. అందులో ఒక రాతి శిలపై సీఎంతోపాటు, మంత్రుల పేర్లు చెక్కగా మరో రాతిపై పూజారులు, మరోదానిపై దేవాదాయశాఖ, ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల పేర్లను చెక్కించారు. ఈ పైలాన్ వద్ద అధికారులు, భక్తులు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. గద్దెలకు నూతన శోభమేడారం సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను రకరకాల పూలతో అలంకరించడంతో నూ తన శోభ సంతరించుకుంది. అమ్మవార్ల గద్దెలు, సాలహా రం చుట్టూ ఆర్చ్ ద్వారాలను పూలతో అలంకరించారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్రెడ్డి.. వనదేవతలను ద ర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో క్యూలైన్లో ఉన్న భక్తులతో ఆపాయ్యంగా పలకరించారు. సీఎంను చూసిన భక్తులు జై రేవంత్రెడ్డి, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. మొక్కుల అనంతరం సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్లో నిలబడి భక్తులకు అభివాదం చేశారు.మంత్రి ధనసరి సీతక్క -
మేడారంలో భక్తుల మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్ల గద్దెల వద్ద పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలను దర్శించుకున్నారు. అనంతరం మేడారం పరిసరాల్లో వంటావార్పు చేసుకుని సందడి చేశారు. అలాగే సమ్మక్క– సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్రావు అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారం జాతర గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు నిదర్శమని తెలిపారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి వడ్డీలేని రుణాలు
ములుగు: మహిళల ఆర్థికాభివృద్ధికి పట్టణ మహిళా సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీని త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్లతో కలిసి డిప్యూటీ సీఎం సోమవారం కలెక్టర్లతో వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ మహిళా సంఘాలలో సభ్యులుగా లేని వారిని రేషన్కార్డు ఆధారంగా గుర్తించాలన్నారు. పంపిణీ కార్యక్రమంలో రద్దీ లేకుండా చూడాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ చేపడతామని, అధికారుల సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్రావు, మున్సిపల్ కమిషనర్ సంపత్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.వీసీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క -
మేడారంలో అడుగడుగునా నిఘా కెమెరాలే
ములుగు/ఏటూరునాగారం/తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునే భక్తులకు పటిష్టమైన పర్యవేక్షణ, వారి కదలికలు, వాహనాల రాకపోకలను నిశితంగా గమనించేందుకు ఈ జాతరలో ఏఐ (ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్)తో కూడిన ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేశారు. సక్సెస్ సీసీటీవీ సేల్స్ అండ్ సరీ్వస్ నిర్వాహకుడు వాసాల మహేశ్ ద్వారా పోలీసులు ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను (ఏఎన్పీఆర్) పదిచోట్ల అమర్చారు. భక్తుల రద్దీ, తొక్కిసలాట, ప్రమాదాలను ముందే హెచ్చరించి పోలీసులు, వలంటీర్లను అలర్ట్ చేస్తారు.మేడారం జాతరకు వచ్చే ప్రత్యేక రహదారుల వద్ద వీటిని అమర్చారు. ఎస్పీ సు«దీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో మేడారం గద్దెల పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చి 24/7 నిరంతర పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. డీజీపీ, ఐజీ, డీఐజీలతోపాటు ఎస్పీలు సైతం ఈ కంట్రోల్ రూమ్ ఆధారంగా ప్రతినిత్యం పర్యవేక్షణ చేయనున్నారు. సీఎం రేవంత్రెడ్డి మేడారం పర్యటనలో భాగంగా మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. కెమెరాల పనితీరు, పర్యవేక్షణను అధికారులు ఆయనకు వివరించారు. ఎన్పీఆర్ కెమెరాలు ఎక్కడెక్కడ అంటే... సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద రెండు, చిన్నబోయినపల్లి, కామారం ఆర్చి, బయ్యక్కపేట, పస్రా, ములుగు, కాల్వవల్లి, మేడారం జంపన్నవాగు వద్ద, బస్టాండ్ ప్రాంతాల్లో ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాలు వాహనాల నంబర్లు, వాహనాలు, ప్రజలు ఎక్కడ ఉన్న ఎంతమంది ఉన్నారో ముఖచిత్రాలు చిత్రీకరిస్తాయి. ప్రతి వ్యక్తి ముఖచిత్రం, వీడియోలు రికార్డు అవుతాయి. రాత్రివేళలో సైతం రికార్డు అవుతుంది. ప్రతీ వాహన నంబర్ ప్లేట్ కూడా రికార్డు చేయడం దీని ప్రత్యేకత. దీని ఆధారంగా వాహనాలు ఎంట్రన్స్, ఎగ్జిట్ ఎన్ని అవుతున్నాయి.. ఎంతమంది భక్తులు వచ్చిపోతున్నారో రోజువారీగా లెక్క తెలుస్తుంది. హీలియం బెలూన్లలో 4 డ్రోన్ కెమెరాలు జాతరకు కొంతమంది దొంగలు, అపరిచిత వ్యక్తులు వచ్చే అవకాశం ఉండడంతో వారిని గుర్తించడానికి ఈసారి హీలియం బెలూన్లను నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాటిలో డ్రోన్ కెమెరాలను అమరుస్తున్నారు. ఈ డ్రోన్ల ద్వారా అప్పటికే సర్వర్లో అనుమానిత, అపరిచిత వ్యక్తుల వివరాలను పొందుపర్చారు. భూమి నుంచి 300 మీటర్ల ఎత్తులో ఈ హీలియం బెలూన్ డ్రోన్ కెమెరాలు ఉంటాయి. ఈ కెమెరాలు అపరిచిత వ్యక్తులు, దొంగలు రాగానే పసిగట్టి ఫొటో తీసి కమాండ్ కంట్రోల్ రూమ్కు అతడి ముఖచిత్రాన్ని పంపిస్తుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి. రద్దీ ప్రాంతాల్లోనూ... అధిక రద్దీ ఉన్న ప్రాంతాలు, వివరాల సేకరణ, ట్రాఫిక్, పార్కింగ్ మానిటరింగ్లతోపాటు డ్రోన్ల కంటే ఎక్కువ సమయం ఒకే స్థలంలో నిలిచే సామర్థ్యం ఈ హీలియం బెలూన్ కెమెరాలకు ఉంది. మేడారం జాతర భక్తుల విడిదికి అటవీ ప్రాంతాలు ఉండడంతో హీలియం బెలూన్ కెమెరాలు కంట్రోల్ రూమ్కు నిరంతరం లైవ్ ఫీడ్ ఇస్తాయి. దీంతో భద్రత, నిర్వహణ మరింత సమర్థవంతంగా గుర్తించే ఆస్కారముంది. ఇవేకాకుండా పీటీజెడ్ కెమెరాలు 30 ప్రాంతాల్లో అమర్చారు. ఈ కెమెరాలు 360 డిగ్రీల చుట్టూ తిరిగి చిత్రీకరిస్తాయి. సాధారణమైన ఫోర్ మెగా పిక్సల్ కెమెరాలు 450 అమర్చారు. ఇలా కెమెరాలు అమర్చడంతో ఒక్కో కెమెరా చేసే పని వందమంది పోలీసులకు సమానంగా ఉంటుంది. జాతరలో ఎటు చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో పర్యవేక్షణ సులభతరంగా మారింది. జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్ జాతరకు మూడు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న క్రమంలో భక్తులెవరూ తప్పిపోకుండా చర్యలను చేపడుతున్నారు. గత జాతరలో దాదాపు 30 వేల మంది వరకు తప్పిపోయిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్’వ్యవస్థను తీసుకొస్తున్నారు. వొడాఫోన్–ఐడియా సహకారంతో ఈ విధానం అందుబాటులో ఉంటుంది. పస్రా, ఎస్ఎస్ తాడ్వాయి మార్గాల్లోని కౌంటర్లలో వృద్ధులు, పిల్లల వివరాలను నమోదు చేసి వారికి క్యూఆర్ కోడ్ గల జియోట్యాగ్లను కడతారు. దీంతో వారు ఎవరైనా తప్పిపోయినా ఈ ట్యాగ్ను స్కాన్ చేయటం ద్వారా వారి పూర్తి వివరాలు తెలుస్తాయి. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలో అమలు చేయటానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. -
మేడారం: ఆధునీకరించిన గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్
సాక్షి, ములుగు జిల్లా: మేడారంలో సీఎం రేవంత్రెడ్డి రెండో రోజు పర్యటించారు. మంగళవారం వేకువ జామునే కుటుంబ సమేతంగా సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. తొలిమొక్కును రేవంత్ దంపతులు చెల్లించుకున్నారు. తన ఎత్తు బంగారాన్ని(బెల్లం) ఆయన సమర్పించారు. అంతకు ముందు.. ఆధునీకరించిన మేడారం గద్దెలను సీఎం ప్రారంభించారు. సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో నిర్మించిన నూతన సాలహారం, ద్వారాలు, ఆర్చీలను సీఎం రేవంత్రెడ్డి మంత్రులతో కలిసి సీఎం ప్రారంభించారు. సీఎం, మంత్రులను పూజారులు, దేవాదాయశాఖ అధికారులు ఆదివాసీ సంప్రదాయాలు, ఆచారాలతో డోలు వాయిద్యాల నడుమ గద్దెలపైకి స్వాగతం పలికారు. ఆయా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం అమ్మవార్లను దర్శించుకుని బంగారం(బెల్లం) ప్రసాదం స్వీకరించారు.రాష్ట్ర చరిత్రలో తొలిసారి నిన్న(ఆదివారం) మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించారు. అనంతరం మేడారం ఆలయ ఎగ్జిట్ సెంటర్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు తిలకించారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు, ఆటపాటలను చూసి మంత్రముగ్ధులయ్యారు. అనంతరం హరిత హోటల్లో రాత్రి బస చేశారు. ఇవాళ(సోమవారం) ఉదయం సీఎం రేవంత్ సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నిర్మించిన పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వన దేవతలకు చీర, సారెలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత హెలికాప్టర్లో హైదరాబాద్కు బయలుదేరారు. -
సీఎం రేవంత్కు ఘన స్వాగతం
● జంపన్నవాగు పుష్కరఘాట్ పనుల పరిశీలన ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి: ఖమ్మం నుంచి హెలికాప్టర్లో మేడారం సమ్మక్క, సారలమ్మ సన్నిధికి చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు మంత్రులు, అధికారులు ఆదివారం ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో మంత్రులు ధనసరి సీతక్క, ఉత్తమ్ కుమార్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖతోపాటు కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రాంచంద్రునాయక్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సార య్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, డాక్టర్ మురళీనాయక్, యశస్విని రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, స్టేట్ ఫైనాన్స్, ఆయిల్ ఫెడ్ కమిషన్ చైర్మన్లు సిరిసిల్ల రాజయ్య, జంగా రాఘవరెడ్డి, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అక్కడినుంచి నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించి జాతర ప్రాంతాల దృశ్యాలను తిలకించారు. ఏఐ అత్యాధునిక కెమెరాలు, ఏఎన్పీఆర్ కెమెరాల పనితీరును పోలీసు అధికారులు వివరించారు. అంతకుముందు కమాండ్ కంట్రోల్ వద్ద సీఎంకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. పనుల పరిశీలన జంపన్నవాగు వద్దకు వెళ్లిన సీఎం, మంత్రులు భక్తుల కోసం ఏర్పాటు చేసిన స్నానఘట్టాలు, బాత్రూమ్లు, షవర్లను పరిశీలించారు. అనంతరం కాలినడకన హరిత హోటల్ సమీపంలోని సర్కిల్, ఊరట్టం స్తూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాండ్ స్కేపింగ్లో సుందరంగా తీర్చిదిద్దిన కళాచిత్రాలను పరిశీలించారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్ ములుగు
ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రస్థాయి 11వ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ (సబ్–జూనియర్) పోటీలు ఆది వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించారు. ఆది లాబాద్ ఎంపీ గోడం నగేష్, కలెక్టర్ రాజర్షిషా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలు ప్రారంభించారు. 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. సాయంత్రం ము గింపు కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై క్రీడాకారులకు బహుమతులు పంపిణీ చేశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూ ల నర్సయ్య, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డి భోజా రెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, డీవైఎస్ఎస్ఓ శ్రీనివాస్, డీటీఎస్ఎస్ఓ పార్థసారథి, నాయకులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. అండర్–8 బాలుర విభాగంలో 10 పాయింట్లతో జగిత్యాల, బాలికల విభాగంలో 8 పాయింట్లతో కామారెడ్డిలు విజేతలుగా నిలిచాయి. అండర్ 10 బాలుర విభాగంలో 6 పాయింట్లతో సంయుక్తంగా ములుగు, మంచిర్యాల జిల్లాలు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో 8 పాయింట్లతో ములుగు, మహబూబాబాద్ జిల్లాలు సంయుక్త విజేతలుగా సత్తా చాటాయి. అండర్–12 బాలుర విభాగంలో 7 పాయింట్లతో ఆదిలాబాద్, బాలికల విభాగంలో 8 పాయింట్లతో నారాయణపేట చాంపియన్షిప్ సాధించాయి. అండర్–14 బాలుర విభాగంలో 8 పాయింట్లతో వనపర్తి, బాలికల విభాగంలో 10 పాయింట్లతో హనుమకొండ గెలుపొందాయి. ఇక 19 పాయింట్లతో అన్ని విభాగాల్లో కలిసి ములుగు ఓవరాల్ చాంపియన్ షిప్ కై వసం చేసుకుంది.ఆదిలాబాద్లో ముగిసిన సబ్ జూనియర్ పోటీలు -
గట్టమ్మతల్లికి మొక్కులు
ములుగు రూరల్: ఆదిదేవత గట్టమ్మ తల్లికి మేడారం భక్తులు మొక్కులు చెల్లించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి బయలుదేరిన భక్తులు మొదటి మొక్కులు గట్టమ్మ తల్లికి చెల్లించారు. భక్తులు అమ్మవారికి పసుపు–కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న సమ్మక్క–సారలమ్మ గద్దెలకు పసుపు–కుంకుమ సమర్పించారు. అనంతరం మేడారం బయలుదేరి వెళ్లారు. ములుగు రూరల్: మేడారం వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా మొబైల్ ఏటీఎం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆదివారం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో గట్టమ్మ ఆలయం వద్ద మొబైల్ ఏటీఎంను బ్యాంక్ అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో గట్టమ్మ తల్లి దర్శనానికి వచ్చే భక్తులు అవసరాల నిమిత్తం మొబైల్ ఏటీఎంను వినియోగించారు. వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆదివారం సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ, నందీశ్వరుని విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని శేషాద్రి కొనియాడారు. ములుగు రూరల్: జిల్లాలోని రాయినిగూడెం గ్రామానికి చెందిన వజ్జ నిఖిల్కుమార్ టాటా ముంబై మారథాన్ పోటీలో ప్రతిభ కనబరిచారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన మారథాన్లో 42 కిలో మీటర్ల దూరాన్ని 4.58 గంటలలో పూర్తి చేసి కల సాకారం చేసుకున్నాడు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టాటా ముంబై మారథాన్లో నిఖిల్ ప్రతిభ చాటడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
వాహనాల రద్దీ
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ పునఃప్రతిష్ఠాపన ప్రారంభోత్సవం, కేబినెట్ సమావేశానికి ఆదివారం సీఎంతో పాటు మంత్రులు మేడారానికి చేరుకోవడంతో ఏ రోడ్డు చూసినా వాహనాల రద్దీ కనిపించింది. అధికారుల వాహనాలతో రోడ్డు కిక్కిరిసిపోయింది. హరిత హోటల్, బస్టాండ్, మేడారం గద్దెల రోడ్ల గుండా వెళ్లేందుకు అధికారులు, రాజకీయ నాయకుల వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చి మిగితా భక్తుల వాహనాలను దారి మళ్లించారు. వన్వే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. వాహనాల మళ్లింపుపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రైవేట్ వాహనాలను గద్దెల చుట్టు పక్కల ప్రాంతాలకు అనుమతించలేదు. -
జోరుగా అభివృద్ధి పనులు
ములుగు/ఎస్ఎస్తాడ్వాయి: గత కొన్నేళ్ల క్రితం పచ్చని చెట్లు, అడవి ప్రాంతంగా ఉన్న మేడారంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం గద్దెల పునర్నిర్మాణం పనులతో పాటు మేడారంలోని దారులన్నీ విస్తరించింది. దారుల్లో డివైడర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆధునిక లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి వేళ మేడారం దారులన్నీ విద్యుత్ కాంతులతో విరాజిమ్ముతున్నాయి. అంతేకాకుండా గద్దెల ప్రాంగణంలో హైమాస్ట్ లైటింగ్ సామర్ధ్యం కలిగిన వాటికంటే ఎక్కువ సామర్ధ్యం కలిగిన వాటిని ఏర్పాటు చేయడంతో తల్లుల గద్దెల ప్రాంగణం విద్యుత్ కాంతులతో వెలుగొందుతోంది. సీఎం రేవంత్రెడ్డి మేడారానికి వచ్చిన సందర్భంగా పలు అభివృద్ధి పనులు కూడా చేపట్టడంతో మేడారంలో నూతన శోభ సంతరించుకుంది. -
తరలొచ్చిన సర్కారు.. మురిసిన మేడారం
పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిసాక్షి ప్రతినిధి, వరంగల్: కాంక్రీట్ జంగిల్లో నుంచి రాష్ట్ర సర్కారు పచ్చని వనానికి చేరుకుంది. కంచు గజ్జల సవ్వడితో.. కొమ్ము బూరల నాదంతో.. జంపన్న వాగు అలల సాక్షిగా.. సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల బృందం, అధికార గణానికి గిరిజనులు ఆత్మీయ స్వాగతం పలకగా, వనసిరి వెలుగుల్లో.. మారిన నవ మేడారం ముఖచిత్రం చూసి అందరూ అబ్బురపోయారు. సాయంత్రం నుంచి వనంనుంచి రాష్ట్ర పాలన సాగించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వమంతా తరలిరావడంతో మేడారం ఆదివారం పోలీసులమయమైంది. ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న కీకారణ్యంలో మంత్రి వర్గ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. సాహసోపేతమైన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం మేడారంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రి వర్గ సభ్యులు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీలు, స్పెషల్ సెక్రటరీలు, డీజీపీలు, సీనియర్ ఐపీఎస్లు, ఐఏఎస్లు అందరూ ఆదివారం సాయంత్రం మేడారం చేరుకున్నారు. రూ.251 కోట్లతో చేపట్టిన ఆధునికీకరణ పనులు, శిలలతో సాలాహారాలు, ద్వార బంధాలు, గద్దెల సుందరీకరణ పనులను ప్రత్యేకంగా పరిశీలించేందుకు మంత్రులు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. సమ్మక్క–సారలమ్మ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేసుకుని రెండు రోజుల పాటు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఆదివాసీ సంప్రదాయాలతో జరిగే మేడారం జాతర ఈసారి ప్రత్యేకంగా ఉండాలని మంత్రి సీతక్క పట్టుబట్టడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో పనులు వేగంగా జరిగేలా సీఎం చర్యలు తీసుకున్నారు. ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభం, మొ క్కుల సమర్పణతోపాటు మంత్రి వర్గ సమావేశానికి సైతం కార్యాచరణకు శ్రీకారం జరిగింది. పోలీసుల వలయంలో మేడారం మేడారం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబ ల్యం తగ్గినప్పటికీ సీఎం, మంత్రుల బస నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా పికెట్లు, బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, ఏఎన్పీఆర్ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజులముందు నుంచి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి మేడారంలో పర్యటించి ఐపీఎస్ అధికారులతో సమన్వయం చేశారు. ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్కేకన్ అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు అతిథుల కోసం మౌలిక వసతులపై దృష్టి పెట్టారు. 10 మంది ఐపీఎస్ అధికారులు, 1,600 పోలీసు అధికారులు, సిబ్బంది మేడారంలో బందోబస్తు నిర్వహించారు. మంత్రులు మాత్రమే.. మేడారంలోని హరిత హోటల్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి కేవలం మంత్రులు, మంత్రి వర్గ సమావేశ ప్రత్యేక ఆహ్వానితులను మాత్రమే అనుమతించారు. చీఫ్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీని కూడా అనుమతించారు. సాయంత్రం 4 గంటల నుంచి హరిత హోటల్ ముఖ ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి, మంత్రులు మినహా మిగతా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను అనుమతించలేదు. మంత్రివర్గ సమావేశం అనంతరం సమావేశం నిర్ణయాలను ప్రకటించేలా మీడియా బ్రీఫింగ్ భేటీకి మాత్రం హైదరాబాద్ సమాచార పౌర సంబంధాలశాఖ తయారు చేసిన జాబి తాలోని అక్రిడేటెడ్ జర్నలిస్టులను అనుమతించారు. కాగా, మొదట సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు సుమారు గంటపాటు మంత్రివర్గ సమావేశం ఉంటుందని సీఎం టూర్ షెడ్యూల్ను అధికా రులు ప్రకటించారు. అయితే, ఖమ్మం జిల్లా పాలేరులో కార్యక్రమాలు ఆలస్యం కావడంతో ముఖ్యమంత్రి 5:30 గంటలకు మేడారం చేరుకోవడం వల్ల సుమారు గంట ఆలస్యంగా కేబినెట్ సమావేశం మొదలైంది. ఈసమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ సాహసోపేత నిర్ణయం సీఎం, మంత్రుల పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత హరిత హోటల్లో పలు అంశాలపై చర్చ కేబినెట్ భేటీకి మంత్రులకు మాత్రమే అనుమతి మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు -
మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్సిగ్నల్
సాక్షి, ములుగు జిల్లా: మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. తొలిసారిగా సచివాలయం బయట మేడారం వేదికగా సమావేశం జరిగింది. మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.రెండున్నర గంటల పాటు కేబినెట్ సమావేశం సాగింది. 18 అంశాల ఎజెండాగా భేటీ జరిగింది. జిల్లాల పునర్వవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. పొట్లపాడు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదించింది. -
మేడారంలో ఘర్షణ
వరంగల్ క్రైం: మేడారంలో శనివారం ఓ పోలీస్ అధికారి, పూజారి కుటుంబం మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం.. మేడారానికి చెందిన సమ్మక్క వడ్డె పూజారి కుమారుడు చిలకలగుట్ట దారిలో ఇంటి వద్ద కొబ్బరికాయల దుకాణం ఏర్పాటు చేశాడు. కొబ్బరికాయలు వెనక్కి జరపాలని పూజారి కుమారుడిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై కొంత మంది పూజారులు సంబంధిత ఎస్సై స్థాయి అధికారికి వెళ్లి చెప్పేందుకు ప్రయత్నించగా సదరు ఎస్సై పూజారి వడ్డె కుమారుడిపై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఆగ్రహించిన పూజారులు సంబంధిత అధికారితో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ఈ క్రమంలో మేడారం విధుల్లో ఉన్న పోలీసులు, అధికారులు జోక్యం చేసుకుని పూజారులతో మాట్లాడి గోడవను సద్దుమణిగేలా చేశారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అన్నారంలో ఇసుక లారీలు రోడ్డుపైనే పార్కింగ్ చేస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం లారీలు ఇరువైపులా పార్కింగ్ చేసి ఉండడంతో దామెరకుంట వైపు, చెన్నూర్, కాళేశ్వరం మీదుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
డివైడర్ల తొలగింపు
ఏటూరునాగారం: మహాజాతర సమయంలో 29వ తేదీన సమ్మక్కను చిలకలగుట్ట మీద నుంచి గద్దెలకు తీసుకొచ్చే ముందు మేడారం గ్రామంలోని సమ్మక్క గుడికి రావడం ఆనవాయితీ. అయితే గుడి ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై ఇటీవల డివైడర్లను నిర్మించారు. సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో పూజారులు, ఆదివాసీలు, కుటుంబాలు, యువత, భక్తులు లక్షలాది మంది రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉండడం వల్ల ఈ డివైడర్లతో మరింత కిక్కిరిసిపోవడంతో పాటు అమ్మవారి సేవకు అడ్డు ఏర్పడే అవకాశం ఉందని పూజారులు తెలిపారు. దీంతో అధికారులు వెంటనే సెంట్రల్ లైటింగ్ పోల్స్, డివైడర్లను కూల్చి వేశారు. అధికారులకు ముందు చూపులేని తనంతో లక్షలాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
టెంట్ సిటీ.. లగ్జరీ టెంట్లు
ఏటూరునాగారం: మహాజాతరకు వచ్చే భక్తులు బస చేసేందుకు మేడారం పోలీస్ క్వార్టర్స్ పక్కనే లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేశారు. దానికి టెంట్ సిటీగా నామకరణం చేశారు. అయితే ఈ నెల 18, 19వ తేదీల్లో సీఎం రేవంత్రెడ్డి మేడారం పర్యటన ఉండడంతో వాటిని మరింత అత్యాధునికంగా రూపొందించారు. టెంట్లను ప్రభుత్వం రెండు రోజుల పాటు అద్దెకు తీసుకొని మేడారం వచ్చే మంత్రులకు ఇందులో సకల ఏర్పాట్లు చేయనుంది. మంత్రులు, వీవీఐపీలు, ఇతర అధికారులు సైతం ఇక్కడ విశ్రాంతి తీసుకోవడంతో పాటు పడుకునేందుకు సౌకర్యాలను కల్పించారు. సీఎం పర్యటన తర్వాత ఆన్లైన్లో టెంట్లను అద్దెకు ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. -
పోరుదీక్ష పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి రూరల్: ఈనెల 20న ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద తలపెట్టిన తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్షను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జన్నె యుగేందర్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో కళాకారులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జన్నె యుగేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం తమ ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ సాధించుకున్నామన్నారు. అయినప్పటికీ ఉద్యమ కళాకారులకు ఉపాధి లేకుండా నిరాశ్రయులుగా దీనస్థితిలో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు సెగ్గెం శ్రావణ్, రాజేష్, రాజా, సడవలి, మధుకర్, సమ్మరాజ్, రాజశేఖర్, సంధ్యారాణి, నిర్మల, రాజేశ్వరి, శోభ, పాల్గొన్నారు. -
ఇక మున్సిపల్ పోరు..
ములుగు: మున్సిపల్ పోరుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇటీవల మున్సిపల్ తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన అధికారులు శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ టీఎస్.దివాకర సమక్షంలో వార్డుల వారీగా డ్రా పద్ధతిలో రిజర్వేషన్లను ఖరారు చేశారు. మేజర్ పంచాయతీగా ఉన్న ములుగును జీవింతరావుపల్లి, బండారుపల్లి జీపీలను కలుపుకొని 2025 మే 29న మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మున్సిపాలిటీగా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండడంతో చైర్పర్సన్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు అధికార పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీలు సన్నద్ధమవుతున్నాయి. తొలిసారిగా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా పుర చరిత్రలో నిలిచిపోనున్నారు. ఎస్టీ నియోజకవర్గమైన ములుగులో అనుహ్యంగా ములుగు మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మేజర్ పంచాయతీగా ఉన్న ములుగును 2019 ఫిబ్రవరి 17న ములుగు జిల్లాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాగా ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీగా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినప్పటికీ తగినంత జనాభా, ఓటర్లు లేకపోవడంతో మున్సిపాలిటీ ఏర్పాటు కాలేదు. ములుగు మున్సిపాలిటీలో జీవింతరావుపల్లి, బండారుపల్లి జీపీలను కలిపి మున్సిపాలిటీగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో తొలిసారిగా జరగనున్న మున్సిపల్ పోరుకు 20 వార్డులను, 20 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రం పరిధిలో సుమారుగా 698 మంది ఓటర్లు ఓటు వేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. 20 వార్డుల పరిధిలో 13,963 మంది ఓటర్లు ఉండగా ఇందులో 6,661 మంది పురుషులు, 7,300 మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. 20 వార్డులలో 2 ఎస్టీకి, 3 ఎస్సీలకు, 5 బీసీలకు, 10 జనరల్ అభ్యర్థులకు రిజర్వేషన్లు కేటాయించగా ఇందులో 10 మంది మహిళలకు 10 వార్డులను కేటాయించారు. ములుగు మున్సిపల్ పోరుకు ఇప్పటి నుంచి రాజకీయ పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. బీసీ మహిళకు చైర్పర్సన్ పదవిని కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి వంగ సుమలత, మాజీ సర్పంచ్ బండారి నిర్మల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి మాజీ జెడ్పీటీసీ సకినాల భవానితో పాటు మాజీ ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి పోటీలో ఉంటున్నట్లు బీఆర్ఎస్ పార్టీలో ప్రచారం సాగుతోంది. మున్సిపాలిటీ చైర్పర్సన్ పీఠాన్ని ఎలాగైనా చేజిక్కించుకునేందుకు ఇరు పార్టీలకు చెందిన వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. వారం రోజులుగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నాయకులు నిమగ్నమయ్యారు. తమను ఎలాగైనా గెలిపించాలని అవసరమైతే ఓటుకు రూ. 2 నుంచి 5 వేల వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓటర్లకు సంకేతాలు ఇస్తున్నారు. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు తొలిసారిగా ములుగులో మున్సిపల్ ఎన్నికలు 20 వార్డుల పరిధిలో 13,963 మంది ఓటర్లు చైర్పర్సన్ పీఠంపై బీసీ మహిళ1వ వార్డు – ఎస్టీ మహిళ 2 – ఎస్సీ జనరల్ 3 – జనరల్ మహిళ 4 – జనరల్ మహిళ 5 – ఎస్సీ మహిళ 6 – బీసీ జనరల్ 7 – జనరల్ 8 – జనరల్ మహిళ 9 – జనరల్ మహిళ 10 – జనరల్ మహిళ 11వ వార్డు – బీసీ జనరల్ 12 – జనరల్ 13 – ఎస్సీ జనరల్ 14 – జనరల్ మహిళ 15 – బీసీ మహిళ 16 – జనరల్ 17 – బీసీ జనరల్ 18 – బీసీ మహిళ 19 – జనరల్ 20 – ఎస్టీ జనరల్ -
జాతరలో భక్తుల భద్రత కీలకం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతరలో భక్తుల భద్రత కీలకమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మేడారం జాతర సందర్భంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను శనివారం రాత్రి సందర్శించారు. జాతర ప్రాంతాలలో సుమారు 450 సీసీ కెమెరాల ద్వారా పోలీసులు కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లోని భారీ ఎల్ఈడీ స్క్రీన్పై జాతర ప్రాంగణంలో జరుగుతున్న కార్యక్రమాలు, భక్తుల రాకపోకలు, జనసాంద్రత పరిస్థితులను మంత్రి సీతక్క ప్రత్యక్షంగా వీక్షించారు. జాతర సమయంలో అవాంఛనీయ ఘటనలు జరిగితే పోలీసులు ఎలా స్పందిస్తారు, ముందస్తు చర్యలు, సన్నాహాలు ఏమిటన్న అంశాలను పోలీస్ అధికారులు మంత్రికి వివరించారు. భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రతీ చిన్న అంశాన్ని కూడా అప్రమత్తతతో పర్యవేక్షించాలని మంత్రి సీతక్క పోలీస్ అధికారులకు ఆదేశించారు. భక్తులు నిర్భయంగా, ప్రశాంతంగా జాతరలో పాల్గొనేలా భద్రతా ఏర్పాట్లు ఉండాలని, పోలీస్ యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, జిల్లా ఎస్పీ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన మేడారంలో నేడు సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో శనివారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఏర్పాట్లను పరిశీలించారు. మేడారంలో ఆదివాసీ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన వేదికను మంత్రి పరిశీలించి ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఏర్పాట్ల వివరాలను మంత్రి సీతక్కకు వివరించారు. బందోబస్తూ, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టర్ దివాకర సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచలను చేశారు. అలాగే సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్ల కోసం నియమించిన ప్రత్యేక అధికారులతో ఆర్డీఓ వెంకటేశ్ సమావేశం నిర్వహించి వారి విధుల నిర్వహణ, ఏర్పాట్లపై సూచనలు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎల్ఈడీ స్క్రీన్ల పరిశీలన -
ములుగు అడిషనల్ ఎస్పీ బదిలీ
ములుగు: ములుగు అడిషనల్ ఎస్పీ శివమ్ ఉపాధ్యాయ బదిలీ అయ్యారు. ఏటూరునాగారం ఏఎస్పీగా ఏడాదికిపైగా విధులు నిర్వహించిన శివమ్ ఉపాధ్యాయ పదోన్నతిపై 2025 సెప్టెంబర్ 18న ములుగు అడిషనల్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. నాలుగు నెలల వ్యవధిలోనే శివమ్ ఉపాధ్యాయను ప్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. చెట్లు, స్తంభాలకు రంగులు ఏటూరునాగారం: మహాజాతర సందర్భంగా వచ్చిపోయే వాహనాలు, భక్తులకు రోడ్డు వెంట ఉన్న చెట్లు, స్తంభాలు కనిపించే విధంగా ఆర్అండ్బీశాఖ ఎరుపు, తెలుపు గుర్తులతో ప్రతీ చెట్టుకు, స్తంభానికి కలర్ వేయించారు. దీంతో రోడ్డు వెంట ఏమి ఉన్నాయి, ఎంత దూరం వరకు ఉన్నాయనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో వాహనదారులకు, భక్తులకు రక్షణ కల్పించేలా ఈ రంగులు సహాయ పడనున్నాయి.రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక మల్హర్(కాటారం): రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు మండలంలోని దామరకుంట సోషల్ వెల్ఫేర్ విదార్థిని మంతెన శ్రీహర్షిని ఎంపికై నట్లు పెద్దపెల్లి జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు టి.లక్ష్మణ్, వేల్పుల కుమారు తెలిపారు. ఈనెల 18 నుంచి 20 వరకు నారాయణపేట జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ ఖోఖో చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనున్నట్లు చెప్పారు. విద్యార్థిని ఎంపిక పట్ల కళాశాల ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ నజ్మా, పీడీ రాజేశ్వరి, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తంచేశారు. గూగుల్ మ్యాప్ తప్పుదారి.. పర్యాటకులకు తిప్పలు గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం లక్నవరం సరస్సుకు వెళ్లే పర్యాటకులు గూగుల్ మ్యాప్ గందరగోళంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గూగుల్ మ్యాప్లో లక్నవరం సరస్సు అని సెర్చ్ చేస్తే మేడారం నుంచి వచ్చే వాళ్లకు దుంపెల్లిగూడెం మీదుగా, వరంగల్ నుంచి వచ్చే వారికి జంగాలపల్లి క్రాస్ నుంచి కన్నాయిగూడెం గ్రామంలోకి చూపిస్తోంది. ఫలితంగా పర్యాటకులు 20 నుంచి 30 కిలో మీటర్ల వరకు అదనంగా ప్రయాణించి, చివరకు దారి తప్పినట్లు తెలుసుకొని మళ్లీ వెనక్కి వస్తున్నారు. ముఖ్యంగా ఇతర జిల్లాలు, రాష్టాల నుంచి వచ్చే వారికి స్థానిక మార్గాలపై అవగాహన లేకపోవడంతో గూగుల్ మ్యాప్పైనే ఆధారపడాల్సి వస్తోందని, ఈ క్రమంలో సమయం, ఇంధనం వృథా కావడంతో పాటు పర్యాటకుల మనోభావాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు గూగుల్ మ్యాప్లో లక్నవరం సరస్సు లొకేషన్ సరి చేయడంతోపాటు ప్రధాన రహదారులపై స్పష్టమైన దిశ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. -
‘మేడిగడ్డ’ పునరుద్ధరణ ఆలస్యం!
● పరీక్షల ఫలితాలకు ఏడాది దాటే అవకాశం ● క్షేత్రస్థాయి పరీక్షలు పూర్తయ్యాకే ముందడుగుకాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ పునరుద్ధరణకు మరో ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశాలు ఉ న్నట్లు తెలుస్తోంది. సాంకేతిక కారణాలు, క్షేత్రస్థా యి పరీక్షల నిర్వహణలో జాప్యం కారణంగా పునరుద్ధరణ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయి. బ్యారేజీ నిరుపయోగంగా మారి ఇప్పటికే రెండేళ్లు పూర్తవుతున్నా, పునరుద్ధరణ ఎ ప్పుడవుతుందో ఇంకా స్పష్టత రావడం లేదు. రెండేళ్లుగా.. మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్ 21న ఏడోబ్లాక్లోని 20వ పియర్ కుంగిన విషయం తెలిసిందే. అన్నారం, సుందిళ్లలో సీపేజీ లీకేజీలు ఏర్పడ్డాయి, అప్పటి నుంచి ఎన్డీఎస్ఏ ఆదేశాలు, సూచనల మేరకు పలు పరీక్షలు నిర్వహించారు. మళ్లీ పునరుద్ధరణ చేపట్టడానికి పరీక్షలు చేయడానికి ఈనెలలో అడుగులు వేస్తున్నారని తెలిసింది. కాగా మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీ ల్లో నిర్వహించాల్సిన పరీక్షల అనంతరం చేపట్టే పనులకు అవసరమైన డిజైన్ల రూపకల్పన కోసం నీ టిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) డిజైన్సంస్థలతో ఒప్పందాలకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు సమాచారం. 9 రకాల పరీక్షలు చేయడానికి సిద్ధం.. మేడిగడ్డ బ్యారేజీలో కుంగుబాటుకు గురైన ఏడో బ్లాక్లో ఇప్పటికే ఒక దఫా పరీక్షలు నిర్వహించిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) మరో తొమ్మిది రకాల పరీక్షలు చేపట్టనుంది. ఈనెల చివరి వారం లేదా ఫిబ్రవరిలో.. ఈ నెల చివరి వారం లేదా ఫిబ్రవరి తొలి వారంలో పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికా రులు భావిస్తున్నారు. నీటి నిల్వ చేయడానికి బ్యారేజీలు వచ్చే ఖరీఫ్ సీజన్కు కూడా సిద్ధంగా లేవని ఆ రోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావును ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించగా ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది. -
వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి వరపూజ
● వేలాదిగా తరలివచ్చిన భక్తులు ● ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సీతక్కమంగపేట: మండలంలోని మల్లూరులో మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీహేమాచల లక్ష్మీనర్సింహాస్వామి వరపూజ మహోత్సవం (జాతర) గురువారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వాహణ అధికారి రేవెల్లి మహేష్ పర్యవేక్షణలో లక్ష్మీనర్సింహాస్వామి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రవరా వరపూజ (పెళ్లిచూపులు) కార్యక్రమాన్ని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకష్ణమాచార్యుల బృందం, పూజారి ముక్కామల రాజశేఖర శర్మ వరపూజ మహోత్సవాన్ని వేదమంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. గ్రామంలోని రామాలయం ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో మూడు గంటల పాటు నేత్ర పర్వంగా కొనసాగింది. స్వామివారి ఇతి వృత్తాన్ని భద్రాచలం దేవస్థాన వ్యాఖ్యాత ఎస్టీజీ కృష్ణమాచార్యులు వివరించారు. వరపూజ మహోత్సవం సందర్బంగా స్వామివారికి ఆలయ ఈఓ మహేష్, పట్టువస్త్రాలను అందించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం, మల్లూరు శంభులింగేశ్వరస్వామి ఆలయ పూజారి అనిపెద్ది నాగేశ్వర్రావు పెద్దలుగా వ్యవహరించి స్వామివారు, అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలను అందచేశారు. మే 1న తిరుకల్యాణం మల్లూరుగుట్టపై ఉన్న హేమాచల క్షేత్రంలో సంక్రాంతి సందర్భంగా ఆలయ అర్చకులు తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. స్వామివారిని నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి వేద మంత్రోచ్ఛరణ నడుమ కై ంకర్యాదులు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ప్రతి ఏటా హేమాచల క్షేత్రంలో నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలను ఏప్రిల్ 27వ తేదీ నుంచి తిరుకల్యాణ మహోత్సవాలు, మే 1న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించేందుకు వివాహ సుముహూర్తాన్ని ఖరారు చేసి నిశ్చయ తాంబూలాల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హేమాచలున్ని దర్శించుకున్న మంత్రి సీతక్క హేమాచల లక్ష్మీనర్సింహాస్వామిని మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ రేవెల్లి మహేష్, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అలాగే లక్ష్మీ నర్సింహాస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లను వేలాది మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా తహసీల్దార్ రవీందర్, టీఎస్ఈజీసీ సభ్యుడు గుమ్మడి సోమయ్య, మాజీ చైర్మన్ చిట్యాల పురుశోత్తం, యరంగారి సురేష్, ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై టీవీఆర్ సూరిని ఆలయ ఈఓ మహేష్, అర్చకులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, నాయకులు అయ్యోరి యానయ్య, చందర్లపాటి శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు. -
మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి
● ఏఎస్పీ మనన్ బట్ ఏటూరునాగారం: మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్ అన్నారు. గురువారం మండలకేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మద్దేడు పీఎస్ పరిధిలోని కడియం పాండు అలియాస్ కార్తీక్, ముచకి మంగళ్ అనే వ్యక్తులు లొంగిపోయినట్లు తెలిపారు. ఇద్దరు పార్టీ సభ్యులు జనజీవన స్రవంతిలో కలవడంతో వారికి సరెండర్ పాలసీ కింద రూ. 25 వేల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీ సంక్షేమ కోసం చేపట్టిన పోరు క న్నా ఊరు మిన్న... మన ఊరికి తిరిగిరండి అనే నినాదంలో భాగంగా సీఆర్పీ ఆధ్వర్యంలో ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారన్నారు. మావోయి స్టు పార్టీ బలహీనపడుతున్న నేపథ్యంలో కింది స్థాయి క్యాండర్ నాయకత్వంపై అసంతృప్తితో రహ స్య జీవితం వదిలి కుటుంబాలతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని మావోలు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో పదుల సంఖ్యలో లొంగిపోతున్నట్లు తెలిపారు. -
భయం భయంగా బైపాస్రోడ్డు
● వాహనాల రద్దీకి ఎగసిపడుతున్న దుమ్ము ● పాత జాతరను గుర్తుకు చేస్తున్న గట్టమ్మ రోడ్డు ఏటూరునాగారం: వరంగల్ నుంచి గట్టమ్మ మీదుగా మేడారం జాతరకు వెళ్లే భక్తులకు కొత్తగా ఏర్పాటు చేస్తున్న బైపాస్ రోడ్డు పాత జాతరను గుర్తుకు తెస్తుంది. మేడారం వెళ్లే భక్తులు గట్టమ్మ దగ్గర మొక్కులు చెల్లించుకునేందుకు తమ వాహనాల నిలిపి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. గత రెండు జాతర నుంచి గట్టమ్మ దేవాలయం వద్ద పక్కకు ఏర్పాటు చేసిన పార్కింగ్లోనే వాహనాలను నిలిపేవారు. ప్రస్తుతం వాహనాలు సంఖ్య గణనీయంగా పెరగడంతో గట్టమ్మ దేవాలయానికి ముందుగా బైపాస్ రోడ్డును సుమారు కిలోమీటర్ వరకు ఏర్పాటు చేసి గుట్ట దిగువన పార్కింగ్ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం వాహనాలను డైరెక్ట్గా వెళ్లకుండా పోలీసులు ఆపి గట్టమ్మ బైపాస్ నుంచి వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల గట్టమ్మ బైపాస్ ప్రస్తుతం మెటల్ రోడ్డుతోనే ఉండడంతో దుమ్ము ఎగసిపడుతోంది. దీంతో ముందు వెళ్లే వాహనాలు కనిపించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాటర్ స్ప్రేయింగ్ చేయించాలి.. బీటీ రోడ్డు వేసే వరకు మెటల్ రోడ్డుపై వాటర్ స్ప్రె యింగ్ చేయించాలని భక్తులు కోరుతున్నారు. డైరెక్ట్గా వెళ్లే వాహనదారులను గట్టమ్మ వద్ద నిలపకుండా పంపించాలని వాహనదారులు కోరుతున్నారు. కంకర రోడ్డు కావడంతో దుమ్ము ఎగిసిపడడంతో వెనుక వచ్చే వాహనాలకు రోడ్డు క నిపించే పరిస్థితి లేకుండా పోతుంది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ట్రాఫిక్జాం అవుతుంది. -
ముందు ‘మున్సిపల్’..
శనివారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపాలిటీ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్కు రెండు రోజుల ఆలస్యంగానైనా వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా ప్రకటన వెలువడింది. ఆ తర్వాత వెంటనే మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లను రాష్ట్ర పురపాలకశాఖ ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు మేయర్, చైర్మన్ స్థానాల్లో 3 కార్పోరేషన్లు, 38 మున్సిపాలిటీలను బీసీలకు కేటాయించారు. అయితే ఏ జిల్లాలో ఏ నగరం, ఏ పట్టణం ఎవరికి కేటాయిస్తారనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. ఇందులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)తో పాటు 12 మున్సిపాలిటీలపై శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి అందరూ ఊహించినట్లుగా ‘పుర’పోరుకు వేగంగా పావులు కదులుతుండగా.. రెండు, మూడు రోజుల్లో (20వ తేదీ వరకు) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చని అంటున్నారు. ఈ విషయమై అధికారులు, అధికార పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ముఖ్య నేతలకు సంకేతాలు కూడా అందినట్లు ప్రచారం ఉంది. త్వరలోనే రిజర్వేజన్లు.. నోటిఫికేషన్ ముందుగా ప్రకటించిన ప్రకారం సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారం, జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆదివారం, సోమవారం.. రెండు రోజులు మేడారంలో బస చేయనున్న ఆయన సమ్మక్క సారలమ్మ గద్దెలు, ఆలయ ప్రారంభించడం, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అంతకు ముందే నిర్వహించే కేబినేట్ సమావేశంలో ఎన్నికల అంశం ప్రధానం కానుండగా.. ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కూడా రేవంత్రెడ్డి భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్న ప్రచారానికి తోడు రెండు రోజుల కిందట మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ప్రకటన కూడా ఊతం ఇస్తోంది. దీంతో మున్సిపల్ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లలో ఉమ్మడి వరంగల్లోని 12 మున్సిపాలిటీల్లో ఏ మున్సిపాలిటీ ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ అవుతుందోనన్న చర్చ కూడా సీరియస్గా సాగుతోంది. వార్డుల ఆధారంగా కూడా రిజర్వేషన్ల అంశం రెండు రోజుల్లో తేలే అవకాశం ఉందన్న ప్రచారం ఆశావహులను ఉత్కంఠకు గుర్తి చేస్తోంది. ఇదిలా ఉండగా ప్రధాన రాజకీయ పార్టీలు సైతం మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కూడా మున్సిపల్ వార్డులు, చైర్మన్ల కోసం అన్ని సామాజిక వర్గాల నుంచి ప్రత్యామ్నాయంగా అభ్యర్థులను ఎంచుకుంటున్నాయి. రిజర్వేషన్లకు అనుగుణంగా గెలుపు గుర్రాలను బరిలోకి దింపే వ్యూహంలో తలమునకలవుతున్నారు. గ్రేటర్లో డివిజన్ల విస్తరణ లేనట్లే.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరహాలు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోనూ డివిజన్ల విస్తరణ ఉంటుందని భావించారు. ప్రజాప్రతినిధులు కూడా కొందరు ప్రయత్నాలు చేశారు. గ్రేటర్ వరంగల్ పాలకవర్గం పదవీ కాలం ఈ ఏడాది మే 7న ముగియనుంది. ఈలోగా పెరిగిన జనాభా, ఇళ్ల నిర్మాణానికి తోడు విస్తరించిన నగరాన్ని దృష్టిలో పెట్టుకుని 66 డివిజన్లను 88 డివిజన్లకు పెంచాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. 2011 జనాభా లెక్కలకు ప్రస్తుత జనాభాతో పోలిస్తే భారీగానే పెరిగినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. సుమారు 406 చదరపు కిలోమీటర్ల మేరకు నగరం విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో ఒక్కో డివిజన్కు 7 వేల నుంచి 9 వేల ఓటర్లను తీసుకుని 88 డివిజన్లు చేయాలని పురపాలక శాఖ డైరక్టర్ టీకే శ్రీదేవికి పలుమార్లు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. ఈ తరుణంలోనే వార్డుల రిజర్వేషన్లపై ప్రకటన వెలువడటంతో ఇప్పట్లో డివిజన్ల విస్తరణ లేనట్లేనన్న చర్చ మొదలైంది. దీంతో పాటు ఈ సారి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను మళ్లీ మహిళలకే కేటాయిస్తారా? ఏమైనా మార్పులు చేస్తారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్? అధికారులకు సంకేతాలు ‘గ్రేటర్’ సహా 12 మున్సిపాలిటీల్లో వార్డులు ఖరారు మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లపై నేడు ప్రకటన ‘బల్దియా’ల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల కసరత్తు మేడారంలో రేపు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలతో సీఎం భేటీమున్సిపాలిటీల వారీగా రిజరేషన్లు – 2026 జిల్లా మున్సిపాలిటీ వార్డులు ఎస్టీ ఎస్సీ బీసీ మహిళ(జ) అన్ రిజర్వుడుహనుమకొండ జీడబ్ల్యూఎంసీ 66 2 11 20 17 16 పరకాల 22 1 5 5 7 4 వరంగల్ నర్సంపేట 30 3 4 8 8 7 వర్ధన్నపేట 12 3 2 1 4 2 జనగామ జనగామ 30 1 5 9 9 6 స్టేషన్ఘన్పూర్ 18 1 5 3 6 3 మహబూబాబాద్ మహబూబాబాద్ 36 7 5 6 10 8 డోర్నకల్ 15 4 3 0 4 4 మరిపెడ 15 6 1 0 4 4 తొర్రూరు 16 2 3 3 5 3 కేసముద్రం 16 3 2 3 5 3 భూపాలపల్లి భూపాలపల్లి 30 2 6 7 8 7 ములుగు ములుగు 20 2 3 5 6 4 -
గోవు సకల దేవతా స్వరూపం
హన్మకొండ కల్చరల్: గోవు సకల దేవతాస్వరూపమని, వేదాలు, పురాణ సాహిత్యంలోనూ చెప్పబడిందని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. కనుమ పండుగను పురస్కరించుకుని శుక్రవారం వేయిస్తంభాల దేవాలయంలో గోపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో గోవును నూతన వస్త్రంతో అలంకరించి శ్రీసూక్తవిధానంతో పూజలు చేశారు. శనగపిండి, బెల్లం, బియ్యం, పండ్లు నైవేద్యంగా సమర్పించారు. హారతి, నీరాజన మంత్రపుష్పం చేశారు. భక్తులు గోమాత చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆలయ ఈఓ అనిల్కుమార్, పరి చారకులు సందీప్శర్మ తదితరులు పాల్గొన్నారు. -
పరిశుభ్రతతోనే ఆరోగ్యానికి మేలు
జనసంద్రం● తల్లులను దర్శించుకున్న 5 లక్షల మంది ● వనమంతా భక్తుల సందడి● కలెక్టర్ దివాకర టీఎస్ తల్లుల గద్దెల వద్ద కిక్కిరిసిన భక్తజనం ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం వచ్చే భక్తులు అమ్మవార్ల దర్శనంతో పాటు పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యానికి మేలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శుక్రవారం మేడారంలో పర్యటించి జాతర పనులను పరిశీలించారు. సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా చేపట్టనున్న ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శుభ్రతతో కూడిన జీవనం పవిత్రతకు మార్గమని, ఆ పవిత్రతే దైవత్వానికి సమీపమని సూచించారు. మేడారంలో ప్రతీ ఒక్క భక్తుడు పరిశుభ్రత పాటించాలని, దీనిని నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకోవాలన్నారు.మేడారం -
ఆదిదేవతకు మొక్కులు
ములుగు రూరల్: మేడారం మహాజాతర సందర్భంగా వరుస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవార్ల దర్శనానికి బయలుదేరారు. శుక్రవారం ఆదిదేవత గట్టమ్మ తల్లికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కుల చెల్లించారు. పసుపు, కుంకుమతో పాటు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. దీంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. ఉదయం 9 గంటల సమయంలో గట్టమ్మ ఆలయానికి చేరుకునే భక్తుల వాహనాలతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. సుమారు గంట పాటు భక్తులు ఇబ్బందులు పాడ్డారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. అయితే గట్టమ్మ వద్ద విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి అవగాహన లేకపోవడంతోనే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. -
మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
ములుగు: మున్సిపాలిటీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు 2011 జనాభా లెక్కల ప్రకారం బుధవారం అధికారులు రిజర్వేషన్లు ప్రకటించారు. ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులకు 13,963 మంది ఓటర్లు ఉన్నారు. 6,661 మంది పురుషులు, 7,300 మంది మహిళలు ఇద్దరు ఇతరులు ఉన్నారు. 20 వార్డులలో రెండు ఎస్టీలకు(ఎస్టీ జనరల్ ఒకటి, ఎస్టీ మహిళ ఒకటి) కేటాయించగా ఎస్సీ జనరల్కు మూడు సీట్లను(ఎస్సీ జనరల్కు రెండు, ఎస్సీ మహిళ ఒకటి) కేటాయించారు. అలాగే బీసీలకు ఐదు సీట్లు (బీసీ జనరల్ మూడు, బీసీ మహిళ రెండు) కేటాయించారు. అలాగే జనరల్ మహిళకు ఆరు, అన్ రిజర్వుడు నాలుగు స్థానాలు ఉన్నాయి. 20 వార్డులలో 10 వార్డులను మహిళలకు కేటాయించారు. -
ఆ ఇంటికి ‘పెద్ద’రాయుడు..
ములుగు: నల్లబెల్లి మండ ల పరిసర గ్రామాల్లో తిరుగుతూ గంగిరెద్దును ఆడించే పెద్ద వెంకటయ్యది మూడు తరాల చరిత్ర. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వృత్తే అతడికి జీవనాధారం. వెంకటయ్య దగ్గర ఉన్న గంగిరెద్దు పేరు పెద్దరాయుడు. తెల్లటి శరీరం, నుదుట ఎర్రని చుక్క, మెడలో గంటలతో అడుగు పెడితే పిల్లలందరూ చుట్టుముడుతారు. ‘పెద్దరాయుడిని మేము ఎద్దులా చూడము. మా కుటుంబంలో నా కన్న బిడ్డలా చూసుకుంటాం’అని పెద్ద వెంకటయ్య చెప్పుతుంటే ఆయన కళ్లలో గర్వం, ప్రేమ కనిపించాయి. పెద్దరాయుడు గురించి ఆయన మాటల్లో.. కఠినమైన శిక్షణ.. ప్రేమతోనే సాధ్యంఒక ఎద్దును గంగిరెద్దుగా తీర్చిదిద్దడం వెనుక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. తిరుపతి కొండల్లో గురువు ప్రేమ సైగలతో శిక్షణ ఇస్తారు. డూడూ బసవన్న అంటే తల ఊపడం, కాళ్లతో తాళం వేయడం, యజమాని మాట ప్రకారం ఆశీర్వదించడం ఇవన్నీ నేర్పడానికి ఎంతో ఓర్పు ఉండాలి. ప్రతిరోజూ పెద్దరాయుడు (గంగిరెద్దు)కు స్నానం చేయించి ప్రత్యేకమైన ఆహారం అందిస్తూ కుటుంబ సభ్యులకంటే జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. పండుగ సమయంలో గతంలో బియ్యం, ధాన్యం, కాసిన్ని డబ్బులు ఇచ్చేవారు. కానీ పట్టణీకరణ పెరగడం, ప్రజల్లో ఆసక్తి తగ్గడంతో ప్రస్తుతం ఆదరణ తగ్గింది. కుటుంబ పోషణతోపాటు ఎద్దు మేతకు కూడా ఇబ్బంది అవుతోంది. ప్రభుత్వం మమ్ముల్ని కళాకారులుగా గుర్తించి పింఛన్ ఇవ్వాలి. పశుపోషణకు సాయం చేస్తే ఈ కళను బతికించుకుంటాం. -
నేటి నుంచి మేడారం మహాజాతర పూజలు
ములుగు: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర పూజా కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు(బుధవారం) మేడారం, కన్నెపల్లిలో గుడిమెలిగె పండుగను పూజారులు సంప్రదాయంగా నిర్వహించనున్నారు. పూజారులు అమ్మవార్ల ఆలయాలను శుద్ధి చేసి పసుపు, కుంకుమలతో అలంకరించనున్నారు. పూజారులు ఉదయాన్నే తలస్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరంచి గుడిమెలిగె పండుగ పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం పూజారులు గుడిమెలిగె పండుగ నిర్వహించేందుకు ప్రత్యేకంగా సమావేశమై కార్యక్రమాలకు సంబంధించిన పూజ సామగ్రిని సిద్దం చేశారు. గుడిమెలిగె పండుగ అనంతరం వారం రోజుల తర్వాత మండమెలిగె పండుగను నిర్వహించనున్నట్లు వివరించారు. గుడిమెలిగె పండుగతో అమ్మవార్లకు మహాజాతర పూజా కార్యక్రమాలు ఆరంభం కానున్నాయి. -
బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేయాలి
ములుగు రూరల్: మల్లంపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మండల పరిధిలోని మల్లంపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాఉతూ మహాజాతరకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వాహనాల రాకపోకలకు సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జాతర రాకపోకలు కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో నేడు(బుధవారం) భోగి పండుగ సందర్భంగా గోదాదేవి రంగనాథుల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వర్రావుశర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్యాణ వేడుకలను పురస్కరించుని శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ముస్తాబు చేశారు. ఆలయం ఎదుట ఉన్న తులసి వనాలను ముస్తాబు చేశారు. ఉదయం 10.31 గంటలకు కల్యాణాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగపేట: మండల పరిధిలోని మంగపేట, కమలాపురం, రాజుపేట తదితర గ్రామాల్లోని పలు షాపుల్లో అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి మాచర్ల కోటేశ్వర్రావు ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని గాలి పటాలను విక్రయించే పలు ఫ్యాన్సీ, కిరాణం, జనరల్ స్టోర్లలో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా అమ్మకాలు ఏమైనా విక్రయిస్తున్నారా అని పరిశిలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మకర సంక్రాంతి పండుగను ఎకో ఫ్లెండ్లీగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్బీఓ రవి, శ్రీలత, ప్రశాంత్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీ అభినవ వీరభద్ర స్వామి– భద్రకాళి అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని నేడు(బుధవారం) ఉదయం 11.20 గంటలకు కల్యాణాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు బురుగుపల్లి మఠం గంగాధర్, కోనుగంటి రాజ్కుమార్లు తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలోని శివాలయం నుంచి వీరభద్రుడు–భద్రకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను మంగళవారం డప్పుచప్పుళ్లతో ట్రాక్టర్లో ఊరేగింపుగా వీరభద్రుడి ఆలయానికి తీసుకెళ్లారు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున రథానికి స్వాగతం పలుకుతూ నీళ్లు ఆరబోశారు. -
పోలింగ్ స్టేషన్ల జాబితా విడుదల
ములుగు: ములుగు మున్సిపాలిటీకి చెందిన 20 పోలింగ్ కేంద్రాల జాబితాను మున్సిపల్ కమిషనర్ జనగాం సంపత్రెడ్డి మంగళవారం విడుదల చేశారు. పోలింగ్ కేంద్రాల జాబితాను మున్సిపాలిటీ కార్యాలయ గోడలపై అంటించారు. 1వ వార్డు పోలింగ్ స్టేషన్ జీవింతరావుపల్లి ప్రభుత్వ పాఠశాలలో, 2, 3, 4, 19, 20వ వార్డుకు చెందిన పోలింగ్ స్టేషన్లు ములుగు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో, 5, 6, 7వ వార్డు ములుగు ప్రైమరీ స్కూల్లో, 8, 9, 14వ వార్డుకు చెందిన పోలింగ్ స్టేషన్లు ములుగు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్లో 10, 11వ వార్డు బండారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో, 12, 13వ వార్డు జెడ్పీహెచ్ఎస్ బండారుపల్లిలో, 15, 16, 17, 18వ వార్డు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. 20 వార్డులకు 20 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా 13,963 మంది ఓటర్లకు ప్రతీ పోలింగ్ కేంద్రంలో దాదాపుగా 698 మంది ఓటు వేసేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. -
నేటినుంచి మహాజాతర పూజలు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర పూజా కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు(బుధవారం) మేడారం, కన్నెపల్లిలో గుడిమెలిగె పండుగను పూజారులు సంప్రదాయంగా నిర్వహించనున్నారు. పూజారులు అమ్మవార్ల ఆలయాలను శుద్ధి చేసి పసుపు, కుంకుమలతో అలంకరించనున్నారు. పూజారులు ఉదయాన్నే తలస్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరంచి గుడిమెలిగె పండుగ పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం పూజారులు గుడిమెలిగె పండుగ నిర్వహించేందుకు ప్రత్యేకంగా సమావేశమై కార్యక్రమాలకు సంబంధించిన పూజ సామగ్రిని సిద్దం చేశారు. గుడిమెలిగె పండుగ అనంతరం వారం రోజుల తర్వాత మండమెలిగె పండుగను నిర్వహించనున్నట్లు వివరించారు. గుడిమెలిగె పండుగతో అమ్మవార్లకు మహాజాతర పూజా కార్యక్రమాలు ఆరంభం కానున్నాయి.మేడారం, కన్నెపల్లిలో గుడిమెలిగె పండుగ -
ఆ ఇంటికి ‘పెద్ద’రాయుడు..
నల్లబెల్లి: నల్లబెల్లి మండ ల పరిసర గ్రామాల్లో తిరుగుతూ గంగిరెద్దును ఆడించే పెద్ద వెంకటయ్యది మూడు తరాల చరిత్ర. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వృత్తే అతడికి జీవనాధారం. వెంకటయ్య దగ్గర ఉన్న గంగిరెద్దు పేరు పెద్దరాయుడు. తెల్లటి శరీరం, నుదుట ఎర్రని చుక్క, మెడలో గంటలతో అడుగు పెడితే పిల్లలందరూ చుట్టుముడుతారు. ‘పెద్దరాయుడిని మేము ఎద్దులా చూడము. మా కుటుంబంలో నా కన్న బిడ్డలా చూసుకుంటాం’అని పెద్ద వెంకటయ్య చెప్పుతుంటే ఆయన కళ్లలో గర్వం, ప్రేమ కనిపించాయి. పెద్దరాయుడు గురించి ఆయన మాటల్లో.. కఠినమైన శిక్షణ.. ప్రేమతోనే సాధ్యం ఒక ఎద్దును గంగిరెద్దుగా తీర్చిదిద్దడం వెనుక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. తిరుపతి కొండల్లో గురువు ప్రేమ సైగలతో శిక్షణ ఇస్తారు. డూడూ బసవన్న అంటే తల ఊపడం, కాళ్లతో తాళం వేయడం, యజమాని మాట ప్రకారం ఆశీర్వదించడం ఇవన్నీ నేర్పడానికి ఎంతో ఓర్పు ఉండాలి. ప్రతిరోజూ పెద్దరాయుడు (గంగిరెద్దు)కు స్నానం చేయించి ప్రత్యేకమైన ఆహారం అందిస్తూ కుటుంబ సభ్యులకంటే జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. పండుగ సమయంలో గతంలో బియ్యం, ధాన్యం, కాసిన్ని డబ్బులు ఇచ్చేవారు. కానీ పట్టణీకరణ పెరగడం, ప్రజల్లో ఆసక్తి తగ్గడంతో ప్రస్తుతం ఆదరణ తగ్గింది. కుటుంబ పోషణతోపాటు ఎద్దు మేతకు కూడా ఇబ్బంది అవుతోంది. ప్రభుత్వం మమ్ముల్ని కళాకారులుగా గుర్తించి పింఛన్ ఇవ్వాలి. పశుపోషణకు సాయం చేస్తే ఈ కళను బతికించుకుంటాం. -
గాలిపటమా పద పద..
వరంగల్ ఎల్లంబజార్లో నిజాం కాలం నుంచి విక్రయాలుఖిలా వరంగల్: సంక్రాంతిని పురస్కరించుకొని అందరూ గాలిపటాలు ఎగురవేస్తుంటారు. ఈసారి ఈగల్, డోరేమాన్, లేడీబర్డ్, జాజ్, పందెం కోడి వంటి ఆకర్షణీయమైన పతంగులు కనువిందు చేస్తున్నాయి. నిజాం నవాబుల కాలం నుంచే వరంగల్ ఎల్లంబజార్లో పతంగులు విక్రయిస్తూ ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, గుజరాత్ నుంచి పతంగులను దిగుమతి చేసుకుంటున్నారు. 2017 నుంచి చైనా మాంజా విక్రయాలపై నిషేధం.. 2016లో జాతీయ ట్రిబ్యునల్ తీర్పుతో 2017 నుంచి చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై ప్రభుత్వాలు నిషేధం విధించాయి. అయినా కొందరు వ్యాపారులు దొంగచాటున విక్రయిస్తున్నారు. పోలీసులు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి మాంజాను స్వాధీనం చేసుకొని విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. నిజాం కాలం నుంచి అమ్ముతున్నాం.. వరంగల్ ఎల్లంబజార్లో నివాసం ఉంటాం. తాత ముత్తాతలు పతంగుల వ్యాపారం చేసేవారు. వంశపారంపర్యంగా నిజాం కాలం నుంచి పతంగులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నాం. మా ఇద్దరు కుమారులు సైతం ఇదే వ్యాపారం చేస్తున్నారు. 30 రోజులు మాత్రమే సీజన్ ఉంటుంది. –చౌహాన్ సూరాజ్, వ్యాపారి, ఎల్లంబజార్, వరంగల్మా షాపునకు వందేళ్ల చరిత్ర.. సురాజ్ మాల్కు వందేళ్ల చరిత్ర ఉంది. ఈ షాపును నమ్ముకొని నా ఇద్దరు కుమారులు జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన యువత ఇక్కడి నుంచి హోల్సేల్, రిటైల్గా కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. –చౌహాన్చంద్, వ్యాపారి పెద్దల పర్యవేక్షణలోనే ఎగురవేయాలి. నాణ్యమైన గాలిపటాలు కొనుగోలు చేసి కాటన్ దారాలు మాత్రమే వాడాలి. చైనా, ఇతర మాంజాలు వాడొద్దు.భవనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగురవేయొద్దు. జనావాసాలకు దూరంగా విశాలమైన మైదాన ప్రదేశంలోనే ఎగురవేయాలి. పైకి చూస్తే భవనంపై నుంచి కింద పడే ప్రమాదం ఉంది. పతంగులు విద్యుత్ తీగలు, స్తంభాలకు చిక్కినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కర్రలు, ఇనుప చువ్వలతో తీసే ప్రయత్నం చేయొద్దు. -
వైద్యశిబిరాల ఏర్పాటు పనులు పూర్తిచేయాలి
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతరకు ముందస్తుగా వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటు చేయనున్న 10 ఉచిత వైద్య శిబిరాలు, క్యాంపుల ఏర్పాటుకు త్వరగా పనులు పూర్తి చేయాలని మేడారం మహాజాతర ఉప సమన్వయ అధికారి, హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అప్పయ్య అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మేడారంలో పర్యటించి ఉచిత వైద్య శిబిరాలు చేసే స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ స్థలాల చదును, టెంట్ల ఏర్పాటు పనులు త్వరగా చేయాలన్నారు. అలాగే టీం సభ్యులు సరిపడా మందులు సమకూర్చుకోవాలని సూచించారు. అనంతరం టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సందర్శించి శిబిరానికి వస్తున్న రోగుల వివరాలు, రిఫరల్ కేసులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్ కుమార్, జిల్లా ప్రోగ్రాం అధికారి పవన్కుమార్, కాటాపూర్ పీహెచ్సీ వైద్యాధికారి రంజిత్, డెమో సంపత్, ఏఎంఓ దుర్గారావు, ఆరోగ్య విస్తరణ అధికారి సమ్మయ్య, సీనియర్ అసిస్టెంట్ గణేశ్, డీపీఎంఓ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.మహాజాతర ఉప సమన్వయ అధికారి అప్పయ్య -
లక్ష్మీదేవరకు బోనమెత్తిన భక్త జనం
కాళేశ్వరం: కాళేశ్వరంలో లక్ష్మీదేవర కిష్టస్వామి కల్యాణం భక్తిశ్రద్ధలతో నాయకపోడ్ పూజారుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం కల్యాణం, బోనాల సందర్భంగా మహిళా భక్తులు బోనమెత్తారు. ఆలయం చుట్టూర డప్పు చప్పుళ్లు, శివసత్తుల ఆటపాటలు, పూనకాలతో జయజయ ధ్వానాలతో మార్మోగింది. లక్ష్మీదేవరకు పట్నంతో బోనం సమర్పించి ప్రత్యేకంగా పూజలు, మొక్కులు చెల్లించారు. దీంతో భారీగా భక్తజనం తరలి రావడంతో ఆలయ పరిసరాలు ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో పూజారులు ఇనుముల వెంకటేష్, ఇనుముల రాకేష్, పోలం లస్మయ్య, ఇనుముల రాములు, ఇనుముల కిష్టయ్య, కిరణ్ పాల్గొన్నారు. -
‘సీఎం పర్యటనను విజయవంతం చేయండి’
ములుగు రూరల్: ఈ నెల 18న మేడారం రానున్న సీఎం రేవంత్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్గౌడ్ అన్నారు. మండల పరిధిలోని మల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం మేడారం వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, నాయకులు బొక్క సత్తిరెడ్డి, వెంకన్న, వాకిడి రామకృష్ణారెడ్డి, మల్లంపల్లి సర్పంచ్ శ్యాంరావు తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్: జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్కు మండలంలోని రాయినిగూడెం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు పాఠశాలలో సోమవారం విద్యార్థులను ప్రిన్సిపాల్ ఈరులాల్ అభినందించారు. రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఈ నెల 7 వ తేదీ నుంచి 9 వరకు నిర్వహించిన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ మేరకు పాఠశాలకు చెందిన తరుణ్, మహేశ్లు హెల్త్ అండ్ హైజెనిక్ అనే అంశంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎంపికై నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఈ నెల 18న జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు జిల్లా నుంచి పాల్గొననున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బానోత్ ఈరులాల్, గైడ్ టీచర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వైభవంగా గోదాదేవికి సారె..
మంగపేట: మండలంలోని కమలాపురం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా గోదారంగనాయక మహిళా కమిటీ ఆధ్వర్యంలో గోదాదేవి అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, వంశీకుమారాచార్యులు ఉదయం గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో కమలాపురం పాతూరులోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి అమ్మవారికి పసుపు. కుంకుమ, పూలు, గాజులు, పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం, వివిధ రకాల పిండి వంటలు, పండ్లు పట్టుకుని భక్తులు సతీసమేతంగా మంగళవాయిద్యాల నడుమ ఆటోస్టాండ్, అంబేడ్కర్ సెంటర్ మీదుగా ఆలయానికి చేరుకుకున్నారు. అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు జరిపించి సారెను సమర్పించారు. అనంతరం నిర్వహించిన కుంకుమ పూజలో గోదారంగనాయక మహిళా కమిటీ, ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ పాల్గొని గోదాదేవి అనుగ్రహించి తమ కోరికెలను తీర్చాలని వేడుకుంటూ పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తుల గోత్రనామాలతో ఆలయ పూజారి ప్రత్యేక అర్చనలు జరిపించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నేడు(మంగళవారం) గోదాదేవి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పూజారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.భక్తిశ్రద్ధలతో మహిళల పూజలు -
విద్యాసంస్థల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి
ములుగు: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సోమవారం సాయంత్రం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల నిర్మాణంపై ఆయన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ దివాకర పాల్గొన్నారు. ఈ వీసీలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీల్లో ముందు వరుసలో ఉంచేందుకు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతుందన్నారు. జిల్లాల వారీగా స్కూల్స్ నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ, నిర్మాణ పనులు, తదితర అంశాలపై సమీక్షించారు. అంతకుముందు సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తగు ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాకు ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేయగా సంబంధిత పాఠశాలకు భూమిని కేటాయించినట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేయగా పనులు ప్రారంభం అయ్యాయని వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులు అదనపు కలెక్టర్ మహేందర్ జీ, మున్సిపల్ కమిషనర్ సంపత్ రావు, డీఈఓ సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు.వీసీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క -
ఓటర్లు 13,963
వార్డుల వారీగా ఓటర్ల వివరాలుమున్సిపాలిటీ తుది ఓటరు జాబితా విడుదలములుగు: మున్సిపాలిటీ అధికారులు ఎన్నికల తుది ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేసి ప్రదర్శించారు. ములుగు పట్టణంతో పాటు బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామాలను కలుపుకొని 2024 ఫిబ్రవరి 2న ములుగు మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులలో 13,963 మంది ఓటర్లతో జాబితాను ప్రకటించారు. ఇందులో పురుషులు 6,661 మంది, మహిళలు 7,300 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నా రు. మున్సిపాలిటీగా ఆవిర్భవించిన ములుగులో తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీలో 20 వార్డులు ములుగు మున్సిపాలిటీలో ఓటర్ల లెక్క తేలింది. ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. జనవరి 20వ తేదీ లోగా నోటిఫికేషన్ రానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకోసం మున్సిపాలిటీల పరంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో సోమవారం తుది ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. ములుగు పట్టణంలో 20 వార్డులకు గాను 20 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. జనవరి 1న అధికారులు 14,112 మందితో ఓటర్ల జాబితాను ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించారు. అభ్యంతరాల పరిష్కారం తర్వాత 149 ఓటర్లను తొలగించి 13,963 మందితో తుది జాబితా విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 18 వేల జనాభా ఉండగా 1,844 మంది ఎస్టీలు, 2,470 మంది ఎస్సీలు ఉండగా మిగిలిన జనాభాలో బీసీ, ఓసీలు ఉన్నారు.వార్డు పురుషులు మహిళలు ఇతరులు 1 321 350 0 2 333 404 1 3 342 410 0 4 380 393 0 5 299 355 0 6 315 312 0 7 371 364 0 8 355 342 0 9 329 366 0 10 350 395 1 11 344 367 0 12 381 409 0 13 326 362 0 14 354 402 0 15 380 379 0 16 291 325 0 17 312 317 0 18 293 345 0 19 277 337 0 20 308 366 0 పురుషులు 6,661.. మహిళలు 7,300 తొలిసారిగా ములుగు మున్సిపాలిటీలో ఎన్నికలు రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠచైర్మన్ పీఠంపై పార్టీల నజర్ ములుగు మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరగనుండడంతో చైర్మన్ పదవిని కై వసం చేసుకునేందుకు అధికార పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీలు సన్నద్ధమవుతున్నాయి. ములుగు నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ కావడంతో చైర్మన్ పదవి ఎస్టీ రిజర్వేషన్ వస్తుందా.. లేదా జనాభా ఆధారంగా ఎస్సీ, బీసీలకు కేటాయిస్తారా అని ఉత్కంఠతో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు అధికార పార్టీ సిద్ధమవుతుండగా, పట్టణంలో ఎలాగైన తమ పార్టీ జెండాను ఎగురవేసేందుకు బీఆర్ఎస్, బీజేపీలు సన్నద్ధమవుతున్నాయి. -
రామప్ప హుండీ ఆదాయం రూ.6,71,954
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయ హుండీ కానుకలను సోమవారం లెక్కించగా రూ.6,71,954ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ తెలిపారు. దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ కుమారస్వామి సమక్షంలో హుండీ కానుకలను శ్రీవల్లి సేవా సమితి సభ్యులు లెక్కించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గిరిబాబు, సర్పంచ్ చల్లగోండ రాజు, రామప్ప ఆలయ ప్రధాన పూజారి హరీశ్ శర్మ, అర్చకుడు ఉమాశంకర్, టూరిజం గైడ్లు విజయ్కుమార్, వెంకటేశ్లు పాల్గొన్నారు. ములుగు రూరల్: విద్యుత్ వినియోగదారులు ఉచిత విద్యుత్ను సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్శాఖ ఎస్ఈ ఆనందం అన్నారు. ఈ మేరకు సోమవారం ఉచిత విద్యుత్ వినియోగదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తుందని తెలిపారు. వ్యవసాయ రైతులకు సైతం ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. జిల్లాలో గృహజ్యోతి పథకంలో 40,855 మంది, వ్యవసాయ విద్యుత్ వినియోగంలో 25,427 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈ నాగేశ్వర్రావు, ఏఈ రవి, లైన్ ఇన్స్పెక్టర్లు జహీర్ తదితరులు పాల్గొన్నారు. వాజేడు: అడవుల సంరక్షణ అందరి బాధ్యతని ఎఫ్ఎస్ఓలు నాగమణి, భిక్షపతి అన్నారు. ఈ మేరకు సోమవారం మండల పరిధిలోని పూసూరు, కృష్ణాపురం గ్రామాల్లో సోమవారం అడవులతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అడవులతో మానవాళికి ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. అడవులకు నిప్పు పెడితే చెట్లతో పాటు జంతువులు మృత్యువాత పడుతాయని తెలిపారు. అనంతరం యువకులకు వాలీబాల్ పోటీలను నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి పూసూరు, కృష్ణాపురం సర్పంచ్లు దబ్బగట్ల సుమన్, పూనెం విజయ్బాబులు బహుమతులు ప్రదానం చేశారు. ములుగు: జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వయోవృద్ధుల కొరకు ఏర్పాటు చేసిన ప్రణమ్ డే కేర్ సెంటర్ను సీఎం రేవంత్రెడ్డి సోమవారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి తుల రవి, ములుగు రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ వైస్ చైర్మన్ శ్రీనివాస్, కోశాధికారి సతీష్, కార్యదర్శి రమేష్, నాగరాజు, జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మూర్తి, ఉపాధ్యక్షుడు ఐలయ్యలు రిబ్బన్ కట్ చేసి కేర్ సెంటర్ను ప్రారంభించారు. ఈ డే కేర్ సెంటర్ వయోవృద్ధుల ఉల్లాసానికి, క్రీడా కార్యక్రమాలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఇన్చార్జ్ నాగేంద్ర, ఎఫ్ఆర్ఓ గణేశ్ తదితరులు పాల్గొన్నారు. రేపు గోదారంగనాయకస్వామి కల్యాణం కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రేపు ఉదయం 10 గంటలకు శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. -
పరిశుభ్రతే లక్ష్యం
సేకరించిన చెత్తను ట్రాక్టర్లో వేస్తున్న కార్మికులు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా అధికారులు ప్రణాళికతో తగిన చర్యలు చేపడుతున్నారు. ఈ సారి మహాజాతరకు 3 కోట్ల మంది భక్తులు తరలివస్తారనే అధికారుల అంచనాతో జిల్లా పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో జాతరలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. మహాజాతర సమయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా మేడారం ప్రాంతంలో 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి దింపనున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్మికులు 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో పని చేస్తూ రోడ్లు, జంపన్నవాగు, ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచనున్నట్లు చెబుతున్నారు. జాతరకు 20 మంది డీపీఓలు మేడారం మహాజాతరలో జిల్లా పంచాయతీశాఖ ఆధ్వర్యంలో విధుల నిర్వహణకు భారీ సంఖ్యలో అధికారులను, సిబ్బందిని నియమించనున్నారు. డీపీఓలు 20 మంది, డీఎల్పీఓలు 40 మంది, ఎంపీఓలు 120 మంది, పంచాయతీ కార్యదర్శులు 500 మందిని జాతరలో పారిశుద్ధ్య పనుల విధుల నిర్వహణకు నియమించనున్నట్లు డీపీఓ వెంకయ్య తెలిపారు. ముందస్తు జాతరలో చెత్త సేకరణ, శుభ్రత నిర్వహణ, దుమ్ము ధూళి సమస్యలు తలెత్తకుండా ముందస్తు పారిశుద్ధ్య చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మేడారంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన జాకెట్లు, మాస్కులు వంటి రక్షణ సామగ్రిని అందించేందుకు 9 మంది ఎంపీఓలు, 150 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.మేడారం మహాజాతరలో పారిశుద్ధ్య నిర్వహణకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశాం. భక్తులకు పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. గత జాతర కంటే ఈ సారి జాతరలో వెయ్యిమంది కార్మికుల సంఖ్యను పెంచాం. మంత్రి ధనసరి సీతక్క ఆదేశాల మేరకు, కలెక్టర్ దివాకర సూచనలు, సలహాల మేరకు జాతరలో ఎక్కడ కూడా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. జాతరలో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పడేయకుండా భక్తులు సహకరించాలి. – కొండ వెంకయ్య, డీపీఓ●ఈ సారి జాతరలో పారిశుద్ధ్య పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆధునిక యంత్రాలను వినియోగించనున్నారు. 150 ట్రాక్టర్లు, 5 వేల జాకెట్లు, 1.50 లక్షల మాస్కుల కొనుగోలు, 18 స్వీపింగ్ యంత్రాలు, 50 స్వచ్ఛ ఆటోలు, 20 బాబ్ క్యాట్లు, 20 జేసీబీలు, 40 డోజర్లు, 10 వ్యాక్యూమ్ క్లీన్ యంత్రాలు, 50 వాటర్ ట్యాంకులు, మహిళల కోసం 13 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖల నుంచి సమకూర్చనున్నట్లు అధికారులు తెలిపారు. మేడారం జాతరలో పారిశుద్ధ్య వ్యవస్థను బలోపేతం చేయడం ప్రజారోగ్య పరిరక్షణతో పాటు జాతర గౌరవాన్ని మరింత పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. మూడు షిఫ్టుల్లో పనులు క్లీనింగ్కు భారీగా యంత్రాలు -
జేబు దొంగల హెచ్చరిక
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరలో జేబు దొంగలున్నారు..జాగ్రత్త చేతివాటం ప్రదర్శించే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మేడారంలోని నార్లాపూర్ పీఎస్ పోలీసులు గత జాతరలో జేబు దొంగతనాలకు పాల్పడిన వారి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ బ్యానర్ను సోమవారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. భక్తులు నగదు, మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువులు జాగ్రతగా ఉంచుకోవాలని అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచనలు చేస్తున్నారు. -
మేడారంలో భక్తుల సందడి
ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తల్లులకు ఎత్తు బంగారం సమర్పించారు. చీర, సారె సమర్పించి తల్లులకు మొక్కులు చెల్లించారు. భక్తజనంతో మేడారం పరిసరాలు కిక్కిరిసి కనిపించాయి. కాగా, ఆదివారం ఒక్క రోజే సుమారు 5 లక్షల మంది తల్లులను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. – ఎస్ఎస్ తాడ్వాయి -
ఒకేసారి 8వేల మంది భక్తుల దర్శనం
సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026ములుగు/ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో ఒకేసారి 8వేల మంది భక్తులు దర్శనం చేసుకునేలా మాస్టర్ప్లాన్ రూపొందించినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జాతర పనుల పురోగతిపై ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలోని హరిత హోటల్లో ఆదివారం ఆయన అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్ దివాకర టీఎస్ తొలుత జాతర పనుల వివరాలను మంత్రులకు వివరించారు. ఈ నెల 15వ తేదీలోపు పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. స్వల్పంగా ఉన్న ఆర్అండ్బీ శాఖ పనులు గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మేడారానికి రానున్నారని, ఇక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారానికి ఆదివారం ప్రతి గంటకు సగటున వెయ్యి వాహనాలు చేరుకున్నాయని తెలిపారు. దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్లడించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ జాతర సమయంలో తొక్కిసలాట వంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్ని శాఖల అధికారులతో పనుల పురోగతిని విడివిడిగా అడిగి తెలుసుకున్నారు. జాతర క్యూలైన్లకు సంబంధించిన పనుల పురోగతిని పంచాయతీ రాజ్ ఈఈ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ల్యాండ్ స్కేపింగ్ పనుల గురించి జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ వివరించారు. రవాణా ఏర్పాట్లపై ఆర్టీసీ డీఎం వివరాలు అందజేశారు. జాతర కోసం మొత్తం 3,600 బస్సులను 51 పాయింట్ల నుంచి నడుపుతున్నామని ఆయన తెలిపారు. గద్దెల సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశామని డీఎంహెచ్ఓ వివరించారు. జాతర విధులకు మొత్తం 13 వేల మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ వెల్లడించారు. మంత్రి సురేఖ, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఫైనాన్ ్స సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీశ్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు. 18న మేడారానికి సీఎం రేవంత్రెడ్డి రాక.. కేబినెట్ సమావేశం అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క -
పుస్తకావిష్కరణ
ఎస్ఎస్తాడ్వాయి: సమ్మక్క –దీ గ్లోరీ ఆఫ్ మేడారం పుస్తకాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క ఆవిష్కరించారు. సమాచార పౌర సంబంధాలశాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెంటి వెంకటరమణ రచించిన పుస్తకాన్ని మేడారంలో మంత్రి సీతక్క కలెక్టర్ దివాకరతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం జాతర విశిష్టతను ఆదివాసీ సంస్కృతి– సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ పుస్తకాన్ని రూపొందించారని సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, డీపీఆర్వో రఫీక్ పాల్గొన్నారు. చిన్నారి తల్లిదండ్రులకు అప్పగింత అదే విధంగా మేడారంలో జాతర ఏర్పాట్లను మంత్రి పర్యవేక్షిస్తున్న సమయంలో ఓ చిన్నారి తప్పిపోయిన విషయాన్ని సీతక్క గమనించారు. వెంటనే అధికారులు ఆ చిన్నారి వివరాలు సేకరించి తల్లిదండ్రులను గుర్తించగా వారికి అప్పగించారు. జాతరలో చిన్నపిల్లలను జాగ్రతగా చూసుకోవాలని మంత్రి సీతక్క తల్లిదండ్రులకు సూచించారు. మేడారంలో భక్తులు, పిల్లలు తప్పిపోతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. -
సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
వెంకటాపురం(ఎం): ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతర ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో మేడారం తరలివచ్చి సీఎం రేవంత్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోత్ రవిచందర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పీవీ కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మండలం నుంచి ప్రతీ కార్యకర్త హాజరయ్యేలా సంబంధిత నాయకులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి అయిలయ్య, పంచాయతీ రాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్రెడ్డి, నాయకులు బండి శ్రీనివాస్, పోశాలు, రేవంత్, కోటి, తదితరులు పాల్గొన్నారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ -
ఘనంగా వడ్డె ఓబన్న జయంతి
ములుగు రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించగా వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఓబన్న చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. సాయుధ పోరాట సైనాధ్యక్షుడిగా వీరోచిత పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ప్రభుత్వం ఓబన్నకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దండుగుల మల్లయ్య, సారంగపాణి, నర్సయ్య, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. ‘నాయీబ్రాహ్మణులకు గుర్తింపు కార్డులివ్వాలి’ ములుగు రూరల్: మేడారం జాతరలో నాయీబ్రాహ్మణులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కల్యాణ కట్టల అధ్యక్షుడు అన్నం మోహన్కుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతరలో నాయీబ్రాహ్మణులకు న్యాయం జరిగేలా చూ డాలన్నారు. వృత్తిదారులు ఆధార్, కుల ధ్రువీ కరణ సర్టిఫికెట్ల ఆధారంగా గుర్తించి ఉచిత వసతి, భోజనం సౌకర్యం కల్పించాలన్నారు. జాతర ఆదాయంలో ఎక్కువశాతం కేశఖండన ద్వారానే సమకూరుతుందని తలనీలాలతో వచ్చే ఆదాయంలో నాయీబ్రాహ్మణులకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాతర ట్రస్టు బోర్డులో సైతం అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. రేగొండ: మండలంలోని కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా నేడు (సోమవారం) స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మహేష్, చైర్మన్ ముల్కనూరి భిక్షపతి తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 19న సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగే దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీలో నిర్వహించిన జీపు జాతలో పాల్గొని మాట్లాడారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, సకల జనులను చైతన్యం చేయడం కోసం జీపు జాత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మిక నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బందు సాయిలు, నాయకులు రజినీకాంత్, శ్రీకాంత్, దేవేందర్, ప్రీతి, నవీన్, క్రాంతి, రవికమార్, రాజేందర్ పాల్గొన్నారు. -
హేమాచలక్షేత్రంలో సండే సందడి
ప్రత్యేక అలంకరణలో హేమాచలుడు, స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుంటున్న భక్తులు మంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రితో పాటు తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొని స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్
మల్హర్: తాడిచర్ల ఓపెన్కాస్ట్–2 ప్రాజెక్ట్ ఏర్పాటుకు మండలంలోని మల్లారం (దుబ్బపేట) కస్తూర్భా సమీపంలోని వ్యవసాయ భూముల్లో జీహెచ్ఐ కంపెనీ బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్ చేస్తుంది. జీహెచ్ఐ కంపెనీ ప్రతినిధులు సదరు వ్యవసాయ భూమిలో ఇప్పటికే 450 మీటర్ల లోతులో డ్రిలింగ్ చేపట్టారు. మరో 200 నుంచి 300 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేస్తే బొగ్గు నాణ్యతను గుర్తించవచ్చని అంటున్నారు. ఇప్పటికే పెద్దతూండ్ల కిషన్రావుపల్లిలో, తాడిచర్ల శివారులోని పెద్దతూండ్ల ఆరెవాగు వంతెన సమీపంలో డ్రిల్లింగ్ వేశారు. భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్ష కేంద్రాన్ని ఆదివారం జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ పరీక్షకు 159 మందికి గాను 113 మంది హాజరు కాగా 46 మంది గైర్హాజరయ్యారు. డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ పరీక్షకు 50 మంది విద్యార్థులకు 46 మంది హాజరుకాగా నలుగురు గైర్హాజరైనట్లు డీఈఓ తెలిపారు. -
ప్రగతిపథాన నిలుపుతాం..
యువత సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను. నేను బీఎస్సీ చదవాను. రాజకీయాల్లోకి వచ్చి గ్రామాన్ని బాగు చేయాలనే ఆలోచనతో వచ్చి సర్పంచ్ అయ్యాను. గ్రామంలోని యువతరం సహకారం తీసుకుని ప్రజల సమస్యలను పరిష్కరిస్తాను. రోడ్లు, తాగునీరు, విద్య, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాను. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూస్తాను. – బోదెబోయిన భరత్ కుమార్, గుమ్మడి దొడ్డి గ్రామ సర్పంచ్నేను ఇంటర్మీడియట్ చదివాను.26ఏళ్లకే సర్పంచ్ అయ్యాను. గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకున్నాను. తొలుత గ్రామంలోని ప్రధాన సమస్యలపై దృషిసారించి ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్లాన్తో ముందుకు వెళ్తాను. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటున్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గ్రామాభివృద్ధికి పాటుపడుతాను. – రాందేని నర్సింహామూర్తి రాజు, షాపెల్లి సర్పంచ్ -
4.30 ఎకరాలు.. 2,732 మొక్కలు
ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉద్యాన పంటల సాగుఏటూరునాగారం: ఏడేళ్లుగా పడావుపడిన భూమిని ఐటీడీఏ అధికారులు సాగులోకి తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆ భూమి అసాంఘిక శక్తులకు, అక్రమార్కులకు అడ్డాగా మారింది. ఈ క్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా స్పందించి ఏటూరునాగా రం మండల కేంద్రంలోని ఉద్యాన నర్సరీ(గార్డెన్) స్థలంలో పండ్లు, పూల మొక్కల సాగుకు శ్రీకారం చుట్టారు. ఐటీడీఏ ద్వారా బడ్జెట్ను కేటాయించి నర్సరీలో బోరు నిర్మాణ చేపట్టారు. అదే విధంగా రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాంతాల నుంచి అనేక రకాల మొక్కలను తెప్పించారు. అనునిత్యం మొక్కల పర్యవేక్షణ ఐటీడీఏకు చెందిన 4.30 ఎకరాల్లో గార్డెన్లో 2 వేల మల్లె మొక్కలు, 116 నిమ్మ, 116 సపోట, 250 టేకు మొక్కలను ఇటీవల ఐటీడీఏ ఏపీఓ వసంతరావు చేతుల మీదుగా మొక్కలను నాటించే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే 250 కొబ్బరి మొక్కలు నాటే పనులతో పాటు డ్రిప్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ మొక్కలను పెంచేందుకు ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేశారు. నిత్యం పర్యవేక్షణతో పాటు దిగుబడి వచ్చిన తర్వాత మార్కెట్, హాస్టళ్లలో సరఫరా చేసే విధంగా పక్కా ప్లాన్ చేశారు. వీటికి ఖర్చును ఐటీడీఏ ద్వారా బడ్జెట్ కేటాయించారు. అలాగే వెదురు మొక్కలను మాత్రం ఉపాధి హామీ పథకం ద్వారా నాటించేలా చర్యలు తీసుకున్నారు. వెదురు మొక్కల సాగు వల్ల వచ్చే ఆర్థిక ఫలాలను ఐటీడీఏకు అందజేయనున్నారు. ఇప్పటికే మల్లె, సపోట, టేకు, నిమ్మ మొక్కలు నాటే పనులు పూర్తయ్యాయి. వెదురు ప్లాంటేషన్ పనులు సాగుతున్నాయి. రెండేళ్లలోపు దిగుబడి తీసి ఫలాలను హాస్టళ్లకు సరఫరా చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. గతంలో గిరిజనులకు ఈ స్థలాన్ని లీజ్కు ఇచ్చి కూరగాయల పంటలను దిగుబడి చేసి ఆర్థిక ఫలాలు వచ్చేవిధంగా చేశారు. అయితే ఆ సమయంలో ఏడాది పాటు సాగు జరిగింది. తర్వాత లాభాలు రావడం లేదని గిరిజన మహిళా సంఘం ఉపసంహరించుకున్నారు. దాంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భూమిలో ఎలాంటి సాగు జరగలేదు. అనేక మార్లు సాక్షి కథనాలు ప్రచురించింది. పడావుపడిన భూముల్లో అసాంఘిక శక్తులు, భూమి కబ్జా విషయాలపై అధికారులకు కళ్లు తెరిచేలా కథనాలు రావడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించి స్వయంగా పంటల సాగుకు చర్యలు చేపట్టారు. పీఓ చిత్రామిశ్రా చొరవతో సాగులోకి భూమి బడ్జెట్ కేటాయింపు.. బోరు నిర్మాణం -
జాతరలో మెరుగైన వైద్యసేవలు
ములుగు రూరల్ : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యశాఖ ఆధ్వర్యంలో సిద్ధమయ్యారు. గత జాతర అనుభవాల దృష్ట్యా భక్తులకు వైద్య సేవలు కల్పించేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు. భక్తులకు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైతే యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సేవలు అందించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. అమ్మవారి గద్దెలు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలలో ముందస్తుగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా వైద్యశిబిరాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ములుగు జనరల్ ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా వసతుల కల్పన చేపట్టారు. టీటీడీ కల్యాణ మండపంలో ప్రధాన ఆస్పత్రి మేడారం గద్దెల పరిసరాల్లోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల ప్రధాన ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. దీంతో పాటు జంపన్నవాగు, ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఆరు పడకల సామర్థ్యంతో రెండు మినీ ఆస్పత్రులు, జాతర పరిసరాల్లో 30 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అత్యవసర చికిత్స, గుండెపోటు, ప్రమాదాలు జరిగిన సమయంలో గోల్డెన్ అవర్లో చికిత్స అందించేందుకు వీలుగా 35 అంబులెన్స్లను సిద్ధం చేశారు. 8 రూట్లలో 42 రూట్ క్యాంపులు 8 ప్రధాన రహదారుల్లో భక్తులకు సేవలు అందించేందుకు 42 రూట్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. హనుమకొండ నుంచి మేడారం రూట్లో 9 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే రూట్లో ఆరు, భద్రాచలం రూట్లో ఐదు క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. 3,199మంది వైద్య సిబ్బంది ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాకు చెందిన 3,199 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఇందులో 72 మంది స్పెషలిస్టులు, 42 మంది మహిళా వైద్యులు, 544 మంది వైద్యులు విధులు నిర్వహించడంతో పాటు 2,150 మంది పారా మెడికల్ సిబ్బంది, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు వైద్యసేవలు అందించనున్నారు. జనవరి 25 నుంచి పూర్తిస్థాయిలో.. జనవరి 25వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో వైద్య శిబిరాలు ప్రాంభించనున్నారు. శిబిరాల్లో 248 రకాల మందులు, సర్జికల్ సామగ్రిని ముందస్తుగా సిద్ధం చేసుకున్నారు. ప్రణాళికా బద్ధంగా వైద్య సేవలు అందించడంలో సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ ఉండనుంది. మేడారంలో 3 ఆస్పత్రులు, 30 మెడికల్ క్యాంపులు 42 రూట్ క్యాంపులు, 35 అంబులెన్స్లు విధులు నిర్వహించనున్న 3,199 మంది సిబ్బంది -
వామ్మో డేంజర్..
మల్హర్ మండలం కొయ్యూరు నాగులమ్మ సమీపంలో బొగ్గుల వాగు వంతెన ప్రమాదకరంగా ఉంది. వంతెన సైడ్ వాల్ను గతంలో లారీ ఢీకొట్టడంతో వాల్ సగభాగం కూలిపోయింది. వంతెన మీదుగా మంథని–కాటారం ప్రాంతాలకు నిత్యం వేలాది వాహనాలు వెళ్తుంటాయి. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 28న నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో రద్దీ పెరగనుంది. జిల్లా అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న వంతెనకు సైడ్ వాల్ నిర్మించాలని పలువురు కోరుతున్నారు. – మల్హర్ -
ఖాకీల కారుణ్యం!
● ఇటీవల మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు డయల్ 100కు కాల్ వచ్చింది. మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఉస్మాన్, కానిస్టేబుల్ నరేశ్ వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి ప్రాణాలు కాపాడారు. ● ఇటీవల నర్సంపేటకు చెందిన ఓ యువతి ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. బస్టాండ్ వద్ద అనుమానం వచ్చి ఆ విషయాన్ని పసిగట్టిన బ్లూకోల్ట్స్ సిబ్బంది ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన కౌన్సెలింగ్ ఇచ్చి జీవితం గొప్పదనాన్ని తెలిపి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ● రాయికల్కు చెందిన ఓ యువతిని సైతం బ్లూకోల్ట్స్ సిబ్బంది కాపాడి కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ● కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధి వడ్డేపల్లి చెరువు కట్టపై ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు సకాలంలో స్పందించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ● తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురైన ఓ యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లోంచి వెళ్లి ఆత్మహత్యకు యత్నిస్తుండగా హనుమకొండ పోలీసులు కాపాడారు. ● ధర్మసాగర్కు చెందిన పల్లెపు శ్రీనివాస్ మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయోధ్యపురం రైల్వే ట్రాక్పై పడుకుని ఆత్మహత్యకు యత్నించాడు. రైల్వే కీమెన్ వేణు, సహకారంతో పోలీసులు అతడి ప్రాణాలు కాపాడారు. ● ఈనెల 5న (గత సోమవారం) గౌసియాబేగం అనే మహిళ తన మూడేళ్ల పాపతో మండిబజార్ ఏరియాలో నడిచి వెళ్తుండగా లోబీపీతో పడిపోయింది. అక్కడే విధుల్లో ఉన్న ఇంతేజార్గంజ్ ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి మహిళను పోలీస్ వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ప్రకృతి వైపరీత్యాలైనా. సభలు, సమావేశాలైనా.. పండుగైనా పబ్బమైనా మీ రక్షణ కోసమే మేమున్నాం అంటున్నారు పోలీసులు. ఆపత్కాలంలో ముందు వరుసలో నిలబడి సేవలందిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నడవ లేని వృద్ధులను ఎత్తుకొని పోలింగ్ బూత్లకు తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లాలో భారీగా కురిసిన వర్షాలకు వరదలు ముంచెత్తి ఇళ్లలో చిక్కుకున్న వృద్ధులను, పిల్లలను కాపాడారు. విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది.. ఆత్మహత్య వైపు అడుగులు వేస్తున్న ఎంతో మందిని కాపాడి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. పోలీస్ వాహనంలో తరలించి.. ప్రాణాలు నిలబెట్టి మడికొండ పోలీస్ స్టేషన్ ఎదుట డివైడర్ను బైక్ ఢీకొట్టిన ఘటనలో యువకులు సాయిరాం, ఆకుల శశాంక్కు తీవ్ర రక్తస్రావమైంది. రోడ్డుపై పడి కొట్టుకుంటుండగా ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ తన వాహనంలో బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకులను చూసి స్థానికులెవ్వరూ ముందుకు రాలేదు. పోలీసులు చేసిన ఆ సేవ సోషల్ మీడియాలో వైరలైంది. ఆత్మహత్యలను అడ్డుకుంటూ.. ప్రాణాలను నిలబెడుతూమిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయకుడి నిమజ్జనం సమయంలో ఉర్సుగుట్టకు నిమజ్జనానికి వచ్చిన ఓ యువకుడు ట్రాక్టర్లో చేతులు కాళ్లు కొట్టుకుంటూ నురుగులు కక్కాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై శ్రవణ్, కానిస్టేబుల్ చందు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగింత విపత్తులు, ప్రమాదాల సమయంలోనూ మేమున్నామంటూ.. ఆపద్బాంధవులుగా.. ఓరుగల్లు పోలీసులు వీరి సేవలకు సలాం అంటున్న ప్రజలు పసిగట్టి.. ప్రాణాలు కాపాడి -
హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట : మండలంలోని మల్లూరు హేమాచల క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్ష్మీనర్సింహ స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు చేసి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామి వారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. భక్తుల గోత్రనామాలతో అర్చకులు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేదాశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడిగా మారింది. -
వనదేవతలకు మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలో కొలువైన సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జంపన్న వాగులో షవర్ల కింద స్నానాలు ఆచరించి, వనదేవతల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు మేడారం అటవీ ప్రాంతంలో చెట్ల కింద వంటావార్పు చేసుకుని కుటుంబ సమేతంగా భోజనలు చేశారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. -
గట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
ములుగు రూరల్ : ఆది దేవత గట్టమ్మ తల్లిని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్ దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం మేడారంలోని సమ్మక్క–సారలమ్మల దర్శనానికి కుటుంబ సమేతంగా బయలుదేరిన ఆయన మొదటి మొక్కులు గట్టమ్మ తల్లికి చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్ మాట్లాడుతూ.. ప్రకృతి ఒడిలో కొలువైన గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మైదాన ప్రాంతాల్లోనే గాలిపటాలు ఎగురవేయాలి ములుగు రూరల్ : మైదాన ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేయాలని, విద్యుత్ వాహకం కలిగిన చైనా మాంజాను వినియోగించకూడదని విద్యుత్ శాఖ ఎస్ఈ ఆనందం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్లకు దూరంగా.. సురక్షితంగా సంక్రాంతి సంబురాలు నిర్వహించుకోవాలని ఆయన వివరించారు. గాలిపటాలు ఎగురవేయడం సాంప్రదాయంగా వస్తోందని, అలాంటి సమయాల్లో విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో గాలిపటాలు ఎగురవేయకూడదని సూచించారు. ఎలాంటి ప్రమాదాలు సంభవించిన 1912 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. హేమాచలుడి వరపూజకు ఆహ్వానం మంగపేట : మల్లూరు హేమాచల క్షేత్రంలో ఈనెల 15న మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించనున్న లక్ష్మీనర్సింహస్వామి వరపూజ మహోత్సవం (పెళ్లిచూపులు) కార్యక్రమానికి రావాలని ఈఓ రేవెల్లి మహేష్, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అర్చకులకు ఆహ్వాన పత్రికను శనివారం అందజేశారు. ప్రతి ఏటా హేమాచల లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వరపూజ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. కార్యక్రమంలో అర్చకులు కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, సిబ్బంది శేషు, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో పూజలు చేశారు. సెలవు రోజు కావడంతో విద్యార్థులు, ప్రజలు పెద్దఎత్తున వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకొని కోటగుళ్ల శిల్ప సంపదను తిలకించారు. ఎలుగుబంటి వేషంతో కోతులు పరార్ చిట్యాల : చిట్యాల మండలం ఏలేటి రామయ్యపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు పంటలను కోతులు నష్టపరుస్తున్నాయి. ఇంట్లోకి కూడా వచ్చి అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కోతుల బాధనుంచి ఉపశమనం కోసం రైతు శనివారం ఎలుగుబంటి వేషం వేసి కోతులను తరిమి కొట్టాడు. దీంతో కోతులు అక్కడినుంచి పారిపోయాయి. రైతు వేషాన్ని చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. -
భక్తులకు ఇబ్బంది కలగొద్దు
● మంత్రి సీతక్కములుగు రూరల్ : మేడారం మహాజాతరకు రానున్న భక్తులకు రవాణా అంతరాయం కలగకుండా బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. శనివారం మల్లంపల్లి కెనాల్పై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మేడారం జాతకు వచ్చే భక్తులకు మల్లంపల్లి బ్రిడ్జి అత్యంత కీలకమని, జాతర ప్రారంభానికి ముందే బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా చూసుకో వాలని, తాత్కాలిక రోడ్డు, భద్రత ఏర్పాట్లు చే యాలని వివరించారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. మార్కెట్ కమిటీ చైర్ పర్స న్ రేగ కల్యాణి, ఆత్మ చైర్మన్ కొండం రవీంద ర్రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జాతర ఏర్పాట్ల పర్యవేక్షణ ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో మహాజాతర ఏర్పాట్లను మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. శనివారం రాత్రి వరకు జాతర పనుల పురోగతిని సమీక్షించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ అధికారులు, పోలీసు సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి శాఖల మధ్య సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. జాతర విధుల్లో ఉన్న పోలీసులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆమె సూచించారు. కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, పీఓ చిత్రామిశ్రా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలి ములుగు: మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. 20 వార్డులను గెలిచి ములుగు గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగుర వేయాలన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన ఆ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించగా సీతక్క హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కష్టపడిన ప్రతీ కార్యకర్తకి పార్టీ పరంగా గుర్తింపు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనను జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి సీఎం విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ బానోత్ రవిచందర్, పీసీసీ కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, నాయకులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, భగవాన్ రెడ్డి, వంగ రవియాదవ్, మామిడిశెట్టి కోటి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తులతో రామప్ప కళకళ
వెంకటాపురం(ఎం) : మేడారం భక్తులతో రామప్ప ఆలయం కళకళ లాడుతోంది. సమ్మక్క–సారలమ్మల దర్శనానికి వెళ్లే భక్తులు రామప్ప ఆలయాన్ని చూసేందుకు వస్తుండడంతో రామప్ప కిక్కిరిసిపోతుంది. దీంతో పూజారులు గర్భగుడిలోకి భక్తులను అనుమతించకుండా ప్రదానం ద్వారం వద్దనే తీర్థప్రసాదాలు అందించి పంపిస్తున్నారు. వీకెండ్ కావడంతో శనివారం వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. రామప్ప గార్డెన్లో ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. రామప్ప సరస్సు వద్దకు వెళ్లి బోటింగ్ చేశారు. రామప్పను సందర్శించిన మహబూబాబాద్ జిల్లా జడ్జి మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని మహబూబాబాద్ జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ కుటుంబ సమేతంగా శనివారం సందర్శించారు. రామప్ప శిల్పకళా సంపదను గైడ్ వెంకటేష్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. శిల్పకళా సంపద బాగుందని కొనియాడారు. -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు
ఎస్ఎస్తాడ్వాయి : ఈనెల 18న సీఎం రేవంత్రెడ్డి మేడారం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. శనివారం కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా శాంతి భద్రతలు, బందోబస్తు ఏర్పాట్లు, ప్రొటోకాల్కు సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తూ ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. సీఎం పర్యటన సురక్షితంగా, క్రమబద్ధంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మేడారంలో మ్యూజియం, ఆర్టీసీ పార్కింగ్ స్థలాలు, టెంట్ సీటీ పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
నిట్లో సీఈటీఎస్బీ–26 జాతీయ సదస్సు
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లోని బయో టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో సీఈటీఎస్బీ–26 (ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ స్టక్చరల్ బయోఫిజిక్స్)పై మూ డు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నిట్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో శుక్రవారం నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. భారత ప్రభుత్వం బయోటెక్నాలజీ విభాగంలో నూతన ఆవిష్కరణలకు పరిశోధనలకుగాను అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఎస్ఐఆర్ మాజీ డీజీ, ప్రొఫెసర్ శేఖర్.సీ.మండే, బయోటెక్నాలజీ విభాగం హెడ్, ప్రొఫెసర్ బి.రామరాజు, ప్రొఫెసర్లు రాజన్ శంకర్నారాయణన్, కిరణ్కుమార్, సౌమ్య లిప్సా పాల్గొన్నారు. -
విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
వెంకటాపురం(ఎం): స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలోని 40 మంది విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థి, హైదరాబాద్ ఇంటిలిజెన్స్ ఎస్పీ దండుగూడి రమేశ్ స్టడీ మెటీరియల్ను అందించగా పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. తాను చదివిన ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూతను అందించేందుకు 40 మందికి స్టడీ మెటీరియల్ పాఠశాలకు పంపించారు. ఎంఈఓ ప్రభాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను అందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డుకాకూడదని కష్టపడకుండా ఇష్టంతో చదువుకొని చదువులో బాగా రాణించి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రాధిక, ఫరినా బేగం, పాల్గొన్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు నిర్వహించుకున్నా రు. ఈ డీఈఓగా శ్రీజ, హెచ్ఎంగా వర్షిణి, ఉపాధ్యాయులుగా జయశ్రీ, అంజలి, హేమశ్రీ, అవంతి క, హారిక, రోహిణి, శృతి, స్వాతి, అలేఖ్య, రంజిత్, ప్రత్యూష, రాకేష్, ఎల్లస్వామి, పీడీగా ప్రణయ్లు వ్యవహరించారు. -
టెట్నుంచి మినహాయింపు ఇవ్వాలి
ములుగు రూరల్ : ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శిరుప సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాఠశాల వద్ద నల్లబ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపారు. 317 జీఓ ఉత్తర్వులను సమీక్షించి ఉపాధ్యాయులకు ఉద్యోగ స్థానికతను కల్పించుట కోసం ఫిబ్రవరి 5న ఢిల్లీలో జరిగే ధర్నాకు సంఘీభావంగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. వాజేడు : సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నిబంధన పట్ల పునరాలోచన చేయాలని తెలంగాణ ఆదివాసీ టీచర్స్ ములుగు జిల్లా అధ్యక్షుడు తోలెం చిరంజీవి కోరారు. స్థానిక ఉన్నత పాఠ శాల ఆవరణలో శుక్రవారం ఎంఈఓ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఏటీఏ క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాలాజీ, జనార్ధన్, రాంబూపతి, కవిత, విష్ణుప్రియ, పీఆర్టీయూ నాయకులు ప్రభాకర్, శ్రీరంగం తదితరులున్నారు. కన్నాయిగూడెం : ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ శుక్రవారం గూర్రేవుల జెడ్పీఎస్ఎస్ ఉపాధ్యాయులు న్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. -
కోతకు గురైన రోడ్డు
మంగపేట : మండలంలోని రాజుపేట, బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్య ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డు కప్పవాగు మలుపు వద్ద ప్రమాదం పొంచి ఉంది. 2023–04 వర్షాకాలంలో అతిభారీ వ ర్షాల కారణంగా వరదలు ఏటూరునాగారం–బూ ర్గంపాడు ప్రధాన రోడ్డుపై నుంచి పారడంతో సుమారు 30 మీటర్ల వరకు రోడ్డు కోతకు గురైంది. ఏళ్లు గడుస్తున్నా ఆర్ అండ్బీ అధికారులు నేటి వ రకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో అ త్యంత ప్రమాదకరంగా తయారైంది. పగలు, ర్రాతి తేడా లేకుండా నిత్యం వందలాది ఇసుక లారీలు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల రాక పో కలతో రోడ్డు రద్దీగా ఉంటుంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో సుమారు పదికి పైగా ప్రమాదాలు చోటు చే సుకున్నాయి. ఆయా సంఘటనల్లో నలుగురికి పైగా మృతి చెందగా పది మందికి పైగా తీవ్రంగా గాయపడి నడవలేని స్థితిలో న్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు మంచానికి పరిమితం కావడంతో వారిపై ఆధార పడిన కుటుంబాల పరిస్థితి అ త్యంత దయనీయంగా మారిందన్నారు. ఏడాది కోసారి రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తూ నీతులు వల్లించకుండా ప్రమాదకరంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరుగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి మేడారం జారతకు వెళ్లే వచ్చే భక్తుల వాహనాలు ఇదే రోడ్డుపై నుంచి వెళ్తుంటాయి. అధికారులు స్పందించి ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా రో డ్డు కు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పొంచి ఉన్న ప్రమాదం మరమ్మతు చేయని అధికారులు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు -
తరలివచ్చి మొక్కులు తీర్చి..
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు శుక్రవారం వేల సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవార్ల గద్దెల వద్ద భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లో వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. భక్తుల రద్దీని పోలీసు అధికారులు పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా.. మేడారంలో తల్లుల దర్శనానికి తరలివస్తున్న భక్తులు మొక్కుల చెల్లింపులో భాగంగా సంప్రదాయ ప్రకారం ఎదురకోడిని ఎగిరేస్తున్నారు. కోడిని ఒకసారి ఎగరేయడానికి కోడి యజమానులు రూ.10 తీసుకుంటున్నారు. ఈ ఎదురుకోళ్లను ఎగరేసేవిధానం చాలాఏళ్లుగా కొనసాగుతోంది. -
ములుగు జిల్లా జోలికొస్తే ఖబడ్దార్..
● బడే నాగజ్యోతి ములుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను రద్దు చేసే కుట్రలో భాగంగా ములుగు జిల్లాకు కూడా ప్రమాదం పొంచి ఉందని, ములుగు జిల్లా రద్దుకు కుట్ర చేస్తే సహించేదిలేదని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం జిల్లాలను రద్దు చేయబోతుందనే ఊహాగానాల నేపథ్యంలో ములుగు ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని అన్నా రు. ములుగు జిల్లా జోలికొస్తే జిల్లా ప్రజల తిరుగుబాటును ప్రభుత్వం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ములుగు పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వేములపల్లి భిక్షపతి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి గండి కుమార్, గోర్రె సమ్మయ్య, బైకాని సాగర్, మాదం సాగర్, దూడబోయిన శ్రీను, రఘు, రాణా ప్రతాప్, పోరిక శ్యామల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
చిట్యాల : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను, విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని భూపాలపల్లి రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రైతు సంఘం జీపుజాతా మండల కేంద్రానికి చేరుకుంది. దీంతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 11 వరకు జిల్లాలోని 10 మండలాలు 343 గ్రామాల 302 కిలోమీటర్ల వరకు జీపుజాతా తిరుగుతుందన్నారు. ఈ నెల 19న జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు పాల్గొన్నారు. -
రామప్పలో భక్తుల సందడి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, విద్యార్థులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా ఆలయ విశిష్టత గురించి గైడ్లు పర్యాటకులకు వివరించారు. అనంతరం రామప్ప సరస్సు కట్టకు చేరుకొని సరస్సులో బోట్ షికారు చేశారు. ములుగు రూరల్: క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. మండలంలోని కొత్తూరు దేవునిగుట్ట ఆవరణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవారం ప్రాంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి కనబరచాలని అన్నారు. కొత్తూరు–పత్తి పల్లి మ్యాచ్ ప్రాంభించారు. పత్తిపల్లి టీం గెలుపొందగా అభినందించారు. కార్యక్రమంలో పత్తిపల్లి ఉప సర్పంచ్ పోరిక భద్రు నాయక్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వాజేడు: అడవుల మూలంగా మానవాళికి ఎంతో మేలు జరుగుతుందని దానిని కాపాడుకుందామని ఎఫ్ఎస్ఓ నారాయణ అన్నారు. మండల పరిధిలోని చెరుకూరు గ్రామంలో శుక్రవారం జిల్లా అటవీ శాఖాధికారి రాహుల్ కిషన్ జాదవ్ ఆదేశాల మేరకు యువకులకు వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారికి సర్పంచ్ వాసం రాజబాబు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం యువతీ యువకులకు అడవిలో నిప్పు మూలంగా జరిగే కష్ట, నష్టాలను వివరించారు. కార్యక్రమంలో పద్మ, మనీష, జనార్ధన్, దామోదర్ ఉన్నారు. గణపేశ్వరుడికి లక్ష్మీవారం పూజలు భూపాలపల్లి: కాకతీయుల కళావైభవం గణపు రం కోటగుళ్లలో గణపేశ్వరుడికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీవారం కావడంతో భక్తులు అధికసంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ, విభూతి, గంధంతో గణపేశ్వరుడిని అలంకరించారు. భక్తులకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. -
మేడారంలో ‘హలాల్’ను నిషేధించాలి
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం జాతరలో హలాల్ విధానాన్ని నిషేధించాలని వనవాసీ కల్యాణ పరిషత్ జిల్లా కార్యదర్శి డాక్టర్ మైపతి సంతోష్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లిస్తూ సంప్రదాయబద్దంగా కోళ్లు, యాటలను దేవతలకు సమర్పిస్తారన్నారు. గిరిజన సంప్రదాయాలకు విరుద్ధంగా మేడారం జాతరలో దుకా ణాలను ఏర్పాటు చేసుకుని కోళ్లు, మేకలను హలాల్ పద్ధతితో కోయడం జరుగుతుందన్నా రు. ఈ విధానం గిరిజన సంప్రదాయాలకు అనుకూలం కాదని దీంతో గిరిజన సంస్కృతికి భంగం కలుగుతుందని తెలిపారు. జాతరలో ఈవిధానాన్ని తక్షణమే నిషేధించి దుకాణా లను తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి గిరిజన సంస్కృతి, పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వనదేవతలను దర్శించుకున్న వాసుదేవరావు ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మలను బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు శుక్రవారం దర్శించుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుతో కలిసి ఆయన అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. తల్లుల కరుణ కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరికీ, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పెండింగ్ డీఏలను విడుదల చేయాలి వాజేడు : బకాయి ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని పీఆర్టీయూ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం ఎంఈఓ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా పీఆర్టీయూ క్యాలెండర్ను ఆవిష్కరించారు. రాజేష్, బాలాజీ, ప్రభాకర్, రాజ్యలక్ష్మి, శ్రీకాంత్, రాజెష్, ఆనంద్, కుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి పరామర్శ ఏటూరునాగారం: నేతకాని కులసంఘం రాష్ట్ర నాయకుడు గోగు మల్లయ్య అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను నేతకాని కుల సంఘం జిల్లా నాయకులు పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జాడి రాంబాబు మాట్లాడుతూ సంఘం కోసం మల్లయ్య చేసిన సేవలు మరువలేనివి అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎల్లయ్య, నారాయణ, అర్జున్, లక్ష్మికాంత్, నర్సింహరావు, పోషయ్య తదితరులు పాల్గొన్నారు. నేతకాని కులస్తులకు ఏజెన్సీ హక్కులు కల్పించాలివెంకటాపురం(కె): నేతకాని కులస్తులకు ఏజెన్సీ హక్కులు కల్పించాలని తెలంగాణ నేతకాని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జాడీ ఈశ్వర్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో నేతకాని కులస్తుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతకాని కులస్తులకు సాగులో ఉన్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని అన్నారు. సమస్యలు ప రిష్కరించాలని కోరుతూ ఈ నెల 12న ము లుగు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు వినియోగించుకోవాలి
ములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం ద్వారా అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ అన్నారు. బండారుపల్లి పీఎంశ్రీ మోడల్ పాఠశాలను శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ రాజేశ్ శర్మ, రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అశిష్ కోహ్లి, డైరెక్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ అమర్జీత్ శర్మ, ఉన్నతాధికారుల బృందంతో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల అమలుతీరును అడిగి తెలుసుకున్నారు. ఒకేషనల్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్లను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయాలని రూ.10 వేలను ప్రిన్సిపాల్ దేవకి కి అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ సంపత్రావు, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్దార్థ్ రెడ్డి, సెక్టోరియల్ అధికారులు అర్షం రాజు, శ్యాంసుందర్రెడ్డి, సాంబయ్య, సైకం శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రామప్ప శిల్పకళ బాగుంది.. వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని శుక్రవారం హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాగూర్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి మంత్రి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి శాలువాలతో వారిని సత్కరించారు. అనంతరం ఆలయ విశిష్టత, శిల్పకళా ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పాకళ సంపద బాగుందని కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్ చేస్తూ సరస్సు అందాలను తిలకించారు. వారివెంట అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు, తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై చల్ల రాజు తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవర్లకు ఉచిత కంటి వైద్యశిబిరం
ములుగు: రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ములుగు డీటీఓ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఈఐబీ, ఆటో, టాటా మ్యాజిక్, లారీ డ్రైవర్లకు నిపుణులైన వైద్యులచే కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపీణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీఓ శ్రీని వాస్ మాట్లాడారు. వాహనాలు నడిపే డ్రైవర్లకు కంటి ఆరోగ్యం ఎంతో కీలకమైందని, రోడ్డు ప్రమాదా లను నివారించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. అనంతరం వెంకటాపూర్ మండల కేంద్రంలోని జోహార్ పాఠశాల విద్యార్థులచే పాదచారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించా రు. రోడ్డు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, పాదచారుల భద్రత వంటి అంశాలపై వివరంగా అవగా హన కల్పించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం అబ్దుల్ జావీద్, పాల్గొన్నారు. -
జాతరను విజయవంతం చేయాలి
మల్హర్(కాటారం): మండలంలోని జాదరావుపేటలో ఈ నెల 11 నుంచి 12 వరకు జరిగే నాయక పోడుల ఆరాధ్య దైవం లక్ష్మీదేవర బోనాల జాతరను వియవంతం చేయాలని నాయకపోడు యువత కోరారు. శుక్రవారం జాతరకు సంబంధించిన వాల్పోస్టర్ను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కోర్కెల తీర్చే కొంగుబంగారం లక్ష్మిదేవర బోనాల జాతర మహోత్సవా లను జాదరావుపేట గ్రామ పంచాయతీలో నాయకపోడ్ల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కోట అశోక్, బద్ది వెంకటేష్, పెరుమాండ్ల రాజేందర్, గుంటి రాహుల్, చింతకుంట్ల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో సంక్రాంతి సంబురాలు
గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయి మోడల్ స్కూల్లో శుక్రవారం సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యార్థుల కోసం ము గ్గుల పోటీలు, పతంగుల ఫెస్టివల్ను ప్రిన్సిపాల్ గండు కుమార్ ఏర్పాటు చేయగా, స్కూల్ ఆవరణ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థినిలు రంగురంగుల ముగ్గులు వేసి పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే విధంగా రూపొందించిన ముగ్గులు అందరి మనసుకు ఆకట్టుకున్నాయి. మరో వైపు అబ్బాయిలు స్వయంగా తయారు చేసుకున్న పతంగులతో పతంగుల ఎగురవేత పోటీలో ఆనందంగా పాల్గొని సంక్రాంతి సందడిని రెట్టింపు చేశారు. ముగ్గుల పోటీలను ఉపాధ్యాయులు పరిశీలించి అత్యుత్తమ ముగ్గులు వేసిన విద్యార్థులను ఎంపిక చేసి బహుమతులు ప్రకటించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వెంకటాపురం(కె) : మండల కేంద్రంలోని విజన్ స్కూల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. శనివారం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఆనంతరం స్కూల్ ఆవరణలో భోగి మంటలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్కూల్ ఇన్చార్జ్ రామారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీలను సర్పంచ్ తాటి సరస్వతి, ఉప సర్పంచ్ సన్నిలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపాద్యాయులు బోల్లే శ్రీనివాస్, జయరాం, రమాదేవి, భిక్షమణి, పుష్పావతి తదితరులు ఉన్నారు. ఏటూరూనాగారం : మండల పరిధిలోని కొమరం భీం ఎంపీపీఎస్లో సంక్రాంతి సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు శుక్రవారం నిర్వహించారు. పోటీల్లో గెలుపోందిన విద్యార్ధులకు బహుమతులను అందజేశారు. పాఠశాల హెచ్ఎం గుమ్మల రవిందర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వాజేడు : స్థానిక ఎంపీపీఎస్లో శుక్రవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్ధులకు, తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి మండల విద్యాశాఖాధికారి తేజావత్ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. మంగపేట: మండల కేంద్రంలోని శ్రీ వైష్నవి ప్రైవేటు పాఠశాలలో ముందస్తు మకర సంక్రాంతి పండుగ సంబరాలను పాఠశాల ప్రిన్సిపాల్ రావుల రాజేశ్వర్రావు పర్యవేక్షణలో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యార్థులకు కలిసి సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. డిగ్రీ కళాశాలలో ముగ్గుల పోటీలు ఏటూరునాగారం : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తు ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీలను మహిళా సాధికారత, కళాశాల సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలను కాలేజీ ప్రిన్సిపాల్ రేణుక ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళా సాధికారిత విభాగం కన్వీనర్ పాతిమా, కళాశాల సాంస్కృతిక విభాగం కన్వీనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మలుగు రూరల్ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఘనంగా రంగోలి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీ నిర్వహించి బహుమతులను అందజేశారు. ప్రిన్సిపాల్ మల్లేశం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఉదయశ్రీ, అనిల్ కుమార్ అ ధ్యాపకులు బాల య్య, కవిత, శిరీష, రాధిక, ఉదయశ్రీ, పాల్గొన్నారు. -
మేడారం భక్తులకు గాయాలు
ఎస్ఎస్తాడ్వాయి: పత్తి లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొట్టడంతో మేడారానికి వస్తున్న భక్తులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాలకు చెందిన భక్తులు టాటా మ్యాజిక్ వాహనంలో మేడారానికి వస్తున్నారు. అదేసమయంలో కాల్వపల్లి నుంచి పత్తి లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం వీరి వాహనాన్ని మండలంలోని కాల్వపల్లి శివారులో ఢీకొట్టింది. దీంతో మంచిర్యాలకు చెందిన పోసక్క, రాజలక్ష్మి, రోజా తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురిని 108 అంబులెన్స్లో ఎంఈటీ నద్దునూరి మధు, పైలెట్ అరె కరుణాకర్ ప్రథమ చికిత్స నిర్వహించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో టాటా మ్యాజిక్ నుజ్జునుజ్జయింది. మరో 12 మంది భక్తులకు ఎలాంటి ప్ర మాదం జరగకపోవడంతో ఊపిరిపిల్చుకున్నారు.కాల్వపల్లి దాటిన తర్వాత ప్రమాదం -
జిల్లా ఏర్పాటులో బీజేపీ క్రియాశీలక పాత్ర
ములుగు రూరల్: ములుగు జిల్లా ఏర్పాటు కోసం శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ క్రియాశీలక పాత్ర పోషించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన త్వర్వాత తొలిసారిగా ఆయన శుక్రవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరామ్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. గట్టమ్మ ఆలయం వద్ద గజమాలతో సత్కరించారు. అనంతరం గట్టమ్మ ఆలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గం వెనుక బడిన ప్రాంతం ఇక్కడి విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీ గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ములుగు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వీరేందర్, గౌతం రావు, వాసుదేవరావు, నరేష్, చింతలపూడి భాస్కర్ రెడ్డి, రాజు నాయక్, జవహర్ లాల్, గుగులోతు స్వరూప, రవీంద్రచారి, జాడి వెంకట్, రమేష్ తదితరులు ఉన్నారు.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి
మంగపేట: నేటి యువత వ్యసనాలకు దూరంగా ఉండి సమాజానికి దోహదపడే విధంగా సామాజిక చైతన్య కార్యక్రమాల్లో ముందుకు సాగాలని యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కుంజ సూర్య అన్నారు. మండలంలోని రాజుపేటలో అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడాపోటీలను ఆయన శుక్రవారం ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పానీయాలు, గంజాయి వంటి పదార్థాలకు బానిస కావొద్దన్నారు. ప్రతీ క్రీడాకారుడు ఓటమి గెలుపునకు నాంది అనే స్ఫూర్తితో స్నేహపూర్వకంగా పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను చాటి ఇతర క్రీడా కారులకు ఆదర్శంగా నిలువాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ కర్రి నాగేంద్రబాబు మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
పునరుద్ధరణ రెండోదశ పనులు షురూ
హన్మకొండ కల్చరల్: హైదరాబాద్ సర్కిల్ భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) ఆధ్వర్యంలో వేయిస్తంభాల ఆలయం కల్యాణ మండపం పునరుద్ధరణలో భాగంగా రెండో దశ పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ నిఖిల్దాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలాజికల్ ఇంజనీర్ కృష్ణ చైతన్య, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ హెచ్ఆర్ దేశాయ్ పాల్గొని పూజలు నిర్వహించి కళ్యాణ మండపం పైకప్పు వాటర్ ప్రూఫింగ్ పనులు ప్రారంభించారు. ప్రస్తుత ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 32 లక్షలు కాగా, 90రోజుల్లోపు పూర్తయ్యేలా వాటర్ ప్రూఫింగ్ పనులు చేపట్టారు. పనులు పూర్తయిన అనంతరం కళ్యాణ మండపం దక్షిణ భాగం రీసెట్టింగ్ పనులను ఏఎస్ఐ చేపట్టనుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వేదపండితుడు గంగు మణికంఠశర్మ, నిట్ విశ్రాంతాత ఆచార్యులు, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, కన్జర్వేషన్ అసిస్టెంట్లు మల్లేశం, అజిత్, దేవాదాయశాఖ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. -
భక్తుల రద్దీ పర్యవేక్షణకు నిఘానేత్రాలు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతరలో నిఘానేత్రాల ద్వారా భక్తుల రద్దీని పర్యవేక్షించనున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. మేడారం జాతరలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పని తీరును మేడారంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి శుక్రవారం ఎస్పీ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణకు ఎలాంటి అనూహ్య సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సీసీటీవీ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. జాతర సమయంలో భారీ రద్దీ ఉన్న ప్రధాన ప్రాంతాలైన జంపన్నవాగు, అమ్మవార్ల గద్దెలు, హరిత వై జంక్షన్, ట్రాఫిక్ మార్గాలు, కూడళ్ల రద్దీ, కోర్ పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి నేపథ్యంలో ఈసారి గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భద్రతను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. -
రిజర్వేషన్పై ఉత్కంఠ..!
ములుగు: మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుండటంతో రిజర్వేషన్లపై ఆశావహుల్లో గుబులు మొదలైంది. జిల్లాలో తొలిసారిగా ములుగు పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండడంతో రిజర్వేషన్పై ఉత్కంఠ నెలకొంది. ములుగు మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా 14,112 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 6,731 మంది పురుషులు 7,379 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. ఇప్పటికే ఆయా వార్డుల్లో ఓటరు ముసాయిదాను విడుదల చేసిన సంబంధిత అధికారులు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. 12న ఓటరు తుది జాబితాను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 13న పోలింగ్ స్టేషన్ల వివరాలను టీ పోల్ యాప్లో అప్లోడ్ చేయనున్నారు. తొలిసారిగా ములుగులో మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతుండడంతో చైర్మన్ పదవిని కై వసం చేసుకునేందుకు అధికార పార్టీ ఇప్పటికే పావులు కదుపుతుండగా, మున్సిపల్ ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్.. కౌన్సిలర్గా పోటీ చేయాలనుకుంటున్న పలువురు ఆశావహులు ఇప్పటికే ఆయా వార్డుల్లో గ్రౌండ్ వర్క్ను ప్రారంభించారు. ఒక్కొక్కరు రెండు నుంచి మూడు వార్డులపై దృష్టి పెట్టారు. ఏ వార్డు రిజర్వేషన్ అనుకూలంగా వస్తే అక్కడినుంచే పోటీ చేయాలనే ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు జనం మధ్యనే ఉంటున్నారు. ఆయా కాలనీల్లో ఏదైనా సమస్యను ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తే అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారమయ్యేలా చర్యలు చేపడుతూ.. ప్రజలకు చేరువ అవుతున్నారు. ఇలా ఎన్నికలకు ముందే ప్రజల మన్ననలు పొందాలని ఆశావహులు ఉత్సాహంగా తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆశావహుల్లో టెన్షన్ మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత రాలేదు. రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ములుగు ఎస్టీ నియోజవర్గం కావడంతో ఎస్టీ రిజర్వేషన్కు కేటాయిస్తారా.. ఇతర సామాజిక వర్గాలకు కేటాయిస్తారా.. అనేది సందేహంగా మారింది. జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల కేటాయింపు ఏ పద్ధతిలో ఉంటుంది.. 42 శాతం కొత్త రిజర్వేషన్లు అమలు చేస్తారా? అని ఆశావహులు జోరుగా చర్చించుకుంటున్నారు. తమకే టికెట్ ఇవ్వాలని ఇప్పటికే పలువురు అదినాయకుల వద్ద క్యూ కడుతున్నట్లు సమాచారం. కీలకంగా మారనున్న చైర్మన్ స్థానం మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ స్థానం రిజర్వేషన్ కీలకంగా మారనుంది. ఈ పీఠం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలోని ప్రధాన నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా కుర్చీని దక్కించుకొని తొలిసారిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ పార్టీ జెండా ఎగురవేసేందుకు అధికార పార్టీతోపాటు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు 12న వార్డుల వారీగా ఓటరు తుది జాబితా విడుదల -
క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి
ఏటూరునాగారం/మంగపేట/వాజేడు : క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎంఈఓలు కోయడ మల్లయ్య, వెంకటేశ్వర్లు, పోదెం మేనక అన్నారు. శుక్రవారం ఆయా మండల కేంద్రాల్లో సీ ఎం కప్ 2026 టార్చ్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడల ద్వారానే శారీరక దారుఢ్యం పెంపొందుతుందని అన్నారు. ఈ నెల 17 వరకు సీఎం కప్పై ర్యాలీ నిర్వహించి అనంతరం మండల స్థాయి పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని మండలానికి పేరు తీసుకు రావాలని వారు కోరారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ కోచ్ ఎండీ హుస్సేన్, సతీష్, ఎస్సై రాజ్ కుమార్చ హెచ్ఎం సాంబశివరావు, క్లస్టర్ ఇన్చార్జ్ పద్మశ్రీ, మున్వర్, స్వరూప తదితరులు పాల్గొన్నారు. మంగపేట జెడ్పీహెచ్ఎస్లో ఆమె మండలంలోని వ్యాయామ, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులతో కలిసి సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు శ్రీనివాస్, నాగేందర్, వెంకటేశ్వ ర్లు, నరేష్, శ్యాంప్రసాద్, సుజాత పాల్గొన్నారు. -
క్రీడా ప్రతిభకు సీఎం కప్ పోటీలు
ములుగు: యువత తమ క్రీడా ప్రతిభను కనబర్చడానికి సీఎం కప్ పోటీలు సువర్ణ అవకాశాన్ని కల్పిస్తున్నాయని కలెక్టర్ టీఎస్.దివాకర పేర్కొన్నారు. కలెక్టరేట్లో సీఎం కప్ రెండో ఎడిషన్ టార్చ్ ర్యాలీని కలెక్టర్ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణస్థాయి క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీయడానికి సీఎం కప్ రెండో ఎడిషన్ సరైన వేదికని తెలిపారు. ఈ క్రీడాపోటీలు రేపటి వరకు టార్చ్ ర్యాలీలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. 8న ములుగు జిల్లా కలెక్టరేట్లో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, మల్లంపల్లి జెడ్పీఎస్ఎస్లో 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, వెంకటాపురం(ఎం) జెడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు, గోవిందరావుపేట జెడ్పీహెచ్ఎస్లో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు, 9న ఐటీడీఏ కార్యాలయంలో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, మంగపేట జెడ్పీహెచ్ఎస్లో 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తాడ్వాయి పాఠశాలలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, 10న ముప్పనపల్లి జెడ్పీహెచ్ఎస్లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, వాజేడు జెడ్పీహెచ్ఎస్లో 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, వెంకటాపురం(కె) జెడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3గంటల వరకు టార్చ్ ర్యాలీ కొనసాగనుందని వెల్లడించారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 44 రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు గ్రామస్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయిలో, ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు నియోజకవర్గస్థాయిలో, 10 నుంచి 14వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, 19 నుంచి 26 వరకు రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి సర్ధార్ సింగ్, డీఈఓ సిద్ధార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
మేడారంలో ప్లాస్టిక్కు నో..
ఎస్ఎస్తాడ్వాయి: ఎకో ఫ్రెండ్లి సమ్మక్క– సారలమ్మ జాతర నిర్వహణకు ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు గురువారం మేడారంలో వినూత్న ప్రచారం నిర్వహించారు. ప్లాస్టిక్కు నో చెప్పండి నినాదంతో భక్తులకు, వ్యాపారులకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఎకో క్లబ్ కన్వీనర్ డాక్టర్ సరిత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అనిల్కుమార్, డాక్టర్ ఉదయశ్రీల ఆధ్వర్యంలో పెక్ల్సీలు ఏర్పాటు చేసి కరప్రతాలను పంపిణీ చేశారు. కాగితపు క్లాత్ సంచులు వాడాలని వ్యాపారులకు సూచించారు. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే పర్యావరణ, ఆరోగ్య నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బాలయ్య, అధ్యాపకులు, వలంటీర్లు పాల్గొన్నారు.ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ప్రచారం -
యువత మత్తుకు దూరంగా ఉండాలి
ములుగు: యువత మత్తు పదార్దాలకు దూరంగా ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్న్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అధ్యర్యంలో నేషనల్ యూత్ డే ప్రోగ్రాంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. యువత కష్టపడి చదివి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. మోటార్ వెహికల్ చట్టం, పోక్సో చట్టం గురించి వివరించారు. ఉచిత న్యాయ సహాయానికి టోల్ ఫ్రీ నంబర్ 15100కి కాల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం, వైస్ ప్రిన్సిపాల్ బాలయ్య, యాంటీ డ్రగ్స్ కమిటీ కన్వీనర్ అనిల్ కుమార్, ప్రొఫెషర్ ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
రూ.2వేల కోట్లతో వరంగల్ అభివృద్ధి
ఖిలా వరంగల్/హన్మకొండ/హన్మకొండ కల్చరల్: రూ.2వేల కోట్లతో వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. సంక్షేమాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్.రాంచందర్ రావు రెండు రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టారు. దీనిలో భాగంగా గురువారం హనుమకొండకు వచ్చిన ఆయనకు కాజిపేటలోని కడిపికొండ బ్రిడ్జి వద్ద పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా వరంగల్లోని భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడినుంచి బయలుదేరి హనుమకొండ హంటర్రోడ్ నందిహిల్స్ వద్దకు చేరుకుని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వేధ బాంక్వెట్హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇక్కడే మధ్యాహ్న భోజనం చేసిన తరువాత వరంగల్కు ర్యాలీగా బయలుదేరారు. అనంతరం శాంతినగర్లోని రాజశ్రీ గార్డెన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి వరంగల్ పర్యటనలో భాగంగా భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. కాజీపేట కోచ్ఫ్యాక్టరీ నిర్మాణం, మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ పనులు మోదీ ఆధ్వర్యంలో పూర్తవుతాయని చెప్పారు. హెల్త్ యూనివర్సిటీ కూడా కేంద్ర ప్రభుత్వ చొరవతో ఏర్పడిందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిందేనని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎం.గౌతం రావు, తూళ్ల వీరేందర్ గౌడ్, వేముల అశోక్, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, కొండేటి శ్రీధర్, ఎం.ధర్మారావు, వన్నాల శ్రీరాములు, డాక్టర్ రాజేశ్వర్రావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, కుసుమ సతీశ్, మల్లాడి తిరుపతిరెడ్డి, రఘునాఽరెడ్డి, డాక్టర్ వన్నాల వెంకటరమణ, ఎన్.వి.సుభాష్, డా.పగడాల కాళీ ప్రసాద్, గుండె గణేష్, ఒంటేరు జైపాల్, ఎడ్ల అశోక్ రెడ్డి, దిలీప్ నాయక్, చాడ స్వాతి, గుజ్జల వసంత, రావుల కోమల, అభినవ్ భాస్కర్, ఎండీ రఫీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు నాయకులు, కార్యకర్తల ఘనస్వాగతం -
అధికారులు బాధ్యతతో పనిచేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతరలో జోనల్, సెక్టార్ అధికారులు బాధ్యతతో పనిచేయాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అన్నారు. మేడారం హరిత హోటల్లో జాతర విధుల నిర్వహణపై జోనల్, సెక్టార్ అధికారులకు గురువారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మేడారం జాతర ప్రదేశాలను 12 జోన్లుగా విభజించి 62 మంది జోనల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. అలాగే 51 సెక్టార్లకు 179 మంది అధికారులను కేటాయించినట్లు వివరించారు. జాతర సమయంలో చేపట్టాల్సిన బాధ్యతలు, నిర్వహణ విధానం, ప్రజల భద్రత, రవాణా నియంత్రణ, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై అధికారులకు స్పష్టమైన అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రతీ అధికారికి స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన మాన్యువల్ను అందజేశామని వివరించారు. జాతర నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలిపారు. డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా భక్తుల రద్దీని పర్యవేక్షించడంతో పాటు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులకు మాస్టర్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామన్నారు. దీంతో సమస్యలు తలెత్తిన వెంటనే గుర్తించి తక్షణమే పరిష్కరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జంపన్నవాగు ప్రాంతంలో జన సందోహం ఎక్కువగా ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా 3 షిఫ్టుల్లో గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ జాతరను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.అదనపు కలెక్టర్ మహేందర్జీ -
నాలుగు నెలల్లోనే విచారణ పూర్తి
ములుగు: జిల్లాలో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న 18 ఏళ్ల లోపు బాలలకు సంబంధించిన కేసుల విచారణను నాలుగు నెలల్లోనే విచారణ పూర్తి చేయాలని, పొడిగించదగిన సహేతుకమైన కారణాలుంటే గరిష్టంగా 6 నెలల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో బాలరక్ష భవన్ ప్రాంగణంలో బాలల న్యాయ మండలిని (జేజేబీ) ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీపీఓ రమణమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చట్టంతో విబేధిస్తున్న పిల్లల కేసుల సత్వర పరిష్కారమే బాలల న్యాయ మండలి ముఖ్య ఉద్దేశమని వివరించారు. ప్రతీ మూడు నెలలకోసారి ఈ కేసుల స్థితిని హైకోర్టు డీఎల్ఎస్ఏ సెక్రటరీ సమీక్షిస్తారని పేర్కొన్నారు. పిల్లలకు పోలీస్, కోర్టు, జడ్జి అనే భావన రాకుండా అధికార యంత్రాంగం డ్రెస్ కోడ్ లేకుండా సివిల్ డ్రెస్లో, పిల్లలకు స్నేహాపూర్వకమైన వాతావరణంలో కేసుల విచారణ ఉంటుందని తెలిపారు. ఈ బోర్డు ద్వారా పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని బోర్డు ముందుకు వచ్చే పిల్లల్లో పరివర్తన తీసుకొచ్చి వారికి కొత్త జీవితాన్ని ఇచ్చేందుకు కలిసి కట్టుగా కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కన్హయ్యలాల్, జిల్లా బాలల న్యాయ మండలి మెజిస్ట్రేట్ గుంటి జ్యోత్స్న, జిల్లా సంక్షేమాధికారి తుల రవి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి మధుళిక తేజ, జేజేబీ సోషల్ వర్కర్ మెరుగు సుభాశ్, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాలాచారి, భిక్షపతి, న్యాయవాదులు రాంసింగ్, శంకర్, స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూర్యచంద్రకళ -
‘ఆపరేషన్ స్మైల్’తో.. బాలలకు భరోసా
● 2019 నుంచి 854 మంది బాలకార్మికులకు విముక్తి ● పాఠశాలల్లో చేర్పిస్తున్న అధికారులుజిల్లాలోని పది మండలాల్లో దాడులు నిర్వహించి గుర్తించిన బాల కార్మికులను పాఠశాలల్లో చేర్పించాం. అంతేకాకుండా బాల కార్మికుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. 18 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. లేబర్ యాక్టు ప్రకారం యజమానులు శిక్షకు అర్హులు. ప్రతీఏడాది జనవరి, జూలైలో ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలి. – తుల రవి, జిల్లా సంక్షేమశాఖ అధికారిములుగు రూరల్: వివిధ కారణాలతో చదువు మధ్యలో మానేసి బాల కార్మికులుగా మారిన పిల్లల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతోంది. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు హోటళ్లు, కిరాణం దుకాణాలు, ఇటుకబట్టీలు, బైక్ మెకానిక్ షాపుల వద్ద పనులు చేస్తున్న వారిని గుర్తించి వెట్టిచాకిరి నుంచి కాపాడేందుకు ప్రభుత్వం 2014 నుంచి ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ వంటి కార్యక్రమాలు చేపడుతోంది. అధికారులు ప్రతిఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్, మహిళా శిశు సంక్షేమశాఖ, పోలీస్, చైల్డ్ హెల్ప్లైన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపడుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతూ 18 ఏళ్ల లోపు పిల్లలను, చదువు మానేసి కార్మికులుగా మారిన వారి వివరాలు సేకరించి అదుపులోకి తీసుకుంటున్నారు. అదుపులోకి తీసుకున్న బాల కార్మికుల పరిస్థితులను బట్టి వారికి అందుబాటులో ఉండే పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించి చదువు చెప్పిస్తున్నారు. 854 మంది చిన్నారులకు విముక్తి జిల్లాలోని పది మండలాల పరిధిలో ప్రతీ ఏడాది జనవరి, జూలై నెలల్లో ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలను అధికారులు 2014 నుంచి నిర్వహిస్తున్నారు. జిల్లా ఏర్పాటు అయినప్పటి నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు 854 మంది బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పించి పాఠశాలల్లో చేర్పించారు. బాలల రక్షణ కమిటీల ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పనిలో పెట్టుకున్న యజమానులపై లేబర్ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఇటుకబట్టీలు, క్రషర్లలో పనుల నిమిత్తం వచ్చిన కార్మికుల పిల్లలను అందుబాటులో ఉన్న పాఠశాలల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. బాల కార్మికులను గుర్తించిన, బడీడు పిల్లలను బడిలో చేర్పించకుండా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు పాఠశాలలకు పంపించేందుకు అంగీకార పత్రాలను రాయిస్తున్నారు. సంవత్సరం నెల బాలకార్మికులు 2019 జనవరి 19 జూలై 58 2020 జనవరి 138 జూలై 30 2021 జనవరి 190 జూలై 47 2022 జనవరి 129 జూలై 30 2023 జనవరి 32 జూలై 32 2024 జనవరి 63 జూలై 33 2025 జనవరి 47 జూలై 02 2026 జనవరి 04 -
వనదేవతలకు.. మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో సుందరీకరణ పనుల్లో భాగంగా స్కేపింగ్ ల్యాండ్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. గ్రామీణ జీవన శైలి, ఆదివాసీల సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్నాయి. రైతులు, ఎద్దులు, అడవి జంతువుల రూపాలతో మేడారం జాతర ఆత్మను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎస్ఎస్తాడ్వాయి: వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు గురువారం భారీగా తరలివచ్చారు. సమ్మక్క రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. జంపన్నవాగులోని షెవర్ల కింద పుణ్యస్నానాలు ఆచరించి.. అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పోలీసులు భక్తులను క్రమపద్ధతిలో సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడ్దిరాజుల గద్దెలను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని కుటుంబ సమేతంగా భోజనలు ఆరగించారు. -
ఈసారి గిరిజన గ్రామం లేనట్టేనా?
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలోని ఆదివాసీ మ్యూజియంలో ఈసారి కోయ గిరిజన గ్రామ ఏర్పాటు లేనట్లుగానే కనిపిస్తుంది. ఆదివాసీ మ్యూజియం నిర్మించిన నాటి నుంచి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలు జాతరకు వచ్చే భక్తులు తెలిసేలా మ్యూజియంలో మోడల్ కోయ గిరిజన గ్రామాన్ని ఏర్పాటు చేశారు. వెదురుతో గుడిసెలు నిర్మించి పైకప్పు గడ్డితో ఏర్పాటు చేసి మట్టితో గోడలు ఏర్పాటు చేసి ముగ్గులతో అందంగా అలకరించే వారు. కాని ఈ సారి జాతరలో కోయ గిరిజన గ్రామం ఏర్పాటుపై గిరిజన సంక్షేమశాఖ అధికారులు పక్కనబెట్టడంపై ఆదివాసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉంటుంది. రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.● భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్వాజేడు : కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావ్ తెలిపారు. మండల పరిధిలోని పెద్దగొళ్లగూడెం గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆయన సమక్షంలో బుధవారం పది కుటుంబాలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో 37మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ విజయ, ఆర్ఐ కుమారస్వామి, ఆయా గ్రామాల సర్పంచ్లు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్, నాయకులు దంతులూరి విశ్వనాథప్రసాద రాజు, జగన్నాథరాజు, అల్లి నాగేశ్వరావు, విజయ్ ఉన్నారు. ఏటూరునాగారం : మండల కేంద్రంలోని కొమురం భీమ్ స్టేడియంలో నిర్వహిస్తున్న క్రీడాకారులకు ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే వైద్యసేవలను అందించేందుకు సిబ్బంది, వైద్యులు అందుబాటులో ఉన్నట్లు ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ తెలిపారు. బుధవారం క్రీడా మైదానంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయగా ఆయన పరిశీలించి మాట్లాడారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అలాగే ఎమర్జెన్సీ సేవలు కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైద్యురాలు సుమలత, గిరి, ఫార్మాసిస్ట్ స్వామి, సుగుణావతి, ధనలక్ష్మి, ఖలీల్, ఈఎంటీ రాజ్కుమార్ పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత అందరి కర్తవ్యం
ఏటూరునాగారం: రోడ్డు భద్రత అందరి కర్తవ్యమని జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వినోద్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో బుధవారం రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినోద్రెడ్డి హాజరై మాట్లాడారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. వాహనదారులు మద్యం సేవించి నడపరాదని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ డైరెక్టర్ వసంత శ్రీనివాస్, డిగ్రీ కళాశాల ప్రిన్సి పాల్ రేణుక, స్థానిక సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సీహెచ్.వెంకటయ్య, జ్యోతి, ఫాతిమా, సంపత్, రమేశ్, భాస్కర్ పాల్గొన్నారు.జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వినోద్రెడ్డి -
పిల్లర్ వంకరగా..
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో భక్తుల క్యూలైన్ల కోసం నిర్మిస్తున్న జీఐ షెడ్ల నిర్మాణంలో నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయి. పిల్లర్ల దిమ్మలు పైన ఒకలాగా కింద ఒకలాగా వంకరగా ఒరిగి పోయినట్లు కనిపిస్తుండడంతో పనుల నాణ్యత ప్రమాణాల తీరుపై తీవ్ర విమర్శలు తలెతుత్తున్నాయి. పనుల ప్రాథమిక దశలోనే లోపాలు కనిపిస్తే షెడ్ల నిర్మాణంలో మరెన్ని లోపాలు ఉంటాయోనని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జాతర సమీపిస్తున్న వేళ హడావుడిగా పనులు చేయడంతోనే లోపాలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
అభివృద్ధి పనులేవి?
కొండాయిలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద అధ్వానంగా ఉన్న ప్లోరింగ్మల్యాలలో సమ్మక్క గుడికి రంగులు వేస్తూ..ఏటూరునాగారం: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతరకు మరో 21 రోజుల సమయం మాత్రమే ఉంది. కొండాయిలో కొలువై ఉన్న సమ్మక్క మరిది గోవిందరాజుల ఆలయంపై అధికారులకు చిన్నచూపు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆలయానికి రంగులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేదు. జాతర సమీపిస్తున్నప్పటికీ అభివృద్ది పనులు మొదలుపెట్టకపోవడంపై ఆదివాసీలు మండిపడుతున్నారు. మేడారం జాతర సమీపిస్తున్నా అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆలయం చుట్టూ గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. గోవిందరాజులను మేడారం జాతర సమయంలో సారలమ్మ వచ్చే రోజునే గద్దెలపైకి తీసుకెళ్లడం ఆనవాయితీ. జాతర సమయం దగ్గరపడుతుందని హడావుడి పనులు చేయడం అధికారులకు పరిపాటిగా మారిందని భక్తులు వాపోతున్నారు. దెబ్బతిన్న ఫ్లోరింగ్, పగిలిపోయిన నాపరాయి కొండాయిలో గల సమ్మక్క,– సారలమ్మ గద్దెల వద్ద ఫ్లోరింగ్ పనులు మొదలు కాలేదు. మేడారం జాతర సమయంలో జాతరకు వెళ్లే భక్తులు ఎడ్లబండ్లు, ప్రైవేట్ వాహనాల్లో ఇక్కడకు వచ్చి గద్దెలను దర్శించుకొని పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ఫ్లోరింగ్, నాపరాయి పగిలిపోయి అధ్వానంగా మారింది. భక్తుల సౌకర్యార్ధం మరమ్మతులు చేయాల్సిన ఎండోమెంట్, ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు వాటిపై దృష్టి పెట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు. మల్యాలలో రంగుల పనులు మల్యాలలో కొలువైన సమ్మక్క గుడికి రంగులు వేస్తున్నారు. మేడారం జాతర సమయంలో గోవిందరాజుల పూజారులు పడిగెతో ఇక్కడికి చేరుకుని ఆతిఽథ్యం స్వీకరించి మేడారానికి బయలుదేరుతారు. ఇందుకోసం సమ్మక్క గుడిని రంగులతో ముస్తాబు చేస్తున్నారు. సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద దెబ్బతిన్న ఫ్లోరింగ్ జాతర సమీపిస్తున్నా పట్టించుకోని అధికారులు -
నేడు, రేపు ఉమ్మడి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన
హన్మకొండ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు గురు, శుక్రవారాలు రెండు రోజుల పాటు హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర శాఖ పర్యటన వివరాలు విడుదల చేసింది. గురువారం ఉదయం 10 గంటలకు కాజీపేటలో ఘనస్వాగతం అనంతరం ర్యాలీగా భద్రకాళి దేవస్థానానికి చేరుకుంటారు. అమ్మవారి దర్శనం అనంతరం హనుమకొండ హంటర్ రోడ్లోని వేద బాంక్వెట్ హాల్కు చేరుకుని ప్రెస్మీట్లో మాట్లాడుతారు. అనంతరం ఇక్కడ జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్లో ర్యాలీ అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరునుంచి ర్యాలీగా జిల్లాకేంద్రానికి చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. రాత్రి గుడెప్పాడ్లోని ఓ హోటల్లో బస చేస్తారు. 9న ఉదయం 9 గంటలకు ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు. 10.30కు మేడారం చేరుకుని సమక్క, సారలమ్మను దర్శించుకుని మొక్కలు చెల్లిస్తారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. మీడియాతో మాట్లాడిన అనంతరం హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారు. ములుగు రూరల్: ఎన్నికల నియమావళిని పారదర్శకంగా అమలు చేయాలని కోరుతూ బుధవారం మున్సిపల్ కమిషనర్ సంపత్కు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవితేజ మాట్లాడుతూ ఒకే వ్యక్తి ఒకే ఓటు ఉండే విధంగా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీలో కూడా ఓటుహక్కు కలిగి ఉన్న ఓటర్ల పేర్లను సరిచేయాలన్నారు. కుటుంబ సభ్యులను యూనిట్గా తీసుకుని తుది ఓటరు జాబితా ప్రకటించాలని కోరారు. జాబితా వివరాలను మున్సిపాలిటీ కార్యాలయంతో పాటు బండారుపల్లి, జీవింతరావుపల్లిలో ప్రదర్శించాలని కోరినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్ : బైక్ను టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఇంచర్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 53 మంది విద్యార్థులు జిల్లాలోని రామప్ప, లక్నవరం పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ అజాగ్రత్త.. అతివేగం వల్ల అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. బస్సు ప్రమాదానికి గురికావడంతో విద్యార్థినులు భయందోళనకు గురయ్యారు. ప్రైవేటు వాహనాల్లో విహార యాత్రలకు తీసుకొచ్చినప్పుడు యాజమాన్యాలు జాగ్రత్తలు వహించాలని గ్రామస్తులు.. ఉపాధ్యాయులను, డ్రైవర్ను మందలించారు. మల్హర్ (కాటారం): చిన్న కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చిన్న కాల్వల నిర్మాణానికి చేపట్టే భూ సేకరణ నిమిత్తం మండలంలోని దామెరకుంట గ్రామంలో బుధవారం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రమేశ్ ఆధ్వర్యంలో భూ సేకరణ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా దామెరకుంట గ్రామ పంచాయతీ ఆవరణలో 6.02 ఎకరాలు, మల్లారంలో 17.15, గూడురులో 6.01 ఎకరాలు, జాదరావుపేటలో 5.04 ఎకరాలు మొత్తం దామెరకుంట క్లస్టర్ పరిధిలోని 34.22 ఎకరాల భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతుల పేర్లును తహసీల్దార్ నాగరాజు గ్రామసభలో చదవి వినిపించారు. అలాగే పలువురి రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరించారు. -
భక్తుల సౌకర్యాలే ప్రధాన లక్ష్యం
ఎస్ఎస్తాడ్వాయి: భక్తుల సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అధికారులు ముందుకు సాగాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారంలోని సమ్మక్కతల్లి కొలువైన చిలకలగుట్ట ప్రాంతాన్ని సీతక్క అధికారులతో కలిసి బుధవారం సందర్శించారు. గుట్ట పైనుంచి అమ్మవారిని పూజారులు తీసుకొచ్చే దారిని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జంపన్నవాగు, ఊరట్టం కాజ్వే ప్రాంతాలను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. గద్దెల ప్రాంగణంలో పునరుద్ధరణ పనులు, రాతి స్తంభాల అమరిక పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్చి పిల్లర్లు ప్రాకారం పనులన్నీ రేపటి కల్లా పూర్తి చేయాలన్నారు. సీఎం రేవంతర్రెడ్డి పర్యటన సందర్భంగా మేడారంలో సభ ఏర్పాటు స్థలాన్ని పరిశీలన చేసి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతగా పని చేయాలని సీతక్క స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు. హేమాచలుడి వరపూజకు రావాలని మంత్రికి ఆహ్వానం మంగపేట: శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి వరపూజ మహోత్సవానికి రావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను ఆహ్వానిస్తూ ఆలయ కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేశ్ బుధవారం ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రతిఏటా మకర సంక్రాంతి రోజున లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవ మూర్తులకు మల్లూరు గ్రామంలో వరపూజ మహోత్సవం(పెళ్లిచూపులు) నిర్వహించడం ఆనవాయితీ. వైభవంగా జరిగే స్వామివారి వరపూజ మహోత్సవానికి రావాలని కోరుతూ బుధవారం మేడారం వచ్చిన మంత్రి సీతక్కను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే కలెక్టర్ దివాకర, ఎస్పీ రాంనాథ్ కేకన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణికి ఆహ్వాన పత్రికను ఆలయ ఈఓ మహేశ్ అందజేశారు. అనంతరం ఆహ్వాన కరపత్రాలు, వాల్ పోస్టర్లను మంత్రి సీతక్క ఆవిష్కరించారు.పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
5 గంటలు..15 అంశాలు
ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సుదీర్ఘ సమీక్షసాక్షిప్రతినిధి, వరంగల్/హన్మకొండ అర్బన్ : ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి మంత్రి ధనసరి సీతక్కతో కలిసి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బుధవారం హనుమకొండలోని కలెక్టరేట్(ఐడీఓసీ)లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. సుమారు ఐదు గంటలకుపైగా జరిగిన సమావేశంలో సీఎం సలహాదారు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఆరు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానంగా మా మునూరు ఎయిర్పోర్టు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వరద నీటి కాల్వల వ్యవస్థ, పారిశుద్ధ్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు, భద్రకాళి మాడవీధులు, భద్రకాళి చెరువు పూడికతీత పనులు, రెండు పడక గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, యూరి యా, వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రి య, యాసంగి సంసిద్ధత ఇలా మొత్తం 15అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇళ్ల సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం.. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పెండింగ్లో ఉన్న సమస్యలను 15 రోజు ల్లో పరిష్కరించాలని గృహ నిర్మాణశాఖ ఎండీ వీపీ గౌతమ్ను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టిన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, అలాగే వాటికి చెల్లింపులు చేయాలన్నారు. ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇప్పటికే ముఖ్య మంత్రి ప్రకటించారని, రెండు పడకల గదుల ఇళ్ల (2– బీహెచ్కే) ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలన్నారు. ఈనెల 20వ తేదీలోగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి మౌలి క సదుపాయాల పనులు పూర్తిచేయాలన్నారు. గ్రా మీణ ప్రాంతాల్లో రెండు పడకల గదులకు లబ్ధిదా రుల ఎంపిక ప్రక్రియను ఈనెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ స్థాయిలో నగర అభివృద్ధి వరంగల్ను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క(అనసూయ) అన్నారు. ఆదివాసీ లకే కాకుండా కోట్లాదిమంది గిరిజనేతరులకు ఇలవేల్పులైన మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలతో పాటు ఆలయ ప్రాంగణం పునరుద్ధరణకు సీఎం ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, భూక్య మురళీనాయక్, గండ్ర సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, రాహుల్, రిజ్వాన్ బాషా షేక్, అద్వైత్ కుమార్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మాడవీధుల పనుల పరిశీలన హన్మకొండ కల్చరల్: నగరంలోని భద్రకాళి దేవాలయంలో కొనసాగుతున్న మాడవీధుల నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి పరిశీలించారు. మాడ వీధుల మ్యాప్ను చూసి త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాలయం మీద రాజకీయం చేస్తున్న వారికి ఒకటే చెబుతున్నామని, అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్న విషయాన్ని గమనించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. మాడవీధులకు ఖర్చు చేసే ప్రతీ పైసాకు లెక్క చెప్పాలని అధికారులను ఆదేశించారు. పాల్గొన్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, మామునూరు ఎయిర్పోర్టుపై స్పష్టత అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెట్టాలని అధికారులకు ఆదేశం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరికపెండింగ్ పనులను పరుగులు పెట్టించాలని మంత్రి పొంగులేటి.. కలెక్టర్లు, అధికారులకు సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రెండో దశ పనుల కోసం రూ.305 కోట్లతో చేపట్టే భూసేకరణ త్వరగా జరిగేలా చూడాలని ఆదేశించారు. రూ.30కోట్లతో భద్రకాళి మాడవీధుల పనులు జరుగుతున్నాయని, పూజారుల నివాస గదులు, సత్రం పనులు కొనసాగుతున్నాయన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అన్ని పనులు మార్చి 31 నాటికి పూర్తిచేయాలని, సీఎం రేవంత్రెడ్డి ఆసుపత్రిని ప్రారంభిస్తారన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి పొంగులేటి తెలిపారుఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమంపై సాగిన సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి పలువురిని మందలించారు. బాగా పనిచేసిన అధికారులను ప్రశంసించారు. మామునూరు ఎయిర్పోర్టుకు నిర్ణీత సమయంలో భూసేకరణ పూర్తి చేసినందుకు వరంగల్ కలెక్టర్ సత్యశారద, రెవెన్యూ అధికారులను అభినందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలో జనగామ ముందంజలో ఉందని ఆ జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, సంబంధిత అధికారులను ప్రశంసించారు. ఐఅండ్పీఆర్ శాఖ, పౌరసంబంధాలశాఖ డీఈఈ పనితీరు బాగా లేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, అధికారుల పనితీరు బాగా లేకపోవడం వల్లే నిత్యం ఆ జిల్లా పతాక శీర్షికలకు ఎక్కుతుందని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ను ఉద్దేశించి అన్నారు. -
బాల్య వివాహ నిషేధ చట్టంపై అవగాహన
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని భారతి విద్యానికేతన్, విజన్ స్కూల్లో బాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త్ నిషేధ చట్టంపై విద్యార్థులకు అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల పరిరక్షణ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ బాల్య వివాహాల చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్య వివాహలతో బాలికల చదువు, ఆరోగ్యం దెబ్బతింటుందని వివరించారు. 18 ఏళ్ల లోపు అమ్మాయిలు, 21 ఏళ్ల లోపు అబ్బాయిలకు వివాహాలు జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో బాలల పరిరక్షణ సమితి సభ్యులు జ్యోతి, సుమన్, రాజు రజిని పాల్గొన్నారు. -
జాతరలో మెరుగైన వైద్యసేవలు
ములుగు రూరల్: మేడారం మహాజాతరలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతరలో మెడికల్ క్యాంపుల ఏర్పాటు, మందుల పంపిణీ నిర్వహణకు అధికారులను నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య సూత్రాలు, జాతీయ ఆరో గ్య కార్యక్రమాల ప్రచారానికి మాస్ మీడియా వి భాగం, కర పత్రాలు, ఆరోగ్య ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, రణధీర్, డెమో సంపత్, సూపరింటెండెంట్ విజయభాస్కర్, గణేశ్, వినోద్, హిమ, కిరణ్, వెంకటేశ్ పాల్గొన్నారు.జిల్లా వైద్యాధికారి గోపాల్రావు -
సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శం
● మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి ఎస్ఎస్తాడ్వాయి: బాలికల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి పూలేను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కొయ్యడ మల్లయ్య అధ్యక్షతన సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలను జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేగ కల్యాణి హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. బాలికల అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని తెలిపారు. బాలికలు చదువుకునేందుకు పాఠశాలలను స్థాపించారని ఆమె సేవలను కొనియాడారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి చెంచయ్య మాట్లాడుతూ విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథం పెంపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలను అందించిన 20 మంది మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సూర్యనారాయణ, ఏఎంఓ శ్యాంసుందర్రెడ్డి, ఎంఈఓ గడ్డి శ్రీనివాస్, పీజీ హెచ్ఎంలు బద్దం లక్ష్మారెడ్డి, రేవతి, నాయకులు వాసుదేవరెడ్డి, వెంకటస్వామి, బాబురావు, డీటీఎఫ్ నాయకులు రేగ నరేందర్, కేజీబీవీ స్పెషలాఫీసర్ పుష్పనీల పాల్గొన్నారు. -
రోడ్ల పనులు.. పూర్తయ్యేదెన్నడో?
మేడారం జాతర సమయం సమీపిస్తున్నా పూర్తికాని పనులు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనుంది. జాతర సమయం సమీపిస్తున్నా ఇంకా రోడ్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. వనదేవతల దర్శనానికి వచ్చే వాహనాల దారి మళ్లింపులతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఒకే రోజున సుమారుగా 2 లక్షల మంది భక్తులు మేడారానికి వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. మేడారం ప్రధాన దారుల్లో రోడ్ల నిర్మాణం పనులు సాగుతున్న తీరుపై భక్తులు, గ్రామస్తులు ఆగ్రహానికి గురవుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో మేడారానికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లోగా రోడ్ల నిర్మాణం పనులన్నీ పూర్తి కాకపోతే భక్తులకు మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సూచిక బోర్డులు నిల్.. వివిధ ప్రాంతాల నుంచి మేడారం వచ్చే భక్తుల వాహనాలను అధికారులు దారి మళ్లిస్తుండడంతో ప్రయాణ దూరం పెరగడంతో పాటు సరైన సూచిక బోర్డులు లేకపోవడంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. పస్రా నుంచి వచ్చే భక్తుల వాహనాలను దారి మళ్లించి నార్లాపూర్ చెక్ పోస్టు నుంచి పంపిస్తున్నారు. ఇలా తిరిగి రావడం వల్ల మేడారం వెళ్లేందుకు రెండు కిలోమీటర్ల దూరం ఎక్కువగా ఉంటుందని భక్తులు వాపోతున్నారు. అలాగే కొత్తూరులో సీసీ రోడ్ల నిర్మాణం పనుల కారణంగా చెక్పోస్టు నుంచి కాల్వపల్లికి వెళ్లే దారిలోని మార్గ మధ్య నుంచి అటవి మార్గంలో కన్నెపల్లి మీదుగా వాహనాలను పంపిస్తుండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దారి మళ్లింపుతో గంటల తరబడి ఆలస్యం అవుతుందని భక్తులు వాపోతున్నారు. అక్కడక్కడా అసంపూర్తిగా పనులు మేడారంలో రోడ్ల నిర్మాణం పనులు అతుకులు గతుకులుగా సాగుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల నిర్మాణం పనులను మధ్యమధ్యలో అర్ధాంతరంగా వదిలేయడంతో మేడారం ప్రాంతవాసులతో పాటు భక్తులు అవస్థలు పడుతున్నారు. మేడారంలో ప్రధానంగా స్కేపింగ్ ల్యాండ్, చిలకలగుట్ట జంక్షన్ వద్ద రోడ్డు పనులు అసంపూర్తిగా వదిలేశారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి గద్దెల వద్దకు వచ్చే దారిలో జంక్షన్ వద్ద సీసీ రోడ్డు నిర్మించారు. కాని ర్యాంపు వేయకపోవడంతో వాహనాలు కిందకు దిగే పరిస్థితి లేదు. దీంతో వెనుతిరిగి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని వాహనాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన దారికి అడ్డంగా కంకర పోసి వాహనాలు వెళ్లకుండా చేశారని మేడారం సమీపంలోని రెడ్డిగూడెం గ్రామస్తులు సోమవారం రోడ్డెక్కారు. జంపన్నవాగు నుంచి వచ్చే దారిలో రెడ్డిగూడెంలోకి వెళ్లే సీసీ రోడ్డు దగ్గర వాహనాల రాకపోకలు సాగకుండా కంకర కుప్పలు పోశారు. అంతేకాకుండా జంపన్నవాగు నుంచి వచ్చే బీటీ రోడ్డు వద్ద డివైడర్ నిర్మించారు. దీంతో హరితహోటల్ నుంచి రెడ్డిగూడెంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు, రోడ్డు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామస్తులు ఆందోళన చేస్తుండగా పోలీసులు వచ్చి దారి సమస్యను తక్షణమే పరిష్కారిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వనదేవతల దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు వాహనాల దారి మళ్లింపులతో తప్పని తిప్పలు -
సమస్యల పరిష్కారానికి కృషి
ఏటూరునాగారం: గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో పీఓ గిరిజనుల నుంచి 8 వినతులను స్వీకరించారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘానికి మేడారం జాతరలో నాలుగు కోళ్ల షాపులు, 200ల టీషర్టులు, 50 వీఐపీ పాస్లు, 50 వీవీఐపీ పాస్లు ఇవ్వాలని పీఓకు విన్నవించారు. ఆదివాసీ రైతుసంఘం సభ్యులు మంగపేట మండలానికి 50 మందికి టీషర్టులు, బెల్లం, కొబ్బరి షాపులు ఇప్పించాలని కోరారు. మహబూబాబాద్ జిల్లాలోని మదగూడెం గ్రామానికి చెందిన ఓ గిరిజనుడు ట్రైబల్ రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం ఇప్పించాలని కోరారు. కన్నాయిగూడెం మండలం రాయినిగూడెంలో సాగు భూములకు 10 హెచ్పీ మోటార్లు, పైపులైన్ ద్వారా నీరు అందించాలని విన్నవించారు. మంగపేట మండలం గంపోనిగూడెంకు చెందిన ఓ గిరిజన మహిళా నా భర్త 2022లో మరణించారని, పేద కుటుంబం కావడంతో కుటుంబం గడవడం లేదని ఉపాధి కల్పించాలని అధికారులను వేడుకుంది. ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేశ్ బాబు, మేనేజర్ శ్రీనివాస్, జేడీఎం కొండల్రావు, ప్రోగ్రాం అధికారి మహేందర్, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, జియాలజిస్ట్ ఆలెం కిశోర్, ఐటీడీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా గిరిజనదర్బార్లో వినతులు స్వీకరించిన పీఓ -
నేటినుంచి విద్యుత్ ప్రజాబాట
హన్మకొండ : వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరాకు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్న టీజీ ఎన్పీడీసీఎల్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి(మంగళవారం)నుంచి ప్రజాబాట ద్వారా వినియోగదారుల ముంగిటికి వెళ్లనుంది. పొలంబాట ద్వారా విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు చేరుకుని నేరుగా రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. అదే విధంగా ప్రతీ సోమవారం సర్కిల్, డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్లోనూ ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈ విధానాలు కొనసాగుతుండగానే కొత్తగా ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో.. ఆయా సెక్షన్ పరిధిలో ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో వినియోగదారులనుంచి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తారు. గ్రామాల్లో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు, నగరాలు, పట్టణాల్లో కార్పొరేటర్, కౌన్సిలర్, ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. వీరి సమక్షంలో విద్యుత్ అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలు తెలుసుకుంటారు. అప్పటికప్పుడు పరిష్కారమయ్యే వాటిని వెంటనే పరిష్కరిస్తారు. మిగతా వాటిని నిర్దేశిత సమయంలో పరిష్కరిస్తారు. సెక్షన్ స్థాయిల ఏఈల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎస్.ఈ, డీఈ, ఏడీఈలు అందరూ ఒకేచోట పాల్గొనవద్దని ఆదేశాలున్నాయి. ఒక కార్యక్రమంలో ఎస్ఈ పాల్గొంటే మరో కార్యక్రమంలో డివిజన్ ఇంజనీర్, మరో కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ పాల్గొంటారు. ఇలా సర్కిల్ పరిధిలోని ముగ్గురు ఉన్నతాధికారులు మూడు సెక్షన్లలో నిర్వహించే ప్రజా బాటలో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వీరితో పాటు ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్, డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు కూడా పాల్గొనే అవకాశముంది. నేటి (మంగళవారం)నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అధికారుల క్షేత్రస్థాయి పర్యటన సమస్యల గుర్తింపు, అప్పటికప్పుడు పరిష్కారం ప్రతి సెక్షన్లో వారానికి మూడు రోజులు -
మహాజాతరను విజయవంతం చేయాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతరను అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని, జాతర నిర్వహణలో జోనల్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. మేడారంలోని హరిత హోటల్ లో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావులతో కలిసి జోనల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మేడారం మహాజాతర విజయవంతం చేయడంలో జోనల్ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని తెలిపారు. జోనల్ అధికారులు సెక్టార్ అధికారులతో కలిసి తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్ చేయాలని సూచించారు. జోనల్, సెక్టార్, వివిధ శాఖల అధికారులకు మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మూడు షిఫ్టులవారీగా అధికారులు విధులు నిర్వర్తించాలన్నారు. ముఖ్యంగా ప్రతీ జోనల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య పనులు నిరంతరం జరిగేలా చూసుకోవాలన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి అధికారులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, డీఎస్పీ రవీందర్ పాల్గొన్నారు. దుకాణాల మార్పునకు చర్యలు మేడారంలో రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను నిర్ధేశిత స్థానాలకు వెనక్కి మార్పించే కార్యక్రమాన్ని కలెక్టర్ దివాకర, ఎస్పీ రాంనాథ్ కేకన్ సోమవారం రాత్రి సమన్వయంతో అమలు చేశారు. జాతర సమయంలో రహదారులపై విపరీతమైన భక్తుల రద్దీ, వాహనాల గందరగోళం ఏర్పడే అవకాశం ఉన్నందున రోడ్డు నుంచి 12 అడుగుల దూరంలోనే దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు వ్యాపారులకు సూచించారు. అధికారులు వ్యాపారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి మేడారం జాతర సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపడుతున్నామని వివరించారు. భక్తులు సురక్షితంగా రాకపోకలు, వాహనాలు సాఫీగా నడిచేలా ఉండేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. వ్యాపారులు అధికారుల సూచనలను అర్ధం చేసుకొని సహకరించడంతో రహదారి విస్తరణ సక్రమంగా సాగడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మార్గం సుగమమైందని కలెక్టర్, ఎస్పీ తెలిపారు. -
ఓటరు జాబితాపై నాయకుల అభ్యంతరం
ములుగు: ములుగు మున్సిపాలిటీలో ఓటరు జాబితాపై వివిధ పార్టీల నేతలతో సోమవారం నిర్వహించిన సమావేశంలో నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటరు జాబితాలో తప్పులు ఉన్నాయని, మృతుల పేర్లు కూడా జాబితాలో ఎలా ప్రదర్శించారని అధికారులను ప్రశ్నించారు. ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరిస్తానని మున్సిపాలిటీ కమిషనర్ జనగాం సంపత్ తెలిపారు. ఓటరు జాబితాపై ప్రజల నుంచి ఇప్పటి వరకు 31 అభ్యంతరాలు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని రష్యా దేశానికి చెందిన ఇరినా, అమీయాలు సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఏటూరునాగారం: క్రీడల్లో గెలుపోటములు సహజమని అటవీశాఖ దక్షిణ రేంజర్ అబ్దుల్ రెహమాన్ అన్నారు. మండల కేంద్రంలోని కొమురం భీం స్టేడియంలో అటవీ సంరక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో నాలుగు జట్లు పాల్గొనగా ఎక్కెల టీంకు మొదటి బహుమతి, కొమురం భీం నగర్ టీం రెండో బహుమతి గెలుచుకున్నట్లు అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఆర్ఓ నారాయణ, ఎఫ్బీఓ దయానంద్, కల్యాణ్, చిట్టి, రాజేష్, ప్రశాంత్, పవన్, దిలీప్ పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్రెడ్డి ఎన్నిక ములుగు: ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ (పీఎస్హెచ్ఎం) జిల్లా యూనియన్ను సోమవా రం గోవిందరావుపేట మండలంలోని పీవీఆర్ కన్వెన్షన్ హాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా మధు, ప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శిగా వేణుగోపాల్, కోశాధికారిగా నాగేశ్వర్రావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు విలువలతో కూడిన, నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా హెడ్మాస్టర్లు పనిచేయాలని సూచించారు. గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. -
సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు
● రాష్ట్రస్థాయికి పలువురి ఎంపిక ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలను మండల పరిధిలోని బండారుపల్లి గురుకుల పాఠశాలలో నిర్వహించారు. ఈ మేరకు సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి పోటీలను ప్రారంభించి మాట్లాడారు. జిల్లా స్థాయిలో క్రీడాకారులు ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి వెళ్లాలని సూచించారు. అనంతరం అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారు ఈ నెల 18న ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించనున్న 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విజేందర్రెడ్డి, పీఈటీ రాజ్కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో ఏటూరునాగారం మండలానికి చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబర్చినట్లు అథ్లెటిక్స్ కోచ్ పర్వతాల కుమారస్వామి, కరిష్మా తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి జిల్లా అథ్లెటిక్స్ సెక్రటరీ వెంకటేశ్వర్రెడ్డి మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. మెడల్స్ సాధించిన వారిలో సంజన, ఎం.వైష్ణవిదేవి, కార్తిక్, బీమయ్య, ప్రణీత్ ఉన్నారు. -
బైక్, టాటాఏస్ ఢీ
ఏటూరునాగారం/వాజేడు/మంగపేట: బైక్, టాటాఏస్ ఢీ కొన్నాయి. ఈ క్రమంలో టాటాఏస్ ట్రాలీ, మిల్లర్ బోల్తా పడగా ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన వాజేడు మండల పరిధిలోని మండపాక వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వాజేడు ఎస్సై జక్కుల సతీష్ కథనం ప్రకారం.. మంగపేట మండల పరిధిలోని కమలాపురానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు వాజేడులోని పూసూరులో స్లాబ్ సెంట్రింగ్ పనులు, స్లాబ్ కాంక్రీట్ పనులు ముగించుకొని టాటాఏస్లో 15 మంది కార్మికులు సామగ్రితో ఏటూరునాగారం వైపు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మండపాక వద్ద మంగపేటకు చెందిన గుగ్గిళ్ల సూర్యనారాయణ తన బైక్పై వచ్చి కార్మికుల వాహనాన్ని ఢీకొట్టడంతో టాటాఏఎస్ వాహనం తిరగపడింది. ఈ క్రమంలో కమలాపురంలో నివాసం ఉంటున్న కార్మికుడు ఛత్తీస్గఢ్ వాసి బొజ్జ ఏసు(30)పై సెంట్రింగ్ పనిముట్లు మీదపడగా అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహన దారుడు సూర్యనారాయణ, టాటాఏస్ డ్రైవర్ సూరితో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన క్షతగాత్రులను వరంగల్, ములుగుకు రెఫర్ చేసినట్లు స్థానిక వైద్యులు తెలిపారు. పొట్ట కూటికోసం భవన నిర్మాణ పనులకు వెళ్లి ప్రమాదం బారిన పడగా పలువురి కాళ్లు ,చేతులు విరిగిపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఒకరి మృతి.. ఎనిమిది మందికి గాయాలు -
మేడారం జాతర పవిత్రతను కాపాడాలి
● పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఎస్ఎస్ తాడ్వాయి: ఆదివాసీల ఆత్మగౌరవం, అస్తిత్వానికి ప్రతీకగా మేడారం జాతర రూపుదిద్దుకుంటుందని, జాతర పవిత్రతను కాపాడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. మేడారంలోని హరిత హోటల్లో సమ్మక్క–సారలమ్మ మహా జాతర 2026 నిర్వహణపై పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులతో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకుల సమన్వయంతో జాతర విజయవంతం చేయాలన్నారు. జాతర నిర్వహణపై ఆదివాసీ సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను తెలపాలని సూచించారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసం మేడారం జాతర కలకలాం గుర్తుండిపోయేలా ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకుంటుందని వెల్లడించారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చేటప్పుడు ఆదివాసీ యువజన సంఘాలు సమన్వయం పాటించాలని, వలంటరీ సభ్యులకు, మహిళలకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. జాతర సమయంలో ఇసుక లారీల రవాణాను పూర్తిగా నిలిపివేయనున్నట్లు వివరించారు. జాతరకు వచ్చే భక్తులు ఏ విధంగా దర్శనం చేసుకోవాలనే అంశంపై ప్రత్యే క రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ సంపత్రావు, డీఎఫ్ఓ కిషన్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేశ్, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఆదివాసీ సంఘాల నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
చకచకా ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల దిశగా కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 1న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించింది. ఈనెల 10న పోలింగ్ కేంద్రాల వారీగా సవరించిన ఓటరు జాబితాను వెల్లడించేందుకు అధికార యంత్రాంగం సీరియస్గా కసరత్తు చేస్తోంది. ఈ సమయంలో ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్న చర్చ శనివారం నుంచి జోరందుకుంది. అందుకు తగినట్లుగా ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల లెక్కింపు.. కేంద్రాల గుర్తింపు గత నెల 30న ముసాయిదా జాబితా ప్రకటించగా.. ఈ నెల 10న తుది జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లోని వార్డుల్లో పోలింగ్ కేంద్రాల గు ర్తింపు ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. ఓటరు జాబితా తయారీ, ప్రచురణ నోటిఫికేషన్లో భాగంగా మున్సిపాలిటీల వారీగా 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా, ఎస్సీ, ఎస్టీల జనాభా వివరాలు కూడా ఇచ్చారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణనచేసి.. వీటి ఆధారంగానే రిజర్వేషన్లను నిర్ణయించే అవకాశం ఉంటుందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న మహబూబాబాద్, నర్సంపేట, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ, జనగామ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి మున్సిపాలిటీలతోపాటు కొత్తగా కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలకు కూడా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. నేడు రాజకీయ పార్టీలతో భేటీ... ‘గ్రేటర్’ ఎన్నికలు ఏప్రిల్ తర్వాతే? మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వేగం పెంచింది. ఓటరు జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై రోజూ జిల్లా ఉన్నతాధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆరా తీస్తోంది. కాగా, షెడ్యూల్ ప్రకారం ఓట రు జాబితా తయారీ, ప్రచురణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం మున్సిపాలిటీ ముసాయిదాపై రాజకీయ పార్టీల నాయకులతో ఉన్నతాధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లోని 2 మున్సిపాలిటీల పాలకవర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉండడంతో వాటిని ఎన్నికల నుంచి మినహాయించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ వ రంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు ఏప్రిల్ తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు 11న లేదా 20న నోటిఫికేషన్..? అధికారులకు సంకేతాలు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల ముసాయిదామౌలిక వసతులు ఉన్న వాటినే పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేయనున్నారు. గత ఆగస్టులో కేంద్రాలను గుర్తించగా, తిరిగి అవి ఆయా వార్డుల పరిధిలోకి వస్తాయా రావా అనేది అధికారులు మరోసారి పరిశీలించి ఎంపిక చేయనున్నారు. వార్డుల్లో ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా రెండు కేంద్రాల ఏర్పాటుపైనే అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఈ నెల 10న వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటరు ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. కేంద్రాల ఏర్పాటుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అయా మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య, 2011 లెక్కల ప్రకారం జనాభామున్సిపాలిటీ వార్డుల మొత్తం ఎస్టీలు ఎస్సీలు సంఖ్య జనాభా పరకాల 22 34,318 472 8,262 నర్సంపేట 30 51,086 4,397 7,110 వర్ధన్నపేట 12 13,732 3,980 2,470 జనగామ 30 52,408 1,694 8,335 స్టేషన్ఘన్పూర్ 18 23,483 962 6,663 భూపాలపల్లి 30 57,138 4,464 11,966 మహబూబాబాద్ 36 68,889 14,220 9,709 డోర్నకల్ 15 14,425 3,536 2,866 కేసముద్రం 16 18,548 3,754 2,418 మరిపెడ 15 17,685 7,635 3,062 తొర్రూరు 16 19,100 2,093 3,985 ములుగు 20 16,533 1,844 2,470 మొత్తం 260 3,87,345 49,051 69,316 -
పవర్ జనరేట్ హుళక్కేనా?
ఏటూరునాగారం: గోదావరి నదిపై నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో 2019లో సమ్మక్క బ్యారేజీకి ఆనుకొని పవర్ జనరేట్ ప్రాజెక్టు ఏర్పాటుకు రూపకల్పన చేశారు. పాలకులు, జెన్కో అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ ఉత్పత్తి తయారీ హుళక్కేనా అన్నట్లుగా మారింది. పవర్ ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో సమ్మక్క బ్యారేజీకి సమీపంలో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఇరిగేషన్ అధికారులు సివిల్ వర్క్ను పూర్తి చేశారు. డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టును సైతం జెన్కోకు సమర్పించి ఆరేళ్లు అవుతుంది. అయినా ఇంతవరకు ఒక అడుగు ముందుకు పడని పరిస్థితి నెలకొంది. 59 గేట్లు మూసివేస్తే.. 6.5 టీఎంసీల నీరు నిల్వ 12 టర్బెన్లను అమర్చి 250 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే పవర్ జనరేట్ ప్రాజెక్టుపై గత, ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు బ్యారేజీలోని 59 గేట్లు మూసివేస్తే 6.5 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. గోదావరిలో ప్రవహించే నీటితో హైడల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి పవర్ జనరేట్ చేసే విధంగా టర్బన్స్ ఇతర పనిముట్లను అమర్చాల్సి ఉంది. దీంతో తయారయ్యే విద్యుత్ను పవర్ గ్రిడ్కు తరలిస్తే ఇతర రాష్ట్రాల నుంచి 250 మెగావాట్ల విద్యుత్ను అరువు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. హైడల్ ప్రాజెక్టులపై ఆసక్తి చూపని జెన్కో గోదావరిలో ప్రవహించే జలాలతో హైడల్ ప్రాజెక్టును పూర్తి చేసి నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో అప్పట్లో రూ.3 వేల కోట్లను పవర్ జనరేషన్ కోసం ప్రభుత్వం కేటాయించింది. గోదావరి జలాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ దానిపై అధికారులు మొగ్గుచూపడం లేదు. కన్నాయిగూడెంలోని ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ వర్క్ పూర్తి అయినపప్పటికీ అందులో పవర్ ప్లాంట్ను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవర్ జనరేట్ చేసేందుకు అనువైన స్థలం, నీటి సామర్ధ్యం ఉన్నా కూడా జెన్కో అధికారులు ఆసక్తి చూపకపోవడం, పాలకులు పట్టించుకోకపోవడం ఏజెన్సీ ప్రజలకు శాపంగా మారింది. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం తుపాకులగూడెం బ్యారేజీ పక్కనే ఉన్న పవర్ జనరేషన్ ప్లాంట్పై దృష్టి సారించి పనులు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి తయారీ పనులు మొదలు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. సివిల్ వర్క్ పూర్తిచేసి డీపీఆర్ అందజేత ఆరేళ్లు అయినా పట్టించుకోని జెన్కో అధికారులు -
కిక్కిరిసిన మేడారం
భక్తజనంతో మేడారం పరిసరాలు కిక్కిరిశాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. తల్లులకు ఎదుర్కోళ్లు, యాటపోతులు, ఎత్తు బంగారం, పసుపు కుంకుమ, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ సమ్మక్క గద్దె వద్ద భక్తులు..మొక్కులు చెల్లించేందుకు గద్దెల వద్ద బారులుదీరిన భక్తులుకిక్కిరిసిన జనంతో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం -
భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన
మంగపేట: మండలంలోని బోరునర్సాపురంలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా భక్తులు భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ వెంకటేశ్వరస్వామి చిత్రపటం, కలశంతో గోవింద నామస్మరణ చేస్తూ ఆలయం నుంచి ఏటూరునాగారం–బూర్గపాడు ప్రధాన రోడ్డు మీదుగా ఉమాచంద్ర శేఖరస్వామి ఆలయం, పాతనర్సాపురం మీదుగా తిరిగి ఆలయం వరకు నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర సంకీర్తన చేపట్టిన భక్తులకు గ్రామస్తులు మంగళహారతితో ఎదురేగి బిందెలతో నీల్లారపోసి స్వామివారికి స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న నగరసంకీర్తన భక్తుల బృందం ఆలయంలో శ్రీ వెంకటేశ్వరస్వామిని ఆరాధిస్తూ భజన చేస్తూ పాటలు పాడారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజారి జీడికంటి మధుసూదనాచార్యులు భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆదివారం ఆలయంలో ఉదయం 8 నుంచి స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించనున్నట్లు పూజారి మధుసూదనాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నర్రా శ్రీధర్, గౌరవ అధ్యక్షుడు దేవకి, కరి వెంకాయమ్మ, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ వెంకటేశ్వర్లు, కోశాధికారి పూసాల సరోజీ, భక్తులు నాగేశ్వర్రావు, కడియాల సుదర్శన్, కొత్త శ్రీనివాస్, గుజ్జుల కోటిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
యూరియా పంపిణీపై అసహనం
ములుగు రూరల్: యాసంగి సాగుకు సరిగా యూరియా పంపిణీ చేయకపోవడంతో ఓ రైతు అసహనానికి గురై రెండు బస్తాల యూరియాను పెట్రోల్ పోసి తగలపెట్టి నిరసన తెలిపాడు. ఈ ఘటన శనివారం మల్లంపల్లి మండలం దేవనగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 450 యూరియా బస్తాల పంపిణీ చేపట్టారు. గ్రామానికి చెందిన గుడెళ్లి హరీశ్ లైన్లో నిలబడి రెండు బస్తాల యూరియా తీసుకున్నాడు. ప్రస్తుతం మొక్కజొన్నకు యూరియా అవసరం ఉందని తనకు ఇంకా కావాలని అడుగగా లేవని తెలిపారు. దీంతో హరీశ్ అధికార పార్టీ నాయకులు పదుల సంఖ్యలో బస్తాలు తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. సాధారణ రైతులకు మాత్రం రెండు బస్తాలు ఇస్తున్నారని ఆరోపించారు. దీంతో అసహనికి గురైన హరీశ్ గ్రామంలోనే తను తీసుకున్న యూరియా బస్తాలపై పెట్రోల్పోసి నిప్పు అంటించారు. సమ్మక్కసాగర్లో రొయ్య పిల్లల విడుదల కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం సమ్మక్కసాగర్ బ్యారేజీలో రొయ్య పిల్లలను శనివారం విడుదల చేశారు. మత్స్యశాఖ అధికారులు సబ్సిడీ రొయ్య పిల్లలను అందించగా పెసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్ వాటిని గిరిజన సొసైటీ కమిటీ, సర్పంచ్ పీరీల స్వప్న ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వప్న మాట్లాడుతూ గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం సబ్సిడీపై రొయ్య పిల్లలను అందజేస్తుందని వివరించారు. హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీమంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయంలో సందడి నెలకొంది. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో పాటు మేడారం వెళ్లివచ్చే భక్తులు సైతం స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి నువ్వులనూనెతో తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు, పూలతో అలంకరించారు. దర్శించుకున్న భక్తుల గోత్ర నామాలతో అర్చనలు జరిపించి స్వామివారి చరిత్రను వివరించారు. నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని గొత్తికోయగూడెం తొర్రిచింతలపాడుకు చెందిన నిరుపేదలకు శనివారం యూత్ ఫర్ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు దుప్పట్లు, సోలార్ లైట్లు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు కోటి మాట్లాడారు. చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేయడం మరు వలేనిదన్నారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి అయిలయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉప సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఒగ్గు పదం.. డోలు పాదం
ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్ ఒగ్గు రవి బృందం ఈ నెల26న ఢిల్లీ పరేడ్లో ప్రదర్శన ఇవ్వనుంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నుంచి వీరికి ఆహ్వానం అందింది. ఈనెల 8న ఢిల్లీ వెళ్లి అక్కడే 25 వరకు రిహార్సల్స్ చేసి 26న ఢిల్లీ కర్తవ్యపథ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతంలో మొదలైన వీరి ఒగ్గుడోలు విన్యాసం తొలిసారి ఢిల్లీ పరేడ్లో ఆకట్టుకోనుంది. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. మండలంలోని మాణిక్యాపురానికి చెందిన ఒగ్గు కథ పితామహుడు చుక్కా సత్తయ్య కథకు డోలు విన్యాసం తోడై అనేక ప్రదర్శనలతో దేశవిదేశాల్లో ఎన్నోసార్లు కళాకారులు డోలు విన్యాసాన్ని ప్రదర్శించారు. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని అదే గ్రామానికి చెందిన చౌదరిపల్లి రవికుమార్ అలియాస్ ఒగ్గు రవి పుణికి పుచ్చుకుని ప్రదర్శనలు ఇస్తున్నారు. డోలు విన్యాసంలో ఓంకారం, సమ్మెట, పాంచ్పటాకా, తాండవం, శిఖరం, కోలాటం ఇలా అనేక రకాల డోలు విన్యాసాలతో పాటు దశావతారాలు, పోతరాజులు, శివసత్తులు, విష్ణురూపం, శివశక్తుల విన్యాసం వంటి అనేక ప్రదర్శనల్లో దాదాపు 5 వేల మంది యువకళాకారులకు శిక్షణ ఇచ్చారు. దేశవిదేశాల్లో 26 ఏళ్లుగా ప్రదర్శనలు.. ఒగ్గు రవి, బృందం సుమారు 26 ఏళ్లుగా దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చింది. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్, తాజ్ ఉత్సవాలు, అంతర్జాతీయ వేదికలతో దేశంలోని పలు రాష్ట్రాల్లో తమ ప్రదర్శనలిచ్చారు. అంతేకాకుండా స్పెయిన్, మలేషియా, న్యూజిలాండ్, సింగపూర్, దోహ వంటి తదితర 12 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. కాగా, ఢిల్లీ పరేడ్లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు తెలంగాణ నుంచి 30 మంది కళాకారుల బృందం వెళ్తుండగా.. జనగామ జిల్లా నుంచి చౌదరిపల్లి రవికుమార్, మరికుక్కల అశోక్, గువ్వల మధు ఉన్నారు.విన్యాస శిక్షణకు న్యాయం జరిగింది.. ఎన్నో ఏళ్లుగా ఒగ్గుడోలు ప్రదర్శనలో ఉస్తాద్ ఒగ్గు రవి ఇచ్చిన శిక్షణకు న్యాయం జరిగింది. ఇంతటి అవకాశం కల్పించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మా గురువైన ఒగ్గు రవి కష్టానికి తగిన ఫలితం దక్కింది. మేమంతా అక్కడ విన్యాసాలు చేయనుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది.ఆనందంగా ఉంది.. ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు అవకాశం రావడం ఆనందంగా ఉంది. దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చాం. కానీ, ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎదుట ప్రదర్శనలు ఇచ్చే అవకాశం రావడం సంతోషంగా ఉంది. భారత ప్రభుత్వానికి, తెలంగాణకు రుణపడి ఉన్నాం. ఉపరాష్ట్రపతితో ఒగ్గుడోలు కళాకారులు (ఫైల్)అస్సలు ఊహించలే.. గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసానికి అవకాశం దక్కుతుందని అస్సలు ఊహించలే. ఎన్నో చోట్ల ప్రదర్శనలు ఇచ్చాం. ఇలాంటి అవకాశం రావడం సంతోషం. భవిష్యత్లో మరెన్నో అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాం. – మరికుక్కల అశోక్, మాణిక్యాపురం, ఒగ్గుడోలు కళాకారుడు ●ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన– ఒగ్గు, రవికుమార్, మాణిక్యాపురం (ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ జాతీయ పురస్కార గ్రహీత) సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శం ఆర్చ్ స్తంభాలపై ఏర్పాటు చేస్తున్న పీటీ బీమ్గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు ప్రదర్శనకు ఓరుగల్లు కళాకారులు మాణిక్యాపురం కళాకారుడు ఒగ్గు రవి బృందానికి అందిన ఆహ్వానం జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపునకు అవకాశం 8న ఢిల్లీకి వెళ్లనున్న కళాకారుల బృందం.. 25వ తేదీ వరకు రిహార్సల్స్ -
జాతర పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతరకు ముందస్తుగానే అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. మేడారం ఆలయ పరిసరాల్లో చేపట్టిన పునరుద్ధరణ, ల్యాండ్ స్కేపింగ్ పనులను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో జాప్యం జరగకుండా వేగం పెంచాలన్నారు. నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఆలయ పరిసరాల్లో చేపట్టిన ల్యాండ్ స్కేపింగ్ సుందరీకరణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునే విధంగా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. పచ్చదనంతో ప్రతిబింబించేలా మొక్కలు నాటడం, నడక మార్గాలను, విశ్రాంతి ప్రదేశాలుగా రూపొందించాలన్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రాకారపు రాతి స్తంభాలపై బ్రాకెట్లు, ప్రధాన ఆర్చి రాతి స్తంభాలపై పీటీ బీమ్లు వెంటనే అమర్చాలని ఆదేశించారు. జాతర ప్రారంభానికి ముందుగా అన్ని నిర్మాణాలు, సుందరీకరణ పనులను పూర్తి చేయాలన్నారు. వనదేవతల దర్శనానికి లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణం, జంపన్నవాగు పరిసరాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో పరిశుభ్రత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహాజాతరను సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


