breaking news
Mulugu
-
ఈద్ కా తోఫా పంపిణీ
కాళేశ్వరం(మహదేవపూర్): రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేసిన ఈద్ కా తోఫాను మహదేవపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రతీ ఒక్కరు సోదరాభావంతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హసీనాఅక్బర్ఖాన్, మసీదుల సదర్లు తాజోద్దీన్, ముజుఖాన్, మాజీ మసీద్ కమిటీ సదర్ దయాజ్ఖాన్, నాయకులు వామన్రావు, ఉప సర్పంచ్ శ్రీజ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
నిరుపయోగంగా..
ఏటూరునాగారం: జిల్లాలో మొక్కల పెంపకమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం బృహత్ పల్లె ప్రకృతి వనాలను రూ. 20ల వరకు ఖర్చు చేసి ఏర్పాటు చేసింది. అవి ఇప్పుడు పశువులకు కేంద్రాలుగా, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. 2023లో సర్పంచ్ల ఆధీనంలో ఉన్న పల్లె ప్రకృతి వనాలను అభివృద్ధి చేసేందుకు ఎన్ఆర్ఈజీఎస్ కింద నిధులు మంజూరు చేశారు. దీంతో జిల్లాలోని 9 మండలాల్లో 25 బృహత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీల పరిధిలోని కూలీలతో మొక్కలను నాటించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. వనాల్లో మొక్కల పెంపకం లక్షల రూపాయలు ఖర్చు చేసి బోరు, డ్రిప్, విద్యుత్ మోటారు, పైపులైన్లు ఇలా అనేక రకాల వసతులు కల్పించినట్లు లెక్కలు చూపి డబ్బులు సైతం తీసుకున్నారు. అయినా అవి ఉపయోగంలోకి రాలేదు. బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో వాకింగ్ ట్రాకర్స్, గార్డెనింగ్, మొక్కల పెంపకంతో పాటు ఇతర పండ్ల మొక్కలను నాటించేందుకు అప్పడు ప్రణాళికలను రూపొందించారు. పనులు చేపట్టిన సర్పంచులు మధ్యలోనే వాటిని వదిలేసి నిధులు కాజేశారు. ప్రభుత్వం మారడంతో పాటు సర్పంచ్లు సైతం వేరే వారు రావడంతో వాటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారించాలి.. బృహత్ పల్లె ప్రకృతి వనాలు అన్ని మండల కేంద్రాల్లో రోల్మోడల్గా ఉండేలా చూడాలని అప్పటి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి వాటి నిర్వహణ గు రించి పట్టించుకోకపోవడంతో అవి మరుగున పడ్డా యి. వాకింగ్ ట్రాక్, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా గార్డెనింగ్, కూర్చునేందుకు బేంచీలు, పండ్ల తోటలు, రక రకాల పూల మొక్కలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అప్పటి సర్పంచ్లు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వాటిని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాటి నిర్వహణపై దృష్టి సారించలేదు. దీన్నే అదునుగా భావించిన కొ ంతమంది పల్లె ప్రకృతి వనాల భూములు కబ్జాకు పాల్పడుతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో మళ్లీ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలి. కోతులకు ఫుడ్ కోర్ట్లు ఏర్పాటు చేయాలి. అడవుల్లో ఎలాంటి పండ్లు లభించకపోవడంతో కోతులు గ్రామాల్లోకి వచ్చి దాడులు చేస్తున్నాయి. పండ్ల మొక్కలను పెంచి వాటికి ఆహారం వేయడంతో పాటు మంచి ఆహ్లాదకరమైన గార్డెన్లను తయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. – గండెపల్లి నర్సయ్య, సామాజికవేత్త, ఏటూరునాగారం●పలు చోట్ల బృహత్ పల్లెప్రకృతి వనంలోని భవనాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. మద్యం సేవించి ఖాళీ సీసాలు, ఇతర పదార్థాలను అక్కడే పడేస్తున్నారు. పోలీసులు, ఈజీఎస్, గ్రామ పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పోకిరీలు, ఆకతాయిలకు అడ్డాగా మారాయి. అలా గే గంజాయి, కొకెన్ వంటి మత్తు పదార్థాలను కూ డా అక్కడ వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారిస్తే ఆహ్లాదకరమైన వాతావరణం ప్రజలకు దొరుకుతుందని ప్రజలు కోరుతున్నారు. కబ్జాలకు గురవుతున్న భూములు మందుబాబులకు అడ్డాగా మారిన వైనం పట్టించుకోని అధికారులు -
రామప్పలో నీతి ఆయోగ్ అధికారి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేటలో గల రామప్ప దేవాలయాన్ని నీతి ఆయోగ్ గ్రేడ్ వన్ అధికారి కృష్ణన్గోపాల్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఉమాశంకర్ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ శాలువాతో వారిని సత్కరించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ విశిష్టత గురించి టూరిజం గైడ్ గోరంటల విజయ్ కుమార్ వివరించారు. వారి వెంట నీతి ఆయోగ్ జిల్లా కోఆర్డినేటర్ రవిష్, దేవాదాయ శాఖ సిబ్బంది అవినాష్, సంతోష్, టూరిస్ట్ పోలీస్ అరుణ్ తదితరులు ఉన్నారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించారు. పాఠశాల భవనం మంజూరు చేయాలని వినతి కన్నాయిగూడెం: మండల పరిధిలోని బుట్టా యిగూడెం గ్రామ పంచాయతీ పరిఽధిలోని కొ త్తూరులో గల పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఈ మేరకు గ్రామస్తులు సర్పంచ్ దృష్టికి సమస్యను పలుమార్లు తీసుకురావడంతో గ్రామ సర్పంచ్ జాడి రాంబాబు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ దివాకరను గురువారం కలిసి భవనం మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ తక్షణమే నిధులు విడుదల చేసి భవన నిర్మాణం చేపడుతామని తెలిపారని వివరించారు. కండక్టర్తో వాగ్వాదం ● భార్యాభర్తలపై కేసు నమోదు భూపాలపల్లి అర్బన్: డబ్బుల విషయంలో ఆర్టీసీ కండక్టర్తో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వాగ్వాదం చేసిన భార్యాభర్తలపై కేసు నమోదైన ఘటన భూపాలపల్లిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై సాంబమూర్తి, కండక్టర్ ఎం.యమున తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్–2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హనుమకొండ నుంచి భూపాలపల్లికి వస్తుండగా పరకాలలో సులోచన అనే ప్రయాణికురాలు తన భర్తతో కలిసి బస్సు ఎక్కింది. కండక్టర్కు రూ.100 ఇచ్చి తన భర్తకు భూపాలపల్లి రూ.70 టికెట్ తీసుకోగా.. రూ.30 టికెట్పై కండక్టర్ రాసింది. చెల్పూర్లో బస్సు ఎక్కిన మరో ప్రయాణికుడు రూ.500 ఇచ్చి భూపాలపల్లికి రూ.30 టికెట్ తీసుకోగా.. 470 రూపాయలు టికెట్ వెనుకవైపు కండక్టర్ రాశారు. భూపాలపల్లిలో దిగిన తర్వాత ఇద్దరికి కలిపి రూ.500 కండక్టర్ ఇచ్చింది. దీంతో సులోచన తన రూ.30 తనకే ఇవ్వాలని కండక్టర్తో వాగ్వాదానికి దిగింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ విషయాన్ని కండక్టర్ బస్స్టేషన్ కంట్రోలర్కు తెలియజేయగా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో 100కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కండక్టర్, మహిళా ప్రయాణికురాలిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. కండక్టర్ ఫిర్యా దు చేయగా ప్రయాణికురాలు సులోచన, అమె భర్తపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ భూపాలపల్లి అర్బన్: కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో నిందితుడు కీర్తి అక్షిత్కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసినట్లు సీఐ నరేష్కుమార్ తెలిపారు. 2024 సంవత్సరంలో పట్టణంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన అక్షిత్పై పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో అతనిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. కోర్టు కేసులకు సంబంధించిన నిందితులు కోర్టు ఇచ్చిన వాయిదా తేదీలకు తప్పనిసరిగా హాజరు కావాలని, లేకపోతే కోర్టు జారీచేసే వారెంట్ల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. -
పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
ములుగురూరల్: గ్రామ పంచాయతీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని ఇంచర్ల ఎంఆర్ గార్డెన్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంపై జిల్లాలోని సర్పంచ్లు, కౌన్సిలర్లకు కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవచేయాలన్నారు. గ్రామసభలు నిర్వహించి పంచాయతీ నిధులను ఖర్చు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు రూ. 600కోట్లను మంజూరు చేసిందని మరో రూ.1200 కోట్లు మంజూరు చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పంచాయతీలకు ఒక వెయ్యి 3కోట్ల రూపాయలను కేటాయించిందని వెల్లడించారు. గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రూ.50 కోట్లు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. శిక్షణ తర్వాత సర్పంచ్లు, కౌన్సిలర్లు తూచ తప్పకుండా సూచనలు పాటించాలన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లది కీలక పాత్ర అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 15 మంది ప్రత్యేక వైద్య నిపుణులు వైద్యసేవలు అందిస్తున్నారని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. దివ్యాంగులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ధ్రువీకరణ పత్రం స్థానంలో యూడీఐడీకార్డు ప్రవేశపెట్టిందని వివరించారు. యూడీఐడీకార్డు కోసం మీసేవ కేంద్రాల్లో స్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, గ్రంథాల య సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ, ఆర్డీఓ వెంకటేశ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.ఏటూరునాగారం: ఏజెన్సీలోని గిరిజన విద్యార్థుల్లో వెలుగులు నింపేందుకు అడవిలో కంటైనర్ స్కూల్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. మండల కేంద్రంలోని అల్లంవారిఘణపురం పంచాయతీ పరిధిలోని గుర్రాలబావిలో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ వారి సహకారంతో ఈ కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలను కలెక్టర్ దివాకర, ఎస్పీ రాంనాథ్ కేకన్లతో కలిసి మంత్రి గురువారం ప్రారంభించి మాట్లాడారు. అవకాశాలు లేని చోట కొత్త వనరులను సృష్టించడమే లక్ష్యమన్నారు. పేదలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని వివరించారు. కంటైనర్ పాఠశాలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు, బాత్రూమ్లను కూడా నిర్మించినట్లు వివరించారు. అటవీప్రాంతాల్లో ఉన్న గిరిజనులను విద్యావంతులు చేసేందుకు ఈ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని వెల్లడించారు. అడవిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు అటవీశాఖ అనుమతి ఇవ్వనందున ఇలాంటి పాఠశాలను ఏర్పాటు చేసుకొని విద్యను అందించాల్సి వస్తుందని వివరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై గిరిజనులు సీతక్కకు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, ఆత్మ చైర్మన్ కర్ల అరుణ, రొయ్యూర్ సర్పంచ్ కావిరి అర్జున్, అల్లంవారిఘనపురం సర్పంచ్ మహాలక్ష్మీ, రామన్నగూడెం సర్పంచ్ నవీన్, నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, గుడ్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క -
‘పర్యాటక ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలి’
వెంకటాపురం(ఎం): పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజి, సీఆర్ఎంవైఆర్కే రాజు అన్నారు. ఈ మేరకు ప్రజాపాలన 99రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప చెరువు బోటింగ్ పాయింట్ వద్ద శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటక ప్రదేశాలను పరిశుభ్రంగా మార్చాలన్నారు. పర్యాటక ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆకర్షణీయంగా ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్టీడీసీ ఏఈ విజయ్ కుమార్, టూరిజం గైడ్స్ గోరంటాల విజయ్ కుమార్, వెంకటేశ్, టూరిస్ట్ పోలీసులు అరుణ్, దశరథం, బోటింగ్ ఇన్చార్జ్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ తరలింపు
ఏటూరునాగారం: మండల పరిధిలోని ముళ్లకట్ట బ్రిడ్జి నుంచి కొంత మంది రాత్రి సమయంలో ఇసుకను ఎలాంటి అనుమతి లేకుండా లారీల్లో తరలిస్తున్నట్లు సమాచారం. ఇసుకను ముందుగా ట్రాక్టర్ల ద్వారా లోడ్ చేసుకొని ఒక రహస్య ప్రదేశంలో నిల్వ చేసి రాత్రి సమయాల్లో టిప్పర్లు, లారీల్లో వరంగల్కు తరలిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ సమాచారం రెవెన్యూ, టీఎస్ఎండీసీ అధికారులకు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ముళ్లకట్ట బ్రిడ్జికి సమీపంలో ఎలాంటి ఇసుక తవ్వకాలు జరపవద్దని గతంలో 163 జాతీయ రహదారి అథారిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక తవ్వకాల వల్ల బ్రిడ్జికి ప్రమాదం ఉందని ముందుగానే హెచ్చరించారు. కానీ కొంత మంది డబ్బుల లాభాపేక్ష కోసం ఇసుకను తవ్వుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై తహసీల్దార్ జగదీశ్ను వివరణ కోరగా ముళ్లకట్ట వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో రాత్రి సమయాల్లో పట్టుకునేందుకు ప్రయత్నించగా ట్రాక్టర్లు దొరకలేదు. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకొని ఇసుక అక్రమ రవాణాదారులపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని వివరించారు.అనుమతి లేకుండానే ముళ్లకట్ట బ్రిడ్జి నుంచి రాత్రివేళల్లో రవాణా -
ఎండలోనే.. 108 బైక్లు
ఐటీడీఏ భవనం వెనుక ఎండలో ఉన్న 108 బైక్లు ఏటూరునాగారం: ఆపదలో ఉన్న క్షతగాత్రులను ఆదుకోవాల్సిన వాహనాలు ఎండలో ఎండుతున్నాయి. మహాజాతరలో అత్యవసర సేవల నిమిత్తం తీసుకొచ్చిన 108 బైక్లపై అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు అత్యవసర సేవలను అందించడానికి రాష్ట్రంలోని భద్రాచలం, మన్ననూరు, ఉట్నూరు ఐటీడీఏ పరిధి నుంచి సుమారు 108 ద్విచక్ర వాహనాలు మేడారానికి తీసుకొచ్చారు. జాతర ముగిసి రెండు నెలలు కావస్తున్నా ఇంత వరకు ఆ వాహనాలను పట్టుకెళ్లడం లేదు. ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయం వెనుక 108 బైక్లు ఎండలోనే ఉండడంతో బ్యాటరీలు సైతం పక్కకు తీసి పెట్టారు. క్రమంగా బ్యాటరీల చార్జింగ్ కూడా దిగిపోతుంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. ఈ విషయంపై ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ను వివరణ కోరగా రోడ్డు రవాణా, హెల్త్ అధికారులకు సమాచారం ఇచ్చామని, త్వరలోనే బైక్లను పంపించే ఏర్పాటు చేయిస్తామని వివరించారు. మేడారం మహాజాతరకు తీసుకొచ్చిన ద్విచక్ర వాహనాలు డిచార్జ్ అవుతున్న బ్యాటరీలు పట్టించుకోని అధికారులు -
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
● జీసీడీఓ రజితవెంకటాపురం(కె)/వాజేడు: పదోతరగతి విద్యార్థినులు వందశాతం ఉత్తమ ఫలితాలు సాధించాలని జీసీడీఓ రజిత సూచించారు. మండల పరిధిలోని కస్తూర్భాగాంధీ పాఠశాలను ఆమె గురువారం సందర్శించారు. పాఠశాలలోని పరిసరాలను, కిచెన్ రూమ్, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీసీడీవో మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థినులు పరీక్షల సమయంలో భయాందోళనకు గురికావద్దన్నారు. ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. చదువుల్లో రాణించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. 8వ తరగతిలో ఎన్రోల్మెంట్ పెంచేలా చర్యలు తీసుకోవాలని టీచర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి శిరీష తదితరులు పాల్గొన్నారు. అనంతరం వాజేడు మండల పరిధిలోని జంగాలపల్లి కేజీబీవీని జీసీడీఓ రజిత సందర్శించారు. కలెక్టర్ దివాకర అందించిన విజయపథ సందేశ పత్రాలను విద్యార్థులకు ఎంఈఓ వెంకటేశ్వరరావుతో కలిసి అందజేశారు. పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని పలు సూచనలు చేశారు. అనంతరం టీచింగ్ స్టాఫ్ యాక్షన్ ఫ్లాన్ ఉపాధ్యాయుల డైరీలతో పాటు స్టోర్రూమ్, కిచెన్గార్డెన్, వాష్రూమ్లను పరిశీలించారు. -
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
ఎస్ఎస్ తాడ్వాయి: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్కుమార్ తెలిపారు. మండల పరిధిలోని మేడారంలో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా మైపతి అరుణ్కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితాలో ఉంచడం ద్వారా ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఇప్పటికే దేశవ్యాప్తంగా లంబాడీలను ఎస్టీ జాబితాలోనే కొనసాగించేలా రాజకీయ కుట్రలు చేస్తుందని తెలిపారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వివరించారు. సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో ఆదివాసీలు ఐక్యతతో ఉద్యమించాలన్నారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర కమిటీలను ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడిగా ఈసం సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా పోడెం బాబు, కల్తీ వీరస్వామి, కార్యదర్శులుగా చంద రఘుపతిరావు, సోయం రాజేందర్, కొడెం వెంకటేశ్వర్లులను ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా మైపతి అరుణ్కుమార్, ప్రధాన కార్యదర్శులుగా గుర్రాల రవీందర్, కుడిమెత తిరుపతి, ఉపాధ్యక్షులుగా పొదెం రామ్మూర్తి, సోయం జంగు, అలెం కోటి, కొడప నగేశ్, ఉయిక సుదర్శన, పడిగ నాగేశ్వర్రావు, కార్యదర్శులుగా దారబోయిన రమేశ్, సోయం విక్రమ్ తదితరులు ఎన్నికయ్యారు. అనంతరం వారు సమ్మక్క– సారలమ్మలను దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి, ప్రధాన కార్యదర్శి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్కుమార్ -
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
కన్నాయిగూడెం: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలని నీతిఆయోగ్ కన్సల్టెంట్ అధికారి కృష్ణన్గోపాల్ తెలిపారు. మండలంలో నీతిఆయోగ్ సంపూర్ణ అభియాన్ 2.0 ఆస్పీరేషనల్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని రాజన్నపేట, దేవాదుల గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. ఆస్పీరేషనల్ బ్లాక్లో చేపట్టిన ఆరు ఇండికేటర్లను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. నిరుపేదల అభ్యున్నతికి అధికారులు అహర్నిశలు పాటుపడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 6 నెలల నుంచి ఆరేళ్ల పిల్లలకు పౌష్టికాహారం అందిస్తే ఆరోగ్యంగా పెరుగుతారని వివరించారు. అనంతరం ముప్పనపల్లిలోని అంగన్వాడీ కేంద్రాలతో పాటు కేజీబీవీలోని మరుగుదొడ్లు, తాగునీరు, విద్యార్థినులకు అందిస్తున్న ఆహార పదార్థాలు, వివిధ వసతులను పరిశీలించారు. అలాగే కంటైనర్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న బోధన పద్ధతి తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ప్రేమలత, తహసీల్దార్ సర్వర్ పాషా, మండల అభివృద్ధి అధికారి సాజిదా బేగం, ఎంఈఓ సాంబశివరావు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.నీతిఆయోగ్ కన్సల్టెంట్ అధికారి కృష్ణన్గోపాల్ -
మళ్లీ జనగణన
సాక్షి ప్రతినిధి, వరంగల్: దేశవ్యాప్తంగా త్వరలో జనగణన చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనాభా వివరాలపై మళ్లీ చర్చ మొదలైంది. చివరిసారిగా 2011లో జరిగిన జనగణనలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం జనాభా 35,12,576గా నమోదైంది. వాస్తవానికి మళ్లీ 2021లో జనగణన చేపట్టాల్సింది. కరోనాతో అది జరగలేదు. అప్పటి నుంచి 15 ఏళ్లలో జనాభా గణనీయంగా పెరిగినట్లు అంచనాలు చెబుతున్నాయి. అధికారిక గణాంకాలు వెలువడితే ఉమ్మడి జిల్లాలో జనాభా 38 లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత మొదటిసారి.. ఉమ్మడి వరంగల్ను హనుమకొండ, వరంగల్ , జనగామ, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలుగా విభజించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరగనున్న ఇది మొదటి పూర్తిస్థాయి జనగణన కావడం విశేషం. కాగా, కొత్త జిల్లాల వారీగా మొదటి పూర్తి డేటా జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మొదటిసారిగా జరగనున్న ఈ జనగణనలో ప్రతి జిల్లాకు విడిగా పూర్తి గణాంకాలు వెలువడనున్నాయి. దీంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం అందనుంది. దశాబ్దంలో పెరిగిన పట్టణీకరణ.. 2011 గణాంకాల ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత దశాబ్దంలో పట్టణీకరణ వేగంగా పెరిగింది. ముఖ్యంగా వరంగల్–హనుమకొండ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పట్టణాలకు వలసలు, విద్య అవకాశాలు, పరిశ్రమలు, ప్రభుత్వ ఉద్యోగాలు పెరగడమే ఇందుకుకారణమని చెబుతున్నారు. డిజిటల్గా జనగణన.. జనగణన ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా కాగితపు దరఖాస్తుల స్థానంలో సర్వేయర్లు మొబైల్ యాప్ల ద్వారా సమాచారాన్ని నమోదు చేయనున్నారు. దీంతో డేటా సేకరణ వేగంగా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. జనగణనలో ప్రతి ఇంటి కుటుంబ వివరాలు, విద్యస్థాయి, ఉద్యోగం, గృహ పరిస్థితులు తదితర అంశాలను నమోదు చేస్తారు. కొత్తగా ఆన్లైన్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసే అవకాశం కూడా కల్పించే యోచన ఉంది. కాగా, సర్వేలో ఇల్లు, కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సు, లింగం, విద్యస్థాయి, ఉద్యోగం/వృత్తి, ఇల్లు సొంతమా అద్దెనా, తాగునీరు, మరుగుదొడ్డి వంటి సదుపాయాలు.. తదితర 33 ప్రశ్నలతో వివరాలు సేకరించనున్నారు. రెండు విడతల్లో జనగణన సర్వే జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు.. ఎన్యుమరేటర్లకు శిక్షణ ఉమ్మడి వరంగల్లోని 6 జిల్లాల్లో పకడ్బందీగా జనగణన చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ దశ 11 మే 2026న ప్రారంభమై 9 జూన్ 2026 వరకు కొనసాగుతుంది. రెండో దశలో జనాభా గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియ ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తారు. 1 మార్చి 1 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారు. కాగా, రెండు విడతల్లో చేపట్టే జనగణనలో ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది సర్వేయర్లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వారందరికీ మంగళవారం నుంచి మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా రెవెన్యూ అధికారి, డీఎఫ్ఓ, ఆర్డీ ఓలు, వరంగల్ మహానగర పాలకసంస్థ, ము న్సిపల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర జిల్లాస్థాయి అధికారులు పాల్గొంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మొదటిసారి వివరాల నమోదు ఉమ్మడి వరంగల్ జిల్లా జనాభా 38 లక్షలు దాటే అవకాశం పట్టణీకరణతో వరంగల్, హనుమకొండలో జనాభా భారీగా పెరుగుదల -
సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
వాజేడు: మండల పరిధిలోని రాంపురం గ్రామంలో బుధవారం విద్యుత్ శాఖ డీఈ పురుషోత్తం ఆధ్వర్యంలో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈ పురుషోత్తం మాట్లాడుతూ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా రాంపురం గ్రామానికి 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి దర్తీ అభియాన్ యోజన కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాల్లో మీటర్లు లేని వారికి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకోసం ప్రత్యేక లైన్ వేసి ట్రాన్స్ఫార్మర్లను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆయన వెంట ఏడీఈ ఉమారావు, ఏఈ హర్షద్ అహ్మద్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ ఉపాధ్యాయుడు కృష్ణబాబుకు గౌరవ డాక్టరేట్ వాజేడు: మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు పీర్ల కృష్ణబాబు గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్ని విద్యాభ్యాసం పూర్తిచేసుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగాన్ని సాధించారు. విధుల్లో అంకితభావంతో పనిచేస్తూనే పేదలకు సాయం చేయాలనే సంకల్పంతో అమ్మ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ క్రమంలో ఎంతోమందికి సాయం అందిస్తూనే ఉన్నారు. కరోనా సమయంలో సైతం పేదలకు నిత్యావసర సరుకులు అందచేసి శభాష్ అనిపించుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ డాక్టరేట్ను బుధవారం ప్రదానం చేసింది. ఈ మేరకు కృష్ణబాబు మంత్రి సీతక్కను కలవగా శాలువా కప్పి సన్మానించారు. కార్మికుల సమస్యలపై ఆరోపణలు సరికాదు భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల సమస్యలపై తెలంగాణ సింగరేణి ఉద్యోగ సంఘాల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆసత్యపు ఆరోపణలు చేయడం సరికాదని ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి పసునూటి రాజేందర్ తెలిపారు. ఏరియాలోని యూనియన్ కార్యాయలంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేని వారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కొంతకాలంగా కార్మికుల సమస్యలను పరిష్కరించామని, కార్మిక సంక్షేమానికి యాజమాన్యంతో నిరంతరం చర్చలు జరిపి పలు ప్రయోజనాలను సాధించామని తెలిపారు. కార్మికుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ఆరోపణలు చేయకుండా కార్మిక సంక్షేమానికి కలిసి పని చేయాలని సూచించారు. సమావేశంలో నాయకులు మధుకర్రెడ్డి, జోగు బుచ్చయ్య, శశరత్నం, సమ్మిరెడ్డి, అశోక్, హుస్సెన్, శంకర్, రమేష్లు పాల్గోన్నారు. -
తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి
ములుగురూరల్: మున్సిపాలిటీ పరిధి బండారుపల్లిలోని 12, 13 వార్డుల్లో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రెయినేజీలో నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. దోమల కారణంగా ప్రజలు అనారోగ్య సమస్యల భారినపడే ప్రమాదం ఉన్నందున ఫాగింగ్ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమేశ్, కౌన్సిలర్లు గుంటోజు పావని, పోరిక రాజునాయక్, గుగ్గిళ్ల దివ్య, కేశెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు.మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ -
పట్టాలు.. పడిగాపులు
ఏటూరునాగారం: ఏజెన్సీలోని ఆర్ఓఎఫ్ఆర్(రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాలు కలిగిన పలువురు గిరిజన రైతులు వివిధ కారణాలతో మృత్యువాతపడ్డారు. వారి వారసులకు అటవీహక్కుల పత్రాలు తమపేరుపైకి మార్పు చేయాలని మూడేళ్లుగా పడిగాపులు కాస్తున్నారు. బాధిత కుటుంబీకులు ఐటీడీఏ, ఆయా మండలాల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం డెత్ క్లెయిమ్స్ రిపోర్ట్ను ఐటీడీఏలోని ఆర్ఓఎఫ్ఆర్ విభాగానికి అందించడం లేదు. దీంతో పట్టాల మార్పు కోసం గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు. పెండింగ్లో 412 మంది రైతుల వివరాలు జిల్లాలోని 10 మండలాల్లో 12,434 మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగి ఉన్నారు. అందులో ఇప్పటి వరకు మరణించిన వారు 450 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 38 మందికి చెందిన గిరిజన రైతుల వివరాలు మాత్రమే ఐటీడీఏలోని ఆర్ఓఎఫ్ఆర్ విభాగానికి రావడంతో ఆయా రైతుల వారసులకు పట్టాలు చేశారు. ఇంకా 412 మంది రైతుల వివరాలు రెవెన్యూ కార్యాలయాల నుంచి ఐటీడీఏకు రావాల్సి ఉంది. ఇవి రాకపోవడంతో బాధిత రైతుల వారసులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా మార్పిడి కాలేని పరిస్థితి నెలకొంది. నష్టపోతున్న రైతులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతు బంధు పథకం కింద రూ.10 వేలు రైతుకు పెట్టుబడి సాయం కింద జమ అయ్యేవి. ప్రస్తుత ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద రూ. 12వేలు ఒక ఎకరానికి ఇస్తుంది. పట్టా కలిగిన రైతులు మరణించడంతో ప్రభుత్వం చెల్లిస్తున్న రైతు భరోసా రావడం లేదు. దీనివల్ల బాధిత రైతులు పెట్టుబడి సాయం కోల్పోతున్నారు. ఇదేకాకుండా ఏడాదికి రూ.6వేలు వచ్చే పీఎం కిసాన్ డబ్బులు, రైతుబీమా లాంటి అనేక పథకాలను రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మూలంగా గిరిజన రైతులు కోల్పోతున్నారు. ఇప్పటికై నా జిల్లాలోని రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి వారి పరిధిలో ఉన్న మరణించిన రైతుల వివరాలను ఐటీడీఏలోని ఆర్ఓఎఫ్ఆర్ విభాగానికి అందించాలని బాధితులు వేడుకుంటున్నారు.మండలాలు మరణించిన ఐటీడీఏకు వచ్చిన పెండింగ్ వారి సంఖ్య వివరాలుఏటూరునాగారం 70 13 57 గోవిందరావుపేట 30 17 13 కన్నాయిగూడెం 49 0 49 మంగపేట 135 0 135 ములుగు 21 0 21 ఎస్ఎస్తాడ్వాయి 71 5 66 వెంకటాపురం(ఎం) 18 3 15 వెంకటాపురం(కె) 50 0 50 వాజేడు 6 0 6 రైతుల డెత్క్లెయిమ్స్ ఐటీడీఏకు అందించని రెవెన్యూ అధికారులు కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షిణలుజిల్లాలోని మరణించిన గిరిజన రైతుల వివరాలను ఐటీడీఏలోని ఆర్ఓఎఫ్ఆర్ విభాగానికి పంపించాలి. రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంతో గిరిజన రైతులకు అందాల్సిన పథకాలు అందడం లేదు. దీనివల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై ఐటీడీఏ అధికారులు సైతం దృష్టి సారించి రైతుల సమస్యలు పరిష్కరించాలి. – కాపుల సమ్మయ్య, రైతు, ఏటూరునాగారం -
తాగునీటి సమస్య లేకుండా చూడాలి
ములుగు: వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తాగునీటి సమస్య కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆదనపు కలెక్టర్ సంపత్ రావు, డీఆర్డీఓ శ్రీనివాస్రావు, డీపీఓ వెంకయ్య, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ తాగునీరు, ఇందిరమ్మ ఇళ్లు, నర్సరీల పెంపకంపై జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం మండలాల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏ ఒక్క గ్రామంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, చేతి పంపులు, పైపులైన్ల మరమ్మతులను గుర్తించి వెంటనే పూర్తి చేయాలన్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికీ అందుతున్నాయా లేదా అనే విషయంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. రాబోయే వర్షాకాలం నాటికి మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉండేలా నర్సరీల్లో మొక్కలను పెంచాలన్నారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోయాలన్నారు. నర్సరీల్లో గ్రీనరీ పెంపొందించేలా ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అనంతరం బండారుపల్లి గురుకుల పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు వంశీరెడ్డి ఫౌండేషన్ పరీక్షల మెటీరియల్ను అందించగా కలెక్టర్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, డీఈఓ సిద్ధార్థరెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ పాల్గొన్నారు. నేడు ప్రజాప్రతినిధులకు శిక్షణ ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు, మున్సిపల్ కౌన్సిలర్లకు గురువారం ఇంచర్ల ఎంఆర్ ఫంక్షన్హాల్లో ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని వివరించారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
అగ్నిప్రమాదాలపై అప్రమత్తం
ములుగు: వేసవి కాలంలో సంభవించే అగ్ని ప్రమాదాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని లీడింగ్ ఫైర్ ఫైటర్ బి.సుధాకర్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని బిట్స్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు అగ్నిప్రమాదాలపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో దీపం వెలిగించడం, వంట చేసేటప్పుడు గ్యాస్ వినియోగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. చిన్నారులు నిప్పు జోలికి వెళ్లొద్దని సూచించారు. వేసవిలో ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏ చిన్న పొరపాటు జరిగినా తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. చల్లని వాతావరణంలోనే నిప్పు వెలిగించాలని, ఎండతీవ్రతను బట్టి పూరిళ్లపై నీళ్లు చల్లుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జి.కవిత, టెక్నికల్ ఫైర్ ఫైటర్ ప్రవీణ్, అనిల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.లీడింగ్ ఫైర్ ఫైటర్ సుధాకర్ రెడ్డి -
తక్కువ కోడ్ చేస్తేనే కుట్టుమిషన్ల కొనుగోలు
ఏటూరునాగారం: తక్కువ కోడ్ చేసిన వారినుంచే కుట్టు మిషన్లు కొనుగోలు చేస్తామని ఏపీఓ వసంతరావు తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ సమీపంలో ఉన్న గోదాంలో ఉచిత కుట్టు శిక్షణతో పాటు మహిళా గ్రూపుల్లోని గిరిజన మహిళలకు ప్రభుత్వ పాఠశాలల స్కూల్ యూనిఫాంలను కుట్టించడానికి ప్రత్యేకంగా రూపొందించనున్న కుట్టు మిషన్ కేంద్రానికి ఐటీడీఏ అధికారులు గతంలో టెండర్లను ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం కార్యాలయంలో ఆన్లైన్లో టెండర్లు వేసిన వ్యాపారుల నుంచి మిషనరీ నమూనాలను సేకరించారు. అనంతరం ఏపీఓ మాట్లాడుతూ ఎవరు తక్కువ కోడ్ చేస్తే వారి నుంచే మిషనరీని కొనుగోలు చేస్తామని తెలిపారు. డ్రెస్ల తయారీకి కటింగ్ టేబుల్, కాజా మిషన్, బటన్ మిషన్, ప్రిటింగ్ మిషన్, డ్రెస్ కటింగ్ మిషన్నరీలను కొనుగోలు చేయాల్సి ఉందని తెలిపారు. సరైన కంపెనీ యజమానుల వద్ద నాణ్యతతో కూడిన మిషనరీని ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇస్తే వారి నుంచి కొనుగోలు చేస్తామని వివరించారు. ఈ సందర్భంగా ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేష్బాబు, జీసీసీ డీఎం వాణి, జేడీఎం కొండల్రావు, డీటీ అనిల్ ఆధ్వర్యంలో టెండర్లను పరిశీలించారు. తక్కువ కోడ్ చేసిన వారి వివరాలను ఉన్నతాధికారులకు అందజేశారు.ఐటీడీఏ ఏపీఓ వసంతరావు -
బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026
మేడారంలో వ్యాపార కమిటీ ఎన్నిక ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని మేడారంలో ఆదివాసీ వ్యాపార కమిటీ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వ్యాపార కమిటీ అధ్యక్షురాలిగా బంగారి సులోచన, ఉపాధ్యక్షుడిగా అలం సమ్మారావు, కార్యదర్శిగా చింత సతీష్, సహాయ కార్యదర్శిగా సిద్ధబోయిన సత్యవతి, కోశాధికారిగా తల్లడి గౌరమ్మ, కోశాధికారిగా సిద్ధబోయిన సావిత్రి, సలహాల కమిటీ సభ్యులుగా సిద్ధబోయిన జగ్గారావు, పీరిళ్ల వెంకన్న, చిడం బాబురావు, సిద్ధబోయిన స్వామి, నర్సింగరావు, సిద్ధబోయిన రాణా, రమేశ్, కొక్కెర రమేశ్, సిద్ధబోయిన సురేందర్లను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా కమిటీ అధ్యక్షురాలు సులోచన మాట్లాడుతూ అమ్మవార్ల గద్దెల పరిసరాల ప్రాంతాలు, రోడ్లకు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో ఆదివాసీలు మాత్రమే వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలని కమిటీలో తీర్మాణించినట్లు వెల్లడించారు. మేడారంలో ఆదివాసీల వ్యాపారాల అభివృద్ధికి కృషి చేస్తానని వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సర్పంచ్లు ములుగు: ఢిల్లీలో ఈ నెల 13న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి జిల్లాలోని వెంకటాపురం(ఎం) మండలం లక్ష్మీదేవిపేట సర్పంచ్ బొమ్మకంటి వంశావతి, ములుగు మండలం రాయినిగూడెంకు చెందిన ఈసం సునీత ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహిళా సాధికారత సమాన హక్కులపై ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగ కార్యక్రమానికి జిల్లా నుంచి ఇద్దరు సర్పంచ్లు ఎంపికై ఢిల్లీకి తరలివెళ్లారు. అంగన్వాడీకేంద్రం సందర్శన ములుగు: ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మంగళవారం జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీడీపీఓ శిరీష వైద్య కళాశాల విద్యార్థులకు అంగన్వాడీ తరఫున పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు అందించే ఐదు రకాల సేవల గురించి వివరించారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి కిశోర బాలికల పిల్లలతో విద్యార్థులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ములుగు వైద్య కళాశాల నుంచి డాక్టర్ స్వామి, డాక్టర్ వాణి, ఆరోగ్య విద్యా బోధకులు చిదురాల భాస్కర్, అంగన్వాడీ సూపర్వైజర్లు సరస్వతి, రమాదేవి, కళావతి, ఆనంతలక్ష్మి పాల్గొన్నారు.ములుగు: పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ నెల 14 నుంచి ఏఫ్రిల్ 13 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ సారి సెంట్రల్ సిలబస్ తరహాలో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతీ పరీక్షకు మధ్య(సబ్జెక్టువారీగా) మూడు నుంచి నాలుగు రోజుల పాటు వెసలుబాటు కల్పించారు. ఈ క్రమంలో పరీక్షల మధ్య ఉన్న వ్యవధిని వినియోగించుకునేలా సబ్జెక్టు టీచర్లు తగిన మెలకువలు నేర్పించి సన్నద్ధం చేయాలని విద్యాశాఖ ఉపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేసింది. క్లాక్ రూంల ఏర్పాటు జిల్లాలోని ప్రతి పరీక్షా కేంద్రం వద్ద క్లాక్ రూం ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షల మెటీరీయల్ తప్పా ఇతర ఎలాంటి వస్తువులు తీసుకొచ్చినా క్లాక్ రూం వద్ద డిపాజిట్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్లు, డీఓ, సీఎస్లు సైతం తమ సెల్ఫోన్లను క్లాక్ రూం వద్దనే డిపాజిట్ చేసి విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేయనున్నారు. పరీక్ష ప్రారంభ సమయం నుంచి ముగిసేవరకు జిరాక్స్ సెంటర్లను మూసివేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు సంబంధిత వెబ్సైట్ నుంచి తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. హాల్టికెట్లు పాఠశాలకు వచ్చినప్పటికీ విద్యార్థులకు పంపిణీ చేయకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇప్పటికే తమ హాల్టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు సిద్ధమయ్యారు. ప్రైవేట్ పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు ఫీజుల కోసం హాల్టికెట్లు విద్యార్థులకు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్విజిలేటర్ల కేటాయింపులో పైరవీలు పరీక్షాకేంద్రాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇన్విజిలేటర్ల నియామకానికి సంబంధించి ఆయా మండలాల ఎంఈఓల నుంచి అనుమతి తీసుకొని జిల్లా విద్యాశాఖాధికారులు ఇన్విజిలేటర్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాని నిబంధనలకు విరుద్ధంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పనిచేసే ఒకరిద్దరూ ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో పాటు తమ పలుకుబడిని ఉపయోగించి ఇన్విజిలేటర్ల నియామకంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఎస్జీటీలను కాకుండా కొంతమంది స్కూల్ ఆసిస్టెంట్లను ఇన్విజిలేటర్లుగా నియమించేందుకు రంగం సిద్ధం చేసినప్పటికీ ఇన్విజిలేటర్ల జాబితాను అధికారికంగా ఇంకా విడుదల చేయలేదు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఇన్విజిలేటర్ల నియామకాల్లో అక్రమాలు జరగకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్ల జాబితాను నేడు(బుధవారం) వెల్లడిస్తాం. ఇన్విజిలేటర్ల జాబితా సర్ప్రైజ్గా ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్లు ఇన్విజిలేటర్లుగా పనిచేసే చోట వారి పాఠశాలకు చెందిన పిల్లలు లేకపోతేనే విధులు కేటాయిస్తాం. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. – సిద్ధార్థరెడ్డి, డీఈఓ ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా గంట ప్రతాప్ను నియమిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఆరేళ్లుగా ఖాళీగా ఉంటుంది. ఎట్టకేలకు ఎస్డీసీ పోస్టును భర్తీ చేయడంతో ఇన్ని రోజులు పెండింగ్లో ఉన్న ఆర్ఓఎఫ్ఆర్, ఎల్టీఆర్, కోర్టు కేసులు పరిష్కారం అవుతాయని గిరిజనులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జిల్లా పరిధిలోని 10 మండలాల్లో గల 117 పాఠశాలల్లో 3,291 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఈ నెల 14 నుంచి జరిగే పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 1,697 మంది బాలురు, 1,594 మంది బాలికలు హాజరు కానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకోసం పరీక్ష కేంద్రాల వారీగా సీఎస్, డీఓ, ఇన్విజిలేటర్ల జాబితాను అధికారులు తయారు చేసినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. మంగపేట మండలంలోని రాజుపేట, మల్లంపల్లి మండలాల్లో పోలీస్ స్టేషన్లు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో సీ సెంటర్లుగా వాటిని గుర్తించి ఆయా పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక కస్టోడియమ్లను ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష సమయానికి కంటే అరగంట ముందు ప్రశ్నాపత్రాలను స్థానిక పోలీస్స్టేషన్ల నుంచి పోలీసుల బందోబస్తు మధ్య సీఎస్, డీఓలు పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి, పరీక్ష అనంతరం జవాబు పత్రాలను పోస్టాఫీస్లో డిపాజిట్ చేయనున్నారు. పీఎం సూర్యఘర్తో ఉచిత విద్యుత్ 300 యూనిట్ల వరకు వినియోగం ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో 27.07 మెగావాట్ల విద్యుత్కు 9,058 దరఖాస్తులు ఇప్పటి వరకు 2,939 రూఫ్టాప్ ఇన్స్టలేషన్ ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద క్లాక్ రూమ్ ఏర్పాటు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలు.. 3,291 మంది విద్యార్థులు -
ఏప్రిల్లో యూజీడీ పనులు
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ మహానగర సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ‘గ్రేటర్’కు కీలకమైన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) నిర్మాణం కోసం రెండు రోజుల క్రితం రూ.5,257 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో యూజీడీతో పాటు ఇతర పనులను వేగవంతం చేయడంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంత్రి కొండా సురేఖతో కలిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి.. సమీక్ష సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి దీటుగా వరంగల్ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నాన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలులో వేగం పెంచాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన వివిధ ప్రగతి పనులు వచ్చే జూన్ 2వ తేదీ కల్లా పూర్తి కావాలని, సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు నిర్విరామంగా పనిచేయాలన్నారు. యూజీడీకి టెండర్ పూర్తిచేయాలి.. వరంగల్లో చేపట్టే భూగర్భ డ్రెయినేజీ పనులకు సంబంధించి వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వచ్చేనెలలో పనులను ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లకు ఈనెల 31లోగా లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని సూచించారు. రెండు పడక గదుల ఇళ్ల కాలనీల్లో కరెంట్, డ్రెయినేజీ, తాగునీరు, రోడ్లు వంటి కనీస సౌకర్యాలను ఆనాటి ప్రభుత్వం విస్మరించిందని తక్షణమే ఆయా కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నెలాఖరులో అర్హులకు ‘డబుల్’ ఇళ్ల పంపిణీ వరంగల్ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు త్వరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సచివాలయంలో వరంగల్ అభివృద్ధిపై సమీక్ష పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కలెక్టర్లువరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తి చేశామని, జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్రెడ్డి అధికారులకు సూచించారు. ఈఆస్పత్రి నిర్మాణ పనులు, ఆస్పత్రి సామగ్రి ఏర్పాటు, డాక్టర్ల నుంచి మొత్తం సిబ్బంది నియామకానికి సత్వరమే కార్యాచరణ పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు, భద్రకాళి చెరువు పూడికతీత అంశాలకు సంబంధించి ఆలయ మాడవీధుల్లో కృష్ణశిలతో నిర్మించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రకాళి చెరువు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో విషయంలో భూ సేకరణను వేగవంతం చేయాలన్నారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన ఇన్నర్ రింగ్రోడ్డు, ఔటర్ రింగ్రోడ్డు, అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూసేకరణ వేగవంతం చే యాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్పాయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్లపై సౌర వెలుగులు
హన్మకొండ: సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ఉచిత విద్యుత్ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను తీసుకొచ్చింది. దేశంలో ఒక కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.75,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కింద ఇంటి పైకప్పులో సౌర ఫలకాల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. సౌర శక్తిని వినియోగించుకోవడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచడం దీని ఉద్దేశం. ఈపథకం ద్వారా వినియోగదారుడు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడుకోవడంతోపాటు అదనపు విద్యుత్ను గ్రిడ్కు విక్రయించుకునే అవకాశముంది. ఇంటి పైకప్పు సోలార్ ఫలకల ఇన్స్టలేషన్కు అనువుగా ఉండాలి. 20.16 కోట్ల రాయితీని విడుదల ఉమ్మడి వరంగల్ జిల్లాలో గృహ విద్యుత్ సర్వీస్లు 12,73,350 ఉన్నాయి. ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద రూఫ్టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం, సోలార్ ఫలకల బిగింపు కోసం 27.7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా 9,058 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 9.95 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 2,939 రూఫ్టాప్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టలేషన్ చేశారు. ఇందులో 9.42 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2,595 రూఫ్టాప్ సోలార్ ఇన్స్టలేషన్కుగాను రూ.20.16 కోట్ల రాయితీని విడుదల చేశారు. విద్యుత్ వ్యయాన్ని తగ్గించేందుకు.. సౌరశక్తి ఉత్పత్తి ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు విద్యుత్ వ్యయం తగ్గుతుంది. దీంతోపాటు మిగులు విద్యుత్ను గ్రిడ్కు విక్రయించడం వల్ల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. స్వయం సమృద్ధిని సాధించే అవకాశం ఉంది. మిగులు విద్యుత్ను గ్రిడ్కు అమ్మడం ద్వారా ఆదాయాన్ని పొందుతారని విద్యుత్ అధికారులు తెలిపారు. ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా నెలకు రూ.612 చొప్పున ఏడాదికి రూ.7,344 ఆదా చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ప్లాంట్ ద్వారా నెలకు రూ.1,328 చొప్పున ఏడాదికి రూ.15,938, మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటు ద్వారా నెలకు రూ.2,252 చొప్పున ఏడాదికి రూ.27,024 ఆదా చేసుకోవచ్చు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా కార్బన్ డయాకై ్సడ్ సమానమైన ఉద్గారాలు తగ్గుతాయి. ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.30,000 రాయితీ అందిస్తోంది. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు రూ.60,000, మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు రూ.78,000 రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. సోలార్ ప్యానళ్లు 25 ఏళ్ల పాటు విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఇందులో 4 నుంచి 5 సంవత్సరాల్లో పెట్టుబడి పొందవచ్చు. మిగతా 20 ఏళ్లు పూర్తి లాభదాయకంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాయితీ వినియోగించుకోవాలి..ప్రభుత్వం రూఫ్టాప్ సోలార్ప్లాంట్ (ఫలకల) ఏర్పాటుకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద రాయితీ అందిస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. విద్యుత్ను ఉచితంగా వాడుకోవడమే కాకుండా విక్రయించి సైతం ఆదాయం పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. – మహేందర్రెడ్డి, రెడ్కో హనుమకొండ,జనగామ, భూపాలపల్లి జిల్లాల మేనేజర్ఉమ్మడి జిల్లాలో సోలార్ ఫలకల ఏర్పాటు ఇలా.. (కెపాసిటీ మెగావాట్లలో)... దరఖాస్తు ఇలా.. ఆసక్తి కలిగిన వినియోగదారులు పీఎం సూర్యఘర్ డాట్ గోవ్ డాట్ ఇన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇదే వెబ్సైట్లో వెండర్ను ఎంచుకోవాలి. ఎంచుకున్న వెండర్ సంబంధిత వినియోగదారుడిని సంప్రదించి, ఒప్పందం చేసుకుంటాడు. ఆ వెంటనే సోలార్ ఫలకలు బిగిస్తారు. సంబంధిత డిస్కం నెట్మీటరు బిగించి అనుసంధానం చేస్తుంది. తర్వాత సంబందిత వినియోగదారుడి బ్యాంకు ఖాతాకు 15 రోజుల్లో సబ్సిడీ మొత్తం జమవుతుంది.జిల్లా గృహ విద్యుత్ వచ్చిన కెపాసిటీ ఇన్స్టలేషన్ కెపాసిటీ సర్వీస్లు దరఖాస్తులుభూపాలపల్లి 2,04,722 1,485 4.63 195 0.63 హనుమకొండ 3,67,999 4,762 13.40 1633 5.53 వరంగల్ 3,04,030 1,587 5.12 668 2.33 జనగామ 1,76,061 491 1.50 211 0.67 మహబూబాబాద్ 2,20,538 733 2.42 232 0.79 -
‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ను అమలుచేయాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర ● ఉదయాన్నే గ్రామాల్లో ఆకస్మిక పర్యటనములుగు/వెంకటాపురం(ఎం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ మంగళవారం ఉదయాన్నే మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్భందీగా అమలు చేయాలనే ధృడ సంకల్పంతోనే కలెక్టర్ ప్రగతిబాట పట్టి గ్రామాలను సందర్శించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. మండల కేంద్రంతో పాటు నల్లగుంట, ఎల్లారెడ్డి పల్లె గ్రామాల్లో పర్యటించారు. పరిశుభ్రత కార్యక్రమాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిదులకు సూచనలు చేశారు. ఆయా గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణాలు చేపట్టని ఇళ్లను రద్దుచేసే అవకాశం ఉందన్నారు. అనంతరం బీసీ కాలనీ వద్ద నర్సరీని కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సూర్యనారాయణ, తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు, వెంకటాపురం(ఎం) గ్రామ సర్పంచ్ మామిడి శెట్టి సుగుణస్వామి, ఎల్లారెడ్డిపల్లె సర్పంచ్ భాషబోయిన పోశాలు, రామప్ప ఆలయ చైర్మన్ మిల్కూరి అయిలయ్య, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 2కే రన్ ప్రారంభం జిల్లా కేంద్రంలో ములుగు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కే రన్ను కలెక్టర్ దివాకర ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రి జంక్షన్ నుంచి చేపట్టిన 2కె రన్ బండారుపల్లి రోడ్డు మీదుగా జీవంతరావుపల్లి క్రాస్ నుంచి తిరిగి అక్కడి వరకే కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి 2కే రన్ కార్యక్రమాలు ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం వెంకటాపురం(ఎం)మండల కేంద్రంలోని ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. మాల్ ప్రాక్టీస్కి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. -
రామప్పలో సింగరేణి బృందం
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి బృందం సందర్శించింది. ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో జరుగుతున్న పెట్రోల్ లీడర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా రామప్ప దేవాలయాన్ని స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ సాయి నిరంజన్ ఆధ్వర్యంలో సింగరేణి ఏరియాల నుంచి కలిసివచ్చిన పాఠశాలల స్కౌట్స్ అండ్ గైడ్స్ సందర్శించారు. అనంతరం వారు రామలింగేశ్వరస్వామిని దర్శించుకోగా టూరిజం గైడ్ విజయ్ కుమార్ వారికి ఆలయ చరిత్రను వివరించారు. కార్యక్రమంలో స్కౌట్స్ లీడర్స్ శ్రీనివాసరావు, స్వామి, మాస్టర్స్ రమేశ్, కుమార్, భాస్కర్, శైలజ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా హక్కుల కోసం పోరాడాలి
ఏటూరునాగారం: మహిళా హక్కుల కోసం ప్రతీఒక్కరు పోరాడాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కల్యాణి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్యదర్శి చిలుక రాజు అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణి మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్యామ్సుందర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర గొప్పదన్నారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించారు. జీసీడీఓ రజిత, ఎంఈఓ వాసం సాంబశివరావు, టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు దిలీప్, జిల్లా అధ్యక్షుడు పాల ఉప్పస్వామి, ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు, నాయకులు పాల్గొన్నారు.మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కల్యాణి -
కొండచిలువ కలకలం
గోవిందరావుపేట: మండలంలోని దుంపెల్లిగూడెం గ్రామ సమీపంలో శ్మశానవాటిక పక్కన ఉన్న పొలంలో కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఎర్రబోయిన కుమార్ తన పొలంలో పాము కనిపంచడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ అడవి జంతువులు గ్రామాల్లో కనిపించినప్పుడు ప్రజలు భయపడకుండా అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
గిరిజన దర్బార్లో వినతుల వెల్లువ
ఏటూరునాగారం: మండలకేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఏటీడీఏ ఏపీఓ వసంతరావు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదేశాల మేరకు సెక్టార్ అధికారుల ద్వారా గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మొత్తం 12 వినతులు వచ్చాయి. వెంకటాపురం (ఎం), తాడ్వాయి, వాజేడు, మంగపేట, బయ్యారం, తదితర మండలాలకు చెందిన గిరిజనులు వినతులు అందించారు. ● మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం ముందు ఉన్న ఖాళీ స్థలంలో అర్హులైన నాయకపోడు గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కాపుల సమ్మయ్య, రాజు, సారయ్య విన్నవించారు. ● వాజేడు మండలం నాగారం గ్రామానికి చెందిన 19 మంది గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు గిరి సౌరవికాసం కింద బోర్లు, మోటార్లు ఇవ్వాలని స్థానిక సర్పంచ్ బోదెబోయిన స్వరూప విన్నవించారు. ● ఏటూరునాగారం మండలం రొయ్యూర్ గ్రామంలో 1వ వార్డులో మట్టిరోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని, మంగపేట మండలం కమలాపురంలో బోరు నిర్మించుకోవడానికి అటవీశాఖ నుంచి అనుమతి ఇప్పించాలని స్థానికుడు దామోదర్ కోరారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాను ఆన్లైన్లో నమోదు చేయాలి. రైతు భరోసా వస్తుంది. పీఎం కిసాన్ రావడం లేదు. అగ్రికల్చర్, ఐటీడీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. సమస్యను పరిష్కరించి ఆదుకోవాలి. – దబ్బట్ల సుదర్శన్, రైతు, ఏటూరునాగారం -
ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాలి
ఏటూరునాగారం: కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పొడెం సమ్మయ్య అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని కస్తూర్భాగాందీ విద్యాలయం, మండల విద్యావనరుల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ 29 రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, కేజీబీవీ పాఠశాలలో కేర్ టేకర్స్ను నియమించాలని డిమాండ్ చేశారు. మార్చి 16 తేదీన ములుగు జిల్లా కేంద్రంలో జరిగే ధర్నా, 20న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పత్రి కిరణ్, కోశాధికారి మండపు సంతోష్, కేజీబీవీ ఉపాధ్యాయులు అరుణ, స్వరూప, హరిత, రమాదేవి, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సమ్మయ్య -
సమస్యలు తక్షణమే
మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026ములుగు రూరల్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్ దివాకర అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర అర్జిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి అక్కడే పరిష్కరించే ప్రయత్నం చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ దివాకర మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా అందిన దరఖాస్తులను పరిశీలించి సాధ్యాసాధ్యాలను అర్జిదారులకు సమాచారం అందించాలని సూచించారు. గ్రీవెన్స్లో స్వీకరించిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. మొత్తం 49 దరఖాస్తులు ప్రజావాణిలో మొత్తం 49 దరఖాస్తులు రాగా అత్యధికంగా భూ సమస్యలు 17, పింఛన్లు 15, ఇందిరమ్మ ఇల్లు 3, ఉద్యోగ కల్పన 2, ఇతర దరఖాస్తులు 12 వచ్చాయి. ప్రజావాణిలో దరఖాస్తును పరిశీలిస్తున్న కలెక్టర్ టీఎస్ దివాకర, పక్కన జిల్లా అధికారులు కలెక్టర్ టీఎస్ దివాకర ప్రజావాణిలో 49 అర్జీలు -
ఫౌండేషన్ కోర్సులో శిక్షణ ఇచ్చాం
ఏటూరునాగారం: హనుమకొండలోని పీఈటీసీ సెంటర్లలో 2025 మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు 141 మంది నిరుద్యోగులకు ఫౌండేషన్ కోర్సులు ఇచ్చామని ఐటీడీఏ ఏపీఓ వసంతరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘ట్రైనింగ్ నిల్’ అనే కథనానికి ఏపీఓ స్పందించి వివరణతో కూడిన లేఖను అందించారు. ఫౌండేషన్ కోర్సుల కోసం ఏజెన్సీలకు ఇంటర్వ్యూలను నిర్వహించిన తర్వాతనే ‘శ్రీధర్ సీసీఈ’ అనే అకాడమీకి అప్పగించామన్నారు. వైటీసీ కేంద్రాల్లో డీఆర్డీఓ, సెర్ప్, ద్వారా శిక్షణను చేపడుతామన్నారు. ఫౌండేషన్ కోర్సుకు సంబంధించిన స్టడీ మెటీరియల్, ఫ్యాకల్టీ రెమ్యునరేషన్ ఇతర సౌకర్యాలన్నీ కమిషనర్ హైదరాబాద్చే అప్రూవల్ అయిన తర్వాతనే ఇవ్వడం జరిగిందన్నారు. పీఈటీసీలో మరో బ్యాచ్కు కూడా శిక్షణ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఏపీఓ తెలిపారు. ఈ శిక్షణ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంకింగ్, రైల్వే, ఎస్ఎస్సీ, ఇన్సూరెన్స్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోలీసు కానిస్టేబుల్స్, ఎస్సై, జీపీఓ, గ్రూప్స్ నియామకాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇంటెలిజెన్స్ ఆరా వైటీసీలో ట్రైనింగ్ నిల్, పీఈటీసీలో జరుగుతున్న అక్రమాలపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. పీఈటీసీలో ఎలాంటి ట్రైనింగ్ జరిగాయి. ఎంత ఖర్చు చేశారని కూపి లాగుతున్నారు. వైటీసీలకు చెందిన నిధుల మళ్లింపు ఎలా జరిగిందని ఐటీడీఏ అధికారుల నుంచి వివరాలను ఇంటెలిజెన్స్ బృందం సేకరిస్తోంది. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. పీఈటీసీతో 141 మందికి లబ్ధి ఐటీడీఏ ఏపీఓ వసంతరావు -
మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దు
ములుగు: విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు కావొద్దని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీబాలికల ఉన్నత పాఠశాలలో మత్తు పదార్థాల నిర్మూలన కార్యక్రమంపై ఒకరోజు జిల్లాస్థాయి వర్క్ షాప్ నిర్వహించగా ముఖ్యఅతిథిగా డీఈఓ సిద్ధార్థ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రతీ పాఠశాలలో ప్రహరీ క్లబ్బులు నిర్వహించాలన్నారు. ప్రహారీ క్లబ్ అధ్యక్షుడిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సభ్యులుగా ఒక సీనియర్ టీచర్, 6 నుంచి 9 తరగతి వరకు ప్రతి తరగతి నుంచి ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులు ఉండి ప్రహరీ క్లబ్బులను పటిష్టంగా నిర్వహించాలన్నారు. అనంతరం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్స్పెక్టర్ రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలను తెలుసుకొని, ఎవరైనా మత్తు పదార్థాలకు, డ్రగ్స్కి అలవాటు పడుతున్నట్లు గమనిస్తే స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు. డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతీఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ శ్యాంసుందర్ రెడ్డి, ఎస్సైలు ఉపేందర్, శ్రీనివాస్, చైల్డ్ వెల్ఫేర్ అధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. పరీక్షలకు సిద్ధం కండి.. వాజేడు: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలకు హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ డాక్టర్ యోగితారాణా అన్నారు. సోమవారం డిజిటల్ ప్యానెల్ స్క్రీన్ ద్వారా రాష్ట్ర విద్యాశాఖాధికారులు అవగాహన కల్పించారు. వాజేడు ఉన్నత పాఠశాలలో విద్యార్ధులతో కలిసి ఎంఈఓ తేజావత్ వెంకటేశ్వరరావు వీక్షించారు. పరీక్షలను ప్రశాంతంగా రాసి ఎక్కువ మార్కులు వచ్చేలా చూసుకోవాలని అవగాహన కల్పించారు. -
రామప్ప ఆలయ ఈఓగా బాధ్యతల స్వీకరణ
వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపద గల రామప్ప దేవాలయానికి నూతన ఈఓగా (ఆలయ కార్యనిర్వహణాధికారి) ఇమ్మడి భాస్కర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హన్మకొండ మండలం వేలేరు మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న భాస్కర్కు రామప్ప ఆలయ ఈఓగా అదనపు బాధ్యతలు కల్పిస్తూ దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న బిల్ల శ్రీనివాస్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మండలగిరి వేంకటేశ్వరస్వామి ఆలయానికి అదనపు బాధ్యతలు కేటాయించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈఓ భాస్కర్ రామప్ప రామలింగేశ్వరస్వామికి కుటుంబసమేతంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి హరీష్శర్మ ఈఓ దంపతులను శాలువాతో సత్కరించారు. -
వరే.. సరి..!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఈ యాసంగిలోనూ రైతులు వరి సాగువైపే మొగ్గు చూపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఈ సీజన్లో వరిసాగు గతంతో పోలిస్తే కొంత మేర పెరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనాలు సూచిస్తున్నాయి. సాగునీటి లభ్యత, మార్కెట్ డిమాండ్ కారణంగా రైతులు మళ్లీ వరి వైపు మొగ్గు చూపినట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మొత్తం సుమారు 6.35 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు ప్రాథమిక అంచనా. గత యాసంగిలో ఇది 5.98 లక్షల ఎకరాల వరకు మాత్రమే నమోదైంది. దీంతో ఈసారి దాదాపు 37 వేల ఎకరాలకు పైగా పెరుగుదల కనిపించింది. యాసంగి సాగు ఇలా... గతంతో పోలిస్తే ఈ యాసంగిలో వరిసాగు పదిశాతం మేర తగ్గుతుందని వ్యవసాయశాఖ అధికారులు మొదట అంచనా వేశారు. ఈ మేరకు ఈ సీజన్లో మొత్తం సాగు విస్తీర్ణం 9,12,880 ఎకరాలని అంచనా వేసిన అధికారులు 5.75 లక్షల ఎకరాల్లో వరి పంటలకు అవకాశం ఉందన్నారు. అందుకు భిన్నంగా మొత్తం పంటలు 9,82,880 ఎకరాల్లో వేయగా, 6,34,579 (64.56 శాతం) ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. మొక్కజొన్న, ఇతర పంటలన్నీ కలిపితే 35.44 శాతంగా నమోదయ్యాయి. ఈ లెక్కన గతంతో పోలిస్తే 37 వేల పైచిలుకు ఎకరాల్లో ఈసారి వరి సాగుకాగా, ఈసారి కూడా వరిసాగులో ఉమ్మడి వరంగల్ది రికార్డేనని వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఒకరు పేర్కొన్నారు. వరి సాగు పెరగడానికి కారణాలు... జిల్లాల వారీగా చూస్తే హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో వరి సాగు గణనీయంగా పెరిగింది. మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా కొంత మేర విస్తీర్ణం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. సాగునీటి లభ్యత, సాగు సౌకర్యాలు మెరుగుపడటం, ప్రభుత్వం వరి కొనుగోలుపై హామీ ఇవ్వడం, సన్నరకం మీద బోనస్ ఇవ్వడం వంటి కారణాలతో రైతులు ఇతర పంటల కంటే వరి సాగును ఎక్కువగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని మండలాల్లో నీటి కొరత, వాతావరణ మార్పులు వంటి కారణాలతో వరి సాగు విస్తీర్ణం కొంత తగ్గిన ప్రాంతాలు కూడా ఉన్నాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. జిల్లా మొత్తం పంటలు వరి వరంగల్ 1,96,722 95,152 హనుమకొండ 1,77,735 1,11,380 జనగామ 2,07,353 1,79,010 మహబూబాబాద్ 2,13,665 1,07,617 జేఎస్ భూపాలపల్లి 1,17,085 89,000 ములుగు 70,320 52,420 మొత్తం 9,82,880 6,34,579 మొత్తం విస్తీర్ణంలో 64.56 శాతం వరి నమోదు గతంతో పోలిస్తే పెరిగిన వైనం.. మిగతా పంటలతో పోలిస్తే మేలంటున్న రైతులు -
మెరుగైన వసతులు కల్పించాలి
ములుగు రూరల్: విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ దివాకర అన్నారు. సోమవారం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల పరిధిలోని ఇంచర్లలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలోని గదులు, స్టోర్ రూమ్, కిచెన్ షెడ్, విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహంలోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించా లని అధికారులను ఆదేశించారు. అనంతరం మో డల్ బస్టాండ్ పనులను పరిశీలించారు.కలెక్టర్ దివాకర -
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి
ఏటూరునాగారం: పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఆదివారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏటూరునాగారంలో ర్యాలీ నిర్వహించి వై జంక్షన్లో రాస్తారోకో చేశారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న యుద్ధంతో చమురు నిల్వల కొరత ఉంటుందనే సాకుతో గ్యాస్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వగురువు అని చెప్పుకునే నరేంద్ర మోదీ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారని దుయ్యబట్టారు. అమెరికా చెప్పుచేతల్లో మన దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్కు పెంచిన రూ.60లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి సాంబశివ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.దావూద్, తుమ్మల వెంకటరెడ్డి, రత్నం రాజేందర్, వాసు, చిట్టిబాబు, రఘుపతి, జిల్లా కమిటీ సభ్యులు మల్లారెడ్డి, ప్రవీణ్, తోకల రవి, రమేష్, దేవయ్య, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రవికుమార్ ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన ర్యాలీ -
హెచ్పీవీ వ్యాక్సిన్ వేసుకోవాలి
ములుగు: సర్వైకల్ క్యాన్సర్ రాకుండా హెచ్పీవీ వ్యాక్సిన్ను కిశోరబాలికలు తప్పనిసరిగా వేసుకోవాలని కలెక్టర్ దివాకర సూచించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 14 నుంచి 15 ఏళ్ల బాలికలు తమ పేర్లను పోర్టల్లో నమోదు చేసుకున్న అనంతరం వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. తల్లిదండ్రుల అనుమతి మేరకే వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం లాగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ములుగు, ఏటూరునాగారం, వెంకటాపురం మండల కేంద్రాలలోని ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేస్తారని వివరించారు. ఏఎన్ఎం, ఆశ వర్కర్లు కిశోరబాలికల పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ గోపాల్రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
ట్రైనింగ్ నిల్
ములుగుసోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026నామమాత్రంగా గిరిజన దర్బార్7ఏటూరునాగారం: మండల కేంద్రంలోని 5వ వార్డు సభ్యుడు కొండాయి చిన్ని ఆధ్వర్యంలో టీ 20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో భారత్ విజయం సాధించడంతో యువకులు ఆదివారం సంబురాలు జరుపుకున్నారు. భారత్ జట్టు 20 ఓవర్లకు 255 పరుగులు చేయగా న్యూజిల్యాండ్ జట్టు 19 ఓవర్లకు 159 పరుగులు చేసి ఓడిపోయింది. భారత్ జట్టు గెలవడంతో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. జై భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలోని ఐదు యూత్ ట్రైనింగ్ సెంటర్ల(వైటీసీ)లో యువతకు గతంలో శిక్షణ ఇచ్చేవారు. అయితే ములుగులో ఉన్న వైటీసీని సెంట్రల్ యూనివర్సిటీకి, మహబూబాబాద్లో ఉన్న వైటీసీ జేఎన్టీయూ యూనివర్సిటీకి కేటాయించారు. ఏటూరునాగారం, కాటారం, హనుమకొండ వైటీసీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ వీటిల్లో ప్రస్తుతం ఎలాంటి శిక్షణలు చేపట్టడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్జెక్టు రీయింబర్స్మెంట్ పేరుతో 2022–23లో కోటి రూపాయలు మంజూరు చేశారు. ఈ నిధులతో గిరిజన యువతీయువకులకు హోటల్ మేనేజ్మెంట్, సోలార్, కంప్యూటర్ కోర్సులో మూడు నెలల శిక్షణతో పాటు భోజన వసతి కల్పించాల్సి ఉంది. కానీ ఆ నిధులను ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్(పీఈటీసీ)కి మళ్లించారు. దీంతో వైటీసీ ట్రైనింగ్ సెంటర్లలో యువతకు ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. సెంటర్లను సైతం అధికారులు మూసివేశారు. నామమాత్రంగా ఫౌండేషన్ కోర్సు పీఈటీసీలో కొత్తగా ఫౌండేషన్ కోర్సును తెరమీదకు తీసుకొచ్చారు. సివిల్స్, నీట్ వరకు శిక్షణ ఇచ్చేందుకు ఎలాంటి అర్హత లేని అమీర్పేటకు చెందిన ఓ ఏజెన్సీని ఫౌండేషన్ కోర్సుకు ట్రైనర్స్గా కేటాయించారు. గతంలో పనిచేసిన ప్రిన్సిపాల్కు ఏజెన్సీ ప్రతినిధికి స్నేహం ఉండడంతో ఆ ఏజెన్సీ శిక్షణ బాధ్యతను అప్పగించడంతో పాటు ప్రత్యేకమైన స్టడీ మెటీరియల్ను కూడా తయారు చేయించే అగ్రిమెంట్ కూడా ఇచ్చారు. ఒక్కో బుక్కుకు రూ. 800 చెల్లించి పీఈటీసీ సెంటర్ ప్రిన్సిపాల్ కొనుగోలు చేశారు. అదే మార్కెట్లో రూ. 400 చెల్లిస్తే అన్ని రకాలుగా ఉన్న మెటీరియల్ లభించేది. కానీ ఏజెన్సీ వారు ఇచ్చే కమిషన్లకు ఆశపడి నిర్వహకులు అర్హత లేనివారితో స్టడీ మెటీరియల్, ట్రైనింగ్ ఇప్పించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఫలితాల్లో వెనుకంజ హనుమకొండలోని పీఈటీసీలో ఫలితాలు చూస్తే కేవలం రెండేళ్లలో 30 మందికి కూడా ఉద్యోగాలు వచ్చినట్లు రికార్డులు లేవు. అంతేకాకుండా ఈ పీఈటీసీలో ఏజెన్సీ గిరిజనులకు ప్రాముఖ్యత ఇవ్వకుండా కేవలం మైదాన ప్రాంతాల గిరిజనులకే కల్పించి వారికి నచ్చినట్లు రికార్డులు రాసుకొని బిల్లులను డ్రా చేసుకున్నట్లు గిరిజన సంఘాల నాయకుల ఆరోపిస్తున్నారు. అసలు పీఈటీసీకి బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ఖర్చు చేశారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయనే వివరాలను పీఈటీసీ ప్రిన్సిపాల్ విడుదల చేస్తే అసలు విషయం బయటకు వస్తుందని గిరిజన సంఘాల నాయకులు వాపోతున్నారు. ఐటీడీఏలోని అకౌంట్స్ అధికారులు సైతం పీఈటీసీకి నిధుల మళ్లింపులో సహకరించి కమీషన్లు తిన్నట్లు సమాచారం ఉందని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సమగ్రంగా ఆడిట్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుందని పలు సంఘాల నాయకులు వాపోతున్నారు. మూతపడిన వైటీసీ కేంద్రాలను తెరిపించి నిరుద్యోగ గిరిజన యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలి. మూడేళ్ల నుంచి ఎలాంటి శిక్షణ, ఉపాధి లేక గిరిజన యువకులు రోడ్లపై తిరుగుతున్నారు. వారి ప్రవర్తన, అలవాట్లు చెడు మార్గాలకు వైపునకు వెళ్తున్నాయి. ఐటీడీఏకు కోట్లాది రూపాయల నిధులు వస్తున్నా పక్కదారి పట్టించి అధికారులు వారి స్వార్ధాల కోసం ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నారు. నిరుద్యోగులకు వెంటనే ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించాలి. పీఈటీసీకి వచ్చిన నిధులు, ఖర్చులపై బహిరంగంగా వివరణ ఇవ్వాలి. – నీలాద్రి, శంకరాజుపల్లి, తుడుందెబ్బ నాయకుడు నిరుద్యోగులకు అందని ఉపాధి రెండు వైటీసీలు యూనివర్సిటీలకు కేటాయింపు నిధుల దారి మళ్లింపు.. పట్టించుకోని అధికారులువైటీసీల్లో యువతకు ట్రైనింగ్ ఇచ్చేందుకు 2022–23లో మంజూరైన కోటి రూపాయల నిధులను హనుమకొండలోని ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్(పీఈటీసీ)కి నిధులను బదలాయించారు. నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ పీఈటీసీ ప్రిన్సిపాల్ పలుకుబడితో లోపాయికారంగా ఈ నిధులను మళ్లించుకున్నాడు. అదే విధంగా ఎగ్జామ్కు ప్రిపరేషన్ అయిన విద్యార్థులనే తీసుకొచ్చి నామమాత్రంగా శిక్షణ ఇచ్చి నట్లు రికార్డులు సృష్టించారు. ఇష్టానుసారంగా విద్యార్థుల పేర్లను నమోదు చేసుకొని వారికి ఉద్యోగాలు వచ్చినట్లు రికార్డులు నమోదు చేసి ఆ నిధులను నీళ్లలాగ ఖర్చు చేశారు. సమస్యల పరిష్కారం గాలికే... గైర్హాజరవుతున్న అధికారులు -
మేడారంలో భక్తుల సందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో మేడారానికి తరలివచ్చారు. అమ్మవార్ల గద్దెల వద్ద భక్తులు పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. అలాగే సినీనటుడు బాబు మోహన్ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సంప్రదాయంగా బాబుమోహన్కు పూజారులు అమ్మవార్ల కండువా కప్పి ప్రసాదం అందజేశారు. జంపన్నవాగులో నీరు లేకపోవడంతో పాటు స్నానఘట్టాల వద్ద ఒక షెవర్ కూడా లేకపోవడంతో భక్తులు స్నానాలు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు ఆరగించారు.వనదేవతలకు మొక్కులు -
తగ్గనున్న దూరభారం
మల్హర్: ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన కిషన్రావుపల్లి రహదారి నిర్మాణం పనులు మొదలయ్యాయి. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు రోడ్డు నిర్మాణానికి అటవీ ప్రాంతంలో హద్దులు ఏర్పాటు చేశారు. మరోవైపు రోడ్డు నిర్మాణానికి గతంలో టెండర్ ప్రక్రియ కావడంతో రోడ్డు పనులు నడుస్తుండడంతో ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాడిచర్ల మండల కేంద్రం నుంచి భూపాలపల్లి జిల్లాకేంద్రానికి చేరుకోవాలంటే ప్రస్తుతం కాటారం మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. ఖమ్మంపల్లి నుంచి భూపాలపల్లి వరకు 20 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి 2017 సంవత్సరంలో అనుమతి వచ్చింది. ప్రస్తుతం 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని పూర్తిచేశారు. రోడ్డు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ భూపాలపల్లి వన్ఇంకై ్లన్ మైన్ ఫారెస్ట్ రోడ్డులో ఫారెస్ట్ అధికారులు నిర్ధారించిన రోడ్డు ప్రదేశంలో మట్టి పనులు చేపడుతున్నారు. మట్టి పనులు పూర్తికాగానే లెవలింగ్ పనులు చేపట్టి అవసరమైన చోట కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిసింది. తగ్గనున్న దూరభారం.. మంథని నుంచి భూపాలపల్లికి వెళ్లాలంటే కాటారం మీదుగా 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఖమ్మంపల్లి–తాడిచర్ల మీదుగా కేవలం 30 కిలోమీటర్లలోనే భూపాలపల్లికి చేరుకోవచ్చు. ప్రస్తుతం నిత్యం వందలాది వాహనాలు మంథని మీదుగా సుదూర ప్రాంతం నుంచి వెళ్తున్నాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే సగం దూరభారం తగ్గనుండటంతో విద్య, వైద్యం మరింత మెరుగుపడనుంది. సమయంతో పాటు ఇంధన ఖర్చులు భారీగా ఆదా కానున్నాయి. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో తాడిచర్లతో పాటు చుట్టూ ప్రక్కల గ్రామాలు పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతాయి. రూ.4.67 కోట్ల చెల్లింపు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రోడ్డు నిర్మాణానికి మోకాలడ్డిన అటవీశాఖ ఎట్టకేలకు ఒక వరస రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. మల్హర్ మండలం పెద్దతూండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్రావుపల్లి నుంచి అటవీప్రాంతం గుండా భూపాలపల్లి వన్ ఇంకై ్లన్ మైన్ వరకు ఏడు మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపట్టవచ్చని.. కాగా ఆ ప్రాంతంలో తాము నష్టపోతున్న చెట్ల సంపదకు గాను రూ.4.67 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సదరు నిధులు చెల్లించింది. కిషన్రావుపల్లి నుంచి భూపాలపల్లి సమీపంలోనే వన్ ఇంక్లైన్ వరకు 7 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్లతో టెండర్ ప్రకియ పూర్తయింది. కిషన్రావుపల్లి ఫారెస్ట్లో రానున్న ఆరు నెలల కాలంలో రోడ్డు అందుబాటులోకి వస్తుంది. పిల్లల ఉన్నత చదువులు, మెరుగైన వైద్యానికి అనువుగా ఉంటుంది. ప్రయాణభారం తగ్గుతుంది. జిల్లా కార్యాలయాలకు, ఇతర అవసరాలకు భూపాలపల్లికి వెళ్లడానికి కొయ్యూరు నాగులమ్మ మీదుగా భూపాలపల్లికి పోతున్నాం. ఈ రోడ్డు పూర్తయితే ఉపయోగకరంగా ఉంటుంది. – చింతలపల్లి మల్హల్రావు,మాజీ ఎంపీపీ, మల్హర్ పెరగనున్న రవాణా సౌకర్యం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి -
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
● జిల్లా సంక్షేమ అధికారి ప్రేమత వెంకటాపురం(కె): మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అన్నారు. మండల కేంద్రంలోని కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆనంతరం కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలను నిర్మూలిస్తే మహిళల హక్కులను కాపడినట్లేనని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి దేశాభివృద్ధిలో కీలక పాత్రపోషించాలని సూచించారు. మహిళల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. అనంతరం వెంకటాపురం, వాజేడు మండలాలకు చెందిన మహిళా సర్పంచ్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ తాటి సరస్వతి, కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ లూర్ధు రాజు, సీడీపీవో ముత్తమ్మ, సూపర్వైజర్ పుష్పలత, శ్యామల, సుధాకర్. లారెన్స్, గొంది హనుమంతు పాల్గొన్నారు. -
అన్నిరంగాల్లో మహిళల ప్రతిభ
● జడ్జి ఎస్వీపీ.సూర్య చంద్రకళములుగు: అన్ని రంగాల్లో మహిళలు ప్రతిభ చూపుతున్నారని, ఎక్కడైతే సీ్త్రలు గౌరవించబడతారో అక్కడే దేవతలు పూజలందుకుంటారని జిల్లా జడ్జి ఎస్వీపీ సూర్య చంద్రకళ పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టులో ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ మహిళ కోర్టు సిబ్బందికి ఆటలు, పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి టి.కన్నయ్యలాల్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గుంటి జ్యోత్స్న, అదనపు జూనియర్ సివిల్ జడ్జి డి.మధులిక, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. పెరిగిన ఈవ్టీజింగ్ కేసులు.. ఏటా 3.6 శాతం కేసులు పెరుగుదల రెండు నెలలు..80 వేధింపుల కేసులు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత -
ముగిసిన నాగులమ్మ జాతర
మంగపేట: మండలంలోని లక్ష్మీనర్సాపురం నాగులమ్మ ఆలయంలో ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన నాగులమ్మ ఆదివాసీ గిరిజన జాతర శనివారంతో ముగిసింది. విశేష పూజలు అందుకున్న నాగులమ్మ, సడాలమ్మ అమ్మవార్లు వనప్రవేశం చేయడంతో జాతర పరిసమాప్తమైంది. చివరి రోజు ముగింపు కార్యక్రమాన్ని ఆలయ ట్రస్టి, ప్రధాన పూజారి(నాగులమ్మ ఉపాసకుడు) బాడిష రామకృష్ణ స్వామి ఆధ్వర్యంలో పూజారులు, వడ్డెలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడి పంటలు బాగుండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ పూజారులు, వడ్డెలు తల్లులకు పూజలు నిర్వహించి వేడుకున్నారు. అనంతరం పూజారులు ఝెర్రట్టలగుట్టకు సడాలమ్మను, నాగులమ్మను గండొర్రెగుట్టకు డోలు వాయిద్యాల నడుమ అత్యంత భక్తిశ్రద్ధలతో వన ప్రవేశానికి సాగనంపారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టి బాడిష రామకృష్ణస్వామి మాట్లాడుతూ నాగులమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని తెలిపారు. మహాజాతర విజయవంతానికి కృషి చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారులు సోడి సత్యం, కుర్సం పుల్లయ్య, కట్టం సమ్మక్క, చౌళం భవాని, మడకం సుప్రజ, పొలిశెట్టి స్వరూప, వడ్డెలు కొర్స శ్రీకాంత్, ముయబోయిన శివ, కుల పెద్ధలు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు రూ.36 వేల కోట్ల రుణాలు
● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కములుగు: గత రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు రూ.36వేల కోట్ల రుణాలను అందించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్లో శనివారం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. జిల్లాలోని 585 మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.52.50 కోట్ల రుణాల చెక్కులను అందజేశామని తెలిపారు. రూ.36 వేల కోట్ల రుణాలకు రూ.1,121 కోట్ల వడ్డీని మాఫీ చేసినట్లు వివరించారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి పలు రకాల వ్యాపారాలను చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని వెల్లడించారు. ఒక్కో భవనానికి ఉపాధి హామీ పథకం కింద రూ. 10 లక్షల నిధులతో నిర్మాణ పనులు మొదలు పెడుతున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, అధికారులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు. అనంతరం ములుగు ప్రభుత్వ డీగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్మేళాలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అదేవిధంగా కలెక్టరేట్లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై, గోదావరి పుష్కరాలపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అలాగే మున్సిపాలిటీలోని 5వ వార్డులో చేపట్టగా మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ములుగు పట్టణాభివృద్ధికి రూ.15 కోట్లతో ఇప్పటికే టెండర్లు జరిగాయని వెల్లడించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణం చేపట్టాలని సూచించారు. అనంతరం ఇంచర్ల, దేవగిరిపట్నం, కన్నాయిగూడెం గ్రామాల్లో రూ.10 లక్షలతో నిర్మించనున్న ఒక్కొక్క మహిళా సమాఖ్య భవనానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. దేవగిరిపట్నంలో ఇందిరమ్మ పథకం కింద చింతలపూడి వినోద ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోగా మంత్రి ప్రారంభించారు. అనంతరం వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలో వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమానికి హాజరై పలు సూచనలు చేశారు. లక్ష్మీదేవిపేటలో రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళ సమాఖ్య భవన నిర్మాణ పనులకు, ఎల్లారెడ్డిపల్లెలో రూ.17.50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయినేజీ, జీపీ భవనం పనులను సీతక్క ప్రారంభించారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ములుగు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనిలెక్టర్ దివాకర అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ 18వ వార్డులో విద్యుత్ లైన్లు, ములుగులోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని, మిషన్ భగీరథ, ఇరిగేషన్ కార్యాలయాలను, లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమాలను శనివారం పరిశీలించి మాట్లాడారు. ములుగు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి తోపుకుంట వరకు ఉన్న విద్యుత్ లైన్ షిఫ్టింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని పరిశీలించి తాగునీటి శుద్ధి కేంద్రం, వంటగది, స్టోర్ రూమ్, కూరగాయలను పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్, మిషన్ భగీరథ కార్యాలయాలను సందర్శించి పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయాలని ఆదేశించారు.● కలెక్టర్ టీఎస్.దివాకర -
పట్టణాభివృద్ధే లక్ష్యం
నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ● కౌన్సిలర్ల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి ● వీఐపీ రిపోర్టర్, ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళములుగు: ఎండనక, వాననక నిరంతరం శ్రమిస్తున్నారు.. తెల్లవారుజాము నుంచి పొద్దుగూకే వరకు పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా వీధులు, డ్రెయినేజీలను మున్సిపల్ కార్మికులు శుభ్రపరుస్తున్నారు.. చెత్తాచెదారాన్ని తొలగిస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు. అరకొర వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సరైన రక్షణ పరికరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.. నేడు (ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ములుగు మున్సిపల్ తొలి చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన చింతనిప్పుల చంద్రకళ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం చూపేందుకు శనివారం సాక్షి వీఐపీ రిపోర్టర్గా మారారు. పారిశుద్ధ్య సిబ్బంది సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం 4వ వార్డులో పర్యటించి కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చంద్రకళ: ఎలా ఉన్నారు.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? స్వరూప: ప్రభుత్వం అందించే రూ.9,500 వేతనం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు వేతనం పెంచి ఆదుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్నాం. సెలవురోజుల్లో కూడా పనులు చేస్తూ వీధులు శుభ్రపరుస్తున్నాం. చంద్రకళ: సొంత ఇళ్లు అందరికీ ఉన్నాయా? పూలమ్మ: ఇరవై ఏళ్లకు పైగా కార్మికురాలిగా పనిచేస్తున్నా. ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు. కిరాయికి ఉంటూ ఇబ్బందులు పడుతున్నాం. ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. కార్మికులందరికీ ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించి ఇస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. చంద్రకళ: ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? విజయ: డ్రెయినేజీలు శుభ్రం చేయడం, చెత్తను తరలించే క్రమంలో దుర్వాసన వస్తుంది. బ్యాక్టీరియా వల్ల ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కార్మికులకు గ్లౌస్, మాస్క్లు, బూట్లు, భద్రత పరికరాలు పంపిణీ చేయాలి. పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య బీమాతో పాటు శాశ్వత ఉద్యోగ కల్పనతో పాటు వేతనాలు పెంచాలి. చంద్రకళ: తాగునీటి సరఫరా ఎలా ఉంది? రాజక్క: కాలనీలో చేతిపంపులు పనిచేయడం లేదు. తాగునీటి సమస్య ఉంది. ఎండాకాలం ప్రారంభమైనందున తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలి. చంద్రకళ:అందరికీ పింఛన్లు వస్తున్నాయా? మల్లిక: కాలనీలో చాలామందికి పింఛన్లు రావడం లేదు. పింఛన్ కోసం చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటివరకు రాలేదు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వృద్ధాప్య, వింతంతువు, వికలాంగులకు పింఛన్లు అందించాలి. చంద్రకళ:కాలనీలో ఇంకా ఏమైనా సమస్యలు నెలకొన్నాయా? రమ: కోతుల బెడద తీవ్రంగా ఉంది. కాలనీల్లో విచ్చలవిడిగా తిరుగుతూ గాయపరుస్తున్నాయి. వాటిని పట్టుకెళ్లి అటవీప్రాంతంలో వదిలిపెట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. -
నేరాల నియంత్రణపై దృష్టి
ములుగు: నేరాల నియంత్రణకు ఉమెన్ హెల్ప్ డెస్క్ల ద్వారా.. ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో బాధితులకు తక్షణ సహాయం అందిస్తున్నాం. మహిళలపై గృహహింస, దాడులు వంటి కేసులపై వేగంగా దర్యాప్తు జరిపి న్యాయస్థానంలో బలమైన సాక్ష్యాలు సమర్పించి కన్వెక్షన్ శాతాన్ని పెంచుతున్నాం..జిల్లాలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 185 కేసులు నమోదు కాగా 15కేసుల్లో ట్రయల్ పూర్తై కన్వెక్షన్ వచ్చిందని జిల్లా షీటీమ్ ఎస్సై మౌనిక వెల్లడించారు. ఆదివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాక్షితో ఆమె మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే.. పాఠశాలలు, పర్యాటక ప్రదేశాల్లో నిఘా మహిళలపై దాడులు జరగకుండా మహిళ పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. యువతులు, మహిళలు, విద్యార్థినులకు ఆకతాయిలు వేధించకుండా చర్యలు చేపడుతున్నాం. పాఠశాలలు, ప ర్యాటక ప్రదేశాల్లో షీటీమ్ బృందాల నిఘా ఉంది. బాధితులు ఫిర్యాదు చేయాలి ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో పీఎస్లో ఉమెన్ హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు. డెస్క్లలో మహిళా పోలీస్లే విధులు నిర్వహిస్తున్నారు. బాధితులు భయపడకుండా వచ్చి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేస్తేనే న్యాయం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో 100కు లేదా మహిళల హెల్ప్లైన్ 181కు, 8712576528 నంబర్కు కాల్ చేయాలి. అవసరం మేరకు సోషల్ మీడియా వాడాలి సోషల్ మీడియాను అవసరం మేరకే వినియోగించుకోవాలి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని పర్సనల్ ఫొటోలు పంపవద్దు. చట్టాలపై అవగాహన సదస్సులు మహిళలపై నేరాలు జరిగినపుడు ఎవరికి చెప్పుకోవాలో ఆర్థంకాక ఆందోళన చెందుతున్నారు. చట్టాలపై ప్రతీ గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించి మహిళలను చైతన్యవంతులను చేస్తున్నాం. పాఠశాలలు, పర్యాటక ప్రదేశాల్లో మహిళల భద్రతపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.● ఉమెన్ హెల్ప్డెస్క్లతో బాధితులకు న్యాయం ● సాక్షితో షీటీమ్ ఎస్సై మౌనిక -
సొంత నిర్ణయంతోపాటు తల్లిదండ్రుల సూచనతోనే కోర్సు ఎంపిక మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ సర్వేలో విద్యార్థినుల మనోగతం
‘మేం రోజువారీ తీసుకునే నిర్ణయాల్లో సగమే స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నాం.. ఇటు తల్లిదండ్రుల సూచన, సొంత నిర్ణయంతో ఇప్పుడు చదువుతున్న కోర్సులను ఎంచుకున్నాం. మేం తీసుకునే నిర్ణయాల్లో సగమే మద్దతు వస్తోంది. పూర్తి స్థాయిలో రావాలి. అదే సమయంలో తల్లిదండ్రులు ఆడపిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా మేం ఉండాలి.’ అని అంటున్నారు విద్యార్థినులు. నేడు (ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘మీరెంత ఇండిపెండెంట్’.. అన్న అంశంపై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 18–25 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థినులను ‘సాక్షి’ సర్వే చేసింది. పలు అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుంది. – సాక్షి నెట్వర్క్ ఏ) పూర్తిగా బీ) కొద్దిమేర సీ) లేదు 3. మీ నిర్ణయాలకు మీ ఇంట్లో ఎంత మేర మద్దతు లభిస్తోంది? 2. మీరు ప్రస్తుతం ఎంచుకున్న కోర్సును మీరు కావాలనే ఎంచుకున్నారా?ఏ) నా సొంత నిర్ణయం58ఏ) 50 %44ఏ4. ఒక సీ్త్ర ఇండిపెండెంట్గా ముందుకు వెళ్లాలంటే.. ఎవరి సహకారం ఎక్కువ అవసరం? 18బీ) 100%బీసీ) సమాజం8సీ) 25%ిసీబీ) స్నేహితులు24ఏ) కుటుంబంబీ) మా తల్లిదండ్రుల నిర్ణయం సీ) స్నేహితుల సూచన88డీ) 0%సర్వే శాంపిల్ : ప్రతీ జిల్లా నుంచి 20 మంది, ఆరు జిల్లాల నుంచి 120 మంది●ఇండిపెండెంట్గా ముందుకు వెళ్లాలంటే కుటుంబ సహకారం ఎంతో అవసరం1. మీరు తీసుకునే రోజువారీ నిర్ణయాల్లో ఎంత మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
మంత్రి సీతక్క సహకారంతో ములుగు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా. ప్రతీ కాలనీని నేరుగా సందర్శించి ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తాను. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఇంటింటికీ నల్లానీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీకాలనీలో అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా మారుస్తాం. ప్రధానంగా డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది. డ్రెయినేజీ సమస్యను పరిష్కరించేందుకు కౌన్సిలర్ల సహకారంతో సంబంధిత అధికారులతో చర్చించి ముందుకెళ్తాం. – చింతనిప్పుల చంద్రకళ, ములుగు మున్సిపల్ చైర్పర్సన్ -
ఎండైనా.. నింపాల్సిందే
వాజేడు: ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంటను రైతులు అమ్ముకోవాలంటే బస్తాల్లో నింపాల్సిందే. దీని కోసం కొందరు యువకులు ఒక జట్టుగా ఏర్పడి బస్తాల్లో మిర్చిని నింపుతారు. రైతులు ఒక్కొక్కరికి రూ.500 చెల్లించి బస్తాల్లో కాయలను తొక్కిస్తుంటారు. ఒక్క బస్తాలో 30 కేజీల నుంచి 50 కేజీలు ఉండేలా చూసి తొక్కిస్తారు. వాటిని మార్కెట్లో విక్రయించడానికి అనుకూలంగా ఉండటంతో పాటు ఎండిన మిర్చి పాడు కాకుండా ఉంటుంది. ఉదయం 3 నుంచి 8 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి వరకు ఈ పనిని చేస్తుంటారు. ఎంత ఎండ ఉన్నా యువకులు మిర్చి బస్తాల్లో నింపుతారు. -
కార్పొరేట్ తరహాలో
శనివారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2026ఏటూరునాగారం: కార్పొరేట్ తరహాలో ప్రీ ప్రైమరీ పాఠశాలలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలివిడతలో జిల్లాకు ఒకటి చొప్పున నిర్మించనుంది. ఒక్కొక్క దానికి రూ.30 లక్షలు వెచ్చించనుంది. ఈ మేరకు ఇప్పటికే శిశు సంక్షేమశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే జిల్లాలోని 564 అంగన్వాడీ సెంటర్లలో మౌలిక వసతులు కల్పించడానికి రూ.2లక్షలు ఒక్కో సెంటర్కు ఇవ్వనుంది. ఇందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో అదనపు నిధులు ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆరోగ్యలక్ష్మీ పథకంలో భాగంగా తెలంగాణ పోషణ పథం పేరిట చిన్నారులు, బాలికలు, గర్భిణులు, బాలింతల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించనుంది. రక్తహీనత నివారించేందుకు.. కౌమార బాలికల్లో (14–18 ఏళ్లు) పోషకాహార లోపం, రక్తహీనత నివారించేందుకు ఏడాదిలో వందరోజుల ప్రణాళిక అమలు చేయనుంది. ప్రత్యేక న్యూట్రీషియన్ ప్యాకేజీ కింద మల్టీమిల్లెట్ చిక్కి, ఇన్స్టంట్ మిక్స్ (ఉప్మా, కిచిడి) అందిస్తారు. బాలామృతం, బాలామృతం ప్లస్, ఫార్ములేషన్లో మరిన్ని మైక్రో న్యూట్రియేంట్లు ఉండేలా చర్యలు తీసుకుంది. ప్రీ ప్రైమరీ టీచర్లకు ఇంటర్తోపాటు రెండేళ్ల డిప్లొమా అర్హత, ఈ నేపథ్యంలో అంగన్వాడీ టీచర్లకు నూతన విద్యావిధానం కింద సర్టిఫికేషన్ కోర్సు నిర్వాహణ చేపట్టనుంది. ప్రీస్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, బెల్ట్, బూట్లు, సాక్సులు అందించాలని, ఏడాదికి 300 రోజులు 100 మిల్లీలీటర్ల పాలు, 25 గ్రాముల అల్పాహారం అంగన్వాడీ కేంద్రాల్లో ఇవ్వాల్సి ఉంది. అద్దె భవనాల్లోని అంగన్వాడీలకు శాశ్వత భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకుంది. ఏజెన్సీలో తక్కువ బరువు పిల్లలే ఎక్కువ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేపట్టే నూతన పథకాలను ఏజెన్సీలో అమలు చేయనుంది. తక్కువ, అతి తక్కువ బరువు ఉన్న పిల్లలకు మంచి పౌష్టికాహారం అందజేసి వారి బరువు, ఎత్తు పెరిగేందుకు ఆరోగ్య లక్ష్మీని మరింత పటిష్టంగా అమలు చేయనున్నారు. జిల్లాలో 30 కొత్త అంగన్వాడీ భవనాలకు నిధులు మంజూరు అయ్యాయి. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు రూ.2 లక్షలు కేటాయించగా వాటితో పనులు చేపట్టడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాలను మరింత మెరుగుపర్చుతాం. – ప్రేమలత, డీడబ్ల్యూఓ, ములుగు ప్రతిపాదనలు సిద్ధం చేసిన శిశు సంక్షేమశాఖ అంగన్వాడీ కేంద్రాల మరమ్మతుకు రూ.2లక్షలు కేటాయింపు జిల్లాలో 664 అంగన్వాడీ కేంద్రాలుజిల్లాలో 664 అంగన్వాడీ కేంద్రాలకు గాను 564 కేంద్రాలకు శాశ్వత భవనాలు ఉండగా 100 కేంద్రాలకు పక్కా భవనాలు లేకుండా ఉన్నాయి. వీటిని పూర్తిస్తాయిలో నిర్మించడానికి నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయించే దిశగా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో శాశ్వత అంగన్వాడీ కేంద్రాలు నెలకొల్పనున్నారు. -
క్రీడలతో శారీరక దారుఢ్యం
భూపాలపల్లి: క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందించుకోవచ్చని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలో అంబేడ్కర్ క్రీడామైదానంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి నాలుగవ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ను శుక్రవారం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసుల కోసం ట్రాక్ ఈవెంట్స్తో పాటు క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ వంటి క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీసు సిబ్బందిలో క్రీడాస్ఫూర్తి, ఆరోగ్య చైతన్యం, ఐక్యత పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. అనంతరం ఎస్పీ సంకీర్త్, అదనపు ఎస్పీ నరేష్కుమార్ ఫ్రెండ్లీ వాలీబాల్ మ్యాచ్ ఆడారు. స్పోర్ట్స్ మీట్లో భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం కింద జిల్లాలోని 13 పోలీస్స్టేషన్ల పరిధిలోని గ్రామాల యువతతో 13 జట్లను తీసుకొని వారికి వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, సీఐ డి.నరేష్కుమార్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
‘వేప’కు విపత్తు!
ములుగు: వేయి లాభాల చెట్టు వేపకే విపత్తు సంభవిస్తోంది. వేపచెట్టు నుంచి లభించే ఆకు, బెరడు, కాయలు, పిండి, చెక్క, నూనె తదితర ఉత్పత్తులు సర్వరోగ నివారిణిగా పేరున్నాయి. వ్యవసాయ, ఉద్యాన పంటల్లో కీటకనాశినిగా, వివిధ రకాల ఔషధాలు, చర్మ సౌందర్య ఉత్పత్తుల తయారీలో వేపకు అత్యంత ప్రాధాన్యం ఉందని చెబుతారు. ఉగాది పండుగ రోజు వేపపూవు తయారు చేసే పచ్చడిని పవిత్రంగా భావిస్తారు. ఇన్ని సుగుణాలు ఉన్న వేపచెట్టును ఐక్య రాజ్యసమితి 21వ శతాబ్ధపు చెట్టుగా గుర్తించి చరిత్రలో స్థానం కల్పించింది. దీన్ని హెర్బల్ ఇండియన్ డాక్టర్గా పిలుస్తున్నారు. ఇంతటి విశిష్టత కలిగిన వేపచెట్టుకు ఇప్పుడు విపత్తు రావడం చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఇటీవల వందలాది వేపచెట్లు ఎండుముఖం పడుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైన విషయం తెలిసిందే. ఫంగస్ కారణమే.. ‘ఫోమాప్సిస్ అజాడిరక్టె’ అనే శిలీంద్రం (ఫంగస్) ఆశించడంతోనే వేప చెట్లు ఎండుతున్నట్లు వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీనినే కొమ్మ ఎండు తెగులు అని అంటున్నారు. దీంతో చెట్టు కొమ్మలు పూర్తిగా గోధుమరంగులోకి మారి ఎండిపోయి రాలిపోతాయి. శిలీంద్ర సిద్ద బీజాలు గాలి ద్వారా ఒకచెట్టు నుంచి మరో చెట్టుకు వ్యాప్తి చెంది ఫలితంగా గాలివీచే దిశలో ఉన్న చెట్లు అన్ని వ్యాధిసోకి ఎండిపోతాయి. వేప చెట్లపై ‘ఫోమాప్సిస్ అజాడిరక్టె’ అనే వ్యాధి గురించి ఆందోళన అవసరం లేదు. వ్యాధి సంక్రమించిన కొమ్మలను కత్తిరించాలి. లేదా కార్బండిజమ్, క్లోరోథలోనిల్, మాంకోజెమ్ వంటి శిలీంధ్రనాశకాలను నీటిలో కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. లేదా వేరు దగ్గర పోయాలి. తెగులు తీవ్రమైతే పూర్తిగా ఎండిపోయి, చెట్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. సహజంగానే వేప చెట్టుకు వ్యాధిని తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన పనిలేదు. – సుతారి సతీష్, వృక్ష శాస్త్ర వేత్త, వరంగల్ రసం పీల్చుతున్న ‘డైబ్యాక్ వ్యాధి’ జిల్లాలో వందలాది చెట్లపై ప్రభావం -
వైభవంగా నాగులమ్మ పగిడిద్దరాజు కల్యాణం
మంగపేట: మండలంలోని లక్ష్మినర్సాపురంలో కొలువుదీరిన నాగులమ్మ ఆలయంలో నాగులమ్మ, పగిడిద్దరాజు కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో ఈనెల 3 నుంచి ప్రారంభమైన జాతర మూడవరోజు కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి నాగులమ్మ, వనదేవతకు ఎదుర్కోలు మహోత్సవం అనంతరం ఆలయ ప్రధాన పూజారి (నాగులమ్మ ఉపాసకుడు) బాడిష రామకృష్ణ స్వామి ఆధ్వర్యంలో రాత్రి ఒంటి గంట నుంచి వేద పండితులు గాదె నరేష్ ఆచార్యులు, మహేష్, రాకేష్ల బృందం నాగులమ్మ అమ్మవారు, పగిడిద్దరాజు కల్యాణ మహోత్సవాన్ని వేదమంత్రోశ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. నాగులమ్మ ఉపాసకుడు (దేవరబాల) రామకృష్ణ స్వామి లోకకల్యాణం కోసం సుమారు రెండున్నర గంటల పాటు అగ్నిగుండంలో నడిచారు. భక్తులు జై నాగులమ్మ తల్లీ అంటూ భక్తితో చేసిన నినాదాలు జాతర ప్రాంతం మార్మోగింది. అంతకుముందు రామకృష్ణ స్వామి ఆదివాసీ గిరిజన పూజారులు, వడ్డెలతో కలిసి రహస్యపూజలు నిర్వహించి అగ్నిగండాన్ని వెలిగించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నేడు నాగులమ్మ, సడాలమ్మ, వనదేవత వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఏటూరునాగారం, తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం మండలాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, చర్ల, మణుగూరు తదితర ప్రాంతాల నుంచి సుమారు 20వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. -
టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈమేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మేయర్గా, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన స్వర్ణ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ రేసులో ఉన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన స్వర్ణకు ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం కన్నాయిగూడెం: మండలంలోని కన్నాయిగూడెం, ఏటూరు సబ్స్టేషన్ల పరిధిలోని వివిధ గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనుందని విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ స్వామి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏటూరునాగారం నుంచి ఉన్న 33కేవీ లైన్లో తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగింపుతో పాటు మండల పరిధిలోని విద్యుత్ మరమ్మతుల కారణంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిచిపోనున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. పనులు త్వరగా పూర్తి చేయండివాజేడు: జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరగా పుర్తి చేయాలని నేషనల్ హైవే ఈఈ మనోహర్ అన్నారు. వాజేడు మండలంలోని జగన్నాథపురం నుంచి చెరుకూరు వరకు 10 కిలో మీటర్ల మేర రెండు లైన్ల జాతీయ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరిస్తున్నారు. శుక్రవారం వాజేడుకు వచ్చిన ఆయన రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. మండల పరిధిలోని చీకుపల్లి, పెద్ద గొళ్లగూడెం గ్రామాల మధ్యన ఇసుక వాగుపై పాత బ్రిడ్జిని తొలగించి నూతన బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఇప్పటికే డైవెర్షన్ రహదారి వేసి బ్రిడ్జి తొలగింపు పనులను చేపట్టారు. ఈ పనులను పరిశీలించిన ఈఈ మనోహర్ వర్షాకాలం రాక ముందే బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట నేషనల్ హైవే ఏఈ రామ్ముర్తి తదితరులు ఉన్నారు. ములుగు: ములుగు మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి సీతక్క ప్రత్యేక నిధులు కేటాయించారని, కొందరు ప్రతిపక్ష పార్టీలకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు అవగాహన లేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిచందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ములుగు మన్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం మంత్రి సీతక్క సహకారంతో గత సంవత్సరం సెప్టెంబర్ నెలలోనే రూ.15 కోట్ల పనులకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. అప్పటివరకు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరగలేదని, కాబట్టి అప్పటి టెండర్ల ప్రక్రియపై ఇటీవల ఎన్నికై న కౌన్సిలర్లు అనవసర వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. గతంలో ప్రారంభమైన టెండర్లను రద్దు చేసి మళ్లీ కొత్త టెండర్లు వేయాలని కలెక్టర్ను కోరడం వారి అవివేకాన్ని సూచిస్తుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పనులకు వచ్చిన నిధులు అదే పరిధిలో వినియోగించబడతాయని, అనవసర ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మహిళా నాయకులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలి
గోల్ సాధించారు..● సివిల్స్ ఫలితాల్లో మెరిసిన జిల్లా అభ్యర్థులు ● ఉత్తమ ర్యాంకులతో కలసాకారం చేసుకున్న యువకులుసమీక్షలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, చిత్రంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్సీ రవీందర్రావు, ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సమావేశానికి హాజరైన కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద, చాహత్బాజ్పాయ్, సందీప్కుమార్ ఝా, దివాకర టీఎస్, అధికారులుసాక్షి, మహబూబాబాద్: సంక్షేమ పథకాలు అర్హులకు చేరినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ఆ దిశగా అధికారులు ముందుకు పోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికపై ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం శుక్రవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో జరిగింది. పలు అంశాలపై కలెక్టర్లు ప్రణాళికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనుల్లో నూతన ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. వేసవి సెలవుల్లో పాఠశాల్లో మరమ్మతులు చేయించాలన్నారు. మండలంలోని అధికారి హాస్టళ్లను దత్తత తీసుకొని వారంలో రెండు రోజులు అక్కడే భోజనం చేసేలా చూడాలని పేర్కొన్నారు. ప్రమాదాలు నివారించేందుకు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాల గుర్తింపు ఇవ్వాలని ఆదేశించారు. బిల్లులు అందించి ఈనెల చివరి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి పేదలకు అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండ్ చేయని లబ్ధిదారుల నుంచి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలని తెలిపారు. పాత భవనాలకు అవసరమైన చోట రంగులు వేయించాలని సూచించారు. ఇవేకాకుండా ప్రజల నుంచి వచ్చే వినతులు పరిశీలించాలని, ప్రజలకు ఏం అవసరమో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి.. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల స్థితిని తెలుసుకుంనేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలని, సమాచారాన్ని ప్రజల ఫోన్లకు చేరవేయాలని సూచించారు. బాలికల వసతి గృహాల్లో ఇన్సినిరేటర్లు ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే పనులు జాప్యం చేస్తున్నారన్నారు. ములుగు జిల్లా ఉపాధి హామీ పథకంలో వెనుకబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ విప్ రాచంద్రునాయక్ మాట్లాడుతూ.. గత కలెక్టర్ హయాంలో ఫైల్స్ పెండింగ్లో ఉండడంతో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు నిలిచి పోయాయని వివరించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యేలు, మురళీనాయక్, నాగరాజు, ప్రకాశ్రెడ్డి, రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డి తమ నియోజకవర్గాల్లో సమస్యలు, 99 రోజుల ప్రణాళికలో చేపట్టే కార్యక్రమాలు వివరించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా ప్రజల సమస్యలు పరిష్కరించేలా, పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడాలన్నా రు. సమావేశానికి హాజరు కాని మహబూబాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్, ములుగు డీఎఫ్ఓకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు, మున్సిపల్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.రైతుల సమస్యల పరిష్కార మార్గాలను తెలిపేందుకు సీనియర్ రైతులను భాగస్వామ్యులను చేసి చెప్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు అంకిత భావంతో పనిచేస్తే రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే బాధ తప్పుతుందని మంత్రి అన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య భూసమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో సాదాబైనామాకు అవకాశం వస్తుందని, అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాలకు గుర్తింపు ప్రారంభించిన ప్రతీ ఇందిరమ్మ ఇల్లుకు బిల్లు అందాలి ఫారెస్ట్, రెవెన్యూ మధ్య ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలి ప్రజాపాలన–పల్లెప్రగతి ఉమ్మడి జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
యాసంగి పంటలకు దేవాదుల నీరు
ములుగు రూరల్: యాసంగి పంటలకు దేవాదుల నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం మల్లంపల్లి మండలం రాంచంద్రాపూర్కు నీరు చేరుకుంందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ తెలిపారు. యాసంగికి నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ చైర్మన్ బొక్క సత్తిరెడ్డి, ములుగు పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, మల్లంపల్లి సర్పంచ్ ల్యాదె శ్యాంరావు, రాజు, రాకేష్ పాల్గొన్నారు. గిరిజన కళాశాలలో అధికారుల విచారణఏటూరునాగారం: మండల కేంద్రంలోని గిరిజన బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 10 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందడంపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో అధికారులు స్పందించారు. ఈ మేరకు మహబూబాబాద్, ములుగు జిల్లాల గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ హరిసింగ్, జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్రెడ్డిలు గురువారం గురుకుల కళాశాలను సందర్శించి విచారణ చేపట్టారు. కలుషితమైన ఆహారం తినడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారా అన్న కోణంలో ఆరా తీశారు. అదేవిధంగా పరీక్షల సమయం కావడంతో ఒత్తిడికిలోనై ఉంటారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల ఒత్తిడికి గురయ్యారని, ఎండ తీవ్రతతో అలా జరిగిందని విద్యార్థులు తెలిపినట్లు ఆర్సీఓ వెల్లడించారు. ఆహారంలో ఎలాంటి లోపాలు, కల్తీ జరగలేదన్నారు. ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాలేదని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలివెంకటాపురం(కె): డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఏటూరునాగారం ఏఎస్పీ మనన్భట్ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరీవ్–ఆలీవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆటో, కారు డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలను నడుపుతూ ప్రజలను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రమాదం జరిగిన మొదటి గంటలో ఆస్పత్రికి చేర్చడం గోల్డెన్ ఆవర్గా పరిగణిస్తారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గుడ్ సమారిటన్ పథకం ద్వారా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించిన వ్యక్తికి రూ.25 వేలు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. అనంతరం విలేకరులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ ముత్యం రమేశ్, ఎస్సై తిరుపతిరావు, వాజేడు ఎస్సై సతీశ్, పేరూరు ఎస్సై కృష్ణప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సెకండ్ ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో గొంది హనుమంత్ గోల్డ్ మెడల్ సాధించగా ఏఎస్పీ అభినందించారు. సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో గురువారం పీజీ కోర్సులు ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీలోని పలు పరీక్ష కేంద్రాలను హ్యూమనిటీస్ భవనం, మైక్రోబయాలజీ, జియాలజీ, కామర్స్అండ్ బిజినెస్మేనేజ్మెంట్ కళాశాలలను కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో కలిసి సందర్శంచి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షల నిర్వహణను పరిశీలించిన వారిలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, వివిధ విభాగాల అధిపతులు ఉన్నారు. -
‘మద్దతు’ ఇవ్వని మార్క్ఫెడ్!
దిక్కుతోచని స్థితిలో మొక్కజొన్న రైతులుసాక్షి ప్రతినిధి, వరంగల్: మొక్కజొన్నల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. మార్క్ఫెడ్ చాలా చోట్ల ఇంకా కొనుగోళ్లను ప్రారంభించలేదు. ఫలితంగా సిండికేట్గా మారిన ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్లో ఇష్టారాజ్యంగా మొక్కజొన్నలు కొంటున్నారు. 2025–26 ఖరీఫ్ సీజన్లో కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు రూ.2,400 కనీస మద్దత ధర (ఎంఎస్పీ)ని ప్రకటించింది. మొక్కజొన్నల కొనుగోలు విషయంలో మార్క్ఫెడ్, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు దూరంగా ఉన్నాయి. దీంతో ఖరీఫ్లో ఎలా గోలా గండం గట్కెక్కించుకున్న మొక్కజొన్న రైతులకు ఈ యాసంగిలో వ్యాపారులు చుక్కలు చూ పెడుతున్నారు. క్వింటాకు రూ.1,850 నుంచి రూ.1,950 మించి ధర ఇవ్వకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. 2.11 లక్షల ఎకరాల్లో సాగు.. ఎంఎస్పీ బహుజాగు 2025–26 యాసంగి సీజన్కు సంబంధించి విత్తనాల వేసే నుంచి ఫిబ్రవరి–మే మధ్య వరకు సాగు నమోదు ఆధారంగా 2,11,500 ఎకరాల్లో మొక్కజొన్న వేసినట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ సాగు ఆధారంగానే ఒక్కో ఎకరానికి వాతావరణ పరిస్థితుల ఆధారంగా 28 క్వింటాళ్ల నుంచి 32 వరకు వస్తుందనేది అంచనా. ఈ లెక్కన 5.92 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 6.78 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు దిగుబడి రావొ చ్చని భావించి ఆ మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మార్క్ఫెడ్ సహా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులే వ్యవసాయ మార్కెట్ కమిటీలతో పాటు నేరుగా గ్రామాలకు వెళ్లి అగ్గువసగ్గువకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ‘లాభాల మాట దేవుడెరుగు కానీ ఇంటిల్లిపాది కష్టపడినప్పటికీ తమ పెట్టుబడులు పోను రెక్కల కష్టం కూడా మిగిలడం లేదు’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి సుమారు రూ.28,000 నుంచి రూ.40 వేలు ఖర్చు చేస్తే.. ఇప్పుడున్న ధరల ప్రకారం రూ.18.200 నుంచి రూ.23,000 వరకే మిగిలితే అప్పులు, వడ్డీలకే సరిపోతున్నాయని చెబుతున్నారు.2025–26లో జిల్లాల వారీగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం.. మొక్కజొన్న వ్యాపారుల ‘సిండికేట్’.. క్వింటాకు రూ.1,950 దాటని పరిస్థితి ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2,400.. ‘కనీస మద్దతు’ కోసం ఎదురుచూపులు ఉమ్మడి వరంగల్లో 2.11 లక్షల ఎకరాల్లో సాగు 7.56 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేక అన్నదాతల ఆందోళనజిల్లా సాగు విస్తీర్ణం ( ఎకరాల్లో...)హనుమకొండ 58,000 వరంగల్ 46,000 జనగామ 30,150 మహబూబాబాద్ 40,230 ములుగు 20,125 జేఎస్ భూపాలపల్లి 16,995 మొత్తం 2,11,500ఖర్చు అంశం సుమారు ఖర్చు రూ.లు)భూమి దున్నడం, సిద్ధం చేయడం 4,000 – 6,000 విత్తనాలు (హైబ్రిడ్) 3,000 – 4,000 ఎరువులు 5,000 – 7,000 మందులు (కీటక నివారణ) 3,000 – 5,000 కూలీల ఖర్చు 6,000 – 8,000 నీటి ఖర్చు 3,000 – 5,000 కోత – రవాణా 4,000 – 6,000 మొత్తం ఖర్చు 28,000 – 40,000 -
హెచ్పీవీతో హెల్త్
ములుగు రూరల్: మహిళల్లో అధికంగా వచ్చే గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కిశోర బాలికల(14–15 ఏళ్లు) ఆరోగ్యమే లక్ష్యంగా క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ(హుమర్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు గాను విద్య, వైద్య ఆరోగ్యశాఖ సర్వే నిర్వహించింది. క్యాన్సర్ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. వైద్యాధికారులు, సిబ్బందికి శిక్షణ పూర్తి జిల్లా వైద్యారోగ్యశాఖ ఆద్వర్యంలో వైద్యాధికారులకు, సిబ్బందికి హెచ్పీవీ టీకాపై శిక్షణ ఇచ్చారు. ఇందులో 28 మంది వైద్యాధికారులు, 51 మంది పీహెచ్సీ వైద్యులు, 487 మంది ఆశ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బాలికలు టీకాలు తీసుకునేందుకు సంసిద్దం చేయాలని సూచించారు. బాలికల వివరాలు నమోదు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించుకునే బాలికలు తప్పనిసరిగా ఆధార్కార్డు తీసుకు రావాలి. ఆధార్కు లింకు అయిన ఫోన్కు వచ్చే ఓటీపీతో వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత వారికి ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ములుగు జిల్లాకేంద్రంలో జనరల్ ఆస్పత్రి, ఏటూరునాగారంలోని సీసీహెచ్సీ, వెంకటాపురం(కె)లోని సీహెచ్సీ సెంటర్లలో వ్యాక్సినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. 3,127 మందికి టీకాలు జిల్లాలోని పది మండలాల పరిధిలో 3,127 మంది కిశోర బాలికలు ఉన్నట్లు విద్యాశాఖ రికార్డుల్లో నమోదై ఉంది. వైద్యశాఖ అధికారులు అందుకు అనుగుణంగా వ్యాక్సినేషన్ వేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో బాలికకు సింగిల్ డోస్ మాత్రమే ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రత్యేక వైద్య నిపుణులు, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్నర్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు విధుల్లో ఉంటారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అధికారులు 3,127 మంది.. మూడు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ఈ నెల 8 నుంచి ప్రారంభంఆడబిడ్డలకు హెచ్పీవీ టీకా రక్షణ కవచం లాంటిదని కలెక్టర్ దివాకర తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాను కిశోర బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 8న వ్యాక్సినేషన్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. వ్యాక్సినేషన్కు వచ్చే వారు ఐడీ ప్రూఫ్ ఆధార్, బర్త్ సర్టిఫికెట్, ఆపార్ ఐడీ తీసుకురావాలని సూచించారు. టీకాకు వచ్చే క్రమంలో అల్పాహారం తీసుకొని రావాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేకర్, ఏటూరునాగారం సూపరింటెండెంట్ సురేశ్కుమార్, జిల్లా వైద్యాధికారి గోపాల్రావు, జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీకాంత్, రాయినిగూడెం మెడికల్ ఆఫీసర్ నాగఅన్వేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న వ్యాక్సిన్ను కిశోర బాలికలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 8న హెచ్పీవీ టీకా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో ప్రారంభించేందుకు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో మూడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా బాలికల సంఖ్యను గుర్తించాం. అందుకు అనుగుణంగా వ్యాక్సిన్ ఇండెంట్ తయారు చేసి నివేధించాం. – గోపాల్రావు, డీఎంహెచ్ఓ -
పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఏటూరునాగారం/మంగపేట: వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగపేట మండల పరిధిలోని చుంచుపల్లి, పొదుమూరు, ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెం, ముళ్లకట్ట ప్రాంతాల్లోని పుష్కరఘాట్లను ఏఎస్పీ మనన్భట్, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు సూరి, మహేశ్లతో కలిసి ట్రాఫిక్ రూట్లు, పార్కింగ్ స్థలాలు, వన్వే ప్రాంతాలను గురువారం పరిశీలించారు. స్నాన ఘట్టాల ఏర్పాటు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుష్కరఘాట్లకు వచ్చే భక్తులు, పర్యాటకులకు ఇబ్బంది లేకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని పుష్కరాలను విజయవంతం చేస్తామన్నారు. గోదావరిలో వరద నీరు, ఉధృతి, అందులోని గోతులు, ప్రమాద ఘటికలను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలు, నది వద్ద భద్రతా చర్యలు, భక్తుల రద్దీ నియంత్రణ వంటి అంశాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతీ ఘాట్ వద్ద గజ ఈతగాళ్లు, పడవలు, రెస్క్యూ టీం, మర బోట్లు, రబ్బర్ ట్యూబ్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
మున్సిపల్ కమిషనర్పై కౌన్సిలర్ల ఆగ్రహం
ములుగు: ములుగు మున్సిపల్ కమిషనర్ రమేష్పై నూతనంగా ఎన్నికై న సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ సమావేశాన్ని ఆర్అండ్బీ గెస్ట్హౌజ్లో గురువారం కమిషనర్ రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ హాజరయ్యారు. మున్సిపాలిటీ సాధారణ సమావేశంలోని ఎజెండా అంశాలను సమావేశంలో చదివి వినిపించారు. విపక్ష సభ్యుల పట్ల కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఎజెండా తయారీలోనే తీర్మాణం ఆమోదించినట్లుగా రాశారని సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సభ్యులకు ఎజెండాను అందించే విషయంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కొన్ని తప్పులు చోటు చేసుకున్న మాటవాస్తవమేనని, ఇక నుంచి మూడు రోజుల ముందుగానే సభ్యులకు సమాచారం ఇస్తామని కమిషనర్ హామీనిచ్చారు. కొత్తగా పన్నులు పెంచవద్దని, రానున్న వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. వీధిలైట్లు ఏర్పాటు చేయాలని, అభివృద్ధి పనుల్లో వివక్ష చూపవద్దని కౌన్సిలర్ సురేందర్ విజ్ఞప్తి చేశారు. పార్టీలకతీతంగా పట్టణాభివృద్ధికి కలిసి పని చేయాలని నాలుగో వార్డు కౌన్సిలర్ పావని ప్రస్తావించారు. అనంతరం దేవగిరిపట్నం రోడ్డు 60 ఫీట్లకు విస్తరణ, మాస్టర్ ప్లాన్ తయారీ, వీధిలైట్ల కొనుగోలు వంటి ఐదు అంశాలను ఆమోదించారు. ఈ సమావేశంలో డిప్యూటీ చైర్పర్సన్ ఆసియా షాహీన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సభ్యుల ఆరోపణ -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ములుగు/ములుగు రూరల్:వైద్యాధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్.దివాకర హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అత్యవసర పరీక్ష గది, వృద్ధులు, పెడియాట్రిక్ వార్డులతో పాటు ల్యాబోరేటరీ, రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలోని విభాగాలు, వైద్యుల వివరాలపై ఆరా తీశారు. ఇన్పేషెంట్, ఔట్ పేషెంట్ల వివరాలను తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, సదుపాయాలను పరిశీలించారు. పేషెంట్లకు ఇచ్చే మందులను ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఇవ్వాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే గ ర్భిణులకు వివిధ రకాల టెస్టులను ఆస్పత్రిలోనే చే యాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న అదనపు గదుల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అలాగే ఇంచర్ల శివారు ఎర్రిగట్టమ్మ పరిధిలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పండుగ వాతావరణంలో ప్రజాపాలన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ దివాకర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల పాటు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో చేపట్టడానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. దీనిలో భాగంగా అన్నిశాఖల అధికారులు శ్రద్ధతో సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
ఆన్లైన్లోనే పౌరసేవల దరఖాస్తుల విచారణ
ములుగు: రాష్ట్రంలో పౌరసేవలను పారదర్శకంగా వేగంగా అందించేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని ములుగు ఆర్డీఓ వెంకటేశ్ తెలిపారు. కలెక్టరేట్లో రెవెన్యూ శాఖ అఽధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. ఇకపై పౌరసేవల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, రెవెన్యూ సిబ్బంది నివేదికల సమర్పణ తదితర ప్రక్రియ మొత్తం ఆన్లైన్ విధానంలోనే కొనసాగుతుందన్నారు. కాగిత రహిత విధానం అమల్లోకి రావడంతో సమయానికి సేవలు అందడం, పారదర్శకత పెరగడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఆదాయ ధ్రువీకరణ పత్రం సేవలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. దశలవారీగా కులం, నివాసం వంటి ఇతర ధ్రువపత్రాలు సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఆనంతరం ఈ మొబైల్ యాప్ వినియోగంపైన కలెక్టరేట్ కార్యాలయంలో ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ శిక్షణ ఇచ్చారు. మీసేవ ద్వారా అప్లై చేస్తే దరఖాస్తు తొలుత జీపీవో లాగిలోకి వస్తుందన్నారు. అనంతరం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఎంఆర్ఐ)కి, తదనంతరం ఆర్ఐ నుంచి నేరుగా డిప్యూటీ తహసీల్దార్(డీటీ) లాగిన్ కి చేరుతుందని వివరించారు. ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తుంటారని వివరించారు. ములుగు ఆర్డీఓ వెంకటేశ్ -
దళారులు ఇబ్బంది పెడుతున్నారు..
మార్క్ఫెడ్ అధికారులు సరైన విధంగా కొనుగోలు కేంద్రాలు తెరవని కారణంగా దళారులు, ప్రైవేట్ వ్యాపారులు రంగప్రవేశం చేసి తక్కువ ధరకు మక్కలు కొంటున్నారు. ఖరీఫ్లోనూ రైతులకు మక్కలు అమ్ముకునే విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు యాసంగి మొక్కజొన్నల విషయంలో కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించాలి – రామారపు సాంబయ్య, రైతు, మాణిక్యాపూర్, భీమదేవరపల్లిరైతులను ఆదుకోవాలి..టీజీ మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన మక్కలను ప్రభుత్వ మద్దతు ధరకు కొనాలి. ఎకరానికి రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి చివరకు రెక్కల కష్టం కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మొక్కజొన్న రైతులను వెంటనే ఆదుకోవాలి. – టి.సారయ్య, ఉపాధ్యక్షుడు, ఎంఏసీఎస్, మాణిక్యాపూర్, భీమదేవరపల్లి -
రేపు మెగా జాబ్మేళా
ములుగు రూరల్: రేపు(శుక్రవారం) జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ సంపత్రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం డిగ్రీ కళాశాలలో జాబ్మేళా కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కళాశాల ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు నిర్వహించే జాబ్మేళాకు జిల్లా వాసులే కాకుండా భూపాలపల్లి, నర్సంపేట, పరకాల ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సైతం తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వివరించారు. గూగుల్ ఫామ్ ద్వారా తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు బాలయ్య, కవిత, అనిల్ కుమార్, ఉదయశ్రీ, విజేత, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026
7 కేంద్రాల్లో నిర్వహణ.. ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఏపీ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్(మేఘాలయ). ఎవరు అర్హులంటే.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్, సైన్స్ క్లబ్లో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం ఇస్తారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక అవకాశంఈ నెల 31 వరకు గడువు.. విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా www.isro.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల వడపోత అనంతరం ఏప్రిల్ 13న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు. మే 11 నుంచి 22 వరకు యువికా–26 కార్యక్రమం నిర్వహిస్తారు. మే 22న ముగింపు కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. ఈ ఏడాది చేపట్టనున్న కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ఆ సంగతులేంటో తెలుసుకుందాం రండి. – మహబూబాబాద్ అర్బన్అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో వంద ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పరిశోధనలు చేపడుతోంది. ఈవిజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమం చేపడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న మొత్తం విద్యార్థులు 48,941 ఉన్నారు.అన్నీ ఉచితంగానే..ఇస్రో నిర్వహించే యువికా కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులకు ప్రయాణం, భోజన, వసతి సౌకర్యాలను ఇస్రో ఉచితంగా అందజేయనుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో 12 రోజులపాటు ఇస్రోకు చెందిన స్పేస్ సెంటర్లకు తీసుకెళ్తారు. అక్కడ సైన్స్కు సంబంధించిన వింతలు, విశేషాలు, సప్త గ్రహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించనున్నారు. విద్యార్థులు వినియోగించుకోవాలి.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు భావిశాస్త్రవేత్తలుగా ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏడు రోజులు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. – వి.రాజేశ్వర్. డీఈఓ, మహబూబాబాద్●జిల్లాల వారీగా 9వ తరగతి విద్యార్థులు శాస్త్రవేత్తలతో మాట్లాడే చాన్స్ ఈ నెలాఖరు వరకు దరఖాస్తు గడువు ఎంపికైతే ప్రత్యేక శిక్షణ -
పెద్దల సభకు వేం నరేందర్రెడ్డి
సాక్షి, మహబూబాబాద్: రాజ్యసభ సభ్యుడిగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అత్యంత సన్నిహితుడిగా పేరున్న నరేందర్రెడ్డి ప్రస్తుతం సీఎం ముఖ్య సలహాదారుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ సభ్యుల స్థానంలో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. ఏఐసీసీ కోటాలో అభిషేక్ మనుసింఘ్వీకి మరోమారు అవకాశం కల్పించగా, రాష్ట్ర కోటాలో వేం నరేందర్రెడ్డికి చాన్స్ ఇచ్చారు. ఈ మేరకు ఇరువురు నేడు(గురువారం) అసెంబ్లీ సెక్రటరీకి తమ నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో నాయకుడికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేరు ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం నేడు నామినేషన్ దాఖలుపేరు: వేం నరేందర్రెడ్డి తల్లిదండ్రులు: కృష్ణారెడ్డి, రత్నమ్మ భార్య: విజయ కుమారులు: కృష్ణభార్గవ్, కృష్ణచైతన్య గ్రామం: అర్పనపల్లి, మండలం కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా రాజకీయ అనుభవం: 2004 – 2009 వరకు మహబూబాబాద్ ఎమ్మెల్యే ప్రస్తుతం: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య సలహాదారుడు -
ప్రగతి ప్రణాళికను అమలు చేయాలి
ఏటూరునాగారం: రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్ దివాకర అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికల కార్యాచరణ అమలుపై బుధవారం రెవెన్యూ, పంచాయతీరాజ్, ప్రణాళిక, ఇరిగేషన్, హోం, రవాణా, వ్యవసాయం, ఉద్యాన తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అయిదు దశల్లో అమలు చేయనున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కలెక్టర్ క్షుణ్ణంగా వివరించారు. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడం, సేవలను సమర్థవంతంగా అందించడం ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అన్నారు. గ్రామ పంచాయతీ నుంచి జిల్లాస్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ప్రజారోగ్యం, రోడ్డు భద్రతా చర్యలు, వివిధ వర్గాల వారి సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్, అన్ని శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లు
మంగపేట: మండల పరిధిలోని లక్ష్మీనర్సాపురంలో గల నాగులమ్మ ఆలయంలో నాగులమ్మ, సడాలమ్మ అమ్మవార్లు గద్దెలపై బుధవారం కొలువుదీరారు. జాతర రెండో రోజు బుధవారం నాగులమ్మ ఆలయ ప్రధాన పూజారి బాడిష రామకృష్ణ ఆధ్వర్యంలో కన్నాయిగూడెం సమీపంలో సడాలమ్మ, నాగులమ్మ అమ్మవార్లకు ఎదుర్కోలు మహోత్సవాన్ని సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. నాగులమ్మ పూజారి బాడిష నాగరమేశ్, గిరిజన పూజారులు, వడ్డెలు ఆలయ సమీపంలోని గండొర్రెగుట్ట వద్ద నాగులమ్మ, ఝెర్రట్టలగుట్ట వద్ద సడాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి డోలి వాయిద్యాల నడుమ తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల ప్రజలు నృత్యాలు చేస్తూ భారీగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం పూజారులు, వడ్డెలు అమ్మవార్లను గద్దైపె ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని పెరకలకుంట లక్ష్మీదేవర ఆలయం నుంచి ఆలయానికి వచ్చిన లక్ష్మీదేవరకు ఆలయ పూజారులు, వడ్డెలు కంకణాలు కట్టి స్వాగతం పలికారు. రాత్రి సమయంలో అమ్మవార్లకు రమణక్కపేట సమీపంలోని పవిత్ర గోదావరిలో ఏడు చెలిమల నీటితో పాటు వివిధ దళాలతో పుణ్యస్నానాలు, అభిషేక పూజలు నిర్వహించారు. చుంచుపల్లి నుంచి అమ్మవారికి చెందిన అవిరేణి కుండలను ఆదివాసీ మహిళలు తీసుకొచ్చి ఆలయానికి సమర్పించారు. నేడు గురువారం గద్దెలపై కొలువైన అమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఇంకా భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ మేరకు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆలయ ప్రధాన పూజారి బా డిష రామకృష్ణ, నాగరమేశ్ ఆధ్వర్యంలో ఆలయంలో తగిన వసతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో పూజారులు సోడి సత్యం, కుర్సం పుల్లయ్య, కట్టం సమ్మక్క, చౌళం భవాని, మడకం సుప్రజ, పొలిశెట్టి స్వరూప, వడ్డెలు కొర్స శ్రీకాంత్, శివ, చిన్నాబ్బాయి, కారం రాజేశ్, కుల పెద్ధలు విష్ణుమూర్తి, మడకం రాజేశ్వర్రావు, చౌళం వెంకటేశ్వర్లు, కొమరం మాధవరావు తదితరులు పాల్గొన్నారు. నాగులమ్మ, సడాలమ్మకు పూజలు భారీగా తరలివచ్చిన భక్తజనం -
నీటి వృథాకు చెక్
ఏటూరునాగారం: వర్షాలు, వరదల సమయంలో నీరు వృథాగా వెళ్లి సముద్రంలో కలుస్తుంది. ఆ నీటిని ఒడిసిపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద ఒక్కో గ్రామానికి రెండు చెక్ డ్యామ్లను నిర్మించాలని రూపకల్పన చేశాయి. నీటి సంరక్షణ పథకం కింద ఒక్కో చెక్ డ్యామ్కు రూ.5లక్షల బడ్జెట్ను సైతం అధికారులు కేటాయించారు. జిల్లాలో అత్యధికంగా నీటి వనరులు ఉన్నా విద్యుత్ మోటార్లు, బోర్ల మీద ఆధారపడి రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలోని 174 గ్రామ పంచాయతీలోని చెరువులు, వాగులు, వంకలు, తోగులు ఇలా నీటి సౌకర్యం, సౌలభ్యం ఉన్న ప్రాంతాల్లో చెక్డ్యామ్లు నిర్మించాలని స్పష్టమైన ఆదేశాలు జిల్లా కలెక్టర్కు అందాయి. ఈ మేరకు కలెక్టర్ దివాకర మండలాల్లోని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అధికారులకు గ్రామ పంచాయతీకి రెండు చొప్పున సులభతరమైన, పూర్తి స్థాయిలో ఉపయోగించే ప్రాంతాలను గుర్తించాలని ఆదేశాలు అందాయి. దీంతో ఈజీఎస్ అధికారులు గ్రామాల్లోని రైతులు, స్థానికులతో చర్చించి వాగులు, వంకలు, తోగులు, చెరువు సమీపంలో నిర్మాణాలకు ప్రణాళికలను సిద్ధం చేశారు. పెరగనున్న భూగర్భ జలాలు నీటిని చెక్డ్యామ్లు నిర్మించి నిల్వచేస్తే భూగర్భజలాలు కూడా అధికంగా పెరిగే అవకాశాలున్నాయి. జిల్లాలో మిర్చి, వరి, పత్తి, ఇతర పంటలకు కావాల్సినంత నీటిని ఈ చెక్డ్యామ్ల్లో నిల్వచేసి పంటల అవసరాలకు అనుగుణంగా నీటిని ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు వ్యవసాయదారులకు విద్యుత్ ఖర్చులు, మోటార్లు, బోర్లు వేయడం లాంటి ఖర్చులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 348 చెక్డ్యామ్లు జిల్లా వ్యాప్తంగా 348 చెక్డ్యామ్లు నిర్మించే అవకాశాలున్నాయి. వీటికి తోడు ఇంకా రైతులకు అవసరమైన చోట మరిన్ని అదనంగా నిర్మించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలో నీటి సౌకర్యం ఎక్కువగా ఉన్న ఏజెన్సీ మండలాల్లో మరిన్ని అదనంగా చెక్డ్యామ్లు మంజూరయ్యే అవకాశాలు ఉండడంతో రైతులకు మరింత లాభం చేకూరనుంది. నీటి సంరక్షణలో సర్పంచ్ల పాత్ర కీలకంగా మారింది. గ్రామంలోని సర్పంచ్, గ్రామం పేరు, హబిటేషన్, లోకేషన్, సర్వే నంబర్, ప్రభుత్వం, ఫారెస్టు, రెవెన్యూ, ప్రైవేటు అనే వివరాలు అందించాల్సి ఉంది. జీపీకి రెండు చొప్పున తీసుకోవచ్చు. లేదంటే ఎక్కువగా కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. పంచాయతీ కార్యదర్శులు కూడా గ్రామంలో ఎక్కడి చెక్డ్యామ్లు అక్కడే నిర్మించాలని నిర్ణయించి గ్రామ పంచాయతీల తీర్మాణం ఈజీఎస్ అధికారులకు అందించాలి. – చరణ్రాజ్, ఏపీఓ ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఏటూరునాగారం 16 మీటర్ల పొడువుతో ఒక్కో చెక్డ్యామ్ను నిర్మించేందుకు రూ.5 లక్షలు కేటాయించారు. వీటితో నిబంధనల ప్రకారం నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు అధికంగా ఉన్నప్పటికీ నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నీటిని నిల్వచేసే ప్రాంత్రాలను గుర్తించి చెక్డ్యామ్లు నిర్మిస్తే రైతులకు 365ల రోజుల పాటు రెండు పంటలు సులభంగా పండుతాయి. ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గ్రామానికి రెండు చొప్పున మంజూరు ఒక్కోదానికి రూ.5 లక్షల బడ్జెట్ -
‘పాత భూమినే సాగు చేస్తున్నాం’
ఎస్ఎస్తాడ్వాయి: కొత్తగా పోడుభూమిని సాగుచేయలేదు.. పాత భూములనే సాగు చేస్తున్నామని అటవీశాఖ అధికారులు కందకాలు తీయడం నిలిపివేయాలని కాల్వపల్లికి చెందిన రైతులు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా బుధవారం బాధిత రైతులు విలేకర్లతో మాట్లాడారు. కాల్వపల్లిలో 40 ఆదివాసీ కుటుంబాలకు చెందిన తాము ముప్పై ఏళ్లుగా నివాసం ఉంటున్నామని తెలిపారు. 2001లో పోడు చేసి 2004 నుంచి సాగుచేసుకుని జీవనం సాగిస్తున్నామని వివరించారు. ఇన్నేళ్లుగా ఎన్నాడూ జేసీబీలతో రాని అధికారులు ఆకస్మాత్తుగా కందకాలు తీయడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో మంత్రి సీతక్క కూడా పట్టాలిప్పిస్తామని చెప్పారని, కొత్తగా పోడు చేయొద్దని చెప్పిన మాటను గౌరవించి పోడు చేయలేదని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమ సమస్యలను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికై నా మంత్రి సీతక్క స్పందించి తమకు పట్టాలు ఇప్పించాలని వేడుకున్నారు. -
నీటి ఎద్దడి నివారణకు బోరు ఏర్పాటు
ములుగు రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు రంగారావుపల్లిలో నీటి ఎద్దడి నివారణకు బోరు వేయించారు. ఈ మేరకు బుధవారం 4వ వార్డు కౌన్సిలర్ గుంటోజు పావని భూమి పూజ చేసి బోరు వేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క ఎన్నికల సమయంలో రంగారావుపల్లి ప్రజలకిచ్చిన హామీ నేరవేర్చారని తెలిపారు. అదే విధంగా కాలనీలో నె లకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని పావని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శివ, రవి, రూప్సింగ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్: ములుగు ఎస్సైగా ఉపేందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. మహిళా ఉద్యోగులు క్రీడా పోటీల్లో పాల్గొనాలి ములుగు రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలో మ హిళా ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడాపోటీలకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పోలు రాజు, కార్యదర్శి మేడిపల్లి చైతన్యలు బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. సీ్త్ర–శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో టీజీవో, టీఎస్జీవో సహకారంతో నేడు, రేపు బండారుపల్లి రోడ్డులోని గిరిజన భవన్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ‘కాల్వపల్లి రైతులపై దాడి జరగలేదు’ ఏటూరునాగారం: కాల్వపల్లికి చెందిన రైతులపై అటవీశాఖ అధికారులు దాడులు చేయలేదని అటవీశాఖ జిల్లా అధికారి రాహుల్ కిషన్ జాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని ఛానల్స్, పత్రికలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వివరించారు. వార్తలు రాసే విషయంలో సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని రాహుల్ కిషన్ జాదవ్ వెల్లడించారు. -
విద్యుత్ సరఫరాలో లైన్మెన్ల పాత్ర కీలకం
గోవిందరావుపేట: విద్యుత్ సరఫరాలో లైన్మెన్ల పాత్ర కీలకమైందని డీఈ నాగేశ్వరరావు, ఏడీఈ వేణుగోపాల్, ఏఈ దేవ్సింగ్, సబ్ ఇంజినీర్ అఖిల అన్నారు. పస్రా సెక్షన్లో లైన్మెన్ దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఓ అండ్ ఎం(ఆపరేటర్ అండ్ మెంటెనెన్స్) సిబ్బందిని బుధవారం శాలువాలతో సన్మానించి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు, గాలులు, ప్రమాదకర పరిస్థితులు ఎదురై విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు వాటిని సరిచేసి లైన్మెన్లు నిరంతర విద్యుత్ను అందిస్తున్నారని తెలిపారు. వారి సేవలు అభినందనీయమని వివరించారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్లు రామచంద్రయ్య, సమ్మిరెడ్డి, లైన్మెన్లు తిరుపతి, వేణు, అసిస్టెంట్ లైన్మెన్లు భిక్షపతి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా మండమెలిగె పండుగ
మంగపేట: మండల పరిధిలోని వాగొడ్డుగూడెం పంచాయతీ పరిధి లక్ష్మీనర్సాపురం నాగులమ్మ ఆలయంలో మండమెలిగె పండుగ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. జాతర కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రధాన పూజారి, నాగులమ్మ ఉపాసకుడు (ఆలయ ట్రస్టి) బాడిష రామకృష్ణ స్వామి ఉదయం ఆలయాన్ని శుద్ధిచేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం ఎదుట తోరణ స్తంభాలను నిలిపారు. పసుపు, కుంకుమలతో అలంకరించి గడపను ప్రతిష్ఠించారు. మండమెలిగె పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి డోలి వాయిద్యాల నడుమ వడ్డెలు, గిరిజన పూజారులు, ఆదివాసీ ఉపాధ్యాయ సంఘం నాయకులతో కలిసి ఆలయానికి చేరుకుని మామిడి తోరణాలతో అలంకరించారు. అనంతరం గోదావరి నదీ జలాలతో శుద్ధి చేసిన అమ్మవారి ఆభరణాలు, గజ్జెలు, అడారాల(కుండలు)తో అలంకరించి దూపంతో రహస్య పూజలు నిర్వహించారు. అలాగే పూజారులు, వడ్డెలు, కులపెద్దలు ఆలయ ప్రాంగణంలో ఉన్న ఘడికామరాజు, పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, ఎర్రమ్మ, పోతురాజు, నాగులమ్మ నాగులమ్మ గద్దెలను పవిత్ర గోదావరి నదీ జలాలతో అభిషేకించారు. అమ్మవారి ప్రతి రూపాలైన జెండా కర్రలతో డోలి వాయిద్యాలతో భక్తిశ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలోని ఆయా గద్ధెలపై ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. గద్దెలపై జెండాలను ప్రతిష్ఠించారు. నేడు మహాజాతర ఘట్టం ప్రారంభమవుతుందని ఆలయ ప్రధాన పూజారి రామకృష్ణ స్వామి తెలిపారు. నేడు నాగులమ్మ, సడాలమ్మ రాక నేడు గండొర్రెగుట్ట నుంచి నాగులమ్మ, యర్రెట్టలగుట్ట నుంచి వచ్చే సడాలమ్మ అమ్మవార్లు ఆలయంలో కొలువుదీరనున్నారు. అమ్మవార్లకు పవిత్ర గోదావరి జలాలతో పుణ్యస్నానం చేయించిన అనంతరం డోలు వాయిద్యాలు, మేళతాళాలతో ఆలయానికి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టించనున్నట్లు నాగులమ్మ పూజారి రమేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగులమ్మ పూజారి బాడిష నాగరమేష్, సోడి సత్యం, కుర్సం పుల్లయ్య, కట్టం సమ్మక్క, చౌళం భవాణి, మడకం సుప్రజ, పొలిశెట్టి స్వరూప, వడ్డెలు కొర్స శ్రీకాంత్, శివ, ఆదివాసీ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రారంభమైన నాగులమ్మ జాతర గద్దెలపై జెండా కర్రల ప్రతిష్ఠాపన -
మోడల్ ప్లాంటేషన్
ఏటూరునాగారం: ఏజెన్సీలోని రైతులకు ఆయిల్పామ్ మొక్కల పెంపకం, వచ్చే ఆదాయం, ఉపయోగాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మోడల్ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. ఐటీడీఏ హర్టికల్చర్ ద్వారా 3 మే 2023న 9.12 ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటేందుకు అప్పటి పీఓ అంకిత్, ఐటీడీఏ ప్రాజెక్టు హర్టికల్చర్ అధికారి రమణ ఆధ్వర్యంలో మొక్కల సంరక్షణకు కలెక్టర్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి రూ.24 లక్షలు మంజూరు చేశారు. మొక్కలు నాటించారు. నీరు పట్టేందుకు సైతం డ్రిప్, మోటార్లను అమర్చారు. కానీ నాటి నుంచి నేటి వరకు ఆ మొక్కల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఆయిల్పామ్ తోట పెంపకం పేరుతో నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేసి రూ.24 లక్షలు డ్రా చేయడం గమనార్హం. మొక్కల పెంపకంపై పర్యవేక్షణ కొరవడడంతో గడ్డి, పిచ్చి మొక్కులు పెరగడంతో పాటు ఆయిల్పామ్ మొక్కలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్టు పూర్తైందని అధికారులు, సిబ్బంది కలిసి విందులు కూడా చేసుకోవడం గమనార్హం. ఎండిపోతున్నా పట్టించుకోని అధికారులు రూ.24 లక్షల నిధులు వృథాఐటీడీఏ ప్రాజెక్టు హర్టికల్చర్ అధికారి రమణ మోడల్ ప్లాంటేషన్కు శ్రీకారం చుట్టారు. ఆయన బదిలీ కావడంతో పాటు ఆశాఖకు సంబంధించిన అధికారుల పోస్టులు స్థానికంగా ఖాళీగా ఉండడంతో ప్లాంటేషన్ గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ఉద్యానశాఖకు సంబంధించిన అధికారులు ఉన్నా పట్టించుకోకపోవడం గమనార్హం. ఆయిల్పామ్ మొక్కలకు నీటి సౌకర్యం, కంచె సైతం లేకపోవడంతో పశువులు, మేకలు మేస్తుండడంతో ఆయిల్పామ్ మొక్కలు ఎండితున్నాయి. ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన మోడల్ ప్లాంటేషన్ ప్రాజెక్టుపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
జాతీయస్థాయి పోటీలకు వేణుమాధవరావు
వాజేడు: ఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి గిరిజన కళా ఉత్సవానికి తరలివెళ్లారు. మండల పరిధిలోని పేరూరుకు చెందిన తొర్రెం వేణు మాధవరావు ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన కళా ఉత్సవంలో తన చిత్రకళలతో ఆకట్టుకుని జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఢిల్లీలో నిర్వహించిన గిరిజన కళా ఉత్సవంలో పాల్గొని తన చిత్రకళల గురించి వివరించారు. దీంతో పలువురి నుంచి ప్రశంసలు అందుకున్నట్లు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా రాములవారి తలంబ్రాలు భూపాలపల్లి అర్బన్: శ్రీ రామనవమి సందర్భంగా ఈనెల 27న భద్రాచలంలో నిర్వహించే శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవానికి సంబంధించిన పవిత్ర ‘కల్యాణ తలంబ్రాలు’ పోస్టాఫీస్ ద్వారా భక్తుల ఇళ్లకు పంపిణీ చేయనున్నట్లు భూపాలపల్లి సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు సమీప పోస్టాఫీసులో రుసుం చెల్లించి తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చన్నారు. అంతరాలయ అర్చన కల్యాణ తలంబ్రాలు (1 ముత్యం, కుంకుమ, మిశ్రీ, కాజు గింజలు) రూ.450, ముత్యాల తలంబ్రాలు (1 ముత్యం) రూ. 151 చెల్లించాల్సి ఉంటుందన్నారు. కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలు స్పీడ్ పోస్టు ద్వారా భక్తులకు పంపించనున్నట్లు తెలిపారు. శ్రీ రామనవమి మహోత్సవాలకు హాజరుకాలేని భక్తులకు ఈ సేవ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఎర్రగట్టు వెంకన్న కల్యాణం రద్దు హసన్పర్తి: చంద్రగ్రహణంతో ఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని రద్దు చేశారు. జాతరను పురస్కరించుకుని మంగళవారం ఉదయం హసన్పర్తి–భీమారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆతర్వాత స్వామి వారిని రథంపై ఎర్రగట్టుగుట్టకు చేర్చారు. మధ్యాహ్నం 12 గంటలలోపే స్వామి వారిని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆతర్వాత ఆయాన్ని ద్వారబంధనం చేశారు. చంద్రగ్రహణంతో ఈసారి స్వామివారి శోభాయాత్ర నిరాడంబరంగా సాగింది. బుధవారం మహా సంప్రోక్షణ అనంతరం దర్శనాలు ప్రారంభమవుతాయని ఉత్సవ కమిటీ తెలిపింది. కాక్లియర్ ఇంప్లాంట్తో అంగవైకల్యం దూరం ఎంజీఎం : కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స ద్వారా పిల్లల్లో పుట్టుకతో వచ్చిన చెవుడు, మూగ అంగవైకల్యాన్ని పూర్తిగా నయం చేయొచ్చని ఎంజీఎం ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ శ్రమలత తెలిపారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ఎంజీఎం హాస్పిటల్లోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంపత్రావు, ఆడియాలజిస్ట్ డాక్టర్ రతన్సింగ్, డాక్టర్ జెన్నీఫర్, డాక్టర్ ప్రత్యూష, సీనియర్ రెసిడెంట్స్, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. గణపురం హోలీ సందర్భంగా మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో గణపేశ్వరుడిని మోదుగు పూలతో మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతీ సంవత్సరం హోలీ సందర్భంగా ఆలయ ఆవరణలో పూసే మోదుగు పోలతో స్వామి వారిని అలంకరిస్తామని ఆలయ అర్చకులు నాగరాజు తెలిపారు. -
పోడుభూముల్లో కందకాలు
ఎస్ఎస్తాడ్వాయి: పోడు భూముల్లో కందకాలు తీస్తున్న అటవీశాఖ అధికారులను మంగళవారం కాల్వపల్లి రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు పోడు రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాల్వపలి రైతులు భూపాలపల్లి జిల్లాలోని దూదేకులపల్లి రేంజ్ పరిధి సంగారం బీట్ పరిధిలో 25 ఏళ్లుగా సుమారుగా 162 ఎకరాల్లో 47 కుటుంబాలు పోడు భూములను సాగుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మంగళవారం అటవీశాఖ అధికారులు రైతుల పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు భూముల చుట్టూ జేసీబీతో కందకాలు తీస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు అక్కడకు చేరుకుని తవ్వకాల పనులను అడ్డుకోవడంతో అటవీశాఖ అధికారులు, రైతులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూములే తమకు జీవనాధారమని వాటిని వదిలే ప్రసక్తే లేదని బాధిత రైతులు అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు తిరిగి వెళ్లిపోయారు. రైతుల సాగులో ఉన్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు జారీ చేయాలి. సింగారం బీట్లోని కాల్వపల్లి రైతులు పోడు భూములను సాగు చేస్తున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల జారీకి దరఖాస్తులు చేసుకున్నారు. కానీ అధికారులు దరఖాస్తులను పెండింగ్లో పెట్టారు. – కొప్పుల రవికుమార్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కాల్వపల్లి అటవీశాఖ అధికారులను అడ్డుకున్న రైతులు -
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
● ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రహమాన్ ఏటూరునాగారం: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్ రహమాన్ అన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలకేంద్రంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది మంగళవారం బైక్ ర్యాలీ చేపట్టారు. వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ మాట్లాడుతూ అడవులను సంరక్షించడంతో పాటు వన్యప్రాణులను కాపాడుకోవడం ప్రతీఒక్కరి బాధ్యత అన్నారు. ప్రకృతి ప్రసాధించిన ఔషధ మొక్కలు మానవాళికి అమూల్యమైనవన్నారు. వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలు, వన్యప్రాణుల వేట, చెట్ల నరికివేత వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రజలు అటవీశాఖకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. -
గిరిజన దర్బార్లో వచ్చిన వినతుల వివరాలు..
ఎస్ఎస్తాడ్వాయి మండలం గోనెపల్లికి చెందిన రైతు రైతు భరోసా వచ్చేలా చూడాలని విన్నవించారు. అలాగే కొండపర్తికి చెందిన అభయహస్తం ఫౌండేషన్ ద్వారా ఆదివాసీ గిరిజన పిల్లల కోసం నిర్మించిన లెర్నింగ్ సెంటర్ ప్రారంభించామని, ఐటీడీఏ ద్వారా మరింత సహకారం అందించాలని కోరారు. కాటాపురం సమీపంలోని శ్రీరామ్నగర్లో లెర్నింగ్ సెంటర్ నిర్మాణం, అవసరమైన సామగ్రి అందించాలని కోరారు. సంగెం మండలం పోచమ్మతండాకు చెందిన ఒకే కుటుంబానికి కుమారుడికి ఎంబీబీఎస్, కుమార్తెకు ఐఐటీ సీటు వచ్చిందని, ఆర్థిక సాయం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం లో ఐటీడీఏ గెస్ట్హౌజ్లో కాంటిజెంట్ వర్కర్గా పనిచేస్తున్న ఉద్యోగి రెగ్యులర్ చేయాలని డీడీకి విన్నవించారు. మంగపేట మండలం రమణక్కపేటకు చెందిన ఓ గిరిజన విద్యార్థిని జీఎన్ఎంగా కోర్సు చేసి ఎంజీఎంలో స్టాఫ్నర్సుగా ట్రైనింగ్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నానని ఉద్యోగ అవకాశం కల్పించాలని విన్నవించారు. పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఓ నిరుద్యోగి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. వెంకటాపురం(కె) ఆలుబాకకు చెందిన ఓ గిరిజనుడు, వాజేడుకు మండలం పూసూరుకు చెందిన గిరిజనులు ఇందిర సౌర గిరివికాసం కింద బోరు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ సురేష్బాబు, మేనేజర్ శ్రీనివాస్, జేడీఎం కొండల్రావు, ప్రోగ్రాం అధికారి మహేందర్, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రవేశ పరీక్ష గడువు పొడిగింపు
గోవిందరావుపేట: మండలంలోని చల్వాయి మోడల్ స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల గడువును మార్చి 10వ తేదీ వరకు పొడిగించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ గండు కుమార్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దరఖాస్తు చేయని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్ల డించారు. అర్హులైన విద్యార్థులు గడువు లోపు తమ దరఖాస్తులను సమార్పించాలని కోరారు. వివరాలకు ఫోన్ నంబర్లో 8096350115 సంప్రదించాలని సూచించారు. సీతారాముల తలంబ్రాలు ఊరేగింపు వాజేడు: మండల పరిధిలోని శ్రీరాంనగర్ గ్రామంలో సీతారాముల తలంబ్రాలను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. త్వరలో జరుగనున్న సీతారాముల కల్యాణానికి చేతులతో ఒలిచి తలంబ్రాలను సిద్ధం చేశారు. ఆ తలంబ్రాలను సోమవారం ఊరేగించారు. రామప్పలో ఫారెస్ట్ అధికారులు వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సోమవారం అటవీశాఖ ఎంఓఈఎఫ్సీసీ ఐజీఎఫ్ డాక్టర్ త్రినాధ్ కుమార్, సీపీఎఫ్ ప్రభాకర్ సందర్శించారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్లు వారికి స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించగా రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వారికి వివరించారు. వారి వెంట ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, భూపాలపల్లి డీఎఫ్ఓ నవీన్ రెడ్డి, ఎఫ్డీఓ సత్యయ్య, ఎఫ్బీవో కిషన్ తదితరులు ఉన్నారు. బొగ్గు ఉత్పత్తిని పెంచాలిభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సంస్థ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. గడిచిన నెలలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 4.21 లక్షల టన్నులు కాగా, 3.45 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించి 82 శాతంలో నిలిచినట్లు తెలిపారు. రోజువారీ సగటు ఉత్పత్తి 12,327 టన్నులు నమోదైందన్నారు. ఓపెన్కాస్టుల్లో మట్టి వెలికితీత పనుల్లో ఓసీ–2లో 13.50 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 10.14 లక్షల క్యూబిక్ మీటర్లు 75శాతం సాధించగా, ఓసీ–3లో 30.00 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 23.45 లక్షల క్యూబిక్ మీటర్లు 78శాతం సాధించినట్లు తెలిపారు. మొత్తంగా 43.50 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 33.59 లక్షల క్యూబిక్ మీటర్లు 77శాతం మట్టి వెలికితీత పనులు చేయడం జరిగిందన్నారు. ఈ నెల ఉత్పత్తి లక్ష్యం 4.54 లక్షల టన్నులు చేయాల్సి ఉందన్నారు. ఉత్పత్తి పెంపు కోసం ఉద్యోగులందరూ సమిష్టిగా కృషి చేయాలని, పనిగంటలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గైర్హాజరు శాతాన్ని తగ్గించి ఉత్పత్తి పెంపునకు అవగాహన కల్పించాలని కోరారు. అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా వర్కింగ్ పర్మిషన్ తదితర నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, రక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తి కొనసాగించాలని తెలిపారు. రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని తెలిపారు. -
దేవునిగుట్టపై పూర్ణాహుతి
ములుగు రూరల్: కొత్తూరు దేవునిగుట్టపై కొలువైన లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు సోమవారం లక్ష్మీనర్సింహస్వామి జాతరలో భాగంగా స్వామి కల్యాణ మహోత్సవంలో ఎడ్లబండ్లు తిరుగు కార్యకక్రమం నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
కొడుకు పట్టించుకోవడం లేదు
నాకు ఒక్క కొడుకు. హైదరాబాద్లో ఉంటున్నాడు. బాగోగులు పట్టించుకోవడం లేదు. జీవనం సాగించడం ఇబ్బందిగా ఉంది. ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదు. ఉన్న ఎకరం భూమి అమ్ముకుందామనుకుంటే అడ్డు తగులుతున్నాడు. – కొల్లు వెంకట్రెడ్డి, గోవిందరావుపేట ములుగు మున్సిపాలిటీ పరి ధిలోని పాల్సాబ్పల్లికి చెందిన నిరుపేదలకు ఇళ్లు కేటా యించాలి. తన వార్డులో సు మారుగా 25 కుటుంబాలు సొంత ఇళ్లు లేక దుర్భరజీవి తాలు గడుపుతున్నారు. దీంతో పాటు కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థను సైతం మెరుగుపర్చాలి. – కొయిల లక్ష్మి, కౌన్సిలర్ రెండో వార్డు, ములుగు వెంకటాపురం(ఎం) శివారులో తనకు వారసత్వంగా వచ్చిన భూమి ఉంది. దానికి సంబంధించి పట్టా అందించాలి. సర్వే నంబర్ 1710/సి/2 లో 20 గుంటల భూమి మా తాత చింతిరెడ్డి బాల్రెడ్డి పేరున పట్టా ఉంది. నా తండ్రి మరణించాడు. కావున తన పేరున పట్టా అందించాలి. – చింతిరెడ్డి దిలీప్రెడ్డి, వెంకటాపురం(ఎం)● -
సెంట్రల్ డ్రగ్ స్టోర్ రికార్డుల పరిశీలన
ములుగు రూరల్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విజిలెన్స్ డ్రగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ స్టోర్, మెడికల్ కళాశాల సెంట్రల్ స్టోర్ను విజిలెన్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్ జన్ను కిరణ్కుమార్ తనిఖీలు నిర్వహించారు. ఇటీవల హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ వద్ద ప్రభుత్వం పంపిణీ చేసిన 50 ఇంజక్షన్లు లభ్యం కావడంతో విచారణ చేపట్టారు. ప్రభుత్వం నుంచి పునిస్కా కంపెనీకి చెందిన 0217 బ్యాచ్ నంబర్ కలిగిన 1,700 మెట్రోనైడోజనల్ ఇంజక్షన్లు సెంట్రల్ మెడిసిన్ స్టోర్కు సరఫరా కాగా ములుగు ఆస్పత్రికి 1,286 ఇంజక్షన్లు సరఫరా అయ్యాయని తెలిపారు. మిగిలిన 414 నిల్వ ఉన్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి రికార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో కోల్డ్ స్టోరేజ్ చేయాల్సిన మందులను ఇష్టానుసారంగా నిల్వ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రక్తదానం ప్రాణదానంతో సమానం
వాజేడు: రక్తదానం ప్రాణదానంతో సమానమని జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. మండల పరిధిలోని ప్రగళ్లపల్లిలో సోమవారం చేయూత స్వచ్ఛంద సంస్థ, మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్టు, దూలాపురం అటవీ రేంజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడటం అనేది మాటలకు అందనిదని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతిఒక్కరూ రక్తాన్ని దానం చేయాలని సూచించారు. రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన 25 యూనిట్ల రక్తాన్ని రెడ్క్రాస్ సొసైటీ వారికి అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మడకం సుభద్ర, మాజీ సర్పంచ్ నరే శ్, దూలాపురం రేంజర్ బాలకృష్ణ, మురళి, లలిత, ఆదిలక్ష్మి, జగదీశ్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.జెడ్పీ మాజీ చైర్పర్సన్ నాగజ్యోతి -
విద్యార్థులు ప్రణాళికతో చదవాలి
ములుగు: పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రణాళికతో చదవాలని కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనపై విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభను విశ్లేషించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా గణితం, సైన్స్, ఇంగ్లిష్ వంటి ప్రధాన సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు సాధిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో రోజువారీగా, వారాంత మోడల్ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులను సన్నద్ధం చేయాలని తెలిపారు. పరీక్షలు అంటే భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా రాసేలా ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ధైర్యం నింపాలని సూచించారు. విద్యార్థుల హాజరు, అభ్యసన పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. టెన్త్ ఫలితాల్లో జిల్లాను ముందంజలో నిలిపేందుకు సమష్టిగా పాటుపడాలని సూచించారు. అనంతరం పదోతరగతి విద్యార్థులకు పలు సూచనలు చేసి ఆల్ ది బెస్ట్ తెలిపి విజయపథ సందేశ లేఖలను అందజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, డీఈఓ సిద్ధార్థరెడ్డి, మండల అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి ఈ నెల 14నుంచి జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ జీ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి వచ్చే అధికారులకు సైతం సెల్ఫోన్ అనుమతి లేదన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నాపత్రం పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లేటప్పుడు, పరీక్ష అనంతరం సమాధాన పత్రాలను పోస్టాఫీస్లో డిపాజిట్ చేసే సమయంలో తప్పకుండా పోలీస్ సిబ్బంది సమక్షంలోనే జరగాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షల నిర్వహణ సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. పరీక్ష సమయంలో తహసీల్దార్లు పరీక్ష కేంద్రాన్ని సందర్శిస్తారని డీటీ స్థాయి అధికారులు సిట్టింగ్ స్క్వాడ్గా ఉంటారని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్ఎంతో పాటుగా మెడికల్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్షలకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు సరిపడా బస్సులు విధిగా సమయానుగుణంగా నడపాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ సిద్ధార్థ రెడ్డి, డీపీఓ వెంకయ్య, వివిధ శాఖల అధికారులతో పాటు ఏసీజీఈ వినోద్ కుమార్, కోఆర్డినేటర్లు రాజు, శ్యాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
వేగం కన్నా ప్రాణం మిన్న
ఏటూరునాగారం: వేగం కన్నా ప్రాణం మిన్న అని ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్ అన్నారు. మండల కేంద్రంలోని వైజంక్షన్ వద్ద పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం అరైవ్ అలైన్ కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించి ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రత విషయంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హెల్మెట్ ధరించి నిబంధనలను పాటించాలని, వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణం చేయవద్దన్నారు. మీ ప్రాణం మీ కుటుంబానికి అమూల్యమన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని తెలిపారు. హెల్మెట్ ధరించి నిబంధనలను పాటిస్తున్న వారిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.ఏఎస్పీ మనన్ బట్ -
వినతులిచ్చాం.. పరిష్కరించండి
ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బాధితులు అధికారులకు అర్జీలను సమర్పించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 59 వినతులు రాగా కలెక్టర్ దివాకర స్వీకరించారు. అలాగే ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో 10 వినతులు రాగా ఐటీడీఏ డిప్యూటీ డీడీ దబ్బగట్ల జనార్ధన్ స్వీకరించారు. వాటిని పరిశీలించిన అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. భూ సమస్యలు 14పింఛన్లు 14ఇందిరమ్మ ఇళ్లు 14ఇతర శాఖలకు సంబంధించి 17 ప్రజావాణిలో 59, గిరిజన దర్బార్లో 10 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ దివాకర, ఐటీడీఏ డిప్యూటీ డీడీ జనార్దన్ -
మహిళలు సైన్స్, టెక్నాలజీ రంగాల్లో రాణించాలి
ములుగు రూరల్: మహిళలు సైన్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో రాణించినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని తెలంగాణ అకాడమీ అఫ్ సైన్స్ రీజినల్ కోఆర్డినేటర్, ప్రొఫెసర్ కిషన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో సోమవారం సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక విజయాలు సాధించామన్నారు. వాటిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం, ఎకో క్లబ్ కన్వీనర్ సరిత, అధ్యక్షులు బాలయ్య, సరిత, అనిల్ కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కరాటేలో విద్యార్థుల ప్రతిభ
గోవిందరావుపేట/వాజేడు: తాడ్వాయి మండలం మేడారంలోని జంపన్నభవన్లో ఆదివారం నిర్వహించిన 8వ స్టేట్ లెవల్ షోటోఖాన్ కరాటే చాంపియన్ షిప్ 2026లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. గోవిందరాపేట మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన గొంది విగ్నేందర్ ప్రస్తుతం మండల కేంద్రంలోని మెరిట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఈ కరాటే పోటీల్లో విగ్నేందర్ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించాడు. ఈ మేరకు పాఠశాల కరస్పాండెంట్ రవికిరణ్ విద్యార్థిని సోమవారం అభినందించారు. భవిష్యత్లో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే వాజేడుకు చెందిన పెనుమళ్లు సీతారామ చంద్రారెడ్డి మండల కేంద్రంలోని పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కరాటేలోని స్వారింగ పోటీలో ద్వితీయ, కటాలో మూడో స్థానంలో విజయం సాధించగా ప్రశంసపత్రంతో పాటు మెడల్ అందించారు. -
విద్యుత్ వ్యవస్థ రక్షణకు చర్యలు
హన్మకొండ: విద్యుత్ వ్యవస్థను రక్షించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ పకడ్బందీ చర్యలు చేపట్టింది. వర్షాకాలం, అకాల వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులు రావడం సహజం. వీటితో విద్యుత్ సబ్స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, విద్యుత్ లైన్లకు ముప్పు వాటిల్లుతోంది. తద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో విద్యుత్ వ్యవస్థలను రక్షించడంతోపాటు వినియోగదారులకు అంతరాయాలు లేకుండా అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతి సబ్స్టేషన్లో నిర్మాణ సమయంలోనే లైటర్నింగ్ అరెస్టర్లు (పిడుగుల నిరోధకాలు) ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా పొడవాటి లైన్లను గుర్తించి ఈ లైన్లలో స్తంభాలకు లైటర్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, విద్యుత్ లైన్లకు రక్షణ ఉంటుంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో పొడవాటి విద్యుత్ లైన్లలో మొత్తం 2,337 లైటర్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేశారు. హనుమకొండ సర్కిల్లో 95, వరంగల్ సర్కిల్లో 25, జనగామలో 107, భూపాలపల్లి సర్కిల్లో 52, మహబూబాబాద్ సర్కిల్లో 38, ఖమ్మం సర్కిల్లో 248, భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్లో 182, కరీంనగర్ సర్కిల్లో 281, జగిత్యాలలో 161, పెద్దపల్లిలో 211, నిజామాబాద్లో 328, కామారెడ్డిలో 59, అదిలాబాద్లో 89, నిర్మల్లో 84, మంచిర్యాలలో 218, ఆసిఫాబాద్ సర్కిల్లో 159 లైటర్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేశారు. ఎలా పనిచేస్తుందంటే.. లైట్నింగ్ అరెస్టర్ అనేది మెరుపు, పిడుగు వల్ల ఉత్పన్నమయ్యే అధిక ఓల్టేజీని భూమిలోకి సురక్షితంగా మళ్లించే రక్షణ పరికరం. దీని ద్వారా ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, స్విచ్గేర్ పరికరాలు, ఇతర విద్యుత్ పరికరాలతో పాటు యంత్రాంగం సురక్షితంగా ఉండడం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గుతాయి. మెరుపు కారణంగా కలిగే బ్రేక్డౌన్లు తగ్గుతాయి. దీంతోపాటు పరికరాలు సురక్షితంగా ఉండడంతో నష్టం తగ్గుతుంది. నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం. విద్యుత్ వ్యవస్థ రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్రమంలోనే సుదూరంగా ఉండే విద్యుత్లైన్లలో లైటర్నింగ్ అరెస్టర్లు చేశాం. విని యోగదారులు కూడా వర్షాకాలంలో ఇంటి విద్యుత్ పరికరాలకు సర్జ్ ప్రొటెక్టర్లు వినియోగించాలి. మెరు పు సమయంలో అనవసరంగా విద్యుత్ పరికరాల ను తాకకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. –టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఉరుములు, మెరుపులనుంచి రక్షణకు నిరోధకాల బిగింపు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 2,337 లైటర్నింగ్ అరెస్టర్ల ఏర్పాటు -
జీపీ కార్మికుల వేతనాలు చెల్లించాలి
● సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ వెంకటాపురం(ఎం): గ్రామపంచాయతీ కార్మికుల 6 నెలల పెండింగ్ వేతనాలతో పాటు, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెలా వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సమావేశాన్ని పాలకుర్తి సురేశ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీపీ కార్మికులకు వ్యతిరేకమైన జీవో నంబర్ 51 సవరించడంతో పాటు మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. అనంతరం యూనియన్ మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా సురేశ్, ప్రధాన కార్యదర్శిగా ఓదెలు, కోశాధికారిగా స్వామి, ఉపాధ్యక్షుడిగా సాంబయ్య, సత్యపాల్ రెడ్డి, రమేశ్, సహాయ కార్యదర్శులుగా నవాబు, కవిత, రాజయ్య తదితరులను ఎన్నుకున్నారు. -
ముందుచూపేది?
రామన్నగూడెం వద్ద చుక్క నీరు లేకుండా ఉన్న పుష్కరఘాట్ రాంనగర్ వద్ద ఒడ్డుకు దగ్గరలో ఉన్న గోదావరి నీరు ఏటూరునాగారం: వచ్చే ఏడాది జూన్ 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులు పుణ్యస్నానాలు చేసే విధంగా ఘాట్ల నిర్మాణంతో పాటు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి అవసరం ఉంది. 2015లో చోటుచేసుకున్న తప్పిదాలు పునరావృతం కాకుండా ఇప్పటికై నా ముందుచూపుతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఏజెన్సీలోని వాజేడు, ఏటూరునాగారం, మంగపేట మండలాల పరిసర ప్రాంతాల నుంచి గోదావరి ప్రవహిస్తోంది. 2027 జూన్ 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో 2015లో వచ్చిన గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం విడుదల చేసిన రూ. 6 కోట్ల నిధులతో ఏటూరునాగారం మండలంలోని ముళ్లకట్ట, రామన్నగూడెం వద్ద పుష్కరఘాట్లను ఇరిగేషన్ అధికారులు నిర్మించారు. అలాగే మంగపేట మండల కేంద్రంలో మరో ఘాట్ నిర్మించారు. అధికారులు ఎస్టిమేట్ వేసి నిర్మించిన ఘాట్ల వద్ద గోదావరి ప్రవాహం లేక పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో జల్లుస్నానాలు చేశారు. గోదావరి పుష్కరాలకు పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చి జల్లు స్నానాలు చేసిన భక్తులు బీఆర్ఎస్ మంత్రులు, అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. స్థానిక రైతులు, వ్యవసాయ దారులు ట్రాక్టర్ల ద్వారా కిలో మీటర్ దూరంలో ప్రవహించే గోదావరికి భక్తులను తరలించి పుణ్యస్నానాలు చేసేలా సహకరించారు. గోదావరి ఒడ్డున ఇన్ఫిల్టర్ బావులు నిర్మించి మోటార్ల ద్వారా జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేసినా కొంతమంది ట్రాక్టర్లలో గోదావరికి వెళ్లి స్నానాలు చేశారు. ఈ ప్రాంతాల్లో ఘాట్లు నిర్మిస్తే ఉపయోగం ఇటీవల కలెక్టర్ టీఎస్.దివాకరతో పాటు అధికారులు జిల్లాలోని పుష్కరఘాట్ల నిర్మాణాలకు స్థలాలను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కానీ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఘాట్ల నిర్మాణం చేపట్టాలనే ఆలోచన చేయలేదని స్థానికుల ద్వారా తెలుస్తుంది. వాజేడు మండలం పూసూరు రేవు, ఎడ్జర్లపల్లి రేవు వద్ద నీరు ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఘాట్లను నిర్మిస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ముళ్లకట్టకు కిలోమీటర్న్నర దూరంలో మరో ఘాట్, రాంనగర్ వద్ద పాత పడవ రేవు వైపునకు నిర్మిస్తే భక్తులకు ఇబ్బంది ఉండదు. మంగపేట వద్ద ఇప్పుడున్న దానికి ఆనుకుని మరో ఘాట్ నిర్మిస్తే భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు సులువుగా ఉంటుంది. 2015 నాటి పాఠాలు నేర్వని అధికారులు నీరులేక జల్లు స్నానాలు చేసిన భక్తులు 2027 పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విన్నపం నీరు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ఘాట్లు నిర్మించాలని వేడుకోలు వచ్చే ఏడాదిలో జరగబోయే పుష్కరాలకు భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు రూ.4 కోట్లతో 50మీటర్ల పుష్కరఘాట్ కాంక్రీట్తో నిర్మించేందుకు ఇరిగేషన్ శాఖ ప్రతి పాదనలు సిద్ధం చేసింది. గోదావరి వరద ఘా ట్కు దూరంగా ఉంటే పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమా దం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని గోదా వరి ప్రవహించే ప్రాంతాలను గుర్తించి అక్కడ ఘాట్లను నిర్మిస్తే బాగుంటుందని స్థానికులు అధికారులు, నాయకులను కోరుతున్నారు. -
ముగిసిన ముప్పిడి ఉద్యమ ప్రస్థానం
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ (మావోయిస్టు) పార్టీలో ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ అలియాస్ జంగ్ దాదా ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఆయిడిసి, బాయిడిసి.. నాన్ననిడిసి సాయుధ బాట పట్టిన మావోయిస్టు నేత మళ్లీ జనం మధ్యకు రానున్నారు. పేద, బడుగు బలహీన వర్గాల కోసం తుపాకీ ఎత్తి రాజీలేని ఉద్యమాన్ని సాగించిన ముప్పిడి సాంబయ్య ఆదివారం జనజీవన స్రవంతిలో కలిశారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా, దండకారణ్య డివిజన్ కమిటీ నేతగా ఉన్న ఆయన తన 14 మంది అనుచరులతో కలిసి ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారన్న వార్త చర్చనీయంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన సాంబయ్య సుమారు నాలుగు దశాబ్దాల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరారు. పదో తరగతి చదువుతున్నప్పుడే ఉద్యమం వైపు.. ముప్పిడి సాంబయ్య 1984లో పదో తరగతి చదువుతున్నప్పుడు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. వరంగల్ ఉద్యమ పితామహుడు, వరంగల్ జిల్లా కార్యదర్శి పులి అంజన్నను స్ఫూర్తిగా తీసుకొని 1984లో పూర్తిస్థాయి కార్యకర్తగా పార్టీలో చేరారు. మొదట పరకాల ఏరియా దళసభ్యుడిగా, కొద్ది రోజులకే బాబన్న పేరుతో పరకాల – చిట్యాల ఏరియా కమాండర్గా వ్యవహరించారు. పరకాల కమాండర్ నుంచి ఖమ్మం జిల్లాకు జిల్లా కమిటీ సభ్యుడిగా బదిలీ అయ్యి 2002 వరకు అక్కడే ఉన్నారు. 2002 తర్వాత 2018 వరకు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, తూర్పు ఇన్చార్జ్గా భాస్కర్ పేరుతో వ్యవహరించారు. 2018లో ఒడిశా స్టేట్ కమిటీ మెంబర్గా వ్యవహరించారు. 2025లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి స్థానంలో ఒడిశా నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికై కొనసాగుతున్నారు. కాగా, 2013లో కమాండర్ స్థాయి అయిన నిమ్మల సారమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. వివాహం జరగగా ప్రస్తుతం ఆమె జనగామలో ఉంటున్నట్లు పోలీసుల సమాచారం. వికాస్, జంగ్ దాదా ఆయనే.. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పనిచేసిన సాంబయ్య.. వికాస్, జంగ్ దాదా పేర్లతో కూడా పనిచేసి పాపులర్ అయ్యారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జిల్లా కమిటీ సభ్యుడు, కార్యదర్శిగా పనిచేసినప్పుడు సుదర్శన్, వికాస్ పేర్లతో వ్యవహరించారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జంగ్ దాదాగా ఆదివాసీ గిరిజనులతో మమేకమయ్యారు. సాహిత్యంలో అనేక రచనలు చేశారు. సాంబయ్య తల్లిదండ్రులు రామస్వామి–భద్రమ్మ కాగా.. ప్రస్తుతం భద్రమ్మ ఉంది. సాంబయ్య కు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉండగా.. ఒక సోదరుడు సదానందం ప్రభుత్వ టీచర్. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత, అనుచరులు కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య పులి అంజన్న స్ఫూర్తితో 42 ఏళ్ల క్రితం ఉద్యమ బాట ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలో పనిచేసిన సాంబయ్య ఉమ్మడి వరంగల్ నుంచి మిగిలింది నరహరి, పాండునే.. -
సండే సందడి
రామలింగేశ్వరస్వామికి పూజలు వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజారులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించారు. గోవిందరావుపేట: మండల పరిధిలోని పర్యాటక ప్రాంతమైన లక్నవరంలో ఆదివారం పర్యాటకులు సందడి నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో లక్నవరం సరస్సుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి ప్రకృతి అందాలను చూసి ఆనందంగా గడిపారు. తేలాడే వంతెనపై నడుస్తూ.. సరస్సులో బోటు షికారు చేస్తూ సందడిగా గడిపారు. -
రామప్ప శిల్పకళ అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ సంపద అద్భుతంగా ఛత్తీస్ఘడ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జు వెంకటేశ్వర్ కొనియాడారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆయన ఆదివారం సందర్శించి రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప ఆలయం బాగుందని కొనియాడారు. అదేవిధంగా అమెరికాకు చెందిన క్రిస్ రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వివరించగా రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ అంటూ కొనియాడారు. నేడు పదహారు పండుగ కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరాలయంలో మహా శివరాత్రి సందర్భంగా శ్రీశుభానంద–ముక్తీశ్వరుల కల్యాణం జరిగి (నేడు)సోమవారం 16 రోజులు అవుతున్న సందర్భంగా పదహారు రోజుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రధాన ఉత్సవ మూర్తుల కల్యాణం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. కాళేశ్వరాలయంలో భక్తుల సందడి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సెలవుదినం కావడంతో భక్తుల సందడి నెలకొంది. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి స్వామి వారి ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీశుభానందదేవి, శ్రీసరస్వతీ అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. శని, కాలసర్పనివారణ పూజలు భక్తులు నిర్వహించారు. దీంతో ఆలయంలో భక్తులు కోలాహలం కనిపించింది. -
నారసింహుడికి సింహవాహనసేవ
● కోటంచలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలురేగొండ: మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఆది వారం నాలుగో రోజు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఉదయం నిత్య విధి పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి సింహవాహన సేవలో మాడవీధుల గుండా ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, మేళతాళల చప్పుళ్లతో ఊరేగించారు. బలిహరణం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామి వారికి గరుడోత్సవం, సదస్యం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆరగింపు, తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్రావు, ఆలయ ఈఓ మహేష్, ధర్మకర్తలు, గ్రామపెద్దలు కనుకుంట్ల దేవేందర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. నేడు హనుమంతవాహన సేవ నేడు(సోమవారం) స్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు బుచ్చమచార్యులు తెలిపారు. రాత్రి చిన్న రథసేవ, దోపోత్సవం కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు. -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందజేస్తున్న మంత్రి సీతక్క సర్పంచ్ను సన్మానిస్తున్న మంత్రులు సీతక్క, పొంగులేటిఏటూరునాగారం: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతామని రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర, శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ దివాకరతో కలిసి కొండాయి గ్రామానికి చెందిన 90మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉంటే ఇంటి నిర్మాణానికి తక్షణమే లక్ష రూపాయల రుణం అందుతుందని వివరించారు. అలాగే కొండాయి గ్రామానికి వెళ్లే దారిలోని జంపన్నవాగుపై హైలెవల్ బ్రిడ్జిని రూ.16 కోట్లతో మంజూరు చేయించి నిర్మాణం పనులు చేపట్టామన్నారు. కొండాయి గ్రామం జంపన్నవాగు పరీవాహక ప్రాంతంలో ఉన్నందున మంజూరైన ఇళ్లను సురక్షిత ప్రాంతంలో నిర్మించుకోవాలని లబ్ధిదారులకు మంత్రి సీతక్క సూచించారు. పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన 38 చెక్కులను మంత్రి అందజేశారు. అలాగే నూతనంగా ఏర్పడిన ఆత్మకమిటీతో మంత్రి సీతక్క ప్రమాణ స్వీకారం చేయించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) కమిటీ పారదర్శంగా పనిచేయాలని సూచించారు. అనంతరం చైర్మన్, డైరెక్టర్లను మంత్రి సన్మానించారు. అనంతరం ఏటూరునాగారం పట్టణ కేంద్రంలో సుమారు కోటి రూపాయలతో చేపట్టిన ఆధునిక కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశంచారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, డీపీఓ వెంకయ్య, హౌసింగ్ పీడీ సూర్యనారాయణ, ఎంపీడీఓ శ్రీనివాస్, రవాణా శాఖ స్టేట్ డైరెక్టర్ వసంతశ్రీనివాస్, నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, వావిలాల ఎల్లయ్య, ఎండీ అప్సర్పాషా, గౌస్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. నూతన సర్పంచ్లకు సన్మానం వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయం ఆవరణలో ఆదివారం నూతనంగా ఎన్నికై న కాంగ్రెస్ సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాలెంవాగు ప్రాజెక్టు మంజూరు చేశారని తెలిపారు. ఆ ప్రాజెక్టు అభివృద్ధికి గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు కాల్వల మరమ్మతులకు నిధులు మంజూరు చేసి 15వేల ఎకరాలకు సాగునీరు అందించేలా కృషి చేశామని వెల్లడించారు. వాజేడు మండల పరిధిలోని పూసూరు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం కొత్తగా ఎన్నికై న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యె తెల్లం వెంకట్రావ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీను, నాయకులు చిడెం మోహనరావు, మన్నెం సునీల్ పాల్గొన్నారు. కొండాయి బ్రిడ్జి పనులు త్వరలోనే పూర్తి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
పుచ్చకాయలకు భలే గిరాకీ
వాజేడు: వేసవికాలం వచ్చిందంటే చాలు పుచ్చ కాయలకు భలే గిరాకీ ఉంటుంది. మండల కేంద్రంలోని జగన్నాథపురం జంక్షన్ వద్ద ఆలుబాక గ్రామానికి చెందిన పలువురు రైతులు పుచ్చకాయలను తెచ్చి విక్రయిస్తున్నారు. దీంతో జగన్నాథపురం, మండపాక, చెరుకూరు, ధర్మవరం తదితర గ్రామాలకు వెళ్లే ప్రజలు కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. సీపీఆర్, డెఫిబ్రిలేషన్పై శిక్షణ ఎంజీఎం: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన కీలక నైపుణ్యాలపై 33 మంది వైద్యులకు కాకతీయ వైద్య కళాశాలలో సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యఅనిల్ తెలిపారు. శని, ఆదివారాల్లో డాక్టర్ సూరిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ జ్ఞాపిక సమక్షంలో హృదయం ఆగడం (కార్డియాక్ అరెస్టు), సీపీఆర్, డిఫిబ్రిలేషన్ వినియోగం వంటి అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య మాట్లాడుతూ శిక్షణ పొందిన వైద్యులు భవిష్యత్లో మరికొంత మందికి శిక్షణ ఇవ్వడం ద్వారా అత్యవసర వైద్యసేవల నాణ్యత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. రేపు భద్రకాళి దేవాలయం మూసివేత హన్మకొండ కల్చరల్: చంద్రగ్రహణం సందర్భంగా భద్రకాళి దేవాలయాన్ని మంగళవారం మూసివేయనున్నట్లు ఈఓ రామల సునీత, ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, వేదపాఠశాల అధ్యాపకుడు తాతాభట్ల నరసింహశర్మ ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటల వరకు పూజలు నిర్వహించిన అనంతరం 7.30 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. తిరిగి రాత్రి 7 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేస్తామని, బుధవారం సంప్రోక్షణపూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతిస్తామని వారు తెలిపారు. -
ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి
● టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉప్పస్వామి, నాగరాజుఏటూరునాగారం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న తెలుగు, హిందీ, వ్యాయామ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల ఉప్పస్వామి, పల్లె నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శనివారం మండల కేంద్రంలోని ఐటీడీఏ ఏపీఓ వసంతరావుకు ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంతో పాటు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసి కనీస వేతనం చెల్లించాలన్నారు. వీటితో పాటు కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలను 10వ తరగతి వరకు అప్గ్రేడ్ చేయాలన్నారు. జీవో నంబర్ 317 ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. వసతి గృహాలకు వసతి ప్రత్యేకంగా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్లను మంజూరు చేయాలని కోరారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల సమస్యల పరిష్కారానికి 10వ తేదీన హైదరాబాద్లోని గిరిజన సంక్షేమ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ఉపాధ్యాయులందరూ అధిక సంఖ్యలో హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ నాయకులు బడుగు రాజు, భూక్య సారంగపాణి పాల్గొన్నారు. -
నేడు హేమాచలక్షేత్రానికి మంత్రుల రాక
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని మంత్రులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నేడు(ఆదివారం) దర్శించుకోనున్నారు. నేటి ఉదయం మేడారం నుంచి హేమాచలక్షేత్రానికి ఉదయం 8 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇద్దరు మంత్రులు హేమాచల క్షేత్రానికి రానుండటంతో ఆలయ కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్, మంగపేట ఎస్సై ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయనున్న చేయనున్నారు. ఉద్యోగ విరమణ సహజం ములుగు రూరల్: ప్రతీ ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. వెంకటాపురం(ఎం) పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన ఎస్సై రాంసింగ్ను జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో శనివారం శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 35 ఏళ్ల పాటు పోలీస్శాఖకు తన సేవలు అందించారని తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారని వివరించారు. ఉద్యోగ విరమణ తర్వాత కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, ఆర్ఐ వెంకటనారాయణ, వెంకటాపురం(ఎం)ఎస్హెచ్ఓ రాజు తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ చట్టాలను పటిష్టంగా అమలుచేయాలి వెంకటాపురం(కె): ఏజెన్సీ ప్రాంతంలోని చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక క్వారీల్లో పెసా చట్టం నియమ నిబంధనలు పాటించాలన్నారు. కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తూ 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఇసుకను డంపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు కృష్ణబాబు, తాటి రాంబాబు, నవదీప్, నాగరాజు, మల్లయ్య పాల్గొన్నారు. చంద్రవాహన సేవలో.. ● కోటంచలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలురేగొండ: మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శనివారం మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉదయం నిత్యనిధి, హోమం నిర్వహించిన అనంతరం స్వామి వారిని గజవాహన సేవలో మాడవీధుల గుండా ఊరేగించారు. సాయంత్రం బలిహరణ సేవ నిర్వహించిన అనంతరం స్వామి వారిని చంద్రవాహన సేవలో డప్పువాయిద్యాల నడుమ మాడవీధుల గుండా ఊరేగించారు. అనంతరం తీర్థప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్రావు, ఆలయ ఈఓ మహేష్, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, రవిందర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
విజ్ఞానాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
● జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి ములుగు: శాస్త, సాంకేతిక విజ్ఞానాభివృద్ధిలో పరిశోధనలను ఆసరాగా చేసుకుని నేటి విద్యార్థులు భాగస్వాములు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను డీఈఓ ప్రారంభించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు గందె రమేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి డీఈఓ సిద్ధార్థ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ప్రతిరోజూ నూతన ఆవిష్కరణలతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అందులోని విషయాలను విద్యార్థులు సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలని సూచించారు. నిత్యజీవితంలో పరిశోధనాత్మ దృక్పథాన్ని అలవర్చుకుని విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదుగాలన్నారు. పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిట్లను పరిశీలించిన ఆయన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి కృషి చేసిన సైన్స్ ఉపాధ్యాయులు సతీశ్ కుమార్, క్యాతం రాజేందర్ లను ఆయన అభినందించారు. జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మకంగా తయారుచేసిన ఎగ్జిబిట్లు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. వీటిని స్ఫూర్తిగా తీసుకొని సైన్స్ పట్ల అభిరుచిని పెంచుకొని సైన్స్ కోర్సులు చదివి విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరుకోవాలని వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు ఉపన్యాస, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ లో ప్రదర్శింపబడుతున్న మోడల్ రాకెట్ లాంచింగ్ కార్యక్రమానికి విద్యార్థులను తీసుకెళ్తున్న ఉపాధ్యాయ బృందాన్ని డీఈఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిట్టల మల్లయ్య, తోట చంద్రమౌళి, మహమ్మద్ జాఫర్ అలీ, కేశబోయిన మదన్ మోహన్, గైని సతీష్, వజ్జ లక్ష్మినారాయణ, దొంతి సత్యం, చల్లా భాస్కర్ రెడ్డి, బైకాని రజిత, విద్యార్థులు పాల్గొన్నారు. -
పుష్కరఘాట్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు
మేడారంలో రాతి కట్టడాలు● అదనపు కలెక్టర్ సంపత్ రావు ● జంపన్నవాగులో నిరంతరం గోదావరి నీరు ● రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డివాజేడు: మండలంలో పుష్కర ఘాట్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించాలని అదనపు కలెక్టర్ సంపత్రావు అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. వచ్చే ఏడాది జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాలకు వాజేడు, పేరూరు గ్రామాల వద్ద పుష్కర ఘాట్లకు అనువైన ప్రదేశాలను అధికారులతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. మండలంలో రెండు పుష్కర ఘాట్లు కొత్తగా నిర్మించాల్సి ఉండగా పనులు చేపట్టాలన్నారు. అందుకు సంబంధించి తాగునీరు, మరుగు దొడ్లు, విద్యుత్ లైన్, పార్కింగ్ ప్రదేశం తదితర పనుల ప్రారంభంపై ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వాటి నిర్మాణాలకు ఖర్చు అంచనా విలువలతో నివేదికలను అందజేయాలని కోరారు. అలాగే చండ్రుపట్ల గ్రామంలో పుష్కరఘాట్ ఏర్పాటు చేయాలని పరిశీలించగా అనువైన ప్రదేశం లేకపోవడంతో పేరూరులో పరిశీలించి ప్రతిపాదనలను వెంటనే అందజేయాలన్నారు. ఆయన వెంట నాగారం సర్పంచ్ స్వరూప, ఎంపీడీఓ విజయ, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ శ్రీకాంత్ నాయుడు, ఆర్ఐ కుమార స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. -
త్రీఫేజ్ విద్యుత్ అందేనా?
● ఏళ్ల తరబడి గిరిజన రైతుల నిరీక్షణ ● జిల్లాలో 321 కనెక్షన్ల కోసం దరఖాస్తులు ● ఐటీడీఏలో 17 డీడీలు మాయంఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలోని పలువురు గిరిజన రైతులు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లాలోని గిరిజన గ్రామాల నుంచి 321 మంది రైతులు గతంలో దరఖాస్తు చేసుకున్నారు. అయినా అధికారులు మూడేళ్లుగా ఒక కనెక్షన్కు కూడా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా కావడం లేదు. ప్రతీసారి గిరిజన దర్బార్లో పలుమార్లు గిరిజనులు త్రీఫేజ్ విద్యుత్ సరఫరాపై అధికారులకు వినతులు ఇస్తూ పోతున్నారు. కానీ పట్టించుకునే వారే కరువయ్యారని బాధితులు వాపోతున్నారు. దీంతో విసిగివేజారిన గిరిజనులు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా రాదని వ్యవసాయాన్ని మానివేయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. రైతులు డీడీలు తీసినా.. ఏటూరునాగారం మండలంలోని అల్లంవారిఘణపురం, బన్నాజీబంధంకు చెందిన 17 మంది రైతులు త్రీఫేజ్ విద్యుత్ సరఫరాకు ఒక్కో రైతు రూ.5,500ల చొప్పున డీడీలు తీసి ఇచ్చారు. కానీ ఇంత వరకు విద్యుత్ సరఫరా చేయడం లేదు. ట్రాన్స్ఫార్మర్లు లేవు, లైన్ లేదు, డీడీలు కూడా మాయమైన పరిస్థితి ఉంది. అవి ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఐటీడీఏలో ఉండాల్సి న డీడీలు కనిపించకుండా పోయాయని రైతులు వా పోతున్నారు. సిబ్బంది మాయం చేశారా లేక వాటి ని డ్రా చేశారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. డీడీలు ఇచ్చి మూడేళ్లు.. అల్లంవారిఘణపురంలో 12 మంది రైతులు, బన్నాజీబంధంకు చెందిన ఐదుగురు రైతులు ఒక్కొక్కరూ రూ.5,500ల చొప్పున డీడీలు తీశారు. మూడేళ్లు అయినా విద్యుత్ సరఫరా చేయడం లేదు. విద్యుత్శాఖ, ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం మూలంగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా కావడం లేదు. వ్యవసాయ బోర్లు వేసుకొని నిరుపయోగంగా ఉంటున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని ఏజెన్సీలోని రైతులు కోరుతున్నారు. -
చట్టాలపై అవగాహన ఉండాలి
● చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్ములుగు రూరల్: చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. ఈ మేరకు శనివారం బండారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా హక్కు, బాల కార్మిక, ర్యాగింగ్, బాల్య వివాహాలు, మోటర్ వెహికిల్ చట్టాల గురించి వివరించారు. న్యాయ సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు. ఉచిత న్యాయ సహాయం పొందే విధానాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, ప్రధానోపాధ్యాయుడు నర్సింహమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు మరింత భరోసా ఇవ్వాలి
● ఎన్హెచ్సీ డీపీఎం కమల ఏటూరునాగారం: మండలంలోని దివ్యాంగులకు ఎన్హెచ్సీ సెంటర్ మరింత భరోసా ఇవ్వాలని ఎన్హెచ్సీ డీపీఎం(జిల్లా ప్రాజెక్టు మేనేజర్) కమల అన్నారు. మండల కేంద్రంలోని ఎన్హెచ్సీ సెంటర్ను ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్లోని పిల్లలకు సిబ్బంది అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్హెచ్సీ సెంటర్ లేకపోవడం వల్ల దివ్యాంగుల్లో మార్పులేకుండా ఉండేదని, ఇప్పుడు మానసిక, శరీర మార్పులు, ఎదుగుదల కనిపిస్తుందని తెలిపారు. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు రెన్యూవల్స్ త్వరగా చేయించుకోవాలని సూచించారు. అలాగే మండలంలోని దివ్యాంగుల పొదుపు సంఘంతో అధికారులు సమావేశమై పొదుపు చేయడం వల్ల కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం పీడబ్ల్యూడీ కృష్ణవేణి, ఏపీఎం కొప్పుల శ్రీధర్రెడ్డి, ఎన్హెచ్సీ సెంటర్ సీసీ నర్సింహరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
పంచాయతీలకు నిధులు
15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన కేంద్రం● జిల్లాలో 171 జీపీలకు కేటాయింపు ● పంచాయతీ ఖాతాల్లో రూ.5.49 కోట్లు జమములుగు: రెండేళ్లకు పైగా ఖాళీగా దర్శనమిచ్చిన పంచాయతీల ఖాజానాలకు కేంద్రం నిధులు జమ చేయడంతో కళకళలాడుతున్నాయి. 2024 ఫిబ్రవరితో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామపంచాయతీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి అభివృద్ధి కుంటుపడింది. పారిశుద్ధ్య పనుల నిర్వహణ, వీధిదీపాల ఏర్పాటు, చెత్తాచెదారాన్ని తరలించే ట్రాక్టర్లకు సైతం డీజిల్ పోసేందుకు అప్పులు చేసి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగింది. పంచాయతీ కార్యదర్శులు గ్రామపంచాయతీల భారాన్ని తమ మీద వేసుకొని కొంతమేర నెట్టుకువచ్చినప్పటికీ పంచాయతీల అభివృద్ధిలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. జిల్లా వ్యాప్తంగా 10 మండలాల పరిధిలోని 171 గ్రామపంచాయతీ ఖాతాల్లో రూ.5.49.73.162 లను కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థికసంఘం నిధులను జమచేసింది. ఒక వ్యక్తికి సంవత్సరానికి రూ.150ల చొప్పున కేటాయిస్తుండగా ఎస్సీ, ఎస్టీ జనాభాకు 10 నుంచి 20 శాతం అదనంగా నిధులను కేటాయిస్తుంది. రేండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఎస్డీఎఫ్ గ్రాంట్ ఇప్పటివరకు మంజూరు కాలేదు. కేంద్రం 2023–24 సంవత్సరానికి చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసినప్పటికీ 2024–25 ఆర్థిక సంవత్సరానికి చెందిన నిధులను మంజూరు చేయాల్సి ఉంది. కేంద్రం మంజూరు చేసిన నిధులను తాగునీరు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యం కల్పిస్తారు. ఈ నిధులతో తాగునీరు, పైపులైన్ ఏర్పాటు, ట్యాంకుల నిర్మాణం, డ్రెయినేజీ వ్యవస్థ, చెత్తాచెదారాన్ని తరలింపు, నిర్వహణ కేంద్రాలకు 60 శాతం నిధులను ఖర్చు చేయాల్సి ఉండగా, సీసీ రోడ్ల నిర్మాణం, వీధిదీపాల ఏర్పాటు, పంచాయతీ భవనాల మరమ్మతు, శ్మశాన వాటికల సదుపాయాలకు 40 శాతం నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. కేంద్రం మంజూరు చేసిన నిధులను మార్చి 31వ తేదీలోగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు మంజూరైన నిధులను పాలకవర్గాలు ఖర్చు చేస్తేనే మిగిలిన నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఏటూరునాగారం 61,64,495 గోవిందరావుపేట 58,54,016 కన్నాయిగూడెం 24,14,646 మంగపేట 90,29,476 ములుగు 85,68,649 తాడ్వాయి 48,87,273 వెంకటాపురం(ఎం) 63,79,108 వెంకటాపురం(కె) 66,03,853 వాజేడు 54,36,416 మొత్తం 5,49,73,162 గ్రామ పంచాయతీకి మంజూరైన నిధులతో ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తాం. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామంలో ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. 15వ ఆర్థిక సంఘం నిధులను తాగునీరు, పారిశుద్ద్య నిర్వహణకు ప్రాధాన్యం కల్పిస్తాం, మిగిలిన నిధులతో ప్రజల అవసరాన్ని బట్టి వినియోగిస్తాం. – మామిడిశెట్టి సుగుణ, సర్పంచ్, వెంకటాపురం -
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
ఏటూరునాగారం: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని సీజీఎం రాజీవ్ చౌహన్ తెలిపారు. శుక్రవారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం ఆవరణలో మొక్కలను నాటి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు, ప్రజలకు నాణ్యతమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు నూతనంగా సబ్స్టేషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో నిరంతరం విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. రైతులకు త్రీఫేజ్ సరఫరా ఉంటుందని వెళ్లడించారు. విని యోగదారులు విద్యుత్ను వృథా చేయకుండా పవర్ను సేవ్ చేయాలన్నారు. నిర్లక్ష్యంగా విద్యుత్ వైర్ల ను నిర్మించకుండా శాశ్వతంగా ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే అధికారులు, సిబ్బందిని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ ఆనందం, డీఈఈ నాగేశ్వర్రావు, డీఈఈ పురుషోత్తం, టీఆర్ఈ డీఈఈ సదానందం, టీఆర్ ఏడీ మధుసూదన్, ఏఈ స్వామి, లైన్ ఇన్స్పెక్టర్ కొండా స మ్మయ్య, లైన్మెన్లు, జేఎల్ఎంలు పాల్గొన్నారు. సీజీఎం రాజీవ్ చౌహన్ -
84 మంది గైర్హాజరు
● కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ఏటూరునాగారం: జిల్లాలో పది మండలాల్లో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు కొనసాగుతున్నాయని, ఇంటర్మీడియేట్ జిల్లా అధికారి నాయిని విరేందర్ తెలిపారు. శుక్రవారం ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష కావడంతో జిల్లాలోని 2,006 మందికి 1,922 మంది హాజరు కాగా 84 మంది గైర్హాజరయ్యారన్నారు. ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే పరీక్ష గదిలోకి అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. నేడు (శనివారం) ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష ఉందని, విద్యార్థులు సకాలంలో హాజరు కావాలన్నారు. -
‘ఉద్యమ్’తో సబ్సిడీ రుణాలు
ములుగు: ఉద్యమ్ రిజిస్ట్రేషన్పై అందరికీ అవగాహన ఉండాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్పై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. యువత వ్యాపార రంగాలపై ఆసక్తి ఉన్న వారు చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలనుకునేవారు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ద్వారా స బ్సిడీ రుణాలు పొందాలంటే ఉద్యమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకుని ఉండాలన్నారు. సదస్సులో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యత, ఎలిజిబిలిటీ ప్రమాణాలు, ఆన్లైన్ అప్లై చేసే విధానం, లాభాలు (లోన్లు, సబ్సిడీలు, ప్రాధాన్యత టెండర్లు మొదలైనవి) వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా చిన్న వ్యాపారాలు ప్రభుత్వం నుంచి సమగ్ర సాయం పొందడం, బ్యాంకు లోన్లు, సబ్సిడీలు, టెండర్లో ప్రాధాన్యం వంటి ప్రయోజనాల కోసం సరైన దశలో ఉద్యమ్ రి జిస్ట్రేషన్ సహాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్, ఈడీసీ మేనేజర్ విక్రమ్, అసిస్టెంట్ మేనేజర్ భుక్య శ్రీకాంత్, ఆర్పీ వెంకన్న, రామేందర్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థరెడ్డి -
కల్యాణం.. కమనీయం..
మంగపేట: మండలంలోని కమలాపురం బిల్ట్ కాలనీలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దేవతామూర్తుల కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ పూజారి ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు వేదమంత్రోశ్ఛరణ నడుమ దేవతామూర్తుల విగ్రహాలను మంగళవాయిధ్యాలతో కల్యాణ వేదికపై ప్రతిష్ఠించారు. భక్తులు స్వామివారికి, అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు పూజారులు వేద మంత్రోశ్ఛరణ నడుమ వేంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవి కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తుల గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం -
పోలీస్ క్రీడా పోటీల్లో ‘బెటాలియన్’కు పతకాలు
గోవిందరావుపేట: తెలంగాణ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో 5వ బెటాలియన్ సిబ్బంది ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. వివిధ విభాగాల్లో మొత్తం 40 పతకాలతో ముందంజలో ఉన్నారు. బెటాలి యన్కు చెందిన పిసి–1,440 డి.కల్యాణ్ ఈత (స్విమ్మింగ్) పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసి 5 బంగా రు పతకాలు సాధించగా మరో పి.సి1,268 బి.హనుమంతు కరాటే విభాగంలో వ్యక్తిగతంగా 5 పతకాలు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. విజయాన్ని పురస్కరించుకొని బెటాలియన్ అదనపు కమాండెంట్ బి. సీతారాం శుక్రవారం సిబ్బందిని అభినందించారు. వారి కృషి, పట్టుదల, క్రమశిక్షణ ప్రశంసనీయమన్నారు. క్రీడారంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని, భవిష్యత్లో కూడా ఇలాగే ప్రతిభ కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు అనిల్ కుమార్, శ్రీనివాస్ రావు, ఆర్ఐలు వెంకటేశ్వర్లు, సాయి బాబు తదితర అధికారులు పాల్గొన్నారు. -
లోపభూయిష్టంగా విద్యాకమిషన్ సిఫారసులు
ఏటూరునాగారం: తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులు లోపభూయిష్టంగా, విద్యారంగానికి ఉపాధ్యాయులకు నష్టాన్ని కలిగించేలా ఉన్నాయని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ వీరభద్రం అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరిగిన సంఘ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ సొంత అభిప్రాయాలను విద్యారంగం ఉపాధ్యాయులపై రుద్దడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల, అధ్యాపకుల, బోధనేతర సిబ్బంది వేతనాలు మార్కెట్ ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నాయని సిఫారసులు ఇవ్వడం అర్ధరహితమన్నారు. రాష్ట్రంలోని విద్యావవస్థపై సమగ్ర అధ్యయనం చేసి పాఠశాలల పరిస్థితులు, విద్యా ప్రమాణాల పెంపు, విద్యా రంగ పురోగతిపై ప్రభుత్వానికి మంచి నివేదిక ఇవ్వాలన్నారు. ప్రభుత్వం సమగ్రంగా సర్వేలు చేయాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అడప రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాంబాబు, కందుకూరి రాజు, రాజేంద్రప్రసాద్, నాయుడు, విష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
నేడు మేడారానికి పొంగులేటి రాక
ఎస్ఎస్తాడ్వాయి: మేడారానికి నేడు (శనివారం) రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రానున్నారు. మంత్రి సీతక్కతో కలిసి ఆయన అమ్మవార్ల గద్దెల ప్రాంగణం నిర్మించిన ఆల య పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం పెండింగ్ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షి సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి పొంగులేటి శ్రీని వాస్రెడ్డి, మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెండింగ్ మిల్లింగ్ చార్జీలు విడుదల చేయాలి ములుగు రూరల్: పెండింగ్లో ఉన్న మిల్లింగ్ చార్జీలను విడుదల చేయాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా సివిల్ సప్లయీస్ డీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కృష్ణవేణిని అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న మిల్లింగ్ చార్జిలను విడుదల చేయాలన్నారు. మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని డీఎం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వాడబలిజలు అన్నిరంగాల్లో రాణించాలివాజేడు: వాడబలిజ కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలని వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గగ్గురి రమణయ్య అన్నారు. మండలంలోని ధర్మవరంలో శుక్రవారం ధర్మవరం, బీసీ మర్రిగూడెం గ్రామాలకు చెందిన వాడబలిజ కూలీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లలకు విద్య ఎంతో ముఖ్యమైందన్నారు. ప్రతీ విద్యార్థికి తమ తల్లిదండ్రులు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధను చూపాలన్నారు. రానున్న రోజుల్లో వాడబలిజలు అన్ని రంగాల్లో రాణించాలని దానికి సన్నద్ధం కావాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర యూత్ అధ్యక్షుడు ఆదినారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, మండల అధ్యక్షుడు నాగార్జున, రఘుబాబు, సమ్మయ్య, శ్రీధర్ తదితరులున్నారు. బడిలో మట్టి కుండల వర్క్షాప్ కాళేశ్వరం: జిల్లాస్థాయి జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలను మహదేవపూర్ జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో మట్టి కుండల తయారీ వర్క్ షాప్తో ప్రారంభించారు. కుమ్మరివారితో కుండల తయారీ విధానాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి స్వామి మాట్లాడుతూ.. పర్యావరణానికి అనుకూలమైనటువంటి మట్టిపాత్రలు వాడాలని తెలిపారు. ప్రాచీన కాలంలో ఇంట్లో ప్రతీ వస్తువు మట్టితో తయారుచేసిన వంట పాత్రలు, నీటిని నిలువ చేసే పాత్రలు, ధాన్యం నిల్వచేసే కాగులు పేర్పులు మొదలగు మట్టిపాత్రలు ఉపయోగించేవారని తెలిపారు. దీంతో ప్రజలందరికీ మంచి ఆరోగ్యంతో పాటు కుటీర పరిశ్రమలు బలపడేవని తెలిపారు. నేటి సమాజంలో మట్టి పాత్రలన్నీ కనుమరుగైపోయాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాలుర పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం, బయోసైన్స్ జిల్లా ఫోరమ్ అధ్యక్షుడు బి.ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ హసీనభాను, ఉపసర్పంచ్ శ్రీజ, బాలికల పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం సరిత, పి.కల్యాణి, ఉర్దూ పాఠశాల హెచ్ఎం యాస్మిన్, వివిధ పాఠశాలల సైన్స్ టీచర్లు పాల్గొన్నారు. -
కల్చర్ఫుల్ ఫెస్ట్..
● నిట్లో ఉత్సాహంగా స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకలు ● ఆకట్టుకున్న స్వయంభు సినిమా యూనిట్ ● సందడి చేసిన హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్ ● ప్రత్యేక ఆకర్షణగా హీరో నిఖిల్ సిద్ధార్థ, డైరెక్టర్ శైలేష్ ● ఉర్రూతలూగించిన ప్రోషో వేడుకలను తిలకిస్తున్న విద్యార్థులుకాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహిస్తున్న సాంస్కృతిక మహోత్సవం (కల్చరల్ఫెస్ట్) కలర్ఫుల్గా సాగింది. ఈ ఫెస్ట్లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని తమతమ సంస్కృతీసంప్రదాయాలను పంచుకున్నారు. తొలిరోజు శుక్రవారం స్ప్రింగ్స్ప్రీ–26లో డైరెక్టర్స్ కట్లో సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను, స్వయంభు మూవీ హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్, అభినవ్ గోమటమ్, కెమెరామెన్ కేకే సెంథిల్కుమార్, ప్రోషోలో జోనితాగాంధీ తన గానామృతంతో విద్యార్థులను అలరించారు. ఫ్లాష్ షూట్ సీఈఓ స్టార్టప్ రంగాలపై అవగాహన కల్పించారు. చివరి రోజు శనివారం ప్రోషోలో రానినారెడ్డి పాప్ సాంగ్స్తో అలరించనుంది. ‘వారెవ్వ ఏమీ ఫేసు.. అచ్చం హీరోలా ఉంది బాసు’ అని పాట పాడుతూ విద్యార్థులు ఫేస్ పెయింటింగ్లో కలర్ఫుల్ లుక్ ఇచ్చారు. తమ ముఖాలలపై డైనోసార్, ప్రకృతిని తమ చేతి కుంచెతో వివిధ రంగులతో ఆవిష్కరించుకున్నారు. -
పుష్కరఘాట్ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
మంగపేట/ఏటూరునాగారం: గోదావరి పుష్కరఘాట్ల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కలెక్టర్ టీఎస్ దివాకర ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగపేట మండలంలో నూతనంగా పుష్కరఘాట్ నిర్మాణం చేపట్టేందుకు మల్లూరు, చుంచుపల్లి, మంగపేటలోని పొదుమూరు, గంపోనిగూడెం సమీపంలోని సండ్రోనిఒర్రె ప్రాంతంలో గోదావరి తీర ప్రాంతాన్ని కలెక్టర్ టీఎస్ దివాకర, అదనపు కలెక్టర్ మహేందర్జీ (రెవెన్యూ)తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం, ముల్లెకట్టలో 2015లో నిర్మించిన పుష్కరఘాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంగపేట మండలంలో నూతన పుష్కరఘాట్ నిర్మాణంపై ఇరిగేషన్ డీఈ రవికుమార్, ప్రవీణ్కుమార్తో చర్చించి వెంటనే ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ఆదేశించారు. జూలై 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు అన్ని సౌకర్యాలు కల్పించేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ముఖ్యంగా ప్రతీ ఘాట్ వద్ద భక్తులకు తాగునీరు, లైటింగ్, మరుగుదొడ్లు, రవాణామార్గం, పార్కింగ్ స్థలాలు, ప్రత్యేక వైద్యశిబిరాలు కల్పించడానికి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తహసీల్దార్ తోట రవీందర్, ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్, ఎస్సై టీవీఆర్ సూరి, ఎంపీడీఓ బద్రునాయక్, ఇరిగేషన్ డీఈ రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ మల్లేశ్వర్రావు, ఆర్ఐ శ్రీనివాస్, ఎంపీఓ మహేందర్, పంచాయతీ కార్యదర్శి సురేష్, రూప్సింగ్ తదితరులు ఉన్నారు. కలెక్టర్ టీఎస్ దివాకర -
రెండు నిమిషాల్లో కుల ధ్రువీకరణ పత్రం
ఏటూరునాగారం/మంగపేట: ప్రజలకు రెండు నిమిషాల్లో కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం జరుగుతుందని ఈ–జిల్లా మేనేజర్ (ఈడీఎం) దేవేందర్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని మంగపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మీసేవా, ఆధార్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. మీసేవలో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ తప్పులు లేకుండా నమోదు చేయాలని, ఫార్మర్ రిజిస్ట్రేషన్ సర్వీసును రైతులుందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్ణీత రు సుం కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. యూనివర్సల్ క్లైంట్ సాఫ్ట్వేర్ ద్వారా ఆ ధార్ సేవలు సులభతరం అయ్యాయన్నారు. మీసే వ నిర్వాహకులు ఈఎస్డీ గైడ్లైన్స్ ప్రకారం నడిపించాలన్నారు. మీసేవ లోగో, తహసీల్దార్ ఇతర అధికారుల నంబర్లు ప్రజలకు కనిపించేలా ఉండాలన్నారు. కల్యాణలక్ష్మీ, బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. ఈ కా ర్యక్రమంలో మీసేవ జిల్లా మేనేజర్ పోలోజు విజ య్, రాకేష్, సెంటర్ల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈడీఎం దేవేందర్ మీసేవ కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీలు -
పుష్కరాలకు పార్కింగ్ స్థలాల గుర్తింపు
ఏటూరునాగారం: వచ్చే ఏడాలో జరగనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాలను నిలిపించేదుకు ప్రత్యేకంగా నాలుగు చోట్ల పార్కింగ్ స్థలాలను అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఐటీడీఏ ఇంజనీరింగ్శాఖ ద్వారా పార్కింగ్ స్థలాలను అభివృద్ధి చేసేందుకు, లెవలింగ్, విద్యుత్ దీపాలు ఇతర పనుల కోసం ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖ అధికారులు రూ. 5.21 కోట్లతో ప్రతిపాదలను కలెక్టర్ దివాకరకు గురువారం అందజేశారు. నిధులు మంజూరు చేస్తే వాటితో పార్కింగ్ స్థలాలకు కావాల్సిన పనులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే గానీ ఇక్కడ పనులు మొదలయ్యే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా పార్కింగ్ స్థలాలను ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెం, మంగపేట పుష్కరఘాట్లు, వెంకటాపురం(కె) వైపు ఒకటి, ముళ్లకట్ట వద్ద మరొకటి ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఏటూరునాగారం: ఉన్నత విద్యా పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్ల వేతనాలు, మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం కింద బిల్లులు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. ఏడాదిగా చెల్లించకున్నా వాటి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. స్కావెంజర్లలకు సరైన వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు చాంద్పాషా, ఉపాధ్యక్షుడు కొమురయ్య, ప్రమీల, కార్మికులు పాల్గొన్నారు. రేగొండ: భక్తుల కొంగుబంగారంగా విరజిల్లుతున్న కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం అభిషేకంతో మొదలయ్యాయి. అనంతరం స్వామి వారిని సూర్యవాహన సేవలో మాడ వీధుల గుండా ఊరేగించారు. ఈ సేవలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వస్తివాచనం అనంతరం శేషవాహనసేవ, అంకురారోహనం కార్యక్రమాలు కొనసాగాయి. జాతర మొదటి రోజు భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో దేదీప్యమానంగా వెలుగొందేందుకు అధికారులు ఆలయాన్ని దీపాలంకరణ చేశారు. నిత్య అన్నసత్రం ప్రారంభం వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే నిత్య అన్న సత్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు కాసం నాగరాజు, గౌరవ అధ్యక్షుడు ఎర్రం సదాశివ శంకర్, సభ్యులు పాల్గొన్నారు. రేగొండ: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్, సివిల్ సప్లయీస్ అధికారులు గురువారం ఉదయం పట్టుకున్నారు. హనుమకొండ జిల్లా అంబాల నుంచి మహారాష్ట్రకు అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు మండలంలోని భాగిర్థిపేట జంక్షన్ వద్ద టాస్క్ఫోర్స్ ఏసీపీ ప్రభాకర్ తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. టాటా ఏస్ వాహనంలో బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లయి ఆర్ఐ రాజు ఫిర్యాదు మేరకు డ్రైవర్ కృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రుణ లక్ష్యాలను అధిగమించాలి
ములుగు: బ్యాంకులకు నిర్ధేశించిన రుణ లక్ష్యాలను అధికారులు అధిగమించాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్జీ అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బ్యాంకర్ల జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లాస్థాయి సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత కల్పిస్తూ బ్యాంకర్లు ముందుకు సాగాలన్నారు. గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సమావేశాలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బ్యాంకర్లకు సూచించారు. నూతనంగా ఏర్పడే మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలను అందించడానికి నూతన ఖాతాలను తెరిపించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా 60 ఏళ్లు నిండిన మహిళ వయోవృద్ధులతో ఏర్పాటు చేస్తున్న సంఘాలకు నూతన ఖాతాలు అందించడంతో పాటు రుణ సహాయం అందించడానికి బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వ పథకాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి నియమ నిబంధనల ప్రకారం రుణాలు అందించే విధంగా చూడాలని పేర్కొన్నారు.అనంతరం లీడ్ బ్యాంకు మేనేజర్ జయప్రకాశ్, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, ఆర్బీఐ ఏజీఎం యశ్వంత్ సాయి, యూనియన్ బ్యాంక్ డీజీఎం కమలాకర్లతో కలిసి వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సర ప్రొటెక్షన్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ బుక్లను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి కొమురయ్య, పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ధర్మ నాయక్, మత్స్య సంవర్థక శాఖ అధికారి సాల్మన్ రాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్, హర్టికల్చర్ అధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ మహేందర్జీ -
బెంగళూరులో తెలంగాణ ఉపాధ్యాయుల ప్రదర్శన
మంగపేట: దక్షిన భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బెంగళూరు జ్ఞానభారతి క్యాంపస్లోని ఆర్ఐఈఎస్టీ వేదికగా తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు మిన్నంటాయి. 2025–2026 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న 30 రోజుల సర్టిఫికెట్ ఇన్ ఇంగ్లిష్(సీఈఎల్టీ)శిక్షణలో భాగంగా గురువారం నిర్వహించిన రీజినల్ కాంట్రీబ్యూషనల్ కార్యక్రమంలో తెలంగాణ ఉపాధ్యాయులు తమ ప్రతిభను చాటారు. శిక్షణలో భాగంగా ఐదు రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులు తమ ప్రాంతీయ కళలను ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రం తరఫున వివిధ జిల్లాల నుంచి హాజరైన ఉపాధ్యాయులు రాష్ట్ర సాంస్కృతిక చిహ్నమైన బతుకమ్మ, వీరనారి రాణిరుద్రమాదేవి ఏకపాత్రాభినయం, వనదేవతల పండుగ, సమ్మక్క–సారక్క జాతరపై నిర్వహించిన ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో సమ్మక్క–సారక్క పాత్రలో జిల్లాకు చెందిన మంగపేట మండంలోని తొండ్యాల లక్ష్మిపురం, ఎంపీపీఎస్ ఉపాధ్యాయులు ఎం.కావ్య, మంగపేట ఎంపీపీఎస్ పాఠశాల సెకండ్ గ్రేడ్ ఉపాధ్యారాలు ఆర్. వందన ప్రత్యేక ఆకర్షణగా నిలిచి తన సత్తా చాటారు. ఉపాధ్యాయుల ప్రదర్శనను డైరెక్టర్ సిప్రయన్ మంథారో, తెలంగాణ ఇన్చార్జ్ రవినారాయణ, డైరెక్టర్ హిలేష్సిభగత్ ప్రత్యేకంగా అభినందించారు. ఇంగ్లిష్ బోధనలో శిక్షణ పొందుతూనే తమ ప్రాంతీయ అస్తిత్వాన్ని చాటిన ఉపాధ్యాయులను అభినందించారు. -
ఇంటర్ సెకండియర్ పరీక్షలు షురూ..
ఏటూరునాగారం: జిల్లాలోని పది మండలాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యారు. ఈ మేరకు ఆయా కళాశాలల సిబ్బంది విద్యార్థులను పరిశీలించి సెంటర్లోకి అనుమతించగా తెలుగు, సంస్కృతం, అరబిక్వంటి భాషా పరీక్షను ప్రశాంతంగా పరీక్ష రాసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నాయిని వీరేందర్ తెలిపారు. జిల్లాలోని పది కేంద్రాల్లో 1,832 మందిని అలాట్ చేయగా 1,787 మంది పరీక్షకు హాజరు కాగా 45 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అలాగే జాకారం, ములుగు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు తెలిపారు. హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వచ్చిన అనుమతించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇవ్వడంతో స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఎన్నో కష్టాలు పడుతూ పరీక్షల కేంద్రాలకు చేరుకునే సమయంలో ఆలస్యమై పరీక్షలకు దూరమైన సందర్భాలున్నాయని వారు వాపోయారు. ఈ ఏడాది నుంచి 5 నిమిషాల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయగా..విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
మొక్కజొన్న, మిర్చి పంటల పరిశీలన
ములుగు రూరల్: మండల పరిధిలోని అబ్బాపూర్, అన్నంపల్లి గ్రామాల్లోని మొక్కజొన్న, మిర్చి తోటలను గురువారం వ్యవసాయ పరిశోధన సంస్థ వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రావణ్ కుమార్, వీరన్న, మానస సౌందర్య, మాధవిలు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో యాసంగి వరి పంటలకు కాండం తొలిచే పురుగు, జింక్ లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. కాండం తొలిచే పురుగు నివారణకు నాటు పెట్టిన 15–20 రోజుల్లోపు కార్బోప్యూరన్ 3జీ ఎకరాకు 10 కిలోలు,, కార్టాప్ హ్రెడ్రోక్లోరిక్ 4జీ ఎకరాకు 8 కిలోలతో పాటు అదనంగా లింగాకర్షణ బుట్టలు వాడాలని సూచించారు. చౌడు సమస్య ఉన్న భూముల్లో రెండో దఫా యూరియాతో పాటు 100 గ్రాముల కార్బెండాజిం, మాంకోజెబ్ మిశ్రమాన్ని చల్లి పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. అధిక మోతాదులో యూరియా వాడటం నీరు నిల్వ ఉండటం వల్ల వేరు కుళ్లు, కింద ఆకులు ఎండిపోయినట్లు గుర్తించినట్లు తెలిపారు. వాటి నివారణకు 10 కిలోల యూరియా 150 గ్రాముల స్పింట్ కలిపి చల్లాలని సూచించారు. జింక్ లోపం నివారణకు లీటర్ నీటిలో 2 గ్రాముల జింక్ కలిపి చల్లాలని సూచించారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు క్లోరాన్ ట్రానిప్రోల్, లాంబ్డా సైహలోత్రిన్ మందు లీటర్ నీటికి 0.5 మిశ్రమాన్ని కలిపి పిచికారీ చేయాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పరమేశ్, ఏఈవో జ్యోతి, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఐఏఎస్ల ఆకస్మిక బదిలీ
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.హనుమకొండ, మహబూబాబాద్, జనగామ కలెక్టర్లను బదిలీ చేసి.. వారి స్థానంలో కొత్త కలెక్టర్లను నియమించారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓను కరీంనగర్ కలెక్టర్గా నియమించారు. జనగామ అదనపు కలెక్టర్ను హైదరాబాద్కు బదిలీ చేశారు. ఇటీవలే ఐఏఎస్ అధికారి హోదా కల్పించన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)గా నియమించారు. ఎవరు ఎక్కడికంటే.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్పాయ్ హనుమకొండ కలెక్టర్గా నియమితులయ్యారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు కమిషనర్గా కూడా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను మహబూబాబాద్కు బదిలీ చేశారు. మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ సమన్వయ శాఖకు బదిలీ చేశారు. జనగామ కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ జోగులాంబ గద్వాలకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆరు నెలల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా పనిచేసి ప్రస్తుతం జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా ఉన్న సందీప్ కుమార్ ఝాను నియమించారు. మరో ఐఏఎస్ అధికారి, జనగామ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పర్మార్ పింకేష్కుమార్ లలిత్కుమార్ను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా నియమించారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. కాగా, ఇటీవల ఐఏఎస్ (ఎస్సీఎస్) అధికారిగా పదోన్నతి పొందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వైవీ గణేశ్కు వరంగల్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పోస్టింగ్ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి ఏడుగురికి స్థానచలనం హనుమకొండ కలెక్టర్గా చాహత్.. ‘గ్రేటర్’కమిషనర్గా అదనపు బాధ్యతలు మహబూబాబాద్కు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కేంద్ర సర్వీసులకు మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్సింగ్ జోగుళాంబ గద్వాలకు జనగామ కలెక్టర్ ఆయన స్థానంలో సందీప్ కుమార్ ఝా నియామకం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా కరీంనగర్ కలెక్టర్గా బదిలీ -
బీమాతో ధీమా
మహిళా సంఘం సభ్యురాలు అయి ఉండి సహజ మరణం చెందితే వారు తీసుకున్న రుణమాఫీ కానుంది. అదే సీ్త్ర నిధి, బ్యాంకు రుణాలు తీసుకున్న మహిళ సంఘం సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం అందించే రూ. 10 లక్షల బీమా సొమ్ము నామినీ ఖాతాలో జమ అవుతుంది. దీంతో పాటు రుణం మాఫీ చేస్తారు. 50 శాతం మించి అంగవైకల్యం ఏర్పడితే సదరం ధ్రువపత్రం పరిశీలించి రూ. 5 లక్షలు అందించనున్నారు.ములుగు రూరల్: మహిళలు ఆర్ధికాభివృద్ది సాధించడంతో పాటు కుటుంబ ఆర్థిక ప్రగతికి వెన్నుదన్నుగా నిలుస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మహిళా సంఘాల సభ్యులకు భరోసా కల్పిస్తూ ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10 లక్షల బీమా పరిహారం పొందే విధంగా సౌలభ్యం కల్పించింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు పొందిన రుణం సైతం మాఫీ చేయనుంది. దీంతో మహిళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి అవకాశాలు జిల్లాలో వివిధ సమాఖ్యల్లో 69,149వ మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులు సీ్త్ర నిధి రుణాలతో పాటు బ్యాంకు రుణాలు పొందుతూ స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ, పర్యాటక ప్రాంతాల్లో ఆయా యూనిట్లను ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు. ఈ మేరకు ఉపాధి అవకాశాలు అందేలా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. బీమాకు అర్హులు వీరే.. గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయస్సు వారు స్వయం సహాయక సంఘాల సభ్యురాలిగా ఉన్నవారికి బీమా వర్తిస్తుంది. ప్రభుత్వం మహిళా సంఘాల నుంచి రుణాలు అందించి ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది. రుణం పొంది ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమాతో పాటు రుణమాఫీ చేస్తుంది. మహిళా సంఘాల సభ్యులకు సెర్ప్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. మహిళా సంఘాల సభ్యులకు భరోసాగా ఉంటుంది. – శ్రీనివాస్, అదనపు డీఆర్డీఏ, ఐకేపీ ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10లక్షలు, రుణమాఫీ జిల్లాలో 69,149 మందికి బీమా -
చెక్డ్యాం నిర్మాణాలపై సర్వే చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలోని జంపన్నవాగులో నీటి ప్రవాహం కొనసాగేలా చెక్డ్యాం నిర్మాణాలపై సర్వే నిర్వహించి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మేడారంలోని హరితహోటల్లో కలెక్టర్ టీఎస్.దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్లతో కలిసి గురువారం జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మేడారం మాస్టర్ ప్లాన్, జంపన్నవాగు అభివృద్ధి పనులు, వేసవి కాలంలో తాగునీటి సమస్యకు చర్యలు, 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సీఎం అదేశాల మేరకు మేడారంలో మరిన్ని శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. గద్దెల చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, పూజారులతో సమావేశాలు నిర్వహించి వారి సూచన, సలహాల మేరకు పటిష్టమైన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. మేడారం రోడ్ల డివైడర్ మధ్యలో ప్లాంటేషన్ చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లాలోని నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయాలని అధికారులను అదేశించారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని తదితర పనులపై సూచనలు చేశారు. అలాగే వచ్చే ఏడాదిలో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఘాట్ల వద్ద కనీస సదుపాయాలు భక్తులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎన్ఈజీఎస్లో కూలీల సంఖ్య పెరిగే విధంగా చూడాలన్నారు. ఈసమావేశంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్జీ, అదనపు కలెక్టర్( స్థానిక సంస్థలు ) సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్, ఎండోమెంట్ కమిషనర్ సునిత, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, జిల్లా వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, అధికారులు పాల్గొన్నారు. అలాగే ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాను ప్రభుత్వం కరీంనగర్ జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క చిత్రామిశ్రాను శాలువాతో సత్కరించి అభినందించారు. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే బాధ్యత సర్పంచ్లపై ఉందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతుల వేదికలో నిర్వహించిన నూతన సర్పంచ్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరేలా కృషి చేయాలన్నారు. గ్రామ స్థాయిలో సమస్యలను తక్షణం పరిష్కరించే దిశగా పని చేయాలన్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత గోవిందరావుపేట: మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, వయో వృద్ధులకు భరోసా కల్పించడానికి 60ఏళ్లు నిండిన వారికి ప్రత్యేక మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మండల పరిధిలోని పస్రాలో గురువారం మంత్రి సీతక్క పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ.10 లక్షల నిధులతో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా గ్రామ సంఘాల భవనాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాల ఉన్నతికి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మహిళా సంఘాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి జిల్లాకు దాదాపు 42 శాశ్వత భవనాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా వారికి రెట్టింపు ఆదాయం లభించిందని, మహిళలు స్వశక్తితో ఎదగడానికి వారికి సకాలంలో వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి ఆర్థికాభివృద్ధికి పాటుపడడం జరుగుతుందని వివరించారు. మేడారంలో అభివృద్ధి పనులకు మాస్టర్ ప్లాన్ సిద్ధంచేయాలి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క -
అకాలవర్షం.. రైతుల ఆగమాగం
మంగపేట/వెంకటాపురం(కె): అకాలవర్షంతో మిర్చి రైతులు ఆగమాగం అవుతున్నారు. మంగపేట, వెంకటాపురం(కె) మండలాల్లో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సంతో పాటు మోస్తరుగా వర్షం పడడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఆయా మండలాల పరిధిలో వందల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేసి కోతలు కోసి మిర్చి పంటను కల్లాల్లో ఆరబెట్టారు. ఈ క్రమంలో అకాల వర్షం కారణంగా పంటను కాపాడుకునేందుకు రైతులు టార్ఫాలిన్లతో పరుగులు తీసి పంటపై కప్పి కాపాడుకున్నారు. పలుచోట్ల గాలి దుమారానికి పరదాలు లేచిపోవడంతో కొంతమేర పంట తడిసిపోయింది. తెల్లవారుజాము వరకు చిరుజల్లులు పడిపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఫైళ్లు రెడీ.. పైసల్లేవ్
ఏటూరునాగారం: ఏజెన్సీలోని గిరిజనుల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన ట్రైకార్, గిరివికాస్, సోలార్, స్వయం ఉపాధి పథకాలకు నిధులు కరువయ్యాయి. ఐటీడీఏ పరిధిలోని గిరిజన మండలాల వారీగా అర్హులైన గిరిజనులు గిరివికాసం కింద 324 మంది, ట్రైకార్ ద్వారా రాజీవ్ యువవికాసం కింద 613, సోలార్ పథకం కింద 521 మంది అర్హులను గుర్తించి ఫైల్ రెడీ చేసి ఉంచారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఐటీడీఏకు సరైన బడ్జెట్ రాకపోవడంతో పైళ్లు మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా యి. ఐటీడీఏ పీఓకు సూపర్ పవర్స్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడంతో ప థకాలు అమలుకు నోచుకోలేని పరిస్థితి నెలకొంది. బడ్జెట్ కేటాయింపులో అలసత్వం గతంలో ఐటీడీఏకు నేరుగా నిధులు వచ్చేవి. కానీ మూడేళ్ల నుంచి ఎలాంటి నిధులు రావడం లేదు. పథకానికి కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసి ఐటీడీఏ పీఓ పరిశీలించి కలెక్టర్కు ఫైల్ పుటప్ చేయగా అక్కడ క్షుణ్ణంగా పరిశీలన చేసిన అనంతరం హైదరాబాద్లోని ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్కు ఫైల్ వెళ్తుంది. కానీ అర్హుల జాబితాకు కావాల్సిన బడ్జెట్ను ప్రభుత్వ ఆర్థిక కమిషన్ నుంచి మంజూరును ట్రైబల్ వెల్ఫేర్కు జీఓ జారీ చేయాల్సి ఉంది. కానీ ఫైనాన్స్ కమిషన్ ట్రైబల్ వెల్ఫేర్కు ఈ పథకాలకు కావాల్సిన డబ్బులను ఇవ్వడం లేదు. దీంతో అ లబ్ధిదారుల ఫైళ్లను అలాగే హోల్డ్ చేసి పెట్టారు. నిర్మాణాలకే పెద్దపీట ఐటీడీఏ ద్వారా ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ కింద రూ.39.5 కోట్లు మంజూరు కాగా వాటి ద్వారా ఆశ్రమ పాఠశాలల్లో నూతన భవనాల నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ పనులు ఈ ఏడాది మార్చి 31 వరకు పూర్తి చేయాలనే నిబంధనలు ఉన్నాయి. దీంతో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు వేగంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ, ఇంజనీరింగ్ శాఖ ద్వారా గిరిజన విద్యాలయాలు, ప్రహరీలు, ఇతర భవన నిర్మాణాల మరమ్మతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏకు నిధులు కేటాయిస్తూ వస్తుంది. దానివల్ల కేవలం మరమ్మతులు, నిర్మాణాల పనులు మాత్రమే సాగుతున్నాయి. గిరిజన రైతులకు అందించాల్సిన పథకాలను మాత్రం పక్కన పెట్టడంతో రైతులు నిరాశ పడుతున్నారు.మంగపేట : ములుగు నియోజక వర్గంలోని అర్హులైన గిరిజనులందరికీ ఏటూరునాగారం ఐటీడీఏ ద్వారా ట్రైకార్ రుణాలను మంజూరు చేయాలని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్ను తెలంగాణ రాష్ట్ర ఉపాధిహామీ మండలి(టీఎస్ఈజీసీ)సభ్యుడు గుమ్మడి సోమయ్య కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్లోని ట్రైకార్ కార్యాలయంలో చైర్మన్ బెల్లయ్యనాయక్ను బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలో ఎక్కువగా నిరుపేద గిరిజన కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. వారిలో అర్హులైన వారందరికీ ట్రైకార్ ద్వారా రుణాలు అందించి ఆర్థికాభివృద్ధికి సహకరించాలని కోరినట్లు సోమయ్య తెలిపారు. ఐటీడీఏకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల అమలుకు నిధులు కేటాయించాలి. సోలార్, గిరివికాసం, రాజీవ్ యువవికాసం, ఇతర పథకాలకు బడ్జెట్ను కేటాయించి అర్హులైన వారికి నేరుగా నిధులు అందించేలా చూడాలి. నిధులు రాకపోవడంతో గిరిజనులకు సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయి. తక్షణమే ప్రభుత్వాలు స్పందించి నిధులు మంజూరు చేయాలి. – చందా మహేశ్, ఏటూరునాగారం. ఆదివాసీ నాయకుడు● మూడేళ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనులు మరమ్మతులు, నిర్మాణ పనులకే బడ్జెట్ -
తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి
మంగపేట: గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య అన్నారు. వేసవి కాలం సమీపిస్తుండటంతో గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులతో ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారిగా తాగునీటి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్య ఎదురుకాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో 100 శాతం పన్నులు వసూలు చేయాలన్నారు. ఒకరిద్దరు కార్యదర్శులు పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మందలించారు. సమావేశంలో ఎంపీడీఓ భద్రు, ఎంపీఓ మహేందర్, ఈజీఎస్ ఏపీఓ అంకూస్, కార్యదర్శులు పాల్గొన్నారు.జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య -
బంజారాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ములుగు: బంజారాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని గట్టమ్మ గుడి శివారులో సేవాలాల్ మహరాజ్ ఆల య నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని బుధవారం ఘ నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మున్సిపల్ చైర్పర్సన్ చింత నిప్పుల చంద్రకళ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సేవాలాల్ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం హర్షించదగిన విషయమన్నారు. బంజారాల కులస్తులు భ వన నిర్మాణం ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వం బంజారాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. అనంతరం మంత్రి సీతక్క సేవా లాల్ జయంతి వేడుకల్లో మహిళలతో కలిసి నృత్యం చేశారు. అనంతరం కలెక్టర్ దివాకర మా ట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ చదువు, ఆరోగ్యంపై శ్రద్ధ కనబర్చాలన్నా రు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పోరిక గోవింద్ నాయక్, పూజారులు రమేష్గిరి, కిషన్, ఐటీడీఏ అధికారి జనార్ధన్, రాహుల్, బంజారా కులస్తులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పనులు త్వరితగతిన పూర్తిచేయాలి ములుగు రూరల్: కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను మంత్రి బుధవారం పరిశీలించి మాట్లాడారు. భవనాన్ని నాణ్యతతో సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. మంత్రి వెంట కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ తదితరులు ఉన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్కను టీఎన్జీవోస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగులకు ఆరోగ్యకార్డులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసి శాలువా కప్పి సన్మానించి పూల మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చైతన్య, లాల్నాయక్, ఉదయ్ కుమార్రెడ్డి, ప్రదీప్, భాస్కర్, శ్రీకాంత్, రవీందర్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఎస్ఎస్తాడ్వాయి: గ్రామీణ యువత క్రీడల్లో రాణించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. బాలకుమారస్వామి జాతరను పురస్కరించుకుని కొడిశాల (బిట్టుపల్లి)లో నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడోత్సవాలు బుధవారం ముగిశాయి. సర్పంచ్ మొగిలిపల్లి రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు మంచి స్పందన రావడం హర్షనీయమన్నారు. ఈ పోటీల్లో కొత్తగూడెం– రంగాపూర్ జట్టు మొదటి స్థానంలో నిలిచి బహుమతి రూ.15,016లను కై వసం చేసుకోగా రెండో స్థానంలో నిలిచిన చింతకుంట జట్టుకు రూ. 12,016, మూడో స్థానంలో నిలిచిన ముళ్లకట్టరాంపూర్ జట్టుకు రూ. 8,016, నాలుగో స్థానంలో నిలిచిన కొడిశాల జట్టుకు రూ.5,016లను అందజేశారు. అలాగే షీల్డులను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్కుమార్, పస్రా సీఐ దయాకర్, ఎస్సైలు కమలాకర్, తాజోద్దీన్, మధుకర్, నిర్వహకులు మొగిలిపల్లి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాకారులను అభినందించిన ఎస్పీ
ములుగు రూరల్: ఇటీవల సైబరాబాద్లో నిర్వహించిన తెలంగాణ పోలీసుల క్రీడాపోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించగా ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ వారిని బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాపోటీల్లో జిల్లాకు చెందిన పోలీసులు పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన అమిత్కుమార్ సింగ్, మేకల నాగరాజులను ఆయన అభినందించారు. భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించాలని కోరారు. వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని లక్ష్మీదేవిపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆర్పీ తిప్పనబోయిన రామకృష్ణ ప్రకృతిని గౌరవిస్తూ వృక్షపూజ నిర్వహించారు. బుధవారం పాఠశాలలో సాంఘికశాస్త్ర పాఠ్యబోధనలో భాగంగా విద్యార్థులకు ప్రకృతిలో చెట్ల గొప్పతనాన్ని వివరించారు. పర్యావరణానికి హాని తలపెట్టడం చాలా బాధాకరమైన విషయమన్నారు. మానవాళికి, పక్షులకు, జంతువులకు, జీవరాసులకు కేంద్రమైన చెట్లు ఎంతో మేలు చేస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సోషల్ ఫోరం అధ్యక్షుడు కమలాకర్, ఆర్పీలు ఏడుకొండలు, నాగేశ్వర్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని హనుమకొండలో గల ఫ్రీ ఎగ్జామ్నేషన్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్గా సారయ్యదొరను నియమిస్తూ ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా బుధవారం ఆదేశాలు జారీ చేశారు. పీజీ హెడ్మాస్టర్ అయిన సారయ్య దొరను నియమించడంతో పాటు పీఈటీసీలో శిక్షణ ఇచ్చి పలువురికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చేలా చూడాలని సూచించారు. గతంలో పనిచేసిన శ్రీరాములు ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో సారయ్యదొరను నియమించారు. ములుగు: ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత, భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రెండు కొత్త పథకాల అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలను హరిస్తూ జిల్లా కేంద్రంలో బుధవారం ప్రభుత్వ ఉద్యోగులు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రమాద బీమా పథకం అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మేరకు ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం, కుటుంబ భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పింస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ చైర్మన్ మడుగూరి నాగేశ్వరరావు, ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏళ్ల మధుసూదన్, ఆదివాసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మంకిడి రవి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు జనగాం బాబురావు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నవరం రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షల నిర్వహణలో అప్రమత్తం
ములుగు: వచ్చే నెల 14వ తేదీ నుంచి పదోతరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు విధుల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ సిద్ధార్థరెడ్డి మాట్లాడారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాలను ముందస్తుగా సందర్శించి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉండాలని సూచించారు. పదో తరగతి పరీక్షలకు మొదటిసారిగా క్లాక్ రూమ్ నిర్వహణ ప్రవేశపెట్టినందున విద్యార్థుల వస్తువులు బ్యాగులు ఏమైనా ఉంటే క్లాక్ రూమ్ వద్ద భద్రపరచుటకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎసీజీఈ కన్నం వినోద్కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి -
అర్జీలు పరిష్కరించండి..
● గ్రీవెన్స్, గిరిజన దర్బార్లో అధికారులను వేడుకున్న బాధితులు ● ప్రజావాణిలో 51, గిరిజన దర్బార్లో 14 వినతులు ● స్వీకరించిన కలెక్టర్ దివాకర, పీఓ చిత్రామిశ్రా ● పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశంములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్లో పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బాధితులు అర్జీలు అందజేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 51 వినతులు రాగా కలెక్టర్ దివాకర స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించిన ఆయన సత్వరమే పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనుల నుంచి 14 వినతులు రాగా పీఓ చిత్రామిశ్రా స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు ఇతర శాఖలకు సంబంధించి 16భూ సమస్యలు 15 ఇందిరమ్మ ఇళ్లు 7ములుగు మండలం మదనపల్లికి చెందిన ఓ గిరిజనుడు తన తండ్రి ఉద్యోగం కారుణ్య నియామక కింద ఇప్పించాలని విన్నవించారు. జిల్లా కేంద్రంలో గిరిజనేతరులు ఆక్రమించుకున్న ములుగు గ్రామకంఠం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ నాయకులు విన్నవించారు. గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంలో పనిచేస్తున్న సీఆర్టీల వేతనాలు ఇవ్వాలని కోరారు. గంగారం మండలం మడగూడెంలో విద్యుదాఘాతానికి కాలిపోయిన బాధితుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని పీఓను కోరారు. ఏటూరునాగారం మండలం రాంపూర్ ఆగ్రహార్లో గిరిజనులకు పట్టాలు ఉన్నాయని కానీ రైతు భరోసా రావడం లేదని రైతులు మొరపెట్టుకున్నారు. 5వ షెడ్యూల్ ప్రాంతాల్లోని ఆర్ఓఎఫ్ఆర్ భూములను ఆన్లైన్ చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు విన్నవించారు. వెంకటాపురం(కె) మండలం బోదాపురం పాఠశాల భవనం శిథిలావస్థలో ఉందని, భవనం మంజూరు చేయాలని కోరారు. ములుగు మండలంలోని పొట్లాపురంలో ఉన్న పోడు భూములకు రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని గిరిజన రైతులు కోరారు. 2026 మేడారం జాతరలో 834 మంది వలంటీర్లకు భోజన వసతి కల్పించిన బిల్లు ఇప్పించాలని ఆదివాసీ నంఘం నాయకులు పీఓకు విన్నవించారు. ములుగు మండలం పొట్లాపురంలో సబ్సిడీపై ట్రాక్టర్ ఇప్పించాలని రైతులు పీఓను కోరారు. కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, డీడీ జనార్ధన్, ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేష్బాబు, మేనేజర్ శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
పింఛన్ ఇప్పించండి.. బోధకాలతో ఎలాంటి పని చేసుకోలేకపోతున్నాను. అధికారులు తన పరిస్థితిని గమనించి పింఛన్ ఇప్పించాలి. బోధకాలు కారణంగా పనులు కూడా చేసుకోలేక పోతున్నాను. ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నాను. పింఛన్ ఇప్పించి ఆదుకోవాలి. – అర్కావత్ భీముడు, ఇంచెన్చెరుపల్లి, వెంకటాపురం(ఎం) మండలంఅక్రమ పట్టాను రద్దు చేయాలితనకు వారసత్వంగా సంక్రమించిన భూమిని అక్రమంగా వేరే వారి పేరున పట్టా జారీ చేశారు. వెంకటాపురం(ఎం) మండలం పాలంపేట శివారులో 2.13ఎకరాల భూమి ఉంది. తనకు సంబంధం లేకుండా అధికారులు వేరే వ్యక్తికి పట్టా చేశారు. – ఏలూరి రాజయ్య, పస్రా, గోవిందరావుపేట మండలం దారి కబ్జా చేసి ఇల్లు నిర్మిస్తున్నారు.. తన ఇంటికి వెళ్లే దారిని కబ్జా చేశారు. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. తక్షణమే పంచాయతీ అధికారులు స్పందించి ఇంటి నిర్మాణ పనులు నిలిపివేయాలి. సదరు వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలి. – అజ్మీర భావుసింగ్, రాంచంద్రాపురం, ములుగు మండలం -
కమ్ముకుంటున్న మబ్బులు
ఆందోళనలో రైతులు సమస్యలు పరిష్కరించాలి విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అన్నారు.వాతావరణం జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఆకాశం మేఘావృతమై పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. మిర్చి పంటపై పరదాలు కప్పుతున్న రైతులువెంకటాపురం(కె): ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం సాయంత్రం ఆకాశంలో మబ్బులు ఒక్కసారిగా కమ్ముకోవటంతో మిర్చి రైతులు భయాందోళనకు గురయ్యారు. రెండేళ్లుగా దిగుబడి లేక, మిర్చికి గిట్టుబాటు ధరలేక అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఈ ఏడాది పంటకు మంచి ధర ఉండడంతో అప్పుల ఊబిలోంచి బయట పడతామని ఆశ పడుతున్న రైతులకు ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో కల్లాల్లో ఆరబోసిన పంటను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. మిర్చి పంట తడవకుండా కాపాడుకునేందుకు పరదాలు కప్పారు. -
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
● రేపటి నుంచి ఇంటర్ ప్రథమ, 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ● జిల్లావ్యాప్తంగా పది సెంటర్ల ఏర్పాటుఏటూరునాగారం: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు పది కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో 3,841 విద్యార్థులు రేపటి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం, 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం అధికారులు పరీక్ష కేంద్రాల్లో సర్వం సిద్ధం చేశారు. కేంద్రాల్లో తాగునీటి వసతి, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, టేబుల్స్, చెత్తాచెదారం తొలగింపుతో పాటు ప్రశాంతమైన వాతావరణం కలిగేలా కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. పరీక్ష కేంద్రానికి ప్రతీ విద్యార్థి 30 నిమిషాల ముందు చేరుకోవాల్సి ఉంటుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు మార్చి 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 10 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఒక్కో పరీక్ష కేంద్రానికి ఒక్కో డిపార్ట్మెంట్ ఆఫీసర్కు అలాట్ చేశారు. ఇన్విజిలేటర్లను మాత్రం పరీక్ష కేంద్రానికి, నిర్వహణ బాధ్యతలను చేపట్టే చీఫ్ సూపరింటెండెంట్ను నిర్ణయించి విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా ఇన్విజిలేటర్లను కేటాయిస్తారు. అలాగే జిల్లా పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయడానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీంతో పాటు ఒక సిట్టింగ్ స్క్వాడ్ టీం బృంధం, మరో టీం కస్టోరియల్ టీం ఈ పరీక్ష కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు నియమించారు. నియమాలు పాటించాలి పరీక్ష కేంద్రానికి వచ్చే విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, డిటిజల్ వాచ్లు, సెల్ఫోన్లు, కెమెరాలు తీసుకురావద్దని అధికారులు తెలిపారు. నిర్ధిష్టమైన ఆదేశాలను ఇప్పటికే అధికారులు జారీ చేశారు. అంతేకాకుండా 200 మీటర్ల వరకు జిరాక్స్ షాపులను కూడా మూసివేయనున్నారు. ప్రశ్నపత్రాలు బయటకు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు, 144 సెక్షన్ను సైతం అమలు చేయనున్నారు. ఏర్పాట్లు పూర్తి చేశాం..జిల్లాలోని 10 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, స్క్వాడ్లను కూడా కేటాయించాం. పరీక్షలు సజావుగా జరిగేలా పరీక్ష కేంద్రాల వద్ద తగిన భద్రత ఏర్పాట్లు చేయడానికి పోలీసుశాఖకు సమాచారం అందించాం. – నాయిని వీరేందర్, ఇంటర్మీడియట్ జిల్లా అధికారిపరీక్ష రాయనున్న విద్యార్థుల వివరాలు.. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 1,773 మంది, ఒకేషనల్ విద్యార్థులు 208 మంది ఉన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 1,632 కాగా ఒకేషనల్కు చెందిన విద్యార్థులు 228 మంది ఉన్నారు. మొత్తంగా 3,841 మంది పరీక్షలు రాయనున్నారు. -
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
● వీసీలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ములుగు: గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్ల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్ అన్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గోదావరి నది తీరం ప్రాంతాల జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గోదావరి నది తీరంలో జరగనున్న పుష్కరాల ఏర్పాట్లపై పూర్తిస్థాయిలో నివేదికలు తయారు చేసి సమర్పించాలన్నారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యశిబిరాలు, గజ ఈతగాళ్ల ఏర్పాటు, బందోబస్తుతో పాటు ఇతర పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించే దిశగా ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో గోదావరి పుష్కరాలు ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలో మంగపేట, ముళ్లకట్ట, రామన్నగూడెం, కన్నాయిగూడెంలో పుష్కర ఘాట్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ప్రతీ పుష్కర ఘాట్ వద్ద భక్తులకు తాగునీరు మరుగుదొడ్లు, పార్కింగ్, విద్యుద్దీపాల ఏర్పాటు వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, అధికారులు పాల్గొన్నారు. -
సాంకేతిక విజ్ఞానాన్ని పెంచుకోవాలి
● జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి ములుగు: విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని పెంచుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం అధ్యక్షుడు శిరుప సతీష్కుమార్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పాఠశాలల్లో వివిధ స్థాయిల్లో నిర్వహిస్తున్న అనేక పోటీ పరీక్షల్లో పాల్గొని విజేతలుగా నిలవాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో భాగంగా జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో స్టీల్ప్లేట్లను విద్యార్థులకు అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులందరూ ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా సైనన్స్ అధికారి అప్పని జయదేవ్ మాట్లాడుతూ సైన్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధం కలిగి ఉంటుందన్నారు. విద్యార్థులు అవగాహనతో చదివి జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్లో ప్రథమ స్థానంలో బండారుపల్లి ఆదర్శ పాఠశాల చెందిన శివ ప్రసాద్, ద్వితీయ స్థానంలో ఇదే పాఠశాలకు చెందిన హర్షితతో పాటు మంగపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన మహమ్మద్ ఆఫ్సియాలు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు నిర్వహకులు తెలిపారు. అనంతరం విజేతలకు సర్టిఫికెట్లు, సైన్స్ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవరపు శ్రీధర్, కోశాధికారి బోదెబోయిన జయరాం, స్థానిక పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు రాజేందర్, ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘ఆంగ్లంపై పట్టు సాధించేలా బోధించాలి’
వాజేడు: ఆంగ్ల భాషపై విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే పట్టు సాధించేలా ఉపాధ్యాయులు ప్రణాళికతో బోధించాలని జిల్లా విద్యాశాఖ అకాడమిక్ క్వాలిటీ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ సాంబయ్య, ఉల్లాస్ కోఆర్డినేటర్ కృష్ణ బాబులు అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో వాజేడు, నాగారం ప్రాథమిక పాఠశాలల కాంప్లెక్స్ సమావేశాన్ని సోమవారం ఎంఈఓ తేజావత్ వెంకటేశ్వరరావు, హెచ్ఎం ఆనందరావులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఫౌండేషన్ లిటరసి. న్యూమరసి వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు జయేందర్, సయ్యద్ అలీముద్దీన్ ఖాద్రీ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు ములుగు రూరల్: వేసవిలో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు చేపడుతున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఆనందం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో లోడ్ పెరుగుదల అంచనాల మేరకు ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం 33కు పెంచినట్లు తెలిపారు. అదనంగా 49 నూతన ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేసినట్లు వివరించారు. గతేడాది మార్చిలో 5, 816 మెగావాట్లు ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 5,904 మెగావాట్లకు చేరిందని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 7 నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశామని వివరించారు. విద్యుత్ నాణ్యత మెరుగుపరిచేందుకు 27.35 కేఎం, 33/11 కేవీ ఇంటర్ లింక్ లైన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందిస్తామని తెలిపారు. శంకుస్థాపన సరే.. పనులేవి? చిట్యాల: చిట్యాల, టేకుమట్ల మండలాల ప్రధాన రహదారిపై మూడు చోట్ల కల్వర్టుల నిర్మాణాలకు రూ.2 కోట్లు మంజూరయ్యాయి. చిట్యాల మండలంలోని నవాబుపేట, సీఆర్పల్లి శివారులోని ప్రధాన రహదారిపై కల్వర్టు నిర్మాణం కోసం ఎమ్మెల్యే సత్యనారాయణరావు డిసెంబరు 2024లో శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి 14 నెలలు పూర్తయినా సంబంధిత కాంట్రాక్టరు పనులు ప్రారంభించలేదు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాంతినగర్ సమీపంలో కల్వర్టు పక్కన తాత్కాలిక రోడ్డు కోసం పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశాడు. ప్రతీ ఏడాది వర్షాకాలంలో గుట్టల ప్రాంతం నుంచి వర్షపునీరు వస్తుంది. భారీ వర్షాలు కురిసిన సమయంలో వాహనాల రాకపోకలు నిలిచిపోతాయి. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు ప్రారంభించలేదని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కల్వర్టుల నిర్మాణం ప్రారంభించి పూర్తి చేయించాలని కోరుతున్నారు. 108 ఉద్యోగులకు స్టార్ అవార్డులు హన్మకొండ అర్బన్/ఎంజీఎం: ఆపద సమయంలో 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుని మెరుగైన వైద్య సేవలందించి ప్రాణాలు కాపాడిన హనుమకొండ జిల్లాకు చెందిన పలువురు 108 సిబ్బందికి 108 సర్వీస్ వరంగల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్, జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్టార్ అవార్డులు అందించారు. ఐనవోలుకు చెందిన ఈఎంటీ ఏనుగుల రాజు, పరకాల టీం సభ్యులు పాముల రాజు, పుట్ట విజయభాస్కర్, ధర్మసాగర్ మండలానికి చెందిన మాచర్ల వెంకటేశ్, వరంగల్ జిల్లాకు చెందిన ఈఎంటీలు కె.నాగరాజు, శ్యాంసుందర్, పైలట్ వై.రాజన్న, కుమారస్వామి అవార్డులు అందుకున్నారు. వీరిని 108 సర్వీస్ అధికారులు, సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో వరంగల్ మేనేజర్ భరత్ కుమార్, భూపాలపల్లి మేనేజర్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
హేమాచల క్షేత్రం అభివృద్ధిపై మంత్రికి నివేదిక
మంగపేట: మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధిపై పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్కకు సోమవారం నివేదికను అందజేసినట్లు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి రెవెల్లి మహేశ్ తెలిపారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో సీతక్కను కలిసి ఆలయ పూజారులు ఆశీర్వచనం ఇచ్చారు. మకర సంక్రాంతి రోజున స్వామివారి వరపూజ మహోత్సవానికి ఆలయానికి వచ్చిన మంత్రి స్వామివారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ మేరకు ఏప్రిల్లో జరగనున్న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి ముందుగా ఆలయంలో భక్తుల సౌకర్యానికి చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను మంత్రికి వివరించి నివేదికను అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా 2027 జూన్లో జరుగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా మల్లూరులో పుష్కరఘాట్ నిర్మాణం చేపడితే దేవస్థానం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రికి వివరించినట్లు తెలిపారు. వీటిపై స్పందించిన మంత్రి త్వరలోనే హేమాచలక్షేత్రంలో చేపట్టాల్సిన పనులతో పాటు మల్లూరులో పుష్కరఘాట్ నిర్మాణానికి హామీ ఇచ్చారని పూజారులు వివరించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ఈశ్వర్చంద్ రామానుజం దాస్, నాగరాజీవ్ శర్మ, రికార్డు అసిస్టెంట్ లక్ష్మినారాయణ ఉన్నారు. -
సీఎం పర్యటనలతో ప్రజాధనం వృథా
● బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి ములుగు: ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్రెడ్డి మూడుసార్లు దేవాదుల ప్రాజెక్టును సందర్శించినా స్థానికులకు ఒరిగిందేమిలేదని, పర్యటనల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ జెడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షుడు సానికొమ్ము రమేశ్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నీళ్లు, నిధుల కోసమే తెలంగాణను కొట్లాడి సాధించుకున్నామన్నారు. కేసీఆర్ పోరాట ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ వచ్చిందన్నారు. రేవంత్రెడ్డికి ముఖ్యమంత్రి సీటు కేసీఆర్ పెట్టిన భిక్ష అన్నారు. తెలంగాణ రాకపోతే రేవంత్రెడ్డి సీఎం ఎలా అయ్యేవారని విమర్శించారు. తెలంగాణ సాధకుడైన కేసీఆర్ను విమర్శించే అర్హత రేవంత్రెడ్డికి లేదన్నారు. జిల్లాలోని గంగారం, కొత్తగూడెం మండలాలకు పాఖాలలో లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగునీటిని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని మండలాలకు తుపాకుల గూడెంలోని సమ్మక్క బ్యారేజ్ నుంచి గోదావరి జలాలను కాల్వల ద్వారా సాగునీటిని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. కమీషన్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6 వేల కోట్లు ఉన్న ప్రాజెక్టు అంచనాలను రూ.18,500 కోట్లకు పెంచిందని ఆరోపించారు. సమ్మక్క బ్యారేజీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు తాగు, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బైకాని ఓదెలు, కోగిల మహేశ్, పోరిక విజయరాం నాయక్, కుడుముల లక్ష్మినారాయణ, లకావత్ నర్సింహనాయక్, చెన్న విజయ్, ఆకుతోట చంద్రమౌళి, గోనెల భారత్, బైకని సాగర్, అనుముల సురేష్, గండి కుమార్, ముంజాల భిక్షపతి, మాచర్ల ప్రభాకర్, గొర్రె సమ్మయ్య, కాకి పురుశోత్తం, గరిగె రఘు తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
మల్హర్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని తాడిచర్ల రైతు వేదికలో 99 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. మొదటి విడతలో ఎంపికై న వారికి పథకం మంజూరు పత్రాలు అందజేశామని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమన్నారు. పేదల సంక్షేమం కోసం ఎల్ల ప్పుడూ కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బండి స్వామి, గడ్డం క్రాంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, రాష్ట్ర ఉపాధిహామీ కౌన్సిల్ సభ్యుడు దండు రమేశ్, ఉప సర్పంచ్ బబ్బలి రాజు, మాజీ ఎంపీపీ మల్హల్రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితెల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్రెడ్డి -
పగిడిద్దరాజు జాతరను విజయవంతం చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గుండాల మండలం యాపలగడ్డలో మార్చి 4నుంచి 7వ తేదీ వరకు అర్రెం వంశస్తుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పగిడిద్దరాజు జాతరను విజయవంతం చేయాలని మేడారం జాతర మాజీ చైర్మన్ అర్రెం లచ్చుపటేల్ కోరారు. మేడారం జాతర చైర్పర్సన్ ఇర్ప సుకన్య, మేడారం సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన స్వామి, సర్పంచ్ కల్తి కృష్ణవేణి, అర్రెం వంశీయులతో కలిసి పగిడిద్దరాజు జాతర పోస్టర్ను ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్రెం వంశీయుల ఇలవేల్పు పగిడిద్దరాజు జాతరను నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రి సీతక్కను, పలువురు ప్రజాప్రతినిధులను జాతరకు ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. భక్తుల భారీగా తరలివచ్చి జాతరను విజవయంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్రెం వంశస్తులు అప్పయ్య, లక్ష్మినర్సు, నాగయ్య, బుచ్చయ్య, సమ్మయ్య, కాంతారావు, తాడ్వాయి మాజీ సర్పంచ్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
మారేడుగొండ చెరువులోకి దేవాదుల జలాలు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని మారేడు గొండ చెరువులోకి ఆదివారం దేవాదుల లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేశారు. లక్ష్మీదేవిపేట, బూర్గుపేట, నర్సింగాపూర్, లక్ష్మిపురం, చక్రవర్తిపల్లి గ్రామాలకు చెందిన రైతులు మారేడు గొండ చెరువు కింద రబీలో వరి పంట సాగు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం కురిసిన వర్షాలకు సరస్సు కట్ట తెగిపోగా ఇటీవల మరమ్మతులు చేపట్టారు. చెరువులో పూర్తిస్థాయిలో నీరు లేకపోవడంతో రైతులు, నాయకులు సమస్యను మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో మాట్లాడిన మంత్రి దేవాదుల పైపులైన్ ద్వారా మారేడుగొండ చెరువులోకి నీటిని విడుదల చేయాలని ఆదేశించడంతో అధికారులు నీటిని విడుదల చేశారు. దీంతో రబీ వరి పంట సాగుకు నీటి ఇబ్బంది లేకుండా పంటలు పండించుకుంటామని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. -
హేమాచలక్షేత్రంపై నిర్లక్ష్యం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవాదాయ ధర్మాదాయశాఖ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం వందల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఏ మాత్రం పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తుంది. ఈ దేవాలయం 35 ఏళ్ల క్రితం నుంచే దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంది. ప్రతి ఏటా కోటి రూపాయలకు పైగా ఆదాయం వస్తుండడంతో 2018లో దేవస్థానానికి 6 ఏ టెంపుల్గా గుర్తింపు పొందింది. ఆలయ నిర్వహణను పర్యవేక్షించేందుకు గ్రేడ్వన్ స్థాయి అధికారిని నియమించాల్సి ఉంది. అయినప్పటికీ ఆలయంపై దేవాదా యశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో 2016 నుంచి ఇప్పటి వరకు ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతోంది. ఆలయంలో కొందరు సిబ్బంది మధ్య అంతర్యుద్ధం సోషల్ మీడియా వేదికగా చేసుకుని వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆలయ ప్రధాన అర్చకుడి పోస్టు భర్తీలో భాగంగా కొందరు పూజారుల మధ్య విబేధాలు బయటపడిన పలు సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి. అదే విధంగా కొందరు సిబ్బంది ఒకరంటే ఒకరికి గిట్టక రెండు వర్గాలుగా విడిపోయారు. పలు విషయాలపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల సిబ్బందిలో గణేశ్ అనే వ్యక్తిని విధుల నుంచి తప్పించి పక్కన పెట్టారు. దీంతో తాను మేడారం మహాజాతర డ్యూటీలో ఉండగా తానంటే గిట్టనివారు ఆకాశ రామన్న పేరిట ఉత్తరం రాసి తనపై కుట్రచేశారని అసహనం వ్యక్తం చేస్తూ వాట్సాప్ గ్రూపులో పోస్టుచేశారు. పూజారులు, సిబ్బంది విషయంలో కొందరు రాజకీయ నేతలు జోక్యం చేసుకోవడంతో పవిత్ర పుణ్యక్షేత్రంలో పూజలు నిర్వహించాల్సిన పూజారులు, విధులు నిర్వహించాల్సిన సిబ్బంది మధ్య ఏమి జరుగుతుందోననే ఆసక్తికర చర్చ సాగుతోంది. విషయంపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులు స్పందించి గుట్టపై రాజకీయ వివాదాలకు తావులేకుండా భక్తులకు సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. హేమాచలక్షేత్రాన్ని 2016 నుంచి రాజకీయ గ్రహణం పట్టి పీడిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్వం నుంచి స్థానికులకు ఒకరికి ఆలయ చైర్మన్గా మరో 13 మంది సభ్యులుగా 2016 వరకు ఆలయ పాలకమండలి కొనసాగింది. ఆలయ చైర్మన్ పదవి దక్కించుకునే ప్రయత్నంలో కొందరు రాజకీయ నాయకుల స్వార్ధం ఆలయ అభివృద్ధికి శాపంగా తయారైంది. ఏజెన్సీ ప్రాంత పరిధిలో ఉన్న ఆలయానికి పాలక మండలిలో చైర్మన్, సభ్యులుగా తమకు అవకాశం కల్పించాలని స్థానిక ఆదివాసీ గిరిజనులు హైకోర్టును ఆశ్రయించారు. పాలకమండలి ఏర్పాటుకు హైకోర్టు స్టే ఇవ్వడంతో 2017 ఆలయ పాలక మండలి ఏర్పాటు నిలిచిపోయింది. దీంతో ఆలయ ప్రాంగణంలో ప్రసాదం, కొబ్బరికాయల విక్రయాలు, కొబ్బరి ముక్కలు, పుట్టు వెంట్రుకలు, ఆలయ ప్రాంగణంలో షాపుల నిర్వహణకు బహిరంగ వేలం పాటలు నిలిచిపోవడంతో ఆదాయానికి గండి పడుతుంది. నిత్యం సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాల కల్పనపై దృష్టి సారించని అధికారులు పదేళ్లుగా ఏర్పాటు చేయని పాలకమండలి సోషల్ మీడియా వేదికగా సిబ్బంది అంతర్యుద్ధం -
మేడారంలో భక్తుల రద్దీ
● జంపన్నవాగులో పుణ్యస్నానాలు ● వనదేవతలకు మొక్కులు ఎస్ఎస్తాడ్వాయి: మేడారానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో గద్దెల ప్రాంగణం భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క–సారలమ్మకు పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రధాన ఆర్చ్ ద్వారం నుంచి భక్తులను పోలీసులు క్రమపద్ధతిలో దర్శనాలకు పంపించారు. నార్లాపూ ర్ పోలీస్స్టేషన్ ఎస్సై కమలాకర్ భక్తుల రద్దీని పర్యవేక్షించి ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. మేడారం కార్యనిర్వహణాధికారి వీరస్వామి కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకు ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎత్తు బంగారం అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు. సంప్రదా యంగా పూజారులు ఆయనకు డోలివాయిద్యాలతో గద్దెలపైకి స్వాగతం పలికారు. ఆయన వెంట సూపరింటెండెంట్ విజయ్కుమార్, జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, మధు, సిబ్బంది ఉన్నారు. -
ప్రతీ ఎకరాకు నీరు
ములుగు: రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పనులను 2027 డిసెంబర్లోగా పూర్తిచేసి 6 లక్షల ఎకరాల ఆయట్టుకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ఇంటెక్వెల్ మోటార్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటెక్వెల్ వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.15,500 కోట్లు ఖర్చు చేసినా నిర్మాణం పూర్తి కాలేదన్నారు. ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తాం.. ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని మంత్రివర్గంలో ఆమోదించి నిధులు సమకూర్చి పూర్తిచేస్తామని సీఎం అన్నారు. నిర్మాణం పూర్తయ్యేందుకు నిధుల కొరత, భూసేకరణ సమస్య ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే రూ. 8 లక్షల 11 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వంపై అప్పుల భారం ఉందని వెల్లడించారు. గోదావరి, కృష్ణా జలాలపై అపోహలు వద్దని, తెలంగాణకు రావాల్సిన వాటాను, నీటి హక్కులపై ప్రభుత్వం తరఫున పూర్తిగా పోరాడి కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ప్రతీ ఎకరాకు సాగునీరు, ప్రతీ పౌరుడికి తాగునీరు అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా ప్రాజెక్టులు పూర్తికాలేదన్నారు. నీళ్లు, నిధులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం లోపాల వల్ల ప్రాజెక్టులు పూర్తికాకుండా పోయాయని విమర్శించారు. జూన్ 2 వరకు భూసేకరణ : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దేవాదుల ప్రాజెక్టులో సొరంగ మార్గంతోపాటు పంపుహౌస్లలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల భూసేకరణ జూన్ 2 వరకు పూర్తిచేస్తామని వివరించారు. ఇందుకు అవసరమైన నిధుల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. గోదావరి నదిలో చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే జలాశయాల్లో తెలంగాణ వాటా పరిరక్షణకు చర్యలు మొదలయ్యాయని, ట్రిబ్యునల్, సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం వద్ద పోరాటం చేస్తున్నది తామేనని ఆయన స్పష్టం చేశారు. కొందరు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు బలరాంనాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, గండ్ర సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా పాల్గొన్నారు.రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి దేవాదులకు ఇప్పటి వరకు రూ.15,500 కోట్లు ఖర్చు గోదావరి, కృష్ణా జలాల వాటా, నీటి హక్కులు పూర్తిగా కాపాడుదాం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుపాకుల గూడెంలో సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ఇంటెక్వెల్ పరిశీలన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీరు ఎత్తిపోయలే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షా పది వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినా రెండేళ్లలో చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదని సీఎం రేవంత్రెడ్డి రు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టుల నిర్మాణాలు, రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, గోదావరి నది జలా లపై ప్రతిపక్షాలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గోదావరి, కృష్ణా నది జలాల కోసం పక్క రాష్ట్రాలతోపాటు అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని పేర్కొన్నారు. కష్టపడి ప్రాజెక్టులను నిర్మించుకొని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకుందామన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మంత్రివర్గంతో సమీక్షించనున్నట్లు సీఎం తెలిపారు. మేడారం జాతరను మహా కుంభమేళాగా జరిపించామని, మేడారంలో శాశ్వత సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. -
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
ఏటూరునాగారం: గిరిజన, సాంఘిక, మైనార్టీ, బీసీ సంక్షేమశాఖల పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఏటూరునాగారం మండలంలోని రెండు సెంటర్లలో మొత్తం 601 మంది పరీక్షలు రాసేందుకు హాజరుకావాల్సి ఉండగా 23 మంది గైర్హాజరైనట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజు తెలిపారు. ఆకులవారి ఘనపురం క్రాస్రోడ్లోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 231 మంది, స్పోర్ట్స్ స్కూల్ కేంద్రంలో 347 మంది పరీక్షలు రాసేందుకు హాజరైనట్లు తెలిపారు. -
‘ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి’
వెంకటాపుం(కె): మౌలిక వసతులు లేని ప్రైవేట్ పాఠశాలలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలను ఎస్ఎఫ్ఐ బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన మరుగుదొడ్లు, విదద్యుత్ సౌకర్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల వద్ద నుంచి వేల రూపాయల ఫీజలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసి మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. రజకులపై దాడి అమానుషం భూపాలపల్లి రూరల్: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మండలంలో కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో రజకులపై జరిగిన దాడి అమానుషమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేవుడి దర్శనానికి వెళ్లిన వారిని కులం పేరుతో అవమానించడం, దాడి చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రణయ్ రాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కౌటం సురేందర్, జిల్లా కార్యదర్శి మోటాపోతుల సమ్మయ్య, జిల్లా నాయకులు ఏదునూరి స్వామి పాల్గొన్నారు. కోటగుళ్లను సందర్శించిన ఇంగ్లండ్ దేశస్తులు గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లను ఆదివారం ఇంగ్లండ్ దేశానికి చెందిన సిమన్, వాలేరి సందర్శించారు. రామప్ప గైడ్ గోరంట్ల విజయ్కుమార్ ఆలయ విశిష్టతను వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు ఆలయ శిల్పసంపద అద్భుతంగా ఉందన్నారు. వారి కెమెరాలలో శిల్ప సంపదను బంధించుకున్నారు. మెడల్స్ సాధించడంపై హర్షం మల్హర్(కాటారం): రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీల్లో జిల్లా క్రీడాకారులు మెడల్స్ సాధించడం పట్ల జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య, కార్యదర్శి పూతల సమ్మయ్య హర్షం వ్యక్తంచేశారు. హనుమకొండ జవహర్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీల్లో అండర్–16 షాట్ఫుట్లో జిల్లాకు చెందిన సమన్విత గోల్డ్ మెడల్స్, అన్విత 18 లాంగ్జంప్లో సిల్వర్ మెడల్, పలు విభాగాల్లో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు వారు ఆదివారం మెమొంటోలు, సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందన్నారు. స్టేట్ సెక్రటరీ సారంగపాణి మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీలు నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. -
రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: సీఎం రేవంత్
ములుగు: గోదావరి జలాల అంశం రాజకీయ రంగు పులుముకుందన్నారు సీఎం రేవంత్రెడ్డి. రాష్ట్రం ఏర్పడినప్పుడు నీళ్లు, నిధులు బాగా ఉన్నాయని, సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఎంతో మేలు జరిగేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే రూ. లక్ష కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు సీఎం రేవంత్. రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, ప్రస్తుతం నిధుల కొరత ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అనుకుంటే అది భ్రమేనని తేలిపోయింద్నారు. ఇక కృష్ణా జలాల తరలింపుపై సభలో క్లారిటీ ఇచ్చామన్నారు. గోదావరి జలాల వివాదంపై అసెంబ్లీఓ చర్చిద్దామన్నారు. చౌకబారు రాజకీయాలతో తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈరోజు(ఆదివారం, ఫిబ్రవరి 22వ తేదీ) దేవాదుల ప్రాజెక్టును పరిశీలించారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా ఇంజనీరింగ్ అధికారులతో నీటి లభ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ అధికారులు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్తో పాటు మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేంద్రరెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
● లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్ వెంకటాపురం(ఎం): ప్రతిఒక్కరూ చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని రామాంజాపూర్లోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యాహక్కు, బాల కార్మికుల, ర్యాగింగ్, బాల్య వివాహాల చట్టాల గురించి మహేందర్ వివరించారు. ఉచిత న్యాయం పొందడంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోతు స్వామిదాస్, హెచ్ఎం గోదాదేవి, ఉపాధ్యాయులు సమ్మయ్య, రాధ తదితరులు పాల్గొన్నారు. గందరగోళంగా భూ సర్వే ములుగు రూరల్: భూ సర్వే విషయంలో రైతులను అధికారులు గందరగోళానికి గురిచేస్తున్నారని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. సర్వే అధికారులు భూమి హద్దులను నిర్ణయించే క్రమంలో ప్రతీసారి హద్దులు మారుతున్నాయని వివరించారు. అధికారులు ల్యాండ్ మాఫియా చేతిలో కీలుబొమ్మలుగా మారారని పేర్కొన్నారు. వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని లింగాపూర్ శివారులో జరుగుతున్న తతంగమే ఇందుకు నిదర్శనమని వెల్లడించారు. 30 ఏళ్లుగా సాగులో ఉన్న రైతుల భూముల హద్దులను చెరిపేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి సరిహద్దులు నిర్ణయించి సమస్యలు లేకుండా చూడాలని కోరారు. -
గోదావరి ఇన్టెక్వెల్కు నేడు సీఎం రేవంత్ రెడ్డి
దేవాదుల ప్రాజెక్టు అంశం వివాదం అవుతున్న నేపథ్యంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఆ ప్రాజెక్టు ఇన్టెక్ వెల్ను సందర్శించనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సీఎం.. అక్కడినుంచి ఇన్టెక్ వెల్ను సందర్శించి అక్కడే అధికారులతో ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నీటిపారుదలశాఖ మంత్రి గతంలో 2026 మార్చి వరకు ప్రాజెక్టు పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు నీరందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో నెలరోజులే గడువు ఉండటంతో ప్రాజెక్టు పెండింగ్ భూసేకరణ, మూడో విడత పనులపై సీఎం రేవంత్రెడ్డి అఽధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. -
– హన్మకొండ కల్చరల్
సంగీతంలో మత్తు ఉంది. అంతు చిక్కని మహత్తు ఉంది. వ్యాధులను నయం చేసే గుణం ఉంది. మనసును తేలిక చేసే మహత్యం ఉంది. చరిత్రలో ఆ మహిమతో కొందరు జీవిత సారం తెలుసుకున్నారు. సరిగమలతో మరికొందరు భవ సాగరం దాటారు. అంతటి ప్రాధాన్యమున్న కళలో రాణించేందుకు బాల్యంలో ఆసక్తి ఉండి నేర్చుకోనివారు.. నేర్చుకుందామన్నా.. అవకాశాలు రాని వారు.. జిజ్ఞాసను నెరవేర్చుకునేందుకు విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల బాటపడుతున్నారు. వృత్తి రీత్యా ఉద్యోగం చేస్తూనే ప్రవృత్తి కోసం విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు. అలాంటి సంగీత పిపాసుల నేపథ్యమే ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ..వరంగల్లోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో సితార్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు‘నాకు సంగీతమంటే ఇష్టం. సివిల్స్కి సన్నద్ధమయ్యే ముందు కర్నాటక వయోలిన్ నేర్చుకున్నా. తర్వాత విధుల్లో బిజీగా ఉంటుండడం వల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు మళ్లీ సాధన చేస్తున్నా. ఇలా విద్యార్థులతో ప్రదర్శన ఇవ్వడం సంతోషంగా ఉంది. – ఇటీవల హనుమకొండలో జరిగిన సంగీతోత్సవంలో కలెక్టర్ స్నేహ శబరీష్ స్వయంగా వయోలిన్ ప్రదర్శన ఇచ్చిన సమయంలో చేసిన వ్యాఖ్యలు. వారంతా వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. పలు హోదాల్లో ఉన్నారు. ఐదారంకెల జీతం తీసుకుంటున్నారు. చుట్టూ సకల సౌకర్యాలున్నాయి.. కానీ, వారిని ఓ వెలితి వెంటాడుతోంది. ఆ జిజ్ఞాసే వారిని కఠోర సాధనకు ఉపక్రమించింది. వీరందరి కళలకు జీవం పోస్తోంది భద్రకాళి ఆలయ ప్రధాన ఆర్చ్ సమీపంలోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల. ఇక్కడ శాసీ్త్రయ కూచిపూడి, పేరిణి, హిందుస్థానీ, కర్ణాటక సంగీతం, కర్ణాటక వయోలిన్, సితార్, తబలావంటి శిక్షణ ఇస్తున్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడడం.. విద్యార్థుల్లో కళలపై ఆసక్తి పెంచడం.. వివిధ కళల్లో శిక్షణ ఇచ్చి విశిష్టతను చాటి చెప్పడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ముందుకు వెళ్తోంది. ఇప్పటికే వేలాది మంది ఇక్కడ శిక్షణ పొంది శాసీ్త్రయ కళల్లో రాణిస్తున్నారు. ఈ కళాశాలలో 10 ఏళ్ల బాలల నుంచి 75 ఏళ్ల వృద్ధుల వరకు శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం ఈ కళాశాలలో సంగీత, నృత్య అధ్యాపకులు ప్రిన్సిపాల్ యన్.సుధీర్కుమార్.. ఇదే కాలేజీలో సరిగమలు పలికిన విద్యార్థి కావడం విశేషం. సంగీతంలో జిజ్ఞాసను ప్రదర్శిస్తున్న ఉద్యోగులు వివిధ రకాల వాయిద్యాల్లో శిక్షణ మానసిక ప్రశాంతత కోసం ‘కళల’ బాట విధి నిర్వహణ ముగిశాక సమయం కేటాయింపు నేర్పుతున్న విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల -
మంగళసూత్రాలు అందజేత
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామికి ఖమ్మం పట్టణానికి చెందిన డాక్టర్ సాయి విజయ్ చౌహాన్ బహుకరించిన 30.876 గ్రాముల బంగారు మంగళ సూత్రాలు, 60 గ్రాముల వెండి గొలుసులను రిటైర్డ్ ఆలయ అర్చకులు కై కర్యం రాఘవాచార్యులు శనివారం ఆలయ కార్యనిర్వహణ అధికారి మహేశ్కు అందజేసినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.4,75,775 ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ముక్కాముల రాజశేఖర్శర్మ, అర్చకులు ఈశ్వర్చంద్ రామానుజమ్ దాస్, ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ సురేశ్, భక్తులు సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
● రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మంగపేట : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని వాడగూడెం, వాగొడ్డుగూడెం, రామచంద్రునిపేట, బ్రాహ్మణపల్లితో పాటు తదితర గ్రామాల్లో శనివారం రాత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా వాగొడ్డుగూడెం నుంచి పూరేడుపల్లి వరకు రూ.4 కోట్లతో చేపట్టనున్న 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం రామచంద్రునిపేట(సంఘంపల్లి), బ్రాహ్మణపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందుగా మంగపేట ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ తోట రమేశ్ ఇంటివద్ధ ఆయన సమక్షంలో తిమ్మంపేట, చుంచుపల్లి, వాడగూడెం, రమణక్కపేట, మంగపేట తదితర గ్రామాలకు చెందిన సుమారు 50 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికి సీతక్క పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పార్టీలో ప్రతిఒక్కరూ ఐకమత్యంగా ఉండాలన్నారు. జిల్లాలో మంగపేట పెద్ద మండలం అయినప్పటికీ 15 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ధి కుంటు పడిందన్నారు. ప్రతిఒక్కరూ మండల అభివృద్ధికి పనిచేయాలని, అభివృద్ధికి తాను పూర్తిగా సహకరిస్తానని వివరించారు. వచ్చే నెలలో ఇందిరమ్మ రెండోవిడత ఇళ్ల మంజూరులో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో సీసీరోడ్లు నిర్మాణం పనులు జరిగాయని లేని గ్రామాల్లో సైతం సీసీ రోడ్ల నిర్మాణం పనులు చేపడుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉపాధిహామీ మండలి(టీఎస్ఈజీసీ)సభ్యుడు గుమ్మడి సోమయ్య, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, జిల్లా ప్రచార కార్యదర్శి నాయకులు పూజారి సురేందర్, అధికార ప్రతినిధి యానయ్య, మండల మహిళా అధ్యక్షురాలు నిర్మల, మండల నాయకులు నర్సయ్యగౌడ్, శేషగిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


