breaking news
Mulugu
-
హేమాచలుడిని దర్శించుకున్న హిమాలయ యోగి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, పూజారులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వయంభు స్వామివారికి ఆయన గోత్రనామాలతో అర్చన జరిపించారు. ఆలయ పురాణం, స్వామివారి విశిస్టతను ఆర్చకులు వివరించి వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికత మన సనాతన ధర్మం అన్నారు. హేమాచలుడిని దర్శించుకున్న ఆయన మల్లూరు కేసీఆర్ కాలనీలోని మంచర్ల మనేశ్వర్రావు, యశోద పిరమిడ్ ధ్యాన మాస్టర్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహర్షి సంకల్పంతో కర్నూలులో ప్రారంభమైన ఒక పిరమిడ్ నేడు దేశ వ్యాప్తంగా లక్షల పిరమిడ్లు వెలిశాయన్నారు. సంకల్పంతో ధ్యానం చేసి శక్తిని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన మాస్టర్లు ఉప్పలి రమేశ్, కవిత, ముత్తినేని వెంకటేశ్వర్లు, యరంకని ఆనందం, ఉమ గ్రామస్తులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు ఆకర్షణీయంగా చేపట్టాలి
ములుగు రూరల్: జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆకర్షణీయంగా చేపట్టాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ అన్నారు. ములుగు మండలంలోని కొత్తూరు దేవునిగుట్ట, ఇంచర్ల ఏకో పార్క్ అభివృద్ది పనులను ఆమె శుక్రవారం పరిశీలించారు. ముందుగా దేవునిగుట్ట్ట లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకుని ట్రెక్కింగ్ పనులను పరిశీలించారు. అనంతరం ఇంచర్ల ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఏకో పార్క్, వాచ్ టవర్, నీటికుంటలను పరిశీలించారు. వెదురు బొమ్మల తయారీదారులతో మాట్లాడారు. చేతివృత్తిదారులు వెదురు బొమ్మల తయారీతో ఆర్థికాభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ఎస్ ప్రభాకర్, సీసీఎఫ్ కాళేశ్వరన్, ములుగు, భూపాలపల్లి డీఎఫ్ఓలు రాహుల్ కిషన్ జా దవ్, నవీన్రెడ్డి, పారెస్టు డివిజనల్ ఆఫీసర్లు, ఎఫ్ఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్: పోక్సో కేసులో ఓ వ్యక్తికి 20 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన విచారణలో నిందితుడు దోషిగా తేలడంతో న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 6 వేల జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు. ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో బండారుపల్లి గ్రామానికి చెందిన కొడబోయిన మహేందర్ పోక్సో కేసు 2020లో అదే గ్రామానికి చెందిన ఎల్పుల రవితేజపై ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసు విచారణ దర్యాప్తు అధికారిగా దేవేందర్రెడ్డి, ఎస్సై ఫణి, కోర్టు మానిటరింగ్ డీఎస్ కిశోర్, కోర్టు లియాసోనింగ్ అధికారి ఎస్సై లక్ష్మణ్, కోర్టు సీడీఓ స్రవంతిలను ఎస్పీ అభినందించారు. కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాలకు చెందిన సాధువులు గోదావరి పరిక్రమణ యాత్ర పేరిట ఈనెల 14న ఆదివారం కాళేశ్వరం రానున్నారు. 15న సోమవారం ఉదయం ముందుగా త్రివేణి సంగమగోదావరిలో పుణ్యస్నానాలు చేయనున్నారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేస్తారని ఆలయ వర్గాల ద్వారా తెలిసింది. సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరస్వాములు 500మంది వరకు తరలి రానున్నారని తెలిసింది. దీంతో వారిని దర్శించుకోవడానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. మల్హర్: ఓపెన్ కాస్ట్లో ఉద్యోగులు, కార్మికులు రక్షణలో భాగస్వాములు కావాలని సేప్టీ కమిటీ కన్వీనర్ వెంకటరమణ సూచించారు. 56వ రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండలంలో తాడిచర్ల ఓపెన్కాస్ట్ మైన్ను వెంకట్వేర్రావు సందర్శించి, రక్షణ ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడాతూ.. ప్రతీ ఉద్యోగి విధి నిర్వహణలో రక్షణ సూత్రాలు పాటించాలని సూచించారు. కార్మికుల రక్షణపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు. రక్షణ సూత్రాలు పాటిస్తూ లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాద రహిత ఓపెన్కాస్ట్ మైన్గా నిలిచేలా ప్రతీ ఒక్కరు పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ఓపీ, సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం సంస్థ నియమ నిబంధనలను అనుసరించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని వివరించారు. కార్యక్రమంలో మైన్ ఏజెంట్ జీవన్కుమార్, సభ్యులు జాకీర్ హుస్సేన్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, జెన్కో జీఎం మోహన్రావు, ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్లు శ్రీధర్, కేఎస్ మూర్తి, మైన్ మేనేజర్ శ్రీనివాస్, సేప్టీ అధికారి సురేష్బాబు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతరలో ట్రాఫిక్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. మండల పరిధిలోని అడవిమార్గంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యామ్నాయ దారులను డీఎస్పీ రవీందర్తో కలిసి ఎస్పీ బైక్పై తిరుగుతూ శుక్రవారం పరిశీలించారు. మహావీర్ పార్కింగ్ నుంచి వెంగ్లాపూర్, గోనెపల్లి మీదుగా కొండపర్తి, కాల్వపల్లి నుంచి అడవి మార్గంలోని దారులను తనిఖీ చేశారు. మేడారం మహాజాతర సమయంలో భారీ సంఖ్యలో భక్తులు ప్రైవేట్ వాహనాల్లో రానున్న నేపథ్యంలో రహదారి వెడల్పు, మలుపులు, సేఫ్ జోన్లు, ట్రాఫిక్ డైవర్షన్కు అనుకూల ప్రాంతాల వివరాలను తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కొండపర్తి రూట్ను కూడా ఉపయోగించుకునే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. మేడారం జాతర సమయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మార్గమధ్యలో సైన్ బోర్డ్స్, రేడియం స్టికర్స్, సిగ్నలింగ్ టీమ్స్, పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట పస్రా సీఐ దయాకర్ ఉన్నారు. వాహనదారులు అప్రమత్తం ములుగు రూరల్: చలికాలంలో ఉదయం పొగమంచు కారణంగా వాహనాలు నడిపే వారు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ఉదయం సమయంలో వాహనదారులు ఫాగ్లైట్లు, హెడ్ లైట్లు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. వాహనాలను ఓవర్ స్పీడ్గా నడపరాదని తెలిపారు. ముందు వెళ్తున్న వాహనాలు సరిగా కనిపించని కారణంగా సురక్షిత దూరం పాటించాలని, ఇతర వాహనదారులను అప్రమత్తం చేసేందుకు హారన్ ఉపయోగించాలని సూచించారు. రోడ్డు పక్కన వాహనాలు నిలుపవద్దని పేర్కొన్నారు. డ్రైవర్లు నిద్రలేమి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని హెచ్చరించారు. ఉదయం వాకింగ్ చేసే వారు హైవేలపై కాకుండా నిర్ణీత మైదానాల్లో వ్యాయామం చేయాలని సూచించారు. చలికాలంలో అత్యవసరమైతే తప్పా ఉదయం 5 నుంచి 8 గంటల వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని తెలిపారు. అత్యవసర సమయాల్లో 100, 112 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ బైక్పై అడవిమార్గం దారుల పరిశీలన -
కాజీపేట టు పెంబర్తి..
విద్యారణ్యపురి : మూడేళ్లక్రితం మహబూబాబాద్, ములుగు జిల్లా కేంద్రాల్లో మహాత్మాజ్యోతిబా పూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేశారు. వివిధ డిగ్రీకోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించగా అప్పట్లో అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో కాలేదు. దీంతో ఆ తర్వాత మహబూబాబాద్, ములుగులోని ఆ రెండు బీసీ మహిళా డిగ్రీ కళాశాలలను అదే పేర్లతోనే కాజీపేటలోని మహాత్మాజ్యోతిబా పూలే బీసీ ఐదేళ్ల ‘లా’కోర్సు నడుస్తున్న భవనంలోనికి షిఫ్టింగ్ చేశారు. రెండేళ్ల నుంచి ఆ భవనంలోనే అరకొర సౌకర్యాలతోనే ఆయా డిగ్రీ కళాశాలలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఐదు కోర్సుల్లోనే అడ్మిషన్లు అయ్యాయి. బీఏ, బీకాం సీఏ, ఎంపీసీఎస్, ఎంఎస్డీఎస్, బీఎస్సీ బీజెడ్సీ కోర్సుల్లో సుమారు 230మంది వరకు విద్యార్థినులు చదువుతున్నారు. ఫస్టియర్, సెకండియర్ కోర్సులు కొనసాగుతుండగా వచ్చే సంవత్సరం ఫైనలియర్ విద్యార్థినులు కూడా ఉంటారు. పది మంది రెగ్యులర్ లెక్చరర్లు ఉండగా ఆరుగురు గెస్ట్ ఫ్యాకల్టీ విద్యాబోధన చేస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్గా వి శ్రాంత అధ్యాపకుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ‘లా’విద్యార్థినుల ఆందోళన ఒకే భవనంలో ఐదేళ్ల ‘లా’కోర్సులో మూడు సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థినులు చదువుతున్నారు. ఈభవనంలోనే డిగ్రీ కళాశాల విద్యార్థినులు కూడా ఉండడంతో తమకు కూడా సదుపాయాలు సరిపోవడం లేదని ‘లా’విద్యార్థినులు ఇటీవల ఆందోళనకు దిగారు. డిగ్రీ కళాశాలల వేరే చోట నిర్వహించుకోవాలని ఆందోళన చేపట్టారు. డిగ్రీ కళాశాలను పెంబర్తికి షిఫ్ట్ చేయాలని ఆదేశాలు ‘లా’కళాశాల భవనంలోనే కొనసాగుతున్న బీసీ మహిళా డిగ్రీ కళాశాలల (మహబూబాబాద్, ములుగు)ల్లోని విద్యార్థినులను జనగామ జిల్లా పెంబర్తిలో ఇప్పటికే నిర్వహిస్తున్న మహాత్మాజ్యోతిబాపూలే బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలకు షిష్టింగ్ చేయాలని (ఈనెల 20వతేదీవరకు) బీసీ గురుకులాల వెల్ఫేర్ రాష్ట్ర కార్యదర్శి సైదులు ఇటీవల ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఇందుకు సంబంఽధించిన ఉత్తర్వులు ఉమ్మడి వరంగల్ బీసీ గురుకులాల ఆర్సీఓకు, మహబూబాబాద్, ములు గు డిగ్రీ కళాశాలల కలిపి నిర్వహిస్తున్న డిగ్రీ కళా శాల స్పెషల్ ఆఫీసర్కు అందాయి. దీంతో కొన్నినెలలుగా ఈ కళాశాలకు వివిధ చోట్ల అద్దెభవనం చూశారు.కానీ అనువైన భవనం లభించడం లేదంటున్నారు. ఇప్పుడు కళాశాలలోని విద్యార్థినులను పెంబర్తి కళాశాలకు తరలించాలని యోచిస్తున్నారు. కాజీపేటలో కొనసాగుతున్న బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను ఇక్కడే కొనసాగించాలి. పెంబర్తికి తరలించొద్దు. నా కూతురు కూడా డిగ్రీ చదువుతోంది. విద్యకుదూరమయ్యే పరిస్థితి తీసుకురావొద్దు. ములుగు జిల్లా గురుకుల డిగ్రీ కాలేజీని ములుగు జిల్లాలోనైనా ఏర్పాటు చేయాలి. – కె.రాజు, ఓ విద్యార్థిని తండ్రి, ములుగు జిల్లా దేవగిరి పట్నం ఈ కళాశాల మహబూబాబాద్, ములుగు జిల్లాలకు సంబంధించినది కావడంతో ఆయా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత విద్యార్థినులు కూడా కాజీపేటలోని ఈ కాలేజీలో చదువుకుంటున్నారు. తాము పట్టణ ప్రాంతంలో ఉందని ప్రవేశాలు పొందామని, ఇప్పుడు మళ్లీ తమను పెంబర్తి మహిళా గురుకుల కళాశాలకు తరలిస్తే దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము వెళ్లబోమని స్పెషల్ ఆఫీసర్ ,అధ్యాపకులతోనూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈవిషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఇటీవల కొందరు కాజీపేటకు వచ్చి ఇక్కడి నుంచి తరలించొద్దని స్పెషల్ ఆఫీసర్కు విన్నవించుకున్నారు. పలువురు తల్లిదండ్రులు బీసీ గురుకులాల ఉమ్మడి వరంగల్ ఆర్సీఓతోనూ మాట్లాడారని సమాచారం. ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్డీసీ రాష్ట్ర సెక్రటరీ ఆదేశాల మేరకు పెంబర్తిలోని బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలకు తరలించాలనే యోచనలో ఉన్నారు. వ్యతిరేకిస్తున్న విద్యార్థినులు, తల్లిదండ్రులు మహబూబాబాద్, ములుగు జిల్లాలకు కలిపి కాజీపేటలో ఏర్పాటు మరోసారి తరలింపునకు ఆదేశాలు జారీ -
ప్రలోభాల ఎర
ఓటర్లను ఆకట్టుకునేందుకు పాట్లు● రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు ● మూడు మండలాల్లో 52 జీపీలకు 15 ఏకగ్రీవం ● 37 సర్పంచ్ స్థానాలకు 129 మంది అభ్యర్థుల పోటీ ● 315 వార్డు స్థానాలు.. బరిలో 851 మందిములుగు: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామగ్రిని శనివారం అధికారులకు పంపిణీ చేయనున్నారు. ఉన్నతాధికారులు మండలాల వారీగా ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు ర్యాండమైజేషన్ను పూర్తి చేశారు. శుక్రవారంతో ఎన్నికల ప్రచారానికి తెర పడడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం మొదటి విడతలో గోవిందరావుపేట, ఎస్ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లోని కాంగ్రెస్ 36 సర్పంచ్ స్థానాలను గెలుపొంది పైచేయి సాధించింది. బీఆర్ఎస్ 11 స్థానాలతో సరిపెట్టుకుంది. రెండో విడతలో ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల్లోని 52 గ్రామ పంచాయతీలకు 15 ఏకగ్రీవం కాగా మిగిలిన 37 సర్పంచ్ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. 37 సర్పంచ్, 315 వార్డులు జిల్లాలోని ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల పరిధిలో 52 గ్రామ పంచాయతీలకు, 462 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా, 15 గ్రామ పంచాయతీలు 147 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 37 సర్పంచ్ స్థానాలకు 129 మంది సర్పంచ్ అభ్యర్థులు, 315 వార్డు స్థానాలకు 851 మంది వార్డు అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఆదివారం జరగనున్న ఎన్నికల కోసం 462 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేయగా 66,729 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 1,183 అధికారులు కేటాయింపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు 1,183 మంది పీవో, ఏపీవోలను కేటాయించారు. మల్లంపల్లి మండలానికి 78 మంది పీవోలు, 93 మంది ఏపీవోలు, ములుగు మండలానికి 207 మంది పీవోలు, 263 ఏపీవోలు, వెంకటాపురం మండలానికి 245 మంది పీవోలు, 297 మంది ఏపీవోలు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచి ఎన్నికలు ముగిసే వరకు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వహించనున్నారు. రెండో విడత పోలింగ్పై.. తొలి విడత ఎన్నికల ఫలితాల ప్రభావం పడే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లాలో అఽత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందగా బీఆర్ఎస్ అభ్యర్థులు వెనుకబడిపోయారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో ఎవరూ ఊహించని విధంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు సతీమణి శ్రీలతను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని విజయఢంకా మోగించారు.రెండో విడతలో ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఈ క్రమంలో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మందు, మాంసం, నగదు రూపేణా ఆశపెడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ తమకే ఓటేసి గెలిపించాలంటూ ప్రాధేయపడుతున్నారు. డబ్బు, మందం పంపిణీకి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. -
విద్యుత్ పనుల నాణ్యతలో రాజీలేదు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర సందర్భంగా చేస్తున్న విద్యుత్ పనుల నాణ్యతలో రాజీపడేది లేదని ఎన్పీడీసీఎల్ అపరేషన్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. శుక్రవారం మేడారంలో విద్యుత్ ఏర్పాట్ల పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ములుగు సర్కిల్ పరిధిలోని నార్లాపూర్లో కొత్తగా నిర్మాణంలో ఉన్న 33/11 కేవీ సబ్స్టేషన్ను పరిశీలించారు. అనంతరం మేడారంలో విద్యుత్ ఏర్పాట్ల పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈనెలఖారుకల్లా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. నాణ్యతలో ఎలాంటి రాజీపడవద్దని, భక్తులకు విద్యుత్ సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. జాతర విజయవంతం కావడానికి విద్యుత్ శాఖ కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. అందువల్ల ప్రతీపని నాణ్యతతో సమయానికి పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఈ ఆపరేషన్ రాజు చౌహన్, ములుగు ఎస్ఈ ఆనందం, డీఈ ఆపరేషన్ నాగేశ్వరరావు, ఏడీఈలు వేణుగోపాల్, సందీప్ పాటిల్ పాల్గొన్నారు.ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ మధుసూదన్ -
ఇసుక రీచ్ నిలిపివేయాలని నిరసన
ములుగు రూరల్: రైతులకు నష్టం చేస్తున్న అబ్బాయిగూడెం ఇసుక రీచ్ను నిలిపివేయాలని కోరుతూ శుక్రవారం అబ్బాయిగూడెం రైతులు ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ ముంజాల భిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ అబ్బాయిగూడెంలోని ఇసుక రీచ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. రైతుల పంటలకు నష్టం కలిగేలా విద్యుత్ స్తంభాలను విరగొట్టారని వివరించారు. దీంతో రైతుల పంట పొలాలు ఎండి పోతున్నాయని వాపోయారు. అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇసుక రీచ్ను నిలిపి వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తోట నాగేశ్వర్రావు, బొల్లె రాంబాబు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ములుగు రూరల్: ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సార్వత్రిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని లీగల్ హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికై నా లీగల్ సమస్యలు ఉంటే సమస్యల పరిష్కారానికి హెల్ప్డెస్క్ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గోపాల్రావు, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్వామిదాస్, అడ్వకేట్ సుధాకర్, డాక్టర్ కపూర్, హేమంత్, ప్రేమ్సింగ్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్ -
జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం, మేడారంలో రోడ్ల విస్తర్ణ పనులతోపాటు భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని ఇది లాస్ట్ డెడ్లైన్ అని మంత్రి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మంత్రి సీతక్కతో కలిసి అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి పనులు, సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్దరణ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, గద్దెల ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రోడ్ల నిర్మాణం, జంపన్న వాగు వద్ద ఏర్పాట్లు, వాగులో ఇసుక లెవలింగ్ పనులను పరిశీలించారు. అనంతరం జాతర అభివృద్ధి పనులపై ఆయాశాఖల అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించి జాతర పనుల పురోగతి వివరాలపై ఆరా తీశారు. గద్దెల ప్రాంగణం సాలహారం, గద్దెల విస్తర్ణ, ఆర్చీ ద్వారా స్థంబాల స్థాపన పనుల్లో నెమ్మదిగా సాగుతున్నాయని పూజారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా పొంగులెటి మాట్లాడుతూ.. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులతోపాటు, జాతర అభివృద్ధి పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు కార్మికుల సంఖ్యను పెంచడంతోపాటు అదనంగా మరో రెండు క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్యూలైన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. అంతకుముందు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్శన్ రేగ కల్యాణి. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు. పనులను పరిశీలించిన మంత్రులు పొంగులేటి, సీతక్క ఈనెల 30 లాస్ట్ డెడ్లైన్ అధికారులతో సమీక్ష సమావేశం -
కొడుకు చేతిలో తండ్రి హత్య
గూడూరు: మద్యం మత్తులో గొడవపడిన తండ్రిని కుమారడు కొట్టి చంపిన ఘటన మానుకోట జిల్లా గూడూరు మండలంలోని దామరవంచ శివారు హఠ్యతండాలో గురువారం అర్ధరాత్రి జరిగింది. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హఠ్యతండాకు చెందిన ధారావత్ నందీరాంనాయక్ (45) భార్యా పిల్లలతో హైదరాబాద్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి స్వగ్రామానికి వచ్చారు. గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన నందీరాం గొడవ చేస్తున్నాడు. గొడవ వద్దని చెప్పిన భార్యపై మద్యం మత్తులో రోకలితో దాడి చేయడానికి యత్నించాడు. గుర్తించిన కుమారుడు కృష్ణ అదే రోకలితో తండ్రి ఛాతిపై కొట్టాడు. వెంటనే కింద పడి స్ప్రృహకోల్పోయాడు. కొద్దిసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు గూడూరు సీహెచ్సీకి తరలించారు. వైద్యుడు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై మృతుడి తల్లి ధారావత్ సోమ్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. -
14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్
హన్మకొండ : హనుమకొండ బాలసముద్రంలోని షైన్ జూనియర్ కళాశాలలో ఈనెల 14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్యాదవ్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో స్కాలర్షిప్ టెస్ట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ టెస్ట్లో 96 నుంచి 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్ ప్రవేశంలో పూర్తి రాయితీ అందించనున్నట్లు తెలిపారు. 91 నుంచి 95 మార్కులు సాధించిన విద్యార్థులకు 75 శాతం, 86 నుంచి 90 మార్కులు సాధించినవారికి 50 శాతం, 81 నుంచి 85 మార్కులు సాధించిన విద్యార్థులకు 25 శాతం ట్యూషన్ ఫీజు రాయితీ మొదటి ఐదుగురు విద్యార్థులకు అందించనున్నట్లు వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్లు మూగల రమ, ఏ.కవిత, మూగల రమేష్, ప్రిన్సిపాల్స్ పి.శ్రీనివాస్, ప్రశాంత్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
లక్ష్యానికి నవోదయం !
ఖిలా వరంగల్: నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు(శనివారం) జరిగే ప్రవేశ పరీక్షకు మొత్తం 28 పరీక్ష కేంద్రాలను 14 బ్లాకులుగా విభజించి ఏర్పాటు చేశారు. 5,648 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 3,207 బాలురు, 2,439 బాలికలు ఉన్నారు. మొత్తం 80 సీట్లు ఉండగా.. పట్టణ(నగర) పరిధిలో 20 సీట్లకు 1,934 మంది, గ్రామీణ ప్రాంత పరిధిలో 60 సీట్లకు 3,714 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. సీటు వస్తే నవోదయమే.. మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో ఒక్కసారి సీటు లభిస్తే ఆరో తరగతి మొదలు 12వ తరగతి (ప్లస్ టూ) వరకు ఉచితంగా చదువు కొనసాగించవచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం మామునూరులోనే ఉంది. ఈ విద్యాలయంలో ఏటా ప్రవేశానికి పోటీ భారీగా ఉంటోంది. శనివారం ఎంపిక పరీక్ష నిర్వహించనున్న నేపధ్యంలో పాటించాల్సిన మెలకువలను నవోదయ ప్రిన్సిపాల్ పూర్ణిమ వివరించారు.నేడు నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉమ్మడి జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలు పరీక్ష కేంద్రానికి గంట ముందే అనుమతి పరీక్ష రాసే విద్యార్థులు 5,648 మంది -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
కాటారం: ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా కొనసాగించడానికి పోలింగ్ స్టేషన్లకు కేటాయించిన పీఓ, ఏపీఓలు, సిబ్బంది కృషి చేయాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ తెలిపారు. కాటారం మండలకేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్లో శుక్రవారం ఎన్నికల విధులపై పీఓ, ఓపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు, ఓటింగ్, కౌంటింగ్ విధానాలపై మాస్టర్ ట్రైనర్ పోలింగ్ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ మాట్లాడుతూ పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, పీఓ, ఓపీఓలు పాల్గొన్నారు. మహాముత్తారంలో.. మహాముత్తారం మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల విధులు, నిర్వహణపై అధికారులు పీఓ, ఓపీలకు అవగాహన కల్పించారు. నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని అభ్యంతరాలకు తావివ్వవద్దని వివరించారు.కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ -
వెట్టి చాకిరీపై.. కదిలిన యంత్రాంగం
వరంగల్ క్రైం: విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించి.. టిఫిన్లు తయారు చేయించిన ఓగ్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వ్యవహారంపై శుక్రవారం సాక్షిలో ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్ర, జిల్లా అధికారులు కదిలారు. సాక్షి కథనంపై స్పందించిన పరకాల కోర్టు న్యాయమూర్తి జి.సాయి శరత్ పాఠశాలను సందర్శించడంతో వెట్టి చాకిరీ వ్యవహారం ఒక్కసారిగా వెడెక్కింది. దామెర తహసీల్దార్, జ్యోతి వరలక్ష్మి, డీసీఓ ఉమామహేశ్వరి, భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారి అలివేలు, దామెర ఎస్సై అశోక్ కుమార్, ఎంఈఓ రాజేష్ ఉదయం పాఠశాలను సందర్శించారు. ముందుగా టిఫిన్ చేసిన విద్యార్థులను వేర్వేరుగా ప్రశ్నించారు. విచారణలో విద్యార్థులు తమతో బలవంతంగా పనులు చేయించినట్లు అధికారులకు చెప్పినట్లు సమాచారం. పాఠశాలలో పనిచేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ తన దగ్గర వంట మనుషులు లేకపోవడంతో విద్యార్థులను పనిలో పెట్టుకున్నట్లు అధికారులకు చెప్పినట్లు తెలిసింది. చిట్టి వెట్టి చాకిరి కథనంపై స్పందించిన న్యాయమూర్తి సాయి శరత్ ఈఅంశాన్ని సుమోటాగా తీసుకుని పాఠశాల లో విచారణ చేపట్టి నివేదికను జిల్లా ప్రధాన న్యాయమూర్తికి అందజేసినట్లు తెలిసింది. సమస్యల స్వాగతం.. పాఠశాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో అధికారులు ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్లు తెలిసింది. పాఠశాలలో చోటుచేసుకున్న ఘట నపై లోతుగా విచారణ చేసినట్లు తెలిసింది. భద్రా ది కొత్తగూడెం జోనల్ అధికారి అలివెలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి వివరాలు సేకరించారు. విద్యార్థులు టిఫిన్ వండటం, విద్యార్థులను కులం పేరుతో దూషించిన ఘటనలపై సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శికి నివేదిక సమర్పిస్తామని, ఆ తర్వాత శాఖాపరమైన చర్యలు ఉంటాయని జోనల్ అధికారి అలివేలు తెలిపారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి: విద్యార్థి సంఘాలు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న ప్రిన్సిపాల్ సమ్మయ్య ను సస్పెండ్ చేయాలని కోరుతూ టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునిల్, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ కుమార్, విద్యార్థి సంఘాల జేఏసీ కోఆర్డినేటర్ అనిల్ భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థులతో మాట్లాడిన పరకాల జడ్జి ప్రిన్సిపాల్ సస్పెన్షన్కు విద్యార్థి సంఘాల డిమాండ్ ‘సాక్షి’ కథనంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు -
‘మంత్రిపై చర్యలు తీసుకోవాలి’
ములుగు రూరల్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. రెండో విడత ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో సాయంత్రం 5 గంటలు దాటి న తర్వాత సభలు, సమావేశాలు, మైక్లతో ప్రచారం నిర్వహించకూడదు. ఈ మేరకు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత జాకారంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలు అతిక్రమించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
తల్లి వార్డుమెంబర్..కొడుకు సర్పంచ్
కేసముద్రం: మండలంలోని మహముద్పట్నం గ్రామ వార్డుమెంబర్గా తల్లి, సర్పంచ్గా కొడుకు ఎన్నికయ్యారు. గ్రామంలో ఎస్టీ ఓటర్లు ఏడుగురు మాత్రమే ఉండగా, సర్పంచ్ స్థానంతో పాటు, మూడు వార్డులు ఎస్టీ రిజర్వేషన్ అయ్యాయి. దీంతో రెండు కుటుంబాలకు చెందిన వారే పోటీలో నిల్చున్నారు. ఈ మేరకు గురువారం గ్రామంలో ఎన్నికలు నిర్వహించగా, 3వ వార్డు మెంబర్గా పోటీ చేసిన తల్లి బుచ్చమ్మకు 33 ఓట్లురాగా, ఆమె ప్రత్యర్థికి కూడా 33 ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు టాస్ వేశారు. దీంతో బుచ్చమ్మ విజయం సాధించింది. బుచ్చమ్మ కొడుకు కట్ల ఎల్లయ్య కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా పోటీలో నిలిచి గెలుపొందారు. దీంతో ఒకే ఇంట్లో తల్లి వార్డుమెంబర్గా, కొడుకు సర్పంచ్గా విజయం సాధించడం విశేషం. -
సాయంత్రం కాంగ్రెస్.. రాత్రి బీఆర్ఎస్
కాంగ్రెస్ కండువాలు కప్పుతున్న నాయకులువెంకటాపురం(ఎం): మండల కేంద్రంలో ద్వితీయ శ్రేణి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు అధికార, ప్రతిపక్షనేతలు పోటీ పడుతుండడంతో విచిత్ర రాజకీయ సమీకరణాలు నెలకొన్నాయి. బీ ఆర్ఎస్కు చెందిన కొంతమంది వ్యక్తులు గురువారం సాయంత్రం మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేతలు గురువారం రాత్రి అదే నేతలను తిరిగి బీఆర్ఎస్లో చేర్చుకుని పార్టీ కండువా కప్పి ఫొటోలు దిగారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు మళ్లీ వారికే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోనే కొనసాగుతారని ఫొటోలు దిగి వారితో నినాదాలు చేయించారు. దీంతో ఎవ రూ ఎప్పుడు ఏ పార్టీలో చేరుతున్నారో.. ఎవరికి మద్దతు ఇస్తున్నారో అర్థంకాక ఇరుపార్టీల అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. కండువాలు మార్చిన నాయకులు -
సహజారెడ్డి అంత్యక్రియలు పూర్తి
● అమెరికాలో ఎనిమిది రోజుల క్రితం అగ్నిప్రమాదంలో మృతి స్టేషన్ఘన్పూర్: అమెరికా బర్మింగ్ హోమ్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో భారత కాలమాన ప్రకారం ఈనెల 5న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన ఉడుముల సహజారెడ్డి అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామశివారు గుంటూరుపల్లిలో శుక్రవారం సాయంత్రం క్రైస్తవ సంప్రదాయంలో నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరుపల్లికి చెందిన ఉడుముల జయాకర్రెడ్డి, గోపు మరియశైలజ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వారి పెద్ద కుమార్తె సహజారెడ్డి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లింది. అమెరికాలో బర్మింగ్హోమ్లో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న ఆమె ఎనిమిది రోజుల క్రితం అగ్నిప్రమాదంలో మృతిచెందింది. కాగా ఆమె మృతదేహాన్ని గుంటూరుపల్లికి శుక్రవారం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా విశాఖపట్నం అగ్రపీఠాధిపతి బిషప్ ఉడుముల బాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. -
తొలి విడత సర్పంచ్లు వీరే..
సమ్మక్క, బయ్యక్కపేట ప్రవళిక, తాడ్వాయి శైలజ, ఊరట్టంనాగభూషణం, వెంగ్లాపూర్ మోహన్రావు, కాటాపూర్ సృజన, కాల్వపల్లి రవీందర్, లింగాలజిల్లాలోని ఏటూరునాగారం, ఎస్ఎస్ తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం జరిగింది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. అనంతరం విజేతలను అధికారులు ప్రకటించారు. -
ఉత్సాహంగా..ఆసక్తిగా..
ఏటూరునాగారం: ఓటు హక్కు తొలిసారి రావడంతో హైదరాబాద్ నుంచి ఉత్సాహంగా తరలివచ్చారు యువ ఓటర్లు. ఏటూరునాగారంలో జరిగిన మొదటి దశ సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు యువ ఓటర్లు హాజరై వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. చాలా దూరం నుంచి ఇక్కడ ఓటు వేయాలని సంకల్పంతో వచ్చాను. నాకు ఎంతో సంతోషంగాను ఉంది. ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యత దేనికి లేదన్నారు. అందరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి. – వావిలాల సునిత ఎన్నికలు ఉన్నాయని తెలిసి చంటిబిడ్డను ఎత్తుకొని వచ్చాం. ఎంతో దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఇక్కడి రావడం చాలా ఆనందంగా ఉంది. భార్య, పిల్లలతో కలిసి ఓటును వినియోగించుకొని తిరుగు ప్రయాణం చేస్తా. కష్టం ఉన్నప్పటికీ ఇష్టంగా ఓటును వినియోగించుకున్నా. – రాజశేఖర్, హైదరాబాద్ గోవిందరావుపేట: జీపీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయడం మరుపురాని అనుభూతి. ఇది నా జీవితంలో మరిచిపోలేను. గ్రామాభివృద్ధికి పాటు పడే వ్యక్తికి ఓటు వేయడం ఎంతో సంతోషంగా ఉంది. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆమెను సిబ్బంది అభినందించారు. యువత ముందుకు రావడం ప్రజాస్వామ్యానికి మంచి సంకేతమని పలువురు వివరించారు. – పులుసం మైత్రి -
హస్తందే హవా..
జీపీ ఎన్నికల్లో బోల్తాపడిన బీఆర్ఎస్ ములుగు: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ ప్ర భుత్వం రెండేళ్ల పాలనలో పథకాల అమలును ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన పంచాయతీ అభ్యర్థులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభు త్వ తీరును విమర్శిస్తూ ప్రజల్లో ప్రచారాన్ని నిర్వహించారు. మూడు మండలాల్లో.. ఈ సందర్భంగా తొలి విడత జీపీ ఎన్నికలు గురువారం జిల్లాలోని గోవిందరావుపేట, ఎస్ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో జరుగగా ఓటర్లు కాంగ్రెస్కు బ్రహ్మరథం పట్టారు. మూడు మండలాల పరిధిలో 48 పంచాయతీలకు 9 ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవమైన పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. మిగిలిన 39 పంచాయతీలకు గురువారం ఎన్నికలు జరగగా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు గెలుచుకున్నారు. అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కై వసం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు. మూడు మండలాల పరిధిలో 48 పంచాయతీలకు 9 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 39 స్థానాలకు ఎన్నికలు జరగగా 27 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, 11 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు, ఒక స్థానంలో ఇతరులు గెలుపొందారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కై వసం కావడంతో కాంగ్రెస్ నేతలు సంబురాలు జరుపుకుంటున్నారు. రెండు, మూడో విడతల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. బోల్తాపడిన బీఆర్ఎస్ రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థించిన తొలి విడతలో కాంగ్రెస్ శ్రేణులకు ప్రజలు పట్టం కట్టారు. అదే విధంగా బీఆర్ఎస్ సర్పంచ్లకు ప్రజల నుంచి చుక్కెదురైంది. మూడు మండలాల్లో 48 పంచాయతీలకు 10 స్థానాలను మాత్రమే బీఆర్ఎస్ కై వసం చేసుకోవడంతో ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత కొనసాగుతుందనే విమర్శలున్నాయి.మండలం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇతరులు ఎస్ఎస్ తాడ్వాయి 13 05 0 ఏటూరునాగారం 08 03 1 గోవిందరావుపేట 15 03 0 మొత్తం 36 11 01 36 స్థానాల్లో కాంగ్రెస్.. 11 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు -
నిబంధనల మేరకు ప్రచారాలు నిలిపివేయాలి
ములుగు రూరల్: ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రచారాలను నిలిపి వేయాలని కలెక్టర్ దివాకర గురువారం ఒక ప్రకటనలో సూచించారు. రెండో విడత ఎన్నికల్లో భాగంగా ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగించాలని తెలిపారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని వివరించారు. ఎన్నికలు జరిగే మండలాలలో 44 గంటల పాటు బహిరంగ ప్రచారం చేయరాదని సూచించారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 12వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఎన్నికల సరళి పరిశీలన మొదటి విడత ఎన్నికల్లో భాగంగా కలెక్టరేట్లో గురువారం వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను కలెక్టర్ దివాకర పరిశీలించారు. మొదటి విడత ఎన్నికలు ఏటూరునాగారం, ఎస్ఎస్తాడ్వాయి. గోవిందరావుపేట మండలాల్లో నిర్వహించారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ, కౌటింగ్ను సమర్థవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించినట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, ఈడీ దేవేందర్ పాల్గొన్నారు. -
పోలింగ్ ప్రశాంతం
ఏటూరునాగారం: జిల్లాలో ఏటూరునాగారం, ఎస్ఎస్ తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో గురువారం జీపీ ఎన్నికల్లో భాగంగా తొలి విడతగా నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ సాగగా ఉదయం 7 గంటల నుంచి మందకొడిగా ప్రారంభమైంది. 9 గంటల తర్వాత ఓటర్లు బారలుదీరడంతో ఓటింగ్ ప్రక్రియ ఊపందుకుంది. కాగా జిల్లాలోని మూడు మండలాల్లో పోలింగ్ 78.65 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. చలితో ఉదయం పూట మందకొడిగా.. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో గురువారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పోలింగ్ సరళి మందకొడిగా సాగింది. 9 తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ కనిపించింది. క్రమ క్రమంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. ఎన్నికల సిబ్బంది ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించి ఒంటిగంట వరకు ముగించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు వార్డు సభ్యులు, సర్పంచ్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. మహిళల ఓట్లే అధికం గోవిందరావుపేట మండలంలో మొత్తం ఓట్లరు 20,402 ఉండగా 15,501 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ఎస్ఎస్ తాడ్వాయిలో 16,680 మంది ఓటర్లు ఉండగా 13,928 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోగా ఏటూరునాగారం మండలంలో 23,279 మంది ఓటర్లు ఉండగా 18,043 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మూడు మండలాల్లో అత్యధికంగా మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడు మండలాల్లో కలిపి 24,412 మంది మహిళలు ఓటు వేయగా 23,055 మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకొని సత్తాచాటారు. క్యూలైన్లలో సైతం మహిళలు బారులుదీరి ఆహా అనిపించారు. 48 సర్పంచ్ స్థానాలకు గాను 9 ఏకగ్రీవం కాగా 420 వార్డు సభ్యులకు 128 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.మండలం మొత్తం పోలైన పోలింగ్ ఓటర్లు ఓట్లు శాతంఏటూరునాగారం 23,279 18043 77.51 ఎస్ఎస్తాడ్వాయి 16,680 13,928 83.50 గోవిందరావుపేట 20,402 15,501 75.98 మూడు మండలాల్లో 60,361 ఓట్లకు 47,472 ఓట్లు పోలింగ్ ఉదయం మందకొడిగా సాగిన ఓటింగ్ -
పోలింగ్ కేంద్రాల పరిశీలన
ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి: మొదటి విడత జీపీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను గురువారం సాధారణ ఎన్నికల పరిశీలకుడు, జనరల్ అబ్జర్వర్ డి.ప్రశాంత్ కుమార్ గురువారం పరిశీలించారు. ఎస్ఎస్తాడ్వాయి మండలం పరిధిలోని బీరెల్లి, రంగాపూర్, గంగారం, కాటాపూర్, దామరవాయి, కామారం పోలింగ్ కేంద్రాలతో పాటు, ఏటూరునాగారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్, చిన్న బోయినపల్లి, శివాపురం, తాళ్లగడ్డ, ఏకే ఘన్పూర్, ముళ్లకట్ట, రోహిర్, ఎక్కెల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లోని ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎస్పీ రవీందర్, సీఐ శ్రీనివాస్, సీడీపీఓ ప్రేమలతను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఏటూరునాగారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో నిర్వహిస్తున్న పోలింగ్ సరళిని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ను నిష్పక్షపాతంగా జరిపించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని నాయకులు, ఓటర్లు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రవీందర్, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు రాజ్కుమార్, సురేశ్ ఉన్నారు. అలాగే తాడ్వాయి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను గురువారం ఎస్పీ పరిశీలించారు. పోలింగ్ సరళి, శాంతి భద్రత వివరాలను తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డిని ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. -
అడవులతోనే మానవాళి మనుగడ
సౌత్ రేంజ్ అధికారి అప్సర్నిస్సా కన్నాయిగూడెం: అడవులతోనే మానవాళి మనగడ కొనసాగుతుందని, అడవికి నిప్పు పెడితే భవిష్యత్ తరాలకు ప్రమాదం ఏర్పడుతుందని ఏటూరునాగారం సౌత్ జోన్ రేంజ్ అధికారి అప్సర్ నిస్సా అన్నారు. మండల పరిధిలోని బుట్టాయిగూడెం, లక్ష్మీపురం, చింతగూడెం, ఏటూరు, దేవాదుల గ్రామాల్లో అప్సర్ నిస్సా బుధవారం తిరుగుతూ రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. అడవులకు నిప్పు పెట్టడంతో అడవులు అంతరించిపోతాయని గుర్తు చేశారు. నేటి అడవులతోనే భవిష్యత్ తరాలకు మనుగడ ఉంటుందని వివరించారు. రానున్న వేసవిలో అడవికి పనుల నిమిత్తం వెళ్లిన రైతులు, కూలీలు అడవికి నిప్పు పెట్టవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో బీట్ అధికారులు రవి కుమార్, శ్రీనివాస్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. -
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
గోవిందరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నేడు జరగనున్న మొదటి విడత పోలింగ్ విధుల్లో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సూచించారు. ఈ మేరకు ఆయన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం సందర్శించి అక్కడి ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించారు. అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి బలగాల వినియోగం, రూట్ మ్యాప్, కమ్యూనికేషన్ వ్యవస్థలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు తప్పకుండా అమలు చేయాలన్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు భయపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పస్రా ఎస్సై అచ్చ కమలాకర్ మాట్లాడుతూ మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 140 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బంది పోలింగ్ స్టేషన్ పరిధిని దాటి వెళ్లకూడదని సూచించారు. పోలింగ్, లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పస్రా ఎస్సై నంబర్ 8712670085, పోలీస్ స్టేషన్ నంబర్ 8712670086 కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, ఎంపీడీఓ చిలువేరు వరుణ్ తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
నిబంధనల మేరకే ఖర్చు చేయాలి
వాజేడు: జీపీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనల మేరకే ఖర్చు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు మానస తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మండల కేంద్రానికి వచ్చిన ఆమె రైతు వేదికలో పోటీలో ఉన్న అభ్యర్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ. 1.50 లక్షలు, వార్డు మెంబర్ రూ.30 వేల వరకు ఖర్చు చేయవచ్చని వెల్లడించారు. అంతకు మించి ఖర్చు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. నిబంధనల కంటే ఎక్కువగా డబ్బు తీసుకెళ్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా వారి ఖర్చుల వివరాలను మూడుసార్లు విచారణ జరిపించుకోవాలని సూచించారు. మండలంలో ఫ్లయింగ్ స్క్వాడ్, ఎన్సీసీ టీం తిరుగుతుందని తెలిపారు. నిబంధనల కంటే ఎక్కువ ఖర్చు చేసిన అభ్యర్థి పోటీల్లో గెలిచినా ఆ విషయం ఫిర్యాదు రూపంలో వస్తే విచారించి నిజమని తేలితే ఆ గెలుపును రద్దు చేసే అవకాశం ఉందన్నారు. మైక్తో ప్రచారం చేయాలనుకుంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ విజయ, తహసీల్దార్ శ్రీనివాస్, చంద్రశేఖర్, శ్రీకాంత్ నాయుడు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు మానస -
21న జాతీయ లోక్ అదాలత్
ములుగు: ఈ నెల 21న ములుగు జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ ఎస్వీపీ సూర్య చంద్రకళ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోక్ అదాలత్లో రాజీపడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ, కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, ఇన్సూరెన్స్, ఎకై ్సజ్, ప్రీ–లిటిగేషన్ కేసులతో పాటు ఇతర రాజీపడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లోక్ అదాలత్కు కక్షిదారులు హాజరై, తమ కేసులను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. రాజీపడదగు కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులలో తెలియపరిచి రాజీ కుదుర్చుకోవాలని కోరారు. రాజీపడద గు కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టు కు నేరుగా హాజరు కావాలని వెల్లడించారు. ములుగు రూరల్: మేడారం జాతరలో రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అందించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఎస్పీని తన కార్యాలయంలో రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జాతరలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ను భక్తులకు అప్పగించడం అభినందనీయమని వివరించారు. ఈ ఏడాది జరిగే జాతరలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో మూడు కేంద్రాల్లో భక్తులకు మినరల్ వాటర్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీనివాస్, సెక్రటరీ చుంచు రమేష్, కొట్టె రాజిరెడ్డి, సారయ్య తదితరులు పాల్గొన్నారు. కాటారం: కాటారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన క్రీడాకారులు రాంచరణ్, దేవేందర్, అభిషేక్ 69వ ఎస్జీఎఫ్ అండర్ 19 హ్యాండ్ బాల్ జిల్లాస్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చారు. దీంతో నిర్వాహకులు వీరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ మాధవి బుధవారం తెలిపారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు మహబూబ్నగర్లో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, బలరాం, మహేందర్, శ్రీనివాస్, వెంకటేశ్ అభినందించారు. భూపాలపల్లి అర్బన్: భారత రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులను తెలుసుకొని వినియోగించుకోవాలని జిల్లా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల విద్యార్థులకు సూచించారు. మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్జి అఖిల హజరై మాట్లాడుతూ.. యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనకు ఉందని ఎందరో మహనీయుల కృషి ఫలితంగా మానవ హక్కుల, విధుల రూపకల్పన జరిగిందన్నారు. ఎక్కడైతే హక్కులకు భంగం వాటిల్లుతుందో అక్కడ చట్టం న్యాయం పనిచేయడం ప్రారంభిస్తుందని తెలిపారు. జీవించే హక్కు సమానత్వ హక్కుతోపాటు విద్యాహక్కు కూడా ఉందని అన్నారు. చదువుతోనే ఏదైనా సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీ పుప్పాల శ్రీనివాస్, పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు సేవానాయక్, న్యాయవాది మంగళపల్లి రాజ్కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. -
పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రత
ములుగు రూరల్ : జిల్లాలో మొదటి విడత పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు జిల్లాలో గోవిందరావుపేట, ఎస్ఎస్తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో మొదటి విడత ఎన్నికల నిర్వహణకు డీఎస్పీలు ఇద్దరు, సీఐలు ఆరుగురు, ఎస్సైలు 33 మందితో పాటు 400 మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు భద్రత చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కంట్రోల్ రూం, క్విక్ రెస్పాన్స్ టీంలు, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పోలీస్ పికెటింగ్, మొబైల్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు గుంపులుగా తిరగడం, బెదిరింపులకు పాల్పడకూడదని వెల్లడించారు. -
‘ప్రతీ మనిషికి పుట్టుకతోనే హక్కులు’
ములుగు: ప్రతీ మనిషికి పుట్టుకతోనే హక్కులు లభిస్తాయని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ విజ్ఞాన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సదస్సుకు మహేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలోని మానవ జాతి మొత్తం ఒక కుటుంబం లాంటిదని తెలిపారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నట్టే, గౌరవం సైతం అందించడమే మానవ హక్కుల దినోత్సవ ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, ఉపాధ్యాయులు ఖలీల్, వీరనారాయణ, మమత తదితరులు పాల్గొన్నారు. -
యాక్షన్ ప్లాన్ రెడీ!
గత యాసంగిలో 6,46,664 ఎకరాలకు సాగు నీరు ప్రస్తుతం 5,29,726 ఎకరాలకు అందించేలా ప్రణాళిక గతేడాదితో పోలిస్తే తగ్గిన 1,16,938 ఎకరాలు వరంగల్ ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధి మెట్ట భూములకు 41.28 టీఎంసీలుసాక్షిప్రతినిధి, వరంగల్: యాసంగి పంటలకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉమ్మడి వరంగల్లో 9,48,114 ఎకరాలకుగాను 5,29,726 ఎకరాలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. 15 రోజులు ఆన్.. 15 రోజులు ఆఫ్ పద్ధతిన యాసంగి పంటలకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈనెల 24 నుంచి వరంగల్, ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలోని 5,29,726 ఎకరాల తడి, మెట్ట భూములకు 41.28 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కూడా రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈమేరకు యాసంగి పంటలకు సాగునీరు అందేలా అధికారులు కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఎక్కడెక్కడ ఎలా? ఇరిగేషన్ వరంగల్ చీఫ్ ఇంజినీర్ పరిధిలో మొత్తం 7,92,894 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ యాసంగిలో 4,35,172 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందులో 2,68,598 ఎకరాల తడి, 1,66,574 ఎకరాల మెట్ట భూములు ఉన్నాయి. జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల ద్వారా 1,95,095 ఎకరాలకు 11.30 టీఎంసీలు, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (ఎల్ఎండీ దిగువ) ద్వారా 1,57,038 ఎకరాలకు 12.88 టీఎంసీలు, ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద 83,039 ఎకరాలకు 6.82 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. నీటి లభ్యతను బట్టి యాసంగి పంటలకు సాగునీరు అందేలా నీటిపారుదలశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈమేరకు రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అత్యధికంగా ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలని సూచిస్తున్నారు. ములుగు ఇరిగేషన్ సర్కిల్లో ఇలా.. ములుగు ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం పరిధిలో మొత్తం 1,55,220 ఎకరాల ఆయకట్టు ఉంది. 94,554 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నారు. ఇందులో తడి 34,958 ఎకరాలు కాగా, మెట్ట 59,596 ఎకరాలు. ఇందుకోసం 10.28 టీఎంసీల నీరు సిద్ధంగా ఉన్నట్లు నీటిపారుదలశాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్ (ఎల్ఎండీ దిగువన) కింద 1,03,883 ఎకరాలకు గాను 58,901 ఎకరాలకు ఆరు టీఎంసీలు సరఫరా చేయనున్నారు. పాకాల చెరువు కింద 18,193 ఎకరాలకు మొత్తంగా, రామప్ప లేక్ కింద 5,180 ఎకరాలకుగాను 1,600 ఎకరాలకు అదనంగా కలిపి 6,780 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నట్లు శ్రీస్కివంశ్రీ కమిటీ పేర్కొంది. అలాగే లక్నవరం చెరువు కింద 8,794 ఎకరాలకు గాను 4,550లు, మల్లూరు వాగు కింద 7,500 ఎకరాలకు 1,500లు, పాలెంవాగు ప్రాజెక్టు కింద 7,500 ఎకరాలకు గాను 1,500 ఎకరాలకే ఈ సారి సాగునీటిని అందించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. ఆన్అండ్ఆఫ్ పద్ధతే.. ఉమ్మడి వరంగల్లో ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, దేవాదుల, రామప్ప, పాకాల, లక్నవరం సరస్సులు, చిన్ననీటి వనరుల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టు కింద 9,48,114 ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు, నీటి లభ్యతను బట్టి 5,29,726 ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ (వారబందీ) పద్ధతిన సరఫరా చేయనున్నారు. అయితే, గత యాసంగిలో 6,46,664 ఎకరాలకు నీరిచ్చిన అధికారులు ఈసారి 5,29,726 ఎకరాలే ప్రతిపాదించారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 1,16,938 ఎకరాలు తగ్గింది. కాగా, 15 రోజులు విడుదల చేసి 15 రోజులు ఆఫ్ చేసే పద్ధతిలో ఈ నెల 24 నుంచి ఆయకట్టుకు నీటి విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎల్ఎండీ, దేవాదుల, రామప్ప, లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగుల పరిధి ఆయకట్టు రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. 5.30 లక్షల ఎకరాలు.. 41.28 టీఎంసీలు! యాసంగి యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన ఇరిగేషన్ శాఖ వరంగల్, ములుగు సర్కిళ్లలో ఆయకట్టుకు సాగునీరు 15 రోజులకోసారి ఆన్అండ్ఆఫ్ -
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
ములుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టరేట్ చాంబర్లో మొదటి విడత ఎన్నికలు జరగనున్న గోవిందరావుపేట, ఎస్ఎస్తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ దివాకర, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్కుమార్ సమక్షంలో మంగళవారం నిర్వహించారు. మొదటి విడత పోలింగ్కు సంబంధించి గ్రామాల వారీగా ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు వివరించారు. నామినేషన్ల ఉపసంహరణ నాటికే ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాలతో కూడిన గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరపాల్సిన అవసరం లేకపోవడంతో ర్యాండమైజేషన్ ప్రక్రియ నుంచి కొంతమంది సిబ్బందికి మినహాయింపు కల్పించినట్లు వివరించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందికి పోలింగ్ విధులు కేటాయించినట్లు వివరించారు. మొదటి విడతలో 379 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికలు ఉండగా, 20 శాతం అదనంగా సిబ్బందిని రిజర్వ్లో ఉంచుతూ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన గోవిందరావుపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్రావుతో కలిసి పరిశీలించారు. పంపిణీ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు, సీల్ ట్యాగులు, స్టేషనరీ, పోలింగ్ బృందాల కిట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేలా చూడాలన్నారు. భద్రతా చర్యలు, రవాణా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరిపారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
ప్రలోభాలు షురూ
రేపు మొదటి విడత పంచాయతీ ఎన్నికలుములుగు: జీపీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు సమయం దగ్గర పడుతుండంతో ప్రచారానికి తెర పడింది. రేపు(11వ తేదీ) జిల్లాలోని గోవిందరావుపేట, ఎస్ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లోని 39 సర్పంచులకు, 287 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కంటే 44 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో అభ్యర్థులు మంగళవారం సాయంత్రం నుంచే ప్రచారాన్ని ముగించారు. వారం రోజుల పాటు పంచాయతీల్లో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించిన అభ్యర్థులు ప్రచారానికి చెక్ పెట్టి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. 39 సర్పంచులు.. 287 వార్డులకు పోలింగ్ జిల్లాలోని గోవిందరావుపేట, ఎస్ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల పరిధిలో 48 గ్రామ పంచాయతీలకు, 420 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా 9 జీపీలు 128 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 39 సర్పంచ్ స్థానాలకు, 287 వార్డు స్థానాలకు రేపు(11వ తేదీ) ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం 436 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేయగా 68,299 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మూడో విడత అభ్యర్థులకు గుర్తులు వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం మండలాల పరిధిలోని పంచాయతీలకు మంగళవారం ఉప సంహరణ గడువు ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. మూడు మండలాల పరిధిలో 46 సర్పంచ్ స్థానాలు ఉండగా ముప్పనపల్లి పంచాయతీ ఏకగ్రీవం అయింది. మిగిలిన 45 పంచాయతీలకు 209 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 408 వార్డు స్థానాలకు 48 ఏకగ్రీవం కాగా మిగిలిన 360 వార్డు స్థానాలకు 926 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో వారు ప్రచారాన్ని మొదలు పెట్టారు. 122 మంది ఆర్వో, ఏఆర్వోలకు విధుల కేటాయింపు జిల్లాలో మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్లు(ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల(ఏఆర్వో)కు విధులు కేటాయించారు. మొదటి విడత ఎన్నికలకు 20 మంది ఆర్వోలు, 20 మంది ఏఆర్వోలు, రెండో విడతకు 23 మంది ఆర్వోలు, 23 మంది ఏఆర్వోలు, మూడో విడతకు 18 మంది ఆర్వోలు, 18 మంది ఏఆర్వోలను కేటాయించారు. మూడు విడతల్లో 9 మండలాల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో 122 మంది ఎన్నికల అధికారులుగా విధులు నిర్వర్తించనున్నారు. మొదటి విడత పోలింగ్కు 44 గంటల ముందు నుంచే ఆయా మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుంది. పోలింగ్ ముగిసే వరకు బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచారాలు నిర్వహించవద్దు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా గ్రామ పంచాయతీల్లో ఉండకూడదు. ఎన్నికల ఉల్లంఘనలు పాల్పడితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అన్ని విబాగాల నోడల్ అధికారులకు ఆదేశించాం. – టీఎస్ దివాకర, కలెక్టర్గ్రామాల్లో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు మందు పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాగైన సర్పంచ్, వార్డు సభ్యుడిగా గెలుపొందాలని ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ఆయా గ్రామాలను బట్టి ఓటుకు రూ.300ల నుంచి రూ. 500ల వరకు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అలాగే మద్యం షాపులు బంద్ ఉండడంతో అభ్యర్థుల అనుచరులు మద్యం సమకూర్చుకునే పనిలో పడ్డారు. 39 సర్పంచ్ స్థానాలకు బరిలో 145 మంది అభ్యర్థులు 287 వార్డు స్థానాలకు 753 మంది మూడో విడత పోలింగ్ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు -
‘హ్యూమన్ పాపిలోమా’పై శిక్షణ
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం హ్యూమన్ పాపిలోమా వైరస్పై వైద్యాధికారులకు, సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ తరగతులను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు హాజరై మాట్లాడారు. మహిళల్లో గర్భాశయ కేన్సర్ నిరోధించడానికి నూతనంగా కేంద్ర ప్రభుత్వం హ్యుమన్ వ్యాక్సిన్ ప్రవేశ పెట్టిందని అన్నారు. ఈ వ్యాక్సిన్ 14 ఏళ్లు నిండిన బాలికలకు వేయనున్నట్లు తెలిపారు. దీంతో ఎటువంటి దుష్పలితాలు ఉండవని వివరించారు. ఈ వ్యాక్సిన్ పై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డెమో సంపత్, ఎస్ఓ స్వరూపరాణి, మానిటరింగ్ సూపర్వైజర్ సురేశ్ బాబు, వెంకట్రెడ్డి, ఫార్మసీ స్టోర్ ఇన్చార్జ్ వినోద్, డీఈఓ నిఖిల తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద ఏర్పాటుచేసిన చెక్పోస్టును జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్, ఐఏఎస్ ఫణింద్రరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఆయన ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనను శాలువాతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. అనంతరం గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద ఏర్పాటుచేసిన గణాంక పర్యవేక్షణ బృందం కేంద్రాన్ని సందర్శించారు. ఆ బృంద సభ్యులతో మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రతీ ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. వాహనాలలో ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు కలిగి ఉండి సరైన సాక్షాలు లేకుండా డబ్బులు ఉన్నట్లయితే ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు సీజ్ చేయాలని ఆదేశించారు. మెట్పల్లి గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన పోలింగ్కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న వసతులు, తాగునీరు, కరెంటు, మూత్రశాల వసతులు తప్పకుండా ఉండాలని పంచాయతీ కార్యదర్శి మంజూర్కు సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు ప్రతీ ఒక్కరు పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సిబ్బందికి పలు సూచనలు జారీచేశారు. ఆయన వెంట ఎంపీడీఓ రవీంద్రనాథ్, కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ ఉన్నారు. ఎలక్షన్ అబ్జర్వర్ ఫణింద్రరెడ్డి అంతర్రాష్ట్ర వంతెన చెక్పోస్టు పరిశీలన -
చెక్డ్యాం నిర్మాణం కలేనా?
మంగపేట: మండల పరిధిలోని వాగొడ్డుగూడెం పంచాయతీ పరిధి కొత్త చీపురుదుబ్బ గ్రామానికి సమీపంలో గల కప్పవాగుపై చెక్డ్యాం నిర్మాణం కలగానే మిగిలింది. గిరిజన, గిరిజనేతర రైతులకు చెందిన వందలాది ఎకరాలకు సాగునీరు అందించే చెక్డ్యాం కనీసం ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయి ఆరేళ్లు గడిచింది. పునఃనిర్మాణం కోసం అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా హామీలకే పరిమితమైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇంజనీరింగ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఆదివాసీ గిరిజన రైతులకు శాపంగా మారింది. నిత్యం పారే కప్పవాగు మండలంలోని దోమెడ అటవీ ప్రాంతం నుంచి ఊటతోగులు, వాగుల నుంచి నిత్యం జీవనదిలా పారే కప్పవాగు నీటిని ఆదివాసీ గిరిజనుల భూములకు సాగునీటికి మళ్లించేందుకు రూపకల్పన చేశారు. ఈ మేరకు 1986లో అప్పటి ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ సీవీఎస్కే శర్మ వీడీసీ కమిటీ పర్యవేక్షణలో లక్షల రూపాయలు వెచ్చించి కప్పవాగుపై చెక్డ్యాంను నిర్మింపజేశారు. చెక్డ్యాం నిర్మాణంతో పాతచీపురుదుబ్బ, కొత్తచీపురుదుబ్బ, సంఘంపల్లి (రామచంద్రునిపేట) గ్రామాల గిరిజన రైతులకు చెందిన సుమారు 600 ఎకరాల భూములతో పాటు చెక్డ్యాం కింది ప్రాంతమైన నడిమిగూడెం, రాజుపేట, పెరకలకుంట గ్రామాలకు చెందిన గిరిజన, గిరిజనేతర భూములకు సాగునీరు అందింది. 20 ఏళ్ల నుంచి చెక్డ్యాం పరిరక్షణపై ఐటీడీఏ అధికారులు, ఇంజనీరింగ్ శాఖ పట్టించుకోకపోవడంతో ప్రతిఏటా వాగు వరద ఉధృతికి కోతకు గురికావడం, లీకేజీలు ఏర్పడటంతో శిథిలావస్థకు చేరింది. చెక్డ్యాం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆయకట్టు పరిధిలోని గిరిజన రైతులు అధికారులకు లిఖిత పూర్వకంగా వినతులు సమర్పించినా పట్టించుకోక పోవడంతో 2019లో చెక్డ్యాం ఆనవాళ్లు లేకుండా కొట్టుకు పోయి ఆరేళ్లు అయ్యింది. అయినా దాని నిర్మాణం ఊసే లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. వందలాది ఎకరాల్లోని రెండు పంటలకు నిత్యం నీరందించే తోగుల వాగు నీరు వృథాగా వెళ్లి గోదావరిలో కలుస్తుంది. అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపం వృథాగా పోతున్న కప్పవాగునీరు సాగునీటి కోసం గిరిజన రైతులకు తప్పని తిప్పలు -
అవినీతి నిర్మూలనలో యువత పాత్ర కీలకం
భూపాలపల్లి: అనినీతి నిర్మూలనలో యువత పాత్ర కీలకమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. అవినీతి నిర్మూళన వారోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో పట్టణంలో నిర్వహించిన ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అవినీతిని ఎవరూ ప్రోత్సహించవద్దని, ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలన్నారు. పారదర్శక పరిపాలన, అవినీతి నిర్మూలన కోసం పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నారని ఎస్పీ పేర్కొన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి
● ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ వాజేడు: స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులను అధికారులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిసైడింగ్ అధికారులకు మంగళవారం మూడో విడత పోలింగ్పై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియలో పీవోలు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. నిబంధనలను పక్కాగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సజావుగా జరిపించాలన్నారు. నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలను అధికారులు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో విజయ, ఎంఈవో వెంకటేశ్వర్లు ఉన్నారు. -
విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి
చిట్యాల: పాఠశాలలో విద్యార్థులకు విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పింగిలి విజయపాల్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మండలంలోని జూకల్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థుల తరగతులను పరిశీలించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో అమలు అవుతున్న విద్యా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు ప్రణాళికతో చదువుకోవాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా పథకాలను తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి విద్యార్థుల నమోదును పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గిరగాని కృష్ణ, ఉపాధ్యాయులు ఉన్నారు. భూపాలపల్లి అర్బన్: విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం జిల్లా ఎన్నికలను జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. ఓటింగ్ పద్ధతి ద్వారా నిర్వహించిన ఎన్నికలలో జిల్లా అధ్యక్షుడిగా స్థానిక అయ్యప్ప టెంపుల్ ప్రధాన పూజా రి కుదురుపాక కృష్ణమాచార్యులు, ప్రధాన కార్యదర్శిగా బలబత్తుల రాజేశ్వరచార్యులు, కోశాధికారిగా తంగేళ్లపల్లి వెంకటాచార్యులు ఎన్నికయ్యారు. వారితో కమిటీ సభ్యులు, పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకున్నారు. ● ట్రాక్టర్కింద పడి బాలుడి మృతి.. తల్లిదండ్రులకు అప్పగించకుండా పూడ్చివేత గణపురం: ప్రమాదవశాత్తు ట్రాక్టర్కింద పడి ఓ బాలుడు చనిపోయాడు. ఆ ట్రాక్టర్ డ్రైవర్ గుట్టుచప్పుడు కాకుండా ఆ బాలుడి మృతదేహాన్ని ఓపెన్కాస్ట్ మట్టి డంపింగ్యార్డులో పూడ్చిపెట్టాడు. ఈ విషయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. గణపురం ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మరావుపేట గ్రామానికి చెందిన బందెల రాకేష్ (6) ఈ నెల8వ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన గంపల శంకర్ ట్రాక్టర్లో వడ్లు తీసుకొని ఐకేపీ సెంటర్కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆ బాలుడిపైనుంచి వెళ్లింది. దీంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. కాగా, తన కుమారుడు రాకేష్ కనిపించకపోవడంతో తండ్రి రాజు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు శంకర్ను అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతను బాలుడు రాకేష్ మృతదేహాన్ని గ్రామ శివారులో ఓసీ–3 డంపుయార్డుకి తీసుకువెళ్లి మట్టిలో పూడ్చివేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా, శంకర్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం మెట్పల్లి (కన్నెపల్లి) పంపుహౌస్ నుంచి గణపురం మండలం చెల్పూర్ కేటీపీపీ వరకు ఉన్న పైప్లైన్ కాళేశ్వరంలోని జాతీయ రహదారి 353(సీ)పక్కనే ఉన్నటువంటి గేట్వాల్వ్ వద్ద లీకేజీ ఏర్పడింది. లీకేజీ అయి నెలలు గడుస్తున్నా సంబంధిత కేటీపీపీ ఇంజనీర్లు మొద్దునిద్ర వీడడం లేదు. దీంతో గోదావరి నీరు వృథాగా పోతోంది. దీంతో రోడ్డు పక్కనే పెద్ద నీటిగుంటగా ఏర్పడి నీరు నిల్వగా మారింది. దీంతో చెత్తాచెదారం చేరి దోమలు వృద్ధి చెంది స్వైరవిహారం చేస్తున్నాయి. పందులు మురికి నీటిలో సేదదీరుతున్నాయి. చుట్టుపక్కల ఇళ్లకు దుర్వాసన వెలజల్లుతోంది. రోగాలు ప్రబలుతున్నాయి. సంబంధిత ఇంజనీర్లు, ఉద్యోగులు అటువైపు చూడడం లేదని ప్రజలు వాపోతున్నారు. -
చెక్డ్యాం నిర్మాణం చేపట్టాలి..
కూలిపోయిన చెక్డ్యాం స్థానంలో నూతన చెక్డ్యాం నిర్మించి వందలాది ఎకరాలకు నీరందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. చెక్డ్యాం పూర్తిగా కొట్టుకు పోవడంతో పంటలు పండించేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. సకాలంలో నీరందక పంటలు ఎండి పోతుండటంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. కలెక్టర్ స్పందించి ప్రభుత్వం ద్వారా చెక్డ్యాం నిర్మాణానికి నిధులు మంజూరు చేసి గిరిజన రైతులకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. బాడిశ నాగరమేశ్, బీఆర్ఎస్ యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాజుపేట -
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీపై 24 గంటల పాటు పోలీసుల నిఘా ఉంటుంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం నేరం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలను, ఓటర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా, సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్లు పెట్టి ఇతరులను ఇబ్బందులకు గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో ప్రతిరోజూ గస్తీ నిర్వహిస్తూ ఎన్నికల తీరును పరిశీలిస్తున్నాం. ప్రజలు తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి. ఎన్నికలు జరిగే రోజున పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోపు ఎవరూ సంచరించవద్దు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు గొడవలు పెట్టుకొని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేస్తాం. ప్రజల సహకారంతో ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేస్తాం.జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక నిఘా పెడుతున్నాం. పోలింగ్ రూట్లకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. పోలింగ్ సామగ్రి పంపిణీ నుంచి బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూములకు చేరే వరకు పటిష్ట బందోబస్తు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించాం. జిల్లాలో సుమారు 1300 పోలింగ్ కేంద్రాల పరిధిలో 200 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి చర్యలు చేపడుతున్నాం. ప్రతీ పోలింగ్ కేంద్రంపై ప్రత్యేక నజర్ ఉంటుంది. -
ప్రతీ రూపాయి లెక్క చెప్పాల్సిందే
భూపాలపల్లి అర్బన్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓడినా, గెలిచినా ప్రచారం కోసం పెట్టిన ప్రతీ రూపాయి ఖర్చు లెక్క ఎన్నికల కమిషన్కు చెప్పాలి. ఏ విడత జరిగే ఎన్నిక అయినా నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ ముగిసే రోజు వరకు (15 రోజులు) సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన ప్రతీ అభ్యర్థి ఎన్నికల కోసం నిర్వహించిన లావాదేవీలు నమోదు చేయాల్సిందే. అందుకు ప్రతీ అభ్యర్థి బ్యాంకులో కొత్తగా ఖాతా తెరిచి, ఆ ఖాతా ద్వారానే ఎన్నికలకు ఖర్చు చేయాలి. పాత ఖాతాను వినియోగించినట్టయితే అందులో నిర్వహించే ఇతర లావాదేవీలకు సైతం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థులకు తల నొప్పిగా మారుతోంది. అందుకే కొత్త ఖాతాలు తెరవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. నామినేషన్ పత్రంతో పాటు బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతిని కూడా జతపరచడం తప్పనిసరి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 5వేల జనాభాకు మించిన గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50లక్షలు, వార్డు సభ్యుడు రూ.50వేలు మాత్రమే ఎన్నికల వ్యయం చేయాలి. 5 వేల జనాభాలోపు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50లక్షలు, వార్డు సభ్యుడు రూ.30వేల వరకు ఖర్చు చేయవచ్చు. ఖర్చు పరిమితి మించితే వేటు పడుతుంది. వ్యయ పరిశీలకుల నియామకం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు చేసే ఖర్చులను పరిశీలించడానికి జిల్లాలోని మండలానికి ఒక వ్యయ పరిశీలకుడిని అధికారులు నియమించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వినియోగించే పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, ప్రింట్, డిజిటల్ మీడియా ప్రకటనలు, వాహనం అద్దె, డ్రైవర్ వేతనం, ఇంధనం, మైకులు, సౌండ్ సిస్టమ్, టెంట్లు, కుర్చీలు, భోజనం, లాడ్జింగ్, బోర్డింగ్, కార్యకర్తలకు ఇచ్చే ఖర్చులు, జెండాలు, టీ, టిఫిన్, కాఫీలు, క్యాప్లు, టీ–షర్టులు, బ్యాడ్జీలు, ప్రచార వాహనాల అలంకరణ ఖర్చుల లెక్కలు చూపాలి. వాటి ధరలు ఎన్నికల అధికారులు నిర్ణయించిన మేరకే ఉండాలి. 45రోజుల్లో లెక్కలు ఇవ్వాలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు మూడు విడతలుగా ఖర్చుల వివరాలను అధికారులకు సమర్పించాలి. ప్రచార ప్రారంభంలో మొదటిసారి, ప్రచారం మధ్య దశలో రెండోసారి, పో లింగ్కు ముందు రోజు మూడోసారి లెక్కలు ఇవ్వాలి. ఎన్నికల ఫలితాలు వెలువడిన 45 రోజుల్లో అభ్యర్థులు వారి ఖర్చు లెక్కలు ఎన్నికల అధికారులకు తగిన బిల్లులతో సమర్పించాలి. ఎన్నికల ఖర్చులు నామి నేషన్ పత్రంలో సూచించిన బ్యాంకు ఖాతా ద్వా రానే నిర్వహించాలి. ఓడినా, గెలిచినా ఖర్చు లెక్కలు ఇవ్వాల్సిందే. గెలిచిన అభ్యర్థులు ఖర్చు లెక్కలు ఇవ్వకుంటే పదవి పోతుంది. ఓడిన అభ్యర్థులు ఇవ్వకుంటే మూడేళ్ల వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుంది. నూతన బ్యాంకు ఖాతా ద్వారానే చెల్లింపులు 45 రోజుల్లో లెక్క చూపకుంటే పదవి గోవిందా మూడేళ్లు అనర్హత వేటు -
చేప పిల్లల పంపిణీ
వాజేడు : మండలంలోని మత్స్యకార సొసైటీలకు సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చేప పిల్లలు పంపిణీ చేశారు. జిల్లా మత్స్యకార సంస్థ ఎఫ్ఓ రమేశ్, పెసా జిల్లా నాయకుడు కొమరం ప్రభాకర్ చేతుల మీదుగా 2.10 లక్షల చేప పిల్లలను అందజేశారు.15 గ్రామాలకు చేప పిల్లలను పంపిణీ చేసి చెరువుల్లో జాగ్రత్తగా వదిలారని వారు తెలిపారు. ములుగు : బీసీలకు 42శాతం రిజర్వేషన్ దక్కడం లేదనే మనస్తాపంతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరాచారికి విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై సోమవారం శాంతిర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ ఉద్యమానికి విశ్వబ్రాహ్మణ బిడ్డ అమరుడయ్యాడని సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్కతుర్తి రాజన్న తెలిపారు. నాడు తెలంగాణ కోసం, నేడు బీసీల రిజర్వేషన్ల సాధనకు విశ్వకర్మలే అమరులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శాంతి ర్యాలీలో సంఘం నాయకులు కడివెండి వీరాచారి, కాగితపు శ్రీనివాస్, శ్రీలమంతుల నరసింహచారి, నారాయణ, మహేశ్, బస్వోజు రమేశ్, శంకరాచారి, రవీంద్ర చారి, నాగరాజు, గుంటోజు పావని తదితరులు పాల్గొన్నారు. వాజేడు: ఓ వ్యాన్, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన పెద్ద గొళ్లగూడెం గ్రామంలో జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై జక్కుల సతీశ్ ప్రకారం.. గ్రామానికి చెందిన గొంది సాంబశివరావు(40) అదే గ్రామానికి చెందిన సమ్మయ్య అనారోగ్యంతో మృత్యువాత పడిపోవడంతో అంత్యక్రియల్లో పాల్గొని హైవే పైనుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటి సమీపంలోకి రాగానే వ్యాన్ వచ్చి ఢీ కొట్టింది. దీంతో సాంబశివరావు ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకుని తల్లిదండ్రులు గౌరమ్మ, జగన్నాథరావుతో పాటు బంధువులు అక్కడికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఘటనా స్థలంలోని వివరాలను సేకరించారు. పోస్టు మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఏటూరునాగారం సివిల్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు. మృతుడికి భార్య, ఒక కొడుకు ఉన్నారు. కాటారం(మహాముత్తారం): ప్రభుత్వ వైద్యశాలలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో నిరంతరం వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి మందుల నిల్వ, రోగులకు అందుతున్న వైద్యసేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పెగడపల్లి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను సందర్శించి సౌకర్యాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. డీహెంఎచ్ఓ వెంట జిల్లా ప్రోగ్రామింగ్ అధికారి డాక్టర్ సందీప్, డాక్టర్ దీప్తి, డీడీఎం మధుబాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
బ్యాలెట్ బాక్సులు సిద్ధం
ఏటూరునాగారం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలివిడత పోలింగ్ ఈ నెల 11న ఏటూరునాగారం, ఎస్ఎస్తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో జరగనుండగా ఈ మేరకు అధికారులు సోమవారం బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఏటూరునాగారం మండలంలోని 12 జీపీలకు గాను 24,636 ఓట్లు ఉన్నట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో బ్యాలెట్ బాక్సులను శుభ్రం చేయించి సిద్ధం చేయించినట్లు తెలిపారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను సైతం అధికారులు నిర్వహించారు. 10వ తేదీన పోలింగ్ బూత్, రూట్ ఆఫీసర్లతో కలిసి ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ బూత్లకు బ్యాలెట్ బాక్సులను తరలిస్తామని వెల్లడించారు. అలాగే ఎస్ఎస్తాడ్వాయి మండలంలో 16,680 మంది ఓటర్లు ఉండగా 130 పోలింగ్ కేంద్రాలకు 136 పోలింగ్ బాక్సులను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. 18 గ్రామ పంచాయతీలకు గాను 3 ఏకగ్రీవం కాగా మిగితా 15 గ్రామ పంచాయతీలకు 52 మంది సర్పంచులు, 239 మంది వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. గోవిందరావుపేట మండలంలో 18 గ్రామ పంచాయతీల్లో 5 ఏకగ్రీవం కాగా 15 జీపీలకు 52 మంది బరిలో నిల్వగా 283 మంది వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. -
జిల్లాస్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ
ములుగు రూరల్ : జిల్లా స్థాయిలో నిర్వహించిన క్రీడాపోటీల్లో జాకారంలోని పీఎంశ్రీ తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన క్రీడాకారులను అభినందించి మాట్లాడారు. జిల్లా స్థాయి పోటీల్లో అండర్–17 కబడ్డీ, వాలీబాల్, ఖో–ఖో, ఫుట్బాల్ క్రీడల్లో ప్రథమ స్థానం సాఽధించడం ఆనందంగా ఉందన్నారు. డీఈఓ సిద్ధార్థ్రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారని పేర్కొన్నారు. అథ్లెటిక్స్లో లాంగ్జంప్లో రాంచరణ్ గోల్డ్ మెడల్, షాట్ఫుట్లో క్యాంస పథకం సాధించారని తెలిపారు. 100 మీటర్ల పరుగులో చరణ్ కాంస్య పథకం సాధించి ఓవరల్ జిల్లా చాంపియన్గా నిలిచారని వెల్లడించారు. -
మహాజాతరకు అడవిమార్గంలో రోడ్డు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతర సందర్భంగా అటవీ మార్గంలోని రోడ్డును అధికారులు చదును చేయించి అందుబాటులోకి తీసుకొచ్చారు. మండల పరిధిలోని వెంగ్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోనెపల్లి నుంచి అటవీ మార్గం గుండా మేడారం వీఐపీ పార్కింగ్ వరకు 8 కిలోమీటర్ల మేర రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ దారి గుండా ద్విచక్ర, ఫోర్వీల్ వాహనాలు వెళ్లే విధంగా ప్రస్తుతం రోడ్డును ఏర్పాటు చేశారు. మేడారం జాతరకు వచ్చే వీఐపీల వాహనాలను సైతం ఈ రోడ్డు మార్గం గుండానే మళ్లించేందుకు పోలీసుశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అటవీ మార్గన రోడ్డు అందుబాటులోకి రావడంతో ఈ సారి ట్రాఫిక్ సమస్య తీరనుంది. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
ములుగు రూరల్: ఎన్నికల సంఘం నియమ నిబంధనలు, మార్గదర్శకాలను అధికారులు తప్పకుండా పాటించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం రెండో విడతలో మల్లంపల్లి, ములుగు, వెంకటాపురం(ఎం) మండలాల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు శిక్షణ తరగతులను వేర్వేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మల్లంపల్లి, ములుగు, వెంకటాపురం(ఎం) మండలాల్లో ఈ నెల 14వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నికల విధుల్లో పాల్గొనాలని సూచించారు. రెండో విడత పోలింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు అధికారులు సకాలంలో చేరుకోవాలని, సదుపాయాలను పరిశీలించుకోవాలన్నారు. ఓటింగ్ కంపార్ట్మెంట్, సిట్టింగ్ ఏర్పాట్లను నిబంధనలకు అనుగుణంగా చూసుకోవాలన్నారు. బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులతో పాటు నోటా సింబల్ తప్పనిసరిగా సరిచూసుకోవాలన్నారు. ఎన్నికల విధులను సజావుగా నిర్వహించాలని సూచించారు. అనంతరం వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బ్యాలెట్ పేపర్లను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఆర్వోలు, ఏఆర్వోలు, ఏపీఓలు పాల్గొన్నారు.ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్కుమార్ -
భద్రత కార్మికుడి బాధ్యత
భూపాలపల్లి అర్బన్: భద్రత అనేది సంస్థ అమలు చేసే నియమం మాత్రమే కాదని ప్రతీ కార్మికుడి వ్యక్తిగత బాధ్యత అని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి, భద్రత కమిటీ కన్వీనర్ శ్రీనాద్ తెలిపారు. 56వ వార్షిక భద్రత పక్షోత్సవాలను సోమవారం ఏరియాలోని కేటీకే 1వ గనిలో ప్రారంభించారు. ఈ పక్షోత్సవాల ప్రారంభోత్సవానికి జీఎం, భద్రత కమిటీ కన్వీనర్ హాజరై జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ వ్యక్తికి భద్రత అనేది ఇంటి నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. సింగరేణి సంస్థలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రతీ ఉద్యోగి విధులు ముగించుకొని ఇంటికి సురక్షితంగా చేరడమే సంస్థ లక్ష్యమన్నారు. ఉద్యోగుల నిర్లక్ష్యం, చిన్న తప్పిదం వల్ల పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతీ ఒక్కరు భద్రత పరికరాలను వినియోగించుకోవాలని సూచించారు. భద్రత పక్షోత్సవాలు ఉద్యోగుల్లో అవగాహన పెంపుతో పాటు, సమగ్ర భద్రతా సంస్కృతిని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయని సూచించారు. అనంతరం ఉద్యోగులతో కలిసి రక్షణ ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు లక్ష్మణ్, రాధాకృష్ణ, తిరుపతి, అఫ్సర్పాషా, కిరణ్కుమార్, అమరనాథ్, శ్రీనివాసరావు, డాక్టర్ రాహుల్, రాజు, కిరణ్కుమార్, కార్మిక సంఘాల నాయకులు రమేష్, హుస్సేన్, కృష్ణప్రసాద్, రవీందర్, తిరుపతి, సదయ్య పాల్గొన్నారు. గైర్హాజరు ఉద్యోగులకు కౌన్సిలింగ్ ఏరియాలోని కేటీకే ఓపెన్కాస్ట్–2ప్రాజెక్ట్లో గైర్హాజరు ఉద్యోగులకు సోమవారం అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. గని మేనేజర్ రమాకాంత్ కౌన్సిలింగ్ నిర్వహించి సూచనలు చేశారు.ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి -
చిన్నారులకు మిల్క్
జిల్లాలోని అంగన్వాడీ సెంటర్లు, చిన్నారుల వివరాలుప్రాజెక్టులు సెంటర్లు చిన్నారులుములుగు 142 2,536 ఎస్ఎస్ తాడ్వాయి 124 1,430 వెంకటాపురం(కె) 168 1,624 ఏటూరునాగారం 206 2,683అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు పంపిణీఏటూరునాగారం: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు చిక్కటి పాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఈ మేరకు గత నెల 17వ తేదీన పంచాయతీరాజ్, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు రోజుకూ 100 ఎంఎల్ చిక్కటి పాలను అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 549 ప్రధాన అంగన్వాడీ సెంటర్లు ఉండగా 91 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల పిల్లలు 8,273 మంది ఉండగా ఈ పథకం ద్వారా పాలను అందిస్తున్నారు. దీంతో పేద కుటుంబాలకు చెందిన పిల్లల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా సెంటర్ల నిర్వహకులు చూస్తున్నారు. ఈ పాల పథకం అమలుపై చిన్నారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాలు అందుతున్నాయి..ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రంలో 100 ఎంఎల్ పాలు ఇస్తున్నారు. రోజు అంగన్వాడీ కేంద్రానికి తీసుకొచ్చి వదిలిపెడితే పిల్ల లకు టీచర్లు పాలు ఇవ్వడంతో పాటు ఆటపాటలతో విద్యాబోధన చేస్తున్నారు. దీనివల్ల ఏజెన్సీ గ్రామాల్లోని పిల్లలకు మరింత మేలు జరుగుతుంది. పిల్లలు కూడా అంగన్వాడీ బడికి రావడానికి ఇష్టపడుతున్నారు. – ఎట్టి మానస, చిన్నబోయినపల్లి, తల్లి పైలట్ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక గత నెల 17న లాంఛనంగా పథకాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క జిల్లాలో 8,273 మంది చిన్నారులు -
భక్తిశ్రద్ధలతో హేమాచలుడికి పూజలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచలక్షేత్రానికి భక్తులు ఆదివారం భారీగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాది మంది తరలివచ్చి ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి నువ్వుల నూనెతో తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. స్వామివారిని పట్టు వస్త్రాలు, పూలతో అలంకరించగా దర్శించుకున్న భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి చరిత్ర, ఆలయ పురాణాన్ని వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
కాళేశ్వరంలో భక్తుల పూజలు
కాళేశ్వరం: ఆదివారం సెలవురోజు కావడంతో మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో స్నానాలు చేశారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఆల య పరిసరాలు, గోదావరి తీరం వద్ద భక్తుల సందడితో కోలాహలంగా కనిపించింది. ఆర్టీఐ రక్షక్ జిల్లా అధ్యక్షుడిగా కమల్మిత్ర భూపాలపల్లి అర్బన్: ఆర్టీఐ రక్షక్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా లూయిస్ కమల్ మిత్రను నియమించినట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు సతీష్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కట్ట సురేష్బాబును నియమించారు. జిల్లాలో సమాచార హక్కు చట్టంపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించడానికి బాధ్యతలు స్వీకరించినట్లు కమల్మిత్ర తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులకు సంబంధించిన వివరాలను పరిశీలించేందుకు ప్రతీ పౌరుడికి సమాచారం సేకరించే హక్కు ఉందని తెలిపారు. ఈ బాధ్యత అప్పగించినందుకు వ్యవస్థాపక అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రస్థాయిలో విద్యార్థుల ప్రతిభ టేకుమట్ల: మండలకేంద్రంలోని శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు కుంగ్ఫూ–కరాటేలో రాష్ట్ర స్థాయిలో చాంపియన్షిప్ ట్రోఫీ సాధించినట్లు కరస్పాండెంట్ హరీశ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతినికేతన్ విద్యార్థులు వేములవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కుంగ్ఫూ– కరాటే చాంపియన్షిప్ 2025లో పాల్గొని విజయం సాధించినట్లు చెప్పారు. పిల్లలు చూపిన క్రమశిక్షణ, ధైర్యం, నైపుణ్యం అందరినీ ఆకట్టుకుందని చెప్పారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. వేయిస్తంభాల ఆలయంలో పల్లకీసేవ హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో ఆదివారం మార్గశిర బహుళ తదియ ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీరుద్రేశ్వరీరుద్రేశ్వస్వామి వార్లకు ఆదివారం పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్, శ్రవణ్ ఉదయం ప్రభాతసేవ, గణపతి పూజ, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 121 మంది దంపతులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. అనంతరం శ్రీరుద్రేశ్వరీశ్రీరుద్రేశ్వస్వామి వార్లను పల్లకీసేవలో ప్రతిష్టించి మంగళవాయిద్యాలతో, హారతులతో ఆలయ పరిక్రమచుట్టూ పల్లకిసేవ నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. ‘శాంతితోనే అభివృద్ధి’హన్మకొండ: శాంతితోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని పూర్వ వరంగల్ జిల్లా కలెక్టర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో ‘ఎగిరే శాంతి కపోతం’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్ రెడ్డి జ్యోతి ప్రజ్వళన చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శాంతి దిశగా ఆలోచించాలన్నారు. కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ మహమ్మద్ ఇక్భాల్ అలీ తదితరులు మాట్లాడారు. మహమ్మద్ సిరాజుద్దీన్ పుట్టిన రోజును పురస్కరించుకుని విశ్రాంత ఆచార్యులు గూడ నరసింహమూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు విజయ్బాబు, విప్పనపల్లి రవికుమార్, డాక్టర్ విష్ణువర్దన్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతరలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు ఎస్పీ ఆదివారం అధికారులతో కలిసి వెంగ్లాపూర్ నుంచి బయ్యక్కపేట వరకు ట్రాఫిక్ నియంత్రణకు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. జాతర బందోబస్తుకు వచ్చే పోలీస్ అధికారులకు, సిబ్బందికి మేడారంలో వసతుల కోసం నిర్దేశించిన ప్రదేశాలను చూసి ఆయా ప్రదేశాల్లో చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాతర బందోబస్తుకు వచ్చే అధికారులకు, సిబ్బందికి లోటుపాట్లు లేకుండా వసతి ఏర్పాట్లు చేయాలన్నారు. జాతర ప్రారంభానికి ముందుగానే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. మేడారంలో సాగుతున్న రోడ్ల విస్తరణ, గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంలో చేపట్టిన రాతి పిల్లర్ల ఏర్పాట్ల పనులను ఎస్పీ పరిశీలించారు. జాతరలో భక్తుల వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించి నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్, ఆర్ఐలు స్వామి, వెంకటనారాయణ, తిరుపతి ఉన్నారు. -
మేడారంలో భక్తుల కోలాహలం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలిచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. కోళ్లు, యాటలను అమ్మవార్లకు జడతపట్టి మొక్కుగా సమర్పించారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం, చిలకలగుట్ట, శివరాంసాగర్ పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. దీంతో మేడారం పరిసరాల్లో ఎటు చూసినా భక్తజనమే కనిపించారు. రోడ్ల పనులతో తప్పని తిప్పలు మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. మేడారంలో రోడ్ల నిర్మాణం పనులు జోరుగా సాగుతుండడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. అమ్మవార్ల గద్దెల వద్దకు వెళ్లే పలు దారుల రోడ్ల నిర్మాణం పనులు చేస్తుండగా అక్కడికి ఎలా చేరుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. మేడారం మహాజాతర సమయం దగ్గర పడుతుండడంతో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మేడారంలో జంపన్నవాగు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ, జంపన్నవాగు నుంచి గద్దెలకు వచ్చే దారిలో నీడ చెట్ల నుంచి హరితహోటల్ దారిలో, ఆర్టీసీ బస్డాండ్ భక్తుల క్యూలైన్ దారిలో రోడ్ల విస్తర్ణం పనులు సాగుతున్నాయి. పస్రా నుంచి నార్లాపూర్ మీదుగా జంపన్నవాగు నుంచి గద్దెల వద్దకు వెళ్లే దారిలో రోడ్డు విస్తరణ పనులు సాగుతుండగా మేడారం ఐలాండ్ వద్దకు భక్తుల వాహనాలు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. అంతేకాకుండా తాడ్వాయి మీదుగా మేడారానికి వచ్చిన భక్తులకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి మేడారం ఐలాండ్ వరకు రోడ్డు నిర్మాణం పనులు నడుస్తుండడంతో వాహనాలు వెళ్లలేని పరిస్దితి ఏర్పడింది. హరితహోటల్ దారిలో కూడా రోడ్డు విస్తరణ పనులు సాగుతుండగా భక్తుల వాహనాలు వెళ్లేందుకు దారి లేకుండా పోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. జంపన్నవాగు స్నానఘట్టాల రోడ్డుపై నుంచి రెడ్డిగూడెం ఊళ్లో నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్డాండ్ ప్రదేశాలకు వెళ్లారు. ఈ దారులు తెలియని భక్తులు జంపన్న వాగు వద్ద వాహనాలను పార్కింగ్ చేసి కాలినడకన అమ్మవార్ల దర్శనానికి గద్దెల వద్దకు తరలివెళ్లారు. నడవలేని స్థితిలో ఉన్న కొంతమంది భక్తులు ఇబ్బందులు పడ్డారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రులు పొంగులెటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్కలు మేడారం పర్యటనకు వచ్చిన సందర్భాల్లో పదేపదే అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించినా వారి తీరు మారడం లేదు. భారీగా తరలివచ్చిన భక్తజనం వనదేవతలకు మొక్కుల చెల్లింపు రోడ్ల నిర్మాణ పనులతో భక్తుల ఇక్కట్లు -
సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పాలతో ప్రొటీన్స్ ప్రతిరోజూ 100 ఎంఎల్ చిక్కటి పాలను చిన్నారులు తాగడం వల్ల ఎముకలు, దంతాలు ధృడంగా ఉంటాయి. పాలలో ఉండే కాల్షియం, భాస్వరం, విటమిన్ డీతో పాటు ఏ విటమిన్ వంటి పోషకాలు చిన్నారులకు అంది చక్కటి ఫలితాన్ని ఇస్తాయి. అంతే కాకుండా ప్రొటీన్స్, విటమిన్లతో పాటు పొటాషియం వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను కూడా అందిస్తాయి. అలాగే అధిక బరువు పెరగకుండా చూస్తాయి. చిన్నారులకు పాలతో పాటు మహాలక్ష్మీ పథకం కింద కోడిగుడ్డు, అన్నం, కురుకురేలు, బాలామృతం, బాలామృతం ఫ్లస్ వంటివి కూడా అంగన్వాడీ టీచర్లు అందజేస్తున్నారు. -
మహాజాతర పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతర అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మండల పరిధిలోని మేడారంలోని అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల రాతి నిర్మాణం పనులు, సీసీ ప్లోరింగ్ పనులను, ప్రధాన ద్వారం ఆర్చీ స్తంభాలను ఆయన శనివారం పరిశీలించారు. సమ్మక్క– సారలమ్మ గద్దెల విస్తరణ పనులను పరిశీలించి అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని, యంత్రాలను ఉపయోగించాలని సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. జాతర సమయంలో కోట్లాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకోవడానికి వస్తుంటారని తెలిపారు. ఈ క్రమంలో భక్తులను దర్శనానికి పంపించే క్యూ లైన్లు అతి ముఖ్యమని వెల్లడించారు. క్యూ లైన్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పనులను పూర్తిచేయాలన్నారు. రోడ్ల విస్తరణ నిర్మాణం పనుల్లో వేగం పెంచాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశించిన గడువులోపు పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గద్దెల ప్రాంగణం పనుల పరిశీలన మేడారంలోని గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శనివారం పర్యవేక్షించారు. జాతరలో పనుల పురోగతి పరిశీలించారు. గద్దెల ప్రాంగణం సాలహారం నిర్మాణం చుట్టూ ఏర్పాటు చేస్తున్న రాతి పిల్లర్లను పరిశీలించారు. జాతర సమయంలో పోలీస్ అత్యవసర సేవలకు అనుగుణంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఎస్పీ సూచనలు చేశారు. జాతర సమయంలో భారీగా మేడారానికి తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టలో ఉంచుకుని గద్దెల ప్రాంగణంలో భక్తుల భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను, అత్యవసర సేవలపై అధికారులతో ఎస్పీ చర్చించారు. తొలుత అమ్మవార్లను ఎస్పీ దర్శించుకున్నారు. -
జోరుగా ప్రచారం..
● జిల్లాలో ముగిసిన నామినేషన్ల పర్వం ● రెండు విడతల్లో 24 పంచాయతీలు ఏకగ్రీవం ● పట్టణాల్లో ఉన్న వారికి అభ్యర్థుల ఆఫర్లు ● ఓటర్లను ఆకట్టుకునేలా నాయకుల ప్రయత్నాలుములుగు: జిల్లాలోని 9 మండలాల పరిధిలో మూడు విడతల్లో జీపీ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల పర్వం ముగియడంతో పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార జోరును అభ్యర్థులు పెంచారు. ఎన్నికల్లో విజయభేరి మోగించేందుకు ప్రణాళికలతో ముందుకుసాగుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు ప్రధానంగా పోటీపడుతున్నారు. మొదటి, రెండో విడతలో జరగనున్న మండలాల్లో ఇప్పటికే పరిశీలన, ఉపసంహరణ ఘట్టం పూర్తవగా బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు ఆయా పార్టీలు గ్రామాభివృద్ధికి అంటూ పలు ఆఫర్లు ప్రకటించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య కొన్నిచోట్ల సఖ్యత కుదిరి ఏకగ్రీవం అయ్యాయి. అధికార పక్షానికి సర్పంచ్, ప్రతిపక్ష పార్టీకి ఉప సర్పంచ్, వార్డులు కేటాయించి పరస్పరం సహకరించుకున్నారు. మిగిలిన చోట్ల పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరెవరనేది తేటతెల్లమైంది. మూడో విడతకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ, పరిశీలన పూర్తయింది. జిల్లాలో 25 పంచాయతీలు ఏకగ్రీవం జిల్లాలో 146 గ్రామపంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా 25 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మొదటి విడతలో 9 జీపీలు, రెండో విడతలో 15 పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు, మూడో విడతలో కన్నాయిగూడెం మండల పరిధిలోని ముప్పనపల్లి పంచాయతీకి సింగిల్ నామినేషన్ దాఖలైంది. మొదటి విడతలో గోవిందరావుపేట మండల పరిధిలోని చల్వాయి, కోటగడ్డ, ముత్తాపూర్, రాఘవపట్నం, కర్లపల్లి, ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో అంకంపల్లి, పంబాపూర్, నర్సాపూర్, ఏటూరునాగారం మండలంలో శంకరాజుపల్లి పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. రెండో విడతలో ములుగు మండల పరిదిలోని అంకన్నగూడెం, రాయినిగూడెం, కొత్తూరు, జగ్గన్నపేట, పెగడపల్లి, బంజారుపల్లి, మల్లంపల్లి మండల పరిధిలోని గుర్తూరుతండా, ముద్దునూరుతండా, కొడిశలకుంట, దేవనగర్, వెంకటాపురం(ఎం) మండలంలో అడవిరంగాపూర్, నర్సింగాపూర్, తిమ్మాపూర్, పాపయ్యపల్లి, కేశవాపురం గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మూడో విడతలో పోటీలో ఉన్న అభ్యర్థులు తమ నామినేషన్లను ఉప సంహరించుకుంటే మరిన్ని గ్రామాలు కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి.. పల్లెల నుంచి పట్టణాలకు వలసవెళ్లిన వారు, ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి సర్పంచ్ అభ్యర్థులు ఫోన్లు చేసి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఓటు వేసేందుకు వస్తే ఓటుకు రూ.500 నుంచి రూ.1000 ఇవ్వడమే కాకుండా బస్ఛార్జీలు సైతం చెల్లిస్తామని చెబుతున్నారు. జిల్లా నుంచి సుమారుగా 3 వేలకు పైగా ఓటర్లు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు సమాచారం. 10 మంది ఓటర్లు ఒకే ప్రాంతంలో ఉంటే ప్రత్యేకంగా వాహనాన్ని మాట్లాడుకుని రావాలని కిరాయి డబ్బులను ఓటర్లకు అభ్యర్థులు పంపుతున్నట్లు తెలిసింది. మండలం పంచాయతీలు ఏకగ్రీవం బరిలో ఉన్నవారు ఎస్ఎస్ తాడ్వాయి 18 3 52 గోవిందరావుపేట 18 5 52 ఏటూరునాగారం 12 1 41 వెంకటాపురం(ఎం) 23 5 43 మల్లంపల్లి 10 4 58 ములుగు 19 6 81 వాజేడు 17 0 65 వెంకటాపురం(కె) 18 0 87 కన్నాయిగూడెం 11 1 52గ్రామాల్లో సందడి వాతావరణం మొదటి, రెండో విడత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరెవరనేది స్పష్టత రావడంతో అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులతో గ్రామాల్లో ప్రచార చేపట్టగా సందడి వాతావరణం నెలకొంది. ఓటర్లను ఆకట్టుకునేలా మాట్లాడుతున్నారు. దీంతో ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థుల విజయానికి నాయకులు రంగంలోకి దిగారు. జిల్లాకు చెందిన నేతలతో పాటు, మండలాలకు చెందిన నేతలు తమ అభ్యర్థి గెలుపు కోసం ప్రణాళికలు రూపొందించి ముందుకు కదులుతున్నారు. మొదటి విడత పోలింగ్ 11వ తేదీ కాగా రెండో విడతకు 14న, మూడో విడతకు 17న పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్లను లెక్కించి సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలను అధికారులు ప్రకటించనున్నారు. అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. మెజార్టీ వార్డు సభ్యులు ఉప సర్పంచ్ను ఎన్నుకుంటారు. -
అంతులేని అవినీతి..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : హనుమకొండ కలెక్టరేట్లో రూ.60వేల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ ఎ.వెంకట్రెడ్డిపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఓ వైపు భూ నిర్వాసితులు, మరోవైపు కొందరు రైస్మిల్లర్లు తమగోడును వెళ్లబోసుకుంటున్నారు. దామెర, ఊరుగొండ గ్రామాలకు చెందిన గ్రీన్ఫీల్డ్ హైవే బాధిత రైతులు ఏకంగా హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ‘మా ఉసురు తాకింది’అంటూ టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. సీఎంఆర్ వేధింపులకు గురైన రైస్మిల్లర్లు కొందరు సీఎస్ కార్యాలయంలో వెంకట్రెడ్డిపై ఫిర్యాదులు చేయడం కలకలం రేపుతోంది. ఆదినుంచి వివాదాస్పదుడే... రెవెన్యూశాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన ఎ.వెంకట్రెడ్డి ఆదినుంచి వివాదాస్పదుడే. ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే.. ఆ ప్రభుత్వంలోని తన సామాజిక నేపథ్యం ఉన్న నేతల పేర్లు చెబుతూ ఉన్నతాధికారులను మెప్పించే ప్రయత్నం చేసేవారన్న ఆరోపణలున్నాయి. జనగామ ఆర్డీఓగా, సూర్యాపేట అడిషనల్ కలెక్టర్గా పనిచేసిన సమయంలోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. భువనగిరి – వరంగల్ 563 జాతీయ రహదారి భూసేకరణలో ఈయన చేయని అక్రమాలు లేవన్న ఫిర్యాదులు ఉన్నతాధికారులకు చేరాయి. జనగామ ఆర్డీఓగా పని చేసిన సమయంలో అప్పుడున్న నియోజకవర్గ కీలక నేత, ఆయన బావమరుదులు, బంధువుల ఒత్తిళ్లకు తలొగ్గి అసైన్డ్, ప్రభుత్వ భూములను పట్టాభూములుగా చిత్రీకరించి రూ.లక్షల్లో పరిహారం చెల్లించారన్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. సూర్యాపేటలో డిఫాల్టర్లయిన రైసుమిల్లర్ల నుంచి భారీగా వసూళ్లు చేసి సీఎంఆర్ కింద వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కట్టబెట్టినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో అక్కడా విచారణ ఎదుర్కొన్నారు. అక్రమార్కులకు సీఎంఆర్.. ఉదంతాలు అనేకం.. ● హనుమకొండ అడిషనల్ కలెక్టర్గా వెంకట్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో సీఎంఆర్ కేటాయింపులకు తీసుకునే నజరానాలు రెండింతలు పెరిగాయని కొందరు రైస్మిల్లర్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కార్యాలయంలో చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ● ఒక్కో సీజన్కు ఒక్కో రైసుమిల్లు నుంచి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపించారు. ● ఇన్టైంలో సీఎంఆర్ ఇచ్చిన రైసుమిల్లర్లను పక్కన పెట్టి.. డిఫాల్టర్లయిన వారు ముడుపులివ్వగానే వారికి పెద్ద మొత్తంలో ధాన్యం కేటాయించారు. ● కమలాపూర్లో రెండు రైస్మిల్లులున్న ఓ వ్యాపారి సుమారు రూ.16 కోట్ల వరకు బకాయి ఉన్నా తిరిగి ఈ సీజన్లో భారీగా ధాన్యం కేటాయింపులకు ఆదేశాలిచ్చిన వెంకట్రెడ్డి.. ‘కన్నయ్య’కు అన్నయ్యలా మారాడని రైస్మిల్లర్లు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ● సీతంపేట శివారులోని ఓ రైసుమిల్లర్కు రూ.15 కోట్ల మేరకు ధాన్యం కేటాయించగా.. ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు తిరిగి బియ్యం చెల్లించలేదని చెబుతున్నారు. ● ఇలా పలువురు రైస్మిల్లర్లకు ఇష్టారాజ్యంగా సీఎంఆర్ కేటాయించి.. ఉన్నతాధికారులకు ప్రభుత్వంలోని కొందరు కీలక ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి బెదిరింపు ధోరణిని కూడా ప్రదర్శించే వారన్న పేరు వెంకట్రెడ్డికి ఉంది. ● పౌరసరఫరాలశాఖలోని ఓ కింది స్థాయి ఉద్యోగి సీఎంఆర్ లావాదేవీలలో కీలకంగా వ్యవహరించగా.. ఇద్దరు ఉన్నతాధికారులు సైతం కొమ్ముకాశారన్న విమర్శలున్నాయి. ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు...? అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలిసింది. రూ.60 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకట్రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ కన్నెబోయిన మనోజ్, సీనియర్ అసిస్టెంట్ మహ్మద్ గౌసుద్దీన్లకు ఏసీబీ అధికారులు శనివారం హనుమకొండ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఈ మేరకు విచారణ జరిపిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి క్షమా దేశ్పాండే ముగ్గురికి ఈ నెల 19 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇవ్వగా, ఖమ్మం జిల్లా జైలుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డిపై ఫిర్యాదుల పరంపర తవ్విన కొద్దీ అవినీతి, అక్రమాలు.. సీఎంఆర్లో అవకతవకలు కలెక్టరేట్ ఎదుట టపాసులు కాల్చి రైతుల సంబురాలు రెండో రోజు నాగోల్, హనుమకొండలో సోదాలు రూ.30.30లక్షల నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు భూసేకరణ, సీఎంఆర్ రికార్డులపైనా విచారణవెంకట్రెడ్డి టీమ్పై ఏసీబీ ఆరా.. ఏసీబీ అధికారులు శుక్రవారం ఘటనా స్థలంలోనే రసాయన పరీక్షలు చేసి, లంచం డబ్బు వెంకట్రెడ్డి చేతిలో ఉండటాన్ని ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత కలెక్టరేట్లో తనిఖీలు చేసిన ఏసీబీ టీమ్ పలు ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ఈ లావాదేవీకి సంబంధించిన డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన కార్యాలయ గదిలోని డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, ఫైళ్లను స్కాన్ చేశారు. ఈ రైడ్స్లో అదనపు ఆస్తులు, మరిన్ని అవినీతి ఆధారాలు దొరికినట్లు సమాచారం. సీఎంఆర్, భూసేకరణల్లో భారీ అక్రమాలు జరిగాయన్న నిర్ధారణకు వచ్చిన ఏసీబీ.. ఈ రెండు అంశాల్లో అతనికి అత్యంత సన్నిహితంగా మెలిగిన రెవెన్యూ, సివిల్సప్లయీస్ అధికారులు, సిబ్బంది వివరాలపై ఆరా తీస్తోంది. హనుమకొండ, నాగోల్లోని ఆయన ఇళ్లలో తనిఖీలు చేసి రూ.30లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకు కోడ్
● కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. కలెక్టరేట్లో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మొదటి, రెండో దశ పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా సంబంధిత గ్రామాలు, మండలాల్లో ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుందని తెలిపారు. మూడో దశలో ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి తొలగిపోతుందన్నారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో జిల్లాలోని సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నాయకులు, ప్రజలు నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జీపీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఖర్చు పరిమితులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. -
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ములుగు: జీపీ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని అధికారులు నిశితంగా పరిశీలించాలని సాధారణ ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఎన్నికల ప్రక్రియను జరిపేందుకు వీలుగా నియమించిన మైక్రో అబ్జర్వర్లకు శనివారం కలెక్టరేట్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్ ప్రక్రియను అనుసరిస్తూ మైక్రో అబ్జర్వర్లకు ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలో పరిశీలన బాధ్యతలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్కు ముందురోజే డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకోవాలని సూచించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ జయ ప్రకాశ్, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
● హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ ములుగు: జిల్లాలోని పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ.వేణుగోపాల్ సూచించారు. జిల్లా కేంద్రంలో ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల న్యాయ సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై పెండింగ్లోని సివిల్, క్రిమినల్, ఇతర కేసులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. న్యాయ పరిపాలన విషయాలపై చర్చించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీ పీ సూర్య చంద్రకళ, భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేష్ బాబు, మహబూ బాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు అనంతరం వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప దేవాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. పూజారులు తీర్థప్రసాదాలు అందించి శాలువాతో సత్కరించారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్కుమార్ వివరించగా శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. -
సోమేశ్వరాలయంలో ములుగు కలెక్టర్ పూజలు
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ దంపతులను స్వామి వారి శేషవస్త్రాలతో సన్మానించి స్వామి వారి ప్రసాదం అందించారు. ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. రామప్పలో ఎన్నికల పరిశీలకుడు వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం హనుమకొండ జిల్లా ఎన్నికల పరిశీలకుడు శివకుమార్ నాయుడు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ఆయన వెంట తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై చల్లా రాజు ఉన్నారు. ‘అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కాంగ్రెస్’ ములుగు రూరల్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బీజేపీ జిల్లా ఇన్చార్జ్ నరేశ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నియంతృత్వ పాలన సాగుతుందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్ధుల విజయం కోసం పోటీదారులను భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరికొండ బలరామ్, చింతలపూడి భాస్కర్ రెడ్డి, రమేష్, రవీంద్రచారి, సురేందర్, తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ సేవలు మరువలేనివి ఏటూరునాగారం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశానికి అందించిన సేవలు మరువలేనివని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని 6వ వార్డులో గల అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలను యువత కొనసాగించాలన్నారు. యువత సన్మార్గంలో నడవాలని సూచించారు. క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థాయికి చేరుకుంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సునీల్, చిన్ని కృష్ణ, వలిబాబా, ఖాజాపాషా పాల్గొన్నారు. భక్తుల రద్దీ మంగపేట: మల్లూరు శ్రీహేమాచల క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం పూజలు, అర్చనలు జరపించారు. -
సెక్టార్ అధికారుల పాత్ర కీలకం
● అదనపు కలెక్టర్ సంపత్రావు ములుగు/ఏటూరునాగారం: ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారుల పాత్ర కీలకమని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్రావు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలు, పరిశీలించాల్సిన ఆంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంపత్రావు మాట్లాడుతూ గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని డీఆర్సీ కేంద్రాలలో సమస్యలు లేకుండా డిస్ట్రిబ్యూషన్ సాఫీగా జరిగేలా చూడాలన్నారు. శిక్షణ సామగ్రి, పోలింగ్కు ముందు, తర్వాత చేయాల్సిన, చేయకూడని చెక్ లిస్ట్ పంపిణీ చేసినట్లు తెలిపారు. సెక్టార్ అధికారులు పోలింగ్ స్టేషన్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. కనీసం మూడు సార్లు ప్రతీ పోలింగ్ స్టేషన్ వెళ్లి మౌలిక సదుపాయాలు చూసుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి రాతలు ఉండకూడదని, 100 మీటర్ల పరిధిలో రాజకీయ పార్టీలకు సంబంధించిన పోస్టర్లు, సామగ్రి ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ఏటూరునాగారంలోని డిగ్రీ కళాశాలలో ఆర్వోలు, ఏఆర్వోలు, పీఓలకు శనివారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలన్నారు. తొలి విడతలో ఎస్ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం, గోవిందరావుపేట మండలాల్లో ఈ నెల 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ సజావుగా జరిగేలా ప్రణాళికతో వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తతో వ్యవహరించాలన్నారు. శిక్షణ తరగతుల్లో సూచించిన అంశాలను పాటించాలన్నారు. అనంతరం ఏటూరునాగారం మండల పరిధిలోని 130 పోలింగ్ కేంద్రాల పరిధిలోని బీఎల్ఓలకు బూత్ల వారీగా ఓటరు స్లిప్పులను అందజేసినట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో బూత్ లెవల్ ఆఫీసర్లకు అందజేసి ప్రతీ ఓటర్కు స్లిప్ను అందజేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. -
ముగిసిన మూడో విడత నామినేషన్ల ప్రక్రియ
వెంకటాపురం(కె)/ కన్నాయిగూడెం: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో మూడో విడతలో 46 సర్పంచ్ స్థానాలు, 408 వార్డు స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వెంకటాపురం (కె) మండలంలో 18 సర్పంచ్ స్థానాలకు 103 నామినేషన్లు దాఖలయ్యాయి. వాజేడు మండలంలో 17 సర్పంచ్ స్థానాలకు 85, కన్నాయిగూడెం మండలంలో 11 సర్పంచ్ స్థానాలు, 90 స్థానాలకు దాఖలైన నామినేషన్ల పూర్తి వివరాలు శుక్రవారం అర్థరాత్రి వరకు అందలేదు. వెంకటాపురం(కె) 166 వార్డు స్థానాలకు 405 నామినేషన్లు దాఖలయ్యాయి. వాజేడులో 152 స్థానాలకు 373 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి గ్రామ సర్పంచ్ స్థానంతోపాటు, మొత్తం ఎనిమిది వార్డు స్థానాలకు ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ముప్పనపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వు కాగా.. గ్రామానికి చెందిన తిప్పనపల్లి లక్ష్మయ్య మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆ గ్రామంలో కేవలం రెండు వార్డులకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయా.. లేదా.. వారిలోకూడా ఎవరైనా ఉపసంహరించుకుని మొత్తానికి ఏకగ్రీవం చేస్తారా.. వేచిచూడాలి. -
‘నవోదయ’ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
ములుగు: జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని అదనపు కలెక్టర్ రెవెన్యూ మహేందర్ జీ తెలిపారు. శుక్రవా రం ఆయన తన చాంబర్లో జవహర్ నవోదయ వి ద్యాలయ అధికారులు, సంబంధిత అధికారులతో పరీక్ష ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. మా మునూరు జవహర్ నవోదయ విద్యాలయ వరంగల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ఆరవ తరగతిలో ప్రవేశానికి ఈనెల 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాల్లో 515 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. ఏటూరునాగారం జెడ్పీహెచ్ఎస్ లో 162 మంది విద్యార్థులు, బండారుపల్లి ఆదర్శ పాఠశాలలో 192 మంది విద్యార్థులు, ములుగు జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో 161 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఆఫ్ లైన్లో దరఖాస్తు చేసుకున్న వా రు విద్యాలయ హెల్ప్ లైన్ నంబర్ 91107 82213 కు ఫోన్ చేసి తమ వివరాలు తెలిపి హాల్ టికెట్ పొందవచ్చని తెలిపారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికా రులను ఆదేశించారు. నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఇన్చార్జ్ లక్ష్మీరెడ్డి, కలెక్టరేట్ ఏఓ రాజ్ కుమార్, పర్యవేక్షకులు సలీం, శివకుమార్ పాల్గొన్నారు. ములుగులో మూడు పరీక్ష కేంద్రాలు హాజరు కానున్న 515 మంది విద్యార్థులు అదనపు కలెక్టర్ రెవెన్యూ మహేందర్ -
‘నిధి’ కొందరికే..
వ్యవసాయ భూమికి పట్టాలు పొందిన ప్రతి రైతుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి అవకాశం కల్పించారు. నూతనంగా పట్టాలు పొందిన రైతులకు దరఖాస్తు అవకాశం కల్పించాలి. పలువురు రైతులు పట్టాలు ఉన్నా.. పెట్టుబడి సాయం పొందలేకపోతున్నారు. – ఒజ్జల కుమారస్వామి, రైతు, ములుగు పీఎం కిసాన్ సమ్మాన్ నిథి పథకానికి ప్రభుత్వం కటాఫ్ విధించింది. 2019 కంటే ముందు పట్టాలు పొందిన వారిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. వారికి పెట్టుబడి సాయం అందుతుంది. కటాఫ్ తేదీ తర్వాత పట్టాలు పొందిన వారికి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. – సురేష్కుమార్, డీఏఓ ●ములుగు రూరల్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఫలితం జిల్లాలో కొంత మంది రైతులకు మాత్రమే అందుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి 2019 ఫిబ్రవరి 01వ తేదీ వరకు పట్టాలు కలిగి ఉన్న రైతుల నుంచి మాత్రమే అప్పట్లో దరఖాస్తులు తీసుకుంది. ఆ తర్వాత పట్టాలు పొందిన రైతులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో వారంతా ఈ పథకానికి దూరమయ్యారు. అయితే ఆ తర్వాత వారసత్వం ద్వారా భూములు పొందిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. ఆరేళ్లుగా నిరీక్షణ.. ప్రభుత్వం ప్రకటించిన కటాప్ తేదీ తర్వాత భూ పట్టాలు పొందిన రైతులకు పీఎం కిసాన్ నిధికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో ఆరేళ్లుగా నిరీక్షిస్తున్నారు. జిల్లాలోని 10 మండలాల్లో పట్టాలు కలిగిన రైతులు 86,736 మంది ఉన్నారు. ఇందులో 29,955 మంది రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు జమ అవుతున్నాయి. ఆరు సంవత్సరాలుగా పట్టాలు పొందిన రైతులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించకపోవడంతో పెట్టుబడి సాయం అందక రైతులు నష్టపోతున్నా రు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మూడు దఫాలుగా రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. నిబంధనల వర్తింపు.. రైతులకు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం సాయం అందించాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రవేశపెట్టింది. పథకానికి దరఖాస్తు చేసుకున్న రైతుల్లో అర్హులను గుర్తించి ఆర్థికసాయం అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు పథకానికి అనర్హులు. కుటుంబ సభ్యులకు వేర్వేరుగా భూమలు ఉన్నా.. ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది. ఆదాయపు పన్ను, విదేశాల్లో నివాసం ఉండే వారికి పథకం వర్తించదు. ఇప్పటి వరకు 20 విడతల్లో లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. కేంద్ర ప్రభుత్వం పథకంలో చేస్తున్న మార్పుల కారణంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుంది. మొత్తం పట్టాదారులు 86,763 మంది 2019కి ముందు పట్టాలు పొందిన రైతులకే నగదు జమ ఆరు సంవత్సరాలుగా పట్టాదారుల ఎదురుచూపు -
శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
నర్సంపేటలో జరిగిన ప్రజా పాలన–ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్రెడ్డి, పక్కన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, నాయిని, ప్రకాశ్రెడ్డి, రాంచంద్రునాయక్, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ సారయ్యఅభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డినర్సంపేట సీఎం సభ సక్సెస్.. కార్యకర్తల్లో జోష్ ● భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులుహెలిపాడ్ వద్ద రేవంత్రెడ్డికి ఘనస్వాగతం ● పంచాయతీ ఎన్నికలపై దిశానిర్దేశం ● పోలీసుల భారీ బందోబస్తుసాక్షి, వరంగల్/నర్సంపేట/నర్సంపేట రూరల్ : నర్సంపేటలో కాంగ్రెస్ శ్రేణులు కదంతొక్కాయి. పట్టణంలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన–ప్రజావిజయోత్సవ సభ సక్సెస్ కావడంతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారి నర్సంపేటకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం 3.32గంటలకు చేరుకున్న సీఎంకు ఉమ్మడి జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి ప్రజాపాలన–విజయోత్సవ సభావేదిక వద్దకు భారీ కాన్వాయ్తో బయలుదేరారు. సీఎం రేవంత్రెడ్డి రోడ్డుపొడువునా ప్రజలకు అభివాదం తెలుపుతూ సభాస్థలికి చేరుకున్నారు. ముందుగా సభా వేదిక వద్ద సుమారు రూ.600 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగించారు. పంచాయ తీ ఎన్నికల్లో యువత, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభకు నర్సంపేట డివిజన్లోని ఆరు మండలాలనుంచే కాకుండా ఉమ్మడి జిల్లానుంచి పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రజల రాకతో సభాప్రాంగణమంతా నిండిపోయింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పింగిలి శ్రీపాల్రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ రియాజ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్.నాగరాజు, డాక్టర్ మురళీనాయక్, రేవూరి ప్రకాశ్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డి హెలికాప్టర్ రాజుపేట గ్రామ శివారులోని హెలిపాడ్ వద్ద దిగింది. హెలికాప్టర్ నుంచి బయటకు వచ్చిన సీఎంకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి అనసూయ( సీతక్క), కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితోపాటు మరి కొందరు ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు. ఔటర్ రింగ్ రోడ్డు, యూజీడీ తీసుకొస్తున్నాం కొత్త ఏడాది మేడారం జాతరకు మళ్లీ వస్తా నర్సంపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి -
మేడారంలో మొక్కుల సందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానా లు అచరించిన భక్తులు అమ్మవార్లకు పుట్టువెంట్రుకలను సమర్పించుకున్నారు. తల్లుల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మేడారంలో గద్దెల ప్రాంగణంలో పునర్నిర్మాణం పనులు చేస్తు న్న కార్యికులు, భక్తుల రద్దీతో గద్దెల ప్రాంగణం సందడిగా మారింది. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. -
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
● రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ములుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఆమె జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీసీలో సాధారణ పరిశీలకుడు (ఎన్నికలు) ప్రశాంత్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆయిల్ ఫెడ్, హైదరాబాద్, అదనపు కలెక్టర్ సంపత్ రావు తదితరులో కలిసి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ దివాకర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కమిషనర్.. మొదటి, రెండో విడత నామినేషన్ల స్వీకరణ దాఖలైన నామినేషన్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల సిబ్బంది కేటాయింపు, పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ బాక్సుల అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ.. మొదటి దశ పోలింగ్కు కావాల్సిన బ్యాలెట్ పత్రాలను సంబంధిత ఎంపీడీఓలకు అందజేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వెబ్ కాస్టింగ్, ఓటర్ స్లిపుల పంపిణీ, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లు, సర్వీస్ ఓటర్లు, టీ పోల్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఎంపీడీఓ కార్యాలయాల్లో ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
వరాలు కురిపిస్తారా..!?
సాక్షిప్రతినిధి, వరంగల్ : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సుమారు 35 రోజుల తర్వాత మళ్లీ ఓరుగల్లులో పర్యటిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు శుక్రవారం తొలిసారి వస్తున్న ఆయన... ‘ప్రజాపాలన – ప్రజావిజయోత్సవాల’ సందర్భంగా పలు అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్నా.. తరుణంలో నర్సంపేట సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన పథకాలు, నిధులపై స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. గ్రేటర్ వరంగల్తోపాటు ఉమ్మడి వరంగల్పై ఏం వరాలు కురిపిస్తారనే చర్చ జరుగుతోంది. అలాగే ‘మొంథా’ తుపాన్ నష్టం సందర్భంగా ఇళ్లు కూలిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ.15వేలకు చెల్లించిన ప్రభుత్వం.. పంటల నష్టంపై నివేదికలు పంపిన చాలామందికి పరిహారం అందలేదు. వీటిపైన సీఎం ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. డీపీఆర్ స్థాయిలోనే ‘గ్రేటర్’పనులు... ఉమ్మడి వరంగల్కు కావాలి నిధులు.. ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వరంగల్పై పలు హామీలు కురిపించారు. హైదరాబాద్తో పోటీ పడేలా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. ఈ మేరకు సుమారు దశల వారీగా రూ.6,500 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. ఇందులో మామునూరు ఎయిర్పోర్టుకు రూ.150 కోట్ల వరకు నిధులు విడుదలై భూసేకరణ జరుగుతోంది. భద్రకాళి చెరువు పూడిక, మాఢ వీధులు నిర్మాణం తదితర పనులు నడుస్తున్నాయి. వరంగల్ నగరంలో సుమారు నాలుగు వేల కోట్ల విలువైన అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ ప్రతిపాదనలు డీపీఆర్ల దశలో ఉన్నాయి. ఔటర్ రింగ్రోడ్డు, ఇన్నర్ రింగ్రోడ్డులతోపాటు పలు అభివద్ధి పథకాలకు నిధులు మంజూరైనా ఆ పనులు సాగడం లేదు. స్మార్ట్సిటీ పనులకు తోడు రాష్ట్రం వాటా కింద నిధులు మరిన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు రావాల్సి ఉంది. అలాగే ఉమ్మడి వరంగల్లో మేడారం అభివృద్ధి, గిరిజన యూనివర్సిటీలకు మరిన్ని నిధులు అవసరం ఉందని ఇటీవల ప్రజాప్రతినిధులు సీఎంను కోరారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కూడా ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఆ మూడు పథకాలపై స్పష్టత... కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఇటీవల వరంగల్లో పర్యటించారు. కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ), కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మామునూరు ఎయిర్పోర్ట్ పనులను ఆయన ప్రత్యేకంగా పరిశీలించి సమీక్షించారు. ఈ సందర్భంగా 7 మెగా టెక్స్ టైల్ పార్కుల్లో ఒకటైన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు పనులపై కేంద్రం మొత్తం రూ.200 కోట్లతో చేపట్టగా రూ.1,700 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 12,500 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు విషయంలో 696 ఎకరాల భూమి ఎయిర్ పోర్టు అధికారుల వద్ద ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం సుమారు 243 ఎకరాల భూమి సేకరించి ఎయిర్ పోర్టు అథారిటీకి అందజేస్తే త్వరగా నిర్మాణం ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. కాజీపేటలోని రైల్ మానుఫ్యాక్చరింగ్ యూనిట్ త్వరగా నిర్మాణం పూర్తి చే యాలని కేంద్రం భావిస్తుందన్నారు. ఈ మూడు పథకాల విషయంలో పలుమార్లు రాష్ట్ర, కేంద్ర ప్ర భుత్వాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరిగా యి. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందని పార్టీవర్గాల సమాచారం. ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ కానున్న సీఎం? ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ సభ’లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సభలో మాట్లాడనున్న ఆయన ఉమ్మడి వరంగల్పై నిధుల జల్లు కురిపిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అంతకు ముందు గ్రామ పంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో తాజా పరిస్థితి ఏమిటి? పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏం జరుగుతోంది.. ? అని మాట్లాడనున్నారు. మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేలా రేవంత్రెడ్డి మరోసారి మార్గదర్శనం చేయనున్నారని తెలిసింది.సాక్షి, వరంగల్/నర్సంపేట/నర్సంపేట రూరల్: నర్సంపేట నియోజకవర్గానికి తొలిసారి వస్తున్న సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ సభకు జనసమీకరణ చేయనున్నారు. జాపాలన–ప్రజా విజయోత్సవ సభలో భాగంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి రూ.1,023 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలు, నాయకులు భారీగా హాజరుకానున్నారు. పటిష్ట బందోబస్తు.. పట్టణంలోని సర్వాపురం శివారులో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రి ఎదుట సభా స్థలిని ఏర్పాటుచేశారు. సీఎం రేవంత్రెడ్డి.. సభా స్థలికి వెళ్లేందుకు ప్రత్యేకంగా రోడ్డు నిర్మించారు. స్టేజీపై సుమారు 50 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. నర్సంపేట డివిజన్లోని ఆరు మండలాలల నుంచి 50 వేల మందిని సభకు తరలించనున్నారు. ఇందుకోసం 135 ఆర్టీసీ బస్సులు, 60 ప్రైవేట్ బస్సులను సిద్ధం చేశా రు. ఏర్పాట్లను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఆర్డీఓ ఉమారాణి, ఏసీపీ రవీందర్ పరిశీలించారు. హెలిపాడ్, సభా ప్రాంగణాన్ని బాంబ్ స్క్వాడ్ బృందాలు, జాగీలాలు తనిఖీ చేశాయి. గత పర్యటనలో రూ.6,500 కోట్లు మంజూరు చేసిన సీఎం..మందకొడిగా పనులు.. ఇటీవల జిల్లాకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. మామునూరు, కేఎంటీపీ, ఆర్ఎంయూలపై వ్యాఖ్యలు ఈ మూడు ప్రాజెక్టులలో రాష్ట్రం పాత్రపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి మరిన్ని నిధులపై ఆశలు -
నైట్ విజిట్
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను మంత్రి సీతక్క గురువారం రాత్రి పరిశీలించారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునర్నిర్మాణం పనులను పరిశీలించారు. అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. జాతరకు ముందుగా పనులు పూర్తి చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని తెలిపారు. మంత్రి వెంట డీసీసీ అధ్యక్షుడు అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ ఉన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
కన్నాయిగూడెం: వైద్యసిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ గోపాల్రావు హెచ్చరించారు. గురువారం సాక్షిలో మారని వైద్యుల తీరు శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన డీఎంహెచ్ఓ మండల కేంద్రంలోని పీహెచ్సీని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి జరిగిన ఘటనపై ఆరా తీశారు. సిబ్బంది రోగులకు 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో డీఎంహెచ్ఓతో పాటు జిల్లా ప్రోగ్రామ్ అధికారి పవన్ కుమార్, డాక్టర్ గిరిబాబు సిబ్బంది పాల్గొన్నారు.డిగ్రీ కళాశాలలో ఆడిట్ బృందం తనిఖీ ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం అకాడమిక్ ఆడిట్ బృందం గురువారం తనిఖీ నిర్వహించింది. కమిషనరేట్ ఆఫ్ కాలేజెస్ ఎడ్యూకేషన్ తెలంగాణ ఆదేశాల మేరకు ఆడిట్ బృందం అకాడమిక్ రికార్డులను తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో హనుమకొండలోని పింగిలి డిగ్రీ కళాశాల పిన్సిపాల్, ప్రొఫెసర్ చంద్రమౌళి, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీనియర్ అధ్యాపకులు రవీందర్ పాల్గొన్నారు. ఈ తనిఖీ బృందానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.బాలయ్య, న్యాక్ కో ఆర్డినేటర్ జగదీశ్, అకాడమిక్ కో ఆర్డినేటర్ భాస్కర్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ ములుగు రూరల్: జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ రాంనాథ్ కేకన్ జిల్లా జడ్జి ఎస్వీపీ సూర్యచంద్రకళను గురువారం మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థ, పోలీస్ శాఖల మధ్య సమన్వయం, కేసులు త్వరితగతిన పరిష్కారానికి అవసరమైన సహకారం వంటి అంశాలపై చర్చించినట్లు ఎస్పీ వెల్లడించారు. డీటీడీఓగా నాగసాగర్ ఏటూరునాగారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీటీడీఓగా గొట్టిముక్కుల నాగసాగర్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో హనుమకొండ పరిపాలన అధికారిగా పనిచేస్తున్న నాగసాగర్కు భూపాలపల్లి డీటీడీఓగా బాధ్యతుల అప్పగించారు. ఆయన శుక్రవారం విధుల్లో చేరనున్నారు. సైబర్ నేరాలపై అవగాహన ఉండాలిములుగు: సైబర్ నేరాలపై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా సైబర్ క్రైమ్ డీఎస్పీ నందిరాంనాయక్ సూచించారు. జిల్లా కేంద్రంలోని సమ్మక్క– సారక్క ట్రైబల్ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ప్రాడ్కా ఫుల్స్టాఫ్, 6 వారాల సైబర్ అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. వ్యక్తిగత సమాచారాన్ని, పాస్వర్డ్లు, బ్యాంక్, ఓటీపీ వివరాలను ఎవరితో పంచుకోవద్దని సూచించారు. అపరిచిత లింక్లపై క్లిక్ చేయవద్దని, ఫోన్ ద్వారా వచ్చే అటాచ్మెంట్ లింక్లను తెరవవద్దని వెల్లడించారు. డిజిటల్ అరెస్ట్, బెదిరింపుల గురించి భయపడవద్దన్నారు. మోసానికి గురైతే టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేయాలన్నారు. -
సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి
ములుగు రూరల్: పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో స్పెషల్ పార్టీ సిబ్బందితో సమావేశం నిర్వహించి సిబ్బంది సంక్షేమం, భద్రత తదితర అంశాలపై చర్చించారు. సిబ్బందికి ఫీల్డ్లో ఎదురవుతున్న పరిస్థితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం సిబ్బంది ఆరోగ్యం, భద్రత, విశ్రాంతి సౌకర్యాలపై ఆరా తీశారు. స్పెషల్ పార్టీ పోలీసులు జిల్లా భద్రతలో అతి ముఖ్యమైన ప్రాత పోషిస్తున్నారని తెలిపారు. స్పెషల్ పార్టీ పోలీసులకు అవసరమయ్యే రక్షణ సామగ్రిని సమకూర్చుతామని ఎస్పీ వివరించారు. అనంతరం స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ 2014 బ్యాచ్కు చెందిన కిరణ్ హెడ్ కానిస్టేబుల్గా ఉద్యోగోన్నతి పొందగా ఎస్పీ శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో కష్టపడిన వారికి ఉద్యోగోన్నతులు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఆర్ఐ ఆపరేషన్స్ తిరుపతి, ఆర్ఎస్సైలు గోపిచంద్, ప్రశాంత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ -
ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా?
మంగపేట: అసలే మూలమలుపు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం కష్టం.. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రోడ్డు అడుగడుగునా ప్రమాద కరంగా మారింది. అయినా సంబంధిత ఆర్ఆండ్బీ అధికారులకు కనిపించకపోవడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని కమలాపురం నుంచి జిల్లా సరిహద్దులోని బ్రాహ్మణపల్లి వరకు గల ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డు ఇసుక లారీల దాటికి గోతులమయంగా మారి ప్రమాదకరంగా మారిపోయింది. ప్రధానంగా చుంచుపల్లి పీహెచ్సీ ఎదుట మూలమలుపు వద్ద రోడ్డు మధ్యలో నాలుగు మీటర్ల వెడల్పు రెండు ఫీట్ల గొయ్యి ఏర్పడటంతో అందులో జనావాసాల నుంచి వచ్చే మురుగు నీరు నిలిచింది. దీంతో అత్యంత ప్రమాదకరంగా మారింది. మూలమలుపు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు అతి దగ్గరకు వచ్చే వరకు కనిపించని పరిస్థితి ఉంది. ఏమాత్రం వాహనం అదుపుతప్పినా భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. 2022లో ఇదే ప్రదేశంలో కలప లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి పీహెచ్సీలోకి దూసుకెళ్లే క్రమంలో బోల్తా పడింది. ఈ సంఘటనలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు బాలురకు తీవ్ర గాయాలయ్యాయి. కొద్దిరోజుల్లో మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. చుంచుపల్లితో పాటు కమలాపురం, మంగపేట, తిమ్మంపేట, పాలాయగూడెం తదితర ప్రాంతాల్లో రోడ్లపై భారీ గోతులు ఏర్పడి ప్రమాదకరంగా ఉన్నాయి. తక్షణమే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డు గుంతలమయం చుంచుపల్లి పీహెచ్సీ ఎదుట మూలమలుపు వద్ద రెండు ఫీట్ల గొయ్యి -
ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్
ములుగు: పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును విని యోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ అవకాశం కల్పించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి గురువారం వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ దివాకర , అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్రావు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన నియమాలు, ఏకగ్రీవ స్థానాల్లో ఉప సర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు, నామినేషన్లపై వచ్చే ఫిర్యాదులు, తదితర అంశాలపై ఎన్నికల కమిషనర్ రివ్యూ నిర్వహించారు. వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికై న చోట ఉప సర్పంచ్ ఎన్నికలకు చర్యలు తీసుకోవాలని, ఏకగ్రీవంగా ఎన్నికై న గ్రామ సర్పంచులకు సంబంధించి ఫలితాలు నిబంధనల ప్రకా రం ప్రకటించాలని సూచించారు. అనంతరం అధి కారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్కు చేసుకున్న దరఖాస్తు పరిశీలించి అర్హులకు తప్పకుండా అందించాలన్నారు. ప్రతీ గ్రామం, మండలాల వారీగా వివరాలు సేకరించి సంబంధిత రిటర్నింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ జారీ చేసేలా చూడాలన్నారు. మొదటి విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో ఓటుహక్కు ఉండి ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది డిసెంబర్ 8న, రెండో విడత వారికి 12న, మూడో విడత వారికి 15న ఫెసిలిటేషన్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేలా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ సూచించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్ల నియామకం చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ సీఎం రోశయ్య సేవలు చిరస్మరణీయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్గా పనిచేసిన కొణిజేటి రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. కలెక్టరేట్లో గురువారం ఏర్పాటు చేసిన రోశయ్య వర్ధంతి కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్ రావుతో కలిసి కలెక్టర్ హాజరై రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికశాఖ మంత్రిగా ఎన్నోసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని, సీఎంగా పని చేసి రాష్ట్రాన్ని వినూత్న సంస్కరణలతో అభివృద్ధి చేశారని తెలిపారు. అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్గా పని చేసి విశిష్ట సేవలు అందించారని వెల్లడించారు. రాజకీయాల్లో స్వచ్ఛమైన వ్యక్తిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. రోశయ్య వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ రాజ్కుమార్, పర్యవేక్షకులు మహేశ్ బాబు, మంజుల తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
రెండోరోజు నామినేషన్లు
వెంకటాపురం(కె): రెండో విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో రెండో రోజు నామినేషన్లను పలువురు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం వెంకటాపురం(కె) మండలంలో 23 సర్పంచ్ స్థానాలకు, 63 వార్డు స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వాజేడులో 18 సర్పంచ్ స్థానాలకు 54 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. కన్నాయిగూడెంలో సర్పంచ్ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలు కాగా వార్డు స్థానాలకు 64నామినేషన్లు వేశారు. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
వాజేడు/వెంకటాపురం(కె):స్థానిక సంస్థల ఎన్నికల నియమనిబంధనలు తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్కుమార్ అధికారులకు సూచించారు. వాజేడు మండల కేంద్రంలోని నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆయన గురువారం పరిశీలించారు. అలాగే నాగారం, మొరుమూరు, గుమ్మడిదొడ్డి గ్రామాల్లోని కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ విజయ, ఎంపీఓ శ్రీకాంత్ నాయుడు, ఆర్ఐ కుమారస్వామి, డీటీ రాంసింగ్ ఉన్నారు. అలాగే నాగారంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని తహసీల్దార్ శ్రీనివాస్ పరిశీలించారు. నామినేషన్ వేసే అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని హెల్ప్డెస్క్ సిబ్బందికి సూచించారు. అదే విధంగా వెంకటాపురం(కె) మండల పరిధిలోని బీసీ మర్రిగూడెం, పాత్రాపురం, వెంకటాపురంలోని నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ప్రశాంత్కుమార్ పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్కుమార్ -
మూడో విడత నామినేషన్లు
వెంకటాపురం(కె): మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం తొలిరోజు కొనసాగింది. జిల్లాలోని వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో మూడో విడత నామినేషన్ల ప్రక్రియ చేపట్టగా పలువురు సర్పంచ్, వార్డు స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. మూడో విడతలో భాగంగా బుధవారం వెంకటాపురం(కె)లో 18 సర్పంచ్ స్థానాలకు గాను అభ్యర్థులు తొలిరోజు నామినేషన్లు ఎవరూ వేయలేదు. వార్డు స్థానాలు 166 ఉండగా నలుగురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. వాజేడులో 17 సర్పంచ్ స్థానాలకు ఐదుగురు నామినేషన్లు వేయగా 152 వార్డు స్థానాలకు 14మంది నామినేషన్లు వేశారు. అలాగే కన్నాయిగూడెంలో 11 సర్పంచ్ స్థానాలకు గాను ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా 90 వార్డు స్థానాలకు నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. -
కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలి
మల్హర్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ ఆదేశించారు. బుధవారం మండలంలో రుద్రారం, ఎడ్లపల్లి, కొయ్యూ రు, కొండంపేట్, వల్లెకుంట, తాడిచర్ల గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సెంటర్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ రైతుల నుంచి ఎఫ్ఏక్యూ గ్రేడ్ ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాగ్ చేసిన రైస్ మిల్లులకు తరలించాలన్నారు. అ లాగే కొనుగోలు కేంద్రాల్లో రోజువారీగా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, చెల్లింపుల పురోగతి ట్యాబ్లో నమోదు చేయాలన్నారు. రైతులకు అవసరమైన మౌలిక వసతులు తాగునీరు, నీడ, కొలతల యంత్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీసీఎస్ఓ కిరణ్కుమార్, తహసీ ల్దార్ రవికుమార్, మండల వ్యవసాయ అధికారి శ్రీజ, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
షురూ..
గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ పూర్తి ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయి: పల్లెల్లో ప్రచారం ఊపందుకుంది. జిల్లాలోని 9 మండలాల్లో మూడు దఫాలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏటూరునాగారం, ఎస్ఎస్ తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో మొదటి విడత ఎన్నికల కోసం నామినేషన్లను గత నెల 27 నుంచి 29 స్వీకరించారు. తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కాగా ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచులు, వార్డు సభ్యులకు గుర్తుల కేటాయింపు బుధవారం పూర్తైంది. దీంతో గ్రామ పంచాయతీల్లో ప్రచార జోరు మొదలైంది. అదే విధంగా పలు జీపీల్లో సర్పంచులు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక రెండో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా మూడో విడతలో ఎన్నికలు జరగనున్న వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో ఆశావహులు తొలిరోజు నామినేషన్లు వేశారు. గుర్తుల కేటాయింపు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ బుధవారం సాయంత్రంతో ముగిసింది. వివిధ పార్టీల నుంచి ఆశావహులు సర్పంచ్, వార్డు మెంబర్ల పోటీకి నామినేషన్ పత్రాలను సమర్పించగా పరిశీలన పూర్తి చేసిన అధికారులు నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం సాయంత్రం 3 గంటల వరకు గడువును నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు వచ్చే నాటివరకు వివిధ పార్టీల ప్రధాన నాయకులు నామినేషన్ దాఖలు చేసిన వ్యక్తులతో బేరసారాలు నిర్వహించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీలో ఉండే సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులకు అధికారులు గుర్తులను కేటాయించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గుర్తుల లీస్టును ప్రదర్శించడంతో గుర్తులు తెలుసుకునేందుకు అభ్యర్థులు పోటీ పడ్డారు. అనంతరం అభ్యర్థులు ప్రింటింగ్ ప్రెస్ల వద్దకు చేరుకుని తమకు కేటాయించిన గుర్తులతో కరపత్రాలు, వాల్ పోస్టర్లు తయారు చేయించుకుని ప్రచారాన్ని షురూ చేశారు. ఇదిలా ఉండగా ఏటూరునాగారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజ్కుమార్, ట్రైనీ ఎస్సై రచితతో పాటు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఏకగ్రీవ సర్పంచులు, వార్డు సభ్యులు వీరే.. ఏటూరునాగారం మండల పరిధిలోని శంకరాజుపల్లిలో 8 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. అనూహ్యంగా ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన దేవులపల్లి విజయ్కుమార్ ఒక్కరు మాత్రమే బరిలో నిలిచారు. దీంతో పోటీదారులు ఎవరూ లేకపోవడంతో దేవులపల్లి విజయ్కుమార్ శంకరాజుపల్లి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు రిటర్నింగ్ అధికారి రవిచంద్ర తెలిపారు. అదేవిధంగా ఏటూరునాగారం 13వ వార్డు ఆవుల అక్షయ వార్డు సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఆ వార్డులో చిన్నపల్లి దేవకి తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో అక్షయ్య వార్డు సభ్యురాలిగా ఎన్నికై నట్లు రిటర్నింగ్ అధికారి రాజు తెలిపారు. అదే విధంగా ఎస్ఎస్తాడ్వాయి మండల పరిధిలోని అంకంపల్లి, నర్సాపూర్(పీఏ), పంబపూర్ జీపీలకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఒక్కొక్కరు మినహా మిగితా వారు ఉపసంహరించుకోవడంతో ఆయా గ్రామాల సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. అంకంపల్లి సర్పంచుగా ఇర్ప వెంకటేశ్వర్లు, పంబపూర్ సర్పంచుగా ముక్తి శ్రీను, నర్సాపూర్(పీఏ) సర్పంచుగా యాప కళ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పాటు ఈ మూడు జీపీల్లోని వార్డు సభ్యులు కూగా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు వెల్లడించారు. ఎస్ఎస్ తాడ్వాయి గ్రామపంచాయతీలో 10 వార్డు అభ్యర్థి ఈసం ఆశోక్తో పాటు వెంగ్లాపూర్ జీపీలో నాలుగు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మండలం సర్పంచులు ఏకగ్రీవమైనవి బరిలో వార్డుల్లో.. నిలిచిందిఎస్ఎస్తాడ్వాయి 18 3 52 239 ఏటూరునాగారం 12 1 41 234 గోవిందరావుపేట 18 05 52 283 సర్పంచ్, వార్డు సభ్యులకు గుర్తుల కేటాయింపు పలు జీపీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల ఏకగ్రీవం -
డయల్ యువర్ డీఎంకు విశేష స్పందన
ములుగు రూరల్: ఆర్టీసీ అధికారులు బుధవారం నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నుంచి మొత్తం 15 మంది ఫోన్ చేసినట్లు తెలిపారు. ఇందులో ఎక్కువగా పొట్లాపూర్కు బస్సు సర్వీస్ పెంచాలని, గట్టమ్మ పాయింట్ వద్ద బస్సు ఆపడం లేదని, బస్సులు సమయపాలన ప్రకారం నడిచేలా చూడాలని విజ్ఞప్తులు వచ్చినట్లు డీఎం రవిచందర్ తెలిపారు. త్వరలోనే ప్రయాణికుల సౌకర్యార్ధం సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ భవాని, కస్టమర్ రిలేషన్ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. సమ్మక్కసాగర్లో చేపపిల్లల విడుదల కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ పంచాయతీలో గల సమ్మక్క సాగర్బ్యారేజీలో మత్స్యశాఖ, పెసా, మొబలేజర్స్ ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి చేప పిల్లలను గోదావరిలో విడుదల చేసే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఈ మేరకు బుధవారం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయకూడదనే ఆదేశాలు ఉన్నప్పటికీ లెక్కచేయకుండా చేప పిల్లలను గోదావరిలో వేస్తున్నారని పలువురు అధికారుల పై విమర్శలు చేస్తున్నారు. ‘సీఎం అనుచిత వ్యాఖ్యలు సరికాదు’ ములుగు రూరల్: హిందూ దేవతలపై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ దేవతలపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించాలన్నారు. ఎంఐఎం పార్టీ మెప్పుకోసం హిందూ దేవతలను కించపరిచడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీంద్రచారి, చింతలపూడి భాస్కర్ రెడ్డి, భూక్య రాజునాయక్, కొత్త సురేందర్, రమేష్, శోభన్, కృష్ణాకర్ రావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత్ పూర్వ సైనిక్ సేవ పరిషత్లో చేరిక భూపాలపల్లి అర్బన్: రక్షణ శాఖ గుర్తింపు పొందిన ‘అఖిల భారత్ పూర్వ సైనిక్ సేవ పరిషత్’ లో జిల్లాలోని జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం మాజీ సైనికులు చేరినట్లు జిల్లా అధ్యక్షుడు అభిషేక్ తెలిపారు. గత రెండు రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన యూత్ ఫర్ నేషన్ కార్యక్రమానికి హాజరైన అఖిల భారత్ పూర్వ సైనిక్ సేవ పరిషత్ కేంద్ర అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ వీకే చేతుర్వేది ఆధ్వర్యంలో చేరినట్లు ఆయన తెలిపారు. మాజీ సైనికుల సంక్షేమ కార్యక్రమాలను భవిష్యత్లో మరింత బలపరిచేందుకు జిల్లా మాజీ సైనికుల సంఘం అఖిల భారత్ పూర్వ సైనిక్ సేవ పరిషత్ సహకారంతో ముందుకు సాగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అభిషేక్ గుప్తా, ప్రధాన కార్యదర్శి దుబాసి సాగర్, మాజీ సైనికులు బేతోజు మురళీ కృష్ణ, సైనిక కుటుంబాలు పాల్గొన్నారు. -
పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు
ములుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బందికి రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర, సాధారణ ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ తెలిపారు. ములుగులోని కలెక్టర్ చాంబర్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించగా కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. జిల్లాలోని మండలాల వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేసినట్లు వివరించారు. జిల్లాలోని 146 గ్రామ పంచాయతీల సర్పంచ్, 1,290 వార్డు స్థానాలకు, 1,306 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్ స్టాఫ్ కలుపుకుని ప్రిసైడింగ్ అధికారులతో పాటు, ఓపీఓల ర్యాండమైజేషన్ జరిగిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, డీపీఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులు సమాజానికి స్ఫూర్తి ప్రదాతలు దివ్యాంగులు సమాజానికి స్ఫూర్తి ప్రదాతలని, ప్రపంచ వేదికపై మన దేశ కీర్తిని చాటిన ఘనత దివ్యాంగులదని వారితో ఆత్మీయంగా మెలగాలని కలెక్టర్ దివాకర సూచించారు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీసామాజిక పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి కలుపుకునే సమాజాన్ని రూపొందించడమనే నేపథ్యం్ఙలో జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో జిల్లా సంక్షేమ అధికారి తుల రవి అధ్యక్షతన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై దివ్యాంగుల హక్కులు, అవకాశాలు సామాజిక బ్యాతలపై కలెక్టర్ వివరించారు. అనంతరం దివ్యాంగుల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో పలు డిమాండ్లపై కలెక్టర్కు వినతిపత్రం అందించగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. జిల్లాలో దివ్యాంగులకు విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక భద్రత రంగాల్లో వారికి సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ వివరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మహేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. సౌకర్యాలు కల్పించడం మన బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి రవి, డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా నాయకులు పూజరి మాణిక్యం, కనకం రాజు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ దివాకర, సాధారణ ఎన్నికల పరిశీలకులు శ్రీకాంత్కుమార్ -
గ్రామాలాభివృద్ధికి కృషి
ఎస్ఎస్తాడ్వాయి: గ్రామాలాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలో పార్టీ నాయకులను, కార్యకర్తలను మంత్రి సీతక్క కలిసి బుధవారం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపునకు నాయకులు, కార్యకర్తలు బేదాభిప్రాయాలు లేకుండా కలిసి కట్టుగా పనిచయాలన్నారు. ప్రతీ గ్రామపంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుని అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. పంచాయతీరాజ్శాఖ మంత్రిగా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసి పల్లెల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికై న అంకంపల్లి, నర్సాపూర్, పంబపూర్ గ్రామాల సర్పంచ్లను, వార్డు సభ్యులను మంత్రి సీతక్క శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఉపసంహరించుకున్న అభ్యర్థులు నిరుత్సాహపడొద్దని రానున్న రోజుల్లో పదవులు వరిస్తాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మహిళా అధ్యక్షురాలు సోమ నాగమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరగా మంత్రి సీతక్క పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మేడారం జాతర చైర్మన్ లచ్చుపటేల్, మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ పాక సాంబయ్య పాల్గొన్నారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క -
జాతరలో పనిచేయడం సేవగా భావించాలి
● ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్ ఎస్ఎస్తాడ్వాయి:మేడారం మహాజాతరలో పనిచేసే అధికారులంతా సేవగా భావించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మండల పరిధిలోని మేడారంలో జాతర విజయవంతంపై సమ్మక్క– సారలమ్మ పూజారులు, గిరిజన అభ్యుదయ సంఘం యువకులతో ఆయన బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికారులంతా నిబద్ధతతో పనిచేస్తేనే జాతర విజయవంతం అవుతుందన్నారు. గత పుణ్యం వల్లే ఈ జాతరలో తల్లులకు సేవ చేసే అదృష్టం మనందరికీ లభిస్తుందని వివరించారు. పూజారులు, యువత కోసం ప్రత్యేక పాసులు జారీ చేస్తామని, పోలీస్ శాఖ మధ్య సమన్వయ లోపం లేకుండా కృషి చేస్తామని సూచించారు. మేడారం పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతుండడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. జాతరలో 10 వేల మందికి పైగా పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అభివృద్ధి పనులపై కలెక్టర్ దివాకరతో సమీక్షించి పెండింగ్ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు లేకుండా మెరుగైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. జాతరకు వచ్చే ప్రతీ భక్తుడు సులభంగా దర్శనం చేసుకుని సురక్షితంగా తిరిగి ఇంటికి చేరేలా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పూజారులు, యువత, మేడారం ప్రజలు, పోలీసులు అంతా ఒక కుటుంబంలా కలిసి పనిచేసి, ఆచార సంప్రదాయాలను పాటిస్తూ మహాజాతరను విజయవంతం చేయాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో డీఎస్పీ రవీందర్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పస్రా సీఐ దయాకర్, ఎస్ఎస్ తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. -
సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
భూపాలపల్లి రూరల్: షిర్డీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకోని బుధవారం పట్టణంలోని కారల్ మార్క్స్కాలనీలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేకు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు మహాన్నదానం నిర్వహించారు. -
హేమాచలుడి ఆదాయం రూ.7.39 లక్షలు
మంగపేట: మండల పరిధిలోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన 9 హుండీలలోని కానుకల లెక్కింపు ద్వారా రూ.7.39 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేశ్ తెలిపారు. జులై 29 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు స్వామివారి ప్రధాన ఆలయం, వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన హుండీలలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను స్వామివారి కల్యాణ మండపంలో బుధవారం లెక్కింపు ప్రక్రియను నిర్వహించారు. 127 రోజులకు గాను రూ.7,39,429 ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు. హుండీ లెక్కింపు సందర్భంగా ఎస్సై టీవీఆర్ సూరి ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి అనిల్కుమార్, టీజీవీబి సిబ్బంది, మణుగూరుకు చెందిన శ్రీవారి సేవా సమితి బృందం, భక్తులు పాల్గొన్నారు. -
సమయం లేదు మిత్రమా!
● సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ముగిసిన మొదటి, రెండో విడత నామినేషన్ల పర్వం ● మొదటి విడత పోలింగ్ అభ్యర్థుల ప్రచారానికి వారం రోజులే గడువు ● అన్నివర్గాల మద్దతు కూడగట్టేందుకు అభ్యర్థుల తాపత్రయంములుగు: తొలి విడత నామినేషన్లు నవంబర్ 29న ముగియగా, రెండో విడత నామినేషన్లు మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 11న తొలి విడత సర్పంచ్ ఎన్నికలు జిల్లాలోని గోవిందరావుపేట, ఎస్ఎస్తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో జరగనున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానా లకు నేడు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరి లో ఉన్న అభ్యర్థులను ప్రకటించి గుర్తులను కేటా యించనున్నారు. ఎన్నికల కంటే రెండు రోజుల ముందే ప్రచారాన్ని నిలిపి వేయనుండగా తొలి విడత అభ్యర్థులు ప్రచారం నిర్వహించేందుకు వా రం రోజుల సమయం మాత్రమే ఉంది. వారం రో జుల్లో అన్ని వర్గాల మద్దతు కూడబెట్టుకోవడమే కా కుండా ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించాల్సి ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థుల్లో టెన్షన్.. అదేవిధంగా రెండో విడత ఎన్నికలు ఈ నెల 14వ తేదీన ఉండగా నామినేషన్ల పర్వం ముగిసింది. 6వ తేదీన ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించి గుర్తులను కేటాయించనున్నారు. మూడు విడతల్లో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ప్రచారానికి వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం మొదలైంది. సర్పంచ్, వార్డు స్థానాలకు అత్యధికంగా నామినేషన్లు పడిన చోట రెబెల్స్ను బుజ్జగించడం, బరిలో ఉన్న అభ్యర్థులకు ఖర్చుల కింద ప్యాకేజీలు ఇవ్వడం లాంటి సంఘటనలు కొనసాగే అవకాశం ఉంది. నువ్వా.. నేనా.. పంచాయతీ ఎన్నికల్లో నువ్వా.. నేనా అనే విధంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. ప్రచారంలోనే కాకుండా ఖర్చులో కూడా వెనుకాడేది లేదని బహిరంగంగానే చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఉన్న చోట సర్పంచ్ అభ్యర్థులు ఓటరుకు రూ.200 నుంచి 300లు, బీసీ, ఆన్ రిజర్వుడ్ ఉన్న చోట ఒక్కొక్క ఓటుకు రూ.500ల నుంచి రూ.1000లు ఇచ్చేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో మద్యం, డబ్బులు ఏరులై పారే అవకాశం ఉండగా, ఎన్నికల అధికారులు ఎంతమేర అరికడతారో వేచి చూడాల్సిందే.సర్పంచ్ అభ్యర్థిగా తమకు ఒక అవకాశం ఇవ్వాలని ఆశావహులు ప్రజలను వేడుకుంటున్నారు. గ్రామాల్లో సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు కుల సంఘాల నాయకులు, పెద్ద మనుషులను బతిమాలుకుంటున్నారు. సమయం తక్కువగా ఉండడంతో పాటు ఎన్నికల ఖర్చు సైతం తగ్గి ఈసారి విజయావకాశాలు కొంచెం మెరుగ్గా ఉంటాయనే ఉద్దేశంతో పార్టీలకు చెందిన పెద్ద నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకవైపు సమయం లేకపోవడం, మరోవైపు చోటా, బడా నేతలను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎలాగైనా మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని తాపత్రయ పడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఎలాంటి అంశాలు సానుకూలంగా ఉంటాయనే అంశంపై ఆయా పార్టీల పెద్దలు గ్రామాల్లో ఉన్న ముఖ్య నేతల నుంచి సలహాలు కోరుతున్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎలాగైన గెలిపించాలని, పార్టీల్లో విభేధాలు ఉంటే సమన్వయం చేసుకోవాలని గ్రామపంచాయతీ పరిధిలోని నాయకులకు, కార్యకర్తలను ఆయా పార్టీలకు చెందిన జిల్లా అధ్యక్షులు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు/ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మాస్టర్ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనుల్లో వేగం పెంచి సకాలంలో పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ తాడ్వాయి మండల పరిధిలోని మేడారంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్తో కలిసి జాతర పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న రాతి నిర్మాణంలో పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులను అదేశించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న క్యూలైన్ రేలింగ్ పనులను, ఊరట్టం స్తూపం వద్ద సర్కిల్ సుందరీకరణ పనులు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ రవీందర్, అధికారులు ఉన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏస్క్వేర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా పరిధిలోని 40 ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు కెరీర్ గైడెన్స్పై ఓరిఝెంటేషన్ నిర్వహించారు. ముందుగా మై సెల్ఫ్ ఈ వెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు కెరీర్ ఎంపికలో స్పష్టత, దిశానిర్దేశం ముఖ్యమన్నారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం కీస్టోన్ పాఠశాల ఫౌండర్ శ్రీ లక్ష్మీ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను ఉపాధ్యాయులు గుర్తించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రోత్సహించాలని సూచించారు. చదువులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డిగ్రీ పూర్తి అయ్యేవరకు స్కాలర్షిప్ అందిస్తామని వివరించారు. -
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ములుగు రూరల్: మేడారం మహాజాతర సమయంలో ఆదిదేవత గట్టమ్మ తల్లికి భక్తులు మొక్కులు చెల్లించే క్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు మంగళవారం గట్టమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులతో కలిసి పార్కింగ్ స్థలాలను పరిశీలించి మాట్లాడారు. గట్టమ్మ ఆలయం వద్ద చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, ఫారెస్ట్ రేంజ్ అధికారి శంకర్, సీఐ సురేష్కుమార్, ఎస్సై వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ రాంనాథ్ కేకన్ను గట్టమ్మ ఆలయ ప్రధాన పూజారులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతర సమయంలో ఆలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకపోడ్ జిల్లా అధ్యక్షుడు సురేందర్, పూజారులు కొత్త సదయ్య, మొగిలి, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు. పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి మేడారం మహాజాతర సందర్భంగా వాహనాల రద్దీకి అనుకూలంగా ఆర్టీసీ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బస్సులు బ్రేక్డౌన్ అయితే వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేయా లన్నారు. మహాజాతరకు భక్తులను తీసుకొచ్చే బాధ్యత ఆర్టీసీపై ఉందన్నారు. ట్రాఫిక్ నియంత్రణ బాధ్యత పోలీసులపై ఉంటుందని వివరించారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
పార్టీ బలోపేతానికి కృషి
గోవిందరావుపేట: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్లోని గాంధీభవన్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో టీసీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ నుంచి రెండోసారి డీసీసీ అధ్యక్షుడిగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో మరోసారి నమ్మకం ఉంచి డీసీసీ అధ్యక్షుడిగా నియమించిన ఏఐసీసీ నేతలు, సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రి సీతక్కలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి పాటుపడిన వారికి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని తెలిపారు. రెండోసారి అశోక్ డీసీసీ అధ్యక్ష పీఠం దక్కడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.డీసీసీ అధ్యక్షుడిగా రెండోసారి నియామక పత్రం అందుకున్న పైడాకుల అశోక్ -
నేడు డయల్ యువర్ డీఎం
ములుగు రూరల్: నేటి డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ వరంగల్–2 డిపో మేనేజర్ రవిచందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు వరంగల్–2 డిపోలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ములుగు జిల్లా పరిధిలోని ప్రయాణికులు సెల్ నంబర్ 7382425150కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని వివరించారు. రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. మహాజాతరకు 56 రోజులే కథనం సాక్షిలో మంగళవారం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కలెక్టర్ మేడారంలో ఆర్అండ్బీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల విసర్తణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఆర్అండ్బీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాలపై అప్రమత్తం ములుగు రూరల్: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఓఎస్డీ శివం ఉపాధ్యాయ అన్నారు. ఈ మేరకు ఆయన జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో చేపట్టిన సైబర్ నేరాలపై అవగాహన సదస్సును మెడికల్ కళాశాల, గిరిజన యూనివర్సిటీ, ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల అవగాహన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత సమాచారం పాస్వర్డ్, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఎవరితో పంచుకోకూడదని తెలిపారు. అపరిచిత లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు. డిజిటల్ అరెస్టు, బెదిరింపులకు భయపడకూదన్నారు. ప్రజలు సైబర్ మోసాల బారిన పడితే 1930 టోల్ ఫ్రీ నంబర్కు, క్రైమ్ పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ నందిరాం, సీఐ సురేశ్, గిరిజన యూనివర్సిటీ రిజిస్టర్ రఘురాం, మెడికల్ కళాశాల ఫ్యాకల్టీ జీవన చంద్ర, క్రైమ్ సిబ్బంది శ్రీకాంత్, శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
భారీ క్రేన్లు.. రాతి పిల్లర్లు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారానికి భారీ క్రేన్లు.. రాతి పిల్లర్లను మంగళవారం ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చారు. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంలో భాగంగా గద్దెల చుట్టూ సాలహారం స్టోన్స్ నిర్మాణం పనులు సాగుతున్నాయి. అదే విధంగా ప్రధాన ఆర్చీ ద్వారాలకు సంబంధించిన భారీ రాతి పిల్లర్లను మేడారానికి తీసుకొచ్చారు. వాటిని కిందకు దింపేందుకు భారీ క్రేన్లు మేడారానికి వచ్చి వాటిని కిందకు దింపాయి. ఈ సందర్భంగా భారీ క్రేన్లను భక్తులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు.మేడారంలో భారీ క్రేన్లు -
బస్టాండ్ నిర్మాణ పనుల పరిశీలన
మంగపేట: మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఆర్టీసీ బస్టాండ్ భవన నిర్మాణం పనులను ఆర్టీసీ కరీంనరగర్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సల్మాన్, వరంగల్ ఈఈ రవీంద్రనాథ్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. రూ.52 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టిన పనులు ఏడాదిన్నర అవుతున్నా నేటికి నత్తనడకన కొనసాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో మేడారం మహాజాతర ప్రారంభం కానుండడంతో బస్టాండ్ నిర్మాణ పనులు ఎంతమేరకు జరిగాయి, ప్రభుత్వ నిబంధనల మేరకు కాంట్రాక్టర్ పనులు చేస్తున్నాడా లేదా అని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పని గడువు ముగిసినా పనులు పూర్తి కాకపోవడం నిబంధనల మేరకు గ్రౌండ్లో గ్రావెల్కు బదులు పంట పొలాల్లోని ఇసుక మట్టిని నింపిన విషయంపై సంబంధిత కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ భవన నిర్మాణం, ప్రాంగణం గ్రౌండ్లో గ్రావెల్తో ఫిల్లింగ్ చేసి పైన మెటల్ లేర్ వేసి రోలర్తో రోలింగ్ చేయాల్సి ఉందని కాంట్రాక్టర్ను ప్రశ్నించారు. స్థానికంగా గ్రావెల్, కంకర దొరకడం లేదని, రోలర్ లేదని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఎస్టిమేట్ ప్రకారం పనులు పూర్తి చేయకపోతే పనులు నిలిపివేయాలని ఆదేశించారు. -
మహాజాతర మరో
నెల రోజుల ముందు నుంచే భక్తుల తాకిడిమేడారం అభివృద్ధి పనుల కోసం వచ్చిన యంత్రాలుసాక్షిప్రతినిధి, వరంగల్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు వేళవుతోంది. రెండేళ్లకోసారి జిల్లాలోని ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించే సమ్మక్క–సారలమ్మ జాతరకు కోటి మందికిపైగా భక్తులు తరలివస్తారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కుంభమేళాను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తలపెట్టింది. ఇందుకోసం రూ.150 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా సెప్టెంబర్ 23న మేడారం సందర్శించి వివరాలు వెల్లడించారు. వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అయితే.. ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షల మేరకు క్షేత్రస్థాయిలో పనులు వేగంగా జరగట్లేదు. ఈనెల నుంచే భక్తజనం.. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతరకు సమయం మరో 56 రోజులే మిగిలి ఉంది. ఈనెల రెండో వారం నుంచే భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. ప్రతీ జాతరకు కనీసం నాలుగైదు నెలల ముందు నుంచి నిర్వహణ ఏర్పాట్లు, అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. ఈసారి జాతర కోసం ప్రభుత్వం పంచాయతీరాజ్కు రూ. 51.30 కోట్లు, రహదారులు, భవనాల శాఖకు రూ.9.95 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.5.90 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.8.57 కోట్లు.. ఇలా సుమారు 21 శాఖలకు మొత్తం రూ.150 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. వంద రోజుల్లోనే పనులు పూర్తి చేయాలని సీఎం ఉన్నతాధికారులకు పదే పదే సూచించారు. ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వారంలో రెండు రోజులు ఈ పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇప్పటికీ మేడారంలో మూడు పర్యాయాలు, హైదరాబాద్లో రెండుసార్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జిల్లా మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా రహదారుల విస్తరణ, సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, క్యూలైన్లు సహా పలు ముఖ్యమైన పనులు మాత్రం ఇంకా ముగింపు దశకు చేరుకోలేదు. పనుల వేగవంతానికి ఆదేశం.. జాతర సమయం సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్కుమార్, తన సలహాదారు వేం నరేందర్రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో ఆయన జాతర పనులు, ఏర్పాట్లపై ఆరా తీశారు. కొన్ని ప్రధాన పనుల ఆలస్యంపై అధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. కాగా, మేడారంలో పురోగతిలో ఉన్న పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘గద్దెల దగ్గరలో ఉన్న చెట్లను తొలగించవద్దు. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దు. నిర్మాణంలో విమర్శలకు తావివ్వొద్దు. గద్దెల సమీపంలో వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం అధికారులకు సూచించారు. గద్దెల దగ్గర నాలుగు వైపులా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి, గ్రాండ్ లుక్ వచ్చేలా లైటింగ్ ఏర్పాటు చేయాలని, గుడి చుట్టూ పచ్చదనం పెంపొందించాలని ఆదేశించారు. భక్తుల రద్దీ పెరగనున్నందున ఆలస్యం చేయకుండా పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో ఇప్పటికై నా పనుల్లో వేగం పెరుగుతుందన్న చర్చ అన్ని వర్గాల్లో జరుగుతోంది. సుమారు రూ.150 కోట్లతో కొసాగుతున్న పనులు సెప్టెంబర్ 23న సీఎం సందర్శన.. వంద రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం హైదరాబాద్లో అత్యవసర సమీక్ష.. పనుల తీరుపై సీఎం సీరియస్ -
ప్రత్యేక పాలన
14ఏళ్లుగా..అధికారుల పాలనలో అభివృద్ధి శూన్యం● కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం ● అనేక సమస్యలతో తల్లడిల్లుతున్న గ్రామాలు మంగపేట మండల కేంద్రంమంగపేట: మంగపేట మండలం షెడ్యూల్డ్ అని గిరిజనులు.. కాదు నాన్ షెడ్యూల్డ్ అని గిరిజనేతరుల మధ్య నలుగుతున్న పంచాయితీ వీడడం లేదు. దాదాపుగా 14 ఏళ్లుగా ఈ మండల పరిధిలోని 25 గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేక ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. సమస్యలను ఎవరూ సరిగా పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. ఈసారి కూడా ‘పంచాయితీ’ తేలకపోవడంతో ఎన్నికలు జరగని పరిస్థితి నెలకొంది. అసలు పంచాయితీ ఏమిటంటే.. మండలంలో ప్రస్తుతం 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రొటేషన్ పద్ధతిపై పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో 2006లో అప్పటి 18 గ్రామాలకు నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో షెడ్యూల్డ్ ప్రాంతంగా పరిగణిస్తూ అన్ని స్థానాలను ఎస్టీ రిజర్వేషన్ పద్ధతిన ఎన్నికలు నిర్వహించారు. ఈ మండలం షెడ్యూల్డ్ పరిధిలోకి రాదని 2011లో గిరిజనేతరులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలను నిలుపుదల చేస్తూ కోర్టు స్టే ఇచ్చింది. అప్పటి నుంచి కోర్టుల్లో నలుగుతున్న ఇరువర్గాల పంచాయితీపై 05 జూలై 2023న గిరిజనులకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ గిరిజనేతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గిరిజనేతరుల పిటిషన్ను పరిశీలించిన సుప్రీం.. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. దీంతో 2011 నుంచి పంచాయతీ ఎన్నికలు ప్రతిసారీ వాయిదా పడుతూనే ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు లేకపోవడంతో 14 ఏళ్లుగా ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలోనే పరిపాలనలో కొనసాగుతోంది. ప్రజాధనం అవినీతిపరుల పాలు.. మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు సర్పంచ్లు లేకపోవడంతో గడిచిన 14 ఏళ్లు ప్రత్యేకధికారుల పాలనలో పంచాయతీల అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చిన కోట్ల రూపాయల నిధులను కార్యదర్శులు మొదలుకుని మండల స్థాయి అధికారుల వరకు స్వాహా చేసిన ఆరోపణలున్నాయి. ఈ మండలంలో రూ.3 కోట్లకు పైగా కాజేసి సస్పెండ్ కూడా అయ్యారు. రూ.4 కోట్లకు పైగా పనులు చేయకుండానే చేసినట్లుగా రికార్డుల్లో చూపించి కాజేసినట్లు బహిరంగ రహస్యం. అభివృద్ధికి ఆమడ దూరం మండలంలో సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సైతం నిలిచిపోవడంతో ప్రజా ప్రతినిధులు అనే వారే లేకపోవడంతో గ్రామాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ప్రత్యేకధికారులు ఉత్సవ మూర్తుల్లా వ్యవహరించడం, పంచాయతీ కార్యదర్శుల్లో జవాబుదారీతనం లేక పోవడంతో పాటు గ్రామసభలు నిర్వహించకపోవడంతో పంచాయతీల అభివృద్ధికి నిధులు ఎంత వచ్చాయి, వాటిని దేనికి ఖర్చుచేశారనేది లెక్కాపత్రం లేకుండాపోయింది. మౌలిక వసతులపై అడిగేందుకు అధికారులు అందుబాటులో లేక పోవడంతో గ్రామాల్లో కనీసం వీదిలైట్ల ఏర్పాటు లేక పోవడం, తాగునీటి సమస్య వెంటాడుతూనే ఉంది.మండల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందిఏజెన్సీ, నాన్ ఏజెన్సీ పంచాయితీ కారణంగా పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో మండల అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. స్థానిక ప్రజా ప్రతినిధులు లేక పోవడంతో ప్రజల సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారు. గ్రామాల్లో మౌలిక సదుపాయల కల్పన, విద్య, వైద్యం, అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ, వీధిలైట్ల ఏర్పాటు అనేక సమస్యలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. త్వరితగతిన సమస్య పరిష్కారమై ఎన్నికలు నిర్వహిస్తే మండల ప్రజలకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. – గుగ్గిళ్ల సురేశ్, తెలంగాణ అంబేడ్కర్ సంఘం మండల అధ్యక్షుడు మంగపేటఅధికారుల ఇష్టారాజ్యంప్రత్యేకధికారుల పాలనలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పంచాయతీల కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమవుతున్నాయి. అధికారుల్లో జవాబుదారీతనం పూర్తిగా కొరవడింది. ఏఒక్క అధికారి అందుబాటులో ఉండక గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు తమను అడిగేవారు లేరనే దీమాతో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. – గాదె శ్రీనివాసాచారి, ఎన్హెచ్ఆర్సీ జిల్లా ఉపాధ్యక్షుడు, తిమ్మంపేట -
నిబంధనలు అతిక్రమించిన నాయకులు
ములుగు రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నిబంధనలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అతిక్రమించారు. ఈ మేరకు సోమవారం మల్లంపల్లి మండల పరిధిలోని మహ్మద్గౌస్పల్లిలో రెండో రోజు సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు నిబంధనలు పట్టించుకోలేదు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరొకరు మాత్రమే లోపలికి వెళ్లే అవకాశం ఉంది. నామినేషన్ వేసేందుకు డీజే, డప్పులతో వచ్చారు. అలాగే నామినేషన్ సమర్పించేందుకు నాయకులు గుంపుగా వెళ్లడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు వాగ్వాదం చోటుచేసుకుంది. నిబంధనలు అతిక్రమించడమే కాక పోలీసులపై దురుసుగా ప్రవర్తించడాన్ని కాంగ్రెస్ నాయకులను పలువురు తప్పుపట్టారు. పోలీసులు, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం -
కర్రె గుట్టలపైకి రహదారి
● బేస్ క్యాంపు నుంచి పామునూరు వరకు ● ప్రారంభమైన 10కిలో మీటర్ల పనులు వాజేడు: కర్రె గుట్టలను పర్యాటక హబ్, ప్రశాంత ప్రదేశంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనుల్లో ముందడుగు వేసింది. అందులో భాగంగానే ముందుస్తుగా మండల పరిధిలోని మొరుమూరు గ్రామం వద్ద సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపును ఏర్పాటు చేసిన వారం రోజుల వ్యవధిలో రహదారి పనులను చేపట్టారు. మొరుమూరు బేస్ క్యాంపు నుంచి కర్రె గుట్టలపై ఉన్న పామునూరు వరకు రహదారిని నిర్మిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం రహదారి నిర్మాణ పనులకు పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. మొరుమూరు బేస్ క్యాంపు నుంచి పామునూరు వరకు 10 కిలో మీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారు. రహదారి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ రహదారి పూర్తయితే పోలీస్ బలగాలు గుట్టలపైకి వెళ్లడానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. -
వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
కల్యాణాన్ని తిలకిస్తున్న భక్తులుఏటూరునాగారం: మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో గీతా జయంతిని పురస్కరించుకుని సోమవారం శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగా, పద్మావతి అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కమిటీ సభ్యులు, అర్చకులు ఎల్లాప్రగడ నాగేశ్వరరావు శర్మ, మణికంటశర్మ, హయగ్రీవచారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రామాలయం చైర్మన్ అలువాల శ్రీనివాస్, కత్తెర శ్రీనివాస్, తాడూరి దీనబంధావస్వామి, బాల్యం ప్రసాద్, చెన్న రాంబాబు, శ్రీనివాస్, రాహుల్, సిసింద్రి, ఎగ్గడి జగదీశ్, చిప్ప అశోక్, సర్వేశం, గుంత రమేష్, నూక ప్రభాకర్, గంజి రమేష్ అయ్యప్పస్వామి దేవాలయం చైర్మన్ బోలుసాని గౌరీ శంకర్, సాయిబాబా దేవాలయం చైర్మన్ పెండ్యాల ప్రభాకర్, అయ్యప్ప గురు స్వాములు వసంత రమేష్, సిద్ధూ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథంలో ఊరేగించారు. భక్తి పాటలతో సేవకులు నృత్యాలు చేశారు. భక్తులు రథానికి ఎదురువచ్చి నీళ్లు ఆరబోసి కొబ్బరికాయలను కొట్టారు. -
ఎయిడ్స్వ్యాధి నిర్మూలనకు పాటుపడాలి
● డీఎంహెచ్ఓ గోపాల్రావు ములుగు రూరల్: ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంపై అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అడ్డంకులను అధిగమిద్దాం, ఎయిడ్స్ ప్రతిస్పందనను మారుద్దాం అనే నినాదంతో ఈ సంవత్సరమంతా ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు. ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించి వ్యాధిని అరికట్టవచ్చని వివరించారు. కళాశాల, ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాధి పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ నియంత్రణ అధికారి చంద్రకాంత్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు శ్రీకాంత్, రణధీర్, డీపీఎంవో సంజీవరావు, డెమో సంపత్, ఏఎంఓ దుర్గారావు, ఎయిడ్స్ జిల్లా నియంత్రణ ప్రోగ్రాం మేనేజర్ నీలిమా తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర ఘాట్లకు పగుళ్లు
రామన్నగూడెంలో గోదావరి వద్ద నెర్రెలుబారి కూలిపోయిన పుష్కర ఘాట్ మెట్లుఘాట్ వద్ద కోతకు గురవుతున్న ఒడ్డు ఏటూరునాగారం: ఏటూరునాగారం మండలం రామన్నగూడెం, మంగపేట మండలంలో పుష్కరఘాట్లు గోదావరి ప్రవాహానికి పగుళ్లు తేలి, నెర్రెలుబారి ప్రశ్నార్ధకంగా మారాయి. కరకట్ట కోతకు గురవుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కరకట్ట పునఃనిర్మాణం చేపడుతామన్న ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో గోదావరి నది సుమారు 110 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. పవిత్ర గోదావరి నది స్నానం, పుణ్యకార్యాలు, కర్మలకు ప్రాధాన్యంగా నిలుస్తోంది. జిల్లాలోని రామన్నగూడెం వద్ద 2003లో గోదావరి పుష్కరాల సందర్భంగా అప్పటి ప్రభుత్వం రూ.67లక్షల నిధులతో పుష్కర ఘాట్ను నిర్మించారు. 12 సంవత్సరాలకొకసారి వచ్చే పుష్కరాల కోసం మొట్టమొదటిగా రామన్నగూడెం ఘాట్ను నిర్మించడం గమనార్హం. అనంతరం 2015లో వచ్చిన పుష్కరాలకు మరో రూ.కోటి కేటాయించి అదనపు ఘాట్ను నిర్మించారు. ఈ రెండు ఘాట్లు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. వర్షాకాలంలో వచ్చే వరదలకు గోదావరి నది ఉధృత రూపానికి పుష్కరఘాట్ బీటలు తేలి, నెర్రెలుబారి పగిలిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి. గోదావరి వరద ఉధృతి వల్ల కాంక్రీట్ మెట్లు సైతం కూలిపోయాయి. అక్కడ భక్తులు దిగేందుకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. మరోమారు గోదావరి వస్తే ఇక్కడ పుష్కర ఘాట్కు మెట్లు ఉండేవి అనే సందేహం నెలకొనే పరిస్థితి ఉంది. మంగపేటలోని పుష్కరఘాట్ సైతం గోదావరి ప్రవాహానికి కొట్టుకుపోయింది. గోదావరి మెట్లకు నెర్రెలుబారింది. ఇక్కడ కూడా 2015లో పుష్కరాల సమయంలో మొదటగా గోదావరి పుష్కర ఘాట్ను ఏర్పాటు చేశారు. వచ్చే పుష్కరాలకు కేంద్ర బిందువు 2027లో జరగనున్న గోదావరి పుష్కర ఘాట్కు రామన్నగూడెం అత్యంత కీలకమైంది. గోదావరి ఒడ్డు వెంట శివాలయం ఉండడంతో గోదావరిలో స్నానం ఆచరించిన భక్తులు శివపార్వతులను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందుకు రామన్నగూడెం పుష్కరఘాట్కు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. గోదావరి వరద ప్రతీ ఏటా కొత్త రూపాన్ని దాల్చి ప్రవాహ సరళిని మార్చుకొని ప్రవహిస్తోంది. గోదావరి ఉగ్రరూపం వల్ల ఘాట్ కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు. పదేళ్ల నుంచి కరకట్ట పునఃనిర్మాణం చేపడుతామన్న ప్రభుత్వాలు మిన్నకుండి పోతున్నాయి. కరకట్టతోపాటు ఘాట్ కూడా లేకుండా పోయే దుస్థితిలోకి వచ్చింది. అధికారుల సందర్శన కేంద్ర జలవనరులు, భారీ నీటిపారుదల శాఖ అధికారులు సైతం కరకట్ట వెంట ఉన్న పుష్కర ఘాట్ను చాలాసార్లు పరిశీలించారు. గోదావరి వరద సమయంలో సైతం జిల్లా అధికారులు, రాష్ట్ర మంత్రులు సైతం రామన్నగూడెం పుష్కరఘాట్ను సందర్శించి మరమ్మతు చర్యలు చేపడుతామని పేపర్ల ప్రకటన మాత్రమే చేసి వదిలేశారు. సర్వేలు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసినప్పటికీ ఉలుకు పలుకు లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల ముందు చూపులేని తనంతో గోదావరి పవిత్రకు, రక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. గోదావరి వరద గ్రామాల్లోకి రాకుండా నిర్మించిన రక్షణ గోడలు ఒక్కొక్కటిగా నీటిలో కలిసిపోతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గోదావరి ఉగ్రరూపానికి జలసమాధి కావాల్సి వస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కోతకు గురవుతున్న ఒడ్డుపుష్కర ఘాట్కు రక్షణగా నిర్మించిన మట్టి కట్ట, ఒడ్డు సైతం గోదావరి వరదతో కోతకు గురవుతోంది. దీనివల్ల ఘాట్కు ఇటు గ్రామానికి ప్రమాదం పొంచి ఉంది. మట్టి ప్రతి ఏడాది గోదావరి నీటిలో కలిసిపోతూ మూడు మీటర్ల మేర గుంతలు ఏర్పడ్డాయి. మట్టి కొట్టుకుపోతుండడంతో ఘాట్కు ఉన్న రక్షణ గోడలు సైతం కూలిపోయే దశకు చేరడం గమనార్హం. ఇలానే వదిలేస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. మరమ్మతులు చేపట్టేనా? కోతకు గురవుతున్న కరకట్ట వచ్చే పుష్కరానికి కీలకం కానున్నరామన్నగూడెం ఘాట్ -
ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు ప్రణాళిక
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ములుగు రూరల్ : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నియంత్రణ చర్యల్లో భాగంగా ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అధికారులకు సూచించారు. జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి ఆదివారం గట్టమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో వారు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మేడారం వచ్చే భక్తులు ఆది దేవత గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తారని అందుకు అనుగుణంగా పార్కింగ్ స్థలాలను గుర్తించాలని తెలిపారు. వాహనాల రాకపోకలతో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండే విధంగా ప్రత్యామ్నాయ దారిని ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు సహకరించాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల పార్కింగ్కు వేర్వేరు ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, ఫారెస్టు రేంజ్ అధికారి శంకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శంకర్, సీఐ సురేష్, ఎస్సై వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ వ్యాన్ డ్రైవర్ల వేతనాలు పెంచాలి
భూపాలపల్లి అర్బన్: స్కూల్ వ్యాన్ డ్రైవర్లు, క్లీనర్ల వేతనాలు పెంచాలని భూపాలపల్లి పట్టణ అఖిల పక్ష పార్టీల నాయకులు, విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ది కాకతీయ ప్రైవేట్ స్కూల్స్ వ్యాన్ డ్రైవర్స్, క్లీనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ, డీఎస్పీ, టీఆర్పీ, ఏఐటీయూసీ, విద్యార్థి యువజన సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ పార్టీలు, సంఘాల నాయకులు సోత్కు ప్రవీణ్కుమార్, రాజేందర్, గీసా సంపత్, సతీష్, రవీందర్, రవిపటేల్, వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, సురేష్ మాట్లాడారు. ది కాకతీయ స్కూల్ వ్యాన్ డ్రైవర్ క్లీనర్ అసోసియేషన్ మూడు డిమాండ్లతో ఒక రోజు సమ్మె చేపట్టినట్లు తెలిపారు. డ్రైవర్ వేతనం నెలకు రూ.20వేలు, క్లీనర్ వేతనం రూ.10వేలు, 12 నెలల జీతం చెల్లించాలని, ఇద్దరు పిల్లలకు ఉచిత విద్యను అందించాలని కోరారు. ఈ డిమాండ్లతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం (ట్రస్మా) దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాలేదన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రతి సంవత్సరం స్కూల్ ఫీజులు పెంచుతూ యాజమాన్యం లాభాల్లో ఉన్నప్పటికీ డ్రైవర్లకు, క్లీనర్లకు జీతాలు పెంచకపోవడం చాలా దారుణమన్నారు. సమ్మెకు అన్ని రాజకీయ, విద్యార్థి, యువజన సంఘాల మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ది కాకతీయ ప్రైవేట్ స్కూల్ వ్యాన్స్, క్లీనర్ అసోసియేషన్ నాయకులు నాతరి ప్రదీప్, పువ్వాడ రాంబాబు, జైద నర్సింగ్, మీసాల శ్రీనివాస్, జైద మధు, బొల్లపల్లి అశోక్, ఓరిగంటి కిరణ్, ఎండీ షఫీ, నేలి మొగిలి, దుబ్బాక సందీప్ పాల్గొన్నారు. ఒక రోజు సమ్మె -
హేమాచలానికి పోటెత్తిన భక్తులు
మంగపేట: మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేటు వాహనాల్లో వేలాదిగా తరలివచ్చి సందడి చేశారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద భక్తులు స్నానాలు ఆచరించి స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి ఆలయ చరిత్ర, పురాణం వివరించి వేదాశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాల నుంచి అయ్యప్ప మాలధారులు, భక్తులు తరలివచ్చి లక్ష్మీనర్సింహస్వామి దర్శించుకున్నారు. -
ఆరు వార్డులకు నామినేషన్లు నిల్..!
● 32 వార్డులకు ఒక్కో దరఖాస్తుతో ఏకగ్రీవం.. గోవిందరావుపేట: మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసే సరికి చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. మొత్తం 18 గ్రామ పంచాయతీలు ఉండగా 154 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందులో 32 వార్డులకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి. ఆరు వార్డుల్లో ఒక్క నామినేషన్ రాలేదు దీంతో ఎలాంటి ఓటింగ్ అవసరం లేకుండానే వారిని ఈ నెల 3న నామినేషన్ల ఉపసంహరణ రోజున విజేతలుగా ప్రకటించే అవకాశం ఉంది. నామినేషన్లు రాకపోవడంతో తిరిగి ఎన్నికలు తప్పవా? మండలంలోని ఆరు వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అభ్యర్థుల ఎంపికలో విభేదాలు, కమ్యూనిటీ స్థాయి సమీకరణాలు, స్థానిక వర్గాల మధ్య అనుసంధానం వంటి కారణాలతో ఆయా వార్డుల్లో పోటీకి ఎవరూ ముందుకు రాలేకపోయినట్లు సమాచారం. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ దాఖలు కానీ ఆరు వార్డులకు తొలిదశ ఎన్నికలు పూర్తయిన తర్వాత మరోసారి నోటిఫికేషన్ జారీ చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మండలంలో గ్రామ పంచాయతీ రాజకీయాలు కాస్త వేడెక్కాయి. ఏకగ్రీవాల ప్రభావం, ఖాళీగా ఉన్న వార్డుల పున:ఎన్నికలు, మిగతా వార్డుల్లో జరగనున్న పోటీ మొత్తం ఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తాయోననే అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. -
గద్దెల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి
ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణ పునఃనిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. వరుస క్రమంలో నిర్మిస్తున్న వనదేవతల పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల నిర్మాణ పనులను ఆదివారం సీతక్క పరిశీలించారు. నూతనంగా నిర్మించిన గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజును ఈనెల 4న పూజారులు ప్రతిష్ఠించే అవకాశం ఉందని త్వరగా పనులు పూర్తి చేయాలని ఆమె కాంట్రాక్టర్ను అదేశించారు. గద్దెల ప్రాంగణంలో సీసీ ఫోర్లింగ్ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను అదేశించారు. ఆమె వెంట జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, అధికారులు ఉన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు పాటుపడాలి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం మేడారంలోని హరితహోటల్లో మండలంలోని ఎల్బాక గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొక్క రాజు, సుశీల, మడ్డి వెంకన్న, సమ్మక్క, గుండ్లపల్లి సమ్మయ్య, పాయం వెంకటరావు, శాంతమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరగా మంత్రి సీతక్క కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఈసందర్భంగా సీతక్క మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అభ్యర్థుల విజయానికి కష్టపడి పని చేయాలన్నారు. గ్రామాలభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్, మాజీ ఎంపీపీ ఎనగంటి రాములు, నార్లాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. మంత్రి సీతక్క -
సర్పంచ్ 18.. వార్డులకు 37
రెండో విడత నామినేషన్లు ప్రారంభం ములుగు రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల స్వీకరణ ఆదివారం ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల్లో ప్రారంభమైంది. వెంకటాపురం (ఎం) మండలంలో సర్పంచ్ స్థానానికి–9, ములుగు మండలంలో 4, మల్లంపల్లి–5 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం సర్పంచ్ నామినేషన్లు–18, వార్డు సభ్యుల నామినేషన్లు–37 దాఖలు చేశారు. మరో రెండు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. వాహనాల తనిఖీ ఏటూరునాగారం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలోని 163 జాతీయ రహదారిపై ఆదివారం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. అనుమానిత వాహనాలను క్షుణ్ణంగా సోదా చేసి పంపించారు. ప్రయాణికులు, డ్రైవర్ల వివరాలను తెలుసుకున్నారు. అలాగే మద్యం, డబ్బు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ఇతర వస్తువులు సరఫరా అవుతున్నాయా అని ఆరా తీస్తున్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపిక కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన వెలగందుల తరుణి 6వ తరగతి, వెలగందుల తణ్మయి 8వ తరగతి విద్యార్థులు వీవీఎం (విద్యార్థి విజ్ఞాన్ మంథన్) పరీక్షకు రాష్ట్రస్థాయి ఎంపికై నట్లు జిల్లా వీవీఎం కోఆర్డినేటర్, పాఠశాల ఫిజికల్ సైన్స్ టీచర్ మడక మధు ఆదివారం తెలిపారు. వచ్చే నెలలో హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పరీక్షలో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికై నందుకు పాఠశాల హెచ్ఎం జి.శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యాయులు సరిత, సుధారాణి, సరితాదేవి, వలిపాషా, శ్రీనివాస్, రజిత, లీలారాణి, సమ్మయ్య, వీరేశం, దీపిక, వసుధప్రియా, ప్రసూన, సాహెదాబేగం, పూర్ణిమ, అజ్మాత్పాషా, ఆంజనేయులు విద్యార్థులను అభినందించారు. తరుణి తన్మయి -
సర్పంచ్లకు 275.. వార్డులకు 913 దాఖలు
ముగిసిన మొదటి దశ నామినేషన్లు ఏటూరునాగారం: గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్లు శనివారంతో ముగిశాయి. జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీల నాయకులు రెండు మూడు సెట్లతో కూడిన నామినేషన్లను అందజేశారు. నేడు స్రూటినీ చేయనున్నారు. 3వ తేదీన ఉపసంహరణల అనంతరం అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. ఏ మండలంలో ఎన్ని నామినేషన్లు.. ఏటూరునాగారం మండలంలో సర్పంచ్కు 75, వార్డు సభ్యులకు 266, తాడ్వాయి మండలంలో సర్పంచ్కు 111, వార్డు సభ్యులకు 280, గోవిందరావుపేట మండలంలో సర్పంచ్కు 89, వార్డుసభ్యులకు 367 నామినేషన్లు దాఖలు చేశారు. -
పరిశీలన.. సమీక్ష
● ‘గ్రేటర్’లో రోజంతా బిజీబిజీగా గడిపిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి ● వరంగల్ రైల్వే స్టేషన్ పరిశీలన.. క్యాంటీన్లో చాయ్పే చర్చ ● శ్రీభద్రకాళి, వేయిస్తంభాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు● కల్యాణమండపం పనుల అలసత్వంపై అసంతృప్తి ● కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ తనిఖీ.. పనులపై ఆరా ● వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి – హన్మకొండ/హన్మకొండ కల్చరల్/ఖిలా వరంగల్/కాజీపేట రూరల్ వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండపాన్ని పరిశీలిస్తున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి, చిత్రంలో బీజేపీ నాయకులు -
తొలి సర్పంచ్ కందుకూరి కాంతయ్య
హసన్పర్తి: హనుమకొండ మండలం గోపాలపురానికి చెందిన కందుకూరి కాంతయ్య గ్రామానికి తొలి సర్పంచ్. 1979 నుంచి 1995 వరకు వరుసగా 17 ఏళ్ల పాటు సర్పంచ్గా సేవలందించారు. హనుమకొండ సమితి డిప్యూటీ ప్రెసిడెంట్గా, ఏనుమాముల మార్కెట్ కమిటీ డైరెక్టర్గా, వరంగల్ కో–ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా పదవులు నిర్వర్తించారు. మాజీ మంత్రి హయగ్రీవాచారికి ముఖ్య అనుచరుడిగా వ్యవహరించారు. 1999లో ఆయన హత్యకు గురయ్యారు. ఆయన సేవలకు గుర్తుగా గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్ద కాంతయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏటా కాంతయ్య వర్ధంతి, జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. కాంతయ్య స్ఫూర్తితో ఆయన కుటుంబీకులు రాజకీయంలో రాణిస్తున్నారు. -
నిస్వార్థ సేవ.. వెలిశాల తోవ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన వెలిశాల రాధాకృష్ణ 1975 నుంచి 1995 వరకు నాలుగు పర్యాయాలు సర్పంచ్గా పనిచేశారు. అనంతరం 2000 నుంచి 2005వ సంవత్సరం వరకు మళ్లీ ఎన్నికై ప్రజలకు సేవలందించారు. గ్రామ అభివృద్ధికి తనవంతుగా కృషి చేశారు. భూ సమస్యలు, కుటుంబ తగాదాలను పరిష్కరించారు. మృధుస్వభావిగా ఉంటూ అందరి మన్ననలు పొందారు. నిస్వార్థంగా సేవ చేసిన ఆయన 2006 మార్చిలో మృతిచెందారు. పలు పార్టీల నేతలు, గ్రామస్తుల సహకారంతో 2014 జనవరి 27న రాధాకృష్ణ విగ్రహాన్ని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు. -
ములుగు
ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025వసతుల కల్పన.. అభివృద్ధి రూపకల్పనదామెర: హనుమకొండ జిల్లా దామెర మండలం కోగిల్వాయికి చెందిన గట్ల మల్లారెడ్డి సేవలు ఇప్పటికీ గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. 1984–90, 1996–2001 రెండు పర్యాయాలు సర్పంచ్గా సేవలందించారు. గ్రామంలో ప్రైమరీ, హై స్కూల్ నిర్మించారు. పలు గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, పైప్లైన్, బస్షెల్టర్ నిర్మాణం, అంతర్గత రోడ్లు, వీఽధి దీపాలు ఏర్పాటు వంటి ఎన్నో సేవలు చేశారు. ఆయన సేవలకు గుర్తుగా గ్రామంలోని కూడలిలో మల్లారెడ్డి ప్రతిమను ప్రతిష్టించారు. మల్లారెడ్డి కుమారుడు గట్ల విష్ణువర్ధన్ రెడ్డి అమెరికా నుంచి వచ్చి 2018 నుంచి 2024 వరకు సర్పంచ్గా, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడిగా సేవలందించారు. -
మోహన్రావుది వీర మరణం!
టేకుమట్ల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలంలోని రామకిష్టాపూర్(వి) గ్రామానికి చెందిన లింగంపల్లి మోహన్రావు నాలుగు పర్యాయాలు సర్పంచ్గా ఎన్నికయ్యారు. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ సేవలందించారు. సొంత ఖర్చులతో రోడ్ల విస్తరణ, సబ్స్టేషన్ ఏర్పాటు రోడ్లు, డ్రెయినేజీ, నీటి వసతి ఇలా అనేక సేవలందించారు. సర్పంచ్గా కొనసాగుతున్న సమయంలోనే 2009లో మావోయిస్టులో చేతిలో హతమయ్యారు. దాంతో ఆయన అభివృద్ధ్దికి గుర్తుగా గ్రామస్తుల కోరిక మేరకు గ్రామ పంచాయతీ వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయనది వీరమరణమని ఇప్పటికీ స్థానికులు చెప్పుకుంటారు.. -
మేడారంలో హెల్త్ డైరెక్టర్ పర్యటన
ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వైద్యశిబిరాల స్థలాలను రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ శనివారం పరిశీలించారు. మేడారంలో 2026 జనవరి 28నుంచి 31వరకు జరుగనున్న మహాజాతర నేపథ్యంలో భక్తులకు అందించే వైద్యసేవల ఏర్పాట్లను ఆయన పరిశీలిస్తు పర్యటించారు. టీటీడీ కల్యాణ మండపాన్ని దర్శించి ఆస్పత్రి ఏర్పాటుపై ఉమ్మడి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత జాతరలో వైద్యసేవల పరంగా ఏర్పడిన ఇబ్బందులను ఈసారి జాతరలో తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. కార్యక్రమంల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ గోపాల్రావు, అప్పయ్య, సాంబశివరావు, డీపీఎం సంజీవరావు పాల్గొన్నారు. లక్ష్మీదేవరకు విడిది ఏర్పాటు చేయాలి వెంకటాపురం(ఎం) : మేడారం వనదేవతల సన్నిధిలో సమ్మక్క– సారక్కల ఆడబిడ్డ అయిన ఆదివాసీ లక్ష్మీదేవరకు విడిది ఏర్పాటు చేయాలని ఆదివాసీ నాయక పోడ్ దెబ్బ వ్యవస్థాపక అధ్యక్షుడు దబ్బా సుధాకర్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో లక్ష్మీదేవర గుడారపు పండుగకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడారం మహాజాతరలో సమ్మక్క–సారలమ్మ గద్దెలకు రాకముందే ఆదివాసీ లక్ష్మీదేవర వనదేవతల గద్దెలు తొక్కుతుందని పేర్కొన్నారు. మేడారంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాలు ఆదివాసీల ఇలవేల్పు లక్ష్మీదేవరలకు మేడారంలో విడిది ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయక పోడ్ దెబ్బ కోఆర్డినేటర్ నెమలి నర్సయ్య, నాయకులు బొల్లెం సారయ్య, గాలి సమ్మయ్య, మధు, సరోజన, యాదగిరి, రాజు, స్వామి, కనకయ్య, రామక్క తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా ఇన్చార్జ్ల నియామకం హన్మకొండ: భారతీయ జనతా పార్టీ జిల్లాల వారీగా ఇన్చార్జ్లను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఇన్చార్జ్ల పేర్లను శనివారం ప్రకటించారు. హనుమకొండ జిల్లాకు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి)ను ఇన్చార్జ్గా నియమించారు. వరంగల్కు కొండపల్లి శ్రీధర్ రెడ్డి (ఖమ్మం), జయశంకర్ భూపాలపల్లికి దశమంత రెడ్డి (జనగామ), మహబూబాబాద్కు డాక్టర్ జరుపులావత్ గోపి (నల్లగొండ), ములుగు జిల్లాకు డాక్టర్ కోరండ్ల నరేష్ (రంగారెడ్డి), జనగామ జిల్లాకు కట్ట సుధాకర్ రెడ్డి (నాగర్ కర్నూల్)ను ఇన్చార్జ్గా నియమించారు. భక్తులతో కిక్కిరిసిన హేమాచలంమంగపేట : మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్నారు. తిల తైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామి వారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. వాటర్ కూలర్ల ఏర్పాటు ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చుకునేందుకు దాతలు బహూకరించిన వాటర్ కూలర్లను రెండు చోట్ల ఏర్పాటు చేసినట్లు ఈఓ రేవెల్లి మహేష్ తెలిపారు. -
కేసీఆర్ పట్టుదలతోనే ప్రత్యేక రాష్ట్రం
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు ఏటూరునాగారం : ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని, అనేక మంది అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం, జయశంకర్ విగ్రహం ఎదుట దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించి కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సాధించడం కోసం కేసీఆర్ అనేక ఉద్యమాలు చేశారన్నారు. ఎంతోమంది విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్నట్లు చెప్పారు. నిధులు, నీళ్లు, నియమాకాలను సాధించుకునే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. అనంతరం తొలి ఉద్యమకారులను లక్ష్మీనర్సింహరావు ఘనంగా సన్మానించారు. పార్టీ మండల అధ్యక్షుడు గడదాసు సునీల్కుమార్, సమ్మయ్య, నగేష్, కృష్ణ, వలిబాబు, మల్లారెడ్డి, నూతి కృష్ణ, సర్దార్, సమ్మయ్య, ముత్తయ్య, స్వరూప, ముత్తేష్ తదితరులు పాల్గొన్నారు. -
రెండో విడతకు వేళాయె..
● నేటినుంచి నామినేషన్ల స్వీకరణ ● 52 సర్పంచ్.. 462 వార్డులకు ఎన్నికలుములుగు: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడతగా జిల్లాలోని గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో 48 గ్రామ పంచాయతీలకు, 420 వార్డులకు శనివారం వరకు నామినేషన్లు స్వీకరించారు. రెండవ విడతలో ములుగు, మల్లంపల్లి, వెంకటాపూర్ మండలాల్లోని 52 గ్రామ పంచాయతీలకు, 462 వార్డులకు నేటి నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతలో 32,242 మంది పురుషులు, 34,478 మహిళలు, తొమ్మిది మంది ఇతరులతో కలిసి మొత్తం 66,729 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్లు స్వీకరించేందుకు ములుగు మండలంలో ఎనిమిది క్లస్టర్లు, వెంకటాపూర్ మండలంలో ఆరు క్లస్టర్లు, మల్లంపల్లి మండలంలో మూడు క్లస్టర్లు ఎర్పాటు చేశారు. ఏ మండలంలో ఎన్ని జీపీలు.. ములుగు మండలంలో 19 గ్రామపంచాయతీలు, 172 వార్డులు ఉండగా 24,985 మంది ఓటర్లు ఉన్నారు. మల్లంపల్లి మండలంలో 10 గ్రామ పంచాయతీలు.. 90 వార్డులు ఉండగా 13,505 మంది ఓటర్లు ఉన్నారు. వెంకటాపూర్ మండలంలో 23 గ్రామపంచాయతీలు, 200 వార్డులు ఉండగా 28,239 మంది ఓటర్లు ఉన్నారు. -
ఊరు వెలగాలని మూడెకరాలు అమ్మేశారు..
● ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి ● కలెక్టర్ దివాకర టీఎస్పాలకుర్తి టౌన్: పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో రెండు పర్యాయాలు సర్పంచ్గా సేవలందించిన గంట సోమయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి 1981–1994 వరకు సర్పంచ్గా ప్రజలకు విశిష్ట సేవలందించారు. చివరకు తనకున్న ఆస్తినంతా ప్రజా సేవకు ధారపోశారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని వావిలాల గ్రామానికి రప్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గ్రామానికి బస్సు సర్వీసులు నడిపించారు. గ్రామంలో 13 నీళ్ల ట్యాంకులు నిర్మించారు. ప్రధాని రాజీవ్గాంధీ చేతుల మీదుగా ఉత్తమ సర్చంచ్గా పురస్కారం అవార్డు, ప్రశంసపత్రం అందుకున్నారు. గ్రామంలో టెలిఫోన్ ఎక్చేంజ్, విద్యుత్ సబ్సేష్టన్ మంజూరు చేయించారు. 1991 ఆగస్టు 19న సీపీఐ(ఎంఎల్) పీపుల్స్వార్ నాగన్న దళం సర్పంచ్ సోమయ్యను కిడ్నాప్ చేయడంతో అప్పటి కలెక్టర్ బీపీ ఆచార్య చొరవతో నాలుగు రోజుల తర్వాత విడుదలయ్యారు. 2021లో కన్నుమూశారు. గ్రామ ప్రజలు ఆయన సేవలకు గుర్తుగా 2022 ఏప్రిల్లో వావిలాల ప్రధాన కూడలిలో విగ్రహం ఏర్పాటు చేశారు. దుగ్గొండి: మండలంలోని తిమ్మంపేట గ్రామ సర్పంచ్గా విశిష్ట సేవలందించిన సారంపల్లి రాజిరెడ్డి 1970 నుంచి 11 ఏళ్లపాటు సర్పంచ్గా పనిచేశారు. ఈసమయంలో ఇంటింటికీ విద్యుత్ను తీసుకొచ్చేందుకు తన మూడెకరాల పొలాన్ని అమ్మేశారు. నాలుగు కిలోమీటర్ల దూరంలో లక్నెపల్లి గ్రామం నుంచి విద్యుత్ లైన్ వేయించారు. గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని వందలాది మంది పేదల ఇళ్ల కోసం ఇచ్చారు. ఆయన మరణానంతరం 2008లో రాజిరెడ్డి విగ్రహాన్ని గ్రామ పంచాయతీ ఎదుట ప్రధాన రహదారి పక్కన గ్రామస్తులంతా కలిసి ప్రతిష్టించారు. ఇప్పటికీ రాజిరెడ్డి పేరు ప్రస్తావన రాగానే కరెంట్ తెచ్చిన మహానుభావుడు అంటూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆయనను గుర్తు చేసుకుంటారు. ఎన్నికల ‘కిక్కు’పదవులకు వేలం వేస్తే చర్యలుఆస్తిని ధారపోశారు.. ప్రజల గుండెల్లో నిలిచారు -
శనివారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2025
గ్రామ ప్రథమ పౌరుడి హోదా దక్కించుకునేందుకు ఇప్పటినుండే వివిధ రాజకీయ పార్టీల నుంచి చోటా, బడా నేతలు పోటీ పడుతున్నారు. పార్టీ పరంగా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండనప్పటికీ గెలుపే ధ్యేయంగా ఇప్పటినుంచే గ్రూపులను ఒక్కటి చేస్తూ ఎన్నికల్లో గెలుపొందేందుకు పావులు కదుపుతున్నారు. ప్రభుత్వం మండల పరిషత్ ఎన్నికలు ముందుగా జరిపి పంచాయతీ ఎన్నికలు తర్వాత జరపాలని ఆలోచించింది. మారిన సమీకరణాల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు తొలుత రావడంతో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినా.. ఆ సానుభూతితో మండల పరిషత్ ఎన్నికల్లో గెలవవచ్చనే ధీమాలో అభ్యర్థులు ఉన్నారు. -
విద్యార్థులు శాస్త్రీయ అవగాహన పెంచుకోవాలి
ఏటూరునాగారం: విద్యార్థులు శాసీ్త్రయ అవగాహన పెంచుకోవాలని ములుగు ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ జిల్లా స్థాయి పరీక్ష పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు మూఢనమ్మకాలను వదిలిపెట్టాలని, సైన్స్ను జీవితంలో అన్వయించుకోవాలన్నారు. ప్రస్తుతం ఆకస్మిక గుండెపోటు మరణాలు అధికంగా ఉన్నాయని, ప్రతిఒక్కరూ సీపీఆర్ చేయడం నేర్చుకోవాలన్నారు. చెకుముకి పరీక్షలకు జిల్లా నలుమూలల నుంచి 40 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారన్నారు. తెలుగు విభాగం నుంచి జెడ్పీహెచ్ఎస్ అలుబాక, ఇంగ్లిష్ విభాగం నుంచి జెడ్పీహెచ్ఎస్ ఏటూరునాగారం, పైవేట్ స్కూల్స్ విభాగం నుంచి గోవిందరావుపేట మెరిట్ స్కూల్, టీజీఎంఎస్ బండారుపల్లి రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు అర్హత సాధించారు. కరీంనగర్లో జరగనున్న రాష్ట్ర స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కొయ్యడ మల్లయ్య, ప్రధాన కార్యదర్శి గడ్డి శ్రీనివాస్, కలకొట్ల నరేష్, పల్లె నాగరాజు, మహిళా సమత సొసైటీ కన్వీనర్ యమున, అనిత, రేవతి, వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.ములుగు ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ -
ఎన్నికల విధానం చూస్తే బాధేస్తోంది..
సాక్షి, మహబూబాబాద్ :‘స్వాతంత్య్ర ఉద్యమం, నిజాంపాలన చూశాను. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. సర్పంచ్ పదవితో రాజకీయ ఆరంగ్రేటం చేసి నాలుగుసార్లు ఎమ్మెల్యే, నాలుగుసార్లు ఎంపీగా పనిచేశా. అప్పటి రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలకు పొంతన లేదు. అప్పుడు మంచి నాయకుడిని ఎన్నుకోవాలనే తపన ప్రజల్లో ఉండేది. అభ్యర్థులను గెలిపించే బాధ్యత నాయకులు, కార్యకర్తలు తీసుకునేది. జీపులు.. డీజిల్ ఖర్చు తప్ప, ఇతరత్రా వ్యయాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఓట్లు పడాలంటే డబ్బులు ఖర్చుపెట్టాలి. ఈవిధానం చూస్తే బాధేస్తోంది’ అని మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నాటి పరిస్థితులను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. సర్పంచ్గా అరంగ్రేటం చదుకునే రోజులు.. అప్పటివరకు నాకు రాజకీయాలు తెలియదు. అందరి ప్రోత్సాహంతో 1960లో మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఏకగ్రీవ ఎన్నిక కావడంతో పెద్దగా డబ్బులు ఖర్చుపెట్టలేదు. నాకు ఇప్పుడు 95ఏళ్లు.. నేను సర్పంచ్గా గెలిచినప్పుడు ముప్పై సంవత్సరాలు కూడా లేవు. అయినా సర్పంచ్ అంటే గ్రామంలో ప్రత్యేక ఆదరణ. నాయకుడికి కూడా గ్రామం అన్నా.. గ్రామస్తులు అన్నా.. ప్రాణంగా పనిచేసేవారు. గ్రామాల అభివృద్ధికి ఎంతదూరమైనా పోయేవాళ్లం. ఎన్నికల్లో డబ్బులు పంచడం అంటే తెలియదు. గ్రామాల్లోకి వెళ్తే.. అక్కడి నాయకులే భోజనాలు పెట్టేవారు. పార్లమెంట్ ఎన్నికలకు నాకు అయిన ఖర్చు రూ.7,500 మాత్రమే.. ఇప్పుడు ఒక్క ఓటుకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది. కమ్యూనిస్టులతో పోటీ.. ఆరోజుల్లో ఇన్ని పార్టీలు లేవు. కమ్యూనిస్టు, కాంగ్రెస్ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉండేది. 1967లో ఎంపీగా ఎన్నికై న సమయంలో తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది. అప్పుడు మర్రి చెన్నారెడ్డి ఇతర నాయకులు నన్ను తెలంగాణ పార్లమెంటరీ సమితి కన్వీనర్గా ఎన్నుకున్నారు. 1969లో హైదరాబాద్లో పదివేల మందితో సత్యాగ్రహ కార్యక్రమం చేశాం. జైలుకు వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. అయితే అప్పుడు కమ్యూనిస్టులు ప్రజాప్రతినిధులతో పనులు చేయించేలా పోటీ పడేవారు. అభివృద్ధిని ఆకాంక్షించేవారు. పనిచేసిన వారిని అభినందించే సంస్కృతి ఉండేది. ఇప్పుడు అలాంటి వాతావరణం కనిపించడం లేదు.నాడు గ్రామానికి సేవ చేసే నాయకులను ఎన్నుకునేవారు. ఇప్పుడు డబ్బులు ఖర్చుపెట్టే వారికి టికెట్లు ఇస్తున్నారు. ప్రజలు వారికి ఓట్లు వేసి ఎన్నుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ వాతావరణం మంచిదికాదు. డబ్బులు లేనివారు ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. డబ్బులు పంచి పెట్టడం అంటే అవినీతికి అవకాశం ఇవ్వడమే.. ఈ సంస్కృతి మారాలి. ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు కలగజేసుకొని డబ్బులకు, ఎన్నికలకు ఉన్న సంబంధాన్ని విడగొట్టాలి. లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఓటుకు డబ్బులు ఇవ్వడం అంటే.. అవినీతిని ప్రోత్సహించడమే ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు ప్రత్యేక దృష్టి పెట్టాలి ‘సాక్షి’తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీగా ఎదిగిన రామసహాయం -
కొనసాగిన నామినేషన్ ప్రక్రియ
ఏటూరునాగారం/గోవిందరావుపేట/ఎస్ఎస్తాడ్వాయి: జిల్లాలో మొదటి దశలో ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల పర్వం రెండో రోజు కొనసాగింది. శుక్రవారం సర్పంచ్ పోటీ కోసం 41 మంది, వార్డు సభ్యుల కోసం 72 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ తెలిపారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించి కేవలం ముగ్గురు వ్యక్తులను మాత్రమే నామినేషన్కు అనుమతి ఇచ్చారు. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు సతీమణి శ్రీలత ఏటూరునాగారం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో ప్రత్యేకత సంతరించుకుంది. కాగా ఇప్పటి వరకు మూడు మండలాల్లో సర్పంచ్లకు 63, వార్డులకు 92 నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా అసిస్టెంట్ ఎన్నికల అధికారులు నిత్యం పర్యవేక్షణ చేశారు. సర్పంచ్ 41, వార్డు సభ్యులకు 72 నామినేషన్లు దాఖలు నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వంమండలం సర్పంచ్ వార్డులు ఏటూరునాగారం 16 6 గోవిందరావుపేట 8 29 తాడ్వాయి 17 37 మొత్తం 41 72 -
ఆశావహులకు ఆప్షన్!
ములుగు: పంచాయతీ ఎన్నికల సమరం మొదలైంది. రిజర్వేషన్ల వారీగా గెలుపు గుర్రాల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు గ్రామాల్లో అభిప్రాయాలను సేకరిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని సర్పంచ్ పదవులను ఆశిస్తున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైనా.. మండల పరిషత్ ఎన్నికల్లో సానుభూతితో గెలవొచ్చనే ధీమాతో పల్లెపోరుకు సిద్ధమవుతున్నారు. మొదటి విడత నామినేషన్లు ప్రారంభం కావడంతో జిల్లాలోని పలు గ్రామాల్లో సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు తమకు అండగా నిలిచి గెలుపొందేందుకు సహకారం అందించాలని కోరుతున్నారు. మారిన సమీకరణలు రాజకీయ పార్టీల పరంగా జరిగే పరిషత్ ఎన్నికలను మొదట నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఆ దిశగా నోటిఫికేషన్ సైతం గత సెప్టెంబర్లో విడుదల చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఆశావహులు సన్నద్ధమయ్యారు. ప్రధాన పార్టీల తరఫున బీఫాం దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేపట్టారు. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల పెంపును కోర్టు సమర్థించకపోవడంతో ఎన్నికలకు బ్రేక్ పడడంతో ఆశావహులు నిరాశ చెందారు. ప్రస్తుతం పరిషత్ ఎన్నికల కంటే ముందుగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందేందుకోసం ఆశావహులు సన్నద్ధమవుతున్నారు. పంచాయతీ పోరుకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుతం పల్లెల్లో ఎక్కడ చూసినా రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులు ఎవరున్నారు. ఎవరూ పోటీ చేస్తే గెలుపొందుతారనే వాటిపై పార్టీల పరంగా సర్వేలు నిర్వహించుకుంటున్నారు. పార్టీల పరంగా ఒక్కొక్క పార్టీ నుంచి ఇద్దరి నుంచి ఐదుగురు అభ్యర్థుల జాబితాను తయారు చేస్తున్నారు. తీవ్రంగా పోటీ ఉన్న చోట సర్పంచ్గా ఒకరిని, ఎంపీటీసీగా మరొకరిని ప్రకటిస్తూ సమన్వయం చేస్తున్నారు. కొంతమంది రెండింటిలోనూ పోటీ చేసేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు ఆశావహులు పలు ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. గ్రామాల్లో మొదలైన ఎన్నికల హడావుడి -
నామినేషన్ పత్రంలో ఖాళీలు ఉంచొద్దు
ములుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థులు పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నామినేషన్ పత్రంలో ఖాళీలు ఉంచొద్దని జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నామినేషనన్తో పాటు ఇద్దరు సాక్షులతో సెల్ఫ్ డిక్లరేషన్ దాఖలు, ఎవరైనా అభ్యర్థి నామినేషన్తో పాటు సెల్ఫ్ డిక్లరేషనన్ దాఖలు చేయడంలో విఫలమైతే, అతను/ఆమె దానిని నామినేషన్ వేసే చివరి తేదీ సాయంత్రం 5 గంటలలోపు దాఖలు చేయాలన్నారు. డిక్లరేషన్ కోసం అఫిడవిట్ కానీ, నోటరీ కానీ అవసరం లేదన్నారు. అన్ని నిలువు వరుసలను పూరించాలని, ఏ కాలమ్ను ఖాళీగా ఉంచొద్దన్నారు. ఏదైనా వస్తువుకు సంబంధించి సమాచారం లేకుంటే, సందర్భానుసారంగా ‘నిల్’ లేదా ‘వర్తించదు’ అని పేర్కొనాలన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థి నూతన బ్యాంకు ఖాతా తప్పనిసరిగా తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం జత చేయాలి. సర్పంచ్, వార్డు మెంబర్ సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నామినేషన్ వేసే అభ్యర్థులు ఈ సూచనలు తప్పక పాటించాలన్నారు.జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ -
వేస్ట్ వస్తువులతో ఆదాయం
ములుగు: ఇంటి పరిసరాల్లో ఏర్పడే చెత్త (వేస్ట్)తో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చని రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్జీసీ అధికారి విద్యాసాగర్ తెలిపారు. శుక్రవారం ములుగు బాలికల ఉన్నత పాఠశాలలో శ్రీవేస్ట్ టు వెల్త్ఙ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లాలోని సుమారు 30 పాఠశాలల విద్యార్థులు వేస్ట్ పదార్థాలతో పనికి వచ్చే వాటితో పాటు ఇంటిలో అలంకరణకు ఉపయోగపడే వస్తువులను తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ పరిసరాల్లో ఇంట్లో ఏర్పడే చెత్త నుంచి ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసి పర్యావరణాన్ని కాపాడాలని, పొల్యుషన్ను తగ్గించాలన్నారు. పైగా ఆదాయం కూడా సంపాదించవచ్చన్నారు. ఎగ్జిబిషన్లో మొదటి బహుమతి బండారుపల్లి గురుకుల పాఠశాల, ద్వితీయ బహుమతి పస్రా ఉన్నత పాఠశాల, తృతీయ బహుమతి ములుగు మైనార్టీ పాఠశాల విద్యార్థులు నిలిచారు. వీరిని ప్రశంసతో పాటు నగదును అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్, హెచ్ఓం పుష్ప తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ -
చిచ్చు పెడుతున్న ఇసుక ర్యాంప్లు
వెంకటాపురం(కె): మండలంలోని ఇసుక ర్యాంప్లు గిరిజనులు, గిరిజనేతులకు మధ్య చిచ్చు పెడుతున్నాయి. మండల పరిధిలోని అబ్బాయిగూడెంలోని ఓ ఇసుక ర్యాంప్తో గిరిజనులు, గిరిజనేతరులకు మధ్య గొడవలు జరుగుతుండటంతో వారం రోజు లుగా గ్రామంలో రిలే దీక్షలు చేస్తున్నారు. శుక్రవా రం పంట పొలాల నుంచి రహదారి పోవడంతో పంటలు నష్టపోతున్నామని ఆందోళన చేస్తున్నారు. పంట పొలానికి దుమ్ము పడకుండా కంచెను ఏర్పా టు చేయగా ఇసుక సొసైటీ సభ్యులు కూల్చారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మన్నేటి ధనలక్ష్మి అనే మహిళపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు పురుగుమందు డబ్బాలతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారితో మాట్లాడారు. అయినా వినకపోవడంతో విషయాన్ని టీఎండీసీ పీఓ విష్ణువర్ధన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. ఇసుక రీచ్ పనులు నిలిపేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాగా అబ్బాయిగూడెం ఇసుక రీచ్తో పంటలు నష్టపోతున్నామని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణ మహిళలకు గాయాలు పురుగుమందు డబ్బాలతో ధర్నాకు దిగిన గ్రామస్తులు -
మహాజాతర విజయవంతానికి పాటుపడాలి
ములుగు రూరల్: మేడారం మహాజాతర విజయవంతానికి పాటుపడాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం జాతరను మీడియా, పోలీస్ యంత్రాంగం గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విజయవంతం చేయాలని కోరారు. గతంలో చోటుచేసుకున్న సంఘటనలు పనరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. జాతరకు సుమారు కోటి 50 లక్షల మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లిస్తారని అందుకు అనుగుణంగా 10 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని వివరించారు. మేడారం జాతరలో అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో కొనసాగుతున్న మాస్టర్ ప్లాన్ పనుల వివరాలతో పాటు అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్ల ఏర్పాటు వివరాలు వెల్లడించారు. పోలీస్ యంత్రాంగం తీసుకునే నిర్ణయాలకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి, మత్తు పదార్థాల నివారణపై కళాజాతా బృందాలతో అవగాహన కార్యక్రమాలను నిర్విహిస్తామని వివరించారు. అక్రమ మట్టి, పశువుల రవాణాను అడ్డుకుంటామని అన్నారు. జాతర సమయంలో పాత్రికేయులకు ఇబ్బందులు తలెత్తకుండా గుర్తింపుకార్డులు ఇవ్వడానికి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం పోలీస్ అధికారులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు.మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు కోసం పోలీస్శాఖ ఆధ్వర్యంలో పకడ్బందిగా ఏర్పాట్లు చేయాలన్నారు. మేడారంలో సాగుతున్న పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్లు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన రెయిన్కోట్లు, టీషర్ట్లను ఎస్పీ పంపిణీ చేశారు. ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవోస్ నాయకులు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సుధీర్ రాంనాథ్ కేకన్ను టీఎస్జీవోస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సంఘం జిల్లా అధ్యక్షుడు పోలురాజు ఆధ్వర్యంలో ఎస్పీని శాలువాలతో సన్మానించి మొక్కను అందించారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
ప్రజావైద్యుడు విద్యాసాగర్ కన్నుమూత
ఏటూరునాగారం: ఆయన ఒక ప్రజావైద్యుడు. పేదలకు కేవలం రూ.3లకే ఇంజక్షన్ వేసి ప్రజల మనలను పొందిన గొప్ప ఆదర్శవాది వంగల విద్యాసాగర్. అయితే ఆయన ఆర్ఎంపీగా పనిచేస్తూనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి 2001లో ఏటూరునాగారం నుంచి ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. ఐదేళ్లపాటు ఎంపీటీసీగా పనిచేసిన అనంతరం ఆర్ఎంపీగా పనిచేస్తూనే కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించి వంగల విద్యాసాగర్(60) గురువారం మృతి చెందాడు. ఎంతో మంది పేద ప్రజలకు తక్కువ ధరకు వైద్యం అందించి వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన మరణవార్త విన్న ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యాసాగర్ మరణ వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహంపై పార్టీ కండువా కప్పి నివాళులర్పించారు. తొలితరం బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెఈ్ప మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, నాయకులు మల్లారెడ్డి, చిన్నికృష్ణ, ఖాజాపాషా, రాంనర్సయ్య, బోజారావు, ప్రదీప్రావు తదితరులు పాల్గొన్నారు. రూ.3కే ఇంజక్షన్ వేసి పేదప్రజల మన్ననలు పొందిన ఆదర్శవాది -
నామినేషన్లు 44
ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి/గోవిందరావుపేట: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ మేరకు జిల్లాలోని ఏటూరునాగారం, ఎస్ఎస్తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 22 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేయగా వార్డు స్థానాలకు సైతం 22 నామినేషన్లు మొత్తంగా 44 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో ఆర్వోలు, ఏఆర్వోలు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. పోలీసులు నామినేషన్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి లేనిది ఎవరిని లోనికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలింగ్ బూత్లను ఎన్నికల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి లోటుపాట్లను సరిచేశారు. 12 జీపీలకు.. 5 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ ఏటూరునాగారం మండలంలోని 12 గ్రామ పంచాయతీలకు గాను 5 క్లస్టర్లలో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తొలిరోజు నామినేషన్లు ఏటూరునాగారం నుంచి సర్పంచ్ స్థానానికి రెండు, శంకరాజుపల్లి నుంచి ఒకటి సర్పంచ్ స్థానానికి, ఒకటి వార్డు స్థానానికి నామినేషన్ వచ్చింది. రామన్నగూడెం నుంచి ఒకటి సర్పంచ్, చిన్నబోయినపల్లి నుంచి వార్డు స్థానానికి రెండు, రొయ్యూరు నుంచి ఒకటి వార్డు స్థానానానికి నామినేషన్ దాఖలైనట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. సర్పంచ్ స్థానాలకు రెండు.. వార్డు స్థానాలకు 14.. గోవిందరావుపేట మండలంలోని 5 క్లస్టర్లలో కలిపి మొత్తం రెండు సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు రాగా వార్డు స్థానాలకు 14 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అందులో మచ్చాపూర్ నుంచి జంపాల ప్రభాకర్, పస్రా నుంచి భూక్య సుమలత సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు. అలాగే వార్డు స్థానాలకు బుస్సాపూర్ గ్రామం నుంచి ఐదు నామినేషన్లు రాగా మచ్చాపూర్ ఒకటి, గాంధీనగర్ నుంచి ఒకటి, పస్రా నుంచి ఒకటి, గోవిందరావుపేట నుంచి 6 నామినేషన్లు దాఖలయ్యాయి.ఎస్ఎస్తాడ్వాయి మండలంలోని 18 గ్రామ పంచాయతీల నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. మండల పరిధిలో మొత్తంగా 16 సర్పంచ్, నాలుగు వార్డు స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బీరెల్లి గ్రామం నుంచి సర్పంచ్ స్థానానికి వంగరి అనసూర్య, బెజ్జూరి శ్రీనివాస్, దాయ సత్యవతి, జాజ విజయ, నార్లాపూర్ నుంచి భూక్య శ్రీనివాస్, ఊరట్టం నుంచి చర్పా సౌజన్య, కాటాపూర్ నుంచి దిడ్డి మోహన్రావు, ఖలిల్ హుస్సెన్, గంగారం నుంచి బడే రజిత, రంగాపూర్ నుంచి ఇర్ప శివప్రసాద్, తాడ్వాయి నుంచి ఇర్ప సుకన్యసునీల్, కల్తి నాగమణి, కొట్టెం ప్రవళిక, బయ్యక్కపేట నుంచి సురకంటి సమ్మక్క, దామెరవాయి నుంచి వట్టం తిరుపతిలు నామినేషన్లు వేశారు. వార్డు స్థానాలకు కాటాపూర్ నుంచి దిడ్డి మాధవి, దిడ్డి మల్లయ్య, తాడ్వాయి నుంచి దుర్గం నవీన్, దామెరవాయి నుంచి లోడారి సమ్మయ్యలు నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 22, వార్డు స్థానాలకు 22 నామినేషన్లు స్వీకరించిన ఆర్వోలు, ఏఆర్వోలు కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తుమండలం సర్పంచ్లు వార్డులు ఏటూరునాగారం 4 4 గోవిందరావుపేట 2 14 ఎస్ఎస్తాడ్వాయి 16 4 -
నేటి నుంచి జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
ములుగు రూరల్: జిల్లా అథ్లెటిక్స్ సోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆస్మిత అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ పగడాల వెంకటేశ్వర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జాకారం సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో నేటి నుంచి అండర్ 14, 16 బాలికలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2036 ఒలంపిక్స్లో దేశం తరఫున పాల్గొనేందుకు కిందిస్థాయి నుంచి బాలికల్లోని క్రీడానైపుణ్యాన్ని గుర్తించేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారిణులను రాష్ట్ర, జాతీయస్థాయిలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి ఉన్నతస్థాయిలో పాల్గొనే విధంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.ములుగు: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం–2025 సందర్భంగా జిల్లాలోని దివ్యాంగులందరికీ రేపటి నుంచి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి తుల రవి తెలిపారు. ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో దివ్యాంగులకు రన్నింగ్, షాట్పుట్, చెస్, జవెలిన్ త్రో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని దివ్యాంగులందరికీ జూనియర్స్ విభాగంలో 10 నుంచి 17 సంవత్సరాల వరకు, సీనియర్స్ విభాగంలో 18 నుంచి 54 ఏళ్ల వారికి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. క్రీడా పోటీల్లో పాల్గొనే దివ్యాంగులు సదరం సర్టిఫికెట్తో పాటు ఆధార్కార్డుతో హాజరు కావాలని సూచించారు. విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని వివరించారు. వెంకటాపురం(కె): ఉపాధ్యాయులకు ప్రభుత్వం టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరభద్రం అన్నారు. మండల కేంద్రంలో ఎస్టీయూ మండల అధ్యక్షుడు పుణెం రమణయ్య ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులను టెట్ పరీక్ష మానసిక ఒత్తిడికి గురిచేస్తుందన్నారు. బోధన నాణ్యత, అభ్యసన ప్రక్రియకు ఆటకంగా మారుతుందని వివరించారు. టెట్ మినహాయింపుపై యూనియన్ ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలపై సంఘం నిరంతరం పోరాడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాండా రంగారావు, వాంకుడోత్ రాంబాబు, నాయుడు, రాజశేఖర్, రాంబాబు, శిరీష, ఉషారాణి, సమ్మక్క, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. గోవిందరావుపేట: ఇటీవల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ రాంనాథ్ను చల్వాయి టీజీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం గురువారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలు, కమ్యూనిటీ పోలిసింగ్, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమన్వయంతో పని చేయాలని నిర్ణయించుకున్నారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబాబు దర్శించుకున్నారు. గురువారం ఆయన ఆలయానికి రాగా అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ అర్చకులు ఆయనను శాలువాతో సన్మానించారు. -
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ములుగు: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఫిర్యాదులు, సమాచారం కొరకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జి ల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం మొదటి విడత ఎన్నికల్లో 48 సర్పంచ్, 420 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు ఫ్లయింగ్, స్టాటిస్టిక్, వీడియో సర్వేలైన్ బృందాలు, ఎన్నికల సంబంధిత పర్యవేక్షణ బృందాలను, ఎన్నికల అధికారులను నియమించినట్లు వివరించారు. ప్రజలను ప్రలోభపెట్టే నగదు, మద్యం, కానుకల పంపిణీ, ప్రచారం, అక్రమ నగదు రవాణా, ఇతర ప్రభావిత అంశాలపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ఓటర్లను ప్రలోభ పెట్టే సంఘటనలు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 18004257109కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. అదే విధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన టీ–పోల్ మొబైల్ యాప్ను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. గూగుల్ ప్లే స్టోర్ యాప్ అందుబాటులో ఉందని ప్రతిఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. యాప్ ద్వారా ఓటర్ల పోలింగ్, కేంద్రం వివరాలు, ఓటర్ స్లిప్పులు, నమోదు సమాచారం సులభంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర -
విత్తన బిల్లుపై అభిప్రాయాల సేకరణ
ములుగు: కొత్త విత్తన బిల్లు–2025 ముసాయిదాపై రైతులు, విత్తన వ్యాపారులు, ఉత్పత్తిదారులు, నర్సరీల యజమానులు, ఇతర వాటాదారుల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్జీ తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కొత్త విత్తన బిల్లు–2025 ముసాయిదాపై జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్త విత్తన బిల్లులోని సెక్షన్లు, క్లాసులు, విత్తన చట్టం 1966లోని లోపాలు, కొత్త చట్టం లక్ష్యం గురించి చర్చించారు. ఈ సందర్భంగా హాజరైన రైతులు, విత్తన వ్యాపారులు, విత్తన ఉత్పత్తిదారులు, నర్సరీల యజమానులు బిల్లులోని ప్రతీ క్లాజ్పై తమ సూచనలు, అభిప్రాయాలను తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అవినాష్ వర్మ, మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న మేడారం పనులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. గద్దెల చుట్టూ ప్రహరీ నిర్మాణం పనులు బేస్మెంట్ పూర్తయి రాతి పిల్లర్లు ఏర్పాటు చేస్తున్నారు. గద్దెల సాలహారం చుట్టూ ఎనిమిది ఆర్చీ ద్వారాల సీసీ పిల్లర్ల పనులు కూడా పూర్తి దశకు చేరుకున్నాయి. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల నిర్మాణం పనులు పూర్తి కావస్తున్నాయి. గద్దెల చుట్టూ ఆదివాసీ చిత్రాలు, పడిగలతో కూడిన పిల్లర్ల ఏర్పాటుకు సిద్ధం చేశారు. సమ్మక్క– సారలమ్మల గద్దెలను విస్తరణ పనులు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి. తల్లుల గద్దెల చుట్టూ రాతి పిల్లర్ల ఏర్పాటు చేసేందుకు బేస్మెంట్ స్థాయిలో పనులు పూర్తయ్యాయి. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంతో పాటు గద్దెల ప్రాంగణంలో షో లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మేడారంలో ప్రస్తుతం 1.5 కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్డు పనులు వేస్తున్నారు. -
అయ్యయ్యో.. ‘చే’జారిందే!
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపికపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు తమ పేర్లు సిఫారసు చేయకపోవడం వల్లే చాన్స్ చేజారిందని ఆశావహులు వాపోతుతుండగా, దరఖాస్తు చేసుకున్నా అవకాశం దక్కని సీనియర్లు అధిష్టానం తమపై చిన్నచూపు చూసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ప్రకటన వెలువడిన నాలుగైదు రోజులకు చాపకింది నీరులా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలకు గాను ఇద్దరు షెడ్యూల్ కులాలు, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక జనరల్, ఒక షెడ్యూల్ తెగలకు చెందిన నాయకులకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. ఈ విషయంలో సామాజిక, సమన్యాయం పాటించినట్లు పార్టీ అధిష్టానం, సీనియర్లు చెబుతుండగా, సిఫారసులు ఫలించని, అవకాశం దక్కని నేతలు మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు అనుచరవర్గాలు చెప్తున్నాయి. వరంగల్పై పోటాపోటీ సిఫారసులు.. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్కు అనూహ్యంగా అవకాశం దక్కిందని చెప్పొచ్చు. తూర్పు నియోజకవర్గంలో రెండు వర్గాలుగా పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ దంపతులు ఒక వర్గంగా, మిగిలిన నాయకులు మరో వర్గంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొండా దంపతులు మినహా మిగిలిన వారంతా డీసీసీ అధ్యక్షురాలిగా మాజీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణను ప్రతిపాదించారు. వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలతోపాటు ఆ నియోజకవర్గాలకు చెందిన నాయకులు కూడా స్వర్ణను ప్రతిపాదించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వర్ధన్నపేట నియోజకవర్గం ఏనుగల్లుకు చెందిన బొంపెల్లి దేవేందర్రావుకు డీసీసీ పదవీ ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. కొండా దంపతులు గోపాల నవీన్రాజుకు గానీ, లేని పక్షంలో మీసాల ప్రకాశ్కు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. కాగా, మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్ పేరును డీసీసీ అధ్యక్షుడిగా ఎవరు ప్రతిపాదించలేదు. సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్లకు సన్నిహితంగా, ఛత్తీస్గఢ్కు పార్టీ పరిశీలకుడిగా వెళ్లడంతో మీనాక్షి నటరాజన్ దృష్టిలో పడడం, మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ కోటాలో ఆయూబ్ పేరును చేర్చినట్లు తెలిసింది. మాజీలకు ఇవ్వొద్దని, కనీసం ఐదేళ్ల నుంచి పార్టీలో కొనసాగుతుండాలన్న నిబంధనలను పరిగణనలోకి తీసుకోవడంతో స్వర్ణ, నవీన్రాజులు అనర్హులయ్యారు. దీంతో మంత్రి కొండా సురేఖ దంపతులు, వారి అనుచరులు అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. మహబూబాబాద్లో ఎంపీ వర్గం.. జనగామలో ‘కొమ్మూరి’ వర్గం కినుక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ భార్య ఉమకు కేటాయించడం పట్ల కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదవి ఆశించిన మరికొందరు అసంతప్తిగా ఉన్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు భరత్చందర్ రెడ్డి వర్గానికి దక్కడం పట్ల ఆయన వర్గం సంతోషంగా ఉంది. కానీ, ఎంపీ బలరాం నాయక్ వర్గానికి చెందిన నునావత్ రాధకు ఇవ్వకపోవడం పట్ల ఆయన అసంతప్తిగా ఉన్నట్లు అనుచరవర్గంలో చర్చ జరుగుతోంది. మొదటినుంచీ డీసీసీ అధ్యక్షుడు పదవి వస్తుందని భావించిన పీసీసీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి కూడా అసంతృప్తిగానే ఉన్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అనుచరుడిగా ఉన్న గణపురం అంజయ్య కూడా అధ్యక్ష పదవి వస్తుందని ప్రచారం చేసుకున్నారు. అందరిని సమన్వయం చేసుకునేందుకు మురళి నాయక్ దంపతులు ప్రయత్నాలు చేస్తున్నారు. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్ పర్సన్గా పనిచేసిన లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్ను నియమించగా, మాజీ ఎమ్మెల్యే, మాజీ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి, ఆయన అనుచరులు అసంతృప్తిలో ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. పార్టీ స్థాపించిన నాటినుంచి నేటివరకు ఒకే పార్టీలో ఉండడం లకావత్ ధన్వంతికి తగిన గుర్తింపు ఇచ్చిందన్న చర్చ జరుగుతుండగా, ఎస్టీ సామాజిక వర్గం, మహిళ కావడంతో గొడవలకు ఫుల్స్టాప్ పెట్టవచ్చని ఉద్దేశంతో ఆమెను జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు కూడా బలపరిచినట్లు ప్రచారం జరుగుతోంది. ములుగు డీసీసీ అధ్యక్షుడిగా మళ్లీ పైడాకుల అశోక్కే చాన్స్ దక్కింది. ఈ విషయంలో మంత్రి సీతక్క సిఫారసు మేరకు ఆయనకు మరోసారి అవకాశం దక్కిందన్న చర్చ పార్టీలో ఉంది. పార్టీలోని ఒక్కరిద్దరు సీనియర్లు అసంతృప్తికి గురైనట్లు వారి అనుచరులు చెబుతున్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, జయశంకర్ భూపాలపల్లి అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్లను నియమించడంలో ఎమ్మెల్యేల మాట చెల్లుబాటయ్యింది. భూపాలపల్లి నుంచి మాజీ మావోయిస్టు నేత గాదర్ల అశోక్ అలియాస్ ఐతు ప్రయత్నించినా ఆయనకు చాన్స్ రాలేదు. హనుమకొండ నుంచి సుమారు 20మందికిపైగా ఆశించినా సీనియర్ నేత వెంకట్రాంరెడ్డికే అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పగించింది. ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై మోదం, ఖేదం పార్టీ సీనియర్లనుంచీ భిన్న స్వరాలు.. వరంగల్పై మంత్రి సురేఖ శిబిరంలో అసంతృప్తి? మంత్రి సీతక్క అనుచరుడికే మళ్లీ ములుగు పగ్గాలు.. హనుమకొండ, భూపాలపల్లిల్లో ఎమ్మెల్యేల మాటే చెల్లుబాటు మహబూబాబాద్ డీసీసీపై ఎంపీ వర్గం కినుక.. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో వాజేడు, వెంకటాపురం(కె) మండలాలను రెండు సమస్యాత్మక మండలాలుగా గుర్తించాం. ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలి. నేటి నుంచి మొదటి విడత నామినేషన్లు స్వీకరిస్తాం. వచ్చే నెల 11న 48 సర్పంచ్లకు, 420 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తాం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు, ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్లో సంప్రదించాలి. –కలెక్టర్ టీఎస్.దివాకర -
పంచాయతీ ఎన్నికలకు సహకరించాలి
ములుగు రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికల నిర్వహణ కొనసాగుతుందన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. అలాగే ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థుల ప్రచారం కోసం ప్రచురించే పోస్టర్లు, ఇతర మెటీరియల్ నిబంధనలకు లోబడి ముద్రణ చేపట్టాలని ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. జీపీ ఎన్నికల్లో చట్టాలకు లోబడి ప్రింటింగ్, ప్రచురణ కర్తల పేర్లు, చిరునామాను ముద్రించాలని సూచించారు. ముద్రణ పత్రాలపై ప్రిటింగ్ ప్రెస్ చిరునామా తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. డిక్లరేషన్ పత్రాలను కలెక్టర్, ఎన్నికల స్థాయి అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఎన్నికల కోడ్ పై వీడియో కాన్ఫరెన్స్.. పంచాయతీ ఎన్నికల కోడ్ను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ సంపత్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ సజావుగా జారీ చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 11న మొదటి, 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికల పోలింగ్ జరుగనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర అధికారులతో టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నియమ నిబంధనలు పాటిస్తూ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వివరాలను గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, ఇన్చార్జ్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీఓ
ములుగు రూరల్: జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ రాంనాథ్ కేకన్ను జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి సందర్భంగా శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో విశేష అభిషేక పూజలను ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామికి పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు తీర్ధప్రసాదం వితరణ చేశారు.ఈకార్యక్రమంలో ఈఓ మహేష్, జిల్లా గ్రంథాలసంస్ధ చైర్మన్ కోట రాజబాబు, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు. కాటారం: జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ(ఎన్ఐపీహెచ్ఎం) ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ తేనెటీగల బోర్డు సారథ్యంలో కాటారం వ్యవసాయ మార్కెట్లో వారం రోజులపాటు నిర్వహించిన తేనెటీగల పెంపకం ఉచిత శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన 25 మంది రైతులకు తేనెతీగల పెంపకంపై అవగాహన కల్పించారు. శ్రీ నేచురల్ హనీ వ్యవస్థాపకురాలు తాళ్లపెల్లి సంజన–రఘుతోపాటు వివిధ ప్రైవేట్ సంస్థల నిపుణులు శిక్షణలో రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. తేనెటీగల వర్గీకరణ, తేనెటీగ పెట్టె, ఉపకరణాల గుర్తింపు, కాలనీ నిర్వహణ, కాలానుగుణంగా నిర్వహణ, తేనె సంగ్రహణ, వ్యాధి, తెగుళ్ల నిర్వహణ వంటి అంశాలపై సైద్ధాంతిక, ఆచరణాత్మక శిక్షణ అందించారు. రైతులు తేనెటీగల పెంపకంతో అదనపు ఆదాయం పొందవచ్చని పలువురు సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఆత్మకూరి కుమార్యాదవ్, పంతకాని మల్లికార్జున్, బొమ్మన భాస్కర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ప్రకటన
హన్మకొండ/గీసుకొండ: దీక్షా దివస్ స్ఫూర్తితో ప్రభుత్వంపై వరంగల్ నుంచి ప్రతిఘటన మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణ ప్రకటన వచ్చిందని స్పష్టం చేశారు. వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనకు వచ్చిన కేటీఆర్కు బుధవారం పలువురు నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు చేరుకుని కై టెక్స్ కంపెనీతో పాటు పార్కును సందర్శించారు. అక్కడి నుంచి హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. రాజ్యాంగ దివస్లో భాగంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. మడికొండరెడ్డి కన్వెన్షన్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీరవెల్లి భరత్ కుమార్రెడ్డి కుమార్తె భార్గవిరెడ్డి, ఉదయ్రెడ్డి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ సమాజాన్ని కదిలించిన రోజు నవంబర్ 29 అని, దీక్షా దివస్ను విజయవంతం చేయాలని కోరారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం రేవంత్ సర్కారు రూ.160 కోట్లు ఖర్చుపెట్టిందని, బిహార్లో రాహుల్ గాంధీ డబ్బా కొట్టినా ఫలితం లేదని తూర్పారబట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 24 శాతాన్ని 17 శాతానికి తగ్గించి బీసీలకు రేవంత్ ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీలకు క్షమాపణ చెప్పాలి.. కామారెడ్డి డిక్లరేషన్తో బీసీలతో ఓట్లు వేయించుకుని సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. రిజర్వేషన్లు పెంచకుండానే పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. చెంపలేసుకుని సీఎం బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయామనే బాధ లేదు.. అప్పుడప్పుడు ఇలా జరిగితేనే మంచిదని రాష్ట్రంలో అధికారం కోల్పోవడంపై కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిపోయామనే బాధ అవసరం లేదని, ప్రభుత్వం పోయిందని నిరుత్సాహపడాల్సింది లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కేసీఆర్ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నారన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, శంకర్నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, మాజీ మంత్రులు డీఎస్ రెడ్యానాయక్, సత్యవతిరాథోడ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం,నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, సాంబారి సమ్మారావు, ఎల్లావుల లలితాయాదవ్, రాకేశ్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, రాకేశ్రెడ్డి పాల్గొన్నారు.దీక్షా దివస్ స్ఫూర్తితో వరంగల్ నుంచి ప్రతిఘటన ఓట్లు వేయించుకుని బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటనకాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ) పూర్తయితే సుమారు 30 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ అన్నారు. గతంలో ఆజంజాహి మిల్లు మూతబడి వైభవాన్ని కోల్పోయిన వరంగల్కు కేఎంటీపీ మళ్లీ పూర్వ వైభవం తెచ్చిందన్నారు. నేత కార్మికులు వలసలు వెళ్లకుండా ఉండేందుకు 2017 అక్టోబర్ 22న పార్కు పనులకు అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం గణేశా, యంగ్వన్, కై టెక్స్ కంపెనీల్లో ఉత్పత్తి జరుగుతోందని పేర్కొన్నారు. కేఎంటీపీని కేంద్రం పీఎం మిత్ర కింద ఎంపిక చేసిందన్నారు. -
రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ప్రామాణికం
ములుగు రూరల్: భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ప్రామాణికమని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ పౌరుడికి సమాన హక్కులు కల్పించడమే రా జ్యాంగ లక్ష్యమన్నారు. అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి అందరికి మార్గదర్శిగా మారాడని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలన్నారు. నవంబర్ 26న రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో ఆ నందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. ప్రజల రక్షణ పోలీసుల బాధ్యత గోవిందరావుపేట: ప్రజల హక్కుల రక్షణ పోలీసుల బాధ్యతని టీజీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం అన్నారు. మండల పరిధిలోని చల్వాయి టీజీఎస్పీ 5వ బెటాలియన్లో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ సుబ్రహ్మణ్యం హాజరై డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. ప్రజలకు రక్షణ కల్పించడం పోలీసుల ప్రాథమిక బాధ్యత అన్నారు. పోలీసులది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని రాజ్యాంగం తమ మీద పెట్టిన పవిత్ర కర్తవ్యమన్నారు. అనంతరం సిబ్బందితో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం వంటి తదితర అంశాలను కాపాడేందుకు సంసిద్ధులుగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ సీతారామ్, అసిస్టెంట్ కమాండెంట్ అనిల్ కుమార్, శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
నేటి నుంచి.. నామినేషన్ల స్వీకరణ
ములుగు రూరల్: జిల్లాల్లో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నేటి(గురువారం) నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. జిల్లాలోని గోవిందరావుపేట, ఎస్ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో మొదటి విడత ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నామినేషన్ల స్వీకరణకు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. నామినేషన్లు దాఖలు చేసే జీపీల వివరాలు.. ప్రతీ మండలంలో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గోవిందరావుపేట మండలంలో లక్నవరం జీపీ కార్యాలయంలో లక్నవరం, రాంనగర్, కోటగడ్డ గ్రామాలకు చెందిన వారు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. కర్లపల్లి జీపీ కార్యాలయంలో కర్లపల్లి, బాలాజీనగర్, లక్ష్మీపురం గ్రామస్తులు నామినేషన్ల పత్రాలు సమర్పించాలి. చల్వాయి జీపీ కార్యాలయంలో చల్వాయి, సోమళ్లగడ్డ, మచ్చాపూర్, బుస్సాపూర్, గోవిందరావుపేట జీపీలో గోవిందరావుపేట, రాఘవపట్నం, పస్రా జీపీ కార్యాలయంలో పస్రా, గాంధీనగర్, మొల్లగూడెం, ముత్తపూర్, పాపయ్యపల్లి గామాలకు చెందిన వారు నామినేషన్ల పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్ఎస్తాడ్వాయి మండలంలోని మండల పరిషత్ కార్యాలయం రూం నంబర్ 1 లో బీరెల్లి, రంగాపూర్, వెంగళపూర్, నార్లాపూర్ గ్రామాలకు చెందిన వారు నామినేషన్ పత్రాలు అందజేయాలి. రూం నంబర్ 2 లో లింగాల, బంధాల, ఊరట్టం, మేడారానికి చెందిన వారు తమ నామినేషన్ పత్రాలు ఇవ్వాలి. తహసీల్దార్ కార్యాలయంలో దామెరవాయి, గంగారం, కాటాపూర్కు చెందిన వారు, పంచాయతీ కార్యాలయంలో ఎస్ఎస్ తాడ్వాయి, అంకంపల్లి, పంబాపూర్, కాల్వపల్లి, బయ్యక్కపేట, మండల సమాఖ్య భవనంలో కామారం, నర్సాపూర్కు చెందిన సర్పంచ్, వార్డు స్థానాలకు బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ పత్రాలు అందజేయాలి. ఏటూరునాగారం జీపీలో ఏటూరునాగారానికి చెందిన వారు మాత్రమే నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. రామన్నగూడెం పంచాయతీ కార్యాలయంలో రామన్నగూడెం, కోయగూడెంకు చెందిన వారు మాత్రమే.. రోహిర్ పంచాయతీలో రోహిర్, చెల్పాక, ఆకులవారిగణపురంకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు ఇవ్వాలి. శంకర్రాజ్పల్లి జీపీలో శంకర్రాజ్పల్లి, ముల్లకట్టకు చెందిన వారు.. చిన్నబోయినపల్లి పంచాయతీలో చిన్నబోయినపల్లి, శివాపురం, శాపెల్లి, కొండాయి అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలి. విధుల్లో 15 మంది ఆర్వోలు, 15 మంది ఏఆర్వోలు మూడు మండలాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుమండలం సర్పంచ్ వార్డు ఆర్వోలు ఏఆర్వోలు స్థానాలు స్థానాలుగోవిందరావుపేట 18 154 5 5 ఎస్ఎస్తాడ్వాయి 18 152 5 5 ఏటూరునాగారం 12 114 5 5 -
అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు
హన్మకొండ: తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు. డిసెంబర్ 4న అరుణాచలం గిరిప్రదక్షిణకు వెళ్లాలనుకునే భక్తులకు ఆర్టీసీ ఈ అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్–1 డిపోకు సంబంధించిన సూపర్ లగ్జరీ బస్సు హనుమకొండ నుంచి డిసెంబర్ 2న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి 3న ఉదయం 6 గంటలకు ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం చేరుకుంటుందని తెలిపారు. ఇక్కడ విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకున్న తర్వాత బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు వెల్లూరులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధికి చేరుకుంటుందని, ఇక్కడ అమ్మవారి దర్శనం అనంతరం బయలుదేరి రాత్రి 7 గంటలకు అరుణాచలం చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణం డిసెంబర్ 4న మధ్యాహ్నం బయలుదేరి 5న ఉదయం జోగుళాంబ అమ్మవారి శక్తి పీఠం సన్నిధికి చేరుకుంటుందన్నారు. ఇక్కడ దర్శనానంతరం బీచుపల్లి హనుమాన్ ఆలయం సన్నిధికి చేరుకుంటుందని, ఇక్కడ దర్శనానంతరం బయలుదేరి హనుమకొండకు చేరుకుంటుందని తెలిపారు. చార్జీలు పెద్దలకు ఒక్కొక్కరికి రూ.5 వేలు, పిల్లలకు రూ.3,500గా నిర్ణయించినట్లు వివరించారు. ఆర్టీసీ వెబ్సైట్లో కాని నేరుగా ఆర్టీసీ రిజర్వేషన్ల కౌంటర్లో రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 8074562195, 9885779970, 9866373825, 9959226047 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
‘లేబర్ కోడ్లను రద్దు చేయాలి’
ములుగు రూరల్: కార్మికులను శ్రమదోపిడీకి గురిచేసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కమిటీ నాయకుడు ఎండీ అమ్జద్పాషా డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆరోపించారు. రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు గిట్టుబాటు ధర చట్టం, వ్యవసాయ కార్మికులకు సమగ్ర రుణమాఫీ పథకాన్ని అమలు చేయడం, మైక్రో ఫైనాన్స్ దోపిడీని అరికట్టాలన్నారు. విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలని కోరారు. స్మార్ట్ మీటర్లను బిగించకూడదని కోరారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. పంటల తేమశాతాన్ని 12 నుంచి 20శాతం వరకు పెంచాలన్నారు. పంటల దిగుమతిని వ్యతిరేకించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చంద్రయ్య, కొమురయ్య, నాగిరెడ్డి, విద్యాసాగర్రెడ్డి, వేణు, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. -
కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎస్పీ
ములుగు రూరల్: ఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సుధీర్ రాంనాథ్ కేకన్ కలెక్టర్ టీఎస్.దివాకరను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు కలెక్టర్కు ఎస్పీ మొక్కను అందించారు. అనంతరం జనవరి 28నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతరపై చర్చించారు. కన్నాయిగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో రిజర్వేషన్లపై భీముని నరేశ్ చేస్తున్న ఆరోపణలు సరికాదని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడెం బాబు అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం తుడుందెబ్బ మండల అధ్యక్షుడు గెండ్ల పాపారావు ఆధ్వర్యంలో నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంత్రి సీతక్కపై నరేశ్ చేస్తున్న ఆరోపణలు మానుకోవాలన్నారు. రాజ్యాంగం ప్రకారం 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలోని గిరిజనులకు వందశాతం గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే నిబంధన ఉందని గుర్తుచేశారు. నరేశ్కు అవగాహన లేక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పీరీల శ్రీనివాస్, ఆలం సంతోష్, మురళి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన భూపాలపల్లి అర్బన్: కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏరియాలోని సింగరేణి గనుల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య మాట్లాడుతూ.. కేంద్ర న్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లు మార్చి కార్మికులను కార్పొరేట్లకు కట్టు బానిసలుగా మార్చిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనార్దన్, నర్సయ్య, ప్రసాద్రెడ్డి, శంకర్, శ్రీనివాస్, పవన్, మల్లేష్, సాజిత్ పాల్గొన్నారు. రిజర్వాయర్ పనుల అడ్డగింత కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా కాటారం మండల కేంద్రంలోని గారెపల్లి రిజర్వాయర్ వద్ద కొనసాగుతున్న పనులను మంగళవారం నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. పరిహారం తేల్చకుండా పనులు చేపట్టవద్దని జేసీబీ ఎదుట కూర్చొని పనులను నిలిపేశారు. తాము భూములు కోల్పోయి ఏళ్లు గడుస్తున్నప్పటికీ పరిహారం అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. భూములు కోల్పోయి, పరిహారం అందక తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రైతులు వినలేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలో రైతులు విష్ణు, రాజయ్య, ఆశయ్య, మల్లక్క, వెంకటమ్మ ఉన్నారు. ‘ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి’గణపురం: విద్యుత్ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చైర్మన్ సుంకు సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గణపురం మండలం చెల్పూరు కేటీపీపీ ప్రధాన గేట్ ఎదుట గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్రెడ్డి మాట్లాడుతూ 23 వేల మంది కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఏపీ ఎస్సీబీ రూల్స్(కన్వర్షన్) ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డిసెంబర్ మొదటివారంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమ్మెకు సైతం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. -
క్రీడలతోనే మానసికోల్లాసం
ఏటూరునాగారం: క్రీడాకారులకు క్రీడలతోనే మానసికోల్లాసం కలుగుతుందని క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ క్రీడామైదానంలో క్రికెట్ క్రీడాకారుల ఎంపికను భాస్కర్రెడ్డి మంగళవారం ప్రారంభించి వారిని పరిచయం చేసుకుని మాట్లాడారు. జిల్లాలోని పది మండలాల నుంచి చురుకై న క్రీడాకారులను ఎంపిక చేసి జిల్లా టీంగా తయారు చేయనున్నట్లు తెలిపారు. ఈ టీంను హైదరాబాద్లో నిర్వహించబోయే జిల్లాల టోర్నీకి పంపించనున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులు క్రీడలపై మక్కువ పెంచుకొని చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ తక్కలపల్లి దేవేందర్, బీజేపీ మండల అధ్యక్షుడు వినుకోలు చక్రవర్తి, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు గండెపల్లి సత్యం, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వావిలాల జనార్దన్, మండల అధ్యక్షుడు దుర్గం దుర్గారావు, కోచ్ లకావత్ రాణాప్రతాప్, క్రీడాకారులు పాల్గొన్నారు.క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్రెడ్డి -
హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో సహజసిద్ధంగా వెలిసిన పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్నారు. పూజారులు శేఖర్శర్మ, రాజీవ్ నాగఫణి శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి ప్రత్యేకతలు, చరిత్రను వివరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. -
మహిళా సంఘాలకు ఆర్థిక భరోసా
ములుగు రూరల్: మహిళా సంఘాలకు ప్రభుత్వం రుణాలు అందించి ఆర్థిక భరోసా కల్పిస్తుందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తున్న రుణా లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ములుగు నియోజకవర్గానికి చెందిన 9 మండలాల స్వయం సహాయక సంఘాలకు రూ. 2.26కోట్ల చెక్కును అందించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు సగటు మహిళ ఆత్మగౌరవంగా నిలుస్తున్నాయన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఒక్కో గ్రూపునకు రూ.20 లక్షల రుణాన్ని అందించి వ్యాపారస్తులుగా తీర్చిదిద్దుతుందన్నారు. మహిళా సంఘాలకు 2025–26 ఖరీఫ్ సీజన్లో 60ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు. వాటి ద్వారా 21,364 మెట్రిక్టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు ముంజారు కాగా 2,900 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాల య సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, అదనపు కలెక్టర్ సంపత్రావు, డీఆర్డీఓ శ్రీనివాస్రావు, ఎల్డీఎం జయప్రకాశ్, ఏపీడీ శ్రీనివాస్, జిల్లా, మండల స మాఖ్య, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు టాస్క్ ఆధ్వర్యంలో టెలీ పర్ఫార్మెన్స్ కంపెనీలో ఉద్యోగావకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగావకాశాలకు 2024–25 సంవత్సరంలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన యువకులు అర్హులని పేర్కొన్నారు. కంపెనీ వందమంది యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించనుందని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఫోన్ నంబర్ 9618449360 ద్వారా లేదా క్యూఆర్కోడ్ స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు డిసెంబర్ 1న ములుగు రీజినల్ సెంటర్ నుందు సెలక్షన్ నిర్వహించబడుతుందని వివరించారు. ఎంపికై న అభ్యర్థులకు తొమ్మిది రోజుల పాటు శిక్షణ ఉంటుందని వెల్లడించారు. నెల వేతనం రూ.20 వేలు అందిస్తారని వివరించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర సూచించారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
కొండాయి బ్రిడ్జి పనులు షురూ..
కొండాయి బ్రిడ్జి పనులు నాణ్యతగా చేపట్టాలి. గతంలో నిర్మించిన బ్రిడ్జి వరదలకు కొట్టుకుపోయింది. మళ్లీ అలా జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి. అందుకు అధికారులు, పాలకులు నాణ్యతగా పనులు చేపట్టి ప్రజలకు పది కాలల పాటు బ్రిడ్జి ఉపయోగపడేలా చూడాలి. – దబ్బగట్ల కిశోర్, కొండాయి, ఏటూరునాగారం బ్రిడ్జి పనులు సకాలంలో పూర్తి చేయాలి. ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. పనుల్లో జాప్యం లేకుండా చూడాలి. గిరిజనులకు ఎంతో అవసరమైన బ్రిడ్జిని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి. బ్రిడ్జి నిర్మాణం సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలి. – బొచ్చు ప్రకాశ్, కొండాయి, ఏటూరునాగారం ఏటూరునాగారం: ఎట్టకేలకు కొండాయి బ్రిడ్జి పనులు మొదలయ్యాయి. మూడేళ్ల నుంచి పెండింగ్ పడుతూ వస్తున్న పనులు వడివడిగా అడుగులు పడ్డాయి. నూతన సాంకేతిక విధానాన్ని అమలు చేస్తూ వరద ఎంత ఉధృతి ఉన్నా తట్టుకునే విధంగా నూతన బ్రిడ్జి నిర్మాణం డిజైన్వేశారు. జిల్లాలోని ఏటూరునాగారం మండలం కొండాయి–దొడ్ల గ్రామాల మధ్యలో ఉన్న జంపన్నవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి సీతక్క కృషితో రోడ్డు భవనాల శాఖ ద్వారా రూ.16 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ పనులను శ్రీ వేంకటేశ్వర కన్స్ట్రక్షన్ దక్కించుకొని పనులు మొదలు పెట్టింది. ఈ పనులను 2026 నవంబర్ వరకు పూర్తి అయ్యేలా కావాల్సిన చర్యలు తీసుకున్నట్లు ఆర్అండ్బీశాఖ అధికారులు తెలిపారు. 24 గడ్డర్లతో నిర్మాణం బ్రిడ్జి పొడువు 180 మీటర్లు, 7 పిల్లర్లు, 24 గడ్డర్ల(బీమ్)తో బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. 24 గడర్స్ నిర్మాణంలో భాగంగా ఇప్పటి వరకు 9 నిర్మాణం పూర్తికాగా మిగతా వాటి నిర్మాణానికి చురుకుగా కార్మికులు పనులు చేపడుతున్నారు. జంపన్నవాగులో ఆరు పిల్లర్లను భూమి లోపటికి 27 మీటర్ల లోతులో ప్రత్యేక టెక్నాలజీతో కాంక్రీట్ పిల్లర్లను రెండు నిర్మించారు. మరో ఐదు పిల్లర్లను నిర్మించాల్సి ఉంది. నిర్మించిన ఆరు పిల్లర్లపై 8 మీటర్ల ఎత్తులో పిల్లర్ నిర్మాణం చేపట్టి దానిపై గడర్స్ అమర్చిన తర్వాత బ్రిడ్జిపై 8.5 మీటర్ల కాంక్రీట్ స్లాబ్ నిర్మిస్తారు. ఒక్కో పిల్లర్కు మధ్య 22.2 మీటర్ల పొడువు ఉంటుంది. ఈ పిల్లర్ల నిర్మాణం వల్ల ఎక్కడ ఎలాంటి పిల్లర్లు కుంగిన స్లాబ్ చెక్కుచెదరకుండా ఉండేలా డిజైన్ చేశారు. అంతేకాకుండా సుమారు వందేళ్ల వరద నీటి ప్రవాహాన్ని అంచనా వేసి దీనిని నిర్మించారు. 2016లో నిర్మించిన ముళ్లకట్ట బ్రిడ్జి పిల్లర్లు 44 మీటర్ల లోతులో దింపగా కొండాయి బ్రిడ్జి వాగుకు 27 మీటర్ల లోతులోకి దింపడం గమనార్హం. సులభతరం కానున్న రవాణా కొండాయి వద్ద బ్రిడ్జి 2023 వరదలకు కొట్టుకుపోయి 8 మంది జలసమాది అయిన విషయం తెలిసిందే. దీంతో రవాణా కష్టాలు మూడేళ్లుగా లోతట్టు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతూ జీవిస్తున్నారు. ఈ బ్రిడ్జి పనులు పూర్తి అయితే కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీ, ఐలాపురం, కొత్తూరు గ్రామాల గిరిజనులు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. ఇవేకాకుండా 2028లో వచ్చే మేడారం జాతరకు ఈ బ్రిడ్జి పూర్తి స్థాయిలో మేడారం భక్తులకు అందుబాటులోకి వస్తుంది. ఇవేకాకుండా వైద్యం, విద్య, వ్యవసాయం, నిత్యావసర వస్తువుల మార్గం సులభతరం కానుంది. రెండు పిల్లర్లకు కాంక్రీట్ ఫిల్లింగ్ ఏడాది వరకు పనులు పూర్తయ్యేలా చర్యలు -
ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్
అబ్బాయిగూడెం వద్ద రోడ్డుకు ఇరువైపులా నిలిపి ఉన్న ఇసుక లారీలువెంకటాపురం(కె): ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అడ్డదిడ్డంగా రోడ్డుకు ఇరువైపులా ఇసుక లారీలు నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. మండల పరిధిలోని ఆలుబాక నుంచి అబ్బాయిగూడెం వరకు ఇసుక లారీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం నుంచి ఇసుక లారీలు అధిక సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా నిలిపివేయడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, ద్విచక్రవాహనదారులు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక లారీలను రోడ్డుపై నిలపకుండా పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి నిలపాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. -
మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. మండల పరిధిలోని ఇంచర్లలో ఇందిరా మహిళా శక్తి చీరలను మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణితో కలిసి ఆయన మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవిచందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చిక్కుల రాములు, మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముసినపల్లి కుమార్గౌడ్, శానబోయిన అశోక్, తిరుపతి, రాజమొగిలి, రాజు తదితరులు పాల్గొన్నారు.గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ -
పథకాలపై అవగాహన కల్పించాలి
ములుగు రూరల్: కార్మిక సంక్షేమ పథకాలపై కార్మికులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో కార్మిక సంక్షేమ పథకాల అవగాహన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న సహాయ కార్మిక శాఖ అధికారి వినోద, ఆర్డీఓ వెంకటేశ్ల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల సభ్యులకు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రకాల పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్మికుల నూతన కార్డు అప్లై చేసుకునే విధానం, బెన్ఫిట్స్ పొందే విధానంపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
● సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ములుగు రూరల్: హమాలీ కార్మికుల వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో సోమవారం ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలైన ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీ తదితర హమాలీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం హమాలీల వెల్ఫేర్ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు ప్రమాదవశాత్తు బస్తాలు మీద పడి గాయాలపాలై, చనిపోయినా ఎలాంటి రక్షణ లేనందున ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కార్మికులకు యూనిఫామ్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘు, చిన్ని, స్వామి, శ్రీధర్, లక్ష్మణ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వందేమాతరం వార్షికోత్సవ ర్యాలీ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం హాజరై మాట్లాడారు. బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయాన్ని స్మరించుకుంటూ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నట్లు వెల్లడించారు. జాతీయ కార్యక్రమం వార్షికోత్సవాన్ని ఏడాది పాటు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబర్లో ప్రధానమంత్రి మోదీ ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వినుకోలు చక్రవర్తి, జనార్దన్, లవన్, మహాలక్ష్మీ, స్వరూప, కృష్ణవేణి, సీతయ్య, సత్యం, రోహిత్, రవికిరణ్ పాల్గొన్నారు. -
నేడు క్రికెట్ క్రీడాకారుల ఎంపిక
ఏటూరునాగారం: నేడు క్రికెట్ క్రీడాకారుల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోడి వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియ జెడ్పీహెచ్ఎస్ క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలోని పది మండలాల నుంచి ఒక జిల్లా టీంను తయారు చేసి క్రికెట్ షెడ్యూల్ వచ్చిన తర్వాత స్టేట్మీట్ను ఆడిస్తామని తెలిపారు. ప్రతీ క్రీడాకారుడు నేడు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. క్రీడాకారులు వైట్ డ్రెస్, ఆధార్కార్డు, టెన్త్ మెమో వెంట తీసుకొని రావాలని సూచించారు. అండర్ 19, ఓపెన్ టు ఆల్ 30 వయస్సులోపు విద్యార్థులు, క్రీడాకారులు హాజరు కావాలని కోరారు. ఏటూరునాగారం: సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల నియామక సమయంలో అర్హత ప్రమాణాలన్ని పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన వారిని మళ్లీ అర్హత నిరూపించుకోమనటం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొన్నారు. టెట్ పరీక్ష ఉద్దేశం కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించబోయే వారికి అర్హతను నిర్దేశించి మాత్రమేనని వివరించారు. తక్షణమే ప్రభుత్వం విద్యాహక్కుల చట్టాన్ని సవరించి టెట్ పరీక్ష నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని కోరారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్పోస్టు కాళేశ్వరం: మహారాష్ట్ర మీదుగా ధాన్యం అక్రమ రవాణాకు చెక్పెట్టేందుకు ఖరీఫ్ సీజన్లో చెక్పోస్టును ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి (డీసీఎస్ఓ) కిరణ్కుమార్ అన్నారు. సోమవారం మహాదేవపూర్ మండలం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లి వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి ధాన్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారి బృందాలు రెండు షిఫ్టులుగా 24/7 విధుల్లో ఉంటూ ఈ తనిఖీ కేంద్రం ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహదేవపూర్ రామారావు, మండల వ్యవసాయ అధికారి సుప్రజ్యోతి, సివిల్ సప్లై విభాగం డీఎం రాములు, కాళేశ్వరం ఎస్సై జి.తమాషారెడ్డి, ఆర్ఐ సురేందర్రెడ్డి, రఘు, జీపీఓ శ్యామ్ పాల్గొన్నారు. ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి భూపాలపల్లి అర్బన్: మీసేవ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, నూతన మీ సేవల ఏర్పాట్లను విరమించుకోవాలని తెలంగాణ మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్త కిరణ్కుమార్ కోరారు. వాట్సప్ ద్వారా మీసేవ సర్వీసులను రద్దు చేయాలని, నూతన మీ సేవ కేంద్రాల ఏర్పాటును విరమించుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా వ్యాప్తంగా మీ సేవల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కిరణ్కుమార్ మాట్లాడుతూ.. పది సంవత్సరాల క్రితం నుంచి ఉన్న కమిషన్ విధానమే నేటికీ కొనసాగుతుందని కమిషన్ పెంచాలని కోరారు. కొద్దిపాటి కమిషన్తోనే మీ సేవలో నడిపిస్తున్నామని, పెరిగిన ఖర్చులతో ఇబ్బందికరంగా మారిందన్నారు. గతంలో తొలగించిన సర్వీసులు తిరిగి పునరుద్ధరించాలని, జీవనోపాధి భద్రత దృష్ట్యా భరోసా కల్పించే విధంగా ఉత్తర్వులు అందించాలని ఆయన కోరారు.


