breaking news
Mulugu
-
శంభో శంకరా..
వెంకటాపురం(ఎం): జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయాలు హరహర మహాదేవా.. శంభో శంకరా.. అంటూ శివనామస్మరణతో మార్మోగాయి. ఆదివారం ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కల్యాణ వేడుకలను తిలకించారు. ములుగులోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు ఆలయ ఆవరణలోని నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. శివలింగం వద్ద భక్తులు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు మారేడు చెట్టు కింద దీపాలు వెలిగిస్తూ పూజలు నిర్వహించారు. రామప్ప ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ ఛైర్మన్ మిల్కూరి అయిలయ్య, ఈఓ బిల్ల శ్రీనివాస్, ఆలయ ఇన్స్పెక్టర్ అనిల్ ఆధ్వర్యంలో సిబ్బంది కందగడ్డ, అరటిపండ్లను ప్రసాదంగా అందించారు. రామప్పలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో 546 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించినట్లు వైద్యాధికారి శ్రీకాంత్, డాక్టర్ రిషిత తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలు అందించినట్లు డీఎస్పీ కిశోర్కుమార్, సీఐ సురేశ్, ఎస్సై చల్ల రాజు తెలిపారు. శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు భక్తులతో కిటకిటలాడిన రామప్ప ఆలయం కనులపండువగా శివపార్వతుల కల్యాణం -
నిరంతరం విద్యుత్ సరఫరా
ములుగు: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ములుగు సర్కిల్ పరిధిలో నిరంతరం విద్యుత్ సరఫరా అందించామని ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) ఆనందం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ములుగు సర్కిల్ పరిధిలోని అన్ని శివాలయాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామన్నారు. మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ వెలుగులతో ఆలయాలు ప్రకాశిస్తున్నాయని వివరించారు. లోడ్ అంచనాలకు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచామని వెల్లడించారు. 24 గంటలు పర్యవేక్షణ చేసేలా అదనపు సిబ్బందిని నియమించామన్నారు. రామప్ప వద్ద 25 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు వివరించారు. సమావేశంలో ములుగు ఏడీఈ వేణుగోపాల్, ఏఈ రమేష్, సబ్ ఇంజనీర్లు సాంబరాజు, శివ పాల్గొన్నారు.ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఆనందం -
నేడు కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం
● చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ములుగు: ములుగు మున్సిపాలిటీకి ఎన్నికై న కౌన్సిలర్లు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 20 వార్డులకు 12 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 1 బీజేపీ, 2 స్వతంత్రులు గెలుపొందారు. సోమవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 12:30గంటలకు చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి చేతులు ఎత్తే పద్ధతిలో చైర్పర్సన్, వైస్ చైర్మన్ను ఎన్నుకోనున్నారు. చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.నేటి ప్రజావాణి రద్దు ములుగు: నేటి ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ టీఎస్.దివాకర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉండడంతో పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో నేడు జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు గమనించాలని ఆయన కోరారు. వెంకటాపురం(ఎం): మహాశివరాత్రి సందర్భంగా రామప్ప గార్డెన్లో గంగిశెట్టి సరస్వతి జ్ఞాపకార్థం ఆమె కుమారుడు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాన్ని ఆదివారం అదనపు కలెక్టర్ మహేందర్జీ ప్రారంభించారు. 15 ఏళ్లుగా ప్రతీ శివరాత్రికి రామప్పకు వచ్చే భక్తులకు ఉచిత మినరల్ వాటర్ను అందిస్తున్న గంగిశెట్టి శ్రీనివాస్ సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామప్ప ఆలయ చైర్మన్ మిల్కూరి అయిలయ్య, ఈఓ శ్రీనివాస్, తహసీల్దార్ గిరిబాబు, లయన్స్ క్లబ్ సభ్యులు పింగిలి నాగరాజు, చుంచు రమేష్, గొల్లపెల్లి రాజేందర్, మామిడిశెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు. రేగొండ: మండలంలోని కోటంచలో నిర్వహించనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పున:ప్రతిష్ట మహోత్సవం, స్వామి వారి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయన్నారు. స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం, బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని కోరారు. అనంతరం గడిపల్లి శివాలయంలో నిర్వహించిన శివరాత్రి వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయినేని సంపత్రావు, నాయకులు ఉమేష్ గౌడ్, భిక్షపతి, రవీందర్ రావు, శ్రీనివాస్, సాంబయ్య పాల్గొన్నారు. -
చెలిమనీరే.. తాగునీరు
ఏజెన్సీలోని గొత్తికోయలకు తప్పని తిప్పలుఏటూరునాగారం: ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన గిరిజనుల కష్టాలు తీరడం లేదు. ఏజెన్సీలో ఆవాసాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న గొత్తికోయలకు స్వచ్ఛమైన తాగునీరు కరువైంది. కిలోమీటర్ల దూరం నడిచివెళ్లి వాగుల్లో చెలిమలు తోడి నీటిని తెచ్చుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 51 గొత్తికోయగూడేలు ఉన్నాయి. వీటిల్లో 3,548 మంది గొత్తికోయలు జీవనం సాగిస్తున్నారు. ఇందులో రాయబంధం, రేగులగూడెంతో పాటు మరో నాలుగు గూడేలకు రోడ్లు, తాగునీటి వసతి కల్పించారు. కానీ మిగతా 45 గూడేల్లో మాత్రం తాగునీటి కోసం గొత్తికోయలు వాగుల్లోని చెలిమలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అడవిలో కిలో మీటర్ల మేర బిందెలను చేతపట్టుకుని వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. అలాగే తాగునీటితో పాటు రోజువారి అవసరాలకు సైతం వాగునీటినే తెచ్చుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందంటే తాగునీటి సమస్య మరింత జఠిలంగా ఉంటుందని గొత్తికోయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషితం అవుతున్న వాగునీరు ఏజెన్సీలో ప్రవహించే వాగుల్లోని నీరు గతంలో చెట్ల మధ్య నుంచి ఊటలు వచ్చేవి. ఆ నీటిని తాగడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు వాగుల్లోకి వ్యర్థాలు, ప్లాస్టిక్, పశువుల కళేబరాలు వచ్చి చేరుతుండడంతో నీరు కలుషితం అవుతుంది. దీంతో వాగుల్లోని నీటిని వాడే గిరిజనులు కాచి చల్లార్చిన నీటినే తాగాలని అవగాహన సదస్సులు పెట్టి చైతన్య పరుస్తున్నారు. అటవీశాఖ అడ్డంకులు తాగునీటి వసతి కల్పించేందుకు జీపీలకు అటవీశాఖ అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటుంది. కమీషన్లకు కక్కుర్తి పడి ఆటోమెటిక్ బోర్లు, హెవీ వాటర్ బోర్లను నిర్మించడానికి సంబంధిత బోర్వెల్స్కు వత్తాసు పలుకుతూ బోర్లు వేయిస్తున్నారు. కానీ గిరిజనులు గొంతు తడుపుకునేందుకు తాగునీటి కోసం బోర్లు వేసేందుకు అనుమతి ఇవ్వలేదు. గతంలో మిషన్ భగీరథ పైపులైన్ అడవి మార్గం నుంచి వేసేందుకు అధికారులు నిరాకరించడంతో పైపులైన్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో గొత్తికోయగూడేలకు తాగునీరు అందని పరిస్థితి నెలకొంది.ఏటూరునాగారం 8కన్నాయిగూడెం 6వాజేడు 3వెంకటాపురం(కె) 4ఎస్ఎస్తాడ్వాయి 8మంగపేట 7గోవిందరావుపేట 5ములుగు 2వెంకటాపురం(ఎం) 2 కిలోమీటర్ల మేర అడవిలో కాలినడకన ప్రయాణం వాగుల్లో చెలిమలు తోడి తెచ్చుకుంటున్న నీరు -
బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్
ములుగు రూరల్: బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్ అని, బంజారాల సంస్కృతీ, సంప్రదాయాలతో పాటు కుల దైవాల చరిత్రను భావితరాలకు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని దేవగిరిపట్నంలో సేవాలాల్ మహరాజ్ ఆలయంలో ఆదివారం నిర్వహించిన సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రికి సేవాలాల్ మహరాజ్ ఆలయ పూజారి కిషన్ మహరాజ్ స్వామి తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్, స్థానిక సర్పంచ్ పూలమ్మ తదితరులు పాల్గొన్నారు. సేవాలాల్ మహరాజ్ ఆదర్శప్రాయుడు గోవిందరావుపేట: సేవాలాల్ మహరాజ్ ఆదర్శప్రాయుడని, ఆయన చూపిన మార్గంలో ప్రతిఒక్కరూ నడవాలని టీఎస్టీఈఏ(తెలంగాణ షెడ్యూల్డ్ ట్రైబల్ ఎంప్లాయీస్ అసోసియేషన్) జిల్లా అధ్యక్షుడు భూక్య సక్రునాయక్ అన్నారు. మండల పరిధిలోని పస్రాలో గ్రామ సర్పంచ్ భూక్య సుమలత నివాసంలో ఎల్హెచ్పీఎస్, బంజారా రైతుమిత్ర సంఘం, బంజారా కుల పెద్దల ఆధ్వర్యంలో ఆదివారం సద్గురు సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహరాజ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంజారాలు సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుతూ నీతి నిజాయతీతో ముందుకు సాగాలన్నారు. ఎల్హెచ్పీఎస్ మండల అధ్యక్షుడు లకావత్ నరసింహ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ జయంతి నిర్వహణకు ప్రభుత్వం విడుదల చేసే నిధులు జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా మండలాల వారీగా కేటాయించాలని కోరారు. ప్రతీ బంజారా తండాలో జయంతిని అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ భూక్య సుమలత, జోగా, భద్రమ్మ, పీరమ్మ, మున్నా, రఘురామ్, దేవా తదితరులు పాల్గొన్నారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
ఎలిశెట్టిపల్లి బ్రిడ్జిపై సర్వే
ఏటూరునాగారం: మండల పరిధిలోని ఎలిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో హైదరాబాద్ ప్రొఫెసర్ శంకర్ బృందంతో పాటు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఆదివారం గ్రామానికి వెళ్లేదారిలో సర్వే చేపట్టారు. చెల్పాక నుంచి ఎలిశెట్టిపల్లికి వెళ్లాలంటే జంపన్నవాగు దాటితేనే ఆ గ్రామానికి చేరుకునే పరిస్థితి ఉంది. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఎలిశెట్టిపల్లి జంపన్నవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్శాఖ ద్వారా రూ. 21 కోట్లతో వాగుపై 200 మీటర్ల పొడవులో బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు డిజైన్ చేశారు. అయితే అక్కడ ఉన్న భూమి, పరిస్థితిని హైదరాబాద్ ప్రొఫెసర్ శంకర్ బృందంతో పాటు పీఆర్ డీఈ నరేశ్ క్షుణ్ణంగా పరిశీలించారు. గిరిజనుల డిమాండ్ మేరకు జంపన్నవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారులు డీపీఆర్ను చేపట్టారు. వర్షాకాలంలో వాగు ప్రవాహం, ఉధృతి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. జంపన్నవాగు ఉప్పొంగితే ఎలిశెట్టిపల్లి, కొత్తూరు, గిరిజనగూడేలకు రవాణా సౌకర్యం పూర్తిగా నిలిచిపోయేదని స్థానికులు ఇంజనీరింగ్ అధికారులకు వివరించారు. ఈ క్రమంలో బ్రిడ్జి నిర్మాణంపై సర్వే వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తున్న మంత్రి సీతక్కకు రుణపడి ఉంటామని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్ల దేవేందర్, వావిలాల ఎల్లయ్య, రాష్ట్ర రవాణా శాఖ డైరెక్టర్ వసంత శ్రీనివాస్, సర్పంచ్లు పలక మహాలక్ష్మీ, అట్టం రాంబాబు, దేవులపల్లి విజయ్కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ డొంగిరి మధుబాబు, మాజీ సర్పంచ్ చింత సుమలత, రమేష్, హరీష్, కుదురుపాక శ్రీనివాస్, సత్యం, రాంబాబు, సారయ్య, చెన్నెం ఎల్లయ్య పాల్గొన్నారు. హైదరాబాద్ ప్రొఫెసర్ శంకర్ బృందం, పంచాయతీరాజ్ అధికారుల పర్యటన రూ.21 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి డిజైన్ -
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మహాశివరాత్రి సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రామప్పలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. రాత్రి 9 గంటలకు నవ్యజ బృందంచే చేసిన పేరిణి నృత్యం, 10 గంటలకు చైతన్య బృందం ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యం, 11 గంటలకు మోతె రమేశ్ ఆధ్వర్యంలో ఆర్కెస్ట్రా ప్రోగ్రాం నిర్వహించారు. 12గంటలకు మోతె శంకర్ ఆధ్వర్యంలో చెక్కబొమ్మలాట, అర్ధరాత్రి ఒంటిగంటకు మనుల స్వప్న బృందంచే భక్తి గీతాలు భక్తులను అలరించాయి. జాగరణ చేపట్టిన భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. -
తీరని నష్టం..!
కొద్దితేడా.. ‘బల్దియా’ఎన్నికల్లో పోరాడి ఓడిన బీఆర్ఎస్బీఆర్ఎస్కాంగ్రెస్ 39.21 శాతం 41.82 శాతం సాక్షిప్రతినిధి, వరంగల్: ఓరుగల్లులో రసవత్తరంగా సాగిన మున్సిపల్ ఎన్నికల పోరులో బీఆర్ఎస్కు కొద్ది తేడాతో తీరనినష్టం జరిగింది. అధికార పార్టీకి ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలు అడ్వాంటేజ్గా ఉంటాయన్న చర్చ ఉన్నప్పటికీ.. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఓట్లను విశ్లేషిస్తే బీఆర్ఎస్ గట్టిపోటీనే ఇచ్చింది. ఉమ్మడి వరంగల్లోని 12 మున్సిపాలిటీల్లో ఓటింగ్ సరళిని ఈ విషయం స్పష్టమవుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులకు పోలైన మొత్తం ఓట్లను గమనిస్తే కేవలం 2.61 శాతం ఓట్ల వ్యత్యాసమే ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయిన కొన్నిచోట్ల ఓటుశాతం ఎక్కువగా ఉన్నా వార్డులను గెలిచేలా పనిచేయలేదు. అయితే తొర్రూరు మున్సిపాలిటీలో ఓటుశాతం తగ్గినా, వార్డులు పెరిగాయి. స్వల్ప వ్యత్యాసమే... ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ మొత్తానికి మొత్తం గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి ఒక్క స్థానంతోనే సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈ సారి జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 12 మున్సిపాలిటీల్లో మొత్తం 3,35,278 ఓట్లకు 2,62,283 ఓట్లే పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు పోలైన ఓట్లను గమనిస్తే కేవలం 2.61 శాతం తేడా ఉండగా, ఈ తేడాలో 140 వార్డులను కాంగ్రెస్ కై వసం చేసుకుంటే, బీఆర్ఎస్ 88లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా మెజార్టీ మున్సిపాలిటీలు చేజారిపోయాయి. చెదిరిన బీఆర్ఎస్ కంచుకోటలు... మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంచుకోటలు చెదిరిపోయాయి. స్టేషన్న్ఘన్పూర్, నర్సంపేట, డోర్నకల్, భూపాలపల్లి తదితర మున్సిపాలిటీలలో పరిస్థితి అధ్వానంగా మారింది. ఆయాచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్లకు పోలైన ఓట్లను పరిశీలిస్తే ఈ మున్సిపాలిటీల్లో 10 నుంచి 14 శాతం వరకు బీఆర్ఎస్కు తక్కువ ఓట్లు పడ్డాయి. ఫలితంగా ఆ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. మరిపెడ, ములుగులలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు దరిదాపుల్లో లేకుండా పోయారు. నర్సంపేటలో 40,968 ఓట్లకు 34,908 కోట్లు పోల్ కాగా అందులో బీఆర్ఎస్కు 13,756 (39.39 శాతం) ఓట్లు వస్తే కాంగ్రెస్కు 17,358 (49.72 శాతం) ఓట్లు వచ్చాయి. స్టేషన్ఘన్పూర్లో కాంగ్రెస్కు 48.57 శాతం ఓట్లు వస్తే, బీఆర్ఎస్కు 31.39 శాతం, డోర్నకల్లో కాంగ్రెస్కు 49.19 శాతం, బీఆర్ఎస్కు 37,79 శాతమే వచ్చాయి. భూపాలపల్లిలో పోలైన 34,367 ఓట్లలో కాంగ్రెస్కు 14,638 (42.59 శాతం) ఓట్లు రాగా, బీఆర్ఎస్కు 13,949 (40.59 శాతం), ములుగులో కాంగ్రెస్కు 44.53 శాతం వస్తే బీఆర్ఎస్కు 30.44 శాతమే ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్కు మధ్య 2.61 శాతమే ఓట్లతేడా చాలాచోట్ల అధికంగా వచ్చినా ఆ మేరకు దక్కని సీట్లు పరకాల, నర్సంపేట, ములుగులలో దరిచేరనీయని హస్తం మున్సిపల్ ఎన్నికలపై నేతల పోస్టుమార్టం.. పార్టీలో సాగుతున్న అంతర్మథనం -
ఎదుర్కోలు మహోత్సవం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శివాలయంలో శనివారం రాత్రి ఎదుర్కోలు మహోత్సవాన్ని నిర్వహించారు. శివ పార్వతుల కల్యాణం ముందు రోజు ఎదుర్కోలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అర్చకులు రాజ్కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి శివుడు, పార్వతి ఇరు పక్షాల గ్రామ పెద్దలు ఎదర్కోలు నిర్వహించి తాంబూలాలను ఇచ్చి పుచ్చుకున్నారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక ములుగు రూరల్: సీఎం కప్ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు మండలంలోని దేవగిరిపట్నం మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత తెలిపారు. ఈ మేరకు శనివారం రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడాపోటీలు ఇటీవల జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీల్లో షాట్పుట్లో అండర్–16 విభాగంలో ఆకాంక్ష, రెజ్లింగ్ అండర్–14 విభాగంలో పూజిత, రెజ్లింగ్ అండర్–16 విభాగంలో రేష్మ, వాల్బాల్లో రిజ్వాన, శ్రీవేణి, కబడ్డీలో శ్రావ్య, 600 మీటర్ల పరుగు పందెంలో సన ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ విద్యార్థినులు ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. కాజీపేటలో రైల్వేట్రాక్ మరమ్మతు పనులు కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో శనివారం రైల్వే ఇంజనీరింగ్ అధికారులు రైల్వేట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు. కాజీపేట రైల్వే స్టేషన్లోని ఒకటో నంబర్ ప్లాట్ఫాంలో రైల్వేట్రాక్ కాలపరిమితి పూర్తి అయ్యింది. ఆ స్థానంలో కొత్త రైల్వేట్రాక్ (ట్రాక్ రెల్ రిప్లస్) పనులు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గతంలో ఒక రైలు పట్టా 13 మీటర్ల వరకు ఉండేదని, ప్రస్తుతం ఎలాంటి జాయింట్ లేకుండా 200 మీటర్ల వరకు రైలు పట్టా ఉంటుందని పేర్కొన్నారు. అధునాతన సాంకేతిక రైళ్ల వేగాన్ని తట్టుకునేందుకు ఈ ట్రాక్ వేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల నుంచి ఇంజనీరింగ్ స్టాఫ్, యంత్రాలతో ట్రాక్ రెన్యువల్ పనులు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. కంప్యూటర్ సైన్స్ బీఓఎస్గా రమేశ్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా (బీఓఎస్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.రమేశ్ను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్గా పనిచేసిన డాక్టర్ మంజుల పదవికాలం ముగియడంతో రమేశ్ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాలపాటు కొనసాగనున్నారు. -
ట్రాక్టర్ను ఢీ కొట్టిన ఇసుక లారీ
● ఆరుగురికి గాయాలు ఏటూరునాగారం: ఓ ట్రాక్టర్ను ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ బోల్తాపడగా ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం మండల పరిధిలోని రొయ్యూర్ సమీపంలో గల 163వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మిర్చి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాలీలోని నలుగురు, ఇంజిన్పై కూర్చున్న ఇద్దరు ఎగిరిపడ్డారు. ఏటూరునాగారానికి చెందిన కూలీలు ట్రాక్టర్ యజమాని పూజారి బుచ్చయ్యతో కలిసి మిర్చి తోట నుంచి ఏటూరునాగారం వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన ఆరుగురిని 108లో సామాజిక ఆస్పత్రికి తరలింలించారు. క్షతగాత్రులు గాయాలతో బయపడినట్లు వైద్యులు తెలిపారు. ఢీ కొట్టిన లారీ వివరాలపై స్థానికులు ఆరా తీస్తున్నారు. -
పూజా కార్యక్రమాల వివరాలు..
నేటి(ఆదివారం) ఉదయం 4:30 గంటలకు సుప్రభాతం, 6 నుంచి గణపతి పూజ, అఖండ దీపారాధన, పుణ్యహవచనము, అంకురార్పణ, రక్షబంధనం, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటలకు శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని ఆలయ పూజారులు కోమల్లపల్లి హరీశ్ శర్మ, ఉమాశంకర్లు వైభవంగా జరిపించనున్నారు. 16న సోమవారం 5 గంటలకు సుప్రభాతం, గణపతి పూజ, స్వామివారికి రుద్రాభిషేకాలు, 11 నుంచి గణపతి పూజ, విగ్రహారాధన, వీరభద్ర పళ్లెరము, సాయంత్రం భద్రకాళి పూజ, సహస్రనామార్చన, బలిహరణ, దీపోత్సవం నిర్వహించనున్నారు. 17న మంగళవారం అగ్నిగుండాల మహోత్సవంతో పాటు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి మహాశివరాత్రికి రామప్ప ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాత్రి 10గంటలు శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తాం. రామలింగేశ్వరస్వామిని భక్తులు సులభంగా దర్శించుకునేలా క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశాం. జాగరణ భక్తులకు అరటిపండ్లు, కందగడ్డ, అంగూర పండ్లను అదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రసాదంగా అందించనున్నాం. భక్తులకు తాగునీటి వసతి కల్పించాం. – బిల్ల శ్రీనివాస్, ఈఓ రామప్ప -
చైర్పర్సన్ ఎవరో?
● రేసులో స్వాతి, చంద్రకళ ● ఇరువురి మధ్య నెలకొన్న పోటీ ● 16న చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ములుగు: ములుగు మున్సిపాలిటీ తొలి పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకునేందుకు సన్నద్ధమైనప్పటికీ చైర్పర్సన్ పదవి ఎవరికి దక్కనుందో చూడాలి. ప్రధానంగా నల్లెల్ల స్వాతి, చింతనిప్పుల చంద్రకళ మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పార్టీ విధేయుడిగా పేరొందిన మాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి కోడలు స్వాతి పదవిని ఆశిస్తున్నారు. గత 20 ఏళ్లుగా పార్టీలో ఉంటూ సీతక్క అనుచురుడిగా గుర్తింపు పొందిన చింతనిప్పుల భిక్షపతి సతీమణి చంద్రకళ సైతం చైర్పర్సన్ రేసులో ఉండడంతో ఇరువురి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎంపికను మంత్రి సీతక్కనే ఫైనల్ చేస్తుందని, సీతక్క మాటకు, పార్టీకి కట్టుబడి ఉన్నామ ని కౌన్సిలర్లు, పార్టీ నాయకులు చెబుతున్నారు. క్యాంపునకు తరలివెళ్లిన కౌన్సిలర్లు ములుగు మున్పిపాలిటీ చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ పార్టీ నుంచి స్వాతి, చంద్రకళతో పాటు మాజీ సర్పంచ్ బండారి నిర్మల, మాజీ ఉప సర్పంచ్ వంగ సుమలత కూడా ఆశించారు. మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల, సుమలత ఓటమి చెందడంతో స్వాతి, చంద్రకళ మధ్య పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన 12 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు క్యాంపునకు వెళ్లినట్లు సమాచారం. ఈ నెల 16న చైర్పర్సన్, వైస్ చైర్మన్కు ఎన్నిక జరగనుంది. నల్లెల్ల స్వాతిచింతనిప్పుల చంద్రకళ -
మున్సిపాలిటీ వారీగా వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు, శాతాలు ఇలా..
మున్సిపాలిటీ మొత్తం పోలైనవి బీఆర్ఎస్ శాతం కాంగ్రెస్ శాతం బీజేపీ శాతం స్వతంత్రులు/ శాతం ఇతరులు పరకాల 26,818 21,533 8,467 39.32 8,267 38.39 3735 17.35 1,064 4.71 నర్సంపేట 40,968 34,908 13,753 39.39 17,358 49.72 1645 4.71 2,152 6.16 వర్ధన్నపేట 10,526 9,077 3,978 43.82 3,709 40.86 740 8.15 650 7.16 జనగామ 44,045 34,821 13,341 38.31 12,057 34.63 2416 6.94 7007 20.12 స్టేషన్ఘన్పూర్ 18,550 15,670 4,919 31.39 7612 48.57 728 4.64 2411 15.38 మహబూబాబాద్ 65,712 49,681 18,483 37.20 17070 34.36 1,270 2.56 12,858 25.88 తొర్రూరు 21,451 16,611 7,718 46.46 7,992 48.11 713 4.29 188 1.31 మరిపెడ 13,687 11,738 4,723 40.24 5,449 46.42 198 1.69 1,368 11.65 డోర్నకల్ 10,869 8,900 3,363 37.79 4,378 49.19 251 2.82 908 8.18 కేసముద్రం 15,963 13,750 6,743 48.97 6,149 44.65 436 3.16 422 2.92 భూపాలపల్లి 52,726 34,367 13,949 40.59 14,638 42.59 2789 8.11 2,991 8.70 ములుగు 13,963 11,227 3,418 30.44 4999 44.53 1669 14.86 1,141 8.99 -
ధ్వంసమైన పుష్కరఘాట్ పరిశీలన
మంగపేట: మండల కేంద్రంలోని పొదుమూరు సమీపంలో గోదావరి ఒడ్డున 2015లో పుష్కరఘాట్ నిర్మించారు. గోదావరి వరదలకు ధ్వంసమైన ఈ ప్రాంతాన్ని ఇరిగేషన్ ఈఈ శంకరయ్య రెవెన్యూ పంచాయతీ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 జూన్లో జరుగనున్న గోదావరి పుష్కరాలకు పుష్కరఘాట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు స్థల పరిశీలనకు వచ్చినట్లు వెల్లడించారు. 2015లో పుష్కరాల సందర్భంగా రూ.5.64 కోట్లతో 170 మీటర్ల మేర నిర్మించిన పుష్కరఘాట్ను పరిశీలించినట్లు తెలిపారు. మండలంలో 2027 జూన్లో జరిగే పుష్కరాలకు పుష్కరఘాట్ ఏర్పాటు చేసేందుకు ఈ నెల 18న ఉన్నతాధికారులు అనుకూలమైన స్థలాన్ని పరిశీలించేందుకు మండలానికి రానున్నట్లు వివరించారు. ముందస్తుగా అనుకూలమైన స్థలాన్ని గుర్తించేందుకు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం గోదావరి కరకట్ట నిర్మాణం జరుగుతున్నా దొంగల ఒర్రె ప్రాంతాన్ని కూడా పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ రవికుమార్, ఏఈ వలీమ్మహ్మద్, జీపీఓ రాములు, నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల సందడి
వెంకటాపురం(ఎం)/మంగపేట: చారిత్రక రామప్ప దేవాలయం, హేమాచలక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. రామప్పకు పర్యాటకులు, విద్యార్థులు తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ పర్యాటకులకు వివరించారు. అలాగే రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు శనివారం భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేటు బస్సులు, ఆటోలలో వేలాదిగా తరలివచ్చారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. అర్చకులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
తల్లుల దీవెనలతో ప్రజలకు సేవ చేస్తాం
● స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మల తల్లుల దీవెనలతో ప్రజలకు మరింత సేవ చేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నూతనంగా ఎన్నికై న స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లతో కలిసి ఆయన శనివారం అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు ఎత్తు బంగారం, చీరసారె, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేయాలని సంకల్పించామని తెలిపారు. ఆలయ సంప్రదాయ ప్రకారం దేవాదాయశాఖ అధికారులు, పూజారులు కడియం శ్రీహరితోపాటు నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్లకు డోలి వాయిద్యాలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం పూజారులు కడియం శ్రీహరి, కౌన్సిలర్లను అమ్మవారి కండువా కప్పి సన్మానించి ప్రసాదం అందజేశారు. -
బంగారు తల్లి కాళ్లు మొక్కి.. ఆనంద భాష్పాలు
హన్మకొండ: ఆడపిల్ల అదృష్టమంటారు. తన విజయానికి తన కూతురే (బంగారు తల్లి) కారణమని ఓ తండ్రి మున్సిపల్ ఎన్నికల్లో వార్డుసభ్యుడిగా గెలుపొందాక తన కూతురు కాళ్లు మొక్కాడు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో 19వ వార్డునుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. ఆయనకు 584 ఓట్లు రాగా, 207 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. గెలుపు ధ్రువీకరణపత్రం అందుకున్న తరువాత కౌంటింగ్హాల్నుంచి బయటికి వచ్చిన ఆయన నేరుగా తన కోసం వేచి చూస్తున్న కూతురు సహస్ర రెండు కాళ్లను మొక్కాడు. అనంతరం ఎత్తుకుని ముద్దు పెట్టుకుని భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా, శ్రీనివాస్ మొదటినుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు తన కూతురు సహస్ర పుట్టడంతో తన అదృష్టంగా భావించాడు. ముద్దుగా బంగారు తల్లి అని పిలుచుకుంటాడు. అందుకే గెలుపొందగానే తన కూతురు కాళ్లు మొక్కినట్లు అనుచరులు తెలిపారు. -
మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం
● రామప్ప ఆలయ చైర్మన్ ఐలయ్య వెంకటాపురం(ఎం): మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని రామప్ప ఆలయ చైర్మన్ ఐలయ్య తెలిపారు. మండలంలోని చారిత్రాత్మక గ్రామ దేవాలయానికి శుక్రవారం రామప్ప ఉత్సవ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసింది. ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు హరీష్ శర్మ, ఉమా శంకర్ల మంత్రోచ్ఛరణలా మధ్య పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్కను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చైర్మన్ ఐలయ్యను స్థానిక కాంగ్రెస్ నాయకులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు శంకర్, రాజు, తిరుపతిరెడ్డి, వెంకటేశ్వర్లు, నర్సయ్య ,విజయ, కల్పనాదేవి, రాజీరు, వీరేష్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హంసవాహనం ట్రయల్ రన్..
కాళేశ్వరం: శివరాత్రి సందర్భంగా ఈసారి కాళేశ్వరంలోని వీఐపీఘాటు వద్ద తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. తెప్పోత్సవానికి వీవీఐపీలు హాజరు కానున్న నేపథ్యంలో భద్రత చర్యల్లో భాగంగా శుక్రవారం ఈఓ మహేష్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి హంసవాహనంలో ట్రయల్ రన్ చేశారు. 15మంది నుంచి 20మంది వరకు ఆ హంసవాహనంలో ఆసీనులై గోదావరిలో జలవిహారం చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. ఎంత కెపాసీటీ వరకు ప్రయాణించాలనేది పోలీసులు అంచనా వేసుకున్నారు. -
వేతన వెతలు
ఏటూరునాగారం: జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న ల్యాబ్ టెక్నిషియన్లు, ఫార్మాసిస్ట్లు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ఎక్స్రే టెక్నిషియన్స్, కాంటింజెంట్ వర్కర్లు విభాగాల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బంది సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. డీఎంఎఫ్టీ (కలెక్టర్ ఫండ్) కింద ఔట్సోర్సింగ్గా పనిచేస్తున్న 28 మంది ఉద్యోగులకు ఆరు నెలల నుంచి వేతనాలు లేక అవస్థలు పడుతున్నారు. వేతనాలు చెల్లించడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారు. వేతనాలు చెల్లించాలని ఉద్యోగులు అధికారులకు విన్నవించినా రేపు.. మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. పీహెచ్సీలు ఉద్యోగుల సంఖ్యబ్రహ్మణపల్లి 4 ఎదిర 1 గోవిందరావుపేట 3 కన్నాయిగూడెం 2 కాటాపురం 3 కోడిశాల 4 పేరూరు 2 తాడ్వాయి 1 వాజేడు 3 వెంకటాపురం(కె) 4 డీఎంహెచ్ఓ ఆఫీస్ వర్కర్ 1 జిల్లా వ్యాప్తంగా 28 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఎదురుచూపులు పట్టించుకోని అధికారులు, పాలకులు -
కలెక్టర్ కార్యాలయంలోనే పెండింగ్..
డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయానికి వేతనాలు చెల్లించేందుకు ఫైల్ను పంపించినప్పటికీ ఇప్పటి వరకు వేతనాల బిల్ చేయకుండానే పక్కన బెట్టారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని భారాన్ని మోస్తున్న ఉద్యోగుల సమస్యలను తీర్చడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారు. అసలే ఉద్యోగులకు తక్కువ వేతనాల ఉన్నాయని, ఆ వేతనాన్ని కూడా నెలానెలా ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని మండిపడుతున్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో వేతనాల బిల్ చేసే ఇన్చార్జ్ వల్లనే వేతనాలు సకాలంలో రావడం లేదని ఉద్యోగస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా వైద్యశాఖలోని పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంటింజెంట్ ఉద్యోగుల వేతనాలు ఇవ్వాలని ఉద్యోగస్తుల కుటుంబాలు వేడుకుంటున్నాయి. అంతేకాకుండా ఈ విషయాన్ని బయటకు చెప్పితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కొంతమంది అధికారులు బెదిరించడంతో ఉద్యోగస్తులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. -
కాంగ్రెస్ హవా
ములుగు మున్సిపల్ తొలిపీఠం కాంగ్రెస్దేములుగు: ములుగు మున్సిపాలిటీకి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా కొనసాగింది. శుక్రవారం కలెక్టర్ టీఎస్ దివాకర ఆధ్వర్యంలో ములుగు డిగ్రీ కళాశాలలో పటిష్ట బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రారంభించారు. తొలిసారిగా ములుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ స్థానాన్ని కాంగ్రెస్ కై వసం చేసుకోనుంది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 20 వార్డుల్లో కాంగ్రెస్ 12 వార్డులను గెలుచుకోగా బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. నాలుగు ఓట్లతో గెలిచి.. 19వ వార్డు అభ్యర్థి పౌడల ఓంప్రకాష్ కేవలం నాలుగు ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి అనుముల సురేష్పై గెలుపొందారు. వార్డులో మొత్తం 502 ఓట్లు పోలవగా 183 ఓట్లు సురేష్, 187 ఓట్లు ఓంప్రకాష్కు వచ్చాయి. ఇందులో బీజేపీ అభ్యర్థికి 124, 6 ఓట్లు చెల్లనివిగా గుర్తించగా, 2 ఓట్లు నోటాకు పడ్డా యి. అదేవిధంగా 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి ఇమ్మడి రాకేష్ యాదవ్పై 9 ఓట్ల మెజార్టీతో చింతనిప్పుల చంద్రకళ విజయం సాధించారు. రాకేష్కు 238 ఓట్లు పోలవగా, చంద్రకళకు 247 ఓట్లు పోలయ్యాయి. చైర్పర్సన్ రేసులో స్వాతి, చంద్రకళ తొలిసారి మున్సిపల్గా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ కై వసం చేసుకోనుంది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ గెలవడంతో చైర్పర్సన్ సీటుకు మార్గం సుగమమైంది. 6వ వార్డు నుంచి గెలుపొందిన చింతనిప్పుల చంద్రకళ, 8వ వార్డు నుంచి గెలుపొందిన నల్లెల్ల స్వాతి చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వీరితో పాటు చైర్పర్సన్ పదవిని ఆశించిన వంగ సుమలత, బండారి నిర్మల ఓడిపోవడంతో స్వాతి, చంద్రకళ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈనెల 16న జరిగే చైర్పర్సన్ ఎన్నికలోపే అభ్యర్థిని మంత్రి సీతక్క ఖరారు చేయనున్నట్లు తెలిసింది. గెలుపు సంబురాలు ములుగు మున్సిపాలిటీ ఫలితాలు వెలువడిన అనంతరం గెలుపొందిన అభ్యర్థులు తమ పార్టీల నాయకులతో సంబురాలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ బాణాసంచా పేల్చారు. మున్సిపల్ పీఠాన్ని కౌవసం చేసుకునేందుకు గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులు క్యాంపునకు వెళ్లినట్లు సమాచారం. కౌంటింగ్కు పటిష్ట భద్రత ములుగు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కట్టుదిట్టంగా నిర్వహించినట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ను తెరిచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. వార్డులకు పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించారు. అనంతరం సాధారణ బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. కలెక్టర్తోపాటు ఎన్నికల జనరల్ పరిశీలకుడు గంగాధర్, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు ఎప్పటికపుడు పర్యవేక్షించారు. ప్రతీ వార్డులో పోలింగ్ స్టేషన్ల వారీగా వచ్చిన బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున కట్టలు కట్టి అభ్యర్థుల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గెలుపొందిన అభ్యర్థులకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందించారు. 20 వార్డుల్లో 12 వార్డులు గెలుపొందిన కాంగ్రెస్ 5 వార్డులతో సరిపెట్టుకున్న బీఆర్ఎస్ బోణికొట్టిన బీజేపీ, 2 సీట్లు గెలుచుకున్న ఇండిపెండెంట్లు 9వ వార్డులో ఉద్యమకారుడికి దక్కిన గౌరవం -
కొనసాగుతున్న పులుల గణన
మంగపేట: మండలంలోని మంగపేట రేంజ్ పరిధిలోని ఈనెల 9 నుంచి వివిధ సెక్షన్ల పరిధిలో తాడ్వాయి ఫారెస్టు డివిజినల్ అధికారి వజ్రారెడ్డి పర్యవేక్షణలో అఖిలభారత పులుల గణన కొనసాగుతోంది. మేడారం మహాజాతర కారణంగా నిలిచి న కార్యక్రమాన్ని తిరిగి శుక్రవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. గణన కార్యక్రమంలో భాగంగా మొదటి మూడు రోజులు శాఖాహారుల గణన, తర్వాత మూడు రోజులు మాంసాహారులు, పెద్ద శాఖాహారుల గణనకు కేటాయించామన్నారు. మంగపేట రేంజ్ పరిధిలో ఇన్చార్జ్ రేంజ్ అధికారి అశోక్, డిప్యూటీ రేంజ్ అధికారి కోటేశ్వర్, సుజాత, సెక్షన్ ఆఫీర్ హన్మ, రషీద్, రేంజ్ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారన్నారు. వణ్యప్రాణుల ఉనికి, వాటి సంఖ్య గుర్తించడానికి, పులి జాడ కోసం ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల ద్వారా పాదముద్రలు గుర్తులు, వాటి విసర్జతాల సేకరణ జరుగుతుందన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
ఏటూరునాగారం: క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మీనర్సింహారావు అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని కొమురంభీం మినీ స్టేడియంలో కేంద్ర ప్రభుత్వం మేరా యువ భారత్ వరంగల్ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఎస్సై రచిత్ర మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలతో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు. యువకులకు వాలీబాల్, షటీల్, పరుగు పందెం, బాలికలకు పరుగు పందెం, షటీల్, తగ్గాఫ్ వార్ తదితర క్రీడలను నిర్వహించారు. గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్, ట్రోఫీని అందజేశారు. మేరా యువ భారత్లో నమోదు చేసుకోవాలి క్రీడాకారులు మేరా యువ భారత్ పోర్టల్లో నమోదు చేసుకుంటే స్పోర్ట్స్ కిట్స్ అందించనున్నట్లు మేరా యువ భారత్ ఇన్చార్జ్ డిప్యూటీ డైరెక్టర్ దేవిలాల్ తెలిపారు. క్రీడాకారులు ఏ క్రీడల్లో రాణిస్తే దానికి కావాల్సిన క్రీడా సామగ్రిని పొందే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మాదరి మధు, నాగవత్ కిరణ్, బాలికల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రేమలీల, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ అరుణ, పీడీలు స్వరూప, శంకర్నారాయణ, యువ భారత్ వలంటీర్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. అంబులెన్స్లో ప్రసవం మంగపేట: మండలంలోని శనిగకుంట నుంచి పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రసవించిన సంఘటన శుక్రవారం జరిగింది. నర్సింహాసాగర్ పంచాయతీ పరిధిలోని శనిగకుంట గ్రామానికి చెందిన మంకిడి కావేరి అనే గర్భిణి ప్రసవ వేదన పడుతుండటంతో స్థానిక ఆశావర్కర్ 108కు సమాచారం అందించింది. వెంటనే మంగపేట 108 సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకుని కావేరికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటి రాంగాని రాము సమయస్ఫూర్తితో సుఖ ప్రసవం జరిగేలా వైద్యం అందించగా పండంటి పాపకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో అవసరమైన మందులను అందించి మంగపేట పీహెచ్సీలో చేర్పించారు. ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు గణపురం: కోటగుళ్లలో గణపేశ్వరుడికి శుక్రవారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. -
ఉద్యమకారుడికి దక్కిన గౌరవం
ములుగు మున్సిపాలిటీలో ఉద్యమకారుడి కుటుంబానికి ప్రజలు పట్టం కట్టారు. జిల్లా సాధనకు కృషి చేసిన ఉద్యమకారుడు గండ్రకోట కుమార్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 9వ వార్డు నుంచి తన సతీమణి గండ్రకోట వాణిని బరిలో నిలిపాడు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బలంగా ఉన్నప్పటికీ ములుగు జిల్లా సాధన ఉద్యమంలో ముందుండి పోరాడినందుకు గాను కాలనీవాసులు కుమార్ సతీమణి వాణికి పట్టం కట్టారు. 64 ఓట్లతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. ఫలితాల అనంతరం వార్డు పరిధిలో కాలనీవాసులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహిస్తున్న గండ్రకోట వాణికుమార్ దంపతులు -
ఆలయ అభివృద్ధికి కృషి
గోవిందరావుపేట: ముయ్యాలమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని పస్రా నాగారం (పాతూరు)లో జరుగుతున్న ముయ్యాలమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరలో పాల్గొనడం ఆనందంగా ఉందని, భక్తుల విశ్వాసానికి అనుగుణంగా ముయ్యాలమ్మ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, నాయకులు గొంది కిరణ్, పులుగుజ్జు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.మంత్రి సీతక్క -
కాటారంలో 2కే రన్
మల్హర్(కాటారం): ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను పురస్కరించుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం కాటారం మండలకేంద్రంలో 2కే రన్ నిర్వహించారు. ఎస్బీఐ బ్యాంకు నుంచి అంబేడ్కర్ కూడలి వరకు 2కే రన్ సాగగా కాటారం డీఎస్పీ సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. కేవైసీ మోసాల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. తెలియని సందేశాల లింక్లను ఓపెన్ చేయొద్దని పేర్కొన్నారు. ప్రతీ బ్యాంకు ఖాతాదారు కేవైసీ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ తిరుపతి, ఎస్సై శ్రీనివాస్, వివిధ బ్యాంకుల మేనేజర్లు ప్రవీణ్, హరిరాంనాయక్, సంతోష్, సికందర్, భాస్కర్, రవినాయక్ పాల్గొన్నారు. -
లేబర్కోడ్లను రద్దు చేయాలి
ములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్కోడ్లను రద్దు చేసి 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు జంపాల రవీందర్, రత్నం రాజేందర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గాలు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా లేబర్ కోడ్లను తీసుకురావడం దారుణమన్నారు. వెంటనే వాటిని రద్దు చేయాలని కోరారు. అలాగే స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించి కనీస వేతనం రూ. 26 వేలు అందించాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. సివిల్ సప్లయీస్, హమాలీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమ్జద్పాషా, స్వామి, సాంబయ్య, రాంబాబు, రాజు, రాజేందర్, దేవేందర్, కమలక్క, భారతి, సరోజన తదితరులు పాల్గొన్నారు.ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకుల డిమాండ్ -
ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
వెంకటాపురం(ఎం): మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా రామప్ప ఆలయాన్ని సుందరీకరించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులకు సూచించారు. మండల పరిధిలోని రామప్పలో నిర్వహించనున్న మహాశివరాత్రి ఏర్పాట్లను కలెక్టర్ గురువారం పరిశీలించి మాట్లాడారు. రామప్పలో మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. రామప్పకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో పాటు భక్తులకు తాగునీటి వసతి కల్పించాలని వివరించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. రామప్ప పరిసర ప్రాంతాల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని, జాగరణ చేపట్టే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ,ఆర్డీఓ వెంకటేశ్, ఆలయ ఈఓ శ్రీనివాస్, అర్చకులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
రామప్ప ఉత్సవ కమిటీ చైర్మన్గా అయిలయ్య
వెంకటాపురం(ఎం): రామప్ప ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్గా మండల కేంద్రానికి చెందిన మిల్కూరి అయిలయ్యను నియమిస్తూ దేవాదాయశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి రామప్పలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను పండుగ వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా మిల్కూరి అయిలయ్య, డైరెక్టర్లుగా ఒడ్డెపల్లి శంకర్, జీడీ రాజు, వంచ తిరుపతిరెడ్డి, కట్కూరి వెంకటేశ్వర్లు, యాట నర్సయ్య, తనగుల విజయ, కల్పనాదేవి, నర్సయ్య, బొద్దుల రాజీరు, మూడు వీరేశ్, నర్సింహారెడ్డిలను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆత్మ చైర్మన్గా కర్ల అరుణ ఏటూరునాగారం: ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ ఒకటవ వార్డుకు చెందిన మాజీ ఉపసర్పంచ్ కర్ల అరుణను ఏటూరునాగారం ఆత్మ చైర్మన్గా మంత్రి సీతక్క ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పెద్ద బాధ్యతను అప్పగించినందుకు విధి నిర్వహణలో నిజాయతీగా పనిచేస్తానని తెలిపారు. తన ఎంపికకు సహకరించిన మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్నలకు కృతజ్ఞతలు తెలిపారు. దేవాదుల మరో రెండు మోటార్లతో నీటి పంపింగ్ కన్నాయిగూడెం: మండలంలోని తుపాకులగూడెం దేవాదుల ఎత్తిపోతల వద్ద మరో రెండు మోటార్లతో నీటి పంపింగ్ను గురువారం ప్రారంభించారు. గత కొన్నిరోజుల నుంచి మూడు మోటార్లతో పంపింగ్ను కొనసాగించిన అధికారులు గురువారం మరో రెండు మోటార్లను ఆన్చేసి నీటిని గొల్లబుద్దారం రిజర్వాయర్కు పంపింగ్ను కొనసాగిస్తున్నారు. నిన్నటి వరకు ఫేజ్టులో ఒకటి, ఫేజ్త్రీలో రెండు మొత్తం మూడు మోట్లాతో 831 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసిన ఇంజనీరింగ్ అధికారులు గురువారం ఫేజ్త్రీలో మరో రెండు మోటార్లను ప్రారంభించారు. మొత్తం ఐదు మోటార్లతో 13,336 క్యూసెక్కుల నీటిని గొల్లబుద్దారం రిజర్వాయర్కు అక్కడి నుంచి భీమ్ఘనపూర్ రిజర్వాయర్కు పంపింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి ఎగువ నుంచి 14,750 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో అదే మోతాదులో నీటిని దిగవకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. కాళేశ్వరాలయంలో పూజలు కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వొడ్డెపల్లి రామచందర్రావు, ఎలక్షన్ అబ్జర్వర్ గంగాధర్ గురువారం వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేసి శ్రీశుభానందదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి ఆశీర్వచన వేదిక వద్ద వారిని ఆలయ సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ సన్మానించారు. అర్చకులు తీర్థప్రసాదం అందజేశారు. త్రివేణి సంగమంలో హంసవాహనం కాళేశ్వరం: ఈనెల 15న ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా రాత్రి ఏడు గంటలకు త్రివేణి సంగమంలో హంసవాహనంలో తెప్పోత్సవం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గురువారం సాయంత్రం హంసవాహనం ఆకృతితో గోదావరిలో కూలీలు తయారు చేశారు. దీంతో సగం వరకు తయారైన హంసవాహనం పర్యాటకులు, భక్తులను ముచ్చట గొలుపుతుంది. -
మహిళా సంఘాలకు భారీ ఆదాయం
వెంకటాపురం(ఎం): మేడారం మహాజాతరలో ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లు, క్యాంటీన్ల ద్వారా భారీ ఆదాయం సమకూరిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. మండల పరిధిలోని రామప్పలో ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా ఏర్పాటు చేసిన క్యాంటీన్ను సీతక్క గురువారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 565 ఆదాయ యూనిట్లను ఎస్హెచ్జీ గ్రూపుల ద్వారా ఏర్పాటు చేశామన్నారు. మేడారం జాతరలో మహిళా సంఘాలు రూ. 6 కోట్ల పెట్టుబడి పెడితే రూ.3 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. మేడారం జాతర ప్రాంగణంలో మహిళా సంఘాలకు అనుకూలమైన ప్రదేశాల్లో షాపులను కేటాయించామన్నారు. జిల్లాలోని పది మండలాలకు చెందిన మహిళా సమాఖ్యల ద్వారా వివిధ రకాల వ్యాపార యూనిట్లు ఏర్పాట్లు చేయించి మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలు కల్పించామని వివరించారు. ప్రభుత్వ ప్రోత్సాహకం, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు కల్పించడంతో మహిళలు కూల్డ్రింక్ సెంటర్లు, చికెన్ సెంటర్లు, ఇప్పపువ్వు లడ్డూ స్టాళ్లు, బ్యాంబూ చికెన్, క్యాంటీన్లు, స్నాక్స్ తదితర దుకాణాలను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించారని వెల్లడించారు. ఈ వ్యాపారాల కోసం రూ.6 కోట్ల పెట్టుబడిని బ్యాంకులు, జిల్లా మహిళా సమాఖ్యల ద్వారా సమకూర్చగా మొత్తం రూ.9.12 కోట్ల ఆదాయం లభించిందన్నారు. పెట్టుబడి ఖర్చులు పోగా రూ.3 కోట్లకు పైగా లాభం వచ్చిందని వివరించారు. అనంతరం మంత్రి సీతక్క రామప్ప రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు మంత్రికి శాలువా కప్పి సత్కరించారు. రామప్పలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలపై ఆలయ అధికారులతో చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రామప్ప కు వచ్చిన విద్యార్థులు సీతక్కతో ఫొటోలు దిగారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, రామప్ప ఆలయ కమిటీ చైర్మన్ అయిలయ్య, నాయకులు రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క రామప్పలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం -
రూ.13,51,76,275
‘మేడారం’ ఆదాయం హన్మకొండ కల్చరల్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఆదాయం రూ. 13,51,76,275 వచ్చినట్లు మేడారం జాతర ఈఓ వీరస్వామి తెలిపారు. మహాజాతర సందర్భంగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద దేవాదాయశాఖ ఏర్పాటు చేసిన 780 ఇనుపరేకు హుండీలు, 45 వస్త్ర, 3 ఒడిబాలబియ్యం హుండీలు కలిపి మొత్తం 828 హుండీలను భారీ సెక్యూరిటీతో ఫిబ్రవరి 2వతేదీ సోమవారం హనుమకొండ లష్కర్బజార్లోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలోకి చేర్చారు. హుండీల లెక్కింపు ఫిబ్రవరి 5న గురువారం ప్రారంభమైంది. చివరిరోజు లభించిన ఆదాయం.. ఎనిమిదో రోజు (చివరిరోజు) గురువారం చిల్లరనాణేలను వేరు చేసి తూకం వేసి లెక్కించడంతో మహాజాతర హుండీల లెక్కింపు పూర్తయ్యింది. చివరిరోజు లెక్కింపులో నాణేల ద్వారా లభించిన ఆదాయం రూ.4,56,399, ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్ ద్వారా) రూ. 21,36,607 మొత్తం కలిపి రూ.25,93,006 సమకూరింది. జాతర ఆదాయం రూ.13,51,76,275 మహా జాతర మొత్తం ఆదాయం రూ.13,51,76,275గా నమోదైందని ఈఓ వీరస్వామి తెలిపారు. భక్తులు వివిధ రకాల వస్తువుల రూపంలో వేసిన బంగారం, వెండి సూక్ష్మ కానుకలను సైతం ప్రత్యేక నిపుణుల సహాయంతో, సెన్సార్ల సహాయంతో గుర్తించి లెక్కకట్టారు. ఏటా పెరుగుతున్న ఆదాయం 1946లో జాతర ఆదాయం రూ.17,173 కాగా, 1968లో దేవాదాయశాఖ మొదటిసారిగా నిర్వహించిన జాతరలో రూ.1,20,113గా నమోదైంది. 1980లో మొదటిసారిగా వరంగల్ జిల్లా కలెక్టర్గా పని చేసిన జె.బాపురెడ్డి ఐఏఎస్ పెద్ద ఎత్తున ప్రచారంతో జాతర ఆదాయం రూ. 4,50,000 వచ్చింది. అదేవిధంగా 2002 నుంచి జాతర ఆదాయం కోటి రూపాయలు దాటింది. 2016 జాతర ఆదాయం రూ. 8.90 కోట్లుగా నమోదైంది. ఈవిధంగా ప్రతిఏటా జాతర ఆదాయం కోట్లల్లో పెరుగుతూ వస్తోంది. 2024లో మేడారం జాతర సందర్భంగా గద్దెల ప్రాంగణంలో 518 హుండీలు, తిరుగువారం హుండీలు 22 కలుపుకుని మొత్తం 540 హుండీలకుగాను ఆదాయం రూ.12,71,79,280 సమకూరింది. కాగా, ప్రస్తుతం జాతరలో గద్దెల ప్రాంగణంలో 828 హుండీలను ఏర్పాటు చేయగా.. రూ.13,51,76,275గా నమోదైంది. గతంకంటే 288 హుండీలను అదనంగా ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే భక్తుల రద్దీ పెరిగినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదు. గత జాతరలో 779 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండి కానుకలు లభించాయి. ప్రస్తుత జాతరలో 486 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 31కిలోల 700 గ్రా ముల వెండి లభించింది. గతం కంటే తక్కువగా కానుకలు వచ్చాయి. దీనికి బంగారం, వెండి రే ట్లు పెరగడమే కారణంగా చెప్పవచ్చని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గత జాతర ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత జాతర ఆదాయం ఆశించినంత పెరగలేదు. పూర్తయిన మహా జాతర హుండీల లెక్కింపు చివరి రోజు లభించిన ఆదాయం రూ. 4,56,399 ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్ల ద్వారా) రూ. 21,36,607 గత జాతరకంటే అదనంగా 288 హుండీల ఏర్పాటు అయినప్పటికీ పెరగని ఆదాయం, తగ్గిన బంగారు, వెండి కానుకలు -
టెన్షన్.. టెన్షన్
డిగ్రీ కళాశాలలో మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిములుగు: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు(శుక్రవారం) వెలువడనున్నాయి. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. గెలుపోటములపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో కౌంటింగ్కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మూడు రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ పూర్తి అవుతుంది. దీంతో మున్సిపాలిటీ ఎన్నికల పోటీలో నిలిచిన అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరికొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుండడంతో గెలుస్తామో లేదోననే భయం నెలకొంది. ఓటర్లను అభ్యర్థులు ఎవరు అడిగినా మీకే ఓటు వేశామని చెబుతుండడంతో అభ్యర్థులు గెలుపోటములపై అంచనాలు వేసుకోలేక పోతున్నారు. దీంతో బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం భద్రంగా దాగి ఉన్పప్పటికీ శుక్రవారం ఓట్ల లెక్కింపుతో బయటపడనుంది. లెక్కింపు ఇలా.. మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కోసం 7గురు ఆర్ఓలు, 7గురు ఏఆర్ఓలు, 9 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 18 మంది కౌంటింగ్ సహాయకులను కేటాయించారు. 20 వార్డులకు గాను 7 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతీ టేబుల్పై మూడు వార్డులకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు. మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితా లను వెల్లడించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన ఆనంతరం 8 నుంచి సాధారణ ఓట్లను లెక్కించనున్నారు. 71 సీసీ కెమెరాలతో నిఘా జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూమ్లో బ్యాలెట్ బాక్స్లను అధికారులు భద్రపరిచారు. కౌంటింగ్ సమయంలో స్ట్రాంగ్ రూమ్ వద్ద 71 సీసీ కెమెరాలతో పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పటిష్ట బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. ధీమాతో కాంగ్రెస్.. ఆశలపల్లకిలో బీఆర్ఎస్ ములుగు మున్సిపల్ ఎన్నికలకు తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. తొలిసారి చైర్పర్సన్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు అధికార పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని నాయకులు ధీమాతో ఉండగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే తమకు కలిసి వస్తుందని ఆశలపల్లకిలో ఊగిసలాడుతున్నారు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో 14 నుంచి 16 సీట్లు గెలుస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతుండగా, 9 సీట్లను గెలుచుకొని బీజేపీ, ఇండిపెండెంట్ల సహకారంతో చైర్పర్సన్ పదవిని కై వసం చేసుకుంటున్నామని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు.‘పుర’ ఓట్ల లెక్కింపు ఇలా.. నేడు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ 20 వార్డులు.. 7 టేబుళ్ల ఏర్పాటు మూడు రౌండ్లలో లెక్కింపు పూర్తి గెలుపోటములపై ఎవరి ధీమా వారిదే.. -
పవర్లిఫ్టింగ్లో జాఫర్కు గోల్డ్ మెడల్
కాజీపేట రూరల్: కాజీపేట రాంనగర్ (కడిపికొండ)కు చెందిన నేషనల్ ఐరన్ క్లబ్ జిమ్ కోచ్ కమ్ చైర్మన్ ఎండీ.జాఫర్ మాస్టర్ పంజాబ్ హరిద్వార్లో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్షిప్లో ప్రథమ స్థానం నిలిచి గోల్డ్ మెడల్ను కై వసం చేసుకున్నారు. 59 కేజీల విభాగంలో జరిగిన నేషనల్ పవర్లిఫ్టింగ్ కాంపిటీషన్లో 317 1/2 కిలోల టోటల్ చేసి తెలంగాణ నుంచి జాఫర్ ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్మెడల్ను సాధించి రికార్డును బ్రేక్ చేశారు. ఈమేరకు తెలంగాణ నుంచి పాల్గొని గోల్డ్మెడల్ను సాధించిన జాఫర్ను పలువురు అభినందించారు. ఇప్పటి వరకు 15 నేషనల్ పవర్ లిఫ్టింగ్లో పాల్గొని విజయం సాధించినట్లు, ప్రపంచ ఇంటర్నేషనల్ పవర్ లిప్టింగ్ పోటీలో పాల్గొని విజయం సాధిండమే తన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు అందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని జాఫర్ వేడుకుంటున్నారు. -
విద్యుత్ అంతరాయానికి సహకరించాలి
ములుగు రూరల్: విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఏఈ రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు(గురువారం) జిల్లా కేంద్రంలోని పత్తిపల్లిరోడ్డు, మున్సిపల్ ఆఫీస్ రోడ్డులో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా అంతరాయం కలుగుతుందని వెల్లడించారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. ఎస్సై రాజ్కుమార్ బదిలీ ఏటూరునాగారం: ఏటూరునాగారం ఎస్సై రాజ్కుమార్ హైదరాబాద్ ఇంటెలిజెన్స్కు బదిలీ అయ్యారు. 2025 జూన్ 13న వాజేడు పోలీస్స్టేషన్ నుంచి ఏటూరునాగారం ఎస్సైగా ఆయన బదిలీపై వచ్చారు. ఈ పోలీస్స్టేషన్లో అతి తక్కువ కాలం ఆయన పనిచేసి రికార్డులోకి ఎక్కారు. ఇప్పటి వరకు స్టేషన్లో ఎస్సై ఎవరు వచ్చినా రెండేళ్ల పాటు విధులు నిర్వర్తించేవారు. ఏటూరునాగారం ఎస్సైగా ఇంకా ఎవరిని నియమించలేదు. రామప్పలో విదేశీయుల సందడి వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం సింగపూర్, అమెరికా, జపాన్ దేశాలకు చెందిన మేరి, జాన్ బోమెన్, యోహీ మోబర్ల్ సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్ప కళ సంపద బాగుందని కొనియాడారు. వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు గోవాలో నిర్వహించనున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ అంతర్జాతీయ సదస్సుకు హనుమకొండ జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్కుమార్ ఎంపికయ్యారు. కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఎన్ఐటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ వద్ద ఫిజికల్ ఎడ్యుకేషన్లో పీహెచ్డీ చేస్తున్న అశోక్కుమార్ సదస్సులో శ్రీది లైఫ్ అండ్ అచీవ్మెంట్ ఆఫ్ ఠాకూర్ దేవ్ సింగ్శ్రీ అంశంపై పేపర్ ప్రజెంటేషన్ చేయనున్నారు. ఈసందర్భంగా అశోక్కుమార్ను గైడ్ రవికుమార్, ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్ఖాన్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, పీడీలు, పీఈటీలు, కోచ్లు అభినందించారు. హన్మకొండ కల్చరల్: భద్రకాళి అమ్మవారిని బుధవారం తెలంగాణ జ్యువెల్లరీ వెరిఫికేషన్ అధికారి, బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి దేవాలయం కార్యనిర్వహణాధికారి కట్టా అంజనీదేవి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు అలయమర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. అదేవిధంగా మహాశిరాత్రిని పురస్కరించుకుని వరంగల్కు చెందిన న్యాయవాది చిదంబరనాథ్శర్మ దంపతుల ఆధ్వర్యంలో ఐదురోజుల పాటు నిర్వహించే మహారుద్రయాగాన్ని ఆలయ అర్చకులు ప్రారంభించారు. వరంగల్ క్రైం: అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని భవన నిర్మాణ రంగంలో వాడే బ్రాండెడ్ గోల్డ్ మెడల్ కంపెనీని పోలిన నకిలీ వైర్లు విక్రయిస్తున్నాడో వ్యాపారి. పక్కా సమాచారంతో డబ్బాల సమీపంలోని అర్భుద ఎలక్ట్రికల్స్ అండ్ శానిటరీలో టాస్క్ఫోర్స్ పోలీసులు, హనుమకొండ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. రూ.3.59 లక్షల నకిలీ వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. షాప్ యజమాని కంతి లాల్ అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం హనుమకొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. -
ముసలయ్య జాతరకు ఏర్పాట్లు పూర్తి
ములుగు రూరల్: మండల పరిధిలోని రాయినిగూడెంలో గుట్టమీది ముసలయ్య జాతరకు పూజారులు తేదీలను ఖరారు చేయడంతో పాటు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తవిటి నారాయణ తెలిపారు. ఈ మేరకు బుధవారం గుడిశుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు గుట్టమీది ముసలయ్య జాతర నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొ క్కులు చెల్లించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తవిటి పుష్పక్క, రాములు, సమ్మయ్య, రామస్వామి, విజయ, సర్పంచ్ ఈసం సునీత, ఉప సర్పంచ్ దేవేందర్రావు, ఆలయ ప్రచార కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
సబ్సిడీ గ్యాస్ పక్కదారి
గోవిందరావుపేట: జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలు సబ్సిడీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వహకులతో కుమ్మకై ్క సబ్సిడీ సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. వాస్తవానికి ఆయా ప్రదేశాల్లో వాణిజ్య అవసరాలకు వాడాల్సిన (కమర్షియల్) సిలిండర్ల స్థానంలో సబ్సిడీ గ్యాస్ను బహిరంగంగా వాడుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. కొన్ని హోటళ్లలో ఒకేసారి నాలుగైదు సిలిండర్లు వాడుతున్నారంటే గ్యాస్ దందా ఎలా కొనసాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. గ్యాస్ ఏజెన్సీలతో పాటు కొంతమంది మధ్యవర్తుల ద్వారా గృహ సిలిండర్లు హోటల్ యజమానులకు చేరుతున్నట్లు సమాచారం. ఒక్కో సిలిండర్పై అదనపు వసూలు ఈ దందాలో ఒక్కో గ్యాస్ సిలిండర్పై రూ.150 నుంచి 200 వరకు అదనంగా వసూలు చేస్తూ వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా దందా సాగుతున్నా సంబంధిత పౌరసరఫరాల శాఖ గ్యాస్ విభాగం అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. సాధారణంగా ఇంటి అవసరాలకు వాడే 14.2 కేజీల సిలిండర్ ధర రూ.925లు ఉండగా వాణిజ్య అవసరాలకు వాడే 19 కేజీల సిలిండర్ ధర రూ.1,858 ఉంది. ధరలో భారీ వ్యత్యాసం ఉండడంతో హోటల్, రెస్టారెంట్ల యజమానులు వాణిజ్య సిలిండర్లను ఉపయోగించకుండా గృహ అవసరాలకు వాడే సిలిండర్లను ఏజెన్సీల నిర్వహకులకు అదనంగా డబ్బులు చెల్లించి తీసుకుంటున్నారు. గ్యాస్ కనెక్షన్ల వివరాలు జిల్లా వ్యాప్తంగా 8 ఏజెన్సీలు ఉండగా మొత్తం 1,00,200 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో సాధారణ కనెక్షన్లలో సింగిల్ 32,183, డబుల్ 15,798, దీపం పథకం కింద సింగిల్ 17,203, డబుల్ 2,947, సీఎస్ఆర్ పథకం కింద సింగిల్ కనెక్షన్లు 7,792, డబుల్ 702 ఉన్నాయి. పీఎంయూవై పథకం కింద సింగిల్ కనెక్షన్లు 21,153 ఉండగా డబుల్ 2,150 ఉన్నాయి. కమర్షియల్ కనెక్షన్లు మా త్రం కేవలం 272 మాత్రమే ఉండడం గమనార్హం. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న గృహ గ్యాస్ సిలిండర్లు పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం అందిస్తోంది. వాటిని వాణిజ్య ప్రయోజనాలకు మళ్లించడం తీవ్రమైన నేరం. ఈ అంశంపై త్వరలోనే ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తాం. అక్రమంగా గృహ సిలిండర్లు వినియోగిస్తున్న హోటళ్లు, నిబంధనలు అతిక్రమిస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తప్పవు. అలాగే అధిక వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – రాంచందర్, డీటీసీఎస్, ములుగు 70 శాతం హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగం వాణిజ్య సిలిండర్లు వాడాల్సి ఉన్నా నిబంధనలు బేఖాతర్జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు సుమారుగా వెయ్యికి పైగా ఉన్నాయి. వీటిలో 70 శాతం సబ్సిడీ సిలిండర్లే వాడుతున్నారు. ఏజెన్సీలకు చెందిన వాహనాల్లోనే గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు సరఫరా చేస్తున్నా సంబంధిత అదికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సబ్సిడీ సిలిండర్లను అక్రమంగా హోటళ్లు, రెస్టారెంట్లకు తరలిస్తూ రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. -
వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరి
వెంకటాపురం(కె): బాలింతలు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ కోరం క్రాంతికుమార్ అన్నారు. మండల పరిధిలోని నూగూరు సబ్సెంటర్లో జాతీయ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సబ్ సెంటర్ను సందర్శించి మాట్లాడారు. కుష్ఠు వ్యాధి నివారణపై రేపటి(శుక్రవారం) వరకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వ్యాధి గ్రస్తులు ఉంటే సకాలంలో వైద్యశాలకు తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది రాఘవులు, స్వరూప, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ -
ఉమ్మడి జిల్లాలో 80.09 శాతం పోలింగ్
● గతంతో పోలిస్తే 13.38 శాతం ఎక్కువ సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ల నుంచి 1,073 మంది కౌన్సిలర్ల కోసం పోటీ పడ్డారు. బుధవారం రాత్రి వరకు అధికారుల ప్రకటించిన ప్రకారం ఉమ్మడి జిల్లాలో 80.09 శాతంగా పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా 12 మున్సిపాలిటీల్లో మొత్తం 3,35,244 మంది ఓటర్లకు 2,58,930 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2020లో జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 9 మున్సిపాలిటీలలో 200 వార్డులుండగా ఏకగ్రీవమైన 18 వార్డులు మినహాయించి 182 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. 2,32,763 మంది ఓటర్లకు ఆ ఎన్నికల్లో 1,77,508 (76.26 శాతం) మంది ఓట్లేశారు. 2020 ఎన్నికలకు ఈసారి ఎన్నికలు పోలిస్తే కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలు పెరిగాయి. పెరిగిన మున్సిపాలిటీలు, ఓటర్లు, పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే గతంతో పోలిస్తే 13.38 శాతం పెరిగింది.ములుగు జిల్లా 80.41 శాతం హనుమకొండ జిల్లా 80.18 శాతం వరంగల్ జిల్లా 85.42 శాతం జేఎస్ భూపాలపల్లి 65.18 శాతం మహబూబాబాద్ జిల్లా 78.90 శాతం జనగామ జిల్లా 80.66 శాతం -
కాళేశ్వరంలో తెప్పోత్సవానికి ఏర్పాట్లు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మహా శివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమంలోని సరస్వతీఘాటులో తెప్పోత్సవం నిర్వహించడానికి దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలం నుంచి తీసుకువచ్చిన తెప్పకు సంబంధించిన సామగ్రితో హంస ఆకృతిని తయారు చేస్తున్నారు. తెప్పను 45 డ్రమ్ముల నుంచి 60 డ్రమ్ముల వరకు సుమారు 40 మంది కూర్చుని ప్రయాణించే విధంగా కూలీలు తయారు చేస్తున్నారు. దీనికి ఒక మోటార్ పడవను అమర్చనున్నారు. మహాశివరాత్రి (ఆదివారం) రోజు రాత్రి 7 గంటలకు విశేష పూజలతో ఉత్సవమూర్తులను జలవిహారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. -
‘రామప్ప శిల్పకళ బాగుంది’
నందీశ్వరుడి వద్ద శిక్షణ అధికారులువెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ బాగుందని శిక్షణ అధికారులు కొనియాడారు. మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న అధికారులు సందర్శించారు. భారత్ దర్శన్ స్టడీ టూర్లో భాగంగా శిక్షణ తీసుకుంటున్న 75 మంది అధికారులు ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. నందీశ్వరుడిని దర్శించుకుని ఫొటోలు దిగారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్కుమార్ వివరించారు. వారి వెంట ఎంసీహెచ్ఆర్డీ అధికారులు, టూరిస్ట్ పోలీసులు ఉన్నారు. -
పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతి
ములుగు: 24 నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని జిల్లా ఉపాధి హామీ ఉద్యోగుల జాక్ చైర్మన్ నారగోని సునీత కోరారు. ఈ మేరకు మంగళవారం డీఆర్డీఓ శ్రీనివాసరావుకు ఉపాధి సిబ్బందితో కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే స్టేట్ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం మేరకు అన్ని మండలాల్లో ఈ నెల 16 నుంచి ఉపాధి హామీ కార్యాలయాలు మూసివేస్తామని తెలిపారు. రెండేళ్లుగా ఆఫీస్ మెయింటెనెన్స్, కరెంట్, ఇంటర్నెట్ బిల్లులు, ప్రింటర్స్ పేపర్, స్టేషనరీ బిల్లులు చెల్లించకపోవడంతో ఉపాధి హామీ ఉద్యోగులు అప్పులు చేసి కార్యాలయాల నిర్మాణ ఖర్చులు భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోతు రాజు, కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దబోయిన శ్రీనివాస్, ఈసీల సంఘం నుంచి మనోహర్, ప్లాంటేషన్ మేనేజర్ కిశోర్, నరేందర్, గణేశ్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికతతో శివరాత్రి ఉత్సవాలు
వెంకటాపురం(ఎం): రామప్పలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలను ఆధ్యాత్మిక శోభతో నిర్వహించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ వెంకటేశ్, రామప్ప ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్, ప్రధాన అర్చకుడు హరీశ్శర్మ, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ మంగళవారం నిర్వహించారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా రామప్పలో పారిశుద్ధ్యం, పార్కింగ్, రోడ్డు నిర్వహణ, దేవాలయం వద్ద వసతి సౌకర్యం, తాగునీటి సరఫరా, హెల్త్ క్యాంప్ల ఏర్పాటు, ఫైర్ ఇంజన్ సౌకర్యం, హెల్ప్ సెంటర్ ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులు సిద్ధం చేసుకున్న ప్రణాళికను కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు మహాశివరాత్రి మహోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్ స్థలాలు గుర్తించాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని వివరించారు. అలాగే రామలింగేశ్వరస్వామిని దర్శించుకునే భక్తుల కోసం అవసరమైన పందిళ్లు, తాగునీటి వసతికి చలివేంద్రాలు తదితర ఏర్పాట్లు చేయాలని వెల్లడించారు. రామప్ప ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. అదే విధంగా వచ్చే ఏడాది జూలైలో నిర్వహించనున్న గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలోని గోదావరి నది పుష్కర ఘాట్లు ముళ్లకట్ట, రామన్నగూడెం, మంగపేట, వెంకటాపురం(కె) ప్రాంతాల్లోని ఘాట్ల వివరాలు, అక్కడ చేపట్టాల్సిన పనులపై సమగ్ర సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
ముగిసిన సీఎం కప్ క్రీడాపోటీలు
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడాపోటీలు ముగిశాయని జిల్లా యువజన క్రీడల అధికారి రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కప్ క్రీడలు 28 విభాగాలలో పోలీసులు నిర్వహించగా 1100 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు మెడల్స్తో పాటు ప్రశంసపత్రాలు అందించినట్లు వెల్లడించారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి జిల్లాకు పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్రెడ్డి, ఎస్జీఎఫ్ఐ సెక్రటరీ వేణు, ఐటీడీఏ స్పోర్ట్స్ ఆఫీసర్ ఆదినారాయణ, కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అబ్బు, పీడీ మల్లయ్య, పీటీలు, కోచ్లు పాల్గొన్నారు. -
ఆర్టీసీ జాతర ఆదాయం రూ.20.24కోట్లు
డిపోల వారీగా తిరిగిన బస్సులు, ఆదాయం(రూలలో)డిపో బస్సులు కిలో మీటర్లు ప్రయాణికులు ఆదాయం హనుమకొండ 387 5 18,722 2,55,732 3,90,34,592 జనగామ 180 2,86,666 67,148 1,86,79,760 వరంగల్–1 283 4,05,208 2,64,785 3,23,88,513 వరంగల్–2 217 5,92,450 3,41,593 4,61,28,361 మహబూబాబాద్ 117 2,08,548 46,931 1,06,53,950 నర్సంపేట 152 2,30,372 85,857 1,64,85,955 పరకాల 175 2,50.260 84,574 1,72,40,378 తొర్రూరు 110 1,82,469 40,802 1,06,16,240 భూపాలపల్లి 90 1,31,460 46,163 1,12,00,375 హన్మకొండ: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు నడిపిన టీజీఎస్ ఆర్టీసీ రూ.20,24,124లు ఆదాయం రాబట్టుకుంది. జాతరకు 1,711 ప్రత్యేక బస్సులు నడిపి, 9,203 బస్ డేస్లలో, 25,027 ట్రిప్పుల ద్వారా మొత్తం 28,06,155 కిలోమీటర్లు నడిపింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. జాతరలో మొత్తం 12,33,585 మంది ప్రయాణికులు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఇందులో 6,08,686 మంది మహిళ(ఉచిత టికెట్)లు కాగా, 5,12,399 మంది చార్జీల చెల్లింపు ప్రయాణికులు ఉన్నారు.మేడారానికి మొత్తం ట్రిప్పులు 25,027 తిరిగిన మొత్తం కిలో మీటర్లు 28,06,155 -
టోకెన్ సమ్మె రాజకీయ స్వార్థమే
భూపాలపల్లి అర్బన్: ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త కార్మిక సమ్మె పూర్తిగా రాజకీయ స్వార్థంతో, కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ నిర్వహిస్తున్నదని బీఎంఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్ విమర్శించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 15 సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం ఒకరోజు సమ్మెలతో కార్మికులకు ఒరిగిందేమిటో సంఘాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ విషయంలో వాస్తవాలను దాచిపెట్టి రాజకీయ లబ్ది కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రెండు కోడ్లలో కార్మిక వ్యతిరేక అంశాలపై సవరణల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న బీఎంఎస్ ఈ రాజకీయ ప్రేరేపిత సమ్మెకు మద్దతు ఇవ్వదని స్పష్టం చేస్తూ, కార్మికులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమ్మెలో పాల్గొని నష్టపోవద్దని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు రాసకట్ల నర్సింగరావు, పాండ్రాల మల్లయ్య, కడారి శంకర్, నారాయణ, శీలం రాజు, ఓరం లక్ష్మణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పోలీసుల సేవలు అభినందనీయం
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ములుగు రూరల్: మేడారం మహాజాతర విజయవంతంలో పోలీసుల సేవలు అభినందనీయమని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్లో మంగళవారం అధికారులకు, సిబ్బందికి బడాఖాన ఏర్పాటు చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎస్పీ మాట్లాడారు. రాష్ట్ర బెటాలియన్, జోన్లు, సెక్టారుల్లో విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పోలీస్ సిబ్బంది నృత్యాలు, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సదానందం, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్బట్, డీఎస్పీ రవీందర్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని నారాయణగిరిపల్లెలో కోతుల బెడద తీవ్రంగా ఉండడంతో గ్రామపంచాయతీ అధికారులు ఎలుగుబంటి డ్రెస్ తెప్పించి సిబ్బందికి వేసి మంగళవారం వాడవాడలా తిరిగారు. ఎలుగుబంటి వేషదారుడితో పాటు జీపీ సిబ్బంది, గ్రామస్తులను చూసిన కోతులు వానగుట్టవైపు తరలివెళ్లాయి. -
నేడే మున్సిపోల్
ములుగు: ములుగు మున్సిపాలిటీకి నేడు తొలిసారిగే జరగనున్న ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వారం రోజులుగా ప్రచారంతో హోరెత్తించిన వివిధ పార్టీల అభ్యర్థులు గత రెండు రోజులుగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా 20 పోలింగ్ కేంద్రాలను 50 బ్యాలెట్ బాక్స్లను అధికారులు ఏర్పాటు చేశారు. ములుగు డిగ్రీ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి పోలింగ్ సిబ్బందికి మంగళవారం ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. అధికారులు ఏర్పాటు చేసిన వాహనాల్లో సిబ్బంది పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు చేరుకున్నారు. 40 సీసీ కెమెరాలతో వెబ్కాస్టింగ్ ములుగు మున్సిపాలిటీలో 20 పోలింగ్ కేంద్రాలలో 19 కేంద్రాలు హైపర్ సెన్సిటివ్, ఒకటి సెన్సిటివ్ కేంద్రంగా గుర్తించారు. 40 కెమెరాలతో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 20 వార్డుల పరిధిలో 13,963 మంది ఓటర్లు ఉండగా 6,661 మంది పురుషులు, 7,300 మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. 20 వార్డులకు 83మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉదయం 7గంటల నుంచే.. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు బుధవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది మంగళవారం రాత్రి వరకు పోలింగ్ బూత్లతో పాటు, నెంబర్ల వారీగా బూత్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ సంపత్రావు, మున్సిపల్ కమిషనర్ రమేశ్లు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను ములుగు డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్రపర్చనున్నారు. స్ట్రాంగ్ రూం వద్ద 70 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టి గెలిచిన కౌన్సిలర్ల పేర్లు ప్రకటించనుండగా, 16న చైర్పర్సన్ ఎన్నికతో పాటు వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. గుర్తింపు కార్డు తప్పనిసరి ములుగు మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సమయంలో ఓటర్ స్లిప్పులతో పాటు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని కలెక్టర్ దివాకర సూచించారు. ఎలక్షన్ కమిషన్ అనుమతించిన గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని సూచించారు. ఓటరు గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ కార్డు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు. ఫొటోతో కూడిన పోస్టాఫీస్ లేదా బ్యాంక్ పాస్బుక్. కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు. డ్రైవింగ్ లైస్సెన్స్ తదితర గుర్తింపు కార్డులు ఉండాలని వెల్లడించారు. పోలింగ్కు పకడ్బందీ చర్యలు మున్సిపాలిటీ ఎన్నికలకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు, సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ దివాకర సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సామగ్రిని చెక్లీస్ట్ ప్రకారం సరిచూసుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే రూట్, మానిటరింగ్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది వివరాలు ఇలా.. కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ములుగు మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు 20 వార్డులకు.. 83 మంది అభ్యర్థులు పోటీ -
దరఖాస్తు గడువు పొడిగింపు
ఎస్ఎస్ తాడ్వాయి: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా వివిధ ఉద్యోగాల కోసం అందిస్తున్న ఉచిత శిక్షణకు సంబంధించిన దరఖాస్తుల గడువు ఈ నెల 22వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ కె.జగన్మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ నిరుద్యోగులకు రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలతో పాటు ఆర్ఆర్బీ, బ్యాంకింగ్, ఎస్ఎస్సీ వంటి పోటీ పరీక్షలకు హనుమకొండలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ఐదు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అసక్తి గల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భూపాలపల్లి అర్బన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్యశాస్త్ర విభాగంలో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణారావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఈ కోర్స్ ద్వారా ట్యాలీ ప్రైమ్ (జీఎస్టీ) ఉపయోగించి వ్యాపార కౌంటింగ్, బిల్లింగ్ ఇన్వెంటరీ నిర్వహణకు సంబంధించి లావాదేవీలను సమర్ధవంతంగా నిర్వహించే విధానాన్ని శిక్షణార్థులు నేర్చుకుంటారని తెలిపారు. కోర్స్ పూర్తిచేసిన అభ్యర్థులకు జూనియర్ అకౌంటింగ్, అకౌంట్స్ అసిస్టెంట్, జీఎస్టీ అసిస్టెంట్ బిల్డింగ్ ఆపరేటర్ వంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక విధానాలకు, హక్కుల పరిరక్షణకు కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం ఏరియాలోని అన్ని గనుల వద్ద గేట్ మీటింగ్లు నిర్వహించి కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జేఏసీ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ, స్వదేశీ పెట్టుబడులను రద్దు చేయాలన్నారు. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికే కేటా యించి, పర్మనెంట్ కార్మికులతోనే బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని తెలిపారు. ప్రతీ నెల మెడికల్ బోర్డు నిర్వహించి డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను లెక్కించగా రూ.10.92 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు. కోటంచ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించగా నోట్లు రూ.9,82,050, నాణెములు రూ.1,10,329 వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ నందనం కవిత, సర్పంచ్్ మొగిళి, పంచాయతీ కార్యదర్శి అమూల్య, ఆలయ సిబ్బంది రవీందర్, శ్రావణ్, సుధాకర్, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల రాజు, కొత్తపల్లిగోరి భజన బృందాలు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె డిమాండ్లు సింగరేణి పరిధిలో లేవని, కేంద్ర ప్రభుత్వం, కోలిండియా పరిధిలో ఉంటాయని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఏరియాలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమ్మె కారణంగా సింగరేణికి బొగ్గు ఉత్పత్తికి నష్టం జరగడం వలన రూ.77 కోట్లు, కార్మికులకు రూ.12కోట్ల నష్టం వాటిల్లితుందన్నారు. నూతన లేబర్ కోడ్ల వలన కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు నష్టం లేదన్నారు. సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందన్నారు. కార్మికులు గ్రహించి సమ్మెకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులు శ్యాంసుందర్, శ్రావణ్ పాల్గొన్నారు. -
భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 14 నుంచి 16 వరకు జరుగు మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగొద్దని కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ అన్నారు. సోమవారం ఆయన అధ్యక్షతన కాళేశ్వరం దేవస్థానం సమావేశ మందిరంలో మహాశివరాత్రి జాతర నిర్వహణ ఏర్పాట్లపై సంబంధితశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన మహాశివరాత్రి జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింత సమర్థవంతమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా భద్రత, రాకపోకలు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యసేవలు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. జాతర సందర్భంగా భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకొని ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవలు, పరిశుభ్రత నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మహాశివరాత్రి జాతరకు సంబంధించిన వాల్పోస్టర్లను సబ్ కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఈఓ మహేష్తో కలిసి క్యూలైన్లు, భద్రత ఏర్పాట్లపై చర్చించారు. సబ్కలెక్టర్ పాతనక్ష రహదారిని సర్పంచ్తో కలిసి పరిశీలించారు. ఈ సమావేశంలో కాళేశ్వరం సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్రెడ్డి, తహసీల్దార్ రామారావు, డీటీ యూసఫ్, ఎంపీడీఓ రవీంద్రనాథ్, ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు, ఎస్సై తమాషారెడ్డి, రెవెన్యూ సిబ్బంది శ్యామ్తో పాటు సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ కాళేశ్వరంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై సమీక్ష -
ప్రలోభాల ఎర
ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంప్రచారానికి తెర..ములుగు: ములుగు మున్సిపాలిటీ ఎన్నికలకు సమరం మొదలైంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. మందు, మాంసాహారం, నగదు రూపేణా ఆశపెడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ తమకే ఓటేసి గెలిపించాలని ప్రాధేయపడుతున్నారు. ములుగు మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ధీమాతో అభ్యర్థులు ఓటర్లకు పంచేందుకు మందు, చీరలు ముందస్తుగానే సమకూర్చుకున్నారు. ఇప్పటికే కొన్ని వార్డుల్లో రోజుకు కిలో చికెన్, క్వాటర్ బాటిల్ చొప్పున ఓటర్లకు పంపిణీ చేస్తూ తమకే ఓటేసి గెలిపించాలని అభ్యర్థులు వేడుకుంటున్నారు. పోటీలో 83 మంది.. తొలిసారిగా ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీ పరిధిలో బండారుపల్లి, జీవింతరావుపల్లి గ్రామాలు విలీనం అయ్యాయి. 20 వార్డులకు 83 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చైర్పర్సన్ రిజర్వేషన్ బీసీ మహిళకు కేటాయించడంతో చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకోవాలనే ఆలోచనలో అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. బీఆర్ఎస్, బీజేపీలు 20 వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ కొన్ని చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పోటీ పడుతుంది. బీజేపీ ఒకటి, రెండు చోట్ల పోటీ ఇస్తుందనే ప్రచారం సాగుతోంది. 20 వార్డులకు కాంగ్రెస్ నుంచి 20 మంది, బీఆర్ఎస్ నుంచి 20, బీజేపీ నుంచి 20, సీపీఎం నుంచి ఇద్దరు, స్వతంత్రులు 21 మంది పోటీపడుతున్నారు. 11న పోలింగ్ ములుగు మున్సిపాలిటీగా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. 20 వార్డులకు 20 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా 50 బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేశారు.. మున్సిపాలిటీ ఎన్నికల్లో 13,963 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 6,661 మంది పురుషులు, 7,300 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. ఎన్నికల విధులకు ఏడుగురు ఆర్ఓలు, ఏడుగురు ఏఆర్ఓలు, 74 మంది ఏపీఓలను నియమించినట్లు మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్ తెలిపారు.రేపే పోలింగ్ 20 వార్డులకు.. 83 మంది అభ్యర్థుల పోటీకాంగ్రెస్ హవా కొనసాగేనా.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ అదే ఊపుతో మున్సిపల్ ఎన్నికల్లో జోరుగా ముందుకెళ్తోంది. మంత్రి సీతక్క నిత్యం అభ్యర్థులకు, ఓటర్లకు అందుబాటులో ఉంటూ 20 వార్డులకు 20 గెలుచుకోవాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి జెడ్పీ చైర్పర్సన్ పదవిని ఆశించిన సకినాల భవాని చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, చైర్పర్సన్ పదవిని ఆశించిన మాజీ ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, సుధీర్ బీఆర్ఎస్పై అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్కు బలం చేకూరింది. అయినప్పటికీ మాజీ మంత్రి సత్యవతిరాధోడ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం ప్రతిరోజు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ దూకుడు కొనసాగుతుందా, బీఆర్ఎస్ పుంజుకుంటుందా అనేది ఈ నెల 13న వెలువడే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -
వందశాతం పోలింగ్ లక్ష్యం
● కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు: మున్సిపాలిటీ ఎన్నికల్లో వందశాతం పోలింగ్ నమోదు చేసేలా అధికారులు లక్ష్యం పెట్టుకోవాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సోమవారం విలేకరులకు పలు వివరాలు వెల్లడించారు. రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సాధారణ సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు సంస్థలు, ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థల భవనాల్లో విధులు నిర్వహించబోయే వారందరికీ ఈ నెల 10, 11, 13వ తేదీల్లో సెలవును ప్రకటించినట్లు తెలిపారు. ఓటర్లు తప్పకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 144 సెక్షన్ అమలు ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 12వ తేదీ సాయంత్రం 5గంటల వరకు 72 గంటల పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని వెల్లడించారు.. 144 సెక్షన్ అమలులో ఉన్న నేపధ్యంలో గుంపులుగా ఉండడం, ర్యాలీలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ములుగు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ దివాకర సోమవారం రాత్రి సందర్శించారు. సిబ్బందికి పొలింగ్ సామగ్రిని పక్కాగా అందించాలని పలు సూచనలు చేశారు. బీఎల్ఓలు ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల సిబ్బందికి విధుల కేటాయింపు
● అదనపు కలెక్టర్ సంపత్రావు ములుగు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా కలెక్టరేట్లో మూడో ర్యాండమైజేషన్ ప్రక్రియలో భాగంగా సోమవారం పోలింగ్ సిబ్బందికి విధులు కేటాయించినట్లు అదనపు కలెక్టర్ సంపత్రావు, జనరల్ అబ్జర్వర్ గంగాధర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ విధులు నిర్వర్తించేందుకు మూడో ర్యాండమైజేషన్ ద్వారా మొత్తం 20 మంది ప్రిసైడింగ్ అధికారులు, 20 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 60 మంది ఇతర పోలింగ్ అధికారులను కేటాయించారు. ఈ సందర్భంగా ఆరుగురిని సూక్ష్మ పరిశీలకులను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. అదే విధంగా 20 శాతం రిజర్వ్ సిబ్బందిని కూడా ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేశ్, ఈడీఎం దేవేందర్ పాల్గొన్నారు. 13 వరకు అవగాహన సదస్సులు ఆర్బీఐ పిలుపు మేరకు కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్పై అవగాహన పెంచేందుకు ఆర్థిక అక్షరాస్యత వారంగా నిర్వహిస్తున్నట్లు లీడ్ బ్యాంకు జిల్లా అధికారి జయప్రకాశ్ తెలిపారు. అదనపు కలెక్టర్లు సంపత్రావు, మహేందర్జీ, ఆర్డీఓ వెంకటేశ్లచే పోస్టర్లను ఆవిష్కరించినట్లు వెల్లడించారు. నేటి నుంచి సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
బోనమెత్తిన మహిళలు
మహాదేవపూర్ మండల కేంద్రంలో మల్లన్న బోనాల జాతర పండుగ సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి మొక్కులు చెల్లించారు. సోమవారం మహారాష్ట్రతో పాటు తెలంగాణ నుంచి భక్తులు తరలివచ్చి మల్లన్న స్వామికి బోనం సమర్పించారు. ఒగ్గు కళాకారుల డోలు వాయిద్యాల నడుమ భక్తులు మల్లన్న స్వామికి ఇష్టమైన గజ్జల లాగులు వేసుకొని నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పూజారి జాడి శ్రీశైలం, జాడి గట్టయ్య, జాడి వెంకయ్య, సమ్మయ్య, జాడి గట్టయ్య, రాజేందర్, రేగుల భాస్కర్, లక్ష్మి దేవర పూజారులు పాల్గొన్నారు. – కాళేశ్వరం -
మండల ప్రత్యేకాధికారిగా డీపీఓ వెంకయ్య
మంగపేట: మండల ప్రత్యేకాధికారిగా జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్యను నియమిస్తూ అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మండల ప్రత్యేకాధికారిగా కొనసాగుతున్న డీఈఓ సిద్ధార్థరెడ్డి స్థానంలో డీపీఓను నూతనంగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మండలంలో 2011 నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగక పోవడంతో ప్రజాప్రతినిధులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా పంచాయతీ అధికారి మండల స్పెషలాఫీసర్గా బాధ్యతలు చేపట్టనుండడంతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైస్కూల్ సందర్శన వెంకటాపురం(ఎం): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం ములుగు జిల్లా ప్యానల్ టీం సభ్యుల బృందం జనగాం బాబురావు, హజీ, శ్రీనివాస్, హామీద్, నాగేశ్వర్రావులు సందర్శించి పాఠశాల సమగ్ర ప్రగతిని పరిశీలించారు. విద్యా ప్రగతికి సంబంధించిన విషయాలతో పాటు పాఠశాల మౌలిక వసతులపై ఆరా తీశారు. విద్యార్థుల హాజరుశాతం, గ్రేడుల వివరాలు పరిశీలించిన తర్వాత మౌలిక వసతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రత, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆర్ఓ ప్లాంట్ ద్వారా తాగునీటి లభ్యత, మరుగుదొడ్ల సక్రమ నిర్వహణ, రుచికరమైన మధ్యాహ్న భోజనం తదితర విషయాల్లో పాఠశాల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రార్థన సమయం నుంచి సాయంత్రం పాఠశాల ముగిసే వరకు పాఠ్యాంశాలతో పాటు జరిగే ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ‘సకాలంలో పనులు పూర్తిచేయాలి’ కన్నాయిగూడెం: నీతి ఆయోగ్ ఆస్పీరేషనల్ బ్లాక్లో నిర్వహించ తలపెట్టిన పనులన్నీ వందశాతం సకాలంలో పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి, ఈజీఎస్ ఏపీడీ వెంకటనారాయణ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో ఆస్పీరేషనల్ బ్లాక్లో చేపట్టిన సంపూర్ణ అభియాన్ 2.0ను రైతు వేదికలో సోమవారం ప్రారంభించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో ఆస్పీరేషనల్ కో ఆర్డినేటర్ రమేశ్ ఆధ్వర్యంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఐసీడీఎస్, విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు ఆరు ముఖ్యమైన అంశాలు ఉన్నాయని తెలిపారు. అధికారులు పనుల్లో అలసత్వం చేయకుండా సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. అనంతరం సీడీపీఓ ప్రేమలత మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలు, బాలింతలు, గర్భిణుల ఎత్తు, బరువు చూడాలన్నారు. అదే విధంగా వారికి పౌష్టికాహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సర్వర్, ఎంపీడీఓ ఇన్చార్జ్ సాజిదాబేగం, మండల విద్యాశాఖ అధికారి సాంబయ్య, మండల శిశు సంక్షేమ అధికారి ప్రేమలత, ఐకేపీ ఏపీఎం సతీశ్, ఏపీఓ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. కోటగుళ్లలో పూజలు గణపురం: మండలకేంద్రంలోని కాతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఆశుతోష్ పాండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త అట్లూరి వెంకటలక్ష్మీనరసింహారావుతో కలిసి ఆయన ఆలయాన్ని సందర్శించారు. వారిని ఆలయ అర్చకుడు నాగరాజు సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందచేశారు. సోమవారం ప్రత్యేక పూజలు కోటగుళ్లలో సోమవారం సందర్భంగా గణపేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగరాజు స్వా మి వారిని ప్రత్యేకంగా అలంకరించగా భక్తులు దర్శించుకున్నారు. -
సద్దన్నం భలే రుచి..
ఆకలి తప్ప ఏమీ తెలియని ఓ బాలుడు.. తాను ఎక్కడ ఉన్నాడు.. ఎందుకు ఉన్నాడో తెలియదు.. తెలిసిందల్లా ఆకలి మాత్రమే అనేలా పొలం గట్టున తల్లిపెట్టిన సద్దన్నం తింటున్నాడు. ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్కు చెందిన గొత్తికోయ గిరిజనులు మండలానికి కూలీ పనుల కోసం వచ్చారు. తోటి కూలీలతో వరి పొలంలో కలుపుతీసేందుకు వచ్చిన తల్లి కుమారుడిని గట్టుపై కూర్చోబెట్టి ఆకలి వేస్తే తినేందుకు సద్ది, తాగేందుకు అంబలి బాటిల్ను పెట్టి పనిలో నిమగ్నమైంది. ఎండలో కూర్చున్న ఆ బాలుడు ఆకలి వేయడంతో సద్దన్నం తింటూ తన తల్లి వైపు అమాయకంగా చూస్తుండగా సాక్షికి చిక్కాడు. – మంగపేట -
పోలింగ్ సిబ్బందికి విధులు కేటాయింపు
ములుగు : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జనరల్ అబ్జర్వర్ గంగాధర్ సమక్షంలో పోలింగ్ సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు. అనంతరం పోలింగ్ సిబ్బందికి విధులు కేటాయించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా అనుసరిస్తూ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టినట్లు వారు తెలిపారు. టీ–పోల్ పోర్టల్ ద్వారా ఎన్నికల విధులు నిర్వహించే 24మంది (పీఓలు) ప్రిసైడింగ్ అధికారులు, 24 మంది ఏపీఓలు, 72 మంది ఓపీఓలకు రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు వివరించారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలో 20వార్డులకు సంబంధించి 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్, ఈడీఎం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. వార్షిక పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలి ములుగు రూరల్ : పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ్రెడ్డి సూచించారు. శనివారం మల్లంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ సబ్జెక్ట్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంగ్లిష్ సబ్జెక్ట్లో అధిక మార్కులు ఎలా సాధించాలో మెలకువలను విషయ నిపుణులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఖలీల్, మాజీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్రెడ్డి, ఏసీజీఈ వినోద్కుమార్, సూర్యనారాయణ, ఎంఈఓ తిరుపతి, ఝాన్సీ, ఆంగోత్ రాజు, వైష్ణవి, కృష్ణ, పద్మ, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెరిగిన గోదావరి వరద ● నిలిచిన కరకట్ట పనులు మంగపేట : మండలంలో గోదావరి వరద నీటి మట్టం పెరిగింది. దీంతో గోదావరి ఒడ్డు వెంట చేపట్టిన కరకట్ట నిర్మాణ పనులు నిలిచి పోయాయి. కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం వద్ద గోదావరిపై నిర్మించిన సమ్మక్కసాగర్ బ్యారేజ్ ఎగువ ప్రాంతం నుంచి వరద ఇన్ఫ్లో పెరగడంతో శనివారం 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో గోదావరిలో వరద నీరు క్రమంగా పెరగడంతో సాయంత్రం వరకు కరకట్ట బండ్ పనులు జరుగుతున్న ప్రాంతంలోకి వరద నీరు చేరింది. పొక్లెయినర్ల చుట్టూ సైతం నీరు చేరడంతోపాటు బండ్ నిర్మాణానికి వినియోగించే రాళ్లు కూడా నీట మునిగి పనులు పూర్తిగా నిలిచి పోయాయి. ఇదే విషయంపై ఇరిగేషన్ ఏఈ వలీమ్మహ్మద్ను వివరణ కోరగా గోదావరిలో నీటిమట్టం పెరగడం వల్ల తాత్కాలికంగా పనులకు అంతరాయం కలిగింది. వరదనీటి కారణంగా ఎలాంటి నష్టం జరుగలేదన్నారు. 14,503 క్యూసెక్కుల నీరు విడుదల కన్నాయిగూడెం : జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గోదావరిపై నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుంచి దిగువకు 14,503 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి 6,000 క్యూసెక్కుల ఉన్న నీరు శనివారం బ్యారేజ్లోకి ఒక్కసారిగా 14,750లకు వచ్చి చేరింది. నేటినుంచి ఎరువుల బుకింగ్ ప్రక్రియ ప్రారంభం ములుగు : జిల్లావ్యాప్తంగా ఎరువుల బుకింగ్ ప్రక్రియ (నేడు)ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఫర్టిలైజర్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎరువులు బుక్ చేసుకోవాలని ఆయన రైతులను కోరారు. యాప్ డౌన్లోడ్లో గానీ, బుకింగ్ ప్రక్రియలో గానీ ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే సంబంధిత ఏఓ, ఏఈఓలను సంప్రదించాలన్నారు. ములుగు–89777 51161, వెంకటాపూర్–89777 51162, మల్లంపల్లి–87124 99938, ఏటూరునాగారం–89777 51142, గోవిందరావుపేట–89777 51149, మంగపేట–89777 51151, కన్నాయిగూడెం–89777 51150, తాడ్వాయి–89777 51152, వెంకటాపురం–89777 51153, వాజేడు–89777 51152 నంబర్లలో ఆయా మండలాలకు చెందిన రైతులు సంప్రదించాలని కోరారు. -
ఇండిపెండెంట్లే కీలకం!
● చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై ప్రభావం ● ప్రధాన పార్టీలకు గుబులు ● గెలుపు అవకాశం ఉన్న ఇండిపెండెంట్లపై గురి ● ఇప్పటి నుంచే టచ్లో పెట్టుకునే ప్రయత్నం ● మొదలైన ముఖ్యనేతల బేరసారాలుపోటీలో అత్యధికంగా స్వతంత్రులు సాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై వారు ప్రభావం చూపుతారనే చర్చ జరుగుతోంది. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులుంటే.. 1,073 మంది కౌన్సిలర్ సీటు కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కలిసి 260 మంది, బీఆర్ఎస్ నుంచి 259, బీజేపీ నుంచి 240 మంది పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్గా 314 మంది వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రధాన పార్టీల్లో గుబులురేపుతున్నారు. ఆశించిన పార్టీలో టికెట్లు రాకపోవడంతో కొందరు స్వతంత్రులుగా రంగంలోకి దిగారు. ఇంకొందరు తమ సత్తా చాటేందుకు యత్నిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల్లో ఎవరి ఓట్లు చీలుస్తారనే భయం అభ్యర్థుల్లో నెలకొంది. ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. టఫ్ ఫైట్.. స్వతంత్రుల కారణంగా ఎవరి ఓట్లకు గండిపడుతుందనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్లు రానివారు రంగంలో గట్టిగానే పోరాడుతున్నారు. దీంతో ఓవైపు అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే.. మరో వైపు గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెంట్లను ప్రధాన పార్టీల నేతలు టచ్లో పెట్టుకుంటున్నారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసి ఖర్చులు మోసేందుకు చాటుమాటుగా బేరసారాలు చేస్తున్నారు. 12 మున్సిపాలిటీల ను తమ ఖాతాలో వేసుకునేందుకు పోటాపోటీగా ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీల నుంచి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు స్వతంత్రులను రాజీ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అంతర్గత మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడెక్కడ.. ఎలా ఉంది? హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు 100 మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి 22 మంది చొప్పున అభ్యర్థులుండగా, బీజేపీ నుంచి 21 కాగా రెబల్స్, స్వతంత్రులు కలిపి 35 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 12 మందికి విజయావకాశాలున్నాయంటున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ 30 వార్డులకు 120 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అన్ని వార్డులకు అభ్యర్థులను నిలపగా, స్వతంత్రులుగా కూడా 30 మంది తలపడుతున్నారు. ఇందులో ఆరుగురు గెలిచే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు అభ్యర్థులను బరిలో నిలపగా, అత్యధికంగా 50 మంది ఇండిపెండెంట్లు (రెబల్స్ కూడా) పోటీలో ఉన్నారు. మొత్తం 50 మందిలో 20 మంది ఈజీగా గెలుస్తారన్న చర్చ జరుగుతోంది. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులకు 27 వార్డుల్లో కాంగ్రెస్, 3 చోట్ల సీపీఐ, సీపీఎంలుండగా, బీఆర్ఎస్ నుంచి 29 మంది, బీజేపీ 26 మంది కౌన్సిలర్ కోసం పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి రెబల్స్ కలుపుకుని 45 మంది స్వతంత్రులు బరిలో నిలిచి ప్రధాన పార్టీలకు చుక్కలు చూపెడుతున్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలోని 18 వార్డులకు 82 మంది పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్కు మొత్తం వార్డుల నుంచి అభ్యర్థులుండగా, 13 వార్డులకు బీజేపీ అభ్యర్థులను నిలిపింది. ఇక్కడ 33 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్లు ఆశించి స్వతంత్రులుగా నిలిచిన నలుగురు గట్టి పోటీ ఇస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 155 మందిలో.. 58 మంది ఇండిపెండెంట్లుగా పోటీలో నిలిచారు. కాంగ్రెస్ 32, మిత్రపక్షాలు నాలుగు చోట్ల, బీఆర్ఎస్ 35, బీజేపీ నుంచి 30 మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడ సుమారు 8 మంది ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేస్తుండగా, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 63 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తుండగా, స్వతంత్రులు సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరిపెడ మున్సిపాలిటీ నుంచి 15 వార్డులకు మొత్తం 63 మంది పోటీ చేస్తుండగా, అన్ని వార్డులకు మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలో దింపాయి. 18 మంది ఇండిపెండెంట్లుగా పోటీలో నిలబడి పోరాడుతున్నారు. కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులకు 58 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు అన్ని వార్డులకు అభ్యర్థులను దింపగా, బీజేపీ 15 చోట్ల పోటీ చేస్తుంది. ఇక్కడ 11 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. డోర్నకల్ మున్సిపాలిటీలో 15 వార్డులకు 64 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అన్ని వార్డులకు అభ్యర్థులను పెట్టగా, బీఆర్ఎస్ 14, బీజేపీ 14 వార్డుల్లో పోటీ పెట్టింది. 21 మంది ఇక్కడి నుంచి ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులకు 107 మంది ఉండగా, కాంగ్రెస్ 25, మిత్రపక్షాలు 5 కలిపి 30 వార్డులకు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ 30 వార్డుల్లో, బీజేపీ 25 వార్డుల్లో అభ్యర్థులను పోటీలో దింపగా 27 మంది స్వతంత్రులు బరిలో నిలిచి పోరాడుతున్నారు. ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులకు 83 మంది బరిలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీలు అన్ని వార్డులకు పోటీ చేస్తుండగా, 23 మంది ఇండిపెండెంట్లుగా కౌన్సిలర్ కోసం కొట్లాడుతున్నారు. -
నేడు భూపాలపల్లికి సీఎం రేవంత్రెడ్డి
● కొడవటంచ ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన, ప్రత్యేక పూజలు ● సింగరేణి వెయ్యి క్వార్టర్ల ఎదురుగా బహిరంగ సభ ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుభూపాలపల్లి : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు (ఆదివారం) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. చాపర్ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొడవటంచకు చేరుకుంటారు. లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. విశ్రాంతి భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆలయంలో రూ.12 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి చాపర్ ద్వారా గణపురం మండలంలోని సింగరేణి వెయ్యి క్వార్టర్ల ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభావేదికపై డీబీఎం 38 కాల్వకు పైపులైన్ ఏర్పాటు, భీంఘన్పూర్ రిజర్వాయర్ ఆధునీకరణ, గణపసముద్రం చెరువు సిమెంట్ లైనింగ్ తదితర పనులకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిసింది. సభ ఏర్పాట్లు పూర్తి.. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డి శనివారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించే స్థలాలు, సభాస్థలి, హెలిపాడ్ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారీ బందోబస్తు.. సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభ వద్ద సుమారు 1,100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, ఎస్సైలు విధుల్లో ఉండనున్నారు. -
అభివృద్ధి చేసే వారికే ఓటు
దోమల స్వైరవిహారం7వ వార్డులో సైడ్ డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగునీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. చెత్తాచెదారంతో దుర్గంధం వెదజల్లుతోంది. – సానికొమ్ము శ్రీధర్రెడ్డి, 7వ వార్డుములుగు : ప్రతీ వార్డులో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. కోతుల బెడదతోపాటు వీధిదీపాలు లేకపోవడంతో కాలనీల్లో కారు చీకట్లు కమ్ముకుంటున్నాయి. తొలిసారిగా ములుగు మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. పట్టణంలోని 20 వార్డుల పరిధిలో సుమారు 16 వేల మంది జ నాభా, 13,963 మంది ఓటర్లు ఉన్నారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేసే వారికే తాము ఓటు వేస్తామని ములుగు వాకర్స్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని తంగేడు స్టేడియంలో శనివారం నిర్వహించిన ‘సాక్షి’ చర్చావేదికలో వా కర్స్ పాల్గొని తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను వివరించారు. నూతనంగా కొలువుదీరే పాలకవర్గం పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు.ఆటస్థలం లేక ఇబ్బందులు ములుగు పట్టణంలో పిల్లలు ఆడుకునేందుకు క్రీడాస్థలం లేదు. పిల్లలకు ఆటస్థలాన్ని కేటాయించడంతో పాటు వస్తువులను సమకూర్చాలి. పిల్లల పార్కు నిర్మిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. – తాడెం తిరుపతి, ములుగు అర్హులకు పింఛన్లు అందించాలి పార్టీలకతీతంగా అర్హులను గుర్తించి పింఛన్లు అందించాలి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అసలైన పేదలకు చేరాలి. పార్టీల పేరుతో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం చేయొద్దు. – పాముకుంట్ల కుమార్, ములుగుట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు ములుగు పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. – మాలోత్ రమేష్, ములుగు కోతులు, కుక్కల సమస్యను పరిష్కరించాలి పట్టణంలో కోతులు, కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. బడికి వెళ్లే విద్యార్థులను సైతం కోతులు గాయపరుస్తున్నాయి. ఇళ్లపై గంతులు వేస్తూ ఇంట్లో లేని సమయంలో వంటసామగ్రిని చిందరవందర చేస్తున్నాయి. కుక్కల బెడద తీవ్రంగా ఉంది. – పరికరాల విక్రమ్, ములుగు మాస్టర్ ప్లాన్ రూపొందించాలి ములుగు పట్టణ అభివృద్ధికి మాస్టర్ప్లాన్ రూపొందించాలి. గట్టమ్మ ఆలయం నుంచి జంగాలపల్లి వరకు బైపాస్ రోడ్డు నిర్మించాలి. వర్షాకాలంలో డ్రెయినేజీలు పొంగి ప్రవహిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. – జనగాం బాబురావు, ములుగు రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలి మినీ గ్రౌండ్ నిర్మించి సదుపాయాలు కల్పించాలి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించాలి ‘సాక్షి’ చర్చా వేదికలో ములుగు వాకర్స్ల మనోగతం తొలిసారిగా ములుగు మున్సిపాలిటీ ఎన్నికలు -
రామప్పను సందర్శించిన 13 దేశాల ప్రతినిధులు
వెంకటాపురం(ఎం) : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని 13 దేశాలకు చెందిన 28 మంది ప్రతినిధులు శనివారం సందర్శించారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో శిక్షణ పొందుతున్న లెబనాన్, టర్కీ, ఉజ్జెకిస్తాన్, జింబాబ్వే, ఈజిప్ట్, మొరాకో, ఇథియోపియా, టాంజానియా, లైబీరియా, మాలి, బోట్స్వానా, మారిషన్, గ్వాబెమాల దేశాలకు చెందిన 28 మంది ప్రతినిధులు కోర్స్ డైరెక్టర్ డాక్టర్ రావులపాటి మాధవి ఆధ్వర్యంలో రామప్పను సందర్శించగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టత, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. వారి వెంట ఎంసీహెచ్ఆర్డీ కోఆర్డినేటర్లు నంద కిషోర్, రవి, గౌతమ్, సీఐ సురేష్, ఎస్సై చల్ల రాజు, టూరిస్ట్ పోలీసులు ఉన్నారు. -
ఇళ్లు మంజూరు చేయాలి
పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలి. ఇళ్లు లేని పేదలు వందల్లో ఉంటే పదుల సంఖ్యలో మాత్రమే ఇళ్లు ఇస్తుండడంతో మిగిలిన వారు ఇబ్బందులకు గురవుతున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి. – కొయ్యల రాజు, ములుగు రోడ్లు లేక ఇబ్బందులు కాలనీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గుంతలమయమైన రోడ్లపై వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నాం. రహదారులను విస్తరించి సీసీ రోడ్లను నిర్మించాలి –ములకాల శ్రీను, ములుగుస్విమ్మింగ్పూల్ నిర్మించాలి సరైన వ్యాయామం స్విమ్మింగ్ పూల్తోనే సాధ్యం. స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తే చిన్నారులు ఈత నేర్చుకోవడానికి సులభంగా ఉండడమే కాకుండా వాకింగ్ చేసేవారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. – ఇంజపూరి వెంకట్, ములుగుమినీ గ్రౌండ్ నిర్మించాలిములుగు పట్టణంలో మినీ గ్రౌండ్ నిర్మించాలి. పోలీసు, ఆర్మీ తదితర ఉద్యోగాలు సాధించేందుకు కోచింగ్ కోసం వరంగల్కు వెళ్తున్నారు. గ్రౌండ్ నిర్మించి సదుపాయాలు కల్పించాలి. – గడ్డం క్రాంతికుమార్, ములుగు -
‘ఆమె’నే నిర్ణేత!
● ఓట్లు..సీట్లలో ఆధిపత్యం ● జనరల్ స్థానాల్లోనూ పోటీ ● ములుగు తొలి చైర్పర్సన్ మహిళకే..ములుగు : ములుగు మున్సిపల్ ఎన్నికల్లో నిర్ణయాధికారం అతివలదే. ఎన్నికల బరిలో నిలిచిన కౌన్సిలర్ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించడంలో వారే కీలకపాత్ర పోషించనున్నారు. ములుగు పట్టణ పరిధిలో 6,661 పురుష ఓటర్లు ఉండగా 7,300 మహిళలు ఉన్నారు. పురుషుల కంటే 639 మంది మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని బీసీ మహిళకు కేటాయించడంతో తొలిసారిగా మహిళనే చైర్పర్సన్ సీటుపై ఆశీనులు కానున్నారు. ఇలా ఓట్లు.. సీట్లలోనూ మహిళల అధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అభ్యర్థుల తలరాతలను మార్చే శక్తిగల మహిళామణులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించారు. చైర్పర్సన్ పీఠమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచిన పలువురు మహిళా అభ్యర్థులు జనరల్ స్థానాల్లోనూ పోటీ చేస్తుండటం నారీశక్తికి నిదర్శనమని చెప్పొచ్చు. మహిళలు 46, పురుషులు 37 మంది.. ఓట్లలోనే కాదు.. సీట్లలోనూ మహిళల అధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ములుగు మున్సిపల్ పరిధిలోని 20 వార్డులకు గాను 10 వార్డులను మహిళలకు రిజర్వ్ చేశారు. ఆయా వార్డుల్లో మహిళలే పోటీ చేస్తున్నారు. పట్టణంలోని అన్ని వార్డుల పరిధిలో మొత్తం 83 మంది అభ్యర్థులు బరిలో నిలువగా అత్యధికంగా మహిళా అభ్యర్థులే ఉండడం ఆసక్తిని రేపుతోంది. మహిళా చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. 83 మందిలో మహిళా అభ్యర్థులు 46 మంది పోటీ చేస్తుండగా, పురుషులు 37 మంది బరిలో ఉన్నారు. మహిళలకు 10 స్థానాలు కేటాయించగా వివిధ రిజర్వేషన్లకు చెందిన జనరల్ స్థానాల్లో కూడా మహిళలు అభ్యర్థులుగా పోటీ చేస్తుండడం గమనార్హం. జనరల్కు కేటాయించిన 6, 7 వార్డుల్లో కాంగ్రెస్ తరఫున మహిళలు బరిలో నిలిచారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి 2, 6, 7, 20 వార్డుల్లో బీఆర్ఎస్ నేతలు తమ సతీమణులు, కుటుంబ సభ్యులను పోటీలో నిలిపారు. ఇలా రిజర్వ్డ్ స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీపడుతున్నారు. కౌన్సిలర్గా విజయం సాధిస్తే చైర్మన్ పీఠాన్ని అధిరోహించవచ్చనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. నిర్ణయాధికారం ఆమెదే.. ఆయా వార్డుల్లో పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించగల శక్తి వారికే ఉంది. మహిళా ఓటర్లు ఏ పార్టీ అభ్యర్థి వైపు నిలబడుతారో వారే ఆ వార్డులో విజయాన్ని సొంతం చేసుకునే అవకాశముంది. అభ్యర్థుల గెలుపోటములను శాసించే అధికారం మహిళా ఓటర్లకే ఉంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వారి ఓట్లు రాబట్టేందుకు పరితపిస్తున్నాయి. ఇందుకోసం అవసరమైన తాయిలాలను ప్రకటిస్తున్నాయి. ప్రత్యేక బహుమతులను అందజేయడంతో పాటు తాము గెలిస్తే మహిళల కోసం కాలనీలో ప్రత్యేక సదుపాయలు కల్పిస్తామని హామీలిస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ సమాచారం మొత్తం వార్డులు: 20 బరిలో ఉన్న అభ్యర్థులు: 83 మహిళలు: 46 పురుషులు: 37 పురుష ఓటర్లు: 6,661 మహిళా ఓటర్లు: 7,300 -
పులి.. ఒకటా? రెండా?
రఘునాథపల్లి మండలం మండెలగూడెం శివారులోని పరిశె రాజుకుచెందిన లేగదూడపై శుక్రవారం తెల్లవారుజామున పెద్ద పులి దాడి చంపింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై దూదిమెట్ల నరేష్ అటవీశాఖ డీఎఫ్ఓ కొండల్రెడ్డి, సిబ్బందితో వెళ్లి పులి పాదముద్రలుగా నిర్ధారించారు.జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సరిహద్దులోని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్పూర్ గ్రామంలో పులి సంచరించినట్లు శుక్రవారం మద్దూరు సీఐ రమేష్, ఎస్సై ఆసీఫ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాముడు గుర్తించారు. సమీప గ్రామాలైన కట్కూర్, వీఎస్ఆర్ నగర్, బండనాగారం, బంజేరు, మార్మాముల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సమాచారం ఇచ్చారు.జనగామ: మూడు రోజులుగా జనగామ జిల్లా బచ్చన్నపేట, జనగామ, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల పరిసర అటవీ ప్రాంతాల్లో పులి సంచారం వార్తలు గ్రామాలను వణికిస్తున్నాయి. మొదట అటవీ ప్రాంతాల్లోనే తిరుగుతున్నట్లు భావించినా ఇప్పుడు మనుషుల నివాస ప్రాంతాలవైపు వచ్చిందన్న ప్రచారంతో అధికార యంత్రాంగం ప్రజలను మరింత అప్రమత్తం చేస్తోంది. రఘునాథపల్లి, బచ్చన్నపేట మండలాల్లోని చెరువుల అంచులు, పల్లె వెలుపల ఉన్న పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తులు రాత్రివేళలో బయటకు రావడానికి, వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లడానికి జంకుతున్నారు. పశువులను కూడా వెలుపల వదలడానికి భయపడుతున్నారు. పగలు కొండకోనల్లో తిష్ట వేసిన పులి ఇప్పటివరకు రాత్రివేళల్లో యాదాద్రి, జనగామ జిల్లాలో 20 వరకు ఆవులు, మేకలను వేటాడినట్టు పలు గ్రామాల్లో వార్తలు, సంఘటనలు వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆడనా.. మగనా... ఈ పులి ఎక్కడినుంచి వచ్చింది.. మగపులా? ఆడపులా? లేక రెండు పులులా? అన్న అనుమానాలు కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరించిన పులిని అటవీశాఖ అధికారులు రాయల్ బెంగాల్ టైగర్గా గుర్తించారు. ఇది మగ పులిగా నిర్ధారించారు. కానీ, బచ్చన్నపేట మండలంలో మరో పులి సంచరిస్తోందనే ప్రచారం ప్రజల్లో మరింత భయాన్ని రేకెత్తిస్తోంది. ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో పులిఛాయలు, పాదముద్రలు భిన్నంగా ఉండటం వంటి అంశాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో అటవీశాఖ, పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. పులి కదలికలను గుర్తించేందుకు అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ట్రాపింగ్ బోన్లు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో రాత్రి పహారా బృందాలను ఏర్పాటు చేసి గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. పులికోసం బోన్లు.. ట్రాప్ కెమెరాల ఏర్పాటు పగలు కొండల్లో.. రాత్రి పొలాల్లో టైగర్ జాడలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు పులి సంచారంపై జిల్లా అటవీశాఖ అధికారులు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెబుతున్నారు. పులి కదలికలు రాత్రివేళల్లో చురుకుగా ఉంటాయని, వేకువజామున, సాయంత్రం, చీకటి పడిన తర్వాత పులి సంచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండడం మంచిది. పులి కనిపించిన సందర్భంలో పెద్దగా గోల చేయరాదు. శబ్ధాల వల్ల పులి మరింత ఆందోళనకు గురవుతుంది. మేకలు, ఆవులు వంటి పశువులను రాత్రివేళల్లో బయట ఉంచవద్దు. రాత్రి పొలాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు, మహిళలు రాత్రివేళల్లో ఒంటరిగా బయటికి వెళ్లొద్దు. వీలైనంత వరకు గుంపులుగా ప్రయాణించాలి. పులి కదలికలు కనిపిస్తే వెంటనే ఎస్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ, ఎస్హెచ్ఓ, తహసీల్దార్లకు సమాచారం ఇవ్వాలి. -
గట్టమ్మ ఆలయ హుండీల లెక్కింపు
ములుగు రూరల్: మేడారం మహాజాతర సందర్భంగా గట్టమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన హుండీలను శుక్రవారం లెక్కించారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఈఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరిశీలకుడు అనిల్కుమార్ సమక్షంలో లెక్కింపు జరిగింది. గట్టమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.13,06,463 వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ యుగేందర్రెడ్డి, ఎస్సై వెంకటేశ్వర్లు, పూజారులు కొత్త సద య్య, కొత్త లక్ష్మయ్య, అరిగెల సమ్మయ్య, మొగిలి, పుష్పలత, శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ములుగు: జిల్లాలోని ప్రతీ మహిళా సంఘంలో ఉన్న సభ్యురాలికి రుణాలు అందించాలని, సంఘ సభ్యులు మైక్రో ఫైనాన్స్ సంస్థల బారిన పడకుండా చూడాలని సీ్త్ర నిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో సీ్త్ర నిధి, సెర్ప్ సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడారు. సీ్త్ర నిధి నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.22 కోట్లకు గాను ఇప్పటికే రూ.12 కోట్లు అందించామని, ఈ నెల చివరిలోగా మిగిలిన రుణాలను అందిస్తామన్నారు. మేడారం జాతరలో భాగంగా ప్రత్యేక జీవన ఉపాధిని గుర్తించి వారికి సరైన సమయంలో రుణ సౌకర్యం కల్పించి ఆదాయ అభివృద్ధికి ప్రత్యేక రుణాలు అందించినందుకు సిబ్బందిని అభినందించారు. అనంతరం ములుగు అడిషనల్ కలెక్టర్ సంపత్రావు మాట్లాడుతూ శ్రీనిధి సంస్థ ద్వారా ఇప్పటివరకు జిల్లాలో వివిధ రకాల రుణాలు మంజూరు చేశామన్నారు. బకాయి ఉన్న సంఘ సభ్యుల నుంచి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి బకాయి లేకుండా రికవరీ అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్, అడిషనల్ డీఆర్డీఓ గొట్టే శ్రీనివాస్, శ్రీనిధి జోనల్ మేనేజర్ రవికుమార్, ఆర్ఎం అశోక్, డీపీఎంలు గడ్డం శ్రీనివాస్, రాజు, దేవానంద్ పాల్గొన్నారు. ఏటూరునాగారం: విద్యార్థులు శిక్షణ సమయంలో నైపుణ్యాలు, క్రమశిక్షణ, ఉత్తమ భవిష్యత్ లక్ష్యంగా ముందుకు సాగాలని 2024 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన ట్రైనీ అధికారి ప్రథమేష్ కేశవ్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ఆర్ఐటీఐ, ఏటీసీ, శివాపురంలోని సబ్బుల పరిశ్రమను సందర్శించారు. శిక్షణకు ఉపయోగపడే పరికరాలను పరిశీలించారు. రిపేర్లు, తయారీ, నిర్మాణం విధానాలను అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. మహిళా గ్రూపు సభ్యులతో మాట్లాడి ఉత్పత్తులు ఏ మేరకు అవుతున్నాయని, ఆదాయం ఏ విధంగా ఉందని తెలుసుకున్నారు. అంతేకాకుండా ఐటీడీఏ ద్వారా గిరిజనులకు అమలవుతున్న పథకాలు, వాటి విధానం, క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు జరుగుతున్నాయని ఐటీడీఏ ఏపీఓ వసంతరావును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్ఓ సురేష్బాబు, జీసీసీ డీఎం వాణి, జేడీఎం కొండల్రావు, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి ఉన్నారు. ములుగు రూరల్: కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూత్ పెస్టివల్లో బండారుపల్లి మోడల్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులను మంత్రి డాక్టర్ దనసరి సీతక్క, కలెక్టర్ టీఎస్ దివాకరలు వేర్వేరుగా అభినందించారు. పోరిక యువరాణి పోస్టర్ పెయింటింగ్లో ప్రథమ, భూక్య హేమలత సోలో సాంగ్స్లో ద్వితీయ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వందన, ఎస్ఎస్ఎస్ ప్రోగ్రాం కన్వీనర్ ప్రసన్కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ పాల్గొన్నారు. -
ఉన్నట్టా.. లేనట్టా..
ఏటూరునాగారం: గిరిజన యువతీయువకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని కోట్లాది రూపాయలు ఖర్చు చేసి యూత్ ట్రైనింగ్ సెంటర్లను (వైటీసీ) నెలకొల్పారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో ఏటూరునాగారం, జాకారం, కాటారం ప్రాంతాల్లో నెలకొల్పి దాని ద్వారా గిరిజన యువతీ యువకులకు పలు రకాల శిక్షణలను ఉచితంగా ఇచ్చేవారు. అందులో శిక్షణ పొందిన వారికి ఉపాధి కూడా కల్పించేలా ఐటీడీఏ ప్రత్యేక చర్యలు చేపట్టేది. కానీ ఉపాధి శిక్షణలు, అవకాశాలు లేకుండా పోయాయి. వైటీసీ కేంద్రాలు కేవలం వరదలప్పుడు వచ్చే ఎన్డీఆర్ఎఫ్, ఇతర అవసరాలకు షెల్టర్లుగా మారాయి. తరగతి గదులు బోసిపోయి కనిపిస్తున్నాయి. ప్రైవేట్రంగంతో భాగస్వామ్యం వైటీసీ సెంటర్లలో నేరుగా ప్రభుత్వం శిక్షణ ఇవ్వకుండా ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఏజెన్సీలను వారికి వసతి, భోజనం, ఇతర ఖర్చులను అందజేసేందుకు బడ్జెట్ కేటాయించేవారు. గతంలో సింక్రోసర్వ్ అనే ఏజెన్సీలో ఐటీడీఏ భాగస్వామ్యం చేసుకొని హోటల్ మేనేజ్మెంట్, సోలార్ సిస్టమ్పై శిక్షణ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలాంటివి ఏమిలేకుండా నిరుపయోగంగా భవనాలు మిగిలిపోతున్నాయి. దీంతో చదువుకున్న గిరిజన యువతీ యువకులు ఎలాంటి ఉపాధి లభించక నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది. పలు పథకాలు నిర్వీర్యం ఉపాధి శిక్షణ కింద భవిత, స్వయం ఉపాధి ట్రైనింగ్, ఉద్యోగ ఉపాధి అనే నాలుగు అంశాలపై యువతను సన్మార్గంలో పెట్టేలా గత ప్రభుత్వాలు రూపకల్పన చేశాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాలపై ఎలాంటి మొగ్గు చూపడం లేదు. ఐటీడీఏ కార్యాలయానికి సరైన బడ్జెట్ను కేటాయించకపోవడంతో ఉపాధి శిక్షణ కార్యక్రమాలను చేపట్టడం లేదని అధికారులు పెదవి విరుస్తున్నారు. కేవలం వేతనాలు, మెంటనెన్స్ కింద మాత్రమే నిధులొస్తున్నాయని, ఇతర ఉపాధి కార్యక్రమాలకు రావడం లేదని గిరిజన సంఘాలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ దీనిపై ఎలాంటి దృష్టి సారించడం లేదు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద వచ్చే నిధులు సైతం పక్కదారి పటిస్తున్నారని ఆరోపణలున్నాయి. దీంతో గతంలో ఏర్పాటు చేసిన ఉపాధి లక్ష్యాలు నీరుగారిపోతున్నాయి. జిల్లాలో 2,119 మంది నిరుద్యోగులు జిల్లాలోని 9 మండలాల్లో గిరిజన నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారని గతంలో సర్వే చేపట్టారు. ఆ సర్వే ఆధారంగా జిల్లాలో సుమారు 2,119 మంది గిరిజనులున్నారు. వారికి సరైన ఉపాధి, శిక్షణ ఇవ్వాల్సిన ఐటీడీఏ చూస్తూ ఉండడం గమనార్హం. శిక్షణ, ఉపాధి లేకపోవడంతో యువత చెడుమార్గం, వ్యసనాలకు దారి తీస్తోందని వారి తల్లిదండ్రులు, ఆదివాసీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ● గిరిజనులకు దక్కని శిక్షణ, ఉపాధి నిధులు లేమి కారణంగా జాబ్మేళాలు శూన్యం జిల్లాలో 2,119 మంది గిరిజన నిరుద్యోగులు -
శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
● మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకూ కత్తి మీద సామే ● గ్రామ పంచాయతీ ఫలితాల బేరీజు.. పకడ్బందీగా గెలుపు కోసం పావులు ● రెండు రోజులుగా మున్సిపాలిటీల్లోనే నేతల మకాం ● ఓట్ల కోసం పార్టీల నేతలు, ఇన్చార్జ్ల పాట్లు.. రోజువారీ పరిస్థితిపై అధిష్టానాల ఆరా.. సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా.. రెండు రోజుల ముందే ప్రచారానికి తెరపడనుంది. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి ఇంకా మూడు రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అభ్యర్థుల గెలుపు కోసం దూకుడు పెంచారు. ప్రజాప్రతినిధులు, పార్టీలు నియమించిన ఎన్నికల ఇన్చార్జ్లు రెండు రోజులుగా మున్సిపాలిటీలలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటి ప్రచారం, కులసంఘాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్లో ఈ ఎన్నికలు మూడు పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. 10 నియోజకవర్గాలు.. 12 మున్సిపాలిటీలు..ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీలలో 260 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిసి 1,073 మంది పోటీలో ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. 12 మున్సిపాలిటీలను కై వసం చేసుకోవడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ తర్వాత ఎక్కువ పంచాయతీలలో తమ మద్దతుదారులను గెలిపించుకుని రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్.. గత వైభవాన్ని చాటుతామంటోంది. బీజేపీ 12 మున్సిపాలిటీల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. కాగా వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు మినహా 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ తరఫున కాళిప్రసాదరావు ప్రచారం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్దన్నపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు సవాల్గా మారాయి. నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేల పెద్ది సుదర్శన్ రెడ్డిలు చైర్మన్ పీఠం కోసం కుస్తీ పడుతున్నారు. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం వార్డుల్లో తిరుగుతున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ పీఠం కోసం బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభ్యర్థుల గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. ఇన్చార్జ్లు, ముఖ్య నేతలను కలుపుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఆమె అత్త, టీపీసీసీ నేత హనుమాండ్ల ఝాన్సీలు అభ్యర్థులను బరిలోకి దింపారు. వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కాగా.. ఇక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్తో కలిసి నడుస్తున్న కడియం శ్రీహరి ఆ పార్టీ అభ్యర్థులను అందరిని గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత డా.తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నారు. జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వార్డు కౌన్సిలర్ల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఉండగా, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, పాయం వెంకటేశ్వర్లులు ఇన్చార్జ్లుగా ఉన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (కాంగ్రెస్), గండ్ర వెంకట రమణారెడ్డి (బీఆర్ఎస్)లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మెజార్టీ స్థానాలను దక్కించుకుని చైర్మన్ పీఠంను కై వసం చేసుకోవాలని చూస్తున్నారు. బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి అభ్యర్థులను బరిలోకి దింపారు. ములుగు నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధనసరి సీతక్క కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని భావిస్తున్నారు. ముఖ్యనేతలు, పార్టీ ఇన్చార్జ్లతో కలిసి అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఉన్న బడే నాగజ్యోతి.. ఆమెకు తోడుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎన్నికల ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే బి.శంకర్నాయక్(బీఆర్ఎస్)లకు ప్రతిష్టాత్మకం కాగా, బీఆర్ఎస్ నుంచి మాజీ విప్ దాస్యం వినయభాస్కర్, కాంగ్రెస్ నుంచి సీహెచ్ వెంకటేశ్లు ఇన్చార్జ్లుగా ఉన్నారు. బీజేపీ నుంచి హుస్సేన్నాయక్.. అభ్యర్థులను బరిలోకి దింపారు. డోర్నకల్ నియోజకవర్గంలో డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ (బీఆర్ఎస్)లకు సవాల్గా మారాయి. -
ట్రాన్స్ఫార్మర్లోని రాగి తీగ చోరీ
ఏటూరునాగారం: మండలపరిధిలోని చిన్నబోయినపల్లి శివారులో దొంగల హల్చల్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన మూలగొండ్ల బుచ్చిరెడ్డి అనే రైతుకు చెందిన పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని దుండగలు పగులగొట్టి అందులోని రాగి తీగను చోరీ చేశారు. నాట్లు వేసిన రైతులు పది ఎకరాల వరకు సాగునీటికి ఎదురు చూస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం కావడంతో పొలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి పంటలకు నీరు అందక భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రామ శివారులో ఇలాంటి దొంగతనాలు పెరుగుతున్నాయని, రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని, దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ త్వరగా పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. -
ఉపాధి అవకాశాలు కల్పించాలి
డిగ్రీ పూర్తి చేసి ఎలాంటి ఉద్యోగం లేక ఇంటి వద్దనే ఉంటున్నాం. డిగ్రీ చదివిన వారికి ఐటీడీఏ ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో కనీసం జీవితం గడిసేందుకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక చాలా మంది గిరిజనులు అభివృద్ధిలో వెనుకపడుతున్నారు. – పూసం కమలాకర్, చంచుపల్లి, మంగపేట డిగ్రీ చదివిన అనేక మంది గిరిజనులకు ఉద్యోగం లేకుండా ఉంది. వైటీసీల ద్వారా పలు రకాల ఉచిత శిక్షణలను కల్పించి ఉద్యోగం కల్పించే విధంగా జాబ్మేళాలను నిర్వహించాలి. ఐటీడీఏ స్థానికంగా ఉన్నప్పటికీ ఎలాంటి జాబ్మేళాలు లేవు. – దుబ్బ అంజలి, ఎక్కెల, ఏటూరునాగారం -
ఏఐ మనిషికి ప్రత్యామ్నాయం కాదు
ములుగు: పరిశోధన రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవుడికి ప్రత్యామ్నాయం కాదని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అకడమిక్ డీన్, ప్రొఫెసర్ జి.రామిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, వాణిజ్యశాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో ఎంపవరింగ్ రీసెర్చ్ ఎక్సలెన్స్– ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టూల్స్ ఫర్ అకడమిక్ రైటింగ్ అండ్ పబ్లిషింగ్ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమకాలిన మానవ జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒక విప్లవాత్మకమైన పరిణామమన్నారు. పరిశోధన రంగంలో నైతికంగా వినియోగించుకున్నప్పుడు మాత్రమే పరిశోధన ఫలితాలకు సార్థకత ఉంటుందన్నారు. అనంతరం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ వరలక్ష్మి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల ప్రవేశంతో పరిశోధన రంగం అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడమే కాకుండా పరిశోధన రంగంలో విశ్వమే ఒక గ్రామంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కొప్పుల మల్లేశం, సెమినార్ కన్వీనర్ డాక్టర్ బి.జగదీష్, సెమినార్ కోకన్వీనర్ డాక్టర్ సిహెచ్.భాస్కర్, ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ బి.రాధికారాణి, ప్రిన్సిపాల్స్ చంద్రమౌళి, శ్రీనివాస్, విజయలక్ష్మి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అకడమిక్ డీన్ రామిరెడ్డి -
‘పుర’పోరుకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లు
సాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. మున్సిపాలిటీల వారీగా సీనియర్ నాయకులను ఇన్చార్జ్లుగా నియమించిన టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్.. వార్డుల వారీగా అభ్యర్థుల గెలుపు బాధ్యతలను వారిపైనే పెట్టారు. నియోజకవర్గాల వారీగా ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను సమన్వయం చేసుకుంటూ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ వరంగల్, మహబూబాబాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్లుగా ఉన్నారు. వీరికి తోడు మున్సిపాలిటీల వారీగా కోఆర్డినేటర్లను గురువారం నియమించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జనగామ మున్సిపాలిటీకి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, పాయం వెంకటేశ్వర్లుకు మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్లుగా బాధ్యతలు ఇచ్చారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని తొర్రూరు మున్సిపాలిటీకి ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కొలను హనుమంతరెడ్డిని నియమించారు. పరకాలకు టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, స్టేషన్ఘన్పూర్కు భీమగాని సౌజన్య, భూపాలపల్లికి ఎర్రబెల్లి వరద రాజేశ్వర్రావు, వర్ధన్నపేటకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్ మున్సిపాలిటీకి గాజర్ల అశోక్, మరిపెడకు ఎంపీ పోరిక బలరాంనాయక్, కేసముద్రంకు దూడ వెంకటరమణ, మహబూబాబాద్కు సీహెచ్ వెంకటేశ్, ములుగుకు ఈవీ శ్రీనివాస్రావు, నర్సంపేటకు డాక్టర్ పులి అనిల్కుమార్ను సమన్వయకర్తలుగా టీపీసీసీ నియమించింది. కోఆర్డినేటర్లుగా నియమితులైన వారికి అభ్యర్థుల గెలుపు బాధ్యతలను అప్పగించింది. కోఆర్డినేటర్లుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు మినహా ఇతర సీనియర్లకు భవిష్యత్లో నామినేటెడ్ పోస్టులకు మున్సిపల్ ఎన్నికల విజయాలకు కూడా పార్టీ అధిష్టానం లింకు పెట్టినట్లు సమాచారం. కాగా, టీపీసీసీ నియమించిన సమన్వయకర్తలు అభ్యర్థుల గెలుపు కోసం వెంటనే రంగలోకి దిగారు. 12 మున్సిపాలిటీలకు సీనియర్ల నియామకం జనగామ, తొర్రూరు, మరిపెడకు ఎంపీలు చామల కిరణ్కుమార్రెడ్డి, కడియం కావ్య, బలరాంనాయక్ ఉత్తర్వులు జారీచేసిన టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అభ్యర్థుల గెలుపునకు.. నామినేట్ పదవులకు లింకు -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు
భూపాలపల్లి: ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, పొరపాట్లకు తావు ఇవ్వొద్దని కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో సీఎం పర్యటనకు చేయాల్సిన ఏర్పాట్ల్లపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, వైద్య, విద్యుత్, అగ్నిమాపక, దేవాదాయ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. సీఎం పర్యటన సందర్భంగా శాఖల వారీగా నిర్వర్తించాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు. హెలిప్యాడ్ వద్ద ఉన్న విద్యుత్ వైర్లను తొలగించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. చెల్పూరు జీపీ పరిధిలో జరిగే సభా ప్రాంగణం వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, చెల్పూరులో పబ్లిక్ మీటింగ్ జరిగే ప్రాంతంలో ఆయుష్ ఆస్పత్రిలో సేఫ్ హౌస్, మీటింగ్ ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. సీఎం కాన్వాయ్కు అవసరమైన వాహనాల ఏర్పాటు, సీఎం ప్రయాణానికి వినియోగించే వాహనాల ఫిట్నెస్ తనిఖీలు, అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించాలని ఆదేశించారు. కొడవటంచ ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని,వీఐపీల ప్రొటోకాల్, పురోహితులను నియమించాలన్నారు. పొరపాట్లకు తావివ్వొద్దు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
మేడారం క్లీన్..
● జోరుగా సాగుతున్న పారిశుద్ధ్య పనులుఎస్ఎస్ తాడ్వాయి: మేడారంలో పారిశుద్ధ్య పనులు జోరుగా సాగుతున్నాయి. సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా మేడారానికి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో వారు పడేసిన చెత్తా చెదారం పేరుకుపోయింది. దీనిని తొలగించేందుకు పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారు. జాతర సమయంలో, జాతర అనంతరం మేడారానికి వస్తున్న భక్తులకు ఎక్కడ కూడా అపరిశుభ్రత, చెత్తాచెదారం కనిపించకుండా తొలగిస్తున్నారు. మేడారంతో పాటు పరిసర ప్రాంతాల్లో సైతం ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. డీపీఓ వెంకయ్య సైతం దగ్గరుండి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తూ చెత్తాచెదారం తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు కావాల్సిన వసతులు కల్పిస్తూ మేడారాన్ని క్లీన్గా చేసి స్థానికులకు తిరిగి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
సాంకేతిక విద్యకు ప్రాధాన్యం
ములుగు రూరల్: ప్రస్తుత సమాజంలో సాంకేతిక విద్యకు అత్యంత ప్రాధాన్యం ఉందని అదనపు కలెక్టర్ సంపత్రావు సూచించారు. మండల పరిధిలోని గౌస్పల్లి ఎంపీయూపీఎస్ పాఠశాలలో గురువారం డిజిటల్ క్లాస్రూమ్ను ఆయన ప్రారంభించారు. అదానీ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగాంగా డిజిటల్ విద్యాభివృద్ధికి స్మార్ట్ టీవీని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దృశ్య, శ్రవణ పద్ధతుల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్ధంచేసుకోవడంతో పాటు ఎక్కువగా గుర్తుంచుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ వనరులను ఉపయోగించుకోవటం ద్వారా విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలు మెరుగుపడుతాయన్నారు. అనంతరం డీఈఓ సిద్ధార్ధరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఇంగ్లిష్ భాషలో నైపుణ్యాల అభివృద్ధికి దిశ ఫౌండేషన్, ఈఎల్ఎఫ్ లెర్న్ టు రీడ్ ఇంగ్లిష్ ఇన్ 90 రోజుల కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయడంలో స్మార్ట్ టీవీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. ఎనిమిదేళ్లలో 8 పాఠశాలలకు అదానీ గ్రూప్ స్మార్ట్ టీవీలను అందించిందని వెల్లడించారు. వాటిని ఉపాధ్యాయులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ అర్షం రాజు, పాఠశాల హెచ్ఎం లక్కి సమ్మయ్య, అదానీ గ్రూప్ ప్రతినిధులు ప్రశాంత్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సంపత్రావు -
కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఈ నెల 31న అధికారికంగా ముగిసినా భక్తుల తాకిడి మాత్రం తగ్గడం లేదు. సమ్మక్క రోజు గురువారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి పుట్టు వెంట్రుకలు సమర్పించుకున్నారు. అనంతరం గద్దెల వద్ద పసుపు, కుంకుమ, కానుకలు, ఎత్తు బంగారం, ఒడి బియ్యం, చీర సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే సమ్మక్క గద్దె వద్ద కోడె ధ్వజస్తంభానికి పలువురు భక్తులు కోడెను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. వేలాది మంది భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలిరావడంతో జంపన్నవాగు నుంచి గద్దెల వరకు వాహనాలు బారులుదీరాయి. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. కన్నెపల్లి ఆలయంలో సమ్మక్కకు మొక్కులు కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో తిరుగువారం పండగ సందర్భంగా రెండోరోజు సమ్మక్కకు సారలమ్మ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోసారి గుడిని శుద్ధి చేసి పసుపు, కుంకుమలతో అలంకరించారు. గుడి ఆవరణలో కూడా అందంగా ముగ్గులు వేశారు. సారలమ్మ పూజారులు సమ్మక్కకు నైవేద్యంగా యాటను సమర్పించి మొక్కును చెల్లించారు. పూజారులతో పాటు గ్రామస్తులు సారలమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించి యాటలు, కోళ్లను సమర్పించారు. ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు భారీగా వచ్చి సారలమ్మ గుడికి చేరుకొని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేలాదిగా తరలివచ్చి మొక్కుల చెల్లింపు కన్నెపల్లిలో రెండోరోజు సమ్మక్కకు మొక్కు -
బాలకుమారస్వామికి మంత్రి సీతక్క పూజలు
ములుగు రూరల్: మండల పరిధిలోని అంకన్నగూడెం బాలకుమారస్వామి జాతరలో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొని మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. అనంతరం ఆమె ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమ్మక్క సోదరుడిగా బాలకుమార స్వామిని కొలుస్తారని తెలిపారు. సమ్మక్కకు యుద్ధ సమయంలో అండగా బాలగోముడుగా నిలిచాడని వివరించారు. ఆయనను గండ్ర గొడ్డలి రూపంలో కొలుస్తారని వెల్లడించారు. అనంతరం ఆలయ మరమ్మతులకు ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ. 5 లక్షల కేటాయించి పనులను ప్రారంభించారు. -
దారి ఇలా.. వెళ్లేదెలా?
ఏటూరునాగారం: ప్రభుత్వాలు మారిన.. పాలకులు మారిన.. ఏళ్లు గడుస్తున్నా ఏజెన్సీలోని పలు గ్రామాలకు శాశ్వత రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా శాశ్వత రోడ్లు లేకపోవడం బాధాకరం. అడవి పోతుందనే అటవీశాఖ అధికారుల అడ్డంకులతో కీకారణ్యంలో ఉన్న పలు గ్రామాలకు నేటికీ రోడ్డు వేసే అదృష్టం కనబడుటలేదు. జిల్లాలోని కన్నాయిగూడెం మండలంలోని పలు గ్రామాలతో పాటు ఐలాపూర్ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక 39 ఏళ్లుగా గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఏటూరునాగారంలో పంచాయతీలో ఉన్న గ్రామం 1986లో అప్పటి దివంగత నందమూరి తారకరామారావు ఐలాపూర్లో గిరిజన సంక్షేమ పాఠశాల భవనాన్ని రూ.4.3 లక్షలతో మంజూరు చేశారు. అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశాలు ఇచ్చారు. ఇక అంతే ఆ గ్రామంలో కేవలం గిరిజనులు ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు. కాని ఇప్పటి వరకు విద్యుత్, తాగునీరు, విద్య, వైద్యం అరకొరగా అందుతున్న పరిస్థితి ఉంది. ఈ మౌలిక వసతులు అందాలంటే ముఖ్యంగా రవాణా మార్గం ఎంతో కీలకమైంది. అలాంటి రోడ్డు మార్గం నేటికీ లేకపోవడం దారుణం. వర్షాకాలం వచ్చిందంటే రోడ్డంతా బురదమయంగా మారుతున్న పరిస్థితి. రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు అసంపూర్తిగా బ్రిడ్జి నిర్మాణ పనులు అటవీశాఖ అడ్డంకులతో ఏజెన్సీవాసులకు తప్పని తిప్పలు -
అవగాహనతోనే ఆరోగ్య రక్షణ
భూపాలపల్లి అర్బన్: ప్రతీఒక్కరు ఆరోగ్య రక్షణపై అవగాహన కలిగి ఉండాలని, కేన్సర్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజ్ సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ కేన్సర్ దినోత్సవాన్ని మున్సిపల్ పరిధిలోని జంగేడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రోజూ తగినంత నీరు సేవించడం, వ్యాయామం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవని తెలిపారు. -
వేడెక్కిన ఓరుగల్లు
మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా ‘మున్సిపల్’ పోరుసాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగియగా.. 260 వార్డులకు 1,073 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తులతో సాగుతుండగా, బీఆర్ఎస్, బీజేపీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ప్రచారానికి మరో ఐదు రోజులే సమయం ఉండడంతో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. రెబల్స్పై బుజ్జగింపుల అస్త్రం మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ఇంకా ఆరు రోజులే ఉండడంతో రెబల్స్ను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తులతో పోటీ చేస్తుండగా.. 40 చోట్ల రెబల్స్ బెడద ఉంది. ఒంటరి పోరు చేస్తున్న బీఆర్ఎస్కు సైతం రెబల్స్ సెగ తాకుతోంది. నర్సంపేట, వర్ధన్నపేటలో ఎనిమిది చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది, బీఆర్ఎస్ నుంచి 06 ఆరుగురు రెబల్ అభ్యర్థులుగా పోటీలో ఉండగా, వారితో పార్టీ నేతలు మంతనాలు చేస్తున్నారు. డోర్నకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, మరిపెడలో కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు, కేసముద్రంలో కాంగ్రెస్ నుంచి ఒక్కరు, బీఆర్ఎస్లో ఇద్దరు చొప్పున రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరందరితో ఆ పార్టీల నేతలు చేస్తున్న ప్రయత్నాలు నేడో రేపో కొలిక్కి రావచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 12 మున్సిపాలిటీల్లో మొత్తం 260 వార్డులకుగాను ఒకచోట బీజేపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికాగా 26 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో లేరు. అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతల ప్రచారం ఈనెల 8న భూపాలపల్లికి సీఎం రేవంత్రెడ్డి.. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు కేంద్ర మంత్రులు వస్తారంటున్న బీజేపీ నేతలుజిల్లా మున్సిపాలిటీ వార్డులు బరిలో ఉన్న అభ్యర్థులు భూపాలపల్లి భూపాలపల్లి 30 107 ములుగు ములుగు 20 83 హనుమకొండ పరకాల 22 101 వరంగల్ నర్సంపేట 30 120 వర్ధన్నపేట 12 50 జనగామ జనగామ 30 127 స్టేషన్ఘన్పూర్ 18 82 మహబూబాబాద్ మహబూబాబాద్ 36 155 డోర్నకల్ 15 64 కేసముద్రం 16 58 మరిపెడ 15 63 తొర్రూరు 16 63 -
జోరందుకున్న ‘పుర’పోరు..
అన్ని మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఏఐఎఫ్బీ తదితర పార్టీలు, స్వతంత్రులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇదే సమయంలో ‘పుర’ పీఠాలు లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు.. ఆ పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్లుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (వరంగల్), పొన్నం ప్రభాకర్ (మహబూబాబాద్)లను నియమించింది. వారు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలను కలుపుకుని సమన్వయం చేస్తున్నారు. ఏఐసీసీ పరిశీలకుడు పి.విశ్వనాథన్ ఉమ్మడి జిల్లాలో బుధవారం పర్యటించగా.. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి జేఎస్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఏర్పాటు చేసే సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 12 మున్సిపాలిటీలకు ఇన్చార్జ్లను నియమించారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, అరూరి రమేశ్ తదితరులు అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ నుంచి అభ్యర్థుల గెలుపు కోసం కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ జిల్లా అధ్యక్షులను సమన్వయం చేస్తున్నారని, త్వరలోనే వారి పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ఎదురుచూపులు
ములుగు రూరల్: యాసంగి పంటల సాగు మొదలై నెలరోజులు కావస్తున్నా రైతు భరోసా డబ్బులు ఖా తాలలో జమ కాకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ప్రభుత్వం విడుదల చేస్తుందో తెలియక పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అప్పులు చేసి పంటలు సాగుచేస్తున్న దుస్థితి నెలకొంది. రైతు భరోసాపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో సాగు భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలనే ఉద్దేశంతో శాటిలైట్ సర్వే అనంతరం డబ్బులు విడుదల చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లాలో 1,73,970 ఎకరాల్లో సాగు జిల్లాలోని పది మండలాల పరిధిలో మొత్తం 1,73,970 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా 86,763 మంది రైతులు ఉన్నారు. జిల్లాలో అధిక మొత్తంలో వరి సాగు చేయడంతో పాటు పత్తి, మిర్చి, మొక్కజొన్న, అపరాల వంటి పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 1.15 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. 2024 యాసంగి సీజన్లో ప్రభుత్వం 68,687 మంది రైతులకు రైతు భరోసా రూ.64.64 కోట్లను అందించింది. 2025 వానాకాలం సీజన్లో 79,481 మంది రైతులకు రూ.99.10 కోట్లను అందించింది. ప్రస్తుతం యాసంగి పంటలసాగు పనులు చివరి దశకు చేరుకున్నా రైతుభరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో ఇంకా జమకాకపోవడంతో ఎప్పుడు పడుతాయోనని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ స్పందన కరువు యాసంగి సాగు రైతుభరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. యాసంగి సాగు పెట్టుబడి సాయం ప్రభుత్వం పంటల సాగు సమయంలో విడుదల చేయకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. వ్యవసాయశాఖ మంత్రి శా టిలైట్ ఆధారంగా సాగు భూములకు అందిస్తామని తెలిపారే తప్పా ఎప్పటి వరకు భరోసా నిధులు విడుదల చేస్తారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదని పలువురు రైతులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో రైతులు యాసంగి సాగు భరోసా డబ్బులు అందుతాయా లేదా అనే సందిగ్ధంలో ఉండిపోయారు. యాసంగి పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు సాగుభూములకే పెట్టుబడి సాయం అంటూ ప్రచారం -
‘ఫార్మసీ కోర్సులు ప్రారంభించాలి’
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని సమ్మక్క–సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీలో ఫార్మసీ డిపార్టుమెంట్ విభాగంలోని కోర్సులను నెలకొల్పి తక్షణమే ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైబల్ యూనివర్శిటీలో త్వరలో ప్రారంభించపోయే ఇంజనీరింగ్ కోర్సులు ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈలతో పాటు బ్యాచ్లర్ ఆఫ్ ఫార్మసీ కోర్సులు కూడా ప్రారంభించాలన్నారు. గ్రాడ్యుయేషన్ కోర్సులలో ఎంఏ లిబరల్ స్టడీస్, ఎంఏ డెవలప్మెంట్స్ స్టడీస్లతో పాటు మాస్టర్ ఆఫ్ ఎం ఫార్మసీలలో అన్ని స్పెషలైజేషన్ కోర్సులు తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. జాతరపై తప్పుడు ప్రచారం చేయొద్దు ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరపై తప్పుడు ప్రచారం చేయొద్దని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అన్నారు. మేడారంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను ప్రభుత్వం 90 రోజుల్లో పూర్తి చేయడం హర్షించదగిన విషయమన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుపొంది, కోట్లాది మంది భక్తులు హాజరైన మహాజాతరలో చిన్న చిన్న లోటుపాట్లు తలెత్తుతాయని వాటిని కొంత మంది బీఆర్ఎస్ నాయకులు కావాలనే విమర్శలు చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో చాలా సమస్యలు తలెత్తాయని, అయినా పూజారులుగా తాము సర్ధుకుపోయామే తప్పా రాజకీయం చేయలేదన్నారు. పార్టీల పరంగా ఏమైనా ఉంటే బయట రాజకీయం చేసుకోవాలే తప్పా వనదేవతల పేరుతో రాజకీయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పూజారులు కొక్కెర రమేష్, చందా రఘుపతిరావు, తదితరులు పాల్గొన్నారు. భక్తులను అవమాన పరిచారని ఫిర్యాదుకాళేశ్వరం: కాళేశ్వరానికి వచ్చే భక్తులకు ఎలాంటి అవమానం జరగొద్దని ఈఓకు హైదరాబాద్కు చెందిన ఓ భక్తులు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. బుధవారం మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని వీఐపీ ఘాటులో హైదరాబాద్కు చెందిన సందీప్ తన తండ్రి అస్తికలు కలిపేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. బుధవారం అస్తికలు గోదావరిలో కలిపి తీరంపైకి రాగానే అక్కడే ఉన్న ఓ కాంట్రాక్టర్ ఎక్కడపడితే అక్కడ కార్లు పార్కింగ్ చేస్తారా.. అంటూ తమను బూతులు తిడుతూ అవమాన పరిచారని ఫిర్యాదు చేసినట్లు సందీప్ తెలిపారు. ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎక్కడ చేయకూడదని దేవాదాయశాఖ సూచిక బోర్డులు అమర్చలేదన్నారు. భవిష్యత్లో ఇలాంటి అవమానం ఎవరికీ జరగకుండా దేవాదాయశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాక్టికల్ పరీక్ష కేంద్రం తనిఖీ మల్హర్: మండలంలోని తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వృత్తివిద్య ప్రయోగ (ప్రాక్టికల్) పరీక్ష కేంద్రాన్ని బుధవారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జి.వెంకన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న విధానాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ గ్యారంటీలపై ఓటర్లు నిలదీయాలి
ములుగు రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ఓటర్లు నిలదీయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ములుగు మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జ్ సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకీపడిన పథకాల వివరాలతో కూడిన బాకీ కార్డులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు బాకీ కార్డులను ప్రజలకు అందించి వివరించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యంకాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు, నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి, ములుగు, మల్లంపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు సానికొమ్ము రమేష్రెడ్డి, పాలెపు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, గోవింద్నాయక్, ప్రదీప్రావు, వేములపల్లి భిక్షపతి, కాకి పురుషోత్తం, అమర్సింగ్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ -
డిగ్రీ కళాశాలలో జాతీయస్థాయి సెమినార్
ములుగు రూరల్: ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 6, 7వ తేదీలలో జాతీయస్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశ్ తెలిపారు. కళాశాలలో ‘ఎం పవరింగ్ రీసెర్చ్ ఎక్సెలెన్స్ ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ టూర్ ఫర్ అకాడమి రైటింగ్ అండ్ పబ్లిషింగ్’ అనే అంశంపై నిర్వహించనున్న సెమినార్ బ్రోచర్లను అదనపు కలెక్టర్ మహేందర్జీ, సంపత్రావులు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిగ్రీ కళాశాలలో జాతీయస్థాయి సెమినార్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ మల్లేశం మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సెమినార్కు దేశవ్యాప్తంగా వందమంది పరిశోధకులు, విద్యావేత్తలు, అధ్యాపకులు తరలివచ్చి తమ పరిశోధన పత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బాలయ్య, కవిత, భాస్కర్, సరిత, శిరీష, రాధిక, అనిల్ కుమార్, ఉదయశ్రీ, విజేత, శంకర్, సోమన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
అప్పుచేసి పెట్టుబడి పెట్టాను..
ప్రభుత్వం రైతుభరోసా నిధులను సకాలంలో విడుదల చేయాలి. యాసంగి సీజన్ ప్రారంభమై నెలరోజులు గడిచినా పెట్టుబడి సాయం అందలేదు. దీంతో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి అప్పులు చేసి పెట్టుబడి పెట్టాను. పంటల కాలం ప్రారంభానికి ముందే రైతు భరోసా నిధులు విడుదల చేస్తే రైతుకు ఆసరాగా ఉంటుంది. – ఇమ్మడి భిక్షపతి, రైతు, ములుగు ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం తక్షణమే అందించి ఆదుకోవాలి. ఈ ఏడాది వానాకాలం సీజన్లో పంటలు సాగు చేస్తే దిగుబడి తగ్గి పెట్టుబడి కూడా రాలేదు. యాసంగి సాగు చేసేందుకు పెట్టుబడి లేక ఎదురుచూడాల్సి వస్తుంది. ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో వెంటనే జమ చేయాలి. – కొనుపుల కృష్ణ, రైతు, ములుగు -
విమర్శలకు ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలి
మంగపేట: మంత్రి సీతక్కపై మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ విమర్శలు చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధిహామీ మండలి(టీఎస్ఈజీసీ) డైరెక్టర్ గుమ్మడి సోమయ్య హితువు పలికారు. మండల పరిధిలోని కమలాపురంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం మాజీ మంత్రి చేసిన వ్యాక్యలు సరికాదన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మంత్రిగా పనిచేసిన సత్యవతిరాథోడ్ ములుగులో ఏమి అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో జిల్లా అభివృద్ధి జరిగిందా లేదా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలో అభివృద్ధి ఎంతమేరకు జరిగిందనేది జిల్లా ప్రజలకు తెలుసని వివరించారు. జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి సీతక్క సీఎం సహకారంతో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. మేడారం మహాజాతరకు ప్రభుత్వం రూ.210 కోట్లు కేటాయించడంతో పాటు నెలరోజుల్లోనే అభివృద్ధి పనులు పూర్తిచేసి జాతరను విజయవంతం చేస్తే జీర్ణించుకోలేక ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సీతక్క ఆధ్వర్యంలో మహాజాతర సకె్స్స్ కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి వచ్చే మెప్పును చూసి జీర్ణించుకోలేక సోషల్ మీడియా, పెయిడ్ ఆర్టిస్టులతో బురద జల్లడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.టీఎస్ఈజీసీ సభ్యుడు సోమయ్య -
కలెక్టర్ను కలిసిన గెజిటెడ్ ఆఫీసర్లు
ములుగు: మేడారం మహాజాతర విజయవంతానికి అహర్నిశలు శ్రమించిన కలెక్టర్ టీఎస్.దివాకరను మంగళవారం కలెక్టరేట్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అసోసియేషన్ డైరీని కలెక్టర్కు అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంపత్ రావు, సెక్రటరీ జీవన్ కుమార్, ట్రెజరర్ ప్రకాశ్ రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ కొమురయ్య, సంఘం నాయకులు రాజు, శ్రీనివాస్, లక్ష్మణ్ నాయక్, యశ్వంత్, విజయభాస్కర్, శైలజ, దుర్గారావు, శంకర్, రాజేశ్వరరావు, రాజు, బాలయ్య, సారంగపాణి పాల్గొన్నారు. గణపురం: మండలకేంద్రంలోని కోటగుళ్లలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య పూజలో భాగంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు నాగరాజు తీర్థ ప్రసాదాలు అందించారు. రేపు ఢిల్లీలో ధర్నా భూపాలపల్లి అర్బన్: టెట్ రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం ధర్నా వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుభాకర్రెడ్డి మాట్లాడుతూ.. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలన్నారు. విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(2)ను ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలిరావాలి ఢిల్లీలో జరిగే ధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, తిరుపతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొఆన్నరు. టెట్ను రద్దు చేసే వరకు పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కౌలు రైతు ఆత్మహత్య ఏటూరునాగారం: అప్పుల బాధతో ఓ కౌలురైతు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని 3వ వార్డులో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై రాజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బట్టు నర్సయ్య(65) 7 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ఏడేళ్లుగా సాగుచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆశించిన రీతిలో దిగుబడి రాక రూ.3లక్షల మేరకు అప్పులయ్యాయి. చేసిన అప్పులు ఎలా తీర్చాలనే మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం ఇంటికొచ్చిన కుటుంబ సభ్యులు గమనించి సామాజిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యకోసం వరంగల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. జీవన శైలిలో మార్పుతోనే క్యాన్సర్ఎంజీఎం: జీవనశైలిలో మార్పుతోనే క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అప్పయ్య తెలిపారు. అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వడ్డేపల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీఎంహెచ్ఓ మాట్లాడారు. త్వరలో ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతుందని పేర్కొన్నారు. -
మహా జాతరనూ వదల్లేదు!
సాక్షిప్రతినిధి, వరంగల్: మేడారం మహాజాతరను కూడా దొంగల ముఠాలు వదల్లేదు. ప్రధానంగా జంపన్న వాగు, గద్దెల పరిసరాల్లో భక్తుల మొబైల్ ఫోన్లు, బంగారు గొలుసులు, నగదును దొంగిలించిన ఘటనల్లో కీలక వ్యక్తుల సమాచారం లభ్యమైంది. ‘వ్యాల్యూ పిచ్’ సాఫ్ట్వేర్ ఆధారంగా ఫేస్ రికగ్నేజేషన్ సిస్టంతో ఈ దొంగతనాలకు సంబంధించి కొందరు నిందితులను, దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేసేవారిని పోలీసులు అరెస్టు చేశారు. జాతరలో ఫేస్ రికగ్నేజేషన్ ద్వారా గతంలో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలను గుర్తించినట్లు క్రైం ఇన్వెస్టిగేషన్ విభాగం ప్రకటించింది. సాంకేతిక సహకారంతో దొంగల ఆటకట్టు.. భక్తుల పర్యవేక్షణ, వారి కదలికలు, వాహనాల రాకపోకలను నిశితంగా గమనించేందుకు జాతరలో ఏఐ కెమెరాలు పెట్టారు. ఆటోమెటిక్ నంబర్ పేస్ రికగ్నేషన్ కెమెరాలను (ఏఎన్పీఆర్) 10 చోట్ల అమర్చారు. దొంగతనాలకు పాల్పడే పాతనేరస్తులను గుర్తించేందుకు ఆటోమెటిక్ ఫేస్ రికగ్నేషన్ కోసం ప్రత్యేక సీసీ కెమెరాలను రద్దీ ప్రాంతాల్లో పెట్టారు. గతంలో చోరీలు చేసిన ఇతర రాష్ట్రాల దొంగల ఫొటోలు కంప్యూటర్లో ఫీడ్ చేశారు. వ్యాల్యూ పిచ్ అనే సాఫ్ట్వేర్తో అనుసంధానం చేయగా కంప్యూటర్లో ఫీడ్ చేసిన ఫొటోల్లోని వ్యక్తులు ఎవరొచ్చినా పోలీసులకు అలర్ట్ ఇస్తుంది. ఇదంతా గద్దెల పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ రూంలో అమర్చిన పెద్ద ఎల్సీడీ స్క్రీన్లను 24/7 నిరంతర పర్యవేక్షణ చేసేలా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల జాతరకు పాత దొంగలు వచ్చినట్లు 70 అలర్ట్లు వచ్చాయి. డ్రోన్, సీసీ కెమెరాలు ఆ దొంగలను గుర్తించాయి. కమాండ్ కంట్రోల్ రూంకు వారి ముఖాలను పంపడంతో అప్రమత్తమైన పోలీసులు.. మహారాష్ట్ర, ఏపీలోని నంద్యాల గ్యాంగ్లకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ట్రేస్ చేసిన వ్యాల్యూ పిచ్ సాఫ్ట్వేర్ ‘ఫేస్ రికగ్నేజేషన్ సిస్టం’తో దొరికిన ఆచూకీ 70 మంది గుర్తింపు, ఐదుగురి అరెస్టు.. విచారణ -
కేయూలో పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు షురూ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 23 కేంద్రాల్లో (నాన్ ప్రొఫెషన్నల్) ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి. క్యాంపస్లోని పలు కేంద్రాలను పరీక్షల విభాగం అధికారులు సందర్శించారు. పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పి.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ కె.మమత పరిశీలించారు. పలు పరీక్షలు వాయిదామున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 7, 10వ తేదీల్లో నిర్వహించనున్న బీటెక్ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలను వాయిదావేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ మంగళవారం తెలిపారు. ఈపరీక్షలను ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తామని, 10న నిర్వహించాల్సిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు, 11న నిర్వహించాల్సిన ఎంబీఏ పరీక్షలను 19వ తేదీకి వాయిదా వేశామని ఆయన పేర్కొన్నారు. ఈమార్పును కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు గమనించాలని కోరారు. ఖిలా వరంగల్: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటను మంగళవారం ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అధికారి అఖిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నల్ల రాతిలో శిల్పులు చెక్కిన శిల్పకళాసంపదను తిలకించారు. అనంతరం ఖుష్మహల్, శృంగారపు బావి, ఏకశిలగుట్ట, రాతిమట్టికోట అందాలను వీక్షించారు. కోట గైడ్ రవియాదవ్ కాకతీయుల శిల్పకళ గురించి వివరించగా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. కార్యక్రమంలో కేంద్రపురావస్తుశాఖ సిబ్బంది, టీజీటీఎస్టీడీసీ ఆజయ్ తదితరులు ఉన్నారు. -
యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి
● లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్ వెంకటాపురం(ఎం): యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, పొగాకు, గుట్కా, సిగరెట్లు, గంజాయి తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్డేను పురస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడారు. క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే వ్యాధి నుంచి బయట పడవచ్చని తెలిపారు. ఆరోగ్య వంతమైన ఆహారపు అలవాట్లు, ప్రతిరోజూ వ్యాయాయం చేసి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, మెడికల్ ఆఫీసర్ రిషిత, సంఘమిత్ర, ఏఎన్ఎంలు శోభ, విజయ తదితరులు పాల్గొన్నారు. -
‘రామప్ప శిల్పాలు మరుపురానివి’
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలోని శిల్పకళ సంపద మరుపురానిదని స్విట్జర్లాండ్ దేశస్తులు కొనియాడారు. చారిత్రక రామప్ప దేవాలయాన్ని స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రైస్ బాస్టియన్, కిస్టినా జాక్వెస్లు మంగళవారం సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. అదేవిధంగా ఇండియాన్ ఆడిట్ ఆకౌంట్ సర్వీస్ అధికారి అఖిల్ రామప్పను సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకోగా గైడ్ వెంకటేశ్ ఆలయ విశిష్టతను వివరించారు. -
ప్రచార ఆర్భాటం తప్ప సౌకర్యాలేవి
ములుగు: మేడారం మహాజాతరపై ప్రచారం ఆర్భాటం తప్ప భక్తులకు కల్పించిన సౌకర్యాలు ఏమి లేవని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మేడారం జాతరకు 2014లో రూ.150 కోట్లు, 2016లో రూ.125 కోట్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించి భక్తులకు సౌకర్యాలు కల్పించారని గుర్తు చేశారు. ప్రస్తుతం మేడారం జాతరలో అభివృద్ధి పనుల పేరిట నిధులు ఖర్చు చేశామని చెబుతున్న మంత్రులు వాటాల కోసం కుమ్ములాటలు పెట్టుకుంట్టున్నారని ఎద్దేవా చేశారు. సమ్మక్క సారలమ్మ దేవతల గద్దెల ప్రాంగణం సహజతత్వం కోల్పోయేలా చేశారని విమర్శించారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పించకుండా మేడారం జాతరలో కేవలం ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయడానికే పరిమితమయ్యారని ఆరోపించారు. ట్రాఫిక్లో చిక్కుకుని ఇబ్బందులకు గురైన భక్తులు ప్రభుత్వానికి పెట్టిన శాపనార్థాలు తప్పకుండా తగులుతాయన్నారు. ములుగు నియోజకవర్గాన్ని రూ.100 కోట్లతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధిచెప్పి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు, నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి, నాయకులు గోవింద్నాయక్, రమేష్రెడ్డి, చంద్రమౌళి, మోహన్, భిక్షపతి, విజయ్, సురేశ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రూ.100 కోట్లతో ములుగును అభివృద్ధి చేశాం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ -
పుణ్యస్నానాలు.. మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు మంగళవారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహాజాతర అధికారికంగా ముగిసి మూడు రోజులు గడిచినా మేడారానికి భక్తులు వస్తూనే ఉన్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద పూజలు చేశారు. ఈ క్రమంలో గద్దెల వద్ద పేరుకుపోయిన కొబ్బరి, బెల్లం మిశ్రమాన్ని దేవాదాయశాఖ సిబ్బంది తొలగిస్తున్నారు. -
ట్రాఫిక్ సమస్యల నివారణకు కమిటీ
ములుగు: రాబోయే మేడారం జాతరకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, పూర్తిగా నివారించేందుకు ప్రత్యేక కమిటీని వేయనున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడారం మహాజాతర విజయవంతానికి హోంగార్డు నుంచి ఎస్పీ స్థాయి వరకు 40 రోజుల పాటు అహర్నిశలు శ్రమించామని వెల్లడించారు. జాతరకు వచ్చిన కోటిన్నర మంది భక్తులను క్షేమంగా ఇంటికి చేర్చామని తెలిపారు. సమ్మక్క సారలమ్మ దేవతలను గద్దెలకు తీసుకరావడం నుంచి వనప్రవేశం వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని వివరించారు. ప్రస్తుత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే జాతరకు పూజారులకు, మీడియా ప్రతినిధులకు, స్థానిక మేడారం యువతకు, అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. మేడారంలో సమ్మక్క– సారలమ్మ వనదేవతలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో ఫైరింగ్ చేసి అమ్మవార్లకు స్వాగతం పలకడం మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగిందని వెల్లడించారు. ఈ సమావేశంలో ములుగు ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్, సీఐలు సురేశ్, దయాకర్, ఎస్సైలు పాల్గొన్నారు. మహాజాతరలో 40 రోజులపాటు శ్రమించాం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
శరణ్(తెల్లపులి) ఇక లేదు
జూ పార్క్లో గుండెపోటుతో మృతి న్యూశాయంపేట: వరంగల్ నగరంలోని కాకతీయ జులాజికల్ పార్క్ సందర్శకులకు కనువిందు చేసిన తెల్లపులి (శరణ్, 14 సంవత్సరాలు) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందింది. మగ తెల్లపులిని హైదరాబాద్ నుంచి గతేడాది జూలైలో తీసుకొచ్చి రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేతులమీదుగా ఎన్క్లోజర్ను ప్రారంభించి సందర్శకులు వీక్షించేందుకు వదిలారు. కొద్ది రోజులుగా జూ పార్క్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా తెల్లపులి సగటు వయస్సు 15ఏళ్లు ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. సుమారు 14 ఏళ్లు ఉన్న తెల్లపులి వృద్దాప్యం వల్ల బీపీ, గుండె సంబంధిత, మూత్రపిండ సమస్యలతో రెండు నెలలుగా బాధపడుతుందని తెలిపారు. పులికి వైద్య సిబ్బంది నిరంతరం చికిత్స అందించినప్పటికి మంగళవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చనిపోయిందిని జూ పార్క్ ఇన్చార్జ్ ఎఫ్ఆర్ఓ మయూరి తెలిపారు. కాగా ఛీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ ఆదేశాల మేరకు సీనియర్ వెటర్నరీ వైద్యులు, మామునూరువెటర్నరీ కళాశాల వైద్యబృందం తెల్లపులికి పోస్టుమార్టం నిర్వహించి జూ పార్క్లోనే ఖననం చేసినట్లు చెప్పారు. -
లెక్క తేలింది..!
ములుగు: ములుగు మున్సిపాలిటీ ఎన్నికల పోరులో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు 159 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం 76 మంది తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి 20 వార్డులకు ప్రతీ పార్టీ నుంచి 20 మంది చొప్పున మొత్తంగా 60 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదే విధంగా 21 మంది స్వతంత్రులు, ఇద్దరు సీపీఎం నుంచి మున్సిపాలిటీ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల్లో రెబల్స్ లేకుండా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల ముఖ్య నేతలు తమ పార్టీ నుంచి రెబెల్ అభ్యర్థులు లేకుండా చూశారు. నామినేషన్లు వేసిన వారిని బుజ్జగించి విత్డ్రా చేయించారు. 1వ వార్డులో మూడు పార్టీల నుంచి 3 అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే 2వ వార్డులో 4, 3వ వార్డులో 4, 4వ వార్డులో 3, 5వ వార్డులో 4, 6వ వార్డులో 3, 7వ వార్డులో 4, 8వ వార్డులో 4, 9వ వార్డులో 7, 10వ వార్డులో 4, 11వ వార్డులో 4, 12వ వార్డులో 4, 13వ వార్డులో 9, 14వ వార్డులో 4, 15వ వార్డులో 4, 16వ వార్డులో 6, 17వ వార్డులో 3, 18వ వార్డులో 3, 19వ వార్డులో 3, 20 వార్డులో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ములుగు మున్సిపల్ ఎన్నికల బరిలో 83మంది అభ్యర్థులునేటి నుంచి ముమ్మర ప్రచారం మున్సిపల్ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయించడంతో నేటి నుంచి అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. తమ అనుచరులతో తమకు కేటాయించిన గుర్తులతో వాడవాడ తిరగనున్నారు. 159 నామినేషన్లకు 76 ఉపసంహరణ పోటీలో ఉన్న వారికి గుర్తుల కేటాయింపు -
నేడు తిరుగువారం పండుగ
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క– సారలమ్మకు బుధవారం పూజారులు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుగువారం పండుగలో భాగంగా మేడారం, కన్నెపల్లి అమ్మవార్ల ఆలయాలను పూజారులు శుద్ధి చేసి దూప దీపాలు వెలిగించి యాటను నైవేధ్యంగా సమర్పిస్తారు. అనంతరం పూజారుల కుటుంబీకులు, స్థానిక ఆదివాసీలు, గిరిజనేతరులు అమ్మవార్ల ఆలయాలకు చేరుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం పూజారులు అమ్మవార్ల పూజాసామగ్రి, వస్త్రాలను తిరిగి ఆలయాల్లో భద్రపర్చనున్నారు. తిరుగువారం పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాల తంతు ముగియనుంది. తిరుగువారం పండుగ సందర్భంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకోనున్నారు. -
‘పది’లో వందశాతం ఫలితాలు సాధించాలి
ములుగు: పదోతరగతి విద్యార్థులు ప్రణాళికతో చదివి వందశాతం ఫలితాలు సాధించేలా డీఎన్ఆర్ ట్రస్టు కృషి చేస్తుందని డీఈఓ సిద్ధార్థరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, వెంకటాపురం(ఎం) జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు టెన్త్ స్టడీ మెటిరీయల్ను ట్రస్టు అధినేత దొడ్డ ప్రతాప్రెడ్డి అందజేయగా డీఈఓ విద్యార్థులకు సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ సూర్యనారాయణ, పరీక్షల నియంత్రణ అధికారి వినోద్కుమార్, కో ఆర్డినేటర్లు రాజు, శ్యాంసుందర్, సాంబయ్య, శ్రీనివాస్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు రాధిక, భాగ్యలక్ష్మి, సురేష్, రమేష్, పుష్ప, డాక్టర్ కందాల రామయ్య, జనగాం బాబురావు, విక్రమ్, నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఏటూరునాగారం: ములుగులో నిర్వహించిన జిల్లా స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్లో ఏటూరునాగారం జెడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థిని కె.కృష్ణ జిల్లా ప్రఽఽథమ స్థానంలో నిలిచిందని హెచ్ఎం సాంబశివరావు తెలిపారు. ఇప్పటి వరకు ఆమె మూడు పర్యాయాలు జిల్లాస్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ములుగు: హనుమకొండలోని నిత్య బంకెట్హాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన లయన్స్ ఇంటర్నేషనల్ 320 ఎఫ్ రెండో రీజనల్ ప్రాంతీయ మహాసభలో ములుగు లయన్స్ క్లబ్కు 12 ఆవార్డులు వచ్చినట్లు క్లబ్ అధ్యక్షుడు దొంతి రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లయన్స్క్లబ్ చేసిన సేవలకు గాను ఫస్ట్– బెస్ట్ మెంబర్షిప్ గ్రోత్, బెస్ట్ క్యాలెండర్ ఈవెంట్స్, బెస్ట్ చైల్డ్ వూడ్ క్యాన్సల్, బెస్ట్ అవేర్నెస్, బెస్ట్ నీడ్ బేసిక్ ఆక్టివిటీ, బెస్ట్ ఎన్విరాన్మెంట్, ఫస్ట్ బెస్ట్ స్క్రబ్ బుక్, బెస్ట్ ఫొటో ఎగ్జిబిషన్, ఫస్ట్ రీచ్డ్ 9 అవార్డులతో పాటు, బెస్ట్ లయన్స్క్లబ్ అధ్యక్షుడుగా శ్రీనివాస్రెడ్డి, బెస్ట్ కార్యదర్శిగా చుంచు రమేష్, బెస్ట్ కోశాధికారిగా ఆడెపు రమేష్లు ఆవార్డులు అందుకున్నారు. మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికపండ్ల నరహరి, రీజినల్ ఛైర్ పర్సన్ పద్మజాదేవి చేతుల మీదుగా ఆవార్డులు తీసుకున్నట్లు వెల్లడించారు.మంగపేట: మంగపేట రేంజ్ పరిధిలోని మల్లూరు సెక్షన్లో రిజర్వు ఫారెస్టులో పోడుభూమి కోసం చెట్లను తొలిగిస్తున్న జేసీబీని సోమవారం సీజ్ చేసినట్లు మంగపేట రేంజ్ అధికారి అశోక్ తెలిపారు. రేంజ్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మల్లూరుకు చెందిన వర్స రాము ఆర్ఓఎఫ్ఆర్ భూమిలో ఉన్న చెట్లను తొలిగిస్తుండగా బీటాఫీసర్ రషీద్ బేస్క్యాంప్ సిబ్బంది జేసీబీని పట్టుకున్నారు. ఆర్ఓ ఎఫ్ఆర్ భూమి విస్తరణకు యంత్రాలతో చెట్లను తొలిగిస్తుండగా పట్టుబడిన జేసీబీని రేంజ్ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసి సీజ్ చేసినట్లు తెలిపారు. టీఎస్ఎస్టీఎఫ్ జిల్లా ములుగు: తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం (టీఎస్ఎస్టీఎఫ్) జిల్లా అధ్యక్షుడిగా బొంతల కమలాకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ములుగు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాయం వీర నారాయణ, సెక్రటరీగా మందపెల్లి కృష్ణ, గౌరవ అధ్యక్షుడిగా యాకూబ్రెడ్డి, మహిళ అధ్యక్షురాలిగా ప్రమీల, సలహాదారులుగా నాగేశ్వర్రావు, దేవ్సింగ్ తదితరులను ఎన్నుకున్నారు. -
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
దోమల మందు పిచికారీ పనులను పరిశీలిస్తున్న డీపీఓ వెంకయ్య, అధికారులుఎస్ఎస్ తాడ్వాయి: మేడారంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మహాజాతర అనంతరం భక్తుల రద్దీ కాస్త తగ్గడంతో భక్తులు విడిది చేసిన ప్రాంతాల్లోని చెత్తాచెదారాన్ని, ప్లాస్టిక్, ఇతర వస్తువులను సేకరించి ట్రాక్టర్లలో డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. పలు సెక్టార్ల పరిధిలోని మేడారం, నార్లాపూర్, చింతల్ క్రాస్, ఊరట్టం, ఆర్టీసీ బస్టాండ్, చిలుకలగుట్ట, కన్నెపల్లి, కొత్తూరు ప్రాంతాల్లో వేలాది మంది కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. మంత్రి సీతక్క స్వచ్ఛమైన మేడారంగా తీర్చిదిద్ది గ్రామస్తులకు అప్పగించాలని ఆదేశించారు. దీంతో డీపీఓ వెంకయ్య పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతేకాకుండా దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా ట్రాక్టర్తో కెమికల్ స్ప్రే చేయిస్తున్నారు. డంపింగ్ యార్డుకు చెత్త తరలింపు పనులను పర్యవేక్షించిన డీపీఓ వెంకయ్య -
రూ.60 కోట్లతో పట్టణాభివృద్ధికి కృషి
ములుగు: ములుగు పట్టణాన్ని రూ.60 కోట్లతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని డీఎఆల్ఆర్ ఫంక్షన్ హాల్లో మంత్రి సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రూ.10 కోట్లతో చేపడుతున్న పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. రూ.50 కోట్లతో చేపట్టనున్న పనులకు టెండర్లు పూర్తి అయినట్లు, తొందరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. 2004లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టి ములుగు పట్టణాభివృద్ధికి పునాది వేయగా, అప్పటి ఎమ్మెల్యే పొదెం వీరయ్య ములుగు పట్టణంలో సీసీ రోడ్లు వేసి అభివృద్ధి పనులు చేపట్టారని వివరించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ములుగులో చేసిన అభివృద్ధి ఏమిలేదన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ములుగు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పట్టణంలోని ప్రతీ జంక్షన్లో ఈ ప్రాంత సంస్కృతి ప్రతిభింభించేలా అభివృద్ధి చేయడంతో పాటు రహదారులను విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. మహాజాతర ప్రతిష్ట దెబ్బతీసేలా కుట్రలు మేడారం మహాజాతర ప్రతిష్టను దెబ్బతీసేలా కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది పీఠాధిపతులు తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీ వాహనాలు భారీగా రావడంతో నాలుగు గంటల పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తి ఇబ్బంది ఏర్పడిందన్నారు. ఈ సారి మేడారం జాతరకు మాస్తో పాటు క్లాస్ భక్తులు పెద్ద ఎత్తున రావడంతో జీర్ణించుకోలేని కొంతమంది జాతరపై నెగిటివ్ ప్రచారానికి ఒడిగట్టారని వెల్లడించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు మల్లాడి రాంరెడ్డి, బానోతు రవిచందర్, గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, బైరెడ్డి భగవాన్రెడ్డి, చింతనిప్పుల భిక్షపతి, రవీందర్రెడ్డి, పల్లె జయపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ పల్లెబాటతోనే ములుగు అభివృద్ధికి పునాది రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క -
కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు సోమవారం భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. మహాజాతర ముగిసి రెండు రోజులు అవుతున్నా మేడారానికి భక్తుల తాకిడి తగ్గలేదు. వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి వచ్చిన భక్తులు జంపన్నవాగులో స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీర సారె, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారానికి 10 కిలోమీటర్ల దూరానికి వెళ్లి వంటావార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు సందడిగా గడిపారు. -
ఎవరి వ్యూహం వారిదే..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆయా పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. పట్టణాల్లో పాగా వేసేందుకు అధికార పార్టీ, విపక్ష పార్టీలు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జిల్లా.. మున్సిపాలిటీ.. అక్కడి రాజకీయ వెసులుబాటును బట్టి సీపీఐ, సీపీఎం తదితర పార్టీల మద్దతును కూడగట్టుకునేందుకు ఆ పార్టీల నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో బల్దియాలలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సోమవారం నాటికి చాలా మున్సిపాలిటీల్లో ఇంకా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. వార్డుల వారిగా బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆచీతూచీ వ్యవహరిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకే సమయం ఉండటంతో ఉదయమే ‘బి’ ఫామ్లు ఇచ్చేలా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్లాన్ చేస్తున్నాయి. అన్ని పార్టీలకు రెబల్స్ బెడద.. బుజ్జగింపుల తర్వాతే ‘బీ’ఫామ్స్... ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు అభ్యర్థులు 2,372 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలనలో 300లు తిరస్కరణకు గురికాగా 2,072 మంది బరిలో ఉన్నారు. సగటున చూస్తే ఒక్కో వార్డు నుంచి 9 నుంచి 10 నామినేషన్లు దాఖలు కాగా.. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్లకు రెబల్స్ బెడద అధికంగా ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని ఈ సారి రెబల్స్ బెడద ఉండకుండా చూడాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి రేవంత్ రెడ్డి, కేసీఆర్లు ముఖ్యనేతలకు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్లు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఆయా మున్సిపాలిటీలకు ప్రాతినిధ్యం వహించే మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో రెండు రోజులుగా మంతనాలు చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్లపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన ప్రజాప్రతినిధులు అందుకు అనుగుణంగా రిజర్వేషన్లను బట్టి వార్డు కౌన్సిలర్లను ఎంపిక చేసే ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు. సోమవారం రాత్రి వరకు పరకాల, నర్సంపేట, స్టేషన్ఘన్పూర్, జనగామ, తొర్రూరు తదితర మున్సిపాలిటీలలో బరి నుంచి సుమారు 117 మంది వరకు తప్పుకున్నట్లు సమాచారం. కాగా అయితే మంగళవారం మధ్యాహ్నం 3 గంటలలోగా బరిలో ఉండే అభ్యర్థుల ‘బీ’ఫామ్లు సమర్పించాల్సి ఉండగా అంతకు ముందే రెబల్స్ను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, పరకాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్నుంచి 22 వార్డుల్లో పోటీలో నిలిచే అభ్యర్థుల జాబితాను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రకటించారు. ‘పుర’ పీఠం లక్ష్యంగా పార్టీల వ్యూహం.. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడమే తరువాయి మున్సిపల్ చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు బలాబలాలను లెక్కలు వేసుకుంటున్నాయి. ఇందుకోసం పార్టీల నాయకుల్ని, శ్రేణుల్ని అప్రమత్తం చేస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అందరూ కూడా పార్టీ గుర్తుపై పోటీ చేసేవారి గెలుపునకు కృషి చేసేలా వార్డుల వారీగా బృందాలను నియమిస్తున్నారు. వరుస విజయాలు, అభివద్ధి కార్యక్రమాలను మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చాలని అధికార కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలు అనుకూలంగా మార్చుకుని.. ఆ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఒప్పించి ఓట్లు పొందాలన్న ప్లాన్తో బీఆర్ఎస్, బీజేపీలున్నాయి. ఈ క్రమంలోనే గెలుపే లక్ష్యంగా వార్డు కౌన్సిలర్లను ఎంపిక చేసే పనిలో అన్నీ పార్టీలు ఎక్సర్సైజు చేశాయి. ఇదిలా వుండగా మొత్తం 12 మున్సిపాలిటీల్లో 335244 మంది ఓటర్లుండగా.. అందులో మహిళలు 172087లు కాగా, పురుషులు 163088లు ఉన్నారు. అత్యధికంగా మహిళలే ఉండటంతో వార్డులు, మున్సిపాలిటీల వారిగా అత్యధికంగా వారి ఓట్లను పొందేందుకు కూడా పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. జిల్లా మున్సిపాలిటీ దాఖలైన తిరస్కరించిన మిగిలినవి నామినేషన్లు నామినేషన్లు నామినేషన్లుభూపాలపల్లి భూపాలపల్లి 230 64 166 ములుగు ములుగు 192 16 176 హనుమకొండ పరకాల 215 02 213 వరంగల్ నర్సంపేట 291 00 291 వర్థన్నపేట 121 00 121 స్టేషన్ఘన్పూర్ 181 00 181 మహబూబాబాద్ మహబూబాబాద్ 357 127 230 డోర్నకల్ 146 44 102 కేసముద్రం 167 44 123 మరిపెడ 142 03 139 తొర్రూరు 144 00 144 మొత్తం 2,372 300 2,072నామినేషన్ల పరిశీలన రోజు నాటికి అయా మున్సిపాలిటీల్లో దాఖలైన నామినేషన్లు, తిరస్కరించినవి, మిగిలినవి 260 వార్డులకు 2372 నామినేషన్లు... తిరస్కరణ తర్వాత 2072 పోటాపోటీగా నామినేషన్లు.. అన్ని పార్టీల నుంచి రెబల్స్ పరకాలలో బీఆర్ఎస్నుంచి వార్డు అభ్యర్థుల ప్రకటన.. నేడు నామినేషన్ల ఉపసంహరణ.. -
మున్సిపోల్కు ఏర్పాట్లు పూర్తి
నేడు నామినేషన్ల ఉపసంహరణ, గుర్తుల కేటాయింపుమాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్ రమేశ్ములుగు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీ కార్యాలయంలో ఆయన సోమవారం సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ములుగు మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా వివిధ పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు. మున్సిపాలిటీ పరిఽధిలో 16,533 మంది జనాభా ఉండగా.. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 20 వార్డులకు గాను 20 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని వివరించారు. 13,963 మంది ఓటర్లలో 6,661 మంది పురుషులు, 7,300 మహిళలు, ఇద్దరు ఇతర ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. గుర్తుల కేటాయింపు ఇలా.. నేడు(మంగళవారం) మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉప సంహరించుకునే అవకాశం ఉందని, బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను 3 గంటల తర్వాత ప్రకటించి గుర్తులు కేటాయిస్తామన్నారు. మధ్యాహ్నం 3 గంటలలోపు పార్టీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వారు బీ ఫారం సమర్పించకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తామని చెప్పారు. 20 వార్డుల నుంచి అభ్యర్థులు నామినేషన్ వేశారని తెలిపారు. సోమవారం 19వ వార్డులో ఒక అభ్యర్థి నామినేషన్ను విత్డ్రా చేసుకున్నారని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు 20 వార్డులకు 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. తాగునీటి వసతి, మరుగుదొడ్లు, ర్యాంపులు, ఫర్నీచర్, లైటింగ్, వికలాంగులు, వృద్ధులకు వీల్చైర్లు వంటి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో 50 బ్యాలెట్ బాక్స్లు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ములుగు డిగ్రీ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడమే కాకుండా స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాలను డీగ్రీ కళాశాలలోనే ఏర్పాటు చేసినట్లు ఉద్ఘాటించారు. విధుల్లో 24 మంది పీఓలు, 74 మంది ఏపీఓలు సాక్షితో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్మున్సిపల్ ఎన్నికల కోసం ఏడుగురు (ఆర్ఓ) రిటర్నింగ్, ఏడుగురు (ఏఆర్ఓ)అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 24 మంది పీఓ(పోలింగ్ ఆఫీసర్లు)లు, 74 మంది ఏపీఓ(ఆసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు)లను నియమించినట్లు తెలిపారు. సోమవారం ములుగు బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్నికల విదుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. బుధవారం రెండోసారి శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 20 శాతం సిబ్బందిని రిజర్వ్లో ఉంచామన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 201 గృహాలకు చెందిన రూ.3,33,435 ఇంటి పన్నుల బకాయిలు వసూలు అయ్యాయని వివరించారు. -
కరకట్ట పనులు త్వరగా పూర్తిచేయాలి
మంగపేట: మండల కేంద్రంలోని గోదావరి ఒడ్డు వెంట కరకట్ట నిర్మాణ పనులను పూర్తి నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ వెంకటకృష్ణ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని గంపోనిగూడెం, కమలాపురం గ్రామాల మధ్య దొంగలఒర్రె ప్రాంతంలో సీడీఓ హైదరాబాద్ డ్రాయింగ్ నమూనాతో లాంచింగ్ ఆప్రాన్ విత్క్రేడ్స్ టెక్నాలజీతో సాగుతున్న కరకట్ట నిర్మాణ పనులను వెంకటకృష్ణ సోమవారం పరిశీలించారు. డ్రాయింగ్ మ్యాప్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గోదావరిలో 34 మీటర్ల వెడల్పుతో జింక్తో కూడిన జాలీ(మెస్) రాక్బెడ్, 1.2 మీటర్ల తిక్నెస్తో లాంచింగ్ ఆప్రాన్, ఒడ్డు వెంట 50 మీటర్ల స్లోబ్తో 0.9 మీటర్ల తిక్నెస్తో 2.5 కిలో మీటర్ల వరకు కొనసాగుతున్న పనులపై ఆరా తీశారు. పనుల వివరాలను ఇరిగేషన్ ఈఈ శంకరయ్య, ఫీల్డ్ స్టాఫ్ను అడిగి తెలుసుకున్నారు. సీడీఓ డిజైనింగ్ ప్రకారంగా పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కంపెనీ యాజమాన్యం మాన్సూన్ ప్రారంభానికి ముందే అగ్రిమెంటు గడువులోగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ బుచ్చిరెడ్డి, ఈఈ బాలకృష్ణ, ఇరిగేషన్ ములుగు ఎస్ఈ మోహన్రావు, ఇరిగేషన్ ఏటూరునాగారం ఈఈ శంకరయ్య, డీఈ రవికుమార్, ఏఈ వలీమ్ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ వెంకటకృష్ణ -
కేసీఆర్కు సిట్ నోటీసులు సరికాదు
ములుగు: మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సానికొమ్ము రమేశ్రెడ్డి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్, మేడారం జాతర వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ద్వారా కేసీఆర్కు నోటీసులు ఇప్పించి ఇబ్బంది పెట్టాలని చూస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మస్రగాని వినయ్కుమార్, కోగిల మహేశ్, ఆకుతోట చంద్రమౌళి, ముంజాల భిక్షపతి, గరిగె రఘు, అనుముల సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేకం!
సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ఓరుగల్లుకు లేదుఉమ్మడి వరంగల్ జిల్లా వాసులను నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్సాక్షిప్రతినిధి, వరంగల్: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు ప్రత్యేక కేటాయింపులు లేవు. వరంగల్కు కీలకమైన ఎయిర్పోర్ట్ నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. మెడికల్, ఐటీ హబ్లు ఏర్పాటు చేసే నగరాల జాబితాలో చోటు దక్కలేదు. పర్యాటక అభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం.. ఈ బడ్జెట్లో ఓరుగల్లు పర్యాటకాన్ని పట్టించుకోలేదు. మేడారం జాతరకు జాతీయ హోదా ఊసేలేదు. ములుగు గిరిజన యూనివర్సిటీతో పాటు కాళోజీ, కాకతీయ యూనివర్సిటీల ప్రస్తావన లేదు. ఉమ్మడి వరంగల్లో కీలక ప్రాజెక్టులకు ఈ సారి మొండిచెయ్యే చూపారన్న చర్చ జరుగుతోంది. ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేదని కొందరు మేధావులు, ఆర్థికవేత్తలు అంటుండగా.. ఈసారి కూడా అన్యాయం జరిగిందని వివిధ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ వర్గాల ఆశలు నెరవేరలే... వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉద్యోగులు, మధ్యతరగతి వారి ఆశలు నెరవేరలేదు. ఆ వర్గాలను ప్రభావితం చేసే అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి జిల్లాలో ఆదాయ పన్ను చెల్లింపుదారులు 5.28 లక్షల మందికి పైగా ఉన్నట్లు అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమలవుతున్న స్లాబులను కొనసాగించడంతోపాటు స్టాండర్డ్ డిడెక్షన్ను పెంచితే బాగుంటుందన్న వారి కోరిక తీరలేదు. డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు విస్తరించి, విద్య, వైద్య ఖర్చులపై టీడీఎస్ను 5 నుంచి 2 తగ్గించి చిన్నతరహా ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఆరు నెలల ఊరట ఇచ్చారు. గృహ రుణాల విషయంలో వడ్డీ రాయితీ, చిన్న కమతాలు కలిగిన రైతులకు భరోసా కల్పించే అంశాలు బడ్జెట్లో లేవు. రింగురోడ్డు నిర్మాణం, స్మార్ట్సిటీ పథకం పొ డిగింపుపై స్పష్టత లేదు. బడ్జెట్లో రాయితీలు లేకపోవడంతో అనేకవర్గాలు పెదవి విరుస్తున్నాయి. 6 జిల్లాలకు 6 బాలికల హాస్టళ్లు.. బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు.. పర్యాటకం, మెడికల్ హబ్లో దక్కని చోటు ‘ట్రైబల్’ సహా యూనివర్సిటీలకు కేటాయించని నిధులు కేఎంటీపీకి ప్రయోజనం.. రైతులకు ఊరట జిల్లాకో బాలికల హాస్టల్.. ఉపాధి, ఉద్యోగావకాశాలుదేశంలోని అన్ని జిల్లాల్లో బాలికల హాస్టళ్లను అన్ని హంగులతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలకు బాలికల హాస్టళ్లు రానున్నాయి. రైతులకు ఎరువులపై ఈసారి రాయితీ శాతాన్ని పెంచడం ఊరట కలిగించే అంశం కాగా, 9.17 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. కొత్త పథకం ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 75,834 ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లకు మేలు జరగనుంది. ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించి వైద్యం, ఆరోగ్యం పరంగా పేదలకు రాయితీలు ఇచ్చారు. క్యాన్సర్ రోగులకు సరఫరా చేసే మందుల ధరలు తగ్గనుండగా.. 23,190 మందికి నెలనెలా ఖర్చులు తగ్గనున్నాయి. -
బీ ఫారాలు ఎవరికో?
ములుగు: రేపటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండడంతో కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు నుంచి నలుగురు అభ్యర్థులు ప్రతీ వార్డుకు పోటీలో నిలవడంతో బీ ఫామ్లపై ఆసక్తి నెలకొంది. పార్టీల అభ్యున్నతికి ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డామని కొందరు, పైసలు ఎన్ని అయినా పెట్టి గెలిచి వస్తామని మరి కొందరు ప్రధాన పార్టీల ముఖ్య నేతల వద్ద బీ ఫారాల కోసం క్యూ కడుతుండడంతో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలలోపు బీ ఫారాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పరిగణిస్తారు. ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారికి బీ ఫారాలు ఇవ్వకుండా వెయిట్ అండ్ సీ అంటూ అధిష్టానాలు దాటవేస్తున్నాయని పోటీదారులు వాపోతున్నారు. బీ ఫామ్ రాకపోతే జంప్ కాకుండా.. మున్సిపల్ ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి ఇద్దరి కంటే ఎక్కువగా నామినేషన్లు వేసిన వారిలో ఒకరికి బీ ఫామ్ ఇస్తే మిగిలినవారు ఇతర పార్టీకి జంపయ్యే అవకాశం ఉందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. మున్సిపల్ వార్డుల పరిధిలో గెలుపోటములపై సర్వే నిర్వహిస్తున్నామని చెబుతూ బీ ఫారాలు ఇవ్వకుండా దాటవేస్తుండడంతో ఆశావహులు నిరుత్సాహపడుతున్నారు. ఇప్పటికే వేలాది రూపాయాలు ప్రతిరోజూ ఖర్చు చేస్తున్నా బీఫాంపై స్పష్టత లేకపోవడంతో ఏమి చేయాలో తెలియక ఆయోమయానికి గురవుతున్నారు. బీఫాం కేటాయిస్తే రెబెల్స్ను బుజ్జగించి ఓటర్లను మెప్పించేందుకు వారం రోజులు కూడా ఓటింగ్కు సమయం లేదని వాపోతున్నారు. నామినేషన్లు వేసినప్పుడే బీఫారాలు అందిస్తే ప్రచారం నిర్వహించుకునేలా, ప్రతీ ఓటరును కలిసే అవకాశాలు ఉండేవని వారు అభిప్రాయపడుతున్నారు. 159 మంది అభ్యర్థులు.. 176 నామినేషన్లు ములుగు మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు 159 మంది అభ్యర్థులు 192 నామినేషన్లు దాఖలు చేశారు. ఒకే పార్టీ అభ్యర్థిగా రెండు నామినేషన్లు వేస్తే ఒక నామినేషన్ను పరిగణలోకి తీసుకున్నారు. పార్టీ అభ్యర్థిగా ఒకటి, స్వతంత్ర అభ్యర్థిగా మరొకటి, ఇతర పార్టీ పేర్ల మీద మరో నామినేషన్ వేస్తే మూడింటిని ఆమోదించారు. 192 నామినేషన్లలో ఒకే పార్టీ అభ్యర్థిగా రెండు నామినేషన్లు వేసినా 32 నామినేషన్లలో 16 నామినేషన్లను మాత్రమే పరిగణలోకి తీసుకోగా 176 నామినేషన్లు వాలిడ్ నామినేషన్లుగా గుర్తించారు. 176 నామినేషన్లలో కాంగ్రెస్ నుంచి 66 మంది, బీఆర్ఎస్ నుంచి 52, బీజేపీ నుంచి 29 మంది, సీపీఎం నుంచి 3, ఇతర రిజిస్టర్ పార్టీల నుంచి ఏడుగురు, ఇండిపెండెంట్లు 19 మంది నామినేషన్లు దాఖలు చేశారు.ములుగు మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండడంతో చైర్పర్సన్ పీఠంపై ప్రధాన పార్టీలు కన్నేశాయి. చైర్పర్సన్ బీసీ మహిళకు కేటాయించడంతో అధికార పార్టీలో ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి మాజీ జెడ్పీటీసీ సకినాల భవాని, మాజీ ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి నామినేషన్లు వేయకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో చైర్పర్సన్ అభ్యర్థిత్వంపై గందరగోళం నెలకొంది. బీజేపీ నుంచిఇ సిరికొండ సునీత బలరాం పేరు వినిపిస్తుంది. బీజేపీ అధిష్టానం కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు నేడు(సోమవారం) బీఫారాలను అందయనుండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సర్వేల పేరుతో నామినేషన్ విత్డ్రా రోజు చివరి క్షణాల్లో అందజేయనున్నట్లు సమాచారం. రేపటితో ఉపసంహరణకు గడువు బీఫాం కోసం పోటీదారుల్లో టెన్షన్ చైర్పర్సన్ పదవిపై పలువురి ఆశలు -
భక్తుల కోలాహలం
మంగపేట/వెంకటాపురం(ఎం): మేడారంలోని వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించిన అనంతరం హేమాచలక్షేత్రం, రామప్ప ఆలయానికి తరలివచ్చి లక్ష్మీనర్సింహస్వామి, రామలింగేశ్వస్వామిని దర్శించుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం మంగపేట మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో కోలాహలంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పవన్కుమార్, శేఖర్శర్మ భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అదే విధంగా అదే విధంగా మేడారం భక్తులు తిరుగు ప్రయాణంలో రామప్పను సందర్శిస్తుండడంతో పాటు ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. రామప్ప ఆలయ గార్డెన్లో భక్తులు సేదతీరి ఉల్లాసంగా గడిపారు. అలాగే ఏసీబీ తెలంగాణ ఐజీ తరుణ్ జోషి కుటుంబసమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.మేడారం నుంచి హేమాచల క్షేత్రం, రామప్పకు తరలివస్తున్న సందర్శకులు -
‘సీతక్క పారిపోయే రకం కాదు’
మేడారం(ములుగు జిల్లా): మనసా వాచా కర్మణా చిత్తశుద్ధితో మా ఆదివాసీల అస్తిత్వం కోసం పరితపించే ఆదివాసి బిడ్డనని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. తాను పారిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాల చేశాయని, సీతక్క పారిపోయే రకం కాదన్నారు. భక్తులు, ప్రజల కోసం పంతం నెగ్గించుకునే రకం తానన్నారు. మేడారంలో మీడియా సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. ‘తనువెల్ల ఆదివాసి అస్తిత్వాన్ని, నిలువెల్లా ఆత్మగౌరవాన్ని, తల్లుల పట్ల భక్తిని కలిగి ఉన్న వ్యక్తిని నేను. మేడారం జాతర దిగ్విజయాన్ని జీర్ణించుకోలేక కొందరు చేసే కుట్రలకు భయపడే రకం కాదుజాతరను విజయవంతం చేసిన విధంగానే జాతర తర్వాత చేపట్టాల్సిన పనులను పూర్తి చేస్తున్నాం. ఐదువేలకు పైగా పారిశుద్ధ్య సిబ్బంది నియమించి మేడారాన్నీ పరిశుభ్రపరుస్తున్నాము. రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందికి అభినందనలు. విఐపిల తాకిడి వల్ల ట్రాఫిక్ జామ్ అయిందిఆ ట్రాఫిక్ జామ్ లో ఆర్టీసీ బస్సులు చిక్కుకుపోయాయి. గట్టమ దేవాలయం వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా చర్యలు తీసుకున్నాము. గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత సమ్మక్కకు రావటం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నివారించాం. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఈ దఫా నివారించగలిగాము. భక్తితో బాధ్యతతో సంయమనంతో దైవ దర్శనానికి రండి అని భక్తులకు మేము చేసిన విజ్ఞప్తి పనిచేసిందిబ్రహ్మాండంగా జాతరను నిర్వహించుకున్నాము. అందరికీ అభినందనలు. సమ్మక్క సారలమ్మతో మాకు భావోద్వేగా బంధం ఉంది అందుకే అన్ని జాగ్రత్తలు చేపట్టాము. గుడి నిర్మాణ బాధ్యతలను నెత్తికెత్తుకున్నాము. గుడి నిర్మాణం జాతరకు ముందే పూర్తయింది. గతంలో జాతరకు ముందు రోజుకు ఒకటి రెండు లక్షల మంది భక్తులే వచ్చేవారు. కానీ కొత్త గుడి నిర్మాణం తర్వాత ఓకే రోజూ 8 లక్షల మంది వరకు భక్తులు వచ్చారు. గతంలో తాత్కాలికంగా పనులు జరిగేవి కానీ ఈ దఫా శాశ్వత పద్ధతిలో పనులు పూర్తి చేయడం వల్ల భక్తులు విపరీతంగా తరలివచ్చారు. త్రాగునీరు టాయిలెట్స్ ముందస్తుగానే సిద్ధం చేశాం. సమ్మక్కను సకాలంలో గద్దెల మీదకు తీసుకురావడంలో పూజారులు సహకరించారు.. వారికి ధన్యవాదాలు. కొంతమంది కొత్త పోలీస్ సిబ్బంది పూజారులను గుర్తించకపోవడం వల్ల పొరపాటు జరిగింది. ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఇబ్బందులకు గురిచేయలేదు’ అని పేర్కొన్నారు. -
మేడారంలో నిరంతరం పారిశుద్ధ్య పనులు
మేడారం (ములుగు): మేడారం మహాజాతరలో మున్సిపల్, పంచాయతీరాజ్, పారిశుద్ధ్య కార్మికులు 5 వేల మంది నిత్యం అందుబాటులో ఉంటూ రోడ్లు, మరుగుదొడ్లు, చెత్తాచెదారం సేకరిస్తూ నిరంతరం సేవలు అందిస్తున్నారు. జాతరకు 15 రోజుల ముందు నుంచి పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి హెల్త్ శానిటేషన్ వర్కర్లతో పనిచేయిస్తూ రోజువారీగా డబ్బులు చెల్లిస్తున్నారు. అమ్మవారి గద్దెల ప్రాంగణం, ఇతర కార్యాలయాలు, అధికారుల నివాస ప్రాంతాలు, రహదారుల వెంబడి, మరుగుదొడ్ల పరిశుభ్రత, క్లీనింగ్, బ్లీచింగ్ వంటి శానిటేషన్ పనులు నిర్వహిస్తూ భక్తులకు హెల్త్ సమస్యలు రాకుండా చూస్తున్నారు. సేకరించిన చెత్తాచెదారాన్ని ప్రత్యేక ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు, తదితర వాహనాల్లో బయటకు తరలిస్తున్నారు. రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి తీసుకొచ్చిన కాంట్రాక్టర్ రూ.700 మాత్రమే చెల్లిస్తున్నాడని కార్మికులు వాపోతున్నారు. తాగునీటితో పాటు తినడానికి తిండి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు వాపోతున్నారు. మాస్క్లు, చీపుర్లు సైతం కాంట్రాక్టర్ అందించడంలేదని గుంటూరు నుంచి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
మేడారం టు రామప్ప
వెంకటాపురం(ఎం): మేడారం వనదేవతల ను దర్శించుకుని రామప్ప ఆలయానికి వచ్చే భక్తులతో శనివారం సందడి నెలకొంది. భారీ సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు, దేవాదాయశాఖ సిబ్బంది క్యూలైన్లలో భక్తులను పంపించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని భక్తులు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. అదేవిధంగా రామప్ప ఆలయాన్ని అగ్నిమాపక డీజీ విక్రమ్సింగ్ మాన్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్లు వేర్వేరుగా రామప్పను సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. హైకోర్టు జడ్జిలు సృజన, రాణి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వారికి వివరించారు. -
ఈసారైనా విదిల్చేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు(ఆదివారం) ప్రవేశపెట్టే 2026–27 బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఏ మేరకు నిధుల వాటా దక్కనుంది? అన్న చర్చ ప్రధానాంశమైంది. ఈసారైనా కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపుల విషయమై సీతమ్మ కరుణిస్తుందన్న ఆశతో ఓరుగల్లు ప్రజలు ఎదురు చూస్తున్నారు. 2025–26 కేంద్ర బడ్జెట్ ఊరించి.. ఉసూరుమనిపించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు నేరుగా పద్దులేవీ ప్రకటించలేదు. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యంతో ఈ బడ్జెట్ను రూపకల్ప న చేసినట్లు చెప్పినా.. నేరుగా ఆ వర్గాలకు చెందిన అందరికీ మేలు జరిగే పరిస్థితి కనిపించలేదు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీ, కాకతీయ టెక్స్టైల్ పార్కుకు పీఎం మిత్ర హోదా, నిధుల కేటాయింపు, ములుగు ట్రైబల్ యూనివర్సిటీ, వరంగల్ నగరంలో నియో రైలు, భూగర్భ డ్రెయినేజీ, ఎయిర్పోర్ట్ బడ్జెట్లో ప్రస్తావనకు రాలేదు. హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నా.. బడ్జెట్లో ఆ మే రకు నిధులివ్వలేదు. ఫలితంగా అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉంటున్నాయి. ఈసారి బడ్జెట్లోనైనా ప్రాధాన్యమిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. కీలక ప్రాజెక్టులపై చిన్నచూపు.. ములుగు ట్రైబల్ యూనివర్సిటీ, వరంగల్ నగరంలో నియో రైలు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఎయిర్పోర్ట్ తదితర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలన్న ప్రతిపాదనలకు మోక్షం కలగడం లేదు. పలు ప్రతిష్టాత్మక పథకాలకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు జరగకపోవడంపై ప్రజలు ప్రతీసారి పెదవి విరుస్తున్నారు. కాజీపేట రైల్వే కోచ్ను ఈ ఏడాది ఆగస్టు వరకు పూర్తి చేయాల్సి ఉన్నా.. గత బడ్డెట్లో నేరుగా పద్దుల్లో చేర్చకపోవడం వల్ల పూర్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు రూ.350 కోట్లు ఇవ్వాలని చేసిన ప్రతిపాదనలు గత బడ్డెట్లో బుట్టదాఖలే అయ్యాయి. లెదర్ పార్కు, సైనిక్ స్కూల్తో పాటు వివిధ పథకాల కోసం చేసిన ప్రతిపాదనలను పట్టించుకోకపోగా.. రూ.4,174 కోట్ల అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిధుల్లో కేంద్రం వాటా తేలలేదు. ఈసారి నిధులిచ్చి వాటాను క్లియర్ చేయాలని కోరుతున్నారు. నిధులు కేటాయించని కారణంగా సైనిక్ స్కూల్ను ఇతర జిల్లాలకు తరలించాలని చూస్తున్నారు. రైల్వేశాఖకు కేటాయింపులపై ఆశలు..ఈసాధారణ బడ్జెట్లోనైనా రైల్వేశాఖకు కేటాయింపులు జరిగితే పలు కొత్త, అసంపూర్తి రైల్వేలైన్లకు మోక్షం కలుగుతుంది. మణుగూరు–రామగుండం రైల్వేలైన్ సర్వే కోసం గతంలో బడ్జెట్ కేటాయించారు. ఆ మేరకు భూసేకరణ, నిర్మాణం పూర్తి కోసం నిధులు ఇవ్వలేదు. హసన్పర్తి–కరీంనగర్, డోర్నకల్–మిర్యాలగూడ రైల్వేలైన్ల సర్వే, భూసేకరణ, నిర్మాణం కోసం చేసిన కేటాయింపులు పెరగాల్సి ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన రైల్వే కోచ్ఫ్యాక్టరీని పూర్తి చేసేందుకు ఆ మేరకు నిధులు ఇవ్వాల్సి ఉంది. కాజీపేట రైల్వే టౌన్ స్టేషన్, రైల్వే ఆస్పత్రిని సబ్ డివిజన్ ఆస్పత్రి మార్పుపైన ఆశలు ఉన్నాయి. స్టేషన్ఘన్ఫూర్ నుంచి సూర్యాపేట వరకు కొత్త లైన్కు నిధులివ్వడంతో పాటు కాజీపేట జంక్షన్ నుంచి ముంబై. విజయవాడ, కాగజ్నగర్ వరకు మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించాలన్న డిమాండ్ ఉంది. కాగా, గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధి కోసం స్మార్ట్సిటీ గడువును పెంచి అదనంగా నిధులు కేటాయించాలని నగరవాసులు కోరుతున్నారు. నేడు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్.. నిర్మలమ్మపైనే ఆశలు ట్రైబల్ యూనివర్సిటీ, కోచ్ఫ్యాక్టరీ పూర్తికి నిధులు అవసరం ఉమ్మడి వరంగల్లో కీలక ప్రాజెక్టులు పెండింగ్ రైల్వే లైన్లు, స్టేషన్లకు విడుదల కాని నిధులు గత బడ్జెట్లో ప్రతిపాదించినా దక్కని ప్రాధాన్యం ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర ప్రాజెక్టులకు కేటాయింపులపై ఆశలు -
అరణ్యానికి ఆదిశక్తులు
సమ్మక్క: రాత్రి 7.58 గంటలకుమేడారం(ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి): ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వన ప్రవేశం కార్యక్రమంతో సమ్మక్క–సారలమ్మ మహాజాతర శనివారం ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క–సారలమ్మతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజును పూజారులు ఆదివాసీ సంప్రదాయ రీతిలో పూజలు చేసి తల్లులను వనం చేర్చారు. సాయంత్రం గద్దెల వద్ద ప్రారంభమైన వన ప్రవేశ కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది. పూజారులు కన్నెపల్లికి సారలమ్మను, చిలకలగుట్టకు సమ్మక్క తల్లిని తీసుకెళ్లారు. కొండాయికి గోవిందరాజును పూజారులు దబ్బగట్ల గోవర్ధన్, రాజారం, వడ్డె బాబు, పూనుగొండ్లకు పగిడిద్దరాజును పూజారులు పెనక బుచ్చిరాములు పడగలను తీసుకెళ్లారు. భక్తులు.. అమ్మల ఆశీస్సులతో గమ్యస్థానానికి చేరుకున్నారు. డోలు వాయిద్యాలు, కొమ్ముబూర ధ్వనులేమీ లేకుండా తల్లుల వన ప్రవేశం నిశ్శబ్దఽంగా సాగింది. శని వారం సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. తల్లులారా వెళ్లొస్తాం.. తల్లులూ వెళ్లొస్తాం.. అంటూ తీరొక్క మొక్కులు చెల్లించిన భక్తులు శనివారం స్వస్థలాలకు బయల్దేరి వెళ్లారు. బస్టాండ్ పరిసరాలు కిక్కిరిసి కనిపించాయి. బోసిపోయిన మేడారం.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది ప్రైవేట్ వాహనాల్లో భక్తులు తరలివచ్చారు. వాహనాల పార్కింగ్కు కేటాయించిన స్థలాలు జాతర ముగియడంతో నిర్మానుష్యంగా మారాయి. ఇసుకేస్తే రాలనంత మంది జనంతో ఉన్న మేడారం ఒక్కసారిగా బోసిపోయింది. చెట్లు పుట్టలు అంటూ తేడా లేకుండా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మలకు మొక్కులు చెల్లించి తిరుగు ప్రయాణం చేశారు. పోలీసులు వన్ వే చేయడంతో వచ్చిన దారి కాకుండా పోలీసులు సూచించిన దారిలో వాహనాలు తరలించారు. భక్తుల రద్దీతో విరిగిన గ్రిల్స్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా శుక్రవారం వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల తాకిడికి అర్ధరాత్రి సమయంలో సమ్మక్క గద్దె సమీపంలోని ఇనుప గ్రిల్స్ విరిగిపోయాయి. భక్తుల రద్దీ, తోపులాటతో గ్రిల్స్ విరిగి పక్కకు పడ్డాయి. ఆ సమయంలో భక్తులు అనేక మంది అక్కడే ఉన్నప్పటికీ ఎలాంటి గాయాలు కాలేదు. విరిగిన గ్రిల్స్కు ఎండోమెంట్ అధికారులు వెల్డింగ్ చేయించారు. దాంతో దర్శనాలు యథావిధిగా కొనసాగాయి. జనం నుంచి వనం చేరిన తల్లులు ఆదివాసీ సంప్రదాయంతో వన ప్రవేశంవరాల మూటలు భక్తులకిచ్చారు.. వారిచ్చిన ప్రేమను మూటగట్టుకున్నారు. ఆసీనులై అందరి మొర ఆలకించారు.. ఎనలేని కాస్మిక్ ఎనర్జీని ప్రసరించారు. భక్తుల ప్రేమకు మురిసిపోయారు. వెళ్లొస్తామంటూ తల్లులు ముందుకు కదిలారు.. ఆ దారులు.. సెలయేరులై పాదాలు తడపగా గాలులు సుమగంధాలై నాట్యం చేశాయి. వనాలు గొంతెత్తి సుస్వరాలు పలుకగా. ‘సాహో.. అంటూ విశ్వం స్వాగతించింది! -
నామినేషన్ల పరిశీలన
ములుగు: మున్సిపాలిటీ ఎన్నికల కోసం మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించిన అధికారులు శనివారం పరిశీలించారు. 20 వార్డులకు 192 నామినేషన్లు దాఖలు కాగా ఏ ఒక్కటి తిరస్కరణకు గురి కాలేదని మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్ తెలిపారు. 1వ వార్డుకు 7 నామినేషన్లు దాఖలు కాగా 2వ వార్డుకు 9, 3వ వార్డుకు 9, 4వ వార్డుకు 7, 5వ వార్డుకు 6, 6వ వార్డుకు 7, 7వ వార్డుకు 12, 8వ వార్డుకు 7, 9వ వార్డుకు 17, 10వ వార్డుకు 8, 11వ వార్డుకు 13, 12వ వార్డుకు 7, 13వ వార్డుకు 16, 14వ వార్డుకు 7, 15వ వార్డుకు 11, 16వ వార్డుకు 11, 17వ వార్డుకు 7, 18వ వార్డుకు 5, 19వ వార్డుకు 11, 20వ వార్డుకు 15 నామినేషన్లు దాఖలు అయినట్లు ఆయన వెల్లడించారు. 20 వార్డులకు.. 192 నామినేషన్లు -
అమ్మల దీవెన
మేడారం(ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం): వరాల తల్లులకు భక్తులు మనసారా మొక్కులు చెల్లించారు. నలుగురు దేవతలు గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాల అనంతరం గద్దెలకు చేరుకున్నారు. కోరిన కోర్కెలు నెరవేరడంతో మొక్కులు అప్పగించారు. గద్దెల వద్ద పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, చీరసారె, యాటపోతులు, కోళ్లు, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో గద్దెల ప్రాంగణం కళకళలాడింది. గ్రిల్స్ బయట నుంచి అమ్మవార్లను తనివితీరా మొక్కుకున్నారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. జయజయధ్వానాలతో గద్దెల ప్రాంగణం మార్మోగింది. ఆదివాసీ సంప్రదాయంగా జరిగిన పూజలు, డోలు వాయిద్యాలతో మేడారం ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. కోటి మందికిపైగా మొక్కులు.. వనదేవతలను ఇప్పటి వరకు కోటి మందికిపైగా.. దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు సుమారు 45 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, మంగళవారం నుంచి మొదలైన భక్తుల రద్దీ శుక్రవారం వరకు కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో మేడారానికి చేరుకున్నారు. మేడారం పరిసరాల ప్రాంతంలోని 20 కిలోమీటర్ల దూరంలో విడిది చేసిన భక్తులు అమ్మవార్లు గద్దెలపైకి రావడంతో బుధవారం రాత్రి నుంచి లక్షల సంఖ్యలో దర్శనానికి పోటెత్తారు. మేడారం ఎక్కడ చూసినా భక్త జన గుడారంలా కనిపించింది. అటవీ ప్రాంతంలోని వనంలో భక్తులు చెట్ల కింద గుడారాలు వేసుకుని మూడు రోజులు సందడిగా గడిపారు. సమీప గ్రామాల్లో భక్తుల సందడి మహా జాతర సందర్భంగా మేడారంతో పాటు చుట్టు పక్కల గ్రామాలైన రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, నార్లాపూర్, కాల్వపల్లి, బయ్యక్కపేట, వెంగళాపూర్ గ్రామాల్లో సందడి నెలకొంది. ఆయా గ్రామాల్లో గదులను అద్దెకు తీసుకుని విడిది చేశారు. పండుగ వాతావరణంలో పల్లెలన్నీ కళకళలాడాయి. ఇంటి యజమానులు భక్తులను బంధువులుగా ఆదరించారు. బస చేసింది మూడు రోజులే అయినప్పటికీ వారిలో కొందరు బంధువులుగా మారిపోయారు. తిరుగు ప్రయాణం.. తల్లుల దర్శనం అనంతరం శుక్రవారం భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో వేలాది మంది తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. ఆర్టీసీ బస్టాండ్ భక్తులతో కిక్కిరిసిపోయింది. మేడారం ఆర్టీసీ బస్టాండ్ నుంచి తాడ్వాయి వరకు 14 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆర్టీసీ బస్సుల రాకపోకలతో బారులుదీరాయి. సాధారణంగా 20 నిమిషాల్లో తాడ్వాయికి చేరుకోవాల్సి ఉండగా.. ఆర్టీసీ బస్సులు బారులుదీరడంతో గంటకు పైగా సమయం పట్టింది. ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన భక్తులు సైతం గుడారాలు ఖాళీ చేసి తిరుగు ప్రయాణం కావడంతో పస్రా వరకు ప్రైవేట్ వాహనాలతో దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. భక్త కోటి జనంతో పూజలు అందుకున్న సమ్మక్క–సారలమ్మను నేడు (శనివారం) సమ్మక్క సారలమ్మ పూజారులు వన ప్రవేశం చేయనున్నారు. అదేవిధంగా ఏటూరునాగారం మండలంలోని కొండాయికి గోవిందరాజులు, గంగారం మండలం పూనుగొండ్లకు పగిడిద్దరాజు పడిగలను గద్దెలపై నుంచి పూజారులు తీసుకెళ్లనున్నారు. సారలమ్మతో పాటు గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెల వద్ద నుంచి ముందు బయల్దేరగా, వీరి తర్వాత సమ్మక్కను పూజారులు వన ప్రవేశం చేయించనున్నారు. సంపెంగలో నీళ్లు సంబురపడ్డాయి.. పూనకాలతో పులకించి పోయాయి. తలనీలాలు తన్మయత్వం చెందాయి.. ఎనలేని భక్తిని చాటాయి. పసుపు, కుంకుమలు ప్రణమిల్లాయి.. పొడిసేటి పొద్దులై ప్రభవించాయి. కోళ్లు, యాటలు సై సై అన్నాయి.. మొక్కుల లెక్కల్లో తరించిపోయాయి. సాక చుక్కలు నేలపై పారాయి.. ఆనవాయితీకి అద్దం పట్టాయి. ఎత్తు బంగారపు మూటలు నెత్తిన చేరాయి.. భక్తి నిండిన మనసుల్ని ఉరకలెత్తించాయి. ఒడిబియ్యం, చీర సారెలు పోటీపడ్డాయి.. వనదేవతల ఒడికి వడివడిగా చేరాయి. గద్దెలు పసిడి కాంతులై ధగధగ మెరిశాయి.. భక్తకోటికి ఆడబిడ్డల దీవెనలు అందాయి.మేడారం (కాళేశ్వరం): మేడారం జాతరకు లక్షలాదిగా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి పునీతులయ్యారు. వాగులో ఇసుకతో తల్లుల ప్రతిమలు చేసి పూజించారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. శివసత్తులు పూనకా లతో నీరాజనం పలికారు. వరం పట్టారు. భ క్తులతో జంపన్నవాగు ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. అనంతరం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లించారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. మేడారంలో కిక్కిరిసిన గద్దెల ప్రాంగణం వనదేవతలను లక్షలాదిగా దర్శించుకుని పూజలు తిరుగు ప్రయాణంలో వాహనాల బారులు -
వీఐపీ లైన్లో సాధారణ భక్తులు
మేడారం (ఏటూరునాగారం): మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు తరలివచ్చి న భక్తులు క్యూలైన్ల వద్ద పోటెత్తారు. ప్రత్యేకంగా వీఐపీ క్యూలైన్లు ఏ ర్పాటు చేసినప్పటికీ సాధారణ భక్తులు సైతం వీఐపీ క్యూలైన్లలో కిక్కిరిసిపోయారు. సాధారణ భక్తులు వీఐ పీలు కాదా అంటూ అక్కడున్న పోలీసులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో సాధారణ భక్తులను సైతం వీఐపీ క్యూలైన్లలో దర్శనానికి అనుమతి ఇచ్చారు. అలాగే ఐటీడీఏ గెస్ట్హౌస్ ఎదురుగా ఉన్న ప్రధాన రోడ్డుపైకి వనదేవతలను దర్శించుకుని వస్తున్న భక్తులతో పా టు జంపన్నవాగు నుంచి గద్దెలకు వెళ్లే వారు రా వడంతో అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. చి న్నారులు, వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. -
చైర్మన్ పీఠంపైనే నజర్!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీల్లో పాగా వేయడమే మూడు ప్రధాన పార్టీల లక్ష్యం. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటా పోటీగా కొట్లాడిన కాంగ్రెస్, బీఆర్ఎస్లో చివరకు కాంగ్రెస్ ఆధిక్యతను చాటింది. బీజేపీ సైతం గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే అత్యధికంగా స్వా ధీనం చేసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కి వచ్చిన తర్వాత తొలిసారిగా పార్టీ గుర్తులపై ఎన్ని కలు జరుగుతున్నాయి. ఆ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈక్రమంలో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఆ మూడు పార్టీ లు కూడా గెలుపు గుర్రాలవైపు చూస్తున్నాయి. నా మినేషన్ల గడువు శుక్రవారంతో ముగిసినప్పటికీ.. శనివారం నాటికి ‘బి’ ఫామ్లను సమర్పించే అవకాశం ఉండడంతో ఈలోగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. గెలుపు గుర్రాలవైపే మొగ్గు ఉమ్మడి వరంగల్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ (జీడబ్ల్యూఎంసీ), 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా మిగతావాటికి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో మూడు జనరల్ (పరకాల, వర్ధన్నపేట, తొర్రూరు)కు, ఒకటి జనరల్ మహిళ (మరిపెడ)కు, రెండు బీసీ జనరల్ (జనగామ, భూపాలపల్లి)కు, రెండు బీసీ మహిళ (నర్సంపేట, కేసముద్రం)కు కేటాయించారు. అలాగే ఎస్టీ మహిళలకు రెండు (మహబూబాబాద్, ములుగు), ఎస్సీ జనరల్కు రెండు (డోర్నకల్, స్టేషన్ ఘన్పూర్)లు రిజర్వ్ చేశారు. అయితే రిజర్వేషన్ల వారీగా మున్సిపల్ పీఠాలపై కన్నేసిన ప్రధాన పార్టీలు.. గెలిచే అవకాశం ఉన్న వారిని వార్డు కౌన్సిలర్గా ఎంపిక చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు శుక్రవారం అంతా కసరత్తు చేసి జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఒక్కో వార్డుకు ఒక్కో పార్టీకి ఇద్దరు నుంచి నలుగురు వరకు నామినేషన్లు వేశారు. శనివారం ‘బి’ఫామ్ల సమర్పించే ప్రక్రియ ఉండగా.. అవకాశం దక్కని వారిని బుజ్జగించేందుకు కూడా నాయకులు సిద్ధమయ్యారు. భారతీయ జనతా పార్టీ మాత్రం మున్సిపల్ ఎన్నికలపై అంతగా కసరత్తు చేస్తున్నట్లు కనిపించడం లేదు. పార్టీల దూకుడు.. ఆశావహుల యత్నాలు మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు మరో 11 రోజులే ఉండడంతో అభ్యర్థుల ఎంపిక మొదలు.. గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తించే వరకు పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించే పనిలో పడ్డాయి. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్లుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ను ఇప్పటికే నియమించింది. వారు ఉమ్మడి వరంగల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నాయకులతో ఎన్నికలపై సమన్వయం చేస్తున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు జిల్లాల ఇన్చార్జ్లతో పాటు 12 మున్సిపాలిటీలకు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఇంకా ఆ పార్టీ గెలుపు వ్యూహం ఏంటి? ఇన్చార్జ్లు ఎవరనేది స్పష్టం చేయకపోగా, అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు మాత్రం ప్రకటించింది. సీపీఐ, సీపీఎం పార్టీలు బలమున్నచోట వార్డు కౌన్సిలర్లను పోటీలో దింపడంతో పాటు అవకాశం ఉన్న చోట ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడం, తీసుకోవాలన్న యోచన కూడా చేస్తున్నట్లు ప్రచారం. ఇదిల ఉంటే ఇప్పటికే నామినేషన్లు వేసి ‘బి’ఫామ్ల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతల చుట్టూ చక్కర్లు కొడుతుండగా.. ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరనేది నేడు తేలనుంది. మొత్తం 199 నామినేషన్ల స్వీకరణ ములుగు: ములుగు మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు 199 నామినేషన్లు దాఖలు అయినట్లు మున్సిపల్ కమిషనర్ రమేశ్ శుక్రవారం తెలిపారు. తొలి రోజు 4, రెండో రోజు 61, మూడవ రోజు 134 నామినేషన్లు (మొత్తం 199) దాఖలు అయినట్లు ఆయన తెలిపారు. మెజార్టీ స్థానాలపై బీఆర్ఎస్.. బీజేపీ నాయకుల గురి గెలుపు గుర్రాలకే పార్టీ బీఫామ్లు.. నేడే అభ్యర్థులు తేలేది మూడు పార్టీలకు సవాల్గా మారిన ఎంపిక -
మేడారం భక్తులకు నరకం..
సాక్షి, ములుగు: మేడారం జనసంద్రమైంది. గద్దెలపై ఇద్దరు తల్లులు కొలువుదీరడంతో దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. సమ్మక్క, సారలమ్మ నామస్మరణతో మేడారం ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. దీంతో, జాతరకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మేడారం నుండి తాడ్వాయి వరకు 14 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 12 గంటల నుండి భక్తులు వేచి చూస్తున్నారు. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.మేడారంలో భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. పసరా నుంచి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకునే ఆర్టీసీ బస్సులతో పాటు, వీఐపీ వాహనాలు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ జామ్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పసరా నుంచి నార్లాపూర్ రూట్లో వెళ్లే ప్రైవేటు వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. మేడారం నుంచి తిరుగు ప్రయాణమయ్యే భక్తులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక వేలాది మంది భక్తులు మేడారం బస్టాండ్లో బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు.మేడారం రూట్ 163 జాతీయ రహదారి పై భారీ ట్రాఫిక్ జామ్!సమ్మక్క-సారలమ్మల దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో మేడారం ప్రధాన రహదారి పై భారీ #TrafficJam ఏర్పడింది. గంటలో వెళ్లే జర్నీ నాలుగైదు గంటలు పడుతుండటంతో భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. #MedaramJathara pic.twitter.com/4UnSdWH2fr— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) January 31, 2026తల్లుల దర్శనం కోసం కలెక్టర్ మంజూరు చేసిన వీఐపీ, వీవీఐపీ పాస్లు పొందిన భక్తులకు క్యూలైన్లను ఎత్తేయడంతో శుక్రవారం జాతరకు వచ్చిన భక్తులు పాస్లు చేత పట్టుకొని క్యూలైన్లు, దర్శనాల కౌంటర్ల కోసం మేడారం వీధుల్లో వెతుకుతూ కనిపించారు. మరికొందరు దర్శనాలు చేసుకోకుండానే మెయిన్ గేటు బయట నుంచే మొక్కులు చెల్లించుకొని తిరుగు పయనమయ్యారు. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెకు చేరిన తర్వాత భక్తుల రాక ఒక్కసారిగా పెరగడంతో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. ఎటు చూసినా దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి.భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. శనివారం తల్లుల వన ప్రదేశంతో జాతర పరిసమాప్తం కానున్నది. అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే సుమారు 45 లక్షల మందికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ప్రారంభమైంది మొదలు ఇప్పటివరకు మేడారానికి సుమారుగా 1.25 కోట్ల మంది వరకు జనం వచ్చారని అధికారులు తెలిపారు. -
Medaram Jatara: గుండెల నిండుగా మొక్కులు
మేడారం జనసంద్రమైంది.. గద్దెలపై ఇద్దరు తల్లులు కొలువుదీరడంతో దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. సమ్మక్క, సారలమ్మ నామస్మరణతో మేడారం ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క కో..సారక్క కో అంటూ గద్దెల ప్రాంగణం మార్మోగింది. శివసత్తుల పూనకాలతో హోరెత్తింది. పవిత్రమైన మాఘశుద్ధ శుక్రవారం వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరి ఉండడంతో ఎక్కువ మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. చీరలు, రవిక ముక్కలు, ఎత్తు బంగారం (బెల్లం), ఎదురు కోళ్లు, ఒడిబియ్యం, కొబ్బరికాయలు..తీరొక్క రూపాల్లో భక్తులు పరవశంతో మొక్కులు సమర్పించుకున్నారు. అమ్మల ప్రసాదం, పసుపు, కుంకుమల కోసం పోటీపడ్డారు. పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో జంపన్నవాగు ప్రాంతం మొత్తం జనంతో కిటకిటలాడింది. అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే సుమారు 45 లక్షల మందికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ప్రారంభమైంది మొదలు ఇప్పటివరకు మేడారానికి సుమారుగా 1.25 కోట్ల మంది వరకు జనం వచ్చారని అధికారులు తెలిపారు.జాతర మొదలైన ఈనెల 28నుంచి మేడారానికి భక్తుల రాక బాగా పెరిగింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. బుధవారం రాత్రి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు, గురువారం రాత్రి సమ్కక్క గద్దెలపైకి చేరారు. నలుగురు వనదేవతలు గద్దెలపైకి చేరే అపురూప ఘడియల కోసం వేచిచూసిన భక్తులు ఆర్దరాత్రి నుంచి దర్శనం కోసం బారులు దీరారు. శుక్రవారం రాత్రి వరకు ఆదివాసీ గిరిజనులు సంప్రదాయ పద్ధతుల్లో డప్పుల మోతలు, బాకాలు, బూరనాదాలతో వీరంతా వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే శుక్రవారం ఉదయం వరకు భక్తులకు ఇబ్బందులు లేకుండానే దర్శనం జరిగింది. గరిష్టంగా గంటన్నర సమయంలో భక్తులు దర్శనం ముగించుకుని గద్దెల ప్రాంగణం బయటకు వచ్చారు. శుక్రవారం ఉదయం తర్వాత నుంచి వీవీఐపీల రాక మొదలవడంతో భక్తులకు ఇబ్బందులు మొదలయ్యాయి. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రాక సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు జాతరలో పదే పదే వీఐపీ ద్వారాల వెంట వెళ్లి దర్శనం చేసుకున్నారు. వీఐపీల కుటుంబాల దర్శనం కోసం పోలీసు కంట్రోల్ రూమ్ వైపు ద్వారాలను తెరిచి పెద్ద సంఖ్యలో పంపించడంతో క్యూలో నిల్చున్న భక్తులకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు అధికారులు, సిబ్బంది విధుల్లో భాగంగా భక్తులను క్యూలో పంపడానికి ప్రయత్నించినా... తరచూ వీఐపీల తాకిడి పెరగడంతో వారు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. వీఐపీ, వీవీఐపీ పాసులు లేవు లేవంటూనే విచ్చలవిడిగా పలువురు ప్రజాప్రతినిధులు ‘వీవీఐపీ’ స్టిక్కర్లతో రెండు మూడు కార్లలో అనుచరులతో గద్దెల సమీపం వరకు వెళ్లారు. దీంతో భక్తులు గంట నుంచి రెండు గంటలపాటు ఇబ్బంది పడ్డారు. తరచూ సైరన్, కాన్వాయ్లతో వీవీఐపీలు పర్యటించిన సందర్భంగా ఇబ్బందిపడిన భక్తులు ఇద్దరు ప్రజాప్రతినిధుల వాహనాలను అడ్డుకుని నిలదీశారు.మేడారం దారిలో ట్రాఫిక్ జామ్.. మేడారం నుంచి తాడ్వాయి, పస్రాలకు వెళ్లే రెండు మార్గాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యింది. మేడారం నుంచి తాడ్వాయి వెళ్లే అటవీ మార్గంలో సుమారు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మేడారం నుంచి నార్లాపూర్ చింతల్క్రాస్ నుంచి పస్రాకు, నార్లాపూర్ చెక్పోస్టు నుంచి కాల్వపల్లి, కాటారం, మహదేవపూర్, మంథని, నార్లాపూర్ నుంచి బయ్యక్కపేట మీదుగా భూపాలపల్లి మార్గాలలో ప్రైవేట్ వాహనాలు ఇష్టారాజ్యంగా ఎదురెదురు కావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు శ్రమించి క్లియర్ చేశారు.నేడు దేవతల వనప్రవేశంవన దేవతల దర్శనం అనంతరం శుక్రవారం రాత్రి నుంచి భక్తులు తిరుగు ప్రయాణం అయ్యారు. మధ్యాహ్నం నుంచే దర్శనం కోసం బారులు దీరిన భక్తులు మొక్కులు సమర్పించుకుంటూ వెనుదిరగడం కనిపించింది. జాతరకు ముందుగా వచ్చి మేడారం చుట్టూ గ్రామాల శివారుల్లో టెంట్లు వేసుకుని, అద్దె గృహాలు, గుడారాల్లో బస చేసిన వీరు.. దర్శనం తర్వాత తరలివెళ్లిపోతుండడంతో ఆ ప్రాంతాలు ఖాళీ అవుతున్నాయి. ఇదిలా ఉండగా సమ్మక్క–సారలమ్మలు శనివారం సాయంత్రం వనప్రవేశం చేయనున్నారు. అడవిలో ఉండే వన దేవతలు జనంలోకి వచ్చి నాలుగు రోజులు మొక్కులు అందుకున్నారు. ఆదివాసీ సంప్రదాయాలతో పూజారులు వనదేవతలను నేటి సాయంత్రం వనంలోకి తీసుకెళ్లనున్నారు. మేడా రం గద్దెలపై ఉండే సమ్మక్క, సారలమ్మలు వనంలోకి.. గోవిందరాజులు, పగిడిద్దరాజును వారి వారి స్థలాలకు తీసుకెళ్లనున్నారు. -
"లక్షలాది ప్రయాణికులను సురక్షితంగా చేరుస్తున్నాం"
సాక్షి ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకొని తిరిగి గమ్యస్థానాలకు వెళ్తున్న భక్తులకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేర్చడానికి ఆర్టీసీ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీ నుండి అధికారులు కింది స్థాయి సిబ్బంది సైతం క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.ఈ సందర్భంగా మేడారంలో భక్తుల రద్దీ ఆర్టీసీ బస్ స్టేషన్ లో అధిక రద్దీ కారణంగా క్యూలైన్ లలో ప్రయాణికులు ఇబ్బందులపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి సీతక్క తో పాటు డీజీపీ,ఆర్టీసీ ఎండీ ,జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎస్పీ తో మాట్లాడారు. ప్రస్తుతం మేడారంలో ఉన్న పరిస్తితి పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రయాణికులను మేడారం తీసుకొస్తున్న బస్సులు కొద్దిసేపు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం వల్ల మేడారం బస్ స్టేషన్ లో గమ్యస్థానాలకు వెళ్ళే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయని ఈ సందర్భంగా మంత్రికి పోలీసులు సూచించారు. దీంతో వెంటనే వాటిని క్లియర్ చేసి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేయాలని క్లియరెన్స్ చేస్తూ వాహనాల వేగాన్ని పెంచాలని ఈ సందర్భంగా మంత్రి వారికి సూచించారు. -
జయహో జగజ్జనని మేడారంలో గద్దెకు చేరిన సమ్మక్క
● 7.13 గంటలకు మూడోసారి కాల్పులు● 7.14 గంటలకు నాలుగోసారి కాల్పులు ● 7.33 గంటలకు ప్రధాన గేటు దాటి అమ్మవారు బయటకు రాక ● 7.52 గంటలకు ఎదురుకోళ్ల మండపం చేరిక ● 8.29 గంటలకు సమ్మక్క గుడి చేరిక ● 9.47 గంటలకు ప్రధాన ద్వారం వద్దకు రాక ● 9.58 గంటలకు గద్దైపె సమ్మక్క ప్రతిష్ఠాపన వెన్నెల వెల్లివిరిసిన వేళ.. కుంకుమ భరిణె వెలిసింది. లక్షల నయనాల నిరీక్షణల నడుమ.. చిలకలగుట్ట చిందులు వేసింది. గాల్లో పేలిన తూటాల సాక్షిగా మనస్సు ఉప్పొంగింది. దారులన్నీ రంగులు రంగరించుకుంటుంటే.. ఇసుకేస్తే రాలనంత జనం జయజయధ్వానాలు పలికారు. డోలు వాయిద్యాలు.. బూరకొమ్ముల శబ్దాలు తల్లిని కీర్తించగా.. రోప్ పార్టీ వెంట సాహో.. సమ్మక్క నినాదాలు హోరెత్తాయి. అవనినేలే తల్లి ఆసీనురాలవ్వగా.. ధరణి పూల వనమై పులకించిపోయింది. ● జాతరలో మహాఘట్టం ఆవిష్కృతం ● అడుగుడుగునా భక్తుల నీరాజనాలు ● గద్దెలపై కొలువైన నలుగురు దేవతలు ● నేడు మొక్కులు సమర్పించనున్న భక్తులు మేడారం(ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం): మేడారం మహాజాతరలో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. చిలకలగుట్ట నుంచి కల్పవల్లి సమ్మక్క తల్లి వస్తుండగా జై సమ్మక్క అంటూ భక్తుల నినాదాలు హోరెత్తాయి.. గద్దెల వరకు నీరాజనాలు పలికారు. గుట్ట దిగి సమ్మక్క తల్లిని పూజారులు డోలు వాయిద్యాలు, బూరకొమ్ముల శబ్దాలతో తీసుకొచ్చి గద్దైపె ప్రతిష్ఠించారు. గుట్టపై రహస్య పూజలు.. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి వద్ద పూజాసామగ్రి, పసుపు, కుంకుమ, కంకనాలు, అమ్మవారికి కావాల్సిన వస్త్రాలను తీసుకొని పూజారులు గుట్టపైకి వెళ్లారు. అమ్మవారిని తీసుకొచ్చే పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు మరో నలుగురు పూజారులు కలిసి సమ్మక్క కొలువై ఉన్న రహస్య స్థావరం వద్దకు చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి కొన్ని గంటల పాటు రహస్య పూజలు చేశారు. కృష్ణయ్య కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను తీసుకొని గుట్టదిగే మధ్యలో మరికొంతమంది పూజారులు కలిసి గుట్టదిగారు. అధికారికంగా తుపాకీతో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గాల్లోకి నాలుగు సార్లు కాల్పులు జరిపి అమ్మవారికి గౌరవ వందనం సమర్పించారు. చిలకలగుట్ట దారిమధ్యలో ఉన్న ఎదురుకోళ్ల పూజా మందిరానికి అమ్మవారిని తీసుకెళ్లి పూజారులు విశ్రాంతి తీసుకుని బయల్దేరారు. అక్కడి నుంచి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కలెక్టర్ దివాకర టీఎస్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, జాతర చైర్పర్సన్ ఇర్ప సుకన్య, అధికారులు కలిసి అమ్మవారిని గద్దె వరకు తీసుకొచ్చారు. చిలకలగుట్ట వద్ద మంత్రి సీతక్కతోపాటు పలువురు మంత్రులు, అధికారులు, ఆదివాసీలు నృత్యాలు చేశారు. హరివిల్లు.. చిలకలగుట్ట దారి సమ్మక్కకు స్వాగతం పలికేందుకు మహిళలు దారిలో రంగు రంగులముగ్గులు వేశారు. అమ్మవారికి యాటపోతులు, కోళ్లు, కొబ్బరికాయలు కొట్టి స్వాగతించారు. చెట్టు, పుట్ట, గుట్టలు, ఎత్తయిన భవనాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తల్లి రాకను తిలకించారు. మూడుసార్లు లైట్ల ఆర్పివేత.. గద్దైపె సమ్మక్కను ప్రతిష్ఠించిన సమయంలో మూడుసార్లు హైమాస్ట్ లైట్లను ఆర్పివేశారు. పూజారులు గద్దైపెన అమ్మవారిని ప్రతిష్ఠించి గౌరవ వందనాన్ని సమర్పించారు. ఇదేక్రమంలో ఫొటోలు, డ్రోన్లు తిరగకుండా నిషేధం విధించారు. సమ్మక్క రాకకు ముందు గద్దైపె ఉన్న బంగారం, కానుకలను తీసుకెళ్లేందుకు గ్రామస్తులు పోటీ పడ్డారు. ఈ ఆచారం అనాదిగా వస్తోందని పూజారులు తెలిపారు. నలుగురు వనదేవతలకు పూజలు.. సమ్మక్కను గద్దైపె ప్రతిష్ఠించడంతో నలుగురు వనదేవతలు కొలువుదీరారు. ఈఓ వీరస్వామి, ఎండోమెంట్ అధికారులతో కలిసి ముందుగా మంత్రులు అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఆ తర్వాత దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇచ్చారు. సమ్మక్కను గద్దైపె ప్రతిష్ఠించిన అనంతరం పూజలు చేస్తున్న పూజారులు, ఆదివాసీ యువత, అధికారులుమేడారం(ఏటూరునాగారం): సమ్మక్క–సారలమ్మ గద్దెలపై ఉన్న బంగారం(బెల్లం) తీసుకునేందుకు భక్తులు అనేక పాట్లు పడుతున్నారు. గురువారం భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో బంగారం పంపిణీ సకాలంలో జరగలేదు. దీంతో బంగారం దక్కించుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. గ్రిల్స్ నుంచి లోపలికి చేతులు చాపి బంగారం ఇవ్వండి అంటూ వలంటీర్లను కోరారు.ములుగు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు నేటితో గడువు ముగియనుంది. బుధవారం 4 నామినేషన్లు దాఖలు కాగా గురువారం 61 నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా ఇప్పటి వరకు 64 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నేడు(శుక్రవారం) చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. గురువారం 1వ వార్డులో ఒక నామినేషన్ రాగా 2వ వార్డులో 3, 3వ వార్డులో 2, 4వ వార్డులో 3, 5వ వార్డులో 3, 6వ వార్డులో 2, 7వ వార్డులో 9, 8వ వార్డులో 2, 9వ వార్డులో 5, 10 వ వార్డులో 1, 11వ వార్డులో 3, 12వ వార్డులో 1, 13వ వార్డులో 4, 14వ వార్డులో 2, 15 వార్డులో 3, 16వ వార్డులో 3, 17వ వార్డులో 5, 18వ వార్డు 1, 19వ వార్డులో 5, 20 వార్డులో 6 నామినేషన్లు దాఖలు అయినట్లు మున్సిపల్ కమిషనర్ రమేశ్ తెలిపారు.● బస్టాండ్ నుంచి జంపన్నవాగుకు రూ.50 నుంచి 100 మేడారం(కన్నాయిగూడెం): మేడారం మహాజాతరలో బస్టాండ్ నుంచి జంపన్నవాగుకు నడిచే ఆటోలకు ఫుల్ డిమాండ్ ఉంది. బస్సులో వచ్చిన భక్తులను ఒకరికి రూ.50 నుంచి 100 కిరాయి మాట్లాడుకుని జంపన్నవాగు వద్ద దింపుతున్నారు. కుబుంబ సమేతంగా జాతరకు వచ్చిన భక్తులు ఆటోల్లో జంపన్నవాగుకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి తల్లులను దర్శనం చేసుకుంటున్నారు.మేడారం(మంగపేట): మహాజాతరకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా మేడారం తరలివచ్చిన భక్తులు మేడారం ఊరట్టం, రెడ్డిగూడెం, కన్నెపల్లి, చిలకలగుట్ట లాంటి తదితర ప్రాంతాల్లో మూడురోజులుగా గుడారాలు, కంకవనాల కింద విడిది చేశారు. ఈ మేరకు సమ్మక్క తల్లి గురువారం గద్దెకు చేరడంతో పరవశించిన భక్తజనం అత్యంత భక్తిశ్రద్ధలతో వరాల తల్లికి ఎత్తు బెల్లం(బంగారం), పసుపు, కుంకుమ సమర్పించి, యాటల మొక్కులు చెల్లించారు. తమ కోర్కెలు నెరవేరాలని కోరుకున్నారు. సాయంత్రం 5.30 గంటలకు సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు పూజారులు చిలకలగుట్ట మీదకు వెళ్లారు. 6.45 గంటలకు ములుగు ఎస్పీ సుధీర్రామ్నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపారు. రాత్రి 7.12 గంటలకు గేటు వద్ద కాల్పులు పోటెత్తిన భక్తజనం మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు గురువారం భక్తులు పోటెత్తారు. జంపన్నవాగు, గద్దెల ప్రాంగణం, చిలకలగుట్ట పరిసర ప్రాంతాలు ఎటుచూసినా జనం కిక్కిరిశారు. కుటుంబ సమేతంగా మేడారానికి వచ్చిన వారు తప్పిపోకుండా ఉండేందుకు కర్రలకు జెండాలు, బెలూన్స్, వాటర్ బాటిళ్లను గుర్తుగా పెట్టుకొని ముందుకు సాగారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించే క్రమంలో శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. ఉహించని విధంగా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. వనదేవతల గద్దెల ప్రాంగణం భక్తులు సమర్పించిన బంగారంతో కళకళలాడింది. సమ్మక్క రాకముందు ప్రత్యేక పూజలు.. చిలకలగుట్ట పైనుంచి సమ్మక్కతల్లి గురువారం రాత్రి కొలువుదీరడానికి ముందు సమ్మక్క పూజారులు తల్లి గద్దైపె ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమ్మక్క గుడి నుంచి సమ్మక్క దేవతను తీసుకొచ్చే ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, దూప వడ్డె దొబె నాగేశ్వర్రావు, జలకం వడ్డె మల్యెల సత్యంతోపాటు పూజారులు కలిసి సమ్మక్క వడెరాలు, పసుపు, కుంకుమలను తీసుకుని డోలు వాయిద్యాలు, బూరకొమ్ముల శబ్దాల నడుమ గద్దైపెకి వె ళ్లి పూజలు చేశారు. సమ్మక్క గద్దైపె కంకవనం ప్రతిష్ఠమేడారంలోని జెండాగుట్ట నుంచి సమ్మక్క పూజారులు కంకవనాన్ని తీసుకొచ్చి గురువారం ఉదయం పది గంటలకు గద్దైపె ప్రతిష్ఠించారు. మొదట జెండాగుట్టలో పూజారులు కంకవనానికి పూజలు నిర్వహించారు. కర్రలతో కంకవనాన్ని బందోబస్తు మధ్య గద్దె వద్దకు తీసుకొస్తున్న సమయంలో ఆడపడుచులు ఎదురెళ్లి పూజారుల పాదాలకు నీళ్లు ఆరగించి హారతి పట్టారు. తల్లి వచ్చే దారిలో చిలకలగుట్ట వద్ద ఆనవాయితీగా కింద కూర్చొని పైకి లేచి నమస్కరించారు. గద్దె వద్దకు చేరుకున్న పూజారులు ముందుగా గద్దె పక్కనే ఉన్న రహస్య పూజా మందిరంలోకి పూజలు చేశారు. అనంతరం గద్దైపె ప్రతిష్ఠించారు. ఈ సమయంలో భక్తులను గద్దెలపైకి రాకుండా పోలీసులు అదుపు చేశారు. సారలమ్మ గద్దె వద్ద పూజలు నిర్వహించారు. ఈ వనమహోత్సవానికి మంత్రి సీతక్క హాజరై పూజారులతో కలిసి గద్దైపెకి వచ్చారు. గద్దెలపై నలుగురు వనదేవతలు కొలువుదీరడంతో నేడు (శుక్రవారం) భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని దర్శించుకుంటారు. తీరొక్క మొక్కులు చెల్లించి ఆశీర్వాదాన్ని పొందుతారు. ఇప్పటికే కోటి మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. శనివారం సమ్మక్క, సారలమ్మ వనప్రవేశం చేస్తారు. -
మేడారంలో మద్యం దందా!
మేడారం ( ములుగు/కాళేశ్వరం): మేడారం జాతరకు తరలివచ్చే భక్తుల అవసరాలను మద్యం వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల నుంచి నకిలీ మద్యాన్ని భారీ మొత్తంలో డంప్ చేసి దందా సాగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బుధ, గురువారాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో మద్యం రేట్లను అమాంతం పెంచారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ భక్తుల జేబులకు చిల్లుపెడుతున్నా సంబంధిత ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో చిన్నపాటి బెల్ట్షాపులపై దాడులు చేసి కేసులు పెట్టే అధికారులు మేడారం జాతరలో నకిలీ మద్యం దందా సాగిస్తున్న షాపులవైపు కన్నెత్తి చూడడం లేదు. మేడారం జాతర పేరుపై మద్యం వ్యాపారులు ఎకై ్సజ్ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు అప్పజెప్పినట్లు విమర్శలు వస్తున్నాయి. జాతరలో కేఎఫ్ లైట్బీర్ రూ. 270 (అసలు ధర రూ.180), స్ట్రాంగ్ బీర్ రూ. 270(అసలు ధర రూ.190), బడ్వైజర్ రూ.300(అసలు ధర 200), రాయల్స్టాగ్ రూ. క్వార్టర్ 300(అసలు ధర 220), బ్లెండర్స్ప్రైడ్ రూ. 420 (అసలు ధర 360) ఇలా రెట్టింపు ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. లైసెన్స్లు నామమాత్రంగా తీసుకొని వందల సంఖ్యలో మద్యం దుకాణాలు వెలియడంతో భక్తులు ఽఅధిక ధరలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై భూపాలపల్లి ఎ కై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. ధరలు పెంచి విక్రయిస్తున్న వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ మద్యం డంప్ -
విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు
మేడారం(ములుగు/హన్మకొండ): మేడారం జాతరలో విద్యుత్ ప్రమాదాల నివారణకు లైన్లకు స్పేసర్ అమర్చినట్లు టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్రావు, టి.మధుసూదన్ తెలిపారు. గురువారం మేడారంలో వారు విద్యుత్ సరఫరాను పర్యవేక్షించి మాట్లాడారు. చీఫ్ ఇంజనీర్లు కె.రాజుచౌహాన్, అశోక్ పర్యవేక్షణలో నలుగురు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఏడుగురు డివిజన్ ఇంజనీర్లు, 30 మంది అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్లు 150, 500 మంది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. భద్రతలో భాగంగా ట్రాన్స్ఫార్మర్లకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశామన్నారు. శాశ్వత ప్రాతిపదికన జంపన్న వాగు ఇరువైపులా 6 టవర్లు ఏర్పాటు చేశామన్నారు. నిరంతరం ట్రాన్స్ఫార్మర్ల వద్ద సిబ్బంది లోడ్ తనిఖీ చేస్తున్నారని, ఎక్కడ ఎటువంటి సమస్య తలెత్తినా రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వెంటనే సమాచారం కంట్రోల్ రూంకు చేరవేస్తుందని పేర్కొన్నారు.టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్రావు, టి.మధుసూదన్ -
జన సంద్రంగా మారిన మేడారం.. పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతర నేపథ్యంతో ఆ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. శుక్రవారం వేకువ జామున సమక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు భక్త జనం పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో వేలాది వాహనాలు తరలి వస్తుండగా.. కిలోమీటర్ల మేరన ట్రాఫిక్ జామ్ అయ్యింది. మేడారం వీధులన్నీ సమక్క, సారలమ్మ నామఃస్మరణలతో మారుమోగుతోంది. తమను, తమవాళ్లను చల్లంగా చూడాలంటూ వన దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకోంటున్నారు. రేపు సాయంత్రం సమ్మక్క, సారలమ్మల వన ప్రవేశంతో జాతర ముగియనుంది. ఈ నేపథ్యంలోఈ రెండ్రోజుల్లో లక్షల మంది జాతరకు పోటెత్తే అవకాశం కనిపిస్తోంది. వీఐపీల తాకిడి..మేడారం మహాజాతరకు వీఐపీల తాకిడి పెరిగింది. రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తులాభారం వేసి తల్లులకు నిలువెత్తు బంగారం(బెల్లం) పంచిపెడుతున్నారు. తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.పోలీసుల ఓవర్ యాక్షన్వీఐపీ భద్రత పేరుతో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఉదయం నుంచి స్పెషల్ గేట్ ద్వారా వందలాది పోలీసులు సమ్మక్క- సారలమ్మ గద్దెల వైపు వస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు తల్లుల దర్శనం కావడం లేదు. గద్దెల ప్రాంగణమంతా పోలీసులే ఉండడంతో.. అడ్డు తొలగాలని స్థానిక అధికారులు పదే పదే మైకుల్లో చెప్తున్నారు. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదు. వీఐపీలు అరకోరగా వస్తున్నప్పటికీ.. వాళ్ల భద్రత పేరిట పోలీసులు అతికి దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సమ్మక్క తల్లి నామస్మరణతో..చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్కను తీసుకువచ్చే జాతర ప్రధాన ఘట్టం గురువారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమై.. రాత్రి 9:58గంటలకు గద్దెపై సమ్మక్క తల్లిని ప్రతిష్ఠించే వరకు ఉద్విగ్నభరితంగా సాగింది. అడవి తల్లి రాక కోసం భక్తులంతా కన్నార్పకుండా చిలకలగుట్ట వైపు చూశారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కతల్లిని చేతపట్టుకున్న మరుక్షణమే సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య తన్మయత్వంతో ఒక్క ఉదుటున గుట్ట దిగారు. మిగిలిన పూజారులు కృష్ణయ్యను తోడ్కొని వచ్చారు. సమ్మక్క రాకకు సూచనగా, అధికారిక లాంఛనాల ప్రకారం ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఏకే–47 తుపాకీతో 4 విడతలుగా గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క రాకను సూచించే ఈ శబ్దంతో ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క తల్లి నామస్మరణతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. -
మేడారంలో కేంద్రమంత్రుల పూజలు.. రాష్ట్ర మంత్రుల వినతి ఇదే..
సాక్షి, మేడారం: మేడారం మహాజాతరలో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. సమక్క నేడు వనం నుండి జనం మధ్యకు రానుంది. తల్లి రాక సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. మరోవైపు.. మేడారానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేంద్రమంత్రులు కూడా మేడారం జాతరలో పాల్గొన్నారు.మేడారం మహా జాతరలో కేంద్ర మంత్రులు జుయల్ ఓరమ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సారలమ్మని దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించారు. మరోవైపు.. రాష్ట్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు పొంగులేటి, సీతక్క, లక్ష్మణ్ కూడా మేడారంలో అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర మంత్రులు జుయల్ ఓరమ్, కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు వినతిపత్రం సమర్పించారు.ఇదిలాఉండగా.. మేడారం జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఈరోజు ఆవిష్కృతం కానుంది.. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం చిలకలగుట్టపై పూజలు నిర్వహించి అక్కడినుండి గద్దెల పైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. సారలమ్మను కాక వంశీయుల చేతుల మీదుగా తీసుకురాగా.. సమ్మక్కను సిద్దబోయిన వంశీయుల చేతుల మీదుగా గద్దెల పైకి తీసుకొస్తారని తెలిసిందే. ఈ కార్యక్రమంలో చందా వంశీయులు, ఐదు వంశస్తులు, మేడారం గ్రామస్తులతో పాటు ఆదివాసీలు అంతా పాల్గొని డోలి వాయిద్యాలు, ఆదివాసి ఆచార సంప్రదాయాలతో సమ్మక్కను ఉత్సాహంగా, ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు.సమ్మక్క రాక సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ 10 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి అధికారిక లాంచనాలతో స్వాగతం పలకడం ఇక్కడ ఆనవాయితీ. జిల్లా కలెక్టర్ ఎదురెళ్లి సమ్మక్క పూజారులకు పట్టు వస్త్రాలు సమర్పించి వారికి స్వాగతం పలుకుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా డిప్యుటీ సీఎం భట్టి మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పూజారులకు స్వాగతం పలుకుతారు. సమ్మక్క ఆగమనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. స్థానిక మంత్రి సీతక్క అన్నీ తానై జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
మేడారం జాతరలో నేడు కీలక ఘట్టం
రెండేళ్లకొకసారి.. లక్షలాదిమంది భక్తులు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మేడారం మహాజాతరలో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. సమక్క నేడు వనం నుండి జనం మధ్యకు రానుంది. తల్లి రాక సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే గడియలు వచ్చేశాయి. నిన్న రాత్రి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనం పూర్తయ్యింది. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి కన్నేపల్లి నుంచి సారలమ్మ ను, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి గోవిందరాజు ప్రతిరూపాలను కాలి నగడకన తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మంత్రి సీతక్క, పొంగులేటి, అడ్లూరి లక్ష్మణ్ సారలమ్మకు స్వాగతం పలికారు.ఇక ఈ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఈరోజు ఆవిష్కృతం కానుంది.. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం చిలకలగుట్టపై పూజలు నిర్వహించి అక్కడినుండి గద్దెల పైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. సారలమ్మను కాక వంశీయుల చేతుల మీదుగా తీసుకురాగా.. సమ్మక్కను సిద్దబోయిన వంశీయుల చేతుల మీదుగా గద్దెల పైకి తీసుకొస్తారని తెలిసిందే. ఈ కార్యక్రమంలో చందా వంశీయులు, ఐదు వంశస్తులు, మేడారం గ్రామస్తులతో పాటు ఆదివాసీలు అంతా పాల్గొని డోలి వాయిద్యాలు, ఆదివాసి ఆచార సంప్రదాయాలతో సమ్మక్కను ఉత్సాహంగా, ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు..సమ్మక్క రాక సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ 10 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి అధికారిక లాంచనాలతో స్వాగతం పలకడం ఇక్కడ ఆనవాయితీ. జిల్లా కలెక్టర్ ఎదురెళ్లి సమ్మక్క పూజారులకు పట్టు వస్త్రాలు సమర్పించి వారికి స్వాగతం పలుకుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా డిప్యుటీ సీఎం భట్టి మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పూజారులకు స్వాగతం పలుకుతారు..సమ్మక్క ఆగమనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. స్థానిక మంత్రి సీతక్క అన్నీ తానై జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ సమ్మక్కను గద్దెల పైకి తీసుకు రావడం కోసం మూడంచెల పోలీసు భద్రతతో ప్రత్యేక రోప్ పార్టీని సిద్ధం చేశారు. ఇప్పటికే రెండుసార్లు మాక్ డ్రిల్ నిర్వహించారు.ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు లక్షలాదిమంది భక్తులు ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు.. ఇప్పటికే మేడారం పరిసరాలన్ని జనంతో కిక్కిరిసిపోయాయి. చుట్టూ పది కిలోమీటర్ల నిడివితో ఎటు చూసినా మేడారం వనం మొత్తం జనసంద్రంగా మారిపోయింది. వివిధ మార్గాల్లో మేడారం చేరుకున్న భక్తులంతా సమ్మక్క ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు.. సమ్మక్క - సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువు దీరిన తర్వాత మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రయాణం అవుతారు. -
మనం మురవంగా జనం కొలువంగా
మేడారం నుంచి సాక్షిప్రతినిధి, వరంగల్: కోట్లాది భక్తుల కొంగుబంగారం.. కోరిన కోర్కెలు తీర్చే వన దేవతలు..సబ్బండ జనాల ఆరాధ్యదైవాలు..సమ్మక్క–సారలమ్మల మహాజాతర అంగరంగవైభవంగా ప్రారంభమైంది. అశేష భక్తజన సందోహం నడుమ ములుగు జిల్లా మేడారంలో జయజయధ్వానాల భక్తినినాద హోరులో ఆధ్మాత్మిక ఘనసంరంభం మొదలైంది. బుధవారం సారలమ్మ ఆగమనం క్షణక్షణం అత్యంత ఉద్విగ్నభరితంగా సాగింది. భక్తుల పొర్లుదండాలు..శివసత్తుల పూనకాలు..కొమ్ము, బూర, డోలు వాయిద్యాల మధ్య సారలమ్మ తల్లి గద్దెను చేరడంతో భక్తజనం పులకించిపోయారు.కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడి నుంచి మొంటె (వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు. జంపన్నవాగులో నీటితో కాళ్లు కడుక్కుని అక్కడి నుంచి సమ్మక్క గుడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి పూజారులు ముగ్గురి రూపాలను రాత్రి మేడారం గద్దెలపై చేర్చారు. కన్నెపల్లి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మ వస్తున్న వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు పోటీపడ్డారు. కోరిన కోరికలు నెరవేర్చే వనదేవత సారలమ్మ మేడారం గద్దెపై కొలువుదీరారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు సారలమ్మతోనే గద్దెలపైకి చేరారు. జాతర తొలిరోజు ఆచారాల ప్రకారం కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత గద్దెపైకి రాకతో మహాజాతర అంకురార్పణ జరిగింది.ఆచారాల నడుమ ఆగమనం.. ఎదురేగిన భక్తజనం..ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం సారలమ్మ యేతేంచగా... అడుగడుగునా అశేషంగా తరలివచ్చిన భక్తజనం ఎదురేగారు. బుధవారం ఉదయం 11:00 నుంచి 12:00 గంటల మధ్య సమ్మక్క, సారలమ్మ పూజారులు గద్దెల వద్దకు చేరుకుని పుట్టమన్నుతో గద్దెలను అలికి శుద్ధి చేశారు. గొట్టు గోత్రాల ప్రకారం, ఆదివాసీ సంప్రదాయ పద్ధతుల్లో పీఠ ముగ్గులు వేసి అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీర సారెలను సమర్పించి ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 5.45 గంటల సమయంలో సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ మేడారంలోని సమ్మక్క గుడికి బయలుదేరారు. అప్పటికే అక్కడికి చేరుకున్న గోవిందరాజు, పగిడిద్దరాజులు సారలమ్మతో కలిసి గుడికి వెళ్లారు. సారలమ్మ పూజారులు గుడిలో సారలమ్మ పీఠం పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు నిర్వహించారు. సమ్మక్క పూజారులు కూడా కట్టడి పూజలు చేశారు. అనంతరం మాఘ శుద్ధ పౌర్ణమి వెన్నెలలో సమ్మక్క అమ్మవారు, పగిడిద్దరాజులకు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం కల్యాణ మహోత్సవం నిర్వహించారు. తదనంతరం తల్లి అనుమతి తీసుకున్న సారలమ్మతో పాటు గద్దెలకు చేరిన గోవిందరాజు, పగిడిద్దరాజులను పూజారులు గద్దెలపై ప్రతిష్టించారు. ఈ సమయంలో దేవాదాయశాఖ అధికారులు పూజా కార్యక్రమాల సమయంలో విద్యుత్ దీపాలను ఆర్పివేయడంతో పూజారులు పూజా, ప్రతిష్ట క్రతువును పూర్తి చేశారు.వరంబట్టిన మహిళలు..కన్నెపల్లి నుంచి హనుమంతుడి రక్షా కవచం (నీడ)లో సారలమ్మ దేవత బయలుదేరి, రాత్రి మేడారం గద్దెలకు చేరుకున్నారు. కాగా సారలమ్మ గద్దె పైకి వస్తున్న సమయంలో ఎదురెళ్లి వరం పడితే సంతానభాగ్యం కలుగుతుందని, కోర్కెలు నెరవేరతాయని మహిళల నమ్మకం. ఈ సందర్భంగా సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను మొంటెలో తీసుకొస్తుండగా ఆలయం మెట్ల నుంచి వంద మీటర్ల పొడవునా భక్తులు కింద పడుకుని వరం పట్టారు. కాగా, సారలమ్మను తీసుకొస్తున్న పూజారులు వీరిపై దాటివెళ్లారు. సారలమ్మ గద్దెలకు రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ముబూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాయి ద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలుతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తిభావంతో ఉప్పొంగింది. కాగా ప్రభుత్వం తరఫున రాçష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క, ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.నృత్యం చేసిన మంత్రులురాçష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కన్నెపల్లి నుంచి మేడారం గద్దెల వరకు ఆద్యంతం ఊరేగింపులో పాల్గొన్నారు. మేడారం గద్దెల వద్ద మంత్రులు, అధికారులు కలిసి నృత్యం చేశారు. కాగా, రాత్రి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అమ్మ వారిని దర్శించుకున్నారు.నేడు సమ్మక్క తల్లి రాక..జాతరలో అత్యంత ప్రధాన ఘట్టం సమ్మక్క అమ్మవారు మేడారం గద్దెపైకి చేరడం. చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క ప్రతిమను తీసుకొచ్చే ప్రక్రియ గురువారం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల సమయంలో గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, మరికొందరు పూజారులు చిలకలగుట్టపై నుంచి కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను వెదురు బొంగులో భద్రపర్చుకుని తీసుకొస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆధ్వర్యంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గాలిలోకి కాల్పులు జరిపిన తర్వాత సమ్మక్క కుంకుమభరిణెతో పూజారులు బయల్దేరుతారు. ఆ సమయంలో భక్తులు... అమ్మవారు వచ్చే దారిలో పోటీపడి ఘన స్వాగతం పలుకుతారు. అదే సమయంలో సమ్మక్కకు ఎదురేగి కోళ్లు, మేకలతో మొక్కి బలిస్తారు. రాత్రి సమ్మక్కను ప్రతిష్టించాక భక్తుల మొక్కులు మొదలవుతాయి. శుక్రవారం నలుగురు వనదేవతలు గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు లక్షలాదిగా తరలివచ్చి తనివితీరా మొక్కులు చెల్లించుకుంటారు. -
Medaram Jathara: నాలుగురోజులుంటేనే మనసు నిమ్మలం!
మేడారం (ములుగు): ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు భక్తులు అమ్మవార్లపై ఉన్న అపార నమ్మకంతో వస్తుంటారు. కోరిన కోర్కెలు నెరవేర్చే సమ్మక్క–సారలమ్మ తల్లులకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అనాదిగా అమ్మవార్లపై ఎనలేని విశ్వాసాన్ని చూపుతూ రెండేళ్లకొకసారి జరిగే మహాజాతరకు కుటుంబసమేతంగా హాజరై తల్లుల చెంత నాలుగు రోజుల పాటు ఆధ్మాత్మిక సేద్యం చేస్తుంటారు. బుధవారం జాతరకు వచ్చి శనివారం సాయంత్రం దాక నాలుగు రోజులు ఇక్కడే గడుపుతారు. అవసరమైన ఆహార సామగ్రి, ఇతర వంట సరుకులు తెచ్చుకుంటారు. అమ్మవార్లు గద్దెలపై కొలువుదీరిన వెంటనే నిలువెత్తు బంగారాన్ని సమర్పించి కోరికలు నెరవేర్చినందుకు యాటలను, కోళ్లలను బలిచ్చి చల్లంగా చూడు తల్లి అంటూ వేడుకుంటారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చి సమ్మక్క–సారలమ్మను దర్శించుకుంటారు. మేడారం జాతర జరిగే నాలుగు రోజుల పాటు పౌర్ణమి వెలుగుల్లో గుడారాలు వేసుకొని సమ్మక్క తల్లిని వేడుకుంటారు. 30ఏళ్లుగా జాతరకొస్తున్నాం..అడవి బిడ్డలైన సమ్మక్క–సారలమ్మను భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. 1998 నుంచి ప్రతీ రెండేళ్లకొసారి మేడారం జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటాం. అమ్మవార్ల మహిమను, మహాత్మ్యాన్ని స్నేహితులకు కూడా తెలియజేయడంతో వారు కూడా మేడారం జాతరకు వస్తున్నారు. అమ్మవార్లను నమ్ముకుంటే అనుకున్న పని జరుగుతుందని స్నేహితులు కూడా చెప్పారు.– దామెర రాజు, సికింద్రాబాద్అమ్మవారి ఆశీస్సులతో బాబు పుట్టాడు..తల్లుల మహిమల గురించి విని జాతరకు వచ్చి పెళ్లి కావాలని అమ్మవార్లకు మొక్కులు చెల్లించాను. దీంతో మరుసటి జాతర వచ్చేలోపు వివాహం జరగడమే కాకుండా బాబు పుట్టాడు. దీంతో కుటుంబ సమేతంగా మేడా రం చేరుకొని బాబు పుట్టువెంట్రుకలను మేడారంలోనే తీశాం. 20 ఏళ్లుగా ప్రతీ మేడారం జాతరకు వస్తూ ఎన్ని ఇబ్బందులైనా నాలుగు రోజుల పాటు మేడారంలో ఉండి అమ్మవార్లు గద్దెల పైకి వచ్చిన తర్వాత మొక్కులు చెల్లిస్తున్నాం.– వెంకటగిరి కిశోర్బాబు, అమీర్పేట, హైదరాబాద్ నాలుగు రోజులు ఉంటం..16 ఏళ్లుగా మేడారం జాతరకు వస్తున్నాం. కష్టాలు తీర్చమని అమ్మవార్లను వేడుకుంటాం. కోరికలు నెరవేర్చాలని అమ్మవారికి పూజలు నిర్వహిస్తాం. కోరికలు నెరవేరిన వెంటనే అమ్మవార్లకు యాటపోతులను బలిస్తాం. ప్రతీ రెండేళ్లకు ఒకసారి మేడారానికి కుటుంబంతో కలిసి రావడం ఆనందంగా ఉంటుంది. జాతరలో సౌకర్యాలు ఉన్నా లేకున్నా..నాలుగు రోజు పాటు ఉండి అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లిస్తాం. సరిపడా వంట సరుకులు తెచ్చుకుంటాం. నాలుగు రోజులుంటేనే మనసు నిమ్మలంగా ఉంటుంది.– వరికుప్పల పుష్ప, పాలకుర్తి, జనగామఎటుచూసినా కోలాహలం..సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజు, తండ్రి పగిడిద్దరాజు ప్రతిమలను గద్దెలపైకి తీసుకురావడంతో మేడారం, కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు మొత్తం జనంతో నిండిపోయింది. మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తుల తాకిడితో సుమారు నాలుగైదు కిలోమీటర్ల పొడవునా దారులు కిక్కిరిసిపోయాయి. సారలమ్మ గద్దెపైకి రాగానే భక్తులు పరవశంతో దర్శనం కోసం ఒక్కసారిగా గద్దెల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఒకేసారి ఎక్కువ మంది రావడంతో తోపులాట జరిగింది. సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులుదీరుతున్నారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన క్యూలైన్లు సరిపోక రోడ్డుపై సైతం వరుసల్లో బారులు దీరారు. భక్తుల తాకిడి గంట గంటకు పెరగడంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. -
నామినేషన్ వేసేద్దాం!
ములుగు: మున్సిపల్ నగారా మోగడంతో పోటీకి సై అంటున్న ఆశావహుల్లో సందడి నెలకొంది. అధికారికంగా ఏ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించకున్నా.. తొలుత నామినేషన్ వేసి ఆపై బీఫామ్ కోసం ప్రయత్నం చేద్దామనే భావనతో పలువురు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల దాఖలుకు మూ డు రోజుల సమయమే ఇవ్వడంతో అందుకు అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.బలమైన వారికే..నామినేషన్ వేసినా పార్టీ నుంచి బీ ఫామ్ అందితేనే ఆ పార్టీ గుర్తు దక్కుతుంది. దీంతో తొలుత నామినేషన్ వేయడానికి ఆశావహులు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఏ వార్డుల్లో ఎవరు పార్టీ అభ్యర్థి అనేది నామినేషన్ల ఉపసంహరణతోనే తేలనుంది. దీంతో తొలుత నామినేషన్ వేద్దాం.. ఆపై చివరి వరకు బీ ఫామ్ కో సం ప్రయత్నాలు చేయాలనే ఆలోచనలో పలువురు ఉన్నారు. ఇప్పటికే వార్డుల వారీగా బలమైన అభ్యర్థులు ఎవరన్నది కాంగ్రెస్ పార్టీ సర్వే చేయించినట్లు తెలిసింది. ఈ సర్వేల ప్రకారమే అంగ, ఆర్థిక, జనబలం ఉన్న వారికి బీ ఫామ్ ఇవ్వనున్నట్లు సమాచారం. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. దీంతో బలం ఉందనుకునే వారినే బరిలోకి దింపేలా సిద్ధమవుతోంది. బలం లేని చోట పొత్తు కలిసొచ్చే పార్టీలకు సీట్లు కేటాయించేలా చర్చలు చేస్తోంది.కలిసొస్తే ప్రచారం..షెడ్యూల్ విడుదలైన తెల్లారి నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలుకావడంతో అభ్యర్థులను ఎంపిక కోసం పార్టీలకు సమయం లేనట్లే. అంతే కాక మూడు రోజులే నామినేషన్లు స్వీకరించనున్నారు. మొదటిరోజే పార్టీ బీ ఫామ్తో నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు 12 రోజుల పాటు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. అందుకే పార్టీలు కూడా అభ్యర్థులను త్వరగా నిర్ణయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇదేసమయాన టికెట్ రాని ఆశావహులకు నచ్చజెప్పేందుకు కూడా సిద్ధమవుతున్నారు.అంతా వారం లోగానే..ఈ నెల 28(బుధవారం) నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ, ఆ తర్వాత పరిశీలన, అభ్యంతరాలు, ఉపసంహరణల ప్రక్రియ ఉంటుంది. వచ్చే నెల 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అప్పటి వరకు బీ ఫామ్ ఇచ్చే అవకాశం ఉన్నందున పార్టీలు తేల్చేవరకు అభ్యర్థి ఎవరో వేచి చూడక తప్పదు. మొత్తంగా వారం లోపలే ప్రక్రియ ముగియనుండడంతో పార్టీలకు సవాల్గా మారనుంది. ఆశావహులు ఎక్కువ మంది నామినేషన్ వేస్తే.. వీరిలో పార్టీ అభ్యర్థిని తేల్చడం, మిగతా వారిని బుజ్జగించి ఉపసంహరింపజేయడం కత్తిమీద సాములా మారే అవకాశం ఉంది.తొలిరోజు నాలుగు నామినేషన్లుములుగు మున్సిపాలిటీకి తొలిరోజు 4 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ రమేశ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో 20 వార్డులు ఉండగా ఏడు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మూడు వార్డులను కలిపి ఒక నామినేషన్ కేంద్రం చొప్పున, 18 వార్డులకు 6 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరో రెండు వార్డులకు ఒక నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 8,9,16,19 వార్డులకు ఒకటి చొప్పున నామినేషన్ దాఖలు అయినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. -
అమ్మవార్లకు మొక్కలు
ములుగు: మేడారం సమ్మక్క– సారలమ్మ దేవతలను భక్తులు క్యూలైన్లలో వెళ్లి దర్శించుకుంటున్నారు. మహాజాతర సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం మూడు వైపులా క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. గద్దెలను విస్తరించిన క్రమంలో ఈసారి మేడారంలో తక్కువ సమయంలో వనదేవతల దర్శనం జరుగుతోందని భక్తులు పేర్కొంటున్నారు. భక్తుల రద్దీ ఉన్నప్పటికీ ఎక్క డా తొక్కిసలాటలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సారి క్యూలైన్ల వద్ద భక్తులకు తాగునీటి వసతి కల్పించారు. క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసిన క్యూలైన్లపై పోలీసులు, వలంటీర్ల నిరంతరం మార్గనిర్దేశం చేయడంతో వనదేవతల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. గత జాతరలతో పోలిస్తే ఈ సారి అమ్మవార్లను దర్శించుకోవడం కొంచెం సులభంగా మారింది. -
మేడారం జాతరలో విషాదం
ములుగు: మేడారంలో విషాదం చోటు చేసుకుంది. జంపన్నవాగులో పడి భక్తుడు మృతి చెందాడు. మృతుడు మంచిర్యాలకు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు భూపాలపల్లి జిల్లాలో మేడారం జాతరకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో తల్లి, కుమార్తె మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడిన భక్తుల్ని ఆస్పత్రికి తరలించారు.భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం బోర్లగూడెం గ్రామం సమీపంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లేందుకు ఒక ట్రాక్టర్లో 25 మందికి పైగా భక్తులు ప్రయాణిస్తున్నారు. ట్రాక్టర్ నియంత్రణ కోల్పోయి బోల్తా పడటంతో తల్లి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం.మెదారం జాతరకు ప్రతి రెండేళ్లకోసారి లక్షలాది మంది భక్తులు తరలివెళ్తారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, వ్యక్తిగత వాహనాల్లో బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ట్రాక్టర్లో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని, వాహనాల్లో అధిక సంఖ్యలో ప్రయాణించరాదని అధికారులు సూచించారు. -
బస్సు ఎక్కడ దిగినా మొత్తం ఛార్జీ చెల్లించాల్సిందే..
ములుగు జిల్లా: మేడారం జాతర సందర్భంగా టీజీ ఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అయితే నిర్ధారించిన స్థానం నుంచి గమ్య స్థానం వరకు ఒకే ధర నిర్ణయించారు. దీంతో ప్రయాణికులు బస్సు ఎక్కిన ప్రదేశం నుంచి దిగే స్థానం వరకు మధ్యలో ఎక్కడ దిగినా టికెట్కు మొత్తం ధర చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు ఏటూరునాగారం– వెంకటాపురం(కె) మేడారం స్పెషల్ బస్సు ఏటూరునాగారంలో ఎక్కి వాజేడు మండలంలోని ఏ గ్రామంలో దిగినా వెంకటాపురం(కె) చార్జీ చెల్లించాల్సి వస్తోంది.సాధారణం ఈ రెండు ప్రాంతాల మధ్య చార్జీ రూ.30 ఉంటుంది. కానీ రూ.100 వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఇంత చార్జీ ఎలా చెల్లించాలని కండక్టర్ను నిలదీస్తున్నారు. ఈ కొద్ది దూరానికే ఇంత చార్జీ ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. అయితే కండక్టర్ మాత్రం తామ చేసేది ఏమీ లేదని పైనుంచే చార్జీలు నిర్ధారణ అయి వచ్చాయని చెబుతున్నారు. -
వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్య
గంగారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లకు చెందిన పగిడిద్ద రాజు పెళ్లి కొడుకయ్యాడు. సమ్మక్కను వివాహం చేసుకునేందుకు జిల్లాలోని ఎస్ఎస్తాడ్వాయి మండలం మేడారానికి మంగళవారం బయలుదేరి వెళ్లాడు. ఈ మేరకు పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో వడ్డెలు గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి కల్తీ జగ్గారావు, పూజారులు పడిగను పట్టుకొని తరలివెళ్లారు. పగిడిద్దరాజు గ్రామం దాటే వరకు మహిళలు నీళ్లు ఆరబోశారు. వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్యా అంటూ భక్తులు మొక్కులు చెల్లించారు. 70 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెనక సాంబయ్య ఇంట్లో రాత్రి బసచేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు మేడారంలోని గద్దెకు చేరుకుంటారు. సమ్మక్కతో వివాహం అనంతరం జాతర తర్వాత పగిడిద్దరాజు తిరిగి పూనుగొండ్లకు చేరుకుంటారు. రెండురోజుల అనంతరం మరుబెల్లి జాతరను పూనుగొండ్లలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ మొక్కులు చెల్లిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని గిరిజనులు, గిరిజనేతరుల నమ్మకం. పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయం వద్ద గిరిజన యువకులు వలంటీర్లుగా పనిచేశారు. మంత్రి ధనసరి సీతక్క ,మేడారం ట్రస్ట్బోర్డు చైర్పర్సన్ సుకన్య, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు వినయ్, సూర్యప్రకాశ్, ఎస్సై రవికుమార్, రాజ్కుమార్, ఎండోమెంట్ ఈఓ వీరస్వామి, రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ నారాయణరెడ్డి పూజలు చేశారు. -
అంకెల్లో మేడారం
మహా జాతరకు భారీ ఏర్పాట్లుఫైర్ బ్రిగేడ్ వాహనాలు: 15ఫైర్ ఫైటర్లు: 268కమ్యూనికేషన్ – టెక్నాలజీశాశ్వత మొబైల్ టవర్లు: 27తాత్కాలిక మొబైల్ టవర్లు: 33వీహెచ్ఎఫ్ సెట్లు: 450తాగునీటి నల్లాలు: 5,482జంపన్నవాగు వద్ద డ్రెస్సింగ్ రూములు: 119పార్కింగ్ స్థలాలు: 42మొత్తం విస్తీర్ణం: 1,418 ఎకరాలు టీజీఎస్ఆర్టీసీ బస్సులు: 4,000మొత్తం ట్రిప్పులు: 51,000ఆర్టీసీ సిబ్బంది: 10,441వైద్య సిబ్బంది: 5,192అంబులెన్సులు: 30 బైక్ అంబులెన్సులు: 40 ప్రధాన ఆస్పత్రి: 50 పడకలు రోజుకు మెడికల్ క్యాంపులు: 30ట్రాన్స్ఫార్మర్లు: 196విద్యుత్ స్తంభాలు: 911విద్యుత్ లైన్లు: 65.75 కి.మీ విద్యుత్ సిబ్బంది: 350 డీజిల్ జనరేటర్లు (బ్యాకప్): 28బ్లాకులు: 285టాయిలెట్లు: 5,700గజ ఈతగాళ్లు: 210సింగరేణి రెస్క్యూ: 12ఎస్డీఆర్ఎఫ్ బృందాలు: 100– ములుగుపారిశుద్ధ్య సిబ్బంది: 5,000ట్యాంకర్లు: 150 ట్రాక్టర్లు: 100స్వీపింగ్ మెషిన్లు: 18 జేసీబీలు : 12స్వచ్ఛ ఆటోలు: 40 డోజర్లు: 16భక్తుల అంచనా: సుమారు 3 కోట్లు విధుల్లో సిబ్బంది: 21 శాఖలు, 42,027 మంది ఆదివాసీ వలంటీర్లు: పరిపాలనా విభజన: 08 జోన్లు 42 సెక్టార్లు 2,000 మంది -
రారండోయ్ మేడారం
నేటినుంచి మహా జాతర ● కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలపైకి రాక మలుగు/ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం: మేడారం సమ్మక్క– సారలమ్మ మహా జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం గద్దైపె కొలువుదీరనుంది. ఈ మేరకు మంగళవారం సారలమ్మ పూజారులు సమావేశమయ్యారు. వన దేవతను గద్దైపెకి తీసుకెళ్లే ముందు గుడిలో నిర్వహించే పూజాకార్యక్రమాలకు సామగ్రి సిద్ధం చేసుకున్నారు. కొత్త వెదురు బుట్టను తయారు చేసి సారయ్య ఇంటి వద్ద పవిత్రంగా ఉంచారు. సారలమ్మ గద్దైపెకి రానున్న సందర్భంగా బుధవారం ఉదయం కన్నెపల్లి గుడి నుంచి పసుపు కుంకుమ, కంకణాలు, పవిత్ర జలం తీసుకొని ఆడపడుచులు సారలమ్మ గద్దెను అలికి ముగ్గులు వేసి ముస్తాబు చేస్తారు. సారలమ్మ పూజారులతో పాటు ఆ గ్రామంలోని స్థానిక ఆదివాసీలు, కాక వంశస్తులు తమ ఇళ్లను శుద్ధి చేసుకొని మంగళహారతి ఇచ్చి మొక్కుతారు. అదేవిధంగా కొండాయి నుంచి గోవిందరాజులును ప్రధాన పూజారి దబ్బగట్ల గోవర్ధన్ తదితరులు పూజలు చేసి పడిగ రూపంలో తీసుకొస్తారు. గోవిందరాజులును వడ్డె బాబుతో కలిసి డప్పుచప్పుళ్లతో బయలుదేరగా పడిగను పట్టుకున్న వడ్డె కాళ్లకు నీళ్లు అంటకుండా మోసుకొస్తారు. కోరికలు నెరవేర్చేందుకు నిలువెత్తు బంగారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునే భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరాలని నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. అమ్మలను కొలిచే జాతర కావడంతో అన్ని సమయాల్లోనూ మేడారానికి మహిళలు రావచ్చు. ఇక్కడే కాన్పులు అయిన మహిళలు వేలల్లో ఉంటారు. రూ.101 కోట్లతో గద్దెల ప్రాంగణం విస్తరణ.. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.150 కోట్లు నిధులను మంజూరు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ 20 రోజులుగా మేడారంలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గద్దెల ప్రాంగణాన్ని రూ.101 కోట్లతో విస్తరించారు. ఈసారి 3 కోట్ల మంది భక్తులు దర్శించుకోవడానికి అధికా రులు ఏర్పాట్లు చేశారు.హనుమాన్ జెండా నీడలో సారలమ్మ.. సారలమ్మను బుధవారం కన్నెపల్లి నుంచి పూజారులు కాక సారయ్య ప్రత్యేక పూజలు చేసి మేడారంలోని గద్దెకు తీసుకువస్తారు. ఇందులో భాగంగానే హనుమాన్ జెండా నీడలోనే సారలమ్మ ముందుకు సాగుతుంది. కన్నెపల్లి నుంచి మేడారం సారలమ్మ గద్దెల వరకు హనుమాన్ జెండా రక్షణలోనే సారలమ్మ గద్దెకు చేరుకుంటారు. గుడారాలతో నిండిన మేడారం..గుడారాలతో మేడారం నిండిపోయింది. నార్లాపూర్ స్తూపం నుంచి మొదలుకొని జంపన్నవాగు పరిసర ప్రాంతాలు, చిలకలగుట్ట నుంచి మొదలుకొని ఆర్టీసీ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఎడ్లబండ్లు, ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చిన భక్తులు మేడారం చుట్టు పక్కల ప్రాంతాల్లో గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎటుచూసినా మేడారం పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి మొదలుకుని జంపన్నవాగు వరకు రోడ్లన్నీ భక్తులతో బారులుదీరాయి. బుధవారం ఉదయం వరకు వేలాది సంఖ్యలో వాహనాలు, లక్షల సంఖ్యలో భక్తులు రానుండడంతో మేడారం కిటకిటలాడనుంది. -
వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్య
గంగారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లకు చెందిన పగిడిద్ద రాజు పెళ్లి కొడుకయ్యాడు. సమ్మక్కను వివాహం చేసుకునేందుకు ములుగు జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలం మేడారానికి మంగళవారం బయలుదేరి వెళ్లాడు. ఈ మేరకు పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో వడ్డెలు గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి కల్తీ జగ్గారావు, పూజారులు పడిగను పట్టుకొని తరలివెళ్లారు. పగిడిద్దరాజు గ్రామం దాటే వరకు మహిళలు నీళ్లు ఆరబోశారు. వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్యా అంటూ భక్తులు మొక్కులు చెల్లించారు. 70 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెనక సాంబయ్య ఇంట్లో రాత్రి బసచేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు మేడారంలోని గద్దెకు చేరుకుంటారు. సమ్మక్కతో వివాహం అనంతరం జాతర తర్వాత పగిడిద్దరాజు తిరిగి పూనుగొండ్లకు చేరుకుంటారు. రెండురోజుల అనంతరం మరుబెల్లి జాతరను పూనుగొండ్లలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ మొక్కులు చెల్లిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని గిరిజనులు, గిరిజనేతరుల నమ్మకం. పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయం వద్ద గిరిజన యువకులు వలంటీర్లుగా పనిచేశారు. మంత్రి ధనసరి సీతక్క ,మేడారం ట్రస్ట్బోర్డు చైర్పర్సన్ సుకన్య, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు వినయ్, సూర్యప్రకాశ్, ఎస్సై రవికుమార్, రాజ్కుమార్, ఎండోమెంట్ ఈఓ వీరస్వామి, రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ నారాయణరెడ్డి పూజలు చేశారు. పూనుగొండ్ల నుంచి మేడారానికి సమ్మక్క భర్త పగిడిద్దరాజు 70 కిలోమీటర్లు అడవిలో కాలినడకన పడిగతో బై లెల్లిన పూజారులు -
వనం దారిపట్టిన భక్తజనం
అడవిబిడ్డలు అందరికీ అమ్మలైన సన్నివేశం. తెలంగాణకు శతాబ్దాల కిందటే పోరాటం అబ్బిన సందర్భం. సమ్మక్క–సారలమ్మ దివ్య చరితం. వారి త్యాగాన్ని గుర్తు చేసుకునే వేళ ఇది. పర్యావరణాన్ని రక్షించడానికి ప్రాణాలు ఫణంగా పెట్టిన వారి ధైర్యసాహసాలను స్మరించుకునే సమయం ఇది. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర ప్రకృతిని ఆరాధించమని ఉద్బోధిస్తుంది. దైవం ముందు ధనిక, పేద తారతమ్యాలు లేవన్న సత్యాన్ని స్పష్టం చేస్తుంది. మాఘశుద్ధ పౌర్ణమితో మొదలు మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్క పున్నం) నుంచి జాతర మొదలవుతుంది. నాలుగు రోజుల పాటు ప్రధాన జాతర అంతా ఆదివాసీ సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ భక్తుల నమ్మకాలే సహస్ర నామాలు, పూనకాలే హోమాది క్రతువులు. న మ్మిన వారి కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఆ తల్లీకూతుళ్ల వీరత్వమే దైవత్వం. ఆసాహసాన్ని త లుచుకొని భక్తి పారవశ్యం పొందడమే మానవత్వం. ప్రతీ మనిషిలోనూ దైవత్వం ఉందని నిరూపించే అరుదైన జాతర మేడారంలో సాక్షాత్కరిస్తుంది. గద్దెలే దేవతామూర్తులుగా.. మేడారంలో సమ్మక్క– సారలమ్మకు ఎలాంటి విగ్రహాలు ఉండవు. రెండు గద్దెలు ఉంటాయి. ఒకటి సమ్మక్క గద్దె, ఇంకోటి సారలమ్మ గద్దె. వీటినే దేవతామూర్తులుగా కొలుస్తారు. మనిషి ఎత్తు ఉండే కంక మొదళ్ల వంక కన్నార్పకుండా చూస్తూ వన దేవతలను మనసులో ప్రతిష్ఠించుకుంటారు. దట్టమైన అడవి నుంచి దేవతలను తోడ్కొని వచ్చే వడ్డెలు (పూజారులు) తమ మీది నుంచి దాటుకుంటూ వెళ్తే జన్మ సార్థకం అవుతుందని భక్తుల నమ్మకం. పసుపు, కుంకుమ స్వరూపంగా నిలిచిన దైవాలను వాటితోనే ఆర్చిస్తారు. అమ్మవారి రూపంలో ముఖానికి పసుపు పూసుకుని పెద్దబొట్టు పెట్టుకుని వచ్చి వన దేవతలను దర్శించుకుంటారు. కంకబియ్యం (ఒడిబియ్యం), ఎదురుకోళ్లు, లక్ష్మీదేవర (గుర్రం ఆకారపు తొడుగును ముఖానికి కట్టుకుని వచ్చి దానిని అమ్మవారికి సమర్పించడం) వంటి రకరకాల మొక్కులు ఇక్కడ చెల్లించుకుంటారు. దేవతల గద్దెలపై ఉండే కుంకుమను ఎంతో పవిత్రంగా నమ్ముతారు. -
జనసంద్రంగా మేడారం.. భారీగా ట్రాఫిక్జామ్
సాక్షి, హైదరాబాద్: మేడారం మహా జాతర నేటి నుంచే ప్రారంభం కానుంది. నాలుగు రోజులపాటు సాగే సంరంభంలో.. ఇవాళ పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెల ప్రాంగణంలో ప్రతిష్టించడంతో అంకురార్పణ జరగనుంది. రేపు సాయంత్రం సమక్క గద్దె మీదకు చేరనుంది. జాతర నేపథ్యంలో మొక్కులు చెల్లించుకునేందుకే లక్షల మంది జాతరకు తరలి వస్తున్నారు. మేడారం పరిసర ప్రాంతాలు భక్త జనంతో కిక్కిరిసిపోయింది. జాతర మొదలు కావడంతో ఒక్కసారిగా పోటెత్తారు. ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు, బస్సులు.. ఇలా వాహనాల్లో తరలి వస్తున్నారు. దీంతో బుధవారం వేకువ జామున సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నెలకొంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. పోలీసులు రంగంలోకి దిగారు. ఇటు జంపన్న వాగు వద్ద ఇసుకేస్తే రాలని జనం కనిపిస్తున్నారు. మేడారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి గుడి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకువచ్చి బుధవారం మేడారం గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠిస్తారు. గురువారం సాయంత్రం మేడారం సమీపంలోని చిలుకలగుట్ట నుంచి కుంకుమభరిణె రూపంలో సమ్మక్కను తీసుకువచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం వనదేవతలు సమ్మక్క-సారలమ్మను భక్తకోటి దర్శించుకుంటారు. శనివారం సాయంత్రం జనదేవతల వనప్రవేశంతో మహాజాతర పరిసమాప్తి అవుతుంది.నేటి నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు భారీ సంఖ్యలో మేడారం వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లే.. మహోత్తర ఘట్టానికి తగ్గట్లు పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. మహా జాతర నేపథ్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. 13వేల మంది పోలీసులు, 42వేల మంది వివిధ శాఖల అధికారులతో జాతర నిర్వహణ జరగనుంది.రాత్రి వేళ ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల పదికిలోమిర్ల పరిధిలో తాత్కాలిక విద్యుత్ స్తంభాలు, వీధిదీపాల ఏర్పాటు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పండుగైన మేడారం గిరిజన జాతరను మంత్రి సీతక్క దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇటు వీవీఐపీల పర్యటనల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి జాతరకు సుమారు రెండు కోట్ల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనాలు వేస్తున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జాతికి పోరాటం కోసం.. తల్లుల చరిత్ర తెలిస్తే ఉద్వేగం..!
రాష్ట్రంలో ఏ దారి చూసినా మేడారం వైపే.. పసిపిల్లాడి నుంచి పండుముసలి దాక ఆ తల్లి దర్శనం కోసమే ఆరాటం .. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు మేడారం బాటపట్టారు. కోట్లలో వస్తున్న భక్తజనం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో గిరిజన కుంభమేళాగా పిలిచే సమ్మక్క-సారక్క జాతర నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈనెల 28 నుంచి 31 వరకూ సాగే ఈ జాతర ఈ రోజు పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులు గద్దెలపైకి రావడంతో మెుదవవుతుంది. రేపు చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి వస్తుంది. ప్రస్తుతం పిల్ల నుంచి పెద్ద దాకా ఏ నోట చూసినా సమ్మక్క తల్లి పేరే... రేపు చిలకలగుట్టపైకి రానున్న అమ్మవారిని దర్శించుకోవాలనే భక్తుల కోరిక.. ఇన్ని కోట్ల హృదయాలలో కొలువైన ఆ తల్లికి ఎటువంటి ఆడంబరాలు అక్కర్లేదు. నిండుమనసుతో కొలిస్తే చాలు భక్తుల కోరికలు నెరవేరుస్తుంది. బెల్లం ముద్ద సమర్పిస్తే చాలు వారింట్లో బంగారమై వెలుస్తోంది. అందుకే ఆ తల్లిని దర్శించుకోవడానికి కోట్లసంఖ్యలో ప్రజలు మేడారం వస్తున్నారు. ఆ మాతను దర్శించుకొని తమ జన్మధన్యమైందని సంతోషపడుతున్నారు.తెలంగాణ మహాజాతర గిరిజన కుంభమేళాగా పిలిచే సమ్మక్క సారక్క జాతర విశిష్టతపై ప్రత్యేక కథనం అడవిలో మేడరాజుకు దొరికిన సమ్మక్కప్రస్తుతం ములుగు జిల్లాలో ఉన్న మేడారం ప్రాంతాన్ని అప్పట్లో మేడరాజు అనే గిరిజన రాజు పాలించేవారు. ఈ సందర్భంలో మేడరాజు ఓ సారి వేటకు అడవికి వెళ్లారు. అప్పుడు పుట్ట మీద చిన్నపాప కనిపించింది. ఆ సమయంలో చుట్టూ పులులూ, సింహాలూ ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవాంశ సంభూతురాలిగా భావించారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిందని దేవతగా ఆమెను కొలుచుకున్నారు. సమ్మక్క హస్త వాస్తి సైతం వారి నమ్మకానికి ఎంతో బలం చేకూర్చింది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదని చరిత్ర చెబుతుంది. సమ్మక్క యుక్తవయసు వచ్చాక ఆమెను మేడరాజు తన మేనల్లుడైన పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు. వీరికి సారలమ్మ (సారక్క), నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు జన్మించారు. వీరు ప్రజలతో మమేకమై సుఖసంతోషాలతో జీవిస్తూ తమ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నారు.ప్రతాప రుద్రుడి దాడి సూమారు 13 వ శతాబ్దం ఆ సమయంలో కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పరిపాలిస్తున్నాడు. ఆసమయంలో మేడారం ప్రాంతంలో వరుసగా కరువు కాటకాలు వచ్చాయి. వర్షాలు లేక పంటలు పండక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తిండికే కష్టంగా మారడంతో కాకతీయ రాజులకు కట్టాల్సిన పన్ను (కప్పం) చెల్లించలేకపోయారు. అయితే ప్రజల కష్టాన్నీ ఏమాత్రం పట్టించుకోని ప్రతాపరుద్రుడు నిర్ధాక్షనీయంగా మేడారంపై యుద్ధం ప్రకటించాడు.అయితే ప్రతాపరుద్రుని సైన్యం ముందు గెలవలేమని తెలిసినా ఆత్మగౌరవం ప్రాణం కంటే గొప్పదని జాతికి నేర్పడానికి యుద్ధానికి సిద్ధం అన్నారు.ఈ యుద్ధంలో పగిడిద్ద రాజు, కూతురు సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాడారు వీరమరణం పొందారు. కాకతీయ సైన్యం దాటికి తట్టుకోలేక, పరాభవాన్ని భరించలేక సమ్మక్క కుమారుడు జంపన్న అక్కడి సంపంగి వాగులో దూకి నట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి ఆ వాగును జంపన్న వాగు అని పిలుస్తున్నారు. అయితే తన జాతికి పోరాటం నేర్పడం కోసం సమ్మక్క తల్లి చివరి వరకూ పోరాడింది. రక్తం చిందుతున్నా ఏమాత్రం వెనకడుగువేయకుండా శత్రువుల భరతం పట్టింది. చివరకు శత్రువుల దాడిలో గాయపడిన సమ్మక్క, తన రక్తపు ధారలతోనే చిలకలగుట్ట వైపు వెళ్లింది.అయితే ఆ సమయంలో నా జాతి బిడ్డలను కాపాడడం కోసం తాను అడివిలోనే ఉంటాను అని చెప్పి మాయమైందని భక్తులు నమ్ముతుంటారు. అనంతరం సమ్మక్క తల్లిని వెతకడానికి అక్కడి ప్రజలు వెళ్లగా చిలకలగుట్టపై ఒక పుట్ట దగ్గర నెమలి పింఛం, పసుపు, కుంకుమలు ఉన్న ఒక భరిణె మాత్రమే కనిపించింది. సమ్మక్క తల్లి కుంకుమ రూపంలోనే ఉందని గిరిజనులు విశ్వసించారు. అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి ఆ తల్లులను స్మరించుకుంటూ జాతర జరుపుతున్నారు. ఆనవాయితీగా మారింది. 900 సంవత్సరాల కలిగిన ఈ మహాజాతరను 1940 వరకూ చిలకల గుట్టపైన జరిపేవారు అయితే ఆతరువాత వచ్చిన అశేషమైన జనవాహిని కారణంగా కొండకింద జరపడం ప్రారంభించారు. ఈ జాతరకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలనుంచే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు వస్తారు. అయితే కోట్లాది మంది దర్శించుకునే ఈ మహాజాతరను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ ఏడాది సమ్మక్క సారక్క జాతర కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జనవరి-28 సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రాకజనవరి-29 సమ్మక్క గద్దెలపైకి రాక జనవరి-30 భక్కుల మెుక్కుల సమర్పణ జనవరి-31 సమ్మక్క, సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజుల వనప్రవేశంవన దేవతల వన ప్రవేశంతో ఈ మహాజాతర ముగుస్తుంది. -
నేటి నుంచే మేడారం మహాజాతర
సాక్షి ప్రతినిధి, వరంగల్ /మహబూబాబాద్: తెలంగాణ కుంభమేళా, ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర అసలు ఘట్టం కొన్ని గంటల్లో మొదలు కానుంది. కోరిన కోర్కెలు తీర్చే వనదేవత సారలమ్మ బుధవారం సాయంత్రం మేడారంలోని గద్దెపై కొలువుదీరనుంది. మేడారం సమీపంలోని కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ గుడిలో మంగళవారం ప్రత్యేకంగా మొక్కు లు చెల్లించారు. పూజారులు ఆదివాసీ సంప్రదాయ ప్రకారం సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ బుధవారం ఉదయం నుంచి మొదలవుతుంది. సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కన్నెపల్లి నుంచి పూజారులు, జిల్లా అధికారులు సారలమ్మను తీసుకొస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చే లోపు ఏటూరునాగారం కొండాయిలో కొలువైన గోవిందరాజులు, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో కొలువైన పగిడిద్దరాజును మేడారం గద్దెలపైకి తీసుకొస్తారు. మేడారం బయల్దేరిన పగిడిద్దరాజు సమ్మక్కను వివాహం చేసుకునేందుకు పగిడిద్దరాజు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో పెళ్లి కుమారుడిగా ముస్తాబై మంగళవారం మేడారం బాటపట్టారు. అత్తగారిల్లు మేడారం వెళ్లేందుకు సమ్మక్క వంశీయులు పగిడిద్దరాజు వంశమైన పెనక వంశీయులకు పసుపు, కుంకుమ ఇస్తారు. దీన్ని తీసుకొని వారు పూనుగొండ్లకు బయల్దేరుతారు. ఇదే సమయంలో పూనుగొండ్లలోని పెనక వంశీయులైన వెంకటేశ్వర్లు ఇంట్లో ఉన్న పూజా సామగ్రి, పానుపు, పడిగెలను శుద్ధి చేశారు. అనంతరం (నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, మువ్వలు) సిద్ధం చేసి తళపతి ఇంట్లో పెనక వంశీయులు ప్రధాన పూజారి రాజేశ్వర్, బుచ్చిరాములు, పురుషోత్తం, రాహుల్, వెంకటేశ్, సురేందర్, సమ్మయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివాసీ సంప్రదాయంలో మొక్కులు సమర్పించి దేవునిగుట్ట నుంచి వనం (వెదురు చెట్టు) తీసుకుని గ్రామ పొలిమేరలో పడిగెను కలిపి ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకొచ్చారు. వనాన్ని తాకితే మంచి జరుగుతుందనే నమ్మకం. దీంతో భక్తులు వనాన్ని తాకడానికి పోటీ పడ్డారు. పగిడిద్దరాజును తీసుకెళ్లేందుకువచ్చిన మంత్రి, అధికారులు సమ్మక్క తరçఫున గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతోపాటు మేడారం ట్రస్టుబోర్డు చైర్మన్ సుకన్య, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ కల్యాణి, సమ్మక్క వంశీయులు పూనుగొండ్లకు వచ్చారు. తంతు ముగిశాక మేడారానికి పగిడిద్దరాజు (ప్రతిమ)ను తీసుకొని కాలి నడకన మేడారం బయల్దేరారు. మంగళవారం రాత్రి వరకు కర్లపల్లి లక్ష్మీపురం గ్రామంలో బస ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం రాళ్లవాగులో స్నానం చేసి సాయంత్రానికి మేడారం చేరుకోనున్నారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం తీసుకొచ్చే వేడుకను చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై ఉండే శుక్రవారం మేడారం భక్తులతో నిండిపోనుంది. శనివారం దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.జాతరను వైభవంగా జరుపుకొందాంసాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం మహాజాతరను నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆత్మగౌరవానికి ప్రతీకలుగా కొలిచే సమ్మక్క–సారలమ్మ జాతరను వైభవంగా జరుపుకోవాలని పిలుపునిస్తూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోటిన్నర మందికిపైగా భక్తులు తరలివచ్చే జాతరకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఘనంగా ఏర్పాట్లు చేసి నిధులు వెచ్చించామని తెలిపారు. రూ. 250 కోట్లతో ఆలయ ప్రాకారం విస్తరణతోపాటు సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను విశాలంగా నిర్మించామన్నారు. లక్షలాదిగా నిరంతరం మేడారం తరలివస్తున్న భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లు, శాశ్వత మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందన్నారు. కోటిన్నర మందికిపైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని, భక్తులకు ఇబ్బందుల్లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అమెరికా నుంచి సీఎం ఫోన్లో ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా, 13 వేల మంది పోలీసులతో జాతర భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మేడారాన్ని సుమారు 45 లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నుంచే మేడారం భక్తజనంతో కిక్కిరిసింది. -
జిల్లా అభివృద్ధే లక్ష్యం
ములుగు: జిల్లా అభివృద్ధే లక్ష్యంగా అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తున్నారని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు జిల్లాలో ఈ ఏడాది 3,811 మంది గర్భిణులు నమోదు కాగా 2,110 మందికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు చేసి రాష్ట్రంలోనే జిల్లాను ముందంజలో నిలిపామన్నారు. జిల్లాలో 108, 102 వాహనాల ద్వారా 13,856 ట్రిప్పులతో 26,285 మందిని వైద్యసేవల కోసం ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి ఇంటికి చేర్చినట్లు వెల్లడించారు. ఏటూరునాగారం సీహెచ్సీలో డయాలసిస్ వ్యాధిగ్రస్తులైన 297 మందికి 2,899 సెషన్స్ అందించినట్లు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 4,867 మంది వైద్యసేవలకు రూ.19.83 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు. జిల్లాలో నెలవారీగా ఓపీప 14,319 మంది, సగటు నెలవారీగా ఐపీ 1,463గా ఉందన్నారు. తెలంగాణ డియాగ్నోస్టిక్స్ పథకం ద్వారా 134 రకాల ఆరోగ్య పరీక్షలను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతినెలా 5, 20వ తేదీలలో సదరం క్యాంపుల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి అర్హులకు వికలాంగ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంతో లబ్ధి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా 50,117 మంది లబ్ధిదారులను గుర్తించి రూ.1.64 లక్షల సిలిండర్లు సరఫరా చేసి రూ.4.38 కోట్లకు పైగా సబ్సిడీని చెల్లించినట్లు వ్యాఖ్యానించారు. 1.72 కోట్ల మంది ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేయగా రూ.117 కోట్లను ఆర్టీసీకి చెల్లించినట్లు తెలిపారు. జిల్లాలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉన్న 41,992 గృహాలకు రూ.27.77 కోట్ల సబ్సిడీని చెల్లించామన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద జిల్లాలో 1,767 మంది గర్భిణులు, పాలిచ్చే తల్లులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. సమగ్ర బాలల పరిరక్షణ సేవ ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 124 మంది బాలలను రక్షించామన్నారు. తొమ్మిది బాల్య వివాహాలను అరికట్టినట్లు తెలిపారు. రైతులకు రూ.99.10 కోట్లు చెల్లింపు రైతుభరోసా పథకంలో భాగంగా 2025 సంవత్సరానికి వానాకాలం పంటకి ఎకరానికి రూ. 6 వేల చొప్పున 79,481 రైతులకు రూ.99.10 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. రైతుబీమా పథకం కింద 2025–26 సంవత్సరంలో చనిపోయిన 87 మంది రైతు కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున రూ.4.35 కోట్లు వారి కుటుంబ సభ్యుల ఖాతాలలో జమ చేశామన్నారు. వ్యవసాయ పరికరాలను 50శాతం రాయితీపై అందించేందుకు రూ.80.60 లక్షలను కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ వరకు 1,33,687 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.295.28 కోట్లను చెల్లించామన్నారు. సన్నధాన్యానికి రూ.24.21 కోట్లను బోనస్ రైతులకు చెల్లించినట్లు పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో భాగంగా బ్లాక్ బెర్రీ ఐలాండ్, అరణ్య క్యాంప్, లక్నవరం జంగిల్ క్యాంప్, ట్రెక్కింగ్ మార్గాలు, జలగలంచ వ్యూ పాయింట్ను ప్రారంభించామన్నారు. దామరవై, కొండేటి వ్యూ పాయింట్, లక్నవరం పార్క్, ఏటూరునాగారం అభయారణ్యం అటవీ విహారం కోసం జంగిల్ సఫారీ వాహనాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎకో టూరిజం డెవలప్మెంట్లో భాగంగా పర్యాటకుల కోసం తాడ్వాయి హట్స్ను ప్రారంభించామన్నారు. రూ.13 కోట్లతో రామప్ప ఐలాండ్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయని వివరించారు. సౌకర్యాల కల్పనకు రూ.151 కోట్లు రేపటి నుంచి 31వ తేదీ వరకు మేడారంలో జరిగే సమ్మక్క–సారలమ్మ మహాజాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు రూ.151 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. 21 శాఖల ఆధ్వర్యంలో జాతర పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసపత్రాలను కలెక్టర్ అందజేశారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.జాతీయ జెండాకు వందనం చేస్తున్న కలెక్టర్ దివాకర మేడారం జాతరను విజయవంతం చేయాలి గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ టీఎస్.దివాకర -
గట్టమ్మ ఆలయానికి భక్తుల తాకిడి
ములుగు రూరల్: మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో బయలుదేరారు. ఈ మేరకు సోమవారం రాత్రి సమయంలో ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో భక్తులు అధిక సంఖ్యలో గట్టమ్మ ఆలయానికి చేరుకొని పుసుపు–కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి ఆలయాల్లోని పరిసరాల్లో ఉన్న సమ్మక్క–సారల మ్మ తల్లుల గద్దెలను దర్శించుకున్నారు. అలాగే సోమవారం రాత్రి గట్టమ్మ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో వాహనాల రద్దీ పెరిగింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సీఐ సురేశ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
ఆదివాసీ యువత రోప్పార్టీ సిద్ధం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో ఆదివాసీ యువతతో రోప్ పార్టీ సిద్ధమైంది. ఈ నెల 29న చిలకలగుట్ట నుంచి సమ్మక్కతల్లిని మేడారం గద్దైపెకి తీసుకొచ్చే క్రమంలో పోలీసుల రోప్ పార్టీతో పాటు మేడారానికి చెందిన ఆదివాసీ యువతతో రోప్ పార్టీ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో పోలీసుల రోప్ పార్టీ కీలకమైనప్పటికీ ఆదివాసీ యువత రోప్ పార్టీ కూడా అంతే కీలక పాత్ర పోషిస్తుంది. సమ్మక్కతల్లి చిలకలగుట్ట దిగిన నుంచి గద్దైపెకి ప్రతిష్టించే వరకు ఆదివాసీ యువత సంప్రదాయాలను పాటిస్తూ రోప్ పార్టీగా అమ్మవారిని గద్దైపెకి తీసుకొస్తుంది. యువతకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంటుంది. సోమవారం చిలకలగుట్ట వద్ద ఆదివాసీ యూత్ రోప్ పార్టీ సమావేశమై అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రతలపై చర్చించారు. ఈ సందర్భంగా చిలకల గుట్ట వద్ద ట్రాక్టర్ డోజర్తో చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. -
మహాజాతరకు ముస్తాబు
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షిప్రతినిధి, వరంగల్ : ఆదివాసీల అతి పెద్ద ఉత్సవం, తెలంగాణ కుంభమేళాకు మేడారం ముస్తాబైంది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు రెండు వారాల ముందునుంచే గిరిజన సంప్రదాయాల ప్రకారం గుడిమెలిగె, మండమెలిగె తదితర పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఓ వైపు సమ్మక్క సారలమ్మల గద్దెల పునరుద్ధరణ పనులు జరుగుతుండగానే ఈ కార్యక్రమాలకు శ్రీకారం జరగ్గా.. ఈ నెల 28న సారలమ్మ రాకతో మొదలయ్యే జాతర 31 వరకు జరుగుతుంది. ఈ మేరకు జాతరకు ఏర్పాట్లు అన్నీ పూర్తయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముస్తాబైన నయా మేడారం... మేడారం చరిత్రలోనే తొలిసారిగా రూ.251 కోట్ల భారీ నిధులు కేటాయించారు. ఇందులో గద్దెల శాశ్వత పునరుద్ధరణకు రూ.101 కోట్లు, జాతర నిర్వహణ, భక్తుల సౌకర్యాలకు రూ.150 కోట్లకు పైగా నిధులు వెచ్చించారు. ఇది మేడారం చరిత్రలోనే అత్యధిక కేటాయింపు కావడం విశేషం. మేడారం అభివద్ధి పనుల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నవి కొత్తగా నిర్మించిన శాశ్వత గద్దెలు. వీటితోపాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను గ్రానైట్ రాళ్లతో పునర్నిర్మించారు. ప్రాకారం చుట్టూ ఉన్న రాతి శిలలపై కోయ గిరిజనుల వీరగాథలు, సమ్మక్క–సారలమ్మ చరిత్ర, ఆదివాసీల గోత్రాలు, వారి ఆచార వ్యవహారాలు, వీరగాథలను ప్రతిబింబించే చిత్రాలను చెక్కారు. ఇవి భవిష్యత్తు తరాలకు మేడారం చరిత్రను వివరించే సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. కాంక్రీట్ కట్టడాలు మాత్రమే కాదు.. గిరిజన సంస్కృతికి అద్దం పట్టే దృశ్యకావ్యాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. భద్రత వలయంలో మేడారం.. గతంలో వనదేవతల గద్దెల ప్రాంతంలో 2–3 వేల మంది ఉంటేనే తొక్కిసలాట జరిగేది. ఈసారి పునరుద్ధరణలో భాగంగా ఒకేసారి 7వేల నుంచి 8 వేల మంది భక్తులు దర్శించుకునేలా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీలకు ప్రత్యేక లైన్లు, క్యూలైన్లపై జీఐ షీట్లతో పైకప్పు ఏర్పాటు చేశారు. నాలుగు గద్దెలను ఒకేసారి దర్శించుకునేలా కంపార్టుమెంట్లు నిర్మించారు. జంపన్న వాగు వద్ద శాశ్వత స్నానఘట్టాలు, సుందరీకరణ పనులు పూర్తిచేశారు. మేడారం చుట్టూ 10 కి.మీ.ల మేర ఫోర్ లేన్ రోడ్లు, పార్కింగ్కు అదనంగా 63 ఎకరాల స్థల సేకరణ చేశారు. కాగా ఈసారి 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా జాతర సందర్భంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలనుంచి తరలి వచ్చే భక్తుల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కాగా 460 సీసీ కెమెరాలతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ ద్వారా రద్దీని పర్యవేక్షించే సిస్టం ఏర్పాటు చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జనసాంద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రమాదాల్ని ముందుగానే నివారించే ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. 20 ప్రత్యేక డ్రోన్ల ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్, 20 మంది ఐపీఎస్ అధికారులు, 30 వేల మంది సిబ్బంది విధుల్లో ఉండబోతుండగా, ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి 2 కి.మీ.కు ఒక చెక్పోస్టు ఏర్పాటు చేస్తున్నారు. రూ.251 కోట్లతో పునరుద్ధరణ, జాతర నిర్వహణ పనులు జాతర ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రకటన వనదేవతల దర్శనానికి తరలివస్తున్న భక్తులు 28 నుంచి 31 వరకు మహా జాతర.. 3 కోట్లమంది వస్తారని అంచనా -
గట్టమ్మతల్లిని దర్శించుకోవడం ఆనవాయితీ
ములుగు రూరల్: మేడారం వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులు గట్టమ్మతల్లిని దర్శించుకోవడం ఆనవాయితీ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు సోమవారం ఆదిదేవత గట్టమ్మతల్లిని సీతక్క దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం గట్టమ్మ ఆలయ ప్రాంగణంలో జిప్సి గోల్డ్ వారి సహకారంలో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులకు గట్టమ్మ వద్ద పార్కింగ్, టాయిలెట్స్, పుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించామని తెలిపారు. గట్టమ్మ వద్ద మిని మేడారం జాతరను తలిపిస్తుందని వెల్లడించారు. భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించిన జిప్సి గోల్డ్ యజమానులకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్వాహకులు పింగిళి నాగరాజు, గంగిశెట్టి శ్రీనివాస్, తిరుమల రవిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, దేవాదాయశాఖ ఈఓ ప్రసాద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, గొల్లపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు మెరుగైన వైద్యసేవలు ఎస్ఎస్ తాడ్వాయి: మహాజాతరకు వచ్చే భక్తులకు వైద్య ఆరోగ్య శాఖ తరఫున సురక్షితమైన ఆరోగ్య సేవలు అందుతాయని మంత్రి సీతక్క తెలిపారు. మేడారంలో సోమవారం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని మంత్రి సీతక్క ప్రారంభించి మాట్లాడారు. జాతరకు వచ్చి అనారోగ్య సమస్యల బారిన పడిన భక్తులు వైద్యశిబిరాల్లో ఆరోగ్య సేవలు పొందాలని సూచించారు. అనంతరం మేడారం తుడుందెబ్బ వలంటీర్లకు జాతర సందర్భంగా ప్రత్యేకంగా తయారుచేసిన టీ షర్టులను మంత్రి సీతక్క అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, ఐటీడీఓ పీఓ చిత్రామిశ్రా, ఏఎంసీ చైర్పర్సన్ కల్యాణి, వైద్యాధికారులు, వైద్యులు, తుడుందెబ్బ నాయకలు, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క -
మేడారానికి యాపలగడ్డ పగిడిద్దరాజు
ఎస్ఎస్ తాడ్వాయి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిధిలోని యాపలగడ్డ నుంచి పగిడిద్దరాజు మేడారానికి సోమవారం పయనమయ్యారు. అరెం వంశస్తులు యాపలగడ్డలోని పగిడిద్దరాజు గద్దె వద్ద సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మేడారానికి కాలినడకన కదిలారు. ఈ నెల 28న (బుధవారం) కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దె పైకి రానున్న సందర్భంగా యాపలగడ్డ నుంచి పగిడిద్దరాజును మేడారానికి తీసుకురానున్నారు. మేడారం జాతర చైర్ పర్సన్ ఇర్ప సుకన్యసునీల్, మాజీ కమిటీ చైర్మన్ అరెం లచ్చుపటేల్, సమ్మక్క పూజారి స్వామిలు యాపలగడ్డకు వెళ్లి పగిడిద్దరాజుకు స్వాగతం పలికారు. -
రామప్పలో భక్తుల రద్దీ
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. మేడారాన్ని సందర్శించిన అనంతరం భక్తులు రామప్పకు చేరుకుని రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్నారు. నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలను చాటుకుంటున్నారు. అదేవిధంగా రామప్ప ఆలయాన్ని అమెరికాకు చెందిన విదేశీయులు సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.రామప్ప ఆలయంలో మేడారం భక్తుల సందడి -
నవ మేడారం
వనదేవతలు సమ్మక్క–సారలమ్మ ఖ్యాతి విశ్వవ్యాప్తంకారడవిలో, వాగు వంకల నడుమ మొదలైన చిన్న జాతర.. ప్రస్తుతం దేశాన్ని ఆకర్షిస్తోంది. గూడెం ప్రజలు కొలిచిన ఆ సన్నిధి.. ప్రస్తుతం కోట్లాది భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. మట్టి గద్దెల నుంచి విస్తృత సౌకర్యాల దాకా.. దిగబడే ఎగుడు దిగుడు రోడ్ల నుంచి డబుల్ బీటీ రోడ్డు దాకా.. ఎడ్ల బండ్ల ప్రయాణం నుంచి హెలికాప్టర్ దాకా మేడారంలో ఆధునికత సంతరించుకుంది. సెల్ఫోన్ టవర్లు, అత్యాధునిక సీసీ కెమెరాలు.. డ్రోన్లు ఒక్కటేమిటి వన మేడారం ఇప్పుడు నవ మేడారమైంది. – ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి -
రామప్పను చూసొద్దాం..
● 6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా ● సౌకర్యాలు అంతంత మాత్రమే! ● 180 మందితో పోలీసు బందోబస్తువెంకటాపురం(ఎం): మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు తరలివచ్చే భక్తజనం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం జాతర ఉండగా ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు మేడారం భక్తులతో రామప్ప ఆలయం కిటకిటలాడనుంది. మేడారం దారిలో ఉన్న లక్నవరం సరస్సు సందర్శనను అధికారులు పూర్తిగా నిలిపి వేయనుండడంతో రామప్ప ఆలయానికి మేడారం భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. మేడారంను సందర్శించి తిరుగు ప్రయాణంలో రామప్పకు వచ్చే భక్తులు రామప్పలో ఒకరోజు విడిది చేసి రామలింగేశ్వరుడిని దర్శించుకుని వెళ్తారు. ఆలయానికి సుమారు 6 లక్షల నుంచి 8 లక్షల మంది మేడారం భక్తులు సందర్శిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. రామప్పను సందర్శించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్, ఎస్సై చల్లా రాజు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సౌకర్యాలు అంతంత మాత్రమే రామప్పను సందర్శించే మేడారం భక్తుల కోసం తా గునీటి వసతిని అంతంత మాత్రంగానే ఉంది. ఆలయం శివారులోని రెండు ట్యాంకులకు మాత్ర మే మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. హెలిపాడ్ పార్కింగ్ వద్ద ఉన్న వాటర్ ట్యాంకుకు నీటిని సరఫరా చేసేందుకు నూతనంగా బోరు వేసినప్పటికీ కనెక్షన్ ఇవ్వకపోవడంతో నిరుపయోగంగా మారింది. పార్కింగ్ ప్రాంతంలో 30 తాత్కాలిక మరుగుదొడ్లను నిర్మించినప్పటికీ నీటి వసతి కల్పించకపోవడంతో అలంకారప్రాయంగానే మిగిలాయి. ఆలయ పరిధిలో 32, రామప్ప గార్డెన్లో 32 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. క్యూలైన్ల ఏర్పాటు రామప్పను సందర్శించే మేడారం భక్తుల కోసం ఆలయ అధికారులు క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం ముందు కాళ్లు చేతులు శుభ్రం చేసుకోవడానికి నల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి పనిచేయకపోవడంతో ఆలయం ఎదుట డ్రమ్ములు ఏర్పాటు చేసి నీళ్లు నింపుతున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రామలింగేశ్వరుని దర్శన వేళలు ఉండగా మేడారం భక్తుల కోసం రాత్రి 9 గంటల వరకు ఆలయ దర్శన వేళలు పొడగించాలని భక్తులు కోరుతున్నారు. ఉప కాల్వలో స్నానాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 180 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెంకటాపురం ఎస్సై చల్లా రాజు తెలిపారు. రామప్పలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనదారులు వాహనాలు నిలిపి పోలీసులకు సహకరించాలని కోరారు. కాగా రామప్ప సరస్సుకు చెందిన ఉపకాల్వల్లో స్నానాలు ఆచరించి రామప్ప ఆలయాన్ని సందర్శిస్తున్నారు. -
భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. ఆదివారం మేడారంలో జరుగుతున్న పనులను కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేడారంలో చిలుకలగుట్ట, ట్రైబల్ మ్యూజియంను సందర్శించారు. జాతరలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. జాతర పనులన్నీ సకాలంలో పూర్తి చేశామని, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించమన్నారు. చిలకలగుట్ట ప్రాంతాన్ని సందర్శించి అక్కడ భక్తుల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల పరిస్థితిని పరిశీలించారు. ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించి అక్కడ చేపడుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసులకు సూచించారు. వారి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మద్యం సేవించి వాగులోకి దిగొద్దు ఏటూరునాగారం: మద్యం సేవించి జంపన్నవాగులోకి దిగి స్నానం చేయొద్దని మంత్రి సీతక్క అన్నారు. మేడారంలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. మద్యం సేవించి వాగులోకి దిగితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని, చిన్న పిల్లలను సైతం దగ్గరుండి స్నానం చేయించాలన్నారు. మంత్రి ధనసరి సీతక్క మేడారంలో పనుల పరిశీలన


