breaking news
Mulugu
-
తల్లీతండ్రి అన్నీ.. అన్నే!
ఎస్ఎస్తాడ్వాయి: తాడ్వాయి మండల కేంద్రంలోని ఇందిరానగర్కు చెందిన దుబ్బాక శ్రీనివాస్కు ఇద్దరు చెల్లెళ్లు స్వప్న, రవళి. శ్రీనివాస్ 17 ఏళ్ల వయస్సులో ఉన్న సమయంలో తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. ఇద్దరు చెల్లెళ్లను కంటికి రెప్పలా చూసుకుంటూ వారిపి ఉన్నత చదువులు చదివించాడు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసి తన వంతుగా బాధ్యత నెరవేర్చాడు. తమ కోసం అన్న పడిన కష్టాలను మరచిపోని స్వప్న, రవళి ప్రతీ ఏడాది ఎక్కడున్నా.. రాఖీ పండుగకు వచ్చి అన్నకు రాఖీ కడుతున్నారు. తల్లిదండ్రులు లేకపోయినా.. మేమున్నాం అని చెల్లెళ్లకు భరోసా ఇచ్చిన అన్నకు రాఖీ కట్టి కృతజ్ఞతలు చెబుతున్నారు. -
మండలాల వారీగా గ్రామసభల్లో వచ్చిన సమస్యలు..
● లింగాల గ్రామానికి చెందిన చెన్యూరి కన్నయ్యకు మూడేళ్లుగా ఓటరు జాబితాలో పేరు లేదు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా ఇంటింటికీ అందించిన ఎన్యూమరేషన్ ఫారం కూడా అందలేదు. ఈ క్రమంలో గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో తన పేరు ఓటరు జాబితాలో లేదని అధికారుల దృష్టికి కన్నయ్య తీసుకెళ్లారు. దీంతో పేరు చేర్చుకునేందుకు ఫారం–6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేయించారు. అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో కన్నయ్యకు తిరిగి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం లభించింది.మంగపేట: మండల పరిధిలో 25 గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. బుచ్చంపేటలో 222వ పోలింగ్ కేంద్రం పరిధిలో 850 మందికి ఓటర్లు ఉండగా 145 మంది ఓటర్ల వివరాల్లో వివిధ రకాల సవరణలపై వివరాలను కోరుతూ బీఎల్ఓ లక్ష్మణ్ నోటీసులు జారీ చేశారు. ఎస్ఎస్తాడ్వాయి: మండల కేంద్రంలోని ఇందిరానగర్కు చెందిన గాలిబు తరమ్మకు ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియలో భాగంగా దరఖాస్తు చేసుకునేందుకు ఎన్యూమరేషన్ దరఖాస్తు ఫారం అందలేదు. దీంతో ఓటరు జాబితాలో పేరు సైతం రాలేదు. తన భర్త వెంకమల్లుకు సైతం ఎన్యూమరేషన్ దరఖాస్తు ఫారం రాకపోవడంతో ఓటరు లీస్ట్లో పేరు లేదు. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఇద్దరికి ఓటు హక్కు వచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను వేడుకుంది. -
తండ్రి బాధ్యత నెరవేర్చిన అన్న
కష్టమే రానివ్వనని ఒకరు. ఆపదొస్తే అండగా నిలుస్తానని మరొకరు. నీకు నేనున్నానంటూ ఇంకొకరు.. తోబుట్టువుకు సగం ఆస్తి రాసిచ్చిన అన్న ఒకరు. అక్కతో రాఖీ కట్టించుకోవడానికి విదేశాల నుంచి సొంతూరికి వచ్చిన తమ్ముడొకరు. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు. రాఖీ పండుగకు అసలైన అర్థం చెబుతున్న వీరందరి గురించి రక్షాబంధన్ సందర్భంగా ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. కాశిబుగ్గ: కొత్తవాడకు చెందిన దువ్వ సాంబమూర్తి–రమాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఒక కుమారుడు చనిపోగా, ఒక కుమారుడు రాజ్కుమార్, కుమార్తె శీరిష ఉన్నారు. వికలాంగుడైన తండ్రి సాంబమూర్తి కుమార్తె పెళ్లి చేసిన తర్వాత మరణించాడు. చెల్లెలిపై ప్రేమతో అన్న రాజ్కుమార్ (సాఫ్ట్వేర్ ఇంజనీర్) చెల్లి, బావకు కొత్తవాడలోని ఇంట్లోనే నివాసం కల్పించాడు. చెల్లెలిపై ప్రేమతో ఆరునెలల క్రితం పుర ప్రముఖుల సమక్షంలో 180 గజాల ఇల్లు స్థలంలో సగం 90 గజాల స్థలం రిజిస్ట్రేషన్ చేసి, కాగితాలు అప్పగించాడు. చెల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్న రాజ్కుమార్ను అందరూ అభినందిస్తున్నారు. తండ్రి ప్రేమను పంచిన పలువురు అన్నలు ఆస్తి కాదు.. అనుబంధమే ముఖ్యమంటున్న ఓ సోదరుడు అక్కాచెల్లెళ్లకు అండగా నిలుస్తున్న సోదరులు రాఖీ కట్టి రక్షగా నిలుస్తామంటున్న సోదరీమణులు నేడు రాఖీ పౌర్ణమి -
విధులకు సకాలంలో హాజరు కావాలి
● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోఎస్ఎస్తాడ్వాయి: వైద్యాధికారులు, సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కావాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో సూచించారు. మండల పరిధిలోని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఇన్పేషెంట్ రిజిస్టర్ను పరిశీలించారు. రోగుల వివరాలను సక్రమంగా నమోదు చేస్తున్నారా అని ఆరా తీశారు. రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. రోగుల సహాయకులతో మాట్లాడి వైద్యసేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. దోమల నివారణకు నివాస ప్రాంతాల్లో ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్ (ఐఆర్ఎస్) చేపడుతున్నారా అని ఆరా తీశారు. అన్ని నివాస ప్రాంతాల్లో ఐఆర్ఎస్ కవరేజీ ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మందుల నిల్వ గదిని తనిఖీ చేసి మందుల గడువు తేదీలను పరిశీలించారు. పంపిణీ చేసే మందుల వివరాలను స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఫార్మసీని తనిఖీ చేసిన ఆయన రోగులకు మందులు పంపిణీ చేసే తీరును పరిశీలించారు. -
అధికారులు బాధ్యతతో పనిచేయాలి
● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కములుగు: జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో, బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. మండల పరిధిలోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఇంజనీరింగ్ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సీతక్క గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి సంబంధిత ప్రాజెక్టులకు సమగ్ర అంచనాలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల పురోగతికి సంబంధించిన వివరాలను శాఖలవారీగా నమోదు చేయాలని సూచించారు. పనులను సకాలంలో పూర్తి చేయని గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్కు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను నిరంతరం రామప్ప సరస్సుకు తరలించే సాధ్యాసాధ్యాలను వెంటనే పరిశీలించాలని సూచించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం సుమారు రూ.200 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జీ, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ తదితరులు పాల్గొన్నారు. రూ.8.50 కోట్ల పనులకు శంకుస్థాపన ములుగు పురపాలక సంఘం నిధులతో మున్సిపాలిటీ విలీన గ్రామాల్లో రూ.8.50 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. బండారుపల్లిలో రూ.5.50 కోట్లతో, జీవింతరావుపల్లిలో రూ.3 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు మంత్రి సీతక్క వివరించారు. అదే విధంగా ములుగు మండలంలో నూతనంగా ఏర్పాటైన బంజారుపల్లి గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఆనంతరం జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్, ఉద్యానశాఖ కార్యాలయాలను మంత్రి సీతక్క తనిఖీ చేసి విధుల్లో లేని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి
ఏటూరునాగారం: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు అన్నారు. మండల కేంద్రంలో గురువారం రైతు సంఘం విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఇటీవల మరణించిన సారంపల్లి మల్లారెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన వాణిజ్య విధానం పేరుతో దేశంలోకి విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు రానున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 36వ అఖిల భారత మహాసభలు నల్లగొండ జిల్లాలో నవంబర్ 15 నుంచి 18వ రకు జరగనున్నాయని తెలిపారు. ఈ మహాసభల జయప్రదానికి రైతులందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకుడు సూడి కృష్ణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చ వెంకటేశ్వర్లు, తుమ్మల వెంకట్రెడ్డి, దావూద్, తీగల ఆదిరెడ్డి, చిట్టెం ఆదినారాయణ పాల్గొన్నారు. రాష్ట్ర రైతుసంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు -
విజయగణపతితో మొదలు..
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం రాతి కట్టడాలకు ఒక్కో అడుగు పడుతోంది. ఆలయ జీర్ణోద్దరణలో భాగంగా పాత ఆలయాల తొలగింపు పూర్తి కావడంతో సంబంధిత కాంట్రాక్టర్, ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. డ్రాయింగ్, డిజైన్లలో స్వల్ప మార్పులు, చేర్పుల తర్వాత మార్కింగ్లు మొదలు పెట్టారు. పడమర, దక్షిణ గోపురాల మధ్య నైరుతి మూలన పూర్వం నుంచి ఉన్న విజయగణపతి ఆలయం స్థలంలోనే గురువారం మళ్లీ రాతి నిర్మాణానికి మార్కింగ్ ఇచ్చి ముగ్గుపోశారు. ప్రాకారానికి ముగ్గుపోసి మార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. 12 ఫీట్ల మేర లోతు తవ్వకాలు జరిపి దిగువన భూమి నుంచి పైకి కాంక్రీట్, ఇనుముతో బేస్మెంట్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. క్రషర్ పనులు చేపట్టడానికి పక్కనే నీటి ట్యాంకు కూడా నిర్మించారు. ఇప్పటికే గ్రానైట్ స్టోన్, ఇనుము, సిమెంట్, ఇసుకను కాంట్రాక్టర్లు తెప్పించారు. పడమర వైపున నైరుతి నుంచి ఉత్తరం వైపున వాయువ్యం మూల వరకు 12 ఫీట్ల లోతు వరకు ప్రొక్లైయిన్తో తవ్వకాలు జరుపుతున్నారు. మొత్తం 360 ఫీట్ల పొడవుతో 280 ఫీట్ల వెడల్పుతో ఆలయ నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రధాన ఆలయానికి ఆంధ్రప్రదేశ్లోని గురజపల్లిలో కృష్ణశిలకు ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. చురుగ్గా కాళేశ్వరాలయ పునర్నిర్మాణ పనులు -
ఏటా ఒకచోట వేడుకలు
డోర్నకల్: డోర్నకల్లోని బ్యాంక్ స్ట్రీట్కు చెందిన కాలా యశోధర్ జైన్కు తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. వీరంతా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు. ఏటా రాఖీ పండుగను పురస్కరించుకుని అక్కాచెళ్లెళ్లలో ఒకరి ఇంటికి తమ సోదరుడిని పిలిపించుకుంటారు. అందరూ అతడికి రాఖీలు కట్టి ఆనందంగా గడుపుతారు. ఇటీవల మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరత్వాడాలోని సోదరి ఇంటికి అందరూ చేరుకుని సోదరుడు యశోధర్జైన్కు రాఖీలు కట్టి దీవెనలు అందుకున్నారు. -
ఆధారాలు చూపాల్సిందే..
ములుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు సంబంధించి తుది దశ ప్రక్రియ మొదలైంది. మ్యాపింగ్ కాని వారితో పాటు అనామలిస్ (స్పష్టమైన గుర్తింపు లేని ఓటర్లు) జాబితాలో చేరిన ఓటర్లకు బీఎల్వోలు గురువారం నుంచి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసులు అందుకుంటున్న వారు నిర్ణీత గడువులోగా తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మ్యాపింగ్ కాని, ఆధారాలు సరిగ్గాలేని ఓటర్లకు ఇళ్ల వద్దకే వచ్చి బీఎల్వోలు నోటీసులు అందజేస్తున్నారు. 1 జూలై 1987లోపు జన్మించిన వారు నోటీసులు అందుకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. 1987 నుంచి 2004 మధ్యలో జన్మించిన వారు నోటీసు ఆందుకున్న వ్యక్తితో పాటు తల్లి లేదా తండ్రికి చెందిన గుర్తింపు కార్డు అందించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సవరణలు, ఆధారాల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 20న ముగుస్తుంది. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అక్టోబరు 19న తుది ఓటరు జాబితా విడుదల కానుంది. 12 రకాల గుర్తింపు కార్డులు ఇవే.. నోటీసులు పొందిన ఓటర్లు 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని బీఎల్వోకి లేదా తహసీల్దార్ కార్యాలయంలో చూపించి తమ ఓటును సరిచేసుకోవాలి. ఆధార్ కార్డు, పాస్పోర్ట్, పాన్కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్బుక్, ఉపాధిహామీ జాబ్ కార్డ్, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సురెన్స్ కార్డు, పింఛన్ బుక్, రైతు పాస్బుక్, ఎన్పీఆర్ స్మార్ట్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలి. 8,028 మందికి నోటీసులు ములుగు నియోజకవర్గంలోని 10 మండలాల పరిధిలో 303 పోలింగ్ బూత్లు ఉండగా 2,09,128 మంది ఓటర్లు ఉన్నట్లు ఈ నెల 17వ తేదీన అధికారులు ఓటర్ల మసాయిదాను విడుదల చేశారు. జిల్లాలో నో మ్యాపింగ్, అనామలిస్ ఓటర్లు 41,900 మంది ఉన్నట్లు గుర్తించి వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలో గురువారం సాయంత్రం వరకు 8,028 మందికి నోటీసులు అందించినట్లు అధికారులు తెలిపారు. నోటీసులు తీసుకున్నవారు నిర్ణీత గడువులోపు ఆధారాలు చూపకుంటే ఓటుహక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. లేదంటే ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం రేపటి నుంచి ఆధారాల స్వీకరణ జిల్లాలో 41,900 మందికి జారీ కానున్న నోటీసులు ఇప్పటి వరకు 8,028 మందికి జారీనియోజకవర్గంలో మండలాల వారీగా జారీ చేసిన నోటీసులుమండలం మొత్తం జారీ నోటీసులు చేసినవి మంగపేట 9,589 1,362 ఏటూరునాగారం 3,703 932 ములుగు 6,742 632 గోవిందరావుపేట 2,227 950 కొత్తగూడ 5,342 291 మల్లంపల్లి 648 90 వెంకటాపురం(ఎం) 5,207 1,288 ఎస్ఎస్తాడ్వాయి 3,772 712 కన్నాయిగూడెం 3,056 1,260 గంగారం 1,614 511 -
సోదరభావానికి ప్రతీక రాఖీ పండుగ
ములుగు: సోదరభావానికి ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఆదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావులకు గురువారం మంత్రి సీతక్కకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ సీతక్కకు చీర బహుకరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ సోదరసోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి సీతక్క రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీ వేడుకలు నిర్వహించి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు మంత్రి సీతక్క రాఖీలు కట్టారు. బెటాలియన్ కమాండెంట్గా లక్ష్మీకాంతరావు గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయిలో గల 5వ బెటాలియన్ (టీజీఎస్పీ) నూతన కమాండెంట్గా సీవీ.లక్ష్మీకాంతరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లో విధులు నిర్వహించిన ఆయన అంకితభావం, క్రమశిక్షణతో విశిష్ట సేవలు అందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారులు, సిబ్బందితో సమావేశమైన మాట్లాడారు. బెటాలియన్లో క్రమశిక్షణ, సమన్వయం, విఽధి నిర్వహణతో పాటు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బెటాలియన్ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని కోరారు. నూతన కమాండెంట్కు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపా రు. ఈ కార్యక్రమంలో సహాయక కమాండెంట్లు పీకే ప్రసాద్, ధర్మారావు, ఆర్ఐలు కిరణ్ కుమార్, భాస్కర్, స్వామి, వెంకటేశ్వర్లు, సాయిబాబు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్ పోటీలకు బాచి ఎంపిక ములుగు: మండల పరిధిలోని బండారుపల్లిలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల విద్యార్థి గుడెల్లి బాచి జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. దక్షిణ జోనల్ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు –2026 అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన బాచి 60 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో నిలిచి పతకం అందుకుని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని పాఠశాల ప్రిన్సిపల్ సింగారం దేవకి తెలిపారు. ఈ మేరకు గురువారం అధ్యాపకులు బాచిని అభినందించారు. హిందూ సంప్రదాయ దుస్తుల్లో జర్మనీ దేశస్తులు వెంకటాపురం(ఎం): భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తిని చూపుతూ జర్మనీ దేశానికి చెందిన సాండ్రో కోట్, స్టెపానీ ఎంజిల్మెన్ హిందూ సంప్రదాయ దుస్తులు ధరించి రామప్ప దేవాలయాన్ని గురువారం సందర్శించారు. భారతీయ సంస్కృతిలో పురుషులు ధోతి, కుర్తా మహిళలు చీరవంటి సంప్రదాయ వస్త్రాలను ధరించడం ద్వారా మన ఆచార వ్యవహారాలకు గౌరవం ఉంది. ఈ నేపథ్యంలో విదేశీయులు సైతం భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. టూరిజం గైడ్ విజయ్ కుమార్ ఆలయ విశిష్టత గురించి వివరించగా వారు రామప్ప శిల్పకళను ఆసక్తిగా తిలకించారు. రామప్ప ఆలయం ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు. రేషన్ షాపు తనిఖీమహాముత్తారం: మండల పరిధిలోని కొర్లకుంటలో గల రేషన్ షాపును గురువారం జిల్లా తూనికల కొలతల అధికారి శ్రీలత తనిఖీ చేశారు. దుకాణంలోని కాంటాను పరిశీలించారు. లబ్ధిదారులకు బియ్యం తూకం వేసేటప్పుడు తట్టు సంచిని ఉపయోగించి వేసినట్లు విచారణలో తేలిందన్నారు. -
ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగం
నిట్ వరంగల్లోని ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనలకు సప్తగాన్ ఏషియా వాహన పనితీరు తోడ్పడుతుంది. మెరుగైన రహదారులు, రవాణా సౌకర్యం నిర్మాణానికి ఆయా ప్రదేశాల డేటా అవసరం. అలాంటి డేటాను సప్తగాన్ అందజేస్తుంది. నేషనల్ హైవేలో నిర్మించే రహదారులపై అవసరమైన సూచనలు, పరిశీలన వివరాలను భారత ప్రభుత్వం.. నిట్ వరంగల్నుంచి కోరుతోంది. అలాంటి పరిశీలనలకు సప్తగాన్ ఏషియాతో ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది. – శంకర్, సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, సప్తగాన్ ఏషియా కో–ఆర్డినేటర్ ● -
భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
భూపాలపల్లి అర్బన్: ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు ఉద్యోగుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి సూచించారు. ఏరియా జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన సేఫ్టీ రివ్యూ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏరియా సేఫ్టీ అధికారి మాటూరి రవీందర్ సమావేశానికి అధ్యక్షత ఏర్పాటు చేసిన సమీక్షలో ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో అమలవుతున్న భద్రతా చర్యలు, సేఫ్టీ నిబంధనల అమలు, ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలు, ఉద్యోగుల భద్రత, తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఆయా విభాగాల్లో భద్రతకు సంబంధించిన సమస్యలను జీఎం దృష్టికి అధికారులు తీసుకురాగా, వాటిపై చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. భద్రతే ప్రధానం అనే భావనతో ప్రతీ అధికారి, ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జీఎం రాజేశ్వర్రెడ్డి తెలిపారు. -
హక్కుల సాధనకు ఉద్యమాలు ఉధృతం
● తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్కుమార్ఎస్ఎస్తాడ్వాయి: ఆదివాసీల హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్కుమార్ అన్నారు. మండల పరిధిలోని మేడారంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఆదివాసీ మార్చ్కు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను తుడుందెబ్బ నాయకులతో కలిసి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరుణ్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదివాసీల మనుగడ దినదినగండంగా మారుతోందన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ఎన్నిసార్లు ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వానికి విన్నవించినా స్పందన లేదని విమర్శించారు. ఆదివాసీల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏల ద్వారానే ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని కోరారు. సమస్యల పరిష్కారానికి మార్చ్లు సెప్టెంబర్ 7న ఏటూరునాగారం, 16న ఉట్నూర్, 21న భద్రాచలం, 28న మన్ననూరులో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ఆదివాసీలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జాతీయ ఉపాధ్యక్షుడు పొడెం బాబు, రాష్ట్ర కార్యదర్శి కోరగట్ల లక్ష్మణ్, ఏఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. గణేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పాయం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి గ్రామసభలు
ములుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నేటి నుంచి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభల్లో అధికారులు తమ పరిధిలోని ఓటరు జాబితాలను ప్రజల సమక్షంలో చదివి వినిపిస్తారని పేర్కొన్నారు. ఓటర్లు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకునేందుకు అవకాశం కల్పిస్తారని వివరించారు. పేరు లేకపోయినా, కొత్త ఓటరు కావాల్సిన వారికి ఫామ్ 6తో దరఖాస్తు చేయాలని, ఫామ్ 7 సవరణలు, ఫామ్ 8 ద్వారా బదిలీ చేపట్టాలని వెల్లడించారు. ఏదైనా సలహా కోసం 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మరింత సమాచారం తెలుసుకోవాలని కోరారు.రామప్పలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని బుధవారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయ్యంగార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల శిల్పకళకు తలమానికం రామప్ప దేవాలయమని కొనియాడారు. అనంతరం రామప్ప చెరువు సందర్శించి బోటింగ్ చేశారు. వారి వెంట ఈఓ ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, దేవాదాయ, పురావస్తు, టూరిజం శాఖల అధికారులు ఉన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి ములుగు: జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని విద్యుత్శాఖ ఏఈకి వినతి పత్రాన్ని కాలనీ వాసులు బుధవారం విద్యుత్శాఖ కార్యాలయం వద్ద బుధవారం అందజేశారు. కృష్ణకాలనీలోని 15వ వార్డులో లోవోల్టేజీ సమస్యతో ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతున్నాయని వార్డు కౌన్సిలర్ వాణికుమార్ ఏఈకి వివరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు సంపత్, గండ్రకోట కుమార్, చుంచు రమేశ్, నాగేశ్వర్రావు, సుధాకర్, శంకర్, కుమార్, సంపత్, ఇక్బాల్ పాల్గొన్నారు. రాఖీ మహోత్సవం ఏటూరునాగారం: మండలంలోని చిన్నబోయిపల్లికి చెందిన సంతోష్, రాజేందర్, సమ్మయ్య తదితరుల ఆధ్వర్యంలో బుధవారం రాఖీ మహోత్సవాన్ని నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థిని, విద్యార్థులకు 1200 మందికి కట్టించి రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించినట్లు విశ్వహిందూ పరిషత్ నాయకులు ప్రవీణ్కుమార్ తెలిపారు. పాఠశాలల్లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పలు రకాల కార్యక్రమాలను చేపట్టినట్లు ప్రవీణ్ కుమార్ వివరించారు. మేడిగడ్డకు ప్రాణహిత వరద కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది వరద మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తింది. బుధవారం ఉదయం 1.51 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎగువ నుంచి తరలిరాగా, సాయంత్రానికి 1.29 లక్షల క్యూసెక్కులకు తగ్గి మేడిగడ్డకు చేరుతోంది. దీంతో బ్యారేజీలో మొత్తం 85గేట్లు ఎత్తి నీటిని దిగువకు అదేస్థాయిలో ఔట్ఫ్లో రూపంలో తరలిస్తున్నారు. కాగా, మంగళవారం 1.44 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో తరలిపోయింది. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గుముఖం పడుతున్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారు. -
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
లబ్ధిదారుడికి పింఛన్ మంజూరు పత్రం అందజేస్తున్న మంత్రి సీతక్కమార్కెట్ యార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి సీతక్కఎస్ఎస్తాడ్వాయి/మంగపేట: గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు ఎస్ఎస్తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో రూ.4.46 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి బుధవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తాడ్వాయి వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.83 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏటూరునాగారం మండలం శివాపూర్లో రూ.80లక్షలతో చేపట్టిన పనులను ప్రారంభించారు. గోగుపల్లిలో రూ.55 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏటూరునాగారం మార్కెట్ యార్డులో రూ.2.28 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రహదారులు, మురుగు కాల్వలతో పాటు మార్కెట్ యార్డుల్లో అవసరమైన సౌకర్యాలను మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా మంగపేట మండలంలో బుధవారం సాయంత్రం మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీడీఓ భద్రునాయక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై వివిధ గ్రామాలకు చెందిన 43 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందచేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇటీవల హేమాచల క్షేత్రం అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు చేయగా మరింత అభివృద్ధికి సీఎం ఇచ్చిన హామీని గుర్తుచేశారు. అలాగే మామిడిగూడెంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం ఇటీవల పలు కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు నరసింహస్వామి, వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షుడు అశోక్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
నిట్తో ఎంఓయూ..
కాజీపేట అర్బన్ : ‘నా దారి రహదారి.. బెటర్ డోంట్ కమిన్ టు మై వే’ అనే సినిమా డైలాగ్ను తలపిస్తూ ‘మెరుగైన రహదారుల నిర్మాణానికి అవసరమైన డేటా అందించడమే నా దారి’ అంటూ ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన సప్తగాన్ వాహనం ఇటీవల నిట్ వరంగల్కు చేరుకుంది. భారతదేశంలోనే తొలిసారిగా హరియాణా, గురుగ్రామ్లో అడ్వాన్స్ టెక్నాలజీ, రూ.30 కోట్ల వ్యయంతో దీన్ని రూపొందించారు. ఆధునిక టెక్నాలజీతో రూపకల్పన మెరుగైన రహదారుల నిర్మాణంలో కీలకం నిట్ వరంగల్తో ఎంఓయూ.. ఇటీవల పనితీరును పరిశీలించిన విద్యార్థులు ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనకు ఉపయుక్తంమెరుగైన రవాణా సౌకర్యం, రహదారుల నిర్మాణాల్లో లోపాన్ని పసిగట్టడం, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ పరిశోధనలకు దేశవ్యాప్తంగా ఈ సప్తగాన్ ప్రయాణం చేస్తోంది. ఇందులో మన ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు ఇటీవల సప్తగాన్ ఏషియా సంస్థ నిర్వాహకులు, నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. భారత ప్రభుత్వం వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా విజన్లో భాగంగా ఈ వాహనాన్ని ఇక్కడికి తీసుకురాగా, వాహన పనితీరును విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. వాహన పనితీరుపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పర్చుకున్నారు. -
మళ్లీ ‘లేఖల’ లొల్లి?
సాక్షిప్రతినిధి, వరంగల్ : పోలీస్శాఖలో ఇన్స్పెక్టర్ల బదిలీలు మరోసారి రాజకీయ సిఫారసుల చర్చకు తెరలేపాయి. మల్టీజోన్–1 పరిధిలో తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అధికారికంగా పరిపాలనా కారణాలతోనే బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ.. కొందరు ఇన్స్పెక్టర్లు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో తమకు అనుకూలమైన పోస్టింగుల కోసం ప్రయత్నించారన్న ఆరోపణలు పోలీస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. భూపాలపల్లిలో కీలక మార్పులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్బీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న చెన్నూరి శ్రీనివాస్ను జయశంకర్ భూపాలపల్లి ఎస్హెచ్ఓగా నియమించారు. అక్కడ చిట్యాల సర్కిల్లో పనిచేస్తున్న దగ్గు మల్లేశ్ను మల్టీజోన్–1, హైదరాబాద్కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో యడ్లపల్లి సతీష్ చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమించారు. ఇదే జోన్ పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ముగ్గురు ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. వరంగల్కు ముగ్గురు.. ఒకరు బయటకు.. వరంగల్ కమిషనరేట్కు తాజా బదిలీల్లో ముగ్గురు ఇన్స్పెక్టర్లు వచ్చారు. రామగుండం కమిషనరేట్ టాస్క్ఫోర్స్లో పనిచేస్తున్న తెల్లబోయిన కిరణ్, రామగుండం కమిషనరేట్ లీగల్ సెల్లో పనిచేస్తూ మల్టీజోన్–1 కంట్రోల్ రూమ్కు అటాచ్ అయి ఉన్న అనుముల శ్రీనివాస్ను కూడా వరంగల్ కమిషనరేట్కు పంపారు. హైదరాబాద్ టీజీఐసీసీసీ ఇన్స్పెక్టర్ భరత్ సుమన్ను కూడా కమిషనరేట్లో రిపోర్టు చేయాలన్నారు. మరోవైపు వరంగల్ కమిషనరేట్ సీఎస్బీలో పనిచేస్తున్న యడ్లపల్లి సతీష్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సర్కిల్కు బదిలీ చేశారు. ‘లేఖ’ ఎవరిది.. పోస్టింగ్ ఎక్కడ? ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగిన ప్రతీసారి రాజకీయ సిఫారసుల అంశం తెరపైకి వస్తుండటం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా తమకు అనుకూలమైన సర్కిల్, కమిషనరేట్ లేదా కీలక విభాగంలో పోస్టింగ్ కోసం ప్రజాప్రతినిధుల సిఫారసులు తీసుకొస్తున్నారన్న ఆరోపణలు గతంలోనూ వినిపించాయి. తాజాగా మల్టీజోన్–1 పరిధిలోని 9 మందికి బదిలీ కాగా.. తమకు అనుకూలమైన పోస్టింగ్ల కోసం మరికొందరు ఇన్స్పెక్టర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం. త్వరలోనే వరంగల్ కమిషనరేట్, జేఎస్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన కొందరికి బదిలీలు ఉంటాయంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి కరీంనగర్ల నుంచి కొందరు వరంగల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం ఉంది. అధికారికంగా మాత్రం ‘అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్’... మల్టీజోన్–1 పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ తొమ్మిది మంది బదిలీలను ‘ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్’గా పేర్కొంది. దీంతో అధికారిక ఉత్తర్వుల్లో పరిపాలనా కారణాలే కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ సిఫారసులపై చర్చ సాగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఎవరి సిఫారసు పనిచేసింది? ఎవరి పోస్టింగ్ మారింది? అన్నదానిపై పోలీస్ శాఖలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. భవిష్యత్లో జరగనున్న బదిలీలు, పోస్టింగ్ల ఉత్తర్వులు వెలువడితే గాని మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. పోలీస్ పోస్టింగుల్లో తీవ్ర చర్చ మల్టీజోన్–1లో 9 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ వరంగల్ కమిషనరేట్కు ముగ్గురు.. ఇక్కడినుంచి ఒకరు బయటకు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో పోస్టింగులంటూ ఆరోపణలు.. గతంలోనూ ఇదే తరహా వివాదాలు -
మేడారం జాతరలో 2.882 కిలోల బంగారం, 203 కిలోల వెండి
ములుగు జిల్లా: మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతరలో భక్తులు సమర్పించిన మిశ్రమ బంగారం, వెండి కానుకల లెక్కింపు మంగళవారం పూర్తయింది. హనుమకొండ ఎస్టీఓలో భద్రపరిచిన ఆరు ట్రంకు బాక్సులను ధార్మిక భవన్కు తీసుకువచ్చి రెండు రోజులపాటు లెక్కించారు. 1994, 1996, 2000 జాతరలకు చెందిన మిశ్రమ వెండి బాక్సులు, 2004, 2006, 2008, 2010, 2012 జాతరలకు సంబంధించిన మిశ్రమ బంగారం, వెండి బాక్సులను తెరిచి లెక్కించారు. ఈ సందర్భంగా బంగారం, వెండి కాని వస్తువులను వేరు చేసి స్వచ్ఛతను నిర్ధారించారు. అధికారిక లెక్కల ప్రకారం మిశ్రమ బంగారం 2 కిలోల 882 గ్రాముల 500 మిల్లీగ్రాములు, మిశ్రమ వెండి 183 కిలోల 561 గ్రాములుగా తేలింది. 20 కిలోల స్క్రాప్తో కలిపి మొత్తం వెండి 203 కిలోల 561 గ్రాములుగా నమోదైనట్లు మేడారం ఈఓ వీరస్వామి తెలిపారు. కాగా, ఇంకా ఆరు జాతరల ట్రంక్ బాక్సుల లెక్కింపు చేయాల్సి ఉంది. -
టీపీసీసీ చీఫ్కు చేరిన క్రమశిక్షణ సంఘం నివేదిక మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ చుట్టూ ఉచ్చు
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుటుంబాన్ని చుట్టుముట్టిన పరిణా మాలు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలపై మంత్రి కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో క్రమశిక్షణ సంఘం నివేదిక పీసీసీ చీఫ్కు చేరడం.. మరోవైపు మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్పై నమోదైన హత్యాయత్నం కేసులో వరుస అరెస్టులు, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ సస్పెన్షన్.. ఇలా ఒకదాని వెంట ఒకటి పరిణామాలు చోటుచేసుకోవడంతో ‘ఇక కొండాపై ఏం తేల్చనున్నారు?’ అన్న చర్చ పొలిటికల్ సర్కిళ్లలో సాగుతోంది. టీపీసీసీకి ‘క్రమశిక్షణ’ నివేదిక.. ‘కొండా’ శిబిరంలో కలకలం.. కొండా సుస్మిత వ్యాఖ్యలు, తదుపరి పరిణామాలపై విచారణ పూర్తి చేసి నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు అందించినట్లు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్ల డించారు. మంత్రి సురేఖకు నోటీసులు జారీ చేయడం, ఆమె వివరణ ఇవ్వడం, అనంతరం కమిటీ తన అభిప్రాయాలను నివేదిక రూపంలో సిద్ధం చేసి సమర్పించడం వరకూ వ్యవహారం చేరింది. క్రమశిక్షణ చర్యలు కఠినంగా ఉండాలని కోరినట్లు మల్లు రవి ప్రకటించడంతో కొండా సురేఖ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? అనేది మరింత ఆసక్తికరంగా మారింది. రెండు పరిణామాలు ఒకే సమయంలో.. రాజకీయంగా సుస్మిత వ్యాఖ్యల వ్యవహారం.. పరిపాలనా, పోలీసు కోణంలో నార్ల సుమంత్ కేసు.. రెండూ ఒకే సమయంలో తెరపైకి రావడంతో కొండా కుటుంబంపై రాజకీయ ఒత్తిడి పెరిగిందన్న చర్చ సాగుతోంది. ఆయన గతంలో మంత్రి సురేఖకు ఓఎస్డీగా పనిచేసినందునే ఈ కేసు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి, ‘హత్యాయత్నం’ ఆరోపణలతో నమోదైన కేసులో సుమంత్ డ్రైవర్ నవీన్తోపాటు మరో ముగ్గురు అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. సుమంత్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కేసు నమోదులో జాప్యం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ను సస్పెండ్ చేయడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.అసలు టార్గెట్ ఎవరు? ఓరుగల్లులో ఉత్కంఠ ఇప్పటి వరకు కుమార్తె వ్యాఖ్యల వ్యవహారంలో మంత్రి సురేఖను బాధ్యురాలిని చేయాలా? లేదా అది సుస్మిత వ్యక్తిగత వ్యాఖ్య లుగానే పరిగణించాలా? అన్నది కాంగ్రెస్లో చర్చ జరిగినా..చివరకు క్రమశిక్షణ సంఘం నివేదికలో సురేఖ వ్యవహారంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే మూడు పర్యాయాలు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని కమిటీ ప్రస్తావించడం.. ఈసారి కఠిన చర్యలకు సిఫారసు చేశామనడం.. కొండా శిబిరంలో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో సుమంత్ కేసులో పోలీసులపై చర్యలు తీసుకోవడం కూడా చర్చకు దారితీసింది. ఈ రెండు పరిణామాల మధ్య పార్టీ అధిష్టానం ఎలాంటి రాజకీయ సమీకరణాన్ని ఎంచుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులను హైదరాబాద్కు పిలిపించడం.. క్రమశిక్షణ సంఘం నివేదిక తీవ్రత.. పీసీసీ స్థాయిలో తదుపరి కసరత్తుపై జరుగుతున్న ప్రచారం.. ఇవన్నీ కలిపి చూస్తే త్వరలోనే కీలక నిర్ణయం వెలువడే అవకాశముందన్న చర్చ సాగుతోంది. మంత్రి పదవిపై ప్రభావమా? పార్టీ పరంగా చర్యా? వివాదానికి ఫుల్స్టాపా? లేక సర్దుబాటా? కాంగ్రెస్ అధిష్టానం ఏం తేల్చబోతోందన్నదే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.సాక్షి, వరంగల్ : వన మహోత్సవంలో పాల్గొనేందుకు వరంగల్కు మంగళవారంవచ్చిన మంత్రి కొండా సురేఖను సుస్మిత వ్యాఖ్యలు, సీఎంతో వివాదంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా ఆమె స్పందించకుండా మౌనం పాటించడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రాజకీయ అంశాలపై ఘాటుగా స్పందించే మంత్రి ఈసారి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో పార్టీ వర్గాల్లో మరిన్ని ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా, అధిష్టానం కదలికలను బట్టే కొండా ఆలోచనలుంటాయని అనుచరులు అంటున్నారు. డ్రైవర్ సహా నలుగురు అరెస్టు.. నిర్లక్ష్యం చేసిన సీఐపై వేటు ఒకేసారి రాజకీయ రచ్చ.. పోలీసు కేసు.. హైదరాబాద్కు ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులు -
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
ములుగు: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంగళవారం గట్టమ్మ సమీపంలోని పంచాయతీరాజ్ పైలాన్ ఆవరణలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టొప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్కు బాటలు వేయాలన్నారు. వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా ప్రకృతిని పరిరక్షించే సామాజిక బాధ్యతగా ప్రతిఒక్కరూ భావించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎఫ్డీఓ సత్తయ్య, అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చిత్తడి నేలల పరిరక్షణకు చర్యలు జిల్లాలోని చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, జలవనరుల హద్దులను క్షేత్రస్థాయిలో పక్కాగా గుర్తించాలని కలెక్టర్, జిల్లా చిత్తడి నేలల కమిటీ చైర్మన్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ జిల్లా స్థాయి చిత్తడి నేలల కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని చిత్తడి నేలల గుర్తింపు, సర్వే, హద్దుల నిర్ధారణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్తడి నేలలు, జలవనరుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని జలవనరులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి విస్తీర్ణం, హద్దులకు సంబంధించిన వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. సర్వే, హద్దుల నిర్ధారణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ సంపత్, డీపీఓ వెంకయ్య, డీఏఓ సురేశ్కుమార్, జిల్లా ఉద్యానశాఖ అధికారి సంజీవరావు పాల్గొన్నారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు -
పెరుగుతున్న గోదావరి
● సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి 4,96,300క్యూసెక్కుల నీరు కన్నాయిగూడెం: గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో మండల పరిధిలోని తుపాకులగూడెం గోదావరిపై ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీలోకి 4,96,400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సోమవారం వరకు 1,20,300 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా మంగళవారం ఒక్కరోజే సుమారుగా 3,76,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరినట్లు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ 59 గేట్లను ఎత్తి 4,90,300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలిపారు.సమ్మక్కసాగర్ బ్యారేజీ వద్ద వరద ఉధృతి -
కేవీ మంజూరు గర్వకారణం: బీజేపీ
వెంకటాపురం(ఎం): జిల్లాకు కేంద్రీయ విద్యాలయం(కేవీ) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంజూరు చేయడం గర్వకారణమని పార్టీ జిల్లా అధ్యక్షుడు బలరాం అన్నారు. మండల పరిధిలోని జవహర్నగర్ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని బీజేపీ నాయకులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భగా బలరాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 54 కొత్త కేవీల్లో తెలంగాణకు నాలుగు మంజూరయ్యాయని తెలిపారు. వాటిల్లో ఒకటి జిల్లాకు కేటాయించడం ప్రధాని నరేంద్రమోదీ ఘనత అని వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు సైతం ప్రారంభమయ్యాయని తెలిపారు. పాఠశాల ఏర్పాటుకు కృషి చేసిన ప్రధాని మోదీ, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్కు కృతజ్ఞతలు తెలిపారు. -
మండలాల వారీగా వితంతువులు, ఒంటరి మహిళలు
● బీసీ మహిళలకు ఉచితంగా రూ.12వేల విలువైన ఆటోమేటిక్ మిషన్లు ● 18 నుంచి 55ఏళ్లలోపు మహిళలు అర్హులు ● వితంతు, ఒంటరి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ● సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు గడువు కనీస విద్యార్హత ఉండాలి.. ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్ లబ్ధి పొందాలంటే మహిళలకు కనీస విద్యార్హత ఉండాలి. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే క్రమంలో ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, అర్హత పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను మండల, మున్సిపాలిటీ స్థాయి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయిస్తారు. ఆన్లైన్ చేసిన దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తుదారులు మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది.ములుగు: రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత, ఆర్థికాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి ద్వారా సంక్షేమ పథకాలు, అవకాశాలు కల్పిస్తోంది. ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గంలో నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా ప్రభుత్వం ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకునే విధంగా షెడ్యూల్ ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు రూ.500 గ్యాస్ సిలిండర్, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వ్యాపార అవకాశాలు, వడ్డీలేని రుణాలు, రుణ బీమా పథకం, ఆరోగ్యలక్ష్మి. స్వయం ఉపాధి పథకాలను అందిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని వెనుకబడిన తరగతుల మహిళలకు ఇందిరమ్మ కుట్టుమిషన్ పథకం ద్వారా మరింత ప్రయోజనం కలుగనుంది. ప్రభుత్వం తొలి విడతగా రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లాకు రెండు వేల కుట్టుమిషన్లు ప్రభుత్వం తొలి విడతగా ప్రతీ జిల్లాకు రెండు వేల కుట్టు మిషన్లు వందశాతం సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది. జిల్లాలో ములుగు, వెంకటాపురం(ఎం), మంగపేట, ఏటూరునాగారం, గోవిందరావుపేట, మల్లంపల్లి, ఎస్ఎస్ తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం అందించే కుట్టుమిషన్ తీసుకోవడానికి మహిళలు ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12 వేల వరకు ఉంటుంది. జిల్లాకు 2 వేల వరకు ఆటోమేటిక్ కుట్టుమిషన్లు మహిళలకు అందించనుండడంతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. వచ్చేనెల 15 వరకు గడువు జిల్లాలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన 18 నుంచి 55 ఏళ్ల వరకు ఉన్న మహిళలు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మహిళలు కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల వరకు మించకూడదు. ఒక కుటుంబం నుంచి ఒక రేషన్ కార్డుపై ఒకరికి మాత్రమే ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని వర్తింపజేస్తారు. దరఖాస్తు చేసుకునే మహిళ తప్పనిసరిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. పేద మహిళలు, నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 16,337 మంది వితంతువులు, 1,511 మంది ఒంటరి మహిళలు ఉన్నారు. అదే విధంగా మేర, మేరు సామాజిక వర్గానికి చెందిన వారికి సైతం ప్రాధాన్యం ఉంటుంది.మండలం వితంతువులు ఒంటరి మహిళలు ఏటూరునాగారం 1,557 173 గోవిందరావుపేట 1,858 100 కన్నాయిగూడెం 551 61 మల్లంపల్లి 852 54 మంగపేట 2,573 258 ములుగు 1,915 126 ములుగు మున్సిపాలిటీ 816 60 ఎస్ఎస్తాడ్వాయి 1,189 132 వెంకటాపురం(ఎం) 2,064 106 వెంకటాపురం(కె) 1,659 262 వాజేడు 1,303 179 -
చెక్డ్యామ్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
● టెలికాన్ఫరెన్స్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగు: చెక్డ్యామ్లు, పంట కుంటల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ప్రతీ గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయం నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య, ప్రత్యేక కమిషనర్ శ్రీలక్ష్మితో కలిసి మంత్రి సీతక్క జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన పంటకుంటల పనులను వెంటనే ప్రారంభించి, ఉపాధి కల్పనతో పాటు నీటి సంరక్షణకు ఉపయోగపడే శాశ్వత ఆస్తులుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఏజెన్సీలో చెక్డ్యామ్లు, పంటకుంటలు, ఇతర నీటి సంరక్షణ పనుల్లో వేగం పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, జీవనోపాధికి ఉపయోగపడే ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని మంత్రి సీతక్క సూచించారు. అలాగే వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6.18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 5.32 కోట్ల మొక్కలు నాటి 86 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ సంపత్రావు, డీఆర్డీఓ రవీందర్, డీపీఓ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. -
అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు
ఏటూరునాగారం: మండల పరిధిలోని మీసేవ, ఆథార్ కేంద్రాల్లో అధిక వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ హెచ్చరించారు. మండలకేంద్రంలోని మీసేవ, ఆథార్ కేంద్రాలను తహసీల్దార్ జగదీశ్వర్తో కలిసి ఆయన మంగళవారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు వ్యతిరేకంగా దరఖాస్తుదారుల నుంచి అధిక రుసుము వసూలు చేస్తే నిర్వాహకుల సస్పెన్షన్తో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పలు మీసేవ, ఆధార్ కేంద్రాల్లో అధిక రసుము వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు తరుచుగా వస్తున్నాయని నిర్వాహకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులు అందుబాటులో ఉంటూ దరఖాస్తుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ ఈఎస్డీ నిబంధనలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మీసేవ జిల్లా మేనేజర్ పోలోజు విజయ్, సెంటర్ల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ -
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
గోవిందరావుపేట: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సిబ్బందికి సూచించారు. మండల పరిధిలోని పస్రా పోలీస్స్టేషన్ను వార్షిక తనిఖీలో భాగంగా ఎస్పీ మంగళవారం సందర్శించారు. స్టేషన్లోని రికార్డులు, కేసుల దర్యాఫ్తు పురోగతి, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధులు, పెండింగ్ కేసుల వివరాలపై ఎస్పీ సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించి, పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందికి సూచించారు. అలాగే స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, గంజాయి, ఇతర అక్రమ కార్యకలాపాలపై నిఘా మరింత పెంచాలని ఆదేశించారు. విధుల్లో అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసి పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన వాహనాల రికార్డులను పరిశీలించారు. అలాగే రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలను గమనించాలని ఆదేశించారు. అనంతరం స్టేషన్ సిబ్బందిని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ ఎన్.రవీందర్, పస్రా సీఐ దయాకర్, ఎస్సై తాజొద్దీన్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
సమస్యలు పరిష్కరించాలి
ములుగు: రాష్ట్రంలో భూసేకరణ, పునరావాసం –పునరావాస పునరుద్ధరణ (ఆర్అండ్ఆర్), అటవీ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు పాల్గొన్నారు. ప్రాజెక్టుల వారీగా అవసరమైన భూసేకరణ, పెండింగ్లో ఉన్న ఆర్అండ్ఆర్ చెల్లింపులను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.● వీసీలో రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి -
పోలీస్స్టేషన్ ఆకస్మిక తనిఖీ
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డ్స్, క్రైమ్ ఫైల్స్, పీఎస్ పరిసరాలు, ఆయుధాల పనితీరు పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్, మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఆదేశించారు. అదేవిధంగా ఆన్లైన్ పోర్టల్స్, సీసీటీఎస్ఎస్, రోడ్డు ప్రమాదాల పోర్టల్, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీల గురించి సమీక్ష నిర్వహించి సిబ్బంది పలు సూచనలు చేశారు. ఆ తర్వాత పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో సీఐ ముత్యం రమేశ్, ఎస్సైలు తిరుపతిరావు, తిరుపతి రెడ్డి, సాయి కృష్ణలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి ములుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యతా ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని, ప్రతీ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్షాభావ పరిస్థితులు, నీట్–పీజీ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు జిల్లా నుంచి కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక, చారిత్రక, వారసత్వ, ఎకో టూరిజం, హస్తకళలు, జల పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటిని అనుసందానిస్తూ పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఈ వీసీలో డీఈఓ సిద్ధార్థ రెడ్డి, డీఐఓ వీరేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మేడిగడ్డకు 1,44,470 క్యూసెక్కుల ఇన్ఫ్లో కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాణహిత నది వరద ప్రవాహం పెరిగి మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరితో కలిసి మేడిగడ్డకు చేరుతోంది. మంగళవారం మేడిగడ్డ వద్ద 1,44,470 క్యూసెక్కుల ఇన్ఫ్లో తరలిరావడంతో మొత్తం గేట్లు ఎత్తి నీటి ని దిగువకు తరలిస్తున్నారు. రాత్రి వరకు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. సీఈఆర్ క్లబ్ అభివృద్ధికి చర్యలు భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి సీఈఆర్ క్లబ్ను అభివృద్ధి చేసి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఏరియా జీఎం కార్యాలయంలో సీఆర్ క్లబ్ కమిటీ సభ్యులతో జీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్లోని మౌలిక సదుపాయాల మెరుగుదల, అవసరమైన మరమ్మతులు, కొత్త సౌకర్యాల కల్పన, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. క్లబ్ను మరింత ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సూచించారు. అనంతరం సీఆర్ క్లబ్ కమిటీ సభ్యులు జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డిని సన్మానించారు. ఈ సమావేశంలో పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సాయి కృష్ణ, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి రమేష్, ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షుడు బేతేల్లి మధుకర్రెడ్డి, సీఈఆర్ క్లబ్ సంయుక్త కార్యదర్శి కాపు చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
వన మహోత్సవం లక్ష్యాలను పూర్తి చేయాలి
● వీసీలో మంత్రి కొండా సురేఖ ములుగు: వన మహోత్సవంలో భాగంగా జిల్లాలకు నిర్దేశించిన మొక్కలు నాటే లక్ష్యాలను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేసేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంత్రి కొండా సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం వన మహోత్సవం కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, డీఎఫ్ఓ వికాస్ మీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. వీసీ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసి, జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 27న పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామసభలు ఆగస్టు 27న రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్న్హాల్ నుంచి కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఆర్డీఓ కృష్ణవేణితో కలిసి వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జనరేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, పూర్తి చేస్తున్నామన్నారు. 27న గ్రామసభలు, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ వీసీలో సూపరింటెండెంట్, ఎలక్షన్ వింగ్ ఎండీ. సలీం ఉద్దీన్, నాయబ్ తహసీల్దార్ (ఎలక్షన్) ఎం. నితీష్ తదితరులు పాల్గొన్నారు. -
నిలిచిన బొగ్గు ఉత్పత్తి
భూపాలపల్లి అర్బన్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనులో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. శనివారం మధ్యాహ్నం నుంచి బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాకేంద్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్ట్–1, 2 ప్రాజెక్ట్లలో పని స్థలాల వద్ద వరద నీరు వచ్చి చేరింది. రోడ్లు పూర్తిగా బురదమయమయ్యాయి. దీంతో బొగ్గు, మట్టి వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు రోజుల్లో కలిసి సుమారు 10వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గనిలోకి చేరిన వరద నీటిని భారీ మోటార్ల సహాయంతో బయటికి పంపిస్తున్నారు. -
సర్పంచ్ల ఫోరం జిల్లా కన్వీనర్గా కుమార్గౌడ్
ములుగు: సర్పంచ్ల ఫోరం జిల్లా కన్వీనర్గా ముసినపల్లి కుమార్గౌడ్ను నియమించినట్లు తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి ప్రకటించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారం, గ్రామీణ స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కన్వీనర్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల సర్పంచులను సమన్వయం చేస్తూ వారి సమస్యలను తెలుసుకుని, వాటిని సంబంధిత అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. కాగా కుమార్ గౌడ్ నియామకంపై జిల్లాలోని పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రేరణ’కు మోడల్ స్కూల్ విద్యార్థిని ఎంపికములుగు రూరల్: భారత ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రేరణ కార్యక్రమానికి పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ బండారుపల్లి విద్యార్థిని హర్షిత ఎంపికై నట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సింగారం దేవకి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత యువతకు స్ఫూర్తినిచ్చే ప్రేరణ కార్యక్రమానికి విద్యార్థిని ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షితను అభినందించారు. నిషేధిత భూముల జాబితాపై విచారణ జరపాలిములుగురూరల్: 22ఏ నిషేధిత భూముల జాబితాపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిప్రతం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరామ్ మాట్లాడుతూ 2014కు ముందు 22ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూముల పూర్తి వివరాలు వెల్లడించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22ఏలో కొత్తగా చేర్చిన భూములు, తొలగించిన భూముల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జవహర్ లాల్, కృష్ణాకృపాకర్, రవీంద్రచారి, రాజ్ కుమార్, సుమలత, జనార్దన్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సోమవారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ప్రతీ గదిని సందర్శించిన ఎమ్మెల్యే పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. సుమారు 242 మంది విద్యార్థులకు వసతి కల్పించే ఈ హాస్టల్ నిర్మాణాన్ని వేగవంతం చేసి సెప్టెంబర్ మొదటి వారంలోగా పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. నిర్మాణం పూర్తయిన అనంతరం హాస్టల్ చుట్టూ ప్రహరీతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అవసరమైతే అదనపు నిధులు కేటాయించి విద్యార్థులకు మెరుగైన వసతి వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
నామిలేట్ పదవులు!
47 రోజులు గడిచినా నామినేటెడ్ పోస్టులపై నాన్చివేత ధోరణిసాక్షిప్రతినిధి, వరంగల్: నామినేటెడ్ పదవులపై మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పలువురు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం జూలై 8న ముగిసింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించడమా? లేక పాతవారినే మరోసారి కొనసాగిస్తారా? అనే దానిపై వెంటనే నిర్ణయం వస్తుందని భావించారు. ఆపదవుల కాలం ముగిసి 47 రోజులు గడిచినా ఆ ప్రస్తావనే లేదు. దీంతో ఇటు తాజా మాజీలు.. అటు ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇటీవలి రాజకీయ పరి ణామాల నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే పదవులు ముగిసిన వారిలో కొందరు మరోసారి కొనసాగేందుకు అధిష్టానం పెద్దలను కలుస్తుండగా.. గత ఎన్నికల్లో టికెట్లు ఆశించి అవకాశం దక్కని వారు, ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు, దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న సీని యర్లు పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశావహుల్లో ఉత్కంఠ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే దశల వారీగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. 2024 జూలై 8న ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా 37 మంది చైర్మన్లను ప్రభుత్వం నియమించగా.. ఉమ్మడి వరంగల్ నుంచి ఆరుగురికి అవకాశం లభించింది. పాలకుర్తి, వరంగల్ పశ్చిమ టికెట్లను ఆశించి తప్పుకున్న జంగా రాఘవరెడ్డికి ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి, పరకాల నుంచి పోటీకి వైదొలిగిన ఇనగాల వెంకట్రామిరెడ్డికి ‘కుడా’ చైర్మన్ పదవి లభించాయి. మహబూబాబాద్ నుంచి బెల్లయ్య నాయక్కు ట్రైబల్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, భూపాలపల్లి నుంచి అయిత ప్రకాశ్రెడ్డికి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎండీ రియాజ్కు గ్రంథాలయ పరిషత్ వంటి కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు అప్పగించారు. జూలై 8న వారి పదవీకాలం పూర్తయ్యింది. కాగా, జిల్లాలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు తొలుత నామినేటెడ్ పోస్టు (రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్) పదవి కట్టబెట్టిన అధిష్టానం.. ఆయన పదవీకాలం ముగిసిన వెంటనే మరో రెండేళ్లు పొడిగించింది. మిగతా ఆరు పోస్టులపై మాత్రం కొనసాగుతున్న సస్పెన్స్ తాజా మాజీలు, ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. మా పేర్లు పరిశీలించండి.. ఓవైపు తాజా మాజీలు కొనసాగింపు కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కొత్తగా పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్, ఎమ్మెల్సీ తదితర నామినేటెడ్ పదవుల కోసం పోటీలో ఉన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ, జిల్లా స్థాయిల్లో పార్టీకి సేవలందించిన దొమ్మాటి సాంబయ్య, శనిగరపు ఇందిర, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కె.రవళి, నమిండ్ల శ్రీనివాస్, ఈవీ శ్రీనివాసరావు, పింగిళి వెంకట రాంనర్సింహరెడ్డి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, గాజర్ల అశోక్తో పాటు పలువురు నేతలు పదవుల రేసులో ఉన్నారు. వెన్నం శ్రీకాంత్రెడ్డి, భరత్ చంద్రారెడ్డి, గొల్లపల్లి రాజేందర్, మార్క విజయ్కుమార్, అబూబక్కర్, పోలెపల్లి రంజిత్రావు, మరికొందరు సీనియర్లు కూడా తమ పేర్లను పరిశీలించాలని అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నట్లు కూడా పార్టీ వర్గాల సమాచారం. మరింత సమయం పట్టే అవకాశం రెన్యూవల్ చేస్తారా.. కొత్తవారికి ఇస్తారా? అని సందిగ్ధం ఎటూ తేల్చని అధిష్టానం.. తాజా మాజీల్లో టెన్షన్ రోజురోజుకూ పెరుగుతున్న ఆశావహులుసీఎం, పీసీసీ చీఫ్, మంత్రులదే తుది నిర్ణయం ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీలో అధి ష్టానం ఎలాంటి ఫార్ములాను అనుసరిస్తుందన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారా? ఇప్పటికే పదవులు అనుభవించిన వారికి మరో అవకాశం కల్పిస్తారా? సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యతకు పెద్దపీట వేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరు జిల్లాల మధ్య సమతుల్యతతో పాటు ఆయా సామాజికవర్గాలకు ప్రాతినిథ్యం కల్పించడం కూడా కీలకంగా మారనుంది. ఒకరికి పదవి ఇస్తే మరో సామాజికవర్గం నుంచి వచ్చే డిమాండ్ను ఎలా సమన్వయం చేయాలన్నది అధిష్టానానికి సవాలుగా మారే అవకాశముంది. ఇదిలా ఉండగా.. నామినేటెడ్ పోస్టుల భర్తీకి మరికొంత సమయం పట్టవచ్చని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్), ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరింత ఆలస్యం కావొచ్చన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా, ఈసారి కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీలో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్తో పాటు ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే ల సిఫార్సులే కీలకంగా మారనున్నాయన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో నడుస్తోంది. -
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
ములుగు: ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారులు అందించిన దరఖాస్తులకు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. సోమవారం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు సీహెచ్. మహేందర్ జీ, ఎం.సంపత్ రావులతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 44 దరఖాస్తులు రాగా భూమికి సంబంధించినవి 15, ఇందిరమ్మ ఇళ్లు 4, పింఛన్లు 7, ఇతర శాఖలకు సంబంధించినవి 18 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని, ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రవి కుమార్, ఆర్డీఓ కృష్ణవేణి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు ప్రజావాణిలో కలెక్టర్, గిరిజన దర్బార్లో ఐటీడీఏ పీఓ వినతుల స్వీకరణ -
ప్రత్యేక నిఘా
మంగళవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2026గంజాయి రవాణాపైజిల్లాలో మత్తు పదార్థాల నివారణే లక్ష్యం పోలీస్శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు యువత మత్తుకు దూరంగా ఉండాలి ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ‘సాక్షి’ ఫోన్ఇన్ కార్యక్రమానికి విశేష స్పందనప్రశ్న: యువత గంజాయి మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. – శ్రీనివాస్, ఏటూరునాగారంజవాబు: డ్రంకెన్ డైవ్ నిర్వహిస్తాం. మత్తు పదార్థాలు సేవిస్తే చర్యలు తీసుకుంటాం. రాత్రి సమయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పైట్రోలింగ్తో పాటు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ములుగు రూరల్: జిల్లాలో గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, మత్తు పదార్థాల నివారణే లక్ష్యంగా పోలీస్శాఖ పని చేస్తుందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు సాక్షి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పలువురు అడిగిన ప్రశ్నలకు ఎస్పీ సమాధానం ఇచ్చారు. మత్తు పదార్థాల రవాణా, వినియోగం, దుష్పలితాలు, నిర్మూలనకు పోలీస్శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తుకు బానిసై బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దన్నారు. మత్తుకు బానిసైన వారిని తిరిగి మాములుగా మార్చేందుకు కౌన్సెలింగ్తో పాటు రియాబిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రశ్న: గంజాయికి అలవాటుపడిన వారిని మాన్పించేందుకు రియాబిటేషన్ సెంటర్ ఎక్కడఉంది. – జెట్టి శ్రీను, వెంకటాపురం(కె)జవాబు: మత్తు పదార్థాలకు అలవాటుపడిన వారిని మాన్పించేందుకు జిల్లా కేంద్రంలో రియాబిటేషన్ కేంద్రం ఉంది. ములుగు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కొనసాగుతోంది. మీ ప్రాంతంలో ఎరైన ఉన్నట్లయితే వారికి సమాచారం అందించండి. ప్రశ్న: జిల్లాకేంద్రంలో యువత మత్తు పదార్థాల వినియోగం రాత్రి సమయంలో ఎక్కువగా ఉంది. – ముంజాల భిక్షపతి, ములుగుజవాబు: రాత్రి సమయంలో యువత గుంపులుగా కలిసి సిగరెట్లు, మద్యం, గంజాయి వంటివి సేవించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీస్ పెట్రోలింగ్ పెంచుతాం. ప్రశ్న: మేడారం వచ్చే టూరిస్టులు ఇక్కడి యువతకు మత్తు పదార్థాలను అలవాటు చేస్తున్నారు. – ఎనగంటి నరేష్, నార్లాపూర్జవాబు: మేడారం వచ్చే ఇతర రాష్ట్రాలు, పట్టణ ప్రాంతాల టూరిస్టులపై లోకల్ పోలీస్లతో స్పెషల్ ఫోకస్ పెట్టిస్తాం. యువత మత్తుకు దూరంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రశ్న: గ్రామాల్లో విచ్చిలవిడిగా గుడుంబా తయారీ అమ్మకాలు చేపడుతున్నారు. – సావర్తి ధర్మేందర్, వెంకటాపురం(ఎం), భిక్షపతి, కన్నాయిగూడెంజవాబు: గ్రామాల్లో గుడుంబా తయారీ, నిర్మూలనకు చర్యలు తీసుకుంటాం. పోలీస్శాఖ, ఎకై ్సజ్శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి గుడుంబా నియంత్రణ చేపడతాం. ప్రశ్న: ఇసుక లారీలు అధికలోడ్తో వెళ్లడంతో రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. చర్యలు తీసుకోవాలి. –నరేష్, మంగపేటజవాబు: అధిక లోడ్తో వెళ్లే వాహనాలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం. వాహనదారులకు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతాం. ప్రశ్న: ప్రభుత్వ పాఠశాలల ఆవరణాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. చర్యలు తీసుకోవాలి. – హరీష్, వెంకటాపురం(ఎం)జవాబు: ప్రభుత్వ పాఠశాల వద్ద మద్యం సేవించకుండా రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తాం. అలాగే పాఠశాల పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తాం. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
ఏటూరునాగారం: మండలకేంద్రంలోని స్థానిక ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈనెల 19, 20వ తేదీల్లో హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ ప్రదర్శన పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రేణుక తెలిపారు. సోమవారం మండలకేంద్రంలోని కళాశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చరిత్ర, తెలుగు, కంప్యూటర్ సైన్స్ విభాగాల విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిజ్ఞాస కోఆర్డినేటర్ జీవవేణి, విభాగాల అధిపతులు వెంకటయ్య, సంపత్, శ్రీధర్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
గిరిజన దర్బార్లో..
ఏటూరునాగారం: గిరిజనులు సమర్పించిన వినతులు తక్షణమే పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని ఐటీడీఏ సమావేశంలో గిరిజనుల నుంచి 13 వినతులను స్వీకరించారు. గోవిందరావుపేట మండలం గాంధీనగర్ గ్రామం అభివృద్ధికి ఎస్సీసీఎల్ సీఎస్ఆర్ నిధుల ద్వారా గ్రామ అభివృద్ధి పనులు చేయించాలని సింగరేణి కాలారీస్ కంపెనీ లిమిటెడ్ కార్మికులు కోరారు. గూడూరు మండలం గుండెంగ గ్రామంలో బోరు ఇప్పించాలని గిరిజన రైతు కోరారు. తాడ్వాయి మండలం గంగారం గ్రామంలో అన్నారం శివారులో ప్రభుత్వ భూమిని ఆక్రమణకు గురవుతుందని, పరిరక్షించాలని కోరారు. అలాగే వివిధ మండలాల నుంచి గిరిజనులు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. వచ్చిన సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కారం చూపుతామని పీఓ తెలిపారు. కార్యక్రమంలో ఎస్డీసీ ప్రతాప్, డీడీ జనార్దన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, జేడీఎం కొండల్రావు, ఈఈ ప్రవీణ, జీసీసీ డీఎం వాణి, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి, ఆర్టీసీ కంట్రోలర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
27న ఉద్యోగుల మహాధర్నా
ములుగు: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. సోమవారం జేఏసీ చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రీపోలు రాజు ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్లకు ధర్నా నోటీసు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ పీఆర్సీ అమలు, పెండింగ్లో ఉన్న 6 డీఏల విడుదల, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల మంజూరు, హెల్త్ కార్డుల అమలు తదితర డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వి.యాకూబ్రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యదర్శి కందుల జీవనన్కుమార్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి మేడి చైతన్య, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.రామ్మూర్తి, సారయ్య, శ్యామ్నాయక్, ప్రభాకర్రావు, ప్రకాష్రెడ్డి, అప్పలనాయుడు, ధర్మానాయక్, డాక్టర్ కొమురయ్య, సిద్ధార్థరెడ్డి, ప్రేమలత, పిట్టల రవి, కుమారస్వామి, ఎండీ రఫీక్, చంద్రశేఖర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఎస్పీతో ఫోన్ ఇన్
ములుగు రూరల్ : Ýë„ìS B«§ýlÓ-Æý‡Å…ÌZ ¯ólyýl$ (ÝùÐ]l$ÐéÆý‡…)-Ð]l¬Ë$VýS$ Gïܵ çÜ$«©ÆŠḥ Æ>…¯é£Š కేకన్ తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల వరకు ఉంటుంది. ఫోన్ ఇన్ కార్యక్రమంలో మత్తు పదార్థాల రవాణా, వినియోగం, నియంత్రణపై ఎస్పీ సలహాలు, సూచనలు అందించనున్నారు. జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై నేరుగా వివరణ ఇవ్వనున్నారు. ఫోన్ చేయదలిచిన వారు కింది పేర్కొన్న ఫోన్ నంబర్కు కాల్ చేయగలరు. -
పత్తిదే పైచేయి
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు పంట మార్పిడికి మొగ్గు చూపుతున్నారు. లోటు వర్షపాతం, వరి కంటే తక్కువ నీటితో పండే పత్తి, పప్పుధాన్యాల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో సాధారణ సాగు అంచనాతో పోలిస్తే పత్తి, పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరగగా.. వరి 66.88 శాతానికే పరిమితమైంది. వ్యవసాయశాఖ విడుదల చేసిన వానాకాలం–2026 నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్లో సాధారణ సాగు విస్తీర్ణం 15.93 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 13.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యా యి. మొత్తం 85.78 శాతం సాగు పూర్తయ్యింది. అంచనాలు మించిన పత్తి సాగు.. ఉమ్మడి వరంగల్లో సాధారణంగా 5,54,387 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా.. ఈసారి ఇప్పటికే 5,61,578 ఎకరాల్లో సాగైంది. అంటే సాధారణ అంచనాలో 101.30 శాతం మేర సాగు నమోదైంది. ముఖ్యంగా భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో పత్తి సాగు సాధారణ అంచనాలను మించింది. భూపాలపల్లిలో 98,764 ఎకరాల సాధారణ సాగుకు 1,09,442 ఎకరాల్లో పత్తి వేశారు. జనగామలో 1,37,145 ఎకరాల అంచనాకు 1,38,325 ఎకరాల్లో సాగు చేశారు. పెరిగిన పప్పుధాన్యాల సాగు.. పప్పుధాన్యాల సాగు భారీగా పెరగడం ఈసారి మరో ఆసక్తికర పరిణామం. సాధారణంగా 15,715 ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగవుతాయని అంచనా ఉండగా.. ఇప్పటికే 60,863 ఎకరాల్లో సాగయ్యాయి. సాధారణ అంచనాతో పోలిస్తే 387.29 శాతం ఎక్కువగా సాగైంది. మహబూబాబాద్లో సాధారణ అంచనా 4,696 ఎకరాలు కాగా.. 23,815 ఎకరాల్లో సాగు చేశారు. వరంగల్లో 1,355 ఎకరాల అంచనాకు 11,742 ఎకరాల్లో, భూపాలపల్లిలో 352 ఎకరాల అంచనాకు గాను 9,670 ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగయ్యాయి. జనగామలో 7,777 ఎకరాల అంచనాకు 11,059 ఎకరాల్లో సాగు నమోదైంది. తక్కువ నీటితో సాగు, వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటను కొనసాగించే అవకాశం ఉండడంతో రైతులు పప్పుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వరిసాగు 66.88 శాతం మాత్రమే సాధారణంగా 9,21,445 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా కాగా 6,16,267 ఎకరాల్లో మాత్రమే సాగైంది. దీంతో సాధారణ సాగు విస్తీర్ణంలో 66.88 శాతం మాత్రమే నమోదైంది. అధిక నీటి అవసరం ఉండే వరి సాగు.. వర్షపాతం లోటు నెలకొన్న ప్రాంతాల్లో కొంత మందగించింది. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాగులో మానుకోట ముందంజ.. భూపాలపల్లి టాప్ మొత్తం సాగు విస్తీర్ణం పరంగా మహబూబాబాద్ ముందు ఉంది. జిల్లాలో 3,71,318 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణానికి 3,30,176 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాధారణ అంచనాతో పోలిస్తే సాగు ప్రగతిలో భూపాలపల్లి 94 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత జనగామ 91 శాతం, మహబూబాబాద్ 89 శాతం, హనుమకొండ 85 శాతం, ములుగు 80 శాతం, వరంగల్లో 72 శాతం చొప్పున సాగు నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,61,578 ఎకరాల్లో కాటన్ క్రాప్ వరి 6,16,267, పప్పుధాన్యాలు 60,863 ఎకరాల్లో సాగు ఈసారి 15.93 లక్షలకు 13.66 లక్షల ఎకరాల్లో పంటలు వర్షాభావ పరిస్థితులతో పంటమార్పిడికి రైతుల మొగ్గునాలుగు జిల్లాల్లో తీవ్ర వర్షాభావం.. భూపాలపల్లిలో 11.98 మీటర్లకు భూగర్భజలాలు.. వర్షాభావం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జూన్ 1 నుంచి ఈ నెల 21 వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 430.1 మిల్లీమీటర్లు కాగా.. నాలుగు జిల్లాల్లో తీవ్ర లోటు నమోదైంది. హనుమకొండలో సాధారణ వర్షపాతం 547.8 మిల్లీమీటర్లకు 298.4 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. దీంతో 45.5 శాతం లోటు నమోదైంది. వరంగల్లో 43.1 శాతం, జనగామలో 43.2 శాతం, మహబూబాబాద్లో 30.8 శాతం లోటు ఉంది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వరుసగా 8.5, 7.9 శాతం స్వల్ప లోటు ఉన్నా.. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం సాధారణ వర్షపాతం పరిధిలోనే ఉన్నాయి. మహబూబాబాద్లో 6.02 మీటర్లు, వరంగల్లో 6.65, ములుగులో 7.11, హనుమకొండలో 7.71, జనగామలో 9.14 మీటర్ల లోతులో నీటిమట్టం ఉంది. భూపాలపల్లిలో మాత్రం భూగర్భజల మట్టం 11.98 మీటర్ల లోతున చేరడంతో ఆందోళన పరిస్థితి నెలకొంది.అవగాహనతో పంటల మార్పువర్షపాతం లోటు, తక్కువ నీటి లభ్యత, ఎల్నినో ప్రభావంపై వ్యవసాయశాఖ చేపట్టిన అవగాహన సదస్సులు ఫలించాయి. అధిక నీటి అవసరం ఉన్న వరి సాగు కంటే తక్కువ నీటితో సాగయ్యే పత్తి, పప్పుధాన్యాల వైపు రైతుల మొగ్గు చూపారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్సీడ్స్, పప్పుధాన్యాల పంటలు సాగు చేయాలని రైతులకు సూచించాం. – దోమ ఆదిరెడ్డి, ఏడీఏ, హనుమకొండ -
చట్టాలను యథావిధిగా కొనసాగించాలి
ములుగు రూరల్ : కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో విశ్రాంత ఉద్యోగుల భవనంలో జంపాల రవీందర్ అధ్యక్షతన ఏఐటీయూసీ జిల్లా మూడో మహాసభ నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. అనేక ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థ కోసం నాలుగు చట్టాలుగా కుదించిందని వివరించారు. దీంతో కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా పోతుందన్నారు. కార్మికుల హక్కును రక్షించుకోవటం కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాని పిలుపునిచ్చారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ముత్యాల రాజు, ప్రధాన కార్యదర్శిగా బండి నర్సయ్యతో పాటు 15మందితో కూడిన కమిటీని ఎన్నుకున్నారు. నాయకులు పోలం కొండయ్య, పోతిరెడ్డి ప్రమీల, గడ్డం భారతి, కుడుముల సమ్మక్క, రాజకుమారి, రమ, శ్రీనివాస్, రాజేందర్, దేవేందర్, సతీష్ తదితరులు ఉన్నారు. -
90మంది కండక్టర్లు ఔట్ !
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో జీవితానికి భద్రత ఉంటుందని కోటి ఆశలతో వచ్చిన నిరుద్యోగులను ఏడాదిలోపే సంస్థ రోడ్డున పడేసింది. వరంగల్ రీజియన్లో ఒక్కసారిగా 90మంది ఔట్ సోర్సింగ్ కండక్టర్లను తొలగిస్తూ రీజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు పర్సనల్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ రీజియన్లో మొత్తం 274మంది ఔట్ సోర్సింగ్ కండక్టర్లు పనిచేస్తుండగా శుక్రవారం రాత్రి 90మందిని తొలగించారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసు, సమాచారం ఇవ్వకుండానే అన్యాయంగా తొలగించారని నిరసన వ్యక్తం చేస్తూ, తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయం వద్ద తొలగించిన ఔట్ సోర్సింగ్ కండక్టర్లు ధర్నా చేశారు. ఏడాది కాలంగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమను అకారణంగా తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. మరునాడు విధులకు రమ్మని డ్యూటీ చార్టు వేసి రాత్రికి రాత్రే తొలగించడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. తాము ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్కు రూ.లక్షనుంచి రూ.2 లక్షల వరకు ఇచ్చి విధుల్లో చేరామని ఆరోపించారు. నెలకు ఇచ్చే రూ.18వేలలో ఒక్కరోజు గైరాజర్కు రూ.600లకు బదులుగా రూ.1200 కోత విధించినా.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీలో ఉద్యోగ భద్రత ఉంటుందని సహిస్తూ వచ్చామన్నారు. తమ కుటుంబాల పరిస్థితులు అర్థం చేసుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ షెడ్యూల్స్ తగ్గించడంతో కండక్టర్లు మిగులుబాటులో ఉన్నారని, అందుకే తాత్కాలికంగా తొలగించామని తెలిపారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించిన ఆర్టీసీ వరంగల్ రీజియన్లో మొత్తం 274మంది ఔట్ సోర్సింగ్ కండక్టర్లు ఆర్ఎం కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా.. తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ -
గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి
●సాక్షి, మహబూబాబాద్: బంజారా యువతులు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. తీజ్ అంటే గోధుమ నారు. ప్రకృతి శ్రావణంలో వర్షాలు కురిసి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఈ సీజన్లో కనిపించే ఎర్రని వర్ణం గల ఆరుద్ర పురుగులను కూడా తీజ్ అని పిలుస్తారు. అంతటి అందమైన పురుగులను దేవుడు మనకోసమే కిందికి పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు యువతులు మనస్సులో కోరుకున్న కోరిక ఫలిస్తుందనేది గిరిజనుల నమ్మకం. ఈనేపథ్యంలో గోధుమలు బుట్టల్లో అలికి రోజూ నీళ్లు పోస్తే ఆరుద్ర పురుగులాంటి అందం, మంచి నడవడిక, బుద్ధి, సంపదలతో కూడిన వరుడు దొరుకుతాడని గిరిజనులు నమ్ముతారు. ఈనమ్మకం వందల ఏళ్ల కిందట మొదలై రోజురోజుకూ ఆధునిక హంగులు అద్దుకుంటోంది. తొమ్మిది రోజుల తంతు పెళ్లీడుకు వచ్చిన యువతి తనకు కావాల్సిన పెళ్లికొడుకు కోసం చేసే ఈ పండుగలో ముందుగా తల్లిదండ్రులు, తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా తండా పెద్ద నాయక్ అనుమతి పొందిన తర్వాత పండుగ తంతు మొదలు పెడతారు. తీజ్ (గోధుమ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్లి దుస్సేరు (ఫిలోణీర్ వేళ్లీ) తెస్తారు. ఈ తీగలతో అందమైన బుట్టలను అల్లుతారు. లంబాడీల ఆరాధ్య దైవం తుల్జా భవానీ, సేవాలాల్ మహరాజ్, సీత్లాభవానీలకు పూజలు చేసి స్నానాలు ఆచరించి పవిత్రతతో పుట్టమట్టిని తెస్తారు. లంబాడీ భాషలో బోరడీ ఝుష్కేరో అంటే రేగుముళ్లు గుచ్చడం. గోధుమబుట్టల్లోని నారుకు నీరు పోస్తున్న యువతి గోధుమ నారు పెంచి.. కోరుకున్న వరుడి కోసం పూజలు ఉమ్మడి జిల్లాలో బంజారాల సంబురం నూతన అలంకరణలతో ఉత్సవం -
ప్రజారోగ్య పరిరక్షణకు సహకరించాలి
ములుగు: ప్రజారోగ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలని ములుగు పురపాలక సంఘం కమిషనర్ సంపత్, చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ శనివారం విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని ఖాళీ, నివాస స్థలాల్లో చెత్త, వ్యర్థాలు, మురుగునీరు నిల్వ ఉండకుండా యజమానులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. చెత్త, మురుగునీరు నిల్వతో దోమలు, ఈగలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తెలిపారు. పురపాలక సంఘం నోటీసు జారీ చేసిన తేదీ నుంచి 7 రోజుల్లోగా స్థలాన్ని శుభ్రం చేయాలని పేర్కొన్నారు. గడువులోగా శుభ్రం చేయకపోతే పురపాలక సంఘమే శుభ్రపరిచి అయ్యే ఖర్చును సంబంధిత యజమాని నుంచి రూ.10 వేల వరకు వసూలు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. -
సాగునీరేది?
గోవిందరావుపేట: ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవడం లేదు. దీంతో జిల్లాలోని ప్రధాన సరస్సులు, చెరువుల్లో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో లక్నవరం సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 33.6అడుగులు కాగా ప్రస్తుతం 22.1 అడుగుల మేర నీరు ఉంది. నీటినిల్వ క్రమంగా తగ్గుతుండగా పంటలు సాగు చేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. ఆయకట్టు కింద ఇప్పటికే 5వేల ఎకరాల్లో వరిపంటను సాగుచేశారు. సాగుచేసిన రైతులు నీటి విడుదల కోసం చూస్తున్నారు. అనాధికారికంగా మరో 15వేల ఎకరాల్లో నాట్లు వేసేందుకు రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో సాగునీటి కోసం రైతులు తండ్లాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది నీటితో కళకళ గతేడాది ఇదే సమయానికి లక్నవరం సరస్సులో 33.6 అడుగుల నీటితో కళకళలాడుతూ నిండుకుండలా ఉంది. ఈ ఏడాది మాత్రం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే నాట్లు వేసిన పొలాల్లో నీరులేక తేమశాతం తగ్గిపోయింది. పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉండడంతో రైతులు పంటలను కాపాడుకోవడానికి నీటి విడుదలపై ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గతంలోనే నీటి విడుదలను నిలిపివేసిన అధికారులు నీటి విడుదలపై ఆలోచనలో పడ్డారు. నీటి విడుదలపై ఉత్కంఠ అధికారిక లెక్కల ప్రకారం లక్నవరం చెరువు కింద 8,794 ఎకరాల ఆయకట్టు ఉంది. స్థానికంగా అనాధికారికంగా మరో 15 వేల ఎకరాలకు పైగా సాగు అవుతున్నట్లు అంచనా. సాధారణంగా ఈ సమయానికి ఆయకట్టు పరిధిలో వరినాట్లు పూర్తై రెండో దశ ఎరువులు, పురుగు మందులు పిచికారీ కూడా పూర్తయ్యేది. కానీ ఈసారి వర్షాభావంతో ఇప్పటివరకు సుమారు 5 వేల ఎకరాల్లోనే మాత్రమే నాట్లు పడగా.. వేలాది ఎకరాల్లో నారుమడులు ముదిరిపోవడం, ఎండిపోవడం వంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నాట్లు వేసిన పంటలను కాపాడేందుకు అవసరమైన మేరకు ఒక విడత నీటిని అందించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పరిమితంగా ఉన్న లక్నవరం నీటిని ఇప్పటికే నాట్లు వేసిన పంటలను కాపాడేందుకు వినియోగించాలా.. లేక ఇంకా నాట్లు వేయాల్సిన ప్రాంతాలకు కూడా అందించాలా.. అన్నది అధికారులకు సవాలుగా మారింది. నరసింహుల, కోటగడ్డ, రంగాపురం, శ్రీరాంపతి కాల్వల పరిదిలోని రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా సరస్సులోకి ఇన్ఫ్లో లేకపోవడం, నీటి నిల్వ క్రమంగా తగ్గుతుండటంతో నీటి విడుదల విషయంలో అధికారులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. లక్నవరం సరస్సులో ప్రస్తుత నీటిమట్టం 22.1 అడుగులు రోజురోజుకూ తగ్గుతున్న నీరు ఆయకట్టు కింద 5వేల ఎకరాల్లో నాట్లు సాగునీటిపై రైతుల్లో ఆందోళన నీటి విడుదలపై అధికారులు ఆచితూచి అడుగులు -
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి
ములుగు: ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, సహాయ ఎన్నికల నమోదు అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించాలని ఈసీఐ సెక్రటరీ నవీన్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించేందుకు రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన శనివారం జిల్లాలో పర్యటించారు. ఈ మేరకు వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని పాలంపేట గ్రామంలోని పోలింగ్ కేంద్రాలతో పాటు గోవిందరావుపేట మండలం చల్వాయి పోలింగ్ కేంద్రాలను నవీన్ కుమార్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల పరిస్థితి, ఓటర్లకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, బీఎల్ఓల పనితీరు తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం చల్వాయి గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో పేర్లు, వివరాల పరిశీలన, మార్పులు, చేర్పులు, అభ్యంతరాలకు సంబంధించిన అంశాలపై క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నవీన్కుమార్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ–2026 పురోగతిపై ఏఈఆర్ఓలు, సంబంధిత ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అర్హత కలిగిన ఓటర్లు జాబితాలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దార్లు, ఎలక్షన్ సెల్ పర్యవేక్షకులు సలీం, డీటీ నితీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈసీఐ సెక్రటరీ నవీన్కుమార్ -
రేపు ఎస్పీతో ఫోన్ ఇన్
ములుగు రూరల్ : Ýë„ìS B«§ýlÓ-Æý‡Å…ÌZ Æó‡ç³#-(ÝùÐ]l$ÐéÆý‡…)-Ð]l¬Ë$VýS$ Gïܵ çÜ$«©ÆŠḥ Æ>…¯é£Š కేకన్ తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల వరకు ఉంటుంది. ఫోన్ ఇన్ కార్యక్రమంలో మత్తు పదార్థాల రవాణా, వినియోగం, నియంత్రణపై ఎస్పీ సలహాలు, సూచనలు అందించనున్నారు. జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై నేరుగా వివరణ ఇవ్వనున్నారు. ఫోన్ చేయదలిచిన వారు కింది పేర్కొన్న ఫోన్ నంబర్కు కాల్ చేయగలరు. -
విభజన హామీలు అమలుచేయాలి
ములుగు రూరల్: తెలంగాణ రాష్ట్ర విభజన హామీలను సమ్మక్క–సారక్క గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర యూనివర్సిటీల ఇన్చార్జ్ రెహమాన్ అన్నారు. ఈ మేరకు శనివారం ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా గిరిజన యూనివర్సిటీ వద్ద సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న గిరిజన యూనివర్సిటీ సమస్యలకు నిలయంగా మారిందన్నారు. కళాశాలలో పూర్తిస్థాయిలో కోర్సులు అందుబాటులో లేవని తెలిపారు. తాత్కాలిక పద్ధతిలో ప్రొఫెసర్లతో విద్యాబోధన చేపడుతున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు చేపట్టడంతో పాటు విభజన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్కుమార్, కుమ్మరి సాగర్, రాజ్కుమార్, ప్రవీణ్, నవీన్, రమేశ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. వాట్సాప్ సేవలు వినియోగించుకోవాలి ములుగు రూరల్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు వాట్సాప్ చాట్బాట్ సేవలను టీజీ ఎన్పీడీసీఎల్ అందుబాటులోకి తీసుకొచ్చిందని సర్కిల్ సూపరింటెండెంట్ భిక్షపతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వినియోగదారులు కార్యాలయాలకు వెళ్లకుండా అవసరమైన సేవలు పొందే విధంగా డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. వినియోగదారులు నంబర్కు 8712481489 వాట్సాప్లో హాయి అని పంపితే అందుబాటులో ఉన్న సేవలు వినియోగించుకోవచ్చని వివరించారు. ఫిర్యాదుల నమోదు, బిల్డింగ్, సర్విస్ కనెక్షన్, సోలార్కు సంబంధించిన సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. సంస్థ టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించవచ్చని తెలిపారు. వినియోగదారులు డిజిటల్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. 25 నుంచి దరఖాస్తుల పరిశీలన ఎస్ఎస్తాడ్వాయి: జిల్లాలోని తాడ్వాయి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గల గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తులను ఈ నెల 25 నుంచి పరిశీలించనున్నట్లు డీడబ్ల్యూఓ, తాడ్వాయి సీడీపీఓ ప్రేమలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు మాత్రమే నిర్ధేశిత తేదీల్లో ఉదయం 10.30 గంటలకు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో స్వయంగా హాజరుకావాలని సూచించారు. గోవిందరావుపేట మండలంలోని అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఈనెల 25న, హెల్పర్ పోస్టులకు వచ్చే నెల 2న, తాడ్వాయి మండలంలోని టీచర్ పోస్టులకు 27న, సెప్టెంబర్ 3న దరఖాస్తుల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా టెన్త్, ఇంటర్, పుట్టిన తేదీ సర్టిఫికెట్, స్థానికత, కులం వంటి తదితర ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని సీడీపీఓ ప్రేమలత కోరారు. -
కమ్ముకొచ్చిన శ్రావణ మేఘాలు.. ఆకాశం అక్షింతలు వేసినట్లుగా రాలే చినుకులు.. పచ్చని పైర్లు.. చల్లని గాలులు.. నేలమ్మ కొప్పులో ఎర్రని మందారాలు పెట్టినట్లుగా అగుపించే ఆరుద్ర పురుగులు.. ఇవన్నీ బంజారా యువతుల మనస్సులోని కోర్కెలు నెరవేర్చే ప్రకృతి సూచకాలు. వీటన్నింట
తీజ్ వేడుకల్లో నిర్వహించే ప్రతీ ఘట్టం ఆకట్టుకుంటుంది. వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనిగలకు యువతలు రేగుముళ్లు గుచ్చుతారు. ఎంతో నిష్టతో చేసే ఈ ప్రక్రియను బావ వరుస ఉన్న వారు కన్నెపిల్ల మనస్సు చెదిరేలా కదిలి స్తూ ఉంటారు. అప్పుడు రేగుముళ్లు శనిగలకు కాకుండా వారి చేతికి కూడా గుచ్చుకుంటాయి. దీన్ని భరిస్తూ రేగుముళ్లు శనిగలకు గుచ్చడం ఈ తంతు ప్రత్యేకత. ఏడోరోజు ఢమోళీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఢమోళీ చుర్మో (రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామా భవానీకి నైవేధ్యం పెడతారు. ఎనిమిదో రోజు మట్టితో బంజారా ఆరాధ్య దైవాల ప్రతిరూపాలు తయారు చేస్తారు. అబ్బాయి (డోక్రా), అమ్మాయి (డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సంప్రదాయాల ప్రకారం పూజ చేస్తారు. తొమ్మిదో రోజు డప్పుచప్పుళ్లు, గిరిజన నృత్యాలతో అంద రూ బుట్టలవద్దకు వెళ్తారు. అక్కడికి తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలిస్తారు. ఈసందర్భంగా అన్నదమ్ములు, అక్కాచెళ్లెళ్ల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు.భోగ్ వద్ద తీజ్ బుట్టలతో యువతులు -
వరలక్ష్మీ..నమోస్తుతే..
ములుగు: శ్రావణమాసంలో సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఆచరించే వాటిలో ప్రధానమైన వరలక్ష్మీ వ్రతాన్ని శుక్రవారం జిల్లావ్యాప్తంగా మహిళలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఉదయాన్నే తలంటు స్నానమాచరించి ఇంటి ముందు గుమ్మాలకు మామిడాకులతో అలంకరించారు. వారి వారి ఇళ్లల్లో ఇష్టదైవమెన లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమను బంగారు ఆభరణాలు, నగదు, పూలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి వద్ద పవిత్ర కళశాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయంలో ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు హరీష్శర్మ, ఉమాశంకర్లు వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించగా మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. -
రైతు బీమా ప్రీమియం చెల్లింపులు నిలిపివేత
ములుగు: అన్నదాతలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన రైతు బీమా పథకంపై అయోమయం నెలకొంది. ఈనెల 13వ తేదీ వరకు బీమా గడువు తీరిపోయిన రెన్యూవల్పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. అకాల మరణంతో పెద్ద దిక్కు దూరమైన కుటుంబానికి భరోసాగా నిలిచిన ఈ పథకానికి బ్రేక్ పడనుందనే సందేహం నెలకొంది. కాగా రైతులతోపాటు సామాన్య కుటుంబాలకు బీమా వర్తించేలా ‘ఇందిరమ్మ బీమా’ పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 18 నుంచి 59 ఏళ్లలోపు వారికి.. రైతులు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షల బీమా అందించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. 18 నుంచి 59 ఏళ్లలోపు రైతులు ప్రమాదవశాత్తు లేదా సాధారణ మరణం సంభవించినా పథకం వర్తించేలా మార్గదర్శకాలు రూపొందించారు. ప్రతీ రైతుకు ఆరంభంలో రూ.2,271లు ప్రీమియం చెల్లించగా, ప్రస్తుతం ప్రీమియం రేట్లు పెరగడంతో ఒక్కో రైతుకు రూ.3,556 చొప్పున బీమా కంపెనీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రతీ ఏటా ఆగస్టు 13వ తేదీలోగా ప్రభుత్వం ప్రీమియం చెల్లించి రెన్యూవల్ చేస్తుంది. ఈనెల 13వ తేదీ వరకు బీమా గడువు తీరినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం రెన్యూవల్ చేయకపోవడంతో రైతు బీమాపై సందేహం నెలకొంది. జిల్లాలో 41,013 మంది రైతులు జిల్లా వ్యాప్తంగా రైతు బీమా పథకంలో 41,013 మంది రైతులు ఉన్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు 1,874 మంది రైతులు మృతిచెందగా 1,853 మందికి రూ.5 లక్షల చొప్పున రూ.92.65 కోట్లను రైతు కుటుంబాలకు చెల్లించారు. ఇంకా 21 మంది రైతులకు రూ.1.05 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది ప్రీమియం ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించలేదు. దీంతో ఆగస్టు 13వ తేదీలోపు మరణించిన రైతు కుటుంబాలకు మాత్రమే పాత విధానం ప్రకారం బీమా డబ్బులు అందనున్నాయి. అయితే ఆగస్టు 13 తర్వాత మరణించిన రైతుల కుటుంబాల పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అందరికీ వర్తించేలా ఇందిరమ్మ బీమా! రైతు బీమా స్థానంలో సామాన్య ప్రజలు, రైతులకు వర్తించేలా ప్రభుత్వం ఇందిరమ్మ బీమా పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని నవంబర్ నెలలో ప్రారంభించనున్నట్లు అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త పథకం అమలు తీరుతెన్నులపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ బీమా పథకం ద్వారా ఇంటి పెద్ద మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తారనే చర్చ జోరుగా జరుగుతోంది. సమాచారం లేదురైతు బీమా రెన్యూవల్పై ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటి వరకు మృతిచెందిన 1,853 రైతులకు రైతు బీమా పథకం ద్వారా పరిహారం బాధిత కుటుంబ ఖాతాల్లో జమ చేశాం. ఇంకా 21 మంది రైతులకు బీమా డబ్బులు అందించాల్సి ఉంది. ఇందిరమ్మ బీమా పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. –సురేష్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఎనిమిదేళ్ల క్రితం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఈ నెల 13వ తేదీ వరకే తీరిపోయిన గడువు జిల్లాలో 41,013 మంది అన్నదాతలుజిల్లాలో మృతిచెందిన రైతుల వివరాలు మరణించిన రైతులు : 1,874చెల్లించిన డబ్బులు : రూ. 9.65 కోట్లు చెల్లించాల్సినవి : రూ.1.05కోట్లు -
క్షయ వ్యాధి నివారణలో పోషకాహారం ముఖ్యం
ములుగు రూరల్: క్షయ వ్యాధి నివారణలో పోషకాహారం ముఖ్య పాత్ర పో షిస్తుందని జిల్లా టీబీ నియంత్రణ అధికారి రవితేజ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో క్షయ వ్యాధి నియంత్రణపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో క్షయ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్, డైరెక్టరీ బెనిఫిషరి స్కీమ్ కింద నెలకు రూ.1000 చొప్పున అందరికీ అందించాలన్నారు. న్యూట్రిషన్ కిట్లో నూనె, ప్రోటీన్పౌడర్, గుడ్లు, పప్పు మొదలైనవి ఉంటాయన్నారు. క్షయ వ్యాధి నియంత్రణలో సిబ్బంది నిబద్ధతతో పని చేయాలన్నారు. క్షయ కేసులను గుర్తించడంలో నిర్ధిష్టమైన ప్రణాళిక ప్రకారం స్క్రీనింగ్ నిర్వహించాలని, క్షయ వ్యాధి నివారణలో భాగంగా ఇంట్లో ఉన్న వారికి సైతం ప్రెసెంటివ్ ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా 90 శాతం క్షయ రాకుండా ఆపవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దుర్గరావు తదితరులు ఉన్నారు. -
అవయవదానంపై అవగాహన
ములుగు: అవయవదానంతో ఆరిపోతున్న జీవితా లకు వెలుగునివ్వాలని తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం రాష్ట్ర సహధ్యక్షుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం అవయవదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సామాజిక ఉద్యమాల దళపతి ముంజాల భిక్షపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ అశోక్ మాట్లాడుతూ మరణానంతరం నేత్రదానం ద్వారా ఇద్దరికి చూపునివ్వవచ్చని, పార్థివదేహాన్ని వైద్య కళాశాలకు దానం చేయడం ద్వారా భవిష్యత్ వైద్యులకు గురువుగా నిలవవచ్చన్నారు. చనిపోయిన తర్వాత కూడా అవయవదానం ద్వారా చిరంజీవులుగా జీవించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కె. న రసయ్య, ఎం.గోపాల్రెడ్డి, కుమ్మరి వెంకట్, స్థానికులు పాల్గొని అవయవదాన ప్రతిజ్ఞ చేశారు. -
వయోవృద్ధులను గౌరవించాలి
భూపాలపల్లి రూరల్: కుటుంబాలకు పునాది పెద్దవారేనని, వారిని గౌరవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ జీవన్ కుమార్ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఓల్డేజ్ హోమ్లో వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. జీవన్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వృద్ధులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దవారిపట్ల గౌరవ మర్యాదలు పాటించాలన్నారు. వారిని ఇబ్బంది పెడితే చట్టాలు కఠినంగా శిక్షిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హోమ్ నిర్వాహకులు శ్యామ్ ప్రసాద్, శైలజ, కోర్డు సూపరింటెండెంట్ రఘురాం,సీనియర్ అసిస్టెంట్ సురేందర్, సిబ్బంది అంబాల దేవేందర్, గోపాల్, రమేశ్ పాల్గొన్నారు. -
రామప్పను సందర్శించిన శిక్షణ అధికారులు
వెంకటాపురం(ఎం): మండలంలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప దేవాలయాన్ని శుక్రవారం హైదరాబా ద్లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న అధికారులు భారత్ దర్శన్లో భాగంగా రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర స్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్లు తీర్థ ప్రసాదాలు అందించారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. వారి వెంట ఈఓ ఇమ్మడి భాస్కర్, ఎంసీహెచ్ఆర్డీ అధికారులు శంకర్, నందకిషోర్, రవి, ఆర్ఐ రమేశ్, టూరిస్ట్ పోలీసులు, రెవెన్యూ, పురావస్తు, దేవాదాయ, టూరిజం శాఖల సిబ్బంది, తదితరులు ఉన్నారు. -
ఓవర్ టు ఢిల్లీ..!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : పరకాల రాజకీయంతో ఓరుగల్లు కాంగ్రెస్లో మొదలైన విభేదాలు.. మంత్రి కొండా సురేఖ కుటుంబం, సీఎం రేవంత్రెడ్డి మధ్య బహిరంగ విమర్శలకు దారితీసి.. ఇప్పుడు ఏఐసీసీ పరిశీలనకు చేరాయి. సురేఖ కుమార్తె సుస్మిత.. సీఎం రేవంత్రెడ్డి, ఆయన కుటుంబం, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి ఆమె ఇచ్చిన వివరణపై కమిటీ సంతృప్తి చెందకపోవడంతో పరిస్థితిని ఏఐసీసీ దష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో సీఎల్పీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమై సురేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. కూతురు వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ఈ నెల 19న గీసుకొండలో జరిగిన మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్లో చర్చనీయాంశమయ్యాయి. అభ్యర్థిత్వాలను నిర్ణయించేది పార్టీ అధిష్టానమే అయినప్పుడు పరకాల సభలో సీఎం.. రేవూరి ప్రకాశ్రెడ్డిని ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. గతంలో రేవంత్రెడ్డి తమ కుటుంబానికి ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీశాయి. ముఖ్యమంత్రి, సొంత పార్టీ ఎమ్మెల్యేపై బహిరంగ వేదికనుంచి ఈ స్థాయిలో విమర్శలు రావడాన్ని పీసీసీ నాయకత్వం తీవ్రంగా పరిగణించి నోటీసు జారీ చేసింది. మంత్రి వివరణపై సంతృప్తి చెందని కమిటీ.. చల్లారని పంచాయితీ సుస్మిత వ్యాఖ్యలకు మంత్రి సురేఖను బాధ్యురాలిగా పరిగణించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ.. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంత్రి ఇచ్చిన సమాధానంతో సమస్యకు తెరపడలేదు. కూతురు వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సముచితం కాదని పేర్కొంటూ.. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని కోరడం మరింత వివాదానికి దారి తీసింది. ఈ తంతు కొనసాగుతుండగానే హైదరాబాద్లోని సీఎల్పీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు సురేఖ కుటుంబ రాజకీయ వ్యవహారశైలిని తప్పుబట్టారు. సదరు నేతలు వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణకే పరిమితం చేయకుండా.. మంత్రి పదవి అంశాన్ని కూడా ముందుకుతెచ్చి సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడంతోపాటు పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాలపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ తలెత్తే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ అంశంపై ఆరా తీసినట్లు పార్టీ వర్గాల సమాచారం. హైకమాండ్ వద్దకు ‘హస్తం’ పేచీ.. ఇప్పటికే షోకాజ్ నోటీసు, మంత్రి వివరణ, సీఎల్పీలో నేతల సమావేశం, చర్యలకు డిమాండ్.. ఇలా వరుస పరిణామాలు చోటుచేసుకోవడంతో బంతి ఇప్పుడు అధిష్టానం కోర్టులోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారా? మంత్రి పదవినుంచి తొలగించాలన్న డిమాండ్పై హైకమాండ్ ఎలా స్పందిస్తుంది? పరకాల టికెట్ విషయంలో రేవూరి ప్రకాశ్రెడ్డి అభ్యర్థిత్వంపై సీఎం చేసిన ప్రకటనకు అధిష్టానం మద్దతిస్తుందా? కొండా కుటుంబంతో రాష్ట్ర నాయకత్వం భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరిస్తుంది? అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తానికి ఓరుగల్లు నుంచి కాంగ్రెస్లో మొదలైన పంచాయితీ.. సీఎల్పీకి చేరి.. అక్కడినుంచి టీపీసీసీ దాటి ఏఐసీసీ గడప తొక్కింది. ఇక ఈ వివాదానికి ముగింపు ఎలా పలుకుతారన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది. త్వరలో మీడియా ముందుకు సురేఖ? ఇదిలా ఉండగా.. శుక్రవారం హైదరాబాద్లో తనను కలిసిన మీడియాతో కొండా సురేఖ చిట్చాట్ చేశారు. ‘తన ఇంట్లో ప్రత్యేక పూజ జరుగుతున్నందున బిజీగా ఉన్నాను. చెప్పాల్సినవి గురువారమే చెప్పాను. త్వరలోనే మీడియాతో మాట్లాడుతాను’ అని పేర్కొన్నారు. దీంతో ఒకటి, రెండు రోజుల్లో సురేఖ మీడియా ముందుకు వచ్చి తాజా వివాదంపై పూర్తిస్థాయిలో స్పందించే అవకాశం ఉందని తన అనుచరవర్గాలు తెలుపుతున్నాయి.ఏఐసీసీకి చేరిన ఓరుగల్లు కాంగ్రెస్ పంచాయితీ సురేఖ వివరణపై సంతృప్తి చెందని పీసీసీ.. ఏఐసీసీకి ‘క్రమశిక్షణ’ నివేదిక సీఎల్పీలో అత్యవసరంగా భేటీ అయిన ఉమ్మడి వరంగల్ నేతలు మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డిమాండ్ అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ -
తమ్ముడిని చంపిన అన్న అరెస్ట్
వాజేడు: మండలపరిధిలోని ముత్తారం కాలనీకి చెందిన జాడి రాంబాబు (46) ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం వాజేడు పోలీస్స్టేషన్లో వెంకటాపురం (కె) సీఐ ముత్యం రమేశ్, ఎస్సై జక్కుల సతీశ్ హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈనెల 15 (శనివారం)న జాడి రాంబాబు రంపంతో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ పోస్టుమార్టం నివేదికలో హత్య చేసినట్లు అనుమానం కలగడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వివరాలిలా ఉన్నాయి.. జాడి రాంబాబుకు అన్న, ముగ్గురు అక్కలు ఉన్నారు. ఇందులో ఒక అక్క, అన్నకు వివాహం కాగా మిగతా ఇద్దరు అక్కలు రాంబాబుతోనే ఉంటున్నారు. రాంబాబు నిత్యం ఇద్దరి భార్యలతో గొడవ పడుతుండటంతో వారిద్దరు పుట్టింటికి వెళ్లిపోయారు. వారిని తీసుకురావాలని ఇంట్లో ఉన్న ఇద్దరు అక్కలతో గొడవపడుతుండటంతో వారు కూడా మండపాల గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో రాంబాబు కూతురు రమ్య కొడుకు పుట్టు వెంట్రుకల కోసం మేనమామ వరుస అయిన ప్రవీణ్ను పంపించాలని పదిరోజుల క్రితం రజిత (రాంబాబు భార్య) జానకిరావుకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో జానకిరావు ప్రవీణ్ను రజిత ఇంటికి పంపించాడు. తన కొడుకును ఎందుకు పంపించావు, వెంటనే తీసుకురావాలని రాంబాబు తన అన్న జానకిరావుతో గొడవ పెట్టుకోవడంతో పాటు తీవ్రంగా గాయపరిచాడు. ఇది మనుసులో పెట్టుకున్న జానకిరావు రాంబాబును హత్య చేయాలని భావించి ఈనెల 15న శనివారం రాత్రి మద్యం సేవించి వచ్చి రాంబాబు పడుకున్న సమయంలో గడ్డి కోసే కొడవలితో తల, గొంతుపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఏమి తెలియనట్లుగా అతని (రాంబాబు) చేతిలో రంపం ఉంచి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అనంతరం పోస్టుమార్టం నివేదికలో హత్యగా తేలడంతో పోలీసులు విచారణ చేపట్టి జానకిరావును అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం ఒప్పుకున్నాడు. దీంతో జానకిరావును శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆత్మహత్య కేసును ఛేదించిన పోలీసులు -
దరఖాస్తుల ఆహ్వానం
ములుగు రూరల్: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను తాత్కాలిక పద్ధతిన బోధన సిబ్బంది నియామకానికి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని భూపాలపల్లి, ములుగు జిల్లా రిజనల్ కోఆర్డినేటర్ పద్మిని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్హతల సంబంధిత సబ్జెక్టులో బీఈడీ పూర్తి చేసి టెట్ క్వాలిఫై అయి ఉండాలని, డిగ్రీ, పీజీ పరీక్షల్లో 55 శాతం మార్కులు సాధించి ఉన్నవారు అర్హులన్నారు. పీజీటీ హిందీ, గణీతం, జూనియర్ లెక్చరర్ ఇంగ్లిష్, జువాలజీలో ఖాళీలు ఉన్నాయన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 27వ తేదీన ఏటూరునాగారం స్పోర్ట్స్ పాఠశాలలో ఉదయం 10 గంటలకు హాజరుకావాలన్నారు. డెమో, మార్కుల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 9959072997, 8309452015 నంబర్లను సంప్రదించాలన్నారు. మలేరియా నివారణపై అవగాహన కల్పించాలి వెంకటాపురం(కె): మలేరియా నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా సెంట్రల్ టీమ్ సభ్యులు లక్ష్మణ్, అశోక్, సురేశ్లు తెలిపారు. మండలంలో శుక్రవారం మలేరియా నివారణ నియంత్రణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు వైద్యశాలలో ఉన్న మలేరియా వ్యాధిగ్రస్తుల రికార్డును పరిశీలించారు. అనంతరం వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి గ్రామాల్లో మలేరియా అనుమానిత కేసులను సకాలంలో గుర్తించి రక్తపూత సేకరణ పరీక్షలను నిర్వహించాలన్నారు. పాజిటివ్ తక్షణమే చికిత్స నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి యుధిస్టర్, సబ్ యూనిట్ అధికారి నర్సింహారావు, హెఈఓ కోటిరెడ్డి, సిబ్బంది గణేష్, రాఘవులు, భాస్కర్ తదితరులు ఉన్నారు. వివాదరహిత జీవితం గడపాలి భూపాలపల్లి అర్బన్: పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగితే సమయం, డబ్బు వృథా కావడంతో పాటు తీవ్రంగా నష్టపోతారని ప్రతి ఒక్కరూ వివాద రహిత జీవితాలను గడపాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ వ్యాన్ ద్వారా మున్సిపాలిటీ పరిఽధిలోని మంజూర్నగర్, మహిబూబ్పల్లిలో శుక్రవారం న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉచిత న్యాయ సహాయం అవసరమైన వారు, కోర్టు కేసుల్లో చిక్కుకున్న వారు, ప్రామిసరీ నోట్, కుటుంబ, సివిల్ తదితర వివాదాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. సూపరింటెండెంట్ రఘురామ్ మాట్లాడుతూ.. కేసుల్లో రాజీమార్గాన్ని అనుసరించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. వివాదాలకు దూరంగా జీవించాలని కోరారు. న్యాయ సహాయం కోసం నల్సా టోల్ఫ్రీ నంబర్ 15100ను వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, మహిత, వెంకటేష్, రాజ్కుమార్, గౌతమి, కార్తీక్ పాల్గొన్నారు. -
ముగిసిన పొట్ట పండుగ
ఎస్ఎస్తాడ్వాయి: వనదేవతల క్షేత్రమైన మేడారంలో సమ్మక్క పూజారులు రెండు రోజుల పాటు నిర్వహించిన పొట్ట పండుగ పూజా కార్యక్రమాలు గురువారంతో ముగిశాయి. బుధవారం ప్రారంభమైన పూజలు గురువారం ఉదయం వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా పూజారులు సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. బుధవారం రాత్రి సమ్మక్క గుడి నుంచి పసుపు, కుంకుమ, అమ్మవారి పూజా సామగ్రితో గద్దెలకు వెళ్లిన పూజారులు రాత్రంతా సంబురాలు చేసుకుని గురువారం ఉదయం గద్దెల నుంచి ఊత కొమ్ముల శబ్ధం, డోలివాయిద్యాలతో సమ్మక్క గుడికి చేరుకున్నారు. పూజారులు గుడికి వస్తున్న దారిలో ఆదివాసీ ఆడపడుచులు ఎదురెల్లి పూజారుల కాళ్లకు పవిత్రమైన జలాలను ఆరగించారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. సమ్మక్క గద్దె నుంచి పూజారులు బయలుదేరిన సమయంలో భక్తులు, స్థానిక ఆదివాసీ యువతీయువకులు దారి పొడవునా పడుకోవడంతో పూజారులు వారి పైనుంచి దాటి వెళ్లారు. అనంతరం సమ్మక్క గుడిలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి గుడిలో పొట్టకు వచ్చిన మొక్కజొన్న కంకులు, వరి పొట్టను అమ్మవారికి పూజారులు నైవేద్యంగా సమర్పించారు. యాటను బలిచ్చారు. అమ్మవారికి కొత్త ధాన్యాన్ని సమర్పించిన తర్వాత స్వీకరిస్తామని పూజారులు తెలిపారు. రెండు రోజుల పాటు పొట్ట పండుగ పూజా కార్యక్రమాలతో మేడారంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సమ్మక్క పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు సిద్ధబోయిన ముణింధర్, మహేశ్, కొక్కెర కృష్ణయ్య, సిద్ధబోయిన రాణా రమేశ్, భోజారావు, సిద్ధబోయిన స్వామి, జనార్దన్ పాల్గొన్నారు. వనదేవతల గద్దెల నుంచి సమ్మక్క గుడికి చేరుకున్న పూజారులు అమ్మవారికి నైవేద్యంగా వరిపొట్ట, మొక్కజొన్న కంకులు -
నూతన కలెక్టరేట్లోనే ప్రజావాణి
ములుగు: ఈ నెల 24వ తేదీ నుంచి ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నూతనంగా ప్రారంభించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోనే నిర్వహించనున్నట్లు కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎడమ వైపున ఉన్న సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలకు వివిధ ప్రభుత్వ శాఖల సేవలను ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో గట్టమ్మ సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన అత్యాధునిక సౌకర్యాలతో నూతన కలెక్టరేట్ నిర్మించినట్లు పేర్కొన్నారు. విశాలమైన కార్యాలయ గదులు, సమావేశ మందిరాలు, ప్రజలకు అనుకూలమైన వసతులతో కలెక్టరేట్ ఉందని వివరించారు. సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తమ దరఖాస్తులను అందజేయవచ్చని కలెక్టర్ వివరించారు.కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని జవహర్నగర్ మోడల్ స్కూల్ క్యాంపస్లో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయం 2026–27 విద్యా సంవత్సరానికి నూతన ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని కేంద్రీయ విద్యాలయం ములుగు ప్రిన్సిపాల్ సీతారాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సరీ నుంచి నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రవేశాల కోసం నేటి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 10న లాటరీ పద్ధతిలో ఎంపిక, 12న ప్రవేశ జాబితా ప్రచురణ, 15 నుంచి 21 వరకు ప్రవేశాలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 23 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు వివరించారు. విద్యార్థుల వయస్సు, రిజర్వేషన్ తదితర ప్రవేశ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన తల్లిదండ్రులు నిర్ణీత గడువులోగా తమ పిల్లల ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. కేంద్ర బృందం ప్రతినిధుల పర్యటన వాజేడు: మలేరియా నివారణపై కేంద్ర బృందం ప్రతినిధులు లక్ష్మణ్, అశోక్, సురేశ్ మండల పరిధిలోని పేరూరు పీహెచ్సీని గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ల్యాబోరేటరీ పరిశీలనతో పాటు కృష్ణాపురం, కడేకల్ గ్రామాల్లో పర్యటించారు. మలేరియా నిర్ధారణ, రక్త నమూనాల సేకరణ, పరీక్షలు, కేసుల గుర్తింపుతో పాటు అనుమానిత జ్వర కేసులపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. మలేరియా జ్వరాల నివారణకు దోమల నివారణతో పాటు పరిసరాల పరిశుభ్రత, దోమ తెరలను వినియోగించాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే సమీప పీహెచ్సీలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పేరూరు వైద్యాధికారి భాస్కర్, సిబ్బంది దుర్గారావు, నరసింహరావు, వెంకటరెడ్డి, వేణుగోపాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అక్షరాస్యతలో జిల్లాను అగ్రభాగాన నిలపాలి
ములుగు: అక్షరాస్యతలో జిల్లాను అగ్రభాగాన నిలపాలని అదనపు కలెక్టర్ సంపత్రావు అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(టాస్) పోస్టర్ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే టాస్, ఉల్లాస్ కార్యక్రమాలకు సంబంధించిన సమన్వయ సమీక్ష సమావేశం డీఈఓ సిద్ధార్థరెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. టాస్, ఉల్లాస్ కార్యక్రమాలను సామాజిక బాధ్యతగా తీసుకొని లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. టాస్ అడ్మిషన్ల పెంపుపై ప్రతిరోజూ సమీక్షించాలన్నారు. ఎంఈఓలు, ఏపీఎంలు, ఏఐ కోఆర్డినేటర్లు తప్పనిసరిగా ప్రతిరోజూ అడ్మిషన్ల పెంపునకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ తుమ్మ రమేశ్రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ పుల్లూరు వేణుగోపాల్, డీఆర్డీఏ ఏపీడీ గొట్టే శ్రీనివాస్, టాస్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం, ఉల్లాస్ జిల్లా కోఆర్డినేటర్ పీర్ల కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సంపత్రావు -
ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం
ములుగు రూరల్: యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ ఆరోపించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో 2014 నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాయమాటలతో గద్దెనెక్కిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ యువశక్తిని నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు. నిరుద్యోగ యువత శ్రమ దోపిడీకి గురయ్యే విధంగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేరుకే జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని తెలిపారు. రాష్ట్రంలో 20 వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 9వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల వెంకట్రెడ్డి, రాజేందర్, చిట్టిబాబు, మల్లారెడ్డి, ప్రవీన్, కవిత, రజిత, రాజు, రవీందర్, అరుణ్, దేవేందర్, రవితేజ, తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ -
రక్త పరీక్షల రిపోర్టులు సకాలంలో అందించాలి
ములుగు రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షలు సకాలంలో నిర్వహించి రిపోర్టులను సకాలంలో అందించాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని టీ హబ్ను ఆయన గురువారం సందర్శించి మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన రక్త నమూనాల పరీక్షలు త్వరగా నిర్వహించి రిపోర్టులను అందిస్తే ఆరోగ్య కార్యకర్తలు జ్వరపీడితుల ఆరోగ్య పరిస్థితి, వైద్యం అందించేందుకు వీలుంటుందని తెలిపారు. అనంతరం జాతీయ హెల్త్ మిషన్ కార్యక్రమంలో పనిచేస్తున్న సిబ్బంది పని తీరును పరిశీలించారు. అసంక్రమిత వ్యాధుల నియంత్రణ క్లినిక్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. మధుమేహం, హైపర్ టెన్షన్ రోగుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ అధికారి నాగఅన్వేష్, మాస్ మీడియా అధికారి సంపత్, ప్రోగ్రాం విస్తరణ అధికారి సురేశ్బాబు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ గోపాల్రావు -
చదువుతోనే గుర్తింపు
ఏటూరునాగారం: విద్యార్థులకు చదువుతోనే తగిన గుర్తింపు వస్తుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బానోత్ ధర్మ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విభాగానికి సంబంధించిన పోస్టర్ను గురువారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే నిలిపివేయకుండా ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఓపెన్ యూనివర్సిటీ విధానం అమలులో ఉందని తెలిపారు. 2026–27 అడ్మిషన్లకు సెప్టెంబర్ 9వ తేదీ వరకు సమయం ఉన్నట్లు తెలిపారు. ఒకేసారి రెండు డిగ్రీలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. విద్యార్థులకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు ఉపాధి కల్పించేందుకు వైస్ ఛాన్స్లర్గా ప్రొఫెసర్ గంటా చక్రపాణి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. అంబేడ్కర్ యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని తెలిపారు. చదువుకోవాలనే లక్ష్యం ఉన్న వారు ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలని కోరారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సి పాల్ నవీన్, అధ్యాపకులు భాస్కర్, రమేశ్, రాజశేఖర్, శ్రీకాంత్, శ్రీనివాస్, నాగలక్ష్మి పాల్గొన్నారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ ధర్మ -
గంజాయి స్వాధీనం విలువ (రూ. కోట్లలో)
2024 2,97,19,7172025 5,76,39,3532026 1,29,94,670●వరంగల్ నార్కొటిక్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడేళ్లలో నమోదైన కేసులు, స్వాధీనం చేసుకున్న గంజాయి (కిలోలు)విద్యార్థులకు అవగాహన, విక్రేతలపై కఠినచర్యలు పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. విక్రయాలు, సరఫరాకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు అవసరమైన సందర్భాల్లో పీడీ యాక్టు కింద కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గంజాయికి బానిసలైన యువతను గుర్తించి వారిపై చట్టపరమైన ప్రక్రియతోపాటు డీ–అడిక్షన్ సెంటర్లకు తరలించి, కౌన్సెలింగ్, చికిత్స మార్పు తెచ్చే చర్యలు చేపడుతున్నాం. – పి. రమేశ్కుమార్, డీఎస్పీ, నార్కొటిక్స్ ఈగల్ ఫోర్స్ మాదక ద్రవ్యాల అనుకూల పంటల సాగు వద్దు యువత దేశ భవిష్యత్కు వెన్నెముక. వారు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యం, విద్య, కుటుంబ వ్యవస్థ, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అదేవిధంగా, మాదక ద్రవ్యాల తయారీకి అనుకూలమైన పంటలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగు చేయకుండా చూడాలి. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రభుత్వం, ఆచార్యులు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, ప్రజలు కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. – డా. గాదె సమ్మయ్య, ప్రముఖ విద్యావేత్తసాక్షిప్రతినిధి, వరంగల్: చదువుకోవాల్సిన వయసులో కొందరు మత్తుకు బానిసలవుతున్నారు. తొలుత సరదాగా మొదలుపెట్టి.. ఆపై అలవాటుగా.. చివరకు వ్యసనంగా మార్చుకుంటున్నారు. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి చిన్నచిన్న గొడవలనుంచి తీవ్రమైన నేరాల వరకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కొందరు మైనర్లు, స్కూల్, కాలేజీ విద్యార్థులే గంజాయి ముఠాల టార్గెట్గా మారుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో గంజాయి మత్తులో మైనర్లు ప్రిన్సిపాల్ను హత్య చేసిన ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఉలికిపాటు నెలకొంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్లో గంజాయి సరఫరా, వినియోగం, యువత ప్రమేయంపై మరోసారి చర్చ మొదలైంది. స్కూల్ వెనుక నుంచి, హాస్టళ్ల వరకు.. వరంగల్ నార్కొటిక్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడేళ్లలో 134 గంజాయి కేసులు నమోదవగా, 369మందిని అరెస్ట్ చేశారు. 2,571 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు వరంగల్ నగర శివార్లకే పరిమితమైన గంజాయి వినియోగం క్రమంగా కొన్ని విద్యాసంస్థల పరిసరాలకూ చేరిందన్న ఆందోళన ఉంది. స్కూల్ వెనుక ఖాళీ ప్రదేశాలు, పాడుబడిన భవనాలు, చెరువు కట్టలు, రైల్వే పరిసరాలు, కాలేజీ హాస్టళ్లు, అద్దె గదులు.. ఇలా నిర్మానుష్య ప్రాంతాలను కొందరు మత్తు సేవించేందుకు ఉపయోగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా వరంగల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగుచూసిన గంజాయి కేసు మరింత ఆందోళన కలిగించింది. బీటెక్, ఇంటర్ విద్యార్థులతో కూడిన ముఠా 36 కిలోలకు పైగా గంజాయితో పట్టుబడింది. ఎనిమిది మంది విద్యార్థులు డబ్బులు పోగేసి గంజాయి కొనుగోలు చేసినట్లు ‘ఈగల్’దర్యాప్తులో వెల్లడైంది. ఈ విద్యార్థులు ఇదే తరహా కేసులో నాలుగోసారి పట్టుబడడం ఆందోళనకరం. వినియోగంతో మొదలు.. విక్రయంతో ముగింపు గంజాయి ముఠాలు ముందుగా కొందరు విద్యార్థులను వినియోగదారులుగా మార్చి.. ఆ తర్వాత వా రినే చిన్నస్థాయి క్యారియర్లు, విక్రేతలుగా ఉపయోగించుకుంటున్నాయన్న ఆందోళన ఉంది. మొదట స్నేహితుడి ద్వారా పరిచయం.. ఆపై ఉచితంగా లే దా తక్కువ ధరకు సరఫరా.. అలవాటు పడిన తర్వాత డబ్బుల కోసం ఇతరులకు సరఫరా చేయించడం.. ఇలా మత్తు వల విస్తరిస్తున్నట్లు పోలీసులు గుర్తించిన కేసులు చెబుతున్నాయి. స్కూల్ దశనుంచే గంజాయి కిక్కుకు బానిసలు.. కళాశాలలే లక్ష్యంగా సరఫరా.. మత్తులో పెరుగుతున్న నేరాలు.. విద్యార్థులే ‘క్యారియర్లు’ నల్లగొండ ఘటనతో ఒక్కసారిగా ఉలికిపాటు మేల్కోకపోతే మరిన్ని ఘోరాలు.. నేరాలు -
ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి
ములుగు రూరల్: రైతులు వరిసాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఉద్యానవనశాఖ అధికారి సంజీవరావు అన్నారు. ఈ మేరకు బుధవారం మల్లంపల్లి మండలంలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్నినో ప్రభావంతో వర్షాలు సంమృద్ధిగా కురవని కారణంగా రైతులు నీటి సాంద్రత తక్కువ వినియోగం ఉన్న పంటలు కూరగాయలు, పుప్పుదినుసులు, ఆయిల్ సీడ్స్, పండ్ల తోటలు సాగు చేయాలన్నారు. రైతులు సాగు చేస్తున్న కూరగాయ తోటలు, మిర్చి నారు మడులను, బంతితోటలను సందర్శించి రైతులకు సూచనలు చేశారు. ఉద్యానవనశాఖ రైతులకు డ్రిప్, తుంపర్ల పరికరాలు సబ్సిడీపై అందింస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పంటల సాగు విధానంపై వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విశ్వతేజ, ఆత్మ చైర్మన్ రవీందర్రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి సురేశ్కుమార్, హెచ్ఓ శ్రీకాంత్, ఏఓ శ్రీధర్, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
హేమాచల క్షేత్రానికి మహర్దశ
మంగపేట: రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఈ నెల 16న జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శిచుకున్న సీఎం హెలికాప్టర్లో ములుగుకు వెళ్లే క్రమంలో హేమాచలక్షేత్రం విశిష్టత, స్వామివారి చరిత్రను ఎంతో ఆసక్తిగా మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. హేమాచలక్షేత్రానిది 16 శతాబ్ధాల చరిత్ర, 60 ఏళ్ల క్రితమే దేవాదాయ ధర్మాదాయ శాఖలో గుర్తింపు పొంది ఉంది. 6 ఏ టెంపుల్గా రికార్డుల్లో ఉన్నా గత ప్రభుత్వాలు, పాలకులు, దేవాదాయశాఖ నిర్లక్ష్యం కారణంగా అభివృది నోచుకోని హేమాచలక్షేత్రం అభివృద్ధికి స్వయంగా సీఎం రేవంత్రెడ్డి హామీ ఇవ్వడంతో ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధిపై మంత్రుల ప్రత్యేక దృష్టి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పురాతనమైన హేమాచలక్షేత్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది మార్చి 1న మంత్రులు సీతక్క, శ్రీనివాస్రెడ్డి ఆలయాన్ని సందర్శించి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న సందర్భంగా హేమాచలక్షేత్ర అభివృద్ధి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి మేడారం తరహాలో అభివృద్ధి చేయిస్తామని హామీనిచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆలయ అభివృద్ధి పనులకు మాస్టర్ప్లాన్ నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్, దేవాదాయశాఖ, వివిధ శాఖల అధికారులను ఆదేశించడంతో సుమారు రూ.18 కోట్ల అంచనాతో నివేదికలను రూపొందించారు. తొలి విడతలో రూ. 3కోట్లు మంజూరు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ ముఖ మండపం, వివిధ ప్రతిపాదిత పనులపై ఆర్కిటెక్చర్ల బృందం రూపొందించిన పలు రకాల డిజైనింగ్ మ్యాపులను సీతక్క గత నెల 16న పరిశీలించారు. 2027 జూన్లో జరిగే గోదావరి పుష్కరాలకు ముందే అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించిన విషయం విధితమే. దీంతో పాటు స్వయంగా సీఎం ఆలయ అభివృద్ధికి అవసరమైన మేరకు నిధులు మంజూరు చేస్తానని ప్రకటించడంతో ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ, వివిధ శాఖల అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ములుగు పర్యనటలో మంత్రులతో చర్చించిన సీఎం చిగురిస్తున్న భక్తుల ఆశలు -
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ములుగు రూరల్: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో నిబద్ధతతో, పక్షపాతం లేకుండా బాధితులకు న్యాయం చేకూరేలా ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసుల్లో ముద్దాయిలను, సాక్షులను తప్పని సరిగా కోర్టుకు హాజరుపర్చాలన్నారు. నేరస్తులకు శిక్షపడేలా కోర్టు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది చూసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, సస్పెక్టులపై నిఘా ఉంచాలని సూచించారు. నమోదైన కేసుల వివరాలను ఆన్లైన్ చేయాలన్నారు. దొంగతనాలు, ఆర్థిక నేరాలలో ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరిగే విధంగా చూడాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణపై నిఘా పెంచాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ మమన్ భట్, డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్, డీఎస్పీ రవీందర్, సీఐలు సురేశ్, దయాకర్, రమేశ్, ఆర్ఐలు స్వామి, వెంకటనారాయణ, శ్రీకాంత్, తిరుపతి, ఎస్సైలు వెంకటేశ్, చల్లా రాజు, తాజుద్దీన్, కమలాకర్, జగదీశ్, మహేశ్, సూరి, వెంకటేశ్, సతీష్, కృష్ణప్రసాద్, తిరుపతి పాల్గొన్నారు. -
మందుల కొరత లేకుండా చూడాలి
ములుగు రూరల్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా వార్షిక ఇండెంట్లను పంపించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సూచించారు. ఈ మేరకు బుధవారం ఆస్పత్రి స్పెషలిస్ట్ విభాగాధిపతులు, ఫార్మసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వైద్య, మౌలిక సౌకర్యాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీ)సెంట్రల్ మెడిసిన్ స్టోర్ అధికారుల సమన్వయంతో అవసరమయ్యే మందులు, సర్జికల్ మెటీరియల్ నివేదికలు అందించాలన్నారు. ఆస్పత్రిలో అన్ని విభాగాలకు సంబంధించిన వైద్యులు అవసరమయ్యే మందులను కొరత లేకుండా తెప్పించుకోవాలని సూచించారు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్ నుంచి 628 రకాల మందులు, 536 సర్జికల్కు సంబంధించిన బకెట్లను పంపిణీ చేస్తుందని వివరించారు. ఈ మేరకు సీఎంఎస్ పుస్తకాలను వైద్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ సీఎంఎస్ ఇన్చార్జ్ ఫార్మసీ ఆఫీసర్ భాస్కర్రావు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ భిక్షపతిరావు, రామ్మోహన్, ఉషారాణి, శ్రీకళ, లక్పతి, సుప్రియ, అనూష, ఫార్మసీ ఆఫీసర్ సుస్మిత, జిల్లా సీఎంఎస్ ఫార్మసీ అధికారి సమ్ములు, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీఐని బలోపేతం చేయాలని వినతి ఏటూరునాగారం: ఆర్టీఐని బలోపేతం చేయాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నపుండ్రా ప్రసాద్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు తోట రమేశ్లు బుధవారం ములుగు కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్టీఐ యాక్ట్–2005 చట్టం అమలు పరిరక్షణకు జిల్లా కమిటీలతో పాటు మాని టరింగ్ వ్యవస్థను పునరుద్ధరించాలని కోరారు. ప్రతీ కార్యాలయంలో ఆర్టీఐకి సంబంధించి సమాచారం ఇచ్చేందుకు కేటాయించిన అధి కారి పేరు, ఫోన్ నంబర్లు బోర్డుపై ఉండేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఏటూరునాగారం మండల అధ్యక్షుడు బైరెడ్డి మల్లారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్కుమార్, భూపాలపల్లి జిల్లా కన్వీనర్ దేవేందర్, భూపాలపల్లి మండల అధ్యక్షుడు శివప్రసాద్ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలి కన్నాయిగూడెం: పేదలకు మెరుగైన వైద్యం అందించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ అన్నారు. మండల పరిధిలోని పీహెచ్సీని డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ బుధవారం తనిఖీ చేశారు. ఆరోగ్యకేంద్రంలో పేదలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి ఓపీ, పరీక్షలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. డ్రగ్ రూమ్లో మందుల నిల్వల వివరాలను, సిబ్బంది రిజిస్టర్ను పరిశీలించారు. మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు భాస్కర్రావు, ఓం ప్రకాశ్, డాక్టర్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. పాముకాటుతో యువతి మృతి వాజేడు: మండల పరిధిలోని ఆర్లగూడేంకు చెందిన పాయం శిరీష(25) కట్లపాము కాటు వేయడంతో మృతి చెందింది. బంధువుల కథనం ప్రకారం.. ఆర్లగూడేంకు చెందిన పాయం కృష్ణారావు, జానకీలకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అందులో శిరీష పెద్ద కూతురు. చిన్నకూతురుకు పెళ్లి అయింది. చిన్నకూతురుకు కుమారుడు జన్మించగా 21 రోజుల వేడుకను తల్లిదండ్రుల ఇంట్లో నిర్వహించారు. మంగళవారం రాత్రి అందరూ భోజనాలు చేసి పడుకున్నారు. ఈ క్రమంలో శిరీషను కట్లపాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఏటూరునాగారం తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ములుగుకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి ఆమె మృతి చెందిందని వైద్యులు తెలుపడంతో బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. -
ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవం
ములుగు రూరల్: ప్రపంచ ఫొటోగ్రాపర్స్ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో రామప్ప ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం ఫొటోగ్రఫీ పితామహుడు డాగ్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రను భద్రపరిచే సాధన కెమెరా అన్నారు. ఒక్కఫొటో వెయ్యి మాటలకు సమానమని తెలిపారు. ఫొటోగ్రఫీ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్న ఫొటోగ్రాఫర్ల సేవలను కొనియాడారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్స్ కందుల రవీందర్, జక్కుల సదానందం, శ్రీనివాస్, వెంకట్, మాట్ల భద్రి, దేవేందర్, రమేశ్, రాజు, సంపత్, అరవింద్, బాబురావు, సునీల్ పాల్గొన్నారు. -
మహిళలు, బాలికల సంరక్షణే ధ్యేయం
● కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావుములుగు: మహిళలు, బాలికలకు సురక్షిత వాతావరణం కల్పించడంతో పాటు వారి సంరక్షణే ధ్యేయమని కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయంలో జిల్లా నిర్భయ ఫండ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ నిర్భయ ఫండ్ ద్వారా పైలట్ ప్రాజెక్ట్(మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు)గా జిల్లా ఎంపికై ందని తెలిపారు. ఈ మేరకు జిల్లాలో మహిళలు, బాలికలు సురక్షితంగా చదువుకోవడానికి, ప్రయాణించడానికి, రోజువారీగా పలు కార్యక్రమాల్లో స్వేచ్ఛగా పాల్గొనడానికి వీలు కల్పించేలా మహిళా–స్నేహపూర్వక పట్టణ ప్రదేశాలను సృష్టించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అన్నారు. మహిళలు, బాలికలు భద్రత, రవాణా, ప్రజా ప్రదేశాలు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి అంశాలకు సంబంధించి ఎదుర్కొనే సవాళ్లను కమిటీ గుర్తిస్తుందని తెలిపారు. మహిళలు, బాలికలకు సురక్షితమైన నగరంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా స్థానిక సంఘాలు, ప్రభుత్వ సంస్థలు, పౌర సంఘాలు సమన్వయంతో పనిచేసి మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని మహిళలు, బా లికల సురక్షిత అవసరాలను గుర్తించి ప్రణాళికలు, ప్రతిపాదనలు తయారు చేసినట్లు వివరించారు. వీటిని ప్రభుత్వానికి సమర్పించి ప్రభుత్వ అనుమతితో తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఈపీ ప్రేమలత, డీఎస్పీ కిశోర్కుమార్, జిల్లా రవా ణాశాఖ అధికారి ఠాకూర్ ఈశ్వర్ సింగ్, మున్సిపల్ కమిషనర్ సంపత్, టూరిజం అసిస్టెంట్ మేనేజర్ సూర్య కిరణ్, డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్ రమాదేవి, సఖి కేంద్రం సెంటర్ అడ్మిన్ లావణ్య, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ పాల్గొన్నారు. -
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
ఎస్ఎస్తాడ్వాయి: కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని ములుగు డీఎస్పీ రవీందర్ పోలీసు అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని మేడారంలో గల నార్లాపూర్ పోలీస్ స్టేషన్ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రౌడీషీటర్లు, కేడీ నేరస్తుల కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగంతో ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన డీఎస్పీ, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. అనంతరం ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణకు మరింత అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పస్రా సీఐ దయాకర్, ఎస్సై కమలాకర్ ఉన్నారు. డీఎస్పీ రవీందర్ -
ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి
ములుగు: నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలపై అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. నూతన కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో మంగళవారం సంయుక్త సలహా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, సాగునీటి లభ్యత, పంటల సాగు పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల శాఖల అధికారులు ఒకే వేదికపై చర్చించడం ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను గుర్తించవచ్చన్నారు. అలాగే మే నెల నుంచి ఎల్నినో ప్రభావం, వర్షపాతం లోటు పరిస్థితులపై రైతులకు రైతు వేదికలు, ప్రచార మాద్యమాల ద్వారా నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నీటి లభ్యతను అంచనా వేసుకోకుండా పంటలు సాగు చేసి రైతులు నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలలో జిల్లాలో సాధారణ వర్షపాతం 218 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 83 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను రైతులు గమనించి నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రైతులు పూర్తిగా వరి పంటపైనే ఆధారపడకుండా వేరే పంటలకు సైతం ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఉద్యానవన పంటల సాగుకు అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి రైతులకు తగిన సలహాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు సైతం తమ పరిధిలోని రైతులకు నీటి పొదుపు అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, సమ్మయ్య, ఆత్మ కమిటీ జిల్లా చైర్మన్ రఘు, డివిజన్ చైర్మన్లు రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు -
కలెక్టర్కు సన్మానం
ములుగు: కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావును తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీఎన్జీవోస్)ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో ఘనంగా సన్మానించారు. కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం, రాష్ట్ర పంచాయతీరాజ్ రోడ్ల పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసినందుకు కలెక్టర్కు టీఎన్జీవోస్ జిల్లా శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ సంఘం జిల్లా అధ్యక్షుడు సంపత్ రావు ఆధ్వర్యంలో అసోసియేషన్ నాయకులు కలెక్టర్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల జీవన్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ కొమరయ్య, ఉపాధ్యక్షులు కె.శిరీష, విజయభాస్కర్, రాజ్కుమార్, యశ్వంత్, జాయింట్ సెక్రెటరీలు రఫిక్, శైలజ, రాజు తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణోత్సవం భవిష్యత్కు బలమైన పునాది
కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవం గతానికి గర్వకారణం భవిష్యత్కు బలమైన పునాది. విద్య, నాణ్యమైన పరిశోధనల దిశగా కృషి చేస్తున్నాం. రూసా ప్రాజెక్టుకింద రూ.60కోట్ల నిధులు రాగా, రూ.35కోట్లతో 42పరిశోధన ప్రాజెక్టులు, రూ.15కోట్లతో కెహబ్ అభివృద్ధి చేస్తున్నాం. బీఎస్ఎన్ఎల్కు సంబంధించి అండర్గ్రౌండ్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు పూర్తయింది. అకడమిక్ బ్లాక్లు, వర్క్షాప్లు,సెమినార్ హాల్స్, స్వర్ణోత్సవ శతాబ్ది పైలాన్ తదితర పనులకు ఆమోదం లభించింది. రూ.400లకోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. 50 ఏళ్ల విద్యాప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం. – కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి -
క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు బ్యాటరీ టెస్టులు
ఏటూరునాగారం: మండల పరిధిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల క్రీడా పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు పొందటానికి అర్హులైన విద్యార్థులకు మంగళవారం పాఠశాల ఆవరణలో బ్యాటరీ టెస్టులను నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ రాజునాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ తరగతిలో ప్రవేశానికి 4వ తరగతి ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోగా బ్యాటరీ టెస్టులకు 105 మంది హాజరయ్యారని తెలిపారు. వారికి వివిధ రకాల టెస్టులను నిర్వహించినట్లు వెల్లడించారు. అలాగే 6 నుంచి 9వ తరగతిలో కూడా సీటు పొందేందుకు దేహదారుఢ్య, నైపుణ్య పరీక్షలను నిర్వహించి గెలుపొందిన వారికి సీటును ఇస్తామని వివరించారు. రెండు రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడలపై ఆసక్తి, చదువుపై శ్రద్ధ ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. తొలిరోజు 105 మంది హాజరు ప్రిన్సిపాల్ రాజునాయక్ -
రామప్ప టెంపుల్ బాగుంది
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్గా ఉందని జర్మనీ దేశానికి చెందిన డేనియల్ గ్రాస్, కెవిన్ పౌలుస్ కొనియాడారు. రామప్ప రామలింగేశ్వర స్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఆహ్వానం ములుగు: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి 2026 విద్యా సంవత్సరానికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సిద్ధార్థరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డుకు దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు తమ దరఖాస్తుతో పాటు పాఠశాలలో చేపట్టిన వినూత్న కార్యక్రమాల వివరాలను జత చేసి రెండు కాపీలను ఈ నెల 25వ తేదీలోగా సంబంధిత మండల విద్యాశాఖ అధికారులకు దరఖాస్తులను పరిశీలించి ప్రతీ మండలం నుంచి ముగ్గురు ఉపాధ్యాయులను సిఫారసు చేయాలని పేర్కొన్నారు. ఎంపిక చేసిన వారి పూర్తి దరఖాస్తులను ఈ నెల 29 ఉదయం 11 గంటలోగా డీఈఓ కార్యాలయంలో అప్పగించాలని డీఈఓ పేర్కొన్నారు. ఓబీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా బుచ్చయ్య ఏటూరునాగారం: కన్నాయిగూడెం మండలం గూర్రేవుల గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు పల్లా బుచ్చయ్యను బీజేపీ రాష్ట్ర ఓబీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా నియమిస్తూ నియామక పత్రాన్ని ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా మంగళవారం బుచ్చయ్య మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ బలోపేతానికి నిరంతరం పాటుపడుతానని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి ఏటూరునాగారం: కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగట్టాలని ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పోరిక గోవింద్ నాయక్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం పార్టీ మండల అధ్యక్షుడు రాంనర్సయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గోవింద్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల పునాదులపైనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గొప్ప ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం తీరని లోటన్నారు. ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప ఉద్యమ నాయకుడు పెద్ది విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించకపోవడం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెద్ది విగ్రహ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు సర్ధార్ పాషా, నాయకులు తుమ్మ మల్లారెడ్డి, కూనూరు అశోక్ గౌడ్, తాడూరి రఘు, మాదరి రామయ్య, మాదరి చంద్రమౌళి, గడదాసు సునీల్ కుమార్, కాళ్ల రామకృష్ణ పాల్గొన్నారు. 21న అథ్లెటిక్స్ ఎంపికలు వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 21వ తేదీన వరంగల్ జిల్లాస్థాయి అండర్–14, 16, 18, 20 బాలబాలికల అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, యుగేంధర్రెడ్డి మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 26, 27 తేదీల్లో జేఎన్ఎస్లో జరగనున్న అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి మెమోతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు 9866564422, 9000354465 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
‘రోగులకు మెరుగైన వైద్యం అందించాలి’
కన్నాయిగూడెం: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రాంతీయ కార్యాలయం (ఆర్ఓహెచ్ఎఫ్డబ్ల్యూ)హైదరాబాద్ బృందం ప్రోగ్రాం అధికారి రవితేజ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని కేంద్ర ఆరోగ్య, కుటంబ సంక్షేమ బృందం సభ్యులతో కలిసి మంగళవారం సందర్శించారు. మారుమూల గ్రామాల్లో పేదలకు అందుతున్న ఆరోగ్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని రోగుల, అధికారుల రిజిస్టర్లను తనిఖీ చేశారు. వాటి నిర్వహణపై పలు సూచనలు చేశారు. అనంతరం చింతగూడెంలో పర్యటించి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అనంతరం ప్రోగ్రామ్ ఆధికారి రవితేజ మాట్లాడుతూ ప్రజలు సీజనల్ వ్యాధులపై జాగ్రతగా ఉండాలన్నారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. వర్షాకాలంలో వేడి చేసిన నీటిని తాగాలని వెల్లడించారు. అలాగే ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిల్వకుండా చూసుకోవాలని ప్రోగ్రాం అధికారి రవితేజ సూచించారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు లక్ష్మణ్, శ్రీనివాస్, అశోక్, వెంకటేశ్వర్లు, సిబ్బంది హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్, భాస్కర్రావు, ఏఎన్ఎం ఊర్మిల తదితరులు పాల్గొన్నారు. -
సీతక్కపై ఆరోపణలు సరికాదు
● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ ములుగు: మంత్రి సీతక్కపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కుమార్గౌడ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా సాధన ఉద్యమంలో నల్లెల కుమారస్వామి ఆధ్వర్యంలో రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసి కలిసికట్టుగా పోరాడి జిల్లా సాధించుకున్నామన్నారు. ఉద్యమంతో సంబంధం లేని వారు ఇప్పుడు మంత్రి సీతక్క, కుమారస్వామిపై ఆరోపణలు చేయడం సబబుకాదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు రాజేందర్గౌడ్, రవి యాదవ్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి వినతులు పరిష్కరించాలి
ములుగు : ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన వినతులను పూర్తిస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్ మహేందర్జీ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో 28 దరఖాస్తులు స్వీకరించారు. భూ సమస్యలు–3, ఇందిరమ్మ ఇళ్లు–5, పెన్షన్–7, ఇతర శాఖలకు సంబంధించి 13 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్రావు, డిప్యూటీ ట్రెయినింగ్ కలెక్టర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మండల స్థాయి ప్రజావాణికి విశేష స్పందన జిల్లాలోని పది మండలాల్లో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని అదనపు కలెక్టర్ మహేందర్జీ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే ప్రజల సమస్యలను పరిష్కరించేవిధంగా ప్రభుత్వం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 219 మంది అధికారులు పాల్గొనగా ప్రజల నుంచి 180 దరఖాస్తులు స్వీకరించారని పేర్కొన్నారు. ఏటూరునాగారంలో 24, గోవిందరావుపేట–14, కన్నాయిగూడెం–3, మల్లంపల్లి–32, మంగపేట–42, ములుగు–14, తాడ్వాయి–10, వెంకటాపురం(ఎం)–25, వెంకటాపురం(కె)–12, వాజేడులో 4 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ప్రజలు మండలస్థాయి ప్రజావాణిని వినియోగించుకోవాలని కోరారు. అదనపు కలెక్టర్ మహేందర్జీ -
26,77,498
17.08.26 నాటికి ఓటర్లుసాక్షిప్రతినిధి, వరంగల్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)తో ఉమ్మడి వరంగల్లో రాజకీయ సమీకరణాల కంటే ముందే ఓటర్ల లెక్కల్లో భారీ మార్పు చోటుచేసుకుంది. జూన్ 10న ఉన్న ఓటర్లతో పోలిస్తే సోమవారం నాటి ముసాయిదా ప్రకారం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీగా ఓటర్ల వివరాలు మారాయి. 30,53,238 మంది ఓటర్లు ఉండగా.. తాజా జాబితాలో 26,77,498 మంది నమోదయ్యారు. అంటే దాదాపు 12.31 శాతం తగ్గుదల కనిపించింది. 3,75,740 మంది ఓటర్లు తగ్గారు. 4,83,803 మంది ఏఎస్డీడీ (మరణించినవారు, గుర్తించలేని/గైర్హాజరైన వారు, శాశ్వతంగా తరలిపోయినవారు, ఇప్పటికే మరోచోట నమోదైనవారు, ఇతర కేటగిరీ)లలో ఉన్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ఓటర్లకు మ్యాపింగ్ జరగకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తూర్పులో భారీ మార్పు.. పశ్చిమలో పెద్ద కోత ఉమ్మడి వరంగల్లో అత్యంత ఆసక్తికరమైన గణాంకం వరంగల్ పశ్చిమది. జూన్ 10న 2,86,335 మంది ఓటర్లు ఉండగా.. సోమవారం నాటికి 2,03,719కు తగ్గారు. అంటే 82,616 మంది తగ్గారు. వరంగల్ తూర్పులోనూ దాదాపు ఇదే తరహా పరిస్థితి. 2,60,437 మంది నుంచి ఓటర్ల సంఖ్య 2,09,646కు తగ్గింది. అంటే 50,791 మంది తగ్గారు. ఏఎస్డీడీలో పాలకుర్తి రెండో స్థానం.. ఏఎస్డీడీని పరిశీలిస్తే పాలకుర్తి 23.68 శాతంతో ఉమ్మడి వరంగల్లో రెండో స్థానం, వరంగల్ తూర్పు 23.88 శాతంతో మొదటి స్థానంలో ఉంది. భూపాలపల్లిలో ఏఎస్డీడీ ఓటర్ల శాతం కేవలం 8.63 శాతం ఉంది. అంటే ఒకే ఉమ్మడి ప్రాంతంలో నియోజకవర్గాల మధ్య సవరణ ప్రభావంలో గణనీయమైన తేడా కనిపిస్తోంది. అక్టోబర్ 1న తుది జాబితా.. ఇక నుంచి క్లెయిమ్స్, అభ్యంతరాలు, విచారణ, కొత్తగా చేరే ఓటర్లు, తిరిగి చేర్చే పేర్లతో జాబితా మారనుంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబర్ 1న వెలువడే తుది జాబితానే ఉమ్మడి వరంగల్లో అసలు ఓటర్ల బలాన్ని స్పష్టంగా చూపించనుంది. ఇప్పటివరకు కనిపిస్తున్న గణాంకాలు తుది జాబితా కాదన్నదే కీలకం. ప్రత్యేక సవరణలో ముసాయిదా జాబితా అనంతరం ఓటర్లకు తమ పేరు ఉందో లేదో చూసుకునే అవకాశం, అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ముసాయిదా జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాలకు ఈ నెల 30 వరకు అవకాశం ఉండగా, వాటి పరిష్కార ప్రక్రియ సెప్టెంబర్ 28 వరకు కొనసాగి, తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 1న ప్రచురించాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం కనిపిస్తున్న తగ్గుదలలో ఎన్ని పేర్లు శాశ్వతంగా తొలగిపోతాయి? ఎన్ని తిరిగి చేరుతాయి? కొత్తగా ఎన్ని పేర్లు చేరతాయి? అనేది త్వరలో తేలనుంది. రంగంలోకి రాజకీయ పార్టీలు మరణించిన వారు, గుర్తించలేని/గైర్హాజరైన వారు, శాశ్వతంగా తరలిపోయిన వారు, ఇప్పటికే మరోచోట నమోదైన వారు, ఇతర కేటగిరీలు ఏఎస్డీడీలో ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. తమ బూత్లో తొలగించిన ఓటర్ల జాబితాను తీసుకోవడం, నిజంగా అక్కడే నివసిస్తున్న ఓటర్ల పేర్లు తొలగిపోయాయా? అనేది ఇంటింటికీ పరిశీలించడం. అర్హులైన కొత్త ఓటర్లు, మిస్సైన పేర్లు, చిరునామా/పేరు తప్పులపై క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేయడం. ఇది పార్టీలకు కేవలం రాజకీయ కార్యక్రమం కాదు.. ఎన్నికల బూత్ మేనేజ్మెంట్కు కీలకమైన ప్రక్రియగా మారనుంది. నియోజకవర్గం 10.06.26 17.08.26 ఏఎస్డీడీ ఏఎస్డీడీ నో తగ్గిన ఓటర్లు ఓటర్లు (డిజిటైజ్) శాతం మ్యాపింగ్ ఓటర్లువరంగల్ పశ్చిమ 2,86,335 2,03,719 43,892 21.55 46,238 82,616 పరకాల 2,22,679 2,03,598 37,376 18.36 4,568 19,081 వరంగల్ తూర్పు 2,60,437 2,09,646 50,058 23.88 25,685 50,791 నర్సంపేట 2,40,244 2,21,913 46,321 20.87 5,559 18,331 వర్ధన్నపేట 2,76,272 2,46,981 53,804 21.78 12,966 29,291 జనగామ 2,49,437 2,22,381 46,000 20.69 9,943 27,056 స్టేషన్ఘన్పూర్ 2,56,806 2,39,750 31,215 13.02 6,746 17,056 పాలకుర్తి 2,61,241 2,41,462 57,177 23.68 12,776 19,779 డోర్నకల్ 2,24,165 2,05,085 27,254 13.29 4,715 19,080 మహబూబాబాద్ 2,60,770 2,31,871 39,243 16.92 9,687 28,899 భూపాలపల్లి 2,77,882 2,41,964 20,877 8.63 11,739 35,918 ములుగు 2,36,970 2,09,128 30,586 14.63 11,313 27,842ఉమ్మడి వరంగల్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సవరణ ముసాయిదా ఇలా.. -
గీత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ములుగు రూరల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ పేర్కొన్నారు. సోమవారం చైతన్య బస్సుయాత్ర జిల్లా కేంద్రానికి చేరుకోగా జిల్లా అధ్యక్షుడు గుండబోయిన రవిగౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా రూ.20 కోట్ల నిధులను విడుదల చేయాలని కోరారు. ఏజెన్సీల్లో రద్దు చేసిన సొసైటీలను పునరుద్ధరించాలని అన్నారు. జిల్లా కేంద్రంలో సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు, కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, కుమార్, శ్రీనివాస్, మధుకర్, నర్సయ్య, యాకయ్య తదితరులు పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ -
ఎన్ఎంఎంఎస్తో ఉపకారం
ములుగు రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్)ను ప్రవేశ పెట్టింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు నాలుగేళ్లపాటు ఉపకార వేతనం అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువు కొనసాగించేందుకు ఉపకార వేతనం ఎంతగానో దోహదపడుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యార్థులు ఉన్నత చదువులకు దూరంగా కాకుండా ఉండేందుకు ఈ స్కాలర్షిప్ను తీసుకు వచ్చింది. అర్హతలు ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాసేందుకు ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. దీంతో పాటు 7వ తరగతిలో 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జత చేసి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో దరఖాస్తు పత్రాన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలి. ఆన్లైన్లో పరీక్ష రుసుం చెల్లింపు.. అర్హత పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఓసీ, బీసీ వారు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50లు ఆన్లైన్లో చెల్లించాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.తెలంగాణ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులు పూర్తిచేయాలి. ఈ నెల 24వ తేదీతో గడువు ముగియనుంది. నవంబర్లో అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో పరీక్ష రాసేందుకు వెసులుబాటు కల్పించారు. ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు.. ఎన్ఎంఎంఎస్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు ఉపకారవేతనం అందిస్తారు. ప్రతీ ఏడాది రూ.12 వేలను విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ స్కూల్, గురుకుల పాఠశాలల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడానికి మంచి అవకాశం ఇది. విద్యార్థులు వినియోగించుకోవాలి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో అర్హత సాధిస్తే నాలుగేళ్ల పాటు ఏటా రూ.12వేల స్కాలర్షిప్ అందుతుంది. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించి పరీక్షకు దరఖాస్తులు చేసుకునేలా చూడాలని ఆదేశించాం. – సిద్ధార్థ్రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి దరఖాస్తుకు ఈనెల 24వరకు గడువు 8వ తరగతి విద్యార్థులు అర్హులు అర్హత సాధిస్తే ఏటా రూ.12వేలు అందజేత8వ తరగతి విద్యార్థులుములుగు 192 వెంకటాపురం(కె) 171 మంగపేట 168 గోవిందరావుపేట 155 ఏటూరునాగారం 134 వెంకటాపురం(ఎం) 90 తాడ్వాయి 69 వాజేడు 63 మల్లంపల్లి 43 కన్నాయిగూడెం 29 మొత్తం 1,114గతంలో అర్హత సాధించిన విద్యార్థులు 2022 18 2023 212024 18 2025 19 -
రామప్పలో శ్రావణ శోభ
వెంకటాపురం(ఎం) : మండలంలోని రామప్ప దేవాలయంలో సోమవారం శ్రావణ సందడి నెలకొంది. శ్రావణమాసంలో తొలి సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రావణ సోమవారం సందర్భంగా రామప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడింది. విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి ములుగు రూరల్ : చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని లీగల్ ఎయిడ్ ఛీప్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం, న్యాయసేవలు, ఉచిత న్యాయం, న్యాయ పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందజేస్తున్న న్యాయ సేవలను వినియోగించుకోవాన్నారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ కవిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలుగు చంద్రయ్య, అధ్యాపకులు శిరిష, రాధిక, శంకర్ విద్యార్థులు పాల్గొన్నారు.మంగపేట : మండలంలోని వివిధ గ్రామాల్లో గల రేషన్ షాపుల్లో కాంటాలను లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శ్రీలత సోమవారం తనిఖీ చేశారు. గిరిజన సహకార సంస్థ, ప్రైవేటు రేషన్ డీలర్లు, మహిళా పొదుపు సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న రేషన్ షాపుల్లో ప్రతి నెలా బియ్యం పంపిణీలో కొందరు నిర్వాహకులు ఎలక్ట్రానిక్ కాంటాలపై అవగాహన ఉన్న వ్యక్తుల సహకారంతో టెక్నాలజీని ఉపయోగించి తూకంలో మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో కమలాపురం, బోరునర్సాపురంలోని నాలుగు రేషన్ షాపుల్లో ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లను పరిశీలించారు. కమలాపురంలోని ఓ రేషన్ షాపులో తూకంలో తేడా రావడంతో కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ములుగు : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ములుగు మండల మాజీ అధ్యక్షుడు సానికొమ్ము రమేష్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్రెడ్డి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని, రైతు బీమా వెంటనే అమలు చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని వివరించారు. కార్యక్రమంలో చిన్న విజయ్, పోరిక గోవింద్ నాయక్, వెంకన్న, మహేష్, చంద్రమౌళి, ముంజాల భిక్షపతి పాల్గొన్నారు. అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం భూపాలపల్లి అర్బన్: సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న అందజేయనున్న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2026లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖాధికారి రాజేందర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్పెషల్ ఆఫీసర్లు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, వలంటీర్ ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరారు. -
వర్షాలు సమృద్ధిగా కురవాలి
రేగొండ: వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వర్షాలు కురవాలని వరుణయాగం నిర్వహించగా ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలియజేసిన నేపథ్యంలో కోటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురవాలని రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మండలంలోని లింగాల ఎంజేపీలో సుమారు రూ.3లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్, ఇన్వర్టర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, ఆలయ మాజీ చైర్మన్ సంపత్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్నం రవి పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాంములుగు రూరల్ : కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో వందేమాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించకుండా సోనియాగాంధీ అంతరాయం కలిగించినందుకు దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశభక్తి, జాతీయ గౌరవం, వందేమాతర గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. జాతీయ గీతం విషయంలో రాజకీయ భేదాలకు అతీతంగా గౌరవం, క్రమశిక్షణ పాటించవలసిన బాధ్యత దేశ పౌరులపై ఉందని తెలిపారు. జాతీయ జెండా విషయంలో బీజేపీపై ఆరోపణలు చేసిన మంత్రి సీతక్క కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించిన తీరుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. ములుగు జిల్లా ఏర్పాటు ఒక్క వ్యక్తి, రాజకీయ పార్టీ కృషి కాదని సమష్టి ప్రజల కృషి ఫలితమని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా చిత్రీకరించడం సరికాదని హితవు పలికారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్రెడ్డి, భూక్య జవహర్లాల్, దేవేందర్రావు, రవీంద్రాచారి, నగరపు రమేష్, కృష్ణాకర్, రామరాజు, సుమలత, నాగరాజు, రాకేష్యాదవ్, మహేందర్, సతీష్, నరేందర్, కుమార్, రవిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరిస్తాం
ఏటూరునాగారం : గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తామని ఐటీడీఏ పీఓ లెనిన్వత్సల్ టొప్పో పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో పీఓ గిరిజనుల నుంచి 25 వినతులు స్వీకరించారు. వెంకటాపురం(కె) మండలంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో మూడేళ్లుగా ఆఫీస్ సబార్డినేట్గా (అటెండర్) పనిచేస్తున్నామని, క్యాటరింగ్, శానిటేషన్ డబ్బులు సగం జీతం వస్తుందని, వేతనం ఇప్పించాలని గిరిజనుడు కోరారు. మహబూబాబాద్ జిల్లా నుంచి కాంటింజెంట్ వర్కర్గా పనిచేస్తున్న తనకు కాలు విరిగిందని, తన పోస్టును కోడలికి ఇప్పించాలని కోరారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురంలో తుడుందెబ్బ స్టడీ సెంటర్ బుక్స్, కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరారు. ఐటీడీఏ పాఠశాలలోని స్కావెంజర్లకు వేతనాలు ఇప్పించాలని గిరిజనులు ఏఐటీయూసీ నాయకుడు జంపాల రవీందర్ కోరారు. వినతులను పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పీఓ తెలిపారు. కార్యక్రమంలో ఎస్డీసీ ప్రతాప్, డీడీ జనార్దన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, జేడీఎం కొండల్రావు తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ లెనిన్వత్సల్ టొప్పొ గిరిజన దర్బార్లో 25 వినతుల స్వీకరణ -
మండలస్థాయి ప్రజావాణి ప్రారంభం
గోవిందరావుపేట : ప్రజావాణికి వచ్చే ప్రతీ దరఖాస్తును స్వీకరించి, స్థానికంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం గోవిందరావుపేటలో శ్రీకారం చుట్టారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మండలస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించి, వాటి పురోగతిని దరఖాస్తుదారులకు తెలియజేయాలన్నారు. ప్రతీ దరఖాస్తుకి ఫోన్ నంబర్ను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు ఒకే సమస్యపై పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా చూడాలన్నారు. ఒంటరి మహిళలు, వితంతువు పింఛను దరఖాస్తులు ఈ నెల 31లోగా స్వీకరించాలని ఆదేశించారు. పస్రా, గోవిందరావుపేట, చల్వాయి ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, తండాలు, గూడేల్లో మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.50 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎంపీడీఓ చిలువేరు వరుణ్ కుమార్ మాట్లాడుతూ.. మండల ప్రజావాణికి మొత్తం 14 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, తహసీల్దార్ సృజన్కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
రోడ్ల పైలాన్ ఆవిష్కరణ.. కలెక్టరేట్ ప్రారంభోత్సవం
ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ వద్ద నిర్మించిన హ్యామ్ రోడ్ల (గ్రామీణ రహదారుల) అభివృద్ధి పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. అక్కడినుంచి కలెక్టరేట్కు చేరుకొని రూ.868 కోట్లతో జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి పనుల మరో పైలాన్ను ప్రారంభించారు. పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నూతన కలెక్టరేట్ను సీఎం రేవంత్రెడ్డి.. మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించారు. కార్యాలయం అంతా కలియదిరిగి పరిసరాలు పరిశీలించారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావును కుర్చీలో ఆసీనులు చేసి శాలువా కప్పారు. నూతన కలెక్టరేట్ పక్కన ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టు భవనాలు నిర్మించడంతోపాటు మల్లూరు లక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు సీఎం తెలిపారు. కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించి గ్రూప్ ఫొటో దిగారు. -
గిరిజన టైలరింగ్ హబ్
పరకాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు హాజరైన ప్రజలుఏటూరునాగారం: ఏజెన్సీలోని గిరిజన మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఐటీడీఏ ప్రత్యేక చొరవ తీసుకుంది. ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యార్థులకు స్కూల్ యూనిఫాం స్వయంగా కుట్టి ఇచ్చేందుకు నిరుద్యోగ మహిళలతో నూతనంగా టైలరింగ్ హబ్ను ఏర్పాటు చేసింది. ఐటీడీఏ సమీపంలోని నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్డులో ప్రత్యేక వసతులతో ఈ కేంద్రాన్ని నెలకొల్పింది. సుమారు రూ.16 లక్షల బడ్జెట్తో 24 కుట్టు మిషన్లు, కాజాలు, బటన్స్ కుట్టే మిషన్లను తీసుకొచ్చారు. షెడ్డు ఏర్పాటుకు రూ. 6.50 లక్షలు కేటాయించగా మిషనరీ, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు రూ.9.50 లక్షలు కేటాయించారు. వీటితో పాటు ప్రత్యేక కార్పేట్, ఫ్యాన్లు, లైటింగ్ సిస్టమ్తో పాటు విద్యుత్ మోటార్లను సైతం అమర్చుతున్నారు. హబ్ ప్రారంభానికి ఏర్పాట్లు గతంలో ఐటీడీఏ పరిధిలో సుమారు 4 వేల మంది విద్యార్థులకు వివిధ గ్రామాల్లోని మహిళా సంఘాల్లో గల టైలరింగ్ నేర్చుకున్న మహిళలకు నూతన దుస్తులు కుట్టే కాంట్రాక్ట్ ఇచ్చేవారు. ప్రస్తుతం అలా కాకుండా ఐటీడీఏ ద్వారానే ప్రత్యేక టైలరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో నైపుణ్యం గల మహిళలను కేటాయించి ఈ మిషనరీలతో చౌకగా కుట్టి ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో చదివే విద్యార్థులకు యూనిఫాం అందించనున్నారు. దీనివల్ల సమయం, ఖర్చు కూడా తక్కువ కానుండడంతో పాటు గిరిజన మహిళలకు ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ హబ్ను జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపట్టింది. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన పీఓ చిత్రామిశ్రా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించారు. దాంతో ఈ పనులు శరవేగంగా ముందుకుసాగుతున్నాయి. దాదాపుగా మిషనరీ ఫిట్టింగ్ పూర్తికాగా చిన్నచిన్న పనులు కొనసాగుతున్నాయి. ఈ హబ్ను అధికారికంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ కేంద్రం నడపనున్నారు. ప్రైవేట్ మార్కెటింగ్పై నజర్ ఈ హబ్లో శిక్షణతో పాటు ప్రభుత్వ ఆమోదిత కాంట్రాక్టుతో డ్రెస్లను తయారు చేయించనున్నారు. ఈ హబ్ ద్వారా ప్రైవేట్ మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటును సైతం కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రైవేట్ రంగంలో రకరకాల డ్రెస్లు కుట్టి విక్రయిస్తే మహిళలు మరింత ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. దీంతో నిత్యం డ్రెస్లు కుట్టడంతో పాటు మార్కెటింగ్ చేసేందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. తక్కువ ధరలకే నాణ్యమైన డ్రెస్లు సైతం అందుబాటులోకి రానున్నాయి. బటన్స్, కాజాల స్టిచ్చింగ్ రూ. 16 లక్షల నిధులు కేటాయించిన ఐటీడీఏ -
ముత్యాలమ్మకు బోనాలు
మంగపేట: మండల పరిధిలోని రామచంద్రునిపేటలో ముత్యాలమ్మ బోనాల పండుగను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. అసలేరు కార్తెలో ముత్యాలమ్మ అమ్మవారికి గ్రామస్తులు బోనాలు సమర్పించడం ఆనవాయితీ. అసలేరు కార్తె ముగుస్తుండటంతో అత్యంత భక్తిశ్రద్ధలతో మహిళలు డప్పుచప్పుళ్ల మధ్య బోనాలతో ఆలయానికి తరలివెళ్లారు. ముత్యాలమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురువాలని, పాడిపంటలు పండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వెంగల బుచ్చిరెడ్డి, గుజ్జ నర్సిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకన్న గ్రామస్తులు పాల్గొన్నారు. -
12 ఏళ్లకు పింఛన్ మంజూరు
ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని లింగాల గ్రామానికి చెందిన ఊకే సాకేత్ పుట్టుకతోనే దివ్యాంగుడు. తల్లిదండ్రులు దివ్యాంగుల పింఛన్ కోసం ఇంతకాలం ప్రయత్నించినా మంజూరు కాలేదు. మేడారంలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా ఆదివారం సాకేత్కు అమ్మవార్ల సన్నిధిలో ముఖ్యమంత్రి పింఛన్ మంజూరు పత్రాన్ని అందజేశారు. మంత్రి సీతక్క చొరవతో సాకేత్కు దివ్యాంగుల పింఛన్ మంజూరైందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ‘బుచ్చమ్మకు ఇల్లు నిర్మించి ఇస్తాం’ ఎస్ఎస్తాడ్వాయి: ఆదివారం మేడారం వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఆలయ పరిసరాల్లో బారికేడ్ల వెలుపల ఉన్న భక్తులను పలకరించారు. ఈ సందర్భంగా బుచ్చమ్మ అనే మహిళ ముఖ్యమంత్రిని కలిసి తన కుటుంబ పరిస్థితిని వివరించారు. తనకు సొంత ఇల్లు లేక చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని సీఎంకు వివరించారు. ప్రభుత్వం తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బుచ్చమ్మ వినతిపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి ఆమెకు ఇల్లు నిర్మించి ఇస్తామని హామీనిచ్చారు. ఇందుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని కలెక్టర్ను ఆదేశించారు.బ్రిడ్జి పనుల పరిశీలన వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి, పెద్దగొళ్లగూడెం గ్రామాల మధ్యన నిర్మిస్తున్న ఇసుక వాగు బ్రిడ్జి పనులను నేషనల్ హైవే ఎస్ఈ మోహన్ ఆదివారం పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు ఎక్కడి వరకు వచ్చింది, ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందనే విషయాన్ని అక్కడ పని చేస్తున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. హేమాచలక్షేత్రంలో దేవాదాయశాఖ కమిషనర్ మంగపేట: మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారంలో సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ముందుగా హేమాచలక్షేత్రానికి వచ్చి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, పూజారులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి ఆలయంలోని స్వయంభు స్వామివారికి కమిషనర్ గోత్రనామాలతో అర్చనలు జరిపించి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రోడ్డు ప్రమాదంలో భక్తులకు గాయాలు ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని మేడారం సమ్మక్క– సారలమ్మ దర్శనానికి ఆదివారం వచ్చిన భక్తుల కారు ఓ చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం అశ్వాపురం సమీపంలోని మొడికుంటకు చెందిన భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు కారులో మేడారానికి వచ్చారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో మేడారం సమీపంలో కారు అదుపు తప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న రవితేజ, దేవిక, హంసవేణిలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ ఈఎంటీ రజినీకర్, పైలెట్ గణపతిలు గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించారు. -
హైదరాబాద్ తరహాలో ములుగు అభివృద్ధి
ములుగు: హైదరాబాద్ తరహాలో జిల్లాను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీతక్క మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. గృహా నిర్మాణానికి సంబంధించి ములుగు నియోజకవర్గానికి 5వేల ఇళ్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. సాగునీటి రంగంలో ప్రాధాన్యత ఇస్తూ రూ.200 కోట్లతో పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్, రామప్ప–లక్నవరం అనుసంధాన పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ పనులు పూర్తయితే వ్యవసాయ రంగానికి మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. జిల్లా కేంద్రంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు, వైద్యవిద్య సదుపాయాల విస్తరణకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి నిధులను విడుదల చేస్తూ నిలిచి పోయిన పనులను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. తప్పుడు ప్రచారాలు చేసేవారిని వనదేవతలు సమ్మక్క–సారలమ్మ చూసుకుంటారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై తప్పు డు ప్రచారం చేయడం సరికాదని, ప్రజలు వాస్తవాలను గమనించాలని మంత్రి సీతక్క కోరారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
అభివృద్ధి.. సంక్షేమం.. రాజకీయం!
సీఎం రేవంత్రెడ్డి ములుగు, పరకాల పర్యటన.. ఆద్యంతం ఆసక్తికరంసాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదివారం ములుగు, పరకాల పర్యటన అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ సందేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మేడారంలో వనదేవతలను దర్శించుకుని పింఛన్ల పంపిణీ మొదలుపెట్టారు. అక్కడినుంచి ములుగులో హ్యామ్రోడ్ల పైలాన్ ఆవిష్కరణ.. కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం.. చివరగా పరకాలలో ‘ప్రజాపాలన–ప్రగతిబాట’ విజయోత్సవ సభలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్, పట్టణ మౌలిక వసతులు, మహిళా సాధికారతకు సంబంధించిన పలు పనులకు శ్రీకారం చుట్టారు. రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేసిన సీఎం.. సొంతపార్టీలోని అసంతృప్తులకూ చురకలు అంటించారు. చర్చనీయాంశంగా రాజకీయ సందేశం.. పరకాల సభలో సీఎం ప్రసంగం అభివృద్ధి, సంక్షేమంతోపాటు రాజకీయ సందేశాలతోనూ సాగింది. ప్రజలనుంచి ఎన్నికై న ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులుగా పనిచేయాలన్నారు. ‘కేసీఆర్ ఫ్యామిలీ జస్టిస్ చేస్తే నేను సోషల్ జస్టిస్ చేస్తున్నా.. ఆనాడు కుటుంబసభ్యులకు పదవులు కట్టబెడితే, మేం సామాజిక కోణంలో అవకాశాలు కల్పిస్తున్నాం.. ఇలాంటి నేతలు మహిళలు, ప్రజలకు ఎలా న్యా యం చేస్తారు’ అంటూ ఘాటైన విమర్శలు చేశారు. పాలకుర్తిలాంటి చోట పాలన పరాకాష్టకు చేరి కొండలాంటి వ్యక్తులమని చెప్పుకున్న వారు ఎన్నికల్లో బండలా పగిలిపోయారని, ఇప్పటికై నా ప్రజల చైతన్యమే ప్రజాస్వామ్యానికి బలమని గ్రహించాలని పేర్కొన్నారు. సీఎం పర్యటనతో ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. ఓరుగల్లుపై వరాల జల్లు వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మామునూరు విమానాశ్రయం కోసం భూసేకరణకు రూ.300 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామని ప్రకటించారు. రెండేళ్లలో విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. వరంగల్ నగరంలో సుమారు రూ.5,700 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సమర్థంగా సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నామని, మిగిలిన ఖాళీలను దశలవారీగా భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. ‘ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక 32 నెలల పాలనలో రోజూ మూడు గంటలైనా రెస్ట్ తీసుకోలేదు. ప్రజలు అండగా ఉంటే చాలు ఏదైనా సాధిస్తా’ అని రేవంత్ స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క,అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు కావ్య, వేం నరేందర్ రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, రాంచంద్రునాయక్, మురళీనాయక్, ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణ, కలెక్టర్లు హేమంత్ సహదేవరావు, చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద, సీపీ శ్వేత, ఎస్పీ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందడి.. ఓరుగల్లుపై వరాల జల్లు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై హామీలు.. నిరుద్యోగులకు మార్గదర్శనం రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు సొంతపార్టీ అసంతృప్తులకు చురకలు సీఎం పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరం.. పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాల్లో సీఎం రేవంత్రెడ్డి తాజా పిలుపు ఆసక్తికర చర్చకు తెరలేపింది. ముఖ్యమంత్రి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి ప్రాధాన్యం దక్కగా.. మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ప్రకాశ్రెడ్డిని మరోసారి గెలిపించాలని సీఎం ప్రజలకు పిలుపునివ్వడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో గతంలో రేవూరి, మంత్రి కొండా సురేఖ వర్గాల మధ్య విబేధాలు బహిర్గతమైన సందర్భాలున్నాయి. ఫ్లెక్సీల వివాదం ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. కాగా, మంత్రి సురేఖ గైర్హాజరుకు అధికారిక కారణం వెల్లడికాకపోవడంతో స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా.. ‘పరకాలలో రేవూరికే సీఎం అండ’ అన్న సంకేతాన్ని రేవంత్రెడ్డి పర్యటన ఇచ్చిందనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. -
పుణ్యస్నానాలు.. ప్రత్యేక పూజలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు, శ్రావణ మాసం కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరకుని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 10నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు ముక్కామల రాజశేఖర్శర్మ, పవన్కుమార్ ఆచార్యులు, ఈశ్వర్చంద్శర్మ, అనిపెద్ది రాజీవ్ శర్మ స్వామివారికి నిర్వహించిన తిలతైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరాన్ని పోలి ఉండే లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని పులకించారు. సంతానం కోసం నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు పంపిణీ చేసి వేద మంత్రోచ్ఛరణతో ఆశీర్వచనం ఇచ్చారు. వందల సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తజనంతో సందడి నెలకొంది. హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి వేలాదిగా తరలివచ్చిన భక్తజనం -
పేద విద్యార్థి చదువుకు మంత్రి పొన్నం అండ
భీమదేవరపల్లి: పేదరికం ప్రతిభకు అడ్డంకి కారాదనే ఉద్దేశంతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మండల కేంద్రానికి చెందిన బొల్లంపల్లి రజిత, సారంగపాణి దంపతుల కుమార్తె హాసిని ఇటీవల పూణేలోని ప్రతిష్టాత్మక తలేగావ్ ఐఐటీ యూనివర్సిటీలో సీటు సాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో ఉన్నత చదువుల కోసం ఫీజులు చెల్లించలేక ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించారు. విద్యార్థిని హాసిని ఉన్నత విద్య ఆగకూడదనే సంకల్పంతో ఆమెకు రూ.3 లక్షల విలువైన ఆర్థిక సహాయం చెక్కు అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పేదరికం కారణంగా ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. -
కేయూ సైన్స్ విభాగాల డీన్గా ప్రొఫెసర్ వెంకట్రాంరెడ్డి
కేయూ క్యాంపస్: కేయూ సైన్స్ విభాగాల డీన్గా ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి.వెంకట్రాంరెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు శనివారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆబాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ జి.హనుమంతు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. వెంకట్రాంరెడ్డి గతంలో ఫిజిక్స్ విభాగాధిపతిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా, అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, పరీక్షల నియంత్రణాధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన కేయూ ఓఎస్డీగా టీజీఎడ్సెట్ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండేళ్లపాటు ఆయన సైన్స్ విభాగాల డీన్గా కొనసాగనున్నారు. వీసీ ప్రతాప్రెడ్డి చేతుల మీదుగా ఉత్తర్వులు అందుకున్నారు. -
గిరిజనుల అభివృద్ధికి కృషి
● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో ఏటూరునాగారం: గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మండల కేంద్రంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఐటీడీఏలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. అనంతరం గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పీఓ మాట్లాడారు. ఏజెన్సీలోని గిరిజనులకు విద్య, వైద్యం అందేలా చూడడంతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఐటీడీఏ కృషి చేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే మేడారం జాతరకు రూ.150 కోట్లను విడుదల చేసి పలు అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. గిరిజన విద్యార్థులు విద్యాభ్యాసానికి ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా ఆస్పత్రితో పాటు 3 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 22 పీహెచ్సీలు, 128 ఆరోగ్య ఉపకేంద్రాల్లో ప్రతిరోజూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు పీఓ వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ మనన్భట్, విద్యార్థులు, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు. -
కేయూ అభివృద్ధికి రూ.400 కోట్లతో ప్రతిపాదనలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.400 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలనాభవనం ఆవరణలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. 50 ఏళ్ల కేయూ ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ లక్ష్యాల వైపు మరింత దృఢంగా సాగాలని పిలుపునిచ్చారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణ, మౌలిక వసతులు, విద్యార్థి సంక్షేమం, పరిపాలనా సంస్కరణల్లో విశ్వవిద్యాలయం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. రూసా ప్రాజెక్టు ద్వారా రూ.50 కోట్లతో వివిధ పరిశోధన ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. కేయూ ఇంజనీరింగ్ కళాశాలకు ఏఐసీటీ అనుమతి లభించిందన్నారు. కేయూలోని గ్రంథాలయ అభివృద్ధికి రూ.కోటి కేటాయించామని తెలిపారు. వేడుకల్లో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, ఓఎస్డీ ఆచార్య వెంకట్రామ్రెడ్డి, పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ సురేష్లాల్, రమ, సుదర్శన్, అనితారెడ్డి, సుకుమారి, చిర్ర రాజు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల బోధన, బోధనేతర ఉద్యోగులకు నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు వీసీ, రిజిస్ట్రార్ బహుమతులను అందజేశారు. తొలుత వీసీ ప్రతాప్రెడ్డి.. ఎన్సీసీ కేడెట్ల గౌరవ వందనం స్వీకరించారు.● కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి -
హెల్త్ ఏటీఎం సేవలు
కాళేశ్వరం: మహదేవపూర్ సీహెచ్సీలో జూలై 31న ప్రారంభమైన హెల్త్ ఏటీఎం సేవలు కాటారం డివిజన్ ప్రజలకు ఉపయోగకరంగా మారాయి. హెల్త్ ఏటీఎం ద్వారా 64 వ్యాధులకు 15 రకాల పరీక్షలు నిర్వహించి వెంటనే రిపోర్టులు అందజేస్తున్నారు. రోగులు కాటారం, భూపాలపల్లి, పరకాల, మంచిర్యాల, హనుమకొండ లాంటి పట్టణాలకు వెళ్లకుండా ప్రజలకు సమ యం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతున్నాయి. చేసే పరీక్షలు ఇవే.. ఎత్తు, బరువు (శరీర కొవ్వు విశ్లేషణ), రక్తపోటు, రక్తంలోని ఆక్సిజన్ శాతం, శరీర ఉష్ణోగ్రత, ఈసీజీ, హీమోగ్లోబిన్, రక్తంలో చక్కెర, యూరిక్ యాసిడ్, లిపిడ్ ప్రొఫైల్ (కొలెస్ట్రాల్ పరీక్ష), హెచ్బీఏ1సీ (గత 2–3 నెలల సగటు చక్కెర స్థాయి), స్పైరోమీటర్ (ఊపిరితిత్తుల పనితీరు) పరీక్ష, ఆటో స్కోప్ (చెవి పరీక్ష), డెర్మా స్కోప్ (చర్మ పరీక్ష), డెంటల్ కెమెరా (దంతాల పరీక్ష) ఈ విధమైన 15 పరీక్షలు హెల్త్ ఏటీఎంలో కొద్ది నిమిషాల్లోనే అనేక ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. ఏటీఎం మిషన్ వద్ద వ్యక్తి కూర్చొని, నిలబడి ఉండటం, రక్త పరీక్షల ద్వారా పరీక్షలు చేస్తున్నారు. 15 నిమిషాల నుంచి 25 నిమిషాల్లో పరీక్షల రిపోర్టులు అందజేస్తున్నారు. ఏ రోజు ఎన్ని పరీక్షలు చేశారంటే.. జూలై 31 9 ఆగస్టు 1 2 ఆగస్టు 4 10 ఆగస్టు 5 4 ఆగస్టు 6 7 ఆగస్టు 10 1 ఆగస్టు 12న 9హెల్త్ ఏటీఎంతో త్వరగా పరీక్షలు తెలుసుకోవచ్చు. 15 రకాల పరీక్షలకు అనుసంధానంగా ఉన్న 64 రకాల పరీక్షలు తెలుసుకోవచ్చు. మారుమూల ప్రాంతంలో ఇలాంటి హెల్త్మిషన్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. టెక్నిషియన్ అందుబాటులో ఉన్నారు. పూర్తిగా ఉచితంగా సేవలు అందుబాటులో ఉన్నాయి. – విద్యావతి, సూపరింటెండెంట్, మహదేవసూర్ సీహెచ్సీ -
ఇంధన స్వావలంబన దిశగా అడుగులు
హన్మకొండ: ఇంధన స్వాలంబన దిశగా సోలార్, బ్యాటరీ స్టోరేజ్ సాంకేతికతల వైపు అడుగులు వేస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి చెప్పారు. హనుమకొండలో నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. విద్యుత్ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వరుణ్ రెడ్డి ప్రసంగించారు. సమష్టి కృషితో 33 కేవీ 11 కేవీ లైన్లలో విద్యుత్ అంతరాయాలను 36 శాతం వరకు తగ్గించగలిగామన్నారు. కవర్డ్ కండక్టర్లు, ఓల్టేజ్ బూస్టర్లు, నూతన సబ్స్టేషన్ల నిర్మాణం ద్వారా విద్యుత్ సరఫరాలో నాణ్యత పెరిగిందన్నారు. సామాజిక బాధ్యతగా 10,345 అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు అందించడం సంతృప్తినిచ్చిందన్నారు. రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్, ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్స్, జీఐఎస్ మ్యాపింగ్ ప్రక్రియ తుది దశకు చేరిందన్నారు. నిజామాబాద్ జక్రాన్పల్లిలో మొట్టమొదటి సోలార్ ప్లాంట్ నెలకొల్పామని చెప్పారు. ఎల్సీ యాప్ ద్వారానే ఎల్సీలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల భద్రతకు శ్రీవన్ మినిట్ రూల్ తీసుకువచ్చామని చెప్పారు. భద్రతా మౌలిక సదుపాయాలకు రూ.57.97 కోట్ల ఖర్చు చేసినట్లు వివరించారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 1912 నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏఐ వాయిస్ ఏజెంట్ను ప్రవేశపెట్టే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సంస్థ నష్టాలు రూ.1,370 కోట్ల నుంచి రూ.670 కోట్లకు తగ్గాయని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్లు తిరుపతి రెడ్డి, మధుసూదన్, ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సీఈలు తిరుమల్రావు, జయవంత్ రావు చౌహన్, అశోక్, మాధవరావు, సురేందర్, అన్నపూర్ణ, గౌతమ్ రెడ్డి, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, వేణు బాబు పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో వైద్యులు, విద్యార్థుల పాత్ర కీలకంకాశిబుగ్గ: దేశాభివృద్ధిలో వైద్యరంగం, వైద్యులు, విద్యార్థుల పాత్ర కీలకమని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ రమేష్రెడ్డి అన్నారు. వరంగల్ కాళోజీ హెల్త్ వర్సిటీలో శనివారం స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ జాటోతు వెంకటేశ్వర్లు, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జునరెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వందన పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
సీఎం సారూ.. మా ఊరును మరిచారా?
● అమల్లోకి రాని అక్కంపేట రెవెన్యూ గ్రామ ఉత్తర్వులు ● అక్కంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్కు వేడుకోలుఆత్మకూరు: సీఎం రేవంత్రెడ్డి అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో 2022లో ఆత్మకూరు మండలం అక్కంపేటలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పర్యటించిన సందర్భంగా అక్కంపేట ప్రజలు తమ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మార్చాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను అధికారంలోకి రాగానే రెవెన్యూ గ్రామంగా మారుస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామంగా మారుస్తున్నామని సీఎం అధికారికంగా ప్రకటించారు. కానీ, ఇంతవరకు తమ గ్రామం పెద్దాపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలోనే రికార్డుల్లో చూపిస్తున్నదని ఇంతవరకు అక్కంపేట రెవెన్యూ గ్రామ ఉత్తర్వులు అమలు కావట్లేదని అక్కంపేట ప్రజలు వాపోతున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత జయశంకర్ స్వగ్రామంపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టి గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని అక్కంపేట గ్రామస్తులు సీఎం రేవంత్ను కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి అక్కంపేట సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించి అక్కంపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పాలన మరింత వేగం
ములుగు: జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి నేడు(ఆదివారం) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద హెలిపాడ్ను సిద్ధం చేశారు. గట్టమ్మ ఎదురుగా నిర్మించిన పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధి పైలాన్, నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. దీంతో పాలన మరింత వేగం కానుంది. అలాగే, మేడారం వనదేవతల ప్రాంగణాన్ని సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. నూతన కలెక్టరేట్ భవన సముదాయంలో కలెక్టర్ ఛాంబర్, సమావేశ మందిరం, విద్యుత్, జనరేటర్ సదుపాయం, తాగునీటి వసతి, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేశారు. నూతన కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో పారిశుద్ధ్యం, సుందరీకరణ, ల్యాండ్ స్కేపింగ్, విద్యుద్ధీపాల అలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అదే విధంగా సీఎం రాకపోకలకు ప్రత్యేక మార్గాలు, వీఐపీ వాహనాల పార్కింగ్, ప్రజలు, అధికారులు కూర్చునేందుకు అవసరమైన ఏర్పాట్లు, బారికేడ్లు, పోలీస్ బందోబస్తు, అగ్నిమాపక, వైద్య బృందాలు, అంబులెన్స్ తదితర అత్యవసర సేవలను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. ఏర్పాట్ల పరిశీలన సీఎం పర్యటనలో లోటుపాట్లకు తావులేకుండా ప్రతీశాఖకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ములుగు కలెక్టరేట్, మేడారం సమ్మక్క, సారలమ్మ ప్రాంగణాన్ని ఎంపీ బలరాంనాయక్, కలెక్టర్ హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి మంత్రి శనివారం పరిశీలించారు. సీఎం పర్యటించే ప్రతీ ప్రాంతంలో భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. మేడారంలో ప్రత్యేక ఏర్పాట్లు ముఖ్యమంత్రి మేడారం చేరుకునే హెలిపాడ్ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయడంతో పాటు హెలిపాడ్ నుంచి సమ్మక్క–సారలమ్మ వనదేవతల ప్రాంగణం వరకు రహదారులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. వనదేవతల దర్శనం, ప్రత్యేక పూజలు చేసే సమయంలో తీసుకునే జాగ్రత్తలపై సూచనలు చేశారు. వనదేవతల ప్రాంగణాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కలెక్టరేట్ ప్రారంభం ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు పరిశీలించిన మంత్రి సీతక్క -
అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యం
ములుగు7ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026ములుగు రూరల్: జిల్లా సమగ్రాభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్య్ర సమరయోధుడు చిందం రాజమల్లును శాలువాలతో సన్మానించారు. స్వాతంత్య్ర వేడుకల్లో విద్యార్థుల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆధ్వర్యంలో సీపీఆర్, అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. 1,636 ఇళ్ల నిర్మాణం పూర్తి పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నదని తెలిపారు. జిల్లాలో 4,956 గృహాలకు మార్కింగ్ పూర్తి చేయగా అందులో 1,636 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి అయినట్లు వివరించారు. ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ములుగు జనరల్ ఆస్పత్రిలో కోటి రూపాయల వ్యయంతో అధునాతన పరికరాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. యూడీఐడీ కేంద్రంతో పాటు రూ.20 లక్షల నిధులతో గైనిక్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించామని వివరించారు. అలాగే ఏటూరునాగారంలో 100 పడకల ఆస్పతికి అదనంగా మరో 50 పడకల ఆస్పత్రి భవన నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రూ.23 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా జిల్లాలోని మహిళలకు రూ.147.61కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. 984 మహిళా సంఘాలకు.. రూ.79.58కోట్లు అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 95 అంగన్వాడీ పోస్టులు, 329 ఆయా పోస్టులు భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఆసరా పథకం కింద 37,353 మంది లబ్ధిదారులకు రూ.9.7కోట్లను ప్రతినెలా అందిస్తున్నామని తెలిపారు. 2026–27 సంవత్సరానికి బ్యాంకు లింకేజీ కింది 984 మహిళా సంఘాలకు రూ.79.58కోట్ల రుణాలు, సీ్త్రనిధి ద్వారా 90 సంఘాలకు రూ.3.76 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు గాను రూ.143.40 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దీంతో 7,556 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడం జరుగుతుందని వెల్లడించారు. 80,828 మంది రైతులకు రైతుభరోసా రైతు భరోసా ద్వారా జిల్లాలో 80,828 మంది రైతుల ఖాతాలలో రూ.100.30 కోట్లు జమ చేసినట్లు వివరించారు. జిల్లాలో రేషన్ కార్డుదారులు 2,94,897 మందికి 1,933 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 171 గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.22.26కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. సీఆర్ఆర్ గ్రాంట్ కింద రూ.111.4 కోట్లతో 111 రోడ్డు పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలో ఇంటర్నల్ సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులను రూ.36.50 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో 2,491 మంది గిరిజనులకు రూ. 27.17కోట్లతో స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా రూ.23 లక్షలతో 64 వేల మొక్కలను నాటి సంరక్షిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, డీఎఫ్ఓ వికాస్మీనా, అదనపు ఎస్పీ సదానందం, డీఆర్ఓ రవికుమార్, ఆర్డీఓ కృష్ణవేణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ప్రజాప్రతనిధులు పాల్గొన్నారు. పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.143 కోట్లు మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు -
పగబట్టిన విధి!
హన్మకొండ చౌరస్తా/ఆత్మకూరు/ఖిలా వరంగల్:/హన్మకొండ అర్బన్: ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. మృత్యువు ఒక్కొక్కరిని తన ఒడికి చేర్చుకుంది. రెండేళ్లలో కుటుంబాన్ని మొత్తం కబళించింది. రెండేళ్ల క్రితం కొడుకు, ఐదు నెలల క్రితం భర్త మృతి చెందగా.. శనివారం భార్య సైతం అనంతలోకాలకు చేరుకుంది. హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన వరంగల్ మార్కెటింగ్ శాఖ అధికారి (డీఎంఓ) కలకోట్ల సురేఖ(43) శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని తెలుసుకున్న స్థానికుల రోదనలతో పెద్దమ్మగడ్డ దుఃఖసాగరంలో మునిగిపోయింది. మృత్యుపాశమైన ఇసుకలారీ.. కలకోట్ల సురేఖ వరంగల్ డీఎంఓగా విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ ఇన్చార్జ్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఆమె గూడెప్పాడ్లో మార్కెట్ యార్డులో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వ్యక్తిగత పనుల నిమిత్తం కారులో చింత విజయబాబు అనే వ్యక్తితో కలిసి ఏటూరునాగారం వైపు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న ఇసుకలారీ ఢీకొట్టడంతో సురేఖతోపాటు విజయబాబు కూడా దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో కొడుకు.. అనారోగ్యంతో భర్త సురేఖ, కిరణ్ స్వస్థలం హనుమకొండలోని పెద్దమ్మగడ్డ అయినప్పటికీ పదిహేనేళ్ల క్రితం జూలైవాడలో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. సురేఖ ఒక్కగానొక్క కుమారుడు సుక్రీత్ (16) రెండేళ్ల క్రితం క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తుండగా.. బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్ వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొట్టడంతో అతడు మృతి చెందాడు. సురేఖ భర్త బొక్క కిరణ్ (50) అనారోగ్యంతో బాధపడుతూ ఐదు నెలల క్రితం మృతిచెందాడు. శనివారం సురేఖ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండేళ్లలో కుటుంబమంతా మృత్యు ఒడిలోకి చేరినట్లయ్యిందని కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చివరి స్టేటస్లో కొడుకు జ్ఞాపకాలు..పతాకావిష్కరణ అనంతరం సురేఖ తన విధి నిర్వహణకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకున్నారు. అదే సమయంలో తన కుమారుడు బతికున్నప్పుడు పాఠశాలలో దిగిన ఫొటోలు, అతడితో సరదాగా గడిపిన సందర్భాల ఫొటోలను కూడా స్టేటస్గా ఉంచుకున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకం కొడుకు, భర్త మరణించిన తర్వాత సురేఖ తన వృద్ధ తల్లిదండ్రులతో కలిసి జూలైవాడలోని ఇంట్లో నివసిస్తున్నారు. సురేఖ తండ్రి సురేందర్ సీపీఓ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. కూతురుకు వరుసగా ఎదురైన విషాదాలను తలచుకుంటూ ఇప్పుడు ఆ వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘ముందు మనవడిని.. ఆ తర్వాత అల్లుడిని కోల్పోయాం.. ఇప్పుడు కూతురిని కూడా కోల్పోయాం.. ఈ ఘోరాన్ని ఎలా భరించాలి..?’ అంటూ బంధువులను పట్టుకుని వారు గుండెలవిసేలా రోదించడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. సురేఖకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. కాగా సురేఖ మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటివరకు తమతో ఉన్న అధికారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారన్న విషయం తెలియగానే గూడెప్పాడ్ మార్కెట్ పాలకవర్గం, సిబ్బంది, వరంగల్ మార్కెటింగ్శాఖ అధికారులు విషాదంలో మునిగిపోయారు. మంచి అధికారిని కోల్పోయామని పాలకవర్గం విచారం వ్యక్తం చేసింది. సిబ్బంది.. అధికారి సురేఖతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. ఒకే కుటుంబంలో రెండేళ్లలో ముగ్గురు మృతి తాడ్వాయి రోడ్డు ప్రమాదంలో వరంగల్ డీఎంఓ సురేఖ దుర్మరణం కన్నీరు మున్నీరైన బంధువులు -
ముస్తాబైన నూతన కలెక్టరేట్
ములుగు: ప్రజల చెంతకే పాలన లక్ష్యంగా ఏర్పాటు చేసిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలతో కళకళలాడనుంది. ములుగు పట్టణ శివారులోని గట్టమ్మ ఆలయ సమీపంలో రూ.63.50 కోట్లతో 16 ఎకరాల వీస్తీర్ణంలో నూతన హంగులతో కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు. ఇందులో రూ.8.50 కోట్లతో కలెక్టర్, అదనపు కలెక్టర్ భవనాలను నిర్మించారు. 2023 జూన్ 7న గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కలెక్టరేట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా మూడేళ్ల పాటు పనులు కొనసాగాయి. పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం నూతన కలెక్టరేట్ భవనాన్ని సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. అదే విధంగా గట్టమ్మ ఎదురుగా పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన హ్యామ్ రోడ్ల పైలాన్ను సీఎం ఆవిష్కరించనున్నారు. ఇంచర్ల సమీపంలో నిర్మించిన ఇందిర మహిళా శక్తి భవనాన్ని, ములుగు మండలంలోని పొట్లాపూర్ ఎత్తిపోతల పథకాన్ని, మంగపేట, మల్లంపల్లిలో నిర్మించే తహసీల్దార్ కార్యాలయాల భవనాలను వర్చువల్ విధానంలో సీఎం ఆవిష్కరించనున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించనున్న పంచాయితీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం, ఏటూరునాగారంలోని ఏటీడీఏ భవనం, ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనం, మంగపేట– మణుగూరు, బ్రహ్మణపల్లి– కాటాపూర్ రోడ్ల పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. జిల్లా పాలనకు కేరాఫ్గా గట్టమ్మ తల్లి జిల్లా పరిపాలనకు కేరాఫ్ అడ్రస్గా గట్టమ్మ తల్లి వద్ద నిర్మించిన నూతన కలెక్టరేట్ నిలవనుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు వివిధ చోట్ల ఉండడంతో కార్యాలయాల చిరునామా గుర్తించడంలో ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. ప్రభుత్వ కార్యాలయాన్ని ఒకే చోటకు రానుండడంతో ప్రభుత్వ పాలన ప్రజలకు మరింత చేరువకానుంది. విశాలమైన కార్యాలయ గదులు, అధునిక హంగులతో నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్స్, డిజిటల్ నెట్వర్కింగ్ సదుపాయాలు, పార్కింగ్ వసతి, ఆహ్లాదకరమైన పరిసర ప్రాంతాలతో నూతన కలెక్టరేట్ భవనాన్ని తీర్దిదిద్దారు. సీఎం పర్యటన ఇలా.. ఈనెల 16న మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సీఎం రేవంత్రెడ్డి జిల్లాలోని మే డారం చేరుకోనున్నారు. సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనం అనంతరం అక్కడి నుంచే రాష్ట్రంలోని వితంతువు, ఒంటరి మహిళలకు ఫించన్లు అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నా రు. అనంతరం కలెక్టరేట్కు చేరుకుని గట్టమ్మ వద్ద నిర్మించిన పైలాన్ను ప్రారంభిస్తారు. ఈసందర్భంగా సీఎం రేవంత్రెడ్డి.. గట్టమ్మ తల్లిని దర్శించుకోనున్నట్లు సమాచారం. కలెక్టరేట్ భవనంతోపాటు వివిధ అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించిన అనంతరం పరకాలలో జరిగే బహిరంగసభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొనున్నారు. ఇదిలా ఉండగా.. మంత్రి సీతక్కకు సైతం కలెక్టరేట్లో ప్రత్యేక ఛాంబర్ కేటాయించినట్లు తెలిసింది. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా రేపు ప్రారంభం రూ.63.50 కోట్లతో నిర్మాణం ఒకే చోట కొలువుదీరనున్న జిల్లా కార్యాలయాలు ప్రజలకు చేరువకానున్న ప్రభుత్వ పాలన -
రహదారుల అభివృద్ధి ఐకాన్..
● రేపు పైలాన్ ఆవిష్కరించనున్న సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర గ్రామీణ రవాణా రంగంలో సరికొత్త అధ్యాయానికి ములుగు జిల్లా వేదిక కానుంది. గ్రామాలు, మండల కేంద్రాలు, ప్రధాన రహదారుల మధ్య మెరుగైన అనుసంధానం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న భారీ రహదారి అభివృద్ధి కార్యక్రమానికి ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి ములుగు నుంచి శ్రీకారం చుట్టనున్నారు. సుమారు రూ.16,007 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి గుర్తుగా నిర్మించిన పైలాన్ను సీఎం ఆవిష్కరించనున్నారు. రవాణా వ్యవస్థ బలోపేతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తొలి దశలో 2,145 రహదారులను సుమారు 7,448 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలు, అక్కడి నుంచి ప్రధాన రహదారులకు నిరంతర అనుసంధానం కల్పించేలా ఈ ప్రణాళికను రూపొందించారు. ప్రతీ గ్రామాన్ని మండల కేంద్రంతో రెండు వరుసల రహదారితో, మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రంతో నాలుగు వరుసల రహదారితో, జిల్లా కేంద్రాన్ని రాష్ట్ర కేంద్రంతో ఆరు వరుసల రహదారితో అనుసంధానించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రహదారుల నిర్మాణాన్ని హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టనున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత 15 సంవత్సరాలపాటు సంబంధిత నిర్మాణ సంస్థలే రహదారుల నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో రహదారుల నిర్మాణంతోపాటు వాటి నాణ్యత, మన్నికకు కూడా భరోసా కలగనుంది. రహదారుల అభివృద్ధికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. -
సీఎం పర్యటనలో లోటుపాట్లకు తావివ్వొద్దు
● అధికారులు అప్రమత్తంగా బాధ్యతలు నిర్వర్తించాలి ● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుములుగు: సీఎం పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా.. అధికారులు అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. శుక్రవారం ఆయన ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 16న సీఎం రేవంత్రెడ్డి జిల్లాలో పర్యటించే ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది డ్యూటీ పాసులు, గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. మేడారం వనదేవతల ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, నూతన కలెక్టరేట్, పైలాన్, గట్టమ్మ ఆలయ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మేడారంలో వనదేవతల దర్శనం, పింఛన్ల పంపిణీ కార్యక్రమాలతోపాటు నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం, సభా ప్రాంగణంలో చేపట్టాల్సిన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని తెలిపారు. నూతన కలెక్టరేట్, పైలాన్ పరిశీలన గట్టమ్మ ఆలయ సమీపంలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవనం, పైలాన్ తుది దశ పనులను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి శుక్రవారం పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా మిగిలిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్రావు, ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్వో రవికుమార్, ఆర్ అండ్ బీ అధికారి శ్యామ్ సింగ్, మున్సిపల్ కమిషనర్ సంపత్, ఎస్ఈ ఈడీ ధర్మనాయక్ పాల్గొన్నారు. -
దేశ భద్రతలో యువత ముందుండాలి
ములుగు రూరల్: దేశ భద్రతలో యువత ముందుండాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. మల్లంపల్లి మండలకేంద్రంలో మండల అధ్యక్షుడు బైకాని మహేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అంబేడ్కర్ సెంటర్ నుంచి జాతీయ రహదారిపై కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బలరాం మాట్లాడుతూ.. ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని అన్నారు. దేశ పౌరులు ఐక్యత, సమానత్వానికి కట్టుబడి ఉండాలన్నారు. ర్యాలీలో విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, స్వరూప, రాజ్కుమార్, కుమార్, రవి, యుగందర్, రాజేందర్, సురేష్ , శ్రీకాంత్, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఒడ్డున టేకు దుంగలు లభ్యం వెంకటాపురం(కె): మండల పరిధిలోని బెస్తగూడెం గ్రామ సమీపంలోని గోదావరి నది ఒడ్డున ఐదు టేకు దుంగలను అటవీశాఖ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వెంకటాపురం అటవీశాఖ అధికారి ముక్తార్ అహ్మద్ మాట్లాడుతూ.. బెస్తగూడెం గోదావరి నది ఒడ్డున ఐదు టేకు దుంగలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం వచ్చిందని తెలిపారు. సిబ్బందితో కలిసి గోదావరి నది ఒడ్డుకు వెళ్లి ఐదు టేకు దుంగలను స్వాధీనం చేసుకుని అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.45 వేల వరకు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది లాలు, బాబు, బేస్ క్యాంప్ సిబ్బంది ఉన్నారు. ఇంటిలో అరుదైన బ్యాండెడ్ క్రైట్ పాము ఏటూరునాగారం: అత్యంత విషపూరితమైన బ్యాండెడ్ క్రైట్ పామును స్థానిక అటవీశాఖ అధికారులు గురువారం రాత్రి పట్టుకున్నారు. మండల కేంద్రానికి చెందిన రాజు కొత్త ఇళ్లు నిర్మించుకోగా అందులో అరుదైన అత్యంత విషపూరితమైన పాము కనిపించింది. దీంతో స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వెంటనే ఎఫ్బీఓ దయానంద్, బేస్క్యాంప్ సిబ్బంది ఇంటిలో వెతకగా బ్యాండెడ్ క్రైట్ పాము అని, చాలా విషపూరితమైన పాము అని చెప్పడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ సిబ్బంది చాకచక్యంగా దానిని పట్టుకొని దట్టమైన అడవిలో వదిలేశారు. దీంతో చుట్టూ పక్కల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తారు వేసారా.. పూసారా? ఈఫొటోల్లోని రోడ్డుపై ఏదో పూసినట్టుగా కనిపిస్తుందా.. అయితే మీరు పొరబడినట్టే..! ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నది రోడ్డు మరమ్మతు.. అవును.. మీరు చదివింది నిజమే.. ఏటూరునాగారం మండలం కేంద్రంలోని 163 జాతీయ రహదారిపై గుంతలు ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పలు కథనాలు ప్రచురించాం. దీంతో స్పందించిన సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు శుక్రవారం ఇలా గుంతలు ఉన్నచోట అతుకులా తారు పూసి వదిలేశారు. మరమ్మతుల పేరుతో ౖపైపె మెరుగులు దిద్దడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. – ఏటూరునాగారం -
అణగారిన వర్గాలకు బీజేపీ వ్యతిరేకం
● రాష్ట్ర మంత్రి సీతక్క ● బీజేపీ తీరును ఖండిస్తూ జిల్లా కేంద్రంలో ర్యాలీములుగు: అణగారిన వర్గాలకు బీజేపీ వ్యతిరేకమని, ఉత్తరాఖండ్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న బహిరంగ సభ ప్రాంగణాన్ని శుద్ధి చేసిన బీజేపీ తీరుకు నిరసనగా ములుగులో శుక్రవారం రాత్రి మంత్రి సీతక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బీజేపీ ది మనువాద భావజాలం, అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా బీజేపీ భావజాలం పని చేస్తుందని ఆరోపించారు. ఇది మల్లికార్జున ఖర్గేకు జరిగిన అన్యాయం కాదని, దేశంలో 90 శాతం మంది అణగారిన వర్గాలకు జరిగిన అవమానమని పేర్కొన్నారు. 2002 వరకు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై జాతీయ జెండా ఎగురవేయలేదని, అలాంటి వారు ఇప్పుడు జాతీయవాద క్లాసులు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బీజేపీ తక్షణమే మల్లికార్జున ఖర్గేకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ బానోతు రవిచందర్, నాయకులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, చింతనిప్పుల భిక్షపతి, పల్లె జయపాల్రెడ్డి, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి
ములుగు రూరల్: స్వాతంత్య్ర సమరయోధుల తాగ్యాలను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ అన్నారు. ఈ మేరకు గురువారం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాకేంద్రంలో ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రారంభించిన తిరంగ్ ర్యాలీ కలెక్టరేట్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత దేశం పట్ల జాతీయతా భావం కలిగి ఉండాలన్నారు. విద్యతో పాటు దేశభక్తి, సేవాభావం, సామాజిక బాధ్యత అలవర్చుకోవాలన్నారు. ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. ఈ ర్యాలీలో విద్యార్థులు నినాదాలు చేయడంతో పాటు వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, నాయకులు చింతలపూడి భాస్కర్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణవేణి నాయక్, భూక్య జవహర్లాల్, రాజునాయక్, స్వరూప, కృష్ణాకర్, రవీందర్రెడ్డి, నరేష్, తేజరాజు, సునీల్, రాజ్కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ -
ట్రాక్టర్ డ్రైవర్ దారుణ హత్య
మంగపేట : మండలంలోని నర్సింహాసాగర్ పంచాయతీ పరిధిలో గొందిగూడెనికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ తాటి శశికుమార్ (32) దారుణ హత్యకు గురయ్యాడు.ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. శశికుమార్ రాంనగర్కు వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన గల ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి నిందితులు అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. గురువారం ఉదయం విషయం తెలిసిన వెంటనే ఏటూరునాగారం సీఐ సూర్యప్రకాశ్, ఎస్సై టీవీఆర్ సూరి సిబ్బందితో హత్య జరిగిన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్య జరిగిన ఇంట్లో మృతుడితో పాటు ఎవరెవరు ఉంటున్నారు, రాత్రి ఎవరెవరు ఉన్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఇంట్లో మృతుడితో పాటు మండలంలోని పూరేడుపల్లికి చెందిన కొప్పుల నర్సింహారావు, లక్ష్మి దంపతులు ఉంటున్నారు. హత్య జరిగిన రాత్రి కూడా వారే ఉన్నట్లు వెల్లడి కావడంతో ఇద్దరిని అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కొంతకాలంగా తన భార్యను వేధిస్తుండటంతో తామే హత్యచేసినట్లు నర్సింహారావు, లక్ష్మి దంపతులు ఒప్పుకున్నట్లు సమాచారం. ఎస్సై సూరిని వివరణ కోరగా మృతుడి భార్య రాధిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలి
● జిల్లా వైద్యాధికారి గోపాల్రావుములుగు రూరల్: జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని వందశాతం చేరుకోవాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. ఈ మేరకు గురువారం వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. పీహెచ్సీల్లో నెలవారీగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. వర్షాకాలంలో వచ్చే మలేరియా, డెంగీ వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతీ ఇంటిని సర్వే చేసి దోమల లార్వా నియంత్రణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జ్వర పీడితులకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 14ఏళ్లు నిండిన విద్యార్థులకు హెచ్పీవీ వ్యాక్సిన్పై అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ చేయాలన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో గర్భిణుల వివరాలు 12 వారాల్లోపు నమోదు చేయాలన్నారు. రక్తహీనత ఉన్న వారికి ఐరన్ పాలిక్ మాత్రలను అందించాలని తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతి, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, రవితేజ, నాగఅన్వేష్, మాస్ మీడియా అధికారి సంపత్, దుర్గారావు, వెంకట్రెడ్డి, భూపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ములుగు: మహిళల ఆర్థికాభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ తెలంగాణ ఆధ్వర్యంలో బిట్స్పిలానీ హైదరాబాద్కు చెందిన టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ సహకారంతో శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమైతేనే కుటుంబం బాగుపడుతుందని అలాగే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళల సామర్థ్యంపై సీఎం రేవంత్రెడ్డికి అపారమైన నమ్మకం ఉందని వివరించారు. అందుకే మహిళా సంఘాలకు వివిధ వ్యాపార, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ వారిని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నారని వివరించారు. వడ్డీలేని రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు మహిళా సంఘాలు తీసుకున్న రుణాలపై వడ్డీని ప్రభుత్వం క్రమం తప్పకుండా చెల్లిస్తోందని వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు రూ.13 కోట్ల వడ్డీ మొత్తాన్ని మహిళలకు తిరిగి చెల్లించినట్లు వెల్లడించారు. మహిళలు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంత వ్యాపారాలను ఏర్పాటు చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. తద్వారా మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. బిట్స్ పిలానీ సహకారంతో అందించే శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మేడారం సమ్మక్క–సారలమ్మ, రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సు, బొగత జలపాతం, గోదావరి తీరం, దట్టమైన అడవులతో జిల్లా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సుమారు రూ.1.50కోట్లతో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, డీఆర్డీఓ రవీందర్, బిట్స్ పిలానీ ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ మేనేజర్ నవీన్ కృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, ములుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కె.అనూష తదితరులు పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తిచేయాలి ఈనెల 16న సీఎం జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పైలాన్ నిర్మాణ పనుల పురోగతిని, నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని కలెక్టర్ హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క విలేకర్లతో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి 16న ములుగు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో మేడారం చేరుకుని వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తదితర వివరాలను వెల్లడించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
ఏటూరునాగారం: వేటగాళ్ల విద్యుత్ ఉచ్చులకు బలైన నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఏటూరునాగారం సౌత్ రేంజ్ అధికారి అబ్ధుల్ రెహమాన్, నార్త్ ఎఫ్ఆర్ఓ అశోక్, ఎస్ఎస్తాడ్వాయి ఎఫ్ఆర్ఓ రమేశ్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలో ముందుగా విద్యుత్ ఉచ్చులకు బలైన అధికారి నవీన్ మృతికి నివాళులర్పించారు. అనంతరం వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి ఏటూరునాగారం డివిజన్లో పరిధిలోని అటవీశాఖ అధికారులు అటవీశాఖ కార్యాలయం నుంచి కూరగాయల మార్కెట్ వరకు బైక్ ర్యాలీ, నిరసనలు చేపట్టారు. అనంతరం బస్టాండ్ వద్ద ఎఫ్ఆర్ఓలు మాట్లాడుతూ బూర్గంపాడు మండలం నకిరిపేట సమీపంలో గల అడవిలో జంతువుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చు తగిలి చెరువు సింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ చనిపోయారని తెలిపారు. అతని మరణానికి కారణమైన వేటగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏటూరునాగారం, వెంకటాపురం డివిజన్ జూనియర్ ఫారెస్టు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్, మంగపేట ఇన్చార్జ్ హుస్సేన్, జూనియర్ ఫారెస్టు ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు నారాయణ, శేషు, ఏటూరునాగారం దక్షిణం, ఏటూరునాగారం ఉత్తరం, తాడ్వాయి, మంగపేట, వెంకటాపురం(కె), వాజేడు, దూలపురం రేంజ్లకు చెందిన డిప్యూటీ ఎఫ్ఆర్ఓలు, సెక్షన్, బీట్ ఆఫీసర్లు, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. -
96 మిల్లులు.. 73,809 టన్నులు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లాలో కలకలంరేపుతున్నాయి. ఉమ్మడి వరంగల్లో కోట్లాది రూపాయల విలువైన సర్కారు ధాన్యం కొందరు రైసుమిల్లర్ల జేబుల్లోకి వెళ్లింది. రైతుల నుంచి కొనుగోలు చేసి మిల్లింగ్ కోసం కేటాయించగా, వాటిని పక్కదారి పట్టించి ఆ డబ్బుతో కొందరు జల్సాలు చేస్తున్నారు. మరికొందరు బినామీ పేర్ల మీద బంగళాలు, కార్లు, భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల సీఎంఆర్ ఎగవేసి తిరుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మంత్రులు, పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. కఠిన నిర్ణయాలు తీసుకుని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం డిఫాల్టర్లు, వారికి సహకరిస్తున్న అధికారుల్లో గుబులు మొదలైంది. ఆరు జిల్లాల్లో రూ.166 కోట్లు.. మహబూబాబాద్లో అత్యధికం.. ఆరు జిల్లాలకు చెందిన కొందరు రైసుమిల్లర్లు గత వానాకాలం సీజన్ నాటికే రూ.348 కోట్లకు పైగా ధాన్యం బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం. 2022–23 రబీ సీజన్కు సంబంధించి ఆరు జిల్లాల్లో గురువారం నాటికి 96 రైస్మిల్లుల నుంచి 73,809 మెట్రిక్ టన్నుల ధాన్యం విలువకు సమానమైన రూ.166.30 కోట్ల రికవరీ ఇంకా పెండింగ్లో ఉంది. బకాయిల్లో మహబూబాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. తర్వాత వరంగల్ జిల్లా ఉంది. డిఫాల్టర్లకూ సీఎంఆర్..?.. ఇలాగైతే బాకీ తీరేదెప్పుడు? 2022–23 రబీ సీజన్కు సంబంధించిన సీఎంఆర్ బకాయిలు ఇంతవరకు పూర్తిగా రికవరీ కాకపోవడం గమనార్హం. ఆ జాబితాలో ఉన్న కొందరికీ ఆ తర్వాత సీజన్లలో కూడా సీఎంఆర్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పటికే కోట్లాది రూపాయలు ఎగవేసిన మిల్లర్లను డిఫాల్టర్లుగా చూపకుండా ఎలా ఇస్తారు? అన్న చర్చ కొందరు రైసుమిల్లర్లలోనే సాగుతోంది. ఉన్నతాధికారులు అడిగినప్పుడు బకాయిల వివరాలే చూపుతున్న స్థానిక అధికారులు.. డిఫాల్టర్ల జాబితా, సీఎంఆర్ కేటాయింపులు గోప్యంగా ఉంచుతున్నారన్న చర్చ కూడా ఉంది. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి తాజా ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికై నా బకాయి ఉన్న 96 మిల్లుల నుంచి ధాన్యం లేదా దాని విలువను పూర్తిస్థాయిలో రికవరీ చేయాల్సి ఉంది.ధాన్యం (మెట్రిక్ టన్నులు)మొత్తం మిల్లులుచెల్లించిన మిల్లులుఇప్పటికీ సరఫరా అయినది (మె.టన్నులు)బకాయి ధాన్యం (మె.టన్నులు)సీఎంఆర్ ఇచ్చిన ధాన్యం (మె.టన్నులు)ఉమ్మడి వరంగల్లో సీఎంఆర్ బకాయి లెక్క ఇదీ.. సీఎంఆర్ బకాయిల కొండ... ఆరు జిల్లాల్లో రూ.348 కోట్లపైనే 2022–23 రబీ సీజన్ బకాయిలే భారీగా.. మహబూబాబాద్లో అత్యధికం ఆ తర్వాత వరంగల్, హనుమకొండ జిల్లాలు... రైస్మిల్లర్ల నుంచి రావాల్సిన బకాయిలపై సీరియస్గా ఉండాలి. భవిష్యత్లో వారికి సీఎంఆర్ ఇవ్వొద్దు. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించినా, సీఎంఆర్ అప్పగించకపోయినా కఠిన చర్యలు తీసుకోవాలి. బకాయిలపై పక్కా లెక్కలు తేల్చాలి. బకాయిదారులనుంచి ధాన్యం లేదా దాని విలువను పూర్తిగా రికవరీ చేయని వారిపై చర్యలు ఉంటాయి. సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి1,11,634బకాయి 73,80937,825216120(55.56%)జిల్లా సీఎంఆర్గా మొత్తం బకాయి బకాయి బకాయి ఇచ్చిన ధాన్యం మిల్లులు ధాన్యం మిల్లులు విలువ (మె.టన్నులు) (మె.టన్నులు) (రూ.కోట్లలో..) హనుమకొండ 13,015 34 8,683 12 19.42 వరంగల్ 32,425 67 21,512 27 48.54 జనగామ 4,429 45 3,258 27 7.49 జేఎస్ భూపాలపల్లి 15,900 20 4,204 5 9.59 మహబూబాబాద్ 40,758 25 33,309 12 74.90 ములుగు 5,107 25 2,843 13 6.36 -
రామప్ప దేవాలయం అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయం అద్భుతంగా ఉందని పలువురు పర్యాటకులు కొనియాడారు. ఈ మేరకు గురువారం సినీనటుడు అప్పాజీ అంబరీష దర్బా, ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దిల్బాగ్సింగ్ వేర్వేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు ఆయనకి స్వాగతం పలికారు. రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వారికి వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. అనంతరం అప్పాజీ అంబరీష శ్రీమంతుడు, కిక్, జవాన్, ఇదం జగత్, శుభలేఖలు, మను, పడిపడి లేచే మనస్సు, హుషారు తదితర సినిమాల్లో నటించారు. వారి వెంట టూరిస్ట్ పోలీసు భద్రు, శ్రీకాంత్, దేవాదాయ, పురావస్తు టూరిజం శాఖల సిబ్బంది ఉన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి ఏటూరునాగారం: గొత్తికోయల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా ఆత్మకమిటీ చైర్మన్ చిటమట రఘు అన్నారు. మండల కేంద్రంలో అటవీశాఖ కార్యాలయంలో తాడ్వాయి రేంజర్ రమేశ్, డీఆర్ఓ కృష్ణవేణితో కలిసి రఘు గొత్తికోయలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోత్తికోయలు ఎదుర్కొంటున్న సమస్యలను ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు చేల వినయ్, పీఏసీఎస్ డైరెక్టర్ వంగపండ్ల రవి పాల్గొన్నారు. విషజ్వరంతో బాలుడి మృతి ఏటూరునాగారం : మండలంలోని శంకరాజుపల్లికి చెందిన బాలుడు ఆత్కూరి సందీప్ (16) విషజ్వరంతో మృతిచెందాడు. వారం రోజుల నుంచి సందీప్ జ్వరంతో బాధపడుతుండగా స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. జ్వరం రావడంతో ప్లేట్లెట్స్ తగ్గి మరణించినట్లు స్థానికులు తెలిపారు. సందీప్ మృతి చెందడంతో సర్పంచ్ దేవులపల్లి విజయ్కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. -
విద్యార్థుల చెంతకు సమాచారం..
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ తన ప్రత్యేకతను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటోంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రత్యేకంగా విద్యార్థుల చెంతకు సమాచారం అందజేసేందుకు కొత్తగా రెండు డిజిటల్ ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు. సాధారణంగా అధికారులు తన అఫీషియల్ పోర్టల్ అయిన వెబ్సైట్, ఇన్స్ర్ట్రాగాంలో కళాశాల ప్రాధాన్యత కలిగిన సమాచారం పొందుపరుస్తుంటారు. ప్రతిరోజూ విద్యార్థులు ఆ వెబ్సైట్, ఇన్స్ట్రాగాంను ఓపెన్ చేయడం కుదరకపోవడంతో కీలక సమాచారం మిస్సవుతున్నారు. ఆ చిన్న సమాచారం తెలి యాలన్న ఉద్దేశంతో క్యాంపస్లో రెండు డిజిటల్ ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఎల్ఈడీ బోర్డులు తాజా సమాచారాన్ని తెలియజేస్తుంటాయి. అదే విధంగా విద్యార్థులకు ఇంటర్న్షిప్, పేపర్ ప్రజంటేషన్,పే టెంట్ హక్కులు సాధించిన వారి వివరాలతోపాటు క్యాంపస్లో చోటుచేసుకునే వివరాలను తెలుసుకునేందుకు కేరాఫ్గా డిజిటల్ ఎల్ఈడీ సమాచారం నిలుస్తోంది. విద్యార్ధుల చెంతకు... నిట్ వరంగల్లో బీటెక్, ఎంటెక్, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు సుమారు 6,500 మంది విద్యనభ్యసిస్తున్నారు. కాలి నడకన, సైక్లింగ్లో కళాశాల తరగతి గదులు, ల్యాబ్స్, ఆడిటోరియం, హాస్టల్స్, కెఫెలకు వెళ్తుంటారు. ఇక్కడికి మెయిన్ బిల్డింగ్, కలాం గెస్ట్హౌజ్ వద్దనుంచి వెళ్లాల్సి ఉంటుండడంతో ఆ డిజిటల్ బోర్డుల్లో ప్లే అవుతున్న సమాచారాన్ని ఆసక్తిగా తిలకిస్తూ తమకు అవసరమైన వాటిని నోట్ చేసుకుంటున్నారు. నిట్లో కొత్తగా డిజిటల్ ఎల్ఈడీల ఏర్పాటు.. ఆసక్తిగా తిలకిస్తూ సమాచారం తెలుసుకుంటున్న విద్యార్థులు -
ఐక్యత భావమే..దేశానికి రక్షణ
● ఘనంగా హర్ ఘర్ తిరంగా..భూపాలపల్లి రూరల్: ఐక్యత భావమే.. దేశానికి రక్షణ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి ఘనంగా హర్ ఘర్ తిరంగా.. ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజలందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. దేశం ఐక్యంగా ఉంటే భారతదేశాన్ని ప్రపంచంలో ఎవరు కూడా ఓడించలేరన్నారు. ప్రతిఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నిశిధర్రెడ్డి, కౌన్సిలర్ యుగేందర్, పార్టీ నాయకులు, యువకులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
గౌరవవేతనం చెల్లింపులో గందరగోళం
ములుగు రూరల్: మేడారం మహాజాతరలో భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించే సమయంలో ప్రమాదాలకు గురికాకుండా హెచ్చరికలు చేస్తూ, భక్తులకు రక్షణగా ఉంటూ గజ ఈతగాళ్లు సేవలందించారు. సుమారు ఆరు రోజుల పాటు భక్తులకు సేవలందించిన వారికి మత్స్యశాఖ అధికారులు ఒక్కొక్కరికి రోజుకు గౌరవ వేతనం రూ.వెయ్యి చెల్లించాల్సి ఉండగా చెల్లించడంలో గందరగోళం సృష్టిసున్నారు. జాతర సమయంలో విధులు నిర్వర్తించిన మత్స్యశాఖ అధికారి సాల్మన్రాజ్, ఎఫ్ఎఫ్ఓ రమేశ్లు జిల్లాలోని 64 మత్స్యశాఖ సొసైటీల నుంచి 180 మంది గజఈతగాళ్లను కేటాయించారు. వీరికి భోజన వసతి, లైవ్ జాకెట్లు, టార్చ్లు, ట్యూబ్ వంటి సామగ్రిని అందించారు. రూ.18.89 లక్షల నిధుల విడుదల ఇటీవల జిల్లా మత్స్యశాఖ అధికారి పదవీ విరమణ పొందగా, ఇన్చార్జ్ డీఎఫ్ఓను నియమించారు. ఎఫ్ఎఫ్ఓ రమేశ్ ట్రాన్స్ఫర్ అయినప్పటికీ రిలీవ్ కాకుండా జాతర నిధుల్లో నుంచి కొంతమేర డబ్బులు విత్ డ్రా చేసినట్లు సమాచారం. ఈ విషయంపై ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నివేదికలు అందించారు. ఇన్చార్జ్ డీఎఫ్ఓ విధులు నిర్వర్తించడంలేదని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో ఆయన స్థానంలో రజినిని ఇన్చార్జ్ డీఎఫ్ఓగా నియమించారు. మేడారం జాతర నిధులు రూ.18.89లక్షలు విడుదల కావడంతో జాతర సమయంలో విధులు నిర్వర్తించిన గజ ఈతగాళ్లు కార్యాలయనికి వచ్చి డబ్బులను తీసుకోవాలని తెలియజేశారు. మత్స్యకారులు కార్యాలయానికి వచ్చిన అనంతరం ఆరు రోజులు విధులు నిర్వహిస్తే ఐదు రోజులకు మాత్రమే ఒక్కొక్కరికి రూ.5వేల గౌరవ వేతనం చెల్లించినట్లు తెలిపారు. ప్రశ్నిస్తే మస్టర్లో సంతకాలు నాలుగు రోజులకే ఉన్నాయని కానీ ఐదు రోజులకు చెల్లిస్తున్నానని సమాధానం చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. మేడారం మహాజాతరలో జంపన్నవాగు వద్ద ఆరు రోజులు విధులు నిర్వర్తించిన గజ ఈతగాళ్లు ఐదు రోజులకే డబ్బులు చెల్లిస్తున్న మత్స్యశాఖ అధికారులు -
సోలార్ సిస్టం పనుల పరిశీలన
వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లిలో నిర్మించ తలపెట్టిన 100కేవీ సోలార్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం(బీఈఎస్ఎస్) పనులను టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ మేరకు చీకుపల్లిలో పైలెట్ ప్రాజెక్ట్ కింద బీఈఎస్ఎస్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు పనులకు సంబంధించిన మెటీరియల్ను మూడు రోజు లుగా చేరవేస్తుండటంతో సీఎండి అక్కడికి చేరుకుని పనులపై ఆరా తీశారు. అనంతరం వెంకటాపురం(కె) నుంచి ధర్మవరం వరకు నిర్మిస్తున్న 33 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్ పనులు, చెరుకూరు నుంచి ధర్మవరం వరకు అటవీ ప్రాంతంలో ఉన్న పాత 33 కేవీ లైన్ స్థానంలో కవర్డ్ కండక్టర్తో చేపట్టిన పనులను పరిశీలించారు. వాజేడు సెక్షన్ ఫీల్డ్ సిబ్బంది, ఎమర్జెన్సీ బ్రేక్ డౌన్ సిబ్బందితో మాట్లాడి పలు వివరాలను తెలుసుకున్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండటంతో పాటు సేఫ్టీ పరికరాలను సక్రమంగా ఉపయోగించాలని సూచించారు. ఆయన వెంట ఎస్ఈ భిక్షపతి, డీఈలు సదానందం, పురుషోత్తం ఉన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన ములుగు: జిల్లా కేంద్రంలో సీఎం పర్యటన ఏర్పాటు పనులను టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈనెల 16వ తేదీ సీఎం రేవంత్రెడ్డి ములుగు పర్యటనలో భాగంగా విద్యుత్ శాఖకు సంబంధించిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ ఆఫీస్ కాంప్లెక్స్, గట్టమ్మ సబ్స్టేషన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎస్ఈ భిక్షపతి, డీఈ సదానందం, ఈఈ వెంకటరాం, ఏడీఈ వేణుగోపాల్, ఏఈలు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ములుగు/ఎస్ఎస్తాడ్వాయి: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ బుధవారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెలిపాడ్ పనులు, బారికేడ్లు, వీవీఐపీ వేచి ఉండే టెంట్, భద్రతా ఏర్పాట్లతో పాటు పైలాన్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. అధికారులు ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పైలాన్ నిర్మాణంతో పాటు ఇతర పనులను గడువులోగా పూర్తి చేసి, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. గట్టమ్మ దేవాలయ పరిసరాల పరిశుభ్రత, సుందరీకరణ, వాహనాల పార్కింగ్ స్థలాలతో పాటు తదితర అంశాలను సమీక్షించారు. అనంతరం నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని పరిశీలించారు. కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న పైలాన్ పనుల పురోగతిని పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే తాడ్వాయి మండల పరిధిలోని మేడారంలో సీఎం పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఆరా తీశారు. హెలిపాడ్, కమాండ్ కంట్రోల్ రూమ్, ఆలయ పరిసరాల్లో చేస్తున్న పనులను కలెక్టర్ సహదేవరావు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి వెళ్లి పరిశీలించారు. సీఎం గిరిజన సంప్రదాయాల ప్రకారం వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నందున ఆశీర్వచనాలు, శేషవస్త్రాల సమర్పణ, మొక్కులు చెల్లింపు తదితర కార్యక్రమాల్లో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గార్డెనింగ్, ల్యాండ్స్కేపింగ్తో పరిసరాలను సుందరీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, డీఎస్పీ రవీందర్, మేడారం ఆలయ ఈఓ వీరస్వామి, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు -
రికార్డుల మేరకు చెల్లిస్తున్నాం..
మేడారం జాతరలో విధులు నిర్వర్తించిన వారికి రికార్డుల మేరకు డబ్బులను చెల్లిస్తున్నాం. నాలుగు రోజులు మాత్రమే విధుల్లో ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. ఆరు రోజులు విధులు చేపట్టినట్లు తెలుపగా జాతర సమయంలో విధుల్లో ఉన్న అధికారులను ఫోన్లో సంప్రదించి విషయం తెలుసుకున్నాను. వారు 5 రోజులు విధుల్లో ఉన్నారని తెలుపగా డబ్బులు చెల్లిస్తున్నాం. ఆరు రోజులు విధుల్లో ఉన్నట్లు నిర్ధారణ అయితే తిరిగి డబ్బులు చెల్లిస్తాం.ఆరు రోజుల వేతనం చెల్లించాలి మేడారం జాతరలో గజ ఈతగాళ్లు ఆరు రోజుల పాటు విధులు నిర్వర్తించారు. ఐదు రోజులకు మాత్రమే డబ్బులు చెల్లించడంతో నష్టపోతున్నారు. గతంలో విధులు నిర్వర్తించిన ఎఫ్ఎఫ్ఓ హాజరు మస్టర్లలో సంతకాలను ఐదు రోజులకు మాత్రమే తీసుకున్నారు. జాతర అనంతరం సుమారు 25 మంది వరకు తిరుగు వారం వరకు విధులు నిర్వర్తించారు. అందుకు సంబంధించిన డబ్బులను సైతం అందించాలి.●– సాద శంకర్, మత్స్యశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు – రజిని, జిల్లా మత్స్యశాఖ ఇన్చార్జ్ అధికారి -
ఆశ్రమ పాఠశాల తనిఖీ
ఎస్ఎస్ తాడ్వాయి: మండల పరిధిలోని ఊరట్టం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను బుధవారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో తనిఖీ చేశారు. పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించి విద్యార్థులకు స్పార్క్ ట్రైనింగ్పై అందుతున్న శిక్షణ వివరాలను ఇన్స్ట్రక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, రీడింగ్ హాల్ను పరిశీలించి విద్యార్థుల వినియోగంపై ఆరా తీశారు. స్కూల్ లెడ్ క్లబ్లు నిరంతరం నిర్వహించాలని, డిజిటల్ బ్లాక్ బోర్డులను సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి అన్ని సబ్జెక్టుల్లో పట్టుసాధించి మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కల్తీ శ్రీనివాస్, డిప్యూటీ వార్డెన్ అరుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి
రేగొండ: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించి, వారికి సైన్స్పై ఆసక్తి పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా సైన్స్ అధికారి స్వామి కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్, ఇన్స్పైర్ అవార్డు ఆన్లైన్, ఖాన్ అకాడమీ బుక్ ఆఫ్ డిజిటల్ లర్నింగ్ తదితర అంశాలపై ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పరిశోధన విధానాన్ని పెంపొందించాలన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఎన్నుకుని విద్యార్థులచే ప్రాజెక్ట్ తయారు చేయించి జిల్లా స్థాయి నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్లో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు దేవేందర్, ఆర్పీలు ప్రవీణ్, సుమన్, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎంజీఎంలో వైద్యసేవలపై కలెక్టర్ ఆరా కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని బుధవారం కలెక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వార్డుల్లో రోగులకు అందుతున్న సేవలు, మీడియాలో వచ్చిన కథనాలపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముందుగా.. ఆమె ఎంఏసీ, క్యాజువాలిటీతోపాటు డైట్ సెంటర్ను పరిశీలించారు. ఈసందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఎంఏసీ వద్ద ఓ రోగి బయట పడుకున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన దాని గురించి అడిగి అధికారులనుంచి వివరణ తీసుకున్నారు. ఓ సెక్యూరిటీ గార్డు డబ్బులు తీసుకుంటున్నట్లు వచ్చిన మీడియా కథనంపై ఆరా తీశారు. తమ పేషెంట్ను ఎంఏసీ వార్డులో అడ్మిట్ చేసుకోవడం లేదని, తమ యూనిట్ కాదని చెబుతున్నారని రోగి బంధువులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. క్యాజువాలిటీకి వెళ్లి వైద్య సేవల విషయంలో ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారని డ్యూటీ డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పేషెంట్ అటెండెంట్ కలెక్టర్కు తమ సమస్యలు విన్నవించారు. దీంతో ఆమె వార్డుల్లోకి వెళ్లి స్వయంగా రోగులకు అందుతున్న వైద్య సేవల తీరును తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని కంప్లైంట్ బాక్స్ పరిశీలించారు. అనంతరం రోగులకు ఆహారాన్ని అందించే డైట్ను ఆమె ప్రత్యేకంగా పరిశీలించారు. అంతకుముందు అకడమిక్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ వెంట ఎంజీఎం సూపరింటెండెంట్ రాంకుమార్రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ అశ్విని, నర్సింగ్ సూపరింటెండెంట్ దయాశీల, పలువురు వైద్యులు ఉన్నారు. రోగులకు పరీక్షే కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సాధారణంగా చేయించుకునే బ్లడ్ గ్రూపింగ్ టెస్ట్ లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. అత్యసవర విభాగంతో పాటు సెంట్రల్ ల్యాబ్లో కూడా ఈ పరీక్ష అందుబాటులో లేకపోవడంతో పేషెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు సర్జరీ చేయాలన్నా, రక్తం ఎక్కించాలన్నా బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం ముఖ్యం. ఈ గ్రూపు తెలుసుకోవడానికి అవసరమైన సిరాస్ లేకపోవడం వల్ల టెస్ట్లు చేయడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఒక పేషెంట్ ఏ రక్త గ్రూపునకు సంబంధించిన వారో తెలుసుకోవడానికి యాంటీ ఏ, యాంటీ బి, యాంటీ ఓ అందుబాటులో ఉండాలి. ఇందులో ఏమీ లేకపోవడంతో పేషెంట్లు ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. అయితే ప్రైవేట్గా తీసుకొచ్చిన బ్లడ్ గ్రూప్ రిపోర్ట్ను వైద్యులు అంగీకరించడం లేదని పేషెంట్లు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. అత్యవసరంగా సర్జరీ చేయాలంటే బ్లడ్ గ్రూప్ లేకుంటే సర్జరీలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు ఈ పరీక్షలపై ప్రత్యేక చొరవ చూపాలని, అడ్వాన్స్గా కెమికల్స్ ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
ఐటీడీఏ ముట్టడిని జయప్రదం చేయాలి
వెంకటాపురం(కె): ఆదివాసీ చట్టాలను అమలు చేయాలని తుడందెబ్బ జాతీయ ఉపాధ్యక్షుడు యాసం రాజు అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో మంగళవారం గోండ్వానా సంక్షేమ పరిషత్, ఆదివాసీ నవనిర్మాణ సేన, తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం, తుడుం దెబ్బ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 17న తలపెట్టిన చలో ఐటీడీఏ ముట్టడి వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ చట్టాలైన 1/70 యాక్ట్, జీఓ నంబర్ 3ను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కు చట్టాలను అధికారులు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రవన్కుమార్, సర్వేశ్వర్రావు, చిరంజీవి, భిక్షపతి, నరసింహమూర్తి, సాయి, రాంచందర్, సమ్మయ్య, సూర్యం తదితరులు పాల్గొన్నారు. వరంగల్ లీగల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) విద్యార్థిని ప్రీతి హత్య కేసు విచారణ హనుమకొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రారంభమైంది. కేసు విచారణ షెడ్యూల్ మంగళవారం నుంచి ఐదు మాసాల వరకు నిర్ణయించారు. మొత్తం 99మంది సాక్షులను విచారించనున్నారు. మొదటి రోజు మృతురాలి తండ్రిని విచారించారు. 2023లో మృతి చెందిన మెడికో ప్రీతి హత్య విషయమై నాడు పీజీ విద్యార్థి అయిన మహ్మద్ షఫీని నిందితుడిగా భావించి కాలేజీ నుంచి తొలగించిన విషయం విదితమే. విచారణను ఎస్సీ, ఎస్టీ కోర్డు జడ్జి పద్మజ బుధవారానికి వాయిదా వేశారు. విద్యారణ్యపురి: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా పోరాటాలు చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు టి.లింగారెడ్డి, నన్నబోయిన తిరుపతి తెలిపారు. హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హనుమకొండ, వరంగల్ జిల్లాల యూఎస్సీఎస్ శాఖల దశలవారీ పోరాటాల సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 12, 13 తేదీల్లో అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద, 19న జిల్లాకేంద్రంలో ధర్నాలు, 29న హైదరాబాద్లో మహాధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పీఆర్సీని 2023నుంచి అమలు చేయాలని, సీపీస్ను రద్దుచేసి పాత పెన్షన్ను పునరుద్ధరించాలని డిమాండ్లతో ఆందోళలు చేపడతామని పేర్కొన్నారు. కమిటీ రాష్ట్ర బాధ్యులు రావుల రమేష్, ఎ.శ్రీనివాస్రెడ్డి, జిల్లాల బాధ్యులు పెండెం రాజు, గొడిశాల సత్యనారాయణ, జి. ఉప్పలయ్య, కె.శ్రీనివాస్, బైరి స్వామి, భీమళ్ల సారయ్య, శ్రీనివాస్, డి.శ్రీరామ్, సూరయ్య, ఎ.మల్లయ్య, ఆర్.రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రూ.5కోట్లు మంజూరు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం చండ్రుపల్లి–నాగేపల్లి గ్రామాల నడుమ వాగుపై ప్రతీ వర్షకాలంలో లో లెవల్ వంతెనతో వరదనీరు చేరి ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యం చండ్రుపల్లి వద్ద హై లెవల్ వంతెన నిర్మాణం కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హ్యామ్ నిధులు నుంచి రూ.5కోట్లు ఆర్అండ్బీ శాఖకు మంజూరు చేశారు. త్వరలో టెండర్ పూర్తయి నిర్మాణం జరుగుతుందని సోమవారం కాటారం పర్యటనలో మంత్రి పేర్కొన్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుల ఆహ్వానం విద్యారణ్యపురి: హనుమకొండలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో హిందీ, పీఈటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ గిరిరాజ్గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 12నుంచి 18వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటలవరకు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. -
సర్ 100 శాతం పూర్తి
ములుగు: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో భాగంగా ములుగు నియోజకవర్గంలో ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 25 నుంచి 30వ తేదీ వరకు ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం జూలై 1 నుంచి ఆగష్టు 10వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి వెళ్లి ఫారాలను అందజేశారని వివరించారు. ములుగు నియోజకవర్గంలో మొత్తం 2,36,970 మంది ఓటర్లు ఉండగా వారిలో 2,09,128 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేసినట్లు వెల్లడించారు. ఇది మొత్తం ఓటర్లలో 88.25 శాతంగా ఉందని తెలిపారు. మిగిలిన 27,842 మంది ఓటర్లను ఆన్కలెక్టబుల్గా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరిలో 8,354 మంది మరణించారని, 4,015 మంది డబుల్ ఎంట్రీలు ఉన్నాయని పేర్కొన్నారు. 14,207 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినట్లు, 1,219 మంది ఆచూకీ లభించని వారు ఉన్నట్లు వెల్లడించారు. డిజిటలైజేషన్ పూర్తయిన 88.25 శాతం, వివిధ కారణాలతో ఆన్కలెక్టబుల్గా గుర్తించిన 11.75 శాతం కలిపి జిల్లాలో నూటికి నూరుశాతం సర్ ప్రక్రియ పూర్తయిందని వివరించారు. ఈ ప్రక్రియను విజయవంతం చేసిన ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లు, బీఎల్ఓలను కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు -
విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
ములుగు రూరల్: విద్యార్థులు లక్ష్యంతో చదువుతూ ముందుకు సాగాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం అన్నారు. ఈ మేరకు మంగళవారం బండారుపల్లి పీఎంశ్రీ మోడల్ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సమయం వృథా చేయకుండా ప్రణాళికతో చదవాలన్నారు. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే సేవాగుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. శ్రద్ధతో చదివి ఉన్నతస్థాయికి చేరుకుని ఉపాధ్యాయులకు, తల్లి దండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వందన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం -
ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి
ములుగు రూరల్: దేశభక్తి స్ఫూర్తితో ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ నాయకులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో జాతీయ జెండాను ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ నెల 13న ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలో తిరంగ్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ జెండా మనదేశ గౌరవం, ఐక్యతకు ప్రతీక అని వివరించారు. హర్ ఘర్ తిరంగ్ భారతీయుల్లో దేశభక్తి భావం పెంపొందిస్తుందని వెల్లడించారు. జాతీయ జెండాలకు ఇంటింటికీ అందించే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే తిరంగ్ ర్యాలీకి విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూక్య జవహర్లాల్, రవీంద్రచారి, వెంకట్, నగరపు రమేశ్, రాజునాయక్, కృష్ణాకర్, రాయంచు నాగరాజు, కుమార్, శ్రీకాంత్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం -
‘కాళోజీ’ రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వెంకటేశ్వర్లు
కాశిబుగ్గ: వరంగల్ కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా డాక్టర్ జాటోతు వెంకటేశ్వర్లు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న డాక్టర్ వెంకటేశ్వర్లును ఫారెన్ సర్వీసు కింద డిప్యూటేషన్పై రిజిస్ట్రార్గా మూడేళ్లపాటు పనిచేయడానికి ప్రభుత్వం ఇటీవల నియమించింది. కాళోజీ హెల్త్వర్సిటీలో ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా పనిచేసిన డాక్టర్ నాగార్జున రెడ్డి జాయింట్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహించనున్నారు. కాగా, డాక్టర్ వెంకటేశ్వర్లును కాశోజీ వీసీ డాక్టర్ రమేష్రెడ్డి, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జునరెడ్డి సన్మానించారు. -
పాత పోడు భూముల్లోనే పంటలు సాగుచేసుకోవాలి
మంగపేట: గొత్తికోయ గిరిజనులు పాత పోడు భూములు మాత్రమే పంటలు సాగుచేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య అన్నారు. ఈ మేరకు మంగళవారం మండల పరిధిలోని తక్కెళ్లగూడెం, ముసలమ్మతోగు ప్రాంతాల్లోని పోడు సమస్యపై గొత్తికోయ గిరిజనులతో అటవీశాఖ అధికారులు, ఎస్సై టీవీఆర్ సూరి సమక్షంలో యానయ్య చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. ఎన్నో ఏళ్లుగా పోడు భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజన రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు, రైతులు సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. పాత పోడు భూముల్లో మాత్రమే పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. అదే విధంగా అటవీశాఖ అధికారులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దని, సాగుచేసుకుంటున్న భూముల్లో ట్రెంచ్ కొట్టి రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. అధికారులు రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. రైతులు, అటవీశాఖ అధికారులు ప్రశాంత వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవాలని యానయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ దోమెడ సెక్షన్ డీఆర్ఓ అప్సరున్నీసా, ఎఫ్ఆర్ఓ నర్సింగరావు, బీట్ ఆఫీసర్లు, గిరిజన రైతులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి యానయ్య -
వదలరు.. కదలరు!
కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ‘ఔట్సోర్సింగ్’ హ వాకాశిబుగ్గ: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ఆవరణలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యసేవల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అవసరం ఉన్న చోట విధులు నిర్వర్తించాల్సిన ఔట్సోర్సింగ్ సిబ్బంది ఇష్టానుసారంగా పనిచేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పరిఽధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేయాల్సి ఉంది. వైద్యసిబ్బంది సైతం ఎక్కడ వైద్యసేవలు అవసరం ఉంటే అక్కడికి వెళ్లక తప్పదు. అయితే, సూపర్ స్పెషాలిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది తీరే వేరుగా ఉంది. చివరకు వారు అధికారుల ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఎంజీఎంకు అనుబంధంగా హాస్పిటల్.. వరంగల్ ఎంజీఎంకు అనుబంధంగా పీఎంఎస్ఎస్వై పఽథకం కింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను వరంగల్ కాకతీయ వైద్యకళాశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. ఎంజీఎంలో అందిస్తున్న వైద్యసేవలతోపాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రత్యేకంగా సూపర్ సేవలు అందిస్తోంది. ఇందులో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బంది కూడా ఈ రెండు హాస్పిటల్స్లో అధికారుల ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించాల్సి ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది తీరు వేరే అన్నట్లు తాము ఇక్కడే పనిచేస్తామంటూ కొందరు సిబ్బంది పట్టుబడుతున్నట్లు సమాచారం. వైద్యసిబ్బంది తీరు ఇలా.. సూపర్ స్పెషాలిటీలో ఎక్కువ మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. చివరకు ఎక్కువ మంది వైద్యులు కూడా కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్నారు. 120 మంది స్టాఫ్నర్సులు ఉండగా.. ఇటీవల 20 మంది వరకు ఉద్యోగాలు వచ్చి రాజీనామా చేసి వెళ్లారు. ఐదారుగురు మూడు నెలల నుంచి రాకుండా ఉంటున్నట్లు తెలుస్తోంది. కొందరూ మెడికల్ లీవ్లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం 90 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. పారామెడికల్ సిబ్బంది 98 వరకు ఉండగా, వీరిలో ఆరుగురు రాజీనామా చేసి వెళ్లారు. కొందరు రెండు నెలల నుంచి లాంగ్ లీవ్లో ఉంటూ ఏమి చేస్తున్నారో తెలియదు. ఇక 115 మంది వరకు పేషంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది విధులకు సరిగా హాజరు కావడం లేదని సమాచారం. ఆస్పత్రిలో ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తున్నారని ఆరోపణలు ఎంజీఎంలో అవసరం ఉన్నా వెళ్లనంటున్న మిగులు సిబ్బంది అధికారుల ఆదేశాలను పట్టించుకోని తీరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఎంజీఎంకు వెళ్లాలంటూ అఽధికారులు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేసినా కొందరు సిబ్బంది మేము వెళ్లమంటూ చెబుతూ సూపర్లోనే పనులు చేస్తున్నట్లు సమాచారం. వీరిలో స్టాఫ్నర్సులు, పేషంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడే పనిచేస్తామని పట్టుబట్టడానికి కారణమేమిటో అంతుపట్టడం లేదని అధికారులే తలపట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంకా కొంతమంది సిబ్బంది ఇష్టానుసారంగా విధులకు వచ్చి వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరిని గాడిలో పెట్టాల్సిన సూపర్వైజర్లు ఏం చేస్తున్నారో వారికే తెలియాలి. కొన్ని సందర్భాల్లో కచ్చితంగా పనిచేయాలని చెబితే వారికి ఉద్యోగ అవకాశం కల్పించిన ప్రజాప్రతినిధి నుంచి టక్కున ఫోన్కాల్ వస్తుంది. దీంతో అధికారులు ఏమి చేయలేని పరిస్థితి ఉంది. ఇదంతా బహిరంగమే అయినా ‘ఎవరికీ వారే యమునా తీరే’ అన్నట్లు ఉందనే ప్రచారం లేకపోలేదు. ఇటీవల ముగ్గురు సెక్యూరిటీ గార్డులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎంజీఎంకు పంపించినట్లు తెలుస్తోంది. పేషెంట్లు తక్కువ.. వైద్యసిబ్బంది ఎక్కువప్రతిరోజు ఓపి ఉన్నప్పుడు 400 నుంచి 500 వరకు పేషెంట్లు వస్తుంటారు. ఇక ఇన్పేషెంట్ల పరంగా 20 నుంచి 25 వరకు మాత్రమే ఉంటారని సమాచారం. దీనిని బట్టి చూస్తే పేషెంట్లు తక్కువగా ఉన్నా వైద్య సిబ్బంది అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అధికారులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. -
కరాటేలో విద్యార్థినుల ప్రతిభ
ములుగు రూరల్: ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ కరాటే పోటీలలో జగ్గన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారని హెచ్ఎం విజయలక్ష్మీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పతకాలు సాధించిన విద్యార్థినులను కోచ్ అభినందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం విజయలక్ష్మీ మాట్లాడుతూ న్యూఢిలీలో ఈనెల 7నుంచి 9వ తేదీ వరకు ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ కరాటే పోటీలు నిర్వహించారని తెలిపారు. పాఠశాలకు చెందిన నిహారిక 47 కేజీల విభాగంలో కాంస్య పతకం, అవంతిక సబ్ జూనియర్ పోటీల్లో 37 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించినట్లు వివరించారు. బాలికల ఆత్మరక్షణకు కరాటే పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. విద్యార్థినులను కరాటే పోటీలలో రాణించేలా తీర్చిదిద్దిన కోచ్ రాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కర్రెగుట్టల్లో డీజీపీ ఆనంద్ పర్యటన
వెంకటాపురం(కె): తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పామూనూరు, తడపల బెస్ క్యాంపులను పరిశీలించి తెలంగాణ బోర్డర్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఛత్తీస్గఢ్ 196 సీఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంప్ను పరిశీలించి సీఆర్పీఎఫ్ అధికారులు, ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పామూనూరు గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వారికి నిత్యావసర సరుకులు, దుస్తులు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ విలేకర్లతో మాట్లాడుతూ 50 ఏళ్ల తర్వాత కర్రెగుట్టల చిత్రం మారిందన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో పోలీస్, రెవెన్యూ, అటవీశాఖతో పాటు అన్ని శాఖల అధికారుల బృందం పర్యటించిందన్నారు. ఐదు దశాబ్ధాలుగా మావోయిస్టులకు సురక్షిత స్థావరంగా ఉండి, భద్రతా దళాలకు అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టల అటవీప్రాంతంలో చారిత్రక మార్పు చోటు చేసుకుందని వెల్లడించారు. ఆపరేషన్ కగార్తో తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఎన్కౌంటర్లో మరణించడంతో పాటు పలువురు లొంగిపోయారని వివరించారు. ప్రస్తుతం ముప్పాల లక్ష్మణ్రావుతో పాటు ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన ప్రధాన నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో అటవి ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రివార్డుల మొత్తం, ఆర్థికసాయం, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీఐజీ కార్తికేయ, ఎస్ఐబీ అడ్మిన్ సింధుశర్మ, కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏఎస్పీ మనన్భట్, సీఐ ముత్యం రమేశ్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.లొంగిపోయిన వారికి ఉపాధి కల్పిస్తాం డీజీపీ సీవీ ఆనంద్ మావోయిస్టు సీనియర్ నాయకురాలు సమత లొంగుబాటు పామూనూరు, తడపల బేస్ క్యాంపుల పరిశీలన ఆపరేషన్ కగార్తో 700 మంది లొంగుబాటు -
పనులు త్వరగా పూర్తిచేయాలి
ములుగు: నూతన సమీకృత కలెక్టరేట్ భవనం, పైలాన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు మంత్రి సోమవారం నూతన కలెక్టరేట్ కార్యాలయం, గట్టమ్మ వద్ద నిర్మిస్తున్న పైలాన్ నిర్మాణ పనులను పరిశీలించారు. పైలాన్ నిర్మాణ పురోగతిని పరిశీలించిన మంత్రి సీతక్క, పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పార్కింగ్, విద్యుత్ సౌకర్యాలు, తాగునీటి ఏర్పాట్లు, పరిశుభ్రత తదితర అంశాలపై ఆరా తీశారు. సందర్శకులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ కృష్ణవేణి, ములుగు తహసీల్దార్ విజయభాస్కర్, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలి ఈ నెల 16న సీఎం రేవంత్రెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రానున్నందున జిల్లా నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు తరలివచ్చి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్లు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొనే విధంగా నాయకులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.సమీకృత కలెక్టరేట్ను పరిశీలిస్తున్న సీతక్కపైలాన్ను పరిశీలిస్తున్న మంత్రి సీతక్క, అధికారులు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గణపేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు ఉదయం నుంచే అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా.. జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కోడూరి నవీన్కుమార్సుమతి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ గోశాలలో పని చేస్తున్న పాణిగంటి గణేష్కు రూ.24 వేలు వేతనాన్ని నవీన్కుమార్ దంపతులు అందించారు. కార్మిక సంఘాల నాయకులను నిలదీయాలి భూపాలపల్లి రూరల్: కార్మికులను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ.. ఇచ్చిన హామీలను నేరవేర్చని కార్మిక సంఘాల నాయకులను గనుల పైన కార్మికులు నిలదీయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య పిలుపునిచ్చారు. యూనియన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గట్టయ్య మాట్లాడారు. ఈ నెలతో సింగరేణి ఎన్నికల గడువు ముగుస్తుందని, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ప్రాతినిధ్య కార్మిక సంఘం ఐఎన్టీయూసీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. గెలిచిన కార్మిక సంఘాలు కార్మిక సమస్యలను గాలికి వదిలేసి తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే పైరవీకారులుగా మారి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి సింగరేణిలో కార్మిక ఓట్లు దండుకోవడానికి ముందుకొస్తున్న ఈ సంఘాల నాయకులను హమీలపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో యూనియన్ నాయకులు దాసరి జనార్ధన్, రాళ్ల బండి బాపు, రత్నం కిరణ్, నామల శ్రీనివాస్, సలీం సాజిత్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్ది జ్ఞాపకాలతో..కన్నీటిపర్యంతం
నల్లబెల్లి: ఓవైపు విషాదం..మరోవైపు ఉద్యమ జ్ఞాపకం.. ఇంకోవైపు అభిమానుల ఆప్యాయత..ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ భావోద్వేగ వేదికగా మారింది. సోమవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు గులాబీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పెద్దితో ఉన్న అనుబంధాన్ని, ఉద్యమ కాలం నాటి రోజులను గుర్తుచేసుకుంటూ నేతలు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు.. సంస్మరణ సభలో తమ ఉద్యమ సహచరుడు పెద్దితో తనకున్న అనుబంధాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగంలో తెలియజేస్తూ.. ‘ఎంత కాలం బతికామన్నది కాదు..ఎట్లా బతికామన్నదే ముఖ్యం..సమాజంకోసం, ప్రజల కోసం జీవించిన వ్యక్తి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు’ అని కొనియాడారు. పెద్ది అంతిమయాత్ర, దశదినకర్మ, సంస్మరణ సభకు ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలిరావడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి ప్రజలు నిలబడి కడసారి చూపుకోసం ఎదురుచూసిన తీరు ఆయనకున్న ప్రజాదరణను తెలియజేస్తుందన్నారు. నర్సంపేటలో నిర్మించిన మెడికల్ కాలేజీకి సుదర్శన్రెడ్డి పేరు పెడుతామని కేటీఆర్ చేసిన కీలక ప్రకటనతో పెద్ది అభిమానుల్లో భావోద్వేగాన్ని నింపింది. పెద్ది లేని నర్సంపేట.. నర్సంపేటలో పెద్ది సుదర్శన్రెడ్డిలేని మీటింగ్లో పాల్గొంటామని కలలో కూడా ఊహించలేదంటూ మాజీ మంత్రి హరీశ్రావు తన ప్రసంగంలో కంటతడి పెట్టుకుంటున్నారు. సభలో పెద్ది కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి. పెద్ది సుదర్శన్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పలువురు అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సంస్మరణ సభలో మాజీమంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, డీఎస్ రెడ్యానాయక్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, శంకర్నాయక్ నాయకులు గండ్ర జ్యోతి, సతీష్రెడ్డి ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పించి ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో నేతలు, అభిమానుల కన్నీరు భారీగా తరలివచ్చిన గులాబీ నాయకులు, శ్రేణులు ఉద్యమ సహచరుడిని తలుచుకుని కేటీఆర్, హరీశ్రావు భావోద్వేగం -
50 పడకల ఆస్పత్రి.. పనులు షురూ
ఏటూరునాగారం: మండల కేంద్రంలో ఇప్పటికే మాత శిశు సంరక్షణ కేంద్రం, రక్తనిధి కేంద్రంతో పాటు 30 పడకల ఆస్పత్రి ఉంది. ఏజెన్సీ ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందేలా ప్రభుత్వం మరో 50 పడకల ఆస్పత్రిని మంజూరు చేసింది. ఇటీవల రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ ద్వారా రూ.22కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులను కేవీఎన్రెడ్డి కన్స్ట్రక్షన్ వారు టెండర్ దక్కించుకున్నారు. జీప్లస్ 2 ఆస్పత్రి, స్టాఫ్ క్వార్టర్స్ సైతం నిర్మించడం వల్ల వైద్యులు, సిబ్బంది స్థానికంగా ఉండడం వల్ల రోగులకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. ఈ పనులను 18 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఇంజనీరింగ్శాఖ ద్వారా కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీని ప్రకారం పనులు సకాలంలో పూర్తి చేసి వైద్య సేవలకు అందుబాటులో తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేశ్కుమార్, ఇంజనీరింగ్శాఖ ఏఈ నితీష్ తెలిపారు. జనరల్ ఆస్పత్రికి కొత్త భవనం ఏటూరునాగారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(ఏరియా)గా అప్గ్రేడ్ చేశారు. కొత్త భవనానికి అంకురార్పణ చేయడంతో ఏజెన్సీలోని గ్రామీణలకు మెరుగైన వైద్యం చేరువలోకి రానుంది. తెలంగాణ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ పనులను చేపట్టారు. ఇందులో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్, మందుల నిల్వల గిడ్డంగి, రోగుల వెయిటింగ్ హాల్, వైద్యుల గదులు, స్టాఫ్నర్సుల గదులతో పాటు జనరల్ వార్డును సైతం నిర్మించనున్నారు. తల్లిపాల ఫీడింగ్ రూంల ఏర్పాటుకూ ప్లాన్ రూపొందించారు. వాహనాల పార్కింగ్, అంబులెన్స్ల కారిడార్ కూడా అందుబాటులోకి రానుంది. ఇదేకాకుండా ఎమర్జెన్సీ వార్డును సైతం ఆధునికీకరణగా రూపొందించనున్నారు. ఇప్పటికే ఉన్న సౌకర్యాలు ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో ఇప్పటికే మెరుగైన సౌకర్యాలు ఉండగా అదనంగా 50 పడకల ఆస్పత్రి రావడం శుభసూచికమని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాతశిశు ఆస్పత్రి, డయాలసిస్ సెంటర్, రక్తదాన నిధి కేంద్రం ఉండడంతో పాటు ఆయుష్ హోమియోపతి ఆస్పత్రి కూడా అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, ఎస్ఎస్తాడ్వాయి, వెంకటాపురం(కె) ప్రాంతాల్లోని ప్రజలకు ఇక్కడ ఉచిత మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. నిరుపయోగంగా ల్యాబొరేటరీ భవనం తెలంగాణ హబ్ (ల్యాబొరేటరీ) భవనం నిరుపయోగంగా మారింది. రూ. 35లక్షలతో భవనం నిర్మించారు కానీ సౌకర్యాలు, మిషనరీలను సమకూర్చలేదు. దీంతో ల్యాబ్ భవనం నిరుపయోగంగా మారింది. ఈ భవనం కూడా రోగులకు అందుబాటులోకి వస్తే డెంగీ, మలేరియా, తదితర పరీక్షలను ఉచితంగా చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హబ్పేరుతో భవనానికి నిధులు కేటాయించినప్పటికీ మిషనరీలకు బడ్జెట్ కేటాయించకపోవడంతో ఇక్కడ ఎలాంటి పరికరాలను ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ భవనం నిరుపయోగంగా మారింది.నిరుపయోగంగా ఉన్న తెలంగాణ హబ్(ల్యాబ్) భవనంకొనసాగుతున్న జనరల్ ఆస్పత్రి భవనం పనులు రూ. 22 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం 18నెలల్లో పనులు పూర్తి చేయాలని ఒప్పందం -
జోరుగా ఇసుక తవ్వకాలు
మంగపేట : మండలంలో ఇసుకాసురుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారుల సహకారం రాజకీయ నాయకుల పలుకుబడితో కేంద్రంలోని గౌరారం, మల్లూరువాగు, రాజుపేట ముసలమ్మ వాగుల్లో జోరుగా జేసీబీలతో తవ్వకాలు చేపడుతూ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అధికారుల సహకారం, రాజకీయ నాయకుల పలుకుబడితో తమ అక్రమదందాను ఆపేదెవరు.. అడ్డుకునే దమ్ము ఎవరికుందనే ధీమాతో యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఏకంగా జేసీబీతో తవ్వకాలు జరుపుతూ మంగపేట, కమలాపురం, మల్లూరులో సిమెంటు ఇటుకల తయారీ పరిశ్రమలు, సీసీరోడ్ల నిర్మాణం, పలు ప్రైవేట్ పనులకు ట్రాక్టర్లతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లు గౌరారంవాగు నుంచి బోరునర్సాపురం వద్ద నిర్మించిన కరకట్ట మీదుగా రాకపోకలు సాగిస్తుండటంతో కట్టపై భారీ గోతులు పడి పొలాలకు వెళ్లే వీలులేకుండా పోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వాగుల్లో నుంచి అక్రమంగా తరలింపు -
తిరగబడితే ప్రభుత్వ పతనం తప్పదు
గోవిందరావుపేట: రైతులు, కార్మికులు తిరగబడితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పతనం తప్పదని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సోమ మల్లారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత సంయుక్త సంఘాల పిలుపులో భాగంగా సోమవారం మండల కేంద్రంలో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి కార్మికుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అమెరికాతో చేసుకున్న వ్యవసాయ దిగుమతి ఒప్పందాలను విరమించుకోవాలన్నారు. గ్రామీణ పేదలకు ఉపయోగపడుతున్న ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కోరారు. కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యాక్షుడు పొదిళ్ల చిట్టిబాబు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యాక్షుడు తీగల ఆదిరెడ్డి, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి గొంది రాజేష్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల మురళి, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లారెడ్డి -
వర్షాలకు కూలిన ప్రహరీ
● బాలికల ఆశ్రమ పాఠశాలకు రక్షణ కరువు ఏటూరునాగారం: మండల కేంద్రంలోని తాళ్లగడ్డ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ప్రహరీ ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయింది. బాలికలకు రక్షణగా ఉండే ప్రహరీ కూలిపోయినా సంబంధిత ఆశ్రమ పాఠశాల వార్డెన్, ప్రధానోపాధ్యాయులు ఈ విషయంపై ఏమాత్రం స్పందించడం లేదు. ప్రహరీ లేకపోవడంతో అపరిచిత వ్యక్తులు రాత్రి సమయాల్లో లోనికివెళ్లే ప్రమాదం ఉంది. ప్రహరీ కూలిపోయిన విషయాన్ని ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ డీడీ, ఇంజనీరింగ్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్, ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. బాలికల రక్షణకు వెంటనే నూతనంగా ప్రహరీని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయంపై డీడీ జనార్దన్ ను వివరణ కోరగా అక్కడ ఉన్న పరిస్థితి వెంటనే పరిశీలించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. -
కాజీపేట రైల్వేస్టేషన్లో ఎమర్జెన్సీ మెడికల్ బాక్స్
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వేస్టేషన్లోని స్టేషన్ మాస్టర్ కార్యాలయంలో ఆదివారం టీడీ సేవర్ 101 ఎమర్జెన్సీ మెడికల్ బాక్స్ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ కిట్లో గాయాలకు డ్రెస్సింగ్లు, బ్యాండేజీలు, రక్తస్రావాన్ని నియంత్రించే సామగ్రి తదితర అత్యవసర వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. రైల్వేస్టేషన్, రైళ్లలో ప్రయాణికులు అనుకోకుండా ఏదైనా ప్రమాదాలకు గురైనప్పుడు లేదా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనప్పుడు తక్షణ ప్రథమ చికిత్స అందించేందుకు ఈ మెడికల్ బాక్స్ ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు తెలిపారు. -
ఆదివాసీల అభ్యున్నతికి కృషి
ఏటూరునాగారం: ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తామని ఐటీడీఏ ఏపీఓ, ఎస్డీసీ(స్పెషల్ డిప్యూటీ కలెక్టర్) ప్రతాప్, డీడీ జనార్దన్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఏటూరునాగారం బస్టాండ్ నుంచి ర్యాలీ నిర్వహించారు. వైజంక్షన్ వద్ద, ఐటీడీఏ కార్యాలయంలోని కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గిరిజన భవన్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆదివాసీల అభివృద్ధి, ఎదుగుదలకు ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం ఆదివాసీలకు ప్రత్యేక నిధులు, పథకాలను అందిస్తుందని వివరించారు. ఐటీడీఏ ద్వారా అనేక గిరిజన గ్రామాలకు రోడ్లు, విద్యుత్, తాగునీటి వసతి వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు. ఆదివాసీలకు సైతం ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఈఈ ప్రవీణ, డీటీ అనిల్, పెనక ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. ఎస్డీసీ ప్రతాప్, డీడీ జనార్దన్ -
పల్లెలకు విస్తరించిన సైబర్ నేరాలు
భూపాలపల్లి: సైబర్ నేరాలు పెద్ద పట్టణాలకే పరిమితం కాకుండా, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం విస్తరించాయని, ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు. తొలుత గౌరవ వందనం స్వీకరించి, డీపీఓలో కొత్తగా ఏర్పాటుచేసిన జిమ్ను ప్రారంభించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో డీజీపీ సరదాగా కాసేపు టేబుల్ టెన్నిస్ ఆడారు. పోలీసు అధికారులు, సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. డీజీపీ కార్యాలయంలోనే బెటాలియన్ సిబ్బంది ఆత్మహత్య చేసుకున్న ఘటనపై స్పందించిన డీజీపీ.. ఆత్మహత్యలకు దారితీస్తున్న కారణాలను లోతుగా విశ్లేషించి, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు ఉద్యోగులు తమ రిటైర్మెంట్ అనంతరం వచ్చిన సొమ్మును కూడా సైబర్ మోసగాళ్ల చేతిలో కోల్పోతున్నారని అన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఆన్లైన్ గ్యాంగులు ప్రజలను మోసం చేస్తున్నాయని తెలిపారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీజీపీ తెలిపారు. ఈ అంశంపై రెండు జిల్లాల ఎస్పీలతో లోతుగా చర్చించి, సమర్థవంతమైన చర్యలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రోడ్లపై అక్రమ పార్కింగ్, ఇతర కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణనష్టం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు హైవే పెట్రోలింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ట్రాఫిక్, రోడ్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటుచేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ప్రజలు తీసుకుంటున్న ఆహారం నాణ్యతపై ఆందోళన కలిగించే పరిస్థితులు ఉన్నాయన్నారు. కల్తీ ఆహార పదార్థాలపై నిఘా పెంచడంతో పాటు సంబంధిత శాఖల సమన్వయంతో తనిఖీలు, దాడులు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఆయా కార్యక్రమాల్లో మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి, డీఐజీ, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఈగల్ ఎస్పీ గిరిధర్, సీఎస్బీ ఎస్పీ సాయిశ్రీ, భూపాలపల్లి, ములుగు జిల్లాల ఎస్పీలు సిరిశెట్టి సంకీర్త్, సుధీర్ రాంనాథ్కేకన్, భూపాలపల్లి ఏఎస్పీ నరేష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హైవే పెట్రోలింగ్ బలోపేతం కల్తీ ఆహార విక్రయాలపై కఠిన చర్యలు ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా డీజీపీ సీవీ ఆనంద్ -
‘పెద్ది’ కుటుంబానికి కేసీఆర్ ఓదార్పు
సాక్షి, వరంగల్/నల్లబెల్లి: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆత్మీయ ఓదార్పునిచ్చారు. పెద్ది సుదర్శన్రెడ్డి దశదినకర్మ సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది స్వగృహానికి కేసీఆర్ వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషాదంలో ఉన్న పెద్ది సతీమణి స్వప్నను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన కేసీఆర్ మధ్యాహ్నం 3.50 గంటలకు నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్రెడ్డి నివాసానికి చేరుకున్నారు. తొలుత సుదర్శన్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ను చూడగానే స్వప్న భావోద్వేగానికి గురై బోరున విలపించారు. సుదర్శన్రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ఇంట్లోని ఫొటోలను చూస్తూ కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. అనంతరం కుమారుడు నిదర్శన్రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠకు రూ.కోటి చొప్పున, సుదర్శన్రెడ్డి తల్లి అమృతమ్మకు రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందించారు. మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కుటుంబ సభ్యులతో సుమారు 45 నిమిషాల పాటు ముచ్చటించిన కేసీఆర్.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 4.35 గంటలకు నల్లబెల్లి నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. అంతకుముందు నల్లబెల్లికి వచ్చే క్రమంలో ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్త వనకర్ రెడ్డి ఇంటి వద్ద కొద్దిసేపు ఆగి వెళ్లారు. ప్రముఖుల పరామర్శ.. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, సిరికొండ మధుసూదనాచారి, జీవన్రెడ్డి, తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బోయినపల్లి వినోద్కుమార్, వినయ్భాస్కర్, అరూరి రమేశ్, బండా ప్రకాశ్, డీఎస్ రెడ్యానాయక్, మాలోత్ కవిత, శంకర్నాయక్, నన్నపునేని నరేందర్, గండ్ర జ్యోతి, ఎర్రోళ్ల శ్రీనివాస్, హరిరమాదేవి, సాంబారి సమ్మారావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు కేసీఆర్ నల్లబెల్లికి వస్తున్నారనే సమాచారంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. నల్లబెల్లి–నర్సంపేట రహదారులు కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. శ్రీపెద్ది సుదర్శన్రెడ్డి అమర్ రహేశ్రీ, శ్రీజోహార్ పెద్దిశ్రీ నినాదాలు మార్మోగాయి. పలుచోట్ల కాన్వాయ్ ఆపిన కేసీఆర్ కిందికి దిగి కార్యకర్తలను పలకరించారు. శ్రీపెద్ది కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కేసీఆర్ మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎర్రవెల్లి నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు. కేసీఆర్ వెంట మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, జీవన్రెడ్డి, సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్, మాజీ ఎంపీలు వినోద్కుమార్, మాలోత్ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ముఖ్యులు జి.జగదీశ్వర్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్రెడ్డి, అనిల్జాదవ్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. సంతాప సభ ఏర్పాట్లపై ఆరా నల్లబెల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న పెద్ది సంతాప సభ ఏర్పాట్లపై మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ మాట్లాడారు. సభకు హాజరయ్యే అభిమానులందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా డీసీపీ రవీందర్రెడ్డి, నర్సంపేట రూరల్ సీఐ సాయి రమణ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లబెల్లి ఎస్సై సాయిప్రసన్న కుమార్తో పాటు ఏడుగురు ఎస్సైలు, 200 మంది బందోబస్తు విధులు నిర్వర్తించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి దశదినకర్మకు మాజీ సీఎం హాజరు చిత్రపటానికి నివాళి.. పెద్ది స్వప్నను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా రూ.2.25 కోట్ల చెక్కులను కుటుంబ సభ్యులకు అందించిన మాజీ సీఎం -
కేయూకు రూ.500 కోట్లు కేటాయించాలి
కేయూ క్యాంపస్: మౌలిక వసతుల కల్పనకు కేయూకు రూ.500 కోట్లు కేటాయించాలని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ (కుర్తా) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ.సదానందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేయూ గెస్ట్హౌస్లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉన్నత విద్య అవకాశాలు పరిమితంగా ఉన్నరోజుల్లో కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటుతో బడుగు, బలహీనవర్గాల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోనికి వచ్చిందని గుర్తుచేశారు. తొలి ఉపకులపతి వెంకట్రామయ్య అంకితభావం, కఠోరశ్రమ, ముందుచూపుతో కాకతీయ యూనివర్సిటీకి బలమైన పునాదులు వేశారన్నారు. తర్వాత వీసీలుగా బాధ్యతలు నిర్వర్తించిన జాఫర్నిజాం, వాసుదేవ్ తదితరులు అదేస్ఫూర్తిని కొనసాగించారని వివరించారు. దివంగత వీసీ ఎన్.లింగమూర్తి హయాంలో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేశారని, అధ్యాపకుల నియామకాలు కూడా చేపట్టినట్లు వివరించారు. గోల్డెన్జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11న ఉదయం10 గంటలకు కుర్తా ఆధ్వర్యంలో పరిపాలన భవనంలోని సెనేట్హాల్లో విశ్రాంత ఆచార్యుల సమావేశం (మీట్) ను నిర్వహిస్తామని చెప్పారు. యూనివర్సిటీలో 204 మంది విశ్రాంత అధ్యాపకులు ఉన్నారని, 70 ఏళ్లపైబడిన విశ్రాంత అధ్యాపకులను కేయూ గోల్డెన్జూబ్లీ ఉత్సవాల మీట్లో సన్మానించనున్నట్లు వివరించారు. ఉత్సవాలకు కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించామని తెలిపారు. సమావేశంలో కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ వడ్డె రవీందర్, కోశాధికారి జి.వీరన్న, జాయింట్ సెక్రటరీ కృష్ణారెడ్డి, ికుర్తా కార్యవర్గసభ్యులు ప్రొఫెసర్లు సీహెచ్ సమ్మయ్య, సుధాకర్ తదితరులుపాల్గొన్నారు. న్యాయ వ్యవస్థపై నమ్మకంతో పోరాడుతున్నాం కాశిబుగ్గ: న్యాయ వ్యవస్థపై తమకు అపారమైన విశ్వాసం ఉందని, అదే నమ్మకంతోనే కార్మికుల పక్షాన పోరాడుతున్నామని ఆజంజాహి మిల్స్ వీఆర్ఎస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఆదివారం వరంగల్ చింతల్ బ్రిడ్జి వద్ద వీఆర్ఎస్ అసోసియేషన్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కుడికాల కుమారస్వామి, జన్ను రమేశ్ మాట్లాడుతూ.. 134 మంది మిల్లు కార్మికులకు 200 గజాల చొప్పున ఇచ్చినట్లుగానే మిగతా 318 మందికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో పాండవుల సమ్మయ్య, తౌటం రమేశ్, సంజీవ్ పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగొద్దు కాళేశ్వరం: ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్న శ్రావణమాసంలో ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నెలరోజుల పాటు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతున్నట్లు కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ, ఈఓ మహేశ్ తెలిపారు. ఆదివారం కాళేశ్వరం ఈఓ కార్యాలయంలో చైర్మన్, ఈఓ, ధర్మకర్తలు, ఎక్స్అఫీ షియో సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. పూజలు, భక్తుల రద్దీ, ఆలయ పరిసరాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. -
కోతకు గురవుతున్న ఎలిశెట్టిపల్లి రోడ్డు
● జంపన్నవాగు వరదకు ఒర్లిపోతున్న మట్టి ఏటూరునాగారం: మండల పరిధిలోని ఎలిశెట్టిపల్లికి వెళ్లే ప్రధాన రోడ్డు జంపన్నవాగు వరదకు కోతకు గురవుతోంది. జంపన్నవాగు వర్షాల కురిసిన సమయంలో ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రోడ్డుకు వేసిన మట్టి మొత్తం ఒర్లిపోయి చెట్లు కూడా వరద నీటిలో కలిసి కొట్టుకుపోతున్నాయి. వరద మరింత ఎక్కువైతే ఆ గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా కోతకు గురై కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. అధికారులు వెంటనే స్పందించి ఒర్లిపోతున్న రోడ్డుకు రాయితో రివిట్మెంట్ చేయించాలని మాజీ సర్పంచ్ చెరుకుల గోపి కోరారు. -
నేడు నల్లబెల్లికి కేసీఆర్ రాక
నర్సంపేట: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఇంటికి రానున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించిన విషయం విదితమే. మొక్కలు నాటి సంరక్షించాలి ములుగు రూరల్: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మున్సిపాలిటీ కౌన్సిలర్ గండ్రకోట వాణి అన్నారు. ఈ మేరకు శనివారం గట్టమ్మ ఆలయ పరిసరాల్లో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్వాడ కార్యక్రమం నిర్వహించగా ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గట్టమ్మ ఆలయ పరిసరాలలో ఉన్న చెత్తా చెదారం తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆలయ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువతరం యూత్ అధ్యక్షుడు గునిశెట్టి సందీప్, రంజిత్, జితేందర్, రాఘవ, బన్నీ, నాగసాయి, రాంచరణ్, మహేందర్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు. రామప్ప శిల్పకళ అద్భుతం వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలోని శిల్పకళ అద్భుతంగా ఉందని టీజీటీడీసీ జీఎం (ఫైనాన్స్) సునిత అన్నారు. ఈ మేరకు ఆమె శనివారం కుటుంబ సమేతంగా రామప్పను సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా బాగుందని కొనియాడారు. ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి ములుగు రూరల్: నేడు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పోడు దెబ్బ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ గాలి సమ్మయ్య కోరారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతీగూడెంలో ఆకుపచ్చ జెండా ఎగురవేయాలన్నారు. ఆదివాసీల హక్కులను, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని వెల్ల డించారు. జల్ జంగిల్ జమీన్ పరిరక్షణకు పోరాటం చేసిన వీరుల ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఆదివాసీలు హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సారయ్య, యాదగిరి, కనకయ్య, ధనుంజయ్, రామారావు, రమేశ్, తిరుపతి పాల్గొన్నారు. ఏఐసీసీ చీఫ్ను కలిసిన డాక్టర్ రామకృష్ణ హన్మకొండ చౌరస్తా: త్వరలో జరగనున్న వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానా నికి పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ హనుమకొండకు చెందిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ శనివారం ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిశారు. రామకృష్ణ చారి టబుల్ ట్రస్ట్ చైర్మన్గా, పార్టీలో సీనియర్గా వరంగల్ నియోజకవర్గం, క్షేత్రస్థాయిలో పార్టీ బలో పేతం కోసం చేస్తున్న కృషిని వారికి వివరించారు. అంతేకాకుండా పలు రాష్ట్రాల్లో ఎన్నికల పరిశీలకులుగా పనిచేసిన అనుభవాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తన తాత, తండ్రి సైతం కాంగ్రెస్ పార్టీగా విధేయుడిగా ఉన్న ట్లు తెలిపారు. దశాబ్దానికి పైగా పార్టీ కోసం శ్ర మిస్తున్న తనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అ వకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వంలో భాగమయ్యే కార్పొరేషన్ చైర్మన్ పదవితోనైనా ప్రజలకు మరింత చేరువవుతానని తెలిపారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 30 లేఖలు సిఫారసు చేశానని రామకృష్ణ వారికి వినతిపత్రం అందజేశారు. -
భగీరథతో భరోసా
గోవిందరావుపేట: రామప్ప సరస్సు వేలాది కుటుంబాలకు భరోసా కల్పిస్తోంది. జిల్లాలోని వేలాది కుటుంబాల దాహం తీర్చే తాగునీటి వనరుకు ఆధారం. సరస్సు నుంచి సేకరించిన నీటిని పాలంపేటలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్(డబ్ల్యూటీపీ)లో శుద్ధి చేసి ప్రతిరోజూ 18 మిలియన్ లీటర్ల మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని వెంకటాపురం(ఎం) మండల పరిధిలో గల పాలంపేట గ్రామంలోని డబ్ల్యూటీపీకి రామప్ప సరస్సు ప్రధాన నీటి వనరు. సరస్సులోని నీటిని సేకరించేందుకు ప్రత్యేకంగా ఇన్టెక్వెల్ నిర్మించారు. అక్కడి నుంచి నీటిని ప్లాంట్కు తరలించి శాసీ్త్రయ పద్ధతుల్లో శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరా నిర్వహణకు ప్రతినెలా రూ.30.70లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. పాలంపేట డబ్ల్యూటీపీ పరిధి నుంచి జిల్లాలోని ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేట మండలాల్లోని 173 జనావాస ప్రాంతాల్లోని 35వేల ఇళ్లకు ఈ ప్లాంట్ నుంచి మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతోంది. ప్లాంట్లో శుద్ధి చేసిన నీటిని గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన 197 ఓవర్హెడ్ సర్వీస్ రిజర్వాయర్ల(ఓహెచ్ఎస్ఆర్)కు తరలిస్తారు. అక్కడి నుంచి ఇళ్లకు కుళాయిల ద్వారా తాగునీరు చేరుతోంది. ఆరు దశల్లో నీటి శుద్ధి రామప్ప సరస్సు నుంచి వచ్చిన నీటిని నేరుగా ప్రజలకు సరఫరా చేయరు. ముందుగా పాలంపేట డబ్ల్యూటీపీలో ఆరు దశల్లో శుద్ధి చేస్తారు. ఏరేషన్తో ప్రారంభమయ్యే ప్రక్రియలో కోగ్యులేషన్, ప్రీ క్లోరినేషన్, ఫ్లాక్యులేషన్, ఫిల్ట్రేషన్, చివరగా పోస్ట్ క్లోరినేషన్ నిర్వహిస్తారు. నీటిలోని మలినాలను తొలగించడం, అవసరమైన రసాయన ప్రక్రియల ద్వారా నీటిని శుద్ధి చేస్తారు. ఫిల్టర్ల ద్వారా వడపోయడం, అనంతరం క్లోరినేషన్ చేయడం వంటి దశలు పూర్తయిన తర్వాతే నీటిని సరఫరా చేస్తూ ప్రజలకు ఆరోగ్యంపై భరోసా కల్పిస్తున్నారు. నాణ్యతపై నిత్యం నిఘా ప్రజలకు సరఫరా చేసే నీటి నాణ్యత విషయంలో అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. పాలంపేట డబ్ల్యూటీపీలో ప్రతిరోజూ నీటి నాణ్యతను పరీక్షిస్తారు. టర్బీడీటీ, పీహెచ్, టీసీఎస్, రెసీడ్యూవల్ క్లోరిన్ వంటి ప్రధాన అంశాలను పరిశీలిస్తారు. నీటిలో మలినాల స్థాయి, నీటి స్వభావం, కరిగిన పదార్థాల పరిమాణం, క్లోరిన్ స్థాయి వంటి అంశాలను పరీక్షించిన తర్వాతే సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మూడు మోటార్లు.. రెండు పంపుహౌస్లు నీటిని శుద్ధి చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు పాలంపేట డబ్ల్యూటీపీలో రెండు పంపుహౌస్లు ఉన్నాయి. వీటిలో 100 హెచ్పీ సామర్థ్యం కలిగిన మూడు మోటార్లు ఏర్పాటు చేశారు. ప్లాంట్ నుంచి శుద్ధి చేసిన నీటిని రిజర్వాయర్లకు పంపింగ్ చేయడంలో ఈ మోటార్లు కీలకంగా పని చేస్తున్నాయి. 173 జనావాస ప్రాంతాలు.. 35వేల ఇళ్లకు తాగునీరు రామప్ప సరస్సు నీరు నాలుగు మండలాలకు సరఫరా పాలంపేట డబ్ల్యూటీపీలో నీటి శుద్ధి.. నాణ్యత పరీక్షలుస్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం పాలంపేట డబ్ల్యూటీపీ ద్వారా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నీటిని శుద్ధి చేసి ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నాం. విద్యుత్ అంతరాయం, పైపులైన్ లీకేజీల మరమ్మతుల సమయంలో మాత్రమే కొద్దిసేపు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పి.సుమన్, డీఈ, మిషన్ భగీరథ, ములుగు -
పోలీసులు అంకిత భావంతో పనిచేయాలి
● పర్యావరణాన్ని బాధ్యతగా పరిరక్షించాలి ● డీజీపీ సీవీ ఆనంద్ ● మామునూరు బెటాలియన్లో స్వాగతంమామునూరు: స్పెషల్ పోలీసులు రాష్ట్ర అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, ఎస్డీఆర్ఎఫ్ సామర్థ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్ను అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్తో కలిసి డీజీపీ సందర్శించారు. బెటాలియన్ ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న ఆయనకు కమాండెంట్ డి.శివప్రసాద్రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం పోలీసుల నుంచి డీజీపీ గౌరవందనం స్వీకరించి, విధులు, సంక్షేమం, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ముఖాముఖి బెటాలియన్ ఆడిటోరియంలో జరిగిన అధికారులు, సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలందించాలని, బెటాలియన్లో మరిన్ని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. పోలీసింగ్ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వృత్తి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞాన, సమన్వయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అంతకు ముందు బెటాలియన్లో మొక్కలు నాటారు. తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ పరికరాలను పరిశీలించి, నైపుణ్యాన్ని డీజీపీ అభినందించారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు బాలయ్య, వీరన్న, రాజేందర్, ఆర్ఐలు కార్తీక్, విజయ్, రవి, పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉప్పొంగుతున్న వాగులు
కన్నాయిగూడెం: మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఏజెన్సీలోని పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐలాపూర్ చుట్టూ ఉన్న వాగులు ఉప్పొంగడంతో గ్రామస్తులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో పాటు కంతనపల్లి గ్రామ పరిధిలోని దొంగలగుట్ట వాగు పొంగి పొర్లడంతో తుపాకులగూడెం, ఏటూరునాగారం ప్రధాన రహదారిపై లోలెవల్ వంతెన పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద తగ్గిన తర్వాత రాకపోకలు కొనసాగాయి.


