breaking news
Mulugu
-
నియంతృత్వ పాలనకు నిదర్శనం..
మహబూబాబాద్ అర్బన్: ప్రజాస్వామ్య మౌలిక సూత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛను కాలరాయడం నియతృత్వ పాలనకు నిదర్శనం. వాక్ స్వాతంత్య్రం నిరాకరించడం అంటే ప్రజస్వామ్యంలో నాలుగో స్తంభాన్ని కూలగొట్టడమే. ప్రభుత్వ కాలపరిమితి పరిమితం. కానీ, ప్రజాస్వామ్యం అజేయమైంది. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టి మీడియా గొంతును నొక్కయడం సరికా దు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం సరికాదు. – డాక్టర్ డోలి సత్యనారాయణ, తెలంగాణ ఉద్యమకారుడు, మానుకోట ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే.. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతికా స్వేచ్ఛను హరించడమంటే రాజ్యాంగ సూత్రాలను దెబ్బతీయడమే. ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. ప్రతిక స్వేచ్ఛను కాపాడకుంటే ప్రజలు బుద్ధిచెబుతారు. – పిల్లి సుధాకర్, మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు -
బతుకమ్మ కానుక..
వెంకటాపురం(ఎం): బతుకమ్మ పండుగకు మహిళలకు ఇందిరమ్మ చీరలు కానుకగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పొదుపు సంఘాల సభ్యులకు మాత్రమే ఒక్కొక్కరికి రెండు చీరలు ఈనెల 22 నుంచి ఉచితంగా రెండు విడతల్లో అందించనున్నారు. ఒక్కో చీర ధర రూ.800 వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 76,469 మందికి.. 1,52,938 చీరలు జిల్లాకు 10 మండలాల పరిధిలో 171 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 9 మండల సమైఖ్యలు ఉండగా 355 గ్రామ సమైఖ్యలు ఉన్నాయి. వీటి పరిధిలో 7,019 స్వయం సహాయక సంఘాలు ఉండగా.. 76,469 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున 1,52,938 చీరలు జిల్లాకు రావాల్సి ఉంది. జిల్లాకు వచ్చే ఇందిరమ్మ చీరలను నిల్వ చేసేందుకు డీఆర్డీఏ అధికారులు ములుగు, గోవిందరావుపేట, ఏటూరునాగారం మండలాల్లో గోదాంలను కేటాయించారు. ఆరున్నర మీటర్లు గల ప్రింటెడ్ పాలిస్టర్ చీరలు 1,44,478, తొమ్మిది మీటర్లు గల పాలికాట్ చీరలు 8,460 జిల్లాకు రానున్నాయి. ఈనెల 22 నుంచి 30 వరకు మహిళలకు చీరలను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు విడతల్లో పంపీణీ ఈనెల 22వ తేదీ నుంచి చీరలు అందించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు రేషన్ దుకాణాలకు చెందిన డీలర్ల ద్వారా ఒకరికి ఒక చీర చొప్పున అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఈసారి స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు మాత్రమే రెండేసి చీరల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల పరిధిలోని గ్రూపుల వారీగా సభ్యుల వివరాలు సేకరించి మండలాల వారీగా కావాల్సిన చీరల జాబితాను ప్రభుత్వానికి పంపించారు. బతుకమ్మ పండుగ ప్రారంభం రోజున ఒకటి, సద్దుల బతుకమ్మకు మరో చీరను అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. చీరలను ప్రత్యేక సంచిలో ప్యాక్ చేసి ఇవ్వనున్నారు. ఆ సంచిపై ఇందిరాగాంధీ ఫొటో, ఇందిర మహిళా శక్తి లోగోతో పాటు శ్రీఅక్కాచెల్లెళ్లకు మీ రేవంతన్న కానుకశ్రీ అని రాసి ఉండనుంది. సీఎం రేవంత్రెడ్డితో పాటు డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురి మంత్రుల ఫొటోలను ముద్రించారు. మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే.. ఒక్కొక్కరికి రెండు చీరలు ఈనెల 22నుంచి పంపిణీకి ఏర్పాట్లుమండలం మహిళలు చీరలు ములుగు 17,043 34,086 మంగపేట 12,535 25,070 వెంకటాపురం(ఎం) 8,438 16,876 గోవిందరావుపేట 7,959 15,918 ఏటూరునాగారం 7,544 15,088 వెంకటాపురం(కె) 7,522 15,044 తాడ్వాయి 6,183 12,366 వాజేడు 6,002 12,004 కన్నాయిగూడెం 3,245 6,490 -
పరిహారం కోసం ఐక్యంగా ఉద్యమించాలి
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం ప్రాంత రైతులకు పంట నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించేంత వరకు రైతుల పక్షాన ఐక్యంగా ఉద్యమించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని కొత్తూరులో జాతర పంట నష్టపరిహార సాధన సమితి అధ్యక్షుడు అల్లెం కృష్ణార్జున్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథులుగా బీర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, బీజేపీ జి ల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, సీపీఎం రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్రెడ్డి, జి ల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ మేడారం జాతర సందర్భంగా రెండో పంట సా గుచేయకుండా నష్టపోతున్న మేడారం, ఊరట్టం, నార్లాపూర్, వెంగళపూర్, రెడ్డిగూడెం, కన్నెపల్లి రైతులకు ఎకరానికి రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, పంట నష్టపరిహార సాధన సమితి చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు. పరిహారానికి సంబంధించిన ప్రభుత్వ జీఓ ఇచ్చేంత వరకు రైతులు ఐకమత్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మేడారం ప్రాంత రైతుల ప్రధాన సమస్య అయినటువంటి జంపన్నవాగు, తూముల వాగుపై కరకట్ట నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచులు శ్రీధర్, బాబు రావు, అరుణ, కమిటి ఉపాధ్యక్షులు హనుమంత రెడ్డి, శ్రీను కిరణ్, రమేష్, మొక్క నరేందర్, ప్రధా న కార్యదర్శులు చర్పా చంద్రశేఖర్, ముర్తేష్, నరేష్, ప్రణయ్. బీఆర్ఎస్, బీఆర్ఎస్, సీపీఎం నాయకులు శివరాజ్, శ్యామ్ ప్రసాద్, స్వరూప, బుచ్చ య్య, ఆలేం అశోక్, మహిళా అధ్యక్షురాలు సరో జన, ప్రధాన కార్యదర్శి కొప్పుల బతుకమ్మ, తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్ష నాయకుల పిలుపు ఎకరానికి రూ. 50వేలు చెల్లించాలని డిమాండ్ -
కలానికి సంకెళ్లేసి సత్యాన్ని నిర్బంధించలేరు!
నిఖార్సయిన జర్నలిజంతో తెలుగు పత్రికా ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘సాక్షి’పై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అక్కసు పెంచుకుందని ఉమ్మడి వరంగల్ జిల్లా పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలకు అక్షర రూపమిచ్చినందుకు సాక్షి జర్నలిస్టులపై అక్కడి ప్రభుత్వం కేసులు పెట్టించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కలానికి సంకెళ్లు వేసి సత్యాన్ని నిర్బంధించగలరా? అని వారంతా ప్రశ్నిస్తున్నారు. -
డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ఏటూరునాగారం/ములుగు రూరల్: గిరిజన ఆ శ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల న్యా యమైన కోర్కెలు పరిష్కరించాలని సీఐటీయూ జి ల్లా అధ్యక్ష,కార్యదర్శులు రత్నం రాజేందర్, ఎండీ. దావూద్ అన్నారు. జీఓ నంబర్ 64ను రద్దు చేయాలంటూ జేఏసీ పిలుపు మేరకు నిరవధిక సమ్మెను శుక్రవారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఎదుట చేపట్టారు. సమ్మెకు దావూద్ హా జరై మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లను, కాంటింజెంట్, పార్ట్టైం వర్కర్లకు 2021 జూన్ 15న బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో విడుదల చేసిన జీఓ నంబర్ 64 ప్రకారం వేతనాలు చెల్లిస్తే వేతనాలు పెద్ద ఎత్తున తగ్గే అవకాశం ఉందన్నారు. వర్కర్ల బాగోగులు పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు ఏసీ గదులకే పరిమితం అయితే కార్మికుల కష్టాలు ఎలా తెలుస్తాయన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, 2014లో నాటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 212ను అమలుపరచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కమల, సమ్మ క్క, సంతోషా, లక్ష్మీ, సత్యం,రాజు,రత్నం ప్రవీణ్ బాలేశ్వర్, కోట య్య, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల గొంతు నొక్కడమే..
హన్మకొండ అర్బన్: ప్రతిపక్షాల గొంతు నొక్కడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉన్న ఏకై క గొంతుక పత్రికలు. వాటిని కూడా అణచివేయడం, అక్రమ కేసులతో తొక్కివేయడం వంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టకర పరిణామాలుగా చెప్పాలి. ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. పత్రికలే ప్రజల గొంతుకగా ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పత్రికలు, పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టులను కేసుల పేరుతో నిర్బంధించడం. వేధించడం అమానుషం. ఇది మంచి పరిణామం కాదు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ప్రభుత్వాలు, నాయకులు ప్రజాగ్రహానికి గురవ్వక తప్పదు. – ఎన్నమనేని జగన్మోహన్రావు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రజల స్వేచ్ఛను హరించడమే..హన్మకొండ అర్బన్: అధికార పక్షం విఫలమైనప్పుడు ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా నిలబడేవి పత్రికలు, మీడియా మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అధికారంలోకి వస్తే వారు తమ స్వలాభం కోసం నిర్బంధాలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది పూర్తిగా ప్రజలను ఇబ్బంది పెట్టినట్లే, కక్ష సాధించినట్లే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా పత్రికా స్వేచ్ఛను కాలరాయడమన్నది ప్రజల స్వేచ్ఛను హరించడమే. ఇప్పటికై నా ప్రభుత్వాలు ఉద్దేశపూర్వక చర్యలను మానుకోవాలి. సాక్షి జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – నిమ్మల శ్రీనివాస్, సామాజికవేత్త -
వనదేవతలకు భక్తుల మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మల ను దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు అఽ దిక సంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్ల గ ద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీర సారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరా జు లకు పూజలు చేశారు.అమ్మవార్లకు యాటలను, కో ళ్లను మొక్కుగా సమర్పించారు. మొక్కుల అనంత రం భక్తులు మేడారం పరిసరాల్లో వంటావార్పు చే సుకుని సహపంక్తి భోజనాలు చేశారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, మధు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. -
17నుంచి స్వస్తు నారీ స్వశక్తి పరివార్ అభియాన్
ములుగు రూరల్ : ఈ నెల 17నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే స్వస్తు నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అఽధి కారి గోపాల్రావు అన్నారు. శుక్రవారం జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ గోపాల్రావు మాట్లాడుతూ కార్యక్రమాలను వైద్యాధికారులు, సూపర్వైజర్లు పర్యవేక్షించినప్పుడే ప్రభుత్వ నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించవచ్చని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఎక్కువ ప్రసవాలు అయ్యేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ చంద్రకాంత్, పవన్కుమార్, శ్రీకాంత్ రణధీర్, సంపత్ ఉన్నారు. ములుగు రూరల్ : మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం బీమా వర్తింపజేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మల్లంపల్లి యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అన్నారు. భోజనం తయారు చేస్తున్న సమయంలో కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు గున్నాల రాజకుమారి, పద్మ, శ్రీనివాస్, కమల, రాధ, భగ్య, కనుకలక్ష్మీ, పూల, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్ : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం దేవగిరిపట్నం జిల్లా పరిషత్ పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మోటారు వెహికిల్ చట్టం, బా ల్యవివాహ నిరోధక, బాలకార్మిక చట్టాల గు రించి వివరించారు. డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్ పోక్సో, నిర్భంద విద్యాహక్కుల చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏజీపీ బా లుగు చంద్రయ్య, ప్రధానోపాద్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గోవిందరావుపేట : కోతుల బారి నుంచి ప్రజలను రక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ అన్నారు. మండలంలో రో జురోజుకి కోతుల బెడద తీవ్రమవుతుందని వాటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో పస్రా సెంటర్లో శుక్రవారం భారీ ర్యాలీ తీసి గ్రామ పంచా యతీ, ఫారెస్ట్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ మండలంలో విచ్చలవిడిగా కోతులు వీరంగం సృష్టిస్తున్నాయని పగలు, రాత్రి తేడా లేకుండా ఇళ్లలోకి వస్తున్నాయని, ప్రజలు నిత్యం భయంతో గడుపుతున్నారని అన్నారు. ప్రభుత్వం, గ్రామ పంచాయతీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను సమన్వయపరిచి కోతులబెడద నుంచి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్/గోవిందరావుపేట: మద్యం తాగి వాహనాలు నడుపొద్దని ఎస్సై వెంకటేశ్వర్రావు తెలిపారు. గతంలో మద్యం తాగి పట్టుబడిన 91 మందిని శుక్రవారం కోర్టుకు హాజరుపరిచినట్లు ఎస్సై తెలిపారు. దీంతో ములుగు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి 85 మందికి రూ.1.68 లక్షల జరిమానా విధించినట్లు తెలి పారు. ఆరుగురు వ్యక్తులకు రెండు రోజుల సాధారణ శిక్షతో పాటు రూ.12 వేలు జరిమానా విధించినట్లు వెల్లడించారు. -
భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు సరికాదు!
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక పత్రికా స్వేచ్ఛ, ప్రశ్నించే గొంతుకలను భౌతికదాడులతో పాటు పోలీసులను ఉపయోగిస్తూ తప్పుడు కేసులతో తీవ్ర అణచివేతకు గురిచేస్తుండడంపై పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజా సమస్యలపై కథనాలు ప్రచురిస్తే సాక్షి దినపత్రిక జర్నలిస్టులపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఫిర్యాదులు ఇప్పిస్తూ కేసులు నమోదు చేస్తుండడాన్ని ఖండించారు. వివిధ అంశాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటు చేసే ప్రెస్కాన్ఫరెన్స్ల వార్తలు రాసిన సందర్భంలోనూ సాక్షి దినపత్రికతో పాటు ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – హన్మకొండ -
అటవీ అమరుల త్యాగాలు మరువలేనివి
ములుగు రూరల్: అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవి సంపద, వన్యప్రాణుల పరిరక్షణకు నిరంతరం పాటుపడి ప్రాణాలు కోల్పోయారని వారి సేవలను కొనియాడారు. అటవీ సంపద పరిరక్షణ ప్రతీవ్యక్తి బాధ్యతని తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ములుగు పరిధిలో 35, ఏటూరునాగారం పరిధిలో 31 యూనిట్ల రక్తాన్ని సేకరించి అందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ డోలి శంకర్, సిబ్బంది పాల్గొన్నారు. వైద్యశిబిరం ఏటూరునాగారం: అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ ఉద్యోగులు గురువారం మండల కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ అడవుల రక్షణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను విస్మరింఝ ద్దని సూచించారు. అనంతరం అటవీశాఖ కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనాలతో బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం 31 మంది అధికారులు, ఉద్యోగులు కార్యాలయంలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్తాడ్వాయి, ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం(కె), దూలాపురం అటవీ రేంజ్ కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వాగు దాటి వైద్యం చేసిన సిబ్బంది
వెంకటాపురం(కె): వాగు దాటి వైద్య ఆరోగ్య సిబ్బంది ఆదివాసీలకు వైద్యం చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని పరిధిలోని సీతారాంపురం గ్రామానికి వెళ్లాలంటే మధ్యలో పూసు వాగు అడ్డుగా ఉంటుంది. ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ద్విచక్ర వాహనాలపై వాగు వరకు వైద్య సిబ్బంది వెళ్లారు. వాహనాలను వాగు వద్ద పెట్టి వాగు దాటి రెండు కిలో మీటర్లు నడిచి గ్రామానికి చేరుకున్నారు. మాతా శిశు సంరక్షణ వైద్యాధికారి డాక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య సిబ్బంది మలేరియాపై ఇంటింటా సర్వే నిర్వహించారు. జ్వరాలతో బాధపడుతున్న వారికి మందులు ఇచ్చి రక్త నమూనాలు సేకరించారు. తాగునీటి బావిని పరిశీలించి క్లోరినేషన్ చేశారు. గ్రామంలో నిల్వ ఉన్న నీటిని ఇంటింటా తిరిగి పార బోశారు. ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడిగా ఉన్నప్పుడే ఆహారాన్ని తినాలని సూచించారు. డెంగీ, మలేరియా రాకుండా జాగ్రత్తలను పాటించాలని, నీటితో ఉన్న డ్రమ్ములు, గోలాలపై మూతలను పెట్టుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఈఓ కోటిరెడ్డి, వెంకట రమణ, నాగమణి, సమ్మక్క, మోహన్ ఉన్నారు. -
దరఖాస్తులను నిష్పక్షపాతంగా పరిశీలించాలి
ములుగు: దరఖాస్తులను నిష్పక్షపాతంగా పరిశీలించి భూ రికార్డులను ప్రామాణికంగా రూపొందించాలని కలెక్టర్ దివాకర సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ వెంకటేశ్లతో కలిసి గురువారం సాదాబైనామాల దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మండలాల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, భూ పరమైన వివాదాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన సాదాబైనామాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు, అందులో ఎన్ని నోటీసులు జనరేట్ చేసి సర్వే ప్రక్రియ పూర్తి చేశారు, పెండింగ్లో ఉన్న వాటి కారణాల గురించి తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్ ఉన్న మండలాల్లో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్డీఓ లాగిన్లో ఉన్న విరాసిత్, మిస్సింగ్ సర్వే నంబర్లు, పేరు, సర్ నేమ్, తదితర పెండింగ్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని తెలిపారు. భూ భారతి అప్లికేషన్లో నమోదవుతున్న సాదాబైనామాలు, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్, గ్రీవెన్స్ దరఖాస్తుల పరిశీలన, ధ్రువీకరణలో వేగం పెంచాలని ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్లు, కలెక్టరేట్ కార్యాలయ పర్యవేక్షకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
రైతుల సమస్యలు పరిష్కరించాలి
● రైతుసంఘం జిల్లా కార్యదర్శి వెంకట్రెడ్డి ములుగు రూరల్: రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ దివాకరను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో యూరియా అందించాలన్నారు. లేని పక్షంలో పంటలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రైతులకు యూరియా అందించాలని కోరారు. రబీ సీజన్లో వడగండ్ల వానల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. జిల్లాలో 2,993 ఎకరాల్లో రూ.5.72కోట్ల మేర పంటనష్టం వాటిల్లిందని వివరించారు. యాసంగి సన్నదాన్యానికి బోసన్ డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుసంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం రాజేందర్, కొర్ర రాజు, కృష్ణారావు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న రైతులు మాత్రమే ఎంపిక
ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు సాగునీటిని అందించేందుకు సౌర జల గిరివికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు జనవరి నుంచి అధికారులు సర్వేలను ముమ్మరంగా చేపట్టారు. 2025–26 వరకు ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఐటీడీఏ అధికారులు ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో ఉన్న గిరిజనులు సాగుచేస్తున్న ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న భూములకు మాత్రమే ఈ పథకం వర్తించే విధంగా ప్రభుత్వం విధివిధానాలు రూపకల్పన చేసింది. అయితే ఈ సర్వేల ద్వారా ఇప్పటి వరకు 250 ఎకరాలను అధికారులు గుర్తించారు. ప్రభుత్వం 560 మందికి పథకం వర్తింపజేయాలని ఐటీటీఏకు టార్గెట్ను కేటాయించింది. దీంతో ఐటీడీఏ అధికారులు ఆర్ఓఎఫ్ఆర్ భూములు కలిగిన రైతుల వద్దకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. జీసీఎస్ద్వారా ఆ భూములను గుర్తించి అర్హులైన రైతుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల కలెక్టర్ దివాకర సైతం అధికారులతో సమీక్షించి ఈ పథకాన్ని అతి త్వరలో గ్రౌండింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. రెండు ఎకరాలకు పైనే.. రెండు ఎకరాలకు పైగా సాగు భూమి కలిగిన రైతులనే అర్హులుగా పరిగణలోకి తీసుకుంటారు. రెండు ఎకరాల కంటే తక్కువ ఉంటే పక్కనే ఉన్న గిరిజన రైతు భూమిని కలిసి ఒక యూనిట్ను మంజూరు చేస్తారు. ఇలా రెండు నుంచి ఆపైన భూమి కలిగి ఉన్న గిరిజన రైతులను ఇందిర సౌర జల గిరివికాసం పథకాన్ని అప్పగించనున్నారు. ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ అనేక మంది గిరిజన దర్బార్లో రైతులు వినతులు సమర్పిస్తున్నారు. వాటి ఆధారంగా సర్వేలు చేయడంతో పాటు నేరుగా వచ్చి దరఖాస్తులు చేసుకున్న వారితో పాటు అర్హులైన రైతుల భూములను కూడా పరిశీలించి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఒక్క యూనిట్కు రూ.6 లక్షలు గిరిజనుల ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూమిలో రైతుకు సోలార్ ప్యానెల్, బోరు, మోటారు ఇతర సామగ్రిని అందించడానికి ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా రూ.6 లక్షలతో ఒక యూనిట్ను మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ యూనిట్ మంజూరైన రైతు పొలంలో బోరును దింపి సోలార్ ప్యానెల్తో త్రీఫేజ్ విద్యుత్ వచ్చేలా సౌకర్యాలు ఏర్పాటు చేసి మోటారు బిగించి సాగునీరు అందేలా చూస్తారు. దీంతో ఒక రైతుకు రూ. 6 లక్షలు విలువ చేసే యూనిట్ దక్కనుంది. అయితే సర్వేలు పూర్తికాగానే యూనిట్ను మంజూరు చేసేందుకు ఐటీడీఏ పీఓ కావాల్సిన ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. దీంతో గిరిజనులకు సాగునీటి కష్టాలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో విద్యుత్ సరఫరా లేక అటవీ హక్కుల భూములకు మోటార్లను బిగించుకోలేక, పంటలు పండించక భూములు పడావు పడి ఉన్నాయి. ప్రస్తుతం సోలార్ వసతితో రెండు పంటలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ముమ్మరంగా కొనసాగుతున్న సర్వే 560 మందికి పథకం వర్తించేలా ఐటీడీఏకు టార్గెట్ -
ఓటరు తుది జాబితా ప్రదర్శన
ములుగు: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మండల పరిషత్ సభ్యులు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ సభ్యుల (జెడ్పీటీసీ) తుది ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాను జెడ్పీ సీఈఓ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.సంపత్రావు బుధవారం విడుదల చేశారు. ఈ నెల 8లోపు అభ్యంతరాలు స్వీకరించి, 9న అభ్యంతరాలు పరిష్కరించి, బుధవారం పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 గ్రామ పంచాయతీలు ఉండగా 10 జెడ్పీటీసీ స్థానాలు, 83 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 473 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటి పరిధిలో మొత్తం 2,29,159 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,10,838 మంది పురుషులు, 1,18,299 మంది మహిళలు, 22 మంది ఇతరులు ఉన్నారు.మండలం గ్రామ ఎంపీటీసీలు ఓటర్లు పంచాయతీలువెంకటాపురం(ఎం) 23 9 28,236 ఏటూరునాగారం 12 9 24,636 గోవిందరావుపేట 18 9 25,441 కన్నాయిగూడెం 11 5 9,992 మల్లంపల్లి 10 5 13,507 మంగపేట 25 14 39,369 ములుగు 19 9 24,985 ఎస్ఎస్ తాడ్వాయి 18 7 18,226 వెంకటాపురం(కె) 18 9 25,336 వాజేడు 17 7 19,431 171 గ్రామపంచాయతీలు 473 పోలింగ్ కేంద్రాలు జిల్లాలో 2,29,159 మంది ఓటర్లు -
ప్రతిభను వెలికితీసేందుకే పోటీలు
ములుగు/ములుగు రూరల్/ఏటూరునాగారం: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే కళాఉత్సవ్ పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయని జిల్లా విద్యాధికారి సిద్ధార్థరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సమగ్రశిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ కాటం మల్లారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కళాఉత్సవ్ పోటీలు జరగగా డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వివిధ విభాగాలలో పోటీలు నిర్వహించగా అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రాష్ట్రస్థాయి కళా ఉత్సవాలకు ఎంపికచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జయదేవ్, కోఆర్డినేటర్ సాంబయ్య, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కందాల రామయ్య, సముద్రాల శ్రీనివాసచారి, హమీద్, బాలాజీ రవి పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక ఈ కళాఉత్సవ్ పోటీల్లో బండారుపల్లి తెలంగాణ మోడల్ స్కూల్కు చెందిన విద్యార్థి దీక్షరామ్ క్లాసికల్ డ్యాన్స్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఎంఈఓ మల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు విద్యార్థిని డీఈఓ సిద్ధార్థరెడ్డి, పాఠశాల హెచ్ఎం దేవకి, సిబ్బంది అభినందనలు తెలిపారు. అదే విధంగా ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు కళాఉత్సవ్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారని ఎంఈఓ మల్లయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన గ్రూప్ డ్యాన్స్ , ఫోక్లో హర్షవర్ధన్, ఉమా మహేష్, రిషీక్, సాయినాధ్, కార్తీక్, వరుణ్, సందేశ్ల బృందానికి ప్రథమ బహుమతి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు వారు రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ 2025కు ఎంపికై నట్లు ఆయన వివరించారు.జిల్లా విద్యాధికారి సిద్ధార్థరెడ్డి -
మద్యం టెండర్లకు కసరత్తు
ఉమ్మడి వరంగల్లో జిల్లాల వారీగా మద్యం దుకాణాలుసాక్షిప్రతినిధి, వరంగల్: వైన్స్ (ఏ4)లకు 2025–27 సంవత్సరాలకు సంబంధించి టెండర్లు నిర్వహించేందుకు ఆబ్కారీ శాఖ సన్నద్ధమవుతోంది. వాస్తవానికి నవంబర్ నెలాఖరుతో గడువు ముగియనుండగా.. ఒక నెల ముందుగానే టెండర్లు నిర్వహించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వం 2023 ఆగస్టులోనే వైన్స్ల టెండర్లు నిర్వహించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎకై ్సజ్ పాలసీ అమల్లోకి వస్తున్నప్పటికీ అక్టోబర్లో టెండర్లు నిర్వహించాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్లతో ఇటీవల హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. దీంతో అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడవచ్చని అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్ 1 నుంచే కొత్త దుకాణాలు ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల సందర్భంగా 2023–25 ఎకై ్సజ్ పాలసీనే అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. ఈసారి కూడా ఆరు స్లాబుల విధానాన్నే అమలు చేయనున్నట్లు తెలిసింది. గతంలో 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షల లైసెన్స్ ఫీజు వసూలు చేశారు. 5 వేల నుంచి 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభాకు రూ.60 లక్షలు, లక్ష జనాభా నుంచి 5 లక్షల్లోపు ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల్లోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్లు లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. ఈసారి కూడా అదే పాలసీ అమలు చేయనుండడంతో ఎప్పటిలాగే టెండర్లు వేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. కాగా, డిసెంబర్ ఒకటి నుంచి రాబోయే రెండేళ్లకు సంబంధించి కొత్త పాలసీ అమలుల్లోకి రానుండగా.. గతంలో మాదిరిగానే దుకాణాలకు సంబంధించి మూడు సామాజికవర్గాల (గౌడ, ఎస్సీ, ఎస్టీ) వ్యాపారులకు 30 శాతం వరకు రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈసారి మద్యం దుకాణాల టెండర్లు పోటాపోటీగా సాగనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ–జాతరతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగనున్నాయన్న చర్చ ఇప్పటికే సాగుతోంది.జిల్లా వైన్స్లు హనుమకొండ 65వరంగల్ 63జనగామ 47మహబూబాబాద్ 59జేఎస్ భూపాలపల్లి ములుగు 60294మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు యథాతథంగా అమలు కానున్నట్లు, ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా.. టెండర్లు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈమేరకు మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించేలా జిల్లాల వారీగా మద్యనిషేధ, ఆబ్కారీ శాఖ చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరినట్లు సమాచారం. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో 2021–23 సంవత్సరాల నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఈసారి కూడా ఉమ్మడి వరంగల్లో 294 మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు పాటించనున్నారు. ఈలెక్కన ఉమ్మడి వరంగల్లో 15 శాతం రిజర్వేషన్ల కింద గౌడ సామాజికవర్గానికి 39 నుంచి 44 దుకాణాలు రానున్నాయంటున్నారు. ఎస్సీలకు 27 లేదా 29, ఎస్టీలకు 13 నుంచి 15 దుకాణాలు కేటాయించనున్నారు. సుమారు 206 నుంచి 215 మద్యం దుకాణాలకు ఓపెన్ కేటగిరీ కింద కేటాయించే అవకాశం ఉండగా.. ఇందులోనూ అన్ని సామాజికవర్గాలు పాల్గొనే వీలుంటుంది. కాగా, ఈసారి కూడా 2011 జనాభా ప్రకారమే షాపులు కేటాయించనుండగా, స్లాబ్ల విధానం కూడా గత పాలసీ ప్రకారమే కొనసాగించనున్నారు. అయితే గతంలో టెండర్ దరఖాస్తు ధర రూ.2 లక్షలు ఉండగా.. ఈ సారి రూ.3 లక్షలకు పెంచారు. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంపు త్వరలో టెండర్ల తేదీల ప్రకటన డీసీ కార్యాలయాలకు అందిన మార్గదర్శకాలు -
ఏజెన్సీ విద్యపై దృష్టి సారించాలని వినతి
వెంకటాపురం(కె): ఏజెన్సీ మండలాల్లో విద్యా వ్యవస్థపై అధికారులు దృష్టి సారించాలని కోరుతూ బుధవారం ఆదివాసీ నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి సిద్దార్ధరెడ్డికి వినతి ప్రతం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ నవ నిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు కోర్స నర్సింహమూర్తి మాట్లాడుతూ వెంకటాపురం, వాజేడు మండలాల్లో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందన్నారు. విద్యార్థులు వందల సంఖ్యలో ఉంటే ఉపాధ్యాయులు మాత్రం ఒక్కరే ఉంటున్నారని తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 11 మంది విద్యార్ధులకు ఒక్క ఉపాధ్యాయుడు ఉండాల్సి ఉండగా 30 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలే ఉన్నాయని తెలిపారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు కేవలం కేర్ టేకింగ్ స్కూల్స్గానే నడుస్తున్నాయని తెలిపారు. విద్యాబోదన సరిగా ఉండడం లేదన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజయ్, మహేష్, నారాయణ, నర్సింహరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పాలనలోనే సొంతింటి కల సాకారం
ములుగు రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే పేదల సొంతింటి కల సాకారం అవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర –శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని మదనపల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి మంత్రి బుధవారం హాజరై మాట్లాడారు. జిల్లాలో 5వేల ఇళ్లను మంజూరు చేశామన్నారు. ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి పనిచేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని గిరిజనభవన్లో నిర్వహించిన కృతజ్ఞత సన్మానసభకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ ఉపకులాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల్లో నియోజకవర్గంలో 100ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. జిల్లాకేంద్రంలో ఎస్సీ ఉపకులాలకు కమ్యూనిటీ భవన నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిందని తెలిపారు. అనంతరం మంత్రి సీతక్కను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, గడ్డం వెంకటేశ్వర్లు, కుమారస్వామి, రమేష్, గోపాల్ వెంకటరాంనర్సయ్య, రాజమౌళి, రమేష్ పాల్గొన్నారు. రూ.4లక్షల డిపాజిట్ పత్రాలు అందజేత ములుగు మున్సిపాలిటీ పరిధిలో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు మైదం మహేష్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు బాధిత కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించి బాధితుడి పిల్లల పేరున రూ.4లక్షల డిపాజిట్ చేసిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహేష్ మృతికి కారణమైన ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి స్వార్ధ రాజకీయాల కోసం మహేష్ మరణాన్ని వాడుకుంటున్నారని వివరించారు. అనంతరం మదనపల్లి గ్రామానికి చెందిన దూడపాక మహేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
మరింత సహకారం
రైతు ఉత్పత్తి సంఘాలుగా పీఏసీఎస్లుములుగు రూరల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు పంట రుణాలు అందించడం, వసూలు చేయడానికి పరిమితమైన పీఏసీఎస్లు రూపు మార్చుకోనున్నాయి. విడతల వారీగా సంఘాలను ఆధునికీకరించడంతో పాటు రైతులకు ఆదాయం పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రైతు ఉత్పత్తి సంఘాలను(ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) మార్పు చేసింది. ఈ మేరకు జిల్లాలో 8 సంఘాలను ఎంపిక చేసింది. 10 మండలాలు.. 12 సంఘాలు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 12 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో రైతు ఉత్పత్తి కేంద్రాలుగా 8 సంఘాలు ఎంపికయ్యాయి. ఈ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయనుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులే సంఘాలుగా ఏర్పడి తమ పంట ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పించనుంది. దీంతో పాటు ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు ఇవ్వనుంది. డ్రోన్, రోబోటిక్స్ వంటి యంత్రాల వినియోగంపై సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తోంది. మార్కెటింగ్, ధాన్యం నిల్వలు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ, పాల ఉత్పత్తి సంఘాల ఏర్పాటు, శీతల గిడ్డంగుల నిర్మాణం, జౌషది కేంద్రాల ఏర్పాటు, ఆధునిక వ్యవసాయ పరికరాల విక్రయం, మత్స్యకేంద్రాల నిర్వహణ వంటి వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తారు. నిర్వహణ ఖర్చులు మంజూరు రైతు ఉత్పత్తి కేంద్రాలుగా ఎంపికై న పీఏసీఎస్లకు ఏడాదికి రూ.6 లక్షల చొప్పున మూడేళ్లకు రూ.18లక్షలు నిర్వహణ ఖర్చుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దీంతో పాటు అదనంగా రూ.15 లక్షలు ఈక్విటి గ్రాంట్ విడుదల చేస్తుంది. ఒక్కో ఎఫ్పీఓకు క్రెడిట్ గ్యారంటరీ కింద రూ. 2 కోట్ల వరకు గ్యారంటీ సదుపాయం లభిస్తుంది. జిల్లాలో 8 సొసైటీల ఎంపిక ప్రభుత్వ నిధులతో వ్యాపారం రైతుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా అడుగులుజిల్లాలో మొత్తం 12 సంఘాలు ఉండగా అందులో 8 సంఘాలు రైతు ఉత్పత్తి కేంద్రాలుగా ఎంపికయ్యాయి. సంఘాల అభివృద్ధితో పాటు సొసైటీల పరిధిలో ఉన్న రైతులు ఐకమత్యంతో వ్యాపారం చేసుకోవడానికి వీలుకలుగుతుంది. సంఘాల పరిధిలోని రైతులకు ఆధునాతన వ్యసాయం, యాంత్రీకరణపై అవగాహన కల్పిస్తారు. – సర్దార్సింగ్, జిల్లా సహకార అధికారి -
వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి
ములుగు రూరల్: వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా సంక్షేమాధికారి తుల రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవన్లో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పట్టించుకోని పక్షంలో సీనియర్ సిటిజన్ యాక్టు ద్వారా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇలాంటి సమస్యను ఎదుర్కొనే వారు కలెక్టర్ లేదా ఆర్డీఓను సంప్రదించాలని సూచించారు. సీనియర్ సిటిజన్లు సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కార మార్గం చూపుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో బాసాని రాంమూర్తి, అసోసియేషన్ అధ్యక్షుడు దామెర నర్సయ్య, దామోదర్, యుగేందర్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం తాత్కాలిక కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్గా బాసాని రాంమూర్తి, కో కన్వీనర్లుగా వెంకట్రెడ్డి, చందర్రావు, సంజీవరావులను ఎన్నుకున్నారు. ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని బీసీ వెల్ఫేర్ అధికారి తులరవి అన్నారు. చాకలి ఐలమ్మ 40వ వర్థంతిని జిల్లా కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ అధికారి తుల రవి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ మహిళా శక్తికిప్రతీకగా నిలిచారన్నారు. భూస్వాముల దౌర్జన్యాలకు తలొగ్గకుండా రైతుల పక్షన నిలబడి పోరాడిన వీరవనిత అని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు రమేష్, చాపర్తి రాజు, మహేందర్, పరికరాల రవి, గూడెళ్లి ఓదెలు, నేరెళ్ల శంకర్, జాలిగం శ్రీనివాస్, భద్రయ్య, సారంగపాణి, బీసీ వెల్పెర్శాఖ అధికారులు సరిత, మానస, కుమారస్వామి, ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.జిల్లా సంక్షేమాధికారి తుల రవి -
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలి
హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లా పునర్నిర్మాణంలో వేగం పెంచాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలన్నారు. మంగళవారం హనుమకొండ అదాలత్ కూడలిలోని రాచకొండ ప్రవీణ్ నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల వివక్షకు గురికాగా, స్వరాష్ట్రంలో కల్వకుంట్ల పాలకుల కుటుంబ ప్రయోజనాల కోసం వరంగల్ జిల్లాను ముక్కలు చెక్కలు చేసి తీవ్ర విధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని ప్రకటించిన మేరకు వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒకే వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా రూ.6,000ల కోట్ల అభివృద్ధి నిధులను సమకూర్చి అండర్గ్రౌండ్ డ్రైనేజ్, మామునూరు ఎయిర్పోర్టు, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన అమలు చేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక కోఆర్డినేటర్ సోమ రామమూర్తి, ఆయా సంఘాల నాయకులు రాచకొండ ప్రవీణ్, సోమిడి శ్రీనివాస్, చాపర్తి కుమార్ గాడ్గే, సోయం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ -
సేవలు అందట్లే..
భూపాలపల్లి రూరల్: జిల్లాలో మూడేళ్లుగా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో గర్భిణులు, పిల్లలు, బాలింతలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ఇన్చార్జ్లతో కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు ప్రాజెక్టులు.. జిల్లాలో భూపాలపల్లి, మహదేవపూర్ అంగన్వాడీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 644 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 40 టీచర్, 120 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయడం లేదు. పదవీ విరమణ పొందిన వారితో పాటు విధుల్లో మరణించిన వారితో ఖాళీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతను పక్క కేంద్రాల టీచర్లకు అప్పగించడంతో వారిపై అదనపు పనిభారం పడుతోంది. దీంతో కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. టీచర్లు, హెల్పర్లది కీలక పాత్ర... ఐసీడీఎస్ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు క్షేత్రస్థాయిలో చాలా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఓ వైపు అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు పలు రకాల సేవలు అందిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. బూత్ లెవెల్ అధికారులుగా ఎన్నికల విధుల్లో సేవలు అందిస్తున్నారు. ఖాళీలు భర్తీ అయితే వీరికి పనిభారం తగ్గడంతోపాటు, కేంద్రాల్లో మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాల ఖాళీలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఖాళీలు ఉన్న కేంద్రాల్లో ఇన్చార్జ్లను నియమించాం. ఎప్పటికప్పుడు సీడీపీఓలు, సూపర్వైజర్లు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – మల్లీశ్వరి, ఇన్చార్జ్ జిల్లా సంక్షేమాధికారి మూడేళ్లుగా భర్తీకాని టీచర్, ఆయా పోస్టులు అంగన్వాడీల్లో ఇన్చార్జ్లతో కార్యకలాపాలు ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, పిల్లలు, బాలింతలు -
పంట నష్టపరిహార మహిళా సాధన కమిటీ ఎన్నిక
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర పంట నష్ట పరిహార మహిళ సాధన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ కమిటీ గౌరవ అధ్యక్షుడు రామసహాయం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం మేడారంలో కమిటీ అధ్యక్షుడు కృష్ణాఅర్జున్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మహిళ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా జాలిగాపు సరోజన, ప్రధాన కార్యదర్శిగా కొప్పుల బతుకమ్మ, ఉపాధ్యక్షులుగా నాలి ప్రతిభ, దానుక దేవమ్మ, చింత సునీత, గడ్డం సంధ్యారాణి, కార్యదర్శులుగా బోడ స్వరూప, జంగ వసుమతి, ఈక సుగుణ, ప్రచార కార్యదర్శులుగా దేవులపల్లి భద్రమ్మ, బానూరి రజిత, అల్లెం సరోజన, రాధమ్మలను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. మండల పరిధిలోని కొత్తూరులో 12న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి రైతులు, కుల సంఘాలు, రాజకీయ నాయకులు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచులు బాబురావు, గడ్డం అరుణ, నాయకులు సిద్ధబోయిన శివరాజ్, జంగా హన్మంతరెడ్డి, సోలం వెంకన్న సతీష్, సంకె ప్రణయ్ పాల్గొన్నారు. -
మహిళ ఆరోగ్యం..
జిల్లాలో మహిళల కోసం నాలుగు ఆరోగ్య క్లినిక్లుఇంటికి సౌభాగ్యంవెంకటాపురం(ఎం): మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు. మహిళల కోసం ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళ క్లినిక్లను ప్రారంభించింది. గ్రామీణ, పట్టణ ప్రాంత పేద మహిళలకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళా క్లినిక్లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లాలో 2023 మార్చి 8న గత ప్రభుత్వం ఆరోగ్య మహిళా క్లినిక్ సెంటర్లను ప్రారంభించి మహిళలకు వైద్య సేవలు అందిస్తుంది. జిల్లాలోని నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మహిళలకు ప్రతీ మంగళవారం వైద్యాధికారులు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. 33,788 మంది మహిళలకు పరీక్షలు జిల్లాలోని వెంకటాపురం(ఎం), మంగపేట, రొయ్యూరు, ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటు చేసిన మహిళా ఆరోగ్య క్లినిక్ల ద్వారా ఇప్పటి వరకు 33,788 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఇందులో అనుమానిత లక్షణాలు ఉన్న 287 మందిని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ఇందులో నోటి, రొమ్ము, గర్భసంచి క్యాన్సర్ లక్షణాలు, థైరాయిడ్, కడుపులో నీటి బుడగలు లాంటివి ఉన్న వారిని జిల్లా ఆస్పత్రితో పాటు వరంగల్ ఎంజీఎం, హైదారాబాద్లోని ఎంఎన్జే ఆస్పత్రికి సిఫారసు చేస్తున్నారు.● పీహెచ్సీల్లో ప్రతీ మంగళవారం పరీక్షలు ● ఇప్పటి వరకు 33,788 మందికి పరీక్షలు ● 18 మందికి క్యాన్సర్ ఉన్నట్లు గుర్తింపుప్రాథమిక దశలోనే గుర్తింపు ప్రతీ మంగళవారం మహిళా క్లినిక్ల ద్వారా వైద్య సిబ్బంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతీ మహిళకు ప్రాథమిక పరీక్షలు జరిపి వ్యాధిని నిర్ధారించడం, అనుమానితులను జిల్లా ఆస్పత్రులకు సిఫారసు చేస్తున్నారు. వ్యాధి గుర్తిస్తే ఉచితంగా వైద్య చికిత్సలు చేసి మందులు అందజేస్తున్నారు. మహిళలు ఆరోగ్య సమస్యలతో పాటు పలు రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. జిల్లాలో 18 మంది వివిధ రకాల క్యాన్సర్లతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. వ్యాధి తీవ్రమైన తర్వాత చికిత్స తీసుకోవడం కన్నా ప్రాథమిక దశలోనే పరీక్షల ద్వారా వ్యాధి లక్షణాలు గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా నయం చేయవచ్చని వైద్యాధికారులు మహిళలకు సూచిస్తున్నారు. మహిళలు తప్పకుండా పరీక్షలు చేసుకోవాలి మహిళలు ఏమైనా అనుమానిత లక్షణాలు ఉంటే సంబంధిత వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా పూర్తిగా వ్యాధిని నయం చేయవచ్చు.18 ఏళ్లలోపు ఆడపిల్లలకు థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటున్నందున తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్య మహిళా క్లినిక్ సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. మహిళలు, యువతులు మంచి పోషకాహారం తీసుకోవాలి. – చీర్ల శ్రీకాంత్, మాతా శిశుపోషక జిల్లా అధికారి ● -
రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ములుగు/వెంకటాపురం(ఎం)/గోవిందరావుపేట: జిల్లా కేంద్రంలోని అంతర్గత రోడ్లు, గ్రామీణ ప్రాంత రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి నుంచి మదనపల్లి వరకు రూ.4 కోట్లతో విస్తరించనున్న రహదారి, సెంట్రల్ లైటింగ్ పనులను కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్తో కలిసి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడమే కాకుండా రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లే రహదారులను విస్తరించనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో మహిళా శక్తి పథకం ద్వారా ఇద్దరు మహిళలకు రూ.10లక్షల విలువ చేసే మొబైల్ ఫిష్ ఔట్లేట్ వాహనాలను మంత్రి సీతక్క అందజేశారు. ఈక పద్మ, కట్ల శిరీషలకు 60శాతం సబ్సిడీపై వాహనాలను అందించారు. వీహబ్ ఆధ్వర్యంలో ర్యాంప్ ఉమెన్ ఆక్సెలేరేషన్ ప్రోగ్రాంపై అవగాహన సదస్సు నిర్వహించగా సీతక్క హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషన్ సంపత్, జిల్లా మత్స్యశాఖ అధికారి సల్మాన్రాజ్, ఫీల్డ్ ఆఫీసర్ రమేష్, వీహబ్ సీఈఓ సీత, అదనపు కలెక్టర్ సంపత్రావు, ఆసోసిఝెట్ డైరెక్టర్ ఊహా, డీఆర్డీఓ శ్రీనివాస్రావు, కోఆర్డినేటర్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. అలాగే వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని సింగరకుంటపల్లి పంచాయతీ భవన నిర్మాణానికి రూ. 20 లక్షలు, నర్సాపూర్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.40లక్షలు, నారాయణగిరిపల్లి అంగన్వాడీ భవన నిర్మాణానికి రూ.12లక్షలు, నారాయణగిరిపల్లెలో రూ.45లక్షలతో నిర్మించనున్న అంతర్గత రోడ్ల పనులకు కలెక్టర్తో కలిసి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన 495 కుటుంబాలకు, గోవిందరావుపేట మండలంలోని ప్రాజెక్టునగర్లో 149 కుటుంబాలకు యునైటెడ్ వే, ఇన్ఫోసెస్ సంస్థల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను మంత్రి సీతక్క చేతుల మీదుగా పంపిణీ చేశారు. పంటనష్ట పరిహారంపై సానుకూలం ఎస్ఎస్తాడ్వాయి: మేడారం రైతుల పంటనష్ట పరిహారంపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. మంగళవారం మేడారానికి వచ్చిన మంత్రి సీతక్కను పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్, కాంగ్రెస్ నాయకులు అనంతరెడ్డి, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షుడు చర్పా రవీందర్ల ఆధ్వర్యంలో మేడారం ప్రాంతంలోని రైతులు పంట నష్టపరిహారం ఇప్పించాలని మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. జాతర సమయంలో భక్తుల వాహనాలు పార్కింగ్ కోసం 1500 ఎకరాలు నష్ట పోతున్నారని సీతక్కకు వివరించగా పరిహారం ఇప్పించేందుకు వెంటనే సర్వే నిర్వహించి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ముజఫర్, నాయకులు పీరీల వెంకన్న, జంగా వెంకటేశ్, వీరమోహన్ రావు, రాజయ్య, బాపురెడ్డి, పోడెం బాబు రైతులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి సీతక్క -
కాళోజీ సేవలు మరువలేనివి
● అదనపు కలెక్టర్ సంపత్రావు ములుగు రూరల్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని అదనపు కలెక్టర్ సంపత్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి అదనపు కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ కాళోజీ నారాయణరావు తెలుగు సాహిత్యం, ప్రజా ఉద్యమాల్లో చేసిన కృషి విశేషమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయ ఏవో రాజ్కుమార్, సూపరింటెండెంట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో.. ములుగు: అదే విధంగా ములుగు మున్సిపల్ కార్యాలయంలో కాళోజీ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ పాల్గొని కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే గోవిందరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మమత, అధికారులు లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యనందించాలి
ములుగు రూరల్: గురుకుల పాఠశాలలు, ఆశ్రమ, మోడల్, కేజీబీవీ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుకుల, ఆశ్రమ పాఠశాలలు, మోడల్, కేజీబీవీల్లో నిత్యం విద్యాశాఖ అధికారులు తనిఖీ నిర్వహించాలన్నారు. వార్డెన్ నుంచి డీఈఓ వరకు విధులు సక్రమంగా నిర్వహించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఏపీఓ వసంతరావు, డీఈఓ సిద్ధార్థరెడ్డి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, గిరిజనశాఖ ఆర్సీఓ హరిసింగ్, మైనార్టీ వెల్ఫేర్ అధికారి సర్ధార్, అధికారులు పాల్గొన్నారు. రేపు స్థానిక సంస్థల తుది ఓటరు జాబితా ములుగు: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈనెల 10న వెలువరించడం జరుగుతుందని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి వారితో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితా ప్రదర్శన చేయడం జరిగిందన్నారు. ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలన్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి మార్పులు, చేర్పుల ఆనంతరం తుది జాబితాను వెలువరిస్తామన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్రావు, డీప్యూటీ ఈఓ రాజు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్ దివాకర -
పరిష్కారం ఏదీ?
ములుగు రూరల్: ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లు రాలేదని ఒకరు, పింఛన్ మంజూరు చేయాలని వృద్ధుడు, ఉపాధి కల్పించాలని మరొకరు.. ఇలా జిల్లా వ్యాప్తంగా పలువురు సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుంచి కలెక్టర్ దివాకర దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. గ్రీవెన్స్లో మొత్తం 49 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను సత్వర పరిష్కారం చూపాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులు, పెండింగ్ దరఖాస్తుల వివరాలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం కాని దరఖాస్తులు అర్జీదారులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు. శాఖల వారీగా దరఖాస్తులు ఇలా.. ప్రజావాణిలో మొత్తం 49 దరఖాస్తులు రాగా గృహ నిర్మాణ శాఖ 13, భూ సమస్యలు 10, పెన్షన్ 9, ఉపాధి కల్పన 2, ఇతర శాఖలకు సంబంధించినవి 15 దరఖాస్తులు వచ్చాయి. ఏటూరునాగారం: గిరిజన దర్బార్లో గిరిజనులు సమర్పించిన వినతులను పరిశీలించి వాటికి పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపడుతామని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం 16 మంది గిరిజనుల నుంచి వినతులను స్వీకరించారు. ఏటూరునాగారం మండలం ఎస్టీ నాయకపోడు చెందిన గిరిజనులమని, గోదావరి నది ప్రాంతానికి దగ్గర ఉండడంతో వరదలు వస్తే ఇళ్లు ఖాళీ చేయాల్సి వస్తోందని, తమకు ఇంటి స్థలం, ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. వెంకటాపురం(కె) మండలం సీతారాంపురం గ్రామంలో రోడ్డు, పూసూరు వాగుపై కాజ్వే నిర్మించి రవాణా మార్గం ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఏటూరునాగారం మండలం లంబాడీతండాకు చెందిన గిరిజనుడు ఈఎస్ఎస్లో మంజూరు అయిన కెనరా బ్యాంక్లో సబ్సిడీ జమ అయిన డబ్బులను ఇవ్వడం లేదని, వాటిని ఇప్పించాలని పీఓకు మొరపెట్టుకున్నారు. కన్నాయిగూడెం మండలం సర్వాయిగ్రామంలో సమ్మక్క సారలమ్మ గుడి వెళ్లే దారిని మరమ్మతు చేయాలని విన్నవించారు. తాడ్వాయి మండలం ఒడ్డుగూడెంలో త్రీఫేజ్ కరెంటు, వ్యవసాయ పంటలకు బోర్లు మంజూరు చేయాలని గిరిజనులు కోరారు. ఇలా పలువురు తమ సమస్యలను పరిష్కరించాలని పీఓకు విన్నవించారు. వినతులు పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తామని పీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేష్బాబు, జీసీసీ డీఎం వాణి, డీటీలు కిషోర్, అనిల్, ప్రోగ్రాం ఆఫీసర్ మహేందర్, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో 49, ఐటీడీఏలో 16 వినతులు స్వీకరించిన కలెక్టర్ దివాకర, పీఓ చిత్రామిశ్రా సత్వరమే పరిష్కరించాలని ఆదేశం -
ఉన్నట్టా.. లేనట్టా!
● నాలుగు రోజులుగా కనిపించని పెద్దపులి ● గాలింపు చర్యలు చేపడుతున్న ఫారెస్ట్ అధికారులుములుగు: జిల్లాలో ఐదు రోజుల క్రితం ఆకస్మికంగా దర్శనమిచ్చిన పెద్దపులి జాడ దొరకడం లేదు. ఈనెల 3న ములుగు మండలంలోని పత్తిపల్లిలో పు లి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించా రు. 4న వెంకటాపురం(ఎం) మండలంలోని నర్సాపూర్ శివారులో పెద్దపులి అడుగులను గుర్తించిన అటవీశాఖ అధికారులు పాలంపేట వానగుట్ట వైపు వెళ్లినట్లు చెప్పారు. అప్పటి నుంచి పులి జాడ దొరకడం లేదు. అటవీశాఖ అధికారులు మాత్రం వానగుట్ట సమీపంలోనే ఉందని చెబుతున్నారు. రోజుకు 20 నుంచి 30 కిలోమీటర్ల వరకు నడిచే పెద్దపులి వానగుట్ట సమీపంలోనే మకాం వేసి ఉందని చె బుతుండడం అనుమానాలకు తావిస్తోంది. గత సంవత్సరం డిసెంబర్ 10న గోదావరి దాటి జిల్లాలోకి ప్రవేశించిన బెంగాల్ టైగర్ వెంకటాపురం(కె) మండలంలోని బోదాపూర్ మీదుగా మల్లూరు గుట్టల వైపు వెళ్లినట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. 2025 మార్చి 7న వెంకటాపురం(ఎం) మండలంలోని లింగాపూర్ ప్రాంతంలో పులి సంచరించింది. ప్రతీఏటా పులులు జిల్లాలో సంచరిస్తున్నా..వాటికి భద్రత లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021లో జిల్లా కేంద్రం మీదుగా పులి చర్మాన్ని తరలిస్తున్న స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 2022 లో తాడ్వాయి మండలంలో వేటగాళ్ల ఉచ్చులకు గర్భంతో ఉన్న పులి (ఎస్–1) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వానగుట్టలో వేటగాళ్ల ఉచ్చు.. వానగుట్ట, వరాలగుట్ట ప్రాంతంలో అడవి పందుల కోసం వేటగాళ్లు ఉచ్చులు పెట్టినట్లు అనుమానా లున్నాయి. నాలుగు రోజులుగా పులి జాడ తెలవకపోవడంతో పాటు రైతులు, పశువుల కాపరులు పా దముద్రలు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందిస్తే త ప్ప అధికారులు స్వచ్ఛందంగా తెలుసుకునే పరిస్థి తి కనిపించడం లేదు. అ క్రమ కలప రవాణా, ఇస ుక రవాణాపై రాత్రింబవ ళ్లు విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారులకు జిల్లాలో సంచరిస్తున్న పులి ప్రయాణంపై సమాచారం లేకుండాపోయింది. పు లి కోసం గాలిస్తున్నామని చెబుతున్నారే తప్ప పులి వానగుట్ట ప్రాంతంలో ఉందా.. ఇతర ప్రాంతానికి తరలివెళ్లిందా.. అనే పూర్తి వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం. పులి వేటగాళ్ల ఉచ్చులకు బలి కాకముందే గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించి, భద్రత చర్యలు చేపట్టాలని వన్యప్రాణుల ప్రేమికులు కోరుతున్నారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఎమ్మార్పీఎస్ జాతీయ నేత, దళిత రత్న నెమలి నర్సయ్య, జిల్లా ఇన్చార్జ్ చాతాల్ల రమేశ్ అన్నారు. సోమవారం ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి నుంచి ర్యాలీగా వెళ్లిన నాయకులను, పెన్షన్దారులను కలెక్టరేట్ గేటు వద్దనే పోలీసులు నిలిపేశారు. దీంతో పోలీసులకు, ఎమ్మార్పీఎస్ నాయకుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఎమ్మార్పీఎస్ నాయకులు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు పెంచి ఇవ్వాలన్నారు. ఇప్పటికై న ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీఎస్ రాష్ట్ర నాయకుడు మంచోదు చంద్రమౌళి, తడుగుల విజయ, వెలుకుర్తి మోహన్రావు, మహాజన సోషలిస్టు పార్టీ నాయకుడు కల్లేపల్లి రమేశ్, వికలాంగుల కుల పోరాట సమితి నాయకులు దూడపాక రాజు, కొండి రమేశ్, గజ్జల ప్రసాద్, మరాటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
చాట్బాట్ను సద్వినియోగం చేసుకోవాలి
ములుగు: విద్యుత్ వినియోగదారుల కోసం తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టీజీఎన్పీడీసీఎల్) ఆధ్వర్యంలో వాట్సాప్ చాట్ బాట్ను అందుబాటులోకి తెచ్చినట్లు ములుగు డివిజనల్ ఇంజనీర్ నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ వినియోగదారులు స్మార్ట్ఫోన్ వాట్సాప్లో 7901628348 నంబర్కు హాయ్ అని మెసేజ్ పంపగానే వెల్కమ్ టు టీజీఎన్పీడీసీఎల్ కాల్ సెంటర్ అని సందేశం అందుతుందన్నారు. వెంటనే రిజిస్టర్ కంప్లైంట్, ట్రాక్ కంప్లైంట్, చాట్ విత్ ఏజెంట్ వంటి ఆప్షన్లు వస్తాయన్నారు. వినియోగదారులు యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేస్తే వెంటనే విద్యుత్ సర్వీస్ వివరాలు ప్రదర్శించ బడతాయన్నారు. వివరాలను ఓకే చేసిన తర్వాత కంప్లైంట్కు సంబంధించిన విభాగాల మెనూ కనిపిస్తుందని, వినియోగదారుడు తాను ఎదుర్కొంటున్న సమస్యను ఎంచుకుని ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చన్నారు. అలాగే సమస్య పురోగతి ట్రాక్ చేసుకోవచ్చని తెలిపారు. సమస్య పరిష్కారమైన తర్వాత వినియోగదారుడికి ఐవీఆర్ఎస్ కాల్ వస్తుంది. వినియోగదారుడు సంతృప్తి చెందనట్లయితే కంప్లైంట్ను మళ్లీ రీఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. వినియోగదారుల సమస్యలను త్వరగా పరిష్కరించడం, సమయాన్ని ఆదా చేయడం, పారదర్శకతను కాపాడటం చాట్బాట్ ప్రత్యేకత అన్నారు. వినియోగదారులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని డివిజనల్ ఇంజనీర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు.టీజీ ఎన్పీడీసీఎల్ డీఈ నాగేశ్వరరావు -
మాత్రలు మింగి విద్యార్థినికి అస్వస్థత
ఎస్ఎస్తాడ్వాయి: మండలంలోని మేడారం ఇంగ్లిష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని పారాసెటమాల్ మాత్రలు (ట్యాబెట్లు) మింగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి... వెంకటాపురం మండలంలోని రామంజపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి సాయిప్రసన్నకు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఇంటికి తీసుకెళ్లి వారం రోజుల క్రితం పాఠశాలకు తీసుకువచ్చారు. ఇన్ని రోజులు ఇంటి వద్ద ఏమి చేశావని హిందీ టీచర్ ఆమెను మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఎక్కువ మొత్తంలో జ్వరం ట్యాబెట్లు (పారాసెటమాల్) వేసుకుంది. గమనించిన పాఠశాల నిర్వాహకులు, సిబ్బంది వైద్య చికిత్స కోసం ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై హెచ్ఎం సాయిబాబాను వివరణగా కోరగా విద్యార్థి సాయిప్రసన్నకు జ్వరం ఉండటంతో ఇంటికి వెళ్లి వచ్చిందని, తరగతి గదిలో కొంతమంది విద్యార్థినులను ఎఫ్ఏ మొదటి యూనిట్ పరీక్ష రాయలేదని, రెండో ఎఫ్ఏ యూనిట్ పరీక్ష ఎలా రాస్తారని టీచర్ ప్రశ్నించారు. అంతేగాని సాయిప్రసన్నను మందలించడం, తిట్టిందనే పుకార్లు అవాస్తవమన్నారు. -
భక్తుల భద్రతకు చర్యలేవి?
ఎస్ఎస్తాడ్వాయి: ఇటీవల జోరుగా వర్షాలు కురియడంతో మేడారం జంపన్నవాగులో వరద ప్రవాహం కొనసాగుతోంది. మొన్నటి వరకు ఇసుక దిబ్బలతో కనిపించగా నేడు నీటితో కళకళలాడుతోంది. దీంతో తొలుత స్నానఘట్టాలపై ఉన్న షవర్ కింద పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు ప్రస్తుతం వాగులోనే స్నానాలు చేస్తున్నారు. వరద ఉధృతితో వాగులో భక్తులు ప్రమాదాల బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవాలని మేడారం దేవాదాయశాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమకేమీ పట్టనట్లుగా వ్యహరిస్తున్నారే విమర్శలు వస్తున్నాయి. ఆదివారం తాజాగా అమ్మవార్ల దర్శనానికి వచ్చిన జనగామకు చెందిన కనికంటి మనీష్ జంపన్నవాగులో స్నాన చేసేందుకు వెళ్లి గల్లంతై మృత్యువాత పడ్డాడు. ఇలాంటి ఘటనలు ప్రతిఏటా వర్షాకాలంలో చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల నివారణకు చర్యలు నిల్.. మేడారం వచ్చిన భక్తులు చాలా మంది జంపన్నవాగు నీటిలో పుణ్యస్నానాలు చేస్తేనే మంచిదని విశ్వసిస్తారు. వాగు వరద సమాంతరంగా వెళ్లడంతో స్నానాలకు వెళ్లిన భక్తులకు నీటి లోతు తెలియకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. గతంలో భక్తులు నీట మునిగి మృత్యువాత పడిన విషాద ఘటనలు ఉన్నాయి. హెచ్చరిక బోర్డులతో నివారణ జంపన్నవాగులో నీటి ప్రవాహం, ప్రమాదభరితంగా ఉన్న స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చు. ప్రస్తుతం రెడ్డిగూడెం లోలెవల్ కాజ్వే వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. మేడారానికి వచ్చిన భక్తులు చాలా మంది ఈ–కాజ్వే వద్ద నీటి ప్రదేశంలో ఎక్కువగా స్నానాలు చేస్తుంటారు. కాజ్వే కింద వాగులో నీరు కూడా సమృద్ధిగా ఉండడంతో భక్తులు స్నానాలు చేస్తుంటారు. కానీ లోతు కూడా భారీగానే ఉంటుంది. ఈ–కాజ్వే ప్రాంతంలో గతంలో పదుల సంఖ్యలో భక్తులు నీటమునిగి మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. ఈ లోలెవల్ కాజ్వే వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అలాగే ఊరట్టం జంపన్నవాగు వద్ద కాజ్వే ధ్వంసమైన ప్రదేశంలో కూడా నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా భక్తులు స్నానాలు చేస్తుంటారు. గత మూడేళ్ల క్రితం వర్షాకాలంలో ఇద్దరు భక్తులు ఒకేసారి నీటి మునిగి మృత్యువాత పడ్డారు. అలాగే జంపన్నవాగు వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తే పుణ్యస్నానాలు చేసే భక్తులకు సూచనలు చేయడంతో పాటు ప్రమాదవశాత్తు నీటమునిగిన భక్తులను కాపాడే అవకాశం ఉంటుంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. హెచ్చరిక బోర్డులు కరువు పట్టించుకోని అధికారులు -
అభివృద్ధిపై దృష్టి సారించని మంత్రులు
వెంకటాపురం(కె): జిల్లాకు ఇద్దరు మంత్రులు ఉన్నా అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మండలంలోని రోడ్డు సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టి ముగింపు సభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క ఇద్దరు మంత్రులు ఉన్నా ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వాలు రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పార్టీ మారిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. వందలాది ఇసుక లారీల రాకపోకలతోనే రోడ్డు పాడైపోయిందన్నారు. ఇసుక లారీలతో వచ్చే ఆదాయంతో రోడ్డు నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమస్యను పరిష్కరించపోతే దశల వారీగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ, మండల కార్యదర్శి గ్యానం వాసు, వంకా రాములు, కుమ్మరి శ్రీను, కట్ల నర్సింహచారి తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రంగారెడ్డి -
కాళేశ్వరంలో బాలకవి సమ్మేళనం
కాళేశ్వరం: తెలంగాణ భాషా దినోత్సవం (కాళోజీ జయంతి) పురస్కరించుకొని పీఎం శ్రీ కాళేశ్వరం పాఠశాలలో ఆదివారం ‘బాలకవి సమ్మేళనం’ నిర్వహించారు. కాళేశ్వరం, మహదేవపూర్ పాఠశాల బాల బాలికలు కవితా పఠనం కార్యక్రమం పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం దొనికల రాజేందర్ అధ్యక్షతన జరిగింది. 20 మంది బాల కవులతో పాటు 20 మంది కాళేశ్వరం పాఖాల కవులు పాల్గొని తెలుగుభాష, తెలంగాణ నుడికారం, పలుకు బడుల సోయగం, కాళోజీ ఔన్నత్యాన్ని కవితలతో అక్షరాంజలి సమర్పించారు. బాల కవులు విద్య, అక్షయ, జ్యోతిక, తన్మయి, తరుణ, సంయుక్త ఉత్తమ ప్రదర్శనతో సభను రంజింపచేశారు. హెచ్ఎం రాజేందర్ మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో పాఠశాలలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్య అతిథి మాడుగుల భాస్కరశర్మ మాట్లాడుతూ కవి సమ్మేళనం గొప్ప కార్యక్రమన్నారు. సాహిత్య కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరానికి చెందిన కవులు మాడుగుల భాస్కరశర్మ, నారాయణమూర్తి, శ్రీనివాస శర్మ, రామగుండం రామ్మూర్తి, ఉపాధ్యాయులు మడక మధు, జ్యోతి, శ్రీధర్, శ్యామ్, బండారి రాజ్ కుమార్లతో పాటు తండా హరీశ్గౌడ్, రహీమొద్దీన్, గన్నోజు ప్రసాద్, చిట్ల ప్రేమ్ కుమార్, పుచ్చ కుమారస్వామి, కాయ్యడ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
జీపీఓలు వస్తున్నారు..
వెంకటాపురం(ఎం): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామపాలన అధికారులు రానే వచ్చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టు 1న వీఆర్ఓ వ్యవస్థను, 10వ తేదీన వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వీఆర్ఓ, వీఆర్ఏలను ఇతర శాఖలకు బదలాయించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని రద్దు చేయడంతో పాటు గతంలో ఉన్న వీఆర్ఏ, వీఆర్ఓలను తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకునేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లాలో 97 మంది దరఖాస్తు చేసుకోగా వారికి పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారిని జీపీఓలుగా ఎంపిక చేశారు. ఈనెల 5న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా జిల్లాకు చెందిన 47 మంది గ్రామపాలన అధికారులు నియామక పత్రాలు అందుకున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో జీపీఓలను గ్రామాలకు కేటాయించనున్నారు. దీంతో గ్రామాల్లో జీపీఓల వ్యవస్థ ప్రారంభమైతే రైతులకు సంబంధించిన భూ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 గ్రామ పంచాయతీలు ఉండగా 335 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ గ్రామాలను 99 క్లస్టర్లుగా విభజించారు. ప్రతీ క్లస్టరుకు ఒక జీపీఓను కేటాయించి బాధ్యతలను అప్పగించనున్నారు. జిల్లాలో 99 క్లస్టర్లకు 47 మంది జీపీఓలను (గ్రామపాలన అధికారులు) మాత్రమే ఎంపిక చేయడంతో మిగిలిన 52 క్లస్టర్లలో రెవెన్యూశాఖలో పనిచేస్తున్న జూనియర్ ఆసిస్టెంట్లకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. కొత్తగా గ్రామాల్లో బాధ్యతలు చేపట్టే గ్రామపాలన అధికారులు పల్లెల్లో ప్రజలతో నిత్యం మమేకమై పని చేయాల్సి ఉంటుంది. భూమి వివాదాల పరిష్కారం, కొలతలు, పహాణీల సవరణలు, ఎన్నికల విధులు, ఓటరు జాబితా పనులు, గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రజా సమస్యలు, పరిపాలన సమస్యలు పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. గతంలో పనిచేసిన వీఆర్ఓలను తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకొని గ్రామాలకు జీపీఓలుగా నియమి స్తుండడంతో శాఖాపరమైన ఇబ్బందులు తొలగనున్నాయి. గ్రామస్థాయిలో వీఆర్ఏ, వీఆర్ఓలు లేక ఆర్ఐ(రెవెన్యూ ఇన్స్పెక్టర్)లపై అదనపు భారం పడేది. ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించిన సమయాల్లో, విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ, విచారణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రస్తుతం గ్రామాల్లో గ్రామపాలన అధికారుల వ్యవస్థ మొదలు కానుండడంతో రెవెన్యూశాఖకు కొంతమేర ఇబ్బందులు తొలగనున్నాయి. కొండాయి గ్రామం వ్యూ జిల్లాలో 47 మంది గ్రామాధికారుల నియామకం సీఎం చేతుల మీదుగా నియామకపత్రాలు రెవెన్యూశాఖలో తొలగనున్న ఇబ్బందులు జిల్లాలో 355 గ్రామాలు 99 క్లస్టర్లు -
‘డబుల్’.. ఎన్నాళ్లీ ట్రబుల్!
సాక్షిప్రతినిధి, వరంగల్:● హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో 790 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 520 ఇళ్లు నిర్మించారు. మర్రిపల్లిగూడెం, గూడూరులో 50 చొప్పున 100 ఇళ్లు, కమలాపూర్లో 320 నిర్మించారు. రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్, వాటర్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కొద్ది రోజులు కాలయాపన జరిగింది. ఇప్పటికీ లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేయకపోవడంతో ఇళ్లు నిరుపయోగంగానే ఉన్నాయి. ● మహబూబాబాద్ జిల్లాలో 5,567 ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. 2024 వరకు 2,503 మాత్రమే పూర్తయ్యాయి. అందులో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 1,256 మందికి పంపిణీ చేశారు. ఇంకా 3,064 ఇండ్లు వివిధ స్థాయిల్లో ఉండగా.. పూర్తయిన 2,503 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇంకా 1,247 లబ్ధిదారులకు అందజేయడంలో కాలయాపన జరుగుతోంది. .. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోక్షం కలగడం లేదు. నిర్మాణాలు పూర్తయినా ఇళ్లపంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఫలితంగా మూడేళ్ల కిందట పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీకి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వివిధ స్థాయిల్లో నిలిచిపోయిన నిర్మాణాల్లో గడ్డి, ముళ్లపొదలు ఏర్పడ్డాయి. పంపిణీ చేసిన వాటిలో సరైన మౌలిక సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లు పథకంలో అవకాశం రాక అర్హులైన వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, పూర్తయిన వాటిని పంపిణీ చేయాలన్న డిమాండ్ వస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకాశం రాని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సొంతింటికలను సాకారం చేసే లక్ష్యంతో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని అమలు చేసింది. ఉమ్మడి వరంగల్లో ఈ పథకం కింద రెండు విడతల్లో 26,284 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో అధికారులు చెబుతున్న ప్రకారం సుమారు రూ.860 కోట్ల వరకు ఖర్చు చేసి 10,939 (41.62 శాతం) ఇళ్లు పూర్తి చేశారు. అందులో నుంచి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 4,874 (44.56 శాతం) రెండు పకడల గదుల ఇళ్లను పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా మంజూరైన మొత్తం 26,284లలో 4100 వరకు వివిధ కారణాలతో నిర్మాణాలు మొదలు పెట్టలేదు. నిర్మాణాలు ప్రారంభించిన 22,184 ఇళ్లలో 10,939 పూర్తయ్యాయి. 11,245 ఇళ్లు వివిధ స్థాయిల్లో నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఈ ఇళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. పూర్తయిన 10,939 ఇళ్లలో 4,874 ఇళ్లు మాత్రమే పంపిణీ చేశారు. 6,065 ఇళ్ల మంజూరులో జాప్యం జరుగుతుండడంతో ఉండడానికి గూడులేక వేలాది మంది నిరుపేదలు ఏళ్లపాటు గుడిసెల్లో జీవిస్తూ పక్కా ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.జిల్లా మంజూరు పూర్తి పంపిణీ హనుమకొండ 4,326 2,143 1,200 వరంగల్ 6,350 2,350 1,250 జేఎస్ భూపాలపల్లి 3,882 1,615 710 జనగామ 4,400 1,600 750 ములుగు 1,800 950 300 మంజూరైన ఇళ్లలో పూర్తయినవి 41.62 శాతమే పూర్తయిన ఇళ్లలో పంపిణీ చేసింది 44.56 శాతం చాలాచోట్ల శిథిలావస్థకు గృహాలు వివిధ స్థాయిల్లో నిలిచినవి 11,245.. ఆ నిర్మాణాలపై నీలినీడలు నెరవేరని పేదోళ్ల సొంతింటి కల.. ‘ఇందిరమ్మ’పై అర్హుల ఆశలు -
హేమాచలుడి ఆలయం మూసివేత
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా పూజారులు స్వామి వారి గర్భాలయం, ఉప ఆలయాల్లో ఆదివారం మధ్యాహ్నం నైవేద్యం సమర్పణ అనంతరం ద్వార బంధనం చేసి ఆలయాలను మూసివేసినట్లు ఈఓ రేవెల్లి మహేష్ తెలిపారు. సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసిన అనంతరం సోమవారం ఆలయంలో సంప్రోక్షణ పూజా కార్యక్రమాలను నిర్వహించి ఉదయం 9 గంటల నుంచి పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. భక్తులు స్వామివారిని ఎప్పటి విధంగానే దర్శించుకోవచ్చని ఈఓ తెలిపారు. -
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
ములుగు/ములుగు రూరల్: పెండింగ్లో ఉన్న మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల మూడు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ వర్కర్స్, అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులకు జీఓ నంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కార్మికులను పర్మనెంట్ చేయాలన్నారు. కనీస వేతనాల అమలుతో పాటు 2వ పీఆర్సీ ప్రకారం రూ. 26వేలు చెల్లించాలని కోరారు. అదే విధంగా కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రమాదాలలో మరణించిన కార్మికులకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం యూనియన్ నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నద్దునూరి సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా మాట్ల జయకర్, కోశాధికారిగా కావటి భాస్కర్, ఉపాధ్యక్షుడిగా నాంపెల్లి రఘు, ఎంపెల్లి స్వరూప, సహాయ కార్యదర్శులుగా గడ్డం నాగార్జున, దామర రాజు, కమిటీ సభ్యులుగా సాంబయ్య, రఘు, రాజేశ్వరి, మహేష్, బాలు, రాజేష్, పల్లవి, రంజిత్లను ఎన్నుకున్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ -
రూ.100 కోట్లు కేటాయించాలి
రహదారుల మరమ్మతులకు వెంకటాపురం(కె): మండలంలోని ఆర్అండ్బీ రహదారుల మరమ్మతులకు రూ.100 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మండల పరిధిలోని యాకన్నగూడెం నుంచి మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శనివారం పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెబుతున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ మండలంలో ఏం అభివృద్ధి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ఆయన గాలికి వదలడం సరికాదన్నారు. ఎమ్మెల్యే వైఫల్యం కారణంగానే రోడ్లు అధ్వానంగా మారాయని విమర్శించారు. ఒక్కొక్క ఇసుక లారీ నుంచి ప్రభుత్వం టాక్స్ల పేరుతో రూ.1340 వసూలు చేస్తూ రోడ్ల ను ఎందుకు మరమ్మతులు చేయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, మండల కార్యదర్శి గ్యానం వాసు, నాయకులు కుమ్మరి శ్రీను, కట్ల నర్సింహచారి, తోట నాగేశ్వరావు, కుంజా శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కృష్ణారెడ్డి -
యూరియా కోసం బారులు
ఎస్ఎస్తాడ్వాయి: మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట శనివారం యూరియా బస్తాల కోసం రైతులు క్యూలో బారులుదీరారు. పది రోజుల తర్వాత సహకార సంఘం కార్యాలయానికి యూరియా బస్తాలు రావడంతో రైతులు ఒక్కసారిగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఎస్సై శ్రీకాంత్రెడ్డి, ట్రైనీ ఎస్సై మధు రైతులు ఇబ్బంది పడకుండా క్రమ పద్ధతిలో యూరియా బస్తాల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. రైతులు కార్యాలయం నుంచి జాతీయ రహదారి వరకు క్యూ కట్టి గంటల తరబడి క్యూలో నిలబడి పలువురు రైతులు ఇబ్బంది పడ్డారు. మండల వ్యవసాయశాఖ అధికారి కుమార్యాదవ్, ఇద్దరు ఏఈఓలను పీఏసీఎస్ కార్యాలయం వద్ద అందుబాటులో ఉంచారు. పట్టాపాస్ పుస్తకం, ఆధార్కార్డు తీసుకు వచ్చిన రైతులకు అధికారులు ఒక్కో రైతుకు రెండు బస్తాలను పంపిణీ చేశారు. మరికొంతమంది రైతులకు యూరియా బస్తాలు దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. -
లడ్డూ @ రూ.1.16 లక్షలు
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని గణేశ్ చౌక్ వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా వినాయక లడ్డూ వేలం పాటను నిర్వహకులు నిర్వహించగా జిల్లా కేంద్రంలోని వారాహి రెస్టారెంట్ యజమాని బొమ్మగాని హైమవతి–జగదీశ్వర్ దంపతులు రూ.1.16లక్షలకు పాడి దక్కించుకున్నారు. ఈ మేరకు నిర్వహకులు వారికి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు చింతలపూడి భాస్కర్రెడ్డి, బలరాం, కొత్త సురేందర్, ఇమ్మడి రాకేష్యాదవ్, ఎల్లావుల అశోక్, రాకేష్రెడ్డి, అజయ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పరిషత్కు ముందడుగు !
ములుగు: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రాదేశిక ఎన్నికలకు ముందడుగు పడింది. మండల పరిషత్ సభ్యులు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ సభ్యుల (జెడ్పీటీసీ) ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల రూపకల్పనపై జెడ్పీ సీఈఓ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.సంపత్రావు శనివారం డ్రాఫ్ట్(ముసాయిదా)ను విడుదల చేశారు. రేపటి(సోమవారం) లోపు అభ్యంతరాలు స్వీకరించి, 9న పరిష్కరించి, 10న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఓటర్ల జాబితా యథావిధిగా ఉండనుండగా, పోలింగ్ స్టేషన్ల మార్పుతో పాటు ఎంపీటీసీ పరిధిలో వచ్చే గ్రామాల వివరాలను తుది జాబితాలో అధికారులు ప్రకటించనున్నారు. 83 ఎంపీటీసీ స్థానాలు.. 473 పోలింగ్ స్టేషన్లు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 గ్రామ పంచాయతీలు ఉండగా 10 జెడ్పీటీసీ స్థానాలు, 83 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 2,29,159 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,10,838 మంది పురుషులు, 1,18,299 మంది మహిళలు, 22 మంది ఇతరులు ఉన్నారు. 8న వివిధ రాజకీయ పార్టీల నేతలతో మండల స్థాయిలో ఎంపీడీఓలు, జిల్లా స్థాయి అధికారులు సమావేశాలు నిర్వహించి వారి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. 9వ తేదీన స్వీకరించిన అభ్యంతరాలను పరిష్కరించి 10న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. రిజర్వేషన్లపై ఉత్కంఠ.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుండగా, రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ గవర్నర్ వద్ద ఫైల్ పెండింగ్లో ఉంది. దీంతో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం కల్పిస్తామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. పాత రిజర్వేషన్లను కొనసాగిస్తారా.. కొత్తగా రిజర్వేషన్లను ప్రకటిస్తారా అనేది స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉండడంతో సెప్టెంబర్ నెలలో ఎన్నికల నిర్వహణ పూర్తవుతుందా అనేది సందేహాంగానే మారింది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం మరింత సమయం కావాలని హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. రిజర్వేషన్లపై ఆదేశాలు లేవు..ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఆదేశించినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. జిల్లాలో 10 జెడ్పీటీసీ స్థానాలు, 83 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 473 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. 8 వరకు అభ్యంతరాలు స్వీకరించి 10వ తేదీన తుది జాబితా ప్రకటిస్తాం. – సంపత్రావు, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలుఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై డ్రాఫ్ట్ విడుదల 8 వరకు అభ్యంతరాల స్వీకరణ 10న ఓటర్ల తుది జాబితా విడుదల జిల్లాలో 83 ఎంపీటీసీలు, 10 జెడ్పీటీసీలు -
ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
వివిధ భాషల్లో 5వేల పుస్తకాలు, వందలాది జర్నల్స్, పురాతన స్క్రిప్ట్లు.. ఒకేచోట కొలువై ఉన్న ప్రొఫెసర్ గజ్జెల రామేశ్వరం ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇక.. అనేక మంది విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడనుంది. అరుదైన విజ్ఞాన సంపద ఉన్న ఈ ప్రకృతి గ్రంథాలయంతో ఇటీవల కాకతీయ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది. గత జూలైలో పుణే జాతీయ ప్రకృతి వైద్య సంస్థ కూడా పరస్పర ఒప్పందం చేసుకుంది. భారతీయ సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థ అభివృద్ధి వ్యాప్తికి పరిశోధనలు, శిక్షణ వంటి విద్యా కార్యక్రమాల్లో పరస్పర ప్రయోజనాలు పొందనున్నారు. ఈ ప్రకృతి వైద్య గ్రంథాలయం ప్రత్యేకతలు, విద్యార్థులకు ఉపయోగం, తదితర అంశాలపై ఈ వారం ప్రత్యేక కథనం.నేచురోపతి లైబ్రరీ రీసెర్చ్ సెంటర్తో కేయూ, పుణే సంస్థల ఎంఓయూకేయూతో ఎంఓయూతో కలిగే ప్రయోజనాలు.. కాకతీయ యూనివర్సిటీ వారు ఈ నెల ఒకటో తేదీన ప్రకృతి వైద్య గ్రంథాలయంతో ఎంఓయూ చేసుకున్నారు. ● ప్రకృతి వైద్యజ్ఞానాన్ని సమయానికి పొందేలా ఈ లైబ్రరీ రీసెర్చ్ సెంటర్లోని పుస్తకాల క్యా టలాగ్, వర్గీకరణ చేపడతారు. ఇందుకు కేయూ లైబ్రరీ సైన్స్ విద్యార్థులను వినియోగిస్తారు. ● ఇరు సంస్థల వర్క్షాప్లు, సేవల మార్పిడి కోసం ఎలాంటి ఆర్థిక భారం ఉండబోదు. సదస్సులు, సమావేశాలను సంయుక్తంగా నిర్వహించేందుకు అవకాశం ఉంది. ● ఎంఎల్ఐఎస్సీ విద్యార్థులు, పీహెచ్డీ పరిశోధకులు తమ ప్రాజెక్ట్ వర్క్స్, ఇంటర్న్షిప్లకు అధ్యయనం చేసేందుకు ఈ ప్రకృతి వైద్య లైబ్రరీలోకి అనుమతి ఉంటుంది. ● ఆర్ట్స్ విద్యార్థులు ప్రకృతి వైద్య విజ్ఞాన సంపదను వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు తెలుగు భాషలో ప్రకృతివైద్యంపై పద్యాలు, కవితల రూపంలో కూడా చికిత్స విధానాలున్నాయి. ● అమెరికా సిలికాన్ యూనివర్సిటీలో ఆయుర్వేద డిప్లొమా కోర్సు నడుస్తున్నది. తెలుగు, హిందీ భాషల్లో ప్రకృతి వైద్యానికి సంబంధించిన పుస్తకాలు, జర్నల్స్ ఉన్నాయి. ఆయా భాషల్లో ప్రకృతి వైద్యంపై పరిశోధన చేయాలనుకునేవారికి ఎంతో ఉపయోగపడనుంది. ● ఫార్మసీ విద్యార్థులకు ఫార్మాకాగ్నెన్స్ నేచురోపతికి సంబంధించిన ఆయుర్వేదం, యోగా, నేచురోపతి మీద ఒక పేపర్ ఉంది. ఆయా విద్యార్థుల సిలబస్కు అనుగుణంగా నూట్రిషన్స్, రోగ నిరోధకత పరిశోధనలకు ఉపయోపడే ప్రకృతి వైద్యం, విజ్ఞాన పుస్తకాలను ఉపయోగించుకోవచ్చు. ● ఇంటినే గ్రంథాలయంగా మార్చిన గజ్జెల రామేశ్వరం ● వివిధ భాషల్లో 5 వేల పుస్తకాలు, జర్నల్స్ అందుబాటులో.. ● ప్రకృతి వైద్యపరిజ్ఞానం పెంపొందించుకునే అవకాశం కేయూ క్యాంపస్: హనుమకొండ ప్రకాశ్రెడ్డిపేటలోని ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్లో దేశ, విదేశీ భాషా గ్రంథాలు ఉన్నాయి. ప్రకృతివైద్యానికి సంబంధించిన 50 పత్రికలు లభిస్తాయి. కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం విశ్రాంత ఆచార్యులు గజ్జెల రామేశ్వరం 2018 జూలై 24న తన ఇంటిలోనే ఈ లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రకృతి వైద్యంపై ఆసక్తి ఉన్నవారు ఈ లైబ్రరీలో ఉచితంగా ప్రవేశించి చదువుకునే అవకాశం కల్పించారు. పుణే జాతీయ ప్రకృతివైద్య సంస్థతో.. పుణేలోని జాతీయ ప్రకృతివైద్య సంస్థ గత జూలై 1న ఈ ప్రకృతి వైద్య గ్రంథాలయ పరిశోధన కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ సత్యలక్ష్మి, రామేశ్వరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. పుణే జాతీయ ప్రకృతి వైద్యసంస్థలో ఆస్పత్రి ఉంటుంది. అక్కడి నేచురోపతి కోర్సుల విద్యార్థులకు క్లినికల్ రీసెర్చ్కు సంబంధించిన ప్రకృతి వైద్య విజ్ఞాన పుస్తకాలు, జర్నల్స్ ఇక్కడి లైబ్రరీ రీసెర్చ్సెంటర్లో ఉన్నాయి. ఆ విద్యార్థులు ఇక్కడికి వచ్చి వినియోగించుకుంటారు. ఇతర దేశాల శాస్త్రవేత్తలు, ప్రకృతి వైద్యులు తమ సంస్థను సందర్శించిన సమయంలో పరిశోధనల విజ్ఞాన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉండడం వల్ల వారిని తరచూ ఇక్కడికి పంపే అవకాశాలున్నాయి. ఇది హెల్త్ ఎడ్యుకేషన్ టూరిజానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. యోగా, హిస్టరీ, లైఫ్ సైన్సెస్ వారికి ఉపయుక్తం కేయూ దూరవిద్యలో యోగా డిప్లొమా కోర్సు నడుస్తోంది. ఈ విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు 300 వరకు ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్లోనూ నేచురోపతిపై ఒక పేపర్ ఉంది. సైకాలజీ విద్యార్థులకు మానసిక వైద్య విద్యకు సంబంఽధించి ప్రకృతి వైద్యపరంగా విజ్ఞానసంపద ఉంది. భారత ప్రకృతివైద్య చరిత్ర, ప్రకృతి వైద్య ఉద్యమ వైతాళికులు ఎవరు అనే అనేక అంశాలు, చారిత్రక పరంగా ప్రకృతి వైద్యవిధానం ఎలా వచ్చిందనే దానిపై హిస్టరీ విద్యార్థులు, పరిశోధనలకు ఈలైబ్రరీ రీసెర్చ్సెంటర్లో అనేక దేశ, విదేశాల పుస్తకాలు, జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి. లైఫ్సైన్సెస్ పీజీకోర్సుల విద్యార్థులకు ఉపయోగపడే జ్ఞాన సంపద అందుబాటులో ఉంది. మహిళలతోనే దేశాభివృద్ధి సాధ్యంప్రకృతి వైద్యవిజ్ఞానం ప్రజాబాహుళ్యంలోకి.. మూడున్నర దశాబ్దాలుగా సేకరించిన అరుదైన ప్రకృతి వైద్యవిద్య, సాహిత్య విజ్ఞాన సంపదను అందుబాటులో ఉంచా. కేయూ, పుణేలోని జాతీయ ప్రకృతివైద్య సంస్థతో మా లైబ్రరీ రీసెర్చ్ సెంటర్తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. విజ్ఞాన సంపదను విద్యార్థులు, పరిశోధకులు ఉపయోగించుకోవాలి. – గజ్జెల రామేశ్వరం, ప్రకృతి వైద్య లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడుఇంటర్న్షిప్నకు కూడా.. ఈ ఎంఓయూతో ఎంఎల్ఐఎస్సీ విద్యార్థులకు ఇంటర్న్షిప్నకు అవకాశం లభించింది. తొలుత ఒకటి రెండురోజుల్లోనే ఇద్దరు విద్యార్థులను ఆ లైబ్రరీ సెంటర్కు పంపనున్నాం. మా లైబ్రరీ సైన్స్ విభాగంనుంచి ఆ లైబ్రరీలో పుస్తకాల క్యాట్లాగ్, క్లాసిఫికేషన్కు విద్యార్థులు సహకారం అందిస్తారు. – డాక్టర్ రాధికారాణి, కేయూ లైబ్రరీ సైన్స్ విభాగం అఽధిపతి -
హేమాచలుడిని దర్శించుకున్న పీఓ
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చిన పీఓకు ఆలయ కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేష్, పూజారులు స్వాగతం పలికారు. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్న పీఓ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. అనంతరం స్వామివారి విశిష్టత, ఆలయ చరిత్రను వివరించి శేష వస్త్రాలను అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తులు ములుగు రూరల్: జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతిలో 2026–27 విద్యా సంవత్సరంలో చేరేందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ పూర్ణిమ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు చేసుకోదలచిన విద్యార్థులు వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందినవారై ఉండాలని వెల్లడించారు. దరఖాస్తుల గడువు సెప్టెంబర్ –23 వరకు ఉందని ఎంపిక పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఉంటుందని వివరించారు. 9వ తరగతి దరఖాస్తులు చేసుకునే వారు 2025–26 విద్యాసంవత్సరంలో 8వ తరగతి చదువుతూ ఉండాలని 1 మే 2011 నుంచి 31 జూలై 2013 మధ్య జన్మించి ఉండాలని తెలిపారు. 11వ తరగతిలో చేరేందుకు దరఖాస్తు చేసుకునే వారు 2025–26లో 10వ తరగతి చదువుతూ 1 జూన్ 2009 నుంచి 31 జూలై 2011 మధ్యలో జన్మించి ఉండాలని పేర్కొన్నారు. ఎన్వీఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ‘విల్ట్’ సోకకుండా సేంద్రియ ఎరువు వాజేడు: మిర్చి తోటకు విల్ట్ వైరస్ రాకుండా ఉండటం కోసం ముందస్తు నివారణలో భాగంగా ఓ రైతు ప్రత్యేకంగా సేంద్రియ ఎరువును తయారు చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన ఇర్ప రామ్ముర్తి శనివారం ఎరువు వివరాలను వెల్లడించారు. ట్రైకో డర్మ్, సూడో మోనాస్ మందులను పశువుల ఎరువులో కలిపి మురగపెట్టాలని తెలిపారు. ఆ మందు ఎరువులో పూర్తిగా కలిసిన తర్వాత మిర్చి తోటను పాతే చేనులో చల్లి కలియ దున్నాలని వివరించారు. గతంలో ఈ పద్ధతి పాటించడం వల్ల విల్ట్ వైరస్ రాలేదని వెల్లడించారు. మొక్కేతలు ప్రారంభం వాజేడు: గోదావరి వరద కొంతమేర తగ్గడంతో కొందరు రైతులు మిర్చి మొక్కేతలను శనివారం ప్రారభించారు. మిర్చి నార్లు నాటడం ఇప్పటికే ఆలస్యం కావడంతో గోదావరి వరద తమ చేల వరకు రాదని భావించిన రైతులు మొక్కేతలను వేస్తున్నారు. మండల పరిధిలోని వాజేడు, గుమ్మడి దొడ్డి, జగన్నాథపురం గ్రామాల్లో ఈ మొక్కేతలు ప్రారంభం అయ్యాయి. రామప్ప టెంపుల్ బ్యూటీఫుల్ వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటీఫుల్గా ఉందని జర్మనీకి చెందిన జీస్టాస్ నిమాన్ కొనియాడారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆయన శనివారం సందర్శించి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. -
వానగుట్ట ప్రాంతంలోనే పులి మకాం
వెంకటాపురం(ఎం): జిల్లాలో గత మూడు రోజులుగా సంచరిస్తున్న పులి శుక్రవారం సా యంత్రం వరకు వెంకటాపురం(ఎం) మండలంలోని వానగుట్ట అటవీ ప్రాంతంలోనే ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. బుధవారం ములుగు మండలంలోని పత్తిపల్లి, పోట్లాపూర్ సమీప అడవుల్లో సంచరించిన పులి.. గట్టమ్మ మీదుగా గురువారం వెంకటాపురం(ఎం) మండలంలోకి ప్రవేశించింది. శుక్రవారం ఉదయం సింగరకుంటపల్లె రోడ్డు దాటుతూ వానగుట్ట వైపు వెళ్లినట్లు తెలిసింది. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా ములుగు ఎఫ్ఆర్ఓ శంకర్ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వానగుట్ట సమీపంలో పులి పాదముద్రలను గుర్తించినట్లు ఎఫ్ఆర్ఓ శంకర్ తెలిపారు. పులి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.గాలింపు చర్యలు చేపట్టిన అటవీశాఖ అధికారులు -
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్
ములుగు: విద్యార్థులు, సమాజ భవిష్యత్ ఉపాధ్యాయుల చేతిల్లోనే నిర్మాణం అవుతుందని కలెక్టర్ దివాకర టీఎస్ పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శుక్రవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో నిర్వహించిన గురుపూజోత్సవానికి జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి అధ్యక్షత వహించగా కలెక్టర్ దివాకర టీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసంద్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మంచి సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని సూచించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతమైన ములుగు జిల్లాలో సేవలందిస్తున్న ఉపాధ్యాయుల కృషి ప్రశంసనీయమన్నారు. విద్యార్థుల అభివృద్ది కోసం ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంపత్రావు, చైర్మన్ రేగ కల్యాణితో కలిసి కలెక్టర్ దివాకర జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 33 మందిని సత్కరించి అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి సూర్యనారాయణ, సమగ్ర శిక్షా కోఆర్డినేటర్లు అర్షం రాజు, కాటం మల్లారెడ్డి, గుళ్లపెల్లి సాంబయ్య, మండల విద్యాధికారులు, అవార్డు గ్రహీతలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ దివాకర టీఎస్ 33 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం -
ప్రయాణం సాహసమే..
మంగపేట: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరునాగారం నుంచి మంగపేట మండలంలోని జిల్లా సరిహద్దు గ్రామం బ్రాహ్మణపల్లి వరకు ప్రధాన రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రాహ్మణపల్లి నుంచి ఏటూరునాగారం ఎన్హెచ్ 163 వరకు 34 కిలోమీటర్ల ఏటూరునాగారం– బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి అత్యంత ప్రమాదకరంగా తయారైంది. నిర్లక్ష్యమే పాపం.. మండలం నుంచి ఏటూరునాగారం వరకు ప్రధాన రోడ్డు అభివృద్ధి కోసం నాటి ప్రభుత్వం 2019 నుంచి 2021 వరకు పలు దఫాలుగా సుమారు రూ.20 కోట్లకుపైగా మంజూరు చేసింది. అప్పటి అధికార పార్టీ అండదండలతో టెండరు పొందిన గుత్తేదారుతో సంబంధిత అధికారులు కమీషన్ల కోసం కుమ్మక్కై పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డుపై ఏర్పడిన గోతులను పూడ్చకుండా ఆర్ఆండ్బీ అధికారులు పట్టింపులేనట్లుగా వ్యవహరించడం, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహించడంతో సైడ్బర్మ్లు కోతకు గురై గోతుల ఏర్పడ్డాయి. మంగపేట రైతువేదిక వద్ద కల్వర్టు పక్కన రెండు చోట్ల 15 మీటర్ల వెడల్పుతో సుమారు 4 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడింది. అదే చోట రోడ్డు మధ్యన, కోమటిపల్లి క్రాస్రోడ్డు సమీపంలో పలు చోట్ల మోకాలు లోతుతో 10 మీటర్ల వెడల్పుతో భారీగోతులు ఏర్పడి నీరు నిలిచి ఉంటున్నాయి.మల్లూరు, వాడగూడెం ఇసుక క్వారీలతోపాటు పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, మణుగూరు 10కి పైగా ఇసుక క్వారీల నుంచి నిత్యం వందల సంఖ్యలో లారీలు వరంగల్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ఇసుకను రవాణా చేస్తున్నాయి. వరంగల్ నుంచి నిత్యం ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, లారీలు, డీసీఎంలు, కార్లు ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాలు, మండలం మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం, పట్టణాలతోపాటు ఖమ్మం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వరకు రేయింబవళ్లు ప్రధాన రోడ్డుపై రాకపోకలు సాగిస్తుండటంతో రద్దీగా ఉంటుంది. ఇసుక లారీల కారణంగా రోడ్డుపై భారీగోతులు ఏర్పడి నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యకృత్యంగా మారి ప్రమాదాలు చోద్యం చూస్తున్న ఆర్అండ్బీ అధికారులు -
సందిగ్ధంలో హరిత హోటళ్లు
ఎస్ఎస్తాడ్వాయి: జిల్లాలోని మేడారం, తాడ్వాయి, ములుగు, బొగత ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన హరితహోటళ్ల నిర్వహణ సందిగ్ధంగా మారింది. టూరిజంశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన హరితహోటళ్లను గుజరాత్కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ లీజుకు తీసుకుని పెరియాడో రిసార్ట్స్ పేరుతో నిర్వహించింది. అయితే గురువారం రాత్రి తాడ్వాయిలోని హరి తహోటల్ నుంచి రెండు కంటైనర్లలో నిర్వాహకులు సామగ్రిని తీసుకెళ్లారు. లీజుకు తీసుకున్న హరితహోటళ్లను వదులుకున్నట్లు తెలుస్తుంది. అయితే పెరియాడో రిసార్ట్స్లో పని చేస్తున్న సిబ్బందికి మూడు నెలల వేతనాలు చెల్లించలేదు. ఈక్రమంలో హరితహోటల్ ఖాళీ చేస్తున్నట్లు తెలిసి వేతనాల విషయంపై సంబంధిత ఎండీని సిబ్బంది అడగగా తర్వాత చెల్లిస్తామని చెప్పి వెళ్లిపోయినట్లు తెలిసింది. వారు వెళ్లిపోవడంతో సిబ్బంది శుక్రవారం హరితహోటల్ మెయిన్ గేట్కు తాళం వేశారు. మేడారం, బొగత, తాడ్వాయి పెరియాడ్ రిసార్ట్స్లో పని చేసిన సిబ్బంది అందరూకలిసి జీతాలు ఇప్పించాలని తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హరితహోటళ్లను లీజుకు తీసుకున్న ప్రైవేట్ సంస్థ టూరిజంశాఖకు లీజు బకాయిలు కూడా చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. దీంతో మళ్లీ హరిత హోటళ్లు తెరుచుకుంటాయా.. లేదా.. అనే సందేహాలు పర్యాటకుల్లో వ్యక్తమవుతున్నాయి. పెరియాడో రిసార్ట్స్ సంస్థ వారు ఖాళీ చేయడంతో జిల్లాలోని పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా టూరిజంశాఖ అధికారులు హరితహోటళ్లు అందుబాటులోకి తీసుకొస్తారా.. లేదా.. వేచిచూడాలి. కాగా టూరిజంశాఖ అధికారులు హరితహోటల్ను సందర్శించి సిబ్బందితో మాట్లాడినట్లు తెలిసింది. ఈవిషయంపై టూరిజంశాఖ ఈడీ ఉపేందర్రెడ్డిని వివరణ కోరగా హరిత హోటల్ లీజుకు తీసుకున్న సంస్థ బకాయిలు చెల్లించాల్సి ఉంది. లీజ్ బకాయిలు చెల్లించాని గతంలోనే 15 రోజుల గడువు ఇస్తూ నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు. ఈనెల 3వ తేదీతో గడువు ముగిసిందని.. బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేతనాలు చెల్లించలేదని సిబ్బంది తాళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు -
పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం ములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ పేదల సంక్షేమం కోసం పని చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకేంద్రంలో జాతీయ రహదారిపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలా భిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యావసర సరుకులపై జీఎస్టీ తగ్గించడంతో పేద, మధ్యతరగతి, రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. గృహ వినియోగ వస్తువులపై 18 శాతం ఉన్న జీఎస్టీ 5శాతానికి తగ్గించారని అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ వస్తువులపై 12 శాతం నుంచి 5 శాతానికి ఆరోగ్యరంగంలో 18 శాతం నుంచి 5 శాతం తగ్గించారని అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో చిరువ్యాపారులకు మేలు జరుగుతుందన్నారు. దీంతో ప్రధాని మోదీ, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు. చింతలపూడి భాస్కర్రెడ్డి, కొత్త సురేందర్, కృష్ణాకర్, రాజ్కుమార్, రాకేష్యాదవ్, రవిరెడ్డి, సుమలత, మహేందర్, బాబు, శ్రీహరి పాల్గొన్నారు. -
గొత్తికోయగూడెంపై దాడి
శాంతినగర్లో అటవీశాఖ అధికారులు కూల్చిన గుడిసెమంగపేట: మండల పరిధిలోని సండ్రోనిఒర్రె అటవీ ప్రాంతం సమీపంలోని శాంతినగర్ గొత్తికోయగూడెంపై మంగపేట అటవీశాఖ రేంజ్ అధికారి అశోక్ ఆధ్వర్యంలో దాడి జరిగింది. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే..అటవీ ప్రాంతంలోని శాంతినగర్లో పదేళ్ల క్రితం ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన సుమారు 15 పైగా గొత్తికోయ గిరిజన కుటుంబాలు గుడిసెలు వేసుకున్నాయి. పోడు చేసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అటవీశాఖ అధికారులు ఒక్కసారిగా గూడెంపై దాడికి దిగి తొమ్మిదికి పైగా గుడిసెలను కూల్చివేసి అడ్డువచ్చిన అమాయక గొత్తికోయ గిరిజనులపై దాడి చేసి గాయపరిచినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై అటవీశాఖ రేంజ్ అధికారి అశోక్ను వివరణ కోరగా మంగపేట బీటు పరిధిలోని అటవీప్రాంతంలో శాంతినగర్లో కొత్తగా పోడుచేసి అటవీ ప్రాంతాన్ని కబ్జా చేసేందుకు యత్నించగా 20 రోజుల క్రితం స్థానిక పోలీసులతో కలిసి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఉండాలని కొత్తగా పోడు చేయొద్దని, గుడిసెలు వేయవద్దని హెచ్చరించామని వివరించారు. అయినప్పటికీ వినిపించుకోకుండా నూతనంగా గుడిసెలు వేసినట్లు తెలిసిందన్నారు. దీంతో సాయంత్రం 3 గుడిసెలను తొలిగించినట్లు వివరించారు. గిరిజనులపై దాడి, గుడిసెలు కూల్చేసిన అటవీశాఖ అధికారులు -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ఏటూరునాగారం/మంగపేట: మీ సేవ కేంద్రాల నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ అన్నారు. ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని మీసేవ కేంద్రాలను ఆయన గురువారం ఆకస్మింకగా తనిఖీ చేశారు. నిర్ణీత రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. అతి త్వరలో ఏటూరునాగారంలో నూతన ఆధార్ సేవ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మంగపేట మండలంలోని పలు మీ సేవ కేంద్రాలను తహసీల్దార్ రవీందర్, ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్లతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. మీ సేవ కేంద్రాల నిర్వహకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ నిబంధనల మేరకు పని చేయాలని సూచించారు. నిర్ణీత రుసుము కంటే ఎక్కువ రుసుము దరఖాస్తుదారుడి నుంచి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీసేవ సెంటర్లో తప్పకుండా సిటిజన్ చార్టర్, భూ భారతికి సంబంధించిన ఫ్లెక్సీలు, మీసేవ లోగో, తహసీల్దార్, ఈడీఎం, పరిష్కారం కాల్ సెంటర్ల ఫోన్ నంబర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మీసేవ జిల్లా మేనేజర్ పోలోజు విజయ్, మీసేవ సెంటర్ నిర్వహకులు పాల్గొన్నారు. ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ -
నిమజ్జనానికి వేళాయె..
ములుగు: నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడికి నేడు ప్రజలు వీడ్కోలు పలకనున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పోలీసు అధికారులు సంయుక్తంగా కలిసి వినాయక నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి నిమజ్జన కార్యక్రమాలు మొదలుకానున్నాయి. భక్తులు చెరువుల్లోకి దిగకుండా ప్రధాన చెరువుల వద్ద గ్రామ పంచాయతీ, పోలీస్ అధికారులు క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దివాకర, డీపీఓ దేవరాజ్ ఆదేశాలు జారీ చేయడంతో ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు చెరువులు, కుంటల వద్ద ఏర్పాట్లను పూర్తి చేశారు. రామప్ప, లక్నవరం సరస్సుల్లో అనుమతి లేదు.. వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని రామప్ప, గోవిందరావుపేట మండల పరిధిలోని లక్నవరం జలాశయం వంటి ప్రధాన చెరువుల్లో వినాయక నిమజ్జనానికి పోలీసు శాఖ అనుమతులు నిరాకరించింది. నిమజ్జనం సమయంలో యువకులు సరస్సుల్లో దిగి మృత్యువాత పడతారనే నెపంతో నిమజ్జనం చేసేందుకు అనుమతులు ఇవ్వలేదు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. నిమజ్జనం చేసే ప్రాంతాలను ఆయా మండలాలకు చెందిన పోలీసు అధికారులు గురువారం పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారీ బందోబస్తు జిల్లాలో శుక్రవారం జరిగే వినాయక నిమజ్జనానికి సంబంధించి 400 మంది సివిల్, ఏఆర్, టీఎస్పీఎస్, స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లాలో 800కు పైగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు. నిమజ్జన ప్రక్రియ మొదలు నుంచి పూర్తి అయ్యేంత వరకు పూర్తి కార్యక్రమాన్ని పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఇంటెలిజెన్స్, ఎస్బీ ఫీల్డ్ అధికారులు పరిశీలించనున్నారు. ములుగు సబ్ డివిజన్ డీఎస్పీ రవీందర్, ఏటూరునాగారం సబ్ డివిజన్ ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పరిశీలనలో నిమజ్జన కార్యక్రమం కొనసాగనుంది. జిల్లాలో ప్రధానంగా ములుగు గ్రామ పంచాయతీ పరిధిలోని తోపుకుంట, మల్లంపల్లి మండలంలో ఊర చెరువు, వెంకటాపురం(ఎం) మండలంలో నల్లకాలువ, గోవిందరావుపేట మండలంలోని గౌరారం చెరువు, రంగాపూర్ కాల్వ, ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో జంపన్నవాగు, కన్నాయిగూడెం మండలంలో తుపాకుల గూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ, వెంకటాపురం(కె) మండలంలో పాలెం వాగు వద్ద, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు మండలాలకు చెందిన వారు ఏటూరునాగారం ముళ్లకట్ట పూసూరు బ్రిడ్జి వద్ద వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జనానికి క్రేన్లు, జేసీబీలను వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. నిమజ్జనం ప్రాంతంలో లైటింగ్ ఏర్పాటు, విద్యుత్కు అంతరాయం కలిగితే జనరేటర్లను సైతం వినియోగించేలా చర్యలు చేపట్టారు. ఆయా చెరువుల వద్ద గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. చెరువులు, వాగుల వద్ద ఏర్పాట్లు జిల్లాలో 800కు పైగా గణపతి విగ్రహాలు 400 మంది పోలీసులతో బందోబస్తు రామప్ప, లక్నవరం చెరువుల్లో అనుమతి నిరాకరణవినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. జిల్లా వ్యాప్తంగా రహదారులు, నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. శోభాయాత్ర భక్తిభావంతో శాంతియుతంగా సాగేలా ఉత్సవ కమిటీ సభ్యులు చూసుకోవాలి. గ్రామాలలో ప్రజల సంరక్షణకు స్థానిక పోలీసు బృందాలు పెట్రోలింగ్ నిర్వహిస్తాయి. నిమజ్జనం సమయంలో స్థానిక పోలీసులకు ప్రజలు సహకరించాలి. – డాక్టర్ శబరీశ్, ఎస్పీ -
బడికి రాకుంటే ఊరుకునేదే లేదు..
ఏటూరునాగారం: మండల పరిధిలోని నార్త్ పాఠశాల ఉపాధ్యాయుడిగా పోతు రాజశేఖర్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పాఠశాలకు విద్యార్థులు డుమ్మా కొడితే ఊరుకునేదే లేదు.. ఎట్లాగైనా బడికి తీసుకురావాలే.. అనే సంకల్పంతో ఇంటింటికి తిరిగి పిల్లలను బడికి తీసుకొస్తాడు. ఈ ఏడాది 25 మంది విద్యార్థులను కొత్తగా అడ్మిషన్ చేయించారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సైతం ఈ పాఠశాలలో చేరే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాడు. అంతేకాకుండా అందులో 16 మంది ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఉండడం గమనార్హం. ఇంగ్లిష్ మీడియంలో పాఠాలను బోధిస్తూ ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నాడు. -
యూరియా కోసం పడిగాపులు
ఏటూరునాగారం: యూరియా కోసం రైతులు పడిగాపులు పడ్డారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా బస్తాలను కొనుగోలు చేసేందుకు రైతులు గురువారం ఉదయం నుంచి బారులుదీరారు. ఒక్కో రైతు ఆధార్ కార్డుపై రెండు యూరియా బస్తాలు ఇవ్వడంతో అవసరం ఉన్న రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై రాజ్కుమార్లు సిబ్బందితో కలిసి బందోబస్తు చేపట్టారు. సుమారు 200 మంది రైతులు బస్తాలు క్యూలో నిలబడ్డారు. అయితే రైతుల మాత్రం తమకు రెండు బస్తాలు సరిపోవని ఎక్కువ ఇవ్వాలని అధికారులను కోరారు. నిబంధనల ప్రకారం రెండు బస్తాలు మాత్రమే ఇచ్చే అనుమతి ఉందని ఏఓ వేణుగోపాల్ తెలిపారు. ఈ బస్తాలను చిన్నబోయినపల్లి తో పాటు షాపెల్లి, గోగుపల్లి, శివాపురం, పెద్ద వెంకటాపురం, కొండాయి, దొడ్ల, మల్యాల తదితర గ్రామాల రైతులకు మాత్రమే అందజేశారు.ఒక్కో రైతుకు రెండు బస్తాలు పంపిణీ -
ఆదర్శం యాదలక్ష్మి
గోవిందరావుపేట: మండల పరిధిలోని గాంధీనగర్ యూపీఎస్ పాఠశాలలో యాదలక్ష్మి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. మూడేళ్లుగా పాఠశాలలో విద్యార్థులు లేని పరిస్తితి ఉంది. దీంతో పాఠశాలలో ఆమె ఉపాధ్యాయురాలిగా అడుగుపెట్టినప్పటి నుంచి పెను మార్పులు తీసుకొచ్చారు. తన సొంత ఖర్చులతో భవనానికి పెయింటింగ్ వేయించి సుందరంగా తీర్చిదిద్దారు. పిల్లల ఇంటింటికీ తిరిగారు. తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఈ ఏడాది ఆరుగురు విద్యార్థులను బడిలో చేర్పించారు. వారికి షూస్తో పాటు స్టడీ మెటీరియల్ అందజేసి వినూత్న రీతిలో బోధిస్తూ ఆదర్శంగా నిలిస్తోంది. -
వైకల్యంతో పుట్టిన పిల్లలను గుర్తించాలి
ములుగు: వైకల్యంతో పుట్టిన పిల్లలను గుర్తించి సామాజిక ఆరోగ్య కేంద్రాలకు సిఫారసు చేయాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు వైద్య సిబ్బందికి సూచించారు. జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయంలో రాష్ట్రీయ బాలికల స్వస్థత కార్యక్రమంపై గురువా రం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తీవ్ర రక్తహీనత గల పిల్లలను గుర్తించి సామాజిక ఆరోగ్య కేంద్రం ఏటూరునాగారం, ములుగు ప్రభుత్వ ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేయాలన్నారు. రోజు వారిగా స్క్రీనింగ్ వివరాలను ఆర్బీఎస్కే పోర్టలో నమోదు చేయాలన్నారు. ప్రతీ నెలలో పాఠశాలలను సందర్శించి వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్లు రణధీర్, పవన్ కుమార్, నరహరి, శ్రీనివాస్, మల్లిఖార్జున్, జయప్రద, డెమో సపంత్, కోఆర్డినేటర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు
వాజేడు/వెంకటాపురం(కె): మీసేవ కేంద్రాల్లో నిర్ణీత రుసుము కంటే అధికంగా వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ అన్నారు. వాజేడు, వెంకటాపురం(కె) మండలాల పరిధిలోని వాజేడు, పేరూరు, ఆలుబాక, పాత్రాపురం, మొర్రవానిగూడెం, వెంకటాపురం(కె)లోని మీసేవ కేంద్రాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ సేవ కేంద్రాలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ఈఎస్డీ నిబంధనల ప్రకారం కేంద్రాలను నడపాలన్నారు. ఆపరేటర్లు అందుబాటులో ఉండి మీ సేవ ద్వారా నిర్వహించే అన్ని రకాల సర్వీసులతో పాటు ఆన్లైన్ సర్వీసులను ప్రజలకు అందించాలని సూచించారు. రెండు మండలాల్లో ప్రజలు ఆధార్ సేవల పట్ల పడుతున్న ఇబ్బందులను గుర్తిస్తామని తెలిపారు. త్వరలోనే అదనపు ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కల్యాణలక్ష్మి, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్ చేసే సమయంలో తప్పులు దొర్లకుండా చూసుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా మేనేజర్ పోలోజు విజయ్ ఉన్నారు.ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ -
రామప్ప శిల్పకళ మరుపురానిది..
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ సంపద మరుపురానిదని భారత విదేశాంగ శాఖ, సాన్ఫ్రాన్సిస్కు చెందిన భారత కాన్సుల్ జనరల్ శ్రీకర్రెడ్డి, బ్రూనై భారత హై కమిషనర్ అబ్బగాని రాము పేర్కొన్నారు. బుధవారం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని వారు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆల య పూజారి ఉమాశంకర్ వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రా మప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప ఆలయం బాగుందని కొని యాడారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మ, తహసీల్దార్లు గిరిబాబు, సత్యనారా యణ, ఆర్ఐ విజేందర్ తదితరులు పాల్గొన్నారు.రామప్ప ఆలయ విశిష్టతను వివరిస్తున్న గైడ్ విజయ్కుమార్ రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహిస్తున్న భారత విదేశీ రాయబారులుభారత విదేశీ రాయబారులు శ్రీకర్రెడ్డి, రాము -
సర్వేలతో సరి.. అందని పరిహారం
వర్షాలతో 644 ఎకరాల్లో పంటనష్టంకొండాయిలో ఇసుక మేటలతో ఉన్న పొలాలుజిల్లాలో వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి. వరి, పత్తి, ఇతర పంటలను కోల్పోయిన రైతులను గుర్తించి వారికి పరిహారం అందిస్తే మళ్లీ సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ సర్వేలు చేసి కేవలం కాగితాలకే పరిమితం చేయడం సరికాదు. – వినుకోలు చక్రవర్తి, బీజేపీ మండల అధ్యక్షుడు, ఏటూరునాగారంఏటూరునాగారం: జిల్లాలో రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలకు గోదావరితో పాటు వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో వరద నీరు వరి, మిర్చి, పత్తి, అరటి తోటల నుంచి ప్రవహించి నష్టానికి గురిచేసింది. దీంతో గత నెలలో వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక సర్వేలు చేపట్టి జిల్లాలో 450 ఎకరాల మేరకు పంటనష్టం వాటిలినట్లు ఉన్నతాధికారులకు నివేదికను అందజేశారు. అయినా రైతులకు ఎలాంటి పంట నష్టపరిహారం అందలేదు. వాటి నుంచి తేరుకోకముందే ఇటీవల కురిసిన వర్షాలకు మరికొన్ని చోట్ల 194 ఎకరాల్లో వరి పంట పొలాల నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించి ఇసుక మేటలు వేసింది. దీంతో మొత్తంగా 644 ఎకరాల్లో పంట నష్టపోయిన అన్నదాతలు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇసుక మేటలు ఏటూరునాగారం మండల పరిధిలోని కొండాయి గ్రామంలో ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు 25 ఎకరాల్లో పంట నీటి పాలైంది. అలాగే గోగుపల్లి, శివాపురం, చిన్నబోయినపల్లి గ్రామాల్లోని రైతుల పొలాల నుంచి వరద నీరు ప్రవహించడంతో సుమారు 35 ఎకరాల మేర ఇసుక మేటలు వేసింది. భూమి పంటల సాగుకు పనికిరాకుండా పోయింది. దీంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. మంగపేటలో జూలై నెలలో కురిసిన వర్షాలకు 89 ఎకరాలు, ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు 45 ఎకరాల మేరకు పంటలకు నష్టం వాటిలినట్లు అధికారులు అంచనా వేశారు. ఇలా మండలాల వారీగా అధికారుల క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నష్టం బయటకు వచ్చే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. గోదావరి వరదతో పొలాల్లో ఇసుక మేటలు ఆదుకోవాలని అన్నదాతల వేడుకోలు -
పంట నష్టంపై క్షేత్రస్థాయిలో సర్వే
ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామంలో 25ఎకరాల్లో భారీ వర్షాలతో నష్టపోయిన పంటలను ఏఈఓ రాజు బుధవారం సర్వే చేశారు. రైతులు సాగు చేస్తున్న వరి, ఇతర పంటలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించిన వివరాలు నమోదు చేసుకున్నారు. వరద ఉధృతి వల్ల నీరు పొలాల మీదుగా ప్రవహించడంతో ఇసుక మేటలు, వరి పైరు కొట్టుకుపోయినట్లు తెలిపారు. ప్రాథమిక సర్వే నివేదికలను అధికారులకు అందజేయనున్నట్లు ఏఈఓ రాజు తెలిపారు. కొండాయి గ్రామానికి రవాణా మార్గం లేకపోవడంతో పడవలో ప్రయాణించి సర్వే చేపట్టారు.అదేవిధంగా మండలంలోని గోగుపల్లి, శివాపురం, చిన్నబోయినపల్లి గ్రామాల్లో ఏఈఓ రవి సర్వే చేపట్టారు. పొలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతుల వివరాలను నమోదు చేసుకున్నారు. -
ప్రభుత్వ బడులకు రేటింగ్
ములుగు: ప్రభుత్వ పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణపై దేశవ్యాప్తంగా బడులకు రేటింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 200 పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు రూ.లక్ష నగదు ప్రోత్సాహకంతో పాటు సంబంధిత ఉపాధ్యాయులను మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్న విహార కేంద్రాల సందర్శనకు తీసుక వెళ్లనున్నారు. అయితే గతంలో ప్రభుత్వం స్వచ్ఛత పురస్కారాలు అందజేసిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం నిలిచిపోవడంతో మళ్లీ జాతీయస్థాయిలో పాఠశాలలకు రేటింగ్ పేరుతో పురస్కారాలు అందించనున్నారు. 30వ తేదీ వరకు గడువు జిల్లాలో 561 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలు స్వచ్ఛ ఏవమ్ హరిత్ స్కూల్ రేటింగ్ కోసం ఈ నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాఠశాలల్లో తాగునీరు, మరుగు దొడ్లు, మూత్రశాలల నిర్వహణ, పచ్చదనం, పరిశుభ్రతతో పాటు తదితర పాఠశాల నిర్వహణపై ఆన్లైన్లో ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అక్టోబర్లో కమిటీ బృందం తనిఖీ చేపట్టనుంది. 3 స్టార్ వచ్చిన పాఠశాలలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన ఆరు పాఠశాలలను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో 4 స్టార్ వచ్చిన వాటిని జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు. దేశంలోని ఉత్తమంగా ఉన్న 200 పాఠశాలలకు స్వచ్ఛ ఏవమ్ హరిత్ పురస్కారం అందజేస్తారు. లక్ష నగదుతో పాటు ఉపాధ్యాయులను విహార యాత్రకు తీసుకెళ్తారు. అయితే 35 నుంచి 50 పాయింట్లు ఉన్న పాఠశాలలకు 2 స్టార్, 51 నుంచి 74 పాయింట్లు గల పాఠశాలలకు 3 స్టార్, 75 నుంచి 89 పాయింట్లు ఉన్న స్కూళ్లకు 4 స్టార్, 90 నుంచి 100 పాయింట్లు ఉన్న బడులకు 5 స్టార్ కేటాయిస్తారు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఎంఈఓలకు, ఉపాధ్యాయులకు శిక్షణ స్వచ్ఛ ఏవమ్ హరిత్ పురస్కారంతో సర్కారు పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత నెలకొననుంది. మరుగుదొడ్ల నిర్వహణ బాగుపడనుంది. ఆయా బడుల్లో స్వచ్ఛ వాతావరణం నెలకొల్పడానికి దోహద పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు, నీటి సదుపాయం ఉన్నప్పటికీ వాటిని సరిగా వినియోగించడం లేదు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటడం, పరిసరాల శుభ్రత, పచ్చదనం కోసం దోహదపడనుంది. జాతీయస్థాయిలో ఎంపికై తే జిల్లాతో పాటు పాఠశాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్ కింద పాఠశాలలను జాతీయస్థాయిలో ఎంపిక చేయనున్నారు. ఈ నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంఈఓలతో పాటు మండలానికి ఒక్కో ఉపాధ్యాయుడికి బుధవారం జిల్లా కేంద్రంలోని ములుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షణ ఇప్పించాం. మండల స్థాయిలో ప్రతీ పాఠశాల నుంచి ఒక ప్రధానోపాధ్యాయునికి అవగాహన కల్పించి పాఠశాలలో ఉండే అనేక వసతులను ఆన్లైన్లో అప్లోడ్ చేసి పాఠశాల రేటింగును మెరుగుపరుచుకోవాలి. జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో పాఠశాలలు రాష్ట్రస్థాయికి, జాతీయస్థాయికి ఎంపిక కావాలి. – సిద్ధార్థ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి -
పారిశుద్ధ్య కార్మికుడి ఆత్మహత్య
ములుగు రూరల్: ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదని తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ములుగు మున్సిపాలిటీ పరిధి మాధవరావుపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరావుపల్లికి చెందిన మైదం మహేష్(30)మూడేళ్లుగా ములుగు గ్రామ పంచాయతీ పరిధిలో తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. తోటి కార్మికులకు వేతనం రాగా, తనకు ఐదు నెలలుగా ఇవ్వకపోవడంతో పలుమార్లు పంచాయతీ అధికారులను కలిశాడు. అయినా వేతనం ఇవ్వకపోవడంతో మనోవేదనకు గురై మంగళవారం రాత్రి ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మైరుగైన వైద్యం కోసం అక్కడినుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
మంగపేట: పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారులతో రిసెప్షన్ సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని ఎస్పీ శబరీశ్ సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా మంగపేట పోలీస్స్టేషన్ను ఎస్పీ బుధవారం సందర్శించి పరిసరాలు, పరిశుభ్రతను పరిశీలించారు. 5ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అని స్టేషన్ మొత్తం కలియతిరిగి పరిశీలించారు. అనంతరం స్టేషన్ నిర్వహణ రికార్డులను పరిశీలించి ప్రతీ వర్టికల్కు ఒక అధికారిని కేటాయించి రికార్డులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని తెలిపారు. విచారణలో ఉన్న కేసులను పరిశీలించి మిస్సింగ్ కేసులను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంప్యూటర్ సిబ్బంది పనులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఐ శ్రీనివాస్, ఎస్హెచ్ఓ టీవీఆర్ సూరి, సిబ్బంది పాల్గొన్నారు. గోదావరి ఉధృతి పరిశీలన పోలీస్ స్టేషన్ తనిఖీ అనంతరం ఎస్పీ కమలాపురంలో గల ఇంటెక్వెల్ వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీశ్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు భారీగా వస్తుందని తెలిపారు. దీంతో గోదావరి పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు గోదావరికి చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు. ఎస్పీ డాక్టర్ శబరీశ్ -
గోదావరి పరవళ్లు
కన్నాయిగూడెం/వాజేడు: మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద బుధవారం గోదావరి పరవళ్లు తొక్కుతోంది. దీంతో బ్యారేజీ ప్రాంతమంతా వరద నీటితో జలమయమైంది. బుధవారం ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వచ్చి చేరడంతో పాటు సరస్వతీ, లక్ష్మీ, ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని వదులుతుండడంతో సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి ఉదయం 7,72,748 క్యూసెక్కులకు నీరు వచ్చి చేరగా సాయంత్రం 7,58,013క్యూసెక్కులకు మేర కొంత తగ్గింది. ఒక్కసారిగా గోదావరి భారీగా చేరడంతో ప్రజలు భయానికి గురయ్యారు. అలాగే వాజేడు మండల పరిధిలోని బుధవారం గోదావరి వరద ఉధృతంగా పెరగడంతో టేకులగూడెం చివరన జాతీయ రహదారి ముంపునకు గురైంది. రెండు రాష్ట్రాల మధ్యన రాకపోకలు నిలిచి పోయాయి. అదే విధంగా పేరూరు–కృష్ణాపురం, ఏడ్జెర్లపల్లి– పూసూరు, వాజేడు– గుమ్మడి దొడ్డి గ్రామాల మధ్యన ఉన్న బ్రిడ్జీలు వరద నీటిలో మునగడంతో పలు గ్రామాలకు రాక పోకలు నిలిచి పోయాయి. అప్రమత్తమైన అధికారులు వరదలోకి ఎవరూ వెళ్లకుండా ట్రాక్టర్లను అడ్డంగా పెట్టారు. పూసూరు గోదావరి బ్రిడ్జి వద్ద గోదావరి వరద పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. -
నవ సమాజ నిర్మాణానికి నడుం బిగించాలి
ములుగు: నవ సమాజ నిర్మాణానికి యువత నడుం బిగించాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడి నవసమాజ నిర్మాణ ఏర్పాటుకు పాటుపడాలన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు నో చెప్పి, బంగారు భవిష్యత్కు బాటలు వేసుకునేందుకు ప్రణాళికతో ముందుకుసాగాలన్నారు. దూమపానం, గంజాయి, మద్యపానం, కొకై న్, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కొందరు చెడు అలవాట్లతో మానసిక ఒత్తిడికి గురై చదువు, ఆటల్లో రాణించలేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో రాయినిగూడెం పీహెచ్సీ వైద్యాధికారి ప్రసాద్, ఆరోగ్య కార్యకర్త రవి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
రూ. 21లక్షల కరెన్సీతో అలంకరణ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఇండియన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతిని మహాలక్ష్మీ అవతారంలో రూ.21 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు యల్లాప్రగడ రాధాకృష్ణశర్మ ప్రత్యేక పూజలను నిర్వహించారు. బుధవారం ఇండియన్ యూత్ మండపం వద్ద కరెన్సీ నోట్లతో అలంకరణ చేయగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కమిటీ వారు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.ములుగు రూరల్: ములుగు మండలంలోని పత్తిపల్లి శివారులో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు బుధవారం గుర్తించారు. అటవీశాఖ రేంజ్ అధికారి డోలి శంకర్ కథనం ప్రకారం... పత్తిపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు పత్తి చేనులో అడవి జంతువుల పాదముద్రలు ఉన్నాయని అటవీశాఖ కార్యాలయానికి సమాచారం అందించారు. ఈ మేరకు ఎఫ్ఆర్ఓ సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిశీలించి పెద్దపులి పాదముద్రలుగా గుర్తించామని తెలిపారు. పాదముద్రల ఆధారంగా అటవి ప్రాంతానికి వెళ్లినప్పటికీ ఆచూకీ లభించలేదని తెలిపారు. పాదముద్రల ఆధారంగా మగ పెద్దపులి అని గుర్తించినట్లుగా వివరించారు. పత్తిపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం, రాత్రిళ్లు ప్రజలు బయటకు రావద్దని సూచించారు. పశువులు, గొర్రెల కాపరులు అటవీ ప్రాంతాలకు వెళ్లకూడదన్నారు. అడవి సమీపంలో ఉన్న వ్యవసాయ పంట పొలాలకు రైతులు, కూలీలు వెళ్లొద్దని సూచించారు. పులి కనిపిస్తే సెల్ నంబర్ 9849358923కి సమాచారం అందించాలని తెలిపారు.ఎస్ఎస్తాడ్వాయి: పంటనష్ట పరిహార సాధన సమితి ఆధ్వర్యంలో మేడారంలో ప్రచార రథాన్ని ప్రారంభించారు. బుథవారం సమ్మక్క పూజారులు సిద్ధబోయిన మునీందర్, సిద్ధబోయిన సురేందర్, కొక్కెర కృష్ణయ్య, కమిటీ అధ్యక్షుడు కృష్ణా అర్జున్లు అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పంటనష్ట పరిహార సాధన సమితి అధ్యక్షుడు కృష్ణాఅర్జున్ మాట్లాడుతూ మేడారంలో ఈ నెల 6న పంటనష్ట పరిహారం కోసం నిర్వహించనున్న సమావేశానికి నార్లాపూర్, వెంగ్లాపూర్, బయ్యక్కపేట, కాల్వపల్లి గ్రామ పంచాయతీల్లోని రైతులు హాజరయ్యేందుకు ఈ ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు రామసహాయం శ్రీనివాస్రెడ్డి, కమిటీ సభ్యులు జంగా హన్మంతరెడ్డి, గొంది శ్రీధర్, సమ్మారావు, లక్ష్మణ్, బాబురావు పాల్గొన్నారు. -
లింగనిర్ధారణ పరీక్షలు నేరం
ములుగు రూరల్: లింగనిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం మండల పరిధిలోని రాయినిగూడెం పీహెచ్సీ వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడ పిల్లలను రక్షించాలి– ఆడ పిల్లలను చదివించాలి అనే నినాదంతో గ్రామాల్లో విస్తృతంగా ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, శిశు సంరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ శక్తి జిల్లా కోఆర్డినేటర్ రమాదేవి, వైద్యులు ప్రసాద్, నాగఅన్వేష్, డోమో సంపత్, సఖి సెంటర్ అడ్మిన్ లావణ్య, తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా రాయినిగూడెం పీహెచ్సీలో అశా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి నియంత్రణలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు సమన్వయంతో పనిచేసి క్షయ రహిత సమాజాన్ని నిర్మించాలని సూచించారు. ములుగు: రేపు(గురువారం) జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రం వద్ద ప్రత్యేక అవసరాల చిన్నారులకు ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించనున్నట్లు డీఈఓ సిద్ధార్థరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర శిక్ష, అలింకో వారి సౌజన్యంతో శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ అవకాశాన్ని దివ్యాంగుల పిల్ల ల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరానికి చిన్నారులను తీసుకొచ్చే తల్లిదండ్రులు రెండు పాస్ఫొటోలు, 40 శాతం కంటే ఎక్కువగా దివ్యాంగత్వం ఉన్నట్లు సదరం ధృవపత్రం, ఆదాయం, రేషన్కార్డు, ఆధార్కార్డు తీసుకురావాలని సూచించారు. వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో మంగళవారం బాండ్ మొక్కజొన్న డీలర్లతో ఏటూరునాగారం ఏడీఏ అవినాష్ వర్మ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగా మొక్కజొన్న విత్తనాలు ఉత్పత్తి చేసి ఇబ్బందులకు గురికావద్దని తెలిపారు. భవిష్యత్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. విత్తనోత్పత్తి చేయదలిచిన రైతులు తప్పనిసరిగా ఆర్గనైజర్, కంపెనీ డీలర్ల నుంచి అగ్రిమెంట్ తీసుకోవాలని సూచించారు. రైతులు పాటించాల్సిన పద్ధతులు, దిగుబడిలో వచ్చే వ్యత్యాసం లాంటి వివరాలను అగ్రిమెంట్లో పొందు పరచాలన్నారు. -
పడిగాపులు కాసినా.. దొరకడం లేదు..
మూడు ఎకరాల సొంత భూమి ఉంది. మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగుచేశాను. యూరియా కోసం ప్రతిరోజూ పడరాని పాట్లు పడుతూ యూరియా వచ్చిందంటే సొసైటీకి పరుగులు తీస్తున్న పరిస్థితి. రాత్రి నుంచి ఉదయం వరకు పడిగాపులు కాసినా బస్తా కూడా దొరకడం లేదు. ప్రస్తుతం యూరియా వేసేందుకు అదను దాటిపోతుంది. ప్రభుత్వం యూరియా పంపిణీ చేసి రైతులను ఆదుకోవాలి. – దుర్గం సమ్మయ్య, లక్ష్మీదేవిపేట యూరియా కోసం రాత్రి నుంచి సొసైటీ ఎదుట క్యూలో నిల్చున్నాను. అయినా ఒక బస్తా కూడా దొరకలేదు. మూడు ఎకరాల్లో పత్తి, మూడు ఎకరాల్లో మిర్చి సాగు చేశాను. పంట సాగుకు 18 బస్తాల యూరియా అవసరం ఉండగా ఇప్పటికీ నాలుగు బస్తాలు మాత్రమే తీసుకున్నాను. యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. – శెట్టి రజినీకర్, వెంకటాపురం(ఎం) జిల్లాలో ఆగస్టు 31 వరకు 10,790 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశాం. సోమవారం 450, మంగళవారం 150 మెట్రిక్ టన్నుల యూరి యా పంపిణీ చేశాం. యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు. అవసరానికి అనుగుణంగా మాత్రమే రైతులు యూరియా తీసుకెళ్లాలి. సెప్టెంబర్ 30 వరకు మరో 3,400 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది. – సురేష్కుమార్, ములుగు వ్యవసాయ అధికారి -
కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ కుట్రలు
● బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నాగజ్యోతి ములుగు: కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసు నుంచి జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించి రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ.. కాళేశ్వరంపై విచారణ పేరుతో తెలంగాణ అస్తిత్వంపై చంద్రబాబు, ప్రధాని మోడీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భారీ కుట్రగా పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టును మూసేసి, గోదావరి జలాలను ఆంధ్రకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుండెకాయని అలాంటి ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జిల్లాలో రైతులకు సకాలంలో యూరియా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.. -
సమస్యల పరిష్కారానికి కృషి
ఏటూరునాగారం: ఏజెన్సీ గ్రామాలలో నెలకొన్న దళిత, గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిచేందుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య మంగళవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అధ్యక్షతన అత్యవసర సమావేశాన్ని ఏర్పా టు చేశారు. ఈ సమావేశానికి ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాల నుంచి దళిత గిరిజన సంఘాల ముఖ్య నాయకులు హాజరయ్యారు. ముందుగా ఐటీడీఏలో ఆయా శాఖల వారీగా అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీ ఏరియాలో 1/70 యాక్ట్ ఉన్నప్పటికీ హక్కులను ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. ఐటీడీఏ ద్వారా ప్రత్యేక డీఎస్సీ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వెంకటయ్య మాట్లాడుతూ ఏజెన్సీలో జీవో నంబర్ 3 రద్దయిందని దాని అమలుకు కృషి చేస్తానని తెలిపారు. 6న కలెక్టర్రేట్లో సమావేశం ఈ నెల 6న కలెక్టరేట్లో కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించాలన్నారు. దళిత గిరిజన సంఘాల నాయకులు కూడా పాల్గొనాలన్నారు. అధికారులందరూ ఒకేచోట ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు. వనదేతల దర్శనం.. ఎస్ఎస్తాడ్వాయి: మేడారం వనదేవతలను వెంకటయ్య దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు నీలాదేవి, రాంబాబునాయక్, శంకర్, లక్ష్మీనారాయణ, ప్రవీణ్లతో కలిసి ఆయన అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
వైఎస్సార్ దేశానికే ఆదర్శం
వెంకటాపురం(ఎం): దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి దేశానికే ఆదర్శమని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి అయిలయ్య అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని తాళ్లపహాడ్లో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా మంగళవారం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేద ప్రజల గుండెల్లో రాజన్న ఇంకా పదిలంగానే ఉన్నాడని, వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు మరువలేనివని అయిలయ్య కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి నవనీత్, కాంగ్రెస్ నాయకులు చెన్నోజు శ్రీనివాస్, జంగిలి రవి, చీకూర్తి రమేష్, ఎస్కె.జాకీర్, భూస సాంబయ్య, అన్నవేన రాజు, భూస గణేశ్, కూరెళ్ల సాంబయ్య, పులి రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఓటర్లు 2,29,159
ములుగు: జిల్లాలోని 171 గ్రామ పంచాయతీల పరిధిలో 2,29,159 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు కలెక్టర్ దివాకర, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంపత్రావు, జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఒంటేరు దేవరాజ్ మంగళవారం తుది జాబితా ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. గత నెల 30వ తేదీ లోపు అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు 31న పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 224 అభ్యంతరాలు రాగా విచారణ చేసి పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంతో పాటు అన్ని పంచాయతీ కార్యాలయాల్లో ఓటర్ల తుది జాబితాను ప్రదర్శించినట్లు వెల్లడించారు. 171జీపీలు.. 1520 వార్డులు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 గ్రామ పంచాయతీలు, 1,520 వార్డులు ఉండగా 1536 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్త ంగా మొత్తం 2,29,159 మంది ఓటర్లు ఉండగా అందులో 1,10,838 మంది పురుషులు, 1,18,299 మంది మహిళలు, 22 మంది ఇతరులు ఉన్నారు. పురుషుల కంటే మహిళలే అన్ని మ ండలాల్లో ఎక్కువగా ఉండడం గమనార్హం. గతంలో 1,535 పోలింగ్ స్టేషన్లు ఉండగా అదనంగా మరో పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు అ ధికారులు ప్రకటించారు. గత నెల 28న జిల్లాలో 2,28,911 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించగా అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం 248 మంది అదనంగా ఓటర్లు ఉన్నట్లు గుర్తించి 2,29,159 మందితో తుది జాబితా ప్రకటించారు. తుది జాబితా ప్రకటించిన అధికారులు 224 అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించిన అధికారులు -
యూరియా కోసం.. అరిగోస
వెంకటాపురం(ఎం): పగలనకా.. రాత్రనకా.. రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆపై రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. పలు చోట్ల పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను సముదాయిస్తున్నారు. పోలీసులే రైతులకు యూరియా టోకెన్లు అందిస్తూ దగ్గరుండి అధికారులచే యూరియా పంపిణీ చేయిస్తున్నారు. అయినప్పటికీ యూరియా కోసం రైతుల ఆందోళనలు ఆగడం లేదు. కష్టాలు తీరడం లేదు. వ్యవసాయ పనులు మానుకొని సహకార సంఘాల వద్ద క్యూలు కడుతున్నారు. మంగళవారం వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని లక్ష్మీదేవిపేటలో అర్ధరాత్రి 2 గంటల నుంచి, వెంకటాపురం మండల కేంద్రంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే రైతులు పీఏసీఎస్ కార్యాలయాల ఎదుట క్యూ కట్టారు. అర్ధరాత్రి నుంచి క్యూలో నిలబడిన ఒక్కొక్కరికి ఒక్కో బస్తా చొప్పున ఇచ్చి పంపుతున్నా చివరి వరుసలో ఉన్న రైతులకు అందలేదు. దీంతో పంటలను ఎలా సాగుచేయాలని, యూరియా కొరతతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అప్పడు లేని కొరత.. ఇప్పుడెందుకు? గతంలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎలా ఎదురైందని రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో వరిపంట 1,30,117 ఎకరాల్లో, పత్తి 27,143, మొక్కజొన్న 8,365 ఎకరాలు, మిర్చి 6,900 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో 1,70,169 ఎకరాల్లో పంటలు సాగు అవుతుండగా, 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 11 వేల మెట్రిక్ టన్నుల యూరియాను వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పంపిణీ చేసినప్పటికీ యూరియా కొరత ఉండడంతో ప్రశ్నార్థకంగా మారింది. యూరియాను రైతులు ముందస్తుగా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం మూలంగానే సన్న, చిన్న కారు రైతులకు యూరియా దొరకకుండా ఇబ్బందులు పడుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. పోలీసుల పహారాలో రైతులకు పంపిణీ పనులు మానుకుని క్యూలో ఉంటున్న అన్నదాతలు -
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి
వాజేడు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని పైలట్ గ్రామ పంచాయతీ టేకులగూడెంలో మంగళవారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. బిల్లులు ఖాతాల్లో పడుతున్నాయని అని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇళ్ల నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రతీ సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. ఇల్లు రాని వారు ఆందోళన చెందవద్దని అర్హులందరికీ ఇళ్లు మంజూరు అవుతాయని వివరించారు. అలాగే మండల పరిధిలోని చండ్రుపట్ల గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధులతో మాట్లాడిన ఆయన మధ్యాహ్న భోజనంతో పాటు వంటగదిని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మండల పరిధిలోని పేరూరు పీహెచ్సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలంలో వచ్చే మలేరియా, డెంగీ వ్యాధుల నియంత్రణలో వైద్యాధికారులు నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు. జిల్లా స్థాయిలో తయారు చేసిన ప్రణాళికల షెడ్యూల్ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తప్పని సరిగా అమలు చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో అమలు తీరును సూపర్వైజర్లు పర్యవేక్షించాలన్నారు. ఆశ కార్య కర్తలు ప్రతీరోజు 20 ఇళ్లను సందర్శించి జ్వరంతో బాధపడుతున్న వారికి మందులను ఇవ్వాలన్నారు. జ్వరం తగ్గకపోతే పీహెచ్సీలకు తీసుకురావాలని సూచించారు. అనంతరం ల్యాబ్, మందుల గది, ఇన్పేషెంట్ వార్డులను సందర్శించి రిజిస్టర్లను తనిఖీ చేశారు. పేరూరు వైద్యశాలకు మరో మేడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఇన్చార్జ్ ఎంపీవో శ్రీకాంత్ నాయుడు, ఎంఈఓ వెంకటేశ్వర్లు ఉన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
ములుగు రూరల్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణపతి నిమజ్జనానికి జిల్లా కేంద్రంలోని తోపుకుంట వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ సంపత్, తహసీల్దార్ విజయభాస్కర్, సీఐ సురేష్కుమార్, ఎస్సై వెంకటేశ్వర్రావులు పరిశీలించారు. నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. అదే విధంగా జిల్లా కేంద్రంలోని అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని ఐదవ రోజు నిమజ్జనం చేశారు. అటవీశాఖ సిబ్బంది వినాయక నిమజ్జనంలో ఆటపాటలతో అలరించారు. వినాకుడిని వైభవంగా ఊరేగించి అనంతరం తోపుకుంటలో నిమజ్జనం చేశారు. -
కబడ్డీ పోటీల్లో తరంగిణి ప్రతిభ
వాజేడు: నేషనల్ జూనియర్ స్థాయి కబడ్డీ పోటీల్లో ఆదివాసీ బిడ్డ ఉయిక తరంగిణి ప్రతిభ చూపింది. వివరాల్లోకి వెళ్తే..మండల కేంద్రానికి చెందిన ఉయిక రమేష్–రాంబాయి ల కూతురు తరంగిణి ఖమ్మంలోని నవోదయలో చదువుతున్న క్రమంలో ఆటలపై మ క్కువ చూపేది. ఈ క్రమంలో కబడ్డీపై దృష్టి సారించి నేషనల్ స్థాయికి చేరుకుంది. ఆదివారం కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించిన నేషనల్ జూనియర్ స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబర్చింది. దీంతో ఆమె ఉత్తమ రైడర్గా ఎంపికై జిల్లాకు మంచిపేరు తీసుకొచ్చింది. ఆటల్లో మరింత ప్రతిభ చూపి ఉత్తమ క్రీడాకారిణిగా రాణించి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకొస్తానని ఆమె వెల్లడించారు. తరంగిణి తండ్రి ఉయిక రమేష్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో 2024 నవంబర్ 21న మావోయిస్టులు హతమార్చిన ఘటన విధితమే. -
మూడు నెలలుగా పింఛన్ రావడం లేదు..
మూడు నెలలుగా పింఛన్ రావడం లేదు. పింఛన్ కోసం వెళ్తే నీ పేరున డబ్బులు జమ కాలేదని చెబుతున్నారు. పింఛన్ అందించే ఉద్యోగిని అడిగితే పంచాయతీ కార్యదర్శి రాలేదు అంటూ తిప్పుతున్నాడు. మూడు నెలలుగా పింఛన్ రా కపోవడంతో ఇబ్బందులు పడుతున్నాను. అధి కారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – అంబటి సరోజన, జాకారం, ములుగు మండలం ఇందిరమ్మ ఇళ్ల జాబి తాలో పేరు వచ్చింది. దరఖాస్తు సమయంలో ఇంటి నిర్మా ణం ఉమ్మడి స్థలంలో నిర్మించుకుందామనుకుని నమోదు చేయించాను. ఇప్పడు అక్కడ అన్నదమ్ముల భూమి పంపకంలో ఇంటి నిర్మాణానికి ఇబ్బందిగా ఉంది. నాకు వేరే చోట స్థలం ఉంది. అక్క డ ఇంటి నిర్మాణానికి అనుమతి ఇప్పించాలి. – అల్లి రాంబాబు, సుందరయ్య కాలనీ, వాజేడు ములుగు ఏరియా ఆస్పత్రిలో కరోనా సమయంలో ల్యాబ్ టెక్నీషియన్గా తాత్కాలిక పద్ధతిలో పనిచేశాను. మూడు నెలలు ఈ –హెల్త్ ప్రొఫైల్ ప్రోగ్రాంలో పని చేశాను. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాను. ములుగు ఏరియా ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఇప్పించి ఉపాధి కల్పించాలి. – చిక్కుల రాకేశ్, అబ్బాపూర్, ములుగు మండలం -
సహాయక చర్యలు పకడ్బందీగా చేపట్టాలి
ములుగు రూరల్: భారీ వర్షాలు, వరద సహాయక చర్యలు పకడ్బందీగా చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క సీఎం సలహదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్, అదనపు కలెక్టర్ సంపత్రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. కంట్రోల్ రూంలలో 24 గంటలు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, కుంటల మరమ్మతులకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. నేటి నుంచి 6వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిందని తదితర అంశాలపై అధికారులకు సీఎం వివరించారు.వీసీలో సీఎం రేవంత్రెడ్డి -
సీపీఎస్ను రద్దు చేయాలని నిరసన
ములుగు: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించాలని కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ చైర్మన్ పోలురాజు మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగులకు శాపమైన సీపీఎస్ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న యూపీఎస్ విధానం కూడా ఆమోధయోగ్యంగా లేదన్నారు. అనంతరం సీపీఎస్ను రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సర్వర్ అహ్మద్, వాసుదేవరెడ్డి, ఆదిరెడ్డి, రాజునాయక్, మేడి చైతన్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉధృతంగా జంపన్నవాగు
ఏటూరునాగారం/వెంకటాపురం(కె)/వాజేడు: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మండల పరిధిలోని మల్యాల, కొండాయి, గోవిందరాజులకాలనీ, ఐలాపురం గ్రామాలకు రాకపోకలు చిలిపోయాయి. వాగు వద్ద ఉన్న బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో వాగు ఉధృతి పెరిగినప్పుడు రాకపోకలను నిలిపివేస్తున్న పరిస్థితి. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పడవలను సైతం వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పక్కన పెడుతున్నారు. అలాగే మండల పరిధిలోని ఎలిశెట్టిపల్లి గ్రామానికి సైతం రాకపోకలు నిలిచిపోయాయి. వాగు అవతలి గ్రామాల ప్రజలు వాగు వరద తగ్గితేగాని బయటకు వచ్చే పరిస్థితి లేదు. వెంకటాపురం(కె) మండల పరిధిలోని కలిపాక వాగు ఉధృతంగా ప్రమాధ స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు గిరిజన గ్రామాలైన కలిపాక, ముత్తారం, పెంకవాగు, సీతరాంపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తగ్గుతున్న గోదావరి వరద రెండు రోజుల క్రితం నుంచి ఉగ్రరూపం దాల్చిన గోదావరి తగ్గుముఖం పట్టింది. రామన్నగూడెం వద్ద ఆదివారం 15.50మీటర్లు ఉండగా సోమవారం 13.91కు తగ్గింది. క్రమ క్రమంగా గోదావరి వరద తగ్గుతుండడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అదే విధంగా వాజేడు మండల పరిధిలోని నీటిలో మునిగి ఉన్న రహదారులు క్రమంగా బయటపడ్డాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు కొనసాగుతున్నాయి. టేకులగూడెం గ్రామ చివరన మర్రిమాగు వద్ద జాతీయ రహదారి నుంచి వరద నీరు తగ్గడంతో రెండు రాష్ట్రాల మధ్యన రాకపోకలు కొనసాగుతున్నాయి. భారీ వర్షం.. లోతట్టు ప్రాంతం జలమయం మంగపేట: మండల పరిధిలోని రమణక్కపేట అటవి ప్రాంతంలో సోమవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదతో లోతట్టు ప్రాంతం పూర్తిగా జలమయమైంది. సుమారు మూడు గంటల పాటు కుండపోతగా వర్షం పడడంతో గండొర్రెగుట్ట నుంచి వచ్చిన వరద నీటితో పాటు మల్లూరు వాగు మధ్యతరహ ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా వచ్చిన భారీ వరద తోడు కావడంతో గండిపడిన చోటు నుంచి గ్రామంలోని సీఎస్ఐ స్కూల్, అంబేడ్కర్ కాలనీ మీదుగా వరద ఉధృతంగా ప్రవహించింది. దీంతో ఉదయం 7 గంటల వరకు వరదనీరు ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డు పైనుంచి ప్రవహించింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనంతరం వర్షం తగ్గిపోవడంతో పాటు వరదనీరు పూర్తిగా తొలగిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ తగ్గుముఖం పట్టిన గోదావరి -
వినతులిచ్చాం పరిష్కరించండి
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు అజ్మీర బాలు. ఏటూరునాగారం మండలం లంబాడీతండా. ఈయన 2021–22లో ఈఎస్ఎస్ కింద కంగన్హాల్ షాపునకు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం ఇతడికి ఐటీడీఏ ట్రైకార్, కెనరా బ్యాంక్ ద్వారా సబ్సిడీ రుణం వచ్చింది. ఈయన ఖాతాలో సుమారు రూ.80 వేలు రుణం జమ అయ్యాయి. కానీ ఆ రుణాన్ని బ్యాంక్ అధికారులు, ఐటీడీఏ అధికారులు కలిసి లబ్ధిదారుడికి అందజేయాల్సి ఉంది. కానీ దానిని అందించడం లేదు. నాలుగేళ్ల నుంచి బ్యాంక్, ఐటీడీఏ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. కానీ గ్రౌండింగ్ మాత్రం ఇవ్వడం లేదు. వ్యవసాయం చేయలేక ఇంటి వద్ద ఒక షాపు పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకునేందుకు చేసిన ప్రయత్నం అధికారుల వల్ల నీరుగారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల బాధితులు అనేకమంది ఉండడం గమనార్హం. ములుగురూరల్/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్, ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ సమస్యలపై 70 దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ టీఎస్.దివాకర అదనపు కలెక్టర్ సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్తో కలిసి వినతులు స్వీకరించగా ఐటీడీఏలో ఏపీఓ వసంతరావు డీడీ పోచంతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ మేరకు కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో 50 ఫిర్యాదులు రాగా ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో 20 వినతులు వచ్చాయి. వాటిని పరిశీలించిన అధికారులు ఆయా శాఖల అధికారులకు సిఫారసు చేశారు. పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో దరఖాస్తుదారుడికి సమాచారం అందించి సమస్యను వివరించాలని సూచంచారు. స్వీకరించిన కలెక్టర్ దివాకర, ఏపీఓ వసంతరావు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు -
గిరిజన దర్బార్లో..
ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో కోయ భవన్ నిర్మాణానికి భూమిని కేటాయించడానికి ఐటీడీఏ అధికారులు దృష్టి పెట్టాలని బూటారానికి చెందిన గిరిజనులు కోరారు. మహబూబాబాద్ మండలం మైలారం గ్రామానికి చెందిన గిరిజనుడు బెస్ట్ అవైలబుల్ స్కీం ఫీజు ఇప్పించాలని వేడుకున్నారు. రేగొండ మండలం రామన్నగూడెంకు చెందిన నిరుద్యోగి తనకు టెంట్హౌజ్ మీద రుణం ఇప్పించాలని కోరారు. ఇదే మండలంలోని రామన్నగూడెం తండాలో డ్రెయినేజీ నిర్మాణం చేపట్టానని అందుకు రావాల్సిన బిల్లు ఇప్పించాలని కోరారు. మహదేవ్పూర్ మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన రైతులు రైతు భరోసా ఇప్పించాలని వేడుకున్నారు. ఏటూరునాగారం మండలంలోని పాఠశాలలు, కళాశాలల్లో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని నిర్వాహకులు కోరారు. ఇలా పలు సమస్యలపై బాధితులు వినతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేష్బాబు, డీటీలు కిశోర్, అనిల్, కొమురం ప్రభాకర్, కొండల్రావు పాల్గొన్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం
ములుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ, ఫ్లెక్సీని దహనం చేసేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ నాయకుల నుంచి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అనంతరం బడే నాగజ్యోతి విలేకర్లతో మాట్లాడారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ అనేది బీఆర్ఎస్ పార్టీపై జరుగుతున్న దాడి కాదని, తెలంగాణను ఎడారిగా మార్చే విద్రోహ చర్య అన్నారు. ఇందులో ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్రెడ్డిల కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకే ముగ్గురు ఒక్కటయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూస్తే పార్టీ శ్రేణులే కాదు తెలంగాణ ప్రజలు కూడా ఎదురు తిరుగుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సానికొమ్ము రమేష్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పోరిక విజయ్ రాంనాయక్, కోగిల మహేష్, వేములపల్లి భిక్షపతి, చెన్న విజయ్, గొర్రె సమ్మయ్య, గండి కుమార్, ఆకుతోట చంద్రమౌళి పాల్గొన్నారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నాగజ్యోతి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా -
ఇన్చార్జ్ డీఈఓగా సిద్ధార్థరెడ్డి బాధ్యతలు
ములుగు: జిల్లా విద్యాశాఖ అధికారిగా సోమవారం సిద్ధార్థరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ములుగు ఇండస్ట్రీస్ మేనేజర్గా కొనసాగుతున్న సిద్ధార్థరెడ్డికి ఇన్చార్జ్ డీఈఓగా అదనపు బాధ్యతలను కలెక్టర్ దివాకర అప్పగించారు. గత జూన్ 16న డీఈఓ పాణిని లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో సస్పెండ్ అయ్యాడు. హనుమకొండ డీఈఓ వాసంతికి జూన్ 17న జిల్లా డీఈఓగా అదనపు బాధ్యతలు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆమె విధుల్లో చేరలేదు. దీంతో కలెక్టర్ చొరవ తీసుకుని ఇంటర్ విద్యాశాఖ అధికారి చంద్రకళకు డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు బాధ్యతలు నిర్వర్తించడం ఆమెకు ఇబ్బందిగా మారడంతో సోమవారం సిద్ధార్థరెడ్డికి ఇన్చార్జ్ డీఈఓగా బాధ్యతలు అప్పగించారు. ఎస్ఎస్తాడ్వాయి: ఆదివాసీ ప్రజలు మావోయిస్టులకు సహకరించొద్దు, హింసామార్గం విడిచి సాధారణ ప్రజా జీవితంలోకి రావాలని తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ యువజన సంఘం పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా సోమవారం కరపత్రాలు వెలిశాయి. మండల పరిధిలోని బయ్యక్కపేట, ఊరట్టం, కాల్వపల్లి గ్రామాల్లో పలుచోట్ల కరపత్రాలు కనిపించాయి. మావోయిస్టులతో ఒరిగేదేమి లేదని అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో మావోయిస్టుల అవసరం లేదని.. గ్రామాల అభివృద్ధికి, పిల్లల భ విష్యత్ బాగుండాలంటే మావోయిస్టుల సమాచారం పోలీసులకు ఇవ్వాలని కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈ విషయం ఆయా గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. ములుగు రూరల్: యాసంగిలో రైతులు పండించిన సన్నధాన్యానికి బోనస్ డబ్బులు చెల్లించాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. అమ్జద్పాషా అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందించి మాట్లాడారు. బోనస్ డబ్బులు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలకు సకాలంలో యూరియా అందించాలన్నారు. రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని దుయ్యబట్టారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర దక్కేలా చట్టం చేయాలని కోరారు. ములుగు రూరల్: ఆశ కార్యకర్తలకు అందిస్తున్న వేతనాలను తగ్గిస్తామని ఆరోగ్యశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని ఫిక్స్డ్ వేతనాల జీఓను విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా ఆశ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టగా అడ్డుకుని అరెస్టులు చేయడం సరికాదన్నారు.అరెస్టు అయిన వారిలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి, మంజుల, సరిత, రజిత, యశోద, శ్రావ్య, మాధవి, శోభ, స్వరూప పాల్గొన్నారు. ములుగు: గంజాయి సేవిస్తున్న 8 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం ములుగు మండలం ఇంచర్ల సమీపంలో కిలోన్నర గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని ములుగు పోలీసులు పట్టుకొని విచారించినట్లు తెలిసింది. దీంతో వెంకటాపురం(ఎం) మండల కేంద్రానికి చెందిన నలుగురు, ములుగుకు చెందిన ఇద్దరు, ఇంచర్లకు చెందిన మరో యు వకుడికి సుమారు 500 గ్రాముల గంజాయిని విక్రయించానని పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి మిగతా ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు
భూపాలపల్లి అర్బన్: ఆదాయాన్ని రాబట్టి లాభాల బాటపట్టేలా అన్ని మార్గాలను ఆర్టీసీ యాజమాన్యం అన్వేషిస్తోంది, గతంలో ప్రయాణికుల సమస్యలను అంతగా పట్టించుకోని ఆర్టీసీ నేడు ప్రయాణికులకు చేరువయ్యేందుకు వినూత్న సేవలను ప్రవేశపెట్టడానికి ప్రణాళిక రూపొందించుకుంది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుంచి వినోద, విహరయాత్రలకు ప్రత్యేక బస్సులను నడిపించే చర్యల్లో నిమగ్నమైంది. ఆదాయానికే పరిమితం కాకుండా ప్రయాణికుల కుటుంబాలకు సైతం వినోదం, విహరయాత్రలను పంపించేందుకు ప్రత్యేకంగా బస్సులను కేటాయించింది. ఇది వరకే ప్రయాణికులను ఆదరించేలా ప్రతి డిపోలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్య విధుల్లో తీరికలేకుండా గడిపే వారికి కాలక్షేపం కోసం, తీర్థయాత్రలపై ఆసక్తి ఉన్న వారికోసం ప్రత్యేక బస్సులను కేటాయిస్తున్నారు. ప్రయాణికులు ఎక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారన్నది తెలుసుకొని ఈ యాత్ర ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా యాత్ర వివరాలు, తేదీలు, చార్జీలను ప్రకటించి ప్రయాణికులు పేరు నమోదు చేసుకునే విధంగా ప్రచారం చేపడుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి ఈ నెలలో 4 టూర్ ప్యాకేజీల వివరాలను ప్రారంభించారు. విహర, వినోద యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఈ నెలలో నాలుగు రూట్లలో బస్సులు నడపడానికి ప్రణాళికలు రూపొందించాం. ముందస్తుగా డిపోలో పేర్లు నమోదు చేసుకొని సీట్లు రిజర్వేషన్ చేసుకోవాలి. – ఇందూ, డిపో మేనేజర్, భూపాలపల్లి ప్రయాణికుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ఆదాయ పెంపునకు అధికారుల చర్యలు ఈ నెలలో మూడు టూర్లకు ప్యాకేజీలు సిద్ధం -
రైతులను రోడ్డు మీదేసిన కాంగ్రెస్
రేగొండ: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతాంగం గోస పడుతుందని, రాష్ట్రాన్ని బాగు చేస్తారని నమ్మి ఓట్లేస్తే .. రైతులను నడి రోడ్డున నిలబెడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని ఆదివారం మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. రైతాంగం సాగు అవసరాలపై ముందు చూపు లేకపోవడమే రైతుల కష్టానికి కారణమన్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. -
శాంతించిన గోదావరి
కన్నాయిగూడెం: మూడు రోజుల నుంచి ఉరకలేసిన గోదావరి ఉధృతి ఆదివారం కొంతమేర తగ్గి శాంతించింది. మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి ఆదివారం సాయంత్రం వరకు 8,17,183 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్నటి వరకు 8,57,190 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా ఆదివారం 40 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం తగ్గి శాంతించింది. ప్రస్తుతం బ్యారేజీ 59 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 82.90 మీటర్ల నీటి మట్టం ఉంది. ఇన్టెక్వెల్ వద్ద ఫేజ్.2 లో ఒక మోటారును ఆన్ చేసి 247 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఇంకా నీటిలోనే రహదారులు వాజేడు: మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి వరద క్రమేపీ తగ్గుతూ వస్తోంది. మూడు రోజుల క్రితం ముంపునకు గురైన రహదారులు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరద ఇలానే తగ్గుముఖం పడితే కొన్నిచోట్ల రహదారులు బయటపడే అవకాశం ఉంది. టేకులగూడెం చివరన 163 నంబర్ జాతీయ రహదారి ముంపునకు గురికావడంతో ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు– గుమ్మడిదొడ్డి, ఏడ్జెర్లపల్లి– పూసూరు, పేరూరు–కృష్ణాపురం గ్రామాల మధ్యన రహదారులు ముంపులోనే ఉండడంతో ఆయా గ్రామాలకు ఇంకా రాకపోకలు కొనసాగడం లేదు. జాతీయ రహదారి నుంచి కోయవీరాపురం గ్రామానికి వెళ్లే రహదారి చాకలి వాగు వద్ద మునగడంతో గ్రామస్తులు గుట్ట పక్కన ఉన్న పాత దారి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద 8,17,183 క్యూసెక్కుల నీటి ప్రవాహం 59 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల -
గుంతలో దిగబడిన 108 వాహనం
వెంకటాపురం(కె): మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామ సమీపంలో ఆర్ఆండ్బీ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలో 108వాహనం శనివారం రాత్రి రెండు గంటల సమయంలో దిగబడింది. వివరాల్లోకి వెళ్లే.. బోదాపురం గ్రామ సమీపంలోని ఇసుక రీచ్ వద్ద లారీ డ్రైవర్ పాము కాటుకు గురయ్యాడు. గమనించిన లారీ డ్రైవర్లు 108 సిబ్బందికి సమాచారం అందించగా వారు పాము కాటుకు గురైన డ్రైవర్ను తీసుకువచ్చేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వాహనం రామచంద్రాపురం గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా లారీలు అడ్డురావడంతో పక్క నుంచి వెళ్తున్న 108వాహనం గుంతలో దిగబడింది. దాన్ని బయటకు తీసేందుకు 108 సిబ్బంది, గ్రామస్తులు గంటపాటు శ్రమించి బయటకు తీశారు. అనంతరం బోదాపురం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో స్థానిక ఎస్సైకి సమాచారం అందించారు. దీంతో ఆలుబాక గ్రామానికి చెందిన ముస్తాఫా పాము కాటుకు గురై న డ్రైవర్ పాషాను ద్విచక్రవాహనంపై రామచంద్రాపురం తీసుకొచ్చి 108 వాహనం ఎక్కించారు. దీంతో సిబ్బంది పాషాకు వాహనంలో చికిత్స అందిస్తూ వెంకటాపురం వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యం అందించగా కోలుకుంటున్నాడు.గంటపాటు శ్రమించి బయటకు తీసిన సిబ్బంది, గ్రామస్తులు -
హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలోని స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాల్లో హేమాచలగుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించిన పూజారులు స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు. సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేసి వేద మంత్రోచ్ఛరణతో ఆశీర్వచనం ఇచ్చారు. -
3న కార్మిక పోరాట బహిరంగ సభ
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 3వ తేదీన బీఎంఎస్ ఆధ్వర్యంలో కార్మిక పోరాట బహిరంగ సభను భూపాలపల్లి ఏరియాలో నిర్వహించనున్నట్లు బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు యూని యన్ కార్యాలయంలో ఆదివారం వాల్పోస్టర్ ఆవి ష్కరణ చేపట్టారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏరియాలోని అంబేడ్కర్ సెంటర్లో సాయంత్రం నాలుగు గంటలకు సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎంపీ ఈటల రాజేందర్, బొగ్గు పరిశ్రమల ఇన్చార్జ్ లక్ష్మారెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి, యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాధవనాయక్, హాజరు కానున్నట్లు తెలిపారు. -
స్కావెంజర్ల సమస్యలు పరిష్కరించాలి
ఏటూరునాగారం: స్కావెంజర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జిల్లా పరిషత్ పాఠశాలల స్కావెంజర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యనమల ప్రవీణ్కుమార్ అన్నా రు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో స్కా వెంజర్ల జిల్లా కమిటీ ఎన్నిక, సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లుగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని తెలిపారు. స్కావెంజర్లను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. పిల్లల సంఖ్య ఆధారం కాకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా వాసం ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శిగా మానస, ఇర్ప రాధికలను ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్కుమార్ -
అక్రమంగా తరలిస్తున్న టేకు కలప స్వాధీనం
వెంకటాపురం(కె): మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అటవీశాఖ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. ఎఫ్డీఓ ద్వాలి యా తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురం గ్రామ సమీపం నుంచి అక్రమంగా ఓ వ్యాన్లో తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎదిర, రామచంద్రాపురం, వెంకటాపురం అటవీ శాఖ సిబ్బంది, బేస్ క్యాంప్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. మొర్రవానిగూడెం గ్రామ శివారుల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో వారిని గమనించిన వ్యాన్ డ్రైవర్ సుమారు రూ.8 లక్షల విలువ చేసే టేకు కలపను వదిలేసి పారిపోయాడు. వాహనంతోపాటు కలపను వెంకటాపురం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ద్వాలియా తెలిపారు. దాడిలో శ్రీనివాసరా వు, దేవయ్య, లక్ష్మణ్దాస్ ఉన్నారు. -
మోదీ తల్లిపై రాహుల్గాంధీ వ్యాఖ్యలు సరికాదు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం ములుగు రూరల్: ప్రధాని నరేంద్రమోదీ తల్లిపై రాహుల్గాంధీ అనుచిత వ్యాఖ్యలు సరికాదని, రాహుల్ గాంధీని అరెస్టు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై రాహుల్గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మాటలు దేశ మహిళలు, ప్రజలను కించపరిచే విధంగా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ దేశ ప్రజలకు క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతలపూడి భాస్కర్రెడ్డి, రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ భూక్య జవహార్లాల్, ఉపాధ్యక్షుడు కృష్ణాకర్, అల్లె శోభన్, రవీంద్రాచారి, నగరపు రమేష్, రాజ్కుమార్, లవణ్కుమార్, ఇమ్మడి రాకేష్యాదవ్, రవిరెడ్డి, నాగరాజు, హరిబాబు, సంపత్, సుమలత, పవన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
దోబూచులాడుతున్న గోదావరి..!
● ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలు ● తగ్గుతూ.. పెరుగుతున్న వరద ● సమ్మక్క సాగర్బ్యారేజీ వద్ద 8,53,023 క్యూసెక్కులుకన్నాయిగూడెం: గోదావరి ఉధృతి తగ్గుతూ పెరుగుతూ.. దోబుచులాడుతోంది. వారం రోజులుగా మండలంతోపాటు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా నీరు చేరుతోంది. దీంతోపాటు ఎగువన ఉన్న సరస్వతి, లక్ష్మి, ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా నీరు చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ వరద నీటితో ఉరకలేస్తుంది. నిన్నటి వరకు పెరుగుతూ వచ్చిన గోదావరి శనివారం ఉదయం తగ్గి సాయంత్రం కొంతమేర పెరిగింది. ఉదయం బ్యారేజీలోకి ఎగువ ప్రాంతం నుంచి 8,57,190 క్యూసెక్కులు చేరగా.. మధ్యాహ్నం 8,45,043 క్యూసెక్కులు చేరింది. సాయంత్రం 8,53,023 క్యూసెక్కులు ఉంది. బ్యారేజీ వద్ద నీటిమట్టం 83.30 మీటర్లుగా కొనసాగుతుంది. జలదిగ్బంధంలో రహదారులు వాజేడు: శనివారం ఉదయం తగ్గిన గోదావరి వరద సాయంత్రం నుంచి మళ్లీ పెరుగుతుంది. శుక్రవారం రాత్రి 16.740 మీటర్లకు పెరిగిన గోదావరి శనివారం మధ్యాహ్నం వరకు 16.720 మీటర్లకు తగ్గింది. సాయంత్రానికి మండల పరిధిలోని పేరూరు వద్ద 16.760 మీటర్లకు చేరుకుంది. గోదావరి వరద ఉధృతంగా పెరుగుతుండడంలో మండలంలోని రహదారులు పలు చోట్ల జలదిగ్బంధంలో ఉన్నాయి. టేకులగూడెం చివరన 163 నంబర్ జాతీయ రహదారి ముంపునకు గురైన విషయం తెలిసిందే. వరద తీవ్రత పెరగడంతో రెండు రాష్ట్రాల మధ్యరాక పోకలు నిలిచిపోయాయి. ఏడ్జెర్లపల్లి– పూసూరు, పేరూరు–కృష్ణాపురం, జాతీయ రహదారి నుంచి కోయవీరాపురం, వాజేడు–గుమ్మడి దొడ్డి గ్రామాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాల్లో గోదావరి వరదతో పొలాలు నీట మునిగాయి. రహదారులు నీట మునగడంతో అప్రమత్తమైన అధికారులు పర్యవేక్షణ చర్యలు చేపట్టారు. ప్రజలు వరదలోకి వెళ్లకుండా ట్రాక్టర్లను అడ్డంగా పెట్టారు. గ్రామ పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. వరద ఉధృతి పెరిగితే లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
వరద బాధితులకు సామగ్రి పంపిణీ
● పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ ఏటూరునాగారం: వరద బాధితులకు దుప్పట్లు, వంట సామగ్రి, నిత్యావసర వస్తువులను అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ, గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్తో కలిసి శనివారం అందజేశారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో కొండాయి, మల్యాల, దొడ్ల లోని 100 మంది వరద బాధితులకు సామగ్రిని అందజేసి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి సీతక్క పిలుపు మేరకు రెలెయబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సామగ్రి అందించినట్లు తెలిపారు. అనంతరం రిలెయబుల్ ట్రస్టు ప్రతినిధి తుపాకుల రవి మాట్లాడుతూ మంత్రి సీతక్క సూచనమేరకు బాధితులకు అండగా నిలిచినట్లు చెప్పారు. ఏజెన్సీలో తమ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాంపతి, తహసీల్దార్ జగదీశ్వర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకన్న, మండల అధ్యక్షుడు చిటమట రఘు, వావిలాల ఎల్లయ్య, గీకురు భాగ్య, తదితరులు పాల్గొన్నారు. -
కాకతీయ వైభవం ఉట్టిపడేలా అభివృద్ధి
వెంకటాపురం(ఎం): కాకతీయ వైభవం ఉట్టిపడేలా జంగాలపల్లి జంక్షన్ మాదిరిగా వెంకటాపురం మండల కేంద్రంలోని తాళ్లపహాడ్ వై జంక్షన్ను అభివృద్ధి చేస్తానని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం రాత్రి మండల కేంద్రంలోని రామాలయం వద్ద బొమ్మకంటి రమేష్ దంపతులు నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వినాయకునికి పూజలు నిర్వహించగా శ్రీరామ యూత్ కమిటీ సభ్యులు సీతక్కను సన్మానించారు. అనంతరం మంత్రి సీతక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు అయిలయ్య, భగవాన్రెడ్డి, శ్రీనివాస్, నవనీత్, పోశాలు, రవి, రామాచారి, రాజేశ్వర్రావు పాల్గొన్నారు.రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
● కలెక్టర్ దివాకర టీఎస్ వెంకటాపురం(ఎం): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ లబ్ధిదారులకు సూచించారు. మండలంలోని లక్ష్మీదేవిపేటలో ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించి, మా ట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుంటేనే రూ.5 లక్షల సాయానికి అర్హులు అవుతారని స్పష్టం చేశారు. గ్రామంలో ఇళ్లు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించని లబ్ధిదా రులు వెంటనే నిర్మాణాలు చేపట్టాలన్నారు. లక్ష్యాని కి అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. అనంతరం అడవిరంగాపూర్ ఎర్రకుంట చెరువు మత్తడి శివారులో గల రోడ్డు భారీ వర్షాల కా రణంగా తెగిపోయినందున తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ నారా యణ, డీఈ రవీందర్ రెడ్డి, ఎంపీడీఓ రాజు, ఏఈ జయంతి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
అభ్యంతరాలు తెలియజేయాలి
ములుగు రూరల్: ఆగస్టు 30వ తేదీ లోపు డ్రాఫ్ట్ ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు తెలియజేయాలని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన డ్రాఫ్ట్ ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల చేశామని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా అప్డేట్ చేశామన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురిస్తామన్నారు. రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు జాబితా పరిశీలించి అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 31వ తేదీ లోపు ఫిర్యాదు చేయాలన్నారు. సెప్టెంబర్ 2న తుది జాబితా తయారు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, పలు రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపద్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టీఎస్ దివాకర శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాలైన వాజేడు, వెంకటాపురం(కె), ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, ఉధృతి పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. అధికార యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు ప్రజలు సహకరించాలన్నారు. ఏదైన తక్షణసహాయం కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 18004257109కు సమాచారం అందించాలన్నారు.కలెక్టర్ టీఎస్ దివాకర -
‘రెవెన్యూ’లో వేళ్లూనిన అవినీతి!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూశాఖలో అవినీతి పరాకాష్టకు చేరుతోంది. కొందరు తహసీల్దార్లు, అధికారులు అక్రమాదాయానికి కొత్తదారులు వెతుక్కుని మరీ అవినీతికి పాల్పడుతుండడం వివాదాస్పదమవుతోంది. కిందిస్థాయిలో పలువురు వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి పైస్థాయిలో సర్వేయర్లు, ఇన్స్పెక్టర్లు, తహసీల్దార్ల వరకు అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతీ పనికి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్న కొందరి తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చేయి తడిపితే తప్ప దస్త్రం కదిలించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఓ వైపు శాఖాపరమైన చర్యలు.. మరోవైపు ఏసీబీ దాడులు చేస్తున్నా కొందరు తహసీల్దార్ల తీరు మారడం లేదు. తాజాగా ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. శుక్రవారం ఆయన ఇంటితో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై ఐదు చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ప్రాథమికంగా రూ.5 కోట్ల అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తుండడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆది నుంచి అవినీతి ఆరోపణలు.. 2022లో వీఆర్ఎస్కు దరఖాస్తు.. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించిన కేసులో అరెస్టయిన తహసీల్దార్ బండి నాగేశ్వర్రావుపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ధర్మసాగర్, కాజీపేట, హసన్పర్తితోపాటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్లో పలుచోట్ల పనిచేసిన సమయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు అధికారులకు అందాయి. తహసీల్దార్ ఉద్యోగంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో భాగస్వామిగా చేరి రెండు చేతులా సంపాదిస్తూ ప్రభుత్వ, అసైన్డ్భూములను అప్పనంగా కట్టబెట్టారన్న ఫిర్యాదు మేరకు 2019లో అప్పుడున్న కలెక్టర్ విచారణ జరిపారు. ధర్మసాగర్ మండలంలోని ఓ గ్రామంలో గుట్టను విక్రయించి రిజిస్ట్రేషన్ చేసి పాస్పుస్తకాలు జారీ చేయడం వివాదంగా మారింది. 1976లో హసన్పర్తి శివారు కోమటిపల్లిలో కొనుగోలు చేసిన సీకేఎం కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్కు చెందిన 29 గుంటల భూమిని నగరానికి చెందిన ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసి వారి నుంచి రూ.45 లక్షలు తీసుకున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ విషయమై బాధితులు 2022లో అప్పటి సీపీ, డీసీపీ, ఏసీపీకి ఫిర్యాదు చేశారు. తహసీల్దార్తోపాటు ఆ ముగ్గురిపై చేసిన ఫిర్యాదుపై విచారణ జరిగినా ఇప్పటికీ నానుతోంది. వరంగల్, హైదరాబాద్లో విలాసవంతమైన భవనాలను నిర్మించడంతోపాటు ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగుచూడడంతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు కూడా ఆయన దరఖాస్తు చేసుకున్నారు. చివరకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దాడులు చేయడం చర్చనీయాంశమవుతోంది. 2024లో భూసేకరణలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వరంగల్ ఆర్డీఓ సిడాం దత్తును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు వరంగల్ జిల్లా సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో ఏకంగా సంయుక్త పాలనాధికారి సీసీ రూ 45 వేలు తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. హనుమకొండ జిల్లా నడికూడ మండల ఆర్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. భూపాలపల్లిలో రెవెన్యూ అధికారులకు లంచమివ్వాలని, లేదంటే తమ పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని వృద్ధ దంపతులు భిక్షాటన చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. వెంకటాపూర్లో ఓ రైతు తనకున్న భూమిని పట్టా చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి, చివరకు విసిగిపోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇలా ఆరోపణలు వచ్చిన పలువురిపై బదిలీలు, సస్పెన్షన్, వీఆర్లో వేటు పడినా.. రాజకీయ పలుకుబడితో మళ్లీ కీలక మండలాల్లో పోస్టింగ్లు తెచ్చుకుని అదే తంతు కొనసాగిస్తున్నారు. నాలుగేళ్లలో అవినీతి నిరోధక శాఖ ఉమ్మడి జిల్లాలో 66కు పైగా వివిధ శాఖలకు చెంది న వారిని పట్టుకుంది. అందులో రెవెన్యూ శాఖదే అగ్రస్థానం ఉండడం గమనార్హం. అయినా ఆ శాఖలో పని చేస్తున్న కొందరిలో మార్పు రావడం లేదన్న చర్చ జరుగుతోంది.ఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్రోడ్డులోని ఖిలా వరంగల్ తహసీల్ధార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. బీరువా, కౌంటర్లు, క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతీ ఫైల్ను పరిశీలించి కొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మండల ఏర్పాటు నుంచి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
ముంపునకు గురైన జాతీయ రహదారి
● తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య నిలిచిన రాకపోకలు వాజేడు: మండలపరిధిలోని టేకులగూడెం గ్రామసమీపంలో 163 నంబర్ జాతీయ రహదారిపైకి శుక్రవారం గోదావరి వరద నీరు చేరింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద క్రమేపి పెరుగుతుండడంతో రేగుమాకు ఒర్రె నుంచి రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. అప్రమత్తమైన అధికారులు వరదలోకి ఎవరూ వెళ్లకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. వరద పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముంపునకు గురైన జాతీయ రహదారిని పేరూరు ఎస్సై కృష్ణప్రసాద్, ఎంపీడీఓ శ్రీకాంత్నాయుడు పరిశీలించారు. వాహనదారులు నీటిలో నుంచి వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. -
తేరుకోని వాగవతలి గ్రామాలు
ఏటూరునాగారం: జిల్లాలోని మారుమూల ప్రాంతాలు వర్షాలు, వరదల నుంచి ఇంకా బయట పడలేదు. వాగవతలి గ్రామాలు తేరుకోకుండా వరద నీటికి భయపడుతూ జీవిస్తున్నారు. దీంతో కలెక్టర్ దివాకర టీఎస్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎస్పీ శబరీష్ స్థానిక పోలీసులను అలర్ట్ చేసి సరిహద్దు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు సేవలందించాలని ఆదేశించారు. ఏటూరునాగారం మండలంలోని కొండాయి వద్ద జంపన్నవాగు ఉధృతంగా ఉండడంతో పడవలపైనే ప్రయాణాలను సాగించారు. ఎలిశెట్టిపల్లి వద్ద ప్రజలను దాటించేందుకు పడవను సిద్ధంగా ఉంచారు. తాడ్వాయి మండలంలోని జనగలంచ వద్ద రోడ్డు సగం వరకు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. పెరుగుతున్న గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదా వరి నది క్రమంగా పెరుగుతుంది. ఏటూరునాగా రం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఉదయం 8 గంటలకు 14.83 మీటర్లకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జా రీ చేశారు. సాయంత్రం 4 గంటలకు 15.56 మీటర్ల వరద ఉధృతిగా ప్రవహిస్తోంది. 15.83 మీటర్ల నీటి మట్టం చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చే యనున్నారు. కన్నాయిగూడెంలోని సమ్మక్క బ్యారే జ్ వద్ద 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. రెండో ప్రమాద హెచ్చరికకు దగ్గరలో గోదావరి నీటిమట్టం పడవల ప్రయాణమే వారికి దిక్కు అప్రమత్తమైన అధికారులు రామన్నగూడెం వద్ద 15.56 మీటర్ల నీటిమట్టం -
గ్రామాల అభివృద్ధే ధ్యేయం
ములుగు రూరల్/వెంకటాపురం(ఎం)/గోవిందరావుపేట/తాడ్వాయి: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ దనసరి సీతక్క అన్నారు. జిల్లాలోని ములు గు, వెంకటాపురం (ఎం), గోవిందరావుపేట, తా డ్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ములుగు మండలంలోని జగ్గన్నపేట, ఇంచర్ల గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను కలెక్టర్ టీఎస్ దివాకరతో కలిసి ప్రారంభించారు. జగ్గన్నపేట గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రూ.35లక్షలు, 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి భూమి పూజ చేశారు. ఇంచర్లలో నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.200 కోట్లతో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, అదనపు కలెక్టర్ సంపత్రావు, డీపీఓ దేవరాజ్, డీఆర్డీఓ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు పాల్గొన్నారు. వెంకటాపురం(ఎం) మండలంలోని జవహర్నగర్లో రూ.12లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. గోవిందరావుపేట మండలంలోని చల్వాయిలో రూ.45లక్షలు, దుంపిల్ల గూడెంలో రూ.10లక్షలు, పస్రాలో రూ.75 లక్షలతో సీసీ రోడ్డు పనులకు కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్తో కలిసి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఎస్ఎస్తాడ్వాయి మండల కేంద్రంలోని కామారంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయ భవనం, సీసీ రోడ్ల నిర్మాణ పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. మంత్రి సీతక్క -
అధికారుల సూచనలు పాటించాలి
ములుగు రూరల్/వెంకటాపురం(ఎం): జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున ప్రజలు, వాహనదారులు అధికారుల సూచనలు పాటించాలని కలెక్టర్ దివాకర సూచించారు. ఈ మేరకు కలెక్టర్ గురువారం వరద ప్రాంతాల్లో పర్యవేక్షించారు. అనంంతరం ఆయన మాట్లాడుతూ రోడ్లపై వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల వైపునకు వాహనదారులు వెళ్లకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎగువ ప్రాంతాల్లో నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారులపై వరద ప్రవాహం ఉన్న ప్రాంతాలలో ప్రయాణాలను నివారించేందుకు ట్రాక్టర్లు, ఇతర వాహనాలను అడ్డుగా ఏర్పాటు చేయాలన్నారు. వర్షాల దృష్ట్యా తక్షణ సాయం కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 18004257109కు సమాచారం అందించాలన్నారు. డీడీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాల ఏర్పాటు అకాల వర్షాలతో ఎదురయ్యే విపత్కర పరిస్థితులు ఎదుర్కునేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని ఎస్పీ శబరీశ్ తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు వరద ప్రాంతాల్లో ఆయన పర్యటించి పోలీసు అధికారులకు పలు సూచనలు అందించి ప్రజలను, వాహనదారులను అప్రమత్తం చేశారు. సంస్కృతికి ప్రతీక తీజ్ బంజారా, లంబాడీల సంస్కృతీసంప్రదాయానికి తీజ్ పండుగ ప్రతీక అని కలెక్టర్ దివాకర తెలిపారు. జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో డీఎఫ్ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ మహేందర్జీతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లంబాడీల ఆచార సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని తరతరాలకు అందించడం అభినందనీయమన్నారు. తీజ్ పండుగ వేడుకలు సామాజిక ఐక్యతకు, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకలని పేర్కొన్నారు. తీజ్ ఉత్సవాలతో సమాజంలో ఆనందం, ఐక్యత పెరుగుతాయని వివరించారు. రైతులందరికీ యూరియా అందిస్తాం జిల్లాలో పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ యూరియా అందిస్తామని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయాన్ని ఆయన గురువారం తనిఖీ చేసి ఇప్పటి వరకు రైతులకు అందించిన యూరియా రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ దివాకర -
తెగిన పెద్దచెరువు కట్ట.. నీట మునిగిన పొలాలు
గోవిందరావుపేట: మండలంలో 20సెంటీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో రంగాపూర్లోని పెద్ద చెరువు కట్ట తెగిపోవడంతో చెరువులోని నీళ్లు పక్కనే ఉన్న వాగులో కలిసిపోయాయి. ముంపు ప్రాంతమైన ప్రాజెక్టు నగర్లోని 15 కుటుంబాలను ఎస్పీ డాక్టర్ శబరీశ్ పునరావాస కేంద్రానికి తరలించి వారికి పండ్లు, బిస్కెట్లు, తాగునీటిని పంపిణీ చేశారు. కలెక్టర్ శబరీశ్ సైతం గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వర్షాలు, వరదలు తగ్గేవరకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రంగాపూర్లో తెగిన పెద్ద చెరువు కట్ట చెరువును తలపిస్తున్న పంట పొలాలు -
కోతకు గురైన ఎన్హెచ్
తాడ్వాయి– పస్రా మార్గంలోని మొండ్యాల తోగు వద్ద జాతీయ రహదారి వరద తాకిడికి భారీగా కోతకు గురైంది. ఈరోడ్డు మార్గన నిత్యం వందలాది వాహనాలు నడుస్తుడడంతో ప్రమాదాలకు గురికాకుండా తాడ్వాయి పోలీసులు భారీకేడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మండలంలోని ఊరట్టం తూముల వాగు వరద తాకిడికి బ్రిడ్జి సమీపంలో రోడాం వద్ద సీసీ రోడ్డు కోతకు గురైంది. అలాగే మండల కేంద్రంలోని తాడ్వాయి నుంచి మేడారానికి వెళ్లే దారిలోని కామారం బ్రిడ్జి సమీపంలో తారు రోడ్డు కూడా ధ్వంసమైంది. వాహనదారులు, ప్రజలను అప్రమత్తం చేస్తూ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అకారణంగా ప్రజలు వాగులు దాటి రావొద్దని వెంగ్లాపూర్, నార్లాపూర్, చింత క్రాస్ వద్ద రోడ్ల వెంట ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. -
విద్యార్థులు లక్ష్యసాధనకు పాటుపడాలి
కన్నాయిగూడెం: విద్యార్థులు లక్ష్య సాధనకు నిరంతరం పాటుపడాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థుల చదువుపై ఆరా తీశారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న విషయాలను తెలుసుకున్నారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. భోజన వసతిపై ఆరా తీసి మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్కు సూచించారు. అనుమతులు లేకుండా పాఠశాలకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మండల కేంద్రంలోని పీహెచ్సీని తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మందుల గది, ల్యాబ్ను పరిశీలించారు. మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సీజన్లో వచ్చే మలేరియా, టైపాయిడ్, కలరా, డెంగీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రోగులకు నిరంతరం వైద్యసేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో హెచ్డీఎఫ్సీ, వృత్తి స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా కేంద్రీకృత అభివృద్ధి ప్రాజెక్టు కరపత్రాలను బ్యాంక్ జోనల్ అధికారి అమిత్ నాందేవ్తో కలిసి కలెక్టర్ విడుదల చేసి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించే పంటలను ఐపీఎం పద్ధతిలో పండించి మంచిరేటు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అభినవ్, మండల ప్రత్యేక అధికారి వెంకటనారాయణ, ఎంపీడీఓ సాజిదా, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్, కోటయ్య, నరేష్, లక్ష్మయ్య, బ్యాంక్ జోనల్ హెడ్ కరుణాకర్ రెడ్డి, క్లస్టర్ హెడ్ రాజేశ్, మేనేజర్ ఆసీయా, గిరిధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
బీజేపీ జిల్లా కమిటీ ఎన్నిక
ములుగు రూరల్: బీజేపీ జిల్లా కమిటీ ఎన్నికను జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నుకున్నారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆదేశాల మేరకు కమిటీని నియమించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ జిల్లా పదాధికారులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాయకులు బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలలో పార్టీ సభ్యులను గెలిపించుకోవాలని సూచించారు. నూతన కమిటీలో జిల్లా ఉపాధ్యక్షుడిగా జినుకల కృష్ణాకర్, రవీందర్రెడ్డి, అల్లెం శోభన్, మద్దినేని తేజరాజు, ప్రధాన కార్యదర్శులుగా నగరపు రమేష్, రవీంద్రాచారి, జాడి వెంకట్, కార్యదర్శులుగా సుధాకర్రెడ్డి, శ్రీనివాస్, జ్యోతి, మధు, లవన్కుమార్, మహాలక్ష్మీ, కోశాధికారిగా రాజ్కుమార్, కార్యాలయ కార్యదర్శిగా విశ్వనాధ్, మీడియా కన్వీనర్గా శ్యాంప్రసాద్లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, భూక్య రాజు నాయక్, భూక్య జవహర్లాల్, గుగులోత్ స్వరూప, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అనుమతులు తప్పనిసరి
ములుగు రూరల్: వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను ప్రతిష్ఠించే కమిటీలు అనుమతులు తప్పనిసరిగా పొందాలని ఎస్పీ శబరీశ్ సూచించారు. జిల్లాకేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో నెలవారి నేర సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహాలను ప్రతిష్ఠించిన ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. మండపాల్లో నిర్వహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్ల గురించి ఆరా తీసి వివరాలు అప్టేడ్ చేయాలన్నారు. కోర్టు ట్రయల్లో ఉన్న కేసుల గురించి ఆరా తీశారు. ప్రతీ కేసులో తప్పనిసరిగా సాక్షులకు, ముద్దాయిలకు సమాన్లు అందించాలన్నారు. ఈ నెలలో నమోదైన కేసుల వివరాలను స్టేషన్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కుమార్, సీఐలు శ్రీనివాస్, సురేష్, రమేష్, దయాకర్, ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్సైలు పాల్గొన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలి విధి నిర్వహణలో పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సాయుధ దళ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా ఎస్పీ సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. అధికారులు నిర్వహిస్తున్న విధులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కార్యాలయంలో రికార్డులను పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. బీడీ టీం కార్యాలయంలో అత్యాధునిక పరికరాల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. మోటర్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సదానందం, ఆర్ఐలు స్వామి, సంతోష్, వెంకటనారాయణ, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ శబరీశ్ -
మట్టి విగ్రహాలను పూజించడం మేలు
ములుగు రూరల్: వినాయక చవితి వేడుకల్లో మట్టి విగ్రహాలను పూజించడం మేలని కలెక్టర్ టీఎస్.దివాకర సూచించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో మట్టి విగ్రహాల పోస్టర్ను ఆవిష్కరించి కలెక్టర్ మాట్లాడారు. వినాయక విగ్రహాల తయారీలో వినియోగించే రసాయనాలతో జలవనరులు కాలుష్యంగా మారి జలరాశులు అంతరించి పోతున్నాయన్నారు. ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. చెరువుల్లో మట్టి మేటలను తొలగించడానికి, చెరువుల స్వచ్ఛతను కాపాడడానికి భక్తులు నడుంబిగించాలని తెలిపారు. మట్టి విగ్రహాలతో చెరువులు కలుషితం కాకుండా ఉంటాయని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ వెంకటేశ్, కాలుష్య నియంత్రణ మండలి ఏఈ సుభాష్నాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
వినాయక చవితి శోభ
గోవిందరావుపేట/ఏటూరునాగారం: జిల్లాలో వినాయక చవితి ఉత్సవాల సందడి ప్రారంభమైంది. నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజు ల పాటు జరగనున్నాయి. విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వహకులు మండపాలను డెకరేషన్ చేయడంతో పాటు విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ మేరకు జిల్లాలోని 9 మండలాల పరిధిలో రెండు వేలకు పైగా గణపతుల మండపాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు కిరాణ షాపుల్లో పూజా సామగ్రి కొనుగోళ్లతో సందడి వాతావరణం నెలకొంది. నిర్వహణకు భారీగానే ఖర్చు గ్రామాల్లోని సంఘాలు, యువజన సంఘాలు, కాలనీ అసోసియేట్లు, భక్త మండలీలు నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న గణ నాథుడి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. విగ్రహాలతో పాటు ఏర్పాట్లు, నిర్వహణ ఖర్చులు సైతం భారీగానే పెరిగాయి. వినాయకుడి విగ్రహాల ధరలు సైతం గతం కంటే 20 శాతానికి పైగా ధరలు పెరిగినప్పటికీ అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి. దుకాణాల్లో సందడి దుకాణాల వద్ద పూజా సామగ్రిని కొనుగోలు చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు. బుధవారం వినాయక చవితి కావడంతో చిన్న పిల్లలు సైతం బాల వినాయకుడిని ఇళ్లలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు పండుగను ఘనంగా జరుపుకునేందుకు కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో దుకాణాలు రద్దీగా మారాయి. 1వ రోజు భాద్రపద శుద్ధ చవితి రోజున వరసిద్ధి వినాయకుడిగా ఆవహన చేసి పూజించి, ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. 2వ రోజు వికట వినాయకుడిగా ఆవాహన చేసి పూజలు చేసి, అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. 3వ రోజు భాద్రపద శుద్ధ షష్టి రోజున లంబోదరుడిగా కొలుస్తారు. 4వ రోజు సప్తమి రోజున గజానన వినాయకుడిగా పూజించి చెరుకుగడలు నైవేద్యంగా సమర్పిస్తారు. 5వ రోజు అష్టమి రోజున మహోధర వినాకుడిగా పూజిస్తారు. 6న నవమి రోజున ఏకదంత వినాయకుడిగా కొలుస్తూ నువ్వులతో చేసిన పదార్థాలను సమర్పిస్తారు. 7న దశమి రోజున వక్రతుండ వినాయకుడిగా పూజించి అరటి మొదలైన పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. 8న ఏకాదశి రోజున విఘ్నరాజ వినాయకుడిగా పూజించి సత్తుపిండిని సమర్పిస్తారు. 9వ రోజు భాద్రపద శుద్ధ ద్వాదశి రోజున దూ మ్రవర్ణ వినాయకుడిగా ఆవహన చేసి పూజించి నేతి అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తారు. మండపాల ఏర్పాట్లు పూర్తి పూజా సామగ్రి కొనుగోళ్లతో దుకాణాల్లో సందడి -
రైతులు ఆందోళన చెందొద్దు
ములుగు రూరల్: రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సురేష్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది ఆగస్టు నెల వరకు యూరియా 10వేల 20 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని ఈ ఏడాది 10 వేల 720 మెట్రిక్ టన్నులు రైతులకు అందించినట్లు వెల్లడించారు. నేడు జిల్లాకు 500 మెట్రిక్ టన్నుల యూరియా, 31న 500 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు వివరించారు. సెప్టెంబర్ నెలలో రైతులకు 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఉత్తమ ఎస్సైగా కమలాకర్గోవిందరావుపేట: మండల పరిధిలోని పస్రా ఎస్సై కమలాకర్ ఎస్పీ శబరీశ్ నుంచి ఉత్తమ ఎస్సైగా ప్రశంసపత్రం, నగదు రివార్డును మంగళవారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై కమలాకర్ మాట్లాడుతూ నేర పరిశోధనలో ప్రతిభ కనబర్చి పలు కేసులను చాకచాక్యంగా పరిష్కరించిన పోలీసులను గుర్తించి నగదు బహుమతులు, రివార్డులు అందించినట్లు తెలిపారు. ఉత్తమ ఎస్సైగా అవార్డు, నగదు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, వీటిని అందజేసిన ఎస్పీ శబరీశ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సైని డీఎస్పీ రవీందర్, సీఐ దయాకర్, సిబ్బంది అభినందించారు.దుకాణాలకు టెండర్ల నిర్వహణ కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో షాపులు నడుపుకునేందకు లైసెన్స్ హక్కుల కోసం ఈ– టెండర్, సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం ద్వారా ఈఓ మహేష్ ఆధ్వర్యంలో నాలుగు టెండర్లు నిర్వహించారు. మంగళవారం టెండర్లకు పర్యవేక్షణాధికారిగా నందనం కవిత పర్యవేక్షణలో స్వీట్ హౌస్ నడుపుకునేందుకు రూ.3.40లక్షలు, పూలదండలు, పూలు, పండ్లు అమ్ముకొను హక్కు రూ.9లక్షలు, సులభ్ కాంప్లెక్స్ నడుపుకునేందుకు రూ.70వేలు, భక్తుల ఫొటోలు తీసుకునేందుకు రూ.1.20లక్షల హెచ్చు పాట వచ్చినట్లు ఈఓ తెలిపారు. టెండర్ల ద్వారా దేవస్థానానికి రూ. 14.30 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు.సెప్టెంబర్ 1న నిరసన దినంభూపాలపల్లి అర్బన్: సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)పిలుపు మేరకు సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించనున్న నిరసన దిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా జేఏసీ చైర్మన్ బూరుగు రవికుమార్ కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో టీజీఈ జేఏసీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ ఎదుట ఉదయం 11 గంటలకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ 8న ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే బస్సు యాత్రలో ఉద్యోగులు పాల్గొనాలని పిలుపుని చ్చారు. అనంతరం వాల్పోస్టర్ ఆవిష్కరించా రు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు విజయలక్ష్మి, సుభాకర్రెడ్డి, అశోక్, తిరుపతి, సేవానాయక్, రఘుకుమార్, శంకర్, విజయ్, మొండయ్య, సురేందర్రెడ్డి పాల్గొన్నారు.మట్టి గణపతి విగ్రహాల పంపిణీకాళేశ్వరం: శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానంలో మట్టి గణపతి విగ్రహాలను మంగళవారం ఉచితంగా పంపిణీ చేసినట్లు ఈఓ మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ, వెల్ది శరత్చంద్రశర్మ, జూనియర్ అసిస్టెంట్లు రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పూజలు చేసి.. వంతెనపై నుంచి దూకి
కాళేశ్వరం: మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఇంట్లో కుటుంబ సభ్యులు మందలించారని.. తమ ఇష్ట దైవమైన కొండయ్య మహారాజ్ చిత్రపటానికి పూజ చేసి ఓ వ్యక్తి కాళేశ్వరం వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి గల్లంతయ్యాడు. పోలీసులకు ఇచ్చిన పిర్యాదు ప్రకారం.. మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన మండిగ బాపు (75) మంగళవారం కాళేశ్వరం చేరుకున్నాడు. అంతర్రాష్ట్ర వంతెన ఫుట్పాత్పై తమ ఇష్టదైవమైన కొండయ్య మహారాజ్ చిత్రపటానికి కుంకుమతో పూజలు చేసి కొబ్బరికాయ కొట్టాడు. ఆ తర్వాత చెప్పులు వంతెన గోడపై వదిలి గోదావరిలోకి దూకాడు. స్థానికుల సమాచారం అందించడంతో పోలీసులు కుటుంబ సభ్యులకు తెలిపారు. గల్లంతైన వృద్ధుడి కుమారుడు రాజబాపు ఫిర్యాదు మేరకు ఎస్సై తమాషారెడ్డి కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అతడి వెంట ఉన్న తన సోదరుడు చిన్నబాపును పోలీసులు విచారిస్తున్నారు. ఆయనకు భార్య వీరలక్ష్మి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.గోదావరిలో గల్లంతైన వ్యక్తి కోసం పోలీసుల గాలింపు -
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
ఎస్ఎస్తాడ్వాయి: ఇంటింటా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి బాధ్యతగా పెంచాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్రావు అన్నారు. టీజీఐఎల్పీ ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని గవర్నర్ దత్తత గ్రామం కొండపర్తిలో పండ్లు, వెదురు మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండ్ల మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. వెదురు మొక్కల పెంపకం లాభదాయకంగా ఉంటుందన్నారు. దత్తత గ్రామం కొండపర్తి అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, డీపీఎంలు రాజు, శ్రీనివాస్, తాడ్వాయి సెర్ప్ ఏపీఎం కిషన్, టీజీఐఎల్పీ జిల్లా కోఆర్డినేటర్ వెంకన్న, మండల కోఆర్డినేటర్ యాదగిరి, గ్రామస్తులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ సంపత్రావు -
గిరిజన దర్బార్లో వినతులు ఇలా..
వెంకటాపురం(కె) మండల పరిధిలోని పాత్రాపురం గ్రామానికి చెందిన ఓ గిరిజన వ్యక్తి తమ కుటుంబసభ్యుల మరణ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలని కోరారు. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన రవి మేడారంలో ఆదివాసీ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి చేయించాలని విన్నవించారు. ఏటూరునాగారం మండల పరిధిలోని చెల్పాక గ్రామానికి చెందిన గిరిజనుడు ఆర్థిక సాయం ఇప్పించాలని కోరారు. మంగపేట మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన గిరిజనుడు ఐటీఐ అప్రెంటిస్ పూర్తి చేశానని అవుట్ సోర్సింగ్లో ఉద్యోగం ఇప్పించాలని విన్నవించాడు. గోవిందరావుపేట మండలం పస్రాకు చెందిన ఓ గిరిజనుడు అవుట్ సోర్సింగ్లో ఉద్యోగం కల్పించాలని కోరారు. ములుగు మండలం అంకన్నగూడేనికి చెందిన గిరిజనుడు సౌర గిరిజల వికాసం పథకం మంజూరు చేయాలని కోరారు. ఇలా పలువురు తమ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీఓ వసంతరావుకు వినతులు అందజేశారు. దరఖాస్తులను పరిశీలించి పీఓ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏపీఓ వసంతరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ సురేష్బాబు, మేనేజర్ శ్రీనివాస్, డీటీ అనిల్, డిప్యూ టీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, హెల్త్ ప్రోగ్రాం ఆఫీసర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి
మాది నిరుపేద కుటుంబం. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా వెన్నుముక దెబ్బతిని మంచానికి పరమితమయ్యాను. తల్లితో పాటు నివసించేందుకు ఇల్లు లేదు. గతంలో కలెక్టర్ చిన్న రేకుల షెడ్డు ఏర్పాటు చేయించి ఇవ్వగా అది పూర్తిగా ధ్వంసమైంది. కలెక్టర్ స్పందించి ఇందిరమ్మ ఇల్లు కేటాయించి ఆదుకోవాలి. – జల్లెల్ల రమేష్, మొద్దులగూడెం, గోవిందరావుపేట మండలం మల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటి నివాస స్థలం వా రసత్వంగా వచ్చింది. ఈ స్థలా న్ని నా భార్య పేరున రిజిస్ట్రేషన్ చేశాను. ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే పంచాయతీ కార్యదర్శి అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, సంబ ంధిత పత్రాలను పరిశీలించి అనుమతి ఇప్పించాలి. – చిరువంచ రమేష్, మల్లంపల్లిభూ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు వినతులు ఇచ్చినా ఫలితం లేకుండా పో యింది. వారసత్వంగా వచ్చి న భూమికి కొందరు అడ్డుతగిలి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి వారంలో సమస్య పరిష్కా రం కాకుంటే మళ్లీ ఫిర్యాదు చేయమంటే చేశారు. – బోట చిన్ననర్సయ్య, వెంకటాపురం(కె) -
ఎయిడ్స్పై అవగాహన తప్పనిసరి
ములుగు రూరల్: ఎయిడ్స్పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. ఈ మేరకు సోమవారం మండల పరిధిలోని జాకారం సాంఘీక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(దిశా) ఆధ్వర్యంలో చేపట్టిన 5కె మారథన్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. విద్యార్థులకు ఎయిడ్స్పై క్విజ్ కాంపిటీషన్ ఏర్పాటు చేసి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
వైద్య పరీక్షల కోసం నిరీక్షణ
ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని కాటాపూర్ పీహెచ్సీలో సోమవారం వైద్యం కోసం వెళ్లిన రోగులు పరీక్షల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. పీహెచ్సీ వైద్యాధికారి రంజిత్ ఆస్పత్రికి వచ్చిన రోగులను పరీక్షించి టెస్టులు రాశారు. ఈ క్రమంలో రక్త పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో లేకపోవడంతో రోగులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రక్త పరీక్షల అనంతరమే మలేరియా, డెంగీ, టైఫాయిడ్ ఉన్నట్లు తేలితే వైద్యాధికారి వాటికి తగినట్లుగా మందులు రాయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. పలువురు మందులు రాయించుకుని వెళ్లారు. కాటాపూర్ పీహెచ్సీ పరిధిలో ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రోగులు వైద్య సేవల కోసం పదుల సంఖ్యలో ఆస్పత్రికి వస్తుంటారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో సిబ్బంది అందరూ అందుబాటులో ఉండేలా జిల్లా వైద్యాధికారి తగిన చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడంపై వైద్యాధికారి రంజిత్ను వివరణ కోరగా ల్యాబ్ టెక్నీషియన్ బంధువులు చనిపోవడంతో వెళ్లగా వేరే వ్యక్తితో పరీక్షలు చేయించినట్లు తెలిపారు.కాటాపూర్ పీహెచ్సీలో అందుబాటులో లేని ల్యాబ్ టెక్నీషియన్ -
నోటిఫికేషనే తరువాయి..
సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వేళయ్యిందా..? రిజర్వేషన్లు తేలకున్నా ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోందా..? ఈ మేరకు పార్టీ కేడర్, నాయకులకు సంకేతాలు అందాయా..? పీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనుందా?.. జిల్లా ఉన్నతాధికారులను కూడా అప్రమత్తం చేశారా?... అంటే నిజమే అంటున్నాయి అధికార పార్టీ, అధికార వర్గాలు. నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సోమవారం కూడా జిల్లా కలెక్టర్లకు మౌఖికాదేశాలు అందాయన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయ పార్టీల్లో మొదలైన సందడి... స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. మొదట పేర్కొన్న విధంగానే ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీపీపీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తే ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఆరు జిల్లా ప్రజాపరిషత్లు, 75 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 778 ఎంపీటీసీ స్థానాలు 75 ఎంపీపీ స్థానాలను ప్రకటించి ఆ మేరకు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఆ తర్వాత 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలు జరిపే విధంగా 15,021 పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు ఇది వరకే ప్రకటించారు. కాగా, ఈ నెల 29న జరిగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ఇటీవలి సమావేశంలో జరిగే కీలక నిర్ణయాలను బట్టి ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండగా.. రాజకీయ పార్టీల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల సందడి పెరిగింది. సెప్టెంబర్ మాసంలో ఎన్నికలు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లపై పోటీ చేసేందుకు ఆశావహులు సై అంటున్నారు. ఆయా పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలను కలిసి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. జిల్లా జెడ్పీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ వార్డులు పోలింగ్ కేంద్రాలు హనుమకొండ 1 12 12 129 210 1,986 1,986 వరంగల్ 1 11 11 130 317 2,754 2,754 జేఎస్భూపాలపల్లి 1 12 12 109 248 2,102 2,102 మహబూబాబాద్ 1 18 18 193 482 4,110 4,110 ములుగు 1 10 10 83 171 1,520 1,535 జనగామ 1 12 12 134 280 2,534 2,534 06 75 75 778 1,708 15,006 15,021ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసి దాదాపుగా రెండేళ్లు కావస్తోంది. దీనిపై ఇదివరకే ఈ సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు జరిపించాలన్న హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార పార్టీ నేతలు, సీఎం నిర్ణయించినట్లు ప్రచారం. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోయినప్పటికీ.. పార్టీ పరంగా ఆ మేరకు అవకాశం కల్పించే యోచనలో అధిష్టానం ఉన్నటు్ల్ ఆ పార్టీ ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు చెబుతున్నారు. ఈ నెల 29న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలపై చర్చించి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, చీఫ్ సెక్రటరీల నుంచి ఆదేశాలు అందడంతో అందరూ అలర్ట్ అయ్యారు. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రకటించే అవకాశం ‘స్థానిక’ంలో బీసీలకు 42 శాతం అవకాశం.. పార్టీ కేడర్కు కాంగ్రెస్ సంకేతాలు ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. ఆ తర్వాతే సర్పంచ్, ‘ప్యాక్స్’ల ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో 6 జెడ్పీలు, 75 జెడ్పీటీసీ స్థానాలు.. జిల్లా కలెక్టర్లకూ సీఎస్ సమాచారం.. -
జనహిత పాదయాత్ర
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పరిధి ఇల్లంద మార్కెట్నుంచి మండలకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ వరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లు జనహిత పాదయాత్ర నిర్వహించారు. వారి వెంట మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ శ్రేణులు నడిచారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. అనంతరం అంబేడ్కర్ సెంటర్లో జరిగిన కార్నర్ మీటింగ్లో ముఖ్యనేతలు ప్రసంగించారు. – సాక్షి, వరంగల్ -
ఎన్నికల హామీలు అమలు చేయాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం ములుగు రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందించారు. మున్సిపాలిటీ పరిధిలో డ్రెయినేజీలు, సీసీ రోడ్లు సరిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామంలో తాగునీటి, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న 200 పడకల ఆస్పత్రిలో రోగులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతలపూడి భాస్కర్రెడ్డి, రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, నాయకులు రవీంద్రచారి, కృష్ణాకర్, విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు. -
జేఈఈ మెయిన్స్లో జగదీశ్వరి ప్రతిభ
కన్నాయిగూడెం: పేదింటి బిడ్డ జేఈఈ మెయిన్స్లో ప్రతిభ చూపి హర్యానాలోని సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించింది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని బుట్టాయిగూడెం గ్రామంలో కుమ్మరి ప్రమీలతిరుపతి దంపతుల కూతురు జగదీశ్వరి ఇటీవల వెలువడిన జేఈఈ మెయిన్స్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లి సేల్స్ డీలర్ షాపు నడుపుతూ కూతురును కష్టపడి చదివించింది. తల్లి కష్టం చూసిన జగదీశ్వరి ప్రణాళికతో చదివి జేఈఈ మెయిన్స్లో ఉత్తమ ప్రతిభ చూపి హర్యానాలోని సెంట్రల్ యూనివర్సిటీలో చేరింది. పేదరికం చదువుకు అడ్డుకాదని నిరూపించింది.పోడు భూములకు పట్టాలివ్వాలిములుగు రూరల్: పోడు సాగు చేసుకొని జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీ గిరిజనులకు పోడు పట్టాలు అందించాలని ఎంసీపీఐ(యూ) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సాంబయ్య అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట, కలెక్టరేట్లో బాలన్నగూడెం గ్రామంలో పోడు సాగు చేసుకొని జీవనం కొనసాగిస్తున్న వారికి పట్టాలు అందించకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి పోడు జీవనం కొనసాగిస్తున్న గిరిజనులకు పట్టాలు అందించి ఆదుకోవాలని అన్నారు.జీఐఏ సాధన సమితి ప్రధాన కార్యదర్శిగా గణేశ్మంగపేట: అర్చక ఉద్యోగుల మలిదశ గ్రాంట్ ఇన్ ఎయిడ్(జీఐఏ) సాధన సమితి ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గొర్లపల్లి గణేశ్ను ఎన్నుకున్నట్లు సంఘం నాయకులు దురిశెట్టి విద్యాసాగర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల హైదరాబాద్లోని బోలక్పూర్ భవాని శంకర దేవాలయంలో రాష్ట్రంలోని దేవస్థానంలో నిర్వహించిన అర్చక, ఉద్యోగుల సమావేశంలో అర్చక ఉద్యోగుల మలిదశ (జీఐఏ) సాధన సమితి నూతన సంఘాన్ని ఏర్పాటు చేసి కమిటీని ఎన్నుకున్నట్లు వివరించారు. కమిటీ ప్రధాన కార్యదర్శిగా నర్సింహస్వామి, ఆలయంలో పనిచేస్తున్న గణేశ్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు తెలిపారు.చెక్ బౌన్స్ కేసులో జరిమానా ములుగు రూరల్: జిల్లా కోర్టులో 2022లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో సోమవారం జిల్లా జూనియర్ సివిల్ కోర్టులో తీర్పు వెలుబడింది. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని అబ్బాపూర్కు చెందిన గాదె శంకర్ 2022లో జాకారం గ్రామానికి చెందిన గండ్రత్ శ్రీనివాస్పై చెక్ బౌన్స్ కేసు వేశారు. బాధితుడి వైపు న్యాయవాది సునీల్ కోర్టులో సమర్పించిన ఆధారాలను పరిశీలించి గండ్రత్ శ్రీనివాస్పై రూ. 8 లక్షలు, కోర్టు జరిమానా రూ. 10 వేలు చెల్లించాలని తీర్పు వెలువరించారు. ఈ తీర్పును దిక్కరిస్తే నెల రోజుల పాటు జైలు ఉంటుందని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి గుంటి జోత్స్న తెలిపారు.నియామక ఉత్తర్వులుకాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం అర్చకులుగా ఎంపికై న సంగనభట్ల విజయ్కుమార్, రావుల రాజకుమార్, త్రిపురారి శ్రావణ్కుమార్, కాకిరాల పవన్శర్మలకు ప్రధానార్చకులు పనకంటి ఫణీంద్రశర్మతో కలిసి ఆలయ ఈఓ మహేష్ సోమవారం నియామక పత్రాలను అందించారు. మరో అర్చకుడు కశ్యప్శర్మపై పలు అబియోగాలు రావడంతో ప్రభుత్వ పరిశీలనకు పంపినట్లు తెలిపారు. సోమవారం నలుగురు విధుల్లో చేరినట్లు తెలిపారు. -
ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
వెంకటాపురం(ఎం): గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ టీఎస్.దివాకర సూచించారు. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. విద్యుత్, మున్సిపల్, పంచాయతీ, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ జిల్లా కేంద్రంతో పాటు ఏటూరునాగారంలోని ముళ్లకట్ట, రామన్నగూడెం, మంగపేట మండలాల్లో లోలెవెల్లో ఉన్న విద్యుత్ తీగలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనానికి వెళ్లే రూట్లలో విద్యుత్ తీగల విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రూట్ క్లియరెన్స్ సమర్పించాలన్నారు. మెడికల్ కోసం లైటింగ్, శానిటేషన్, బ్లీచింగ్ వంటి పనులను మున్సిపల్, పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో పక్కాగా చేపట్టాలన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో వైద్యాధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఆనంతరం ఎస్పీ శబరీశ్ మాట్లాడుతూ ఈసారి గణేశ్ విగ్రహాల నిర్వాహకులు పోలీస్ వెబ్సైట్లో గణేశ్ మండపంతో పాటు తమ పూర్తి వివరాలు నమోదు చేయాలని, తద్వారా వారికి తగిన సేవలు అందుతాయని తెలిపారు. నిమజ్జన ప్రాంతాలైన చెరువుల వద్ద పోలీసుశాఖ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు, ప్రత్యేకంగా రాత్రి సమయాల్లో మండపాల నిర్వాహకులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సీహెచ్.మహేందర్ జీ, సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల అభివృద్ధికి కృషి అనంతరం నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం వికాసత్ భారత్ కార్యక్రమంలో గిరిజనులను అభివృద్ధికి కృషి చేయనున్నట్లు వెల్ల డించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదికర్మ యోగి కార్యక్రమాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి బుక్లెట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదికర్మ యోగి కార్యక్రమాల ద్వారా 7 శాఖల నుంచి అధికారులను రాష్ట్రస్థాయి శిక్షణకు పంపించినట్లు తెలిపారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరుకుని ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ప్రతీ ఆదివారం స్వామివారికి నిర్వహించే తిల తైలాభిషేకం పూజాలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
బోనస్ అందేదెప్పుడో?
● జిల్లా వ్యాప్తంగా 39,412.180 క్వింటాళ్ల సన్నధాన్యం కొనుగోలు ● రావాల్సిన బోనస్ రూ.19.70కోట్లుప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించడంతో సన్నరకం ధాన్యం నాలుగున్నర ఎకరాల్లో సాగు చేశాను. సన్నరకం వరి సాగుకు పెట్టుబడి ఖర్చులు ఎక్కువ కాగా దిగుబడి తక్కువ వచ్చింది. వరిధాన్యం అమ్మి మూడు నెలలు గడిచినప్పటికీ బోనస్ డబ్బులు జమకాలేదు. ఈ ఏడాది వర్షాకాలంలో పంటల సాగుకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం స్పందించి బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలి. – ఇమ్మడి భిక్షపతి, రైతు, ములుగు రాష్ట్ర ప్రభుత్వం బోనస్కు బడ్జెట్ కేటాయించలేదు. రైతుల నుంచి సన్నధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఎంఎస్పీ డబ్బుల చెల్లింపులు వెంటనే జరిగాయి. జిల్లాలో సన్నధాన్యం అమ్మకాలు చేపట్టిన రైతుల వివరాలు ఐఎఫ్ఎంఎస్ లాగిన్ నుంచి ప్రభుత్వానికి అందించాం. బడ్జెట్ కేటాయించిన వెంటనే బోనస్ డబ్బులు రైతుల ఖాతాలలో జమ అవుతాయి. – ఫైజల్ హుస్సేన్, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన సన్నధాన్యానికి క్వింటాకు బోనస్ రూ.500 ప్రకటించింది. దీంతో యాసంగి సాగులో జిల్లా ఎక్కువ శాతం రైతులు సన్న రకం ధాన్యం సాగు చేశారు. యాసంగి పంట అమ్మకాలు చేపట్టి మూడు నెలలు గడుస్తున్నా సన్న ధాన్యానికి బోనస్ అందకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించగా ప్రభుత్వం మద్దతు ధర రూ.2,320 చెల్లించింది. కానీ బోనస్ డబ్బులు మాత్రం రైతుల ఖాతాలలో జమ కాలేదు. మూడు నెలలు గడిచినా.. యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పీఏసీఎస్, ఐకేపీ, జీసీసీ, రైతు సంఘాల ఆధ్వర్యంలో 130 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అధికారులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే చివరి వరకు ధాన్యం కొనుగోళ్లు చేశారు. నెలలు గడుస్తున్నా సన్నధాన్యం పండించిన రైతుల ఖాతాలలో ఇప్పటి వరకు బోనస్ డబ్బులు జమ కాలేదు. ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా మొత్తం 81,874.320 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసింది. ఇందులో సన్నధాన్యం 39,412.180 క్వింటాలుగా ఉంది. 6,182 మంది రైతులకు.. రూ.19.70 కోట్లు జిల్లాలోని 10 మండలాల్లో యాసంగిలో సన్నధాన్యం పండించిన రైతులకు రూ.19.70కోట్లు చెల్లించాల్సి ఉంది. 6,182 మంది రైతులు 39,412.180 క్వింటాళ్ల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించారు. -
450 మందికి వైద్య పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఆదివారం నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంపులో 450 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. సింగరేణి ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన హెల్త్ క్యాంపును ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్కు చెందిన స్పెషలిస్టు డాక్టర్ హాజరై ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్మికుల కోరిక మేరకు సీఎండీ, డైరెక్టర్ల ఆదేశాల మేరకు సూపర్స్పెషలిటీ క్యాంపు నిర్వహించినట్లు జీఎం తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం కవీంద్ర, అధికారులు నజీర్, మారుతి, నాయకులు విజేందర్, శేషారత్నం, ఇన్చార్జ్ ఏసీఎంజో డాక్టర్ గోపికృష్ణ, స్పెషలిస్టు డాక్టర్లు పాల్గొన్నారు. -
ఓపెన్ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలి
విద్యారణ్యపురి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈవిద్యాసంవత్సరం 2025–26 లో డిగ్రీ, పీజీ ప్రవేశాలు పొందాలని ఆ యూనివర్సిటీ స్టూడెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు కోరారు. డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాల ప్రక్రియలో భాగంగా ఆదివారం వెంకటేశ్వర్లు ఆ యూ నివర్సిటీ సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణతో కలిసి హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల అధ్యయన కేంద్రాలను వేర్వేరుగా సందర్శించారు. ప్రవేశాల పోస్టర్లను ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. బీఏ,బీకాం,బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందే విద్యార్థులకు రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని వెల్లడించారు. విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. ఈనె ల 30 వరకు అడ్మిషన్లకు గడువు ఉందని తెలిపారు. పూర్తి వివరాలకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలన్నారు. కేడీసీలో పోస్టర్ల ఆవి ష్కరణ కార్యక్రమంలో కేడీసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఆలువాల సంజీవయ్య, అధ్యాపకులు డాక్టర్ బి.వెంకటగోపీనాథ్, ఎం.సదానందం, సురేశ్, పూర్ణచందర్, దుర్గం రవి, రమేశ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
కోతకు గురవుతున్న కరకట్ట
ఏటూరునాగారం: ఇటీవల కురిసిన వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కరకట్ట ఉంటుందా... కొట్టుకపోతుందా అనే ప్రమాదస్థాయికి చేరింది. మండల పరిధిలోని రామన్నగూడెం పుష్కరఘాట్ నుంచి 300 మీటర్ల దూరంలో ఉన్న కరకట్ట మట్టి ఇటీవల వరదలకు ఒర్లిపోయి పగుళ్లు తేలింది. కరకట్ట మట్టి కొట్టుకుపోవద్దని ఇరిగేషన్ అధికారులు టెక్స్టైల్ క్లాత్ వేసినప్పటికీ ఎలాంటి ఫలితాలను ఇవ్వడం లేదు. నిర్లక్ష్యం వీడకుంటే.. భారీ మూల్యం తప్పదు గోదావరి కరకట్ట పటిష్టపర్చడంలో అధికారులు, పాలకులు పట్టించుకోకపోతే వరద ఉధృతికి కరకట్ట కోతకు గురై గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని నిపుణులు చెబుతున్నారు. పన్నెండేళ్ల నుంచి కరకట్ట పటిష్ట పర్చడానికి గత, ప్రస్తుత ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కబెడుతున్నాయి. కరకట్ట పటిష్టపర్చడానికి గత ప్రభుత్వ హయాంలో రూ.137 కోట్ల బడ్జెట్ ఇస్తున్నట్లు 2022లో ఏటూరునాగారం వచ్చిన సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఒక్కపైసా కూడా రాలేదు. ప్రస్తుత ప్రభుత్వం నేటికి ఎలాంటి నిధులను కేటాయించడం లేదు. కేవలం మరమ్మతులతోనే కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి. ఇరిగేషన్ అధికారులు కేవలం కమీషన్లకు కక్కుర్తి పడి మరమ్మతులకు మాత్రమే మొగ్గుచూపుతున్నారు. వరదలు వచ్చినప్పుడే హడావుడి గోదావరి వరద వచ్చినప్పుడే అధికారులు, పాలకుల హడావుడి చేస్తున్నారనే తప్ప వేరేలేదు. ముంపు ప్రాంతాల ప్రజలను తరలించినట్లు హడావుడి చేసి లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం ప్రభుత్వ అధికారులకు షరామాములే. ఇలాంటి సంఘటనలు గత ఐదేళ్ల నుంచి జరుగున్నా అధికారులు శాశ్వత పరిష్కారంపై మొగ్గు చూపడం లేదు. వాహనాల డీజిల్, భోజనాలు, ఇతర బ్లీచింగ్ పేరుతో లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం తప్పా ఒరిగింది ఏమి లేదని ముంపు ప్రాంతాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు చోట్ల కోతలు.. కరకట్ట మొత్తం 10.2 కిలోమీటర్లు రామన్నగూడెం–పుష్కరఘాట్ నుంచి ఏటూరునాగారం– ఎక్కెల గ్రామం వరకు ఉంది. ఇందులో 3.5, 5.8, 6.9 కిలో మీటర్ల వద్ద కరకట్ట ఆయా ప్రాంతాల్లో కోతలకు గురవుతోంది. ప్రస్తుతం 300మీటర్ల వద్ద నూతనంగా మట్టి ఒర్లిపోతోంది.గోదావరి వరదకు కరకట్ట కొట్టుకుపోకుండా ఉండేందుకు జియోట్యూబ్స్ టెక్నాలజీతో నిర్మిస్తామని గతేడాది ప్రభుత్వం హడావుడి చేసింది. కాని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగానే మారింది. వాటి కోసం రూ.70 లక్షల వరకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించనప్పటికీ అవి ఆచరణలోకి రాలేదు. జియోట్యూబ్స్ పనులు మొదలు పెడుతారనే నమ్మకాలు సైతం లేవని ప్రజలు వాపోతున్నారు. గోదావరి ఉధృతికి ఒర్లిపోతున్న మట్టి అధికారుల నిర్లక్ష్యం.. కానరాని జియోట్యూబ్స్ -
ఉత్సాహంగా స్పోర్ట్ ్సడే రన్
వరంగల్ స్పోర్ట్స్: హాకీ క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ డీఎస్ఏ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్పోర్ట్స్డే రన్లో యువత, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వద్ద డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ జెండా ఊపి రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్యాన్చంద్ను స్మరించుకుంటూ ఈ నెల 31వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రన్ స్టేడియం నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా తిరిగి స్టేడియానికి చేరుకుంది. కార్యక్రమంలో హ్యాండ్బాల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్, డీఎస్ఏ కోచ్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి
భూపాలపల్లి అర్బన్: మూడు రోజుల క్రితం విషతుల్యమైన నీళ్లను తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో మూడు రోజుల క్రితం విద్యార్థులు తాగే నీటిలో విషద్రావణాన్ని కలిపినట్టు విద్యార్థుల ద్వారా ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇలాంటి ఘటనలు బాధాకరమని, ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో బాధ్యతగా ఉంటూ, వాతావరణ పరిస్థితులలో మార్పులకు అనుగుణంగా జాగ్రత్తలు పాటించాలన్నారు. యూఆర్ఎస్లో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విద్యార్థులను పరామర్శించిన అనంతరం ఆసుపత్రి సూపరిండెంట్తో ఫోన్లో మాట్లాడారు. ఆస్పత్రి ఆవరణ శుభ్రంగా లేదని డ్యూటీ డాక్టర్లు, సూపరింటెండెంట్ అందుబాటులో లేరని, విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు. ఆస్పత్లిఓ సరైన సౌకర్యాలు లేవని ప్రైవేట్ ల్యాబ్కు వెళ్లి టెస్టులు చేయించుకోవాలని విద్యార్థులను పంపించడం సరికాదన్నారు. తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల ల్యాబ్ సౌకర్యాలను మెరుగుపరచాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. అనంతరం డీఈఓ ముద్దమల్ల రాజేందర్తో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ఆరోగ్యం మెరుగయ్యే వరకు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుభాకర్రెడ్డి, కిరణ్కుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మందల రవీందర్రెడ్డి, స్థానిక నాయకులు కృష్ణమోహన్, హరిప్రసాద్, స్వామి, రాజిరెడ్డి, రమేష్, రవీందర్, జలంధర్ అనిల్ పాల్గొన్నారు.ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి -
అనుమతులు తప్పనిసరి
ములుగు రూరల్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాలలో విగ్రహాలను ప్రతిష్ఠించే నిర్వహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ములుగు ఎస్సై వెంకటేశ్వర్రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహకులు పోలీస్శాఖకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో పాటు పోర్టల్లో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు వివరాలను విలేజ్ పోలీస్ ఆఫీసర్కు అందించాలని వివరించారు. పోర్టల్లో విగ్రహం ఎత్తు, నిమజ్జనం తేదీ, నిమజ్జన స్థలం, కమిటీ సభ్యుల వివరాలను నమోదు చేయాలని వెల్లడించారు. ఏటూరునాగారం/వెంకటాపురం(కె): ఏజెన్సీ పరిధిలోని 108 అంబులెన్స్ల్లో ఇద్దరు గర్భిణులు ఆదివారం ప్రసవించారు. వివరాల్లోకి వెళ్తే.. ఏటూరునాగారం మండల పరిధిలోని శివాపురం పంచాయతీ పరిధిలో గల లింగాపురం గొత్తికోయగూడేనికి చెందిన మడకం సోనికి పురటి నొప్పుల రావడంతో 108కు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న పైలట్ గడ్డం దశరథం, ఈఎంటీ లోహిత కలిసి ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే పురటి నొప్పులు ఎక్కువై ప్రసవించింది. తల్లీబిడ్డను చికిత్స నిమిత్తం ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా వెంకటాపురం(కె) మండల పరిధిలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన పూనం దివ్యకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. మహిళను సిబ్బంది ఎదిర ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దివ్యకు ఈఎంటీ ప్రవీణ్, పైలట్ కుమారస్వామి వైద్యసేవలు అందించారు. తల్లీబిడ్డలను ఎదిర ఆస్పత్రిలో చేర్పించి వైద్యసేవలు అందిస్తున్నారు. ● సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్చూర్ నాయక్ భూపాలపల్లి రూరల్: విద్యుత్ ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటూ, వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్చూర్ నాయక్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. సర్కిల్లోని డీఈ టెక్నికల్ ఆధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించి విద్యుత్ ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామన్నారు. రైతుల సమస్యలను విని పరిష్కరించడానికి విద్యుత్ అధికారుల పొలంబాట కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 358 లూజ్ లైన్లు పునరుద్దరించామని, 682 ఒరిగిన స్తంభాలు సరి చేశామని, 2,216 మధ్య స్థంబాలు నెలకొల్పామని తెలిపారు. 292 లోలెవెల్ లైన్ క్రాసింగ్ డబల్ ఫీడింగ్ పాయింట్లను మార్చమని తెలిపారు. జీరో ప్రమాదాలే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తినా 1912 టోల్ ఫ్రీనంబర్ ద్వారా సంప్రదించాలని మల్చర్ నాయక్ సూచించారు. గణపతి రుద్రుడిగా రుద్రేశ్వరస్వామికి అలంకరణహన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో భాద్రపద మాసం శుద్ధ పాడ్యమి ఆదివారం శ్రీరుద్రేశ్వరస్వామి వారిని గణపతి రుద్రుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు పానుగంటి ప్రణవ్, పెండ్యాల సందీప్శర్మ ఉదయం నుంచి ప్రభాతసేవ, ఉత్తిష్ట గణపతి ఆరాధన రుద్రాభిషేకాలు నిర్వహించారు. -
యూరియా కోసం బారులు
పాలంపేటలో యూరియా కోసం క్యూలో ఉన్న రైతులులక్ష్మీదేవిపేటలో క్యూలో చెప్పులు పెట్టిన రైతులువెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేట, లక్ష్మీదేవిపేట గ్రామాల్లో యూరియా కోసం రైతులు ఆదివారం బారులుదీరారు. పాలంపేటలో పీఏసీఎస్ కార్యాలయ ఎదుట యూరియా బస్తాల కోసం రైతులు క్యూ కట్టగా ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. అలాగే లక్ష్మీదేవిపేటలో రైతులు తమ చెప్పులను క్యూలో ఉంచారు. ఈ సందర్భంగా ఏఓ శైలజను సాక్షి వివరణ కోరగా యూరియా కొరత లేదని రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రైతులు ముందస్తుగా యూరియాను నిల్వచేసుకోవడం మూలంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. -
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ములుగు రూరల్/వెంకటాపురం(ఎం): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని మల్లంపల్లి, జాకారం, బండారుపల్లి, శ్రీనగర్, మహ్మద్గౌస్ పల్లి గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలు, కూరగాయల మార్కెట్, ఇంటర్నల్ సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులకు శనివారం కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణితో కలిసి మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం మెడికల్ కళాశాల విద్యార్థుల కోసం నూతన మిని బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో అంతర్గత రహదారులు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రధాన రహదారి విస్తరణ పనులు సైతం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు దశల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, పంచాయతీ రాజ్ ఈఈ అజయ్ పాల్గొన్నారు. రూ.32.41 కోట్లు.. 689 పనులు ప్రారంభం ఉపాధి పనుల జాతరలో భాగంగా జిల్లాలో రూ.32.41 కోట్లతో 689 పనులు ప్రారంభించినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్రావు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, పాఠశాలల్లో టాయిలెట్లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని పలు గ్రామాలలో వివిధ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపనలు చేసినట్లు వివరించారు. మహిళా శక్తి ఉపాధి భరోసా కింద మహిళలకు మంజూరైన పశువుల, మేకల షెడ్, కోళ్లపారం, స్వచ్ఛభారత్ మిషన్ కింద సైడ్ కాల్వలు, డ్రెయినేజీ పనులను మంత్రి సీతక్క ప్రారంభించారని వెల్లడించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
కంకవనాల నర్సరీకి సన్నాహాలు
ఏటూరునాగారం: జిల్లాలోని అన్ని వర్గాల రైతులకు కంకవనాలను పెంచేందుకు అనువైన స్థలాలను పరిశీలించినట్లు అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ సంపత్రావు తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ ఏటూరునాగారం నర్సరీని ఏపీఓ వసంతరావుతో కలిసి సంపత్రావు శుక్రవారం పరిశీలించారు. ఇండస్ట్రీ ఎన్జీఓ ద్వారా పది లక్షల కంకవనం మొక్కలను పెంచడానికి అనువైన స్థలం కోసం ఈ ప్రాంతాన్ని పరిశీలించినట్లు వారు తెలిపారు. ఈ మొక్కలను ఇక్కడ పెంచి చుట్టూ పక్కల మండలాల్లోని రైతులకు ఈజీఎస్ ద్వారా ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. కంకవనాలను పెంచి వాటిని మార్కెటింగ్ చేసే వెసులుబాటు కూడా కల్పిస్తోందన్నారు. జిల్లాలోని ఆసక్తిగల వ్యక్తులకు కంకవనంతో వస్తువుల తయారీపై శిక్షణ ఇప్పించడానికి ట్రైనర్లను పిలిపిస్తున్నట్లు తెలిపారు. మొక్కలు నాటిన అధికారులు ప్రతీ ఒక్కరు మొక్కలను పెంచాలని అడిషనల్ కలెక్టర్ సంపత్రావు, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు అన్నారు. పనుల జాతరలో భాగంగా ఐటీడీఏ నర్సరీ వద్ద వారు మొక్కలను నాటారు. ఉపాధి హామీలో భాగంగా ప్రతీ ఒక్కరికి మొక్కులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వ్యక్తులు ఈజీఎస్, జీపీ సిబ్బందిని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేష్బాబు, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కుమార్, ఈజీఎస్ ఏపీఓ చరణ్రాజ్, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.ఐటీడీఏ స్థలాలను పరిశీలించిన అధికారులు -
గణపతి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
ఏటూరునాగారం: గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. ఈనెల 27 నుంచి తొమ్మిది రోజు పాటు నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ముందస్తు ముందస్తు చర్యల్లో భాగంగా ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లోని గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, ము స్లిం మైనార్టీ సభ్యులు, ఆలయ చైర్మన్లతో ఏఎస్పీ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక వి గ్రహాలు ప్రతిష్ఠించే ప్రతీ ఒకరు ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ప్రతి మండపంలో సీసీ టీవీ కెమెరాను ఏర్పాటు చేసుకోవాలని, మండలపాల దగ్గర విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రతీరోజు రాత్రి ఇద్దరు మండపాల దగ్గర విధిగా ఉండాలన్నారు. గణేష్ విగ్రహ నిమజ్జన సమయంలో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రోడ్డుపై నిరుపయోగంగా ఉన్న వాహనాలను వెంటనే తొలగించాలని తెలిపారు. విద్యుత్ తీగలను సరిచేసే విధంగా విద్యుత్శాఖ వారితో సమన్వయం చేసుకోవా లని సూచించారు. భక్తి శ్రద్ధలతో నిమజ్జనం ఊరేగింపు జరుపుకునేందుకు అన్ని కమిటీల సభ్యులు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. నిమజ్జ నం కోసం ముళ్లకట్ట వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ట్లు తెలిపారు. సమావేశంలో సీఐ అనుముల శ్రీని వాస్, ఎస్సై రాజ్కుమార్, ట్రెయినీ ఎస్సైలు నరేష్, రచిత్ర రామాలయం కమిటీ చైర్మన్ అలువాల శ్రీని వాస్, సాయిబాబా కమిటీ చైర్మన్ ప్రభా కర్, హనుమాన్ అర్చకులు యల్లాప్రగడ సూర్యనారాయణశర్మ, గణపతి కమిటీ సభ్యులు, మజీద్ అధ్యక్షుడు అఫ్జల్పాషా, సర్కార్, అజ్మత్ఖాన్ పాల్గొన్నారు.ఏఎస్పీ శివం ఉపాధ్యాయ -
నిర్లక్ష్యం వహిస్తే ఇంటికే..
మంగపేట : పాఠశాలల నిర్వహణ, విద్యాబోధనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంటికి వెళతారని కలెక్టర్ టీఎస్ దివాకర మంగపేట ప్రాథమికోన్నత పా ఠశాల ఉపాధ్యాయులను శుక్రవారం ఘాటుగా హె చ్చరించారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్, ప్రాథమికోన్నత పాఠశాల, పీహెచ్సీని ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూపీఎస్ ఉపాధ్యాయులు విద్యాబోధన సక్రమంగా చేయడంలేదని, పాఠశాల నిర్వహణ, రికార్డులు సక్రమంగా లేకపోవడంతో నెలరోజుల్లో పద్ధతి మా ర్చుకోవాలని లేకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జెడ్పీ హెచ్ఎస్, యూపీఎస్ను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం ప్రతీ రోజు భోజనం అందిస్తున్నారా రుచి గా ఉంటుందా.. లేదా.. అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారంలో ఎన్ని రోజులు గ్రుడ్లు ఇస్తున్నారని అడగడంతో సరైన సమాధానం రాకపోవడంతో విద్యార్థులను ఇంగ్లిష్లో వారాలు స్పెల్లింగ్తో చెప్పమని అడగడంతో ఒక్కరుకూడా చెప్పకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి చెందారు. విద్యార్థులకు ఏం భోదిస్తున్నారు. అసలు ఏమి జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎంత, ఎందరు ఉపాధ్యాయులు ఉన్నారని విధులకు ఎంతమంది హాజరయ్యారని ఆరా తీశారు. విద్యార్థుల్లో కనీస పురోగతి కనిపించడం లేదని, విద్యార్థులకు హోంవర్క్ ఏమి ఇస్తున్నారని వాటిని చూపించాలని ఆదేశించారు. అయినప్పటికీ వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఉపాధ్యాయుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. హెచ్ఎం ములకాల వెంకటస్వామి, ఉపాధ్యాయుడు సెలవు పెట్టారని ఎంఈఓ, జెడ్పీ హెచ్ఎస్ మేనక కలెక్టర్కు తెలిపారు. పాఠశాల నిర్వహణపై మీ పర్యవేక్షణ సక్రమంగా లేదని ఎంఈఓను సున్నితంగా హెచ్చరించారు. పాఠశాల రికార్డులు కూడా సక్రమంగా లేవని, నాలుగో తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేయలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల తర్వాత సందర్శిస్తానని అప్పటి వరకు పాఠశాల నిర్వహణ, రికార్డులు సక్రమంగా ఉండాలని, విద్యార్థులల్లో మార్పు తీసుకురావాలని తెలిపారు. పీహెచ్సీలో తనిఖీ మండల కేంద్రంలోని పీహెచ్సీ నిర్వహణ, సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. రోజువారీగా ఓపీ వివరాలు, డెంగీ, మలేరియా జ్వరాల నమోదు వివరాలను వైద్యాధికారి స్వప్నితను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలో చికిత్స పొందుతున్నవారితో మాట్లాడారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రవీందర్, ఎంపీఓ శ్రీనివాస్, ఆర్ఐ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సురేష్ ఉన్నారు. పనుల జాతర ప్రారంభం ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని కూలీలంద రూ వినియోగించుకోవాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఉపాధి హామీ అభివృద్ధి పనుల జాతర కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ సంపత్రావుతో కలి సి శుక్రవారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రా మంలో కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దివాకర మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకానికి సంబంధించి మొత్తం 266 పనులు చేపట్టామని, ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి కార్మికుడు రోజుకు రూ.307 లబ్ధి పొందాలన్నారు. పనుల్లో భాగంగా చిన్నబోయినపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రైతులకు క్యాటిల్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన, ఇంకుడు గుంతల నిర్మా ణం, నీటి సంరక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం కొంతమంది ఉపాధి, పారిశుద్ధ్య కార్మికులు దివ్యాంగులు కలిసి కలెక్టన్ను సన్మానించారు. ఇదిలా ఉండగా. ఎక్కువ పనులు చేసిన హసీనాబేగం, అస్మత్, సరస్వతి, మల్టీపర్పస్ వర్కర్ మేకల కిష్టయ్యను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కుమార్, ఈజీఎస్ ఏపీఓ చరణ్రాజ్ ఉన్నారు. ఉద్యోగులకు కలెక్టర్ దివాకర హెచ్చరిక -
అంగన్వాడీలు పోరాటాలకు సిద్ధం కావాలి
గోవిందరావుపేట: అంగన్వాడీలు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. పస్రా పీఎస్ఆర్ గార్డెన్లో శుక్రవారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ములుగు జిల్లా మహాసభలను సరోజన, రుద్రమదేవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జయలక్ష్మి హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఐసీడీఎస్తోపాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానం తెచ్చిందని అన్నారు. ప్రమాదకరమైన విధానాలకు వ్యతిరేకంగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ సిఫార్సులను అమలు చేస్తుందని, ఐసీడీఎస్ను నిర్వీర్యపరచడానికి నిర్ణయం చేయడం దుర్మార్గమని అన్నారు. విద్యాబోధన బాధ్యతలను అంగన్వాడీ టీచర్స్కు, హెల్పర్లకు ఇవ్వాలని, వలంటీర్లకిచ్చే అదనపు వేతనం అంగన్వాడీ టీచర్లకి ఇవ్వాలని అన్నారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, హెల్పర్లర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, ఎండీ దావుద్, కొప్పుల రఘుపతి, సోమా మల్లారెడ్డి, గొంది రాజేష్, సమ్మక్క, పద్మారాణి, భాగ్యలక్ష్మి, పార్వతి, సూరమ్మ, సరిత, రమ, రుక్మిణి, ధనలక్ష్మి, మోక్షరాణి, దీప, వెంకటరమణ, విజయలక్ష్మి, మల్లికార్జున, శోభ, పుష్ప తదితరులు పాల్గొన్నారు.జయలక్ష్మి -
పూర్వ ప్రాథమిక తరగతులకు నిధులు
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరంనుంచి పూర్వ ప్రాథమిక తరగతులు ప్రా రంభించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు పా ఠశాలల్లో చిన్నారులకు అడ్మిషన్లు కల్పించారు. ప్రభుత్వం తాజాగా సమగ్ర శిక్ష ద్వారా పూర్వ ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం నిధులు మంజూరు చేసి విడుదల చేసింది. ఈ మేరకు ఒక్కో స్కూల్కు రూ.1.70లక్షల నిధులను కలెక్టర్లకు జమ చేశారు. హనుమకొండ జిల్లాలో 45 పూర్వ ప్రాథమిక తరగతులకు నిధులు మంజూరై విడుదలయ్యాయి. అందులో 25 స్కూళ్లకు రూ.1.70లక్షల చొప్పున, మరో 20 స్కూళ్లకు రూ.50వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. రంగులు, విద్యార్థులకు ఆట వస్తువులు ఆయా పాఠశాలల్లోని పూర్వ ప్రాథమిక తరగతి గదికి రూ.50వేలు వెచ్చించి రంగులు వేయించాల్సింటుంది. ఆట వస్తువులు కొనుగోలు చేయాలి. ఒక్కో విద్యార్థికి రూ.1,000 కేటాయించి బ్యాగ్, షూస్, బెల్ట్, టై తదితర వస్తువులు కొనుగోలు చేయాలి. ఈ నిధులు జిల్లా కలెక్టర్లకు విడుదల చేసిన నేపథ్యంలో వాటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్.. డీఈఓలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. త్వరలోనే జిల్లాల కలెక్టర్లు ప్రతీ పూర్వ ప్రాథమిక తరగతి విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు ఒక ఆయా, ఒక ఇన్స్ట్రక్టర్ నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. కొన్నింటికి రూ.1.70లక్షలు, మరికొన్నింటికి రూ.50వేల చొప్పున విడుదల తరగతి గదికి కలర్, ఆటవస్తువులకు, విద్యార్థులకు బ్యాగ్, షూస్, టై, బెల్టు త్వరలోనే ఆయాలు, ఇన్స్ట్రక్టర్ల నియామకంజిల్లా పాఠశాలలు నిధులు భూపాలపల్లి 54 78.60 హనుమకొండ 65 52.50 వరంగల్ 32 54.40 ములుగు 08 13.60 మహబూబాబాద్ 22 37.40 జనగామ 15 21.90 -
వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి
● డీఎంహెచ్ఓ గోపాల్రావు ములుగు రూరల్/వెంకటాపురం(ఎం): గురుకుల పాఠశాలల్లోని విద్యార్థినులు తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని సందర్శించారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని, స్టోర్ రూం, కిచెన్ షెడ్లను పరిశీలించారు. అనంతరం వైద్యశిబిరంలో 35 మందికి పరీక్షలు నిర్వహించగా 10 మంది జ్వరంతో బాధపడుతున్నారన్నారు. వారికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెల్త్ ప్రొవైడర్ నవ్య, డెమో సంపత్, పాఠశాల ప్రిన్సిపాల్ నర్మదాబాయి, వైస్ ప్రిన్సిపాల్ స్వాతి, హెల్త్ సూపర్వైజర్ జయశ్రీ పాల్గొన్నారు. అలాగే వెంకటాపురం(ఎం) మండలంలోని ఇంచెంచెరువుపల్లిలోని వైద్య శిబిరాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. నీటి నిల్వలపై మూతలు పెట్టుకోవాలన్నారు.అనంతరం ప్రాథమిక పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డెమో సంపత్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్ సంఘమిత్ర, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. -
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో కూరగాయలు, మాంసం విక్రయాల మార్కెట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్, మాంసం, చేపలు, చికెన్ మార్కెట్లు ఒకే దగ్గర ఉండడంతో ఇబ్బందికర పరిస్థితి ఉన్నందున వేర్వేరుగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డులో గల పశుసంవర్థకశాఖ కార్యాలయం సమీపంలో నాన్వెజ్ మార్కెట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్ సంపత్, పంచాయతీరాజ్ ఈఈ అజయ్కుమార్ పాల్గొన్నారు.హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నేడు (శుక్రవారం) పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ జరపనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ అదాలత్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పెన్షన్, జీపీఎఫ్ కేసులు, ఖాతాల సమస్యలు చర్చించి పరిష్కరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఆయా ఖాతా దారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవా లని కలెక్టర్ కోరారు. మంగపేట: మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి(ఈఓ)గా రేవెల్లి మహేశ్ గురువారం బాధ్యతలను చేపట్టారు. ఆలయ ఈఓ శ్రావణం సత్యనారాయణ హనుమకొండలోని మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి, సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓగా బదిలీ అయ్యారు. భూపాలపలిలోని భక్తాంజనేయస్వామి దేవస్థానం ఆలయ ఈఓగా విధులు నిర్వహిస్తున్న మహేశ్కు లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో సత్యనారాయణ నుంచి అదనపు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన మహేశ్కు అర్చకులు పవన్కుమార్, ఈశ్వర్చంద్, సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య శుభాకాంక్షలు తెలిపారు. -
మేడారంలో ముగిసిన పొట్ట పండుగ
డోలివాయిద్యాలతో గుడికి వెళ్తున్న పూజారులుభక్తుల పైనుంచి దాటుకుంటూ వెళ్తున్న పూజారులుఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో సమ్మక్క పూజారులు రెండు రోజుల పాటు పొట్ట పండుగను ఘనంగా నిర్వహించారు. బుధవారం మొదలైన పొట్ట పండుగ పూజా కార్యక్రమాలు గురువారంతో ముగిశా యి. బుధవారం రాత్రి సమ్మక్క గుడి నుంచి పసు పు, కుంకుమలు, పూజా సామగ్రి తీసుకుని గద్దెలకు వెళ్లిన పూజారులు రాత్రంతా సంబురాలు చేసుకుని గురువారం ఉదయం గద్దెల వద్ద నుంచి పూజా సామగ్రిని తీసుకుని బూర కొమ్ముల శబ్ధాలు, డోలి వాయిద్యాలతో గుడికి వెళ్లారు. సమ్మక్క గద్దె నుంచి పూజారులు బయల్దేరిన సమయంలో భక్తులు, స్థా నిక ఆదివాసీ యువతీయువకులు దారిపొడువునా పడుకోవడంతో పూజారులు వారిపైనుంచి దాటి వెళ్లారు. అనంతరం సమ్మక్క గుడిలో పూజారులు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొక్కజొన్న కంకులు.. వరి పొట్ట నైవేద్యం పొట్టకు వచ్చిన మొక్కజొన్న కంకులు, వరి పొట్టను అమ్మవారికి పూజారులు నైవేద్యంగా సమర్పించారు. యాటను బలి ఇచ్చారు. అమ్మవారికి కొత్త ధాన్యాన్ని సమర్పించిన తర్వాతే స్వీకరిస్తామని పూజారులు వెల్లడించారు. రెండు రోజుల పాటు పొట్ట పండుగ పూజా కార్యక్రమాలతో మేడారంలో సందడి వాతావరణం నెలకొంది. గద్దెల నుంచి గుడికి వెళ్లిన పూజారులు పొట్టకు వచ్చిన ధాన్యం అమ్మవారికి నైవేద్యంగా సమర్పణ -
శాంతించిన గోదావరి
ఏటూరునాగారం: గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. బుధవారం రాత్రి వరకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి గురువారం ఉదయం నుంచి తగ్గుతుండడంతో జిల్లాలోని అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మండల పరిధిలోని రామన్నగూడెం వద్ద ఉదయం 9 గంటలకు 16.45 ఉండగా సాయంత్రం 6 గంటలకు 15.91 మీటర్లకు చేరింది. అయితే వరద తగ్గుతున్న క్రమంలో కరకట్ట కోతకు గురయ్యే ప్రమాదం ఉంటుందని ముందస్తుగా ఇరిగేషన్శాఖ అధికారులు మూడు వేల ఇసుక బస్తాలను సిద్ధం చేసి ఉంచారు. ఎక్కడ గండ్లు పడినా వెంటనే ఇసుక బస్తాలు వేసి కరకట్ట కోతకు గురికాకుండా చేసే ప్రయత్నం చేపట్టారు. ఓడవాడ, ఎస్సీ కాలనీ వైపు నుంచి వరద నీరు వెనుకకు వెళ్లడంతో భూములు తేలాయి. దీంతో గోదావరి సమీపంలోని ప్రజలు భయాందోళన నుంచి తేరుకున్నారు. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఉన్న గంగాదేవి ఆలయాన్ని గోదావరి తాకుతూ ప్రవహిస్తోంది. పోటెత్తిన వరద గోదావరి తగ్గుతూ రాంనగర్ వైపు పోటెత్తడంతో రాంనగర్–రామన్నగూడెం గ్రామాల మధ్యలోని రహదారి మునిగిపోయింది. దీంతో కోయగూడ ఎల్లాపురం, రాంనగర్, లంబాడీతండా గ్రామాల ప్రజలు గోదావరి నీటిలో నుంచి నడుచుకుంటూ తమతమ పనులకు వెళ్లారు. విద్యార్థులు వరద దాటలేక పాఠశాలలకు వెళ్లలేక ఇంటివద్దే ఉండిపోయారు. రాంనగర్ వద్ద వరదలో ఎవరూ దిగకుండా పోలీసులు పహారా కాశారు. పంచాయతీ సిబ్బంది సైతం రాంనగర్ వైపు అడ్డుగా ట్రాక్టర్ను ఏర్పాటు చేసి ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. అలాగే కొండాయి, ఎలిశెట్టిపల్లి గ్రామాల ప్రజలు పడవల ద్వారానే రాకపోకలను సాగిస్తున్నారు. ముంపు గ్రామాల్లో క్లోరినేషన్ మండలంలోని రామన్నగూడెం, రాంనగర్, ఓడవాడ, ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో క్లోరినేషన్ పనులను పంచాయతీ అధికారులు, సిబ్బంది ముమ్మరం చేశారు. ప్రజలు రోగాల భారిన పండకుండా ముందస్తుగా ఫాగింగ్, బ్లీచింగ్ చల్లించే పనులు చేపట్టారు. ప్రజలు దోమ తెరలు వాడాలని ఇంటింటికీ ఆశ కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించారు. రాంనగర్ గ్రామానికి పోటెత్తిన వరద కరకట్ట కోతను అడ్డుకునేందుకు 3 వేల ఇసుక బస్తాలు సిద్ధం రామన్నగూడెం వద్ద నీటిమట్టం 15.91 మీటర్లు కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీకి బుధవారం సాయంత్రం వరకు 11,12,170 క్యూసెక్కుల వరద వచ్చి చేరగా గురువారం సాయంత్రం వరకు 8,26,610 క్యూసెక్కులకు తగ్గింది. గోదావరి తగ్గుముఖం పడుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 84.20 మీటర్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజీ 59 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు అధికారులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం దేవాదుల ఎత్తిపోతల వద్ద 87.20 మీటర్ల నీటి మట్టం ఉన్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలుపుతున్నారు. -
బంధాలలో నేలకూలిన ఇల్లు
ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని బంధాల గ్రామానికి చెందిన కుర్సం కాంతారావు ఇల్లు నేలకూలింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం కాంతారావు కుటుంబ సభ్యులు నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారుజామున ఒకసారిగా ఇల్లు కూలిపోతున్న శబ్ధం రాగానే మేల్కొని బయటకు పరిగెత్తగానే ఇల్లు నేలకూలింది. ఇంట్లోని వస్తువులు, వంట పాత్రలు ధ్వంసమయ్యాయని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు దెబ్బతిని కూలిపోయిందని, ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నారు. -
ఉపాధి జాతర
వెంకటాపురం(ఎం): గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఏడాదిలో 100 రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలుచేస్తోంది. పంచాయతీల అభివృద్ధిలో ప్రజలను మరింత భాగస్వాములను చేసేందుకు పనుల జాతర–2025 పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రారంభించే పనులు.. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా కమ్యూనిటీ సముదాయాలు, పశువుల కొట్టాలు, కోళ్లు, మేకల షెడ్లు, వ్యవసాయ బావుల నిర్మాణాలు, చెక్డ్యాములు, తోటలు, ఉద్యానవనాలు, కంపోస్టు గుంతలు, అజోల్ల ఫిట్ల నిర్మాణం, పాఠశాల మరుగుదొడ్లు, భవనం పైకప్పు మరమ్మతులు, తాటి, ఈత చెట్లు నాటడం, వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర పనులను ప్రారంభించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో.. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ షెడ్లు, సెగ్రిగేషన్ షెడ్లు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ, శానిటరీ కాంప్లెక్స్ తదితర వాటికి భూమిపూజ చేయనున్నారు.ఈ మేరకు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటిలో శుక్రవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రణాళికలు ఖరారు చేసి జిల్లాలో 816 పనులను గుర్తించారు. వీటిని పూర్తి చేసేందుకు రూ.33.42 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది.పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఒకేసారి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నాం. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఆదేశానుసారం శుక్రవారం గ్రామాల్లో పనుల జాతర చేపడతాం. ఉపాధి కూలీలకు 100 రోజుల పని కల్పించడంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మొదలు కానున్నాయి. – శ్రీనివాస్రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ● 816 పనులకు.. రూ.33.42 కోట్లు కేటాయింపు పనుల జాతర 2025 పేరిట ప్రత్యేక కార్యక్రమం -
అక్రమాలకు కేరాఫ్గా డీటీఓ కార్యాలయాలు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రవాణాశాఖ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు అగడం లేదు. అన్ని పనులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఏజెంట్లు, ప్రైవేట్ వ్యక్తులు రూ.లక్షలకు పడగలెత్తుతుండగా.. అధికారుల ఆదాయం, అక్రమాస్తులకు హద్దూపద్దు లేదు. ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధి కారులు జరిపిన దాడుల్లో వెల్లడవుతున్న ఆస్తుల వివరాలే ఇందుకు సాక్ష్యం. మే 7న ఏకంగా వరంగల్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంటిపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దాడులు చేసిన ఏసీబీ.. ఆ తర్వాత ఈ జిల్లాలో పనిచేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జగిత్యాల డీటీఓ భద్రునా యక్ రూ.22వేలు తీసుకుంటుండగా ఆగస్టు 6న పట్టుకున్నారు. తాజాగా వరంగల్, హనుమకొండలలో ఎంవీఐగా పనిచేసిన జి.వివేకానంద రెడ్డి నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది. నెల రోజుల కిందట వివిధ పనుల కోసం ఏజెంట్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల మేరకు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ.. కొందరు సీనియర్ ఎంవీఐల ఆస్తులపై ఆరా తీస్తుండటం హాట్టాపిక్గా మారింది. ఏసీబీ దాడులకు వెరవని రవాణాశాఖ అధికారులు వసూళ్లకు ‘ప్రైవేట్’ వ్యక్తులు, ఏజెంట్లే మధ్యవర్తులు కాసుల కక్కుర్తితో అడ్డంగా దొరుకుతున్న అధికారులు ఆదాయాన్ని మించిన ఆస్తులు.. ఆ ఫిర్యాదులపైనే పలువురిపై దాడులు రవాణాశాఖలో అంతులేని ఆదాయం ఉండటంతో కొందరు అధికారులు పోటీపడీ పోస్టింగ్లు కొడుతున్నారు. కొందరు మోటారు వెహికిల్ ఇన్స్పెకర్లు ఇప్పుడు ఇన్చార్జ్ డీటీఓలుగా కూడా అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇందులో కూడా కొన్నిచోట్ల సీనియర్లు తిరకాసు చేసి జూనియర్లను ముందుంచి తెరవెనుక అక్రమ ఆదాయమార్గాలపై చక్రం తిప్పుతున్నారు. హనుమకొండ డీటీఓ పోస్టు కూడా ఖాళీ అయిన సమయంలో వాస్తవానికి అదే కార్యాలయంలో సీనియర్గా ఉన్న 1994 బ్యాచ్కు చెందిన సీనియర్ ఎంవీఐ డీటీఓగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే తెరపైన కీలక పోస్టులో ఉండటం ఇష్టం లేక అత నే ఆ పోస్టుపై విముఖత చూపడంతో 2012 బ్యా చ్కు చెందిన ఒకరికి ఆ పోస్టు కట్టబెట్టి ఆ సీనియ ర్ ఎంవీఐ అన్నీ తానై చూస్తుండటం వల్లే మా మూళ్లు రెండింతలయ్యాయన్న ఆరోపణలు ఉ న్నాయి. ఇదిలాఉంటే ఇన్చార్జ్ల కోసం అన్ని జిల్లాల్లో పోటీ ఉంది.వరంగల్లో ఎంవీఐగా ఉన్న ఒకరు మహబూబాబాద్ ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తుండగా, పెద్దపల్లి ఎంవీఐగా ఉన్న ఓ అధికా రి ఆ పోస్టుతోపాటు ములుగు ఎంవీఐగా, ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లిలో ఎంవీఐగా, ఇన్ఛార్జ్ డీటీఓగా ఒక్కరే చూస్తున్నారు. ఇలా.. ఏళ్లతరబడిగా ఉమ్మడి వరంగల్లో పాతుకుపోయిన కొందరు రవాణాశాఖ అధి కారు ల తీరుపై ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నా రు. హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకుంటూ కోరుకున్న పోస్టుల్లో కొనసాగుతున్నారంటున్నారు. కాగా,రవాణాశాఖలో పెచ్చుమీరుతున్న అవినీతిపై కొందరు అవినీతి నిరోధకశాఖ అ ధికా రులు కూడా ద్వంద్వ వైఖరితో ఉన్నారన్న చర్చ కూడా ఆశాఖలో జరుగుతోంది. వ్యక్తిగత పరిచయాల ఆధారంగా లెక్కకు మించిన అవినీతి జరి గినా ఆ కార్యాలయాలు,అధికారులపై ఉదా సీనంగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సమ్మక్కసాగర్లోకి 11,02,460 క్యూసెక్కుల నీరు
కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీకి గోదావరి వరద భారీగా వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం ఉదయం వరకు బ్యారేజీలోకి 9,40,290 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం రాగ సాయంత్రం వరకు 11,02,460కు పెరిగింది. దీంతో బ్యారేజీ 59 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 83మీటర్లు కాగా సామర్థ్యం మించి 84.50 మీటర్లకు చేరింది. అలాగే ఎస్పీ శబరీశ్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి మండలంలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీతో పాటు, లోతట్టు గ్రామాలలో పర్యటించారు. అనంతరం వారు మాట్లాడారు. భారీ వర్షాల దృష్య గోదావరిలోకి భారీగా నీరు చేరుతుందన్నారు. దీంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో లోతట్టు గ్రామాలు ముప్పునకు గురయ్యే అవకాశం ఉన్నందునా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరం వస్తే 100కు డయల్ చేయాలన్నారు. -
గోదావరి పరవళ్లు.. అధికారులు అప్రమత్తం
మంగపేట : గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో మండల పరిధిలోని కమలాపురం బిల్ట్ ఇంటెక్వెల్ వద్ద వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. ఎర్రవాగు బ్రిడ్జి సమీపానికి గోదావరి బ్యాక్ వాటర్ చేరుకుంది. అదే విధంగా మండల కేంద్రం నుంచి బోరునర్సాపురం మధ్యలో గౌరారం వాగుపై నిర్మించిన బ్రిడ్జి సమీపంలోకి బ్యాక్ వాటర్ పోటెత్తింది. దీంతో అప్రమత్తమైన తహసీల్దార్ రవీందర్, మండల స్పెషలాఫీసర్ సిద్ధార్థరెడ్డి, ఎంపీడీఓ భద్రునాయక్, ఎస్సై టీవీఆర్ సూరి, సురేష్, శ్రీకాంత్, ఎంపీఓ శ్రీనివాస్ కమలాపురంలోని ముంపు ప్రాంతాలైన పాతూరు, గుడ్డేలుగులపల్లి, మండల కేంద్రంలోని పొదుమూరు, ముస్లింవాడ, వడ్డెరకాలనీ, కత్తిగూడెం, దేవనగరం, వాడగూడెం, అకినేపల్లిమల్లారం గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుండడంతో ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. -
ఉగ్ర గోదావరి
గోదావరి ప్రమాద హెచ్చరికల వివరాలు.. ఏటూరునాగారం: గోదావరిలోకి ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం మండల పరిధిలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరిలోకి నీటి ప్రవాహం భారీగా వచ్చి చేరడంతో బుధవారం సాయంత్రం 6 గంటలకు వరద నీరు రెండో ప్రమాద హెచ్చరికను దాటి 16.20 మీటర్ల వేగంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. 17.33 మీటర్లకు చేరితే అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు వెల్లడించారు. కడెం ప్రాజెక్టు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఇంకా ఎత్తి ఉంచడంతో వరదనీరు భారీగా వచ్చి గోదావరిలో కలుస్తోంది. ఛత్తీస్గఢ్లోని ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి కూడా భారీగా వరద గోదావరిలోకి వచ్చి చేరుతోంది. దీంతో తుపాకులగూడెంలోని సమ్మక్క బ్యారేజీ వద్ద 10.72 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఏటూరునాగారంలోని జంపన్నవాగు సంగపాయవద్ద గోదావరి, వాగు రెండు కలవడంతో గోదావరి ఉధృతి మరింత పెరిగింది. కరకట్టకు ఆనుకొని ప్రవహించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఓడవాడ ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ వరద నీరు వచ్చి చేరడంతో దసరా, జమ్మి ప్రాంతాలు నీట మునిగాయి. పునరావాస కేంద్రాలకు తరలింపు గోదావరి వరద పోటు ఒక్కసారిగా ఎక్కువ కావడంతో రెవెన్యూ పంచాయతీరాజ్, ఇరిగేషన్, పోలీస్ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి పరీవాహక ప్రాంతాలైన ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓడవాడ, దళితకాలనీ ప్రాంతాల్లోని ప్రజలను క్రాస్రోడ్డులో ఏర్పాటుచేసిన పునరావస కేంద్రమైన గిరిజన భవన్కు తరలిస్తున్నారు. మండలంలోని రామన్నగూడెం, రాంనగర్ ప్రాంతాల్లోని ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. ప్రజలు ఎవరు కూడా వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని జాలర్లు చేపలు వేటకు వెళ్లొద్దని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆయా లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు,గా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి. ముఖ్యంగా ఏటూరునాగారంలోని ఓడవాడ, మానసపల్లి, రామన్నగూడెం పుష్కర ఘాట్, రాంనగర్ లోని ఆయా ప్రాంతాల్లో బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలను తరలించడానికి ఆయా శాఖల అధికారులు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజ్కుమార్, తహసీల్దార్ జగదీశ్వర్ వరద ఉధృతిని అంచనా వేస్తూ ప్రజలను తరలించడానికి వాహనాలను సిద్ధం చేస్తున్నారు. మండల పరిధిలోని కొండాయి, ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రెండు రోజులుగా వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో పడవలను నడపకుండా పక్కనబెట్టారు. వాగులోని వరద తగ్గుముఖం పట్టడంతో అధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు సతీష్, వినోద్లు పడవల ద్వారా ప్రజలను జంపన్నవాగు దాటిస్తున్నారు. పడవలకు ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేయడంతో వారి సాయంతో ప్రజలను క్షేమంగా ఒడ్డుకు చేర్చుతున్నారు. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలోకి.. అప్రమత్తమైన అధికారులు పునరావాస కేంద్రాలకు తరలింపునకు చర్యలు రెండు గ్రామాలకు పడవ ప్రయాణం మొదటి ప్రమాద హెచ్చరిక 14.83 మీటర్లు రెండో ప్రమాద హెచ్చరిక 15.83 మీటర్లు మూడో ప్రమాద హెచ్చరిక 17.33 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం 16.20 మీటర్లుఏటూరునాగారంగ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఓవైపు సూర్యుడు ప్రకాశిస్తుండగానే భారీ వర్షం కురిసింది. దీంతో ఒకేసారి అటు ఎండ, ఇటూ వర్షం రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. -
మహాజాతరకు.. నిధుల వరద
కొనసాగుతున్న సైన్స్ కాంగ్రెస్ కేయూ స్వర్ణోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ బుధవారం ఉత్సాహంగా కొనసాగింది. ‘మేడారం–2026’ నిర్వహణకు రూ.150 కోట్లు దక్షిణ మధ్య రైల్వే భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తుందని కన్స్రక్షన్ చీఫ్ ఇంజనీర్ సునీల్ కుమార్ వర్మ అన్నారు. సాక్షిప్రతినిధి, వరంగల్/ఏటూరునాగారం: వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ కుంభమేళా, సమ్మక్క, సారలమ్మల మేడారం మహాజాతరకు భారీగా నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.150 కోట్లు మంజూరు చేస్తూ శాఖలవారీగా బడ్జెట్ను కేటాయించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. భారీగా నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్లకు రాష్ట్ర సీ్త్ర శిశుసంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ఇతర రాష్ట్రాలనుంచి భక్తుల రాక మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. గత ఏడాది రూ.110కోట్లు గత ఏడాది 2024 మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.110కోట్లు మంజూరు చేసి మేడారంలో పలు అభివృద్ధి పనులు చేసింది. జాతరలో భక్తుల సౌకర్యాలను మరింత పెంచేందుకు ఈసారి అదనంగా రూ.40 కోట్లు పెంచి రూ.150కోట్లు చేయడం గమనార్హం. 2022లో అప్పటి ప్రభుత్వం రూ.75 కోట్లను మేడారం జాతర నిర్వహణకు మంజూరు చేసింది. నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు గత ఏడాది రూ.110కోట్లే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు మంత్రి సీతక్క ధన్యవాదాలు శాఖల వారీగా నిధులు కేటాయింపు 2026 జనవరిలో తెలంగాణ కుంభమేళా