Mulugu
-
రామప్పను సందర్శించిన శ్రీలంక టూరిస్టులు
వెంకటాపురం(ఎం)/గోవిందరావుపేట: ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని శుక్రవారం శ్రీలంకకు చెందిన 15 మంది టూర్ ఆపరేటర్స్ సందర్శించారు. తెలంగాణ పర్యాటక శాఖ, శ్రీలంక ఎ యిర్లైన్స్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా తె లంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన నాగర్జునసాగర్, నేలకొండపల్లి, బుద్దవనం, వరంగల్ కోట, భద్రకాళి, వేయిస్తంభాల గుడిని సందర్శించారు. పర్యటనలో భాగంగా శుక్రవారం రా మప్ప ఆలయం, లక్నవరం సరస్సులను సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు ద ర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. శ్రీలంక నుంచి తెలంగాణలోని పర్యాటక ప్ర దేశాలకు త్వరలో టూర్లను కండక్ట్ చేసేందుకు ప ర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నామన్నారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్ చేశారు. లక్నవరం సరస్సు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చిందన్నారు. వారి వెంట టూరి జం అధికారులు సాయిరాం, శ్రీనాథ్లు ఉన్నారు. అదే విధంగా క్రొయేషియా దేశానికి చెందిన పీటర్ సందర్శించారు. శుక్రవారం సందర్భంగా రామలింగేశ్వరస్వామిని శ్రీ దుర్గ అవతారంలో అలంకరించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు హరీష్శర్మ తెలిపారు. -
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
ములుగు: వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని డిప్యూటీ ఎన్నికల అధికారి, అడిషనల్ కలెక్టర్ సీహెచ్ మహేందర్జీ అధికారులను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన అవగాహన శిక్షణ శిబిరంలో అడిషనల్ కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల కమిషన్ మేరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుందన్నారు. పోలింగ్ ముందు ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్లను తెరిచి చూపించాలన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసుశాఖ తరఫున తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, తహసీల్దార్ విజయభాస్కర్, సూపరింటెండెంట్ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. నులిపురుగుల నివారణను అన్ని శాఖల అధికారులు బాధ్యతగా స్వీకరించాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్రావు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 1 నుంచి 19 సంవత్సరాలు ఉన్న 73,244 మంది చిన్నారులకు మాత్రలను పంపిణీ చేస్తున్నామన్నారు. వైద్య సిబ్బంది నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు.అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ -
మూడు జోన్లు, 21 సెక్టార్లు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతరకు ఇంకా నాలుగు రోజులే మిగిలింది. జాతరకు సుమారు 20 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారుల అంచనా. మేడారానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కాకుండా జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టింది. ఇప్పటికే ముందస్తుగా మేడారంలో పారిశుద్ధ్య పనులు కొనసాగుతుండగా జాతర నాలుగు రోజులు ఎక్కడా కూడా పారిశుద్ధ్య సమస్యల తలెత్తకుండా డీపీఓ దేవరాజు ప్రత్యేక చర్యలకు కసరత్తు చేస్తున్నారు. సెక్టార్ల వారీగా కార్మికులు.. మేడారం మినీజాతరలో పారిశుద్ధ్య పనుల కోసం మూడు జోన్లు, 21 సెక్టార్లు ఏర్పాటు చేశారు. జంపన్నవాగు, అమ్మవార్ల గద్దెల కోర్ ఏరియా, ఊరట్టం కన్నెపల్లి ఈ మూడు జోన్లలో 21 సెక్టార్లను ఏర్పాటు చేశారు. ఈ సెక్టార్ల వారీగా పారిశుద్ధ్య కార్మికులకు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చెత్తను సేకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 10 ట్రాక్టర్లలో చెత్తను డంపింగ్ కేంద్రాలను తరలించనున్నారు. చెత్త పూడ్చివేతకు రెండు జేసీబీలు, రెండు డోజర్లను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచనున్నారు. ఈ సెక్టార్లలో డీపీఓ పర్యవేక్షణలో ఇద్దరు ఎంపీఓలు, 30 మంది పంచాయతీ కార్యదర్శులు, 10 మంది కారోబార్లను నియమించారు. రోజుకు రెండు షిఫ్టులు.. మేడారం జాతరలో పారిశుద్ధ్య సేవలను 400 మంది కార్మికులను ప్రత్యేకంగా నియమించనున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో కార్మికులు మేడారంలో పారిశుద్ధ్య సేవలు చేపడుతున్నారు. జాతర ప్రారంభం నాటికి మొత్తం 400 మంది పారిశుద్ధ్య కార్మికులను రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా రప్పించనున్నారు. వీరు ఈ 21 సెక్టార్లలో రోజుకు రెండు షిఫ్టుల వారీగా పనులు చేయనున్నారు. ఈసారి మినీ జాతరలో ఎక్కడి చెత్త అక్కడే సేకరించి ఒక దగ్గర వేసేందుకు గ్రీన్ మ్యాట్తో ఒక మినీ డంపింగ్ కేంద్రం లాగా ఏర్పాటు చేశారు. జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో భక్తుల తాగునీటి వసతి కోసం ప్రత్యేకంగా 10 వాటర్ ట్యాంకర్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. శానిటేషన్ ప్రాంతాలు, భక్తులు విడిది చేసే ప్రదేశాల్లో ఎక్కడా కూడా చెత్త, దోమలు, ఈగలు నిల్వకుండా కార్మికులు ఎప్పటికప్పుడు తొలగించి బ్లీచింగ్ చేసేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మేడారంలోని రోడ్లపై దుమ్ము, దూళి లేవకుండా ట్యాంకర్లతో రోడ్లపై నీళ్లు చల్లుతున్నారు. భక్తుల విడిది చేసే తాగునీటి వసతితో పాటు మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు కార్మికులను ప్రత్యేకంగా నియమించారు. పక్కా ప్రణాళికతో పనులు మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతరలో పారిశుద్ధ్య పనులకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. జాతరకు ముందస్తుగా 10 రోజుల నుంచి పనులు చేపడుతున్నాం. జాతర సమయంలో ఎలాంటి పారిశుద్ధ్య సమస్య ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాం. గత రెండు జాతరల్లో ములుగు డీఎల్పీఓగా పనిచేసిన అనుభవంతో పారిశుద్ధ్య పనుల్లో లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. మంత్రి సీతక్క, కలెక్టర్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తాం. – దేవరాజ్, డీపీఓ మేడారంలో ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు 30 మినీ డంపింగ్ కేంద్రాల ఏర్పాటు చెత్త ఏరివేతకు 400 మంది కార్మికులు -
సకాలంలో జాతర పనులు పూర్తి చేయాలి
ఏటూరునాగారం: కొండాయి, దొడ్ల ప్రాంతాల్లో జరిగే మినీ జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆర్డీఓ నేత వెంకటేశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొండాయిలోని గోవిందరాజుల గుడిలో ఆర్డీఓ, డీడీ పోచం కలిసి పూజలు చేశారు. అనంతరం జాతర జరిగే ప్రాంతాలను, భక్తులు ఎంత మంది వస్తారని సారలమ్మ పూజారి కాక వెంకటేశ్వర్లను అడిగి తెలుసుకున్నారు. జాతర ప్రాంతా ల్లో నిర్మిస్తున్న ప్రహరీ, షెడ్డు, తాగునీటి వసతి, విద్యుత్ పనులను సకాలంలో పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తీసుకురావాలన్నారు. రో డ్డుపై ఎక్కడ కూడా గుంతలు లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ జగదీష్, ఐటీడీఏ ఏఓ రాజ్కుమార్, ఎంపీఓ కుమార్, పంచాయతీ కార్యదర్శి సతీష్, గోవిందరాజుల పూజారి దబ్బగట్ల గోవర్ధన్, రాజారాం, రఘు తదితరులు పాల్గొన్నారు.వైభవంగా సీతారాముల కల్యాణం మంగపేట: మండలంలోని బోరునర్సాపురం శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఈ నెల 4 నుంచి కొనసాగుతున్న 18వ వార్షికోత్సవాల చివరి రోజు సందర్భంగా ఉదయం సంక్షేప రామాయణం, ఆదిత్య హృదయం హోమం పూజలను నిర్వహించారు. అనంతరం సీతారాముల ఉత్సవ మూర్తుల కల్యాణం వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు మంగపేట, చెరుపల్లి, కమలాపురం తదితర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నర్రా శ్రీధర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇసుక క్వారీల నిర్వహణకు డీఎల్ఎస్సీ నిర్వహించాలిఏటూరునాగారం: గిరిజన సొసైటీ క్వారీల నిర్వహణకు డీఎల్ఎస్సీ నిర్వహించాలని ఇసుక సొసైటీల అధ్యక్షుడు ఈసం రాజు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గిరిజన భవన్లో గిరిజన సొసైటీ సభ్యులు, నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ డీఎల్ఎస్సీ నిర్వహించకుండా ఉండడంతో క్వారీలు నడవడం లేదన్నారు. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) మండలంలోని వివిధ గ్రామాల ఇసుక సొసైటీలను గిరిజనేతరలకు అప్పగించడం విడ్డూరంగా ఉందన్నారు. పట్టా భూములకు ఎలాంటి ఫారెస్టు అనుమతి అవసరం లేదన్నారు. డీఎల్ఎస్సీ నిర్వహించి క్వారీలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దబ్బగట్ల సుమన్, బుచ్చయ్య, సుభద్ర, నాగబాబు, నర్సింగరావు, భరత్ తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల ఆందోళన వాజేడు: మండల పరిధిలోని పెనుగోలు కాలనీలో సోలార్ సిస్టం ద్వారా ఏర్పాటు చేసిన మోటారు కాలిపోయింది. దీంతో తమకు తాగునీరు వసతి కల్పించాలని కోరుతూ పెనుగోలు కాలనీ గిరిజనులు ఖాళీ బిందెలతో శుక్రవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు మాట్లాడుతూ సోలార్ సిస్టం ద్వారా ఏర్పాటు చేసిన మోటారు కాలిపోయి నెలరోజులు అవుతున్నా.. అధికారులు మరమ్మతు చేయడం లేదని ఆరోపించారు. ఉదయం, సాయంత్రం మిషన్ భగీరథ, గ్రామ పంచాయతీ నీరు వస్తున్నప్పటికీ అవి తాగడంలేదన్నారు. సోలార్సిస్టం ద్వారా సరఫరా అవుతున్న నీరు పెనుగోలు కాలనీ గ్రామస్తులకే కాకుండా మండల కేంద్రంలోని నాగారం, జంగాలపల్లి, వాజేడు గ్రామాలకు చెందిన ప్రజలు తీసుకు వెళ్లి తాగుతుంటారు. అయితే సోలార్సిస్టం ద్వారా నడిచే మోటారు స్థానికంగా మరమ్మతు చేయడం కుదరదని, తప్పనిసరిగా హైదరాబాద్కు తీసుకెళ్లి మరమ్మతు చేయించాల్సి ఉంటుందని తెలిసింది. -
స్థానిక సమరానికి సిద్ధంగా ఉండాలి
మంగపేట: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని బోరునర్సాపురంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో నెలకొన్న పరిస్థితులపై సీతక్కకు వివరించారు. మొదటి నుంచి పార్టీ అభివృద్ధికి పాటుపడిన వారికి ప్రాధాన్యం లేకపోవడంతో అసంతృప్తి నెలకొందని సయ్యద్హుస్సేన్ మంత్రికి వివరించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకుల మధ్య ఎలాంటి విబేధాలు ఉన్నా తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ, మండల నాయకులు ప్రత్యేక ప్రణాళికతో పనిచేసి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పటేల్, మహిళా విభాగం అధ్యక్షురాలు రేగ కల్యాణి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇస్సార్ఖాన్, కర్రి నాగేంద్రబాబు, యానయ్య, వెంకటేశ్వర్లు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ లైటింగ్ పరిశీలన ఏటూరునాగారం: ఏటూరునాగారం మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ నుంచి వై జంక్షన్ వరకు నూతనంగా నిర్మించిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను శుక్రవారం రాత్రి మంత్రి పరిశీలించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి లైట్లు వెలుగుతున్న స్తంభాలను చూస్తూ పాదయాత్ర చేశారు. విబేధాలు వీడి సమన్వయంతో పనిచేయాలి పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క -
జూనియర్ vs సీనియర్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలో ఉండే కొందరు విద్యార్థులు క్రమశిక్షణ తప్పుతున్నారు. ఇటీవల రెండు సంఘటనల్లో పలువురు విద్యార్థులను హాస్టళ్లనుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలు మరిచిపోకముందే తాజాగా శుక్రవారం కామన్ మెస్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. భోజనం చేస్తున్న సమయంలోనే విద్యార్థులు పరస్పరం దాడి చేసుకున్నారు. భోజనం ప్లేట్లు, గిన్నెలను కిందపడేశారు. ఆ సమయంలో మిగతా విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియక అయోమయానికి గురయ్యారు. సాయంత్రం మరోసారి ఘర్షణ.. క్యాంపస్లోని పీహెచ్సీలో చికిత్స పొందిన ఇద్దరు జూనియర్లు సాయంత్రం గణపతిదేవ హాస్టల్కు వచ్చారు. ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదు.. జూనియర్లకు, సీనియర్లకు మధ్య మళ్లీ ఘర్షణ మొదలైంది. సీఐ రవికుమార్, ఎస్సై మాధవ్ ఇతర పోలీస్సిబ్బంది అక్కడి చేరుకొని ఇరువర్గాలకు చెందిన 18 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్కు తరలించారు. తొలుత కామన్మెస్లో దెబ్బలు తగిన ఇద్దరు జూనియర్లను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. హాస్టళ్ల డైరెక్టర్ ఏమంటున్నారంటే.. తమకు గౌరవం ఇస్తలేరనే కారణంతోనే సీనియర్ విద్యార్థులు.. జూనియర్లతో గొడవ పడినట్లు హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ చెబుతున్నారు. మొదట ‘నావైపు ఎందుకు చూస్తున్నావు’ అని ఓ సీనియర్.. జూనియర్ విద్యార్థిని ప్రశ్నించగా.. మాటమాట పెరిగి పరస్పరం కొట్టుకున్నారని తెలిపారు. అదే కారణమా? మరేదైనా ఉందా అనే కోణంలో విచారించాల్సి ఉందని చెబుతున్నారు. తమను సీనియర్లు కొట్టారని ముగ్గురు జూనియర్లు, జూనియర్లే కొట్టారని ముగ్గురు సీనియర్ విద్యార్థులు తమ దృష్టికి తెచ్చినట్లు రాజ్కుమార్ తెలిపారు. నేడు వీసీ వచ్చాక నిర్ణయం ఘర్షణ విషయాన్ని హైదరాబాద్లో ఉన్న వీసీ కె.ప్రతాప్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా యూనివర్సిటీలోనే ఉన్న రిజిస్ట్రార్ రామచంద్రం, కెమిస్ట్రీ విభాగం అధిపతి, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. శనివారం వీసీ వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది సమావేశమై నిర్ణయించనున్నట్లు సమాచారం. హాస్టల్నుంచి సస్పెండ్ చేయాలా.. ఒక సెమిస్టర్ మొత్తం సస్పెండ్ చేయాలనేది ఆలోచన చేస్తున్నారు. కామన్ మెస్లో ప్లేట్లు, గిన్నెలు పడేయడంతో జరిగిన నష్టం ఎంత అనేది కూడా అంచనా వేస్తున్నారు. సీసీ పుటేజీలు కూడా పరిశీలించాలని యూనివర్సిటీ అధికారులు యోచిస్తున్నారు. ఎవరెవరి మీద ఎవరు దాడి చేసుకున్నారనేది స్పష్టంకానుంది. కేసు నమోదు కొట్టుకున్న విద్యార్థులను కేయూ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు సీనియర్లు 8 మంది, జూనియర్లు 10మంది, నలుగురు ఏబీవీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొట్టుకున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత సీనియర్లకు గౌరవం ఇస్తలేరనే కారణంతో గొడవ? కామన్మెస్లో ఒకసారి, హాస్టల్ వద్ద మరోసారి ఘర్షణ ఇద్దరు జూనియర్లను ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు పోలీసుల అదుపులో 18మంది విద్యార్థులు నేడు వీసీతో చర్చించి చర్యలు తీసుకునే అవకాశం ఆధిపత్యం కోసమేనా.. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు సీనియర్లు తమకు జూనియర్లు గౌరవం ఇవ్వడం లేదని కొంతకాలంగా గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కామన్మెస్లో అందరూ భోజనం చేస్తున్నారు. ఏమి జరిగిందో తెలియదు.. ఒక్కసారిగా జూనియర్లకు, సీనియర్లకు మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు కొట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం తెలుసుకున్న హాస్టళ్ల డైరెక్టర్ ఎల్పీ రాజ్కుమార్, కేయూ పోలీస్టేషన్ ఎస్పై మాధవ్ తన పెట్రోలింగ్ సిబ్బందితో కామన్మెస్కు చేరుకున్నారు. దెబ్బలు తాకిన ఇద్దరు జూనియర్లను క్యాంపస్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ఘర్షణకు దారితీసిన పరిస్ధితులను పోలీసులు అక్కడి సిబ్బంది, విద్యార్థులను, హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. -
15 రోజులపాటు చికిత్స.. దక్కని ప్రాణం
కన్నాయిగూడెం: మండల పరిధిలోని బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీలోని కొత్తూర్ గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వర్ రావు (41) ఇందిరమ్మ ఇల్లు రాలేదని అధికారులు ఏర్పాటు చేసిన గ్రామసభలోనే పురుగుల మందు తాగిన విషయం తెలిసిందే. 15 రోజులు మృత్యువుతో పోరాడి బుధవారం అర్ధరాత్రి వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతుడి కూతురు షాలిని తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 23న బుట్టాయిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామసభలో అధికారులు ప్రదర్శించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో నాగేశ్వర్రావు పేరు లేకపోవడంతో ఆవేదనకు గురై అక్కడే పురుగుల మందు తాగాడు. వెంటనే అక్కడున్న వారు 108లో ఏటూరునాగారం తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా వైద్యశాలకు, ఆ తర్వాత హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యఖర్చులకు ఉన్న భూమిని కుదవపెట్టారు. సరిపోకపోవడంతో బుధవారం వరంగల్ ఎంజీఎంకి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 2 గంటలకు మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. సాయంత్రం గ్రామంలో నాగేశ్వర్రావు అంత్యక్రియలు నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏటూరునాగారం సీఐ శ్రీనువాస్, ఎస్సైలు వెంకటేష్, సురేష్లు బందోబస్తు నిర్వహించారు. అంత్యక్రియల నిమిత్తం ములుగు ఆర్డీఓ రూ.50వేల ఆర్థికసాయం అందించారు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని గ్రామసభలో పురుగుల మందు తాగిన వ్యక్తి మృతి కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి ప్రకటన -
బాధితులకు అండగా భరోసా కేంద్రం
ములుగు: బాధిత మహిళలకు భరోసా కేంద్రం ఎల్లవేళలా అండగా ఉంటుందని డీఎస్పీ, డీసీఆర్బీ(డిస్ట్రిక్ క్రైం రికార్డ్సు బ్యూరో) కిశోర్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం ఏర్పాటు చేసి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, పోలీసులతో కలిసి వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణకు ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచడానికి తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, యువతులు, వృద్ధులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులతో పాటు తదితర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వన్ స్టాఫ్ సొల్యూషన్గా పని చేస్తున్నాయని తెలిపారు. మహిళలు సమాజంలోఎదుర్కొంటున్న సమస్యలపై కౌన్సెలింగ్ నిర్వహించి ధైర్యాన్ని పెంపొందించేందుకు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రం ఎస్పీ పర్యవేక్షణలో సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భరోసా కేంద్రం జిల్లా ఇన్చార్జ్, ఎస్సై ఎన్.స్రవంతి, సెంటర్ కో ఆర్డినేటర్ అనూష, సిబ్బంది అవగాహన సదస్సులు నిర్వహిస్తూ మహిళలు, యువతులు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.డీఎస్పీ కిశోర్కుమార్ -
గిట్టుబాటు ధర చెల్లించాలి..
ఎండుమిర్చికి ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లించాలి. మార్కెట్లో మిర్చిని కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేయాలి. గతేడాది ఏసీల్లో (నిల్వ) పెట్టిన రైతులు చాలా మంది నష్టపోయారు. రైతులు చాలా పెట్టుబడి పెట్టి మిర్చి పంటలను సాగు చేస్తున్నారు. తెగుళ్లు సోకి పెట్టుబడి పెరిగింది. ఈ సారి మంచి ధరకు ఎండు మిర్చికి కొనుగోలు చేసి ఆదుకోవాలి. – గడబోయిన శ్రీకాంత్, రాంనగర్, ఏటూరునాగారం అధికారుల సూచనలు పాటించాలి.. ల్యామ్డా, అసిఫేట్, బైఫిరాన్తోపాటు తెగులు మందు కలిపి పిచికారీ చేయాలి. ఎకరంలో 20 నుంచి 30 వరకు జిగురు అట్టలను అమర్చాలి. దానివల్ల పురుగు శాతాన్ని అదుపుచేయవచ్చు. రైతులు హార్టికల్చర్ అధికారుల సూచనలు, సలహాలను పాటించి మిర్చి దిగుబడిని పెంచుకోవాలి. – శ్రీకాంత్, జిల్లా హార్టికల్చర్ అధికారి నల్లివ్యాధితో నష్టం.. నల్లి వ్యాధి సోకి పంట దిగుబడి అధికంగా తగ్గింది. ఏఈఓలు, వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులు పంటలను పరిశీలించడం లేదు. కేవలం కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. రెండు ఎకరాలు సాగు చేస్తే ఏడు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తెగుళ్లతో దిగుబడి అధికంగా తగ్గింది. మార్కెట్లలో చాలా తక్కువ ధర పలుకుతోంది. – ఎగ్గడి వెంకటేశ్వర్లు, ఏటూరునాగారం -
మిర్చి పంటసాగు వివరాలు
ములుగు– ఏటూరునాగారంగోవిందరావుపేటవాజేడుమొత్తంవెంకటాపురం(కె)మంగపేటకన్నాయిగూడెంతాడ్వాయివెంకటాపురం(ఎం)ఏటూరునాగారంరైతులు12,2652,59886725218491,4011,4022,59730ఎకరాలు1,2522,9593,81301,21019,7334,3832,0763,98060 -
మండమెలిగె పండుగే మినీ మేడారం..
ఎస్ఎస్తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వా యి మండలంలోని మేడారంలో ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు మినీ జాతర (మండమెలిగె పండుగ. అనగా పసుపు, కుంకుమ రూపంలో సమ్మక్క తల్లిని గుడి నుంచి గద్దైపెకి తీసుకొచ్చి పూజలు నిర్వహించి రాత్రంతా జాగారం ఉండడం) నిర్వహించనున్నారు. ప్రతి రెండేళ్లకోసారి ఫిబ్రవరిలో మహాజాతర జరగుతుంది. ఈ క్రమంలో ఏడాది మధ్యలో మినీ జాతర నిర్వహిస్తారు. మహాజాతర సమయంలో గుడిమెలిగె పండుగ నుంచి వన ప్రవేశం వరకు పూజ కార్యక్రమాలు నిర్వహించగా.. మినీ జాతరలో మాత్రం మండమెలిగె పండుగతో పూజ కార్యక్రమాలు పరిసమాప్తమవుతాయి. మహాజాతరలో ఇలా.. మహాజాతరలో గుడిమెలిగె పండుగ నుంచి తల్లుల వనం ప్రవేశం వరకు అమ్మవార్లకు పూజలు చేస్తారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మహాజాతరలో మండమెలిగె పండుగకు వారం రోజులు ముందు సమ్మక్క పూజారులు గుడిమెలిగె పండుగ నిర్వహిస్తారు. మళ్లీ వారం తర్వాత మండమెలిగె పండుగ చేస్తారు. ఈపండుగ జరిగిన వారం తర్వాత కన్నెపల్లి నుంచి సారలమ్మ, చిలకలగుట్ట నుంచి సమ్మక్కతల్లిని గద్దైపెకి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. అంతేకాకుండా సమ్మక్క తల్లి గద్దైపెకి వచ్చే రోజు ఉదయం వనం తీసుకొచ్చి గద్దైపె ప్రతిష్ఠిస్తారు. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులను కూడా మేడారం గద్దెలపైకి తీసుకొస్తారు. మొక్కుల అనంతరం అమ్మవార్ల వనప్రవేశంతో మహాజాతర ముగుస్తుంది. మినీ జాతరలో పూజా కార్యక్రమాలు .. మహాజాతర జరిగిన ఏడాది తర్వాత పూజారులు మినీ జాతర (మండమెలిగె పండుగ) నిర్వహిస్తారు. మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో మండమెలిగె పండుగకు వారం ముందు గుడిమెలిగె పండుగను నిర్వహిస్తారు. వారం తర్వాత మండమెలిగె పండుగ జరుగుతుంది. బుధ, గురువారం రెండు రోజుల్లో మండమెలిగె పండుగ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మినీ జాతరలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు,గోవిందరాజులను గద్దెలపైకి తీసుకురావడం, వనం ప్రవేశం లాంటి పూజ కార్యక్రమాలను ఉండవు. మండమెలిగె పండుగతోనే మినీ జాతర పూజ కార్యక్రమాలు ముగిస్తాయి. మహాజాతర ముగిసిన ఏడాది మధ్యలో నిర్వహణ ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జాతర -
దిగుబడి దిగులు
ములుగుశుక్రవారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025మిర్చి రైతుకు చివరికి మిగిలేది కన్నీరే..7మహాకుంభాభిషేకానికి వేళాయె..● నేటి నుంచి మూడురోజుల పాటు కార్యక్రమం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో నేటి(శుక్రవారం) నుంచి మూడురోజుల పాటు మహాకుంభాభిషేకం జరగనుంది. ఈమేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం రాత్రి విద్యుత్ దీపాలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. – కాళేశ్వరంగతంలో ఎకరాకు రూ.25 వేలు కౌలు ఉంటే ఈ సారి రూ.35 వేలకు పెరిగింది. భూములను కౌలుకు తీసుకొని మిర్చి పంటను సాగు చేస్తున్న రైతులకు అప్పులే మిగిలాయి. పంట పచ్చగా ఉన్నప్పటికీ ఆకు మడతపడి వ్యాధులు సోకడంతో పూతరాలిపోయి దిగుబడి పడిపోయింది. ఇదిలా ఉంటే మిర్చిని కోసేందుకు వచ్చే కూలీల రేట్లు కూడా పెరిగిపోయాయి. వీటితో పాటు పెట్టుబడి సైతం అధికం కావడంతో పెట్టుబడి రాక, దిగబడి తగ్గిపోవడంతో రెండు విధాలుగా రైతులు నష్టపోతున్నారు.● పంటకు తెగుళ్లు సోకి తగ్గిన దిగుబడి ● మార్కెట్లో రోజురోజుకూ పడిపోతున్న ధరలు ● గతేడాది రూ.23 వేలు.. ఈ ఏడాది రూ.13 వేలు ● జిల్లాలో 19,733 ఎకరాల్లో మిరప సాగుపడిపోతున్న ధరలు పచ్చి, పండు, ఎండు మిర్చికి మార్కెట్లో ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గతేడాది క్వింటాలుకు రూ.23వేలు ఉండగా ఈ ఏడాది రూ.13 వేలకు పడిపోవడంతో రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మార్కెట్లో మిర్చికి ధర పెరిగితే దిగుబడి వచ్చి మంచి ఆదాయం వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. వరంగల్, గుంటూరు మార్కెట్లకు అత్యధికంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి మిర్చి వస్తుండడంతో జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని మిర్చికి డిమాండ్ పడిపోతోంది. ప్రభుత్వం స్పందించి స్వరాష్ట్రంలో పండించిన మిర్చి పంటకు ధర అధికంగా పలికే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.మిర్చి పంటకు తెగుళ్లు సోకి రైతులకు అపారనష్టం వచ్చింది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి మిరప పంటను సాగు చేసిన వారికే కన్నీళ్లే మిగిలాయి. వాతావరణ మార్పులు, భూమిలో వచ్చిన పెనుమార్పులతో మిర్చి పంటపై నల్లి, తామెర, రసం పీల్చే పురుగుల దాడి చేయడంతో పూత రాలిపోయి దిగుబడి శాతం భారీగా పడిపోయింది. ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాల నుంచి మిర్చి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేది. అధికంగా పురుగు మందులు వాడుతున్నారే సాకుతో అంతర్జాతీయ మార్కెట్లో సైతం మిర్చి కొనుగోలు సెల్లర్స్ ముఖం చాటేస్తున్నారు. మిర్చికి ప్రభుత్వం గిట్టుబాట ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పెరిగిన కౌలు ధరలు – వివరాలు 8లోu -
మల్లంపల్లిలో తాగునీరు కలుషితం
ములుగు: మల్లంపల్లిలో సరఫరా అవుతున్న తాగునీరు పలుచోట్ల కలుషితం అవుతుందని గుర్తించినట్లు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం పబ్లిక్ హెల్త్ లేబోరేటరీ సివిల్ సర్జన్, బ్యాక్టీరియాలజిస్ట్ డాక్టర్ కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మండల కేంద్రంలో వైద్యబృందం పర్యటించింది. మల్లంపల్లి, మంచినీళ్లపల్లి, కుమ్మరిపల్లి, హ్యూమాయి నగర్ గ్రామాల్లోని తాగునీటిని వైద్యులు ల్యాబ్లో టెస్ట్ చేసిన రిపోర్టులను స్థానికులకు తెలి యజేశారు. దీనికి సంబంధించిన రిపోర్టులను మల్లంపల్లి గ్రామ పంచాయతీ అధికారులకు పంపించినట్లు వెల్లడించారు. కలుషితమయ్యే నీటి ప్రాంతాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం సొసైటీ డైరెక్టర్ గూడెపు ఇందిరా రాజిరెడ్డి, మల్లంపల్లి మండల సాధన కమిటీ అధ్యక్షుడు గోల్కోండ రాజు, జిల్లా కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి దేవేంద్ర చారి, జిల్లా ఎస్సీ సెల్ ఉపాద్యక్షుడు తాళ్లపెల్లి సాంబయ్య, అంకం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో అభిషేక పూజలుమంగపేట: మండల పరిధిలోని బోరునర్సాపురంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో కొనసాగుతున్న 18వ వార్షికోత్సవ మూడోరోజు కార్యక్రమంలో బాగంగా గురువారం అభిషేక పూజలు నిర్వహించారు. ఉద యం 8నుంచి 9గంటల వరకు స్వామి వారికి అభిషేక పూజలు నిర్వహించారు. 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సుదర్శనవనం (హోమం) పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరాగా పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.అడవుల సంరక్షణకు పాటుపడాలి వాజేడు: అడవులు ప్రగతికి ముఖ్యమైనవని వాటి సంరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఎఫ్ఎస్ఓలు నాగమణి, నారాయణ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని కడేకల్, ముత్తారం కాలనీ గ్రామాల్లో గురువారం ప్రజలకు అవగాహన కల్పించారు. అడవులతో ప్రజలకు, జంతువులకు కలిగే ప్రయోజనాలపై వివరించారు. అడవుల్లో పొరపాటున కూడా మంటలు పెట్టవద్దని కోరారు. ఒక వేల అడవిలో మంటలు చెలరేగితే స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పాటు మంటలను ఆర్పడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె
ములుగు రూరల్: జిల్లాలోని రెండో ఏఎన్ఎంల సమస్యలను ఈ నెల 17వ తేదీ వరకు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని ఆ సంఘం అధ్యక్షురాలు సుజాత, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. ఈ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. అనంతరం డీఎంహెచ్ఓ గోపాల్రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ రెగ్యులర్ చేయడం లేదన్నారు. అనేక పోరాటాల చేయగా గ్రాస్ సాలరీ ఇస్తామని హామీ ఇచ్చి మరిచారని తెలిపారు. అందుకే 100శాతం గ్రాస్ సాలరీ వెంటనే అమలు చేయడంతో పాటు రూ.10లక్షల లైఫ్ టైం గ్రాట్యుటీ, హెల్త్ ఇన్యూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఏడు నెలల పీఆర్సీ ఏరియర్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను ఈ నెల 17వ తేదీ వరకు స్పందించకపోతే సమ్మెకు వెళ్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కన్వీనర్ అమ్జద్పాషా, నాయకులు సరోజన, పావని, మమత, సరోజిని, శోభారాణి, స్వప్న, సరిత, సరస్వతి, పుణ్యవతి, లలిత, సూర్యకాంతం, సమ్మక్క, సబిత, కవిత, లక్ష్మీ పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావుకు వినతి పత్రం అందజేసిన రెండో ఏఎన్ఎంలు -
మినీ జాతరకు ఏర్పాట్లు పూర్తి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో ఈనెల 12నుంచి 15వ తేదీ వరకు జరగనున్న మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ టీఎస్. దివాకర తెలిపారు. మండల పరిధిలోని మేడారంలో ఆయా శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ దివాకర క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. మేడారంలోని వైద్య శిబిరం, జంపన్నవాగు వద్ద స్నాన ఘట్టాలను, మహిళలు దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాటు చేసిన గదులను పరిశీలించారు. అనంతరం గద్దెల ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు 10 నుంచి 20 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే జాతతరకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతో పాటు వైద్య సిబ్బంది 24గంటల పాటు అందుబాటులో ఉంటారని తెలిపారు. వైద్య శాఖ సిబ్బంది అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అత్యవసర సమయంలో ఇబ్బందులకు గురయ్యే వారిని జిల్లా కేంద్రానికి తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద తొక్కిసలాట, చోరీలు జరగకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జంపన్నవాగు, గద్దెల ప్రాంతం, మేడారం పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులతో నిరంతరం శుభ్రం చేయించాలని డీపీఓ దేవరాజ్ను ఆదేశించారు. భారీ సంఖ్యలో భక్తుల వాహనాలు వస్తే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ శాఖ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోండడంతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో చలువ పందిళ్లు, మ్యాట్లను ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. సుమారుగా రూ.5.30 కోట్ల రూపాయలతో వివిధ పనులను పూర్తి చేసినట్లు వివరించారు. పలుచోట్ల ప్రత్యేకంగా మరుగుదొడ్ల ఏర్పాటుతో పాటు తాగునీటి వసతి సౌకర్యం కల్పించామని తెలిపారు. ఆర్టీసీ అధికారులు హనుమకొండ నుంచి నిరంతరం బస్సులను మేడారం జాతరకు నడిపించనున్నారని తెలిపారు. జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుందని వివరించారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు మొక్కులను చెల్లించుకొని తిరుగు ప్రయాణం కావాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, డీపీఓ దేవరాజ్, డీఎంహెచ్ఓ గోపాల్రావు, ఇరిగేషన్ ఈఈ నారాయణ తదితరులు పాల్గొన్నారు. జాతరలో భక్తులకు సౌకర్యాలు కలెక్టర్ టీఎస్.దివాకర -
తప్పుడు ఆరోపణలతో మానసికంగా వేధిస్తున్నారు
ములుగు: 15 రోజులుగా పలు పత్రికల్లో తప్పుడు ఆరోపణలు చేపిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఇన్చార్జ్ జిల్లా సంక్షేమ అధికారి కూచన శిరీష తెలిపారు. జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. వివిధ శాఖలను సమన్వయం చేస్తూ పనుల్లో పురోగతిని సాధించానని తెలిపారు. శాఖా పరమైన పనులు చిత్తశుద్ధితో చేస్తున్న తనపై కొంతమంది రెండు నెలల క్రితం వచ్చిన సీడీపీఓ ధనలక్ష్మి ద్వారా తప్పుడు ఆరోపణలు చేపిస్తూ పలు పత్రికల్లో వార్తలు రాపిస్తూ తనను మానసిక వేదనకు గురిచేస్తున్నారని తెలిపారు. అలాగే విధులకు ఆటంకం కలిగించేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజనిర్ధారణ జరిగే వరకు తాను సీడీపీఓగానే కొనసాగుతానని అసత్య ఆరోపణలు చేస్తున్న వారితో పాటు సూత్రదారులు, పాత్రదారులపైనా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులను కోరుతున్నట్లు ఆమె వివరాలను వెల్లడించారు.జిల్లా సంక్షేమ అధికారి శిరీష -
మా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య చేసుకున్న మా నాన్న కోరిక మేరకు ఇల్లు ఇవ్వాలి. మంత్రి సీతక్క చొరవ తీసుకో వాలి. ఇంటి పెద్ద చనిపోవడంతో మా కుటుంబం రోడ్డున ప డింది. మాకున్న భూమిని కుదువ పెట్టి వైద్యం చే యించాం. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలి. – షాలిని, మృతుడి కుమార్తె బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం : మంత్రి సీతక్క కుమ్మరి నాగేశ్వర్ రావు కుటుంబాన్ని ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుంది. అతని వైద్యం కోసం నిరంతరం మా జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్ నాతో మాట్లాడాడు. ప్రైవేట్ ఆస్పత్రినుంచి ఎంజీఎంకు ఎందుకు తరలించారో తెలియదు. ● -
వనదేవతల సన్నిధిలో 32 హుండీలు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ వనదేవతల సన్నిధిలో భక్తుల కానుకలు సమర్పించేందుకు 32 హుండీలను ఏర్పాటు చేశారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో మేడారంలో ఇన్స్పెక్టర్ కవిత పర్యవేక్షణలో గురువారం హుండీలకు సీల్ వేసి గద్దెలపై ఏర్పాటు చేసినట్లు ఈఓ రాజేంద్రం తెలిపారు. సమ్మక్క గద్దైపె 14, సారలమ్మ గద్దైపె 14, గోవిందరాజు గద్దె వద్ద 2, పగిడిద్దరాజు గద్దె వద్ద 2 హుండీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తులు కానుకలను హుండీల్లో వేసి మొక్కులు చెల్లించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ క్రాంతికుమార్, రికార్డు అసిస్టెంట్ వీరయ్య, పూజారులు పాల్గొన్నారు. -
మాజీ సర్పంచ్ల అరెస్ట్ అప్రజాస్వామికం
ములుగు: పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరుతూ సచివాలయం ఎదుట నిరసన తెలపడానికి సిద్ధమైన మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అక్రమంగా అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పాప పవన్కుమార్ అన్నారు. ఈ మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్న మాజీ సర్పంచ్లు దాసరి రమేష్, మిద్దెబోయిన రాములు, మోరె రాజయ్య, తిరుపతి, కల్పనరూప్సింగ్లు స్టేషన్లో నిరసన తెలిపారు. ఆర్జిత సేవలు బంద్కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో ఈనెల 7, 8, 9 తేదీల్లో జరిగే మహా కుంభాభిషేకానికి మూడు రోజుల ఆర్జీత సేవలను నిలిపివేస్తున్నట్లు ఈఓ మహేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుంభాభిషేకానికి వచ్చే భక్తులు దర్శనం చేసుకొని, అన్నప్రసాదం తీసుకోవాలని తెలిపారు. ఇసుక లారీలు నిలిపివేత ఈనెల 7, 8, 9 తేదీల్లో మహదేవపూర్ మండలం మీదుగా నడిచే ఇసుక లారీలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా టీజీఎండీసీ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. -
ఈసారి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు కాళేశ్వరం గోదావరిలో త్రివేణి సంగమం
● అంతర్వాహినిగా కలిసే సరస్వతి నది ● మే 15 నుంచి 26 వరకు పుష్కరాలు ● వీఐపీ ఘాట్ దగ్గర శాశ్వత ప్రాతిపదికన పనులు ● ఈసారి ప్రత్యేక ఆకర్షణగా జాయ్రైడ్, టెంట్సిటీ, కల్చరల్ ఫెస్టివల్స్ ● క్షేత్ర సంస్థ ఆధ్వర్యంలో సిద్ధమైన మాస్టర్ప్లాన్ పార్కింగ్హెలిపాడ్సిరొంచ టు కాళేశ్వరం దారి.. -
అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత గ్రామమైన కొండపర్తిలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని కొండపర్తిని బుధవారం కలెక్టర్ దివాకర, గవర్నర్ జాయింట్ సెక్రటరీ భవాని శంకర్, ప్రైవేట్ సెక్రటరీ పవన్సింగ్లు సందర్శించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, సోలార్ ఆర్గనైజింగ్ సిస్టం, మసాలా మేకింగ్, టైలరింగ్ సెంటర్, స్కూల్, అంగన్వాడీ భవనాల ప్రహరీ, టాయిలెట్స్, తాగునీటి వసతి తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం కొమురంభీమ్, బిర్సాముండా విగ్రహాలను పరిశీలించారు. అలాగే గ్రామంలోని గిరిజనుల జీవనోపాధి, వ్యవసాయ పంటల సాగు స్థితిగతులను కలెక్టర్ వారికి వివరించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో 79బీపీఎల్ ఇళ్లు, 370మంది జనాభా ఉన్నారని తెలిపారు. వారి జీవనోపాధిని మెరుగుపర్చేందుకు 10ఎకరాల వ్యవసాయ భూమికి ఒకటి చొప్పున గ్రామంలో మొత్తం ఏడు బోర్లు వేయనున్నట్లు వెల్లడించారు. బోర్లు వేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్, డీటీ సురేష్ బాబు, ఎంపీడీఓ సుమనవాణి పాల్గొన్నారు.కొండపర్తిని సందర్శించిన కలెక్టర్, గవర్నర్ జాయింట్ సెక్రటరీ భవాని శంకర్ -
విద్యుత్ తీగలు అమర్చితే చర్యలు
ములుగు: వన్య ప్రాణులకు హాని కలిగించేలా పంట పొలాల చుట్టూ విద్యుత్ తీగలు అమర్చితే చర్యలు తప్పవని ఎస్పీ డాక్టర్ శబరీశ్ హెచ్చరించారు. ఈ మేరకు వైల్డ్లైఫ్ శాఖ తరఫున ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్ను బుధవారం ఎస్పీ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతువుల ప్రాణాలు మనిషి ప్రాణా లతో సమానమన్నారు. పంటపొలాల చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే సెక్షన్ 105 బీఎన్ఎస్ కింద పదేళ్ల జైలుశిక్ష, ఎలక్ట్రిసిటీ యాక్జ్ 135 తరఫున మూడేళ్ల జైలు శిక్ష, వైల్డ్లైఫ్ ప్రొటెక్షన్ కింద మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. పోలీసు అధికారులు, విద్యుత్ సిబ్బంది గ్రామాల వారీగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, సీఐ శంకర్, ఎస్సై వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ డాక్టర్ శబరీశ్ -
కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహిస్తాం
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలో మహాకుంభాభిషేకాన్ని అందరితో కలిసి వైభవంగా నిర్వహిస్తామని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. ఽబుధవారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, దేవాదాయశాఖ ఆర్జేసీ రామకృష్ణరావుతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఆల య రాజగోపురం వద్ద మెట్ల మార్గాన్ని పరిశీలించి ఆలయంలోని పరంజా(కర్ర)లతో చేస్తున్న మె ట్లమార్గాన్ని పరిశీలించారు. మెట్ల కెపాసిటీ అడిగి తెలుసుకున్నారు. వీఐపీలు, సామాన్యుల వీక్షణకు ఎక్కడ ఉంటారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈఓ కార్యాలయంలో అధికారులతో కలిసి మహాకుంభాభిషేకం వాల్పోస్టర్లను ఆవిష్కరించా రు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కాళేశ్వరం దేవస్థానంలో ఈనెల 7, 8, 9 తేదీల్లో జరిగే మహాకుంభాభిషేకం కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. భక్తులు మెచ్చేలా ఏ ర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దా దాపు 42 సంవత్సరాలు తర్వాత జరుగుతున్న కార్యక్రమమం కావడంతో చాలా ప్రాధాన్యం ఉందన్నారు. ఈ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమష్టి కృషి చే యాలన్నారు. భక్తులు కార్యక్రమం వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల రద్దీ నియంత్రణ, క్యూ పాటించడానికి వీలుగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ సునీత, దేవస్థానం ఈఓ మహేష్, డీపీఓ నారాయణరావు, ఇరిగేషన్,పీఆర్ ఈఈలు తిరుపతి, వెంకటేశ్వర్లు, డీపీఆర్ఓ శ్రీని వాస్, కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి వీరభద్రయ్య, తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, డీటీ కృష్ణ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఆలయ అర్చకులు కృష్ణమూర్తిశర్మ, ఫణీంద్రశర్మ, సీఐ రామచంద్రారావు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు. ఈనెల 7, 8, 9 తేదీల్లో కార్యక్రమం భక్తుల వీక్షణకు రెండు ఎల్ఈడీ స్క్రీన్లు కలెక్టర్ రాహుల్శర్మ -
రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్గా ఉందని ఇంగ్లాండ్కు చెందిన జాన్ దంపతులు కొనియాడారు. రామప్ప దేవాలయాన్ని బుధవారం వారు సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం పాలంపేట శివారులో ప్రధాన రహదారి పక్కన నాటు వేస్తున్న కూలీలతో మాట్లాడారు. నాటు వేసే విధానం బాగుందని పేర్కొంటూ నాటు వేసే ఫొటోలను తమ సెల్ఫోన్తో తీసుకున్నారు. రామప్ప పరిసర ప్రాంతాలు అందంగా, ఆహ్లాదకరంగా ఉన్నాయని కొనియాడారు. సైబర్ నేరాలపై అవగాహన అవసరం ములుగు: సైబర్ నేరాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరమని సైబర్ క్రైం డీఎస్పీ సందీప్రెడ్డి సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో వైద్యులు, విద్యార్థులకు బుధవారం జాగృక్త దివాస్ కార్యక్రమంలో భాగంగా అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సందీప్రెడ్డి మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీ, మల్టీలెవల్ మార్కెటింగ్(ఎంఎల్ఎం) పిరమిడ్ ఫ్రాడ్స్, జంప్డ్ డిపాజిట్ స్కాంలపై వివరించారు. ఒక వేళ ఎవరైనా సైబర్క్రైం బారిన పడితే వెంటనే 1930 టోల్ నెంబర్కి లేదా వెబ్సైట్ ద్వారా గానీ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సైబర్ క్రైం స్థానిక అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని వివరించారు. కాటమయ్య కిట్ను ఉపయోగించుకోవాలి వెంకటాపురం(ఎం): ప్రతీ గీత కార్మికుడు కాటమయ్య కిట్ను ఉపయోగించుకోవాలని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి రవీందర్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని పాలంపేటలో 40మంది గీత కార్మికులకు సేఫ్టీ మోకుల వినియోగంపై ట్రైనర్లు బుర్ర శ్రీనివాస్, గుంగెబోయిన రవి, రంగు సత్యనారాయణ, పులి రమేష్లు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కారుపోతుల సత్యం, మూల రత్నాకర్, కోటగిరి సురేందర్, గట్టు శంకర్, దండెపల్లి సారంగం తదితరులు పాల్గొన్నారు. 10న ఐటీఐ అప్రెంటిస్షిప్ మేళాకాటారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఈ నెల 10న ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా (పీఎంఎన్ఏఎం) నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదర్శ ఆటోమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్ మోట ర్స్, శ్రీధర్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు మరి కొన్ని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ మేళాకు హాజరవుతారని తెలిపారు. ఐటీఐ ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ విభాగాల్లో పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకొని మేళాకు హాజరుకావాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు బయోడేటా, అప్రె ంటిస్షిప్ రిజిస్ట్రేషన్, ఎస్ఎస్సీ మెమో, ఐటీఐ మెమో, ఎన్టీసీ, కుల ధృవీకరణపత్రం, ఆధార్, రెండు పాస్పోర్ట్ ఫొటోలతో హాజరుకావాలని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరగబోయే కుంభాభిషేకం, మహాశివరాత్రి, సరస్వతి పుష్కరాలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. బుధవారం ఆయన కాళేశ్వరంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 7, 8, 9వ తేదీల్లో కాళేశ్వరంలోని కాళేశ్వరముక్తీశ్వర స్వామి ఆలయంలో జరిగే కుంభాభిషేకం, మహాశివరాత్రి, మే నెలలో జరిగే సరస్వతీ పుష్కరాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా ముందస్తుగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. వాహనాలకు సరైన పార్కింగ్ ఉండే విధంగా చూడాలన్నారు. ట్రాఫిక్ జాం కాకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాళేశ్వర ఆలయ పరిసరాలు, మెయిన్ ఘాట్, వీఐపీ ఘాట్లను, బైపాస్ రోడ్డును పరిశీలించారు. కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ చంద్రరావు, ఎస్సై తమాషారెడ్డి ఉన్నారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించండి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. కేటీకే 5వ గనిలో మ్యాన్ రైడింగ్ను పొడగించాలని, కొత్త టబ్బులను ఏర్పాటు చేసి నాణ్యత పాటించాలని, టబ్బుల రిపేరు సామానులు సరిగా రావడం లేదని, బుట్లు, సాక్స్లు, వీల్స్ బోలోట్స్, ఇతర మెటీరియల్ నాసిరకంగా ఉంటున్నాయన్నారు. క్యాంటిన్లో నాణ్యతతో కూడిన అల్పాహారం అందించాలని, ఎస్డీఎల్ యంత్రాల మరమ్మతు పరిరకాలు లేక ఫిట్టర్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, నాయకులు రాజయ్య, జనార్దన్, శ్రీనివాస్, శ్రీధర్లు పాల్గొన్నారు.