Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement

బిగ్‌బాస్

Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Kushboo Sundar Interesting Comments On Young Actress In Double Occupancy Success Meet1
ఇప్పటి కాలం వేరు.. మా పిల్లకు అదే చెబుతాం: కుష్బూ సుందర్‌

‘‘ఇంతకు ముందు పెళ్లి వ్యవహారాన్ని హీరోయిన్లు రహస్యంగా మార్చేశారు. ఇప్పుడు కాలం మారింది. యువతరం కొత్తగా ఆలొచిస్తున్నారు. వారితో పాటు మనం మారుతున్న పరిస్థితి. మా పెద్ద అమ్మాయి అవంతికకు పెళ్లి జరగబోతోంది. ఆమె హీరోయిన్‌ ఎంట్రీ ఇచ్చి రెండు చిత్రాల్లో నటించారు. మరో రెండు చిత్రాల్లో నటించనున్నారు. ఇక మా రెండో కూతురు ఆనందిత కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ఆమె నిర్వహణ బాధ్యతలను నిర్వహించిన తొలి చిత్రం డబుల్‌ ఆక్యుపెంసీ. గత 12 వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్ర విజయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా కెమెరా ముందు, వెనుక పని చేసిన టీమ్‌ కే చెందుతుంది. కష్టపడి సంపాదించిన డబ్బుతో చిత్రం చేయడానికి థియేటర్‌ లకు కుటుంబసమేతంగా వచ్చే ప్రేక్షకులకు పైసా వసూల్‌ అని చెప్పుకుంటూ జాలీగా బయటకు వెళ్లాలనే నేను, సుందర్‌ సి మా పిల్లలకు చెబుతాం. అదే విధంగా ఇక్కడ మీకంటే ఎవరు ఎక్కువ కాదు. ప్రతిభను చాటుతూ శ్రమిస్తే విజయం తధ్యం అని చెపుతాం. ఆ విధంగా చిత్ర నిర్మాణ రంగంలో మా రెండవ కూతురు ఆనందిత మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర యూనిట్‌ కు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయబోతున్నాం. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెల్లడిస్తాం’’ అని డబుల్‌ ఆక్యుపెంసీ చిత్ర సక్సెస్‌ మీట్‌ లో నటి, నిర్మాత కుష్బూ సుందర్‌ పేర్కొన్నారు. వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అవ్వీ మూవీస్‌, బెంచ్‌ మీడియా సంస్థలు కలిసి నిర్మించారు. అశ్విన్‌ కందస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్‌, సంయుక్త విశ్వనాధన్‌, రేష్మా వెంకటేష్‌, వినోద్‌ కిషన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

Rashmika Cocktail 2 Movie Telugu Review2
పెళ్లి తర్వాత రష్మిక తొలి సినిమా.. టాక్ ఏంటి?

ఈ వీకెండ్ ఇద్దరు స్టార్ హీరోయిన్లు తమ సినిమాలతో వచ్చారు. మామూలుగా చెప్పుకొంటే ఇందులో అంతేం ఉందని అనిపిస్తుంది. కానీ ఈ రెండు మూవీస్ కూడా ఆయా హీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చినవి కావడంతో కాస్త ఆసక్తి నెలకొంది. సమంత 'మా ఇంటి బంగారం' పాస్ మార్కులు వేయించుకుంది. మరి రష్మిక 'కాక్‌టెయిల్ 2' టాక్ ఏంటి? ప్రేక్షకులు ఏమంటున్నారు?(ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్)రష్మిక ఇదివరకే హిందీలో గుడ్ బై, థామా, ఛావా, యానిమల్, మిషన్ మజ్ను తదితర సినిమాలు చేసింది. అయితే వీటిలో యానిమల్, ఛావా మాత్రమే మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇప్పుడు 'కాక్‌టెయిల్ 2'తో వచ్చేసింది. షాహిద్ కపూర్, కృతి సనన్‌తో కలిసి రష్మిక స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఈ మూవీకి దాదాపుగా నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ స్టార్స్ ఉండటం వల్ల కలెక్షన్స్ పర్లేదనిపిస్తున్నాయి.మరీ ముఖ్యంగా ఇప్పటితరానికి కనెక్ట్ అయ్యే లివ్ ఇన్ రిలేషన్, గ్లామర్ లాంటివి ఉండటంతో కాస్తోకూస్తో యూత్ వస్తున్నారు. అయితే ఇది హిందీ వరకే రిలీజ్ చేశారు. సోషల్ మీడియా అంతా కూడా కృతి సనన్ సూపర్ అన్నట్లు ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో పీఆర్ చాలా ఉంటుంది. మరి నిజంగానే కృతి బాగా చేసిందా లేదంటే రష్మికని సైడ్ చేయడానికి కృతిని పొగిడేస్తున్నారా అని సందేహం కలుగుతోంది. ప్రస్తుతానికైతే నెగిటివ్ టాక్ నడుస్తోంది. వీకెండ్ పూర్తయితే ఫలితం ఏంటనేది పూర్తి క్లారిటీ రావొచ్చు.'కాక్‌టెయిల్ 2' విషయానికొస్తే.. షాహిద్ కపూర్, రష్మిక పాత్రలు లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటారు. ఓ సందర్భంలో రష్మిక పాత్ర విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో తన బాయ్ ఫ్రెండ్ ఎంత నిజాయతీపరుడో తెలుసుకునేందుకు రష్మిక, తన ఫ్రెండ్ కృతి సనన్ సాయం అడుగుతుంది. సరదాగా పరీక్షిద్దాం అనుకుంటే మొత్తం సీన్ మారిపోతుంది. చివరకు ఏమైందో? మరి ఎవరు ఎవరు ఒక్కటయ్యారు అనేది మిగతా స్టోరీ. (ఇదీ చదవండి: సీఎం విజయ్ నిర్ణయం.. ఇండస్ట్రీ వ్యక్తికి కీలక పదవి)

Manoj Paramahamsa Appointed Tamilnadu Film School Chairman3
సీఎం విజయ్ నిర్ణయం.. ఇండస్ట్రీ వ్యక్తికి కీలక పదవి

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్తుతం రాజకీయంగా బిజీగా ఉన్నారు. మరోవైపు వరసగా సినీ ప్రముఖులని కలుస్తూనే ఉన్నారు. తాజాగా ఈయన తీసుకున్న నిర్ణయం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగు, తమిళ సినిమాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసకు కీలక పదవి కట్టబెట్టడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇదిగో రామ్ చరణ్ కూతురు క్లీంకార)ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసని తమిళనాడు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి విజయ్ అధికారిక ఉత్తర్వు జారీ చేశారు. మనోజ్ ఒకప్పుడు ఈ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లోనే చదువుకున్నారు. తర్వాత అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఖాళీ సమయాల్లో సినిమాటోగ్రఫీకి సంబంధించి వర్క్ షాప్స్ నిర్వహించడం, క్లాసులు చెప్పడం లాంటివి మనోజ్ పరమహంస చేస్తుంటారు. విజయ్ హీరోగా నటించిన స్నేహితుడు, లియో, బీస్ట్ సినిమాలకు ఈయనే సినిమాటోగ్రాఫర్. అలా టెక్నికల్ నాలెడ్జ్ ఉందని ఈయనకు పదవి ఇచ్చారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం విజయ్ తన సన్నిహితులకు పదవులు కట్టబెట్టుకుంటున్నారని విమర్శిస్తున్నారు.ఇకపోతే మనోజ్ పరమహంస తెలుగులో.. రేసుగుర్రం, ఏ మాయ చేశావె, బ్రూస్ లీ, రాధేశ్యామ్, గుంటూరు కారం, హరిహర వీరమల్లు, ఓజీ తదితర సినిమాలకు పనిచేశారు. తమిళంలోనూ స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన అనుభవముంది.(ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్)

Kayadu Lohar Takes Break From Social Media4
షాకింగ్ డెసిషన్.. మనసుకు విశ్రాంతి కావాలి

స్వతహాగా అసోం అమ్మాయి అయినప్పటికీ తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కాయదు లోహర్. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్'లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మనసుకు విశ్రాంతి కావాలి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు వెల్లడించింది.(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇదిగో రామ్ చరణ్ కూతురు క్లీంకార)'సోషల్ మీడియా నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్నా. శరీరానికి ఇచ్చినట్లే మనసుకూ విశ్రాంతి కావాలి. ‍స్క్రీన్‌కి దూరంగా ఉండి నాతో నేను ఎక్కువ టైం గడపాలనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసి ప్రేమ చూపించిన వాళ్లకు థ్యాంక్స్. కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటా. ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే నా టీమ్ ఈ అకౌంట్ ద్వారా షేర్ చేస్తుంది. అందరికీ మంచి కలగాలని కోరుకుంటున్నా' అని కాయదు పోస్ట్ పెట్టింది.తెలుగులో 'అల్లూరి' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైనప్పటికీ ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' చిత్రం ఈమెకు మంచి పేరు తీసుకొచ్చింది. అలా తెలుగు, తమిళ, మలయాళంలో పలు మూవీస్ చేసింది. ప్రస్తుతానికైతే తమిళంలో ఇమ్మోర్టల్, తెలుగులో 'ప్యారడైజ్' చేస్తోంది. మరి కెరీర్ పరంగా బాగానే ఉన్న టైంలో ఇలా సోషల్ మీడియాకు ఎందుకు బ్రేక్ ఇచ్చిందో?(ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official)

Bhagyshri Borse And Vaishnavi Chaitanya Latest News5
షాకిచ్చిన వైష్ణవి చైతన్య.. భాగ్యశ్రీ ఎంజాయ్

గ్లామరస్‌గా కనిపించి షాకిచ్చిన వైష్ణవి చైతన్యమంచులో చిన్నపిల్లలా భాగ్యశ్రీ బోర్సే ఎంజాయ్బెడ్‌పై అందమైన పోజుల్లో డింపుల్ హయాతిమెరుపు తీగలా మారిపోయిన కాజల్ అగర్వాల్డ్యాన్స్ అదరగొట్టేసిన మెగా డాటర్ నిహారికవయ్యారంగా సోయగాలతో కృతి శెట్టి View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Sravya Maddineni / శ్రావ్య మద్దినేని (@sravyamaddineni) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Sunainaa (@thesunainaa) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

Tollywood Actress Samantha Pregnant And Baby Bump Viral6
సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్

హీరోయిన్ సమంత ప్రెగ్నెన్సీతో ఉందనే రూమర్స్ గత రెండు మూడు రోజుల నుంచి వచ్చాయి. అయితే 'మా ఇంటి బంగారం'తో నిన్ననే థియేటర్లలోకి వచ్చిన సామ్.. వరసగా సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ బేబీ బంప్‌తో కనిపించి పుకార్లని నిజం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు ‍కలెక్షన్స్ ఎన్నికోట్లు?)చెన్నైకి చెందిన సమంత.. తెలుగులో రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ తదితర స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉంది. మధ్యలో మయోసైటిస్ వ్యాధి వల్ల రెండేళ్లు ఇండస్ట్రీకి దూరమైంది. దర్శకుడు రాజ్ నిడిమోరుని సమంత.. గతేడాది డిసెంబరులో పెళ్లి చేసుకుంది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లే.ఇప్పుడు లీడ్ రోల్ చేసి నిర్మాతగా 'మా ఇంటి బంగారం' సినిమాతో వచ్చింది. థియేటర్లలో దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. తొలిరోజు రూ.13.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కూడా వచ్చాయి. మూవీ సక్సెస్‌ని శనివారం టీమ్ అంతా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో సమంత బేబీ బంప్‌తో కనిపించింది. ఈమె సన్నిహితులు ప్రెగ్నెన్సీ అని చెప్పారు కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇదిగో రామ్ చరణ్ కూతురు క్లీంకార)Not everyone can make a cake-cutting look like a queen's victory parade... Samantha can 👑🎂❤️‍🔥✨#Samantha #SamanthaRuthPrabhu #MaaIntiBangaaram pic.twitter.com/bHypABnDKP— Cinewoods (@Cinewoodsoffl) June 20, 2026

Ram Charan Daughter Kiln Kaara Face Reveal7
బర్త్ డే స్పెషల్.. ఇదిగో రామ్ చరణ్ కూతురు క్లీంకార

మెగా హీరో రామ్ చరణ్ రీసెంట్‌గానే 'పెద్ది'తో వచ్చాడు. రూ.400 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చాయి గానీ యునానిమస్ హిట్ అయితే అనిపించుకోలేదు. థియేటర్లలో రన్ చివరకొచ్చేసింది. మరోవైపు రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఎట్టకేలకు తమ కూతురు క్లీంకార ఫేస్ రివీల్ చేశారు. పాప మూడో పుట్టినరోజు సందర్భంగా ఉపాసన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు ‍కలెక్షన్స్ ఎన్నికోట్లు?)చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్.. 2012 జూన్‌లో ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. కానీ దాదాపు పదకొండేళ్ల తర్వాత అంటే 2023 జూన్‌లో వీళ్లకు ఆడపిల్ల పుట్టింది. అప్పటినుంచి ఆమెని కెమెరాల కంట పడనివ్వలేదు. ఇప్పుడు మూడో పుట్టినరోజు సందర్భంగా ముఖాన్ని బయటపెట్టారు. చరణ్, ఉపాసన.. క్లీంకారని ఎత్తుకున్న ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఉపాసన-చరణ్ దంపతులకు ఈ ఏడాది జనవరిలో ట్విన్స్ పుట్టారు. ఇందులో అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. వీళ్లకు శివరామ్, అన్వీరా అని పేర్లు పెట్టారు. వీళ్లని కూడా మూడో పుట్టినరోజు నాడు చూపిస్తారేమో?(ఇదీ చదవండి: ఇన్‌స్టా నుంచి సినిమాల్లోకి.. ఎవరయ్యా సమంత ఫ్రెండ్‌?) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

Tollywood Director Siraj Mehadi Reacts Theatres Issue8
చిన్న సినిమాలపై పెద్ద‌ కుట్ర జరుగుతోంది

తెలుగు సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై ఇండ‌స్ట్రీలో పెద్ద కుట్ర జరుగుతోందని దర్శకుడు, నటుడు షెరాజ్ మెహదీ ఆరోపించారు. తన చిత్రం 'ఓ అందాల రాక్షసి' విడుదల, రీ రిలీజ్ టైంలో ఎదురైన ఇబ్బందులపై ఫిల్మ్ చాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. నా సినిమా మీద మాత్ర‌మే కాదు లో-బడ్జెట్ సినిమాల నిర్మాత‌ల‌కు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇస్తామని హామీ ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకుంటున్నారని షెరాజ్ ఆరోపించారు. థియేటర్ల కేటాయింపు వ్యవస్థలో రాజకీయాలు పనిచేస్తున్నాయని, దీనివల్ల చిన్న చిత్రాలు నష్టపోతున్నాయని తెలిపారు.(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు ‍కలెక్షన్స్ ఎన్నికోట్లు?)హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో చిన్న చిత్రాలకు పరిమిత సంఖ్యలో మాత్రమే షోలు ఇస్తున్నారని, అవి కూడా ప్రేక్షకులు తక్కువగా వచ్చే సమయాల్లో కేటాయిస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీని వల్ల సినిమాలు ప్రేక్షకుల దృష్టికి చేరకముందే విఫలమయ్యే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. థియేటర్లతో పాటు ఆడియో రైట్స్, శాటిలైట్ హక్కులు, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్, ఓవర్సీస్ మార్కెట్ వంటి అన్ని విభాగాల్లోనూ చిన్న సినిమాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. కొత్త దర్శకులు, నిర్మాతలకు అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.‘ఓ అందాల రాక్షసి’ సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని ప్రివ్యూ చూసిన ప్ర‌తి ఒక్క‌రూ చెప్పారు. అంత హిట్ సినిమాను కూడా ఇండ‌స్ట్రీ పెద్ద‌లు రానివ్వ‌డం లేదు. ఈ సమస్యపై ఫిల్మ్ చాంబర్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన రాలేదన్నారు. భరత్ భూషణ్.. త‌మ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. థియేటర్ల కేటాయింపులో జరిగిన అన్యాయంపై పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ సినిమాస్ సంస్థలకు లీగల్ నోటీసులు పంపినట్లు వెల్లడించారు. మొదటి విడుదల సమయంలో సరైన అవకాశాలు లభించి ఉంటే రీ-రిలీజ్ అవసరం వచ్చేది కాదని పేర్కొన్నారు.ఇతర రాష్ట్రాల్లో సినిమాలకు సబ్సిడీలు అందుతున్నాయని, తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్న చిత్రాలకు ప్రత్యేక ప్రోత్సాహక విధానాలు తీసుకురావాలని షెరాజ్ కోరారు. ఇండస్ట్రీలో సమస్యలు ఉన్నప్పటికీ చాలామంది భయంతో బహిరంగంగా మాట్లాడడం లేదని, తాను మాత్రం నిజం కోసం పోరాడుతున్నానని షెరాజ్ తెలిపారు. పరిస్థితులు మారకపోతే తెలుగు చిత్ర పరిశ్రమను విడిచి ఇతర భాషా పరిశ్రమల్లో పనిచేయాలనే ఆలోచన కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.(ఇదీ చదవండి: ఇన్‌స్టా నుంచి సినిమాల్లోకి.. ఎవరయ్యా సమంత ఫ్రెండ్‌?)

Maa Inti Bangaram Samantha Friend Artist Manjusha Full Details9
ఇన్‌స్టా నుంచి సినిమాల్లోకి.. ఎవరయ్యా సమంత ఫ్రెండ్‌?

ఈ వీకెండ్ థియేటర్లలో రిలీజైన సినిమాల్లో సమంత 'మా ఇంటి బంగారం'కి పర్లేదనిపించే టాక్ వచ్చింది. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.13 కోట్లకు గ్రాస్ కలెక్షన్స్ సాధించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సరే ఈ విషయం పక్కనబెడితే మూవీలో సమంత అదరగొట్టేసినప్పటికీ ఈమె ఫ్రెండ్ కిరణ్మయి పాత్ర చేసిన నటి కూడా ఆకట్టుకుంది. 'లెట్స్ కమాన్' అంటూ అందరినీ నవ్విస్తోంది. ఇంతకీ ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: సమంత 'మా ఇంటి బంగారం' రివ్యూ)ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా నడుస్తోంది. ఇన్ స్టా, యూట్యూబ్‌లో తన ప్రతిభ చూపిస్తూ చాలామంది గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలానే 'మా ఇంటి బంగారం'లో సమంత స్నేహితురాలిగా మంజూష ముక్కవిల్లి అవకాశం దక్కించుకుంది. పాతతరం నటీమణులైన సూర్యకాంతం, ఛాయాదేవి, నిర్మలమ్మ రీల్స్ చేస్తూ ఇన్ స్టాలో గుర్తింపు మంజూష చాలానే తెచ్చుకుంది.ఓ రోజు డైరెక్టర్ నందిని రెడ్డి అనుకోకుండా మంజూష రీల్ పడింది. దీంతో ఈమెని పిలిపించి ఆడిషన్ తీసుకుంది. మూడుసార్లు ఆడిషన్ చేసి సమంత ఫ్రెండ్ క్యారెక్టర్‌కి ఎంపిక చేసింది. నందిని రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రూవ్ చేసుకున్న మంజూష.. ఇప్పుడు పలువురు దర్శకనిర్మాతల దృష్టిలో పడింది.లాడ్జిలో ఉంటూ తెల్లవారుజామునే వంటలు చేసొచ్చి ఫ్రెండ్ సమంతకు రహస్యంగా చేరవేసి ఆమెను గట్టెక్కించే పాత్రలో మంజుష భలే నటించింది. ఓవైపు అమాయకంగా మరోవైపు గడుసుతనం ప్రదర్శించే సీన్స్‌లో ఈమె యాక్టింగ్ తెగ నవ్విస్తోంది. ఇదే తొలి సినిమా అయినప్పటికీ చాలా సహజంగా పాత్రలో సెట్ అయిపోయి, అనుభవమున్న నటిలా హావభావాలు పలికించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. హైదరాబాద్‌లోనే ఉంటున్న ఈమెకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు పలకరిస్తాయేమో చూడాలి?(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు ‍కలెక్షన్స్ ఎన్నికోట్లు?) View this post on Instagram A post shared by Manjusha Mukkavilli (@manju_kuttilu)

Blast Movie OTT Streaming Latest Update10
ఓటీటీలోకి తమిళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

అప్పుడప్పుడు చిన్న సినిమాలు కూడా అద్భుతాలు చేస్తుంటాయి. అలా గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఓ తమిళ యాక్షన్ మూవీ సొంత భాషతో పాటు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడది ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ‘బాలన్‌- ది బాయ్‌’ మూవీ రివ్యూ)యాక్షన్ హీరో అర్జున్, అభిరామి, ప్రీతిముకుందన్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'బ్లాస్ట్'. తెలుగులో 'బ్లాస్ట్ జోన్' పేరుతో రిలీజ్ చేశారు. ఓ మాదిరి అంచనాలతోనే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. తమిళ, తెలుగులో హిట్ అనిపించుకుంది. ఇప్పుడీ చిత్రం వచ్చే గురువారం(జూన్ 25) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'బ్లాస్ట్' విషయానికొస్తే.. నీల(ప్రీతి ముకుందన్) మిడిల్ క్లాస్ అమ్మాయి. తల్లిదండ్రులు(అర్జున్, అభిరామి)తో కలిసి ఉంటుంది. వీళ్లంతా కరాటే మాస్టర్లే. నీల తండ్రి ఓవైపు మెడికల్ షాప్ నడుపుతూనే మరోవైపు పిల్లలకు ఫ్రీగా కరాటే నేర్పిస్తుంటాడు. నీల ఓ రోజు షాపులో ఉండగా కృపాకర్ గ్యాంగ్‌కి చెందిన ఓ రౌడీ వచ్చి ఈమెని బెదిరించి కొన్ని మందులు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే నీల చేతిలో చావుదెబ్బలు తిని జైలుపాలవుతాడు. దీంతో కృపాకర్‌ గ్యాంగ్‌తో పాటు మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ అబ్రహం (అర్జున్‌ చిదంబరం).. నీల కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తారు. తర్వాత ఏమైంది? అసలు కృపాకర్‌ గ్యాంగ్‌.. నీల కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు ‍కలెక్షన్స్ ఎన్నికోట్లు?)

Advertisement
Advertisement