Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement

సినిమా పోల్

Advertisement

ఫొటోలు

A to Z

Advertisement

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Priyanka Jain Wedding Proposal to Shivakumar in Andaman Nicobar1
ఈ జర్నీ అంత ఈజీ కాదు.. కలిసి ముందుకెళ్దాం.. నటి పెళ్లి ప్రపోజల్‌

బిగ్‌బాస్‌ బ్యూటీ ప్రియాంక జైన్‌ (Priyanka Jain), బుల్లితెర నటుడు శివకుమార్‌ (Shivakumar) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమలో మునిగారు. కొంతకాలంగా కలిసే ఉంటున్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. శనివారం (జూన్‌ 8న) శివకుమార్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా అండమాన్‌- నికోబార్‌లో అతడి పుట్టినరోజు వేడుకలు జరిపిన ప్రియాంక.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని మోకాలిపై కూర్చుని ప్రపోజల్‌ చేసింది.బీచ్‌లో ప్రపోజల్‌..నెచ్చెలి ఎదురుగా వచ్చి చేయందుకోమన్నాక ఎవరైనా ఎలా ఆగుతారు. శివ్‌ కూడా అంతే.. సంతోషంతో గంతేశాడు. తప్పకుండా అని అంగీకారంగా హత్తుకున్నాడు. అప్పుడు ప్రియాంక సగం పెళ్లి అయిపోనట్లే అన్నట్లుగా ఓ ఉంగరాన్ని అతడి వేలికి తొడిగింది. నా జీవిత భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు అధికారికంగా నువ్వు నావాడివి. ఎప్పటికీ నాతోనే ఉండాలి. మనం జంటగా ఎన్నో సాహసాలు చేద్దాం. కలిసి ఎదుగుదాం..ఇక్కడివరకు మన ప్రయాణం అంత సులువుగా జరగలేదు. తర్వాత కూడా అంత ఈజీగా ఉండకపోవచ్చు. కానీ మనం ప్రతిరోజు దాన్ని ఉత్తమంగా మార్చుకునేందుకు ప్రయత్నిద్దాం. ఏయేటికాయేడు కాలాన్ని వృథా చేయకుండా జ్ఞాపకాలు కూడబెట్టుకుందాం. కలిసి ముందుకుసాగుదాం అని రాసుకొచ్చింది. ఇది చూసిన బుల్లితెర తారలు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సీరియల్స్‌తో పాపులర్‌కర్ణాటకలో పుట్టి పెరిగిన ప్రియాంక.. జానకి కలగనలేదు, మౌనరాగం వంటి సీరియల్స్‌తో పాపులర్‌ అయింది. మౌనరాగం సీరియల్‌లో శివకుమార్‌కు జంటగా నటించింది. అక్కడ మొదలైన పరిచయమే తర్వాతి కాలంలో ప్రేమగా మారింది. ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉంటున్న వీళ్లిద్దరూ పెళ్లెప్పుడు చేసుకుంటారని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బిగ్‌బాస్‌ అయిపోగానే వివాహం చేసుకోవాలనుకున్నారు. గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని ప్లాన్‌కాకపోతే అంగరంగ వైభవంగా, కొన్నిరోజులపాటు పెళ్లి వేడుకలు జరుపుకోవాలని ప్లాన్‌ చేసుకుందట ప్రియాంక. అందుకు చాలా డబ్బు అవసరం అవుతుందని, అది సంపాదించుకున్నాకే పెళ్లి చేసుకుంటామని గతేడాది శివకుమార్‌ బయటపెట్టాడు. ఇప్పుడా సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. ఈ ఏడాదే వీరి వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరగనున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) చదవండి: చిన్నతనంలో చేదు అనుభవాలు.. అబ్బాయిల్ని నమ్మాలంటేనే..

Balakrishna Lakshmi Narasimha Re Release Song Goes Controversy2
బాలకృష్ణ బర్త్‌డే సందేశం... కొత్త సీసాలో పాత సారా కలిపాడుగా!

ఆధునిక టెక్నాలజీతో బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో తీసిన సినిమాలను కలర్‌ లోకి తీసుసుకురావడం, ఆ తరువాత పాత సినిమాలను 4కెలో లో రీరిలీజ్‌ చేయడం వంటి మార్పుల్ని ఇప్పటికే మనకు పరిచయం చేసిన టాలీవుడ్‌ ఇప్పుడు మరో కొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. అదే పాత సినిమాలో కొత్త పాటల్ని కలపడం. పాత విజువల్స్‌కు కొత్త పాటని జత చేసే ట్రెండ్‌ కు నాంది పలికింది సినీనటుడు బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహా సినిమా. ప్రస్తుతం రీ రిలీజ్‌ సినిమాలకు కాసుల వర్షం కురుస్తుండడంతో మొత్తం టాలీవుడ్‌ ఫ్లాష్‌ బ్యాక్‌లోకి పరుగులు తీస్తోన్న సంగతి తెలిసిందే. అలా ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లి అప్పట్లో హిట్‌ అయిన చిత్రాల్ని తిరిగి ప్రేక్షకుల ముందుకు తెచ్చే క్రమంలోనే ఇప్పుడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 21 ఏళ్ల తరువాత లక్ష్మీ నరసింహా సినిమాను రీరిలీజ్‌ చేస్తున్నారు. జూన్‌ 8 న ఈ సినిమా రీరిలీజ్‌ కు రెడీ అయ్యింది. బాలకృష్ణ హీరోగా జయంత్‌ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీ నరసింహా. దీనిని నిర్మాత బెల్లంకొండ సురేష్‌ నిర్మించారు. ఈ చిత్రంలో ఆసిన్‌ హీరోయిన్‌ గా నటించింది. 21ఏళ్ల క్రితం 2004 లో రిలీజ్‌ అయిన ఈ సినిమా చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు రీరిలీజ్‌ సినిమా వస్తుంది అంటే కొత్తగా ట్రైలర్‌ ను రూపొందించి విడుదల చేయడం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు మాత్రం ఏకంగా ఒక కొత్త పాటనే రూపొందించారు. మొదట లక్ష్మీ నరసింహా సినిమాలోనే బాలకృష్ణ క్యారెక్టర్‌ ను రివీల్‌ చేసే సాంగ్‌ ఒకటి రూపొందించారట. అయితే షూటింగ్‌ కూడా చేసినా ఆ సాంగ్‌ ని వాడలేదట. దీంతో ఆ పాత బాలయ్య డ్యాన్స్‌ విజువల్స్‌ను కొత్తగా పాట రాయించి మరీ ఆ విజువల్స్‌కు జత చేశారట.తాజాగా ఈ కొత్త సాంగ్‌ ను మేకర్స్‌ విడుదల చేశారు. మంచినీళ్లు తాగినోడు మామూలోడు, మజ్జిగ తాగినోడు మంచోడు.. మందేసినోడు ఘనుడు.. మ్యాన్షన్‌ హౌస్‌ వేసినోడు మహానుభావుడు అంటూ సాగే ఈ పాటనుచంద్రబోస్‌ రాయగా, స్వరాగ్‌ కీర్తన్‌ ఆలపించగా, భీమ్స్‌ నేపధ్య సంగీతం అందించారు. పాట చివర్లో జై బాలయ్య జైజై బాలయ్య అంటూ బాలకృష్ణకు యధాశక్తి భజన చేశారు బెల్లంకొండ. సినిమా రీరిలీజ్‌ రోజు కలెక్షన్స్‌ కోసం రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు..అలాగే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పాత సినిమాకు కొత్త ఆకర్షణలను జోడించడం కూడా తప్పు కాదు. కానీ తాజాగా జోడించిన పాటలో వాక్యాలే అభ్యంతరకరంగా ఉన్నాయి. ఓ వైపు మద్యం ప్రకటనల్లో, ప్రచారాల్లో సినిమా తారలు పాల్గొనడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. అలాంటిది ఏకంగా మందు తాగితేనే ఘనుడు, మ్యాన్షన్‌ హౌస్‌ తాగితేనే మహానుభావుడు..వాడిని ఎవడూ ఆపలేడు... అంటూ తన పాటల ద్వారా చెప్పడం అంటే... ఒక ప్రజా ప్రతినిధి యువతకు ఏం సందేశం ఇస్తున్నట్టు? పైగా ఆయన పుట్టిన రోజు నాడు.. అభిమానులకు ఇవ్వాల్సిన సందేశం ఇదేనా?

Akhanda 2 Movie Teaser Release Date Locked3
'అఖండ 2' అప్డేట్‌.. మొదలైన తాండవం

నందమూరి బాలకృష్ణ 'అఖండ' తాండవం మొదలైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'అఖండ 2' నుంచి తాజాగా అప్డేట్‌ ప్రకటించారు. జూన్‌ 9న సాయిత్రం 6.03గంటలకు టీజర్‌ విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పణలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సంయుక్తా మేనన్, ఆది పినిశెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం తమన్‌ అందిస్తున్నారు. తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా బాలయ్యతో సినిమా ప్రకటించాడు NBK111పేరుతో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.2021లో విడుదలైన అఖండ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్‌ 2ను తెరకెక్కించారు. ఈ ఏడాది దసరా సందర్బంగా సెప్టెంబర్‌ 25న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, అదేరోజున పవన్‌ కల్యాణ్‌ ఓజీ సినిమా కూడా రానుంది. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన అఖండ2 పోస్టర్‌లో రిలీజ్‌ డేట్‌ ప్రకటించలేదు. దసరా బరిలో ఈ రెండు పోటీలో ఉంటాయా..? అనే విషయం తెలియాలంటే అఖండ2 టీజర్‌తో ఒక ‍క్లారిటీ వచ్చేస్తుంది. బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.Brace yourselves for the divine fury 🔥 #Akhanda2 - The Teaser Thaandavam from tomorrow ❤‍🔥#Akhanda2Teaser out on June 9th at 6.03 PM 🔱🔥#Akhanda2Thaandavam'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman @14ReelsPlus @iamsamyuktha_… pic.twitter.com/bD5Y7uRofb— 14 Reels Plus (@14ReelsPlus) June 8, 2025

Jamie Lever Says She was Traumatised as a 10 Year Old by Inappropriate Men4
చిన్నతనంలో చేదు అనుభవాలు.. అబ్బాయిల్ని నమ్మాలంటేనే భయం!

పాపులర్‌ కమెడియన్‌ జానీ లివర్‌ (Johny Lever) కూతురు జామీ లివర్‌ (Jamie Lever) హిందీలో అనేక సినిమాలు చేసింది. గతేడాది ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె తన బాల్యంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. నాకు పదేళ్లుంటాయనుకుంటా. స్కూల్‌ అయిపోగానే వెళ్లి కారులో కూర్చున్నాను. మా డ్రైవర్‌ నా సోదరుడు జెస్సీ కోసం బయట ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి మా కారు దగ్గరకు వచ్చి నన్ను చూస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. కారు డోర్‌ తీసి లోపలకు వస్తే నా పరిస్థితి ఏంటని భయంతో వణికిపోయాను.మమ్మల్ని కాపాడాల్సిన వ్యక్తే..డోర్‌ లాక్‌ చేసి తనను చూడనట్లే ఉన్నాను. దాంతో అతడు కాసేపటికి వెళ్లిపోయాడు. మా స్కూల్‌ బస్‌ డ్రైవర్‌ కూడా మాతో పద్ధతిగా ప్రవర్తించేవాడు కాదు. ఎప్పుడూ ఏదో ఒకరకంగా తాకాలని చూసేవాడు. ఇదంతా ఒక పీడకలలా మర్చిపోవాలనుకునేదాన్ని. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన వ్యక్తే ఇలా నీచంగా ఆలోచిస్తే ఏమనాలి? ఇవన్నీ చూశాక అబ్బాయిలను నా జీవితంలోకి ఆహ్వానించాలంటేనే భయమేసింది. 20'sలో కేవలం ఒక్కరిని మాత్రమే డేటింగ్‌ చేశాను. నాకు జరిగిన అనుభవాలను అమ్మ సుజాతకు, నాన్న జానీ లివర్‌కు కూడా చెప్పుకోలేదు అని తెలిపింది.చదవండి: పవన్‌ కల్యాణ్‌ సినిమాను ఎందుకు ఆపుతారు?: సునీల్‌ నారంగ్‌

Devi Prasad Shares Behind The Story Of Blade Babji Ship Scene5
Devi Prasad: కెవ్వుమని అరవమంటే.. ‘కెవ్వు’ అని పడిపోయింది

సూపర్‌స్టార్ హీరోగా"గూఢచారి117" సినిమా షూటింగ్ మద్రాస్ లోని స్టూడియోలో వేసిన "విమానం ఇంటీరియర్ సెట్" లో జరుగుతోంది. సమయం అర్ధరాత్రి 2 గంటలు. బాలనటుడైన మహేష్‌బాబుతోసహా దాదాపు సినిమాలోవున్న నటీనటులందరూ ఆ ఫ్లైట్ సెట్లో ఉన్నారు. ఫ్లైట్ ఎక్స్‌టీరియర్ వర్క్ హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. కృష్ణగారు డైరెక్టర్‌గారితో "ముందు మహేష్ షాట్స్ తీయగలిగితే తీసి పంపించేయండి. నిద్రకి ఆగలేడు.నేను కావాలంటే తెల్లవారేవరకూ ఉంటాను" అని నవ్వుతూ చెప్పారు. ఆ సినిమా షూట్ జరుగుతున్నప్పుడు మహేష్‌బాబు టకటకా డైలాగులు చెబుతుంటే కృష్ణగారు చూస్తూ భలే మురిసిపోతుండేవారు.కధప్రకారం టెర్రరిస్ట్ భానుప్రియ గ్రూప్ ఫ్లైట్ హైజాక్ చేసి వాళ్ళ డిమాండ్స్ కోసం ఒక్కొక్కరినీ చంపుతుంటారు. ఆ ప్రోసెస్ లో భాగంగా కొత్తగా పెళ్ళైన ఓ జంటలోని యువకుడిని చంపుతారు. మా మిత్రుడు పురం రాధాకృష్ణ(తర్వాతికాలంలో"చిరంజీవులు" సినిమాకి దర్శకత్వం వహించాడు) ఆ యువకుడి పాత్ర పోషిస్తే అతని జంటగా ఓ కొత్తమ్మాయి వేసింది. డైరెక్టర్ గారు ఆ అమ్మాయితో "టెర్రరిస్ట్‌లు మీ ఆయన్ని కాల్చేశారు అది చూసి నువ్వు కెవ్వుమని అరిచి పడిపోవాలి"అని చెప్పారు. సెట్లో ఒకరిద్దరుగురకపెడుతున్నవాళ్ళను,నిద్రకుజోగుతున్నవాళ్ళను లేపి టేక్ అని అరిచాము. డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పగానే రాధాకృష్ణ బుల్లెట్ తగిలినట్లు అరిచి పడిపోతే అతన్ని చూసిన ఆ అమ్మాయి ఒక్కసారిగా తల పైకెత్తి తన చెవులురెండూ మూసుకుని "కెవ్వు" అనే పదం పెద్దగా పలుకుతూ పడిపోయింది. అంతే దెబ్బకి సెట్లో అందరికీ నిద్రమత్తు ఒదిలిపోయింది. విరగబడి నవ్వారందరూ. మీరు చెప్పిందేకదా చేశాను ఎందుకు నవ్వుతున్నారు అన్నట్లు చూసిందా అమ్మాయి. డైరెక్టర్ గారు "కెవ్వుమనిఅరవమంటే"కెవ్వూ"అనిఅనక్కర్లేదమ్మా.అరిచిపడిపోతే చాలు" అని మళ్ళీ యాక్షన్ చెప్పారు. మళ్ళీ సెకెండ్ టేక్ లో కూడా ఆ అమ్మాయి "కెవ్వూ" అంటూ దీర్ఘం తీయడంతో మళ్ళీ నవ్వులేనవ్వులు.మూడో టేక్ కి అర్ధమైందామెకి.టేక్ ఓకే అయ్యింది. అప్పటి నుండి ఆ అమ్మాయి "కెవ్వుకుమారి" అయ్యింది. కొన్ని తెలుగు తమిళ సినిమాలలో నటించిన ఆ అమ్మాయి తరువాత కనిపించలేదు. నేను దర్శకత్వం వహించిన "బ్లేడ్‌బాబ్జీ" సినిమాలో.... అల్లరి నరేష్ బృందం బ్యాంక్ రాబరీ చేసి పోలీసులనుండి తప్పించుకున్న ఆనందంలో వైజాగ్ బీచ్ ఒడ్డున లంగరేసివున్న ఓ చిన్న షిప్ లో మందుకొట్టి పడుకుని తెల్లారి లేచి చూసేసరికి షిప్ సముద్రం మధ్యలో ఉంటుంది.షాక్ అయ్యిన వాళ్ళు చేతులు చెవులకు ఆనించి "కెవ్వు" అని అరుస్తారు పెద్దగా. అలా అరిపించటానికి ఆనాటి కెవ్వు కుమారి "కెవ్వే" నాకు ప్రేరణ. ఆ "కెవ్వు" ఆనాడు సెట్లో అందరినీ ఎలా నవ్వించిందో అలాగే ఈ "కెవ్వు" ధియేటర్‌లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. వెతకాలేగానీ మనచుట్టూ జరిగే సంఘటనల్లో, చుట్టూ ఉండే మనుషుల్లో ఎన్నో నవ్వులు దాక్కునివుంటాయి.మనిషికి కష్టమొచ్చినపుడు కష్టపడకా,దుఃఖం వచ్చినపుడు దుఃఖపడకా తప్పదు. కానీ మిగిలిన విలువైన సమయాన్నికూడా భారంగా ఎందుకు ఖర్చు చెయ్యటం? ఏమాత్రం "ఖర్చు"లేని "నవ్వు" ని ముఖానికెందుకు దూరం చెయ్యటం? సాధ్యమైనన్ని నవ్వుల్ని పోగేసుకుని బ్రతికేద్దాం. (దర్శకుడు, నటుడు దేవీ ప్రసాద్ స్వీయ అనుభవాలను నుంచి..)

Bigg Boss Seven Gautham Krishna Starrer Solo Boy Movie Release Date Locked6
బిగ్‌బాస్‌ గౌతమ్ 'సోలో బాయ్' ఎప్పుడు వస్తున్నాడంటే..?

తెలుగు బిగ్ బాస్‌ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా మెరవనున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో పోసాని కృష్ణ మురళి, అనిత చైదరి, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఇప్పటికే విడుదలైన ‘సోలో బాయ్’ ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్ సినీ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. తాజాగా రిలీజైన పోస్టర్‌లో గౌతమ్.. రమ్య పసుపులేటితో కలిసి కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఈ పోస్టర్ యూత్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని జూలై 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గతంలో 'ఆకాశ వీధుల్లో' చిత్రంతో ఆకట్టుకున్న గౌతమ్ మరోసారి హీరోగా ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి!

Aishwarya Rajesh's Soppana Sundari Movie Review In Telugu7
ఓటీటీలో ఐశ్వర్య రాజేశ్‌ డార్క్ కామెడీ మూవీ... 'సొప్పన సుందరి' ఎలా ఉందంటే?

టైటిల్: సొప్పన సుందరినటీనటులు: ఐశ్వర్య రాజేశ్‌, లక్ష్మీ ప్రియ, చంద్రమౌళి, దీపా శంకర్‌, కరుణాకరన్‌ తదితరులుడైరెక్టర్: ఎస్‌జీ ఛార్లెస్‌ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: జియో హాట్‌స్టార్'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ కొట్టిన బ్యూటీ 'ఐశ్వర్య రాజేశ్'(Aishwarya Rajesh). ఇప్పుడు తెలుగువారికి సుపరిచితమైన పేరు. గతంలో ఆమె పలు తమిళ చిత్రాల్లో మెప్పించింది. ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రలో వచ్చిన డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌ సొప్పన సుందరి (Soppana Sundari). 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.'సొప్పన సుందరి' కథేంటంటే..అహల్య (ఐశ్వర్య రాజేశ్‌) తన తల్లి, అక్కతో కలిసి ఓ బస్తీలో నివసిస్తూ ఉంటుంది. తాను ఓ నగల దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటుంది. అయితే అహల్యకు ఉహించని విధంగా రూ.10 లక్షల విలువైన లక్కీ డ్రాలో బహుమతిగా లభిస్తుంది. అయితే కారు దక్కిందని సంతోషించేలోపే అసలు కథ మొదలవుతుంది. ఇంతకీ ఆ కారు అహల్య కుటుంబానికి దక్కిందా? నగలే కొనకుండా అసలు ఈ బహుమతి వీరికెలా వచ్చింది? అనే విషయాలు తెలియాలంటే సొప్పన సుందరి చూడాల్సిందే.ఎలా ఉందంటే..వీకెండ్‌ వచ్చిందంటే చాలు. సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. ‍అలాంటి వారిని కడుపుబ్బా నవ్వించే డార్క్ కామెడీ చిత్రం సొప్పన సుందరి. అలాగే మిడిల్ క్లాస్‌ ఫ్యామిలీకి మంచి సందేశం కూడా ఇచ్చే మూవీ. అహల్య(ఐశ్వర్య రాజేశ్), అన్నయ్య దొర (కరుణాకరన్‌) పెళ్లి చేసుకుని కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోతాడు. దీంతో అహల్య తన అక్క పెళ్లి బాధ్యతను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రథమార్థంలో అహల్య కారు గెలుచుకోవడం, ఆ తర్వాత అహల్య అక్కకు కూడా పెళ్లి కుదురుతుంది. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. కారు కోసం అన్నయ దొర ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తాయి. అలా ఈ కథ చివరికీ పోలీస్‌ స్టేషన్‌కు చేరడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.పోలీసుల చేతికి కారు వెళ్లడంతో.. సెకండాఫ్‌ వచ్చేసరికి కథ మొత్తం కారు చుట్టే తిరుగుతుంది. ఆ కారును దక్కించుకునే క్రమంలో ఐశ్వర్య రాజేశ్.. ఆమె అన్నయ్య దొర తన టీమ్‌తో కలిసి చేసే ప్రయత్నాలు ఫుల్‌ కామెడీని తలపిస్తాయి. అయితే కొన్ని చోట్ల సన్నివేశాలు మరీ లాజిక్‌లెస్‌గా ఉంటాయి. అయితే కామెడీ కథ కోణంలో చూస్తే అలా ఉంటేనే సెట్‌ అవుతుంది. అందుకే డైరెక్టర్‌ ఎలాంటి లాజిక్‌ లేకుండా కథను రాసుకున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్ కావడంతో ప్రేక్షకుడికి ఆ ఫీలింగ్‌ కలగదు. చివర్లో కారును అడ్డం పెట్టుకుని ఎస్సై చేసే దుర్భుద్దిని చూపిస్తూ డైరక్టర్ ఆ కోణంలోనూ ఆడియన్స్‌కు మేసేజ్ ఇచ్చారు. అయితే ఈ మూవీతో మనది కానీ వస్తువును బలవంతంగా తీసుకెళ్తే మనిషికి మనశ్శాంతి ఉండదనే సందేమిచ్చారు. కక్లైమాక్స్‌లో దురాశ దుంఖానికి చేటు అనే సామెతతో కథను ముగించాడు. కామెడీతో పాటు మిడిల్ క్లాస్‌ ఫ్యామిలీకి మంచి సందేశాన్నిచ్చే చిత్రం సొప్పన సుందరి. వీకెండ్‌లో మంచి కామెడీతో పాటు సందేశాత్మక చిత్రం చూడాలనుకుంటే సొప్పన సుందరి ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..ఐశ్వర్య రాజేశ్ ఈ కథకు ప్రధాన బలం. తన పాత్రలో సహజంగా నటించి అభిమానులను మెప్పించింది. ఐశ్వర్య రాజేశ్ మిడిల్ క్లాస్ అమ్మాయిలా ‌తన పాత్రలో ఒదిగిపోయింది. ఐశ్వర్యకు తల్లి పాత్ర పోషించిన దీపా శంకర్‌, ఆమె అన్నయ్యగా దొరగా కరుణాకరన్‌ తమ పాత్రల్లో మెప్పించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్‌లో సాగదీత సన్నివేశాలు కట్ చేయాల్సింది. నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఫర్వాలేదనిపించాయి.

Suniel Narang Response On Pawan Kalyan's Hari Hara Veera Mallu Issue8
పవన్‌ కల్యాణ్‌ సినిమాను ఎందుకు ఆపుతారు?: సునీల్‌ నారంగ్‌

‘‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలని కావాలని ఆపుతున్నారనడం తప్పు. ఆయన (పవన్‌ కల్యాణ్‌) సినిమాని ఎవరూ ఆపరు... ఎందుకు ఆపుతారు? ఆయన సినిమా ఆపితే నెక్ట్స్‌ వీక్‌ నా సినిమా (‘కుబేర’ని ఉద్దేశించి) కూడా రిలీజ్‌కి ఉంది కదా? ఆయన సినిమా రిలీజ్‌ ఆపడం అనేది అసాధ్యం?’’ అని ‘తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ అధ్యక్షుడు సునీల్‌ నారంగ్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ (టీఎస్‌ఎఫ్‌సీసీ) సమావేశంలో అధ్యక్షుడితో ΄ాటు కొత్త ΄ాలక మండలిని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నిర్మాత సునీల్‌ నారంగ్‌ వరుసగా మూడోసారి ఎంపికయ్యారు. ఉ΄ాధ్యక్షులుగా రవీంద్ర గో΄ాల, ఉదయ్‌ కుమార్‌ రెడ్డి కె, సెక్రటరీగా శ్రీధర్‌ వీఎల్, జాయింట్‌ సెక్రటరీగా చంద్రశేఖర్‌ రావు జె, ట్రెజరర్‌గా సత్యనారాయణ గౌడ్‌ .బి ఎన్నికయ్యారు. అదే విధంగా 15 మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సునీల్‌ నారంగ్‌ మాట్లాడుతూ– ‘‘అల్లు అరవింద్‌గారు, ‘దిల్‌’ రాజు, సురేష్‌బాబు, నా వద్ద థియేటర్లు ఉన్నాయనడం కరెక్ట్‌ కాదు. నా వద్ద 70 థియేటర్లు ఉంటే 40 బుకింగ్స్‌ ఉన్నాయి. 30 థియేటర్లు లీజ్‌ తీసుకున్నాం. అది కూడా గ్రౌండ్‌ లీజ్‌... ప్లస్‌ మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. అవన్నీ కలిపినా కేవలం ఐదారు శాతం మాత్రమే ఉన్నాయి. అనవసరంగా ఆ నలుగురు అంటూ మాట్లాడటం తగదు. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. అందరి సినిమాలూ రావాలి, విడుదలవ్వాలని కోరుకుంటాం. హీరోలు ఏడాదికి ఐదు సినిమాలు చేయాలి, పది చేయాలి అని మాట్లాడటానికి నేను ఎవరు? అది వాళ్ల ఇష్టం. వాళ్ల పారితోషికం నిర్ణయించడానికి మేము ఎవరు? హీరోలు అనేవాళ్లు దేవుళ్లు. 145 కోట్ల దేశ జనాభాలో ఇరవై ముప్పై మందే హీరోలున్నారు. లేదంటే నలభై మంది ఉంటారు. అలాంటి వాళ్ల గురించి నేను ఏం మాట్లాడాలో తెలియడం లేదు. సినిమా రిలీజైన 28 రోజులకే ఓటీటీలో విడుదల చేయడం అన్నది కూడా ఓ శత్రువులా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీలో నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్‌... ఎవరూ బాగాలేరు. కానీ, డిజిటల్‌ ప్రొవైడర్స్‌ అయిన వీఎమ్‌ఎస్, క్యూబ్‌ వాళ్లు, ఓటీటీ వాళ్లు బాగున్నారు. నాతో సినిమా తీయమని నిర్మాతలను ఏ డైరెక్టరూ, హీరో పిలవరు. మాకు ఇష్టం అయితే మేం వెళుతున్నాం... మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవరి ఇష్టం వారిది’’ అని తెలిపారు.‘టీఎస్‌ఎఫ్‌సీసీ’ సెక్రటరీ శ్రీధర్‌ మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ‘సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్‌ 2, కోర్ట్‌’ సినిమాల ద్వారానే ఎగ్జిబిటర్లకు డబ్బులు వచ్చాయి. మన హీరోలు ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చేయాలని వినతి చేస్తున్నాను. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్స్‌లో టిక్కెట్‌ ధరలు, క్యాంటీన్‌ ధరలు సాధారణంగా ఉంటున్నాయి. కానీ, మల్టీప్లెక్స్‌లో ఎక్కువ ఉంటాయి. కావాలంటే రెండింటినీ పోల్చి చూడండి’’ అన్నారు. నిర్మాతలు సురేష్‌బాబు, కిరణ్, కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ తదితరులు మాట్లాడారు.

Allu Arjun And Mahesh Babu Establish Multiplex In Some Cities9
మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌.. ఇద్దరు కలిసి భారీ ప్లాన్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, రవితేజ, విజయ్‌ దేవరకొండ ఇప్పటికే మల్టీప్లెక్స్‌ నిర్మాణంలో అడుగుపెట్టారు. ఏషియన్‌ గ్రూప్స్‌ భాగస్వామ్యంతో వారు ఈ రంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్‌లోనే అత్యంత విలాసవంతమై మల్టీప్లెక్స్‌ను (AMB) మహేశ్‌బాబు నిర్మించగా.. (AAA)పేరుతో అల్లు అర్జున్‌ రీసెంట్‌గా ఈ వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. అయితే, ఇప్పుడు వారిద్దరూ ఇతర రాష్ట్రాల్లో కూడా తమ వ్యాపారాన్ని విస్తరించే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది.అయితే, (AMB) పేరుతో బెంగళూరులో ఒక భారీ మల్టీప్లెక్స్‌ను మహేశ్‌ నిర్మించారు. త్వరలో ప్రారంభం కానుంది. ఆరు స్క్రీన్స్‌తో అత్యంత లగ్జరీ సౌకర్యాలతో దీనిని నిర్మించారు. ఇప్పుడు చెన్నైలో కూడా మరో మల్టీప్లెక్స్‌ నిర్మించబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి అక్కడ అతిపెద్ద థియేటర్‌ను నిర్మించాలని ప్రిన్స్‌ మహేశ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఏషియన్‌ సినిమాస్‌ అధినేత సునీల్‌ నారంగ్‌ తన సన్నిహితుల వద్ద చెప్పారు.ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా ఇప్ప‌టికే హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో (AAA) సినిమాస్ పేరుతో ఒక మల్టీప్లెక్స్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ఆయన కూడా ఏషియన్‌ సినిమాస్‌ భాగస్వామ్యంతోనే ఈ వ్యాపారంలో అడుగుపెట్టారు. అయితే, ఇప్పుడు ఆయన వైజాగ్‌లో AAA మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైజాగ్‌లో త్వరలో ప్రారంభం కానున్న ఇనార్బిట్ మాల్‌లో హైదరాబాద్‌లో ఉన్నట్లే మల్టీప్లెక్స్ కట్టిస్తున్నారట. ఇదే విషయాన్ని సునీల్‌ నారంగ్‌ చెప్పుకొచ్చారట. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చని తెలుస్తోంది.హైదరాబాద్‌లో అతిపెద్ద ఐమాక్స్‌ థియేటర్‌ కూడా త్వరలో నిర్మించనున్నట్లు ఏషియన్‌ అధినేత సునీల్‌ నారంగ్‌ చెప్పారని మీడియా సర్కిల్‌లో ఒక వార్త ఉంది. భాగ్యనగరంలో ఇప్పటి వరకు నిజమైన IMAX థియేటర్లు లేవు. గతంలో హైదరాబాద్‌లో IMAX థియేటర్లు ఉన్నప్పటికీ, ఇప్పుడు అవి లేవు. అయితే, ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో "PCX" అని పిలువబడే ఒక పెద్ద స్క్రీన్ ఉంది, ఇది 3D IMAX 70mm స్క్రీన్‌గా ఉండేది.., కానీ ఇప్పుడు కాదు. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే హైదరాబాద్‌కు తొలి ఐమాక్స్‌ థియేటర్‌ త్వరలో రానుంది.

Manchu Mohan Babu Comments On Prabhas10
'కన్నప్ప' వేడుకలో ప్రభాస్‌పై మోహన్‌బాబు వ్యాఖ్యలు

విష్ణు మంచు నటించిన తాజా చిత్రం ‘కన్నప్ప’(kannappa) ప్రీ రిలీజ్‌ వేడుక గుంటూరులో ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. శివ నామస్మరణతో చాలా విజయవంతంగా కార్యక్రమం జరిగింది. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్‌ హీరోయిన్‌గా నటించారు. మోహన్‌బాబు, ఆర్‌.శరత్‌కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్‌ కుమార్, కాజల్‌ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలకపాత్రల్లో నటించారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్‌ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 27న విడుదల కానుంది.ప్రీ రిలీజ్‌ వేడుకలో ప్రభాస్‌ గురించి నటుడు మోహన్‌బాబు పలు వ్యాఖ్యలు చేశారు. 'ప్రభాస్‌, నేనూ 'బావ.. బావ..' అనుకుంటాం. ఇప్పటికీ నేను తనకు ఫోన్‌ చేస్తే బావ అంటూనే మాట్లాడుతాను. తనూ అంతే.. అలా చాలా సరదాగా మా ఇద్దరి మధ్య పలకరింపులు ఉంటాయి. మానవత్వం, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్‌. ఈ సినిమాలో నటించాలని నేను అడగ్గానే బావ.. దీని గురించి మీరు నా దగ్గరకు రావాలా..? మీరు వదిలేయండి. ఏదైనా ఉంటే నేనూ విష్ణు మాట్లాడుకుంటాం..' అని అన్నాడు. దటీజ్‌ ప్రభాస్‌. పెద్దల పట్ల తను చూపించే మర్యాద ఇలా ఉంటుంది.' అని ఆయన అన్నారు. కన్నప్ప సినిమాను థియేటర్స్‌లో చూసి తన బిడ్డ విష్ణును ఆశీర్వదించాలని ఆయన కోరారు. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను స్వయం కృషితోనే పైకొచ్చానని పేర్కొన్నారు. జీవితంలో భయం అనేది ఉండకూడదని ఆయన సూచించారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది..? అదే విద్యాలయాల్లో పిల్లలకు నేర్పిస్తున్నానని అన్నారు. మోహన్‌బాబు యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లు ఇప్పుడు ఎంతోమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అయ్యారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండమని చెబుతున్నానని తెలిపారు.మంచు విష్ణు మాట్లాడుతూ.. 'కన్నప్ప' సినిమా తీయాలనేది నా కల. ఈ సినిమా కోసం నాకు చాలామంది సహకరించారు. మా నాన్న నాకు దేవుడు. ఆయన లేకపోతే నేను లేను. ఈ సినిమాలో ఎవరెవరు నటించాలనేది కూడా అంతా శివాజ్ఞ ప్రకారమే జరిగింది. ఈ సినిమాలో నా మిత్రుడు ప్రభాస్‌కు (Prabhas) నటించాడు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మేము అడిగిన వెంటనే నాన్నగారి మీద ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానంతో ప్రభాస్ వెంటనే ఒప్పుకొన్నాడు. ఈ కాలంలో స్నేహానికి విలువ ఉందంటే ప్రభాస్‌ ఒక ఉదాహరణ అని చెబుతున్నాను. వ్యక్తిగా ఆయన్ను అందరూ ప్రేమించండి.'అని చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement