-
జూన్ 8న జాతీయ లోక్ అదాలత్
ఖమ్మంలీగల్ : వచ్చే నెల 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా తక్షణమే చర్యలు ప్రారంభించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ అన్నారు. లోక్ అదాలత్ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ఆయన ఇతర న్యాయమూర్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజీ పడదగిన క్రిమినల్ కేసులను గుర్తించి కక్షిదారులకు నోటీసులు పంపాలని మెజిస్ట్రేట్లను ఆదేశించారు. చెల్లని చెక్కుల కేసులు, భార్యాభర్తల మధ్య తగాదాలు వంటి కేసులు పరిష్కారం అవుతాయని, వాటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని తెలిపారు. కక్షిదారులకు లోక్ అదాలత్ ప్రయోజనాలను వివరించి వారిని రాజీ దిశగా ప్రోత్సహించాలని సూచించారు. సివిల్ కేసుల్లో ముఖ్యంగా రుణ వసూలు కేసులలో సులభ వాయిదాల రూపంలో కూడా అప్పు చెల్లించేలా రాజీ పడవచ్చని, ఈ కేసులో లోక్ అదాలత్ ఇచ్చే అవార్డును చట్ట ప్రకారం అమలు చేయవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.ఉమాదేవి, రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి వి.అపర్ణ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె.వి. చంద్రశేఖర్రావు, అదనపు సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎం.కల్పన, రెండో అదనపు మెజిస్ట్రేట్ వై.బిందుప్రియ, మూడో అదనపు మెజిస్ట్రేట్ వి.మాధవి తదితరులు పాల్గొన్నారు.నేటి నుంచి దోస్త్ వెబ్ ఆప్షన్లుఖమ్మం సహకారనగర్ : డిగ్రీ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు సంబంధించి వెబ్ ఆప్షనన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమవుతుందని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ జాకిరుల్లా తెలిపారు. కళాశాలలో మంగళవారం వెబ్ ఆప్షన్ల ప్రచార పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు నేటి నుంచి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చని చెప్పారు. ఈనెల 25 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, 27వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుందని తెలిపారు. మొదటి విడత సీట్లు కేటాయింపు జూన్ 3న వెలువడుతుందన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ బి.వి.రెడ్డి, టి.జీవన్, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ సత్యవతి, దోస్త్ కో ఆర్డినేటర్ ఎం.సుబ్రమణ్యం, పరీక్షల కంట్రోలర్ ఎన్.గోపి, వేలాద్రి, బి.వెంకన్న, ఎం.వి.రమణ, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం భద్రాచలంటౌన్: తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఎనిమిది ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీబీఎస్ఈ సిలబస్ బోధనలో ఇంటర్ మొదటి సంవత్సరానికి ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులలో ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. 2023 – 24 విద్యా సంవత్సరంలో ఎస్సెస్సీ ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థులు ఈనెల 18వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో బాలికలకు గండుగులపల్లి, పాల్వంచ, గుండాల, బాలురకు టేకులపల్లి, దుమ్ముగూడెం, చర్ల, ములకలపల్లి, సింగరేణి కళాశాలల్లో వివిధ గ్రూపుల్లో సీట్లు ఉన్నాయని వివరించారు. ఆసక్తి ఉన్నవారు ఎంచుకున్న ఈఎంఆర్ఎస్ విద్యాలయాలలో దరఖాస్తులు అందజేయాలని, పదో తరగతిలో సీజీపీఏ, సీబీఎస్ఈ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఇందుకు గాను ఈనెల 22న చర్ల విద్యాలయంలో కౌన్సిలింగ్ ఉంటుందని పీఓ తెలిపారు. 18 వరకు గడువు ములకలపల్లి: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్)లో ఇంటర్లో ప్రవేశానికి ఈ నెల 18 వరకు గడువు పొడిగించినట్లు విద్యాలయాల ప్రాంతీయ సమన్వయ అధికారి టీవీ.రాజు, ములకలపల్లి ఏకలవ్య ప్రిన్సిపాల్ రాజేశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ పొందేందుకు 2023–24లో పదో తరగతి ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. -
గాలి దుమారం.. వర్షబీభ త్సం..
ఖమ్మంమయూరిసెంటర్/తిరుమలాయపాలెం/కూసుమంచి : జిల్లా వ్యాప్తంగా మంగళవారం వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మధిర, సత్తుపల్లి, కారేపల్లి, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, వైరా, కామేపల్లి, రఘునాథపాలెం, ఏన్కూరు, కూసుమంచి, ఎర్రుపాలెం మండలాల్లో వర్షం పడింది. కొన్ని చోట్ల గాలి దుమారంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తిరుమలాయపాలెం మండలం గోపాయిగూడెం స్టేజి వద్ద భారీ వృక్షం రోడ్డుపై పడింది. దీంతో ట్రాఫిక్కు అంతరాయం వాటిల్లింది. పాతర్లపాడు, గోల్తండా, జింకలగూడెం గ్రామాల్లోనూ తీవ్ర నష్టం వాటిల్లింది. ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఈ మూడు గ్రామాల్లోనే సుమారు 50 స్తంభాలు పడిపోయాయని ట్రాన్స్కో ఏఈ రవికుమార్ తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది కృషి చేస్తున్నట్లు చెప్పారు. గోల్తండా మీదుగా జల్లేపల్లి, హైదర్సాయిపేట వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇంటికప్పులు లేచిపోయి నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో డ్రెయిన్లు పొంగిపొర్లగా, దుక్కుల్లోకి వర్షపు నీరు చేరింది. అత్యధికంగా సత్తుపల్లిలో.. సత్తుపల్లిలో 3.9 సెం.మీ.వర్షపాతం నమోదైంది. మధిర ఏఆర్ఎస్ కేంద్రంలో 2 సెం.మీ., పెనుబల్లి గౌరారంలో 1.3, మధిర మండలం సిరిపురంలో 1.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు మరో మూడు రోజులు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. సత్తుపల్లిలో 3.9 సెం.మీ.వర్షపాతం నమోదు -
ఈవీఎంల తరలింపు ప్రక్రియ పూర్తి
ఖమ్మం సహకారనగర్ : ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించే ప్రక్రియ పూర్తయిందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. మంగళవారం ఆయన ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ సంజయ్ జి కోల్టే తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపరిచామని చెప్పారు. ఈవీఎంలకు మూడంచెల భద్రత కల్పించామని, సీఆర్పీఎఫ్, ఆర్మ్డ్, స్థానిక పోలీసులు నిరంతరం కాపలా ఉంటారని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్కు అన్ని వైపులా సీసీ కెమెరాలు, టెరరస్ పై నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాల పుటేజ్లు చూడడానికి టెలివిజన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. అభ్యర్థులు, అభ్యర్థుల ఏజెంట్లు వచ్చి టెలివిజన్లో సీసీ కెమెరాలు పరిశీలించవచ్చని, పాస్లు ఉన్న వారు స్ట్రాంగ్ రూంల వద్దకు వెళ్లి పర్యవేక్షణ చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఏఆర్ఓలు ఆదర్శ్ సురభి, బి.సత్యప్రసాద్, వేణుగోపాల్, ఎం.రాజేశ్వరి, గణేష్, రాజేందర్, మధు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ పత్రాల పరిశీలన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు సంబంధించిన పత్రాలను పక్కాగా పరిశీలించామని ఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. మంగళవారం ఆయన ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లతో కూడిన పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంట్ పరిధిలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. పటిష్ట బందోబస్తు నడుమ ఈవీఎంలను రిసెప్షన్ సెంటర్కు, అక్కడి నుంచి స్ట్రాంగ్ రూమ్లకు తరలించామన్నారు. ఈవీఎంలకు భారీ బందోబస్తు ఖమ్మంరూరల్: లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను అధికారులు మండలంలోని పొన్నెకల్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలకు తరలించారు. జూన్ 4న కౌంటింగ్ జరగనుండడంతో అప్పటి వరకు ఈవీఎంలకు భారీ బందోబస్తు కల్పించారు. కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా నిరంతరం కాపలా కాస్తున్నారు. సీసీ కెమెరాల నడుమ భద్రత కల్పిస్తూ స్ట్రాంగ్ రూంల వైపు చీమ కూడా దూరనంతగా నిఘా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ జరిగే వరకు ఉన్నతాధికారులు నిత్యం స్ట్రాంగ్రూంలను పర్యవేక్షించనున్నారు. రిటర్నింగ్ అధికారి గౌతమ్ -
ఓటేశారు..
12,41,135● ఖమ్మం, కొత్తగూడెంలో తక్కువగా పోలింగ్ ● పాలేరులో అత్యధికంగా 83.77 శాతం నమోదుమందిసాక్షిప్రతినిధి, ఖమ్మం : ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో 16,31,039 మంది ఓటర్లకు గాను 12,41,135 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంటే 76.09 శాతం పోలింగ్ నమోదైంది. 7,87,160 మంది పురుషులకు.. 6,05,969 మంది, 8,43,749 మంది మహిళలకు 6,35,099 మంది ఓటు వేశారు. సంఖ్యాపరంగా మహిళలే ఎక్కువ మంది ఓటు వేసినా.. శాతంలో లెక్కిస్తే పురుషులు 76.98 శాతం, మహిళలు 75.27 శాతం మంది మాత్రమే ఉండడం గమనార్హం. పాలేరులో అత్యధికంగా.. ఈ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఇక్కడ 2,40,806 మంది ఓటర్లకు గాను 2,01,721 మంది ఓటు వేశారు. అంటే 83.77 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ పాలేరు నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. అలాగే ఖమ్మంలో 62.97 శాతం, కొత్తగూడెంలో 69.47 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది.నియోజకవర్గాల వారీగా పోలింగ్ వివరాలు.. నియోజకవర్గం మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు శాతం ఖమ్మం 3,24,073 2,04,078 62.97 పాలేరు 2,40,806 2,01,721 83.77 మధిర 2,22,160 1,81,815 81.84 వైరా 1,93,389 1,56,762 81.06 సత్తుపల్లి 2,43,943 1,95,979 80.34 కొత్తగూడెం 2,47,494 1,71,928 69.47 అశ్వారావుపేట 1,59,174 1,28,852 80.95మొత్తం 16,31,039 12,41,135 76.09 -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
తల్లాడ: మండలంలోని మిట్టపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. తల్లాడ ఎస్ఐ కొండల్రావు మంగళవారం తెలిపిన వివరాలిలా.. కల్లూరుకు చెందిన బొడ్డు వెంకటేశ్వర్లు (42) కోదాడలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటే వేసేందుకు ఆదివారం రాత్రి కోదాడ నుంచి బయలు దేరి మార్గ మధ్యలో తల్లాడలోని అత్తగారింటి వద్ద ఆగి భార్య, పిల్లలతో మాట్లాడి స్వగ్రామమైన కల్లూరుకు మోటార్ సైకిల్పై వెళ్తున్నాడు. రాత్రి సమయంలో డివైడర్ను ఢీకొట్టడంతో వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు ఖమ్మం ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. అక్కడ వెంకటేశ్వర్లు మృతిచెందాడు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ తంబారపు వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పిచ్చికుక్క స్వైరవిహారం ఖమ్మంఅర్బన్: నగరంలోని ధంసలాపురం పాతకాలనీలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఎదురుపడిన పది మందిపై దాడికి దిగి గాయపరిచింది. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం సాయంత్రం పిచ్చికుక్క కాలనీలో పరుగులు తీస్తూ ఎదురుగా కనపడిన వారిని కరిచింది. వారంతా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామాల్లో, కాలనీల్లో విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలను నియంత్రించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ముగ్గురిపై కుక్క దాడి కామేపల్లి: మండలంలోని పండితాపురం గ్రామంలో ముగ్గురిపై ఓ కుక్క దాడి చేసి గాయపర్చింది. గ్రామానికి చెందిన దుద్దుకూరి నిత్యా, తోటకూరి నాగమణి, నాలుగేళ్ల బాలుడు సురిపిన్ని పిన్నయ్పై కుక్క దాడి చేసి గాయపర్చింది. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, నిత్యం కుక్కల దాడిలో గాయాలపాలవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి రక్షించాలని కోరుతున్నారు. అనుమానాస్పద స్థితిలో యువతి మృతి గుండాల: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందిన ఘటన ఆళ్లపల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. తునికబండల గ్రామానికి చెందిన ఈసం రమ్య (20) ఇటీవలే ఇంటర్ పూర్తి చేయగా మంగళవారం ఉయదం కంప్యూటర్ కోచింగ్ కోసం కొత్తగూడెం వెళ్లాల్సి ఉంది. కాగా కుటుంబ సభ్యులు ఉదయాన్నే రమ్యను నిద్ర లేపుతుండగా నోట్లో నురగ వచ్చి అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆళ్లపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
ఆదాయానికి మించి ఖర్చు
● బ్రహ్మోత్సవాలకు రూ.2.37 కోట్ల వ్యయం ● ఆదాయం రూ.1.89 కోట్లు మాత్రమే ● శ్రీరామనవమి లెక్కలు తేల్చిన దేవస్థానం అధికారులుభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగిన శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల లెక్కలను అధికారులు ఎట్టకేలకు తేల్చారు. ఆదాయం కంటే ఖర్చే ఎక్కువగా ఉంది. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు రూ.2,37,30,121 ఖర్చు చేయగా, అన్ని మార్గాల ద్వారా రూ.1,89,61,124 ఆదాయం సమకూరింది. సెక్టార్ల ద్వారా సుమారు రూ.93 లక్షలు, పరోక్ష సేవల ద్వారా రూ.7 లక్షలు, పోస్టల్ ద్వారా అంతరాలయ సేవలకు రూ.90 వేలు, పోస్టల్లో తలంబ్రాల బుకింగ్ ద్వారా రూ.75 వేలు, టీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా రూ.23.20 లక్షలు, దేవస్థానంలోని కౌంటర్లలో తలంబ్రాల విక్రయం ద్వారా రూ.7.88 లక్షల ఆదాయం లభించింది. 100 గ్రాముల లడ్డూలు రెండు లక్షల వరకు విక్రయించగా, రూ. 49 లక్షలు, 7,451 మహా లడ్డూల అమ్మకం ద్వారా రూ.7.45 లక్షల ఆదాయం సమకూరింది. సగమే అమ్ముడుపోయిన సెక్టార్ల టికెట్లు ఈ ఏడాది ముందస్తుగా సెక్టార్లు టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచినా సుమారు సగం మాత్రమే అమ్ముడుపోయాయి. కల్యాణానికి అన్ని సెక్టార్ల టికెట్లు 16,213 అందుబాటులో ఉంచగా, కేవలం 8936 టికెట్లు మాత్రమే విక్రయమైనట్లు అధికారులు తెలిపారు. టికెట్ల అమ్మకం ద్వారా మొత్తం రూ.1,77,71,150 ఆదాయం రావాల్సి ఉండగా, రూ.89,96,150 ఆదాయం మాత్రమే వచ్చింది. ఇక పట్టాభిషేకానికి మొత్తం 3,640 టికెట్లు అందుబాటులో ఉంచగా, 529 టికెట్లే అమ్ముడుపోయాయి. దీంతో రూ.33,24,000 రావాల్సి ఉండగా, కేవలం రూ.3 లక్షల ఆదాయమే సమకూరింది. కల్యాణం, పట్టాభిషేకాలలో మొత్తంగా 9,465 టికెట్లు అమ్ముడుపోగా రూ. 93,01,450 ఆదాయం వచ్చిందని దేవస్థానం అఽధికారులు తెలిపారు. సెక్టార్ల టికెట్లు విడివిడిగా పరిశీలిస్తే ఉభయదాతల టికెట్లు 668, వెయ్యి రూపాయల టికెట్లు 884 అమ్ముడుపోయాయి. ఖాళీగా వదిలిన జెడ్, వీఐపీ సెక్టార్ల వివరాలు.. ఈ ఏడాది ఎన్నికల కోడ్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వేడుకలకు హాజరుకాలేదు. దీంతో సీఎం సెక్టార్ను జిల్లా ఉన్నతాధికారులు జెడ్, వీఐపీ సెక్టార్లుగా విభజించారు. కల్యాణానికి జెడ్ సెక్టార్లో రూ.పది వేలతో 100, వీఐపీ సెక్టార్లో రూ. 5 వేలతో 250 టికెట్లను, పట్టాభిషేకానికి జెడ్ సెక్టార్లో రూ.5వేలతో 100, వీఐపీ సెక్టార్లో రూ.2,500తో 250 టికెట్లను ప్రత్యేకంగా ముద్రించారు. కల్యాణానికి జెడ్, వీఐపీ సెక్టార్ల ద్వారా రూ.22.50 లక్షలు, పట్టాభిషేకానికి రూ.11.25 లక్షల ఆదాయం రావాల్సి ఉంది. అయితే గత శనివారం దేవస్థానం అధికారులు విడుదల చేసిన లెక్కల్లో ఈ విభాగాలను ఖాళీగా ఉంచటం గమనార్హం. నవమి రోజున జెడ్, వీఐపీ సెక్టార్లు పూర్తిగా నిండిపోయాయి. ఆ టికెట్లను సైతం జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ముద్రించిన టికెట్లతోనే విక్రయించారు. అయితే ఆ లెక్కలను దేవస్థానం అధికారులకు ఇప్పటికీ అప్పగించలేదని సమాచారం. దీంతో ఆ టికెట్ల ద్వారా దేవస్థానం ఆదాయం సుమారు రూ.33 లక్షల మేర గండి పడినట్లు తెలుస్తోంది. కనీసం ఆ ఆదాయం దేవస్థానానికి అప్పగించినా కనీసం ఖర్చు వరకు వచ్చి ఉండేదని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు ఆ లెక్కలను అప్పగిస్తారా... లేదా అలాగే వదిలేస్తారా...అనేది తేల్చాల్సి ఉంది. -
విజ్ఞతతో ఓటు వేశారు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లా ప్రజలు ఎంతో చైతన్యవంతులని, వారు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేశారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్కే పడిందని, తాను మంచి మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. మంగళవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ గ్రామం వెళ్లినా కుల, మతాలకతీతంగా తనను ఆశీర్వదించి, మద్దతుగా నిలిచారని చెప్పారు. కేసీఆర్ రోడ్డు షో సందర్భంగా కూడా భారీగా ప్రజలు తరలివచ్చారని చెప్పారు. ఆరు నెలల కాలంలో తాగు, సాగు నీరు, కరెంట్ కోతల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ఏది ఏమైనా తమకు అనుకూలంగా మంచి ఫలితాలు వస్తాయనే గట్టి నమ్మకం ఉందని చెప్పారు. తన విజయం కోసం అహర్నిశలు శ్రమించిన పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు, సీనియర్ నాయకులు, జిల్లా, మండల, గ్రామ, బూత్ స్థాయి నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు, తెలియజేశారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఉప్పల వెంకటరమణ, కూరాకుల నాగభూషణం, బిచ్చాల తిరుమల్రావు, ఆర్జేసీ కృష్ణ, బెల్లం వేణుగోపాల్, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులపై చర్య తీసుకోవాలి
ఖమ్మంసహకారనగర్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో సజావుగా ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులపై లాఠీచార్జీ చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని టీపీటీఎఫ్ బాధ్యులు వై.అశోక్కుమార్, పి.నాగిరెడ్డి ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు. రాష్ట్రంలో ఒకేవిధంగా రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిన ఉపాధ్యాయులపై పోలీసులు అసహనంగా లాఠీచార్జ్ చేశారన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేస్తారని చెప్పిన అధికారులే ఎన్నికలు ముగిసిన తర్వాత సరైన రెమ్యునరేషన్ ఇవ్వకుండా పోలీసులతో బలప్రయోగం చేయించడం అత్యంత బాధాకరమన్నారు. ఐదు రోజుల రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఈ ఘటనకు బాధ్యులైన ఆర్డీఓ తదితర అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చింతకాని: మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన దేవరపల్లి మోహన్రెడ్డి, కురుగుంట్ల రవీందర్రెడ్డి, పిన్నెల్లి శ్రీనివాసరావుపై స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తూము కోటేశ్వరరావు స్కూల్ వద్ద ఉండగా ఆ ముగ్గురు వ్యక్తులు అతడితో గొడవ పడి కొట్టి చంపుతామని బెదిరించారు. కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ ఐ నాగుల్మీరా ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. మహిళ మెడలో గొలుసు చోరీఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్నగర్లో మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధితురాలు నరేట్ల ప్రమీల కథనం ప్రకారం.. మండలంలోని సుభాష్నగర్ గ్రామపంచాయతీ గిరిజన గురుకుల కళాశాల వీధికి చెందిన ప్రమీల ఉదయం ఏడు గంటల సమయంలో ఆరుబయిట వాకింగ్ చేస్తోంది. అదే సమయంలో ముఖానికి తెల్లటి రుమాలు కట్టుకున్న వ్యక్తి బైక్పై వేగంగా వచ్చి ఆమె మెడలోని 2.50 తులాల బంగారు గొలుసును లాక్కొని వెళ్లిపోయాడు. ఈ ఘటనతో షాక్కు గురైన మహిళ తేరుకునేలోపు చోరీకి పాల్పడిన వ్యక్తి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ఖమ్మంఅర్బన్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన ఖమ్మం నగరంలోని బోనకల్ రోడ్డు.. ధంసలాపురం వంతెనపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన వార్డు మాజీ సభ్యుడు, పెయింటర్ గుంటి దేవయ్య (50)కు ఇద్దరు కుమార్తెలుండా వారు హైదరాబాద్లో చదువుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వారు సోమవారం రాగా.. మంగళవారం తెల్లవారుజామున వారిని హైదరాబాద్ పంపించేందుకు ద్విచక్రవాహనంపై ఖమ్మం వచ్చాడు. వారిని బస్సు ఎక్కించి తిరిగి రామకృష్ణాపురం వస్తున్న ఆయన ద్విచక్రవాహనం బ్రిడ్జి ఎక్కుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయన్ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఖమ్మంఅర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కూతుర్లకు టాటా చెప్పి వచ్చిన కొద్ది సమయంలోనే దేవయ్య మృతిచెందటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కారును ఢీకొట్టిన మిల్లర్ ఖమ్మంఅర్బన్: నగరంలోని మమతారోడ్డు నుంచి గొల్లగూడెం పోయే రోడ్డులో మంగళవారం కారును మిల్లర్ ఢీకొట్టింది. స్థానికుల కథనం ప్రకారం కంకర మిక్సింగ్ చేసే మిల్లర్ను ఓ వ్యక్తి ఆటోకి తాడుతో కట్టి తీసుకెళ్తున్నాడు. మధ్యలో తాడు తెగడంతో మిల్లర్ రోడ్డుపైకి దూసుకొచ్చి అటుగా వెళ్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్నవారు గాయపడ్డారు. అయితే, వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
వెనుదిరిగిన పోలీస్ బలగాలు
చర్ల: పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో సరిహద్దు నుంచి పోలీస్ బలగాలు వెనుదిరిగాయి. వారం రోజుల కిందట సరిహద్దు ప్రాంతానికి భారీగా చేరుకున్న సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, కోబ్రా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగించగా, సోమవారం సాయంత్రం పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో బలగాలు అడవిని వీడుతున్నాయి. సరిహద్దు ప్రాంతంలోని పూసుగుప్ప, చెన్నాపురం, ఎర్రంపా డు, బత్తినపల్లి, పులిగుండాల, కుర్నపల్లి, బోదనెల్లి తదితర గ్రామాల సమీపాల్లోని అటవీ ప్రాంతంలో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించారు. ఎస్పీ రోహిత్రాజ్ ఆదేశాల తో ఏఎస్పీ పరితోష్ పంకజ్, ఓఎస్డీ సాయిమనోహర్ నేతృత్వంలో సరిహద్దులో భారీగా బలగాలు మోహరించాయి. ఆదివాసీలకు ఎన్నికలపై అవగాహన కల్పించి వారిని పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేసేలా ప్రోత్సహించారు. ఉచితంగా ‘నర్సింగ్’ శిక్షణఇల్లెందు: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతుల కోసం ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ, హెచ్ఎస్బీసీ సహకారంతో హైదరాబాద్లోని ప్రథమ్ హెల్త్ కేర్ శిక్షణ కేంద్రంలో రెండు నెలల పాటు నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రథమ్ ఎడ్యుకేషన్ పౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ సరిత సింగు మంగళవారం తెలిపారు. శిక్షణ పూర్తయిన వారికి 100 శాతం ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఉపాధి ఆధారిత శిక్షణ కార్యక్రమాలకు అర్హత ఆసక్తి గల గ్రామీణ/పట్టణ ప్రాంత అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, నర్సింగ్ అసిస్టెంట్కు రెండు నెలలు కాలం, 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు 90002 03952 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
భవితవ్యం.. నిక్షిప్తం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 76.09 శాతం ఓటింగ్ నమోదైంది. సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన అనంతరం ఈవీఎంలను ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్లకు తరలించారు. స్ట్రాంగ్రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు. జూన్ 4న జరిగే లెక్కింపుతో ఫలితం తేలనుంది. గెలుపోటములు తేలేందుకు 21 రోజుల సమయం ఉండడంతో అభ్యర్థుల నుంచి లోతైన విశ్లేషణ జరుగుతోంది. ఎక్కడ తమకు భారీగా ఓట్లు పోలయ్యాయి.. ఎక్కడ మైనస్లో ఉన్నామనే అంచనాల్లో మునిగారు. ఎవరి విశ్లేషణలు వారికి ఉన్నా.. గెలుపు తమదేననే ధీమా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు గెలుపోటములు అటుంచితే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి..? గెలిచే అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుందనే దానిపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పందేలు జోరందుకున్నాయి. ఏం జరిగింది..? ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ సరళిపై అభ్యర్థులు పోస్టుమార్టమ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం మొత్తం పోలింగ్ రిపోర్టును తెప్పించుకున్న అభ్యర్థులు ముఖ్య నేతలతో కలిసి ఎక్కడెక్కడ ఎంతమేరకు పోలింగ్ నమోదైందనే దానిపై చర్చలు జరుపుతున్నారు. అలాగే పోలింగ్ ఏజెంట్లతో కూడా మాట్లాడి బూత్ల వారీగా నమోదైన ఓట్లు.. తమకు వచ్చిన ఓట్లపై ఆరా తీస్తున్నారు. అసెంబ్లీల వారీగా నమోదైన పోలింగ్ శాతం, అనుకూల, ప్రతికూల అంశాలపై అంచనాలు వేస్తున్నారు. ఆయా పార్టీల అధిష్టానాలు కూడా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఓటింగ్ సరళి ఎలా ఉందని తెలుసుకుంటున్నాయి. తమకు అనుకూలమైన ఓటింగ్ పడే డివిజన్లు, వార్డులు, కాలనీలు ఏవి..? అక్కడ ఎంత మేరకు పోలింగ్ జరిగింది, ఎక్కడ తక్కువ ఓట్లు వస్తాయి..? తదితర అంశాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం.. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలుపు తమదేనని ధీమాగా ఉన్నారు. పోలింగ్ అనంతరం తమకు అనుకూలమైన వాతావరణం ఉందనే భావన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గెలుపు తమదేనని పార్టీ నేతలు, నాయకులు, కేడర్ వద్ద చెబుతున్నారు. గెలుపు ఖాయమని, లక్ష నుంచి 1.50 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమనే అంచనాకు ఆ పార్టీ వచ్చినట్లు తెలుస్తోంది. ఆరు గ్యారంటీలు, ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు, కేడర్ ఉండటం, బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉండటం తమకు కలిసి వస్తాయనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కూడా ఓటింగ్ సరళిని బట్టి చూస్తే తమకే అనుకూలంగా ఉందనే భావన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు పర్యటనకు భారీ స్పందన రావడం, ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుందనే ధీమా బీఆర్ఎస్ నేతల్లో ఉంది. ప్రధానంగా రైతులు, కార్మికులు తమకే ఓట్లు వేశారని విశ్లేషిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు తన గెలుపుపై లెక్కలు వేయడంలో మునిగారు. మోదీ మానియా, కేంద్ర ప్రభుత్వ పథకాలు తమకు అనుకూలమైన ఓటు పడేలా చేశాయనే ఉద్దేశంలో ఆయన ఉన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి అంశాలు తమకు కలిసి వస్తున్నాయని బీజేపీ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఈ పోలింగ్ దేనికి సంకేతం.. గత పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ శాతంతో పరిశీలిస్తే ప్రస్తుత పోలింగ్ స్థిరంగా ఉంది. 2019 ఎన్నికల్లో 75.30 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. ఈసారి 76.09 శాతం మంది ఓటు వేశారు. గత ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా ఓటింగ్ శాతం పెరిగింది. 2009 ఎన్నికల్లో 82.08 శాతం, 2014 ఎన్నికల్లో 82.13 శాతం పోలింగ్ నమోదైంది. ఆ రెండు ఎన్నికల కన్నా.. ఇప్పుడు పోలింగ్ శాతం కొంత తగ్గుముఖం పట్టింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 5,67,459 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి. ఇక సీపీఎం అభ్యర్థి బోడా వెంకట్కు 57,102 ఓట్లు, బీజేపీ అభ్యర్థి దేవకి వాసుదేవరావుకు 20,488 ఓట్లు వచ్చాయి. ఈ సారి కూడా 76.09 శాతం పోలింగ్ జరగడంతోపాటు సీపీఎం కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఫలితాలపై విశ్లేషిస్తున్న కాంగ్రెస్ భారీ మెజార్టీ ఖాయమన్న ఆనందంలో ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేక ఓటు తమ విజయానికి నాంది అని బీఆర్ఎస్ చెబుతోంది. బీజేపీ కూడా ఇదే రీతిలో గెలుపుపై ఆశలు పెట్టుకుంది.పోలింగ్ సరళిపై అభ్యర్థుల ఆరా ఎక్కడెక్కడ అనుకూలంగా ఉందనే అంశంపై చర్చ జూన్ 4న తేలనున్న ఫలితం.. గెలుపు తమదేనని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల ధీమా అక్కడ ఎందుకు తగ్గింది..? ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ను విశ్లేషిస్తే.. ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాల్లోనే తక్కువగా ఓటింగ్ నమోదైంది. ఖమ్మం నియోజకవర్గంలో 62.97 శాతం, కొత్తగూడెం నియోజకవర్గంలో 69.47 శాతం మంది ఓట్లు వేశారు. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో 80 శాతం పైగా పోలింగ్ నమోదు కావడంతో ఇక్కడ కలిసొచ్చేది ఎవరికి.. తగ్గిన చోట ఎవరికి నష్టమనే విశ్లేషణ జరుగుతోంది. పోల్ మేనేజ్మెంట్లో వెనుక పడ్డామా..? అసలు ఎందుకు పోలింగ్ శాతం తగ్గిందనే కారణాలను అభ్యర్థులతోపాటు ఆ పార్టీల నేతలు అన్వేషిస్తున్నారు. -
జోరుగా... హుషారుగా
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నూతనంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహిస్తున్న వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం జోరుగా హూషారుగా కొనసాగుతోంది. ఈ శిక్షణ శిబిరానికి ఔత్సాహిక క్రికెటర్లు దాదాపు 90 మంది తరలివస్తున్నారు. వారిలో ప్రతిభను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని శిబిరం నిర్వాహకులు తెలిపారు. ప్రధానంగా హెచ్సీఏ పరిధిలో జరిగే అండర్–14, 16, 19 కేటగిరిల్లో అధిక సంఖ్యలో క్రికెటర్లు వచ్చేలా చొరవ చూపుతున్నామని చెబుతున్నారు. ఈ శిక్షణ శిబిరంలో ప్రతిభ కనబరిచి వారిని హెచ్సీఏ ఆధ్వర్యంలో జరిగే క్రికెట్ లీగ్ టోర్నీలకు పంపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హెచ్సీఏ అధ్యక్షుడు ఎ.జగన్మోహన్ రావు ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్, ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ శిబిరంలో పాల్గొనే వారికి బాల్స్, బ్యాట్లు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఉదయం, సాయంత్రం వేళలో ఖమ్మంలో జరిగే శిక్షణ శిబిరానికి మరింత మంది హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. శిక్షణ శిబిరానికి వస్తున్న ఔత్సాహిక క్రికెట్టర్లు వారి మనోగతాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. అవి వారి మాటల్లోనే..ఖమ్మంలో కళకళలాడుతున్న హెచ్సీఏ క్రికెట్ శిబిరం హాజరవుతున్న 90 మంది ఔత్సాహిక క్రికెటర్లు నిత్యం పర్యవేక్షిస్తున్న అసోసియేషన్ నాయకులుహెచ్సీఎ చొరవతో శిక్షణ శిబిరం జిల్లా కేంద్రంలోని క్రికెట్ నెట్స్లో హెచ్సీఎ ఆదేశాలనుసారం వచ్చే నెల 20వ తేదీ వరకు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాం. ఈ కోచింగ్కు అశించిన స్థాయి కంటే అధికంగానే ఔత్సాహిక క్రికెటర్లు వస్తున్నారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారు మాకు కావాల్సిన క్రికెట్ పరికరాలు అందుబాటులోకి తేవడంతో వాటిని సద్వినియోగం చేసుకుంటున్నాం. క్రికెటర్లకు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, కీపింగ్ అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. వారిలో సామర్థ్యం పెంచేందుకు ఫిట్నెస్ కూడా బాగా నేర్పిస్తున్నాం. – ఎం.డీ.ఫారూఖ్, క్రికెట్ నెట్స్ ప్రతినిధి -
అదుపుతప్పిన ట్రాక్టర్
టేకులపల్లి: అతిట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ సబ్స్టేషన్ గోడను ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. కోయ గూడెం గ్రామానికి చెందిన పోలెబోయిన వినోద్, పూనెం నాగరాజు కలిసి మంగళవారం ట్రాక్టర్ నడుపుతూ రావులపాడు వైపు బయలుదేరారు. అతి వేగంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లడం వల్ల విప్పలతండా సమీపంలో అదుపుతప్పి విద్యుత్ సబ్స్టేషన్ గోడను బలంగా ఢీకొట్టింది. వినోద్, నాగరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు మృతికొత్తగూడెంరూరల్: లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనిధి ఫంక్షన్హాల్ వద్ద ట్రాక్టర్ బోల్తాపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్ఐ రమణారెడ్డి కథనం మేరకు.. గడ్డిగుట్ట గ్రామానికి చెందిన ధరావత్ రాంపాల్ కుమారుడు మోతీలాల్ (22) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. తెల్లవారుజామున మోతీలాల్ కారుకొండ నుంచి ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ హేమచంద్రాపురం వైపు వస్తుండగా శ్రీనిధి ఫంక్షన్హాల్ మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిడన మోతీలాల్ను స్థానికులు కొత్తగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రమణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి... దమ్మపేట: ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని అల్లిపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని చిల్లగుంపు గ్రామానికి చెందిన గండికోట మోతే (42) ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి సోమవారం అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. అల్లిపల్లి గ్రామ శివారులోని ముత్యాలమ్మతల్లి ఆలయ సమీపంలో బైక్ అదుపుతప్పడంతో కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన మోతేను అశ్వారావుపేట ఆసుత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు గండికోట నవీన్ మంగళవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టుగా ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. చికిత్స పొందుతున్న వ్యక్తి... అశ్వారావుపేటరూరల్: ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందు తూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం.. ఏపీ లోని తిరుపతి ప్రాంతానికి చెందిన గుజరాత్ రాహుల్ (35)కు పదిహేనేళ్ల కిందట అశ్వారావుపేట మండల కేంద్రంలోని నందమూరినగర్కు చెందిన శిల్పతో వివాహమైంది. కాగా, మనస్పర్దల కారణంగా భార్య పుట్టింటికి వచ్చింది. దీంతో ఈ నెల 10వ తేదీన రాహుల్ భార్య వద్దకు వచ్చి కాపురానికి రావాలని కో రగా, ఆమె నిరాకరించడంతో బంధువులతో మాట్లాడిన తరువాత స్థానిక ఆర్టీఎస్ చెక్పోస్టు సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తెలిసిందే. గమనించిన స్థానికులు, కానిస్టేబుల్ మనోజ్ రక్షించి స్థానిక సీహెచ్సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్న క్రమంలోనే ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీనిపై మృతుడి తమ్ముడు గుజరాత్ వెంకటేశ్వరరావు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో యువకుడు.. ఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్నగర్ గ్రామ పంచాయతీ లలితాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో పూనెం ధన్రాజ్ (38) మంగళవారం మృతిచెందా డు. ఇంట్లో ఫ్యాన్ సరిగా తిరగడం లేదని స్వయంగా వైర్లు తొలగించి స్విచ్ ఆఫ్ చేయకుండానే బిగిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ధన్రాజ్ మృతిచెందాడు. మృతుడి తండ్రి యాదగిరి అతని చిన్నతనంలోనే మృతిచెందగా అంగన్వాడీ పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న తన తల్లి ఆదెమ్మ ఉంది. భర్తను, ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన ఆదెమ్మ రోదిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది. ఆదెమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అడవిపంది దాడిలో వ్యక్తికి గాయాలుగుండాల: తునికాకు కట్టలకు కట్ల(నార) కోసం అడవికి వెళ్లిన ఓ వ్యక్తిపై అడవిపంది దాడిచేసిన ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. తునికాకు కట్టలు కట్టేందుకు నార అసరం కావడంతో ఆళ్లపల్లి మండలంలోని లొద్దిగూడెం గ్రామానికి చెందిన పాయం లక్ష్మీనారాయణ స్థానికులతో కలిసి అడవికి వెళ్లాడు. ఈక్రమంలో పొదలమాటున ఉన్న పంది అతడిపై ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని స్థానిక వైద్యుల వద్దకు తీసువచ్చి చికిత్స అందించారు. -
బొగ్గు రవాణాకు అడ్డుకట్ట
సత్తుపల్లి: సత్తుపల్లి లారీలకు నాణ్యమైన బొగ్గు ఇవ్వడం లేదని నిరసిస్తూ మంగళవారం లారీ యజమానులు కిష్టారం ఓసీ వద్ద బైఠాయించి బొగ్గు రవాణాను అడ్డుకున్నారు. సింగరేణి క్వాలిటీ అధికారి మదన్మోహన్ లారీలకు బొగ్గు లోడింగ్లు రానివ్వకుండా చేయటం వల్లే ఫ్యాక్టరీలు సత్తుపల్లి బొగ్గును కొనేందుకు ముందుకు రాకపోవటం వల్ల సమస్యలు తలెత్తాయని లారీ యజమానులు సింగరేణి అధికారులతో వాగ్వాదానికి దిగారు. కిష్టారం ఓసీలో నాణ్యమైన జీ–7, జీ–8 బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ ఫ్యాక్టరీలకు ఇచ్చేటప్పుడు జీ–13, నల్లబండరాళ్లు లోడ్ చేయడంతో రోజుల తరబడి లారీలు నిలిచిపోతున్నాయని, దీనిపై సింగరేణి అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోక పోవటం వల్లే లోడింగ్ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సత్తుపల్లి లారీలకు ఉత్పత్తిలో 40 శాతం రవాణాకు ఇవ్వాల్సి ఉండగా కేవలం 20 లారీలకు మాత్రమే లోడింగ్లు ఇస్తూ లారీ యజమానులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో అధికారులపై దురుసుగా వెళ్లేందుకు లారీ యజమానులు ప్రయత్నించటంతో సర్దిచెప్పారు. అయితే, సింగరేణి పీఓ నర్సింహారావు లారీ యజమానులతో చేసిన చర్చలు ఫలించకపోవటంతో ఆందోళన మరింత తీవ్రతరం చేశారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు లారీలను కదలనిచ్చేది లేదని, సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కొండపల్లి రమేశ్రెడ్డి, ఎస్కే కీజర్ స్పష్టం చేశారు. కాగా, రుద్రంపూర్ కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్కు బొగ్గును రవాణా చేసేందుకు వచ్చిన లారీలు ఆందోళన తీవ్రతరం కావటంతో వెనక్కి వెళ్లిపోయ్యాయి. కాగా, ఏ ఫ్యాక్టరీ నుంచి కూడా బొగ్గు నాణ్యతపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు రాలేదని, ఫ్యాక్టరీలకు బొగ్గు అవసరం లేనందునే తీసుకోవటం లేదని సింగరేణి పీఓ నర్సింహారావు తెలిపారు. కాగా, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దృష్టికి మంగళవారం రాత్రి సమస్యను తీసుకెళ్లారు. సింగరేణి అధికారులతో చర్చిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఆందోళనలో ఎస్కె మౌలాలీ, వేముల విశ్వనాథం, వెలిశాల చెన్నాచారి, పీఎల్ ప్రసాద్, లియాకత్, మోహన్రావు, మునీర్, చిన్నంశెట్టి శ్రీను, ఎస్కే బాజీ, పి.చంద్రశేఖర్ పాల్గొన్నారు. కిష్టారం ఓసీ వద్ద లారీ యజమానుల ఆందోళన ఉద్రిక్తంగా మారిన వంటా వార్పు -
● ‘బ్లూమింగ్ మైండ్స్’ హవా
ఖమ్మంఅర్బన్: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో ఖమ్మం బల్లేపల్లిలోని బ్లూమింగ్మైండ్స్ పాఠశాల విద్యార్దులు ఉత్తమ మార్కులు సాధించారని కరస్పాండెంట్ పి.అశోక్రెడ్డి తెలిపారు. వందశాతం ఉత్తీర్ణతతోపాటు ఏ1 గ్రేడ్ అత్యధిక మంది సాధించారని వెల్లడించారు. ఎన్.జయశ్రీ, కె.రోహిత్, పి.పూజ. ఆ.వర్షిత, వి రోహిత, చి.మహి ఏ 1 గ్రేడ్ సాధించగా.. సబ్జెక్టుల వారీగానూ ఉత్తమ ఫలితాలు వచ్చాయని తెలిపారు. విద్యార్థులను కరస్పాండెంట్తో పాటు చైర్మన్ బి.సత్యనారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ కిరణ్కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ప్రసాద్ అభినందించారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో ప్రైవేట్ పాఠశాలల సత్తా
ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో కరస్పాండెంట్ రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతీరెడ్డి 12వ తరగతిలో హార్వెస్ట్ ప్రభంజనం ఖమ్మం సహకారనగర్: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సోమవారం విడుదల చేసిన 12వ తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారని హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులను వారు అభినందించాక మాట్లాడారు. మొత్తం 500మార్కులకు గాను ఏ.జిఘ్నేష్, కృష్ణప్రసాద్ 495మార్కులు, జి.రాజ్వర్థన్ 494, ఆర్.సాయిసంజయ్ 485, పి.పునీత్ 481, వి.జశ్వంత్ 480, ఎస్.లిఖిత్ సాయి 475, కె.ప్రణయ్ సంజన్ 470 మార్కులు సాధించి విజయదుందుభి మోగించారన్నారు. కాగా, 12వ తరగతి విద్యార్థులు 225మంది హాజరు కాగా నూరుశాతం ఉత్తీర్ణత నమోదవగా, 83మంది విద్యార్థులు 450కి పైగా మార్కులు సాధించారని కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ తెలిపారు. -
● శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ
ఖమ్మం మమత రోడ్డులోని శ్రీచైతన్య ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ పాఠశాల విద్యార్థులు సీబీఎస్ఈ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించారని చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య వెల్లడించారు. ఈసందర్భంగా విద్యార్థులను అభినందించిన వారు మాట్లాడుతూ 500మార్కులకు ఎస్.మనోన్మయి 491మార్కులు, జి.తన్మయి 483, ఎన్.నిఖిత 483, వి.కీర్తి 481, వి.వర్షిత్ 480, ఎస్.మధు సన్షిత 479మార్కులు సాధించారన్నారు. నూరు శాతం ఫలితాలతో 30మంది విద్యార్థులు 450మార్కులకుపైగా సాధించారని చెప్పారు. విద్యార్థులను చైర్మన్, డైరెక్టర్తో పాటు డైరెక్టర్ సాయి గీతిక, ఏజీఎం చేతన్ మాథుర్, కోఆర్డినేటర్ కృష్ణారావు, ప్రిన్సిపాళ్లు టీఎల్ఎన్.శర్మ, నాగప్రవీణ, వైస్ ప్రిన్సిపాల్ సురేష్, డీన్ లక్ష్మీనర్సింహ, ఇన్చార్జ్లు రామారావు, నరేష్, సతీష్ అభినందించారు. -
మేం ఓటు వేసేది లేదు...
● పలుచోట్ల బహిష్కరించిన ప్రజలు ● సమస్యల పరిష్కారంపై హామీ ఇవ్వాలని డిమాండ్ ● ప్రజాప్రతినిధులు, అధికారులు నచ్చచెప్పడంతో ఓటింగ్కు హాజరుకొత్తగూడెంరూరల్: గ్రామంలోని సమస్యలు పరిష్కరించేంతవరకు ఓటు వేయబోమని భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామంలోని గొల్లగూడెం వాసులు నిరసన తెలిపారు. సోమవారం ఉదయం గంట పాటు బైఠాయించిన వారు రహదారులు, డ్రెయినేజీలు, తాగునీరు వంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో ఏఎస్పీ విక్రాంత్సింగ్, డీఎస్పీ రెహమాన్, ఎస్ఐ రమణారెడ్డి గొల్లగూడెం చేరుకున్నారు. సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తామని చెప్పగా.. వారు ఓటింగ్కు బయలుదేరారు. కాగా, గ్రామస్తుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఓటు వేసేలా కృషి చేసిన ఏఎస్పీ, డీఎస్పీ, ఎస్సైని ఎస్పీ రోహిత్రాజ్ అభినందించారు. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో.. గుండాల: గుండాల మండలం పెద్దతోగు గ్రామంలో 81 మంది ఓటర్లు ఉండగా స్థానిక పోలింగ్ కేంద్రంలో 21 మంది, గుండాల పోలింగ్ కేంద్రంలో 60 మందికి కేటాయించారు. దీంతో ఓటర్లు 16 కి.మీ దూరం వెళ్లాల్సి వస్తోంది. తమకు ముత్తాపురం నుంచి ఆరు కి.మీ. మేర రోడ్డు సౌకర్యం లేదని, గ్రామంలోనే ఓటు వేసే అవకాశం కల్పించాలనే డిమాండ్తో రెండు గంటల పాటు రోడ్డుపై ధర్నా చేశారు. దీంతో గుండాల సీఐ రవీందర్, తహసీల్దార్, ఎంపీడీఓ చేరుకుని వారితో మాట్లాడారు. రోడ్డు నిర్మాణానికి నిధులు ఉన్నా అటవీశాఖ అనుమతి కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వచ్చే ఎన్నికల నాటికి అందరూ స్థానికంగా ఓటు వేసేలా అవకాశం కల్పిస్తామని చెప్పడంతో శాంతించిన గ్రామస్తులు గ్రామపంచాయతీ అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో గుండాలకు వెళ్లి ఓటేశారు. ఇక ఆళ్లపల్లి మండలం రాయిగూడెం గ్రామస్తులు సైతం కిన్నెరసానిపై వంతెన, బాటన్ననగర్కు రోడ్డు సౌకర్యం కోసం ఎన్నికలను బహిష్కరించగా విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నచ్చచెప్పడంతో వారు ఓటేసేందుకు ముందుకు వచ్చారు. అలాగే, గ్రామాభివృద్ధి కోసం ఎన్నికలు బహిష్కరిస్తూ పెద్దవెంకటాపురం గ్రామస్తులు తీర్మానం చేయగా వారు సైతం ఎమ్మెల్యే హామీతో ఓటు వేశారు. ఎన్నెస్పీ కాల్వపై వంతెన లేదని.. ఏన్కూరు: ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందరు మారినా సమస్య పరిష్కరించడం లేదని ఆగ్రహించిన ఏన్కూరు మండలం రాయమాదారం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామానికి చెందిన రైతుల పొలాలు ఎన్నెస్పీ కాల్వలకు అవతలి వైపు ఉండగా, బ్రిడ్జి లేక రెండు కి.మీ. తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఓటు వేసేది లేదని పేర్కొనగా.. తహసీల్దార్ సీహెచ్.శేషగిరిరావు, ఎంపీడీఓ సకినాల రమేష్ చేరుకుని సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని నచ్చచెప్పడంతో వారు ఓటింగ్లో పాల్గొన్నారు.కొమ్ముగూడెం తండా వాసుల నిరసన ఇల్లెందురూరల్: గ్రామంలో సాగునీటి వనరులు లేవంటూ ఇల్లెందు మండలం లచ్చగూడెం గ్రామపంచాయతీ కొమ్ముగూడెం తండా వాసులు లోక్సభ ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో 371 మందిలో 50 మంది ఓటు వేశాక.. రైతులు తమకు అన్యాయం జరుగుతోందంటూ ఎన్నికల బహిష్కరణపై ప్రకటన చేశారు. దీంతో ఎమ్మెల్యే కోరం కనకయ్య వెళ్లగా సాగునీటి సౌకర్యం కల్పించాలని, లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించాలని రైతులు కోరారు. అయితే, లిఫ్ట్ ఏర్పాటు చేయాల్సిన ప్రాంతం ఖమ్మం జిల్లాలోకి వెళ్లినందున అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. అలాగే, గతంలో సింగరేణి నిధులతో ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వేయించానని, తాగునీటి పథకం నిర్మించానని చెప్పగా.. తహసీల్దార్ రవికుమార్, సీఐ కరుణాకర్ కూడా చేరుకుని ప్రజలకు నచ్చచెప్పడంతో రైతులు పోలింగ్ కేంద్రానికి బయలుదేరారు. -
ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
ఖమ్మంక్రైం: భారీ బందోబస్తు, కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని సీపీ సునీల్దత్ తెలిపారు. కాగా, జిల్లాలోని పలు సమస్యాత్మక గ్రామాలను ఆయన సందర్శించి బందోబస్తుపై ఆరా తీశారు. కాగా, లోక్సభ ఎన్నికల సందర్బంగా 2,391 మంది పోలీసు సిబ్బంది, ఆరు కంపెనీల కేంద్రబలగాలు, 17 సెక్షన్ల స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నాయని సీపీ తెలిపారు. ఈమేరకు ఎలాంటి ఘటనలు జరగకుండా బందోబస్తు విజయవంతంగా పూర్తి చేయడంపై సిబ్బందిని ఆయన అభినందించారు.కాంగ్రెస్ – బీఆర్ఎస్ వర్గాల ఘర్షణ తిరుమలాయపాలెం: మండలంలోని మేడిదపల్లి పోలింగ్ బూత్లో తలెత్తిన వివాదం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో రెండు వర్గాల్లో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణ సమాచారం తెలుసుకున్న పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి కొసుకొచ్చారు. కాగా, ఘటనపై పరస్పరం ఇచ్చిన ఫిర్యాదులతో కేసులు నమోదు చేశారు. రామకృష్ణాపురంలో పోలీస్ పికెట్ చింతకాని: మండలంలోని రామకృష్ణాపురంలో సోమవారం రాత్రి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిశాక గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ జరగడంతో ట్రెయినీ ఐపీఎస్ అవినాష్, వైరా సీఐ సాగర్ ఆధ్వర్యాన పోలీస్ సిబ్బందితో కలిసి ఇరువర్గాలకు చెదరగొట్టారు. ఈక్రమంలో గ్రామానికి చెందిన తూము హన్మంతరావుతో పాటు పాటు మరికొందరికి గాయాలయ్యాయి. అనంతరం గ్రామంలో ఎలాంటి ఘటనలు పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. పోలింగ్కు వెళ్తూ గుండెపోటుతో మృతి వైరారూరల్: మండలంలోని తాటిపూడిలో ఓటు వేసేందుకు బయలుదేరిన వృద్ధుడు ఆకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన కొలిపాక వీరస్వామి(72) సోమవారం ఉదయం కుమారుడు శ్రీనుతో కలిసి పోలింగ్ కేంద్రానికి బయలుదేరాడు. అంతలోనే గుండెలో నొప్పి వస్తుందని కుర్చీలో కూప్పకూలిన ఆయన కన్నుమూశాడు. వీరస్వామికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
No Headline
లౌకికవాదమే మన జీవన విధానం – డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర: లౌకికవాదం మన జీవన విధానమని, ప్రజాస్వామ్యం మీదే పునాదులు ఆధారపడి ఉన్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. మధిరలోని సుందరయ్య నగర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఆయన ఓటు వేశాక మాట్లాడారు. ప్రజాస్వామ్యయుతంగా నచ్చిన పార్టీకి ఓటేసి నచ్చిన ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం ఆయన డలంలోని మునగాల కృష్ణాపురంలో పర్యటించి పోలింగ్ సరళిపై స్థానిక నేతలతో చర్చించారు.బీజేపీతో రాజ్యాంగం, రిజర్వేషన్లకు ముప్పు – రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కల్లూరురూరల్: కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడమే కాక ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తన స్వగ్రామమమైన కల్లూరు మండలం నారాయణపురంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశాక ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను సంరక్షించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. బీజేపీ లాంటి పార్టీకి రాష్ట్రంలో చోటు ఇవ్వకూడదన్నారు. ఆయన వెంట పొంగులేటి ప్రసాద్రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రజాహిత పాలనకు ఈ ఎన్నికలు ఊతం – రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుఖమ్మంవన్టౌన్: దేశ భవిష్యత్ను నిర్ణయించేవే లోక్సభ ఎన్నికలు అని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్ల డించారు. ఖమ్మంలోని గొల్ల గూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్నాక మంత్రి మాట్లాడారు. దేశం, తెలంగాణలో ఈ ఎన్నికలు ప్రజాహిత పాలనకు ఊతమిస్తాయని తెలిపారు. ప్రజలు అభిమానించే సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం పదికాలాల పాటు సమర్ధవంతంగా, శక్తిమంతంగా పాలించేలా ప్రజలు లోక్సభ ఎన్నికల్లోనూ తీర్పు ఇస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. మంత్రి వెంట నాయకులు సాధు రమేష్రెడ్డి, రావూరి సైదుబాబు, రషీద్, బొమ్మిడి శ్రీనివాస్, కమతం రామకృష్ణ, సాయికృష్ణ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ది గోబెల్స్ ప్రచారం – బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి కల్లూరురూరల్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు తొలగిస్తుందని కాంగ్రెస్ మోసపూరిత ప్రచారం చేస్తోందని బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి ఆరోపించారు. నారాయణపురంలో ఆయన ఓటు వేశాక మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీయే పలుమార్లు మార్చిందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా నరేంద్రమోదీ మూడో సారి ప్రధాని పదవి చేపట్టనున్నారని తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ తీరును ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పార. ఈ సమావేశంలో పొంగులేటి మహేందర్రెడ్డి, నంబూరి రామలింగేశ్వరరావు, బి.పోతురాజు పాల్గొన్నారు. రెండు స్థానాల్లో గెలుస్తాం... – రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రఖమ్మం మయూరిసెంటర్/తిరుమలాయపాలెం: ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు నామ నాగేశ్వరరావు, మాలోతు కవిత గెలుస్తారని ఎంపీ వద్దిరాజు ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఓటు హక్కు వినియోగించుకున్నాక ఆయన మాట్లాడుతూ ఎన్నికల సరళిని పరిశీలిస్తే కేసీఆర్కు పట్టం కట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నట్లు అర్థమైందని తెలిపారు. కాగా, తిరుమాలయపాలెం మండలం పిండిప్రోలులో ఓటు వేశాక ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయిన ప్రజలు లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పనున్నారని.. అసెంబ్లీకి భిన్నంగా తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు. నాయకులు బెల్లం వేణు పులుగుజ్జు వెంకటేశ్వర్లు చామకూరి రాజు, పరికపల్లి చంద్రశేఖర్, వెంకట్, దూదిమెట్ల శ్రీను, తాత రవీందర్, చామకూరి వెంకన్న పాల్గొన్నారు. కాగా, ఖమ్మంలో ఓటు వేశాక బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల్లో తాను గెలవబోతున్నానని ఓటింగ్ సరళితో అర్థమైందని చెప్పారు. -
ఓటేసిన నేతలు..
ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ దంపతులులోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఖమ్మం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీ.పీ.గౌతమ్ దంపతులు జిల్లా కేంద్రంలో అటవీశాఖ కార్యాలయంలోని పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిద్దరు ఇతర ఓటర్లతో కలిసి క్యూలో నిల్చుని తమ వంతు వచ్చాక ఓటు వేశారు. అనంతరం కలెక్టర్ నయబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల తదితర పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటింగ్ సరళిపై ఆరా తీశారు. – ఖమ్మం సహకారనగర్సాక్షి ప్రతినిధి, ఖమ్మం : లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆయన భార్య మల్లు నందిని, కుమారుడు సూర్య విక్రమాదిత్య ఓటు వేశారు. కల్లూరు మండలం నారాయణపురంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుడు ప్రసాద్రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మంలోని గొల్ల గూడెంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటు వేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మంలోని కవిత పీజీ కళాశాలలో, భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేటలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు, ఖమ్మం ఎన్నెస్సీ క్యాంప్లోని అంబేద్కర్ కాలేజీ సెంటర్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆయన కుటుంబ సభ్యులు, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో ఎమ్మెల్సీ తాతా మధు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్, మధిర మండలం కొస్తాలలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి, భద్రాలలంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, కొత్తగూడెంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు సమితిసింగారంలో, టేకులపల్లి మండలం కోయగూడెంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఓటు వేశారు. ఇక ఖమ్మం హార్వెస్ట్ పాఠశాలలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దంపతులు, సత్తుపల్లి, కూసుమంచి మండలం రాజుపేటలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య దంపతులు, కందాల ఉపేందర్రెడ్డి దంపతులు ఓటు వేశారు. కాగా, కల్లూరు మండలం నారాయణపురంలో బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
రూ.5లక్షల నగదు స్వాధీనం
కారేపల్లి: కారేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో సోమవారం ఉదయం చేపట్టిన వాహన తనిఖీల్లో అధికారులు రూ.5లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఆగి ఉన్న కారులో ఎన్నికల స్క్యాడ్ అధికారులు తనిఖీ చేయగా రూ.5 లక్షల నగదు లభించింది. కాగా, ఈ నగదును కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీలకు అందజేయడానికి తీసుకొచ్చినట్లు తెలిసింది. బీఆర్ఎస్ నాయకుల నిర్బంధం నగదు పంపిణీ విషయమై బీఆర్ఎస్లో గొడవ జరగగా.. నాయకులను నిర్భందించిన ఘటన కారేపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కారేపల్లి మండలంలోని బీఆర్ఎస్ బూత్ కమిటీలకు పంపిణీ చేయడానికి జిల్లా పార్టీ నుండి రూ.9 లక్షల పైచిలుకు నగదు పంపించినట్లు సమాచారం. ఇందులో రూ.3లక్షలు మాత్రమే పంపిణీ చేస్తుండగా కార్యకర్తలు నిలదీశారు. ఆపై నాయకులను గదిలో నిర్బంధించడంతో మొత్తం నగదును పంపిణీ చేశారు.ఉసురు తీసిన ఈత సరదా కారేపల్లి: సరదాగా స్నేహితులతో కలిసి బావిలో ఈతకు వెళ్లి యువకుడు నీట మునిగి మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం మాధారంలో సోమవారం చోటుచేసుకుంది. మాధారం గ్రామానికి చెందిన తాటి సంతోష్(25) సోమవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి మాధారం–గోవింద్తండా సమీపాన బావిలో ఈతకు వెళ్లాడు. అయితే, బావిలో దూకిన సంతోష్ తిరిగి పైకి రాకపోవడంతో ఆయన స్నేహితులు కేకలు వేయగా సమీపంలోని వారు చేరుకుని సంతోష్ను బయటకు తీసుకొచ్చే సరికే ఆయన మృతి చెందాడు. మాధారానికి తాటి కృష్ణ–సుశీల దంపతుల కుమారుడైన సంతోష్ హమాలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండగా ఆయన మృతితోకుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదించారు. -
పదో తరగతి ఫలితాల్లో... ● హార్వెస్ట్ అగ్రస్థానం
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారని హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి తెలిపారు. పదో తరగతిలో 500మార్కులకు అన్విదారెడ్డి 493మార్కులు, బి.పార్థవి 488, కె.ధాత్రిజ 487, కె.పణ్వక్ చౌదరి 486, వై.అశ్రితా సత్య 485, పి.సాయి అక్షిత 485, ఎం.అనన్య 483, కె.హర్షిత్ 481, బి.లక్షిత 481 మార్కులు సాధించారన్నారు. పరీక్షలకు హాజరైన 267మందిలో నూరుశాతం ఫలితాలు సాధించగా 58మంది విద్యార్థులకు 450కిపైగా, 130మంది విద్యార్థులు 400కిపైగా మార్కులు సాధించారని తెలిపారు. ● శ్రీవిద్యాస్ అభ్యాసన ప్రతిభ సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ప్రతిభ కనబర్చారని శ్రీ విద్యాస్ అభ్యాసన సీబీఎస్ఈ స్కూల్ డైరెక్టర్లు ఆర్.వీ.నాగేంద్రకుమార్, గొల్లపుడి రాంప్రసాద్, ఎం.చైతన్యకృష్ణ తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించిన వారు వివరాలు వెల్లడించారు. 500మార్కులకు గాను సీహెచ్. కార్తీకారెడ్డి 426, రామానుజపార్ధు 413, కె.సుశాంత్ 398, జె.యోగేష్ 386, మేఘచంద్ర 384, రవితేజ 377, సాయి శ్రీనాథ్ 372, అబీబ్ 367, ఏ.సాహితి 362మార్కులు సాఽధించారని తెలిపారు. నూరు శాతం ఫలితాలు సాధించడమే కాక ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే అత్యుత్తమ మార్కులు సాఽధించారని పేర్కొన్నారు.నీకార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. – ఖమ్మం సహకారనగర్ -
●బరిలో 35 మంది..
ఈ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు మధ్య పోటీ నెలకొంది. పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు చివరి వరకు నువ్వా.. నేనా అన్నట్టుగా ప్రచారం చేశారు. 16 మంది అభ్యర్థులకు ఒక ఈవీఎం ఉపయోగించనుండడంతో 35 మంది అభ్యర్థులు, నోటా గుర్తు కలిపి మూడు ఈవీఎంలు ఏర్పాటు చేశారు. అవసరమైతే వినియోగించేందుకు వీలుగా అదనంగా మరికొన్ని ఈవీఎంలను అందుబాటులో పెట్టారు. మొత్తం 7,034 బ్యాలెట్ యూనిట్లు, 2,323 కంట్రోల్ యూనిట్లు, 2,634 వీవీ ప్యాట్లను పోలింగ్ స్టేషన్లకు తరలించారు. ●పోలింగ్ శాతం పెరిగేనా.. 2019 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 15,13,094 మంది ఓటర్లు ఉండగా 11,39,848 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 75.33 శాతం ఓటింగ్ గత ఎన్నికల్లో నమోదైంది. ఈ ఏడాది పోలింగ్ శాతం పెంచేందుకు అధికారం యంత్రాంగం విస్తృత ప్రచారం చేసింది. ప్రతీ అసెంబ్లీ పరిధిలో మహిళలు, దివ్యాంగులు, యువత కోసం ప్రత్యేకంగా మూడు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమాలతో ప్రచారం చేసింది. -
నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాలు (పీఎస్) ఇలా..
నియోజకవర్గం పీఎస్లు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఖమ్మం 355 1,55,284 1,68,740 49 3,24,073 పాలేరు 290 1,15,717 1,25,081 8 2,40,806 మధిర 268 1,07,111 1,15,039 10 2,22,160 వైరా 252 93,700 99,683 6 1,93,389 సత్తుపల్లి 294 1,18,490 1,25,441 12 2,43,943 కొత్తగూడెం 253 1,19,477 1,27,979 38 2,47,494 అశ్వారావుపేట 184 77,381 81,786 7 1,59,174మొత్తం 1,896 7,87,160 8,43,749 130 16,31,039
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement