breaking news
Khammam
-
ధరల నియంత్రణలో కేంద్రం విఫలం
కొణిజర్ల: ఽదరల నియంత్రణలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర మంగళవారం కొణిజర్ల మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా తనికెళ్ల ఆఫీస్ సెంటర్లో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం విధానాల కారణంగా కార్పొరేట్ శక్తులు ప్రజలను దోచుకుంటూ ఎదుగుతున్నారన్నారు. 2014 నుంచి మోదీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ అమలు చేయకపోగా, అవినీతి పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు మతం పేరుతో దేశ ఐక్యతను దెబ్బతీస్తున్న బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, ఎర్రా బాబు, దొండపాటి రమేష్, గడల భాస్కరరావు, యామాల గోపాలరావు, యాసా వెంకటేశ్వరరావు, లతాదేవి, కళావతి, సీతామహా లక్ష్మి, నరసింహరావు, గోవిందరావు, వెంకటరెడ్డి, ఏదులాపురం కౌన్సిలర్ శ్రీజ సుదర్శన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ ప్రజా చైతన్య యాత్రలో హేమంతరావు -
అలా అయితేనే కొంటాం...
● ఖమ్మం మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు నిలిపివేత ● ఆర్డీ వ్యవస్థకు సడలింపు లేకపోవడమే కారణంఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వ్యాపారులు మిర్చి కొనుగోళ్లు నిలిపివేశారు. పంట క్రయవిక్రయాల్లో వ్యాపారులకు ఆర్డీ (రేట్ డిఫరెన్స్) వెసలుబాటును నియంత్రించడం ఇందుకు కారణమైంది. రోజులాగే ఉద యం 7 గంటలకు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి శాంపిళ్లను రైతులు మార్కెట్కు తీసుకురాగా మొత్తం 174 లాట్లకు సంబంధించి జెండాపాట నిర్వహించారు. ఇందులో ఖరీదుదారులు, కమీషన్దారులు పాల్గొని గరిష్టంగా రూ.22,750కు పాడా రు. ఆపై శ్యాంపిళ్లను పరిశీలించాక అంతా పక్కకు తప్పుకున్నారు. జెండాపాట ధర నిర్ణయించి పంట ఎందుకు కొనుగోలు చేయడం లేదని ఆరా తీయగా కొందరు వ్యాపారులు బహిరంగంగానే ఇతర మార్కెట్ల మాదిరి ఖమ్మం మార్కెట్లో ఆర్డీకి అవకాశం ఇవ్వటం లేదని పేర్కొన్నారు. రైతు నుంచి పంట కొనుగోలు ధర, బిల్లింగ్ ధరకు తేడా ఉంటేనే వ్యాపారం చేయగలుగుతామన్నారు. అన్ని ప్రాంతాల్లో ఈ విధానం అనధికారికంగా అమలవుతుండగా, ఖమ్మం మార్కెట్లో లేకపోవటంతో బయ్య ర్లు కూడా ఆర్డర్లు ఇవ్వటం లేదని వెల్లడించారు. ఆర్డీతో పన్నులకు తూట్లు పంటల కొనుగోళ్లలో ఆర్డీకి వెసులుబాటు కల్పిస్తే పన్నులకు తూట్లు పడతాయి. ప్రస్తుతం మిర్చి ధర రూ.22 వేలకు పైగా ఉండగా, వ్యాపారులు బిల్లింగ్లో రూ. 5 నుంచి 6 వేల వరకు తగ్గించాలని కోరుతున్నారు. అంటే రూ.16 వేల నుంచి రూ. 17 వేల చొప్పున బిల్లింగ్ చేస్తే మార్కెట్కు చెల్లించాల్సి ఒక శాతం పన్ను, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీలకు 4 – 5 శాతం పన్నుకు తూట్లు పడుతుంది. ఈ విధానం అన్ని ప్రాంతాల్లో అమలవుతున్నా కొద్ది రోజులుగా ఖమ్మం మార్కెట్లో నియంత్రిస్తున్నారు. దీంతో వ్యాపారులు మిర్చి కొనుగోళ్లు నిలినివేసిన తమ నిరసన తెలిపారు. అన్ని ప్రాంతాల్లో ఉన్నట్లుగా ఖమ్మం మార్కెట్లోనూ ఆర్డీ వ్యవస్థ అమలుచేయాలని వ్యాపారులు, నిబంధనల ప్రకారమే క్రయవిక్రయాలు చేపట్టాలని మార్కెట్ కమిటీ చెబుతుండడంతో ప్రతిష్టంభన నెలకొంది. కాగా, మంగళవా రం పంట కొనుగోళ్లు నిలిపివేయటంతో 6,124 బస్తాల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. -
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు
కొణిజర్ల: విద్యార్థులకు బోధన, నాణ్యమైన భోజ నం సమకూర్చే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. కొణిజర్ల సమీపాన కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో చదివే చల్లా హేమశ్రీ ఆది వారం రాత్రి మృతి చెందగా ఎమ్మెల్యే, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మంగళవారం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు అందుతున్న విద్య, వైద్యం, వసతి సౌకర్యాలపై ఎస్ఓ సౌజన్యతో చర్చించడమే కాక బాలికలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలికల ఆరోగ్యం, భద్రతపై శ్రద్ధ చూపుతూనే ప్రభుత్వం కలిపిస్తున్న సదుపాయాలు అందజేసే బాధ్యత ఉపాధ్యాయులదేని తెలిపారు. ఆతర్వాత గిరిజనఆశ్రమ పాఠశాలలో కూడా ఎమ్మెల్యే తనిఖీ చేశారు. అనంతరం కొణిజర్ల మండలం బస్వాపురంలో విద్యార్థి హేమశ్రీ కుటుంబాన్ని కూడా ఎమ్మెల్యే, సుడా చైర్మన్ పరామర్శించా రు. ఆమె తల్లిదండ్రులు మౌనిక – రమేష్ను పరా మర్శించడమే కాక ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ చల్లా వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సవళ్ల నాగేశ్వరరావు, నాయకులు వడ్డె నారాయణ రావు, సూరంపల్లి రామారావు, రాంపూడి రోశయ్య, కోసూరి శ్రీనివాసరావు, రాయల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీ, ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే -
పరిహారం విడుదలలో జాప్యం చేయొద్దు
కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ చట్టం అమలుకు సంబంధించి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో గుర్తించిన ప్రతీ సమస్యను పరిష్కరించి, నివేదిక సమర్పించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన పోలీసు కమిషనర్ సునీల్దత్తో కలిసి జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పించాక కలెక్టర్ మాట్లాడుతూ అట్రాసిటీ చట్టం అమలు తీరుపై మూడు నెలలకోసారి జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన ప్రతీ అంశంపై అధికా రులు చర్యలు తీసుకుని నివేదిక సమర్పించా లని సూచించారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం త్వరగా అందించాలని స్పష్టం చేశారు. అలాగే, ప్రతీనెల మండల స్థాయిలో సివిల్ రైట్స్ డే నిర్వహణ, మానిటరింగ్ కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డుల జారీపై సమీక్షించారు. సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటివరకు అట్రాసిటీ చట్టం కింద 62 ఫిర్యాదులు అందగా, విచారణ తర్వాత 53 కేసులు నమో దు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏపీపీ విజయలక్ష్మి, ఎస్సీ డీడీ జి.జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముజాహిద్, డీఆర్డీఓ శ్రీరామ్, డీఎంహెచ్ఓ రామారావు, హౌసింగ్ పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.సమస్యల పరిష్కారం కోసం నేడు నల్లబ్యాడ్జీలతో నిరసనఖమ్మం సహకారనగర్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించడంతో పాటు పెండింగ్లో ఉన్న డీఏలు, బిల్లులను చెల్లించాలనే డిమాండ్తో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ఆధ్వర్యాన బుధవారం నిరసన తెలపనున్నట్లు టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయ్, జిల్లా కార్యదర్శి వెంగళరావు తెలి పారు. ఖమ్మంలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల వేతనాల నుంచి మూడు నెలలుగా నగదు మినహాయిస్తున్నా హెల్త్కార్డుల జారీలో మాత్రం విఫలమయ్యారని విమర్శించారు. ఈ మేరకు బుధవారం అన్ని తహసీల్దార్ కార్యాల యం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరనన తెలపనుండగా, ఉపాధ్యాయులు అధిక సంఖ్య లో పాల్గొని విజయవంతంచేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్ బస్సు సీజ్ఖమ్మంక్రైం: ఖమ్మంలోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సులో పరిమితి మించి విద్యార్థులను తీసుకెళ్తుండగా రవాణా శాఖ అధికారులు సీజ్ చేశా రు. ఖమ్మంలో మంగళవారం సదరు బస్సును విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకుని రవాణాశాఖా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఉద్యోగులు తనిఖీ చేసి పరిమితి కన్నా ఎక్కువ విద్యార్థులను తీసుకెళ్తున్నట్లు తేల్చి సీజ్ చేశారు. అంతేకాక ఆ బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా లేకపోవడంతో జరిమానా విధించనున్నట్లు ఇన్చార్జ్ ఆర్టీఓ శ్రీనివాస్ తెలిపారు. అక్రమంగా కలప తరలిస్తున్న వాహనాలు స్వాధీనంఖమ్మంవ్యవసాయం: వివిధ ప్రాంతాల నుంచి కలపను అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలను మంగళవారం రాత్రి అటవీశాఖ టాస్క్ ఫోర్స్ బృందాలు వలపన్ని పట్టుకున్నాయి. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి ప్రాంతం నుంచి ఓ బొలేరో వాహనంలో తుమ్మ కలపను తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక ఇల్లెందు రహదారిలో అనుమతి లేకుండా ఖమ్మం వైపు వస్తున్న ట్రాక్టర్ ను కూడా స్వాధీనంచేసుకుని ఖమ్మం అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. ఈ రెండు వాహనాల్లోని కలప విలువను బుధవారం అంచనా వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని టాస్క్ఫోర్స్ అటవీ అధికారి ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. ‘అక్రమంగా కలప రవాణా?’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీంతో అధికారులు మంగళవారం తని ఖీలు పెంచటంతో రెండు వాహనాలు చిక్కాయి. గురుకులంలో ఎలుకల కాటు..ఆరుగురు విద్యార్థినులకు గాయాలు సత్తుపల్లి(పెనుబల్లి): పెనుబల్లి మండలం అడవిమల్లెలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అడవిమల్లెలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల హాస్టల్లో నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థినులను సోమవారం రాత్రి ఎలుకలు కరిచాయి. విద్యార్థినులు మంగళవారం ఈ విషయాన్ని చెప్పడంతో లంకాసాగర్ పీహెచ్సీకి తరలించి చికిత్స చేయించారు. అయితే, గురుకుల హాస్టల్లో ఎలుకల బెడద కొత్తేమీ కాదని, గతంలోనూ పలువురిని కరిచినా నివారణ చర్యలు చేపట్టలేదని విద్యార్థినులు ఆరోపించారు. ఎలుకల భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
విప్లవోద్యమ నాయకురాలు సీతక్క
●నివాళులర్పించిన మాస్లైన్ నేతలు ఖమ్మంమయూరిసెంటర్: దాదాపు 30 ఏళ్ల పాటు అడవిలో సాయుధ సభ్యురాలుగా పనిచేసిన గంగసాని సీతక్క(సరోజిని) విప్లవోద్యమ నాయకురాలు అని మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పేర్కొన్నారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందగా ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నివాళులర్పించారు. అనంతరం రంగారావు మాట్లాడుతూ సీతక్క సీని యర్ నేత ధర్మన్న జీవిత సహచరి కాగా, 15 ఏళ్లుగా అనారోగ్యం, వృద్ధాప్య కారణాలతో బయట ఉంటున్నారని తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి సీ.వై.పుల్లయ్య, నాయకులు సభ్యులు జి.రామ య్య, ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల అశోక్, సీహెచ్.శిరోమణి, టీ ఝాన్సీ, పి శోభ, శివకుమార్, కొత్తపల్లి రేణుక, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాయల రవికుమార్, న్యాయవాది కందాల క్రాంతికుమార్తో పాటు పోటు శ్రీనివాస్, గంగసాని కృష్ణ, రమాదేవి తదితరులు కూడా సీతక్క మృతదేహం వద్ద నివాళులర్పించారు. -
లింగనిర్ధారణ పరీక్షల కట్టడిపై దృష్టి
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలో ఎక్కడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా అడ్డుకట్ట వేయడమే కాక నిబంధనలు ఉల్లంఘించే సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ రామారావు సూచించారు. గర్భస్ధ లింగ నిర్ధారణ నిషేధ చట్టం(పీసీపీఎన్డీటీ) 1994 అమలుపై జిల్లా సలహా కమిటీ సమావేశం మంగళవారం జరగగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల నమోదు, పునరుద్ధరణ, రికార్డుల పరిరక్షణపై సూచనలు చేశా రు. ఆడ శిశువులపై వివక్షను నివారించి, బాలికా జననాలపై ప్రజల్లో విస్తృత అవగాహ న కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అదికారులు డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, బిందుశ్రీ, లక్ష్మీనారాయణ, మోతియా, అధికా రులు వీరయ్య, వెంకటేశ్వరరాజు, నాగరాజు, వేణుమాధవరావు, ప్రదీప్బాబు, మాధవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా మహిళా న్యాయవాదుల క్రీడలు ఖమ్మం లీగల్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయవాదులకు నిర్వహిస్తున్న క్రీడాపోటీలు కొనసాగుతున్నాయి. ఈమేరకు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మహిళా న్యాయవాదులకు జావెలిన్ త్రో పోటీలు నిర్వహించగా ఉమారాణి, లిఖిత, కేవీవీ.లక్ష్మి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే, టెన్నికాయిట్లో ఉమారాణి, రమణ, షాట్పుట్లో కవితశ్రీ, లక్ష్మి, పావని, డిస్కస్ త్రోలో సంధ్యారాణి, కవితారాణి, ఉమారాణి, రన్నింగ్లో అలేఖ్య, పావని, నందిత గెలుపొందారు. ఇక బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో రాజబోయిన శ్రీనివాస్, కొప్పుల కృష్ణ జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. పోటీల ఆర్గనైజర్లుగా శేఖర్ రాజు, ఏడునూతల శ్రీనివాసరావు వ్యవహరించగా, కళ్యాణి, శిరీష, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. రూ.కోటి విలువైన ధాన్యం పక్కదారి ముదిగొండ: సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలతో జిల్లాలోని రైస్మిల్లుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నేలకొండపల్లి, పెనుబల్లి, తల్లాడ మండలాల్లో మిల్లుల్లో తనిఖీ చేసి అక్రమాలను గుర్తించారు. ఇక మంగళవారం ముదిగొండ మండలం సువర్ణాపురం – ముత్తారం రహదారి వెంట శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీలో వరంగల్ నుంచి వచ్చిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ కిషోర్ ఆధ్వర్యాన చేపట్టిన ఈ తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. గోదాముల్లోని ధాన్యం బస్తాలు, రికార్డులను పరిశీలించగా రూ.కోటికి పైగా విలువైన 450 మె. టన్నుల ధాన్యం లెక్కలు తేలకపోవడంతో నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు డీసీఎస్ఓ చందన్ కుమార్ తెలిపారు. కాగా, ముత్తారం రహదారిలో పొలాల మధ్య ఉన్న ఈ మిల్లుపై ఆది నుంచి ఆరోపణలు ఉన్నాయి. తనిఖీల్లో నేలకొండపల్లి సివిల్ సప్లయీస్ డీటీ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కట్లేరు అభివృద్ధి పనుల్లో వేగం పెరగాలి ● జలవనరుల శాఖ సీఈ వాసంతి ఎర్రుపాలెం: మండలంలోని రూ.36. కోట్ల నిధులతో చేపట్టిన కట్లేరు ఆయకట్టు అభివృద్ధి, మరమ్మతు పనుల్లో వేగం పెంచాలని జలవనరుల శాఖ సీఈ వాసంతి సూచించారు. మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావుతో కలిసి మంగళవారం ఆమె కట్లేరు కాల్వ లైనింగ్, బ్రిడ్జి పనుల్లో నాణ్యతను పరిశీలించారు. రైతుల సూచనల మేరకు కట్లేరు ఎడమ, కుడి కాల్వల్లో పశువులకు ఉపయోగపడేలా ర్యాంపులు, డ్రాప్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఈ శ్రీకాంత్, ఈఈ మధు, డీఈ సాంబశివరావు, ఏఈలు వనజ, రాజేశ్వరరావు, రాము, వంశీ, సర్పంచ్లు షేక్ పెద్దబాబు సాహెబ్, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శీలం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
బోధించే వారే దారి తప్పారు..
● నకిలీ సర్టిఫికెట్లతో లెక్చరర్ ఉద్యోగాలు ● ఉమ్మడి జిల్లాలో నలుగురి గుర్తింపు, నోటీసులుమధిర: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన వృత్తిలో ఉన్న అధ్యాపకులే దారి తప్పారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం నకిలీ సర్టిఫికె ట్లు సమర్పించినట్లు బయటపడడంతో ఉమ్మడి జిల్లాలో నలుగురు లెక్చరర్లు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వివరణ అందిన అనంతరం వారిపై కేసులు నమోదు చేసే అవకాశముంది. 2023లో నియామకం గత ప్రభుత్వం 2023 ఏప్రిల్ 4న ప్రభుత్వ జూని యర్ కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకులను ఎంపిక చేసింది. తొలుత నియామకపత్రాలు ఇచ్చిన అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. అయితే, నియామకాల్లో అవకతవకలు జరిగాయని, పలువు రు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారని విద్యార్థి సంఘాల నాయకులు, అప్పటి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. ఈమేరకు లెక్చరర్లగా నియమితులైన అందరి సర్టిఫికెట్ల పరిశీలన చేపట్ట గా రాష్ట్రంలో 35మంది తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారని టాస్క్ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఈ జాబితాలో ఉమ్మడి జిల్లానుంచి నలుగురు ఉన్నట్లు తేలడం చర్చనీయాంశంగా మారింది. బిహార్ సర్టిఫికెట్ మధిర జూనియర్ కాలేజీలో నియమితులైన గంటా కృష్ణ అంతకుముందు ములుగు జిల్లా వాజేడులో కాంట్రాక్టు లెక్చరర్గా పనిచేశారు. ఆ తర్వాత రెగ్యులర్ పోస్టుకు ఎంపికయ్యారు. ఆయన 2009లో బిహార్లోని బోద్గయలో ఉన్న మగధ యూనివర్సిటీలో పీజీ చేసినట్లు సర్టిఫికెట్ సమర్పించాడు. అయితే, టాస్క్ఫోర్స్ అధికారులు ఆరా తీయగా మగధ యూనివర్సిటీలో కృష్ణ పీజీ చేయలేదని, తాము సర్టిఫికెట్ జారీ చేయలేదని అక్కడి నుంచి సమాధానం వచ్చింది. దీంతో కృష్ణ నకిలీ సర్టిఫికెట్ సమర్పించినట్లు నిర్ధారిస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈనెల 7న మధిర కాలేజీకి మెయిల్ పంపించారు. ఈమేరకు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీచేస్తూ, సమాధానం ఆధారంగా చర్యలు తీసుకోవడమే కాక క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అందులో పేర్కొన్నారు. ఈ విషయమై మధిర కాలేజీ ప్రిన్సిపాల్ శంకర్ను వివరణ కోరగా... కృష్ణ నకిలీ సర్టిఫికెట్ సమర్పించినట్లు మెసేజ్ వచ్చిందని తెలిపారు.ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సివిక్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న గంటా కృష్ణ, వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న షేక్ రోషన్బీ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారని టాస్క్ఫోర్స్ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల హిందీ లెక్చరర్ చాంద్పాషా, పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ యాకయ్య కూడా ఈ జాబితాల ఉండడంతో వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. -
అక్షరాలా లక్షన్నర !
అనర్హుల తొలగింపునకు... అర్హులైన ఓటర్లను గుర్తించడమే కాక మృతి చెందిన, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న వారిని తొలగించడంతో పాటు ఓటర్ల వివరాల్లో అవసరమైన మార్పుల కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను చేపట్టారు. ఈ సందర్భంగా 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుత జాబితాతో రివిజన్ చేపట్టారు. 87.31 శాతం డిజిటలైజేషన్ జిల్లాలో 10,85,927 మంది తమ ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు అందజేయగా సోమవారం అర్ధరాత్రి వరకు డిజిటలైజేషన్ 87.31 శాతంగా నమోదైంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో అత్యధికంగా పాలేరులో 92.21 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. ఇక్కడ 291 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,45,885 మంది ఓటర్లకు 2,26,729 మంది ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించారు. అతితక్కువగా ఖమ్మం నియోజకవర్గంలోని 355 పోలింగ్ కేంద్రాల్లో 3,28,203 మంది ఓటర్లు ఉండగా.. 2,47,540 మందే ఫారాలు అందజేశారు. దీంతో ఇక్కడ 75.42 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. అలాగే, డిజిటలైజేషన్ చేసిన వాటిలో 43,131 దరఖాస్తుల మ్యాపింగ్ కాకపోవడంతో వీరికి ఈనెల 17 నుంచి నోటీసులు జారీ చేస్తారు. పుట్టిన తేదీని అనుసరించి కుల ధ్రువీకరణ పత్రం, ఎస్సెస్సీ మెమో, తల్లిదండ్రుల సర్టిఫికెట్లతో సమర్పిస్తే అర్హతల ఆధారంగా ముసాయిదా జాబితాలో చోటు కల్పిస్తారు. తొలగింపులో ఖమ్మం టాప్ జిల్లాలో ప్రస్తుత ఓటరు జాబితా ప్రకారం 12,43,781 మంది ఓటర్లకు గాను సర్ అనంతరం 1,57,854 మంది ఓట్లు తొలగించనున్నారు. ఇందులో 33,380 మంది మరణించగా.. 1,01,549 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటరుగా నమోదైన వారు 11,004 మంది, చిరునామా లభించని వారు 11,371 మంది ఉండగా.. ఇతర కారణాలతో ఫారాలు అందజేయని వారు 550 మంది ఉన్నారని తేలింది. వీరందరి పేర్లు జాబితా నుంచి తొలగించనున్నారు. కాగా, ఇతర కారణాల జాబితాలో ఉన్న వారెవనైనా అభ్యంతరాలు వ్యక్తం చేసి ఆధారాలు సమర్పిస్తే పేర్లు కొనసాగుతాయి. మొత్తంగా 1,57,854 మంది ఓట్లు తొలగించనుండగా.. అందులో అత్యధికంగా ఖమ్మం నియోజకవర్గంలో 80,663 మంది ఉన్నారు. తొలగించే మొత్తం ఓట్లలో 51 శాతానికి పైగా ఇక్కడే ఉండడం గమనార్హం. ఆ తర్వాత మధిరలో 20,638 మంది, వైరాలో 17,153 మంది, పాలేరులో 19,156 మంది, సత్తుపల్లి నియోజకవర్గంలో 20,244 మంది ఓట్లు తొలగించనున్నారు. అగ్రస్థానాన వేంసూరు ‘సర్’ డిజిటలైజేషన్ను మండలాల వారీగా పరిశీలిస్తే జిల్లాలోని వేంసూరు అగ్రస్థానాన నిలిచింది. ఇక్కడ 46 పోలింగ్కేంద్రాల పరిధిలో 36,625 మంది ఓటర్లు ఉండగా.. 35,159 ఫారాలు డిజిటలైజేషన్ చేశారు. అంటే 95 శాతానికి పైగా నమోదైంది. అలాగే నేలకొండపల్లి మండలంలో 95 శాతం పూర్తవగా.. 90 శాతానికి పైగా డిజిటలైజేషన్ అయిన మండలాల్లో తిరుమలాయపాలెం, రఘునాథపాలెం, కూసుమంచి, ఎర్రుపాలెం, ముదిగొండ, బోనకల్, చింతకాని, జూలూరుపాడు, సింగరేణి, ఏన్కూరు, కొణిజర్ల, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాలు ఉన్నాయి. 80 – 90 శాతం లోపు సత్తుపల్లి, వైరా, మధిర, ఖమ్మంరూరల్ మండలాలు, 70 – 80 శాతం లోపు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డిజిటలైజేషన్ పూర్తయింది. ‘సర్’లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తవడంతో ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. అదేరోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిష్కరించాక అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. దీంతో ‘సర్’ ప్రక్రియ పూర్తవుతుంది.జిల్లాలో 1,57,854 ఓట్లు ఫట్ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ప్రక్రియలో కీలకఘట్టం ముగిసింది. బీఎల్ఓలు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను తిరిగి ఇచ్చే గడువు సోమవారంతో ముగియగా డిజిటలైజేషన్ పూర్తి చేశారు. జిల్లాలోని 1,460 పోలింగ్ కేంద్రాల పరిధిలో 12,43,781 మందికి గాను అందిన 10,85,927 ఫారాలను డిజిటలైజేషన్ చేయగా జిల్లాలో 87.31 శాతంగా నమోదైంది. దీంతో మిగిలిన 1,57,854 ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించనున్నారు. ఇందులో మరణించిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారే అత్యధికంగా ఉన్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంవివరాలు ఖమ్మం పాలేరు మధిర వైరా సత్తుపల్లి మొత్తం ఓటర్లు 3,28,203 2,45,885 2,26,126 1,96,475 2,47,092డిజిటలైజ్ చేసినవి 2,47, 540 2,26,729 2,05,488 1,79,322 2,26,848వారసులుగా మ్యాపింగ్ 1,29,583 1,25,415 1,06,733 98,353 1,27,440స్వయంగా మ్యాపింగ్ 95,151 90,951 95,127 77,604 96,432మ్యాపింగ్ కానివి 22,799 10,363 3,628 3,365 2,976మరణించిన వారు 9,155 5,540 6,888 5,604 6,193శాశ్వతంగా వలస 58,952 11,345 10,889 9,659 10,704ఆల్రెడీ ఎన్రోల్డ్ 3,865 1,577 1,871 1,376 2,315అందుబాటులో లేనివారు 8,222 644 989 497 1,019ఇతర కారణాలు 469 50 01 17 13తొలగించే ఓట్లు 80,663 19,156 20,638 17,153 20,244 -
బౌద్ధక్షేత్రం వద్ద ఆదిమ మానవుల ఆనవాళ్లు
నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రం సమీపాన ఆదిమ మానవుల ఆనవాళ్లు వెలుగులోకి వస్తున్నాయి. క్షేత్రం సమీపంలోని ఓ బండపై శిలాయుగపు ఆదిమ మానవులు ఉపయోగించినట్లు భావిస్తున్న నూరుడు గుంతలు కనిపించాయి. ఆయుధాలను పదును చేసుకునేలా ఈ గుంతలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అంతేకాక ఇక్కడ సమాధులు కూడా ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు పసుమర్తి శ్రీనివాస్ తెలిపారు. ఈమేరకు చారిత్రక ఆనవాళ్లు కలిగిన పరుపు బండలుఽ ధ్వంసం కాకుండా రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు ఈ ప్రాంతాన్ని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకుని సంరక్షించాలని కోరారు. -
హత్య చేసి.. మృతదేహాన్ని తీసుకొచ్చి !?
●మధిర సమీపాన బిహార్ వాసి మృతదేహం మధిర:మధిరలోని పీవీఆర్ కల్యా ణ మండపం దగ్గర మంగళవారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. సదరు వ్యక్తిని ఇత ర ప్రాంతంలో హత్య చేసి ఇక్కడకు తీసుకొచ్చినట్లు భావి స్తుండగా, మధిర– వైరా ప్రధాన రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మధిర టౌన్ సీఐ రమేష్, సిబ్బంది చేరుకుని పరిశీ లించాక మృతుడి ముఖం, చేతులపై రక్తపు మరకల ను గుర్తించారు. ప్రధానరహదారికి సుమారు 50 అడు గుల దూరాన మృతదేహం ఉండడంతో ఇది రోడ్డు ప్రమాదం కాదని, హత్యేనన్న అంచనాకు వచ్చారు. బిహార్ వాసి.. ఖమ్మంలో నివాసం బిహార్ రాష్ట్రంలోని ముజాఫూర్ జిల్లాకు చెందిన ఎండీ.తలీమ్(45) ఖమ్మం గట్టయ్యసెంటర్లోని ఒక బొటిక్ దుకాణంలో ఎంబ్రాయిడరీ వర్కర్గా పని చేస్తున్నాడు. ఆయన ఇటీవల మద్యానికి బానిస కాగా, ఖమ్మం నుంచి బస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరు వెళ్లినట్లు టికెట్ల ద్వారా గుర్తించారు. ఆపై బస్సులో సోమవారం మధిరకు చేరుకున్న ఆయన సోమవారం రాత్రి బస్టాండ్ సమీపంలోని పూల దుకాణం వద్ద తిరగగా 11–30 గంటలకు ఫోన్ స్విచాఫ్ అయినట్లు తేలింది. ఆయనను గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి హత్య చేసి వైరా రోడ్డులోని ఖాళీ ప్లాట్లో మృతదేహాన్ని పడేసి ఉంటారని తెలుస్తోంది. గంజాయి మత్తులో ఎవరైనా హత్య చేశారా, ఇతర కారణాలు ఉన్నాయా అనేది తేల్చేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, తలీమ్కు భార్య, నలుగురు కుమారులు ఉండగా కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రమేష్ తెలిపారు. -
ఇక్కడా ‘ఇజ్రాయిల్’ సాంకేతికత
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం నగర ప్రజలకు నిరంతరం, స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో మున్సిపల్ కార్పొరేషన్ బృహత్తర ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. రూ.160 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు వృథా కాకుండా ఓవర్ హెడ్ ట్యాంక్ల నుంచి వినియోగదారుడి ఇంటికి నీరు చేరుతుంది. దేశం నుంచి తొమ్మిది మంది ఐఏఎస్లు, తొమ్మిది మంది చీఫ్ ఇంజనీర్లతో కూడిన బృందం ఇజ్రాయిల్లో పర్యటించగా, ఇందులో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఉన్నారు. ఎనిమిది రోజుల పాటు అక్కడ జరిగిన అంతర్జాతీయ స్థాయి అర్బన్ వాటర్ సప్లై అండ్ డెవలప్మెంట్ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. పట్టణ నీటి సరఫరా, ఆధునిక జల నిర్వహణ, సుస్థిర అభివృద్ధికి సంబంధించి అంశాలపై సదస్సులు, సాంకేతిక ప్రదర్శనలు, అధ్యయనాల్లో పాల్గొని ఖమ్మం వచ్చిన కమిషనర్ అక్కడి ప్రత్యేకతలు, వాటి ఆధారంగా ఖమ్మంలో చేపట్టే పనులను మంగళవారం వివరించారు. ఆ వివరాలు కమిషనర్ మాటల్లోనే... మన దగ్గర లీకేజీలే సమస్య ఇక్కడ ఇజ్రాయిల్ తరహా నీటి కొరత లేదు. ఖమ్మంలో లకారం, మున్నేరు, పాలేరు, సాగర్ కెనాల్ ద్వారా పుష్కలంగా నీరు లభిస్తోంది. నగరానికి రోజుకు 70 మిలియన్ లీటర్ల నీరు అవసరమైతే, ప్రతిరోజూ అంతే పరిమాణంలో సరఫరా చేస్తున్నాం. అయినా ప్రజలకు రోజు విడిచి రోజు అది కూడా గంట లేదా గంటన్నర మాత్రమే నీళ్లు వస్తున్నాయి. నీటి లీకేజీలు, అనధికారిక కనెక్షన్లు, పాతకాలం నాటి మౌలిక సదుపాయాలే ఇందుకు కారణం. ప్రజలు నేరుగా లైన్మెన్లతో మాట్లాడి, పైపులకు జాయింట్లు వేసి అనధికారికంగా నీటిని తోడేస్తున్నారు. తద్వారా నీరు వృథా అవడమే కాక కేఎంసీకి ఆదాయం రావడం లేదు. అందుకే లీకేజీలను అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ.160 కోట్లతో నగరమంతా.. ఖమ్మం నగరం మొత్తంలో 150 డీఎంఏలు ఉన్నాయి. డీఎంఏ అంటే నీటి సరఫరా వ్యవస్థలో నీటి ప్రవాహం, పీడనాన్ని మీటర్ల ద్వారా పర్యవేక్షించి నియంత్రించే ఒక నిర్దిష్ట ప్రాంతం. పైలట్ ప్రాజెక్ట్ విజయంతో కార్పొరేషన్ తరఫున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.160 కోట్ల గ్రాంట్ మంజూరు చేయడంతో టెండర్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నాం. ఈ నిధులతో నగరంలోని అన్ని డీఎంఏలలో ఆధునిక పైప్లైన్లు, సెన్సార్లు ఏర్పాటు చేసి 24 గంటల నిరంతర తాగునీటి సరఫరాను త్వరలోనే అందుబాటులోకి తెస్తాం.ఇజ్రాయిల్లో నీటి లభ్యత చాలా తక్కువ. అందుకే వాళ్లు గాలి నుంచి నీటిని తయారు చేయడం, సముద్రపు నీటిని శుద్ధి చేసి తాగునీరుగా మార్చడం లాంటి వినూత్న పద్ధతులు ఉపయోగిస్తున్నారు. అక్కడ నీటిని అమూల్యమైన సహజ వనరుగా పరిగణిస్తారు. సొంతంగా బోర్ వేసుకోవాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ప్రతీ బోర్కు మీటర్ బిగించి నీటి వినియోగానికి తగినట్లుగా బిల్లు చెల్లించాల్సిందే. పైగా లీకేజీలను గుర్తించడానికి భూగర్భ పైప్లైన్లలో ప్రతీ 200 మీటర్లకు ఒక సెన్సార్లు, స్కాడా సిస్టమ్ అమర్చారు. లీకేజీ ఏర్పడగానే క్విక్ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగుతాయి.రూ.160 కోట్లతో నిరంతరం తాగునీటి సరఫరా -
రూ. 17.74 కోట్లతో ఫ్రూట్ మార్కెట్
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మంలో వ్యాపారులు, ప్రజలకు ఉపయోగపడేలా పండ్ల మార్కెట్కు ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఖానాపురంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యాన నిర్మించిన వీధి వ్యాపారుల ప్రాంగణంతో పాటు పక్కనే ఉన్న స్థలం కలుపుకుని మార్కెట్ ఏర్పాటుకు నిర్ణయించారు. వీధి వ్యాపారుల ప్రాంగణం వినియోగంలో లేకపోవడంతో 2.30 ఎకరాల్లో మార్కెట్ ఏర్పాటుచేస్తారు. వ్యవసాయ మార్కెట్ పరిధిలో.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో మార్కెటింగ్ శాఖ అధికారులు అవసరమైన నిర్మాణాలు, నిధులతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. పండ్ల మార్కెట్లో యార్డు, వే బ్రిడ్జి, అంతర్గత రహదారులు, ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రహరీ, ఆర్చ్ వంటి నిర్మాణాలకు రూ.17.74 కోట్లు అవసరమని అందులో పొందుపరిచారు. రైతులు, వ్యాపారులకు ప్రయోజనం ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి. మామిడి, జామ, అరటి, బొప్పాయి, దానిమ్మ, జీడి మామిడి వంటి పండ్ల తోటలు ఉండగా.. వీటి విక్రయానికి రైతులు పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. వ్యాపారులకు కూడా సరైన హోల్సేల్ మార్కెట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోనే దాదాపు 44మంది హోల్సేల్ పండ్ల వ్యాపారులు ఉన్నారు. ఈమేరకు ఖమ్మంలో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటైతే రైతులకే కాక వ్యాపారులు, ప్రజలకు ఉపయోగపడనుంది.ఖానాపురంలో ఏర్పాటుకు కసరత్తుఖమ్మం వ్యవసాయ మార్కెట్కు అనుబంధంగా పండ్ల మార్కెట్ ఏర్పాటుచేయాలని ప్రతిపాదించగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించారు. ఖానాపురంలోని 2.30 ఎకరాల్లో పండ్ల మార్కెట్ ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ వచ్చింది. ఇందుకు కావాల్సిన రూ.17.74 కోట్ల మంజూరుకు మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. – యరగర్ల హన్మంతరావు, ఖమ్మం మార్కెట్ చైర్మన్ -
ఈసారైనా ముడిపడేనా?
సత్తుపల్లి: ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి రెవెన్యూ పరిధిలో భూ వివాదాలను రీ సర్వే ద్వారా పరిష్కారానికి నిర్ణయించారు. ఇటీవల సత్తుపల్లిలో జరిగిన ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే రాగమయి చేసిన వినతితో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రీ సర్వేకు ఆదేశాలిచ్చారు. పదేళ్లుగా మూడుసార్లు ఎంజాయ్మెంట్ సర్వే చేసి పాస్ పుస్తకాలు జారీ చేసినా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా మరింత తీవ్రమయ్యాయి. ఫలితంగా రైతులు తహసీల్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. బేతుపల్లి సర్వేనెంబర్ 133, 878/938, 138లో సమస్యలు తీవ్రంగా ఉన్నందున హద్దులు తేల్చడంతోపాటు భవిష్యత్లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా సర్వే చైన్లతో కాకుండా జియో ట్యాగింగ్తో సర్వే చేస్తున్నారు. పొంతన లేని భూమి వివరాలు బేతుపల్లి రెవెన్యూ పరిధిలో ఏడు పంచాయతీలు ఉన్నాయి. మొత్తం విస్తీర్ణం11,782 ఎకరాలకు గాను రికార్డుల్లో 12,047 ఎకరాలు ఉన్నట్లు చూపిస్తోంది. తద్వారా అదనంగా 265 ఎకరాలకు పాస్ పుస్తకాలు జారీ కావడం సమస్యకు కారణమైంది. క్రయవిక్రయాలు జరిగినప్పుడు భూమి బదలాయింపు జరగక రికార్డులో అలాగే కొనసాగించడం, వారసత్వంగా వచ్చినా రికార్డుల్లో పేర్లు మారకపోవడం పాస్ పుస్తకంలో ఉన్న భూమికి క్షేత్రస్థాయిలో భూమికి వ్యత్యాసం ఉండడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. దీనికి తోడు ధరణి పోర్టల్లో కొన్ని సర్వే నెంబర్లు పూర్తిగా కనిపించకపోవడం ఇంకొన్ని తప్పుగా నమోదు కావడంతో సరిహద్దు సమస్యలు ఏర్పడి తరచూ ఘర్షణలు తలెత్తున్నాయి. ముప్పై ఏళ్లకొకసారి.. ప్రతీ ముప్పై ఏళ్లకొకసారి రీ–సర్వే జరగాల్సి ఉన్నప్పటికీ 90 ఏళ్లుగా జరగటం లేదు. తెలంగాణ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో భూ వివాదాల పరిష్కారం కోసం రీ సర్వేకు నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇందులో తరచూ వివాదాలు జరుగుతున్న బేతుపల్లి రెవెన్యూను పైలట్గా ఎంపిక చేసింది. సర్వే అనంతరం భూ యజమానుల రికార్డులు ఆధునీకరించి పక్కాగా కంప్యూటరీకరణ చేస్తారు. దీంతో వివాదాలు తగ్గి.. ప్రభుత్వ పథకాలు నేరుగా నిజమైన భూ యజమానికి అందనున్నాయి. కలెక్టర్ పర్యవేక్షణలో.. కలెక్టర్ దివాకర టీ.ఎస్. పర్యవేక్షణలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ముగ్గురు చొప్పున పది బృందాలను ఏర్పాటుచేశారు. మొత్తంగా సర్వేను 45 రోజుల్లో పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించారు. బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని 11,782 ఎకరాలను సెక్టార్కు వేయి ఎకరాలు నుంచి 1,100 ఎకరాలు కేటాయించి రీ సర్వే చేపడుతున్నారు. ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి, పట్టా భూమి, గ్రామ కంఠం, రోడ్లు, చెరువుల భూమి నిర్ధారించాక, రైతులకు నోటీసులు ఇచ్చి వారి సమక్షంలోనే మిగతా భూమి సర్వే చేస్తున్నారు. అలాగే, పాత విధానం కాకుండా జియో ట్యాగింగ్తో అక్షాంశాలు, రేఖాంశాల (జీపీఎస్) ఆధారంగా సర్వే చేసి రైతుల సమక్షంలోనే నమోదు చేసి భూ ఆధార్ నెంబర్ కేటాయిస్తారు. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ రెవెన్యూ, సర్వే అధికారులతో సమీక్షించి సూచనలు చేశారు. ఈ సర్వేతోనైనా సమస్యలు పరిష్కారమవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మండలం సత్తుపల్లి రెవెన్యూ బేతుపల్లి పంచాయతీలు ఏడు విస్తీర్ణం 11,782 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లో 12,047 ఎకరాలు అదనం 265 ఎకరాలు ప్రస్తుతం సర్వే నాలుగోసారి బేతుపల్లి రెవెన్యూలో భూముల రీ సర్వే సత్తుపల్లి మండలం బేతుపల్లి రెవెన్యూలో రీ–సర్వేను కలెక్టర్ దివాకర మంగళవారం పరిశీలించారు. భూ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న సర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ఎవరి భూమి అయినా రికార్డుల నమోదు కాకపోతే ఉద్యోగులకు చెప్పి సర్వే చేయించుకోవాలని తెలిపారు. సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్(అమ్ములు), సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, తహసిల్దార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం రైతుల సహకారంతో సర్వే వేగంగా జరుగుతోంది. ఏ రోజుకారోజు వివరాలను సత్తుపల్లి తహసీల్దార్కు, అక్కడి నుంచి ఉన్నతాధికారులకు చేరుతుంది. కలెక్టర్ దివాకర సూచనలతో రీ సర్వే ఎటువంటి ఆటంకాలు లేకుండా చేపడుతున్నాం. త్వరలోనే పూర్తిచేసి నివేదిక ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. – వి.నాగభూషణం, డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్, కల్లూరు -
జలుబు అని ఆర్ఎంపీ దగ్గరికెళితే.. పాప ప్రాణమే పోయింది
ఖమ్మం జిల్లా: అసలే అర్హతలు లేని వైద్యం.. ఆపై ఆర్ఎంపీగా చెలామణి అవుతున్న సదరు వ్యక్తి మద్యం మత్తులో వైద్యం చేసి అభంశుభం తెలియని బాలిక ప్రాణాలు బలిగొన్నాడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు... బస్వాపురం గ్రామానికి చెందిన చల్లా రమేష్, మౌనిక దంపతులకు కుమార్తె హిమశ్రీ(16) స్థానిక కేజీబీవీలో ఎనిమిదో తరగతి చదువుతుండగా.. ఆదివారం బోనాల పండుగ కావడంతో ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే స్వల్పంగా జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆమెను స్థానిక ఆర్ఎంపీ మారుతి సంపత్ వద్దకు తండ్రి తీసుకెళ్లగా అప్పటికే మత్తులో ఉన్న ఆర్ఎంపీ ఆమెకు ఓ ఇంజక్షన్ ఇచ్చాడు. మరో ఇంజక్షన్ ఇస్తుండగా హిమశ్రీ నోటి నుంచి నురగలు కక్కుతూ కళ్లు తిరుగుతున్నాయని చెప్పి స్పృహ కోల్పోయింది. ఈ మేరకు సంపత్ ఆటో పిలిపించి బాలికకు సీరియస్గా ఉందని ఖమ్మం తీసుకెళ్లాలంటూ తండ్రిని ఎక్కించుకుని బయలుదేరాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం లేక ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక మృతి చెందిందని ఆమె బంధువులు ఆçస్పత్రి ఎదుట ఆందోళన చేయగా పోలీసులు నచ్చచెప్పి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. బాలిక తండ్రి రమేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కొణిజర్ల ఎస్సై సూరజ్ తెలిపారు. -
రోడ్డెక్కిన కార్మిక, రైతు లోకం
ఖమ్మం మయూరిసెంటర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల, మతతత్వ విధానాలు అనుసరిస్తోందని ఆరోపిస్తూ అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపుతో సోమవారం జిల్లా కేంద్రంలో ‘జైల్ భరో’ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో జిల్లా పరిషత్ సెంటర్ నుంచి టూటౌన్ పోలీస్ స్టేషన్ వరకు ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని క్రమాన నాయకులు, కార్మికులు స్వచ్ఛందంగా పోలీసు వాహనాలు ఎక్కి అరెస్టు అయ్యారు. హక్కులను కాలరాస్తున్నారు.. రాస్తారోకో సందర్భంగా సీపీఎం రైతు సంఘం రాష్ట్ర నాయకుడు నున్నా నాగేశ్వరరావు, సీపీఐ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, మాస్లైన్ జిల్లా కార్యదర్శి సీ.వై. పుల్లయ్య, బీఆర్ఎస్ నాయకుడు పగడాల నాగరాజు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ, పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని ఆరోపించారు. అంతేకాక అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్ తదితర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుని, జీరో సుంకంతో దిగుమతులను ప్రోత్సహించడం వల్ల దేశ రైతులు దివాళా తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక ఉపాధి హామీ పథకం పేరు మార్పు, పేదలకు ఇచ్చే బియ్యంలో కోత తదితర సవరణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు జి.రామయ్య, తుమ్మ విష్ణువర్ధన్, సింగు నరసింహారావు, తోట రామాంజనేయులు, యర్రా శ్రీనివాస్, వై.విక్రమ్, ఎస్.నవీన్రెడ్డి, గోవిందరావు, వెంకన్న, నరాల నరేష్, ఆవుల అశోక్, కమ్మకోమటి నాగేశ్వరరావు, పాషా, దండ జ్యోతిరెడ్డి, తొట్టి కొమరయ్య, రాంబాబు, కేలోత్ లక్ష్మణ్, శిరోమణి, బండి పద్మ, పి.రమ్య, షకీనా, ఝాన్సీ పాల్గొన్నారు. -
వాహనాల ఫిట్నెస్.. ఆటోమేటిక్!
ఖమ్మంక్రైం: సరుకు, ప్రజా రవాణా చేసే లారీలు, బస్సులు, లైట్ మోటార్ వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు ఇన్నాళ్లు అధికారులే ప్రత్యక్షం(మ్యాన్వల్)గా చేపడుతుండగా, ఈ విధానానికి చెల్లుచీటి పాడనున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఆసరాగా ఫిట్నెస్ పరీక్షించేందుకు యంత్రాలను వినియోగించనున్నారు. ఈమేరకు తొలిదశగా రాష్ట్రంలోని 15 జిల్లాల్లో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు(ఏటీఎస్)లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింధి. ఇందులో ఖమ్మం జిల్లా రవాణాశాఖా కార్యాలయానికి కూడా చోటు దక్కడం విశేషం. మొదటి దశలోనే ఖమ్మంలో... రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 37 ప్రాంతాల్లో ఏటీఎస్(ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్)లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఇందులో తొలుత 15 ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేయనుండగా ఇందుకోసం రూ.50కోట్లు కేటాయించారు. ఈ జాబితాలో ఖమ్మం కూడా ఉండడంతో ఇక్కడి రవాణా శాఖ కార్యాలయంలో రూ.3కోట్ల విలువైన ఆటోమెటిక్ స్టేషన్ను ఏర్పాచేస్తారు. ఫిట్నెస్ పరీక్షలు ఇలా... ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లో ప్రత్యేక పరికరాలు ఉంటాయి. వీటి పరిధిలోకి వాహనం వెళ్లగానే వాహనాల బ్రేక్, ఇంజన్ సామర్థాలే కాక కాలుష్య ఉద్గారాలు, ఇతర అంశాలను సెన్సార్లతో పరీక్ష పూర్తవుతుంది. ఆపై అంతా సక్రమంగా ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ అవుతుంది. అలా సర్టిఫికెట్ ఉన్న వాహనం వివరాలు నేరుగా కేంద్ర రవాణాశాఖ పరిధిలోని వాహన్ పోర్టల్లో ఆప్లోడ్ అవుతాయి. తద్వారా అవినీతికి ఆస్కారం లేకపోగా, ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీలో పారదర్శకత పెరిగి రోడ్డు భద్రత మెరుగుపడుతుందని భావిస్తున్నారు. త్వరలోనే జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏటీఎస్ యంత్రం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రవాణాశాఖా ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. యంత్రం నిర్వహణ, పరీక్షలపై రవాణా శాఖ ఉద్యోగులకు శిక్షణ ఉంటుంది. – శ్రీనివాస్, ఇన్చార్జ్ ఆర్టీఓప్రసుత్తం ఫిట్నెస్ పరీక్షలు ఎంవీఐల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే వాహనాలను పరీక్షించి ఫిట్నెస్ పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. అయితే, పలు సందర్భాల్లో వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు ఫిట్నెస్ లేనట్టు తేలుతోంది. దీంతో కార్యాలయాల్లో ఫిట్నెస్ పరీక్ష సరిగా నిర్వహించకుండానే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇందులో నగదు చేతులు మారుతున్నట్లు తెలుస్తుండగా, కొన్ని వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే తిరుగుతున్నా అధికారులు నియంత్రించలేకపోతున్నారని తెలుస్తోంది. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని మానవ ప్రమేయం లేకుండా సాంకేతిక పరిజ్ఞానంతోనే వాహనాల సామర్ధ్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయంచింది. -
రోడ్డు వేస్తే ఆత్మహత్యే శరణ్యం
చింతకాని: నిబంధనలకు విరుద్ధంగా తన పొలంలో నుంచి రోడ్డు వేసేందుకు కాంగ్రెస్ నాయకులు, ఇంకొందరు రైతులు ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ ఓ రైతు ఆవేదనకు గురయ్యాడు. ఈమేరకు చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్గా మారడంతో పోలీసులు స్పందించి పనులు నిలిపివేయించారు. చింతకాని మండలం నాగులవంచలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నాగులవంచకు చెందిన రైతు జొన్నలగడ్డ మల్లికార్జున్రావు పొలం మీదుగా రోడ్డు నిర్మాణం చేసేందుకు స్థానిక నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. రోడ్డు నిర్మాణ పనులను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఆయనపై కొద్దిరోజుల నుంచి ఒత్తిడి తీసుకురావడమే కాక బెదిరిస్తున్నారని రైతు చెబుతున్నాడు. అంతేకాక ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు పనులు చేపట్టి తీరుతామని ఆదివారం పొక్లెయినర్ను పని ప్రదేశంలోకి తీసుకొచ్చారు. భట్టి మా వెంట ఉన్నారని బెదిరింపులు? ఓపక్క బెదిరించడమే కాక రోడ్డు పనులను అడ్డుకుంటున్నాడంటూ గ్రామానికి చెందిన కొందరు రైతులు మల్లికార్జున్రావుపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో రోడ్డు నిర్మాణం తప్పదని భావించిన ఆయన సోమవారం తన పొలంలోనే చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకుని సెల్పీ వీడియో తీసుకున్నాడు. ‘రోడ్డు వేయాలని గత మూడు రోజుల నుంచి అంబటి వెంకటేశ్వరరావు(మత్కేపల్లి మార్కెట్ చైర్మన్) ఆధ్వర్యాన కొందరు పొలం వద్దకు వచ్చి నాపై దాడి చేస్తామని బెదిరిస్తున్నారు.... మా పొలం దాటాక కిలోమీటర్ రోడ్డు ఉన్నా నాకు ఉన్న ఎకరం చేను వరకే రోడ్డు పోస్తామంటున్నారు.. తాటి చెట్లు సాదుకున్నాం.. నా పట్టా భూమిలో ఉన్న డొంక అది... కేసు పెడతాం, ఎమ్మార్వో, ఎస్సైకు చెబుతామని బెదిరిస్తున్నారు... నేను ఒక్కన్నే అయిపోయిన... మందు తాగుదామనుకుంటున్న... పొక్లెయినర్ డొంకలోకి దిగగానే తాగి చచ్చిపోదామనుకుంటున్నా... భట్టి గారు ఉండు మాకు, మీరు ఏమి చేస్త్తారని నిన్న పొలం దగ్గర బెదిరించారు... పొక్లెయినర్ తీసుకువచ్చి ఇక్కడ పెట్టారు’ అంటూ బాధిత రైతు తీసుకున్న సెల్పీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో స్పందించిన పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని వివరాలను సేకరించడమే కాక రోడ్డు పనులను నిలిపివేయించారు.కాంగ్రెస్ నేతలు వేధిస్తున్నారని రైతు ఆవేదన -
గ్రీన్ఫీల్డ్ హైవేపై తప్పిన ప్రమాదం
వైరా/సత్తుపల్లి: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై సోమవారం రోడ్డు ప్రమాదం జరగగా ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. వైరా మండలం సోమవరం వద్ద ముందు వెళ్తున్న బోలేరో వాహనాన్ని ఫార్చునర్ కారు ఢీకొట్టగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సత్తుపల్లిలోని మదర్థెరిస్సా విద్యాసంస్థల ఛైర్మన్ చలసాని సాంబశివరావు ఫార్చునర్లో హైవే మీదుగా ఖమ్మం నుంచి సత్తుపల్లి వస్తున్నారు. ఇదే మార్గంలో ముందు మొక్కల లోడ్తో వెళ్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి అడ్డదిడ్డంగా వెళ్లినట్లు తెలిసింది. ఈమేరకు వెనుకాల ఉన్న ఫార్చునర్ ఆ వాహనాన్ని ఢీకొట్టగా ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో బెలూన్లు తెరుచుకోవడంతో సాంబశివరావు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనలో బొలేరో వాహనం డ్రైవర్ కాలు విరగగా, ఫార్చునర్ డ్రైవర్కు సైతం గాయాలయ్యాయి. ఘటనపై వైరా ఎస్సై పుష్పాల రామారావు కేసు నమోదు చేయగా, ప్రమాదం విషయం తెలియడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తదితరులు సాంబశివరావుకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. కాగా, గ్రీన్ఫీల్డ్ హైవేపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున కారణాలపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలు -
ఖమ్మంలో సౌత్ ఏషియా బాడీబిల్డింగ్ చాంపియన్షిప్
ఖమ్మం స్పోర్ట్స్: ప్రతిష్టాత్మక 17వ సౌత్ ఏషియాన్ బాడీ బిల్డింగ్ అండ్ బెస్ట్ ఫిజిక్ చాంపియన్షిప్ టోర్నీ నిర్వహణకు ఖమ్మంను వేదికగా ఖరారు చేశారు. వచ్చే ఏడాది జూలై, ఆగస్టులో ఈ టోర్నీ జరగనుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి తెలిపారు. ఖమ్మంలో టోర్నీ నిర్వహించాలని సోమవారం ఢిల్లీలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయాను కలిసి వినతిపత్రం అందించగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. దేశ రాజధానులకే పరిమితమయ్యే అంతర్జాతీయ స్థాయి పోటీలు ఖమ్మంలో జరగనుండగా.. భారత్, భూటాన్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల నుంచి 150 మంది క్రీడాకారులు, 300 మంది టెక్నికల్ అధికారులు హాజరవుతారని ఎంపీ తెలిపారు. సౌత్ ఏషియాన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జనరల్ బాడీ జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్నన్న నిర్ణయాన్ని జాతీయ అధ్యక్షుడు స్వామి రమేష్ తన దృష్టికి తీసుకురాగా కేంద్ర క్రీడల మంత్రికి వివరించడంతో సానుకూలంగా స్పందించారని వివరించారు. ‘పీఎం – సేతు’ హబ్ కేటాయించాలని వినతి ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాకు ‘పీఎం–సేతు’ హబ్ కేటాయించాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని ఎంపీ రఘురామిరెడ్డి కోరారు. పరిశ్రమలు కేంద్రీకృతమైన ప్రాంతాలకే ఐటీఐల ఆధునీకరణ పరిమితం చేయకుండా, గ్రామీణ, గిరిజన ప్రాంతాలకూ ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం ఐటీఐని హబ్గా గుర్తించి, కొత్తగూడెం తదితర ఐటీఐలను అనుసంధానించాలని కోరారు. అంతేకాక ఖమ్మంలో మిరప ప్రాసెసింగ్, ఫుడ్–ప్రాసెసింగ్ స్కిల్ సెంటర్ల ఏర్పాటు, కొత్తగూడెంలో ట్రైబల్ స్కిల్ అండ్ ఎనర్జీ – మైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడమే కాక ఈవీలు, సోలార్ ఎనర్జీ, డ్రోన్లు, రోబోటిక్ కోర్సులు ప్రవేశపెట్టాలని విజ్ఞప్తిచేశారు. ఎంపీ వినతితో కేంద్ర క్రీడల మంత్రి సానుకూల స్పందన -
మున్సిపల్, అటవీ శాఖల మధ్య వివాదం
సత్తుపల్లి టౌన్: సత్తుపల్లిలోని విరాట్ నగర్ కాలనీలో జామాయిల్ చెట్ల తొలగింపు విషయంలో అటవీశాఖ, మున్సిపల్ అధికారుల మధ్య వివాదం నెలకొంది. ఇటీవల ఆ ప్రాంతంలో జామాయిల్ చెట్టు విరిగి ఇంటిపై పడడంతో స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చెట్లు నరికించాలని ఆయన ఆదేశించగా మున్సిపల్ కమిషనర్ కొండ్ర నరసింహ, తహసీల్దార్ సత్యనారాయణ సోమవారం విరాట్నగర్ వెళ్లి ఇళ్లకు ఆనుకుని ప్రమాదకరంగా ఉన్న చెట్లను నరికించేందుకు ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసి అటవీ శాఖ సిబ్బంది చేరుకుని అడ్డుకున్నారు. చెట్లు నరికితే కేసులు నమోదు చేస్తామని రేంజర్ ఎల్లయ్య స్పష్టం చేయడంతో కమిషనర్ నరసింహ ‘ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారు... అవసరమైతే తనపై కేసులు నమోదు చేసుకోండి.. చెట్లు మాత్రం నరకాల్సిందే’ అని బదులిచ్చారు. దీనికి తోడు స్థానికులు కూడా చెట్లు నరకాల్సిందేనని పట్టుబట్టగా తహసీల్దార్ సర్దిచెప్పారు. కాగా, ప్రస్తుతం ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించి, ఆ తర్వాత నిబంధనల మేరకు అన్నింటినీ తొలగిస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు. జామాయిట్ చెట్ల తొలగింపు వేళ వాదన -
అలా.. ముగిసింది!
● 45 రోజులపాటు సాగిన ‘సర్’ ప్రక్రియ ● చివరి రోజున హడావుడి ● అర్ధరాత్రి వరకు సాగిన డిజిటలైజేషన్సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ జిల్లాలో సోమవారం ముగిసింది. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించడానికి, ఆ ఫారాలను డిజిటలైజేషన్ చేసేందుకు చివరి రోజు కావడంతో హడావుడి కనిపించింది. జిల్లాలో ఆదివారం నాటికి 87.25 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తవగా, పాలేరులో అత్యధికంగా.. ఖమ్మం నియోజకవర్గంలో అతితక్కువగా నమోదైంది. రెండు సార్లు గడువు పొడిగింపు అర్హత ఉన్న వారి పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా చూడడంతోపాటు చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన, రెండేసి చోట్ల ఓట్లు కలిగిన వారిని తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో ఈ ప్రక్రియ జూన్ 25న మొదలైంది. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, తిరిగి సేకరణ, డిజిటలైజేషన్ కోసం జిల్లాలో 1,460 మంది బీఎల్ఓలను నియమించారు. ఈమేరకు 12,43,781 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా.. సేకరణ, డిజిటలైజేషన్ పూర్తికి తొలుత జూలై 24 వరకు గడువు విధించారు. ఆతర్వాత ఈనెల 3, మళ్లీ 10వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఎట్టకేలకు పూర్తి ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్ల చేతికి అందినా వివరాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2002 ఓటరు జాబితాలో పేరు చూసుకోవడం, సీరియల్ ఇతర నంబర్లు తెలుసుకోవడం భారంగా మారింది. చదువుకున్న వారే ఈ విషయంలో తడబడగా.. నిరక్షరాస్యులకు తీరని సమస్యగా మారింది. దీంతో కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రాలతోపాటు గ్రామపంచాయతీల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయడంతో ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ క్రమంగా పెరుగుతూ వచ్చింది. అలాగే వివిధ పార్టీల ఆధ్వర్యాన బూత్ లెవల్ ఏజెంట్లను నియమించగా వారు కూడా ఫారాలు నింపడంలో ఓటర్లకు సహకరించారు. 9వ తేదీ నాటికి 87 శాతం జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ఆదివారం నాటికి 87.25 శాతం పూర్తయింది. పాలేరు నియోజకవర్గంలో అత్యధికంగా 92.17 శాతం పూర్తయింది. అతి తక్కువగా ఖమ్మం నియోజకవర్గంలో 75.25 శాతమే చేయగలిగారు. మధిర, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలోనే నమోదైంది. సోమవారంతో ‘సర్’ గడువు ముగియగా గత 45 రోజులుగా పనిచేస్తున్న అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్ఐఆర్కి సంబంధించి పూర్తి గణాంకాలు మంగళవారం వెల్లడికానున్నాయి.రెండు సార్లు గడువు పెంచినా చాలామంది చివరి రోజైన సోమవారం వరకు కూడా ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వలేదు. దీంతో బీఎల్ఓలు ఊర్లలో లేని వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, మృతిచెందిన వారిని మినహాయించి ఫారాలు ఎవరెవరో ఇవ్వలేదో జాబితా పరిశీలిస్తూ ఇళ్లకు వెళ్లి ఆరా తీశారు. అంతేకాక పలువురి నుంచి ఫారాలు స్వీకరించి అక్కడికక్కడే డిజిటలైజేషన్ చేసే పనుల్లో రాత్రి పొద్దుపోయే వరకు నిమగ్నమయ్యారు. -
గడువు సమీపిస్తోంది..
● రేషన్, గ్యాస్కు ఈ–కేవైసీ తప్పనిసరి ● రేషన్కార్డుదారులకు 30వరకు, గ్యాస్కు 15 ఆఖరి తేదీ ● జిల్లాలో పలువురు లబ్ధిదారుల పెండింగ్ఖమ్మం సహకారనగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే సంక్షేమ పథకాలు ఆగిపోకుండా లబ్ధిదారులు ఈ–కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలనే నిబంధన విధించారు. అయితే, జిల్లాలోని రేషన్ లభ్ధిదారులు, గ్యాస్ కనెక్షన్లు కలిగిన పలువురు ఇప్పటివరకు ఈ–కేవైసీ చేయించుకోలేదు. గడువు సమీపిస్తున్నందున త్వరపడకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోయే అవకాశం ఉన్నందున ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. రేషన్లో భేష్.. జిల్లాలో రేషన్కార్డులు 4,73,271 ఉండగా... వీటిలో 13,36,126 మంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే, కార్డుపై పేరు ఉన్న ప్రతీ వ్యక్తి ఈ–కేవైసీ చేయించుకోవాలి. కానీ ఇప్పటి వరకు 11,09,369 మంది ఈ–కేవైసీ పూర్తి కాగా.. 83.3 శాతంతో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన నిలిచింది. అయినా ఇంకా 2,26,757 మంది మిగిలిపోయాయి. ఈనెల 31వ తేదీ వరకు గడువు ఉన్నందున లబ్ధిదారులు ముందుకు రావాల్సి ఉంది. ఇలా తెలుసుకోండి... ఈ–కేవైసీ పూర్తయిందో, లేదో లబ్ధిదారులు సులువుగా తెలుసుకునే వీలుంది. ఇందుకోసం https:// smartpds.telangana.gov. in/ src& Trans& int లింక్ తెరిచి రేషన్ కార్డు నెంబర్, క్యాప్చర్ నమోదు చేయాలి. కుటుంబీల వివరాల పక్కన యాక్టివ్ అని వస్తే ఈ–కేవైసీ అయినట్లు, ఇన్ యాక్టివ్ అని ఉంటే కానట్లు భావించాలి. ఈనెల 31వ తేదీ వరకు ఈ–కేవైసీ చేయించు కోకపోతే బియ్యం పంపిణీ నిలిచిపోయే అవకాశంఉందని అధికారులు చెబుతున్నారు. గ్యాస్కు ఐదు రోజులే... జిల్లాలో చాలా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లకు ఈ–కేవైసీ పూర్తికాలేదు. ఈ కారణంగానే గ్యాస్ బుకింగ్, సరఫరాలో జాప్యం జరుగుతోంది. వంట గ్యాస్ వినియోగంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ–కేవైసీ విధానాన్ని 2023లో ప్రారంభించగా, చాలామంది ముందుకు రావడం లేదు. ఈక్రమాన ఈనెల 15వ తేదీన గడువు ముగియనుండగా ఈ–కేవైసీ చేయించుకోవాలని, లేనిపక్షంలో సబ్సిడీ అందకపోగా పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుందని డీలర్లు చెబుతున్నారు. రేషన్కార్డు, గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్న వినియోగదారులు నిర్దేశిత గడువులోగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. ఈ నెల 31 తేదీ వరకు రేషన్షాపుల్లో చేయించుకునే అవకాశం ఉంది. గ్యాస్ వినియోగదారులైతే ఏజెన్సీలో కానీ, మొబైల్ యాప్లో కానీ ఈనెల 15వ తేదీలోగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. – చందన్కుమార్, డీసీఎస్ఓ -
‘సర్’లో బీఎల్ఏల పాత్ర అభినందనీయం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో అధికారులను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏలు) ఓటర్లకు సహకరించారని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. జిల్లాలోని 1,460 బూత్లకు ఇప్పటివరకు 1,276 బూత్ల్లో 95 – 100 శాతం, 172 బూత్ల్లో 90 – 95 శాతం, 12 బూత్ల్లో 80 – 90 శాతం నమోదు పూర్తయిందని వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో పనిచేసిన మండల, పపట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్లు, సూపర్వైజర్లు, ముఖ్య నాయకులకు ఆయన ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. 50 గంటల పాటు ‘ప్రజా కళాజాతర’ ఖమ్మం మామిళ్లగూడెం: యాభై ఏళ్ల ప్రజా సాంస్కృతిక ప్రస్థానాన్ని పురస్కరించుకుని వచ్చేనెల 26న ఉదయం 10 గంటల నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 12గంటల వరకు 50గంటల పాటు ‘ప్రజా కళాజాతర’ పేరిట ఆటాపాట నిర్వహిస్తున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క వెల్లడించారు. ఖమ్మంలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజా సంస్కృతి నిర్మాణంలో భాగమైన సంస్థలు, శక్తులను, వ్యక్తులందరినీ ఈ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని విమలక్క పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అరుణోదయ సాంస్కతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్సూర్, పోతుల రమేష్, ఏపీ ప్రధాన కార్యదర్శి సుధాకర్తో పాటు భాస్కర్, విజయ్, దర్శి రాకేష్, అనిత తదితరులు పాల్గొన్నారు. కాపర్ వైర్ల చోరీ కేసులో నలుగురి అరెస్ట్ఖమ్మం రూరల్: వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేసిన మోటార్లు, స్టార్టర్ బాక్సులే కాక ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్ చోరీ చేస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ సీఐ ముష్క రాజు సోమవారం వివరాలు వెల్లడించారు. ఖమ్మంలోని వివిధ కాలనీలకు చెందిన అంగులూరి ఏసుపాల్, షేక్ మహ్మద్ రఫీ, పొగరత్తి వెంకటేష్, వెండి రాము కొంతకాలంగా ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తల్లాడ, ఖమ్మం అర్బన్, చింతకాని, కొణిజర్ల, వేంసూరు మండలాల్లోని మోటార్లు, స్టార్టర్ బాక్సులతో పాటు ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్ను చోరీ చేస్తున్నారు. ఈమేరకు సోమవారం చేపట్టిన వాహనాల తనిఖీల్లో వీరు పట్టుబడగా పది మోటార్లు, 100 కిలోల కాపర్ వైర్, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామని వెల్లడించారు. నందీశ్వరస్వామికి అభిషేకంపాల్వంచరూరల్: పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయ సముదాయంలో నూతనంగా నిర్మించిన శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో మాఘమాసం త్రయోదశిని పురస్కరించుకుని సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ నందీశ్వరస్వామికి పంచామృతా భిషేకం, అష్టోత్తర శతనామార్చన, నీరాజనం, మంత్రపుష్పం పూజ లు నిర్వహించారు. నేడు రుద్రహోమం మాసశివరాత్రిని పురస్కరించుకుని పెద్దమ్మ తల్లి ఆలయంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి రుద్రహోమం నిర్వహించనున్నట్లు ఈఓ విజయ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పూజలో పాల్గొనే భక్తులు రూ. 1,516 చెల్లించి గోత్ర నామాలు నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 63034 08458 నంబరులో సంప్రదించాలని కోరారు. -
తెలంగాణ – ఏపీ పోలీసుల సమన్వయ భేటీ
నేరాల కట్టడికి సంయుక్త తనిఖీలపై చర్చమధిర: రాష్ట్ర సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ఇసుక అక్రమ రవాణా కట్టడి చేసేలా తెలంగాణ – ఏపీ రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో విధులు నిర్వర్తించనున్నారు. ఈమేరకు మధిరలో సోమవారం తెలంగాణలోని ఖమ్మం జిల్లా, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పోలీసు అధికారులు సమావేశమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో నేరస్తుల కదలికలు, చోరీలు, ఇసుక అక్రమ రవాణా, జూదం తదితర అంశాలపై సమాచార మార్పిడి చేసుకుంటూ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లి నేరాలకు పాల్పడే వ్యక్తులపై దృష్టి సారించేలా సమాచారం వేగంగా ఇచ్చిపుచ్చుకోవాలనే అంశంపై చర్చించారు. వైరా, మైలవరం ఏసీపీలు సారంగపాణి, రామచంద్రరావు, మధిర రూరల్, తిరువూరు, మదిర టౌన్, వైరా సీఐలు డి.మధు, గిరిబాబు, దోమల రమేష్, వైవీ.ప్రసాద్, ఎస్ఐలు పాల్గొన్నారు. -
రేక్ పాయింట్కు 2,635 మె.టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్కు ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 2,635.47 మెట్రిక్ టన్నుల యూరియా సోమవారం చేరింది. ఈ యూరియాలో ఖమ్మం జిల్లాకు 1,275.47 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 600 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 660 మె.టన్నులు సరఫరా చేశామని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు. మిగతా 100 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్గా నిల్వ చేసినట్లు వెల్లడించారు. పార్ట్టైం విధానంలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ భద్రాచలంటౌన్: ఖమ్మం రీజియన్లోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఫ్యాకల్టీ పోస్టులను పార్ట్టైం విధానంలో భర్తీ చేయనుండగా, అర్హులైన గిరిజన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. డిగ్రీ, పీజీలో 55శాతం మార్కులు కలిగి ఉండి, బీఈడీ, టెట్ ఉత్తీర్హులైన వారు అర్హులని పేర్కొన్నారు. మహిళా విభాగంలో టీజీటీ(హిందీ, గణితం, బయోసైన్స్, సోష ల్), జేఎల్(బోటనీ) ఐదు పోస్టులు ఉండగా, జనరల్ విభాగంలో పీజీటీ(హిందీ, ఇంగ్లిష్, సోషల్), జేఎల్(జువాలజీ) నాలుగు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సర్టి ఫికెట్ల జిరాక్స్లతో ఈనెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా భద్రాచలం ఐటీడీఏలోని ఆర్సీఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 85001 36628 నంబర్లో సంప్రదించాలని సూచించారు. మార్కులు, డెమో ఆధారంగా ఎంపిక ఉంటుందని పీఓ తెలిపారు. గురుకుల డిగ్రీ కళాశాలల్లో.. ఖమ్మం రీజియన్లోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీఓ రాహుల్ తెలిపారు. పీజీలో 55శాతం మార్కులతో పాటు నెట్/సెట్/పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల్లో కామర్స్ ఆరు, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ రెండేసి పోస్టులతో పాటు గణితం, బోటనీ, కంప్యూటర్ సైన్స్, పొలిటికల్ సైన్స్ ఒక్కో పోస్టు భర్తీ చేస్తామని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సర్టిఫికెట్ల జిరాక్స్లతో ఈనెల 13న సాయంత్రం 5గంటల్లోగా పాల్వంచ కేఎల్ఆర్ పీజీ కళాశాల ప్రాంగణంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 98489 65711, 79893 25024 నంబర్లలో సంప్రదించాలని పీఓ సూచించారు. క్రికెట్ మ్యాచ్లో జిల్లా జడ్జి జట్టు విజయం ఖమ్మం లీగల్: రానున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాదులకు నిర్వహిస్తున్న పోటీల్లో భాగంగా సోమవారం జ్యూడీషియల్ అధికారులు, ఉద్యోగుల జట్టు – న్యాయవాదుల జట్ల నడుమ స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో జిల్లా జడ్జి జట్టు ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యాయవాదుల జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 99 పరుగులు చేయగా, రావూరి శ్రీను, దిలీప్ చెరో 20 పరుగులు చేశారు. అనంతరం జిల్లా జడ్జి జట్టు 13 ఓవర్లలోనే 103 పరుగులు చేయడంతో విజయం సాధించింది. జట్టులో రాజేష్ అర్ధ సెంచరీ సాధించగా జిల్లా జడ్జి నాగరాజు బ్యాటింగ్, బౌలింగ్లో ప్రతిభ కనబరిచారు. అంతేకాక రావుల వెంకట్ – కె.ఉపేందర్రెడ్డి జట్లు తలపడగా వెంకట్ జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు సీనయ్య, ప్రవీణ్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు యడ్లపల్లి రమేష్, కొప్పుల రవితో పాటు జానీమియా, కొల్లి సత్యనారాయణ, మందడపు శ్రీనివాసరావు, రామారావు, నారాయణ, రాంబ్రహ్మం, పవన్, వెంకట్ నారాయణ పాల్గొన్నారు. రూ.7.50కోట్ల విలువైన ధాన్యం పక్కదారి తల్లాడ: తల్లాడలోని విజయదుర్గ రైస్ ఇండస్ట్రీలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం చేపట్టిన తనిఖీల్లో భారీగా ధాన్యం పక్కదారి పట్టిందని గుర్తించారు. వరంగల్ విజిలెన్స్ అధికారులు రైస్ ఇండస్ట్రీలో తనిఖీ చేపట్టి ధాన్యం నిల్వలు, రికార్డులను పరిశీలించిన విషయం విదితమే. ఈమేరకు రూ.7.50 కోట్ల విలువైన 2449.384 మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు తేల్చారు. దీంతో విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో మిల్లు యజమాని బండారు నరసింహారావుపై కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్లువైరా సీఐ వెంకప్రసాద్ తెలిపారు. -
ప్రజాస్వామ్య పరిరక్షణకు మార్పు అవసరం
కారేపల్లి/కామేపల్లి/రఘునాథపాలెం/కొణిజర్ల: దేశంలో బీజేపీ వ్యవహరిస్తున్న విధానాలతో ప్రజాస్వామ్యం ప్రమాదటంచుకు చేరిందని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ పేర్కొన్నారు. ఈమేరకు ప్రజాస్వామ్య పరిరక్షణకు మార్పు అత్యవసరమని ఆయన తెలిపారు. పార్టీ ఆధ్వర్యాన చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర సోమవారం కారేపల్లి, కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో సురేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కేంద్రం రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చకపోగామరింత సంక్షోభంలోకి నెట్టిందని, ఎరువుల ధరలు పెంచి భారం మోపిందని తెలిపారు. ఇక రాష్ట్రంలో రుణమాఫీ అమలు చేయలేకపోయారని విమర్శించారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలనే అమలు చేస్తూ ఆ పార్టీ నాయకులకే పథకాలు అందిస్తుండగా మిత్ర ధర్మాన్ని ఎక్కడా పాటించడం లేదన్నారు. కాగా, రఘునాథపాలెం మండలం పాపటపల్లి, చిమ్మపుడి గ్రామాల్లో మహ్మద్ రజబ్ అలీ విగ్రహాల వద్ద నాయకులు నివాళులర్పించారు. కాగా, యాత్ర శనివారం రాత్రి కొణిజర్ల మండలంలోకి ప్రవేశించగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు బాగం హేమంతరావు తదితరులు మాట్లాడారు. ఈ యాత్రలో సీపీఐ రాష్ట్ట్ర, జిల్లా నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, ఎర్రా బాబు, ఏపూరి లతాదేవి, స్వర్ణ రమేష్, అజ్మీరా రామ్మూర్తి, రావి శివరామకృష్ణ, ఆనందరావు, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, రాయల రామారావు, అజ్మీరా నరేష్, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, పోటు కళావతి, సింగు నర్సింహారావు, సీతామహాలక్ష్మి, సిద్దినేని కర్ణకుమార్, తాటి నిర్మల, పగడాల మల్లేష్, శాఖమూరి శ్రీనివాసరావు, దొండపాటి రమేష్, ఎం.వెంకటరెడ్డి, గడల భాస్కరరావు, తోటపల్లి సీతారాములుతో పాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. యాత్రలో సీపీఐ జిల్లా కార్యదర్శి సురేష్ -
రెవెన్యూ.. అక్రమాలు
భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు చేసే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించగా కొందరు చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అవసరమైన పత్రాలను పరిశీలించకుండానే ఇటీవల ఓ తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయగా, ఇదేమిటని అడిగితే నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని సర్దిచెప్పారని సమాచారం. చాలాచోట్ల అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.వివాదంలో ఉన్నా.. జిల్లాలో సమగ్ర భూ సర్వే కింద కాకరవాయి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. గ్రామంలోని మొత్తం భూమిని రెవెన్యూ యంత్రాంగం సర్వే చేయగా.. భూమి వివరాలు పరిశీలంచుకోవాలని రైతులకు నోటీసులు ఇచ్చారు. ఇదేగ్రామంలో ఓ భూమిపై వివాదంలో ఉండడం, కోర్టు పరిధిలో కేసు కొనసాగుతుండగా అది తేలేవరకు ఎలాంటి లావాదేవీలు జరపొద్దనే ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా వివాదంలో ఉన్న ఈ భూమిని రెవెన్యూ అధికారులు రెండు నెలల క్రితం రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇదేమిటని వారసులు అడిగితే కోర్టులో ఉందనే విషయం తమకు తెలియదంటూ దాటవేసినట్లు సమాచారం. నిబంధనలన్నీ బేఖాతర్ కాకరవాయికి చెందిన ఓ వ్యక్తి భార్యకు పసువు కుంకుమ కింద ఆమె తల్లిదండ్రుల నుంచి 10 ఎకరాల వ్యవసాయ భూమి సంక్రమించింది. ఈ దంపతులకు ఉన్న ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కుమార్తె దివ్యాంగురాలు. మిగిలిన ఇద్దరిని వివాహాలు జరిగాయి. సదరు వ్యక్తి భార్య ఐదేళ్ల క్రితం మృతి చెందగా ఆమె పేరిట ఉన్న భూమిని తన పేరుపైకి మార్చుకునేందుకు రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. అయితే, భూమి పంపకాలపై అప్పటికే కోర్టులో కేసు ఉండగా, విషయాన్ని వారసుల్లో ఒకరు తిరుమలాయపాలెం తహసీల్దార్, కూసుమంచి రిజిస్ట్రార్, ఖమ్మం రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాక భార్య పేరిట ఉన్న భూమిని మార్చాలంటే ఫ్యామిలీ సర్టిఫికెట్ లేదా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ లేదా కోర్టు ఉత్తర్వులు ఉండాలి. అంతేకాక కుటుంబ సభ్యుల ఆధార్కార్డులు ఉండాలి. కానీ ఫ్యామిలీ సర్టిఫికెట్లో కూతుర్ల పేరు లేకుండా.. కేవలం సదరు వ్యక్తి పేరు మాత్రమే ఉంది. ఇక భూబదలాయింపు సమయాన ఇద్దరు కూతుర్లకు సమాచారం ఇవ్వకపోగా అభ్యంతరాలను స్వీకరించలేదు. ఆయన అన్ రిజిస్టర్డ్ వీలునామా సమర్పించినా అధికారులు చట్టబద్ధతపై విచారణ చేయలేదు. ఆపై రెండు నెలల క్రితం ఆయన పేరిట రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఆ తర్వాత అదే నెలలో ముగ్గురు కుమార్తెల్లో ఒకరి పేరిట కొంత, ఇతర వ్యక్తుల పేరుపై కొంత రిజిస్ట్రేషన్, జీపీఏ చేపించాడు. ఇవన్నీ ఒకే రోజు చేయడం విశేషం. కాకరవాయికి చెందని ఓ వ్యక్తి తన భార్య చనిపోయిందని, ఆమె రాసిన వీలునామా ప్రకారం భూమిని తన పేరిట మార్చాలని కోరాడు. కుటుంబంలో ఓ కూతురితో వివాదం ఉందని మొదట నా దృష్టికి రాలేదు. ఈ వ్యవహారంలో కోర్టు ఉత్తర్వులు ఉన్నా, ప్రస్తుతం అవి అమల్లో(ఫోర్స్) లేవు. వివాదం తెలియగానే లావాదేవీలు, బదిలీలను పూర్తిగా హోల్డ్లో పెట్టాం. కాకరవాయి పరిధిలో రీ–సర్వే పూర్తయ్యే వరకు రిజిస్ట్రేషన్లు, బదిలీలు జరగవు. – లూథర్ విల్సన్, తహసీల్దార్, తిరుమలాయపాలెంరైతులు ఇబ్బంది పడొద్దని ప్రభుత్వం భూసమస్యలకు పరిష్కారం చూపేలా భూభారతి చట్టం తీసుకొచ్చారు. గతంలో ఉన్న ధరణిలో చాలా భూములు నిషేధిత జాబితాలో పడడంతో రైతులు క్రయవిక్రయాలకే కాక రిజిస్ట్రేషన్ల సమయంలోనూ అవస్థ పడ్డారు. అయితే, ఇప్పుడు చట్టంలో మార్పులు తీసుకొచ్చినా రైతుల ఇక్కట్లు తీరడం లేదు. పీఓబీ, ఇతర సమస్యలతో రైతులు అధికారుల చుట్టూ తిరుగుతుండగా, ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ డేకు చాలావరకు ఇటువంటి సమస్యలే వస్తున్నాయి. భూ భారతి చట్టం, నిబంధనలు తూచ్ గత ప్రభుత్వ హయాంలో అమలుచేసిన ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినా రెవెన్యూ శాఖలో అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. కొత్త చట్టంలోని నిబంధనలను విస్మరిస్తున్న కొందరు రెవెన్యూ అధికారులు దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు చేస్తుండడం గమనార్హం. ఇటీవల మృతి చెందిన మహిళ పేరిట ఉన్న భూమిని వారసుల అంగీకారం లేకుండానే ఆమె భర్త పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఘటన వెలుగు చూసింది. అంతకుముందే వారసులు కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చినా పరిగణనలోకి తీసుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. భూముల రీసర్వేకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో ఈ ఘటన చోటుచేసుకోగా వారసుల్లో ఒకరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం -
మనోహరం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలంలో రామయ్య కల్యాణం మనోహరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం స్టేడియం ప్రాంగణంలోని రామ సేవామండపంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. అర్చకులు స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని పూర్తిచేశారు. శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి పాల్వంచలోని బాపూజీ నగర్కు చెందిన కట్టెకోల యాదగిరిరావు రూ.లక్ష విరాళం అందించారు. ఈఓ దామోదర్రావు వారికి రశీదును అందచేశారు. -
ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి.. కుటుంబీకుల ఆరోపణలు
తెలంగాణ: ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం: ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్న అనంతరం బాలిక మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చోటుచేసుకుంది. వైద్యంలో భాగంగా అధిక మోతాదులో మందులు, ఇంజక్షన్ ఇవ్వడం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించసాగారు.కుటుంబీకుల వివరాల ప్రకారం.. కొణిజర్ల మండలం లింగగూడెం గ్రామానికి చెందిన చల్లా హేమశ్రీ (13) కొణిజర్ల కస్తూరిబా కళాశాలలో 8వ తరగతి చదువుతోంది. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం వరకు గ్రామస్తులు, స్నేహితులతో కలిసి హేమశ్రీ ఉత్సాహంగా గడిపింది. అనంతరం బాలికకు జలుబు, దగ్గు రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాలికకు ఇంజక్షన్ ఇవ్వడంతో పాటు మందులు అందించారు. కానీ కాసేపటికే బాలిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారగా, విషయాన్ని గ్రహించిన కుటుంబీకులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన ఆస్పత్రి వైద్యులు పరిస్థితి విషమించిందని అప్పటికే మార్గం మధ్యలోనే మృతి చెందిందని చెప్పారు.అయితే, ఆర్ఎంపీ డాక్టర్ అధిక మోతాదులో మందులు ఇవ్వడం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అనంతరం బాలిక మృతదేహాన్ని పోలీసుల ఆధ్వర్యంలో స్వగ్రామానికి తరలించారు. కుటుంబీకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. అలాగే, బాలిక మృతికి గల అసలు కారణాలు ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. -
ఐర్లాండ్ గడ్డపై ప్రతిభ చాటిన తెలంగాణ బిడ్డలు
వైరా: ఐర్లాండ్లో ఈనెల 8వ తేదీన నిర్వహించిన మిస్ ఇండియా యూనివర్స్ ఐర్లాండ్ పోటీల్లో ఖమ్మం జిల్లా వైరాకు చెందిన మాదినేని నిఖిత ఫస్ట్ రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2022లో అక్కడ ఎంఎస్ పూర్తి చేసిన ఆమె అక్కడే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్గా ఉద్యోగం చేస్తోంది. ఈ నేపథ్యాన ఐర్లాండ్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యాన భారత్ నుంచి వెళ్లి ఐర్లాండ్లో ఉంటున్న యువతులకు ఇటీవల నిర్వహించిన పోటీల్లో తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన 18 మంది పాల్గొన్నారు. ఐర్లాండ్లోని డబ్లిన్లో జరిగిన పోటీల్లో ఫస్ట్ రన్నరప్గా నిఖిత నిలవగా, ఆ తర్వాత స్థానాల్లో కేరళకు చెందిన అన్మోల్, వరంగల్కు చెందిన రాజరాజేశ్వరి నిలిచారు. ఈ సందర్భంగా నిఖిత ‘సాక్షి’తో మాట్లాడుతూ స్టేజీ ఫెర్పార్మెన్స్ను పరిశీలించడమే కాక న్యాయనిర్ణేతలు పలు ప్రశ్నలు అడిగారని తెలిపారు. అపజయాలు ఎదురైనప్పుడు ఎలా స్పందిస్తావన్న ప్రశ్నకు మనోధైర్యం కోల్పోకుండా మళ్లీ ప్రయత్నం చేస్తానని వెల్లడించింది. కాగా, నిఖిత తల్లి సునీత వైరా 12వ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవగా ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఐర్లాండ్ అందాల పోటీల్లో ఆమె నెగ్గడంపై తల్లిదండ్రులు, వైరా వాసులు అభినందించారు. -
ప్రజా సమస్యలపై పోరాటమే యువజన కాంగ్రెస్ లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: యువశక్తిని జాతీయ నిర్మాణానికి వినియోగించడంతో పాటు విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల సాధన, ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడడమే యువజన కాంగ్రెస్ లక్ష్యమని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తెలిపారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సత్యనారాయణ, రాయల నాగేశ్వరరావు జెండా ఆవిష్కరించారు. అనంతరం నూతి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నిరసించడం, న్యాయం కోరడం యువత హక్కులని తెలిపారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువత గొంతుకను అణచివేసే కుట్రలు చేస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. నాయకులు వేజండ్ల సాయికుమార్, బాలాజీనాయక్, కొత్త సీతారాములు, శేఖర్గౌడ్, బొడ్డు బొందయ్య, సయ్యద్ గౌస్, అనిల్, గంగరాజు, షాహెల జావిద్ తదితరులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ -
నమ్మాలి... ఇవి నగర రోడ్లే !
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని అంతర్గత, ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి. కొన్ని రోడ్లు వేసి చాన్నాళ్లు కావడంతో వాహనాల రద్దీతో దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల కేబుల్, నీటి పైపు లైన్ల కోసం తవ్వకాలు చేపట్టాక సరిగా కాంక్రీట్ చేయకపోవడంతో గుంతలు పడ్డాయి. వీటిని తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారే తప్ప కొత్త రోడ్లు వేయకపోవడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంమొత్త రోడ్లు 1,132 కిలోమీటర్లు.. ఖమ్మం నగరంలోని 60 డివిజన్లకు గాను సీసీ, బీటీ, డబ్ల్యూబీఎం (వాటర్ బౌండ్ మకాడమ్), కచ్చా రోడ్లు అన్నీ కలిపి 1,132 కి.మీ. మేర ఉన్నాయి. కార్పొరేషన్ ఏర్పాటు సమయాన విలీన గ్రామాల్లో ఇంకా పాత రోడ్లే దర్శనమిస్తున్నాయి. కొన్ని కాలనీల్లో కొత్తగా రోడ్లు వేస్తున్నా.. పాత రోడ్ల మరమ్మతులను పట్టించుకోవడం లేదు. సీసీ, బీటీ రోడ్లపై ఓ వైపు పగుళ్లు ఏర్పడగా మరో వైపు గుంతలు తేలాయి. ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటనల సమయాన తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నా కొత్త రోడ్లకు మోక్షం లభించక.. సీసీ రోడ్లు వేయాలని గత కార్పొరేటర్లు చేసిన ప్రతిపాదనలు పెండింగ్లోనే ఉన్నాయి. ప్రధాన రహదారులు అంతే.. గ్రీన్ఫీల్డ్ హైవే తెరవకముందు వరకు ఉమ్మడి జిల్లాతో పాటు సరిహద్దున ఉన్న ఏపీలోని పలు ప్రాంతాలకు వాహనాల రాకపోకలు ఖమ్మం నగరం మీదుగానే సాగాయి. గ్రీన్ఫీల్డ్ రహదారి తెరుచుకున్నా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాక వందల సంఖ్యలో వాహనాలు నగరం నుంచే వచ్చివెళ్తున్నాయి. ఇవన్నీ భారీ లోడ్తో వెళ్తుండడంతో రోడ్లు చాలాచోట్ల దెబ్బతిన్నాయి. ●పాత బస్టాండ్ నుంచి జెడ్పీసెంటర్ వరకు రహదారి చాలాచోట్ల దెబ్బతిన్నది. రాపర్తినగర్ బైపాస్ రోడ్డు.. కొత్తబస్టాండ్ నుంచి రైల్వే బ్రిడ్జి, మున్నేరు బ్రిడ్జి వరకు పలు చోట్ల గుంతలు ఏర్పడగా నయాబజార్ సర్కిల్ నుంచి ఎఫ్సీఐ గోదాం రోడ్డు గుంతలు తేలి దుమ్ము, ధూళితో ఇబ్బంది ఎదురవుతోంది.కోతకు గురైన అల్లీపురం రహదారిగట్టయ్య సెంటర్లో...ద్వారకానగర్లో...గుట్టల బజార్లో...ఖమ్మం వన్టౌన్ పరిధిలోని బోనకల్ క్రాస్ రోడ్డు, కమాన్బజార్, గౌంధీచౌక్, ఖిల్లా రోడ్డు, బ్రాహ్మణ బజార్, పాత బస్టాండ్ ప్రాంతం, పాకబండ బజార్, ముస్తాఫనగర్, అల్లీపురం రోడ్డు టూటౌన్ ప్రాంతంలోని బస్డిపో రోడ్డు, రాపర్తినగర్, సరిత క్లినిక్ రోడ్డు, మామిళ్లగూడెం, మమతా రోడ్డు త్రీటౌన్లోని పీఎస్ఆర్ రోడ్డు, శ్రీనివాస్నగర్, ప్రకాశ్నగర్, కాల్వొడ్డు రోడ్లు కేబుల్, పైపులైన్ల కోసం ఇష్టారీతిన తవ్వకాలు -
ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
● గిరిజన అభివృద్ధి శాఖ డీడీ ఫిరంగి ● ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఖమ్మంమయూరిసెంటర్: ఆదివాసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారి అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని గిరిజన అభివృద్ధి శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఎం.ఫిరంగి తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ఆదివారం నిర్వహించారు. తొలుత గిరిజన బాలుర కళాశాల పీఎంహెచ్ వసతిగృహంలో జెండా ఎగురవేయగా, జెడ్పీసెంటర్ నుంచి గిరిజన భవనం వరకు ఆదివాసీ సాంస్కృతిక కళారూపాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సభలో డీడీ ఫిరంగి మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను వివరించారు. అనంతరం ఆదివాసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం సతీష్ మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, 1976 నాటి జీఓ ఆధారంగా పొందుతున్న ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, మహారాష్ట్ర, కర్ణాటకల్లో నిర్వహిస్తున్నట్లుగానే తెలంగాణలో కూడా ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఓ పి.రమేష్, ఏసీఎంఓ రాములు, వసతిగృహ సంక్షేమ అధికారులు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. బంజారా భవనం నుండి.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా లంబాడీల ఆధ్వర్యాన బంజారా భవనం నుండి గిరిజన భవన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ మాట్లాడారు. ఆదివాసీ విద్యార్థులు, లంబాడీ విద్యార్థులు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. లంబాడీ విద్యార్థులు ఉదయం, ఆదివాసీలు మధ్యాహ్నం తర్వాత సభ నిర్వహించుకునేలా సమన్వయం చేశారు. -
జమలాపురంలో ఆషాఢమాస పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయడమే కాక అలివేలు మంగ అమ్మవారికి సర్పంచ్ తుళ్లూరి నిర్మలకుమారి–కోటేశ్వరరావు దంపతులు బోనాలు, సారె సమర్పించారు. అలాగే, అర్చకులు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదం, స్వామి మూలవిరాట్కు అభిషేకం, స్వామి నిత్యకల్యాణం, పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పీజీలో నాలుగు కొత్త కోర్సులు రేక్ పాయింట్కు చేరిన కాంప్లెక్స్ ఎరువులు చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్కు ఆదివారం కాంప్లెక్స్ ఎరువులు చేరాయి. ఇందులో డీఏపీ 394.800 మెట్రిక్ టన్నులు, 20.20.0.13 ఎరువులు 723.250 మె.టన్నులతో పాటు ఎంఓపీ 255.200 మె. టన్నులు ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖా ధికారి డి.పుల్లయ్య వెల్లడించారు. ఈ ఎరువుల ను మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రత్యేక బెటాలియన్లో అదనపు డీజీపీ సత్తుపల్లి: సత్తుపల్లి మండలం గంగారంలోని 15వ ప్రత్యేక బెటాలియన్ను అదనపు డీజీపీ సంజయ్కుమార్ జైన్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏకలవ్యుడి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన బెటాలియన్లోని ఎంటీ గ్యారేజ్, ఆడిటోరియం, బీటీసీ ట్రైనింగ్ సెంటర్, ప్రధాన కార్యాలయం, క్వార్టర్లు, ఫైరింగ్ రేంజ్లను పరిశీలించి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో కమాండెంట్ ఎన్.పెద్దబాబు, వివిధ విభాగాల అధికారులు ఏ.అంజయ్య, బి.వేణుగోపాల్రెడ్డి, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు. వరుణ యాగానికి భద్రగిరి వేదపండితులుభద్రాచలంటౌన్: రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో సోమవారం నిర్వహించనున్న వరుణ యాగం కార్యక్రమానికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన ముఖ్య వైదిక సిబ్బంది, వేదపండితుల బృందం ఆదివారం ప్రత్యేక వాహనంలో బయలుదేరి వెళ్లింది. రాష్ట్రవ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలన్నీ నిండాలని, తద్వారా పాడిపంటలు వర్ధిల్లి రైతాంగం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం ఈ మహా యాగాన్ని తలపెట్టింది. హోమాలు, పూజా కార్యక్రమాల్లో భద్రాద్రి రామాలయ అర్చక స్వాములు కీలక పాత్ర పోషించనున్నారు. వేద పారాయణం నిర్వహించేందుకు ఆలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, ఉప ప్రధాన అర్చకులతో కూడిన వేదపండితుల బృందం బయలుదేరింది. -
శాకంబరి అవతారంలో అమ్మవారు
వాతావరణ ం జిల్లాలో సోమవారం సాధారణ ఉష్ణోగ్రతలే ఉంటాయి. మధ్యాహ్నం ఎండ పెరిగినా సాయంత్రం తర్వాత చల్లబడుతుంది.ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శాకంబరి అలంకరణలో పెద్దమ్మతల్లి, శాకంబరేశ్వరుడి అలంకరణలో శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు వితరణ చేసిన కూరగాయలు, పండ్లు, పూలతో ఆదివారం పాల్వంచ మండలంలోని శ్రీ కనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారిని అలంకరించారు. ఈ అవతారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉమ్మడి జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేయగా, భక్తులు ఒడి బియ్యం, పసుపు కుంకుమ, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజల్లో ఈఓ విజయ్కుమార్, అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు. – పాల్వంచరూరల్ -
‘నిర్మల్ హృదయ్’ అధినేత సాంబశివారెడ్డి మృతి
ఖమ్మంసహకారనగర్: ఖమ్మంలోని నిర్మల్ హృదయ్ స్కూల్ కరస్పాండెంట్ వంగా సాంబశివారెడ్డి (80) ఆదివారం మృతి చెందాడు. ఆయన తన నివాసంలో గుండెపోటుతో మరణించినట్లు కుటుంబీకులు వెల్లడించారు. గుంటూరు జిల్లా కాల్లిపర మండలం వలభాపురంలో జన్మించిన సాంబశివారెడ్డి ఎమ్మెస్సీ పూర్తయ్యాక కొత్తగూడెంలోని రామచంద్ర కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు. ఆ తర్వాత 1978 – 79లో ఖమ్మం ఎన్ఎస్టీ రోడ్లో ఎన్నెస్పీ పిల్లల కోసం నిర్మల్ హృదయ్ స్కూల్ను ప్రారంభించి.. వేలాది మందిని తీర్చిదిద్దారు. కాగా, సాంబశివారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు సుధాకర్రెడ్డి, రవిభరత్రెడ్డి ఉన్నారు. ఆయన మృతిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, పలు పార్టీల నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, బాగం హేమంతరావు, దండి సురేశ్, తమ్మినేని వీరభద్రం, పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, ప్రైవేట్ పాఠశాలల సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్రం కాంతారావుతో పాటు పలు విద్యాసంస్థల చైర్మన్లు మల్లెంపాటి శ్రీధర్, శ్రీవిద్య, రవిమారుత్, గుండాల కృష్ణ, వీరన్న, ఉషాకిరణ్కుమార్, వెంకటేశ్వరరావు, సీహెచ్జీకే ప్రసాద్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
ఒకరి ఆధార్తో ఇంకొకరికి రుణం
డీసీసీబీ మేనేజర్పై కేసు నమోదు వైరా: ఓ వ్యక్తి ఆధార్కార్డు ఉపయోగించి అదే పేరు కలిగిన ఇంకొకరికి పంట రుణం మంజూరు చేసిన బ్యాంకు మేనేజర్పై వైరా పోలీసులు కేసు నమోదు చేశారు. వైరాలోని డీసీసీబీ మేనేజర్ ఎ.అనిత, ఉద్యో గి నరసింహారావు 2024లో వైరా మండలం గన్న వరం గ్రామానికి చెందిన శీలం ప్రసాద్రెడ్డి ఆధార్కార్డు వినియోగించి అదే గ్రామానికి చెందిన శీలం ప్రసాదరెడ్డి (తండ్రి కృష్ణారెడ్డి)కి రూ.2 లక్షల రుణం మంజూరు చేశారు. ఈ విషయం ఇటీవల బయటపడడంతో అసలు ఆధార్ కార్డు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంకు మేనేజర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామారావు తెలిపారు. వరదనీటిలో చిక్కుకున్న భక్తుల కారురైతుల చొరవతో తప్పిన ముప్పు ఏన్కూరు: ఆలయ దర్శనానికి బయలుదేరిన వారి కారు వరదనీటిలో చిక్కుకోగా.. స్థానిక రైతులు అప్రమత్తం కావడంతో క్షేమంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మానికి చెందిన పలువురు మహిళలు ఆదివారం ఉదయం ఏన్కూరు మండలం లోనినాచారం శ్రీఅద్భుత వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చారు. ఆ తర్వాత పాల్వంచ పెద్దమతల్లి, భద్రాచలంలో రామయ్య దర్శనానికి వెళ్లాలని బయలుదేరారు. అయితే, నాచారం ఆలయం సమీపాన వాగు దాటుతుండగా ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో కారు అందులో చిక్కుకుంది. కారు నుంచి బయటకు దిగే క్రమాన ఓ మహిళ నీటిలో కొట్టుకొనిపోతుండగా స్థానిక రైతులు అప్రమత్తమై కాపాడారు. అంతేకాక కారును కూడా ట్రాక్టర్ సాయంతో వరద నుంచి బయటకు లాగగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
హామీల అమలులో విఫలమైన ప్రభుత్వం
మధిర/బోనకల్: ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు విమర్శించారు. పార్టీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ప్రజాచైతన్య యాత్ర శనివారం మధిర, బోనకల్ మండలాల్లో కొనసాగింది. మధిర మండలం మల్లవరం, మధిర, మడుపల్లి గ్రామాల్లో నిర్వహించిన సభల్లో హేమంతరావు మాట్లాడారు. రుణమాఫీ, రైతు బీమా, మహిళలకు రూ.2,500 సహా పలు హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, బోనకల్ మండలంలోని మోటమర్రి, రాయన్నపేట, కలకోట, బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాల్లో జరిగిన యాత్రలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిందని, రైతుల ఉద్యమాలకు తలొగ్గి నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ మళ్లీ దొడ్డిదారిన అమలుకు యత్నిస్తోందని ఆరోపించారు. తొలుత రాయన్నపేటలో తూము ప్రకాష్రావు కాంస్య విగ్రహం, కలకోటలో ఆయన స్తూపానికి సీపీఐ జాతీయ సమితి సభ్యుడు హేమంతరావు నివాళులర్పించగా, యాత్రకు సీపీఎం నాయ కులు సంఘీభావం తెలిపారు. యాత్రలో సీపీఐ నాయకులు బెజవాడ రవిబాబు, జమ్ముల జితేందర్రెడ్డి, ఎర్రా బాబు, ఏపూరి లతాదేవి, సిద్ధినేని కరుణకుమార్, సింగు నర్సింహారావు, సీతామహాలక్ష్మి, ఏనుగు గాంధీ, తోట రామాంజనేయులు, యంగల ఆనంద్రావు, తూము రోషన్కుమార్, కొంగర భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాచైతన్య యాత్రలో సీపీఐ నేత హేమంతరావు -
చోరీకి వెళ్లాడు.. వృద్ధురాలిని హతమార్చాడు
తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలులో ఇటీవల జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు ఆదివారం తిరుమలాయపాలెం పోలీస్స్టేషన్లో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి వివరాలు వెల్లడించారు. పిండిప్రోలుకు చెందిన ఐతనబోయిన ప్రశాంత్ చికెన్షాపు నిర్వహిస్తున్నాడు. మద్యానికి బానిస కావడమే కాక ఆన్లైన్ గేమ్లతో అప్పుల పాలయ్యాడు. షాప్ పక్కనే వృద్ధులైన చెన్న సుగుణ – జనార్దన్ దంపతులు ఉండడం, సుగుణ మెడలో బంగారు ఆభరణాలు ఉండడంతో చోరీకి నిర్ణయించుకున్నాడు. గత నెల 17న అర్ధరాత్రి వ్యాన్ రావడంతో కోళ్లు తీసుకున్న ప్రశాంత్, మాస్క్ ధరించి ఇంటి వెనక వైపు నుంచి వెళ్లి తలుపు కొట్టి నీళ్లుకావాలని అడిగాడు. దీంతో సుగుణ తలుపు తీసి నీళ్లు ఇస్తుండగా ఆమె మెడలోని బంగారు గొలుసు లాగాడు. అప్రమత్తమైన ఆమె పక్కనే డబ్బాలోని కారం గుప్పించడమే కాక మాస్క్ తొలగించి ప్రశాంత్ను గుర్తుపట్టింది. దీంతో ఆందోళనకు గురైన ఆయన ఇనుపరాడ్డుతో సుగుణ తలపై మోదగా అక్కడికక్కడే కన్నుమూసింది. పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనలు వృద్ధురాలైన సుగుణను హత్య చేశాక ప్రశాంత్ ఆమె బంగారు గొలుసును షాపు పక్కన దాచి ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లారికల్లా హత్య విషయం బయటపడడంతో ఏమీ తెలియనట్టు స్థానికులతో కలిసి పరిశీలించాడు. అంతేకాక గ్రామంలో దొంగతనాలు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన చేయగా.. నిందితుడు అందులో పాల్గొనడం గమనార్హం. ఈ క్రమాన కూసుమంచి సీఐ సంజీవ్ నేతృత్వాన ప్రత్యేక బృందాలు గ్రామాన్ని జల్లెడ పట్టినా క్లూ లభించలేదు. ఆ తర్వాత ప్రశాంత్ 25 గ్రాముల బంగారు గొలుసును తన సమీప బంధువైన మరిపెడ మండలం ధర్మారానికి చెందిన సరగండ్ల మహేశ్కు ఇచ్చి ఆయన ద్వారా తాకట్టు పెట్టాక రూ.1.50 లక్షల నగదు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఈ మేరకు దర్యాప్తులో భాగంగా పలువురి కాల్డేటా, ఆర్థిక లావాదేవీలు పరిశీలిస్తుండగా ప్రశాంత్పై అనుమానం వచ్చింది. దీంతో మహేశ్ని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. ఈ మేరకు నిందితుడు ప్రశాంత్తో పాటు బంగారం తాకట్టుకు సహరించిన మహేశ్ను సైతం అరెస్ట్ చేశారు. కాగా, కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సీఐ సంజీవ్, తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్ ఎస్ఐలు జగదీశ్, సంతోష్, నాగరాజు, హరికృష్ణతో పాటు సిబ్బంది పూర్ణచందర్రావు, శ్రీలత, కిషన్, రాంబాబు, తొంటా శ్రీనును ఏసీపీ అభినందించిన వారికి రివార్డులు అందజేశారు. కాగా, పిండిప్రోలులో మరో రెండు చోరీ కేసుల్లోనూ విచారణ కొనసాగుతోందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ ఈ సందర్భంగా తెలిపారు. కాల్డేటా, నగదు లావాదేవీల ఆధారంగా నిందితుల అరెస్ట్ -
ముక్కకు తంటా
ధరల మంట..ఖమ్మంవ్యవసాయం: కోళ్ల దాణా ధరలు మండి పోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న దాణా ఖర్చులతో కోళ్ల పెంపకంపై భారం పడుతోంది. పెరిగిన ఉత్పత్తి ఖర్చు భారం చికెన్ ప్రియులే భరించక తప్పటం లేదు. ప్రస్తుతం మార్కెట్లో చికెన్ ధర రూ.320 వరకు చేరడంతో సామాన్యులు మొద లు మధ్య తరగతి కుటుంబాలకు భారమైంది. పెరిగిన దాణా ధరలు దాణా ధరలు కొద్ది రోజుల వ్యవధిలో 25 – 75 శాతం వరకు పెరిగాయి. ఈ ప్రభావంతో ధర 40 శాతం మేర పెరిగింది. రెండు నెలలుగా మొక్కజొన్న, సోయా, బియ్యం తవుడు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కోళ్ల పరిశ్రమ ఒత్తిడికి గురవుతూ.. పౌల్ట్రీ రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఒక కోడిని పెంచేందుకు గతంలో రూ.70 – రూ.80వరకు ఖర్చయితే ఇప్పుడు అది రూ.100కు చేరింది. ఉత్పత్తి తగ్గించిన రైతులు దాణా ఖర్చు పెరగడంతో నిర్వహణ భారం భరించలేక పౌల్ట్రీ రైతులు కోళ్ల ఉత్పత్తి తగ్గించారు. మరోపక్క ఇటీవల ఏసీ పౌల్ట్రీలు పెరుగుతున్నాయి. వీటిలో తక్కువ ఖర్చు, తక్కువ వ్యవధిలోనే కోడి సిద్ధమవుతోంది. వీటితో పోలిస్తే సాధారణ ఫారాల్లో కోళ్ల ఉత్పత్తి ధర ఎక్కువగా ఉండడం నిర్వాహకులపై భారం పడుతోంది. దీనికి తోడు ఇప్పుడు దాణా ధరలు పెరగడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గిస్తున్నారు. జిల్లాలో 25 – 30 వరకు పెద్ద పౌల్ట్రీ ఫారాలు ఉండగా, చిన్న పరిశ్రమలు వందల సంఖ్యలో కొనసాగుతున్నాయి. చికెన్ ప్రియులపై భారం పెరిగిన చికెన్ ధరలు వినియోగదారులకు భారంగా మారుతున్నాయి. కరోనా తర్వాత చికెన్కు ప్రాధాన్యత పెరిగింది. ప్రోటీన్లు ఉండే ఆహారం కావడం.. మటన్ ధర రూ.వేయి దాటడంతో చాలామంది చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు. సామాన్యులు మొదలు మధ్య తరగతి, ఉన్నత స్థాయి వర్గాలు వారానికి ఒకసారి చికెన్ తింటున్నారని అంచనా. గతంలో కిలో రూ.200 వరకు ఉన్న చికెన్ ధర ప్రస్తుతం ప్రాంతాల వారీగా రూ.300 నుంచి రూ.320 పలుకుతుండడం సామాన్య, మధ్య తరగతి వారిపై భారమవుతోంది. ప్రస్తుత ధరగత ధరదాణా రకం పెరుగుదలరూ.160 నుంచి రూ.200 ఉన్న కిలో చికెన్ ఇప్పుడు రూ.320కి విక్రయిస్తున్నారు. ఈ ధరతో వారానికి ఒకసారి కొనుగోలు చేయడం భారంగా ఉంది. ప్రొటీన్ ఫుడ్గా చికెన్కు ప్రాధాన్యత ఇస్తున్నా ధరల పెరుగుదల ఇబ్బందికరంగా మారింది. –సోమారపు సుధీర్, ప్రకాష్నగర్, ఖమ్మం దాణాలో మొక్కజొన్నతో పాటు సోయా, బియ్యం తవుడు ధరలు పెరిగి కోడి ఉత్పత్తి ఖర్చు బాగా పెరిగింది. రూ.80 మేర విక్రయించాల్సిన లైవ్ కోడిని రూ.130తో అమ్మినా ప్రయోజనం ఉండడం లేదు. ఫారాల నిర్వహణ ఆశానకంగా లేదు. –రావి బాబూరావు, శ్రీనివాసనగర్, ఖమ్మం -
నిరుద్యోగులకు ఉచిత ఆన్లైన్ కోచింగ్
ఖమ్మంసహకారనగర్: ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి పోలీస్, గ్రూప్స్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఏడాది పాటు ఉచిత ఆన్లైన్ కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆర్సీ ఎగ్జామ్స్ చైర్మన్ మెండెం కిరణ్కుమార్ తెలిపారు. పోస్టర్లను ఆదివారం మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్రెడ్డి ఆవిష్కరించగా కిరణ్కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలోనే పేరున్న కరీం, కృష్ణారెడ్డి, పాషా తదితర అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఆన్లైన్ కోచింగ్ ఇప్పిస్తామని తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు kiranyuvasena. comలో వివరాలు నమోదు చేసుకోవాలని, వివరాలకు 83990 99499 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
వైరారూరల్: వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామ సమీపాన ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగితో పాటు ఆయన కుటుంబీకులు గాయపడ్డారు. వైరా మున్సిపాలిటీ పరిధి బ్రాహ్మణపల్లికి చెందిన ప్రశాంత్ మణుగూరు ఏరియా కొండాపురం భూగర్భ గనిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం భార్యాపిల్లలతో కలిసి స్వస్థలానికి వచ్చి తిరిగి కారులో వెళ్తూ ముందున్న లారీని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమాన ఎదురుగా వచ్చిన మరో లారీని ఢీకొట్టగా ప్రశాంత్తో పాటు ఆయన భార్య ఆశఅంజని, కుమార్తెలు యవనశ్రీ, నేహాశ్రీ, ధ్వనికశ్రీకి గాయాలయ్యాయి. అయితే, ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయి ప్రశాంత్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో పోలీసులు, స్థానికులు గంట పాటు శ్రమించి బయటకు తీశారు. ఇదే సమయాన అటుగా వెళ్తున్న వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ అంబులెన్స్ రావడం ఆలస్యంం కావడంతో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ ఏర్పాటు చేసిన ప్రైవేట్ వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. లారీడ్రైవర్ బాలాజీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.రామారావు తెలిపారు. లారీని ఓవర్టేక్ చేస్తూ ఇంకో లారీని ఢీకొట్టిన కారు -
రోడ్డు ప్రమాదంలో సుతారి మేసీ్త్ర మృతి
నేలకొండపల్లి: మండలంలోని అమ్మగూడెం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుతారి మేసీ్త్ర మృతి చెందాడు. అమ్మగూడెంనకు చెందిన సుతారి మేసీ్త్ర గండు రంగయ్య (55) తన వాహనంతో పెట్రోల్ బంక్ సమీపాన నిలబడ్డాడు. ఈ క్ర మాన కూసుమంచి నుంచి నేలకొండపల్లి వెళ్తున్న ట్రాలీ ఆటో ఢీట్టడంతో తీవ్రగాయాలైన ఆయనను ఖమ్మం తరలించగా అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. ఆయన కుమార్తె అనూష ఫిర్యాదుతో డ్రైవర్ ప్రకాష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. వరినాట్లు వేయిస్తూ కౌలు రైతు..రఘునాథపాలెం: వరినాట్లు వేయిస్తూ కౌలు రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని చిమ్మపుడి గ్రామానికి చెందిన కటకం వెంకన్న (48) తన సొంత భూమి 30 కుంటలతో పాటు 9 ఎకరాల భూమి ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. కూలీలు వరినాట్లు వేస్తుండగా పొలంలో మందు చల్లుతున్న వెంకన్న ఒక్కసారి కూప్పకూలాడు. కుటుంబ సభ్యులు, కూలీలు ఆయనకు సీపీఆర్ చేసి బయటకు తీసుకొచ్చేలోగా మృతి చెందాడు. కాగా, మృతుడికి భార్యతో పాటు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యాన్ ఢీకొట్టడంతో రైతు...కూసుమంచి: ఖమ్మం – సూర్యాపేట జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు మాలోత్ సుక్యా (55) మృతి చెందాడు. మండలంలోని భగవత్వీడుతండాకు చెందిన ఆయన టీవీఎస్ మోపెడ్పై ఇంటి నుంచి గంగబండతండాకు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాల పాలైన సుక్యా అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపటం వల్లే ప్రమాదం జరిగిందని రైతు కుమారుడు కృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
స్టీల్ బల్లల కోసం రూ.1,00,116 విరాళం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం యూపీహెచ్ కాలనీలోని శ్రీస్వయంభూ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో వసతుల కల్పనకు గోకుల్ ఏజెన్సీ అధినేత చంద్రకాని శేషగిరిరావు, ఆయన కుమారులు రమేశ్, రంజిత్ రూ.1,00,116 విరాళం అందజేశారు. ఈ నగదుతో ఆలయ అన్నదానం క్యూలైన్లో భక్తులు కూర్చునేలా స్టీల్ బల్లలు తయారీ చేయించాలని ఆలయ నిర్వాహకులను కోరారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అల్లిక అంజయ్య తదితరులు దాతలను అభినందించారు. నేటి జైల్ భరోను జయప్రదం చేయండిఖమ్మంమయూరిసెంటర్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం తలపెట్టిన జైల్భరోను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్(టీయూసీఐ అనుబంధం) రాష్ట్ర కార్యదర్శి జి.రామయ్య పిలుపునిచ్చారు. ఖమ్మం రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో నగర ఉపాధ్యక్షుడు కిన్నెర నారాయణ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం ఖమ్మం జెడ్పీ సెంటర్ నుంచి టూ టౌన్ పోలీస్స్టేషన్ వరకు నిర్వహించే ర్యాలీలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు డి.గురవయ్య, బాబు, శ్రీను, సుధాకర్, నాగరాజు, యుగంధర్, సరస్వతి, సత్యవతి, లక్ష్మి, మోహన్, దేవా, ధర్మయ్య, అనిల్, నరసయ్య పాల్గొన్నారు. పీఆర్సీ ప్రకటించి పదోన్నతులు కల్పించాలి ఖమ్మంసహకారనగర్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించా లని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో జిల్లా అధ్య క్షుడు షేక్ రంజాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి ఎంఈఓ, జేఎల్, డైట్, బీఈడీ కాలేజీల్లోని ఖాళీ పోస్టు లను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. అంతేకాక కాంగ్రెస్ ఎన్నికల వేళ ఇచ్చి న హామీ మేరకు పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపు, పాత పింఛన్ విధానం పునరుద్ధరణపై స్పందించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లయినా సమస్యల పరిష్కా రంపై ప్రభుత్వం ఉదాసీన వైఖరిని నిరసిస్తూ ఈ నెల 12,13 తేదీల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపి, ప్రభుత్వం స్పందించకపోతే 19న కలెక్టరేట్ల వద్ద నిరసనలు, 29న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో నాయకులు బుర్రి వెంక న్న, షమీ, వల్లంకొండ రాంబాబు, బానోత్ రాందాస్, సురేశ్, ఉద్దండ్, నాగేశ్వరరావు, నర్సయ్య, పద్మ, నిర్మలాకుమారి, రామారావు, నాగూర్వలీ, సుధాకర్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. పేకాటరాయుళ్ల అరెస్టు రెండు చోట్ల రూ.32,500 నగదు స్వాధీనం ఎర్రుపాలెం/తల్లాడ: ఎర్రుపాలెం మండలంలోని సఖినవీడు సమీపాన పేకాట కేంద్రంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని ఐదు మోటారు సైకిళ్లు, రూ.23,800 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.రమేశ్కుమార్ తెలిపారు. అలాగే, తల్లాడలోని గొల్లగూడెం వెళ్లే రహదారిలో గుంటు చెరువు సమీపాన ఎస్ఐ వెంకటకృష్ణ, సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతూ పది మంది పట్టుబడగా, రూ.8,700 నగదు, ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోక్సో కేసులో నిందితుడి రిమాండ్ వైరా: మైనర్ బాలికతో మద్యం మత్తులో శనివారం రాత్రి అసభ్యకరంగా ప్రవర్తించిన వైరా వాసి గౌరవరపు డేవిడ్ అలియాస్ జగదీశ్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ మేరకు ఆయనను మధిర కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం రిమాండ్కు తరలించారు. -
నేను కావాలంటే మీ అత్తను చంపేయ్
● మూడో మహిళ కోరిందని రెండో భార్య తల్లి హత్య ● ఆపై మృతదేహాన్ని తగలబెట్టిన నిందితులు సత్తుపల్లి: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళను తన అత్త, భార్య తిట్టి, కొట్టి అవమానించారనే కోపంతో వృద్ధురాలిని హత్య చేసిన ఆమె అల్లుడితో పాటు ఆయనతో సంబంధం కలిగిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సత్తుపల్లి పోలీస్స్టేషన్లో ఆదివారం వైరా ఏసీపీ సారంగపాణి వివరాలను వెల్లడించారు. సత్తుపల్లి మండలం తుమ్మూరుకు చెందిన గుండాల వెంకటనరసమ్మ (65) కుమార్తె మంగను వెదుళ్ల తిరుపతిరావు వివాహం చేసుకున్నాడు. అంతకు ముందే మరో మహిళను పెళ్లాడినా ఆమెను వదిలేసి మంగతో పాటు తుమ్మూరులో ఉంటున్నాడు. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన పగుట్ల సునీతతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై తరచూ గొడవలు జరుగుతుండగా, ఇటీవల వెంకటనర్సమ్మ, మంగ కలిసి వెళ్లి దుద్దిపూడిలో పని చేస్తున్న సునీతను తిట్టి, కొట్టారు. దీన్ని అవమానంగా భావించిన సునీత తనతో వివాహేతర సంబంధం కొనసాగించాలంటే వెంకటనరసమ్మను హతమార్చాలనితిరుపతిరావుకు సూచించింది. ఇంట్లో టీవీ చూస్తుండగా.. ఈ నెల 2వ తేదీన వెంకటనర్సమ్మ ఇంట్లో ఉండడాన్ని గమించిన తిరుపతిరావు, సునీత వెనుక నుంచి వెళ్లి చీర కొంగును ఆమె మెడను బిగించి హత్య చేశారు. అంతేకాక మృతదేహాన్ని అదేరోజు రాత్రి ద్విచక్ర వాహనంపై నారాయణపురం శివారుకు తీసుకెళ్లి అక్కడ చెత్తాచెదారం వేసి బైక్ నుంచి పెట్రోల్ తీసి తగలబెట్టారు. మరుసటి రోజు రాత్రి మళ్లీ వెళ్లేసరికి మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో భాగాలను మరికొంత దూరం తీసుకెళ్లి పూర్తిగా తగలబెట్టారు. తొలుత వెంటనర్సమ్మ కానరావడం లేదని అందిన ఫిర్యాదుతో విచారిస్తుండగా.. ఆమెను హత మార్చినట్లు తిరుపతిరావు గ్రామ సర్పంచ్ వీరబాబు, జీపీఓ లక్ష్మణ్కు చెప్పాడు. దీంతో పోలీసులు తిరుపతిరావు, సునీతను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో సత్తుపల్లి పట్టణ ఎస్ఐ తుమ్మలపల్లి శ్రీహరి, ఎస్ఐలు వీరప్రసాద్, ప్రదీప్ పాల్గొన్నారు. -
అత్తను హత్య చేసి తగులబెట్టిన అల్లుడు
సత్తుపల్లి: పెద్ద మనుషుల సమక్షాన నిర్వహించిన పంచాయితీలో డబ్బులు, బంగారం ఇవ్వాలని తీర్పు రావడంతో కక్ష గట్టిన వ్యక్తి తన అత్త (భార్య తల్లి)ను హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం, తుమ్మూరుకు చెందిన వెదుళ్ల వెంకటనరసమ్మ(60) పెద్ద కూతురు మంగకు తిరుపతిరావుతో 30 ఏళ్ల క్రితం వివాహం అయింది. కొంతకాలానికి తిరుపతిరావుకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మంగకు చెందిన బంగారం, రూ.50 వేల నగదును తిరుపతి ఆ మహిళకు ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయమై మంగ, నరసమ్మ పెద్ద మనుషుల వద్ద ఈనెల 1వ తేదీన పంచాయితీ పెట్టించగా, ఆరు నెలల్లో నగదు, బంగారం తిరిగి ఇవ్వాలని పంచాయితీలో తీర్పు చెప్పినట్లు సమాచారం.ఆ రెండో రోజే హత్యతిరుపతిరావు పంచాయితీ జరిగిన రెండో రోజే హత్య చేసినట్లు తెలిసింది. తల్లి కనిపించడం లేదని మంగ పోలీసులకు ఫిర్యాదు చేసింది, పోలీసులు విచారించగా సెల్ఫోన్ చార్జింగ్ వైర్ నరసమ్మ మెడకు బిగించి హత్య చేసి, నారాయణపురం – బేతుపల్లి మధ్య రోడ్డు పక్కన తోటలో మృతదేహాన్ని తగలబెట్టినట్లు తిరుపతిరావు ఒప్పుకున్నాడు. పోలీసులు శనివారం ఘటనాస్థలి నుంచి ఎముకలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. తిరుపతిరావును, అతడికి సహకరించిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. హత్యలో మరెవరైనా పాల్గొన్నారా, మృతదేహాన్ని నారాయణపురం తరలించడానికి ఎవరైనా సహకరించారా అనే కోణాల్లో సత్తుపల్లి పట్టణ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి దర్యాప్తు మొదలుపెట్టారు.భార్యతో గొడవపడి.. ఇంటికి నిప్పు పెట్టిన భర్తపక్కింటికి కూడా వ్యాపించిన మంటలునవీపేట: భార్యతో గొడవపడిన వ్యక్తి.. మద్యం మత్తులో తన ఇంటికే నిప్పు పెట్టాడు. మంటలు పక్కింటికి కూడా వ్యాపించడంతో లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మోకన్పల్లిలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. మోకన్పల్లి గ్రామానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి (వీఆర్ఏ) అల్లం సురేశ్ తరచూ భార్య ఉమతో గొడవపడేవాడు. పలుమార్లు పెద్ద మనుషులు జోక్యం చేసుకుని పంచాయితీపెట్టి రాజీ కుదిర్చారు. తాగుడుకు బానిసైన సురేశ్.. శుక్రవారం రాత్రి ఎప్పటిలాగే మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు. అర్ధరాత్రి వరకు గట్టిగా అరుస్తూ భార్యను కొట్టడంతో.. విషయం తెలుసుకున్న పుట్టింటివారు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. మద్యం మత్తులో తెల్లవారే వరకు కేకలు వేసిన సురేశ్.. శనివారం ఉదయం అదే మత్తులో పెట్రోల్ పోసి ఇంటి పైకప్పుకు నిప్పంటించాడు. మంటలు పక్కనే ఉన్న అల్లం సాయిబాబా ఇంటికీ వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంట్లోని వస్తువులు కాలిబూడి దయ్యాయని, రూ. లక్ష మేర ఆస్తినష్టం జరిగిందని సాయిబాబా తెలిపారు. సాయిబాబా ఫిర్యాదు మేరకు సురేశ్పై కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిపై పోక్సో కేసు
వైరా: బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పార్టీ ఇన్చార్జ్గా చెలామణి అవుతున్న గౌరవరపు డేవిడ్రాజ్ శనివారం మద్యం మత్తులో వైరాకు చెందిన 11 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లి గణితం చెబుతానంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. సాయంత్రం ఈ ఘటన జరగగా కూలీ పనులకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక విషయం చెప్పడంతో వారు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఐ పుష్పాల రామారావు చేరుకుని డేవిడ్రాజ్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. కాగా, డేవిడ్పై గతంలోనే రౌడీషీట్ నమోదైంది.సాయం చేస్తానంటూ నగదు చోరీ నేలకొండపల్లి: దివ్యాంగులకు సాయం చేస్తాను, కొంత డబ్బు చెల్లిస్తే అంతకు మించి ఇస్తానని నమ్మబలికిన వ్యక్తి రూ.15 వేలు చోరీ చేసిన ఘటన ఇది. నేలకొండపల్లికి చెందిన మండల కేంద్రంలో ఓ దివ్యాంగుడు శనివారం స్కూటీపై పెట్రోల్ బంక్ వద్ద ఉండగా, పల్సర్ బైక్పై మాస్క్ పెట్టుకున్న గుర్తుతెలియని యువకుడు వచ్చాడు. ఎంత డబ్బు ఉంటే అంతకు మించి సాయం చేస్తాననడంతో సదరు దివ్యాంగుడు జేబులో రూ.15 వేల నగదు తీస్తున్నాడు. ఆ నగదు తాను లెక్కిస్తానంటూ యువకుడు లాక్కుని పరారయ్యాడు. అదే సమయాన వచ్చిన చెన్నారానికి చెందిన దివ్యాంగుడు వీరయ్య తన వాహనంపై వెంబడించినా నిందితుడు వేగంగా వెళ్లిపోవడంతో దొరకలేదు. నంబర్ ప్లేట్ లేని వాహనంపై మాస్క్ ధరించి తిరుగుతున్న వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. స్కూటీ అపహరణ సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి తుమ్మూరి రామారావు వీధిలో స్కూటీని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ తన ఇంటిముందు శుక్రవారం రాత్రి స్కూటీ పార్క్ చేశాడు. అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీని అపహరించగా, ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మృతుడు రేపల్లెవాడ వాసి.. చింతకాని: చింతకాని రైల్వేస్టేషన్ సమీపాన గురువారం వందేభారత్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడి ఆచూకీ గుర్తించారు. మృతుడిని చింతకాని మండలం రేపల్లెవాడ గ్రామానికి చెందిన మేడగాని భిక్షం (75)గా గుర్తించగా, ఆర్థిక సమస్యలతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. కాగా, ఛిద్రమైన మృతదేహానికి అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు ఆధ్వర్యాన శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. -
ఆధునికత దిశగా..
పాల్వంచరూరల్: ప్రకృతితో మమేకమై అటవీ ప్రాంతాల్లో జీవనం సాగించిన ఆదివాసీలు క్రమంగా ఆధునికత వైపు అడుగులు చేస్తున్నారు. ప్రభుత్వ సదుపాయాలు, సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ చైతన్యం, ముందడుగు ఆదివాసీ సమాజం మొత్తంలో లేదు. పాలకులు, ఉన్నతాధికారులు, అభ్యుదయ, స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహిస్తే ఆదివాసీలు అందరూ ప్రగతిబాట పట్టే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా ఆదివాసీ ప్రజలు అధిక సంఖ్యలో జీవనం సాగిస్తున్నారు. తొలుత అడవే వీరి జీవనానికి ప్రధాన ఆధారంగా ఉండేది. పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా ఉపాధి పొందేవారు. క్రమంగా వ్యవసాయం చేయడంతోపాటు వివిధ రకాల వృత్తి, పరిశ్రమల్లో పనులు చేస్తున్నారు. మరికొందరు ఉన్నత విద్య చదివి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నతస్థాయి కొలువులు కూడా చేపడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వస్త్రధారణపైనా ఆసక్తి చూపుతున్నారు. పలువురుఉన్నత చదువులపై దృష్టి సారిస్తున్నారు. ఐఐటీ, ఎన్ఐటీల్లో, ఎంబీబీఎస్, డిగ్రీ, పీజీలు చేస్తున్నవారు అనేక మంది ఉన్నారు. ఐటీడీఏ పరిధిలో 32 గురుకుల, ఆశ్రమ పాఠశాలలు ఉండగా, 14,253 గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 60 శాతం మంది ఆదివాసీలే ఉన్నారు. భద్రాచలం: ఆదివాసీ సంప్రదాయ కొమ్మునృత్యం నేడు యువతకు ఉపాధిగా మారింది. కొమ్ము పాగా ధరించి డోలు వాయిస్తూ లయబద్ధంగా చేసే నృత్యం ఆకట్టుకుంటుంది. ఇద్దరు నృత్యకారులు ఎగురుతూ ధరించిన కొమ్ములతో ఢీ కొట్టే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. దీన్నే రేలా నృత్యం అని కూడా పిలుస్తారు. పురుషులు అడవి దున్న లేదా ఎద్దు కొమ్ములతో తయారు చేసిన ప్రత్యేకమైన కిరీటాన్ని తలకు ధరిస్తారు. శరీరంపై నెమలి ఈకలు, వర్ణరంజితమైన దుస్తులు, చేతిలో డప్పు (తుడుము) కనిపిస్తాయి. తొలుత ఆదివాసీ గ్రామాల్లోనే ప్రదర్శించే ఈ నృత్యం ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యక్రమాలు, శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలలో, ప్రముఖుల పర్యటనల్లో ప్రదర్శిస్తున్నారు. దీంతో కొందరు ఆదివాసీ యువకులు సంస్కృతిని కాపాడుకుంటూనే కొమ్ము నృత్యంతో ఉపాధి పొందుతున్నారు. గొత్తికోయ గిరిజన గ్రామాల్లో మూల ఆదివాసీ సంక్షేమ సంఘం (మాస్ ), గిరిజన పెద్దలు కలిసి ఆదివాసీ పల్లెల్లో డీజేలను వినియోగించొద్దని నిర్ణయించుకున్నారు. సంప్రదాయ నృత్యాలను ప్రోత్సహిస్తున్నారు. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం -
పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు?
తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలు లో జరిగిన ఓ వృద్ధురాలి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది. గ్రామానికి చెందిన చెన్న సుగుణ గత నెల 17న రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా, ఆభరణాల చోరీ కోసం వచ్చిన వారితో కారం, కత్తిపీటతో ప్రతిఘటించింది. దీంతో అదే కత్తిపీటతో ఆమె తలపై తీవ్రంగా కొట్టగా మృతి చెందిన విషయం విదితమే. ఈ మేరకు పోలీసులు గ్రామాన్ని జల్లెడ పట్టి అనుమానితులను విచారించడంతో పాటు పలువురి కాల్డేటాను పరిశీలించారు. ఈ క్రమాన వృద్ధురాలి ఇంటి సమీపాన చికెన్షాపు నిర్వహిస్తున్న ఓ యువకుడి కదలికలపై నిఘా వేసి ఆయన ఆర్థిక లావాదేవీలు, కాల్ డేటాను పరిశీలించడంతో నిందితుడిగా తేలినట్లు సమాచారం. ఆయన తన సమీప బంధువు ద్వారా పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేసినట్లు తేలడంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఆ యువకుడి సోదరుడు, సమీప బంధువును కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చోరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్న నగదు లావాదేవీల ఆధారంగా పోలీసులు కేసు చేధించినట్లు తెలుస్తుండగా, హత్యకు ఉపయోగించిన వస్తువులు, బంగారాన్ని రికవరీ చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. అంతేకాక ఇదే గ్రామంలో జరిగిన ఇంకొన్ని ఘటనల్లో నిందితుల పాత్ర ఉందా అని విచారిస్తున్నట్లు సమాచారం.కాల్డేటా, లావాదేవీల ఆధారంగా గుర్తింపు -
వైభవోపేతంగా వరుణయాగం
సత్తుపల్లి(పెనుబల్లి): అతివృష్టి, అనావృష్టి లేకుండా దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పెనబల్లి మండలంలోని శ్రీ నీలాద్రీశ్వర దేవస్థానంలో శనివారం వరుణయాగం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనంతో యాగ ప్రాంగణం కిక్కిరిసిపోగా, వేద మంత్రోచ్ఛరణలతో ఆలయం మార్మోగింది. సకాలంలో వర్షం కురవాలని, రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వేద పండితులు, అర్చకులు యాగం నిర్వహించారు. అర్చకులు కేతముక్కల పవన్కుమార్శర్మ, మాధవ్ పర్యవేక్షణలో పలు ప్రాంతాల అర్చకులు అనిపెద్ది ప్రసన్నకుమార్శర్మ, సుబ్రహ్మణ్యశర్మ నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఆలయ ఈఓ రజనీకుమారి, ఇన్నోవేషన్ కమిటీ చైర్మన్ చీకటి నరసింహారావు, సభ్యులు మిట్టపల్లి నరేంద్ర, మాణిక్యాల ప్రసాద్, గంగిశెట్టి జగదీశ్కుమార్, శ్రీనివాస్, సత్యనారాయణ, దేవాలయ ఉద్యోగులు ఏర్పాట్లను పర్యవేక్షించగా భక్తులకు అన్నప్రసాదం అందజేశారు.నీలాద్రీశ్వర ఆలయానికి తరలివచ్చిన భక్తులు -
స్నేహితుల కుటుంబాలకు చేయూత
కారేపల్లి: ఆపదలో ఉన్న స్నేహితుల కుటుంబానికి చిన్ననాటి మిత్రులు అండగా నిలిచారు. మండలంలోని మాధారం గ్రామానికి చెందిన రమేశ్ తల్లి లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ క్రమాన రమేశ్తో కలిసి మాధారం కేవీ విద్యానికేతన్లో 10వ తరగతి చదివినవారు ఆయనకు శనివారం రూ.27 వేలు అందించారు. అలాగే, గుంపెళ్లగూడెంనకు చెందిన వీరన్న మృతి చెందడంతో ఆయన కుమార్తె పేరిట రూ.1.10 లక్షలను డిపాజిట్ చేసి బాండ్ అందజేశారు. కార్యక్రమంలో కేవీ విద్యానికేతన్ కరస్పాండెంట్ కప్పెర రంగారావు, పూర్వ విద్యార్థులు బాదావత్ రవి, అజ్మీరా నరేశ్, బోడ రమేశ్నాయక్, అజ్మీరా సురేశ్, బట్టు వీరు, బాలు, లచ్చు, బానోతు నగేశ్, దుంపటి గోవింద్, పోతనబోయిన ఉమారావు, రాంబాబు, అజ్మీరా రజిని తదితరులు పాల్గొన్నారు. గురుకులాల సమస్యలు పరిష్కరించాలి మధిర: గురుకులాల్లోని సమస్యలే కాక ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మధిరతో పాటు పలు గురుకులాల్లో శనివారం పరిశీలించిన ఆయన ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా ఉన్న టైం టేబుల్ను మార్చడమే కాక ఉపాధ్యాయులకు నైట్డ్యూటీలు తొలగించి వార్డెన్లను నియమించాలన్నారు. అంతేకాక 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లిస్తూ హెల్త్ కార్డులు ఇవ్వాలని, జూనియర్ కళాశాలల అధ్యాపకులకు గెజిటెడ్ హోదా కల్పించాలని కోరారు. సమావేశంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలీతో పాటు దామోదర్, శాంసన్, బండారు నాగరాజు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. టీసీసీబీఈఏ జిల్లా కమిటీ ఎన్నిక ఖమ్మంవ్యవసాయం: తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా నాలుగో మహాసభ శనివారం ఖమ్మంలో జరిగింది. సమావేశంలో టీసీసీబీఈఏ రాష్ట్ర చైర్మన్ కనకం జనార్దన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే అలీముద్దీన్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పాశం నాగేందర్, ప్రధాన కార్యదర్శి బి.ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించగా, సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానం, పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మూడేళ్ల కాలానికి గాను జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఈ.శాంతిరాగమయి, కార్యదర్శిగా ఎం.రామకృష్ణ, కోశాధికారిగా ఎన్.నాగేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. పోలీసు సంక్షేమ సంఘం.. ఖమ్మంక్రైం: జిల్లా పోలీస్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా హేమనాథ్ (హెచ్సీ 2092), ఉపాధ్యక్షులుగా కె.జగదీశ్ (ఎస్ఐ), సురేశ్ (ఎస్ఐ), కార్యదర్శిగా బి.వీరభద్రం (ఏఆర్ ఎస్ఐ) ఎన్నికయ్యారు. అలాగే, సంయుక్త కార్యదర్శిగా కె.సుధాకర్ (పీసీ 2353), ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.అప్పారావు (ఏఆర్ పీసీ 1172), కోశాధికారిగా నరసింహారావు (పీసీ 2668)తో పాటు కార్యవర్గ సభ్యులుగా వై.వెంకటేశ్వర్లు (పీసీ 1073), వి.వినయ్కృష్ణ (పీసీ 498), కె.సురేశ్ (పీసీ 2885), టి.జమలయ్య (ఏఆర్ పీసీ 79), ఎన్.ఏడుకొండలు (ఏఆర్ పీసీ 1387), టి.రేణుక (పీసీ 253) ఎన్నిక కాగా, ఈ కార్యవర్గం మూడేళ్ల పాటు కొనసాగనుంది. గణిత ఫోరం జిల్లా అధ్యక్షురాలిగా ఝాన్సీరాణి బోనకల్: బోనకల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు గంటెల ఝాన్సీరాణి తెలంగాణ గణితఫోరం జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఖమ్మం రిక్కాబజార్ హైస్కూల్లో జరిగిన టీఎంఎఫ్ కార్యవర్గ సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఝాన్సీరాణిని మండల ఉపాధ్యాయులు అభినందించారు. -
కరువు వేళ.. ‘ఉపాధి’ ఆసరా
● ఎల్నినో ప్రభావంతో కూలీల తిప్పలు ● చేతినిండా పని కల్పించేలా అధికారుల ప్రణాళిక ● జలసిరి, వనమహోత్సవం ద్వారా సన్నాహాలు ఖమ్మంమయూరిసెంటర్: ఆకాశం వైపు చూస్తే మబ్బుల పలకరింపులే తప్ప వర్షాలు కురవడం లేదు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వానలు ముఖం చాటేయడంతో వ్యవసాయ పనులు లేక కూలీలు అవస్థ పడుతున్నారు. ఈ క్లిష్ట సమయాన ఉపాధి హామీ కూలీలను ఆదుకునేందుకు యంత్రాంగం నడుం బిగించింది. సీజన్తో సంబంధం లేకుండా ప్రతీ కూలీకి పని కల్పించేలా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జలసిరి పనులు వర్షపు నీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి. అంతేకాక బోరుబావులు రీచార్జ్ అయ్యే అవకాశముంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని వీబీజీ రామ్ జీ (ఉపాధి హామీ) పథకంలో భాగంగా 100 శాతం సబ్సిడీతో ఇంకుడు గుంతల నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఈ పనులతో రైతులకు లబ్ధి జరగడమే కాక కూలీల చేతి నిండా పని దక్కుతుంది. ఇంకుడు గుంతల నిర్మాణానికి ముందుకు వస్తున్న ప్రజలు, రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం తక్షణమే అనుమతి జారీ చేస్తున్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం, వనమహోత్సవ పనులకు సంబంధించి ఇప్పటికే 7,516 దరఖాస్తులకు ఆమోదించి ఉపాధి కూలీలతో పని చేయిస్తున్నారు. ఉచిత నిర్మాణాలు గృహాల నుంచి వచ్చే వృథా నీటిని భూమిలోకి మళ్లించేలా ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రభుత్వం రూ.6,500 వరకు సమకూరుస్తోంది. కూలీలతో ఈ పని చేయించి వారికి వేతనంగా చెల్లిస్తారు. అలాగే, సామాజిక గుంతల నిర్మాణానికి రూ.3వేలు వెచ్చిస్తున్నారు. ఇక పంట కుంటల(ఫామ్ పాండ్స్) నిర్మాణానికి సైతం లక్ష్యాలు విధించి భారీ సబ్సిడీతో మంజూరు చేస్తున్నారు. పని గ్యారంటీ వీబీజీ రామ్ జీ పథకం నిబంధనల ప్రకారం ప్రతీ కూలీ కుటుంబానికి ఏటా 125 రోజుల పాటు పని కల్పించాలి. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికారులు వనమహోత్సవంలో భాగస్వామ్యం చేస్తున్నారు. గ్రామాల్లో గుంత తీయించి మొక్కలు నాటడం, ట్రీగార్డులు ఏర్పాటు చేయడం, నీళ్లు పోసి సంరక్షించే బాధ్యతలను ఉపాధి కూలీలకే అప్పగిస్తుండడంతో పర్యావరణ పరిరక్షణే కాక కూలీలకు దీర్ఘకాలికంగా పని లభిస్తోంది. ఫలితంగా వర్షాభావ పరిస్థితులతో గ్రామీణ ప్రాంతాల నుంచి కూలీలు నగరాలు, పట్టణాలకు వలస వెళ్లకుండా గ్రామాల్లోనూ పని దక్కనుంది. మరోపక్క భూగర్భ జలాలు పెరిగి తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయని ప్రజలు భావిస్తున్నారు.వర్షాభావ పరిస్థితుల్లో కూలీలు ఇబ్బంది పడకుండా జిల్లావ్యాప్తంగా ఉపాధి పనులను వేగవంతం చేశాం. జలసిరి కింద ఇంకుడు గుంతలు, పంట కుంటల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నాం. అర్హులైన ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – కొండపల్లి శ్రీరామ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
పాఠశాలల క్రీడలు ఎప్పుడు?
ఖమ్మం స్పోర్ట్స్: విద్యాసంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నాయి. అయినా పాఠశాలల క్రీడాపోటీల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ, పాఠశాలల క్రీడా సంఘం పట్టింపు లేనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఏటా ఇదే తరహాలో ప్రణాళిక లేకపోవడం, ఆతర్వాత హడావుడిగా జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తుండడంతో జట్ల ఎంపికల్లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. క్యాలెండర్ రూపొందించి పోటీలు నిర్వహిస్తేనే అర్హులు, ఔత్సాహిక విద్యార్థులకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేధిస్తున్న నిధుల కొరత ప్రధానంగా పోటీల నిర్వహణకు నిధుల కొరత వేధిస్తోంది. క్రీడా నిర్వహకులు ప్రతీ విద్యార్థి నుంచి కనీసం రూ.10 వసూలు చేసినా రూ.లక్షల్లో జమ అవుతాయి. కానీ గత ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుంచే దాదాపు రూ.10లక్షలకు పైగా వసూలు కావాల్సి ఉండగా ఆ స్థాయిలో రాలేదు. కొన్ని స్కూళ్ల బాధ్యులు ఆలసత్వం వహించగా, ఇంకొందరు పూర్తిగా చెల్లించలేదు. మరోపక్క ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండగా, విద్యాసంవత్సరం ప్రారంభంలోనే రుసుము వసూలు చేస్తే బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి. మండల, జోన్ స్థాయిలో పోటీలు తప్పనిసరి జిల్లా స్థాయి పాఠశాలల క్రీడాపోటీలనుమూడంచెల్లో నిర్వహించాలి. మండల స్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహించాల్సి ఉన్నా పెద్దగా స్పందన రావడం లేదు. ఆపై కొంతమందిని హడావుడిగా తీసుకొచ్చి, ఆ పోటీలు కాగానే జోన్స్థాయి జట్లను ఎంపిక చేసి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని క్రీడాంశాల్లో నేరుగా జిల్లాస్థాయి ఎంపికకు పంపిస్తుండడం గమనార్హం. భావిస్తున్నారు. జిల్లాస్థాయిలో కనీసం 20 క్రీడాంశాశాల్లో పోటీలు నిర్వహించి జట్లను ఎంపిక చేస్తే ఫలితం ఉంటుందని తెలిసినా విద్యాశాఖ అధికారులు, పాఠశాలల క్రీడాసంఘం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. అయితే, క్రీడా సంఘం బాధ్యులు మాత్రం సరైన నిధులు లేక జేబు నుంచి ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. కనీసం 30 క్రీడాంశాలకు పైగా అండర్–14, 17 బాలబాలికల జట్లను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించాల్సి ఉండడం, క్రీడాకారుల వెంట పీఈటీలు వెళ్లాల్సి రావడం భారం మారుతున్నందున ముందుగా నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు. -
శ్రీవారికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని స్వామివారి పాదా నికి అర్చకులు పంచామృతం అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామితో పాటు అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, ఆతర్వాత పల్ల కీ సేవ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఏఓయూలో డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు సత్తుపల్లి టౌన్: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ ప్రవేశాల గడువు ను సెప్టెంబర్ 9వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయాన్ని సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ చీపు పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఇంటర్, పాలి టెక్నిక్, ఐటీఐ, ఓపెన్ ఇంటర్, డిప్లొమా పాసై న విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. ఎస్టీ కోయ, చెంచు, గోండు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఉచిత విద్య అందుతుందని తెలి పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ రెగ్యులర్ డిగ్రీ చేయలేని వారు, గృహిణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే, రెండు, మూడో సంవత్సరం విద్యార్థులు సెప్టెంబర్ 9 లోపు ట్యూషన్ ఫీజు చెల్లించాలని ఆయన తెలిపారు. వివరాలకు 94918 81910, 81878 37058 నంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు. పక్కా ప్రణాళికతో డెంగీ నియంత్రణ ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డెంగీ వ్యాధి నియంత్రణకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కేఎంసీలో శనివారం ఆయన అర్బన్ మలేరియా విభాగం సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎంఓ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో డెంగీ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడం ఉపశమనం కలిగిస్తోందన్నారు. 2022లో 272, 2023వ సంవత్సరంలో 129, 2024లో 65, 2025లో 45 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు మూడే నమోదయ్యాయని తెలిపారు. అయినా గత అనుభవాల దృష్ట్యా వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో యాంటీ లార్వా కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశించారు. సైడ్ డ్రెయిన్లలో నీరు నిల్వ ఉండకుండా చూస్తూ, ఫాగింగ్ నిర్వహించాలని తెలిపారు. మత్స్య రైతులకు ముగిసిన శిక్షణ కూసుమంచి: మండలంలోని పాలేరు మత్స్య పరిశోధన కేంద్రంలో హైదరాబాద్కు చెందిన పీ.వీ.నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన మత్స్య రైతులకు ఇస్తున్న శిక్షణ శనివారం ముగిసింది. ‘బయోప్లాక్ విధానంలో చేపల సాగు’ అంశంపై ఇక్కడ మూడు రోజుల పాటు ఇచ్చిన శిక్షణకు ఖమ్మం, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, హైదరా బాద్, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల నుంచి 25 మంది మత్స్య రైతులు, మత్స్యకారులు పాల్గొన్నారు. ముగింపు సమావేశంలో సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయస్వామి సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న మెళకువలు పాటిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. అలాగే, నాబార్డ్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.శ్యాంప్రసాద్, శాస్త్రవేత్త బి.రవీందర్తో పాటు నాగరాజు తదితరలు మాట్లాడగా శాస్త్రవేత్తలు బానోతు దివ్య, డాక్టర్ కె.అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భార్య కేసు పెడతానని బెదిరిస్తే..
కొణిజర్ల: గొడవ పడి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి ఇంటికి రాకపోగా ఫోన్ చేస్తే కేసు పెట్టి జైలులో వేయిస్తానని బెదిరించడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొణిజర్ల ఎస్ఐ జి.సూరజ్ తెలిపిన వివరాలు.. మండలంలోని తనికెళ్లకు చెందిన పెద్దగౌండ్ల గోపాల్రావు అలియాస్ గోపి(27)కు గతంలోనే వివాహం జరిగినా విభేదాలతో విడిపోయారు. ఆ తర్వాత ఆయన చింతకాని మండలం నేరడకు చెందిన రజనిని వివాహం చేసుకోగా దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు జరుగుతుండగా పెద్దలు నచ్చజెప్పినా మార్పు రాలేదు. ఈ క్రమాన 15 రోజుల క్రితం రజని పుట్టింటికి వెళ్లింది. గోపి ఫోన్ చేయగా మరోమారు ఫోన్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించినట్లు తెలిసింది. దీంతో గోపి రోజులాగే శుక్రవారం ఆటో నడిపిన అనంతరం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం స్థానికులు ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూడగా ఉరి వేసుకుని కనిపించాడు. ఘటనపై ఆయన తల్లి శాంతమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, గోపి చేతిపై ‘నా చావుకు కారణం భార్య రజని, మామ మట్టా సీతారాములు’అని రాసుకున్నాడని తెలిపారు.ఆందోళనతో యువకుడి ఆత్మహత్య -
ఐకేపీలో వీఓఏల కొరత
చింతకాని: గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడం, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి చేరవేయడంలో ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) గ్రామ సంఘాల సహాయకులు (వీఓఏ) కీలకపాత్ర పోషిస్తారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తూ మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతకు వెన్నెముకగా నిలవాల్సి ఉంటుంది. మహిళా సంఘాల్లో ఐక్యతను పెంచి క్రమం తప్పక పొదుపు చేసేలా ప్రోత్సహించడం, సీ్త్రనిధి, బ్యాంకుల ద్వారా సంఘాలకు రుణాలను ఇప్పించి రికవరీ ప్రక్రియను పర్యవేక్షించడమే కాక సంఘాల ఆర్థిక లావాదేవీలకు నిర్వహణలో చేయూతనిస్తారు. కానీ, జిల్లాలో వీఓఏలు సరిపడా లేకపోవడంతో సంఘాల అభివృద్ధి కుంటుపడుతోంది. సంఘాల ఏర్పాటు, రుణాల మంజూరులోనే కాక అంతర్గత పొదుపు, వసూళ్లు కూడా సక్రమంగా సాఫీగా జరగడం లేదు. మరోపక్క ప్రతీనెల సంఘాల రికార్డులు, బ్యాంక్ పాస్పుస్తకాల తనిఖీ సాఫీగా జరగకపోవడంతో సభ్యులు రుణ వాయిదాలు చెల్లిస్తున్నా లీడర్లు బ్యాంక్లో జమచేయకుండా సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. జిల్లాలో ఇలాంటి ఉదంతాలు వెలుగుచూస్తున్నా వీఓఏల నియామకంపై అధికారులు దృష్టిసారించడం లేదు. 24 వేలకు పైగా సంఘాలు.. 921 మంది వీఓఏలు జిల్లాలోని 20 మండలాల్లో 2,42,090 మంది మహిళా సభ్యులతో కూడిన 24,797 స్వయం సహాయక సంఘాలు కొనసాగుతున్నాయి. మహిళా సంఘాలను సమర్థవంతంగా నడిపించాలంటే నిబంధనల ప్రకారం 20 సంఘాలకు ఒక వీఓఏను నియమించాలి. అంటే జిల్లాలో 1,240 మంది వీఓఏలు పనిచేయాల్సి ఉండగా, 921 మందే ఉన్నారు. ఫలితంగా కొత్త సంఘాల ఏర్పాటు, ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ, రుణాల మంజూరు, రికవరీలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా మహిళా సంఘాలు, సభ్యుల ఆర్థికాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోంది.ఏయే గ్రామాల్లో అత్యవసరంగా వీఓఏల నియామకం అవసరమో గుర్తించి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటాం. అంతేకాక డిజిటల్ లావాదేవీలు జరిపేలా సభ్యులకు అవగాహన కల్పిస్తున్నాం. నగదు సొంతానికి వాడుకునే సభ్యులపై చర్యలు తీసుకుంటాం. –కొండపల్లి శ్రీరామ్, డీఆర్డీఓ సంఘాల సంఖ్యకు అనుగుణంగా వీఓఏలు లేకపోవడంతో పర్యవేక్షణ సాఫీగా సాగడం లేదు. రికార్డుల నిర్వహణ, రుణాల మంజూరులో వీఓఏలు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులు స్పందించి నియామకాలు చేపట్టాలి. – గంధం కవిత, చింతకాని మండల సమాఖ్య అధ్యక్షురాలు -
నర్సరీ దాటని నారు
మధిర: వర్షాభావ పరిస్థితులు వరి సాగుపై కాక మిర్చి సాగుపైనా ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే నారు పెంచే నర్సరీలు తగ్గగా, అధికారులు సైతం మిర్చి సాగు తగ్గించాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే, ఈనెలాఖరు వరకు మిర్చి సాగుకు అవకాశం ఉన్నందున ఆ సమయానికి సాగు విస్తీర్ణంపై స్పష్టత రానుంది. నర్సరీల రెన్యూవల్ అంతంతే... వ్యవసాయ సీజన్ ఆరంభం నుంచే అధికారులు ఎల్నినో ప్రభావంపై అవగాహన కల్పిస్తుండడంతో మిర్చి నారు పెంచే నర్సరీల యజమానులు ఆచితూచి వ్యవహరించారు. ఏటా జూన్ చివరి నుంచే నర్సరీల్లో నారు పెంపకం మొదలుపెట్టి ఆగస్టు వరకు విక్రయిస్తారు. కొందరు రైతులు సొంతంగా విత్తనాలు తెచ్చుకుంటే, ఇంకొందరికి నర్సరీల యజమానులే తాము పెంచిన నారు విక్రయించడం ఆనవాయితీ. ఈసారి పరిస్థితుల దృష్ట్యా చాలామంది నర్సరీల యజమానులు రెన్యువల్కే మొగ్గుచూపలేదు. అంతేకాక నారు పెంపకానికి అవసరమైన కోకోపిట్ ధర టన్నుకు గత ఏడాది రూ.5వేలు ఉంటే ఈ ఏడాది రూ.11వేలకు చేరడంతో వెనుకడుగు వేశారు. జిల్లాలోని కూసుమంచి, రఘునాథపాలెం, కారేపల్లి, తల్లాడ, కామేపల్లి, కొణిజర్ల, మధిర తదితర మండలాల్లో ఎక్కువగా మిర్చి సాగవుతుంది. గత ఏడాది 235 నర్సరీల ద్వారా 53.40 కోట్ల మొక్కలను రైతులకు విక్రయించారు. ఈసారి చాలాచోట్ల నర్సరీల్లో నారు సిద్ధం చేసినా... కొనుగోళ్లు మాత్రం ఊపందుకోలేదు. గత వారంగా కురుస్తున్న వర్షాలతో కొందరు రైతులు నారు తీసుకెళ్లి నాటుతున్నా, విస్తీర్ణంపై మాత్రం అంచనాకు రాలేకపోతున్నారు. పెరుగుతుందని భావిస్తే... గత సీజన్ చివరి నుంచి ఇప్పటివరకు బహిరంగ మార్కెట్లో మిర్చి రేటు ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం తేజ రకం క్వింటా రూ.22 వేలకు పైగా ధర పలుకుతోంది. దీంతో ఈ ఏడాది మిర్చి సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుందని అంచనా వేశారు. కానీ ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పరిస్థితి తారుమారైంది. 2024–2025 సీజన్లో జిల్లాలో 70 వేల ఎకరాల్లో మిర్చి సాగు కాగా, ఆ ఏడాది సరైన ధర లేక 2025–2026 సీజన్లో 30 వేల ఎకరాలకే సాగు పరిమితమైంది. ఈసారి ధర బాగున్నప్పటికీ ఎల్నినో ప్రభావం.. అధికారులు అవగాహన కల్పిస్తుండడంతో సాగు విస్తీర్ణం పెద్దగా పెరగకపోవచ్చని తెలుస్తోంది. వర్షాభావంతో మిర్చి సాగుపై నీలినీడలు కోకో పిట్ కొరత తీవ్రంగా ఉంది. అంతేకాక గత ఏడాది టన్ను ధర రూ.5వేలు ఉంటే ఈ ఏడాది రూ.11వేలకు చేరింది. వర్షాభావ పరిస్థితులతో మిర్చి సాగు ఎలా ఉంటుందో తెలియడం లేదు. అంతుకే రైతులు విత్తనాలు తీసుకొస్తేనే నారు పెంచుతున్నాం. – కిషోర్, నర్సరీ యజమాని, మధిరఏడు నెలల కాలపరిమితి కలిగిన మిర్చి సాగుకు ప్రతీ దశలో నీరు అవసరం ఉంటుంది. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా మిర్చి సాగు తగ్గించాలని రైతులకు సూచిస్తున్నాం. ఈనెలాఖరు వరకు మిర్చి సాగు చేసే అవకాశమున్నందున ఇప్పుడే అంచనా వేయలేం. – మధుసూదన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, ఖమ్మం -
బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ పతనం
చింతకాని: దశాబ్ద కాలంగా కేంద్రంలో మోదీ అనుసరిస్తున్న విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు విమర్శించారు. పార్టీ ఆధ్వర్యాన చేపట్టిన జన చైతన్య యాత్ర శనివారం చింతకాని మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ దేశ ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ సంస్థల కోసమే పాలన సాగిస్తున్నారని, దేశ సంపదను వారికి దోచిపెడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని తెలిపారు. రాముడి పేరుతో ప్రజలను వంచిస్తున్న మోదీ, తనను విమర్శించే వారిని మాత్రం దేశద్రోహులుగా చూపుతున్నారని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు పేదలకు కాక పైరవీకారులు చెప్పినవారికే మంజూరవుతున్నాయ ని విమర్శించారు. హామీల అమలులో విఫలమైన ప్రభుత్వం తీరు మార్చుకోవాలని సూచించారు. కాగా, సీపీఐ నేతల యాత్రలకు పలు గ్రామాల్లో బీఆర్ఎస్, సీపీఎం నాయకులు స్వాగతం పలికారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్, నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, ఎర్రా బాబు, షేక్ జానీమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, అజ్మీరా రాంమూర్తి, పోటు కళావతి, రావి శివరామకృష్ణ, చిన్నవెంకటరెడ్డి, ఏపూరి రవీంద్రబాబు, సీతామహాలక్ష్మి, దూసరి గోపాల్రావు, సర్పంచ్లు పర్సా రామచంద్రరావు, ఏపూరి పద్మ, ఆవుల నర్సింహారావు, కాంపెల్లి కోటమ్మ, నాయకులు దొబ్బల వెంగళరావు, మార్గం శ్రీను, పదిమెల వెంకటనర్సయ్య, గోగుల ఆది, సింగారపు సత్యనారాయణ, పగిడిపల్లి ఏసు పాల్గొన్నారు.సీపీఐ జాతీయ సమితి సభ్యుడు హేమంతరావు -
బ్రాండెడ్ పేరిట నకిలీ వైర్లు
ఖమ్మంఅర్బన్: బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ ఎలక్ట్రిక్ వైర్ల విక్రయాలు సాగుతున్నాయనే సమాచారంతో టాస్క్ఫోర్స్, ఖమ్మం అర్బన్ పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఖమ్మం ప్రశాంతినగర్లోని ఓ గోదాంలో భారీగా నకిలీ వైర్లను స్వాధీనం చేసుకోగా, వ్యాపారి పరారైనట్లు సమాచారం. అక్కడ పనిచేస్తున్న రాజస్థాన్కు చెందిన ఇద్దరు, రఘునాథపాలెం మండలం కొర్లబోడుతండాకు చెందిన అనిల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. బ్రాండెడ్ బాక్సుల్లో ప్యాకింగ్ శానిటరీ సామగ్రి నిల్వ పేరిట శ్రాంతినగర్లోని గోదామును రాజస్థాన్కు చెందిన వ్యాపారి కొంతకాలం క్రితం అద్దెకు తీసుకున్నాడు. ఇక్కడ నకిలీ, నాసిరకం వైర్లను తెప్పించి బ్రాండెడ్ కంపెనీల బాక్సుల్లో ప్యాక్ చేయించి అమ్ముతున్నట్లు తెలిసింది. గోల్డ్మెడల్ కంపెనీ పేరుతో నకిలీ వైర్లను ఎలక్ట్రీషియన్ల ద్వారా ఇళ్ల యజమానులకు విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో టాస్క్ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ, ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ ఆధ్వర్యాన తనిఖీ చేయగా గుట్టురట్టయింది. అయితే, దందా ఎప్పటి నుంచి కొనసాగుతోంది, నిర్వాహకులెవరనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. టాస్క్ఫోర్స్, అర్బన్ పోలీసుల తనిఖీల్లో గుర్తింపు -
వలస ఆదివాసీలు
రెండు దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి ఆదివాసీలు వలస వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. వీరిలో ఛత్తీస్గఢ్ వాసులే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో 125 వలస ఆదివాసీ పల్లెలు ఉండగా, 23 వేల మంది జనాభా ఉంది. వీరిలో పదో తరగతి, ఇంటర్ చదువుతున్నవారు గ్రామంలో ఒకరిద్దరి కంటే ఎక్కువగా లేరు. ఇప్పుడిప్పుడే ఆధునికత వైపు అడుగులు వేస్తున్నారు. వంట గ్యాస్, ద్విచక్ర వాహనాలు, స్మార్ట్ఫోన్లు, ఇళ్లలో డిష్ టీవీల వినియోగాన్ని అలవర్చుకోవడమే కాక పిల్లలను చదివిస్తున్నారు. పాల్వంచ మండలంలోని పలు పల్లెల్లో ఈ మార్పులు కన్పిస్తున్నాయి. రెడ్డిగూడెం ఎస్టీకాలనీకి చెందిన ఇద్దరు యువకులు ఇంటర్, చిరుతానిపాడులో మరో ఇద్దరు యువతులు ఉన్నత విద్య చదువుతుండగా గంగదేవిగుప్పలో ఓ యువకుడు పీజీ చేశాడు. -
కాలేజీలు కళకళ !
ఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సౌకర్యాలు కల్పించడమే కాక నాణ్యమైన విద్య అందిస్తూ ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది నోట్బుక్కులు కూడా పంపిణీ చేయగా, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలుచేస్తామన్న ప్రకటనతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి కనబరిచారు. జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గత ఏడాది 2,862 మంది విద్యార్థులు చేరితే, ఈ ఏడాది ఇప్పటి వరకు 3,127 మంది ప్రవేశాలు పొందడంతో పలు కాలేజీలు కళకళలాడుతున్నాయి. ప్రవేశాలకు ఈనెల 15వ తేదీ వరకు గడువు ఉన్న నేపథ్యాన ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. విస్తృత ప్రచారం ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపునకు అధ్యాపకులు, ఉద్యోగులు గత విద్యాసంవత్సరం చివరి సమయం నుంచే విస్తృత ప్రచారం చేశారు. కాలేజీల్లోని సౌకర్యాలు, మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థుల వివరాలను కరపత్రాల ద్వారా వివరించా రు. ఉచిత పాఠ్య, నోట్ పుస్తకాల పంపిణీ, డిజిటల్ బోధనతో పాటు ఈ విద్యాసంవత్సరం నుంచి అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలవుతుందని వివరించడంతో ప్రవేశాలు పెరిగాయి. ప్రవేశాలు ఇలా.. జిల్లాలోని 21కాలేజీలకు గాను అత్యధికంగా ఖమ్మంలోని ఏఎస్ఆర్ శాంతినగర్ జూనియర్ కళాశాలలో ప్రవేశాలు నమోదయ్యాయి. ఈ కాలేజీలో గత ఏడా ది 361మంది విద్యార్థులు ఉంటే, ఈ ఏడాది ఇప్పటి వరకు 440మంది చేరారు. సత్తుపల్లి బాలికల కళాశాలలో గత ఏడాది 80మంది ఉండగా.. ఈ ఏడాది 126కు పెరిగింది. ఇలా పలు కళాశాలల్లో గతేడాతో పోలిస్తే 20–40మంది వరకు ఎక్కువగా చేరారు. అయితే, కొన్ని కాలేజీల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రవేశాలు కాలేదు. బనిగండ్లపాడు కళాశాలలో గత ఏడాది 67మంది విద్యార్థులు ఉండగా.. ఈ ఏడాది 47మందే ఉన్నారు. నాగులవంచ కళాశాలలో 104 మంది ఉండగా.. ఈసారి 69మంది, ముదిగొండ కళాశాలలో గత ఏడాది 117మంది ఉంటే ఈ ఏడాది 91 మంది, బోనకల్లో గత ఏడాది 96 మంది విద్యార్థులు ఉండగా ఈసారి 70కే పరిమితమైంది.ప్రభుత్వ కళాశాలల్లో గత ఏడా ది కన్నా ఈ ఏడాది ప్రవేశాలు పెరిగాయి. కాలేజీల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, నాణ్యమైన విద్య అందించడ మే కాక డిజిటల్ బోధన, ఉచిత పాఠ్య, నోట్పుస్తకాల పంపిణీ తదితర అంశాలు కలిసొచ్చాయి. ఈ నెల 15వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశం ఉన్నందున విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – రవిబాబు, డీఐఈఓ -
నా భర్తను చంపేయ్... ఆ తర్వాతే కనిపించు
ఖమ్మం రూరల్: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను కడతేర్చాలని చూసింది ఓ భార్య. ఈ విషయాన్ని గ్రహించిన భర్త పోలీసులను ఆశ్రయించగా, భార్య, ఆమె ప్రియుడిపై కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడుకు చెందిన గాదె రాజేశ్వరరావుకు సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన భవానితో 2016లో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి నాయుడుపేటలోని అద్దె ఇంట్లో ఉంటూ ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్లో రాజేశ్వరరావు పని చేస్తున్నాడు.రెండు నెలల క్రితం సాయిప్రభాత్నగర్లోని అద్దె ఇంటికి మారారు. అయితే భవాని ప్రవర్తనలో మార్పు వచి్చంది. రాజేశ్వరరావుకు దూరంగా ఉంటూ పిల్లలను సరిగా చూసుకోవడంలేదు. జూలై 27న ఆస్పత్రి నుంచి రాజేశ్వరరావు మధ్యాహ్న భోజనానికి వచ్చేసరికి ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. కిటికీలో నుంచి చూడగా, ఆమె మరో వ్యక్తితో చనువుగా కనిపించింది. దీంతో రాజేశ్వరరావు అరవడంతో ఆమె తలుపు తీయగానే సదరు వ్యక్తి పారిపోయాడు. ఎవరని అడిగితే తనకు తెలియదంటూ భర్తతో గొడవకు దిగింది.ఈ విషయాన్ని ఆయన తన బంధువులకు చెప్పగా చిలుకోడులో పంచాయతీ పెడతామని చెప్పారు. ఈనెల 28న ఇద్దరు పిల్లలను చిలుకోడులో దిగబెట్టాక, పెరుమాండ్ల సంకీసలో ఉన్న సోదరుడిని తీసుకొచ్చేందుకు బైక్పై బయలుదేరాడు. అయితే, ఓ వ్యక్తి తనను అనుసరిస్తుండడంతో పరిశీలించగా తన భార్యతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా గుర్తించి నిలదీస్తుండగా పారిపోయాడు. చంపేయ్ అంటూ చాటింగ్ అక్కడి నుంచి చిలుకోడు వెళ్లిన రాజేశ్వరరావు తన భార్య భవాని సెల్ఫోన్లో ఇన్స్ట్రాగాం, వాట్సాప్ పరిశీలించగా ‘నా భర్తకు వేరే వ్యక్తితో యాక్సిడెంట్ చేయించాకే కనిపించు. వాడు మళ్లీ బతకకూడదు, వేరే వ్యక్తి అయితేనే మనపై అనుమానం రాదు’అంటూ పంపించిన మెసేజ్లు ఉన్నాయి. అవి ఎవరికి పంపిందోనని నంబర్ పరిశీలిస్తే ఖమ్మంలో కొరియర్ బాయ్గా పని చేసే పురిమెట్ల సైదులుగా తేలింది. ఆయనది కూడా భవాని స్వగ్రామమైన రాఘవాపురం అని తెలిసింది. ఈమేరకు తొలుత రాజేశ్వరరావు డోర్నకల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఖమ్మం రూరల్ స్టేషన్కు బదలాయించారు. మరోమారు ఖమ్మం రూరల్లో కూడా ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం భవాని, సైదులుపై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. -
పంద్రాగస్టు నుంచి కొత్త పింఛన్లు
● దశల వారీగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితిరుమలాయపాలెం: అర్హతే ప్రామాణికంగా కుల, మత, రాజకీయాలకు అతీతంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈనెల 15న కొత్త ఆసరా పింఛన్ల మంజూరు ప్రారంభం కానుందని మంత్రి ప్రకటించారు. తిరుమలాయపాలెం మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. తిప్పారెడ్డిగూడెం నుంచి రాకాసి తండా వరకు రూ.2.10 కోట్లు, రాజారం నుంచి తుమ్మగూడెం వరకు రూ.4.50 కోట్లతో నిర్మించే బీటీ రహదారులతో పాటు హైదర్సాయిపేట, పాతర్లపాడుల్లో గ్రామపంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశాక మంత్రి మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అమలుచేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ తదితర పథకాలతో పేద కుటుంబాలకు అండగా నిలిచామని తెలిపారు. ఎంపికలో పారదర్శకత పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇళ్ల కోసం ఎవరూ రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, త్వరలోనే రెండో విడత లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకట్రెడ్డి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, డీపీఓ వినోద్కుమార్, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ సిలార్ సాహెబ్, ఆత్మ చైర్మన్ చావా శివరామకష్ణ నాయకులు, సర్పంచ్లు రామసాయం నరేష్రెడ్డి, కొప్పుల అశోక్ మంగీలాల్, బెల్లం శ్రీనివాస్, ఉపేందర్, సిమ్లానాయక్, జడల సుష్మ, మందుల అరుణ తదితరులు పాల్గొన్నారు. -
సెలవుల తర్వాత ‘చేయూత’ దరఖాస్తులు
● మరోసారి అర్హుల నుంచి స్వీకరించాలని నిర్ణయం ● దశల వారీగా పింఛన్ల మంజూరు ఖమ్మంమయూరిసెంటర్: చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత లబ్ధిదారుల వివరాల పునఃపరిశీలనతో పాటు, అర్హులైన వారికి కొత్త పింఛన్లు అందజేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు ఉండడంతో, ఆతర్వాత మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిసింది. ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులు జిల్లాల అధికారులకు దిశానిర్దేశం చేశారు. వారికే ప్రాధాన్యత ఈనెల 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా అర్హులైన వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళల నుంచి తొలి ప్రాధాన్యతగా దరఖాస్తులు స్వీకరిస్తారు. తలసేమియా, సికిల్ సెల్ బాధితులను దివ్యాంగుల కేటగిరీగా పరిగణించి దశల వారీగా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. వృద్ధాప్య పింఛన్ల విషయంలో లభ్యత ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోనున్నారు. పరిశీలన ఇలా.. పింఛన్ కోసం అర్హులు అభ్యర్థులు కొత్తగా రూపొందించిన దరఖాస్తు ఫారం నింపి ఆధార్ కార్డు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, తాజా పాస్పోర్ట్ సైజ్ ఫొటోను జత చేసి పంచాయతీ కార్యదర్శి, వార్డు ఆఫీసర్లకు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ఆన్లైన్లో నమోదు చేశాక... ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా పరిశీలిస్తారు. దరఖాస్తుదారులకు కారు, బైక్, ఆటో వంటి వాహనాలు, సొంత భూమి, ఇతర ఆదాయ వనరులు ఉన్నాయా అని యాప్ ద్వారా తేల్చాక అర్హులను నిర్ధారిస్తారు. అలాగే, క్షేత్రస్థాయిలోనూ పరిశీలిస్తారు. కాగా, పింఛన్ల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలతో త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని తెలిసింది. -
కాంగ్రెస్ మండల, గ్రామ కమిటీల నియామకం
ఖమ్మంమయూరిసెంటర్: ఏఐసీసీ సంఘటన్, సృజన్, అభియాన్ ప్రక్రియలో భాగంగా మండల, గ్రామ కమిటీలను నియమించేందుకు ఇన్చార్జిలను నియమించినట్లు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ తెలిపారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ ఆదేశాలతో ఈ నెల 15 లోపు మండల, గ్రామ కమిటీలను నియమించాల్సి ఉందని తెలిపారు. ఇందుకోసం మండల అధ్యక్షులతో సమన్వయం చేసుకునేలా ఇన్చార్జ్లను నియమించామని చెప్పారు. సమావేశంలో నాయకులు పులిపాటి వెంకయ్య, బానోత్ బాలాజీ నాయక్, గజ్జెల్లి వెంకన్న, తూములూరి లక్ష్మీనరసింహారావు, కిలారు అనిల్కుమార్, రామసహాయం హరితరెడ్డి, కమటాల రేణుక, బచ్చలకూర నాగరాజు, మూడుముంతల గంగరాజుయాదవ్, కొట్టెట్టే రాజశేఖర్, కంచర్ల వెంకటనర్సయ్య, పులిబండ్ల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మండలాల వారీగా ఇన్చార్జ్లను డీసీసీ అధ్యక్షుడు ప్రకటించారు. రఘునాథపాలెం మండలానికి ఫతే మహమ్మద్, ఖమ్మం రూరల్కు గజ్జెల వెంకన్న, తిరుమలాయపాలెంకు హరితరెడ్డి, కూసుమంచికి తూములూరి లక్ష్మీనర్సింహారావు, నేలకొండపల్లికి బమ్మిడి శ్రీనివాసరావు, ముదిగొండకు బచ్చలకూర నాగరాజు, చింతకాని ఎస్.కే.మస్తాన్, బోనకల్కు దామా స్వరూప, మధిరకు వెంకటనర్సయ్య, ఎర్రుపాలెంకు చిట్టిబాబును ఇన్చార్జ్గా నియమించినట్లు తెలిపారు. అలాగే, సింగరేణి మండలానికి ప్రభావతిరెడ్డి, ఏన్కూరుకు కమటాల రేణుక, కొణిజర్లకు బాలాజీనాయక్, వైరాకు మద్దినేని రమేశ్, తల్లాడకు ఎం.నాగరాజు, కల్లూరుకు పొట్లపల్లి వెంకటేశ్వర్లు, పెనుబల్లికి ఎస్.బ్రహ్మారెడ్డి, సత్తుపల్లికి సోమిరెడ్డి, వేంసూరుకు గంగిశెట్టి ప్రసాద్, కామేపల్లికి కొట్టే రాజశేఖర్ ఇన్చార్జ్గా నియమితులయ్యారు. ఇక మున్సిపాలిటీల్లో ఏదులాపురానికి కె.వెంకటరమణ, మధిరకు జి.ఝాన్సీ, వైరాకు మద్దినేని రమేష్, కల్లూరుకు కోసూరి వెంకటేశ్వర్లు, సత్తుపల్లికి యర్రం సత్యనారాయణను ఇన్చార్జ్గా నియమించారు.మండల అధ్యక్షులు, ఇన్చార్జ్ల నేతృత్వాన పర్యవేక్షణ -
స్మార్ట్కార్డులు వచ్చేశాయ్..
రేషన్ లబ్ధిదారులకు 15నుంచి పంపిణీఖమ్మం సహకారనగర్: ఏళ్ల తర్వాత పేదలకు కొన్నాళ్ల క్రితం రేషన్కార్డులు మంజూరయ్యాయి. అంతేకాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేషన్షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈక్రమాన ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి లబ్ధిదారులకు స్మార్ట్కార్డులు అందించాలని నిర్ణయించింది. 2016 లో లాస్ట్... 2016వ సంవత్సరంలో జిల్లాల పునర్విభజనకు ముందు రేషన్కార్డులు ముద్రించి జిల్లాలకు పంపించారు. అయితే, జిల్లాల పునర్విభజన సమయాన వాటిని పంపిణీ చేయకుండా పక్కన పెట్టేశారు. ఆతర్వాత అవసరమైన వారు ఈపీడీఎస్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు. ఈనేపథ్యాన కార్డుదారులకు ప్రభుత్వం స్మార్ట్కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లాకు కార్డులు ఇప్పటికే చేరగా ఈనెల 15వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అతిథుల చేతుల మీదుగా కొందరికి అందజేయనుండగా.. ఆ తర్వాత మిగతావారికి రేషన్షాపుల్లో పంపిణీ చేస్తారు. కాగా, జిల్లాలోని 21 మండలాల పరిధిలో 748రేషన్ షాప్లు, 4,73,271 కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 13,36,126మంది లబ్ధిదారులు ఉన్నారు. కుటుంబంలోని మహిళ ఫొటోతో ముద్రించిన కార్డులు జిల్లాకు చేరాయని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. -
సీజనల్ ప్రభావం తక్కువే..
● ఈ ఏడాది తగ్గిన డెంగీ కేసులు ● పరిసరాల పరిశుభ్రతోనే సంపూర్ణ కట్టడి ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో ఈ సీజన్లో వ్యాధుల ప్రభావం తక్కువగానే ఉంది. ఎల్నినో ప్రభావంతో ఈ సీజన్లో అంతగా వర్షాలు కురవట్లేదు. దీంతో క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య సమస్యలు అంతగా ఉత్పన్నం కాకపోవడంతో వ్యాధుల ప్రభావం తగ్గినట్లు తెలుస్తోంది. ప్రతీ సీజన్లో జూలై నెలలోనే ప్రభావం చూపే డెంగీ కేసులు నామమాత్రంగానే నమోదు కాగా.. వైరల్ ఫీవర్స్ కూడా అంతగా ప్రభావం చూపకపోవడంతో ప్రజలు కొంతమేర ఊపిరి పీల్చుకుంటున్నారు. పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లలో ఓపీ సేవలు పెరిగినా అందులో జ్వరబాధితుల శాతం తక్కువగా ఉంటోంది. అలాగే జిల్లా ఆస్పత్రిలో ఎప్పటిలాగే జనం కిటకిటలాడుతున్నప్పటికీ ఒకటి, రెండు వైరల్ కేసులు మినహా డెంగీ ప్రభావం ఏమాత్రం లేదని వైద్యులు చెబుతున్నారు. ఎల్నినో దెబ్బ.. వ్యాధులకు అడ్డుకట్ట జిల్లాలో ఎల్నినో ప్రభావంతో జూన్, జూలై నెలల్లో అంతగా వానలు కురవలేదు. అప్పుడప్పుడూ చిరు జల్లులు మినహా అంతగా వర్షాల ప్రభావం లేకుండా పోయింది. దీంతో చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జ్వరాలు అంతగా నమోదు కాలేదు. ఎక్కువగా ఆర్థోపెడిక్, కంటి, ఇతర అనారోగ్య సమస్యలతో వైద్య సేవలకు వస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో మాత్రం గర్భిణుల పరీక్షలు, డెలివరీల కోసం, చిన్నారుల అనారోగ్య సమస్యలు, పలు రకాల ఆపరేషన్ల కోసం ఇన్పేషంట్లుగా చేరి చికిత్స చేయించుకుంటున్నారు. అలాగే ఓపీ సేవలు కూడా పెరిగాయి. జ్వరం కాకుండా పలు రకాల సమస్యలతోనే ఎక్కువ మంది వైద్య సేవలకు వస్తున్నారు. ఏటా ఆగస్ట్ వచ్చిందంటే ఆస్పత్రి బెడ్లు పూర్తిగా నిండిపోయి, కింద కూడా బెడ్లు వేసి చికిత్స అందించాల్సి వచ్చేది. కానీ, ఆ పరిస్ధితితులు జిల్లాలో ఎక్కడా కనిపించట్లేదు. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం పరిస్ధితితులు భిన్నంగా ఉంటున్నాయి. చిన్న పాటి జ్వరంతో వచ్చినా కూడా కొన్ని ఆస్పత్రుల్లో రోగులను ప్లేట్లెట్స్ పేరు చెప్పి బయపెట్టి డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కరువవటంతో ప్రైవేట్ డయోగ్నొస్టిక్ యాజమాన్యాలు ఆస్పత్రులతో లాలూచి పడి అడ్డగోలు టెస్టులు నిర్వహిస్తూ దోపిడీకి తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి కొందరు అధికారులు కూడా అంటకాగుతున్నట్లు తెలుస్తోంది. అప్రమత్తత తప్పనిసరి మలేరియా, డెంగీ, చికున్గున్యా వంటి వ్యాధులకు కారణం దోమలే. ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల మలేరియా వ్యాధి వ్యాపిస్తుంది. నిల్వ ఉన్న మంచి నీటిలో ఈ దోమ 200 – 300 వరకు గుడ్లు పెడుతుంది. ఈ దోమ మలేరియా ఉన్న వ్యక్తిని కుట్టి, వేరే వ్యక్తిని కుట్టడం ద్వారా మలేరియా వ్యాపిస్తుంది. అలాగే ఏడిస్ దోమ కూడా నిల్వ ఉన్న మంచినీటిలో గుడ్లు పెడుతుంది. విడతకు 300 చొప్పున తన జీవిత కాలంలో 900 గుడ్లు పెడుతుంది. ఉదయం పూటే కుట్టే ఈ దోమల వల్ల డెంగీ జ్వరం కలుగుతుంది. దీన్ని టైగర్ దోమ అని కూడా పిలుస్తారు. దీని వల్ల చికున్ గున్యా, ఎల్లో ఫీవర్ కూడా వస్తుంది. ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే నీటిపై మూతలు పెట్టడం, వాడేసిన కొబ్బరిబొండాలు, టైర్లు, పాత సామగ్రి, ప్లాస్టిక్ కప్పులు, పాత సామాన్లు, రుబ్బురోళ్లు, మొక్కల కుండీలు తదితర వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దోమ తెరలు వాడటం, ఇంటి కిటికీలు, డోర్లు, వెంటిలేటర్లకు మెస్లు ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు.ఈ సీజన్లో పెద్దాస్పత్రిలో నమోదైన ఓపీ, ఐపీ వివరాలు నెల ఔట్ పేషంట్ ఇన్ పేషంట్ జూన్ 34,629 3,327 జూలై 39,739 3,666 ఆగస్టు(6వరకు) 7,127 652 -
ముసురేసింది...
ఖమ్మంవ్యవసాయం: అల్పపీడనానికి తోడు నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం భారీ వర్షం, ఇంకొన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయానికి ఏన్కూరులో 23.3 మి.మీ.లు, ముదిగొండలో 18.3, పల్లెగూడెంలో 13.5, గేటుకారేపల్లిలో 13.3, ఖమ్మం ఖానాపురంలో 10.8, ప్రకాష్నగర్ 9.5, చింతకానిలో 8.8, రఘునాథపాలెంలో 8.5, కలక్టరేట్ వద్ద 7.5, కూసుమంచిలో 6.5, నాగులవంచ, వైరాలో 5 మి.మీ. వర్షపాతం నమోదైంది. తిమ్మారావుపేట, పెనుబల్లి, సత్తుపల్లి, పెద్దగోపతి, తిమ్మారావుపేట, కామేపల్లి, కొణిజర్ల, కల్లూరు తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురవగా, మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. పైర్లకు ప్రయోజనకరం ప్రస్తుతం కురుస్తున్న వానలు సాగులో ఉన్న పైర్లకు ప్రయోజనం కలిగిస్తున్నాయి. జూన్లో వర్షాలు మొదలుకాగానే రైతులు విస్తారంగా పత్తి సాగు చేశారు. ఆతర్వాత వర్షాలు లేకపోవడంతో పంటల సాగుపై నీలినీడలు కమ్ముకోగా అధిక నీరు అవసరమయ్యే వరి సాగు జోరందుకోలేదు. ప్రభుత్వం, అధికారుల సూచనలతో పలువురు వరి మాగాణి భూముల్లో పెసరతో పాటు కంది, మినుము, వేరుశనగ, చెరకు సాగు చేస్తున్నారు. ప్రస్తుత వర్షాలు కొనసాగితే వరి సాగు చేయాలనే ఆశతో అన్నదాతలు ఉన్నారు. నాగార్జునసాగర్లోకి నీరు చేరితే ఆలస్యంగానైనా నాట్లు వేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలోని 1.10 లక్షల ఎకరాల్లో పలు పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నారు. -
ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించండి
ఖమ్మం సహకారనగర్: రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా నమోదవుతున్నందున నీరు అధికంగా అవసరమయ్యే వరికి బదులు రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై సమీక్షించారు. సీజనల్ పరిస్థితులు, వ్యవసాయం, మండల ప్రజావాణి, వనమహోత్సవం, రేషన్ కార్డుల పంపిణీ, చేయూత పెన్షన్లు, యూనిఫామ్ పురోగతిపై ఆరా తీస్తూ సూచనలు చేశారు. ఈ వీసీకి జిల్లా నుంచి హాజరైన కలెక్టర్ దివాకర టీఎస్.. ఆ తర్వాత అధికారులతో సమావేశమయ్యారు. ఎల్నినో ప్రభావంతో పంట మార్పిడి చేసేలా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, భూగర్భ జలాలు పెరిగేలా పంట కుంటలు, సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణాలపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే, స్మార్ రేషన్ కార్డుల పంపిణీ, మహోత్సవంపై సూచనలు చేశారు. డీఆర్వో రామ్మూర్తి, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, పౌర సరఫరాల శాఖ అధికారి చందన్కుమార్, డీఆర్డీఓ శ్రీరామ్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి మధుసూదన్ పాల్గొన్నారు. మార్కెట్కు రూ.60 లక్షల ఆదాయం మక్కల అమ్మకంతో పన్ను రూపంలో లబ్ధి ఖమ్మంవ్యవసాయం: మొక్కజొన్నల అమ్మకం పన్ను ద్వారా ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు రూ. 60 లక్షల ఆదాయం లభించింది. గడిచిన యాసంగి సీజన్లో ప్రైవేట్ మార్కెట్లో మక్కలకు సరైన ధర లేకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. ఈమేరకు క్వింటాకు రూ. 2,400తో కొనుగోలు చేసిన 28 వేల మెట్రిక్ టన్నుల మక్కలను ఖమ్మం మార్కెట్లో భద్రపరిచారు. ఈ పంటను ఇటీవల టెండర్ల ద్వారా విక్రయించగా.. కొనుగోలు చేసిన వ్యాపారులు, సంస్థల బాధ్యులు తరలిస్తున్నారు. ఈమేరకు పంటల క్రయవిక్రయాలపై మార్కెట్కు ఒక శాతం పన్ను చెల్లించాల్సి ఉండడంతో మార్కెట్కు రూ.60 లక్షల ఆదాయం లభించింది. 14లోగా సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు తల్లాడ/ఏన్కూరు: గ్రామపంచాయతీల వారీగా అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను ఈనెల 14లోగా రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విద్యాలత సూచించారు. తల్లాడ ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం జరిగిన గ్రామ కార్యదర్శుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామపంచాయతీల అవసరాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి మండలాల వారీగా సమర్పించాలని తెలిపారు. అలాగే, ప్రతీ గ్రామపంచాయతీలో 20 పంట కుంటల ఏర్పాటుకు రైతుల నుంచి అంగీకార పత్రాలను తీసుకోవాలన్నారు. అలాగే, ఏన్కూరు మండలం భగవాన్నాయక్ తండా, గార్లఒడ్డు, రేపల్లెవాడ గ్రామాల్లో పర్యటించిన ఆమె పంట కుంటలు, వననర్సరీలు, గ్రామాసమాఖ్య భవన నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. రైతుల పొలాల్లో పంట కుంటలు తవ్వించడం ద్వారా సాగునీరు అందడమే కాక భూగర్భ జలాలు మెరుగవుతాయని, ఇందుకోసం జిల్లాలో 800 స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. ఈకార్యక్రమాల్లో అడిషనల్, అసిస్టెంట్ పీడీలు శిరీష, చలపతిరావు, డీఎల్పీఓ విజయలక్ష్మి, ఎంపీడీఓలు ఏ.శ్రీధర్రాజు, భాగ్యశ్రీ, సర్పంచ్లు భూక్యా నర్సి, సురేష్, ధరావత్ మణి, ఉద్యోగులు సూరయ్య, జీవీఎస్.నారాయణ, రేగళ్ల హరికృష్ణ, వాణిశ్రీ, కోటయ్య పాల్గొన్నారు. -
మూడు రోజులే సర్!
సాక్షి ప్రతినిధి,ఖమ్మం: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం(ఎస్ఐఆర్) గడువు మూడు రోజుల్లో ముగియనుంది. ఈనెల 10వ తేదీలోగా ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు అందిస్తే అదే గడువులోగా వారు డిజిటలైజేషన్ ముగించాల్సి ఉంటుంది. జిల్లాలో ఇప్పటివరకు 87.12 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తికాగా... మిగతావి కూడా పూర్తిచేసేలా కలెక్టర్ దివాకర టీ.ఎస్. యంత్రాంగం వేగం పెంచింది. శనివారం నుంచి సోమవారం వరకు వరుసగా సెలవులు ఉన్నప్పటికీ ‘సర్’ విధులు నిర్వర్తిస్తున్న వారు విధులకు హాజరుకావాలని ఆదేశించారు. ఖమ్మంలో షిష్టింగ్ ఓటర్లు 57,374.. నియోజకవర్గాల వారీగా చూస్తే పాలేరు నియోజకవర్గంలో అత్యధికంగా 92.07 శాతం, ఆతర్వాత సత్తుపల్లిలో 91,78 శాతం, వైరాలో 91.24 శాతం, మధిరలో 90.82 శాతం, ఖమ్మం నియోజకవర్గంలో 74.90 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. ఐదు నియోజకవర్గాల్లో కలిపి మరణించిన, శాశ్వతంగా నివాసం మారిన, డబుల్ ఓటర్లు, గైర్హాజరు జాబితా(ఏఎస్డీ)తో పాటు ఇతరులు మొత్తంగా 1,54,669 మంది ఓటర్లు ఉన్నారని తేలింది. గైర్హాజరు జాబితాలో ఉన్న ఓటర్ల తరఫున ఎన్యుమరేషన్ ఫారాలు అందితే డిజిటలైజేషన్ చేస్తారు. ఇక మిగిలిన వారి ఓట్లు మాత్రం ఎస్ఐఆర్ పూర్తయ్యాక జాబితాలో ఉండవు. మరణించిన, శాశ్వతంగా నివాసం మారిన, రెండేసి ఓట్లు ఉన్న వారు, గైర్హాజరు (ఓటరు దరఖాస్తు ఇవ్వని వారు) జాబితాలో జిల్లాలోనే ఎక్కువగా ఖమ్మం నియోజకవర్గంలో 78,242 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మరణించిన ఓటర్లు 9,081, శాశ్వతంగా నివాసం మారిన వారు 57,373 మంది, డబుల్ ఓట్లు కలిగిన వారు 3,807 మందితో పాటు గైర్హాజరు కేటగరీలో 7,492 మంది, ఇతరులు 488 మంది ఉన్నారు.12,43,781మొత్తం ఓటర్లుమొత్తం పోలింగ్ కేంద్రాలు 1,46087.12%10,83,599శాశ్వతంగా నివాసం మారిన వారుమరణించిన ఓటర్లుఏఎస్డీ జాబితాలో చేయాల్సినవిగైర్హాజరుఇతరులుడబుల్ ఓటర్లు5,51333,28199,36957210,86910,578డిజిటలైజేషన్ఈనెల 10తో ముగియనున్న ఎస్ఐఆర్ -
పొట్టకూటి కోసం వచ్చి... అనంతలోకాలకు
బోనకల్: రెక్కాడితే డొక్కాడని ఓ కూలీ కుటుంబ పోషణ కోసం రాష్ట్రం దాటి రాగా ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఘటనకు సంబంధించి వివరాలు.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లికి చెందిన తేజావత్ రాము (40) జీవనోపాధి కోసం అత్తగారిల్లయిన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రాహ్మణకుంట తండాకు వచ్చి రేకుల షెడ్డు వేసుకుని ఉంటున్నాడు. బోనకల్ మండలంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులకు బ్రాహ్మణకుంట తండా నుంచి పది మంది కూలీలతో కలిసి ఆయన వెళ్లాడు. రావినూతల సబ్స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్ ట్రాలీలో వేసుకుని వెళ్తుండగా ముష్టికుంట్ల సమీపాన మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి పక్కన గోతిలోకి దూసుకెళ్లింది. దీంతో ట్రాలీ పల్టీ కొట్టడంతో రాము కింద చిక్కుకోగా మిగతా వారు బయటపడ్డారు. స్థానికులు ఆయనను బయటకు తీసి 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కాగా, రాముకు భార్య, కుమారుడు, కుమార్తె ఉండగా కుమార్తె వివాహం రెండు నెలల క్రితమే జరిపించాడు. ఘటనపై అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మాచినేని రవి తెలిపారు.ట్రాక్టర్ బోల్తా పడడంతో కూలీ మృతి -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలను నెరవేర్చాల్సిందే..
నేలకొండపల్లి/ముదిగొండ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాల్సిందేనని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు హెచ్చరించారు. పార్టీ ఆధ్వర్యాన చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర శుక్రవారం నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో హేమంతరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ దేశసంపదను వారికి కట్టబెడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీరం చేస్తోందని ఆరోపించారు. ఇదే సమయాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను గాలికొదిలేశాయన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతీ కుటుంబానికి రూ.15 లక్షలు, ఆదాయం రెట్టింపు వంటి హామీలను కేంద్రం విస్మరించడంతో నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం పెరిగిందని, సంక్షోభంతో రైతులు, సామాన్యుల జీవనం దుర్భరంగా మారిందని పేర్కొన్నారు. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడమే ప్రజాపోరు యాత్ర లక్ష్యమని హేమంతరావు తెలిపారు. కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహ్మద్ మౌలానా, నాయకులు జితేందర్రెడ్డి, యర్ర బాబు, కర్ణకుమార్, మారిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లేబోయిన ఉపేందర్, కాశిబోయిన అయోధ్య, ఆలేటి మహేశ్, బాలిన కృష్ణంరాజు, రావెళ్ల కృష్ణ, పెద్దపాక నాగరాజు, ఏపూరి లలితాదేవి, కొండపర్తి గోవిందరావు, రావులపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.ప్రజాచైతన్య యాత్రలో సీపీఐ నేత హేమంతరావు -
జిల్లాలో అమల్లోకి ‘ఎఫ్ఎఫ్ఎస్’
ఖమ్మంవ్యవసాయం: ఎరువుల కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’(ఎఫ్ఎఫ్ఎస్) డిజిటల్ విధానం జిల్లాలో శుక్రవారం అమల్లోకి వచ్చింది. పలు రకాల ఎరువులను రైతులకు సబ్సిడీపై ఇస్తుండగా అక్రమాలు చోటు చేసుకుంటుండడం, అంతర్జాతీయ పరిణామాలతో కొరత ఏర్పడడంతో చెక్ పెట్టేలా కేంద్రం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో యూరియా, డీఏపీతో పాటు పలు రకాల కాంప్లెక్స్, ఇతర ఎరువులన్నీ ఈ విధానంలోనే బుక్ చేసి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో తొలిదశగా పది జిల్లాలో అమలుచేస్తుండగా, జాబితాలో జిల్లా కూడా ఉంది. జీఎఫ్ఆర్(జనరల్ ఫెర్టిలైజర్ రికమండ్) విధానంలో ఎఫ్ఎఫ్ఎస్ను అమలు చేస్తూ రైతులు సాగు చేసే పంటల ఆధారంగా ఎరువులను పంపిణీ చేస్తున్నారు. తొలిరోజు ఎఫ్ఎఫ్ఎస్ విధానంలో 7,772 మంది రైతులకు ఎరువులను విక్రయించారు. పలు ప్రాంతాల్లో ఎరువుల పంపిణీని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు.తొలిరోజు వినియోగించుకున్న 7,772 మంది రైతులు -
28 మందికి ఏఎస్సైలుగా ఉద్యోగోన్నతి
ఖమ్మంక్రైం: పలు పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న 28 మందికి ఏఎస్ఐలుగా ఉద్యోగోన్నతి లభించింది. ఈ సందర్భంగా వీరిని శుక్రవారం పోలీస్ కమిషనర్ సునీల్దత్ అభినందించి పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి మాట్లాడారు. బాధ్యతలు క్రమశిక్షణతో నిర్వర్తిస్తూ మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. కాగా, ఉద్యోగోన్నతి పొందిన వారికి భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వనున్నారు. సురక్షిత డ్రైవింగ్పై డ్రైవర్లకు శిక్షణ ఖమ్మంమయూరిసెంటర్: ప్రమాదాల నివారణకు ఆర్టీసీ ఖమ్మం రీజియన్ పరిధిలోని డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నట్లు రీజినల్ మేనేజర్ ఎ.సరిరామ్ తెలిపారు. రీజియన్ పరిధి ఏడు డిపోల డ్రైవర్లకు ఖమ్మం కొత్త బస్టాండ్ మీటింగ్హాల్లో శుక్రవారం శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రైవింగ్ సమయాన అప్రమత్తతపై వివరించారు. మంచి ఆహార అలవాట్లను కలిగి ఉండి సరైన విశ్రాంతి తీసుకుని విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం ట్రాఫిక్ సీఐ రవికుమార్, ఏఎంవీఐ మధు రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. అన్ని ఆస్పత్రుల్లో పాముకాటుకు చికిత్స ఖమ్మంవైద్యవిభాగం: వర్షాలు కురుస్తున్న నేపథ్యాన పాములు, ఇతర విషకీటకాల బారిన పడకుండగా ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రామారావు సూచించారు. పొలాల్లో పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, రాత్రి వేళ పొలాల వద్దకు వెళ్లే వారు టార్చ్లైట్ వెంట ఉంచుకోవాలని, దట్టమైన గడ్డి, చెత్తాచెదారం, పొదలు ఉన్న ప్రాంతాల్లో నడిచే సమయాన శబ్దం చేస్తూ ముందుకు సాగాలని తెలిపారు. కాగా, జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాము కాటుకు గురైన వారికి ఇచ్చే ఇంజక్షన్లు, చికిత్స అందుబాటులో ఉన్నాయని డీఎంహెచ్ఓ వెల్లడించారు. పాము కాటుకు గురైన వ్యక్తి ఆందోళన చెందకుండా ఉండేలా ధైర్యం చెబుతూ ఆస్పత్రికి తీసుకెళ్లాలే తప్ప నాటు వైద్యాన్ని నమ్మి కాలం వృథా చేయొద్దని ఆయన ఓ ప్రటనలో సూచించారు. 10న జైల్ భరోను జయప్రదం చేయండి ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న చేపడుతున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐక్య రైతు, కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. అఖిలపక్ష రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల సంయుక్త సమావేశం ఖమ్మంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించగా.. నాయకులు మాట్లాడారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకోవడమే కాక ట్రంప్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తక్షణం రద్దు చేయాలనే తదితర డిమాండ్లతో చేపడుతున్న జైల్భరోను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ, కాంగ్రెస్, సీపీఎం, బీఆర్ఎస్, మాస్లైన్, న్యూడెమోక్రసీతో పాటు ప్రజా సంఘాల నాయకులు దొండపాటి రమేశ్, కొండపర్తి గోవిందరావు, తుమ్మల యుగంధర్, యరగర్ల హన్మంతరావు, పొన్నం వెంకటేశ్వరరావు, కల్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రం, ఎండీవై పాషా, జి.రామయ్య, బందెల వెంకయ్య, ఇమ్మడి హన్మంతరావు, ప్రకాష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఖమ్మంలో ‘చేనేత నడక’ ఖమ్మంగాంధీచౌక్: జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా శుక్రవారం ఖమ్మంలో ‘చేనేత నడక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖమ్మంలోని బస్ డిపో నుంచి పెవిలియన్ గ్రౌండ్ మీదుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. చేనేత శాఖ ఏఓ శ్రీనివాసరావు, డీవైఎస్ఓ సునీల్రెడ్డి, డీఆర్డీఓ శ్రీరామ్, జిల్లా పర్యాటక అధికారి సుమన్ చక్రవర్తి, ఉద్యోగులు శర్మ, విజయలక్ష్మితో పాటు చేనేత సహకార సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో నేతన్న భరోసా చెక్కులను సహకార సంఘాల అధ్యక్షులకు అందించారు. అలాగే, చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేసి చేనేత కార్మికులను సన్మానించారు. -
నిందితుల జాడ తెలిసేనా?
● రామారావు హత్య కేసులో ముగిసిన ఎన్ఎఫ్ఎస్యూ విచారణ ● 26 మందిని విచారించిన నిపుణుల బృందంచింతకాని: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీపీఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావు(73) హత్య కేసులో నిందితులెవరో ఇప్పుడైనా తేలుతుందా, లేదా అన్న చర్చ జరుగుతోంది. చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన రామారావు హత్య జరిగిన తొమ్మిది నెలలు గడిచినా ఎలాంటి పురోగతి కానరాలేదు. హత్య కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు విస్తృతంగా విచారణ చేపట్టినా నిందితుల ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రామానికి చెందిన ఆరుగురికి ఈ ఏడాది జనవరి 13వ తేదీన బెంగుళూరులో ఫోరెన్సిక్ నిపుణులు వారం పాటు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించినా పురోగతి కనిపించలేదు. చివరకు గుజరాత్ రాష్ట్రంలోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యూ)కి చెందిన తొమ్మిది మంది నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఖమ్మం సిటీ ట్రైనింగ్ సెంటర్(సీటీసీ)లో సోమవారం నుంచి బుధవారం వరకు అనుమానితులు, కుటుంబసభ్యులు, సాక్షులు మొత్తం 26 మందిని వారు విచారించారు. వీరిలో రామారావు కుటుంబసభ్యులతో పాటు పాతర్లపాడు, ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లివాసులు ఉన్నారు. హత్య కేసుకు సంబంధించి కీలక అంశాలపై లోతుగా సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. విచారణ అంశాలను విశ్లేషించి ఇరవై రోజుల్లో జిల్లా పోలీసులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలియగా.. ఈసారైనా రామారావు హంతకుల జాడ దొరుకుతుందో, లేదో వేచి చూడాలి. -
ఎర్రబోయినపల్లికి త్వరలోనే బస్సు
మంత్రి పొంగులేటి హామీ మేరకు అధికారుల సర్వే కల్లూరురూరల్: కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామానికి త్వరలోనే బస్సు సర్వీస్ ఏర్పాటు చేయిస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చనుంది. ఇటీవల కల్లూరులో నిర్వహించిన ప్రజాదర్బార్లో రెండో తరగతి విద్యార్థి నల్లగట్ల క్రిశాంక్ మంత్రిని కలిసి పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉన్నందున బస్సు నడిపించాలని కోరారు. దీంతో స్పందించిన మంత్రి పొంగులేటి ఆరాతీయగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సర్వే చేస్తామని ఆర్టీసీ అధికారి చెప్పడంతో వారంలోగా సర్వీస్ నడపాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు మధిర ఆర్టీసీ డిపో మేనేజర్ దేవరాజు శుక్రవారం కల్లూరు, లింగాల, కొత్త ఎర్రబోయినపల్లి, పాత ఎర్రబోయినపల్లి గ్రామాల్లో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రికి వినతిపత్రం ఇచ్చిన బాలుడు క్రిశాంత్ను అభినందించారు. కాగా, డీఎం నివేదికను ఖమ్మం ఆర్ఎంకు అందజేశాక ఎర్రబోయినపల్లికి బస్సు ప్రారంభమయ్యే అవకాశముంది. ప్రస్తుతం మధిర నుంచి కల్లూరుకు నడుస్తున్న సర్వీస్ ఎర్రబోయినపల్లి గ్రామానికి రావాలంటే మూడు కి.మీ. అదనంగా తిరిగి రావాల్సి ఉంటుంది. -
రైలు కిందపడి వృద్ధుడు ఆత్మహత్య
చింతకాని: చింతకాని రైల్వేస్టేషన్ సమీపాన గుర్తుతెలియని వృద్ధుడు(70) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు... సదరు వృద్ధుడు గురువారం ఉదయం విజయవాడ వైపు వెళ్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు కిందపడడంతో వృద్ధుడి శరీరం నుజ్జునుజ్జయి గుర్తు పట్టలేని విధంగా మారింది. ఆయన వద్ద చేతికర్ర ఉండగా, గోధుమ, గులాబీ రంగులతో ఉన్న కండువా, మెరూన్, నలుపు, తెల్లటి చుక్కలతో ఉన్న లుంగీ లభించాయని జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో ఖమ్మం ఆస్పత్రి మార్చురీకి తరలించగా, ఆయన వివరాలు తెలిసిన వివరాలు 98481 14202, 87125 58589 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. అనారోగ్యంతో డిప్యూటీ జైలర్ మృతి సత్తుపల్లి టౌన్: సత్తుపల్లి సబ్జైలులో డిప్యూటీ జైలర్గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావు(56) మృతి చెందారు. ఏపీలోని ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన ఆయన కడప, హైదరాబాద్, ఖమ్మం, సత్తుపల్లి సబ్ జైళ్లలో పనిచేశారు. కొన్నాళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాసరావు గురువారం మృతి చెందారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా, శ్రీనివాసరావు మృతిపై సబ్ జైల్ సూపరింటెండెంట్ ఉబ్బల కుటుంబరాజు, ఉద్యోగులు సంతాపం తెలిపారు. చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు ఖమ్మంలీగల్: అప్పు చెల్లించే క్రమాన జారీ చేసిన చెక్కు చెల్లకపోవడంతో నేలకొండపల్లి మండలం చెరువుమాధారానికి చెందిన నందిగామ ఆనంద్బాబుకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి బెక్కం రజిని గురువారం తీర్పు చెప్పారు. ఖమ్మం శ్రీనగర్కాలనీకి చెందిన బండి శివరంజని వద్ద ఆనంద్ 2022 జనవరిలో రూ.6 లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి 2023 జనవరిలో రూ.7 లక్షలకు చెక్కు జారీ చేసిన ఆయన ఖాతా అప్పటికే మూసివేయడంతో తిరస్కరణకు గురైంది. దీంతో న్యాయవాది ద్వారా శివరజంని లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. ఈ మేరకు విచారణ అనంతరం ఆనంద్కు జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.8 లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు. -
కేఎంసీలో ‘అవినీతి’ కలకలం
● ఇటీవలే బయటపడిన డీజిల్ దోపిడీ ● ఇప్పుడు ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వసూళ్లు ● వరుస ఘటనలతో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం?ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ (కేఎంసీ) అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మారిందనే ఆరోపణలు నానాటికీ పెరుగుతున్నాయి. అధికారిక కూపన్లతో సంబంధం లేకుండా.. కేవలం ఫోన్ కాల్తో వాహనాల్లో వందల లీటర్ల డీజిల్ కొట్టించే దందాపై విమర్శలు వస్తుండగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల నుంచి వసూళ్లు బయటపడ్డాయి. ఒకదాని వెనుక ఒకటి అవినీతి ఆరోణలు వస్తుండడం చర్చకు దారి తీయగా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు కేఎంసీపై కన్నేసినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు కోసం కొందరు సిబ్బంది లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమే కాక లంచాలు డిమాండ్ చేసినట్లు సోషల్ మీడియాలో ఆడియోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. తొలుత ఆడియోలు బయటకు రాగా.. మరుసటి రోజే లంచం తీసుకుంటున్న వీడియోలు రావడం అధికార యంత్రాంగాన్ని షాక్కు గురిచేసింది. నిబంధనలకు విరుద్ధంగా, రికార్డులు లేకుండా డీజిల్ పక్కదారి పట్టిస్తారనే విమర్శలు వచ్చిన కొన్నాళ్లకు ఇందిరమ్మ పథకంలో అవినీతి బయటపడడం గమనార్హం. డీజిల్ పక్కదారి పట్టించిన ఘటనలో కొందరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు.. ఆ తర్వాత ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడంపై అనుమానాలను వ్యక్తయమవుతున్నాయి. పాలకులు, అధికారుల అండదండలు? అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత, మంత్రి అనుచరుల అండదండలతోనే దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అధికారులకు విషయం తెలిసినా రాజకీయ ఒత్తిళ్ల వల్ల మౌనం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, కొందరు సిబ్బందితో ఉన్న లోపాయికారీ ఒప్పందాలతో పాలనపై పట్టు సడలిపోయిందని విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి తెరతీయడం, ప్రభుత్వంపై బురదజల్లేలా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారడంతో జిల్లా ఉన్నతాధికారులు, మంత్రి క్యాంప్ కార్యాలయ ప్రతినిధులు రంగంలోకి దిగినట్లు సమాచారం. కేఎంసీలో జరుగుతున్న అంశాలపై వివరాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఆడియో, వీడియో ఆధారాల లీకేజీల వెనుక ఎవరున్నారు, డీజిల్ దోపిడీ వెనుక ఎవరి హస్తం ఉందనే అంశంపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ప్రక్షాళన దిశగా చర్యలు.. కేఎంసీ ప్రతిష్ట దిగజారిన నేపథ్యాన, త్వరగా చక్కదిద్ది, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు అటు అధికారులు, ఇటు పాలకులు కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది. కేఎంసీ పాలనను వెంటనే గాడిన పెట్టకుంటే భవిష్యత్లో ఆరోపణలు పెరుగుతాయనే భావనతో యంత్రాంగం, పాలకులు ముందుడుగు వేసినట్లు సమాచారం.ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల నుండి ఓ వార్డ్ ఆఫీసర్ నగదు డిమాండ్ చేశారని ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదుతో విచారణ చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికే సదరు వార్డ్ ఆఫీసర్ను సస్పెండ్ చేయగా.. విచారణ కోసం త్రిసభ్య కమిటీని నియమించారు. కమిటీ సభ్యులు గురువారం విచారణకు హాజరుకావాలని సూచించగా ఉద్యోగి వచ్చినా ఫిర్యాదుదారుడు రాలేదని తెలిసింది. దీంతో శుక్రవారం రావాలని మరోసారి నోటీసు పంపినట్లు సమాచారం. అయితే, కలెక్టరేట్లోని ఉద్యానశాఖ కార్యాలయంలో చేపట్టిన విచారణలో సదరు ఉద్యోగి మాత్రం తానెలాంటి తప్పు చేయలేదని, కావాలనే ఇరికిస్తున్నారని చెప్పినట్లు తెలిసింది. -
రవాణా శాఖపై ఏసీబీ కన్ను
● తొమ్మిది మంది ఉద్యోగులకు నోటీసులు ● త్వరలోనే పూర్తిస్థాయిలో విచారణ ఖమ్మంక్రైం: జిల్లా రవాణా శాఖ ఉద్యోగులను ఏసీబీ భయం వీడడం లేదు. ఏసీబీ అధికారులు తనిఖీలు, దాడులతో ఏడాది కాలంగా ఈ పరిస్థితి నెలకొంది. గత సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన జిల్లా రవాణాశాఖాధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయడమే కాక కార్యాలయంలో పనిచేస్తున్న తొమ్మిది మంది ఉద్యోగులతోపాటు కొందరు ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. రవాణాశాఖలో అవినీతి పెరిగిందని పలువురు నేరుగా హైదరాబాద్లోని ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో తనిఖీలు చేపట్టిన విషయం విదితమే. ఉద్యోగులకు నోటీసులు గత ఏడాది చేపట్టిన తనిఖీల సందర్భంగా తొమ్మిది మంది ఉద్యోగులు.. ఏజెంట్లతో కుమ్మక్కయ్యారని తేల్చారు. ఈ మేరకు ఆధారాలు కూడా లభించడంతో పూర్తి స్థాయిలో విచారణ అనంతరం సదరు ఉద్యోగులకు ఏసీబీ జారీ చేసిన నోటీసులు గురువారం జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి అందాయి. దీంతో వారు హైదరాబాద్ లేదా వరంగల్లో త్వరలో జరిగే విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. రవాణా శాఖ కార్యాలయంలోని తొమ్మిది మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన డీబీ (డేటాబేస్ ఆపరేటర్) యాకూబ్పాషాను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగిస్తూ డీటీఓ శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో మరొకరిని ఒకటి, రెండు రోజుల్లో నియమించే అవకాశముంది. -
సీపీ గెట్లో డిగ్రీ కళాశాల విద్యార్థినుల ప్రతిభ
రఘునాథపాలెం: రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ప్రవేశాలకు కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన నిర్వహించిన సీపీ గెట్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ సందర్భంగా రఘునాథపాలెంలోని మహాత్మా జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ వై.నాగేశ్వరరావు తెలిపారు. 2025–26లో డిగ్రీ పూర్తి చేసిన ఓర్సు స్రవంతి తెలుగులో రాష్ట్రస్థాయి 28వ ర్యాంకు, అల్లి అఖిల గణితశాస్త్రంలో 66వ ర్యాంకు సాధించగా, మరో పది మంది విద్యార్థినులు500లోపు ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్తో పాటు ఆర్సీఓ సీహెచ్.రాంబాబు, అధ్యాపకులు అభినందించారు. ఆరు జిల్లాల మత్స్యకారులకు శిక్షణ కూసుమంచి: కూసుమంచి మండలం పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో మత్స్యకారులకు మూడు రోజుల పాటు జరిగే శిక్షణ గురువారం ప్రారంభమైంది. ఖమ్మం, సిద్ది పేట, వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల మత్స్యకారులు పాల్గొనగా తొలి రో జు బయోప్లాక్ విధానంలో చేపల పెంపకంపై అవగాహన కల్పించారు. మత్స్యకారులు నూత న సాంకేతిక పద్ధతులను అవలంభిస్తూ చేపల పెంపకంతో లాభాలు సాధించాలని కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. గ్రోవెల్ ఫార్ములేషన్ ఫీడ్ సీనియర్ టెక్నీషియన్ డాక్టర్ జగదీష్, శాస్త్రవేత్త దివ్య వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. వేణుకుమార్కు రూ.లక్ష ఆర్థికసాయం ●అండగా నిలిచిన ఎంపీ రవిచంద్ర ముదిగొండ: ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేద ని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మండలంలోని న్యూలక్ష్మీపురానికి చెందిన గడ్డం వేణుకుమార్ ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యా రు. ఈ సందర్భంగా ఆయనకు రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రూ.లక్ష ఆర్థికసాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు చెక్కును జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, బీఆర్ఎస్ నాయకులు గురువారం వేణుకుమార్కు అందజేశారు. అనంతరం వారు నిరుద్యోగులను విస్మరించి పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి యువతే తగిన గుణపాఠం చెబుతుందని తెలిపారు. బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, వెంకట్గౌడ్, సర్పంచ్ సలీమున్నీసాబేగం, నాయకులు రమేశ్, సీతారామ య్య, కిరణ్, హరీశ్, ఖాసీం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. బియ్యం లారీ స్వాధీనం ఏన్కూరు: అక్రమంగా బియ్యం తరలిస్తున్న లారీని ఏన్కూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండల కేంద్రంలో పోలీసులు గురువారం వాహనాల తనిఖీ చేపడుతుండగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకు బియ్యం లోడ్తో వెళ్తున్న లారీని గుర్తించారు. ఇందులో 250 క్వింటాళ్ల దొడ్డు బియ్యం ఉండగా, లారీని పోలీస్స్టేషన్ తరలించి సివిల్ సప్లయీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పరిశీలన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ నారబోయిన సంధ్య తెలిపారు. -
గోపాలపురం పాఠశాల నిర్మాణానికి రూ.30లక్షలు
తిరుమలాయపాలెం: మండలంలోని గోపాలపురం పాఠశాల శిథిల దశకు చేరడంతో ఉపాధ్యాయురాలు సొంత ఖర్చులతో షెడ్డు ఏర్పాటు చేయించి విద్యార్థులకు పాఠాలు బోధిస్తోంది. ఈ విషయం తెలియడంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ దివాకర టీ.ఎస్. గురువారం పాఠశాలను సందర్శించారు. ఈమేరకు పాఠశాల భవన నిర్మాణానికి రూ.30లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక సొంత నగదుతో షెడ్డు వేయించిన ఉపాధ్యాయురాలు ఇందిరను అభినందించారు. తహసీల్దార్ విల్సన్ ఎంపీడీఓ సిలార్ సాహెబ్, పంచాయతీ రాజ్ ఎస్ఈ వెంకట్రెడ్డి, విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సీ.హెచ్.రామకృష్ణ, ఏఎంఓ పెసర ప్రభాకర్రెడ్డి ఎంఈఓ బాబు, సర్పంచ్ నల్లమల కీర్తి పాల్గొన్నారు.షెడ్డు వేయించిన ఉపాధ్యాయురాలికి కలెక్టర్ సన్మానం -
అమృత భాండాగారం
● జనరల్ ఆస్పత్రిలో మిల్క్ బ్యాంక్కు నాలుగేళ్లు ● స్వచ్ఛందంగా పాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్న తల్లులు ● వేలాది మంది నవజాత శిశువులకు మేలు ఖమ్మంవైద్యవిభాగం: తల్లి పాలు శిశువుకు అమృతం వంటివి. బిడ్డ పుట్టిన గంట లోపు ముర్రుపాలు పట్టిస్తే ఆ శిశువు ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరడమే కాక ఎదుగుదలకు ఉపయోగపడుతాయి. అయితే, కొందరు తల్లులకు సరిపడా పాలు రాక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరికొందరు తల్లులకు పాలు లభించినా శిశువుకు పట్టలేని పరిస్థితి ఎదురవుతోంది. ఫలితంగా ఆయా శిశువులకు డబ్బా పాలు పట్టిస్తే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు ఖమ్మం జనరల్ ఆస్పత్రిలో 2022 మే నెలలో ‘అమృతం’ పేరిట తల్లిపాల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పాలు ఎక్కువగా వచ్చే తల్లుల నుంచి సేకరించి భద్రపరుస్తూ పాలు రాని తల్లుల పిల్లలకు అందిస్తున్నారు. అలాగే పాలు వచ్చినా పట్టించలేని తల్లులు కూడా ఈ కేంద్రంలో పాలను డబ్బాల్లో సేకరించి శిశువులకు పట్టించే అవకాశం కల్పిస్తున్నారు. నాలుగేళ్లుగా సేవలు పెద్దాస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల సేకరణ కేంద్రం నాలుగేళ్లుగా విస్తృత సేవలు అందిస్తోంది. నిత్యం 20 – 25 వరకు ప్రసవాలు జరుగుతుండగా, బరువు తక్కువగా, ఇతర అనారోగ్య సమస్యలతో పుట్టిన వారికి ఎస్ఎన్సీయూలో చికిత్స అందిస్తారు. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో జన్మించి అనారోగ్య సమస్యలకు గురైన శిశువులను కూడా ఎంసీహెచ్ఎస్కు తీసుకొస్తున్నారు. వీరిలో చాలామంది శిశువులకు తల్లి నేరుగా పాలు పట్టించడం సాధ్యం కాక డబ్బా పాలపై ఆధారపడుతున్నారు. ఈ క్రమాన మిల్క్ బ్యాంక్లో పాలు ఎక్కువ పడే తల్లులు స్వచ్ఛందంగా ముందుకొస్తుండగా సేకరించి అవసరమైన శిశువులకు అందిస్తున్నారు. గత నాలుగేళ్లలో ఈ కేంద్రం ద్వారా 10,861 మంది తల్లుల నుంచి 2,969 లీటర్ల పాలు సేకరించి శిశువులకు అందించారు. పెద్దాస్పత్రిలో చికిత్స పొందే శిశువులకే కాక శిశుగృహలో ఉండే పిల్లలకు 159 లీటర్ల పాలు సరఫరా చేయడం విశేషం.పాలు అందించిన తల్లులు 10,681 మంది స్వచ్ఛందంగా వచ్చిన వారు 5,299 మంది ఇప్పటి వరకు సేకరించిన పాలు 2,969 లీటర్లు లబ్ధి పొందిన శిశువులు 12,494 మంది -
బొమ్మ సత్యప్రసాద్కు పలువురి నివాళి
ఖమ్మంఅర్బన్: అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన బొమ్మ విద్యాసంస్థల వైస్ చైర్మన్ బొమ్మ సత్యప్రసాద్కు పలువురు నివాళులర్పించారు. ఆయన నివాసంలో మృతదేహం వద్ద నివాళులర్పించి బొమ్మ విద్యాసంస్థల అధినేత బొమ్మ నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, నాయకులు దొబ్బల సౌజన్య, తుపాకుల ఎలగొండ స్వామి, మాజీ మేయర్లు పునుకొల్లు నీరజ, డాక్టర్ పాపాలాల్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అలాగే, పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, విద్యాసంస్థల బాధ్యులు బాగం హేమంతరావు, రాజా, వాసిరెడ్డి నాగేంద్రకుమార్, మల్లెంపాటి శ్రీధర్, గుండాల కృష్ణ, మేళ్లచెరువు వెంకటేశ్వర్లు, కొప్పు నరేశ్కుమార్, దొడ్డ రవి, చావా రాము, బయ్యన బాబు, కమర్తపు మురళి, మందడపు మనోహర్ కూడా నివాళులర్పించారు. కాగా, శుక్రవారం ఉదయం సత్యప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
ఖమ్మంక్రైం: బంగారు గొలుసు చోరీకి పాల్పడిన నిందితుడిని ఖమ్మం టూటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ బాలకృష్ణ వెల్లడించిన వివరాలు.. సహకారనగర్కు చెందిన పూటగోకర్ల రమాదేవి కిరాణం సరుకులు తీసుకుని వెళ్తుండగా కొణిజర్ల మండలం గోపవరానికి చెందిన బంటు రాము ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కుని పారిపోయాడు. ఆ తర్వాత గొలుసును గాంధీచౌక్లో బంగారం దుకాణంలో విక్రయించాడు. గురువారం వాహనాల తనిఖీ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన రామును అదుపులోకి విచారించగా చోరీ విషయం బయటపడింది. ఆయన నుంచి బైక్, బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. కాగా, జల్సాలకు అలవాటు పడిన రాము చోరీకి పాల్పడ్డాడని సీఐ తెలిపారు. బాలికను పెళ్లాడిన వ్యక్తిపై పోక్సో కేసు తిరుమలాయపాలెం: దంపతుల నడుమ గొడవలతో భార్య కుమారులతో కలిసి వేరే ఉంటుండగా, ఆమె భర్త 17 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వంగా సతీశ్ గత నెల 20న బాలికను వివాహం చేసుకుని ఇంట్లోనే జీవనం సాగిస్తున్నాడు. ఈ విషయమై ఐసీడీఎస్ అధికారి లక్ష్మి ఫిర్యాదు మేరకు కూసుమంచి సీఐ సంజీవ్ గురువారం విచారణ చేపట్టి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. 696.1 కిలోల గంజాయి దగ్ధం తల్లాడ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సీజ్ చేసిన గంజాయిని తల్లాడ మండలం గోపాలపేట ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ (వ్యర్థ పదార్థాల నివారణ పరిశ్రమ)లో దహనం చేశారు. భద్రాద్రి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 32 కేసులకు సంబంధించి 696.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.3.50 కోట్లు కాగా, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి ఆదేశాలతో గురువారం దహనం చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్, కొత్తగూడెం డీపీఈఓ ఎ.శ్రీనివాసరెడ్డి, సీఐ జయశ్రీ, ఎస్ఐలు రమేశ్, గౌతమ్ పాల్గొన్నారు. -
ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు
ముదిగొండ: ముదిగొండలోని పలు హోటళ్లు, స్వీట్షాప్లలో జిల్లా ఇన్చార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ శరత్ ఆధ్వర్యాన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు దుకాణాల్లో శాంపిళ్లు సేకరించడమే కాక లైసె న్స్ లేని దుకాణాదారులకు హెచ్చరిక జారీ చేశారు. హోటళ్లలో శుభ్రత లేకపోయినా, నాణ్యత పాటించకున్నా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఫోన్తో స్పందన నేలకొండపల్లి: నేలకొండపల్లిలో పలువురు హోటళ్ల నిర్వాహకులు నాణ్యత పాటించడం లేదని, కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు స్థానికులు ఫోన్ చేయగా.. జిల్లా పుడ్ ఇన్స్పెక్టర్ వి.శరత్ ఆధ్వార్యన తనిఖీలు చేపట్టారు. పలు హోటళ్లు, బేకరీల్లో శాంపిళ్లు సేకరించడమే కాక నాణ్యత, తయారీ తేదీలు, ఇతర వివరాలను పరిశీలించారు. వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంచుంచుపల్లి: తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని మణుగూరు ప్రాంతీయ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్, చర్ల సీహెచ్సీలో గైనకాలజీ పోస్టుతో పాటు పిల్లల వైద్య నిపుణుల పోస్టుకు కాంట్రాక్టు పద్ధతిన వైద్యులను నియమించనున్నట్లు డీసీహెచ్ఎస్ జి.రవిబాబు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
మార్పు కోసమే పోరాటం
● జాతీయ సమితి సభ్యుడు హేమంతరావు ● జిల్లాలో ప్రారంభమైన ప్రజాచైతన్య యాత్రఖమ్మంరూరల్: దేశం సంక్లిష్ట ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోందని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రజాస్వామ్యం ముప్పులో పడిందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు సంపన్న వర్గాలకు సానుకూలంగా మారడంతో పేదలు మరింత ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈనేపథ్యాన ప్రజాస్వామ్య పరిరక్షణ, మార్పు కోసం కమ్యూనిస్టులు పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర గురువారం ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హేమంతరావు మాట్లాడుతూ దేశంలో సంపద కొద్దిమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీ కాగా, ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయని తెలిపారు. దేశం ఆర్థికంగా పతనం అంచున ఉన్నప్పటికీ, నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ధరల నియంత్రణ, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన హామీలను మోదీ విస్మరించారని విమర్శించారు. ఈనెల 15 వరకు ప్రజా చైతన్య యాత్రలు జరగనుండగా, వచ్చేనెల 1న ఢిల్లీలో లక్షలాదిమందితో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, సిద్ధినేని కర్ణకుమార్, అజ్మీరా రామ్మూర్తి, చిన్న వెంకటరెడ్డి, పుచ్చకాయల సుధాకర్, ఉన్నం బంగారం, చెరుకుపల్లి భాస్కర్, బానోతు రామ్కోటి, పగిళ్ల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ఖమ్మంరూరల్: పేదల సంక్షేమంతో పాటు గ్రామాలు, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మంరూరల్ మండలాల్లో కలెక్టర్ దివాకర టీ.ఎస్.. పోలీసు కమిషనర్ సునీల్దత్తో కలిసి గురువారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గుదిమల్లలో రూ.5 కోట్లతో నిర్మించే రహదారి, కామంచికల్ నుంచి కోయచెలక వరకు రూ.2.10కోట్లతో రహదారి నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి మాట్లాడారు. గడిచిన 32 నెలల్లో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో రూ.21.61 కోట్లవిలువైన అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం గ్రామాలు, కొత్త మున్సిపాలిటీల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే తాము అధికారంలోకి వచ్చాక ఆ లోటు పూడుస్తున్నామని వెల్లడించారు. సంక్షేమ పథకాల జోరు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డుల పంపిణీ, పేదలకు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పొంగులేటి తెలిపారు. గత పదేళ్లలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే తాము మాత్రం తొలి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షలు, హైదరాబాద్కు మరో లక్ష కలిపి మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. అర్హులందరికీ ఇళ్లు దక్కే వరకు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే, ఈనెల 15 నుంచి కొత్తగా వృద్ధాప్య, వితంతు పెన్షన్లు కూడా మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ఏదులాపురంలో చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతీ పనిలో నాణ్యతను పర్యవేక్షిస్తూ గడువులోగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈకార్యక్రమాల్లో ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
పూర్వ ఉమ్మడి జిల్లా పరిధిలోని డీసీసీబీలో పీఏసీఎస్లు, సభ్యుల వివరాలు
మహబూబాబాద్ 02 13,241భద్రాద్రి 21 1,11,534ఖమ్మం 75 3,63,311ములుగు 02 10,403జిల్లాపీఏసీఎస్లురైతులు100 శాతం ప్లేస్మెంట్లునర్సరీల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి ఖమ్మం రూరల్/తిరుమలాయపాలెం: నర్సరీల యజమానులు మిర్చి నారు విషయంలో నాణ్యత పాటిస్తూ రైతులకు నష్టం జరగకుండా చూడాలని జిల్లా ఉద్యాన శాఖాధికారి మధుసూదన్ సూచించారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్, తిరుమలాయపాలెం రైతు వేదికల్లో మిరప నర్సరీల యజమానులకు నర్సరీ చట్టంపై గురువారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. యజమానులు అనుమతి తీసుకోవడమే కాక నాణ్యమైన మిరప నారు మాత్రమే విక్రయించాలని తెలిపారు. కాగా, ఎల్నినో పరిస్థితుల కారణంగా రైతులు మిరప సాగు విషయంలో ఆలోచించాలని సూచించారు. లైసెన్స్ కలిగిన నర్సరీల్లో 45 – 55 రోజుల నాణ్యమైన నారు మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. పాలేరు డివిజన్ ఉద్యాన అధికారి అపర్ణ, ఏఈఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఐటీఐ(అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ – ఏటీసీ)లో గురువారం ప్లేస్మెంట్, అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించారు. మేళాలో 250మంది విద్యార్థులు పాల్గొనగా పది ప్రముఖ పరిశ్రమలు, సంస్థల బాధ్యులు పాల్గొని ఇంటర్వ్యూ ద్వారా ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏటీసీ విద్యార్థులు 98మందికి గాను అందరికీ ప్లేస్మెంట్లు లభించడం విశేషం. ఈ మేరకు అభ్యర్థులకు ట్రెయినీ కలెక్టర్ పరాస్కుమార్ ప్రిన్సిపాల్ సక్రుతో కలిసి నియామక పత్రాలు అందజేశాక మాట్లాడారు. విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకుని అప్రెంటిస్షిప్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ సక్రు మాట్లాడుతూ కోర్సు చేస్తుండగానే విద్యార్థులకు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు దక్కడం ఆనందంగా ఉందని తెలిపారు. భవిష్యత్లో మరిన్ని పరిశ్రమలను భాగస్వామ్యం చేస్తూ మేళాలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా ఉపాఽధి కల్పన అధికారి మాధవి, మధిర ఐటీఐ ప్రిన్సిపాల్ ఏ.శ్రీనివాసరావుతో పాటు అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.సత్తా చాటిన ఖమ్మం ఏటీసీ విద్యార్థులు -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఏదులాపురం మున్సిపాలిటీ 22, 23 వార్డుల్లో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తారు. ఆతర్వాత ఖమ్మంరూరల్ మండలం మంగళగూడెంలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించనున్నారు. అనంతరం తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం, హైదరసాయిపేట, పాతర్లపాడు, రాజారం గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఖమ్మం మార్కెట్కు సెలవులు ఖమ్మంవ్యవసాయం: వారాంతం, బోనాలు, అమావాస్య సందర్భంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవులు ప్రకటించారు. ఈనెల 8వ తేదీ శనివారం, 9న ఆదివారం వారాంతపు సెలవులు కాగా, 10వ తేదీన సోమవారం బోనాల సందర్భంగా ప్రభుత్వం సెలవుప్రకటించింది. ఇక 11వ తేదీ మంగళవారం మార్కెట్ కార్యకలాపాలు జరగనుండగా, 12వ తేదీ బుధవారం అమావాస్య కావడంతో సెలవు అమలవుతుంది. తిరిగి 13వ తేదీ గురువారం నుంచి మార్కెట్ యార్డులో కార్యకలాపాలు జరుగుతాయని, ఈ విషయాన్ని రైతులు, వ్యాపారులు గమనించాలని ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ గురువారం విడుదలచేసిన ఒక ప్రకటనలో సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధనే లక్ష్యం ఖమ్మం సహకారనగర్: నూతన పాఠ్యపుస్తకాల ఆధారంగా విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి కె.రవిబాబు సూచించారు. రెండు రోజుల పాటు కొనసాగే అధ్యాపకుల శిక్షణ తరగతులు ఖమ్మంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం మొదలయ్యాయి. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, అర్థశాస్త్రం, చరిత్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో పాలుపంచుకున్న నిపుణులతో శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. జూనియర్ కాలేజీల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటుచేసినందున బోధనలో మార్పు రావాలని పేర్కొన్నా రు. శిక్షణ ఆధారంగా పాఠాలు బోధిస్తూ మెరుగైన ఫలితాలు నమోదుచేయాలని తెలిపారు. నయాబజార్ కాలేజీ ప్రిన్సిపాల్ ధనమ్మ, రిసోర్స్ పర్సన్లు విజయలక్ష్మి, టి.కిరణ్, సీహెచ్.వెంకటేశ్వర్లు, జె.వెంకన్న, రామయ్య, కె.శ్రీని వాస్, లక్ష్మయ్య, టి.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రారంభంలోనే ప్రమాదం
చింతకాని /ఖమ్మంరూరల్: అధికారుల అనాలోచిత ధోరణి.. వ్యక్తుల నిర్లక్ష్యం వెరసి ఇటీవలే ప్రారంభమైన ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై జరిగిన ప్రమాదంలో రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భవిష్యత్లో గొప్పగా ఎదగాలని కుమారుడిని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించేందుకు తల్లిదండ్రులు వెళ్తుండగా తల్లీకుమారుడు మృతి చెందారు. కారు నడుపుతున్న కుటుంబ పెద్ద తీవ్రగాయాల పాలయ్యాడు. ప్రమాదానికి ఇరువైపులా తప్పు కనిపిస్తున్నా... హైవేపై రాకపోకలకు అనుమతించిన రోజుల వ్యవధిలోనే ఇద్దరిని పోగొట్టుకున్న కుటుంబానికి విషాదం మిగిలింది. గాంధీనగర్ నుంచి హైదరాబాద్కు చింతకాని మండలం మండలం గాంధీనగర్ కాలనీకి చెందిన పాపబత్తిని నరసింహారావు దళితబంధు పథకంలో వచ్చిన కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య సుజాత(40)తో పాటు కుమారులు ఉమేష్, పవన్కుమార్(19) ఉన్నారు. పెద్దకుమారుడు హైదరాబాద్లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా.. ఇటీవల ఇంటర్ పాసైన పవన్కు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. ఆయనను కాలేజీలో చేర్పించేందుకు భార్యతో కలిసి నరసింహారావు బయలుదేరాడు. హడావుడిగా ప్రారంభించడంతో... ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిపై వైరా మండలం సోమవారం వద్ద చాన్నాళ్లుగా అనుమతిస్తున్నారు. అయితే, ధంసలాపురం బ్రిడ్జి ఇటీవల పూర్తయినా, ఇంకా ఎగ్జిట్ వద్ద ఇరువైపులా అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. అయినప్పటికీ హడావుడిగా మూడు రోజుల క్రితం రాకపోకలకు అనుమతించారు. ఈవిషయమై విస్తృత ప్రచారం జరగడంతో వాహనదారులు హైవేను ఎంచుకుంటున్నారు. కాగా, హైదరాబాద్ వైపు వెళ్లేందుకు ఎక్కాల్సిన అప్రోచ్ రోడ్డును పనుల దృష్ట్యా అధికారులు మూసేశారు. ఇదే సమయాన దేవరపల్లి వెళ్లే మార్గంలో హైవే ఎక్కే రోడ్డును మూసివేయలేదు. అంతేకాక హెచ్చరిక బోర్డులు కూడా పెట్టలేదు. దీంతో హైదరాబాద్ వైపు వెళ్లాల్సిన వారు కూడా దేవరపల్లి వైపు ఉన్న రోడ్డుపైకి ఎక్కి రాంగ్రూట్లో ప్రయాణిస్తున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలను అంచనా వేయకపోవడంతో గురువారం నాటి ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగగానే తేరుకున్న అధికారులు హైదరాబాద్ వైపు ఎంట్రీ పాయింట్ను మూసివేసి దేవరపల్లి వైపు ఎంట్రీ పాయింట్ను మాత్రం వదిలేయడం గమనార్హం. ఈ అంశంపై ఎన్హెచ్ ప్రాజెక్టు డైరెక్టర్ దివ్యను వివరణ కోరగా.. అప్రోచ్ రోడ్డు పనుల సామగ్రి తీసుకొచ్చే వాహనాల కోసం ఓ పక్క తెరిచి ఉంచామే తప్ప ఇతర వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం గమనార్హం. చదువులో టాప్.. మృతుడు పవన్ ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని గౌలిదొడ్డిలో పూర్తిచేయగా 932 మార్కులు వచ్చాయి. అనంతరం ఎప్సెట్లో మంచి ర్యాంకు సాధించడంతో ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే పవన్తో పాటు ఆయన తల్లి మృతితో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై నరసింహారావు తండ్రి చంద్రయ్య ఫిర్యాదుతో ఖమ్మంరూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.గాంధీనగర్ కాలనీ నుంచి ఉదయం 7–30 గంటలకు బయలుదేరిన వీరు ధంసలాపురం వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్ వైపు వెళ్లేందుకు గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి ఎక్కేలా అవకాశం లేకపోవడంతో.. దేవరపల్లి వైపు వెళ్లే రోడ్డు నుంచి జాతీయ రహదారిపైకి ఎక్కారు. సమీపాన ఎక్కడా యూటర్న్ లేకపోవడంతో వీరు హైదరాబాద్ వెళ్లేందుకు రాంగ్రూట్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది. కొద్దిదూరం తర్వాత మూలమలుపు వద్ద ఎదురుగా ద్రాక్ష పండ్ల లోడుతో హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టి కారును 30 అడుగుల దూరం లాక్కెళ్లడంతో తల్లి సుజాత, కొడుకు పవన్కుమార్ అక్కడికక్కడే మృతిచెందారు. అంతేకాక డ్రైవింగ్ చేస్తున్న నరసింహారావు కారులో ఇరుక్కుపోవడంతో క్రేన్ సాయంతో బయటకుతీశారు. ఆయన వైపు బెలూన్ ఓపెన్ కావడంతో గాయాలతో బయటపడ్డాడు. అయితే, పక్కనే ఉన్న పవన్కుమార్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో బెలూన్ తెరుచుకోకపోవడం వల్ల తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. -
సహకారంలో కాక!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నామినేటెడ్ ప్రాతిపదికన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (పీఏసీఎస్) పాలకవర్గాలు త్వరలో కొలువుదీరబోతున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవులన్నీ నామినేటెడ్ విధానంలో కాంగ్రెస్ విధేయులకు అప్పగించనున్నారు. ఈ మేరకు ఆశావహుల జాబితా సిద్ధం చేయాలని బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరి ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ నేపథ్యాన ఎమ్మెల్యేలు తమ పరిధి పీఏసీఎస్ల్లో పదవులు ఆశిస్తున్న నేతలపై ఆరా తీస్తుండగా.. ఆశావహులు జాబితాలో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించనున్నారు. తొలిసారి పీఏసీఎస్ పదవులను నామినేటెడ్ విధానంలో భర్తీ చేయనుండడంతో అధికార పార్టీలో హడావుడి మొదలైంది. పీఏసీఎస్ టు డీసీసీబీ.. జిల్లాలోని పీఏసీఎస్లకు చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. పీఏసీఎస్, డీసీసీబీ పాలకవర్గాల కాలపరిమితి ఐదేళ్లు కాగా, 2020లో డీసీసీబీ చైర్మన్గా ఎన్నికై న కూరాకుల నాగభూషణంను రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తప్పించింది. 2024 జనవరిలో వైస్ చైర్మన్గా ఉన్న దొండపాటి వెంకటేశ్వరరావును చైర్మన్గా నియమించారు. ఆతర్వాత 2025 డిసెంబర్ 19తో డీసీసీబీ పదవీకాలం పూర్తయింది. అనంతరం ప్రభుత్వం ఆరు నెలల చొప్పున రెండుసార్లు పొడిగించి చివరకు పాలకవర్గాన్ని రద్దు చేసింది. ప్రస్తుతం డీసీసీబీకి పర్సన్ ఇన్చార్జ్గా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. ఇక పీఏసీఎస్ల పదవీ కాలం ఐదేళ్లకు ముగిసినా ఎన్నికలు జరిగే వరకు తమనే కొనసాగించాలని పాలకవర్గాలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు అనుకూలంగా తీర్పునివ్వడంతో వారు కొనసాగుతున్నా, పది రోజుల్లో గడువు ముగియనున్నట్లు సమాచారం. అంతా నామినేటెడే... పీఏసీఎస్లతో పాటు డీసీసీబీ పాలకవర్గాన్ని సైతం నామినేటెడ్ పద్దతిన భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో పీఏసీఎస్ల్లో సభ్యులైన రైతులు డైరెక్టర్లను ఎన్నుకున్నాక.. వారిలో నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరిగేది. ఇక సొసైటీల చైర్మన్లు డీసీసీబీ డైరెక్టర్లను.. ఆపై డైరెక్టర్లలో చైర్మన్, వైస్ చైర్మన్గా ఎన్నుకునే విధానం ఉండేది. ప్రభుత్వం దీనికి స్వస్తి పలికి పీఏసీఎస్ల నుంచి డీసీసీబీ వరకు పాలకవర్గాలను నామినేటెడ్ విధానంలో నియమించాలని భావిస్తోంది. చైర్మన్, వైస్ చైర్మన్తో సహా డీసీసీబీకి మొత్తం 22 మంది డైరెక్టర్లు ఉంటారు. సుమారు 5లక్షల మంది రైతులు పీఏసీఎస్ల్లో సభ్యులుగా ఉండడంతో చైర్మన్ పదవులను నామినేటెడ్ పద్ధతిన భర్తీ చేసే ప్రక్రియను ప్రభుత్వం కీలకంగా పరిగణిస్తోంది. ఇదే సమయాన ఆశావవహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎంపిక చేయడం జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యేలకు కత్తిమీద సాములా మారనుంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. 2023 ఎన్నికల సందర్భంగా పార్టీలో చేరిన వారు కాకుండా గత కొన్నేళ్లుగా పార్టీకి విధేయులుగా ఉంటూ.. పార్టీనే నమ్ముకున్న సీనియర్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.పీఏసీఎస్లకు తొలిసారి నామినేటెడ్ సారథులు -
త్వరలోనే విడుదల!
● చేప పిల్లల పంపిణీకి నిధుల మంజూరు ● జిల్లాలో 882 జలాశయాలు ఎంపిక ● 3.47 కోట్ల చేపపిల్లల విడుదలకు ఏర్పాట్లు ఖమ్మంవ్యవసాయం: మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు రూపొందించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో కదలిక వచ్చింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎగువన కురిసిన వానలకు జలాశయాల్లోకి నీరు చేరుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి రూ.116 కోట్ల్ల నిధులు మంజూరు చేసింది. దీంతో చెరువులు, రిజర్వాయర్లలో చేపలు, రొయ్య పిల్లలను వదిలేలా మత్స్యశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. మత్స్యకారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2018–19 నుంచి ఉచితంగా చేప పిల్లల పంపిణీని ప్రారంభించగా.. ఏటా వేసవిలో టెండర్ల పూర్తి చేసి జూలై, ఆగస్టుల్లో చేప పిల్లలను వదిలేవారు. కానీ పథకంలో అక్రమాలు, గత ఏడాది కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటంతో సెప్టెంబర్లో టెండర్లు నిర్వహించారు. ఈసారి ఎల్నినో ప్రభావంతో అసలు పథకం ఉంటుందా, లేదా అని భావిస్తుండగా.. ఇటీవల పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో మోక్షం లభించింది. ప్రతిపాదనలు సిద్ధం జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి మత్స్యశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం 882 జలాశయాలను ఎంపిక చేశారు. అంతేకాక ఆయా జలాశయాల్లోని నీటి వనరులు, విడుదల చేయాల్సిన చేప పిల్లల రకాల ఆధారంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే గుర్తించిన జలాశయాల్లో పాలేరు, వైరా, బేతుపల్లి, లంకాసాగర్ వంటి రిజర్వాయర్లతో పాటు పెద్ద చెరువులు, కుంటలు ఉన్నాయి. జిల్లాకు రూ.4.60 కోట్లు పథకానికి రాష్ట్రప్రభుత్వం రూ.116 కోట్లు కేటాయించగా జిల్లాకు రూ.4.60 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో 3.47 కోట్ల చేప పిల్లల పంపిణీకి అధికారులు నిర్ణయించారు. జిల్లాలోని 551 జలాశయాల్లో 35–40 మి.మీ. సైజు కలిగిన 1.11 కోట్ల చేపపిల్లలు, మరో 331 జలాశయాల్లో 80–100 మి.మీ. సైజు కలిగిన 2.36 కోట్ల చేప పిల్లలను వదలనున్నారు. చిన్న చేప పిల్ల ఖరీదు రూ.0.60, పెద్ద చేప పిల్ల ధర రూ.1.50 వరకు ఉంటుంది. ఇందులో బొచ్చ, రవ్వ, బంగారు తీగ, బొచ్చ, రవ్వ తదితర రకాల చేపలు ఉంటాయి. టెండర్ ప్రక్రియ ప్రారంభం ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా మత్స్యశాఖ గురువారం టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. ఆన్లైన్లో టెండర్ల దాఖలుకు ఈ నెల 17వరకు అవకాశం కల్పించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి చైర్మన్గా ఉన్న పర్చేజింగ్ కమిటీ ఆధ్వర్యాన టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈమేరకు రెండెకరాల చేపల చెరువులు కలిగి, అనుభవం ఉన్న వారిని టెండర్ దాఖలు చేసేందుకు అర్హులుగా ప్రకటించారు. కాగా, జలాశయాల్లో చేపల పెంపకం ద్వారా జిల్లాలో 220 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు చెందిన 16 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రతక్ష్యంగా ఉపాధి లభిస్తుంది. పరోక్షంగా వేల కుటుంబాలకు కూడా లబ్ధి జరగనుంది. అయితే, ప్రభుత్వం మరింత ఆలస్యం చేయకుండా త్వరగా చేపపిల్లలు పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు. జిల్లాలో నీటి లభ్యత ఉన్న జలాశయాల్లో చేప పిల్లలు వదిలేందుకు ప్రణాళిక రూపొందించాం. ఇప్పటికే ఆన్లైన్ టెండర్ల ప్రక్రియ ప్రారంభించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశీలన, ఖరారు ఉంటుంది. వీలైనంత త్వరగా ప్రక్రియ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. – ఏ.మల్లేశం, జిల్లా మత్స్య శాఖ అధికారి -
పారదర్శకంగా ఎస్ఐఆర్ నిర్వహణ
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 86.98 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. జిల్లాలో 95,740 మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినట్లు, 33,134 మంది మరణించినట్లు గుర్తించామని, మరో 42,814 మంది ఓటర్లు మ్యాపింగ్ పూర్తి కాలేదన్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10నాటికి ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ చేయాల్సి ఉండగా, కొత్తగా 19 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుకు ప్రతిపాదించామని చెప్పారు. ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ దివాకర పరిశీలించి భద్రతపై ఉద్యోగులకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, ఎస్డీసీ సదానందం, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పరాస్ కుమార్, ఎన్నికల విభాగం ఉద్యోగులు రాజు, అన్సారీ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ దివాకర -
గోదావరి రెండో బ్రిడ్జిపై త్వరలోనే రాకపోకలు
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుబూర్గంపాడు/భద్రాచలం: గోదావరి నదిపై సారపాక – భద్రాచలం మధ్య నిర్మించిన రెండో బ్రిడ్జిపై రాకపోకలను ఈ నెలలోనే పునరుద్ధరిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రెండవ బ్రిడ్జి అప్రోచ్ కుంగడంతో ఇటీవల రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. ఈ పనులను బుధవారం మంత్రి పరిశీలించి నేషనల్ హైవే అధికారులకు సూచనలు చేశారు. బ్రిడ్జి అప్రోచ్కు పటిష్టమైన రిటైనింగ్ వాల్ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పనులు పూర్తిచేసి రాకపోకలకు అనుమతిస్తే భద్రాచలం వచ్చే భక్తులతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీ ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సారపాక సర్పంచ్ కిశోర్నాయక్, ఉపసర్పంచ్ కన్నెదారి రమేష్, నాయకులు పాల్గొన్నారు. -
రోడ్డు విస్తరణ పనులకు మోక్షం
మధిర: మధిరలో రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ‘సాక్షి’లో జూలై 27న ‘కాలక్షేపమా... నిర్లక్ష్యమా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. మధిరలోని ఆర్వీ కాంప్లెక్స్ నుంచి ఆత్కూరు క్రాస్ వరకు, మధిర నుంచి ఎర్రుపాలెం వరకు రహదారి విస్తరణ పనులకు 2024 డిసెంబర్ 15న శంకుస్థాపన చేసినా నేటికీ పనులు చేపట్టకపోవడాన్ని ఈ కథనంలో ప్రస్తావించగా ఆర్అండ్బీ అధికారులు స్పందించారు. ఈమేరకు బుధవారం ఇల్లెందులపాడు నుంచి ఆత్కూరు సర్కిల్ వరకు రోడ్డుకిరువైపులా ఆక్రమణలు, దుకాణాల ముందు ఏర్పాటుచేసిన షెడ్లును తొలగించే పనులు మొదలుపెట్టారు. మున్సిపల్ కమిషనర్ శామ్యూల్, ఆర్అండ్ బీ ఏఈ రాంబాబు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ భాస్కర్ తదితరుల సమక్షాన తొలగింపు చేపడుతుండగా, సీపీఎం, బీఆర్ఎస్, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా తొలగించడం సరికాదని పేర్కొన్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ స్పందిస్తూ డివైడర్ నుంచి 50 అడుగుల మేర ఆర్అండ్ బీ రోడ్డు ఉంటుందని, ఆ పరిధిలో కట్టడాలను ఈనెల 10లోగా స్వచ్ఛందంగా తొలగించాలని, లేనిపక్షంలో నోటీసులు లేకుండా తామే తొలగిస్తామని స్పష్టం చేశారు. అనుమతులు ఎలా ఇచ్చారు? మధిర ఆక్రమణల తొలగింపును వివిధ పార్టీల నాయకులు అడ్డుకున్నారు. అధికారులు అనుమతి ఇచ్చే సమయాన నిబంధనలను పరిశీలించి ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. నిర్మాణాల కోసం ప్రజలు రూ.లక్షల్లో వెచ్చించినందున ముందస్తు సమాచారం, నోటీసులు లేకుండా కొలతలు వేసి కూల్చివేయడం సరికాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాపినేని రామనర్సయ్య, బిక్కి కృష్ణప్రసాద్, చేకూరి శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో మంత్రుల భేటీ
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలతో జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, సత్తుపల్లి ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, డాక్టర్ మట్టా రాగమయి, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో ఖాళీ కానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశావహులపై చర్చించడమే కాక ఎమ్మెల్యేలు నుంచి పేర్లు సేకరించారు.ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చ -
డిప్సైడ్–2 బ్లాక్ ఎవరి ఘనతా కాదు..
రుద్రంపూర్: మణుగూరు ఏరియాలోని డిప్సైడ్–2 బ్లాక్ సింగరేణి దక్కడాన్ని ఎవరికి వారు తమ ఘనతా చెప్పుకోవడం గర్హనీయమని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పేర్కొన్నారు. కొత్తగూడెంలోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ బొగ్గు బ్లాక్ల వేలంలో ప్రైవేట్ సంస్థలు పోటీ పడకపోవడంతో సింగరేణి కేటాయించగా కొన్ని యూనియన్లు వారి ఘనతగా చెప్పుకోవడం, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కూడా ఇదే ప్రకటన చేయ డం సరికాదన్నారు. ఒకవేళ కిషన్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే శ్రావణపల్లి ఓసీ, గోల్లేటి, ఆర్కే, పూజపల్లి, మణుగూరు ఎక్స్టెన్షన్ గనులకు అటవీ అనుమతులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కాగా, మణుగూరు డిప్సైడ్–2 బ్లాక్ కోసం జెన్కో టెండర్లో పాల్గొనడం వల్ల సింగరేణికి 4శాతంకు బదులు 6.5 రాయల్టీతో వచ్చిందని, తద్వారా సంస్థపై రూ.కోట్ల బారం పడనుందని రాజిరెడ్డి తెలిపారు. కాగా, నాడు కేసీఆర్ వేలం లేకుండానే బ్లాక్లను సింగరేణికి ఇవ్వాలని, ప్రైవేట్కు ఇస్తే అడ్డుకుంటామని చెప్పడంతో అప్పుడు ఎవరూ పాల్గొనలేదని చెప్పారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, నాయకులు శంకర్, విజయ్కుమార్, మహిధర్, వెంకటేశ్వర్లు, నవీన్, రాజేష్, వినీత్, శంకర్, తిరుపతి, దేవ్సింగ్ తదితరులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి -
భూభారతి ఆపరేటర్ల ధర్నా
ఖమ్మం సహకారనగర్: రెవెన్యూ శాఖలో భూభారతి(ఎఫ్టీఎస్, ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్) ఆపరేటర్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ భూభారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ నాయకులు జమ్మి ప్రవీణ్కుమార్, ఎం.డీ.ఇజాజ్ అలీ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద బుధవారం వారు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్, ఇజాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 636మంది భూభారతి ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలే తప్ప ఎవరినీ తొలగించవద్దని కోరారు. అంతేకాక పెండింగ్లో ఉన్న 15 నెలల వేతనం విడుదల చేసి, ఇక నుంచి ప్రతీనెల 1వ తేదీన వేతనం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు దొడ్డా రాజు, రవికుమార్, జ్యోతి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
●అవయవాలు దానం చేసిన కుటుంబం కారేపల్లి: మండలంలోని ఎర్రబోడులో ఈనెల 2వ తేదీన జరి గిన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాయం సాయి(20) మృతిచెందాడు. కోయగుంపు గ్రామానికి చెందిన పాయం సాయి, వజ్జా సునీల్ బైక్పై ఇంటికి వస్తున్న క్రమంలో వాహనం అదుపుతప్పి పడటంతో సునీల్ అక్కడికక్కడే మృతిచెందగా, పాయం సాయికి తీవ్ర గాయాలై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు బుధవారం ప్రకటించా రు. అంతేకాక అవయవ దానంతో మరికొందరి జీవితా ల్లో వెలుగు నింపొచ్చని వైద్యులు, గ్రామానికి చెందిన సొసైటీ మాజీ చైర్మన్ ఈసాల నాగేశ్వరరావు అవగాహన కల్పించడంతో తల్లిదండ్రులు ముందుకొచ్చారు. ఈమేరకు సాయి అవయవాలను సేకరించి హైదరాబాద్లోని వివిధ ఆస్పత్రుల్లో పాణా పాయ స్థితిలో ఉన్న వారికి అమర్చగా వారి కుటుంబీకులు, వైద్యులు.. సాయి కుటుంబీకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, సాయి ఇంటర్ పూర్తి చేసి చిన్నచిన్న పనులతో తల్లిదండ్రులు పాయం ఎర్రయ్య, చంద్రకళకు ఆసరాగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి.. ఖమ్మంక్రైం: ఖమ్మం–పందిళ్లపల్లి స్టేషన్లమధ్య బుధవారం రైలు ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి (35) మృతి చెందాడు. సదరు వ్యక్తి పట్టాలు దాటే క్రమాన రైలును గమనించకపోవడంతో ఢీకొట్టగా శరీరం ముక్కలైంది. ఆయన కుడిచేతిపై ‘ఏ ప్లస్ బీ’అని పచ్చబొట్టు ఉండగా కడియంఉందని జీఆర్పీ పోలీసులు తెలిపారు. తొలు త ఆత్మహత్యగా భావించినా, లోకోపైలట్ ఇచ్చిన సమాచారంతో ప్రమాదంగా గుర్తించారు. కాగా, సదరు వ్యక్తి మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. క్వారీలో షాక్తో యువకుడు .. నేలకొండపల్లి: మండలంలోని కోరట్లగూడెం వద్ద ఉన్న గ్రానైట్ క్వారీలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. మధ్యప్రదేశ్కు చెందిన మనోజ్కుమార్ రావత్(19) క్వారీలో పనిచేసే బాబాయి వద్దకు ఇటీవల వచ్చాడు. ఆయన కూడా పనిచేస్తుండగా, బుధవారం గ్రానైట్ రాయిని తొలగించేందుకు వైర్ జరుపుతుండగా షాక్కు గురయ్యాడు. ఆయన ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విసమించి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం
● రూ.30లక్షల మేర ఆస్తినష్టం ● ఆభరణాలు, నగదు నిల్వ చేసిన లాకర్లు సేఫ్మధిర: మధిరలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)శాఖలో బుధవారం అగ్ని ప్రమా దం జరిగింది. ఉదయాన్నే బ్యాంకు నుంచి కాలిన వాసన వస్తుండడంతో సమీపంలోని దుకాణదారులు బ్యాంకు సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని తాళాలు తెరిపించగా పొగలు కమ్మేసి మంటలు వస్తుండడంతో అదుపు చేశారు. అప్పటికే ఏసీలు, ఫర్నిచర్, సీలింగ్ దగ్ధమయ్యా యి. క్యాష్ కౌంటర్ పరిసరాల్లోని సీలింగ్, కంప్యూటర్లు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయాయి. అయితే, ఖాతాదారుల లాకర్లు, బ్యాంక్ నగదు నిల్వ చేసే లాకర్ భద్రంగా ఉండడంతో అధికారులు, ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. బ్యాంకులోని ఫైళ్లకు నష్టం జరగలేదని, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యూబీఐ శాఖ మేనేజర్ నవీన్ తెలిపారు. అయితే, ఘటనలో రూ.30లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు మధిర టౌన్ ఎస్ఐ కిషోర్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రమాద సమాచారం తెలియని గ్రామీణ ప్రాంతాల ఖాతాదారులు రోజు మాదిరిగా 10 గంటలకు బ్యాంకు వద్దకు చేరుకోగా, లావాదేవీలు నిలిచిపోవడంతో వెనుదిరిగారు. -
ఇంకుడు గుంతలతోనే నీటి సంరక్షణ
ముదిగొండ: వర్షపునీటిని ఒడిసి పట్టి భూగర్భజలాలను పెంపొందించడంలో ఇంకుడు గుంతలు కీలకంగా నిలుస్తాయని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. ముదిగొండ మండలం యడవల్లి లక్ష్మీపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బైక్పై ప్రయాణించిన కలెక్టర్.. పంట పొలాల్లో పంట కుంటలు, ఊట కుంటలు, గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలు, పంట కుంటలు, బోరుబావుల రీచార్జ్ నిర్మాణాలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయమై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. వీటి నిర్మాణంలో భూగర్భ జలాలు పెరిగి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుందని చెప్పారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం పక్కన వీఓ భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఎంపీడీఓ విజయ, తహసీల్దర్ రవికుమార్, సర్పంచ్ చెరుకుపల్లి స్వాతి, ఉపసర్పంచ్ మన్నేపల్లి శంకర్, రైతులు పాల్గొన్నారు. -
అప్రమత్తతతోనే సైబర్ నేరాల కట్టడి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు అవగాహన పెంపొందించుకుంటేనే సైబర్ నేరాల కట్టడి సాధ్యమవుతుందని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యాన చేపడుతున్న ‘సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలోని ఎస్ఆర్ కాలేజీలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో సీపీ మాట్లాడారు. ప్రస్తుత తరుణాన సాంకేతిక పరిజ్ఞానం జీవితాలను సులభతరం చేసినా, అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ నేరగాళ్లు ప్రజల సొమ్ము, వ్యక్తిగత సమాచారం, గోప్యతపై దాడులు చేస్తున్నారని తెలిపారు. సైబర్ నేరాల నివారణకు పౌరులు బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలను ఇతరులకు చెప్పొద్దని సూచించారు. అంతేకాక నకిలీ వెబ్సైట్లు, యాప్లు, సామాజిక మాధ్యమాల్లో పెట్టుబడి ప్రకటనలు, డిజిటల్ అరెస్టులను నమ్మొద్దని తెలిపారు. సాధారణ ప్రజల్లో అవగాహన వేగంగా పెరగకపోవడం సమస్యను క్లిష్టతరం చేస్తున్నందున ప్రతీనెల వందల సంఖ్యలో సైబర్ మోసాలపై ఫిర్యాదులు నమోదవుతున్నాయని చెప్పారు. ఈమేరకు మోసపోయినట్లు గ్రహించగానే 24గంటలకు పనిచేసే టోల్ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. ఈకార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, బాలకృష్ణ, మోహన్బాబు, భానుప్రకాష్, ఉస్మాన్ షరీఫ్, రవికుమార్, ఎస్సైలు రంజిత్కుమార్, విజయ్కుమార్ పాల్గొన్నారు.పోలీసు కమిషనర్ సునీల్దత్ -
రాజకీయాల్లో యువత ప్రభావం
మధిర: యువత ఏదైనా సాధించగలదని, దేశ రాజకీయాల్లో వారి ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణ్రావు తెలిపారు. సీపీఎం నేత బోడేపూడి వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా మధిరలో బుధవారం నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. నేపాల్, తమిళనాడులో పాలకవర్గాల పరాజయానికి యువతే కారణమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నందున భవిష్యత్లో జాతీయ రాజకీయాలపై యువత ప్రభావం మరింత ఉంటుందని తెలిపారు. ఇంకా ఈ సదస్సులో సీపీఎం నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెర్వు కోటేశ్వరరావు, పాపినేని రామనర్సయ్య, శీలం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యలు వంద శాతం పరిష్కారం
● రైతుల సమక్షాన పారదర్శకంగా రీసర్వే ● కలెక్టర్ దివాకర టీ.ఎస్.నేలకొండపల్లి: భూముల రీసర్వే ద్వారా భూ సమస్యలు వంద శాతం పరిష్కారమవుతాయని కలెక్టర్ దివాకర టీ.ఎస్. వెల్లడించారు. నేలకొండపల్లి మండలం కొంగరలో బుధవారం జరిగిన భూ భారతి... భూసర్వే గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. రైతుల సందేహాలు నివృత్తి చేశాక కలెక్టర్ మాట్లాడారు. పాస్ పుస్తకంలో భూమి ఉండి, క్షేత్ర స్థాయిలో లేకున్నా.. తక్కువ, ఎక్కువగా నమోదైనా సర్వేతో పరిష్కారమవుతాయని తెలిపారు. సర్వే విషయమై 48గంటల ముందే సమాచారం ఇస్తున్నందున రైతులు సహకరించాలని సూచించారు. సర్వే అనంతరం అభ్యంతరాలు వ్యక్తమైనా పరిష్కరిస్తామని తెలిపారు. ఆధునిక యంత్రాలతో రైతుల సమక్షాన సర్వే చేస్తున్నందున హద్దుల నిర్ధారణలో ఇబ్బంది రాదని చెప్పారు. ఈ సర్వేతో భూ వివాదాలు గణనీయంగా తగ్గి రైతుల భూమికి భద్రత కలుగుతుందని తెలిపారు. జిల్లాలోని బేతుపల్లి, కాకరవాయిలో సర్వే కొనసాగుతుండగా, కొంగరలో త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. అనంతరం బుద్ధారంలో గ్రామ సమాఖ్య భవన నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, తహసీల్దార్ పి.రాంప్రసాద్, ఎంపీడీఓ ఎం.యర్రయ్య, సర్పంచ్ కృష్ణకుమారి, ఉద్యోగులు, నాయకులు కనకం నరసింహారావు, ఆలస్యం మధుసూధన్రావు, చిట్టూరి శ్రీనివాసరావు, నల్లాని మల్లికార్జున్రావు, ఈవూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కూసుమంచి మండలం రాజుపేట బజార్ తాళ్లగడ్డ తండాలో ఈశ్వరమాదారం – భద్రుతండా మధ్య నిర్మించే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత చౌటుపల్లిలో బీరోలు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డుపై హైలెవల్ బ్రిడ్జి, లింగారం తండాలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, సాయంత్రం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి గుదిమళ్లలో ప్రకాష్నగర్ హైలెవల్ బ్రిడ్జి నుంచి గుదిమళ్ల వరకు బీటీ రోడ్డు, ఖమ్మంరూరల్ మండలం కామంచికల్లో కోయచెలక వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఉమ్మడి జిల్లాలో బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ సేవలు ఖమ్మంమయూరిసెంటర్: భారత్నెట్ ద్వారా తెలంగాణలో బ్రాడ్బ్యాండ్ సేవలు, మొబైల్ నెట్వర్క్ విస్తరణపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక వివరాలను వెల్లడించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి బుధవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ పాలన, విద్య, వైద్యం, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు టెలికాం మౌలిక వసతులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 356 గ్రామాలు మొబైల్ నెట్వర్క్ కలిగి ఉండగా, 355 గ్రామాలు 4జీ, 5జీ పరిధిలోకి వచ్చాయని వెల్లడించారు. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 361 గ్రామాల్లో మొబైల్ నెట్వర్క్ ఉండగా.. అందులో 357 గ్రామాల్లో 4జీ, 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నేటి నుంచి సీపీఐ ప్రజా చైతన్య యాత్రలు ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా జిల్లా సమితి ఆధ్వర్యాన గురువారం నుంచి ప్రజా చైతన్య పాదయాత్రలు నిర్వహించనున్నా రు. తొలిరోజు పాదయాత్రను ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు హైవే జంక్షన్ వద్ద పార్టీ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు ప్రారంభిస్తారు. ఈనెల 13వ తేదీ వరకు 20 మండలాల్లో పాదయాత్రలు జరుగుతాయ ని జిల్లా కార్యదర్శి దండి సురేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్యపరిచేందుకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో చేస్తున్న తీవ్ర జాప్యాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ‘దోస్త్’ రిజిస్ట్రేషన్లు ఖమ్మం సహకారనగర్: డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దోస్త్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్–2 గురువారం మొదలుకానుందని ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా తెలిపారు. ఈమేరకు గురువారం నుంచి 11వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండగా, 12వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చని పేర్కొన్నారు. గతంలో రిజిస్ట్రేషన్ చేయని వారికి ఇదే చివరి అవకాశమని, వివరాలకు కళాశాల హెల్ప్లైన్ సెంటర్లో సంప్రదించాలని సూచించారు. పాత మున్నేరు వంతెనపై రాకపోకలకు అనుమతి ఖమ్మంక్రైం: ఖమ్మం కాల్వొడ్డు–జలగంనగర్ మధ్య వంతెనపై మున్నేటి వరద ప్రవహించడంతో తాత్కాలికంగా నిర్మించిన చప్టాలు దెబ్బ తిన్నాయి. దీంతో ఈ మార్గంలో బుధవారం నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అయితే వాహనదారుల ఇబ్బందుల దృష్ట్యా ఇన్నాళ్లు రాకపోకలు నిలిపివేసిన పాత మున్నేరు వంతెనపై ద్విచక్రవాహనాలను వెళ్లేలా తాత్కాలికంగా అనుమతించాలని సీపీ సునీల్దత్ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ఈమేరకు బుధవారం ఆయన పాత మున్నేరు బ్రిడ్జిని పరిశీలించి సూచనలు సైతం చేశారు. అయితే, కేవలం ద్విచక్రవాహనాలు మాత్రమే అనుమతి ఇవ్వాలని తెలిపారు. ట్రాఫిక్, త్రీటౌన్ సీఐలు సత్యనారాయణ, మోహన్బాబు పాల్గొన్నారు. -
విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
ఖమ్మం సహకారనగర్: విద్యా ప్రమాణాల పెంపు, పరిశుభ్రమైన పాఠశాల వాతావరణం కల్పించడమే కాక విద్యార్థుల శ్రేయస్సుపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. ఖమ్మం రాజేంద్రనగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, వసతులను పరిశీలించారు. అలాగే, 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి ప్రగతి, భవిష్యత్ లక్ష్యాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధనతో సరిపెట్టకుండా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలిస్తూ నాణ్యమైన విద్య అందించేందుకు మరింత కృషి చేయాలని సూచించారు.కలెక్టర్ దివాకర టీ.ఎస్. -
రేపటి నుంచి యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు
ఖమ్మంవ్యవసాయం: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్(ఎఫ్ఎఫ్ఎస్ ) యాప్ ద్వారా శుక్రవారం నుంచి ఎరువుల విక్రయాలు జరుగుతాయని జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ) ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఎఫ్ఎస్ యాప్ను తీసుకురాగా, తొలి దశలో జిల్లాను అనుసంధానం చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు యూరియా, డీఏపీ, పొటాష్తో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులను ఈ యాప్ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పట్టాదారు రైతులు, ఎన్డీఎస్ రైతులు, కౌలు రైతులు తమ ఫార్మర్ ఐడీ లేదా ఆధార్ నంబర్ ఆధారంగా ఎరువులు బుక్ చేసుకుని, ఏ మండలంలోనైనా కొనుగోలు చేసే సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఎవరికై నా ఇబ్బందులు వస్తే ఏఓలు, ఏఈఓలతో పాటు డీఏఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కాగా, ఇప్పటివరకు అమల్లో ఉన్న టోల్ఫ్రీ నంబర్ 1800–123–7157 కూడా కొనసాగుతుందని ఆయన తెలిపారు. పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా హేమనాథ్ ఖమ్మంక్రైం: జిల్లా పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా హేమనాథ్ ఎన్నికయ్యారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో బుధవారం రాత్రి జరిగిన ఎన్నికల్లో అన్ని పోలీసుస్టేషన్ల నుంచి ఎన్నికై న 44 మంది ఈసీ మెంబర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈక్రమాన హేమనాథ్కు 26 ఓట్లు నమోదు కాగా, ఆయన ప్రత్యర్థి రమేష్కు 18 ఓట్లు రావడంతో ఎనిమిది ఓట్ల తేడాతో హేమనాథ్ విజయం సాధించారు. ఆయన ప్రస్తుతం సీసీ కార్యాలయంలోని ఐటీ కోర్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకోనున్నారు. కాగా, 13ఏళ్ల ఎన్నికలు జరగడంతో మొదటి నుంచి ఉత్కంఠగానే సాగాయి. -
హద్దుల ఏర్పాటు త్వరగా పూర్తిచేయాలి
కామేపల్లి: సీతారామ ప్రాజెక్టు కెనాల్ ఉప కాల్వ నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా హద్దుల ఏర్పాటు వేగంగా చేపట్టాలని స్పె షల్ డిప్యూటీ కలెక్టర్ సదానందం ఆదేశించా రు. మండలంలోని పొన్నేకల్లో బుధవారం ఆయన హద్దుల ఏర్పాటు పనులను పరిశీలించి సర్వే సిబ్బందికి సూచనలు చేశారు. కాగా, సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. ఇరి గేషన్ డీఈఈ మోతీలాల్, ఉద్యోగులు విజయభాస్కర్, బోలేషా, వెంకటరత్నం పాల్గొన్నారు. ఈనెల 9న ఆదివాసీ దినోత్సవంమాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఖమ్మంమయూరిసెంటర్: ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ఈనెల 9న ఆదివాసీ దినోత్స వం నిర్వహిస్తున్నట్లు సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపా రు. ఈ సందర్భంగా మాస్లైన్ ఆధ్వర్యాన వివిధ ప్రాంతాల్లో సదస్సులు, ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రకృతితో మమేకమై జీవిస్తున్న ఆధివాసీల హక్కులపై ఆంగ్లేయుల కాలం నుంచి దాడి జరుగుతుండగా, వారి వనరులను దోచుకుని జీవితాలను నాశనం చేస్తున్నారని తెలిపారు. కాగా, ఆది వాసీ దినోత్సవం అంటే జాతర కాదని, హక్కు ల కోసం నినదించడం, పోరాటానికి ప్రతిన బూనడమని పేర్కొన్నారు. పోడు భూములకు పట్టాలు, ప్రభుత్వ పథకాల వర్తింపు, పీసా చట్టం, రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 అమలు, స్వయం పాలిత ప్రాంతాలుగా ప్రకటన కోసం ఉద్యమించనున్నట్లు తెలిపారు. అలాగే, అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న వారిపై ఫారెస్ట్ అధికారు ల దాడులు, దౌర్జన్యాలు నిలిపివేసి, అడవులను బొందల గడ్డలుగా మారుస్తున్న ఓపెన్ కాస్ట్లను రద్దు చేయాలని రంగారావు ఓ ప్రకట నలో డిమాండ్ చేశారు. బాల పురస్కార్ దరఖాస్తు గడువు పెంపు ఖమ్మంమయూరిసెంటర్: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్లు జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి ఏ.ప్రమీల తెలిపారు. గతంలో ఉన్న గడువు జూలై 31తో ముగియగా, ఆగస్టు 15 వరకు పొడిగించారని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలు, అసాధారణ ప్రతిభాపాటవాలు, ఆటలు, కళలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్యసాహసాలు తదితర అంశాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 5 – 18 ఏళ్ల లోపు బాలబాలికలు ఈ అవార్డులకు అర్హులని తెలిపారు. ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన వారు, బాలల జీవితాల్లో మార్పు తెచ్చేలా ఏడేళ్లకు పైగా సేవలు అందించిన స్వచ్ఛంద సంస్థలు కూడా అవార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు https:// awards. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఆ పత్రాలను తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. కేఎంసీలో అవినీతిపై విచారణ జరిపించాలి ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి ఉద్యోగులు డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపించి, నిజనిజాలు నిగ్గు తేల్చాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ డిమాండ్ చేశారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో బుధవారం నిర్వహించిన సీపీఎం టూ టౌన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేఎంసీలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న వివాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. పారిశుద్ధ్య వాహనాల డీజిల్ వినియోగంలో రూ.లక్షల దుర్వినియోగం, ఓ వార్డు ఆఫీసర్ ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. కార్పొరేషన్లోని కొందరు అధికారుల తీరు వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వస్తున్నందున సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసమావేశంలో నాయకులు బోడపట్ల సుదర్శన్, జె.వెంకన్న బాబు, సీహెచ్.భద్రం, డి.వీరబాబు, శెట్టి రవీంద్రర్, హుస్సేన్, నరకంటి కుమారి, బీబీ తదితరులు పాల్గొన్నారు. -
‘ఔట్ సోర్సింగ్’ వేతనాల్లో కోత
● మున్సిపల్ ఉద్యోగుల వేతనాలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ ● ఆందోళన బాటలో ఉద్యోగులు, సంఘాలుసత్తుపల్లి టౌన్: అసలే నిత్యవసర ధరలు అమాంతంగా పెరిగాయి. వచ్చే జీతం ఖర్చులకు సరిపడక అవస్థలు పడుతుంటే ప్రభుత్వం మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించింది. ఈమేరకు జీఓ 1181 ఈనెల 12న సీడీఎంఏకు రాగా, మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ అయ్యా యి. దీంతో చిరు ఉద్యోగులకు కార్మిక సంఘాలు అండగా నిలిచి ఆందోళన బాట పట్టాయి. విధుల్లో కీలకం జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్తో పాటు ఏదులా పురం, సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్లు, ఎలక్ట్రికల్ వర్కర్లు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, శానిటరీ జవాన్లు, నీటి సరఫరా విభాగం సిబ్బంది, బిల్ కలెక్టర్లు, ఆఫీస్ సబార్డినేటర్లు, సిస్టం అసిస్టెంట్లు, సిస్టం మేనేజర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు విధులు నిర్వర్తిస్తున్నారు. కోత ఇలా... కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రస్తుత వేతనం రూ. 23,750 ఉండగా రూ.19,500కు కుదించారు. డ్రైవర్లకు రూ.20,500 ఉన్న వేతనాన్ని రూ. 16,600కు, ఎలక్ట్రికల్ వర్కర్ల వేతనాలు రూ. 19,500 నుంచి రూ.15,600కు, శానిటరీ జవాన్ల వేతనాన్ని రూ. 20,500ల నుంచి రూ.16,600కు తగ్గించారు. అలాగే, తాగునీటి సరఫరా విభాగం సిబ్బంది, బిల్ కలెక్టర్లు, ఆఫీస్ సబార్డినేటర్ల వేతనం రూ.16,600 ఉండగా రూ.15,600కు తగ్గించడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. కంప్యూటర్ ఆపరేటర్లు, సిస్టం అసిస్టెంట్లు, సిస్టం మేనేజర్లకు ఒకే విధమైన విధులు నిర్వర్తిస్తుండగా వేతనంలో మాత్రం తేడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాల ఆందోళన.. జులై నెల వేతనాలు ఈనెల 1వ తేదీ నాటికి బిల్లులు చేయాల్సి ఉండగా తగ్గించిన వేతనాలు తీసుకునేందు కు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నిరాకరిస్తుండడంతో బ్రేక్పడింది. అయితే ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, సిస్టం అసిస్టెంట్లు, సిస్టం మేనేజర్లు వర్క్ ఇన్స్పెక్టర్ల వేతనాల్లో మాత్రం మార్పు చేయలేదు. ఈనెల నుంచే కొత్త జీఓ అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా రాజకీయ, కార్మి క సంఘాల నాయకులు ఆందోళన బాట పట్టారు. చట్టవ్యతిరేకంగా ఉద్యోగుల వేత నాలు తగ్గిస్తూ మున్సిపల్ శాఖ జీఓ విడుదల చేయడం సరికా దు. ఈ జీఓ కారణంగా మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.వేలల్లో వేతనం తగ్గుతోంది. ఈ జీఓ ఉపసంహరించే వరకు ఉద్యమాలు చేపడుతాం. – అమర్లపూడి శరత్, టీయూసీఐ నాయకుడు -
వచ్చినప్పుడు ఇస్తాం!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎల్నినో పరిస్థితుల నేపథ్యాన కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఈ నెలలోనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. ప్రతీనెల తొలి 15 రోజులు మాత్రమే బియ్యం పంపిణీ చేస్తుండగా, మూడు నెలల బియ్యం కావడంతో నెలాఖరు వరకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా జిల్లాలోని 748 రేషన్ దుకాణాలకు గాను ఇప్పటి వరకు కేవలం 443 షాప్లకే బియ్యం చేరింది. మిగతా 305 దుకాణాలకు రాకపోగా, లబ్ధిదారులు ప్రతీరోజు షాప్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 7,259 మెట్రిక్ టన్నులే.. మూడు నెలల రేషన్ పంపిణీ ఈనెల 1నుంచి అధికారికంగా ప్రారంభమైంది. జిల్లాలో 4,73,271 రేషన్కార్డులపై ఉన్న లబ్ధిదారులకు మూడు నెలల కోటా పంపిణీ చేయాలంటే 24,359.342 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయి. అయితే, ఇప్పటివరకు జిల్లాలోని 443షాప్లకు కేవలం 7,259.981 మె.టన్నుల బియ్యమే చేరింది. ఇది మొత్తం బియ్యంలో 29.80 శాతం కాగా, కనీసం సగం బియ్యమైనా అన్ని షాపులకు చేరితే లబ్ధిదారుల కు పంపిణీ సాగేది. కానీ 305షాప్లకు 17,099.361 మె.టన్నుల బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చేరకపోవడంతో సమస్య ఎదురవుతోంది. ముందే క్యూ కడుతూ.. మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండడంతో లబ్ధిదారులు మూడు సార్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. దీంతో ఆలస్యం అవుతుందనే భావనతో లబ్ధిదారులు చౌక ధరల దుకాణాల వద్ద ఉదయం నుంచే క్యూ కడుతున్నారు. అయితే 70 శాతం షాపులకు ఇంకా బియ్యమే చేరకపోవడంతో పంపిణీ అంతంత మాత్రంగానే సాగుతోంది. మిగతా షాప్లకు సైతం పూర్తిస్థాయిలో బియ్యం రాక ఆ దుకాణాల వద్ద రద్దీ ఉంటోంది. మిగతా షాపుల వద్ద లబ్ధిదారులు ఆరా తీస్తుండగా ‘స్టాక్ రాలేదు.. బియ్యం వస్తే ఇస్తాం’ అని డీలర్లు చెబుతున్నారు. ఇంకొందరు మాత్రం స్టాక్ లేదని బోర్డు ఏర్పాటుచేసి షాప్లు మూసేశారు.శాతంసరఫరా అయిన బియ్యందుకాణాలకు అందాల్సిన బియ్యం7,259.981 మె.టన్నులు29.8017,099.361 మె.టన్నులుబియ్యం చేరాల్సిన దుకాణాలు305748జిల్లాలో మొత్తం రేషన్షాప్లు4,73,27124,359.342 మె.టన్నులురేషన్కార్డులుమూడు నెలలకు అవసరమైన బియ్యంఇప్పటి వరకు సరఫరా అయిన షాప్లుమూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం బియ్యం కోసం వస్తే స్టాక్ లేవన్నారు. కూలీ పనికి వెళ్లొచ్చే సరికి స్టాక్ అయిపోవడంతో మళ్లీమళ్లీ తిరగడం ఇబ్బందిగా ఉంది. బియ్యం ఎప్పుడు వస్తాయో డీలర్లు సరిగ్గా చెప్పడం లేదు. అన్ని షాప్లకు బియ్యం కేటాయిస్తే బాగుంటుంది. – జి.కృష్ణ, యూపీహెచ్ కాలనీ, ఖమ్మంరేషన్ దుకాణాల్లో బియ్యం నిల్వలు ఉన్నాయి. గత నెలలో మిగిలిన బియ్యాన్నీ పంపిణీ చేయాలని డీలర్లకు సూచించాం. దుకాణాల్లో నిల్వ సామర్థ్యానికి అనుగుణంగా చేరవేస్తున్నాం. జిల్లాలో జీరో స్టాక్ ఉన్న షాపులు ఎక్కడా లేవు. – మల్లికార్జున్బాబు, ఇన్చార్జి మేనేజర్, పౌర సరఫరాల సంస్థ -
వర్షం.. హర్షం
● పలు మండలాల్లో ఓ మోస్తరు వాన ● సాగులో ఉన్న పంటలకు జీవంఖమ్మంవ్యవసాయం: జిల్లాలో కురుస్తున్న వానలు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. అల్పపీడనానికి రుతుపవనాలు తోడు కావడంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. తల్లాడ, కారేపల్లి, ఖమ్మం రూరల్, కల్లూరు, కామేపల్లి మండలాల్లో 6 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదు కాగా, మధిర, కూసుమంచి, పెనుబల్లి, ఏన్కూరు, ఖమ్మం అర్బన్, తిరుమలాయపాలెం మండలాల్లో 3 నుంచి 6 సెం.మీ.ల మధ్య నమోదైంది. పంటలకు ప్రయోజనం జిల్లాలో సాగులో ఉన్న పంటలకు ప్రస్తుత వానలు ప్రయోజనాన్ని కలిగిస్తున్నాయి. అన్నీ కలిపి వానాకాలం పంటల సాగు లక్ష్యం 5.53 లక్షల ఎకరాలకు గాను ఇప్పటికే 3.21 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో పత్తి 2.31 లక్షలు, పెసర 23 వేల ఎకరాల వరకు ఉంది. జలాశయాలకు నీరు చేరితే వరి సాగు విస్తీర్ణం పెరగనుందని చెబుతున్నారు. ఇక ప్రస్తుత వర్షాలతో పలుచోట్ల వాగుల్లో నీరు నిండి రహదారుపైకి చేరింది. కూసుమంచి మండలంలోని కొత్తూరు – నర్సింహులగూడెం మధ్య పాలేరు రిజర్వాయర్కు వచ్చే వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ప్రవాహంతో పాలేరు రిజర్వాయర్లోకి 800 క్యూసెక్కుల నీరు చేరుతోంది. -
పుస్తకాలొచ్చేశాయ్...
● ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు ఊరట ● పాఠ్యపుస్తకాలతో పాటు నోట్స్ కూడా..ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలతో పాటు ఈ విద్యాసంవత్సరం నుంచి నోట్ పుస్తకాలు కూడా అందిస్తున్నారు. జిల్లాలో 21 ప్రభుత్వ కాలేజీలు ఉండగా 5,989మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి అవసరమైన 46,922 పాఠ్య పుస్తకాలే కాక 72వేల నోట్ పుస్తకాలు కూడా వచ్చాయి. రెండు నెలల అనంతరం విద్యాసంవత్సరం జూన్ 1న ప్రారంభం కాగా... ఇంగ్లిష్ మీడియం పుస్తకాలు సకాలంలోనే చేరాయి. కానీ తెలుగు మీడియం పుస్తకాలు రాక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం అందరికీ సరిపడా పాఠ్యపుస్తకాలు రావడంతో పంపిణీ చేస్తున్నారు. డీఐఈఓ రవిబాబు బోనకల్ కాలేజీని మంగళవారం సందర్శించి నోట్ పుస్తకాల పంపిణీని ప్రారంభించారు. అందరికి సరిపడా పాఠ్య పుస్తకాలు రాగా, నోట్ పుస్తకాలు 95శాతం మేర వచ్చాయని ఆయన తెలిపారు. -
శిథిలమైన క్వార్టర్లు కూల్చివేయించండి
కారేపల్లి: కారేపల్లిలో శిథిలావస్థకు చేరిన పోలీసు సిబ్బంది క్వార్టర్లను కూల్చివేసేందుకు చర్యలు చేపట్టాలని సీపీ సునీల్దత్ ఆదేశించారు. కారేపల్లి పోలీసుస్టేషన్ను మంగళవారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు, పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో శుభ్రత, వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆతర్వాత సింగరేణి సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించిన సీపీ.. రీమోడలింగ్పై సీఐ సాగర్ను అభినందించారు. అక్కడ శిథిలావస్థకు చేరిన క్వార్టర్లను పరిశీలించిన ఆయన కూల్చివేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, కారేపల్లి, కామేపల్లి ఎస్ఐలు బి.గోపి, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.●‘దారి’ దొరకలే -
అన్ని వేళ్లూ ఇటువైపే...
● సత్తుపల్లి నియోజకవర్గంలో సైబర్ నేరాల మూలాలు ● తాజాగా పట్టాభి అరెస్టుతో కల్లూరులో కలకలంసత్తుపల్లి: సైబర్ కేసుల్లో ఎక్కడ నిందితులు పట్టుబడినా అన్నివేళ్లూ సత్తుపల్లి వైపే చూపిస్తున్నాయి. రూ.వేల కోట్ల విలువైన నేరాలు బయటపడుతుండగా, నిందితులు సత్తుపల్లి నియోజకవర్గ వాసులై ఉండడంతో ఇక్కడ కలకలం రేగుతోంది. తాజాగా కల్లూరు మండలం లింగాలకు చెందిన దేవరపల్లి పట్టాభిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.వేల కోట్ల విలువైన సైబర్ నేరాల్లో ఆయన పాత్ర కీలకమని గుర్తించినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం కల్లూరు మండలం లింగాలలో గృహప్రవేశానికి రాష్ట్రస్థాయి ఓ మహిళా నేతను తీసుకొచ్చిన ఆయన, ఎప్పుడు స్వగ్రామానికి వచ్చినా రాజకీయ నేతలు పట్టాభిని కలిసేందుకు బారులు దీరుతారని తెలిసింది. అంతేకాక ఖరీదైన కార్లలో వస్తూ చుట్టూ బౌన్సర్లతో హడావుడి చేస్తుంటాడని చెబుతున్నారు. తెలంగాణలో ఒక పార్టీ, ఆంధ్రాలో ప్రస్తుత అధికార పార్టీ నేతలతో అంటకాగుతూ నేర సామ్రాజ్యాన్ని నలుమూలలా విస్తరించాడని, ఎక్కువగా విదేశాల్లో ఉంటూ అనుచరులతో అంతా నడిపిస్తుంటాడని తెలిసింది. కేసు పాతదే... గతేడాది హైదరాబాద్లోని కాల్ సెంటర్పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి రూ.90 కోట్ల విలువైన సైబర్ క్రైం కేసులో పట్టాభిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిసింది. తాజాగా సైబర్ మోసాలకు పాల్పడిన ముఠాలపై నమోదైన కేసుల విచారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ సిట్ను ఏర్పాటుచేసింది. ఈక్రమాన వీఎం బంజర్, సత్తుపల్లి స్టేషన్లలో నమోదైన కేసులన్నీ బదిలీ అయ్యాయి. దీంతో సిట్ విచారణలో పట్టాభిని కీలక నిందితుడిగా గుర్తించి అదుపులోకి మళ్లీ తీసుకున్నట్లు సమాచారం. మూడు సైబర్ కేసుల్లో ఇప్పటికే 52 మంది అరెస్టు కాగా, రూ.90 కోట్లతో మొదలైన నేరాల స్థాయి రూ.వేయి కోట్లు దాటడం గమనార్హం. జియో ట్యాగింగ్.. ఈడీ నజర్ సైబర్ నేరస్తుల కదిలికలను గుర్తించేందుకు జియో ట్యాగింగ్తో నిఘా ఏర్పాటు చేశారు. నిందితులపై హిస్టరీ షీట్లు తెరిచి, నిందితుల ఇళ్లకు జియో ట్యాగింగ్తో తరచూ తనిఖీ చేస్తున్నారు. ఈక్రమాన కల్లూరు డివిజన్ పరిధిలో సైబర్ నేరాలు రూ.వేయి కోట్లు దాటడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కూడా దృష్టి సారించారని సమాచారం. ఓ వైపు ఈడీ నజర్, మరోవైపు సిట్ విచారణ నేపథ్యాన నిందితులతో పాటు కొద్దిపాటి నగదుకు ఆశపడి అకౌంట్లు ఇచ్చిన వారిపై చర్యలు ఉంటాయని తెలిసింది. ఇప్పటికే మ్యూల్ అకౌంట్లు తెరిచిన ముగ్గురు బ్యాంక్ అధికారులపై కేసు నమోదవడంతో జైలు పాలయ్యారు. ఒకరిని చూసి ఇంకొకరు తాజాగా పట్టుబడిన సురభి విలాసవంతమైన జీవితం చూసి సత్తుపల్లి, కల్లూరు పరిసర ప్రాంతాల యువకులు కొందరు సైబర్ క్రైమ్ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు తెలిసింది. సైబర్ నేరాలతో సులువుగా రూ.కోట్లు కొల్లగొట్టి విలాసవంతమైన జీవితం గడపొచ్చనే భావనతో ఆ దిశగా దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇటీవలే సత్తుపల్లికి చెందిన దోసపాటి కృష్ణసాయి, శివ నాగరాజు అలియాస్ నాని రూ.4.70 కోట్ల మేర సైబర్ నేరానికి పాల్పడడంతో అరెస్ట్ అయ్యారు. నిందితులకు రాజకీయ నేతలు ఆశ్రయం లభిస్తుండడంతో మార్పు రావడం లేదనే చర్చ సాగుతోంది. ఇందులో భాగంగానే వేంసూరు మండలానికి చెందిన ఓ నిందితుడు పాత నెట్వర్క్ను మళ్లీ పునరుద్ధరించినట్లు ప్రచారం మొదలైంది. -
మహిళా డిగ్రీ కళాశాలలో 11న స్పాట్ అడ్మిషన్లు
రఘునాథపాలెం: రఘునాథపాలెంలోని మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీల భర్తీకి 11వ తేదీన స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి సీహెచ్.రాంబాబు తెలిపారు. బీఎస్సీ(ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్డీఎస్, బీజెడ్సీ, ఎంబీజడ్సీ), బీఏ(హెచ్ఈపీ), బీకాం(సీఏ), బీకాం(బీఏ) కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజనం సౌకర్యాలు కల్పిస్తున్నందున విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఒరిజనల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్కు హాజరుకావాలని, వివరాలకు 90102 94015, 95338 88851 నంబర్లలో సంప్రదించాలని ఆయన తెలిపారు. హాజరు మరింత పెరగాలి కల్లూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడమే కాక వంద శాతం హాజరయ్యేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కల్లూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. అలాగే, పాఠశాల ప్రాంగణంలో ప్రారంభమైన ప్రీ ప్రైమరీ స్కూల్ను కూడా పరిశీలించారు. బోధనా విధానాలు, ఉపకరణాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు, హాజరుపై ఆరా తీశాక ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఆతర్వాత అదనపు కలెక్టర్ శ్రీజ కల్లూరులోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కూడా తనిఖీ చేసి వైద్యులు, సిబ్బంది హాజరుపై ఆరా తీయడమే కాక చికిత్స వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఐకేపీ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ కుడుతుండగా పరిశీలించి వేగం పెంచాలని సూచించారు. అలాగే, జలసిరి పథకంలో భాగంగా పంట కుంటలు, ఇంకుడు గుంతల ఏర్పాటుకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ ఉద్యోగులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో డీసీహెచ్ఓ రాజశేఖర్గౌడ్, ఎంఈఓ పొదిలి పద్మ, మెడికల్ ఆఫీసర్ రమేష్, హెచ్ఎం వరక రామారావు, వివిధ శాఖల ఉద్యోగులు అశోకరాణి, మెహరాజ్, తదితరులు పాల్గొన్నారు. డీజీపీ దృష్టికి ఎన్నికల వివాదం ఖమ్మంక్రైం: జిల్లాలో 13 ఏళ్ల తర్వాత పోలీసు కానిస్టేబుళ్ల, హెడ్కానిస్టేబుళ్ల సంక్షేమ సంఘానికి ఎన్నికలు జరుగుతుండగా ఏర్పడిన వివాదం డీజీపీ సీ.వీ.ఆనంద్ దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఆయన సంబంధిత పోలీసుస్టేషన్ అధికారిపై చర్యలు తీసుకోవా లని సీపీ సునీల్దత్ను ఆదేశించినట్లు సమాచారం. ఖమ్మంలోని మహిళా పోలీసుస్టేషన్కు సంబంధించి ఈసీ మెంబర్ను ప్రత్యేకంగా ఎన్నుకోవాల్సి ఉండగా, కమాండ్ కంట్రోల్ సిబ్బందితో కలిపి సోమవారం ఎన్నిక నిర్వహించడం వివాదానికి దారితీసింది. దీనికితోడు స్వీట్లు పంచుకోవడం, పార్టీలు చేయడం, విజే త వివరాలు ముందే ప్రకటించడంతో అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న ఓ ప్యానల్ బాధ్యులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే సీపీ బాధ్యులను మందలించగా, మంగళవారం డీజీపీ సైతం సంబంధిత స్టేషన్ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడం గమనార్హం. రెండో రోజు పరిశీలనపాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్ట్ను మంగళవారం కూడా ప్రాజెక్టుల భద్రత, స్థిరత్వ, సమర్థత(సీడీఎస్ఈ) బృందం పరిశీలించింది. చైర్మన్ రామారావు, సభ్యులు మొండికట్ట మార్గం వైపు కరకట్టను పరిశీలించారు. లీకేజీలపై ఆరా తీశారు. తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. -
మక్కలకు యమ డిమాండ్!
ఖమ్మంవ్యవసాయం: ‘ఎల్నినో’ నేపథ్యాన మక్కలకు డిమాండ్కు పెరిగింది. పౌల్ట్రీ పరిశ్రమలు, ఇంధన(ఇథనాల్) కంపెనీలు ఆసక్తి చూపడంతో మార్క్ఫెడ్ ద్వారా వేలంలో మెరుగైన ధర పలికింది. గత యాసంగి సీజన్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,400 కన్నా తక్కువ ధర పలుకుతుండడంతో రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.31 లక్షల మెట్రిక్ టన్నులను రూ.795 కోట్లను వెచ్చించి కొనుగోలు చేయగా, దాదాపు 50 వేల మె.టన్నులను ఓపెన్ షెడ్లలో, మిగిలిన పంట క్లోజ్డ్ షెడ్లలో నిల్వ చేశారు. తొలుత ఓపెన్ షెడ్లలో మక్కలకు రక్షణ లేకపోవడంతో టెండర్లు నిర్వహించగా క్వింటాకు రూ. 2,200 ధరే పలకడంతో నష్టం ఎదురైంది. ఆతర్వాత క్లోజ్డ్ షెడ్లలో ఉన్న మక్కల అమ్మకానికి ఈ–వేలం వేయగా క్వింటాకు రూ.2,490 నుంచి రూ.2,560 ధర పలికింది. ఫలితంగా మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన దాని కంటే అధిక ధర వచ్చినట్లయింది. ఓపెన్ షెడ్లలో ఉన్న మక్కలను తొలుత పంపిస్తుండగా, ఆ తర్వాత మిగతా సరుకు పంపిస్తామని మార్క్ఫెడ్ ఉమ్మడి జిల్లా మేనేజర్ బత్తుల నరసింహారావు తెలిపారు. కొన్న ధర కంటే వేలంలో అధికం -
ఇన్స్టా రీల్స్ వివాదం.. టీచర్ సంచలన నిర్ణయం!
ఖమ్మం జిల్లా: మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గౌతమి వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.గిరిజన ప్రాంతానికి చెందిన గౌతమి ఎంతో కష్టపడి 12 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించారు. అయితే, ఇన్స్టాగ్రామ్లో చురుగ్గా ఉండే ఆమె, సోషల్ మీడియా రీల్స్ ద్వారా ప్రైవేట్ విద్యాసంస్థల అడ్మిషన్లను ప్రమోట్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. పాఠశాల వేళల్లో విధులను నిర్లక్ష్యం చేస్తూ రీల్స్ చేస్తున్నారని, హెచ్చరించినా వైఖరి మార్చుకోలేదని పేర్కొంటూ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ఆమెను 6 నెలల పాటు సస్పెండ్ చేశారు.సస్పెన్షన్ కాలం పూర్తికావడంతో ఇటీవలే ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అయితే, తిరిగి ఉద్యోగంలో చేరిన తర్వాత పరిస్థితులు మరింత విషమించాయి. పోస్టింగ్ ఉత్తర్వుల కోసం వెళ్లినప్పుడు విద్యాశాఖ కార్యాలయంలో అధికారుల నుండి దారుణమైన అవమానాలు ఎదురయ్యాయని, పాఠశాలలో సహోద్యోగుల నుంచి తీవ్రమైన మానసిక వేధింపులు, కుట్రలు మొదలయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్, వ్యక్తిగత విమర్శలు ఆమెను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి.సహోద్యోగుల వేధింపులు, అధికారుల కఠిన వైఖరి, సామాజిక మాధ్యమాల ఒత్తిడిని తట్టుకోలేకపోయిన గౌతమి, చివరకు తాను ఎంతగానో ప్రేమించి సాధించుకున్న ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు భావోద్వేగంతో ప్రకటించారు. తెలియక చేసిన చిన్న తప్పుకు దారుణమైన శిక్ష అనుభవించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Bhukya Gowthami (@gouthamirathode) -
గ్రీన్ఫీల్డ్.. రయ్రయ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం–దేవరపల్లి నేష నల్ గ్రీన్ఫీల్డ్ హైవే పూర్తిస్థాయిలో అందు బాటులోకి వచ్చింది. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 165 కి.మీ మేర నిర్మించిన ఈ రహదారి ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద మొదలై ఏపీలోని రాజమండ్రి సమీపాన ఉన్న దేవరపల్లి వద్ద ముగు స్తుంది. 2017లో ఈ ప్రాజెక్టుకు రూ.3,573 కోట్లతో కేంద్రం ద్వారా అనుమతులు మంజూరయ్యాయి. ఈ రహ దారి నిర్మాణంతో ఏపీ వెళ్లే వారికి సుమారు 100 కి.మీ. కలిసి రానుంది. చిన్నచిన్న పనులు మినహా నిర్మా ణం పూర్తవడంతో ఇన్నాళ్లు వైరా మండలం సోమవరం నుంచే అనుమతించిన వాహనా లను ఆగస్టు 1నుంచి ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు ప్రారంభ స్థానం నుంచి అనుమతిస్తున్నారు. 2017లో రూ.3,573 కోట్లతో...భారత్ మాల ఎకనామిక్ కారిడార్ పథకం కింద ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండలం తల్లంపాడు నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సమీపంలో ఉన్న దేవరపల్లి వరకు 165 కిలోమీటర్ల నిడివితో నిర్మించగా, తెలంగాణలో 90 కి.మీ., ఏపీలో 75 కిలోమీటర్ల మేర ఈ రహదారి ఉంటుంది. 2017లో డీపీఆర్ సిద్ధం కాగా, రూ.3,573 కోట్లతో కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. 2018 నాటికే భూసేకరణ పూర్తి చేశారు. ఈ రహదారి నిర్మాణంలో పలు అడ్డంకులు ఎదురైనా ఎట్టకేలకు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తగ్గనున్న ప్రయాణ సమయంఈ హైవే అందుబాటులోకి రావడంతో హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. తద్వారా సుమారు 56 కి.మీ., సూర్యాపేట నుంచి చూస్తే దాదాపు 100 కి.మీ. దూరం తగ్గుతుంది. గతంలో సూర్యాపేట నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి చేరుకోవాలంటే ఆరు గంటల సమయం పట్టేది. కొత్త హైవేతో కేవలం ఐదు గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు. ఈ కారిడార్ ద్వారా ఏపీలోని ఏడు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, కోల్కతా వరకు నేరుగా అనుసంధానం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. ప్రత్యేకతల రహదారిఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్వేగా చెప్పవచ్చు. నిర్ణీత ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద మాత్రమే ప్రవేశం కల్పిస్తూ ప్రతీ 18 కి.మీ.కు ఒక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ ఏర్పాటు చేశారు. ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ వసూలుకు ’క్లోజ్డ్ టోలింగ్ సిస్టం’ను అందుబాటులోకి తెచ్చారు. భద్రతా కోణంలో ఐదుచోట్ల అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఏటీఎంఎస్), ప్రతీ రెండు కి.మీ.కు 360 డిగ్రీల సీసీ కెమెరాలు, సోలార్ దీపాలు, ప్రతీ ఐదు కి.మీ.కు ఒక ఎమర్జెన్సీ ఓపెనింగ్లు ఏర్పాటు చేశారు. అతివేగం, సీట్బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలను ఏఐ కెమెరాల ద్వారా గుర్తించి నేరుగా చలాన్లు జారీ చేస్తారు. ప్రతీ 50 కిలోమీటర్లకు ఐదు ఎకరాల విస్తీర్ణంలో హోటళ్లు, పెట్రోల్ బంకులు, వాష్రూమ్ల వంటి సదుపాయాలు కల్పించే పనులు మొదలయ్యాయి. క్యూఆర్ కోడ్ ద్వారా సమీప పోలీస్స్టేషన్, పెట్రోల్ బంక్ వివరాలు తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఈ హైవేపై గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది.గ్రీన్ఫీల్డ్ హైవే వివరాలుఖమ్మం నుంచి దేవరపల్లి వరకు దూరం 165 కి.మీ.తెలంగాణలో నిడివి 90 కి.మీ.ఆంధ్రప్రదేశ్లో నిడివి 75 కి.మీ.మొత్తం వ్యయం రూ. 3,573 కోట్లు -
రామాలయ పునర్నిర్మాణానికి రూ.లక్ష విరాళం
సత్తుపల్లి(పెనుబల్లి): పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలోని హరి సంఘం రామాలయం పునఃనిర్మాణం కోసం టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఈమేరకు నగదును సోమవారం ఆయన కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం విజయబాబు మాట్లాడుతూ దేవాలయాలు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని.. వాటి అభివృద్ధి అందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పునర్నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. విద్యుత్ ఇంజనీర్లకు ఉద్యోగోన్నతి, బదిలీలు ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ ఇంజనీర్లు పలువురికి ఉద్యోగోన్నతి కల్పించడమే కాక నూతన స్థానాలకు బదిలీ చేస్తూ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో ఖమ్మం విద్యు త్ సర్కిల్ పరిధిలోని పలువురికి స్థానం దక్కింది. టెక్నికల్ డీఈ వి.చిన్న బాబూరావుకు సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ)గా ఉద్యోగోన్నతి కల్పించి వరంగల్ కార్పొరేట్ ఆఫీస్ జనరల్ మేనేజర్ కార్యాలయం–1లో నియమించారు. భద్రాద్రి జిల్లా హెచ్టీ విభాగం ఏడీఈ బి.కిరణ్కుమార్కు డీఈగా ఉద్యోగోన్నతి కల్పించి ఖమ్మం సర్కిల్ కార్యాలయం టెక్నికల్ డీఈగా నియమించారు. అలాగే, ఖమ్మం కన్స్ట్రక్షన్ విభాగం ఏడీఈ కిరణ్చక్రవర్తికి డీఈగా ఉద్యోగోన్నతి కల్పించి ఖమ్మం ఎంఆర్టీ విభాగానికి, ఎంఆర్టీ విభాగం డీఈ భద్రుపవార్ను మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ డీఈగా, ఖమ్మం డీపీఈ విజిలెన్స్ విభాగం ఏడీఈ రామకృష్ణారావును ఖమ్మం కన్స్ట్రక్షన్ విభాగానికి బదిలీ చేశారు. మిరప సాగు తగ్గిస్తేనే మేలు రఘునాథపాలెం: ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన రైతులు మిరప సాగును నియంత్రించుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి ఎం.వీ.మధుసూదన్ సూచించారు. రఘునాథపాలెం రైతు వేదికలో నర్సరీ చట్టంపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఏడు నెలల కాలపరిమితి కలిగిన మిర్చి సాగుకు ప్రతీ దశలో సమృద్ధిగా నీటి అవసరం ఉంటుందని తెలిపారు. అంతేకాక పెట్టుబడి ఎక్కువ కానున్న నేపథ్యాన, వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులు మిర్చి సాగుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే, నర్సరీ యజమానులు రైతులకు నాణ్యమైన మొక్కలను మాత్రమే అందించాలని ఆదేశించారు. ఉద్యాన అధికారి జి.నగేష్ తదితరులు పాల్గొన్నారు. ‘అంతర్జాతీయ ఎక్స్పోజర్’కు దరఖాస్తులు ఖమ్మం సహకారనగర్: ప్రతిభ కలిగిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విదేశాలకు వెళ్లే అవకాశం కోసం ఈనెల 5వ తేదీన దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకు హాజరుకావాలని డీఈఓ సదానందం సూచించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యాన హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ఐదు రోజుల పాటు అంతర్జాతీయ ఎక్స్పోజర్, ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం మొదటి దశ పూర్తి కాగా... రెండో దశకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నాటికి 55ఏళ్ల లోపు వయస్సు వారు, కనీసం పదేళ్ల సర్వీస్తో పాటు పని చేస్తున్న పాఠశాలలో కనీసం వంద మంది విద్యార్థుల నమోదై ఉంటే అర్హులని చెప్పారు. ఎలాంటి చార్జ్షీట్, విచారణ, నేరారోపణ కేసు, ఆరోపణలు పెండింగ్లో ఉండకూడదని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారు అనర్హులని పేర్కొన్నారు. కేటగిరీల వారీగా ఆరుగురిని ఎంపిక చేయనుండగా, ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలకు అవకాశం దక్కుతుందని తెలిపారు. గత మూడేళ్ల పనితీరు ఆధారంగా దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూలు ఈనెల 5వ తేదీన ఉదయం 10గంటలకు డీఈఓ కార్యాలయంలో మొదలవుతాయని వివరించారు. ఇక్కడి నుంచి జాబితాను కలెక్టర్ నిర్ణయంతో పంపిస్తే రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీ పేర్లు ఖరారు చేస్తుండని డీఈఓ తెలిపారు. -
వరి.. వర్రీ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఓ వైపు ప్రభుత్వం వరి సాగు చేయొద్దని సూచిస్తోంది. ఇంకో పక్క తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జిల్లాలో మాత్రం నీటి జాడ లేక జిల్లాలో వరి సాగుకు సిద్ధమవుతున్న రైతుల్లో అయోమయం నెలకొంది. శ్రీశైలం వరకు వచ్చిన నీరు నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో చేరలేదు. దీంతో సాగర్ నిండుతుందా.. దిగువకు విడుదల చేస్తారా, లేదా అని ఎదురుచూస్తున్నారు. జూలైలో జిల్లాలో లోటు వర్షపాతం నమోదు కాగా, ఆగస్టు, సెప్టెంబర్లోనూ ఎల్నినో ప్రభావంతో అదే పరిస్థితి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. దీంతో వరి సాధారణ సాగు లక్ష్యం 2.92 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 64,602 ఎకరాల్లోనే నాట్లు వేయగా, ఇది కూడా బోర్లు, బావుల కిందే సాగైంది. రెండు నెలల్లో 30.2 శాతం లోటు వానాకాలం సీజన్ మొదలయ్యాక జూన్, జూలై నెలల్లో 30.2 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇది వరి పంట సాగుకు ఏ మాత్రం అనుకూలమైన సంకేతంలా లేదు. సాగుకు కీలకమైన జూలైలో అయితే 62 శాతం లోటు వర్షపాతం ఉండడం గమనార్హం. అత్యధికంగా ఎర్రుపాలెం, కూసుమంచి మండలాల్లో 60 – 99 శాతం మేర వర్షపాతం లోటు ఉంది. మిగతా 11 మండలాల్లో 20 – 59 శాతం లోటు ఉండగా, ఎనిమిది మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. కృష్ణమ్మ పరవళ్లు.. జిల్లాలో బీళ్లు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తింది. శ్రీశైలం వరకు వరద నీరు ఉప్పొంగుతున్నా నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి మాత్రం నీళ్లు ఇంకా రావడం లేదు. వర్షాలు మరింత ఉధృతంగా కురిస్తే తప్ప సాగర్లోకి నీరు వచ్చే అవకాశం లేదు. అయినా ఆశ చంపుకోలేక కొందరు రైతులు బోర్లు, బావుల కింద వరి నాట్లు వేసి సాగర్ ఎప్పుడు నిండుతుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బోర్లు, బావుల సాయంతో నాట్లు వేసినా.. సాగర్ నీరు విడుదలైతేనే పంటలకు ప్రాణం రానుంది. ప్రధానంగా వరి సాగుకు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసే వర్షాలే ఆధారం. ఈ రెండు నెలల్లోనూ ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు కురవవని వాతావరణ శాఖ చెబుతుండడంతో పలువురు రైతులు ధైర్యం చేయలేక భూములను బీళ్లుగా పెట్టారు.పక్క ఫొటోలో ఉన్న రైతు ముదిగొండ మండలం గోకినేపల్లికి చెందిన బతినేని రామారావు. కొన్నేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవడం, బోర్లలో నీరు పుష్కలంగా ఉండడంతో 12ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. ఈసారి వర్షాలు పడకపోవడంతో బోర్లలో నీరు తగ్గింది. దీంతో 12 ఎకరాలకు బదులు మూడెకరాల్లో వరి సాగు చేపట్టాడు. మిగతా భూమి పత్తి వేశాడు. రెండు బోర్లు ఉన్నా ఇప్పుడే నీరు సరిపోవడం లేదని, వర్షాలు పడకపోతే పంటలు చేతికొస్తాయో, లేదోనని రామారావు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.వద్దంటున్న ప్రభుత్వం.. సందిగ్ధంలో రైతాంగం -
పని మనిషే నిందితురాలు
ఇల్లెందు: ఇల్లెందు పోలీసులు భారీ చోరీ కేసును ఛేదించారు. పనిమనిషినే నిందితురాలిగా తేల్చి అరెస్ట్ చేయగా, ఇల్లెందు పోలీసుస్టేషన్లో డీఎస్పీ వెంకన్నబాబు సోమవారం వివరాలు వెల్లడించారు. ఇల్లెందు కాకతీయ నగర్లో పెద్దబోయిన శంకర్ దంపతులు నివాసం ఉంటున్నారు. గత నెల 18న శంకర్ అనారోగ్యంతో మృతి చెందగా, అంత్యక్రియల సమయాన ఆయన చేయించిన ఆభరణాలను గుర్తుగా తల్లి మెడలో వేయాలని కుటుంబీకులు భావించారు. తీరా బీరువా తెరిచి చూస్తే ఆభరణాలు లేకపోవడంతో అంత్యక్రియలు పూర్తయ్యాక గత నెల 30న శంకర్ కుమారుడు నగేష్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు అనుమానంతో ఇంటి పనిమనిషి, కారేపల్లి మండలం టేకులగూడెంకు చెందిన వేమూరి సీతను అదుపులోకి తీసుకోగా చోరీ చేసినట్లు అంగీకరించింది. గతనెల 7న యజమానులు నిద్రిస్తున్న సమయంలో బీరువా తెరిచి 11 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేయగా, గొలుసును ఇల్లెందులోని సీఎస్పీ బ్యాంకులో తాకట్టు పెట్టినట్లు వెల్లడించింది. మిగిలిన ఆభరణాలను సైతం ఖమ్మంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో సీఐ సురేష్కుమార్, ఎస్ఐ ఉమ పాల్గొన్నారు.బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు -
నిరుద్యోగులు ధైర్యం కోల్పోవద్దు
వేణుకుమార్కు నామా ట్రస్ట్ ద్వారా రూ.50 వేల ఆర్థికసాయం ముదిగొండ: కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి నిరుద్యోగులను మోసం చేయడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జెడ్పీ మాజీ చైర్మన్ కమల్రాజ్ పేర్కొన్నారు. అయితే, నిరుద్యోగులు ధైర్యం కోల్పోకుండా ప్రభుత్వ తీరుపై పోరాడాలని సూచించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురానికి వేణుకుమార్ను ఖమ్మం ఆస్పత్రిలో సోమవారం ఆయన పరామర్శించారు. అలాగే, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రకటించిన రూ.50 వేల ఆర్థిక సాయం చెక్కును అందజేసి మాట్లాడారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్, నాయకులు గడ్డం వెంకట్, నానబాల కిరణ్, గడ్డం చిన్నచందర్రావు, కొమరం స్వామి, మేడ ఎల్లారావు పాల్గొన్నారు. హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనం విడుదల ఖమ్మంగాంధీచౌక్: హీరో మోటో కార్ప్ రూపొందించిన ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనం హెచ్ఎఫ్ డీలక్స్ను సోమవారం ఖమ్మం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా బైపాస్ రోడ్డులోని శ్రీశ్రీశ్రీ హీరో షోరూంలో వాహనాన్ని సంస్థ ఎండీ ఈశ్వరప్రగడ రంగనాథ్ విడుదల చేసి మాట్లాడారు. హీరో స్ప్లెండర్లో కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ వాహనాలు ఈ20 నుంచి ఈ85 వరకు ఇంధనాలతో నడుస్తాయని వివరించారు. చారిత్రక కట్టడాల పరిరక్షణకు పెద్దపీట ఖమ్మంమయూరిసెంటర్: దేశవ్యాప్తంగా చారిత్రక సంపద పరిరక్షణతో పాటు, ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి లోక్సభలో సోమవారం అడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. తెలంగాణలోని చారిత్రక కట్టడాల పరిరక్షణకు హైదరాబాద్ సర్కిల్ ద్వారా గడిచిన ఐదేళ్లలో కేటాయింపులు పెరిగాయని తెలిపారు. ‘అడాప్ట్ ఏ హెరిటేజ్ – 2.0’ కింద చారిత్రక ప్రదేశాల్లో వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో ఎంపిక చేసిన 41,762 పాఠశాలలకు గాను 2,104 స్కూళ్లలో స్మార్ట్ క్లాస్రూమ్లు ఏర్పాటయ్యాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని 20,490 పాఠశాలల్లో కంప్యూటర్ సౌకర్యం అందుబాటులోకి రాగా, 15,535 పాఠశాలలకు ఇంటర్నెట్ సేవలు సమకూర్చామని చెప్పారు. అంతేకాక రాష్ట్రంలో డిజిటల్ బోధనపై శిక్షణ పొందిన ఉపాధ్యాయుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని వివరించారు. రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి బోనకల్: రెండు ద్విచక్ర వాహనాలు సోమవారం రాత్రి ఎదురెదురుగా ఢీకొనగా ప్రమాదంలో ఓ పత్రిక జర్నలిస్టు మృతి చెందాడు. బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్) గ్రామానికి చెందిన జర్నలిస్టు మంద సత్యానందం(35) సోమవారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై బోనకల్ వైపు వస్తుండగా రావినూతల సమీపాన వేబ్రిడ్జి వద్ద బోనకల్ నుంచి రావినూతల వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం ఎదురుగా ఢీకొట్టింది. ఘటనలో సత్యానంనందం తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన బైక్పై ఉన్న లక్ష్మీపురం వాసులు తోటపర్తి సాయి, కాంపాటి నాగయ్యకు కూడా తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం తరలించారు. కాగా, సత్యానందానికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలికి బోనకల్ ఎస్ఐ మాచినేని రవి చేరుకుని వివరాలు సేకరించారు. -
పేద విద్యార్థికి ఉపాధ్యాయురాలి అండ
నేలకొండపల్లి: ఓ నిరుపేద విద్యార్థి ఉన్నత చదువుల నిమిత్తం ఉపాధ్యాయురాలు అండగా నిలిచారు. నేలకొండపల్లి మండలం రాయగూడెం ప్రభుత్వ పాఠశాలలో గత ఏడాది పదో తరగతి పూర్తిచేసిన కె.పృధ్వీచరణ్ ప్రతిభ చాటాడు. అయితే, ఆయన ఇంటర్ ఓ ప్రైవేట్ కళాశాలలో చేరినా ఫీజు, ఇతర ఖర్చులకు ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం తెలియడంతో పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలు వి.మాధవీలత ముందుకొచ్చారు. ఈమేరకు రెండేళ్ల ఫీజు కోసం రూ.80 వేల చెక్కును సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు సుంతరమోని నాగార్జున, బెల్లంకొండ సత్యనారాయణ, జి.రాజు, బి.నాగేశ్వరరావు, బి.తిరుమలప్రసాద్ పాల్గొని ఆమెను అభినందించారు.చదువు కోసం రూ.80 వేల ఆర్థికసాయం -
కేఎంసీలో ‘ఇందిరమ్మ’ కలకలం
● లబ్ధిదారుల నుంచి డబ్బు వసూళ్లు ● వార్డ్ ఆఫీసర్ సస్పెన్షన్, విచారణకు ఆదేశంసాధారణ వర్షపాతంరెండు నెలల్లో వర్షపాతం లోటువరి సాగు (అంచనా)ఇప్పటి వరకు సాగుతీవ్ర లోటు వర్షపాతంలోటు వర్షపాతంఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలకసంస్థ(కేఎంసీ) పరిధిలో కొందరు ఉద్యోగులు అక్రమాల రెక్కలు విప్పుతున్నారు. సొంతింటి కల నెరవేర్చుకుందామనుకునే పేదల ఆశలే ఆసరాగా వారు జేబులు నింపుకుంటున్నారు. కేఎంసీ పరిధిలోని పలు విభాగాల్లో ఇప్పటికే అవినీతి వెలుగు చూడగా.. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో నగదు వసూలు చేసిన ఓ వార్డ్ ఆఫీసర్ బాగోతం బయటపడింది. ఫిర్యాదుతో వెలుగులోకి.. ఖమ్మం 57వ డివిజన్కు చెందిన ఓ ఇందిరమ్మ లబ్ధిదారుడి నుంచి వార్డ్ ఆఫీసర్ సందీప్ డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితుడు గతనెల 30న ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన రాకపోవడంతో ఈనెల 1న కలెక్టర్, అదనపు కలెక్టర్ను ఆశ్రయించినట్లు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు సోమవారం సందీప్ను సస్పెండ్ చేయడమే కాక అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ కోసం హౌసింగ్ ఈఈ, కేఎంసీ మేనేజర్, మరో అధికారితో కూడిన త్రీమెన్ కమిటీని నియమించినట్లు సమాచారం. ఆది నుంచీ అదే దందా.. కేఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రారంభమైన నాటి నుంచే సిబ్బంది లంచాల వసూలు మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఓ మహిళా వార్డ్ ఆఫీసర్ లబ్ధిదారుడి నుంచి డబ్బు తీసుకోగా, విషయం బయటకు రావడంతో తిరిగి ఇచ్చినట్లు సమాచారం. అంతేకాక హౌసింగ్ ఏఈలు బిల్లులు మంజూరు చేయాలంటే పర్సంటేజీ డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో వార్డ్ ఆఫీసర్లు, హౌసింగ్ ఏఈలు కుమ్మకై ్క పేదల నుంచి నగదు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇంటి మంజూరు, బిల్లుల కోసం లబ్ధిదారులు నిత్యం కేఎంసీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కేఎంసీతో పాటు కలెక్టరేట్ వేదికగా జరిగే ప్రజావాణిలో వినతులు ఇస్తూనే, సిబ్బంది అక్రమాలపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తాజాగా వార్డ్ ఆఫీసర్ సందీప్పై చర్యలు తీసుకోవడంతో, ఇంకొందరు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. బాధితులు నోరు విప్పితే తమ ఉద్యోగానికి ఎసరు వస్తుందని కేఎంసీలోని పలువురు వార్డు ఆఫీసర్లు, అధికారుల్లో భయం పట్టుకుందని సమాచారం. -
ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించండి
ఖమ్మం సహకారనగర్: వివిధ ప్రాంతాల నుంచి శ్రమకోర్చి వచ్చే ప్రజలు ఇస్తున్న దరఖాస్తులు, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, శ్రీనివాసరెడ్డితో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్.. ప్రతీ ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో డీఆర్వో రామమూర్తి, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని... ● ఖానాపురం హవేలీ శివారు టేకులపల్లికి చెందిన వి.వెంకటయ్య ఈనెల వృద్ధాప్య పింఛన్ అందలేదని ఫిర్యాదు చేశారు. ● ఖమ్మం లెనిన్నగర్కు చెందిన ఎస్.కే నాజియా తలసేమియాతో బాధపడుతున్న తన కుమార్తెకు పింఛన్ మంజూరు చేయాలని కోరారు. ● ఖమ్మం అర్బన్ మండలం కొత్తూరుకు చెందిన ఎం.సూర్యప్రకాష్ పాపిరెడ్డి ఖమ్మం – దేవరపల్లి హైవే ధంసలాపురం ఎంట్రీ వద్ద తమ భూమికి దారి ఇప్పించాలని కోరారు. ● సింగరేణి మండలం పేరపల్లిలోని ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్(టీఎస్ఎస్ఏ) నాయకులు దామల్ల సత్యనారాయణ, కొప్పుల రామారావు వినతిపత్రం అందజేశారు. తల్లిపాలలో పోషకాలు ఖమ్మం వైద్యవిభాగం: ఈనెల 7వ తేదీ వరకు కొనసాగనున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టరేట్లో పోస్టర్లను ఆవిష్కరించాక ఆయన మాట్లాడారు. శిశువు పుట్టినప్పటి నుంచి మొదటి ఆరు నెలలు తల్లి పాలే పట్టించేలా గర్భిణ ులకు అవగాహన కల్పించాలని, తద్వారా శిశువు ఎదుగుదల, అభివృద్ధి, రోగ నిరోధక శక్తికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ పరాస్ కుమార్, డీఆర్ఓ సీహెచ్.రామ్మూర్తి, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీడబ్ల్యూఓ ఏ.ప్రమీల, డీఎంహెచ్ఓ రామారావు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయన అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమావేశమయ్యారు. శాఖల వారీగా ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఈనెల 8లోగా డీపీఆర్కు అందించాలని, ప్రతీ శాఖ నుంచి ప్రశంసా పత్రాల కోసం ఇద్దరు ఉద్యోగుల పేర్లనే ప్రతిపాదించాలని సూచించారు. అనంతరం ఆహ్వా నాలు, శాఖల వారీ స్టాళ్ల ఏర్పాటు తదితర అంశాలపై సూచనలు చేశారు. -
6నుంచి ప్రచార జైత్రయాత్రలు
ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ఆరోపించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉచిత బస్సు పథకం మినహా మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం, పింఛన్ల పెంపు, యువతకు స్కూటీల పంపిణీ తదితర హామీలు నెరవేరలేదన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీలోనూ లోపాలు ఉండగా, సీతారామ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. ఈమేరకు హామీల అమలు, నిధుల కేటాయింపు డిమాండ్లతో 6నుంచి 13వ తేదీ వరకు పార్టీ జాతీయ సమితి పిలుపులో భాగంగా సీపీఐ ఆధ్వర్యాన ప్రచార జైత్ర యాత్రను నిర్వహించనున్నట్లు సురేష్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా పాదయాత్రల ద్వారా ప్రజా సమస్యలను గుర్తించడమే కాక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. తల్లంపాడు వద్ద మొదలయ్యే యాత్రలు 13న ఖమ్మంలో ముగుస్తాయని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, మహ్మద్ సలాం, అజ్మీరా రామ్మూర్తి పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ -
గ్రీన్ఫీల్డ్ హైవేపై గజిగజి ప్రయాణం
వైరా: రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఖమ్మం – దేవరపల్లి మధ్య నిర్మించిన గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకలు పూర్తిస్థాయిలో మొదలయ్యాయి. ఇప్పటికే వైరా మండలం సోమవరం వద్ద ఎగ్జిట్, ఎంట్రీ నుంచి వాహనాలను అనుమతిస్తుండగా తాజాగా ప్రారంభ స్థానమైన ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద నుంచి రాకపోకలకు అనుమతించారు. అయితే, తల్లంపాడు వద్ద టోల్గేట్లు మాత్రం మొదలుకాలేదు. దీంతో తల్లంపాడు నుంచి సోమవరం వరకు హైవేపై ఉచితంగానే ప్రయాణిస్తున్నారు. అలాగే ముందుకెళ్తే దేవరపల్లి వద్ద దిగే సమయాన టోల్ఫీజుకు ఇక్కట్లు రానుండడంతో సోమవరం వద్ద కిందకు దిగి తిరిగి హైవేపైకి చేరాల్సి వస్తోంది. దేవరపల్లి నుంచి వచ్చే వాహనదారులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. రెండు వైపులా వాహనదారులు సోమవరం టోల్ పాయింట్ వద్ద దిగి నమోదు చేయించుకుని వెళ్లాల్సి రావడం, కొత్తగా వచ్చే వాహనదారులు, భారీ వాహనాల డ్రైవర్లకు మలుపు తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఇకనైనా అధికారులు త్వరగా తల్లంపాడు వద్ద టోల్గేట్ అమల్లోకి తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు. -
ఉదయం ఫిర్యాదు.. సాయంత్రం విచారణ
సత్తుపల్లి: హాస్టల్ వార్డెన్, సిబ్బంది తీరుపై విద్యార్థులు ఉదయం కలెక్టరేట్ గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేయగా.. అధికారులు సాయంత్రంకల్లా విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి వివరాలు... సత్తుపల్లి ఎస్సీ బాలుర పోస్ట్ మెట్రిక్ కళాశాల హాస్టల్ వార్డెన్, వంట సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మధిర, సత్తుపల్లి ఏఎస్డబ్ల్యూఓలు గోపీచంద్ నాయక్, మెట్టు వీరన్న సోమవారం రాత్రి హాస్టల్కు వచ్చారు. విద్యార్థులతో సమావేశమై సమస్యలను తెలుసుకోవడమే కాక వార్డెన్, వంట సిబ్బంది తీరుపై వివరాలు సేకరించారు. ఈమేరకు నివేదిక ఉన్నతాధికారులకు అందించనునట్లు ఏఎస్డబ్ల్యూఓలు తెలిపారు. ఎస్సీ బాలుర హాస్టల్లో విచారించిన అధికారులు -
ఆపరేటర్లు ఔట్?
● భూభారతి ఆపరేటర్ల కుదింపునకు నిర్ణయం ● జిల్లాలో 12మందినే కొనసాగించాలని ఉత్తర్వులు ఖమ్మం సహకారనగర్: ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న భూభారతి ఆపరేటర్ల(ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్) తొలగింపునకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రంలో ఒకరితో పాటు మండలానికి ఒకరు చొప్పున ఆపరేటర్లు పనిచేస్తున్నారు. అయితే, లావాదేవీలు తక్కువగా ఉన్న తహసీల్దార్ల కార్యాలయాల్లోని వారిని తొలగించాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 21 మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో ఒక్కో ఆపరేటర్ ఉండగా... కలెక్టరేట్లో ఒకరు కోఆర్డినేటర్గా వ్యవహరిస్తుంటారు. మొత్తంగా 22మందికి గాను 12మందినే కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఏళ్లుగా పనిచేస్తున్న తమను యథావిధిగా కొసాగించాలని ఆపరేటర్లు కోరుతున్నారు. 2018 నుంచి విధుల్లో రెవెన్యూ శాఖలో 2018వ ఆపరేటర్లను నియమించారు. ఆ తర్వాత 2020 అక్టోబర్లో ధరణిని ప్రవేశపెట్టగా... నాటి నుంచి ధరణి ఆపరేటర్లుగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూభారతిగా మార్చాక కూడా వారే కొనసాగుతున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కార్యకలాపాలు, భూమి ధరల నిర్ణయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సుమారు 17నెలల వేతనం పెండింగ్లో ఉండగా, ఇప్పుడు తొలగించాలన్న ఆదేశాలతో ఆందోళన వ్యక్తమవుతోంది. రిజిస్ట్రేషన్లు లేవని... జిల్లాలో 21 మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల లావాదేవీలు జరుగుతుంటాయి. ఈక్రమాన అతి తక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతున్న తొమ్మిది మండలాల్లోని ఆపరేటర్లను తొలగించాలని, ఈక్రమాన పనితీరును పరిగణనలోకి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఫలితంగా జిల్లా కేంద్రంలోని కోఆర్డినేటర్ కాక, మిగతా 21మందిలో 12మందినే కొనసాగించాల్సి ఉంటుంది. వీరి విధులను ఇటీవల చేరిన జూనియర్ అసిస్టెంట్లకు అప్పగించే అవకాశముందని సమాచారం. కాగా, ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమను తొలగించకుండా అందరినీ కొనసాగించాలని ఆపరేటర్లు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ దివాకర టీ.ఎస్.కు వినతిపత్రం అందజేశారు. -
కృష్ణా ఎక్స్ప్రెస్ ఏసీ బోగీలో మంటలు
మధిర: తిరుపతి నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు ఏసీ బోగీలో సోమవారం మంటలు వ్యాపించాయి. కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు ఎర్రుపాలెం రైల్వేస్టేషన్ దాటగానే బీ4 ఏసీ బోగీలో కంప్రెషన్ బెల్టులు కాలిపోయి పొగ వ్యాపించింది. ప్రయాణికులు గమనించి చైన్ లాగడంతో తొండల గోపవరం రైల్వేస్టేషన్ వద్ద నిలిచిపోయింది. అప్పటికే పొగకు తోడు మంటలు వ్యాపిస్తుండడంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు కిందకు దిగారు. ఏసీ మెకానిక్ వచ్చి మరమ్మతులు చేపట్టి కాలిపోతున్న ఏసీ కంప్రెషర్ బెల్ట్లను తొలగించాక సుమారు 20 నిమిషాల అనంతరం రైలు తిరిగి బయలుదేరింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
వరుణుడి కటాక్షం అంతంతే..
ఖమ్మంవ్యవసాయం: వర్షాలు సమృద్ధిగా కురవాల్సిన జూలైలో వరుణుడు జిల్లాపై కరుణ చూపలేదు. మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది జూలైలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. జూలై సాధారణ వర్షపాతం 240.9 మి.మీ.కు గాను కేవలం 90.7 మి.మీ.లు మాత్రమే నమోదు కాగా.. 62.3 శాతం లోటు ఎదురైంది. గత ఏడాది జూలైలో 281.6 మి.మీ. వర్షపాతంతో సాధారణానికి మించి 16.9 శాతం అధికంగా నమోదైంది. రెండు నెలల్లో 24రోజులే వాన జూన్ నెలలో వర్షాలు ఆశాజనకంగా ఉన్నా, జూలైలో బాగా లోటు వర్షపాతం నమోదైంది. జూన్ సాధారణ వర్షపాతం 131.2 మి.మీ.కు గాను 168.9 మి.మీ.గా.. అంటే 28.7 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. ఇక జూన్ 1నుంచి జూలై 31 వరకు రెండు నెలలు పరిశీలిస్తే జిల్లాలో సాధారణ వర్షపాతం 372.1 మి.మీ.కు గాను కేవలం 259.6 మి.మీ. మాత్రమే నమోదవడంతో 30.2శాతం లోటుగా ఎదురైందని అధికారిక నివేదికలో వెల్లడించారు. జూన్, జూలై నెలల్లో నైరుతి రుతుపవనాల అంతగా ప్రభావం చూపకపోవడంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనానికి స్వల్పంగా రుతుపవనాలు తోడై జల్లులు తప్ప భారీ వర్షాలు కురవడం లేదు. జూన్లో 13 రోజులు, జూలైలో కేవలం 11 రోజులే వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ రికార్డులు చెబుతున్నాయి. ఎర్రుపాలెం, కూసుమంచిలో భారీ లోటు జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉండగా వీటిలో ఎర్రుపాలెం మండలం 70.6 శాతం, కూసుమంచి మండలంలో 59.4 శాతం లోటు వర్షపాతంలో ఉన్నాయి. ఇక కారేపల్లి, రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ఖమ్మం అర్బన్, కొణిజర్ల, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, వైరా, మధిర మండలాలు సైతం లోటు వర్షపాతంలో ఉన్నాయి. మిగిలిన ఎనిమిది మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ఇందులో ఏన్కూరు, కల్లూరు మండలాల్లో మాత్రం సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. సాగు అంతంతే... ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పంటల సాగు చతికిలబడింది. సమృద్ధిగా వర్షాలు కురిస్తే జిల్లాలో 6లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యేవి. జిల్లాలో ప్రధాన పంట అయిన వరిని దాదాపు 3లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఆశించిన వర్షాలు లేక, జలాశయాల్లో నీరు చేరకపోవడంతో వరి సాగు ఊపందుకోలేదు. జూన్లో కురిసిన వర్షాలకు పత్తి, పెసర వంటి పంటలను మాత్రం సాగు చేస్తున్నారు. మండలం సాధారణ నమోదు తేడా వర్షపాతం (శాతం) ఎర్రుపాలెం 362.0 106.4 – 70.6 కూసుమంచి 328.8 133.4 – 59.4 సత్తుపల్లి 439.2 208.8 – 52.5 మధిర 346.1 176.0 – 49.1 వేంసూరు 398.5 209.6 – 47.4 కొణిజర్ల 360.3 192.0 – 46.7 ఖమ్మం అర్బన్ 367.1 212.8 – 42.0 కారేపల్లి 433.9 256.6 – 40.9 తిరుమలాయపాలెం 329.0 195.8 – 40.5 రఘునాథపాలెం 358.3 228.2 – 36.3 మండలం సాధారణ నమోదు తేడా వర్షపాతం (శాతం) పెనుబల్లి 388.9 252.0 – 35.2 వైరా 377.8 256.4 – 32.1 నేలకొండపల్లి 337.4 235.4 – 30.2 ముదిగొండ 337.2 284.6 – 15.6 చింతకాని 355.4 301.2 – 15.3 ఖమ్మం రూరల్ 351.4 299.8 – 14.7 కామేపల్లి 412.8 358.6 – 13.1 తల్లాడ 378.8 351.0 – 7.3 బోనకల్ 337.6 315.8 – 6.5 ఏన్కూరు 421.9 437.4 + 3.7 కల్లూరు 392.0 439.0 + 12.0 -
గ్రీన్ఫీల్డ్ హైవేతో అనుసంధానం
● రైల్వేట్రాక్, జల రవాణాపై కేంద్రానికి ప్రతిపాదనలు ● త్వరలోనే కొత్తగూడెంకు ఎయిర్పోర్ట్ అథారిటీ బృందం ● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుసాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారితో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతోపాటు దక్షిణాది– ఉత్తరాది ప్రాంతాలు అనుసంధానమై, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకలు ప్రారంభమైన సందర్భంగా సోమవారం ఆయన రహదారిపై ప్రయాణించగా, ధంసలాపురం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగ్పూర్ – అమరావతి రోడ్డు అనుసంధాన పనులు, రింగ్ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయని, ఇవి పూర్తయితే ఖమ్మం నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని పేర్కొన్నారు. నూతనంగా భద్రాచలం – ఏటూరునాగారం జాతీయ రహదారి నిర్మాణ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిందన్నారు. అలాగే, విజయవాడ – జగదల్పూర్, ఖమ్మం – అశ్వారావుపేట, జగ్గయ్యపేట – కొత్తగూడెం మార్గాలను నాలుగు లేన్లు మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరించారు. కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం త్వరలోనే పరిశీలనకు వస్తుందని తెలిపారు. భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని మల్కన్గిరి రైల్వేలైన్తో అనుసంధానించే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. అయితే, గోదావరిపై బ్రిడ్జి నిర్మాణానికి ఐదేళ్ల సమయం పట్టనున్నందున, అప్పటివరకు పాండురంగాపురం నుంచి సారపాక వరకు 16 కి.మీ. ట్రాక్ పనులను త్వరగా పూర్తి చేసి రైలు మార్గాన్ని అందుబాటులోకి తేవాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. అంతేకాక బ్రిటీష్ కాలంలో గోదావరి నది ద్వారా జరిగిన సరుకు, కలప, ఖనిజాల రవాణాను పునరుద్ధరించాలని కేంద్రానికి ప్రతిపాదించామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు, సీతమ్మసాగర్ బ్యారేజీల నిర్మాణంతో గోదావరిలో నిరంతరం నీటి లభ్యత ఉంటుందని, తద్వారా జలరవాణాకు అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాధు రమేష్ రెడ్డి, తుపాకుల ఎలగొండ స్వామి, మాజీ కార్పొరేటర్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకలకు అనుమతి
ఖమ్మంఅర్బన్: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై వాహనాల రాకపోకలు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు ఎంట్రీ పాయింట్ వద్ద ఆదివారం నుంచి వాహనాలకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. విద్యుత్ లైట్లు అమర్చే పనులు జరుగుతుండడంతో భారీ వాహనాలు మినహా మిగతా వాహనాలను అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యాన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం హైవేపై కొంతదూరం ప్రయాణించి పరిశీలించారు. కాగా, హైవేపై వాహనాల రాకపోకలను అనుమతించినా, ఎలాంటి అధికారిక ప్రారంభ కార్యక్రమం మాత్రం ఉండదని జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ దివ్య తెలిపారు. ఢిల్లీ నుంచి అనుమతులు వచ్చాక టోల్ఫీజు వసూలు మమొదలవుతుందని వెల్లడించారు. ఇన్నాళ్లు సోమవరం వద్ద... హైవే పనులు కొద్ది నెలల క్రితమే పూర్తయినా ధంసలాపురం వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణం మాత్రం ఆలస్యమైంది. దీంతో వైరా మండలం సోమవరం వద్ద హైవేపైకి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ధ్వంసలాపురం వద్ద బ్రిడ్జితో పాటు ఎగ్జిట్ నిర్మాణ పనులు, ఇతరత్రా అన్ని పూర్తవడంతో తల్లంపాడు ఎంట్రీ పాయింట్ నుంచి అనుమతిస్తున్నారు. ఖమ్మం – దేవరపల్లి హైవే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ నుంచి రాజమండ్రి, విశాఖపట్నం వైపు ప్రయాణించే వారికి దూరం, సమయం తగ్గనున్నాయి.ఖమ్మం – దేవరపల్లి హైవేను పరిశీలించిన మంత్రి తుమ్మల -
సొంతంగా ఊపిరి పీల్చలేను..
సత్తుపల్లిటౌన్: ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉద్యోగ విరమణ చేసి ఏళ్లు గడుస్తున్నా బెనిఫిట్లు అందక అనారోగ్యంతో బాధపడుతున్న వారు అవస్థ ఎదుర్కొంటున్నారు. సత్తుపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎండీ నజీరుద్దీన్ 2022లో ఉద్యోగ విరమణ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 21 శాతం ఫిట్మెంట్తో 2024 మే నుంచి ఉద్యోగులకు పెరిగిన జీతం ఇస్తున్నా రిటైర్డ్ ఉద్యోగులకు అమలు చేయలేదు. ఫలితంగా 2017 పే స్కేల్ ఎరియర్లు రూ.12 లక్షలు, 2021 పే స్కేల్ ఎరియర్స్ రూ.7 లక్షలు కలిపి రూ.19 లక్షలు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆక్సిజన్ కాన్సంట్రేటర్ సాయంతో జీవనం సాగిస్తున్న ఆయన నెలనెలా చికిత్స కోసం రూ.18 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అరకొరగా వచ్చే పింఛన్ సరిపోకపోగా, తార్నాక ఆస్పత్రిలో మందులు లేక ప్రతీ రెండు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాడు. తన జీవితం ముగియకముందే ఆర్టీసీ యాజమాన్యం బకాయిలు విడుదల చేయాలని నజీరుద్దీన్ కోరుతున్నాడు. రిటైర్డ్మెంట్ బెనిఫిట్లు ఇస్తేనే జీవితం -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. పెద్దమ్మతల్లికి విశేష పూజలు పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం కిటకిటలాడగా, క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ విజయ్కుమార్, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆపరేటర్ మృతి
కారేపల్లి: మోటార్ సైకిల్ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి చెందగా మరో యువకుడికి గాయాలయ్యాయి. మండలంలోని ఎర్రబోడు కోయగుంపునకు చెందిన వజ్జ సునీల్ (35) ఖమ్మంలోని ఓ సబ్స్టేషన్లో ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన ఆదివారం తన స్నేహితుడు పాయం సాయితో కలిసి ఎర్రబోడు నుంచి కారేపల్లి వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడడంతో సునీల్ తల బండరాయికి తాకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, సాయికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోపి తెలిపారు. చింతకాని: పని ముగించుకున్న వంట మేసీ్త్రలు ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి కొణిజర్ల గ్రామానికి చెందిన వంట మేసీ్త్రలు జూపెల్లి శ్రీనివాసరావు (58), సిలివేరు రామకృష్ణ ఖమ్మంలోని ఓ శుభకార్యంలో వంట చేసేందుకు ఆదివారం వచ్చారు. పని ముగిశాక తిరిగి వెళ్తుండగా చింతకాని మండలం జగన్నాథపురం వద్ద ఖమ్మం వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా శ్రీనివాసరావు మృతి చెందాడు. రామకృష్ణను కుటుంబీకులు విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలిలో పరిశీలించి కేసు నమోదు చేశారు. -
కొలువు కొట్టాల్సిందే!
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేసన్ ఆధారంగా ఉమ్మడి జిల్లాకు సివిల్, ఏఆర్, అగ్నిమాపక శాఖల్లో కలిపి 621 కానిస్టేబుల్ పోస్టులు కేటాయించారు. జైళ్ల శాఖ, స్పెషల్ పార్టీ, బెటాలియన్లలోనూ పోస్టులు ఉన్నాయి. ఈమేరకు నిరుద్యోగులు ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కసరత్తు మొదలుపెట్టారు. పోలీసు ఉద్యోగాలకు ఎంపికలో ఫిజికల్ టెస్ట్ కీలకం కావడంతో మైదానాలకు బారులుదీరుతున్నారు. క్రీడల్లో ప్రవేశం ఉన్నవారు సొంతంగానే ప్రాక్టీస్ చేస్తుండగా.. ఆ అనుభవం లేని వారు కోచ్ల వద్ద శిక్షణ తీసుకుంటున్నారు. అంతేకాక రాతపరీక్షలోనూ సత్తా చాటేలా కోచింగ్ సెంటర్లలో ప్రవేశాలు పొందుతున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి పోలీసు శాఖ ఉద్యోగ పరీక్షల్లో లాంగ్జంప్, హైజంప్, షాట్ఫుట్, 100, 800 మీటర్ల పరుగులో అత్యధిక మార్కులు సాధించిన వారే క్వాలిఫై అవుతారు. అయితే, రన్నింగ్, లాంగ్జంప్, హైజంప్పై అవగాహన లేకపోతే ఫలితం తారుమారయ్యే ప్రమాదముంది. అందుకే ఆశావహులు ప్రాక్టీస్ ముమ్మరం చేశారు. అయితే, అభ్యర్థులు తగిన జాగ్రత్తలు పాటించాలని.. జాగింగ్ లేదా రన్నింగ్, వ్యాయామం వంటివి ముమ్మరంగా సాధన చేస్తేనే ఈవెంట్లలో ఉత్తీర్ణత సాధించే అవకాశమున్నందున తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రణాళికాయుతంగా ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు.ఏడాదిగా నోటిఫికేషన్ కోసం చూస్తున్నా. ప్రస్తుతం నోటిఫికేషన్ రావడంతో పోలీసు ఉద్యోగం సాధించి అమ్మనాన్న ఆశలు నెరవేర్చేలా శిక్షణ తీసుకుంటున్నా. ఫిజికల్ టెస్ట్లతో పాటు రాత పరీక్షల్లోనూ అర్హత సాధించేలా కసరత్తు మొదలుపెట్టా. – రాజేష్, అభ్యర్థి, ఖమ్మంప్రతీ అభ్యర్థి పరీక్షలో అర్హత సాధించేలా మెళకువలు నేర్పుతున్నాం. తగినన్ని మార్కులు సాధించేలా స్కిల్స్ పెంపొందిస్తున్నాం. పరిమిత సంఖ్యలో నిరుద్యోగులకు శిక్షణ ఇస్తూ అన్ని ఈవెంట్లలో ప్రాక్టీస్ చేయిస్తున్నాం. – కె.తిరుపతి, కోచ్, ఖమ్మంఅభ్యర్థులు శ్యాస సంబంధిత వ్యాయామాలు చేయాలి. తద్వారా పరుగు పందెం, ఇతర విభాగాల్లో మెరుగైన ఫలితం వస్తుంది. లేకపోతే ప్రమాదాలు ఎదురవుతాయి. ప్రమాదం కొనితెచ్చుకోకుండా ప్రణాళికాయుతంగా ప్రాక్టీస్ చేయాలి. – డాక్టర్ వి.గంగరాజు, ఫిజీషియన్, ఖమ్మం -
కల్లూరు ప్రభుత్వ కాలేజీకి కంప్యూటర్ ల్యాబ్
కల్లూరు రూరల్: కల్లూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కంప్యూటర్ ల్యాబ్ మంజూరైంది. త్వరలోనే 25 కంప్యూటర్లు, ఇతర పరికరాలు రానుండడంతో గదులను సిద్ధం చేస్తున్నారు. కళాశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందేలా ల్యాబ్ ఏర్పాటుచేయాలని ప్రిన్సిపాల్ వేముల శేఖర్ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందించగా సానుకూల స్పందన లభించింది. ఈమేరకు ప్రభుత్వంతోపాటుగా దాతలు ముందుకొచ్చారు. ఈనేపథ్యాన త్వరలోనే కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకానుంది. కేయూ దూరవిద్యలో ప్రవేశాల గడువు పొడిగింపు ఖమ్మంసహకారనగర్: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో డిగ్రీ, పీజీ, డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఖమ్మం యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి.గోపి సూచించారు. పూర్తి వివరాలకు అధ్యయన కేంద్రం నంబర్ 80088 11998లో కానీ కేయూ దూరవిద్య కేంద్రం వెబ్సైట్లో కానీ సంప్రదించాలని తెలిపారు. 6న జాబ్మేళా ఖమ్మం సహకారనగర్: ఖమ్మం టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ(అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ఏటీసీ)లో ఈనెల 6వ తేదీన అప్రెసింటిస్ షిప్, ప్లేస్మెంట్ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జి.సక్రు తెలిపారు. ఖమ్మం, హైదరాబాద్కు చెందిన పలు ప్రముఖ పరిశ్రమల బాధ్యులు పాల్గొని అప్రెంటిస్ షిప్, ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఈమేరకు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు అప్రెంటిస్షిప్ అడ్వైజర్ జి.రవి(99896 37594)ని సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు. రేక్ పాయింట్కు 2,520 మె.టన్నుల యూరియా చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్కు ఆదివారం ఎన్ఎఫ్ఎల్ కంపెనీకి చెందిన 2,520 మెట్రిక్ టన్నుల యూరియా, 127.6 అమ్మోనియం సల్ఫేట్ చేరింది. యూరియాను ఖమ్మం జిల్లాకు 1,020 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 600 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 800 మె.టన్నులు సరఫరా చేసినట్లు ఖమ్మం డీఓఏ డి.పుల్లయ్య తెలిపారు. మిగతా 100 మె. టన్నుల యూరియా బఫర్ స్టాక్గా నిల్వ చేశామని వెల్లడించారు. -
తల్లీబిడ్డలకు శ్రీరామరక్ష
● రెండేళ్ల పాటు తల్లి పాలతో శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం ● అపోహలు విడనాడితేనే ఫలితం జిల్లాలో కొనసాగుతున్న తల్లిపాల వారోత్సవాలు ఖమ్మంవైద్యవిభాగం: మాతృత్వం ఒక అందమైన అనుభూతి.. గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చే వరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, బిడ్డ జన్మించాక కూడా బిడ్డ ఆరోగ్యమైన ఎదుగుదల కోసం కూడా అంతే అప్రమత్తంగా వ్యవహరించాలి. తల్లి పాలతో బిడ్డకు అనేక ప్రయోజనాలు ఉన్నందున అందరూ అవగాహన పెంచుకుని క్రమం తప్పకుండా పిల్లలకు తల్లి పాలు ఇస్తే ఇద్దరికీ మేలు జరుగుతుంది. ఈ మేరకు అవగాహన కల్పించేందుకు గాను ఏటా ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో వారోత్సవాల సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ప్రయోజనాలను వివరించడమే లక్ష్యం తల్లిపాలతో కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల ఉద్దేశం. సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా తల్లిపాలు పట్టడం చాలా అవసరం అని వైద్యులు సూచిస్తున్నారు. బిడ్డ పుట్టాక తల్లికి వచ్చే మొదటి పాలను కొలెస్ట్రమ్ అంటారు. ఈ పాలలో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్, కార్పొహైడ్రేట్ల వంటి ఎన్నో పోషకాలు ఉండటంతో పాటు చిన్నారి శరీరానికి కావాల్సిన క్యాలరీలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాక ఈ పాలు బిడ్డకు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ అంశాలన్నింటిపై క్షేత్రస్థాయిలో వివరిస్తున్నారు. పాలే వ్యాక్సిన్ ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే కాక ప్రతీ శిశువుకు జీవిత ప్రారంభం నుంచే ఆరోగ్యకరమైన పోషణ లభించేలా పర్యవేక్షిస్తారు. గర్భిణి బిడ్డకు జన్మనివ్వగానే ఆమెకు వచ్చే ముర్రుపాలు శిశువుకు మొదటి వ్యాక్సిన్ వంటిదని చెబుతారు. పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచిస్తారు. తద్వారా బిడ్డకు సమతుల్య ఆహారం అందడంతో పాటు కాల్షియం నిల్వలు పెరిగి రక్తహీనతను దూరం చేస్తుంది. మనో వికాసం, మెదడు అభివృద్ధి చెందుతుంది. డయేరియా, న్యూమోనియా, కేన్సర్, గుండెజబ్బులు, ఎలర్జీ, ఆస్తమా, డయాబెటిస్ నుంచి రక్షణ కల్పిస్తాయి. అలాగే, పిల్లల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. అయితే, ఉద్యోగాలు, నగర జీవనం, సోషల్ మీడియా ప్రభావం వంటి కారణాలతో చాలామంది తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడంలో వెనుకంజ వేస్తున్నారు. అంతేకాక ఉద్యోగ ఒత్తిడి, సమయాభావం వారిని వేధిస్తున్నాయి. అయితే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తల్లిపాలే బిడ్డకు సంజీవని వంటివని చెబుతున్నారు. బిడ్డకు తల్లి పాలు పట్టించడం ద్వారా బిడ్డకే కాక తల్లికి కూడా ప్రయోజనం చేకూరుతుందని వైద్యులు సూచిస్తున్నారు. శిశువుకు పాలు పట్టించడం ద్వారా తల్లి ఆరోగ్యం మెరుగవుతుందని చెబుతున్నారు. రోజుకు 8–12 సార్లు తల్లిపాలు పట్టించేలా తల్లి పోషకాహారం తీసుకోవటంతో పాటు ఎక్కువ నీరు తాగుతూ తగిన విశ్రాంతి తీసుకోవాలి.బిడ్డకు రెండేళ్లు వచ్చేవరకు తల్లి పాలే తాగించడం ద్వారా ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. శిశువుకు సరిపడా పాలు వచ్చేలా గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పాలు, గుడ్లు, తాజా కూరగాయలు తీసుకోవాలి. ఈ విషయమై వారోత్సవాల్లో అవగాహన కల్పిస్తున్నాం. – అవిలేటి ప్రమీల, జిల్లా సంక్షేమ అధికారి గర్భం దాల్చిన నుంచి మహిళ తనతో పాటు కడుపులోని బిడ్డకు పౌష్టికాహారం అందేలా సరైన ఆహారం తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తే శిశువులకు డబ్బా పాల అవసరమే ఉండదు. అంతేకాక పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా ముర్రుపాలు తాగించాలి. – డాక్టర్ పి.వసుమతీదేవి, గైనకాలజిస్ట్, సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రి -
నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని పరామర్శించిన పువ్వాడఖమ్మం వైరారోడ్: అలవికాని హమీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి తదితర హమీలను అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురానికి చెందిన వేణుకుమార్ను ఖమ్మంలోని ఆస్పత్రిలో ఆది వారం ఆయన పరామర్శించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు తదితరులతో కలిసి వేణును పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. అనంతరం పువ్వాడ మాట్లాడుతూ నిరుద్యోగుల ఆశలను వమ్ము చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. నిరుద్యోగులు అధైర్యపడొద్దని, వారి సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు. రెండేళ్ల అనంతరం కేసీఆర్ నాయకత్వాన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతను ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ గుండాల కృష్ణ, నాయకులు ఉప్పల వెంకటరమణ, బచ్చు విజయ్కుమార్, పగడాల నాగరాజు, వాచేపల్లి లక్ష్మారెడ్డి, అజ్మీరా వీరూనాయక్, బత్తుల మురళి, షేక్ మక్బూల్, అయ్యప్పరెడ్డి, జ్యోతిరెడ్డి, సామినేని హరిప్రసాద్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బోదకాలు.. తీవ్ర అవస్థలు
● జిల్లాలో వెలుగుచూస్తున్న వ్యాధి కేసులు ● ఫైలేరియా రహిత జిల్లాగా గుర్తింపునకు ఇంకా దూరమే ● త్వరలో 14 జిల్లాల జాబితాతో కేంద్ర ప్రభుత్వంప్రకటన ● జిల్లాలో మాత్రం భిన్నమైన పరిస్థితి.. ప్రస్తుతం 3,577 కేసులు ఖమ్మంవైద్యవిభాగం: బోదకాలు రహితంగా జిల్లాను తీర్చిదిద్దాలని వైద్య, ఆరోగ్య శాఖ ఏళ్లుగా చేస్తున్న కృషికి ఫలితం దక్కడం లేదు. ఎక్కడో ఓ చోట కేసులు వెలుగు చూస్తుండడంతో పూర్తిస్థాయిలో నిర్మూలన అసాధ్యంగానే మారుతోంది. ఒకప్పుడు రాష్ట్రాన్ని వణికించిన బోదకాలు (ఫైలేరియా) పలు జిల్లాల్లో పూర్తిస్థాయిలో నిర్మూలన దశకు చేరింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఆరేళ్ల కాలంగా మూడుసార్లు ‘ట్రాన్స్మిషన్ ఎసెస్మెంట్ సర్వే’చేయగా ఒక కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఆయా జిల్లాలను ఫైలేరియా రహితంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. అయితే, ఈ జాబితాలో ఖమ్మం జిల్లాకు చోటు కోసం ఇంకొన్నాళ్లు వేచి ఉండక తప్పని పరిస్థితి ఎదురైంది. జిల్లాలో బిన్నమైన పరిస్థితులు ఫైలేరియా కేసులు పలు జిల్లాల్లో క్రమంగా తగ్గిపోతున్నా, ఖమ్మం జిల్లాలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరుసగా ఆరేళ్లు ఒక్క కేసు నమోదు కాకపోతే ఫైలేరియా రహిత జిల్లాగా ప్రకటిస్తారు. కానీ, జిల్లాలో అడపాదడపా కేసులు వెలుగు చూస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 3,577 మంది ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్నారు. అందులో 1,396 మంది ప్రభుత్వం అందించే రూ.2,016 పింఛన్ తీసుకుంటున్నారు. సహజంగా ఫైలేరియా కేసులను వ్యాధి తీవ్రత ఆధారంగా మూడు గ్రేడ్లుగా విభజిస్తారు. మొదటి గ్రేడ్ బాధితులు జిల్లాలో 905 మంది ఉండగా, వీరికి వ్యాధి తీవ్రత నామమాత్రంగానే ఉంటుంది. దీంతో వీరికి పింఛన్ లభించదు. గ్రేడ్–2లో 1,302, గ్రేడ్–3లో 1,370 మంది ఉండగా.. పింఛన్ అందుతోంది. వీరిలో వృద్ధాప్య, వితంతువు పింఛన్లు తీసుకునే వారు ఉండడంతో 1,396 మంది మాత్రం ఫైలేరియా పింఛన్ పొందుతున్నారు. అందని కిట్లు జిల్లాలో గత రెండున్నరేళ్లలో ఆరు ఫైలేరియా కేసులు నమోదయ్యాయి. వాధి బాధితులకు గతంలో ఎంఎండీపీ ప్రోగ్రామ్ కింద కిట్లు ఇచ్చేవారు. అందులో బకెట్, మగ్గు, టవల్, సబ్బు, క్రీమ్ ఉండేవి. కానీ, చివరిసారి 2023లో 3,500 కిట్లు సరఫరా చేయగా.. ఆ తర్వాత ఊసే లేకపోవడంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు. అవగాహనతోనే నిర్మూలన బోదకాలు(ఫైలేరియా) అనేది పరాన్నజీవి పురుగుల వల్ల వచ్చే వ్యాధి. ఈ వ్యాధి కారక జీవులు కలిగిన క్యూలెక్స్ దోమలు కుట్టడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఇది శరీరంలోని శోషరస వ్యవస్థను దెబ్బతీసి, చేతులు, కాళ్లు, వృషణాలు, ఇతర అవయవాల్లో వాపు కలిగిస్తుంది. తీవ్రమైన నొప్పి, కాళ్లు, చేతులు అసాధారణంగా పెద్దవిగా మారతాయి. తద్వారా కొందరిలో శాశ్వత వైకల్యం, నడవడం, పనిచేయడం కష్టంగా మారడమే కాక తరచూ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఫైలేరియా బారిన పడకుండా ఉండాలంటే దోమల నుంచి రక్షణ కోసం దోమతెరలు, దోమల నివారణ క్రీములు వాడాలి. ఇళ్లలోకి దోమలు ప్రవేశించకుండా కిటికీలు, తలుపులకు మెష్లు అమర్చాలి. అంతేకాక ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. జిల్లాలో ఫైలేరియా నిర్మూలనకు కృషి చేస్తున్నాం. 2024లో నాలుగు కేసులు, 2025లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ట్రాన్స్మిషన్ ఎసెస్మెంట్ సర్వే ద్వారా 3,150 మందికి పరీక్షలు చేయగా ఒక్క కేసూ రాలేదు. ఇలా వరుసగా ఆరేళ్ల పాటు ఒక్క కేసు నమోదు కాకపోతే జిల్లాను ఫైలేరియా రహితంగా ప్రకటిస్తారు. ఇది సాధించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. –వెంకట్లేశ్వర్లు, జిల్లా మలేరియా అధికారి -
సూరపునేని సేవలు చిరస్మరణీయం
ఖమ్మంసహకారనగర్: ప్రైవేట్ పాఠశాలల సంఘం రాష్ట్ర బాధ్యులు సూరపునేని శేషుకుమార్ సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఖమ్మంలో ఆదివారం గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్(ట్రస్మా) ఆధ్వర్యాన శేషుకుమార్ నాలుగో వర్ధంతి నిర్వహించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొని ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించాక మాట్లాడారు. బడ్జెట్ పాఠశాలలకు శేషుకుమార్ అండగా నిలిచారని తెలిపారు. అనంతరం నిర్వహించిన మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఇనుగంటి ప్రసాద్రావు, కాకర్ల బాలప్రసన్న ‘నైపుణ్యాలతో పాఠశాల నిర్వహణ’అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాలల నిర్వహణ, విద్యాబోధనలో తీసుకురావాల్సిన మార్పులను వివరించారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్, అధ్యాపకుడి కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థికంగా సాయం అందించారు. కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర నాయకుడు శివరాత్రి యాదగిరి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుర్రం కాంతారావు, నాయుడు వెంకటేశ్వర్లుతో పాటు నాసరయ్య, సంక్రాంతి రవికుమార్, ఐ.వీ.రమణారావు, కేస వీరన్న, కె.శశిధర్రెడ్డి, శంకరయ్య, ప్రవీణ్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఎరువులన్నీ యాప్ ద్వారానే..
ఖమ్మంవ్యవసాయం: ఎరువుల కొరత, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడంతో పాటు రైతులు క్యూలో నిలబడే ఇబ్బందులను తప్పించేలా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎరువుల కొనుగోళ్లకు డిజిటల్ విధానాన్ని అమలు చేయనుంది. ఇందుకోసం యాప్ను రూపొందించింది. అంతర్జాతీయ పరిణామాలతో ముడి పదార్థాల ధరలు పెరగగగా గత ఏడాది వానాకాలం సీజన్ నుంచి యూరియా కొరత ఏర్పడింది. ఈ ఏడాది డీఏపీ (డై అమ్మోనియం పాస్ఫేట్)కి కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ ఎరువులను కేంద్రం సబ్సిడీపై సరఫరా చేస్తుండడం, ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో ఇబ్బందులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమాన గత యాసంగి సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం యూరియా పంపిణీకి ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ను అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా కేంద్రం యూరియాతో పాటు అన్ని ఎరువులను డిజిటల్ విధానంలో బుకింగ్ చేసుకునేలా చర్యలు చేపట్టింది. భూమి ధ్రువీకరణతో.. ఎరువుల కొనుగోలును సులభం చేసేలా కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’బుకింగ్ యాప్ను తీసుకొస్తోంది. రైతులు స్మార్ట్ ఫోన్లలో ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆపై భూమి విస్తీర్ణాన్ని ధ్రువీకరించుకుని, రైతు ఆధార్ నంబర్ను నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. అది నమోదు చేసి లాగిన్ అయ్యాక ఎరువులను బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 6 నుంచి ఉమ్మడి జిల్లాలో.. కేంద్రం ఎరువుల కొనుగోళ్లకు నూతనంగా అమలు చేస్తున్న డిజిటల్ విధానాన్ని రాష్ట్రంలో దశల వారీగా అమలు చేయనుంది. ప్రయోగాత్మకంగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అమలు చేశారు. ఆపై మొదటి దశలో పది జిల్లాల నుంచి ఎంపిక చేయగా, ఇందులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ నెల 6 నుంచి పది జిల్లాల్లో ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ మొదలవుతుంది. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ వంటి అన్ని రకాల ఎరువులను ఈ యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ విధానంలో ఎరువుల బుకింగ్, కొనుగోలు సులభమవుతుందని ఖమ్మం జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య వెల్లడించారు. రైతులకు సందేహాలు ఉంటే అందుబాటులోని వ్యవసాయాధికారులు, డీలర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. -
బంజారాల అభివృద్ధికి ఐక్యంగా కృషి
ఖమ్మంసహకారగనర్: విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో బంజారాలు మరింత అభివృద్ధి సాధించేలా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కుల పెద్దలు ఐక్యంగా కృషి చేయాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని బంజారాభవన్లో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారాల సమాజం ఐక్యతే బలమని, ఈ విషయాన్ని గుర్తించి కలిసికట్టుగా పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గిరిజనుల సంక్షేమం, విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం టీజీటీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, జీఎల్ఎస్ జేఏసీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్నాయక్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన జీఓ 3ను సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి తీసుకెళ్లి గిరిజనుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. అలాగే, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషషన్ల అమలు, ఖమ్మం బంజారాభవన్ అభివృద్ధికి నిధుల మంజూరు, గిరిజన జనాభా అధికంగా ఉన్న జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో భిక్షపతిరాథోడ్, మాలోత్ రామారావు, భూక్యా వీరభద్రం, బానోత్ కిషన్, ఇస్లావత్ భీముడు, ఇస్లావత్ ప్రతాప్, బాల్సింగ్, మంగీలాల్జాదవ్, పోరిక రాము, సాయినాయక్, సుశీల, దేవ్లానాయక్, నగేశ్, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ -
మెట్ట.. సూపర్హిట్టు!
జిల్లాలో మెట్ట పంటలుగా సాగు చేసే పత్తి, పెసర విస్తీర్ణం అంచనాలను మించింది. ప్రస్తుత వానాకాలం జిల్లాలో అన్ని పంటలు కలిపి 5,53,329 ఎకరాల్లో సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో 2,92,915 ఎకరాల్లో వరి పోగా, మిగిలిన విస్తీర్ణంలో పత్తి, పెసర, మినుము, కంది, వేరుశనగ, చెరకు వంటి పంటలను సాగు చేస్తారని ప్రణాళికలో పొందుపరిచారు. అయితే, ఈ ఏడాది జూన్లో కురిసిన వానలు పత్తి, పెసర సాగుకు అనుకూలించడంతో రైతులు ఆ పంటల వైపే మొగ్గు చూపారు. ఆతర్వాత జూలైలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అడపాదడపా కురుస్తున్న జల్లులు ఈ పంటలకుప్రయోజనం కలిగిస్తున్నాయి. –ఖమ్మంవ్యవసాయం15 వేల ఎకరాలు అదనం జిల్లాలో వరి తర్వాత రెండో ప్రధాన పంటగా పత్తి సాగవుతుంది. ఈ సీజన్లో పత్తి 2,16,229 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే, తొలకరి వర్షాలకే దుక్కులు చేసిన రైతులు అంచనాలకు మించి 2,31,577 ఎకరాల్లో విత్తనాలు నాటారు. ఎక్కువ మంది అధిక సాంద్రత, బోదెల పద్ధతి అవలంబిస్తుండగా.. రఘునాథపాలెం మండలంలో పత్తి అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అంతేకాక చింతకాని, తిరుమలాయపాలెం, బోనకల్, కారేపల్లి, కొణిజర్ల, ముదిగొండ, ఏన్కూరు, మధిర, కామేపల్లి, ఎర్రుపాలెం మండలాల్లో కూడా సాగు విస్తీర్ణం అధికంగానే ఉంది పెసరకు ప్రాధాన్యం సాధారణంగా జిల్లాలో మెట్ట పంటగా పెసర సాగు చేస్తారు. మిరప సాగు చేసే భూముల్లో తొలుత పెసర వేసి కోత తర్వాత మిర్చి సాగు మొదలుపెడతారు. ఈ పద్ధతిని కొందరు రైతులు అనుసరిస్తుండగా, ఇంకొకొందరు రైతులు వర్షాభావ పరిస్థితుల్లో వరి మాగాణుల్లోనూ పెసర వేశారు. వర్షాలు కురిస్తే పైరును పచ్చిరొట్టగా దున్ని వరి నాట్లు వేయాలని భావించారు. లేని పక్షంలో పెసర పంట పండుతుంది. ఈ ఏడాది పెసర సాధారణ సాగు విస్తీర్ణం అంచనా 15,607 ఎకరాలైతే 22,711 ఎకరాల్లో సాగైంది. ప్రస్తుతం పెసర పూత, పిందె దశకు చేరగా.. మరో 20 – 30 రోజుల్లో పంట చేతికందనుంది.అంచనాలకు మించి పత్తి, పెసర సాగు -
ఆహా.. అనేలా ప్రణాళిక !
‘సుడా’ మాస్టర్ప్లాన్ అమల్లో మాత్రం జాప్యం ● నివేదికలు, క్లియరెన్స్ల పేరిట కాలయాపన ● ప్రతిపాదనలకే పరిమితమైన రింగ్ రోడ్డు, బఫర్ జోన్లు ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర రూపురేఖలను మార్చేసి, రాబోయే తరాలకు అద్భుతమైన వసతులు కల్పిస్తామంటూ పాలకులు హంగూఆర్భాటంతో ప్రకటించిన బృహత్ ప్రణాళిక(మాస్టర్ ప్లాన్) అడుగు ముందుకు పడడం లేదు. 2047 నాటి జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ(సుడా), ఖమ్మం నగరపాలక సంస్థ(కేఎంసీ)లు కలిసి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు శ్రీకారం చుట్టాయి. అయితే, ముసాయిదా కాగితాలకే పరిమితమవుతుందే తప్ప ఆచరణలో ముందుకు సాగడం లేదు. భవిష్యత్ అవసరాల కోసం 2021 నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నామని అధికారులు చెబుతుండగా.. కాలం కరిగినంత వేగంగా పనుల్లో కనిపించడం లేదు. ‘సుడా’ పరిధిలో 57,183.43 చదరపు హెక్టార్లు, కేఎంసీ పరిధిలో 9,443.62 చదరపు హెక్టార్ల విస్తీర్ణంతో భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ముసాయిదా ప్రణాళికలను నోటీసు బోర్డులపై ప్రదర్శించాక తదుపరి చర్యలపై పాలకవర్గానికి స్పష్టత కరువైందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారులను కలుపుతూ రింగ్ రోడ్డు నిర్మించాలన్న కీలక ప్రతిపాదన ఆచరణ రూపం దాల్చడం లేదు. ఆరెంపుల, ఎం.వీ.పాలెం, రేగులచెలక, వీ.వీ.పాలెం, బస్సాపురం, గుదిమల్ల, తెల్దారుపల్లి, తల్లాంపాడు తదితర గ్రామాలను కలుపుతూ రింగ్ రోడ్డు నిర్మించాలనే ప్రతిపాదన అమలైతే పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నగరం చుట్టూ హైవేలు పూర్తయితే కొద్దిమేర రింగ్రోడ్ నిర్మిస్తే చాలని తెలిసినా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. బృహత్ ప్రణాళికలో భూముల కేటాయింపులను భారీ స్థాయిలో చూపించారు. నివాస గృహాల కోసం ‘సుడా’ పరిధిలో 16 వేల హెక్టార్లకు పైగా, కేఎంసీ పరిధిలో 5వేల హెక్టార్లకు పైగా కేటాయించారు. అలాగే, పారిశ్రామిక జోన్లు, గ్రోత్ కారిడార్ల కోసం వేల హెక్టార్లను ప్రతిపాదించారు. ప్రభుత్వ సంస్థలు, విద్యా, పరిశోధన, వైద్యారోగ్యం, సామాజిక, సాంస్కృతిక అవసరాలతో పాటు శ్మశానవాటికల కోసం కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ నిధుల కొరత, పాలకుల చిత్తశుద్ధి లేమి కాారణంగా ఇవేవీ ఆచరణకు నోచుకోక కాగితాలకే పరిమితమయ్యాయి. నగరంలో వాగులు, చెరువుల సంరక్షణ కోసం సుడా పరిధిలో 1,916.74 చదరపు హెక్టార్లు, కేఎంసీ పరిధిలో 255.92 చదరపు హెక్టార్లను బఫర్ జోన్లుగా ప్రకటించారు. అంతేకాక పంట కాల్వలు, సర్కారు భూములను కాపాడడానికి సరిహద్దులు గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే, 30 అడుగులు ఉన్న అంతర్గత రహదారులను 40 అడుగులకు, 80 అడుగుల రోడ్లను 100 అడుగులకు విస్తరిస్తామని ప్లాన్లో పేర్కొన్నారు. ఈ ప్లాన్ అమలైతే ఆక్రమణలు వెలుగులోకి రావడంతో పాటు రోడ్ల విస్తరణ జరిగి రాకపోకలకు సాఫీగా సాగుతాయి. మాస్టర్ ప్లాన్ ప్రక్రియ ఆలస్యమవడానికి గల సాంకేతిక, పరిపాలనాపరమైన అంశాలపై అధికార, పాలకవర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఉన్న కొన్ని కాల్వలు, నాలాలు ప్రస్తుతం లేవని, వాటి స్థానంలో రహదారులు నిర్మించగా.. కొంత మేర ఆక్రమణలు జరిగాయని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ కాల్వల ప్రస్తుత పరిస్థితిపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని కోరుతూ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్కి సుడా అధికారులు లేఖ రాసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ కాల్వల్లో నీటి పారకం లేకపోగా.. ఆయకట్టులో పంటలు కూడా లేవు. ఆయా ప్రదేశాల్లో కొన్ని చోట్ల గుడిసెలు వేసి ఆక్రమించినట్లు తెలిసింది. మరికొన్ని చోట్ల మున్సిపల్ పార్కులను ఏర్పాటు చేశారు. అయితే, ‘సుడా’ మాస్టర్ ప్లాన్పై గతంలో ఉన్న కోర్టు కేసులు దాదాపు పరిష్కారమైన నేపథ్యాన అనుకూల వాతావరణంలోనే ప్రక్రియ ముందుకు సాగుతోందని చెబుతున్నా.. ఎప్పటికి అమలవుతుందో మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. మాస్టర్ ప్లాన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించినప్పుడు కాల్వలు, నాలాలు, వాటి స్థానంలో వచ్చిన రోడ్లపై కచ్చితమైన వివరాలు అడుగుతారని భావించి అధికారులు ముందుగా సిద్ధమవుతున్నట్లు తెలిసింది. సరైన నివేదికలు, ఆధారాలు లేకపోతే తిరస్కరించే అవకాశముండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదంతా పూర్తయి, ఇరిగేషన్ సీఈ నివేదిక ఇస్తే 10 రోజుల్లో ప్రభుత్వానికి పంపి తుది అనుమతి తీసుకునేలా కసరత్తు చేస్తున్నారు. ఈ విషయమై ‘సుడా’ ప్రణాళిక విఽభాగం అధికారిని వివరణ కోరగా.. నీటి పారుదల కాల్వలకు సంబంధించి స్పష్టమైన నివేదిక రాగానే మాస్టర్ ప్లాన్ తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. -
ఆపదలో ఉన్న మిత్రుడికి చేయూత
● రూ.2.25 లక్షలు అందించిన పూర్వ విద్యార్థులు నేలకొండపల్లి/ఏన్కూరు: నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంనకు చెందిన తాళ్లూరి గురుబ్రహ్మాచారికి ఆయన మిత్రులు అండగా నిలిచారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకున్న ఆయనతో కలిసి ఏన్కూరు గురుకులంలో చదువుకున్న 1992 బ్యాచ్ మిత్రులు.. రూ.2.25 లక్షలు సేకరించి స్నేహితుల దినోత్సవమైన ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో అర్పినేని కృష్ణ, తిరునగిరి అనిల్, వంగూరి మల్లేశ్, పగిడిపల్లి పుల్లయ్య, చిప్పలపల్లి వెంకన్న, వేల్పుల సురేశ్బాబు, గుడిపూడి కృష్ణయ్య, బండి సతీశ్ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి ● టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు ఖమ్మంసహకారనగర్: విద్యారంగంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకా 20 శాతం మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్కులు, నోటు పుస్తకాలు అందలేదని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇస్తామన్న కిట్, రెండు జతల యూనిఫామ్ ఈ నెల 15 నాటికై నా అందేలా చూడాలన్నారు. అలాగే, మధ్యాహ్న భోజన ఏజెన్సీల వేతనాలు పెంచి కోడిగుడ్లు సరిగ్గా పంపిణీ చేయించాలని కోరారు. అంతేకాక సబ్జెక్టు టీచర్ల కొరత తీర్చేలా సర్దుబాటు చేయాలని, ఖమ్మంలోని కొత్త కాలనీల్లో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు రంజాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు, బానోతు రాందాస్, పినపాక సురేశ్, షేక్ ఉద్దండ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. కిన్నెరసానిలో పర్యాటకుల కోలాహలం పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకుల కోలాహలం నెలకొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. డీర్ పార్కులోని దుప్పులను, డ్యామ్, జలాశయాన్ని వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 679 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా రూ.32,380, సఫారీ వాహనాల ద్వారా రూ.10,250 లభించించినట్లు వైల్డ్లైఫ్ అధికారులు తెలిపారు. 360 మంది బోటింగ్ చేయగా రూ.22,400 ఆదాయం టూరిజం శాఖకు ఆదాయం లభించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. -
గ్రానెట్ లారీని ఢీకొట్టిన ఉల్లిపాయల లారీ
వేంసూరు: మండలంలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై ఎగ్జిట్ పాయింట్ సమీపాన ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి కాకినాడ వైపు వెళ్తున్న గ్రానైట్ లారీని హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఉల్లిపాయల లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఘటనలో ఉల్లిపాయల లారీ క్యాబిన్ నుజ్జునుజ్జవడమే కాక మంటలు చెలరేగా యి. ఘటనలో లారీలోని ప్రేమ్కుమార్, సుకేశ్ శరీరం 50శాతం మేర కాలగా 108లో సత్తుపల్లి ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
శ్రీవారికి నిత్యకల్యాణం, అభిషేకం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామి, అలివేలు మంగమ్మ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ జరిపించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బచ్చోడు తండాలో ఒకరికి డెంగీ తిరుమలాయపాలెం: మండలంలోని బచ్చోడు తండాలో ఓ మహిళ తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా ఇటీవల తిరుమలాయపాలెం సీహెచ్పీలో చికిత్స చేయించారు. మళ్లీ శనివారం సుబ్లేడు ఆస్పత్రిలో ర్యాపిడ్ టెస్టు చేయిస్తే డెంగీ పాజిటివ్గా తేలడంతో పాటు ప్లేట్లెట్ కౌంట్ పడిపోయినట్లు తెలిసింది. దీంతో ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంతేకాక ఇదే గ్రామానికి చెందిన మరో వృద్ధురాలు కూడా జ్వరంతో బాధడుతుండడంతో ఖమ్మం తరలించినట్లు తెలిసింది. గ్రామంలో డెంగీ కేసు నమోదు కావడంతో స్థానికులు ఆందోళన చెందుతుండగా, సుబ్లేడు పీహెచ్సీ ఇన్చార్జ్ మెడికల్ ఆఫీసర్ అర్జున్ గౌతమ్ ఆధ్వర్యాన వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. డెంగీ బారిన పడిన మహిళ ఇంటి చుట్టూ దోమల నివారణకు ఫాగింగ్ చేయడమే కాక స్థానికులకు పారిశుద్ధ్య చర్యలపై అవగాహన కల్పించారు. జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రిలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కుమారి, సిబ్బంది పాల్గొన్నారు. డోర్నకల్ సీఎస్ఐ బిషప్గా సేనంరాజ్ ● ప్రస్తుతం ఖమ్మం సీఎస్ఐ చర్చి చైర్మన్ ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం సీఎస్ఐ చర్చి కాంపౌండ్ చర్చి చైర్మన్ డాక్టర్ కోరా సేనంరాజ్కు డోర్నకల్ డయోసిస్ బిషప్ పదవి వరించింది. తమిళనాడు రాష్ట్రంలోని సీనాడ్లో తాజాగా జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో సేనం రాజ్ను డోర్నకల్ డయోసిస్ బిషప్గా నియమించారు. ఆయన ప్రస్తుతం ఖమ్మం సీఎస్ఐ ఖమ్మం చర్చి చైర్మన్గానే కాక డోర్నకల్ డయోసిస్ కోశాధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు. పలు చర్చిల అభివృద్ధికి కృషి చేసిన సేనంరాజ్ను తెలంగాణ, ఏపీతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని సుమారు 3 వేల చర్చిలకు కేంద్రమైన డోర్నకల్ డయోసిస్ బిషప్ పదవి దక్కడంపై పలువురు మత గరువులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఆదివారం డోర్నకల్ డయాసిస్ బిషప్గా సేనంరాజ్కు అక్కడి సీఎస్ఐ చర్చిలో మత పెద్దల సమక్షాన పట్టాభిషేకం జరగనుంది. దక్షిణ కోస్తా రైల్వే మధిర/ఎర్రుపాలెం: మధిర, ఎర్రుపాలెం రైల్వేస్టేషన్లను దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్మాధూర్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లలో వసతులు, అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కాగా, మధిర స్టేషన్లో మరిన్ని రైళ్లకు హాల్టింగ్ ఇవ్వడమే కాక కోచ్ సూచిక బోర్డుల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం కల్పించాలని బీజేపీ నాయకులు జీఎంను కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బీజేపీ పట్టణ, మండల అధ్యక్షులు శివరాజు సుమంత్, గడ్డం శ్రీహరిచౌదరి, నాయకులు ఏలూరి నాగేశ్వరరావు, చిలువేరు సాంబశివరావు పాల్గొన్నారు. ఇక జమలాపురం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎర్రుపాలెంలో శాతవాహనకు హాల్టింగ్ కల్పించాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులతో పాటు ప్రయాణికులు కోరడంతో జీఎంకు స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, కాంగ్రెస్, బీజేపీ మండల అధ్యక్షులు బొగ్గుల శ్రీనివాసరెడ్డి, అనుమోలు సురేశ్, ఆయా పార్టీల నాయకులు వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, నూతక్కి నర్సింహారావు, దేవరకొండ కోటేశ్వరరావు, ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి హన్మంతరావుతో పాటు కొప్పు రవి, షేక్ మౌలాలి పాల్గొన్నారు. -
42 ఏళ్లుగా కలిసిమెలసి..
దుమ్ముగూడెం: నాలుగు దశాబ్దాలుగా చెక్కుచెదరని స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారు మండల వాసులు ఇద్దరు. ప్రైవేట్ బస్సు కండక్టర్లుగా మొదలైన వారి పరిచయం ప్రభుత్వ ఉద్యోగంలోనూ, ఆ తర్వాత వ్యాపార రంగంలోనూ కొనసాగుతోంది. దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామానికి చెందిన వాకచర్ల గౌరీశంకర్, భద్రాచలానికి చెందిన సారథి రమేశ్ 1984లో నాటి ప్రైవేట్ బస్సులో కండక్టర్లుగా పని చేస్తుండగా మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఆపై 1988లో ఆర్టీసీలో కండక్టర్లుగా ఇద్దరూ ఉద్యోగాలు సాధించారు. గౌరీశంకర్ 1999లో ఉద్యోగాన్ని వదులుకుని వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఇక మిత్రుడి బాటలోనే రమేశ్ సైతం 2002లో ఉద్యోగాన్ని వీడి వ్యాపారంలో ప్రవేశించారు. ఉద్యోగాలు మారినా, వ్యాపారాల్లో బిజీగా ఉన్నా 1984లో మొదలైన వీరి స్నేహం ఇప్పటికీ అంతే బలంగా కొనసాగుతోంది.


