Khammam
-
నిబద్ధత గల కమ్యూనిస్టు ప్రసాద్
ఖమ్మంమయూరిసెంటర్: తుదిశ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండా నీడలో పోరాటం సాగించిన పోటు ప్రసాద్ నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు అని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. ఆదివారం బోనకల్ రోడ్డులోని ఆదిత్య థియేటర్ సమీపంలో సీపీఐ జిల్లా కార్యదర్శి, దివంగత కార్మిక నేత పోటు ప్రసాద్ స్మారక స్తూపాన్ని హేమంతరావు ఆవిష్కరించారు. అంతకు ముందు స్థానిక జెడ్పి సెంటర్ నుంచి స్తూపం వరకు ప్రదర్శన నిర్వహించారు. హేమంతరావు మాట్లాడుతూ పోటు ప్రసాద్ విద్యార్థి దశ నుంచి లౌకిక, వామపక్ష భావజాలంతో పని చేశారన్నారు. ప్రసాద్ తన చివరి కార్యక్రమాన్ని 40వ డివిజన్లో నిర్వహించారని, ఇక్కడి ప్రజలు స్తూపాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. కాగా, స్తూపం వద్ద సీపీఐ పతాకాన్ని రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బీజీ క్లెమెంట్, నాయకులు జానీమియా, పోటు కళావతి, మహ్మద్ సలాం, మేకల శ్రీనివాసరావు, పోటు రాజాసాత్విక్, పగడాల మల్లేశ్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. అసత్య ప్రచారంనమ్మొద్దు.. ఖమ్మంవ్యవసాయం: అయిల్పామ్ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న టీజీ ఆయిల్ ఫెడ్ (తెలంగాణ రాష్ట్ర సహకార నూనె గింజల రైతుల సమాఖ్య)పై పలు ప్రైవేట్ కంపెనీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సంస్థ మేనేజ్మెంట్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. రైతులను ప్రోత్సహించి, నాణ్యమైన మొక్కలు అందించి, తాజా పండ్ల గుత్తులకు మార్కెట్ లింకేజీ కల్పించి, ఆయిల్పాం పంటను విస్తరిస్తున్నామని పేర్కొంది. ఇందుకు వ్యతిరేకంగా కొన్ని ప్రైవేట్ కంపెనీలు అసత్య ప్రచారం చేస్తూ సంస్థ ఖ్యాతిని దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నాయని, దీనిని ఎవరూ నమ్మొద్దని సూచించింది. అగ్ని ప్రమాద మృతులకు సంతాపం ఖమ్మంమయూరిసెంటర్: హైదరాబాద్ పాత నగరంలోని చార్మినార్ గుల్జార్ హౌస్ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం బాధాకరమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అగ్ని ప్రమాదం బాధాకరమని, బాధితులను ఆదుకోవాలని కోరారు. 9 ఇసుక లారీల పట్టివేత ఖమ్మంక్రైం: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 9 ట్రాక్టర్లను ఖమ్మం టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. గంధసిరి నుంచి నగరంలోకి తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్ల్ను రాపర్తివంతెన వద్ద, ఐదు ట్రాక్టర్లను ప్రకాష్నగర్ వంతెన వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి టూటౌన్, త్రీటౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిసింది. పెళ్లికి వినూత్న ఆహ్వానం పాల్వంచ: పట్టణంలోని గోవర్దనగిరికాలనీకి చెందిన ఏనుగు రవీందర్రెడ్డి, జ్యోతి దంపతులు వారి కూతురు గౌతమిని సుజాతనగర్ వేపలగడ్డకు చెందిన తాళ్ల శ్రీనివాస్రెడ్డికి ఇచ్చి ఆదివారం వివాహం చేశారు. అయితే, ఈ పెళ్లిపత్రికను గుడ్డసంచిపై ముద్రించి అందులో కార్డు పెట్టి పంచారు. ‘ప్లాస్టిక్ వాడకాన్ని నివారిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం’ అందులో ప్రింట్ చేయించారు. వివాహం ఆద్యంతం ప్లాస్టిక్ వాడకుండా ఉండటంతో అందరూ అభినందించారు. శ్రీకనకదుర్గమ్మకు విశేష పూజలుపాల్వంచరూరల్: శ్రీకనకదుర్గమ్మ అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేషపూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు. -
సేంద్రియ సాగుపై దృష్టి
జీవాల ఎరువు దుక్కికి బలం ● ఇతర జిల్లాల నుంచి వలసవచ్చి ఎరువు చేర్చి సంపాదిస్తున్న కురములు ● జీవాల ఎరువు కోసం పోటీ పడుతున్న రైతులు ● ఆధిక దిగుబడులు వస్తాయంటున్న అన్నదాతలు బోనకల్: పెరిగిన పెట్టుబడులు.. తగ్గుతున్న దిగుబడులు.. భూసార లోపాన్ని ఆధిగమించేందుకు అన్నదాతలు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారిస్తున్నారు. గతంలో పాడి పశువుల ఎరువును పొలాలకు ఎరువుగా ఉపయోగించుకునేవారు. తగ్గిన పశు సంపద వల్ల రైతులు తమ పొలాలకు ఎరువును వేయలేకపోవడంతో భూసారం తగ్గి దిగుబడులు పడిపోతున్నాయి. దీంతో రైతులు జీవాల ఎరువుపై దృష్టి సారించారు. కొందరు యాదవులకు ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేయడంతో వాటిని పొలాల్లో ఎరువుల కోసం ఉపయోగిస్తున్నారు. దీనికి తోడు మహబూబ్నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో కురుమ, యాదవులు మేత కోసం గొర్రెలను బోనకల్ మండలం తీసుకొచ్చారు. ఉదయం మేతమేపుతూ రాత్రి సమయాల్లో వాటిని ఎరువు కోసం ఉంచుతున్నారు. 2000 జీవాలు ఒక రోజు ఉంచితే ఎకరం పొలానికి ఎరువు సరిపోతుంది. ఇందుకు గాను రైతుకు రూ.1500 నుంచి రూ.2000 ఖర్చవుతుంది. తక్కువ ఖర్చుతో పొలం సారవంతంగా తయారవుతుందని అన్నదాతలు వాటి కోసం పోటీ పడుతున్నారు. పొలంలో గొర్రెలు, మేకల మంద వదిలితే పేడ, మూత్రం, వెంట్రుకల వల్ల భూమికి సేంద్రియ పదార్థం లభిస్తుంది. గొర్రె పేడలో పీచుపదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మెక్కల వేర్లు భూమిలోపలికి సులువుగా వెళ్లి తొందరగా మొక్క ఎదుగుతుందని రైతులు చెబుతున్నారు. వాటి మూత్రం పీహెచ్ 7.7 ఉండడం వల్ల భూమిలో ఉన్న చౌడు కూడా పోయి సారవంతంగా తయారవుతుంది. భూమి గుల్లబారడంతో పాటు ఒక లీటరు మూత్రంలో 3 నుంచి 13 గ్రాముల నత్రజని, 18 నుంచి 20 గ్రాముల పొటాషియం, పాస్పరస్ ఉంటాయి. గొర్రె లేదా మేక ఒక రాత్రికి లీటరు మూత్రం విసర్జిస్తుంది. ఈ ఎరువు వల్ల భూమిలో తేమశాతం నిల్వ ఉండి తడులు తక్కువగా పడతాయి. ఒక్క ఏడాది ఎరువు వస్తే మూడేళ్ల వరకు ఎరువు అవసరం ఉండదని రైతులు అంటున్నారు. -
ఆదివాసీ సమాజంపై రాజకీయ కుట్రలు
ఇల్లెందు: రాజకీయ కుట్రలకు ఆదివాసీ సమాజం బలవుతోందని తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు మైపతి అరుణ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఇల్లెందు జేకే సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాగర్జన సభలో మాట్లాడారు. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చి కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల గొంతు కోసిందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీలు కూడా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తామని చెప్పడంలేదన్నారు. రాజకీయ పార్టీల కుట్రలను ఛేదించేందుకు ఆదివాసీలు అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, పొదెం వీరయ్య, తాటి వెంకటేశ్వర్లు వంటివారు ఒక్కసారి కూడా శాసనసభలో ప్రశ్నించలేదని ఆరోపించారు. ఆధార్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు జేజే రాంబాబు మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించామని, కేసు పెండింగ్లో ఉందని తెలిపారు. అంతకుముందు కొత్త బస్టాండ్ సెంటర్లో కొమరం భీం, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టణంలో ఆదివాసీ వేషధారణలతో కళా ప్రదర్శన నిర్వహించారు. సభలో కళాకారులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఈసం సుధాకర్, నాయకులు కల్తీ సత్యనారాయణ, మెట్ల పాపయ్య, తెల్లం వెంకటేశ్వర్లు, జనార్దన్, పోలెబోయిన వెంకటేశ్వర్లు, చుంచు రామకృష్ణ, పొడియం బాలరాజు, బుగ్గ రామనాధం, జోగ రాంబ్రహ్మం పాల్గొన్నారు.తుడుందెబ్బ నేత మైపతి అరుణ్కుమార్ -
● ప్రకృతి ఒడిలో వేసవి సంబురం
వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పిల్లల ఆనందానికి అవధుల్లేవు. ముఖ్యంగా వలస ఆదివాసీ పిల్లలు ప్రకృతి ఒడిలో ఎంతో సంతోషంగా గడుపుతారు. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, పచ్చని చెట్లు, కొండలు, కోనలు వారి ఆట స్థలాలు. పట్టణాల్లో సెల్ఫోన్లు, టీవీలకు పరిమితమయ్యే పిల్లలకు భిన్నంగా ఆదివాసీ పిల్లలు ప్రకృతితో మమేకమై స్వేచ్ఛగా ఆడుకుంటూ... పాడుకుంటూ తమ సెలవులను ఆనందంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం కరకగూడెం మండలంలోని పద్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని నీలాద్రిపేట వలస ఆదివాసీ గ్రామంలో ఓ చెట్టుకు పాత చీరలను కట్టుకొని ఉయ్యాలా ఊగుతూ ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించారు. ఆ దృష్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – కరకగూడెం -
గిరిజన గురుకులాల్లో సీట్లు భర్తీ
ఇల్లెందు: ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల జూనియర్ బాలుర, బాలికల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన కౌన్సెలింగ్కు విద్యార్థులు బారులుదీరారు. 15, 16 తేదీల్లో నిర్వహించిన కౌన్సెలింగ్లో 737 సీట్లు ఉండగా అన్నీ భర్తీ అయ్యాయి. బాలుర కోసం ఆర్జేసీ, యూఆర్జేసీ దమ్మపేట, ఆర్జేపీ, యూఆర్జేసీ కిన్నెరసాని డ్యామ్ సైట్, ఆర్జేసీ, యూఆర్జేసీ గుండాల, యూఆర్జేపీ సింగరేణి, తిరుమలాయపాలెం, ఆర్జేసీ కృష్ణసాగర్ జూనియర్ కళాశాలు ఉన్నాయి. ఇక బాలికల కోసం ఆర్జేసీ భద్రాచలం, సుదిమళ్ల, అంకంపాలెం, యూఆర్జేసీ భద్రాచలం, సుదిమళ్ల, మణుగూరు, కొత్తగూడెం, వైరా, అన్నపురెడ్డిపల్లి ఉన్నాయి. ఒక్క భద్రాచలం బాలికల గురుకులంలో పీఎస్టీటీ–20 సీట్లు, ఐఎం–20 సీట్లు, సీఎస్–20 సీట్లు, ఏటీ–20 సీట్లు, కిన్నెరసాని డ్యామ్ సైట్లో ఏటీ–20 సీట్లు, ఈటీ–20 సీట్లు తప్ప మిగిలిన అన్నీ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ గ్రూపులు ఉన్నాయి. పెరుగుతున్న విద్యార్థులు.. గతంలో టెన్త్ విద్యార్థుల ఉత్తీర్ణత తక్కువ ఉండటం వల్ల సీట్లు భర్తీ కావటం కష్టంగా ఉండేది. కొంతకాలంగా టెన్త్ ఉత్తీర్ణత పెరిగింది. విద్యార్థులు ఇంటర్లో చేరడం వస్తున్నారు. ఈ దఫా తొలి కౌన్సెలింగ్లోనే 12 గురుకులాలు 18 కళాశాలల్లో చేరికలు పెరిగాయి. సీట్లన్నీ భర్తీ అయ్యాయి ఐటీడీఏ పీఓ ఆదేశానుసారం ఈ నెల 15, 16 తేదీల్లో జరిగిన గురుకుల బాలుర బాలికల జూనియర్ కళాశాలల ప్రవేశానికి పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్లో సీట్లు భర్తీ చేశాం. అన్ని కళాశాలల్లో ఉన్న 737 సీట్లు భర్తీ అయ్యాయి. –బి.అరుణకుమారి, ఆర్సీఓ, భద్రాచలం -
ఆకట్టుకున్న ‘తితిక్ష’
ఖమ్మంగాంధీచౌక్: గంజాయి మత్తులో తూగుతూ రాక్షసుడిగా వ్యవహరిస్తున్న కొడుకును తల్లి హత్య చేసిన ఇతివృత్తంగా రూపొందించిన ‘తితిక్ష’ నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో కాకినాడకు చెందిన బీవీకే క్రియేషన్స్ కళాకారులు ఈ నాటికను ప్రదర్శించారు. ముందుగా హైదరాబాద్ దాశరథి థియేటర్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం సహకారంతో నాన్న ఉత్తరం, నా ఆడపిల్ల లఘు చిత్రాలను ప్రదర్శించారు. ముళ్లపూడి ఈశ్వరి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా నెలనెలా వెన్నెల నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన సభలో నాటిక ప్రదర్శకులకు పారితోషికం అందించారు. ఈ సందర్భంగా దాతలు న్యాయవాది జాబిశెట్టి పాపారావు, కొండపల్లి జగన్మోహన్ రావు, వంగవీటి నవీన్ మాట్లాడుతూ.. రంగస్థల కళాకారులను ప్రోత్సహిస్తూ నెల నెలా వెన్నెల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మంలో ఇలాంటి నాటికలు ప్రదర్శించటం గొప్ప విషయమని కొనియాడారు. కార్యక్రమంలో నెల నెలా వెన్నెల నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, మోటమర్రి జగన్మోహన్ రావు, నాగబత్తిని రవి, వేల్పుల విజేత, వేముల సదానందం, నామా లక్ష్మీనారాయణ, మార్తి కొండల్రావు, నందిగామ కృష్ణ, శానం వీరబాబు, జి.రవీందర్ పాల్గొన్నారు. -
ఫార్మర్ ఐడీలో ఫస్ట్..
ఖమ్మంవ్యవసాయం : ఫార్మర్ ఐడీ(రైతు గుర్తింపు) రిజిస్ట్రేషన్ల నమోదు ప్రక్రియలో జిలా అగ్రగామిగా నిలిచింది. వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేయడమే లక్ష్యంగా రూపొందించిన ఫార్మర్ ఐడీ ప్రాజెక్ట్ ఈనెల 5న ప్రారంభం కాగా, ఇప్పటి వరకు నమోదులో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగం ఉన్న 32 జిల్లాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పథకం నిబంధనల ఆధారంగా జిల్లాలో 3,40,072 మంది రైతులు అర్హులు ఉన్నారు. వీరిలో మే 17 నాటికి 45,450 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే 35,017 మంది రైతులకు ఫార్మర్ ఐడీ జనరేట్ అయింది. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో రెండో స్థానంలో రాజన్న సిరిసిల్ల, మూడో స్థానంలో కరీంగనర్, నాలుగో స్థానంలో కామారెడ్డి, ఐదో స్థానంలో నిజామాబాద్ జిల్లాలు నిలవగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 17వ స్థానానికి పరిమితమైంది. చివరి స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉంది. అవగాహనతోనే వేగవంతం.. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫార్మర్ ఐడీపై రైతులకు అవగాహన కల్పించడంతో ఈ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. కేంద్రం రూపొందించిన పథకాల అమలుకు ఈ ప్రాజెక్ట్ను రూపొందించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, సాయిల్ హెల్త్ కార్డు, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, భారత ఆహార భద్రత మిషన్, రాష్ట్రీయ కృషి వికాస యోజన వంటి పథకాల అమలులో ఈ ఐడీ కార్డు కీలకం కానుంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను పారదర్శకంగా రైతుల దరి చేర్చడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో వానాకాలం పంట సాగు అంశాలను వివరించడంతో పాటు ఫార్మర్ ఐడీతో ప్రయోజనాలు, రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యతను కూడా వివరిస్తుండగా ప్రక్రియ వేగవంతానికి ఇవి దోహదం చేస్తున్నాయి. భూమి, పంటల సాగు వివరాలు నమోదు.. ఫార్మర్ ఐడీ ప్రక్రియలో రైతులకు ఉన్న భూమి వివరాలు సర్వే నంబర్ల వారీగా నమోదవుతాయి. భూమి రకం, ఆయా భూముల్లో సాగు చేసే పంటలను కూడా పొందుపరుస్తారు. డిజిటల్ విధానంలో వ్యవసాయ విస్తరణాధికారులు ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 129 క్లస్టర్లలో ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. రైతు వేదికల్లో నిర్వహించే ఈ ప్రక్రియకు రైతులు తరలివస్తూ ఫార్మర్ ఐడీ కోసం తమ భూములు, పటల సాగు వివరాలు చెబుతూ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అందుబాటులో లేని కొందరు రైతులు మీ సేవా కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు.రైతు గుర్తింపు నమోదులో జిల్లా ముందంజ పది రోజల్లో 45 వేల మంది రిజిస్ట్రేషన్ 35 వేల మందికి గుర్తింపు కార్డులు సిద్ధం జూన్ 5 వరకు పూర్తి స్థాయిలో అర్హుల రిజిస్ట్రేషన్, ఐడీ కార్డుల జారీఫార్మర్ ఐడీకి ఎంతో ప్రాధాన్యం ఫార్మర్ ఐడీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ కార్డు ఆధారంగానే కేంద్ర పథకాలు అందుతాయి. కార్డు లేనివారు ఆ పథకాలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. రైతులు తప్పనిసరిగా నిర్దేశిత గడువు లోగా ఏఈఓలను సంప్రదించి భూములు, పంటల సాగు వివరాలను తెలిపి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
ముందస్తు ‘కోటా’
● ఒకేసారి మూడు నెలల బియ్యం సరఫరా ● పంపిణీకి అధికార యంత్రాంగం సన్నద్ధం ● ఇప్పటికే డీలర్లతో సమావేశం ఖమ్మం సహకారనగర్: పేదలకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తుండగా.. జూన్లో మాత్రం ఒకేసారి మూడు నెలల కోటా అందించనున్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలల బియ్యం ముందుగానే లబ్ధిదారులకు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరు వరకు ప్రతి నెల మాదిరిగానే బియ్యం సరఫరా చేసి.. ప్రజలకు పంపిణీ ప్రారంభించే సమయానికి మిగతా రెండు నెలల బియ్యం నిల్వలు కూడా ఆయా రేషన్ దుకాణాలకు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నెలకు 6,500 మెట్రిక్ టన్నులు.. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 748 రేషన్ దుకాణాలుండగా.. వీటి పరిధిలో 4,10,988 కార్డులు ఉన్నాయి. 11,48,031 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తుండగా 73,75,868 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతున్నాయి. సరాసరిన 90 శాతం వరకు లబ్ధిదారులు తీసుకెళ్తున్న క్రమంలో సుమారు 6,500 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు అవసరం అవుతుండగా.. మూడు నెలలకు సంబంధించి సుమారు 20వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. పంపిణీపై సమాలోచనలు.. ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేయాల్సిన క్రమంలో అధికారులు, డీలర్లు సమాలోచనలు చేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో నెలకు సరిపోయే అన్ని సరుకులు మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉన్న క్రమంలో మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఎలా పంపిణీ చేయాలి.. ఎక్కడ నిల్వ ఉంచాలి.. పంపిణీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే అంశాలపై అధికారులు ఆలోచిస్తున్నారు. గత మూడు రోజుల క్రితం రేషన్ డీలర్లతో నిర్వహించిన సమావేశంలోనూ మూడు నెలల బియ్యం పంపిణీపై అధికారులు పలు సూచనలు చేశారు.సన్నద్ధమవుతున్నాం ఇటీవల రాష్ట్రస్థాయి అధికారులు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సమయంలో మూడు నెలలకు సంబంధించిన బియ్యం రేషన్ లబ్ధిదారులకు ఇవ్వాలనే అంశంపై పలు సూచనలు చేశారు. వారి సూచనల ప్రకారం జిల్లాలో మూడు నెలలకు సంబంధించిన బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు వచ్చిన వెంటనే వాటిని అమలు చేయనున్నాం. – చందన్కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి -
తహసీల్దార్లకు పోస్టింగ్లు
ఖమ్మం సహకారనగర్ : జిల్లాలోని పలువురు తహసీల్దార్లకు ఇటీవల బదిలీలు జరగగా.. వారి స్థానంలో జిల్లాకు కేటాయించిన తహసీల్దార్లకు పోస్టింగ్లు ఇస్తూ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ఆయా స్థానాల్లో వెంటనే బాధ్యతలు స్వీకరించనున్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చిన డి.సైదులును ఖమ్మం అర్బన్ తహసీల్దార్గా, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ వి.రవికుమార్ను కూసుమంచి మండలానికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చిన ఎం.రమాదేవిని బోనకల్ తహసీల్దార్గా, మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చిన ఎస్.శ్వేతను రఘునాథపాలెం మండలానికి, అక్కడి తహసీల్దార్ లూథర్ విల్సన్ను తిరుమలాయపాలెం మండలానికి బదిలీ చేశారు. ఎస్.వి.నారాయణమూర్తిని కల్లూరు ఆర్డీఓ కార్యాలయ డీఏఓగా నియమించారు. హెచ్ఐవీ రహిత జిల్లాగా మార్చాలిడీఎంహెచ్ఓ కళావతిబాయి ఖమ్మంవైద్యవిభాగం : జిల్లాను హెచ్ఐవీ రహితంగా మార్చాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతిబాయి అన్నారు. అంతర్జాతీయ కొవ్వొత్తుల స్మారక దినం సందర్భంగా ఆదివారం రాత్రి స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కళావతిబాయి మాట్లాడుతూ.. హెచ్ఐవీతో జీవిస్తున్న వారి పట్ల ప్రేమ, అనురాగాలు చూపించాలని, వారిని కూడా సమాజంలో అందరిలాగే గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ డాక్టర్లు లక్ష్మణరావు, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్ఖమ్మం సహకారనగర్ : జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో మొత్తం ఏడు ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఖమ్మం, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఆరు కేంద్రాలు ఉండగా.. సత్తుపల్లిలో ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 2 : 30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు కొనసాగగా.. అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. రామయ్యకు సువర్ణ పుష్పార్చనభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారికి ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కిన్నెరసానిలో జలవిహారంపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు కిన్నెరసాని ప్రాజెక్ట్కు తరలివచ్చారు. డ్యామ్పై నుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 560 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.30,820 ఆదాయం లభించింది. 250 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.13,300 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
బాల్య వివాహాల నివారణ అందరి బాధ్యత
ఐసీడీఎస్ సీడీపీఓ దయామణి కారేపల్లి: బాల్యవివాహాలు నివారించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని సీడీపీఓ దయామణి అన్నారు. ఆదివారం కారేపల్లిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బాల్యవివాహాలు సమాజానికి ప్రతిబంధకాలని, ఎన్నో అనర్థాలకు దారితీస్తాయని తెలిపారు. 18 ఏళ్లు నిండని బాలికల్లో శరీర, మానసిక పెరుగుదల, లైంగిక పరిపక్వత సరిగా ఉండదని అన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గ్రామ కార్యదర్శి, ఐసీడీఎస్ సూపవర్వైజర్, తహసీల్దార్, సీడీపీఓ, ఆర్డీఓ, కలెక్టర్లకు బాల్య వివాహాలు నిరోధించే అధికారం ఉందని వివరించారు. బాల్య వివాహం జరుగుతోందని తెలిస్తే 1098కి సమాచారం ఇస్తే హెల్ప్లైన్ సిబ్బంది, కార్యదర్శి, పోలీస్, ఐసీడీఎస్ అధికారులు ఆ ఇంటిని సందర్శించి విచారణ చేపడతారని చెప్పారు. -
మద్యం ధరలకు రెక్కలు
● క్వార్టర్పై రూ. 10, ఫుల్ బాటిల్కు రూ.40 పెంపు ● నేటి నుంచి అమలుకు రంగం సిద్ధంవైరా: మద్యం ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే గత నవంబర్లో బీరు ధరలు పెంచిన సర్కార్.. ఆరు నెలలకే లిక్కర్ ధరలు కూడా పెంచడంతో మద్యం ప్రియుల జేబులకు చిల్లు పెట్టినట్టయింది. పెరిగిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. చీప్ లిక్కర్ నుంచి అన్ని రకా ల మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. క్వార్టర్ (180 ఎంఎల్) సీసాపై రూ.10 పెంచగా, హాఫ్ బాటిల్కు రూ. 20, ఫుల్ బాటిల్పై రూ.40 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ప్రధాన ఆదాయ వనరుల్లో మద్యం కూడా ఒకటి. గతంలో బీర్ల ధర రూ. 20 నుంచి రూ. 40 వరకు పెంచడంతో ఈ ఏడాది గతంలో ఏన్నాడూ లేనంతగా బీర్ల అమ్మకాలు సగానికి పైగా తగ్గాయి. మళ్లీ అన్ని బ్రాండ్ల లిక్కర్ రేట్లు పెంచడంతో అమ్మకాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. నేడు మద్యం డిపోలో బిల్లింగ్ ఆలస్యం.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మద్యం సరఫరా అయ్యే వైరాలోని మద్యం డిపోలో వ్యాపారులు బిల్లింగ్ కోసం వస్తుంటారు. పెరిగిన ధరల జాబితా ఆన్లైన్లో ఆప్డేట్ అయ్యేందుకు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, మధ్యాహ్నం తర్వాత సర్వర్లో మార్పులు చేసి పూర్తి స్థాయిలో ధరల జాబి తాను వ్యాపారులకు అందించే అవకాశం ఉంటుందని డిపో అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో పెంచిన ధరల జాబితా చక్కర్లు కొడుతోంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయంతో మద్యం ప్రియులపై ధరల పిడుగు పడిందని చెప్పొచ్చు. మద్యం ప్రియుల ‘బారు’లు ఖమ్మంక్రైం : పెరిగిన మద్యం ధరలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని పలు వైన్స్, బార్ షాపుల ఎదుట మద్యం ప్రియులు బారులుదీరారు. క్వార్టర్కు రూ.10, హాఫ్ రూ.20, ఫుల్ బాటిల్కు రూ.40 చొప్పున పెరుడుతుండడంతో పలువురు మద్యం కొనుగోలు చేసి నిల్వ పెట్టుకున్నారు. -
నిరీక్షణకు ఇక తెర..
● నేర పరిశోధనలో కీలకంగా ఫోరెన్సిక్.. ● వేగవంతమవుతున్న పోస్ట్మార్టం ● 15 నెలల్లో 1,218 శవ పరీక్షలు ● అందులో 20 శాతం అనాథ శవాలేసకాలంలో నివేదికలు అందజేస్తున్నాం శవ పరీక్షలు ఏరోజుకారోజు నిర్వహిస్తున్నాం. రాత్రి పూట కూడా పోస్టుమార్టం చేస్తున్నాం. పోలీసు కేసుల విచారణకు అవసరమైన రిపోర్టులు సకాలంలో అందజేస్తున్నాం. మార్చురీ వద్దే కార్యాలయం ఏర్పాటు చేసి నిత్యం అందుబాటులో ఉంటున్నాం. సాధ్యమైనంత వరకు ఇక్కడే శవ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అత్యవసరమైన వాటికి హైదరాబాద్కు శాంపిళ్లు పంపిస్తున్నాము. భవిష్యత్లో అన్ని పరీక్షలు ఇక్కడే నిర్వహిస్తాం. – రాథోడ్ వినాయక్, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కొంతకాలంగా శవ పరీక్షలు వేగంగా జరుగుతున్నాయి. ఫోరెన్సిక్ విభాగం అందుబాటులోకి వచ్చాక పోస్టుమార్టం నిర్వహణ, రిపోర్టులు వేగవంతంగా రావడం పోలీసుల నేరపరిశోధనకు ఉపయుక్తంగా మారాయి. సంబంధిత వ్యక్తి ఎలా, ఎప్పుడు మరణించాడనేది తేల్చేందుకు పోస్ట్మార్టం నిర్వహిస్తారు. పోలీసులు పంచనామా నిర్వహించి ఫోరెన్సిక్ వైద్యునికి రిక్వెస్ట్ లెటర్ పెట్టిన తర్వాత శవ పరీక్ష చేస్తారు. ఆ తర్వాత వైద్యుడు ఇచ్చే రిపోర్ట్ను బట్టి పోలీసులు విచారణ చేపడతారు. గతంలో శవ పరీక్షకు చాలా ఇబ్బందులు ఉండేవి. పోలీసులు పంచనామా సిద్ధం చేసి మార్చురీకి వచ్చినా పోస్టుమార్టానికి వైద్యుడు రావడం ఆలస్యమయ్యేది. దీంతో పోలీసులు, మృతుల బంధువులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. అంతేకాక క్రిటికల్ కేసుల్లో మృతికి కారణాలను గుర్తిస్తూ రూపొందించే రిపోర్టులు ఆలస్యంగా వచ్చేవి. కొన్ని వరంగల్, మరికొన్ని హైదరాబాద్ పంపించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా పరిస్ధితి లేదు. కీలకమైన శవ పరీక్షలే హైదరాబాద్లో చేయిస్తున్నారు తప్ప మిగితావి ఖమ్మంలోనే నిర్వహిస్తున్నారు. ఘోషిస్తున్న అనాథ శవాల ఆత్మలు ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మార్చురీలో గత 15 నెలల్లో 1,218 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. 2024లో 995, ఈ మూడు నెలల కాలంలో 223 శవపరీక్షలు జరిగాయి. జిల్లాలో హత్యలు, ఆత్మహత్యలు, రైలు, రోడ్డు ప్రమాదాలు, అనుమానిత మరణాలకు సంబంధించిన బాడీలకు ఇక్కడే పోస్టుమార్టం నిర్వహిస్తారు. అలా వచ్చే మృతదేహాల్లో 20 శాతానికి పైగా అనాథ శవాలే ఉంటున్నాయి. ఎక్కడో పుట్టి, ఎక్కడి నుంచో వచ్చి జిల్లాలో మృతి చెందే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా యాచకులు, పనుల కోసం వచ్చే వారు, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందేవారు, ట్రైన్ నుంచి పడి మృతి చెందే వారు ఎక్కువగా ఉంటున్నారు. వారిని గుర్తు పట్టడం కష్టం అవుతుండగా కొద్ది రోజులు వేచి చూసి పోలీసులు, ఆస్పత్రి అధికారుల నిర్ణయంతో అనాథ శవాలుగా దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఈ శవాల దహనానికి జిల్లాలో ప్రభుత్వ పరంగా ఎలాంటి వ్యవస్థ లేదు. దీంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.శవ పరీక్ష కీలకం.. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి డీఎంఈ పరిధిలోకి వెళ్లిన తర్వాత ఫోరెన్సిక్ విభాగం అందుబాటులోకి వచ్చింది. ఎంబీబీఎస్ విద్యార్థులకు దీనిపై సబ్జెక్ట్ ఉంటుంది. ఫోరెన్సిక్ విభాగంలో ప్రత్యేకంగా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్లను నియమించారు. దీంతో పోస్టుమార్టం నిర్వహణలో ఇబ్బందులు తొలగిపోయాయి. బాధిత కుటంబాలకు సకాలంలో సేవలు అందుతుండగా, పోలీసులకు సైతం రిపోస్టులు సమయానికి వస్తున్నాయి. కాగా నేరపరిశోధనలో పోస్టుమార్టం రిపోర్టు కీలకం. మృతికి దారి తీసిన ఘటనలను నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. సాదారణంగా హత్య, ఆత్మహత్య, హత్యాచారం, ప్రమాదం, అనుమానాస్పద మరణాలు సంభవించినప్పుడు క్రిమినల్ కేసుల పరిష్కారానికి శవ పరీక్షలు కీలకంగా నిలుస్తాయి. గతంలో పోస్ట్మార్టం ప్రక్రియలో తీవ్ర జాప్యం జరగగా ఫోరెన్సిక్ వైద్యుడి రాకతో ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. మార్చురీ వద్ద ఫోరెన్సిక్ విభాగం ఏర్పాటుతో వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటుండగా నిరీక్షణకు తెరపడింది. -
టీచర్ పెళ్లిలో ట్విస్ట్.. నేను ప్రేమిస్తున్నా అంటూ ఉపాధ్యాయుడు..
సాక్షి, పాల్వంచ: వారిద్దరూ టీచర్లుగా పనిచేస్తున్నారు.. ఆమె భర్తకు దూరమైంది. అతడికి భార్య లేదు. దీంతో, రెండు కుటుంబాల పెద్దలు వారిద్దిరికీ పెళ్లి కుదిర్చారు. జీవితంలో రెండో అధ్యాయాన్ని ప్రారంభించాలనుకున్న ఈ జంటకు ఊహించని పరిణామం ఎదురైంది. పెళ్లి వేడుకకు వచ్చిన మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ‘ఆపండి... నేను ఆమెను ఇష్టపడ్డాను.. నేనే పెళ్లి చేసుకుంటాను’ అంటూ గందరగోళం సృష్టించడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ వింత ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. పాల్వంచకు చెందిన 29 ఏళ్ల మహిళ స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఆమెకు వివాహం జరిగింది. ఆమెకు ఓ పాప కూడా ఉంది. అయితే, కొన్నాళ్లకు భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం స్థానిక ప్రైవేటు స్కూల్లో పనిచేస్తోంది. మరోవైపు, ఖమ్మంలో పనిచేస్తున్న 33 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడితో ఆమెకు రెండో వివాహం నిశ్చయించారు. పెళ్లయిన కొన్నాళ్లకే అతని భార్య చనిపోయింది. ఆయనకు కూడా ఇది రెండో వివాహం. ఇరు కుటుంబాల పెద్దలు వీరిద్దరికీ వివాహం జరిపించాలని నిశ్చయించారు. శనివారం సాయంత్రం పాల్వంచలోని ఓ ప్రార్థనా మందిరంలో పెళ్లి వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశారు.కాసేపట్లో పెళ్లి అయిపోతుందన్న సమయంలో మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కసారిగా.. నాకు వధువు అంటే ఇష్టం. ప్రైవేటు స్కూల్లో పనిచేసేటప్పుడు వధువుతో పరిచయం ఏర్పడింది. నాకు పెళ్లయినా పిల్లలు పుట్టలేదు. నా భార్యకు విడాకులిచ్చి ఈమెను పెళ్లాడతా అంటూ రచ్చ చేశాడు. ఈ సందర్భంగా వధువు మాట్లాడుతూ.. అతడు గతంలో బతిమిలాడగా తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకుంటానని చెప్పాను. దాన్ని మనసులో పెట్టుకుని ఇలా చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. అలాగే, ఆమెతో వివాహేతర సంబంధమున్నట్లు వరుడికి సైతం ఒకసారి ఫోన్ చేయడం గమనార్హం. ఈ క్రమంలో అతడిని పట్టుకునేలోపే అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. ఈ రచ్చ కారణంగా వరుడితోపాటు అతడి బంధువులు వెళ్లిపోవడంతో వివాహం ఆగిపోయింది. అనంతరం, యువతి, ఆమె కుటుంబ పోలీసులను ఆశ్రయించారు. అతడితో ఫిర్యాదు చేశారు. -
ఎస్సెస్సీ ప్రతిభావంతులకు నగదు ప్రోత్సాహకాలు
ఖమ్మంగాంధీచౌక్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి ప్రతిభ చాటిన విద్యార్థినీ, విద్యార్థులకు మిత్రా ఫౌండేషన్ ఆధ్వర్యాన రూ.3 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులకు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ బహుమతులు అందజేసి అభినందించారు. మొదటి బహుమతి రూ.25 వేలతో పాటు ల్యాప్టాప్ను పచావ వెన్నెల, మాఘం యశ్వంత్ రూ.25 వేలు, చింతోజు సాయి రూ.15 వేలు అందుకోగా, తిరుమలదాసు మాధురి, రామిశెట్టి ఉమ, ఆవుల శ్రీమన్య, గోడ లక్ష్మి, పుచ్చకాయల భవ్య, చందా భావనకు రూ.10 వేల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించటం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. తొలి ఐదు స్థానాల్లో నిలిచిన ఐదుగురు విద్యార్థులను ఢిల్లీకి విమానంలో మూడు రోజుల యాత్రకు తీసుకెళ్తామని తెలిపారు. మిత్ర ఫౌండేషన్ డైరెక్టర్లు రంగా శ్రీనివాస్, పోలవరపు శ్రీనివాస్, చారుగుండ్ల రవికుమార్, చెరుకూరి యుగంధర్, నాగసాయి నగేశ్, ప్రసేన్, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ బాధ్యులు, వైరా ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు దొడ్డా వరప్రసాద్, కిరణ్కుమార్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మొదటి ఐదుగురికి విమానయానం కూడా.. -
ఉపాధ్యాయుల సర్దుబాటు పారదర్శకంగా చేపట్టాలి
ఖమ్మంసహకారనగర్: రానున్న విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని టీపీటీఎఫ్ నాయకులు కోరారు. ఈ సందర్భంగా శనివారం డీఈఓ సామినేని సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏవీ నాగేశ్వరరావు, వెంగళరావు మాట్లాడుతూ.. గతేడాది ఖాళీగా ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారని, ఆ తర్వాత ఏర్పడిన ఖాళీలను పదోన్నతులు, డీఎస్సీ నియామకాలతో భర్తీ చేశారని తెలిపారు. కానీ నేటికీ కూడా డిప్యూటేషన్పై వెళ్లిన ఉపాధ్యాయులు వారి మాతృస్థానానికి వెళ్లలేదని, తద్వారా ఒకే పాఠశాలలో ఒకే సబ్జెక్టుకు ఇద్దరు ఉపాధ్యాయులు పని చేయాల్సి వస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా ప్రక్రియ చేపట్టాలని కోరారు. -
మధిరకు మాస్టర్ ప్లాన్
● జోన్ల వారీగా కన్సల్టెన్సీతో రూపకల్పన ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కమధిర: మధిర మున్సిపాలిటీ కేంద్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నందున భవిష్యత్ అవసరాల దృష్ట్యా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం మధిర వచ్చిన ఆయన స్థానిక వైఎస్సార్ విగ్రహం నుండి క్యాంపు కార్యాలయం వరకు నడిచి వెళ్తూ ఇరుపక్కలా పరిశీలించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్, అధికారులకు పలు సూచనలు చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలు, గృహ, వాణిజ్య జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతలను అనుభవం కలిగిన కన్సల్టెన్సీకి అప్పగించాలని తెలిపారు. అలాగే, రహదారుల వెంట చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్ నిర్మూలనపైనా దృష్టి సారించాలని తెలిపారు. కాగా, రోడ్లపై అక్రమ కట్టడాలు లేకుండా చూస్తూ, ఫుట్పాత్లు ఏర్పాటు చేయాలని, చిరు వ్యాపారుల కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలని చెప్పారు. అంతేకాక మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణానికి రూ.3.50 కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. అండర్ గ్రౌండ్ కేబుల్ పనులపై ఆరా మధిరలో విద్యుత్ సరఫరా కోసం అండర్ గ్రౌండ్ కేబుల్ వేయనుండగా ప్రతిపాదనలపై క్షేత్రస్థాయిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డితో కలిసి పరిశీలించారు. మధిరలోని ఆత్కూరు క్రాస్ నుంచి నందిగామ బైపాస్ రోడ్డు వరకు, ఆర్ఈ కాంప్లెక్స్ నుండి బస్టాండ్ వరకు భూగర్భంలో కేబుల్ వేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. సుమారు రూ.40 కోట్ల వ్యయంతో 18 కి.మీ. 11 కేవీ కేబుల్, 12 కి.మీ. పరిధిలో ఎల్టీ కేబుల్ వేసేలా సిద్ధం కావాలని తెలిపారు. ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ రంజిత్ రెడ్డి, మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, విద్యుత్ శాఖ డీఈలు శ్రీనివాసరావు, హీరాలాల్, ఏడీఈలు అనురాధ, కిరణ్ చక్రవర్తి, నాగమల్లేశ్వరరావు, ఏఈలు అనిల్ కుమార్, అనూష, మైథిలి, గణేష్ పాల్గొన్నారు. కాగా, విద్యుత్ లైన్ పనులపై చర్చిస్తున్న సమయాన అక్కడ ఉన్న మహిళలను డిప్యూటీ సీఎం పలకరించారు. దీంతో వారు తమది దెందుకూరు అని, ఖమ్మం నుంచి వస్తున్నట్లు చెప్పడంతో ఉచిత బస్సు ప్రయాణంపై ఆరా తీశారు. -
కార్పొరేట్ కళాశాల పిలుస్తోంది..
● ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ● నాలుగు జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి అవకాశం ● 107 సీట్ల కోసం ఈనెల 31 వరకు గడువు ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు ఇంటర్మీడియట్ విద్య కోసం కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జిల్లాలోని శ్రీచైతన్య, కృష్ణవేణి, రెజొనెన్స్, సీవీ రామన్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 107 సీట్లలో ఈ అభ్యర్థులు చేరవచ్చు. రిజర్వేషన్ ప్రాతిపదికన అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. వీరికి అవకాశం.. పదో తరగతిలో 7 జీపీఏ లేదా 400 మార్కులకు పైన సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ఆశ్రమ, ప్రభుత్వ వసతిగృహాలు, ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కేజీబీవీ, నవోదయ, కేంద్రియ విద్యాలయాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే ఈ కళాశాలల్లో చేరేందుకు అర్హులు. దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థినీ విద్యార్థులు తప్పని సరిగా గడిచిన ఏడేళ్ల స్టడీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు, సీబీఎస్ఈ ప్రభుత్వ పాఠశాలలు అంటే కేంద్రియ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల్లో చదివిన విద్యార్థులు వారి ఎస్ఎస్సీ వివరాలు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయంలోని ఈ–పాస్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు ఈ కళాశాలల్లో విద్యను అభ్యసించేందుకు రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లను కేటాయించారు. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ ఉండగా.. అందులో 9 శాతం మాదిగ, అనుబంధ కులాలకు, 5 శాతం మాల అనుబంధ కులాలకు, ఒక శాతం షెడ్యూల్ కులాల్లోని ఇతర కులాలకు కేటాయించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తదితర వాటిల్లో కూడా ఈ రిజర్వేషన్ విధానమే అమలు కానుంది. మొత్తం 107 సీట్లలో ఎస్సీలకు 46 సీట్లు కేటాయించారు. అలాగే మైనార్టీలకు 5, ఎస్టీలకు 26, బీసీలకు 17, బీసీ–సీలకు 8, ఈబీసీలకు 5 కేటాయించారు. మొత్తం సీట్లలో 3 శాతం వరకు అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు కేటాయిస్తారు. రిజర్వేషన్ల మేరకు అభ్యర్థులు లేనిపక్షంలో ఇతర కేటగిరిలోని విద్యార్థులకు ఆ సీట్లు కేటాయిస్తారు. కావాల్సిన పత్రాలు అర్హత కలిగిన అభ్యర్థులు ఆయా ధ్రువీకరణ పత్రాలతో ఈ–పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం పదో తరగతి ధ్రువీకరణ పత్రం, మీసేవ నుంచి పొందిన కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, వసతి గృహ విద్యార్థి అయితే సంక్షేమ అధికారి ధ్రువీకరణపత్రం, ఆధార్కార్డు, బ్యాంక్ పాస్ బుక్, ఫిజికల్లీ చాలెంజ్డ్ పత్రాలు ఉండాలి.అభ్యర్థులు సద్వినియోగం చేసుకోండి.. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఇంటర్మీడియట్లో కార్పొరేట్ కళాశాలల్లో చేరేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ–పాస్ వెబ్సైట్లో ఈ నెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాలి. వివరాలు తెలుసుకునేందుకు ఐడీఓసీలోని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయంలో పనివేళల్లో సంప్రదించవచ్చు. కస్తాల సత్యనారాయణ, ఎస్సీ డీడీ, ఖమ్మం -
విద్యావ్యవస్థ సమర్థవంతంగా కొనసాగాలి
ఖమ్మంసహకారనగర్: విద్యావ్యవస్థను సమర్థవంతంగా కొనసాగేలా అందరూ కృషి చేయాలని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ (సైట్) డైరెక్టర్ విజయలక్ష్మీబాయి సూచించారు. ఖమ్మంలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని శనివారం ఆమె పరిశీలించి మాట్లాడారు. ఎంఈఓలు వారి పరిధి పాఠశాలల్లో బోధన నాణ్యత పెంచేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రతీనెల ఉపాధ్యాయుల సమీక్షలు నిర్వహించి, ప్రణాళికపై సూచనలు చేయాలని తెలిపారు. ఆ తర్వాత బడిబాట, పాఠ్యపుస్తకాల సరఫరా, ఏకరూప దుస్తులు సిద్ధం చేయడంపై సూచనలు చేసిన ఆమె శిక్షణలో ప్రతభ కబబర్చిన ఉపాధ్యాయులను సన్మానించారు. జిల్లా విద్యాశాఖ అధికారి సామినేని సత్యనారాయణ, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, అకడమిక్ మానిటరింగ్ అధికారి రవికుమార్, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ రాజశేఖర్, ఎంఈఓలు పాల్గొన్నారు. కాగా, పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తి చేయడమే కాక విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం సమకూర్చాలని, అన్ని పాఠశాలల్లో తాగునీటి వసతి కల్పించాలని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు సైట్ డైరెక్టర్ విజయలక్ష్మీబాయికి వినతిపత్రం అందజేశారు. ఎస్టీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గండు యాదగిరి, ఎస్కే మన్సూర్, నాయకులు పోతగాని వెంకన్న, పాశం శ్రీనివాస్, రామకృష్ణ, రాజు, పెనుగొండ ఉపేందర్రావు పాల్గొన్నారు. సైట్ డైరెక్టర్ విజయలక్ష్మీబాయి -
జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి తెలంగాణ, ఏపీ నుంచి భారీగా హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ చేశారు. పెళ్లిళ్ల సీజన్కు తోడు పాఠశాలలకు సెలవులు కావడంతో స్వామి దర్శనానికి భక్తులు బారులుదీరారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్శర్మ, మురళీమోహన్శర్మ, సిబ్బంది పాల్గొన్నారు. పశువుల అక్రమ రవాణాపై సమాచారం ఇవ్వండి ఖమ్మంక్రైం: పశువుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ సూచించారు. అంతేతప్ప సంస్థల బాధ్యులు చట్టాన్ని అతిక్రమించి వాహనాలను అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. పశువుల రవాణా విషయంలో వివాదాలు తలెత్తకుండా ఇప్పటికే ఏడు చెక్ పోస్టులు ఏర్పాటుచేశామని వెల్లడించారు. చట్టవిరుద్ధంగా ఆవులు, దూడలను రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పండుగ జరుపుకునేలా అవసరమైన చోట్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ వివరించారు. వర్షాలు వచ్చేలోగా మరమ్మతులు పూర్తి కూసుమంచి: పాలేరులోని మినీ హైడల్ ప్రాజెక్టు(జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం)లో మరమ్మతులను వర్షాలు మొదలయ్యేలోగా పూర్తిచేయాలని జెన్కో నాగార్జునసాగర్ ప్రాజెక్టు సీఈ(ఓఅండ్ఎం) మంగేష్ కుమార్ ఆదేశించారు. ప్రాజెక్టు పనులను శనివారం పరిశీలించిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశారు. షెడ్యూల్డ్ ప్రకారం పనులు చేపట్టి వర్షాలు మొదలుకాగానే విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ప్రాజెక్టుకు నీటిని సరఫరా చేసే కాలువ కట్ట కొట్టుకుపోయిన చోట మరమ్మతులను కూడా సీఈ పరిశీలించారు. ప్రజలకు సౌకర్యంగా వీధివ్యాపారుల ప్రాంగణం ఖమ్మంమయూరిసెంటర్: మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా ప్రజలకు అసౌకర్యం లేకుండా వీధి వ్యాపారుల ప్రాంగణాన్ని తీర్చిదిద్దలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. ఖమ్మం పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణాన్ని శనివారం తనిఖీ చేసిన ఆయన వ్యాపారులతో మాట్లాడారు. మార్చి 12న కలెక్టర్ తనిఖీ చేసినప్పుడు వెల్లడైన సమస్యల పరిష్కారంపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సూచనలు చేశారు. ఇందులో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు, నిర్మిస్తున్న షెడ్లను పరిశీలించి నాణ్యత ప్రమాణాల ప్రకారం గడువులోగాపనులు పూర్తిచేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, అధికారులు ఉన్నారు. -
ఊరంతా.. ఖాతా!
నీటి కుంట.. పంటకు లాభమంట ఫాంపాండ్ల తవ్వకంతో లాభాలు ఉన్నందున తవ్వకంపై రైతుల ఆసక్తి మేరకు వివిధ శాఖల అధికారులు ప్రోత్సహిస్తున్నారు.వాతావరణ ం జిల్లాలో ఆదివారం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి. సాయంత్రం తర్వాత కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశముంది.ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 20258లోసంపాదించిన సొమ్మంతా ఎప్పటికప్పుడు ఖర్చు చేస్తే ఆపద, అవసరాలకు ఇతరుల వద్ద చేయి చాచాల్సి వస్తుంది. ఒకవేళ ప్రైవేట్ సంస్థల్లో చీటీలు వేయాలన్నా, పొదుపు చేయాలన్నా భయం వెంటాడుతుంటుంది. అందుకే పోస్టాఫీస్, బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు, డిపాజిట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, ప్రజలకు సరైన అవగాహన లేక పోస్టాఫీసు సేవలను సద్వినియోగం చేసుకోవడం లేదు. కానీ ముదిగొండ మండలంలోని వల్లభి గ్రామస్తులు మాత్రం అందుకు భిన్నంగా ముందుకు సాగుతూ పొదుపులో మేటిగా నిలుస్తుండడం విశేషం. – ముదిగొండలెక్కకు మిక్కిలిగా.. వల్లభి పోస్టాఫీస్లో రికరింగ్ డిపాజిట్లు(ఆర్డీ) 1,420 ఉన్నాయి. అలాగే, నిర్ణీత కాల పరిమితితో టైమ్ డిపాజిట్లు(టీడీ) 275, ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు ఖాతాలు(ఐపీపీబీ) వెయ్యి కొనసాగుతున్నాయి. ఇంకా జనరల్ పాలసీలు(జీఏపీ) 650, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్(పీఎల్ఐ) 25, గ్రామీణ తపాల బీమా(ఆర్పీఎల్ఐ) 700, సుకన్య సమృద్ధి యోజన 250తో పాటు ఎస్బీలు 300 ఉండడం విశేషం.వల్లభి గ్రామ వాసులు 90శాతం మందికి చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు ఉన్నాయి. పైసాపైసా కూడబెట్టుకున్న డబ్బును గ్రామ పోస్టాఫీస్లో వివిధ పథకాల ద్వారా పొదుపు చేస్తూ అవసరాలకు వాడుకుంటున్నారు. క్రమం తప్పకుండా ఖాతాదారులు చిన్న మొత్తాలు జమ వేసుకుంటుండగా.. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుండడంతో ఒకరిని చూసి ఇంకొకరు అన్నట్లుగా ఖాతాదారులు పెరిగారు. వల్లభిలోని పోస్టాఫీస్లో ప్రతీనెలా రూ.100 మొదలు రూ.2వేలు, రూ.5వేలు వరకు జమ చేస్తున్న వారు ఉన్నారు. పింఛన్దారులు, వ్యవసాయదారులు, ఉద్యోగులు, పేద, మధ్య తరగతి ప్రజలు ఇలా అన్ని వర్గాల వారు పొదుపు ఖాతాల్లో నగదు జమ చేసుకుంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక స్థోమత పెంచుకోవడమే లక్ష్యంగా కష్టార్జితంగా సంపాదించిన సొమ్ములో కొంత మేర పొదుపు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏడు వేల జనాభా గ్రామంలో 7వేల జనాభా ఉండగా 1,500 గృహాలు, ఓటర్లు దాదాపు 4,700మంది ఉంటారు. జనాభాలో 90శాతం మందికి పోస్టాపీస్లో ఖాతాలు ఉండడం విశేషం. జిల్లాలోనే అత్యధిక ఖాతాలు కలిగిన పోస్టాఫీస్గా వల్లభి నిలుస్తోంది. ఇక ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు సేవలను వెయ్యి మంది సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో పాటు టైమ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్(ఆర్డీ) ఖాతాదారులు ఉండగా.. తపాలా శాఖ ద్వారా వివిధ రకాల బీమా కూడా చేయించుకుంటున్నారు. పోస్టల్ ఉద్యోగులు ఖాతాదారులను ప్రోత్సహిస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త పథకాలపై అవగాహన కల్పిస్తుండడంతో కొత్త ఖాతాలు పెరుగుతున్నాయి. బ్యాంకులతో పోలిస్తే నగదు జమ, విత్డ్రా సులువుగా ఉండడం, దూరం వెళ్లకుండా గ్రామంలోనే సేవలు అందుబాటులో ఉండడంతో జనం ఆసక్తి కనబరుస్తున్నారు.పొదుపుపై ఆసక్తి... గ్రామంలో ఒకరిని చూసి ఒకరు పొదుపునకు ముందుకొస్తున్నారు. దాదాపు అందరూ ఏదో ఖాతా తెరిచి డబ్బు జమ చేసుకుంటున్నారు. గ్రామస్తులకు పోస్టల్ పథకాలపై అవగాహన కల్పిస్తుండడంతో ఆసక్తి కనబరుస్తున్నారు. – ఎస్.కే.జరీనా, బ్రాంచ్ పోస్ట్మాస్టర్నలుగురం పొదుపు చేస్తాం.. మా కుటుంబంలో నలుగురి పేరిట ఆర్డీలు కడుతున్నాం. చాలా కాలం నుంచి పొదుపు అలవాటుగా మారింది. అత్యవసర పరిస్థితిలో వాడుకుంటూ.. మళ్లీ డబ్బు ఉన్నప్పుడు జమ చేస్తాం. పొదుపుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. – చేకూరి రామారావునెలకు రూ.2వేల జమ పోస్టాఫీస్లో ప్రతీనెల రూ.2వేలు జమ చేస్తా. పిల్లల భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతా తెరిచాను. పిల్లలు పెద్దయ్యే లోగా వారి చదువు, ఇతర ఖర్చులకు ఉపయోగపడతాయనే నమ్మకంఉంది. – సూరపల్లి ఎల్లమ్మపదేళ్ల నుంచి దాచుకుంటున్నా.. ప్రతీనెల ఆర్డీ కడుతున్నా. పింఛన్ సొమ్ములో కొంత మొత్తం పోస్టాఫీలో జమ చేస్తున్నా. ఎప్పుడు అవసరం వచ్చినా తీసుకోవడం పోస్టాఫీస్లోనైతేనే వీలుగా ఉంటుంది. అన్ని అవసరాలకు డబ్బే ప్రధానమని పదేళ్లు నుంచి జమ చేసుకుంటున్నా. – ఎనిక భద్రమ్మన్యూస్రీల్ పోస్టల్ అకౌంట్లలో వల్లభి ముందంజ పొదుపు బాటలో 90శాతం గ్రామస్తులు అత్యధిక ఖాతాలతో జిల్లాలో అగ్రస్థానం -
పక్కాగా లెక్క తేల్చేలా...
● పైలట్ ప్రాజెక్టుగా ములుగుమాడులో భూముల రీసర్వే ● గ్రామంలోని 103 సర్వే నంబర్లు, 845 ఎకరాల్లో సర్వేకు నిర్ణయం ● రేపటి నుంచి ఆరంభించనున్న సర్వేయర్లుఎర్రుపాలెం: కొన్ని గ్రామాల్లో లెక్కాపత్రం లేకుండా ఉన్న భూముల వివరాలను సర్వేనంబర్ల ఆధారంగా తేల్చాలని ప్రభుత్వం నిర్ణయింది. ఇందులో పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఐదు జిల్లాలను ఎంపిక చేసింది. జిల్లాల్లోని ఒక్కో గ్రామంలో భూములకు సంబంధించి లెక్కల నిర్ధారణకు సర్వే చేయనున్నారు. ఈక్రమాన జిల్లాలోని ఎర్రుపాలెం మండలం ములుగుమాడు కూడా ఎంపికైంది. ఈమేరకు ఉత్తర్వులు అందడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే గ్రామానికి తూర్పున కట్లేరు, ఉత్తరాన ఇనగాలి, పడమర దిక్కున మధిర మండలం మాటూరు, దక్షిణాన సఖినవీడు రెవెన్యూ గ్రామాలను సరిహద్దులుగా గుర్తించారు. ఇప్పుడు ఎందుకు.. గత ప్రభుత్వం అమలుచేసిన ధరణి చట్టం ద్వారా భూసమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రస్తుత ప్రభుత్వం భూభారతి పోర్టల్ను తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్లు కావాల్సి ఉంది. దీంతో పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఐదు గ్రామాల్లో సర్వేకు శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం ఎంపిౖకైన ములుగుమాడులో 845ఎకరాల భూమి, 103 సర్వే నంబర్లు ఉన్నాయి. బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించిన నేపథ్యాన సర్వేయర్లు సోమవారం నుంచి రీ సర్వే చేయనున్నారు. అన్ని రకాల భూములను సర్వే చేసి ప్రతీ కమతానికి నంబర్ కేటాయిస్తారు. అనంతరం పహాణీల్లో నంబర్లు, విస్తీర్ణంతో సరిపోల్చాక కలెక్టర్కు, అక్కడి నుంచి ప్రభుత్వానికి నివేదిస్తారు. కాగా, డ్రోన్లు, అత్యాధునిక పరికరాలతో సర్వే ద్వారా భూముల వివరాలు కచ్చితంగా నిర్ధారణ జరుగుతుందని భావిస్తున్నారు.క్షేత్రస్థాయిలో సర్వే భూముల రీ సర్వేకు పైలట్ ప్రాజెక్టుగా ములుగుమాడు ఎంపికై ంది. సోమవారం నుండి గ్రామంలో భూముల సర్వే మొదలుకానుంది. క్షేత్రస్థాయిసర్వే ద్వారా ఏమైనా సరిహద్దు సమస్యలు ఉంటే తెలుస్తాయి. ఆపై భూముల చిత్రపటం రూపొందిస్తారు. – ఎం.ఉషాశారద, తహసీల్దార్ -
ఇప్పుడైతేనే పని సులువు
● రోడ్ల మరమ్మతులపై దృష్టి సారిస్తే మేలు ● జిల్లాలో గ్రామీణ లింక్రోడ్ల పనులపై అనిశ్చితి ● బిల్లుల పెండింగ్తో పనులకు కాంట్రాక్టర్ల నిర్లిప్తత ఖమ్మంఅర్బన్: వర్షాకాలం సమీపిస్తోంది. వర్షాలు జోరందుకుంటే రహదారుల మరమ్మతు పనులు చేపట్టడం సాధ్యం కాదు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నెలారంభం నుంచే మరమ్మతులు చేయించాల్సి ఉన్నా అధికారుల వైపు నుంచి చొరవ కానరవడం లేదు. జిల్లావ్యాప్తంగా అనేక చోట్ల గ్రామీణ లింక్ రోడ్లుగా ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రహదారులపై గుంతలు తేలగా.. చెట్టుకొమ్మలు రహదారిపైకి పెరగడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు ప్రమాదకరంగా మారాయి. వీటి స్థానంలో కొత్త రోడ్లు వేయకున్నా, ఉన్న రోడ్లనైనా మరమ్మతు చేయాలని కోరుతున్నారు. ప్రతిపాదనలైతే సిద్ధం ప్రతీ ఏడాది వర్షాకాలానికి ముందు రహదారులపై గుంతలు పూడ్చడం, రోడ్లకిరువైపులా మట్టి చదును చేయడం, చెట్ల కొమ్మలు తొలగించడం వంటి పనులను వార్షిక నిర్వహణలో భాగంగా చేపట్టాల్సి ఉంటుంది. కానీ రెండేళ్లుగా ఆర్అండ్బీలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు సుమారు రూ.20 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉండగా, వారు ఈసారి పనులపై ఆసక్తి చూపడం లేదని సమాచారం. అయినప్పటికీ ఆర్అండ్బీ అధికారులు మాత్రం వార్షిక నిర్వహణ పనుల కోసం టెండర్లకు అంచనాలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని ఆర్అండ్బీ శాఖ పరిధిలో సుమారు 1,200 కి.మీ. మేర రహదారులు ఉండగా, కిలోమీటర్కు సగటున రూ.20లక్షల చొప్పున రూ.20 కోట్లతో అంచనాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. కానీ గతంలో పని చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ ఏడాది పనులపై స్పష్టత రావడం లేదు. పీఆర్ రోడ్ల పరిస్థితీ అదే వర్షాకాలానికి ముందు రహదారి పనులు పూర్తిచేస్తే బాగుండని వాహనదారులు భావిస్తున్నారు. జిల్లాలో ఆర్అండ్బీ పరిధిలోని రహదారులే కాక పంచాయతీ రాజ్ రహదారులు సైతం దెబ్బతిన్నాయి. రహదారి పై కనిపించేది చిన్న గుంతలే అయినా అవి ప్రమాదా లకు కారణమవుతున్నాయి. దెబ్బతిన్న రోడ్లకు తోడు రహదారులపైకి చొచ్చుకొచ్చిన కంపచెట్లు, రోడ్డు అంచుల వెంట మట్టి దిగపడడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యాన త్వరగా స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.తుపాన్తో దెబ్బతిన్నవి.. గత ఏడాది తుపాన్ కారణంగా అనేక చోట్ల రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు అవసరమైన నిధులతో అంచనాలు పంపినా విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. మళ్లీ వర్షాకాలం వస్తున్నందున మరమ్మతులు చేయకపోతే వరదలతో ఉన్న కొద్దిపాటి రోడ్లు కూడా దెబ్బతింటే అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే ప్రమాదముంది. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు పరిగణనలోకి తీసుకుని రోడ్లు, వంతెనల మరమ్మతులకు తక్షణమే నిధులు కేటాయించాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి. -
పోడు భూములిక పచ్చగా..
గిరిజన రైతుల కోసం ‘ఇందిర గిరి జల వికాసం’ ● రాష్ట్రంలోనే భద్రాచలం ఐటీడీఏకు ఎక్కువగా.. ● ఐదేళ్లలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 27,488 ఎకరాలు లక్ష్యం ● పైలట్ ప్రాజెక్ట్గా చండ్రుగొండ మండలం ఎంపిక భద్రాచలం: గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను సారవంతం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. పోడు భూములకు విద్యుత్ సరఫరా లేక, అటవీ శాఖ అనుమతులు రాక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న గిరిజనులకు ‘సౌర నీరు’ అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. రాష్ట్రంలో పట్టాలు కలిగిన పోడు భూముల హక్కుదారులకు ‘ఇందిర గిరి జల వికాసం’ పేరిట కొత్త పథకాన్ని చేపట్టగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం నాగర్ కర్నూల్ జిల్లాలో అధికారికంగా ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని చండ్రుగొండ మండలంలోని పలు గ్రామాలను ఎంపిక చేశారు. అయితే రాష్ట్రం మొత్తం మీద ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉన్న భద్రాచలం ఐటీడీఏకే అత్యధిక నిధులు కేటాయించడంతో జిల్లాలోని అనేక మంది గిరిజనులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. పోడు భూములు సాగులోకి తెచ్చేందుకే.. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో అనేక ఏళ్లుగా పోడు భూముల ఆధారంగానే ఎంతోమంది గిరిజనులు జీవిస్తున్నారు. వీరికి దివంగత నేత వైఎస్సార్ హయాంలో హక్కు పత్రాలు అందజేశారు. ఆ తర్వాత కూడా కొంతమందికి హక్కు పత్రాలు అందాయి. అయితే ఈ భూములకు సాగు నీరు లేక గిరిజన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఉచిత విద్యుత్ అందజేయాలంటే ఆర్థిక భారంతో పాటు అటవీ శాఖ క్లియరెన్స్ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం సోలార్ విద్యుత్ ద్వారా పంప్సెట్లను అందించాలని నిర్ణయించింది. తద్వారా వచ్చే ఐదేళ్లలో పోడు సాగుదారులందరికీ సోలార్ పంప్ సెట్లకు రూ.6 లక్షల చొప్పున నిధులు విడుదల చేయనుంది. పథకం అమలు ఇలా.. ఈ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించింది. రెండున్నర ఎకరాల పొలం ఉన్న రైతును సింగిల్ యూనిట్గా గుర్తించింది. అంతకంటే తక్కువగా ఉన్న రైతులను గ్రూప్గా ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఈనెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించి రైతులను గుర్తించాలి. జిల్లా స్థాయిలో ఈనెల 30 నాటికి సర్వే, ఇతర పనుల టెండర్లు ఖరారు చేసి, జూన్ 25 నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో పనులు ప్రారంభించేలా షెడ్యూల్ ప్రకటించారు. జూన్ 26 నుంచి మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోరు బావుల తవ్వకం, సోలార్ పంపుసెట్ల ఏర్పాటు, ఇతర పనులు పూర్తి చేయాలి. జిల్లా స్థాయిలో పథకం అమలుకు కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. భద్రాచలం ఐటీడీఏకు భారీగా.. రాష్ట్రంలో 2025–26 నుంచి 2029–30 వరకు ఆరు లక్షల ఎకరాలను జల వికాసం పథకంలోకి తీసుకురానున్నారు. అందులో జిల్లాలోనే అత్యధికంగా 1.96 లక్షల ఎకరాల భూమి సాగులోకి తెచ్చేలా ప్రణాళిక రూపొందించడం విశేషం. కాగా, ఈ పథకానికి భద్రాచలం ఐటీడీఏ పరిఽధిలోని చండ్రుగొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇప్పటికే బెండాలపాడు, రాయికంపాడు తదితర గ్రామాల్లో సోలార్ పంప్సెట్లు అమర్చి ట్రయల్ రన్ నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ఈ పథకం ప్రారంభమయ్యాక జిల్లాలో మొదలు పెట్టనున్నారు.గిరిజన పోడు రైతులకు పూర్తి సబ్సిడీ పోడు హక్కు పత్రాలున్న భూముల్లో సాగు చేస్తున్న గిరిజన రైతులకు పూర్తి సబ్సిడీతో ఈ పథకం అమలు జరగనుంది. ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలు ప్రకటించింది. ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్టుగా చండ్రుగొండ మండలంలో ట్రయల్ రన్ నిర్వహించాం. – డేవిడ్ రాజ్, ఐటీడీఏ ఏపీఓ జనరల్ రానున్న ఐదేళ్లలో జిల్లాకు కేటాయింపులు ఇలా.. సంవత్సరం రైతులు పోడు ఎకరాలు 2025 – 26 550 1,516 2026 – 27 2,809 6,483 2027 – 28 2,809 6,483 2028 – 29 2,809 6,483 2029 – 30 2,809 6,483మొత్తం 11,786 27,448 -
మత్స్యకారులకు ముగిసిన శిక్షణ
కూసుమంచి: పాలేరులోని పీవీ నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో పది జిల్లాల మత్స్యకారులకు ఇస్తున్న మూడు రోజుల శిక్షణ శనివారం ముగిసింది. ‘జలాశయాల్లో మత్స్య అభివృద్ధి – యాజమాన్య పద్ధతులు’ అనే అంశంపై ఇచ్చిన శిక్షణకు ఖమ్మం, నిజామాబాద్, హనుమకొండ, సూర్యాపేట, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, నాగర్కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సిరిసిల్ల జిల్లాల మత్స్యకారులు పాల్గొన్నారు. కాగా, ముగింపు సమావేశంలో సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి బి.నాగులునాయక్ మాట్లాడుతూ.. శిక్షణను మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని మత్స్య అభివృద్ధి సాధించాలని, తద్వారా రాష్ట్రాన్ని ఆక్వా హబ్గా మార్చాలని సూచించారు. చేపల పెంపకంతో పాటు మార్కెటింగ్ కూడా కీలకమైనందున మెళకువలు నేర్చుకోవాలని పేర్కొన్నారు. మత్స్యపరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్తో పాటు శాస్త్రవేత్తలు శాంతన్న, రవీందర్, నాగరాజు మాట్లాడగా శిక్షణలో పాల్గొన్న వారికి నైపుణ్య సర్టిఫికెట్లు అందజేశారు. కాంటాల జాప్యంపై రైతు ఆగ్రహం నేలకొండపల్లి: ధాన్యం కాంటాల్లో జాప్యం జరుగుతుండడంతో ఓ రైతు రోడ్డుపై ధాన్యం పోసి నిప్పంటించేందుకు యత్నించాడు. మండల కేంద్రంలోని మార్కెట్లో ఏర్పాటు చేసిన డీసీఎంఎస్ కేంద్రానికి 50 రోజుల కిందట తాతా హనుమంతరావు ధాన్యం తీసుకొచ్చాడు. ఇప్పటివరకు కాంటా వేయకపోగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుండడంతో శనివారం ఆయన బోదులబండ – నేలకొండపల్లి రహదారిపై ధాన్యం బస్తాలను వేసి నిప్పంటించేందుకు యత్నించాడు. దీంతో సహచర రైతులు అడ్డుకోగా, తహసీల్దార్ వెంకటేశ్వర్లు చేరుకుని నచ్చజెప్పారు. త్వరగా కాంటా వేయిస్తామని నిర్వాహకులు చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. హోరాహోరీగా నెట్బాల్ పోటీలు జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి 8వ సబ్ జూనియర్ అండర్–16 నెట్బాల్ చాంపియన్ షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి 620 మంది బాలబాలికలు పోటీలకు హాజరయ్యారు. ట్రెడిషనల్, ఫాస్ట్–5, మిక్స్డ్ కేటగీరీల్లో క్రీడాకారులు తలపడుతున్నారు. ట్రెడిషనల్, ఫాస్ట్–5 కేటగిరీలకు సంబంధించి బాలుర, బాలికల పోటీలు శనివారం ముగియగా, మిక్స్డ్ డబుల్ నెట్బాల్ పోటీలు శనివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. కాగా, ట్రెడిషనల్, ఫాస్ట్–5 కేటగిరీల బాలుర, బాలికల విభాగంలో నారాయణపేట, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. ట్రెడిషనల్ కేటగిరీలో నారాయణపేట, కరీంనగర్ మొదటి రెండు స్థానాల్లో నిలవగా హైదరాబాద్, ఖమ్మం సంయుక్తంగా మూడో స్థానం దక్కించుకున్నాయి. ఇక బాలికల విభాగంలో మేడ్చల్, నల్లగొండ మొదటి రెండు స్థానాలు చేజిక్కించుకోగా, మూడో స్థానాన్ని జనగామ, ఖమ్మం పంచుకున్నాయి. ఫాస్ట్–5 కేటగిరీ బాలుర విభాగంలో నారాయణపేట, ఖమ్మం జట్లు మొదటి రెండు స్థానాలు సాధించాయి. అలాగే, మహబూబ్నగర్, కుమురం భీం ఆసిఫాబాద్ మూడో స్థానం సంయుక్తంగా దక్కించుకున్నాయి. ఇక బాలికల విభాగంలో మేడ్చల్, ఖమ్మం జట్లు విజేతగా నిలవగా జనగామ, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల జట్లు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. కాగా, మిక్స్డ్ డబుల్స్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగియనున్నాయి. చోరీ కేసులో నిందితుడి ఆత్మహత్యాయత్నం తిరుమలాయపాలెం: చోరీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బంగారు ఆభరణాలు అప్పగించే విషయమై పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఎర్రగడ్డ గ్రామానికి చెందిన నల్లమల్ల ప్రతాప్ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు బంగారు నగలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. ఈ క్రమాన విచారణ చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన సందీప్ను అదుపులోకి తీసుకోగా చెవిదిద్దులు తిరిగి ఇచ్చి, నెక్లెస్ మరో వ్యక్తి వద్ద ఉందని చెప్పాడు. పోలీసులు శనివారం సందీప్తో పాటు ఇంకో వ్యక్తిని విచారించి ఆభరణాలు ఇచ్చేయాలని సూచించి పంపించారు. దీంతో సందీప్ ఇంటికి వెళ్లాక, అక్కడి నుంచి తిరుమలాయపాలెం సొసైటీ గోదాం వెనకాలకు చేరుకుని పురుగులమందు తాగాడు. విషయం కుటుంబీకులకు తెలియడంతో ఆయన్ను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కాగా, సందీప్పై గతంలో పోక్సో కేసు కూడా ఉందని తెలిసింది. -
సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం
ఖమ్మంమయూరిసెంటర్: అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులతోపాటు ఇతర సంక్షేమ పథకాలు అమలయ్యే వరకూ పోరాడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు తెలిపారు. సీపీఎం ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కేఎంసీ కార్యాలయం ఎదుట శనివారం ప్రజలతో కలిసి ధర్నా చేశారు. పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ అధ్యక్షతన జరిగిన సభలో పోతినేని మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పదేళ్లు సాగదీస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాల విషయంలో అదే ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై నిందలు వేస్తున్న ప్రస్తుత పాలకులు.. మూసీ సుందరీకరణ, అందాల పోటీలకు ఉన్న నిధులు ఆరు గ్యారంటీల అమలుకు ఎందుకు వెచ్చించడం లేదని ప్రశ్నించారు. ఇకనైనా కాంగ్రెస్ శ్రేణులకు కాకుండా అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వడంతో పాటు పింఛన్ల కోసం అందిన దరఖాస్తులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా, మున్నేరు రిటైనింగ్ వాల్, తీగల వంతెన నిర్మాణాలతో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కార్పొరేటర్ యల్లంపల్లి వెంకట్రావు డిమాండ్ చేశారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీఉల్లాకు వినతిపత్రం అందజేశారు. పార్టీ నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీనివాసరావు, బొంతు రాంబాబు, మాదినేని రమేశ్, పొన్నం వెంకటేశ్వర్లు, తుమ్మా విష్ణువర్ధన్రెడ్డి, బండారు రమేశ్, ఎంఏ జబ్బార్, ఎస్.నవీన్రెడ్డి, తిరుపతిరావు, మీరా సాహెబ్, కార్పొరేటర్ యర్రా గోపి తదితరులు పాల్గొన్నారు. కేఎంసీ ఎదుట ధర్నాలో సీపీఎం నాయకులు పోతినేని, నాగేశ్వరరావు -
పటేల్ స్టేడియం కళకళ
● కొనసాగుతున్న వేసవి క్రీడా శిబిరాలు ● ఈత, ఇతర క్రీడల్లో శిక్షణకు ఔత్సాహికుల బారులు ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియం ఉదయం, సాయంత్రం ఔత్సాహిక క్రీడాకారులతో కళకళలాడుతోంది. స్విమ్మింగ్ సహా పలు క్రీడల్లో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుండగా పిల్లలు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. దీంతో శిక్షణ సమయాల్లో మార్పులు చేసి బ్యాచ్ల వారీగా విభజించారు. గతంతో పోలిస్తే ఎక్కువగా క్రీడాకారులు వస్తుండడంతో కోచ్లు కూడా ఉత్సాహంగా తర్ఫీదు ఇస్తున్నారు. స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, స్కేటింగ్, బ్యాడ్మింటన్ అంశాల్లో ఎక్కువ మంది హాజరవుతున్నారు. ఇందులో స్విమ్మింగ్కై తే మరింత మంది వస్తుండడంతో బ్యాచ్లుగా విభజించినా అందరికీ శిక్షణ ఇవ్వడం సాధ్యం కావడం లేదని కోచ్లు చెబుతున్నారు. అయితే, వేసవి సెలవులకే పరిమితం కాకుండా ఏడాది పొడవునా హాజరైతేనే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటడం వీలవుతుందని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇబ్బంది లేకుండా శిక్షణ స్టేడియంలో వేసవి శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అన్ని క్రీడాంశాల్లో శిక్షణకు ఏర్పాట్లు చేశాం. ఔత్సాహికులు ఎక్కువగా వస్తుండడంతో రద్దీ నెలకొంటోంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నాం. – టి.సునీల్రెడ్డి, డీవైఎస్ఓ -
కాస్త శాంతించిన భానుడు
ఖమ్మంవ్యవసాయం: జిల్లా వాతావరణంలో శుక్రవారం మార్పులు చోటు చేసుకున్నాయి. నైరుతి రుతుపవనాలు ఈనెల 27 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని చెబుతుండగా.. అంతకు ముందుగానే వాతావరణంలో మార్పులతో జిల్లాలోని పలుచోట్ల గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వర్షాలు కురిసాయి. ఈనెల రెండో వారం వరకు 40–45 డిగ్రీల మధ్య నమోదైన ఉష్ణోగ్రతలు రెండు రోజులుగా 35–40 డిగ్రీలకు తగ్గాయి. శుక్రవారం గరిష్టంగా బాణాపరంలో 39.7 డిగ్రీలు, కనిష్టంగా గంగారంలో 35.5 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం రాత్రి 11గంటల నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఈ వాన శుక్రవారం ఉదయం వరకు కూడా పలు ప్రాంతాల్లో కొనసాగగా అత్యధికంగా మధిరలో 31.6 మి.మీ.లు, ఏన్కూరులో 28.6, వేంసూరులో 26.8, ఖమ్మం రూరల్లో 25.8, కూసుమంచిలో 22.6, తల్లాడలో 22.2, బోనకల్లో 16.4, సింగరేణిలో 13.8, కొణిజర్లలో 11.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలు కురుస్తుండగా రైతులు భూమిలో తేమ ఆధారంగా అక్కడక్కడా దుక్కులు చేస్తున్నారు. అయితే యాసంగి పంటలకు మాత్రం నష్టం జరుగుతోంది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అవస్త పడుతుండగా, కోత దశలో ఉన్న మామిడి పంటకు తీరని నష్టం వాటిల్లింది. చల్లబడిన వాతవరణం వర్షాలు కురుస్తుండడం, ఉష్ణోగ్రతలు తగ్గడంతో జిల్లాలో వాతావరణం కొంత మేర చల్లబడింది. దాదాపుగా రెండు నెలలుగా ఉదయం 9గంటలకు మొదలవుతున్న ఎండ ప్రభావం ప్రభావం రాత్రి వరకు కొనసాగుతోంది. కానీ గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షంతో చల్ల బడడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. పలుచోట్ల వాన, చల్లబడిన వాతావరణం -
ఈనెల 21నుంచి ఎన్సీసీ క్యాంప్
వైరా: వైరా శాంతినగర్లోని న్యూ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో ఎన్సీసీ 11(టీ)వ బెటాలియన్ ఆధ్వర్యాన కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈనెల 21 నుంచి 30 వ తేదీ వరకు క్యాంపు జరగనుండగా, ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎస్.కే.భద్ర, ఏఓ కల్నల్ నవీన్ యాదవ్ శుక్రవారం పాఠశాల ఆవరణలో పరిశీలించారు. క్యాంప్నకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల నుంచి 700మంది కేడెట్లు హాజరవుతారని తెలిపారు. విద్యార్థులు ఎన్సీసీలో చేరడం ద్వారా ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో పాటు దేశభక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాడెంట్ డాక్టర్ పి.భూమేశ్వరరావు, డైరక్టర్ కుర్రా సుమన్, ప్రిన్సిపాల్ షాజీ మాథ్యూ, ఏఓ నరసింహారావు పాల్గొన్నారు. కాంటా వేయడం లేదని రైతుల ధర్నా నేలకొండపల్లి: రోజులు గడుస్తున్నా ధాన్యం కాంటా వేయకపోవడంతో ఎన్నాళ్లు పడిగాపులు కాయాలంటూ రైతులు ధర్నాకు దిగారు. నేలకొండపల్లి మండలం అనాసాగారంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి నెల క్రితం రైతులు దాదాపు 10 వేల బస్తాల ధాన్యం తీసుకొచ్చారు. ఈ ధాన్యానికి ఇప్పటివరకు కాంటా వేయకపోవడంతో తహసీల్ వరకు ర్యాలీగా చేరుకుని ధర్నా చేశారు. దీంతో తహసీల్దార్ వెంకటేశ్వర్లు వెంటనే కాంటాలు వేయిస్తామని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యం బోనకల్: ప్రైవేట్తో పోలిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులు ఉన్నందున మెరుగైన చికిత్స అందుతుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కళావతిబాయి వెల్లడించారు. బోనకల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వైద్యసేవలు, మందుల నిల్వలపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అలాగే, పంచాయతీరాజ్ ఉద్యోగుల సమన్వయంతో డ్రై డే – ఫ్రై డే నిర్వహిస్తూ దోమలను అరికట్టాలని తెలిపారు. అనంతరం జాతీయ డెంగీ నివారణా దినోత్సవంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో డీఎంహెచ్ఓ పాల్గొన్నారు. వైద్యాధికారి స్రవంతి, ఉద్యోగులు దానయ్య, స్వర్ణమార్తమ్మ తదితరులు పాల్గొన్నారు. వాహనం ఢీకొని వ్యక్తి మృతి తల్లాడ: మండలంలోని మిట్టపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని రామానుజవరానికి చెందిన దర్శనాల వెంకటేశ్వర్లు(60) మూడు రోజులుగా మధ్యం సేవిస్తూ తిరుగుతున్నాడు. మిట్టపల్లి వద్ద జాతీయ రహదారి పక్కన ఓ షాపులో మద్యం తాగి నడిచి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన అల్లుడు బీరెల్లి రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి.. వేంసూరు: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని లింగపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాంపల్లి ఈశ్వరాచారి(42) ఇంటి మందు ఉన్న కార్పెంటర్ షెడ్లో పడి ఉన్న విద్యుత్ వైర్ను సరిచేస్తున్నాడు. ఈక్రమంలో షాక్కు గురి కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈశ్వరాచారి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వీరప్రసాద్ తెలిపారు. వడదెబ్బతో బాలిక.. రఘునాథపాలె: వడదెబ్బ బారిన పడిన విద్యార్థిని మృతి చెందింది. రఘునాథపాలెం మండలం పాపటపల్లికి చెందిన గ్రామీణ వైద్యుడు కస్తాల రాంబాబు – రాణి దంపతుల చిన్న కుమార్తె శరణ్య(14) ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణత సాధించింది. వేసవి సెలవుల నేపథ్యాన కొత్తగూడెంలోని బంధువులు ఇంటికి వెళ్లగా శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటర్లో చేర్చేందుకు సిద్ధమవుతుండగా వడదెబ్బతో కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. -
ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా ఏర్పాట్లు
ఖమ్మం సహకారనగర్: రైతులు పండించిన ధాన్యమంతా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని.. ఈక్రమంలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆయన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీ.ఎస్.చౌహాన్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ట్యాబ్ ఎంట్రీ పూర్తిచేసిన 48 గంటల్లోనే రైతులకు ఖాతాలో డబ్బు జమ చేస్తున్నామని తెలిపారు. కాగా, కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన గన్నీ బ్యాగ్లు, టార్పాలిన్ కవర్లు సమకూర్చాలని సూచించారు. రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తుల విచారణ త్వరగా పూర్తిచేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. జిల్లా నుంచి వీసీకి హాజరైన కలెక్టర్, ఆతర్వాత అధికారులతో సమావేశమై సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, డీఎం శ్రీలత, వివిధ శాఖల అధికారులు గంగాధర్, సన్యాసయ్య, పుల్లయ్య, ఎం.ఏ.అలీమ్ పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో మూడు ఆవులు మృతి
రఘునాథపాలెం: మండలంలోని పుటాని తండాలో విద్యుదాఘాతంతో శుక్రవారం మూడు ఆవులు మృతి చెందాయి. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన వశ్య, శంకర్, గుగలోతు రాంజ్యాకు చెందిన ఆవులను మేతకు విడిచారు. ఓ రైతు పొలంలోని 11 కేవీ ట్రాన్స్ఫార్మర్ వద్దకు చేరుకున్న ఆవులు అక్కడి ఎర్త్ పైపును తాకడంతో షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో ఏఈ సతీష్, లైన్ ఇన్స్పెక్టర్ దేవీలాల్, లైన్మెన్ ఎల్లయ్య చేరుకుని పరిశీలించగా, పశువైద్యాధికారి పోస్టుమార్టం చేశారు. ఈవిషయమై ఏడీ సంజయ్కుమార్ను వివరణ కోరగా.. గురువారం రాత్రి ట్రాన్స్ఫార్మర్ సమీపాన పిడుగు పడడంతో ఎర్త్ దెబ్బతిని ఉంటుందన్నారు. తెల్లవారుజామున 4నుండి 8గంటల మధ్య విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో మరమ్మతులు చేశామని, ఆతర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య సత్తుపల్లిరూరల్: బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సత్తుపల్లి మండలం నారాయణపురానికి చెందిన చీకటి దీప్తి(28) గంగారంలోని సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. ఈ నెల 14న ఆమెను తల్లిదండ్రులు మందలించారనే మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయాన కలుపు మందు తాగింది. కాసేపటికి గుర్తించిన కుటుంబీకులు సత్తుపల్లికి, అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొబ్బరి చెట్లపై పిడుగులు చింతకాని/కామేపల్లి: చింతకాని మండలంలోని జగన్నాధపురంలోని ఆలస్యం వెంకయ్య ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుపై శుక్రవారం తెల్లవారుజామున పిడుగు పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడడంతో చెట్టుపై 20 నిమిషాల పాటు మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో వెంకయ్య ఇంట్లో అద్దెకు ఉంటున్న కోలేటి రాంచందర్రావు గృహంలోని ఎలక్ట్రానిక్స్ సామగ్రి, వైరింగ్ పూర్తిగా కాలిపోయింది. అలాగే, కామేపల్లి మండలం తాళ్లగూడెంలోని బండారి రామయ్య ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపైనా పిడుగు పడింది. అయితే, అంతసేపు రామయ్య ఆరు బయటే నిద్రించగా, వర్షం వస్తుండడంతో లోపలకు వెళ్లాడు. అదే సమయాన పిడుగు పడడంతో ప్రమాదం తప్పినట్లయింది. -
30ఏళ్లకు కలిసిన పూర్వవిద్యార్థులు
రఘునాథపాలెం: ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ డిగ్రీ కళాశాల 1993–96 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని శుక్రవారం రఘునాథపాలెం మండలంలోని వి.వెంకటపాలెంలో నిర్వహించారు. ఈసందర్భంగా ముప్పై ఏళ్లకు కలుసుకున్న స్నేహితులు ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ సందడిగా గడిపారు. అంతేకాక అప్పటి లెక్చరర్లు రామచంద్రరావు, విద్యాసాగర్, వెంకటేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ బ్యాచ్ విద్యార్థి, నటుడు ప్రభాకర్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘానికి గది నిర్మాణం కోసం ముందుకొచ్చాడు.ఈకార్యక్రమంలో ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, కామేపల్లి సొసైటీ చైర్మన్ పుచ్చకాయల వీరభద్రంతో పాటు ఎం.వెంకట్, శేఖర్, సిరాజ్, కవిరాజు, వీరస్వామి పాల్గొన్నారు. -
వృద్ధురాలు అదృశ్యం
చింతకాని/కొణిజర్ల: ఆస్పత్రికి బయలుదేరిన వృద్ధురాలు కానరాకుండా పోయిన ఘటన ఇది. చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన బొగ్గుల కాశమ్మ(65) గురువారం ఉదయం ఆటోలో కొణిజర్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ వైద్యుడు లేకపోవడంతో బయటకు వచ్చింది. తొలుత ఆమె పెద్దగోపతి గ్రామీణ వికాస బ్యాంకులో రూ.5వేలు విత్డ్రా చేసినట్లు తెలియగా, ఆతర్వాత ఇంటికి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో ఆమె కుమారుడు సీతారాంరెడ్డి శుక్రవారం కొణిజర్ల, చింతకాని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. చెరువులో విషం కలపడంతో చేపలు మృతి నేలకొండపల్లి: మండలంలోని ఆరెగూడెం చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో శుక్రవారం చేపలు మృతువాత పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు రెండు టన్నుల మేర చేపలు చనిపోయి తేలిపోయాయి. ఈమేరకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు బోయిన వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
బస్సు, లారీ ఢీ : ఐదుగురికి గాయాలు
సత్తుపల్లి: ప్రైవేట్ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సు డ్రైవర్తో పాటు నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు 20 మంది ప్రయాణికులతో శుక్రవారం ఉదయం ప్రైవేట్ బస్సు వెళ్తోంది. ఈక్రమాన కిష్టారం ఓసీ సమీపంలో ఎదురుగా వచ్చిన లారీని ఢీకొనగా రాజమండ్రికి చెందిన ప్రయాణికులు రమేష్, అమ్మాజి, వినాయకుడు, సూర్యారావుకు స్వల్ప గాయాలయ్యాయి. అంతేకాక బస్సు డ్రైవర్ సోమరాజు క్యాబిన్లో ఇరుక్కుపోవటంతో ట్రెయినీ ఎస్సై అశోక్కుమార్, సిబ్బంది రవీంద్రనాధ్, నాగుల శ్రీనివాసరావు చేరకుని అతికష్టంగా ఆయనను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఉదయం 5–30గంటలకు జరగగా, ఉదయం 10 గంటల వరకు సత్తుపల్లి–ఖమ్మం రహదారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సత్తుపల్లి పోలీసులు సింగరేణి నుంచి క్రేన్లను రప్పించి బస్సు, లారీని విడదీసి పక్కకు పెట్టాక రాకపోకలను పునరుద్ధరించారు. వైరా హైలెవల్ వంతెనపై... వైరారూరల్: వైరా మండలం స్టేజీ పినపాక హైలెవల్ వంతెనపై శుక్రవారం ఆర్టీసీ బస్సు–లారీ ఢీకొన్నాయి. భద్రాచలం నుండి వస్తున్న డీలక్స్ బస్సు, వైరా నుండి తల్లాడ వైపు వెళ్తున్న లారీ వంతెనపై ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోగా పోలీసులు చేరుకుని రాకపోకలను క్రమబద్ధీకరించారు. కాగా, ఈ ఘటనలో ప్రయాణికులకు గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
అకాల వర్షంతో రైతుల్లో ఆందోళన
చింతకాని: చింతకాని మండలంలో శుక్రవారం తెల్ల వారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవగా రైతులు ఆందోళనకు గురయ్యారు. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యంపై పట్టాలు కప్పినా ఈదురుగాలులకు పట్టాలు ఎగిరిపోవడంతో ధాన్యం బస్తాలు తడిశాయి. కాంటా వేసి పది రోజులు దాటనా మిల్లులకు తరలించకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని రైతులు ఆరోపించారు. కూసుమంచిలో... కూసుమంచి: మండలంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఒక్కసారిగా వర్షం రావడంతో రైతులు అప్రమత్తమయ్యేలోగా ధాన్యం తడవగా నష్టం ఎదురైంది. కాంటా వేసిన ధాన్యం బస్తాలు కూడా తడిసిపోగా, సకాలంలో మిల్లులకు తరలించకపోవటంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. తల్లాడ మండలంలో.. తల్లాడ: తల్లాడ మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలగా, వైర్లు తెగిపడ్డాయి. ఫలితంగా అన్నారుగూడెం, గోపాలపేట, నరసింహారావుపేట, కుర్నవల్లిల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక రైతులు ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అవస్థ పడ్డారు. కాగా, మండలంలోని అన్నారుగూడెం దళితకాలనీలో సైడ్ డ్రెయిన్లు లేక వరద నీరు నిలవడంతో రాకపోకలకు దీంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నేడు హెచ్టీ విద్యుత్ వినియోగదారుల సదస్సు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని హెచ్టీ విద్యుత్ వినియోగదారుల నెలవారీ సదస్సు శనివారం ఏర్పాటుచేసినట్లు ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఖమ్మంలోని ఎస్ఈ కార్యాలయంలో ఉదయం 11గంటలకు సద స్సు మొదలవుతుందని, హెచ్టీ వినియోగదారులు పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. ఈ సదస్సులో విద్యుత్ అకౌంట్స్, ఇంజనీరింగ్ తదితర విభాగాల ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు. ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు నిధులు ఖమ్మంఅర్బన్: జిల్లాలోని మూడు ఎత్తిపోతల పథకాల మరమ్మతుకు నిధులు మంజూరయ్యాయి. జలవనరుల శాఖ ఈఎన్సీ అనిల్కుమార్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి సమర్పించిన మూడు పనులకు నిధుల మంజూరు అనుమతి ఇచ్చారు. భక్తరామదాసు ప్రాజెక్టుకు విద్యుత్ యంత్రాల మరమ్మతులకు రూ.10 లక్షలు, ముఠాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మరమ్మతులకు రూ.25.50 లక్షలు, మోటాపురం లిఫ్ట్ బోర్ మరమ్మతుకు రూ.7.70 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. వీసీలో జిల్లా నుంచి ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వరరావు, డీఈలు మన్మధరావు, అయోష, శోభారాణి, పృధ్వీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఏఎస్కు స్కూళ్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన నిర్వహించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్(బీఏఎస్) పథకానికి ప్రైవేట్ పాఠశాలల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరంలో కొత్త పాఠశాలలు ఎంపిక చేయనుండగా.. స్టేట్, సెంట్రల్ బోర్డు ద్వారా గుర్తింపు కలిగిన స్కూళ్ల బాధ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. గత ఐదేళ్లలో ఏడు నుంచి 10వ తరగతిలో 90శాతం కంటే ఎక్కువ ఫలితాలు, 50 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు మొదటి తరగతి ఉత్తీర్ణత సాధించడమే కాక విశాలమైన తరగతి గదులు, వసతి, క్రీడా మైదానం, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ ఉండాలని తెలి పారు. ఈమేరకు ఆసక్తి కలిగిన పాఠశాలల యాజమాన్యాలు పూర్తి వివరాలతో ఈనెల 25వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని డీడీ సూచించారు. గిరిజన గురుకుల కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో మొత్తం సీట్ల్లు భర్తీ అయ్యాయని పీఓ బి.రాహు ల్ తెలిపారు. గురుకులాల్లో బాలికలకు 737 సీట్లు ఉండగా, భద్రాచలంలోని గురుకుల కాలేజీలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన విద్యార్థినుల్లో 737 మందికి మెరిట్ ఆధారంగా వారు కోరుకున్న కాలేజీల్లో సీట్లు కేటాయించామని పీఓ తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఆర్సీఓలు అరుణకుమారి, పద్మావతి, ప్రిన్సిపాళ్లు చైతన్య, నాగేంద్రమ్మ, రాణి, ఓ.మాధవి, సంధ్యరాణి, మాధవీలత, ఓ.పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులను తీర్చిదిద్దాలి కొణిజర్ల: వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న శిబిరాల ద్వారా విద్యార్థినులను ఎంచుకున్న రంగాల్లో తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కొణిజర్ల సమీపాన కేజీబీవీలోని సమ్మర్ క్యాంపును శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కంప్యూటర్ బోధన, ఇతర అంశాలపై ఆరా తీశాక విద్యార్థినులు ఆంగ్లంలో మాట్లాడేలా శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. జీసీడీఓ తులసి, ఎంఈఓ అబ్రహం, ఎంపీడీఓ రోజా, ఎంపీఓ రాజేశ్వరి, క్యాంపు కోఆర్డినేటర్ లావణ్య, అసిస్టెంట్ కోఆర్డినేటర్ సునీత తదితరులు పాల్గొన్నారు. -
మీటర్లు గిరగిరా...
ఖమ్మంవ్యవసాయం: ఎండలు మండుతున్న వేళ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలో డిస్కం కేటాయింపునకు మించి విద్యుత్ వినియోగం జరుగుతుండడం గమనార్హం. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ వినియోగం లేకున్నా, గృహ వినియోగం నానాటికీ పెరుగుతుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. సర్కిళ్ల పరిధిలో సర్వీసులు, వాటి సామర్ధ్యం, సీజన్ల వారీగా వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని డిస్కం నుంచి కోటా కేటాయిస్తారు. ఈ ఏడాది మార్చి నుంచి ఎండ తీవ్రత మొదలుకాగా, ఏప్రిల్ చివరి వారానికి తీవ్రరూపం దాల్చింది. గతనెల 26న జిల్లాలో గరిష్టంగా 43.1 డిగ్రీలు, ఈనెల 13న 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మిగతా రోజుల్లోనూ 40–45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ఆ ప్రభావం విద్యుత్ వినియోగంపై పడుతోంది. తగ్గిన కోటా.. పెరిగిన వినియోగం ఖమ్మం ఎన్పీడీసీఎల్ సర్కిల్ పరిధిలో వివిధ కేటగిరీల కింద మొత్తం 6,96,179 విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. ఇందులో గృహ సర్వీసులు 4,96,114 కాగా, వ్యవసాయ సర్వీసులు 1,19,345.. మిగిలినవి ఇతర కేటగిరీల్లో ఉన్నాయి. మార్చి ఏప్రిల్ వరకు గృహ, పరిశ్రమల వినియోగంతో పాటు యాసంగి పంటల సాగులో భాగంగా మోటార్లు వినియోగించారు. దీంతో సర్కిల్కు నిత్యం 5.97 మిలియన్ యూనిట్ల విద్యుత్ను సరఫరా చేశారు. మే ఆరంభం నాటికి యాసంగి పంటల కోతలు పూర్తవడంతో విద్యుత్ కోటాను 4.93 మిలియన్ యూనిట్లను తగ్గించారు. అంటే మార్చి, ఏప్రిల్ నెలలతో పోలిస్తే మే నెల కోటా 1.04 మినియన్ యూనిట్లు తగ్గింది. వ్యవసాయ వినియోగం లేదని ఈ నిర్ణయం తీసుకోగా.. ఎండల కారణంగా గృహ వినియోగం పెరగడంతో పలుచోట్ల అంతరాయాలు, లోఓల్టేజీ సమస్యలు ఎదురవుతున్నాయి. ఉష్ణోగ్రతలతో పాటే పెరుగుతున్న విద్యుత్ వినియోగం జిల్లాలో డిస్కం కోటాకు మించి వాడకం వ్యవసాయ ఉపయోగం లేకున్నా గృహాల్లో ౖపైపెకి...ఉపశమనం కోసం.. ఎండ తాపం నుంచి ఉపశమనం కోసం దాదాపు అందరూ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగిస్తున్నారు. పగలు, రాత్రీ లేకుండా కూలర్లు, ఏసీలు నడుస్తుండడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈనెలలో ఉష్ణోగ్రతలు పెరగగా... విద్యుత్ వినియోగం కోటాకు మించి నమోదవుతోంది. ఖమ్మం సర్కిల్కు నిత్యం 4.93 మిలియన్ల యూనిట్ల విద్యుత్ కోటా కేటాయిస్తే.. గరిష్టంగా 5.82 యూనిట్ల మేర వినియోగం జరుగుతుండడం గమనార్హం. ఈ లెక్కన సర్కిల్లో కోటాకు మించి అదనంగా 18 శాతం విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు.వినియోగానికి అనుగుణంగా సరఫరా ఉష్ణోగ్రతల కారణంగా కొద్ది రోజులుగా విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో కోటాతో ప్రమేయం లేకుండా జిల్లాకు అవసమైన సరఫరా ఇస్తున్నారు. జిల్లాలో ఎక్కడా సమస్య ఎదురుకాకుండా వినియోగదారుల అవసరాల మేరకు సరఫరా జరిగేలా పర్యవేక్షిస్తున్నాం. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ -
పశువుల అక్రమ రవాణా జరగకుండా కట్టడి
● జిల్లా సరిహద్దుల్లో ఏడు చెక్పోస్ట్ల ఏర్పాటు ఖమ్మంక్రైం: పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గాను పోలీసులు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో పోలీసు కమిషనర్ సునీల్దత్ శుక్రవారం జిల్లాలోని అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందస్తు చర్యల్లో భాగంగా పశువుల రవాణా విషయమై వివాదాలు తలెత్తకుండా చెక్ పోస్టులు ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. సరైన వాహనాలు లేకుండా, చట్టవిరుద్ధంగా ఆవులు, దూడలను రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, పండుగల వేళ మత సామరస్యానికి భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వారిని గుర్తించేందుకు ప్రత్యేక సెల్ ద్వారా పర్యవేక్షించాలని తెలిపారు. కాగా, వైరా(పాలడుగు), బస్వాపురం క్రాస్(కొణిజర్ల), హనుమాన్ తండా(కల్లూరు), వెంకటగిరి క్రాస్ (ఖమ్మం రూరల్), సుబ్లేడ్ క్రాస్(తిరుమలాయపాలెం), సింగరేణి టోల్ప్లాజా(కూసుమంచి), వల్లభి(ముదిగొండ)ల్లో చెక్ పోస్టులు ఏర్పాటుచేయగా నిరంతరం గస్తీ కాయాలని సీపీ సూచించారు. -
అంబేద్కర్ ఆశయసాధనే లక్ష్యం
తిరుమలాయపాలెం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ సూచించారు. మండలంలోని హస్నాబాద్లో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యంగంతోనే అందరికీ విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు దక్కుతున్నాయని తెలిపారు. అనేక ఆటుపోట్లను తట్టుకుని ప్రపంచ మేధావిగా ఎదిగిన ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. డాక్టర్ మాగి వెంకన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ కాశీం, రిటైర్డ్ ఫ్రొఫెసర్ ముత్తయ్య, పీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్యతో పాటు వెన్నెబోయిన రమేష్, కీసర సంకీర్త్రెడ్డి, రాజేంద్రప్రసాద్, చింతరాల నాగభూషణం, సుదర్శన్, మాగి వెంకన్న, యాతాకు ల నగేష్, మాగి లక్ష్మయ్య, మాగి బాలకృష్ణ, సత్తిరెడ్డి, శ్రీనివాస్, పల్లి నాగయ్య, మాగి ఉపేందర్, మాగి రాకేష్, సంతోష్, ఉప్పలయ్య పాల్గొన్నారు.విగ్రహావిష్కరణలో ఎమ్మెల్సీ కోదండరామ్ -
మాస్టర్ ప్లాన్లో కదలిక..
● తుది ముసాయిదాపై కసరత్తు ● ఈనెలాఖరుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువరించేలా వేగం ● పాత సుడా పరిధిలోనే ప్లాన్ రూపకల్పనఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ను కలుపుకుని రూపొందించే ‘సుడా’ మాస్టర్ ప్లాన్లో కదలిక వస్తోంది. ఐదేళ్లుగా యంత్రాంగం తర్జనభర్జన పడుతుండగా, రకరకాల కారణాలతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా పబ్లికేషన్ వాయిదా పడుతోంది. దీంతో అటు సుడా పరిధి, ఇటు కేఎంసీలో అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యాన మాస్టర్ ప్లాన్ను త్వరగా సిద్ధం చేసి ఆమోదంలోకి తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించగా సుడా, కేఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పాత ‘సుడా’ పరిధిలో.. రాష్ట్ర ప్రభుత్వం సుడా పరిధిని విస్తరిస్తూ గతేడాది నవంబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మాస్టర్ ప్లాన్ కూడా మళ్లీ మొదటి నుంచి తయారు చేస్తారని అంతా భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం పాత స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) పరిధిలోనే మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని సూచించింది. ఈమేరకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేన్తో పాటు ఏడు మండలాలకు చెందిన 46 గ్రామపంచాయతీల పరిధిలో ప్లాన్ రూపకల్పనపై దృష్టి సారించారు. అయితే, మాస్టర్ ప్లాన్లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని, నిర్మాణాలకు అడ్డంకిగా ఉన్న ఆంక్షలు తొలగించే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. సమావేశాలు ముగిసినా.. సుడా మాస్టర్ ప్లాన్పై రెండేళ్లుగా కసరత్తు చేస్తున్నారు. తొలుత 2021లోనే మాస్టర్ ప్లాన్ అమలుచేయాలని నిర్ణయించినా సాధ్యం కాలేదు. ఆతర్వాత ఓ ప్రైవేట్ సంస్థతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయించి 2022 ఫిబ్రవరి 11న తొలి స్టేక్ హోల్డర్ల సమావేశం నిర్వహించారు. అందులో వచ్చిన సూచనల ఆధారంగా మార్పులు చేసి అదే ఏడాది జూలై 1న రెండో సమావేశం నిర్వహించి మళ్లీ సలహాలు స్వీకరించారు. అనంతరం వాటిని కూడా ప్లాన్లో పొందుపరిచారు. అయితే, 2022 అక్టోబర్ – నవంబర్లో ముసాయిదా ప్లాన్ పబ్లిష్ చేయాల్సి ఉన్నా సవరణల కోసం అధికారులు వాయిదా వేస్తూ వచ్చారు. బఫర్ జోన్లో మార్పులు గతేడాది సెప్టెంబర్లో వచ్చిన వరదలతో మున్నేరు పరీవాహక ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో మున్నేరు బఫర్ జోన్ పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తద్వారా మాస్టర్ప్లాన్లో స్వల్ప సవరణలు చేసేలా ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. అలాగే, స్టేక్ హోల్డర్ల నుండి కొన్ని ప్రాతిపాదనలు రాగా అవి కూడా పొందుపర్చే అవకాశముంది. మున్నేరు, చెరువులు, నాలాలు, కాల్వల బఫర్ జోన్లకు సంబంధించి కొద్ది మార్పులు జరగనుండగా.. ఈనెలాఖరులోగా ముసాయిదాను విడుదల చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నట్లు తెలిసింది. సుడా పరిధి తెలియచేసే మ్యాప్ప్లాన్ ఉంటేనే అభివృద్ధి.. రాష్ట్రంలో ప్రధాన నగరంగా ఖమ్మం విస్తరిస్తుండడమే కాక అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది. ఈ నేపథ్యాన మాస్టర్ ప్లాన్ ఉంటే పద్ధతి ప్రకారం అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుంది. అలా లేకపోవంతో నిర్మాణాలు అడ్డగోలుగా జరుగుతుండగా.. రోడ్లు వెడల్పుగా లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యాన మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తేనే నగర అభివృద్ధి ప్రణాళికాయుతంగా జరుగుతుందని.. తద్వారా భవిష్యత్లో సమస్యలు ఉండవని భావిస్తున్నారు.త్వరలోనే తుదిరూపం సుడా మాస్టర్ ప్లాన్ తుది ముసాయిదాను ఏజెన్సీ నిర్వాహకులు వారం రోజుల్లో సిద్ధం చేయన్నారు. ఈ ముసాయిదాను పబ్లిష్ చేశాక ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపిస్తాం. కేఎంసీతో పాటు పాత సుడా పరిధిని పరిగణనలోకి తీసుకుని ఈ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. – అభిషేక్ అగస్త్య, కేఎంసీ కమిషనర్, సుడా వైస్ చైర్మన్ -
ఇప్పుడు ప్రారంభిస్తేనే మేలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి తీరం వెంబడి కాళేశ్వరంలో కనుల పండువగా సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి పుష్కరాల కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. వీటితో కాళేశ్వరంలో కొత్తగా సరస్వతి మాత విగ్రహం, స్నానఘట్టాలు, నదీ తీరం వెంబడి కొత్త రోడ్లు, టెంట్ సిటీలు వెలిశాయి. ఇదే తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలంలో నెలకొన్న స్థల సమస్య, రోజురోజుకూ పెరుగుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని గోదావరి పుష్కరాలకు యాక్షన్ ప్లాన్ ముందుగానే సిద్ధం చేయాలని భక్తులు కోరుతున్నారు. లేదంటే 2015 పరిస్థితే పునరావృతం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. వన్నె తెచ్చిన పుష్కరాల పనులు ఈ శతాబ్దంలో 2003, 2015లలో గోదావరికి పుష్కరాలు వచ్చాయి. ముఖ్యంగా 2003 పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన కరకట్ట, స్నానఘట్టాలు భద్రాచలం రూపురేఖలను మార్చాయి. కరకట్ట నిర్మాణంతో భద్రాచలం పట్టణానికి గతంలో పోల్చితే వరదల నుంచి భద్రత కలిగింది. విశాలమైన స్నానఘట్టాలు వచ్చాయి. మహిళలు బట్టలు మార్చుకునే గదులు, కల్యాణకట్టలు అందుబాటులోకి వచ్చాయి. గోదావరి మాతకు విగ్రహం, రామాయణ ఇతివృత్తం తెలిపేలా శిల్పాలను ఏర్పాటు చేశారు. దీంతో భద్రాచలానికి కొత్త శోభ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో జరిగిన పుష్కరాలకు చెప్పుకోతగ్గ పనులేవీ భద్రాచలంలో జరగలేదు. గతంలో ఉన్న వాటినే మరికొంత మెరుగు పరిచారు. కొత్త రాష్ట్రంగా ఏర్పాటుకావడం, ఇక్కడ స్థల సమస్యలు వంటి అంశాలు అప్పుడు పుష్కర పనులకు అడ్డం పడ్డాయి. కీలక అంశాలు రాష్ట్ర విభజన కారణంగా భద్రాచలం క్షేత్రంలో స్థల సమస్య ఏర్పడింది. దీంతోపాటు ఏటా జూలైలో వచ్చే వరదలను దృష్టిలో ఉంచుకుని నేటి ట్రెండ్కు తగ్గట్టుగా టెంట్ సిటీ, స్మార్ట్ సిటీలను ఎక్కడ నిర్మించాలనే అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరముంది. ప్రస్తుతం భద్రాచలంలో సామాన్య భక్తుల పుష్కర ఘాట్, బూర్గంపాడు మండలం మోతె దగ్గర వీఐపీ ఘాట్లు ఉన్నాయి. రాబోయే రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్య రాకుండా కొత్త ఘాట్లను నిర్మించాలి. వాహనాల పార్కింగ్, రాకపోకలపైనా అధ్యయనం చేయాల్సి ఉంది. వీటితో పాటు ఏడాది పొడవునా భద్రాచలం వచ్చే భక్తులకు ఉపయోగపడేలా డార్మిటరీలు, లాకర్లు, సామూహిక స్నానాల గదులు, టాయిలెట్ల నిర్మాణాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలి. నదీ తీరంలో సాంస్కృతి కార్యక్రమాలు జరిగేలా అంఫీ థియేటర్, కరకట్ట పైకి సులువుగా ఎక్కి దిగేలా లిఫ్టులు, అదనపు ర్యాంపులు, ఐకానిక్ వంతెన తదితర నిర్మాణాలు వంటివి రాబోయే పుష్కర పనుల్లో కీలకంగా మారనున్నాయి.కాళేశ్వరంలో వైభవంగా సరస్వతి పుష్కరాలు 2027 జూలైలో గోదావరికి పుష్కరాలు రాష్ట్ర విభజనతో భద్రగిరిలో మారిన పరిస్థితులు కార్యాచరణ సిద్ధం చేయాలని కోరుతున్న భక్తులుభద్రాచలమే కీలకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి గోదావరి పుష్కరాలంటే ఆంధ్రకు రాజమండ్రి, తెలంగాణకు భద్రాచలం కేంద్ర స్థానంగా ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయకున్నా భద్రాచలం ప్రధాన కేంద్రంగానే ఉంది. కొత్తగా ధర్మపురి, కోటిలింగాల, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలు గోదావరి పుష్కరాల్లో ప్రముఖంగా నిలిచా యి. తిరిగి గోదావరికి 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3వరకు పుష్కరాలు జరగనున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకోవడమే కాక దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులు, భద్రాచలం పట్టణం, ఏడాది పొడవునా ఇక్కడ జరిగే కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని యాక్షన్ ప్లాన్ రెడీ చేయాల్సిన అవసరముంది. లేకపోతే 2015 తరహాలోనే ౖపైపె పనులు చేపడితే మరోసారి భద్రాద్రి నష్టపోక తప్పదు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో ‘నవోదయ’ విద్యార్థుల ప్రతిభ
కూసుమంచి: పాలేరు నవోదయ విద్యాలయ విద్యార్థులు ఇటీవల వెల్లడైన సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. వివరాలను ప్రిన్సిపాల్ శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. ప్లస్ టూ (12వ తరగతి) పరీక్షలకు 48 మంది విద్యార్థులు హాజరుకాగా వంద శాతం ఉత్తీర్ణత నమోదైందని, ఇందులో 34 మంది డిస్టింక్షన్లో, 14 మంది మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. కాగా, 575 మార్కులతో రాఘవేంద్ర, 566 మార్కులతో నిఖిల్ టాపర్లుగా నిలిచారని తెలిపారు. అలాగే, పదో తరగతి ఫలితాల్లో 79 మందికి వంద శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 65 మంది డిస్టింక్షన్లో, 12 మంది ప్రథమ శ్రేణిలో, ఇద్దరు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని, 583 మార్కులతో యోక్షిత్ టాపర్గా నిలిచాడని ప్రిన్సిపాల్ వివరించారు. చేయి లేకున్నా.. నవోదయ విద్యాలయకు చెందిన బాణోత్ పావని ప్లస్ టూ(బైపీసీ) చదువుతుండగా ఒక చేయి లేకున్నా షూటర్గా పలు పోటీల్లో పాల్గొని సత్తా చాటిందని ప్రిన్సిపాల్ తెలిపారు. అంతేకాక వార్షిక పరీక్షల్లో 79 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిందని వెల్లడించారు. -
ముగ్గురు కుమార్తెలు జన్మించారని ఆత్మహత్య
ఖమ్మంరూరల్: వరుసగా ముగ్గురు కుమార్తెలు జన్మించడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. రూరల్ మండలం వెంకటగిరికి చెందిన దగ్గుపాటి గోపి (26)కి ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. ఇప్పటికే వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉండగా, ఈ నెల 14న మరో ఆడపిల్ల జన్మించింది. అయితే, కుమారుడు లేడనే మనస్తాపంతో మద్యం తాగొచ్చిన ఆయన గురువారం ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకున్నాడు. కాసేపటికి కుటుంబ సభ్యులు కిందకు దించే సరికి మృతి చెందాడు. గోపి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. కుటుంబ కలహాలతో వృద్ధుడు.. తిరుమలాయపాలెం: కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురైన వృద్ధుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని ఏలువారిగూడెంనకు చెందిన కన్నెబోయిన లింగయ్య (74) దంపతులు 15 రోజుల కిందట గొడవ పడ్డారు. దీంతో భార్య తల్లి గారింటికి వెళ్లగా ఆయన మనుమరాలి ఇంటి వద్ద భోజనం చేస్తున్నాడు. బుధవారం మనుమరాలి ఇంటికి వెళ్లిన లింగయ్య పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా, ఆయనను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందగా కుటుంబీకుల ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలపారు. ఆర్టీసీ బస్సులో ఘర్షణఅశ్వాపురం: ఆర్టీసీ మణుగూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సులో ఇద్దరు మహిళలు ఘర్షణ పడిన పంచాయతీ పోలీస్స్టేషన్కు చేరింది. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సులో ఇద్దరు మహిళలకు సీటు విషయంలో గొడవ జరిగింది. ఒకరు ఆపిన సీటులో మరొకరు కూర్చోవటంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొని ఘర్షణకు దారితీసింది. తోటి ప్రయాణికులు వారించిన గొడవ సద్దుమణగకపోవడంతో బస్సును అశ్వాపురం పోలీస్స్టేషన్ వద్ద ఆపి, విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సీఐ అశోక్రెడ్డి ఇద్దరు మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి, వేర్వేరు బస్సుల్లో పంపించేశారు. -
సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్
కల్లూరురూరల్: ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారని ఆయన తనయుడు నందమూరి రామకృష్ణ తెలిపారు. కల్లూరు మండలం యజ్ఞనారాయణపురంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని గురువారం ఆయన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇన్చార్జ్ టీడీ జనార్దన్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సంర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలు నేటికీ పేదలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో తెలుగు జాతికి గుర్తింపు తీసకొచ్చారని చెప్పారు. కాగా, ఎన్టీఆర్ విగ్రహం, అన్నదానాన్ని పోట్రు లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్ పోట్రు ప్రవీణ్ ఏర్పాటు చేయగా శ్రేయస్ మీడియా అధినేత గండ్ర శ్రీనివాసరెడ్డి, రావి సూర్యనారాయణ, సామినేని నవీన్కుమార్, వాసిరెడ్డి రామనాథం, జాస్తి శ్రీనివాసరావు, కేతినేని హరీశ్, ఆళ్ల కమలాకర్రావు, పోట్రు శ్రీనివాసరావు, మండేపూడి సాయి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాజీ సీఎం విగ్రహావిష్కరణలో నందమూరి రామకృష్ణ -
మాడ వీధులకు వీడని మూఢం
● భూ సేకరణ పూర్తయితేనే పనులు ముందుకు ● స్థలం ఇచ్చేందుకు ఏడుగురి నిరాకరణ ● ఈ అడ్డంకి తొలగితేనే సాగనున్న విస్తరణ ● మాస్టర్ ప్లాన్ ప్రకటన కోసం ఎదురుచూపులుభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి తొలి అడుగు పడినా.. ముందుకు సాగడం లేదు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా మాడ వీధుల విస్తరణకు ప్రభుత్వం రూ.60.20 కోట్లు ప్రకటించింది. ఈ మేరకు భూసేకరణ, ఇళ్లు, దుకాణాల తొలగిస్తే నిర్వాసితులకు అందించే పరిహారం కోసం శ్రీరామనవమికి ముందు రూ.35 కోట్లు విడుదల కాగా, సుమారు 40 కుటుంబాలకు అందజేశారు. నవమి రోజే అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి, మాస్టర్ ప్లాన్ ప్రకటిస్తారని భావించినా అది జరగలేదు. దీనిపై ఆలయ అధికారులకు సీఎం స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం. భూ సేకరణ పూర్తయితేనే పనులు ముందుకు సాగే పరిస్థితి నెలకొంది. ఈనెలలో సేకరణ పూర్తయితేనే.. నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయగానే రెవెన్యూ అధికారులు భూ సేకరణ పూర్తి చేసి దేవస్థానానికి అప్పగించాల్సి ఉంది. అయితే శ్రీరామనవమి సందర్భంగా తమ వ్యాపారం దెబ్బతింటుందని, ఆ తర్వాతే తాము ఖాళీ చేస్తామని ఆయా షాపుల వారు రెవెన్యూ అధికారులను, ఎమ్మెల్యేను కలిసి విన్నవించారు. దీంతో అప్పుడు సేకరణ పనులు ఆపేశారు. నవమి వేడుకలు పూర్తయ్యాక అధికారులు మళ్లీ భూ స్వాధీనానికి వెళ్లగా.. ఈనెల 22న హనుమాన్ జయంతి కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మాలధారులతో భద్రగిరి రద్దీగా ఉంటుందని, ఈ సమయంలోనే వ్యాపారాలు అధికంగా జరుగుతాయి కాబట్టి మరోమారు వాయిదా వేయాలని వారు వేడుకుంటున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు పునరాలోచనలో పడ్డారు. కాగా, భూమి ఇవ్వడానికి నిరాకరించిన వారిపై కోర్టును ఆశ్రయించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారికి అందజేయాల్సిన నష్టపరిహారాన్ని కోర్డుకు సరెండర్ చేసి, భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మాస్టర్ప్లాన్ అమలు చేయాలి.. మాడ వీధుల విస్తరణకు ప్రభుత్వం రూ.60.20 కోట్లు ప్రకటించగా, నిర్వాసితులకు పరిహారంగా రూ.35 కోట్లు విడుదల చేసింది. మరో రూ.25.20 కోట్లతో మాడ వీధుల విస్తరణ చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే ఆలయ అభివృద్ధిపై దృష్టి సారిస్తారు. కాగా నవమి ముందు ప్రభుత్వం ఆలయ అభివృద్ది నమూనాలు విడుదల చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మాస్టర్ ప్లాన్కు మరికొన్ని అదనపు వసతులను కల్పించేలా ఈ నమూనాలు రూపొందించారు. అయితే మాడ వీధుల విస్తరణకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. మాస్టర్ ప్లాన్ అమలుకూ తగిన నిధులు మంజూరు చేయాలని భక్తులు కోరుతున్నారు. నిరాకరించిన వారితో చర్చిస్తాం.. ఏడు కుటుంబాల వరకు నష్టపరిహారం చెక్కులు తీసుకోలేదు. వారితో మళ్లీ చర్చలు జరిపి సానుకూలంగా భూ సేకరణకు కృషి చేస్తాం. అయినా వినకుంటే నిబంధనల ప్రకారం నష్టపరిహారాన్ని కోర్టుకు అందజేసి భూ సేకరణను పూర్తి చేస్తాం. వీలైనంత త్వరలో ఆలయానికి భూములు అందజేస్తాం. – కొల్లు దామోదర్ రావు, ఆర్డీఓ, భద్రాచలంకొన్ని కుటుంబాల నిరాకరణ.. భద్రాచలంలో సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు ముందే 40 నిర్వాసిత కుటుంబాలకు రూ.34,45,86,000 అందించినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. అయితే ఇటీవల సస్పెన్షన్కు గురైన ఓ ప్రధానార్చకుడితో పాటు మరో ఆరు కుటుంబాల వారు స్థలాలు ఇచ్చేందుకు, నష్టపరిహారం స్వీకరణకు నిరాకరించారని చెబుతున్నారు. వీరు గతంలో కూడా మాడ వీధుల విస్తరణలో పరిహారం స్వీకరణకు నిరాకరించారు. ప్రభుత్వం ప్రకటించిన మొత్తం కంటే అధికంగా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెవెన్యూ, ఆలయ అధికారులు తీసుకునే చర్యలపైనే పనులు ఆధారపడి ఉంటాయి. -
జాతీయ కార్మిక సంఘాల సమ్మె జూలై 9కి వాయిదా
సింగరేణి(కొత్తగూడెం): కార్మిక రంగ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఈ నెల 20న సమ్మె చేపట్టనున్నట్లు జాతీయ కార్మిక సంఘాలు ప్రకటించగా, దీన్ని జూలై 9కి వాయిదా వేసినట్లు సంఘాల జేఏసీ నాయకులు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గురువారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ నెల 20న పని ప్రదేశాల్లో ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సింగరేణి ఆస్పత్రిలో సీఎండీ తనిఖీ సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆస్పత్రిని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అత్యవసర వార్డు సహా అన్ని వార్డుల్లో పరిశీలించి చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు. ఆ తర్వాత ఫార్మసీని పరిశీలించి మందుల లభ్యతపై తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. సంస్థ కార్మికుల ఆరోగ్యం, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నందున వైద్యులు, సిబ్బంది మెరుగైన సేవలందించాలని సూచించారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఎంఓ కిరణ్రాజ్కుమార్, ఏసీఎంఓలు ఎం.ఉష, సునీల, సీనియర్ పీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యతతోనే మామిడికి ధర
● పిందె మొదలు కాయ వరకు జాగ్రత్తలు తప్పనిసరి ● రవాణా, ఎగుమతుల్లో గ్రేడింగ్, ప్యాకింగ్ ప్రధానం ఖమ్మంవ్యవసాయం: మామిడి పంట కోతలు జోరుగా సాగుతున్నాయి. ఈ నెలాఖరు నుంచి జూన్ రెండో వారం వరకు కోతలు మరింత కొనసాగే అవకాశముంది. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 44,864 ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఇందులో బంగినపల్లి, తోతాపురి, రసాలు, హిమాయత్, దసేరి, మల్లికా, మంజీర, సువర్ణరేఖ, జహంగీర్ రకాలను సాగు చేస్తుండగా.. ఈ మొత్తం విదేశీ ఎగుమతులకు అనుకూలమైన రకాలుగా ఉండడం విశేషం. మామిడికి ప్రస్తుతం రకాలు, నాణ్యత ఆధారంగా టన్నుకు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతోంది. ఏమాత్రం నాణ్యత తక్కువగా ఉన్నా వ్యాపారులు ధర పెట్టడం లేదు. కేవలం చెట్టుపై నిలిచిన పంటకే డిమాండ్ ఉన్న నేపథ్యాన రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఖమ్మం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎం.వీ.మధుసూదన్ పలు సూచనలు చేశారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ఎగుమతుల కోసమైనా, దేశీయంగా అమ్మకానికై నా రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచి ధర లభిస్తుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని చెట్టుపై బాగా తయారైన లేత ఆకుపచ్చ రంగు కలిగిన పండ్లను ఎంపిక చేసుకోవాలి. ఈ క్రమాన కండ కలిగి లేత పసుపు పచ్చ రంగు ఉన్నవి గుర్తించాలి. కాయలను 6 – 7 సెంటీమీటర్ల తొడిమ, భూమికి దగ్గరగా ఉన్న కాయలైతే 2 – 3 సెం.మీ. తొడిమతో కోయాలి. కాయ కింద పడకుండా చిక్కం ఉపయోగించాలి. ఆపై రవాణా కోసం ప్లాస్టిక్ ట్రేల అడుగు భాగాన కాగితాలను అమర్చాలి. ఆపై కాయలను జాగ్రత్తగా పేర్చడంతో పాటు ఈ సమయంలో తొడిమ వద్ద సొన కాయపై చర్మానికి అంటకుండా చూడాలి. అనంతరం ప్యాక్ హౌస్లోనే శుద్ధి చేస్తే విదేశాలకు ఎగుమతి చేయొచ్చు. ఉమ్మడి జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణం, దిగుబడులు జిల్లా సాగు విస్తీర్ణం సాధారణ దిగుబడి (ఎకరాల్లో) (టన్నుల్లో) ఖమ్మం 33,908 1,35,632 భధ్రాద్రి కొత్తగూడెం 10,956 43,824 మొత్తం 44,864 1,79,456 -
గిరిజన సంస్కృతిని పరిరక్షించాలి
ఐటీడీఏ పీఓ రాహుల్ ములకలపల్లి : గిరిజన సంస్కృతిని పరిరక్షించాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ అన్నారు. మండల పరిధిలోని రాజీవ్నగర్లో గురువారం నిర్వహించిన భూమి పండుగ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివాసీలు ఏ కార్యం తలపెట్టినా గ్రామదేవతలను పూజించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అనంతరం స్థానిక యువకులతో కలసి బాణం సంధించారు. ఆ తర్వాత పాత గుండాలపాడు గ్రామాన్ని సందర్శించి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. 35 ఏళ్ల క్రితం అప్పటి పీఓ జేసీ శర్మ తమ గ్రామాన్ని సందర్శించారని, మళ్లీ ఇప్పడు రాహుల్ రావడం ఆనందంగా ఉందని స్థానికులు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్డును పూర్తి చేయాలని, ఐటీడీఏ ద్వారా వ్యవసాయ మోటార్లు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో భద్రాచలం గిరిజన మ్యూజియం ఇన్చార్జ్ వీరస్వామి, గ్రామపెద్దలు తుర్రం శ్రీను, మాజీ ఎంపీటీసీ నూపా సరోజిని తదితరులు పాల్గొన్నారు. బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ పరిశీలన సింగరేణి(కొత్తగూడెం): బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ, గనుల్లో ఉపయోగిస్తున్న కంటిన్యూస్ మైనర్, ఎల్హెచ్డీ యంత్రాల పనితీరును అటవీ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. కొత్తగూడెంలోని పీవీకే –5 ఇంక్లెయిన్ గనిని గురువారం వారు సందర్శించారు. ఏరియాకు వచ్చిన అధికారుల బృందానికి జీఎం ఎం.శాలేంరాజు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం గని అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బొగ్గు ఉత్పత్తి, రవాణాకు సంబంధించిన వివరాలు, యంత్రాల పనితీరును తెలియజేశారు. ఆ తర్వాత అధికారులు మ్యాన్రైడింగ్ ద్వారా గనిలోకి దిగి పంపింగ్ స్టేషన్, సబ్స్టేషన్ ప్రాంతాలను వీక్షించారు. అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (సెంట్రల్) డాక్టర్ వి.ఆర్.జెన్సర్ ఆధ్వర్యంలో డాక్టర్ త్రినాథ్కుమార్, సీసీఎఫ్ డి.భీమానాయక్, ఖమ్మం జిల్లా అటవీ శాఖ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, కొత్తగూడెం డివిజనల్ అటవీ అధికారి కోటేశ్వరరావు తదితరులు పర్యటించారు. -
ఖమ్మం జిల్లాలోని ఏడు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో మద్యం అమ్మకాలు
ఏప్రిల్ 1నుంచి 30 వరకు మే 1నుంచి 13 వరకు సర్కిల్ లిక్కర్ కేసులు బీర్ కేసులు విలువ (రూ.కోట్లలో) లిక్కర్ కేసులు బీర్ కేసులు విలువ (రూ.కోట్లలో) ఖమ్మం–1 39,589 32,527 34.58 11,782 19,325 11.71 ఖమ్మం–2 22,536 18,526 19.16 8,087 12,096 7.67 మధిర 14,309 9,792 11.21 2,176 2,163 1.83 నేలకొండపల్లి 12,907 12,825 10.95 5,284 6,185 4.65 సత్తుపల్లి 18,849 11,618 14.12 8,168 4,331 5.83 సింగరేణి 8,415 5,257 6.34 4,442 4,514 3.78 వైరా 12,653 7,204 9.43 5,363 3,682 4.05మొత్తం 1,29,258 97,749 105.79 45,302 52,296 39.52 -
కిన్నెరసానిలో పుట్టి తిరిగేనా..?
పాల్వంచరూరల్ : కిన్నెరసానికి వచ్చే పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించడంతో పాటు ఒకరికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కెనాల్లో పుట్టి ఏర్పాటు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీచేశారు. అయితే ఐదు నెలలు గడిచినా ఇప్పటివరకు అచరణలోకి రాలేదు. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో రిజర్వాయర్ నుంచి కేటీపీఎస్ కర్మాగారానికి నీరు సరఫరా చేసే కాల్వలో పుట్టి(నాటు పడవ) తిప్పాలని గత డిసెంబర్లో కలెక్టర్ సూచించారు. ఈ మేరకు జిల్లా మత్స్యశాఖ అధికారి ఎండీ ఇంతియాజ్ అహ్మద్ఖాన్కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆయన నెల రోజుల క్రితం రూ.33 వేలతో పుట్టి కొనుగోలు చేసి పునుకుల గ్రామానికి చెందిన మత్స్యకారుడికి అప్పగించారు. కెనాల్లో పుట్టిని ఎలా తిప్పాలో శిక్షణ కూడా ఇచ్చారు. కానీ ఇంతవరకూ ఆ పుట్టి కాలువలో తిరగడం లేదు. దీనిపై జిల్లా మత్స్యశాఖ అధికారిని వివరణ కోరగా.. కలెక్టర్ ఆదేశాల మేరకు నెల రోజుల క్రితమే పుట్టిని కొనుగోలు చేసి మత్స్యకారుడికి అప్పగించామని, అతడు సొంత పనులు పూర్తి చేసుకున్నాక తిప్పుతామని చెప్పాడని తెలిపారు. పుట్టి విషయం పర్యాటకులకు తెలిసేలా ప్రధాన ద్వారం, పంపుహౌస్ వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించామని చెప్పారు. అయితే, కాలువ నీటిలో పుట్టిని తిప్పాలంటే మధ్యలో పంప్హౌస్ గేట్వాల్వ్ను తొలగించాల్సి ఉంటుంది. ఈ పని పూర్తి చేసి వచ్చే ఆదివారం నాటికై నా కెనాల్లో పుట్టిని తిప్పేలా చూడాలని పర్యాటకులు కోరుతున్నారు.కలెక్టర్ ఆదేశించి ఐదునెలలైనా ఆచరణ శూన్యం -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్య కల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నృసింహస్వామికి చక్రస్నానం.. శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీయోగానంద లక్ష్మీ నృసింహ స్వామివారి బ్రహ్మహోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి పవిత్ర గౌతమీ నదిలో చక్ర స్నానం కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి మేళతాళాలు, మహిళా భక్తుల కోలాట నృత్యాల నడుమ గోదావరి తీరానికి తీసుకెళ్లి నదీ జలాలతో చక్ర స్నానం, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హజరై ఈ వేడుకను తిలకించి పులకించారు. -
పొంగు చల్లారింది !
వైరా: ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. సాధారణ జనమంతా చల్లని నీళ్లు లేదంటే కొబ్బరి నీళ్లు, కూల్డ్రింక్లతో తమ దాహార్తి తీర్చుకుంటారు. అదే మందుబాబులైతే ఈ రెండు నెలలు మద్యాన్ని పక్కన పెట్టేసి బీర్ల వైపు మొగ్గు చూపుతారు. తద్వారా ఏటా వేసవిలో బీర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. రెండేళ్ల క్రితమైతే బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదు కాగా.. కొన్ని వైన్స్ల ఎదుట ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. వైరాలోని డిపో నుంచి ఉమ్మడి జిల్లాలోని వైన్స్, బార్లకు మద్యం సరఫరా చేస్తుండగా ఏప్రిల్, మే నెలల్లో బీర్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవని ఎకై ్సజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 60వేల కేసులు డౌన్ వేసవిలో బీర్ల అమ్మకాలు పెరగాల్సింది పోయి లిక్కర్ విక్రయాలు విపరీతంగా పెరుగుతుండడం గమనార్హం. వైరాలోని డిపో నుంచి గతేడాది ఏప్రిల్లో రూ.181 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు సాగగా ఈ ఏడాది రూ.167 కోట్లకు అది పడిపోయింది. గతేడాది ఏప్రిల్లో డిపో నుంచి 2,25,739 బీరు కేసులు అమ్ముడవగా, లిక్కర్ 2,13,172 కేసులు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్లో మాత్రం బీర్లు 1,64,966 కేసులకే పరిమితం కాగా, లిక్కర్ కేసులు మాత్రం 2,00,507 అమ్ముడయ్యాయి. అంటే బీర్ల అమ్మకం 60,733 కేసుల మేర తగ్గింది. ధరలు పెరిగాయానా? ఉమ్మడి జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా వేసవిలో బీర్ల అమ్మకాలు పడిపోయాయి. గత నవంబర్లో ప్రభుత్వం ఒక్కో బీర్ ధరను రూ.20నుంచి రూ.40 మేర పెంచింది. మరోవైపు వాతావరణంలో తరచూ మార్పులు వస్తున్నాయి. రోజంతా ఎండ ఉన్నా సాయంత్రమయ్యే సరికి గాలిదుమారం, వాన ప్రభావం చూపిస్తోంది. ఈ కారణంగా కూడా బీర్ల అమ్మకాలు తగ్గాయని అంచనా వేస్తున్నారు. అయితే, ఏప్రిల్తో పోలిస్తే ఈనెలలో కాస్త పరిస్థితి మెరుగవుతోందని.. రానున్న రోజుల్లో ఇది మరింత పుంజుకుంటుందని వైన్స్, బార్ల యజమానులే కాక ఎకై ్సజ్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మండువేసవిలో బీర్లకు తగ్గిన డిమాండ్ ఇదే సమయాన పెరిగిన లిక్కర్ అమ్మకాలు బీర్ల ధరలు పెరగడమే కారణమని అంచనా -
ఆదివాసీల అంగడి.. సందడి..
భద్రాచలంటౌన్: ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలు గతంలో తమ కుటుంబం వరకు కావాల్సిన కూరగాయలు, ఇతర పంటలే పండించేవారు. కానీ పెరుగుతున్న ఖర్చులు, కుటుంబ భారంతో పంటల సాగు కొద్దికొద్దిగా విస్తరిస్తున్నారు. ఈ క్రమాన ఆదివాసీలు రసాయన ఎరువులు వాడకపోవడంతో పంటలు నాణ్యంగా ఉంటుండడమే కాక ధరల్లోనూ బయటి మార్కెట్తో వ్యత్యాసం ఉండడంతో పట్టణవాసులు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కేవలం ఆకుకూరలు, కూరగాయలే కాక అటవీ ఫలాలు సైతం అమ్ముతున్న ఆదివాసీలు కుటుంబ అవసరాలు తీర్చుకుంటున్నారు. భద్రాచలంలో ప్రత్యేకం.. రాష్ట్ర విభజన సమయాన ఏపీలోకి వెళ్లిన పలు గ్రామాలు, మండలాల నుంచి ఆదివాసీలు తాము సాగు చేసిన పంటలను భద్రాచలంలో విక్రయిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పాత కూరగాయల మార్కెట్లోని ఐటీడీఏ కాంప్లెక్స్ ముందు ఖాళీ స్థలాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ ఆదివాసీ గిరిజనులు మాత్రమే కూరగాయలు, ఆకుకూరలు విక్రయిస్తుండగా ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆదివాసీ అంగడి 11 గంటలకు ముగుస్తుంది. ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలు కొద్దిసేపటల్లో అమ్ముడవుతుండడం విశేషం. అన్నీ తాజాగా.. సాధారణ మార్కెట్ కంటే ఇక్కడ లభించే కూరగాయలు, ఆకుకూరలు తాజాగా ఉంటాయి. తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసే ఆదివాసీలు ఏరోజుకారోజు సేకరించి తీసుకొస్తుండడంతో తాజాగా ఉంటాయని చెబుతున్నారు. అందులోనూ పంటల సాగు రసాయన ఎరువులు వాడకపోవడంతో నాణ్యంగా ఉంటాయని స్థానికులు నమ్ముతున్నారు. అంతేకాక బయటి మార్కెట్తో ధరకూడా తక్కువగా ఉండడంతో కొనుగోలుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న అమ్మకాలు భద్రాచలంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ కంటే ఆదివాసీలు నిర్వహించే అంగడి పట్టణవాసులతో సందడిగా ఉంటోంది. భద్రాచలం పరిసర గ్రామాల్లో సాగు చేసే కూరగాయలను తీసుకొస్తుండగా రోజురోజుకూ అమ్మకాలు పెరుగుతున్నాయి. ఏపీలోని సరిహద్దు మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక, కుక్కునూరు నుంచి భారీగా కూరగాయలను సైతం తీసుకొస్తున్నారు. ఇవి కాక సీజన్ ఆధారంగా సీతాఫలాలు, తునికిపండ్లతో పాటు చింతపండు, మినుములు, పెసళ్లు, బొబ్బర్లు, కందులు సైతం తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. నాణ్యమైన, తాజా కూరగాయల విక్రయం ధరలోనూ బయటి మార్కెట్తో పోలిస్తే తక్కువ కొనుగోలుకు పట్టణవాసుల ఆసక్తి మందులు లేని పంటలు ఇక్కడ మార్కెట్లో లభించే కూరగాయలు తాజాగానే కాక స్వచ్ఛంగా ఉంటాయి. గిరిజనులు ఎటువంటి రసాయన మందులు వాడకుండా పండిస్తుంటారు. దీంతో ఇవి ఆరోగ్యానికి మంచివని నాతోపాటు చాలా మంది ప్రతిరోజు ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. –శంకర్, భద్రాచలం -
వడదెబ్బతో ముగ్గురు మృతి
కామేపల్లి: కామేపల్లి ఇరిగేషన్ సబ్డివిజన్లో లష్కర్గా విధులు నిర్వర్తిస్తున్న బండి రాజమ్మ (60) వడదెబ్బతో మృతి చెందింది. ఇటీవల ఆమె అస్వస్థతకు గురి కాగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందిందని కుటుంబీకులు వెల్లడించారు. ఇరిగేషన్ డీఈఈ శంకర్, ఏఈఈ శ్యామ్, ఉద్యోగులు పలువురు ఆమె మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఖమ్మంలో యాచకుడు.. ఖమ్మంక్రైం: ఖమ్మం మామిళ్లగూడెం ఓవర్బ్రిడ్జి సమీపాన ఓ యాచకుడు గురువారం వడదెబ్బతో మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు చేరుకుని పరిశీలించారు. అనంతరం అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు నేతృత్వాన మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శుక్రవారిపేట వాసి... ఖమ్మంరూరల్: ఖమ్మం శుక్రవారిపేటకు చెందిన ఎస్కే రఫీబాబు (44) వడదెబ్బతో గురువారం మృతి చెందాడు. రూరల్ మండలం గుర్రాలపాడులో ఉంటున్న సోదరుడి వద్దకు బయలుదేరిన ఆయన వెంకటగిరిలోని ఇందిరమ్మ కాలనీ సమీపాన రహదారి పక్కన పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించిన స్థానికులు ఆయన కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చేలోగా రఫీబాబు మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. -
మండుటెండలో సాధువు పాదయాత్ర
మధిర: నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. కానీ, ఒక సాధువు మండుటెండలో పాదయాత్ర నిర్వహిస్తున్నాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన సాధువు కాశీ నుంచి రామేశ్వరానికి పాదయాత్రగా బయలుదేరగా, 54వ రోజైన గురువారం మధిర చేరుకున్నాడు. పరమశివుడిపై నమ్మకంతోనే 58 ఏళ్ల వయస్సులో ఈ యాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏకలవ్య విద్యాలయాల్లో ఇంటర్ ప్రవేశాలు భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు, ఖమ్మం జిల్లాలో ఒక విద్యాలయం ఉండగా, 2024–25లో పదో తరగతి ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థులు అర్హులని వెల్లడించారు. సీబీసీఎస్ సిలబస్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హ్యూమనిటిక్స్ గ్రూపుల్లో ప్రవేశానికి ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గండుగులపల్లి, గుండాలలో బాలికలకు ఎంపీసీ, సీఈసీ, పాల్వంచలో బాలికలకు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు, టేకులపల్లిలో బాలురకు బైపీసీ, సీఈసీ, దుమ్మగూడెంలో బాలురు, బాలికలకు ఎంపీసీ, బైపీసీ, హ్యూమనిటిక్స్ గ్రూపులు, చర్ల, ములకలపల్లి, సింగరేణిలో బాలురు, బాలికలకు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో బోధన ఉంటుందని, పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని పీఓ వెల్లడించారు. కాగా, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 26న ఉదయం చర్ల, భద్రాచలంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. మహిళా సంఘాలకు చెరువుల వన సంరక్షణ బాధ్యత ఖమ్మంమయూరిసెంటర్: మహిళా సంఘాల్లో సభ్యుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పలు పథకాలు అమలుచేస్తున్న ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చెరువుల గట్లపై వన సంరక్షణ బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో మెప్మా అధికారులు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎంసీ సుజాత మాట్లాడుతూ జూన్ 2న చెరువుల వన సంరక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుందని తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీల పరిధిలో ఎంపిక చేసిన చెరువుల బాధ్యతలను స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించనున్నట్లు చెప్పారు. చెరువు కట్టలపై మొక్కలు నాటడం, వాటి పెంపకం బాధ్యతలను సభ్యులు నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, ఖమ్మంలో ఖానాపురం ఊర చెరువు, ధంసలాపురం చెరువు, వైరాలో సోమవారం చెరువు, సత్తుపల్లిలో వేశ్వకాంతుల చెరువు, మధిరలో అంబారుపేట చెరువులను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలిసింది. వివాదాస్పద భూముల్లో పంచనామా ఖమ్మంఅర్బన్: ఖమ్మం అర్బన్లోని మల్లెమడుగు రెవెన్యూ పరిధిలో వివాదాస్పద భూముల్లో తహసీల్దార్ రవికుమార్ గురువారం పంచనామా నిర్వహించారు. ఇక్కడి మూడు సర్వే నంబర్లలో సుమారు 30 ఎకరాల అసైన్డ్ భూముల విషయంలో కొన్నేళ్లుగా కొందరు వ్యక్తులు, ప్రభుత్వం, పేదల మధ్య వివాదం నడుస్తోంది. దీనిపై హైకోర్టులో కేసు దాఖలైంది. విచారణలో ఉండగా రైతులు ఈ ఏడాది పంటల సాగు చేపట్టారు. పంటకాలం పూర్తయిన తర్వాత వివాదాన్ని పరిష్కరించే వరకు ఎవరూ పనులు చేపట్టొద్దని, ప్రభుత్వం సైతం ఈ భూములను ఎవరికీ కేటాయించొద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తహసీల్దార్ రవికుమార్ పంటలు సాగు చేసిన రైతులతో మాట్లాడారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. కాగా, కోర్టు ఆదేశాల మేరకు పంచనామా చేసినట్లు తహసీల్దార్ రవికుమార్ వెల్లడించారు. గాయపడిన వ్యక్తి మృతి చింతకాని: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఖమ్మం అర్బన్ మండలం గోపాలపురానికి చెందిన కొర్రా లోకేశ్ (24) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ప్రైవేట్ బ్యాంక్లో పనిచేసే ఆయన ద్విచక్ర వాహనంపై ఈ నెల 7వ తేదీన చింతకాని మండలం ప్రొద్దుటూరు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లోకేశ్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. -
పాలేరు పొలాల్లో రాజుకున్న అగ్గి
భారీగా చెలరేగుతున్న మంటలుకూసుమంచి: మండలంలోని పాలేరు రిజర్వాయర్ కింద పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు గురువారం వరి కొయ్యలకు నిప్పుపెట్టగా గాలికి మంటలు చెలరేగాయి. రిజర్వాయర్ కట్ట నుండి ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారి వరకు సుమారు రెండు కి.మీ. మేర మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో పలువురు రైతుల గడ్డి వాములు, కరెంటు మోటార్లు, స్టార్టర్లు కాలిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. చర్యలు తీసుకోండి.. ఖమ్మం నుండి హైదరాబాద్కు గురువారం రాత్రి ఈ మార్గంలో వెళ్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంటలను గమనించారు. వ్యవసాయశాఖ అధికారులకు ఫోన్ చేసిన ఆయన కొయ్యలకు నిప్పు పెట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. -
ఎగ్జిట్లతో మెరుగైన రవాణా
జాతీయ రహదారి నిర్మాణాన్ని ఖమ్మం– సత్తుపల్లి(వేంసూరు ఎగ్జిట్) వరకు ఆగస్టు 15కల్లా పూర్తి చేయడమే లక్ష్యంగా పర్యవేక్షిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మార్గంలో వేంసూరు ఎగ్జిట్ నుంచి ధంసలాపురం వరకు రహదారి పనులను గురువారం ఆయన సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి, మాలోతు రాందాస్నాయక్, ఎన్హెచ్ఏఐ పీడీ కె.దివ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ రహదారి పనులు పూర్తయితే ఖమ్మం నుంచి సత్తుపల్లి మధ్య 80కిలోమీటర్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని తెలి పారు. కాగా, సత్తుపల్లి, వైరా, ఖమ్మం ప్రజల డిమాండ్ మేరకు ఎగ్జిట్లను పెంచి రహదారి సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటల ఎగుమతి కోసం జాతీయ రహదారికి అనుసంధానంగా సర్వీస్ రోడ్లను మంజూరు చేయాలని ఇప్పటికే కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఆలస్యమవుతున్నందున ఒక వైపు అయినా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, కొదుమూరు వద్ద విద్యుత్లైన్ సమస్య పరిష్కరిస్తున్నామని వెల్లడించిన మంత్రి... కల్లూరు సమీపాన సాగర్ కాల్వ వద్ద బ్రిడ్జి డిజైన్ మార్చడంతో పనుల్లో కొంత ఆలస్యమైందని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్డీఓ రాజేందర్గౌడ్, మార్కెట్ల చైర్మన్లు దోమ ఆనంద్బాబు, భాగం నీరజాదేవి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, సాధు రమేష్రెడ్డి, పసుమర్తి చందర్రావు, బుక్కా కృష్ణవేణి, బండి గురునాధ్రెడ్డి, పుచ్చకాయల సోమిరెడ్డి పాల్గొన్నారు. -
హైవేపై రయ్.. రయ్
● చివరి దశలో ‘గ్రీన్ ఫీల్డ్’ పనులు ● ఆగస్టు 15వ తేదీకల్లా సత్తుపల్లి వరకు నిర్మాణం పూర్తి ● తద్వారా ఖమ్మం – సత్తుపల్లి మధ్య తగ్గనున్న ప్రయాణ సమయంసత్తుపల్లి: జిల్లాలో కొత్త జాతీయ రహదారి త్వరలో నే అందుబాటులోకి రానుంది. ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి(ఎన్హెచ్ 365 బీజీ)ని 165 కి.మీ. నిడివితో నిర్మిస్తుండగా.. ఈ హైవే జిల్లాలోనే 105 కి.మీ. ఉంటుంది. ఇందులో ఖమ్మం–సత్తుపల్లి మార్గంలో పనులు చివరి దశకు చేరుకోగా త్వరలోనే రహదారి అందుబాటులోకి రానుంది. జిల్లాలో భేష్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని ఐదు ప్యాకేజీలుగా విభజించారు. జిల్లాలోని పనులు 1నుంచి 3వరకు ప్యాకేజీల్లో ఉండగా చకచకా జరగడంతో పూర్తి కావొచ్చాయి. ఏపీలోని 4, 5 ప్యాకేజీల పనులే మందకొడిగా జరుగుతున్నాయి. దేవరపల్లి క్రాస్ వద్ద మూడు కి.మీ. భూసేకరణ వివాదం కోర్టులో ఉండడంతో ఈ జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.డివైడర్లు సహా నిర్మాణం పూర్తయిన హైవేప్యాకేజీల వారీగా ఇలా.. ●ప్యాకేజీ–1 : తల్లంపాడు నుంచి సోమవరం వరకు 33 కి.మీ. మేర రూ.772 కోట్లతో చేపట్టే పనులను ప్యాకేజీ–1గా నిర్ధారించారు. ఇందులో 30 కి.మీ. రోడ్డు నిర్మాణం పూర్తవగా, ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు అనుమతి రాకపోవడంతో ఆటంకం ఎదురైంది. ఇక 32 బ్రిడ్జిల్లో 29 నిర్మాణాలు పూర్తయ్యాయి. ●ప్యాకేజీ–2 : రూ.637 కోట్లతో ఈ ప్యాకేజీ కింద సోమవరం(వైరా) నుంచి చింతగూడెం వరకు 29 కి.మీ. నిడివితో చేపట్టారు. ఇందులో 26 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఈ మార్గంలోని 39 బ్రిడ్జిల్లో 36 బ్రిడ్జిలు నిర్మాణాలు పూర్తయ్యాయి. ●ప్యాకేజీ–3 : రూ.804 కోట్లతో చింతగూడెం నుంచి రేచర్ల(చింతలపూడి మండలం) వరకు 42 కి.మీ. నిడివితో ఈ ప్యాకేజీ కింద పనులు చేపడుతున్నారు. ఇందులో 37 కి.మీ. మేర రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అలాగే, 52 బ్రిడ్జి నిర్మాణ పనులన్నీ పూర్తి చేయడం విశేషం. -
సులభం.. సత్వరం
● స్లాట్ బుకింగ్తో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి ● పైలట్గా ఉమ్మడి జిల్లాలోని మూడుచోట్ల అమలు ● త్వరలోనే అన్ని కార్యాలయాల్లో ప్రారంభంఖమ్మంమయూరిసెంటర్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ తక్కువ సమయంలో పూర్తవుతోంది. స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి వెళ్తే 15 నిమిషాల్లో పని పూర్తవుతుండగా, మరో పది నిమిషాల్లో దస్తావేజులు ఇస్తున్నారు. దీంతో రోజంతా పడిగాపులు కాయాల్సిన ఇబ్బందులు తప్పాయి. ఈవిధానంతో క్రయ విక్రయదారుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఉద్యోగుల నుంచి సానుకూలత వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం ఆర్ఓ కార్యాలయం, కొత్తగూడెం, కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం అమలవుతుండగా.. త్వరలోనే అన్ని కార్యాలయాల్లోనూ అమలుకు సిద్ధమవుతున్నారు. గంటల కొద్దీ వేచి ఉండి.. గతంలో దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం రోజంతా క్రయ, విక్రయదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పడిగాపులు కాయాల్సి వచ్చేది. దీంతో ఇద్దరికీ సమయం కుదరక పలుమార్లు వాయిదా వేసుకునేవారు. మరోవైపు కార్యాలయాల్లోనూ రద్దీ ఉండేది. ఒకే సమయాన పెద్దసంఖ్యలో జనం వస్తుండడంతో కార్యాలయ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఒక్కోసారి డాక్యుమెంట్లన్నీ పూర్తిగా పరిశీలించేందుకు సమయం దొరికేది కాదు. కానీ ఇప్పుడు స్లాట్ బుకింగ్తో ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. చిన్నచిన్న సమస్యలతో.. పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి జిల్లాలోని మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలుచేస్తోంది. తొలిసారి కావడంతో చిన్నచిన్న సమస్యలు ఎదురవుతున్నా అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పాత కంప్యూటర్లు, సర్వర్లను మార్చడంపై దృష్టి సారించిన నేపథ్యాన ఈ నెలాఖరు నాటికి సమస్యలన్నీ తీరతాయని చెబుతున్నారు. అన్ని కార్యాలయాల్లో.. స్లాట్ బుకింగ్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్తో మంచి మంచి ఫలితాలు వచ్చినందున ఈ విధానాన్ని త్వరలోనే అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 25కార్యాలయాల్లో అమలు చేయగా.. ఇటీవల రెండో దశలో మరో 25 కార్యాలయాలు ఎంపిక చేశారు. ఈనెల 1వ తేదీ నుంచే అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని భావించినా సాంకేతిక కారణాలతో జూన్ 1వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిసింది. ఇప్పటికే అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఏప్రిల్ 10 నుండి ఇప్పటివరకు స్లాట్ విధానంలో జరిగిన రిజిస్ట్రేషన్లు కార్యాలయం డాక్యుమెంట్లు ఆదాయం ఖమ్మం ఆర్ఓ 1,164 రూ.10.21 కోట్లు కొత్తగూడెం 698 రూ.2.41 కోట్లు కూసుమంచి 530 రూ.97 లక్షలుసులువుగా రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ విధానం విజయవంతంగా కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు త్వరగా పని ముగించుకుంటున్నారు. అంతేకాక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టి, దస్తావేజులు ఇస్తున్నాం. – రవీందర్రావు, జిల్లా రిజిస్ట్రార్, ఖమ్మంకొద్ది నిమిషాల్లోనే మెసేజ్ గతంతో పోలిస్తే పని సులువైంది. స్లాట్ సమయానికి వస్తే నిమిషాల్లో పని పూర్తయింది. ఆపై డాక్యుమెంట్లు తీసుకెళ్లాలని ఫోన్కు మెసేజ్ కూడా వచ్చింది. రిజిస్ట్రేషన్ అయిన రోజే డాక్యుమెంట్లు ఇవ్వడం బాగుంది. – పొదిల సత్యనారాయణ, టేకులపల్లి15నిమిషాల్లో ముగిసింది.. స్థలం రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని వస్తే 15 నిమిషాల్లోనే పూర్తి చేశారు. గతంలో రోజు మొత్తం ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు త్వరగా పూర్తయింది. ఇక ఇబ్బంది లేకుండా కొద్దిసేపట్లోనే దస్తావేజులు ఇచ్చేశారు.. – ఎల్.సురేష్కుమార్, సాయిగణేష్నగర్ -
గిరిజన కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధి లోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గురువారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో జరిగిన కౌన్సెలింగ్ను గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలల్లో వివిధ కోర్సులకు గాను 810 సీట్లు ఉండగా, 450 సీట్లలో బాలురకు ప్రవేశాలకు కల్పించామని తెలిపారు. మిగిలిన సీట్ల భర్తీకి త్వరలో ప్రకటన చేస్తామని చెప్పారు. అలాగే, బాలికల ప్రవేశాల కోసం శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు దేవదాస్, సీతారాం, వీరస్వామి, సత్యనారాయణ, భాస్కర్, హరికృష్ణ, పద్మావతి, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. విధుల్లో చేరిన 108 ప్రోగ్రాం మేనేజర్ ఖమ్మంవైద్యవిభాగం: ఈఎంఆర్ఐ, గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్గా శివకుమార్ నియమి తులయ్యారు. ఉమ్మడి జిల్లాలోని 108(అత్యవసర సేవలు), 102(అమ్మ ఒడి), 1962(పశు సంచార) సేవలను పర్యవేక్షించనుండగా, గతంలో ప్రోగ్రాం మేనేజర్గా ఉన్న భూమా నాగేందర్ హైదరాబాద్ క్లస్టర్కు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో వరంగల్ నుంచి వచ్చిన శివకుమార్ గురువారం విధుల్లో చేరారు. అనంతరం ఉద్యోగులతో సమావేశమై పలు సూచనలు చేశారు. పది జిల్లాల మత్స్యకారుల శిక్షణ కూసుమంచి: పాలేరులోని పీ.వీ.నర్సింహా రావు మత్స్య పరిశోధనా కేంద్రంలో మత్స్యకారులకు మూడు రోజుల పాటు ఇవ్వనున్న శిక్షణ గురువారం ప్రారంభమైంది. ‘జలాశయాల్లో మత్స్య అభివృద్ధి – యాజమాన్య పద్ధతులు’ అంశంపై ఇస్తున్న ఈ శిక్షణకు ఖమ్మం, నిజామాబాద్, హనుమకొండ, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, నాగర్కర్నూల్, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సిరిసిల్ల జిల్లాల మత్స్యకారులు పాల్గొన్నారు. తొలిరోజు మత్స్యశాఖ నేషనల్ ఫెసిలిటేటర్ బి.లవకుమార్ మాట్లాడుతూ శిక్షణను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా మత్స్య సంపదలో రాష్ట్రాన్ని ముందు నిలపాలని సూచించారు. చేపల పెంపకంలో ఆధునిక పద్ధతులు అవలంబిస్తే మంచి ఫలి తాలు వస్తాయని చెప్పారు. పరిశోధనా కేంద్రం పూర్వ, ప్రస్తుత ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ జి.విద్యాసాగర్రెడ్డి, డాక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడగా మత్స్య శాస్త్రవేత్తలు రవీందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: పాల్వంచ మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చకులు అర్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నివేదన, హారతి సమర్పించారు. అలాగే, మంత్రపుష్పం పఠించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు. -
సహజ సేద్యంపై రైతులకు ప్రోత్సాహం
ఖమ్మంవ్యవసాయం: రసాయన ఎరువుల వాడకం తగ్గిస్తూ సహజ సిద్ధమైన ఎరువులతో పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో గురువారం సమావేశం ఏర్పాటుచేయగా, కలెక్టర్ మాట్లాడుతూ ఏళ్ల క్రితం సహజ సిద్ధంగా వ్యవసాయం చేయడంతో పంటల్లో పోషక విలువలు ఉండేవని తెలిపారు. ఇప్పుడు ఎరువులు అధికంగా వాడుతుండడంతో రైతులకు పెట్టుబడి పెరగడంతో పాటు పంట దిగుబడిలో నాణ్యత ఉండటం లేదన్నారు. ఈనేపథ్యాన సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి, ముందుకొచ్చే రైతుల పొలాల వద్ద భూసార పరీక్షలు చేయించాలని సూచించారు. రైతులతో సంప్రదించేలా గ్రామానికి ఇద్దరు చొప్పున రైతు మిత్రలను ఎంపిక చేయాలన్నారు. కాగా, ఈ విధానంలో పండించిన పంటల అమ్మకానికి ప్రత్యేక మార్కెట్ ఏర్పాటుచేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంకు చెందిన సేంద్రియ రైతు అనుముల రామిరెడ్డి మాట్లాడుతూ తాను 25ఏళ్లుగా వర్మి కంపోస్ట్ తయారుచేసి ఉపయోగించడమే కాక ఇతరులకు ఇస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన మార్కెట్ ఏర్పాటు చేస్తే రైతులు సహజ విదానాల్లో పంటలు సాగుకు ముందుకొస్తారన్నారు. అలాగే, ఇన్పుట్ యూనిట్ల పంపిణీపై దృష్టి సారించాలని కోరారు. సేంద్రియ పంటల అమ్మకానికి ప్రత్యేక మార్కెట్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ -
నెట్జీరో నెరవేరేనా..?
2023లో యాక్షన్ ప్లాన్ ప్రారంభించిన సింగరేణి ● 2024 కల్లా 532 మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యం ● గడువు పూర్తయినా 300 మెగావాట్లు దాటని వైనం ● టెండర్ల దశలోనే మగ్గుతున్న కొత్త పవర్ ప్లాంట్లు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బహుముఖంగా విస్తరించిడంపై దృష్టి సారించిన సింగరేణి.. బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్, సోలార్ విద్యుత్ రంగంలోకి వచ్చింది. త్వరలో రేర్ ఎర్త్ మినరల్స్ విభాగంలోనూ అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే నలుదిశలా విస్తరించే క్రమంలో ముందుగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో సంస్థ వెనకబడటం విమర్శలకు తావిస్తోంది. 2023లోనే టెండర్లకు పిలుపు.. కొత్తగా ఎనిమిది సోలార్ పవర్ ప్లాంట్లను వేర్వేరు ఏరియాల్లో నిర్మించాలని సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం స్థల సేకరణ కూడా పూర్తి చేయడంతో పాటు ప్లాంట్ల నిర్మాణానికి రూ.1,348 కోట్లు కేటాయించింది. ఈ మేరకు 2023 ఆగస్టులో టెండర్లు ఆహ్వానించింది. సెప్టెంబర్లో ప్రీ బిడ్ సమావేశం నిర్వహించి, టెండర్లలో పాల్గొనే ఏజెన్సీల సందేహాలను నివృత్తి చేసింది. 2024 సెప్టెంబర్ నాటికి 232 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయి విద్యుదుత్పత్తి ప్రారంభించాలని అప్పటి సీఎండీ ఎన్.శ్రీధర్ టెండర్లలో పాల్గొన్న సంస్థలను కోరారు. అయితే నిర్దేశిత గడువు దాటి ఎనిమిది నెలలు పూర్తి కావొస్తున్నా పనులు ఒక కొలిక్కి రాలేదు. కేవలం మందమర్రిలో 67.50 మెగావాట్ల ప్లాంట్ పనులు ప్రారంభించడం గమనార్హం. లక్ష్యానికి దూరంగా.. దశదిశలా విస్తరించే క్రమంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో సింగరేణి వెనుకబడిపోతోందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత 72 మిలియన్ టన్నుల లక్ష్యానికి మూడు మిలియన్ టన్నులు తక్కువగా ఉత్పత్తి అయింది. నైనీ (ఒడిశా), ఇల్లెందు (రొంపేడు), కొత్తగూడెం (పీవీకే మెగా ఓసీ)లో కొత్త గనులు అందుబాటులోకి రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు సోలార్ పవర్ విషయంలోనూ అదే జరిగింది. నిర్దేశించిన గడువులోగా సెకండ్ ఫేస్ పనులు పూర్తయితే సింగరేణికి ప్రతీ ఏడాది విద్యుత్ బిల్లుల రూపంలో దాదాపుగా రూ. 290 కోట్లు ఆదా అయ్యేవి. అలాగే నెట్జీరో సాధించిన సంస్థగా దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కేది. కానీ ఈ రెండూ సాధ్యం కాలేదు. ఇవి ఇలా ఉండగానే రాజస్థాన్తో ఒప్పందం, జియోథర్మల్ పవర్ ప్లాంట్, పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్, రేర్ ఎర్త్ మినరల్స్, విండ్ పవర్ అంటూ కొత్త రాగాలను ఆలపించడంపై విమర్శలు వస్తున్నాయి. టార్గెట్ నెట్జీరో.. సింగరేణి సంస్థ ఆరు జిల్లాల పరిధిలో విస్తరించగా 18 ఓపెన్కాస్ట్, 22 భూగర్భ గనులు ఉన్నాయి. సుమారు 40 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. గనుల అవసరాలకు తోడు కార్మికుల సంక్షేమం కోసం సంస్థ భారీగా విద్యుత్ను వినియోగిస్తోంది. ప్రతీ ఏడాది వేర్వేరు అవసరాల నిమిత్తం 715 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వాడుతోంది. అయితే అంతే మొత్తంలో సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసి కాలుష్య నియంత్రణలో నెట్జీరో సంస్థగా నిలవాలని దశాబ్ద కాలంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తొలి విడతలో సంస్థ పరిఽధిలోని అన్ని ఏరియాల్లో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను సిద్ధం చేసింది. తద్వారా 450 మిలియన్ యూనిట్ల విద్యుత్ను సంస్థ ఆదా చేసినట్టయింది. నెట్జీరో రికార్డు దిశగా అడుగులు వేస్తూ మరో 232 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల స్థాపనకు రెండేళ్ల కిందటే ప్లాన్ సిద్ధం చేసింది. -
రిక్తహస్తమే..!
● రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో మొండిచేయి ● అంచనాలు రూ.కోట్లలో.. కేటాయింపులు రూ.లక్షల్లో ● ‘పింక్ బుక్’లో జాడే లేని లైన్లుసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైల్వేబడ్జెట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మొండిచేయే ఎదురైంది. గత మార్చిలో బడ్జెట్ ప్రకటించగా కేటాయింపులపై పింక్బుక్ వివరాలు ఇటీవల వెల్లడయ్యాయి. ప్రతీ ప్రాజెక్టుకు అంచనా వ్యయం రూ.కోట్లలో ఉంటే కేటాయింపులు మాత్రం రూ.లక్షలకే పరిమితమయ్యాయి. నామ్కే వాస్తే నిధులు.. భద్రాచలంరోడ్–కొవ్వూరు రైల్వే లైన్ను 151 కి.మీ. నిడివితో నిర్మించాల్సి ఉండగా ప్రస్తుత బడ్జెట్లో ఆమోదం లభించినా నిధులు అంతంతే కేటాయించారు. ట్రాక్ నిర్మాణానికి రూ.1,444 కోట్లు అవసరమైతే కేవలం రూ.95 లక్షలే కేటాయించడం గమనార్హం. ఈ లైన్తో పాటు కొత్తగా భద్రాచలం(పాండురంగాపురం)–మల్కన్గిరి, కిరండోల్– కొత్తగూడెం, మణుగూరు–రామగుండం రైల్వే లైన్ల నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన రైల్వే శాఖ.. ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ మార్గాలకు కూడా ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించినా ఫలితం కానరాలేదు. మణుగూరుకు మొండిచేయి.. మణుగూరు–రామగుండం రైల్వే లైన్ నిడివి 200 కి.మీ. కాగా నిర్మాణ వ్యయం రూ.2,911 కోట్లుగా అంచనా వేశారు. ఈ లైన్కు ప్రస్తుత బడ్జెట్లో కంటి తుడుపు చర్యగా రూ.73లక్షలు కేటాయించారు. రామగుండం సమీపంలోని రాఘవాపురం వద్ద మొదలై మంథని– భూపాలపల్లి–మేడారం–తాడ్వాయి– రామానుజపురం మీదుగా మణుగూరు వరకు ఈ లైన్ నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూసేకరణ చివరి దశ కు చేరగా, బడ్జెట్లో రిక్తహస్తమే ఎదురైంది. ఆ లైన్ల ఊసేలేదు.. గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఒడిశాలోని మల్కన్గిరి నుంచి ఛత్తీస్గఢ్, ఏపీ మీదుగా భద్రాచలం (పాండురంగాపురం) రైల్వేలైన్ నిర్మాణానికి ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ మార్గానికి సంబంధించి భద్రాచలంరోడ్డు – మణుగూరు సెక్షన్లో పాండురంగాపురం నుంచి భద్రాచలం వరకు 15 కి.మీ. మార్గం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వస్తుంది. అయితే ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వేకు చూపించిన కేటాయింపుల్లో ఈ మార్గం ఊసే లేదు. ఈస్ట్రన్ రైల్వే పరిధిలోని మల్క న్గిరి సెక్షన్లో జరిగే పనులకే రైల్వేశాఖ నుంచి నిధులు మంజూరయ్యాయి. అలాగే కొత్తగూడెం నుంచి ఛత్తీస్గఢ్లోని కిరోండల్కు సంబంధించి కూడా ప్రస్తుత బడ్జెట్లో ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. పోచారం, గాంధీపురం స్టేషన్లకు నిధులు భద్రాచలం రోడ్ మీదుగా సర్వే నిర్వహించిన రైల్వే లైన్లలో ఒకటైన కొండపల్లి – కొత్తగూడెం(125 కి.మీ) రైల్వేలైన్ నిర్మాణ అంచనా వ్యయం రూ.997 కోట్లు కాగా ప్రస్తుత బడ్జెట్లో రూ.10 లక్షలే కేటాయించారు. డోర్నకల్ నుంచి భద్రాచలంరోడ్ వరకు ఉన్న సింగిల్ లైన్ను డబ్లింగ్ చేసేందుకు రూ.770 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో కేటాయింపులేమీ చూపలేదు. అయితే సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలో పోచారం, గాంధీపురం రైల్వే సేష్టన్ల అభివృద్ధికి దాదాపు రూ.50 కోట్ల నిధులు కేటాయించారు. -
ఇటు దరఖాస్తులు
అటు సదస్సులు..పైలట్గా బోనకల్ మండలంలోనూ ‘భూభారతి’ ● ఈనెల 16వ తేదీ వరకు కొనసాగనున్న సదస్సులు ● ఇప్పటివరకు 1,255 దరఖాస్తులు.. చకచకా విచారణ ● మొదటి మండలం నేలకొండపల్లిలో కొనసాగుతున్న పరిశీలన, పరిష్కారంబోనకల్ సాక్షిప్రతినిధి, ఖమ్మం: భూభారతి చట్టానికి సంబంధించి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా తొలి దఫాలో నేలకొండపల్లి మండలాన్ని ఎంపిక చేసి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఇక రెండో దశలో బోనకల్ మండలాన్ని ప్రకటించిన నేపథ్యాన రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తున్నారు. మరోపక్క తహసీల్దార్ కార్యాలయంలోనూ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. బోనకల్ మండలంలో ఈనెల 5న మొదలైన సదస్సులు 16వ తేదీ వరకు కొనసాగతున్నాయి. ఇప్పటివరకు రైతులు తమ సమస్యలపై 1,255 దరఖాస్తులు అందించగా, రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, మొదట పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న నేలకొండపల్లి మండలంలో కూడా దరఖాస్తుల పరిశీలన చేపడుతుండగా, ఇప్పటివరకు 146 దరఖాస్తులు పరిష్కరించారు. అత్యధికంగా మోటమర్రిలో... బోనకల్ మండలంలో రెవెన్యూ సదస్సుల ద్వారా ఇప్పటి వరకు1,255 దరఖాస్తులు అందాయి. అత్యధికంగా మోటమర్రి నుంచి 167 దరఖాస్తులు రాగా, పెద్దబీరవల్లిలో 156 వచ్చాయి. అలాగే, కలకోటలో 118, నారాయణపురంలో 99, తూటికుంటలో 91, లక్ష్మీపురంలో 89, చిరునోములలో 85, చొప్పకట్లపాలెంలో 79, గోవిందాపురం(ఎల్)లో 69, గార్లపాడులో 67, రాయన్నపేటలో 61, బోనకల్లో 58 దరఖాస్తులు అందాయి. అంతేకాక రామాపురంలో 45, జానకీపురంలో 42 దరఖాస్తులు అందగా.. సీతానగరంలో కేవలం 29దరఖాస్తులే సమర్పించారు. కాగా, సాగులో ఉన్న భూమి కన్నా పాస్ పుస్తకంలో తక్కువగా నమోదైందని, నిషేధిత జాబితాలో భూమి ఉందని, పట్టాదారు పేరు, విస్తీర్ణం, సర్వేనంబర్ సవరణ తదితర సమస్యలపై ఎక్కువ దరఖాస్తులు అందాయని తెలుస్తోంది. కాగా, సిబ్బంది తక్కువగా ఉండటంతో సకాలంలో దరఖాస్తులను పరిశీలించడం సాధ్యం కావడం లేదని చెబుతున్నారు. ఈమేరకు డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్, ఆర్ఐలు, మండల సర్వేయర్లను అదనంగా కేటాయించాలని కోరుతూ ఇప్పటికే కలెక్టర్కు తహసీల్దార్ లేఖ రాశారు. అదనపు సిబ్బందిని కేటాయిస్తే దరఖాస్తుల నమోదుతోపాటు క్షేత్రస్థాయి పరిశీలన త్వరగా పూర్తయ్యే అవకాశముంది. నేలకొండపల్లి మండలంలో.. తొలిదఫా పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న నేలకొండపల్లి మండలంలో 3,224 మంది రైతులు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,726 దరఖాస్తులు సాదాబైనామా కోసమే వచ్చాయి. అయితే, వివిధ కారణాలతో వీటి పరిశీలన ప్రారంభం కాలేదు. మిగతా సమస్యలపై అందిన 1,498 దరఖాస్తుల పరిశీలన మాత్రం కొనసాగుతోంది. సాగులో ఉన్న భూమి కన్నా పాస్ పుస్తకంలో తక్కువగా నమోదైందని, విస్తీర్ణం, సర్వేనంబర్ సవరించాలని, కొత్త పాస్ పుస్తకం ఇవ్వాలని కోరడమే కాక అసైన్డ్ భూమి సమస్యలపై దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో 581 దరఖాస్తులను ఇప్పటివరకు పరిశీలించిన బృందాలు 435 దరఖాస్తుల ను తిరస్కరించి, 146 దరఖాస్తులను పరిష్కరించా యి. జిల్లాలో పైలట్ ప్రాజెక్టులుగా ఎంపికై న నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో భూసమస్యలు పరిష్కారమైతే మిగతా ప్రాంతాల్లోనూ అమలుకు శ్రీకారం చుట్టనున్నారు. మరోపక్క సాదా బైనామా దరఖాస్తులపై ప్రభుత్వ నిర్ణయం వెలువడాల్సి ఉంది. -
మోడల్ నియోజకవర్గంగా మధిర
ఎర్రుపాలెం/బోనకల్: ధనిక రాష్ట్రమైన తెలంగాణలో పాలన చేపట్టిన బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో పేదల సంక్షేమం, అభివృద్ధిని విస్మరించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఈక్రమాన అప్పుల భారం ఉన్నా, ఆదాయం సరిపడా లేకున్నా తాము అధికారంలోకి రాగానే అభివృద్ధి పనులతో పాటే సంక్షేమ పథకాలను నిరంతరాయంగా చేడుతున్నామని తెలిపారు. ఎర్రుపాలెంలో రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించే 50 పడకల ఆస్పత్రికి కలెక్టర్ ముజ్మమిల్ఖాన్తో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే, రూ.2.62 కోట్లతో నిర్మించే కండ్రిక – పెద్దగోపవరం బీటీ రోడ్డుకు, రూ.5.74 కోట్లతో బనిగండ్లపాడు – బంజర బీటీ రోడ్డు నిర్మాణాలు, బోనకల్ మండలంలో రూ. 20 కోట్లతో చేపట్టే కలకోట – మోటమర్రి రోడ్డు విస్తరణ, రూ.8కోట్లతో రావినూతల – ఆళ్లపాడు వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాక కలకోటలో హరిజన మత్య్స సొసైటీ భవనం, అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. ఆదాయం పెరగకున్నా... ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోనే మధిరను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు. ఇప్పటికే ఇందిరా డెయిరీ ఏర్పాటు పురోగతిలో ఉండగా, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం మొదలైందని చెప్పారు. అలాగే, అన్ని గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపడుతామని తెలిపారు. కాగా, గత ప్రభుత్వంలో కంటే నేడు ఆదాయం పెరగలేదని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ వ్యవసాయంతో పాటు విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ పథకాలు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు ప్రతీ గ్రామంలో వెచ్చించిన నిధులు, చేసిన అభివృద్ధి వివరాలను లెక్కలతో సహా వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా, యువత ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు జూన్ 2న మంజూరు పత్రాలను పంపిణీ చేస్తామని భట్టి తెలిపారు. అనంతరం పలువురికి కల్యాణలక్ష్మి చెక్కులు అందచేయగా, లక్ష్మీపురంలోని కాంగ్రెస్ నాయకుడు తల్లపురెడ్డి నాగిరెడ్డి ఏర్పాటు చేసిన గొర్రెల ఫామ్ను పరిశీలించి కాంగ్రెస్ శ్రేణులతో సమీక్షించారు. ఈకార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, డీఎంహెచ్ఓ కళావతిబాయి, డీసీహెచ్ఓ రాజశేఖర్, ఆర్డీఓ నర్సింహారావు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసాచారి, పీఆర్ ఈఈ వెంకటరెడ్డి, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, ఏడీఈ విజయచంద్ర, తహసీల్దార్ పున్నంచందర్, కాంగ్రెస్ జిల్లా, మండలాల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, గాలి దుర్గారావు పాల్గొన్నారు. అలాగే, నాయకులు దొబ్బల సౌజన్య, చావా రామకృష్ణ, శీలం శ్రీనివాసరెడ్డి, బొగ్గుల గోవర్దన్రెడ్డి, యరమల పూర్ణచంద్రారెడ్డి, అనుమోలు కృష్ణారావు, వేజండ్ల సాయి, కర్నాటి రామకోటేశ్వరరావు, మోదుగు సుధీర్బాబు, పైడిపల్లి కిషోర్కుమార్, పిల్లలమర్రి నాగేశ్వరరావు, చేబ్రోలు వెంకటేశ్వర్లు, వట్టికొండ రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి సిద్ధంగా ప్రణాళికలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 38 కేంద్రాలు
నేలకొండపల్లి: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 22నుంచి జరగనుండగా, జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి కె.రవిబాబు తెలిపారు. నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీని బుధవారం తనిఖీ చేసిన ఆయన ప్రవేశాల పెంపునకు చేయాల్సిన ప్రచారంపై అధ్యాపకులకు సూచనలు చేశారు. అనంతరం డీఐఈఓ మాట్లాడుతూ సప్లిమెంటరీ పరీక్షలకు 38కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, 11,780 మంది మొదటి, 3,681 మంది ద్వితీ య సంవత్సరం విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో 77.09 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, వచ్చే ఏడాది నూరు శాతం సాధించేలా కృషి చేస్తామని డీఐఈఓ వెల్లడించారు. నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ని గిరిజన నిరుద్యోగ యువతకు ఐటీసీ ప్రథమ్ ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. కోర్సుల వారీగా పది రోజుల నుంచి 45 రోజులపాటు శిక్షణ ఉంటుందని, బ్యూటీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, టైలరింగ్ శిక్షణ కోసం పదో తరగతి, ఆపై విద్యార్హత కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. పుట్టగొడుగుల పెంపకం శిక్షణకు ఏడో తరగతి, ఆపైన, జ్యూట్ బ్యాగ్ల తయారీకి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని వెల్లడించారు. భద్రాచలం, ఖమ్మం వైటీసీల్లో శిక్షణ ఇవ్వడమే కాక ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామని పీఓ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు విద్యార్హత పత్రాలు, కుల ధ్రువీకరణ జిరాక్స్, ఆధార్, రేషన్ కార్డు/ఉపాధి హామీ బుక్, బ్యాంకు పాస్ బుక్, రెండు ఫొటోలతో ఈనెల 21న ఐటీడీఏలోని వైటీసీలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 63026 08905, 81438 40906 నంబర్లలో సంప్రదించాలని పీఓ తెలిపారు. ఇరుశాఖల సమన్వయంతో అభివృద్ధి పనులు ఖమ్మంవ్యవసాయం: రహదారుల విస్తరణ సమయాన విద్యుత్ స్తంభాలు తొలగించడం, కొత్త స్తంభాలు వేయాల్సి వస్తే రోడ్డు తవ్వడం వంటి పనులతో అభివృద్ధి పనులకు ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యాన విద్యుత్, రహదారులు, భవనాల శాఖ అధికారులు సంయుక్తంగా కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బుధవారం ఖమ్మం ఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలో ఇరు శాఖల అధికారులు సమావేశమయ్యారు. ముదిగొండ నుంచి వల్లభి వరకు రోడ్డు వెడల్పు చేస్తున్న క్రమాన పాత స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు, దానవాయిగూడెం – కామంచికల్ రోడ్డు, బల్లేపల్లి – మంచుకొండ రహదారి, వైరా – మధిర రోడ్లలో చేపట్టాల్సిన పనులు, ఖమ్మం రూరల్ మండలంలోని తరుణి హాట్ వద్ద సబ్స్టేషన్ ఏర్పాటుపై చర్చించారు. విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి, డీఈలు ఎన్.రామారావు, డీఈ నాగేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఈఈ యుగంధర్, డీఈలు భగవాన్, వెంకట్రామయ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఉపాధ్యాయ శిక్షణను పరిశీలించిన ఆర్జేడీ ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని పాఠశాల విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్(ఆర్జేడీ) సత్యనారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల హాజ రు, శిక్షణపై ఆరా తీశారు. అనంతరం ఆర్జేడీ మాట్లాడుతూ మార్పులకు అనుగుణంగా శిక్షణ లో నేర్చుకున్న అంశాల ద్వారా బోధించాల్సి ఉంటుందని తెలిపారు. డీఈఓ ఎస్.సత్యనారా యణ, ఏఎంఓ రవికుమార్, ప్లానింగ్ కోఆర్డినేటర్ సీహెచ్.రామకృష్ణ, కోర్సు కోఆర్డినేటర్ శైలజలక్ష్మి పాల్గొన్నారు. కాగా, ఖాళీగా ఉన్న గెజిటె డ్ ప్రధానోపాధ్యాయుల పోస్టుల్లో ఎఫ్ఏసీ హెచ్ఎంలుగా నియమించిన స్కూల్ అసిస్టెంట్లకు ర్యాటిఫికేషన్ ఆర్డర్లు ఇవ్వాలని ఆర్జేడీకి పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు వినతిపత్రం ఇచ్చారు. నాయకులు కట్టా శేఖర్రావు, పి.వెంకటేశ్వరరెడ్డి, తాళ్లూరి చంద్రశేఖర్, రత్నకుమార్, డి.రవికుమార్, లింగం సతీష్, టి.వెంకన్న, శాంతారెడ్డి, మహేష్, రవికిరణ్, సుబ్బారావు పాల్గొన్నారు. -
గురుకులం.. పురోగమనం
● బీసీ గురుకులాల్లో రాణిస్తున్న ఇంటర్ విద్యార్థులు ● ఇంటర్మీడియట్లో ఏడు శాతం పెరిగిన ఉత్తీర్ణత ● సీఓఈగా బోనకల్ గురుకులం అప్గ్రేడ్ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కార్పొరేట్ స్థాయికి మించి వసతి, భోజన సౌకర్యాలు కల్పించడమే కాక ఉచిత విద్య అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల కళాశాలల్లో ఏటేటా విద్యాప్రమాణాలు పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే గురుకులాల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం భారీగా పెరగడడం... ఇంటర్, పదో తరగతి విద్యార్థులు పలువురు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం విశేషం. గత ఏడాది గురుకులాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 82శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది 89శాతానికి పెరిగింది. ఉమ్మడి జిల్లాలో 22 కళాశాలలు ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన 22 మహత్మా జ్యోతిబా పూలే గురుకుల కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ,సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీతోపాటు వృత్తికోర్సులు నిర్వహిసస్తూ ఒక్కో కళాశాలలో కోర్సుకు 40 సీట్లే కేటాయించారు. ఇక కొన్ని కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మాత్రమే బోధన సాగుతోంది. దీంతో ప్రతీ విద్యార్థిపై శ్రద్ధ వహిస్తున్నందున ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. మెరుగైన విద్యతో ఉత్తమ ఫలితాలు బీసీ గురుకులాల్లో ఉత్తమ బోధన అందిస్తున్నాం. నిరంతరం విద్యార్థులపై అధ్యాపకుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాం. ఏటా ఉత్తీర్ణత పెరిగేలా ప్రణాళికాయుతంగా బోధిస్తుండడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ ఏడాది బోనకల్ గురుకులం సీఓఈగా అప్గ్రేడ్ అయింది. భవిష్యత్లో మరిన్ని కళాశాలలకు అవకాశం దక్కుతుంది. – సీహెచ్.రాంబాబు, ఆర్సీఓ, బీసీ గురుకులాలు సీఓఈగా బోనకల్ బీసీ గురుకులాల్లో ఇప్పటి వరకు సీఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ)గా హైదరాబాద్లోని ఒక్క గురుకులాన్నే అప్గ్రేడ్ చేశారు. ఇటీవల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయ సంస్థ రాష్ట్రంలోని మరో తొమ్మిది గురుకులాలను సీఓఈలుగా అప్గ్రేడ్ చేయగా.. జాబితాలో ఖమ్మం జిల్లా బోనకల్ గురుకులానికి కూడా చోటు దక్కింది. దీంతో ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు ఎప్సెట్, జేఈఈ, ఐఐటీ శిక్షణ అందనుంది. ఇంటర్ విద్యతోపాటు ఉన్నత విద్యావకాశాలు కల్పించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ గురుకులాల్లోనే సీఓఈలు ఉండగా.. తాజాగా బీసీ గురుకులాలకు కూడా అప్గ్రేడ్ చేయడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బోధన మరింత కొత్తగా!
● ఉపాధ్యాయులను సన్నద్ధం చేసేలా వివిధ అంశాల్లో శిక్షణ ● విడతల వారీగా ఐదు రోజుల పాటు నిర్వహణఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక కొన్నాళ్లకు దశల వారీగా పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ అందించేవారు. ఆపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు బడి తెరిచిన మొదటిరోజే పుస్తకాలు, యూనిఫాం ఇస్తున్నారు. అంతేకాక పాఠశాల పనిదినాలు వృథా కాకుండా ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో శిక్షణ ఇస్తున్నారు. బోధనలో సరికొత్త మార్పులు తీసుకొచ్చే దిశగా ఏర్పాటుచేసిన ఈ శిక్షణ మొదటి విడత జిల్లాలో మొలైంది. ప్రారంభమైన శిక్షణ తరగతులు జిల్లాలోని ఉపాధ్యాయులకు మూడు విడతలుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. మొదటి విడతగా ఈనెల 13న ఖమ్మంలో శిక్షణ తరగతులు మొదలయ్యాయి. ఐదు రోజుల పాటు కొనసాగే శిక్షణలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ ఉపాధ్యాయులు 326 మంది, గణితం 453, సోషల్ 436 మంది ఉపాధ్యాయులతో పాటు మండల స్థాయి రిసోర్స్ పర్సన్లు 168 మంది, మండలానికి ఎనిమిది మంది చొప్పున స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఐఆర్పీలు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బోధనలో చేయాల్సిన మార్పులపై వివరిస్తూనే డిజిటల్ ఎడ్యుకేషన్, ఏఐ ఆధారిత బోధన, విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్పై అవగాహన కల్పించేలా నిపుణులు వివరిస్తున్నారు. కాగా, మూడు విడతల శిక్షణలో భాగంగా జిల్లాలోని ప్రతీ ఉపాధ్యాయుడు హాజరయ్యేలా పర్యవేక్షిస్తున్నారు. ఈ శిక్షణ తరగతులను మంగళవారం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ప్రారంభించగా, బుధవారం ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి పరిశీలించారు.వృత్తి నైపుణ్యాల పెంపు ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ వృత్తి నైపుణ్యాల పెంపునకు దోహదపడుతుంది. బోధనా విధానాలు, వ్యూహాలు, ఫలితాల సాధన, సమగ్ర మూల్యాంకకానికి ఉపయోగపడుతుంది. విద్యార్థుల నమోదు పెంచేలా చేయాల్సిన కృషిని వివరించారు. – వి.రాజశేఖర్, జెడ్పీహెచ్ఎస్, తుమ్మలపల్లిబోధనకు ఉపయోగం ఇక్కడ ఇచ్చిన శిక్షణ డిజిటల్ బోధనను మరింత సులువు చేయనుంది. స్మార్ట్ టీవీల ఉపయోగం, వెబ్సైట్ల పరిశీలన తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. తద్వారా విద్యార్థులకు మరింత నాణ్యమైన బోధన అందించే అవకాశముంటుంది. – ఎన్.సుధాకర్రావు, జెడ్పీహెచ్ఎస్, ప్రొద్దుటూరుమెరుగైన బోధన కోసం... కోర్సులో భాగంగా రూపొందించిన అంశాలన్నీ ఉపాధ్యాయులకు ఉపయోగపడేవే. తరగతి గదిలో విద్యార్థులు ఆసక్తిగా పాఠాలు వినేలా బోధించడానికి ఇవి కీలకంగా నిలుస్తాయి. డిజిటల్ బోధన కూడా మరింత మెరుగుపడనుంది. – కె.శైలజలక్ష్మి, కోర్సు కోఆర్డినేటర్, ఖమ్మం -
ఆటో బోల్తా.. ఎనిమిది మందికి గాయాలు
తల్లాడ: తల్లాడ–సత్తుపల్లి జాతీ య రహదారిపై బుధవారం జరిగిన ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యా యి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన పలువురు ఆటోలో తల్లాడ మండలం మిట్టపల్లిలో బంధువుల ఇంట కర్మకు హాజరై తిరి గి వెళ్తున్నారు. తల్లాడ మండలం అంజనాపురం వద్ద గేదె అడ్డు రావడంతో ఆటో ముందు బైక్పై వెళ్తున్న వ్యక్తి ఒక్కసారి బ్రేక్ వేయగా కింద పడ్డాడు. ఆ వెంటనే ఆటో డ్రైవర్ కూడా సడెన్ బ్రేక్ వేయగా బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న గొర్రెముచ్చు అరుణ, మాలోచి ఆరోగ్యమ్మ, గొర్రెముచ్చు మౌనిక, మణెమ్మ, సిరి, జాన్సీ, గుత్తికొండ జ్ఞాన సుందరికి కాళ్లు, చేతులు, తలకు గాయాలయ్యాయి. అలాగే, బైక్పై వెళ్తున్న మట్టగాని గురుపాదం కూడా గాయపడగా క్షతగాత్రులను 108 లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోతుల దాడిలో మహిళలకు గాయాలుకొణిజర్ల: గుంపుగా వచ్చిన కోతులు చేసిన దాడిలో ఐదుగురు మహిళలకు గాయాలయ్యాయి. వైరా మున్సిపాలిటీ పరిధిలోకి కొణిజర్ల మండలం దిద్దుపూడిలో కొందరు మహిళలు బుధవారంరోడ్డు పక్కన నిలుచుని మాట్లాడుతుండగా పెద్దసంఖ్యలో వచ్చిన కోతులు దాడి చేశాయి. దీంతో కొందరు తప్పించుకుపోగా, మరికొందరు గాయపడ్డా రు. గ్రామానికి చెందిన షేక్ లాల్బీ, షేక్ అమీనాబీ, షేక్ రజియాబేగం, షేక్ నిజాంబీ, అమర్లపూడి సైదమ్మకు గాయాలు కాగా, కోతుల బెడదపై అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన నిర్వహించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ సీహెచ్.వేణు చేరుకుని వారికి నచ్చచెప్పగా, త్వరలోనే కోతులను అటవీ ప్రాంతాలకు తరలిస్తామని చెప్పి మహిళలకు వైరా పీహెచ్సీలో చికిత్స చేయించారు. గంజాయితో పట్టుబడిన యువకులువైరా: గంజాయి తీసుకెళ్తున్న నలుగురు యువకులను వైరా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని స్టేజీ పినపాక సమీపాన బుధవారం వాహనాల తనిఖీ చేస్తుండగా వైరా, దిద్దుపూడికి చెందిన కోటేశ్వరరావు, అజయ్ కారులో 2.4 కేజీల గంజాయి తీసుకెళ్తూ పట్టుబడ్డారు. అలాగే, సాయి వంఽశీ, సందీప్ బైక్పై వెళ్తుండగా అనునానంతో అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరికి గంజాయి సరఫరా చేసే ఎక్కిరాల రామకృష్ణ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సమ్మెలో సమైక్యంగా పాల్గొనాలి
ఖమ్మంమయూరిసెంటర్: జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 20న చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్బాబు కోరారు. తద్వారా మనువాద, కార్పొరేట్ విధానాలను అమలు చేస్తున్న కేంద్రంపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలోని మంచికంటి హాల్లో కేవీపీఎస్ ఆధ్వర్యాన బుధవారం రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులకు కూడా రక్షణ కరువైందన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను బీజేపీ సర్కార్ రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందని, తద్వారా సంఘం ఏర్పాటు, సమ్మె చేయడం, కనీస వేతనం పొందే హక్కులు దూరమవుతున్నాయని తెలిపారు. ఈనేపథ్యాన సమ్మెలో అందరూ భాగస్వాములై నిరసన తెలపాలని కోరారు. ఈసదస్సుకు నందిపాటి మనోహర్ అధ్యక్షత వహించగా, డాక్టర్ బీ.వీ.రాఘవులు, కోరిపల్లి శ్రీనివాస్, తుమ్మ విష్ణు, మెరుగు సత్యనారాయణ, ఎర్ర శ్రీనివాసరావు, టి.లింగయ్య, బోడపట్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కనులపండువగా దొంగల దోపు శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మహోత్సవాల్లో భాగంగా బుధవారం దొంగల దోపు వేడుక కనులపండువగా సాగింది. ముందుగా ఆలయంలో వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మహిళా భక్తుల కోలాటాల నడుమ ఆలయం నుంచి గోదావరి తీరానికి స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆ తర్వాత నదిలో తెప్పోత్సవం గావించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎల్.రమాదేవి, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
చిన్నారుల పెద్దమనసు
● కిడ్డీ బ్యాంక్ నగదుతో మజ్జిగ పంపిణీ సత్తుపల్లిటౌన్: పిల్లలంతా మూడు, నాలుగు తరగతులు చదువుతున్న వారే.. కానీ ఎండలతో బాటసారుల ఇబ్బందులను గుర్తించి పెద మనస్సు కనబరిచారు. సత్తుపల్లి గాంధీనగర్కు చెందిన మౌలిక్, ఇడుపులపాటి క్రితిక్, కొమ్ముగిరి వర్ధిని, హర్షిని, నందికోళ్ల సంజయ్, జి.సారిక, కన్నెపోగు జశ్వంత్ తమ కిడ్డీ బ్యాంక్లో దాచిన నగదుతో బుధవారం పెరుగు కొని మజ్జిగ చేయించారు. ఆపై ఇళ్ల ముందే చిన్నారులంతా కలిసి కర్రలతో పందిరి వేసి వీధిలో వెళ్తున్న మజ్జిగ పంపిణీ చేయగా పలువురు అభినందించారు. విద్యుత్ శాఖలో ఉత్తమ ఉద్యోగుల ఎంపికఏప్రిల్ నెల జాబితాలో ఐదుగురు ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ శాఖలో ఉత్తమ పనితీరును ప్రదర్శించే అధికారులు, ఉద్యోగులకు ప్రతినెలా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్పీడీసీఎల్ పునరుద్ధరించింది. ఈ కార్యక్రమాన్ని గత ఏడాది ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి ప్రారంభించినా కొన్నాళ్ల తర్వాత నిలిచిపోయింది. తిరిగి విద్యుత్ సరఫరా, అంతరాయాల నిర్వహణ, సత్వర సేవ, వసూళ్లు తదితర అంశాల ఆధారంగా ఏప్రిల్ నెలకు గాను ఐదుగురు అధికారులను ఎంపిక చేసినట్లు ఖమ్మం ఎస్ఈ ఈ.శ్రీనివాసాచారి తెలిపారు. ఇందులో ముదిగొండ విద్యుత్ సబ్స్టేషన్ ఏఈ ఎం.శ్రీనివాసరావు, ఖమ్మం టౌన్–5 ఏఈ జిరుపయ్య, సత్తుపల్లి ఏడీఈ బి.ప్రసాద్బాబు, ఖమ్మం టౌన్–1 ఏడీఈ నాగార్జున, సత్తుపల్లి డీఈ(ఆపరేషన్స్) ఎల్.రాములు ఉన్నారని వెల్లడించారు. అవసరానికి మించి ఎరువులు వాడొద్దుసత్తుపల్లిరూరల్: సాగు చేసే పంటలు, భూసా రం ఆధారంగా అధికారులు, శాస్త్రవేత్తల సిఫా రసు మేరకు ఎరువులు ఉపయోగించాలని, అంతకు మించి వాడితే ఫలితం ఉండకపోగా ఖర్చు పెరుగుతుందని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె.హేమంత్కుమార్ అన్నారు. ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని గంగారం రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి చేయడంతో పాటు పంట అవశేషాలను కలియదున్నడం ద్వారా భూసారం పెరుగుతుందన్నారు. ఆతర్వాత ఏఓ వై. శ్రీనివాసరావు పలు సూచను చేయగా, సొసైటీ చైర్మన్ ఎం.వెంకటరెడ్డి, శాస్త్రవేత్తలు ఎం.రాంప్రసాద్, డాక్టర్ ఆర్.రమేష్, ఉద్యానవన అధికారి శ్రావణి, పశుసంవర్ధక శాఖ వైద్యులు శశిదీప్, ఏఈఓ వాసంతి పాల్గొన్నారు. కాస్త నెమ్మదించిన సూరీడుఖమ్మంవ్యవసాయం: సూర్యుడి తన ప్రతాపాన్ని బుధవారం కాస్త తగ్గించాడు. జిల్లాలో మంగళవారం 40–45 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, బుధవారం అది 35–40 డిగ్రీలకు పడిపోయింది. కాగా, బుధవారం పమ్మిలో గరిష్టంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, సత్తుపల్లి ఓసీ, బాణాపురంలో 39.6, గంగారం, వైరా ఏఆర్ఎస్ 39.3, వేంసూరులో 39.1 డిగ్రీలుగా నమోదైంది. అలాగే, బచ్చోడులో 38.9, చింతకానిలో 38.8, నేలకొండపల్లిలో 38.7, ముదిగొండ 38.5, ఎర్రుపాలెం, ఖమ్మం ప్రకాష్నగర్, కలెక్టరేట్ వద్ద 38.4, పెనుబల్లిలో 38.3, గౌరారం, మధిర, కూసుమంచిలో 38.2, సత్తుపల్లి, వైరా, తల్లాడ, పెద్దగోపతి, కుర్నవల్లిలో 38.1, ఖమ్మం ఖానాపురం, పల్లెగూడెంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో ఆ ప్రభావం కారణంగా ఆకాశం మేఘావృతమై ఉష్ణోగ్రత తగ్గిందని భావిస్తున్నారు. అయితే, ఉక్కపోత ఏ మాత్రం తగ్గకపోవడంతో జనం సతమతమయ్యారు. సీఐల బదిలీ, పోస్టింగ్ ఖమ్మం క్రైం: పోలీసు శాఖలోని మల్టీజోన్–1 పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో భాగంగా కరీంనగర్ పీటీసీలో ఆన్ డ్యూటీపై ఉన్న జి.శ్రీకాంత్గౌడ్ను ఖమ్మం ట్రాఫిక్ సీఐగా కేటాయించారు. అలాగే, ఖమ్మం టాస్క్ఫోర్ సీఐగా వెయింటింగ్లో ఉన బి.బాలాజీని నియమించారు. అంతేకాకుండా కొత్తగూడెం టుటౌన్ సీఐగా వెయిటింగ్లో ఉన్న డి.ప్రతాప్ను నియమించారు. ఈ స్థానంలో ఉన్న టి.రమేష్కుమార్ను ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. -
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయండి
ఖమ్మంరూరల్/కూసుమంచి: వేసవి శిక్షణ శిబిరాల్లో విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వడమే కాక వారిలోని సృజనాత్మకతను వెలికితీయాలని జిల్లా విద్యాశాఖాధికారి సామినేని సత్యనారాయణ సూచించారు. ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లోని జలగంగనర్, కూసుమంచి ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న శిబిరాలను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. చదరంగం, క్యారమ్స్, యోగా, కమ్యూనికేషన్ స్కిల్స్లో శిక్షణ ఇవ్వడమేకాక అల్పాహారం, భోజనం సమకూరుస్తున్న విషయాన్ని వివరించి విద్యార్థులు ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే, విద్యార్థులు గీసిన చిత్రాలను చూసి అభినందించారు. ఎంఈఓలు శ్రీనివాస్, రాయల వీరస్వామి, హెచ్ఎం శ్యాంసన్తో పాటు ఉపాధ్యాయులు మాధవరావు, రూబీ, షాబుద్దీన్, జుబేదా, వెంకటేశ్వర్లు, జాఫర్ పాల్గొన్నారు. -
ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళల అస్థిత్వం
ఖమ్మంరూరల్: అన్ని వర్గాల మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రమే కీలకమని, తద్వారా వారికి సొంత అస్థిత్వం సొంతమవుతుందని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని తరుణి హాట్లో ఉన్న రైసెట్ శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడారు. సీఎస్సీ పాయింట్ల ఏర్పాటులో శిక్షణ తీసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని సూచించారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా కొంత వివక్ష ఉందని, దీని నిర్మూలనకు అంతా కృషి చేయాలని తెలిపారు. ఇందులో భాగంగానే మహిళల ఆర్థికాభివృద్ధికి సిటిజన్ సర్వీస్ సెంటర్లు, షీ జిరాక్స్ సెంటర్లను తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఈకార్యక్రమంలో రైసెట్ డైరెక్టర్ సి.చంద్రశేఖర్, ఏపీఓ నూరొద్దీన్, సీఎస్సీ స్టేట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లలతో ఇళ్లంతా సంతోషం ఎర్రుపాలెం: ఆడపిల్లలు ఉన్న ఇళ్లు సంతోషాలకు చిరునామాగా నిలుస్తాయని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. ‘మా పాప – మా ఇంటి మణిదీపం’ కార్యక్రమంలో భాగంగా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరంలోని ఆడపిల్లకు జన్మనిచ్చిన గూడూరు కోటేశ్వరి– లక్ష్మీనారాయణరెడ్డితో పాటు వారి కుటుంబీకులను కలెక్టర్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలు ప్రతీ రంగంలో రాణిస్తున్నందున సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె.రాంగోపాల్రెడ్డి, డీఎంహెచ్ఓ క్టర్ బి.కళావతిబాయి, ఏసీడీపీఓ జి.కృష్ణశ్రీ, ఎంపీడీఓ బి.సురేందర్, సూపర్వైజర్లు సరిత, మధులత, సునీత పాల్గొన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
సత్తుపల్లిరూరల్: భార్యకు మరొకరితో సంబంధం ఉందనే అనుమానంతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని సిద్ధారం గ్రామానికి చెందిన రాయిని రామారావు(39) తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానిస్తుండగా తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలోనే నాలుగు రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆతర్వాత గ్రామానికే చెందిన ఓ వ్యక్తితో రామారావు గొడవ పడగా, మంగళవారం రాత్రి తన ఇంటి ఆవరణలోని మామిడి చెట్టుకు చీరతో ఊరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం గమనించిన కుటుంబీకులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.చికిత్స పొందుతున్న వృద్ధుడు మృతిపెనుబల్లి: నిప్పంటుకోవడంతో తీవ్ర గాయాలైన వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని లింగగూడెంకు చెందిన గరిక నాగయ్య(85) ఈనెల 6తేదీన బీడీ కాల్చుకునే క్రమంలో అగ్గిపుల్ల మంచంపై ఉన్న దిండుపై పడి నిప్పంటుకుంది. ఆపై మంటలు పెద్దవై నాగయ్య శరీరానికి అంటుకోగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబీకులు నాగయ్యను పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు వీఎం బంజర్ ఎస్సై కె.వెంకటేష్ తెలిపారు. గాయపడిన వ్యక్తి... పెనుబల్లి: రోడ్డుప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కల్లూరు మండలం రఘునాథగూడెంకు చెందిన రామిశెట్టి రామారావు(45) గత నెల 24న పెనుబల్లి మండలం టేకులపల్లికి వచ్చివెళ్తూ ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కింద పడ్డాడు. దీంతో ఆయనకు గాయాలు కాగా, పెనుబల్లి ఆస్పత్రిలో చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ రామారావు మృతి చెందగా, ఆయన కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.వెంకటేష్ తెలిపారు. వడదెబ్బతో కూలీ..నేలకొండపల్లి: ఉపాధిహామీ పనులకు వెళ్లిన కూలీ ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురై మృతి చెందాడు. మండలంలోని చెరువుమాధారానికి చెందిన ఎస్. దానయ్య(55) రోజులాగే బుధవారం ఉపాధిహామీ పనికి వెళ్లాడు. అక్కడ ఎండ కారణంగా అస్వస్థతకు గురైన ఆయన ఇంటికి వచ్చాక బంధువులతో మాట్లాడుతూనే కుప్పకూలాడు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. దానయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాగా, పని ప్రదేశాల వద్ద తగిన సౌకర్యాలు లేకపోవడమే ఆయన మృతికి కారణమని పలువురు పేర్కొన్నారు. -
ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ
● 36 తులాల బంగారంతో పాటు వెండి, నగదు అపహరణ ● రెక్కీ చేసి మరీ చోరీకి పాల్పడిన నిందితులు? ఖమ్మంఅర్బన్: ఖమ్మం ఆరో డివిజన్లోని న్యూ ఖానాపురంలో భారీ చోరీ కలకలం రేపింది. తిరుమలలో దైవదర్శనానికి వెళ్లిన ఉపాధ్యాయుడి ఇంటిని లక్ష్యంగా ఎంచుకున్న దుండగులు చోరీకి పాల్పడ్డారు. కామేపల్లి మండలం పాతలింగాల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బానోతు శోభన్ – వనిత దంపతులు న్యూఖానాపురంలో నివసిస్తుండగా కుటుంబంతో కలిసి సోమవారం రాత్రి రైలులో తిరుపతి బయలుదేరారు. ఇదే సమయాన స్కూటీపై వచ్చిన దుండగులు, ఎవరూ లేరని నిర్ధారించుకున్నట్లు తెలిసింది. ఆపై రెండు గడ్డపారలతో తాళం పగలగొట్టి లోనకు ప్రవేశించారు. అనంతరం బీరువా, లాకర్లను బద్దలుకొట్టి అందులో దాచిన 36 తులాల బంగారం, 30తులాల వెండి ఆభరణాలు, రూ.12వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ విషయం మంగళవారం ఉదయం బయటపడడంతో ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ క్లూస్టీమ్తో చేరుకుని ఆధారాలు సేకరించారు. 45నిమిషాల పాటు ఇంట్లోనే.. మంగళవారం తెల్లవారుజామున 3గంటల సమయాన ముసుగులు ధరించిన దుండగులు ఉపాధ్యాయుడు శోభన్ ఇంట్లోకి ప్రవేశించి సుమారు 45నిమిషాల పాటు ఉన్నారు,. వీరి కదలికలన్నీ సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. కాగా, చోరీ తర్వాత బయటకు వస్తుండగా, అప్పుడే వాకింగ్కు వెళ్తున్న స్థానికుడైన కృష్ణారావుకు అనుమానం వచ్చి శోభన్కు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. దీంతో ఆయన తమ బంధువులను పంపించగా చోరీ విషయం బయటపడింది. కాగా, శోభన్ ఇంట్లోనే కాక అదే భవనంలో కింద అద్దెకు ఉండే వారి ఇంటి కూడా తాళం పగలగొట్టినట్లు సీసీ కెమెరాల పుటేజీ ద్వారా గుర్తించారు. ఈమేరకు తిరుమల ప్రయాణం రద్దు చేసుకున్న ఉపాధ్యాయ దంపతులు ఖమ్మం చేరుకుని పోలీసులను అశ్రయించారు. కాగా, ఖమ్మం స్టేషన్కు వెళ్లే సమయంలో ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఆటో బుక్ చేసుకోగా, ఆటో డ్రైవర్ పైనా అనుమానంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
‘హార్వెస్’ విద్యార్థుల విజయకేతనంఖమ్మం సహకారనగర్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పదో తరగతి, 12వ తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 250మంది హాజరుకాగా 100శాతం ఉత్తీర్ణత నమోదైందని వెల్లడించారు. ఇందులో 500మార్కులకు కె.రిషిత్ 492మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, ఎస్.తేజస్వి 489, బి.హిమవర్షిణి 487, ఎం.ధన్విత 485, బి.చందనప్రియ 483, ఎస్.కే.షాజియా ఇరం 483, పి.ధీరజ్ 481, బి.సహస్ర, పి.భువన్ 480మార్కులు సాధించారని తెలిపారు. అలాగే, 12వ తరగతి ఫలితాల్లో 500కు ఎన్.రాఘవేంద్ర నవనీత్ 487 మార్కులతో అగ్రస్థానాన నిలిచాడని కరస్పాండెంట్, పార్వతిరెడ్డి తెలిపారు. అంతేకాక రేపల్లి శ్రీష 484, బి.సాయిచరణ్ 482, ఎం.నాగయశ్వంత్ 482, బి.సిద్ధార్థ్ 482, ఎన్.సీ.హెచ్.జస్వంత్ సాయి 478, బి.సంజయ్ 477, జి.రాణి ఉమాఅలేఖ్య 475, డి.శ్రీనివాస గౌతమ్రెడ్డి 472, కె.రోహిత 471, టీ.డీ.వీ.ఎస్.ఎస్.నైమాంజలి 470, బి.భార్గవి 470మార్కులు సాధించారన్నారు. కాగా, 12వ తరగతి పరీక్షకు 185 మంది హాజరవగా 100శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కరస్పాండెంట్ రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డితో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. -
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
ఆర్టీసీ ఈడీ సొలొమన్ ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కరీంనగర్ జోన్ ఈడీ సొలొమన్ ఆదేశించారు. ఖమ్మంలోని రీజియన్ మేనేజర్ కార్యాలయం, పాత, కొత్త బస్టాండ్లను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కార్గో పాయింట్, డిస్పెన్సరీలో పరిశీలించాక రీజినల్ మేనేజర్ సరిరామ్తో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. బస్సు సర్వీసుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దని, ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా కొత్త రూట్లను గుర్తించాలని సూచించారు. ఖమ్మం డిపో మేనేజర్ దినేష్కుమార్, అసిస్టెంట్ మేనేజర్ రామయ్య, సూపర్వైజర్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ● మధిర: ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఈడీ సాలొమాన్ సూచించారు. మధిర డిపోను తనిఖీ చేసిన ఆయన సర్వీసుల నిర్వహణ, తదితర అంశాలపై ఉద్యోగులకు సూచనలు చేశారు. ఖమ్మం ఆర్ఎం సరిరామ్, మధిర డీఎం శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కార్యదర్శిగా ప్రవీణ్కుమార్ కొనసాగింపు ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి(ఆన్ డ్యూటీ)గా విధుల్లో ఉన్న పి.ప్రవీణ్కుమార్కు మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. పటాన్చెరువు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి అయిన ప్రవీణ్ను గత ఏడాది జనవరిలో ఖమ్మంకు కేటాయించారు. మరోమారు ఏడాది పొడించడంతో 2026 ఏప్రిల్ వరకు ఆయన ఇక్కడే విదులు నిర్వర్తించనున్నారు. గ్రేడ్–2 కార్యదర్శులకు పదోన్నతులు రాష్ట్రంలో నలుగురు కార్యదర్శులకు గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1గా పదోన్నతి కల్పించారు. ఇందులో భాగంగా సత్తుపల్లి మార్కెట్లో పనిచేస్తున్న జి.సత్యనారాయణకు పదోన్నతి కల్పించి కల్లూరుకు, ఖమ్మం మార్కెట్ నుంచి వి.సృజన్బాబుకు పదోన్నతి కల్పించి లక్సెట్పేట మార్కెట్కు బదిలీ చేశారు. అయితే, ఖమ్మం మార్కెట్ గ్రేడ్–2 కార్యదర్శిగా మాత్రం ఎవరినీ నియమించలేదు. క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్లో క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. శిబిరాన్ని క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సీహెచ్.వెంకట్ ప్రారంభించి మాట్లాడుతూ ఔత్సాహికులకు మెరుగైన శిక్షణ ఇచ్చి హెచ్సీఏ టోర్నీలో ఆడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈకార్యక్రమంలో కన్వీనర్ ఎం.డీ.మాసూద్తో పాటు ఫారూఖ్, తురాబ్ అలీ తదితరులు పాల్గొన్నారు. హైడల్ ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఈ కూసుమంచి: మండలంలోని పాలేరులో మినీ హైడల్ ప్రాజెక్టు(జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం)లో మరమ్మతు పనులను జెన్కో సీఈ(సివిల్) నారాయణ మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా పురోగతిపై ఆరా తీసిన ఆయన, వర్షాకాలంలోగా పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే, గత ఏడాది సెప్టెంబర్లో వచ్చిన భారీ వరదలతో ప్రాజెక్టుకు నీరు సరఫరా చేసే కాల్వ కట్ట తెగిన నేపథ్యాన, అక్కడ చేపడుతున్న మరమ్మతులను కూడా సీఈ పరిశీలించారు. ఎస్ఈ దేశ్యా, డీఈ సింహాచలం పాల్గొన్నారు. వడదెబ్బతో ఇద్దరు మృతిమఽధిర/చింతకాని: మధిర మండలం నిదానపురానికి చెందిన కనపర్తి దానయ్య(49) వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందాడు. ఎండల కారణంగా అస్వస్థతకు గురైన ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. దానయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే, చింతకాని మండలం నాగులవంచలో ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లిన గొడ్డుగొర్ల కేజీరాణి(55) వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందింది. గత శనివారం పనికి వెళ్లిన ఆమె ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురికాగా ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
మామిడి పచ్చడికి ధరల సెగ
పచ్చడి పెట్టేందుకు జంకుతున్న సామాన్యులు ● తెగుళ్లు, అకాల వర్షాలతో దిగుబడి తగ్గి.. పెరిగిన కాయల ధరలు ● నూనె, కారం, ఇతర దినుసులదీ అదే పరిస్థితి మధిర: మాంసాహార ప్రియుల్లో సైతం కొందరు మామిడికాయ పచ్చడితోనే భోజనం ప్రారంభిస్తారు. ఇక శాకాహారులైతే తప్పక పచ్చడి ఉండాల్సిందే. వీరే కాక సన్న, చిన్న కారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర పనులకు ఉదయాన్నే వెళ్లే వారు, కూరలు వండలేని వారికి ఈ పచ్చడే కడుపు నింపుతుంది. దీంతో ఏటా మాదిరి ఈసారి కూడా పచ్చడి పెట్టడానికి సిద్ధమవుతున్న ప్రజలకు ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆది నుంచి అవాంతరాలే... ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో మామిడి చెట్లకు పూత, పిందె సక్రమంగా రాలేదు. అంతేకాక వచ్చిన పూత కూడా చలికాలంలో మంచు కారణంగా తెగళ్లతో రాలిపోయింది. ఆపై అరకొరగా మిగిలిన పూత పిందగా మారగానే ఇటీవల అకాల వర్షాలకు మరో దెబ్బపడినట్లయింది. ఇలా రకరకాల కారణాలతో ఈ ఏడాది మామిడి దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో సీజన్లో రోడ్ల వెంట, మార్కెట్లలో విరివిగా లభించే పచ్చడి మామిడికాయలు ఈసారి పెద్దగా అందుబాటులోకి రాలేదు. ప్రధానంగా పచ్చడి తయారీకి ఉపయోగించే చిన్న రసాలు, పెద్ద రసాలు, నాటు, జలాలు, తెల్ల గులాబీ వంటి రకాల కొరతతో డిమాండ్ నెలకొంది. ఏపీ నుంచి తీసుకొచ్చి... మార్కెట్లో చిన్న రసాలు రూ.30, తెల్ల గులాబీ, జలాలు వంటి రకాలు రూ.50 చొప్పు ధర పలుకుతున్నాయి. ఇక్కడ పెద్దగా దిగుబడి లేకపోవడంతో, జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట, ఏ కొండూరు, నూజివీడు తదితర మండలాల నుంచి వ్యాపారులు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. గతంలో ఒక్కో చిన్న రసం చెట్టుకు సుమారు వెయ్యి మామిడికాయలు కాసేవని.. ఈసారి తెగుళ్లు, అకాల వర్షాలతో ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇక కొన్ని మామిడికాయలకు మంగు రావడంతో పచ్చడి తయారీకి పనికి రావని కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా మిగిలిన కాయలకు డిమాండ్తో పాటు ధర పెరుగుతోంది. అదే బాటలో దినుసులు ఏడాది పాటు మామిడి పచ్చడి నిల్వ ఉండాలంటే నాణ్యమైన కాయలు ఎంచుకోవడమే కాక మేలు రకం దినుసులు ఎంచుకుంటారు. అయితే, ఈసారి సామగ్రి ధరలు కూడా మండిపోతున్నాయి. దీంతో పచ్చడి పెట్టకముందే మంట పుడుతుందని సామాన్యులు వాపోతున్నారు. చట్నీ పెట్టేందుకు కావాల్సిన నూనె, కారం, ఉప్పు, ఎల్లిపాయలు, ఆవాలు, మెంతుల ధరలు పెరిగాయి. పలు రకాల మిర్చి ధర తక్కువగా ఉన్నా పచ్చడి పెట్టే లావు రకాల మిర్చి ఎక్కువగానే ఉంది. ఈ మిర్చి కేజీ రూ.300 నుంచి రూ.600 వరకు పలుకుతుండగా.. కారం పట్టించడానికి కేజీకి రూ.40 వెచ్చించాల్సి వస్తోంది. మహిళలు బిజీబిజీ.. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బంధువులు, మిత్రులు ఒక చోటకు చేరి జాడీల కొద్ది పచ్చడి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇంకొందరు తమ బంధువులు, స్నేహితులు, ఇతర ప్రాంతాల్లో ఉండే పిల్ల లకు పంపించేందుకు మామిడికాయ పచ్చడి తయారుచేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా కారం మిల్లుల్లో రద్దీ ఉంటుండగా, పచ్చడి తయారీతో పలువురి ఇళ్లు కళకళలాడుతున్నాయి. పచ్చడి దినుసుల ధరలు సామగ్రి ధర (కేజీకి రూ.ల్లో) కారం 300 – 600 ఎల్లిపాయలు 200 శనగ నూనె 170 ఆవాలు 170 మెంతులు 180 నువ్వుల నూనె 410 అయినా తప్పడం లేదు.. ఏటా పచ్చడి పెట్టడం తప్పనిసరి. కూర చేయలేని రోజు, కూరగాయల ధరలు పెరిగినప్పుడు పచ్చడి తీసుకుని కూలీ పనులకు వెళ్తాం. ఈసారి పచ్చడికి ఉపయోగించే వస్తువుల ధరలు పెరిగినా తప్పడం లేదు. – కృష్ణవేణి, కూలీ, మధిర పిల్లలకు పంపించేందుకు... అమెరికా, హైదరాబాద్, ఖమ్మంలో ఉంటున్న పిల్లలకు ఏటా పచ్చడి పంపిస్తాం. కూరగాయలతో తినలేనప్పుడు పచ్చడి ఉయోగపడుతుంది. అందుకే ఏటా అందరికీ కలిపి మామిడికాయ పచ్చడి పెడతాం. – రమావత్ మారోనిబాయి, మధిర -
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు
తల్లాడ: రైతులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. తల్లాడ మండలం కుర్నవల్లిలో మంగళవారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించాక ఎంపీడీఓ కార్యాలయంలో మిల్లర్లతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 351 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇందులో హనుమకొండకు జిల్లాకు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించగా, ఆ జిల్లాకు ఇంకా 30వేల మెట్రిక్ టన్నులతో పాటు వరంగల్కు 20 వేల మెట్రిక్ టన్నులు తరలిస్తామని చెప్పారు. అయితే, కొనుగోలు కేంద్రాల్లో కాంటా కాగానే మిల్లులకు తరలించేలా లారీలు సమకూరుస్తున్నందున వేగం పెంచాలని సూచించారు. కాగా, కుర్నవల్లిలో 1638 రకం ధాన్యం 30 వేల బస్తాలు ఉన్నందన మిల్లు యజమానులు దిగుమతి చేసుకోవాలని తెలిపారు. ఎవరైనా తేమ, తాలు పేరుతో తరుగు తీస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షానికి ధాన్యం తడవకుండా 13 వేల టార్పాలిన్లు సరఫరా చేశామని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ చందన్కుమార్, డీఎం గంటా శ్రీలత, ఆర్డీఓ రాజేందర్ గౌడ్, తహసీల్ధార్ సురేష్కుమార్, ఆర్ఐలు కిరణ్, మొయినుద్దీన్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
శ్రీచైతన్య ప్రభంజనం
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యధిక మార్కులతో ప్రభంజనం సృష్టించారని శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. ఖమ్మం మమత రోడ్డులోని శ్రీచైతన్య ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించగా వారిని అభినందించి మాట్లాడారు. కాసిన జస్వంత్ 500 మార్కులకు 489 మార్కులు, కవితాచౌదరి 485, యశస్విత 484, సూర్యతేజ 483, సంహితరెడ్డి 480 మార్కులు సాధించగా, వంద శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏజీఎం చేతన్మాధూర్, కోఆర్డినేటర్ కృష్ణారావు, ప్రిన్సిపాళ్లు నాగప్రవీణ, టీ.ఎల్.ఎన్.శర్మ, సురేష్, డీన్ లక్ష్మీ నర్సింహ, ఇన్చార్జ్లు రాము, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు మెరుగైన బోధనే లక్ష్యం
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధన చేసేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఉపాధ్యాయులకు మూడు విడతలుగా ఇవ్వనున్న శిక్షణ మంగళవారం ఖమ్మంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల పిల్లలే ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నందున వారిని ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు. తాను ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఉపాధ్యాయులు విజయలక్ష్మి తీసుకున్న శ్రద్ధతో ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేసుకున్నారు. అలాగే, భవిత సెంటర్లలో అవసరమైన పరికరాలు సమకూరుస్తూ, దివ్యాంగ విద్యార్థులకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డీఈఓ ఎస్.సత్యనారాయణ, సీఎంఓ రాజశేఖర్, ఏఎంఓ రవికుమార్, ఎంఐఎస్ రామకృష్ణ, హార్వెస్ట్ కరస్పాండెంట్ రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి పాల్గొన్నారు. జూలై 15 తర్వాత పాడి పశువుల కొనుగోలు ఇందిరా మహిళా డెయిరీ పథకం ద్వారా జూలై 15 తర్వాత లబ్ధిదారులకు పాడి పశువులు కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. డెయిరీ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ జూలై 15నుంచి జనవరి వరకు 5వేల పాడి పశువుల యూనిట్లు గ్రౌండింగ్ చేయాలన్నారు. ఈ క్రమంలో పశువుల ఆరోగ్యం, ఇతర అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. డీఆర్డీఓ సన్యాసయ్య, బీసీ, ఎస్సీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు జి.జ్యోతి, నవీన్బాబు, డాక్టర్ పురంధర్, విజయలక్ష్మి పాల్గొన్నారు. మహిళా మార్ట్ నిర్వహణపై శిక్షణ ● ఖమ్మంమయూరిసెంటర్: మహిళా మార్ట్ను లాభాల బాటలో నడిపేలా మహిళా సంఘాల సభ్యులకు ఇప్పటికే శిక్షణ ఇప్పించామని కలెక్టర్ ముజమ్మిల్ తెలిపారు. ఖమ్మం సీక్వెల్ రోడ్డులో సిద్ధమవుతున్న మార్ట్ను పరిశీలించిన ఆయన మాట్లాడారు. సామగ్రి నిర్వహణ, భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీఆర్డీఓ ఆర్.సన్యాసయ్య, పీఆర్ ఈఈ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. దివ్యాంగులలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి ఉపాధ్యాయుల శిక్షణలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ -
ఎల్డబ్ల్యూఈ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత
● ఉమ్మడి జిల్లాలో మూడు పార్క్ల అభివృద్ధి ● అటవీ శాఖ అధికారులతో భేటీలో మంత్రి తుమ్మల ఖమ్మంవన్టౌన్: ఉమ్మడి జిల్లాలోని అటవీ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం, పార్క్ల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ సునీత, పీసీసీఎఫ్ సువర్ణతో హైదరాబాద్లో మంగళవారం సమావేశమైన ఆయన పలు సూచనలు చేశారు. ఇప్పటికే ఎల్డబ్ల్యూఈ నిధులతో అటవీ ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి అనుమతి జారీ చేయాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను కోరినట్లు తెలిపారు. ఇందులో భాగంగా అడవులను సంరక్షిస్తూనే ఉమ్మడి జిల్లాలో ఆరు రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పడమటి నర్సాపురం – అన్నారుపాడు, పాత అంజనాపురం – బేతంపూడి, కొమ్ముగూడెం – రాఘవాపురం, హేమచంద్రాపురం – జూబ్లీపురం గుట్ట, వెంకటాతండా – కుంట్ల, కొత్తపల్లి – ఏపీ సరిహద్దు వరకు రహదారులు నిర్మించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే, ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్, సత్తుపల్లి, తల్లాడ మండలం కనిగిరి హిల్స్ ఎకో టూరిజం, కొత్తగూడెంలో ఎకోపార్క్ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఇవికాక ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు ఆదాయం పెంచేలా ఉపాధి శిక్షణ ఇవ్వడంతో పరికరాలు సమకూర్చాలని, పోడు భూముల్లో వెదురుసాగుకు శ్రీకారం చుట్టాలని మంత్రి తెలిపారు. తద్వారా వారికి మెరుగైన ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. -
పాస్బుక్ కలిగిన రైతులందరికీ రిజిస్ట్రేషన్
కొణిజర్ల: పట్టాదారు పాస్బుక్ కలిగిన ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, తద్వారా కేంద్రప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. మండలంలోని తనికెళ్ల రైతు వేదికలో రైతుల రిజిస్ట్రేషన్ను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులు పాస్పుస్తకం, ఆధార్ కార్డు, ఆధార్కు అనుసంధానమైన నంబర్ కలిగిన ఫోన్తో ఏఈఓలను సంప్రదించాలని తెలిపారు. కాగా, దుక్కులు దున్నడానికి ఇదే అనువైన సమయమని, తద్వారా వర్షాలు కురవగానే భూమి గుల్లబారి విత్తనాలు నాటొచ్చని వెల్లడించారు. వైరా ఏడీఏ టి కరుణశ్రీ, ఏఓ బాలాజీ, ఏఈఓ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వైరారూరల్: అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా అదనపు సిబ్బంది, యంత్రాలను సమకూర్చుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. వైరా మండలంలోని భట్టి స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈసందర్భంగా వైరా నదికి కరకట్ట, చెక్ డ్యామ్, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో చేపడుతున్న పనులను పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. ఎమ్మెల్యే రాందాస్నాయక్, కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, శీలం వెంకటనర్సిరెడ్డి, నాయకులు దొడ్డా పుల్లయ్య, మల్లు రామకృష్ణ, పమ్మి అశోక్, వడ్డె నారాయణరావు తదితరులున్నారు. యంగ్ ఇండియా స్కూల్ స్థలానికి హద్దులు బోనకల్: బోనకల్ మండలంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలకు సంబంధించి స్థలం ఖరారైంది. ఈమేరకు 25ఎకరాల స్థలాన్ని గుర్తించగా సర్వే అనంతరం మంగళవారం జిల్లా సర్వేయర్ వెంకటరావు హద్దులు నిర్ధారించారు. తహసీల్దార్ పూనం చందర్, సర్వేయర్ కృష్ణయ్యతో కలిసి హద్దు రాళ్లు పాతారు. అయితే, పాఠశాల అవసరాలకు మరో ఐదెకరాల భూమి కూడా సేకరించనున్నట్లు తహసీల్దార్ చందర్ తెలిపారు. -
ఆర్టీసీ అభివృద్ధికి ప్రణాళికలు
ఇల్లెందు/చుంచుపల్లి: ప్రయాణికుల సహకారం, ఉద్యోగులు, సిబ్బంది సమష్టి కృషితో ఆర్టీసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని సంస్థ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలోమన్ తెలిపారు. ఇల్లెందు, కొత్తగూడెం బస్టాండ్లు, డిపోలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈడీ డిపోల్లో బస్సుల నిర్వహణ, సిబ్బంది పనితీరుపై ఆరా తీశాక మాట్లాడారు. ప్రయాణికుల అవసరాలు తీర్చడమే సంస్థ కర్తవ్యమని, అందులో భాగంగా ప్రతీ మారుమూల ప్రాంతానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. డిమాండ్ మేరకు కొత్త రూట్లను ఎంపిక చేసి, ఆదాయం పెంచుకోవాలని ఉద్యోగులకు సూచించారు. బస్టాండ్లలో తాగునీరు, పారిశుద్ధ్యం వంటి చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఇల్లెందు డిపోలో 25 బస్సులు ఉన్నాయని, నిత్యం 9,500 కిలోమీటర్లు ప్రయాణించడం ద్వారా రూ.5 లక్షల వరకు ఆదాయం సమకూరుతోందని అధికారులు ఆయనకు వివరించారు. కాగా, ఇల్లెందు బస్ స్టేషన్లో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు షాపులను తొలగించాల్సి వస్తోందని, వ్యాపారులకు ఇచ్చిన గడువు ముగిసినందున మిగిలిన షాపులను తామే కూల్చివేస్తామని ఈడీ ప్రకటించారు. అలాగే, ఇల్లెందు ఆర్టీసీ డిపోలో డీజిల్ బంక్ ఏర్పాటుచేసే వరకు బస్సులకు ఇంధనం సమకూర్చేలా ఏర్పాటుచేసిన మినీ డీజిల్ మినీ ట్యాంక్ను ఆయన పరిశీలించి నిర్వహణపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం రీజియన్ మేనేజర్ సరిరామ్, డీఎం దేవేందర్గౌడ్, డిప్యూటీ ఆర్ఎం మల్లయ్య పాల్గొన్నారు. కరీంనగర్ జోన్ ఈడీ సోలోమన్ -
బౌద్ధక్షేత్రం అభివృద్ధిపై దృష్టి సారించాలి
నేలకొండపల్లి: దక్షిణ భారతదేశంలో కెల్లా అతి పెద్దదైన నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం సరి కాదని సమతా సైనిక్తల్ దక్షిణ భారతదేశ అధ్యక్షుడు రేజర్ల రాజేష్ పేర్కొన్నారు. బౌద్ధక్షేత్రం వద్ద సోమవారం బుద్ధ జయంతి ఉత్సవలు నిర్వహించగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం నాగార్జునసాగర్ను అభివృద్ధి చేసిన విధంగా నేలకొండపల్లి క్షేత్రంపైనా దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది బుద్ధ జయంతి ఉత్సవాలను లక్షలాది మందితో ఇక్కడ నిర్వహించి, సీఎం రేవంత్రెడ్డిని అహ్వనిస్తామని తెలిపారు. కాగా, బుద్ధుడి మార్గాన్ని భవిష్యత్ తరాల వారికి అందించే బాధ్యత అందరూ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూఢనమ్మకాల నిర్మూలన సంస్థ వ్యవస్థాపకుడు బైరి నరేష్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పగిడికత్తుల ఈదయ్య, పెద్దపాక వెంకటి,రాజేశ్వరరావు, రవి, సంపత్, బాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు.సమతా సైనిక్ దక్షిణ భారత అధ్యక్షుడు రాజేష్ -
అదుపు తప్పిన కారు.. ఒకరికి గాయాలు
నేలకొండపల్లి: ఓ కారు అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్లగా తృటిలో ప్రమాదం తప్పింది. మండలంలోని అమ్మగూడెం మీదుగా వెళ్తున్న కారు సోమవారం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ముదిగొండ మండలం మాధాపురానికి చెందిన నాగిరెడ్డి నేలకొండపల్లి వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు దెబ్బతినగా నాగిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వడదెబ్బతో కూలీ మృతి పెనుబల్లి: వడదెబ్బ బారిన పడిన వృద్ధుడు మృతి చెందాడు. పెనుబల్లి ఎస్సీ కాలనీకి చెందిన దండు స్వామి(60) రోజు మాదిరిగానే సోమవారం కూలీ పనికి వెళ్లాడు. సాయంత్రం ముత్యాలమ్మ గుడివైపు నడిచి వెళ్తుండగా వడదెబ్బతో అపస్మారక స్థితికి చేరాడు. దీంతో స్థానికులు ఆయనను పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. ప్రేమ చూపడం లేదని మహిళ ఆత్మహత్య పెనుబల్లి: ఇంట్లో ఎవరూ తనతో ప్రేమగా ఉండడం లేదని మనస్తాపానికి గురైన మహిళ బలవన్మరణానికి పాల్పడింది. పెనుబల్లి బీసీ కాలనీకి చెందిన తోట అంజమ్మ(40) తనతో కుమారులు, కుటుంబీకులు ప్రేమగా ఉండటం లేదంటూ.. వారిని బెదిరించే క్రమంలో 20 బీపీ మాత్రలు మింగింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకపోగా, ఆలస్యంగా గమనించిన కుటుంబీకులు పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుండి ఖమ్మం ప్రభుత్వ ఆస్పకి తరలించగా అంజమ్మ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మానసిక స్థితి సరిగ్గా లేక... ఖమ్మంక్రైం: మానసికస్థితి సరిగ్గా లేని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మంలోని బోనకల్ క్రాస్ రోడ్డు ప్రాంతానికి చెందిన యనగండ్ల శ్యామ్కుమార్(21) సోమవారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన కుటుంబీకుల ఫిర్యాదుతో ఖమ్మం వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
అందుబాటులోకి పచ్చిరొట్ట విత్తనాలు
● ఉమ్మడి జిల్లాలో 4,422 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం ● 50 శాతం మేర సబ్సిడీతో విక్రయం ● పీఏసీఎస్లు, ఆగ్రో రైతుసేవా కేంద్రాల ద్వారా అమ్మకానికి ఏర్పాట్లుఖమ్మంవ్యవసాయం: వానాకాలం సీజన్ సమీపిస్తున్న వేళ ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఖమ్మం ప్రాంతీయ కార్యాలయం నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో రైతులు దుక్కులు చేస్తున్నారు. ఈ నేపథ్యాన భూసారం పెంపునకు పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట విత్తనాలు చల్లి ఆపై కలియదున్నడం ఆనవాయితీ. ఈక్రమంలోనే వ్యవసాయ శాఖ జీలుగు, పిల్లి పెసర, జనుము తదితర పచ్చిరొట్ట పైర్ల పెంకానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకు అనుగుణంగా విత్తనాభివృద్ది సంస్థ విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. వ్యవసాయ శాఖ ఇండెంట్ ఆధారంగా.. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల వ్యవసాయ శాఖ నుంచి అందిన ఇండెంట్ ఆధారంగా పచ్చిరొట్ట విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ సమకూరుస్తోంది. ఖమ్మం జిల్లాలో జీలుగు 14వేల క్వింటాళ్లు, జనుము 1,500 క్వింటాళ్లు, పిల్లిపెసర 150 క్వింటాళ్లు, భద్రాద్రి జిల్లాలో జీలుగు 5వేల క్వింటాళ్లు, జనుము 400 క్వింటాళ్లు, పిల్లి పెసర 50 క్వింటాళ్లకు కావాలని నివేదిక ఇచ్చారు. ఇందులో ఇప్పటివరకు జీలుగు 3,252 క్వింటాళ్లు, జనుము 1,170 క్వింటాళ్లు కలిపి 4,422 క్వింటాళ్ల విత్తనాలు తెప్పించారు. సబ్సిడీతో విక్రయాలు సహజసిద్ధమైన ఎరువు లభించేలా పచ్చిరొట్ట పంటల సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. విత్తనాలపై 50 శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తోంది. కిలో రూ.142.75 ధర ఉన్న జీలుగు విత్తనాలను రూ.71.25కు, రూ.125.50 ధర ఉన్న జనుము విత్తనాలను రూ.62.75కు, రూ.205.50 ధర ఉన్న పిల్లి పెసర విత్తనాలను రూ.102.50కు విక్రయిస్తారు. ఖమ్మం జిల్లాలోని 75 పీఏసీఎస్లు, 13 ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, రెండు టీజీఎస్డీఎల్, ఒక ట్రేడర్తో పాటు భద్రాద్రి జిల్లాలో 20 పీఏసీఎస్లు, ఏడు ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, ఒక ట్రేడర్ ద్వారా విత్తనాలను విక్రయానికి ఏర్పాట్లు చేశారు. విత్తనాల బ్యాగ్ పరిమాణం, ధరలు విత్తనంబ్యాగ్ (కిలోల్లో) ధర (రూ.ల్లో) జీలుగు 30 2,137.50 జనుము 40 2,510.00 పిల్లి పెసర 20 2,055.00 విత్తనాలు సిద్ధం.. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో వ్యవసాయ శాఖ ఇచ్చిన ఇండెంట్ ఆధారంగా పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తెప్పిస్తున్నాం. ఇప్పటికే చేరకున్న జీలుగు, జనుము విత్తనాలను నిర్దేశిత కేంద్రాలకు పంపించాం. 50 శాతం సబ్సిడీపై విక్రయించేలా పర్యవేక్షించనున్నాం. – ఎన్ బిక్షం, విత్తనాభివృద్ధి సంస్థ ప్రాంతీయ మేనేజర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా -
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఎర్రుపాలెం: వేగంగా వెళ్తున్న రైలు నుండి జారిపడిన గుర్తు తెలియని వ్యక్తి(45) మృతి చెందాడు. ఖమ్మం జీఆర్పీఎస్ఐ బి.రాణాప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం నుండి విజయవాడ వైపు వెళ్తున్న రైలు నుండి సదరు వ్యక్తి జారిపడగా తీవ్రగాయాలత మృతి చెందాడు. ఆయన వద్ద ఖమ్మం – విజయవాడ టికెట్ తప్ప ఇతర ఆధారాలు లభించలేదు. నలుపు, తెలుపు గళ్ల షర్ట్, బ్లాక్ పాయింట్ ధరించిన వ్యక్తి మృతదేహాన్ని మధిర ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 58589, 98481 14202 నంబర్లలో సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. రెండు కేజీల గంజాయి స్వాధీనం● ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కారేపల్లి: గంజాయితో వెళ్తున్న ఇద్దరిని కారేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాలు... ఇల్లెందుకు చెందిన వలిపెద్ది రాజ్కమల్, కొత్తగూడెంలోని చుంచుపల్లికి చెందిన కుంజా దిలీప్ చెరో కేజీ గంజాయి సంచులతో ఖమ్మం వెళ్లేందుకు సోమవారం కారేపల్లి వద్ద వేచి ఉన్నారు. ఈక్రమంలో సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి, ఎస్ఐ ఎన్.రాజారాం ఆ మార్గంలో వెళ్తుండగా పోలీసులను చూసిన రాజ్కమల్, దిలీప్ పరుగు పెట్టారు. దీంతో వెంబడించి పట్టుకోగా, రెండు కేజీల గంజాయి లభించింది. ఇల్లెందుకు చెందిన రాజ్కమల్ 2017లో సోలార్ ప్లాంట్ వద్ద జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు కాగా, బెయిల్పై వచ్చాక కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం దిలీప్తో కలిసి ఆయన గంజాయి తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ఐటీడీఏ పీఓ రాహుల్ భద్రాచలంటౌన్: అర్హులైన గిరిజనులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేస్తారని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ పోడు, వ్యక్తిగత భూములకు పట్టాలు, రైతుభరోసా, స్వయం ఉపాధి పథకాలకు రుణాలు, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స కోసం ఆర్థిక సాయం తదితర అవసరాల కోసం గిరిజనులు దరఖాస్తులు ఇచ్చారని తెలిపారు. వీటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. గిరిజన దర్బార్లో వచ్చిన అర్జీలన్నీ ఆన్లైన్లో ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, అర్హులకు విడతల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు చేపడతామని తెలిపారు. ఏపీఓ డేవిడ్ రాజ్, డీడీ మణెమ్మ, ఈఈ చంద్రశేఖర్, వివిధ విభాగాల అధికారులు అరుణకుమారి, రవీంద్రనాథ్, భాస్కరన్, వేణు, లక్ష్మీనారాయణ, ఉదయ్, నరేష్, ఆదినారాయణ, నారాయణరావు, హరికృష్ణ, లింగా నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం పర్యటించనున్నారు. మండల కేంద్రంలో రూ.22 కోట్లతో నిర్మించే 50 పడకల ఆస్పత్రి భవనం, రూ.2.62కోట్లతో కండ్రిక – పెద్ద గోపవరం బీటీ రోడ్డు పనులు, రూ.5.74 కోట్లతో నిర్మించే బనిగండ్లపాడు – బంజర బీటీ రోడ్డు నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. పంటల సాగులో మెళకువలపై అవగాహన వైరారూరల్: ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగామండలంలోని ఖానాపురం రైతు వేదికలో సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈసందర్బంగా వైరా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్ మాట్లాడుతు యూరియా వాడకం తగ్గింపు, తద్వారానేల ఆరోగ్య పరిరక్షణపై వివరించారు. అనంతరం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వి.చైతన్య, వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ వివిధ అంశాలపై మాట్లాడారు.ఏఓ మయాన్ మంజుఖాన్, తల్లాడ వెటర్నరీ వైద్యులు అనాస్, విత్తన అభివృద్ధి అధికారి అక్షిత, ఏఈఓలు సపావత్ సైదులు, ఆలూరి వాసంతి, వెంపటి కీర్తి, మేడా రాజేష్, పరిటాల వెంకటనర్సయ్యతో పాటు నల్లమల వెంకటేశ్వరరావు, షేక్ రఫీ, షేక్ లాల్ మహ్మద్, తుమ్మల రాణాప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించాలి మధిర: రైతులు పంటల్లో యూరియా వాడకాన్ని తగ్గించాలని మధిర వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త రుక్మిణిదేవి సూచించారు. మండలంలోని దెందుకూరు రైతువేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ సదస్సు సోమవారం నిర్వహించగా ఆమె మాట్లాడారు. యూరియా వాడకాన్ని తగ్గిస్తే ఖర్చు కూడా తగ్గుతుందని తెలిపారు. అంతేకాక మేలైన విత్తనాల ఎంపిక, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించి, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. మధిర ఏడీఏ విజయ్ చంద్ర, ఏఓ సాయిదీక్షిత్, ఏఈఓ ప్రవల్లిక, రైతులు పాల్గొన్నారు. పురాతన కాలం నాటి రాతిస్తంభం నేలకొండపల్లి: నేలకొండపల్లిలోని బౌద్ధస్థూపానికి సమీప పొలంలో కాకతీయుల కాలం నాటిదిగా పలకల రాతి స్తంభాన్ని గుర్తించారు. ఈ అంశంపై తెలంగాణ చరిత్ర బృందం కోకన్వీనర్ కట్టా శ్రీనివాస్, పసుమర్తి శ్రీనివాస్ సోమవారం వివరాలు వెల్లడించారు. భూమిపై రెండు అడుగుల ఎత్తు, అడుగున్నర వెడల్పు, ఎనిమిది అంగుళాల మందంతో ఉన్న రాతి ఫలకం బయటపడిందని తెలిపారు. దీనిపై డమరుకం, త్రిశూలంతో పాటు సూర్యచంద్రుల చిహ్నాలు ఉన్నాయని పేర్కొన్నారు. భూమి నుంచి పూర్తిగా వెలికితీసి పరిశీలిస్తే మరిన్ని ఆధారాలు లభించవచ్చని చెబుతున్నారు. సింగరేణి క్రికెట్ టోర్నీ విజేత బెల్లంపల్లి సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని జయశంకర్ గ్రౌండ్లో మూడు రోజులపాటు జరిగిన సింగరేణి ఎగ్జిక్యూటివ్ క్రికెట్ టోర్నీలో బెల్లంపల్లి రీజియన్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో కొత్తగూడెం జట్టుపై విజయం సాధించింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ (ఈ అండ్ ఎం) సత్యనారాయణరావు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళా విభాగంలో కొత్తగూడెం జట్టు విజేతగా నిలవగా, బెల్లంపల్లి టీమ్ రన్నర్గా నిలిచింది. ఈ కార్యక్రమంలో జీఎంలు ఎం.శాలేంరాజు, మనోహర్తోపాటు కోటిరెడ్డి, పాలడుగు శ్రీనివాస్ పాల్గొన్నారు. సమ్మెకు జాతీయ సంఘాల మద్దతు సింగరేణి(కొత్తగూడెం): ఈ నెల 20న జరిగే సమ్మెకు అన్ని జాతీయ కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని అఖిల పక్షం నాయకులు వెల్లడించారు. కొత్తగూడెం రుద్రంపూర్లోని ఏఐటీయూసీ కార్యాలయంలో సోమవారం జరిగినఅఖిలపక్ష సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. అన్ని సంఘాల మద్దతుతో సమ్మెను విజయవంతం చేస్తామని తెలిపారు. ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సీఐటీయూ, ఇఫ్టూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బాల్బ్యాడ్మింటన్కు కేరాఫ్గా..
● బోనకల్లో ఏటా వేసవిలో క్రీడా శిక్షణ శిబిరం ● 22 ఏళ్లుగా కోచ్ లింగయ్య ఆధ్వర్యాన నిర్వహణ ● జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఎంపికై న బాల్బ్యాడ్మింటన్ క్రీడాకారులు బోనకల్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో 22 ఏళ్లుగా వేసవిలో బాల్బ్యాడ్మింటన్ శిక్షణా శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ఎందరో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటారు. శిబిరాల నిర్వహణ, కఠోర శిక్షణలో కోచ్ అమిరేశి లింగయ్య కీలకంగా నిలుస్తూ క్రీడాకారులకు చేయూతనిస్తున్నారు. తొలుత యూత్ ద్వారా.. 1997లో బోనకల్లో శాంతి స్నేహా యూత్ను నెలకొల్పిన లింగయ్య బాల్బ్యాడ్మింటన్ క్రీడకు జీవం పోశాడు. కనుమరుగవుతున్న సంప్రదాయ క్రీడ అయిన బాల్బ్యాడ్మింటన్కు ఎలాంటి లాభాపేక్ష లేకుండా సుమారు 200 మంది క్రీడాకారులకు శిక్ష ణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధం చేశాడు. తద్వారా బాల్బ్యాడ్మింటన్ క్రీడకు కేరాఫ్గా బోనకల్ నిలుస్తోంది. దాతల సహాయ సహకారాలతో అనేకమంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇదే గ్రామంలో ఏటా పాఠశాల విద్యార్థులను సబ్జూనియర్, జూనియర్, సీనియర్ గ్రూప్లుగా విభజించి శిక్షణ ఇస్తున్నాడు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా మంచి ప్రావీణ్యత సంపాదించి ఉన్నత చదువులు చదివి స్సోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందడం విశేషం. ప్రస్తుతం 40 మంది.. ఈ ఏడాది 40 మంది క్రీడాకారులతో వేసవి శిక్షణా శిబిరం ప్రారంభమైంది. నెలపాటు ఈ శిక్షణా శిబి రం నిర్వహించనుండగా.. ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడాకారులకు ఆటలో మెళకువలు నేర్పుతూ నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారు. బోనకల్లో రెండు గురుకుల పాఠశాలలు, కస్తూర్బాగాంధీ పాఠ శాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్న త పాఠశాలలో విద్యార్థులు అధికంగా ఉండడంతో వేసవి శిక్షణా శిబిరం క్రీడాకారుల తో కళకళలాడుతోంది. అలాగే, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారులు కూడా ఈ శిక్షణా శిబిరంలోనే తర్ఫీదు పొందడం విశేషం. -
పర్యాటక ప్రాంతాలుగా అడవుల అభివృద్ధి
● ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ● నీలాద్రి అర్బన్పార్క్లో అభివృద్ధి పనులు ప్రారంభం సత్తుపల్లి: ఉమ్మడి జిల్లాలో అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడంపై అధికారులు దృష్టి సారించాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సూచించారు. సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్పార్క్లో ఫెడల్ బోటింగ్, లైబ్రరీ, ఆర్వో ప్లాంట్, ఎన్ఐఎఫ్ మిషన్, వీఎస్ఎస్ సభ్యులకు ఉపాధి యంత్రాలను సోమవారం ఆయన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆదిలాబాద్ సమీపంలోని తిప్పేశ్వరం అటవీ పార్క్ మాదిరి సత్తుపల్లి అర్బన్ పార్క్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చర్చించారని తెలిపారు. అలాగే, 14 వేల హెక్టార్లలో ఉన్న కనిగిరి గుట్టలను ఎకో టూరిజంలో భాగంగా అభివృద్ధి చేస్తే పర్యాటకుల రాక పెరుగుతుందని, ఆపై గిరిజనులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. కాగా, అటవీశాఖ వీఎస్ఎస్ సభ్యులకు ఉపాధి యంత్రాలను అందించడం అభినందనీయమన్నారు. ఇదే తరహాలో రాజీవ్ యువశక్తి పథకం ద్వారా యంత్రాల పంపిణీ, మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ అడవిపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం ఆనందదాయకమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఛీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డి.బీమానాయక్, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్, ఎఫ్డీఓ వాడపల్లి మంజుల, మున్సిపల్ కమిషనర్ కు.నర్సింహ, రేంజర్ ఉమ, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, దోమ ఆనంద్, గాదె చెన్నారావు, తోట సుజలరాణి, కమల్పాషా, దొడ్డా శ్రీనివాసరావు, వందనపు సత్యనారాయణ, మెప్మా టీఎంసీ సుజాత, దీపక్ రామాయణ్ తదితరులు పాల్గొన్నారు. -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం జరిపించాక స్వామి వారికి కంకణఽ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కమనీయం.. నృసింహ కల్యాణంశ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీనృసింహ స్వామి వారి తిరు కల్యాణ వేడుక వైశాఖ పౌర్ణమి సందర్భంగా సోమవారం కమనీయంగా జరిగింది. మొదట విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించిన అర్చకులు.. వేద మంత్రాల నడుమ కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
నర్సుల సేవలు వెలకట్టలేనివి..
ఖమ్మంవైద్యవిభాగం: ఆస్పత్రుల్లో నర్సుల సేవలు వెలకట్టలేనివని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.రాజేశ్వరరావు అన్నారు. ప్రపంచ నర్సింగ్ దినోత్సవాన్ని ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించారు. ఈసందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ ఎల్.కిరణ్కుమార్, ఆర్ఎంఓలు రాంబాబు, రాథోడ్ వినాయక్తో కలిసి ప్రిన్సిపాల్ కేక్ కట్ చేసి మాట్లాడారు. వ్యాధులతో బాధపడే వారికి స్వస్థత చేకూర్చడంలో వైద్యులతో సమానంగా నర్సులు విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. నర్సింగ్ సూపరింటెండెంట్లు శాంతకుమారి, ఇందిరమ్మతో పాటు రత్నకుమారి, జి.లక్ష్మి, ఎమేలియా మేరి, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. గిరిజన కళాశాలల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల జూని యర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పీఓ బి.రాహుల్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని కళాశాల్లో సీటభర్తీ కోసం ఈనెల 15న బాలికలకు, 16న బాలురకు స్పాట్ కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు. నిర్ణీత తేదీల్లో భద్రాచలంలోని గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఉదయం 9గంటలకు మొదలయ్యే కౌన్సెలింగ్కు 2024–25లో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 94909 57271, 94909 57270 నంబర్లలో సంప్రదించాలని పీఓ తెలిపారు. ఆన్లైన్లో వివరాలు తప్పనిసరి ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసీ అధికారులు పూర్తి వివరాలతో రికార్డులు నిర్వహించాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి ఆదేశించారు. ఆస్పత్రులు, సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఫార్మసీ ఆఫీసర్లకు కలెక్టరేట్లో సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ కుటుంబ నియంత్రణకు పంపిణీ చేసే మందులు, అవసరమైన స్టాక్ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. అలాగే, అర్హులైన దంపతులకు కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో స్టాటిస్టికల్ ఆఫీసర్ నవీన్, డెమో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు 25 శాతం రాయితీతో ఈనెల 31వరకు అవకాశం ఖమ్మంమయూరిసెంటర్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఫీజు చెల్లించే గడువును ప్రభుత్వం ఈనెల 31వ తేదీ వరకు పొడిగించింది. ఫీజు చెల్లింపులో 25 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ గడువు ఈనెల 3తో ముగియగా.. మరోసారి పెంచుతూ ప్రభుత్వ కార్యదర్శి కె.ఇలంబర్తి పేరిట సోమవారం ప్రకటన విడుదలైంది. దీంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు 25శాతం రాయితీ పొందేందుకు మరో అవకాశం లభించింది. తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీల నుండి ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పౌర రక్షణ వలంటీర్లుగా నమోదు చేసుకోవాలి ఖమ్మం రాపర్తినగర్: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన పౌర రక్షణ వలంటీర్లుగా నమోదుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నందున యువత సద్వినియోగం చేసుకోవాలని నెహ్రూ యువక కేంద్రం ఖమ్మం డిప్యూటీ డైరెక్టర్ సీహెచ్.అన్వేష్ సూచించారు. అత్యవసర పరిస్థితులు, సంక్షోభ సమయాల్లో కీలకపాత్ర పోషించే అవకాశమున్నందున యువత ముందుకు రావాలని సూచించారు. ప్రథమ చికిత్స, అత్యవసర సంరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, విపత్తు ప్రతిస్పందన, పునరావాస ప్రయత్నాల్లో తోడ్పాటులో యువతకు అవకాశం ఇవ్వున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వివరాల కోసం htpps// mybharat. gov. in లేదా 94913 83832 నంబర్లో సంప్రదించాలని డీడీ ఓ ప్రకటనలో సూచించారు. -
వాహనం కదలదు.. కల్తీ ఆగదు...
● రోడ్డెక్కని ఆహార తనిఖీ వాహనం ● అయినా ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్కు వేతనాలు ● జిల్లాలో కల్తీ ఆహారంపై కొరవడుతున్న నియంత్రణఖమ్మంమయూరిసెంటర్: ఆహారంలో నాణ్యత పరిశీలన, అక్కడికక్కడే తనిఖీలు చేపట్టేందుకు వినియోగించాల్సిన టెస్టింగ్ ల్యాబ్ వాహనం ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని చెత్త వాహనాల పార్కింగ్ స్థలానికే పరిమితమైంది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో తనిఖీలు, కల్తీ ఆహారంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.50 కోట్లతో ఈ వాహనాన్ని కేటాయించింది. ఖమ్మం కేంద్రంగా జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో దీన్ని వినియోగించాల్సి ఉండగా, నెలల తరబడి బయటకు తీయడం లేదు. అంతేకాక డ్రైవర్, టెక్నీషియన్కు నెలనెలా వేతనాలు ఇస్తుండడం గమనార్హం. అప్పుడప్పుడు.. గుర్తొచ్చినప్పుడే కల్తీ ఆహారం, కల్తీ పదార్థాలకు అడ్డుకట్ట వేసేలా కేంద్ర ప్రభుత్వం మైక్రో బయాలజీ ల్యాబ్ యూనిట్ కలిగిన స్పాట్ కల్తీ టెస్టింగ్ మొబైల్ వాహనాన్ని జిల్లాకు కేటాయించింది. 2022 జూలైలో ఈ వాహనం చేరుకోగా, ఇప్పటి వరకు అధికారులు సక్రమంగా వినియోగించలేదు. ఏటా ఒకసారి, లేదా అధికారులకు గుర్తుకొచ్చినప్పుడు బయటకు తీసి అదే రోజు మూలన పెడుతున్నారు. ఈ వాహనానికి కేటాయించిన డ్రైవర్, ల్యాబ్ టెక్నీషియన్కు మాత్రం నెలనెలా ప్రభుత్వం నుంచి వేతనాలు ఇస్తూ, వాహనం డ్రైవర్ను ఓ అధికారి తన సొంత వాహనానికి ఉపయోగించుకుంటున్నట్లు తెలిసింది. కల్తీని కనిపెట్టేలా.. కల్తీ ఆహారంపై ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు అందినప్పుడు అధికారులు మైక్రో బయాలజీ ల్యాబ్ యూనిట్ కలిగిన వాహనం ద్వారా క్షేత్రస్థాయికి చేరుకోవాలి. అక్కడికక్కడే అనుమానిత ఆహార పదార్థాలను తనిఖీ చేసి కల్తీని నిర్ధారించాల్సి ఉంటుంది. అంతేకాక ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేలా ఇందులోని ప్రొజెక్టర్లు, పిక్చర్ వాల్స్ వినియోగించాలి. వీటికి తోడు వ్యాపారులకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ మంజూరుకు కూడా అవకాశముంది. ఈ వాహనంలో జనరేటర్తో పాటు సేకరించిన శాంపిళ్లు చెడిపోకుండా ఆధునిక పరికరాలు, ఏసీలు ఏర్పాటు చేసినా కొన్ని పరికరాలు పని చేయడంలేదని తెలిసింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఈ వాహనాన్ని వినియోగించాల్సి ఉన్నా కనీసం ఖమ్మంలో ఫిర్యాదులు అందినప్పుడు కూడా పరీక్షలు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అవగాహన శూన్యం జిల్లాలో ఆహార కల్తీపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు కల్తీ ఆహారాన్ని పరీక్షించడంపై అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదు. అడపా దడపా హోటళ్లు, దుకాణాల్లో తనిఖీ చేస్తున్నా అవగాహన కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలమైనట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో కల్తీ ఆహారం వెలుగులోకి వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలనే అంశంపై ప్రజలకు తెలిచడం లేదు. ఈ విషయమై జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ను వివరణ కోరగా.. వాహనాన్ని తిప్పుతున్నామని, టెక్నీషియన్, డ్రైవర్లకు నెలనెలా వేతనాలు ఇస్తున్నామని చెప్పడం గమనార్హం. -
ప్రణాళికాయుతంగా భూసేకరణ
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ఖమ్మం సహకారనగర్: సీతారామ ఎత్తిపోతల పథకం, మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం తదితర పనులకు ప్రణాళికాయుతంగా భూసేకరణ చేపట్టాలని, తద్వారా అభివృద్ధి పనుల్లో వేగం పెరుగుతుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి భూసేకరణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల పథకానికి అటవీ భూమి ఎంత సేకరించాలో నివేదిక ఇస్తే ప్రత్యామ్నాయ భూముల్లో అటవీ పెంపకానికి చర్యలు తీసుకుంటామన్నారు. భూముల సర్వేను ఆధునిక యంత్రాలతో చేపట్టేలా నివేదిక ఇవ్వాలని సూచించారు. అలాగే, మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం, నిర్వాసితుల కోసం లేఔట్ కాలనీకి ఏర్పాటుకు భూమి సేకరించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు ప్రజలు ఇచ్చే ప్రతీ ఫిర్యాదు, వినతిపత్రాన్ని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు. భూసమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి అందిన భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పైలట్ మండలాలుగా ఎంపికై న మండలాలకు సంబంధించి జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భూ సమస్యలపై అందిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని, ఏదైనా దరఖాస్తు తిరస్కరిస్తే అందుకు కారణాలు తెలియజేయాలన్నారు. జిల్లా నుంచి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి వీసీలో పాల్గొనగా కలెక్టర్ మాట్లాడుతూ నేలకొండపల్లి మండలంలో 3,224 దరఖాస్తులు రాగా, వీటి పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. వారం నుంచి పది రోజుల్లో పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈసమావేశాల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.రాజేశ్వరి, డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య, ఆర్డీఓలు జి.నర్సింహారావు, ఎల్.రాజేందర్గౌడ్, ఇరిగేషన్ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రిటైనింగ్ వాల్తో శాశ్వత రక్షణ
ఖమ్మం అర్బన్/ఖమ్మం రూరల్: మున్నేరు నదీ పరీవాహక ప్రాంత ప్రజలు వరదలతో ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారానికి రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అధికారులతో కలిసి సోమవారం ఆయన నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. గత ఏడాది సెప్టెంబర్లో వచ్చిన వరదతో మున్నేరు పరీవాహక ప్రాంతంలో వేలాది కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇరువైపులా 17 కి.మీ. పొడవుతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇందుకోసం రూ.676 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు4,155 మీటర్ల ఎర్త్వర్క్, 3,495 మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కాగా, నిర్మాణంలో భూమి కోల్పోయే నిర్వాసితుల కోసం రివర్ ఫ్రంట్లోనే పోలేపల్లి వద్ద కాలనీ ఏర్పాటుచేసి ఇంటి స్థలాలు కేటాయిస్తామని మంత్రి ప్రకటించారు. అనంతరం జలగం నగర్, నాయుడుపేట వద్ద తీగల వంతెన నిర్మాణ పనులను మంత్రి పొంగులేటి పరిశీలించి నాణ్యతపై సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్, ఆర్అండ్బీ ఎస్ఈలు ఎం.వెంకటేశ్వర్లు, యాకూబ్, ఆర్డీఓ జి.నర్సింహారావు, వివిధ శాఖల అధికారులు యుగంధర్, వాణిశ్రీ, రంజిత్కుమార్, రమేష్రెడ్డి, పి.రాంప్రసాద్, అశోక్నాయక్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ – బీఆర్ఎస్ది ఉమ్మడి నాటకం.. ప్రజలను మభ్యపెట్టేందుకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఉమ్మడిగా నాటకానికి తెర లేపారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అప్పులపై ఓ పార్టీ నేతలు రాసిన స్క్రిప్ట్ను ఇంకో పార్టీ నేతలు బయటకు చెబుతున్నారని అన్నారు. రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించాక ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంపై రూ.8.19 లక్షల కోట్ల అప్పు ఉందనే విషయాన్ని అసెంబ్లీలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు వివరించారని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు హద్దు మీరి విమర్శలు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని, 90 శాతం పనులు చేశామని చెబుతూ, ఇంకా 40 శాతం మిగిలాయని వెల్లడించడం గర్హనీయమని పేర్కొన్నారు. నిర్వాసితుల కోసం ‘రివర్ ఫ్రంట్’ కాలనీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి మసీదుల అభివృద్ధికి నిధులు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మసీదుల అభివృద్ధి, మరమ్మతుల కోసం రూ.లక్ష చొప్పున 18 మసీదులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందజేశారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్తో కలిసి చెక్కులు అందజేశాక మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి డాక్టర్ బి.పురంధర్తో పాటు యాకూబ్పాషా, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా నృసింహుడి కల్యాణం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని స్వయంభూ శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం (గుట్ట)లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు మొదలుకాగా, స్వామి మూలవిరాట్కు 108 కలశాలతో అభిషేకం చేశారు. ఆతర్వాత స్వామిని అలంకరించి, తలంబ్రాలు కలిపారు. అనంతరం మధ్యాహ్నం సుదర్శన యాగం నిర్వహించారు. సాయంత్రం ముత్యాల తలంబ్రాల ఊరేగింపు, ఎదుర్కోలు ఉత్సవం తర్వాత రాత్రి 7గంటలకు అర్చకులు కల్యాణ క్రతువు జరిపించారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహనరావు, భక్తులు పాల్గొన్నారు. -
క్రీడలతో ఏకాగ్రత, శారీరక అభివృద్ధి
కొణిజర్ల: విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా ఏకాగ్రత పెరగడమే కాక శారీరక అభివృద్ధి సాధ్యమవుతుందని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి తెలిపారు. కొణిజర్ల మండలం తనికెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా సామగ్రి పంపిణీ చేసిన డీవైఎస్ఓ మాట్లాడారు. క్రీడలతో ఆరోగ్యకరమైన జీవన శైలి ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీలు శ్రీనివాస్, రంజాన్, ఉపాధ్యాయులు భాస్కర్రావు, గోపాలరావు, అచ్యుతరావు, రాంబాబు, లాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిప్పుల కుంపటిలా జిల్లా..
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపంతో జనం విలవిల్లాడుతున్నారు. దాదాపు జిల్లా అంతటా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో మధ్యాహ్నం వేళ రహదారులు బోసిపోతున్నాయి. ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై మధ్యాహ్నానికి తీవ్రరూపం దాలుస్తుండగా, సాయంత్రం దాటినా వేడి తగ్గడం లేదు. సోమవారం అత్యధికంగా వైరా(ఏఆర్ఎస్) వద్ద 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, పమ్మిలో 42.8, వైరా, ఉర్నవల్లి, తల్లాడలో 42.6, బాణాపురంలో 42.5, ఖమ్మం ఖానాపురంలో 42.3, ఎర్రు పాలెం, గౌరారం, చింతకానిలో 42.2, పెద్దగోపతి, నేలకొండపల్లిలో 42.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కల్లూరు, పెనుబల్లిలో 41.9, గంగారం, కొణిజర్లలో 41.8, పల్లెగూడెంలో 41.6, మధిర 41.4, ఖమ్మం ప్రకాష్నగర్, ఏన్కూరు, గుబ్బగుర్తిలో 41.3, బచ్చోడు 41.2, ఖమ్మం ఎన్ఎస్టీ గెస్ట్హౌస్, రఘునాథపాలెంలో 41.1, తిమ్మారావుపేట, కూసుమంచి, మంచుకొండలో 41, వేంసూరులో 40.9, గేటు కారేపల్లి, లింగాలలో 40.7, సత్తుపల్లి, ముదిగొండలలో 40.6, సిరిపురం, సత్తుపల్లి ఓసీల వద్ద 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు నివేదిక విడుదల చేశారు. మంగళవారం కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని తెలిపారు. వైరాలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత -
●‘న్యూవిజన్’కు ర్యాంకులు..
ఖమ్మం సహకారనగర్: న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్జీకే ప్రసాద్ మాట్లాడుతూ.. ర్యాంక్లు సాధించిన తమ విద్యార్థులు పి.సంహిత 102వ, ఎం.ఆకాంక్ష 109, ఆర్.శీతల్ 110, పి.ప్రణవ్ 168, ఆర్.షణ్ముఖ ప్రియ 171, డి.అనన్య 210, ఎ.రోషిక్ మణిదీపక్ 311, ఎం.రోహన్ శ్రీహరి 456, జి.కార్తీక్ సాయి 492, ఎం.వైష్ణవి 525, ఎన్.స్రవంత్ 534, పి.భవిష్య 583, పి.రోహిత్ 586, మిన్హాజ్ ఆరా 719, కె.జశ్వంత్ రామ్ 755, ఎన్.భార్గవ్ సాయి 844, ఎస్.మనస్వీక్ 1046, సీహెచ్.సాయికృష్ణ 1076, ఆర్.గుణదీప్ 1185, కె.మధురహాసిని 1230, బి.పియూష్ వర్థన్రాథోడ్ 1270, ఆర్.కౌశిక్ 1340, జి.లలనిక చౌదరి 1383, డి.నర్సింహాలక్ష్మి శ్రీనివాస్ 1430, ఈ.వేదసంహిత 1461, ఎం.విశ్వక్ 1514, షేక్.అంజుమ్ 1622, డి.ప్రణీత 1751, జి.అనుప్రియ 1756, సీహెచ్.శ్రీహాస్ 1757, ఎం.చరణ్వెంకట్ 1840, వి.విజయకాంత్ 1849, ఐ.శ్రీహిత 1860 ర్యాంక్లు సాధించారన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గోపిచంద్, అకడమిక్ డైరెక్టర్ సీహెచ్.కార్తీక్, ప్రిన్సిపాళ్లు బ్రహ్మచారి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ర్యాంకర్ల భవిష్యత్ ప్రణాళికలు..
ఐఐటీలో చదవాలని ఉంది.. హార్వెస్ట్ కాలేజీలో చదివిన నేను ఎప్సెట్లో 77వ ర్యాంక్ సాధించాను. ఐఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉంది. తల్లిదండ్రుల తోడ్పాటుతో పాటు పాఠశాల యాజమాన్యం సలహాలు, ప్రత్యేక శిక్షణతో ఈ విజయం సాధించగలిగాను. నాన్న అనిల్కుమార్ కిరాణ షాపు వ్యాపారి, తల్లి కల్యాణి గ్రహణిగా ఉన్నారు. – సాయిచరణ్, హార్వెస్ట్ విద్యార్థిసాఫ్ట్వేర్ కంపెనీ నెలకొల్పాలని.. ఎప్సెట్ ఫలితాల్లో నా తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం ప్రోత్సాహంతోనే రాష్ట్రస్థాయిలో 28వ ర్యాంక్ సాధించగలిగాను. ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ చదివి సాఫ్ట్వేర్ కంపెనీ నెలకొల్పాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాను. మాది వైరా. నాన్న మల్లిఖార్జున్రావు వస్త్ర వ్యాపారం చేస్తుండగా.. అమ్మ గృహిణిగా ఉన్నారు. – వి.కుషాల్, శ్రీచైతన్య విద్యార్థిని -
నల్లచట్టాలతో రైతులకు నష్టం
కొణిజర్ల : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్లచట్టాలతో రైతులు నష్టపోతున్నారని, వీటిని నిరసనగా రైతులతో పాటు కార్మికులు కూడా ఉద్యమిస్తున్నారని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. ఇటీవల భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో చర్చల ద్వారా సమస్య పరిష్కరించాలని కమ్యూనిస్టులు సూచిస్తే దేశ ద్రోహులుగా చిత్రకరించేందుకు కొందరు ప్రయత్నించారని ఆరోపించారు. మండలంలోని లాలాపురంలో సీపీఎం నాయకుడు సంక్రాంతి మధుసూదనరావు సంస్మరణ సభ ఆదివారం నిర్వహించగా రాఘవులు మాట్లాడారు. యుద్ధంతో తీవ్ర నష్టాలు ఉంటాయని, రెండు దేశాల మధ్య సయోధ్యతో యుద్ధాన్ని నివారించొచ్చని కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని పార్టీలన్నీ చెప్పాయన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కమ్యూనిస్టులు లేకపోతే దేశానికి భవిష్యత్ ఉండదనే చర్చ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతన్న ముఖ్యమంత్రే రూ.వేలకోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ తాను కాంగ్రెస్ వాదినైనా మధుసూదనరావు ఆలోచనా విధానాన్ని అవలంబించేవాడినని తెలిపారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్, సాయిబాబా, నున్నా నాగేశ్వరరావు, భూక్యా వీరభద్రం, బుగ్గవీటి సరళ, మాచర్ల భారతి తదితరులు పాల్గొన్నారు. సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు రాఘవులు -
●‘కృష్ణవేణి’ విజయఢంకా..
ఖమ్మం సహకారనగర్: కృష్ణవేణి కళాశాల డైరెక్టర్లు గొల్లపుడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. విజయఢంకా మోగించిన తమ విద్యార్థులు వై.గీతికాశ్రీ 297వ ర్యాంక్, పి.మణిచంద్రసాయి 558, టి.కోమలి 969, పి.సిరి మహాలక్ష్మి 974, కె.మహేష్బాబు 1899, బి.జ్యోత్స్న 2317, పి.భార్గవి 2387, ఎస్కె.అబ్దుల్ సమద్ 2548, కె.వైష్ణవి 3019, పి.యశస్వీ 3182, ఎస్కె.ఇర్ఫాన్ 3291, ఆర్.సీతారామకృష్ణ 4828, కె.హాసిని 4890, టి.దినేష్ 4924, కె.నవ్యశ్రీ 5411, కె.భావన 5439, డి.స్వప్నిక 5524, కె.కరుణశ్రీ 5556, కె.గ్యాన మహేశ్వర్ 5722, ఎస్.సాయి సంజన 6442, ఈ.సుహాస్ 6564, ఎ.సాయినిత్విక 6611, ఎస్కె.బుశ్ర 7053, మహాతేజ 7353, జి.పాల్ జాషువా 7728, పి.నిఖిలేష్ 7800, జి.ద్రోణితశ్రీ 8075, జి.రక్షిత 8175, ఎల్.నాగలక్ష్మి 8360, ఎండీ సామియాసామర్ 8538, ఎన్.వివేక్ 8779, బి.రోహిత్గని 8945, జి.అఖిల 8979, ఎ..భరత్ 9163, టి.కృష్ణవేణి 9514, జి.ప్రవీణ 9519, సృష్టి సాహు 9563, అనుమల భరత్ 9617, కె.మౌనిక 9714, ప్రశాంత్ 9718, రోహిత్ 9843వ ర్యాంక్ సాధించారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామచంద్రయ్య, అకడమిక్ డీన్ ఏలూరి వంశీకృష్ణ, ఏఓ నిరంజన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉద్దీపకం’తో సత్ఫలితాలు
● గతేడాది 3,4,5 తరగతుల విద్యార్థులకు పంపిణీ ● రానున్న ఏడాది 1, 2వ తరగతుల్లో అమలుకు ప్రణాళికలు ● ప్రాఽథమిక విద్య పటిష్టతపై పీఓ దృష్టిభద్రాచలం: భద్రాచలం ఐటీడీఏ పరిఽధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో, వసతి గృహాల్లో ప్రాథమిక విద్య పటిష్టతకు పీఓ చేపట్టిన ప్రయోగం ఫలించింది. గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో గిరిజన విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు ఉద్దీపకం అభ్యాసన పుస్తకాలు అందించారు. మెరుగైన ఫలితాలు కనిపించడంతో ఈయేడాది మిగతా తరగతులకు కూడా అందించాలని భావిస్తున్నారు. విద్యార్థుల్లో వెనుకబాటును గుర్తించి.. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో విద్యపై అవగాహన ఉన్న బి.రాహుల్ ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టాక ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించారు. గిరిజన విద్యార్థులతో మమేకమై వారి ప్రతిభా పాటవాలను పరిశీలించారు. ప్రాథమిక విద్యలో వారి వెనుకబాటుతనాన్ని గుర్తించారు. గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో కనీస పరిజ్ఞానం లేకపోవడంతో ప్రాథమిక విద్య పటిష్టతకు చర్యలు చేపట్టారు. పునాది బలపడేలా ‘ఉద్దీపకం’ ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల సామర్థ్యాలు బలంగా ఉండేందుకు ఉద్దీపకం పేరిట ప్రత్యేక అభ్యాసన పుస్తకాలను తీసుకొచ్చారు. ఇందుకోసం పీఎంఆర్సీ ఆధ్వర్యంలో నిపుణులైన ఉపాధ్యాయులతో ప్రత్యేక పుస్తకాలను సిద్ధం చేయించారు. తొలి విడతగా 3, 4, 5వ తరగతుల విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. గణితంలో కూడిక, తీసివేత, భాగహారం, హెచ్చివేతల ఆవశ్యకత, వాటిని సులువుగా వినియోగించటం, లెక్కల ప్రశ్నలను సులువుగా సాధించడం, ఉన్నత విద్యకు ప్రాథమిక స్థాయిలో గణితం పునాది, నిత్య జీవితంలో లెక్కలను వినియోగించడం వంటి అంశాలపై వర్క్షీట్లతో బుక్లను సిద్ధం చేయించారు. ఇంగ్లిష్లో గ్రామర్పై పట్టు, సులువుగా వాక్యాల కూర్పు, పద వినియోగం పెంపు, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ పెంచే విధంగా రూపొందించారు. ఇంగ్లిష్ నిర్భయంగా మాట్లాడేలా అవసరమైన ప్రాఽథమిక పరిజ్ఞానాన్ని ఈ వర్క్షీట్లలో పొందుపర్చారు. సత్ఫలితాలతో 1,2 తరగతులకు అమలు 2024లో పాఠశాలల ప్రారంభం సమయానికి వర్క్బుక్లను సిద్ధం చేయించి 3,4,5 తరగతుల విద్యార్థులకు అందించారు. ఆశ్రమ పాఠశాలలను సందర్శిస్తూ బోధనా తీరును పర్యవేక్షించారు. ఉద్దీపక పుస్తకాలతో సత్ఫలితాలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది 1, 2వ తరగతులకు కూడా ఉద్దీపనం పుస్తకాలు ఇవ్వాలని భావిస్తున్నారు. సబ్జెక్టు టీచర్లు, ప్రధానోపాధ్యాయులతో సమీక్షించి వర్క్షీట్లు సిద్ధం చేయాలని సూచించారు. తుది పరిశీలన అనంతరం ఆమోదించి పుస్తకాల రూపంలోకి తీసుకురానున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసి పాఠశాలల పునః ప్రారంభం సమయంలోనే పుస్తకాలు అందించాలనే కృతనిశ్చయంతో ఐటీడీఏ అధికారులు దృష్టి సారించారు. -
వేసవిలో పక్షులకు నీరందించాలి
ఖమ్మంవన్టౌన్ : వేసవి కాలంలో పక్షులకు నీరందించేందుకు జిల్లా అటవీ శాఖ వినూత్న ప్రయత్నం చేస్తోంది. ‘ఏ బౌల్ ఆఫ్ వాటర్.. సేవ్ వింగ్స్’ నినాదంతో పాటు సేవ్ ఫారెస్ట్–సేవ్ నేషన్, సేవ్ వాటర్–సేవ్ ప్లాంట్ వంటి పర్యావరణ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆదివారం ఖమ్మం లకారం ట్యాంక్బండ్ నుంచి వెలుగు మట్ల అర్బన్ పార్కు వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీపీ సునీల్దత్, డీఎఫ్ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. వేసవిలో పక్షుల దాహార్తి తీర్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. కాగా, ర్యాలీలో పాల్గొన్న సైకిల్ రైడర్లు.. పక్షులకు నీరందించే మట్టిగిన్నెలు కొనుగోలు చేసి అటవీ శాఖ సిబ్బందికి అందజేశారు. అంతేకాక ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన వన విజ్ఞాన్ సమ్మర్ క్యాంప్లో మొక్కల పెంపకం, ట్రెక్కింగ్, పర్యావరణ అవగాహన, సైక్లింగ్, యోగా తదితర కార్యక్రమాలు నిర్వహించారు. హాజరైన విద్యార్థులకు సీపీ,, డీఎఫ్ఓ, ఇతర సిబ్బంది ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఎఫ్డీఓ మంజుల, ఎఫ్ఆర్ఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.సీపీ సునీల్దత్, డీఎఫ్ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్ -
వృద్ధులపైకి దూసుకెళ్లిన కారు..
సత్తుపల్లిరూరల్: ఇంటి ముందు కూర్చున్న వృద్ధులపైకి ఓ కారు దూసుకెళ్లడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఆదివారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్లోని చింతలపూడి మండలం లింగగూడెంకు చెందిన నవవధువులు భద్రాద్రి రాములోరిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో బుగ్గపాడులో ఇంటి ముందు కూర్చున్న తాటి వీరమ్మ, గడ్డం చిన్నప్ప వృద్ధులను కారు అదుపు తప్పి ఢీ కొట్టింది. ఇరువురికి తీవ్ర గాయాలు కాగా వారిని 108లో సత్తుపల్లికి తరలించారు. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యమధిర: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం మాటూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మానుకొండ తిరుపతమ్మ (30) సుమారు పదేళ్ల క్రితం ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన స్కూల్ వ్యాన్ డ్రైవర్ శ్రీనివాసరావును కులాంతర వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో వారం రోజుల క్రితం తిరుపతమ్మ పుట్టింటికి వెళ్లగా.. పెద్ద మనుషుల సమక్షంలో ఆదివారం మాట్లాడుకునేందుకు భర్త, ఆయన తరఫు బంధువులు వస్తున్నారే విషయం తెలసుకున్న ఆమె మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మధిర రూరల్ ఎస్సై లక్ష్మీభార్గవి కేసు నమోదు చేసి మధిర ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వడదెబ్బతో వ్యక్తి మృతికారేపల్లి: కారేపల్లి భారత్నగర్ కాలనీకి చెందిన వేమూరి వెంకన్న(53) వడదెబ్బతో మృతి చెందాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన ఆదివారం ఎండ తీవ్రత తట్టుకోలేక వడదెబ్బతో మృత్యువాత పడ్డాడు. కాగా, మృతుడు సింగరేణి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వర్తించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఐదు పశువులు.. ముదిగొండ: ఖమ్మం–కోదాడ జాతీయ రహదారిపై ముదిగొండ, వెంకటాపురం గ్రామాల సమీపాన గుర్తు తెలియని వాహనాలు ఢీకొని ఆదివారం నాలుగు గేదెలు, ఒక దూడ మృతి చెందగా.. మరో గేదెకు గాయాలయ్యాయి. ఇవి ముదిగొండ, వెంకటాపురం గ్రామాలకు చెందిన రైతులు వినోద్బాబు, ఉపేందర్కు చెందిన గేదెలు కాగా గాయపడిన గేదెకు స్థానిక పశువైద్యసిబ్బంది వైద్య చికిత్స నిర్వహించారు. -
●‘రెజొనెన్స్’ విజయభేరి..
ఖమ్మం సహకారనగర్: రెజొనెన్స్ కళాశాలల డైరెక్టర్లు ఆర్వీ నాగేంద్రకుమార్, కె.శ్రీధర్రావు మాట్లాడుతూ.. విజయభేరి మోగించిన తమ విద్యార్థులు ఎ.జాహ్నవి 961వ ర్యాంక్, పి.బింధు 1364, బి.హాన్సిక 1842, కె.జశ్వంత్ 2135, ఎం.సుమంత్ 2615, ఎ.నంద 3016, ఎం.ప్రేమ్సాయి 4500, డి.హాన్సిక 5005, బి.ఈశ్వర్వెంకట్ 5034, బి.మాధవి 5855, ఐ.మణిదీప్ 6632, బి.ప్రసాద్ 7851, బి.భగత్ 8185, డి.ఉషశ్రీ 8268, జె.స్వాతి 8328వ ర్యాంక్లు సాధించారన్నారు. ప్రిన్సిపాళ్లు సతీష్, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
ఏజేఆర్ ఆటోమోటివ్స్ షోరూం ప్రారంభం
కరీంనగర్: కరీంనగర్ నగరంలోని విట్స్ కళాశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బుల్ కన్స్ట్రక్షన్స్ ఎక్విప్మెంట్ ఏజేఆర్ ఆటోమోటివ్స్ షోరూంను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బుల్ మిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సౌత్ జోన్ హెడ్ వి.సోమసుందరం, స్టేట్హెడ్ ఎన్.సురేశ్ బాబు, షోరూం డీలర్ అంబటి జోజిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. బుల్ కంపెనీకి సంబంధించి ఒక స్టాండర్డ్ పోర్ట్, స్టాండర్డ్ క్వాలిటీ, మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుందన్నారు. బుల్ కన్స్ట్రక్షన్స్ ఎక్విప్మెంట్ ద్వారా గంటకు లీటర్ డీజిల్ ఆదా చేయడం జరుగుతుందన్నారు. సర్వీస్ విషయంలోనూ 100శాతం క్వాలిటీ అందిస్తామని తెలిపారు. కాంట్రాక్టర్ జగ్గారెడ్డి, ఫాదర్ సంతోష్ పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
● జిల్లాలో మూడు విడతలుగా శిబిరాలుఖమ్మంసహకారనగర్: జిల్లాలోని ఉపాధ్యాయులకు మూడు విడతలుగా వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు డీఈఓ సామినేని సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలి విడత శిక్షణ మంగళవారం నుంచి ఈనెల 17 వరకు, రెండో విడత 20 నుంచి, మూడో విడత 27 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎస్ఏ ఇంగ్లిష్ టీచర్లు 326 మంది, గణితం 453, సోషల్ ఉపాధ్యాయులు 436 మంది, మండల రిసోర్స్ పర్సన్లు 168 మంది, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఐఆర్పీలు 62 మందికి ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. కాగా, కోర్సుల కో ఆర్డినేటర్లు, రిసోర్స్ పర్సన్లతో సోమవారం సంసిద్ధత సమావేశం ఏర్పాట్లు చేశామని తెలిపారు. శిక్షణ తరగతులకు ఎంపికై న ఉపాధ్యాయులంతా ఉదయం 9.30 గంటల లోపు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా జియోట్యా గ్డ్ హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని వివరించారు. వర్కింగ్ లంచ్, టిఫిన్, టీ శిక్షణ కేంద్రంలోనే అందజేస్తారని తెలిపారు. శిక్షణ పూర్తిచేసిన ఉపాధ్యాయులు ఆన్లైన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుని సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బోధించనున్న అంశాలివే.. ఐదు రోజుల శిక్షణ తరగతుల్లో కంటెంట్ ఎన్రిచ్మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ స్కిల్స్, లెర్నింగ్ ఔట్కమ్స్ వంటి అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. అరుణాచలంలో భద్రాద్రి జిల్లా యువకుడు మృతి● గిరిప్రదక్షిణ, దర్శనానంతరం గుండెపోటుజూలూరుపాడు: జూలూరుపాడుకు చెందిన యువకుడు తమిళనాడులోని అరుణాచలం క్షేత్రంలో గుండెపోటుతో ఆదివారం మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని పాపకొల్లు శ్రీ ఉమాసోమలింగేశ్వరస్వామి ఆలయ ప్రధానార్చకుడు తెలికిచెర్ల మధుకుమార్ శర్మ కుమారుడు రాకేష్ శర్మ(33) హైదరాబాద్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. ఈనెల 9న తల్లి భవానితో కలిసి అరుణాచలం పుణ్యక్షేత్రానికి వెళ్లారు. ఆదివారం అక్కడ గిరి ప్రదక్షిణ చేసి, స్వామివారి దర్శనానంతరం తిరిగి అద్దెకు తీసుకున్న రూమ్కు వెళ్లే క్రమంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఆనంద శ్వేత, మూడేళ్ల కూతురు, ఆరు నెలల కుమారుడు ఉన్నారు. కుమారుడికి ఇటీవలే పాపకొల్లు ఆలయంలో అన్నప్రాసన వేడుక నిర్వహించాక, భార్య.. పిల్లలను తీసుకుని పుట్టింటికి కాకినాడ వెళ్లింది. రాకేశ్ తల్లితో కలిసి దైవ దర్శనానికి వెళ్లగా, అక్కడే తుదిశ్వాస విడిచాడు. కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు మధుకుమార్ శర్మ అరుణాచలం బయలుదేరారు. సోమవారం సాయంత్రానికి జూలూరుపాడు చేరుకోనున్నారు. కాగా, మాతృ దినోత్సవం రోజునే పుత్రుడికి కోల్పోయిన తల్లి భవానీ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతడి మృతితో జూలూరుపాడు, పాపకొల్లు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. భార్య మరణాన్ని తట్టుకోలే ని భర్త.. కామేపల్లి: మండలంలోని ఊట్కూర్ గ్రామానికి చెందిన తాళ్లూరి చిన్న వెంకటరత్నమ్మ(75) రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మృతిని తట్టుకోలేక మనోవేదనకు గురైన ఆమె భర్త తాళ్లూరి సత్యమయ్య(85) ఆదివారం మృతి చెందాడు. రెండు రోజుల వ్యవధిలోనే వృద్ధ దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతదేహం గుర్తింపు ఖమ్మంక్రైం: నగరంలోని వన్టౌన్ పరిధిలో ఈ నెల 3న పురుగు మందు తాగి మృతిచెందిన ఓ వ్యక్తిని వన్టౌన్ పోలీసులు గుర్తించారు. సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ వెంకటగిరికి చెందిన ప్రభాకర్ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఈనెల 2న పాత బస్టాండ్ సమీపాన పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే మృతుడి చిత్రాన్ని సామాజిక మాద్యమాల్లో చూసిన కుటుంబసభ్యులు ఆదివారం గుర్తించి పోలీసులను ఆశ్రయించగా.. కొడుకు వినోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వైభవంగా నృసింహ జయంతి
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో స్వాతి నక్షత్రం సందర్భంగా ఆదివారం స్వామివారి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈఓ కొత్తూరు జగన్మోహన్ రావు పర్యవేక్షణలో తెల్లవారుజామున 5:30 గంటల నుంచే అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంప్రదాయయుతంగా సుదర్శన యాగం చేశారు. నయనానందకరంగా గిరి ప్రదక్షిణ.. భక్తజన సందోహం నడుమ ఖమ్మం నడిబొడ్డున ఉన్న స్తంభాద్రి గుట్ట చుట్టూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో నిర్వహించిన గిరి ప్రదక్షిణ నయనానందకరంగా సాగింది. పండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారిని పల్లకీలో ఊరేగిస్తూ గిరి ప్రదక్షణ చేశారు. అనంతరం గుట్టపై ఆలయం పక్కన నక్షత్ర జ్యోతి(దివ్యజ్యోతి)ని అర్చకులు వెలిగించగా దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆ సమయాన భక్తుల నృసింహ నామ స్మరణలతో ఆ ప్రాంతం మార్మోగింది. జయజయధ్వానాల నడుమ స్వామివారి గిరి ప్రదక్షిణ నక్షత్ర జ్యోతి దర్శనానికి పోటెత్తిన భక్తులు -
ఉద్యమకారులు అధైర్యపడొద్దు
ఖమ్మం మామిళ్లగూడెం : జిల్లాలోని తెలంగాణ ఉద్యమకారులు ఎవరూ అధైర్యపడొద్దని టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం నిర్వహించిన పార్టీ సదస్సులో ఆయన మాట్లాడారు. కేసీఆర్ చెప్పిన మోసపూరిత మాటల వల్లే నేడు ఆయన ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చిందన్నారు. కొట్లాడి సాధించిన రాష్ట్రంలో అసలైన ఉద్యమకారులను నేడు వెనక్కు నెట్టేశారని విమర్శించారు. ఎంతోమంది విద్యార్థులు, ప్రజల ఆత్మబలిదానాలతో సాధించిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే పెత్తనం చేసిందని అన్నారు. తనకు ప్రస్తుత ప్రభుత్వంలో అయినా కాస్త గుర్తింపు రావడంతో ఉద్యమకారుల పక్షాన శాసనమండలిలో మాట్లాడగలుతున్నామని చెప్పారు. ప్రతీ ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ దక్కిందన్నారు. సదస్సులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, పల్లె వినయ్కుమార్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి. కృష్ణారావు, నాయకులు పసుపులేటి నరసయ్య, మహబూబ్ బాషా, ప్రసాద్, అక్బర్, డేవిడ్, సయ్యద్ సలీంపాషా తదితరులు పాల్గొన్నారు. కాగా, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడిగా మధిర నియోజకవర్గానికి చెందిన షేక్ సర్దార్ హుస్సేన్ను నియమిస్తున్నట్లు కోదండరామ్ ప్రకటించారు. మీటర్ రీడింగ్ కార్మికుల వినతి.. రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు కోదండరామ్ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో సుమారు 2వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, విద్యుత్ సంస్థకు ఆదాయం సమకూరుస్తున్న తమకు సరైన న్యాయం జరగడం లేదని ఆయన దృష్టికి తెచ్చారు. పీస్రేట్ పద్ధతి కాకుండా నెలవారీ వేతనం ఇవ్వాల ని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించేలా చూడాలని కోరారు. నాయకులు వేమూరి వీరయ్య, నాగేశ్వరావు, అనిల్, మల్లేశ్వరరావు, వంశీ, నాగార్జు న, బాలు, నరేష్, నవీన్, మధు పాల్గొన్నారు. టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్ -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
తిరుమలాయపాలెం/ఖమ్మంవన్టౌన్ : రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణిలో సీసీ రోడ్లు, ఆదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. 11 గంటలకు ఎర్రగడ్డ, 11.30 గంటలకు మేడిదపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణానికి, మధ్యాహ్నం 12 గంటలకు గోపాయిగూడెంలో ఆదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 1.30 గంటలకు కూసుమంచి క్యాంపు ఆఫీస్ నుంచి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లాకు వెళతారు. రేపు పాలిసెట్ఖమ్మం సహకారనగర్: పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ – 2025 ఈనెల 13న జరగనుందని పాలిసెట్ కో ఆర్డినేటర్, ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ జాకిరుల్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష ఉంటుందని, ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాలలో 800 మంది, ఎస్బీఐటీలో 500, కవితా మెమోరియల్ డిగ్రీ కళాశాలలో 500, దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్ కళాశాలలో 500, డీఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో 504 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. ఎండల తీవ్రత దృష్ట్యా దూర ప్రాంత విద్యార్థులు ఉదయం 9 గంటల వరకు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్, ఆధార్ కార్డుతో పాటు, హెచ్బీ పెన్సిల్, బ్లూ/బ్లాక్ పెన్ తీసుకురావాలని తెలిపారు. పెరిగిన ఉష్ణోగ్రతలుఖమ్మంవ్యవసాయం: గత వారం ఉపరితల ద్రోణి కారణంగా తగ్గిన ఉష్ణోగ్రతలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతూ 11 గంటల వరకు తీవ్రరూపం దాల్చుతోంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. పలు రంగాల్లో పనిచేస్తున్న వారు ఉదయం 7 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటల వరకే ముగిస్తుండగా కొందరు ఉదయం, సాయింత్రం వేళల్లో పనులు చేస్తున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బాణాపురంలో 42.8 డిగ్రీలు, పమ్మిలో 42.7, పెనుబల్లిలో 42.6, కూసుమంచిలో 42.4, చింతకానిలో 42.1, నేలకొండపల్లిలో 42, గౌరారం, వైరా ఏఆర్ఎస్లో 41.7, తల్లాడ, గేటు కారేపల్లి, తిరుమలాయపాలెం, వైరా, కుర్నవల్లి, లింగాలలో 41.4, కల్లూరు 41.3, ఖమ్మం ప్రకాశ్నగర్, ముదిగొండలో 40.9, ఎర్రుపాలెం, పల్లెగూడెంలో 40.8, ఖమ్మం ఖానాపురం, వేంసూరులో 40.6, రఘునాథపాలెంలో 40.5, కాకరవాయి, కొణిజర్లలో 40.2, బచ్చోడులో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యల్పంగా సత్తుపల్లిలో 38.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు, ఉక్కపోతకు తోడు అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నేత్రపర్వంగా రామయ్య కల్యాణంభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్య కల్యాణ వేడుక ఆదివారం నేత్ర పర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణ వేడుకలోనూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కిన్నెరసానిలో పర్యాటకుల సందడి పాల్వంచరూరల్: కిన్నెరసానిలో పర్యాటకులు సందడి చేశారు. మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం పలు ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. డ్యామ్పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 406 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖ రూ.22,885 ఆదాయం లభించింది. -
ఎప్సెట్ ఫలితాల్లో ప్రైవేట్ హవా..
●‘శ్రీచైతన్య’ ప్రభంజనం.. ఖమ్మం సహకారనగర్: శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో ప్రభంజనం సృష్టించిన తమ విద్యార్థులు వి.కుషాల్ 28వ ర్యాంక్, వై.నిషాంత్ 61, డి.దుర్గాగుజిరి 222, ఎ.సాయితేజ 253, కె.విశావని వాగ్ధేవి 301, బి.రిషిత 321, ఆర్.జోష్ణవ్కుమార్ 334, కె.సాయిదివ్య వర్షిత 423, జి.సాయి ప్రణవి 491, కె.హాసిని 575, వి.ప్రణతి, కె.తేజశ్విని 653, బి.ఈశ్వర్ గుప్తా 855, యు.వశిష్ట 908, బి.మనిశేషు 968, డి.శ్రీలేఖ 1195, పి.స్మైలిక రెడ్డి 1262, కె.నిషాంత్ రెడ్డి 1394, ఎల్.మనోహర్ 1422, జి.అలేఖ్య 1482వ ర్యాంక్లు సాధించారన్నారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ బి.సాయిగీతిక, డీజీఎం సీహెచ్.చేతన్ మాదూర్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్ఆర్ఎస్డీ వర్మ, డీఎన్ జె.కృష్ణ, ఏజీఎంలు సీహెచ్.బ్రహ్మం, ప్రకాష్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ ప్రభుత్వం అగ్రికల్చర్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఆదివారం విడుదల చేసిన ఎప్సెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో ప్రతిభ కనబర్చినట్లు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఈమేరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ●‘హార్వెస్ట్’ హవా.. ఖమ్మం సహకారనగర్: హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డిలు మాట్లాడుతూ అగ్రశ్రేణి ర్యాంకులు సాధించిన తమ కళాశాల విద్యార్థులు బి.సాయిచరణ్ 77వ ర్యాంక్, బి.సిద్ధార్థ్ 193, ఎన్.రాఘవేంద్ర నవనీత్ 265, డి.శ్రీనివాస్ గౌతమ్రెడ్డి 336, ఎం.నాగయశ్వంత్ 448, ఆర్.వెంకటసాయివర్షిత్ 724, ఎన్సీహెచ్ యశ్వంత్ సాయి 958, జి.రాణి ఉమాఅలేఖ్య 120, టీడీవీఎస్ఎస్ నయమంజలి 161, బి.భార్గవి 202, ఎండీ అనిష ముస్కాన్ 232, సరోజ్ రాజ్ పురోహిత్ 384వ ర్యాంక్ సాధించారన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే ‘భూ భారతి’
బోనకల్: భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని గోవిందాపురం(ఎల్), కలకోట గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఆయన మాట్లాడారు. భూములపై రైతులకు జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ చట్టం ఉపకరిస్తుందన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్లో మార్పులు, చేర్పులు వంటి సేవలను భూభారతి చట్టంలో పొందుపర్చారని వివరించారు. హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందని, పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారం అవుతాయని తెలిపారు. భూమి హక్కులు ఎలా సంక్రమించినా మ్యుటేషన్ చేసి రికార్డుల్లో నమోదు చేయొచ్చని చెప్పారు. రైతులు తమకు న్యాయం జరగలేదని భావిస్తే రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుందని, మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చినా వాటిని తొలగించే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దుచేసే అధికారం ఉంటుందని అన్నారు. కాగా, భూ సమస్యల పరిష్కారానికి కలకోటలో 125, గోవిందాపురంలో 69 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో తహసీల్దార్ పున్నం చందర్, ఇన్చార్జ్ తహసీల్దార్ రాంబాబు, ఆర్ఐలు నవీన్, మైథిలీ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
ఏటీసీ.. అంతా రెడీ!
త్వరలో అందుబాటులోకి నూతన భవనం ● ఇప్పటికే అడ్వాన్స్ కోర్సుల పరికరాలు సిద్ధం ● కొత్తగా ఆరు కోర్సుల్లో బోధనకు అవకాశంఖమ్మంసహకారనగర్: విద్యార్థులకు మరింత ఉపయుక్తమైన కోర్సులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన కొన్ని ఐటీఐల్లో ఏటీసీ (అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కోర్సు)లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా టేకులపల్లి ఐటీఐలో ఏటీసీ ఏర్పాటుతోపాటు నూతన భవనాన్ని మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా.. కొత్తగా ప్రవేశపెడుతున్న కోర్సులకు సంబంధించిన పరికరాలు అమరుస్తున్నారు. 2024 – 25 విద్యా సంవత్సరంలో కళాశాల భవన నిర్మాణానికి రూ.4.77కోట్లు కేటాయించారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఐఐసీ)ద్వారా పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. అడ్వాన్స్ కోర్సుల కోసం.. రాష్ట్రంలో మొత్తం 65 ప్రభుత్వ ఐటీఐలు ఉండగా.. వాటిని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా తొలిదశలో హైదరాబాద్లోని మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ, నిజామాబాద్ ప్రభుత్వ ఐటీఐ, ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలను అప్గ్రేడ్ చేసింది. ఈ కోర్సులు ప్రవేశపెట్టడంతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగు కానున్నాయి. గతంలో 8 కోర్సులు ఉండగా.. ఏటీసీ ద్వారా కొత్తగా ఆరు కోర్సులు వచ్చాయి. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కొత్త కోర్సులకు రంగం సిద్ధం.. నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీసీలో మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోనబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్ (మెకానికల్), అడ్వాన్స్డ్ సీఎస్సీ మిషనింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్ కోర్సులు ప్రవేశపెట్టారు. ఈ కోర్సులను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు స్వయం ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయి. ఈ కోర్సులకు సంబంధించిన ప్రాక్టికల్స్ కోసం అవసరమైన పరికరాలను భవనంలో అమరుస్తున్నారు. దాదాపు ఏడు మిషనరీలను ఇక్కడ అమర్చారు. వీటి ద్వారా విద్యార్థులకు మరింత నాణ్యమైన బోధన అందనుంది. ఇదిలా ఉండగా ఈ నెలాఖరు వరకు భవనం పనులు పూర్తి చేసి ప్రారంభించనున్నారు. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ సిములేటర్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ఆటోమేషన్లో ఇండస్ట్రియల్ ఆటోమేషన్, సిములేటర్ తీరును వివరిస్తారు. పీఎల్సీ ప్రోగ్రామింగ్పై అవగాహన కల్పిస్తారు. పవర్ప్లాంట్ ఆపరేషన్ కంట్రోలింగ్, క్వాలిటీ, ప్రాసెస్ కంట్రోల్, న్యూమాటిక్స్, హైడ్రాలిక్స్, మెషిన్ ఆపరేషన్ కంట్రోలర్పైనా వివరిస్తారు. ఇండస్ట్రియల్ రోబోటిక్స్లో అడ్వాన్స్ వెల్డింగ్, టిగ్ వెల్డింగ్, మిగ్ వెల్డింగ్, ఏఆర్సీ, గ్యాస్ వెల్డింగ్తో పాటు రోబోలను వాడుకుని వస్తువులను షిఫ్ట్ చేయడం వంటివి నేర్పిస్తారు. మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్.. ఎలక్ట్రిక్ వెహికిల్ మెకానిజమ్ నేర్పిస్తారు. బ్యాటరీ నిర్వహణ, ట్రబుల్ షూటింగ్, వెహికిల్ సర్వీసింగ్, అసెంబుల్ ఎలక్ట్రిక్ వెహికిల్ కాంపోనెంట్స్, ఎలక్ట్రిక్ వెహికిల్ రిపేరింగ్పై శిక్షణ ఇస్తారు.సీఎన్సీ, వీఎంసీ మిషన్ మొదటగా సీఎన్సీ, వీఎంసీ మిషన్ ఏర్పాటు చేశారు. ఈ మిషన్పై గౌర్ కటింగ్, నట్, బోల్ట్ తయారీ, మెటల్ కటింగ్, ట్రిమ్మింగ్, టర్నింగ్, ఫేసింగ్, క్రాఫ్ట్, హస్తకళలు, శిల్పం, నమూనా, సీఏడీ సాఫ్ట్వేర్ డిజైనింగ్ తదితర వాటిని నేర్పిస్తారు.ఉద్యోగావకాశాలు సులువు రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐ కళాశాలలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయటం ద్వారా ఆరు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త కోర్సుల ద్వారా నూతన టెక్నాలజీతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సులభంగా లభించనున్నాయి. కోర్సులు, ట్రైనింగ్ పూర్తయిన వారికి టాటా గ్రూప్ వారే వారి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. దీని ద్వారా అనేక మంది విద్యార్థులకు ఉపాధి లభిస్తుంది. – ఎ.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, ఐటీఐ, ఖమ్మం -
నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం
● భారత సైన్యంలో ఉమ్మడి జిల్లా యువత ● కాల్పులు ఆగినా ఎప్పుడేం జరుగుతుందోనని తల్లడిల్లుతున్న కన్నపేగు ● మరోపక్క దేశ సేవలో తమ బిడ్డలు తరిస్తున్నారని సంతోషం ●పుత్రోత్సాహం ఇల్లెందురూరల్: ఇల్లెందు మండలం పోలారానికి చెందిన వల్లోజు లక్ష్మీనారాయణ ఆరేళ్ల క్రితం బీఎస్ఎఫ్ జవాన్గా ఎంపికయ్యాడు. ప్రత్యేక పరిస్థితుల్లో కొంతకాలంగా ఛత్తీస్గఢ్లో విధులు నిర్వర్తిస్తుండగా.. పాకిస్తాన్తో యుద్ధం మొదలుకాగానే మళ్లీ సరిహద్దులకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన తల్లి సమ్మక్క స్పందిస్తూ.. పాకిస్తాన్తో యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు టీవీలో చూస్తున్నానని తెలిపింది. దేశ రక్షణ విధుల్లో కుమారుడు ఉండడం తనలో పుత్రోత్సాహాన్ని నింపిందని, ఇది ఆనందంగానే కాక తమ కుటుంబమంతటికీ గర్వంగా ఉందని తెలిపింది. -
స్క్రాప్ దుకాణాల్లో మున్సిపాలిటీ సామగ్రి
వైరా: మున్సిపాలిటీ కార్యాలయ తాత్కాలిక సిబ్బంది కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపాలిటీలో పాడైన సామగ్రి పాత ఇనప సామాన్ల దుకాణంలో కనిపిస్తుండడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రెండు రోజుల కిందట పాత పంచాయతీ కార్యాలయంలో ఉన్న టన్నుల కొద్ది స్క్రాప్ను ఎవరి అనుమతులు లేకుండా మసీద్ కాంప్లెక్స్లోని ఓ పాత ఇనుప సామగ్రి దుకాణానికి తరలించినట్లు తెలిసింది. పాడైన ఫాగింగ్ మిషన్లు, పాత ఇనుప సామగ్రి, ప్లాస్టిక్ పైపులను టెండర్ ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. కానీ, అలాంటిదేమీ లేకుండా విక్రయించినట్లు సమాచారం. మున్సిపల్ పాలకవర్గం లేకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ చింతా వేణును వివరణ కోసం యత్నించగా ఆయన స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తున్నందున, ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
●35 ఏళ్లు వచ్చినా పసిపాపలా..
సింగరేణి(కొత్తగూడెం): 35 ఏళ్లు వచ్చిన బిడ్డను పసిపాపలా సాకుతోంది. దివ్యాంగురాలైన కూతురిని అన్నీ తానై పోషించుకుంటోంది. కొత్తగూడెం మధురబస్తీలో రైల్వే రిటైర్డ్ ఉద్యోగి పిండి జయరామ్, రాజమణెమ్మలకు నలుగురు కూతుళ్లు. ఇద్దరు సంపూర్ణ ఆర్యోగంతో జన్మించగా వారికి వివాహాలు చేశారు. మరో ఇద్దరు దివ్యాంగులు కిరణ్మయి, ప్రణతి. వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేరు. వాష్రూమ్కు వెళ్లాలన్నా తల్లితోడు అవసరం. ఇద్దరిని తల్లి రాజమణెమ్మ కంటికి రెప్పలా కాపాడింది. 2017లో కిరణ్మయి మృతి చెందింది. ప్రణతికి ప్రస్తుతం 35 ఏళ్లు. దివ్యాంగురాలు కావడంతో తల్లే అన్ని పనులు చేస్తోంది. -
గురునానక్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య
తల్లాడ: రెక్కాడితే గానీ డొక్క నిండని కుటుంబం.. దంపతులిద్దరూ బ్యాంకులో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ ఇద్దరు కుమార్తెలను కష్టపడి చదివిస్తున్నారు. ఇంతలోనే ఆ తల్లిదండ్రులు పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. తల్లాడ మండలం కుర్నవల్లికి చెందిన అయిలూరి శేషిరెడ్డి – కృష్ణకుమారి దంపతుల చిన్న కుమార్తె భావన (22) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ యూనివర్సిటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె శనివారం ఉదయం కళాశాల హాస్టల్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు కారణాలు తెలియరావాల్సి ఉండగా, విషయం తెలియగానే స్థానికంగా విషాదం నెలకొంది. కాగా, భావన 1 నుంచి పదో తరగతి వరకు కల్లూరు ప్రతిభ స్కూల్లో, ఇంటర్ ఖమ్మం శ్రీ చైతన్య కళాశాలలో ఉత్తమ మార్కులతో పూర్తిచేసింది. గురునానక్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా, మొదటి రెండేళ్లు మంచి మార్కులే సాధించింది. ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఈ విషయం తెలియగానే ఆమె తల్లిదండ్రుల కన్నీరుమున్నీరయ్యారు. ఎలుకల మందు తాగి వ్యక్తి.. ఖమ్మంరూరల్: మండలంలోని ముత్తగూడెంనకు చెందిన చెరుకుపల్లి నాగేశ్వరరావు (41) ఎలుకల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బాధ తట్టుకోలేక ఈనెల 9న ఇంట్లో ఎవరూ లేని సమయాన ఎలుకల మందు తాగాడు. అనంతరం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందగా, నాగేశ్వరరావు సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. కుర్నవల్లి గ్రామంలో విషాదం -
ఇటు తల్లిప్రేమ
అటు దేశ భ క్తి..భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత అందరికీ ఆందోళన కలిగించింది. యుద్ధం ఎన్నాళ్లు కొనసాగుతుందోనన్న ఆదుర్దా సామాన్యుల్లో ఉండగా, సరిహద్దు వద్ద సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న వారి కుటుంబాలను ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆవేదన వెంటాడింది. రెండు దేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ప్రకటించినా, మళ్లీ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయం సైనికుల కుటుంబాలను వీడడం లేదు. ఈనేపథ్యాన నేడు(ఆదివారం) అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న వారి తల్లులను పలకరించగా ఓ పక్క భయం.. ఇంకోవైపు ఆనందంవ్యక్తపరిచారు. తమ బిడ్డలు దేశసేవలో తరిస్తున్నారని సంతోషంగా ఉన్నా, యుద్ధం కారణంగా ఏం జరుగుతుందోననే ఆందోళన కూడా వారిలో కనిపించింది. అయితే, కన్నపేగుకు మించి తమ బిడ్డలు భారతమాత సేవలో ఉన్నారనే వారు హర్షం వ్యక్తం చేయడం విశేషం. -
●కష్టాలను ఎదురొడ్డి.. పిల్లలను తీర్చిదిద్ది..
బోనకల్: మండలంలోని ముష్టికుంట్లకు చెందిన చిట్టా అరుణకు ఇద్దరు కుమార్తెలు. 2006లో భర్త సీతారామిరెడ్డి మృతి చెందాడు. కూలి పనులు చేస్తూ జీవనం పోరాటం ప్రారంభించింది. ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి పూర్తి చేసింది. 2011లో కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఔట్సోర్సింగ్ విధానంలో నైట్ వాచ్వుమన్గా చేరింది. జీతం సరిపోక రాత్రి నైట్ వాచ్వుమెన్గా పనిచేస్తూ ఉదయం కూలి పనులకు వెళ్లింది. తల్లి కష్టాన్ని గమనించిన పిల్లలు గ్రీష్మా, సుష్మా ఉన్నత చదువులు పూర్తి చేశారు. గ్రీష్మా ఫిషరీస్ డిపార్ట్మెంట్లో, సుష్మా ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తోంది. భర్త చనిపోయినా అధైర్య పడకుండా ఇద్దరు కూతుళ్లను ఉన్నత చదువులు చదివించి అరుణ పలువురికి ఆదర్శంగా నిలిచింది. -
సంపద పేదలకు పంచితే అన్యాయమా?
మూడు రోజుల్లో మస్తానికుంటకు నీరుజిల్లా పెద్దాస్పత్రిపై ‘రెడ్బ్యాండ్’ ఖమ్మంవైద్యవిభాగం: భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యాన ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల భవనాల టాప్పై రెడ్బ్యాండ్ గుర్తు వేయిస్తోంది. ఇందులో భాగంగానే ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి స్లాబ్పైనా పెద్దసైజ్లో తెలుపు రంగు, ఆపై ఎరుపు రంగుతో క్రాస్ గుర్తు వేయించారు. ఈ గుర్తు వేయించడం ద్వారా యుద్ధ సమయాన విమానాలు, హెలికాప్టర్ల నుండి చూసినా కనిపిస్తుందని, ఈ గుర్తు ఉన్నవి ఆస్పత్రులుగా గుర్తించి శత్రుదేశాలు జెనీవా ఒప్పందం ప్రకారం దాడి చేయవని అధికారులు తెలిపారు.రఘునాథపాలెం: మండలంలోని సాగర్ ప్రధాన కాల్వపై నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా మూడు రోజుల్లో మసానికుంటకు నీరు విడుదల చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రఘునాథపాలెం మండలం గడ్డికుంట తండా వద్ద గ్రావిటీ–5 కాల్వ, బావోజీతండా వద్ద ఉన్న రేగులకుంట చెరువును శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మంచుకొండ ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్లో భాగంగా చెరువులకు నీరు విడుదల చేస్తున్నామని తెలిపారు. తద్వారా రేగులకుంట చెరువు నిండి అలుగు పారుతూ నల్లకుంట చెరువు, మల్లెపల్లికి చేరుతోందని చెప్పారు. మస్తానీకుంట, మంచుకొండకు కూడా మూడు రోజుల్లో నీరు చేరేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. రూ.66.33 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 2,400 ఎకరాల ఆయకట్టుకు సాగర్ జలాలు అందుతాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఆర్డీఓ జి.నర్సింహారావు, ఇరిగేషన్ ఈఈ అనన్య, డీఈ ఝాన్సీ, ఏడీఏ వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు తాతా రఘురాం, ఆత్మ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లుతో పాటు మానుకొండ రాధాకిషోర్, వాంకుడోత్ దీపక్, దేవ్సింగ్, నగేష్, రామ్మూర్తినాయక్, తదితరులు పాల్గొన్నారు. కాగా, అలుగుబారుతున్న రేగులకుంట చెరువు వద్ద మంత్రి పూజలు చేశారు.ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన మంత్రి -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్టౌన్/నేలకొండపల్లి/తల్లాడ: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. నేలకొండపల్లి మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం కార్పొరేషన్, తల్లాడ మండలాల్లో జరిగే పలు కార్యక్రమాలకు హాజరవుతారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి పర్యటించనున్న మంత్రి తల్లాడ పర్యటనలో భాగంగా పినపాకలో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, మిట్టపల్లిలో గ్యాస్ లీకేజీతో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగే కార్యక్రమాల్లోనూ మంత్రి పాల్గొననున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి పాటుపడదాం ఖమ్మంమామిళ్లగూడెం: జిల్లాలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణానికి కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలని పార్టీ జిల్లా సంఘటన సంరచన ప్రభారీ పొనుగోడు పాపారావు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ నేతృత్వాన కొనసాగుతున్న ఫ్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తోందని తెలిపారు. దేశ భద్రత, పౌరుల రక్షణే ధ్యేయంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకుని పార్టీ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలని, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. సమావేశంలో నాయకులు ఈవీ రమేశ్, సన్నే ఉదయ్ప్రతాప్, అల్లిక అంజయ్య తదితరులు పాల్గొన్నారు. వన విజ్ఞాన్ క్యాంప్లో బాలికలుఖమ్మంఅర్బన్: వేసవి సెలవుల నేపథ్యాన అటవీ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్లో 6 – 15 ఏళ్ల బాలబాలికల కోసం ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్సింగ్ నేతృత్వాన కొనసాగుతున్న ఈ శిబిరాన్ని బాలల సదనం బాలికలు సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్లోని వృక్షాలు, పక్షులపై అవగాహన కల్పించగా.. మొక్కల పెంపకం, కొబ్బరిబొండాల్లో తులసి మొక్కలు పెంచే విధానాన్ని సిబ్బంది వివరించారు. మొదటి విడత శిబిరం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉచితంగా నిర్వహించగా, వచ్చే వారం మొదలయ్యే శిబిరానికి పిల్లలు ముందుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎఫ్డీఓ మంజుల, ఎఫ్ఆర్ఓ జి.నాగేశ్వరరావు, ఎఫ్ఎస్ఓ రమేశ్, ఎఫ్బీఓలు జ్యోతి, నాగమణి, కవిత, ఖాజాబీ, ఎఫ్ఎస్ఓ కవిత పాల్గొన్నారు. మంటలు అంటుకుని వృద్ధురాలు మృతి సత్తుపల్లి: వరిగడ్డికి అంటుకున్న మంటలు ఎగిసిపడి ఓ వృద్ధురాలికి అంటుకుని మృతి చెందింది. మండలంలోని తుంబూరు గ్రామానికి చెందిన ఓరుగంటి నాగేశ్వరమ్మ(74) తన వరిపొలంలో శనివారం గడ్డి తొలగించినిప్పుపెట్టింది. అంతలోనే ఎండ తీవ్రతతోఆమె అస్వస్థతకు గురై పడిపోయింది. దీతో మంటలు ఎగిసిపడుతూ వచ్చి నాగేశ్వరమ్మకు అంటుకొని కాలిపోతుండగా గుర్తించిన సమీప రైతులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అంతా చేరుకుని మంటలుఆర్పేలోగా ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. -
●అమ్మ లాంటి దేశరక్షణలో..
తిరుమలాయపాలెం: మండలంలోని రమణతండాకు చెందిన రమావత్ రామచంద్రు – రాజమ్మ కుమారుడైన మూర్తిలాల్ పదిహేనేళ్లుగా భారత సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. సైన్యంలో చేరేటప్పుడు తల్లిదండ్రులు ఆందోళనకు గురైనా తల్లి లాంటి దేశ రక్షణ విధులకు వెళ్తున్నానని చెప్పడంతో అంగీకరించారు. ఈ సందర్భంగా రాజమ్మ మాట్లాడుతూ తన కుమారుడు తరచుగా ఫోన్ చేసి మాట్లాడతాడని తెలిపింది. ప్రస్తుతం విశాఖపట్నంలో విధులు నిర్వర్తిస్తున్నా యుద్ధం నేపథ్యాన ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలనే సమాచారం వచ్చిందని చెప్పాడని పేర్కొన్నారు. -
బామ్మకు వందేళ్ల జన్మదిన వేడుక
చింతకాని: సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని పిల్లలను పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. కానీ, మారుతున్న వాతావరణం, ఆహార అలవాట్లతో చాలా మందికి అది సాధ్యం కావడంలేదు. అయితే, వందేళ్లు వచ్చినా ఆరోగ్యంగా నాలుగు తరాల కుటుంబీకులతో జీవిస్తున్న ఓ బామ్మ తన శత పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంది. చింతకాని మండలం లచ్చగూడెంనకు చెందిన యలమద్ది సీతమ్మ వందో వేడుకలను ఆమె కుటుంబీకులు శనివారం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆమె ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో పాటు మనవలు, మనవరాళ్లు పాల్గొన్నారు. కాగా, సీతమ్మ ఇప్పటికీ ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా పనులు చేసుకుంటోందని తెలిపారు. ఎండు గంజాయి పట్టివేతఖమ్మంక్రైం: నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలో శనివారం 3.5 కేజీల ఎండు గంజాయిని ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. శివకుమార్, బబ్లు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ నుంచి హైదరాబాద్కు 3.5 కేజీల గంజాయిని తరలిస్తుండగా.. నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి గంజాయిని, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వైరాలో దొంగల హల్చల్ వైరా: వైరాలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వైరాలోని ఖమ్మం – సత్తుపల్లి జాతీయ రహదారి పక్కన మూడు దుకాణాలు, గాంధీచౌక్లోని రెండు సెల్ఫోన్ దుకాణాలతో పాటు ఓ బియ్యం దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. సెల్ఫోన్ దుకాణాల్లో 20 సెల్ఫోన్లు, బియ్యం దుకాణంలో రూ.5 వేల నగదు, సాయి ధనలక్ష్మి కిరాణంలో రూ.15 వేల నగదు ఎత్తుకెళ్లగా, మరో దుకాణం షట్టర్ పగలగొట్టారు. ఒకే రోజు ఆరు దుకాణాల్లో చోరీలు జరగడంతో స్థానిక వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫెన్సింగ్ రాళ్ల ధ్వంసంపై కేసుచింతకాని: రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన కుతుంబాక గోపిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగుల్మీరా తెలిపారు. ఖమ్మం కవిరాజ్నగర్కు చెందిన ఉయ్యాల సత్యంకు చింతకాని మండలం వందనం రెవెన్యూలో 5.14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి చుట్టూ ఈ నెల 1వ తేదీన రాళ్లతో ఫెన్సింగ్ వేయగా, గోపి ధ్వంసం చేశాడు. ఘటనపై సత్యం శనివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చీటింగ్ కేసు నమోదుదమ్మపేట: అధికారుల సంతకాల ఫోర్జరీతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి అక్రమంగా భూబదిలీ చేయించుకున్న ఘటనలో ఓ మహిళపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. మండలంలోని మందలపల్లికి చెందిన తూముల ఈశ్వరమ్మ అదే గ్రామానికి చెందిన సాయిల వీరవెంకయ్య బతికుండగానే మృతి చెందినట్టుగా నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించింది. ఇందుకోసం అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయించింది. వీర వెంకయ్య కుటుంబంలో తాను కూడా ఓ కుటుంబ సభ్యురాలిగా మరో నకిలీ ధ్రువీకరణ పత్రం సృష్టించింది. ఈ ఫోర్జరీ పత్రాలను దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించి వీర వెంకయ్య పేరు మీద ఉన్న రెండు ఎకరాల 21 కుంటల భూమిని వారసత్వం ద్వారా గతేడాది మే 22న తన పేరున పట్టా చేయించుకుంది. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపారు. -
● రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ● దొరల పాలన కోసం దోపిడీదారులు ఏకమవుతున్నారు... ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
అశ్వారావుపేట : రాష్ట్రంలో సంపద సృష్టించి పేదల కు పంచడం అన్యాయమా అని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో రూ.40 కోట్లతో నిర్మించనున్న ఆరు విద్యుత్ సబ్స్టేషన్ పనులకు శనివారం స్థానిక పామాయిల్ ఫ్యాక్టరీ ఆవరణలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ‘దొరల పాలన కోసం దోపిడీదారులు ఏకమవుతున్నారు.. తస్మాత్ జాగ్రత్త..’ అంటూ హెచ్చరించారు. ప్రజల వద్ద డబ్బు లాగి దోపిడీ చేసేందుకు తాము అధికారంలోకి రాలేదని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రజలను జలగల్లా పీల్చేసిందని, కేసీఆర్ అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సభలు నిర్వహిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. గడిచిన పదేళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా.. అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు గోదావరిలో పోశారని ఆరోపించారు. రూ.7లక్షల కోట్ల అప్పు తమ ప్రభుత్వంపై వేసినా, సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయడం లేదన్నారు. గిరిజనుల వ్యవసాయం కోసం రూ.12,500 కోట్లతో ఇందిర జల వికాస్ పథకం ప్రవేశపెడుతున్నామని, ఈనెల 18న నాగర్కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని, అదేరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందని తెలిపారు. ఈ పథకంలో గిరిజన రైతులకు సోలార్, డ్రిప్, ఉద్యాన మొక్కలు ఉచితంగా అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పేదల కళ్లలో ఆనందం చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ప్రతీ తండా, గ్రామానికీ నాణ్యమైన విద్యుత్ అందించామని, ఇప్పుడు మరింత మెరుగైన సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే, మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఐటీడీఏ పరిఽధిలో కోటాకు మించి ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎమెల్యేలు ఆది నారాయణ, తెల్లం వెంకట్రావు, రాందాస్ నాయక్, ఐడీసీ, గిడ్డంగుల సంస్థ చైర్మన్లు మువ్వా విజ య్బాబు, రాయల నాగేశ్వరరా వు, భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్ పాల్గొన్నారు. -
శ్రీవారికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం జరిపించారు. ఆతర్వాత శ్రీవారు, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి తెలంగాణ, ఏపీ నుంచి వేలాదిగా హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం నిర్వహించారు. అనంతరం శ్రీవారికి పల్లకీ సేవ జరిగింది. ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్శర్మ, మురళీమోహన్శర్మ, ఉద్యోగులు పాల్గొన్నారు. స్తంభాద్రి ఆలయంలో సుదర్శన యాగం ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం(గుట్ట)లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ సుదర్శన యాగం నిర్వహించారు. ఉదయం ప్రాత:కాలార్చన, పానకాభిషేకం, విశేష పూజలు, బాలభోగ నివేదన అనంతరం పండితులు ప్రత్యేకంగా రుణ విమోచన యోగంగా సంప్రదాయ పద్ధతుల్లో యాగం ప్రారంభించారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు పర్యవేక్షణలో పూజలు జరుగుతుండగా, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా, లక్ష్మీనర్సింహస్వామి జన్మనక్షత్రం సందర్భంగా ఆదివారం సాయంత్రం గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు ఈఓ తెలిపారు. కొండపై ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తులను బయటకు తీసుకొచ్చి, కొండ చుట్టూ మాడవీధుల్లో గిరి ప్రదక్షిణం చేస్తారని, ఆతర్వాత కొండపై అర్చకులు నక్షత్ర జ్యోతిని వెలిగించనున్నారని ఈఓ వెల్లడించారు. -
కర్ణాటకలో సత్తా చాటిన ఖమ్మం విద్యార్థిని
ఖమ్మంసహకారనగర్: కర్ణాటక రాష్ట్రం బెల్గాం నగరంలోని ఏ.ఎం.షేక్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో ఖమ్మం నగరానికి చెందిన తుమ్మలపల్లి చరిత అత్యధిక మార్కులతో బీహెచ్ఎంఎస్ పూర్తిచేసింది. యూనివర్సిటీ టాపర్గా నిలిచిన ఆమె బంగారు పతకం సాధించడమే కాక ప్రతిష్టాత్మక డాక్టర్ బత్రాస్ స్కాలర్షిప్నకు ఎంపికై ందని కుటుంబీకులు తెలిపారు. తాజాగా జరిగిన గ్రాడ్యుయేషన్ డేలో రాజీవ్గాంధీ హెల్త్ యూనివర్సిటీ హోమి యోపతి డీన్ డాక్టర్ సహిదా ఎ.శిరసాంగి చేతుల మీదుగా పట్టా, బంగారు పతకం అందుకుందని వెల్లడించారు. తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు చిన్న కుమార్తె అయిన చరిత బీహెచ్ఎంఎస్లో చేరిన కొన్నాళ్లకే రామారావు మృతి చెందారు. అయినా బాధ దిగమింగుకుని నాలుగేళ్ల కోర్సులో ఏటా మొదటి ర్యాంకు సాధిస్తూ చివరికి బంగారు పతకం సాధించడంపై పలువురు అభినందించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ డేకు హాజరైన చరిత తల్లి విజయలక్ష్మి, కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, తన తండ్రి రామారావు కోరిక మేరకు పేద ప్రజలకు వైద్య సేవలందిస్తానని చరిత వెల్లడించింది. బీహెచ్ఎంఎస్లో టాపర్గా బంగారు పతకం -
●సైనికుడి తల్లిగా గర్విస్తున్నా..
కారేపల్లి: దేశం కోసం, ఇక్కడి ప్రజల కోసం పాక్తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటున్న తన కుమారుడిని చూస్తే గర్వంగా ఉందని కారేపల్లికి చెందిన ఎస్.కే.నూర్జహాన్ వెల్లడించింది. నూర్జహాన్, మునీరుద్దీన్ కుమారుడైన యాకూబ్పాషా 2016లో సైన్యంలో చేరాడు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్లోని లడక్లోనే విధులు నిర్వర్తిస్తున్నాడు. యుద్ధం నేపథ్యాన ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోన ఉన్నప్పటికీ.. తన కుమారుడు దేశం తరఫున పోరాడుతున్న గర్వం ఉందని నూర్జహాన్ తెలిపారు. క్షేమ సమాచారం తెలుసుకుంటున్నట్లు వెల్లడించింది. -
ఆపరేషన్ సిందూర్కు కేఎంసీ మద్దతు
దేశ రక్షణనిధికి విరాళంగా నెల వేతనంఖమ్మంమయూరిసెంటర్: భారత ఆర్మీ తలపెట్టిన ఆపరేషన్ సిందూర్కు ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గం మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా మేయర్ పునుకొల్లు నీరజ ఆధ్వర్యాన కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగులు శనివారం ప్రదర్శన నిర్వహించారు. కేఎంసీ కార్యాలయం నుండి ఆర్టీఓ ఆఫీస్ సిగ్నల్ వరకు ప్రదర్శనగా వెళ్లి మానవహారంగా ఏర్పడి సైన్యానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో పాక్ దాడులను భారత సైనం తిప్పికొడుతూ ప్రజల రక్షణకు పాటుపడుతున్నందున ప్రతిఒక్కరు సంఘీభావం తెలపాలని కోరారు. కాగా, దేశ రక్షణనిధికి తనతో పాటు కార్పొరేటర్ల నెల వేతనం రూ.4లక్షల మేర విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ మేయర్ ఫాతిమ జోహరా, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, బీ.జీ.క్లెమెంట్, రాపర్తి శరత్, దండ జ్యోతిరెడ్డి, గజ్జల లక్ష్మీవెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
●ధైర్యంగా పంపించా...
కూసుమంచి: కూసుమంచి మండలం గోరీలపాడు తండాకు చెందిన బానోతు దస్మి ఇద్దరు కుమారులు భాస్కర్, ప్రసాద్ సైన్యంలో పని చేస్తున్నారు. భాస్కర్ కేరళలో, ప్రసాద్ చైన్నెలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల దస్మీకి ఆరోగ్యం బాగా లేకపోతే భాస్కర్ స్వస్థలానికి వచ్చాడు. ఇంతలో ఫోన్ రాగానే.. భాస్కర్ బయలుదేరాడు. ‘నాకు ఆరోగ్యం బాగా లేకున్నా.. దేశసేవ కోసం వెళ్లాల్సి రావడంతో భాస్కర్ను ధైర్యంగా పంపించా’ అని దస్మీ వెల్లడించింది. కొడుకు దేశం పోరాడుతుంటే, తండా వాళ్లంతా తనకు అండగా ఉన్నారని దస్మీ వెల్లడించింది. -
●అమ్మ ప్రోత్సాహంతో జేఎల్గా..
కరకగూడెం: భర్త చనిపోయినా మనోధైర్యం కోల్పోకుండా ఓ మహిళ తన కూతురిని ఉన్నత శిఖరాలకు చేర్చింది. అమ్మ కష్టం వృథా కాకుండా కూతురు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన మలకం వెంకన్న – సరోజన దంపతులకు రెండో సంతానం రమాదేవి. రమాదేవి ఒకటో తరగతి నుంచి బీఈడీ వరకు గురుకుల విద్యాసంస్థలో చదువుకుంది. కేయూలో ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఎంఏ ఆంగ్లం పూర్తి చేసింది. ఇంటర్లో ఉన్నప్పుడు తండ్రి చనిపోయా డు. అప్పటి నుంచి తల్లి ప్రోత్సాహంతో చదువులో ముందుకు సాగింది. గు రుకుల ఉద్యోగాల్లో జేఎల్ ఇంగ్లిష్, పీజీ టీ ఇంగ్లిష్, టీజీటీ ఇంగ్లిష్, టీజీటీ మ్యాథమెటిక్స్ ఉద్యోగాలకు ఎంపికై పలువురికి అదర్శంగా నిలిచింది. -
●అటు భయం.. ఇటు గర్వం
సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెంలోని రామవరానికి చెందిన దాచేపల్లి ఖాదర్రాజు –యజ్ఞకుమారి కుమారుడైన ఉదయ్కుమార్ జమ్మూలో మేజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. జవాన్గా చేరి మేజర్ స్థాయికి ఎదిగారు. ఆయన భార్య లక్ష్మీసత్య, ఏడాది కుమార్తె కూడా జమ్మూలోనే ఉండగా, వారి నివాసాని కి సమీపంలో బాంబులు పడ్డాయని సమాచారం ఇచ్చారు. ఉదయ్ తల్లి యజ్ఞకుమారి మాట్లాడుతూ ఇప్పుడు భయంగా ఉన్నా.. దేశ రక్షణలో కుమారుడు భాగస్వామ్యమైనందుకు గర్వంగా ఉందని తెలిపారు. దేశం కోసం దేనికై నా సిద్ధమేనని చెబుతాడని వెల్లడించారు. -
రూ.70 లక్షల లంచం డిమాండ్
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం అర్బన్/వైరా: ట్యాక్స్ అప్పీళ్లపై అనుకూల నిర్ణయం తీసుకునేందు రూ.70 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై నమోదైన కేసులో సీబీఐ అధికారులు హైదరాబాద్లోని ఇన్కమ్ట్యాక్స్ (ఎక్సెంప్షన్స్) కమిషనర్, వైరా మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ కుమారుడు జీవన్లాల్ లవిడియా సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కమిషనర్ తరఫున లంచం స్వీకరిస్తుండగా ముంబైలో ఒక మధ్యవర్తిని సీబీఐ శుక్రవారం ఉచ్చు వేసి పట్టుకుంది. సీబీఐ అధికారులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలో మధ్యవర్తిని అరెస్ట్ చేసిన తర్వాత పలు ప్రాంతాల్లో మరికొందరిని అరెస్టు చేశారు. మధ్యవర్తి అరెస్టు సందర్భంగా సేకరించిన సమాచారం మేరకు సీబీఐ అధికారులు ముంబై, హైదరాబాద్, ఖమ్మం, విశాఖపట్నం, ఢిల్లీలో 18 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో లంచం మొత్తంతో పాటు, రూ.69 లక్షల నగదు, పలు పత్రాలు స్వా«దీనం చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మం పాండురంగాపురంలోని మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ నివాసంలోనూ శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు 50మందితో కూడిన సీబీఐ అధికారుల బృందం తనిఖీ చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి శుక్రవారం కమిషనర్ జీవన్లాల్ సహా 14 మందిపై కేసు నమోదు చేయగా, ఇప్పటివరకు జీవన్లాల్ లవిడియాతోపాటు శ్రీరామ్ పలిశెట్టి (శ్రీకాకుళం), నట్టా వీర నాగ శ్రీరామ్ గోపాల్ (విశాఖపట్నం), ముంబైకి చెందిన విరల్ కాంతిలాల్ మెహతా, సాజిద మజ్హర్ హుస్సేన్ షాలను అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వారు చెప్పారు. -
ఒక ఓటుకు ఐదేళ్ల శిక్ష!
సత్తుపల్లి: ‘రాష్ట్రమంతా బర్బాద్ అయింది.. ఏమైనా ఉపాయం ఉంటే ఆలోచించండి అన్నా అని ఓ ఆటోడ్రైవర్ ఈ మధ్య సిగ్నల్ దగ్గర నన్ను గుర్తుపట్టి అడిగారు.. ఒక ఓటుకు ఐదేళ్ల శిక్ష.. తప్పు పార్టీకి ఓటేస్తే అనుభవించాలి కదా.. రీకాల్ వ్యవస్థ మనకు లేదు..’అని చెప్పానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల శేషగిరిరావు కాంస్య విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు.ఇటువంటి దుర్మార్గులు అధికారంలోకి వస్తారని ప్రపంచ మేధావి బీఆర్ అంబేడ్కర్ ఊహించక పోవడంతోనే వారిని ఐదేళ్లూ భరించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ నుంచి కేసీఆర్ వరకు పలువురు సీఎంలను చూసిన తాను, రేవంత్రెడ్డి వంటి దివాలాకోరు సీఎంను మాత్రం చూడలేదని పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్తే తమ మాటలు నమ్మడం లేదని, దొంగల్లా చూస్తున్నారని, అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆశీర్వదించండి ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని కేసీఆర్ మీటింగ్లు పెట్టి మరీ చెప్పారని.. మోసపోతే గోస పడతామని చెప్పినా ప్రజలు వినకపోవడం వల్లే మోసకారి ప్రభుత్వం వచ్చిందని కేటీఆర్ అన్నారు. ప్రజలకు అండగా ఉంటున్న బీఆర్ఎస్ పార్టీని భవిష్యత్ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని సూచించారు. తొలుత పహల్గాం మృతులతో పాటు యుద్ధంలో అమరులైన జవాన్లకు కేటీఆర్ సహా నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. -
మీ భూమిలో సారం ఎంత?
● మట్టి నమూనాలతో భూసార పరీక్షలు ● తగిన జాగ్రత్తలతో కచ్చితమైన ఫలితాలు ● రైతులకు వైరా కేవీకే కోర్డినేటర్, శాస్త్రవేత్తల సలహాలువైరా: నేలల్లో సహజంంగా ఉండే పోషక పదార్థాలకు తోడు రైతులు అదనంగా వేసే సేంద్రియ, రసాయన ఎరువులు పంట దిగుబడి పెరిగేందుకు దోహదం చేస్తాయి. అయితే, ఏ నేలలో ఎంత మోతాదులో సారం ఉంది, అక్కడ ఏయే పంటలు సాగు చేయొచ్చు, సాగు సమయాన ఏ మేర ఎరువులు ఉపయోగించాలో తెలియాలంటే మట్టి నమూనాల పరీక్షలు చేయించడం తప్పనిసరి. ఈ పరీక్షల ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా సరిపడా మాత్రమే ఎరువులు వాడితే రైతులకు భారం తగ్గడమే కాక నేల తల్లిని కాపాడుకున్నట్లవుతుంది. ఈనేపథ్యాన మట్టి పరీక్షల కోసం నమూనాల సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై వైరా కృషి విజ్ఞాన కేంద్రం కోర్డినేటర్ కె.రవికుమార్, శాస్త్రవేత్తలు ఫణిశ్రీ, చైతన్య రైతులకు ఇచ్చిన సూచనలు ఇలా ఉన్నాయి. ప్రయోజనాలు పొలంలో ముఖ్య పోషక పదార్థాలైన నత్రజని, భాస్వరం, పోటాష్ ఏ మోతాదులో ఉన్నాయో పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే, సూక్ష్మపోషక పదార్థాలైన జింక్, మెగ్నిషియం వంటివి ఏ మోతాదులో ఉన్నాయో తెలుసుకుని లోపాలు ఉంటే సరిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుంది. సాగుకు అనువుగా లేని ఆమ్లా భూములు, చౌడు భూములను గుర్తించవచ్చు. పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులను సరిపడా మోతాదులో వాడడం వల్ల రైతులకు వ్యయం తగ్గుతుంది. మెళకువలు తప్పనిసరి మట్టి ఆరబెట్టడానికి రసాయన, సేంద్రియ ఎరువుల సంచులను వాడొద్దు. చెట్ల కింద ఉన్న పొలం భాగం నుంచి మట్టి తీయొద్దు. ఎరువు కుప్పలు వేసిన చోట, ఎప్పుడు నీరు నిలిచే పల్లపు ప్రాంతంలోని మట్టి కూడా పనికిరాదు. పొలంలో అక్కడక్కడ చౌడు ఉన్నట్లు అనుమానిస్తే ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా నమునాలు సేకరించాలి. తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కోసం పంపాలి. -
కదం తొక్కిన జర్నలిస్టులు
ఖమ్మంమయూరిసెంటర్: ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో ఏపీ ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడాన్ని జర్నలిస్టు సంఘాల నాయకులు ముక్తకంఠంతో ఖండించారు. ఎలాంటి నోటీసులు లేకుండానే విజయవాడలోని ఎడిటర్ ఇంట్లోకి ప్రవేశించడం ద్వారా ఏపీ ప్రభుత్వం జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యాన ఖమ్మంలో జెడ్పీ కార్యాలయం నుంచి డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జర్నలిజంపై ముప్పేట దాడి టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన జర్నలిస్టు వ్యవస్థపై తెలుగు రాష్ట్రాల్లో దాడి జరుగుతోందన్నారు. పాలకులు వారికి అనుకూలంగా మాత్రమే వార్తలు రాయాలని కోరుకుంటుండడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని తెలిపారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లోకి పోలీసులు అక్రమంగా జొరబడడం గర్హనీయమన్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛను ప్రభుత్వాలు హరిస్తున్నాయన్నారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరగడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై జరిగిన దాడికి ఏపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విజయవాడలోని సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై ఏపీ పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాలకులు ప్రజామన్ననలు చూరగొనేలా పాలించాలే తప్ప వారికి వ్యతిరేక వార్తలు రాశారని జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం అత్యంత హేయనీయమని తెలిపారు. పత్రికా, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా ఇలాంటి దాడులు చేయడాన్ని తమ యూనియన్ ఖండిస్తోందన్నారు. టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, బాధ్యులు గుద్దేటి రమేష్, కొరకొప్పుల రాంబాబు, యలమంద జగదీష్, టీఎస్ చక్రవర్తి, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) నగర అధ్యక్ష, కార్యదర్శులు మైసా పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాస్, బాధ్యులు మొయినుద్దీన్, శివానంద, టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, ఆవుల శ్రీనివాస్, కూరాకుల గోపి, వేగినాటి మాధవరావు, మహిళా ప్రతినిధులు మధుశ్రీ, వంగూరి ఈశ్వరి, జర్నలిస్టులు మారెడ్డి నాగేందర్రెడ్డి, పి.సత్యనారాయణ, ‘సాక్షి’ బ్రాంచ్ మేనేజర్ మోహన్కృష్ణ, టీవీ ప్రతినిధి పి.మహేందర్కుమార్, ఏసీఎం శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ నిరసనకు ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇటికాల రామకృష్ణ, వంగూరి వెంకటేష్ తదితరులు సంఘీభావం తెలిపారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో సోదాలపై నిరసన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అక్కడి పోలీసుల తీరుపై ఆగ్రహం -
రండి.. డిగ్రీలో చేరండి
‘దోస్త్’ రిజిస్ట్రేషన్లు ప్రారంభం ● ఈనెల 21వరకు మొదటి విడత.. ● ఆతర్వాత మరో రెండు విడతలు కూడా.. ● ఉమ్మడి జిల్లాలోని 11 ప్రభుత్వ కాలేజీల్లో 5,820 సీట్లుఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్ కోర్సుల్లో విద్యార్థులు ఆ వైపు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అయితే, కాలం మారుతున్నా వన్నె తగ్గని డిగ్రీ కోర్సుల్లోనూ చేరేందుకు ఇంకొందరు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రభుత్వం ఏటా మాదిరిగానే డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ద్వారా రిజిస్ట్రేషన్ల షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే మొదటి విడతల షెడ్యూల్ అమల్లో ఉన్న నేపథ్యాన ఉమ్మడి జిల్లాలో డిగ్రీ కళాశాలలు, సీట్లు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వివరాలపై కథనం 2వ తేదీన నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం షెడ్యుల్ను ఈనెల 2వ తేదీన విడుదల చేసింది. ఈనెల 3వ తేదీ నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు మొదలుకాగా, డిగ్రీ బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీబీఎం తదితర కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్థులు నేరుగా దోస్త్ వెబ్సైట్లోనే కాక మీ సేవ, దోస్త్ యాప్, ఆన్లైన్ సర్వీసెస్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మూడు విడతలుగా కొనసాగే ప్రవేశాల ప్రక్రియ కోసం విద్యార్థులు తమకు ఇష్టమైన కళాశాల, కోర్సును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఖమ్మం జిల్లాలో ఐదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలే కాక పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి. మూడు విడతల్లో ఇలా... ●‘దోస్త్’మొదటి విడత రిజిస్ట్రేషన్ ఈనెల 3వ తేదీన మొదలుకాగా, 21వ తేదీ వరకు రూ.200 రుసుంతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 10నుంచి 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశముండగా, 29వ తేదీన మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. ఆయా విద్యార్థులు ఈనెల 30నుంచి జూన్ 6తేదీ వరకు కళాశాలల్లో రిపోర్టింగ్ చేసి నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ● రెండో విడత రిజిస్ట్రేషన్కు రూ.400 ఫీజు చెల్లించాలి. ఈనెల 30నుంచి జూన్ 8వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండగా, ఈనెల 30నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకుంటే అదే నెల 13న సీట్లు కేటాయిస్తారు. ఈ విడతలో సీట్లు దక్కిన విద్యార్థులు వచ్చే నెల 13 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించాలి. ● మూడో విడత రిజిస్ట్రేషన్లోనూ రూ.400 ఫీజుతో వచ్చే నెల 23న ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేరోజు నుంచి వచ్చేనెల 28వ తేదీ వరకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కాగా, 1, 2, 3 విడతల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులంతా జూన్ 24 నుంచి 28వ తేదీల్లో ఆయా కళాశాలల్లో జరిగే ఓరిఝెంటేషన్ కార్యక్రమాల్లో పాల్గొని, 30న ప్రారంభమయ్యే తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్కు ఏమేం కావాలి? ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ సమయాన ఇంటర్ ద్వితీయ సంవత్సరం హాల్టికెట్ నంబర్, ఆధార్కార్డు జిరాక్స్, ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నంబర్, ఎస్సెస్సీ, ఇంటర్ మెమోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు 6నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఇంటర్ టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాస్పోర్టు సైజ్ ఫొటో కూడా సమర్పించాలి.ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, సీట్ల సంఖ్య కళాశాల సీట్లు ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్, ఖమ్మం 1,560 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఖమ్మం 480 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మధిర 300 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నేలకొండపల్లి 300 జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సత్తుపల్లి 480 శ్రీరామచంద్ర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కొత్తగూడెం 360 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాల్వంచ 660 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భద్రాచలం 780 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇల్లెందు 300 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మణుగూరు 360 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అశ్వారావుపేట 240సద్వినియోగం చేసుకోవాలి డిగ్రీలో ప్రవేశాల కోసం విద్యార్థులు ‘దోస్త్’వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మూడు విడతలుగా అవకాశం ఉంటుంది. ఆన్లైన్లోనే నచ్చిన కాలేజీ, కోర్సును ఎంచుకోవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ఎం.డీ.సలీంపాషా, దోస్త్ కో ఆర్డినేటర్, ఖమ్మం -
‘సీతారామ’తో జిల్లా సస్యశ్యామలం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లిటౌన్: గోదావరి జలాల ఆధారంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సత్తుపల్లి మండలం యాతాలకుంటలో సీతారామ ప్రాజెక్ట్ ట్రంక్ టన్నెల్ పనులను శుక్రవారం ఆయన ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు ముజమ్మిల్ఖాన్, జితేష్ వి.పాటిల్, సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి, జారె ఆదినారాయణతో కలిసి పరిశీలించారు. సీతారామ మెయిన్ కెనాల్, మూడు పంప్హౌస్లను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించుకున్నామని తెలిపారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వచ్చే వర్షాకాలానికి వైరా ప్రాజెక్టు, పినపాక నియోజకవర్గంలోని తుమ్మలపల్లి వద్ద మారేడుపాక ఎత్తిపోతల పథకం, కొత్తగూడెం నియోజకవర్గంలో సింగభూపాలెం ద్వారా నీరు వదలాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. నాలుగు నెలల్లో ట్రంక్ నిర్మాణం సత్తుపల్లి ట్రంక్ టన్నెల్లో మిగిలిన 1.2 కి.మీ. పనులు నాలుగు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తద్వారా సత్తుపల్లి, పినపాక, మధిర, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాలకు సాగునీరు అందించవచ్చని, వైరా రిజర్వాయర్ కింద లక్షా 30వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. అప్పుడు సాగర్ జలాలు రాకున్నా ఇబ్బంది ఉండదని తెలిపారు. సీతారామ ప్రధాన కాల్వలో సిల్ట్ తొలగిస్తే బేతుపల్లి, వైరా ప్రాజెక్టులోకి సాఫీగా నీరు చేరుతుందన్నారు. కాగా, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డితో ఫోన్లో మాట్లాడిన మంత్రి విద్యు త్ సంబంధిత సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. జల వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివాసరెడ్డి, ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ శ్రీనివాసాచారి, ఎస్డీసీ రాజేశ్వరి, ఆర్డీఓ రాజేందర్గౌడ్, ఏడీఏ శ్రీనివాసరెడ్డి, నాయకులు మట్టా దయానంద్, దోమా ఆనంద్, సుజలరాణి, దూదిపాల రాంబాబు పాల్గొన్నారు. -
మార్పు పేరిట అందమైన వల
● నెత్తిపై నీళ్లు చల్లుకోవడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదు ● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సత్తుపల్లి/తల్లాడ: సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు జిల్లాను సస్యశ్యామలం చేసేలా సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తే.. కాంగ్రెస్ నేతలు నీరు విడుదల చేసి నెత్తిన చల్లుకున్నారే తప్ప చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మార్పు పేరిట ఆ పార్టీ ప్రజలపై అందమైన వల విసిరిందన్నారు. తల్లాడ మండలం మిట్టపల్లిలో శుక్రవారం డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల శేషగిరిరావు కాంస్య విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి కేటీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. తొలుత పహల్గాం మృతులు, పాకిస్తాన్తో యుద్ధంలో అమరులైన సైనికులకు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేయకపోగా, రైతులకు బోనస్, భరోసా లేదు, రుణమాఫీ అంతంతే అమలుచేస్తున్నారని విమర్శించారు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం, వ్యవసాయశాఖ మంత్రి, నంబర్–2గా చెప్పుకునే మంత్రి ఉన్నా ఒరిగిందేమీ లేదని తెలిపారు. భద్రాచలంలో ఉపఎన్నిక ఖాయం బాండ్లు రాసిస్తాం, అఫిడవిట్ ఇస్తాం, కేసీఆర్ కంటే ఎక్కువే చేస్తామని ఎన్నికల వేళ భట్టి విక్రమార్క, చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. ఎలా చేస్తారని ప్రశ్నిస్తే వారి పార్టీకి 125 ఏళ్ల చరిత్ర ఉన్నందున సంపద సృష్టిస్తాం, వంద రోజుల్లో హామీలు అమలుచేస్తామన్న మాటలు ఏమయ్యాయని నిలదీశారు. ఇక రేవంత్రెడ్డి రైతుబంధు మూడు పంటలకు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ఒక పంటకు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. భద్రాచలం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఖాయమని, ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ శ్రేణులంతా అక్కడకు వెళ్లి పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు గెలిచేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ డీసీఎంఎస్ చైర్మన్ పదవి నుంచి రాయల శేషగిరిరావును అవమానకర రీతిలో దించేశారన్నారు. ఆయన అనునిత్యం రైతుల సమస్యలపై ఉద్యమించారని, ధాన్యం కొనుగోళ్లల్లో జాప్యమైతే అప్పటి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాయలను ఇబ్బంది పెట్టినా, నమ్మిన సిద్ధాంతాన్ని చివరి వరకు వీడలేదని తెలిపారు. తొలుత తల్లాడ మండలం రేజర్ల నుంచి మిట్టపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్రెడ్డి, రేగా కాంతారావు, బానోతు మదన్లాల్, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోతు హరిప్రియ, తాటి వెంకటేశ్వర్లు, కొండబాల కోటేశ్వరరావుతో పాటు లింగాల కమల్రాజు, కూరాకుల నాగభూషణం, దిండిగాల రాజేందర్, దొడ్డా శ్రీనివాసరావు, రెడ్డెం వీరమోహన్రెడ్డి, డి.వెంకటలాల్, దిరిశాల దాసురావు తదితరులు పాల్గొన్నారు. -
మధిర పోలీసుస్టేషన్ అప్గ్రేడ్
మధిర: ఇన్నాళ్లు ఎస్సై స్టేషన్ హౌస్ ఆఫీసర్గా కొనసాగుతున్న మధిర పట్టణ పోలీసుస్టేషన్ను అప్గ్రేడ్ చేశారు. ఇందులో భాగంగా పోలీసుస్టేషన్కు సీఐ స్థాయి అధికారిని ఎస్హెచ్ఓగా నియమించారు. ఈమేరకు ఎస్హెచ్ఓగా డి.రమేష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో ప్రస్తుతం ఇక్కడ సీఐగా ఉన్న డి.మధు మధిర రూరల్, ఎర్రుపాలెం, బోనకల్ పోలీస్ స్టేషన్లకు సర్కిల్ ఇన్స్పెక్టర్గా వ్యవహరించనున్నారు. త్వరలోనే సబ్డివిజన్ మధిర సర్కిల్ను త్వరలోనే సబ్ డివిజన్గా మార్చనున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉండడంతో శాంతిభద్రతల దృష్ట్యా ప్రత్యేక సబ్ డివిజన్ ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన చాన్నాళ్లుగా ఉంది. ప్రస్తుతం టౌన్ పీఎస్ ఎస్హెచ్ఓగా సీఐను నియమించారు. దీంతో మధిర కేంద్రంగా ఇద్దరు సీఐలు విధులు నిర్వర్తించనున్నారు. ఇక మధిర పోలీస్ సర్కిల్ పరిధిని త్వరలోనే సబ్ డివిజన్ స్థాయికి అప్గ్రేడ్ చేయనున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ఎస్హెచ్ఓ స్థాయికి చేరిన టౌన్ పీఎస్ -
లాభాల బాటలో రైతన్న
● సంప్రదాయ పంటలకు బదులు అరటి, జామ తోటలు ● సేంద్రియ విధానంలో సాగు, తోటల వద్దే అమ్మకం ● మిగతా పంటలతో పోలిస్తే లాభాలపై భరోసా ముదిగొండ: ఈ రైతులు కూడా అందరిలాగే వరి, మిర్చి, పత్తి పంటలను ఏళ్ల తరబడి సాగు చేశారు. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు వారిని వెంటాడాయి. ఫలితంగా ఏళ్లు గడుస్తున్న కొద్ది పెట్టుబడి పెరుగుతుందే తప్ప లాభాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న ఆ రైతులకు పండ్ల తోటలు కళ్ల ముందు కనిపించాయి. రసాయన ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ విధానంలో పంటల సాగు ఆరంభించిన వారు ఇప్పుడు అధిక దిగుబడి సాధిస్తున్నారు. రసాయన ఎరువులు వాడకపోవడంతో పండ్లు రుచికరంగా ఉండగా.. వ్యాపారులే తోటల వద్దకు కొనుగోలు చేస్తుండడంతో రవాణా ఖర్చులు తగ్గి లాభాలు లాభాలు ఆర్జిస్తున్నారు. ముదిగొండ మండలం మేడేపల్లిలో పలువురు రైతులు ఈ బాటలో పయనిస్తుండగా ఆ గ్రామ రైతులే కాక చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా వీరిని అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు. జామ.. తైవాన్ పింక్ ముదిగొండ మండలం మేడేపల్లికి చెందిన సామినేని రమేష్ ఏడాదిన్నర క్రితం ఏపీలోని జంగారెడ్డిగూడెం వద్ద నర్సరీలో 19వేల తైవాన్ పింక్ జామ మొక్కలు తీసుకొచ్చాడు. ఒక్కో మొక్కకు రూ.15 వెచ్చించగా.. ఎకరానికి 1,300 చొప్పున 20ఎకరాల్లో సాగు చేశాడు. డ్రిప్ ఇరిగేషన్, పైపులు, బావి, ఫెన్సింగ్, కూలీలు, మొక్కలు కలిపి రూ.20లక్షల మేర పెట్టుబడి అయింది. డ్రిప్ ఇరిగేషన్ విధానం కావడంతో నీరు, ఎరువులు మొక్కకు నేరుగా అందించడం సాధ్యమవుతోంది. మొక్కలు నాటాక ఎనిమిదో నెల నుంచి జామ దిగుబడి మొదలైంది. మొదటి కాపు 75టన్నులు రాగా.. కిలో రూ.25నుంచి రూ,30 వరకు తోట దగ్గరే విక్రయించానని రమేష్ తెలిపారు. ఇక వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేక యంత్రాన్ని అమర్చడంతో ముందు జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతుందని వెల్లడించారు. ఈ యంత్రానికి రూ.50వేలు వెచ్చించినట్లు తెలిపారు. కాయలకు మచ్చలు రాకుండా, చీడపీడలు ఆశించకుండా కవర్లు తొడగడం... సేంద్రియ విధానం కావడంతో కాయలు రుచిగా ఉండి వ్యాపారులు నేరుగా తోట వద్దకు కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. ఫలితంగా తనకు రవాణా ఖర్చులు తగ్గాయని తెలిపారు. అటు అరటి.. ఇటు జామ మేడిపల్లి గ్రామానికే చెందిన మేడిశెట్టి నరసింహారావు అరటి సాగు చేస్తున్నారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలులో ఒక్కో మొక్క(దుంప) రూ.10 చొప్పున తీసుకొచ్చి ఎకరానికి వెయ్యి మొక్కలు నాటారు. ఎకరాకు రూ.30 వేలు ఖర్చు కాగా.. కర్పూర రకం మొక్కలు కావడంతో నాటిన 11నెలలకు దిగుబడి వచ్చింది. టన్ను రూ.14వేల నుంచి రూ.20వేలు వరకు తోట దగ్గరే అమ్ముతున్న ఆయన ఎకరాకు రూ.లక్ష మేర లాభం వస్తోందని తెలిపారు. దీనికి తోడు అంతర పంటగా జామ కూడా సాగు చేస్తుండగా అదనపు ఆదాయం లభిస్తోందని వెల్లడించారు. -
రక్షణపై మాక్డ్రిల్తో అవగాహన
ఖమ్మంమయూరిసెంటర్: యుద్ధం వస్తే పౌరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు మాజీ సైనికులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఖమ్మం ఎన్నెస్పీ హైస్కూల్ సమీపంలోని ఖాళీ స్థలంలో మాజీ సైనిక ఉద్యోగులు, ఇండియన్ వెటర్న్ ఆర్గనైజేషన్ అధికార ప్రతినిధి ఎస్.ఎం.అరుణ్ పర్యవేక్షణలో ఈ డ్రిల్ జరిగింది. భవనాలపై బాంబులు పడినప్పుడు మంటల నుంచి బయటపడడాన్ని అరుణ్ ప్రత్యక్షంగా వివరించారు. అలాగే, గాయపడిన వారికి ప్రథమ చికిత్స, రాత్రి వేళ ఉనికి తెలియకుండా లైట్లు ఆర్పడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎస్సీసీ సుబేదార్ మేజర్ బహుదూర్, జిల్లా ఫైర్ ఆఫీసర్ అజయ్కుమార్, ఆర్పీఎఫ్ సీఐ, మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో పాటు వెంకటేష్, నాళ్ల భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణ తరగతులు ఒకపూటే నిర్వహించాలి బోనకల్: ప్రభుత్వం ఈనెల 13వ తేదీ నుండి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనుండగా, ఎండల తీవ్రత దృష్ట్యా ఒక పూటే నిర్వహించాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరావు డిమాండ్ చేశారు. బోనకల్లో శుక్రవారం జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ శిక్షణను జిల్లా కేంద్రంలో కాకుండా డివిజన్ కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. అలాగే, పాఠశాలలు తెరిచేనాటికి సరిపడా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం సమకూర్చాలని, ఉపాధ్యాయులకు పెండింగ్ బిల్లులు, డీఏ, పీఆర్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు వల్లంకొండ రాంబాబు, గుగులోతు రామకృష్ణ, రమేష్, సూర్య, తులసీదాస్, ఉద్దండ్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలిబోనకల్/ఎర్రుపాలెం: ఇప్పటికే జాప్యమైనందున ఇకనైనా ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బోనకల్ మండలం జానకీపురం, ఎర్రుపాలెం మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఇటీవల ఉద్యోగులపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. అలాగే, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ పేరిట కాలయాపన చేయొద్దని సూచించారు. 317 జీఓ ద్వారా ఉపాధ్యాయులకు జరిగిన నష్టాన్ని సవరించడమే కాక ఉపాధ్యాయ శిక్షణ జిల్లా కేంద్రంగా కాకుండా మండలాల్లో ఏర్పాటు చేయాలన్నారు. కాగా, బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొ ని విద్యార్థుల సంఖ్య పెంపునకు పాటుపడాలని సూచించారు.ఈసమావేశాల్లో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు, మండలాల బాధ్యులు రామ్మోహన్రావు, రవికిరణ్, రవికుమార్, కొండల్రావు, బి.మదనమోహన్రెడ్డి, మారపాక బాబురావు, శెట్టిపల్లి సంగిరెడ్డి, రవికిరణ్, కొండలరావు, సత్యనారాయణరెడ్డి, ఎస్.కే.రమేష్, గోపీకృష్ణ, రేణుక, అప్పిరెడ్డి, సాంబయ్య, లింగయ్య, కృష్ణవేణి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. దరఖాస్తుల పరిశీలనలో వేగం ఏన్కూరు: రాజీవ్ యువవికాసం పథకానికి అందిన దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తిచేసి సంబంధిత కార్పొరేషన్లకు పంపించాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగపద్మజ సూచించారు. ఏన్కూరు మండల పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం తనిఖీ చేసిన ఆమె దరఖాస్తుల పరిశీలనపై ఆరా తీశారు. త్వరగా ప్రక్రియను పూర్తి చేసి అర్హుల జాబితాను కార్పొరేషన్లకు పంపిస్తే లబ్ధిదారుల ప్రకటన సులవవుతుందని తెలిపారు. ఎంపీడీఓ జీవీఎస్.నారాయణ, సూపరింటెండెంట్ తుమ్మలపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదుపు తప్పి వాగులో పడిన లారీ ఏన్కూరు: ఇసుక తీసుకెళ్తున్న లారీ అదుపు తప్పి వాగులో బోల్తాపడింది. భద్రాచలం నుండి ఇసుకతో లారీ ఏన్కూరు మండలం జన్నారం మీదుగా ఖమ్మం వెళ్తోంది. ఈక్రమాన గురువారం అర్ధరాత్రి జన్నారం సమీపంలో అదుపు తప్పి వాగులో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యా యి. అయితే, వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. -
అభివృద్ధి మంత్రం
మున్నేరు తీరం..●రవాణా ఇక్కట్లు తీర్చేలా.. మున్నేటిపై పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో అనుబంధంగా రవాణాకు ఇబ్బంది ఎదురుకాకుండా తీగల(కేబుల్) వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.180 కోట్లు కేటాయించింది. ఖమ్మం నుంచి రాకపోకలు సాగించే వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తీర్చేలా ఈ నిర్మాణం చేపట్టారు. మొత్తం 14 పిల్లర్లతో నిర్మించనున్న ఈ వంతెనలో భాగంగా మున్నేరు మధ్యలో నాలుగు ప్రధాన పిల్లర్ల పనులు చివరి దశకు చేరాయి. రెండేళ్లలో బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయాలనేది లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. తద్వారా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ భారం తగ్గడమేకాక జిల్లా వాసులను ఆకట్టుకునేలా కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తుంది.ప్రకాష్నగర్ వద్ద మరమ్మతులు ప్రకాష్నగర్ వద్ద ఉన్న హై లెవెల్ వంతెన గత ఏడాది వచ్చిన వరదతో దెబ్బతిన్న విషయం విదితమే. దీంతో బ్రిడ్జి మీదుగా రాకపోకలు నిలిపివేసిన అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. దాదాపు రూ.కోటి వ్యయంతో చేపట్టిన పనులు పూర్తవడంతో అవసరమైన అప్రోచ్ రోడ్లు కూడా నిర్మించడంతో సాఫీగా రాకపోకలు సాగుతున్నాయి. పర్యాటక అభివృద్ధికి కార్యాచరణ తీగల వంతెనతో పాటు రిటైనింగ్వాల్ నిర్మాణంతో పూర్తయితే అటు రవాణా ఇక్కట్లు, ఇటు ముంపు సమస్య తీరిపోతుంది. ఆపై మున్నేరు పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బ్రిడ్జి, రిటైనింగ్ వాల్ వెంట వాకింగ్ ట్రాక్ల నిర్మాణం, లైట్ల ఏర్పాటు తదితర పనులకు కార్యాచరణ సిద్ధమైనట్లు సమాచారం. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే నగరవాసులకు కొత్త అందాలు అందుబాటులో వస్తాయని చెప్పొచ్చు.●రిటైనింగ్ వాల్తో భద్రత ఏటా వర్షాకాలంలో వస్తోందంటే మున్నేటి పరీవాహకంలోని ఖమ్మం అర్బన్, రూరల్ మండలాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతుంటారు. ఎప్పుడు వరద ముంచెత్తుతుందోనన్న భయం వారిని వెంటాడుతుంటుంది. దీన్ని అరికట్టేలా రెండు వైపులా మొత్తం 17 కి.మీ. మేర రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చేపట్టారు. రూ.690 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ నిర్మాణం ప్రభుత్వ భూముల్లో చకచకా సాగుతోంది. ప్రైవేట్ భూములు సేకరించాల్సిన చోట జాప్యం జరిగినా, ఇప్పుడు ఆ సమస్యలు కూడా ఓ కొలిక్కి వచ్చాయని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.పరీవాహకంలో రూ.వందల కోట్లతో పనులు చకచకా సాగుతున్న తీగల బ్రిడ్జి, రిటైనింగ్ వాల్ నిర్మాణం తద్వారా ముంపు, ట్రాఫిక్ సమస్యలకు చెక్ ఆ తర్వాత పర్యాటక సొబగులు కూడా.. -
మా లక్ష్యం.. ఒకే ఎన్నిక
ఖమ్మం మామిళ్లగూడెం: దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరగాలనేదే తమ పార్టీ విధానమని మెదక్ పార్లమెంటు సభ్యుడు మాధవనేని రఘునందన్రావు తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే వ్యయం తగ్గుతుందని, ఆ నిధులతో సంక్షేమ పథకాల అమలుకు అవకాశముంటుందని చెప్పారు. ఖమ్మంలో శుక్రవారం ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ అంశంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన సదస్సులో రఘునందన్రావు ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదన్నారు. వామపక్షాలకు ప్రజలు ఇప్పటికే మంగళం పాడారని, అందుకే తెలంగాణలో ఒక సీటుకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఇక సరైన మార్గంలో బీజేపీ మాత్రమే పయనిస్తున్నందున, రాబోయే రోజుల్లో తెలంగాణలో తమ పార్టీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. కాగా, పాకిస్తాన్పై పోరులో భారత ప్రభుత్వానికి మద్ధతు ఇస్తున్నట్లు చెప్పిన సీఎం రేవంత్రెడ్డి.. రాష్ట్రంలోని మదర్సాల్లో తలదాచుకున్న పాక్ మద్దతుదారులు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వలసవాదులను రాష్ట్ర పొలిమేరలు దాటించాలని సూచించారు. ఇద్దరు మహిళా అధికారుల నేతృత్వాన ఆపరేషన్ సిందూర్ను ద్వారా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించడం ద్వారా భారత సైన్యం సత్తా అందరికీ తెలిసిపోయిందని రఘునందన్రావు పేర్కొన్నారు. ఈసమావేశంలో నాయకులు దేవకి వాసుదేవరావు, సన్నే ఉదయ్ప్రతాప్, దొంగల సత్యనారాయణ, డాక్టర్ శీలం పాపారావు, డాక్టర్ గోంగూర వెంకటేశ్వరావు, మేకల నాగేందర్, ఆర్వీఎస్.యాదవ్, పుల్లారావు యాదవ్, తక్కెళ్లపల్లి నరేందర్రావు, నున్న రవికుమార్, పెరుమాళ్లపల్లి విజయరాజు, మందా సరస్వతి తదితరులు పాల్గొన్నారు. వారిని పొలిమేరలు దాటిస్తేనే సీఎం మాటలపై నమ్మకం మెదక్ ఎంపీ రఘునందనరావు -
‘సిందూర్’ విజయవంతం కావాలని పూజలు
ఎర్రుపాలెం/కూసుమంచి: పాకిస్తాన్లో ఉగ్రవాదులను తుదముట్టించేలా భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాంతి హోమం చేసిన అర్చకులు, భారత సైన్యానికి మేలు జరగా లని, వారి కుటుంబాలకు మనోధైర్యం కల్పించాలని పూజలు జరిపించారు. ఆలయ ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్శర్మ, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, నాయకులు తల్లపురెడ్డి నాగిరెడ్డి, శీలం శ్రీనివాసరెడ్డి, గుడేటి బాబురావు, శ్రీనివాసరావు, ఎన్.రామారావు పాల్గొన్నారు. అలాగే, కూసుమంచిలోని శివాలయంలోకూడా పూజలు చేయగా, ఈఓ శ్రీకాంత్, భక్తులు పాల్గొన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లుగా శిక్షణకు దరఖాస్తులు ఖమ్మంసహకారనగర్: లైసెన్స్డ్ సర్వేయర్లుగా శిక్షణ కోసం ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యాన శిక్షణ ఇవ్వనుండగా, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మీ సేవా కేంద్రాల్లో రూ.100 చెల్లించి ఈనెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇంటర్మీడియట్లో గణితం సబ్జెక్టుగా 60శాతం మార్కులు సాధించిన వారు, ఐటీఐ డ్రాఫ్ట్మెన్(సివిల్), డిప్లొమా(సివిల్), బీటెక్(సివిల్) లేదా సమానమైన విద్యార్హత ఉన్న వారు అర్హులని వెల్లడించారు. ఎంపికై న అభ్యర్థుల్లో ఓసీలైతే 50రోజుల శిక్షణకు రూ.10వేలు, బీసీలు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వివరాలకు 83748 79945, 97054 39983, 96769 64860 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. 31వరకు ఓపెన్ వర్సిటీ ఫీజు గడువు ఖమ్మంసహకారనగర్: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఏ, బీకాం, బీఎస్సీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్షలకు అభ్యర్థులు ఈనెల 31లోగా ఫీజు చెల్లించాలని ఖమ్మం రీజినల్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ బి.వీరన్న సూచించారు. వివరాలు, ఫీజు చెల్లింపు కోసం www.braouonline.ac.in వెబ్సైట్లో పరిశీలించాలని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యం వద్దు ● కల్లూరు ఆస్పత్రిలో కలెక్టర్ తనిఖీ కల్లూరు: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంగా వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలే తప్ప నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆదేశించారు. కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా డాక్టర్ వినీత్ పలువురికి చికిత్స చేస్తుండగా పరిశీలించారు. అనంతరం ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్తో మాట్లాడి పరీక్షలు, మందుల లభ్యతపై ఆరాతీశారు. మందులు సరి పడా సిద్ధంగా ఉంచుకోవాలని, ఏవైనా తక్కువగా ఉంటే ముందుగానే తెప్పించుకోవాలని సూచించారు. తహసీల్ధార్ పులి సాంబశివుడు, వైద్యాధికారి నవ్యకాంత్, ఉద్యోగులు ఎం.లలిత, జె.మాధవి, అనూష, అక్తర్, మధు, బి.కృష్ణవేణి పాల్గొన్నారు. ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పెనుబల్లి: రైతులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అధికారులను ఆదేశించారు. పెనుబల్లి మండలం మండాలపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన రికార్డులు పరిశీలించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం, రవాణాపై ఆరా తీశాక కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కాంటా వేయించి మిల్లులకు తరలించాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య, తహసీల్దార్ గంటా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మంలో ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర మహాసభలు
ఖమ్మం మయూరిసెంటర్: ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్క ర్స్ ఫెడరేషన్(ఎస్డబ్ల్యూఎఫ్) రాష్ట్ర నాలుగో మహా సభలను ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయించి నట్లు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. ఖమ్మంలోని మంచికంటి భవన్లో గుండు మాధవరావు అధ్యక్షతన శుక్రవా రం జరిగిన మహాసభల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమాల ఖిల్లా అయిన ఖమ్మంలో ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ మహాసభల నిర్వహణకు నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రాల శ్రీని వాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులందరూ సభల జయప్రదానికి సహకరించాలని కోరారు. అనంతరం సభల ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడిగా కళ్యాణం వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా పిట్టల సుధాకర్, కోశాధికారిగా గుగ్గిళ్ల రోశయ్యను రీజియన్ కార్యదర్శి పిట్టల సుధాకర్ ప్రతిపాదించగా ఆమోదించారు. ఈ సమావేశంలో సీఐటీయూ, ఎస్డబ్ల్యూఎఫ్ తదితర సంఘాల నాయకులు తుమ్మ విష్ణువర్ధన్, అల్లంశెట్టి వెంకటేశ్వర్లు, వై.విక్రం, పిట్టల రవి, కుడుదుల వెంకన్న, తోకల బాబు, పగిళ్లపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
ఇది ప్రజల ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దొరలు, నాయకుల కోసం కాకుండా ప్రజల అవసరాలను తీర్చేలా పనిచేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నూతన భవనాల నిర్మాణానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆపై కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్షించారు. ఏడాదిలోనే రూ.11,482 కోట్లు బీఆర్ఎస్ పాలనలో వైద్య రంగానికి ఏటా సగటున రూ.5,950 కోట్లు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.11,482 కోట్లు వెచ్చించిందని భట్టి వెల్లడించారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ బిల్లులు సైతం తాము చెల్లిస్తూ, పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో ఇప్పటివరకు 90 లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్, బీజేపీ నేతలు చిలువలు పలువలుగా ప్రచారం చేస్తున్నారని, గత పాలకులు రూ.ఏడు లక్షల కోట్ల అప్పు చేసినా ఏనాడూ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేదని భట్టి ఎద్దేవా చేశారు.ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి దామోదరరాష్ట్రంలో ప్రతీ 35 కి.మీ.కు ఒకటి చొప్పున మొత్తం 84 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.ప్రపంచ బ్యాంక్ మంజూరు చేసిన రూ.4,100 కోట్ల నిధులలో రూ.37 కోట్లతో వరంగల్లో రీజినల్ కేన్సర్ సెంటర్, ఖమ్మంలో ఆర్గాన్ రిట్రీవల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల ప్రజలు హైదరాబాద్ వెళ్లే పని లేకుండా స్థానికంగానే సూపర్స్పెషాలిటీ వైద్య సేవలు బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్య, వైద్యానికి సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మెడికల్ కళాశాలలు, అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు అవుతున్నాయన్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా స్థల సేకరణ చేసి ఖమ్మంలో వైద్య కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వం మెడికల్ కళాశాలలను మధ్యలో వదిలేస్తే వాటిని పునఃప్రారంభించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, సీపీ సునీల్దత్, రాయల నాగేశ్వరరావు, డాక్టర్ నరేంద్రకుమార్, ఫణీందర్రావు తదితరులు పాల్గొన్నారు.