breaking news
Khammam
-
నమ్మకం పేరిట నయవంచన
ఖమ్మంక్రైం: భర్తకు దూరమైన మహిళకు సోదరుడిలా అండగా ఉంటానని నమ్మంచి.. సాయం చేస్తున్నట్లు నటించాడు. ఆ వ్యక్తి అసలు స్వరూపం తెలియక ఆయన వ్యాపారం కోసమంటూ సదరు మహిళ డబ్బు, బంగారం ఇవ్వడమే కాక మరికొందరి నుంచి అప్పులు ఇప్పించింది. ఆపై ఆయనలో మృగం మేల్కొనడంతో ఇది తప్పు అని వారించినా వినకపోగా ఊరు మారినా విడవకుండా మరో వ్యక్తితో కలిసి దారుణంగా హతమార్చాడు. ఖమ్మంలో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.భర్తతో విభేదాలు సృష్టించి..కామేపల్లి మండలం పండితాపురానికి చెందిన ప్రమీల (35) తల్లిదండ్రులు మృతి చెందటంతో భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం రేగళ్లలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంది. అదే ప్రాంతానికి చెందిన ఆర్ఎంపీ మాడెం నరసింహారావుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో 2010లో వివాహం చేసుకుని పాల్వంచలో నివాసం ఉన్నారు. అక్కడ నరసింహారావు స్నేహితుడైన బొమ్మ శ్రావణ్ ఇంట్లో ఉంటున్నప్పుడు ఆయనను ప్రమీల అన్నయ్య అని పిలిచేది. కొంతకాలానికి నరసింహారావు దంపతుల మధ్య విబేధాలు రాగా ఇందుకు శ్రావణే కారణమని తెలిసింది. ఆపై ప్రమీల భద్రాచలంలో ఇల్లు అద్దెకు తీసుకుని బట్టల దుకాణంలో పనిచేసేది. అక్కడకు వెళ్లే శ్రావణ్ సోదరుడిలా అండగా ఉంటానని నమ్మించడంతో ఆమె వద్ద ఉన్న బంగారు నగలు, డబ్బుతో పాటు మరికొందరి దగ్గర అప్పు ఇప్పించింది. ఆ తర్వాత ప్రమీలపై కన్నేసిన ఆయన దంపతుల మధ్య అగాధం మరింత పెంచడంతో ఆమె మార్పును కనిపెట్టి హెచ్చరించింది. ఆపై భద్రాచలంలో పోలీస్స్టేషన్లో శ్రావణ్పై కేసు నమోదైంది. ఆ తర్వాత ప్రమీల భద్రాచలం నుంచి పండితాపురంలోని బాబాయి, పిన్ని వద్దకు, అనంతరం ఖమ్మం వచ్చి కస్బాబజార్లోని షాపింగ్ మాల్లో పనిచేస్తూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. ఆమైపె కక్ష పెంచుకున్న శ్రవణ్ తన బావమరిది, కొత్తగూడెంలోని రామవరం వాసి, రౌడీషీటర్ అయిన రమేశ్తో శుక్రవారం ఖమ్మం వచ్చాడు. రాత్రి ఆమె షాపింగ్ మాల్ నుంచి హాస్టల్కు వెళ్తుండగా దూరంగా నిల్చుని రమేశ్ను ముందుకు పంపించినట్లు తెలిసింది. అక్కడ రమేశ్ ఆమెతో గొడవ పడి గొంతుతో పాటు పలుచోట్ల పొడవగా తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. అయితే, చాలాసేపు ఆమె తనను హత్య చేయొద్దని రమేశ్, శ్రావణ్ను బతిమాలినట్లు సమాచారం. ఆ సమయాన వచ్చిన ఓ వృద్ధురాలిని సైతం నిందితులు బెదిరించినట్లు తెలిసింది. చిన్న గల్లీ కావడంతో హత్య విషయం ఆలస్యంగా బయటపడగా ఏసీపీ రమణమూర్తి, వన్టౌన్ సీఐ కరుణాకర్ చేరుకుని పారిపోయిన రమేశ్ను జూలురుపాడు వద్ద అదుపులోకి తీసుకున్నారు. శ్రావణ్ కోసం గాలిస్తున్నారు. ప్రమీల మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో మార్చురీకి తరలించగా ఆమె భర్త శ్రీనివాసరావు పాల్వంచకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించాడు. కాగా, ఖమ్మంలో మహిళల హత్యలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఐద్వా నాయకులు మార్చురి వద్ద ఆందోళన చేపట్టారు. -
హెచ్డబ్ల్యూవోస్ ఫోరం ఆధ్వర్యాన ముగ్గుల పోటీలు
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ హాస్టల్స్ వెల్ఫేర్ ఆఫీసర్ల (టీహెచ్డబ్ల్యూవో) ఫోరం ఆధ్వర్యాన శనివారం ఖమ్మంలోని ఎన్ఎస్పీ క్యాంపు ఎస్సీ బాలుర కాంప్లెక్స్ వసతిగృహం ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఫోరం అధ్యక్షుడు కోటపాటి రుక్మారావు ఆధ్వర్యాన జరిగిన ఈ పోటీల్లో జిల్లాలోని మహిళా వసతిగృహ సంక్షేమ అధికారులు పాల్గొనగా విజేతలకు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమంలో హెచ్డబ్ల్యూవోలది కీలకపాత్ర అని తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్, హెచ్డబ్ల్యూవోల ఫోరం బాధ్యులు ఎర్ర రమేశ్, లలితకుమారి, తాళ్లూరి శ్రీకాంత్, రాధికారెడ్డి, మృదుల, ఎన్.విజయ, ఎన్.నాగేశ్వరరావు, ఎం.కోమలి, సీహెచ్.నాగమణి, పి.మాధురి, సరస్వతి, అస్రపు నిషాబేగం, సునీత, వరలక్ష్మి, వినోద, పూలన్దేవి, అనీపూన్, శ్రీలత, శివ, స్టాలిన్, కరుణాకర్, నరేశ్, శ్రీనుబాబు, సిబ్బంది అంజమ్మ, తిరుపతిరావు, అజారుద్దీన్, నరేశ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
గణనకు సిద్ధం
● జంతు సర్వేకు అటవీ శాఖ సన్నాహాలు ● జిల్లా అడవిలో ఈనెల 20 నుంచి 25 వరకు లెక్కింపు ● అటవీ శాఖ సిబ్బందితోపాటు ఔత్సాహిక వలంటీర్లకూ అవకాశం ● ఎప్పటికప్పుడే ఏఐటీఈ యాప్లో నమోదుపాల్వంచరూరల్: పులులు, జంతువుల లెక్క తేల్చేందు కు అటవీశాఖ సిద్ధమైంది. ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. జిల్లాలోని పాల్వంచ అభయారణ్యం, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు అటవీ డివిజన్లలో 24 రేంజ్ల పరిధిలోని 700 బీట్లలో 1,200 మందితో లెక్కింపునకు రంగం సిద్ధం చేశారు. డెహ్రాడూన్ వైల్డ్లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) ఆధ్వర్యంలో గణన చేపడతారు. పులులతోపాటు శాకాహార, మాంసాహార జంతువులెన్ని ఉన్నాయనే వివరాలు సైతం సేకరిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నాలుగేళ్లకోసారి ఈ సర్వే నిర్వహిస్తారు. లెక్కింపు ఇలా.. ప్రతీరోజు బీట్కు ఇద్దరు చొప్పన ఐదు కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ లెక్కిస్తుంటారు. నిర్దేశించిన బీట్లో ఏడు రోజులపాటు పులుల పాదముద్రలు, పెంటికలు, వెంట్రుకలు తదితర గుర్తులు సేకరించిన తర్వాత జంతువుల గణన చేపడుతారు. ఈ లెక్కింపు ఆధారంగానే భవిష్యత్లో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పులులు, జంతు గణన సందర్భంగా సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు ఏఐటీఈ(ఆల్ ఇండియా టైగర్స్ ఎస్టిమేషన్) యాప్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్లో పొందుపరుస్తారు. సర్వే సిబ్బందికి టీషర్టులు, క్యాప్లతో పాటు ఓ కిట్గ్యాగ్ ఇస్తారు. అందులో పేపర్, పెన్ను, జిప్లాక్(ఆనవాళ్ల సేకరణకు ఉపయోగించే పదార్థం) ఉంటాయి. కాగా, సర్వేపై సిబ్బందికి మరోసారి అవగాహన కల్పించేందుకు ఈనెల 12న అటవీ శాఖ జిల్లా కార్యాలయంలో రేంజర్లతో, 17న కిన్నెరసాని అభయారణ్యం పరిధిలోని గట్టుమల్ల బీట్లో స్థానిక సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆభయారణ్యంలో పెరిగిన జంతువులు కిన్నెరసాని అభయారణ్యంలో జీవవైవిధ్యంతో పాటు జంతువుల వృద్ధికి అనుకూల వాతావరణం ఉండడంతో వాటి సంతతి పెరుగుతోంది. గత జంతుగణన సమయంలో ఎలుగుబంట్లు 412, చుక్కుల దుప్పులు 4,278, కొండగొర్రెలు 659, అడవి పిల్లులు 674, అడవిగేదెలు 1,892, కణుజులు 508తో పాటు తోడేళ్లు, నక్కలు, కుందేళ్లు, అలుగు, మూషిక జింకలను గుర్తించారు. కాగా, ఒకప్పుడు అభయారణ్యంలో ఐదు పులు లు, 14 చిరుతలు ఉండగా అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ఒక పులి మాత్రమే సంచరిస్తోంది. ఈ ఏడాది లెక్కింపు పూర్తయితే కానీ ఏయే జంతువులు ఎన్ని ఉన్నాయనే వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక మూషిక జింకలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క భద్రాద్రి జిల్లాలోనే సంచరిస్తున్నాయని గుర్తించిన అటవీ శాఖ వాటి సంరక్షణకు చర్యలు చేపడుతోంది.జిల్లాలోని 550 బీట్లలో పులు లు, జంతు గణనను పకడ్బందీగా నిర్వహించబోతున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా 75 నుంచి 100 మంది వలంటీర్లను తీసుకుంటున్నాం. ఈ గణనలో అటవీ సిబ్బంది 900 మంది పాల్గొంటారు. వీరికి తోడుగా బేస్ క్యాంప్ సిబ్బంది, వాచర్లు ఉంటారు. డీఆర్ఓలు, బీట్ అధికారులు, వలంటీర్లు బీట్కు ఇద్దరు చొప్పున ప్రతీ రోజు 5 కిలోమీటర్ల చొప్పున లెక్కిస్తారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు లెక్కించి, ఆ తర్వాత యాప్లో నమోదు చేస్తారు. –జి.కృష్ణాగౌడ్, భద్రాద్రి డీఎఫ్ఓ -
పందెం పిలుస్తోంది..
సత్తుపల్లి: సంక్రాంతి పండుగ వస్తుందంటే.. కోడి పందేల సందడే సందడి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర, వైరా నియోజకవర్గాలు ఏపీకి సరిహద్దుగా ఉండడంతో చాలామంది పందేలు చూసేందుకు వెళ్తుంటారు. ఇదే సమయాన పలు ప్రాంతాల్లో ఏర్పాటయ్యే బిర్రులను సత్తుపల్లి పరిసర ప్రాంత వాసులే ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. కొందరు ఏపీలోని నూజివీడు సమీపాన మీర్జాపురంలో బిర్రు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పెద్ద బిర్రుగా ప్రచారం జరుగుతోంది. క్రికెట్ స్టేడియాన్ని తలపించేలా చేపట్టిన నిర్మాణం ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీవీఐపీల కోసం సోఫాలు, గ్లాస్ ఫిటింగ్తో ఏసీ చాంబర్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఏలూరు జిల్లా దెందులూరులో మినీ స్టేడియంతో పాటు వీఐపీల కోసం ఏసీ కంటెయినర్లు సిద్ధం చేసినట్లు సమాచారం. కృష్ణా జిల్లా విస్సన్నపేటలో రాత్రి పందేలు కొనసాగేలా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారని సమాచారం. రూ.25 లక్షల నుంచి.. ఈసారి కోడి పందేలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మీర్జాపురంలో రూ.25 లక్షల పందేలు, రూ.9 లక్షలు, రూ.6 లక్షల బిర్రులు నడిపేందుకు నిర్ణయించినట్లు సమాచారం. దెందులూరు, విస్సన్నపేటలో కూడా రూ.5 లక్షలకు తగ్గకుండా పందేలు వేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్రా ప్రాంతంలో పోలీసుల నుంచి ఇబ్బందులు ఉండకపోవడంతో సురక్షితంగా పందేలు వేయొచ్చు, చూడొచ్చనే భావనతో పలువురు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కాగా, జూదరులు పలువురు కుక్కుట శాస్త్రాన్ని అనుసరిస్తూ ఏ సమయాన, ఏ నక్షత్రంలో ఏ రంగు పుంజు పొడుస్తుంది.. యజమాని పేరులోని మొదటి అక్షరాన్ని అనుసరించి ఏ పుంజుపై పందెం కాస్తే గెలుస్తామో చూసుకుంటారు. రూ.కోట్లలో పేకాట కోడి పందేల మాటున రూ.కోట్లలో పేకాట నడుస్తుందని ప్రచారం. కోడి పందేలు ఓ ఎత్తయితే రాత్రి, పగలు తేడా లేకుండా విద్యుత్ జనరేటర్లు అమర్చి మరీ లోనా.. బయట పేకాట నిర్వహిస్తుండటంతో రెప్పపాటులోనే రూ.కోట్లు చేతులు మారి జూదరులు వీధినపడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇది కాకుండా గుండు పట్టాలతో జూదం నిర్వహిస్తారు. పండుగ మూడు రోజులు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ మూడురోజులు పందేలకు అడ్డూ అదుపు ఉండదు. సంకలో కోడి పుంజు పట్టుకొని పరుగులు పెడుతూ జూదరులు కన్పిస్తుంటారు. ఆంధ్రా సరిహద్దులోని మామిడితోటలు చిన్న పందేలకు నిలయంగా మారుతాయి. పందేల స్థావరాల వద్దే మద్యం, బిర్యానీ, మాంసం విక్రయాలు సాగుతుంటాయి. సంక్రాంతికి వచ్చేయండి.. -
పతంగుల దుకాణాల్లో తనిఖీ
సత్తుపల్లిటౌన్/ముదిగొండ: చైనా మాంజాను నిషేధించిన నేపథ్యాన సత్తుపల్లిలోని పలు దుకాణాల్లో శనివారం అటవీ శాఖాధికారులు తనిఖీ చేశారు. పతంగులు ఎగుర వేసేందుకు చైనా మాంజా వాడితే వన్యప్రాణులతో పాటు ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని రేంజర్ స్నేహలత తెలిపారు. ఈ మేరకు కాటన్ దారాలనే పతంగులకు వాడాలని స్పష్టం చేశారు. ఎవరైనా చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో ఎఫ్ఎస్ఓలు నర్సింహ, నాగరాజు, బీట్ ఆఫీసర్లు చెన్నకేశవరెడ్డి, ప్రశాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే, ముదిగొండ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని కిరాణా, ఫాన్సీ షాపుల్లో ముదిగొండ సీఐ ఓ.మురళి ఆదేశాలతో ఎస్ఐ అశోక్ ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఎవరు కూడా చైనా మాంజా అమ్మొద్దని, అమ్మినా, కొనుగోలు చేసినా చర్యలు తీసుకుంటామని అవగాహన కల్పించారు. -
నేడే తుది పోరు
పినపాక: మండలంలోని ఈ–బయ్యారంలో జరుగుతున్న జాతీయస్థాయి అండర్–17 కబడ్డీ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. శనివారం ప్రీ క్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు నిర్వహించారు. ఆయా మ్యాచ్ల్లో జట్లు హోరాహోరీగా పోటీపడగా తెలంగాణ, హరియాణా, ఉత్తరప్రదేశ్ జట్లు సెమీస్కు చేరాయి. ఆదివారం సెమీఫైనల్లో ఉత్తర్ప్రదేశ్తో తెలంగాణ తలపడనుంది. కాగా, క్వార్టర్ ఫైనల్స్లో ఉత్తరప్రదేశ్ చేతిలో ఓడిన ఆంధ్రప్రదేశ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. చిరుజల్లులతో నిలిచిన ఆట క్వార్టర్ ఫైనల్స్లో కర్ణాటక – రాజస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది. అయితే, ఆ సమయాన చిన్నపాటి వర్షం జల్లు పడడంతో మ్యాచ్ను నిలిపివేశారు. ఆదివారం ఉదయం ఈ రెండు జట్ల నడుమ క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించి గెలిచిన జట్టుతో హరియాణా జట్టుకు సెమీఫైనల్స్ నిర్వహిస్తారు. ఈ రెండింటిలో గెలిచిన జట్టుకు యూపీ – తెలంగాణ మధ్య జరిగే సెమీస్లో విజేతతో ఫైనల్స్ నిర్వహించాకవిజేత ఎవరో తేలనుంది. ఒక్క పాయింట్తో సెమీస్కు దూరం క్రీడల్లో ఒక్క పాయింట్ కూడా ఎంత ముఖ్యమో కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది. అదే పరిస్థితి శని వారం తమిళనాడు జట్టుకు ఎదురైంది. హరి యాణా – తమిళనాడు జట్లు క్వార్టర్స్లో హోరాహోరీగా తలపడ్డాయి. తమిళనాడు 50 పాయింట్లు చేయగా హరియాణా 51 పాయింట్లు సాధించడంతో సెమీస్ కు దూసుకెళ్లింది. ఒక్క పాయింట్ తేడాతో ఓడిన తమిళనాడు సెమీస్ అవకాశాలు దూరం చేసుకున్నట్లయింది. కాగా, టోర్నీ తుది దశకు చేరడంతో అభిమానులు తెలంగాణ జట్టుకు ఈలలు, కేకలతో మద్దతు తెలుపుతున్నారు. కాగా, పంజాబ్పై గెలిచి సెమీస్కు చేరిన తెలంగాణ జట్టు క్రీడాకారులు సంబురాలు చేసుకున్నారు. -
రెండేళ్లలో రూ.12 కోట్ల నిధులు
● మీటర్ గ్యాప్ లేకుండా సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఖమ్మం అర్బన్: పాలేరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఖమ్మం కార్పొరేషన్ విద్యానగర్ కాలనీ అభివృద్ధికి గత రెండేళ్లలో రూ.12 కోట్ల నిధులు మంజూరు చేశామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇంకా అవసరమైన నిధులు మంజూరు చేసి మీటర్ ఖాళీ లేకుండా సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. విద్యానగర్ కాలనీలో రూ.4 కోట్ల నిధులతో చేపట్టే రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ ఏర్పడి పదేళ్లు దాటినా గత పాలకులు అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.కోట్లాది నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, నూతన రేషన్ కార్డుల జారీతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా వసతుల కల్పనపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడగా కార్పొరేటర్ తేజావత్ హుస్సేన్, ఆర్అండ్బీ ఎస్ఈ యాకోబు, ఆర్డీఓ జి.నరసింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, తహసీల్దార్ డి.సైదులు, నాయకులు మద్దినేని బేబీస్వర్ణకుమారి పాల్గొన్నారు.ఖమ్మంరూరల్: కొత్తగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక ఏదులాపురం మున్సిపాలిటీ గొల్లగూడెంలో రూ.42.26 కోట్లు, పెదతండాలో రూ.14కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ అభివృద్ధి పనులపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ భైరు హరినాధ్బాబు, ఆర్అండ్బీ ఎస్ఈ యాకోబు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, తహసీల్దార్ పి.రాంప్రసాద్, నాయకులు బండి జగదీష్, తోట చినవెంకటరెడ్డి, చింతమళ్ల రవికుమార్, బండి సతీష్, వెంపటి రవి, ధరావత్ రాంమ్మూర్తినాయక్, మల్లారెడ్డి పాల్గొన్నారు. -
యూరియా సాధనలో ప్రభుత్వం విఫలం
పాల్వంచ: రైతాంగానికి కావాల్సిన యూరియా కొరత కేంద్రం సృష్టిస్తే, కేంద్రంపై పోరాడి సరిపడా యూరియాను తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల ముందు రేవంత్రెడ్డి ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాలు చేసి అధికారిలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా నేటీకి పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. ఆయిల్ సంపదను దోపిడీ చేసే లక్ష్యంతోనే వెనుజువెలాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాడికి పాల్పడ్డారని, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను పాటించకుండా దుర్మార్గంగా వ్యవహరించారని విమర్శించారు. తనను మోదీ కూడా సంతోష పెట్టలేదని ట్రంప్ పరోక్ష బెదిరింపులకు గురి చేస్తున్నారని, అయినా ప్రధాని మోదీ స్పందించలేదని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ దుమ్ముగూడెం ప్రాజెక్ట్ నీళ్లు కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు కేజీ రామచంద్రన్, కె.రంగయ్య, గోకినపల్లి వెంకటేశ్వర్లు, చండ్ర అరుణ, చిన్న చంద్రన్న, ముద్ద భిక్షం, కల్పన, రాము, రాజు, కృష్ణ పాల్గొన్నారు. పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్అశ్వారావుపేటరూరల్: గిరిజన బాలికను గర్భవతిని చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ టీ యయాతీ రాజు కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల లోపు గిరిజన బాలిక గత దసరా పండుగ సెలవులకు ఇదే మండలంలోని ఓ గ్రామంలో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వచ్చి కొంతకాలం ఇక్కడే ఉంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన యువకుడు ఎం.అరవింద్ బాలికను మాయమాటలతో పరిచయం చేసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భవతి కాగా, శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి దమ్మపేట కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి● మరొకరికి తీవ్ర గాయాలు ఇల్లెందురూరల్: మండలంలోని బొజ్జాయిగూడెం సమ్మక్క గద్దెల సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టేకులపల్లి మండలం సులానగర్కు చెందిన చిలకబత్తిని రవి (42) మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన గనమల్ల భిక్షం తీవ్రంగా గాయపడ్డాడు. ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం వారం రోజులు అక్కడే పనిచేసి శనివారం బైక్పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యలో సమ్మక్క గద్దెల సమీపంలో చెట్టును ఢీకొట్టడంతో తీవ్రగాయాలై రవి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గాయాలైన భిక్షంను సీఐ టి.సురేష్ ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాటుసారా స్వాధీనం నేలకొండపల్లి: నేలకొండపల్లి ఎకై ్సజ్ సర్కిల్ అధికారులు పలు ప్రాంతాల్లో శనివారం తనిఖీలు నిర్వహించగా.. శంకరగిరి తండాలో పది లీటర్ల నాటుసారా పట్టుబడింది. స్కూటీతోపాటు పార్వతిని అదుపులోకి తీసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేశామని, సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన బెల్లం వ్యాపారి వెంకటరమణ పరారీలో ఉన్నాడని సీఐ ఎస్.రమేశ్ తెలిపారు. తనిఖీల్లో ఎస్ఐ లత, సిబ్బంది శ్రీనివాస్, సంపూర్ణ, బలరాం, వినీత్ తదితరులు పాల్గొన్నారు. నాలుగో అంతస్తు నుంచి పడి కార్మికుడు మృతి ఖమ్మంఅర్బన్: ఖమ్మం గోపాలపురంలోని నాలుగు అంతస్తుల భవనంపై ఎలక్ట్రికల్ పనులు చేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన దీన్దయాల్శర్మ (21) కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జయనగర్కాలనీలో నివాసముంటున్న ఆయన ఒక మేసీ్త్ర వద్ద ఆరేళ్లుగా పనిచేస్తున్నాడు. రోజులాగే ఎలక్ట్రికల్ పనులు చేస్తున్న నాలుగో అంతస్తు నుంచి పడడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, ఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయని శర్మ బంధువు దామోదర్శర్మ పోలీసులకు సమాచారం ఇవ్వగా విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మంఅర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు -
గోకులరామంలో రామయ్య ‘విలాసం’
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా శనివారం విలాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. పగల్ పత్తు, రాపత్తు సేవలు పూర్తయ్యాక స్వామికి వివిధ ప్రాంతాల్లో మూడు రోజులు ఈ వేడుకలు నిర్వహిస్తారు. తొలిరోజు శనివారం ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్న గోకుల రామంలో నేత్రపర్వంగా జరిపించారు. స్వామివారిని ప్రత్యేక వాహనంలో కొలువుదీర్చి మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామస్మరణల నడుమ వేడుకగా గోకులరామం వేదికపైకి తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి, హారతి సమర్పించారు. మూలమూర్తులకు సువర్ణ తులసీ అర్చన.. అంతరాలయంలోని మూలమూర్తులకు సువర్ణ తులసీ అర్చన జరిపించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాతసేవ, సేవా కాలం, ఆరాధన చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించిన అర్చకులు నిత్యకల్యాణం నిర్వహించారు.వైభవోపేతంగా ప్రారంభమైన విలాసోత్సవాలు -
నేటి నుంచి మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం ఖమ్మం 54వ డివిజన్ వీడీవోస్ కాలనీలోని ఎన్టీఆర్ పార్క్ ను మంత్రి ప్రారంభిస్తారు. అలాగే, సోమవారం ఉదయం రఘునాథపాలెం మండలం చింతగుర్తిలో వ్యవసాయ స్ప్రేయర్ డ్రోన్ల అవగాహన సదస్సులో పాల్గొన్నాక రాములు తండాలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక 13వ తేదీ మంగళవారం ఉదయం రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెం గ్రామంలో నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్తో పాటు మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్న మంత్రి, పథకం డెలివరీ పాయింట్ వద్ద రైతులతో సమావేశమవుతారు. చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా చర్యలు ఖమ్మంక్రైం: పక్షులు, ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజాను పతంగులు ఎగురవేసేందుకు విక్రయించినా, వినియోగించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ సునీల్దత్ హెచ్చరించారు. చైనా మంజా(సింథటిక్, దారం, గాజుపొడి) చాలా ప్రమాదకరమని తెలిపారు. దీని కారణంగా మనుషులు, పక్షులు ప్రమాదంలో పడుతున్నందున నిషేధించినట్లు పేర్కొన్నారు. ఈమేరకు విక్రయ, వినియోగదారులకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని సీపీ ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు వేదమంత్రోచ్ఛరణల నడుమ పంచామృతంతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం జరిపించగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆతర్వాత పల్లకీసేవ చేశారు. ఈఓ జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టసవరణలపై 20న నిరసనలు ఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ ప్రాంత పేదల కోసం కాంగ్రెస్ హయాంలో రూపొందించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ విమర్శించారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ గాంధీ పేరును తొలగించడమే కాక చట్టసవరణతో పేదలకు పథకాన్ని దూరం చేస్తుందని ఆరోపించారు. ఈ మేరకు 20వ తేదీన జిల్లాలో నిరసనలు చేపడతున్నట్లు తెలిపారు. ఆరోజు జిల్లా వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద నిరసన దీక్షలు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా, త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి జిల్లా పర్యటన ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్చౌదరి, నాయకులు వడ్డేబోయిన నరసింహా రావు, దొబ్బల సౌజన్య, ముల్లపాటి సీతారాములు తదితరులు పాల్గొన్నారు. -
కొండంత అండ
ఇండియన్ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్రూ.66కోట్ల అంచనాలతో... మండల వ్యాప్తంగా 64 చెరువులకు సాగర్ జలాలు అందాలనే లక్ష్యంతో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. తొలుత రూ.66కోట్ల అంచనాలతో ప్రణాళిక రూపొందించినా అన్ని చెరువులకు నీరు అందడానికి పైపులైను విస్తరణ తప్పనిసరి కావడంతో రూ.100 కోట్లకు చేరాయి. ప్రస్తుతం రూ.66 కోట్లతో పూర్తయిన మొదటి దశ పనులను ప్రారంభిస్తే 36 చెరువులకు నీరు అందనుంది. ఇక మండలంలో చిట్టచివరన అత్యధికశాతం గిరిజనులు ఉన్న పంగిడి వైపు మరో 18 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణానికి రూ.34 కోట్లు విడుదలైతే ఇంకొన్ని చెరువులకు నీరు చేరుతుంది. ప్రస్తుతం తొమ్మిది కిలోమీటర్ల ప్రధాన పైప్లైన్ పనులు పూర్తికాగా, మంచుగొండ వద్ద డెలివరీ పాయింట్ ఏర్పాటుచేసి అక్కడి నుంచి గ్రావిటీ విధానంలో 25 కి.మీ. పైప్లైన్తో చెరువులకు నీరు అందించనున్నారు. ఐదు పైపులైన్ల ద్వారా సాగే ఈ నీటితో తొలి దశలో 2,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. కాగా, వీ.వీ.పాలెం వద్ద సాగర్ ప్రధాన కాల్వ నుంచి ఒక్కో మోటార్ ద్వారా 13 క్యూసెక్కుల చొప్పున మూడింటి ద్వారా 39 క్యూసెక్కుల నీటిని పైపులైన్లు ద్వారా చెరువులకు తరలించనున్నారు. ఈ పథకం ప్రారంభంతో మండలంలోని రైతులకు సాగునీటి సమస్యలు తీరడమే కాక భూగర్భజలాలు పెరుగుతాయని, తద్వారా బోర్లు, బావుల ద్వారా పంటలు సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు.సరైన సాగునీటి వనరులు లేక ఇబ్బంది పడుతున్న రఘునాథపాలెం మండల రైతుల చిరకాల స్వప్నం నెరవేరుతోంది. ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించి మండలంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపొందించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం పూర్తయింది. ఈ పథకాన్ని మంత్రి 13వ తేదీన ప్రారంభించనుండగా.. తొలిదశలో మండలంలోని 36చెరువులకు సాగర్ జలాలు చేరనున్నాయి. తద్వారా ఆయకట్టుకు నీరు అందడమే కాక భూగర్భ జలాలు మెరుగుపడతాయని చెబుతున్నారు. – రఘునాథపాలెంఖమ్మం నుంచి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలోని ఏకై క గ్రామీణ మండలమైన రఘునాథపాలెంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు వీ.వీ.పాలెం మీదుగా సాగే సాగర్ ప్రధాన కాల్వపై ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నిర్ణయించారు. మంచుకొండ ఎత్తిపోతల పథకం పేరిట ఈ పథకం నిర్మాణానికి శంకుస్థాపన చేశాక మంత్రి నిరంతరం పర్యవేక్షిస్తూ నిధులు మంజూరు చేయించడంతో రికార్డు సమయంలో పూర్తయింది. పనులు ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే మెయిన్ పైప్లైన్ నిర్మాణం పూర్తి చేయడమే కాక తాత్కాలిక మోటార్లతో ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం సబ్స్టేషన్ నిర్మాణం పూర్తవడంతో మూడు మోటార్లు ఏర్పాటు చేయగా నీటి సరఫరాకు పథకం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. సిద్ధమైన మంచుకొండ ఎత్తిపోతల పథకం మండలంలోని మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ఈనెల 13న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనుండడంతో జలవనరుల శాఖ ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు శనివారం పరిశీలించారు. వీవీపాలెం వద్ద ఉన్న పంప్హౌస్, మోటార్లు, సబ్స్టేషన్, మంచుకొండలో డెలివరీ పాయింట్ను పరిశీలించిన ఆయన ఇంజనీర్లకు సూచనలు చేశారు. శాఖ అధికారులు అనన్య, ఈలు ఝాన్సీ, ఉదయ్ప్రతాప్ పాల్గొన్నారు. -
కొత్త.. కిలకిలలు
ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధి పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, చంద్రుగొండ మండలాల్లో 35వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న పులిగుండాల అటవీ ప్రాంతం(కనకగిరి గుట్టలు)లో అరుదైన పక్షులు ఆవాసం ఏర్పాటుచేసుకున్నాయి. భిన్నమైన వృక్షాలు, మొక్కలే కాక జలపాతాలు, జలాశయాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి కాక మచ్చల జింకలు, అడవి పందులు, నక్కలు, తోడేళ్లు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, సాంబార్ వంటి జంతువులతో పాటు అరుదైన పక్షి జాతులు కూడా ఉన్నట్లు గుర్తించారు. భిన్నమైన పక్షి జాతులు పులిగుండాల అటవీ ప్రాంతంలో వాతావరణం, వృక్ష సంపద, నీటి వనరుల కారణంగా భిన్నజాతుల పక్షులు జీవనం సాగిస్తున్నాయి. కొన్ని స్థిరనివాసం ఏర్పాటుచేసుకోగా, మరికొన్ని పక్షులు సీజన్ల వారీగా వచ్చివెళ్తున్నాయని గుర్తించారు. ఆగ్నేయాసియా, ఈశాన్య భారత దేశంలో మాత్రమే నివసించే ప్లమ్ హెడెడ్ పారకీట్(చిలుక జాతి) పక్షిని ఈ అడవుల్లో ఇటీవల గుర్తించారు. ఆసియా, ఆఫ్రికా అడవుల్లో నివసించే షిక్రా పక్షి కూడా సంచరిస్తున్నట్లు తేలింది. ఇవికాక ఇండియన్ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్ పక్షి ఇక్కడ తరచుగా కనిపిస్తోంది. కామన్, వైట్–త్రోటెడ్, పైడ్, బ్లూ– ఎర్ట్ కింగ్ఫిషర్లు కూడా ఉన్నాయి. పెద్దనీటి పక్షులుగా చెప్పుకునే హెరాన్లు ఇక్కడి సరస్సుల్లో కనిపిస్తున్నాయి. వీటిలో పర్పుల్ హెరాన్, గ్రే హెరాన్లు ఉన్నాయి. ఇంకా టికెల్స్ బ్లూ ఫ్లై క్యాచర్, ఏషియన్ బ్రౌన్ ఫ్లై క్యాచర్ వంటి పేర్ల కలిగిన పక్షి జాతులు ఉన్నట్లు నిపుణులు, అటవీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు సైబేరియా నుంచి ఆస్ప్రె(గద్ద జాతి) పక్షులు, యూరప్ నుంచి నాలుగు రకాల గోరింకలు చలికాలంలో వచ్చి ఫిబ్రవరిలో వెళ్తుంటాయని తేలింది. పక్షి వీక్షణ కేంద్రంగా అభివృద్ది పులిగుండాల అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం విభాగంలో అభివృద్ధి చేస్తూనే అరుదైన పక్షులు ఉన్నందున పక్షి వీక్షణ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. మిరాకీ, అటవీ బర్డ్స్ ఎన్జీవోస్ సంస్థలు ఇక్కడ పరిశోధనలు చేస్తున్నారు. చలికాలంలో ఆయా సంస్థల ప్రతినిధులు ఇక్కడ మకాం వేసి అత్యాధునిక పరికరాలతో పక్షులను పరిశీలిస్తూ అందులో అరుదైన రకాలను గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యాన సాధారణంగా ఉండే పక్షులతో పాటు మొత్తంగా 370 రకాల పక్షులు ఈ అడవుల్లో ఉన్నట్లు మిరాకీ సంస్థ బాధ్యులు చెబుతున్నారు. ప్రత్యేక కార్యక్రమాలు పక్షులు, జంతువులకు ఆవాసంగానే కాక ప్రత్యేక అటవీ ప్రాంతంగా గుర్తింపు పొందడంతో పులిగుండాలకు సందర్శకులు పెరుగుతున్నారు. ఈనేపథ్యాన పక్షులు, జంతుల ప్రేమికుల కోసం అటవీ అధికారులు బర్డ్ వాక్, నేచర్ వాక్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన బర్డ్ వాక్లో వివిధ ప్రాంతాలకు చెందిన 60మందికి హాజరయ్యారు. ఈ ప్రాంతం 27 కి.మీ. రహదారితో ఉండడంతో సఫారీ వాహనాలను సమకూర్చగా, బోటింగ్ ఏర్పాటుకు అటవీ శాఖ సిద్ధమవుతోంది.వైట్ త్రోటెడ్ కింగ్ఫిషర్బ్లాక్ వింగ్డ్ సిల్ట్ఏసియన్ బ్రౌన్ ఫ్లై క్యాచర్అరుదైన పక్షుల ఆవాసంగా పులిగుండాల భిన్నమైన పక్షులు, వన్యప్రాణులతో పాటు వివిధ రకాల వృక్ష జాతులతో ప్రత్యేకతను సంతరించుకున్న పులిగుండాల అటవీ ప్రాంతం అభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టాం. అటవీ ప్రాంతం, జలాశయాలు ఉన్నందున భిన్నమైన పక్షులు ఆవాసం ఏర్పాటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే నిపుణులు పరిశోధనలు చేస్తుండగా పక్షి వీక్షణ కేంద్రంగా కూడా అభివృద్ధి చేయనున్నాం. – సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, జిల్లా అటవీ అధికారి -
ఖో–ఖో జిల్లా బాలబాలికల జట్లు ఎంపిక
కల్లూరు: కల్లూరు మినీ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో శనివారం ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ ఖో–ఖో బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. ఈ పోటీలకు 78 మంది బాలురు, 60 మంది బాలికలు హాజరుకాగా ఖో–ఖో అసోసియేషన్ బాధ్యుల పర్యవేక్షణలో జట్ల ఎంపిక కొనసాగింది. కాగా, క్రీడాకారులకు పరిపూర్ణ కిషోర్రెడ్డి భోజనం, పీఈటీ నరాల సాంబశివరెడ్డి, బానోతు చిరంజీవి క్రీడాకారులకు దుస్తులు సమకూర్చారు. కార్యక్రమంలో ఖో–ఖో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పసుపులేటి వీర రాఘవయ్యతో పాటు సున్నం ప్రసాద్, కృష్ణయ్య, వెంకటేశ్వరరావు, కాంట్రాతి రాధాకృష్ణ, తలపరెడ్డి గౌతమ్రెడ్డి, ఎం.గోపాల్, నవీన్, పాషా,కోటి, అనంతలక్ష్మి, తులసి పాల్గొన్నారు. అయ్యప్ప శోభాయాత్రకు రాష్ట్రవాసుల ఎంపిక ఖమ్మంఅర్బన్: కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆభరణాల శోభాయాత్రలో పాల్గొనే అవకాశం తెలంగాణ నుంచి పలువురు భక్తులకు దక్కింది. అలంగాడ్ యోగం ట్రస్ట్ ఆధ్వర్యాన నిర్వహించే యోగం పెట్ట పురప్పడ్ శోభాయాత్రలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి 25 మందిని ఎంపిక చేసినట్లు అఖిల భారతీయ అయ్యప్పధర్మ ప్రచారసభ రాష్ట్ర అధ్యక్షుడు, అలంగాడ్ యోగం ట్రస్ట్ పోషకుడు టీ.వీ.పుల్లంరాజు తెలిపారు. అలువాలోని మణప్పురం మహాదేవుడి ఆలయం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర ఎరుమేలి వరకు కొనసాగుతుందని వెల్లడించారు. శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయానికి కానుకలను ఊరేగింపుగా తీసుకువెళ్లే ఈ సంప్రదాయాన్ని పెట్ట పురప్పడ్గా వ్యవహరిస్తారని తెలిపారు. సర్కారు బడుల మూసివేతకు కుట్ర ● ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ భద్రాచలంటౌన్: రేషనలైజేషన్ సాకుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ అన్నారు. భద్రాచలంలో శనివారం నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిధుల కోత, ఖాళీల భర్తీ చేపట్టకుండా పేదలకు విద్యను దూరం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ – 2025 బిల్లుతో విద్యను కాషాయీకరణ చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు. విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణను ప్రతీ ఒక్కరు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం టీపీటీఎఫ్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఎం.రామాచారి, అధ్యక్షుడిగా జి.హరిలాల్, ప్రధాన కార్యదర్శిగా వి.వినోదిని, అసోసియేట్ అధ్యక్షుడిగా డి.శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాయకులు వై.అశోక్కుమార్, ఎ.సోమయ్య, కె.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఉపాధ్యక్షుడిగా సంజయ్టేకులపల్లి : బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ (బీఏఎన్ఏఈ ) జాతీయ ఉపాధ్యక్షుడిగా మండలంలోని బోడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోత్ సంజయ్ నాయక్ ఎన్నికయ్యారు. శుక్రవారం నవీ ముంబైలో జరిగిన ఎన్నికల్లో దక్షిణ భారతదేశం నుంచి ఎన్నుకున్నట్లు శనివారం ఆయన తెలిపారు. సంజయ్ హైదరాబాద్లోని ఏఐఎంఎల్ వొక్సెన్ యూనివర్సిటీలో హెచ్ఓడిగా పనిచేస్తున్నాడు. హోటల్లో చోరీ తిరుమలాయపాలెం: మండలంలోని కేశ్వాపురం క్రాస్రోడ్డు వద్ద ఉన్న హోటల్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. పిండిప్రోలుకు చెందిన ఉడుగుల భిక్షం హోటల్ నిర్వహిస్తుండగా, సమీప బంధువు మృతి చెందడంతో శుక్రవారం వెళ్లిన ఆయన శనివారం మధ్యాహ్నం వచ్చాడు. అప్పటికే హోటల్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో పరిశీలించగా నగదు, మద్యం బాటిళ్లు, సిగరెట్లు చోరీ అయినట్లు గుర్తించారు. సుమారు రూ.15 వేల విలువైన సామగ్రి చోరీ అయినట్లు ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
ముగిసిన క్రీడాజ్యోతి ర్యాలీ
ఖమ్మం స్పోర్ట్స్/కల్లూరు/తల్లాడ/సత్తుపల్లిటౌన్/ వేంసూరు/కారేపల్లి: సీఎం కప్ క్రీడాపోటీలను పురస్కరించుకుని జిల్లాలో రెండురోజులుగా నిర్వహిస్తున్న క్రీడాజ్యోతి ర్యాలీ శుక్రవారం ముగిసింది. రెండో రోజు కొణిజర్ల, వైరా, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, ఏన్కూరు, కారేపల్లి, కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో కొనసాగిన ర్యాలీ సాయంత్రం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంకు చేరుకుంది. ఈ కార్యక్రమాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్ మాట్లాడుతూ జిల్లా యువత క్రీడా పోటీల్లో ఉత్సాహంతా పాల్గొని సత్తా చాటాలని సూచించారు. డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి మాట్లాడుతూ ఈనెల 17నుంచి మొదలయ్యే పోటీల్లో పాల్గొనేందుకు అన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కోచ్లు ఎం.డీ.గౌస్, కె.క్రిస్టోఫర్బాబు, ఉదయ్కుమార్, ఆదర్శ్కుమార్, సాంబమూర్తి, బాగం నీరజాదేవి, ఆలకుంట నర్సింహారావు, పత్తిపాటి నివేదిత, పసుపులేటి వీరరాఘవయ్య, రాధాకృష్ణ, తులసి, అప్పారావు, పద్మ, మహేష్, సురేష్బాబు, బి.వెంకటేశ్, పకృద్దీన్, మాణిక్రావు, రాంమోహన్ రావు, నాగేశ్వరరావు, సత్యనారాయణ, రాజేశ్వరరావు, నాగేశ్వరరావు, సోందు, దుగ్గిరాల జయరాజు, యాకూబ్పాషా, మూర్తి, వెంకట్, లక్ష్మణ్, కృష్ణయ్య, విజయ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
మిర్చి ధరలో పురోగతి
ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధర ముందడుగు వేసింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఇన్నాళ్లు క్వింటా తేజా రకం మిర్చికి రూ.15,200 ధర దాటకపోగా శుక్రవారం ఒకేసారి రూ.15,900కు చేరింది. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చితో పాటు కొత్త పంటకు సైతం ఇదే ధర పలికింది. ఇది జెండాపాట ధర కాగా, నాణ్యత ఆధారంగా మోడల్ ధర రూ.15,500గా నమోదైంది. మిర్చి ధర పెరిగిన నేపథ్యాన విక్రయాలు పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. జిల్లాలోని కోల్డ్ స్టోరేజీల్లో సుమారు 20 లక్షల బస్తాల మిర్చి నిల్వ ఉండగా, ఈ ఏడాది జిల్లాలో సుమారు 35వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. ధర ఇలాగే కొనసాగితే సంక్రాంతి తర్వాత విక్రయాలు జోరందుకుంటాయని చెబుతున్నారు. సాగు విస్తీర్ణం తగ్గడంతోనే.. మిర్చ ధర పెరగడానికి సాగు విస్తీర్ణం తగ్గడమేనని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. రెండేళ్లుగా ధర తగ్గడం, తెగుళ్ల కారణంగా దిగుబడి రాకపోవడంతో రైతులు సాగు విస్తీర్ణం తగ్గించారు. జిల్లాలో లక్ష ఎకరాల మేర సాగయ్యే మిర్చి ఈ ఏడాది 35 వేల ఎకరాలకు పడిపోయింది. ఫలితంగా తక్కువ సరుకు వచ్చే అవకాశముండడంతో ధర పెరిగిందని తెలుస్తుండగా, విదేశీ ఆర్డర్లు కూడా లభిస్తే మరింత పుంజుకుంటుందని భావిస్తున్నారు. కాగా, శుక్రవారం ఖమ్మం మార్కెట్కు సుమారు 10వేల బస్తాల కొత్త మిర్చిని విక్రయానికి తీసుకొచ్చారు. ఇక తాలు మిర్చి ధర కూడా గరిష్టంగా రూ.9వేలు, కనిష్టంగా రూ.7వేల వరకు పలికింది. తేజా క్వింటాకు రూ.15,900 -
సీసీఐ కేంద్రంలో అగ్ని ప్రమాదం
కారేపల్లి: కారేపల్లిలోని శ్రీలక్ష్మిప్రియా కోటెక్స్ జిన్నింగ్ మిల్లులో కొనసాగుతున్న సీసీఐ పత్తి కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మిల్లు మిషనరీ నుంచి మొదలైన మంటలు పత్తికి అంటుకోగా ఆ ప్రాంతమంతా పొగ కమ్మేసింది. మిల్లు పక్కనే సుమారు వేయి క్వింటాళ్ల పత్తిపై నిప్పు రవ్వలు పడగా వర్కర్లు, సీసీఐ కేంద్రానికి వచ్చిన రైతులు పరుగులు తీశారు. ఇంతలోనే తేరుకుని పైపులతో నీళ్లు చల్లుతూ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇల్లెందు నుంచి అగ్నిమాపక శాఖ సిబ్బంది వాహనంతో వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే 20క్వింటాళ్ల పత్తి కాలిపోయినా రూ.కోటి విలువైన బేళ్లు, సీడ్లకు నిప్పు అంటుకోక పోవటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. కాగా, పత్తిని బేళ్లుగా మార్చేందుకు శుభ్రం చేసే క్రమాన రాయి వంటివి వస్తే నిప్పు రవ్వలు వస్తాయని.. అది కన్వేయర్ బెల్ట్ వద్ద అంటుకోవడం ప్రమాదం కారణమై ఉండొచ్చని మిల్లు యజమాని రాహుల్ తెలిపారు. అండర్గ్రౌండ్లో ఉన్న మిషనరీ బెల్టుల వద్ద నుంచి పొగ రావడాన్ని గుర్తించిన వర్కర్లు అప్రమత్తం కావడంతో పెనుముప్పు తప్పినట్లయింది. ఘటనాస్థలాన్ని సింగరేణి తహసీల్దార్ రమేష్, ఎంపీఓ రవీంద్రప్రసాద్, గ్రామ కార్యదర్శులు కృష్ణవేణి, నెహ్రూ, సింగరేణి, సర్పంచ్లు మేదరి టోనీవీరప్రతాప్, దండు ప్రవీణ్ తదితరులు పరిశీలించారు. సీసీఐ అధికారి ఆరా ప్రమాదం జరిగిన మిల్లును సీసీఐ అధికారి గురురాజ్ కులకర్ణి పరిశీలించారు. ఇల్లెందు మార్కెట్ కార్యదర్శి నరేష్కుమార్తో కలిసి పరిశీలించిన ప్రమాదాలు వివరాలు తెలుసుకున్నాక మాట్లాడారు. ఒక ల్ రూ.25వేలు ఉంటుందని, అప్రమత్తం కావడంతో పెనుముప్పు తప్పిందని పేర్కొన్నారు. శుక్రవారం 145క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా, మిగతాది మిల్లు యజమాని నిల్వ చేసుకున్నాడని తెలిపారు. -
ఆలయంలో జిల్లా జడ్జి పూజలు
ఖమ్మం అర్బన్: ఖమ్మం యూపీహెచ్కాలనీలోని స్వయంభూ శ్రీ అభయ వెంకటేశ్వర స్వామిని జిల్లా జడ్జి జి.రాజగోపాల్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికగా ప్రత్యేక పూజలు అనంతరం వేదాశీర్వచనం అందజేశారు. దేవస్థానం చైర్మన్ అల్లిక అంజయ్య, ప్రధాన కార్యదర్శి బెల్లికొండలరావు, కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డితో పాటు పల్లపు సత్యం, బొల్లి కొమరయ్య, మేకల వీరన్న, పురం తిరుపతయ్య, ఐతన బోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అదనపు హాల్ నిర్మాణానికి శంకుస్థాపన ఖమ్మం లీగల్: ఖమ్మం కోర్టులో మహిళా న్యాయవాదులకు ప్రస్తుతం ఉన్న బార్ అసోసియేషన్ సరిపోవడం లేదు. దీంతో ర్ అసోసియేషన్ బాధ్యుల విజ్ఞప్తితో జిల్లా జడ్జి జి.రాజగోపాల్ హైకోర్టుకు లేఖ రాయగా అనుమతులు మంజూరయ్యాయి. దీంతో అదనపు హాల్ నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ బాధ్యులు తొండపు వెంకటేశ్వరరావు, గద్దెల దిలీప్, విజయశాంత, ఇందిర, నరసింహారావు, కొల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బెటాలియన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
● రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క సత్తుపల్లిటౌన్: బెటాలియన్ ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డీజీపీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. సత్తుపల్లి మండలం గంగారం 15వ ప్రత్యేక బెటాలియన్లో జరుగుతున్న వార్షిక క్రీడాపోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి విజేతలకు బహుమతులు అందజేశాక మంత్రి మాట్లాడారు. ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసుకుని వస్తే పదోన్నతులు, బదిలీలు, ఇతర సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. పోలీసులు మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు. పూర్వీకులు ప్రకృతి సహజసిద్ధంగా లభించే కల్లు, ఇప్పసారా తాగినా ఆరోగ్యంగా ఉండేవారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వసుంధర యాదవ్, బెటాలియన్ కమాండెంట్ పెద్దబాబు, ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ పోటీల్లో విజేతగా ఖమ్మం జట్టు ఖమ్మంవ్యవసాయం: ఇటీవల నల్లగొండలో జరిగిన విద్యుత్ శాఖ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో ఖమ్మం జిల్లా జటు విజేతగా నిలిచింది. జిల్లా జట్టు రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలవడం ఇది ఐదోసారి కావడం విశే షం. ఈ సందర్భంగా జట్టు క్రీడాకారులను ఖమ్మం, కొత్తగూడెం ఎస్ఈలు ఇనుగుర్తి శ్రీనివాసాచారి, మహేందర్, డీఈ బాబూరావు తదితరులు అభినందించారు. వెంకట్రామిరెడ్డికి ఉత్తమ రైతు పురస్కారం ఎర్రుపాలెం: సేంద్రియ వ్యవసాయంతో ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పి స్తున్న మండలంలోని మీనవోలుకు చెందిన రైతు కుడుముల వెంకట్రామిరెడ్డికి పురస్కారం లభించింది. ఏపీలోని గుంటూరు జిల్లా విజ్ఞాన్ విశ్వవిద్యాలయం, రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యాన శుక్రవారం వడ్లమూడిలోని విజ్ఞాన్ విద్యాలయంలో పలువురు రైతులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఐసీఐఆర్ డైరెక్టర్ చెరుకూరి శ్రీనివాసరావు, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా వెంకట్రామి రెడ్డి పురస్కారం అందుకున్నారు . పాఠశాలకు రూ.2లక్షల విలువైన సామగ్రి పెనుబల్లి: మండలంలోని కొత్తకాయిగూడెం ఎంపీయూపీఎస్కు ఎన్ఓఎస్జీహెచ్ ల్యాబ్ అధినేత సత్యనారాయణరెడ్డి రూ.2లక్షల విలువైన సామగ్రి సమకూర్చారు. ఇందులో ఎస్ టైప్ కుర్చీలు, టీచర్ టేబుళ్లు, డెస్క్ బెంచీలు ఉండగా వీటిని శుక్రవారం ఎంఈఓ కావేటి మోహన్రావు ప్రారంభించారు. సర్పంచ్ కాలసాని తిరుపతమ్మ, మాజీ సర్పంచ్ దొడ్డపునేని శ్రీదేవి, హెచ్ఎం కంకటి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసమే యాత్రనేలకొండపల్లి: ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా ఉండేలా అవగాహన కల్పించేందుకు చిన్న జీయర్స్వామి సుఫలా యాత్ర చేపడుతున్నారని సిద్ధార్థ యోగా విద్యాలయం నిర్వాహకుడు ప్రకృతి వైద్యుడు రామచందర్రావు తెలిపారు. నేలకొండపల్లిలోని విద్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జీయర్ స్వామి చేపట్టే యాత్ర ఈనెల 20న భక్తరామదాసు జన్మస్థలమైన నేలకొండపల్లిలో మొదలవుతుందని పేర్కొన్నారు. రైతులు, ప్రజల సంక్షేమం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే కాక భూమాతను రక్షించుకోవడంపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. కాగా, యాత్ర సందర్భంగా 20వ తేదీన విద్యాలయంలో పాతకాలపు వ్యవసాయ పరికరాలు, దేశవాళీ 150రకాల పప్పు దినుసులు, 12 రకాల వరి బియ్యం, 50 రకాల చేతి వృత్తులు, 250 రకాల ఔషధ ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఈ యాత్రలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అర్చక సంఘం నాయకుడు తుపురాణి మధుసూధనాచార్యులు తదితరులు ఉన్నారు. -
ఇకపై మేమూ ఓటర్లమే!
● తీరిన కొమ్మేపల్లి కాలనీవాసుల కష్టాలు ● ఆరేళ్ల తర్వాత సమస్యకు పరిష్కారంసత్తుపల్లి: కొమ్మేపల్లి పునరావాస కాలనీ ఏర్పడి ఆరేళ్లు కావస్తోంది.. మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పాటు ఓటు హక్కు కల్పించి సమస్యలు పరిష్కరించండి అంటూ స్థానికులు ఎవరికీ మొరపెట్టుకున్నా ఆలకించలేదు. ప్రస్తుతం ‘సాక్షి’లో వరుసగా ప్రచురితమైన కథనాలతో అధికారుల్లో చలనం రాగా కాలనీలోని 449మందికి ఓటు హక్కు కల్పించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి ఓసీతో తరలింపు కిష్టారం పంచాయతీ పరిధిలో 449మంది ఓటర్లను కుటుంబాలతో సహా ఉండగా ఆ ప్రాంతాన్ని ఆరేళ్ల క్రితం సింగరేణి ఓసీ విస్తరణ భాగంగా సేకరించారు. ఆపై నిర్వాసితులకు సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధి అయ్యగారిపేట రెవెన్యూలో ఇళ్లస్థలాలు కేటాయించగా ఇళ్ల నిర్మించుకున్నారు. అయితే, వీరి ఓట్లను కిష్టారం పంచాయతీనే కొనసాగించడంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలో ఓట్లు వేయగలిగా రు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జాబితా నుంచి తొలగించిన అధికారులు మున్సిపాలిటీలో మాత్రం ఓటుహక్కు కల్పించలేదు. దీంతో మండల స్థాయి మొదలు జిల్లాస్థాయి అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోగా, తాజాగా విడుదలైన మున్సి పల్ ముసాయిదా ఓటర్ల జాబితాలోనూ స్థానం దక్కలేదు.కిష్టారం పంచాయతీలో ఓటు తొలగించారు. మున్సిపాలిటీలో ఇవ్వాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదు. చివరకు ‘సాక్షి’ పత్రికలో మా సమస్య ప్రచురితం కావడంతో ఓటు హక్కు రావడం సంతోషంగా ఉంది. – ఎస్కే.యాసిన్, కొమ్మేపల్లి కాలనీసత్తుపల్లి మున్సిపాలిటీలో ఓటర్లుగా కలపాలని ఆరేళ్ల నుంచి వేడుకుంటున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు మున్సిపల్లో విలీనం చేసి సమస్యను పరిష్కరించారు. అధికారులు మున్సిపాలిటీ నుంచి మిగతా సేవలు కూడా అందించాలి. – గుర్రాల చెన్నారావు, కొమ్మేపల్లి కాలనీకొమ్మేపల్లి పునరావాస కాలనీకి చెందిన 449 మంది ఓటర్ల సమస్యపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈనెల 3న రిజర్వేషన్లపై ఉత్కంఠ, 5న కొమ్మేపల్లి కాలనీలో ఇంటింటి సర్వే, 6న ఇది ఎవరికీ పట్టని కాలనీ శీర్షికలతో కథనాలు రావడంతో అధికారులు స్పందించారు. ఈమేరకు ఆగమేఘాలపై కొమ్మేపల్లి కాలనీలో ఇంటింటి సర్వే చేసి నివేదికలు సమర్పించడంతో 449మందికి ఓటు హక్కు లభించింది. వీరిని సత్తుపల్లి మున్సిపాలిటీ 13వ వార్డులో చేర్చినట్లు మున్సిపల్ కమిషనర్ కొండ్రు నర్సింహ శుక్రవారం వెల్లడించారు. కాగా, ఈ వార్డులో ఇప్పటికే 1,923 మంది ఓటర్లు ఉండగా, కొమ్మినేపల్లి ఓటర్లతో కలిపి ఈ సంఖ్య 2,372కు చేరింది. ఈమేరకు అధికారుల ప్రకటనతో కాలనీవాసులు శుక్రవారం స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు. అంతేకాక సమస్య ను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అండగా నిలి చిన ‘సాక్షి’ పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. -
యూరియా కోసం బారులు
బోనకల్: మండలంలోని రావినూతల పీఏసీఎస్ వద్ద యూరియా కోసం శుక్రవారం అన్నదాతలు బారులుదీరారు. సొసైటీ పరిధిలో రావినూతల, ఆళ్లపాడు గ్రామాల రైతులు యూరియా కోసం వచ్చారు. అయితే, 440 బస్తాల యూరియా మాత్రమే ఉండడంతో కూపన్ల ఆధారంగా పంపిణీ చేసిన అధికారులు, మిగతా వారికి శనివారం ఇస్తామని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. ఎల్ఐజీ ప్లాట్ల లాటరీ వాయిదా ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం శ్రీరాంనగర్లోని ఎల్ఐజీ ప్లాట్ల కేటాయింపునకు శనివారం డ్రా తీయాల్సి ఉండగా, వాయిదా వేసినట్లు హౌసింగ్ బోర్డు సీఈ జీవీ.రమణారెడ్డి తెలిపారు. ఇక్కడ ప్లాట్ల కోసం 23 మంది దరఖాస్తు చేసుకోగా అందరికీ ప్లాట్లు కేటాయించనున్నా నంబర్ మాత్రం లాటరీ ద్వారానే ఖరారు చేస్తామని పేర్కొన్నారు. ● ఎల్ఐజీ ప్లాట్లు – విల్లాల మధ్య అక్రమంగా నిర్మించిన గోడ, గేటును హౌసింగ్ బోర్డు ఈఈ అంకమరావు ఆధ్వర్యాన రెవెన్యూ ఉద్యోగులు శుక్రవారం కూల్చివేశారు. ప్లాట్ల డ్రా ప్రక్రియకు ఆటంకం కలిగించేలా ఈ గోడ నిర్మించినట్లు భావిస్తున్నారు. తహసీల్దార్ సై దులు, ఉద్యోగులు సత్యనారాయణ, పృథ్వీరా జ్,రమేష్నాయక్, విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు. -
మూడేళ్లలో సీతారామ పూర్తి
● రూ.100 కోట్లతో వ్యవసాయ యాంత్రీకరణ ● రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మలఅశ్వారావుపేటరూరల్: రానున్న మూడేళ్లలో సీతారామ ప్రాజెక్టును వందశాతం పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి గోదావరి జలాలను అందిస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీతారామ ప్రాజెక్ట్ పేరుతో ఎనిమిదిన్నర వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఎకరా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు. అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన రైతు మేళా, అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు మంత్రులు హాజరయ్యారు. ఆతర్వాత దమ్మపేట గండుగులపల్లిలో సీతారామ ఎత్తిపోతల పథకంపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు గడిచిన రెండేళ్లుగా అమలు కానీ యంత్రీకరణ పథకాన్ని తిరిగి ప్రారంభించామని తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.100కోట్ల వ్యయంతో 1.30లక్షల మంది రైతులకు 50శాతం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందిస్తామని చెప్పారు. రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి దేశంలోని 29 రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 148 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఉమ్మడి రాష్ట్రం హయాంలో కూడా లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వరిసాగులో రాష్ట్రం రికార్డు సృష్టిస్తోందని అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలని చెప్పారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ త్వరలోనే సీతారామ 4వ పం్ప్ హౌస్ను పూర్తి చేసి అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు కూడా గోదావరి నీళ్లు అందిస్తామన్నారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ విస్తరిస్తానమి తెలిపారు. ఈకార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, మట్టా రాగమయి, ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ఆల్దాస్ జానయ్య, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్రమోహన్, ఆయిల్ఫెడ్ ఎండీ యాస్మిన్ భాషా, అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ బీ గోపి తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
చింతకాని: వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రజల కు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని, అలాకాకుండా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డి.రామారావు హెచ్చరించారు. చింతకాని పీహెచ్సీని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన ఉద్యోగుల హాజరు, ఓపీ రికార్డులు పరిశీలించాక మాట్లాడారు. ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించాలని సూచించారు. గర్భిణులు ప్రభు త్వ ఆస్పత్రుల్లోనే ప్రసవించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. మండల వైద్యాధికారి ఆల్తాఫ్, సీహెచ్ఓ వీరేందర్ పాల్గొన్నారు. సొసైటీల ద్వారా రైతులకు విస్తృత సేవలు సత్తుపల్లిటౌన్: వ్యవసాయ పరపతి సహకార సంఘాల ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందించేలా సిద్ధం కావాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సెక్రటరీ కె.సురేంద్రమోహన్ సూచించారు. సత్తుపల్లి పీఏసీఎస్ను శుక్రవారం తనిఖీ చేసిన ఆయన యూరియా నిల్వ లు, ఇప్పటివరకు అమ్మకాలపై ఆరా తీశాక అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. అవసరం మేరకే యూరియా కొనుగోలు చేసి ఉపయోగించాలని సూచించారు. ఆతర్వాత డీసీసీబీ బ్రాంచ్ను పరిశీలించిన సురేంద్రమోహన్ రైతులకు ఇచ్చిన రుణాలు, లక్ష్యాలపై అధికారులతో చర్చించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు కె.విజయ్కుమార్, డీసీఓ గంగాధర్, బ్యాంక్ సీఈఓ వెంకట ఆదిత్య, ఏడీ ఏ శ్రీనివాసరెడ్డి, ఏఓ శ్రీనివాసరావు, మేనేజర్ కిషోర్కుమార్, సీఈఓ వీరస్వామితో పాటు చల్లగుండ్ల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మల్బరీ సాగుతో మెరుగైన ఆదాయం వైరారూరల్: కర్ణాటక రైతుల మాదిరి మల్బరీ, పట్టు పరిశ్రమ ద్వారా ఇక్కడి రైతులు అధిక దిగుబడితో మెరుగైన ఆధాయం సాధించాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ రాష్ట్ర డైరెక్టర్ యాస్మిన్ బాషా సూచించారు. వైరా రెబ్బవరంలో ఒకేచోట 30 మంది రైతులు సాగు చేస్తున్న మల్బరీ క్షేత్రాన్ని శుక్రవారం ఆమె పరిశీలించి మాట్లాడా రు. ఆసక్తి ఉన్న రైతులను కర్ణాటక రాష్ట్రానికి తీసుకెళ్లి అక్కడి రైతులు అవలంబిస్తున్న విధానాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఆతర్వాత రైతు సతీష్ సాగు యో గ్యం కాని చౌడు భూమిలో కొబ్బరిచెట్లు నాటడ మే కాక చేపల చెరువు తవ్వించడాన్ని పరిశీలించిన ఆమె అభినందించారు. ఈ విధానాన్ని అందరికీ వివరించేలా నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఉద్యాన అధికారి ఎం.వీ.మధుసూదన్, పట్టు పరిశ్రమ అధికారి ముత్యాలుతో పాటు అనితశ్రీ, వేణు, విష్ణు, కామేశ్వరరావు, దేవరాజు పాల్గొన్నారు. రైతులకు సరిపడా యూరియా కూసుమంచి: యాసంగి పంటలు సాగు చేస్తున్న రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేస్తామని వ్యవసాయశాఖ సంచాలకులు డాక్టర్ గోపి తెలిపారు. మండలంలోని చేగొమ్మ పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పంటల సాగు, యూరియా అవసరంపై రైతులతో మాట్లాడారు. యూరియా నిల్వలు, డిమాండ్, సాగు ఆధారంగా నియోజకవర్గంలోని సబ్సెంటర్ల ద్వారా పంపిణీ చేస్తుండడంతో ఇబ్బంది రాలేదని అధికారులు తెలిపారు. ఈ విధా నం బాగుందని అభినందించిన సంచాలకులు, అధికారులకు పలు సూచనలు చేశారు. అడిషనల్ డైరెక్టర్ విజయ్కుమార్, ఏడీఏ సతీష్, ఏఓ వాణి, సీఈఓ రామకృష్ణ పాల్గొన్నారు. -
అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్దాం..
మధిర: కాంగ్రెస్ హయాంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తే మరో పార్టీకి భవిష్యత్తే ఉండదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అయితే, చేసిన అభివృద్ధి పనులను చెప్పుకోవడంలో కాంగ్రెస్ శ్రేణులు వెనుకబడగా.. మిగతా పార్టీలు కొద్దిపాటి పనులనే ప్రచారం చేసుకుంటున్నాయని చెప్పారు. ఇకనైనా అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు చేయాలని సూచించారు. మధిర పట్టణం అభివృద్ధి చెందితేనే భవిష్యత్ తరాలకు సుస్థిరమైన జీవితం సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలు కూడా గుర్తించి మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. మధిర మున్సిపాలిటీ పరిధి మడుపల్లిలో శుక్రవారం కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశమైన డిప్యూటీ సీఎం మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ పథకాలు మధిరలో అర్హులకు కూడా అందుతుండగా, అభిృవృద్ధి పనులకు రూ.వందల కోట్ల నిధులు మంజూరు చేశామని పేర్కొన్నా. ఈ విషయాన్ని ప్రతీ నాయకుడు రోజుకు కనీసం పది మందికి వివరించాలని.. తద్వారా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మధిరకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ ప్రాజెక్టులతో పాటు డిగ్రీ, ఇంటర్, హైస్కూళ్లకు సొంత భవనాలు, పాలిటెక్నిక్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, బస్టాండ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. ఈ పనులన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగిన విషయాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు. కాగా, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పూర్తయ్యాక మధిర పట్టణమంతా కొత్త సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని భట్టి వెల్లడించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, నాయకులు పాల్గొన్నారు. -
ప్రతీ హామీని అమలు చేశాం
ఇల్లెందు/పినపాక: ప్రజల దీవెనలతో ఏర్పడిన తమ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లని, ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయడం వల్లే గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 69శాతం పంచాయతీల్లో విజయం సాధ్యమైందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు ఇదే తీర్పు ఇవ్వాలని కోరారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని శుక్రవారం ఇల్లెందు జేకే సింగరేణి హైస్కూల్ ఆవరణలో, పినపాకలో నిర్వహించారు. ప్రజాప్రతినిధులను సన్మానించాక మంత్రి మాట్లాడుతూ ప్రజా పాలనలో సర్పంచులు, వార్డు సభ్యులు కీలకమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి ద్వారానే ప్రజల వద్దకు చేరుతాయని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే మళ్లీ ఎన్నికలకు వస్తామని అన్నారు. మార్చి చివరి నాటికి రెండోదశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిపించాలని, కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఇల్లెందులో నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన సీతారామ ప్రాజెక్టు చేపట్టకుండానే మొండి చేయి చూపించారని విమర్శించారు. గెలిచిన సర్పంచ్, వార్డుసభ్యులు ఇంటి వద్ద కూర్చోకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా పాటుపడాలని కోరారు. నియోజకవర్గానికి తమ ప్రభుత్వం సీతారామ నీళ్లు ఇస్తుందని, బడ్జెట్లో నిధులు కేటాయించేలా మంత్రి పొంగులేటి బాధ్యత తీసుకుంటారని తెలిపారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
బాలికలకు భరోసా
గర్భాశయ ముఖద్వార కేన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ కేన్సర్ ఉన్నట్లు గుర్తించేలోగా తీవ్రత పెరుగుతుండడంతో అత్యాధునిక చికిత్స చేయించినా పెద్దగా ఫలితాలు ఉండడం లేదు. ఈనేపథ్యాన బాలికల దశలోనే కేన్సర్ సోకే అవకాశాలను తుంచివేయాలని ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. బాలికలు కేన్సర్ బారిన పడకుండా కట్టడి చేసేందుకు ముందస్తుగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా హూమన్ పాపిలోమా వైరస్(హెచ్పీవీ) వ్యాక్సిన్ సిద్ధం చేశారు. ఈ నెలాఖరులో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుండగా 14 ఏళ్లు నిండిన బాలికలందరికీ ఇవ్వనున్నారు. ఈమేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు 14 ఏళ్లు నిండి 15 ఏళ్ల వయస్సు లోపు ఉన్న బాలికల గుర్తింపు ఇప్పటికే పూర్తిచేశారు. – ఖమ్మం వైద్యవిభాగంమహిళలే బాధితులు కేన్సర్ బాధితుల్లో పురుషుల కన్నా ఎక్కువగా మహిళలే ఉంటున్నారు. గర్భాశయం, రొమ్ము కేన్సర్ల బారిన పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కేన్సర్ మహమ్మారిని సమూలంగా నిరోధించాలనే లక్ష్యంతో 14–15 ఏళ్ల వయస్సు కలిగిన బాలికలకు ఉచితంగా టీకా వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. ఈ వయస్సులోనే బాలికలకు హార్మోన్ల మార్పులు జరిగే అవకాశమున్నందున ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటికి వెంటనే చికిత్స తీసుకోకపోతే గర్బాశయ ముఖ ద్వారా కేన్సర్కు దారితీసే ప్రమాదముందని గుర్తించారు. ఈనేపథ్యాన ప్రభుత్వమే ఉచితంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్(హెచ్పీవీ) టీకాలు వేయాలని నిర్ణయించింది. త్వరలోనే ప్రక్రియ మొదలుకానుండడంతో జిల్లాలో 14–15 ఏళ్ల బాలికల గుర్తింపు పూర్తి చేశారు. పీహెచ్సీలు, సీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్ల వారీగా సర్వే నిర్వహించిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలో మొత్తం 19,500 మంది బాలికలు ఉన్నట్లు గుర్తించారు. కేన్సర్పై పెరుగుతున్న అవగాహన జిల్లాలో గతంతో పోలిస్తే కేన్సర్పై అవగాహన పెరుగుతోంది. ముప్ఫై ఏళ్లు నిండిన మహిళలకు ఆరోగ్య మహిళ కార్యక్రమం అందుబాటులోకి వచ్చాక పరిస్ధితి మారింది. వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ఆరోగ్య మహిళ కార్యక్రమం కోసం ప్రత్యేక విభాగం ఉండడంతో మహిళలు పరీక్షలు చేయించుకునేందుకు ముందుకొస్తున్నారు. 2023 మార్చి 8న ఈ కార్యక్రమం మొదలుకాగా జిల్లాలోని 12 పీహెచ్సీల పరిధిలో కొనసాగుతోంది. పీహెచ్సీల్లో సర్వైకల్, బ్రెస్ట్, ఛాతి, నోటి, థైరాయిడ్ తదితర కేన్సర్లకు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. అనుమానితులుగా ఎవరైనా తేలితే జిల్లా ఆస్పత్రికి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 6,645 మంది మహిళలకు పెద్దాస్పత్రిలో ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా పూర్తిపరీక్షలు నిర్వహించగా 232 మందికి కేన్సర్ ఉన్నట్లు తేలింది. వీరిలో 92 మందికి బ్రెస్ట్ కేన్సర్, 72 మందికి సర్వైకల్ కేన్సర్, 22 మందికి థైరాయిడ్ కేన్సర్ ఉండగా చికిత్స నిమిత్తం ఎన్ఎంజేకు రిఫర్ చేశారు. అయితే యుక్త వయస్సు బాలికల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ మూలంగా గర్భాశయ ముఖద్వార కేన్సర్ సోకే అవకాశం ఉండడంతో తొలిదశలో హెచ్పీవీ వ్యాక్సిన్ వేయనున్నారు. తద్వారా బాలికల వయస్సు పెరిగాక కేన్సర్ బారిన పడే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.సర్వైకల్ కేన్సర్ బారిన పడకుండా టీకా హెచ్పీవీ వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్ వేసేలా మా శాఖ ఉద్యోగులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చాము. 14 ఏళ్లు నిండి 15 ఏళ్ల వయస్సు కలిగిన బాలికలందరికీ టీకా వేయనున్నాం. ఈ వయస్సు వారు జిల్లాలో 19,500 మంది ఉండగా.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హెచ్పీవీ వ్యాక్సినేషన్కు సిద్ధంగా ఉన్నాం. – చందూనాయక్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి -
ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత
ఖమ్మం సహకారనగర్: రోడ్డు ప్రమాదాల నియంత్రించడాన్ని అందరూ బాధ్యతగా భావించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం పెట్రోల్ బంక్ నిర్వాహకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందితే ఆయనపై ఆధారపడిన కుటుంబం రోడ్డున పడుతుందని తెలిపారు. పెట్రోల్ బంక్ల్లోకి వచ్చి, వెళ్లే మార్గాలు ప్రధాన రోడ్డును కలిసే చోట అవసరమైన మార్పులు చేసుకోవాలని సూచించారు. అలాగే, బంక్కు ఇరువైపులా 100 మీటర్ల దూరాన రోడ్డుపై బ్లింకర్లు, రంబుల్ స్ట్రిప్లు ఏర్పాటుచేయాలని, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏర్పాటుచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్టీఓ డి.జగదీష్, డీఎల్ఎంఓ ప్రవీణ్ కుమార్, ఆర్ అండ్ బీ డీఈ జి.రాధిక తదితరులు పాల్గొన్నారు. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 25న మొదలయ్యే పరీక్షల నిర్వహణకు 66 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ముందుగానే హాల్టికెట్ను విద్యార్థి వాట్సప్ నకు పంపినందున తప్పులు ఉంటే సరిచేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. డీఆర్వో పద్మశ్రీ, డీఎంహెచ్ఓ రామారావు, సీఐ రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
జాతీయ రహదారులపై మరింత భద్రత
సత్తుపల్లిటౌన్/కల్లూరురూరల్: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల కట్టడికి మరిన్ని భద్రతా చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందించాలని ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ అపూర్వ సూచించారు. కల్లూరులోని ప్రధాన సెంటర్, పెనుబల్లి జంక్షన్, లంకపల్లి, కిష్టారం వై జంక్షన్, తాళ్లమడ బ్రిడ్జి, ఏన్కూరులో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆమె వివిధ శాఖల అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అత్యధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను యాప్లో నమోదు చేసి నివారణ చర్యలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. తొలుత జీబ్రా క్రాసింగ్లు, రంబుల్ స్ట్రిప్స్, మార్కింగ్లు, సూచిక బోర్డులు, ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటుచేయాలని సూచించారు. ఐఆర్ఏడీ జిల్లా మేనేజర్ హరిబాబు, నేషనల్ హైవే ఇంజనీర్ కిరణ్, సత్తుపల్లి ఎంవీఐ జేఎన్.శ్రీనివాస్, ఆర్అండ్బీ శాఖ ఇంజనీర్ నాగేశ్వరరావు, సీఐ శ్రీహరి, కల్లూరు ఎస్సై హరిత తదితరులు పాల్గొన్నారు. -
విస్తృత ప్రచారం, జన సమీకరణే లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఈనెల 18న జరగనుండగా విజయవంతానికి విస్తృత ప్రచారం నిర్వహించాలని పార్టీ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు సూచించారు. భారీ జన సమీకరణే లక్ష్యంగా ప్రచారం కొనసాగాలని తెలిపారు. ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్లో కొండపర్తి గోవిందరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ ఎత్తున జన సమీకరణే లక్ష్యంగా గ్రామగ్రామాన ప్రచారం చేయాలని తెలిపారు. అలాగే, 10న అలంకరణ కమిటీ, కమిటీల సమావేశం, 11న కాగడాల ప్రదర్శన, 12న బహిరంగ సభ జయప్రదం కోరుతూ ట్రాక్టర్ల ర్యాలీ, అదే రోజు డీపీఆర్సీ భవనంలో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక 13న జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టుల ఇళ్లపై సీపీఐ జెండాలు ఎగురవేయాలని, 14న గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించాలని తెలిపారు. ఈసమావేశం అనంతరం నాయకులు బహిరంగ సభ జరగనున్న ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కార్యదర్శులు దండి సురేష్, సాబీర్పాషా, నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, యర్రా బాబు, బీజీ.కై ్లమెంట్, ఏపూరి లతాదేవి, సిద్దినేని కర్ణకుమార్, అజ్మీరా రామ్మూర్తి, కొండపర్తి గోవిందరావు, మేకల శ్రీనివాసరావు, పోటు పూర్ణ, చింతల రమేష్, నంబూరి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. 12న కవితా సంచిక ఆవిష్కరణ సీపీఐ విజయాలు, పోరాటాలపై రాసిన కవితలతో రూపొందించిన ‘నూరేళ్ల అరుణ కేతనం’ కవితా సంచికను 12వ తేదీన ఆవిష్కరిస్తామని కమిటీ బాధ్యుడు లెనిన్ శ్రీనివాస్ తెలిపారు. ఏఐటీయూసీ కార్యాలయంలో శింగు నర్సింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంచిక కోసం వంద మంది కవులు తమ రచనలను పంపించారని వెల్లడించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో బాగం హేమంతరావు -
గిరిజనులకు ప్రత్యేకం!
● ‘ఖేలో ఇండియా’లో క్రీడాపోటీల నిర్వహణకు నిర్ణయం ● ఏడు అంశాల్లో జాతీయస్థాయి పోటీలు ● గిరిజన క్రీడాకారుల ప్రతిభకు తగిన గుర్తింపుఖమ్మం స్పోర్ట్స్: గిరిజన యువతలో సహజసిద్ధంగా దాగి ఉండే క్రీడా ప్రతిభను వెలికితీయడం, ఔత్సాహికుల ప్రతిభను తెరపైకి తీసుకురావడమే లనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఖేలో ఇండియా పోటీల్లో ప్రత్యేక విభాగం ఏర్పాటుకు నిర్ణయించింది. జాతీయ స్థాయిలో కేవలం గిరిజన క్రీడాకారులు మాత్రమే పాల్గొనేలా పోటీలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 177 జిల్లాలో గిరిజనులు ఉండగా, ప్రత్యేక పోటీలతో ప్రతిభావంతులను గుర్తించొచ్చని ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన ‘ఖేలో ఇండియా గిరిజన క్రీడలు’ నిర్వహించనుండగా, ప్రస్తుతం వయోబేధం లేకుండా మహిళలు, పురుషులు పాల్గొనేలా ఏడు క్రీడాంశాలకు అవకాశం ఇచ్చారు. ఇందులో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, వెయిట్లిఫ్టింగ్, రెజ్లింగ్, హాకీ, ఫుట్బాల్ క్రీడాంశాలు ఉన్నాయి. తొలుత రాష్ట్రస్థాయిలో ఎంపిక రాష్ట్రస్థాయిలో ఎంపికై న క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు తీసుకుంటారు. రాష్ట్రస్థాయిలో ఎంపిక నిష్పక్షపాతంగా ఎంపిక జరిగేలా నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఒకరు, గిరిజన సంక్షేమం / సాంఘిక సాంక్షేమ శాఖ ఓ అధికారి, తెలంగాణ క్రీడా సంఘం తరపున ఇంకొకరితో పాటు ద్రోణాచార్య / అర్జున అవార్డు గ్రహీత, లేదా కోచ్కు ఈ కమిటీలో స్థానం కల్పిస్తారు. తుది జాబితాలో దేశవ్యాప్తంగా 2,500 మంది క్రీడాకారులకు స్థానం కల్పించడమే కాక ప్రత్యేకంగా స్పోర్ట్స్ కిట్స్ అందించనున్నారు. జాతీయస్థాయిలో ఇప్పటికే పతకాలు సాధించిన క్రీడాకారులు ప్రతిభ మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. ఖేలో ఇండియా క్రీడల ద్వారా సత్తా చాటితే తగిన గుర్తింపు లభిస్తుంది. అంతేకాక ఫెడరేషన్లు ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇన్నాళ్లు తెరపైకి రాలేకపోయిన గిరిజన క్రీడాకారులకు ఇకనైనా గుర్తింపు లభిస్తుందనే నమ్మకం ఉంది. – పుట్టా శంకరయ్య, జాతీయ ఆర్చరీ అభివృద్ధి కమిటీ సభ్యుడుగిరిజన, ఆదివాసీ జనాభా ఉమ్మడి జిల్లాలో అధికంగానే ఉంటుంది. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆర్చరీ శిక్షణకు ఖేలో ఇండియా సెంటర్ ఉండగా, కాచనపల్లి, కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూళ్లలో కూడా ఆర్చరీ శిక్షణ కొనసాగుతోంది. ఈ నేపథ్యాన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన గిరిజన, ఆదివాసీ యువత ఇప్పటికే జాతీయస్థాయి క్రీడల్లో రాణిస్తున్నారు. ప్రధానంగా ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్లో ప్రభుత్వం, ఐటీడీఏ ప్రోత్సాహం, స్పోర్ట్స్ స్కూళ్లలో శిక్షణతో సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఖేలో ఇండియాలో ప్రత్యేకంగా గిరిజనుల కోసం జాతీయ స్థాయి పోటీలు నిర్వహించనుండడంతో వీరికి మంచి వేదికగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వచ్చేనెల 15నాటికి కొత్త మిర్చి యార్డు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్ ఆధునికీకరణలో భాగంగా మొదటి దశ పనులు ఫిబ్రవరి 15నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ సూచించారు. మార్కెట్లో పనులను గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పరిశీలించిన ఆయన మాట్లాడారు. వచ్చే సీజన్కల్లా అవసరమైన అదనపు షెడ్లు, ఇతర నిర్మాణాల్లో వేగం పెంచాలని తెలిపారు. రైతులు యార్డ్లోకి రాగానే మంచి అనుభూతి కలిగేలా అంతర్జాతీయ స్థాయిలో వసతులు ఉండాలని, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు ప్రదర్శించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు అమర్చాలని సూచించారు. అంతేకాక ప్రవేశ ద్వారా వద్దే ఏ షెడ్డుకు తీసుకెళ్లాలి, వేలానికి ఎంత సమయం పడుతుందనే విషయమై రైతులకు సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. అలాగే, సీసీ కెమెరాల ఏర్పాటు, రైతులు బస చేసేలా వసతులు, ఆరోగ్య కేంద్రం, క్యాంటీన్, వే బ్రిడ్జిలు సిద్ధం చేయాలని సూచించారు. రెండు దశల్లో పనులు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మంలో మిర్చి యార్డు ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.155.30 కోట్లు కేటాయించగా రెండు దశల్లో పనులు చేపడుతున్నామని తెలిపారు. మొదటి దశలో రూ.114.96 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని ఇప్పటికే ఏడు షెడ్లకు గాను ఐదింటి నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. మిగతా పనులు త్వరగా పూర్తయ్యేలా దృష్టి సారించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్, వైస్చైర్మన్లు హన్మంతరావు, తల్లాడ రమేష్, జిల్లా వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఉద్యాన శాఖల అధికారులు డి.పుల్లయ్య, గంగాధర్, అలీమ్, మధుసూదన్, మార్కెట్ కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల కార్యదర్శి సురేంద్ర మోహన్ -
ఐఆర్ఏడీతో రోడ్డు ప్రమాదాల కట్టడి
● డేటా ఆధారంగా ప్రమాదాలకు కారణాల విశ్లేషణ ● బ్లాక్స్పాట్ల వద్ద అధికారుల పరిశీలనఖమ్మం అర్బన్/కామేపల్లి: రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్(ఐఆర్ఏడీ) యాప్ కీలకం కానుంది. ఈ మేరకు రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు ఐఆర్ఏడీలో నమోదైన వివరాల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో రెండు రోజులుగా అధికారులు పరిశీలిస్తూ వివరాలు ఆరా తీస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలం, సమయం, వాహనాల వివరాలు, ప్రమాదానికి కారణాలను యాప్లో పొందుపరిస్తే వివరాల విశ్లేషణ ద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించే అవకాశముంటుందని చెబుతున్నారు. తద్వారా ఆయా ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి రోడ్డు నిర్మాణంలో లోపాలు ఉంటే సరిచేయడమే కాక ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురుకాకుండా నిర్వహణపై దృష్టి సారించనున్నారు. కారణాలు ఏమిటి? ఖమ్మంలోని జెడ్పీ జంక్షన్, మమత హాస్పిటల్ రోడ్, ఇల్లెందు రోడ్డులోని బూడిదంపాడు, ధంసలాపురంతో పాటు కామేపల్లి మండలంలోని ముచర్ల క్రాస్, లింగాల క్రాస్, ధంసలాపురం ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులు గురువారం సంయుక్త తనిఖీలు చేపట్టారు. ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ అపూర్వ, ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, ఐఆర్ఏడీ డీఆర్ఎం హరిబాబుతో పాటు రవాణా, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొద్దినెలలుగా ఆయా ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలపై ఆరా తీసిన అధికారులు అక్కడ చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్షించారు. అప్పటికప్పుడే భద్రతా ఏర్పాట్లు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో పరిశీలన సందర్భంగా అధికారులు కారణాలపై ఆరా తీశారు. ఈమేరకు రంబుల్ స్ట్రిప్లు, ట్రాఫిక్ సైన్ బోర్డులు, ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటుతో పాటు జీబ్రా క్రాసింగ్లు, మార్కింగ్ చెరిగిపోయిన చోట కొత్తగా ఏర్పాటుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అంతేకాక పోలీసు, రవాణా, వైద్య, ఆరోగ్యం, ఆర్అండ్బీ శాఖల అధికారులు సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలన్న సూచనలతో ఈ తనిఖీలు చేపట్టడమే కాక పలుచోట్ల తక్షణ చర్యలు చేపట్టారు. ఈక్రమంలోనే ఖమ్మంలోని పలు రహదారులపై మార్కింగ్ వేయించారు. -
రోశిరెడ్డి మరణం పార్టీకి తీరని లోటు
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బూర్గంపాడు: పీసీసీ మాజీ సభ్యుడు యడమకంటి రోశిరెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. నాగినేనిప్రోలులోని రోశిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గురువారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి నివాళులర్పించాక ఆయన మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి అనుచరుడిగా భద్రాచలం, బూర్గంపాడులో పార్టీ అభివృద్ధికి కృషిచేశారని, దివంగత మంత్రి రాంరెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. -
సత్తుపల్లి జిల్లాపై ఆశలు
● పునర్విభజనపై తాజాగా మంత్రి పొంగులేటి ప్రకటన ● కాంగ్రెస్ హామీల్లో ఉండడంతో చర్చసత్తుపల్లి: గతంలో జిల్లాల పునర్వీభజన శాసీ్త్రయంగా జరగనందున జిల్లాల పునర్విభజనపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఇటీవల అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ప్రకటనతో సత్తుపల్లి జిల్లాపై ఆశలు చిగురిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను పునర్విభజన చేస్తారే తప్ప పెంచే ఆలోచన లేదని చెబుతున్నా.. కొత్తగా ఫ్యూచర్ సిటీ జిల్లా ఏర్పాటు చేస్తారనే ప్రచారంతో సత్తుపల్లిలో చర్చ మొదలైంది. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను కలిపి జిల్లాగా చేయడంతో పాటు మండలాల సంఖ్య పది నుంచి పదిహేడుకు పెంచాలని, అశ్వారావుపేటను డివిజన్గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక స్థానం సత్తుపల్లి నియోజకవర్గానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి గెలిచిన జలగం వెంగళరావు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే, ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా గతంలో ఇక్కడి నుంచి గెలిచారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం ఇదే నియోజకవర్గంలోని కల్లూరు మండలం నారాయణపురం. దీంతో జిల్లా ఏర్పాటుపై వీరి మనస్సులో ఏముందోనన్న చర్చ జరుగుతోంది. ఉద్యమానికి సహకారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కల్లూరుకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ సత్తుపల్లి ఎమ్మెల్యేగా రాగమయిని గెలిపిస్తే సత్తుపల్లి జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వానికి సూచన చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఎంపీగా ఉన్నప్పుడు సత్తుపల్లి జిల్లా సాధన ఉద్యమానికి మద్దతు పలకటమే కాక అప్పటి సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు మాత్రం తటస్థ వైఖరి అవలభించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వరకే జిల్లాలు చేయాలని సూచించిన తాను 33 జిల్లాలు ఏర్పడతాయని అనుకోలేదంటూ దాటవేత వైఖరిని ప్రదర్శించారు. కాగా, సత్తుపల్లి జిల్లా సాధన ఉద్యమానికి అప్పటి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహకరించారు. అంతేకాక గత ఎన్నికల సమయాన బీఆర్ఎస్ను గెలిపిస్తే సత్తుపల్లి జిల్లా హామీని నెరవేర్చేలా దృష్టికి కేసీఆర్కు చెబుతానని ప్రకటించారు. ప్రస్తుత ఎమ్మెల్యే రాగమయి దయానంద్ జిల్లా సాధన కోసం ప్రియాంక గాంధీతో ప్రకటన చేయించగా.. ఇటీవల సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం అందించారు. ఎన్నికల నినాదంగా.. ఎన్నికల సమయంలోనే సత్తుపల్లి జిల్లా ప్రతిపాదన తెరపైకి రావడం.. ఆ తర్వాత ఊసెత్తకపోవడంపై స్థానికుల్లో అసహనం వ్యక్తమవుతుంది. ఇప్పుడు కాకపోతే సత్తుపల్లి ఇంకెప్పుడు జిల్లా కాదంటూ సోషల్ మీడియాలో వేదికగా ప్రచారం చేస్తున్నారు. గతంలో జిల్లా సాధన సమితి(జేఏసీ) ఆధ్వర్యాన 129 రోజులు రిలే నిరాహార దీక్షలు, రెండు సార్లు సత్తుపల్లి బంద్ నిర్వహించిన నేపథ్యాన ఈసారైనా సానుకూల ప్రకటన వస్తుందని స్థానికులు ఎదురుచూస్తున్నారు. -
కలకోటలో చేపల చోరీకి యత్నం
బోనకల్: మండలంలోని కలకోట చెరువులో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చేపల చోరీకి యత్నించారు. అదే సమయానికి మత్స్య సహకార సంఘం సభ్యులు వచ్చేసరికి వారు పారిపోయారు. అప్పటికే పెద్దమొత్తంలో చేపలు పట్టి తరలించేందుకు సిద్ధం కాగా, వాటితో పాటు వలలను వదిలేసి వెనుదిరిగారు. ఘటనపై సంఘం సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి.వెంకన్న తెలిపారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి మధిర: మధిర – తొండలగోపవరం రైల్వేస్టేషన్ల మధ్య గురువారం రైలు నుంచి జారిపడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతదేహం వద్ద లభించిన ఆధార్కార్డులోని వివరాల ఆధారంగా బిహార్ రాష్ట్రానికి చెందిన దాతీలాల్(27)గా గుర్తించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని ఆర్కే ఫౌండేషన్ బాధ్యులు సహకారంతో మధిర ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించగా, వివరాల కోసం 98481 14202, 99636 41484 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు.. సత్తుపల్లిరూరల్: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం నాయుడుపేటకు చెందిన మేధమంచి వరప్రసాద్(65) గురువారం తన ద్విచక్రవాహనంపై వస్తుండగా.. సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెం వద్ద కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వరప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉండగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరప్రసాద్ తెలిపారు. ఉరి వేసుకుని యువకుడి బలవన్మరణం ఖమ్మం అర్బన్: ఖమ్మం పాండురంగాపురానికి చెందిన యువకుడు ఆత్మహత్య చేసున్నాడు. పాండురంగాపురానికి చెందిన శాసనాల రాఘవేంద్ర(31) మద్యం సేవిస్తూ జులాయిగా తిరిగేవాడు. ఆయన ప్రవర్తన నచ్చక భార్య ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోగా, తల్లిదండ్రులు మరోచోట నివాసం ఉంటున్నారు. ఈక్రమాన రాఘవేంద్ర బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. ఈ విషయాన్ని గురువారం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి మార్చురీకి తరలించినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. -
ఉత్సాహంగా సీఎం కప్ క్రీడాజ్యోతి ర్యాలీ
ఖమ్మం స్పోర్ట్స్/మధిర/ఎర్రుపాలెం/బోనకల్/ చింతకాని/నేలకొండపల్లి: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యాన గురువారం జిల్లాలోని పలు మండలాల్లో క్రీడాజ్యోతి ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ ర్యాలీని ఖమ్మంలో డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో సీఎం కప్ క్రీడాపోటీలను విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. క్రీడాకారులు ప్రతిభను మెరుగు పరుచుకునేందుకు ఈ పోటీలు వేదికగా నిలవనుండగా ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం ర్యాలీ నేలకొండపల్లి, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో కొనసాగగా, అధికారులు, క్రీడాకారులు స్వాగతం పలికి పాల్గొన్నారు. కాగా, పలు మండలాల్లో ర్యాలీ శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్బాబు, కోచ్లు ఎం.డీ.గౌస్, కోచ్లు వీవీఎస్ మూర్తి, పరిపూర్ణాచారి, సురేష్, చంద్రకాంత్, నాగరాజు, భవ్య, నోయోల్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పీఈటీలు వి.వెంకటేశ్వర్లు, ఎం.యర్రయ్య, బి.చలపతిరావు, వెంకటలక్ష్మి, కిలారు మనోహర్బాబు, బాబ్జీప్రసాద్, సలాది రామారావు, వీరేందర్, రమాదేవి, పుల్లయ్య, పొదిలి వెంకన్న, సయ్యద్ నవీద్పాషా, నారాయణ, కనకరాజు, బి.సురేందర్, బి.మురళీమోహన్రావు, రమేష్, సంపత్కుమార్, రమేష్, ఆర్.రాంబాబు, వెంకటేశ్వర్లు, ప్రభాకర్, చిన్ని, ప్రవీణ్ కుమార్, చైతన్య, వేణు, సునీల్, నరసింహారావు, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా న్యాయవాదులకు ముగ్గుల పోటీలు
ఖమ్మం లీగల్: రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన మహిళా న్యాయవాదులకు గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రంగులతో రంగవల్లులను తీర్చిదిద్దారు. కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన పోటీల సందర్భంగా హరిదాసు ప్రదర్శన ఇవ్వగా, బార్ అసోసియేషన్ బాధ్యులు ఇందిర, విజయశాంత తదితరులు పండుగ వంటకాలు చేశారు. అనంతరం ముగ్గులను న్యాయమూర్తులు వెంపటి అపర్ణ, అర్చనాకుమారి, అఖిల, న్యాయవాది శ్రీలక్ష్మి పరిశీలించి బహుమతులు ప్రకటించారు. ఈమేరకు మంగ లక్ష్మి, ఉమారాణి, లలిత మొదటి మూడు స్థానాల్లో నిలవగా, పోలిశెట్టి పద్మావతి, ఆసియా, నజీమా, శృతి, స్వాతి ప్రత్యేక బహమతులు గెలుచుకున్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తొండపు వెంకటేశ్వరరావు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల అభ్యున్నతికి కార్యాచరణ
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో దివ్యాంగుల అభ్యున్నతికి పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు గురువారం కలెక్టరేట్లో నిర్వహించగా కలెక్టర్ కేక్ కట్ చేసి మాట్లాడారు. గ్రామపంచాయ తీ ఎన్నికల కోడ్ కారణంగా నెల ఆలస్యంగా వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లా ముందంజలో ఉందని, త్వరలోనే దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నిధులు అందిస్తామని తెలిపారు. అర్హులైన దివ్యాంగులకు పారదర్శకంగా సదరమ్ సర్టిఫికెట్ల జారీ, కంటిచూపు సమస్య ఉన్న పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు, వీధి వ్యాపారాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వడమే కాక ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం కేటాయించనున్నట్లు చెప్పారు. బ్యాక్లాగ్ పోస్టులు నిబంధనల మేరకు భర్తీ చేసేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం క్రీడాపోటీల్లో విజేతలుగా నిలిచిన దివ్యాంగులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి విజేత, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుమాధవ్, డీహెచ్ఈడబ్ల్యూ సమ్రీన్, దివ్యాంగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఫిర్యాదులన్నీ పరిష్కరిస్తాం.. ● సీజీఆర్ఎఫ్ చైర్మన్ వేణుగోపాలచారి సత్తుపల్లిరూరల్: విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరిస్తూ మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యమని ఎన్పీడీసీఎల్ సీజీఆర్ఎఫ్ చైర్మన్ వేణుగోపాలచారి తెలిపారు. సత్తుపల్లి మండలం గంగారం విద్యుత్ సబ్స్టేషన్లో గురువారం నిర్వహించిన విద్యుత్ విని యోగదారుల సదస్సులో పలువురు ఫిర్యాదులు అందజేశారు. వేంసూరు, సత్తుపల్లి మండలాల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించాక చైర్మన్ మాట్లాడారు. ఉద్యోగులు తరచుగా క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించవచ్చని తెలిపారు. సదస్సులో డీఈఈ రాములు, ఏడీఈ ప్రసాద్బాబు, ఏఈఈలు శరత్బాబు, హనుమంతురావు, అనిల్, అంకారావు పాల్గొన్నారు. 20న చినజీయర్ స్వామి ‘సఫలా యాత్ర’ ఖమ్మంగాంధీచౌక్: ప్రకృతి వ్యవసాయం, ఆరో గ్యంపై అవగాహన కల్పించేందుకు తెలుగు రాష్ట్రాల్లో త్రిదండి చినజీయర్ స్వామి ‘సఫలా యాత్ర’ నిర్వహించనున్నారని జీయర్ సంస్థల సలహాదారు ఎర్నేని రామారావు తెలిపారు. ఖమ్మంలో గురువారం ఆయన మాట్లాడుతూ యాత్రలో భాగంగా ఈనెల 19న జీయర్ స్వామి ఖమ్మం జిల్లాకు చేరుకుంటారని వెల్లడించారు. భక్త రామదాసు జన్మస్థలమైన నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగా విద్యాలయంలో 20వ తేదీన ప్రకృతి వ్యవసాయంపై జరిగే సదస్సులో మాట్లాడాక రైతులతో కలిసి యాత్ర నిర్వహిస్తారని పేర్కొన్నారు. అలాగే, 21న ఖమ్మంలోని ఈఆర్ఆర్ రిసార్ట్స్లో జరిగే శ్రీగోదారంగనాథస్వామి కల్యాణ వేడుకలో పాల్గొంటారని తెలిపారు. -
రైతులకు మెరుగైన సేవలు
మధిర/ఖమ్మం వైద్యవిభాగం: రైతులు, జీవాల పెంపకందారులకు పశు వైద్య సిబ్బంది ఉత్తమ సేవలు అందించాలని టీవీకే, ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ వాహనాల రాష్ట్ర ప్రోగ్రామ్ మేనేజర్ భగీష్ మిశ్రా సూచించారు. మధిర సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పశు సంవర్ధక శాఖ సంచార వాహనాల(1962)ను గురువారం ఆయన తనిఖీ చేశారు. మధిరలో గత మూడు నెలలుగా జీవాలకు చేసిన చికిత్స అందించిన టీకాలపై ఆరా తీశాక ప్రతినెలా 300 వరకు చికిత్సలు చేస్తున్న ఉద్యోగులన అభినందించారు. ఆతర్వాత 108, 102 వాహనాలను కూడా ఆయన పరిశీలించారు. వాహనాల జిల్లా మేనేజర్ ఆవులూరి దుర్గాప్రసాద్, ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్, డాక్టర్ సౌజన్య, సిబ్బంది నందిని, వెంకటేశ్వర్లు, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ‘అధిష్టాన్’ బిల్లును వెనక్కి తీసుకోవాలిఖమ్మంమయూరిసెంటర్: వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు –2025ను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్లో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వంకాయల రాజు అధ్యక్షత జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మోదీ అధికారంలోకి వచ్చాక విద్యారంగంలో కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ, కేంద్రీకరణ విధానాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు పేరిట రాష్ట్రాల హక్కులు కాలరాసేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. కాగా, రాష్ట్రంలో జాతీయ విద్యావిధానం అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై ముగ్గురు మంత్రులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. నాయకులు ఉమేష్, హారీష్,వెంకటేష్, త్రినాథ్, లోకేశ్,సుశాంత్, మనోజ్, రమణ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణతో ప్రజలకు నష్టంఖమ్మం మామిళ్లగూడెం: ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే నష్టపోయేది సామాన్య, మధ్యతరగతి ప్రజలేనని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు అన్నారు. ప్రభుత్వ బ్యాంకుల పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఏపీటీబీఈఎఫ్) ఆధ్వర్యాన నిర్వహిస్తున్న జన జాగృతి యాత్ర గురువారం సాయంత్రం ఖమ్మం చేరుకుంది. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షుడు రవీంద్రనాథ్తో కలిసి హేమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనాన్ని నిలిపివేయాలని, సరిపడా ఉద్యోగులను నియమించి, ఐదు రోజుల పనిదినాలు అమలుచేయాలన్నారు. హైదరాబాద్ నుంచి యాత్ర నిర్వహిస్తున్న కెనరా బ్యాంకు ఉద్యోగి ఉమామహేష్తో పాటు నాయకులు దండి సురేష్, సమద్, రాజేష్, వి.శ్రీకాంత్, కుమార్, శివరామకృష్ణ, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మూడు టిప్పర్లు సీజ్ వైరా రూరల్: మండలంలోని రెబ్బవరం నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లను సీజ్ చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. పక్కా సమాచారంతో గురువారం తనిఖీలు చేపట్టామని వెల్లడించారు. ఈ సందర్భంగా రెండు టిప్పర్లను సీజ్ చేయడమే కాక డ్రైవర్లు గుంపిడి సురేష్, అడప మహేష్, యజమాని పిల్లలమర్రి రాంబాబుపై కేసు నమోదుకు వైరా పోలీసులకు సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు. -
విద్యుత్ అధికారుల ‘ప్రజాబాట’
ఖమ్మంవ్యవసాయం/రఘునాథపాలెం/ ముదిగొండ/బోనకల్/కల్లూరు రూరల్: విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రూపొందించిన ప్రజాబాట కార్యక్రమం జిల్లాలో గురువారం కొనసాగింది. ఎస్ఈ మొదలు డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ అధికారులు, ఉద్యోగులు నిర్దేశించిన గ్రామాలు, ప్రాంతాల్లో ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లూజ్ లైన్లు, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, సక్రమంగా పని చేయని ట్రాన్స్ఫార్మర్లు, తరచూ అంతరాయాలు, నిర్వహణ లోపాలపై ఫిర్యాదులు అందాయి. అంతేకాక లో ఓల్టేజీ సమస్య పరిష్కారానకి నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, పని చేయని మీటర్లు మార్చాలని, బిల్లుల్లో తేడాలను సరిచేయాలని వినతిపత్రాలు ఇచ్చారు. ఇంకొన్నిచోట్ల ఉచిత విద్యుత్ పథకం అమలుకు దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం త్రీటౌన్ పరిధి సుందరయ్యనగర్, వ్యవసాయ మార్కెట్ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రజాబాట కార్యక్రమాల్లో ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, డీఈ నంబూరి రామారావు, సబ్ డివిజనల్ ఇంజనీర్ సీహెచ్.నాగార్జున తదితరులు పాల్గొని సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఇక రఘునాథపాలెం మండలంలోని రాములుతండా, రఘునాథపాలెంల్లో నిర్వహించిన ప్రజాబాటలో ఏడీ సంజయ్కుమార్, ఏఈలు సతీష్, శంకర్ పాల్గొనగా సర్పంచ్లు జి.కృష్ణారావు, వెంకరామ్, స్థానికులు సమస్యలను వివరించారు. అలాగే, ముదిగొండలో నిర్వహించిన ప్రజాబాటలో ఏడీఈ రమ్య, సర్పంచ్ కట్టకూరి ఉపేందర్, ఉపసర్పంచ్ పార్వతి, ఏఈ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ పాల్గొల్గొన్నారు. ఇక బోనకల్ మండలం ముష్టికుంట్ల, కల్లూరు మండలం లక్ష్మీపురం(రాళ్లబంజరు)లో జరిగిన ప్రజా బాట కార్యక్రమాల్లో ఏడీఏ వైవీ.ఆనంద్, ఏఈలు టి.మనోహర్, మహేంద్రబాబు, సర్పంచ్లు పిల్లలమర్రి నాగేశ్వరావు, భూక్యా రవీంద్రబాబు, ఉద్యోగులు ఉస్మాన్బేగ్, బత్తుల సత్యనారాయణ, శ్రీను, జమీల్, ఏసుపాదం పాల్గొన్నారు. సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ -
తెలంగాణ జట్టు బోణీ
పినపాక: మండలంలోని ఏడూళ్ల బయ్యారంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి అండర్ –17 బాలుర కబడ్డీ పోటీలో తెలంగాణ జట్టు బోణీ చేసింది. రెండో రోజైన గురువారం తమిళనాడు – తెలంగాణ జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఆరు పాయింట్ల తేడాతో రాష్ట్ర జట్టు గెలుపొందింది. జట్టుకు సారథ్యం వహించిన దేవరాజ్ 20 రైడ్ పాయింట్లు సాధించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ప్రారంభంలో మౌరి టెక్, కంది చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు రాష్ట్ర జట్టుకు యూనిఫామ్, షూ అందజేశారు. తమిళనాడుపై గెలుపొందిన రాష్ట్ర జట్టు -
తలసేమియా రహిత భారతాన్ని నిర్మిద్దాం...
ఖమ్మంవైద్యవిభాగం: తలసేమియా వ్యాధి రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ రాజేష్ గార్గె అన్నారు. ఖమ్మంలోని సంస్థ కార్యాలయం వద్ద గురువారం తలసేమియా చిన్నారులకు ఉచిత రక్తపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్గార్గె మాట్లాడుతూ తలసేమియాతో పిల్లలు జన్మించకుండా దంపతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, తలసేమియా చిన్నారులను తల్లిదండ్రులు, సమాజం భారంగా చూడకుండా రక్తదానంతో అండగా నిలవాలని తెలిపారు. ఈనెల 12న తలసేమియా జాతీయ సొసైటీ బాధ్యులు డాక్టర్ అరోరా బృందం ఆధ్వర్యాన ఖమ్మంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, చిన్నారులకు సేవలందించేందుకు ముందుకొచ్చిన పలువురిని రాజేష్గార్గె సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ ఎన్.నర్సయ్యతో పాటు డాక్టర్ డి.నారాయణమూర్తి, డాక్టర్ లక్ష్మీదీపా, సంస్థ ఫౌండర్ పి.అనిత, బాధ్యులు పావని, పి.రవించదర్, ఉదయ్ భాస్కర్, ఎన్.ఉపేందర్, అనురాధ, షీవేన్ తదితరులు పాల్గొన్నారు. ‘సంకల్ప’ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ రాజేష్ గార్గె -
రిజర్వేషన్.. టెన్షన్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ముసాయిదా ఓటర్ల జాబితా ఇప్పటికే విడుదల కాగా ఈనెల 12న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు. ఆతర్వాత కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియకు పురపాలక శాఖ శ్రీకారం చుడుతుంది. దీంతో ఆశావహులు చైర్మన్ పదవితోపాటు వార్డుల రిజర్వేషన్ ఎలా ఉంటుందనే అంచనాల్లో నిమగ్నమయ్యారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేయనుండగా ఏ వార్డు ఎవరికి రిజర్వ్ అయ్యే అవకాశం ఉందో లెక్కలు వేస్తున్నారు. ప్రధానంగా చైర్మన్ గిరిపై కన్నేసిన నేతల్లో టెన్షన్ నెలకొనగా.. అంతా అనుకూలిస్తే బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. చకచకా పనులు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమేనని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాలు విడుదల చేసిన అధికారులు అభ్యంతరాల స్వీకరణ, రాజకీయ పార్టీలతో సమావేశాలు పూర్తి చేశారు. ఈనెల 12న ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై కూడా పురపాలక శాఖ దృష్టి సారించింది. రిజర్వేషన్లు ఖరారైతేనే ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో త్వరగా పూర్తిచేసేలా అధికారులు సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. జనాభా ఆధారంగా.. మున్సిపాలిటీల్లో చైర్మన్, వార్డుల రిజర్వేషన్లను జనాభా ఆధారంగా ఖరారు చేస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభాలో వాటా ప్రకారం స్థానాలు కేటాయిస్తారు. ఇక బీసీ రిజర్వేషన్లను కులగణన కోసం ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ సిఫారసుల ఆధారంగా లెక్కిస్తారు. ఆపై జనరల్ స్థానాలను కూడా గుర్తించాక.. అన్ని కేటగిరీ ల్లో మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయిస్తారు. ఎలా ముందుకు వెళ్లాలి? మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగనుండడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జిల్లాలోని పాత మున్సిపాలిటీలైన సత్తుపల్లి, వైరా, మధిరతో పాటు కొత్తగా ఏర్పడిన ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనుండడంతో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చిస్తున్నారు. రిజర్వేషన్లు ఎలా ఉంటాయి.. ఏ మున్సిపాలిటీ ఎవరికి రిజర్వ్ అవుతుందో అంచనా వేస్తున్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని జనరల్కు, వైస్ చైర్మన్ బీసీ మహిళకు కేటాయించారు. అలాగే వైరా మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఎస్సీకి, వైస్ చైర్మన్ బీసీకి దక్కింది. ఇక మధిర చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు, వైస్చైర్మన్ జనరల్కు రిజర్వ్ అయింది. ఈసారి ఇందులో ఎలాంటి మార్పులు జరుగుతాయో... ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీ రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ ఆశావహులైన నేతల్లో ఉంది.మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో వేగం మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న ఆశావహులు రిజర్వేషన్లు ఖరారయ్యే వరకు వేచి చూడక తప్పదు. కొందరు వార్డుల బరిలో దిగేందుకు ఆసక్తి చూపిస్తుండగా, ఓ స్థాయి నేతలు మాత్రం చైర్మన్ పదవిపైనే గురి పెట్టారు. మరికొందరు కౌన్సిలర్గా పోటీ చేయడంతో పాటు చైర్మన్ పదవిని దక్కించుకునేలా ఇప్పటి నుంచే నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అలాగే, వార్డుల నుంచి పోటీకి సిద్ధమైన కొందరు రిజర్వేషన్ అనుకూలించకపోతే మరో వార్డు నుంచి పోటీ చేసి గెలవొచ్చా అని కూడా పరిశీలిస్తున్నారు. అవకాశం ఉంటుందని భావిస్తున్న వారు ప్రయత్నాలు చేస్తూనే, తాము పోటీ చేయాలనుకునే మున్సిపాలిటీ ఎవరికి రిజర్వ్ అవుతుందో అనుచరులతో చర్చిస్తున్నారు. వార్డుల వారీగా జనాభా ఎవరు ఎక్కువగా ఉన్నారో ఆరా తీస్తూ అంచనాల్లో నిమగ్నమయ్యారు. ఇక కొత్తగా ఏర్పడిన ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల రిజర్వేషన్పై అందరిలో ఆసక్తి నెలకొంది.మున్సిపాలిటీ జనరల్ బీసీజనరల్ ఎస్సీ జనరల్ ఎస్టీ జనరల్ /మహిళ /మహిళ /మహిళ /మహిళ సత్తుపల్లి 05/7 4/3 02/1 1 వైరా 3/5 4/3 2/2 1 మధిర 5/5 2/3 1/5 1 -
ఇంకొన్ని రోజులు ఆగాలి..
● ఎస్సెస్సీ విద్యార్థుల అల్పాహారానికి నిధులు ● వచ్చేనెల 16వ తేదీ నుంచి 19 రోజుల పాటే అమలుకు నిర్ణయం ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా వివిధ కార్యక్రమాలు అమలుచేస్తూనే పదో తరగతి ఫలితాలపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యాన ఎస్సెస్సీ విద్యార్థులకు సెప్టెంబర్ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. తరగతులకు హాజరై ఇళ్లకు వెళ్లేసరికి విద్యార్థులు ఆకలితో బాధపడకుండా అల్పాహారం అందించాలని నిర్ణయించింది. అయితే, ఇప్పటికే ప్రత్యేక తరగతులు మొదలైనా వచ్చేనెల 16నుంచి అల్పాహారం అందించాలన్న నిర్ణయంపై విద్యార్థుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఉదయం, సాయంత్రం తరగతులు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి కావొస్తుండగా రివిజన్ చేయించడంతో పాటు స్లిప్ టెస్ట్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉదయం 7–45నుంచి 8–45గంటల వరకు, సాయంత్రం 4–15నుంచి 5–15గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతుల్లో విద్యార్థులను చదివించడమే కాక వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. అయితే, ఉదయం 7–45గంటలకు పాఠశాలకు వచ్చే విద్యార్థులు సాయంత్రం 5–30గంటల వరకు ఉండాల్సి రావడం, ఆతర్వాత గ్రామీణ విద్యార్థులు ఇళ్లకు వెళ్లే సరికి ఆలస్యమై ఆకలితో బాధపడుతున్నారు. ఈనేపథ్యాన కొన్ని పాఠశాలల్లో దాతల సాయంతో అల్పాహారం సమకూరుస్తుండగా ప్రభుత్వం కూడా అన్ని పాఠశాలల్లో అమలుకు నిర్ణయించింది. జిల్లాల్లో అన్ని యాజమాన్యాలు కలిపి 195 పాఠశాలల్లో 5,508మంది ఎస్సెస్సీ విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.15చొప్పున రూ.82,620 కేటాయించగా, ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు అమలు కోసం 19రోజులకు రూ.15,69,780 నిధులు కేటాయించారు. ఈ నిధులు త్వరలో డీఈఓ ఖాతాలో జమ కానుండగా హెచ్ఎంల ఖాతాలకు బదలాయిస్తారు. ముందు ప్రారంభిస్తేనే... ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్ నుంచే ఉదయం, సాయంత్రం ఎస్సెస్సీ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు ఇళ్లకు చేరే సరికి ఆలస్యమవుతోంది. ఈనేపథ్యాన ప్రభుత్వం ఫిబ్రవరి 19నుంచి అల్పాహారం అందించనున్నట్లు ప్రకటించింది. అలా కాకుండా ఇప్పటినుంచే అల్పాహారం అమలుకు నిర్ణయిస్తే బాగుంటుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా ప్రభుత్వం పునరాలోచన చేయాలని వారు కోరుతున్నారు. -
జీపీఓల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ గ్రామ పాలన అధికారుల(జీపీఓ) యూనియన్ జిల్లా నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. ఖమ్మం టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎన్నిక ఏకగ్రీవం కాగా, టీఎన్జీవోస్, ట్రెసా జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు, తుంబూరు సునీల్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారుమంచి శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. జీపీఓల యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా మన్నె గురుమూర్తి, ప్రధాన కార్యదర్శిగా చీమల వీరబాబు, కోశాధికారిగా షేక్ జమాల్, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అన్వర్ పాషా, బానోతు రవికుమార్, మహిళా అధ్యక్షురాలుగా మాటూరి మమత, తూమాటి శైలజ, అసోసియేట్ అధ్యక్షులుగా నెల్లూరి లవన్కుమార్ ఎన్నికయ్యారని తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు జయపాల్, బొగ్గవరపు వెంకటేశ్వరరావు, కన్నేటి వీరవెంకటప్రసాద్, వసంత, షేక్ నాగుల్మీరా, శీలం వెంకటేశ్వర్లు, మలీద వెంకట్, అజీజ్ పాల్గొన్నారు. -
ట్రాలీని ఢీకొట్టిన లారీ.. దంపతుల మృతి
ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామ సమీపాన మంగళవారం ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. శ్రీకాకు«ళం నుంచి ఖమ్మం జిల్లా వైరాకు వడ్డాది రాము (40) వచ్చి స్థిరపడ్డాడు. ఆయనకు ఏపీకే చెందిన వెంకటరత్నం (37)తో వివాహం జరిగింది. రాము వైరాలో వస్త్రదుకాణం నిర్వహిçస్తున్నాడు. వెంకటరత్నం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని గిరిజన గురుకుల పాఠశాలలో టీజీటీగా పనిచేస్తోంది. రాము ట్రాలీ ఆటోలో పాఠశాల నుంచి భార్యను వైరా తీసుకొస్తుండగా లారీ ఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది. రాము ఆస్పత్రిలో మరణించాడు. -
ప్రాక్టికల్స్కు రూ.50వేల చొప్పున నిధులు
సత్తుపల్లిటౌన్: జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణ కోసం రూ.50వేల చొప్పున ప్రభుత్వం విడుదల చేసిందని డీఐఈఓ రవిబాబు తెలిపారు. సత్తుపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో బుధవారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణ కోసం నాలుగు చొప్పున డిజిటల్స్ స్క్రీన్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అలాగే, వెనకబడిన విద్యార్థులకు కోసం అధ్యాపకులు ప్రతిరోజు స్లిప్టెస్ట్లు నిర్వహిస్తూ నూరు శాతం ఫలితాల సాధనకు కృషి చేస్తున్నారని తెలిపారు. వచ్చేనెల 2వ తేదీ నుంచి జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో నిర్వహిస్తామని, ఈ కెమెరాల పుటేజీ హైదరాబాద్ ఇంటర్బోర్డ్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధాననమవుతుందని తెలిపారు. కాగా, తొలిసారి ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ముందస్తుగా హాల్టికెట్లు విడుదల చేసినందున తప్పులు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఏర్పడిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ కళాశాలల బాధ్యులు జీ.వీ.లింగారెడ్డి, పాలా ప్రవీణ్రెడ్డి, ఎం.మమంద్రారెడ్డి ఉన్నారు. డీఐఈఓ రవిబాబు -
గొల్లగూడెం గోశాలకు రూ.1.20లక్షల వితరణ
ఖమ్మంఅర్బన్: ఖమ్మం గొల్లగూడెంలోని ఓం శ్రీకృష్ణ గోశాల వెల్ఫేర్ సొసైటీకి ఎన్ఆర్ఐ ఫౌండేషన్, వాసవీ సేవా సభ్యులు బుధవారం రూ.1.20లక్షల విరాళం అందజేశారు. గోవుల గ్రాసం నిమిత్తం ఈ విరాళం అందజేశారని గోశాల బాధ్యులు కేసా హన్మంతరావు తెలిపా రు. ఇందుకు సహకరించిన చిట్టిమల్ల సరిత, పెర్ల మూర్తి తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పూర్వ విద్యార్థినుల విరాళం ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల అభివృద్ధికి 1978–19వ బ్యాచ్ విద్యార్థినులు 65వేల విరాళం అందజేశారు. పాఠశాల అభివృద్ధి కోసం ఈ నిధులు వినియోగించాలని కోరుతూ హెచ్ఎం శైలజా లక్ష్మికి బుధవారం నగదు అందజేశారు. పూర్వ విద్యార్థినులు విజయశ్రీ, నిర్మల, సుధారాణి, లక్ష్మి, పి.ఇందిర, కె.అనురాధ, ఉమ, ప్రసన్న, దుర్గ, మాధవి, స్వర్ణలత, పద్మజ, ఝాన్సీలక్ష్మీ, కృష్ణకుమారి, ఎం.విజయలక్ష్మి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. కాల్వొడ్డు బ్రిడ్జిపై కార్లు, ఆటోలకు అనుమతి ఖమ్మంక్రైం: సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీ పెరగనుండడంతో ఖమ్మంలోని కాల్వొడ్డు వద్ద మున్నేటి పాత బ్రిడ్జిపై కార్లు, ఆటోల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఇన్నాళ్లు ద్విచక్రవాహనాలకే అనుమతి ఉండగా, బుధవారం నుంచి 20వ తేదీ వరకు కార్లు, ఆటోలు రాకపోకలు సాగించొచ్చని వెల్లడించారు. బైపాస్ బ్రిడ్జి పైనుంచే రాకపోకలు సాగిస్తే ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే, పాత బ్రిడ్జిపై రెండు వైపులా తవ్వి ఉన్నందున వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని సీఐ సూచించారు. పశుసంపద.. గ్రామ ఆర్థిక బలానికి పునాది రఘునాథపాలెం: గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పశుసంపద కీలకంగా నిలుస్తుందని జిల్లా పశువైద్యాధికారి బి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెంలో బుధవారం పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స కోసం ఏర్పాటుచేసిన శిబిరాన్ని సర్పంచ్ కాపా ఆదినారాయణతో కలిసి ప్రారంభించాక ఆయన మాట్లాడా రు. పశుసంవర్ధక శాఖ సేవలు రైతులకు అందేలా గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు కృషి చేస్తే పశు సంపద వృద్ధి సాధ్యమవుతుందని తెలిపా రు. ఈ పలువురు రైతుల పశువులకు చికిత్స చేయగా, జిల్లా లైవ్స్టాక్ డెవలప్మెంట్ అధికారి రూప్కుమార్, ఉప సర్పంచ్ ప్రవీణ్కుమార్, పంచాయతీ కార్యదర్శి బి.కృష్ణ, సిబ్బంది టి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్ల బకాయిలు విడుదల చేయాలి ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వం గత ఇరవై నెలలుగా బకాయిలు విడుదల చేయకపోవడంతో పెన్షనర్లు క్షోభకు గురవుతున్నారని, వారి కన్నీరు ప్రభుత్వానికి మంచిదికాదని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ పెన్షనర్ల అసోసియేషన్(పీఆర్పీఏ) రాష్ట్ర అధ్యక్షుడు మోతుకూరి మధు అన్నారు. ఖమ్మంలోని పీఆర్టీయూ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా బకాయిలు విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్రావు, నాయకులు గంగవరపు శంకరయ్య, చలపతిరావు, నంబూరి కనకదుర్గ, కొండలరావు, సాధు లక్ష్మణ్రావు, గజేంద్రుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, పీఆర్పీఏ జిల్లా కన్వీనర్గా యలమద్ది వెంకటేశ్వర్లు, కోకన్వీనర్గా పిల్లలమర్రి కొండలరావు ఎన్నుకున్నారు. -
సింథటిక్ మాంజా వినియోగిస్తే నేరం
ఖమ్మంవ్యవసాయం: సింథటిక్తో చేసిన మాంజాను జాతీయ హరిత ట్రిబ్యునల్, రాష్ట్రప్రభుత్వం నిషేధించినందున ఎవరైనా అమ్మినా, వినియోగించినా చర్యలు తీసుకోనున్నట్లు అటవీ శాఖ ప్రకటించింది. ఈమేరకు సమాచారం తెలియచేసేందుకు 08742–295323 నంబర్తో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు. ఈమేరకు అవగాహన కోసం రూపొందించిన పోస్టర్లను బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్తో కలిసి డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఆవిష్కరించారు. పర్యావరణం, పక్షులు, ప్రజల భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్న నిషేధిత నైలాన్ / సింథటిక్ మాంజా అమ్మినా, వినియోగించడం నేరమని పోస్టర్లను పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ టాస్క్ఫోర్స్ అధికారులు, అటవీ అధికారులు పాల్గొన్నారు. -
సత్తుపల్లి జిల్లా చేయండి
సత్తుపల్లి/కల్లూరు రూరల్: జిల్లాల పునర్విభజనపై దృష్టి సారించిన నేపథ్యాన సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను కలిసి సత్తుపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ దయానంద్తో కలిసి ఆమె సీఎం రేవంత్రెడ్డికి బుధవారం హైదరాబాద్లో వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయాన ప్రియాంకగాంధీ జిల్లా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కొత్త మండలాల ఏర్పాటుపైనా సీఎంకు వివరించారు. ఆతర్వాత రాగమయి దంపతులు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కల్లూరులో ఆస్పత్రి ప్రారంభానికి రావాలనికోరారు. ●పెనుబల్లి: మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేందుకు ప్రభుత్వం తరఫున సహకరించాలని సీఎం రేవంత్రెడ్డిని పెనుబల్లి మండలం సోమ్లానాయక్ తండాకు చెందిన మోతీకుమార్ కోరారు. ఎమ్మెల్యే రాగమయి దయానంద్తో కలిసి ఆయన సీఎంను కలిసి మాట్లాడారు. తన తల్లిదండ్రులు పండ్ల విక్రయిస్తుండగా, సొంత ఇల్లు లేకున్నా అడ్డంకులను అధిగమిస్తూ పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నానని తెలి పారు. ఇప్పటికే కిలి మంజారో, మౌంట్ ఎల్బ్రన్ పర్వతాలు అధిరోహించగా, ఎవరెస్ట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దీంతో సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే వినతి -
సీఎంను కలిసిన మేయర్, కార్పొరేటర్లు
● నగర అభివృద్ధికి రూ.250 కోట్లు మంజూరు చేయాలని వినతి ● కాంగ్రెస్లో చేరిన మరో ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర అభివృద్ధికి రూ.250 కోట్ల నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో మేయర్ పునుకొల్లు నీరజ, కాంగ్రెస్ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు సీఎంను హైదరాబాద్లో కలిసి నిధుల మంజూరు కోరుతూ వినతిపత్రం అందజేశారు. అలాగే, ఎల్ఆర్ఎస్ నిధులు రూ.57 కోట్లు వినియోగించుకునేందుకు పరిపాలన అనుమతి ఇప్పించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. నగరంలో మౌలిక వసతులు, అన్ని కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీరు, పారిశుద్ద్యం మెరుగు పరిచేందుకు మరిన్ని నిధులు అవసరమని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సీఎం రేవంత్రెడ్డి ఖమ్మం అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు మేయర్ నీరజ వెల్లడించారు. కాంగ్రెస్లో చేరిన కార్పొరేటర్లు బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మల సమక్షాన కార్పొరేటర్లు తోట ఉమారాణి, దనాల రాధ, రుద్రగాని శ్రీదేవికి కాంగ్రెస్ ఖమ్మం అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇటీవలే ఐదుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరగా వీరితో కలిపి ఎనిమిదికి చేరింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, నాయకులు తుమ్మల యుగంధర్, బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్రెడ్డి పాల్గొన్నారు. -
కబడ్డీ.. కబడ్డీ..
పినపాక: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీలు పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో బుధవారం ప్రారంభమయ్యాయి. దేశంలోని 28 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి జట్లు హాజరుకాగా, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కబడ్డీ భారతదేశంలోనే పుట్టిన సంప్రదాయ క్రీడ అన్నారు. ప్రతీఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని పిలుపునిచ్చారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని అన్నారు. దేశ చరిత్రలో తొలిసారి మారుమూల గిరిజన ప్రాంతమైన ఈ బయ్యారంలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. ఇందుకు బాధ్యత తీసుకున్న మౌరీ టెక్, కంది చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను వారు అభినందించారు. క్రీడా పోటీల కోసం సుమారు ఆరు నెలలు శ్రమించి ఏర్పాట్ల నుంచి ఆతిథ్యం వరకు సమర్థవంతంగా నిర్వహించడం ప్రశంసనీయమని చెప్పారు. తమ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలను ఏర్పాటు చేస్తామని వెల్ల డించారు. కార్యక్రమంలో పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్రాజ్, డీఈఓ నాగలక్ష్మి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ పరిశీలకులు నిర్మల్ జాందే, కంది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వభారత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు 14 మ్యాచ్లు.. జాతీయస్థాయి పోటీల్లో మొత్తం 32 జట్లు పాల్గొనగా, లీగ్ దశలో ఎనిమిది గ్రూపులుగా విభజించారు. తొలి రోజు 14 జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మధ్యప్రదేశ్–చండీఘర్ జట్లు పోటీ పడగా మధ్యప్రదేశ్ జట్టు, ఆంధ్రప్రదేశ్–జార్ఖండ్ జట్ల మధ్య జరిగిన పోటీలో ఏపీ జట్టు, పాండిచ్చేరి–పశ్చిమబెంగాల్ జట్లు పోటీ పడగా పాండిచ్చేరి, తమిళనాడు–బిహార్ జట్లు తలపడగా తమిళనాడు, కర్ణాటక–గుజరాత్ జట్ల మధ్య జరిగిన పోటీలో కర్ణాటక, మహారాష్ట్ర–కేరళ జట్లు పోటీపడగా మహారాష్ట్ర, రాజస్థాన్–ఉత్తరప్రదేశ్ మధ్య జరిగిన పోటీలో రాజస్థాన్, హరియాణా–అసోం జట్లు పోటీ పడగా హరి యాణా, ఒడిశా–పంజాబ్ జట్ల మధ్య జరిగిన పోటీలో పంజాబ్, త్రిపుర–మణిపూర్ జట్లు తలపడగా మణిపూర్ జట్టు గెలుపొందాయి. వీటితో పాటు సీఐఎస్సీఈ–సీబీఎస్ఈ జట్లు పోటీ పడగా సీబీఎస్ఈ, ఢిల్లీ–జమ్మూ కశ్మీర్ జట్లు పోటీ పడగా ఢిల్లీ, హిమాచల్ప్రదేశ్– సీబీఎస్ఈ వెల్ఫేర్ జట్లు పోటీ పడగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్–ఛత్తీస్గఢ్ జట్లు తలపడగా ఛత్తీస్గఢ్ విజయం సాధించాయి. -
‘యాంత్రీకరణ’ రేపు పునఃప్రారంభం
అశ్వారావుపేటరూరల్: వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ఈనెల 9న పునః ప్రారంభించనుండగా, ఈ వేడుకకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్కుమార్రెడ్డి హాజరవుతారని ఆయిల్ఫెడ్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, అశ్వారావుపేట ఏజీ కాలేజీ ఏడీ డాక్టర్ హేమంత్కుమార్ తెలిపారు. వ్యవసాయ కళాశాలలో బుధవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా నిలిచిపోయిన ఈ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్నారని, తద్వారా రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు అందుతాయని చెప్పారు. అదేరోజు ఆయిల్ఫెడ్, వ్యవసాయ, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతు మేళా కూడా నిర్వహిస్తున్నామని, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ సురేంద్రమోహన్, విశ్వవిద్యాలయం డీడీ గోపి హాజరవుతారని వివరించారు. దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేయనున్న లీఫ్ అండ్ సాయిల్ టెస్ట్(భూసార పరీక్ష కేంద్రం) ల్యాబ్, స్థానిక వ్యవసాయ కళాశాలలో జీవ వైవిధ్యానికి సంబంధించిన బయోపార్క్, కళాశాలలో రూ.5కోట్లతో అదనపు బాలికల వసతి భవనానికి, రూ.3కోట్లతో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణాలకు మంత్రులు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. సమావేశంలో ఆయిల్ఫెడ్ ఓపీడీ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, ఏడీఏ రవి, హెచ్ఆర్ఎస్ హెడ్ శాస్త్రవేత్త శ్రీనివాస్, ఆయిల్ఫెడ్ మేనేజర్లు నాగబాబు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. హాజరుకానున్న మంత్రులు తుమ్మల, ఉత్తమ్ -
55 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
తల్లాడ: తల్లాడ మండలం మల్సూర్తండా, మిట్టపల్లి గ్రామాల్లో అక్రమంగా నిల్వ చేసిన 55 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. మల్సూర్తండాలో భూక్యా బద్రి ఇంట్లో 45 క్వింటాళ్లు, మిట్టపల్లిలో షేక్ బడేసాహెబ్ ఇంటి వద్ద పది క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్.వెంకటకృష్ణ తెలిపారు. తనిఖీల్లో సిబ్బంది శశికుమార్, ఆంగోతు శ్రీనివాసరావు, నరేష్ పాల్గొన్నారు. అక్రమ ఫైనాన్స్ కేసులో ఇద్దరి అరెస్ట్ ఖమ్మంఅర్బన్: చట్టవిరుద్ధంగా అధిక వడ్డీతో ఫైనాన్స్ నిర్వహిస్తున్న ఇద్దరిని టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని ఖమ్మం అర్బన్ పోలీసులకు అప్పగించారు. ఖమ్మం దానవాయిగూడెంకు చెందిన పలువురి ఇచ్చిన ఫిర్యాదతో తనిఖీలు చేపట్టగా సారధినగర్కు చెందిన శివకుమార్, దీపాకుమారి అధికవడ్డీతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్లు తేలిందని టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణతెలిపారు. వీరి నుంచి ప్రామిసరీ నోట్లు స్వాధీ నం చేసుకోగా, పరారీలో ఉన్న మరో వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు సత్తుపల్లిరూరల్: కోడి పందేలు నిర్వహించిన వారితో పాటు ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని సత్తుపల్లి సీఐ శ్రీహరి హెచ్చరించారు. గతంలో కోడి పందేలు, జూదం నిర్వహించిన వారితో పాటు ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారికి బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించి తహసీల్దార్ ఎదుట 17మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. కాగా, చైనా మంజా విక్రయాలను అరికట్టేలా తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. చైనా మాంజా విక్రయించడం, కొనుగోలు చేయడం పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం నేరమని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే జైలు శిక్షతో పాటు రూ.10వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించారు. రూ.84వేల విలువైన విదేశీ సిగరెట్లు స్వాధీనంఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో కొంతకాలంగా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సిగరెట్లను విక్రయిస్తున్నారనే సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ సత్యనారయణ నేతృత్వాన ఖమ్మం పాత మున్సిపాలిటీ సమీపంలోని ఓ కిరాణం దుకాణంలో తనిఖీ చేయగా నిషేధిత, హానీకరమైన విదేశీ సిగరెట్లు అమ్ముతున్నట్లు తేలింది. దీంతో వివిధ కంపెనీలకు చెందిన రూ.84,700విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తునకు వన్టౌన్ పోలీస్స్టేషన్లో అప్పగించినట్లు పేర్కొన్నారు. -
జిల్లాలో 10,345 మె.టన్నుల యూరియా
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ప్రస్తుతం 10,345 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈమేరకు 83 పీఏసీఎస్ల్లో 1,169.10 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ షాపుల్లో 525.70 మెట్రిక్ టన్నులు యూరియా ఉన్నందున రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. యాసంగి సాగుకు అవసరమైన యూరియా అన్ని మండలాల్లో పంపిణీ చేస్తుండగా అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే రైతులు ఏఓలు, ఏఓఈల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఓ ప్రకటనలో సూచించారు. సీతారామ భూసేకరణ పూర్తి చేయాలి ఖమ్మం అర్బన్: సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి డిస్టిబ్య్రూటరీ కాల్వలకు భూసేకరణను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్తో కలిసి అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. సీతారామ ప్యాకేజీ–2 పరిధి కాల్వ ద్వారా కల్లూరు, పెనుబల్లి మండలాల్లో 12,454 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉందని తెలిపారు. ఈమేరకు పెనుబల్లి మండలంలో భూసేకరణను ఫిబ్రవరి 3నాటికి పూర్తిచేయాలని ఆదేశించగా, కల్లూరు మండలంలో పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, సర్వేయర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. 30 శాతం రక్తం ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్కు.. ఖమ్మంవైద్యవిబాగం: ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ల నిర్వాహకులు సేకరించిన రక్తంలో 30 శాతం ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు ఇవ్వాలని డీఎంహెచ్ఓ రామారావు ఆదేశించారు. కలెక్టరేట్లో బ్లడ్ బ్యాంక్ల నిర్వాహకులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల ఆధ్వర్యాన రక్తదాన శిబిరాలు నిర్వహించినప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వడమే కాక సేకరించిన రక్తంలో 30శాతం ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్కు అందించాలని తెలిపారు. అలాగే, శిబిరాల సమయాన హెచ్ఐవీ, సిఫిలిస్, హెపటైటిస్ బీ పాజిటివ్ కేసులను గుర్తిస్తే ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసీటీసీ సెంటర్లకు రిఫర్ చేయాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ బి.చందునాయక్ మాట్లాడుతూ బ్లడ్ బ్యాంకుల్లో నిల్వల వివరాలు ప్రదర్శించడమే కాక స్వచ్చంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యోగులు సుబ్రహ్మణ్యం, స్వప్నమాధురి, నాగయ్య, మెహమూద్ అలీ, వీరయ్య పాల్గొన్నారు. -
అభ్యంతరాలు పరిష్కరించండి
ఖమ్మం సహకారనగర్: మున్సిపాలిటీల్లో ఓటర్ల ముసాయిదా జాబితాలపై అందిన అభ్యంతరాలు, ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సూచించారు. హైదరాబాద్ నుంచి బుధవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడగా జిల్లానుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ కుముదిని మాట్లాడుతూ ఈనెల 12న వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా విడుదల చేసి, 13వ తేదీన డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాలను ప్రటించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ జిల్లాలో ఓటరు జాబితాలపై 192 అభ్యంతరాలు అందగా, 129 పరిష్కరించామని తెలిపారు. ఈ సమావేశంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, డీపీఓ రాంబాబు, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాసరెడ్డి, సంపత్, నర్సింహ, రామచందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
వైరా: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ అపూర్వ ఆదేశించారు. వైరాలోని రింగ్రోడ్డు సెంటర్, బస్టాండ్ ఆవరణను బుధవారం పరిశీలించిన ఆమె వాహనాల రాకపోకలు, ఇటీవల జరిగిన ప్రమాదాలపై అఽధికారులతో సమీక్షించారు. అయితే, ఆర్టీసీ బస్టాండ్లో తల్లాడ రోడ్డు వైపు గేటు మూసివేతపై స్థానికులు ఫిర్యాదు చేశారు. బస్సులన్నీ ఒకవైపే వస్తుండడంతో ఇటీవల ప్రమాదాలు పెరిగాయని తెలిపారు. అనంతరం ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ అపూర్వ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రమాదాల కట్టడికి అవసరమైన మార్పులు చేయాలని స్పష్టం చేశారు. ఆర్అండ్బీ డీఈ ఎం.రమేష్తో పాటు పోలీసు, రవాణా శాఖ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు. -
జీఆర్సీలతో మహిళలకు భరోసా
ఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న హింసకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబాల్లో వేధింపులు, సామాజిక వివక్ష ఎదుర్కొంటున్న మహిళలకు తక్షణ సాయం అందించేందుకు జండర్ రిసోర్స్ సెంటర్లు(జీఆర్సీ) ఏర్పాటు చేయనున్నారు. వీటికి ప్రత్యేక నిధులు కేటాయించడమే కాక బాధితులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. వేధింపుల నుంచి విముక్తి గ్రామీణ ప్రాంత మహిళలు గృహహింస, ఇతర వేధింపులకు గురైనా ఎవరికి చెప్పుకోవాలో తెలియక, చట్టపరమైన అవగాహన లేక మౌనంగా భరిస్తున్నారు. ఇలాంటి వారికి జీఆర్సీలు పరిష్కారం చూపనున్నాయి. సెర్ప్ సీఈఓ ప్రత్యేక కార్యాచరణతో జీఆర్సీలపై జిల్లాల వారీగా మండల సమాఖ్యలు, ఏపీఎంలు, సీఓలు, సీసీలు, ఓబీలకు శిక్షణ ఇస్తున్నారు. నాలుగు మండలాలు ఎంపిక తొలి విడతగా జిల్లాలో జీఆర్సీల ఏర్పాటుకు నాలుగు మండలాలను ఎంపిక చేశారు. బోనకల్, మధిర, కల్లూరు, ఖమ్మం రూరల్ మండలాల్లో సెంటర్ల ప్రారంభానికి ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. ఈ నిధులను సెంటర్లో వసతుల కల్పనకే కాక బాధితుల సహాయ, సహకారాల కోసం వెచ్చించనున్నారు. తొలుత ఈ సెంటర్లను మండల సమాఖ్య కార్యాలయంలోనే నిర్వహిస్తారు. ఫిర్యాదులు, సేవలు.. జీఆర్సీల్లో సఖి భరోసా సెంటర్ మాదిరిగానే ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు బాధితులకు తక్షణ సేవలు అందిస్తారు. బాధితులకు అవసరమైన న్యాయ సలహాలు, వైద్యసేవలను అందజేస్తారు. కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి ఎదుర్కొనే వారికి నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పిస్తారు. అలాగే, పోలీస్, ఆశ, అంగన్వాడీలు, ఎస్హెచ్జీ సభ్యుల ద్వారా మహిళా హక్కులు, చట్టాలపై గ్రామాల్లో అవగాహన కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఇలాంటి వ్యవస్థలు గ్రామీణ స్థాయికి చేరడం ద్వారా మహిళలు ఆర్థికంగానే కాక సామాజికంగా ధైర్యంగా ఉంటారని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి సెర్ప్లో భాగమైన జండర్ విభాగం ద్వారా జీఆర్సీ(జండర్ రిసోర్స్ సెంటర్)ల నిర్వహణను మహిళా సంఘాల సభ్యులు, సమాఖ్యలకు అప్పగిస్తున్నట్లు డీఆర్డీవో ఆర్.సన్యాసయ్య వెల్లడించారు. ఖమ్మం టీటీడీసీలో నాలుగు మండలాల సమాఖ్యలు, ఓబీలు, ఏపీఎం, సీఓలు, సీసీలకు బుధవారం ఇచ్చిన శిక్షణలో ఆయన మాట్లాడారు. లింగ వివక్ష, దాడుల సమయాన మహిళలకు అండగా నిలుస్తూ, సెంటర్ల ద్వారా అందే సేవలను గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, వైద్య, మహిళ శిశు సంక్షేమ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహిళలకు అవసరమైన సలహాలు, సేవలను అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో సెర్ప్ జండర్ అడ్వైజర్, ట్రైనర్ జమున జీఆర్సీల నిర్వహణపై శిక్షణ ఇవ్వగా, అడిషనల్ డీఆర్డీఓ జయశ్రీ, డీపీఎం ఆంజనేయులు, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ లింగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశ పడితే.. ఊచలే !
● సైబర్ నేరాల నిధులకు ఖాతాలు అప్పగింత ● ఉచ్చులో చిక్కుకున్న అమాయకులు ● ఇప్పుడు ముఖం చాటేస్తున్న సూత్రధారులుసత్తుపల్లి: సైబర్ నేరగాళ్ల లీలలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. అయితే, సూత్రధారులు, పాత్రధారులు పాత నేరస్తులే అవుతుండడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్కు చెందిన ఓ డాక్టర్ నుంచి రూ.14కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్ల వెనుక సత్తుపల్లి రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. కాంబోడియా కేంద్రంగా ఈ నేరానికి పాల్పడగా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన దాసరి మణిరాం, శివకృష్ణ, బ్రహ్మనాయుడు, పవన్కల్యాణ్ను రిమాండ్పై చంచల్గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్ను కోర్టు అనుమతితో సత్తుపల్లి రూరల్ పోలీసులు రెండు రోజులు విచారించి తిరిగి జిల్లా జైలుకు పంపించారు. అయితే సైబర్ నేరాలకు పాల్పడిన వారు తెలివిగా పలువురి అకౌంట్లను సేకరించి డబ్బు జమ చేయగా.. వారిని విచారిస్తుండడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. ఈ కేసులో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతుండగా, పోట్రు కల్యాణ్ తదితరుల కోసం గాలిస్తున్నారు. బెట్టింగ్ అప్పులు తీర్చి.. అశ్వారావుపేటకు చెందిన ఓ వ్యక్తి సత్తుపల్లిలో చదివాక పీజీ చేశాడు. ఆ సమయంలో సత్తుపల్లిలోని ప్రముఖ పాఠశాల బాధ్యుడి కుమారుడితో స్నేహం ఏర్పడింది. అశ్వారావుపేట యువకుడు విద్యాభ్యాసం తర్వాత పొట్టకూటి కోసం ఆటో నడుపుతూ క్యాటరింగ్ చేస్తుండగా బెట్టింగ్ వ్యసనంతో రూ.4 లక్షల అప్పులయ్యాయి. ఆ సమయాన సైబర్ నేరాల్లో కీలక వ్యక్తి కలిసి తనతో ఉన్నవాళ్లంతా డబ్బు సంపాదించారని, తనతో వస్తే బాకీలు తీరుస్తానని నమ్మించి హైదరాబాద్లోని తన ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చాడని తెలిసింది. ఆపై ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ మోసాల్లో శిక్షణ ఇవ్వగా వ్యవహారమంతా అశ్వారావుపేట వాసి పేరిట నడవడంతో ఆయన ఇప్పుడు కేసు నమోదైంది. కేసు నుంచి బయట వేయమని బాధ్యుల కుటుంబీకులను కోరితే బుకాయిస్తున్నారని ఆయన తల్లి వాపోతోంది. ప్రధాన నిందితులు మాత్రం రూ.కోట్లు కొల్లగొట్టి జల్సాలు చేస్తుండగా.. వీరి ఆగడాలపై నోరు మెదిపేందుకు కమీషన్ కోసం ఆశపడిన వారు జంకుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అప్పనంగా వచ్చే కమీషన్కు కక్కుర్తిపడిన కొందరు ఆధార్, పాన్కార్డులను ఆర్థిక నేరగాళ్లకు అప్పగిస్తున్నారు. సత్తుపల్లి డివిజన్లో పలు వురు ఇలా ఖాతా వివరాలు ఇచ్చాక అందులో నేరగాళ్లు డబ్బు జమ చేయించడంతో పోలీసు ల విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది. నిందితులు రూ.లక్షకు రూ.20వేలు కమీషన్ కింద మినహాయించుకొని మిగిలిన డబ్బు ఇవ్వాలనే నిబంధనతో ఖాతాలు సేకరించినట్లు సమాచారం. వేంసూరు మండలం రాజుగూడెంకు చెందిన ఓ వ్యక్తి ఈ తరహా అకౌంట్లు తెరిపించి డబ్బు బదలాయించిన తర్వాత కొందరు డబ్బులు వాడుకోవటంతో వారిని చితకబాది రికవరీకి ప్రయత్నించినట్లు తెలిసింది. -
గ్యారంటీలు ఏవీ?
సాక్షిప్రతినిది, ఖమ్మం: ‘ఎన్నికల సమయంలో సీఎల్పీ లీడర్గా ఉన్న మల్లు భట్టివిక్రమార్క గ్యారంటీ కార్డులు భద్రంగా పెట్టుకోండి. వంద రోజుల తర్వాత మా ప్రభుత్వం రాగానే అందులోని హామీలన్నీ నెరవేరుస్తాం అన్నారు. రెండేళ్లు గడిచినా ఆ 420 హామీలు ఏమయ్యాయి?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ మద్దతుతో జిల్లాలో గెలిచిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమం బుధవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించగా కేటీఆర్ మాట్లాడారు. రూపురేఖలు మార్చింది కేసీఆరే.. ఖమ్మంలో రహదారుల విస్తరణ, డివైడర్లు, జంక్షన్ల నిర్మాణం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని కేటీఆర్ తెలిపారు. లకారం చెరువు అభివృద్ధి, కొత్త బస్టాండ్, కేఎంసీ భవనం, ఐటీ హబ్ నిర్మాణాలు కేసీఆర్ ఘనతేనని చెప్పారు. కానీ తుమ్మల హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెబుతున్నా... 2014లో ఆయన ఓడిపోతే మిత్రుడు కదా అని కేసీఆర్ తీసుకొచ్చి మంత్రిని చేశాడని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి పూర్తయ్యేదని తెలిపారు. కేసీఆరే అభ్యర్థిగా భావించండి.. త్వరలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్గా భావించి ఓట్లు వేయాలని కోరారు. జిల్లా ప్రజలు ‘పోతే గీతే మా ఎమ్మెల్యే పోతడు, కేసీఆర్ అయితే ఉంటారు కదా’ అని అనుకోవడంతోనే సీట్లు పోయాయని తెలిపారు. ఈసారి మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 7 – 8 అసెంబ్లీ స్థానాలు కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేటర్ల ఇళ్లు తిరుగుతున్న మంత్రి.. ఖమ్మంలో మంత్రి బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఖమ్మంకు తాను వస్తున్నట్లు తెలిసి ముగ్గురు కార్పొరేటర్లను సీఎం దగ్గర కూర్చోబెట్టాడని తెలిపారు. అయితే, ఎందరిని ఎత్తుకెళ్లినా ప్రజల మద్దతు తమకు ఉన్నంత కాలం ఎవరూ ఏమీ చేయలేరన్నారు. పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా 127 మంది సర్పంచ్లు, 156 మంది ఉపసర్పంచ్లు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్పై వ్యతిరేకత ఉంది.. ఖమ్మం వస్తుంటే నాయకన్ గూడెం వద్ద స్వాగతం పలికిన వారిలో రైతులు యూరియా బస్తా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగితే ‘పాలిచ్చే గేదెను వద్దనుకుని, తన్నే దున్నపోతును తెచ్చుకున్నాము’ అని వాపోయారు. ప్రజల్లో కాంగ్రెస్పై తీవ్రమైన వ్యతిరేకత, తీవ్రమైన కోపం కనిపిస్తోందని తెలిపారు. సుమారు 7.5 లక్షల ఎకరాల కొత్త, పాత ఆయకట్టుకు సాగునీరు అందించేలా కేసీఆర్ డిజైన్ చేసిన సీతమ్మసాగర్ ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయిందని కేటీఆర్ తెలిపారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లి ప్రాజెక్టు గొప్పతనాన్ని చెప్పకుండా కాల్వలు తవ్వలేదని మాట్లాడారని పేర్కొన్నారు. ఇల్లెందు లాంటి ప్రాంతాలకు నీళ్లు వెళ్లకుండా వారే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్రెడ్డి, రేగా కాంతారావు, బానోతు చంద్రావతి, నాగేశ్వరరావు, హరి ప్రియ, వెంకటేశ్వర్లు, జెడ్పీ, డీసీసీబీ మాజీ చైర్మన్లు కమల్రాజు, కూరా కుల నాగభూషణం, నాయకులు దిండిగాల రాజేందర్, గుండాల కృష్ణ, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.రూట్ సర్వేలో పాల్గొన్న ఆర్ఎం సరిరామ్, డిపో మేనేజర్లుడిప్యూటీ సీఎంతో పాటు ఇక్కడి ఇద్దరు మంత్రులు పంచాయతీ ఎన్నికల ట్రైలర్తో భయపడ్డారని కేటీఆర్ పేర్కొన్నారు. గెలిచిన సర్పంచ్లు కాంగ్రెస్లో చేరితేనే పథకాలు, నిధులు ఇస్తామని మభ్యపెడితే భయపడొద్దని సూచించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు పంచాయతీల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. -
క్వార్టర్స్లో నెగ్గాం.. సెమీస్, ఫైనల్లోనూ మనదే గెలుపు
సాక్షి, ఖమ్మం: ఎగవేతలు, కూల్చివేతలతో కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని.. అందుకే ఆ పార్టీని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఖమ్మంలో బుధవారం నిర్వహించిన నూతన సర్పంచ్ల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తారు. క్వార్టర్ ఫైనల్లో(సర్పంచ్ ఎన్నికలను ఉద్దేశించి..) మంచి ఫలితాలు వచ్చాయి. సెమీ ఫైనల్ లో మంచి ఫలితాలు వస్తాయి. చివరికి ఫైనల్ లో విజయం మనదే. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. యూరియా బస్తాలు దొరకడం లేదని రైతన్నలు చెబుతున్నారు. పాలిచ్చే గేదెను వదులుకొని.. తన్నే దున్నపోతు ను గెలిపించారని నేను వారితో చెప్పా. అయిపోయింది ఏదో అయిపోయింది.. వచ్చేది బీఆర్ఎస్ అని రైతులు నాతో చెప్పారు. రైతులు ఎంత క్లారిటీగా ఉన్నారో అర్థమైంది.బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో యూరియా కష్టాల్లేవ్. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లైన్లలో చెప్పులు కనిపిస్తున్నాయి. షాపుల్లో లేని యూరియా యాప్ల్లో ఎలా వస్తుంది?.. కాంగ్రెస్ పాలనలో ఎగవేతలు, కూల్చివేతలు. లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు.. ఏమైంది?. కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇచ్చారా?. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చారా?. రెండేళ్లలో ఏం అభివృద్ధి జరిగింది?.. కూల్చివేతలు, ఎగవేతలే కనిపిస్తున్నాయి. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం.. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ పని చేశారు. ఇప్పుడు ఇదే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. కనీసం రైతులకు యూరియా ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నారు. కమీషన్ల కోసమే ఆ మగ్గురు పని చేసేది. 30 శాతం ట్యాక్స్ నడిపిస్తున్నారు వాళ్లు. ఆరు గ్యారెంటీలు భద్రంగా పెట్టుకొండనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆనాడు ఎన్నికల ప్రచారం లో చెప్పారు. ఇప్పుడు రెండేళ్లు అయిన గ్యారెంటీలు అమలు కాలేదు. దీనికి భట్టి ఏమి సమాధానం చెబుతారు?..ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైంది. సర్పంచ్ ఎన్నికల్లో 40 శాతం పదవులు గెలుచుకున్నాం. ఇక్కడే రెండేళ్లలోనే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలుస్తోంది. త్వరలో జగరబోయే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పదు. ఖమ్మం నుంచి 7 నుంచి 8 స్థానాలు గెలుస్తాం అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
కేటీఆర్ రోడ్ షోలో వైఎస్సార్సీపీ జెండాల రెపరెపలు
సాక్షి, ఖమ్మం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కూసుమంచి మండలం నాయకన్గూడెంలో కేటీఆర్ రోడ్ షోలో వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోతో పాటు వైఎస్సార్సీపీ జెండాలు రెపరెపలాడాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు వైఎస్సార్సీపీ జెండాలతో జై జగన్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
లాస్ట్ మినిట్లో మారిన లొంగుబాట
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పీఎల్జీఏ బెటాలియన్ వన్ కమాండర్ బర్సె దేవా లొంగుబాటు విషయంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ పోలీసులు పోటాపోటీగా వ్యూహాలు అమలు పరిచినట్టు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతోపాటు పీఎల్జీఏ బెటాలియన్ వన్ కమాండర్ బర్సె దేవాను లొంగిపోవాలని కోరుతూ వారి స్వగ్రామమైన పూవర్తికి ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్శర్మ గతేడాది నవంబర్ 6న వెళ్లారు. హిడ్మా, దేవా తల్లులైన పొజ్జి, హింగేలతో కలిసి భోజనం చేశారు. ఇద్దరూ లొంగిపోవాలని వారి తల్లులతో పిలుపునిప్పించారు. అయితే నవంబర్ 18న ఏపీలో జరిగిన మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయాడు. ఈ ఘటన అనంతరం మావోయిస్టు మద్దతుదారులతోపాటు స్థానిక ప్రజానీకంలోనూ హిడ్మా పట్ల సానుభూతి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ఛత్తీస్గఢ్ సర్కార్, అటు కేంద్రం తదుపరి ఆపరేషన్లపై ఆచితూచి వ్యవహరించాయి. ఇదే సమయంలో ఛత్తీస్గఢ్లో మైనింగ్ కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ రణరంగంగా మారడం పరిస్థితి తీవ్రతను మరింతగా పెంచింది. దీంతో ఎన్కౌంటర్లకు బదులు తమ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా బర్సె దేవాను లొంగుబాటుకు ఒప్పించేందుకు కేంద్రం ముమ్మరంగా ప్రయతి్నంచినట్టు సమాచారం. అప్రమత్తమైన తెలంగాణఛత్తీస్గఢ్ పోలీసుల నుంచి వచ్చిన లొంగుబాటు ప్రయత్నాలపై నిర్ణయం తీసుకునే విషయంలో బర్సె దేవా ఒకటికి రెండుసార్లు ఆలోచించినట్టు తెలుస్తోంది. చివరకు ఛత్తీస్గఢ్ కంటే తెలంగాణలో లొంగిపోవడమే మేలని భావించి ఇటు దిశగా వచి్చనట్టు సమాచారం. అయితే, అనుకున్నంత వేగంగా లొంగుబాటు ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో తన ‘నెట్వర్క్’ద్వారా బర్సె దేవా ఛత్తీస్గఢ్ పోలీసుల టచ్లోకి వెళ్లేందుకు ప్రయతి్నంచినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు లొంగుబాటు ‘ముచ్చట్లు’సాగించేందుకు అక్కడి నుంచి ప్రతినిధులు గోదావరి తీర ప్రాంత అడవుల్లోకి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ పోలీసులు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. వెనువెంటనే బర్సె దేవా ‘లొకేషన్’కు చేరుకొని, అక్కడి నుంచి సరెండర్ ప్రక్రియను ఆగమేఘాల మీద పూర్తి చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. అకస్మాత్తుగా బర్సె దేవా బృందం మాయం కావడంతో పౌరహక్కుల సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి. వరుస ఎన్కౌంటర్లు హిడ్మా ఎన్కౌంటర్తో జరిగిన డ్యామేజ్ను ఎంతో కొంత పూడ్చుకునేందుకు బర్సె దేవా లొంగుబాటును ఉపయోగించుకునే ప్రయత్నాలు విఫలం కావడంతో బస్తర్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో ఉన్న బలగాలు తమ పంథాను మార్చుకున్నట్టు సమాచారం. బర్సె దేవా లొంగుబాటు ప్రక్రియ అధికారికంగా జరగాల్సిన రోజు ఉదయమే బీజాపూర్, సుక్మా జిల్లాల్లో వేర్వేరుగా రెండు ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. ఆ రోజు 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు బర్సె దేవా లొంగుబాటు విషయంలో తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుకు అతని స్వగ్రామమైన పూవర్తి నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు
● చైనా మాంజా విక్రయాలు, వినియోగం నేరమే ఖమ్మంక్రైం: సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కడైనా కోడి పందేలు నిర్వహించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషన ర్ సునీల్దత్ హెచ్చరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా గతంలో పందేలు, పేకాట స్థావరాలు నిర్వహించిన వారిని బైండోవర్ చేయాల ని అధికారులను ఆదేశించారు. అలాగే, పక్షులతో పాటు ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజా విక్రయించినా, వినియోగించి నా కఠినంగా వ్యవహరిస్తామని సీపీ తెలిపారు. సింథటిక్ దారం, గాజు పొడితో చేసే ఈ మాంజాతో పక్షుల గొంతు, రెక్కలు తెగిపోవడమే కాక మనుషులకు గాయాలయవుతాయని వెల్లడించారు. దీని విక్రయం, వినియోగం వివరాలు తెలిస్తే ప్రజలు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ మంగళవారం ఓ ప్రకటనలో సూచించారు. ఈసీఆర్ విద్యార్థులకు వరం ఖమ్మం సహకారనగర్: ఎవ్రీ చైల్డ్ రీడ్స్(ఈసీఆర్) కార్యక్రమం ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వరంలా నిలుస్తోందని డీఈఓ చైతన్య జైనీ తెలిపారు. ఖమ్మం అర్బన్ ఎమ్మార్సీలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం రెండో విడతగా 30 రోజుల పాటు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం తొలిదశతో విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం గణనీయంగా పెరిగినందున రెండో విడతపై మరింత ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కాగా, వచ్చేనెలలో జరగనున్న ఎఫ్ఎల్ఎస్ సర్వేలో జిల్లా అగ్రస్థానాన నిలిచేలా కృషి చేయాలని ఆమె తెలిపారు. సూచించారు. ఈ సమావేశంలో సీఎంఓ ప్రవీణ్కుమార్, ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజ లక్ష్మీ, హెచ్ఎంలు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. పేరు పెట్టండి.. బహుమతి పట్టండి!ఖమ్మం అర్బన్: ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్కు కొత్త పేరు, ట్యాగ్లైన్ కోసం ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తున్నట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్తో కలిసి పోటీల పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. పార్క్కు కొత్త పేరు, ఆకర్షణీయమైన ట్యాగ్లైన్తో పాటు లోగో రూపకల్పన కోసం పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 10నుంచి 20వ తేదీ వరకు ఆసక్తి ఉన్న వారు సూచనలు పంపించాలని వెల్లడించారు. ఉత్తమ పేరు, ట్యాగ్లైన్కు రూ.4 వేల నగదు బహుమతి, ఉత్తమ లోగోకు రూ.4వేల బహుమతి అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఎఫ్డీఓ మంజుల, జలవనరులశాఖ ఈఈ వెంకట్రామ్, డీఏఓ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి ఖమ్మంలీగల్: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.కల్ప న సూచించారు. ఈనెల 9వ తేదీ వరకు జరగనున్న రహదారి భద్రతా కార్యాచరణ పోస్టర్లను మంగళవారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్లు, కార్లు నడిపే వారు సీట్బెల్ట్ తప్పక ధరించడంతో పాటు పరిమిత వేగంతో నడిపితే ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చని తెలిపారు. అంతేకాక ప్రయాణ సమయంలో అవసరమైన అన్ని పత్రాలను వెంట తీసుకెళ్తే తనిఖీల సమయాన ఎలాంటి ఆటంకాలు ఎదురుకావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ జగదీష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాకు ‘చెక్’పోస్ట్
తిరుమలాయపాలెం: అనుమతి లేకుండా ఇసుక తరలింపును అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. సీపీ సునీల్దత్ ఆదేశాలతో మండలంలోని పాలేరు ఏటి నుండి ఇసుక అక్రమ రవాణా జరగకుండా కాకరవాయిలో చెక్పోస్టు ఏర్పాటుచేశారు. కొంత కాలంగా మండలంలోని ముజాహిదిపురం పాలేరు ఏటితో పాటు హైదర్సాయిపేట పడమటితండా, అజ్మీరాతండా ఆకేరు నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా తరలిస్తున్నారు. పలుమార్లు పోలీసులు కేసులు నమోదు చేసినా రవాణా ఆగడం లేదు. దీంతో నిరంతరం నిఘా కోసం కాకరవాయిలో చెక్పోస్టు ఏర్పాటుచేసి ఏఆర్ కానిస్టేబుళ్లతో 24గంటల పాటు గస్తీ కాస్తున్నట్లు ఎస్సై కె.జగదీశ్ తెలిపారు. కాగా, హైదర్సాయిపేట పడమటితండాలోనూ నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. -
అభివృద్ధిలో కార్యదర్శులదే కీలకపాత్ర
ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీ అభివృద్ధిలో కార్యదర్శులదే కీలకపాత్ర అని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లాలో 65 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–4 కార్యదర్శులుగా క్రమబద్ధీకరణ ఉత్తర్వులను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి మంగళవారం అందజేశాక కలెక్టర్ మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణ, గ్రామాల్లో పచ్చదనం పెంపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వంద శాతం పన్నులు వసూలు చేస్తూనే ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ పంచాయతీ అధికారి రాంబాబు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పంటలకు సరిపడా యూరియా నిల్వలు ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో యూరియా పంపిణీకి సమగ్ర చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. యాసంగి పంటల సాగుకు అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉన్నందున దుష్ప్రచారాలను రైతులు నమ్మొద్దని సూచించారు. అన్ని మండలాల్లో పీఏసీఎస్లు, ప్రైవేట్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచి పంపిణీకి ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 11,817 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉండగా, ఇప్పటివరకు 25,773 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని పేర్కొన్నారు. జిల్లా యంత్రాగం నిరంతరం పర్యవేక్షిస్తున్నందున రైతులు అపోహలకు గురికావొద్దని, ఎక్కడైనా సమస్య ఎదురైతే ఏఓ, ఏఈఓల దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ ఓ ప్రకటనలో సూచించారు. కలెక్టర్ అనుదీప్ -
వైద్యసేవల్లో ఆశాల పాత్ర కీలకం
కొణిజర్ల: వైద్య, ఆరోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాల విజయవంతంలో ఏఎన్ఎం పాత్ర ముఖ్యం కాగా, వైద్యసేవల్లో ఆశా కార్యకర్తల సేవలు కీలకంగా నిలుస్తున్నాయని డీఎంహెచ్ఓ రామారావు తెలిపారు. కొణిజర్ల పీహెచ్సీలో మంగళవారం ఆశా డే సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయిలో ప్రజలకు వైద్యసేవలు సాఫీగా అందాలంటే ఆశాల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంపు, నవజాత శిశువుల సంరక్షణ, వంద శాతం వ్యాక్సినేషన్పై దృష్టి సారించాలని డీఎంహెచ్ఓ సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
నేటి నుంచి కబడ్డీ కూత
పినపాక: జాతీయస్థాయి అండర్ – 17 బాలుర కబడ్డీ పోటీలకు పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిద్ధమైంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రీడా ప్రాంగణంలో ఎల్ఈడీ స్క్రీన్లు, సుమారు 500 మంది వీక్షించేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సింగరేణి సహకారంతో క్రీడా ప్రాంగణం, పార్కింగ్ పరిసరాల్లో భారీ ఎల్ఈడీ లైట్లు అమర్చారు. పోటీల్లో పాల్గొనేందుకు ఇప్పటికే 33 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలిరాగా, మణుగూరు రైల్వే స్టేషన్లో వారికి నిర్వాహకులు స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇసుక తిన్నెల్లో సాధన.. కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు ముందుగానే చేరుకున్న తెలంగాణ రాష్ట్ర జట్టు మంగళవారం గోదావరి ఇసుక తిన్నెల్లో సాధన చేసింది. మరికొన్ని రాష్ట్రాల వారు వ్యాయామం, యోగా వంటివి చేశారు. క్రీడాకారులకు అధికారులతో పాటు మౌరీ టెక్, కంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాల వారికి అనుగుణంగా అల్పాహారంలో బ్రెడ్, జామ్, గుడ్లు, సాంబార్, ఇడ్లీ, పూరి వంటి రుచికరమైన వంటలు అందించారు. మధ్యాహ్నం, రాత్రి రోటీలు, చపాతి, సబ్జి, దాల్ ఫ్రై, రైస్, కర్డ్ రైస్ వంటివి సమకూర్చారు. -
సంక్రాంతికి వచ్చేయండి!
● 1,368 బస్సు సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు ● ఖమ్మం రీజియన్లో ఏడు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ● ఈనెల 9 నుంచి 20వ తేదీ వరకు నిర్వహణ ఖమ్మంమయూరిసెంటర్: సంక్రాంతి పండుగకు ఆర్టీసీ సిద్ధమైంది. పండుగకు సొంత గ్రామాలకు వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఖమ్మం రీజియన్లోని ఏడు డిపోల నుంచి 1,368బస్సు సర్వీసుల నిర్వహణకు సన్నాహాలు చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి పండుగకు ముందుగానే ప్రత్యేక సర్వీసులు మొదలుపెట్టాలని నిర్ణయించగా, ఈ బస్సులు 9వ తేదీ నుండి 20వ తేదీ వరకు కొనసాగుతాయి. అయితే, అదనపు సర్వీసుల్లో సాధారణ చార్జీల కన్నా అదనంగా వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. డిమాండ్ ఆధారంగా రిజర్వేషన్ సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. అయితే, 11, 17వ తేదీల్లో మహాలక్ష్మి సర్వీసులు(పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్) బస్సుల్లో కాకుండా ఇతర సర్వీసుల్లో అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. రద్దీకి అనుగుణంగా.. విద్యా, ఉద్యోగ, వృత్తి వ్యాపార నిమిత్తం హైదరాబాద్తో పాటు ఇతర నగరాల్లో ఉంటున్న వారు సంక్రాంతికి సొంత ఊర్లకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విద్యాసంస్థలకు ఈనెల 10నుంచి సెలవులు మొదలుకానుండగా, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ఖమ్మం రీజియన్ అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వచ్చే ప్రయాణికుల కోసం ఈనెల 9 నుండి 15వ తేదీ వరకు 799 సర్వీసులు నడిపిస్తారు. తిరుగు ప్రయాణంలో ఈనెల 16 నుండి 20 వరకు ఉమ్మడి జిల్లా నుండి హైదరాబాద్కు 569 బస్సు సర్వీసులు ఉంటాయి. ప్రయాణికుల రద్దీ పెరిగితే అదనంగా బస్సులు నడిపేందుకు కూడా ప్రణాళిక రూపొందించారు. రిజర్వేషన్ సౌకర్యం సంక్రాంతి పండుగకు ఆర్టీసీ నడిపించే అదనపు బస్సులకు సంస్థ రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్సైట్ ద్వారా సీట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుండి ఉమ్మడి జిల్లాకు 365 రిజర్వేషన్ సర్వీసులను, తిరుగు ప్రయాణంలో 236 రిజర్వేషన్ సర్వీసులు నడిపిస్తారు.తేదీ రిజర్వేషన్ నాన్ మొత్తం రిజర్వేషన్ 9 68 80 148 10 68 80 148 11 68 88 156 12 68 88 156 13 68 88 156 14 15 20 35 15 10 20 30 ఇక తిరుగు ప్రయాణంలో ఉమ్మడి జిల్లా నుండి హైదరాబాద్కు ఈనెల 16న రిజర్వేషన్, నాన్ రిజర్వేషన్ కలిపి 90 సర్వీసులు నడిపిస్తారు. అలాగే, 17వ తేదీన 138, 18వ తేదీన 173, 19వ తేదీ 128, 20వ తేదీన 40 సర్వీసులు నడిపించేలా ప్రణాళిక రూపొందించారు.సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వచ్చే వారి కోసం ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుండి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిస్తాం. ఏపీకి వెళ్లే ప్రయాణికులు కూడా ఉమ్మడి జిల్లా మీదుగా వెళ్లే అవకాశం ఉండడంతో ఈ ఏడాది సర్వీసుల సంఖ్య పెంచాం. ప్రయాణికులకు సుఖవంతమైన, సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను ఎంచుకునేలా ప్రచారం చేస్తాం. – ఏ.సరిరామ్, ఆర్ఎం, ఖమ్మం రీజియన్, ఆర్టీసీ -
లెర్నింగ్ లైసెన్స్తో పాటు హెల్మెట్లు
ఖమ్మంక్రైం: రవాణా శాఖలో ఏజెంట్ల దందాను అరికట్టేందుకు వాహనదారులు తమ పనుల కోసం నేరుగా వచ్చేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈక్రమంలోనే నేరుగా దరఖాస్తు చేసుకుని వచ్చి లెర్నింగ్ లైసెన్స్ పొందిన పలువురికి జిల్లా రవాణా శాఖ అధికారి జగదీష్ మంగళవారం లైసెన్స్ కాపీతో ప్రోత్సాహకంగా హెల్మెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఏజెంట్ల వ్యవస్థను అరికట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వాహనదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని నేరుగా కార్యాలయానికి రావాలని సూచించారు. కాగా, రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఖమ్మం ఎన్ఎస్సీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నిబంధనలపై పరీక్ష నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీఏ సభ్యుడు వెంకన్న, ఏఎంవీఐలు స్వర్ణలత, సుమలతతో పాటు రవిచంద్రన్, రమేష్, సరిత తదితరులు పాల్గొన్నారు. -
చరిత్రలో నిలిచిపోయేలా సభ
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఈనెల 18న ఖమ్మంలో జరగనుండగా, చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నామని పార్టీ జాతీయ సమితి సభ్యుడు, ఉత్సవాల ఆహ్వాన సంఘ కార్యదర్శి బాగం హేమంతరావు తెలిపారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో జరిగే సభకు అన్ని రాష్ట్రాల నుంచి సీపీఐ నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా పాల్గొంటారని వెల్లడించారు. సభ జయప్రదం కోరుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్నామని, 9న ఖమ్మంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ, 10 నుంచి 14 వరకు కళారూపాల ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు. అంతేకాక ఈనెల 12న డీపీఆర్సీ భవనంలో జరిగే కవి సమ్మేళనానికి ప్రముఖ కవులు సుద్దాల అశోక్తేజ, కేవీఎల్ తదితరులను ఆహ్వానించినట్లు తెలిపారు. ఇప్పటికే సేకరించిన వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించి రచనలతో ప్రత్యేక సంకలనాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు. అలాగే, ఈనెల 17న జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ సబ్ కమిటీ సమావేశం, 19 నుంచి 21 వరకు జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఇక 20వ తేదీన ‘దేశంలో వామపక్ష ఉద్యమం – ఎదుర్కొంటున్న సవాళ్లు’ అంశంపై జరిగే జాతీయ స్థాయి సెమినార్లో అన్ని వామపక్షాల జాతీయ నాయకులు పాల్గొంటారని బాగం వివరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు ఏపూరి లతాదేవి, జమ్ముల జితేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.సీపీఐ శత వార్షిక సభ ఆహ్వాన సంఘం కార్యదర్శి బాగం -
పుర పోరుకు అడుగులు..
బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026తొలి అంకం పూర్తయినట్టే... జిల్లాలో సత్తుపల్లి, వైరా, మధిర మున్సిపాలిటీలకు పాలకవర్గాల గడువు ముగియగా.. కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలు నూతనంగా ఎర్పడ్డాయి. వీటిలో ఓటర్ల ముసాయిదా జాబితాలు విడుదల చేశారు. ఈ జాబితా ఆధారంగా 117 వార్డుల్లో 1,42,901 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలతో మున్సిపాలిటీల్లో ఎన్నికల కళ రాగా, ప్రజలు పరిశీలించి ఓటు హక్కు ఉందా, లేదా.. ఏ వార్డులో ఉందని ఆరా తీస్తున్నారు. వార్డులు మారాయి.. ముసాయిదా ఓటరు జాబితాపై మార్పులు, చేర్పులపై వినతులు స్వీకరించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 100 అభ్యంతరాలు అందగా ఇప్పటికే కొన్నింటిని పరిష్కరించారు. అత్యధికంగా వైరా మున్సిపాలిటీలో 30 ఫిర్యాదులు అందాయి. చాలా కుటుంబాల్లో ఒకరి ఓటు ఓ వార్డులో, ఇంకొకరి ఓటు మరో వార్డులో వచ్చినందున సరిచేయాలని కోరారు. మధిర మున్సిపాలిటీలో కూడా ఇదే తరహా వినతులు అందాయి. ఇళ్లు మారిన వారు తమ ఓటు హక్కును ప్రస్తుత వార్డుకు మార్చాలని దరఖాస్తు చేసుకున్నారు. కల్లూరు మున్సిపాలిటీలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల పేర్లు వేరే వార్డులో ఉన్నాయని 19 అభ్యంతరాలు నమోదయ్యాయి. వీటిని పరిశీలించిన అధికారులు ప్రస్తుతం వారు ఉంటున్న వార్డుకే ఓటు హక్కు బదలాయించడంపై దృష్టి సారించారు. అంతటా ఎన్నికల మూడ్.. ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసినప్పటి నుంచి మున్సిపాలిటీల్లో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. జాబితాలు పరిశీలించిన రాజకీయ నాయకులు తమ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఎవరివైనా పేర్లు లేవా అని ఆరా తీస్తున్నారు. అంతేకాక ఏ వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఎవరు ఎవరికి ఓటు వేసే అవకాశం ఉందో కూడా పరిశీలిస్తున్నారు. ఈనెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంతో ఆశావహులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. పార్టీల గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో తమ సీటు కోసం నేతలు, ప్రజాప్రతినిదులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతూ అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండాలనే అంశంపై దృష్టి సారించాయి.ముసాయిదా ఓటర్ల జాబితాపై అందిన అభ్యంతరాలతో పాటు మార్పులు, చేర్పులను అధికారులు పరిష్కరిస్తున్నారు. అలాగే, సోమవారం మున్సిపాలిటీల్లో పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అలాగే, మంగళవారం జిల్లాస్థాయిలో సమావేశం పూర్తయింది. ఈ సమావేశాల్లో అందిన సలహాలను కూడా పరిగనణలోకి తీసుకుని 10వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు.ముసాయిదా ఓటర్ల జాబితాపై 100 అభ్యంతరాలు -
దొంగల ముఠా అరెస్ట్
రఘునాథపాలెం: వివిధ రాష్ట్రాల్లో చోరీలకు పాల్ప డుతున్న ఇద్దరిని రఘునాథపాలెం పోలీసులు అరెస్ట్చేశారు. ఈ మేరకు వివరాలను ఖమ్మం ఏసీపీ ఎస్.వీ. రమణమూర్తి, సీఐ ఎం.డీ.ఉస్మాన్ షరీఫ్ మంగళవారం వెల్లడించారు. మండలంలోని కోయచలక క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారి పోయే ప్రయత్నం చేశారు. దీంతో వారి ని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించారు. ముదిగొండ మండలం ముత్తారం గ్రామానికి చెందిన లంజపల్లి శేఖర్ అలియాస్ టోనీ, రేగులచలకకు చెందిన జంగా వెంకన్న, కోయచలకకు చెందిన కొరకొప్పు ల నవీన్ ముఠాగా ఏర్పడినట్లు తేలింది. వీరు ఈ నెల 2న రేగులచలకలోని మహిళా కానిస్టేబుల్ పూజిత విధులకు వెళ్లగా ఇంటి వెనక తలుపులు పగలగొట్టి బీరువాలో దాచిన రూ.7,30,740 విలువైన 114 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు అంగీకరించారు. నిందితుల్లో టోనీ, వెంకన్న పట్టుబడగా నవీన్ పరారీలో ఉన్నాడని, వీరి నుంచి ఆభరణాలు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, టోనీపై గతంలో వైరా, ఖమ్మం రూరల్, ఏపీ రాష్ట్రంలోని జగ్గయ్యపేట ప్రాంతాల్లో చోరీ కేసులు ఉన్నాయని వెల్లడించారు. చోరీ కేసులో నిందితులను నాలుగు రోజుల్లోనే అరెస్ట్ చేసిన సీఐ ఉస్మాన్ షరీఫ్, ఎస్ఐలు జి.నరేష్, ఎం.తేజేశ్వర్రెడ్డి, సిబ్బంది ఎస్.రవికుమార్, కె.సంజీవ్కుమార్, శ్రీనివాసులును సీపీ సునీల్దత్, ఏసీపీ రమణమూర్తి అభినందించారు. రూ.7.30 లక్షల విలువైన నగలు స్వాధీనం -
అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలో సబ్బండ వర్గాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఎస్సీ సెల్ సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్లో ఎస్సీలకు పెద్దపీట వేయడమే కాక ఎస్సీ అభ్యర్థుల విజయానికి కృషి చేసినట్లు చెప్పారు. అనంతరం జీపీ ఎన్నికల్లో సర్పంచ్లుగా గెలిచిన 70మందిని సత్కరించారు. ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు బొందయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ దర్జీ చెన్నారావు, నాయకులు దాసరి దానియేలు, కొత్తా సీతారాములు, వేజెండ్ల సాయికుమార్, సయ్యద్ గౌస్, మూడుముంతల గంగరాజు యాదవ్, ముళ్లపూడి సీతారాములు, కొండూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ -
బొమ్మ కాలేజీకి మరో పేటెంట్
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీకి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విభాగం నుంచి పేటెంట్ లభించిందని చైర్మన్ బొమ్మ రాజేశ్వరావు తెలిపారు. ఏపోవర్డ్(ప్రొటీన్ స్ట్రక్చర్ డిటర్మినేషన్ అపరేటస్) పేరిట కృత్రిమ మేధస్సు ఆధారిత గణన నమూనాలను ఉపయోగించి ప్రొటీన్ల నిర్మాణాన్ని కచ్చి తంగా గుర్తించే అంశానికి పేటెంట్ మంజూరు చేశారని వెల్లడించారు. వరుసగా నాలుగు పేటెంట్లు సాధించడం తమ కాలేజీకి గర్వకారణమని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ విజయభాస్కరరావుతో పాటు సంతోష్, కిరణ్ జ్యోతి, సాయి సంధ్య, అనిత, మృదుల, సిద్ధార్థ్, భార్గవి, ముస్కాన్, మనోహర్, కార్తీక్ ఇందులో పాలుపంచుకున్నారని వైస్ చైర్మన్ బొమ్మ సత్యప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యలక్ష్మి, ఉదారు శ్రీధర్, మాధవి, అనూష, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అన్నదానానికి రూ.లక్ష వితరణ మధిర: మధిర బంజారా కాలనీలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవా లయంలో ప్రతీ శనివారం జరిగే అన్నదానానికి తల్లపురెడ్డి నాగిరెడ్డి సతీమణి కృష్ణకుమారి జ్ఞాపకార్ధం రూ.1,00,116ను అందజేశారు. ఈ నగదును ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లాది వాసుకు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి కుమారుడు సుధాకర్రెడ్డి, ఆలయ కమిటీ బాధ్యులు రేగళ్ల సునీత, కొంగర మురళి తదితరులు పాల్గొన్నారు. హైస్కూల్ డైరెక్టర్ కుటుంబానికి... ఖమ్మం అర్బన్: ఖమ్మం పాండురంగాపురంలోని చైతన్య హైస్కూల్ డైరెక్టర్ షేక్ అక్బర్ ఇటీవల మృతి చెందారు. ఈ మేరకు పూర్వ విద్యార్థులు 60మంది సేకరించిన రూ. 1,01,500 నగదును వారి కుటుంబానికి మంగళవారం అందజేశారు. విద్యాబుద్ధులు నేర్పి తాము జీవితంలో స్థిరపడడానికి అక్బర్ పాటుపడ్డారని గుర్తు చేసుకున్నారు. జాతర ఆదాయం.. రూ.1.57 లక్షలు అధికం పెనుబల్లి: మండలంలోని నీలాద్రీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే జాతరలో షాపుల ఏర్పాటుకు మంగళవారం వేలం నిర్వహించారు. కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు అమ్మేందుకు గత ఏడాది రూ.1.61లక్షలు పలకగా ఈసారి రూ.2.01లక్షలకు చేరింది. ప్రసాదం అమ్మకానికి గత సంవత్సరం రూ.2.10లక్షలు వస్తే ఈసారి రూ.2.61లక్షలకు, కొబ్బరిచిప్పలు పోగు చేసుకునే హక్కు గత ఏడాది రూ.34వేలు పాడితే ప్రస్తుతం రూ.77వేలకు చేరింది. ఇక తలనీలాలు పోగు చేసుకునే హక్కు గత ఏడాది రూ.30వేలైతే ప్రస్తుతం రూ.33వేలు, సైకిల్ స్టాండ్ గత ఏడాది రూ.1.03లక్షలు ఉంటే ఈ ఏడాది రూ.1.10లక్షలు, కోనేటి పూజలు గత సంవత్సరం రూ.13వేలు పలికితే ఈసారి రూ.26వేలకు చేరింది. ఫలితంగా మొత్తం ఆదాయం గత ఏడాది కంటే రూ.1.57లక్షలు పెరిగిందని, దేవాదాయ శాఖ పరిశీలకులు ఆర్.సమత తెలిపారు. ఈఓ ఎన్.రజినికుమారి తదితరులు పాల్గొన్నారు. లారీ ఢీకొనడంతో మహిళ మృతి వైరా: ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టగా ఓ మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరం గ్రామ సమీపాన జరిగింది. జగ్గయ్యపేట వైపు నుంచి వస్తున్న ట్రాలీ ఆటోను మధిర వైపు నుంచి వైరా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఘటనలో ట్రాలీ ఆటోలో ఉన్న వడ్డాది వెంకటరత్నం(37) మృతి చెందగా, ఆటో నడుపుతున్న ఆమె భర్త రాముకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో 108 వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. కాగా, వెంకటరత్నం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తుంది. భర్త రాము ట్రాలీ ఆటోలో పరుపులు అమ్మి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి.రామారావు తెలిపారు. -
ధూప, దీప నివేదన రూ.35 వేలకు పెంచాలి
ఖమ్మంగాంధీచౌక్: ధూప, దీప నివేదన పథకంలో భాగంగా అర్చకులతో పాటు నివేదనకు ప్రతీనెల ఇస్తున్న నగదును రూ.35వేలకు పెంచాలని ధూప, దీప, నివేదన(డీడీఎన్) అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ డిమాండ్ చేశారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల స్థాయి అర్చకుల సమావేశం ఖమ్మంలో మంగళవారం జరగగా ఆయన మాట్లాడారు. 2007లో మొదలైన డీడీఎన్ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,758 మంది అర్చకులు పనిచేస్తుండగా, అర్చకులకు రూ.6 వేలు, నివేదనకు రూ.4 వేలు కలిపి రూ.10 వేలు ఇస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నగదు సరిపోవటం లేదని, ఇకనైనా అర్చకులకు రూ.26 వేలతో పాటు నివేదికకు రూ.10 వేలు కేటాయించాలన్నారు. అలాగే, అర్చకులు ఉద్యోగ భద్రత కల్పించి ప్రతీనెల 5వ తేదీన వేతనాలు చెల్లించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రతీ జిల్లాలో అర్చక భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డీడీఎన్ జిల్లా అధ్యక్షుడు మునగలేటి రమేష్ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు తుంబూరి దయాకర్రెడ్డి, ఖమ్మం నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్చౌదరి, మార్కెట్ల చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, బైరి హరినాథబాబు, నర్సింహారావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావుతో పాటు విశాలాక్షి, ఇంగువ రామకృష్ణ, పురాణం కిరణ్శర్మ, సంతోష్శర్మ, భార్గవాచార్యులు, ఆమంచి సురేష్శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్లి వినతిపత్రం అందజేచారు. డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మ -
కొత్త మిర్చి వస్తోంది..
● ఖమ్మం మార్కెట్కు నానాటికీ పెరుగుతున్న సరుకు ● తొలి కోత మైలకాయ విక్రయానికే మొగ్గు ● దేశీయ డిమాండ్ మేరకే ధరలుఖమ్మంవ్యవసాయం: తెలుగు రాష్ట్రాల్లో ‘తేజా’ మిర్చి కొనుగోళ్లకు పేరున్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు కొద్ది రోజులుగా సరుకు రాక క్రమంగా పెరుగుతోంది. సాధారణంగా సంక్రాంతి పండుగ తర్వాత మిర్చి కోతలు, విక్రయాలు మొదలవుతాయి. కానీ రెండేళ్లుగా ముందస్తు సాగుతో జనవరి ఆరంభం నాటికే కోతలు ప్రారంభమవుతున్నాయి. ఏటా మిర్చి సాగు సెప్టెంబర్లో మొదలుకావాల్సి ఉండగా జూలైలోనే నారు పోసి, ఆగస్టు నుంచి సాగు చేస్తుండడంతో ముందస్తు కోతకు వస్తోంది. డిసెంబర్ చివరి వారం నుంచి అరకొరగా అమ్మకాలు మొదలై జనవరి ఆరంభానికి పెరుగుతున్నాయి. నిత్యం 30వేల బస్తాలు గత ఏడాది మిర్చి సాగు చేసిన రైతులు పలువురు మెరుగైన ధర కోసం కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. జిల్లాలో 48 కోల్డ్ స్టోరేజీలే కాక పరిసర జిల్లాల కోల్డ్ స్టోరేజీల నుంచి సైతం రైతులు శాంపిళ్ల ద్వారా విక్రయిస్తున్నారు. నిల్వ మిర్చి నిత్యం 15 వేల బస్తాల వరకు వస్తుండగా, మరోపక్క కొత్త మిర్చి 12వేల నుంచి 15 వేల బస్తాలు వరకు తీసుకొస్తున్నారు. మైలకాయ కావడంతో.. మిర్చి కోతలు మూడు నుంచి నాలుగు సార్లు సాగుతాయి. మొదట కోసే మిర్చిని మైలకాయ చెబుతూ నిల్వ చేయడానికి వీలులేక విక్రయానికి తీసుకొస్తున్నారు. పూర్వం మైలకాయను చేన్లలోనే వదిలేసినా ఇప్పుడు డిమాండ్ ఆధారంగా అమ్ముతున్నారు. ఖమ్మం జిల్లాలో 35 వేల ఎకరాల్లో మిర్చి సాగు కాగా, భద్రాద్రికొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్లగొండ, హనుమకొండ జిల్లాల నుంచి సైతం తేజా రకం మిర్చి ఖమ్మం మార్కెట్కు వస్తోంది. గిట్టుబాటు కాని ధర ప్రస్తుతం పలుకుతున్న ధర మిర్చి రైతులకు గిట్టుబాటయ్యేలా కానరావడం లేదు. ఏటేటా మిర్చి సాగుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఎరువులతో పాటు పురుగుల మందు భారం పడుతుండడంతో ఎకరాకు రూ.1.50 లక్షల వరకు ఖర్చవుతోంది. ఈ పెట్టుబడి ఆధారంగా క్వింటాకు రూ.20 వేల ధర ఉంటే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతుండగా.. ఆ పరిస్థితి లేకపోవడంతో భవిష్యత్పై ఆశలు పెట్టుకుంటున్నారు. తేజా మిర్చికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉండేది. ప్రధానంగా చైనా దేశానికి ఇక్కడి నుంచి పలువురు వ్యాపారులు ఎగుమతి చేసేవారు. మూడేళ్ల క్రితం ఓ దశలో క్వింటా మిర్చికి రూ.25 వేల వరకు పలికి సగటున రూ.20వేల ధర కొనసాగింది. కానీ ఆతర్వాత ధరలు తగ్గుతూ గత ఏడాది బాగా పడిపోయాయి. నాణ్యత ఆధారంగా రూ.12వేల నుంచి రూ.15,500కు మించి పలకపోవడంతో వ్యాపారులు ఆర్డర్లు ఉంటే కొనుగోలు చేస్తున్నారు. ఇక దేశీయంగా రూ.15వేల నుంచి రూ. 15,500 వరకు ధర పలుకుతుండడంతో నాణ్యత ఆధారంగా ఖమ్మంలో గరిష్టంగా రూ.14,800, మోడల్ ధర రూ.14,400, కనిష్టంగా రూ.7వేలుగా నిర్ణయిస్తున్నారు. ఇక్కడి వ్యాపారులు పలువురు మిర్చిని కొనుగోలు చేసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. -
క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం
● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ● గంగారం బెటాలియన్లో స్పోర్ట్స్మీట్ ప్రారంభంసత్తుపల్లిరూరల్: పోలీసులు ఉద్యోగపరంగా ఎదుర్కొనే ఒత్తిడి తగ్గించుకునేందుకు క్రీడలు దోహదం చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సత్తుపల్లి మండలం గంగారం 15వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్లో మంగళవారం ఇంటర్ కంపెనీ స్పోర్ట్స్మీట్ను ఆయన కల్లూరు సబ్కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుంధరయాదవ్, బెటా లియన్ కమాండెంట్ ఎన్.పెద్దబాబుతో కలిసి ప్రా రంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. తొలుత బెటాలియన్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అడిషనల్ కమాండెంట్ అంజయ్య, అసిస్టెంట్ కమాండెంట్ శ్రీధర్రాజా, వేణుగోపాల్రెడ్డి, అశోక్కుమార్, అధికారులు పాల్గొన్నారు. అధికారుల పనితీరు మారాలి వేంసూరు: వేంసూరు మండల అధికారులు పని తీరు మార్చుకుని ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. వేంసూరు తహసీల్లో రెవెన్యూ, విద్య, వైద్యం తదితర శాఖల అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, గ్రామాల్లో పన్నుల వసూళ్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంపుపై సూచనలు చేశారు. అలాగే, ఉపాధి హామీ పథకంలో లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, అధికారులు పాల్గొన్నారు. గోదాం వద్ద పటిష్ట నిఘా ఖమ్మం సహకారనగర్: ఈవీఎం గోదాం పటిష్ట నిఘా కొనసాగాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన ఆయన అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాలను పనితీరుపై ఆరా తీశాక ఉద్యోగులకు సూచనలు చేశారు. చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. ఎన్నికల సూపరింటెండెంట్ ఎం.ఏ.రాజు, డీటీ అన్సారీ, ఆర్ అండ్ బీ డీఈ లఖన్నాయక్, ఏఇ లలిత పాల్గొన్నారు. -
బాలికల విభాగంలో చాంపియన్గా అశ్వారావుపేట జట్టు
ముగిసిన అగ్రి స్పోర్ట్స్ మీట్అశ్వారావుపేటరూరల్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన క్రీడా పోటీలు మంగళవారం ముగిశాయి. విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల నుంచి 400 మందికి పైగా విద్యార్థులు హాజరు కాగా వాలీబాల్, బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, క్యారమ్, చెస్, పుట్బాల్, ఖోఖో, క్రికెట్, టగ్ ఆఫ్ వార్, పరుగు పందెం, లాంగ్ జంప్తోపాటు మరికొన్ని పోటీలు నిర్వహించారు. బాలుర విభాగంలో రాజేంద్రనగర్ జట్టు, బాలికల విభాగంలో అశ్వారావుపేట జట్టు చాంపియన్గా నిలిచాయి. విజేతలు వీరే.. బాలుర విభాగం వాలీబాల్ పోటీల్లో రాజేంద్రనగర్పై జగిత్యాల, బాస్కెల్ బాల్లో రాజేంద్రనగర్పై పాలెం, షటిల్ బ్యాడ్మింటన్లో అశ్వారావుపేటపై రాజేంద్రనగర్, టేబుల్ టెన్నిస్లో అశ్వారావుపేటపై రాజేంద్రనగర్, చెస్ పోటీల్లో రాజేంద్రనగర్పై వరంగల్, క్యారమ్స్లో వరంగల్పై రాజేంద్రనగర్, క్రికెట్ పోటీల్లో జగిత్యాలపై రాజేంద్రనగర్, పుట్బాల్లో అశ్వారావుపేటపై రాజేంద్రనగర్, ఖోఖో పోటీల్లో పాలెంపై సిరిసిల్ల, టగ్ ఆఫ్ వార్లో సంగారెడ్డిపై సిరిసిల్ల జట్లు గెలుపొందాయి. పరుగు పందెం(100 మీటర్లు)లో అశ్వారావుపేట, సంగారెడ్డి, జగిత్యాల విద్యార్థులు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో .. వాలీబాల్లో రాజేంద్రనగర్పై సంగారెడ్డి, క్యారమ్స్లో సైఫాబాద్పై అశ్వారావుపేట, టేబుల్ టెన్నిస్లో రాజేంద్రనగర్పై అశ్వారావుపేట, టెన్నికాయిట్లో సైఫాబాద్పై అశ్వారావుపేట, షటిల్ బ్యాడ్మింటన్లో రాజేంద్రనగర్పై సిరిసిల్ల, చెస్లో వరంగల్పై జగిత్యాల, బాస్కెట్ బాల్లో వరంగల్పై అశ్వారావుపేట, ఖోఖోలో అశ్వారావుపేట–సిరిసిల్ల సంయుక్తంగా విజయం సాధించాయి. టగ్ ఆఫ్ వార్లో ఆదిలాబాద్పై వరంగల్, పరుగు పందెం(100 మీటర్లు)లో ప్రథమ స్థానంలో రాజేంద్రనగర్, ద్వితీయ స్థానంలో జగిత్యాల, తృతీయ స్థానంలో అశ్వారావుపేట, అథ్లెటిక్స్ వ్యక్తిగత విభాగంలో ఎం రచన(అశ్వారావుపేట) విజేతగా నిలిచారు. విజేతలకు మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. జయశంకర్ యూనివర్సిటీ డీఎస్ఏ చల్లా వేణుగోపాల్ రెడ్డి, అబ్జర్వర్ మధుసూదన్రెడ్డి, డీన్ హేమంత్కుమార్, ప్రొఫెసర్లు రాంప్రసాద్, శిరీష, నాగాంజలి పాల్గొన్నారు సాగర్ కాల్వలో దూకి మహిళ ఆత్మహత్య కొణిజర్ల: ఓ మహిళ సాగర్ కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తనికెళ్లకు చెందిన పొట్లపల్లి పార్వతి(52)కి భర్త మృతి చెందగా, పిల్లలు లేకపోవడంతో ఒంటరితనంతో బాధపడుతోంది. ఈక్రమాన మంగళవారం బోనకల్ బ్రాంచ్ కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో గాలిస్తుండగా పెద్దగోపతి లాక్ల వద్ద మృతదేహం లభ్యమైంది. మృతురాలి అక్క ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సూరజ్ తెలిపారు. లాడ్జిలో వ్యభిచారం ఖమ్మంక్రైం: ఖమ్మం త్రీటౌన్ లోని పోస్టాఫీస్ సమీపాన ఓ లాడ్జిలో త్రీటౌన్ పోలీసులు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ గదిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు విటులు, ఒక మహిళను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ మోహన్బాబు తెలిపారు. హాటల్ మేనేజర్ శ్రీకాంత్పై కేసు నమోదు చేయగా, రూ.5,100 స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. -
చిత్తడి నేలల గుర్తింపునకు కార్యాచరణ
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపునకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన వెట్ ల్యాండ్ కమిటీ సమావేశంలో డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వెట్ ల్యాండ్ పరిమితి, ప్రాంతం స్పష్టంగా తెలిసేలా సర్వే శాఖ సహకారంతో నోటిఫికేషన్ రూపొందించాలని తెలిపారు. పట్టా భూముల సర్వే నెంబర్లు స్పష్టంగా తెలిసేలా పొందుపర్చాలని చెప్పారు. కాగా, చిత్తడి నేలలు నోటిఫికేషన్ ద్వారా భూమి యాజమాన్యం మారదనే విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నేలల్లో స్వభావ మార్పు చేయకుండా, నిర్మాణ వ్యర్థాలు, శుద్ధి చేయని వ్యర్థాలు వేయకుండా పర్యవేక్షించాలని తెలిపారు. ఈ విషయమై గ్రామ సభలు నిర్వహించి ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్ మాట్లాడుతూ చిత్తడి భూముల జియో ట్యాగింగ్ చేస్తున్నామని, ఆయా భూముల్లో నిర్మాణాలు, పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఉండదని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, ఎఫ్డీఓ మంజుల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
జీపు బోల్తా పడి వ్యక్తి మృతి
గుండాల: జీపు బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. కొమరారం ఎస్సై నాగుల్మీరా కథనం ప్రకారం.. మండలంలోని చెట్టుపల్లికి చెందిన పెరిక రామకృష్ణ(35) శంభూనిగూడెంలో కిరాయి ఉండటంతో ఆదివారం రాత్రి బయల్దేరాడు. చెట్టుపల్లి–శంభూనిగూడెం మార్గం మధ్యలో ఓ మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్ జీపు కింద పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. -
● ‘నకిలీ’లతో నష్టపోయాం.. న్యాయం చేయండి
తాము సాగు చేసిన మొక్కజొన్న పంట నష్టపోయామని, న్యాయం చేయాలని ఏన్కూరు మండలం రేపల్లెవాడకు చెందిన రైతులు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి వేడుకున్నారు. గ్రామానికి చెందిన 14 మంది రైతులు 50 ఎకరాల్లో సింజెంట్ కంపెనీకి చెందిన 602 రకం విత్తనాలతో మొక్కజొన్న సాగు చేశారు. 40 రోజుల తర్వాత చేనులో గడ్డి నివారణ కోసం ఆ కంపెనీ ఏజెంట్ సలహా మేరకు టింజర్, అట్రాజన్ మందులను పిచికారీ చేశారు. ఆ తర్వాత ఐదారు రోజుల్లోనే పంట ఎండిపోయి నిర్జీవంగా మారింది. దీనిపై ఏన్కూరు మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేశామని, అయినా ఆయన పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. నకిలీ విత్తనాలు, మందులతో తాము మోసపోయామని కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. దీనికి స్పందించిన కలెక్టర్ విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
జాతీయ కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు
పినపాక: జాతీయస్థాయి అండర్–17 కబడ్డీ పోటీలకు మండలంలోని ఈ.బయ్యారంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోటీలపై యువత సోషల్ మీడియా ద్వారా స్వచ్ఛందంగా ప్రచారం చేస్తోంది. ‘మన గ్రామం, మన క్రీడలు, మన బాధ్యత’ ట్యాగ్లైన్తో పోస్టులు పెడుతున్నారు. అధికారులు ప్రత్యే క ఆకర్షణగా భారీ బెలూన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆటోలు, ప్రైవేటు వాహనాలకు పోస్టర్లు అంటించడంతోపాటు మైకులతో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రాల జట్లు రాక పోటీలు బుధవారం ప్రారంభంకానుండగా, సోమవారమే పలు రాష్ట్రాల జట్లు ఈ.బయ్యారం చేరుకున్నాయి. అసోం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, త్రిపుర, ఛతీస్గఢ్ రాష్ట్రాల జట్ల క్రీడాకారులు రాగా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధికారులు వారిని బస చేసే ప్రదేశానికి తరలించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి జాతీయస్థాయి కబడ్డీ పోటీల ఏర్పాట్లలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. సోమవారం పోటీలు నిర్వహించే ఈ.బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల్లో అధికారుల అలస్తత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటీపీఎస్, సింగరేణి సంస్థలను భాగస్వామ్యం చేసుకుని పనులు పూర్తి చేయాలని, విద్యుత్, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పంచాయతీ సిబ్బంది నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని చెప్పారు. డీఈఓ నాగలక్ష్మి, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీఓ వెంకటేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు. జాతీయ కబడ్డీ పోటీలకు నవోదయ విద్యార్థులు కూసుమంచి : ఈ నెల 7 నుంచి ఏడూళ్ల బయ్యారంలో నిర్వహించే జాతీయ స్థాయి అండర్ –17 కబడ్డీ పోటీల్లో వివిధ రీజియన్లకు చెందిన 12 మంది నవోదయ విద్యార్థులు పాల్గొంటున్నారు. వారికి డిసెంబర్ 27 నుంచి సోమవారం వరకు పాలేరు నవోదయ విద్యాలయలో ప్రత్యేక శిక్షణను అందించారు. హైదరాబాద్, పుణె, లక్నో, భోపాల్, పాట్నా రీజియన్లకు చెందిన విద్యార్థులు ఈ పోటీలకు ఎంపికయ్యారు. కాగా, పాలేరు నవోదయ ప్రిన్సిపాల్ కె. శ్రీనివాసులు సోమవారం వారికి స్సోర్ట్స్ కిట్లను అందించారు. రేపటి నుంచి ఈ.బయ్యారంలో ప్రారంభంకానున్న క్రీడలు -
మామిడి ‘పండు’తుందా..?
వేంసూరు: విదేశాలకు ఎగుమతి చేసే తోతాపురి, బంగినపల్లి తదితర మామిడి రకాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాగవుతున్నా యి. ఖమ్మం జిల్లాలో సుమారు 32వేల ఎకరాల్లో మామిడితోటలు ఉన్నాయి.అయితే, మామిడి సాగు వ్యయం పెరుగుతుండడం.. చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలు వస్తుండడంతో సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే పలుచోట్ల మామిడి తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రారంభించారు. వేంసూరు మండలంలో కొన్నేళ్ల క్రితం వరకు 25వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా, ఇప్పుడు ఏడు వేల ఎకరాలకు పడిపోయింది. కాగా, నాలుగేళ్ల నుంచి వరుస నష్టాలు వస్తుండడంతో రైతులు దిగాలు చెందుతుండగా, ఈసారి పూతఆశాజనకంగా ఉండడంతో మెరుగైన దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. పూతను కాపాడుకునేలా.. ఈసారి మామిడిచెట్లకు పూత గణనీయంగా వచ్చింది. ఇందులో సగమైనా కాతగా మారితే దిగుబడికి ఢోకా ఉండదని, లాభాలు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. ఈ మేరకు నాలుగేళ్ల నుంచి నష్టాలు తప్ప లాభమన్నది ఎరగని రైతులు.. పూత, పిందెను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యాన శాఖ అధికారులను సంప్రదిస్తూ తోటల్లో పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. ఇక ఇప్పటికే పలుచోట్ల తోటలను లీజ్కు తీసుకున్న తెలంగాణ, ఏపీ వ్యాపారులు మామిడితోటల్లో చీడపీడల నివారణ చర్యలు చేపడుతున్నారు. వరుసగా నాలుగేళ్ల నుంచి మామిడి తోటలకు పెట్టుబడితోనే సరిపోతుంది. తెగుళ్లకు తోడు ఏదో ఒక కారణంతో నష్టాలే తప్ప లాభాల ముఖమే చూడలేదు. ఈసారి పూత బాగానే ఉన్నా, చివరకు నష్టాలే వస్తే మామిడి తోట తొలగించక తప్పదు. – అట్లూరి సత్యనారాయణరెడ్డి, రైతు, అడసర్లపాడు ఈ ఏడాదైనా మామిడి లాభదాయకంగా ఉంటుందని అనుకుంటున్నాం. ఇప్పటికే మామిడి తోటలు లీజ్కు తీసుకున్నాను. ప్రస్తుతం తోతాపురి తోటల్లో పూత ఆశాజనకంగా ఉంది. వాతావరణం కలిసొస్తే తోటలతో లాభాలు వస్తాయనే ఆశతో ఉన్నాం. – జంగ జమలయ్య, మామిడి తోటల వ్యాపారిజిల్లాలో ఒకప్పుడు వేంసూరు మండలంలో అత్యధికంగా మామిడి తోటలు ఉండేవి. ఈ మండలంలో 25వేలకు పైచిలుకు ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా ఇప్పుడు కేవలం ఏడు వేల ఎకరాలకే పరి మితమైంది. చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలు మామిడి సాగుకు ప్రధాన సమస్యలుగా మారాయి. పూతదశలో ఏటా తేనె మంచుపురుగు, తామర పురుగు ఉధృతితో పెట్టుబడి పెరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. ఒకవేళ కాయ దశకు చేరినా మంగు తెగులుతో నష్టాలు, దీన్ని అధిగమించే సరికి ఈదురు గాలులు, అకాల వర్షాలతో తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయి. ఇవన్నీ ఓర్చుకుంటూ కాత వచ్చేసరికి జిల్లాలో మామిడి మార్కెట్ లేక మంచి ధర కోసం దక్షిణాది రాష్ట్రాల వ్యాపారులపై ఆధారపడక తప్పడం లేదు. -
జాతీయ వాలీబాల్ టోర్నీకి ముగ్గురి ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్ : ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈనెల 11 వరకు జరిగే జాతీయస్థాయి సీనియర్ వాలీబాల్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. రాష్ట్రజట్టులో స్థానం పొందిన వారిలో కొర్రి జగదీష్, బండ్ల గణేష్, చల్లగుండ్ల సారిక ఉన్నారు. జిల్లా నుంచి క్రీడాకారులు ఎంపిక కావడం పట్ల డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి బి.గోవిందారెడ్డి, కోచ్ నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్ చేతులమీదుగా పురస్కారంఖమ్మంరూరల్: మండలంలోని కాచిరాజుగూడెం గ్రామానికి చెందిన వికాస వేదిక సాహిత్య సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కవి, రచయిత జి.లెనిన్ శ్రీనివాస్ త్రిపుర గవర్నర్ డాక్టర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా విశిష్ట పురస్కారం అందుకున్నారు. ఏపీలోని అమరావతిలో జరిగిన మూడో ప్రపంచ తెలుగు మహాసభలో.. తెలుగు అభ్యున్నతి కోసం చేసిన కృషి, సాహిత్య సేవలకు గర్తుగా శ్రీనివాస్కు సాహితీ విశిష్ట పురస్కారాన్ని అందించి సత్కరించారు. పర్యావరణానికి నష్టం కలిగించొద్దు ● డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్మధిర: అటవీ చట్ట నిబంధనలకు లోబడి, పర్యావరణానికి నష్టం కలగకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ అన్నారు. మధిర అటవీ రేంజ్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను, వన సంరక్షణ చర్యలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కల సంరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని, నీటి సరఫరా సక్రమంగా ఉండాలని అన్నారు. జమలాపురం ఆలయ సమీపంలో రూపుదిద్దుకుంటున్న అటవీ పార్కు పనులను పర్యవేక్షించి పర్యాటకులు, భక్తుల సౌకర్యార్థం పార్కును సుందరంగా తీర్చిదిద్దాలని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అటవీ డివిజనల్ అధికారి మంజుల, మధిర అటవీ రేంజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 15 కిలోల గంజాయి స్వాధీనం● బైక్ అదుపుతప్పి కిందపడటంతో బూర్గంపాడు: సారపాక ప్రధాన కూడలిలో పోలీసులను గమనించి అతివేగంగా పరారవుతున్న బైక్ అదుపు తప్పి కిందపడింది. బైక్ నడుపుతున్న వ్యక్తి కొద్దిగాయాలతో అక్కడే పడిపోగా వెనుక కూర్చున్న వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు అక్కడకు చేరుకుని సోదాలు చేయగా 15 కిలోల గంజాయి దొరికింది. ఈ ఘటన సోమవారం జరిగింది. ఎస్ఐ మేడా ప్రసాద్ కథనం ప్రకారం.. సీలేరు నుంచి జగ్గయ్యపేట వైపు బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. బైక్ నడుపుతున్న జగ్గయ్యపేటకు చెందిన కన్నెగంటి ఈశ్వర్ గోపినాఽథ్ను పోలీసులు పట్టుకుని విచారించారు. రూ 7.65 లక్షల విలువైన 15కిలోల గంజాయి లభించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పరారైన వ్యక్తి గూటి నాగరాజుగా తేలింది. బైక్ను సీజ్ చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని, పరారైన నాగరాజు కోసం గాలిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
ఇదో రకం మోసం..!
● పెట్రోల్ బంక్ యజమానులకే బురిడీ ● ఫుల్ ట్యాంక్ చేయించుకుని ఉడాయిస్తున్న వాహనదారులు ● ఖమ్మానికి చెందిన ముగ్గురు యువకులుగా గుర్తింపు ఖమ్మం అర్బన్ : సహజంగా పెట్రోల్ బంకుల్లో కల్తీ జరుగుతోందని, తక్కువ ఇంధనం పోస్తున్నారనే ఆరోపణలు వినియోగదారుల నుంచి వినిపిస్తుంటాయి. కానీ ఇందుకు విరుద్ధంగా కొందరు ఘరానా మోసగాళ్లు పెట్రోల్ బంక్ యజమానులనే బురిడీ కొడుతున్న ఘటనలు జిల్లాలో వెలుగు చూస్తున్నాయి. కార్లలో డీజిల్, పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుని డబ్బు చెల్లించకుండా ఉడాయిస్తున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఖమ్మం నగరంలోని దంసలాపురం, చింతకాని మండలం నాగులవంచ, బోనకల్ మండలంలోని ఓ బంక్, కొణిజర్ల మండలం లాలాపురంలోని బంక్ల్లో ఇలాగే ఇంధనం నింపుకుని డబ్బులు ఇవ్వకుండా కారులో పారిపోయినట్లు బంక్ మేనేజర్లు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణ.. గత నెలలో లాలాపురం బంక్లో డీజిల్ కొట్టించుకుని కారులో ఉడాయించిన ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి వేళల్లో బంకుల్లో సిబ్బంది తక్కువగా ఉండడాన్ని ఆసరాగా తీసుకుని, ఇంధనం నింపిన వెంటనే పరారవుతున్నారు. ఆదివారం సాయంత్రం ధంసలాపురం బంక్ వద్ద ఇలాగే పెట్రోల్ పోయించుకుని పరారు కాగా, కారును గుర్తించిన బంక్ యజమానులు పోలీసులకు సమాచారం అందించగా ఆ కారును పట్టుకుని నిందితులపై విచారణ చేపట్టారు. చింతకాని, బోనకల్ మండలాల్లో కూడా ఇదే కారుతో ఇంధనం నింపుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, ధంసలాపురం ఘటనలో ఖమ్మం నిజాంపేటకు చెందిన పి.శివానంద్, రాపర్తినగర్కు చెందిన బి. కార్తీక్పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. మరో యువకుడి కోసం దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. -
బంకుల్లో మోసాలకు తావు లేదు
ఎర్రుపాలెం: పెట్రోల్ బంక్ల్లో వినియోగదారులను మోసం చేసేందుకు తావు లేదని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి బి.ప్రవీణ్కుమార్ అన్నారు. ఇటీవల మండలకేంద్రంలోని హెచ్పీ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొలతల్లో తేడాలు రావడంతో వినియోగదారులు పౌరసరఫరాల అధికారులకు, మెట్రాలజీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ప్రవీణ్కుమార్, సివిల్ సప్లై డీటీ ప్రసన్న సోమవారం పెట్రోల్ బంక్ను, రికార్డులను పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న ఒక పెట్రోల్ పంప్ను సీజ్ చేశారు. శాంపిళ్లు ల్యాబ్కు పంపించి తేడాలు ఉంటే చర్యలు తీసుకుంటామని ప్రవీణ్కుమార్ తెలిపారు. బంక్ల్లో పని చేసే సిబ్బంది వినియోగదారులతో మర్యాదగా మెలగాలని సూచించారు. టాయిలెట్లు, ఎయిర్, తాగునీరు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు. -
జెండా పండుగలో అందరూ పాల్గొనాలి
● డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్ ఖమ్మంమయూరిసెంటర్ : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచనతో ఈనెల 26న తలపెట్టిన జెండా పండుగలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలంతా పాల్గొనాలని, ప్రతీ ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. ఖమ్మం డీసీసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జెండా పండుగకు అవసరమైన సామగ్రిని జిల్లా కార్యాలయం నుంచి పంపిస్తామని చెప్పారు. కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన పంచాయతీ సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యుల జాబితాను ఈనెల 8లోగా జిల్లా కార్యాలయానికి అందజేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జిల్లా మంత్రులు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. సమావేశంలో నాయకులు సూరంశెట్టి కిషోర్, గాలి దుర్గారావు, కొమ్మినేని రమేష్ బాబు, వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, వడ్డే నారాయణరావు, స్వర్ణ నరేంద్ర, కాసర చంద్రశేఖర్ రెడ్డి, శివ వేణు, పంది వెంకటేశ్వర్లు, కళ్లెం వెంకటరెడ్డి, వేజెండ్ల సాయికుమార్, దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, ముజాహిద్ హుస్సేన్, మొక్కా శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, బోజెడ్ల సతీష్ పాల్గొన్నారు. -
‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’పై దృష్టి పెట్టాలి
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మంసహకారనగర్: ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలుపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. తన క్యాంప్ కార్యాలయం నుంచి సోమవారం ఆయన వీసీ ద్వారా ఎంఈఓలు, హెచ్ఎంలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల్లో పఠనా సామర్థ్యం పెంపునకు చేపట్టిన ఈ కార్యక్రమం మొదటి దశలో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. పంచాయతీ ఎన్నికల కారణంగా మధ్యలో కొంత ఆగినా నూతన సంవత్సరంలో ఉపాధ్యాయులు మరింత ఉత్సాహంగా రెండో దశ అమలుకు కృషి చేయాలని సూచించారు. మొదటి దశలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా రెండు రకాల స్టడీ మెటీరియళ్లు సిద్ధం చేశామని, వెనుకబడిన విద్యార్థులు ప్రగతి సాధించేలా చూడాలని అన్నారు. ఫిబ్రవరిలో జరిగే ఎఫ్ఎల్ఎన్ సర్వేలో జిల్లా నుంచి మంచి పురోగతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాసరెడ్డితో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. లైంగిక వేధింపుల నిరోధక చట్టం అమలు చేయాలి లైంగిక వేధింపుల నిరోధక చట్టం కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో పోష్ యాక్ట్ –2013 పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పని ప్రదేశాల్లో మహిళలను వేధింపులకు గురి చేయడాన్ని నేరంగా పరిగణించాలన్నారు. 10 మంది కంటే ఎక్కువ సిబ్బంది పని చేసే కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలని, ఇందులో 50 శాతం మహిళలు ఉండాలని సూచించారు. నెల రోజుల్లో కమిటీలు ఏర్పాటు చేయకుంటే సంబంధిత బాధ్యులకు రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అనంతరం ఫ్లాగ్ షిప్ వివరాల అప్డేట్పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ధాన్యం కొనుగోలు మొదలైన వివిధ కార్యక్రమాల అమలు వివరాలను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నిర్ణీత గూగుల్ షీట్ ప్రొఫార్మాలో ప్రతి శుక్రవారం అప్ డేట్ చేయాలని ఆదేశించారు. పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులను జనవరి 9 వరకు డిస్పోజ్ చేయాలని సూచించారు. ప్రజావాణిలో 31 సర్వే ల్యాండ్ రికార్డ్స్ దరఖాస్తులు పెండింగ్ ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చింతకానిలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు మూడెకరాల స్థలం గుర్తించాలని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో డీఈఓ చైతన్య జైనీ, సీఎంఓ ప్రవీణ్ కుమార్, డీఆర్ఓ ఎ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాసరావు, జిల్లా సంక్షేమాధికారిణి వి. విజేత, డీహెచ్ఈడబ్ల్యూ సమ్రీన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 12,682 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఎలాంటి కొరత లేదని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అన్ని మండలాల్లో రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. యూరియా విక్రయ కేంద్రాల వద్ద టెంట్, కుర్చీలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించామని, రైతులు టోకెన్లు పొంది యూరియా తీసుకెళ్తున్నారని తెలిపారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 185 కేంద్రాల్లో యూరియా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. -
గూడు గోసకు చెక్..
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వివరాలు..సాక్షిప్రతినిధి, ఖమ్మం : సొంత ఇల్లు లేని పేదలందరినీ ఇందిరమ్మ ఇళ్లు వరిస్తున్నాయి. రెక్కాడితేనే డొక్కాడని స్థితిలో ఉండే నిరుపేదలకు ఈ పథకం భరోసా కల్పిస్తోంది. మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 16,523 ఇళ్లు మంజూరు కాగా.. యుద్ధప్రాతిపదికన నిర్మాణాలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు 7,341 ఇళ్లకు స్లాబ్ వేయగా.. 324 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. చాలా ప్రాంతాల్లో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేశారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ.. ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అర్హతే ప్రామాణికం.. అర్హతే ప్రామాణికంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు సాగుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక మూడు కేటగిరీల్లో జరిగింది. సొంత స్థలం ఉండి గుడిసె, రేకులషెడ్, టైల్స్ వేసిన, అద్దె ఇళ్లలో ఉండే వారిని ఎల్–1గా గుర్తించారు. గుడిసెలు, రేకులషెడ్లు, టైల్స్ వేసిన ఇళ్లు, అద్దె ఇళ్లల్లో ఉంటూ స్థలం కూడా లేని వారిని ఎల్–2గా, ఇల్లు ఉండి తల్లిదండ్రుల నుంచి విడిపోయి తమకు ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్–3 కేటగిరీలో చేర్చారు. ఇందులో ప్రాధాన్యతా క్రమంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ముగ్గు పోయడం నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి దశలోనూ ఇంటి నిర్మాణ స్థితిని ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. నిబంధనల మేరకు పూర్తయిన ఇళ్లకే నిధులు విడుదలవుతున్నాయి. జిల్లాకు 16,523 ఇళ్లు మంజూరు.. ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో గతంలో ప్రజాపాలనతోపాటు మీసేవ, గ్రామసభల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 3,48,639 దరఖాస్తులు గృహ నిర్మాణ శాఖకు అందాయి. అలాగే తొలుత పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో 20 గ్రామపంచాయతీలను ఎంపిక చేయగా.. అందులో 867 దరఖాస్తులు అర్హత సాధించాయి. ఇక గృహనిర్మాణ శాఖకు అందిన దరఖాస్తుల్లో 15,656 అర్హత గలవిగా గుర్తించగా.. మొత్తం 16,523 ఇళ్లు మంజూరయ్యాయి. చకచకా..నిర్మాణాలు.. జిల్లాలో 16,523 ఇళ్లు మంజూరు కాగా.. వివిధ కారణాలతో 2,199 ఇళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. 3,023 ఇళ్లకు పునాది వేశారు. 7,341 ఇళ్లు స్లాబ్ వరకు పూర్తయ్యాయి. 324 ఇళ్లు పూర్తయి గృహప్రవేశాలకు సిద్ధమయ్యాయి. మొత్తంగా మంజూరైన వాటిలో 87 శాతం ఇళ్లకు ముగ్గులు పోయగా, అందులో 94శాతం ఇళ్లు పునాది వరకు వచ్చాయి. దశల వారీగా బిల్లులు తమ ఖాతాల్లో జమవుతుండగా లబ్ధిదారులు నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. గతేడాది సీఎం రేవంత్రెడ్డి భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. అలాగే జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఆ ఇళ్లకూ మోక్షం.. జిల్లా వ్యాప్తంగా పేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరై వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని గతంలోనే సర్కారు నిర్ణయించింది. ఇదిలా ఉండగా.. గతంలో ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు రూ.3 లక్షలు దశల వారీగా అందిస్తామని ప్రకటించింది. దీంతో ఈ పథకం కింద కొందరు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నిధులు విడుదల కాలేదు. ప్రస్తుతం గృహలక్ష్మి ఇళ్లను కూడా ‘ఇందిరమ్మ’ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రారంభమవుతుందని మంత్రి పొంగులేటి ఇటీవలే ప్రకటించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలు.. తమకు ఇల్లు ఎప్పుడొస్తుందో.. రెండో దశలో అయినా తమకు దక్కుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం -
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
జిల్లా జడ్జి రాజగోపాల్ ఖమ్మంలీగల్: ప్రతీ వ్యక్తి రోడ్డు భద్రత నియమాలు పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ అన్నారు. రహదారి భద్రత కార్యాచరణ పోస్టర్ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఈనెల 9 వరకు రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెల్మెట్ లేకుండా వాహనాలను నడపడం వల్ల ప్రాణాలకు ముప్పు వస్తుందన్నారు. మద్యం సేవించి, అతి వేగంగా వాహనాలను నడపవద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యా యసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.కల్పన తదితరులు పాల్గొన్నారు. 10వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలిఖమ్మంమయూరిసెంటర్: ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంతన్న కా సహారా పథకాల కోసం అర్హులైన మైనార్టీ మహిళలు, ఫకీర్, దూదేకులు ఈనెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ముహమ్మద్ ముజాహిద్ సూచించారు. https:// tgobmms. cgg. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకం కింద వితంతువులు, విడాకులు పొందిన వారు, అనాథలు, అవివాహిత మహిళలకు చిరు వ్యాపారాల కోసం రూ.50 వేల చొప్పున, రేవంతన్న కా సహారా పథకం కింద ఫకీర్, దూదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాల కొనుగోలుకు రూ.లక్ష గ్రాంట్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 97040 03002 నంబర్లో సంప్రదించాలని సూచించారు.10న ఖో–ఖో జిల్లా జట్ల ఎంపికకల్లూరు: సబ్ జూనియర్స్ బాలురు, బాలికల జిల్లా ఖో–ఖో జట్ల ఎంపిక పోటీలు ఈనెల 10న నిర్వహించనున్నారు. జిల్లా ఖో–ఖో అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ పోటీలు జరుగుతాయని పీఈటీ పి.వీరరాఘవయ్య తెలిపారు. 2012 ఫిబ్రవరి 4వ తేదీ తర్వాత జన్మించిన వారు అర్హులని, ఆసక్తి గల వారు స్టడీ సర్టిఫికెట్ ఒరిజినల్, జనన ధ్రువపత్రం, ఆధార్కార్డు జిరాక్స్తో కల్లూరు మినీ స్టేడియంలో జరిగే పోటీలకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 94406 69401 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. కాగా, అదేరోజు ఖో–ఖో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నందున సభ్యులు హాజరుకావాలని ఆయన కోరారు. 8న క్రీడాజ్యోతి ర్యాలీఖమ్మం స్పోర్ట్స్ : రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించి ఒలింపిక్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంలో భాగంగా ఈనెల 8న క్రీడాజ్యోతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది జరుగనున్న సీఎం కప్ క్రీడల్లో భాగంగా ఈ ర్యాలీ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ర్యాలీకి క్రీడా సంఘాల బాధ్యులు, జిల్లా అధికారులు తరలి రావాలని కోరారు. రైతులకు అందుబాటులో యూరియాఅదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి కొణిజర్ల/చింతకాని: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొణిజర్ల మండలం పెద్దగోపతి, చింతకాని మండలం నాగిలిగొండలో ఏర్పాటు చేసిన యూరియా పంపిణీ కేంద్రాలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 185 కేంద్రాల ద్వారా రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆయా కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించామన్నారు. పందిళ్లపల్లికి చేరిన ఎరువులుచింతకాని: మండల పరిధిలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్కు సీఐఎల్ కంపెనీకి చెందిన 2,640.30 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు సోమవారం చేరాయి. 20.20.0.13 ఎరువులు 1,339.80 మెట్రిక్ టన్నులు, 28.28.0 ఎరువులు 1300.50 మెట్రిక్ టన్నులు చేరినట్లు టెక్నికల్ ఏఓ పవన్కుమార్ తెలిపారు. -
విద్యుత్ శాఖ ‘ప్రజాబాట’
● ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో కార్యక్రమం ● నేటి నుంచి ప్రారంభం ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ‘ప్రజా బాట’ కార్యక్రమాన్ని రూపొందించింది. నేటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించింది. ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలోని ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, మధిర, వైరా, సత్తుపల్లి డివిజన్ల పరిధిలో ప్రజాబాట కార్యక్రమ నిర్వహణకు అధికారులు ప్రణాళికలు ఖరారు చేశారు. ప్రజాప్రతినిధులను సైతం ఆహ్వానించి, వారి భాగస్వామ్యంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు. మెరుగైన విద్యుత్ సరఫరాకే.. వినియోగదారులకు అంతరాయం లేని నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో పాటు విద్యుత్ వినియోగంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యుత్ సమస్యలు ఎదురైతే వినియోగదారులు సంబంధిత అధికారులను, ఉద్యోగులను సంప్రదించడం, ఫిర్యాదులు చేయడం వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తారు. విద్యుత్ శాఖ అమలు చేస్తున్న నూతన సాంకేతిక విధానాల వినియోగం గురించి కూడా వివరిస్తారు. విద్యుత్ బిల్లుల ఆన్లైన్ చెల్లింపు పద్ధతులు, విద్యుత్ వినియోగంపై రైతులు తీసకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ఫిర్యాదు చేసే విధానం, సోలార్ విద్యుత్ ఏర్పాటు, రాయితీల వంటివాటిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాబాట కార్యక్రమం వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరమైనది. ప్రజల ముంగిటకు విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు వస్తారు. వారికి విద్యుత్ సమస్యలు వివరించి పరష్కరించుకోవాలి. విద్యుత్ శాఖ అందించే సేవలపై అధికారులు, ఉద్యోగులు ప్రజలకు అవగాహన కల్పిస్తారు. శ్రీనివాసా చారి, ఎస్ఈ -
ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్!
● కేఎంసీ ఎన్నికలకు కౌన్సిల్ రద్దు తప్పనిసరి ● నిబంధనలు అడ్డుగా ఉండడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి ● ప్రస్తుతం ప్రభుత్వ సిఫారసు ఒక్కటే మార్గంఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ) ఎన్నికల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నామొన్నటి వరకు కౌన్సిల్ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని పాలకవర్గం హడావుడి చేయగా.. అందుకు నిబంధనలు అడ్డుగా ఉన్నాయని తెలియడంతో ఆ ఆలోచన విరమించుకుంది. అయినప్పటికీ ఫిబ్రవరిలో మిగతా మున్సిపల్, కార్పొరేషన్లతోపాటే కేఎంసీ ఎన్నికలు జరగాలంటే ఏం చేయాలా అన్న అంశంపై చర్చలు మాత్రం కొనసాగిస్తోంది. మున్సిపల్ చట్టం 2019 ప్రకారం కౌన్సిల్ రద్దు నిర్ణయం పాలకవర్గం చేతిలో లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే సిఫారసు చేసే అవకాశం ఉన్నందున ఆ దిశగా ప్రయత్నించాలా అనే అంశంపై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. నిబంధనలు అడ్డు.. మున్సిపాలిటీల్లో పాలకవర్గాల రద్దు, సభ్యుల సస్పెన్షన్, రాజీనామాల వంటి వాటిపై 2019 మున్సిపల్ చట్టంలో ప్రభుత్వం కీలక నిబంధన పొందుపరిచింది. ఈ చట్టం ప్రకారం పాలకవర్గాలకు స్వయంగా రద్దు చేసుకునే హక్కు లేకపోగా, రాజీనామా చేయడానికి మాత్రం అవకాశం కల్పించారు. ఇదే సమయాన ప్రభుత్వానికి కౌన్సిల్ను రద్దు చేసే అధికారం కట్టబెట్టారు. అయితే, కేఎంసీ పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దు చేయాలన్నా ఏదో ఒక లోపాన్ని చూపించాలి. ప్రభుత్వం ఆ విధంగా కౌన్సిల్ను రద్దు చేస్తుందా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయిననూ ఎన్నికలకు వెళ్లాల్సిందే.. కౌన్సిల్ రద్దుకు నిబంధనలు అడ్డుగా ఉన్నాయని తెలిశాక ఎన్నికలకు వెళ్లే ఇతర మార్గాలపై అధికార పార్టీ అన్వేషిస్తోంది. మరోపక్క ప్రభుత్వం కౌన్సిల్ రద్దుకు సిఫారసు అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని సమాచారం. అయినప్పటికీ ఫిబ్రవరిలోనే ఎన్నికలకు వెళ్లాలని కొందరు నేతలు బలంగా కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడైతేనే కేఎంసీలో సత్తా చాటొచ్చని భావిస్తూ కలిసొచ్చే పార్టీలతో చర్చలు జరపడమే కాక పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న ప్రతిపక్ష కార్పొరేటర్లతోనూ సంప్రదింపులు చేస్తున్నారు. ముందస్తుకు అవకాశం కౌన్సిల్ రద్దు ప్రక్రియకు అన్ని దారులు మూసుకుపోవడంతో అధికార పార్టీ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ప్రస్తుత పాలకవర్గం గడువు నాలుగు నెలలే ఉండగా, ఆరు నెలల ముందు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్కు అవకాశం ఉంది. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ సిఫారసుతో ఫిబ్రవరిలో అన్ని మున్సిపల్, కార్పొరేషన్లతో పాటే కేఎంసీకి కూడా ఎన్నికలు నిర్వహించేలా పావులు కదిపేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. తద్వారా ప్రస్తుత పాలకవర్గ గడువు ముగిశాకే కొత్త పాలక వర్గం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. అన్నింటికీ సిద్ధంగా యంత్రాంగం ఖమ్మంనగర పాలకసంస్థలో పెరిగిన ఓటర్లు, జనా భా ఆధారంగా డివిజన్లను విభజించాలని అధికారులు గత నెల 24న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిఫారసుతో ప్రభుత్వానికి లేఖరాశారు. అయితే ప్రభుత్వంనుంచి ఇంకా అనుమతిరాలేదు. మరోప క్క ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ సాగుతోంది. కేఎంసీకి ఎన్నికలు జరపాలంటే ఈనెల 10వ తేదీలోపే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇస్తే మిగతా ప్రక్రియ నిర్వహించేలా అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం డివిజన్ల పెంపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలనే యోచనలో ఉన్నారు. తద్వారా మే నెల నాటికి డివిజన్ల పునర్విభజన పూర్తి చేసి, కొత్త ఓటర్ల జాబితా ద్వారా జూన్ – జూలైలో ఎన్నికలకు వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. -
కాంగ్రెస్లో చేరిన ఐదుగురు కార్పొరేటర్లు
బీఆర్ఎస్కు మరో ఎదురుదెబ్బ ఖమ్మంఅర్బన్ : బీఆర్ఎస్కు మరో ఎదరుదెబ్బ తాకింది. పార్టీకి చెందిన ఐదుగురు మున్సిపల్ కార్పొరేటర్లు సోమవారం హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్లో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్లో చేరిన కార్పొరేటర్లు చిరుమామిళ్ల లక్ష్మి(12వ డివిజన్), గోళ్ల చంద్రకళ(25వ డివిజన్), డోనవన్ సరస్వతి(32వ డివిజన్), దాదే అమృతమ్మ(40వ డివిజన్), మోతారపు శ్రావణి(55వ డివిజన్) మాట్లాడుతూ.. ఆధునిక ఖమ్మం రూపశిల్పిగా పేరొందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమర్థవంతమైన నాయకత్వంతో పాటు సీఎం రేవంత్రెడ్డి హయాంలో ఖమ్మం నగరాన్ని ప్రగతి బాటలో నడిపించే లక్ష్యంతోనే కాంగ్రెస్లో చేరామని, ఇది తమకు ఎంతో ఆనందమైన సందర్భమని చెప్పారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్చౌదరి, కార్పొరేటర్ కమర్తపు మురళి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రావూరి సైదబాబు, చిరుమావిళ్ల నాగేశ్వరరావు, మోతారపు సుధాకర్, ఆళ్ల ఆంజిరెడ్డి పాల్గొన్నారు. -
ఇది పోరాటాల నామ సంవత్సరం
● 7న కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయండి ● మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ఖమ్మంవైరారోడ్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 7న జిల్లాలో పర్యటించనున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2026 పోరాటాల నామ సంవత్సరమని, పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలపై ఆందోళనలను ఉధృతం చేయాలని అన్నారు. నగరంలోని తన నివాసంలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు – రంగారెడ్డి పేరుతో తెలంగాణ ప్రయోజనాలను నిర్వీర్యం చేస్తూ కాంగ్రెస్ నీళ్ల కుట్ర చేస్తోందని, ఆ కుట్రలను ఎండగట్టేది బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. ‘సీతారామ నీళ్లతో కాళ్లు కడుగుతా’ అనే హామీతో గెలిచిన ఖమ్మం నాయకుడు ఇప్పటికై నా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారదాహంతో బీఆర్ఎస్కు ద్రోహం చేసి కాంగ్రెస్లోకి వెళ్లిన నాయకుల పరిస్థితి నేడు వర్ణణాతీతంగా మారిందన్నారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్లను ఈనెల 7న కేటీఆర్ సత్కరించనున్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మండల అధ్యక్షుడు వీరునాయక్, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు ఆర్జేసీ కృష్ణ, కర్ణాటి కృష్ణ, మక్బూల్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, ఖమర్, బచ్చు విజయ్కుమార్, తాజుద్దీన్, కొల్లు పద్మ, మెంతుల శ్రీశైలం, రామ్మూర్తి, బత్తుల మురళి పాల్గొన్నారు. సాక్షిప్రతినిధి, ఖమ్మం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఖమ్మంలో పర్యటించనుండగా షెడ్యూల్ విడుదలైంది. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 11 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో.. పార్టీ మద్ధతుతో ఉమ్మడి జిల్లాలో గెలిచిన సర్పంచ్లకు సన్మానిస్తారు. అనంతరం హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా 7న ఉదయం ఉదయం 10 గంటలకు రాపర్తినగర్ ఆంజనేయస్వామి గుడి వద్ద బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందని, కొత్త బస్టాండ్, ఎన్నెస్పీ క్యాంప్ మీదుగా బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుంటుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. -
హాజరు పెరుగుతోంది..
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఒక్కో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ముందుకు సాగుతోంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి, విద్యార్థులకు ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)ను అమలు చేస్తోంది. ఈ క్రమాన కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం గతం కంటే 20 శాతం వరకు పెరగడం విశేషం. 5,912మంది విద్యార్థులు.. జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. వీటిలో 5,912 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో సగటున 3,405 మంది విద్యార్థులు నిత్యం కళాశాలలకు హాజరవుతున్నారు. అదేవిధంగా అధ్యాపకుల హాజరు సైతం పెరుగుతోంది. గతంలో 50 నుంచి 55శాతం హాజరు ఉండగా, ఎఫ్ఆర్ఎస్ అమలయ్యాక అది 65శాతానికి పెరిగింది. గత సెప్టెంబర్ నుంచి ఎఫ్ఆర్ఎస్ ప్రారంభం కాగా, ఎక్కువ మంది విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలలకు వస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అమలు చేయడంతో హాజరు శాతాన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లతో పాటు ఉన్నతాధికారులు సైతం నిత్యం పర్యవేక్షిస్తున్నారు. దీంతో హాజరు కాని విద్యార్థులపై దృష్టి సారిస్తూ తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నారు. ప్రతి విద్యార్థి కళాశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు సైతం సహకరిస్తుండడంతో హాజరుశాతం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందడంతో పాటు వారు కూడా చదువుపై దృష్టి సారించడంతో ఫలితాలు మెరుగయ్యే అవకాశం ఉంది.ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అమలు తర్వాత హాజరు శాతం పెరుగుతోంది. విద్యార్థులు సకాలంలో సక్రమంగా హాజరవుతున్నందున చదువుపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఎఫ్ఆర్ఎస్ అమలుతో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుండగా.. అధ్యాపకులు సైతం కళాశాలలకు సకాలంలో హాజరవుతున్నారు. సుమారు 10 నుంచి 20 శాతం వరకు హాజరు పెరిగింది. – రవిబాబు, డీఐఈఓ, ఖమ్మం -
నల్ల బెల్లం, నాటు సారా స్వాధీనం
కూసుమంచి: మండలంలోని నాయకన్గూడెం, కోక్యాతండా గ్రామాల్లో శనివారం రాత్రి ఎకై ్సజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నల్లబెల్లం, నాటుసారా, పటిక పట్టుబడింది. ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ రమేశ్ కథనం ప్రకారం.. నాయకన్గూడెంనకు చెందిన వంకాయల జనార్దన్, నాంపల్లి ధనలక్ష్మి, కోక్యాతండాకు చెందిన బాణోత్ నరేశ్ ఆటోలో 4 క్వింటాళ్ల నల్లబెల్లం, 20 కిలోల పటిక, 10 లీటర్ల నాటుసారాను కోక్యాతండాకు రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమో దు చేసి, ఆటో, నల్లబెల్లం, పటిక, నాటుసారా స్వా ధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని ఇన్స్పెక్టర్ వెల్లడించారు. రుణమాఫీ అంటూ రైతుకు టోకరాకూసుమంచి: ఓ రైతు వద్ద నుంచి రుణమాఫీ పేరుతో రూ.20 వేలు స్వాహా చేసిన ఘటన మండలంలో ఆదివారం వెలుగుచూసింది. మండలంలోని అగ్రహారం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వరరావుకు సైబర్ మోసగాడు ఫోన్ చేసి రూ.20వేలు చెల్లిస్తే పంట రుణం రూ.2లక్షల వరకు మాఫీ అవుతుందని నమ్మించాడు. దీంతో సదరు రైతు అతడికి రూ.20వేలు ఫోన్పే ద్వారా చెల్లించాడు. తర్వాత బ్యాంకుకు వెళ్లి విచారించగా తాము ఎలాంటి ఫోన్ చేయలేదని చెప్పడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. పేకాట స్థావరాలపై దాడివైరారూరల్: వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మకాలనీలో ఆదివారం రాత్రి ఒక ఇంట్లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచా రం మేరకు ఎస్ఐ పుష్పాల రామారావు దాడులు నిర్వ హించారు. పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.5,350 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఎస్ఐ వెల్లడించారు. కానిస్టేబుళ్లు నర్సింహారావు, రామారావు దాడుల్లో పాల్గొన్నారు. కేసులు నమోదు.. చింతకాని: వేర్వేరు ఘటనల్లో మండలంలోని రామకృష్ణాపురం, నాగులవంచ గ్రామాలకు చెందిన వ్యక్తులపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ వీరేందర్ కథనం ప్రకారం.. రామకృష్ణాపురానికి చెందిన హనుమంతురావుకు తన భార్య సునీతకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నా యి. ఈ క్రమంలో భార్యపై రాయితో దాడి చేయగా గాయాలయ్యాయి. భార్య ఫిర్యాదు మేరకు హనుమంతరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అలాగే, నాగులవంచ గ్రామానికి చెందిన కోటి.. ఓ వివాహితను వేధిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి బూర్గంపాడు: గత డిసెంబర్ 22న పురుగుమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని వలస ఆదివాసీ గ్రామం రాజీవ్నగర్కు చెందిన కుంజా జోగయ్య (28) కూలి పనులు చేస్తుంటాడు. కొంతకాలంగా మద్యానికి బానిసై.. ఏ పనికి వెళ్లకుండా తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలోనే గత నెల 22న పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించి ఆదివారం మృతిచెందాడు. మృతుడి సోదరుడు భద్రు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్యంతో బీటీపీఎస్ ఉద్యోగి..పాల్వంచ: అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న బీటీపీఎస్ ఉద్యోగి రోడ్డు పక్కనే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని శ్రీనివాసకాలనీకి చెందిన బీటీపీఎస్ ఫోర్మెన్ రామాల థామస్ (56) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. శనివారం మద్య ం సేవించేందుకు బయటకు వెళ్లిన థామస్ తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో రోడ్డు పక్కనే పడి మృతి చెందాడు. అయితే, గతంలో అతడికి ఫిట్స్ ఉందని, అనారోగ్యంతో మృతి చెందాడని భార్య ఝాన్సీ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐసుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న యువకుడు..ఇల్లెందురూరల్: మండలంలోని ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన ఉపేందర్ (30) డిసెంబర్ 28వ తేదీన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. బైక్ను ఢీకొట్టిన డీసీఎంనేలకొండపల్లి: బైక్ను డీసీఎం వాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని బోదులబండకు చెందిన కట్టెకోల మల్లేశం, అనంతు నాగేందర్రావు బైక్పై ఆదివారం ఖమ్మం వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. గోకినేపల్లి–గువ్వలగూడెం మధ్య జాతీయ రహదారిపై డీసీఎం వాహనం బైక్ను ఢీకొట్టింది. బైక్పై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఖమ్మం వైద్యశాలకు తరలించారు. -
● మరిపెడ మండలంలో ఘటన ● తిరుమలాయపాలెం మండలం బచ్చోడు వాసి
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి కారేపల్లి: భార్య కాపురానికి రాకపోవటంతో మనస్థాపం చెందిన వ్యక్తి పురుగుమందు తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మంగళితండాకు చెందిన ధరావత్ రాములు (32) మద్యం తాగుతున్నాడని భార్య సుజాత గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. 6 నెలలు అయినా భార్య రాకపోవడంతో ఈ నెల 3వ తేదీన రాములు పురుగుమందు తాగగా కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తల్లి రుక్కి ఫిర్యాదుతో కారేపల్లి ఎస్ఐ–2 కోడెత్రాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిమరిపెడ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బుర్హాన్పురం గ్రామ శివారు సూర్యాపేట – మహబూబాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండం బచ్చోడు గ్రామ శివారు బచ్చోడు తండాకు చెందిన ధరావత్ రవీందర్ (30) పని నిమిత్తం బైక్పై మరిపెడకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో బుర్హాన్పురం గ్రామ శివారు మలుపు వద్ద బైక్ అదుపు తప్పి సిగ్నల్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. సంపులో పడి కళాకారుడు మృతిసత్తుపల్లిరూరల్: ప్రమాదవశాత్తు సంపులో పడి కళాకారుడు మృతిచెందిన ఘటన మండలంలోని కాకర్లపల్లి లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సోదర డ్యాన్స్ అకాడమీ నిర్వాహకుడు, రంగస్థల కళాకారుడు ఓలేటి వెంకటరమణ (50) ఇంటి ఆవరణలో నిల్చుండగా ఫిట్స్ రావడంతో పక్కనే ఉన్న నీటి సంపులో పడిపోయాడు. గమనించిన స్థానికులు సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటరమణ మృతికి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, మాజీ ఎంపీపీ చల్లారి వెంకటేశ్వరరావు, తమ్మిశెట్టి గణేశ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివా రం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు కిటకిటలాడాయి. అమ్మవారికి అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రేపు వేలం పాటలుఆలయ కొత్త కాంప్లెక్స్లోని 1,2,3 నంబర్ షాపులు, పాతకాంప్లెక్స్లోని 3,4 షాపులు, చీరలు పోగుచేసుకునే, పూలదండల విక్రయాల లైసెన్స్ హక్కులకు మంగళవారం సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి తెలిపారు. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సూపర్బజార్(కొత్తగూడెం): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 7న కొత్తగూడెంలో చేపట్టనున్న పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కోరారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. బైక్ ర్యాలీ కూడా నిర్వహిస్తారని, ఇటీవల విజయం సాధించిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లను సన్మానిస్తారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోత్ హరిప్రియ, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్పర్సన్ మాజీ కాపు సీతాలక్ష్మి, నాయకులు రాజుగౌడ్, రామకృష్ణ, రాంప్రసాద్ పాల్గొన్నారు. -
కబడ్డీ పోటీలకు అంతా సిద్ధం..
పినపాక: ఈ–బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 7 నుంచి నిర్వహించే జాతీయస్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. సంక్రాంతి సంబరాలు ఓ పక్క మొదలవుతుండగానే.. ఈ–బయ్యారం గ్రా మం క్రీడలకు సన్నద్ధం అవుతోంది. క్రీడాప్రాంగణంలో ఐదు మ్యాట్లు ఏర్పాటుచేశారు. సుమారు 200 నుంచి 300 మంది కూర్చొని తిలకించేందుకు గ్యాల రీలు సిద్ధం చేస్తున్నారు. పార్కింగ్ కోసం రెండు ఎకరాల స్థలాన్ని చదును చేసి సిద్ధం చేశారు. 28 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనడానికి 28 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల జట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. వారికి ఎల్సిరెడ్డిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. పిల్లల కు సంక్రాంతి సందర్భంగా సెలవులు ప్రకటించారు. దీంతో వారంతా ఇంటికి వెళ్లడంతో వీరికి బస ఏర్పా టు చేశారు. బెడ్లు, ఫ్యాన్లు, దుప్పట్లు సిద్ధం చేశారు. తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టారు. అన్ని రకాల వంటలు.. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడానికి వస్తున్న క్రీడాకారులకు రుచికరమైన భోజన ఏర్పాట్లను కంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రాలకు అనుగుణంగా వంటలను వండే విధంగా మాస్టర్లను సిద్ధం చేశారు. నార్త్ ఇండియా ఆటగాళ్లకు చపాతి, రోటీ, స్వీట్, దాల్ఫ్రై వంటి వంటకాలు ఏర్పాటు చేయనున్నారు. క్రీడాకారులకు అందించే భోజనంలో రాజీలేకుండా ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. -
లఘు చిత్రం నటులకు సత్కారం
తిరుమలాయపాలెం: తెలుగు భాషను కాపాడే ఉద్దేశంతో గుంటూరులో నిర్వహించిన ప్రపంచ మూడో తెలుగు మహాసభల్లో లఘు చిత్రాలను ప్రదర్శించారు. అందులో కొత్తపల్లి శేషు దర్శకత్వంలో నిర్మించిన ‘మహాశయులు మళ్లీ పుట్టండి’ప్రత్యేక బహుమతి సాధించింది. అందులోని నటులు, తిరుమలాయపాలెంనకు చెందిన కొమ్ము రమేశ్, కొమ్ము అజితతోపాటు కొత్తపల్లి శేషును సన్మానించారు. 6న రాష్ట్రస్థాయి ‘గణిత’ పోటీలుఖమ్మం సహకారనగర్: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి గణిత ప్రతిభా పరీక్ష పోటీలు ఈనెల 6వ తేదీన సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరుగుతోందని, ఈ పరీక్షకు జిల్లా నుంచి పలువురు వెళ్తున్నారని గణితం ఫోరం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, జనరల్ సెక్రటరి రఘు, ట్రెజరర్ ఉపేంద్రయ్య, స్టేట్ సెక్రటరి మౌలానీ తెలిపారు. ఇంగ్లిష్ మీడియం నుంచి టి.గణేష్ రెడ్డి, సీహెచ్.మహేష్, వై.కీర్తిరెడ్డి, తెలుగు మీడియం నుంచి ఎం.భవాని, ఎం.వైష్ణవి, డి.కవిత, గురుకుల విభాగం నుంచి ఎస్కె.సాయి మొగల, వై.రోహిత్, ఎస్.గోపాలకృష్ణ, ఉర్దూ మీడియం నుంచి ఎండీ.ఆశ్రీయా, ఎస్డీ.మునతాహ్, ఎస్కే సల్మా తదితరులు హాజరవుతున్నారని వివరించారు. అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన లారీ.. దుమ్ముగూడెం: మండలంలోని నర్సాపురం – తూరుబాక గ్రామాల మధ్య అదుపుతప్పిన లారీ (టీజీ 04 టీ 4959) చెట్టును ఢీకొట్టింది. ఇసుక లోడ్ కోసం వస్తున్న లారీని క్లీనర్ మద్యంలో డ్రైవింగ్ చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో డ్రైవర్ మద్యం అధికంగా సేవించి నిద్రపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు విచారణ చేపట్టారు. ఇసుక లారీ సీజ్ దమ్మపేట: అనుమతులు లేకుండా ఏపీ నుంచి మండలానికి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని దమ్మపేట పోలీసులు సీజ్ చేశారు. మండలంలోని వడ్లగూడెం శివారులో అనుమానాస్పదంగా కనిపించిన లారీని ఆదివారం తెల్లవారుజామున పెట్రోలింగ్ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా ఏపీలోని రాజమండ్రి నుంచి దమ్మపేటకు ఇసుకను తరలిస్తున్నట్టు తేలడంతో లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిషోర్రెడ్డి తెలిపారు. నాటుసారాపై ఉక్కుపాదం మోపుతాం కరకగూడెం: నాటుసారా నియంత్రణలో భాగంగా మణుగూరు ఎకై ్సజ్ అధికారులు ఆదివారం తెల్లవారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండలంలోని కలవలనాగారం శివారులోని అటవీ ప్రాంతంలో 1000 కిలోల బెల్లం, 15 కిలోల పటిక, 6 లీటర్ల నాటుసారాతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అందుకు బాధ్యులైన భూక్యా రామదాసు, ఇస్లావత్ బన్సీలాల్, వాంకుడోత్ బాబూరావు, కుంసోత్ సాగర్పై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ రాజిరెడ్డి వెల్లడించారు. దాడుల్లో ఎకై ్సజ్ సిబ్బంది వెంకట అప్పారావు, ప్రసన్న, సతీశ్ పాల్గొన్నారు. ఐటీసీ కార్మికుడికి గాయాలు బూర్గంపాడు: సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీలో విధి నిర్వహణలో ఉన్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. పీఎం–1ఏలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు బత్తుల కిశోర్ చేయి ప్రమాదవశాత్తు రివైండర్లో పడింది. తీవ్రంగా గాయపడటంతో అతడిని తోటి కార్మికుల సహకారంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన కార్మికుడిని ఐటీసీ కార్మిక సంఘాల నాయకులు పరామర్శించారు. -
బంకుల్లో డీజిల్ కొట్టించి పరారీ..
ఖమ్మంఅర్బన్/చింతకాని: కారులో షికారుకు వచ్చి.. పెట్రోల్ బంకుల్లో ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టించుకొని డబ్బులు చెల్లించకుండా పరారవుతున్న వ్యక్తులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గత నెల 22న ఖమ్మం నగరంలోని ధంసలాపురం సమీపంలోని ఓ పెట్రోల్ బంక్లో కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టించుకున్నారు. డబ్బులు చెల్లించే క్రమంలో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై బంకు నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. ఆదివారం అదే కారు నాడు పెట్రోల్ కొట్టించిన సమయంలో ఉన్న టీఆర్ నంబర్తో నగరంలో కనిపించడంతో బంకు నిర్వాహకులు ఇందిరానగర్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ సాయంతో నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు. ఖమ్మం అర్బన్ పోలీసులు అక్కడికి చేరుకొని కారు సహా, వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ కోసం తరలించారు. ఇదే తరహాలో జిల్లాలోని బోనకల్, నాగులంచ ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లోనూ ఇంధనం కొట్టించుకొని డబ్బులు చెల్లించకుండా ఉడాయించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందడంతో ఆయా ప్రాంతాల పోలీసులు సైతం ఖమ్మం చేరుకున్నట్లు తెలిసింది. ఖమ్మంఅర్బన్ సీఐ భానుప్రకాష్ను వివరణ కోరగా.. విచారణ చేస్తున్నామని తెలిపారు. కాగా, చింతకాని మండలం నాగులవంచ గ్రామంలోని పెట్రోల్ బంకులో కారులో వచ్చిన కొందరు ఫుల్ట్యాంక్ డీజిల్ కొట్టించుకుని పరారవ్వగా పోలీసులు కేసు నమోదు చేశారు. కారు సహా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు -
బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు
కామేపల్లి : మతతత్వ రాజకీయాలతో దేశ ప్రజలను విభజిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్మించి, లౌకిక, ప్రజాస్వామ్య విలువలు కాపాడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మండలంలోని జాస్తిపల్లిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనిజులాపై అమెరికా చేపడుతున్న యుద్ధోన్మాద చర్యలు ప్రపంచ శాంతికి ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల ఆధారంగా ఉద్యమాలు నిర్మించి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇంటింటికీ సీపీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో నాయకులు దుగ్గి కృష్ణ, భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, మెరుగు సత్యనారాయణ, రమణ, తాళ్లపల్లి కృష్ణ, కొండబోయిన నాగేశ్వరరావు, సుంకర సుధాకర్, దొంతిబోయిన నాగేశ్వరావు, చింతనిప్పు చలపతిరావు, బాణాల శ్రీనివాసరావు, అంబటి శ్రీనివాసరెడ్డి, మచ్చా మణి, కంచర్ల అనిత తదితరులు పాల్గొన్నారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
రైతుల సంక్షేమానికే రిజిస్ట్రేషన్
● పథకాల లబ్ధి కోసం ఆధార్, భూ వివరాలు నమోదు ● జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య ఖమ్మంవ్యవసాయం: రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభ్వుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టిందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రాధాన్యతను వెల్లడించిన ఆయన వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ద్వారా అందుబాటులోకి రాగా రైతుల ఆధార్ నంబర్, భూమి వివరాలు పొందుపరుస్తారని తెలిపారు. ఇందులో రిజిస్ట్రేషన్ కావడం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్, పంటల బీమా అమలులో ఆటంకాలు ఎదురుకావని చెప్పారు. జిల్లాలో 3,54,320మంది రైతులకు గాను ఇప్పటి వరకు 1,97,459 మందిని ఫార్మర్ రిజిస్ట్రీలో ఏఈఓలు నమోదు చేశారని, మిగతా వారు కూడా ముందుకు రావాలని డీఏఓ సూచించారు. ఇవీ ప్రయోజనాలు.. ఫార్మర్ రిజిస్ట్రీలో వివరాలు నమోదు చేయించుకోవడం ద్వారా కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాల అమలు సులభమవుతుందని డీఏఓ తెలిపారు. పీఎం కిసాన్ అమలుకు ఫార్మర్ ఐడీ తప్పనిసరని, రైతుల వివరాలు కచ్చితంగా నమోదు చేయడంతో పారదర్శకత పెరిగి బీమా, సబ్సిడీలు, రుణాలు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. ఈ మేరకు రైతులు ఆధార్ కార్డు, భూమి పాస్ బుక్తో పాటు ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్ వివరాలతో ఏఈఓల వద్ద ఉచితంగా నమోదు చేయించుకోవచ్చని తెలిపారు. అంతేకాక మీ సేవ కేంద్రాల్లో రూ.15 చెల్లించి నమోదు చేసుకునే అవకాశం కూడా ఉందని డీఏఓ పుల్లయ్య వివరించారు. -
నరసింహస్వామికి లక్ష తులసీ అర్చన
ఖమ్మంగాంధీచౌక్: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం నగరంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం లక్ష తులసీ దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. తొలుత స్వామివారిని పూలతో అలంకరించారు. ఆ తరువాత సంప్రదాయ పద్ధతుల్లో తులసీ దళాలతో అర్చన చేశారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్ రావు పర్యవేక్షణలో అర్చకులు పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. డ్రైవర్లకు ఉచిత వైద్య పరీక్షలుఖమ్మంక్రైం: రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో వాహనాల డ్రైవర్లకు ఆదివారం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలు సైతం చేసి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్యులు గౌతమ్నరేష్, మాదిరాజు అశోక్, ఏఎంవీఐలు స్వర్ణలత, సుమలత, ఆర్టీఓ సభ్యుడు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 10 నుంచి టీసీసీ పరీక్షలుఖమ్మం సహకారనగర్ : టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(టీసీసీ)–2026కు సంబంధించిన పరీక్షలు ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ చైతన్య జైనీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షల హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్ www.bse.telangana.gov.in లో అందుబాటులో ఉన్నాయనా పేర్కొన్నారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే తమ కార్యాలయంలోని జిల్లా ప్రభుత్వ పరీక్షల కమిషనర్ (ఏసీజిఈ)ను సంప్రదించాలని సూచించారు. ప్రశాంతంగా టెట్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) రెండో రోజైన ఆదివారం ప్రశాంతంగా జరిగిందని డీఈఓ చైతన్య జైనీ తెలిపారు. 9 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు మొదటి సెషన్లో 1,786 మందికి 1,077 మంది, రెండో సెషన్లో 2,020 మందికి గాను 1,615 మంది అభ్యర్థులు హాజరయ్యారని ఆమె వివరించారు. కిన్నెరసానిలో పర్యాటకుల సందడిపాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు జిల్లాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 388 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.26,685 ఆదాయం లభించింది. 200మంది బోటు షికారు చేయగా, టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.12,020 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఆదివాసీ కళలకు ప్రోత్సాహమేది..?
● వనదేవతల వీరగాఽథలు చెప్పిన పద్మశ్రీ సకిని రామచంద్రయ్య ● భావితరాలకు ఆయనతో శిక్షణ ఇప్పించాలని నిర్ణయం ● 2024లో సకిని మృతి.. శిక్షణకు కార్యాచరణ ప్రకటించని ప్రభుత్వం ● ఆదిలోనే ఆగిపోవడంతో ఆదివాసీ కళాకారులకు నిరాశసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆసియాలోనే అతిపెద్దదిగా పేరున్న సమ్మక్క – సారలమ్మ జాతర కోసం ములుగు జిల్లాలోని మేడారం గ్రామాన్ని సర్వాంగ సుందరంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చెప్పేలా శిలలపై శిల్పాలు చెక్కించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ ఆదివాసీ కళాకారులకు గుర్తింపు, వారికి ప్రోత్సాహంలో ఈ తరహా చొరవ కనిపించడం లేదు. ఫలితంగా ఆదివాసీ, గిరిజన కళాకారులు తగిన గుర్తింపునకు నోచుకోక వారి కళలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇందుకు సమ్మక్క–సారలమ్మ వృత్తాంతాలను తెలిపే పద్మశ్రీ సకిని రామచంద్రయ్య జీవితమే ఉదాహరణగా చెప్పవచ్చు. ‘కంచు’ కంఠం మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన సకిని రామచంద్రయ్య ఆదివాసీ సంస్కృతిలో భాగమైన కంచు మేళం, కంచు తాళం(డోలు వాయిద్యం) సాయంతో వనదేవతల వీరగాథలు చెప్పడంలో ప్రసిద్ధి చెందారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర సందర్భంగా సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు కథను కళ్లకు కట్టినట్టుగా రామచంద్రయ్య గానం చేసేవారు. జాతరలో చిలకల గుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చేప్పుడు ఆయన కీలకంగా వ్యవహరించేవారు. ఈయన ప్రతిభను గుర్తించిన కేంద్రం 2022 జనవరి 25న పద్మశ్రీ అవార్డును ప్రకటించడంతో నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా సత్కారం అందుకున్నారు. వృత్తాంత ప్రచార బాధ్యతలు రామచంద్రయ్యకు పద్మశ్రీ అవార్డు ప్రకటించాక అప్పటి సీఎం కేసీఆర్ స్పందించారు. 2022 ఫిబ్రవరి 1న రామచంద్రయ్యను ప్రగతిభవన్కు పిలిపించుకుని అభినందించడమే కాక ఇంటి స్థలం కేటాయిస్తామని, ఇంటి నిర్మాణానికి రూ.కోటి ఆర్థిక సాయాన్ని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా అందిస్తామని ప్రకటించారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వృత్తాంతాలను భావితరాలకు తెలిసేలా ప్రచారం చేసే బాధ్యతను రామచంద్రయ్యపై పెట్టారు. వారంలో ఆరు రోజులపాటు ఈ అంశంపై ఆసక్తి ఉన్న ఆదివాసీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు గిరిజన విద్యాసంస్థల్లోనూ ప్రచారం చేయాలని సూచించారు. ఇందుకుగాను నెలకు రూ.20 వేలు గౌరవ పారితోషికం ఇస్తామని ప్రకటించి, బాధ్యతను ఐటీడీఏకు అప్పగించారు. కళ అంతరించిపోవద్దని.. ప్రభుత్వ సూచనల మేరకు ఆదివాసీ కళలపై రామచంద్రయ్య నేతృత్వంలో శిక్షణ–ప్రచార కార్యక్రమాలు ప్రారంభించేందుకు భద్రాచలంలోని గిరిజన మ్యూజియంలో 2022లోనే ఓ గదిని ఐటీడీఏ కేటా యించింది. ఆ తర్వాత నిధుల కేటాయింపు, సరైన కార్యాచరణ లేకపోడంతో కార్యక్రమం ఆదిలోనే ఆగిపోయింది. మరోవైపు సకిని రామచంద్రయ్యకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీలైన ఇంటిస్థలం కేటా యింపు, రూ.కోటి ఆర్థిక సాయం అమలుకు నోచుకోలేదు. ఆఖరికి కళాకారులకు అందించే రూ.10 వేల పింఛన్ సైతం అందలేదు. చివరిరోజుల్లో అనా రోగ్యం పాలై వైద్యం కోసం అప్పులు చేశారు. చివరకు రూ.2వేల వృద్ధాప్య పింఛన్తో బతుకీడుస్తూ 2024 జూలై 23న మృతి చెందారు. కంచుతాళం, కంచుమేళం కళలో ఆరితేరిన ఆదివాసీ కళాకారుడిని ఆదుకోకపోగా, కళను భావితరాలకు అందించడానికి ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదనే విమర్శలు వచ్చాయి. మేడారం అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం.. వైఫై, సోషల్ మీడియా జమానాలోనూ ఇప్పటికీ ఆదివాసీ కళలు, సంప్రదాయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన కళాకారులను గుర్తించి అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు. -
కేయూ క్రికెట్ విజేత ‘వరంగల్’
ఖమ్మంస్పోర్ట్స్: నగరంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం నిర్వహించగా.. వరంగల్ జోన్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో వరంగల్ – ఖమ్మం జోన్ జట్లు తలపడగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. జట్టులో ఉదయ్ 32, శిశిరిక్ 16 పరుగులు చేశారు. వరంగల్ బౌలర్లలో నితిన్, దివిన్, ఇబ్రహీం, సిద్ధార్థ ఒక్కో వికెట్ పడగొట్టగా ప్రద్యుమ్న నాలుగు వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన వరంగల్ జోన్ జట్టు తొమ్మిది ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించింది. బ్యాట్స్ మెన్ దివిన్ 77 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. తర్వాత బ్యాట్స్మెన్లలో నితిన్ 28 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. రవికుమార్, డాక్టర్ బి. వెంకన్న హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో పీఈడీలు డాక్టర్ పి.కోటేశ్వరరావు, జె.ఉపేందర్, కుమార్, అస్లాం, సందీప్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమం ఆగదు
● పేదలకు మౌలిక వసతుల కల్పనే ధ్యేయం ● మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి ● ఏదులాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనఖమ్మంరూరల్ : ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ చిత్తశుద్ధితో అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు రూ.56 కోట్ల విలువైన పనులు చేపట్టామని తెలిపారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఇందుకు అవసరమైన నిధులు కేటాయిస్తోందని చెప్పారు. వచ్చే ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రారంభిస్తామని, ప్రతీ ఏడాది ఈ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ఏదులాపు రం మున్సిపాలిటీ పరిధిలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో అంగన్వాడీ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లపై నుంచి విద్యుత్ తీగల తొలగింపు పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో గతంలో వచ్చిన వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు కొంత సాయం చేశామని, భవిష్యత్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా రూ.580 కోట్లతో మున్నేరు నదికి రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. ఏదులాపురం మున్సిపాలిటీని మోడల్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలో చేపట్టిన పనులు త్వరగా, నాణ్యతగా పూర్తి చేయాలని కమిషనర్కు సూచించారు. కార్యక్రమంలో ఖమ్మం సీపీ సునీల్దత్, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఆర్అండ్బీ, ఇరిగేషన్ ఎస్ఈలు యాకోబ్, వెంకటేశ్వర్లు, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్బాబు తదితరులు పాల్గొన్నారు. -
18న ఖమ్మంలో చారిత్రక సభ
● కార్పొరేట్ల కోసమే ‘ఉపాధి’ పేరు మార్పు ● సీపీఐ జాతీయ నేత నారాయణఖమ్మంమయూరిసెంటర్ : ఈనెల 18న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మంలో చారిత్రక సభ నిర్వహించనున్నట్లు పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లక్షలాది మందితో జరిగే ఈ సభకు దేశ, విదేశీ ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. మతోన్మాద శక్తులను అడ్డుకునే సత్తా కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని, కమ్యూనిస్టులను అంతం చేయడం, సిద్ధాంతాన్ని కనుమరుగు చేయడం ఎవరి తరమూ కాదని అన్నారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే భూ పంపిణీ జరిగిందని, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. అలాంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. సంపద కోసమే అమెరికా వెనిజులాపై దాడి చేసిందని, ప్రజాస్వామిక ప్రభుత్వాలపై ట్రంప్ దాడి చేయడాన్ని ప్రజలంతా ఖండించాలని కోరారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు అవాస్తవమని, వెనిజులాలోని చమురు సంపదను వశం చేసుకునేందుకే ట్రంప్ ఆ దేశాధ్యక్షుడిని బంధించాడని అన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల లబ్ధి కోసమే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం మార్పు చేసిందని విమర్శించారు. 40 కుటుంబాల కోసం రూ.28 లక్షల కోట్ల రాయితీ ప్రకటించిన కేంద్రం.. 85 కోట్ల మందికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకాడుతోందని ఆరోపించారు. మూసీ ప్రక్షాళనలో ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని కోరారు. శాసనసభను బైకాట్ చేసిన బీఆర్ఎస్ సభ్యులు వెంటనే రాజీనామా చేయాలన్నారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా వేతనాలు ఎలా పొందుతారని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ తగదని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించాలని కోరారు. పోలవరం, బనకచర్ల సాధ్యం కాదని, చంద్రబాబు, రేవంత్ రెడ్డిల గురుశిష్యుల కథ ముగిసిందని అన్నారు. సమావేశంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర సమితి సభ్యులు యర్రా బాబు, ఏపూరి లతాదేవి, సిద్దినేని కర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భవనాల్లోనే కార్యాలయాలు
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ భవనాల్లోనే కార్యాలయాలు కొనసాగేలా తరలింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాల అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. చింతకాని మండలంలోని రేపల్లెవాడ, రైల్వే కాలనీ, రాఘవపురం, నర్సింహాపురం పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించి, కార్యాలయాల నిర్మాణం జరిగే వరకు జనరల్ ఫండ్ ద్వారా అద్దె చెల్లించాలని సూచించారు. అలాగే, కామేపల్లిలోని సీడీపీఓ కార్యాలయాన్ని పండితాపురం కమిటీ హాల్లోకి, ఖమ్మం అర్బన్ కార్యాలయాన్ని చిల్డ్రన్ హోమ్స్ వద్ద భవనంలోకి మార్చాలని తెలిపారు. అంతేకాక తిరుమలాయపాలెం సీడీపీఓ కార్యాలయానికి అనువైన భవనాన్ని ఎంపిక చేయాలని, ఖమ్మం రూరల్, మధిర, సత్తుపల్లి సీడీపీఓ కార్యాలయాలను అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని స్పష్టం చేశారు. అలాగే, టీఎస్ జీఎల్ఐ కార్యాలయాన్ని పాత మున్సిపాలిటీ కార్యాలయంలోకి మార్చాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు జ్యోతి, శ్రీనివాసాచారి, యాకూబ్, నాగేందర్రెడ్డి, పుల్లయ్య, అలీమ్ తదితర అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
విద్యార్థుల అభ్యున్నతే ధ్యేయం కావాలి
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల అభ్యున్నతే ధ్యేయంగా ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో కృషిచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశె ట్టి సూచించారు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్లో శనివారం జిల్లా విద్యాశా ఖ ఆధ్వర్యాన మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటం వద్ద నివాళులర్పించాక కలెక్టర్ మాట్లాడారు. కుల, మత, వర్ణ వివక్షత ఉన్న రోజుల్లోనే బాలికల చదువు కోసం సావిత్రీబాయి కృషి చేశారని గుర్తుచేశారు. ఈమేరకు ప్రస్తుత ఉపాధ్యాయులు పిల్లల భవిష్యత్ను తీర్చిదిద్దేలా బోధించాలని సూచించారు. అనంతరం పలువురు మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు. డీఈఓ చైతన్యజైనీ, ఉద్యోగులు శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రభాకర్రెడ్డి, ప్రవీణ్కుమార్, రూబీ, ఎంఈఓలు పాల్గొన్నారు. ●కారేపల్లి: కారేపల్లి మండలం బీక్యాతండాకు చెందిన మాలోతు మంజుల కామేపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయంలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెకు ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు ప్రకటించగా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి చేతుల మీదుగా అందుకున్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
కొలువుల కోట !
ఆర్థిక స్థోమత కారణంగా పోటీ ప్రపంచంలో ముందుకు సాగలేక ఇబ్బంది పడుతున్న వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆశాదీపంగా నిలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల చీకట్లను అధిగమించి ఎలాగైనా ప్రభుత్వ కొలువు సాధించాలనే తపనతో ఉన్న యువతీ, యువకులకు విజయాల చిరునామాగా మారింది. ఇక్కడ శిక్షణ పొందిన వందలాది మంది ఉద్యోగాలు సాధిస్తూ తమ కలను సాకారం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న ఉద్యోగ ఫలితాల్లో బీసీ స్టడీ సర్కిల్ నుంచి శిక్షణ తీసుకున్న వారు ముందు వరుసలో నిలుస్తుండడంతో నానాటికీ తాకిడి పెరుగుతోంది. – ఖమ్మంమయూరిసెంటర్అధికారుల ప్రత్యేక చొరవ బీసీ స్టడీ సర్కిల్లో నిరుద్యోగ అభ్యర్థుల కోసం శిక్షణ, సదుపాయాలు కల్పించడంలో అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించడమే కాక అధికారులతో నిరంతరం చర్చిస్తున్నారు. ఇదే సమయాన కలెక్టర్ సౌకర్యాల కల్పనకే పరిమితం కాకుండా అభ్యర్థులకు మార్గదర్శిగా నిలుస్తుండడం వారికి ఉపయోగపడుతోంది. విజయాల వెల్లువ కొద్దినెలలుగా నిర్వహిస్తున్న గ్రూప్–1, 2, 3, 4 ఉద్యోగ పరీక్షలతో పాటు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, డీఎస్సీ, గురుకుల, హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాల్లోనూ ఇక్కడ శిక్షణ తీసుకున్న వారు సత్తా చాటారు. ఒకప్పుడు ఇక్కడ శిక్షణ తీసుకునే వారు వేళ్లపై లెక్కించే సంఖ్యలో ఉండగా, ఇప్పుడు అధికారులపై నమ్మకంతో బారులు దీరుతున్నారు. అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారులు శ్రద్ధ వహిస్తుండడంతో గత రెండేళ్లలో దాదాపు 150 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. ఇందులో చాలామంది పేదలే ఉండడంతో ఉద్యోగాల సాధనతో వారి తలరాతలు మారుతున్నాయని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అండగా ఉంటున్న బీసీ స్టడీ సర్కిల్ రాష్ట్రంలోనే రోల్ మోడల్గా నిలుస్తోందని చెబుతున్నారు.దూరప్రాంతాల ప్రైవేట్ సెంటర్లలో శిక్షణ తీసుకోలేని మాకు బీసీ స్టడీ సర్కిల్ వరంలా మారింది. ఇక్కడ చదువుకునేలా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించడమే కాక పుస్తకాలు సమకూర్చడంతో ఏ ఇబ్బందీ రావడం లేదు. –ఎస్.ఉదయ్కల్యాణ్, జూనియర్ అసిస్టెంట్, పీఆర్స్టడీ సర్కిల్లో నిర్వహించే ప్రతీ పరీక్ష రాసేవాడిని. లైబ్రరీలోని పుస్తకాలు చదవడమే కాక అధ్యాపకుల సలహాలతో గ్రూప్–2లో 387 ర్యాంక్ సాధించాను. ఎంపీఓ ఉద్యోగం సాధనలో అధికారుల సహకారం మరవలేనిది. – పడాల రమేష్, ఎంపీఓగా ఎంపికై న అభ్యర్థికలెక్టర్, ఉన్నతాధికారుల సహకారంతో స్టడీ సర్కిల్లో నిరుద్యోగులకు సౌకర్యాలు కల్పించడమే కాక స్టడీ మెటీరియల్ సమకూరుస్తున్నాం. అనుభవజ్ఞుల శిక్షణతో అభ్యర్థులు ఉద్యోగాలు సాధిస్తుండడం సంతోషంగా ఉంది. – జి.శ్రీలత, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్, ఖమ్మంప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా బీసీ స్టడీ సర్కిల్లో సదుపాయాలు కల్పించారు. పోటీ పరీక్షల కోసం మార్కెట్లోని ప్రతీ పుస్తకాన్ని సమకూర్చడమే కాక అభ్యర్థులు రోజంతా చదువుకునేలా రీడింగ్ రూమ్స్, విశాలమైన హాళ్లు ఏర్పాటు చేశారు. అంతేకాక పరీక్షా విధానంపై అవగాహన కల్పించేందుకు ఆన్లైన్ టెస్ట్లు, వీడియో తరగతుల సదుపాయం కల్పించారు. రాష్ట్రంలోనే పేరున్న సబ్జెక్ట్ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తుండడమే కాక స్టడీ మెటీరియల్ సమకూరుస్తూ ఉపకార వేతనం అందిస్తున్నారు.బీసీ స్టడీ సర్కిల్ శిక్షణతో ప్రతిభ -
గజ.. గజ వణుకు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాను చలి వణికిస్తోంది. గత మూడు వారాలుగా చలి తీవ్రత పెరగడంతో జనజీవనంపై ప్రభావం పడింది. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఇక అర్ధరాత్రి నుంచి ఉదయం పొద్దెక్కేవరకు పొగమంచు తెరలు వీడడం లేదు. దీంతో రోజువారీ కార్యకలాపాలకు ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మరో ఐదారు రోజుల వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది చలి పంజా.. గతంతో పోలిస్తే ఈ ఏడాది చలి పంజా విసురుతోంది. అటవీ ప్రాంతాలు, గ్రామాలే కాకుండా పట్టణాల్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. డిసెంబర్ నెలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 – 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. రాత్రి సమయాన భూమి ఉపరితలం వేగంగా చల్ల బడడం వల్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెబుతున్నారు. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలతోపాటు సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10గంటలు దాటే వరకు మంచుప్రభావం తగ్గకపోవడంతో రహదారులపై ప్రయాణం ఇబ్బందిగా సాగుతోంది. జనవరిలోనూ తీవ్రమే.. సహజంగా జనవరిలో చలి తగ్గి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుంటాయి. కానీ ఈసారి చలి అదే స్థాయిలో ఉంటోంది. చలికాలం ముగింపు దశకు చేరుతున్నా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటం విశేషం. ఈనెల ఇప్పటివరకు పగటి సమయంలోనూ చలి ప్రభావం ఉంటోంది. ఉదయం వేళ పనుల నిమిత్తం బయటకు వచ్చే వారు స్వెట్టర్లు, మఫ్లర్లతో వస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో చలిమంటలు వేసుకుంటూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కమ్మేస్తున్న పొగమంచు గతకొద్ది రోజులుగా పొగమంచు దట్టంగా కమ్మేస్తోంది. అర్ధరాత్రి మొదలు ఉదయం 10గంటల వరకు పొగమంచు తగ్గకపోవడంతో రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితులు ఉంటున్నాయి. ఫలితంగా వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోంది. మంచు, చలి ప్రభావంతో పలువురు జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. మరో ఐదారు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యాన శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని, వేడి ఆహారం, గోరువెచ్చటి నీరు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10–30 గంటలకు జిల్లాకు చేరుకోనున్న మంత్రి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి టెంపుల్ సిటీ, చిన్నతండా, సూర్యనగర్, 4వ తరగతి ఉద్యోగుల కాలనీలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత ములుగు జిల్లా మేడారంలో అభివృద్ధి పనులకు పరిశీలనకు మంత్రి బయలుదేరతారు. శ్రీవారికి నిత్యకల్యాణం, పల్లకీసేవ ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ జరిపించారు. ఈఓ జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు. విధుల్లో చేరిన ఆర్టీఓ ఖమ్మంక్రైం: రెండు నెలల పాటు శిక్షణ నిమిత్తం వెళ్లిన జిల్లా రవాణాశాఖాధికారి జగదీష్ శనివారం విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని రవాణా శాఖాధికారులతో సమావేశం అయ్యారు. ఇటీవల కార్యాలయంలో జరిగిన ఏసీబీ దాడులపై ఆరాతీయడమే కాక, పెనుబల్లి మండలంలో శుక్రవారం స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటన వివరాలు తెలుసుకున్నారు. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీలో పాటిస్తున్న నిబంధనలు తెలుసుకున్న ఆర్టీఓ, సంబంధిత ఫైల్ను పరిశీలించినట్లు తెలిసింది. నర్సింగ్ కళాశాలకు స్థలాల పరిశీలన చింతకాని: చింతకాని మండలానికి ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను కేటాయిస్తూ భవన నిర్మాణాల కోసం రూ.29కోట్లు విడుదల చేస్తూ గతనెల 29న ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈమేరకు భవన నిర్మాణాలకు అనువైన స్థలాలను టీజీఎంఎస్ఐడీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటకృష్ణ శనివారం పరిశీలించారు. మండలంలోని లచ్చగూడెం, నాగులవంచ రైల్వేకాలనీ, తిమ్మినేనిపాలెం, సీతంపేట గ్రామాల్లో స్థలాలను పరిశీలించిన ఆయన పూర్తి వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. టీజీఎంఎస్ఐడీసీ ఏఈ జమలయ్య, తహసీల్దార్ బాబ్జీప్రసాద్, ఆర్ఐ జగదీష్, సర్వేయర్ నవీన్ పాల్గొన్నారు. సీఎం కప్ క్రీడాపోటీలకు దరఖాస్తులు ఖమ్మం స్పోర్ట్స్: సీఎం కప్ క్రీడాపోటీల్లో పాల్గొ నే క్రీడాకారులు తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి సూచించారు. క్రీడాకారులే కాక పీఈటీ, పీడీలతో పాటు క్రీడా సంఘాల బాధ్యులు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వివరాల కోసం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ప్రారంభమైన టెట్ ఖమ్మం సహకారనగర్: టీచర్ ఎలిజబులిటీ టెస్టు(టెట్) శనివారం నుంచి ప్రారంభమైంది. పరీక్షల నిర్వహణకు జిల్లాలో తొమ్మిది కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు డీఈఓ చైతన్య జైనీ తెలి పారు. తొలిరోజు సెషన్–1కి 1,760మందిలో 1,631మంది, సెషన్–2కి 1,760లో 1,615మంది అభ్యర్థులు హాజరయ్యారని వెల్లడించారు. ఎల్ఐజీ ఫ్లాట్లకు 8వరకు దరఖాస్తులు ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం శ్రీరాంనగర్లో నిర్మించిన ఎల్ఐజీ ఫ్లాట్ల కోసం 8వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు. అల్పాదాయ వర్గాల కోసం హౌసింగ్ బోర్డు, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన అపార్ట్మెంట్లలో అమ్మకానికి తొలుత ప్రకటించిన దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది. అయితే, పలువురి వినతితో 8వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఫ్లాట్ల కేటాయింపునకు లాటరీ మాత్రం ఈనెల 10వ తేదీనే జరుగుతుందని తెలిపారు. -
కేయూ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి వై.వెంకయ్య
క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం ఖమ్మంస్పోర్ట్స్: క్రీడాకారులకు టీఏ, డీఏ, ఇతర ప్రోత్సాహకాలను పెంచేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి ప్రొఫెసర్ వై.వెంకయ్య వెల్లడించారు. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి క్రికెట్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని జట్లు పాల్గొంటున్న ఈ పోటీలను ప్రారంభించిన వెంకయ్య మాట్లాడుతూ క్రీడాకారులు, కోచ్లు, మేనేజర్ల టీఏ, డీఏను 25శాతం పెంచేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని తెలిపారు. క్రీడాభివృద్ధి విషయంలో వెనుకడుగు వేయకుండా అన్ని వసతులు కల్పిస్తామని వెల్లడించారు. కేయూ ఫిజికల్ డైరెక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ జె.సోమన్న మాట్లాడుతూ క్రీడాకారులు ప్రతిభను మెరుగుపర్చుకుని యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఖమ్మం జోన్ క్రీడల కార్యదర్శి డాక్టర్ బి.వెంకన్న మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి క్రీడాకారులు ఎక్కువగా యూనివర్సిటీ జట్లకు ఎంపిక అవుతుండడంతో జోన్ పరిధి, యూనివర్సిటీ స్థాయి క్రికెట్ పోటీల నిర్వహణకు అవకాశం దక్కిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి.కోటేశ్వరరావు, జె.ఉపేందర్, పీడీలు అఫ్జల్, కుమార్, అస్లాం, సందీప్ తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమంపాల్వంచరూరల్ : పాల్వంచ మండలం పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేద మంత్రాలతో స్వామివారిని ఊరేగింపుగా యాగశాలలోకి తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతి పూజ అనంతరం హోమం చేసి, చివరకు పూర్ణహుతి జరిపించారు. హోమంలో పాల్గొన్న 17 మంది భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు. -
సీఎం, పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్తా..
సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారి వివరాలను సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ దృష్టికి తీసుకెళ్తానని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఎమ్మెల్యే డాక్టర్ రాగమయితో కలిసి ర్యాలీ నిర్వహించగా, ఆతర్వాత జరిగిన సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ విశ్వనాథన్కు నివేదిక సమర్పించినట్లు తెలిపారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అందరు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అనంతరం దయానంద్ మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిని ఉపేక్షించవద్దన్నారు. నియోజకవర్గంలో పందేలకు అడ్డుకట్ట వేయడంతో తనపై కక్షకట్టారని మండిపడ్డారు. నాయకులు వందనపు సత్యనారాయణ, శివవేణు, దోమ ఆనంద్, చల్లగుళ్ల నర్సింహారావు, ఎండీ.కమల్పాషా, గాదె చెన్నారావు, నారాయణవరపు శ్రీనివాస్, సుబ్బారెడ్డి, దొడ్డా శ్రీనివాసరావు, తోట సుజలరాణి, చల్లారి వెంకటేశ్వరరావు, దాసరి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ -
మధిరలో టెన్షన్.. టెన్షన్
● సీపీఎం నిరసన పిలుపుతో ముందస్తు అరెస్టులు ● అడుగడుగునా పోలీసు బందోబస్తు మధిర: మధిర నియోజకవర్గంలో కొన్నాళ్ల క్రితం సీపీఎం నేతను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయకపోవడమే కాక ఇటీవల పలువురిపై దాడులకు పాల్పడడంతో పాటు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని సీపీఎం ఆధ్వర్యాన శనివారం నిరసన తెలిపారు. ఈమేరకు నియోజకవర్గ వ్యాప్తంగానే కాక ఖమ్మంలోనూ పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. పాతర్లపాడులో సీపీఎం నేత సామినేని రామారావు హత్య జరిగి నప్పటి నుంచి గ్రామపంచాయతీ ఎన్నికల వరకు జరిగిన ఘటనల్లో సీపీఎం నాయకులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై విమర్శలు చేస్తున్న విషయం విదితమే. ఈనేపథ్యాన మధిరలో నిరసన తెలపనున్నట్టు ప్రకటించగా పోలీసులు అప్రమత్తమయ్యారు. మధిరలో భారీ బందోబస్తు ఏర్పాటుచేయడమే కాక డిప్యూటీ సీఎం భట్టి క్యాంపు కార్యాలయం వద్ద మోహరించారు. నిరసన ర్యాలీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, నాయకులు పాల్గొనగా భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తారనే అనుమానంతో బందోబస్తు ఏర్పాటుచేశారు. అయితే, నిరసన శాంతియుతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
● అందుబాటులో 13,795 మెట్రిక్ టన్నుల యూరియా ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
యూరియాపై ఆందోళన వద్దు చింతకాని: జిల్లాలో 13,975 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నందున రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. చింతకాని మండలం నాగులవంచ పీఏసీఎస్లో యూరియా పంపిణీని శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మార్క్ఫెడ్ వద్ద 9,736 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ల్లో 900 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 663 మెట్రిక్ టన్నులే కాక బఫర్ స్టాక్గా 2,495 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని తెలిపారు. ప్రతీ 2 వేల ఎకరాల విస్తీర్ణానికి ఒక సేల్ పాయింట్ ఏర్పాటు చేయడంతో పాటు యూరియా కోసం రైతులు ఎప్పుడు రావాలో ముందస్తు సమాచారం ఇచ్చి కూపన్లను జారీ చేస్తున్నట్లు చెప్పారు. అధికారులకు రైతులు సహకరిస్తూ సూచించిన సమయంలో యూరియా తీసుకెళ్లాలని, అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేయవద్దని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, జిల్లా సహకార అధికారి గంగాధర్, మధిర ఏడీఏ విజయ్చంద్ర, తహసీల్దార్ బాబీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల మ్యాపింగ్ వేగంగా పూర్తిచేయాలి ఖమ్మంసహకారనగర్: ఎస్.ఐ.ఆర్–2002 ఆధారంగా ప్రస్తుత ఓటర్ల జాబితా మ్యాపింగ్ వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ జాబితాపై సూచనలు చేశారు. ప్రతీ బూత్ స్థాయి అధికారి రోజుకు 30 ఎంట్రీలు, సూపర్వైజర్లు 300 ఎంట్రీలు మ్యాపింగ్ చేసేలా లక్ష్యాలను నిర్దేశించాలని తెలిపారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, ఎస్డీసీ రాజేశ్వరి, ఆర్డీఓ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. -
ఈస్ట్జోన్ క్రికెట్ గోల్డ్కప్ టోర్నీలో రన్నరప్గా ఖమ్మం
కేయూక్యాంపస్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ ఈస్ట్జోన్ క్రికెట్ గోల్డ్కప్ పోటీలు శనివారం ముగిశాయి. ఫైనల్స్లో హనుమకొండ – ఖమ్మం జట్లు తలపడగా 20 ఓవర్లలో హనుమకొండ జట్టు మూడు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఆ తర్వాత ఖమ్మం జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 209 పరుగులే చేయడంతో హనుమకొండ జట్టు చాంపియన్గా, ఖమ్మం జట్టు రన్నరప్గా నిలిచింది. ఆయా జట్లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బాధ్యుడు, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గురువారెడ్డి తదితరులు ట్రోఫీలు అందజేశారు. -
●హోదా మారినా పని మానలేదు..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కలిసి వచ్చిన రిజర్వేషన్లకు తోడు ప్రజాసేవపై ఆసక్తితో పలువురు పోటీ చేశారు. ఇందులో సర్పంచ్లుగా గెలిచిన వారు కొందరు గతంలో చేసిన పనులు మానేయగా ఇంకొందరు కుటుంబ పోషణ కోసం హోదాను పక్కనపెట్టి మళ్లీ అవే పనుల్లో నిమగ్నమయ్యారు. కూసుమంచి మండలంలోని నర్సింహులగూడెం సర్పంచ్గా గెలిచిన కలికిని సరిత కుటుంబానికి కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉండగా, ఇతరుల పొలాల్లో కూలీకి వెళ్లేవారు. ప్రస్తుతం కూడా ఆమె గ్రామస్తులతో కలిసి కూలీ పనులకు వెళ్తున్నారు. ఆడంబరాలను దరిచేరనివ్వకుండా పనుల్లో నిమగ్నమైన ఆమెను పలువురు అభినందిస్తున్నారు. –కూసుమంచి -
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
ముదిగొండ: మండలంలోని గంధసిరి వద్ద మున్నేటి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే అంశంపై గత నెల 31న ‘సాక్షి’లో ‘అక్రమాలకు సహకారం’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్నేటి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ మురళి తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో ఎస్ఐ అశోక్, సిబ్బంది పాల్గొన్నారు. ఖమ్మంలో నాలుగు... ఖమ్మంక్రైం: ఖమ్మం ప్రకాష్నగర్ బ్రిడ్జి వద్ద శనివా రం చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను టాస్క్ఫోర్స్, త్రీటౌన్ పోలీసులు సీజ్ చేశారు. ఈ ట్రాక్టర్లను త్రీటౌన్ పోలీస్స్టేషన్ తరలించారు. జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్ ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కె.రవితేజను సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్ఓ డి.రామారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన తిరుమలాయపాలెం ఆస్పత్రిలో జూనియర్ అసిస్టెంట్గా డిప్యుటేషన్పై పనిచేసిన సమయాన అక్కడి సిబ్బందికి భయం, అసౌకర్యం కలిగించేలా వ్యవహరించినట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ విషయమై విచారణ చేపట్టగా రవితేజపై ఆరోపణలు నిజమేనని తేలడంతో సస్పెండ్ చేసినట్లు డీఎంహెచ్ఓ పేర్కొన్నారు. -
ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం
చర్ల: పేద, బలహీన వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యల్లో నుంచే కమ్యూనిస్టు పార్టీ పుట్టుకొచ్చిందని, ఉద్యమాలతోనే ఆ సమస్యలు పరిష్కారం అయ్యాయని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో చర్ల మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ప్రచార జాతాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరగిన సభలో ఆయన మాట్లాడారు. పార్టీ వందేళ్ల ప్రస్థానంలో అనేక సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడి విజయం సాధించామని, గిరిజనులు, దళితులు ఎదుర్కొంటున్న భూ సమస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వరావు, నాయకులు అడ్డగర్ల తాతాజీ, కోటి ముత్యాలరావు, చల్లా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా, సీపీఐ ప్రజార జాతాకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ నల్లపు దుర్గాప్రసాద్, నాయకులు బండారు రామకృష్ణ, భాస్కర్రావు, మురళి సంఘీభావం తెలిపారు. ప్రజల పక్షాన నిలిచేది కమ్యూనిస్టులే.. దుమ్ముగూడెం : ప్రజల పక్షాన నిలిచేది కమ్యూనిస్టులేనని సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా అన్నారు. చర్లలో ప్రారంభమైన జీపు జాతా దుమ్ముగూడెం చేరగా.. అక్కడి సభలో ఆయన మాట్లాడారు. దుమ్ముగూడెం మండలంలో అమరుల త్యాగాలతో వందల ఎకరాల భూములను పేద గిరిజనులకు పంచిన ఘనత కమ్యూనిస్టులదేనని అన్నారు. ఖమ్మంలో జరిగే పార్టీ శత వసంతాల ముగింపు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు పుల్లారెడ్డి, నున్నా లక్ష్మీకుమార్, బొల్లోజు వేణు, తాటిపూడి రమేష్, నోముల రామిరెడ్డి, గొంది నాగేశ్వరరావు పాల్గొన్నారు.సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ -
ఏఐతో రాంగ్ డ్రైవింగ్, వేగానికి చెక్
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న 30 జంక్షన్ల వద్ద నియంత్రణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. జిల్లాలో మూడేళ్లలో జరిగిన 3,200 ప్రమాదాల్లో 50 శాతం జంక్షన్ల వద్దే జరిగాయని తెలిపారు. ఆయా చోట్ల రంబుల్ స్ట్రిప్స్, లేన్ మార్కింగ్ చేయడమే కాక ఆక్రమణలు తొలగింపు పనులు 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అంతేకాక అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణదారులకు నోటీసులు ఇవ్వాలని తెలిపారు. అలాగే, ఏఐ సాంకేతికత వా డుతూ రాంగ్ డ్రైవింగ్, వేగంగా ప్రయాణించే వాహనదారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వైన్స్ దుకాణాల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత యజమానులపై ఉందని అవగాహన కల్పించాలన్నారు. కాగా, విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లను పరిశీలించి సామర్థ్యానికి మించి పిల్లలను తీసుకెళ్లకుండా పర్యవేక్షించాలని సూచించారు. డీఆర్ఓ ఎ.పద్మశ్రీ, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ ఎం.అపూర్వ, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రామభక్తుల పాదయాత్ర
జూలూరుపాడు: ధనుర్మానం సందర్భంగా శనివారం పలువురు రామభక్తులు పాదయాత్ర నిర్వ హించారు.జూలూరుపాడులోని శ్రీసీతారామ చం ద్రస్వామి ఆలయం, గుండెపుడి శ్రీఅభయాంజనేయస్వామి ఆలయం నుంచి ఖమ్మంజిల్లా ఏన్కూ రు మండలం నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగింది. యాత్రకు ముందు, తర్వాత ఆలయాల్లో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసుల విస్తృత తనిఖీలు ఖమ్మంక్రైం: నేరాల నియంత్రణ, అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడి కోసం సీపీ సునీల్దత్ ఆదేశాలతో పోలీసులు జిల్లావ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివా రం ఉదయం వరకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఏటీఎం సెంటర్లు, బ్యాంకు పరిసరాల్లో పరిశీలించిన వారు అక్కడ భద్రతపై ఆరాతీశారు. సరిహద్దు రాష్ట్రాల మీదుగా ఇసు క, గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణా కు అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు ముమ్మ రం చేసినట్లు సీపీ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగిస్తామని వెల్లడించారు. జాబ్మేళాలో 40 మంది ఎంపిక ఖమ్మంరాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యాన శనివారం జాబ్ మేళా నిర్వహించారు. వరుణ్ మోటార్స్లో ఉద్యోగాలకు నిర్వహించిన జాబ్మేళాకు 101 మంది అభ్యర్థులు హాజరు కాగా ఇంటర్వ్యూల అనంతరం 40 మందిని ఎంపిక చేశా రు. జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ తో పాటు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ అభిమానులకు బెయిల్ స్వాగతం పలికిన కుటుంబీకులు, అభిమానులు ఖమ్మంమయూరిసెంటర్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న, ఓపార్టీ నేతల జోక్యంతో పెట్టి న కేసుతో జైలుకు వెళ్లి న వైఎస్సార్, జగన్ అభిమానులకు బెయిల్ లభించింది. ఈ మేరకు ఆలస్యం సుధాకర్, మర్రి శ్రీనివాస్, యర్రా నాగరాజురెడ్డి, గంగరబోయిన రవి, గణ పారపు మురళి, సరికొండ రామరాజు, శివారెడ్డి తదితరులకు శనివారం పూచీకత్తుతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయగా జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా వారికి కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్ అభిమానులు స్వాగతం పలికారు. ఆ తర్వాత జిల్లా జైలు నుంచి నేరుగా రాపర్తినగర్ చేరుకుని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ అభిమానులు తుమ్మ అప్పిరెడ్డి, లక్కినేనిసుధీర్బాబు, ఆలస్యం రవి, భువనగిరి వెంకటరమణ, ఎదులూరి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. సీనియర్ అసిస్టెంట్కు పదోన్నతి ఖమ్మంసహకారనగర్: డీఈఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న గాయత్రికి పదోన్నతి లభించింది. ఆమెకు సూపరింటెండెంట్గా పదోన్నతి కల్పించడంతో పాటు వరంగల్ డీఈఓ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. ఈమేరకు ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి పేరిట శనివారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. డబ్బు ఇవ్వలేదని ఇద్దరిపై దాడి ఖమ్మంఅర్బన్: అడిగితేడబ్బు ఇవ్వలేదని గుర్తు తెలియని వ్యక్తులు అపార్ట్మెంట్ వాచ్మన్తో పాటు ఆయన మిత్రుడిపై దాడిచేశారు. ఖమ్మం బల్లేపల్లిలోని ఒకఅపార్ట్మెంట్లో వాచ్మన్గా పని చేస్తున్న కనకం మధుసూదన్రావు, ఆయన మిత్రుడితో కలిసి వైన్స్ వైపు గతనెల 31న వెళ్తుండగా మార్గమధ్యంలో గుర్తుతెలియని వ్య క్తులు ఆ పారు. ఈ సందర్భంగా వారు డబ్బు అడిగితే లేవ ని చెప్పడంతో ఇద్దరిపై దాడి చేశా రు. బాధితులు శనివారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. -
ప్రాణాలు తీసిన ఓవర్ టేక్
ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు ఖమ్మంక్రైం: ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయాలనే ప్రయత్నంలో అతివేగంగా వెళ్లడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు చావు బతుకుల్లో చికిత్స పొందుతున్నాడు. ఖమ్మంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాద వివరాలను వన్టౌన్ సీఐ కరుణాకర్ వెల్లడించారు. ప్రకాష్నగర్కు చెందిన సుంకుగోపి (19) ఆటో నడుపుతుండగా, ఆయన స్నేహితుడు కిన్నెర అశిష్ డీమార్ట్లో పనిచేస్తున్నాడు. వీరిద్దరు శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనంపై పాకబండ బజార్ వైపు చర్చి కాంపౌండ్ బ్రిడ్జి మీదుగా వెళ్తున్నారు. ముందు ఉన్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమాన బైక్ అదుపుతప్పి బ్రిడ్జిపై పుట్పాత్ను ఢీకొట్టారు. ఘటన లో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా 108లో ఆస్పత్రికి తరలించేసరికి గోపి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అలాగే, అశిష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రకాశ్నగర్కు చెందిన శ్రీను – రజిత దంపతులకు గోపి ఏకై క కుమారుడు కావడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అనుమానాస్పద స్థితిలో కూలీ మృతి ముదిగొండ: ఓ కూలీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ముదిగొండ మండలం కమలాపురంలో శనివారం చోటుచేసుకుంది. ఓ రైతు పొలంలో కూలీ పనులకు కమలాపురానికి చెందిన యల్లాల ఉపేందర్ (23) వెళ్లాడు. పొలంలోనే ఆయన అనుమానస్పద స్థితిలో మృతిచెందగా, కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ అశోక్ పరిశీలించి వివరాలు ఆరా తీశారు. అయితే, ఘటనపై ఫిర్యాదు అందలేదని సీఐ మురళి తెలిపారు. ఉరి వేసుకుని వృద్ధుడి ఆత్మహత్య బోనకల్: మండలంలోని ముష్టికుంట్లకు చెందిన వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన ఆవుల చిన్న బజారు(75)కొన్నాళ్ల నుంచి అనా రోగ్యంతో బాధపడుతుండగా ఇటీవల ఒక కాలు తొలగించారు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్న ఆయన శనివారం ఎవరూ లేని సమయాన ఉరి వేసుకున్నాడు. మృతుడికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎదురెదురుగా రెండు కార్లు ఢీ తల్లాడ: మండలంలోని అంబేడ్కర్నగర్ వద్ద శనివారం ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నా యి. హైదరాబాద్ నుంచి తల్లాడ వైపు కారు వస్తోంది. తల్లాడ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న మరో కారును డ్రైవర్ జాతీయ రహదారిపై గొర్రెల గుంపును తప్పించబోయి ఎదురుగా వచ్చేకారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో రెండు కార్లు దెబ్బతినగా, ఒక కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హత్య కేసులో నిందితుడి అరెస్ట్ ఖమ్మంక్రైం: ఖమ్మం బొక్కలగడ్డలో సొంత పెద్దమ్మను హత్యచేసిన నిందితుడిని త్రీటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వెంకటేశ్వరనగర్కు చెందిన రౌడీషీటర్ శేఖర్ ఆస్తితగాదాల నేపథ్యాన పెద్దమ్మ మోటె రాములమ్మను ఈ నెల 1న దారుణంగా హతమార్చి పారిపోయాడు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చినట్లు సీఐ మోహన్బాబు తెలిపారు. -
మమ్మీ... నొప్పి
అశ్వాపురం/వేంసూరు/పెనుబల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం రెండు విద్యా సంస్థల బస్సులు బోల్తా పడ్డాయి. అయితే, ఈ ఘటనల్లో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలైనా ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేఎల్ఆర్ కళాశాలకు శుక్రవారం ఉదయం వివిధ ప్రాంతాల విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు అశ్వాపురం మండలం మొండికుంట శివారులో వంతెన సమీపాన బోల్తా పడింది. బస్సు స్టీరింగ్ పని చేయకపోవడంతో అదుపు తప్పి వాగు వంతెన పక్కకు బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. ఘటనా సమయంలో 50 మంది విద్యార్థులు ఉండగా, సీఐ అశోక్రెడ్డి, ఎస్సై రాజేష్ సిబ్బందితో చేరుకుని స్థానికుల సాయంతో 108 వాహనాల్లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో విద్యార్థులందరికీ గాయాలు కాగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, బస్సు బోల్తా పడిన సమయాన మణుగూరుకు చెందిన విద్యార్థి అంబికా చేయి బస్సులో ఇరుక్కొని విలవిల్లాడింది. అర గంట పాటు ఆమె నొప్పితో రోదిస్తుండగా జేసీబీల సాయంతో బస్సును పైకి లేపి ఆమెను బయటకు తీయాల్సి వచి్చంది. అయితే, ఈ బస్సు వంతెనకు కాస్త ముందు వాగులో బోల్తా పడితే ప్రాణాపాయం జరిగేదని స్థానికులు తెలిపారు. అయితే, ఫిట్నెస్ లేకపోవడంతో స్టీరింగ్ బ్రేక్ అయి ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఒకే బస్సులో వంద మంది..: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేషన్పాడు శివారు వీరబ్రహ్మాంద్ర స్వామి ఆలయం సమీపాన సాగర్ కాల్వలో వేంసూరు మండలం మొద్దులగూడెంకు చెందిన వివేకానంద పాఠశాలకు చెందిన బస్సు బోల్తా పడింది. శుక్రవారం సాయంత్రం పాఠశాల ముగిశాక విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో 107 మంది వరకు విద్యార్థులు ఉండగా 20 మందికి గాయాలయ్యాయి. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్లడమే కాక బస్ డ్రైవర్ ఆళ్ల నవీన్ మద్యం మత్తులో ఉండడమే ఘటనకు కారణమని తెలుస్తోంది. బస్సు కాల్వలో పడగానే వచ్చిన శబ్దం, విద్యార్థుల కేకలు విని స్థానికులు చేరుకుని వారిని బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను తిరుపూరు, పెనుబల్లి ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదాలపై మంత్రులు ఆరా: ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో జరిగిన విద్యాసంస్థల బస్సు ప్రమాదాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. కలెక్టర్లు, రవాణా శాఖ అధికారులతో మాట్లాడిన వారు ప్రమాదాలకు కారణాలపై విచారణ చేపట్టాలన్నారు. -
అటవీ సరిహద్దులపై వర్క్షాప్
ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలోని అటవీ భూముల సరిహద్దుల గుర్తింపుపై అటవీ శాఖ దృష్టి సారించింది. నానాటికి అటవీ భూముల ఆక్రమణలు పెరుగుతుండటంతో సరిహద్దుల గుర్తింపు, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యోగులకు అవగాహన కల్పి స్తున్నారు. రిజర్వ్ ఫారెస్టు భూములు ఆక్రమణతో అడవులు అంతరించిపోవడమే కాక వన్యప్రాణుల మనుగడకు ఇబ్బంది ఏర్పడుతున్న నేపథ్యాన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఖమ్మంలోని అటవీశాఖ కార్యాలయంలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీసీఎఫ్) బీమానాయక్ అటవీ భూముల సరిహద్దుల గుర్తింపు, రెవెన్యూ ఉద్యోగులతో సమన్వయం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మం, కూసుమంచి, తల్లాడ, మధిర, కారేపల్లి, సత్తుపల్లి రేంజ్ల్లో 1.50 లక్షల రిజర్వ్ ఫారెస్టు, భూములు నోటిఫై అయినందున సర్వే నంబర్ల ఆధారంగా గర్తించాలని సూచించారు. డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్ మాట్లాడుతూ భూముల సరిహద్దులను గుర్తించడమే కాక రక్షణకు తీసుకోవా ల్సిన చర్యలను వివరించారు. ఎఫ్డీఓ మంజుల, ఉద్యోగులు, డ్రాఫ్ట్మెన్లు, ఆపరేటర్లు పాల్గొన్నారు.అవగాహన కల్పించిన సీసీఎఫ్ బీమానాయక్ -
కార్యాలయాల్లో మెరుగైన వసతులు
ఖమ్మం సహకారనగర్: ప్రజాసేవల్లో నాణ్యత పెంచేలా ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన మరమ్మతులు, కావాల్సిన వసతులు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ భవనం, ఆర్అండ్బీ కార్యాలయం, విశ్రాంతిగృహం, బాల రక్షా భవనం, గిరిజన భవనాన్ని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో ఆయన పరిశీలించారు. కార్యాలయాల్లో ఉద్యోగులతో మాట్లాడి వసతులు, పని వాతావరణం, ఇంకా కావాల్సిన సదుపాయాలపై ఆరాతీశాక కలెక్టర్ మాట్లాడారు. అనంతరం హరిత హోటల్ నిర్మాణానికి స్థలం గుర్తింపు కోసం ఎన్నెస్పీ క్యాంప్తో పాటు పలు ప్రభుత్వ భూములను కలెక్టర్ పరిశీలించారు. ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, సర్వేయర్లు నాగేశ్వరరావు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.హరిత హోటల్ నిర్మాణానికి స్థలసేకరణ -
సమాజ సేవ అందరి బాధ్యత
●కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నారాయణ రఘునాథపాలెం/చింతకాని/తిరుమలాయపాలెం: సమాజ సేవను అందరూ బాధ్యతగా భావించాలని, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఇందులో కీలకంగా వ్యవహరించాలని కాకతీయ విశ్వవిద్యాలయ ఎన్సీసీ కోఆర్డి నేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ సూచించారు. రఘునాథపాలెం మండలం రేగులచలకలో ఎంజేపీటీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యాన నిర్వహిస్తున్న శీతాకాల శిబిరం శుక్రవారం ముగియగా ఆయన మాట్లాడారు. ప్రిన్సిపాల్ వై.నాగేశ్వరరావు, ఆర్సీఓ సీ.హెచ్.రాంబాబు, సర్పంచ్ యండపల్లి రమాదేవి సత్యం, అధ్యాపకులు డాక్టర్ ఎన్.స్వాతి, సునీత, వినీల, అనిత, హుస్సేనితో పాటు నున్నా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే, చింతకాని మండలం తిరుమలాపురంలో నాగులవంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యాన, తిరుమలాయపాలెంలో ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన శిబిరాలను నారాయణ ప్రారంభించారు. డీఐఈఓ రవిబాబు, ఎన్ఎస్ఎస్ జిల్లా పీఓ డాక్టర్ శ్రీనివాసరావుతో పాటు మల్లయ్య, చాపలమడుగు వీరబాబు, నాగమణి, పి.నవీన్బాబు, కృష్ణార్జున్రావు, స్వాతి, ఉమారాణి, సుజాత, విజయకుమారి పాల్గొన్నారు. -
చికిత్స పొందుతున్న మహిళ మృతి
నేలకొండపల్లి: వంటచేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిం డర్ పేలడంతో గాయపడిన మహిళకు చికిత్స చేయిస్తుండగా మృతి చెందింది. మండల కేంద్రానికి చెందిన ఇందుమతి(50) గత మంగళవారం ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకేజీతో మంటలు వ్యాపించాయి. ఘటనలో ఇందుమతికి తీవ్ర గాయాలు కాగా, ఆమెను కాపాడే ప్రయత్నంలో కుమారుడు వెంకటేష్ సైతం గాయపడ్డాడు. వీరిలో ఇందుమతిని హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. రోడ్డుప్రమాదంలో ఒడిశా వాసి మృతి ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి గుర్రాలపాడు వద్ద కారు ఢీకొన్న ఘటనలో రబీంద్ర డాకువా(46) మృతి చెందాడు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పతార్పంజికి చెందిన డాకువా గుర్రాలపాడులోని గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి ఇంట్లోకి సరుకులు తీసురావడానికి వెళ్తూ రోడ్డు దాడుతుండగా వెంకటగిరి వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తల, కాళ్లకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై ఆయన బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. అక్రమ మట్టి తవ్వకాలపై తనిఖీలుబోనకల్: మండలంలోని లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలో అనుమతి లేకుండా మట్టి తవ్వి తరలి స్తున్నారనే ఫిర్యాదుతో ఉద్యోగులు తనిఖీచేపట్టా రు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు శుక్రవారం మై నింగ్ ఆర్ఐనాగరాజు,గిర్దావర్ వహీదా సుల్తానా తవ్వకాలు జరుగుతున్న చోటుకు వెళ్లారు. వీరిని గుర్తించిన పలువురు పారిపోగా, జేసీబీని సీజ్ చేసి తహసీల్కు తరలించారు.యూరియా కోసం అవే అగచాట్లు నేలకొండపల్లి: యూరియా కోసం రైతులు తిప్పలు తీరడం లేదు. ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన యాప్ పనిచేయక ఆఫ్లైన్లో ఇస్తున్న కూపన్లతో దుకాణాలు, సొసైటీల వద్ద బారులుతీరుతున్నా రు. నేలకొండపల్లి మండల కేంద్రంతో పాటు వివిధ సొసైటీల వద్దే శుక్రవారం క్యూలైన్లు కని పించాయి. యూరియా స్టాక్తో పోలిస్తే ఎక్కువ మంది రైతులు రావడంతో ఒకటి, రెండు బస్తాలే ఇస్తుండగా అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులందరికీ సరిపడా యూరియా చింతకాని: మండలంలోని చింతకాని, నాగులవంచ సొసైటీల్లో యూరియా పంపిణీని జిల్లా సహకా ర అధికారి గంగాధర్రావు శుక్రవారం పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టాక్ కు అనుగుణంగా రైతులకు కూపన్లను జారీ చేయాలని సిబ్బందికి సూచించారు. వ్యవసాయ అధి కారులను సమన్వయం చేసుకుంటూ సరిపడా యూరియా నిల్వలు సేకరించాలని తెలిపారు. కాగా, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికా వొద్దని, సరిపడా యూరియా సరఫరా చేస్తామని వెల్లడించారు. కాగా, పలు సొసైటీలతో పాటు యూరియా పంపిణీ కేంద్రాలను మధిర ఏడీఏ విజయ్చంద్ర పరిశీలించి మాట్లాడారు. మండలంలోని రెండేసి గ్రామాలకు ఒక యూరియా పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తహసీల్దార్ బాబ్జీప్రసాద్, ఎంపీడీఓ చుంచు శ్రీని వాసరావు, ఏఓ సోములపల్లి మానస, సొసైటీ సీఈఓలు వై.శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాసరావు, ఏఈఓలు పాల్గొన్నారు. -
ఇంట్లో భారీపేలుడు
ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం 300మీటర్ల దూరం వరకు వినబడగా, ఇంటి సీలింగ్ పెచ్చులు ఊడిపోవడంతో కిటికీలు, అద్దాలు ధ్వంసం కావడమే కాక గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఖమ్మం బైపాస్లోని ఓ ఇంట్లో నివాసముండున్న మాదాల నారయణరావు – రమ దంపతులకు కుమారుడు స్నేహన్ చౌదరి ఉన్నాడు. హైదరాబాద్లో చదువుతున్న ఆయన సెలవులకు వచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున 5గంటలకు రమ వంట చేసేందుకు స్టౌ వెలిగిస్తుండగా భారీ పేలుడు సంభవించింది. దీంతో నిద్రలో ఉన్న నారాయణరావు, స్నేహన్ వచ్చేసరికి రమ దుస్తులకు మంటలు అంటుకోవడమే కాక పైకప్పు సీలింగ్ ఊడిపడుతోంది. అంతేకాక శబ్దానికి చుట్టుపక్కల వారు రావడంతో నారాయణరావు కుటుంబీకులు బయటకు పరుగులు తీశారు. అప్పటికే రమ శరీరం కొంత మేర కాలగా ఆమె భర్త, కుమారుడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది చేరుకుని మంటలు అదుపు చేశారు. ఏం జరిగింది? ఇంట్లో పేలుడు ఎలా జరిగిందో అగ్ని మాపక శాఖ, పోలీసు సిబ్బంది అంచనా వేయలేకపోతున్నారు. గ్యాస్ సిలిండర్లు పేలకపోగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగలేదని గుర్తించారు. అయితే, ఫ్రిజ్లో గ్యాస్ లీకేజీతో పేలుడు జరిగి ఉంటుందని ప్రాథమికంగా గుర్తించారు. ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ, కార్కొపరేటర్ శీలంశెట్టి వీరభద్రం తదితరులు చేరుకుని పరిశీలించారు. అయితే, భారీ పేలుడులో రూ.10లక్షల మేర ఆస్తినష్టం జరిగినా కుటుంబీకులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజుల్లో 250మంది కేసులు ఖమ్మంక్రైం: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధ, గురువారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న 250మందిపై కేసు నమోదు చేయగా, ఇందులో ఖమ్మంకు చెందిన 76మంది ఉన్నట్లు ట్రాఫిక్ ఏసీపీ శ్రీని వాసులు తెలిపారు. కేసు నమోదైన వారిపై కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, మద్యం సేవించి తనిఖీల్లో పట్టుబడిన వారికి జైలుశిక్షతో జరిమానా విధించే అవకాశముందని తెలిపారు. గాయాలతో బయటపడిన కుటుంబీకులు -
కాసులే ముఖ్యం
కాలం చెల్లినా..ఖమ్మంక్రైం: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బస్సుల విషయంలో నిబంధనలు పాటించడం లేదు. కాలం చెల్లిన బస్సులను పక్కన పెట్టకుండా వాటిలోనే పిల్లలను తీసుకెళ్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అంతేకాక కాసుల కక్కుర్తితో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ విషయంలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పాఠశాలకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు ఆందోళనగా ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 813 స్కూల్ బస్సులు అధికారిక లెక్కల ప్రచారం జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థలకు 813 బస్సులు ఉన్నాయి. ఏటా జూన్కు ముందు ఖమ్మం, వైరా, సత్తుపల్లి రవాణాశాఖ కార్యాలయాల పరిధిలో వీటిని తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ఏడాది మాత్రం 764 బస్సులకే ఫిట్నెట్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని తెలిసింది. దీంతో మిగిలిన బస్సులను వాడడం లేదా, కాలం చెల్లినా పిల్లలను తరలిస్తున్నారా అన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. నిబంధనలకు మంగళం పెనుబల్లి మండలం గణేషన్పాడు సమీపాన వివేకానంద విద్యాలయం బస్సు శుక్రవారం బోల్తా పడింది. ఇదేరోజు అశ్వాపురం మండలం మొండికుంట వద్ద కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు బోల్తా కొట్టింది. వివేకానంద విద్యాలయం బస్సు బోల్తా పడిన సమయాన అందులో 107 మంది పిల్లలు ఉండడం గమనార్హం. బస్సు ఫీజు అదనంగా వసూలు చేసే యజమానులు అందుకు సరిపడా బస్సులు సమకూర్చకుండా కొన్నింట్లోనే లెక్కకు మిక్కిలిగా తరలిస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఒకేరోజు రెండు ఘట నలు జరగడం అటు విద్యాసంస్థల యాజమాన్యాలు, అధి కారుల నిర్లక్ష్యం తేటతెల్లం చేశాయి. అయితే, కొందరు విద్యాసంస్థల యజమానులు బస్సుల విషయంలో నిబంధనలు పాటించకుండా రాజకీయ నాయకుల పైరవీలతో రవాణాశాఖ అధికారులను మచ్చిక చేసుకుంటున్నారని సమాచారం. కొన్ని బస్సులకు ఫిట్నెస్ లేకపోగా, అనుభ వం లేనిడ్రైవర్లను నియమించడం, వారిలో కొందరు మద్యం మత్తులో వస్తున్నా పట్టించుకోకపోవడమే ప్రమాదాలకు కారణమవుతోందని చెబుతున్నారు.స్కూల్ బస్సులను ఏటా జూన్కు ముందు రవాణా శాఖ అదికారులు పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయడమే కాక ప్రతీనెల ఒకసారి తనిఖీ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. అయితే, ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం తప్ప మిగతా సమయాల్లో అధికారులు తనిఖీల మాటే ఎత్తడం లేదు. ఇక కొందరు డ్రైవర్లు సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి కానరావడం లేదు. బస్సు ఫీజు పేరిట వేలాది రూపాయలు వసూలు చేసే యాజమాన్యాలు కక్కుర్తితో ఒకే బస్సులో వంద మంది చొప్పున తరలిస్తుండడంతో అనుకోని ఘటన జరిగితే ప్రమాద తీవ్రత పెరిగే అవకాశముంది. అయినా, అటు యాజమాన్యాలు.. ఇటు అధికారులు పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
ఉపకార వేతనాలకు దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: కార్మికుల పిల్లలు ఉపకార వేతనాల కోసం వచ్చేనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ పి.కృష్ణవేణి సూచించారు. తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, మోటారు రవాణా సంస్థలు, సహకార సంస్థలు, ధార్మిక లేదా ట్రస్టుల్లో పనిచేస్తున్న వారి పిల్లలకు 2024–25 విద్యాసంవత్సరం ఫలితాల ఆధారంగా ఉపకార వేతనాలు అందుతాయని వెల్లడించారు. ఎస్సెస్సీ, ఐటీఐ ఉత్తీర్ణత సాధిస్తే రూ.వేయి, పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైతే రూ.1,500, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్లుల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి రూ.2 వేలు మంజూరు చేస్తారని పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే మే డే నాటికి ఖాతాల్లో ఉపకార వేతనం జమ అవుతుందని ఆమె తెలిపారు. రిజర్వేషన్ కౌంటర్ను ప్రారంభించిన ఆర్ఎం ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం కొత్త బస్టాండ్లో ఏర్పాటుచేసిన అడ్వాన్స్డ్ టికెట్ రిజర్వేషన్ కౌంటర్ను రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ శుక్రవారం ప్రారంభించారు. టికెట్ల బుకింగ్ కోసం వచ్చే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిప్యూటీ ఆర్ఎం మల్లయ్య, ఖమ్మం, భద్రాచలం డీఎంలు శివప్రసాద్, జంగయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు. గృహజ్యోతి లబ్ధిదారులకు సౌర విద్యుత్ బోనకల్: గృహజ్యోతి లబ్ధిదారులకు సౌర విద్యుత్ అందించేలా యూనిట్లు ఏర్పాట్లుచేస్తున్నట్లు విద్యుత్శాఖ ఖమ్మం ఎస్ఈ శ్రీనివాసచారి తెలిపారు. బోనకల్లో శుక్రవారం ఆయన పలువురి ఇళ్లపై సోలార్ ప్యానళ్ల ఏర్పాటు పనులను పరిశీలించి మాట్లాడారు. సీఎం, డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం అమలుచేస్తోందని తెలిపారు. మధిర నియోజకవర్గం బోనకల్ మండలంలోని 22 గ్రామాల్లో ఈ పథకం కింద సౌర ప్లాంట్ల ఏర్పాటు పనులు చివరి దశకు చేరడంతో నెలాఖరులోగా సోలార్ వెలుగులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఒక్కో ఇంటిపై రూ.1.40 లక్షల విలువైన సోలార్ ప్యానళ్లను ప్రభుత్వమే ఏర్పాటుచేయిస్తోందని తెలిపారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్ వినియోగదారుల అవసరాలకు వాడుకుని మిగిలితే ప్రభుత్వమే కొనుగోలు చేసి నగదును ఖాతాల్లో జమ చేస్తుందని వెల్లడించారు. వ్యవసాయ పంపుసెట్లకు కూడా త్వరలోనే ఈ విధానం అమలుచేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఎస్ఈ తెలిపారు. రెడ్కో జిల్లా మేనేజర్ అజయ్బాబు, డీఈ బండి శ్రీనివాసరావు, ఏఈఈ మనోహర్, ఎస్ఎల్ఆర్ శేషగిరిరావు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి ఖమ్మంరూరల్: మున్సిపాలిటీల ఎన్నికలకు ఎప్పుడు జరిగినా పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. ఏదులాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం ఆమె సత్తుపల్లి, వైరా, కల్లూరు, ఏదులాపురం, మధిర మున్సిపల్ కమిషనర్లతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా తయారీ, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఉద్యోగుల ఎంపిక, శిక్షణపై దృష్టి సారించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలను త్వరగా గుర్తించి అవసరమైన వసతుల కల్పించాలని సూచించారు. ఈసమావేశంలో కమిషనర్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, రామచంద్రరావు, నరసింహం, గురులింగం, సంపత్కుమార్, డీపీఓ రాంబాబు, జిల్లా క్రీడల అధికారి సునీల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆలయ నిర్మాణానికి రూ.2లక్షల విరాళం
కామేపల్లి: మండలంలోని రామకృష్ణాపురంలో గంగమ్మతల్లి ఆలయ నిర్మాణానికి సర్పంచ్ అజ్మీర ద్వాలీచిన్నా రూ.2లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్మాణ కమిటీ సభ్యులకు నగదు అందజేశాక ఆమె మాట్లాడారు. గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధి చేసి మండలంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాన ని తెలిపారు. కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు సూదనపు కోటయ్య, వార్డు సభ్యులు భాగం రంగా రావు, సర్వయ్య, వీరబోయిన నాగేశ్వరరావు, పెరుగు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో డీఎంహెచ్ఓ తనిఖీ ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని శ్రీజ ఫర్టిలి టీ సెంటర్, గుర్రం డెంటల్ కేర్ ఆస్పత్రులతో పాటు స్టార్ డయాగ్నస్టిక్ సెంటర్లో డీఎంహెచ్ ఓ డి. రామారావు శుక్రవారం తనిఖీ చేశారు. ఆయా సెంటర్లలో వైద్యసేవలు, రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్యం, ధరల పట్టిక, అందుబాటులో ఉన్న వైద్యుల వివరాలు ఆరా తీశారు. అంతేకాక రోగులకు వసతులు, రక్షణ పరికరాల వివరాలు తెలుసుకున్న ఆయన ధరల జాబితాతో పాటు లింగ నిర్ధారణ పరీక్షలు చేయబోమంటూ బోర్డులు ఏర్పాటుచేయాలని సూచించారు. నమోదైన వైద్యులు తప్ప ఇతరులతో సేవలు అందించినట్లే తేలితే చర్యలు చేపడతామని తెలిపారు. మహిళా కానిస్టేబుల్ ఇంట్లో చోరీ ●రూ.15లక్షలకు పైగా విలువైన బంగారం, నగదు అపహరణ రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం కోయచలకలో శుక్రవారం ఉదయం చోరీజరిగింది. మహిళా కానిస్టేబుల్ విధులకు వెళ్తుండగా ఆమెను బస్సు ఎక్కించేందుకు భర్త కూడా వెళ్లగా తిరిగొచ్చే సరికి దుండగులు బంగారు ఆభరణాలు, నగదు ను చోరీ చేశారు. గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ తెలబోయిన పూజిత ఇల్లెందులో విధులు నిర్వర్తిస్తుండగా శుక్రవారం ఉదయం ఆమెను కోయచలక క్రాస్ వద్ద దింపడానికి భర్త రాంబాబు వెళ్లాడు. బస్సు ఎక్కించాక పొలం పనులు చూసుకుని రాంబాబు వచ్చేసరికి ఇంటి వెనక తలుపు పగలగొట్టి ఉంది. లోపల పరిశీలించగా బీరువాలోని 13 తులా ల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. అయితే, పూజిత దంపతులు బయటకు వెళ్తున్నట్లు గుర్తించి కాపుకాసిన నిందితులు చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈమేరకు సమాచారం అందుకున్న రఘునాథపాలెం, సీసీఎస్ సీఐలు ఉస్మాన్ షరీఫ్, రాజు, ఎస్ఐ వి.శ్రీనివాస్ క్లూస్స్ టీంతో చేరుకుని విచారణ చేపట్టారు. -
ఒకే బస్సులో 107 మంది
● మద్యం మత్తులో డ్రైవర్.. ఆపై నిర్లక్ష్యం ● కాలువలో బోల్తా పడిన పాఠశాల బస్సు ● 20 మంది చిన్నారులకు గాయాలు వేంసూరు/పెనుబల్లి: పరిమితికి మించి విద్యార్థుల ను ఎక్కించడమే కాక.. డ్రైవర్ మద్యం మత్తులో ఉండగా పాఠశాల బస్సు సాగర్ కాలువలో బోల్తా పడింది. ఈ సమయాన నీళ్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పగా పలువురు చిన్నారులకు గాయాలయ్యాయి. కాసేపైతే ఇళ్లకు చేరతామన్న భావనతో ఉన్న చిన్నారులు ఈ ఘటనతో భీతిల్లిపోయారు. ఏం జరిగిందో తెలియక రక్తమోడుతున్న గాయాలతో విద్యార్థులు రోదనలతో ఆ ప్రాంతం మార్మోగింది. పెనుబల్లి, వేంసూరు మండలాల మధ్యలో జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. సామర్థ్యానికి మించి తీసుకెళ్తూ... వేంసూరు మండలం మొద్దులగూడెం గ్రామంలో వివేకానంద పాఠశాల కొనసాగుతోంది. ఈ పాఠశాలలో మండలంలోని వివిధ గ్రామాలతో పాటు పెనుబల్లి మండలంలోని గ్రామాల విద్యార్థులు చదువుకుంటున్నారు. రోజులాగే శుక్రవారం పాఠశాల ముగిశాక పెనుబల్లి మండలం గణేషన్పాడు, ఎల్ ఎస్.బంజర్, ముత్తగూడెం, గుట్టపాడు తదితర గ్రామాల విద్యార్థులను దింపేందుకు బస్సులో తీసుకెళ్తున్నారు. అయితే, ఒకే బస్సులో 107మంది పిల్ల లను ఎక్కించగా... డ్రైవర్ ఆళ్ల నవీన్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా నడిపాడని తెలిసింది. ఆయన రెండు రోజులుగా మద్యం సేవించి వస్తున్నట్లు తెలిసినా పట్టించుకోలేదని సమాచారం. కాగా, బస్సు పెనుబల్లి మండలం గణేషన్పాడు శివారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం సమీపానికి చేరేసరికి ఎన్నెస్పీ మేజర్ కాలువ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. అయితే, కాలువలో నీళ్లు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినా సామర్ధ్యానికి మించి పిల్లలు ఉండడంతో ఒకరిపై ఒకరు పడగా 20మందికి గాయాలయ్యాయి. బస్సు పడుతున్నప్పుడు పెద్ద శబ్దం రావడం, ఆ తర్వాత ఆందోళనతో విద్యార్థులు చేసిన రోదనలు, అరుపులతో స్థానికులు చేరుకుని బయటకు తీశారు. బస్సు బోల్తా పడగానే డ్రైవర్ నవీన్ కనీసం పట్టించుకోకుండా పరారవడం గమనార్హం. స్థానికులే పిల్లలను బయటకు తీసి అంబులెన్స్లు, ఆటోల ద్వారా 15 మంది తిరుపూరులో ప్రైవేట్ ఆస్పత్రికి, ఏడుగురిని పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్ చేరుకుని సహాయక చర్యలను పరిశీలించగా, ఎమ్మెల్యే మట్టా రాగమయి హుటాహుటీన చేరుకుని వివరాలు ఆరా తీశారు. అంతేకాక తిరుపూరులో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆమె పరామర్శించారు. కాగా, గతంలోనూ ఇదే పాఠశాల బస్సు లచ్చన్నగూడెం, భరణిపాడు గ్రామాల్లో ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. బస్సు ప్రమాదంపై మంత్రుల ఆరా గణేషన్పాడు వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడిందన్న సమాచారంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్తో పాటు రవాణా శాఖ అధికారులు, కల్లూరు ఏసీపీ, సబ్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే జిల్లా ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. అంతేకాక ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని సూచించారు.బస్సు కాల్వలో పడిన సమయాన పెద్దశబ్దం వచ్చింది. అంతేకాక విద్యార్థుల అరుపులు దగ్గరలోని పొలంలో పనిచేస్తున్న మాకు వినబడ్డాయి. నాతో పాటు మరికొందరం పరుగెత్తి వచ్చి బస్సులో నుంచి విద్యార్థులను బయటకు తీశాం. అందులో చాలామందికి గాయాలయ్యాయి. వీరిని ఆటోలు, అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. – పెరవరపు నరసింహ, ప్రత్యక్ష సాక్షి -
వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ పరిధి విద్యాసంస్థల్లో పదో తరగతి విద్యార్థులపై ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్ ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్లు, హెచ్ఎంలు, వార్డెన్లతో శుక్రవారం సమావేశమైన ఆయన మాట్లాడుతూ వెనకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్లు, హెచ్ఎంలు కేటాయించిన పాఠశాలల్లో వారానికి రెండుసార్లు తనిఖీ చేస్తూ ఫొటోలు అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. అలాగే, ఉద్దీపకం వర్క్బుక్ నిర్వహణ, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అమలుపై సూచనలు చేశారు. కాగా, సర్వారం, ఎలిసిరెడ్డిపల్లి, కమలాపూర్, రేగళ్ల తండా, బొజ్జాయిగూడెం, పాల్వంచ, పాత ఇల్లెందు, గొందిగూడెంతో పాటు ఖమ్మంలోని కొన్ని పాఠశాలల్లో గత ఏడాది పదో తరగతి ఫలితాలు ఆశించిన స్థాయిలో రానందున ఈసారి ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పీఓ స్పష్టం చేశారు. తొలుత పీఓ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఓ(జనరల్) డేవిడ్రాజ్, వివిధ విభాగాల అధికారులు మధుకర్, అశోక్, విజయలక్ష్మి, రమేష్, శ్రీరాములు, సత్యవతి, రాధమ్మ, భారతీదేవి, అలివేలు మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ -
●హాహాకారాలు.. ఆర్తనాదాలు
అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట శివారు ఎర్రమ్మగుడి సమీపంలో మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారి వెంట వంతెన వద్ద పాల్వంచకు చెందిన కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తాపడింది. పినపాక, మణుగూరు, అశ్వాపురం మండలాల విద్యార్థులతో మణుగూరు నుంచి బయలుదేరిన బస్సు మొండికుంట దాటాక అటవీ ప్రాంతంలో స్టీరింగ్ సక్రమంగా పనిచేయక అదుపు తప్పి వాగు, వంతెన పక్కకు బోల్తా పడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు ఉండగా, 40 మందికిపైగా గాయాలయ్యాయి. ఇందులో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరికి చేతులు విరిగాయి. సీఐ అశోక్రెడ్డి, ఎస్సై రాజేష్ సిబ్బందితో చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను 108 వాహనాల్లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, విద్యార్థులంతా డిప్లొమా, బీటెక్ కోర్సులు చదువుతున్నారు. అయితే, మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఎర్రమ్మగుడి సమీపంలో వంతెన వద్ద బస్సు బోల్తా పడింది. రెప్పపాటు తప్పినా బస్సు వాగులో బోల్తాపడేది. బస్సువాగులో బోల్తా పడితే పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాపాయం ఉండేది. వాగును చూసిన స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. కాగా, బస్ ఫిట్నెస్ లేకపోవడమే ప్రమాదానికి కారణమని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు భావిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉందని ఆరోపిస్తున్నారు. మరమ్మతులకు గురైన బస్సు కావడంతో స్టీరింగ్ స్టక్ అయి ప్రమాదం జరిగినట్టు సమాచారం. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు డ్రైవర్పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రాజేష్ తెలిపారు. ప్రమాదం జరిగిందని తెలిసి అక్కడకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు రక్తమోడుతున్న తమ పిల్లలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. -
మరో సమరం !
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మరో ఎన్నికల సమరానికి రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటీవలే గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియగా.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు వచ్చే నెలలో ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అధికారులు ఓటర్ల జాబితా రూపకల్పనలో నిమగ్నం కావడంతో ఆశావహులు పోటీకి సిద్ధమవుతుండగా, పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అధిక స్థానాల్లో నెగ్గిన నేపథ్యాన మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. ఇక గత మున్సిపల్ ఎన్నికల మాదిరి పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్, పూర్వ వైభవాన్ని సాధించేందుకు కమ్యూనిస్టులు.. ఉనికి చాటుకునేందుకు బీజేపీ ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాయి. అదే ఒరవడి సాగేలా.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలే కాక పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకుంది. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ జిల్లాలో అత్యధిక స్థానాలను ఆ పార్టీ మద్దతుదారులే గెలుచుకున్నారు. ఈ ఎన్నికలు పార్టీల రహితంగా జరిగినా పార్టీల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇక పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీ వైభవం చాటాలని కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమవుతోంది. స్థానికంగా ఎవరికి బలం ఉంది, ఎవరికి టికెట్ ఇస్తే విజయం దక్కుతుందన్న అంశంపై అంతర్గతంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. క్లీన్స్వీప్ మళ్లీ సాధ్యమా? సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలకు 2020లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్స్వీప్ సాధించింది. సత్తుపల్లిలోని 23 వార్డులకు అన్నిచోట్ల ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. మధిరలో 22 వార్డులకు 13, వైరాలో 20 వార్డులకు 16 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండడం, పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఆధిక్యత ప్రదర్శించిన నేపథ్యాన పాత, కొత్త మున్సిపాలిటీల్లో ఎలా సత్తా చాటాలన్న అంశంపై బీఆర్ఎస్ నాయకత్వం కసరత్తు చేస్తోంది. కమ్యూనిస్టులకు కలిసి వచ్చేనా? పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న సీపీఎం కొంత ప్రభావాన్ని చూపింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లోనూ పొత్తుపై ఉభయ కమ్యూనిస్టులు పెదవి కదపడం లేదు. పట్టు ఉన్న ప్రాంతాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలోనే పార్టీలు ఉన్నందున మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతల్లో చర్చలు సాగుతున్నాయి. మరోవైపు జీపీ ఎన్నికల్లో మాదిరే బీఆర్ఎస్, సీపీఎం పొత్తు కొనసాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోదీ చరిష్మాతో.. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మోదీ చరిష్మాతో ఈ ఎన్నికల్లో సత్తా చాటాలనే ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోనే మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతోందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలను సమాయత్తం చేస్తోంది. క్షేత్రస్థాయిలో బలం పుంజుకోవడానికి మున్సిపల్ ఎన్నికలను ఉపయోగించుకోవాలనే భావనలో ఉన్నట్లు సమాచారం.గతంలో జిల్లాలో సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలు ఉండేవి. ఇటీవల ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. 2020 జనవరిలో పాత మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా అన్నింటా బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ పాలకవర్గాల గడువు గత ఏడాది జనవరి 26తో ముగియడంతో ఎన్నికలు నిర్వహించాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించగా ఈనెల చివరి వారంలో షెడ్యూల్ విడుదలవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయడంతో అభ్యంతరాల పరిష్కారం, మార్పులు, చేర్పుల అనంతరం 10లోగా తుది ఓటర్ల జాబితా విడుదల చేయాల్సి ఉంటుంది.వచ్చే నెలలో మున్సి‘పోల్స్’ నిర్వహణ? -
ప్రతీ రైతుకు యూరియా అందిస్తాం..
● అవసరానికి మించి మాత్రం కొనుగోలు చేయొద్దు ● కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్దత్ కొణిజర్ల: పంటలు సాగుకు అనుగుణంగా రైతులందరికీ యూరియా అందేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కొణిజర్లలోని గోపవరం వ్యవసాయ సహకార పరపతి సంఘంలో యూరియా పంపిణీని పోలీసు కమిషనర్ సునీల్దత్తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా విషయంలో రైతులు అపోహలు వీడాలని సూచించారు. జిల్లాలో 13,180 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నందున అందరికీ సరఫరా చేస్తామని తెలిపారు. మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్న కొణిజర్ల, చింతకాని, బోనకల్, ముదిగొండ మండలాల్లో ప్రతీ రెండు వేల ఎకరాలకు ఒక సేల్ పాయింట్ ద్వారా పంపిణీ చేపడతామని చెప్పారు. కొణిజర్ల మండలంలో ఇప్పటికే ఉన్న ఏడు సేల్ పాయింట్లకు తోడు మరో తొమ్మిది కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. అంతేకాక యూరియా కోసం రైతులు ఎప్పుడు రావాలో ముందస్తు సమాచారం ఇస్తామని వెల్లడించారు. అయితే, రైతు తన సాగు విస్తీర్ణానికి కావాల్సిన యూరియా కంటే ఎక్కువ తీసుకెళ్లొద్దని, ఈ విషయంలో ఉద్యోగులు పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య, డ్రెయినీ డిప్యూటీ కలెక్టర్ ఎం.అపూర్వ, ఏడీఏ కరుణశ్రీ, తహసీల్దార్ అరుణ, ఏఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు, -
TG: కాల్వలో స్కూల్ బస్సు బోల్తా..
ఖమ్మం: ఓ స్కూల్ బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం గణేష్పాడులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఆ సమయంలో స్కూల్ బస్సులో 105 మంది చిన్నారులు ఉన్నారు. అయితే కాలువలో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవ్ చేసే సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ మద్యం సేవించాడని విద్యార్థులు చెబుతున్నారు. -
గడప గడపకు.. మన సర్పంచ్ !
ముదిగొండ: ఇటీవల ఎన్నికల్లో సర్పంచ్లుగా గెలిచిన వారు గ్రామాల్లో సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ముదిగొండ మండలంలోని వనంవారి కిష్టాపురం, ముత్తారం సర్పంచ్లు పర్ణకోల సరళ, ఎల్.మమత నూతన సంవత్సరం సందర్భంగా గురువారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్తూ ఆ ఇంటి పరిసరాలు, వీధుల్లో సమస్యలపై ఆరా తీసి ప్రత్యేక పుస్తకంలో నమోదు చేస్తున్నారు. అంతేకాక ప్రభుత్వ పథకాలకు అర్హుల వివరాలను ఆరా తీశారు. తొలి రోజు పదేసి ఇళ్లకు వెళ్లగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాక సమస్యలు తెలుసుకున్నారు. అన్నింటినీ సమస్యనుప్రాధాన్యత క్రమంలో పరిష్కారానికి కృషి చేస్తామని సర్పంచ్లు సరళ, మమత వెల్లడించగా వారితో పాటు పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల సిబ్బంది పాల్గొనడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పింఛన్ ఆగిపోతుంది.. జాగ్రత్త
● లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఇక్కట్లు ● సంస్థలో ఇంకా 15,888 మంది పెండింగ్ రుద్రంపూర్: సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో పింఛన్ ఆగిపోయే అవకాశం ఉన్నందున జాగ్రత్త పడాలని చెబుతున్నారు. సంస్థ వ్యాప్తంగా సీఎంపీఎఫ్ పెన్షనర్లు, సీపీఆర్ఎంఎస్(పోస్ట్ రిటైర్మెంట్ కార్పొరేట్ మెడికల్ స్కీమ్) కార్డుదారులు రెన్యువల్ కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంది. తద్వారా ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు పింఛన్ క్రమం తప్పకుండా అందుతుంది. పింఛన్దారుడు బతికే ఉన్నట్లు నిర్ధారించేందుకు ఈ సర్టిఫికెట్ అవసరం కాగా, ఒకవేళ వారు మృతి చెందితే వారి నామినీకి పింఛన్ అందించనున్నారు. అలాగే, సీపీఎంఆర్ఎస్ ద్వారా వైద్యసేవలు పొందేందుకు లైఫ్ సర్టిఫికెట్ అవసరమవుతుంది. ఇచ్చింది 72,212 మంది సింగరేణి వ్యాప్తంగా 88,100 మంది పెన్షన్దారులు ఉండగా అందులో 72,212 మందే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించారు. ఇంకా 15,188 మంది అందజేయాల్సి ఉంది. అలాగే, సీపీఆర్ఎంఎస్లో 81,595 మందికి 14,693 మంది ఇవ్వాల్సి ఉంది. ఇందులో రూ.300 మొదలు రూ.20 వేల వరకు పెన్షన్ పొందే కార్మికులు ఉన్నారు. కాగా, ప్రకటనలతో సరిపెట్టకుండా ఏరియా వారీ జాబితా రూపొందించి లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించేలా అధికారులు చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. కాగా, సింగరేణి కార్మికులు పింఛన్తో పాటు వైద్యసౌకర్యం కోసం లైఫ్ సర్టిఫికెట్ ఆన్లైన్లోనూ సమర్పించే అవకాశమున్నందున సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.రిటైర్డ్ ఉద్యోగుల కోసం నెల పాటు గడువు ఇచ్చాం. అయినా 15వేల మందికి పైగా లైఫ్ సర్టిఫికెట్లను ఇప్పటివరకు సమర్పించలేదు. ఇకనైనా ఫోన్లో యాప్ ద్వారా లేదా మీ సేవ కేంద్రాల ద్వారా సర్టిఫికెట్లు అందజేయాలి. – కిరణ్కుమార్, జీఎం (పర్సనల్) -
పిల్లలు, అత్త దూరమై ఆవేదన
తల్లాడ: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఇద్దరు పిల్లలు మృతి చెందారు.. అదే ఘటనలో అత్త, మరో బంధువు మృతి చెంది ఎనిమిది నెలలు దాటినా వారి జ్ఞాపకాలను మరిచిపోలేని వివాహిత తరచూ కన్నీరుమున్నీరయ్యేది. అదే ఆవేదనతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడగా ఆ కుటుంబం మరింత విషాదంలో కూరుకుపోయిన ఘటన ఇది. గత ఏడాది ఏప్రిల్ 29న తల్లాడ మండలం పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్ ఇంట్లో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. ఈ ఘటనలో వినోద్ – రేవతి(30) దంపతుల కవల కుమారులు వరుణ్, తరుణ్ తేజ్, వినోద్ తల్లి సుశీల, మేనకోడలు మృతి చెందారు. అప్పటి నుంచి వినోద్ భార్య రేవతి మానసికంగా కుంగిపోయి తీవ్ర ఒత్తిడికి గురయ్యేది. ఇద్దరు పిల్లలే కాక అత్త, మరొకరు మృతితో మనోవేదనకు గురవుతున్న ఆమె డిసెంబర్ 22న ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొంది. ఆ సమయాన ఇంటి ముందు ఉన్న వినోద్ అనుమానంతో తలుపు నెట్టగా రాకపోవటంతో స్థానికుల సహాయంతో పగులగొట్టి అప్పటికే అపస్మారక స్థితికి చేరిన రేవతిని ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయినా ఫలితం లేక పరిస్థితి విషమించడంతో రేవతి గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎన్.వెంకటకృష్ణ తెలిపారు.జ్ఞాపకాలు మరిచిపోలేక వివాహిత ఆత్మహత్య -
డిప్యూటీ సీఎంను కలిసిస డీసీసీ అధ్యక్షుడు
ఖమ్మంమయూరిసెంటర్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ కలిశారు. హైదరాబాద్లో గురువారం ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కబడ్డీ టోర్నీ విజేత చెరువుమాధారం నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారంలో నిర్వహించిన తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు గురువారంతో ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన పోటీల్లో పలు ప్రాంతాల జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్లో చెరువుమాధారం జట్టు విజేతగా నిలవగా, కోదాడ, కల్లూరు, కోదాడ(బీ), చెరువుమాధారం ఆటో యూనియన్ జట్లు ఆతర్వాత స్థానాల్లో నిలిచాయి. ఆయా జట్లకు సర్పంచ్ అమరగాని ఎల్లయ్య బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సూరేపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అన్నదానానికి రూ. లక్ష విరాళంభద్రాచలంటౌన్: జూనియర్ కళాశాల సెంటర్లోని శ్రీ సాయిబాబా ఆలయంలో అన్నదానానికి పట్టణానికి చెందిన ఉంగరాల వెంకట్రావు–లక్ష్మి దంపతులు తమ కుమారుడు సాయిదీప్ పుట్టినరోజును పురస్కరించుకుని రూ. లక్ష విరాళం అందజేశారు. ఈ నిధులతో గురువారం సుమారు 1,400 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ శాలువాతో సత్కరించి బాబా చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొమ్మనాపల్లి ఆదినారాయణ, కోశాధికారి గొర్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. క్రీడాకారిణికి సన్మానం బోనకల్: ఇటీవల జరిగిన అంతర్జాతీయ స్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్ తరఫున పాల్గొని బంగారు పతకం సాధించిన చాపలమడుగు శశికళను పలువురు సన్మానించారు. మండలంలోని చిరునోములకు చెందిన ఆమె సర్పంచ్ అనుమోలు చంద్రకళ, ఉప సర్పంచ్ నిమ్మతోట రఘు, వార్డు సభ్యులతో పాటు బోనకల్ కళాశాల అధ్యాపకులు వేర్వేరుగా సన్మానించి అభినందించారు. ప్రిన్సిపాల్ నళినిశ్రీ, అధ్యాపకులు అంతోటి తిరుపతిరావు, ప్రేమ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టోల్గేట్ వద్ద 1033 అంబులెన్స్లు నేలకొండపల్లి: జాతీయ రహదారిపై ఎక్కడో ఓ చోట తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందిస్తూ ఆస్పత్రులకు తరలించేలా నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు టోల్గేట్ల వద్ద 1033 నంబర్తో అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. నేలకొండపల్లి మండలం పైనంపల్లి టోల్గేట్ వద్ద రెండు అంబులెన్స్లు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. క్షతగాత్రులు 108 వాహనాలతో పాటు 1033 వాహనాల సేవలు కూడా పొందొచ్చని అధికారులు సూచించారు. ఖమ్మం – కోదాడ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగినప్పుడు ఈ వాహనాలను ఉపయోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్పర్సన్గా చంద్రకళ టేకులపల్లి: భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెంకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు పూనెం చంద్రకళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అనుబంధ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి నియామక పత్రం విడుదలైందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. గురువారం టేకులపల్లిలో ఆమెను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోరం హనుమంతు, నాయకులు భూక్యా దేవానాయక్, కోరం మహాలక్ష్మి, బండ్ల రజిని, రాసమల్ల నరసయ్య, ఎనగంటి అర్జున్రావు, బోడ సరిత తదితరులు పాల్గొన్నారు. -
పెద్దమ్మను హత్య చేసిన రౌడీషీటర్
ఖమ్మంక్రైం: భూతగాదాల్లో సొంత పెద్దమ్మను ఓ రౌడీషీటర్ నడిరోడ్డుపై హతమార్చాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని బొక్కలగడ్డలో గురువారం ఈ ఘటన చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడెంనకు చెందిన మోటె రాములమ్మ(70) కుటుంబం బతుకుదెరువు కోసం ఏళ్ల క్రితం ఖమ్మం వచ్చి బొక్కలగడ్డలో నివాసం ఉంటోంది. ఆమె భర్త యాదగిరి మృతి చెందాక కూలీ పనులు చేసుకుంటూ కుమారుడు నర్సింహారావుతో జీవిస్తోంది. ఆమె భర్త, ఆయన సోదరులకు సంబంధించి స్వగ్రామంలో ఐదెకరాల పొలం ఉండగా ఇంకా పంచుకోలేదు. ఆ భూమిని రాములమ్మ గ్రామంలో ఉంటున్న కుమార్తె పేరిట రిజిస్టర్ చేశాక గొడవలు మొదలయ్యాయి. పెద్దమనుషులు బుధవారం మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేవరకు పొలాన్ని దున్నవద్దని చెప్పారు. అయినా రాములమ్మ కుమార్తె దున్నిస్తోందనే సమాచారంతో ఖమ్మం వెంకటేశ్వరనగర్లో జీవిస్తున్న రాములమ్మ మరిది కుమారుడు మోటె శేఖర్ పెద్దమ్మ ఇంటికి రాగా, ఆ సమయంలో ఆమె కుమారుడు పనికి వెళ్లాడు. ఈక్రమాన వాదన పెరగడంతో ఆరుబయట మిర్చి తొడిమలు తీస్తున్న రాములమ్మ ఊపిరితిత్తులపై శేఖర్ కత్తితో పొడవడంతో సమీపంలోని మహేష్ అనే వ్యక్తి రాగా ఆయనపైనా దాడి చేశాడు. ఘటనలో తీవ్రగాయాలతో రాములమ్మ అక్కడికక్కడే మృతి చెందగా శేఖర్ పారిపోయాడు. కాగా, జులాయిగా తిరిగే శేఖర్పై ఖమ్మం త్రీటౌన్ పోలీస్స్టేషన్లో రౌడీషీట్తో పాటు పలు కేసులు నమోదయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ మోహన్బాబు, ఎస్ఐ కొండలు చేరుకుని రాములమ్మ మృతదేహన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించారు. మృతురాలి కుమారుడు నర్సింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా,నిందితుడు శేఖర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. భూమి పంపకంలో తగాదాలే కారణం -
3.26 కోట్ల చేపపిల్లలు
● జిల్లాలోని 820 జలాశయాల్లో వదిలిన అధికారులు ● చేపపిల్లల విలువ రూ.4.50కోట్లుఖమ్మంవ్యవసాయం: మత్స్యకారుల ఉపాధి మెరుగుపరిచేలా రూపొందించిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం జిల్లాలో ఎట్టకేలకు లక్ష్యాన్ని చేరింది. ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచి కురిసిన వర్షాలతో జిల్లాలోని జలాశయాల్లోకి సమృద్ధి నీరు చేరింది. దీనికి తోడు జిల్లాకు ప్రధాన నీటి వనరుగా ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండడం, అక్కడి నుంచి నీటి విడుదలతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఈమేరకు జిల్లాలోని 882 జలాశయాల్లో 3.48 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని మత్స్యశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే, ఉచిత చేప పిల్లల పంపిణీ టెండర్లకు తొలుత కాంట్రాక్టర్లు ముందుకు రాక జాప్యం జరిగింది. చివరకు ప్రభుత్వం చర్చలు జరపడంతో సెప్టెంబర్ చివరి వారంలో టెండర్లలో పాల్గొన్నారు. కాగా, కోర్టు కేసుల కారనంగా 42 జలాశయాలు మినహా మిగతా వాటిలో చేపపిల్లల విడుదల పూర్తిచేశారు. సైజ్ల వారీగా.. జిల్లాలోని 820 జలాశయాల్లో సుమారు రూ.4.50 కోట్ల విలువైన 3.26 కోట్ల చేపపిల్లలను విడుదల చేశారు. నీటి సామర్ద్యం, ఇతర వనరుల ఆధారంగా రెండు రకాల సైజ్ల్లో చేపపిల్లలను వదిలారు. 80–100 మి.మీ.ల బొచ్చు, రవ్వు, బంగారు తీగ పిల్లలు 2.20 కోట్లు ఉండగా, 35–40 మి.మీ.ల సైజ్లో బొచ్చ, రవ్వ, మోసు రకాలు 1.06 కోట్ల పిల్లలను జలాశయాల్లో విడుదల చేశారు. 16,500 మంది మత్స్యకారులకు ఉపాధి జలాశయాల్లో వంద శాతం సబ్సిడీపై చేపపిల్లలు విడుదల చేయడంతో మత్స్యకారుల ఉపాధికి దోహదపడుతుంది. జిల్లాలోని 210 మత్స్య సహకార సంఘాల్లో 16,500 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం జలాశయాల్లో చేప పిల్లలను విడుదల చేయించాక సంరక్షణ బాధ్యతను సహకార సంఘాలకు అప్పగిస్తారు. సభ్యుల చేప పిల్లలను సంరక్షిస్తూ ఏటా వేసవిలో మూడు నెలల పాటు చేపలు వేటాడి అమ్మమడం ద్వారా ఉపాధి పొందుతారు. జిల్లాలోని జలాశయాల నుంచి ఏటా సుమారు 25 వేల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుందని అంచనా. జిల్లాలోని జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉండడం చేపల పెంపకానికి కలిసి వస్తోంది. సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలైన నీరు జలాశయాల్లోకి చేరడంతో చేపపిల్లల ఎదుగుదలకు ఎలాంటి ఆటంకాలు రావు. ఈ ఏడాది లక్ష్యం మేర చేప పిల్లలను వదిలాం. తద్వారా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభించనుంది. – శివప్రసాద్, జిల్లా మత్స్య శాఖ అధికారి -
రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభం
ఖమ్మంక్రైం: ఈనెల 31వ తేదీ వరకు జరగనున్న జాతీయ రోడ్డు భద్రతావారోత్సవాలను గురువారం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ప్రతిఒక్కరు రోడ్డు భద్రతా నియామాలు పాటించాలని సూచించారు. అంతేకాక వాహనదారులు అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం రవాణా శాఖ ఉద్యోగులతో కలిసి ఆయన అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆతర్వాత జిల్లా రవాణా శాఖా కార్యాలయంలో పలువురు డ్రైవర్లకు అవగాహన కల్పించి భద్రతా నిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమంలో ఇన్చార్జ్ ఆర్టీఓ వరప్రసాద్, ఆర్టీఓ సభ్యుడు వెంకన్న, ఏఎంవీఐలు స్వర్ణలత, సుమలత, దినేష్, రవిచంద్ర, సిబ్బంది సరిత, లక్ష్మి, ప్రసన్న, నిశ్చల తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్ల జాబితా రెడీ
మధిర: మధిర మున్సిపాలిటీలో ఓటర్ల ముసాయిదా ఓటర్ల జాబితాను కమిషనర్ సంపత్కుమార్ విడుదల చేసి వివరాలు వెల్లడించారు. ఈ జాబితాపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనుండగా, మార్పులు, చేర్పుల కోసం గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మధిర మున్సిపల్లో 22 వార్డులకు గాను ముసాయిదా ప్రకారం 25,679 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. వీరిలో 13,424 మంది మహిళలు, 12,251 మంది పురుషులతో పాటు ఇతరులు నలుగురు ఉన్నారని కమిషనర్ తెలిపారు. సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధి 23 వార్డులకు గాను ఓటర్ల జాబితా సిద్ధమైంది. ముసాయిదా జాబితాను మున్సిపల్ కమిషనర్ కొండ్రు నర్సింహ విడుదల చేయగా, 28,479 మంది ఓట ర్లు ఉన్నారని వెల్లడించారు. ఇందులో 13,465 మంది పురుషులు, 14,999 మంది మహిళా ఓటర్లతో పాటు 15 మంది ఇతరులు ఉన్నారని వెల్లడించారు. వైరా: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వైరా మున్సిపాలిటీ పరిధి 20 వార్డులకు సంబంధించి ఓటర్ల ముసాయిదాను కమిషనర్ యూ.గురులింగం విడుదల చేశారు. ఈ జాబితాపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం విచారణ చేపట్టడంతో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించాక తుది జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీలో ఓటర్ల ముసాయిదాను కయమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి విడుదల చేసి మాట్లాడారు. మున్సిపల్ పరిధిలో 32 వార్డులకు గాను 45,256 ఓటర్లు ఉన్నారని తెలిపారు. జాబితాను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు అందించాలని సూచించారు. కాగా, ఈనెల 5న రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కల్లూరు రూరల్ : కల్లూరు మున్సిపాలిటీ ఓటర్ల జాబితా ముసాయిదాను కమిషనర్ ఎం.రామచంద్రరావు గురువారం విడుదల చేశారు. ఈ జాబితా ఆధారంగా మహిళా ఓటర్లు 9,785 మంది, పురుషులు 9,081 కలిపి మొత్తం 18,866 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. కాగా, మున్సిపల్ పరిధిలో వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా ముసాయిదా తయారీని కల్లూరు సబ్కలెక్టర్ అజయ్యాదవ్ గురువారం పరిశీలించారు. మున్సిపల్లో 20 వార్డులకు గాను 13 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయనున్నట్లు ఉద్యోగులు తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరుగుతాయని ప్రచారం జరుగుతుండగా రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈమేరకు జిల్లాలోని మున్సిపాలిటీల్లో గురువారం ఓటర్ల ముసాయిదా జాబితాలు విడుదల చేశారు. మధిర, సత్తుపల్లి, వైరా పాత మున్సిపాలిటీలతో పాటు కొత్తగా ఏర్పడిన ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ముసాయిదా సిద్ధం చేశారు. ఈనెల 5వ తేదీన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించడమే కాక ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆపై అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించాక 10వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. కాగా, ముసాయిదా ఆధారంగా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడం విశేషం. -
గుండెపోటుతో రైతు మృతి
తల్లాడ: ఓ రైతు పొలం వద్ద నుంచి ఇంటికి వెళ్లే క్రమాన స్నేహితులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పి బయలుదేరుతుండగా గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది. తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన దొడ్డ నరేందర్(40) పిల్లలు చదువుల నిమిత్తం ఖమ్మంలో నివసిస్తుండగా, స్వగ్రామంలో ఉన్న పదెకరాలతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై గురువారం గ్రామానికి వచ్చిన ఆయన పొలం వద్దకు వెళ్లగానే గుండెల్లో నొప్పిగా ఉండడంతో తిరిగి ఖమ్మం బయలుదేరాడు. మార్గమధ్యలో యూనియన్ బ్యాంకులో పని చూసుకుని స్నేహితులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాక ఖమ్మం వెళ్తుండగా రెడ్డిగూడెం సమీపాన రెండోసారి తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. దీంతో రోడ్డు పక్కనే కుప్పకూలిన ఆయనను స్థానికులు 108అంబులెన్స్లో ఖమ్మం తరలిస్తుండగా మరణించాడు. కాగా, నరేందర్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కత్తితో పలువురిపై దాడి ఖమ్మంరూరల్: ముదిగొండ మండలం సువర్ణాపురానికి చెందిన గంజుతారి మోహన్ పలువురిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి కోటనారాయణపురంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కోటనారాయణపురానికి చెందిన పోస్టల్ ఉద్యోగి ఏసు మణికంఠం తన స్నేహితుడు ఎస్కే.అబ్దుల్తో కలిసి బయటకు వెళ్లాడు. ఈ క్రమాన హోటల్ వద్ద మోహన్ వీరితో ఘర్షణకు దిగగా మణికంఠం తన బావ రామకృష్ణకు ఫోన్లో చెప్పడంతో ఆయన చేరుకున్నాడు. అక్కడ మోహన్ ముగ్గురిపై కత్తితో దాడి చేశారు. గొడవ ఆపేందుకు యత్నించిన సాయికుమార్పైనా దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఘటనపై బాధితుల ఫిర్యాదుతో మోహన్పై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. -
అభివృద్ధికి ‘ప్లాన్’!
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. పూర్తి కాగానే సీఎం రేవంత్ రెడ్డి వద్దకు పంపించనుండగా.. ఆయన ఆమోదిస్తే ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే నమూనా, బడ్జెట్, ఇతరత్రా పనులు పూర్తి చేసి ఈ ఏడాది శ్రీరామనవమి రోజున సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నవమికి శంకుస్థాపన? నూతనంగా రూపొందించిన డిజైన్పై మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్తో చర్చించారు. మరో మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి సైతం అభివృద్ధి నమూనాపై దృష్టి సారించారు. 2027 ఆగస్టులో గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో పనులు త్వరగా ప్రారంభించి, పుష్కరాల నాటికి భక్తులకు రామయ్య దర్శనానికి ఆటంకం లేకుండా చూడాలనే లక్ష్యంతో ప్లాన్ తుది రూపుపై వేగం పెంచినట్లు తెలుస్తొంది. ప్లాన్ను సీఎం ఆమోదిస్తే మార్చి 27న శ్రీరామనవమి రోజున ఆయనతోనే శంకుస్థాపన చేయించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా మాఢ వీధుల విస్తరణలో ఇప్పటికే భూనిర్వాసితులకు నష్టపరిహారం అందించగా, వారికి బ్రిడ్జి సెంటర్లో ఉన్న ఆర్అండ్బీ కార్యాలయ ఖాళీ స్థలాన్ని అప్పగించాల్సి ఉంది. చర్చనీయాంశంగా అర్చకుల వినతి.. ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్లాన్ సీఎం రేవంత్రెడ్డి ఫైనల్ చేసే క్రమాన శ్రీ భద్రాచల సీతారామ అర్చక సంఘం పేరిట అర్చకులు వినతిపత్రం అందించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో పలుమార్లు స్తపతి, ఇతర అధికారుల సలహాలు, సూచనలతో ఆలయ అధికారులు ప్లాన్ రూపొందించారు. దీన్ని మంత్రులు, దేవాదాయ శాఖ అధికారులు ఆమోదించే తరుణాన మరికొన్ని మార్పులను సూచించారు. ప్రధానంగా రెండో ప్రాకారం, దాని నిర్మాణంపై సలహాలు, సూచనలు చేశారు. మహాలక్ష్మి, గోదాదేవి ఆలయాలు గర్భాలయానికి వెనుక, ఉత్తర, దక్షిణ దిక్కులో నిర్మించాలని, ఆలయ ప్రాకా రాలకు అవతల ఈశాన్య భాగంలో పుష్కరిణి, లక్ష్మీ అమ్మవారి ఆలయానికి ఎదురుగా ద్వాదశ మండ పం, ఆండాళ్ అమ్మవారి ఆలయానికి ఎదురుగా పౌర్ణమి మండపం నిర్మించాలని కోరారు. వీటితో పాటు మరికొన్ని అంశాలను సైతం వినతిపత్రంలో ప్రస్తావించారు. ఆలయ నమూనా సిద్ధం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన డిజైన్ను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టింది. దేవా దాయ శాఖకు చెందిన ఆర్కిటెక్ట్ బృందం, స్తపతి, కలెక్టర్, దేవాదాయశాఖ కమిషనర్ ఇటీవల పలుమా ర్లు భద్రాచలం వచ్చి భక్తులకు అవసరమైన వసతులు, ఆలయ విస్తరణ వంటి పలు పనులను ప్లాన్లో సూచించారు. వైదిక సభ్యుల సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. వీటన్నింటి తర్వాత తుది ప్లాన్ను ఇటీవలే కలెక్టర్ ఫైనల్ చేయగా దేవా దాయ శాఖ కమిషనర్ వద్దకు చేరింది. దీనిపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. అధికారులు, వైదిక సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ప్లాన్పై సమగ్ర అవగాహనకు వచ్చారు. కాగా దేవాదాయ శాఖ అందించిన నివేదిక ప్రకారం మూడు విడతలుగా రూ.350 కోట్లతో అభివృద్ధి చేసేందుకు గతంలో ప్రతిపాదించారు. సీఎం రేవంత్రెడ్డి ఈ ప్లాన్ను ఆమోదిస్తే బడ్జెట్లో నిధుల కేటాయింపు ఇతర అంశాలపై స్పష్టత రానుంది.సిద్ధమైన రామాలయ మాస్టర్ ప్లాన్ నమూనా -
కొత్త మొక్కులు !
ఆలయాలకు పోటెత్తిన భక్తులునూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ఆలయాలకు గురువారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద బారులు దీరగా అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి తెలంగాణ, ఏపీలోని వివి ధ ప్రాంతాల భక్తులు రావడంతో కిటకిటలా డింది. దర్శనం టికెట్లు, ప్రసాదాల విక్రయం, వాహన పూజలు, తలనీలాల టికెట్ల ద్వారా ఒకే రోజు ఆలయానికి రూ.5,05,900 ఆదాయం సమకూరింది. జమలాపురం సర్పంచ్ తుళ్లూరు నిర్మల–కోటేశ్వరరావు భక్తులకు ప్రసాద వితరణ చేయగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగా ఉప్పల విజయదేవశర్మ ప్రమాణ స్వీకారం చేశా రు. ఈఓ కె.జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు ఉప్పల రాజీవ్శర్మ, ఎస్ఐ రమేష్, ఉద్యోగులు సోమ య్య, ముల్పూరి శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. – ఎర్రుపాలెం/సాక్షి నెట్వర్క్


