breaking news
Khammam
-
దేవేరుల గనులు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి నదీ తీరంలో ప్రాణహిత దగ్గర నుంచి మొదలు పెడితే పాపికొండల వరకు ప్రాచీన జీవజాతులకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఒకప్పటి దండకారణ్యంలో భాగంగా ఉన్న జిల్లాలో ఆదిమానవులకు సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. పినపాక మండలం పాండురంగాపురం దగ్గర రాకాసి గూళ్లు (పురాతన సమాధులు), ములకలపల్లి మండలం అక్షరలొద్ది, ఒంటిమిట్టగుండుల దగ్గర రాక్ పెయింటింగ్లు ఇటీవల కాలంలో వెలుగు చూశాయి. బౌద్ధ విహారాలు, రాష్ట్ర కూటులు, కాకతీయులు కట్టించిన ఆలయాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. అయితే, చరిత్ర గర్భంలో కలిసిపోయిన దేవీదేవేరులను సింగరేణి సంస్థ వెలుగులోకి తెచ్చింది. గనుల పేర్లు ప్రత్యేకం ఖని అంటే గని అనే అర్థం. ఆరంభంలో సింగరేణి గనులకు నంబర్లతో లేదా ఆ గనికి పర్యవేక్షకుడిగా ఉన్న అధికారుల పేర్లతో ప్రాచుర్యంలోకి వచ్చాయి. కొత్తగూడెంలో అధికారి పేరు మీద బర్లి పిట్ గని ఉండేది. బొగ్గును వెలికితీసే పద్ధతిని బట్టి ఇల్లెందులో 21 పిట్, స్ట్రట్పిట్ ఉండగా, ఇతర ఏరియాల్లో 5 ఇంక్లైన్, 7 ఇంక్లైన్, 8 ఇంక్లైన్, సెంచరీ ఇంకై ్లన్ పేర్లతో గనులు ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో జాతీయ నాయకుల పేర్ల మీదుగా కూడా గనులు వచ్చాయి. ఇల్లెందులో జవహర్లాల్ నెహ్రూ పేరు మీదుగా జవహర్ఖని (జేకే), రామకృష్ణాపూర్లో రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీద రవీంద్రఖని (ఆర్కే), మణుగూరులో టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీద ప్రకాశంఖని (పీకే) ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. భూపాలపల్లి ఏరియాలో గనులను కాకతీయఖని (కేకే), బెల్లంపల్లిలో శాంతిఖని, మందమర్రిలో కల్యాణిఖనిగా నామకరణం చేశారు. కొన్ని గనులు అక్కడున్న గ్రామం పేరుతో కూడా వచ్చాయి. మణుగూరులో కొండాపూర్ ఓసీ, ఇల్లెందులో పొలంపల్లి గనులు ఉన్నాయి. రామగుండం దగ్గర గోదావరి నది తీరంలో బొగ్గు గనులు రావడం, అక్కడ కార్మిక బస్తీలు పెరిగిపోవడంతో ఏకంగా గోదావరిఖని (రామగుండం) పేరుతో కార్పొరేషన్ ఏర్పాటైంది. కానీ, సింగరేణి వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఒక్క కొత్తగూడెం ఏరియాలోనే వెంకటేశ్ఖని, పద్మావతిఖని అంటూ దేవుడి పేర్లతో గనులు వచ్చాయి. వెలుగులోకి వేంకటేశ్వరుడు పద్మావతిఖనికి సమీపంలో వేంకటేశ్వరుడి విగ్రహం లభ్యమైంది. అప్పటికే కొత్తగూడెంలో 1 నుంచి 6 వరకు నంబర్లతో గనులు వచ్చాయి. దీంతో 1957లో మొదలైన గనికి వెంకటేశ్ఖని, ఆ తర్వాత వీకే–7గా పేరు పెట్టారు. 70 ఏళ్లకు పైగా వీకే, పీవీకే పేర్లతో కొత్తగూడెం ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఆయువుపట్టుగా పద్మావతి, వెంకటేశ్ గనులు నిలిచాయి. గత చరిత్రకు గుర్తుగా ఇక్కడున్న ఓ కొండపై శ్రీభూనీల సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సింగరేణి నిర్మించింది. బొగ్గు నిక్షేపాలు తరిగిపోవడంతో వీకే గని 2021లో మూతపడింది. తాజాగా ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని ఏకకాలంలో భూగర్భ, ఓపెన్కాస్ట్ పద్ధతుల్లో బొగ్గును వెలికి తీసే వీకే మెగా మైన్గా మళ్లీ వెలుగులోకి వచ్చింది. బుద్ధుడికీ ఓ గని.. కొత్తగూడెం సమీపంలో కారుకొండ దగ్గర గౌతమ బుద్ధుడి విగ్రహాలు వెలుగు చూశాయి. వీటిని ఆర్కియాలజీ సంస్థ రక్షిత స్థలాలుగా ప్రకటించింది. ఈ చరిత్రకు గౌరవాన్ని కల్పిస్తూ గౌతంఖని పేరుతో ఒక ఓపెన్కాస్ట్ మైన్ను సింగరేణి సంస్థ 1991లో ప్రారంభించింది. ఈ గనిలో పని చేసే కార్మికుల కోసం కట్టించిన కాలనీకి గౌతంపూర్ కాలనీగా పేరు పెట్టింది. అయితే, ఈ గని కూడా 2021లో మూతపడింది.స్వాతంత్రానికి ముందే సింగరేణి బొగ్గు గనులు ఇల్లెందు, బెల్లంపల్లిలో ప్రారంభయ్యాయి. ఆ తర్వాత కొత్తగూడేనికి 1936లో విస్తరించాయి. ఈ క్రమంలో తొలి గనిగా ప్రస్తుత హెడ్ ఆఫీస్ దగ్గర బర్లిపిట్ మొదలైంది. అయితే, ఇక్కడ అగ్నిప్రమాదం జరగడంతో ఈ గని మూతపడింది. ఆ తర్వాత రామవరం దగ్గర గనులు మొదలయ్యాయి. ఈ క్రమంలో అక్కడున్న కొండలు, గుట్టల్లో బొగ్గు నిక్షేపాల కోసం అన్వేషణ సాగిస్తుండగా అక్కడ భూమి పొరల్లో మరుగున పడిన ఓ శిలా విగ్రహం లభ్యమైంది. ఆనవాళ్లను బట్టి పద్మావతిదేవి విగ్రహంగా గుర్తించారు. దీంతో ఈ ప్రాంతంలో 1952లో మొదలైన గనిని పద్మావతిఖని పేరుతో పిలవడం మొదలైంది. కొత్తగూడెంలో బొగ్గు బావులకు దేవుళ్ల పేర్లు -
ఇందిరమ్మలో టాప్
రాష్ట్ర ప్రభుత్వ మానస పుత్రిక అయిన ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల పురోగతిలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అగ్రస్థానాన నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి, జనగామ, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి. జిల్లాలో గ్రౌండింగ్ అయిన ఇళ్లలో 70.25 శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే పలువురు లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయడం విశేషం. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంప్రణాళికాయుతంగా పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పొరపాట్లకు తావివ్వకుండా ప్రభుత్వం ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతోంది. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించడమే కాక, ఆ నిధులతోనే మోడల్హౌస్లు నిర్మించి చూపించింది. వీటి ఆధారంగా అధికారులు మేసీ్త్రలు, లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. 400 చదరపు అడుగుల్లో హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్తో బెడ్రూమ్, ఇంటి లోపల గదులు, వరండాల్లో టైల్స్ వేశారు. డాబా మెట్ల కింద మరో టాయిలెట్ నిర్మించారు. ఇంట్లో విద్యుత్ సౌకర్యం కల్పించడంతోపాటు ఫ్యాన్లు, రంగులు వేయడం ఇలా అన్ని పనులూ ఈ బడ్జెట్లోనే ఎలా పూర్తిచేయొచ్చో వివరించారు. ఐదు జిల్లాల్లో జెట్ స్పీడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం ఊపందుకుంది. ఖమ్మం జిల్లాలో మొత్తం గ్రౌండింగ్ అయిన 14,470 ఇళ్లల్లో 10,165 నిర్మాణాలు పూర్తి కాగా 70.25 శాతంతో అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత 58.34 శాతంతో మేడ్చల్ మల్కాజ్గిరి, 57.50 శాతంతో జనగామ, 57.31 శాతంతో వరంగల్, 31.71 శాతంతో యాదాద్రి భువనగిరి రెండు నుంచి ఐదో స్థానం వరకు దక్కించుకున్నాయి. జిల్లాకు 16,524 ఇళ్లు.. జిల్లాకు తొలుత పైలట్ ప్రాజెక్టు కింద 26 గ్రామాల్లో 867 ఇళ్లు మంజూరయ్యాయి. ఆ తర్వాత మిగిలిన గ్రామాల్లో 15,657 ఇళ్లు కేటాయించారు. మొత్తంగా 16,524 మంజూరు కాగా.. 2,054 ఇళ్లు మినహా మిగతావి పునాదులు, గోడలు, స్లాబ్ దశల్లో ఉన్నాయి. మొత్తం 988 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తూ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చూస్తున్నారు. ఎవరైనా ఇళ్లు ప్రారంభించకపోతే అవగాహన కల్పిస్తున్నారు.నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లికి చెందిన మరికంటి పద్మ, వెంకన్న దంపతులది నిరుపేద కుటుంబం. వీరికి నలుగురు కుమార్తెలు. సెంటు భూమి లేకపోగా వ్యవసాయ కూలీలుగా జీవనం సాగించేవారు. 16ఏళ్ల క్రితం వెంకన్న మృతిచెందగా కుటుంబ భారం పద్మపైనే పడింది. ఒక కూతురుకి వెంకన్న ఉండగానే వివాహం చేశారు. ఆ తర్వాత పద్మ కూలీ పనులు చేస్తూ మిగిలిన ముగ్గురు కూతుర్లకు వివాహాలు జరిపించింది. పక్కా ఇల్లు లేక శిథిలావస్థకు చేరిన ఇంట్లోనే ఈ కుటుంబం కాలం వెళ్లదీసింది. ప్రభుత్వం ఆమెకు ఇంది రమ్మ ఇల్లు మంజూరు చేయడంతో నిర్మాణం పూర్తిచేసుకుని సంతోషంగా జీవిస్తోంది. వర్షం పడితే ఎప్పుడు కూలుతుందోనన్న భయం లేకుండా హాయిగా ఉంటున్నామని చెబుతోంది.రాష్ట్రంలోనే ఖమ్మం ముందంజ -
నిరుద్యోగులను మోసం చేస్తున్నారు..
పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ ఖమ్మం మామిళ్లగూడెం : నిరుద్యోగ యువతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వి.రాకేష్ అన్నారు. స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 1.90లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నేడు నిరుద్యోగుల వైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ అమలుకు నోచుకోలేదని, నిరుద్యోగ భృతి ఊసే లేదని అన్నారు. ఉద్యోగ సాధన కోసం ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల చుట్టూ తిరుగుతున్న నిరుద్యోగులు నోటిఫికేషన్లు లేక తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం కూడా.. పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాటోత్ ప్రేమ్సింగ్, జిక్కుల భరత్, ఉపాధ్యక్షుడు సీహెచ్ ధరణి కృష్ణ, నాయకులు గోడ్డెటి అశోక్, ఇస్లావత్ రమేష్, వెంకటేష్, కొత్త రమేష్ పాల్గొన్నారు. -
భద్రగిరి రామయ్యకు అభిషేకం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం స్వర్ణ పుష్పార్చన, అభిషేకం జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారి కి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా జరిపారు. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. -
‘హెచ్పీవీ’తో గర్భాశయ కేన్సర్ నివారణ
ఖమ్మంవైద్యవిభాగం : హెచ్పీవీ వ్యాక్సినేషన్తో మహిళలకు గర్భాశయ కేన్సర్ రాకుండా నివారించవచ్చని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం జనరల్ ఆస్పత్రిలోని రేడియాలజీ హబ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌమార బాలికలకు హెచ్పీవీ టీకా వేస్తే భవిష్యత్లో గర్భాశయ కేన్సర్ను కట్టడి చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రుల అనుమతితో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా టీకా వేస్తామని తెలిపారు. అనంతరం బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులతో మాట్లాడుతూ హెల్త్కేర్లో నర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. ఈ కోర్సు పూర్తి చేశాక దేశంలోనే కాక విదేశాల్లోనూ అవకాశాలు ఉంటాయని తెలిపారు. పారిశుద్ధ్యంలో మార్పు కనిపించాలి వారం రోజుల వ్యవధిలో ఆస్పత్రి పారిశుద్ధ్యంలో స్పష్టమైన మార్పు కనిపించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. 99రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన ఖమ్మం జనరల్ ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. క్రిటికల్ కేర్ కేంద్ర భవనం నిర్మాణ పనులను, పార్కింగ్ స్థలం, ఆస్పత్రి పరిసరాలను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆస్పత్రి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పార్కింగ్ నిర్వహణకు ఒక ఏజెన్సీని గుర్తించి బాధ్యతలు అప్పగించాలని, 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పనికి రాని పాత ఫర్నిచర్, ఎక్విప్మెంట్ తొలగించాలని ఆదేశించారు. నిబంధనల మేరకు 200మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నా.. ఆస్పత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలంలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర, డీఎంహెచ్ఓ రామారావు, డీసీహెచ్ఎస్ రాజశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేందర్, ఆర్ఎంఓ రాంబాబు, డాక్టర్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. నేటి నుంచి మినీ సరస్ మేళా ఖమ్మం సహకారనగర్ : డీఆర్డీఏ, నాబార్డ్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈనెల 14 వరకు మినీ సరస్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందని, ఇల్లెందు క్రాస్రోడ్ సమీపంలోని కూరగాయల మార్కెట్ పక్కన గల హెల్త్ మార్కెట్లో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
మహిళలకు సమాన హక్కులు ఉండాలి
ఖమ్మం సహకారనగర్ : మహిళలకు సమాన హక్కులు, సమ న్యాయం ఉండాలని టీజీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని టీజీఓ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. మహిళలకు సమాన వేతనం, విద్య, రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల, టీజీఓస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొంగర వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి, మహిళా విభాగం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.అనిత, పి.సుధారాణి, మహిళా ఉద్యోగులు వేల్పుల విజేత, నవీన, జ్యోతి, రాధా, లలిత, అరుణ, శారద, లావణ్య, మంజుల తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి జీఐఎస్ మ్యాపింగ్ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సమస్యలను సులభంగా పసిగట్టడం, నిర్వహణ పనులను సమర్థవంతంగా చేసేందుకు జీఐఎస్(జియోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) అసెట్ మ్యాపింగ్ పనులను ఖమ్మం విద్యుత్ సర్కిల్ పరిధిలో వేగవంతం చేశారు. జిల్లాలోని 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లలో ఈ పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 33 కేవీ లైన్లలోని 55 ఫీడర్లలో పనులు పూర్తి కాగా, 11 కేవీ లైన్లలో 545 ఫీడర్లలో యూనిక్ పోల్ నంబర్ పెయింటింగ్ పనులు ప్రారంభించారు. ఈ ప్రక్రియ ద్వారా స్తంభాల వారీగా పెట్రోలింగ్ నిర్వహించడం సులభమని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. విద్యుత్ అంతరాయాలు, ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు వంటి వివరాలను ట్రాక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే ఆ పోల్ నంబర్ ఆధారంగా వెంటనే లొకేషన్ మ్యాపింగ్ తెలుసుకోవచ్చని, తక్షణమే అక్కడికి చేరుకుని సమస్య పరిష్కరించవవ్చని వివరించారు. తద్వారా సమర్థవంతమైన పర్యవేక్షణతో అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయవచ్చని తెలిపారు. పల్లె ప్రగతి పనులు పకడ్బందీగా నిర్వహించాలిబోనకల్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణా ళిక కార్యక్రమంలో భాగంగా పల్లెప్రగతి పనులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి టి.రాంబాబు అన్నారు. మండలంలోని ముష్టికుంట్ల, బోనకల్ గ్రామాల్లో నిర్వహిస్తున్న పనులను ఆదివారం ఆయన ఎంపీడీఓ రమాదేవితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 99 రోజుల పాటు గ్రామాల్లో నిర్వహించే పనులతో పల్లెల రూపురేఖలు మారుతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం మెరుగుదలే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను మే 31 వరకు నిర్వహిస్తామని వివరించారు. ఏప్రిల్ 2న అన్ని పంచాయతీల్లో గ్రామసభలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు పిల్లలమర్రి నాగేశ్వరరావు, బానోతు జ్యోతి, ఉపసర్పంచ్లు అమిరేశి సీతయ్య, బానోతు కొండ, కార్యదర్శులు సైదులు, కోలా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. శిక్షణకు వెళ్లిన ఆర్టీఓఖమ్మంక్రైం : జిల్లా రవాణా శాఖాధికారి జగదీష్ విధులకు సంబంధించిన శిక్షణ నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. ఆయన 45 రోజుల పాటు శిక్షణ పొందనున్నారు. గ్రూప్–1 విభాగంలో ఆర్టీఓగా జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన జగదీష్.. వాహనదారులకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా రవాణా శాఖ చేపట్టిన సంస్కరణలకు సంబంధించి శిక్షణ కోసం వెళ్లారని ఆ శాఖ సిబ్బంది తెలిపారు. ఆయన వచ్చేవరకు ఎంవీఐ శ్రీనివాస్ ఇన్చార్జ్ ఆర్టీఓగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. -
‘బండ’ భారం తగ్గించాలి
ఖమ్మంమయూరిసెంటర్ : యుద్ధం సాకుతో గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెంచి సామాన్యులపై ఆర్థిక భారం వేయడం తగదని సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, దండి సురేష్ అన్నారు. గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రెండు పార్టీల ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇరాన్–అమెరికా యుద్ధం ప్రారంభ దశలో వంట గ్యాస్ కొన్ని నెలల కు సరిపడా నిల్వ ఉందని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు పేదలపై భారం వేయడం దుర్మార్గమని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీది ఎప్పుడూ కార్పొరేట్, సంపన్న వర్గాల పక్షమేనని మరోసారి తేలిపోయిందన్నారు. భారత్కు మిత్ర దేశంగా ఉన్న ఇరాన్పై అమెరికా యుద్ధం చేస్తున్నా ప్రధాని నరేంద్రమోడీ మౌనంగా ఉండటం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్, నాయకులు మాచర్ల భారతి, యర్రా శ్రీనువాసరావు, మెరుగు సత్యనారాయణ, మీరా సాహిబ్, దొంగల తిరుపతిరావు, ఎస్.నవీన్ రెడ్డి, బోడపట్ల సుదర్శన్, సీపీఐ నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, ఎస్కే జానిమియా, ఏపూరి లతాదేవి, తోట రామాంజనేయులు, పగడాల మల్లేష్, సీహెచ్ సీతామహాలక్ష్మి, మేకల శ్రీనివాస్, యానాలి సాంబశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.గ్యాస్ ధర పెంపుపై సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన -
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట
ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళా పక్షపాతి అని, ప్రభుత్వ పథకాలన్నింటినీ మహిళ పేరుపైనే అమలు చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య అధ్యక్షతన ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో ప్రతీ పథకానికి మహిళ పేరు పెట్టి అమలు చేస్తున్నారని, రాష్ట్రంలోని మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తోందని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం మహిళలను సత్కరించారు. కాంగ్రెస్ ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్చౌదరి, మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు రఫీదా బేగం, మిక్కిలినేని మంజుల, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి, అనుబంధ సంఘాల అధ్యక్షులు కొత్తా సీతారాములు, సయ్యద్ గౌస్, పుచ్చకాయల వీరభద్రం, గజ్జెల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
బీమా డబ్బుల కోసం భర్త హత్య
ఖమ్మం రూరల్: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యే భర్తను హత్య చేయించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్ సీఐ ముష్క రాజు కథనం ప్రకారం.. ఖమ్మం గాంధీనగర్కు చెందిన చాగంటి రవి (55) పెయింటింగ్ పని చేస్తూ భార్య ప్రశాంతి, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. కాగా, రవిపై ఇన్సూరెన్స్ చేయించి, బీమా డబ్బులు కాజేయాలని భార్య ప్రశాంతితో పాటు మరో నలుగురు కలిసి ప్లాన్ చేశారు. ప్రశాంతికి వరుసకు సోదరుడైన దేశబోయిన శ్రీనివాస్తో పాటు జోగి రాజ్కుమార్, జోగి వెంకటేశ్, జోగి రాంబాబు కలిసి రవి పేరున రూ.66 లక్షలకు బీమా చేయించారు. సమయం చూసి అతడిని హతమార్చి ఆ సొమ్ము కాజేయాలని పథకం వేశారు. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీ రాత్రి దేశబోయిన శ్రీనివాస్.. రవి ఇంటికి వచ్చి మద్యం తాగుదామంటూ తన ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగాక ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం వైపు తీసుకెళ్లి గ్రామ శివారులో రవిని దింపి శ్రీనివాస్ వెళ్లిపోయాడు. మద్యం మత్తులో ఉన్న రవి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ముందస్తు ప్లాన్ ప్రకారం జోగి వెంకటేశ్కు చెందిన కారును రాజ్కుమార్ వేగంగా నడుపుతూ వచ్చి రవిని ఢీకొట్టి వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడిన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత భార్య ప్రశాంతి తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులకు అనుమానం వచ్చి.. విచారించగా నిందితులు అసలు విషయం ఒప్పుకున్నారు. దీంతో ఐదుగురినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రాజు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కారు, ఆటో, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
తల్లిదండ్రులు సూచించిన కాలేజీల్లోనే..
విద్య నభ్యసించే విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో భవిష్యత్లో స్థిరపడాలంటే అవసరమైన విద్య, ఉపాధి అవకాశాలపై మాకున్న అవగాహన మేరకే కోర్సులు ఎంపిక చేసుకుంటున్నాం. అయితే ఏ కాలేజీలో చేరాలనేది మాత్రం మా తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే నడుచుకుంటున్నాం. – కొల్లి శ్యామల, పీజీ ప్రథమ సంవత్సరంచదువు విషయంలో తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో కళాశాలలు, కోర్సుల ఎంపికలో మాకు కొంత స్వేచ్ఛ ఇచ్చినా తుది నిర్ణయం మాత్రం వారిదే. ఏదేమైనా మా ఉన్నతికి దోహదం చేసేలా వారే ఆలోచిస్తున్నారు. కొన్ని సమయాల్లో మేం చెప్పింది కూడా వారు వింటున్నారు. – పచ్చిపాల మహేశ్వరి, పీజీ ప్రథమ సంవత్సరం -
శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
● రూ.లక్ష విలువైన వెండి వక్షస్థల కవచం బహూకరణ ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి పాదానికి, విగ్రహానికి అర్చకులు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం చేశారు. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీ పద్మావతి అమ్మవార్లను సుందరంగా అలంకరించి నిత్య కల్యాణం నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కాగా, ఏపీలోని మైలవరం మండలం ముర్సుమల్లి గ్రామానికి చెందిన శ్రీధర రామారావు, ఆయన సోదరులు రూ.లక్ష విలువ చేసే వెండి వక్షస్థల కవచాన్ని శ్రీపద్మావతి అమ్మవారికి బహూకరించారు. కార్యక్రమంలో ఈఓ జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పందిళ్లపల్లి రేక్ పాయింట్కు యూరియాచింతకాని : మండల పరిధిలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్కు ఇఫ్కో కంపెనీకి చెందిన 2,670.84 మెట్రిక్ టన్నుల యూరియా శనివారం చేరింది. ఆ యూరియాను ఖమ్మం జిల్లాకు 1,070.84 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు 500 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 900 మెట్రిక్ టన్నులు, ఖమ్మం సీఆర్పీకి 200 మెట్రిక్ టన్నులను కేటాయించినట్లు టెక్నికల్ ఏఓ పవన్కుమార్ తెలిపారు. నేడు హెచ్పీవీ టీకాలుఖమ్మంవైద్యవిబాగం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 9 గంటలకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని ఆరోగ్య మహిళా విభాగంలో హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభిస్తారని డీఎంహెచ్ఓ డాక్టర్ రామారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 14 ఏళ్లు పూర్తి చేసుకుని, 15 సంవత్సరాల లోపు గల 11,460 మంది బాలికలు ఈ కార్యక్రమానికి అర్హులని వెల్లడించారు. వారికిచ్చే ఒకే మోతాదు హెచ్పీవీ టీకా గర్భాశయ ముఖ కేన్సర్ నుంచి రక్షణ కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. బాలికలు టీకా తీసుకునే ముందు అల్పాహారం లేదా భోజనం చేసి తల్లిదండ్రులతో కలిసి రావాలని సూచించారు. టీకా తీసుకున్న బాలికల ఎడమ చేతి చూపుడు వేలిపై గుర్తు పెట్టి, ప్రత్యేక ఽధ్రువపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం ఈ టీకా కార్యక్రమం జిల్లాలోని వైరా, మధిర, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కల్లూరు, సత్తుపల్లి, పెనుబల్లి సీహెచ్సీల్లో అమలు చేస్తున్నామని వివవరించారు. ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలి వైరా: రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని పలువురు శాస్త్రవేత్తలు సూచించారు. శనివారం వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత సమగ్ర వ్యవసాయ పరిశోధనా సమాఖ్య, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వ విద్యాలయం బాధ్యులు వరికి బదులు ఆరుతడి పంటల సాగుపై శిక్షణ నిర్వహించారు. కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సుచరితాదేవి, ఐఎఫ్ఎస్ యూనిట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎండీ లతీఫ్పాషా, పంటల వైవిధ్యం, సమగ్ర వ్యవసాయ విధానాలపై వివరించారు. వ్యవసాయ పరిశోధనా స్థానం మధిర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రుక్మిణీదేవి పప్పు దినుసుల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలు వివరించారు. శాస్త్రవేత్తలు శ్రీధర్, డాక్టర్ నాగస్వాతి, డాక్టర్ పావని, డాక్టర్ చైతన్య, ఫణిశ్రీ పాల్గొన్నారు. -
నిర్ణయాధికారం అంతంతే!
స్నేహితుల సూచనసమాజం68248మా తల్లిదండ్రుల నిర్ణయంకుటుంబంనా సొంత నిర్ణయంఇంజనీరింగ్, మెడిసిన్ వైపే.. తమ పిల్లలు ఇంటర్ పూర్తి చేయగానే వృత్తి విద్యా కోర్సులైన ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి చదువులకే తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో డిగ్రీ(బీఎస్సీ) కోర్సుల్లో చేరే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయితే డిగ్రీతో కొన్ని ఉద్యోగాలు సాధించే అవకాశాలు ఉన్నా.. ఆ దిశగా తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. ప్రస్తుత ఆధునిక యుగంలోనూ సగం మంది విద్యార్థినులు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు, మిత్రులు, ఇతర కుటుంబ పెద్దల సలహాలు, సూచనలతోనే ఉన్నత చదువులకు వెళ్తున్నారు. అయితే మేజర్లమైన తమకు సొంత నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తే తమకు ఆసక్తి గల కోర్సులు చదివి భవిష్యత్కు బంగారు బాట వేసుకునే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. సొంత నిర్ణయంతోనే రాణించగలమని చెబుతున్నారు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు ఎదగాలంటే విద్య ఎంతో ముఖ్యం. అయితే ఇప్పటికీ సగం మంది విద్యార్థినులు తమ సొంత నిర్ణయంతో కాకుండా తల్లిదండ్రుల అభీష్టం మేరకే కోర్సులను ఎంచుకుంటున్నారు. ఒకవేళ తమకు ఆసక్తి గల కోర్సులు చదవాలన్నా తల్లిదండ్రులను ఒప్పించడం వారికి అంత సులభం కావడం లేదు. సొంత నిర్ణయాలతో చదివే వారు సగం మంది వరకే ఉన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 18 – 25 ఏళ్ల మధ్య వయసు గల పలువురు విద్యార్థినులను ‘సాక్షి’ శనివారం ప్రశ్నించగా తమ మనోగతాన్ని పంచుకున్నారు. – ఖమ్మం సహకారనగర్/కొత్తగూడెం అర్బన్నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సర్వే -
కోలాహలంగా గిరి ప్రదక్షిణ
ఖమ్మంగాంధీచౌక్: భక్త జన సందోహం నడుమ నృసింహుడి గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది. స్వామి వారి జన్మనక్షత్రం(స్వాతి) సందర్భంగా ప్రతీ నెల నిర్వహించే ఈ వేడుక శనివారం సాయంత్రం స్తంభాద్రి గుట్టచుట్టూ నేత్రపర్వంగా సాగింది. అర్చకుల మంత్రోచ్ఛరణలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించారు. నృసింహ నామ స్మరణతో భక్తులు కీర్తనలు ఆలపించారు. స్వామివారి పల్లకీని మోసేందుకు పలువురు ఆసక్తి కనబర్చారు. గిరి ప్రదక్షిణ అనంతరం స్వామి వారిని తిరిగి ఆలయానికి చేర్చారు. గుట్టపై ఉన్న రాతి కొండపై నక్షత్ర జ్యోతి(దివ్యజ్యోతి)ని అర్చకులు వెలిగించగా.. తిలకించిన భక్తులు పులకించిపోయారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున నృసింహ నామ స్మరణ చేశారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.నక్షత్ర జ్యోతిని దర్శించి, తరించిన భక్తులు -
అండగా ఉంటాం..
ఖమ్మంమయూరిసెంటర్: పారిశుద్ధ్య కార్మికులకు కేఎంసీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని మేయర్ పునుకొల్లు నీరజ భరోసాఇచ్చారు. ‘తెల్లవారుజాము నుంచే విధుల్లో నిమగ్నమవుతారు. ఆరోగ్యాలను పణంగా పెట్టి వీధులు శుభ్రం చేస్తుంటారు. దుమ్ము, ధూళిలో పనిచేస్తూ ప్రజలకు క్లీన్ ఖమ్మాన్ని ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో మహిళా కార్మికులతో మేయర్ చర్చావేదిక నిర్వహించారు. కార్మికులు ఉత్సాహంగా పాల్గొని తమ సమస్యలను వివరించగా.. తక్షణమే పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అలాగే నగరంలోని 50వ డివిజన్ ఆర్టీసీ కాలనీలో మేయర్ రిపోర్టర్గా మారి, అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. రక్షణ పరికరాలు వాడాలి.. ‘మీ ఆరోగ్యంపైనే నగర ప్రజల ఆరోగ్యం ఆధారపడి ఉంది. పారిశుద్ధ్య పనులు నిర్వహించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. రక్షణ పరికరాలను ఉపయోగించాలి. కార్పొరేషన్ అందిస్తున్న గ్లౌజులు, బూట్లు, యాప్రాన్ తప్పనిసరిగా వాడాలి’ అని నీరజ సూచించారు. శనివారం తెల్లవారుజామునే కార్మికులు విధులకు హాజరు కాగా.. నగరంలోని బైపాస్ రోడ్డులో గల ఓ టీస్టాల్లో వారితో కలిసి మేయర్ టీ తాగారు. ఈ సందర్భంగా వారి సమస్యలు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నా రు. కేఎంసీ అందిస్తున్న సదుపాయాలు, విధులు నిర్వహిస్తున్న సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. విధి నిర్వహణ సమయంలో బూట్లు, గ్లౌజులు వేసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని సూచించారు. దీనిపై కార్మికులు మాట్లాడుతూ సామగ్రి అందడంలో ఆలస్యం అవుతోందని, మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి అందించాల్సి ఉందని అన్నారు. గ్లౌజులు, బూట్లు అందజేయాలని కోరారు. ఒకే జత యాప్రాన్ ఉందని, ఒకేసారి రెండు జతల యాప్రాన్లు ఇవ్వాలని, పెద్ద పండుగల సమయంలో సెలవులు ఇవ్వాలని, వేతనాలు పెంచాలని కోరారు. దీనిపై స్పందించిన మేయర్ గ్లౌజులు, చీపుర్లు, యాప్రాన్లు ఇప్పించేలా కృషి చేస్తానన్నారు. పండుగల సమయంలో వెసులుబాటును బట్టి సెలవులు ఇవ్వాలని అధికారులకు సూచించా రు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాపర్తి శరత్, ఎన్విరాన్మెంట్ ఏఈ ఎం.శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, జవాన్లు జ్యోతి, స్వాతి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. మీ కాలనీలో సమస్యలున్నాయా..? ‘నగర పాలక సంస్థ అందిస్తున్న సేవలు ఎలా ఉన్నాయి..? మీ కాలనీలో పారిశుద్ధ్య, ఇతర సమస్యలేమైనా ఉన్నాయా..? అంటూ కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ రిపోర్టర్గా మారి కాలనీ వాసులను ప్రశ్నించారు. నగరంలోని ఆర్టీసీ కాలనీలో శనివారం ఆమె మహిళలతో మాట్లాడారు. ‘సాక్షి’ మీడియా గ్రూప్ తరఫున వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్థానికులతో మాట్లాడుతూ తాను ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజనని, సమస్యలుంటే తనకు వివరించాలని కోరారు. ●మేయర్ : మీ కాలనీలో కేఎంసీ సేవలెలా ఉన్నాయి.?స్థానికులు: కాలనీలో రోజువారీ చెత్త సేకరణ బాగా జరుగుతోంది. రోడ్ల సౌకర్యం బాగుంది. చిన్నచిన్న సమస్యలు మినహా ఇబ్బందులు లేవు. కాలనీలో సౌకర్యాలు బాగున్నాయి. ●మేయర్ : డ్రెయిన్లు ఎలా ఉన్నాయి..? కార్మికులు శుభ్రం చేస్తున్నారా..?స్థానికులు: డ్రెయిన్లలో చెత్త పేరుకుపోతోంది. రెగ్యులర్గా శుభ్రం చేయించడం లేదు. మూడు రోజులకు ఒకసారి క్లీన్ చేయించండి. ●మేయర్ : చెత్త సేకరణ, మంచినీటి సరఫరాలో సమస్యలున్నాయా..?స్థానికులు: ఇంటింటి చెత్త సేకరణకు ప్రైవేట్ వాహనాలు ఏర్పాటు చేశారు. అలా కాకుండా కార్పొరేషన్ వాహనాలను ఏర్పాటు చేయాలి. మంచినీటి సరఫరా ఇప్పుడు బాగానే ఉంది.పారిశుద్ధ్య కార్మికులతో చర్చావేదికలో మేయర్ నీరజ -
ఇష్టంతోనే విద్య..
వృత్తి విద్యా కోర్సులతో పాటు రెగ్యులర్ డిగ్రీ కోర్సుల్లో సైతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయనే విశ్వాసంతో డిగ్రీ కోర్సులను ఎంపిక చేసుకున్నా. తల్లిదండ్రులకు చదువుపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో మంచి కళాశాలను ఎంచుకొమ్మని మాకే చెబుతున్నారు. కొన్ని అంశాల్లో మాత్రం వారి సూచనలు పాటిస్తున్నాం. – వేముల నందిని, డిగ్రీ ద్వితీయ సంవత్సరంతల్లిదండ్రులు, స్నేహితుల సలహాలు, సూచనలతో ఎంచుకున్న కోర్సులోనే చదువుతున్నా. అందరి తల్లిదండ్రులు కూడా చదువు విషయంలో పిల్లలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేలా చూడాలి. తద్వారా విద్యార్థులు లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. పిల్లలు కూడా క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. – జి.చంద్రమౌనిక, డిగ్రీ విద్యార్థిని -
అత్యవసర చికిత్సకు సీఎంఆర్ఎఫ్ మంజూరు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా కారేపల్లి మండలం మాధారం గ్రామానికి చెందిన గుంపెనపల్లి విజయలక్ష్మికి రూ.2.50 లక్షల విలువ చేసే ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరైంది. తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడుతున్న బాధితురాలు ఇటీవల ఎంపీ రఘురాంరెడ్డిని కలిసి.. తన బాధను వ్యక్తపర్చగా.. ఎంపీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో నిమ్స్లో మెరుగైన చికిత్స అందించేందుకు రూ.2.50 లక్షలను కేటాయించగా.. మంజూరు పత్రాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులకు ఎంపీ రఘురాంరెడ్డి శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో అందజేశారు. మెకానిక్ కుటుంబానికి ఆర్థిక సాయం ఖమ్మంఅర్బన్: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ప్రకాష్నగర్కు చెందిన టూవీలర్ మెకానిక్ మారెళ్ల రాజు గతేడాది నవంబర్ 9న అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు భార్య నవ్య, ఏడాది వయసున్న పాప శ్రావణి ఉంది. దీంతో మిగతా మెకానిక్కు అంతా కలిసి టూవీలర్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో రూ.1.40 లక్షలను సమీకరించి, ఎల్ఐసీలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. బాండ్ను శనివారం త్రీటౌన్ సీఐ మోహన్బాబు చేతుల మీదుగా మృతుడి భార్య నవ్యకు అందజేశారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, లాలయ్య, చాంద్, సత్యం, అబ్బాస్, నాగరాజ్, వెంకటేశ్, నరేశ్, వీరేశ్, శ్రీకాంత్, శ్రీను, కరుణాకర్ పాల్గొన్నారు. -
రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలి
ఖమ్మంసహకారనగర్/వైరా/కొణిజర్ల: విద్యాశాఖలో జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు, మండల విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. 99 రోజుల ప్రణాళిక కట్టుదిట్టంగా నిర్వహించడంతో పాటు, రాబోయే 10వ తరగతి పరీక్షలో ప్రభుత్వ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. ఈ నెల 15 వరకు ప్రతి పాఠశాలలో పనికిరాని సామగ్రి, కంప్యూటర్లు, రిజిస్టర్లు తొలగించాలని, పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేకంగా రూ.70 లక్షలు అందిస్తున్నామన్నారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగే 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఈఓ చైతన్య జైనీ, విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు. వైరాలో పరిశుభ్రతను మెరుగుపరిచి పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు అఽధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ అనుదీప్ వైరా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. వైరా మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రకళ, సంతోష్, విజేత, సురేశ్, సక్రునాయక్, గురులింగం పాల్గొన్నారు. కాగా, చిన్నగోపతి గ్రామంలో 100 శాతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ మండల అధికారులు, గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం చిన్నగోపతిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. ఈ నెల 31 లోగా ఇళ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, డీఈ శ్రీరాంరెడ్డి, ఎంపీడీఓ వర్ష, ఎంపీఓ ఉపేంద్రయ్య, తహసీల్దార్ అరుణ, హౌసింగ్ ఏఈ ఉమామహేశ్వరరావు, సర్పంచ్ నాగేశ్వరరావు, వడ్డె నారాయణరావు రేఖ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పల్లిపాడు బస్స్టేజీ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ఎవ్రీ ఛైల్డ్ రీడ్స్ కార్యక్రమ అమలును ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యాశాఖ సమీక్షలో కలెక్టర్ అనుదీప్ -
‘ఆమె’కు రక్షణేది?
● పెరుగుతున్న అత్యాచారాలు, వేధింపుల కేసులు ● అడ్డూ అదుపు లేని ఈవ్టీజింగ్ఖమ్మంక్రైం : జిల్లాలో మహిళలపై గత రెండేళ్లుగా నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నాలుగైదు నెలలుగా దారుణ హత్యలకూ గురవుతున్నారు. మహిళలపై దాడులకు సంబంధించి 2024లో 941 కేసులు నమోదు కాగా, 2025లో 1,146, ఈ సంవత్సరం ఇప్పటివరకు 50కి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. 2024లో వేధింపులు తట్టుకోలేక 16 మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడగా, 2025లో ఆ సంఖ్య 20కి పెరిగింది. పెరిగిన అత్యాచార కేసులు.. జిల్లాలో మహిళలపై వేధింపులతో పాటు అత్యాచారాల కేసులు సైతం నమోదవుతున్నాయి. 2024లో 74 అత్యాచార కేసులు నమోదు కాగా, 2025లో 84, ఈ సంవత్సం ఇప్పటివరకు 5 కేసులు నమోదయ్యాయి. పలువురు మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని సైతం చెప్పుకునే పరిస్థితి లేక కుమిలిపోతున్నారు. అడ్డూఅదుపు లేని ఈవ్టీజింగ్.. జిల్లాలో మహిళలపై ఈవ్టీజింగ్ అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. షీటీమ్స్ ఉన్నా గతంలో వలె పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బస్టాండ్, షాపింగ్మాల్స్, రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రదేశాల్లో ఇది మరింతగా పెరుగుతోంది. 2024లో 17 ఈవ్ టీజింగ్ కేసులు నమోదు కాగా, 2025లో ఈ సంఖ్య ఏకంగా 41కి పెరిగింది. ఇంకా ఫిర్యాదు చేయని బాధితులు ఎంతో మంది ఉంటారని సమాచారం. సమస్యలు చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చే మహిళలకు రక్షణ కల్పించేలా రక్షణ చర్యలు చేపడుతున్నాం. వరకట్న వేధింపులు ఎదరైన వారు సైతం నేరుగా మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. కుటుంబసభ్యులను పిలిచి మొదట కౌన్సిలింగ్ ఇస్తాం. అయినా వారిలో మార్పు రాకుంటే కేసులు నమోదు చేస్తాం. ఈవ్టీజింగ్కు గురైన మహిళలు షీటీమ్స్ వారికి ఫిర్యాదు చేస్తే సత్వర న్యాయం జరుగుతుంది. సఖి, భరోసా కేంద్రాలు సైతం మహిళలకు అండగా ఉంటాయి. – చిట్టిబాబు, మహిళా పీఎస్ సీఐ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
సత్తుపల్లిటౌన్: ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రక్కును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రగాయాలతో మృతి చెందాడు. సత్తుపల్లి మండలం సదాశివునిపేటలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లి మండలం సిధ్దారం గ్రామానికి చెందిన గద్దల మనోజ్(16), గద్దల కార్తీక్(18) సత్తుపల్లిలో ఓ కన్సల్టెన్సీలో పని చేస్తున్నారు. వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై మర్లపాడు వెళ్లి వస్తుండగా సదాశివునిపేట శివాలయం సమీ పాన రోడ్డు ప్రక్కన నిలి పి ఉన్న ట్రాక్టర్ ట్రక్కు ను ఢీకొట్టారు. దీంతో తీవ్రగాయాలు కాగా మనోజ్, గద్దల కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించినట్లు సత్తుపల్లి సీఐ శ్రీహరి తెలిపారు. కాగా, వీరిద్దరికి ఒకే గ్రామం కావడమే కాక ఒకే వీధి కావడంతో సిద్ధారం వాసులు పెద్దసంఖ్యలో చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రక్కును ఢీకొట్టడంతో ఘటన -
జెడ్పీ మాజీ చైర్పర్సన్కు పలువురి నివాళి
టేకులపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గోనెల విజయలక్ష్మి అంత్యక్రియలను ఆమె స్వగ్రా మం టేకులపల్లి మండలం తెలుగూరులో శుక్రవారం నిర్వహించారు. గుండెపోటు తో గురువారం ఆమె మృతి చెందగా మృతదేహాన్ని స్వ గ్రామానికి తీసుకొచ్చారు. తన రాజకీయ గురువైన వెంకటనారాయణ సతీ మణి మృతదేహంవద్ద ఇల్లెందు ఎమ్మెల్యేకోరం కనకయ్య నివాళులర్పించి కన్నీ టి పర్యంతమయ్యారు. అంతేకాక పాడె మోసి అంత్యక్రయల్లో పాల్గొన్నా రు. అలాగే, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, నాయకులు కోరం లక్ష్మి, కోరం సురేందర్, ఉమ, కోరం హన్మంతు, వెంకన్న, నర్సింగ్ లక్ష్మయ్య, కాలె ప్రసాద్, బండ్ల రజిని, శ్రీనివాస్, ఈది గణేశ్, జానీ తదితరులు నివాళులర్పించారు. జెడ్పీ కార్యాలయంలో.. ఖమ్మం సహకారనగర్: ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గోనెల విజయలక్ష్మికి పలువురు నివాళులర్పించారు. ఖమ్మంలోని జెడ్పీ కార్యాలయంలో శుక్రవారం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించాక ఉద్యోగులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు రమణ, శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, జ్యోతి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
సాగులో సాంకేతిక పరిజ్ఞానంతో లాభాలు
మధిర: రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే సాగులో మంచి ఫలితాలు వస్తాయని మధిర ఏడీఏ విజయచంద్ర తెలిపారు. ఈ విషయంలో ఆత్మ కమిటీ సభ్యులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి కోటేశ్వరరావు ఆధ్వర్యాన శుక్రవారం మధిర రైతు వేదికలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఏయే పంటల్లో ఎరువులు ఎప్పుడు, ఎంత మోతాదులో వేయాలి, నానో యూరియా, డీఏపీతో ఉపయోగాలను వివరించారు. అనంతరం మధిర ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త రుక్మిణీదేవి మాట్లాడుతూ వరి, అపరాల్లో ఉన్న వంగడాల ప్రత్యకతలపై అవగాహన కల్పించారు. ఆతర్వాత ఎంటమాలజీ శాస్త్రవేత్త నాగస్వాతి మాట్లాడుతూ చీడపీడల నివారణ, సాయిల్ హెల్త్ కార్డు ఉపయోగాన్ని వివరించగా.. మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు మాట్లాడారు. ఆతర్వాత ఎరువులు, పురుగుల మందుల పిచికారీకి అందుబాటులో ఉన్న డ్రోన్ల ఉపయోగాలను వివరించారు. మార్కెట్ వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణరెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు
నేలకొండపల్లి: ఇంటర్ పరీక్షలు రాసి రెండు బైక్లపై వస్తున్న విద్యార్థులు కారును ఢీకొట్టడమే కాక పరస్పరం ఢీకొనడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నేలకొండపల్లి మండలం అనంతనగర్– నేలకొండపల్లి మధ్య శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. కోరట్లగూడెంకు చెందిన బచ్చలకూరి అభిరామ్, అమ్మగూడెంకు చెందిన వాసంశెట్టి ఉదయ్, ఆరెగూడెంకు చెందిన బోయిన ఉదయ్ నేలకొండపల్లిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసి బైక్పై ఇళ్లకు బయలుదేరారు. సదాశివాపురానికి యండ్రాతి విశాల్, జె.జశ్వంత్, కొంగరకు చెందిన పొట్టా ఆకాష్ అనంతనగర్లో పరీక్షరాసి మరో బైక్పై వెళ్తున్నారు. వీరి బైక్లు అనంతనగర్ – నేలకొండపల్లి మధ్య మూలుమలపు సమీపానికి చేరగా నేలకొండపల్లి నుంచి కూసుమంచి వైపు వెళ్తున్న కారును ఢీకొట్టి ఆపై పరస్పరం ఢీకొన్నా యి. దీంతో బైక్లపై వెళ్తున్న ఆరుగురు విద్యార్థులు ఎగిరిపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో అభిరామ్ పరిస్థితి విషమంగా ఉండగా, మిగతా వారికి సైతం గాయాలై స్పృహ కోల్పోవడంతో స్థానికులు పాకనాటి కన్నారెడ్డి, బచ్చలకూరి నాగరాజు తదితరులు సీపీఆర్ చేస్తూ 108లో నేలకొండపల్లి ప్రభు త్వ ఆస్పత్రికి అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. క్షతగాత్రులను తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఎం.యర్రయ్య పరామర్శించారు. ఇంటర్ పరీక్ష రాసి వస్తుండగా ఘటన -
స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలతో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.రేపు హ్యాండ్బాల్ జట్టు ఎంపిక పోటీలు ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాస్థాయి సీనియర్ పురుషు ల హ్యాండ్బాల్ జట్టు ఎంపికకోసం ఈనెల 8వ తేదీన పోటీలు నిర్వహిస్తున్నట్లు హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి.రఘునందన్ తెలిపారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఉదయం 10గంటలకు మొదలయ్యే పోటీలకు ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్కార్డుతో హాజ రుకావాలని సూచించారు. ఇక్కడ ఎంపిక చేసే జిల్లా జట్టు ఈనెల 13నుంచి హైదరాబాద్ చింతల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. పోగొట్టుకున్న నగదు అందజేతమధిర: మధిరలో ఓ వ్యక్తి పోగొట్టుకున్న నగదును టౌన్ పోలీసులు గుర్తించి అందజేశారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కలగరకు చెందిన రావుల అప్పారావు కోదాడలో ట్రాక్టర్ ట్రక్ కొనుగోలుకు వెళ్తున్నాడు. ఈ క్రమాన ఆయన జేబులో ఉన్న రూ.60వేల నగదును మధిర శాంతిథియేటర్ సమీపాన పోగొట్టుకున్నాడు. ఘటనపై టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ రమేష్ సీసీ కెమెరాలు పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించా రు. దీంతో సిబ్బంది శివ, రమేష్ ఆ మార్గంలో సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి రూ.60వేల నగదు గుర్తించి అప్పగించగా అప్పారావు కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల అనేక లాభా లు ఉన్నందున ఇళ్లు, షాపుల్లో అమర్చుకోవా లని సూచించారు. ఎస్సై నవిత, సిబ్బంది పాల్గొన్నారు. తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ, నిమ్స్ మే (హైదరాబాద్) సంయుక్త ఆధ్వర్యాన గిరిజ న యువత, రైతులకు తేనెటీగల పెంపకంపై ఐదు రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీ ఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 18–40ఏళ్ల లోపు వారు శిక్షణకు అర్హు లని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న మహిళలు, పురుషులు తమ విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, కులధ్రువీకరణ జిరాక్స్లతో ఈనెల 12న ఉదయం 9 గంటలకు భద్రాచలం ఐటీడీ ఏ ప్రాంగణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్కు రావాలని పీఓ సూచించారు. నైపుణ్య శిక్షణ కేంద్రంలో మహిళా దినోత్సవం ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో శుక్రవారం మహిళా దినో త్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన వేడుకల్లో డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా ఉపాధి రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈమేరకు మూడు నెలల శిక్షణ శిబిరం ముగియగా, ట్రెయినీలను సన్మానించారు. ఈకార్యక్రమంలో మేనేజర్ ఉదయ్కుమార్, హరిబాబు తది తరులు పాల్గొన్నారు. -
అంతా మా ఇష్టం..
● పట్టపగలే ఇసుక అక్రమ లోడింగ్ ● చెక్పోస్ట్ ఏర్పాటుచేసినా ఆగని దందాగంధసిరి మున్నేటిలో మధ్యాహ్నమే ఇసుక ట్రాక్టర్లు ముదిగొండ: మండలంలోని గంధసిరి, పెద్దమండవ మున్నేటి నుంచి ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. ఆయా గ్రామాల్లో దాదాపు 300 వరకు ట్రాక్టర్లు ఉన్నాయని తెలుస్తుండగా, నిత్యం వందకు పైగా ట్రాక్టర్లు ఇసుక తరలింపునకే వినియోగిస్తున్నట్లు అంచనా. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూపన్ల పేరిట ఇసుక తరలిస్తున్నట్లు చెబుతూ లెక్కకు మిక్కిలిగా ఇసుక తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. పట్టపగలే మున్నేటి వద్ద ట్రాక్టర్లలో ఇసుక నింపి అర్ధరాత్రి సమయాన అనుకున్న చోటకు చేరుస్తున్నారు. రాత్రి సమయాన ట్రాక్టర్ల శబ్దానికి నిద్రకు దూరమవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. కాగా, అనువైన దారులను ఎంచుకుని ఇసుకను చింతకాని, ముదిగొండ, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, ఖమ్మంకు తెల్లవారుకల్లా చేరుస్తున్నారని సమాచారం. అనుసరిస్తూ.. సమాచారం ఇస్తూ.. ఇసుక దందా అరికట్టాలన్న లక్ష్యంతో ఇటీవల పోలీసు శాఖ ఆధ్వర్యాన మల్లారం–పెద్దమండవ, ఏపీలోని సరిహద్దు వద్ద ఇటీవల చెక్పోస్టు ఏర్పాటు చేశారు. వరస దాడులతో హడావుడి చేసి పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి యజమానులు, డ్రైవర్లపై కేసులు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ దందా ఆగకపోవడం గమనార్హం. పోలీసు పెట్రోలింగ్ వాహనం ఎప్పుడు వచ్చేది, ఏ అధికారి ఎటు వెళ్తున్నాడనేది గుర్తించేందుకు కొందరు అక్రమార్కులు వారి వాహనాలను అనుసరిస్తూ.. ట్రాక్టర్ల యజమానులకు సమాచారం ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో అధికారులు మరో మార్గంలో వెళ్తున్నట్లు తెలియగానే.. ఇంకో పక్క ఇసుక తరలిస్తున్నట్ల సమాచారం. మైనింగ్ అధికారుల జాడే లేకపోవడంతో అక్రమార్కులకు కలిసొస్తుందని చెబుతున్నారు. వేసవి సమీపిస్తున్న వేళ ఇసుక తోడుస్తుండడంతో మున్నేటిలో నీరు అడుగంటే ప్రమాదం ఉన్నందున అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఉత్పత్తి వ్యయం తగ్గించాలి
వాతావరణ ం జిల్లాలో శనివారం ఎండ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది.మణుగూరు టౌన్: యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని, సమష్టి కృషితో లక్ష్య సాధనకు కృషి చేయాలని సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి అన్నారు. శుక్రవారం మణుగూరు ఏరియాలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్(పీఅండ్పీ) కె.వెంకటేశ్వర్లుతో కలిసి పర్యటించారు. తొలుత పీకేఓసీ–2 గనిని వ్యూ పాయింట్ నుంచి బొగ్గు ఉత్పత్తి, లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఓసీలో షావెల్స్ భారీ యంత్రాల పనితీరును పరిశీలించి, బొగ్గు నాణ్యతపై ఆరా తీశారు. అనంతరం ఓసీ–4లో సర్ఫేస్ మైనర్ భారీ యంత్రం ద్వారా జరిగే బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కోల్ బెంచ్లో బొగ్గు నాణ్యత పరిశీలించి వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం జీఎం కార్యాలయంలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏరియా ఉత్పత్తి లక్ష్యాలు అధిగమిస్తున్న తీరును, కొత్త ప్రాజెక్ట్ వివరాలను జీఎం దుర్గం రాంచందర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జీఎం(సీడీఎన్) టి.శ్రీనివాస్, అధికారులు శ్రీనివాసచారి, రమేశ్, వేణుమాధవ్, శ్రీనివాస్, వెంకట్రావు, రాంబాబు, రమేశ్, జ్యోతిర్మయి, సౌరబ్ సుమన్, సురేశ్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి -
కుటుంబానికి వృద్ధురాలి అప్పగింత
ఖమ్మంఅర్బన్: తిరుమలాయపాలెం మండలం కాకరవాయికి చెందిన కొత్తపల్లి లచ్చమ్మ(85) మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి తప్పిపోగా పోలీసులు, అన్నం ఫౌండేషన్ సభ్యులు తిరిగి ఆమెను కుటుంబానికి అప్పగించారు. కొద్దిరోజుల క్రితం లచ్చమ్మ ఇంటి నుంచి వెళ్లిపోగా ఆమె కుమారులు పలుచోట్ల గాలించి ఫలితం లేక ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈక్రమాన గురువారం రాత్రి చైన్నె షాప్ షాపింగ్ మాల్ సమీపాన అచేతనావస్థలో ఉన్న ఆమెను గుర్తించి వన్ టౌన్ ఎస్ఐ అనిల్ అన్నం ఫౌండేషన్కు అప్పగించారు. ఆపై సభ్యులు వివరాలు సేకరించగా కాకరవాయికి చెందిన లచ్చమ్మగా తేలడంతో ఆమె కుమారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా సామూహిక వివాహాలు
మణుగూరు టౌన్: మణుగూరులోని అన్నారం గ్రామంలో దానధర్మట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం 200 ఆదివాసీ జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకురాలు గంటా రాధ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 200 ఆదివాసీ జంటలు పాల్గొన్నాయి. మైసూరు అవధూత దత్తపీఠం బాధ్యుల సమక్షంలో వేడుకలు జరిపారు. మేళతాళాలు, వేద మంత్రోచ్ఛరణతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళసూత్రం, మెట్టెలు, పట్టు వస్త్రాలు, పీటలు తదితర పెళ్లి సామగ్రిని ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రస్ట్ చైర్ పర్సన్ గంటా రాధ మాట్లాడుతూ 2021 నుంచి పలు దఫాలుగా అన్నారం గ్రామంలో 720 జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించినట్లు తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి రూ.1.20 కోట్ల మేర వెచ్చించామని తెలిపారు. కాగా, 200 జంటలు, వారి బంధువులతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో 200 ఆదివాసీ జంటలకు పెళ్లిళ్లు -
నేడు హైకోర్టు న్యాయమూర్తుల రాక
ఖమ్మం లీగల్: ఖమ్మం న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం 40 గంటల మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఖాజా శరత్, జస్టిస్ సూరేపల్లి నందా ప్రారంభిస్తారు. ఈమేరకు ఏర్పాట్లను జిల్లా ప్రధాన జడ్జి, న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ జి.రాజగోపాల్ శుక్రవారం పర్యవేక్షించారు.మహిళలకు ఉపాధి రంగాల్లో శిక్షణ ఖమ్మంఅర్బన్: ఖమ్మం టేకులపల్లిలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం(మహిళా ప్రాంగణం)లో నిరుపేద, అనాథ, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మేనేజర్ వేల్పుల విజేత తెలిపారు. దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన కింద రిటైల్, సేల్స్ అసిస్టెంట్ రంగాల్లో మహిళలకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. మూడు నెలల శిక్షణ కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి సమకూర్చనుండగా పదో తరగతి ఉత్తీర్ణులై 18 – 35 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అర్హులైన మహిళలు రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, 10వ తరగతి మెమో, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జిరాక్స్లను దరఖాస్తుకు జతపరిచి అందించాలని సూచించారు. వివరాలకు కార్యాలయ పనివేళల్లో నేరుగా కానీ 76600 22512, 76600 22513 నంబర్లలో కానీ సంప్రదించాలని విజేత సూచించారు. జాతీయ సదస్సు ప్రారంభం నేలకొండపల్లి: నేలకొండపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రెండు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సును ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జాకీరుల్లా ప్రారంభించాక సావనీర్ విడుదల చేశారు. భౌతిక శాస్త్రం విభాగం ఆధ్వర్యాన ‘ఎకోస్ ఆఫ్ ది పాస్ట్ బీమ్స్ ఆఫ్ లైట్.. ఎక్స్ప్లోరింగ్ ది సైంటిఫిక్ పినామినా బిహైండ్ తెలంగాణ ఆర్కిటెక్చర్’ అంశంపై సదస్సులో భాగంగా తొలిరోజు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, చారిత్రక కట్టడాల ప్రత్యేకతలను వివరించారు. ప్రిన్సిపాల్ పరంజ్యోతి, అధ్యాపకులు తోటకూర రమేష్, బానోత్రెడ్డి, సూర్యనారాయణ, మహంతి, డాక్టర్ నర్సింగ్ శ్రీనివాసరావు, డాక్టర్ రమేష్, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమష్టి కృషితోనే లాభాల్లోకి ఆర్టీసీ ఖమ్మం మామిళ్లగూడెం: ప్రయాణికులకు మెరుగైన సేవలందించేలా ఆర్టీసీ ఉద్యోగులు సమష్టిగా కృషి చేస్తే సంస్థ లాభాల బాట పడుతుందని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలోమన్ తెలిపారు. ఖమ్మం డిపోను శుక్రవారం తనిఖీ చేసిన ఆయన వివిధ విభాగాల్లో పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. ప్రతీ ఉద్యోగి తన వంతు బాధ్యతను సమర్థవంతంగా న్విర్తించాలని తెలిపారు. అనంతరం ఖమ్మం కొత్త, పాత బస్టాండ్లను పరిశీలించిన ఈడీ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులు ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. అనంతరం ఖమ్మం డిపో గ్యారేజీలో మెకానిక్ సిబ్బందితో సమావేశమై నిర్వహణపై సూచనలు చేశారు. ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య, డిపో మేనేజర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఫలితాలు పెంచేలా ప్రణాళిక
● ఎస్సెస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు ● ప్రత్యేక తరగతులతో ఫలితాల మెరుగుపై ఆశాభావం ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ ఖమ్మం సహకారనగర్: పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ముందంజలో నిలిపేలా ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతున్నామని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైనీ వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతీ విద్యార్థి చదువుపై దృష్టి సారించడమే కాక వారి సందేహాల నివృత్తికి ప్రత్యేక తరగతులు దోహదపడుతున్నాయని తెలిపారు. ఎస్సెస్సీ విద్యార్థులకు బోధన, పరీక్షలకు చేస్తున్న ఏర్పాట్లను ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు డీఈఓ మాటల్లోనే... సౌకర్యాలు.. అల్పాహారం ఎస్సెస్సీ విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం సౌకర్యాలు కల్పించింది. అల్పాహారానికి నిధులు మంజూరయ్యాయి. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు కూడా సహకరిస్తున్నారు. జిల్లాలో 16,975మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా 98 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. సందేహాల నివృత్తి పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించేలా ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ఇప్పటికే సూచనలు చేశారు. కొద్దినెలల క్రితమే సిలబస్ పూర్తికాగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఆ తరగతుల్లో చదివిస్తూ ఉపాధ్యాయులు వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. అంతేకాక తరచుగా మాక్ పరీక్షలు నిర్వహించి మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దీంతో ఫలితాలు గతంతో పోలిస్తే కచ్చితంగా మెరుగుపడతాయనే ఆశాభావంతో ఉన్నాం. ఇటీవల విద్యార్థుల్లో పరీక్షలపై భయాన్ని తొలగించేలా మోటివేషనల్ స్పీకర్ గంపా నాగేశ్వరరావుతో అవగాహన కల్పించాం. ఈ సమావేశంలో కలెక్టర్ అనుదీప్ కూడా పాల్గొని విద్యార్థుల్లో భయాన్ని తొలగించేలా సూచనలు చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాదించడమే లక్ష్యంగా హెచ్ఎంలు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. వీటిని సద్వినియోగం చేసుకుంటూ నూరుశాతం ఫలితాలు సాధించేలా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఇదే సమయాన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులకు చర్యలు తీసుకుంటున్నాం. ఇక కలెక్టర్ అనుదీప్ కూడా విద్యాశాఖపై ప్రత్యేక దష్టి సారించడం, పర్యవేక్షిస్తుండడంతో ఫలితాలు తప్పక మెరుగవుతాయనే నమ్మకం ఉంది. -
ప్రత్యేక డ్రైవ్లో సమన్వయం తప్పనిసరి
రఘునాథపాలెం: నూతన సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు ఈనెల 15 వరకు జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్లో చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. రఘునాథపాలెం రైతు వేదికలో మండలంలోని సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, గ్రామ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులకు శుక్రవారం ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే కార్యక్రమం విజయవంతమవుతుందన్నారు. సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటల నుంచే పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని, జీపీల్లో పెండింగ్ ఫైళ్లు పరిష్కరించాలని, ఏవైనా తిరస్కరిస్తే స్పష్టమైన కారణం తెలియచేయాలని పేర్కొన్నారు. తొలుత ఆయన రఘునాథపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య పనులు, పెండింగ్ ఫిర్యాదులు, ఫైళ్లను పరిశీలించి సూచనలు చేశారు. అలాగే, బస్తీ దవాఖానాను తనిఖీ చేసి ఓపీ సేవలు, మందుల నిల్వలపై ఆరా తీశారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీపీఓ రాంబాబు, సర్పంచ్ గాజుల కృష్ణారావు, ఎంపీడీఓ అశోక్, ఎంపీఓ శ్రీనివాసరెడ్డి, గ్రామ కార్యదర్శి అనురాధ, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. అంధుల పాఠశాల నిర్మాణం పూర్తిచేయాలి ఖమ్మం సహకారనగర్: అంధుల విద్యాభివృద్ధి కోసం అత్యున్నత ప్రమాణాలతో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జెడ్పీ సెంటర్లోని నిజాంపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న పాఠశాల పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పనులపై సూచనలు చేశాక వేగం పెంచాలని తెలిపారు. అంధ విద్యార్థులకు డిజిటల్ ఆడియో డివైజ్లు, బ్రెయిలీ లిపి పరికరాల ద్వారా బోధనను పరిశీలించారు. కాగా, అంధ విద్యార్ధిని జి.భవానీ తమకు అధునాతన సౌకర్యాలు కల్పించడంపై కలెక్టర్కు కృతజ్ఞతలు చెప్పగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కాగా, ఈ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న సెన్సార్ రూమ్, గార్డెన్ ద్వారా అంధ విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, పంచాయతీరాజ్ ఈఈ మహేష్బాబు, సీఎంఓ ప్రవీణ్కుమార్, ఏఈ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
ఇళ్లు కోల్పోయిన వారికి పట్టాలు
● ఒకటి, రెండు రోజుల్లో పంపిణీకి ఏర్పాట్లు ● 120 గజాల చొప్పున ఇవ్వాలని నిర్ణయం?ఖమ్మం అర్బన్: ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో కూల్చివేతల కారణంగా ఇళ్లు కోల్పోయిన అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. కూల్చివేతల్లో 700కు పైగా నివాసాలను తొలగించారు. వీరికి ఖమ్మం అంబేద్కర్ భవన్, టీటీడీసీలో పునరావాసం ఏర్పాటుచేయగా, ధ్రువపత్రాల ఆధారంగా సర్వే చేస్తూ అర్హుల జాబితా రూపొందిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులుగా తేలిన వారికి ఒకటి, రెండు రోజుల్లో పట్టాలు అందించే అవకాశముందని తెలిసింది. స్వస్థలం.. ప్రభుత్వ పథకాలు ఇళ్లు కోల్పోయిన వారి ఆధార్ కార్డులు, ఇతర పత్రాలతో అధికారులు సర్వే చేపట్టారు. స్వస్థలంలో ఆస్తి లేకపోవడం, ఇప్పటి వరకు ప్రభుత్వ స్థలం లేదా ఇల్లు పొందని నిరుపేదలతో జాబితా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు 290 మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు నివాసాలు కోల్పోయారు. ఇందులో అర్హులుగా తేలిన వారికి 120గజాల చొప్పున స్థలం కేటాయించే అవకాశముంది. ఖమ్మం చుట్టుపక్కల బల్లేపల్లి, రఘునాథపాలెం మండలం వీవీ.పాలెం, అల్లీపు రం, ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలతో ఇప్పటికే పరిశీలించినట్లు సమాచారం. స్థలాల గుర్తింపు పూర్తిచేశాక సర్వేలో అర్హులుగా తేలిన వారికి పట్టాలు అందించే అవకాశన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన కూల్చివేతల అంశం పట్టాల పంపిణీతో ముగుస్తుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాక పట్టాలు ఇచ్చాక అంబేద్కర్ భవనం, టీటీడీసీ కేంద్రాల నుంచి ఖాళీ చేయించే అవకాశముంది. -
బాధితులకు భరోసా
● ఇంటి వద్దే ఫిర్యాదు స్వీకరణ, ఎఫ్ఐఆర్ నమోదు ● జిల్లా పోలీసు శాఖ విన్నూత ప్రయోగంఖమ్మంక్రైం: వివిధ ఘటనల్లో నష్టపోయే వారు పోలీ సులను ఆశ్రయించడం, ఆపై ఎఫ్ఐఆర్ నమోదు, ఆతర్వాత కాపీ తీసుకోవడంలో ఇబ్బంది పడకుండా పోలీసు శాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. బాధితుల్లో కొందరు ఫిర్యాదుకు ముందుకొస్తున్నా మరికొందరు ఆరోగ్య కారణాలు, ఇతర పరిస్థితులతో పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కలేకపోతున్నారు. సమాజంలో పరువు పోతుందనే భయం ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. వీరు కాక వృద్ధులు, దివ్యాంగులు సైతం స్టేషన్కు వచ్చే పరిస్థితి ఉండడం లేదు. ఈనేపథ్యాన పోలీసులే వారి ఇంటికి వెళ్లి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టారు. హైదరాబాద్ తర్వాత... ఇంటి వద్దే కేసు నమోదు, ఎఫ్ఆర్ జారీ విధానాన్ని తెలంగాణలో తొలుత రాష్ట్ర సీఐఈ విభాగం శ్రీకా రం చుట్టింది. మొదటిసారిగా ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదును ప్రవేశపెట్టడంతో మంచి ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. దీంతో ఉన్నతాధికారుల సూచనలు, సీపీ సునీల్దత్ ఆదేశాలతోశుక్రవారం నుంచి జిల్లాలోనూ ఈ విధానం అమలుకు నిర్ణయించారు. బాధితుల ఇంటికే... ఖమ్మం మహిళా పోలీస్స్టేషన్ పరిధిలో వరకట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తామామలపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసు సిబ్బంది శుక్రవారం నేరుగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఎఫ్ఐఆర్ కాపీ అందజేశారు. అలాగే, చింతకానికి చెందిన ఇట్టా అనితతో చుట్టుపక్కల వాళ్లు గొడవ పడి దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఆమె పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుసుకున్న సిబ్బంది అనిత ఇంటికే వెళ్లి ఫిర్యాదు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధ్యతాయుతంగా... పోలీసుస్టేషన్కు రావటానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్న వారు నిరాశ పడాల్సిన పనిలేదని అధికారులు సూచిస్తున్నారు. ఘటనకు సంబంధించి సమాచా రం, ఇతర వివరాలను అక్కడి పోలీసుస్టేషన్కు తెలియచేస్తే సిబ్బందే నేరుగా ఇంటికి వచ్చి ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ జారీ చేస్తారని తెలిపారు. బాధితులకు అండగా నిలవడంలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, శారీరక దాడులు, ఆస్తి వివాదాల్లో ఒత్తిడి, పోక్సో, అట్రాసిటీ కేసులే కాక బాల్య వివాహాలు, ర్యాగింగ్ వంటి కేసుల్లో ఫోన్ ద్వారా సమాచారం ఇస్తేవిచారణ చేసి వారి ఇంటికే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదుచేస్తామని తెలిపారు. -
ప్రజాపాలనతో భవిష్యత్
సాక్షి ప్రతినిఽధి, ఖమ్మం: ప్రజలకు మేలైన పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ పేరిట చేపడుతున్న 99రోజుల కార్యాచరణతో సత్ఫలితాలు సాధిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి అధ్యక్షతన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పై శుక్రవారం ఉమ్మడి జిల్లాస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇది 99 రోజులకే పరిమితం కాకుండా, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర వేదికగా, భవిష్యత్ ప్రణాళికకు దిక్సూచిలా నిలుస్తుందని తెలిపారు. పలు ప్రాంతాల్లో డ్రెయినేజీ నిర్మాణాల్లో లోపాలను సరిచేయడమే కాక ఏ అధికారి హయాంలో పొరపాటు జరిగిందో వారిని బాధ్యులుగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. సర్వే చేపట్టండి.. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న అటవీ, రెవెన్యూ భూముల వివాదాల పరిష్కారానికి 99 రోజుల ప్రణాళికను వేదికగా చేసుకోవాలని పొంగులేటి సూచించారు. సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం, ఇల్లెందు తదితర నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉన్నందున కలెక్టర్లు, డీఎఫ్ఓలు, రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో సర్వే ద్వారా సరిహద్దులను ఖరారు చేయాలని తెలిపారు. పది అంశాలకు సంబంధించి ప్రణాళిక క్షేత్రస్థాయిలో కట్టుదిట్టంగా అమలు జరిగేలా చూడాలన్నారు. అన్ని సంక్షేమ హాస్టళ్లకు తహసీల్దార్ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించి వారానికోసారి భోజన నాణ్యత పరిశీలించాలని తెలిపారు. ఏదైనా తప్పు జరిగితే సంబంధిత అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. గ్రౌండింగ్ కాని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆసక్తి లేకపోతే అదే గ్రామంలో మరొకరికి కేటాయించాలని సూచించారు. తద్వారా ఈనెలాఖరుకు మొదటి విడత ఇళ్లన్నీ గ్రౌండింగ్ చేయాలని తెలిపారు. ఇంకా వైద్యరంగం పనితీరు మెరుగయ్యేలా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. అలాగే, జీపీలకు పెద్ద ఎత్తున వస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఎకో పార్కుల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, రైతులకు భూసార పరీక్షలు, పంట మార్పిడి విధానంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈనెల 12న ఉమ్మడి జిల్లా పరిధిలో నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు... గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు 99 రోజుల కార్యాచరణను ప్రణాళికాయుతంగా అమలు చేయాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. ఆర్థిక స్థితిగతులు సహకరించకున్నా పేదల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అర్హులకు చేర్చాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పారు. ఉద్యోగుల పనితీరు ఆధారంగానే ప్రజల్లో ప్రభుత్వంపై స్పందన ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, రాందాస్నాయక్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.మెరుగైన పాలన లక్ష్యంగా కార్యక్రమం ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పంచాయతీ, మున్సిపల్ పాలక వర్గాలను భాగస్వాములను చేయాలని కోరారు. గ్రామాల్లో ఉన్న కోతలు సమస్య, ఆహార నాణ్యత, రైతులకు అవగాహనపై దృష్టి సారిస్తూనే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నీటి సరఫరాతో కూడిన టాయిలెట్లు నిర్మించాలని తెలిపారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం ఇంటి కోసం రూ.20వేలు మంజూరైన వారికి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు తిరస్కరించకుండా అర్హులకు కేటాయించాలని సూచించారు. రెండో విడతలో అర్హులు అధికంగా ఉంటే లాటరీ పద్ధతి అనుసరించాలని తెలిపారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే అధికారులు – ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లా డుతూ ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వ సూచనల మేరకు అమలుచేస్తామని వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు ప్రతీ మండలానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. నెల కన్నా ఎక్కువ సమయం పెండింగ్ ఫైళ్లను పది రోజుల్లో క్లియర్ చేయాలన్నారు. -
చావుకు అడ్డొస్తోందని భార్యపై పెట్రోల్ దాడి
తిరుమలాయపాలెం: కిడ్నీ సంబంధిత సమస్యతో నరకయాతన పడుతున్న ఓ వ్యక్తి తన జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడాలని ప్రయత్నించాడు. కానీ కుటుంబంలో విషాదం నింపొద్దని అడ్డు తగలడమే ఆయన భార్యకు శాపమైంది. ఈక్రమంలో సదరు వ్యక్తి భార్యపై పెట్రోల్ పోసి మంట అంటించాక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై జగదీశ్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తిరుమలాయపాలెంకు చెందిన తోటమళ్ల నాగభూషణం(65) రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు.ఈ సందర్భంలో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి మూడు సార్లు ప్రయత్నించగా భార్య జయమ్మ అడ్డుపడింది. నానాటికీ సమస్య పెరుగుతుండడంతో అడ్డుపడుతున్న భార్యను ముందు చంపి ఆ తర్వాత తాను చనిపోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈమేరకు గురువారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ముందుగానే తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. కాగా, నాగభూషణం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉండగా అందరికీ వివాహాలు జరిగాయి.వీరి కుమారుడు మండల కేంద్రంలోనే మరోచోట ఉంటున్నాడు. ఇంట్లో నుంచి మంటలు వస్తుండగా స్థానికులు గమనించి కుమారుడికి సమాచారం ఇవ్వగా వచ్చి భార్యాభర్తలను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ నాగభూషణం శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందగా, జయమ్మ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
పీసీసీఎఫ్ కార్యాలయంలో మన చిహ్నం!
ఖమ్మంవ్యవసాయం: హైదరాబాద్లోని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) కార్యాలయంలో జిల్లాలోని పులిగుండాల ఎటో టూరియం నమూనాతో కూడిన చిహ్నం(లోగో) కొలువుదీరింది. రెండు నెమళ్ల ఆకృతులతో పాటు సహజ జలపాతంలా నీరు ప్రవహించే ఏర్పాటు చేసి విద్యుత్ లైట్లతో ఈ లోగో రూపొందించారు. దీన్ని గురువారం పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణకు జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ హైదరాబాద్లో గురువారం అందజేయగా రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో సీసీఎఫ్లు ప్రియాంక వర్గీస్, డాక్టర్ భీమానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ సిద్ధార్థ్ మాట్లాడుతూ జిల్లాలో పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పులిగుండాల వద్ద సౌకర్యాలు కల్పించామని తెలిపారు. -
పది మంది కార్యదర్శుల బదిలీ
నేలకొండపల్లి: జిల్లాలో పది గ్రామపంచాయతీ కార్యదర్శులను బదిలీ చేశారు. ఈమేరకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్ లోకల్ కేడర్లో భాగంగా 317 జీఓ ప్రకారం ఈ బదిలీలు జరగగా, వీరిని ఇతర జిల్లాలకు కేటాయించారు. రెబ్బవరం కార్యదర్శి కృష్ణయ్యను మంచిర్యాల జిల్లాకు, తల్లంపాడు కార్యదర్శి జంబుగ బుచ్చన్నను ఆదిలాబాద్, ఎం.వీ.పాలెం కార్యదర్శి జూకంటి శ్రీకళను పెద్దపల్లి జిల్లాకు, ముద్దునూరు కార్యదర్శి ఈ.ఏకలక్ష్మిని జనగామకు, తుంబూరు కార్యదర్శి నవీన్ను నిర్మల్కు, నేలకొండపల్లి కార్యదర్శి పి.శ్రీనివాస్ను కరీంనగర్ జిల్లాకు కేటాయించారు. అలాగే, తిరుమలాయపాలెం కార్యదర్శి పి.సజాతను జగిత్యాలకు, పిండిప్రోలు కార్యదర్శి టి.రామును పెద్దపల్లికి, బీరోలు కార్యదర్శి రఘునాథన్ను ఆసిఫాబాద్కు, పెనుబల్లి కార్యదర్శి ముస్తఫాను కరీంనగర్ జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెద్దాస్పత్రిలో క్లిష్టమైన శస్త్రచికిత్స ఖమ్మంవైద్యవిభాగం: గుండెజబ్బుతో బాధపడుతున్న గర్భిణికి ఖమ్మం జిల్లా జనరల్ ఆస్పత్రి వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఆర్.శిరీషను రెండో కాన్పు కోసం ఈనెల 4న రాత్రి ఖమ్మం ఎంసీహెచ్లో చేర్పించారు. ఆమె గుండెజబ్బుతో బాధపడుతున్నట్లు గుర్తించిన గైనకాలజీ, అనస్తీషియా, కార్డియాలజీ , జనరల్ మెడిసిన్ విభాగాల వైద్యులు శస్త్రచికిత్స చేయడంతో ఆడపిల్లకు జన్మనిచ్చింది. వివిధ విభాగాల హెచ్ఓడీలు యామిని, సీతారాంనాయక్, రాంప్రసాద్, గాయత్రి, ఉద్యోగులను జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్ అభినందించారు. ఒత్తిడికి గురికాకుండా చదువులో రాణించాలి ఖమ్మం మామిళ్లగూడెం: విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా చదువుకుని రాణించాలని ఖమ్మం టూ టౌన్ సీఐ వెంకటేశ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాంబాబు సూచించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన పదో తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ మంచికంటి భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వంకాయల రాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వెంకటేశ్, రాంబాబు మాట్లాడుతూ గత 30ఏళ్లుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన టాలెంట్ టెస్ట్ నిర్వహించటం అభినందనీయమని తెలిపారు. వీటి ద్వారా విద్యార్థులకు పరీక్షలపై అవగాహన ఏర్పడి మంచి మారమార్కులు సాధించడం సాధ్యమవుతుందన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ మండలాల వారీగా పరీక్షలు నిర్వహించి.. మమొదటి ఐదు స్థానాల్లో నిలిచిన వారికి జిల్లా స్థాయిలో టాలెంట్ నిర్వహించినట్లు తెలిపారు. నాయకులు దొంతబోయిన వెంకటేష్, త్రినాథ్, సుశాంత్, సింధు, శ్యామ్, లోహిత్కుమార్, లోకేష్, జానీపాషా, హారిక, కీర్తన, అశోక్, సాయి, పూజిత, నవ్య తదితరులు పాల్గొన్నారు. మద్యం అమ్మితే రూ.25 వేల జరిమానా.. వెంకటాపురం గ్రామస్తుల తీర్మానంకరకగూడెం: మండలంలోని వెంకటాపురం గ్రామంలో మద్యపాన నిషేధానికి పంచాయతీ పాలకవర్గం నడుం బిగించింది. ఈ మేరకు సర్పంచ్ చౌలం కేశవరావు ఆధ్వర్యంలో గురువారం గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పరిధిలో ఎవరైనా మద్యం విక్రయించినా, రవాణా చేసినా రూ.25వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అక్రమ విక్రయాల సమాచారం అందించిన వారికి రూ.2 వేల నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. అనంతరం ఉపసర్పంచ్ ఈసం కోటేశ్వరరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్తో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో తీర్మాన ప్రతిని అందజేశారు. -
ఫాసిస్టు విధానాలను ప్రతిఘటించండి
ఖమ్మం మామిళ్లగూడెం: కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న ఫాసిస్టు విధానాలను ప్రతిఘటించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యురాలు టాన్యా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీకి వందేళ్లు నిండిన సందర్భంగా న్యూడెమోక్రసీ ఆధ్వర్యాన ఖమ్మంలో గురువారం జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు బి,భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నాయకులు పాల్గొని అమరులకు నివాళులర్పించారు. అనంతరం టాన్యా మాట్లాడుతూ దేశంలో పోలీసు రాజ్యం నడుస్తోందని.. కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీలు పరుస్తున్నారని ఆరోపించారు. తక్కువ ధరతో కార్పొరేట్లకు భూములు కట్టబెడుతున్న పాలకులు.. మరోపక్క రైతాంగాన్ని దెబ్బతీసేలా చట్టాలు చేస్తున్నారని విమర్శించారు. నాయకుడు అశోక గాయల్ మాట్లాడగా ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర కమిటీల సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు ఆరెల్లి కృష్ణ, కె.విశ్వనాథ్, ప్రకాష్, కందగట్ల సురేందర్, రాంమూర్తి, సాంబ, సాయిలు, గనిరాజ్, దోంతోజ్ ఉపేందర్, యలమద్ది కళాధర్, కీలారి నాగేశ్వరావు, వెంకటరెడ్డి ప్రతాపరెడ్డి, చిట్టిబాబు, గనిరాజ్ చిట్టిబాబు, నున్నా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీ కేంద్ర కమిటీ సభ్యురాలు టాన్యా -
నాగిలిగొండ డీలర్పై కేసు నమోదు
బియ్యం నిల్వల్లో తేడాతో చర్యలుచింతకాని: చింతకాని మండలం నాగిలిగొండ రేషన్ డీలర్ చాట్ల శ్రీనుపై 6ఏ కేసుతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి చందన్కుమార్ తెలిపారు. రేషన్ దుకాణాన్ని ఆయన గురువారం తనిఖీ చేయగా 112.61 క్వింటాళ్లకు బదులు 52.50 క్వింటాళ్ల బియ్యం ఉండడం, 60.11 క్వింటాళ్ల నిల్వ తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో డీలర్పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రేషన్ దుకాణాల డీలర్లు సక్రమంగా బియ్యం పంపిణీ చేయడంతో పాటు రిజిస్టర్లలో అన్ని వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా అక్రమాలకు పాల్పడినా కేసులు తప్పవని హెచ్చరించారు. ‘భూదాన్’ పేరుతో మోసం.. నలుగురి అరెస్ట్ ఖమ్మం అర్బన్: ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్, ప్రభుత్వ భూముల పేరుతో అమాయకులను మోసగించిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. నిందితులు ముఠాగా ఏర్పడి తాము ఓపీడీఆర్కు చెందిన వారమని, భూదాన్ కమిటీ సభ్యులమని తప్పుడు ప్రచారం చేస్తూ భూదాన్ భూముల్లో గృహ స్థలాలు ఇప్పిస్తామని పలువురి నుంచి భారీగా డబ్బు వసూలు చేశారని వెల్లడించారు. అంతేకాక భూదాన్, ప్రభుత్వ భూములను ఆక్రమించి వాటిని చూపిస్తూ ప్రజలను మోసం చేశారని తెలిపారు. ఈమేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో బల్లి శ్రీనివాస్, కోపెర వెంకన్న, కొట్టే బసు, సంపంగి వెంకటాచలంను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు. -
సరి‘కొత్త’ కళ!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కళ తప్పిన కొత్తగూడెం ఏరియాకు మళ్లీ జీవం రానుంది. మూడేళ్లుగా ఊరిస్తున్న వెంకటేశ్ఖని మెగా ఓపెన్ కాస్ట్ కమ్ అండర్ గ్రౌండ్ మైన్ నుంచి బొగ్గు ఉత్పత్తి అధికారికంగా మొదలవబోతోంది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం అవసరమైన చర్యలు చేపడుతోంది. రెండేళ్లుగా ఎదురుచూపులు గతంలో మూతబడిన వెంకటేశ్ఖని (వీకే) భూగర్భ గని, గౌతంఖని ఓపెన్కాస్ట్ మైన్లను ప్రస్తుతం నడుస్తున్న పద్మావతి భూగర్భ గనితో అనుసంధానం చేస్తూ వెంకటేశ్ఖని మెగా ఓపెన్కాస్ట్ కమ్ అండర్గ్రౌండ్ మైన్ ప్రాజెక్టును చేపట్టాలని సింగరేణి 2021లో నిర్ణయించింది. ముందుగా వేసుకున్న అంచనాల ప్రకారం ఈ గని నుంచి 2024 నాటికి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలి. కానీ పర్యావరణ అనుమతులు, సాంకేతిక చిక్కుల కారణంగా గత రెండేళ్లుగా మొదలు కాలేదు. ఎట్టకేలకు గతేడాది నవంబర్ నుంచి ఈ గనిలో పనులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మార్చి మొదటి వారం వరకు నిర్విరామంగా ఉపరితలంలో మట్టిని (ఓవర్ బర్డెన్)ని తొలగిస్తూ రాగా, ఇటీవల బొగ్గు నిల్వలు వెలుగు చూశాయి. 35 ఏళ్ల పాటు ఉత్పత్తి.. వీకే మెగా ఓసీలో 317 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. కనీసం 190 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు వెలికి తీసే అవకాశముంది. ఇక్కడ లభించే బొగ్గు సబ్బిటుమినస్ రకానికి చెందినదిగా గుర్తించారు. ఈ బొగ్గును థర్మల్ పవర్ ప్లాంట్లలో ఎక్కువగా వినియోగిస్తారు. సాలీనా ఈ బొగ్గు గని నుంచి 6.30 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఇందులో 5.30 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఓసీ విధానంలో, ఒక మిలియన్ మెట్రిక్ టన్ను బొగ్గును అండర్గ్రౌండ్ నుంచి వెలికి తీస్తారు. ఇక్కడ 2,403 హెక్టార్ల పరిధిలో బొగ్గును వెలికి తీసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కొత్త బొగ్గు గని అందుబాటులోకి రానుండడంతో కార్మికులతో కొత్తగూడెం మళ్లీ కళకళలాడనుంది. ఈ గని జీవిత కాలం 35 ఏళ్లు ఉండనుంది. వెయ్యి మంది పర్మనెంట్, అంతే సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు గని పనుల్లో బిజీ కానున్నారు. వరుసగా మూతబడిన గనులు దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే కొత్తగూడెంలో సింగరేణి సంస్థ బొగ్గు వెలికితీస్తోంది. ఈ క్రమంలో వెంకటేశ్ ఖని(వీకే)ని 1954లో ప్రారంభించింది. ఈ గని పరిధిలోకి వచ్చే భూభాగం అడుగున 300 మీటర్ల కంటే లోతులో నిల్వ ఉన్న బొగ్గును ఇక్కడ దశాబ్దాల తరబడి తవ్వి తీశారు. బొగ్గు నిల్వలు అడుగంటిపోవడంతో 2021లో మూసేశారు. ఈ గనికి ఒక వైపున పద్మావతిఖని –5 పేరుతో 1991లో భూగర్భ గనిని ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 300 అడుగుల కంటే దిగువన భూగర్భంలో బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. వెంకటేశ్ ఖనికి మరోవైపున గౌతంఖని పేరుతో ఓపెన్ కాస్ట్ మైన్ను 1991లోనే మొదలుపెట్టారు. భూ ఉపరితలం నుంచి 300 అడుగుల లోతు వరకు ఉన్న బొగ్గును వెలికి తీశారు. నిల్వలు అడుగంటి పోవడంతో ఈ గని 2021లోనే మూత పడింది. ఇప్పుడు ఈ మూడు గనులను కలుపుతూ వెంకటేశ్ఖని మెగా ఓపెన్ కాస్ట్ కమ్ అండర్ గ్రౌండ్ మైన్ అందుబాటులోకి రానుంది. భూ ఉపరితలం నుంచి 300 నుంచి 450 అడుగుల లోతులో ఉన్న బొగ్గునే వీకే 7 గని ద్వారా దాదాపు 65 ఏళ్లకు పైగా వెలికి తీశారు. కానీ 300 అడుగుల పైన కూడా భారీ స్థాయిలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు వీకే భూగర్భ గని పై భాగంలో ఉన్న బొగ్గు నిల్వలను ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా వెలికితీస్తారు. ఇక్కడ బొగ్గు నిల్వల కోసం తీసే ఓవర్ బర్డెన్ మట్టితో గతంలోనే మూతపడిన గౌతంఖని ఓపెన్ కాస్ట్లో ఏర్పడిన ఖాళీలను(గుంతలు) పూరిస్తారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ గనిగా కొనసాగుతున్న పద్మావతి భూగర్భ గనిని కూడా వీకే పరిధిలోకి తీసుకొస్తారు. పద్మావతి ఖనిలో బొగ్గు ఉత్పత్తి 2030 వరకు జరగనుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా ఓపెన్ కాస్ట్ పద్ధతిలో బొగ్గు వెలికి తీయనున్నారు. కాగా, కొత్తగూడెం ఏరియా జీఎం శాలేంరాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. వీకే 7 మెగా ఓసీలో బొగ్గు ఉత్పత్తిని శనివారం ఉదయం 8 గంటలకు సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం పీవీకే అండర్ గ్రౌండ్ మైన్ను పరిశీలిస్తారని చెప్పారు. బొగ్గు ఉత్పత్తికి సిద్ధమైన వెంకటేశ్ ఖని మెగా ఓసీ -
జెడ్పీ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి మృతి
టేకులపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గోనెల విజయలక్ష్మి(79) గురువారం గుండెపోటుతో పాల్వంచలో మృతి చెందారు. ఆమె మృతదేహన్ని స్వగ్రామమైన టేకులపల్లి మండలం ప్రెగళ్లపాడు పంచాయతీ పరిధి తెలుగూరుకు తీసుకొచ్చారు. కాగా, విజయలక్ష్మి అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. 2006లో టేకులపల్లి జెడ్పీటీసీగా ఆమె గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ – సీపీఎం కూటమికి సమానంగా సీట్లు రావడంతో టాస్ ద్వారా విజయలక్ష్మికి చైర్పర్సన్గా అవకాశం దక్కింది. ఆమె భర్త వెంకటనారాయణ కాంగ్రెస్లో కీలక నేతగా కొనసాగారు. ప్రత్యర్థుల చేతిలో ఆయన 1991లో హత్యకు గురయ్యారు. గంజాయి రవాణా కేసులో 20ఏళ్ల జైలుశిక్ష ఖమ్మంలీగల్: గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ముగ్గురికి 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె.ఉమాదేవి గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... 2021 ఏప్రిల్ 7న రఘునాథపాలెం పోలీసులు వెంకటాపాలెం శివార్లలో తనిఖీ చేస్తుండగా కారులో తరలిస్తున్న రూ.30 లక్షల విలువైన 194 కేజీల గంజాయి లభించింది. ఈమేరకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఆంజనేయులు తండాకు చెందిన బోడ వాల, బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన కొండపల్లి రవితేజ, బొజ్జ వంశీను అదుపులో తీసుకుని విచారించగా ఏపీలోని డొంకరాయి నుండి హైదరాబాద్ గంజా యి సరఫరా చేస్తునట్లు అంగీకరించారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జీషీటు దాఖలు చేయగా విచారణలో నేరం రుజువు కావడంతో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్కు సహకరించిన ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఏపీపీ జె.శరత్కుమార్రెడ్డి, సిబ్బంది సాంబశివరావు, కె.శ్రీకాంత్, ఎండీ.ఆయూబ్ను పోలీసు అధికారులు అభినందించారు. చెల్లని చెక్కు కేసులో ఆరు నెలలు... ఖమ్మం లీగల్: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో మహిళకు ఆరు నెలల జైలుశిక్ష విదిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కాసరగడ్డ దీప గురువారం తీర్పు చెప్పారు. ఖమ్మం రాపర్తినగర్కు చెందిన నరహరిశెట్టి విజయలక్ష్మి వద్ద కూరపాటి పద్మజ 2018 ఫిబ్రవరిలో రూ.13లక్షల అప్పు తీసుకుంది. ఆపై 2019 మార్చిలో రూ.15లక్షలకు చెక్కు జారీ చేసినా ఆమె ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో విజయలక్ష్మి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేసింది. విచారణ అనంతరం పద్మజకు జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.15లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పారు. -
మేము సైతం.. భాగమవుతాం..
భద్రాచలం: దేవుడిపై తమకు గల భక్తిని పలువురు పలు రకాలుగా చూపిస్తుంటారు. కొందరు భజనలు, కీర్తనల ద్వారా నీరాజనం పలుకుతారు. మరి కొందరు ఉపవాసాలు, నిరంతర పూజలతో కొలుస్తుంటారు. తెలుగు వారి ఇలవేల్పుగా, అందరి బంధువుగా కీర్తిస్తున్న భద్రాద్రి రామయ్య దర్శనానికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. శ్రీరామనవమి రోజున స్వామి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి, తలంబ్రాలు స్వీకరించడమే పరమానందంగా భావించే వారు ఒకప్పుడు. కానీ ప్రస్తుతం భక్తులు ఆ తలంబ్రాల తయారీలో భాగస్వాములై రామయ్యపై భక్తిని చాటుకుంటున్నారు. తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు భక్తులు నిష్టగా గోటితో తలంబ్రాలు వొలుస్తూ, పాదయాత్రగా రామయ్య చెంతకు చేరుస్తుండగా.. వీరి సంఖ్య ఏటేటా పెరుగుతుండడం విశేషం. ప్రతీ గింజపై శ్రీరామ ఆవాహనం.. సాధారణంగా ఒడ్లను రోట్లో దంచి బియ్యంగా చేస్తారు. కానీ ప్రతీ గింజనూ గోటితో వొలుస్తూ వాటిపై శ్రీరామ నామ ఆవాహనం చేస్తూ కఠోర నిష్టతో యజ్ఞంలా ఈ క్రతువు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కోరుకొండకు చెందిన అప్పారావు బృందం దీనికి ఆద్యులు కాగా, ఆ తర్వాత తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు విస్తరించింది. వారు గత రెండు దశాబ్దాలుగా పొలం దున్నడం నుంచి నాట్లు వేసి, కోత కోసి, గోటితో వొలిచే వరకు భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. గత పదేళ్లుగా తెలంగాణలోని పలు జిల్లాల భక్తులు సైతం గోటి తలంబ్రాలు తీసుకొస్తున్నారు. శ్రీరామనవమికి రెండు, మూడు నెలల ముందు నుంచే వరి ధాన్యాన్ని ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో ఉదయం, సాయంత్రం రెండు గంటల పాటు శ్రీరామ నామ స్మరణ చేస్తూ వొలిచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. నవమికి ముందు ఆయా గ్రామాల నుంచి కోలాటాలు, పాదయాత్రగా భద్రాచలం చేరుకుని సమర్పిస్తున్నారు. ఆలయ అర్చకులు వీటిని స్వామి వారి చెంత పూజలు చేశాక, కల్యాణ తలంబ్రాలలో వినియోగిస్తారు. దేవస్థానం నుంచి ఆదరణ అంతంతే.. నియమ నిష్టలు, కఠోర దీక్షతో మండు టెండల్లో కాళ్లకు చెప్పులు సైతం ధరించకుండా రామయ్య చెంతకు వచ్చే వారికి ఆలయంలో దక్కే ఆదరణ తక్కువనే చెప్పాలి. కేవలం ఉచిత దర్శన సౌకర్యం, మధ్యాహ్నం నిత్యన్నదాన ప్రసాదమే సమకూ రుస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అల్పాహారం కల్పించలేకపోతున్నారు. 24 గంటల పాటు నడిచి వచ్చే భక్తులకు ఆలయం ఆధ్వర్యంలో సరిపడా వసతి కల్పించలేకపోతున్నారు. భద్రాచలంలో స్థానిక వస్త్ర వ్యాపారిని సంప్రదించగా ఆయన తన మిత్ర బృందంతో ఆరేళ్లుగా టిఫిన్లు, టీతో పాటుగా మజ్జిగ ఉచితంగా అందిస్తున్నారు. తొలుత 500 మందికి అందించగా, ఈ ఏడాది 5 వేల మందికి నిరంతరాయంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా గ్రామాల్లో భక్తులు సేద తీరేందుకు, బస చేసేందుకు డార్మెటరీ గదులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.గోటి తలంబ్రాలను కఠిన నిష్ట, క్రమశిక్షణతో వొలిచాం. ప్రతీ గింజకు శ్రీరామ నామస్మరణ చేస్తూ పాల్గొన్నాం. సీతారాముల కల్యాణంలో వినియోగించే తలంబ్రాల తయారీలో భాగస్వామ్యం కావటం చాలా సంతోషంగా ఉంది. – జె.శ్రీలక్ష్మి, మోరంపల్లి బంజర -
రిటైర్డ్ ఎస్ఐ కుటుంబంలో మరో విషాదం
ఖమ్మంక్రైం: ప్రభుత్వం నుంచి బకాయిలు సకాలంలో అందక ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాగా.. అనారోగ్యంతో బాధపడుతూ రెండు వారాల క్రితం మృతి చెందిన రిటైర్డ్ ఏఆర్ ఎస్ఐ మైసయ్య కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. మైసయ్యతో పాటే అనారోగ్యానికి గురైన ఆయన భార్య భాగ్యమ్మ మృతి చెందింది. ఆరోగ్యం విషమించడమే కాక భర్త మృతి చెందినట్లు తెలియడంతో ఆమె మృతి చెందగా గురువారం మృతదేహాన్ని ఖమ్మం తీసుకొచ్చారు. మైసయ్య మృతి చెందిన మరుసటిరోజు ప్రభుత్వం బకాయిల్లో కొంత మేర విడుదల చేసిన విషయం విదితమే. కాగా, భాగ్యమ్మ మృతదేహం వద్ద విశ్రాంత పోలీసు అధికారుల సంఘం బాధ్యులు నివాళులర్పించి మాట్లాడారు. మైసయ్య దంపతుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. వీరి పెద్దకుమారుడు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నందున వైద్యానికి నెలకు రూ.20వేలు ఖర్చవుతోందని తెలిపారు. ఆయనకు ప్రభుత్వం ఉద్యోగంతో పాటు తండ్రి పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.రాధాకృష్ణమూర్తి, రుద్ర వెంకటనారాయణతో పాటు ప్రతాప్రెడ్డి, బి.రాజారావు, ప్రసాదరావు, దామోదర్రావు, కిషోర్బాబు, ప్రభాకర్ పాల్గొన్నారు.బకాయిల్లో జాప్యంతో ఇటీవల భర్త మృతి, ప్రస్తుతం భార్య కన్నుమూత -
ఇదిగిదిగో చిరుత..!
● జిల్లా అడవుల్లో సంచరిస్తున్నట్లు గుర్తింపు ● సీసీ కెమెరాల్లో ఎలుగుబంట్లు కూడా నమోదు ● సంరక్షణపై దృష్టి సారించిన అటవీశాఖరిజర్వ్ ఫారెస్ట్లో గర్తించిన చిరుత పులులుఖమ్మంవ్యవసాయం: జిల్లా అడవుల్లో చాలా ఏళ్ల తర్వాత చిరుత సంచారాన్ని గుర్తించారు. కొన్నాళ్లుగా అటవీ సంరక్షణపై దృష్టి సారించడంతో పాటు జంతువులు, వన్యప్రాణుల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సాసర్ పిట్ల ద్వారా నీరు సమకూరుస్తూ అగ్నిప్రమాదాల నివారణకు కృషి చేస్తుండడంతో జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని గుర్తించారు. ఈమేరకు 360 డిగ్రీల కోణంలో ఫొటోలు తీసే సామర్థ్యం కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటుచేయడమే కాక డ్రోన్ల ద్వారా అటవీ ప్రాంతాన్ని రికార్డు చేస్తున్నారు. ఈక్రమాన బిడ్డతో కూడిన చిరుత తిరుగుతున్నట్లు తేలింది. అలాగే, ఎలుగుబంట్లు కూడా తిరుగుతున్నాయని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈమేరకు వీటి సంరక్షణపై దృష్టి సారించడమే కాక ఇతర ప్రాంతాల నుంచి వచ్చాయా.. ఇక్కడే స్థిరనివాసం ఉంటున్నాయా అనే అంశాన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 70వరకు జీవజాతులు వన్యప్రాణుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టిన అటవీ శాఖ... నిర్దేశిత అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల జనాభాను శాసీ్త్రయంగా లెక్కించేందుకు అధునాతన సాంకేతిక విధానాలను ఉపయోగిస్తోంది. వేసవిలో వన్యప్రాణులకు అవసరమైన నీరు సమకూర్చేందుకు సాసర్ పిట్లు నిర్మించడతో పాటు అగ్నిప్రమాదాల నివారణపైనా దృష్టి సారించారు. ఇదే సమయాన సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తుండడంతో ఖమ్మం, సత్తుపల్లి అటవీ డివిజన్ల పరిధి అటవీ ప్రాంతాన వన్యప్రాణులు నివసిస్తున్నట్లు తేలింది. దాదాపు 70 జాతుల వరకు జీవాలు ఉంటున్నాయని ఇటీవల చేపట్టిన సర్వేలో తేలడంతో వీటి సంరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాల్లో చిరుతపులులు, ఎలుగుంట్లు వంటివి నమోదు కావడంతో ఆరోగ్య స్థితిగతులపై ఆరాతీస్తూ జీవన విధానాన్ని పరిశీలి స్తున్నారు. అంతేకాక దాహార్తి తీర్చుకునేందుకు అటవీ ప్రాంతం నుంచి బయటకు రాకుండా నీటి కుంటలు, సోలార్ పంపుల ద్వారా సాసర్ పిట్లలో నిరంతరం నీరు అందుబాటులో ఉంచుతున్నారు. వేటగాళ్ల కట్టడిపై దృష్టి జిల్లాలో వన్యప్రాణులను గతంలో వేటాడిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వన సంరక్షణ సమి తుల ద్వారా వన్యప్రాణులను వేటాడే వారిని గుర్తించి వారికి కౌన్కెసలింగ్ ఇస్తున్నారు. అటవీ ప్రాంతం సమీపాన నివసించే వారికి జంతువులను వేటాడితే ఎదురయ్యే అనర్థాలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక రాత్రి సమయాన అడవిలోకి వెళ్లకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.జిల్లాలో వన్యప్రాణుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేకించి వేసవిలో తాగునీరు సమకూర్చేలా నీటి కుంటలు నిర్మించడంతో సోలార్ బోర్ల ద్వారా నీరు నింపుతున్నాం. ఇదే అధునాతన సాంకేతికతతో వన్యప్రాణుల జీవన విధానం, ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం. అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణలో ప్రజలు కూడా సహకరించాలి. – సిద్ధార్థ్ విక్రమ్సింగ్, జిల్లా అటవీ అధికారి -
పరుగులు తీసే అవస్థ ఉండదు..
● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపనతిరుమలాయపాలెం: అర్ధరాత్రి వేళ ఆపద వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఖమ్మం పరుగు తీయాల్సిన పరిస్థితి ఇకపై ఉండదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గిరిజన బిడ్డలకు ప్రభుత్వ వైద్యాన్ని దరిచేర్చే లక్ష్యంతో తమ ప్రభుత్వం పాటుపడుతోందని తెలిపారు. తిరుమలాయపాలెంలో రూ.26కోట్ల వ్యయంతో నిర్మించనున్న 100 పడకల ఆస్పత్రి భవనానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశాక మాట్లాడారు. జిల్లా ఆస్పత్రిని తలపించేలా అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. గతంలో 30 పడకలుగా ఉన్న ఆస్పత్రిని వంద పడకలకు అప్గ్రేడ్ చేస్తుండడంతో ప్రసవాలు, అత్యవసర చికిత్స కోసం ఖమ్మం వెళ్లాల్సిన బాధలు తప్పుతాయని పేర్కొన్నారు. డయాలసిస్ యూనిట్లు, అత్యాధునిక పరికరాలతో కూడిన వైద్యం కొద్ది నెలల్లోనే అందుబాటులోకి వస్తుందని భరోసా ఇచ్చారు. అయితే, ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా వైద్యులు అంకితభావంతో పనిచేసినప్పుడే లక్ష్యం నెరవేరుతుందని, వైద్యులు అందుబాటులో ఉంటారనే నమ్మకం కలిగినప్పుడు ప్రజలు వస్తారని తెలిపారు. ఈమేరకు వైద్యులు, సిబ్బంది స్థానికంగా ఉంటూ సేవలు అందించాలని ఆదేశించారు. విధుల్లో చిత్తశుద్ధి చూపే వారికి ప్రత్యేక బహుమతులు అందజేస్తానని మంత్రి ప్రకటించారు. కలెక్టర్తో పాటు అధికారులు కూడా తరచూ ఆస్పత్రులను పరిశీలించాలని తెలిపారు. విద్య, వైద్యారంగాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం పనిచేస్తోందని పొంగులేటి వెల్లడించారు. ఆస్పత్రి నిర్మాణ పనులు వేగంగా చేపడుతూ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి చెక్కులు అందజేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృపాఉషశ్రీ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీసీహెచ్ఎస్ రాజశేఖర్గౌడ్, డీఎంహెచ్ఓ రామారావు, హౌజింగ్ పీడీ శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ చందునాయక్ ఎంపీడీఓ సిలార్సాహెబ్, తహసీల్దార్ విల్సన్, ఆత్మకమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణతో పాటు బెల్లం శ్రీనివాస్, కొప్పుల అశోక్, బోడ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
జలవిలాపం
జిల్లాలో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. జిల్లా భూగర్భ జలశాఖ తాజా లెక్కల ప్రకారం... డిసెంబర్లో భూఉపరితలం నుంచి కేవలం 2.89 మీటర్ల లోతుల్లోనే లభ్యమైన నీరు.. ఫిబ్రవరి నాటికి 4.08 మీటర్ల లోతుకు పడిపోయింది. అంటే మూడు నెలల వ్యవధిలోనే 1.19 మీటర్ల మేర నీటి మట్టం పడిపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. రానున్న ఏప్రిల్, మే నెలల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంకొన్ని మండలాల్లో కాస్త పైకి.. జిల్లాలో ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో కొన్ని మండలాల్లో భూగర్భ జలాలు తగ్గగా.. మరికొన్నిచోట్ల మాత్రం పెరిగాయి. అత్యధికంగా కామేపల్లి మండలంలో 2.37 మీటర్ల మేరకు నీరు ఇంకింది. ఈ మండలంలో జనవరిలో 4.88 మీటర్ల వద్ద నీరు ఫిబ్రవరి వచ్చే వరకు 7.25 మీటర్లకు పడిపోయింది. రఘునాథపాలెం మండలంలో 3.77 మీటర్ల నుంచి 5.47 మీటర్లకు పడిపోయింది. ఇక ఎర్రుపాలెం, వేంసూరు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కాగా, బోనకల్లో 0.19 మీటర్లు, చింతకానిలో 0.10, వైరాలో 0.04 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే.. ప్రస్తుతం భూగర్భ జలాలు తగ్గుతున్నా, గత ఏడాదితో పోలిస్తే పరిస్థితి కొంతమేర ఆశాజనకంగానే ఉంది. 2024 డిసెంబర్లో 3.87 మీటర్ల వద్ద నీరు ఉండగా.. 2025 డిసెంబర్లో 2.89 మీటర్ల వద్దే నీటి లభ్యత ఉంది. అంటే 0.98 మీటర్ల మేర నీరు పైనే ఉన్నట్లు గుర్తించారు. ఇక గత ఏడాది జనవరిలో 4.49 మీటర్ల వద్ద ఉంటే ఈ ఏడాది జనవరిలో 3.50 మీటర్ల వద్ద నీటి లభ్యత నమోదైంది. గత ఏడాది ఫిబ్రవరిలో 4.99 మీటర్ల వద్ద.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 4.08 మీటర్ల వద్దే ఉండడం కాస్త ఊరట కలిగించే అంశంగా చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే పరిస్థితి కొంతమేర బాగానే ఉన్నా రానున్న నెలల్లో పరిస్థితి ఏమిటనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇక్కట్లు తప్పవా ? కొద్దినెలలుగా భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతుండడంతో ఈ వేసవిలో నీటికి కటకట ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ప్రధానంగా తాగునీటికి సంబంధించి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ వేసవిలో భానుడి ప్రతాపం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతున్నందున భూగర్భ జలాలు మరింత ఇంకిపోయేందుకు ఆస్కారం ఉంది. గత నాలుగైదు నెలలుగా భారీ వర్షాలు కురవకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యాన వేసవిలో అడపాదడపా వర్షాలు కురిస్తేనే పరిస్థితి కాస్త కుదుటపడుతుందని భావిస్తున్నారు. అయినా వేసవిలో నీటి ఎద్దడి ఎదురుకాకుండా అత్యధికంగా భూగర్భ జలాలు పడిపోయే గ్రామాల్లో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. సత్తుపల్లి.. పాతాళంలో జిల్లాలోని మొత్తం 21 మండలాలను పరిశీలిస్తే సత్తుపల్లి మండలంలోనే భూగర్భ జలాలు అత్యంత దిగువన ఉన్నాయి. 2025 డిసెంబర్, 2026 జనవరి, ఫిబ్రవరి నెలల్లో పరిశీలిస్తే భూగర్భ జలాలు తగ్గుతూ రావడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్లో ఇక్కడ 10.23 మీటర్ల వద్ద ఉన్న నీరు ఈ ఏడాది జనవరిలో 10.92 మీటర్లకు, ఫిబ్రవరిలో 11.82 మీటర్ల వద్దకు పడిపోయింది. అదే 2024 డిసెంబర్లో 12.6 మీటర్లు, 2025 జనవరిలో 13.75, ఫిబ్రవరిలో 14.45 మీటర్లకు పడిపోయినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. 2024 – 05తో పోలిస్తే 2025 – 26లో సత్తుపల్లిలో భూగర్భ జలాల నీటిమట్టం ఆశాజనకంగానే ఉండడం కాస్త ఊరట కలిగిస్తోంది.జిల్లాలో గత ఏడాది డిసెంబర్లో 2.89 మీటర్ల వద్ద భూగర్భ జలాలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరికి అవి 3.50 మీటర్ల కిందకు పోయాయి. అంటే నెలలోనే 0.61 మీటర్ల మేర నీరు తగ్గింది. ఫిబ్రవరి వచ్చే నాటికి అది 4.08 మీటర్లకు వెళ్లింది. ఇలా నెలనెలకు భూగర్భ జలాలు తగ్గుతుండడం గమనార్హం.గణనీయంగా తగ్గుతున్న భూగర్భ జలాలు -
ప్రతిభ వెలికితీత, ప్రోత్సాహానికి పరీక్షలు
భద్రాచలం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభ వెలికితీయడంతో పాటు ప్రోత్సహించేందుకు ముందస్తు పరీక్షలు దోహదపడతాయని ఐటీడీఏ ప్రాజెక్టు అఽధికారి బి.రాహుల్ తెలిపారు. భద్రాచలంలోని ఏజీహెచ్ఎస్ బాలికల ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న పరీక్షలను గురువారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఆందోళనకు గురికాకుండా వార్షిక పరీక్షలు రాసేలా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 89 గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో 395 మంది పరీక్షలు రాశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీడీ అశోక్, ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, తదితరులు పాల్గొన్నారు. 13న పండితాపురం సంత వేలం కామేపల్లి: పశువుల క్రయ, విక్రయాలకు రాష్ట్రంలోనే పేరున్న పండితాపురం వారాంతపు సంత వేలం ఈనెల 13న నిర్వహిస్తున్నట్లు కొమ్మినేపల్లి సర్పంచ్, కార్యదర్శులు ధరావత్ అనురాధ, శంకర్ తెలిపారు. శ్రీ కృష్ణప్రసాద్ పశువుల సంత బహిరంగ వేలం ఈనెల 13న సంత ఆవరణలో ఉదయం 11గంటలకు మొదలవుతుందని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 31వరకు కాల పరిమితితో నిర్వహించే వేలంలో పీసా చట్టం ప్రకారం గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్టీలకు మాత్రమే అర్హులని తెలిపారు. రూ.30 లక్షల ధరావతు, రూ.5లక్షల సాల్వెన్సీని డీడీ లేదా నగదు రూపంలో చెల్లించి పాల్గొనాలని సూచించారు. నేడు మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పలు కార్యక్రమాలకు మంత్రి హాజరవుతారు. ఆతర్వాత 10గంటల కు ఖమ్మం కలెక్టరేట్లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికపై జరిగే ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. స్టాఫ్ అసిస్టెంట్ అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికై న వారి సర్టిఫికెట్ల పరిశీలన మొదలైంది. డీసీసీబీలో 99 ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష నిర్వహించగా ఫిబ్రవరి 17న ఫలితాలు వెల్లడించారు. ఇందులో ఎంపికై న 98 మంది సర్టిఫికెట్ల పరిశీలన బుధవారం డీసీసీబీ ప్రధా న కార్యాలయంలో సీఈఓ ఎన్.వెంకటఆదిత్య పర్యవేక్షణలో ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటి వారంలోగా అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేసే అవకాశముంది. -
రేపు జాబ్ మేళా
ఖమ్మం రాపర్తినగర్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈనెల 6వ తేదీ శుక్రవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖా ధికారి ఎన్.మాధవి తెలిపారు. మెడ్ప్లస్లో ఫార్మసిస్ట్, క్యాషియర్, జూనియర్ అసిస్టెంట్, ఆడిట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఖమ్మం టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్లో ఇంటర్వ్యూ లు ఉంటాయని వెల్లడించారు. 18నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్లతో ఉదయం 10గంటలకు మొదలయ్యే ఇంటర్వ్యూలకు హాజరు కావా లని సూచించారు. మదర్థెరిస్సా ఫార్మసీ కాలేజీకి అటానమస్ హోదాసత్తుపల్లిరూరల్: మండలంలోని కొత్తూరులో ఉన్న మదర్థెరిస్సా ఫార్మసీ కళాశాలకు స్వ యం ప్రతిపత్తి హోదా మంజూరు చేస్తూ యూ జీసీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. హైదరా బాద్ జేఎఎన్టీయూకు అనుబంధంగా కొనసాగుతున్న ఈ కళాశాలకు 2030–2031 వరకు అటానమస్ హోదా వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈవిషయాన్ని కళాశాల చైర్మన్ కంచర్ల సత్యనారాయణ, కరస్పాండెంట్ చలసాని సాంబశివరావు, డైరెక్టర్ డాక్టర్ కందిమళ్ల కృష్ణారావు బుధవారం వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వయం ప్రతిపత్తి పొందిన ఏకై న ఫార్మసీ కళాశాల తమదేనని తెలిపారు. ఈసమావేశంలో ప్రిన్సిపాల్ యర్రా రాజేశ్వర్, వైస్ ప్రిన్సిపాల్ కుమార్రాజా జయవరపు, ఐక్యూ కోఆర్డినేటర్ దాసరి ప్రవీణ్కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నూతన కమిటీఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నూతన ఉమ్మడి జిల్లా కమిటీని రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ బుధవారం ప్రకటించారు. ఖమ్మం బీకే బజార్లో జరిగిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ పాలకుర్తి కృష్ణతో పాటు మరికొందరికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొ న్న వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలనికోరారు. ఈ సమవేశంలో నాయ కులుమందా వెంకటేశ్వర్లు, అశోక్సింగ్, ఎల్. ఎస్.రెడ్డి, వెంకటేశ్వరరావు, రామకృష్ణ, అవి బియా, ధనలక్ష్మి, కృష్ణబాబు పాల్గొన్నారు . ఉద్యోగాలకు ఇంటర్వ్యూలుభద్రాచలంటౌన్: ఐటీడీఏ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభించనున్న గిరి మాల్ట్లో పోస్టుల భర్తీకి ఏపీఓ డేవిడ్రాజ్ భద్రాచలంలో బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. సేల్స్ అసోసియేట్, క్యాషియర్, స్టాక్ అసిస్టెంట్ పోస్టులకు యువతీ, యువకులు 15మంది హాజరు కాగా, విద్యార్హత లతో పాటు వ్యాపార లావాదేవీలపై నైపుణ్యాల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. సాగర్ కాల్వలో పడి దివ్యాంగుడు మృతిఏన్కూరు: దివ్యాంగ యువకుడు ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో పడగా మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏన్కూరుకు చెందిన మల్లు సాయికృష్ణ(30) స్నేహితులతో కలసి బుధవారం హోలీ జరుపుకున్నారు. ఆతర్వాత సిరిపురం మేజర్ కాల్వలో స్నానానికి వెళ్లిన ఆయన ఒడ్డున స్నానం చేస్తుండగా కాలు జారి కాల్వలో పడడంతో గల్లంతయ్యాడు. దీంతో గాలిస్తుండగా మృతదేహం లభ్యమైంది. సాయికృష్ణకు నవంబర్లో వివాహం జరగగా, పోలీసులు చేరుకుని వివరాలు సేకరించాక పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
●ఎవరు దిగమన్నారు.. ఎందుకు ?
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇటీవల కూల్చివేసిన ఇళ్ల వద్ద నిర్వాసితులు ఫొటోలు దిగుతున్నారు. ఇంటి శిథిలాలు కనిపించేలా బుధవారం ఫొటోలు దిగుతున్న కొందరిని ఆరా తీయగా.. ఫొటో దిగి ప్రింట్ తీసి ఇవ్వాలని నాయకులు చెప్పినట్లు వెల్లడించారు. ఈవిషయమై ఖమ్మం అర్బన్ తహసీల్లో ఆరా తీయగా, తాము ఎవరినీ ఫొటోలు అడగలేదని చెప్పడం గమనార్హం. దీంతో దళారులెవరైనా మరోమారు బాధితులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈమేరకు అధికారులు స్పందించి నిర్వాసితులకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
ప్రారంభ దశలోనే చీడపీడల కట్టడి
తిరుమలాయపాలెం: మామిడి రైతులు తోటల్లో చీడపీడలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే నివారణ సులు వవుతుందని పాలేరు డివిజన్ ఉద్యాన శాఖాధికారి అపర్ణ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో మా మిడి తోటలను బుధవారం పరిశీలించిన ఆమె మా ట్లాడారు. పూత దశ నుంచి కాయలు వస్తున్నందున నల్ల మచ్చ తెగులు కనిపిస్తే కార్బండిజం ఒక గ్రాము లేదా కార్బండిజం, మ్యాంకోజెబ్ మందు రెండు గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. తేనెమంచు పురుగుఉధృతి ఉంటే ఇమి డాక్లోప్రిడ్ 0.3. మి.లీ. లేదా థయోమిథాక్సమ్ 0.4 గ్రా.ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని, పిందెలు ఎక్కువగా రాలితే ప్లానోఫిక్స్ 4.5 మి.లీ.ను 25 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని ఆమె తెలిపారు. -
మే 11 నుంచి రైతు సంఘం జాతీయ మహాసభలు
ఇల్లెందు: మే 11, 12, 13 తేదీల్లో ఇల్లెందులో సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ అనుబంధ అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభలు ఇల్లెందులో నిర్వహించనున్నట్లు సంఘం జాతీయ కన్వీనర్ కెచ్చెల రంగయ్య, నాయకులు ప్రదీప్సింగ్ ఠాగూర్ వెల్లడించారు. రెండు రోజులుగా ఇల్లెందులో జరుగుతున్న సంఘం సమావేశాలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంఘం పనితీరును సమీక్షించుకోవడంతో పాటు లోపాలను అధిగమించేందుకు నూతన నాయకత్వాన్ని ఏర్పాటు చేసి ఉద్యమాలను బలోపేతం చేస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 300 మంది ప్రతీనిధులు ఈ మహాసభలకు హాజరవుతారని తెలిపారు. 11వ తేదీన ఇల్లెందులో భారీ ర్యాలీ, బహిరంగసభ ఉంటాయని వివరించారు. అభిమానులు ఆర్థిక సాయం అందించి సభల విజయవంతానికి సహకరించాలని కోరారు. ఈ మహాసభలకు ఇతర పార్టీల అనుబంధ సంఘాల ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అమెరికాతో ఒప్పందం భారత్కు నష్టం అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం చేసుకుందని, ఇది దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని మాస్లైన్ జాతీయ నాయకులు ప్రదీప్సింగ్ ఠాగూర్ అన్నారు. అమెరికా పేద దేశాలపై అప్రజాస్వామికంగా యుద్ధం చేస్తోందని, ప్రజలను నిర్దాక్ష్యిణ్యంగా హతమారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ – అమెరికా ఒప్పందాన్ని నిరసిస్తూ ఈనెల 23న దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, నాయకులు శిబిగిరి, పరితోషిదాస్, నిరంజన్ బేరా, దేవరావు, ఎస్కే గౌస్, బి.రాము, అరుణ, బుర్ర వెంకన్న, పాయం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
పగిడిద్దరాజు జాతర షురూ..
గుండాల: మేడారం సమ్మక్క భర్త, మండలంలోని యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయుడు పగిడిద్దరాజు జాతర బుధవారం అంగరంగవైభవంగా ప్రారంభమైంది. మేడారం జాతర అనంతరం మాఘమాసంలో సమ్మక్క–పగిడిద్దరాజుల నాగవెళ్లి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బుధవారం యాపలగడ్డకు చెందిన అరెం వంశస్తులు, పూజారులు, వడ్డెల ఆధ్వర్యంలో గ్రామంలోని గుట్ట నుంచి పడగ(జెండా)ల రూపంలో పగిడిద్దరాజును గద్దెల వద్దకు చేర్చారు. ముందురోజు రాత్రి గర్భగుడి వద్ద ఆభరణాలు, పడగలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక బుధవారం పగిడిద్దరాజును డప్పువాయిద్యాలతో, గిరిజన నృత్యాలతో ఊరేగింపు ద్వారా గద్దెలపై ప్రతిష్టించి సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేశారు. గురువారం వనం(సమ్మక్క దేవత) రాకతో నిండు జాతర ప్రారంభమవుతుంది. సాయంత్రం జోగుకు వెళ్లి, రాత్రి దేవతలకు గంగాస్నానం చేయిస్తారు. దేవతలకు నాగవెళ్లి జరుపుతారు. శుక్రవారం తెల్లవారుజామున గుడి మెలిగి, దేవతలకు సెలపయ్యను హారం ఇచ్చాక భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బంబోబస్తు ఏర్పాటు చేశారు. దూలుగొండ ముసలమ్మ జాతర ప్రారంభం ఈసం వంశీయుల ఇలవేల్పు దూలుగొండ ముసలమ్మ(దేవత) జాతర బుధవారం రోళ్లగడ్డలో ప్రారంభించారు. ఈసం, మాడె వంశీయులు, పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలతో మండ మెలుగుట, గుడి మెలుగుట నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలతో గర్భగుడి వద్ద పూజలు చేశారు. గురువారం దేవతను గద్దెలపై ప్రతిష్ఠించాక నిండు జాతర ప్రారంభమవుతుంది. శుక్రవారం మొక్కులు చెల్లించుకోనుండగా మూడురోజుల పాటు జాతర జరుగుతుంది. -
లోక్యాతండాలో ఘనంగా ‘డూండ్’
కూసుమంచి: హోలీ పర్వదినం జరుపుకోవడంలో ప్రత్యేకంగా నిలుస్తున్న మండలంలోని లోక్యాతండాలో వేడుకలు బుధవారం రెండో రోజుకు చేరాయి. ఈమేరకు అనాదిగా వస్తున్న డూండ్ వేడుకను తండా వాసులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. గత హోలీ నుంచి ఇప్పటి వరకు తండాలో జన్మించిన మగబిడ్డలకు అన్నప్రాసన, నామకరణం చేయడాన్ని డూండ్గా పిలుస్తారు. ఈమేరకు గేర్యా(వేడుకల పెద్దలు) తండావాసులతో కలిసి కోలాటం ఆడుతూ డూండ్ జరుపుకునే వారి ఇళ్లకు వెళ్లారు. అక్కడ కోలాటం కర్రలతో పొడవాటి కర్రను కొడుతూ పాటలు పాడుతూ తల్లీబిడ్డలను దీవించారు. కాగా, బుధవారం తెల్లవారుజామున తండాలో నిర్వహించిన కామ దహనంలో పెద్దలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొని పూజలు చేశారు.వేడుకలో చిన్నారితో తల్లి రెండో రోజుకు చేరిన హోలీ వేడుకలు -
చేయూత దక్కుతుందా ?!
● పెన్షన్ల కోసం జిల్లాలో వేలాది దరఖాస్తుల పెండింగ్ ● మూడున్నరేళ్లుగా మంజూరుకు దక్కని మోక్షం ● మరోపక్క నగదు పెంపుపై లబ్ధిదారుల్లో ఆశలుఖమ్మంమయూరిసెంటర్: ఏ ఆసరా లేని వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ‘చేయూత’ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే జిల్లాలో అర్హులైన పలువురు పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూడక తప్పడం లేదు. అన్ని అర్హతలు ఉన్నా కొత్త పింఛన్లు మంజూరులో జాప్యం జరుగుతుండడం.. ప్రభుత్వం మారి రెండేళ్లు దాటినా ఫలితం లేకపోవడంపై అర్హులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారగానే పథకం పేరును చేయూతగా మార్చినా మంజూరు కాక సుమారు 18 వేల మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల్లోనైనా కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రకటన చేయాలని దరఖాస్తుదారులు.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు నగదు పెంచాలని ప్రస్తుత లబ్ధిదారులు కోరుతున్నారు. ఎదురుచూపులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో చేయూత పింఛన్ల పెంపు పథకం కూడా అమల్లోకి రాలేదు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్పై రూ.500 తగ్గింపు, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగించే పేదలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. త్వరలో దివ్యాంగులకు సైతం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని వెల్లడించారు. అయితే, ఆసరా పింఛన్లను చేయూత పథకం కింద రూ.4 వేలకు పెంచుతామని ఇచ్చిన హామీపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. మూడేళ్లకు పైగా.. రాష్ట్రంలో కొత్త పింఛన్లు మూడేళ్లుగా మంజూరు చేయడం లేదు. 2022 ఆగస్టులో గత ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేశాక.. మళ్లీ ఇప్పటివరకు దస్త్రం కదలలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పేరును ‘చేయూత’ అని మార్చగా, పింఛన్ల్ కోసం వృద్దులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. కాగా, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి అర్హులు, అనర్హులవి వేరు చేసి.. ప్రభుత్వం ఎప్పుడు ప్రకటన చేసినా జాబితా విడుదల చేయసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 18వేలకు పైగానే... జిల్లాలో చేయూత పింఛన్ల కోసం 18వేల మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో వృద్దులు, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల దరఖాస్తులు అధికంగా ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం అందిన దరఖాస్తులు ఇందులో ఉండగా.. తమకు ఆసరా పింఛన్లు ఎప్పుడు మంజూరవుతాయని దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో అధికారులు కూడా సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వం చేయూత పెన్షన్ల లబ్ధిదారులకు నగదు పెంచుతామని ప్రకటించినా అమలుకు నోచుకోవడంలేదు. అయితే, ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ను ఏటా రూ.500 చొప్పున పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే రూ.2016 పెన్షన్ రూ.2,500లకు, రూ.4 వేల పెన్షన్ రూ. 4,500లకు చేరుతుంది. ఒకవేళ కొత్త పెన్షన్లు మంజూరు చేయాల్సి వస్తే ఈ ఏడాది కూడా పెంపు ఉండకపోవచ్చనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఏదిఏమైనా ఈనెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాలపై స్పష్టత రానుంది. కాగా, జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి ప్రస్తుతం 1,82,752 మంది లబ్ధిదారులు ఉండగా, వీరికి నెలకురూ.42.34 కోట్లు మేర పింఛన్ అందుతోంది. -
డ్రైవర్లకు కంటి చూపు కీలకం
ఖమ్మం క్రైం: డ్రైవర్లకు కంటి చూపు కీలకమని, చూపు బాగుంటేనే ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, సీఐ సత్యనారాయణ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన అరైవ్ – అలైన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం వాహనాల డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం మ్యాక్స్ విజన్ కంటి ఆస్పత్రి సహకారంతో 110 మంది డ్రైవర్లకు ఉచిత కంటిపరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు ఇచ్చారు. కంటిచూపు స్పష్టంగా ఉంటే సిగ్నళ్లు, రహదారి సూచనలు గుర్తించగలుగుతారని, అందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. -
‘కట్’కట రాకుండా..
ఖమ్మం వ్యవసాయం: వేసవి ఎండ తీవ్రత ప్రారంభమైంది. జిల్లాలో ఇప్పటికే 34 – 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో సహజంగానే విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఈ ఏడాది యాసంగిలోనూ విస్తారంగా పంటలు సాగు చేసిన రైతులు బోర్లు, బావులు, కాల్వలు, జలాశయాల్లోని నీటిని విద్యుత్ మోటార్ల ద్వారా వినియోగిస్తున్నారు. మరోపక్క పరిశ్రమలకే కాక ఇళ్లలోనూ కూలర్లు, ఏసీలు వినియోగిస్తుండడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోందని గుర్తించారు. ఇది వచ్చే రెండు నెలలు గరిష్ట స్థాయికి చేరనుండడంతో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఎన్పీడీసీఎల్ అధికారులు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సర్కిల్కు కోటా పెంపు ఖమ్మం విద్యుత్ సర్కిల్ పరిధిలో పెరిగిన విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ఇప్పటికే కోటా పెంచారు. గత ఏడాది ఫిబ్రవరి నెలలో రోజుకు 7.06 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయగా, ఈ ఏడాది 8.25 మిలియన్ యూనిట్లకు పెంచి సరఫరా చేస్తున్నారు. అంటే గత ఏడాదితో పోలిస్తే నిత్యం 1.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ అదనంగా అందుతోంది. జిల్లాలో వినియోగం కూడా అదే స్థాయిలో ఉండగా.. ఎండలు మరింత పెరిగితే కోటా మరికొంత పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొత్త సబ్స్టేషన్, ట్రాన్స్ఫార్మర్లు ఇటీవల జిల్లాలో కొత్తగా విద్యుత్ డివిజన్ ఏర్పాటైంది. మరోపక్క జిల్లా కేంద్రమైన ఖమ్మం విస్తరిస్తూ విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఎండ తీవ్రతతో మరింత లోడ్ పెరగనున్నందున రఘునాథపాలెం మండలం మంచుకొండలో నూతన సబ్స్టేషన్ నిర్మించారు. తద్వారా నగర పరిసర ప్రాంతాలకు విద్యుత్ సమస్య తీరుతుందని చెబుతున్నారు. అలాగే, వేసవి లోడ్కు అనుగుణంగా 110 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటుచేయడం మొదలుపెట్టారు. ఇదేక్రమాన నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం 23 సబ్స్టేషన్లు(33/11) మధ్య ఇంటర్ లింకింగ్ లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.ఎండలతో పెరుగుతున్న విద్యుత్ వినియోగం వేసవిలో నిరంతరం, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. ఇందుకు అవసరమైన సబ్ స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. సబ్స్టేషన్ల మధ్య లింకింగ్ లైన్లతో ఒకచోట సమస్య వచ్చినా మరో స్టేషన్ నుంచి సరఫరా ఇవ్వొచ్చు. వేసవి లోడ్కు అనుగుణంగా సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించాం. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ -
వెంకటరెడ్డి సేవలు మరువలేనివి
కామేపల్లి: మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మాజీ మంత్రి 10వ వర్ధంతి సందర్భంగా బుధవారం కొత్తలింగాల క్రాస్లోని ఆయన విగ్రహానికి వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కనకయ్య మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడడమేకాక ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలు, పార్టీకి సేవలు చేశారని కొనియాడారు. తుది శ్వాస విడిచే వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన వెంకట్రెడ్డి ఆశయ సాధనకు కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలని కోరారు. ఇల్లెందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్మిత్ర, నాయకులు రాంరెడ్డి కృష్ణారెడ్డి, చరణ్రెడ్డి, మానుకొండ రాధాకిషోర్, జగన్నాథరెడ్డి, గింజల నర్సింహారెడ్డి, మేకల మల్లిబాబుయాదవ్, ధనియాకుల హన్మంతరావు, తోటకూరి శివయ్య, నల్లమోతు లక్ష్మయ్య, గుజ్జర్లపూడి రాంబాబు, రెడబోతు గోపీరెడ్డి పాల్గొన్నారు. సస్యరక్షణ చర్యలతో కత్తెర పురుగు కట్టడి కూసుమంచి: మండలంలోని జుజుల్రావుపేటలో పలువురు సాగు చేసిన మొక్కజొన్న పంటను బుధవారం జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య పరిశీలించారు. ప్రస్తుతం పంటను కత్తెర పురుగు ఆశిస్తున్నందున తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం కూసుమంచిలో వాలంటీర్ల ద్వారా చేపడుతున్న క్రాప్ బుకింగ్ సర్వేను పరిశీలించాక, పలు గ్రామాల్లో ఎరువులు, పురుగుమందుల దుకాణాలను తనిఖీ చేశారు. రైతులు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే ఎరువులు కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. అవసరానికి సరిపడా యూరియా అందుబాటులో ఉన్నందున రైతులు ఆందోళన చెందొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ వాణి, ఏఈఓలు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు 334 మంది గైర్హాజరు ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈఓ రవిబాబు తెలిపారు. ఈమేరకు బుధవారం ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరిగాయని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు 16,923మంది విద్యార్థుల్లో 16,589మంది హాజరు కాగా 334మంది గైర్హాజరయ్యారని తెలిపారు. కాగా, రాష్ట్ర పరిశీలకుడు బి.రాజన్న జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా, డీఈసీ, హెచ్పీసీ, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు కూడా కేంద్రాలను పరిశీలించాయని వెల్లడించారు. టీజీఐఐసీ జోనల్ మేనేజర్గా స్వామి ఖమ్మం అర్బన్: టీజీఐఐసీ జోనల్ మేనేజర్గా స్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమలకు అవసరమైన సదుపాయాల కల్పనపై చర్చించారు. ఈక్రమంలో పెట్టుబడులు ప్రోత్సహిస్తూ పారిశ్రామిక వృద్ధికి సహకరించాలని కలెక్టర్ సూచించారు. -
ఇక్కడ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ప్రత్యేకం
రఘునాథపాలెం: మండలంలోని పువ్వాడనగర్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక డంప్ యార్డ్(ప్రాసెసింగ్ యూనిట్) నిర్మిస్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారి ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఇందుకోసం ఎకరం భూమిని కేటాయించగా రూ.50లక్షల వ్యయంతో భారీ షెడ్డు నిర్మాణ పనులు మొదలయ్యాయి ప్లాస్టిక్ వ్యర్థాలను శాసీ్త్రయ పద్ధతిలో ప్రాసెస్ చేసి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ యూనిట్ ఏర్పాటు చేస్తుండగా.. ఇక్కడ విజయవంతమైతే అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. డంపింగ్ యార్డ్తో ప్లాస్టిక్ వ్యర్థాలకు శాశ్వత పరిష్కారం లభించడమే కాక పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని చెబుతున్నారు.పువ్వాడనగర్లో ఏర్పాటుకు శ్రీకారం -
సీఎంఆర్ సేకరణలో ఇబ్బంది రావొద్దు
ఖమ్మం సహకార్ నగర్: మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సేకరణలో అవాంతరాలు ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన గోదాంల మేనేజర్లు, ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మిల్లర్లు సరఫరా చేసే బియ్యంను సకాలంలో దిగుమతి చేసుకునేలా హమాలీలను ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా మిల్లర్లు, వాహనదారులకు ఇబ్బంది ఉండదని తెలిపారు. అంతేకాక గోదాంలకు చేరిన బియ్యంను క్షుణ్ణంగా పరిశీలించి మిల్లర్లకు రశీదులు జారీ చేయాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
రామయ్య పెళ్ల్లికొడుకాయెనే!
భద్రాచలం: శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం ముందుగానే వచ్చిందా అన్నట్లుగా భద్రగిరి మురిసింది. భక్తిశ్రద్ధలతో అర్చకులు, అధికారులు పసుపు, కుంకుమలు దంచగా, తలంబ్రాల తయారీలో మహిళల ఉత్సాహం.. మరో వైపున శ్రీరామనామ స్మరణలు చేస్తూ గోటి తలంబ్రాలతో పాదయాత్రగా వచ్చిన భక్తజనం.. వెరసి మిథిలా స్టేడియం కళకళలాడింది. ఆనందోత్సాహాల నడుమ రామయ్య పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. వసంతం చల్లుకున్న శ్రీ సీతారాములు దర్శనమివ్వగానే ‘మా రామయ్య పెళ్లికొడుకాయెనే’ అంటూ భక్తులు మురిసిపోయారు. ఒకరోజు ఆలస్యంగా.. ప్రతీ ఏడాది ఫాల్గుణ పౌర్ణమి రోజున పసుపు కొమ్ములు దంచి, తలంబ్రాల తయారీతో రామయ్య పెళ్లి పనులకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. ఈసారి చంద్రగ్రహణం రావడంతో ఈ వేడుకలను బుధవారం ప్రారంభించారు. తొలుత మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామి వారి ఉత్సవ మూర్తులను పల్లకీ సేవగా ఉత్తర ద్వారం వద్ద ఆశీనులు చేశారు. అర్చకులు, వేదపండితులు స్వామివారికి, రోళ్లు, రోకళ్లకు సంప్రదాయ పద్ధతుల్లో పూజలు చేశారు. ఆ తర్వాత పసుపు కొమ్ములు దంచి కల్యాణ వేడుకలను ప్రారంభించారు. బియ్యంలో పసుపు, రోజ్వాటర్, గులామ్, సుగంధ ద్రవ్యాలు, అత్తర్ కలిపి తలంబ్రాలు తయారు చేశారు. వాటిని ఆలయ అధికారులు శిరస్సుపై ధరించి స్వామివారి మూలమూర్తుల పాదాల చెంతన ఉంచారు. కాగా ప్రతీ ఏడాది పాదయాత్రగా గోటి తలంబ్రాలతో వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ సంవత్సరం భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో మిథిలా స్టేడియ ప్రాంగణం నిండిపోయింది. తలంబ్రాల తయారీలో మహిళా భక్తులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. భద్రాచలానికి చెందిన స్నేహితుల బృందం.. గోటి తలంబ్రాలు తీసుకొచ్చి న సుమారు 8 వేల మందికి అల్పాహారం, టీ, మజ్జిగ అందించి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. వేడుకగా వసంతోత్సవం ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతారాములకు వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు సువర్ణ లక్ష్మీ అమ్మవారికి పంచామృతంతో కలశాభిషేకం, సహస్ర ధారలతో స్నపనం జరిపారు. ఆస్థాన గాయకులు రామదాసు కీర్తనలను ఆలపిస్తుండగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి నక్షత్ర హారతి సమర్పించారు. అర్చకులు శ్రీ సీతారాములపై రంగులు చల్లి వసంతోత్సవాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత భక్తులపై, ఈఓ దంపతులపై రంగులు చల్లారు. సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సర్పంచ్ పూనెం కృష్ణ, ఆలయ ఈఓ దామోదర్రావు, స్థానాచార్యులు స్థలశాయి, ట్రస్ట్ బోర్డ్ మాజీ సభ్యులు బూసిరెడ్డి అంకిరెడ్డి, అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
పాలన మరింత చేరువ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పేరిట ప్రభుత్వం నిర్వహించే 99 రోజుల కార్యక్రమాన్ని పడక్బందీగా అమలుచేయడానికి సన్నద్ధమయ్యాం. ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఈనెల 6వ తేదీ శుక్రవారం నుంచి జూన్ 12 వరకు జరిగే ఈ కార్యక్రమంలో పది అంశాలు ఉంటాయి. తొలిరోజు ఖమ్మంలో జరిగే ఉమ్మడి జిల్లా సమావేశంలో జిల్లా మంత్రులు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు హాజరవుతారు. విద్య, వైద్య, గృహ నిర్మాణం, వ్యవసాయ రంగాల్లో జిల్లా ఇప్పటికే రాష్ట్రంలో నంబర్ వన్గా ఉండగా.. మిగతా రంగాల్లోనూ ముందు నిలిపేలా కృషి జరుగుతోంది’ అని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కలెక్టర్ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..ప్రభుత్వం పది అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని కార్యక్రమం చేపడుతోంది. ఇందులో పరిసరాల పరిశుభ్రత, ఫైళ్ల పరిష్కారం, ఆరోగ్యం, రోడ్డు భద్రత, సంక్షేమం, పిల్లల భద్రత, రైతు సంక్షేమం, విద్య, యువత–క్రీడలు, పర్యావరణం వంటివి ఉన్నాయి. ఈ అంశాల ఆధారంగా జిల్లాలో పరిస్థితులపై ఇప్పటికే నివేదిక రూపొందించాం. నివేదికలో వివరాలను బేరీజు వేసుకుని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తాం. 99 రోజుల్లో క్షేత్ర స్థాయి సమస్యలు పరిష్కారం కావడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ కూడా సిద్ధమవుతుంది. శాఖల వారీ అధికారులు ఎప్పటికప్పుడు పనుల తీరును పర్యవేక్షించడం ద్వారా కార్యక్రమం ముగిసే నాటికి ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాల్లో గతంతో పోలిస్తే మెరుగుపడతాం. జిల్లాలో 571 గ్రామపంచాయతీలతో పాటు ఏదులాపురం, వైరా, సత్తుపల్లి, కల్లూరు, మధిర మున్సిపాలిటీలు, ఖమ్మం కార్పొరేషన్ ఉన్నాయి. వార్డు, గ్రామం, మున్సిపాలిటీ, నియోజకవర్గం, జిల్లా స్థాయి వరకు 99 రోజుల ప్రణాళిక నిర్వహిస్తాం. క్షేత్ర స్థాయిలో చేయాల్సిన అంశాలపై సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ ప్రతినిధులకు వర్క్షాప్ ఏర్పాటుచేస్తున్నాం. ఎవరు ఏ బాధ్యతలు నిర్వర్తించాలి, ఏ రోజు కార్యక్రమంలో ఏం చేయాలో కరదీపికలు అందిస్తాం. తద్వారా ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ఫైళ్లు పరిష్కరించడం, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలుచేయడం ద్వారా జిల్లాను అన్ని రంగాల్లో రోల్ మోడల్గా నిలుపుతాం. పరిశుభత్ర, పచ్చదనంతో గ్రామాలు, పట్టణాలు మెరిసేలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్ చేపడ తాం. రోడ్ల పక్కన ఉన్న పిచ్చిమొక్కల తొలగింపు, ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రం చేయడం వంటివి ఇందులో భాగంగానే జరుగుతాయి. మరోవైపు అద్దెభవనాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను దశలవారీగా సొంత భవనాల్లోకి మారుస్తాం. జూన్ 5న పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ నెల 1నుంచి 12 వరకు పెద్ద ఎత్తున మొక్కలు నాటిస్తాం. శాఖల వారీగా పెండింగ్ ఫైళ్ల పరిష్కారం కూడా చేపడుతాం.పకడ్బందీగా ‘99 రోజుల ప్రణాళిక’ అమలు హైదరాబాద్లో తాజాగా ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’కార్యక్రమంపై రాష్ట్ర స్థాయి సమీక్షలో పలు రంగాల్లో జిల్లాకు ప్రశంసలు దక్కాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదు ఓవరాల్ ర్యాంకింగ్లో జిల్లా మొదటి స్థానాన నిలిచింది. మూడు వారాల్లో జిల్లాలోని 10 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావొస్తుండగా.. రాష్ట్రంలోనే నంబర్వన్గా ఉన్నాం. అలాగే ఫార్మర్ రిజిస్ట్రీ నమోదులో రాష్ట్రంలో ప్రథమ స్థానం, నెలవారీ అగ్రికల్చర్ ర్యాంకింగ్లోనూ అగ్రస్థానం దక్కింది. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల హాజరు శాతంలోనూ అద్భుతమైన గుర్తింపు వచ్చింది. మొత్తంగా నాలుగు ప్రాధాన్యత రంగాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రథమ స్థానాన నిలవడం సంతోషంగా ఉంది. -
పస్తులతోనే పనులు
ఎర్రుపాలెం: జిల్లాలోని గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో పస్తులతో పనులు చేయలేక అవస్థ పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 589 పంచాయతీల్లో 2వేల మంది మల్టీపర్పస్ వర్క ర్లు ఉన్నారు. గతంలో పని ప్రకారం ఆయా గ్రామ పంచాయతీల్లోని వర్కర్లకు వేతనాలు నిర్ధారించి పంచాయతీ పద్దు నుంచే చెల్లించేవారు. 2018 నవంబర్ తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ల పేరుతో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అందరూ అన్ని రకాల పనులు చేసేలా నిబంధన విధించి ప్రభుత్వమే నేరుగా గ్రీన్ చానల్ ద్వారా నెలకు రూ.9,500 వేతనం ఇస్తోంది. అయితే, తరచూగా నెలల తరబడి వేతనాలు అందడం లేదని మల్టీపర్పస్ వర్కర్లు వాపోతున్నారు. వెట్టిచాకిరీ చేస్తున్నా.. మల్టీపర్పస్ వర్కర్లు అరకొర వేతనాలతో వెట్టిచాకిరీ చేస్తున్నారు. వారాంతపు సెలవులు ఉండకపోగా, ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా పని చేసినా అదనపు వేతనం కూడా చెల్లించలేదు. గ్రామాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తే పారిశుద్ధ్య పనులు మొదలు అంతా వీరే చేయాల్సి వస్తుంది. గ్రామాల్లో ఎవరైనా మృతి చెందితే సున్నం మార్కింగ్ ఇవ్వడం, భోజనాలు పెడితే విస్తళ్లను ట్రాక్టర్లల్లో డంపింగ్ యార్డుకు తరలించడం, తాగునీటి సరఫరా, పైపులైన్ల మరమ్మతులు, డ్రెయినేజీల శుభ్రత .. ఇలా ఏ పనైనా మల్టీపర్పస్ వర్కర్లే చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయినా ప్రభుత్వం రకరకాల సాకులు చూపి వేతనాలు నిలిపేయడం పరిపాటిగా మారింది. నెలలతరబడి వేతనాలు అందక, బయట అప్పు లు పుట్టక ఇబ్బంది పడుతున్నామని వారు వాపోతున్నారు. కాగా, చనిపోయిన, వేతనాలు చాలక, ఇతరత్రా కారణాలతో పనులు మానేసిన వర్కర్ల పేర్లే ఇంకా ఆన్లైన్లో కనిపించడం, వారి పేరుతోనేవేతనాలు మంజూరు చేయడంతో కొత్తగా వచ్చిన వారికి చెల్లింపు కష్టంగా మారినట్లు తెలుస్తోంది. -
కల్యాణోత్సవాలకు నేడు శ్రీకారం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఈనెల 26, 27 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాల పనులకు బుధవారం శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమంలో రామయ్య నేడు పెళ్లి కుమారుడిగా మారనున్నాడు. పసుపు కొమ్ములు దంచి, తలంబ్రాల తయారీతో పనులు ప్రారంభిస్తారు. సాధారణంగా ఫాల్గుణ పౌర్ణమి రోజునే పనులు ప్రారంభించాల్సి ఉన్నా.. మంగళవారం చంద్రగ్రహణం కావడంతో బుధవారానికి మార్చారు. కాగా, నేడు స్వామివారికి వసంతోత్సవం, డోలోత్సవం తదితర పూజలు నిర్వహిస్తారు. తలంబ్రాల తయారీ వేడుకకు మిథిలా స్టేడియం ప్రాంగణంలోని వైకుంఠ ద్వారం వద్ద అధికారులు ఏర్పాట్లు చేయగా, వసంతోత్సవం, డోలోత్సవం బేడా మండపంలో జరుగనున్నాయి. వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మికత.. శ్రీ సీతారాముల కల్యాణానికి పసుపు కొమ్ములు దంచి, తలంబ్రాలు కలపడంతో పనులు ప్రారంభించడం సంప్రదాయం. ఈ కార్యక్రమంలో ఇటీవల భక్తులను భాగస్వాములను చేయడంతో భద్రగిరి క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. గతంలో ఆలయంలో పరిమిత సంఖ్యలో భక్తులతో ఈ వేడుకను చేపట్టగా, ప్రస్తుతం మిథిలా స్టేడియం ప్రాంగణంలోకి మార్చడంతో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ ఏడాది 300 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేయాలని అఽధికారులు భావిస్తున్నారు. పసుపు, కుంకుమ దంచి, ప్రత్యేక గులాములతో తలంబ్రాలు సిద్ధం చేయడం భద్రగిరిలో మాత్రమే ప్రత్యేకమైన వేడుక. ఈ సందర్భంగా బుధవారం నిత్యకల్యాణం రద్దు చేయగా గురువారం యథావిధిగా నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. ఇక నేడు వసంతోత్సవం సందర్భంగా సహస్రధారతో స్నపనం, అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని ఊయలలో ఆశీనులు చేసి డోలోత్సవం నిర్వహిస్తారు. శ్రీ స్వర్ణ లక్ష్మీ అమ్మవారికి పంచామృత స్నపనం, సాయంత్రం 4 గంటలకు సామూహిక కుంకుమార్చన జరగనున్నాయి. కాగా, మేళతాళాలు, వేద మంత్రాల నడుమ అర్చకులు పవిత్ర గోదావరి నదీ జలాలు తీసుకొచ్చి మంగళవారం రాత్రి వసంతోత్సవానికి అంకురార్పణ చేశారు. అనంతరం యాగశాలలో వాస్తుహోమం నిర్వహించారు. రామయ్య కల్యాణ తంతులో తలంబ్రాలు కీలకం. వీటి తయారీలో పరోక్షంగా భాగస్వాములయ్యేందుకు భక్తులు గత కొన్నేళ్లుగా గోటితో ఒలిచి బియ్యం సిద్ధం చేస్తున్నారు. నిష్టగా, కఠోర దీక్షతో శ్రీరామనామస్మరణ చేసుకుంటూ గోటితో ఒలుస్తున్నారు. వీటిని రామయ్య సన్నిధికి తీసుకొచ్చి భద్రగిరి ప్రదక్షిణ చేశాక స్వామివారి తలంబ్రాలలో కలుపుతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు గ్రామాల్లో తయారు చేస్తున్న భక్తులు పాదయాత్రగా భద్రాచలం తరలివచ్చి సమర్పిస్తుండడం విశేషం. కోరుకొండకు చెందిన అప్పారావు బృందం గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన నారు వేసి, పంట కోశాక గోటితో తలంబ్రాలు తయారు చేస్తున్న విషయం తెలిసిందే. -
ఇక్కడ హోలీ.. ప్రత్యేకం
కూసుమంచి: ఎక్కడైనా హోలీ వేడుకలు ఒకే రోజు జరుపుకుంటారు. కానీ కూసుమంచి మండలం లోక్యాతండాలోమాత్రం మూడు రోజుల పాటు సందడి ఉంటుంది. ఈ మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు తండావాసులు నిర్వహిస్తుంటారు. ఈమేరకు మంగళవారం వేడుకలు కోలాటంతో ప్రారంభమయ్యాయి. తండా వాసులంతా గ్రామకూడలిలో చేరి సామూహికంగా కోలాటం ఆడుతూ పాటలతో సందడి చేశారు. ఇక రెండో రోజైన బుధవారం తెల్లవారుజామున తండా వాసులంతా కామదహనం నిర్వహిస్తారు. తండాలో గత హోలీ నుండి ఇప్పటి వరకు మగబిడ్డ పుట్టిన ఇంట డూండ్ వేడుకలు(అన్నప్రాసన, నామకరణం) మధ్యాహ్నం నిర్వమించనున్నారు. మూడో రోజు గురువారం తండావాసులు రంగులు చల్లుకుంటూ రంగేళీ నిర్వహించడంతో వేడుకలు ముగియనున్నాయి. అంతా ఒక చోటకు... మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగు వేడుకల్లో పాల్గొనేందుకు ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్న తండా వాసులంతా స్వస్థలానికి చేరారు. అంతేకాక ప్రతీ ఇంటికి బంధువులు కూడా రావడంతో తండాలో సండి నెలకొంది. ఈమేరకు పొట్టేళ్లను బలి ఇచ్చి విందులు ఏర్పాటు చేస్తుంటారు. కాగా, వేడుకల్లో తొలి రోజైన మంగళవారం తండావాసులంతా గ్రామ కూడలిలో చేరి కోలాటం మాడారు. చిన్నాపెద్ద తేడా లేకుండా కోలాటం ఆడగా.. పలువురు సంప్రదాయ తలపాగలు, పంచెకట్టుతో ఆకట్టుకున్నారు. తండా పెద్ద భేరీ మోగించి వేడుకలను ప్రారంభించాక పాటలు పాడుతూ అందుకు అనుగుణంగా కోలాటం ప్రదర్శించారు. లోక్యాతండాలో ప్రారంభమైన మూడు రోజుల వేడుకలు -
అంగన్వాడీలకు ఉచిత విద్యుత్ కనెక్షన్
ఖమ్మంవ్యవసాయం: ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్లు లేని అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా కనెక్షన్లు ఇస్తున్నామని ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలను గుర్తించామని వెల్లడించారు. ఇప్పటి వరకు కారేపల్లి, నేలకొండపల్లి, కూసుమంచి తదితర మండలాల్లోని పలు కేంద్రాలకు ఉచిత కనెక్షన్లు ఇచ్చామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టిజన్లుగా గుర్తించాలని కార్మికుల ధర్నా ఖమ్మంవ్యవసాయం: ఆర్టిజన్లుగా గుర్తించాలనే డిమాండ్తో అన్మ్యాన్ కార్మికులు మంగళవా రం ఖమ్మం ఎస్ఈ కార్యాలయం వద్ద టీజీ యూఈఈయూ ఆధ్వర్యానధర్నా నిర్వహించా రు. ళ్లుగా పనిచేస్తున్న తమను సంస్థలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీడీసీఎల్ పరి ధిలో విద్యుత్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించినందున ఇక్కడ కూడా అమలుచేయాలన్నారు. అనంతరం ఎస్ఈ శ్రీనివాసాచారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూని యన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.ఉపేందర్, కామినేని నాగేశ్వరరావుతో పాటు సత్యనారా యణరెడ్డి, రామయ్య, రామకృష్ణ, రవి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. కోతుల బాధకు చెక్ బోనకల్: బోనకల్ మండల కేంద్రం వాసులు కోతులతో పడుతున్న ఇక్కట్లు తీర్చేలా గ్రామపంచాయతీ పాలకవర్గం నడుం బిగించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సర్పంచ్ బానోతు జ్యోతి, ఉపసర్పంచ్ బానోతు కొండలు దంపతులు కోతులను బంధించేందుకు ప్రత్యేకంగా పలువురిని నియమించారు. ఒక్కో కోతికి రూ.300 చెల్లిస్తుండగా, బంధించిన కోతులను అటవీ ప్రాంతానికి తరలించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మరీదు శేషు, అంతోటి శ్రీను, అంతోటి సునీత, ఎస్కే.మీరా, జర్పుల లావణ్య, ఉప్పర శ్రీనుతో పాటు గ్రామస్తులు గుండపనేని సుధాకర్రావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. యువకుడిపై కత్తితో దాడితిరుమలాయపాలెం: మండలంలోని బీరోలు గ్రామానికి చెందిన కుందూరు ఉదయ్పై మంగళవారం రాత్రి పలువురు కత్తితో దాడి చేశారు. హోలీ పండుగ తర్వాత విక్రమ్రెడ్డి, కట్ల మహేష్, లింగరాజు మోటార్ సైకిల్పై వస్తుండగా ఉదయ్ వారిని పండుగ మామూలు లేదా అని అడుగుతూ బండి ఆఫ్ చేశాడు. ఈక్రమాన మాటామాట పెరిగి ఉదయ్ చేయిపై కల్లు గీసే కత్తితో దాడి చేశారు. ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
కాసులకు కక్కుర్తి..
● రూ.కోట్ల కోసం కొత్త రూట్లు ● బతికుండగానే చంపేస్తున్న వైనం ● ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న బీమా మోసాలు బూర్గంపాడు: ఈజీ మనీ కోసం అన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు ఓ వైపు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొందరు రూ.కోట్ల కోసం కొత్త రూట్లు వెదుకుతున్నారు. బీమాను అడ్డుపెట్టుకుని మోసాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. బతికున్న వారి కీ డెత్ సర్టిఫికెట్లు ఇప్పించి సొమ్ము కాజేస్తున్నారు. మరికొందరు బీమా డబ్బు కోసమే తోటివారిని చంపేస్తున్నారు. హత్య చేసి ప్రమాదాలుగా చిత్రీకరిస్తున్నారు. బీమా మోసాలలో ఏజెంట్లు, కొందరు అధికారులే కీలకంగా వ్యవహరించడం ‘కంచే చేను మేసిన చందంగా’ మారింది. ఇటీవల బీమా మోసాలు, నేరాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండగా బయటకు రాని ఘటనలు మరెన్నో ఉన్నాయి. పెరుగుతున్న మోసాలు.. జిల్లాలో బీమా మోసాలు, నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పదినెలల క్రితం సారపాకలోని భాస్కర్నగర్కు చెందిన ఓ వ్యక్తికి ఒక ఎల్ఐసీ ఏజెంట్ పాలసీ చేయించాడు. బీమా పొందిన వ్యక్తి భార్యనే నామినీగా నమోదు చేయించాడు. మూడేళ్ల పాటు పాలసీ నగదు కూడా ఏజెంటే చెల్లించాడు. ఆ తర్వాత పాలసీదారుడు చనిపోయినట్లుగా ఏపీలోని కుక్కునూరులో డెత్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. దాన్ని ఎల్ఐసీ కార్యాలయంలో అందించి నామినీ గా ఉన్న పాలసీదారుడి భార్యకు రూ.10లక్షల చెక్కు ఇప్పించాడు. ముందస్తు ఒప్పందం ప్రకారం బీమా సొమ్ము పంచుకునే విషయంలో విభేదాలు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. సదరు ఏజెంట్ నుంచి బీమా సొమ్మును రికవరీ చేసిన ఎల్ఐసీ.. ఆ తర్వాత ఏజెంట్తో పాటు పాలసీదారుడు, నామినీ, మధ్యవర్తులపై కేసు నమోదు చేసి జైలుకు పంపించింది. హత్య చేసి.. సొమ్ము కాజేసేలా.. బూర్గంపాడు మండలం మోతె పట్టీనగర్ గ్రామంలో ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన ఓ యువకుడిని హతమార్చి, అతడి పేరున రూ. 2 కోట్ల బీమా కాజేసేందుకు ఇద్దరు పథక రచన చేశారు. 23 ఏళ్ల ఆ యువకుడి పేరున రూ.2 కోట్లకు ఓ బ్యాంకులో బీమా చేయించి ప్రీమియం కూడా వారే చెల్లించారు. సదరు బ్యాంకులో ఇన్సూరెన్స్ మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించాడు. ఆ యువకుడి ఇంటి పేరు కలిగిన మరో వ్యక్తిని నామినీగా నమోదు చేయించి బీమా సొమ్ము కాజేసేందుకు పథకం రూపొందించారు. ఫిబ్రవరి 13వ తేదీ రాత్రి ఆ ఇద్దరూ కలిసి యువకుడిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. తీవ్రంగాా కొట్టి రోడ్డుపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు. అయితే ఈ వ్యవహారం బెడిసికొట్టడంతో కటకటాల పాలయ్యారు. హత్యయత్నానికి గురైన యువకుడు చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. బూర్గంపాడు/అశ్వాపురం: మండలంలోని సీతా రాంపురం గ్రామానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్లయిన వెంకటేశ్వర్లు, సరస్వతి దంపతులు తమ బంధువులు బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లు సృష్టించి వారి పేరున పెద్దమొత్తంలో బీమా సొమ్ము కాజేశారు. బంధువులతో పాటు మారుమూల గ్రామాల్లోని అమాయకులను నమ్మించి మొత్తం 39 మంది పేరున బీమా చేయించారు. కొంతకాలం ప్రీమియం కూడా వారే చెల్లించారు. ఆ తర్వాత పాలసీదారులు మరణించినట్లుగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఎల్ఐసీ సంస్థకు సమర్పించారు. ఈ క్రమంలో వారికి రూ.1.52 కోట్ల బీమా సొమ్ము అందింది. ఈ సొమ్ములో ఏజెంట్లయిన భార్యాభర్తలు అగ్రభాగం తీసుకుని, కొందరు పాలసీదారులకు కొద్ది మొత్తం అందించినట్లు సమాచారం. అయితే దంపతులైన ఈ ఇద్దరు ఏజెంట్ల నుంచే ఎక్కువగా డెత్ కేసులు వస్తుండగా అనుమానం వచ్చిన ఎల్ఐసీ అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలు తెలుసుకున్నారు. సంస్థను మోసగించిన వారిపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇలాంటి ఘటనలు కొన్ని మాత్రమే వెలుగు చూస్తుండగా, చాలా ఘటనలు బయటకు రాకుండానే కొందరు రూ.కోట్లు కొల్ల గొడుతున్నారనే చర్చ సాగుతోంది. -
డాబా పైనుంచి పడడంతో తీవ్రగాయాలు
●చిన్నారి వైద్యానికి సహకరించాలని తల్లిదండ్రుల వినతి ఖమ్మం అర్బన్: ఖమ్మం శ్రీనగర్ కాలనీ 9వ లేన్లో నివాసం ఉంటున్న ప్రైవేట్ ఉపాధ్యాయుడు వెంకట నిరంజన్ కుమారుడు, నాలుగో తరగతి చదువుతున్న సలోక్ ఇంటి మొదటి అంతస్తు పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. డాబాపై సోమవారం రాత్రి ఆడుకునే సమయాన ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కాగా, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. సలోక్ మెదడుకు తీవ్ర గాయమైనందున చికిత్సకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని చెబుతున్నారు. ఈమేరకు తన కుమారుడిని ప్రాణాలు కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని కుటుంబీకులు కోరారు. మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతి ఏన్కూరు: సుజాతనగర్ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య సతీమణి రుక్మిణమ్మ(95) మంగళవా రం అనారోగ్యంతో మృతి చెందారు. ఖమ్మంలో ఉంటున్న ఆమె మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపా రు. కాగా, రుక్మిణమ్మ అంత్యక్రియలు స్వగ్రామమైన ఏన్కూరు మండలం బురదరాఘవాపురంలో బుధవారం నిర్వహించనున్నారు. మృతుడి ఆచూకీ గుర్తింపు ఖమ్మంరూరల్: మండలంలోని ఎం.వెంకటాయపాలెం వద్ద సోమవారం రాత్రి మృతి చెందిన వ్యక్తి ఆచూకీ గుర్తించారు. ఖమ్మం గాంధీనగర్కు చెందిన చాగంటి రవీందర్(40) సోమవారం ఉదయం పెనుగంంచిప్రోలు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. ఆయన మృతదేహం రాత్రి ఎం.వెంకటాయపాలెంలో కనిపించినా ఆచూకీ తెలియరాలేదు. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా మృతుడిని మంగళవారం గుర్తించగా, రవీందర్ భార్య ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. ఆర్థిక సాయాన్ని 99850 41889 (ఫోన్ పే, గూగుల్ పే) ద్వారా అందించాలని విజ్ఞప్తి చేశారు. -
నాచారం రోడ్డుకు మహర్దశ
ఏన్కూరు: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలాలను కలిపే నాచారం రోడ్డుకు మహర్దశ పడుతోంది. సుమారు 12 కి.మీ. దూరం సింగిల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.43 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో రహదారిని విస్తరించడమే కాక సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ రహదారి మీదుగా రేపల్లెవాడ, మేడేపల్లి, గంగుల నాచా రం, కాలనీ నాచారం, భద్రుధ్రుతండా, మునియతండా, ఒంటిగుడిసె తదితర గ్రామాలకు ప్రజలు రాకపోకలు కొనసాగిస్తారు. నాచారం – రేపల్లెవాడ మధ్య ఉన్న వాగు వర్షాకాలంలో పొంగితే రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం నాలుగు లేన్లుగా విస్తరణలో భాగంగా లోలెవల్ వంతెన స్థానాన హై లెవల్ వంతెన నిర్మిస్తే ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అంతేకాక నాచారంలో ప్రసిద్ధి చెందిన శ్రీ అద్భుత వెంకటేశ్వరస్వామి ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వస్తూ ఉంటారు. రహదారి అభివృద్ధితో భక్తుల రాకపోకలు సులువు కానున్నాయి. రెండు జిల్లాల ప్రజలకు ఉపయోగంగా ఉండే ఈ రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ నిధులు మంజూరు చేయించగా, త్వరలో పనులు మొదలుకానున్నాయి.రూ.43 కోట్లతో నాలుగు లేన్లుగా విస్తరణ -
ఈ–నామ్.. 2.0
● ఖమ్మం మార్కెట్లో కొత్త వెర్షన్ అమలు ● తద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు ● సెల్ఫోన్కు మెసేజ్ రూపంలో పూర్తి వివరాలుఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మరింత ఆధునీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్ 2.0 వెర్షన్ను ప్రవేశపెట్టింది. రైతులకు డిజిటల్ మార్కెటింగ్ను మెరుగుప ర్చడం, పంట వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాన్ని సులభం చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ–నామ్ విధానం అమల్లో ఉన్న వ్యవసాయ మార్కెట్లలో 2.0 వెర్షన్ను ప్రవేశపెడుతుండగా జాబితాలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు కూడా చోటు దక్కింది. 2011–12లో ప్రారంభం రైతులు పండించిన పంటలకు డిమాండ్ మేర ధర దక్కేలా చూడడం, మోసాలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం 2011–12లో ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆనాడే ఖమ్మం మార్కెట్లోనూ మొదలైంది. ఆపై 2016లో కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్(ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చ ర్ మార్కెట్) విధానాన్ని ప్రవేశపెట్టగా ఖమ్మం సహా రాష్ట్రంలోని 57 మార్కెట్లలో అమలు చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్ వ్యవస్థను మరింతగా ఆధునికీకరిస్తూ 2.0 వెర్షన్ను అమల్లోకి తీసుకొచ్చింది. పాత వ్యవస్థను అప్గ్రేడ్ చేయడం ద్వారా మరింత వేగవంతమైన, పారదర్శకమైన ఆన్లైన్ సేవలు అందనున్నాయి. రైతులు తాము పండించిన ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం లభిస్తుందని, అంతర్ రాష్ట్ర వాణిజ్యాన్ని పెంచుతుందని చెబుతున్నారు. అలాగే, పంట నాణ్యత తనిఖీకి ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికత అందుబాటులో వచ్చి రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. సమస్యలను అధిగమిస్తూ.. వ్యవసాయ మార్కెట్లలో ఈ–నామ్ సేవలను అప్గ్రేడ్ చేసే బాధ్యతను డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఇంటిలిజెన్స్(డీఎంఐ) పర్యవేక్షణలో ఎస్ఎఫ్ఏసీ(స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం)కు అప్పగించారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి ఖమ్మం మార్కెట్లో 2.0 వెర్షన్ అమలవుతుండగా.. ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. రైతులకు సమగ్ర సమాచారం ఈ–నామ్ 2.0 ద్వారా రైతు పంట విక్రయాలకు సంబంధించి పూర్తి సమాచారం వారికిఅందుతుంది. గత వెర్షన్లో పంటకు లాట్ ఐడీ ఇవ్వడం, ఆ లాట్ ఆధారంగా బిడ్డింగ్, ఎలక్ట్రానిక్ కాంటాపై తూకం వంటి ప్రక్రియలు ఉండేవి. ప్రస్తుత వెర్షన్లో లాట్ ఐడీ ఇవ్వడమే కాక రైతుల ఫోన్ నంబర్, ఆధార్ నంబర్లు కూడా అనుసంధానిస్తున్నారు. తద్వారా పంట బిడ్డింగ్లో నిర్ణయించిన ధర రైతు ఫోన్కు మెసేజ్ రూపంలో చేరుతుంది. అలాగే, విక్రయం తర్వాత తూకం, నిర్ణయించిన ధర, రైతులకు అందే పైకం వివరాలతో పాటు కమీషన్ కూడా ఆ మెసేజ్లో ఉంటాయి. ఇక తక్పట్టీ కూడా జారీ అయ్యే అవకాశం ఉంది. పత్తి, అపరాల విక్రయాల్లో అమలు ఖమ్మం మార్కెట్లో ప్రధానంగా పత్తి, మిర్చి పంటలతో పాటు పెసలు, కందులు, మినుములే కాక మొక్కజొన్న పంట క్రయవిక్రయాలు కూడా జరుగుతాయి. ఇందులో పత్తి, అపరాల పంటలకు ఇప్పటికే ఈ–నామ్ అమలు చేస్తున్నారు. ఇవే పంటలకు ప్రస్తుతం 2.0 వెర్షన్ అమలు చేయడం మొదలుపెట్టారు.కేంద్రప్రభుత్వం రూపొందించిన ఈ–నామ్ 2.0 వెర్షన్ రైతులకు ఎంతో ప్రయోజనకరం. పంట విక్రయాల్లో పారదర్శకత మరింతగా పెరుగుతుంది. మద్దతు ధర లభించడమే కాక మోసాలకు తావుండదు. ఖమ్మం మార్కెట్లో సమర్థంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాం. – పి.ప్రవీణ్కుమార్, ఉన్నత శ్రేణి కార్యదర్శి, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ -
వేసవి వచ్చేసింది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతను ఎదుర్కొనేందుకు ఫ్యాన్లకు బదులుగా కూలర్లు, ఏసీలు ఆన్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ క్రమాన పెరిగిన డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. కానీ బొగ్గు నిల్వలు ని
కేటీపీఎస్లో నిల్వ ఉన్న బొగ్గుడేంజర్ బెల్స్!2,880 మెగావాట్ల సామర్థ్యం విద్యుత్ ఉత్పత్తిలో జిల్లాకు ఆది నుంచీ తెలంగాణలోనే ప్రత్యేక స్థానం ఉంది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (పాల్వంచ)లోని వివిధ యూనిట్ల నుంచి 1,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(మణుగూరు)లో 1,080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మొత్తంగా జిల్లా నుంచి 2,880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నమోదవుతుండగా.. పారిశ్రామిక, వ్యవసాయ, గృహ అవసరాలను వినియోగిస్తున్నారు. నిన్నా మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడంతో గృహావసర విభాగంలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంది. మరోవైపు రబీ సీజన్లో సాగువుతున్న వరి పొట్ట దశకు చేరుకుంది. దీంతో రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలోనూ మోటార్ల వినియోగం పెరగనుంది. వేధిస్తున్న బొగ్గు కొరత విద్యుత్ ఉత్పత్తి నిరంతరం కొనసాగేందుకు ప్రతీ కేంద్రంలో కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంచుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా 15 రోజులకు తగ్గకుండా నిల్వలు ఉంచుతారు. కానీ ప్రస్తుతం కేటీపీఎస్, బీటీపీఎస్ల్లో బొగ్గు నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి. నాలుగైదు రోజులకు మించి ఇక్కడ నిల్వలు లేవని సమాచారం. కేటీపీఎస్లో వివిధ దశల్లో నిర్మించిన విద్యుత్ ప్లాంట్లకు ప్రతీరోజు 22,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ఈ లెక్కన 21 రోజులకు అవసరమైన 4,72,500 మెగావాట్ల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉండాలి. కనీస స్థాయిలో 15 రోజులను పరిగణనలోకి తీసుకున్నా.. 3,37,500 టన్నుల బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ ప్రస్తుతం ఇక్కడ 80 వేల టన్నుల బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే నాలుగు రోజుల బఫర్ స్టాక్ ఉంది. బీటీపీఎస్లో కొంచెం మెరుగ్గా పదిరోజులకు అటుఇటుగా సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. సింగరేణి నుంచి తగ్గిన సరఫరా కేటీపీఎస్, బీటీపీఎస్లకు ప్రధానంగా సింగరేణి నుంచి బొగ్గు సరఫరా జరుగుతోంది. ఒప్పందం ప్రకారం బీటీపీఎస్కు ప్రతీ రోజు 18వేల టన్నులు, కేటీపీఎస్కు 22,500 టన్నుల బొగ్గు సింగరేణి నుంచి రావాల్సి ఉంది. కానీ కేటీపీఎస్కు సగటున 19 వేల టన్నుల బొగ్గే వస్తోంది. జనవరి మధ్య నుంచి ఇలా ప్రతీరోజు బొగ్గు సరఫరాలో కోత పడుతోంది. ఫలితంగా ఈ రెండు ప్లాంట్లలోనూ 21 రోజులకు సరిపడా ఉన్న బఫర్ స్టాక్ తగ్గుతూ వస్తోంది. దీంతో వేసవి మొదలై విద్యుత్ డిమాండ్ తీవ్ర దశకు చేరుకునే సమయంలో బొగ్గు నిల్వలు అడుగంటిపోయే ప్రమాదం నెలకొంది.జిల్లాలోని పవర్ ప్లాంట్లకు ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి, భూపాలపల్లి ఏరియాల నుంచి ఎక్కువగా బొగ్గు సరఫరా అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్క సత్తుపల్లి ఏరియానే నిర్దేశిత లక్ష్యం మేరకు బొగ్గు ఉత్పత్తి చేసింది. ఎప్పుడూ లక్ష్యాన్ని సాధించే మణుగూరు ఏరియా ఈసారి విఫలమైంది. ఇల్లెందు, కొత్తగూడెంతో పాటు భూపాలపల్లి ఏరియా కూడా లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయాయి. దీంతో ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు సింగరేణి సంస్థ బొగ్గు సరఫరా చేయలేకపోతోంది. దీనికి తోడు ఈ బొగ్గు నాణ్యతలోనూ జెన్కో నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఏదేమైనా.. విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వల విషయంలో జాగ్రత్త పడాల్సిన పరిస్థితి నెలకొంది.విద్యుత్ కేంద్రాల్లో తగ్గిన బొగ్గు నిల్వలు కర్మాగారానికి అవసరమైన బొగ్గు నిల్వలు పెంచాలని ఇప్పటికే సింగరేణి అధికారులను కోరాం. ప్రస్తుతం వస్తున్న బొగ్గు కంటే వినియోగం అధికంగా ఉండడంతో నిల్వలు తగ్గుతున్నాయి. 15 రోజుల కంటే ఎక్కువగా ఉపయోగపడేలా నిల్వ ఉండాలి. కానీ ప్రస్తుతం వారం రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే నిల్వ ఉంటోంది. మార్చిలో దాన్ని భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటాం. – ఎం.ప్రభాకర్ రావు, కేటీపీఎస్ 5,6 దశల సీఈ -
●సీఎం సదస్సులో కలెక్టర్
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ల సదస్సు హైదరాబాద్లో మంగళవారం జరగగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొని పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సదస్సులో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామసభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం ద్వారా జరుగుతున్న లబ్ధిని ప్రజలకు వివరించాలని, విద్యా వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొచ్చే మార్పులపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. అలాగే, ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్టం చేసేలా సమీపంలోని మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేయాలని, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతీనెల బిల్లులు చెల్లించాలని పేర్కొన్నారు. – ఖమ్మం సహకారనగర్ -
రీజియన్లో అదనంగా 86 బస్సులు
సత్తుపల్లిటౌన్: ఆర్టీసీ ఖమ్మం రీజియన్లో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 86 కొత్త బస్సులు నడిపిస్తున్నామని రీజినల్ మేనేజర్ ఎ.సరిరాం తెలిపారు. సత్తుపల్లి డిపోను మంగళవారం తనిఖీ చేసిన ఆయన బస్సుల ఫిట్నెస్ను పరిశీలించడమే కాక బస్టాండ్లో సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆర్ఎం మాట్లాడుతూ మెరుగైన రవాణా కల్పించడమే లక్ష్యంగా అదనపు బస్సులు ఏర్పాటుచేశామని తెలి పారు. ఈ నేపథ్యాన ఆదాయం పెంచేలా ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు. ఆతర్వాత భద్రతా వారోత్సవాల సందర్భంగా గ్యారేజీలో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. అలాగే, అద్దె బస్సుల యజమానులతో సమావేశమై సూచనలు చేశారు. డిపో మేనేజర్ జి.లక్ష్మీనారాయణ, ఉద్యోగులు ప్రవీణ్, సాహితి, శ్రీనివాస్, చక్రవర్తి, ఆనంద్ పాల్గొన్నారు. శ్రీవారి ఆలయం మూసివేత ఎర్రుపాలెం: చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని మండలంలోని జమలాపురంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంగళవారం మూసివేశారు. ఆలయంలో పూజలను ఉదయం 9గంటల లోపే పూర్తిచేసిన అనంతరం దర్శనాలు నిలిపివేసి ఆలయ ద్వారబంధనం చేశారు. కాగా, బుధవారం ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం 9గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఈఓ కె.జగన్మోహన్రావు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, వేద పండితులు విజయకృష్ణ, చక్రధర్, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఖమ్మంవ్యవసాయం: పర్యావరణ సమతుల్యతలో కీలకమైన వన్యప్రాణుల సంరక్షణను అందరూ బాధ్యతగా భావించాలని జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ సూచించారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లాలోని అన్ని రేంజ్ల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని డీఎఫ్ఓ తెలిపారు. వన్యప్రాణుల వేటతో అనర్థాలు, అడవుల నరికివేతతో ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించామని, వన్యప్రాణుల ఆవాసాల మెరుగుదల కోసం పలుచోట్ల మొక్కలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. నేర పూరిత దాడిమాస్లైన్ జాతీయ నాయకుడు ప్రదీప్సింగ్ ఠాగూర్ ఇల్లెందు: అమెరికా, ఇజ్రాయిల్ కలిసి నేరపూరితంగా ఇరాన్పై సైనిక దాడులు నిర్వహిస్తున్నాయని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ అనుబంధ అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ నాయకుడు ప్రదీప్సింగ్ఠాగూర్ విమర్శంచారు. ఇల్లెందులో మంగళవారం జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. సైనికదాడులను వెంటనే నిలిపివేయాలన్నారు. కాగా, ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం శాంతి స్వావలంబనకు మద్దతుతెలపకుండా మౌనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వివిధ రాష్ట్రాల నాయకులు పరితోష్దాస్, సిబిగిరి, నిరంజన్ బేరా, దేవరావు, ఎస్కే.గౌస్, బి.రాము, గుమ్మడి నర్సయ్య, ముద్దా భిక్షం, నాగేశ్వరరావు, రాము, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
వన్యప్రాణికి హాని!
పాల్వంచరూరల్: ఎన్ని చట్టాలు చేసినా వేటగాళ్ల వేటుకు వన్యప్రాణాలు బలి అవుతూనే ఉన్నాయి. ఏటా అటవీ శాఖ, వైల్డ్లైఫ్ శాఖల అధికారులు జంతు సంరక్షణ చైతన్య దినోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలను జాగృతం చేస్తున్నా అటవీ జంతువులకు హాని కలుగుతూనే ఉంది. అటవీశాఖ రికార్డులో నమోదవుతున్న కేసులే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చే. 2021–2022లో జిల్లాలో జంతువుల వధపై 25 కేసులు నమోదయ్యాయి. 2022లో 31 కేసులు, 2023లో ఆరు, 2024లో మూడు, 2025లో నాలుగు కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది పాల్వంచ వైల్డ్లైఫ్ విభాగం అధికారులు 303 ఉచ్చులు, బాణాలు, విల్లంబులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతం క్రమంగా ఆక్రమణకు గురి అవుతుండటంతో అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందినే ఆరోపణలు ఉన్నాయి. వేసవిలో జంతువులు నీళ్ల కోసం వచ్చే క్రమంలో వేటుగాళ్లు ఉచ్చులు పెట్టి వధిస్తున్నారు. కిన్నెరసానిలో విభిన్న జంతువులు.. భద్రాద్రి జిల్లాలో అటవీ విస్తీర్ణం 10 లక్షల ఎకరాల్లో ఉండగా, కిన్నెరసాని అభయారణ్యం 634.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అభయారణ్యంలో విభిన్న రకాల జంతువులు ఉన్నా యి. ఇటీవల పులులు సంచరించిన విషయం విదితమే. అడవి గేదెలు, దున్నలు, ఎలుగుబంట్లు, చుక్కల దుప్పులు, కణుజులు ఉన్నాయి. కిన్నెరసాని రిజర్వాయర్లో వేల సంఖ్యలో మోరేజాతి మొసళ్లు ఉన్నాయి. ఇలా అనేక రకాల జంతువులు అడవుల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. జిల్లాలో అటవీ జంతువుల సంరక్షణపై నిఘా పెట్టాం. బీట్ల వారీగా పర్యవేక్షణ చేపట్టాం. రాత్రి పూట కూడా కన్పించేలా అధనాతన పరిజ్ఞానం కలిగిన రెండు థర్మల్ డ్రోన్లను ఉపయోగిస్తున్నాం. పెట్రోలింగ్తో పాటుట సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నాం. అటవీ ప్రాంతంలో 30 బేస్క్యాంప్లను ఏర్పాటు చేసి 150 మంది సిబ్బందిని కూడా నియమించాం. – జి.కృష్ణాగౌడ్, భద్రాద్రి జిల్లా అటవీశాఖాధికారినేడు ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవంజంతువుల సంరక్షణ కోసం 1972 నుంచి వైల్డ్లైఫ్ చట్టాలు అమలు చేస్తున్నారు. అయినా వేటగాళ్లు వన్యప్రాణుల ఉసురుతీస్తూనే ఉన్నారు. గతేడాది జూన్ 15న ములకలపల్లి రేంజ్లో వేటగాళ్లు నాటు తుపాకులతో సంచరిస్తూ పట్టుబడ్డారు. మే 26న అశ్వారావుపేట రేంజ్లో కస్తూరి జింక అవశేషాల ను పట్టుకున్నారు. ఏప్రిల్ 17న దమ్మపేట రేంజ్లో వండిన దుప్పి మాంసాన్ని పట్టుకున్నారు. ఏప్రిల్ 9న నాటుతుపాకులు కలిగిన ముగ్గురు అరెస్ట్ అయ్యారు. దమ్మపేట రేంజ్లోని పెద్దగొల్లగూడెంలో మేకల గుంపులో వచ్చిన దుప్పి పిల్లలను వేటా డి చంపారు. తాజాగా ఈ నెల1న ఖమ్మం జిల్లా కారేపల్లి రేంజ్లోని ముచ్చర్ల రామస్వామి గుట్ట సమీపంలో అడవి పంది మాంసాన్ని అటవీ శాఖ అధికారులు పట్టుకుని ఇద్దరిపై కేసు పెట్టారు. -
‘నివేదికలో ఉపాధ్యాయులపై కక్షపూరిత వైఖరి’
సత్తుపల్లిరూరల్: తెలంగాణ ప్రభుత్వానికి ఇటీవల విద్యా కమిషన్ సమర్పించిన నివేదికలో ఉపాధ్యాయుల పట్ల కక్షపూరిత వైఖరి కనిపించిందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ ఆరోపించారు. సత్తుపల్లి మండల కమిటీ సమావేశం సోమవారం జరగగా ఆయన మాట్లాడుతూ నివేదిక ఉపాద్యాయులను భయబ్రాంతులకు గురి చేసేలా ఉందని తెలిపారు. టీచర్లకు అధిక జీతాలు ఉన్నాయని పేర్కొనడం, అడ్వాన్స్మెంట్ స్కీమ్ల రద్దు, పనితీరు ఆధారంగా పదోన్నతులు, లేకపోతే ఉద్యోగం నుంచి తొలగింపు వంటి సిఫారసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, ప్రభుత్వం రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరెడ్డి, నాయకులు చెరుకు శ్రీనివాసరావు, కే.వీ.రాజేశ్వరరావు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హెచ్.సూరయ్య, అశోక్ చక్రవర్తితో పాటు ఐ.నాగేశ్వరరావు, ఎం.మధు, జి.శేఖర్, సుకుమార్, వైఎస్ఆర్ పాల్గొన్నారు. -
ట్రస్మా నూతన కమిటీ ఎన్నిక
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రస్మా) జిల్లా కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. ఖమ్మం బల్లేపల్లిలోని నిర్మల్ హైస్కూల్లో జరిగిన ఎన్నికల్లో ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా బీబీఎం స్కూల్ కరస్పాండెంట్ గుర్రం కాంతారావు, కార్యదర్శిగా నాయుడు వెంకటేశ్వరరావు, కోశాధికారిగా నాసరయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలు టాలెంట్ టెస్టుల పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకరావటాన్ని అడ్డుకుంటామని తెలిపారు. రాష్ట్ర కమిటీ సహకారంతో జిల్లాలోని అన్ని బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు శిక్షణ అందేలా చూడడంతో పాటు బడ్జెట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడిచారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివరాత్రి యాదగిరి, వెంకటేశ్వరరావుతో పాటు యాదగిరి శేఖర్రావు, ఐవీ.రమణారావు, కే.సీ.వీరన్న, కొండపల్లి శశిధర్రెడ్డి, అజరుద్దీన్, ఇర్షాద్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.అధ్యక్ష, కార్యదర్శులుగా కాంతారావు, వెంకటేశ్వరరావు -
రేపు ఖమ్మం మార్కెట్కు సెలవు
ఖమ్మంవ్యవసాయం: హోలీ పండుగను పురస్కరించుకుని ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు బుధవారం సెలవు ప్రకటించారు. రైతులు, వ్యాపారులు, కార్మికులు ఈ విషయాన్ని గుర్తించాలని మార్కెట్ కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ ఓ ప్రకటనలో సూచించారు. ఈనెల 6, 7వ తేదీల్లో జాతీయ సదస్సు నేలకొండపల్లి: నేలకొండపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 6, 7వ తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలేటి పరంజ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా కాలేజీలో సోమవారం ఆయన వివరాలు వెల్ల డించారు. భౌతిక శాస్త్రం విభాగం ఆధ్వర్యాన ‘ఎకోస్ ఆఫ్ ది పాస్ట్ బీమ్స్ ఆప్ లైట్.. ఎక్స్ ప్లోరింగ్ ది సైంటిఫిక్ పినామినా బీహైండ్ తెలంగాణ ఆర్కిటెక్చర్’ అంశంపై పీఎమ్ ఉషా(రూసా), తెలంగాణ ఉన్నత విద్యామండలి సౌజన్యంతో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లోని యూనివర్సిటీల నుంచి 60 మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సును కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాప్రెడ్డి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ నర్సింగ్ శ్రీనివాసరావు, కోఆర్డినేటర్ డాక్టర్.రమేష్, టాస్క్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.నారాయణస్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రపంచమంతా శాంతి వెల్లివిరియాలి ఖమ్మంరూరల్: ప్రపంచంలోని అన్ని దేశాల్లో శాంతి వెల్లివిరియాలని ఆల్ ఇండియా బిషప్ల సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పూల ఆంథోని అన్నారు. యుద్ధాలు జరిగితే అందరికీ అనర్ధదాయకమని పేర్కొన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి కరుణగరిలో జరుగుతున్న ఉత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆంథోని మాట్లాడుతూ ప్రతిఒక్కరూ శాంతిమార్గంలో నడవాలని.. ప్రజలు సఖ్యత, ఐకమత్యంతో ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం నాయుడుపేట నుంచి కరుణగిరి వరకు కోలాటాల నడుమ వాహన ర్యాలీ నిర్వహించారు. ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్తో పాటు బిషప్ సగిలి ప్రకాష్, ఫాదర్ శౌరి, జాన్నేష్, ఆంటోని రాజ్, కొమ్ము ఆంథోని, మ్యాథ్యూ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ఉద్యోగులకు పదోన్నతులు సత్తుపల్లి: సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ ఉద్యోగులు పలువురికి పదోన్నతులు కల్పించారు. హెడ్ ఓవర్మెన్ గ్రేడ్–ఏ నుంచి గ్రేడ్–ఏ1గా ఐదుగురికి, గ్రేడ్–బీ నుంచి గ్రేడ్–ఏలోకి ఏడుగురికే కాక టైం రెటెడ్ వేకెన్సీలను ద్వారా ఐదుగురికి పదోన్నతి దక్కింది. అలాగే, కెరీర్ గ్రోత్ స్కీం ద్వారా కిష్టారం ఓసీలో ఒకరికి, జేవీఆర్ ఆర్సీహెచ్పీలో మెకానికల్ గ్రేడ్–బీ నుంచి గ్రేడ్–ఏ ఇంకొకరికి పదోన్నతి కల్పించారు. ఈ సందర్భంగా సోమవారం ఉద్యోగులకు ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ పదోన్నతి పత్రాలు అందజేశారు. పీఓ ప్రహ్లాద్, ప్రాజెక్టు అధికారులు డి.శ్రీనివాసరావు, బి.రాజేశ్వరరావు, జి.కళ్యాణ్రామ్, నాయకులు సుధాకర్, బి.కోటేశ్వరరావు, నర్సింహారావు, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యుత్ వ్యవస్థ రక్షణకు లైట్నింగ్ అరెస్టర్లు ఖమ్మంవ్యవసాయం: అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులు వచ్చినప్పడు విద్యుత్ వ్యవస్థను రక్షించేలా చర్యలు చేపడుతున్నట్లు ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. మెరుపులు, పిడుగుల కారణంగా విద్యుత్ లైన్లు, పంపిణీ వ్యవస్థ, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, ఇతర పరికరాలు నష్టపోకుండా లైట్నింగ్ అరెస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు సర్కిల్ పరిధిలో 109 లైట్నింగ్ అరెస్టర్లను అమర్చగా, ఇవి మెరుపు, పిడుగు సమయాన కలిగే అధిక వోల్టోజీని భూమిలోకి పంపిస్తాయని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్ తొలగింపు ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ను విధుల నుంచి తొగించారు. ఇటీవల పరీక్ష హాల్లో ఓ విద్యార్థి రాసిన సమాధాన పత్రాన్ని మరో విద్యార్థికి అందించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సదరు విద్యార్థి తన తల్లిదండ్రులకు చెప్పగా వారి ఫిర్యాదుతో సోమవారం సీఎస్ను విధుల నుంచి తొలగించామని డీఐఓఈ రవిబాబు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో సీలింగ్ కార్మికుడు మృతి
తిరుమలాయపాలెం: మండలంలోని పాతర్లపాడు స్టేజీ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్కు చెందిన సీలింగ్ కార్మికుడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు... ఉత్తరప్రదేశ్లోని ధరమ్పూర్ జిల్లా మైనహా గ్రామానికి చెందిన విష్ణుకుమార్(25)తో పాటు విజయ్, ఖనీరామ్ ఇళ్లలో సీలింగ్ పని చేస్తూ ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని ఓ ఇంటికి సీలింగ్ చేసేందుకు బైక్పై వెళ్లి ఆదివారం రాత్రి తిరిగి ఖమ్మం వస్తుండగా బైక్ అదుపు తప్పింది. దీంతో కింద పడిన విష్ణుకుమార్ తీవ్రగాయాలతో మృతిచెందగా విజయ్, ఖనీరామ్కు తీవ్రగాయాల్యాయి. వీరిని 108లో ఖమ్మం ఆస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏనెకుంట తండాలో మిర్చి చోరీకి యత్నం తిరుమలాయపాలెం: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చిని కల్లాల్లో ఆరబోస్తే కొందరు చోరీ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే వెలుగు చూశాయి. మండలంలోని ఏనెకుంట తండాకు చెందిన రైతులు బానోతు మల్సూర్, బానోతు రవి మిర్చి కోశాక సమీప అడవిలోని కల్లాల్లో ఆరబెట్టారు. ఆదివారం రాత్రి వారు ఇంటికి వెళ్లాక అక్కడకు చేరుకున్న గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 15 క్వింటాళ్ల మిర్చి చోరీకి యత్నించారు. మిర్చిని రాశులుగా పోసి మరోచోటకు తరలించినా తెల్లవారడంతో తీసుకెళ్లడం సాధ్యం కాక పారిపోయినట్లు తెలిసింది. ఈమేరకు సోమవారం ఉదయం ఆరబోసిన చోట మిర్చి లేకపోవడంతో రైతులు వెతుకుతుండగా మరోచోట రాశులు ఉండడంతో చోరీ సాధ్యం వదిలేసిపోయారని గుర్తించారు. -
గ్రామాభివృద్ధి కోసం ఎన్ఆర్ఐ రూ.లక్ష విరాళం
ముదిగొండ: స్వగ్రామం అభివృద్ధికి తన వంతు సాయంగా ఓ ఎన్ఆర్ఐ(ప్రవాస భారతీయుడు) ముందుకొచ్చాడు. ఈమేరకు ముదిగొండ వాసి వేగినాటి నాగభూషణం సోమవారం సర్పంచ్ కట్టకూరి ఉపేందర్కు రూ.లక్ష విరాళం చెక్కు అందజేశారు. ఆయన ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఇటీవల గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ఏర్పడగా, గ్రామాభివృద్ధికి అండగా నిలుస్తానన్న హామీతో రూ.లక్ష చెక్కు అందజేశారు. నూతన సర్పంచ్తో పాటు పాలకమండలి, యువకులు ఇటీవల కోతుల బెడదను నివారించేందుకు కృషి చేయడంతో పాటు గ్రామంలో అంతర్గత రహదారుల వెంట ముళ్ల పొదలను తొలగించారు. ఈనేపథ్యాన విరాళం అందజేసిన నాగభూషణంను స్థానికులు అభినందించారు. -
చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
పెనుబల్లి: జ్యూఝెలరీ షాప్లో ఆభరణాల చోరీ కేసులో నిందితుడినివీఎం బంజరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు సోమవారం సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తిలింగయ్య వెల్లడించిన వివరాలు... పెనుబల్లి మండలం వీఎంబంజరులోని ఆచారి జ్యూఝెలరీ షాప్నకు గత నెల 7వ తేదీన వచ్చిన వ్యక్తి షాపులోని వారిని మభ్యపెట్టి షోకేస్లో ఉన్న 36 గ్రాముల బరువైన 9బంగారం ఉంగరాలు అపహరించి పారిపోయాడు. ఆపై వీఎం బంజరు ఎస్సై కె.వెంకటేష్, తన సిబ్బందితో విచారణ చేపట్టగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం భీమవరానికి చెందని గొర్రెల సత్యనారాయణ నిందితుడికి తేలింది. ఆయన తిరువూరుకు వెళ్తుండగా వీఎం బంజరు బస్టాండ్లో అదుపులోకి తీసుకుని విచారించడంతో తిరువూరులో రూ.1.20 లక్షలకు తాకట్టు పెట్టినట్లు చెప్పడంతో స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కాగా, నిందితుడు సత్యనారాయణపై 28 కేసులు ఉన్నాయని, ఓ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చాక మళ్లీ చోరీలు మొదలుపెట్టాడని వెల్లడించారు. గుప్తనిధుల పేరిట తవ్వకాల్లో... గుప్తనిధులు ఉన్నాయనే భావనతో తవ్వకాలు చేపట్టిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతనెల 20వ తేదీన మండలంలోని ఏరుగట్ల శివార్లలో కొందరు జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. ఈ విషయం అందిన సమాచారంతో వీఎం బంజరు పోలీసులు వెళ్లే సరికి నిందితులు పరారయ్యారు. వీరి కోసం గాలిస్తుండగా నిందితులు సోమవారం లొంగిపోయారని సీఐ ముత్తిలింగయ్య తెలిపారు. వీరి నుంచి జేసీబీ, మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
‘సూర్య ఘర్’తో ప్రయోజనం
ఖమ్మంవ్యవసాయం: పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ప్రజా పాలన – ప్రగతి పాలన కార్యాచరణపై అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్షించారు. తొలుత సూర్యఘర్ అవగాహన పోస్టర్లు ఆవిష్కరించాక కలెక్టర్ మాట్లాడారు. ఈ పథకం ద్వారా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున ఉద్యోగులు ముందుకు రావాలని తెలిపారు. సబ్సిడీ పోగా మిగతా నగదు బ్యాంకు లోన్ ద్వారా సమకూర్చుకోవచ్చని వెల్లడించారు. కట్టుదిట్టంగా ప్రణాళిక ప్రభుత్వం ఈనెల 6నుంచి జూన్ 12వ తేదీ వరకు ‘99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యాచరణ’ నిర్వహించనున్నందున షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాల అమలుకు అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యాచరణలో భాగంగా మున్సిపల్, పంచాయతీ శాఖల అధికారులు సంక్షేమ పథకాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్డీసీ ఎం.రాజేశ్వరి, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసాచారి, రెడ్కో జిల్లా మేనేజర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పరీక్షలు ప్రశాంతంగా రాయండి ఖమ్మం సహకారనగర్: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు. జీవితంలో పదో తరగతికి ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆందోళనకు గురికావొద్దన్నారు. పరీక్షలకు మరో రెండు వారాల సమయం ఉన్నందున గత కొన్నేళ్ల ప్రశ్నపత్రాల ఆధారంగా సిద్ధం కావాలని సూచించారు. అనంతరం మోటివేషన్ స్పీకర్ గంపా నాగేశ్వరరావు మాట్లాడగా డీఈఓ చైతన్యజైనీ, ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజాలక్ష్మి, డీసీఈబీ కార్యదర్శి కనపర్తి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ కమర్తపు మురళి, మిత్ర గ్రూప్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్కుమార్తో పాటు శ్రీనివాస్, యుగంధర్, మహంకాళి గణేష్, ఉపేందర్, సీతారాంబాబు, గురుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
అక్కడ పది కుటుంబాలే...
ఖమ్మంఅర్బన్: ఖమ్మం వెలుగుమట్ల రెవెన్యూ పరిధి భూదాన్ భూముల్లో ఇటీవల వందలాది నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అంతేకాక ఇన్నాళ్లు వందలాది కుటుంబాలతో కళకళలాడిన ప్రాంతం ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. అయితే, భూదాన కమిటీ ద్వారా తమకు పట్టాలు ఉన్నాయని పేర్కొంటూ కొందరు కోర్టును ఆశ్రయించగా పది ఇళ్లను మాత్రం అధికారులు వదిలేశారు. వీరి ఇళ్లు మిగిలినా చుట్టూ 700వరకు గృహాలను కూల్చివేయడంతో శిథిలాల నడుమ పది ఇళ్లలోని వారు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈనేపథ్యాన శిథిలాల నడుమ ఉండలేక ఇళ్లకు తాళాలు వేసి వీరు కూడా అంబేద్కర్ భవన్, టీటీడీసీలోని పునరావాస కేంద్రాలకే వెళ్లిపోయారు. పొద్దంతా అక్కడే ఉంటూ సాయంత్రం తిరిగి వస్తున్నామని వారు చెబుతున్నారు. అర్హులతో పాటే తమకు కూడా పునరావాసం కల్పించాలని ఆయా కుటుంబాలు కోరుతున్నాయి. భూదాన్ భూముల్లో శిథిలాల నడుమ జీవనం -
భూదాన్..దందా!
ఖమ్మం నగరానికి ఆనుకుని వైరా రోడ్డు సమీపాన ఉన్న భూదాన్ భూమి ఎకరం ధర బహిరంగ మార్కెట్ ఆధారంగా రూ.కోట్లలో ఉంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 31.7 ఎకరాల విలువ రూ.250 కోట్లుగా కలెక్టర్ ప్రకటించడంతో ఎంత హాట్ కేకో అర్థమవుతుంది. నగరానికి సమీపాన ఉన్నందున కాస్త స్థలం దొరికినా నీడ ఏర్పాటుచేసుకోవచ్చని నిరుపేదలు ఆశించారు. ఇదే అదునుగా ముఠాగా ఏర్పడిన కొందరు రూ. లక్ష నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేశారు. ఈ తంతు ఏళ్లుగా కొనసాగడంతో స్థలం పొందిన వారిలో కొందరు గుడిసెలు, మరికొందరు రేకులు, కొంచెం స్థోమత ఉన్న వారు స్లాబ్తో ఇంటి నిర్మాణం చేపట్టారు. తక్కువ ఖర్చుతో గూడు దక్కిందని ఆనందపడుతుండగానే కూల్చివేతలతో ఆ సంతోషం ఆవిరైపోయింది. ఇళ్లు కోల్పోయిన వారిలో నిజమైన నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రస్తుతం వారికి నిలువనీడ లేకపోగా.. రెక్కలు, ముక్కలు చేసుకొని పోగేసిన డబ్బు ముఠా సభ్యులకు ఇచ్చి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల డబ్బు వసూలు చేసిన ముఠా సభ్యులను బాధితులు నిలదీశారు. అంతేకాక మోసపోయిన వారి ఫిర్యాదుతో పోలీసులు ఇప్పటికే 30 మందిని అరెస్టు చేయగా, ఇంకా బాధితులు ఉంటే ముందుకు రావాలని అధికారులు సూచించారు. ఏదేమైనా స్థలం కోసం రూ.లక్షలు ముట్టజెప్పడంతో ఇంటి నిర్మాణానికి రూ.లక్షల్లో అప్పు చేసిన నిరుపేదలు చివరకు బాధితులుగా మిగిలిపోవడం అందరికీ ఆవేదన కలిగిస్తోంది. భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన వారిలో పేదలను ఆదుకుంటామని ప్రకటించిన మంత్రి పొంగులేటి.. ఈనెల 15వరకు ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోయిస్తామని వెల్లడించారు. దీంతో అర్హుల గుర్తింపు సర్వేను ఈనెల 10లోగా పూర్తిచేసి జాబితాను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలుస్తోంది. పేదలు ఇంటి స్థలం కోసం డబ్బు ఎంత ఇచ్చారనే వివరాలు కూడా సర్వేలో నమోదు చేస్తున్నట్లు సమాచారం. భూదాన్ భూముల్లో ఇంటి స్థలం ఇప్పిస్తామంటూ కొందరు డబ్బు వసూలు చేశారని ఫిర్యాదులు అందాయి. ఇప్పటివరకు అందిన ఫిర్యాదుల ఆధారంగా ముఠా సభ్యులు రూ.1.25కోట్లు వసూలు చేశారని తెలుస్తోంది. ఇంకా బాధితులు ఉంటే ముందుకు రావాలి. ప్రత్యేక బృందాలతో విచారణ చేపడుతుండగా.. పేదలను మోసగించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – సునీల్దత్, పోలీస్ కమిషనర్ఇంటి జాగా కోసం రూ.లక్షల్లో వసూలు చేసిన వారి పేర్లతో ఫిర్యాదులు అందడంతో పోలీసులు వారిని అరెస్టు చేయడమే కాక ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. ముఠాలో సభ్యులు ఏ ప్రాంతం వారు, ఎందరు.. వీరి స్వస్థలాల్లో కుటుంబీకులు, బంధువుల పేర్లపై ఏమేం ఆస్తులు ఉన్నాయి, ఇటీవల ఏవైనా కొనుగోలు చేశారా అని ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బాధితుల నుంచి వసూలు చేసిన మొత్తం రూ.కోట్లలో ఉంటుందని భావిస్తుండగా.. ఆ మొత్తాన్ని ముఠా నుంచి బాధితులకు ఇప్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పోలీసు యంత్రాంగం విచారణలో వేగం పెంచింది.వెలుగుమట్ల స్థలాల పేరిట చేతులు మారిన రూ.కోట్లు -
దరఖాస్తులు పెండింగ్ ఉండొద్దు
గ్రీవెన్స్ డేలో కలెక్టర్ అనుదీప్ ఖమ్మం సహకారనగర్: ప్రజలు ఇచ్చే దరఖాస్తులు పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించాల్సిందేనని తెలిపారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీపాదరావు జయంతి శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని కలెక్టరేట్లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ అనుదీప్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన వి.మల్లేశ్వరి, షేక్ జానీమియా, అంజమ్మ, గిరిజను కలెక్టర్ సన్మానించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఎస్డీసీ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కొణిజర్ల మండలం దుద్దుపూడికి చెందిన అమర్లపూడి భాస్కరరావు తమ భూమిని సబ్ స్టేషన్ కోసం కేటాయించగా హైకోర్టు కేసు కారణంగా స్థలం మార్చారని తెలిపారు. అయితే, కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఆ స్థలలాన్ని మున్సిపాలిటీ అధికారులు డంపింగ్ యార్డ్కు కేటాయించారని, మరోమారు పరిశీలించి తమ పేరిట పాస్ పుస్తకాల జారీ చేయాలని కోరారు. నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామం పెద్దతండాకు చెందిన గిరిజనులు గత ప్రభుత్వం సర్వే నంబర్ 663లో ఆరు ఎకరాల స్థలం కేటాయించినందున బంజారా భవన్, సేవాలాల్ మందిరం నిర్మాణానికి అనుమతించాలని కొరకు వినతిపత్రం అందజేశారు. చింతకాని మండలం బస్వాపురానికి చెందిన పాలకుర్తి బాలయ్య, రాధ తమ కుమారులు మనోజ్కుమార్(14), నరేంద్రకుమార్(12) అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నందున పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. -
మొదలైన ‘కొదమూరు’ రెండో దశ పనులు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం వెలుగుమట్ల గుట్ట సమీపాన ఉన్న కొదమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించి రెండో దశ పనులు వేగంగా సాగుతున్నాయి. రెండు నెలల క్రితం ఈ పనులకు శంకుస్థాపన చేయగా అవసరమైన పైపులను లిఫ్ట్ ప్రాంతంలో రెండు రోజులుగా చేరుస్తున్నారు. సుమారు రూ.30 కోట్ల అంచనా వ్యయంతో పథకం రెండో దశ పనులు చేపట్టనుండగా, మొత్తం 10 కి.మీ. పైపులైన్ ద్వారా నీటి పంపింగ్ చేస్తారు. ముందుగా నాగపూర్–అమరావతి నేషనల్ హైవే నిర్మాణంలో అడ్డంకులు లేకుండా 3.5 కి.మీ. మేర పైపులైన్ వేయనున్నారు. ఈ క్రమాన భూసేకరణ సమస్య రాకుండా సుమారు నాలుగు అడుగుల వ్యాసం కలిగిన మైల్డ్ స్టీల్(ఎంఎస్) పైపులు వినియోగించునున్నారు. ఆతర్వాత మిగతా పైప్లైన్కు సాధారణ పైపులే వినియోగించనున్నారు. -
ఈసారీ ఇక్కట్లేనా ?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నవమి పండగ ముంగిట్లోకి వచ్చేసింది. భద్రాచలంలో ఇప్పటికే పనులు చకచకా సాగుతున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు భద్రాచలం వస్తారు. అయితే వారికి భద్రగిరిలో వసతి సౌకర్యాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కరించే అవకాశం అందుబాటులో ఉన్నా.. ఒడిసి పట్టుకోవడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలం అవుతున్నారు.అందుబాటులో 78 గదులు జిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో కాటేజీలు, హోటళ్ల నిర్మాణ పనులు 2016లో ప్రారంభించారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఆగుతూ సాగుతూ వచ్చాయి. గదుల నిర్మాణం నాలుగేళ్ల క్రితమే పూర్తయినా కిటీకీలు, తలుపుల బిగింపు వంటి పనుల్లో జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే గతేడాది కాలంగా ఈ పనుల్లోనూ కదలిక వచ్చింది. 2024 డిసెంబర్ నాటికి అందుబాటులో తెస్తామని అధికారులు ప్రకటించినా.. చివరకు 2025 డిసెంబర్ నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్రోడ్ వద్ద నిర్మిస్తున్న హరిత హోటల్లో 42 గదులు, కిన్నెరసాని డ్యాంసైట్ దగ్గర ఎకో టూరిజంలో భాగంగా నిర్మించిన హరితా హోటల్లో 36 గదుల నిర్మాణం ఏడాది క్రితమే పూర్తయింది. ఇక్కడ పర్యాటకులు విడిది చేసేందుకు 78 గదులతో పాటు డార్మిటరీలు, బార్, రెస్టారెంట్, మూడు చిన్న ఫంక్షన్ హాళ్లు, ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ ఉన్నాయి. ఆదరణ బాగుంటుంది శ్రీరామనవమి, ముక్కోటి, హనుమాన్ జయంతి పండుగలతో పాటు ఇతర పర్వదినాలు, వరుస సెలవులు వచ్చినప్పడు భద్రాచలానికి రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా నవమి, ముక్కోటి సందర్భంగా భద్రాచలంలో వసతి దొరకడం కష్టంగా మారుతోంది. ఇతర జిల్లాల నుంచి డ్యూటీపై వచ్చే ప్రభుత్వ సిబ్బందికి కూడా ఈ ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో భద్రాచలానికి కేవలం గంట ప్రయాణ దూరంలో ఉన్న కొత్తగూడెం, పాల్వంచలోని ప్రైవేటు లాడ్జీలు, హోటళ్లలో గదులు బుక్ చేసుకుంటారు. శ్రీరామనవమికి కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు అన్ని హోటళ్లలో గదులు ముందుగానే బుక్ అయిపోతాయి. కనీసం ఈ నవమికై నా హరితా హోటళ్లను అందుబాటులోకి తీసుకొస్తే పర్యాటకులు/భక్తులకు ఉపయోగకరంగా ఉండడంతో పాటు ఆరంభంలోనే ఈ హోటళ్లకు మంచి ఆదరణ లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కొత్తగూడెం, కిన్నెరసాని దగ్గర త్వరలో అందుబాటులోకి రాబోయే హోటళ్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది నవంబర్లో ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. నిర్ణీత గడువు ముగిసినా, పర్యాటక శాఖ ఆశిస్తున్న అన్ని రకాల అర్హతలు ఉన్న కంపెనీలు ముందుకు రాలేదు. దీంతో హోటల్, కాటేజీలు పర్యాటకులకు అందుబాటులోకి రాకుండా పోయాయి. మొదటి దఫాలో టెండర్లు ఎందుకు రాలేదు? ప్రైవేటు సంస్థలు ఎందుకు వెనకడుగు వేస్తున్నాయనే అంశంపై ఇంతవరకూ చర్చ జరగలేదు. మరోవైపు ఇంత భారీ స్థాయిలో హోటళ్లు నిర్మించినా, వీటి ప్రారంభోత్సవానికి ఉన్న అడ్డంకులు ఏంటీ? వాటిని ఎలా అధిగమించాలి అనే అంశంపై ప్రభుత్వం తరఫున మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల నుంచి చొరవ కరువైంది. వెరసి ఈ హోటల్ అందుబాటులోకి వచ్చేది ఎప్పుడనేది అంతుచిక్కని అంశంగా మారింది. మరోవైపు నిర్మాణం పూర్తయినా ప్రారంభం కాకపోవడంతో హోటల్ ఆవరణలో పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. హరిత హోటల్ నిర్వహణ బాధ్యతలు ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించాం. ఈ మేరకు గత నవంబర్లో టెండర్లు పిలవగా, ఆశించిన ఫలితం రాలేదు. మరోసారి టెండర్లు పిలిచి, అర్హత సాధించిన సంస్థకు బాధ్యతలు అప్పగించి, హోటళ్లను ప్రారంభిస్తాం. – రామకృష్ణ (డీఈ, టూరిజం కార్పొరేషన్) -
దుబాయ్లో మంత్రి తుమ్మల..
అక్కడి పరిస్థితులతో తిరుగు ప్రయాణం ఒకరోజు వాయిదా ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారు. గతనెల 22న ఆయన అల్లుడు డాక్టర్ కల్యాణ్శేఖర్ వైద్యుల సదస్సు నిమిత్తం దుబాయ్ వెళ్లారు. తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అక్కడి ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో మంత్రి తుమ్మల తన కుమార్తె మోహిని, ఇతర కుటుంబీకులతో కలిసి 23వ తేదీన దుబాయ్ వెళ్లారు. అయితే, కళ్యాణ్శేఖర్ మరికొద్ది రోజులు అక్కడే చికిత్స పొందాల్సి ఉందని వైద్యులు చెప్పినట్లు తెలిసింది. ఇంతలోనే మంత్రి తుమ్మల ఈనెల 4న భారత్కు తిరుగు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నా, అక్కడి పరిస్థితుల కారణంగా విమానం రద్దవడంతో టికెట్ను ఈనెల 5వ తేదీకి మార్పు చేసినట్టు క్యాంప్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. మంత్రి దుబాయ్లో చిక్కుకున్నారనే వార్తల్లో వాస్తవం లేదని, పరిస్థితుల దృష్ట్యా ప్రయాణం వాయిదా పడిందే తప్ప ఇబ్బందులు లేవని తెలిపారు. స్పీడ్ పోస్టు ద్వారా భద్రాద్రి కల్యాణ తలంబ్రాలు ఖమ్మంగాంధీచౌక్: భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే శ్రీ సీతారామ కల్యాణాన్ని నేరుగా వీక్షించలేని భక్తుల ఇళ్ల వద్దే తలంబ్రాలు అందిస్తామని తపాలా శాఖ ప్రటించింది. ఇందుకోసం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అధికారులతో తపాలా శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. అంతరాలయ అర్చన కల్యాణ తలంబ్రాలైతే రూ.450, ము త్యాల తలంబ్రాల కోసం రూ.151ను పోస్టాఫీసుల్లో చెల్లిస్తే స్పీడ్ పోస్టు ద్వారా నేరుగా ఇంటి వద్ద అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 27వ తేదీన శ్రీ సీతారాముల కల్యాణం జరగనుండగా, 20వ తేదీవరకు బుకింగ్కు అవకా శం కల్పించారు. కల్యాణానికి నేరుగా వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్రస్వామి ఓ ప్రకటనలో సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులకూ రిజిస్ట్రేషన్ఖమ్మవైద్యవిభాగం: క్షేత్రస్ధాయిలో పనిచేస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల పనితీరు మరింత మెరుగుపడాలని డీఎంహెచ్ఓ డి.రామారావు పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం ఉద్యోగులతో సమావేశమైన ఆయన పలు అంశాలపై సమీక్షించారు. ప్రైవేట్ ఆస్పత్రుల మాదిరిగానే ప్రభుత్వ పీహెచ్సీలు, ఆస్పత్రులకు కూడా రిజి స్ట్రేషన్ చేయించాలన్నారు. సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్న ఆస్పత్రుల్లో ప్రతీ కేసును పరిశీలించి సాధారణ ప్రసవాలకు ప్రోత్సహించాలని సూచించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సి న్ ఈనెల 4వతేదీ నుంచి వేసేలా సిద్ధం కావాల ని తెలిపారు. పరీక్షల వేళ విద్యార్థులు ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడితే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించేలా అవగాహన కల్పించాలని సూచించారు. అలా ఎవరైనా ఉంటే టెలీమానస్ 14416 నంబర్కు ఫోన్ చేస్తే నిపుణులు సలహాలు ఇస్తారని తెలిపారు. అనంతరం అదనపు డీఎంహెచ్ఓ చందూనాయక్ గర్భిణీ సీ్త్రల నమోదు, వ్యాక్సినేషన్, ఎన్సీడీ మందుల పంపిణీ, ఎండాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. వివిధ విభాగాల అధికారులు అరుణాదేవి, వి.సుబ్రహ్మణ్యం, నవీన్కుమార్, అన్వర్, ప్రగతి పాల్గొన్నారు. నేడు మద్యం దుకాణాల బంద్ ఖమ్మంక్రైం: హోలీ పండుగ సందర్భంగా శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని మంగళవారం మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ ఒక ప్రకటనలో సూచించారు. బహింరంగా ప్రదేశాల్లో గొడవలు జరగకుండా నిఽరోధించడానికి ఈ నిర్ణయం అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లఘించినా, అక్రమంగా మద్యం విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
పుంజుకుంటున్న మిర్చి ధర
ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధర మళ్లీ కొద్దికొద్దిగా పుంజుకుంటోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం ‘తేజా’ రకం మిర్చి క్వింటాకు జెండాపాట ధర రూ.19వేలుగా పలికింది. వారం క్రితం రూ.18వేలు ఉన్న ధర క్రమంగా రూ.వేయి పెరిగింది. మిర్చి విక్రయాలు సంక్రాంతి నుంచి ప్రారంభం కాగా అప్పట్లో రూ.21,150గా ఉన్నా మళ్లీ తగ్గింది. ఫిబ్రవరి చివరి వారంలో రూ. 18వేలకు పడిపోగా, ఇప్పుడు రూ.వేయి మేర పెరగడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. విక్రయాలు పెరుగుతున్న వేళ సాధారణంగా పంట విక్రయాలు పెరిగితే డిమాండ్తో పాటు ధర తగ్గుతుంది. కానీ ఇప్పుడు పంట విక్రయాలు పెరుగుతున్న వేళ ధర కూడా పుంజుకుంటోంది. పంట సాగు విస్తీర్ణం తగ్గడం, దిగుబడి కూడా అంతంతే ఉండడమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. కాగా, గత ఏడాది ఫిబ్రవరి, మార్చిలో మిర్చి క్వింటాకు గరిష్టంగా రూ.13వేల నుంచి రూ.14వేల ధర పలికింది. అప్పుడు పంట సాగు ఎక్కువగా ఉండడంతో ఉత్పత్తి అధికంగా రావడడంతో ఏప్రిల్లో రూ.12 వేల లోపునకు పడిపోయింది. దేశీయ మార్కెట్ డిమాండ్ ఆధారంగానే.. గత ఏడాది ఖమ్మం మార్కెట్కు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు నిత్యం లక్ష బస్తాల మిర్చి విక్రయానికి వచ్చేది. కానీ ఇప్పుడు25 వేల నుంచి 30వేల బస్తాలు దాటడం లేదు. ఇక గతంలో మాదిరి విదేశీ ఆర్డర్లు లేకపోవడంతో దేశీయ మార్కెట్లో డిమాండ్ ఆధారంగానే ధరలు నమోదవుతున్నాయి. స్థానిక వ్యాపారులు పంట కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తున్నారు. ఇంకొందరు నాగ్పూర్, కోల్కతా, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. తేదీ ధర ఫిబ్రవరి 24 18,000ఫిబ్రవరి 25 8,200ఫిబ్రవరి 26 18,375ఫిబ్రవరి 27 18,600మార్చి 02 19,000 -
17 ఏళ్లయినా చెక్కుచెదరని బాలిక మృతదేహం!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: 2009లో అనారోగ్యంతో పదేళ్ల బాలిక మృతిచెందగా ముస్లింల సంప్రదాయం ప్రకారం ఖబరస్తాన్లో ఖననం చేశారు. అయితే ఆ మృతదేహం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న వీడియో ప్రస్తు తం వైరల్ అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నంబర్–2 బస్తీకి చెందిన అబ్దుల్ అజమ్ఖాన్ నాలుగు రోజుల కిందట గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన భౌతికకాయాన్ని 17 ఏళ్ల క్రితం మృతిచెందిన తన అన్న కూతురు నస్రీన్ సమాధి పక్కన ఖననం చేసేందుకు గోతి తవ్వుతుండగా బాలిక మృతదేహం కనిపించింది. సహజంగా ఖననం చేసిన ఏడాదిలోపే మృతదేహం మట్టిలో కలిసిపోతుంది. కానీ 17 ఏళ్లయినా మృతదేహం అలాగే ఉండగా, పైన కప్పిన వస్త్రం రంగు మారకుండా, చెదలు పట్టకుండా ఉండటంతో అంతా షాక్ అయ్యారు. ఇదేదో మహిమగా భావించిన కుటుంబీకులు, మత పెద్దలు మరోమారు ప్రార్థన చేసి ఖననం చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచి్చన ఈ ఘటన ఇల్లెందులో చర్చనీయాంశంగా మారింది. -
పేదలను రోడ్డుపాలు చేయడం తగదు
● ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ● వారం రోజుల్లో నివేదిక ఇవ్వకపోతే ఢిల్లీకి పిలుస్తామని హెచ్చరికఖమ్మంఅర్బన్: వెలుగుమెట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేత ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఇళ్ల కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలించారు. చెట్ల కింద ఆశ్రయం పొందుతున్న కుటుంబాల వారి గోడు విన్నారు. గత 15 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, తమ ఇళ్లకు సౌర విద్యుత్ సదుపాయం కూడా ఏర్పాటు చేసుకున్నామని బాధితులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం హుస్సేన్నాయక్ మాట్లాడుతూ.. ముందస్తు నోటీసు లేకుండా ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని, భూదానోద్యమంలో పేదలకు కేటాయించిన భూముల్లో నివసిస్తున్న వారిని రోడ్డుపాలు చేయడం తగదని అన్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లు కూల్చివేసే హక్కు అధికారులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాల్సిన ప్రభుత్వం, ఉన్న ఇళ్లను నేలమట్టం చేయడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణమే అదే స్థలంలో గుడిసెలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించాలని జిల్లా అధికారులకు సూచించారు. ఈ ఘటనపై వారం రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని, లేదంటే ఢిల్లీలో విచారణకు పిలిపిస్తామని ఖమ్మం జిల్లా అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. -
ఫిట్ ఇండియా అంబాసిడర్గా ఫర్హా
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం నగరానికి చెందిన మిసెస్ ఇండియా రన్నరప్ ఎంఏ ఫర్హాను కేంద్ర ప్రభుత్వ యూత్ ఎఫైర్స్, స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ ఫిట్ ఇండియా అంబాసిడర్గా నియమించింది. ఫిట్నెస్పై అవగాహన పెంచటం, ప్రజలను ఆరోగ్యకరమైన, చురుకై న జీవనశైలిని అలవాటు చేసుకునేలా ప్రేరేపించటం లక్ష్యంగా ఫర్హాకు కేంద్రం ఈ బాధ్యతలను అప్పగించింది. ఆదివారం కేంద్రం అందించిన నియామకపు పత్రంపై ఫర్హా మాట్లాడుతూ.. జీవితంలో గర్వించదగిన బాధ్యతను ప్రభుత్వం తనకు కట్టబెట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ఫర్హాను పలువురు అభినందించారు. సబ్ జూనియర్ వాలీబాల్ టోర్నీకి ఎంపిక ఖమ్మంస్పోర్ట్స్: నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం వాలీబాల్ కోర్టులో శిక్షణ పొందుతున్న సయ్యద్ అర్షియా జాతీయస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికై ంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హూగ్లీలో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొననుంది. సయ్యద్ అర్షియా తండ్రి హోంగార్డుగా పనిచేస్తున్నారు. ఆమె ఎంపికపై డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి అభినందనలు తెలిపారు. మహిళా ఉద్యోగుల క్రీడా పోటీలు షురూఖమ్మంస్పోర్ట్స్: తెలంగాణ నాలుగో తరగతి మహిళా ఉద్యోగుల క్రీడా పోటీలు ఆదివారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి నాలుగో తరగతి ఉద్యోగి పదోన్నతి పొంది వృత్తిలో రాణించాలన్నారు. తొలు త ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి, టెన్నికాయిట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో గుంటుపల్లి శ్రీనివాసరావు, బుల్లెట్ శ్రీను, మోదుగు వేలాద్రి, కారుమంచి శ్రీనివాసరావు, జి.బిక్కు, ఓదె లు, ఎం.ఆజ్మీర్సింగ్, కాంపాటి వెంకటరమణ, కనకరావు, జానీ, రాంబాబులు పాల్గొన్నారు. అనంతరం నాలుగో తరగతి ఉద్యోగులను సన్మానించారు. -
అంబేడ్కర్భవన్ వద్ద ఉద్రిక్తత..
ఖమ్మంఅర్బన్: నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూమిలో గూడు కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు తాత్కాలికంగా అంబేడ్కర్ భవన్లో వసతి కల్పించిన విషయం విదితమే. ఆదివారం సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన రాకేశ్దత్త అనే యువకుడు మరో యువకుడితో కలిసి నిర్వాసితులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వైరా రోడ్డుపై ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. దీంతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఖమ్మం టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని యువకుడిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. నిర్వాసితులు యువకుడికి మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టూటౌన్, రఘునాథపాలెం సీఐల ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. దీక్షకు దిగిన యువకుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ముందస్తుగా అదుపులోకి.. రఘునాథపాలెం: కలెక్టరేట్ వద్ద భూదాన్ బాధితులతో కలిసి ఆందోళన చేపట్టేందుకు వస్తున్నట్లు సమాచారం అందడంతో ముందస్తు చర్యలు చేపట్టినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. సీపీఐ (ఎంఎల్) పార్టీకి చెందిన మధుతో పాటు పలువురు నేతలు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. వారిని తహసీల్దార్ వద్ద హాజరు పరిచి, బైండవర్ చేసినట్లు సీఐ వివరించారు. -
సైబర్ నిందితుడి అరెస్ట్
ఖమ్మంక్రైం: ఆన్లైన్లో ఉద్యోగం, షేర్ మార్కెట్లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్తో డబ్బులు వస్తాయని ఆశ చూపి, రూ.47 లక్షలు మోసం చేసిన కేసులో ఒకరిని హైదరాబాద్లో అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్ ఆదివారం తెలిపారు. టీజీసీఎస్బీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ క్రాక్డౌన్–1.0లో భాగంగా జిల్లాకు చెందిన బాధితుడికి వాట్సాప్, టెలిగ్రామ్లో పరిచయమై ఆన్లైన్లో ఉద్యోగం, షేర్ మార్కెట్లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని మోసంచేసిన ఎండీ ఫిరోజ్ను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. విచారణలో కీలకపాత్ర పోషించిన సైబర్ క్రైమ్ సీఐ నరేశ్, ఎస్ఐలు రంజిత్కుమార్, విజయ్కుమార్, సైబర్క్రైం ఉద్యోగులను సీపీ ప్రత్యేకంగా అభినందించినట్లు చెప్పారు. -
రెండు ట్రాక్టర్లు ఢీకొని యువకుడు మృతి
చింతకాని: మండలంలోని నాగులవంచ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రెండు ట్రాక్టర్లు ఢీకొని బోనకల్ మండలం గార్లపాడు గ్రామానికి చెందిన శ్రీరామ నాగయ్య (19) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. నాగయ్య బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామానికి చెందిన బుంగ రాంబాబు శనివారం రాత్రి నాగయ్యకు ఫోన్ చేసి ఇసుక రవాణా చేసేందుకు తన ట్రాక్టర్కు డ్రైవర్గా రావాలని కోరాడు. రాంబాబు ట్రాక్టర్ను తీసుకుని ముదిగొండ మండలం గంధసిరి మున్నేరుకు వెళ్లి ఇసుక లోడ్ చేయించుకుని ఆదివారం తెల్లవారుజామున చింతకాని మండలం నాగులవంచ రైల్వేకాలనీకి వెళ్తున్నాడు. మార్గమధ్యలో చిన్నమండవ గ్రామానికి చెందిన కాశిమాల రాజ్కుమార్కు చెందిన ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోగా రెండు ట్రాక్టర్లు ఢీకొని రోడ్డు పక్కనే ఉన్న గోతిలో పడిపోయాయి. ట్రక్కులోని ఇసుక నాగయ్యపై పడి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి పుల్లమ్మ రాజ్కుమార్ నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడు మృతిచెందాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ వీరేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. -
గాడి తప్పితే వేటే..!
● విద్యాశాఖపై అధికార యంత్రాంగం దృష్టి ● మూడు నెలల్లో 70 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు ● ఎనిమిది మందిపై సస్పెన్షన్ వేటు ఖమ్మంసహకారనగర్: ఇటీవలి కాలంలో విద్యాశాఖ గాడి తప్పినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం దృష్టిసారించింది. విధుల్లో నిర్లక్ష్యం, పలు కార్యక్రమాల అమలులో అలసత్వం, విద్యార్థుల విషయంలో పట్టింపులేనితనంతో ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నారని, సమయపాలన మచ్చుకు పాటించడం లేదని, ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం) అమలు గాలికొదిలేశారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తుండటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని ఏమాత్రం ఉపేక్షించడం లేదు. మూడు నెలల కాలంలో 70 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా.. పలు అంశాల్లో మొత్తం 8 మంది ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈసీఆర్ అమలుపై శ్రద్ధ.. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి విద్యార్థి ఇంగ్లిష్ రాయగలగాలని, చదవాలనే ఉద్దేశంతో ఈసీఆర్ (ఏవ్రీ చైల్డ్ రీడ్స్) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పలు శాఖల అధికారులను సైతం పాఠశాలలను తనిఖీ చేయాలని సూచించారు. ఈసీఆర్పై ప్రత్యేక అధికారులుగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, జెడ్పీ సీఈఓ దీక్షారైనాను నియమించారు. వారు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి విద్యాశాఖ పనితీరుపై అధికారులకు నివేదికలు ఇస్తున్నారు. వాటి ఆధారంగా ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతోపాటు సస్పెండ్ చేయటం లాంటి కఠిన చర్యలకు పూనుకుంటున్నారు. కఠిన చర్యలు.. అలసత్వంతో విధులు నిర్వర్తిస్తున్న సుమారు 70 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా.. ఎనిమిది మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ముఖ్యంగా పలు పథకాలు, కార్యక్రమాల అమలులో కొందరు ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఉన్నతాధికారుల తనిఖీల సమయంలో పట్టింపులేనితనంతో వ్యవహరిస్తుండటంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తుండగా.. ఓ ఉపాధ్యాయుడిని ఏకంగా టర్మినేట్ చేయటం గమనార్హం. దీంతో ఉపాధ్యాయులు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటాం. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించగా విచారణ అనంతరం వారిపై చర్యలు తీసుకుంటున్నాం. సస్పెండ్ కూడా చేస్తున్నాం. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు ఎంతటి వారైనా సహించేది లేదు. ఎఫ్ఆర్ఎస్ను తప్పనసరిగా అమలు చేయాలి. –చైతన్య జైనీ, డీఈఓ -
పుస్తకం ఆవిష్కరణ
ఖమ్మంగాంధీచౌక్: అక్షరాల తోవ సాహితీ సంస్థ 8వ వార్షికోత్సవం సందర్భంగా రూపొందించిన కథలు, కవితల పుస్తకాన్ని సాహితీవేత్తలు ఆవిష్కరించారు. ఆదివారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో అక్షరాల తోవ సాహితీ సంస్థ నిర్వాహకులు నామా పురుషోత్తం అధ్యక్షతన సంస్థ వార్షికోత్సవం నిర్వహించగా.. సంస్థ రూపందించిన కథలు, కవితలు పుస్తకాన్ని, జూలూరుపాడు మండలం పాపకొల్లు ఉన్నత పాఠశాల విద్యార్థి గార్లపాటి కృష్ణమనోహర్ రచించిన ‘ప్రకృతి సాయం’కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాహితీవేత్తలు మువ్వా శ్రీనివాసరావు, వురిమళ్ల సునంద తదితరులు మాట్లాడుతూ.. ఏటా వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు కథలు, కవితల పోటీలను నిర్వహించి ప్రోత్సహించటం మంచి పరిణామం అన్నారు. కార్యక్రమంలో పరిశ సీతారత్నం ట్రస్టు వ్యవస్థాకులు పరిశ పుల్లయ్య, కథా రచయిత మంత్రిప్రగడ శ్రీనివాసరావు, రచయిత్రి తాళ్లూరి లక్ష్మీబాయి, సాహితీవేత్త సయ్యద్ షఫీ, పోతూరి సీతారామారావు, నాయీబ్రాహ్మణ సంఘం ప్రతినిధి యలమందల జగదీశ్ తదితరులు అక్షరాల తోవ సాహితీ సంస్థ కార్యక్రమాలను అభినందించారు. సంస్థ నిర్వాహకులు దాసరోజు శ్రీనివాస్, రాచమళ్ల ఉపేందర్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కథల పోటీల విజేతలు ఏనుగంటి వేణుగోపాల్, పొత్తూరి సీతారామరాజు, జడ సుబ్బారావు, మంత్రిప్రగడ శ్రీనావసరావుకు నగదు పురస్కారాలను అందించారు. వక్తృత్వ పోటీల్లో విజేతలకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందించి విద్యార్థులను సన్మానించారు. మూసాపాగి వెంకన్న, మొగిలి గుణకర్, కేవీ చారి, నాగసాయి, మోదుగు గోవిందు, సదానందం, స్వప్నలను సత్కరించారు. దిలావర్, పోతగాని సత్యనారాయణ, కన్నెగంటి వెంకటయ్య, శ్రీనివాస్, సైదులు, రమేశ్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల కూల్చివేత సరికాదు..
ఖమ్మంఅర్బన్: వెలుగుమట్ల భూదాన్ కాలనీలోని పేదల ఇళ్లను కూల్చివేయడం సరైన చర్య కాదని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య అన్నారు. ఆదివారం కూల్చివేత ప్రాంతాలను సందర్శించి బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలని, ఈ భూమి ప్రభుత్వానికి చెందింది కాదని, భూదాన్ ఉద్యమంలో భాగంగా ఒక ట్రస్టుకు దానం చేసిన భూమి అని తెలిపారు. కూల్చివేసిన స్థలంలోనే బాధితులకు కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాదావత్ రాజు, ఖాదర్బాబా, హరికృష్ణ, ఆదినారాయణ, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపిక ఖమ్మంఅర్బన్: జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఖమ్మం జిల్లాకు చెందిన జలవనరులశాఖ ఉద్యోగి ఎంపికయ్యాడు. కల్లూరు సర్కి ల్ పరిధిలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న బి.విజయ్కుమార్.. 2025 – 26 ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ వెయిట్ లిఫ్టింగ్ – పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్నకు ఎంపికవగా.. మార్చి 5 నుంచి 10 వరకు ఛండీగఢ్లో పోటీలు జరగనున్నాయి. కాగా, విజయ్కుమార్ను పలువురు అభినందించారు. టీటీ టోర్నీలో ప్రతిభ ఖమ్మంస్పోర్ట్స్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో ఫిబ్రవరి 26 నుంచి 28వ తేదీ వరకు జరిగిన జాతీయస్థాయి పారా టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఖమ్మానికి చెందిన రెడ్డి సాయిశివ 15వ ర్యాంకు సాధించాడు. కాగా, అతడిని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, టేబుల్ టెన్నిస్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాలసాని విజయ్కుమార్, వీవీఎస్ మూర్తి, పరిటాల చలపతిరావు, షేక్ మజార్, ఆనం రాజేశ్, రామారావు, సంతోష్, అశ్విన్, లాలయ్య అభినందించారు. ఘనంగా తిరు స్వరూప ప్రదర్శన ఖమ్మంరూరల్: కరుణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాలు పురస్కరించుకొని ఆదివారం ఏసు తిరు స్వరూప మహా ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. వైరా రోడ్డులోని ఆర్సీఎం జాన్ మజ్జుకోని చర్చి నుంచి కరుణగిరి చర్చి వరకు ప్రదర్శన సాగింది. ఉమ్మడి జిల్లా ఆర్సీఎం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఫాదర్ గొర్రెముచ్చు సురేశ్, ఫాదర్ తలపునేని అంతోని, కరుణగిరి డైరెక్టర్ ఫాదర్ జ్వానేశ్, కొమ్ము ప్రసాద్, ఎం.ప్రసాద్ పాల్గొన్నారు. కాగా, ప్రదర్శనలో ఆధ్యాత్మిక గేయాలు ఆలపిస్తూ అలరించారు. కరుణగిరి వేదికపై విశ్రాంత బిషప్ మైపన్పాల్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ ప్రకాష్.. మైపన్పాల్ను సత్కరించారు. కార్యక్రమంలో ఫాదర్ సురేపల్లి ఐజక్, ఫాదర్ వీజీ శౌరి, జయరాజు పాల్గొన్నారు. బౌద్ధక్షేత్రం సందర్శన నేలకొండపల్లి: స్థానిక బౌద్ధక్షేత్రాన్ని ఆదివారం బౌద్ధభిక్షువు రేవత్ దీక్ష భూమి సందర్శించారు. చరిత్రను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి వరకు పాదయాత్రను ప్రారంభించారు. తొలి రోజు కొద్ది దూరం నడిచిన అనంతరం చంద్ర గ్రహణం వల్ల రెండు రోజులు వాయిదా వేశారు. శాంతి సాధన కోసం సోమవారం దేవాలయాలు, చర్చి, మసీద్లలో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, ఉపసాకులు పత్తిపాటి వెంకటేశ్వర్లు, బొనిగల విజయ తదితరులు పాల్గొన్నారు. పేకాటస్థావరంపై దాడి -
ఇళ్లు కోల్పోయిన పేదలకు అండగా ఉంటాం..
ఖమ్మంవైరారోడ్: ఖమ్మం భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు అండగా ఉంటామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం పువ్వాడ అజయ్కుమార్ భూదాన్ బాధితులను హైదరాబాద్ పిలిపించుకొని, లీగల్ సెల్ బాధ్యులతో మాట్లాడారు. బాధితుల తరఫున కోర్టులో పోరాడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పగడాల నాగరాజు, మేకల సుగుణారావు, బత్తుల మురళి, దేవాళ్ల వీరన్న, సంపంగి వెంకటేశ్వర్లు, సంపంగి వెంకటాచలం, బండి శ్రీను, జారా ఆంజనేయులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపునకు కసరత్తు అర్హుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం ఖమ్మంఅర్బన్: భూదాన్ భూమిలో ఇళ్లు కోల్పోయిన బాధితుల వివరాలను అధికారులు ఒకవైపు సేకరిస్తుండగా, మరోవైపు అర్హులుగా తేలిన వారికి ప్రభుత్వ స్థలాలు కేటాయించేందుకు అనువైన ఖాళీ భూములపై ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం కూల్చివేతలో సుమారు 705 మంది ఇళ్లు కోల్పోయినట్లు తెలిసింది. బాధితుల జాబితాలో ఇతర జిల్లాలకు చెందినవారి పేర్లు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఖమ్మం జిల్లాకు చెందిన వారు 616 మంది, వరంగల్ 1, హనుమకొండ 3, మహబూబాబాద్ 17, భద్రాద్రి కొత్తగూడెం–52, సూర్యాపేట–14, ఏపీ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి–1, కృష్ణ–1 ఉన్నట్లు గుర్తించారు. ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన వారు సుమారు 188 మంది, రఘునాథపాలెం మండలానికి చెందిన 27 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారు జిల్లాలోని వివిధ మండలాలకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. అర్హులుగా తేలిన వారికి ప్రభుత్వ భూముల్లో స్థలాలు కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు అన్వేషణ ప్రారంభించారు. -
రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఖమ్మంక్రైం: ఖమ్మం రైల్వేస్టేషన్ పరిధి ఖమ్మం – పందిళపల్లి రైల్వేస్టేషన్ మధ్యలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి(45) ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. మృతుడి కుడివైపు చాతి భాగం కింద పుట్టు మచ్చ ఉండగా కుడి చెయ్యిపై హిందీలో సంజ్య్, ఇంగ్లిష్లో జోటీ అని పచ్చబొట్టు ఉంది. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు సాయంతో మార్చురీకి తరలించినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 98481 14202, 87126 58589 నంబర్లలో సంప్రదించాలని జీఆర్పీ పోలీసులు సూచించారు. -
మహిళ ప్రాణం కాపాడిన 108 సిబ్బంది
ఖమ్మంవైద్యవిభాగం: ఎండదెబ్బకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళకు ప్రాణం పోశారు 108 సిబ్బంది. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో ఆదివారం ప్రమీల (55) ఎండలో పనిచేస్తుండగా బీపీ పూర్తిగా తగ్గిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించగా.. మెడికల్ టెక్నీషియన్ జాటోతు విజయలక్ష్మి, పైలట్ ఆనందరావు ప్రమీలకు వైద్య పరీక్షలు చేసి సాధారణ స్థితికి తీసుకువచ్చారు. 108లోనే ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన సిబ్బందిని గ్రామస్తులు, ప్రమీల కుటుంబ సభ్యులు, 108 మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్ అభినందించారు. -
ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి
ఖమ్మంసహకారనగర్: తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సమర్పించిన విద్యా విధానపత్రం–2026ను అమలు చేసే ముందు ఉపాధ్యాయ సంఘాలతో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) అధ్యక్షులు చావా రవి డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని యూటీఎఫ్ భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిషన్ సిఫారసుల్లో కొన్ని ప్రభుత్వ విద్యారంగానికి మేలు చేసేవిగా ఉన్నప్పటికీ, ఉపాధ్యాయులకు సంబంధించి అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. జాతీయ విద్యా కమిషన్ (కొఠారి కమిషన్) సూచనలకు భిన్నంగా సిఫారసు చేశారని, ఉపాధ్యాయ సంఘాలు సాధించుకున్న అరకొర సౌకర్యాలను కూడా కమిషన్ చాలా ఎక్కువ అనే దృష్టితో వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఉపాధ్యాయుల ఆటోమెటిక్ అడ్వాన్స్మెంట్ స్కేల్స్ రద్దు, వంద శాతం ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల్లో యాభై శాతం రద్దు, ఉపాధ్యాయుల పదోన్నతులకు పనితీరును కొలమానంగా తీసుకోవాలనే సిఫారసులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
కూసుమంచి : మత సామరస్యానికి, సోదరభావానికి ఇఫ్తార్ విందులు వేదికలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచిలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింలకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.మంత్రి పొంగులేటి రంజాన్ శుభాకాంక్షలు -
లక్ష్యం చేరేనా..?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: క్షేత్రస్థాయిలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని కుదించుకున్నా.. అది కూడా చేరడానికి సింగరేణి ఆపసోపాలు పడుతోంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి నెల మాత్రమే గడువు ఉండగా.. అంచనాలకు మించి పని చేస్తేనే లక్ష్యాన్ని చేరే అవకాశం ఉంటుందన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి.19 శాతం లోటు ఈ ఆర్థిక సంవత్సరం 2025 – 26కు సంబంధించి 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి ముగిసే నాటికి 64.68 మిలియన్ టన్నుల బొగ్గు రావాల్సి ఉండగా 19 శాతం లోటుతో 52.70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగలిగారు. ఉత్పత్తిలో సింహభాగం వచ్చే రామగుండం, శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లోని ఉపరితల గనుల్లో ఓబీ పనులు ఆశించిన మేర జరగకపోవడం ఇందుకు కారణమని కార్మికులు అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఆయా గనుల్లో ఓబీ పనుల్లో వేగం పెంచినా 19 శాతం లోటు పూడ్చుకోవడం కష్టమనే అభిప్రాయం అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. ఖాతాలో జమ కాని ‘నైనీ’ ఈ వార్షిక సంవత్సరంలో కొత్తగూడెంలోని వెంకటేశ్ఖని మెగా ఓపెన్కాస్ట్(ఓసీ) నుంచి ఐదు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. జవహర్ఖని(ఇల్లెందు), గోలేటి(బెల్లంపల్లి) ఓసీలు గడిచిన మూడేళ్లుగా అనుమతుల దశలోనే మగ్గిపోతున్నాయి. సింగరేణి ఎంతో నమ్మకం పెట్టుకున్న నైనీ(ఒడిశా) గని బొగ్గు ఉత్పత్తికి రెడీగా ఉంది. అయితే, రవాణా వ్యవస్థలో చిక్కుముడులు సంస్థకు ఇబ్బందిగా మారాయి. దీంతో ఈ గని నుంచి సాలీనా వచ్చే 10 మిలియన్ టన్నుల బొగ్గు ఈసారి కూడా సింగరేణికి ఖాతాలో జమ కాలేదు. సత్తుపల్లి ఒక్కటే.. సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో ఫిబ్రవరి 27నాటికి కేవలం సత్తుపల్లి ఏరియాలోనే 101 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదైంది. కొత్తగూడెం, మణుగూరు, బెల్లంపల్లి, రామగుండం–1 ఏరియాల్లో 90 శాతానికి మించి ఉత్పత్తి జరిగింది. ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా అడ్రియాల గని బొగ్గు ఉత్పత్తిలో చివరి స్థానంలో నిలిచింది. నిర్దేశిత లక్ష్యంలో కేవలం 11 శాతమే ఇక్కడ ఉత్పత్తి జరిగింది. ఈ గనిలో వరుసగా నష్టాలు వస్తున్నా.. వాటిని తగ్గించేందుకు సంస్థ తీసుకుంటున్న జాగ్రత్తలు పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు. గనులు, కార్మికులు ఎక్కువగా ఉన్న శ్రీరాంపూర్, మందమర్రి, రామగుండం, భూపాలపల్లి ఏరియాల్లో రాబోయే నెల రోజుల్లో లక్ష్యానికి మించి ఉత్పత్తి చేస్తేనే లోటు భర్తీ అవుతుంది. లేదంటే మరోసారి లక్ష్యానికి ఆమడ దూరంలోనే సింగరేణి నిలిచిపోయే అవకాశముంది.బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి వెనుకబాటు -
వాజ్పేయిని ఆదర్శంగా తీసుకోవాలి
ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మంమామిళ్లగూడెం : మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, అద్భుతమైన వక్త, రచయిత, కవి, ప్రజాస్వామ్యవాది, గొప్ప దేశభక్తుడు అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కొనియాడారు. ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్లో ఆదివారం నిర్వహించిన వాజ్పేయి శతజయంతి ఉత్సవాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్రావుతో కలిసి అక్షర నీరాజనం పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదవులు, పీఠాల కోసం వాజ్పేయి ఎప్పుడూ రాజీపడలేదని, ఓటమిని సైతం హుందాగా స్వీకరించారని తెలిపారు. ప్రపంచ దేశాల ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయకుండా రాజీలేని ధోరణితో పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన ధీశాలి అని ఉద్ఘాటించారు. దేశంలో ఒకే విధానం ఉండాలనే శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం చారిత్రక ఘట్టమని అభివర్ణించారు. వాజ్పేయి పాలనా దక్షత, నిస్వార్థ సేవ నేటి తరానికి ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. గతంలో జనసంఘ్, కమ్యూనిస్టు, కాంగ్రెస్, స్వతంత్ర పార్టీ వంటి రాజకీయ పక్షాలకు నిర్దిష్టమైన సిద్ధాంతాలు ఉండేవని, నేటి రాజకీయాల్లో అవి పూర్తిగా లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రసార మాధ్యమాలు కూడా వివాదాలకు ఇస్తున్న ప్రాధాన్యతను సమాజానికి మేలు చేసే విషయాలకు ఇవ్వడం లేదని అన్నారు. ప్రతి ఇంట్లో పిల్లలు తప్పనిసరిగా మాతృభాషలోనే మాట్లాడాలని సూచించారు. పరభాషా పదమైన అమ్మను సూచించే ఆంగ్ల పదం వాడితే వస్తుప్రదర్శనశాలలో పెట్టే శవం అని అర్థం వస్తుందని, అమ్మ అని పిలవడంలో ఉన్న కమ్మదనం ఆంగ్ల పదాల్లో ఏమాత్రం లేదని అన్నారు. హిందుత్వం అంటే ఒక ఇరుకై న మతం కాదని, ఎవరినీ ద్వేషించని ఒక గొప్ప జీవన విధానమని అన్నారు. నిత్యం యోగా, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా శారీరక ధారుడ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మాట్లాడుతూ వాజ్పేయి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నాటి ప్రధాని పి.వి.నరసింహారావు కశ్మీర్ సమస్యపై మాట్లాడేందుకు ఆయనను ఐక్యరాజ్యసమితికి పంపడం దేశ ప్రజాస్వామ్య గొప్పదనానికి నిదర్శనమని అన్నారు. కవితా సంకలనాన్ని తీసుకొచ్చిన ఖమ్మం వాసి వెంకటేశ్వరరావును అభినందించారు. కార్యక్రమంలో వాజ్పేయి శతజయంతి ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు దుద్దుకూరి వెంకటేశ్వరరావు, మందడపు ప్రభాకర్ రెడ్డి, సామాజిక సమరసత జాతీయ కళా విభాగం కన్వీనర్, రిటైర్డ్ ప్రొఫెసర్ అప్పల ప్రసాద్, ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా ప్రభుత్వం కాదు.. గడ్డపార సర్కారు
● రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే పేదల ఇళ్లు కూల్చేశారు ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఖమ్మంఅర్బన్: రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపురాజు రామచందర్రావు విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వం కాదని.. గడ్డపార సర్కారు అని ఎద్దేవా చేశారు. వెలుగుమట్లలోని భూదాన్ భూములను ఆదివారం ఆయన పరిశీలించాక విలేకరులతో మాట్లాడారు. పైసా పైసా కూడబెట్టి నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వం కనీస కనికరం లేకుండా కూల్చివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూములపై ఉన్నత న్యాయస్థానం ‘యథాతథ స్థితి’ కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా అధికారులు వాటిని పట్టించుకోలేదని ఆరోపించారు. పత్రాలు అసలైనవి కావని సాకులు చెబుతూ భారీ యంత్రాలతో ఇళ్లను నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు, రోగులు అని కూడా చూడకుండా ఇళ్ల నుంచి బయటకు లాగారని అన్నారు. ఆ తర్వాత ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్లో తలదాచుకున్న బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో బీజేపీ పేదలకు పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతిలో గునపం పట్టుకుని ఏ ఇల్లు కనిపిస్తే ఆ ఇల్లు కూల్చే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. బాధితులకు అదే ప్రాంతంలో 100 గజాల చొప్పున స్థలాలు కేటాయించి, ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రామచందర్రావు డిమాండ్ చేశారు. బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, జిల్లా ఇన్చార్జ్ బి.మహిపాల్ రెడ్డి, నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ఉప్పర్ల శారద, గల్లా సత్యనారాయణ, శీలం పాపారావు, దొంగల సత్యనారాయణ, మందడపు సుబ్బారావు, గుత్తా వెంకటేశ్వర్లు, వీరవల్లి రాజేష్, బండారు నరేష్, నున్న రవికుమార్, విజయరాజు, దొడ్డ అరుణ, రజినీ రెడ్డి, కుమళి శ్రీనివాసరావు, రవి రాథోడ్, శ్యామ్ రాథోడ్, ఏలూరి నాగేశ్వరరావు, నీరుకొండ ఉషారాణి, పమ్మి అనిత, కందుల శ్రీకృష్ణ, మందా సరస్వతి, శ్రీ రామనేని మణి, నకిరేకంటి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. -
నెమలి జాతరకు ప్రత్యేక బస్సులు
మఽధిర : ఏపీలోని గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాలస్వామి జాతర సందర్భంగా సోమవారం మధిర బస్టాండ్ నుంచి నెమలి వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ మధిర డీఎం ఆర్.రామయ్య ఒక ప్రకటనలో తెలిపారు. నేడు ఉదయం 5 గంటల నంచి మధిర బస్టాండ్లో బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాత్రి స్వామివారి కల్యాణం ముగిసే వరకు నెమలి నుంచి మధిరకు బస్సులు తిరుగుతుంటాయని పేర్కొన్నారు. మధిర నుంచి నెమలికి పెద్దలకు రూ.60, పిల్లలకు రూ.30 చార్జీ ఉంటుందని వివరించారు. వైభవంగా లక్ష్మీ నృసింహుల కల్యాణంఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం నగరంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం(గుట్ట)లో నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి వార్షిక జయంతి ఉత్సవాల్లో బాగంగా ఆదివారం లక్ష్మీ నృసింహుల కల్యాణోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. రేపు ఆలయం మూసివేతఎర్రుపాలెం: చంద్రగ్రహణం సందర్భంగా జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేసి, తిరిగి బుధవారం ఉదయం తెరుస్తామని ఈఓ కె.జగన్మోహన్రావు ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీ ఉదయం 9 గంటలకు ద్వారబంధనం చేస్తామని, బుధవారం ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేశాక 9 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు. సీఎం కప్ కరాటే టోర్నీలో ఆరు పతకాలుఖమ్మం స్పోర్ట్స్ : సీఎం కప్ రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో జిల్లాకు వివిధ కేటగిరిల్లో ఆరు పతకాలు దక్కాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన కరాటే క్రీడాకారుడు బి.సందీప్ 75 కేజీల కేటగిరిలో స్వర్ణపతకం సాధించగా, జూనియర్ బాలికల విభాగంలో ముష్కన్ పర్వీన్, తన్మయి లక్ష్మి, బాలురలో అదిల్ పాషా, హర్షతేజ, అశుద్దీన్ కాంస్య పతకాలు సాధించారు. వారిని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, జట్టు కోచ్ గోపతి సైదులు, జిల్లా కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు జి.రాములు అభినందించారు. -
రాష్ట్ర పోలీస్ శాఖ ముందంజలో ఉంది
ఖమ్మంక్రైం : నేరాల నియంత్రణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ముందంజలో ఉందని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. ఖమ్మం పోలీస్ హెడ్క్వార్టర్స్లో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, పోలీస్ ఫ్యామిలీ గృహ భవనాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నివారణాత్మక పోలీసింగ్పై దృష్టి సారించాలని సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా పోలీస్ సిబ్బంది, వారి పిల్లలను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీస్ సిబ్బంది కుటుంబాలకు మెరుగైన వసతి కల్పించేందుకు జిల్లా కేంద్రంలో అత్యాధునిక సదుపాయాలతో గృహాలు నిర్మించామని తెలిపారు. అనంతరం నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కేసుల పురోగతి, మహిళలు, శిశువుల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు. మాదక ద్రవ్యాల నియంత్రణ, ఇసుక అక్రమ రవాణా నివారణకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పదేళ్లుగా సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయని, ఇది సాధారణ సమస్య కాదని అన్నారు. స్వీయ అవగాహనతోనే సైబర్ మోసాలకు కళ్లెం వేసేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ రూపొందించిన సైబర్ సింబా కార్యక్రమాన్ని జిల్లాలో కూడా అమలు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపట్టిన ఆరైవ్, ఆలైన్ కార్యాక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీబ్యూరో, ఈగల్ దేశంలోనే అత్యున్నతంగా పనిచేస్తున్నాయని అన్నారు. బేసిక్ పోలీసింగ్, చట్టాలపై లోతైన అవగాహన కోసం దృష్టి పెట్టాలని, పోలీస్ స్టేషన్ రికార్డు నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట ఐజీ చంద్రశేఖర్రెడ్డి, సీపీ సునీల్దత్, అడిషనల్ డీసీపీలు ప్రసాద్రావు, రామానుజం, కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, సారంగపాణి, శ్రీనివాసులు, మహేష్, సర్వర్, సత్యనారాయణ, ఫణిందర్, సుశీల్సింగ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.డీజీపీ శివధర్రెడ్డి వెల్లడి -
అర్హులైన పేదలకు ప్రభుత్వం అండ
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ‘ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన అర్హులైన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. వీరికి ఇంటి స్థలంతోపాటు రూ.5 లక్షలు మంజూరు చేసి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తాం. ఈ నెల 15 లోగా ఇళ్ల నిర్మాణానికి నాతోపాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వచ్చి ముగ్గులు పోయిస్తాం. ఇళ్ల స్థలం ఇచ్చేందుకు అనువైన ప్రాంతాన్ని ప్రభుత్వ యంత్రాంగం పరిశీలిస్తోంది’. అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్లో ఆయనకు వెలుగుమట్ల బాధితులు తమ గోడు వినిపించారు. కొందరు ముఠాగా ఏర్పడి రూ.లక్షలు వసూలు చేసి తమను మోసం చేశారని వివరించారు. బాధితులతో మాట్లాడిన తర్వాత మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు డబ్బులు వసూలు చేసినట్టు తమకు సమాచారం వచ్చిందని, వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ భూముల్లో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇందిరమ్మ ఇళ్లు తీసుకున్నవారు కూడా ఉన్నట్టు అధికారుల సర్వేలో తేలిందన్నారు. వీరు కాకుండా అర్హులైన పేదలందరికీ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో, వారి సొంత ప్రాంతాల్లో ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, విద్యుత్, తాగునీటి సౌకర్యం, అంగన్వాడీ కేంద్రం, పాఠశాల కూడా నిర్మిస్తామని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచనలతో ఇదంతా 15 రోజుల్లోగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు చెప్పామన్నారు. కొంత మంది యూట్యూబర్లు, పనిగట్టుకొని కొన్ని పేపర్లు ఇదేదో తాము కావాలని చేస్తున్నామని, ఈ భూములతో డబ్బులు పోగేసుకుని ఎక్కడో ఎన్నికలకు వాడతామని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మంత్రి వెంట ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్దత్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, మట్టా దయానంద్ ఉన్నారు. నగలు తాకట్టు పెట్టి డబ్బులిచ్చాం.. ఇప్పుడు రోడ్డున పడ్డాం బాధితురాలు రజియా తన కష్టాలను మంత్రి పొంగులేటికి చెప్పుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే.. మాది చింతకాని మండలం రేపల్లెవాడ. భూదాన భూముల్లో గుడిసెలు వేసుకొని ఎనిమిదేళ్లుగా ఉంటున్నాను. నా భర్త డ్రైవర్, నేను స్కూల్లో ఊడ్చే పనికి వెళతాను. మాకు ఉండటానికి గూడు లేక, నా అమ్మమ్మ నగలను బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.3.60 లక్షలు భూదాన్ భూముల్లో ఉన్న కృష్ణ, రామచంద్రయ్యకు ఇచ్చాను. కరెంట్ లేకపోయినా సెల్ ఫోన్ లైట్లు, దీపాల వెలుగులో బతికాం. వారు చెప్పిన మాటలు విని డబ్బులు ఇచ్చాం. ఇప్పుడు ఇళ్లు కూల్చివేశారు. ప్రభుత్వం మమ్ములను ఆదుకోవాలి. -
ఫార్మర్ రిజిస్ట్రీలో ఫస్ట్ !
ఖమ్మంవ్యవసాయం: ఫార్మర్ ఐడీ(రైతు గుర్తింపు) రిజిస్ట్రేషన్ల నమోదు ప్రక్రియలో 75.59శాతం పూర్తి చేయడం ద్వారా జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో నిలిచింది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించి న ఫార్మర్ ఐడీ(ఫార్మర్ రిజిస్ట్రీ) ప్రాజెక్టు 5మే 2025 న ప్రారంభమైంది. మండలాల్లో క్లస్టర్ల వారీగా ఏఈఓల ద్వారానే కాక మీ సేవా కేంద్రాల్లో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ కొనసాగుతోంది. నిబంధనల మేర కు జిల్లాలో 3,39,832 మంది రైతులు అర్హులు కాగా, ఇందులో ఫిబ్రవరి 27వ తేదీ నాటికి 2,33,962 మంది రైతులు ఐడీకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. భద్రాద్రి జిల్లాకు 30వ స్థానం రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ కొనసాగుతోంది. ఈమేరకు ఖమ్మం జిల్లా మొదటి స్థానాన నిలిచింది. ఇక 75.25 శాతంతో పెద్దపల్లి జిల్లా రెండో స్థానం, 72.06 శాతంతో సిద్ధిపేట మూడో స్థానంలో, 71.77 శాతం పూర్తి చేసిన వరంగల్ జిల్లా నాలుగో స్థానంలో, 71.18 శాతంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఐదో స్థానాన నిలిచాయి. అయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేవలం 53.61 శాతమే నమోదు పూర్తి కావడంతో 30వ స్థానానికి పరిమితమైంది. రిజిస్ట్రీ ఆధారంగా కేంద్ర పథకాలు కేంద్రప్రభుత్వం రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, సాయిల్ హెల్త్ కార్డు, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, భారత ఆహార భద్రత మిషన్, రాష్ట్రీయ కృషి వికాస యోజన తదితర పథకాలను అమలుచేస్తోంది. ఇవి అర్హులకు అందడానికి ఐడీ కార్డు కీలకం కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రిజిస్ట్రేషన్ కలిగిన వారికే కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతాయనే అంశాన్ని వ్యవసాయ శాఖ అధికారులు వివరిస్తున్నారు. ఈమేరకు రైతులకు ఉన్న భూమి వివరాలను సర్వే నంబర్ల వారీగా నమోదు చేయడమే కాక భూమి రకం, సాగు చేసే పంటలను కూడా పొందుపరుస్తారు. డిజిటల్ విధానంలో జిల్లాలోని 129 క్లస్టర్లలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 15 వరకు అవకాశం ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్కు ఈనెల 15వ తేదీ వరకు అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకాలను పొందుతున్న రైతులు, అర్హత ఉండి పథకాలను పొందలేకపోతున్న రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఐడీ కేటాయిస్తారు. ప్రతీ క్లస్టర్లోని రైతు వేదికల్లో ఏఈఓలను పూర్తి వివరాలతో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.ఫార్మర్ ఐడీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఐడీ ఆధారంగానే కేంద్రప్రభుత్వ పథకాలు అందుతాయని రైతులు గుర్తించాలి. నిర్దేశిత గడువులోగా ఏఈఓలను కానీ మీ–సేవా కేంద్రాల్లోనైనా సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తద్వారా 11 అంకెలతో కూడిన గుర్తింపు కార్డు వస్తుంది. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
ప్రాజెక్ట్కు ప్రశంసలు !
● ఖమ్మంలో 24గంటల నీటి సరఫరాకు ‘టైటాన్’ అవార్డు ● స్టార్టప్ కంపెనీకి రూ.50 లక్షల గ్రాంట్ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 24గంటల పాటు తాగునీటి సరఫరా పైలట్ ప్రాజెక్టుకు ప్రశంసలు దక్కాయి. సాంకేతికత సాయంతో అమలుచేస్తున్న ఈ ప్రాజెక్ట్కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడమే కాక, ఇందులో భాగస్వామ్యమైన స్టార్టప్ కంపెనీకి టైటాన్ గ్రూప్ నుండి భారీ ప్రోత్సాహం అందింది. ఖమ్మంలో నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేఎంసీ అధికారులు ‘స్మార్ట్ టెరా’ స్టార్టప్ కంపెనీతో ఒప్పందం చేసుకొని అమలుచేస్తున్నారు. ఈ వినూత్న ప్రయత్నాన్ని గుర్తించిన టాటా గ్రూప్ సంస్థల్లో ఒకటైన టైటాన్.. స్టార్టప్ కంపెనీకి రూ.50 లక్షల గ్రాంట్ మంజూరు చేసింది. అలాగే, కేఎంసీకి అవార్డు అందజేసింది. ఏఐ సాంకేతికతతో లీకేజీలకు చెక్ నగరంలోని రెండు ప్రాంతాల్లో 24గంటల పాటు తాగునీటి సరఫరా చేసేలా కేఎంసీ అధికారులు పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు. అల్లీపురంతో పాటు రోటరీనగర్లో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టగా, రోటరీనగర్లో స్మార్ట్ టెరా స్టార్టప్ కంపెనీతో కలిసి చేపట్టారు. ఇందులో ఏఐ ఆధారంగా లీక్ డిటెక్షన్ సిస్టమ్ను ఉపయోగించడం ద్వారా భూగర్భంలోని పైపులైన్లలో ఎక్కడైనా నీటి లీకేజీలు ఉన్నా సమర్థవంతంగా గుర్తించి అరికట్టారు. నిర్దిష్ట డిస్ట్రిక్ట్ మీటర్డ్ ఏరియా(డీఎంఏ)లో గతంలో 90శాతం ఉన్న నీటి వృథా ప్రస్తుతం 15 శాతానికి తగ్గింది. ఫలితంగా వేలాది లీటర్ల స్వచ్ఛమైన నీరు వృథా కాకుండా ప్రజలకు చేరుతోంది. బెంగళూరులో సదస్సు బెంగళూరులో టైటాన్ గ్రూప్ ఆధ్వర్యాన డిజైన్ ఇంపాక్ట్ అవార్డ్స్ వేడుక నిర్వహించారు. ఇందులో ఖమ్మం ప్రాజెక్టు సాధించిన అద్భుత ఫలితాలకు గాను ప్రతిష్టాత్మక అవార్డు అందజేశారు. సామాన్యుల అవసరాల కోసం సాంకేతికతను వినియోగించడంలో కేఎంసీ చూపిన చొరవను కొనియాడారు. కేఎంసీకి రూ.50 లక్షలతో సాంకేతికత అందించిన స్టార్టప్ కంపెనీకి రూ.50 లక్షల గ్రాంట్ మంజూరు చేయడంతో ఖమ్మం కార్పొరేషన్పై ఆర్థిక భారం తప్పింది. నగరవ్యాప్తంగా విస్తరణ పైలట్ ప్రాజెక్ట్గా రెండు ప్రాంతాల్లో 24గంటల పాటు తాగునీటి సరఫరా విధానాన్ని బెంగళూరు వేదికపై కేఎంసీ ఎస్ఈ వేముల రంజిత్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తొలుత రెండు ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టుకు వస్తున్న మంచి ఫలితాలతో నగరంలోని మిగిలిన ప్రాంతాలకు వర్తింపచేయాలనే సన్నాహాల్లో ఉన్నట్లు తెలిపారు. ఇది అమలైతే ఖమ్మం నగరమంతా నిరంతరాయంగా, వృథా లేకుండా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రానుంది. -
అత్యుత్తమ పత్రాల్లో మనకూ స్థానం
ఖమ్మం సహకారనగర్: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్ ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో వివిధ జిల్లాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈమేరకు వీరు పరిశోధనా పత్రాలు సమర్పించగా అత్యుత్తమైన ఐదింటిని ఎంపిక చేశారు. ఇందులో జిల్లాలోని వేంసూరు జెడ్పీహెచ్ఎస్ జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఆకూటి రాంబాబు సమర్పించిన పత్రానికి స్థానం దక్కింది. ‘శాసీ్త్రయ ధృక్పథం – విమర్శనాత్మక ఆలోచనను అభివృద్ధి చేయడం’ ప్రధాన అంశంగా ఆయన సైన్స్ అభ్యసనంలో అపోహలను తొలగించడంపై ప్రయోగాత్మక విశ్లేషణ సమర్పించారు. విద్యార్థుల్లో మూఢనమ్మకాలను తొలగించి, తార్కిక ఆలోచనలను ఎలా పెంపొందించవచ్చో వివరించగా రాంబాబుకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను డీఈఓ చైతన్య జైనీ, ఏఎంఓ పెసర ప్రభాకర్రెడ్డి, పాఠశాల హెచ్ఎం సుధాకరరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. -
శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మానికి చెందిన జీవీ మాల్ వ్యవస్థాపకులు గుర్రం వెంకటేశ్వర్లు వందో జయంతిని పురస్కరించుకుని వైరా రోడ్డులోని జీవీ షాపింగ్ మాల్లో శతాబ్ది ఉత్సవాలను శనివారం ప్రారంభించారు. శతాబ్ది వేడుకల సందర్భంగా ఏడాది పొడవునా ఆఫర్లు ఇస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. కాగా, ఉత్సవాల ప్రారంభోత్సవంలో సినీ, టీవీనటులు ఆది, శాంతిస్వరూప్, రాజు, దొరబాబు, దీపిక తదితరులు పాల్గొని సందడి చేశారు. కార్యక్రమంలో షోరూమ్ యాజమాన్యం గుర్రం ఉమామహేశ్వరరావు, గుర్రం వాసు, గుర్రం రేవంత్, గుర్రం అంకిత్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కొణిజర్ల: ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని లాలాపురం – తీగలబంజర గ్రామాల మధ్య చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని లాలాపురం గ్రామానికి చెందిన షేక్ అక్బర్ (40) ఏన్కూరు మండల కేంద్రంలో పాత ఇనుము దుకాణం నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి ఆయన దుకాణం మూసివేసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా తీగలబంజర సమీపంలోని కోల్డ్ స్టోరేజీ వద్ద ట్రాక్టర్ ఢీకొట్టింది. ఘటనలో అక్బర్ తలకు తీవ్ర గాయం కాగా 108 ద్వారా ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబీల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
శ్రీవారికి నిత్యకల్యాణం, పల్లకీసేవ
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడిలోని స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం చేశారు. అనంతరం స్వామి, శ్రీ అలివేలు మంగ, శ్రీ పద్మావతి అమ్మవార్లను అలంకరించి నిత్యకల్యాణం జరిపించారు. ఆతర్వాత నిర్వహించిన పల్లకీ సేవలో తెలంగాణ, ఏపీ ప్రాంతాల భక్తులు పాలుపంచుకున్నారు. ఈఓ జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేడు మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11–45గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత భద్రాచలం, దుమ్మగూడెం, చర్ల మండలాల్లో నూతనంగా ఎన్నికై న సర్పంచ్లను మంత్రి సన్మానించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీరామనవమి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తారు. అలాగే, సాయంత్రం ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పొంగులేటి పాల్గొంటారు. నేడు ఖమ్మానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఖమ్మం మామిళ్లగూడెం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు ఆదివారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఆయన ఉద యం 9–30 గంటలకు కోదాడ క్రాస్ వద్దకు చేరుకుంటారని పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. అనంతరం 10–30 గంటలకు ఖమ్మంలో జరిగే మాజీ ప్రధాని అట ల్ బిహారీ వాజ్పేయి జయంతి ఉత్సవ సభలో పాల్గొంటారని వెల్లడించారు. ఆతర్వాత భూదా న్ భూముల్లో ఇళ్లు కూల్చివేసిన స్థలాన్ని పరిశీ లించనున్న రామచంద్రరావు.. అంబేద్కర్ భవ న్లో బాధితులను పరామర్శిస్తారని తెలిపారు. నెమలికి ప్రత్యేక బస్సులు వైరా: ఏపీలోని కృష్ణా జిల్లా నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో కల్యాణం(జాతర) నేపథ్యాన ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ మధిర డిపో మేనేజర్ ఆర్.రామయ్య తెలిపా రు. వైరా బస్టాండ్ నుంచి గంపలగూడెం మీదుగా నెమలి వరకు బస్సు సర్వీసులు ఉంటా యని వెల్లడించారు. ఈమేరకు సోమవారం తెల్లవారుజామున 5గంటల నుంచి ప్రతీ అర గంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని, నెమలి వెళ్లే భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శ్రీ స్తంభాద్రి ఆలయ అభివృద్ధి కమిటీ ఏర్పాటు ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని స్వయంభూ శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం(గుట్ట) అభివృద్ధి(రెన్నోవేషన్) కమిటీని నియమి స్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు కొనసాగే ఈ కమిటీలో పది మందికి అవకాశం కల్పించారు. ఇందులో కర్నాటి రాధిక, చిన్ని మధుసూదన్రావు, చల్లా మధుసూదన్రావు, మోర్ల శ్రీనివాస్, మందడపు సాయివెంకటకృష్ణ, కొల్లా నాగేందర్, కూరపాటి ప్రదీప్కుమార్, చారుగండ్ల రవికుమార్, పంతం సీతారాములు, శనగవరపు ప్రసాద్ ఉన్నారు. వీరిలో శనగవరపు ప్రసాద్ 2012 నుంచి 2016 వరకు దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పనిచేశారు. పురాతనమైన ఈ ఆలయానికి మూడేళ్ల తర్వాత అభివృద్ధి కమిటీ ని నియమించినా ట్రస్ట్ బోర్డు కాకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఇవ్వలేదు. ఇందు కు అడ్డంకులు ఉన్నందున త్వరలోనే సభ్యుల్లో ఒకరికి చైర్మన్గా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. -
ప్రజలకు తోడుగా నిలిస్తేనే గుర్తింపు
● సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు ● ఖమ్మంలో యర్రా శ్రీకాంత్ విగ్రహావిష్కరణఖమ్మంమయూరిసెంటర్: ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం శ్రమించడమే కమ్యూనిస్టు కార్యకర్తకు అసలైన గుర్తింపు అని.. ఆ విషయంలో యర్రా శ్రీకాంత్ ఆదర్శంగా నిలిచారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీ.వీ.రాఘవులు కొనియాడారు. ఖమ్మం బోసు బొమ్మ సెంటర్లో ఏర్పాటుచేసిన శ్రీకాంత్ విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించాక, సీపీఎం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. కమ్యూనిస్టులు ప్రజల మధ్య నీటిలో చేపలా ఉండాలని, శ్రీకాంత్ అదే మార్గం అనుసరించినందునే ఇప్పుడు ఘన నివాళి అర్పిస్తున్నారని చెప్పారు. రాబోయే కేఎంసీ ఎన్నికల్లోనూ ప్రజల పక్షాన నిలబడే వారినే గెలిపించాలని ఆయన కోరారు. కాగా, మోదీ పాలనలో దేశ ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. బూర్జువా పార్టీలు రకరకాల రూపాల్లో ప్రజలను ఆకర్షిస్తాయని, కులమత భావాలను రెచ్చగొట్టి వారి మార్గంలోకి తెచ్చుకుంటాయని చెప్పారు. ఈమేరకు కమ్యూనిస్టులు ప్రజల్లో ఉంటూ వారిని మేల్కొల్పాలని రాఘవులు సూచించారు. సీపీఎం పోరాటాలతోనే పేదలకు పట్టాలు సీపీఎం పోరాట ఫలితంగానే ఖమ్మంలో 6,670 మంది పేదలకు ఇళ్ల పట్టాలు వచ్చాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ఈ పోరాటంలో శ్రీకాంత్ కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. కాగా, భూదాన్ భూముల్లో పదేళ్లుగా పేదలు ఉంటుండగా, ఇప్పుడు ఇళ్లు కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. తొలుత ఖమ్మం గాంధీచౌక్ నుంచి బోసు బొమ్మ సెంటర్ వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించగా, శ్రీకాంత్ మనవళ్లు ప్రదర్శించిన కర్రసాము ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకులు మాచర్ల భారతి, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, బుగ్గవీటి సరళ, బొంతు రాంబాబు, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ, మాదినేని రమేష్, పొన్నం వెంకటేశ్వర్లు, పి.సోమయ్య, ఎం.సుబ్బారావు, యర్రా రమేష్, యర్రా రంజిత్, చింతలచెరువు కోటేశ్వరరావు, శీలం సత్యనారాయణరెడ్డి, మడుపల్లి గోపాల్రావు, కార్పొరేటర్లు యర్రా గోపి, యల్లంపల్లి వెంకట్రావు, శ్రీకాంత్ సతీమణి యర్రా సుకన్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభ కనబరిస్తే నగదు పురస్కారం, ఢిల్లీ యాత్ర
ఖమ్మంగాంధీచౌక్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతూ వార్షిక పరీక్షల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు నగదు బహుమతులు అందించడమే కాక ఢిల్లీకి విజ్ఞానయాత్రకు తీసుకెళ్లనున్నట్లు మిత్రా ఫౌండేషన్ బాధ్యులు ప్రకటించారు. ఈ మేరకు కార్యక్రమ బ్రోచర్ను ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి శనివారం ఆవిష్కరించారు. అనంతరం మిత్రా ఫౌండేషన్ చైర్మన్, ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కురువెళ్ల ప్రవీణ్కుమార్ వివరాలు వెల్లడించారు. పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ఐదుగురు విద్యార్థులకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతులు అందిస్తామని తెలిపారు. అంతేకాక మూడు రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి జీవై నరేశ్తో పాటు బి.నర్సింహారావు, పాలవరపు శ్రీనివాస్, రంగనాగ శ్రీనివాస్, చెరుకూరి యుగంధర్, చారుగండ్ల రవికుమార్, మహంకాళి నగేశ్ పాల్గొన్నారు. -
కరుణగిరిలో కొనసాగుతున్న ఉత్సవాలు
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీలోని కరుణగిరి చర్చిలో శనివారం ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది. కరుణగిరి మహోత్సవాల్లో భాగంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి హాజరైన భక్తులు ప్రార్థనలు నిర్వహించారు. అలాగే, విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం మంగళగిరి డివైన్ మెర్సీ సెంటర్ ఫాదర్ జైసన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మేత్రాసనం ఫాదర్ తప్పెట శౌరి, కరుణగిరి డైరెక్టర్ ఫాదర్ జాన్నేశ్ తదితరులు పాల్గొన్నారు. సేవాలోపానికి పరిహారం చెల్లించాలి ఖమ్మంలీగల్: టీవీ పనిచేయకపోవడం వెనుక కంపెనీ, డీలర్ సేవల్లో లోపం ఉందని జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ తేల్చింది. ఈ మేరకు పరిహారం చెల్లించాలని కమిషన్ ఇన్చార్జ్ చైర్మన్ వి.లలిత, సభ్యురాలు మాధవీలత శనివారం తీర్పు చెప్పారు. కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన తుప్పతి మల్లికార్జునరావు సామ్సంగ్ ఎల్ఈడీ టీవీ కొనుగోలు చేయగా మొదటి రోజు నుంచే సరిగా పనిచేయకపోవడంతో కంపెనీ ప్రతినిధులకు ఫిర్యాదు చేశాడు. అయినా స్పందన రాకపోవడంతో న్యాయవాది బండారు నరేశ్ ద్వారా లీగల్ నోటీస్ పంపించి కమిషన్లో కేసు వేశాడు. విచారణ అనంతరం కొత్త టీవీ ఇవ్వడమే కాక మానసిక వేదనకు రూ.10 వేలు, న్యాయఖర్చులకు రూ.10 వేలు చెల్లించాలని తీర్పు చెప్పారు. నేడు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడి పర్యటన ఖమ్మంమామిళ్లగూడెం: ఖమ్మం వెలుగుమట్ల లో ఇటీవల కూల్చివేసిన ఇళ్లను ఆదివారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్నాయక్ పరిశీలించనున్నారు. భూదాన్ భూము ల్లో ఇళ్లు నిర్మించుకున్న వారిలో పలువురు గిరిజనులు ఉండగా, వారికి పునరావాసం కల్పించకుండా కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో క్షేత్రస్థాయి లో పరిశీలన, బాధితులను పరామర్శించేందుకు హుస్సేన్నాయక్ వస్తున్నారని నాయకులు తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ నేలకొండపల్లి: పారిశుద్ధ్య నిర్వహణలో ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి శనివా రం ఆయన పంచాయతీ కార్యదర్శులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. సీజనల్ వ్యాధుల కట్టడికి పారిశుద్ధ్యమే కీలకమని తెలిపారు. కాగా, ప్రభుత్వం నుంచి ఇటీవల విడుదలైన నిధుల నుంచి మాజీ సర్పంచ్లు చేసిన పనుల బిల్లులు చెల్లించాలని సూచించారు. వ్యక్తిగత, ఇతరత్రా కారణాలతో బిల్లులు ఇవ్వకపోతే చర్యలు ఉంటాయన్నారు. అలాగే, మార్చి నాటికి నూరు శాతం పన్నులు వసూలు చేయాలని, వీధి కుక్కల కట్టడిపై దృష్టి సారించాలని కార్యదర్శులకు సూచించారు. అంతేకాక వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా కార్యాచరణ రూపొందించాలని డీపీఓ తెలిపారు. సమావేశంలో డీఎల్పీఓ విజయలక్ష్మి, ఎంపీడీఓ ఎం.యర్రయ్య పాల్గొన్నారు. సోలార్ ప్లాంట్ పనుల పరిశీలన ఎర్రుపాలెం: మండలంలోని రాజుపాలెంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యాన నిర్మిస్తున్న సోలార్ విద్యుత్ ప్లాంట్ను సెర్ప్ కన్సల్టెంట్ శ్రీధర్గుప్తా, రెడ్కో జిల్లా మేనేజర్ అజయ్ శనివారం పరిశీలించారు. ప్లాంట్ పురోగతిపై ఆరా తీసిన వారు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తవగా, మిగతావి కూడా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం ఆలేటి శ్రీనివాస్, ఏపీఎం హరినారాయణ, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్ నేలకొండపల్లి: ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఇసుక తీసుకొస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు శనివారం సీజ్ చేశారు. ఏపీలోని మల్కాపురం నుంచి మండలంలోని బోదులబండ వైపు ఇసుకతో వస్తున్న ట్రాక్టర్లను తనిఖీ చేయగా అనుమతి లేదని తేలింది. దీంతో ట్రాక్టర్లను సీజ్ చేయడమే కాక డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సంతోష్ తెలిపారు. -
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
మధిర: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా వేయాలని అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు ఆదేశించారు. మధిర రూరల్ పోలీస్స్టేషన్ను శనివారం తనిఖీ చేసిన ఆయన ఫిర్యాదులు, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, చార్జీషీట్ల దాఖలుపై ఉద్యోగులతో సమీక్షించారు. అనంతరం అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ.. మధిర ఏపీకి సరిహద్దుగా ఉన్నందున ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించేలా చెక్ పోస్టుల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా చట్టప్రకారం జరిమానా విధించడమే కాక కేసులు నమోదు చేసి వాహనాలను జప్తు చేయాలని సూచించారు. -
విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
కామేపల్లి: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. పొన్నేకల్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సరస్వతీ దేవీ విగ్రహా ఆవిష్కరణ, నూతన గ్రంథాలయ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు నాణ్యమైన విద్యే పునాది అని, క్రమ శిక్షణతో కూడిన బోధన, మెరుగైన మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి ద్వారానే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం కోసం సహకరించిన దాతలను అభినందించాక మాలోత్ ప్రేమ్కుమార్ పదో తరగతి విద్యార్థులకు అందించిన పరీక్షా సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగులోత్ భూమిక, హెచ్ఎం కోటేశ్వరమ్మ, రాంరెడ్డి చరణ్రెడ్డి, టీటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాలోత్ రామారావు, గింజల నర్సింహారెడ్డి, నల్లమోతు లక్ష్మయ్య, కోయడ శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్, ఉపాధ్యాయులు భూక్యా టంక్, కమల్, మాలోత్ రవి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ కార్మికులకు బీమా కల్పించాలి
రఘునాథపాలెం: ఉపాధి కార్మికులకు రూ.5లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బొప్పని పద్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలం బూడిదంపాడు గ్రామంలో ఇటీవల ఉపాధి పనికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సప్పిడి రాధ కుటుంబాన్ని రాష్ట్ర బృందం పరామర్శించి ఆమె కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. పాలకుల విధానాలపై ఉపాధి కార్మికులు, సిబ్బంది ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా కూలీల రాష్ట్ర నాయకులు శెట్టి వినోద, లోకిని స్వరూప, మొగులోజు శారద, బందం వెంకటరాజ్యం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, నాయకుడు ప్రతాపనేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన ఖమ్మంరూరల్: పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించడంలో ప్రకృతి వ్యవసాయం ఎంతో కీలకమని కూసుమంచి ఏడీఏ సతీష్ అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలోని ముత్తగూడెంలో ప్రకృతి వ్యవసాయంపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రసాయన ఎరువులు, పురుగుమందులు లేకుండా పంటలు సాగు చేయడం వల్ల ఖర్చు తగ్గడంతో పాటు దిగుబడి కూడా పెరుగుతుందన్నారు. కొంతమంది రైతులు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ పార్మింగ్ పథకం ద్వారా వ్యసాయం చేయడం అభినందనీయమన్నారు. అనంతరం రైతులకు మృత్తిక కార్డులు పంపిణీ చేశారు. ఏఓ ఉమానగేశ్, ఏఈఓలు పాల్గొన్నారు. -
పిచ్చికుక్క స్వైరవిహారం
నేలకొండపల్లి: మండలంలోని ముజ్జుగూడెంలో శనివారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. స్థానికులపైకి దూసుకొచ్చిన కుక్క వారు పరుగులు తీసినా వెంట పడి కరిచింది. ఈ ఘటనలో బి.వెంకటేశ్వర్లు, అక్బర్, బుర్రయ్య, అక్షయ్కుమార్, జాహిద్, ఎస్కే రెహాన్, వీరయ్య, యాదయ్య తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆపై ఆచార్లగూడెం వైపు వెళ్లిన కుక్కను స్థానిక యువత వెంబడించి హతమార్చటంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. కాగా, గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, తీవ్ర గాయాలైన వీరయ్యను ఖమ్మం తరలించారు. ఈమేరకు డీఎంహెచ్ఓ రామారావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కె.రాజశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, డీఎల్పీఓ తదితరులు ఆస్పత్రికి వచ్చి వైద్యసేవలపై ఆరా తీశారు. అలాగే, ముజ్జుగూడెం వెళ్లి కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని పాలకవర్గాలకు సూచించారు. ఎంపీడీఓ ఎం.యర్రయ్య, వైద్యాధికారి మంగళ, సర్పంచ్లు శీలం వెంకటలక్ష్మి, కొలికపొంగు ఉప్పలమ్మ, బొడ్డు వసంత, కార్యదర్శులు పాల్గొన్నారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు -
ఎఫ్ఎల్ఎన్ – ఏఐలో జిల్లా ముందంజ
ఖమ్మం సహకారనగర్: ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్)లో భాగంగా ఆర్టిఫీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత బోధనలో జిల్లా ముందంజలో నిలిచింది. విద్యార్థులు కంప్యూటర్ల ద్వారా స్వీయ అభ్యసన విధానాన్ని జిల్లాలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది ప్రారంభించారు. ఇంకొన్ని జిల్లాలోని పాఠశాలల్లో కూడా అమలుచేస్తుండగా రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ప్రథమ స్థానాన నిలిచింది. ఈమేరకు జిల్లా విద్యాశాఖను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా అభినందించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఖమ్మం ఎన్నెస్పీ కాలనీ జీపీఎస్ ఉపాధ్యాయులు ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాను ముందంజలో నిలిపిన ఉపాధ్యాయులను డీఈఓ చైతన్యజైనీ అభినందించారు. -
పేదల ఇల్లు కూల్చడం అన్యాయం
ఖమ్మంఅర్బన్: వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇండ్లను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పేర్కొన్నారు. కూల్చివేతలు జరిగిన ప్రదేశాన్ని శనివారం సాయంత్రం పరిశీలించగా.. బాధితులు తమ సమస్యను వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఏళ్లుగా ఇక్కడే తాత్కాలిక నివాసా లు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నామని, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో అప్పులు చేసి మరీ ఇళ్లు కట్టుకున్నామని తెలిపారు. ఇప్పుడు కూల్చివేతతో రోడ్డున పడ్డామన్నారు. అనంతరం విమలక్క మా ట్లాడుతూ.. భూదాన్ భూముల్లో పేదలు ఇళ్లు కట్టుకుంటే పట్టాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం కూల్చి వేయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పేదలకు ఒక నీతి, పెద్దలకు మరో నీతి అమలు చేయడం సరైంది కాదన్నారు. పాలకులు మారినా పేదల పరిస్థితి మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. బాధితులకు భూదాన్ భూముల్లోనే నివాసాలు ఏర్పాటు చేసేంత వరకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున అండగా నిలిచి పోరాడుతామని పేర్కొన్నారు. అనంతరం అంబేడ్కర్భవన్ పునరావాస కేంద్రంలో ఉంటున్న వారిని సైతం విమలక్క పరామర్శించారు. కార్యక్రమంలో స్పర్శ భాస్కర్, న్యాయవాది మేకల సుగుణారావు, అరుణోదయ మల్సూర్, కొమ్ము రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అరుణోదయ సాంస్కృతిక అధ్యక్షురాలు విమలక్క -
రైతులు బేజారు..
అటు షికారు..కల్లూరురూరల్: పెనుబల్లి మండలంలోని పులి గుండాల ప్రాజెక్టు, పరిసర అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా తీర్చిదిద్దుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా బోటు షికారు సాఫీగా సాగేలా ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు వెళ్లకుండా తూము మూసివేశారు. దీంతో కల్లూరు మండలంలో ఉన్న ఆయకట్టు రైతులు వరి పంట ఎండిపోతోందని ఆందోళన చెందుతున్నారు. యాసంగి పంటలకు నీరేది? కల్లూరు మండలంలోని బత్తులపల్లిలో 250 ఎకరాలు, పెనుబల్లి మండలంలోని బ్రహ్మాళ్లకుంటలో 500 ఎకరాలు, తాళ్లపెంటలో 450 ఎకరాల ఆయకట్టులో పులిగుండాల ప్రాజెక్టు ఆధారంగా పంటలు సాగవుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో సాగు చేసే వరి పంటలకు పుష్కలంగా నీరు అందించినా, యాసంగి పంటకు మాత్రం సాగునీరు నిలిపివేశారు. ఫలితంగా ప్రాజెక్టు నీటినే నమ్ముకుని రైతులు సాగు చేసిన వరి పంట ఎండిపోయే దశకు చేరుతోంది. అయితే, పులిగుండాల ప్రాజెక్టును సాగునీటి అవసరాల కోసమే నిర్మించారని, కనకగిరి గుట్టల నుంచి వృథాగా వెళ్లే నీటికి ఆనకట్ట వేసి కాల్వల ద్వారా ఆయకట్టుకు అందించాలనేది లక్ష్యమని రైతులు చెబుతున్నారు. 30 ఏళ్లుగా తాము ప్రాజెక్టును నమ్ముకుని వ్యవసాయం చేస్తుంటే ఇప్పుడు నీటిని నిలిపివేయడం సరికాదని పోపోతున్నారు. 10 అడుగుల మేర నీరు ప్రాజెక్టులో ప్రస్తుతం పది అడుగుల మేర నీరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని కనీసం తూము వరకై నా నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఫలితంగా వరి పంట చేతికొస్తుందని చెబుతున్నారు. ఈ మేరకు అధికారులు స్పందించాలని ఆయకట్టు రైతులు లక్కిరెడ్డి ఏసురెడ్డి, జరుపుల వెంకన్న తదితరులు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం అవసరమైతే కొద్దిరోజులు బోటు షికారు నిలిపివేయాలని సూచిస్తున్నారు. పులిగుండాల ప్రాజెక్టు వద్ద ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా వివిధ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పర్యాటకుల కోసం బోటు షికారు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే, సాగు అవసరాలకు నీరు వదిలిపెడితే ప్రాజెక్టులో నీరు తగ్గి బోటు షికారు సాధ్యం కాదనే అభిప్రాయానికి అధికారులు వచ్చినట్లు తెలిసింది. ఫలితంగా సాగునీరు వెళ్లకుండా తూములు మూసివేయడంతో సుమారు 1,200 ఎకరాల్లో వరి పంటపై ప్రభావం పడుతోంది. -
కర‘కట్టా’లు తీరేనా?
భద్రగిరిలో గోదావరి కరకట్టపై నిలువ నీడ కరువు ● ఇరవై ఏళ్లుగా పెద్దగా మార్పునకు నోచుకోని వైనం ● సోలార్ ప్యానళ్ల రూఫ్టాప్ ఏర్పాటుచేస్తే నీడతో పాటు గ్రీన్ ఎనర్జీసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మార్చి రాకముందే ఎండలు మండుతున్నాయి. భద్రాచలంలో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 36 సెల్సియస్ డిగ్రీలుగా నమోదైంది. ఆలయ ప్రాంగణంతో పాటు గోదావ రి తీరం, కరకట్ట వద్ద జనసంచారం తగ్గిపోయింది. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేలా మాస్టర్ప్లాన్లో పనులను చేర్చాల్సిన అవసరం ఉంది. రెండు దశాబ్దాలుగా గోదావరి వరదల నుంచి భద్రాచలానికి రక్షణ కల్పించేందుకు 20 ఏళ్ల కిందట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న యటపాక నుంచి భద్రాచలం మీదుగా సుభాష్నగర్ వరకు సుమారు 7.5 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించారు. ఇందులో గోదావరిపై నిర్మించిన వంతెన దగ్గర నుంచి ఆంజనేయస్వామి విగ్రహం మీదుగా సీడబ్ల్యూసీ ఫ్లడ్ మెజర్మెంట్ పాయింట్, స్నానఘట్టాలు, గోదావరి మాత విగ్రహం, గంగమ్మ తల్లి గుడి వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర కరకట్టపై సిమెంట్ రోడ్డు నిర్మించారు. దిగువ భాగంలో రామాయణ ఇతివృత్తాన్ని తెలిపేలా విగ్రహాలు ఏర్పాటుచేశారు. ఆ తర్వాత చెప్పుకోదగిన మార్పులు, అభివృద్ధి జరగలేదు. సోలార్ విద్యుత్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు వెంట 23 కిలోమీటర్ల మేర సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఈ ట్రాక్ నిర్మాణానికి రూ.35 కోట్లు ఖర్చు కాగా, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 14 మెగావాట్లుగా ఉంది. ఇదే తరహాలో గోదావరి కరకట్ట పైభాగంలో సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసేలా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనల్లో చేర్చాలని భక్తులు కోరుతున్నారు. తద్వారా కరకట్టపై నీడ రావడమేకాక విద్యుత్ ఉత్పత్తితో ఆలయానికి అదనపు ఆదాయం సమకూరుతుంది. మాస్టర్ ప్లాన్లో చోటు కల్పిస్తే.. ఏటా భద్రాచలం వచ్చే భక్తులు, రాబోయే గోదావరి పుష్కరాలను దృష్ట్యా భద్రాచలంలో చేపట్టే పనులకు మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ఈ మాస్టర్ ప్లాన్లో గోదావరి కరకట్ట వెంట సోలార్ రూఫ్ ప్యానల్కు చోటు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.వేసవిలో రాష్ట్రంలోనే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భద్రాచలం ఒకటి. ముఖ్యంగా శ్రీరామనవమి సమయంలో ఇక్కడ ఎండలు భగ్గుమంటాయి. గోదావరి తీరంలో పవిత్రస్నానం చేసేందుకు వచ్చే భక్తులకు నిలువ నీడ లేదు. ఏటా మార్చి/ఏప్రిల్లో నవమి సందర్భంగా భద్రాచలం వచ్చే భక్తులు నిలువ నీడ లేక అల్లాడిపోతుంటారు. ఇక ఏజెన్సీలో వానలు కూడా ఎక్కువే. దీంతో ఇటు వర్షాకాలం, అటు ఎండాకాలంలో వచ్చే భక్తులు కరకట్ట దగ్గర ఎక్కువ సేపు గడిపే వీల్లేకుండా పోతోంది. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేలా గోదావరి వంతెన నుంచి కనీసం సుభాష్నగర్ కాలనీ వరకైనా కరకట్ట పై భాగంలో సోలార్ ప్యానళ్లతో రూఫ్ ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
కందుకూరు ఆలయాభివృద్ధికి సహకారం
వేంసూరు: మండలంలోని కందుకూరులో 500 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం మరింత అభివృద్ధి చెందేలా సహకరిస్తామని ఎమ్మె ల్యే మట్టా రాగమయి తెలిపారు. ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం శనివారం జరగగా ఆమె పాల్గొన్నా రు. ఆలయ చైర్మన్గా బండి వెంకటకృష్ణారెడ్డి, కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. అనంతరం కందుకూరులో ఇందిర మ్మ ఇళ్లను ప్రారంభించా రు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాసరి చంద్రశేఖర్రెడ్డి, నాయకులు గొర్ల వెంకటప్పారెడ్డి, గొర్ల సంజీవరెడ్డి, కొప్పుల వెంకటేశ్వరరెడ్డి, బాపిరెడ్డి, బూరుగు రవి నాయకులు పాల్గొన్నారు. కాగా, వేంకటేశ్వరస్వా మి కల్యాణ వేడుకల్లో భాగంగా శనివారం ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. ఆదివారం రాత్రి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి టైలర్స్ యూనియన్ ఆధ్వర్యాన శనివారం స్థానిక కళాభారతిలో టైలర్స్ డే వేడుకలు నిర్వహించారు. తొలుత ర్యాలీ నిర్వహించగా, అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే రాగమయి మాట్లాడారు. టైలర్లకు ప్రభుత్వం తరఫున చేయూతగా నిలుస్తామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఎండీ రెహానాబేగం, యూనియన్ అధ్యక్షుడు ఉమామహేశ్వరరావుతో పాటు టైలర్లు, నాయకులు ఇమాం, వెంకటాచారి, ఎండీ యాసిర్, డీఎన్ చారి, మహమూద్, శ్రీను, రాము, సతీశ్, గాదె చెన్నారావు పాల్గొన్నారు. -
భూదాన్ భూములు పేదలకే చెందాలి
ఖమ్మంమామిళ్లగూడెం: భూదాన్ భూములు అంటేనే పేదల కోసమని, అవి వారికి మాత్రమే చెందాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. ఖమ్మం సమీపాన వెలుగుమెట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని శనివారం పరిశీలించిన ఆయన బాధితులను పరామర్శించాక మాట్లాడారు. గత పదేళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చివేయటం దుర్మార్గపు చర్య అన్నారు. కూల్చిన ప్రాంతంలోనే బాధితులకు ఇళ్లు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ 62 ఎకరాల భూదాన్ భూముల్లో సెంట్ కూడా పోకుండా పేదలకు చెందేవరకు పోరాటం చేస్తానని తెలిపారు. కాగా, అక్రమంగా భూదాన్ భూముల్లో పట్టాలు చేసి అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల ఇళ్లు కూల్చిన అధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో 14 వేల ఎకరాలు, నల్లగొండలో 12 వేలు, మహబూబ్నగర్లో 15 వేలు, ఖమ్మంలో 6 వేల ఎకరాలు.. ఇలా మొత్తం 65 వేల ఎకరాల భూదాన్ భూములు అగ్రవర్ణాల కబ్జాలో ఉన్నాయని ఆరోపించారు. అలాంటప్పుడు ఖమ్మంలోనే పేదలు గూడు కట్టుకుంటే ఎందుకంత కక్షో ప్రభుత్వం చెప్పాలని మల్లన్న సూచించారు. పేదల నుంచి లాక్కున్న భూమిని బిల్డర్లకో, కబ్జాదారులకో కట్టబెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. బీసీల ఓట్లు కావాలి కానీ వారి జీవితాలను మాత్రం నాశనం చేస్తారా అని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కాగా, బాధిత కుటుంబాలకు అదే భూమిలో పునరావాసం కల్పించాలని కోరుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. తక్షణ సాయం కింద ప్రతీ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఆయన వెంట పార్టీ నేత వట్టె జానయ్యయాదవ్ తదితరులు ఉన్నారు. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న -
కలెక్టర్.. ఆ 30 ఎకరాల లెక్క చెప్పగలడా?: ఈటల ఫైర్
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు పంచడం చేత కాదు.. భూములు లాక్కోవడం మాత్రమే తెలుసు అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. కబ్జా చేసిన పెద్దల వద్ద ఉన్న భూములు తీయగలరా? అని ప్రశ్నించారు.బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శనివారం ఖమ్మంలోని భూదాన్ భూములను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. అనంతరం, ఈటల మీడియాతో మాట్లాడుతూ..‘గత ఐదు రోజులుగా వెలుగుమట్ల ప్రాంతంలో ప్రజల కన్నీళ్లతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ఈ ప్రభుత్వం పోవాలని ప్రజలు శాపనార్థాలు పెట్టారు. మొదటి నుంచి కాంగ్రెస్ ఇదే పద్ధతి కొనసాగించారు. జిల్లాలో సీపీఐ మినహా అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీవే కదా?. కీలక మంత్రి పదవులు ఇక్కడే కదా. తమకు న్యాయం జరుగుతుందని జనం సంబురపడ్డారు. కానీ, ఇలా తన ఇళ్లనే కూల్చివేస్తారని అనుకోలేదు.భూదాన్ భూమి అంటే దానం చేసిన భూమి అని తెలియదా?. వినోబా భావే అనే వ్యక్తి వేల ఎకరాలు దానం చేశారు. 147,148, 149 సర్వే నెంబర్లలో 62 ఎకరాల భూదాన్ భూమి ఉంది. ఆనాడు ఈ భూములను ఎవరు దేకలేదు. ఇపుడు ధర పెరగడంతో వాళ్ల కన్ను ఇటు పడింది. రేవంత్ రెడ్డిది కూల్చివేతల ప్రభుత్వం. భూములు పంచడం చేత కాదు. భూములు లాక్కోవడం మాత్రమే తెలుసు. 2019లో చల్లా కోదండరాం అనే జడ్జి ఈ పేదలకు కరెంట్, నీళ్లు ఇవ్వండి అంటే ఆనాటి ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వకపోగా ఉన్నది లాక్కున్నారు. ఏ కోర్టు ఆర్డర్ మీకు ఇల్లు కూల్చమని ఇచ్చింది?. వీళ్లే బలవంతంగా లాక్కున్నారు. కబ్జా చేసిన పెద్దల వద్ద ఉన్న భూములు తీయగలరా?. పెద్దల జోలికి పోయే దమ్ము మీకు ఉందా?. 62 ఎకరాల్లో 32 ఎకరాలు సరే.. మిగతా 30 ఎకరాలు ఏమయ్యాయి?. కలెక్టర్ ఆ 30 ఎకరాల లెక్కచెప్పగలడా?.పేదల కళ్లలో మట్టి కొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. జిల్లాలో ఉన్న భూదాన్ భూముల వివరాలు మొత్తం బయటకు తీయాలి. తప్పు జరిగిందని సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలి. పేదలే నీకు ఓట్లు వేసింది. పేరుకు మాత్రమే పేదల పార్టీ, చేతల పార్టీ కాదు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి సత్వర న్యాయం చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
ఖమ్మంలో ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో తొలిసారిగా ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు కానుంది. విద్యుత్ సేవలను మరింత మెరుగుపర్చడమే లక్ష్యంగా ఖమ్మం పాత బస్టాండ్ ప్రాంగణంలో దీన్ని ఏర్పాటుచేయనున్నారు. ఈమేరకు ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలపగా, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక 33/11 కిలోవాట్ల సామర్ధ్యంతో ఇండోర్ సబ్ స్టేషన్ను ఏర్పాటుకు ఎన్పీడీసీఎల్ నుంచి రూ.6.6 కోట్లు మంజూరు చేశారు. భవనం లోపల పూర్తి రక్షణతో పవర్ ట్రాన్స్ఫార్మర్, వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్లు, ఆధునిక రక్షణ పరికరాలు, కంట్రోల్ ప్యానెళ్లను అమరుస్తారు. తద్వారా వర్షం, దుమ్ము, దూళి, కాలుష్యం నుంచి రక్షణ లభించి.. లోపాల శాతం తగ్గి విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. అలాగే, నిర్వహణ కూడా సులువవుతుందని అధికారులు తెలిపారు. పాత బస్టాండ్లో ఏర్పాటుకు రూ.6.6 కోట్లు -
ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా కృష్ణారావు
ఖమ్మంమామిళ్లగూడెం: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా డాక్టర్ కేవీ కృష్ణారావు నియమితులయ్యారు. అలాగే, ఉమ్మ డి జిల్లా చైర్మన్గా పుసుపులేటి నాసరయ్యను నియమిస్తూ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ ఒక ప్రక్రటన విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు, నాసరయ్య మాట్లాడుతూ.. ఉద్యమకారుల హక్కుల సాధనతో పాటు వారి సంక్షేమ అవసరాల కోసం పాటుపడతామని తెలిపారు. ఆర్చరీ ఎంపిక పోటీలకు ట్రయల్స్ సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాస్థాయి ఆర్చ రీ మినీ అండర్–15, 13, 10 విభాగాల్లో బాలు రు, బాలికల ఎంపికకు ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ బాధ్యులు సాధుల సారంగపాణి, పుట్టా శంకరయ్య తెలి పారు. పాల్వంచ మండలం కిన్నెరసానిలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో ఆదివారం ఉదయం 8 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.కన్వీనర్లుగా స్పోర్ట్స్ స్కూల్ హెచ్ ఎం బి.చందు, పీడీ ఎస్.బాలసుబ్రహ్మణ్యం, క్రీడాకారుల ఎంపిక అనంతరం కోచింగ్ ఇన్చార్జ్లుగా జి.మారప్ప, ఎ.దుర్గయ్య, కె.కళ్యాణ్, పి.నగేశ్ వ్యవహరిస్తారని తెలిపారు. రికర్వ్, కాంపౌండ్, ఇండియన్ రౌండ్లలో పోటీలు జరు గుతాయని పేర్కొన్నారు.అండర్–10కు 2016, జనవరి 1తర్వాత, అండర్–13కు 2013 జన వరి 1 తర్వాత, అండర్–15 విభాగానికి 2011 జనవరి 1 తర్వాత జన్మించిన వారు అర్హులని వారు వివరించారు. రెండు రాష్ట్రాల స్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు ఎర్రుపాలెం: మండలంలోని శ్రీఅంకమ్మ, పేరంటాల శ్రీరామలింగయ్య స్వామి ఆలయ ప్రాంగణంలో తిరునాళ్ల సందర్భంగా శుక్రవారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల స్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఖమ్మం, ప్రకాశం, బాపట్ల ,కృష్ణా జిల్లాల రైతులు పోటీల్లో పాల్గొనగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం విజేతలుగా నిర్వాహకులు బహుమతులు అందచేశారు. ప్రారంభమైన కరుణగిరి మహోత్సవాలు ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలి టీ పరిధి కరుణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాలను ఉమ్మడి జిల్లా ఆర్సీఎం బిషప్ సగిలి ప్రకాష్ శుక్రవా రం ప్రారంభించారు. తొలుత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాక ఆయన మాట్లాడారు. అనంతరం మంగళగిరికి చెందిన డివైన్ మెర్సీ సెంటర్ ఫాదర్ జైసన్ మాట్లాడుతూ మానవులను బతికించేది దేవుడి కృప మాత్రమేనని తెలిపారు. ఈకార్యక్రమంలో కరుణగిరి డైరెక్టర్ ఫాదర్ జానీస్, ఫాదర్ విన్సెంట్, కొమ్ము ఆథోని, ఎలియాస్, యాంజిలో పాల్గొన్నారు. అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ పోలీసు కమిషనర్ సునీల్దత్ ఖమ్మంరూరల్: రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవడమే కాక వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి పెద్దతండాలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో రహదారి భద్రతపై శుక్రవారం ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన మాట్లాడా రు. రోడ్డు భద్రత ప్రాధాన్యతను ప్రతీ వాహనదారుడికి వివరించేలా ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. వాహనదారులు హెల్మెట్, సీటు బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, డ్రైవింగ్ సమయాన సెల్ఫోన్కు దూరంగా ఉండడమే కాక ఇతర నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సదస్సులో డీటీ ఓ జగదీష్, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్లు, కళాశాల చైర్మన్ కె.నవీన్బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?
ఖమ్మంమయూరిసెంటర్: కూలీ పనులు చేసుకుంటూ కూడబెట్టుకున్న సొమ్ముతో కట్టుకున్న పేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా అని వామపక్ష పార్టీల నాయకులు ప్రశ్నించారు. ఖమ్మంలోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం వివిధ పార్టీల నాయకులు నున్నా నాగేశ్వరరావు, దండి సురేష్, ఆవునూరి మధు, గోకినేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఖమ్మం భూదాన్ భూముల్లో పదేళ్ల క్రితం నిరుపేదలు పట్టాలు పొంది 600మంది నివసిస్తుండగా వారి ఇళ్లను కూల్చివేయడంతో రోడ్డున పడ్డారని తెలిపారు. 2014నుంచి బడా బాబుల భూములను క్రమబద్ధీకరిస్తున్న ప్రభుత్వం పేదల ఇళ్లను ఎందుకు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇదేసమయాన ఇళ్లు కూల్చివేసిన ప్రభుత్వం ఆక్రమణలు జరిగియనా చెబుతూ బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. రూ.250 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకున్నామని చెబుతున్న వారు మిగతా స్థలం ఏమైందో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణ సాయుధ పోరాటం, ముదిగొండ భూపోరాటం వంటి వాటితో పేదలకు ఇళ్లు, స్థలాలు, భూములు సాధించిన కమ్యూనిస్టు పార్టీలను తక్కువ చేయాలని చూసే వారు చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు వై.విక్రం, మేకల శ్రీనివాస్, ఆవుల అశోక్, పాముల మోహన్, రాజు, జి.మస్తాన్, శంకర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.వామపక్ష నాయకుల ఆగ్రహం -
●నాడు కట్టడాలు.. నేడు శిథిలాలు
ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో ఏళ్లుగా కొందరు ఇళ్లు నిర్మించుకుంటూ వస్తున్నారు. స్థోమతకు తగ్గినట్లుగా ఎవరికి వారు గుడిసెలు, రేకుల షెడ్లు, స్లాబ్తో ఇళ్లు నిర్మించుకుని వినోబా నవోదయ నగర్ కాలనీగా పేరు పెట్టుకున్నారు. దీంతో ఇన్నాళ్లు ఖమ్మం – వైరా ప్రధాన రహదారిపై వెళ్తుండగా ఇళ్ల సముదాయం కనిపించేది. అయితే, ఈనెల 24న కాలనీలోని ఇళ్లను అధికార యంత్రాంగం కూల్చేసింది. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతం మీదుగా వెళ్తుంటే నేలమట్టమైన ఇళ్ల శిథిలాలే కనిపిస్తున్నాయి. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
వెలుగుమట్ల బాధితులకు అండగా బీఆర్ఎస్
ఖమ్మంవైరారోడ్: వెలుగుమట్లలో పేదల గుడిసెలను కూల్చిన పాపం కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా తాకుతుందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ వ్యాఖ్యానించారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కొందరి సమస్యే కాదని, రాష్ట్రవ్యాప్తంగా పేదలు ఎదుర్కొంటున్న అన్యాయానికి ప్రతీక అని పేర్కొన్నా రు. ఈమేరకు వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలిచేలా న్యాయపోరాటానికి పార్టీ లీగల్ సెల్ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని తెలిపా రు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు తక్షణ పునరావా సం కల్పించడమే కాక అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు గుండాల కృష్ణ, ఉప్పల వెంకటరమణ, బిచ్చల తిరుమలరావు, గుండ్లపల్లి శేషు, మహమ్మద్ తాజుద్దీన్పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ -
ఆయిల్పామ్ పంట లాభదాయకం
బోనకల్: రైతులు ఆయిల్పామ్ సాగు చేయడం ద్వారా లాభాలు పొందొచ్చని జిల్లా ఉద్యానవన శాఖాధికారి ఎం.వీ.మధుసూదన్రావు తెలిపారు. మండలంలోని గోవిందాపురం, నారాయణపురం గ్రామాల్లో రైతులకు శుక్రవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుల్లో అశ్వారావుపేట ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీనివాస్తో కలిసి మాట్లాడారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే ఆయిల్పామ్తో 30ఏళ్లకు పైగా దిగుబడులు వస్తాయని తెలిపారు. అంతేకాక మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున ధర పెరుగు తూ ఉంటుందని చెప్పారు. ఈమేరకు రైతులు ప్రభు త్వ ప్రోత్సహకాలను వినియోగించుకుంటూ సాగు చేయాలని సూచించారు. అనంతరం ఇప్పటికే ఆయిల్పామ్ సాగు చేస్తున్న వారికి ఎరువుల యాజమాన్యం, నీటి నిర్వహణ, డ్రిప్ ఇరిగేషన్, గెలల కోతపై అవగాహన కల్పించారు. పట్టు పరిశ్రమ శాఖ డీడీ ముత్యాలు, మధిర ఏడీఏ స్వర్ణ విజయచంద్ర, మధిర ఉద్యాన అధికారి విష్ణు, ఆయిల్ఫెడ్ ఫీల్డ్ అఫీసర్ నవ్యతో పాటు ఉద్యోగులు వెన్నెల, సుబ్బారావు, గోవిందాపురం సర్పంచ్ మందా కరుణ పాల్గొన్నారు. ఉపాధ్యాయుడి ప్రవర్తనపై ఆగ్రహం మధిర: మండలంలోని దెందుకూరు జెడ్పీహెచ్ఎస్లో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ప్రజాప్రతినిధులతోపాటు గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు స్వర్గం శ్రీనివాసరావు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలికలు వారి తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలిసింది. ఈమేరకు సమాచారంతో శుక్రవారం సర్పంచ్ పగిడిపల్లి శ్రీని వాసరావు తదితరులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీశారు. గతంలోనూ పోలీసులకు ఫిర్యా దు చేసిన విషయాన్ని ప్రస్తావించగా, అది తన వ్యక్తిగత విషయమని ఉపాధ్యాయుడు బదులిచ్చాడు. ఇకనైనా తీరు మార్చుకోకపోతే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ విషయమై హెచ్ఎం రాజకుమారిని వివరణకోరగా...శనివారం బాలికలు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటామని చెప్పారు. కాగా, ఘటనపై అధికారులు విచారణ జరిపించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాగా, ఉపాధ్యాయుడు శ్రీనివాసరావుపై ఆరోపణల నేపథ్యాన ఉన్నతాధికారులు స్పందించారు. ఈమేరకు విచారణ అధికారిగా మధిర ఎంఈఓ వై.ప్రభాకర్తో పాటు ఒక కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిని నియమించినట్లు సమాచారం -
మత్స్యశాఖ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
వైరా: వైరాలోని మత్స్య శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విధుల్లో ఉద్యోగుల నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణలో లోపాలు ఉన్నాయనే ఫిర్యాదులతో తనిఖీకి వచ్చామని ఏసీబీ డీఎస్పీ రమేష్బాబు తెలిపారు. ఉదయాన్నే కార్యాలయానికి చేరుకున్న అధికారులు పలు రికార్డులు స్వాధీనం చేసుకోవడమే కాక రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీలు కొనసాగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమేష్బాబు మాట్లాడుతూ 2022లో మత్స్యశాఖ సొసైటీల నుంచి రూ.50వేల లంచం తీసుకుంటూ అప్పటి ఎఫ్డీఓ బుచ్చిబాబు పట్టుబడ్డాడని తెలిపారు. ఆనాటి రికార్డులతో పాటు ఇతర పత్రాలను పరిశీలన నిమిత్తం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పది మండలాల పరిధితో కొనసాగుతున్న వైరా ఎఫ్డీఓ కార్యాలయం కింద 55 సొసైటీలు ఉండగా పర్యవేక్షణ లోపం, రికార్డుల్లో అవకతవకలను గుర్తించామని తెలిపారు. కాగా, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు పనుల కోసం లంచం అడిగితే 1064 నంబర్కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు. ఇసుక అక్రమ రవాణా కట్టడికి చెక్పోస్ట్ చింతకాని: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తూ తరచుగా వాహనాలు పట్టుబడుతుండడంతో పూర్తిస్థాయిలో కట్టడికి పోలీసులు చర్యలు చేపట్టారు. ఈమేరకు చింతకాని మండలం చిన్నమండవ లో పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యాన శుక్రవారం చెక్పోస్ట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై వీరేందర్ మాట్లాడుతూ చిన్నమండవ మున్నేరు నుంచి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చెక్పోస్ట్ ఏర్పాటు చేశామని, ఇక్కడ పోలీసు, రెవెన్యూ సిబ్బంది నిరంతరం విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. చిన్నమండవ, తిమ్మినేనిపాలెం మున్నేరులోకి ట్రాక్టర్లు వెళ్లకుండా కందకాలు తీయించడంతో పాటు రాత్రివేళ కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలించే వాహనాలను సీజ్ చేయడంతో పాటు డ్రైవర్లు, యజమానులపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు. -
భూదాన్ భూములు నిరుపేదలకే దక్కాలి
ఖమ్మంమయూరిసెంటర్: దశాబ్దం క్రితం పేదలు భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకుంటే కనీస వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం అక్కడి నుంచి ఖాళీ చేయించడం గర్హనీయమని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పేర్కొన్నా రు. ఇకనైనా ఆ భూములను శాశ్వతంగా వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో శుక్రవారం మాస్లైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ఇళ్లు ఇస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు నోటీసులు ఇవ్వకుండా కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. బాధితులకు అక్కడే డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించడంతో పాటు తక్షణ సాయంగా రూ.5లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, గుర్రం అచ్చయ్య, సీవై.పుల్లయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్, కొల్లేటి నాగేశ్వరరావు, బందెల వెంకయ్య, ఆర్.శివలింగం, ఏ.వెంకన్న, శిరోమణి, ఝాన్సీ, మంగతాయి, ఎం.నాగేశ్వరరావు, కమ్మకోటి నాగేశ్వరరావు, తిమ్మిడి హన్మంతరావు, కె.శ్రీను, లాజర్, ఆజాద్ పాల్గొన్నారు. మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు -
వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయాలా?
ఖమ్మంమయూరిసెంటర్: భూదాన్ భూముల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నేత బాలసాని లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ కమర్తపు మురళి అన్నారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో శుక్రవారం వారు మాట్లాడారు. భూదాన్ భూములపై ప్రతిపక్షాలు తలా ఒకమాట చెబుతున్నాయన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు, ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ జిల్లా మంత్రులపై చేసిన వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. బీఆర్ఎస్ హయాంలో సమస్యను పరిష్కరించకపోవడంతో ఇప్పుడు రాద్ధాంతం జరగగా, తమ ప్రభుత్వం పరిష్కారం చూపించబోతుందని తెలిపారు. కాగా, జిల్లా మంత్రులు పేదలకు వ్యతిరేకం కాదని , దళారుల మాటలు విని నివాసముంటూ ఇబ్బంది పడుతున్న అర్హులకు తమ ప్రభుత్వం మంచి దారి చూపించే ప్రయత్నం చేస్తోందన్నారు. పేదల నుంచి డబ్బు వసూలు చేసిన వారిని శిక్షించాలని కలెక్టర్ను కోరామని తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మేయర్ పునుకొల్లు నీరజ, నాయకులు యర్రం బాలగంగాధర్ తిలక్, దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, సాధు రమేష్రెడ్డి, మూడుముంతల గంగరాజుయాదవ్, బచ్చలకూరి నాగరాజు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ఏన్కూరు: మండలంలోని గార్లఒడ్డు సమీపాన శుక్రవారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఏన్కూరుకు చెందిన దుగ్గిరాల కన్నమ్మ(50) గురువా రం అర్ధరాత్రి గార్లఒడ్డు నుండి కాలినడకన ఏన్కూరు వస్తుండగా మార్యమధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది, ఘటనాస్థలికి ఎస్ఐ నారబోయిన సంధ్య చేరుకుని వివరాలు సేకరించడమే కాక, కన్నమ్మ కుమారుడు నర్సింహా రావు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కరెంట్ స్తంభం పైనుంచి పడి వ్యక్తి.. ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపల్ పరిధి లోని ముద్దలపల్లి వద్ద కొత్త కరెంట్ స్తంభంపై పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పడిన భూక్యా మురళి(34) మృతిచెందాడు. తల్లాడ మండలం మల్సూరుతండాకు చెందిన మురళి, అదే గ్రామస్తులు కొందరితో కలిసి మద్దులపల్లి ఏరియాలో కొత్త కరెంట్ స్తంభాలు వేసే పనికి గురువారం వచ్చాడు. ఈమేరకు పైకి ఎక్కిన ఆయన వైర్ లాగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఘటనపై మురళి భార్య సుప్రియ శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దార్యప్తు చేస్తున్నట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. ఖమ్మం స్టేషన్లో మధిర వాసి.. ఖమ్మంక్రైం: ఖమ్మం రైల్వేస్టేషన్లో మధిరకు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందాడు. మధిర మండలం ఖమ్మంపాడుకు చెందిన సామినేని శ్రీనివాసరావు(40) కుటుంబ కలహాలతో మూడేళ్ల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చి తిరుగుతున్నాడు. అనారోగ్యం బారిన పడిన ఆయన శుక్రవారం రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద మృతిచెందినట్లు గుర్తించగా, ఆయన భార్య భవానికి సమాచారం ఇచ్చినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. అనంతరం మృతదేహన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్శ్రీనివాసరావు సాయంతో మార్చురీకి తరలించారు. -
ఆయిల్పామ్లో తెల్లదోమ
● ఆకుల రసం పీలుస్తుండడంతో నష్టం ● పైరు ఎదుగుదల, దిగుబడిపై ప్రభావం ● నివారణ చర్యలపై అధికారుల సూచనలు ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్పామ్ తోటలు ఉన్నాయి. సంప్రదాయ పంటలతో పోలిస్తే ఈ తోటలతో దీర్ఘకాలిక ఆదాయం వస్తుందని అధికారులు అవగాహన కల్పిస్తుండడంతో ఎక్కువమంది రైతులు సాగుకు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం 1.20 లక్షల ఎకరాల్లో పంట సాగవుతుండగా.. ఇటీవల ఆయిల్పామ్ తోటలను తెల్లదోమ ఆశించడం, ఆకులు, పంటపై ఈ తెగులు దాడితో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు, అశ్వారావుపేట, ములకలపల్లి, దమ్మపేట, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి తదితర మండలాల్లో ఈ తెల్లదోమ ఉధృతి కనిపిస్తోంది. వాతావరణంలో తేమ పెరగడం, చల్లని వాతావరణం కారణంగా తెల్లదోమ ఆశిస్తోందని ఉద్యాన అధికారులు విశ్లేషిస్తున్నారు. అయితే, ప్రస్తుతం చలికాలం ముగిసి వేసవి మొదలవుతున్న తరుణాన తెల్లదోమ ఆశించటం రైతులను కలవరపరుస్తోంది. తద్వారా పైరు ఎదుగుదల తగ్గడంతో పాటు దిగుబడి పడిపోయే ప్రమాదముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యాన సత్తుపల్లి, వేంసూరు ప్రాంతాల్లోని ఆయిల్పామ్ తోటల్లో ఖమ్మంజిల్లా ఉద్యానాధికారి ఎంవీ మధుసూదన్ ఇటీవల తెల్లదోమ ఉధృతిని గుర్తించగా, నివారణ చర్యలపై రైతులకు పలు సూచనలు చేశారు. ఆయిల్పామ్ మొక్కలపై ఆకుల దిగువ భాగాన తెల్లదోమ నివసిస్తూ రసం పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. అంతేకాక ఆకులు ముడుచుకుంటాయి. ఫలితంగా మొక్కల పెరుగుదల తగ్గుతోంది. ఈ తెల్లదోమ తేనె వంటి పదార్థాన్ని విడుదల చేయడం వల్ల ఆకులపై నల్లటి పొర (సూటీ మోల్డ్) ఏర్పడి కిరణజన్య సంయోగ క్రియ తగ్గుతుంది. ఇది పంట దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పొలంలో కలుపు మొక్కలను తొలగించి శుభ్రత పాటించాలి. పసుపు స్టిక్కీ ట్రాప్లు ఏర్పాటు చేయాలి. తీవ్ర దాడి ఉన్నప్పుడు ఉద్యాన అధికారుల సూచన తీసుకున్నాక ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ లేదా థియామెథోక్సామ్ 0.25 గ్రా లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలాగే, జీవ నియంత్రణ కోసం వేపనూనె 10,000 పీపీఎం 1.5 మి.లీ.ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అంతేకాక రైతులు తోటను తరచుగా పరిశీలిస్తూ తెల్ల ఈగ లక్షణాలు కనిపించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. అవసరమైతే సూచనల కోసం ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలని మధుసూదన్ సూచించారు. -
ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం సమీపంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఆక్రమణ తొలగింపుతో మొదలైన మాటల మంటలు చల్లారడం లేదు. శుక్రవారం ఓవైపు అధికార యంత్రాంగం బాధితుల వివరాల సేకరణలో నిమగ్నం కాగా.. వీరికి న్యాయం చేయాలని వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా స్పందించడంతో అధికార, ప్రతిపక్షాల నడుమ మాటల యుద్ధం కొనసాగింది. అలాగే, సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బాధితులను పరామర్శించారు. ఇక శనివారం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తదితరులు బాధితులను పరామర్శిస్తారని ఆయా పార్టీల నేతలు వెల్లడించారు. అధికారుల సర్వే భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన వారి వివరాలను సేకరించే పనిని రెవెన్యూ యంత్రాంగం ప్రారంభించింది. నిజమైన నిరుపేదలు ఎవరనేది గుర్తించేందుకు సర్వేను చేపడుతున్నారు. ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం రెవెన్యూ ఉద్యోగులు టీటీడీసీతోపాటు అంబేద్కర్ భవన్లో ఉన్న బాధితుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఆరా తీయడంతో పాటు ప్రాంతాల వారీగా అక్కడి రెవెన్యూ యంత్రాంగానికి సమాచారం ఇచ్చి వివరాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఉదాహరణకు కారేపల్లి మండల వాసులు భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటే.. ఆ వ్యక్తులు వివరాలను కారేపల్లి తహసీల్దార్కు పంపించారు. అక్కడి ఉద్యోగులు ఆధార్కార్డు, రేషన్కార్డు నెంబర్, పిల్లలు ఎందరు, గతంలో ప్రభుత్వం నుంచి పథకాలు అందాయా, స్వగ్రామంలో ఇల్లు ఉందా.. ఆర్థిక పరిస్థితి తదితర వివరాలను సేకరించనున్నారు. వాద.. ప్రతివాదాలు భూదాన్ భూముల వ్యవహారంలో పార్టీల నేతల నడుమ వాద, ప్రతివాదాలు తారాస్థాయికి చేరాయి. గురువారం కేటీఆర్ పర్యటన తర్వాత మాటల యుద్ధం పెరుగుతోంది. కేటీఆర్ వ్యాఖ్య లపై కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. మరో సమావేశంలో మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ భూదాన్ భూములు నిరుపేదలకే దక్కాలని, పేదల ఇళ్లు కూల్చడం సరైన చర్య కాదంటూ వ్యాఖ్యానించారు. ఇక వామపక్ష నేతలు కూడా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అలాగే బీఆర్ఎస్ నేతలు ప్రెస్మీట్ ఏర్పాటు చేసి కేటీఆర్ పర్యటన సందర్భంగా బాధితులను రానివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఇక శనివారం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భూదాన్ భూముల బాధితులను వేర్వేరుగా పరామర్శించనున్నారు.వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో నిర్మాణాలను ఈనెల 24న తొలగించగా, చుట్టూ ఫెన్సింగ్ వేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే హద్దులు నిర్ధారించగా, గోతులు తవ్వి ఫెన్సింగ్ రాళ్లు పాతే పనులు మొదలుపెట్టారు. తద్వారా భూముల్లోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. కాగా, శుక్రవారం బాధితులెవరూ ఇక్కడకు రాకపోవడంతో నిశ్శబ్దం రాజ్యమేలింది. కేవలం ఫెన్సింగ్ వేస్తున్న కూలీలతో పాటు శిథిలాల్లో సామగ్రి ఏరుకునే వారే కనిపించారు.భూదాన్ బాధితుల వివరాల సేకరణలో యంత్రాంగంవెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేత తర్వాత అక్కడ నివాసం ఉన్న వ్యక్తుల సామాజిక, ఆర్థిక సర్వే చేపడుతున్నాం. సర్వేను త్వరగా పూర్తి చేయాలని జిల్లాలోని 14మంది తహసీల్దార్లను ఆదేశించాం. సర్వేలో వెల్లడయ్యే వివరాల ఆధారంగా అర్హులకు ప్రభుత్వ ఆదేశాలతో నివాస స్థల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ఉంటుంది. తొలగించిన ఇళ్లకు సంబంధించిన వ్యక్తులు స్వస్థలాల్లో అందుబాటులో ఉండి సర్వేకు సహకరించాలి. – అనుదీప్ దురిశెట్టి, కలెక్టర్, ఖమ్మం -
ఖమ్మం
వైరాలో ఏసీబీ తనిఖీలు వైరాలోని మత్స్యశాఖ కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.7ఎత్తుకెళ్లారు.. వదిలేశారు! కారేపల్లి మండలం చిమ్నాతండాలోని ఓ ఇంట్లో చోరీ చేసిన నిందితులు ఆ సొత్తును ఒక రోజు తర్వాత మళ్లీ ఇంటి ముందు వదిలేశారు.వాతావరణ ం జిల్లాలో శనివారం ఉక్కపోత వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండ పెరిగినా రాత్రి సమయానికి మాత్రం చల్లబడుతుంది.శనివారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 -
పకడ్బందీగా కేంద్ర పథకాల అమలు
ఖమ్మం సహకారనగర్: అర్హులకు లబ్ధి చేకూరేలా కేంద్రప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని దిశ కమిటీ చైర్మన్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఎంపీఽ అధ్యక్షతన దిశ(జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ) కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్కలెక్టర్ అజయ్యాదవ్, జెడ్పీ సీఈఓ దీక్షారైనాతో పాటు సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నివేదికల పరిశీలన.. సూచనలు వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కేంద్రపథకాల వివరాలను అధికారులు వివరించారు. అనంతరం ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం స్థానంలో వచ్చిన వికసిత్ భారత్ జీ రామ్జీ పథకం మార్గదర్శకాలు ప్రజాప్రతినిధులందరికీ అందిచాలని సూచించారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీపై దృష్టి సారించడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవ సమయాన శస్త్రచికిత్సల కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఐటీఐ, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాలపై అవగాహన కల్పించామని, సెంట్రల్ టూల్ డిజైన్ సెంటర్కు కేంద్రం నిధులు సాధించేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజనం తయారీ కోసం ప్రతీ ప్రభుత్వ పాఠశాలకు గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తుండగా, వైరాలో మూడు వారాల్లోగా డంప్ తొలగిస్తామని చెప్పారు. అలాగే, పోడు భూముల్లో బోర్లు వేయడం, జిల్లాలోని 9–14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను వివరించారు. ●అధికార యంత్రాంగం ప్రొటోకాల్ పాటించాలని ఎమ్మెల్సీ తాతా మధు సూచించారు. వికసిత్ భారత్ జీ రాంజీ పథకంతో కూలీలకు పనివేళలు తగ్గాయా నివేదిక ఇవ్వాలని తెలిపారు. అలాగే, ఉపాధి హామీ పనుల పురోగతి, బకాయిలు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీ సెక్షన్ డెలివరీల తగ్గింపు, ఎన్హెచ్ పనుల్లో వేగంపై దృష్టి సారించాలని చెప్పారు. . ●ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతుల పొలాల్లో బోర్లు వేసుకోవడంతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పనలో ఇబ్బందులు రాకుండా చూడాలని వైరా ఎమ్మెల్యే రాందాస్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో కొందరికి మధ్యలో ఎల్ 1 నుంచి ఎల్ 3 మారిస్తే ఇబ్బంది పడుతున్నారన్నారు. మొదటి దశలో మంజూరైన ఇళ్లు వేసవిలో పూర్తయ్యేలా పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే, దిశ కమిటీ సభ్యురాలు, కారేపల్లి మండలం పోలంపల్లి సర్పంచ్ ధరావత్ హేమలత మాట్లాడుతూ పోచారం రైల్వేస్టేషన్ నుంచి తడికలపూడి స్టేషన్ వరకు రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణానికి భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని, కారేపల్లి–ఇల్లెందు మార్గంలో రైల్వేగేట్ కారణంగా ఇబ్బందులు వస్తున్నందున ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. ●మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీల వద్ద మరమ్మతులు పూర్తిచేసి వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి తెలిపారు. సత్తుపల్లి ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుల డిప్యూటేషన్ రద్దు చేయాలని, అంబులెన్స్ డ్రైవర్ పోస్ట్ మంజూరు చేయడమేకాక అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను ఏర్పాటు చేయాలని సూచించారు.‘దిశ’ కమిటీ సమావేశంలో ఎంపీ రఘురాంరెడ్డి -
46 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
● ఒకరిపై సస్పెన్షన్ వేటు ఖమ్మం సహకారనగర్: పలువురు ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తున్నారనే ఆరోపణలు వస్తుండడంతో కలెక్టర్ అనుదీప్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఈమేరకు హాజరుపై దృష్టి సారించగా.. పలువురు గైర్హాజరవుతున్నట్లు తేలింది. ఇందులో 14మంది ఓడీ అని అప్డేట్ చేసుకోగా, 32మంది అసలు ఎఫ్ఆర్ఎస్లో నమోదు చేసుకోలేదని గుర్తించారు. దీంతో మొత్తం 46మంది ఉపాధ్యాయులకు డీఈఓ చైతన్యజైనీ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే, ఏన్కూరు ఉపాధ్యాయురాలు జయను సస్పెండ్ చేస్తూ డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్ పాఠశాలను తనిఖీ చేయగా ఆమె విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు ఖమ్మంమయూరిసెంటర్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దే అందించేలా ఆర్టీసీ లాజిస్టిక్ విభాగం నిర్ణయించింది. మార్చి 27న భద్రాచలంలో స్వామి కల్యాణం జరగనుండగా, అక్కడకు వెళ్లలేని భక్తుల కోసం దేవాదాయ శాఖ సహకారంతో తలంబ్రాలు చేరవేస్తామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ తెలిపారు. ఈమేరకు ప్రచార పోస్టర్లను శుక్రవారం ఆయన ఖమ్మంలో ఆవిష్కరించి మాట్లాడారు. తలంబ్రాలు కావాల్సిన భక్తులు www.tgsrtclogistics.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఉమ్మడి జిల్లాలోని అన్ని కార్గో సెంటర్లలో రూ.151 చెల్లించి బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డిప్యూటీ ఆర్ఎం యు.రాజ్యలక్ష్మి, ఖమ్మం డీఎం శివప్రసాద్, ఉద్యోగులు జ్యోత్స్న, శ్యామలాదేవి పాల్గొన్నారు. -
‘లైన్’ మారుతోంది...
● విజయవాడ రైల్వే డివిజన్లోకి మధిర సెక్షన్ ● ప్రతీ పనికి ఉద్యోగులు అటే వెళ్లక తప్పని పరిస్థితి ● భవిష్యత్లో పలు రైళ్ల హాల్టింగ్ ఎత్తివేసే అవకాశం? మధిర ఇంజనీరింగ్ సెక్షన్ ఏర్పడి 65ఏళ్లు అవుతోంది. ఇప్పుడు మధిరను విజయవాడ డివిజన్లో కలపాలని తీసుకున్న నిర్ణయం బాధ కలిగిస్తోంది. సొంత రాష్ట్రం వదిలి వెళ్తున్న భావన వస్తోంది. ప్రజలు, ఉద్యోగుల మేలు కోసం మధిరను సికింద్రాబాద్ డివిజన్లోనే కొనసాగించాలి. – మోదుగు సైదులు, రైల్వే ఉద్యోగి, మధిరమధిర: మధిర రైల్వేస్టేషన్ ఇప్పటివరకు సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో కొనసాగుతోంది. అయితే, ఈ ప్రాంతాన్ని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడుతున్న సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధి విజయవాడ డివిజన్లోకి మార్చాలని నిర్ణయించారు. దీంతో మధిరతో పాటు తొండల గోపవరం, ఎర్రుపాలెం రైల్వేస్టేషన్లు ఆ డివిజన్లో విలీనమవుతాయి. ఏపీకి సరిహద్దుగా ఉన్న ఈ స్టేషన్ల ద్వారా నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. టికెట్ల అమ్మకాలతోనే మధిర స్టేషన్కు నెలకు సుమారు రూ.30 లక్షలకు పైగా ఆదాయం సమకూరుతోంది. ఇప్పుడు డివిజన్ను మార్చడం ద్వారా కార్యకలాపాలన్నీ విజయవాడ నుంచే కొనసాగుతాయి. ఫలితంగా రైల్వే ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా సికింంద్రాబాద్ బదులు విశాఖపట్నం లేదా విజయవాడ వెళ్లక తప్పని పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు. హాల్టింగ్పై ప్రభావం మధిర సహా మూడు స్టేషన్లను సౌత్ కోస్టల్ జోన్లో విలీనం చేయడం ద్వారా మధిర స్టేషన్లో ఆగుతున్న పలు రైళ్ల హాల్టింగ్ ఎత్తివేసే అవకాశం ఉంది. డివిజన్ మార్పులో భాగంగా 533/0 కి.మీ.గా ఉన్న మధిర సెక్షన్ పరిధి 525/0 వరకు తగ్గిపోతుంది. ఫలితంగా మూడు స్టేషన్లు ఏపీలోని విజయవాడ డివిజన్లోకి వెళ్తాయి. మధిర రైల్వేస్టేషన్కు దశాబ్దాల చరిత్ర ఉన్నందున తెలంగాణలోని సికింద్రాబాద్ డివిజన్లోనే కొనసాగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. త్వరలోనే కొత్త జంక్షన్లు భవిష్యత్లో ఎర్రుపాలెం, మోటమర్రి రైల్వే జంక్షన్లుగా అప్గ్రేడ్ కానున్నాయి. ఎర్రుపాలెం నుంచి అమరావతి కి రైల్వేలైన్ నిర్మాణం ఆమోదించడంతో ఎర్రుపాలెం జంక్షన్ అవుతుంది. తద్వారా మధిరలో పలు రైళ్లకు హాల్టింగ్ తొలగించి ఎర్రుపాలెంలో ఇస్తారు. అంతేకాక మోటమర్రి కూడా జంక్షన్ అయ్యే అవకాశం ఉండడంతో ఆ స్టేషన్కు ప్రాధాన్యత ఇస్తారు. మధిర స్టేషన్కు కొద్ది కి.మీ. దూరంలోనే ఎడమ వైపు ఎర్రుపాలెం, కుడివైపు మోటమర్రి జంక్షన్లు ఏర్పడితే మధిర స్టేషన్ బోసిపోయే అవకాశముంది. ఇక ఇప్పుడు డివిజన్ కూడా మారిస్తే ఉద్యోగులు, ప్రయాణికుల సమస్యల కోసం నానా పాట్లు పడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. అంతేకాక టికెట్ల ద్వారా స్టేషన్కు వస్తున్న రోజువారీ రూ.లక్ష ఆదాయం, వాహనాల పార్కింగ్, స్టాళ్ల టెండర్ల రుసు ము కూడా విజయవాడ డివిజన్కే జమ అవుతుంది. ఇంకొన్ని సమస్యలు మధిర, తొండలగోపవరం, ఎర్రుపాలెం స్టేషన్ల్లను విజయవాడ డివిజన్కు మార్చడం ద్వారా ఉద్యోగుల కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే కొనసాగుతాయి. మధిరలో ఆగాల్సిన రైళ్లలో మార్పులు వచ్చి ఆదాయం గణనీయంగా తగ్గుతుంది. ఏదైనా సమస్య వస్తే విజయవాడకు వెళ్లాల్సి వస్తుంది. ఇక మధిర రైల్వే అండర్ బ్రిడ్జి విస్తరణ పనులు కలగానే మిగిలిపోతాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని డివిజన్ మార్చకుండా ఎంపీలు చొరవ తీసుకోవాలని ప్రయాణికులు, ఉద్యోగులు కోరుతున్నారు.మధిర స్టేషన్లో ఏదైనా రైలుకు హాల్టింగ్ కల్పించాలన్నా, ప్రయాణికులకు సమస్యలు ఎదురైనా స్థానిక ఎమ్మెల్యే లేదా ఎంపీ దృష్టికి తీసుకెళ్తారు. ఆపై వారు సికింద్రాబాద్ జోన్ రైల్వే జనరల్ మేనేజర్తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. కానీ ఇప్పుడు డివిజన్ మారితే ప్రజాప్రతినిధులకు దృష్టికి సమస్యలను తీసుకెళ్తాక వారు నూతనంగా ఏర్పడే విశాఖపట్నం జనరల్ మేనేజర్తో మాట్లాడాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల వినతులపై ఆంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు కానీ రైల్వే ఉన్నతాధికారులు కానీ పెద్దగా స్పందించే అవకాశం ఉండదు. ఇప్పటికే పద్మావతి, కరీంనగర్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లే మార్గాన మధిర రైల్వేస్టేషన్లో ఆగుతున్నా తిరుగు ప్రయాణంలో ఇక్కడ హాల్టింగ్ సౌకర్యం లేదు. ఇలాంటి సమస్యలన్నీ అపరిష్కృతంగానే మిగిలిపోతాయి. -
దర్శన భాగ్యం దక్కేనా?
శ్రీరామనవమికి భద్రాచలం వచ్చే భక్తులకు సీతారాముల కల్యాణం కనులారా వీక్షించే అవకాశం కల్పించే దిశగా దేవాదాయ శాఖ చర్యలు చేపడుతోంది. ఈమేరకు ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచింది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం కల్యాణం చూసేది ఇలా.. వచ్చే నెల 27వ తేదీ శ్రీరామనవమి రోజున భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకను భక్తులు స్వయంగా తిలకించేందుకు వీలుగా ఆలయం వెలుపల ఉన్న మిథిలా స్టేడియంలో వివాహ తంతు జరిపిస్తారు. అందులో భాగంగా కల్యాణ మండపం చుట్టూ చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తారు. సీఎం, మంత్రులు, జ్యుడీషియల్ విభాగానికి ఒక గ్యాలరీ, ఆ తర్వాత సిఫార్సు లేఖలతో వీఐపీలకు మరో గ్యాలరీని ఏర్పాటు చేస్తారు. దాని తర్వాత సామాన్య భక్తుల కోసం ఉయభదాతలు (ఇద్దరికి కలిపి రూ.7500 టికెట్), రూ. 5,000, రూ. 2,000, రూ.500, రూ.250 చొప్పున టికెట్లు విక్రయిస్తారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని చూసేందుకు వీలుగా వీరందరికీ వేర్వేరు సెక్టార్లు కేటాయిస్తారు. ఈ సెక్టార్లకు ఆవల ఉచితంగా కల్యాణాన్ని తిలకించే అవకాశం భక్తులకు ఉంటుంది. ఆ అడ్డంకులు లేకుండా ఉభయదాతలకు ప్రతీసారి ఎదురువుతున్న ఇబ్బందులు ఇక తొలగిపోనున్నాయి. మిథిలా స్టేడియంలో కల్యాణ మండపం ఎదురుగా నిర్మించిన భారీ షెడ్డు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ షెడ్డు పరిధిలోకి వచ్చే వీవీఐపీ, వీఐపీ, ఉభయదాతల సెక్టార్ల విభజనలో మార్పులు చేసే అవకాశం అధికార యంత్రాంగానికి దక్కింది. సీఎం, ఇతర ప్రముఖులకు సంబంధించిన గ్యాలరీకి మండపం ఎదురుగా ఉన్న స్థలాన్ని కేటాయించనున్నారు. తర్వాత మిగిలిన ప్రదేశాన్ని అడ్డంగా కాకుండా నిలువుగా రెండు భాగాలుగా విభజించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. అందులో ఒకకవైపు వీఐపీ గ్యాలరీ ఉంటే మరో వైపు ఉభయదాతల గ్యాలరీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. తద్వార వీవీఐపీ, వీఐపీ వెనుకకాకుండా వారికి సమాంతరంగా కూర్చుని కల్యాణం చూసే అవకాశం ఉయభదాతలకు కలుగుతుంది. టికెట్ కొన్నా.. తప్పని తిప్పలు శ్రీరామనవమి టికెట్లలో అత్యంత ప్రీమియం కేటగిరికి చెందిన ఉభయదాతలే కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇక వారి తర్వాత వచ్చే రూ.5,000, రూ.2,000, రూ.500, రూ 250 టికెట్లు కొన్న భక్తుల పరిస్థితి మరీ దారుణం. పేరుకే భద్రాచలం వచ్చినట్టు కానీ, మిథిలా స్టేడియంలో ఏ సెక్టార్లో కూర్చున్నప్పటికీ కల్యాణ మండపంలో సీతారాముల వివాహ వేడుకను సరిగా చూడలేని పరిస్థితి నెలకొంది. మిథిలా స్టేడియంలో నేల సమతలంగా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అంతేకాదు భద్రాచలంలో వేసవి తీవ్రత ఎక్కువ కావడంతో భక్తుల కోసం ఏర్పాటు చేసే చలువ పందిళ్లు దర్శనానికి అడ్డుగా నిలుస్తున్నాయి. కనులారా చూడలేదనే అసంతృప్తి.. మండపానికి ఎదురుగా ముఖ్యమంత్రి, మంత్రులు, న్యాయవ్యవస్థకు సంబంధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత వీవీఐపీ గ్యాలరీలో ప్రజాప్రతినిధులు కూర్చుంటారు. తర్వాత సిఫా రసు లేఖలతో రూ.500 టికెట్తో వీఐపీ పాస్ల గ్యాలరీ ఉంటుంది. ఆపై స్థలాన్ని రూ.7,500 టికెట్లు కొనుగోలు చేసే ఉభయదాతలకు గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. అయితే అత్యంత ఖరీదైన టికెట్ కొనుగోలు చేసినా తమకు దగ్గరి నుంచి కల్యాణం స్పష్టంగా చూసే అవకాశం కలగడం లేదనే అసంతృప్తి ప్రతీసారి ఉభయదాతల టికెట్లు ఉన్న వారి నుంచి వస్తోంది.భద్రాద్రిలో మొదలైన శ్రీరామ నవమి ఏర్పాట్లు మిథిలా స్టేడియంలో కల్యాణ మండపం, గ్యాలరీలకు మధ్య విజిబులిటీ (వీక్షణత) సరిగా ఉండదనేది బహిరంగ రహస్యం. అయినప్పటికీ ఈ లోపాన్ని సవరించే ప్రయత్నాలు జరగడం లేదు. ప్రతీసారి సీఎం గ్యాలరీ, వీవీఐపీల గ్యాలరీ ఏర్పాట్లపైనే అఽధికార గణం ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ చేతులు దులుపుకుంటోంది. ఈసారి షెడ్డు అందుబాటులోకి రావడంతో ఉభయదాతల టికెట్లు కొన్నవారికి మేలు జరుగుతుంది. ఇదే స్ఫూర్తితో భద్రాచలం వచ్చే భక్తులందరూ రామయ్య కల్యాణం కనులార చూసేలా మిథిలా స్టేడియంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య
● మహిళ తండ్రిని హతమార్చిన వ్యక్తి ● ఆపై పోలీసుస్టేషన్లో లొంగిపోయిన నిందితుడు తిరుమలాయపాలెం: ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని వృద్ధుడైన ఆమె తండ్రి మందలించాడు. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తి ఆయనను కత్తితో పొడిచి హతమార్చడమే కాక పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. తిరుమలాయపాలెం మండలం పడమటితండాలో గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలిలా.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బోడియాతండాకు చెందిన బానోతు సాయి అత్తగారి ఊరైన పడమటితండాలో 20ఏళ్లుగా మెకానిక్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉండే గుగులోతు రామచంద్రు(55) పెద్ద కుమార్తెకు కొన్నేళ్ల క్రితం వివాహమైనా భర్తను వదిలివేసి ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి ఇంట్లో ఉంటోంది. ఆమెతో సాయికి వివాహేతర సంబంధం ఏర్పడింది. కాగా రామచంద్రు ఖమ్మం రూరల్ మండలం బారుగూడెంలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఆయన గురువారం బంధువు ఇంట్లో కార్యానికి వెళ్లగా అక్కడికి సాయి కూడా రావడంతో తన కుమార్తెతో సంబంధంపై నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆపై సాయి కత్తితో రామచంద్రుపై దాడి చేయడంతో కన్నుమూశాడు. ఆ తర్వాత నిందితుడు పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. తండాలో ఉద్రిక్తత... పోలీసుల మోహరింపు వివాహేతర సంబంధంపై ప్రశ్నించిన రామచంద్రును సాయి హతమార్చడంతో పడమటితండాలో ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేది లేదని ఆయన బంధువులు అడ్డుకున్నారు. అంతేకాక సాయిని చంపి పగ తీర్చుకుంటామని పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. రామచంద్రు మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించేలా ఆయన బంధువులతో జరుపుతున్న చర్చలు రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగాయి. -
ప్రశ్నలు వేసి జవాబులు రాబడుతూ..
● ఉపాధ్యాయురాలిగా మారిన జెడ్పీ సీఈఓ దీక్ష! నేలకొండపల్లి: విద్యార్థులను ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టడమే కాక వారి సందేహాలు తీర్చిన జెడ్పీ సీఈఓ దీక్షారైనా కాసేపు ఉపాధ్యాయురాలి పాత్ర పోషించారు. మండలంలో గురువారం పర్యటించిన ఆమె చెరువుమాధారం, రాజేశ్వరపురం ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. తొలుత ఉపాధ్యాయులతో సమావేశమై ఈసీఆర్ ప్రగతిపై ఆరా తీశారు. ఈక్రమాన చెరువుమాధారం పాఠశాలలో విద్యార్థుల ప్రగతిని తెలుసుకునేందుకు టీచర్గా మారారు. బోర్డుపై అక్షరాలు, పదాలు రాసి చదివించారు. సమాధానాలు చెప్పిన వారికి చాక్లెట్లు ఇచ్చి ప్రోత్సహించారు. ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంఈఓ బి.చలపతిరావు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.కుష్ఠు నిర్మూలనే లక్ష్యం కావాలి ఖమ్మంవైద్యవిభాగం: కుష్ఠు బాధితులకు వైద్యసేవలు అందిస్తూ జిల్లా నుంచి వ్యాధిని పూర్తిగా తరిమికొట్టడమే ఉద్యోగుల లక్ష్యం కావాలని అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ చందునాయక్ అన్నారు. జిల్లాలోని పీహెచ్సీల లెప్రసీ విభాగం డీపీఎంఓలు, ఎంపీఎంఓల సమావేశం లెప్రసీ పారా మెడికల్ ఆఫీసర్ బి.భోజ ఆధ్వర్యాన గురువారం జరిగింది. ఈ సమావేశంలో చందునాయక్ మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన సర్వేలో గుర్తించిన అనుమానితులకు చికిత్స మొదలుపెట్టాలని తెలిపారు. డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్లు ప్రతీనెల ఆశా డే సమావేశమై హాజరై వ్యాధిపై అవగాహన కల్పించాలని, ఆరు నెలల చికిత్స పూర్తయిన వారిని కొద్దినెలల తర్వాత పరీక్షించాలని చెప్పారు. అంతేకాక కొత్త కేసు నమోదైనప్పుడు వారి ఇంటి చుట్టుపక్కల 300 ఇళ్ల వరకు పరిశీలించాలని సూచించారు. డీపీఎంఓ అఫ్జల్మియా, జి.భద్రు, కె.వెంకట్, దూప్సింగ్ పాల్గొన్నారు. ఆయిల్పామ్ సాగు లాభదాయకం రఘునాథపాలెం/తిరుమలాయపాలెం: వరుసగా పత్తి, మిర్చి, వరి సాగు చేసే రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని, తద్వారా దీర్ఘకాలం లాభాలు ఉంటాయని జిల్లా ఉద్యాన అధికారి మధుసూదన్ తెలిపారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తి, తిరుమలాయపాలెంలో గురువారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ఆయిల్పామ్ ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు ఆదాయం ఇవ్వడమే కాక ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటుందని తెలిపారు. అంతేకాక ప్రభుత్వం నుంచి ఎకరాకు రూ.51వేల రాయితీ అందుతుందని చెప్పారు. అశ్వారావుపేట ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు శ్రీనివాస్, సుబ్బారావు ఆయిల్పామ్ సాగు, ఎరువుల యాజమాన్యంపై వివరించారు. చింతగుర్తి సర్పంచ్ మౌనిక, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు నగేష్, సతీష్, విజయలక్ష్మి, జరీనా, గోద్రెజ్ మేనేజర్ రామకృష్ణ, సర్పంచ్ డి.సుజాత, రైతులు కేతినేని సీతారాములు, కొండపల్లి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బడాబాబుల కోసమే పేదల ఇళ్లు కూల్చివేత
ఖమ్మం మామిళ్లగూడెం: బడా బాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే భూదాన్ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను నేలమట్టం చేశారని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ధ్వజమెత్తారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో గురువారం వారు మాట్లాడుతూ దశాబ్దాల క్రితం పేదలు చిన్నపాటి గుడిసెలు వేసుకుని జీవిస్తుంటే ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. అంతేకాక కనీసం 24 గంటల సమయం కూడా ఇవ్వకుండానే రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లు నేలమట్టం చేయడం గర్హనీయమన్నారు. ఆ ప్రాంతంలో విలాసవంతమైన గృహాలు నిర్మించాలని మంత్రులు కల కంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, నాయకులు మందడపు సుబ్బారావు, నకిరికంటి వీరభద్రం, వీరవెల్లి రాజేష్, రవి, శాసనాల సాయిరాం, మందా సరస్వతి, రుద్రగాని మాధవ్, పిల్లలమర్రి వెంకట్, పాలెపు రాము, నలమాస్ శ్రీనివాస్, వల్లాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వాసుదేవరావు -
అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మం సహకారనగర్: గిరిజన సంక్షేమ శాఖ పరిధి పాఠశాలల్లో ద్వితీయ శ్రేణి భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్గ్రేడ్ చేయడంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్ డిమాండ్ చేశారు. ఈమేరకు కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించగా ఆయన మాట్లాడారు. 2022–2023 విద్యాసంవత్సరం నుంచి ఇప్పటివరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఒక సమస్య కూడా పరిష్కరించలేదన్నారు. ఇకనైనా స్పందించకపోతే మార్చి 10వ తేదీన గిరిజన సంక్షేమ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన చేపడుతామని తెలిపారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏవీ.నాగేశ్వరరావు, టి.వెంగళరావు, నాయకులు వెంకటేశ్వర్లు, సంధ్య, జి.వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు, ఎం.నాగిరెడ్డి, గరిక శ్రీనివాస్, ఆకుల వెంకటేశ్వర్లు, భావ్సన్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయ్ -
త్వరలోనే ఎంపీఈడీ కోర్సు?
● తొలుత 40 సీట్లతో ప్రారంభం ● ఖమ్మం ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ నుంచి ప్రతిపాదనలు ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా కేంద్రంలోని యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేషన్ కళాశాలకు అనుబంధంగా కొనసాగుతున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో త్వరలోనే మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(ఎంపీఈడీ) కోర్సు మొదలయ్యే అవకాశముంది. ఈమేరకు ప్రతిపాదనలు పంపించగా, అనుమతులు రాగానే వచ్చే ఏడాది నుంచే కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. 11బ్యాచ్లు పూర్తి ఖమ్మంలో 2013లో 60మందితో బ్యాచ్లర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) కోర్సు ప్రారంభమైంది. ఇప్పటివరకు కాలేజీలో 11 బ్యాచ్లు పూర్తయ్యాయి. ఇందులో బీపీఈడీ పూర్తిచేసిన వారు ఎంపీఈడీ చదివే అవకాశం లేక ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. పలువురు కష్టనష్టాలకోర్చి ఎంపీఈడీతో పాటు పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో వంద మంది చొప్పున బీపీఈడీ కోర్సులో ఉన్నారు. ఈనేపథ్యాన ఖమ్మంలోనే ఎంపీఈడీ కోర్సు ప్రారంభిస్తే అభ్యర్థులు దూరప్రాంతాలకు వెళ్లే ఇక్కట్లు తప్పనున్నాయి. ఈమేరకు 40సీట్లతో కోర్సుకు అనుమతించాలని కోరడంతో పాటు కాలేజీలో సెమినార్ హాల్కు రూ.1.25కోట్లు, హాస్టల్ నిర్మాణానికి రూ.3.75 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించారు. కాలేజీలో అధ్యాపకుల కొరత ఉంది. ఖాళీల భర్తీ కోసం యూనివర్సిటీకి ప్రతిపాదనలు పంపాం. అలాగే, ఎంపీఈడీ కోర్సు ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరాం. అనుమతి వస్తే బీపీఈడీ పూర్తి చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. – డాక్టర్ సీహెచ్.రవికుమార్, ప్రిన్సిపాల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఇప్పటి వరకు ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో అరకొర సౌకర్యాలే ఉన్నాయి. అయినా అధ్యాపకుల చొరవతో అభ్యర్థులకు శిక్షణ సాఫీగా సాగుతోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడే అభ్యర్థులు ప్రవేశాలు పొందుతుండగా.. బీపీఈడీలోనూ సీట్లు పెంచాలనే డిమాండ్ ఉంది. పీజీ కళాశాల మైదానం అందుబాటులోకి రావడం, బాస్కెట్బాల్ సిమెంట్ కోర్టు త్వరలోనే ప్రారంభించే అవకాశముంది. ఈనేపథ్యాన అన్ని అనుకూలతలు ఉన్నందున ఎంపీఈడీ కోర్సు ప్రవేశపెట్టాలని పలువురు కోరుతున్నారు. -
ఐకమత్యంతో ధైర్యంగా ఉండండి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘ఎవరూ అధైర్యపడొద్దు.. ఐకమత్యంతో ధైర్యంగా ఉండండి.. మీ కోసం బీఆర్ఎస్ కొట్లాడుతుంది. ప్రభుత్వం ఇచ్చిన కాగితాలతో అవసరమైతే సుప్రీంకోర్టుకు పోదాం. అసెంబ్లీ, మండలిలో పోరాడుతాం.. మేం అధికా రంలోకి రాగానే ఇక్కడే ఇళ్లు కట్టించి గృహప్రవేశం చేయిస్తామని కేసీఆర్ చెప్పమన్నారు’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. ఖమ్మంఅర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులను గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం అంబేద్కర్ భవన్ పునరావాస కేంద్రంలో ఉంటున్న వారితో కేటీఆర్ మాట్లాడారు. మంత్రుల కన్నుపడింది.. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో 900 కుటుంబాలు ఉంటున్న స్థలంపై జిల్లాలోని ముగ్గురు మంత్రుల కన్ను పడిందని కేటీఆర్ విమర్శించారు. తమ హయాంలో పేదలకు చెడు చేయకపోగా కరెంట్, నీళ్లు ఇచ్చామని, 400 ఎకరాలతోపాటు ప్రభుత్వ భూమిని కూడా కాపాడి పార్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవం రోజు కేసీఆర్ 4లక్షల మందితో మీటింగ్ పెట్టినా ఎవరికీ హాని జరగలేదన్నారు. ప్రస్తుతం చుట్టూ వంద ఎకరాల కొన్నవారు, ఈ స్థలంపై కన్నేసిన వారే మాఫియాగా మారారని పేర్కొన్నారు. పేదల అవస్థలు చూసి కేసీఆర్ తమను పంపించారని తెలిపారు. ఐకమత్యంతో పోరాడండి.. ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఐకమత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నందున ధైర్యంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. వందమందికి అక్కడో, ఇక్కడో స్థలాలు ఇస్తాం.. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటూ లాక్కెళ్లి ఐక్యతను దెబ్బతీసే ప్ర యత్నం చేస్తారన్నారు. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం, మంత్రులు పిలిచి చిచ్చుపెట్టే ప్రయత్నం చేసినా ఐక్యంగా కొట్లాడి విజయం సాధించాలని సూచించారు. మీకు అండగా ఉంటాం.. ఓపీడీఆర్ బాధ్యులు పట్టాలు ఇప్పించినా వారిని ప్రభుత్వం నానా మాటలు అంటోందని కేటీఆర్ తెలిపారు. బాధితులకు పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ రవిచంద్ర అండగా ఉంటారన్నారు. బుధవారమే తాము రావాలని ప్రయత్నించినా ఆటంకాలు కల్పించారని ఆరోపించారు. పేదలకు భూములు దక్కేలా అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామని, శాసనసభ, మండలిలో మాట్లాడతామని హామీ ఇచ్చారు. పేదలు రూపాయి ఖర్చు పెట్టకుండా పార్టీయే బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. మంత్రులు ఇక్కడికి రావాలి.. ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయకపోతే ముగ్గురు మంత్రులు, కలెక్టర్ ఇక్కడికి రావాలని కేటీఆర్ సూచించారు. ఏ తప్పు జరగకపోతే వారే వచ్చి వివరించొచ్చు కదా అని ప్రశ్నించారు. ఆర్డీఓను ముందు పెట్టి ఇళ్లు కూలగొట్టించాక.. ఇప్పుడు మంత్రులందరూ మంచోళ్లంటూ ఆర్డీఓపై నెపం పెట్టి బదిలీ చేశారన్నారు. మంత్రులకు ధైర్యం ఉంటే, తప్పు చేయకపోతే ఎందుకు రావడం లేదో చెప్పాలని సూచించారు.మేం అధికారంలోకి వచ్చాక ఇక్కడే గృహప్రవేశాలు భూదాన్ భూముల్లో కూల్చివేతల ప్రాంతాన్ని కేటీఆర్ పరిశీలించి మహిళలతో మాట్లాడారు. నోటీసులు ఇవ్వకుండా పోలీసులతో వచ్చి బెదిరించి ఖాళీ చేయించారని వారు వాపోయారు. నిలువ నీడ పోయిందని, కూలీ పనులకు వెళ్లలేక, పిల్ల ల చదువు సాగడం లేదని పట్టాలు చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, నేతలు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్, శంబిపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు చంద్రావతి, మెచ్చా నాగేశ్వరరావు, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్, లింగాల కమల్రాజ్, కూరాకుల నాగభూషణంతో పాటు డాక్టర్ చెరుకు సుధాకర్, పగడాల నాగరాజు, తోట రామారావు, కూరాకుల వలరాజు, కర్నాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
భూదాన్.. రగడ
ఖమ్మం సమీపాన వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇళ్ల తొలగింపు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఇళ్ల కూల్చివేతపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇక్కడ 31.07 ఎకరాల భూమి ఉండగా, హైకోర్టు, భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాలతో ఈనెల 24న ఆక్రమణలను తొలగించినట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది. స్థానికులే కాక ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు ఆక్రమించారని.. అందులో కొందరు పేదల వద్ద రూ.లక్షలు వసూలు చేసి స్థలాలు అంటగట్టినట్లు సమాచారం. ఈనేపథ్యాన అర్హులు, అనర్హులెవరనే లెక్కలు తీయడంలో యంత్రాంగం నిమగ్నమైంది. అంతేకాక భూమి భూదాన్ యజ్ఞ బోర్డుదిగా చెబుతూ ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మంమాకు పట్టాలు ఉన్నాయి.. భూదాన్ బోర్డు నుంచి తమకు అధికారంగా పట్టాలు వచ్చాయని కొందరు చూపిస్తున్నారు. 2014లో 1,895 మందికి పట్టాలు ఇవ్వగా.. రూపాయి రూపాయి కూడబెట్టి ఇళ్లు కట్టుకున్నామని చెబుతున్నారు. గత పదేళ్లలో ఎవరూ ఇబ్బంది పెట్టకపోగా.. ఇప్పుడు అనుమతి, పట్టాలు లేవంటూ చెబుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థలంలో కొందరు రేకుల ఇళ్లలో ఉంటుండగా, మరికొందరు స్లాబ్ వేసుకున్నారు. అయితే, అధికారులు మాత్రం భూదాన్ బోర్డు ఎలాంటి హక్కు పత్రాలు ఇవ్వలేదని, కోర్టు ఆదేశాలతోనే కూల్చామని చెబుతున్నారు. అక్రమార్కులకు బంగారు బాతు దాదాపు 31–07 ఎకరాల భూమి అక్రమార్కులకు బంగారు బాతుగుడ్డులా మారింది. కొందరు భూములను ఆక్రమించుకున్నాక అమాయకులను నమ్మించి ప్లాట్లుగా చేసి అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భూదాన్ యజ్ఞ బోర్డు, రెవెన్యూ శాఖ చేపట్టిన విచారణలో నకిలీ పత్రాలను గుర్తించారు. స్థానికులే కాక ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు ఆక్రమించుకోగా భూమాఫియా జోక్యంతో భారీగా అక్రమాలు జరిగాయని సమాచారం. ఈమేరకు 13కేసులు నమోదు చేసిన పోలీసులు, ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరు ముఠాగా ఏర్పడి ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులుగా చెబుతూ ఇంటి స్థలాలు కేటాయిస్తున్నామని రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు తెలిసింది. స్థానికులెవరు.. ఇతరులెవరు ? భూదాన్ భూముల్లో కూల్చివేతలపై బీఆర్ఎస్, వామపక్షాలతో పాటు బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. అయితే కొందరు పేదలు సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో అక్రమార్కులను నమ్మి డబ్బు చెల్లించి నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం. ఇలాంటి వారు కూడా నిరాశ్రయుల్లో ఉండడంతో ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈక్రమంలోనే అర్హులు ఎవరు, అనర్హులు ఎందరనే లెక్కలు తీస్తున్నట్లు సమాచారం. ఖమ్మం నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల వారే కాక భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల వారు కూడా ఉన్నట్లు అధికారుల పరిశీలనలో బయటపడినట్లు తెలిసింది. ఇప్పటివరకు 720మందితో జాబితా రూపొందించగా.. అందులో అర్హులెవరో తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తం జాబితా సిద్ధమై స్థానిక పేదలెవరో తేలితే ప్రభుత్వం ఆదుకోనుందని సమాచారం.1953లో కలవల రాజా రామారావుకు సర్వే నంబర్లు 147, 148, 149ల్లో ఉన్న 31–07 ఎకరాల భూమిని భూదాన్ ఉద్యమంలో భాగంగా దానం చేశారు. ఇందులో కొంత భూమిపై కబ్జాదారుల కన్ను పడగా.. మరికొంత స్థలంలో కట్టడాలు వెలిశాయి. ఇవి ఆక్రమణలేనని రెవెన్యూ యంత్రాంగం నోటీసులు జారీ చేయగా.. పలువురు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇలా ఏళ్లుగా వివాదం సాగుతోంది. ఈ భూమి సమీపానే కలెక్టరేట్ నిర్మాణం జరగడంతో విలువ పెరిగింది. కూల్చివేతల అనంతరం భూమి విలువ రూ.250 కోట్ల మేర విలువ ఉందని అధికారులు వెల్లడించడం హాట్టాపిక్ అయింది.వెలుగుమట్లలో 31.7 ఎకరాల భూములు వెలుగుమట్లలోని భూదాన్ భూముల విలువ సుమారు రూ.250 కోట్లు ఉంటుంది. సీసీఎల్ఏ, హైకోర్టు ఆదేశాలతో భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆక్రమణల కూల్చివేతల సమయాన హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసినా కోర్టు తిరస్కరించింది. భూదాన్ యజ్ఞబోర్డు, రెవెన్యూ శాఖ నిర్వహించిన విచారణలో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు బయటపడ్డాయి. దీంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. స్వాధీనం చేసుకున్న భూమిని ప్రజావసరాల కోసం వినియోగిస్తాం. ఇళ్లు కోల్పోయిన వారిలో అర్హులైన స్థానిక పేదలకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది. – అనుదీప్ దురిశెట్టి, కలెక్టర్ -
నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి
ఖమ్మంమయూరిసెంటర్: వెలుగుమట్ల ప్రాంతంలో ఇళ్లు కోల్పోయి నిర్వాసితులైన వారందరికీ ప్రత్యామ్నాయ నివాసం ఏర్పాటు చేసేంత వరకు పునరావాస కేంద్రాలు నిర్వహించాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం అంబేడ్కర్ భవన్లో ఉన్న వెలుగుమట్ల నిర్వాసితులను పరామర్శించారు. అనంతరం వెలుగుమట్ల ప్రాంతంలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. ప్రతీ కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష అందించాలని, ఇళ్ల కూల్చివేతకు గురైన కుటుంబాలకు ఎటువంటి షరతులు లేకుండా అదే స్థలంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, నిర్వాసితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శులు దండి సురేష్, నున్నా నాగేశ్వరరావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, వామపక్ష పార్టీల నాయకులు వై.విక్రమ్, శింగు నర్సింహారావు, సీ.వై.పుల్లయ్య, సీహెచ్.శిరోమణి, మేకల శ్రీనివాసరావు, యర్రా శ్రీనివాసరావు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.


