Visakhapatnam
-
నీటిలో మునిగి ఆరుగురి మృతి
డుంబ్రిగుడ/అమరావతి/ఏయూ క్యాంపస్(విశాఖ జిల్లా): అల్లూరి సీతారామరాజు, పల్నాడు, విశాఖ జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో నీటిలో మునిగి ఆరుగురు మృతి చెందారు. అల్లూరి జిల్లా పోతంగి పంచాయతీ బిల్లాపుట్టు గ్రామానికి చెందిన అన్నదమ్ములు గుంట కమందన్, గుంట రామదాస్ కుమారులు గుంట సాయికిరణ్ (14), గుంట భానుతేజ్ (14)లు 9వ తరగతి చదువుతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో వీరు డుంబ్రిగుడ మండలం గంగవలస గ్రామంలో ఉన్న తమ మేనత్త ఇంటికి వెళ్లారు. ఆదివారం మామిడి పండ్లు సేకరించేందుకు కొండ వద్దకు వెళ్లి వస్తున్న తరుణంలో..అదే గ్రామానికి చెందిన వీరి స్నేహితుడు కొర్ర సుశాంత్(14)తో కలిసి చెరువులో స్నానాలకు దిగారు. ఇటీవల మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులో 12 అడుగుల మేరకు నీరు చేరింది. ఇది గమనించని విద్యార్థులు ఈతకు దిగి..మునిగిపోయారు. వారిని రక్షించేందుకు సమీపంలోని పొలాల వద్ద ఉన్న వారు వచి్చనా ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురూ మృతి చెందారు. అలాగే, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అగతవరప్పాడు ఏవీఎస్ కాలనీ నుంచి రెండు కుటుంబాలకు చెందిన 10 మంది బక్రీద్ అనంతరం నదిలో స్నానాలు చేసేందుకు ఆదివారం పల్నాడు జిల్లాలోని అమరావతికి వచ్చారు. అమరేశ్వరఘాట్ సమీపంలో కృష్ణానదిలోని ఇసుకలో బాల్తో ఆడుకుంటుండగా.. బాల్ పక్కనే ఉన్న నదిలో పడింది. బాల్ కోసం సయ్యద్ ఖాదర్ వలి (13), సయ్యద్ కాజా(21)లు నీటిలో దిగి...మునిగిపోయారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగా..సీఐ అచ్చియ్య ఘటనా స్థలాన్ని సందర్శించి గజ ఈతగాళ్లను రప్పించారు. వారు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. బాలుడిని బలిగొన్న అలలు విశాఖ సాగర తీరంలో విక్టరీ ఎట్ సీ ఎదురుగా బీచ్లో స్నానానికి దిగి ఎం.శ్రీపాద సూర్య(7) కెరటాలకు బలయ్యాడు. ఆదివారం ఉదయం అగనంపూడికి చెందిన ఓ కుటుంబం బీచ్కు వచ్చింది. వీరిలో స్టీల్ప్లాంట్లో పనిచేస్తున్న సతీష్ది శనివారం పెళ్లి రోజు. వేడుకల అనంతరం ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బీచ్కు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా బలమైన కెరటాలు బాలుడిని లోపలికి లాక్కెళ్లాయి. సమీపంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు పరదేశి వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. బాలుడిని వెంటనే ఒడ్డుకు తీసుకువచ్చి 108 వాహనంలో కేజీహెచ్కు తరలించారు. బాలుడు నీరు ఎక్కువగా తాగడంతో మరణించినట్లు కేజీహెచ్ వైద్యులు వెల్లడించారు. బాలుడి తల్లిదండ్రులను వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్లబాబురావు పరామర్శించారు. -
కొండపై విష‘నాగులు’
నాగులకొండ.. ప్రకృతి రమణీయతకు నెలవు! అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మైనింగ్ మాఫియా కబళిస్తోంది. ఏకంగా 100 అడుగుల లోతులో విచ్చలవిడిగా లేటరైట్ తవ్వకాలు చేపడుతున్నారు. సహజ సిద్ధంగా ఉన్న గెడ్డలను ఆక్రమిస్తూ కొండతో పాటు చెట్టు చేమలను కొట్టేస్తోంది. ఫలితంగా చుట్టుపక్కల ఉన్న 10 గిరిజన గ్రామాలు తాగు నీరు, వంట చెరుకు కోసం అల్లాడే దుస్థితి నెలకొంది.నాగులకొండ.. ప్రకృతి రమణీయతకు నెలవు! అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మైనింగ్ మాఫియా కబళిస్తోంది. ఇక్కడ మైనింగ్కి అనుమతించింది కేవంలం 60 అడుగుల లోతు వరకే. కానీ ఏకంగా 100 అడుగుల లోతులో విచ్చలవిడిగా లేటరైట్ తవ్వకాలు చేపడుతున్నారు. సహజ సిద్ధంగా ఉన్న గెడ్డలను ఆక్రమిస్తూ కొండతో పాటు చెట్టు చేమలను కొట్టేస్తోంది. ఫలితంగా చుట్టుపక్కల ఉన్న 10 గిరిజన గ్రామాలు తాగు నీరు, వంట చెరుకు కోసం అల్లాడే దుస్థితి నెలకొంది. ఇక్కడినుంచి రోజుకు దాదాపు 15 వేల టన్నుల నుంచి 20 వేల టన్నుల లేటరైట్ను కూటమి నేతలు వందల టిప్పర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. టన్ను లేటరైట్ రూ.3,800 నుంచి రూ.4 వేల దాకా విక్రయిస్తూ రోజూ రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు కొల్లగొడుతున్నారు. అంటే, ఏడాదికి రూ.2,044 కోట్ల నుంచి రూ.2,190 కోట్లు వరకు అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఇక టీడీపీ ప్రజాప్రతినిధి కుమారుడి ఖాతాలోకి టన్నుకు రూ.250 వెళుతుండగా ఓ ఎంపీకి రూ.200 చొప్పున ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. – సాక్షి టాస్క్ఫోర్స్గిరిజనుడి ముసుగులో అడ్డగోలు దోపిడీకూటమి పార్టీలోని ఓ ఎంపీకి విధేయుడైన గిరిజనుడు లక్ష్మణరావు పేరుతో నాగులకొండపై అక్రమ మైనింగ్ జరుగుతోంది. ప్రభుత్వానికి నామమాత్రంగా లీజు, రాయల్టీ చెల్లిస్తూ మైనింగ్ మాఫియా రూ.వందల కోట్లను ఆర్జిస్తోంది. అత్యంత విలువైన లేటరైట్ మైన్ ని హెక్టార్కు ఏడాదికి రూ. 26 వేల నామమాత్రపు ధరకు అధికార పార్టీ నేతలకు రాసిచ్చేశారు. అంటే 119 హెక్టార్లకు గాను ప్రభుత్వానికి వచ్చే లీజు ఆదాయం కేవలం రూ.30.94 లక్షలు మాత్రమే. ఇక రాయల్టీ మోసానికి అంతేలేదు. ఇక్కడ నుంచి రోజూ 15 వేల టన్నులకు పైగా లైటరైట్ను తరలిస్తూ 5 వేల టన్నులను మాత్రమే లెక్కల్లో చూపిస్తున్నారు. టన్నుకు రూ.150 చొప్పున (అంటే రోజుకు రూ.7.5 లక్షలు) మాత్రమే రాయల్టీ కింద చెల్లిస్తున్నారు. అంటే రాయల్టీ కింద ఏడాదికి రూ.27.67 కోట్లు మాత్రమే చెల్లించి.. మిగతా రూ.2 వేల కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు జమ కావలసిన ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోచుకుంటున్నారు.విలువైన హై గ్రేడ్ లేటరైట్..నర్సీపట్నం నియోజకవర్గం నాతవరంలో హై గ్రేడ్ (ఉన్నత శ్రేణి) లేటరైట్ లభిస్తుంది. ఇందులో 43–44 శాతం వరకు అల్యూమినియం ఉంటుంది. కాగా, లేటరైట్ అనేది ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్) ఒక రూపం. ఇంత నాణ్యమైనది కావడంతో సిమెంట్ కంపెనీలకు కాకుండా స్టీల్ ప్లాంట్లకు తరలిస్తున్నారు. కాకినాడ పోర్టును దీనికి వినియోగించుకుంటున్నారు. మరోవపు ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. నాణ్యమైన ఖనిజాన్ని.. నాసిరకంగా చూపించి అనుమతులు తీసుకున్నారు. అల్యూమినియం 38–40 శాతంలోపే ఉందని నివేదికలు సమర్పిస్తున్నారు. తద్వారా రాయల్టీ తక్కువగా చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. లీజుదారు లక్ష్మణరావు ద్వారా ఆండ్రూ మినరల్స్కు విక్రయిస్తున్నట్లు ఒప్పందం చేసుకున్నారు.వర్షంలో సైతం లేటరైట్ను తరలిస్తున్న టిప్పర్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్పై ఉక్కుపాదంనిర్ణీత మొత్తానికి మించి తవ్వినందుకు విచారణరూ.5 కోట్ల మేర జరిమానా వసూలునాతవరం మండలం సుందరకోట పంచాయతీ భమిడికిలొద్దిలో నిర్ణీత మొత్తానికి మించి మైనింగ్ చేసేందుకు వీల్లేందంటూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 68,279 టన్నుల లేటరైట్ను ఎక్కువగా తవ్వినట్లు తేలడంతో సుమారు రూ.5 కోట్ల మేర పెనాల్టీ విధించారు. 2023 జూన్లో మైనింగ్ నిలిచిపోగా కూటమి ప్రభుత్వం వచ్చాక లేటరైట్ తవ్వకాలకు టీడీపీ నేతలు పావులు కదిపారు. ఈ క్రమంలో గనుల శాఖ పెనాల్టీని సైతం రద్దు చేసినట్లు తెలుస్తోంది. గత నెలలో మళ్లీ మైనింగ్ ప్రారంభించారు. అయితే, ఫిబ్రవరి నుంచే లేటరైట్ తరలింపు మొదలైనట్లు చెబుతున్నారు. పర్మిట్ల మంజూరు మొత్తం కాకినాడ జిల్లాలోని రౌతులపూడి నుంచి జరుగుతోంది. లేటరైట్ను తవ్వి తరలించే వాహనాలకు జీపీఎస్, మైనింగ్ ప్రాంతంలో వే బ్రిడ్జి లాంటివి ఏమీ లేవు. దీంతో యథేచ్ఛగా భారీ లోడ్ వాహనాల్లో లేటరైట్ తరలిపోతోంది.‘సాక్షి’ బృందాన్ని అడ్డుకున్న మాఫియానాతవరం మండలం సిరిపురం వద్ద మైనింగ్ జరుగుతుండగా.. ఇక్కడినుంచి లేటరైట్ను కాకినాడ జిల్లా రౌతులపూడికి తరలిస్తున్నారు. ఆ తర్వాత అన్నవరం రవికంపాడు వద్ద ఉన్న రైల్వే సైడింగ్ నుంచి ఒడిశాలోని వేదాంత ప్లాంటుకు చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించి వాస్తవాలను వెలికితీస్తున్న ‘సాక్షి’ ప్రతినిధుల వాహనాన్ని రాఘవపట్నం దాటిన తర్వాత మైనింగ్ మాఫియా ఆయుధాలతో అడ్డుకుని బెదిరించింది. వాహనాన్ని వెంటాడింది. సిరిపురం చేరుకునేలోగా మరికొందరిని పోగేసి గిరిజనులతో మాట్లాడకుండా అడ్డుకున్నారు. -
మంత్రి లోకేష్ మోసం.. తిరగబడ్డ టీచర్లు
సాక్షి, విశాఖపట్నం: కూటమి సర్కార్పై ఉపాధ్యాయులు తిరగబడ్డారు. లోకేష్కు వ్యతిరేకంగా ఉపాధ్యాయలు రోడ్డెక్కారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 13 ఉమ్మడి జిల్లాల డీఈవో కార్యాలయాల ముట్టడిని టీచర్లు చేపట్టారు. విశాఖ డీఈవో కార్యాలయం ముట్టడికి కదం తొక్కారు. పోలీసులు భారీగా మోహరించారు. ఎస్జీటీలకు మ్యాన్యూవల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. వెబ్ కౌన్సిలింగ్ వద్దు.. మ్యాన్యూవల్ కౌన్సిలింగ్ ముద్దు అంటూ టీచర్లు నినాదాలు చేశారు. డీఈవో కార్యాలయం ముందు మహిళా టీచర్లు బైఠాయించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది.టీచర్ల బదిలీలపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి. ఎస్జీటీల బదిలీలను ఆన్లైన్లో కాకుండా మాన్యువల్గా చేపడతామని చెప్పి.. ఆన్లైన్ విధానం అమలు చేయడాన్ని తప్పుబడుతూ ఆ సంఘాలు ఆందోళన చేపట్టాయి. శనివారం కౌన్సెలింగ్ జరిగిన ఎంఈఓ కార్యాలయాల ఎదుట నిరసనలకు దిగారు. ఆదివారం కూడా అన్ని జిల్లాల్లో డీఈవో కార్యాలయాలను ముట్టడించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చాయి.ఈ అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు, విద్యాశాఖ మంత్రికి లేఖలు రాసినా ఎలాంటి సమాధానం ఇవ్వనందున తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన చేపడుతున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి గతేడాది సెపె్టంబర్ నుంచి వారం వారం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి బదిలీలు, పాఠశాలల పునర్ వ్యవస్థీకరణపై విజ్ఞప్తులు తీసుకున్నారు.ఈ క్రమంలో ఈసారి ఉపాధ్యాయ బదిలీలకు చట్టం చేస్తున్నామని, ఏటా ఈ చట్ట ప్రకారమే ఆన్లైన్ బదిలీలు చేపడతామని అధికారులు తెలిపారు. అయితే, సంఖ్యాపరంగా అత్యధిక ప్రాథమిక పాఠశాలలు ఉండటంతో వాటిలో పనిచేస్తున్న ఎస్జీటీలకు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉన్నందున ఇబ్బందులు తలెత్తుతాయని.. ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ చేపట్టి బదిలీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అందుకు అధికారులు అంగీకరించినా మార్చిలో చేసిన ఉపాధ్యాయ బదిలీ చట్టం–2025లో మాత్రం ఉపాధ్యాయులందరికీ ఆన్లైన్ కౌన్సెలింగ్ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.అయినప్పటికీ బదిలీ ఉత్తర్వుల్లో మార్పులు చేస్తామని అధికారులు సంఘాలకు హామీ ఇచ్చారు. నాడు తాత్కాలికంగా సమస్య పరిష్కారమైందని భావించినా.. మే నెలల విడుదల చేసిన ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల్లో తిరిగి ఆన్లైన్ విధానం ఒక్కటే ఉంటుందని పేర్కొన్నారు. దీంతో గత నెల 16న ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డీఈవో కార్యాలయాల ముట్టడి తలపెట్టింది. మరుసటి రోజు ఎస్జీటీల మాన్యువల్ కౌన్సెలింగ్కు అధికారులు హామీ ఇవ్వడంతో నిరసనను విరమించింది. తాజాగా ఆన్లైన్ కౌన్సెలింగ్ మాత్రమే ఉంటుందని, అందరూ ఎంఈవో కార్యాలయాలకు వచ్చి ఆప్షన్స్ పెట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం కూడా ఆందోళనకు దిగాయి. -
అయ్యో పాపం!
● నిద్రపోతున్న కూలీని గమనించని లారీ డ్రైవర్ ● నల్ల పిక్కలో కూరుకుపోయి దుర్మరణం ● మూడు రోజుల తర్వాత వెలుగుచూసిన విషాద ఘటన పెందుర్తి: ఓ నిర్మాణ కూలీ జీవితం నిద్రలోనే కడతేరింది. తాను పనిచేస్తున్న చోటే సేద తీరుతుండగా విధి చిన్నచూపు చూడటంతో ఊపిరాడక అసువులు బాశాడు. పెందుర్తి మండలం ముదపాకలోని జగనన్న కాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పెందుర్తి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందబలగ గ్రామానికి చెందిన పక్కి సూరన్నదొర (57), గంగమ్మ దంపతులు కుటుంబంతో కలిసి ముదపాకకు వలస వచ్చి ఇక్కడి జగనన్న కాలనీలో నిర్మాణ పనులు చేస్తుంటారు. సూరన్నదొర అన్న కుమారుడు పక్కి ప్రసాద్ ఈ నెల 4న ఇదే ప్రాంతంలో బావిలో పడి మృతి చెందాడు. ఈ క్రమంలో ప్రసాద్ మృతదేహం పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు వెళ్లిన సూరన్న.. నీరసంగా ఉండటంతో ముదపాకలోని ఇంటికి తిరిగి వచ్చేశాడు. తీవ్ర విషాదంలో ఉన్న సూరన్న ముదపాకలోనే ఉన్న బంధువులతో అదే రోజు సాయంత్రం మద్యం సేవించాడు. ఉదయం మళ్లీ కేజీహెచ్కు వెళ్లి మృతదేహంతో ఊరికి వెళతానని చెప్పాడు. అనంతరం సమీపంలో నిర్మాణం కోసం పోసి ఉన్న నల్ల పిక్క రాశిపై పడుకున్నాడు. అయితే అర్ధరాత్రి అక్కడికి పిక్క వేసేందుకు వచ్చిన లారీ డ్రైవర్ సూరన్న నిద్రిస్తున్న విషయాన్ని గమనించకుండా అతనిపైనే అన్లోడ్ చేసేశాడు. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న సూరన్నదొర ఊపిరాడక మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మూడు రోజుల తర్వాత వెలుగులోకి... కేజీహెచ్కు వెళతానని చెప్పిన సూరన్న కనిపించకపోవడంతో విజయనగరం వెళ్లిపోయాడని అందరూ భావించారు. కానీ అతను అక్కడికి కూడా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించకుండా చాలాసేపు ఎదురుచూశారు. చివరకు ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్న కుటుంబ సభ్యులు గురువారం తిరిగి ఇక్కడికి వచ్చి సూరన్న ఆచూకీ కోసం ఆరా తీశారు. ఈ క్రమంలో అతను అదృశ్యమైనట్లు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేద్దామని నిర్ణయించుకున్నారు. అయితే శనివారం ఉదయం కాలనీలో నిర్మాణ పనుల కోసం నల్ల పిక్కను తరలించేందుకు పొక్లెయిన్తో లారీలకు లోడ్ చేస్తున్నారు. ఆ సమయంలో నల్ల పిక్క రాశి నుంచి ఓ చేయి బయటకు కనిపించడం, ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దుర్వాసన రావడంతో ఆందోళనకు గురైన పొక్లెయిన్ ఆపరేటర్ విషయాన్ని కాలనీవాసులకు, గ్రామస్తులకు తెలిపాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయగా, అది సూరన్నదొరదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. ప్రాథమిక విచారణ చేపట్టిన సీఐ కె.వి.సతీష్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనను అనుమానాస్పద కేసుగా న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడాది కిందట రైలు ప్రమాదంలో సూరన్న కుమారుడు, మూడు రోజుల కిందట ప్రమాదవశాత్తు బావిలో పడి అతని అన్న కుమారుడు మృతి చెందడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబంలో.. ఈ తాజా విషాదం చోటుచేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. -
చదివేద్దాం.. ఓ గాంధీ పుస్తకం
● బాపు ఒక చరిత్ర కాదు.. జీవన పాఠం ● ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ‘గాంధియానా’ ఏర్పాటు ● మహాత్ముని జీవిత విశేషాల పుస్తకాల ప్రత్యేక విభాగం సీతంపేట: జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాదు.. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తి. సత్యం, అహింస అనే సిద్ధాంతాలను ఆయుధాలుగా మలిచి, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి మార్గాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. ఆయన చూపిన మార్గం ప్రపంచానికి ఒక కొత్త పాఠాన్ని నేర్పింది. గాంధీజీ ఆశయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ద్వారకానగర్లోని పౌరగ్రంథాలయంలో ‘గాంధియానా’పేరిట ప్రత్యేక పుస్తక విభాగాన్ని ఏర్పాటు చేశారు. గాంధీజీ చరిత్ర, జీవితం అపురూపం. ఆయన పోరాటం, సిద్ధాంతాలు, ఆశయాలపై వేలాదిగా పుస్తకాలు ప్రచురించగా.. వాటిలో సుమారు వెయ్యి వరకు పుస్తకాలు దాతల నుంచి సేకరించి ఇక్కడ అందుబాటులో ఉంచారు. గాంధీజీ గురించి ఎందుకు చదవాలి? గాంధీజీ జీవిత చరిత్ర, ఆయన పోరాట స్ఫూర్తి గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థి దశలోనే గాంధీజీ గురించి చదివితే నైతిక ప్రవర్తన అలవడుతుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవం, పేదవారికి సహాయం చేయాలనే గుణం, దేశభక్తి వంటి సుగుణాలు పెంపొందుతాయి. తద్వారా విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగుతారు. వివేకంతో కూడిన విద్యను అభ్యసించి, మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడతారు. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శరీరశ్రమ, నిర్భయత్వం, సర్వమత సమభావం, స్వదేశీ, అస్పృశ్యతా నివారణ అనేవి గాంధీజీ పాటించిన ఏకాదశ వ్రతాలు. మత సామరస్యం, అస్పృశ్యతా నివారణ, మద్యపాన నిషేధం, ఖాదీ, గ్రామ పరిశ్రమలు, మౌలిక విద్య, పారిశుధ్యం ఆరోగ్య నియమాలు, ప్రాంతీయ భాషాభివృద్ధి, వయోజన విద్య, సీ్త్ర సాధికారత, జాతీయ భాష, ఆర్థిక సమానత్వం, రైతు సంక్షేమం, కార్మిక సంక్షేమం, ఆదివాసుల వికాసం, కుష్టు రోగుల సేవ తదితరవి మహాత్ముడు అవలంబించారు. వీటన్నింటి గురించి తెలుసుకునేందుకు గాంధీజీకి సంబంధించిన పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. స్వామి వివేకానంద చెప్పినట్లు ‘క్యారెక్టర్, కరికులమ్, కల్చర్’ అనే మూడింటిని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలి. వేల పుస్తకాలు.. కోట్ల ప్రతులు ముంబయిలోని సర్వోదయ మండల్, గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్లు గాంధీజీపై వచ్చిన సుమారు 7 వేల పుస్తకాలను సేకరించి భద్రపరిచాయి. గాంధీజీ స్థాపించిన నవజీవన్ ట్రస్ట్ ఆయన ఆత్మకథ ‘సత్యశోధన’ను 17 భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, కొరియన్, జపనీస్, చైనీస్ భాషల్లో ప్రచురించింది. కోటికి పైగా గాంధీజీ ఆత్మకథ పుస్తకాలు అమ్ముడయ్యాయంటే అతిశయోక్తి కాదు. నైతిక విలువలు పెరుగుతాయి గాంధీజీ గురించి చదవడం వల్ల నైతిక ప్రవర్తన అలవడుతుంది. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యార్థి దశలోనే గాంధీజీ గురించి చదవాలి. కనీసం ఆయన ఆత్మకథ ‘ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్’పుస్తకాన్ని అయినా చదవాలి. కళాశాలలో చేరేటప్పుడు ప్రతి విద్యార్థికి యాజమాన్యం గాంధీజీ ఆత్మకథ పుస్తకాన్ని అందజేయాలి. ఏడాది చివరలో నాన్ క్రెడిట్ (మార్కులతో నిమిత్తం లేకుండా) పద్ధతిలో పరీక్ష నిర్వహించి ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా చూడాలి. దీని వల్ల ప్రతి ఒక్కరిలో నైతిక విలువలు పెరుగుతాయి. ఇలా చేస్తే మెరుగైన సమాజం ఏర్పడటానికి దోహదపడిన వారవుతారు. అలాగే సచివాలయ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులకు వారం, పది రోజుల పాటు శిక్షణ ఇవ్వడం ద్వారా గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలపై అవగాహన కల్పించవచ్చు. దీని వల్ల వారిలో అంకితభావం పెరుగుతుంది. – ఆచార్య వి.బాలమోహన్దాస్, గాంధీ సెంటర్ అధ్యక్షుడు గాంధేయవాదం ఆదర్శం గాంధేయవాదం అన్ని కాలాలకు, అన్ని సమాజాలకు వర్తించే మహత్తర భావన. యువత వ్యక్తిత్వ వికాసానికి గాంధీజీ ఆలోచనలు, ఆశయాలు ఎంతగానో దోహదపడతాయి. ఆయన ఆశయాలు భావితరాలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతోనే పౌరగ్రంథాలయంలో ‘గాంధియానా రిఫరెన్స్’పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ సెంటర్ వ్యవస్థాపకుడు కె.ఎస్.శాస్త్రి బహూకరించిన వందలాది అమూల్యమైన పుస్తకాలు యువతకు దిశానిర్దేశం చేయగలవు. ఇవి కేవలం అలనాటి జాతీయోద్యమ చరిత్రనే కాక, సామాజిక రుగ్మతలపై గాంధీజీ సాగించిన పోరాటాన్ని, ఆయన సంస్కరణ దృక్పథాన్ని ఈ తరం వారికి స్పష్టం చేస్తాయి. గాంధీ గురించి ఏ సమాచారం అయినా ఈ పుస్తకాల్లో లభిస్తుంది. – డి.వి.సూర్యారావు, రచయిత తప్పక చదవాల్సిన కొన్ని పుస్తకాలు ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్(సత్యశోధన), గాంధీ: ది ఇయర్స్ దట్ ఛేంజ్డ్ ది వరల్డ్(రామచంద్ర గుహ), గాంధీ బిఫోర్ ఇండియా(రామచంద్ర గుహ), ఇండియా ఆఫ్టర్ గాంధీ(రామచంద్ర గుహ), మై డియర్ బాపు(సి.రాజగోపాలాచారి గాంధీజీకి రాసిన లేఖలు), ది గుడ్ బోట్మ్యాన్(రాజమోహన్ గాంధీ), గాంధీ: ప్రిజనర్ ఆఫ్ హోప్(జుడిత్ ఎం. బ్రౌన్), ది డెత్ అండ్ ఆఫ్టర్లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ(మకరంద్ పరాంజపే), హింద్ స్వరాజ్ లేదా ఇండియన్ హోమ్రూల్(గాంధీ–1909), ఐయామ్ గాంధీ(బ్రాడ్ మెల్ట్జర్), మై డేస్ విత్ గాంధీ(నిర్మల్ కుమార్ బోస్), ది లైఫ్ ఆఫ్ మహాత్మాగాంధీ(లూయీ ఫిషర్), ఎ వీక్ విత్ గాంధీ(లూయీ ఫిషర్), మహాత్మా గాంధీ: హిజ్ లైఫ్ అండ్ ఐడియాస్(చార్లెస్ ఎఫ్. ఆండ్రూస్, అరుణ్ గాంధీ), ది మ్యాన్ బిఫోర్ ది మహాత్మా(చార్లెస్ డిసాల్వో), ది లివింగ్ గాంధీ: లెసన్స్ ఫర్ అవర్ టైమ్స్(తారా సేఠియా), గాంధీ అండ్ మావో ఇన్ క్వెస్ట్ ఆఫ్ అనాలజీ(రతన్ దాస్), గాంధీ సీఈవో(అలాన్ ఆక్సెల్రాడ్) -
వీసీబీ నికర లాభం రూ.71.77 కోట్లు
● ఈ ఏడాది మరో 5 కొత్త బ్రాంచీలు ● బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు సీతంపేట: ది విశాఖపట్నం కో–ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్(వీసీబీ) ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.71.77 కోట్ల నికర లాభం ఆర్జించి 110వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటోందని బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు తెలిపారు. ద్వారకానగర్లోని బ్యాంకు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుతో మాట్లాడారు. తమ బ్యాంకు 55 బ్రాంచీలతో 1,11,593 మంది సభ్యులను కలిగి ఉందన్నారు. వీసీబీలో షేరు ధనం రూ.389.55 కోట్లు కాగా, డిపాజిట్లు రూ.4354.73 కోట్లు, రుణాలు రూ.3436.47 కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. రుణాల్లో 95 శాతం కోటి రూపాయల కంటే తక్కువ మొత్తం అందజేశామన్నారు. సామాన్యులకు ప్రాధాన్యమిస్తూ 1.30 లక్షల మంది రుణగ్రహీతల అవసరాలకు తగినట్టు సేవలందించినట్టు తెలిపారు. 2024–25 ఆర్ధిక సంవత్సరానికి దాదాపు 7,800 కోట్లకు ఆర్థిక లావాదేవీలు చేరుకున్నట్లు వెల్లడించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి 8,600 కోట్లు లక్ష్యంగా, ఈ ఏడాది మరో 5 కొత్త శాఖలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు. నాన్ షెడ్యూల్ హోదాలో ఉన్న తమ బ్యాంకుకు షెడ్యూల్ హోదా కల్పించేందుకు వీలుగా ఆర్బీఐకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ఆదివారం మద్దిలపాలెంలోని కాకతీయ ఫంక్షన్ హాలులో జరగనున్న 110వ మహాసభలో డివిడెండ్ ప్రకటించనున్నట్టు తెలిపారు. సమావేశంలో బ్యాంక్ డైరెక్టర్లు సూరపనేని నాగభూషణ చౌదరి, ఏజే స్టాలిన్, నామాన కామరాజు, వి.చంద్రశేఖర్, జె.వి.సత్యనారాయణమూర్తి, గుళ్లపల్లి జనార్ధనరావు, సి.హెచ్.ఆదినారాయణ శాస్త్రి, సీఈవో వి.వి.వి.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
యోగాంధ్రలో భాగస్వాములు కండి
ఎంవీపీకాలనీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 21న నిర్వహించే యోగాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు పిలుపునిచ్చారు. యోగాంధ్ర సన్నద్ధతలో భాగంగా ఓం ప్రీ యోగా ఆధ్వర్యంలో 800 మంది సాధకులతో శనివారం యోగాసనాల ప్రదర్శన నిర్వహించారు. ఎంవీపీ కాలనీలోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా సంస్థ నిర్వాహకుడు డాక్టర్ చిలకా వెంకట రమేష్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అతిథులతో పాటు సాధకులతో రమేష్ యోగాసనాలు వేయించారు. సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, గాదిరాజు వర్మ, ఓం ప్రీ యోగా అధ్యక్షుడు కె.శాంతారాం, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, ఆయుష్ విభాగ అధికారి ఝాన్సీ, శ్రీ విశ్వం గ్రూప్ ధర్మరాజు, తమేర మల్టీస్పెషల్ స్కిన్ క్లినిక్ నిర్వాహకులు వెంకటరమణ, శాంతి తదితరులు పాల్గొన్నారు. చికెన్ (కిలో) (వెన్కాబ్) ఫారంధర : రూ.95 బ్రాయిలర్ (లైవ్) : రూ.115 స్కిన్ : రూ.200 స్కిన్లెస్ : రూ.210చికెన్ ధరలు -
నగర పరిశుభ్రత అందరి బాధ్యత
కొమ్మాది: నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడంలో స్వచ్ఛంద సేవకుల(వలంటీర్ల) సేవలు అవసరమని అమెరికన్ కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ అన్నారు. రుషికొండ బీచ్లో శనివారం ఆంధ్ర విశ్వవిద్యాలయం, అమెరికన్ కార్నర్ సంయుక్తంగా నిర్వహించిన ‘కమ్యూనిటీ డే’లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వలంటీర్లతో కలిసి సాగర తీర ప్రాంతంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. బీచ్లో ఉన్న వ్యర్థాలను సేకరించారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని.. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏయూ ఉపకులపతి ప్రొఫెసర్ జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఈ.ఎన్.ధనుంజయరావు మాట్లాడుతూ బీచ్ పరిసరాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వలంటీర్లకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏయూ క్రీడా విభాగం సంచాలకుడు ప్రొఫెసర్ ఎన్.విజయ్మోహన్, ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎస్.హరినాథ్, అమెరికా కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ పబ్లిక్ డిప్లొమసీ అధికారి ఎమిలియా స్మిత్ తదితరులు పాల్గొన్నారు. అమెరికన్ కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ -
స్థానిక ఎమ్మెల్యే దృష్టికి సమస్యలు
68 వార్డ్డులో సమస్యలను కార్పొరేటర్ గుడివాడ అనూష లతీష్ కౌన్సిల్కు వివరిస్తూ.. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకొచ్చారు. అక్కిరెడ్డిపాలెం హైస్కూల్ నుంచి పంచవటి వరకు ప్రధాన రహదారి విస్తరణ, విశాఖ డెయిరీ కాలుష్యం, మింది, అక్కిరెడ్డిపాలెం గ్రామాల నుంచి పోర్టు రోడ్డు డ్రెయిన్కు కనెక్టయిన కాలువలు నిర్మించాలని, మింది తాగునీటి ట్యాంక్ నిల్వ సామర్థ్యం పెంచాలని, రామ్నగర్, కాళికానగర్లో కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. గుడివాడ అప్పన్న కాలనీలో రోడ్డు విస్తరణ పూర్తి చేయాలని కోరారు. -
ఎమ్మెల్యే పల్లాకు పితృ వియోగం
సీతంపేట: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం శనివారం మధ్యాహ్నం సీతంపేటలోని తన స్వగృహంలో స్వర్గస్తులయ్యారు. పల్లా సింహాచలం విశాఖ–2 ఎమ్మెల్యేగా, వుడా బోర్డు సభ్యులుగా పనిచేశారు. గాజువాక అంటే పల్లా సింహాచలంగా పేరును సార్ధకం చేసుకున్నారు. ప్రజాసేవకుడిగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా విశాఖ జిల్లా వాసులకు సుపరిచితుడు. విశాఖ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం టీడీపీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారు 5 గంటల వరకు సీతంపేటలోని ఆయన స్వగృహంలో పార్థివదేహం అందుబాటులో ఉంటుందని, అనంతరం కొత్త గాజువాకలోని పూర్వపు ఇంటి వద్దకు తరలిస్తారు. ఉదయం 9 గంటల తరువాత అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. పల్లా సింహాచలం పార్థివ దేహానికి కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖా మంత్రి సుభాష్, మాజీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, శ్రీనివాస్ దంపతులు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్బాబు, వుడా ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ తదితరులు నివాళులర్పించారు. -
గళమెత్తారు
పలు అంశాలపై నిలదీత.. శ్రీహరిపురంలో ఎఫ్ఆర్యూకి సంబంధించి మేయర్ను డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్ నిలదీశారు. అలాగే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సీనియర్ అసిస్టెంట్ వెంకట్రావు చేసిన ఫ్రాడ్కి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. వార్డులో రోడ్డు పనులు మంజూరైనప్పటికీ ఇంతవరకు పనులు ప్రారంభించక పోవడంపై ప్రశ్నించారు. డాబాగార్డెన్స్: కొత్త మేయర్ పీలా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన తొలి నగరపాలక సంస్థ సమావేశంలోనే అధికార కూటమికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు చుక్కలు చూపించారు. సెంట్రల్ ఏసీ హాల్లోనూ మేయర్తో పాటు పాలకపక్ష సభ్యులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రజల సమస్యలపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు గళమెత్తడంతో, మేయర్ నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వ తీరును నిలదీస్తుంటే ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మేయర్గా తన తొలి సమావేశం ఏకపక్షంగా సాగేలా స్క్రీన్ప్లే రచించినా, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఎదురుదాడికి దిగడంతో మేయర్కు తొలి సమావేశంలో చేదు అనుభవం ఎదురైంది. మేయర్, కూటమి సభ్యుల నాటకానికి తెర జీవీఎంసీ కమిషనరే రాకపోతే కౌన్సిల్కు ఏం మర్యాద ఉంటుందని.. కచ్చితంగా రావాల్సిందేనని డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, జీవీఎంసీ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ నేతృత్వంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఇన్చార్జ్ కమినర్ వచ్చేంత వరకు సభ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. దీంతో మేయర్ పీలా శ్రీనివాసరావు కౌన్సిల్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే టీ బ్రేక్ ప్రకటించారు. ఈ సమయంలోనే జీవీఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ను కౌన్సిల్కు పిలిపించినట్టు తెలుస్తోంది. పార్కులు కబ్జా అవునత్నా..కౌన్సిల్లో కూటమి తీరును ఎండగట్టారు ప్రజా సమస్యలపై నినదించిన వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు మేయర్తో పాటు పాలకపక్ష సభ్యులు ఉక్కిరిబిక్కిరి -
ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి
ఆరిలోవ: ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ పదో వార్డు పరిధి తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు సమావేశమయ్యారు. ఆదివారం చేపట్టనున్న డీఈవో కార్యాలయం ముట్టడిని ఉమ్మడి విశాఖ జిల్లా ఉపాధ్యాయులంతా విజయవంతం చేయాలని కోరారు. అక్కడ పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధు లంతా చేతులు కలిపి ముట్టడికి సంఘీభావం తెలిపారు. అనంతరం అక్కడ నుంచి నాయకులు డీఈవో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ డీఈవో చాంబర్లో బైఠాయించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, సమస్యలు పరిష్కంచాలని, ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ చేపట్టాలని, వెబ్ ఆప్షన్ పెట్టవద్దని నినాదాలు చేశారు. అనంతరం ఆదివారం చేపట్టనున్న డీఈవో కార్యాలయం ముట్టడికి సంబంధించిన నోటీస్ను డీఈవో ఎన్.ప్రేమ్కుమార్కు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డి.గోపీనాథ్, ఇమంది పైడిరాజు, సీహెచ్.వేణుగోపాల్, టి.రామకృష్ణ, టి.ఆర్ అంబేడ్కర్, అరుణ్కుమార్, ధనుంజయ, చిన్నారావు, సూర్యనారాయణ పాల్గొన్నారు. -
జనసేన నుంచి జనసేనలో చేరిక
● ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ సస్పెన్షన్ చేసిన వారంతా ... ● టీడీపీలో కొందరు గండి బాబ్జీ వ్యతిరేకులను జనసేనలో చేర్చుకున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబుపెందుర్తి: జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీలో చేరారు.. షాకయ్యారా..అవ్వకండి.. పెందుర్తి నియోజకవర్గంలో రానున్న రోజుల్లో ఇలాంటి వింతలు మరిన్ని చూడాలి. ఏడాది క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ సస్పెన్షన్కు గురై.. ఎన్నికల్లో జనసేనకు పనిచేసిన నాయకులతో పాటు ఇటీవల టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జీకి వ్యతిరేకంగా రాజీనామాలు చేసిన పలువులు కార్యకర్తలను జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు ఆ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇప్పటికే టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జీ తనకు పక్కలో బల్లెంలా మారడంతో జనసేన నాయకులనే మళ్లీ అదే పార్టీలో చేర్చుకుని ‘నేనే బలవంతుడిని’ అని చెప్పుకోవడం కోసం రమేష్బాబు వెంపర్లాడుతున్నారు. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిలో ఘోర వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కోంటున్న వేళ.. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బలంగా ముందుకు అడుగులు వేస్తున్న సమయంలో.. ‘వాపు’ని బలం అని చెప్పుకోవడానికి కూటమి ముఖ్య నేతలు ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడడం విడ్డూరంగా ఉందని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వారే వీరు.. పెందుర్తి నియోజకవర్గంలో ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులుగా ఉన్న కొంత మంది సబ్బవరం మండలానికి చెందిన నాయకులు పార్టీ వ్యతిరేక విదానాలకు పాల్పడ్డారు. అందులో అమృతపురం ఎంపీటీసీ సభ్యుడు సింగంపల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురిని వైఎస్సార్సీపీ 2024 ఎన్నికల ముందే సస్పెండ్ చేసింది. దీంతో వారంతా జనసేన జెండాలు పట్టుకుని తిరిగారు. వారితో పాటు నారపాడు ఎంపీటీసీ, సబ్బవరం–2 ఎంపీటీసీ బైలపూడి దేముడుబాబు, సబ్బవరం–3 ఎంపీటీసీ సబ్బవరపు శ్రీను తదితర నాయకులు కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు పంచన చేరారు. శనివారం సబ్బవరంలో జరిగిన కార్యక్రమంలో వారందరికీ మళ్లీ కండువాలు వేసి జనసేనలో చేర్చుకోవడంతో సభకు హాజరైనవారే అవాక్కయ్యారు. -
82.468 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
తగరపువలస/కూర్మన్నపాలెం: విశాఖ జిల్లాలోని రెండే వేర్వేరు చోట్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఆనందపురం మండలం పెద్దిపాలెంలో గురువారం రాత్రి రెండు రైస్ మిల్లులపై రెవెన్యూ, పౌరసరఫరా, విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి 82.468 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భీమిలి ఆర్డీవో సంగీత్ మాథూర్, ఆనందపురం తహసీల్దార్ శ్యాంప్రసాద్, సీఎస్డీటీ శ్రీనివాసరావు జరిపిన తనిఖీలు రాత్రి 9 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగాయి. శ్రీబాలాజీ మోడరన్ రైస్ మిల్లు నుంచి 50.800 టన్నులు, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ముద్రతో రీప్రాసెస్ చేసి బయటకు తరలించిన బియ్యానికి సంబంధించి 388 గోనె పట్టాలు, అశోక్ లే ల్యాండ్ లారీని స్వా«దీనం చేసుకున్నారు. అలాగే శ్రీ సాయి రైస్ అండ్ ఫ్లోర్ మిల్లు నుంచి 31.668 టన్నుల బియ్యంతో పాటు 1,252 ఖాళీ గోనె సంచులు, మహీంద్రా బొలేరో వ్యాన్, ఆటోలను స్వా«దీనం చేసుకున్నారు.రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచి, పాలిష్ చేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. వీటిని సీజ్ చేసి జాయింట్ కలెక్టర్కు నివేదిక పంపించినట్టు తహసీల్దార్ తెలిపారు. ఈ రెండు మిల్లుల యజమానులు చెన్నా రాజేష్, రామారావులపై 6ఏ కేసుతో పాటు 7 బీఎన్ఎస్ కేసు నమోదు చేసినట్లు తెలిసింది.1,400కిలోల పీడీఎస్ రైస్ సీజ్ పేదలకు అందించాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆటోను దువ్వాడ పోలీసులు పట్టుకున్నారు. ఆటో నుంచి 1,400 కిలోల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. గూడ్స్ ఆటోలో గాజువాక నుంచి సబ్బవరం రైస్ మిల్లుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో దువ్వాడ చెక్ పోస్టు వద్ద పోలీసులు పీడీఎస్ రైస్ను గుర్తించి, స్వా«దీనం చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. -
వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ పరిధిలోని అన్ని వార్డుల అభివృద్ధి పనుల కోసం ఆయా వార్డు కార్పొరేటర్లకు నిధులు కేటాయించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. అప్రజాస్వామికంగా మేయర్ పీఠాన్ని కై వసం చేసుకున్న కూటమి ప్రభుత్వం, కనీసం పాలననైనా ప్రజాస్వామికంగా నిర్వహించాలని ఆయన హితవు పలికారు. పార్టీలకతీతంగా ఆలోచించి ప్రజా సమస్యలు, వార్డు అభివృద్ధి కోసం దృష్టి సారించాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యేలకు మాత్రమే కాకుండా, ప్రతి వార్డులో ఆయా వార్డు కార్పొరేటర్లు సూచించిన ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై కూటమి పార్టీల మేయర్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో పార్టీలకతీతంగా ప్రజల కోసం ఏ విధంగా పాలన సాగిందో, దానిని దృష్టిలో పెట్టుకుని ప్రజా శ్రేయస్సు కోసం పాలన చేయాలని కేకే రాజు పిలుపునిచ్చారు. -
ట్రెజరీలో అడ్డగోలు బదిలీలు
విశాఖ సిటీ: జిల్లా ఖజానా శాఖలో చేపట్టిన ఉద్యోగుల బదిలీలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. నిబంధనలను ఉల్లంఘించి, ఇష్టానుసారంగా బదిలీల ప్రక్రియను ముగించారంటూ ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కలెక్టరేట్లోని ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్, సీనియర్ అకౌంటెంట్లు, సబార్డినేట్లకు సంబంధించిన బదిలీలలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు? సాధారణంగా ఒకే చోట ఐదేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు తప్పనిసరిగా స్థానచలనం కల్పించాలి. అంతేకాకుండా, బదిలీలను కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా చేపట్టాలి. అయితే జిల్లా ఖజానా శాఖలో ఈ నిబంధనలను పట్టించుకోకుండా, స్టేట్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ కనుసన్నల్లో 34 మంది ఉద్యోగులను ఇష్టానుసారంగా బదిలీ చేశారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఐదేళ్లు పూర్తయినా అక్కడే కొనసాగింపు ఈ బదిలీల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 12 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ కమిటీ నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించలేదని సమాచారం. దీనికి తోడు, ఖజానా శాఖలో ఐదేళ్లుగా జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న ఒక ఉద్యోగికి బదిలీ చేయకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి సదరు జూనియర్ అకౌంటెంట్పై అవినీతి ఆరోపణలు చేస్తూ పలువురు సీఎం పేషీకి ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ కూడా జరుగుతోంది. అయినప్పటికీ, ఆరోపణలను, ఐదేళ్ల నిబంధనను పట్టించుకోకుండా అతడిని బదిలీ చేయకపోవడం పట్ల ఆ శాఖ సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డీటీవో సంతకం చేసి సెలవుపై..? ఈ బదిలీల ఫైల్పై జిల్లా ట్రెజరీ ఆఫీసర్ (డీటీవో) నాగభూషణం సంతకం చేసి దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళినట్లు సిబ్బందిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బదిలీల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని బాధితులు, ఇతర ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ జరిపి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించకుండా 34 మందికి స్థానచలనం ఐదేళ్ల నిబంధనను పట్టించుకోని అధికారులు -
ఏయూలో సమూల మార్పులు
విభాగాలకు నూతన డీన్, డైరెక్టర్ల నియామకం మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్, శుక్రవారం పరిపాలనకు సంబంధించి పలువురు డీన్లు, డైరెక్టర్లను పూర్తిస్థాయిలో మార్పు చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం, సేవలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ సంస్థాగత మార్పులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కీలక నియామకాలు డీన్ అండ్ ఫ్యాకల్టీ అఫైర్స్, డీన్ అవుట్రీచ్, డీన్ అలుమ్నీ రిలేషన్స్, డీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, చీఫ్ కో–ఆర్డినేటర్లు వంటి నూతన పదవులను ఏర్పాటు చేశారు. స్పాట్ వాల్యుయేషన్ విభాగానికి చీఫ్ కో–ఆర్డినేటర్ను నియమించారు. బోధనా సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా డీన్ ఫ్యాకల్టీ అఫైర్స్ను నియమించారు. డీన్ అలుమ్నీ రిలేషన్స్ పదవిని ఏర్పాటు చేశారు. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ – సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఓపెన్ లెర్నింగ్లను అనుసంధానించి, ఒకే డైరెక్టర్ పరిధిలోకి తీసుకువచ్చారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, కళల విభాగాలను అనుసంధానిం చనున్నారు. నూతన డీన్ల వివరాలు డీన్ ఫ్యాకల్టీ అఫైర్స్: కె. రాంబాబు, డీన్ అకడమిక్స్ అఫైర్ కె. శ్రీనివాసరావు, డీన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ వల్లికుమారి (కంప్యూటర్ సైన్స్), డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ – సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఓపెన్ లెర్నింగ్ ప్రొఫెసర్ అప్పలనాయుడు (కెమికల్ ఇంజనీరింగ్), డీన్, పీజీ అండ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్స్ ఆచార్య మునిస్వామి (స్టాటిస్టిక్స్), డీన్ అలుమ్నీ రిలేషన్స్ ప్రొఫెసర్ శ్యామల (కెమిస్ట్రీ), డీన్ అవుట్రీచ్ ప్రొఫెసర్ కె. రమాసుధ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్), డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ ఎస్. హరినాథ్ (సోషల్ వర్క్), డీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లానింగ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ కె.ఎస్. రావు (సివిల్ ఇంజనీరింగ్), చీఫ్ కో–ఆర్డినేటర్ స్పాట్ వాల్యుయేషన్ కేటీ బలరాం పడాల్ను నియమించారు. -
రైతులకువెన్నుపోటు
తగరపువలస: కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన ‘అన్నదాత సుఖీభవ’ పథకం హామీ అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదు. ఏటా రూ.20,000 రైతులకు అందించకపోవడంపై అన్నదాతలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఏడాది గడిచినా ఒక్క పైసా కూడా అందలేదని, ఇది మోసపు హామీతో తమకు వెన్నుపోటు పొడవడమేనని రైతులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సాయం అందకపోగా, సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంలో కూడా విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి, ఆ భారాన్ని రైతులపైనే మోపడం, ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను రక్షించడానికి సమీక్షలు లేకపోవడం, రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసి, రైతు సహాయకులను సచివాలయాలకే పరిమితం చేయడం వంటివి రైతుల కష్టాలను మరింత పెంచాయని అంటున్నారు. చాలావరకు రైతు భరోసా కేంద్రాలు తెరచుకోవడం లేదని, కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేకపోయారని, ఆక్వా, పాడి రైతులను కూడా నిట్టనిలువుగా ముంచేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పండగలా సేద్యం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో వ్యవసాయాన్ని పండగలా మార్చిందని రైతులు గుర్తుచేసుకుం టున్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకుని, అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ అమలు చేశారని, కౌలు రైతులతో సహా ఏటా రూ.13,500 పెట్టుబడి సా యం నేరుగా రైతు ల ఖాతాలకు బది లీ చేశారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 24,925 మంది రైతులకు ఐదేళ్లలో రూ.112.62 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయితీలో రైతు భరోసా కేంద్రాలను సొంత భవనాలలో ఏర్పాటు చేసి, నకిలీ విత్తనాలు, ఎరువుల నివారణకు సాగు సీజన్కు ముందే కియోస్క్ల ద్వారా విత్తనాలు, డీఏపీ, యూరియా అందుబాటులో ఉంచేవారని గుర్తుచేసుకున్నారు. రైతు సహాయకులను నియమించి, వారి ద్వారా మట్టి నమూనా పరీక్షలు, సాగు చేయవలసిన పంటలు, తెగుళ్ల నివారణ, పండిన పంటకు మద్దతు ధర ప్రకటించడంతో పాటు గోనె పట్టాలు, రవాణా సౌకర్యం కల్పించారని తెలిపారు. భీమిలిలో డాక్టర్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షించడంతో పాటు, పశువులలో తలెత్తే రోగాల నిర్ధారణ, చికిత్స కూడా అందించేవారని వివరించారు. అతివృష్టి, అనావృష్టి సమయంలో రైతు నష్టపోకుండా ఉచిత పంటల బీమా పథకం ద్వారా భరోసా కల్పించారని, వైఎస్సార్ జలకళ కింద రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించి మోటార్లు ఏర్పాటు చేశారని అన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రాష్ట్ర రైతులకు అండగా నిలిచారని, ఆ ఐదేళ్లు బ్యాంకులు కూడా రైతులకు విరివిగా రుణాలు ఇవ్వడంతో పాటు వాయిదాలు ఆలస్యం అయినా వేధించేవారు కాదని రైతులు తెలిపారు. ప్రజాప్రతినిధులను గడప గడపకు పంపించి, ఏ కారణం చేత అయినా సాయం అందకపోతే తక్షణం అందేలా చర్యలు తీసుకునేవారని అన్నారు.కూటమి వచ్చాక అప్పులపాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సహాయ కార్యక్రమాలు నిలిచిపోయాయని, దీంతో గత ఏడాది రైతులు అప్పుల పాలయ్యారని, ప్రస్తుతం సీజన్ ప్రారంభం కానున్నందున అధిక వడ్డీల బాధ ఉన్నా అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాత వెన్ను విరిచిన కూటమి ప్రభుత్వం అటకెక్కిన ‘అన్నదాత సుఖీభవ’ భరోసా కల్పించని ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం జిల్లాలో సాగు భూమి 4,454 హెక్టార్లు, అందులో 78 హెక్టార్లు మెట్ట్ట భూమి, రైతు భరోసా కేంద్రాలు 57(భీమిలి 13, ఆనందపురం 18,పద్మనాభం 16, పెందుర్తి 10) కౌలు రైతులు 504 మొత్తం రైతులు 22,569 -
● వినీలాకాశం.. పర్వత రూపం
వినీలాకాశంలో శుక్రవారం అద్భుత దృశ్యం అబ్బురపరిచింది. నీలిరంగులో ఉండే విశాలమైన కాన్వాస్పై పక్షుల గుంపు రిథమిక్గా సాగిపోతున్న తీరు చూపరులను మంత్రముగ్ధులను చేసింది. సాయంత్రం సమయంలో ఆకాశం నిర్మలంగా, నీలి రంగులో మెరిసిపోతోంది. అక్కడక్కడ చిన్నపాటి మబ్బులు తేలియాడుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో వందల సంఖ్యలో పక్షుల గుంపు ఒక పర్వతం ఆకారాన్ని తలపించేలా గాల్లో కదులుతూ ప్రయాణించింది. లయబద్ధంగా సాగిన వాటి ప్రయాణం.. చూసిన ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచింది. ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పవన్ కార్తీక్
ఏయూక్యాంపస్: హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (హెచ్ఆర్ఏఏపీ) నూతన కార్యవర్గ ఎన్నిక శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎం.వి. పవన్ కార్తీక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా జైదీప్ బిశ్వాస్, కోశాధికారిగా ఆర్. వెంకటరావులను ఎన్నుకున్నారు. సలహా మండలి సభ్యుడిగా డాక్టర్ ఎస్. ప్రశాంత్ వ్యవహరిస్తారు. నూతన కార్యవర్గం రాష్ట్రంలో పర్యాటకం, ఆతిథ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా పనిచేస్తుందని అధ్యక్షుడు పవన్ కార్తీక్ తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తామన్నారు. -
డీఎస్సీ పరీక్షకు 88.39 శాతం హాజరు
ఆరిలోవ: జిల్లాలో డీఎస్సీ–2025 ద్వారా విద్యాశాఖ నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. డీఎస్సీ అభ్యర్థులకు జిల్లాలో విద్యాశాఖ మొత్తం 12 పరీక్షా కేంద్రాలను కేటాయించింది. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో 11 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. మొదటి రోజు పరీక్షల కోసం 2,447 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు పంపించగా, వారిలో 88.39 శాతం (2,163 మంది) హాజరయ్యారు. 284 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ఎన్. ప్రేమ్కుమార్ తెలిపారు. ఉదయం సెషన్లో 7 కేంద్రాలలో నిర్వహించిన పరీక్షకు 1,435 మందికి 1,278 మంది (89.06శాతం) హాజరయ్యారు.మధ్యాహ్నం 4 కేంద్రాలలో నిర్వహించిన పరీక్షకు 1,012 మందికి 885 మంది (87.45శాతం) హాజరయ్యారు. డీఈవో ఒక కేంద్రాన్ని, పరీక్షల స్క్వాడ్ మూడు కేంద్రాలను పర్యవేక్షించారు. పరీక్షలు జరిగిన కేంద్రాలలో బుచ్చిరాజుపాలెంలోని ఏడీజెడ్ ఆరోవనా డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రంలో అత్యధికంగా 450 మంది అభ్యర్థులను కేటాయించగా, నగరంలోని చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో అత్యల్పంగా 85 మంది అభ్యర్థులను కేటాయించారు. -
ఖైదీలకు యోగా శిక్షణ
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలోని ఖైదీలు యోగాసనాలలో శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా వారికి ఈ శిక్షణ ఇస్తున్నారు. కారాగారం లోపల ప్రశాంతమైన వాతావరణంలో, పచ్చని చెట్ల మధ్య ఖైదీలకు యోగా నేర్పుతున్నారు. ఖైదీలకు ప్రతిరోజూ గంట పాటు యోగాసనాలు నేర్పుతున్నట్లు జైల్ సూపరింటెండెంట్ ఎం. మహేష్ బాబు శుక్రవారం తెలిపారు. ప్రతిరోజు ఖైదీలు యోగ సాధనలో పాల్గొంటున్నారని, దీని వల్ల వారి శరీర దృఢత్వంతో పాటు మానసిక స్థితి మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. యోగా దినోత్సవం నాటికి జైలులో ఉన్న అందరి ఖైదీలతో యోగాసనాలలో పాల్గొనే విధంగా చర్యలు చేపడుతున్నట్లు మహేష్ బాబు వెల్లడించారు. -
చేతకాక.. కమిషనర్ లేక!
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగింది. కూటమి ప్రభుత్వ అసమర్ధతపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల మండిపాటు, కూటమి కార్పొరేటర్ల అసంబద్ధ వాదనలతో రసాబాసగా మారింది. ప్రభుత్వం ఏర్పడ్డాక.. అడ్డగోలుగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంలో చూపిన చొరవ, జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ను నియమించడంలో చూపకపోవడంపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. ప్లకార్డులతో మేయర్ పోడియంను చుట్టుముట్టి, తక్షణమే జీవీఎంసీకి రెగ్యులర్ కమిషనర్ను నియమించాలని డిమాండ్ చేశారు. దాదాపు 15 నిముషాలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల నినాదాలతో కౌన్సిల్ హాల్ మార్మోగింది. డాబాగార్డెన్స్: నూతన మేయర్ పీలా శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం వాద, ప్రతిపాదనలతో హోరెత్తింది. ప్రధాన అజెండాలోని 27 అంశాలతో పాటు, టేబుల్ అజెండాలోని 6 అంశాలు సభ్యుల చర్చకు వచ్చాయి. వీటిలో 3 ప్రధాన అజెండా(1, 10, 14) అంశాలు, 2 టేబుల్(1, 6) అజెండా అంశాలు తప్ప, మిగిలినవన్నీ ఆమోదం పొందాయి. ఉదయం ప్రారంభమైన సమావేశం రాత్రి వరకు కొనసాగింది. రెగ్యులర్ కమిషనర్ నియామకం ఎప్పుడు? జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు సభను అడ్డుకున్నారు. ప్లకార్డులతో మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి, జీవీఎంసీకి తక్షణమే రెగ్యులర్ కమిషనర్ను నియమించాలని డిమాండ్ చేశారు. కీలకమైన కమిషనర్ పోస్టును నెలల తరబడి భర్తీ చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని నినాదాలు చేశారు. దాదాపు 15 నిమిషాల పాటు వారి నినాదాలతో సభ దద్దరిల్లింది. మేయర్ పీలా శ్రీనివాసరావు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మొదట పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాప తీర్మానం చేయాలని సూచించడంతో, వైఎస్సార్సీపీ సభ్యులు తమ సీట్లలో కూర్చున్నారు. అనంతరం, ఉగ్రదాడి బాధితులకు రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. ఇన్చార్జ్ కమిషనర్ రాకపోవడంతో బ్రేక్ ఇన్చార్జ్ కమిషనర్, కలెక్టర్ హరేందిర ప్రసాద్ సీఎం వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నందున సమావేశానికి హాజరుకాలేదు. దీనిపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కమిషనర్ లేకుండా సభను నిర్వహించడాన్ని తప్పుబట్టారు. వారి నిరసనతో మేయర్ పీలా శ్రీనివాసరావు 15 నిమిషాల్లోనే టీ బ్రేక్ ప్రకటించారు. దాదాపు అరగంట తర్వాత కమిషనర్ హాజరు కావడంతో సభ తిరిగి ప్రారంభమైంది. జీరో అవర్ కోసం పట్టు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్ పీలా అజెండాలోని అంశాలపై చర్చ ప్రారంభించగా, కార్పొరేటర్లు తమ వార్డు సమస్యల పరిష్కారం కోసం జీరో అవర్ కావాలని పట్టుబట్టారు. మేయర్ దీనికి అంగీకరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ జీవీఎంసీకి నాలుగు నెలలుగా కమిషనర్ లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రెండు, మూడు రోజుల్లో కమిషనర్ను నియమించేలా చూడాలని సూచించారు. పీలా గోవింద్ హాజరుపై అభ్యంతరం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ హాజరుపై డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ అభ్యంతరం తెలిపారు. ఏ హోదాలో ఆయన వచ్చారని ప్రశ్నించగా, పీలా గోవింద్ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అని, ప్రభుత్వ ప్రత్యేక ఉత్తర్వుల మేరకు ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చినట్లు అధికారులు వివరించారు. నైట్ ఫుడ్కోర్టుపై మళ్లీ రగడ జైలు రోడ్డులోని నైట్ ఫుడ్కోర్టుపై మరోసారి రగడ చెలరేగింది. అనధికారికంగా అనేక మంది స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారని, వీటిని తొలగించాలని కౌన్సిల్లో పలుమార్లు చర్చించి తీర్మానం చేసినా చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బిపిన్కుమార్ జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో కార్పొరేటర్ పీవీ సురేష్ మాట్లాడుతూ, వార్డుల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఫిర్యాదు చేస్తే, జోనల్ కమిషనర్ తేలికగా ‘అలాగే జరుగుతాయని’మాట్లాడుతున్నారని మండిపడ్డారు.‘ఎఫ్ఆర్యూ’ ఒప్పందం ఎప్పుడైనా రద్దు చేయొచ్చుశ్రీహరిపురంలోని ఫస్ట్ రిఫరల్ యూనిట్ నిర్వహణ కోసం రూ.1.20 కోట్లు కేటాయించడం, విజయ (బెహరా) వెల్ఫేర్ సొసైటీకి చెల్లింపుల ఆమోదంపై జీవీఎంసీ కౌన్సిల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పీవీ సురేష్ సహా ఇతర కార్పొరేటర్లు మాట్లాడుతూ సొసైటీ ఉచిత సేవలకు బదులు డబ్బులు వసూలు చేస్తోందని, 30 ఏళ్ల లీజుపై కూడా అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ హరేందిరప్రసాద్, సొసైటీ సరిగా పనిచేయకపోతే విచారణ జరిపి ఒప్పందాన్ని ఎప్పుడైనా రద్దు చేస్తామని మేయర్ పీలా శ్రీనివాసరావు ద్వారా హామీ ఇచ్చారు. రెగ్యులర్ కమిషనర్ను నియమించకపోవడంపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆగ్రహం జీవీఎంసీపై కూటమి నిర్లక్ష్యం కమిషనర్ను నియమించాలంటూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ప్లకార్డుల ప్రదర్శన 27 అజెండా అంశాలు.. 6 టేబుల్ అజెండా అంశాలు ప్రధాన అజెండాలో 3, టేబుల్ అజెండాలో 2 అంశాలు వాయిదా సుదీర్ఘంగా సాగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జీవీఎంసీలో ఘోస్ట్ ఉద్యోగులు జీవీఎంసీలో ‘ఘోస్ట్ ఉద్యోగులు’ఉన్నారని, పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. అలాంటి వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. విశాఖ డెయిరీ వ్యర్థాలు పంట పొలాల్లోకి చేరి రైతులను ఇబ్బంది పెడుతున్నందున, డ్రైన్లు నిర్మించాలని పల్లా సూచించారు. వర్క్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేయరా? జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పలు కీలక ఆరోపణలు చేశారు. జీవీఎంసీ పరిధిలో దీర్ఘకాలంగా ఒకే చోట పని చేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, వారిని ఎందుకు బదిలీ చేయడం లేదని ప్రశ్నించారు. కీలకమైన జీవీఎంసీకి నెలల తరబడి కమిషనర్ లేకపోవడం దారుణమన్నారు. పనుల టెండర్లలో అంచనాల కంటే 25 శాతం తక్కువకు కాంట్రాక్టర్లు పనులు ఎలా చేస్తున్నారని నిలదీస్తూ, అధికారులు ఎక్కువ ఎస్టిమేషన్లు వేస్తున్నారా? లేదా కాంట్రాక్టర్లకు లీకులు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎవడ్రా నువ్వు..! జీరో అవర్లో వాగ్వాదం చోటుచేసుకుంది. కార్పొరేటర్ కంపా హనోక్ మాట్లాడుతుండగా.. వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన హనోక్, ‘ఎవడ్రా నువ్వు’అంటూ నోరు పారేసుకున్నారు. ఈ ఘటనతో సభలో కొంత గందరగోళం నెలకొంది. వెంటనే రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు కల్పించుకుని, వైఎస్సార్సీపీ నుంచి గెలిచి, పార్టీ మారిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హనోక్కు చురకంటించారు. హనోక్ వెంటనే క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. వాయిదాపడ్డ అంశాలు.. సీనియర్ అసిస్టెంట్ డి.వెంకట్రావు స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తును సభ్యులు వ్యతిరేకించారు. అతనిపై అనేక ఆరోపణలు ఉన్నందున, పూర్తిస్థాయి విచారణ జరిపే వరకు దరఖాస్తును వాయిదా వేశారు. 87వ వార్డులోని కూర్మన్నపాలెం వద్ద ఎంవీవీ అండ్ ఎంకే పార్క్కు 150 కేఎల్డీ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు సంబంధించిన పైప్లైన్ ప్రతిపాదనకు సభ్యులు అభ్యంతరం తెలపడంతో వాయిదా పడింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా 15 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల అభివృద్ధి ప్రతిపాదనను సభ్యులు వ్యతిరేకించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల కాలపరిమితి మార్చి 31తో ముగిసిందని, కేవలం ఇద్దరు ముగ్గురు సిబ్బందితో రూ.కోట్ల విలువైన ప్రాజెక్టులు జరుగుతున్నాయని, దీనిపై సుదీర్ఘంగా చర్చించాలని కోరడంతో వాయిదా వేశారు. పరిపాలన సౌలభ్యం కోసం జోనల్ పరిధి మార్పులు చేసే ప్రణాళికను కూటమి సభ్యులతో సహా పలువురు కౌన్సిల్ సభ్యులు వ్యతిరేకించడంతో వాయిదా వేశారు. వీటితోపాటు టీడీఆర్లు, కోడి మాంసం వ్యర్థాలు, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్, షాప్ రూంలు, పార్క్స్ వంటి అంశాలపై చర్చ అవసరమని సభ్యులు కోరడంతో వాటిని కూడా వాయిదా వేశారు. ఆమోదించిన అంశాల్లో ప్రధానమైనవి రూ.1.96 కోట్లతో 2వ వార్డు కుమ్మరివీధి నుంచి నమ్మివానిపేట కాలనీ బీటీ రోడ్డు విస్తరణ జీవీఎంసీలోని ఈఈ–1 పరిధిలో సివిల్ పనుల పర్యవేక్షణకు అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను ఏడాది పాటు కొనసాగింపు రూ.55.40 లక్షల అంచనా వ్యయంతో 19వ వార్డు పెదవాల్తేరులో చేపల మార్కెట్ పునరుద్ధరణ ఇంజినీరింగ్ విభాగం ఈఈ–5 పరిధిలో 18 మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్లు, సెక్యూరిటీ గార్డుల కొనసాగింపు -
ఏపీ పీజీ ఈసెట్ ప్రారంభం
మద్దిలపాలెం: రాష్ట్రవ్యాప్తంగా ఎంటెక్, ఎం.ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ పీజీ ఈసెట్ 2025 శుక్రవారం ప్రారంభమైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ ఈ పరీక్షలను ప్రారంభించారు. పరీక్షల తొలిరోజు ఉదయం సెషన్లో 92 శాతం, మధ్యాహ్నం సెషన్లో 82 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏయూ నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్ష సెట్ కోడ్ను వీసీ విడుదల చేయగా, రెక్టార్ ఆచార్య ఎన్.కిశోర్ బాబు, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.శశిభూషణరావు, సెట్ కన్వీనర్ ఆచార్య పి.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పరీక్షలు శని, ఆదివారాల్లో కూడా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. -
సామాజిక సందేశంతో ఆకట్టుకున్న నాటికలు
మద్దిలపాలెం: విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నెలవారీ నాటక ప్రదర్శనలో భాగంగా శుక్రవారం రెండు సందేశాత్మక నాటికలను ప్రదర్శించారు. వీఎండీఏ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఎస్.ఎన్. రాజు, డాక్టర్ గుమ్ములూరి రాంబాబు, పైడా కృష్ణప్రసాద్, నాంచారయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి ప్రదర్శనగా స్నిగ్ధ కలం నుంచి జాలువారిన ‘దోషేచ వహ్ని’నాటిక ప్రదర్శించారు. మధ్యతరగతి కుటుంబాల్లో కుమార్తెను అత్తవారింటికి పంపిన తర్వాత, ఆ తల్లిదండ్రులు సర్వం కుమార్తెకు ధారపోస్తూ, కోడలి వేదనను పట్టించుకోని ఇతివృత్తంతో ఈ నాటిక సాగుతుంది. ‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయినేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమ యా ధరిత్రి’ అనే ఆరు సూత్రాలను పాటిస్తూ జీవించే సీ్త్ర పాత్రను ఈ నాటిక స్పృశించింది. అయితే భర్త తప్పు చేసినప్పుడు.. సప్తమ సూత్రంగా ‘దోషేచ వహ్ని’ అని సీ్త్ర చైతన్యవంతురాలై తనకు తానుగా లిఖించుకోవాలి అన్న సందేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథాంశానికి తగ్గట్టుగా నటీనటుల చక్కని నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. రెండవ నాటికగా కెరటాలు ప్రదర్శించారు. భాగవతుల రమాదేవి రచించిన ‘కెరటాలు’కథకు మునిపల్లె విద్యాధర్ నాటకీకరణ చేశారు. ఆధునిక భావాలతో నేటి యువత, ముఖ్యంగా మహిళలు తమ తల్లిదండ్రులను, ఆ తర్వాత భర్తను కూడా ఎదిరించడమే అభ్యుదయంగా భావించి తమ జీవితాలను, భవిష్యత్ను భగ్నం చేసుకుంటున్నారు. అలాంటివారు కెరటాల్లో కొట్టుకు పోకుండా.. గతంలో కొందరి జీవితాలను ఉదాహరణగా తీసుకుని ఒడ్డుకు చేరాలనే సందేశమిస్తూ ఈ నాటిక సాగింది. ఈ రెండు నాటికలను రాజాం కళాక్రియేషన్స్ సంస్థ ప్రదర్శించింది. -
జీ హుజూరు!
బెహరాకునేటి కౌన్సిల్లో కీలక అంశాలు మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించనున్న కౌన్సిల్ సమావేశంలో 27 అంశాలు సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి. వీటితో పాటు మరికొన్ని టేబుల్ అజెండా అంశాలు వచ్చే అవకాశం ఉంది. వీటిలో మినిస్టీరియల్ విభాగానికి సంబంధించిన అంశాలు, పలు అభివృద్ధి పనులకు, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి పొరుగు సేవల విధానంలో వర్క్ ఇన్స్పెక్టర్లు, మాస్ మజ్దూర్ల సేవలు 2026 మార్చి 31వరకు కొనసాగించేందుకు పరిపాలన ఆమోదం, జోన్–4లో యూజీడీలో లోపాల్లేకుండా నిర్వహణకు 6 కేఎల్ జెట్టింగ్ వాహనాలు సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అంగీకరించేందుకు పరిపాలన ఆమోదంతో పాటు మరికొన్ని అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. డాబాగార్డెన్స్ : శ్రీహరిపురంలో ఉన్న ఫస్ట్ రిఫరల్ యూనిట్(ఎఫ్ఆర్యూ) నెలవారీ ఆపరేషన్స్ అండ్ మెయింట్నెన్స్(నిర్వహణకు) బాధ్యతలను ప్రస్తుతమున్న విజయ(బెహరా) వెల్ఫేర్ సొసైటీకే అప్పగిస్తూ.. రూ.1.20 కోట్ల మేర చెల్లింపులు చేసేందుకు జీవీఎంసీ పాలకవర్గం సిద్ధమైంది. కుటుంబ సభ్యులు జీవీఎంసీలో కార్పొరేటర్లుగా ఉన్నప్పుడు... కాంట్రాక్టు ఎలా కట్టబెడతారంటూ గతంలో ఇదే కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కాంట్రాక్టును కేటాయించొద్దుంటూ కౌన్సిల్ సమావేశంలో నానా రభస చేశారు. మొన్న జరిగిన మేయర్పై అవిశ్వాస తీర్మానం ఓటింగ్లో బెహరా భాస్కరరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు జనసేనలోకి జంప్ కావడంతో కూటమికి ప్రీతిపాత్రులయ్యారు. దీంతో మొన్నటిదాకా అక్రమమంటూ పెడబొబ్బలు పెట్టిన ఇదే కూటమి నేతలు ఇప్పుడు ఎర్రతివాచీ పరిచి మరీ కాంట్రాక్టును కట్టబెట్టేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. ఈ మేరకు శుక్రవారం జరగనున్న సమావేశంలో 18వ ఎజెండాగా ఈ కేటాయింపుల అంశాన్ని చేర్చారు. అలాగే టెండర్లు పిలవకుండా ఎలా కేటాయిస్తారని స్థానిక ఎమ్మెల్యే మండిపడుతున్నట్టు తెలిసింది. అవినీతిపై విచారణ పూర్తి కాకుండానే.. ఓ సీనియర్ అసిస్టెంట్ వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా.. అనుమతి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఈయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇంకా విచారణ పూర్తి కాలేదు. అయితే తనను కలిసి దరఖాస్తు చేసుకున్నారంటూ మేయర్ ఏకంగా ఎజెండాలో మొదటి అంశంగా చేర్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కూడా ఇదే కూటమి నేతలు గతంలో ఆరోపణలు గుప్పించిన విషయాన్ని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గం ఓ జోన్గా.. 27 అజెండా అంశాలతో పాటు మరికొన్ని అంశాలు టేబుల్ అజెండాగా సభ్యుల ముందుకు చర్చకు రానున్నాయి. వీటిలో ప్రధానంగా ఇప్పటి వరకు జీవీఎంసీలో 8 జోన్లు ఉన్నప్పటికీ నియోజకవర్గాలకు సంబంధించి సమస్యలు తలెత్తుతున్నాయి. జోన్–5 కార్యాలయం జ్ఞానాపురంలో ఉంది. ఈ జోన్ పరిధిలోకి దక్షిణ నియోజకవర్గం, పశ్చిమ నియోజకవర్గం, ఉత్తర నియోజకవర్గానికి చెందిన వార్డులు వస్తున్నాయి. దీంతో నియోజకవర్గ సమస్య తలెత్తుతున్న దృష్ట్యా.. జీవీఎంసీ పరిధిలో గల నియోజకవర్గాల కిందకు ఆ నియోజకవర్గానికి చెందిన వార్డులను కేటాయిస్తూ కౌన్సిల్ సమావేశం తీర్మానించనుంది. ఇక నుంచి ఏ నియోజకవర్గానికి సంబంధించి, ఆ నియోజకవర్గ జోనల్ కార్యాలయంలోనే వ్యవహారాలు సాగనున్నాయి. ఈ అంశాన్ని టేబుల్ అజెండాలో పొందుపరిచినట్టు తెలిసింది. ● ఫస్ట్ రిఫరల్ యూనిట్ ఓఅండ్ఎంకు రూ.1.2 కోట్లు చెల్లింపు ● గతంలో తీవ్రంగా విమర్శించిన టీడీపీ ● జీవీఎంసీలో కార్పొరేటర్గా ఉండి పనులు ఎలా చేస్తారని నిలదీత ● ఇప్పుడు అవే పనుల అప్పగింతకు సిద్ధం ● నేటి కౌన్సిల్ సమావేశంలో గ్రీన్సిగ్నల్ ఇచ్చేందుకు నిర్ణయం కౌన్సిల్ సమావేశ మందిరం -
దిక్కులేని జీవీఎంసీ
● కమిషనర్ లేని పాలన.. విశాఖకు తీరని వేదన ● ఫైళ్లు పేరుకుపోతున్నాయి.. పనులు సాగడం లేదు ● జీవీఎంసీకి రెగ్యులర్ కమిషనర్ ఎప్పుడు? ● కూటమి నిర్లక్ష్యంపై నగర ప్రజల ఆగ్రహం డాబాగార్డెన్: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా.. ఐదు నెలలుగా రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో నగర పాలన పూర్తిగా గాడితప్పింది. రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్కు నెలల తరబడి కీలక అధికారిని నియమించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి పనులు పూర్తిగా ఆగిపోయాయి. అధికారుల్లో జవాబుదారీతనం కొరవడింది. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్తంభించిన పాలన రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో జీవీఎంసీలో పర్యవేక్షణ కొరవడింది. పాలన స్తంభించిపోయింది. సుమారు 20 లక్షల జనాభా, 98 వార్డులున్న జీవీఎంసీ బాధ్యతలను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్కు అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్న ఆరోపణలున్నాయి. ఓ వైపు కలెక్టరేట్ వ్యవహారాలు.. మరోవైపు జీవీఎంసీ బాధ్యతలతో ఆయన సతమతమవుతున్నారు. దీంతో క్షేత్రస్థాయి పర్యవేక్షణ కొరవడి, ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కింది స్థాయి అధికారులు సైతం తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తుండడంతో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. పనులు ముందుకు సాగడం లేదు. నూతన మేయర్ సైతం సమీక్షలకే పరిమితమయ్యారని, అధికారులను జవాబుదారీ చేసే స్థాయిలో చర్యలు కొరవడ్డాయని విపక్ష కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. అటకెక్కిన అభివృద్ధి, పారిశుధ్యం కమిషనర్ లేని లోటు అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత కమిషనర్ హయాంలో మురికివాడల అభివృద్ధి, రూ.500 కోట్లతో తాగునీటి పైపులైన్ల మంజూరు, గుర్తించిన 1,150 ఖాళీ స్థలాల్లో పార్కుల అభివృద్ధి వంటి కీలక ప్రతిపాదనలు చేశారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో చేపట్టాల్సిన పనులన్నీ ప్రస్తుతం నిలిచిపోయాయి. ఉన్నతాధికారి పర్యవేక్షణ కొరవడటంతో పారిశుధ్య నిర్వహణ దయనీయంగా మారింది. ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. మురికివాడలు, కొండవాలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోంది. దోమలు విజృంభించి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. దక్షిణ నియోజకవర్గంలో ప్రసాద్ గార్డెన్స్, వెలంపేట, పండావీధి, అల్లిపురం, కొబ్బరితోట, పద్మానగర్, చిలకపేట, జాలారిపేట, రంగిరీజువీధి, చెంగల్రావుపేట, జబ్బరతోట, పెయిందొరపేట, కోటవీధి, ఫెర్రీరోడ్డు, తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆరిలోవ, డెయిరీఫాం ఏరియా, రామ్నగర్తో పాటు పలు మురికివాడ ప్రాంతాలు, ఉత్తర నియోజకవర్గ పరిధిలో పలు కొండవాలు ప్రాంతాలు, మురికివాడ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. జీవీఎంసీని గాడిలో పెట్టేదెవరు? జీవీఎంసీకి రెగ్యులర్ కమిషనర్ లేకపోవడం నగర పాలనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. అభివృద్ధి కుంటుపడింది. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఫైళ్లు కదలడం లేదు. రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్కు కమిషనర్ను నియమించకుండా కూటమి ప్రభుత్వం ఆడుతున్న నాటకమేంటో? నగర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కమిషనర్ను నియమించడం అత్యవసరం. – బానాల శ్రీనివాసరావు, జీవీఎంసీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ ప్లాస్టిక్ నియంత్రణ ఎక్కడ? నగరంలో యథేచ్ఛగా ప్లాస్టిక్ వినియోగం కొనసాగుతోంది. గత మేయర్, కమిషనర్ హయాంలో చేపట్టిన ప్లాస్టిక్ నియంత్రణ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించడానికి చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, డోర్–టు–డోర్ ప్రచారాలు, నియంత్రణ కమిటీలు అన్నీ అటకెక్కాయి. దీంతో నగరంలో మళ్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దర్శనమిస్తోంది. ప్రజాగ్రహం, ప్రతిపక్షాల ఆందోళన జీవీఎంసీకి కమిషనర్ను నియమించడంలో ప్రభుత్వ వైఫల్యంపై నగర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్నే నియమించలేని ప్రభుత్వం.. రాష్ట్రాన్ని ఏం పాలిస్తుంది? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ఐదు నెలలుగా కమిషనర్ లేకపోవడం జీవీఎంసీ చరిత్రలోనే ఇది మొదటిసారని, ఇది కూటమి ప్రభుత్వ ఘనకార్యమని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. తక్షణమే సమర్థవంతమైన ఐఏఎస్ అధికారిని కమిషనర్గా నియమించి, నగర పాలనను గాడిలో పెట్టాలని సీపీఎం, సీపీఐ ఫ్లోర్ లీడర్లు గతంలోనే నిరసన వ్యక్తం చేశారు. సమర్థంగా పనిచేస్తున్న కమిషనర్ను అర్ధాంతరంగా బదిలీ చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం విశాఖను దిక్కులేని నగరంగా మార్చివేశారని, ప్రజల సమస్యలు పరిష్కరించే నాథుడే లేడని మండిపడ్డారు. -
ప్రతి విద్యార్థికి స్కూల్ కిట్లు అందాలి
ఆరిలోవ: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచిన వెంటనే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు అందించాలని కేజీబీవీ కార్యదర్శి, జిల్లా నోడల్ ఆఫీసర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. విశాఖ జిల్లాలో మండల హెడ్క్వార్టర్లలో విద్యార్థి మిత్ర కిట్లు ఉన్న పలు స్టాక్ పాయింట్లను గురువారం సందర్శించారు. ఇందులో భాగంగా చినగదిలి మండలం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టాక్ పాయింట్ను పరిశీలించారు. అక్కడ కిట్లలో పాఠ్య పుస్తకాలు, బెల్టులు, బ్యాగులు పరిశీలించి, డీఈవో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ డీఈవో ఎన్.ప్రేమ్కుమార్తో కలసి ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎంఈవోలతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి విద్యార్థి మిత్ర కిట్లను అందించాలన్నారు. 121సి అడ్మిషన్ల విషయంలో ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్తో మాట్లాడి విద్యార్థులందరికీ ప్రవేశాలు పొందేవిధంగా జాగ్రతలు తీసుకోవాలన్నారు. ఈ నెల 21న విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ విజయవంతానికి అందరు ఎంఈవోలు భాగస్వాములు కావాలని సూచించారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టి పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు ప్రవేశాలు జరిగేటట్లు చూపడాలిన్నారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఏపీసీ జె.చంద్రశేఖర్, సెక్టోరియల్ ఆఫీసర్లు, ఎంఈవోలు పాల్గొన్నారు. -
ఐటీఐ కౌన్సెలింగ్ ప్రారంభం
తాటిచెట్లపాలెం: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2025–26 విద్యా సంవత్సరానికి వివిధ ట్రేడుల్లో ప్రవేశానికి గురువారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. తొలి రోజు 1 నుంచి 479 ర్యాంకర్లను కౌన్సెలింగ్కు పిలవగా 226 మంది హాజరయ్యారు. ఇందులో 185 మంది ప్రభుత్వ ఐటీఐల్లో ప్రవేశానికి అర్హత సాధించారు. అభ్యర్థులకు అర్హత పత్రాలను ఉపాధి, శిక్షణ శాఖ ప్రిన్సిపాల్, కన్వీనర్ జె.శ్రీకాంత్ అందజేశారు. శుక్రవారం జరిగే కౌన్సెలింగ్కు 480 నుంచి 1041 ర్యాంకు అభ్యర్థులు కంచరపాలెం ప్రభుత్వ ఐటీఐలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. కౌన్సెలింగ్లో పాల్గొన్న తల్లిదండ్రులకు, విద్యార్థులకు మంచినీరు, మజ్జిగ పాకెట్లు ఐటీఐ సిబ్బంది అందజేశారు. -
జూలై 9, 10 తేదీల్లో గిరి ప్రదక్షిణ
విశాఖ సిటీ: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి గిరి ప్రదక్షిణ జూలై 9, 10 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాలని సూచించారు. భక్తులు జాతీయ రహదారిని దాటే చోట తాత్కాలిక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్, సీపీ శంఖబ్రత బాగ్చి అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి ఎన్హెచ్ఏఐ అధికారులను సమన్వయం చేసుకొని చర్యలు చేపట్టాలని చెప్పారు. తొలి పావంచా వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు పోలీస్ బందోబస్తు, పోలీస్ శిబిరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని చెప్పారు. క్యూలైన్లు, రద్దీ ప్రదేశాల వద్ద గట్టి బందోబస్తు కల్పించాలన్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తాగునీరు, మరుగుదొడ్లు, రద్దీ ప్రదేశాల్లో లైటింగ్ ఏర్పాట్లు చేయాలని, ముందుగానే పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంబులెన్సులు, వైద్య శిబిరాలు సిద్ధం చేయాలని వైద్యాధికారులకు సూచించారు. అప్పుఘర్ వద్ద భక్తులు సముద్ర స్నానాలు చేసే సమయంలో మైక్ ద్వారా జాగ్రత్తలు చెప్పాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. కొండపై అగ్నిమాపక యంత్రం, ఫైర్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉదయం నుంచి దర్శనాలు : ప్రధాన అర్చకుడు వైదిక కార్యక్రమాల షెడ్యూల్ను వివరించారు. జూలై 9వ తేదీ ఉదయం నుంచి దర్శనాలు మొదలవుతాయని, ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రచార రథయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. తొలి పావంచా వద్ద కొబ్బరి కాయ కొట్టడం ద్వారా 32 కి.మీ మేర గిరి ప్రదక్షిణ మొదలవుతుందని పేర్కొన్నారు. 10వ తేదీ సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగుతాయని, ఆ రోజే స్వామికి నాలుగో విడత చందన సమర్పణ జరుగుతుందని తెలిపారు. యంత్రాంగం సహకారంతో ఏర్పాట్లు ఆలయ ఈవో త్రినాథరావు మాట్లాడుతూ యంత్రాంగం సహకారంతో కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం తరఫున చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గుర్తించిన 28 ప్రదేశాల్లో 290 తాత్కాలిక టాయిలెట్లు, 129 శాశ్వత టాయిలెట్లు, జీవీఎంసీ ఆధ్వర్యంలో మరో 29 శాశ్వత టాయిలెట్లు, 31 వైద్య శిబిరాలు, 6 ప్రధాన ప్రాంతాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్ట్ం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కొండపైన 170, దిగువన 58 సీసీ కెమెరాలు ఉన్నాయని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరిన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తొలి పావంచా వద్ద అవసరానికి తగిన విధంగా కొబ్బరి కాయలు కొట్టేందుకు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశంలో డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీఆర్వో బి.హెచ్.భవానీ శంకర్, ఆర్డీవో సంగీత్ మాథుర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
బౌద్ధమతం శాంతిని బోధిస్తుంది
బౌద్ధ సన్యాసి గల్కండెగమ ఉదిత థెరో విశాఖ విద్య: శ్రీలంకలోని థెరవాడ సంప్రదాయానికి చెందిన బౌద్ధ సన్యాసి గల్కండెగమ ఉదిత థెరో ఏయూలోని విద్యా విభాగంలో ‘బౌద్ధమతం–శాంతి విద్య’పై గురువారం ప్రసంగించారు. ఆధునిక కాలపు సంఘర్షణలను పరిష్కరించడం, అంతర్గత సామరస్యాన్ని పెంపొందించడంలో నాలుగు గొప్ప సత్యాలు, అష్టాంగ మార్గం ఔచిత్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు బుద్ధుని బోధనల ద్వారా శాంతి యొక్క ఆధ్యాత్మిక, తాత్విక కోణాలతో నిమగ్నమయ్యే అరుదైన అవకాశాన్ని అందించింది. విభాగాధిపతి ప్రొఫెసర్ టి.షారోన్ రాజు మాట్లాడుతూ ఉపాధ్యాయ శిక్షణ, యువత అభివృద్ధిలో శాంతి విద్య యొక్క పరివర్తనాత్మక పాత్రను వివరించారు. -
పర్యావరణ హితమే ప్రధానం
బీచ్రోడ్డు: పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తూ, భూమి పొరలను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకంపై నిషేధాజ్ఞలను కఠినంగా అమలు చేయాలని పర్యావరణ ప్రేమికులు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఇస్కాఫ్, గ్లోబల్ నెట్వర్క్, సోషల్ మీడియా క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇస్కాఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు జె.ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల పేరుతో వినాశకర వస్తువులను ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి విఘాతం కలుగుతోందని, దీని వల్ల మానవాళి సంవత్సరాల తరబడి వైకల్యం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతోందన్నారు. ఉప్పల అప్పలరాజు మాట్లాడుతూ యుద్ధం వద్దు.. శాంతి ముద్దు అని అన్నారు. మలయాళీ వరల్డ్ కౌన్సిల్ సెక్రటరీ జోషి, గ్లోబల్ నెట్వర్క్ ప్రతినిధి రామ్ ప్రభు, బస్ పోతన, వై.సత్యవతి తదితరులు పాల్గొని పర్యావరణ పరిరక్షణలో ప్రజలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలు నినాదాలు చేశారు. -
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
కలెక్టర్ హరేందిర ప్రసాద్ పిలుపు ఏయూక్యాంపస్: పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం ఆర్.కె.బీచ్ నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్ వరకు నిర్వహించిన గ్రీన్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, జీవీఎంసీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 5 లక్షల మొక్కలను నాటే కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మిలియన్ కంటే ఎక్కువ మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత కూడా చేపట్టాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని, దానికి బదులుగా వస్త్ర, నార సంచులను వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని హెచ్చరించారు. జీవీఎంసీ పరిధిలో 6 వేల మంది పారిశుధ్య సిబ్బంది నిరంతరం నగర పరిశుభ్రతకు కృషి చేస్తున్నారన్నారు. ప్రజలే ప్లాస్టిక్ను నిషేధిస్తే దాని డిమాండ్ తగ్గి ఉత్పత్తి కూడా తగ్గుముఖం పడుతుందని అభిప్రాయపడ్డారు. మొక్కలు నాటడంలో భాగస్వాములైన దివీస్, లారా, కోరమండల్, మాట్రిక్స్, అలోవెరా వంటి పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యాన్ని కలెక్టర్ అభినందించారు. గ్రీన్ ర్యాలీకి ముందు పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఏయూ కన్వెన్షన్ సెంటర్ వద్ద మొక్క నాటారు. కార్యక్రమంలో డీఎఫ్వో, జూ క్యూరేటర్ మంగమ్మ, కాలుష్య నియంత్రణ మండలి, జీవీఎంసీ, అటవీశాఖ, పోలీసులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజలకు పర్యావరణ చైతన్యం పెంపొందిస్తూ కళాకారులు గీతాలను ఆలపించారు. -
వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు సన్నద్ధం
కౌన్సిల్ సమావేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టేందుకు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు జీవీఎంసీలోని వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బానాల సత్య శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, కార్పొరేటర్లు సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కుంటుపడిన అభివృద్ధి పనులు, ముఖ్యంగా పూర్తిస్థాయి కమిషనర్ను నియమించని కూటమి ప్రభుత్వ తీరుపై నగర ప్రజల తరఫున కౌన్సిల్లో చర్చించేందుకు సిద్ధమయ్యారు. -
కుమ్మేసిన వర్షం
ఆరిలోవ: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వారం రోజులుగా తీవ్రమైన ఎండతో అల్లాడుతున్న నగరవాసులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. అయితే కొన్ని చోట్ల గాలివాన బీభత్సంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జీవీఎంసీ 9వ వార్డు విశాలాక్షినగర్, ఎంవీపీ డబుల్రోడ్డులో చెట్లు నేలకూలాయి. కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై చెట్లు విరిగిపడటంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. శానిటరీ సిబ్బంది రంగంలోకి దిగి చెట్లను తొలగించారు. మద్దిలపాలెం ప్రాంతంలో సుమారు 45 నిమిషాల పాటు కురిసిన వర్షానికి రోడ్లు, కాలనీలు తడిసిముద్దయ్యాయి. మద్దిలపాలెం, కేఆర్ఎంకాలనీ, శివాజీపాలెం రోడ్డు, పిఠాపురంకాలనీలో రోడ్లు వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపించాయి. మధురవాడ పరిసర ప్రాంతాల్లో గంటన్నర పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, హైవే సర్వీసు రోడ్లు జలమయమయ్యాయి. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో కారు మబ్బులు అలుముకున్నప్పటికీ వర్షం కురవలేదు. -
సముద్ర ఆహార రంగాభివృద్ధికి నైపుణ్యం కీలకం
డాబాగార్డెన్స్: సముద్ర ఆహార విలువ జోడింపుపై గురువారం నగరంలో అంతర్ రాష్ట్ర నైపుణ్య ఒలింపియాడ్ జరిగింది. సముద్ర ఆహార ప్రాసెసింగ్ నిపుణుల కోసం మైరెన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ(ఎంపీఈడీఏ) తొలిసారిగా ‘ఇంటర్ స్టేట్ స్కిల్ ఒలింపియాడ్ ఆన్ సీఫుడ్ వాల్యూ అడిషన్ ప్రిలిమినరీ రౌండ్(జోన్ ఐఐ ఈస్ట్ కోస్ట్)’ను నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఎంపీఈడీఏ కార్యదర్శి అనిల్కుమార్ ప్రారంభించి మాట్లాడారు. భారతదేశ సముద్ర ఆహార రంగాన్ని అభివృద్ధి చేయడంలో నైపుణ్యాభివృద్ధి, విలువ జోడింపు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. ఇది భారత ప్రభుత్వ వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. ఎంపీఈడీఏ జాయింట్ డైరెక్టర్ విజయ్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎండీఎస్ఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పి.లక్ష్మణరావు, నెక్కంటి సీఫుడ్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్, శాస్త్రవేత్త డాక్టర్ కిజకుడాన్, ఫిష్ ప్యాకర్స్ ప్రతినిధి నాగహనుమాన్, రామకృష్ణ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా తూర్పు తీరానికి చెందిన 20 మంది నైపుణ్యం కలిగిన సముద్ర ఆహార నిపుణులు ఇంటర్–స్టేట్ స్కిల్ ఒలింపియాడ్లో పాల్గొన్నారు. వీరు రొయ్యలు, స్క్విడ్, తిలాపియాతో 10 విలువ ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తులను తయారు చేశారు. సముద్ర ఆహార పరిశ్రమ, మత్స్య సంస్థల నిపుణులతో కూడిన నలుగురు సభ్యుల ప్యానెల్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించింది. కార్యక్రమంలో ప్రాసెసింగ్ టెక్నాలజిస్ట్ డాక్టర్ రమ్యకుమారి, కోటేశ్వర్, అధికారులు పాల్గొన్నారు. ఎంపీఈడీఏ కార్యదర్శి అనిల్కుమార్ -
జర్నలిస్టుల చట్టాలను పునరుద్ధరించాలి
11న ఉన్నతాధికారులకు వినతిపత్రాల అందజేత డాబాగార్డెన్స్: వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించి కేంద్రం రద్దు చేసిన రెండు చట్టాలను పునరుద్ధరించాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 9న అఖిల భారత కార్మిక సంఘాలు నిర్వహించే వివిధ కార్యక్రమాలకు వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘాలు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. నగరంలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా 44 కార్మిక చట్టాలను కేంద్రం రద్దు చేయగా అందులో వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతనాల చెల్లింపు చట్టం 1958 ఉన్నాయన్నారు. వీటి పునరుద్ధరణకు కేంద్రం చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ఈ నెల 11న పాత్రికేయుల డిమాండ్స్ డే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను కలెక్టర్ నుంచి తహసీల్దార్, ప్రజాప్రతినిధులకు అందిస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో జర్నలిస్టులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసరావు, బ్రాడ్కాస్ట్ జిల్లా అధ్యక్షుడు ఇరోతు ఈశ్వరరావు, కింతాడ మదన్, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్, కార్యదర్శి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ధవళేశ్వరపు రవికుమార్, సాంబశివరావు,ప్రసాద్ పాల్గొన్నారు. -
సంకల్ప బలం.. అకండ విజయం
కోటిరెడ్డి ఈ స్థాయికి చేరుకోవడానికి వెనుక, ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ బొడ్డపాలెం గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ సాడి వెంకటేష్ ప్రోత్సాహం ఎంతగానో ఉంది. ఒక బాడీబిల్డర్ కాకుండా.. ఒక ఫొటోగ్రాఫర్ ఆయనలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం విశేషం. ● వైకల్యాన్ని అధిగమించిన కోటిరెడ్డి ● మిస్టర్ ఇండియాగా నాలుగు సార్లు ● కోచ్గా ఎంతో మందికి మార్గనిర్దేశం ● సేవల్లోనూ ఇతరులకు ఆదర్శం విజయాలు.. సవాళ్లు పారా బాడీ బిల్డింగ్లో కోటిరెడ్డి సాధించిన విజయాలెన్నో.. 2013లో పశ్చిమ బెంగాల్లో జరిగిన మిస్టర్ ఇండియా పోటీలో మూడవ స్థానం, 2015, 2017లో బెల్గాంలో జరిగిన సతీష్ సుగర్ క్లాసిక్ (మిస్టర్ ఇండియా) పోటీల్లో వరుసగా రెండు, మొదటి స్థానాలు కైవసం చేసుకున్నారు. 2019లో మీరట్, 2024లో తమిళనాడు, పంజాబ్లలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచి తన సత్తా చాటారు. ఇప్పటివరకు తగరపువలస కేంద్రంగా 2008, 2010, 2017లో మిస్టర్ ఆంధ్ర, 2014లో ఈస్ట్జోన్ స్థాయిలో బాడీ బిల్డింగ్ పోటీలతో పాటు పారా బాడీ బిల్డింగ్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఇండియన్ బాడీబిల్డింగ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శిగా కూడా సేవలందిస్తున్నారు. నగరంలోని బుల్లయ్య కళాశాలలో బీకాం పూర్తి చేసిన కోటిరెడ్డి.. తన ఆసక్తిని బాడీబిల్డింగ్ వైపు మళ్లించారు. ఆరేళ్ల కఠోర శిక్షణ అనంతరం దీనినే తన ఉపాధిగా మార్చుకున్నారు. గత 20 ఏళ్లుగా ఈ రంగంలో అప్రతిహతంగా కొనసాగుతున్నారు. తొలిసారిగా తగరపువలస బైపాస్రోడ్డులో శ్రీఆంజనేయం మజిల్ ప్లానెట్ జిమ్ను స్థాపించారు. అప్పట్లో ఈ జిమ్కు రూ.8 లక్షలు ఖర్చు చేయగా తర్వాత రూ.25 లక్షల విలువైన వ్యాయామ పరికరాలను అందుబాటులో ఉంచారు. తర్వాత జీవీఎంసీ భీమిలిలో జోన్ సంతపేట చిల్డ్రన్స్ పార్కులో 1,500 చదరపు అడుగు విస్తీర్ణంలో రూ.12 లక్షల పరికరాలు, నగరంలోని కృష్ణా కళాశాల వద్ద 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.70 లక్షల పరికరాలతో జిమ్లను ప్రారంభించారు. త్వరలో సంగివలస సుఖీభవ కాలనీ వద్ద 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మరో అధునాతన జిమ్ను సిద్ధం చేస్తున్నారు. ఆనందపురంలో మరో జిమ్ను తెరచి.. తన శిష్యుడికి అప్పగించారు. కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా ఎంతోమంది ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్లకు ఉపాధి కల్పిస్తూ.. సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆర్మీ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే కాకుండా, బరువు తగ్గాలనుకునే వారికి మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం తన మకాంను నగరంలోని రామాటాకీస్ ప్రాంతానికి మార్చుకున్నారు. భారీగానే ఖర్చు బాడీ బిల్డింగ్ అంటే అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మిస్టర్ ఇండియా పోటీలకు సిద్ధం కావాలంటే దాదాపు ఏడు నెలల పాటు కఠోరంగా శ్రమించాలి. రోజుకు 750 గ్రాముల చికెన్, 20 కోడిగుడ్లు, 250 గ్రాముల కూరగాయలు, పండ్లు, ప్రొటీన్ పౌడర్, మల్టీ విటమిన్ టాబ్లెట్లతో పాటు రోజుకు నాలుగు గంటల వ్యాయామం అవసరం. మిస్టర్ ఇండియా పోటీల కోసం కోటిరెడ్డి వద్దకు వచ్చే వారికి ఈ విధంగానే శిక్షణ ఇస్తారు. అయితే ఇందుకు నెలకు రూ.40,000 పైనే ఖర్చవుతుందని, పోటీలకు సిద్ధం కావడానికి మొత్తం రూ.4 లక్షల వరకు వ్యయమవుతుందని కోటిరెడ్డి తెలిపారు. గెలిచిన ప్రైజ్మనీ ఈ ఖర్చులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్చుతో కూడినది కావడంతో బాడీ బిల్డింగ్ను ప్రోత్సహించేవారు తక్కువగా ఉన్నారన్నారు. కోవిడ్–19 సమయంలో జిమ్ల మూసివేత వలన ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఫొటోగ్రాఫర్ ప్రోత్సాహంసామాజిక సేవఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. కోటిరెడ్డి సేవా దృక్పథాన్ని వీడలేదు. తన తల్లిదండ్రులు బోర అప్పన్నరెడ్డి, అప్పయ్యమ్మల పేరుతో ఏటా రక్తదాన శిబిరాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. బాడీబిల్డింగ్ను ఒలింపిక్స్లో చేర్చాలని, ఇతర క్రీడల మాదిరిగానే ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం కోటా కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. స్పాన్సర్లు ముందుకు వస్తే అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించడానికి సిద్ధంగా ఉన్నానని, 60 ఏళ్ల వయసు వరకు పోటీలలో పాల్గొంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘ఏ క్రీడ అయినా సరే.. అది మనల్ని చెడు వ్యసనాలకు దూరంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా జిమ్కు వెళితే ఉక్కులాంటి శరీరం, మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది’ అని కోటిరెడ్డి యువతకు సందేశమిస్తున్నారు. నిడిగట్టు నుంచి మొదలైన ఈ స్ఫూర్తిదాయక ప్రస్థానం.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ, ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తోంది. బోర కోటిరెడ్డి కేవలం ఒక బాడీబిల్డర్ మాత్రమే కాదు.. ఆయన ఒక యోధుడు, మార్గదర్శకుడు. -
వెన్నుపోటుపై ప్రజాగ్రహం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలి.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి.. అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ ‘వెన్నుపోటు దినం’పేరిట నిరసన తెలపాలని వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపునకు అన్ని వర్గాల నుంచి స్పందన లభించింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో తూర్పు, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. జెడ్పీ జంక్షన్ వద్ద ప్రారంభమైన వెన్నుపోటు నిరసన ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. ‘వెన్నుపోటు చంద్రబాబు.. మోసగాడు చంద్రబాబు’అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణే‹Ùకుమార్, విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, కోలా గురువులు, రవిరెడ్డి తదితరులు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేయడం తప్ప మరేమీ చేయలేదని, వారి వైఫల్యాలకు నిరసనగా చేపట్టిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం కూటమి ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందని నేతలు హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కె.సతీష్ పార్టీ కార్యాలయం పర్య వేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షుడు విజయచంద్ర, కార్పొరేటర్లు బానాల శ్రీనివాసరావు, అల్లు శంకరరావు, రెయ్యి వెంకటరమణ, కోరుకొండ వెంకట స్వాతి, కె.అనిల్ కుమార్రాజు, మొల్లి లక్ష్మి, మువ్వలలక్ష్మి, సాడి పద్మారెడ్డి, చెన్నా జానకీ రామ్, కోడిగుడ్ల పూర్ణిమ, వావిలపల్లి ప్రసాద్, శశికళ, ఉత్తరాంధ్ర యువజన విభాగం రీజనల్ ప్రెసిడెంట్ అంబటి శైలేష్, పార్టీ ముఖ్య నాయుకులు కోలా గురువులు, రొంగలి జగన్నాథం, ఎండీ ఫరూఖీ, వుడా రవి, గొలగాని శ్రీనివాస్, రవి రాజు, సతీష్ వర్మ, తాడి జగన్నాథ్రెడ్డి, శ్రీని వాసరెడ్డి, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు పేడాడ రమణి కుమారి, బోని శివరామకృష్ణ, సనపల రవీంద్ర భరత్, బర్కత్ అలీ, ఎస్.ప్రసాదరావు, రామిరెడ్డి, బొండా ఉమా మహేశ్వరరావు, దేవరకొండ మార్కండేయులు, కాళిదాస్ రెడ్డి, అల్లంపల్లి రాజాబాబు, రామన్నపాత్రుడు, కిరణ్ రాజు, పల్లా దుర్గారావు, డా.మంచా నాగ మల్లీశ్వరి, మనలత జాబ్దాస్(చిన్ని), నీలి రవి, కొట్యాడ సూర్య, మహేష్బాబు, వార్డు నాయకులు పాల్గొన్నారు. కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చిందా? తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు మాట్లాడుతూ.. ‘సూపర్ సిక్స్ సహా 143 హామీలిచ్చి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు మోసం చేసినందుకే ఇది వెన్నుపోటు ప్రభుత్వం. మూడు లక్షల పింఛన్లు తొలగించి, కొత్తగా ఒక్క పింఛను అయినా ఇచ్చిందా? రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైన ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వ పతనానికి తొలి అడుగు’ అని అన్నారు.విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోమాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. గాజువాక పాత చెక్పోస్టు ప్రాంతం నుంచి ప్రారంభమై శాంతిగిరి కాలనీ, ములగాడ హౌసింగ్ కాలనీ మీదుగా ములగాడ తహసీల్దార్ కార్యాలయం వరకూ ఈ ర్యాలీ సాగింది. అక్కడ ఆర్ఐ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్, నియోజకవర్గ మహిళా విభాగం ఇన్చార్జి పేడాడ జ్యోత్స్న, జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ, ఎస్సీ సెల్ నాయకులు మల్లేశ్వరరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి చుక్కా వరలక్ష్మి, కార్పొరేటర్లు పి.వి.సురేష్ బల్లా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.గాజువాక నియోజకవర్గంలో గాజువాక సమన్వయకర్త దేవన్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాతగాజువాక జంక్షన్ నుంచి నేషనల్ హైవే మీదుగా చినగంట్యాడ 100 అడుగుల రోడ్డులోని తహసీల్దార్ కార్యాలయం వరకూ ఈ ర్యాలీ సాగింది. తహసీల్దార్ తోట శ్రీవల్లికి వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉరుకూటి అప్పారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకూటి చందు, కార్పొరేటర్లు ఇమ్రాన్, భూపతిరాజు సుజాత తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాంపురం నుంచి పెందుర్తి జూనియర్ కళాశాల వరకూ బైక్లు, కార్లతో ర్యాలీగా తరలివచ్చారు. అక్కడ నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయ రోడ్డు, బీఆర్టీఎస్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ గా సాగారు. ముఖ్య నేతలు బి.భగవాన్ జైరాం, పైలా శ్రీనివాసరావు, కొటాన రాము, జెడ్పీటీసీ సభ్యుడు పి.ఎస్.రాజు, ఎంపీపీలు. నేతలు హాజరయ్యారు.సంపద సృష్టి పేరుతో మోసంరాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ‘వెన్నుపోటు దినం’.. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వా న్ని గద్దె దించేందుకు ఒక మలుపు అవుతుంది. కూటమి ఏడాది పాలనలో మోసాలు, దౌర్జన్యా లు, అవినీతి, దోపిడీలు తప్ప మరేమీ లేవు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకూ ప్రతిపక్షంగా పోరాడుతూనే ఉంటాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా చంద్రబాబు అమలుకాని హామీలిచ్చారు. సంపద సృష్టిస్తానంటూ ప్రజలను మోసం చేశారు’ అని విమర్శించారు. బాబూ మీ కుమారుడు లోకేష్కు సంపద సృష్టిస్తున్నావా? అని ప్రశ్నించారు. విశాఖ నగరంపై చిన్నచూపుపార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మాట్లాడుతూ.. ‘అన్ని వర్గాలను దగా చేసిన చంద్రబాబు, మంత్రి లోకే‹Ù, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడేమి సమాధానం చెబుతారు. యువగళంలో లోకేష్ ఇచ్చిన యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయి. వెనుకబడిన ఉత్తరాంధ్రను కూటమి నేతలు దోచుకుంటున్నారు. విశాఖ నగరంపై చిన్నచూపు చూస్తున్నారు. అమరావతి భ్రమలో ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలను వెన్నుపోటు పొడవడం పెద్ద లెక్క కాదు! గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతీ హామీని అమలు చేసింది. ఈ ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను నిరీ్వర్యం చేసింది. రైతులను అప్పుల పాల్జేసింది. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి వచ్చిన స్పందన.. కూటమి ప్రభుత్వ పతనానికి నాందిగా మారుతుంది’ అని అన్నారు. చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు హయాంలో రాష్ట్ర జీడీపీ 3.8 శాతానికి పడిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇది 8.9 శాతంగా ఉండేది. ఇది చాలదా చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం అని చెప్పడానికి.? గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.2.75 లక్షల కోట్లను సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించింది. ప్రస్తుతం చంద్రబాబు కూటమి నేతల జేబులు నింపుతున్నారు. పవన్ కల్యాణ్ సిని మా ప్రపంచం నుంచి ఇంకా బయటకు వచ్చినట్లు లేరు. ఏడాది పాలనలో మోసాలు, దౌర్జన్యాలు జరిగితే.. అట్టర్ ప్లాప్ సిని మా(ఏడాది పాలన)కు బాణసంచా కాల్చి పండగ చేసుకోవా లని పిలుపునివ్వడం ఆశ్చర్యంగా ఉంది’ అని ఎద్దేవా చేశారు. ప్రజలే చీపుర్లతో పండగ చేస్తారు పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురా లు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. ‘కూటమి ఏడాది పాలనలో మోసా లు, మహిళలపై దాడులు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో పండగలు నిర్వహిస్తారా? మ్యానిఫెస్టో పట్టుకుని ప్రజల ముందుకు వెళితే వారే చీపుర్లు, గరిటెలతో మీకు అన్ని పండగలు చేస్తారు. మహిళల భద్రతను గాలికొదిలేశారు. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు’ అని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సుపరిపాలన కాదని.. ప్రజలు తప్పుడు హామీలకు మోసపోయారని కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.భీమిలి నియోజకవర్గంలో భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. భీమిలి వుడా మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పోలీస్స్టేషన్, మెయిన్ రోడ్డు, గంట స్తంభం మీదుగా నూకాలమ్మ ఆలయం వరకు ర్యాలీ సాగింది. అక్కడ వేదిక వద్ద శ్రీనివాసరావు ప్రసంగించారు. అనంతరం భీమిలిలోని ఆర్డీవో కార్యాలయంలో ఏవో మనోరంజినికి వినతిపత్రం సమర్పించారు. ఈ నిరసన ర్యాలీకి నియోజకవర్గం నలుమూలల నుంచి వందలాది ఆటోలు, 100 కార్లు, 1000 బైక్లతో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చారు. జెడ్పీ వైస్ చైర్మన్ సుంకరి గిరిబాబు, ముఖ్య నేతలు దాట్ల పెదబాబు, చెన్నాదాస్, ఎంపీపీలు దంతులూరి వాసురాజు, కె.రాంబాబు, మజ్జి వెంకట్రావ్, పోతిన హనుమంతురావు, అక్కరమాని రామునాయుడు, గండిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గర్భశోకం
● ప్రాణం తీసిన ఈత సరదా ● వరాహ నదిలో మునిగి అన్నదమ్ముల మృతి ● తల్లిదండ్రులకు తీరని వేదన కోటవురట్ల: మాటలకందని విషాదం.. పగవారికి సైతం రాకూడని ఉత్పాతం.. వరాహ నదిలో మునిగి అన్నదమ్ములు మృతి చెందారు.. ఉన్న పిల్లలిద్దరూ కన్నుమూయడంతో తల్లిదండ్రులు అంతులేని వేదనతో కన్నీరుమున్నీరయ్యారు. మీరే లేకపోతే ఇక మాకెందుకు ఈ బతుకు అంటూ వారు విలపిస్తున్న తీరు అందరి మనసులను కలచివేసింది. ఈ హృదయ విదారక ఘటన కోటవురట్ల శివారు జానకీరాంపురంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుర్ల దేవా (14), సుర్ల హిమవంత్ (10), అల్లు నాయుడులతోపాటు కె.వెంకటాపురానికి చెందిన పోలుపర్తి మోహన్ ఉదయం 8 గంటల సమయంలో గ్రామాన్ని ఆనుకుని ఉన్న వరాహ నదిలోకి ఈత కొట్టేందుకు దిగారు. ఒకచోట లోతు ఎక్కువగా ఉండడంతో అన్నదమ్ములైన దేవా, హిమవంత్ గోతిలో పడి మునిగిపోయారు. మిగతా ఇద్దరు పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వారిని బయటకు తీశారు. అప్పటికే అన్నదమ్ములిద్దరూ ఊపిరాడక మృతి చెందారు. అల్లు నాయుడు బాగానే ఉండగా పోలుపర్తి మోహన్ను స్థానిక సీహెచ్సీకి తరలించి చికిత్స చేయించారు. పిల్లలు ఈతకు వెళ్లే సమయానికి మృతుల తల్లిదండ్రులు సుర్ల రాము, సుర్ల లక్ష్మి ఉపాధి పనికి వెళ్లారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న వారిని ఆపడం ఎవరి తరం కాలేదు. మృతుల్లో పెద్దవాడైన దేవా చిన్నతనం నుంచి తాతగారి ఊరు రోలుగుంట మండలం రొంగలిపాలెంలో ఉంటూ రోలుగుంటలో చదువుకుంటున్నాడు. ఇటీవల తలుపులమ్మతల్లి పండగ జరగడంతో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. సెలవులు కావడంతో తమ్ముడు హిమవంత్, మిగతా పిల్లలతో కలిసి నదిలోకి దిగి ప్రమాదంలో చిక్కుకున్నా రు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రమేష్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. మృతుల తండ్రి సుర్ల రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలకు స్థానిక సీహెచ్సీలో పోస్టుమార్టం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ సత్యనారాయణరాజు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పైల రమేష్, సర్పంచ్ బి.అనిల్కుమార్ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
జాతీయ రహదారిపై కారు దగ్ధం
ఆరిలోవ: జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ప్రయాణిస్తున్న ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు కారులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మధురవాడ నుంచి నగరానికి వెళ్తున్న ఒక కారు జూ పార్కు సమీపంలోకి రాగానే పొగలు రావడం డ్రైవర్ గమనించాడు. వెంటనే అప్రమత్తమై కారును రోడ్డు పక్కన నిలిపివేశాడు. కారు ఆపిన వెంటనే మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ ఘటనతో వెనుక వస్తున్న ఇతర వాహనదారులు భయపడి సుమారు అర కిలోమీటరు దూరంగా తమ వాహనాలను నిలిపివేశారు. కారులో ఉన్నవారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మంటలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి. సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. కారు లోపల షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఈ ఘటనపై ఆరిలోవ పోలీసులు ప్రమాదవశాత్తు కారు దగ్ధమైనట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువతకు ఉపాధి.. యోధులకు భరోసా
ఉజ్వల భవిష్యత్తుకు బాటలు ఇక్కడ శిక్షణ పొందిన పలు రాష్ట్రాలకు చెందిన డిఫెన్స్ ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రాంతాలు, పట్టణాల్లో విజయవంతంగా ఉపాధి పొందుతున్నారు. కొందరు విశాఖ నగరంలోని పలు హోటళ్లు, గీతం వంటి యూనివర్సిటీల్లో ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొందరు ఇతర రాష్ట్రాల్లో సొంతంగా హోటళ్లు, పార్లర్లు కూడా నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు ఒడిశాకు చెందిన తుస్టి అనే ఆర్మీ ఉద్యోగి ఇక్కడ శిక్షణ పొందారు. పదవీ విరమణ తర్వాత తన పేరుతోనే ఒక పార్లర్ను విజయవంతంగా నడుపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో కొనసాగుతున్న ఈ ఫుడ్క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్.. అటు నిరుద్యోగ యువతకు, ఇటు దేశ సేవలో తరించిన సైనికులకు ఉపాధి మార్గాలను చూపుతూ ఆదర్శంగా నిలుస్తోంది. ఆరిలోవ: నగరంలోని ప్రభుత్వ ఫుడ్క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేక గుర్తింపు పొందింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏకై క ఇన్స్టిట్యూట్ ఇది. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతో మంది యువత దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించడంతో పాటు స్వయం ఉపాధి మార్గాల్లో స్థిరపడ్డారు. అలాగే ఈ ఇన్స్టిట్యూట్లో రక్షణ రంగ ఉద్యోగులకు సైతం వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తూ వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. విశాఖపట్నం రూరల్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో 1986లో ఈ ఫుడ్క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటైంది. అప్పటి నుంచి వేలాది మంది నిరుద్యోగ పేద యువతకు అండగా నిలుస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన యువతీ యువకులకు వంటలు, హాస్పిటాలిటీ, బేకరీ వంటి పలు విభాగాల్లో శిక్షణ ఇచ్చి, వారిని సొంతకాళ్లపై నిలబడేలా తీర్చిదిద్దుతోంది. రక్షణ రంగ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ 2017 నుంచి ఈ ఇన్స్టిట్యూట్ తన సేవల పరిధిని మరింత విస్తరించింది. కేంద్ర ప్రభుత్వ చొరవతో డిఫెన్స్ రంగంలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ ఉద్యోగులకు వంటల తయారీలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఉద్యోగ విరమణకు ఆరు నెలల గడువు ఉన్న వారిలో ఆసక్తి కలిగిన వారిని ఎంపిక చేసి, వారికి ఈ శిక్షణ అందిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ రీసెటిల్మెంట్(డీజీఆర్) ఆధ్వర్యంలో ఐఐటీ, ఎన్ఐటీ, ఎఫ్సీఐ వంటి సంస్థలతో పాటు ఫుడ్క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్లో కూడా ప్రీ రిలీజ్ కోర్సు(పీఆర్సీ)లలో భాగంగా ఈ శిక్షణను అందిస్తున్నారు. ఈ శిక్షణకు సంబంధించిన పూర్తి వ్యవహారాలను, ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇక్కడ ఉత్తర, దక్షిణ భారత వంటకాలతో పాటు హాస్పిటాలిటీ, బేకరీ, టూరిజం (హోటల్ మేనేజ్మెంట్) వంటి విభాగాల్లో నిష్ణాతులైన ఇన్స్ట్రక్టర్ల ద్వారా తర్ఫీదు ఇస్తున్నారు. 2017 నుంచి ఇప్పటివరకు 24 బ్యాచ్లకు శిక్షణ పూర్తి చేశారు. ప్రతీ బ్యాచ్ మూడు నెలల కాలపరిమితితో నడుస్తుంది. శిక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ సర్టిఫికెట్తో వారు పదవీ విరమణ అనంతరం స్వయం ఉపాధి పొందడానికి లేదా ఇతర సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించడానికి మార్గం సుగమం అవుతోంది. పదవీ విరమణ పొందుతున్న సైనికులకు ‘ఫుడ్క్రాఫ్ట్’ అండ మూడు నెలల శిక్షణతో స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధిడిఫెన్స్ ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు 2017 నుంచి డిఫెన్స్ ఉద్యోగులకు ఫుడ్ క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటివరకు 24 బ్యాచ్ల్లో 796 మందికి శిక్షణ అందించి సర్టిఫికెట్లు అందజేశాం. ఇక్కడ శిక్షణ పొందినవారు డిఫెన్స్లో రిటైర్ అయిన వెంటనే వివిధ రంగాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. కొందరు సొంతంగా హోటళ్లు, పార్లర్లు నిర్వహిస్తున్నారు. ఇది వారికి చాలా మంచి అవకాశం. ఈ శిక్షణకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. –కె.వి.రమణ, ప్రిన్సిపాల్, ఫుడ్క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్, విశాఖపట్నంరిటైర్మెంట్ అనంతరం నూతన కెరీర్ ఫుడ్క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్లో 2024 బ్యాచ్లో ‘డిప్లమో ఇన్ బ్యాంక్విట్ మేనేజ్మెంట్’లో మూడు నెలల పాటు శిక్షణ పొందాను. ఎయిర్ఫోర్స్లో ఉద్యోగ విరమణ అనంతరం గీతం వర్సిటీలో హాస్పిటాలిటీ సర్వీస్లో ఉద్యోగంలో చేరాను. ఫుడ్క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందడం వల్ల నాకు రిటైర్ అయిన తర్వాత కూడా ఉపాధి లభించింది. – ఆర్.అనూప్, రిటైర్డ్ ఉద్యోగి, ఇండియన్ ఎయిర్ఫోర్స్ శిక్షణ వల్లే సాధ్యమైంది 2024 బ్యాచ్లో ఫుడ్క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్లో హాస్పిటాలిటీలో శిక్షణ పొందాను. మూడు నెలల శిక్షణ అనంతరం తిరిగి ఎయిర్ఫోర్స్లో ఉద్యోగంలో చేరాను. మూడు నెలలు తర్వాత రిటైర్ అయ్యాను. అనంతరం గీతం యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం లభించింది. ఫుడ్క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్లో పొందిన శిక్షణ వల్లే ఇది సాధ్యమైంది. దీంతో నా కుటుంబాన్ని పోషించుకోవడానికి వేరే చోట ఉద్యోగం కోసం వెతకాల్సిన పని తప్పింది. – శ్రీకాంత్, రిటైర్డ్ ఉద్యోగి, ఇండియన్ ఎయిర్ఫోర్స్ -
బావిలో పడి వ్యక్తి మృతి
పెందుర్తి: తోటి కూలీలతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. పెందుర్తి మండలం ముదపాకలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ కె.వి.సతీష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా తెర్లాంకి చెందిన పక్కి ప్రసాద్(25) ముదపాకలోని జగనన్న కాలనీలో నిర్మాణ పనులు చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటి పనులు చేసిన తరువాత సమీపంలోని బావిలోకి తోటి ముగ్గురు నిర్మాణ కూలీలతో కలిసి ఈతకు వెళ్లాడు. మిగిలిన వారు వెళ్లిపోదాం అంటే ‘నేను కాసేపు ఉండి వస్తాను’ అని చెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రసాద్ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తోటి కూలీలు బావి వద్దకు వెళ్లారు. అక్కడ దుస్తులు ఉండడంతో ప్రసాద్ నీటిలో మునిగిపోయి ఉండవచ్చని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఆదేశాల మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రసాద్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు దర్యాప్తు జరుగుతుంది. -
జిల్లా రిసోర్స్ పర్సన్లకు శిక్షణ
ఆరిలోవ: విద్యా శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జల్లాల రిసోర్స్ పర్సన్ల(డీఆర్పీ)కు తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా శిక్షణ జరుగుతోంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. బుధవారం విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన ఎస్ఆర్పీలు(స్టేట్ ఆర్పీలు) 2015–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠశాల అకాడమీ క్యాలెండర్, గ్రంథాలయాల నిర్వహణ, సహిత విద్యలపై శిక్షణ ఇచ్చారు. ఇక్కడ శిక్షణ పొందిన డీఆర్పీలు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈ శిక్షణలో రాష్ట్ర పరిశీలకురాలు రోజ్లిల్లీ, డిప్యూటీ డీఈవో సోమేశ్వరరావు, తోటగరువు హైస్కూల్ హెచ్ఎం దుర్గాభవాని, ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి కృష్ణకుమార్ పాల్గొన్నారు. -
హెల్త్ ఎడ్యుకేటర్స్ సర్వీసెస్ అసోసియేషన్ హర్షం
విశాఖ సిటీ: హెల్త్ ఎడ్యుకేటర్ పోస్ట్ హోదాను డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా మార్పు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై హెల్త్ ఎడ్యుకేటర్స్ సర్వీసెస్, వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా డీఎంహెచ్వో డాక్టర్ జగదీశ్వర్ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు అభినందనలు తెలిపారు. తమ అభ్యర్థన మేరకు పేరు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎం.భానుమూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ పేర్కొన్నారు. దీనికి సహకరించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిహెచ్.సుధాకరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ బేగం, ట్రెజరర్ ఎన్.హరిప్రసాద్, సభ్యులు జయప్రకాశ్, అనురాధ, సుబ్బలక్ష్మి, సరోజిని తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో తొలి సిరామిక్ మోకాలి సంయోజన శస్త్రచికిత్స
● తొలి రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్స ● ఘనత సాధించిన ఎంజీఎం సెవెన్హిల్స్ హాస్పిటల్ డాబాగార్డెన్స్: విశాఖలోని ఎంజీఎం సెవెన్హిల్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సుశాంత్కుమార్ మల్లిక్ నేతృత్వంలో రాష్ట్రంలో రెండు చారిత్రాత్మక ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కుడి మోకాల్లో అడ్వాన్స్డ్ స్టేజ్–4 పోస్ట్ ట్రమాటిక్ ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడుతున్నాడు. ఎంజీఎం సెవెన్హిల్స్ హాస్పిటల్లో చేరగా వైద్య బృందం రాష్ట్రంలోనే తొలి సిరామిక్ మోకాలి సంయోజన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. మెటల్ ఇంప్లాంట్స్ కంటే సిరామిక్ ఇంప్లాంట్స్ ఎక్కువకాలం నిలిచి, అలర్జీ కలిగించని, బయో కంపాటిబుల్ లక్షణాలతో రోగులకు మెరుగైన, దీర్ఘకాల ఫలితాలు ఇస్తాయన్నారు. అలాగే రాష్ట్రంలోనే తొలి రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఒడిశాలోని బొలంగీర్కు చెందిన 48 ఏళ్ల సునీల్కుమార్ బిశ్వాల్ రొటేటర్ కఫ్ ఆర్థోపతి, సికిల్సెల్ వ్యాధి కారణంగా షోల్డర్ జాయింట్లో తీవ్ర సమస్యలు ఏర్పడ్డాయి. దీనికి అధునాతన శస్త్రచికిత్స చేసినట్లు తెలిపారు. ఈ పద్ధతిలో భుజం కీళ్ల నిర్మాణం రివర్స్ చేయబడుతుందని, డెల్టాయిడ్ మజిల్ రొటేటర్ కఫ్ ద్వారా భుజం కదలికలను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. ఈ శస్త్ర చికిత్స ద్వారా రోగి జీవిత నాణ్యతలో మెరుగుల కనిపించిందని, ఇంతకు ముందు ఇదే హాస్పిటల్లో హిప్ రివిజన్ శస్త్రచికిత్స విజయవంతంగా చేసుకున్న రోగి ప్రస్తుతం ఫిజియోథెరపీతో కోలుకుంటున్నాడని చెప్పారు. సమావేశంలో మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అశుతోష్ చందర్ సుడ్, జనరల్ మేనేజర్ సందీప్కుమార్ లెంక, డీజీఎంలు అశోక్ పట్నాయక్, వై.రమేష్ పాల్గొన్నారు. -
మోసాలను ఎండగడతాం..
వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ప్రజలకు చేసిన మోసాలను ఎండగడతామని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమాన్ని ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. -
● బూటకపు హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ● విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకూ అందరికీ పంగనామం ● 11 వేల పెన్షన్ల తొలగింపు.. 11,824 వలంటీర్లు, ఎండీయూ ఆపరేటర్లపై వేటు ● విశాఖలో ఐటీ కంపెనీ పేరుతో ఉర్సాకు అప్పనంగా భూములు ● గెలిపిస్తే స్టీల్ప్లాంట్ కోసం
విశాఖ అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదు. క్వాంటం వ్యాలీ, డేటా హబ్ పేర్లు చెప్పి గాల్లో మేడలు కడుతోంది. త్రీడీలో ప్లాన్లు చేస్తూ ప్రచారాలు చేసుకుంటోంది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, ప్రణాళికలే ప్రస్తుతం అమలవుతున్నాయి. మూడేళ్ల క్రితమే సిద్ధమైన విశాఖ మెట్రో రైలు డీపీఆర్కు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు 15 మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక్క రహదారికి కూడా ప్రణాళిక చేయలేదు. గాల్లో మేడలు.. త్రీడీలో ప్లాన్లు -
అనుమతి కోసం పోలీసులకు లేఖ
విశాఖ సిటీ: వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి అనుమతి కోరుతూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏడీసీపీ అడ్మిన్కు లేఖ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సమన్వయకర్త మొల్లి అప్పారావు, పార్టీ కార్యాలయం పర్యవేక్షకుడు రవిరెడ్డి, మాజీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ వర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీవాత్సవ్, జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గ, జిల్లా అనుబంధం విభాగ అధ్యక్షులు పేడాడ రమణికుమారి, బోని శివరామకృష్ణ, దేవరకొండ మార్కండేయులు, వడ్డాది దిలీప్, పార్టీ నాయుకులు నీలి రవి, ఎస్.కె.బాబ్జి, కొట్యాడ సూర్య, పీతల గోవింద్, జానకిరామ్, విశాలాక్షి, అప్పన, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీలకు మేలు చేసేలా లేవు
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న పథకాలు నగర ఎస్సీలకు మేలు చేసే విధంగా లేవు. జిల్లాల విభజనతో విశాఖ జిల్లా పూర్తిగా నగరం పరిధిలోకి వచ్చింది. బ్రిక్స్, రీసైక్లింగ్, ఇతర చిన్న పరిశ్రమలను ఎస్సీలు నిర్వహించేందుకు స్థలాలు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో సిటీ జీవనానికి అనుగుణంగా పథకాల అమలులో మార్పులు జరగాలి. స్వయం ఉపాధి రుణాలకు దరఖాస్తు గడువు కంటే 2 రోజులు ముందే వెబ్సైట్ నిలిచిపోయింది. దీంతో వందల మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. రుణాల మంజూరులో బ్యాంకులు సైతం సహకరించడం లేదు. – కస్తూరి వెంకటరావు, ఎస్సీ సంఘం నాయకుడు -
నిరసనలతో హోరెత్తుతున్న విశాఖ
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో వేలాది మంది జీవనాధారాన్ని కోల్పోయారు. కుటుంబాలతో రోడ్డున పడ్డారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలతో అరచేతిలో స్వర్గాన్ని చూపించారు. ఇప్పుడు చేతిలో ఉన్న ఉపాధిని సైతం దూరం చేశారు. వలంటీర్లకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తామని నోట్లో బూర్లు వండేశారు. అధికారంలోకి వచ్చాక వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి 11,122 మంది నోట్లో మట్టి కొట్టారు. రైస్ కార్డుదారులకు మరిన్ని నిత్యావసరాలు పంపిణీ చేస్తామని మభ్య పెట్టారు. ఇప్పుడు ఇంటింటి రేషన్ విధానానికి స్వస్తి చెప్పి పేదలను కిలోమీటర్లు నడిపించి, గంటల తరబడి క్యూలో నిలబెట్టి అష్టకష్టాలు పెడుతున్నారు. సంపద సృష్టిస్తామని డబ్బా కొట్టి.. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు, భూముల ధరలు పెంచి సుమారు రూ.250 కోట్ల భారం మోపి నగర ప్రజల నడ్డివిరిచారు. విశాఖకు ఐటీ పెట్టుబడులు తీసుకొస్తామని కబుర్లు చెప్పి.. ఊరూపేరూ లేని ఉర్సా కంపెనీకి రూ.వందల కోట్లు విలువ చేసే భూములను ధారాదత్తం చేశారు. సూపర్ సిక్స్ హామీలు గాలికొదిలేశారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు, అభిమానులు, సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతూ.. కక్ష సాధిస్తూ.. పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో బాబు ష్యూరిటీ.. వెన్నుపోటు గ్యారెంటీ అని చంద్రబాబు మరోసారి నిరూపించారు. –విశాఖ సిటీసూపర్ సిక్స్ పేరుతో బూటకపు హామీలు గుప్పించి ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చడానికి ఖజానా ఖాళీ అయిపోయిందని కుంటి సాకులు చెబుతున్నారు. స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని విద్యార్థులను మోసం చేశారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని, ఉచిత బస్సు ప్రయాణమని మాయమాటలు చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి అన్నదాతకు వెన్నుపోటు పొడిచారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ, పెండింగ్ డీఏలు అన్నీ ఇస్తామని చెప్పి బుట్టలో వేసుకుని ఇప్పుడు నిలువునా ముంచారు. ఇలా విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అందరికీ పంగనామాలు పెట్టారు. ‘ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పోరాడతాం’ అని ఎన్నికలకు ముందు చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక పత్తా లేకుండా పోయారు. ఉక్కు పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం నెమ్మదిగా ఉద్యోగులకు వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపిస్తోంది. కాంట్రాక్టు కార్మికులపై వేటు వేసింది. దీంతో వేలాది మంది కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గత ఏడాది కాలంగా కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు చేస్తున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్గానీ వారి గోడును పట్టించుకున్న దాఖలాలు లేవు. తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు నిరసనలు చేపడుతుంటే.. వారి ఆందోళనలను అణిచివేయడానికి పోలీసులను ప్రయోగిస్తుండడం గమనార్హం. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో వలంటీర్లు, 108 ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ టీచర్లు, ఆశా కార్యకర్తల ధర్నాలు, నిరసనలతో విశాఖ హోరెత్తిపోతోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుకు, సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న ధర్నాలతో దద్దరిల్లుతోంది. ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని 108 ఉద్యోగులు.. విధుల్లోకి తీసుకొని రూ.10 వేలు వేతనం ఇవ్వాలని వలంటీర్లు.. సమస్యలు పరిష్కరించాలంటూ ఆశ వర్కర్ల నిరసనలు.. ఆకలి కేకలతో అలమటిస్తూ పెండింగ్ జీతాల కోసం ఆయాల పొలికేకలు.. ఎండీయూ వాహనాలు రద్దు చేయడంతో రోడ్డున పడ్డ 702 మంది ఆపరేటర్లు, హెల్పర్ల ఆర్తనాదాలు.. ఇలా చంద్రబాబు ఏడాది పాలనలోనే అన్ని వర్గాల నుంచి అసహనం కట్టలు తెంచుకుంటోంది. దౌర్జన్యాలు.. బెదిరింపులు ఐటీ, పర్యాటక రాజధాని పేరుతో మోసం వలంటీర్ల నిరసన(ఫైల్)పత్తా లేకుండా పోయిన పవన్ కల్యాణ్సూపర్ సిక్స్ హామీలకు మంగళం నా -
విశాఖ అభివృద్ధికి ప్రణాళికలు
విశాఖ సిటీ: విశాఖను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ పేర్కొన్నారు. విశాఖలో వన్యప్రాణుల అభయారణ్యం అభివృద్ధిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు వచ్చిన సింగపూర్కు చెందిన మాండై వైల్డ్ లైఫ్ ప్రతినిధులతో మంగళవారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకులను ఆకర్షించే విధంగా కై లాసగిరిపై జిప్లైనర్, స్కై సైక్కింగ్ను ఏర్పాటు చేసి నట్లు చెప్పారు. త్వరలోనే గ్లాస్ బ్రిడ్జ్ కూడా అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపారు. రోప్వేను మరింత ఆధునికీకరణ దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జూ పార్క్ క్యూరేటర్ మంగమ్మ జూ అభివృద్ధిపై వివరించారు. పార్కును మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ శ్రీభరత్, చైర్మన్ ప్రణవ్గోపాల్ సూచించారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్, మాండై వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈఓ మైక్ బార్క్లే, ఉపాధ్యక్షుడు మార్క్ క్రెమెడ్స్ పాల్గొన్నారు. -
కోడి వ్యర్థాల టెండర్లు రద్దు
కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ నిర్ణయం డాబాగార్డెన్స్: కోడి వ్యర్థాల సేకరణ, రవాణాలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి, అధికార కూటమిలోని అంతర్గత కుమ్ములాటలపై ‘సాక్షి’గత నెల 29న ప్రచురించిన ‘కోళ్ల వ్యర్థాల కోసం కుమ్ములాటలు!’ అనే కథనానికి కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ స్పందించారు. జీవీఎంసీ పరిధిలోని కోడి వ్యర్థాల టెండర్లను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. కోడి వ్యర్థాల సేకరణ వ్యవహారంలో అధికార కూటమిలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. అధికారికంగా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్కు కొందరు నేతలు మద్దతిస్తుండగా, అనధికారిక సేకరణదారులకు మరికొందరు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ దండుబజారులో జరిగిన గొడవ విషయమై మహారాణిపేట పోలీసులపై ఒత్తిడి చేశారు. జీవీఎంసీ అధికారులపై మండిపడుతూ తమ వారే వ్యర్థాలు సేకరిస్తారని, ఎలా అడ్డుకుంటారని గట్టిగా కేకలు వేస్తూ హెచ్చరించారు. అలాగే జీవీఎంసీలోని 8 జోన్లకు సంబంధించి 8 మందికి టెండర్లు అప్పగించడంపై కూడా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ మేరకు జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ వివాదాస్పదంగా మారిన కోడి వ్యర్థాల టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మేయర్ వర్సెస్ కార్పొరేటర్ : ఇదే అంశంపై గత సోమవారం జీవీఎంసీలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రమాదకర కోడి వ్యర్థాల అక్రమ రవాణా, అవినీతిలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, జీవీఎంసీ ప్రజారోగ్య అధికారుల ప్రమేయాన్ని నిరోధించాలని కోరుతూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి నగర మేయర్ పీలా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో మేయర్కు, కార్పొరేటర్కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జీవీఎంసీకి మచ్చ తీసుకురావద్దని మూర్తి యాదవ్ సూచించగా.. ‘నా స్థానానికి నీవు విలువ ఇవ్వు. నీ స్థానానికి విలువ తీసుకో’అంటూ మేయర్ మండిపడ్డారు. ఈ క్రమంలో ‘మీ వాయిస్ బాగోలేదు’ అంటూ మేయర్ అతనిపై తీవ్రస్వరంతో హెచ్చరించారు. దీంతో మరోసారి కూటమి పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. -
సంక్షేమ పథకాలు బినామీల పరం
● ఆరోపించిన దళిత సంఘాల నాయకులు ● బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు కరువు ఎంవీపీకాలనీ: జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, రుణాల మంజూరులో బినామీల పాత్ర పెరిగిపోయిందని దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎంవీపీ కాలనీలోని సంక్షేమ భవన్ సెమినార్ హాలులో మంగళవారం రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్కుమార్ అధ్యక్షతన ఎస్సీ సంఘాల నాయకులు, వీధి వ్యాపారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు పలు సమస్యలను లేవనెత్తారు. స్కూల్ బస్సులు, ట్రాక్టర్ల వంటి పెద్ద మొత్తంలో రుణాలు బినామీల పేరుతో మంజూరవుతున్నాయని ఆరోపించారు. స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియకముందే వెబ్సైట్లు మొరాయిస్తున్నాయని, దీంతో అర్హులైన వారు నష్టపోతున్నారని తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కార్పొరేషన్ ద్వారా ఎస్సీ యువతకు పారిశ్రామిక ప్రోత్సాహం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్కు చెందిన విలువైన భూములను పరిరక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారని, భూమి కొనుగోలు పథకం పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. విశాఖపట్నం జిల్లా పూర్తిగా నగరాన్ని ఆనుకుని ఉన్నందున.. రుణాల మంజూరు ప్రక్రియలో అందుకు అనుగుణంగా మార్పులు చేయాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్లో ప్రక్షాళన అవసరమని, పారదర్శకత పెంచాలని కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ విజయ్కుమార్ మాట్లాడుతూ దళిత సంఘాల నాయకులు లేవనెత్తిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాల భౌగోళిక పరిస్థితులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యపద్మ, మాల కార్పొరేషన్ డైరెక్టర్లు కొండ్రు మరిడయ్య, సబ్బవరపు గణేష్, పౌర సరఫరాలశాఖ డైరెక్టర్ బోడపాటి శివదత్త, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయ విద్యార్థుల అ‘పూర్వ’ కలయిక
కె.కోటపాడు: విశాఖపట్నంలోని న్యాయ విద్యాపరిషత్ లా కళాశాలలో 1993లో చదువులు సాగించిన పూర్వ విద్యార్థులు అనకాపల్లి జిల్లా చౌడువాడలో అపూర్వ కలయిక పేరుతో కలుసుకున్నారు. మూడు దశాబ్దాల తరువాత స్నేహితులంతా ఒక్కచోట చేరి గత స్మృతులను నెమరువేసుకున్నారు. అల్లరి చేష్టలను తలచుకొని రోజంతా సంతోషంగా గడిపారు. కుటుంబాల యోగక్షేమాలను ఒకరికి ఒకరు తెలుపుకున్నారు. ఈ అపూర్వ కలయికకు చోడవరం న్యాయవాది, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కాండ్రేగుల డేవిడ్ సారథ్యం వహించారు. వివిధ ప్రాంతాల్లో న్యాయవాద వృత్తి నిర్వహిస్తున్న వారు, న్యాయశాఖలో వివిధ హోదాల్లో స్థిరపడిన వారు హాజరయ్యారు. మూడు దశాబ్దాల తరువాత చౌడువాడలో కలుసుకున్న పాత మిత్రులు -
బొగ్గు లారీ బీభత్సం
నలుగురికి గాయాలు పరవాడ: అనకాపల్లి–విశాఖ జాతీయ రహదారి లంకెలపాలెం కూడలిలో మంగళవారం ఉదయం ఓ బొగ్గు లారీ బీభత్సం సృష్టించింది. విశాఖ పోర్టు ట్రస్టు నుంచి అచ్యుతాపురం ఎస్ఈజెడ్కు వెళ్తున్న బొగ్గు లారీ ఉద యం 6.45 గంటల సమయంలో అతివేగంగా వచ్చి ముందున్న కారును, ఆటో ను ఢీకొట్టింది. అనంతరం సిగ్న ల్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని నిలిచిపోయింది. ప్ర మాదంలో కారు వెనుక భాగం దె బ్బతినగా, ఆటో ముందు భాగం నుజ్జయింది. ఆటోలో ఉన్న సీతారాములు, నాగలక్ష్మి, ఆదిలక్ష్మి, దేముడమ్మ గాయపడ్డారు. క్షతగాత్రులను అగనంపూడి ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన ఆదిలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించారు. ఈ ప్రమాదంలో సిగ్నల్ విద్యుత్ స్తంభం, హైమాక్స్ లైట్, రెయిలింగ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉదయం సమయంలో రోడ్డుపై పెద్దగా జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు, ఎస్ఐ కృష్ణారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బొగ్గు లారీని క్రేన్ సహాయంతో బయటకు తీసి.. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లికార్జున రావు తెలిపారు. -
కమాండెంట్ మురళీకృష్ణకు ఘనంగా వీడ్కోలు
పీఎంపాలెం: ఏపీఎస్పీ 16వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న కేవీ మురళీకృష్ణ తిరుమల దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం బక్కన్నపాలెం బెటాలియన్ ఆవరణలో ఆయన వీడ్కోలు సభ జరిగింది. స్థానిక అధికారులు, సిబ్బంది కమాండెంట్ మురళీకృష్ణ దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం మురళీకృష్ణ మాట్లాడుతూ టీటీడీ సీవీఎస్వోగా బదిలీ కావడం, శ్రీవారి సన్నిధిలో సేవ చేసే అవకాశం లభించడం మహాభాగ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇన్చార్జి కమాండెంట్గా బాధ్యతలు చేపట్టిన శ్రీకాకుళం 1వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ సీహెచ్వీఎస్ పద్మనాభరాజు మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సంక్షేమం కోసం మురళీకృష్ణ నిరంతరం కృషి చేశారని కొనియాడారు. కేజీహెచ్ అంకాలజీ విభాగాధిపతి డాక్టర్ శిల్పా మురళీకృష్ణ, ఇన్చార్జి అదనపు కమాండెంట్ పి.సత్యం, సహాయ కమాండెంట్లు ఎన్.మురళీధర్, వి.నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు. -
నాస్కామ్ ఉచిత ఇంటర్న్షిప్నకు దరఖాస్తులు
మద్దిలపాలెం: నాస్కామ్ ఉచిత ఇంటర్న్షిప్ ప్రొగ్రా మ్లో భాగంగా ఏయూ పరిధిలో 50 వేల మంది ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు అవకాశం కల్పించనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ తెలిపారు. ఈ మేరకు ప్రొగ్రామ్ పోస్టర్ను మంగళవారం ఆవిష్కరించి, మాట్లాడారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఏపీ ఉన్నత విద్యా మండలి, ఏయూ సంయుక్తంగా నాస్కామ్ సహకారంతో విద్యార్థులకు ఈ ఉచిత స్వల్పకాలిక ఇంటర్న్షిప్ను అందిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఈ నెల 7లోగా ఉన్నత విద్యా మండలి పోర్టల్లో విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 90526 56967లో సంప్రదించాల్సిందిగా సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య ధనుంజయరావు, నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ రీజినల్ హెడ్ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘వెన్నుపోటు దినం’ పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో రాష్ట్ర ప్రజలను మోసగించిన తీరును ఎండగడుతూ బుధవారం జరిగే ‘వెన్ను పోటు దినం’కార్యక్రమానికి విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, ఎమ్మెల్యే వరుదు కల్యాణి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో మంగళవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా విభాగ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కె.కె.రాజు, వరుదు కల్యాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. చిన్నారులపై అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నా.. కూటమి ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఏడాది పాలనలో ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కాలేదని.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను ప్రజలకు చెప్పే బాధ్యతను మహిళలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, వార్డు మహిళా నేతలు పాల్గొన్నారు. -
డిజిటల్ భాగ్యం కలిగేనా?
ఆధునిక ప్రమాణాలతో.. అయితే డిజిటల్ చెల్లింపుల అమలులో కొన్ని సాంకేతిక సమస్యలు, దుర్వినియోగం జరిగే అవకాశం వంటి అంశాలపై దేవస్థానం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవి సహేతుకమైనవే అయినప్పటికీ.. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో కూడిన ఆధునిక సాఫ్ట్వేర్ను వినియోగించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. భక్తుల సౌలభ్యాన్ని, దేవస్థానం ఆర్థిక ప్రయోజనాలను, లావాదేవీల్లో పారదర్శకతను దృష్టిలో ఉంచుకుని.. సింహాచలం దేవస్థానంలో కూడా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సింహాచలంలో దర్శనం టికెట్లు, వివిధ ఆర్జిత సేవల టికెట్లు, ప్రసాదాల కొనుగోలు, కేశఖండన వంటి అన్ని సేవలకు నగదు చెల్లింపు తప్పనిసరి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, చత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ వంటి సుదూర ప్రాంతాల నుంచి సింహగిరికి భక్తులు తరలివస్తుంటారు. అయితే సరిపడా నగదు వెంట తెచ్చుకోలేనివారి భక్తుల బాధలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు అధికంగా వినియోగించే యువత.. సరిపడా నగదు వెంట తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో స్మార్ట్ఫోన్, బ్యాంకు ఖాతాలో నగదు ఉన్నప్పటికీ.. ఆలయ కౌంటర్ల వద్ద ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపుల సౌకర్యం లేకపోవడంతో గంటల తరబడి క్యూలో నిరీక్షించి.. చివరకు నిరాశకు గురవుతున్నారు. కొండ దిగువన బస్సు టికెట్టు నుంచి కొండపైన ప్రతి అవసరానికీ నగదు కోసం ఇతరులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వస్తే.. ఈ సమస్యలన్నీ తీరుతాయని భక్తులు అంటున్నారు. దేవస్థానానికి ఆదాయ మార్గం డిజిటల్ పేమెంట్లు అందుబాటులో లేకపోవడంతో దేవస్థానం కొంత ఆదాయం నష్టపోతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిత్యాన్నదాన పథకానికి విరాళాలు అందించాలనుకునే భక్తులు అనేకమంది ఉంటారు. ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం నగదు, చెక్కు, డీడీ రూపంలో విరాళాలు స్వీకరిస్తున్నారు. స్వామికి విరాళం ఇవ్వాలని వారు ముందుగా నిర్ణయించుకుని సింహగిరికి వస్తారు. పై మూడు పద్ధతుల్లో ఏదొకదాన్ని అనుసరించి విరాళం అందజేస్తుంటారు. కాగా.. ఆలయానికి వచ్చిన తర్వాత, స్వామి వారి దర్శనానంతరం లేదా అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత తక్షణమే తమకు తోచినంత విరాళం ఇవ్వాలని చాలా మంది భక్తులు భావిస్తుంటారు. అయితే చేతిలో తగినంత నగదు లేకపోవడం, డిజిటల్ చెల్లింపుల సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో వీరు విరాళం ఇవ్వలేక వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం అన్నప్రసాద విభాగం కౌంటర్ వద్ద రోజూ పదుల సంఖ్యలో భక్తులు డిజిటల్ చెల్లింపుల గురించి ఆరా తీస్తున్నారు. డిజిటల్ చెల్లింపులతో చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు విరాళాలు సులభంగా స్వీకరించే వీలుంటుంది, తద్వారా అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా, సమర్థవంతంగా నిర్వహించవచ్చు. అంతేకాకుండా దర్శనం టికెట్లు, ఇతర సేవల ద్వారా కూడా దేవస్థానానికి పారదర్శకంగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అప్పన్న సన్నిధిలో అన్నీ నగదు లావాదేవీలే.. డిజిటల్ పేమెంట్లు లేక భక్తుల అవస్థలు విరాళాల సమర్పణలోనగదు రహిత చెల్లింపులతో మేలు తద్వారా భక్తులకు సౌలభ్యం, దేవస్థానానికి ఆదాయం -
‘పాలగెడ్డ’లో జారి యువకుడి మృతి
మృతుడు అక్కయ్యపాలెం వాసిమాడుగుల రూరల్: మాడుగులలో జరుగుతున్న మోదమాంబ జాతరకు విశాఖపట్నం నుంచి వచ్చిన యువకుడు పాలగెడ్డ జలాశయంలో కాలుజారి పడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి. అక్కయ్యపాలెం గణేష్నగర్ కాలనీకి చెందిన కె.రోషన్, జయశంకర్, గణేశ్, ఎన్.నవీన్ కలిసి మంగళవారం ఉదయం మాడుగుల సమీపంలోని పాలగెడ్డ జలాశయంలో దిగారు. వీరిలో రోషన్ కాలుజారి జలాశయంలో పడిపోయాడు. రోషన్కు ఈత రాకపోవడంతో జలాశయంలో పడి మృతి చెందాడు. యువకుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రోషన్ మృతితో మిత్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జాతర రోజున ఇటువంటి సంఘటన జరగడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
కౌన్సెలింగ్ సాగుతుందిలా..
తేదీ సమయం ర్యాంకు నంబర్లు 05.06.2025 ఉదయం 8.00 1 నుంచి 230 మధ్యాహ్నం 1.00 231 నుంచి 479 06.06.2025 ఉదయం 8.00 480 నుంచి 737 మధ్యాహ్నం 1.00 738 నుంచి 1041 07.06.2025 ఉదయం 8.00 1042 నుంచి 1361 మధ్యాహ్నం 1.00 1362 నుంచి 1663 09.06.2025 ఉదయం 8.00 బాలికలు, స్టీల్ప్లాంట్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 1 నుంచి 804 10.06.2025 ఉదయం 8.00 మిగులు ర్యాంకుల అభ్యర్థులు 805 నుంచి 1663 -
ముగిసిన బ్యాడ్మింటన్ టోర్నీ
ఎంవీపీకాలనీ: ఎంవీపీకాలనీలోని ఎస్–3 స్పోర్ట్స్ ఏరీనా వేదికగా జరుగుతున్న హండ్రెడ్ ఎస్3 ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మంగళవారంతో ముగిసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 400 మంది క్రీడాకారులు అండర్ 11, 13, 15, 17 ఏళ్ల కేటగిరీల్లో హోరాహోరీగా తలపడ్డారు. ఇండియన్ ఆయిల్ సీనియర్ మేనేజర్ చైతన్య, శ్రీనివాస్, కార్పొరేటర్ ఉషశ్రీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వి.వి.సోమరాజును సత్కరించారు. స్పోర్ట్స్ ఏరీనా నిర్వాహకుడు సహాని తదితరులు పాల్గొన్నారు. -
పల్లా శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ కార్మికులపై టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ రావు(Palla Srinivas Rao) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చాలామంది పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పల్లా వ్యాఖ్యలపై జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు మండిపడ్డారు. ఊసరవెల్లి రాజకీయాలను పక్కనపెట్టి కార్మికులకు క్షమాపణలు చెప్పాలంటూ పల్లాను డిమాండ్ చేశారు. పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి?. అంత ప్రేమ ఉంటే.. మహానాడులో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఎందుకు చర్చించలేదు. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని కార్మికులకు క్షమాపణలు చెప్పాలి. సొంత గనులు లేక స్టీల్ ప్లాంట్కు నష్టాలు వస్తున్నాయి. ఇకనైనా తన ఊసరవెల్లి రాజకీయాలను పల్లా పక్కనపెడితే మంచిది’’ అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ జేఏసీ(Vizag Steel Plant JAC) నాయకులు అన్నారు. ‘‘వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant)లో ఘోస్ట్ ఉద్యోగులు ఉన్నారు. పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారు. 400 మంది కార్మిక నాయకులు ఈ లిస్ట్లో ఉన్నారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే నాలుగేళ్లలో ప్లాంట్ మూసేయాల్సి ఉంటుంది’’ అని పల్లా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమను అవమానపరిచేలా ఉన్నాయంటూ కార్మికులు పల్లాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ఉర్సా భూముల వ్యవహారం.. మంత్రి లోకేష్కు మాజీ మంత్రి సవాల్ -
రెండో రోజూ అవే అవస్థలు
● కొనసాగుతున్న రేషన్ కష్టాలు ● సర్వర్ డౌన్, పనిచేయని ఈపోస్ ● మండుటెండలో కార్డుదారుల నరకయాతన మహారాణిపేట: రేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన రెండో రోజు సోమవారం కూడా ప్రజల కష్టాలు కొనసాగాయి. సాంకేతిక సమస్యలు, పంపిణీలో జాప్యం కారణంగా కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా రేషన్ షాపులలో సర్వర్ మొరాయింపు, ఈ–పోస్ యంత్రాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తడంతో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండలో నిలబడి, క్యూలైన్లలో సరుకుల కోసం ప్రజలు పడిగాపులు కాశారు. ఈ సాంకేతిక లోపాలు పంపిణీ ప్రక్రియను మరింత క్లిష్టతరం చేశాయి. మోత తప్పలేదు గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ‘ఇంటింటి రేషన్’ పథకం ద్వారా ఎండీయూ వాహనాల ద్వారా నిత్యావసరాలు ఇంటి వద్దకే చేరేవి. దీనివల్ల వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు ఎంతో సౌలభ్యం లభించేది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఎండీయూ వాహనాలను నిలిపివేయడంతో ప్రజలు మళ్లీ రేషన్ డిపోల వద్దకు వెళ్లక తప్పడం లేదు. రేషన్ డిపోల వద్ద సరుకులను మోసుకొని వెళ్లే దృశ్యాలు సోమవారం కూడా కనిపించాయి. రెండో రోజు కేవలం 11 శాతం మాత్రమే.. జిల్లాలో రేషన్ పంపిణీ ప్రారంభమై రెండు రోజులు గడిచినా ఇబ్బందులు తప్పలేదు. మొదటి రోజు కేవలం 5.04శాతం మంది కార్డుదారులు మాత్రమే సరుకులు అందుకున్నారు. రెండో రోజు సోమవారం 11శాతం మందికి మాత్రమే సరుకులు అందజేశారు. మొత్తం రెండు రోజుల్లో 5,24,979 మంది కార్డుదారులలో కేవలం 96,019 మందికి బియ్యం పంపిణీ చేయగా, 84,384 మందికి పంచదార పంపిణీ చేశారు. -
వైశ్యరాజు జ్యూయలర్స్ షోరూమ్ ప్రారంభం
పీఎం పాలెం: స్థానిక కారుషెడ్ కూడలికి సమీపంలో వైశ్యరాజు జ్యూయలర్స్ తమ కొత్త భారీ షోరూమ్ను సోమవారం ఘనంగా ప్రారంభించింది. కొవ్వూరి పుండరీకాక్ష రెడ్డి రిబ్బన్ కట్ చేసి షోరూమ్ను ప్రారంభించగా, జామి భోగరాజు మొదటి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా వైశ్యరాజు జ్యూయలర్స్ ఎండీ వైశ్యరాజు భద్రగిరి రాజు మాట్లాడుతూ పీఎం పాలెం, మధురవాడ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన, ఆధునిక డిజైన్లలో బంగారు ఆభరణాలను అందించడానికి కారుషెడ్ మెయిన్ రోడ్డులో ఈ భారీ షోరూమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అన్ని రకాల 22కే బంగారు ఆభరణాలపై 6శాతం తరుగు మాత్రమే వసూలు చేస్తామని, ఈ ఆఫర్ నగదు/యూపీఐ/ఈ–ట్రాన్స్ఫర్ చెల్లింపులకు వర్తిస్తుందన్నారు. సాధారణ వెండి వస్తువులపై తరుగు, మజూరీ, జీఎస్టీ ఉండవన్నారు. కిలో వెండి వస్తువుల కొనుగోలుపై రూ. 12,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ప్రత్యేక ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భద్రగిరి రాజు కోరారు. కార్యక్రమంలో వైశ్యరాజు జ్యూయలర్స్ చైర్మన్ వైశ్యరాజు ఫల్గుణరాజు, సంస్థ డైరెక్టర్లు సురేష్, కిరణ్ కుమార్ రాజు పాల్గొన్నారు. -
రంగంలోకి రేషన్ మాఫియా
● రేషన్ డిపోలు తెరవగానే బియ్యం మాయం ● విశాఖలో రెండుచోట్ల రేషన్ బియ్యం అక్రమ రవాణాకు బ్రేక్ ● 3,999 కిలోల బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు విశాఖ సిటీ/ఎంవీిపీ కాలనీ: రేషన్ డిపోలు ప్రారంభించిన రెండో రోజే రేషన్ మాఫియా మళ్లీ పురివిప్పింది. పేదల కోసం ఉద్దేశించిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించడానికి సిద్ధమైంది. రైల్వే న్యూకాలనీలో 1,509 కిలోలు, ఇసుకతోట కూడలిలో అక్రమంగా తరలిస్తున్న 2,490 కిలోల బియ్యం తరలిస్తున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు ఇబ్బందులు లేకుండా ‘ఇంటింటి రేషన్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎండీయూ వాహనాల ద్వారా నిత్యావసరాలను ఇంటి వద్దకే అందించింది. ఇది కార్డుదారులకే కాకుండా నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి కల్పించింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు బియ్యం కార్డుదారులకు కందిపప్పు, గోధుమపిండి, చోడిపిండి, వంటనూనె వంటి నిత్యావసరాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక ఇంటింటి రేషన్ విధానానికి స్వస్తి పలికి, మళ్లీ పాత విధానంలో రేషన్ డిపోల్లోనే నిత్యావసరాలు అందించేలా ఉత్తర్వులు జారీ చేశారు. డిపోలపై అనుమానాలు.. రేషన్ డిపోలలో సరుకులు ఇవ్వడంతో కార్డుదారులకు పాత కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. కిలోమీటర్లు ప్రయాణించి, గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి బియ్యం, పంచదార కోసం అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభించిన ఈ ప్రక్రియ ప్రహసనంగా మారింది. కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమక్షంలో అట్టహాసంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టింది. అయితే తొలి రోజే సర్వర్ పనిచేయకపోవడం, నిత్యావసరాల పంపిణీలో ఇబ్బందులు తలెత్తడంతో కార్డుదారులతో చీవాట్లు తినాల్సి వచ్చింది. మూడో రోజు సోమవారం కూడా అదే పరిస్థితి నెలకొంది. రేషన్ డిపోల ద్వారా నిత్యావసరాలు పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. గతంలో చౌక దుకాణాల నుంచి టన్నులకు టన్నుల బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిపోయిన సందర్భాలు అనేకమున్నాయి. తాజాగా అదే విధానంలో మళ్లీ సరుకుల పంపిణీని చేపట్టడంతో బియ్యం, పంచదార బ్లాక్ మార్కెట్కు వెళ్లిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందరూ ఊహించినట్లుగానే, రేషన్ డిపోల ద్వారా సరుకులు పంపిణీ చేపట్టిన మూడో రోజే బియ్యం అక్రమ రవాణా మాఫియా రంగంలోకి దిగింది. చౌక దుకాణ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించేందుకు సిద్ధమైపోయింది. రైల్వే న్యూకాలనీలో గుట్టుచప్పుడు కాకుండా బియ్యాన్ని తరలిస్తుండగా నాలుగో పట్టణ పోలీసులు వాహనాన్ని పట్టుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని 1,509 కిలో చౌక బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఇసుకతోట కూడలిలో అక్రమంగా తరలిస్తున్న 2,490 కేజీల పీడీఎస్ బియ్యం ఎంవీపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్ను అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో.. విశాఖలోనే కాకుండా, అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మండలం ఏ.కొత్తపల్లి రేషన్ డిపోపై విజిలెన్స్, పౌర సరఫరా అధికారులు దాడులు చేయగా, 764 కేజీల బియ్యం, 25 ప్యాకెట్ల పంచదార అదనంగా ఉన్నట్లు గుర్తించారు. కార్డుదారులకు సరుకులు ఇవ్వకుండానే బయోమెట్రిక్ వేయించుకుని డిపోల నిర్వాహకులు అప్పుడే అక్రమాలకు తెరలేపినట్లు ఈ ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో రూ.30కి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీలు చేపట్టిన రెండు చోట్ల అక్రమాలు, అవకతవకలు బయటపడ్డాయి. ఇతర డిపోల్లో కూడా తనిఖీలు చేపడితే మరింత మంది లీలలు బయటపడతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కోడి వ్యర్థాల అక్రమ రవాణాపై విచారణ డిమాండ్
డాబాగార్డెన్స్: నగరంలో కోడి వ్యర్థాల సేకరణ, రవాణాలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి, ప్రమాదకరమైన చీకటి వ్యాపారంపై విచారణ చేపట్టాలని కోరుతూ జీవీఎంసీ సీపీఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి.గంగారావు, కూటమి కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సోమవారం జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మేయర్కు పీలా శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ వ్యవహారంపై విచారణకు ఫ్లోర్ లీడర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని డాక్టర్ బి.గంగారావు డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా నగరంలో కోడి వ్యర్థాల సేకరణ, రవాణాలో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా తీవ్ర అనైతిక, ప్రమాదకర అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం వ్యర్థాలను కాపులుప్పాడ డంపింగ్ యార్డ్కు తరలించకుండా, అక్రమంగా చేపల చెరువులకు తరలించి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యర్థాలను వినియోగించిన చేపల చెరువుల్లోని చేపలను తిన్న ప్రజలు ప్రమాదకరమైన వ్యాధులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అనైతిక కుంభకోణంలో అధికార కూటమికి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని,ఈ చీకటి కార్యకలాపాలను అరికట్టాల్సిన ప్రజాప్రతినిధులే బినామీలుగా వ్యవహరించడం నేరమని వారు తీవ్రంగా విమర్శించారు. కోడి వ్యర్థాల అక్రమాలు, అవినీతిపై విచారణకు కౌన్సిల్లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలనిడిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి లేఖలుఇదే అంశంపై కూటమి జనసేన కార్పొరేటర్ కూడా కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ హరేందిర ప్రసాద్, నగర మేయర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్య మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, సీడీఎంఏ కమిషనర్లకు లేఖలు పంపారు. 57 ఫిర్యాదుల స్వీకరణ సోమవారం జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 57 వినతులు అందాయి. వీటిలో నగరంలో జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలు, నియమ నిబంధనలకు వ్యతిరేకంగా సాగుతున్న నిర్మాణాలపై అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావుతో పాల్గొన్నారు. మేయర్కు వినతిపత్రాలు అందజేసిన సీపీఎం ఫ్లోర్ లీడర్ గంగారావు, కార్పొరేటర్ మూర్తి యాదవ్ -
విత్తన బంతులతో సామాజిక వనాలు
విశాఖ సిటీ: విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచడం అవసరమని వీఎంఆర్డీఏ చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు. సోమవారం వీఎంఆర్డీఏ, సిఫా, గ్రీన్ అంబాసిడర్స్, ఎస్ఆర్యూ–జీవీంఎంసీ, గ్రీన్ కై ్లమేట్ టీం ఎన్జీవోల నేతృత్వంలో 20 వేల విత్తన బంతులను కై లాసగిరిపై చల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔషధ గుణాలున్న, పక్షులు గూళ్లు పెట్టుకునే, పక్షులకు ఇతర జీవులకు ఆహారాన్ని ఇచ్చే చెట్ల విత్తనాలతో విత్తన బంతులు తయారు చేయించాలని సూచించారు. మెట్రోపాలిటిన్ కమిషనర్ విశ్వనాథన్ మాట్లాడుతూ దేశీయ ఆవు పేడ, ఒండ్రు మట్టి, ఔషధ గుణాలు కలిగిన, పక్షులు గూళ్లు పెట్టుకునే, వాటికి ఆహారాన్నిచ్చే చెట్ల విత్తనాలతో ఈ విత్తన బంతులు తయారు చేసినట్లు చెప్పారు. సిఫా ట్రస్ట్ సీఈఓ డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ సిరిమాను, అడ్డాకు, మర్రి, రావి, జువ్వి, నేరేడు, మారేడు, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, దేవకాంచన, ఇండియన్ చెర్రీ, కుంకుడు, మామిడి, వేప, రేగు, సీమచింత, గుగ్గిలం, వెదురు, బిల్, చింత, పనస, ఇలా అనేక చెట్ల విత్తన బంతులు వినియోగించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఏపీపీసీబీ రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పి.వి.ముకుందరావు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, ఎస్ఆర్యూ–జీవీఎంసీ ప్రాజెక్ట్ ఇంజనీర్ దాట్ల వివేక్ వర్మ, వీఎంఆర్డీఏ డీఎఫ్ఓ సుజాత శివాని, కై లాసగిరి హార్టీకల్చర్ ఆఫీసర్ రమేష్, గ్రీన్ కై ్లమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం, గ్రీన్ వాలంటీర్ ఐ.కృష్ణకుమారి, ఎస్ఆర్యూ–జీవీఎంసీ ప్రతినిధి మంగరాజు, గ్రీన్ అంబాసిడర్స్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
తిరుమల విద్యార్థుల ప్రతిభ
తగరపువలస: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితా ల్లో తాళ్లవలస క్యాంపస్కు చెందిన తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఓపెన్ కేటగిరీలో కె.ఎస్.రామ్ప్రత్యూష్ 510, ఎస్.ఉదయపవన్ 545 ర్యాంకులు, వివిధ కేటగిరీల్లో ఎం.పురుషోత్తమరావు 39, ఆర్.చరణ్తేజ 86, డి.జయవర్థన్ 226, సీహెచ్ ఉదయకిరణ్ 245, ఆర్.భరత్కుమార్ 272, జి.వరుణ్కుమార్ 309, వి.భార్గవ్ 344, కె.శ్రీరాజ్ 357, పి.భరద్వాజ్ 386, ఎం.పవన్కుమార్ 469వ ర్యాంకులు సాధించారన్నారు. 500 లోపు ర్యాంకులు 10, 1000లోపు 22, 1500లోపు 30, 2వేలలోపు 34, 3వేల లోపు 48, 5వేల లోపు 77, 10వేలలోపు 126 మంది ర్యాంకులు సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. -
అడ్వాన్స్డ్లో నారాయణకు ర్యాంకుల పంట
డాబాగార్డెన్స్: జేఈఈ–అడ్వాన్స్డ్–2025 ఫలితాల్లో విశాఖపట్నం నారాయణ హాస్టల్ విద్యార్థులు ర్యాంకుల పంట పండించినట్లు సంస్థ డీజీఎం డి.హనుమంతరావు తెలిపారు. ఓపెన్ కేటగిరీలో తాలాబత్తుల మనోహర్ 116వ ర్యాంకు, పీటీ ఆనంద్ చక్రవర్తి 118వ ర్యాంకు, ఎం.పూర్ణసాయి 132, ఆరంగి సాత్విక్ 278, పి.ఆదివిష్ణు సుబ్రహ్మణ్యం 279, పొట్నూరు కార్తీక్ 419, కేవీ అరవింద్కుమార్ 442, డి.మహిత్ 551, టి.గౌతమ్ విజయ్ కాశ్యప్ 557, బి.ఈశ్వర్ తనుజ్ 617, పి.శ్రీహర్షవర్ధన్ 635, టీవీ విష్ణు శ్రీవత్సవ 672, లక్ష్యా జైన్ 741, బి.చరణ్తేజస్వీనాయుడు 763, ఆచింత్య పాండే 781, బి లక్ష్మీనివాస్ 794, పి.ప్రశాంతి కార్తీక్ 807 ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. -
అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి
● కలెక్టర్ హరేందిర ప్రసాద్ ● పీజీఆర్ఎస్కు 253 వినతులు మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) లో అందిన అర్జీలపై తక్షణమే చర్యలు తీసుకొని, శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అర్జీలు మళ్లీ పునరావృతం అయితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతకు ముందు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు. ప్రతిరోజు శాఖాపరమైన సమీక్షలు నిర్వహించి, పీజీఆర్ఎస్కు అందిన అర్జీలను పూర్తి స్థాయిలో విచారించి, నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. పీ–4 కార్యక్రమంలో భాగంగా, గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారు లు పేద కుటుంబాలను (బంగారు కుటుంబాలుగా గుర్తించి) దత్తత తీసుకోవాలని, వారికి విద్య, ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ధి వంటి అవసరాలకు సహాయం అందించాలని కోరారు. జూన్ 21న నిర్వహించే ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో అధికారులు చురుకుగా పాల్గొని, తమ కార్యాలయ ఉద్యోగులను, పరిసర ప్రాంతాల వారిని భాగస్వాములను చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి టీ–షర్టులు, యోగా మ్యాట్లు అందజేస్తారని, ముందుగా వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 253 అర్జీల స్వీకరణ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ప్రజల నుంచి మొత్తం 253 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు 93, పోలీసు శాఖకు 21, జీవీఎంసీకి 77, ఇతర విభాగాలకు 62 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ సహా పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
● జిల్లాలో 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ● ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు రాక ● గిన్నిస్ బుక్ రికార్డు కోసం 5 లక్షల మందితో యోగాసనాలు ● ఈ వేడుక నిర్వహణ ఖర్చు రూ.75 కోట్లగా అంచనా ● ఇప్పటి వరకు పైసా విదల్చని ప్రభుత్వం ● అధికారుల మల్లగుల్లాలు
ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, కార్యదర్శులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భారీ సంఖ్యలో హాజరవుతారని చెబుతున్నారు. ఇప్పటివరకు కార్యక్రమం నిర్వహణపై సమీక్షలు, ప్రాంతాల పర్యటనలు మాత్రమే జరిగాయి. ఆర్.కె.బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు బీచ్ రోడ్డులో ఈ ‘యోగా బ్రహ్మాండం’ నిర్వహణ కోసం కసరత్తు చేస్తున్నారు. 500 కంపార్టుమెంట్ల నిర్మాణం సుమారు ఐదు లక్షల మందితో యోగాసనాలు వేయించేందుకు వీలుగా బీచ్రోడ్డులో 500 కంపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. తొక్కిసలాటలు జరగకుండా, ముందుగా ప్రజలను ఈ కంపార్ట్మెంట్లలోకి అనుమతించి, వారిచేత యోగాసనాలు, విన్యాసాలు చేయించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో వెయ్యి మంది చొప్పున మొత్తం ఐదు లక్షల మందికి సరిపడా ఏర్పాట్లు చేస్తున్నారు. కంపార్ట్మెంట్ల నిర్మాణంతో పాటు, వేదికల నిర్మాణం కూడా జరుగుతోంది. ఈ వేదికల మీదుగా ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా ప్రసంగించే అవకాశం ఉంది. బీచ్రోడ్డులోని కొన్ని ప్రాంతాలకు ఇన్చార్జులుగా జిల్లా అధికారులను నియమిస్తున్నారు. భారం ఎవరిది? ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి సంబంధించి ఖర్చు భారం ఎవరిపై పడుతుందనే దానిపై తర్జనభర్జన జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మొదట అంగీకరించిన విధంగా 2 లక్షల మ్యాట్లు, టీ–షర్టులు మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం 5 లక్షల మందితో యోగాసనాలు వేయించాలని నిర్ణయించ డంతో మిగిలిన 3 లక్షల మ్యాట్లు, టీ–షర్టుల భారం ఎవరు భరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కో మ్యాట్ ఖరీదు సుమారు రూ.340 కాగా, 3 లక్షల మ్యాట్లకు రూ.10 కోట్లకుపైగానే ఖర్చవుతుందని అంచనా. దీంతో పాటు యోగాలో పాల్గొనే ఆహారానికి ఒక్కొక్కరికి రూ.100 ఖర్చవుతుంది. 5 లక్షల మందికి రూ.5 కోట్లు వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. వీటితో పాటు, వీఐపీలు, వీవీఐపీల హోటల్స్, కార్లు, స్టేజ్ నిర్మాణాలకు, ఇతర ఏర్పాట్లకు అయ్యే ఖర్చులు అదనం. అధికారుల పరిస్థితి చూస్తుంటే, బడ్జెట్ లేకుండానే ఐదు లక్షల మందితో యోగా చేయించాలన్న ఆశకు ‘ధనాసనం’ వేయక తప్పదేమో.. -
శ్రీవిశ్వ విజయభేరి
సీతంపేట: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీవిశ్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని సంస్థ చైర్మన్ కె.ధర్మరాజు, డైరెక్టర్ పి.సూర్యనారాయణ తెలిపారు. వివిధ కేటగిరీల్లో బి.నవదీప్ రాజు 31వ ర్యాంకు, ఎ.తారక్రామ్ 151, ఎల్.హరికేష్ 519, సిహెచ్.వెంకట హేమవర్ధన్ 592, కె.బలరామ్ 706, బి.షణ్ముఖనాయుడు 765, యు.జయంత్కుమార్ 953, వై.రాజశేఖర్ 1522, డి.రవిరాజు 1917, పి.నితీష్ కుమార్ 2,396 ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. మొత్తంగా వెయ్యి లోపు ఏడుగురు, 5వేల లోపు 30 మంది, పదివేల లోపు 52 మంది ర్యాంకులు సాధించారన్నారు. -
అడ్వాన్స్డ్లో శశి ముందంజ
తగరపువలస: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ సంగివలస క్యాంపస్ విద్యార్థులు ముందంజలో నిలిచారని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ తెలిపారు. వివిధ కేటగిరీల్లో షేక్ ఆజాం ఖాన్ 16వ ర్యాంకు, పాకలపాటి హర్షవర్థన్ 124, దండె స్టీఫెన్ 169, నిడిగట్టు తేజశ్రీ 339, బొడ్డేడ బాల అనిక్ 396, పడాల లిఖిత్ కృష్ణ 928, పొన్నపు స్వరూప 930వ ర్యాంకులు సాధించారన్నారు. 1000లోపు ఏడుగురు, 2వేల లోపు 14, 5వేల లోపు 33, 10వేల లోపు 59 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారన్నారు. ర్యాంకర్లను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా క్రాంతి సుధ అభినందించారు. -
కుక్క అడ్డురావడంతో బైక్ అదుపు తప్పి..
పెందుర్తి: బైక్పై సరదాగా షికారుకు వెళ్లిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. బైక్పై వేగంగా వెళుతున్న సమయంలో కుక్క అడ్డు రావడంతో నియంత్రణ కోల్పోయి వాహనం అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం పెందుర్తి పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పెందుర్తి రాచ్చెరువు సమీపంలోని ఆదిత్యనగర్కు చెందిన శరగడం శ్రీనివాసరావు కుమారుడు శరగడం డాని సత్య అవినాష్(20), పెందుర్తి కూడలి వద్ద నివాసం ఉంటున్న మద్దాల సుధారాణి కుమారుడు మద్దాల శ్రీరామ్(17) స్నేహితులు. అవినాష్ నగరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా.. శ్రీరామ్ ఇటీవలే ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించాడు. ఇద్దరు కలిసి ఆదివారం సాయంత్రం ట్రయంప్ బైక్పై ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారి మీదుగా శొంఠ్యాం వైపు వెళుతున్నారు. సరిగ్గా సరిపల్లి దాటిన తరువాత సర్వీస్ రోడ్డులో కుక్క అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఇరువురు తలలకు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పెందుర్తి సీఐ కె.వి.సతీష్కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ నరసింగరాజు సిబ్బందితో అక్కడికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అంతులేని విషాదంప్రమాదంలో మృతి చెందిన మద్దాల శ్రీరామ్ తండ్రి సతీష్ కోవిడ్ సమయంలో మరణించాడు. దీంతో సుధారాణి పెందుర్తిలో ఓ కిరాణా దుకాణం నడుపుతూ పిల్లలను చవివిస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న శ్రీరామ్ ఎంసెట్ రాశాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు శ్రీరామ్ను బలిగొంది. కాగా శరగడం శ్రీనివాసరావు, అరుణ దంపతులకు అవినాష్తో పాటు ఓ కుమార్తె ఉంది. బీటెక్ చదువుతున్న అవినాష్ చదువులో చురుగ్గా ఉంటాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. -
బలహీనపడిన వాయుగుండం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. నాలుగు రోజులుగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా వేగంగా విస్తరించేందుకు ఇది దోహపడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం బలహీనపడడంతో వర్షాలు కొద్దిమేర తగ్గుతాయని పేర్కొన్నారు. అయితే, చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.శనివారం నుంచి ఆదివారం సాయంత్రం వరకు విజయనగరం, వైఎస్సార్ కడప, నంద్యాల, అనకాపల్లి, తూర్పు గోదావరి, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా గుర్ల, వైఎస్సార్ కడప జిల్లా ఎస్.మైదుకూరులో 24 గంటల వ్యవధిలో 8.7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
దళారులే దిక్కు
రంపచోడవరం: గిరిజన సహకార సంస్థ లక్ష్యానికి దూరంగా పనిచేస్తోంది. గిరిజనులు సేకరించే చిన్న తరహా అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి వారికి బాసటగా ఉండాల్సిన సంస్థ అరకొరగా కొనుగోళ్లు చేస్తూ చేతులు దులుపుకుంటోంది. కొన్ని రకాల చిన్న తరహా అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడమే మానేసింది. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉండగా మార్కెట్లో రేటు లేదనే కారణాన్ని చూపుతూ కొనుగోలుకు దూరంగా ఉంది. ఈ ప్రాంతంలో గిరిజనులకు మంచి ఆదాయాన్నిచ్చే కొండచీపుళ్లు ధర పడిపోయిందన్న కారణంతో కొనుగోలు చేయడం లేదు. దీంతో గిరిజనులు వారు సేకరించిన చీపుళ్లను మారేడుమిల్లి తీసుకువచ్చి కట్ట రూ.50 నుంచి రూ.60కు అమ్ముకుంటున్నారు. వీటిని దళారులు రూ.70 నుంచి రూ.90కు అమ్ముకుని ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. వీటికి సంబంధించి జీసీసీ నిర్ణయించిన ధరకు దళారులు చెల్లించే ధరకు ఎంతో వ్యత్యాసం ఉంది. మొదటి రకం ధర (గ్రేడ్–1) రూ. 45, గ్రేడ్ –2 రూ. 40, గ్రేడ్ –3 రూ. 35గా నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో గిరిజనులు గ్రేడ్లతో సంబంధం లేకుండా ఒక కట్ట రూ. 50 ధరకు పైగా అమ్ముకుంటున్నారు. గతంలో కొనుగోలు చేసిన 20 వేల కొండ చీపుళ్లను కాకినాడ జిల్లా ఏలేశ్వరం గొడౌన్లో నిల్వ చేశారు. ఇవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఏటా బయట మార్కెట్లో కొండచీపుళ్లకు రేటు ఉన్న జీసీసీ నామ మాత్రపు ధరతో కొనుగోలు చేస్తోంది. దీంతో తమ ఉత్పత్తులను జీసీసీ చెల్లించే ధర కంటే బయట వ్యాపారులకు ఎక్కువకు అమ్ముకుంటున్నారు. చింతపండు కిలో రూ.36 ధర నిర్ణయించగా బయట మార్కెట్లో వ్యాపారులకు భారీ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకవాడ గండి చింతపండుకు మంచి డిమాండ్ ఉంది. ఈరకాన్ని వ్యాపారులు రూ.180 నుంచి రూ.200 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. జీసీసీ మాత్రం ఈ రకాన్ని ఇతర ప్రాంతాల్లో లభ్యమయ్యే చింతపండుకు నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తోంది. దీంతో జీసీసీకి విక్రయించేందుకు గిరిజనులు ఆసక్తి చూపడం లేదు. మారేడుమిల్లి ప్రాంత గిరిజనులకు శీకాయ మంచి ఆదాయ వనరు. దీనిని జీసీసీ సరిగ్గా కొనుగోలు చేయడం లేదని గిరిజనులు వాపోతున్నారు. గతంలో విదేశాలకు ఆర్గానిక్ శీకాయను సరఫరా చేసేందుకు హైదరాబాద్కు చెందిన ఒక కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఆ తరువాత జీసీసీ సరిగ్గా కొనుగోలు చేయడం లేదని గిరిజనులు వాపోతున్నారు. జీసీసీ గిరిజనులు సేకరించే, పండించే సుమారు 34 రకాల అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే చిన్న తరహా అటవీ ఉత్పత్తుల సేకరణతో పాటు అవి అంతరించిపోకుండా చూడాల్సి బాధ్యత కూడా ఆ సంస్థపై ఉంది. కోవెల జిగురు కోసం చెట్టు బెరడును సేకరిస్తారు. దీంతో కొంత కాలానికి ఆ చెట్టు చనిపోతుంది. కోవెల చెట్లు అంతరించిపోకుండా వీటి మొక్కలను గిరిజనులతో నాటించి సంతతిని అభివృద్ధి చేయాల్సి ఉంది. జీసీసీకి సేకరణపై ఉన్న శ్రద్ధ వాటి సంరక్షణలో లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీనివల్ల చాలా వరకు కోవెల చెట్లు అంతరించిపోయాయి. నరమామిడి చెట్లది అదే పరిస్థితి. ఆయుర్వేద విలువలు ఉన్న తిప్ప తీగ, కొవెల జిగురు తదితర వాటి కొనుగోళ్లను పూర్తిగా తగ్గించింది. గానుగ పిక్కలు, కరక్కకాయలు, ముసిడి గింజలు, నల్ల జీడిపిక్కలు,నేపాల గింజలు రెల్ల చెక్క, తానికాయలు వంటి అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం లేదు. -
విశాఖ చేరిన డబుల్ డెక్కర్ బస్సు
సింహాచలం: విశాఖ వీధుల్లో డబుల్ డెక్కర్ బస్సు కనువిందు చేయనుంది. పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచనుంది. విశాఖలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు డబుల్ డెక్కర్ బస్సు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సు విశాఖకు చేరుకుంది. హనుమంతవాక నుంచి పాత అడవివరం వైపు ఉన్న బీఆర్టీఎస్ రోడ్డులో కనువిందు చేస్తూ సింహాచలం దేవస్థానానికి చెందిన శ్రీకృష్ణాపురంలోని గోశాలకు చార్జింగ్ కోసం ఆదివారం వచ్చింది. గోశాల ముఖద్వారం గేటు బస్సు కన్నా తక్కువ ఎత్తులో ఉండటంతో లోపలకి వెళ్లలేదు. గేటు బయటనే నిలిచింది. దాంతో బీఆర్టీఎస్ రోడ్డులో సింహాచలం వైపు వచ్చే వారంతా బస్సును ఆసక్తిగా తిలకించారు. గన్నవరం నియోజకర్గంలోని మల్లివల్లిలో అశోక్ లేల్యాండ్ బస్ బాడీ ప్లాంట్ ప్రారంభమైన నేపథ్యంలో ఆ కంపెనీ తయారుచేసిన డబుల్ డెక్కర్ బస్సును ఏపీ ప్రభుత్వానికి సంస్థ ఉచితంగా అందించింది. దాన్ని విశాఖకు కేటాయించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు వరకు ప్రయాణిస్తుందని సిబ్బంది చెప్తున్నారు. -
కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడదాం
‘వెన్నుపోటు దినం’పోస్టర్ ఆవిష్కరణలో బొత్స, కె.కె.రాజు పిలుపు సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ప్రజలకు చేసిన మోసాలను ఎండగడదామని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ‘వెన్నుపోటు దినం’నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి విశాఖ జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించాలన్నారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అధికారం చేపట్టిన ఏడాది కాలంలో 80 శాతం హామీలను అమలు చేసి చూపించామని గుర్తు చేశారు. రెండేళ్ల పాటు కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. ఎంపీ గొల్ల బాబూరావు మాట్లాడుతూ పేద ప్రజలంటే చంద్రబాబుకు ఇష్టముండదని అన్నారు. వారి పార్టీ కార్యకర్తలు, నాయకుల జేబులు నింపడానికే తప్ప ప్రజలేమైపోయినా ఆయనకు పట్టదని మండిపడ్డారు. కూటమి ఏడాది పాలనలో ఎక్కువగా దళితులపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయన్నారు. కె.కె.రాజు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబు.. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఏడాది కాలంలో విశాఖ నగర అభివృద్ధికి కనీసం కోటి రూపాయులు కూడా కేటాయించని చంద్రబాబు.. ఈ ప్రాంతంలో ఉన్న భూములను ప్రైవేట్ సంస్థలకు అత్యంత కారు చౌకగా అప్పగించేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్కుమార్, మళ్ల విజయప్రసాద్, దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి విషయాన్ని గత ప్రభుత్వంపై నెట్టి కాలయాపన చేస్తోందని, రాష్ట్రంలో అభివృద్ధి గానీ, సంక్షేమం గానీ లేదన్నారు. అనంతరం వెన్నుపోటు దినం కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, డిప్యూటీ మేయర్ కె.సతీష్, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర మత్యకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయచందర్, ముఖ్య నేతలు రొంగలి జగన్నాథం, వుడా రవి, గొలగాని శ్రీనివాస్, జహీర్ అహ్మద్, నడింపల్లి కృష్ణంరాజు, రవిరాజు, సతీష్ వర్మ, తాడి జగన్నాథరెడ్డి, చెన్నా జానాకీరామ్, బోని శివరామకృష్ణ, బర్కత్ అలీ, గల్లా శ్రీనివాస్, అల్లు శంకరరావు, కటారి అనిల్ కుమార్ రాజు, ఉరుకూటి రామ చంద్రరావు, పేడాడ రమణి కుమారి, బొండా ఉమా మహేశ్వరరావు, సనపల రవీంద్ర భరత్, మహమ్మద్ ఇమ్రాన్, దౌలపల్లి ఏడుకొండల రావు, కోరుకొండ వెంకట రత్న స్వాతి, పద్మా రెడ్డి, గుండాపు నాగేశ్వరరావు, కోడిగుడ్ల పూర్ణిమ, కరజాడ వెంకట నాగ శశికళ, పి.వి.సురేష్, బల్లా లక్ష్మణరావు, గుడివాడ అనూష, అంబటి శైలేష్, అల్లంపల్లి రాజబాబు, శ్రీదేవి వర్మ, రామన్న పాత్రుడు, కిరణ్ రాజు, పల్లా దుర్గారావు, డా.మంచా నాగ మల్లీశ్వరి, ఆల్ఫా కృష్ణ, కాళిదాస్ రెడ్డి, పులగం కొండారెడ్డి, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, సకలభక్తుల ప్రసాదరావు, రామిరెడ్డి, చిక్కాల సత్యనారాయణ, దేవరకొండ మార్కండేయులు, షేక్ మహ్మద్ గౌస్, చిన్ని, ఉమ్మడి దాస్, కొణతాల ఉమా మహేశ్వర రావు, ఇమంది సత్యనారాయణ, కంచుమూర్తి పద్మ శేఖర్, బొడ్డెడ అచ్చంనాయుడు, నీలి రవి, కొట్యాడ సూర్య, మహేష్ బాబు, కోమటి శ్రీనివాస్, గణేష్గౌడ్, నాగేంద్ర, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష
అల్లిపురం: పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోలీస్ కానిస్టేబుల్(సివిల్, ఏపీఎస్పీ) మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నగరంలో మొత్తం 27 పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. మెయిన్స్కు 12,491 మంది అర్హత సాధించగా, 11,338 మంది మాత్రమే హాజరయ్యారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి, కేంద్రాల లోపలకు అనుమతించారు. నగర ఇన్చార్జి పోలీస్ కమిషనర్, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, డీసీపీ–1(లా అండ్ ఆర్డర్) అజితా వేజెండ్ల, డీసీపీ–2 (లా అండ్ ఆర్డర్) డి.మేరి ప్రశాంతి, డీసీపీ (అడ్మిన్) శ్రీ కృష్ణకాంత్ పటేల్ పలు కేంద్రాలను తనిఖీలు చేసి, పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. -
యోగా డేలో భాగస్వాములు కండి
● కలెక్టర్ హరేందిర ప్రసాద్ పిలుపు ● ఎంవీపీలో జల యోగా ప్రదర్శన ఎంవీపీ కాలనీ: ఈ నెల 21న ఆర్కేబీచ్ వేదికగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లా ప్రజలతో పాటు అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సన్నాహాక కార్యక్రమాల్లో భాగంగా ఎంవీపీ సెక్టార్–8లోని ఎస్3 స్పోర్ట్స్ ఎరీనాలో ఆర్ట్ ఆఫ్ లివింగ్, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో జలయోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరీనా స్విమ్మింగ్పూల్లో డాక్టర్ యార్లగడ్డ గీతాశ్రీకాంత్ జలయోగా ప్రదర్శించారు. నుదుటిపై, అరచేతుల్లో జ్యోతులు వెలిగించి, నీటిలో యోగాసనాలు వేశారు. ప్రదర్శనను తిలకించిన కలెక్టర్ మాట్లాడుతూ గీతా శ్రీకాంత్ చేసిన జలయోగ ప్రదర్శన ఆకట్టుకుందన్నారు. ఇదే విధంగా జిల్లాలోని అన్ని వర్గాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రచారం కల్పించాలన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు అన్ని విధాలా సహకారాన్ని అందించాలని కోరారు. గీతాశ్రీకాంత్ మాట్లాడుతూ జలయోగా ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు, ఎస్3 స్పోర్ట్స్ ఎరీనా నిర్వాహకులు పాల్గొన్నారు. -
చదువు దూరం చేయొద్దు
కోటవురట్ల: అయ్యా విద్యా శాఖామంత్రి లోకేష్ గారూ.. మా పిల్లలకు చదువులు అవసరం లేదా..గిరిజన పిల్లలు చదువుకు దూరంకావలసిందేనా..ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చారు... మా పిల్లల కోసం ఓ ఉపాధ్యాయుడిని నియమించలేరా అంటూ అణుకు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తూ దండం పెడుతూ ఆందోళన చేశారు. అణుకు గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు ఆదివారం ఆందోళన చేశారు. ప్రత్యామ్నాయ పాఠశాలను తెరిచి ఉపాధ్యాయుడిని నియమించాలని నినాదాలు చేశారు. పార్టీ మండల కార్యదర్శి ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ గొట్టివాడ శివారు గ్రామం అణుకు గిరిజన గ్రామంపై చిన్నచూపు తగదన్నారు. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, గత ప్రభుత్వంలో గిరిజనుల పోరాటంతో రోడ్డు వేసి, ప్రత్యామ్నాయ పాఠశాలకు ఉపాధ్యాయుడిని కేటాయించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయుడుని తొలగించారని, దీంతో చిన్నారులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ సుమారు 60 మంది పిల్లలు ఉన్నారని, అందుకు తగ్గట్టుగా పాఠశాలను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వర్షాలకు రోడ్డు కూడా శిథిలమైందని, పిల్లలు రాళ్లు తేలిన రోడ్డుపై చదువు కోసం 12 కిలోమీటర్లు రానుపోను నడవాల్సిన పరిస్థితి ఉందన్నారు. -
406 యూనిట్లని చెప్పి..చేతులెత్తేశారు!
2025–26 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రభుత్వం జిల్లాకు 406 యూనిట్లను కేటాయించింది. రూ.16.88 కోట్ల విలువైన 32 రకాల రుణాల కోసం ఎస్సీ కార్పొరేషన్ మేలో దరఖాస్తులను ఆహ్వానించింది. లబ్ధిదారులు https:// apobmms. apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే మే 10వ తేదీని చివరి తేదీగా ప్రకటించినప్పటికీ.. సాంకేతిక సమస్యల పేరుతో మే 8వ తేదీ నుంచే వెబ్సైట్ పనిచేయడం మానేసింది. దీంతో వందలాది అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. అప్పుడే తీవ్ర విమర్శలు వెల్లువెత్తినా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా ఆ నోటిఫికేషన్ ప్రక్రియనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో దరఖాస్తు చేసుకున్న 3,842 మంది లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ‘రెండు రోజులు ముందే వెబ్సైట్ ఆపేసి దగా చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా రుణాల మంజూరునే నిలిపేయడం దారుణం. ఇది మమ్మల్ని నిలువునా మోసం చేయడమే.’అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నగరమంతా తీరంలోనే.!
ఏయూక్యాంపస్: సాగరతీరం ఆదివారం జనసంద్రంగా మారింది. ఎటు చూసినా కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి సంతోషంగా గడుపుతున్న దృశ్యాలు కనిపించాయి. నగరం మొత్తం తీరంలోనే ఉందా అనే భావన కలిగింది. చిన్న పిల్లలతో కలిసి నగరవాసులు పెద్ద సంఖ్యలో ఆర్.కె.బీచ్ నుంచి వీఎంఆర్డీఏ పార్కు వరకు ఉన్న పర్యాటక ప్రాంతాలకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతాలన్నీ సందర్శకులతో కిక్కిరిసిపోయాయి. బీచ్కి భారీగా వ్యక్తిగత వాహనాల్లో రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బీచ్రోడ్డుతో పాటు సిరిపురం కూడలి, చినవాల్తేరు వంటి ప్రాంతాల్లో వాహనాలు బారులుతీరాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. -
టిడ్కో లబ్ధిదారుల ఆందోళన
అగనంపూడి: జీవీఎంసీ 88వ వార్డు మంగళపాలెం టిడ్కో గృహ సముదాయం వద్ద ఆదివారం ప్లాట్ల కేటాయింపుదారులు ఆందోళనకు దిగారు. ఇక్కడ పదేళ్ల కిందట నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు. అయితే గృహాలను ఇప్పటికీ అందజేయలేదు. పైగా రోడ్లు, డ్రైనేజీలు, మంచినీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించడంలో జాప్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగదు చెల్లింపులు చేసిన లబ్ధిదారులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ గృహ సముదాయం నిర్మించి పదేళ్లు అవుతోందన్నారు. లబ్ధిదారులందరూ నిర్ణీత మొత్తం చెల్లించారని, నేటికీ గృహాలు కేటాయించకపోవడం వల్ల నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కనీస వసతులు కల్పించి, లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించి సేల్ డీడ్లు అందివ్వాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న టిడ్కో ప్రాజెక్టు డీఈ రాజేష్, టాటా ప్రాజెక్టు అధికారి సోమేష్ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. మూడు నెలల్లో ప్రాథమిక వసతులు కల్పించి ప్లాట్లు అప్పగిస్తామని నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. నాయకులు కె.వనజాక్షి, జి.ఆనంద్, కె.అచ్చుతరావు, పిల్లా పద్మ, రొక్కమ్ శ్రీనివాసరావు, గోపి, పి.అప్పలరాజు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి
పరవాడ: అతిగా మద్యం సేవించి ఓ వ్యక్తి లంకెలపాలెం వంతెన వద్ద మృతి చెందినట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. మృతుడు విశాఖపట్నం అక్కయ్యపాలేనికి చెందిన జి.ధన్పాల్ బాలాజీ(55)గా గుర్తించామన్నారు. సీఐ తెలిపిన వివరాలు.. అక్కయ్యపాలేనికి ధన్పాల్ బాలాజీ ఫార్మాసిటీలో అసిస్టెంట్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం అతిగా మద్యం సేవించి లంకెలపాలెం వంతెన సమీపంలో స్పృహ కోల్పోయి మృతి చెందాడు. మృతుడి బంధువుల వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, మార్చురీలో భద్రపరిచినట్లు సీఐ తెలిపారు. మృతుడి బంధువుల వివరాలు తెలిసిన వారు పరవాడ పోలీస్ స్టేషన్ను సంప్రదించాల్సిందిగా సూచించారు. -
ప్రకృతి ఒడిలో ఆరోగ్య యోగం
● చరిత్రలో నిలిచిపోయేలా యోగా వేడుకలు ● కలెక్టర్ హరేందిర ప్రసాద్ వెల్లడి ● తొట్లకొండపై ఘనంగా యోగాంధ్ర కొమ్మాది: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ తెలిపారు. బౌద్ధారామాల్లో ఒకటైన తొట్లకొండపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం ‘యోగాంధ్ర’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలు సంస్థలు, సంఘాల ప్రతినిధులు యోగాసనాలు వేశారు. ముందుగా మయన్మార్కు చెందిన బౌద్ధ గురువు రాజధర్మ, కంబోడియాకు చెందిన బర్మరే, విశాఖ బౌద్ధ సంఘ సభ్యులు ధర్మచారి ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం అందరూ వివిధ యోగాసనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21 జరగనున్న యోగా వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఆర్.కె.బీచ్ నుంచి భీమిలి వరకు సుమారు ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఇందుకోసం గ్రామ, వార్డు స్థాయిల్లో యోగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే యోగా దినోత్సవంలో పాల్గొనే వారికి రవాణా సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమం తర్వాత కూడా ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంతో ఉండడానికి యోగాను కొనసాగించాలని, దీనిని తమ జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకోవాలని కోరారు. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, భీమిలి ఆర్డీవో సంగీత్ మాథూర్, జిల్లా పర్యాటక శాఖ అధికారి జి.మాధవి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు
మహారాణిపేట (విశాఖ): నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల ఒక మోస్తరు వర్షాలు.. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.వీటి ప్రభావంవల్ల పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక శనివారం విజయనగరం జిల్లా గుర్లలో 8.75 మిల్లీమీటర్లు.. వేపాడ, నంద్యాల జిల్లా ముత్యాలపాడులో 7.9 మిమీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 7.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. -
మరోసారి సీజీఆర్ఎఫ్ చైర్మన్గా సత్యనారాయణ
మహారాణిపేట: ఎలక్ట్రిసిటీ కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్రసల్ ఫోరం(సీజీఆర్ఎఫ్) చైర్మన్గా బి.సత్యనారాయణ రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ఈపీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. శనివారం సత్యనారాయణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. 2022 నుంచి 2025 వరకు సత్యనారాయణ సీజీఆర్ఎఫ్ చైర్మన్గా సేవలందించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో 1998 నుంచి 2022 వరకు పలు హోదాల్లో న్యాయమూర్తిగా పనిచేశారు. 2022లో జిల్లా జడ్జిగా పదవీ విరమణ పొందారు. విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో తీర్పులిచ్చారు. కాగా సత్యనారాయణ పునర్నియామకం పట్ల రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడు, కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ, ఏపీ ఈపీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.హరిబాబు(ఫైనాన్స్), సీజీఆర్ఎఫ్ సభ్యులు ఎ.మురళీకృష్ణ (ఇండిపెండెంట్), ఎస్.సుబ్బారావు (ఫైనాన్స్), బి.సులేఖరాణి (టెక్నికల్) హర్షం ప్రకటించారు. -
నిబద్ధతకు మారుపేరు మల్లికార్జునరావు
మహారాణిపేట: సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్గా విశేషమైన సేవలందించిన సీహెచ్ మల్లికార్జునరావుకు జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్.వి.రమణ ఘన వీడ్కోలు పలికారు. జిల్లా సమాచార కార్యాలయంలో శనివారం జరిగిన మల్లికార్జునరావు ఉద్యోగ విరమణ సభలో రమణ మాట్లాడారు. మల్లికార్జునరావు తన 33 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో నిబద్ధతతో, సంయమనంతో పనిచేశారని కొనియాడారు. ప్రాంతీయ సమాచార ఇంజినీర్ కార్యాలయం సూపరింటెండెంట్ అన్నమ్మ మాట్లాడుతూ మల్లికార్జునరావు సున్నిత మనస్కుడని, అదే సమయంలో తన బాధ్యతల పట్ల ఎంతో నిబద్ధత కలిగి ఉండేవారన్నారు. డివిజనల్ పీఆర్వో నారాయణరావు మాట్లాడుతూ మల్లికార్జునరావు తన వృత్తికి అంకితమయ్యారని కొనియాడారు. అసిస్టెంట్ ఇంజినీర్ బాలాజీ, ఏపీఆర్వో శ్రీనివాసరావు, ఏవీఎస్ వెంకట్రావు, సీనియర్ అసిస్టెంట్ మాధవి, పీఆర్వో కిశోర్, పాత్రికేయులు శ్రీనివాసరావు, భగవాన్ తదితరులు మల్లికార్జునరావు చేసిన సేవలను ప్రశంసించారు. అనంతరం మల్లికార్జునరావు దంపతులను ఘనంగా సత్కరించారు. -
పద్మం సిల్వర్ జ్యూయలరీ షోరూం ప్రారంభం
మద్దిలపాలెం: మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్లో పద్మం 92.5 సిల్వర్ జ్యూయలరీ షోరూం శనివారం ఘనంగా ప్రారంభమైంది. సీఎంఆర్ వ్యవస్థాపకుడు, చైర్మన్ మావూరి వెంకటరమణ ఈ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్లుగా నమ్మకమైన సేవలందిస్తూ.. వినియోగదారుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నామన్నారు. అదే నమ్మకానికి నిదర్శనంగా సీఎంఆర్ గ్రూప్ నుంచి పద్మం 92.5 సిల్వర్ జ్యూయలరీ షోరూంను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుత ట్రెండ్కు తగిన బ్రాండ్లతో.. సరికొత్త వెండి ఆభరణాలతో సీఎంఆర్ సెంట్రల్ గ్రౌండ్ ఫ్లోర్లో షోరూంను ప్రారంభించామని వెల్లడించారు. ప్రారంభోత్సవ కానుకగా అన్ని రకాల వెండి ఉత్పత్తులపై ఫ్లాట్ 20 శాతం తగ్గింపు, ఆభరణాల కొనుగోలుపై గ్యారెంటీ కార్డుతోపాటు కచ్చితమైన బైబ్యాక్ పాలసీ అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల మనసుకు హత్తుకునే సరికొత్త డిజైన్లతో సిల్వర్ జ్యూయలరీ ఆభరణాలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. -
దళిత మహిళను మోసం చేసిన ఇద్దరికి రిమాండ్
తగరపువలస: భూమి రిజిస్ట్రేషన్ పేరుతో నగరానికి చెందిన దళిత మహిళ కుంచంగి లక్ష్మిని మోసం చేసి రూ.97 లక్షలు కాజేసిన ఆనందపురానికి చెందిన మీసాల అప్పలనాయుడు, శ్రీదేవి దంపతులను పోలీసులు శనివారం రిమాండ్కు తరలించారు. భీమిలి 15వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వారికి 15 రోజుల పాటు రిమాండ్ విధించారు. బాధితురాలు ఆనందపురం మండలం చందక పంచాయతీలో మధ్యవర్తుల సాయంతో 30 సెంట్ల భూమిని కొనుగోలు చేసింది. అప్పటికే నకిలీ పత్రాలతో నిందితులు ఆ భూమి తమదిగా చూపించి బాధితురాలి నుంచి డబ్బులు కాజేశారు. భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకోవడంతో పాటు బాధితురాలిపై దాడి కూడా చేశారు. దీంతో పోలీసులు వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
నేడు వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జూన్ 4వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఆదివారం జరగనుంది. మద్దిపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు హాజరుకానున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నాయకులు, మాజీ శాసనసభ్యులు, సమన్వయకర్తలు హాజరుకావాలని కేకేరాజు పిలుపునిచ్చారు. -
కదల్లేని వయసులో కష్టం
● ఈ నెలా పింఛన్ల కోసం వృద్ధుల అవస్థలు ● 92.61 శాతం మందికి పింఛన్ల అందజేత మహారాణిపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా.. పింఛన్దారుల కష్టాలు తీరకపోగా మరింత పెరిగాయి. గత ప్రభుత్వ హయాంలో ఇంటికే వచ్చి పింఛన్లు అందించే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి.. ఇప్పుడు వృద్ధులు, వికలాంగులు, మహిళలను సచివాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. నెలవారీ పింఛన్ కోసం గంటల తరబడి ఎండలో నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. శనివారం పెదజాలారిపేట సచివాలయం వద్ద మధ్యాహ్నం 11 గంటల తర్వాత గానీ పింఛన్ల పంపిణీ ప్రారంభం కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఒకే దగ్గర లబ్ధిదారులను చేర్చి.. పింఛన్లు పంపిణీ జరిగింది. బయోమెట్రిక్ ద్వారానే పంపిణీ అని చెబుతున్నా.. అనేక చోట్ల సాంకేతిక సమస్యతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర అవస్థలు పడ్డారు. పింఛన్లలో భారీ కోత ఎన్నికల ముందు 50 ఏళ్లు దాటిన వారందరికీ పింఛన్లు ఇస్తామని హామీల వర్షం కురిపించి.. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చకపోగా.. 60 ఏళ్ల పైబడి అర్హులైన వారి పింఛన్లలోనూ భారీగా కోత పెడుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 1.68 లక్షల మంది పింఛనుదారులు ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలివిగా ప్రతి నెలా దాదాపు వెయ్యి మంది చొప్పున లబ్ధిదారులను తొలగిస్తూ వచ్చింది. దీంతో జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య 1,59,085కు పడిపోయింది. గడిచిన ఏడాది కాలంలోనే సుమారు 9 వేలకు పైగా అర్హులైన పింఛన్దారులను అన్యాయంగా తొలగించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక్క రోజు ముందుగానే.. జిల్లాలో శనివారం ఎన్టీఆర్ సామాజికభద్రత పింఛన్ల కార్యక్రమం జరిగింది. జూన్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. జిల్లాలో మొత్తం 1,59,085 పింఛన్లు ఉండగా.. ప్రభుత్వం రూ.69.64 కోట్లను విడుదల చేసింది. శనివారం రాత్రి ఏడు గంటలకు 1,47,826 మందికి రూ.64.45 కోట్లను సచివాలయం సిబ్బంది అందజేశారు. జిల్లాలో మొత్తం 92.92 శాతం మందికి పింఛన్లు పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీపతి తెలిపారు. మిగిలిన వారికి సోమవారం అందజేస్తామని వెల్లడించారు. -
యోగా వేడుకల విజయవంతానికి చర్యలు
● రవాణా, పార్కింగ్పై దృష్టి సారించాలి ● ఏర్పాట్లను సమీక్షించిన నోడల్ అధికారి డాక్టర్ మల్లికార్జున మహారాణిపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్దేశిత సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా పక్కా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్, యోగా ఉత్సవాల మొబలైజేషన్, ట్రాన్స్పోర్టు నోడల్ అధికారి డాక్టర్ ఎ.మల్లికార్జున జిల్లా అధికారులను ఆదేశించారు. యోగా ఉత్సవాల నిర్వహణ, రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శనివారం జిల్లాకు వచ్చిన ఆయన.. కలెక్టరేట్లో కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జేసీ కె.మయూర్ అశోక్, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్లతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లక్ష్యాన్ని చేరుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. బీచ్రోడ్డులో ఎంత మంది కూర్చోగలరు. అదనపు వేదికల్లో ఎంత మందికి అవకాశం ఉంటుందనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ప్రతి 24 చదరపు అడుగులకు ఒకరు యోగాసనాలు వేసేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రజల వాహనాల పార్కింగ్కు తగిన జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. కంపార్ట్మెంట్ల వారీగా బస్సులు కేటాయించాలని, ఆయా వాహనాలకు నిర్దేశిత స్థలాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనాల రాకపోకల విషయంలో గందరగోళం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో చేపట్టిన చర్యలను కలెక్టర్ హరేందిర ప్రసాద్ మ్యాప్ల ద్వారా వివరించారు. భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి డిపోల్లో రేషన్ పంపిణీ
ఎండీయూ వాహనాలను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం మహారాణిపేట: జిల్లాలో ఆదివారం నుంచి రేషన్ సరకులు నేరుగా రేషన్ డిపోల వద్ద పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎండీయూ వాహనాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసి ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని 642 డిపోల ద్వారా 5.34 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార వంటివి పంపిణీ చేయనున్నారు. ఈ ఏర్పాట్లను జిల్లా ప్రత్యేక అధికారి భగవన్నారాయణ పర్యవేక్షించారు. ఆయన ఇప్పటికే డీలర్లతో సమావేశాలు నిర్వహించి, గోదాముల్లో సరకుల లభ్యత, డిపోల వద్ద ఏర్పాట్లు, ధరల పట్టికలు వంటి విషయాలను సమీక్షించారు. డీఎస్వో వి.భాస్కరరావు పోస్ మెషీన్ల మరమ్మతులు కూడా పూర్తి చేశారు. కాగా, ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 310 ఎండీయూ వాహనాలను రద్దు చేయడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాహనాల ద్వారా అనేక మంది ఉపాధి పొందారు. వీటిని నిలిపివేయడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇదిలా ఉండగా.. చాలా మంది కార్డుదారులకు డిపోలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు ఎండీయూ వాహనాల ద్వారా ఇంటికే సరుకులు వచ్చేవి కాబట్టి డిపోల గురించి చాలా మందికి అవగాహన లేదు. స్థానికంగా ఉన్న కొందరికి కూడా డిపోలు ఎక్కడున్నాయో తెలియకపోవడం గమనార్హం. -
క్రీడలతో క్రమశిక్షణ
మద్దిలపాలెం: క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందని, తద్వారా సమాజానికి అత్యుత్తమ మానవ వనరులుగా నిలుస్తారని ఎమ్మెల్యేలు గణబాబు, గౌతు శిరీష అన్నారు. రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఎంపికై న డాక్టర్ డి.భగీరథ కుమార్, ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికై న డి.ప్రసన్న కుమార్ సత్కార కార్యక్రమం శనివారం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ క్రీడలకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో విశాఖ తన స్థానాన్ని పదిలం చేసుకుంటోందన్నారు. నగరానికి చెందిన భగీరథ కుమార్, ప్రసన్నకుమార్లు జాతీయ స్థాయిలో ఉన్నత పదవులను అందుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. విశాఖ నగరానికి, చేపట్టిన పదవులకు మరింత పేరు తెచ్చే విధంగా కృషి చేయాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. అనంతరం భగీరథ కుమార్, ప్రసన్న కుమార్లను ఎమ్మెల్యేలు సత్కరించారు. విశాఖ జిల్లా రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ చంద్ర, కార్యదర్శి శీలం లక్ష్మణ్, ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కార్యదర్శి థామస్ అయ్య, కళాభారతి కార్యదర్శి జి.రాంబాబు పాల్గొన్నారు. -
పార్టీకి సోషల్ మీడియా కార్యకర్తలే బలం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీకి సోషల్ మీడియా కార్యకర్తలే కొండంత బలమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో సోషల్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. జిల్లాలో 8 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై రాష్ట్రంలోని పలు పోలీస్స్టేషన్లలో 50కి పైగా అక్రమ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మద్దిలపాలేనికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త బోస రమణారెడ్డిపై ఆరు కేసులు, గాజువాక మండలం గొల్లజగ్గరాజుపేటకు చెందిన బొడి వెంకటేష్పై మొత్తం 17 కేసులు, విశాఖకు చెందిన ఇంటూరి రవికిరణ్పై రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొత్తం 21 కేసులు, అలాగే ప్రసాద్ సిద్దు, గోపిరాజు వంకా, సదరం జ్ఞానేష్లపై మార్టూరు పోలీస్స్టేషన్లో కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేశారన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి అధికారిని గుర్తుపెట్టుకోండన్నారు. రానున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని, మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేయడం తథ్యమన్నారు. ప్రజా సంకల్ప యాత్ర దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలు అండగా నిలిచారని గుర్తు చేశారు. మరోమారు పార్టీకి, అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, పార్టీ కార్యాలయ ఇన్చార్జి రవిరెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, కార్పొరేటర్లు, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు -
ఐఐఎంవీలో ‘ఈపీజీడీపీఎం’ ప్రారంభం
తగరపువలస: గంభీరంలోని ఐఐఎం విశాఖపట్నం(ఐఐఎంవీ)లో రక్షణ రంగ అధికారులు, కార్యనిర్వాహకుల కోసం ఏడాది పాటు నిర్వహించే ‘ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ (ఈపీజీడీపీఎం)’శనివారం ప్రారంభమైంది. హిందూస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ విశ్రాంత సీఎండీ హేమంత్ ఖత్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డిజిటల్ మౌలిక వసతులు, వందే భారత్ వంటి ఆవిష్కరణలు, 6జీ టెక్నాలజీ వైపు సాగుతున్న ప్రయాణంలో దేశ నాయకత్వ పాత్రను కొనియాడారు. విమర్శనాత్మక ఆలోచన, భావోద్వేగ మేధస్సు, అనుకూలత, సృజనాత్మక సమస్య పరిష్కార సామర్థ్యాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఐఐఎంవీ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ డైనమిక్, టెక్నాలజీ ఆధారిత ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా రక్షణ సిబ్బందిని సిద్ధం చేయడానికి ఈ కోర్సును రూపొందించినట్లు చెప్పారు. అడ్మిషన్స్ చైర్ ప్రొఫెసర్ ప్రశాంత్ ప్రేమ్కుమార్ నాయర్ మాట్లాడుతూ ఈ బ్యాచ్లో సగటు వయసు 38 సంవత్సరాలు కాగా.. 13 సంవత్సరాల పని అనుభవం కలిగిన వారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో రక్షణ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. ప్రోగ్రాం చైర్ ప్రొ.శ్రీరంగాచార్యులు మాట్లాడుతూ ఈ కోర్సు మాడ్యులర్ ఎంబీఏగా హైబ్రిడ్ ఫార్మాట్లో రూపొందించినట్లు చెప్పారు. డీన్ కావేరీ కృష్ణన్ మాట్లాడారు. -
హాస్టళ్లలో సెల్ఫోన్ల చోరీ కేసు ఛేదన
నిందితుడి అరెస్ట్, 12 ఫోన్లు స్వాధీనం తాటిచెట్లపాలెం: ద్వారకానగర్లోని హాస్టళ్లలో జరిగిన సెల్ఫోన్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసి.. అతని వద్ద నుంచి 12 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్ను స్వాధీనం చేసుకున్నట్లు క్రైం ఏడీసీపీ మోహనరావు తెలిపారు. ద్వారకా పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. ద్వారకానగర్లోని శ్రీ చక్ర బాయ్స్ హాస్టల్ను కొవ్వూరి సోమిరెడ్డి నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 7న ఆ హాస్టల్లో ఉంటున్న గణేష్ అనే విద్యార్థి తన ఫోన్ కనిపించడం లేదని సోమిరెడ్డికి తెలిపాడు. దీంతో ఆయన హాస్టల్లో విచారించగా.. హాస్టల్లో మొత్తం ఆరు ఫోన్లు, అదే ప్రాంగణంలోని మరో హాస్టల్లో ఐదు ఫోన్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో సోమిరెడ్డి ద్వారకా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో నిందితుడు కనకం దామోదర్గా గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మే 27న అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 12 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్ను స్వాధీనం చేసుకున్నారు. కనకం దామోదర్పై గతంలో కూడా వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో సుమారు 20 సెల్ఫోన్ దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని ఏడీసీపీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన ద్వారకా సబ్ డివిజన్ క్రైం సీఐ వి.చక్రధరరావు, ఎస్ఐ ఎస్.రాజు, సిబ్బంది వి.అప్పలరాజు, ఎస్.హరిప్రసాద్ (ఎంవీపీ క్రైం), ఎన్.జగత్కిరణ్(ఎంవీపీ క్రైం)లను ఏడీసీపీ అభినందించారు. సమావేశంలో ఏసీపీ లక్ష్మణరావు పాల్గొన్నారు. -
భూముల అభివృద్ధికి పలు సంస్థల ఆసక్తి
విశాఖ సిటీ: మధురవాడలోని భూముల అభివృద్ధికి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు ఆసక్తి చూపించినట్లు వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రమేష్ తెలిపారు. వీఎంఆర్డీఏకు చెందిన 87.80 ఎకరాల భూమిని పీపీపీ విధానంలో సంయుక్త అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలను వివరించేందుకు శనివారం బెంగుళూరులో నైట్ ఫ్రాంక్ కార్యాలయంలో రోడ్ షో నిర్వహించారు. ఇందులో ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థలైన గోద్రేజ్ ప్రాపర్టీస్, ఉషా శ్రీరామ్ ప్రాపర్టీస్, స్థానిక రియల్ ఎస్టేట్ సంస్థలు హాజరైనట్లు పేర్కొన్నారు. భూముల అభివృద్ధిపై సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ రోడ్ షోలో వీఎంఆర్డీఏ చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్ప, సీఈ భవానీశంకర్, నైట్ ఫ్రాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
పేరు అబద్ధంకబ్జా నిజం!
● భూముల విలువ రూ. 50 కోట్ల పైమాటే! ● పంట నష్టపరిహారం, బీమా సైతం కాజేత ● ప్రశ్నిస్తే హోం మంత్రి పేరుతో బెదిరింపులు మోసగించి కాజేశారు.. ఈ భూములను సాగు చేసుకునేందుకు మా పూర్వీకులకు ప్రభుత్వం పట్టా ఇచ్చింది. వెంకటాపురం గ్రామానికి చెందిన ‘అబద్ధం’ అనే టీడీపీ నాయకుడు, జగన్మోహన్రావు అనే వ్యక్తి మమ్మల్ని మోసం చేసి భూములను లాక్కున్నారు. ఒక్క పైసా లీజు ఇవ్వకపోగా పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్నారు. వారి ఆగడాలకు తట్టుకోలేక ఏం చేయాలో తోచక భయంతో జీవిస్తున్నాం. మా దగ్గర పట్టాలు ఉన్నాయి. –తంతట సూర్యారావు, వెంకటాపురం, ఎస్.రాయవరం మండలం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పేరులోనే కాదు అక్రమ వ్యవహారాల్లోనూ ఓ టీడీపీ నేత సార్థక నామధేయుడినని నిరూపించుకున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం మండలం టీడీపీ నేత అమలకంటి అబద్ధం హోంమంత్రి అనితకు ముఖ్య అనుచరుడు. దళిత వర్గానికి చెందిన అనిత హోంమంత్రిగా ఉన్నప్పటికీ ఆమె అనుచరుడు మాత్రం నిరుపేద దళితుల భూములను ఆక్రమించి దర్జాగా సాగు చేసుకోవడం గమనార్హం. తమ తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న డీ పట్టా భూములను ఆక్వా సాగు పేరుతో లీజుకు తీసుకుని అనిత ముఖ్య అనుచరుడు కాజేశారని బాధితులు వాపోతున్నారు. రూ.50 కోట్ల విలువ చేసే 103 ఎకరాల భూముల రికార్డులను విశాఖ ఆక్వాఫారానికి చెందిన జగన్మోహన్రావుతో కలిసి మార్పు చేసి తనపరం చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. తమ భూములను తమకివ్వాలని కోరితే కేసులు నమోదు చేయించి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆక్రోశిస్తున్నారు. మరోవైపు ఈ భూముల రికార్డులన్నీ తారుమారు చేసి... పంట నష్టపరిహారంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ, రాయితీలు పొందుతుండటం గమనార్హం. ఆక్వా సాగు పేరుతో.. ఎస్.రాయవరం మండలం వాకపాడు రెవెన్యూ పరిధిలోని 73, 74, 75, 77, 78, 344, 345, 346, 347, 348, 351, 352, 353, 354, 435, 438, 439, 441, 442, 443, 445 సర్వే నంబర్లలో సుమారు 103 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ప్రభుత్వం వీటిని సుమారు 30 ఏళ్ల క్రితం తంతట సూర్యారావు (పట్టానెం 41/98), దండా కొండయ్య (42/98), పెయ్యిల నాగరాజు (43/98), గారా నర్సింహులు, జల్లూరి అప్పారావు, దండా త్రిమూర్తులు, దండా అప్పన్న, దండా తాతబ్బాయి, గారా అప్పయ్యమ్మ, బీరా నాగన్న, గారా అప్పారావు, కొప్పిశెట్టి మాణిక్యం, కొప్పిశెట్టి అప్పారావు, కొప్పిశెట్టి అయ్యన్న తదితర స్థానిక పేద రైతుల పేరుతో డీ–ఫారం పట్టాలు మంజూరు చేసింది. అప్పటినుంచి వీరంతా ఈ భూములను సాగుచేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ భూములపై కన్నేసిన టీడీపీ నేత ‘అబద్ధం’.. తనకు లీజుకు ఇస్తే ఆక్వా లాభాల్లో వాటా ఇస్తానని నమ్మబలికి పదేళ్ల క్రితం వారి నుంచి తీసుకున్నాడు. ఎమ్మెల్యే అనిత అండదండలతో 2014లో ఈ భూమిని 42 సబ్ డివిజన్లుగా విభజించి.. ఈ ప్రాంతానికి సంబంధం లేని విశాఖ ఆక్వాఫారానికి చెందిన జగన్మోహన్రావు తండ్రి వీరభద్రరావును తెరమీదకు తీసుకు వచ్చి అతని పేరున మ్యూటేషన్ (వెబ్ల్యాండ్లో) చేశారు. ఈ 42 సబ్ డివిజన్లకు 42 ఖాతా నెంబర్లు ఇచ్చారు. ఈ భూముల్లో ఆక్వా కాకుండా వరి సాగు చేస్తున్నాడు. తమ భూములకు లీజు చెల్లించాలని లేదంటే వెనక్కి ఇవ్వాలని కోరిన రైతులను బెదిరిస్తూ హోంమంత్రి సహకారంతో పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్నాడు. పట్టాలున్నాయి.. ప్రభుత్వం మా పూర్వీకులకు ఇచ్చిన భూములను అబద్ధం అనే టీడీపీ నాయకుడు ఆక్రమించుకున్నాడు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి మమ్మల్ని భూముల్లోకి రానివ్వకుండా బెదిరిస్తున్నారు. కేసులు బనాయిస్తున్నారు. మా దగ్గర పట్టాలు ఉన్నాయి.ఇద్దరూకలిసికబ్జా మా తాత, తండ్రులకు డీ–ఫారం పట్టాలు ఇచ్చారు. ఈ భూముల్లో గంటి, జొన్న సాగు చేసే వాళ్లం. పెట్టుబడులు పెట్టలేక ఆకుల జగన్మోహన్రావు అనే వ్యక్తికి లీజుకు ఇస్తే టీడీపీ నాయకుడు అబద్ధంతో కలిసి కబ్జా చేశారు. మా భూములు మాకు అప్పగించాలని కోరితే కేసులు పెట్టి వేధిస్తున్నాడు. మావద్ద ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. – దండా తాతబ్బాయి, వాకపాడు, ఎస్.రాయవరం మండలం సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 4వ తేదీన తలపెట్టిన ‘వెన్నుపోటు దినం‘ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పొల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. శనివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ‘వెన్ను పోటు దినం పోస్టర్’ను ఆయన ఆవిష్కరించారు. 2024 ఎన్నికల్లో అమలుకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతూ వెన్నుపోటు దినానికి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, కార్పొరేటర్లు అల్లు శంకరరావు, కె.అనిల్కుమార్ రాజు, రెయ్యి వెంకట రమణ, బర్కత్ అలీ, సేనాపతి అప్పారావు, పేడాడ రమణి కుమారి, పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. దళితులకు చెందిన 103 ఎకరాలను కాజేసిన టీడీపీ నేతవెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ నేడు కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష మా భూములు మాకు అప్పగించాలి మాకు ఈ భూములు మినహా వేరే ఆధారం లేదు. వయసు పైబడటంతో కష్టంగా ఉంది. అబద్దం అనే నాయకుడు మా భూములు ఆక్రమించి సాగుచేస్తున్నాడు. మా భూములు మాకు అప్పగించి న్యాయం చేయాలి. –దండా మాణిక్యం, వాకపాడు – పెయ్యిల నాగరాజు, వాకపాడు -
‘లోకేశ్.. పరీక్షలపై ఇంత నిర్లక్ష్యమా.. విద్యార్థికి ఏదైనా జరిగితే?’
విశాఖపట్నం: కడపలో టీడీపీ అట్టహాసంగా నిర్వహించిన మహానాడు ఒక ఫార్స్లా ముగిసిందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చేసిన మోసంను, ఏడాది పాలన తరువాత మరోసారి ఈ మహానాడు ద్వారా మోసం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. మహానాడు ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అధికార పార్టీగా తెలుగుదేశం ఏ చెప్పిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది అసమర్థ పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, సభ్యత మరిచి దారుణమైన భాషతో వ్యక్తిగత దూషణలు చేసేందుకే మహానాడును పరిమితం చేశారని ధ్వజమెత్తారు. చివరికి రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్ధుల జవాబుపత్రాలను కూడా సరైన విధంగా మూల్యాంకనం చేయించలేని స్థాయికి విద్యాశాఖను తీసుకువెళ్ళిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఈ చేతకాని ప్రభుత్వంలో విద్యార్దులకు సైతం దారుణమైన అన్యాయం జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే....కడపలో మహానాడు పేరుతో తెలుగుదేశం పార్టీ పెద్ద డ్రామా ప్రదర్శించింది. కొత్త టెక్నిక్లతో లేనివి ఉన్నట్లుగా చూపించారు. ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక, జిమ్మిక్కులతో ప్రజలను మభ్య పెట్టేందుకు మూడు రోజుల పాటు చాలా తాపత్రేయ పడ్డారు. ప్రతి రాజకీయ పార్టీకి ఆవిర్భావ దినం సందర్భంగా కార్యక్రమాలు చేసుకోవడం సహజం. అధికారంలో ఉన్న పార్టీ తాను చేసిన పనులను చెప్పుకుంటుంది. కానీ టీడీపీ మాత్రం అధికారంలో ఉండి, ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక, వైఎస్సార్సీపీని ఆడిపోసుకుని ఆత్మస్తుతి-పరనిందకే పరిమితమయ్యారు. స్థాయిలేని వ్యక్తులతో సభ్యత లేకుండా మాట్లాడిన భాషను మొత్తం రాష్ట్ర ప్రజానీకం అంతా చూశారు.మహానాడు సాక్షిగా పథకాలపై ఎందుకు స్పష్టత ఇవ్వలేదు?మహనాడు సాక్షిగా ప్రజలకు హామీ ఇచ్చిన పథకాలను ఎప్పుడు, ఏ తేదీల్లో అమలు చేస్తామో ఎందుకు చెప్పలేక పోయారు? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మేం ఏం చేశామో ఇప్పటికీ గట్టిగా చెప్పగలం. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చుకున్నారు. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ జిల్లాగా విజయవాడ ప్రాంతంలో కొత్త జిల్లాను అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మరి ఎన్టీఆర్ జిల్లాను కూడా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా కూటమి ప్రభుత్వం మారుస్తుందా? ఈ రాష్ట్రానికి సేవలు అందించిన ముఖ్యమంత్రులకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇంత సంకుచితంగా సీఎం చంద్రబాబు ఎలా ఆలోచిస్తున్నారు?పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంపై సమీక్ష ఏదీ?పదో తరగతి పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్ధులు రీ వెరిఫికేషన్ పెట్టుకుంటే వారికి ఏకంగా తొంబై మార్కులు వచ్చాయి. ఇటువంటి పరిస్థితిని ఎప్పుడైనా చూశామా? 16వేల మంది తమ పేపర్లను కరెక్షన్ చేయించుకుంటే దానిలో అధికశాతం అస్తవ్యస్తంగా పేపర్ల మూల్యాంకనం చేసినట్లుగా తేలింది. గతంలో ఏ నాడైనా అయిదు వేల కంటే ఎక్కువ మంది విద్యార్థులకి కరెక్షన్లో భిన్నంగా ఫలితాలు వచ్చాయా? మొదట ఇరవై మార్కులు వచ్చి, తరువాత రీవాల్యుయేషన్ తరువాత తొంబై మార్కులు వచ్చిన ఘటనలు ఎన్నడూ లేవు. దీనిని బట్టి చాలా దారుణంగా పదోతరగతి విద్యార్ధుల జవాబుపత్రాలను దిద్దారనేది అర్థమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి పరీక్షల రీవాల్యుయేషన్పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇందులో ఎటువంటి తప్పులు చేశారో కనీసం సమీక్ష అయినా చేసుకున్నారా? గతంలో రోజుకు నలబై జవాబుపత్రాలను ఒకొక్కరికి ఇచ్చేవారు. కానీ తాజాగా వాల్యుయేషన్ చేసిన వారికి రోజుకు ఎన్ని జవాబుపత్రాలను దిద్దాలని ఇచ్చారో బయటపెట్టాలి. విద్యాశాఖ అసమర్థత కారణంగా విద్యార్ధులు ఎంత క్షోభకు గురయ్యారో అర్థం చేసుకోవాలి. ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో బయటపెట్టాలి. ఈనాడు వంటి ఎల్లో మీడియా పత్రికల్లో ఈ వ్యవహారాన్ని వక్రీకరించేలా ఎందుకు కథనాలు రాయిస్తున్నారో చెప్పాలి.మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ... ఉర్సాకు ఎంతకు భూములు ఇచ్చారో బయటపెట్టాలి. కారుచౌకగా కట్టబెడుతున్నారన్న మా ఆరోపణలను వాస్తవం కాదని దమ్ముంటే నిరూపించాలి.ఈ రోజు ఈనాడు పత్రికలో ఇరవై శాతం ఇలాగే రీవాల్యుయేషన్లో మార్కుల్లో తేడాలు రావడం సహజమన్నట్లుగా వచ్చిన కథనం పూర్తి అవాస్తవం. ఏ ఏడాది అయినా అయిదు వేల మంది కంటే ఎక్కువ విద్యార్ధులకు రీవాల్యుయేషన్లో మార్కుల్లో భారీ వ్యత్యాసాలు రాలేదు. ప్రతిఏటా కనీసం పద్నాలుగు రోజులు జవాబు పత్రాలను దిద్దేవారు. కానీ తాజాగా మాత్రం తొమ్మిది రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. జవాబు పత్రాలను దిద్దేవారిపై పనిఒత్తిడిని పెంచారు. వాల్యుయేషన్ సెంటర్లు, టీచర్లను పెంచకుండా ఎక్కువ జవాబుపత్రాలను దిద్దాలని ఇవ్వడం వల్లే ఇటువంటి ఫలితాలు వెలువడ్డాయి.మహానాడులో రైతుభరోసా ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వంలోని వ్యవసాయశాఖ మంత్రి ఎందుకు ప్రకటించలేదు? అమ్మ ఒడి, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి ఇలా కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో తేదీలతో సహా ఎందుకు సంబంధిత మంత్రులు ఎందుకు వెల్లడించలేదు?ఏడాది కూటమి పాలనలో ప్రజలకు జరిగిన మోసాన్ని ఎత్తి చూపుతూ జూన్ 4వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 'వెన్నుపోటు దినం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజలను కలుపుకుని ఆరోజు నిరసనలు, ర్యాలీలు నిర్వహించి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నాం’ బొత్స తెలిపారు. -
చెల్లెళ్లు ఆటపట్టించడంతో అక్క ఆత్మహత్య
మర్రిపాలెం(విశాఖపట్నం): జ్ఞానాపురం గెడ్డ వీధికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాలివి.. కిరణ్మయి (15) తల్లిదండ్రులు, చెల్లెళ్లతో కలిసి నివాసం ఉంటోంది. ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. అయితే బాలికను చెల్లెళ్లు నిత్యం ఏదో ఒక విషయంపై ఆటపట్టిస్తుండటంతో.. శుక్రవారం ఇంట్లో ఉన్న బాత్రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో లేరు. కొంతసేపటికి ఆమె తాత ఇంటికి రావడంతో, అక్క ఎక్కడికో వెళ్లిపోయిందని వారు అతనికి చెప్పారు. అంతా వెతికి, చివరికి బాత్రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా, కిరణ్మయి విగతజీవిగా కనిపించింది. వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కాగా బాలిక తండ్రి ఎండాడలో వెల్డింగ్ పనులు చేస్తుండగా, తల్లి గౌరి నగరంలో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అప్పుడు 18.. ఇప్పుడు 65
దేవరాపల్లి(విశాఖపట్నం): ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన తప్పిదంతో ఓ విద్యార్థి తీవ్ర వేదనకు గురయ్యాడు. రీవాల్యుయేషన్లో ఫెయిల్ కాదు.. ఫస్ట్ క్లాస్ అని తేలింది. దేవరాపల్లి మండలం తెనుగుపూడి డా. బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల విద్యార్థి లింగాల ఆకర్ష్ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాశాడు. ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో పాస్ కాగా సాంఘిక శాస్త్రంలో కేవలం 18 మార్కులు మాత్రమే వచ్చాయి. దీంతో విద్యార్థితోపాటు తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మూల్యాంకనంపై అనుమానం వచ్చి విద్యార్థి తల్లిదండ్రులు ఎస్ఎస్సీ బోర్డుకు రూ.1000 చలానా చెల్లించి సోషల్ పేపర్ జవాబు పత్రాన్ని రీ వాల్యుయేషన్ చేయించారు. పునర్ మూల్యాంకనంలో 65 మార్కులు వచ్చాయంటూ ఎస్ఎస్సీ బోర్డు నుంచి లింగాల ఆకర్ష్ ఫోనును సమాచారం వచ్చింది. అంతే కాకుండా అతని జవాబు పత్రంలోని పేజీలను పంపించారు. దీంతో తన కుమారుడు పరీక్షలో ఫెయిల్ కాలేదని, పాసయ్యాడని తెలిసిన అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. మూల్యాంకనంలో నిర్లక్ష్యంతోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదని బాధిత విద్యార్థి తల్లిదండ్రులతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నచ్చిన చోట కొలువు కోసం పైరవీలు
మహారాణిపేట: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గడువు దగ్గర పడుతుండటంతో, తమకు నచ్చిన చోటకు పోస్టింగ్ల కోసం పైరవీలు ఊపందుకున్నాయి. కూటమి ప్రజా ప్రతినిధుల సిఫార్సులకోసం రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లోని కొంతమంది అధికారులు నిమగ్నమయ్యారు. నగరంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారు అక్కడి నుంచి కదలకుండా ఉండేందుకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నగరంలో పోస్టింగ్లు దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా భీమిలి, విశాఖ రూరల్, ఆనందపురం, పెందుర్తి, సీతమ్మధార తహసీల్దార్ పోస్టులకు మంచి డిమాండ్ ఉంది. వీటిని పొందేందుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు ఆరుగురు సిద్ధపడినట్టు ప్రచారం జరుగుతోంది. నిబంధనలివీ.. జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం తెలిసిందే. ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన వారికి స్థాన చలనం కల్పించాలి. మన్యం ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన వారికి బదిలీల్లో ప్రాధాన్యమివ్వాలి. ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయడమే కాకుండా అన్ని క్యాడర్లు, పోస్టుల్లో చేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకుని, ఎంత కాలం ఒకే ప్రాంతంలో పని చేశారనేది లెక్కించాలి. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు మించి పనిచేసిన వారికి, 40 శాతానికి మించి వైకల్యం ఉన్న ఉద్యోగులకు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే బదిలీల్లో ప్రాధాన్యమివ్వాలి. రెవెన్యూలో సిఫార్సులకే పెద్దపీట? ఉమ్మడి విశాఖలోని రెవెన్యూ శాఖలో అన్ని క్యాడర్లలో బదిలీలు విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ చేయాల్సి ఉంది. దీనిపై ఆయన ఇప్పటికే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి కలెక్టర్లతో సమావేశమై చర్చించారు. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, తహసీల్దార్ కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర క్యాడర్ల బదిలీలపై తుది నిర్ణయం విశాఖ కలెక్టర్ తీసుకోవాల్సి ఉంది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆయన కార్యాలయానికి 68 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. ఇవి కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కూడా సిఫార్సు లేఖలు, ఫోన్లు వచ్చినట్లు సమాచారం. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు తహసీల్దార్లు విశాఖ జిల్లాలో పోస్టింగ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొంతమంది నచ్చిన చోట పోస్టింగ్ల కోసం ఎమ్మెల్యేల సిఫార్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కూటమి ఎమ్మెల్యేల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు పోస్టు కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధం -
కూటమి వైఫల్యాలను ఎండగట్టేందుకు ‘4న వెన్నుపోటు దినం’
విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపు సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు, కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసగించిన తీరును ఎండగడుతూ జూన్ 4వ తేదీన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. శుక్రవారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో కేకే రాజు అధ్యక్షతన విశాఖ ఉత్తర నియోజకవర్గం సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్కు చిన్నచూపు తప్ప, ఈ ప్రాంత అభివృద్ధి చేసేందుకు వారు నోచుకోలేదని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ విశాఖకు వచ్చిన ప్రాజెక్టులను అమరావతికి తరలించుకుపోతున్నారని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కేవలం పచ్చ మీడియాలో తప్ప మరెక్కడా కనబడట్లేదని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేవరకు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాటిని అమలు చేసేవరకు వైఎస్సార్సీపీ తరపున ప్రతీ కార్యకర్త పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, కార్పొరేటర్లు అల్లు శంకర్రావు, కె.అనిల్ కుమార్ రాజు, రెయ్యి వెంకటరమణ, భర్కత్ అలీ, సేనాపతి అప్పారావు, పేడాడ రమణి కుమారి, గుజ్జు వెంకటరెడ్డి, పైడి రమణ, దుప్పలపూడి శ్రీనివాసరావు, పి.సునీత, నీలి రవి, దల్లి రామకృష్ణ రెడ్డి, సప్పంగి శ్రీనివాసరావు, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, బొడ్డేటి కిరణ్, గుడ్ల అశోక్ రెడ్డి, భీశెట్టి ప్రసాద్, కర్రి రామరెడ్డి, నూకరాజు, ప్రసాద్, సదరం జ్ఞానేశ్, షేఖ్ బాబ్జి, అశోక్ రెడ్డి, బి.శ్రీనివాస్, మువ్వల సంతోష్, రాఘవులు, పద్మ శేఖర్, నాగమణి, జగదీష్, సాయి, గాలి ప్రసాద్, కోట్యాడ సూర్య, గోవింద్, భోగవల్లి గోవింద్, సారిపల్లి సంతోష్, రత్నం, అప్పారావు, సొండి సురే ష్, జగదీశ్, చందనసాయి, ఈశ్వరావు పాల్గొన్నారు. -
పంచతంత్రం
‘బ్లూ ఫ్లాగ్ బీచ్లో రుషికొండ సాగరతీరం 2020 అక్టోబర్ 11న ‘బ్లూఫ్లాగ్’గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో రుషికొండ బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.7.35 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో అప్పటి ప్రభుత్వం వివిధ పనులు చేపట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఏటా జ్యూరీ సభ్యులు బీచ్ను పరిశీలించి, ఈ ధ్రువీకరణ పత్రాన్ని పునరుద్ధరిస్తారు. 2023 వరకు సుందరంగా కనిపించిన బీచ్.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘బ్లూ ఫ్రాడ్’గా మారిపోయింది. ఇది అంతర్జాతీయ బీచ్ అనే విషయాన్ని కూడా మర్చిపోయింది. దీంతో డెన్మార్క్ సంస్థ రుషికొండ బీచ్కు ప్రపంచస్థాయి గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేయడతో కూటమి సర్కారు ఉలిక్కిపడింది. హడావుడిగా తా త్కాలిక పనులు చేపట్టి.. మళ్లీ సర్టిఫికెట్ను పునరుద్ధరించేసుకుంది. ఇప్పు డు ఇదే బీచ్ను తమకు కాసులు కురిపించే కేంద్రంగా మార్చేందుకు చకచకా పావులు కదుపుతోంది. ఓ అండ్ ఎం కోసం టెండర్లు.. కానీ.. తాజాగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం), కాలుష్య నియంత్రణ, రెవెన్యూ సేకరణ కోసం గత నెలలో ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రక్రియలోనే జనసేన నాయకుడు చక్రం తిప్పినట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అదే పార్టీకి చెందిన నేత కావడంతో.. ఆయన అండదండలతో విశాఖ రీజియన్ పర్యాటక శాఖను తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. దీంతో ఆ నేత అడుగులకు మడుగులొత్తుతూ జిల్లా ఏపీటీడీసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. టెండర్లలో పాల్గొనేందుకు ఎవరూ రాకుండా ఉండేలా చూడాలంటూ ఆ నేత హుకుం జారీ చేయడం.. టూరిజంలో ‘జగ’మంతా తెలిసిన అధికారి వెంటనే టెండరు నిబంధనలు కఠినతరం చేయడం చకచకా జరిగిపోయాయి. టెండర్లలో పాల్గొన్నారో.? ఆర్ఎఫ్పీ పిలిచేముందు.. ఆసక్తి కలిగిన సంస్థలతో టూరిజం అధికారులు గత నెలలోనే ఆన్లైన్లో ప్రీబిడ్డింగ్ మీట్ను నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సంస్థలకు టెండర్ నియమ నిబంధనల గురించి వివరించగా.. కష్టతరంగా ఉన్నాయని, గతంలో ఉన్న నిబంధనలే ఉంచాలని కొందరు కోరారు. ఈ సూచనలను టూరిజం అధికారులు తోసిపుచ్చారు. ఎవరెవరు ఆసక్తిగా ఉన్నారనే వివరాలను టూరిజం ప్రాంతీయ అధికారులు సేకరించి.. ఆ జాబితాను భీమిలి నేత చేతిలో పెట్టారు. ఇంకేముందు ఆ నేత ఆయా సంస్థల ప్రతినిధులకు ఫోన్లు చేసి బ్లూఫ్లాగ్ టెండర్లలో పాల్గొనవద్దని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. కొందరు ఎదురించి మాట్లాడితే ‘ఈ టెండర్లో పాల్గొంటే, టూరిజంకి సంబంధించి భవిష్యత్తులో ఏ టెండరూ మీకు రాదు’అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో వారంతా టెండర్ వేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ నేత పాచిక పారింది. త్వరలోనే సెకండ్ కాల్కి టెండర్లు ఆహ్వానించి.. తమ అనుయాయులకు అప్పగించేలా అంతా సెట్ చేశాడు. జిల్లా టూరిజం అధికారులు జనసేన నేతకు అనుకూలంగా బ్లూఫ్లాగ్ బీచ్ నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు యత్నిస్తున్నారే తప్ప.. పర్యాటక శాఖ ఆదాయం, బీచ్ అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్లూఫ్లాగ్ బీచ్పై భీమిలి జనసేన నేత కన్ను రుషికొండ బీచ్ నిర్వహణకు టెండర్ల ఆహ్వానం అధికారుల అండతో దోపిడీకి రంగం సిద్ధం? -
జూలై 9న గిరి ప్రదక్షిణ
సింహాచలం: సింహాచలం క్షేత్రంలో జూలై 9న గిరి ప్రదక్షిణ ఉత్సవం జరగనుందని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఈవో వి. త్రినాథరావు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామన్నారు. గిరి ప్రదక్షిణ ఉత్సవం నిర్వహణపై శుక్రవారం దేవస్థానం వైదికులు, ఇంజినీరింగ్ అధికారులు, సెక్షన్ హెడ్లతో ఈవో ముందస్తు సమీక్ష నిర్వహించారు. జూలై 9న 32 కిలోమీటర్ల సింహగిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు, అలాగే జూలై 10న ఆలయ ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొంటారని ఈవో అంచనా వేశారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం కొండచుట్టూ స్టాల్స్, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు విషయంపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ఈ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులకు ముందుగానే లేఖలు రాయాలని సూచించారు. జీవీఎంసీ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ, ఫైర్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. గిరి ప్రదక్షిణ ఉత్సవంలో దాతల సహకారం కూడా ఎంతో ముఖ్యమని ఈవో పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ దీపాలు, మంచినీటి సదుపాయాల కోసం జీవీఎంసీ సహకారం తీసుకుంటామన్నారు. సమావేశంలో స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, డిప్యూటీ ఈవో ఎస్.రాధ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి, ఈఈ రాంబాబు, ఏఈవోలు రమణమూర్తి, ఆనంద్కుమార్, పిల్లా శ్రీనివాసరావు, పంతం శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు కె.మూర్తి, రాజ్యలక్ష్మి, సునీల్, పద్మనాభరాజు, త్రిమూర్తులు, పీఆర్వో నాయుడు పాల్గొన్నారు. ఏర్పాట్లపై దేవస్థానం ఈవో త్రినాథరావు సమీక్ష -
విజయనగరం వరకే రాయగడ ఎక్స్ప్రెస్
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ పరిధి రాయగడ–విజయనగరం సెక్షన్లో జరుగుతున్న మూడో లైన్ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను జూన్ 2,3 తేదీల్లో రద్దు చేశారు. మరికొన్నింటిని గమ్యం కుదించడంతో పాటు రీషెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు చేసిన రైళ్లు ● జూన్ 2న విశాఖపట్నం–కోరాపుట్–విశాఖపట్నం(58538 / 58537) పాసింజర్, విశాఖపట్నం–కోరాపుట్(18512) బై–వీక్లీ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం–రాయ్పూర్–విశాఖపట్నం(58528/58527) పాసింజర్ ● జూన్ 3న కోరాపుట్–విశాఖపట్నం(18511) బై–వీక్లీ ఎక్స్ప్రెస్ గమ్యం కుదించిన రైళ్లు ● జూన్ 1న గుంటూరు–రాయగడ(17243) ఎక్స్ప్రెస్ విజయనగరం వరకు మాత్రమే నడుస్తుంది. జూన్ 2న రాయగడ–గుంటూరు(17244) ఎక్స్ప్రెస్ విజయనగరం నుంచి బయలుదేరుతుంది. రీషెడ్యూల్ చేసిన రైళ్లు ● జూన్1న ఎర్నాకుళం– టాటా (18190) ఎక్స్ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా ఉదయం 10.15 గంటలకు బయలుదేరుతుంది. అలప్పుజ–ధన్బాద్(13352) బోకారో ఎక్స్ప్రెస్ 2 గంటలు ఆలస్యంగా ఉదయం 8 గంటలకు బయలుదేరుతుంది. ● జూన్ 2న దుర్గ్–విశాఖపట్నం(20829) వందేభారత్ ఎక్స్ప్రెస్ నాలుగున్నర గంటలు ఆలస్యంగా ఉదయం 10.15 గంటలకు, విశాఖపట్నం–దుర్గ్(20830) వందేభారత్ ఎక్స్ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా రాత్రి 6.50 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైళ్లు అంతే ఆలస్యంగా ఆయా స్టేషన్లకు రాకపోకలు సాగిస్తాయని, ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని డీసీఎం సూచించారు. -
10న విశాఖలో రాష్ట్రపతి పర్యటన
మహారాణిపేట: నగరంలో జూన్ 10వ తేదీన జరగనున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో శుక్రవారం గిరిజన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ టి.వి.కట్టిమణితో కలిసి వివిధ అంశాలపై సమీక్షించిన కలెక్టర్.. కార్యక్రమ నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతి జూన్ 10వ తేదీ ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాలుకు చేరుకుంటారు. అక్కడ జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు జరిగే కార్యక్రమం అనంతరం, ఆమె రోడ్డు మార్గం ద్వారా విమానాశ్రయానికి చేరుకుని తిరిగి ప్రయాణం అవుతారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు మార్గంలో రానున్న నేపథ్యంలో సుందరీకరణ పనులు, మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. జ్ఞానాపురం రైల్వే అండర్ పాస్ వద్ద నీరు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని, ఒకవేళ వర్షం పడినట్లయితే మోటార్ల ద్వారా నీటిని తొలగించాలని జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఐఎన్ఎస్ డేగా నుంచి కన్వెన్షన్ హాలు వరకు ఎలాంటి హోర్డింగులు, విద్యుత్ తీగలు, ఇతర అడ్డంకులు లేకుండా తొలగించాలని సూచించారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రానున్న క్రమంలో ప్రత్యేక గ్రీన్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీఆర్వో బిహెచ్ భవానీ శంకర్, ఆర్డీవోలు పి.శ్రీలేఖ, సంగీత్ మాధుర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశం -
అతివేగమే ఆయువు తీసింది
● ఫ్లై ఓవర్పై ఘోర ప్రమాదం ● ఇద్దరు యువకుల దుర్మరణం అల్లిపురం: అతివేగం ఇద్దరు యువకుల ఆయువు తీసింది. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి తెలుగుతల్లి ఫ్లైఓవర్పై గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. టూటౌన్ సీఐ ఎం.శ్రీను, ఎస్ఐ కె.శ్రీలక్ష్మి తెలిపిన వివరాలివి. గోపాలపట్నం సమీపంలోని నరసింహనగర్కు చెందిన ఎస్.ప్రసన్నకుమార్, అతని స్నేహితుడు సాయి కిరణ్ బుధవారం రాత్రి 11.30 గంటలకు ఎలక్ట్రిక్ స్కూటర్పై వైఎంసీఏ ఎదురుగా బీచ్కు వెళ్లారు. తిరిగి తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా రైల్వేస్టేషన్ వైపు ప్రయాణిస్తుండగా.. డీఆర్ఎం కార్యాలయం సమీపంలోని మలుపు వద్ద వాహనం అదుపు తప్పింది. అతివేగంగా ఉండటం వల్ల వాహనాన్ని నియంత్రించలేకపోయారు. దీంతో వారు మధ్య డివైడర్పై ఉన్న పూలకుండీని బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ప్రసన్నకుమార్, సాయి కిరణ్లు ఒకరు డివైడర్పై, మరొకరు రోడ్డుపై పడిపోయారు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్ ట్రాఫిక్ సీఐ ఎం.శ్రీను సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అప్పటికే మృతి చెందిన యువకుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ప్రసన్నకుమార్ తండ్రి ఎస్.వెంకట అప్పలరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నరసింహనగర్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
పొగ.. జీవితాలకు సెగ
● దృఢ సంకల్పంతో వ్యసనానికి దూరం కావొచ్చు ● నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం డాబాగార్డెన్స్: సిగరెట్.. గుట్కా.. పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం ఎన్నో అనార్థాలకు, అనారోగ్యాలకు కారణం. ఈ చేదు నిజాన్ని గ్రహించే లోపే.. సిగరెట్ పొగలా మన ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. దృఢ సంకల్పంతో ఈ వ్యసనాన్ని దూరం చేసుకోవచ్చు. మన ఆరోగ్యంతో పాటు మన చుట్టూ ఉన్న వారి శ్రేయస్సు కోసం ఈ మహమ్మారిపై పోరాడాల్సిన అవసరం ఉంది. నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా అది ప్రమాదకరమే. దీని వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఒక సిగరెట్లో 400 పైగా హానికరమైన రసాయనాలు ఉంటాయి. వీటి లో 48కి పైగా క్యాన్సర్ కారకాలున్నాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రసాయనాలు ఊపిరితిత్తులు, గొంతు, నాలుక వంటి భాగాలకు అతి సులువుగా క్యాన్సర్ను కలిగిస్తాయి. గర్భిణులు ధూమపానం చేస్తే, కడుపులోని శిశువు సున్నితమైన అవయవాలపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. ధూమపానం చేసే వారు తమ చుట్టూ ఉన్నవారి ఊపిరితిత్తుల్లోకి దాదాపు 25 శాతం విష వాయువులను ఉచితంగా పంపి.. వారి అనారోగ్యానికి కారణమవుతున్నారు. ఆర్థికంగా చితికిపోయి, అనారోగ్యంతో మంచానపడి జీవితం దుర్భరంగా మారుతుంది. చేయి చేయి కలుపుదాం పొగతాగడం వల్ల కొత్త జబ్బులు వస్తున్నాయి. శారీరక రోగాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యల వలనే చాలా మంది పొగాకుకు బానిసలవుతున్నారు. ఈ అలవాటు మానేందుకు చాలా మంది ఇష్టపడడం లేదు. మందులు వాడినా మెడిటేషన్ చాలా ముఖ్యం. పొగాకు మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా.. మన చుట్టూ ఉన్న వారికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – డాక్టర్ సునీల్కుమార్, చెస్ట్ ఫిజీషియన్, ప్రభుత్వ చాతి ఆసుపత్రి -
ఎయిడెడ్ ఆచార్యులు ఔట్
● ఏయూ నుంచి 38 మంది రిలీవ్ ● కన్నీటి పర్యంతమైన మహిళా ఆచార్యులు ● పరిశోధక విద్యార్థులకు తప్పని అగచాట్లు విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలో ఫారిన్ సర్వీసు/డిప్యుటేషన్పై పనిచేస్తున్న 38 మంది ఆచార్యులు శుక్రవారం ఇక్కడ నుంచి రిలీవ్ అయ్యారు. వైస్ చాన్సలర్ ఆదేశాలతో డిప్యూటీ రిజిస్ట్రార్(అకడమిక్) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి పోస్టింగ్ నిమిత్తం మంగళగిరిలోని కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ కార్యాలయంలో తక్షణమే రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో డిప్యుటేషన్పై పని చేస్తున్న ఆచార్యులంతా శుక్రవారం సాయంత్రం క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపాళ్ల ఆమోదంతో తమ విధుల నుంచి రిలీవ్ అయ్యారు. సాగనంపడమే లక్ష్యంగా.. రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాలల నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఫారిన్ సర్వీసు/డిప్యుటేషన్ ప్రాతిపదికన 2023 జూన్లో 80 మంది ఆచార్యులు వచ్చారు. అనివార్య కారణాల వల్ల 40 మంది అప్పుడే వెనక్కి వెళ్లిపోగా, ఒకరు మరణించారు. మరొకరు ఇటీవలే తమ మాతృస్థానానికి వెళ్లారు. ప్రస్తుతం 38 మంది ఆచార్యులు పనిచేస్తున్నారు. విశ్వవిద్యాలయంలో వెయ్యికి పైగా రెగ్యులర్ ఆచార్యులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం రెండు వందల లోపే ఉన్నారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డిప్యుటేషన్ పై పనిచేస్తున్న సీనియర్ ఆచార్యులను ఈ సంవత్సరం కొనసాగిస్తారని అందరూ భావించారు. కానీ నాటకీయ పరిణామాల నడుమ వారందరినీ ఆగమేఘాల మీద రిలీవ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అగౌరవంగా.. అవమానకరంగా.. డిప్యుటేషన్ పై వచ్చిన ఆచార్యులను ఏయూ నుంచి పంపించేస్తారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై కలత చెందిన కొంత మంది ఆచార్యులు మూడు రోజుల కిందట వీసీని కలిసి తమ ఇబ్బందులను చెప్పుకున్నారు. పిల్లల చదువుల దృష్ట్యా ఈ సంవత్సరం కొనసాగించాలని, విశ్వవిద్యాలయం వంద ఏళ్ల ఉత్సవాల్లో భాగస్వాములయ్యే అవకాశం కల్పించాలని విన్నవించినట్లు తెలిసింది. అదే సమయంలో కూటమికి చెందిన కొంతమంది ప్రజా ప్రతినిధులను కూడా కలిసినప్పటికీ, ఉన్నట్టుండి రిలీవ్ చేయడంతో డిప్యుటేషన్ పై వచ్చిన ఆచార్యులు షాక్కు గురయ్యారు. వర్సిటీ నాక్ గ్రేడ్ సాధించడంలో ఎంతో కీలకంగా పనిచేసిన తమను ఇలా అగౌరవంగా, అవమానకరంగా రిలీవ్ చేయడంపై కొంతమంది మహిళా ఆచార్యులు వర్సిటీ పెద్దల ముందు కన్నీటి పర్యంతమైనట్లు తెలిసింది. రీసెర్చ్ స్కాలర్ల దారెటు? డిప్యుటేషన్ పై వచ్చిన వారంతా సీనియర్ ఆచార్యులు కావడంతో విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఒక్కో ఆచార్యుని వద్ద నలుగురు లేదా ఐదుగురు పరిశోధక విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం 38 మంది ఆచార్యులను వర్సిటీ నుంచి రిలీవ్ చేయడంతో.. ఇప్పటివరకు వారి మార్గదర్శకత్వంలో ఉన్న పరిశోధక విద్యార్థుల పరిస్థితి ఏమిటనేది తేలాల్సి ఉంది. గైడ్ షిప్ మారే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వర్సిటీ అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పరిశోధక విద్యార్థులు కోరుతున్నారు. -
తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన
మహారాణిపేట (విశాఖ): వాయవ్య బంగాళాఖాతంలో ఆవరించి ఉన్న వాయుగుండం పశ్చిమ బెంగాల్–బంగ్లాదేశ్ తీరాల వెంబడి కదిలి గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారింది. మధ్యాహ్నానికి పశ్చిమ బెంగాల్–బంగ్లాదేశ్ తీరాలను దాటింది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో దక్షిణ ఛత్తీస్గఢ్, దానికి అనుకుని ఉన్న తూర్పు విదర్భపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, ఆంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. శుక్రవారం శ్రీకాకుళం,విజయనగరం, మన్యం,అల్లూరి, విశాఖ,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,తూగో, పగో,ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్,బాపట్ల, పల్నాడు,ప్రకాశం,నెల్లూరు,నంద్యాల, వైఎస్ఆర్ కడప,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. pic.twitter.com/uPu8SrZk5i— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 29, 2025 ఇక, శుక్రవారం.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి, విశాఖ,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు.. గురువారం పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.ఇదిలా ఉండగా.. ఏపీవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే భారీగా ఈదురు గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణ, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలపై రాష్ట్రంలోని పలు జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి.. తగిన విధంగా సూచనలు జారీ చేసినట్లు చెప్పింది. -
సీఎం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు
మహారాణిపేట (విశాఖ): ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆరోగ్యంపట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం చంద్రబాబు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. విశాఖలోని రెవెన్యూ గెస్టుహౌస్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు సీఎంను అపాయింట్మెంటు అడిగినా.. ఇవాళ, రేపు అంటూ కొన్నాళ్లుగా అధికారులు వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. తాము పెద్దపెద్ద కోరికలు కోరట్లేదని, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 వేల కోట్ల బకాయిల్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని.. అయినా ప్రభుత్వోద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు మాత్రమే అడుగుతున్నామన్నారు. పీఆర్సీ, ఐఆర్, పాత బకాయిల కోసం ఉద్యోగులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారని, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధమని బొప్పరాజు హెచ్చరించారు.పీఆర్సీకి మీనమేషాలు ఎందుకు?ఇక ఉద్యోగుల బకాయిల్లో కేవలం 10 శాతం మాత్రమే ఇచ్చారని, ప్రభుత్వం ఇంకా నాలుగు డీఏలు బకాయిపడిందన్నారు. పీఆర్సీ కమిషన్ వేయడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని బొప్పరాజు ప్రశ్నించారు. వేరే రాష్ట్రాల్లో కోర్టులకు వెళ్లి డీఏ బకాయిలు సాధించుకున్నారని, ప్రభుత్వం మీద గౌరవంతో తాము కోర్టులకు వెళ్లడంలేదన్నారు. అలాగే, రిటైర్డ్ ఉద్యోగులకే ప్రభుత్వం రూ.ఆరేడు వేల కోట్లు బకాయిలు ఉందని వెల్లడించారు. ఉద్యోగులకు మొత్తంగా రూ.20 వేల కోట్ల వరకు ప్రభుత్వం బకాయి ఉందని.. ఉద్యోగ ఆరోగ్య స్కీం స్కాంగా మారిందని.. ఒక ఉద్యోగి అనారోగ్యానికి గురై చికిత్స కోసం రూ.5 లక్షలు ఖర్చుచేస్తే రూ.90 వేల బిల్లు మంజూరు చేశారని ఆయన అవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నామని, అందులో భాగంగా విశాఖ వచ్చినట్లు బొప్పరాజు చెప్పారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమానికి కూడా వెనుకాడబోమన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సత్తి నాగేశ్వరరెడ్డి, ఏపీ జేఏసీ సెక్రటరీ కేఎన్ రావు, అప్పలరావు, డి. వెంకట్రావు, కిరణ్కుమార్, రాజేష్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
కరోనాతో ఒకరి మృతి?
మహారాణిపేట(విశాఖ)/ముసునూరు: కరోనా సోకి విశాఖ నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి (60) గురువారం ఉదయం మృతిచెందినట్లు తెలిసింది. ఆ రోగి కోవిడ్తో మృతిచెందినట్టు అతని కేస్ షీట్లో నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ వ్యక్తి కోవిడ్తో మృతిచెందలేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి(డీఎంహెచ్వో) డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. జిల్లాలో ఇంతవరకు ఏ విధమైన కోవిడ్ మరణం నమోదు కాలేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.ఏలూరు జిల్లాలో కోవిడ్ కేసు నమోదుఏలూరు జిల్లా ముసునూరు మండలం యల్లాపురానికి చెందిన ఓ వ్యక్తి (52)కి కరోనా సోకింది. కొద్దిరోజుల క్రితం హైదరాబాదులో ఓ ఫంక్షన్కు హాజరైన ఆయన ఇటీవల స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత జలుబు, గొంతు నొప్పి వచ్చి అనారోగ్యానికి గురవడంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. వైద్యులు కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ చేయగా, పాజిటివ్ వచ్చింది. దీంతో అతన్ని హోమ్ ఐసోలేషన్లో ఉంచినట్టు ముసునూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ షకీనా ఇవాంజిలిన్ గురువారం తెలిపారు. -
జూన్ 9న వర్కింగ్ జర్నలిస్టుల ఆందోళన
విశాఖ విద్య: జర్నలిస్టులకు సంబంధించిన రెండు కీలక చట్టాలను కేంద్రం రద్దు చేయడాన్ని నిరసిస్తూ జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నట్లు ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వెంకటరావు, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు ప్రకటించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ హాలులో గురువారం ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం ఇటీవల 44 కార్మిక చట్టాలను రద్దు చేసిందని, అందులో రెండు జర్నలిస్టులకు సంబంధించినవి ఉన్నాయన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతనాల చెల్లింపులు చట్టం 1958 రద్దు చేసిన వాటిలో ఉన్నట్లు వెల్లడించారు. వీటిని తక్షణమే పునరుద్ధరించాలనే డిమాండ్తో జూన్ 9న నిర్వహించే జాతీయ కార్మిక సంఘాల ఆందోళనలో జర్నలిస్టులు కూడా పాల్గొనా లని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో దశలవారీగా ఆందోళన తప్పదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న నేటికి కొత్త అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయలేదన్నారు. అలాగే జర్నలిస్టులు ఇళ్ల స్థలాలకు సైతం నోచుకోలేదన్నారు. పెన్షన్ పథకం అమలు చేయాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా పునరుద్ధరించాలని తీర్మానించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాలను త్వరలోనే ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సమావేశంలో భాగంగా వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్కు సంబంధించిన నూతన వెబ్సైట్ను ఆవిష్కరించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విశాఖ వేదికగా త్వరలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎన్ఏజే సెక్రటరీ జనరల్ ఎం.కొండయ్య, జెండర్ ఈక్విటీ కౌన్సిల్ చైర్మన్ కె.మంజరి, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ, కార్యదర్శి జి.శ్రీనివాసరావు, బ్రాడ్కాస్ట్ అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కె.మదన్, చిన్న మధ్య తరహో పత్రికల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్, కె.శ్రీనివాస్ రావు, పలు జిల్లాల ఫెడరేషన్ నేతలు పాల్గొన్నారు. నూతన వెబ్సైట్ను ఆవిష్కరిస్తున్న నాయకులు -
జాబ్స్ @ గైస్
ఉద్యోగ సాధనలో తగ్గేదేలే! ●● ఐదేళ్లలో 732 ఉద్యోగాలు సొంతం ● సత్తా చాటుతున్న కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు మురళీనగర్: కొలువు ఎవరి సొంతం కాదు.. సత్తా ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు. ఇదే విషయాన్ని కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్(గైస్) విద్యార్థులు నిరూపిస్తున్నారు. ఒకప్పుడు ఫలానా ఇంజినీరింగ్ కోర్సులు చేస్తేనే ఉద్యోగాలు వస్తాయనే అభిప్రాయం ఉండేది. కానీ గైస్ విద్యార్థులు తమకు నచ్చిన కెమికల్ ఇంజినీరింగ్ రంగంలో రాణిస్తూ.. సులువుగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఈ కళాశాలలో చేరితే ఉద్యోగం ఖాయమనే నమ్మకాన్ని నిజం చేస్తున్నారు. ప్రతి క్యాంపస్ డ్రైవ్లోనూ అత్యుత్తమ వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందుతూ తమ ప్రతిభను చాటుతున్నారు. ఐదేళ్లలో రికార్డ్ స్థాయి ఉద్యోగాలు ఒక ప్రభుత్వ డిప్లమో కళాశాలలో పదుల సంఖ్యలో ఉద్యోగాలు రావడమే గొప్పగా చెప్పుకునే రోజుల్లో.. గైస్ విద్యార్థులు కేవలం ఐదేళ్లలో ఏకంగా 732 ఉద్యోగాలు పొందడం విశేషం. ఒకే కళాశాల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రావడం ఒక రికార్డు. వీరిలో 484 మంది బాలురు, 248 మంది బాలికలు ఉన్నారు. సంవత్సరాల వారీగా చూస్తే.. 2020–21లో 178 మంది, 2021–22లో 105 మంది, 2022–23లో 165 మంది, 2023–24లో 105 మంది, 2024–25లో 179 మంది ఉద్యోగాలు సాధించారు. ప్రతి సంవత్సరం సగటున 147 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందుతుండటం గమనార్హం. ఇక గైస్లో కెమికల్ ఇంజినీరింగ్లో నాలుగు విభాగాలు ఉన్నాయి. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో 204 మంది, పెట్రో కెమికల్స్లో 183 మంది, ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్లో 203 మంది, ఆయిల్ టెక్నాలజీలో 142 మంది ఉద్యోగాలు సాధించారు. బాలికల విషయానికి వస్తే.. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో 76 మంది, పెట్రో కెమికల్స్లో 64 మంది, ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్లో 55 మంది, ఆయిల్ టెక్నాలజీలో 53 మంది ఉద్యోగాలు పొందారు. అధిక ప్యాకేజీల్లో బాలికల హవా అత్యధిక వార్షిక వేతనం సాధించడంలో బాలికలు ముందంజలో ఉన్నారు. డిప్లమో స్థాయిలోనే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు దీటుగా అధిక జీతాలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా డి.వంశీప్రియాంక (ఏసియన్ పెయింట్స్) రూ. 6.73 లక్షలు, ఎస్కే జఫ్రీన్ అరాఫాతి(ఏసియన్ పెయింట్స్) రూ.6 లక్షలు, ఎస్.వైశాలి(ఏసియన్ పెయింట్స్) రూ. 6 లక్షలు, జి.గీతా భవాని (అల్ట్రాటెక్ సిమెంట్స్) రూ.4 లక్షలు, ఎల్.తేజస్విని (అల్ట్రాటెక్ సిమెంట్స్) రూ.4 లక్షలు, టి.సంధ్య (టెక్నిప్ ఎనర్జీస్) రూ.3 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు పొందారు. బాలురు కూడా మంచి ప్యాకేజీలు సాధించారు. జీఎస్కే చైతన్య (అల్ట్రాటెక్ సిమెంట్స్) రూ.4 లక్షలు, ఐ.మాధవరావు(ది ఆంధ్ర పెట్రో కెమికల్స్ లిమిటెడ్) రూ.3.6 లక్షలు, డి.సాయిలోకేష్ (సెయింట్ గోబెయిన్) రూ. 2.8 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు పొందారు. కొన్ని కంపెనీలు వీరికి ఇతర ఆర్థిక ప్రయోజనాలు, ప్రయాణ సౌకర్యాలు, క్యాంటీన్లో రాయితీ భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాయి. వెయ్యి ఉద్యోగాలే లక్ష్యం వచ్చే ఏడాది నాటికి తమ కళాశాల విద్యార్థుల ఉద్యోగాల సంఖ్య వెయ్యికి చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. క్యాంపస్ డ్రైవ్కు వెళ్లిన ప్రతి విద్యార్థి ఉద్యోగం సాధించాలి. ఇందుకోసం ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నాం. మల్టీ నేషనల్ కంపెనీలు, నవరత్న కంపెనీల్లో మా విద్యార్థులు పని చేస్తున్నారు. బాలురతో పాటు బాలికలకు సమ ప్రాధాన్యమిస్తూ ఉద్యోగాల సాధనకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. టెక్నికల్ ఎడ్యుకేషన్ బ్రోచర్స్, స్టడీ మెటీరియల్స్లో మా విద్యార్థుల ఫొటోలు ప్రచురించడం మాకు గర్వకారణం. –డాక్టర్ కె.వెంకటరమణ, ప్రిన్సిపాల్, గైస్ -
సంద్రం.. కల్లోలం
● నిన్న ఇసుక.. నేడు రాళ్లు.. రేపు.? గురువారం ఇలాబుధవారం నాటి పరిస్థితిసాగరతీరంలో కొన్ని గంటల్లో చోటుచేసుకున్న అనూహ్యమైన మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. అంబికా సీ గ్రీన్ హోటల్ ఎదురుగా ఉన్న బీచ్ రోడ్డు ప్రాంతంలో బుధవారం కనిపించిన దృశ్యం.. ఒక్క రాత్రిలోనే పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు ఇసుక మేటలతో నిండి ఉన్న ఈ ప్రాంతం.. గురువారం ఉదయానికి కెరటాల తీవ్రతకు ఇసుకంతా కొట్టుకుపోయింది. ఇప్పుడు అక్కడ గతంలో వేసిన రాళ్లు దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో తీరంలోని కొబ్బరి వనాలకు కూడా తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. గతంలోనూ ఇదే ప్రాంతం భారీగా కోతకు గురైన విషయం తెలిసిందే. అప్పట్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన మట్టి, రాళ్లు డంపింగ్ చేసి తాత్కాలికంగా కోతను నివారించారు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. అధికారులు తక్షణమే స్పందించి, తగిన చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు. – ఏయూ క్యాంపస్ తేమతో నిండిన బీచ్రోడ్డు -
నేడు విశాఖ–కిరండూల్ పాసింజర్ రద్దు
తాటిచెట్లపాలెం: కొత్తవలస–కోరాపుట్ సెక్షన్ తైడ–చిమిడిపల్లి పరిధిలో ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. బుధవారం ఇక్కడ గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరా, ఏడీఆర్ఎం(ఇన్ఫ్రా) ఈ.శాంతారం స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. పునరుద్ధరణ పనుల కారణంగా ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లను శుక్రవారం రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. రద్దయిన రైళ్లు : విశాఖపట్నం–కిరండూల్(58501) పాసింజర్, కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్, కిరండూల్–విశాఖపట్నం(18516) నైట్ ఎక్స్ప్రెస్. -
కూటమి నేతలు ఫిర్యాదు చేసినా...!
● వాస్తవానికి మైనింగ్ వ్యవహారంలో కూటమి నేతల మధ్యనే వివాదాలు రాజుకుంటున్నాయి. ఇష్టారీతిలో సాగుతున్న మైనింగ్ వ్యవహారంపై కూటమి పార్టీలోని నేతలే ఫిర్యాదు చేసే పరిస్థితి ఏర్పడింది.● చోడవరం నియోజకవర్గంలో లక్కవరం, గవరవరం, శేమునాపల్లి, వెంకన్నపాలెం, నరసాపురం, జుత్తాడ, భోగాపురం వంటి గ్రామాల్లో విచ్చలవిడిగా మైనింగ్ దందా జరుగుతోందని స్వయంగా జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎస్ఎన్ రాజు తహసీల్దారుతో పాటు విశాఖలోని విజిలెన్స్ ఎస్పీకి కూడా ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. శారదా నదిలోని ఇసుకను ఏ విధంగా ఇష్టారీతిలో తవ్వేస్తున్నారో కూడా ఫొటోలతో సహా వివరించారు. ఫిర్యాదుల పరంపర వారం రోజులుగా సాగుతున్నా.. చడీచప్పుడు లేకుండా పోయింది.● పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి, సబ్బవరం మండలాల్లో సాగుతున్న గ్రావెల్ దందాపై కూడా కూటమి పార్టీలోని నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నారు.● భీమిలిలోనూ అదే పరిస్థితి ఉంది. కూటమి పార్టీల పేరుతో కబ్జాల ఘనుడు చేస్తున్న వ్యవహారంతో పాటు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలపై కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం ఉండటం లేదు.● అనకాపల్లి జిల్లాలో కూడా నేరుగా అనుమతి లేని లారీలు పదుల సంఖ్యలో తిరుగుతున్నాయంటూ స్వయంగా ఎమ్మెల్యే అధికారులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ఎలా తిరగనిస్తున్నారని నిలదీశారు. అయినప్పటికీ రెండు, మూడు రోజులు నిలిచిన వ్యవహారం ఇప్పుడు యథావిథిగా సాగుతూనే ఉంది.● యలమంచిలి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే అవినీతి వ్యవహారాలపై టీడీపీ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు నేరుగా ధ్వజమెత్తుతున్నారు. రాంబిల్లి వద్ద నిర్మిస్తున్న నేవల్ బేస్కు బండరాళ్ల తరలింపులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని.. అధిక లోడుతో అనేక వాహనాలు వస్తున్నాయని అక్కడి టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇందులో ఎమ్మెల్యే భారీగా వాటాలు తీసుకుంటున్నారని కూడా పరోక్షంగా ధ్వజమెత్తుతున్నారు.● ఇలా అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమిలోని ఒక పార్టీ చేస్తున్న మైనింగ్ దందాను మరో పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదంటే కూటమి ప్రభుత్వంలో పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
టెన్షన్.. టెన్షన్!
● ఓ పక్క బదిలీలు, మరో పక్క పదోన్నతులు ● 86 మంది గ్రేడ్–2 హెచ్ఎంలకు బదిలీ ఉత్తర్వులు ● 75 మంది స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి ● సాంకేతిక చిక్కులతో రోస్టర్ కూర్పులో జాప్యం ● ఎస్ఏ, ఎస్జీటీల బదిలీలకు సిద్ధమైన సీనియార్టీ జాబితాలు విశాఖ విద్య: విద్యాశాఖలో బదిలీల పర్వం మొదలైంది. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న 86 మందికి స్థానచలనం కలిగింది. వెబ్ ఆప్షన్స్లో హెచ్ఎంలు కోరుకున్న పాఠశాలల్ని కేటాయిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీల షెడ్యూల్లో భాగంగా గురువారం జిల్లా విద్యాశాఖాధికారులు స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2 హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించారు. జోన్–1 పరిధిలోకి వచ్చే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 8 మంది స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2 హెచ్ఎంలుగా ప్రమోషన్ కల్పించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1, జిల్లా పరిషత్ మేనేజ్మెంట్ పరిధిలోని 66 మంది స్కూల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు దక్కాయి. ఆర్జేడీ బి.విజయభాస్కర్, ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ పర్యవేక్షించారు. ప్రమోషన్ పొందిన స్కూల్ అసిస్టెంట్లు అంతా ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల నుంచి ఈ నెల 31న రిలీవ్ అయి, 1న హెచ్ఎంగా బాధ్యతలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులు ఆదేశించారు. సాంకేతిక చిక్కులతో జాప్యం గ్రేడ్–2 హెచ్ఎం ప్రమోషన్స్ జాబితాలో ఉన్న ఉపాధ్యాయులంతా విశాఖ నగరంలోని సీతమ్మధారలో ఉన్న ఎస్ఎఫ్ఎస్ స్కూల్కు గురువారం ఉదయం 10 గంటలకే చేరుకున్నారు. కౌన్సెలింగ్ మాత్రం సాయంత్రం 6 తర్వాత ప్రారంభమై, రాత్రి 10 వరకు కొనసాగింది. జిల్లా విద్యాశాఖాధికారులు సీనియార్టీ జాబితా సిద్ధం చేసినప్పటికీ, కమిషనరేట్ నుంచి గురువారం సాయంత్రం వరకు ప్రమోషన్స్ కౌన్సెలింగ్కు గ్రీన్సిగ్నల్ రాలేదు. పదోన్నతుల రోస్టర్ కూర్పుపై కొందరు ఉపాధ్యాయులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా దీనిపై కమిషనరేట్ నుంచి సకాలంలో ఆమోదం లభించకపోవటంతో ఇక్కడి అధికారులు నిరీక్షించక తప్పలేదు. సిద్ధమైన ఎస్ఏ, ఎస్జీటీల జాబితాలు స్కూల్ అసిస్టెంట్, సెకడరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ) బదిలీలు భారీగానే ఉంటాయని విద్యాశాఖాధికారులు అంచనా వేస్తున్నారు. బదిలీ కోసం వచ్చిన దరఖాస్తులను ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ పర్యవేక్షణలో వడపోతను ముమ్మరం చేస్తున్నారు. షెడ్యూల్ మేరకు స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు పూర్తయ్యాక, అందుబాటులో ఉన్న ఖాళీల మేరకు అర్హులైన ఎస్జీటీలకు పదోన్నతులిస్తారు. అనంతరం ఎస్జీటీలకు బదిలీలు నిర్వహిస్తారు. పుట్టెడు దుఃఖంలోనూ.. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ అంతా ఉమ్మడి జిల్లా నోడల్ అధికారిగా విశాఖ డీఈవో ప్రేమ్కుమార్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఆయన మామయ్య తీవ్ర అనారోగ్యంతో వారం రోజులుగా చైన్నెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. సమచారం తెలిశాక పుట్టెడు దుఃఖంలోనూ ప్రమోషన్స్, బదిలీలపై ఇక్కడి యంత్రాంగానికి దిశానిర్దేశం చేసి, ఉన్నతాధికారుల అనుమతితో అప్పటికప్పుడు బయలుదేరి వెళ్లారు. -
వర్షాలతో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు
సింహాచలం: ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా సింహగిరికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాల్సిన ఏర్పాట్లపై దేవస్థానం ఈవో వి.త్రినాథరావు గురువారం పరిశీలించారు. స్వామి దర్శనానికి భక్తులు వెళ్లే ఉచిత, రూ.100, రూ.300 క్యూల్లో నడుస్తూ ఎక్కడెక్కడ వర్షం నీరు వస్తోందో ఆయా ప్రాంతాలను గుర్తించారు. నీరు భక్తులపై పడకుండా ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ప్రసాదాల విక్రయశాలకు వెళ్లి, సిబ్బంది పనితీరును పర్యవేక్షించారు. భక్తులతో మార్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. ప్రసాదాల నిల్వ గది ఇరుగ్గా ఉండటంతో, ప్రత్యామ్నాయ గదిలోకి మార్చాలన్నారు. ప్రసాదాల నాణ్యతలో అలసత్వం ప్రదర్శించవద్దని హెచ్చరించారు. ఆయన వెంట దేవస్థానం ఈఈ రాంబాబు, డీఈ హరి, ఏఈవో పిళ్లా శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ జీవీవీఎస్కే ప్రసాద్, పీఆర్వో నాయుడు పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్ లీలలు!
● వీఎంఆర్డీఏ టెండర్లలో నిబంధనలకు తిలోదకాలు ● కూటమి నేతల లబ్ధికి అధికారుల తాపత్రయం ● ‘ది డెక్’ నిర్వహణకుసింగిల్ టెండర్.. అయినా ఓకే ● సీ హారియర్ నిర్వహణ టెండర్ దక్కించుకున్న సంస్థకు చెక్ ● తమ వారికి దక్కలేదని టెండర్ రద్దు విశాఖ సిటీ: విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) ఇంజనీరింగ్ అధికారుల లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిబంధనలకు తిలోదకాలిస్తూ కూటమి ప్రజాప్రతినిధుల అనుచరులకు టెండర్లు కట్టబెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. అందుకు అనుగుణంగా టెండర్లలో రూల్స్ మార్చేస్తున్నారు. అంతటితో ఆగకుండా టెండర్ వేయొద్దని కాంట్రాక్టర్లకు ఫోన్ చేయడం.. తాజాగా వేరొక కాంట్రాక్టు సంస్థకు ఆ టెండర్ దక్కిందన్న అక్కసుతో దాన్ని రద్దు చేయడంపై దుమారం రేగుతోంది. అలాగే మరో నిర్వహణ పనులకు ఒకే టెండర్ దాఖలైనప్పటికీ.. వారికి కేటాయించడంతో ఇతర కాంట్రాక్టర్లు విస్తుపోతున్నారు. సీ హారియర్ టెండర్ రద్దు బీచ్ రోడ్డులోని సీ హారియర్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం నిర్వహణ టెండర్ను అనుకున్నట్లుగానే అధికారులు రద్దు చేశారు. మ్యూజియం నిర్వహణ కోసం 11 నెలలకు గాను రూ.35.05 లక్షల అంచనా వ్యయంతో ఈ ఏడాది ఏప్రిల్లో వీఎంఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఈ నిర్వహణ పనిలో భారీగా ఆదాయం వచ్చే అవకాశముంది. దీంతో ఒక కాంట్రాక్టు సంస్థ అధికారులతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగానే ఈ మ్యూజియం టెండర్లో పాల్గొనవద్దని స్వయంగా ఇంజనీరింగ్ అధికారులే కాంట్రాక్ట్ సంస్థలకు చెప్పినట్లు వార్తలు వినిపించాయి. అయినప్పటికీ పలువురు ఇతర పేర్ల మీద టెండర్లు దాఖలు చేశారు. ఇందులో అత్యల్పంగా 15 శాతం తక్కువకు రూ.29,48,036కు ఒక సంస్థ టెండర్ వేసింది. ఆ తరువాత 9.09 శాతం తక్కువకు రూ.31,86,753కు మరో కాంట్రాక్టు సంస్థ దాఖలు చేసింది. వాస్తవానికి తక్కువకు టెండర్ వేసిన సంస్థకే పనులను అప్పగించాలి. కానీ ఇంజనీరింగ్ అధికారులు రెండో స్థానంలో ఉన్న సంస్థకు పనులు అప్పగించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సంస్థ తక్కువకు టెండర్ వేయకపోవడంతో వారి ఆశలు నిరాశయ్యాయి. దీంతో ఈ టెండర్ను వదులుకోవాలని తక్కువ బిడ్ చేసిన కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నించినప్పకీ అది ఫలించనట్లు సమాచారం. ఫలితంగా తక్కువకు టెండర్ వేసిన కాంట్రాక్టు సంస్థకు వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా తాత్సారం చేశారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఊహించినట్లుగానే ఈ టెండర్ను అధికారులు రద్దు చేశారు. అర్హత సాధించిన సంస్థ నిర్వాహకులకు కనీసం సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. సింగిల్ టెండర్కే ఆమోదం సిరిపురం జంక్షన్లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అండ్ కమర్షియల్ బిల్డింగ్ను వీఎంఆర్డీఏ నిర్మించింది. త్వరలోనే ఈ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ భవన నిర్వహణకు 11 నెలలకు గాను రూ.1.33 కోట్లకు టెండర్లు ఆహ్వానించారు. ఇందులో పాల్గొనేందుకు అనేక కాంట్రాక్టు సంస్థలు ఆసక్తి చూపించాయి. కానీ ఈ పనులపై కూటమి ప్రజాప్రతినిధి కన్నేశారు. తమ అనుచరులకు ఈ టెండర్ను కట్టబెట్టేందుకు చక్రం తిప్పారు. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి సదరు సంస్థకు అనుకూలంగా టెండర్ నిబంధనలను మార్చివేశారు. అంతేకాకుండా ఈ టెండర్ విషయంలో కూడా ఎవరూ దరఖాస్తులు దాఖలు చేయొద్దని కాంట్రాక్టర్లకు ఫోన్లు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంట్రాక్టును ఇప్పటికే వీఎంఆర్డీఏలో మూడు భవనాల టెండర్లు దక్కించుకున్న సంస్థకే కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ పనులకు కేవలం ఒక టెండర్ మాత్రమే దాఖలైంది. నిబంధనల ప్రకారం సింగిల్ టెండర్ను తిరస్కరించాల్సి ఉంటుంది. కానీ ఇంజనీరింగ్ అధికారులు ఈ నిబంధన అమలు విషయంలో వింత భాష్యం చెపుతున్నట్లు సమాచారం. గ్లోబల్ టెండర్ల ద్వారా ఏ సంస్థ వచ్చినా ఆ భవనం నిర్వహణ అంత తేలికై న విషయం కాదని, అందుకే ఇక్కడి సంస్థకే అప్పగిస్తే నిర్వహణ బాగుంటుందని చెప్పి సింగిల్ టెండర్ వేసిన సంస్థకే పనులు అప్పగించడం విశేషం. దీనిపై ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. దీని వెనుక స్థానిక కూటమి ప్రజాప్రతినిధి హస్తం ఉండడంతోనే ఎవరూ ది డెక్ టెండర్పై నోరెత్తలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది. -
డీటీవో భవనం మెట్లు కూలి ఒకరికి గాయాలు
కొత్త భవనం ప్రారంభోత్సవంపై కలెక్టర్ ఆరామహారాణిపేట: కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఉన్న జిల్లా ట్రెజరీ కార్యాలయం(డీటీవో) మెట్లు పాక్షికంగా కూలిపోయాయి. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ట్రెజరీ కార్యాలయానికి వెళ్లే ఐరన్ మెట్లలో ఓ భాగం పడిపోయింది. ఈ ఘటనలో ఆఫీస్ సబార్డినేట్ ప్రసాద్ తలకు గాయమైంది. తృటిలో ప్రాణాపాయం తప్పిందని సిబ్బది ఊపిరి పీల్చుకున్నారు. వర్షం కురిస్తే భయం ఎప్పుడు వర్షం కురిసినా ట్రెజరీ కార్యాలయ పరిస్థితి దారుణంగా ఉంటుంది. 2014లో వచ్చిన హుద్హుద్ తుపానుకు పూర్తిగా ధ్వంసమైన భవనంలోనే ఇప్పటికీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వర్షం పడితే ఆ భవనంలో ఉండేందుకు భయపడే పరిస్థితి. కొన్ని రోజుల క్రితం ఇదే కార్యాలయానికి చెందిన ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ పూర్తిగా కూలిపోయింది. సిబ్బంది విధుల్లో లేని సమయంలో ఆ సంఘటన జరగడంతో ప్రాణనష్టం వాటిల్లలేదు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం కార్యాలయ మార్పునకు చొరవచూపట్లేదు. పక్కనే పక్కా భవనం..! జిల్లా ట్రెజరీ కార్యాలయానికి నూతన భవనాన్ని జిల్లా పరిషత్ పక్కన నిర్మించారు. ఎలక్ట్రిక్, చిన్నచిన్న పనులు మినహా భవనం సిద్ధంగా ఉంది. అయినప్పటికీ వివిధ సాంకేతిక కారాణాల పేరిట ఇంకా దీన్ని ప్రారంభించలేదు. తాజా ఘటనతో జిల్లా ట్రెజరీ అధికారి వై.సుధాకర్ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ దృష్టికి కార్యాలయ సమస్యను తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ స్పందించి కొత్త భవనం ప్రారంభోత్సవానికి ఉన్న ఆటంకాలపై ఆరా తీశారు. -
ఈ గోపాలుడి లీలలు వేరయా..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సీఐ పేరుతో బెదిరిస్తూ వసూళ్లకు దిగి ఊచలు లెక్కిస్తున్న సుధాకర్కు తెలుగుదేశం నేత, ఓ సంస్థ చైర్మన్తో సత్సంబంధాలు కలిగి ఉండటం చర్చనీయాంశమవుతోంది. ఇద్దరూ కలిసి విమానాల్లో పలుమార్లు గోవా, బ్యాంకాక్ లాంటి ట్రిప్పులకు వెళ్లినట్టు కూడా తెలుస్తోంది. తాను ఏసీబీ సీఐ అని పరిచయం చేసుకుంటూ.. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.5 లక్షలు డిమాండ్ చేసిన వ్యవహారంలో టీడీపీ నేత బలగ సుధాకర్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ కూడా ఊచలు లెక్కబెడుతున్నారు. అయితే, అసలు మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పిన గోపాలుడు మరొకరు ఉన్నట్టు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఓ ప్రభుత్వ సంస్థ చైర్మన్ హోదాలో అధికారం చెలాయిస్తున్నట్టు సమాచారం. నకిలీ ఏసీబీ సీఐ సుధాకర్తో సదరు చైర్మన్ ఎంతో అన్యోన్యంగా గోవా, బ్యాంకాక్ వంటి ట్రిప్పులకు వెళుతూ విమానాశ్రయాల్లో దిగిన ఫొటోలు తెలుగుదేశం పార్టీ అంతర్గత గ్రూపుల్లోనూ సర్క్యులేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సదరు సుధాకర్కు పలువురు పోలీసులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోనూ పరిచయాలు ఉన్నట్టు సమాచారం.ఈ నేపథ్యంలో నగర శివారులోని రిసార్టుల్లో పలువురితో ఉన్న ఫొటోలు కూడా ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాకుండా అందమైన అమ్మాయిల ద్వారా పలువురు నేతలు, అధికారులతో అన్యోన్యంగా మాట్లాడిన ఆడియోలు, వీడియోలు రికార్డు చేసి హనీట్రాప్ ద్వారా లక్షలు గుంజినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో లోతుగా విచారణ చేస్తే సదరు చైర్మన్తో పాటు ఇతర వ్యక్తుల పాత్ర కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అధిష్టానానికి ఫిర్యాదుల పరంపర చినబాబుతో తనకు మాత్రమే సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ అధికారం చెలాయిస్తున్న సదరు నేతపై టీడీపీ నేతలే గుర్రుగా ఉన్నారు. వివిధ ప్రజాప్రతినిధులకు కూడా విలువ లేకుండా.. మాట చెల్లుబాటు చేసుకుంటుండంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాకుండా నియోజకవర్గాలతో సంబంధం లేకుండా అన్నింటిలోనూ తలదూర్చుతుండటం కూడా ఆ పార్టీ నేతలకు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలోనూ ఇప్పుడు ఈ నకిలీ ఏసీబీ సీఐ వ్యవహారంలో సదరు చైర్మన్పై పలువురు నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. నేరుగా టీడీపీ అధిష్టానం దృష్టికి ఇద్దరూ చనువుగా ఉన్న ఫొటోలను పంపి మరీ బాగోతాన్ని వెలికితీయాలని కోరినట్టు ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఇక సదరు సంస్థలో కూడా ఇష్టారీతిలో ప్రవర్తిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులను కేటాయిస్తూ దండుకుంటున్న విషయాన్ని కూడా ఈ ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. మొత్తంగా నకిలీ ఏసీబీ సీఐ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని శాఖల్లోనూ వసూళ్లు నకిలీ ఏసీబీ సీఐ సుధాకర్.. అధికార పారీ్టకి చెందిన నేత, ఇతర పోలీసుల అండదండలు చూసుకుని రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. సబ్ రిజిస్ట్రార్లు, రవాణాశాఖ, రెవెన్యూ, విద్యుత్ శాఖతో పాటు రాజకీయ పారీ్టల నేతలనూ బెదిరించి భారీగా వసూళ్లకు తెగబడినట్టు తెలుస్తోంది. ఏసీబీ పేరుతో పలువురు అధికారుల నుంచి లక్షల్లో గుంజుకున్నట్టు సమాచారం. వీరెవ్వరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు మాత్రం రావడం లేదు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే తమ మీద కూడా కేసు నమోదవుతుందనే భయమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ప్రధానంగా పలువురు సబ్ రిజిస్ట్రార్ల వద్ద లక్షల్లో వసూలు చేశారని తెలుస్తోంది. ఇక రెవెన్యూ శాఖలో కూడా భూలావాదేవీల్లో దండుకుంటున్న అధికారులను గుర్తించి టార్గెట్లు ఇచ్చి మరీ వసూలు చేశారనే ప్రచారం ఉంది. ఇక రవాణాశాఖలో కూడా కొద్ది మంది వద్ద లక్షల్లో వసూలు చేశారని సమాచారం. ఇక కొద్ది మంది నేతలు, అధికారులతో తమ బ్యాచ్లో ఉన్న మహిళల ద్వారా చనువుగా మాట్లాడించి.. ఆ మాటలను రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేసి వసూళ్లకు తెగబడ్డారనే పేరుంది. ఒక విధంగా హనీట్రాప్కు పాల్పడ్డారని టీడీపీ నేతలే పేర్కొంటున్నారు. ఈ విధంగా భారీగా దండుకున్న సొమ్ముతో సదరు బ్యాచ్ జల్సాలు చేసేవారు. ప్రధానంగా గోవా, బ్యాంకాక్ వంటి ట్రిప్పులకు వెళ్లినట్టు తెలుస్తోంది. వీరందరూ విమానాశ్రయాల్లో దిగిన ఫొటోలను ఇప్పు డు టీడీపీ నేతలే ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. -
నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. బుధవారం రాత్రికి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తంగానూ, మహారాష్ట్ర, తెలంగాణలో చాలా భాగాలు, చత్తీస్ఘఢ్, ఒడిశాల్లో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోంది. ఇది గురువారం మధ్యాహ్నానికి ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశముంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.అల్లూరి, పార్వతీపురం మన్యం, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపారు. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40–50, గరిష్టంగా 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంపై వర్షాల ప్రభావం జూన్ 1 వరకూ కొనసాగనుంది. అనంతరం క్రమంగా వర్షాలు తగ్గుముఖం పట్టి.. పొడి వాతావరణం ఉంటుందనీ.. జూన్ 10 తర్వాత నుంచి వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
కలెక్టర్కు ఏపీయూడబ్ల్యూజే వినతి మహారాణిపేట: జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు నాలుగు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు యూనియన్ నేతలు కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్ర ప్రసాద్ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వారికి ఆనందపురం, సబ్బవరం, పెందుర్తి మండలాల్లోని ప్రభుత్వ భూముల్లో స్థలాలు కేటాయించాలని యూనియన్ అధ్యక్షుడు కె.రాము, ప్రధాన కార్యదర్శి ఆర్.రామచంద్రరావు కోరారు. ఈ విషయంపై ప్రభుత్వానికి నివేదిక పంపుతానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు రామచంద్రరావు తెలిపారు. యూనియన్ ప్రతినిధులు బి.నారాయణరావు, డి. హరినాథ్, రవి తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సీఎం ఎన్టీఆర్కు ఘన నివాళి
మహారాణిపేట: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లా యంత్రాంగం అధికారికంగా ఈ కార్యక్రమాలను నిర్వహించింది. బీచ్రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తన క్రమశిక్షణ, అంకితభావంతో రాష్ట్ర ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, ప్రత్యేక ఉప కలెక్టర్లు మధుసూదనరావు, శేష శైలజ, సీఎంవో నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మీ సేవలు చాలు.. వెళ్లిపోండి.!
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలో ఫారిన్ సర్వీసుపై పనిచేస్తున్న ఎయిడెడ్ అధ్యాపకులందరినీ తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేయాలని కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ భరత్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు బుధవారం వర్సిటీకి చేరాయి. దీంతో రాష్ట్రంలోని వేర్వేరు ఎయిడెడ్ కాలేజీల నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చిన వారంతా నేడో రేపో ఇక్కడ నుంచి రిలీవ్ కానున్నారు. ఏయూలో రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 2023 జూన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ కాలేజీల నుంచి ఫారిన్ సర్వీసు/డిప్యుటేషన్ కింద 80 మంది అధ్యాపకులను తీసుకున్నారు. వర్సిటీ పాలక మండలి ఆమోదంతో జరిగినందున ఉన్నత విద్యామండలి అధికారులు ఇందుకు అనుమతించారు. తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో 40 మంది వెంటనే వెనక్కి వెళ్లిపోయారు. ఒకరు మృతి చెందగా, మరొకరు ఇటీవలే మాతృస్థానానికి వెళ్లారు. ప్రస్తుతం 38 మంది ఏయూలో పనిచేస్తున్నారు. వీసీ కీలక నిర్ణయం ఆంధ్ర యూనివర్సిటీకి ఆర్థిక భారమవుతున్న వారిని పంపించేయాల్సిందేనని వర్సిటీలోని కొంతమంది కొంతకాలంగా పట్టుబడుతున్నారు. ప్రస్తుత వీసీ ఆచార్య రాజశేఖర్ ఇటీవల క్యాంపస్ కాలేజీల డీన్లు, ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులతో సమావేశమయ్యారు. ఎయిడెడ్ అధ్యాపకుల విషయంలో వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారిని పంపించేయాల్సిందేనని మెజార్టీ విభాగాధిపతులు, ప్రిన్సిపాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో వీసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారిని వర్సిటీ నుంచి రిలీవ్ చేస్తామని ఈ నెల 19న కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు నివేదించారు. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ అధ్యాపకులంతా తదుపరి పోస్టింగ్ కోసమని కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనరేట్లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆచార్యుల కొరత తీరేదెలా.? ఏయూలో రెగ్యులర్ ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. వెయ్యి మందికి పైగా అధ్యాపకులు ఉండాల్సిన ఏయూలో ప్రస్తుతం రెండు వందల్లోపే రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. దీంతో ఎయిడెడ్, కాంట్రాక్టు, అతిథి అధ్యాపకులే బోధనలో కీలకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం 38 ఎయిడెడ్ అధ్యాపకులు రిలీవ్ చేస్తే.. ఆ స్థానాలను వేరే మార్గాల్లో భర్తీ చేయాలి. 2025–26 విద్యా సంవత్సరానికి సిద్ధమవుతున్న సమయంలో ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు వీసీ దృష్టి సారించాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు 31 నాటికి రిలీవ్ చేస్తాం ఏయూలో పనిచేస్తున్న ఎయిడెడ్ అధ్యాపకులను వెంటనే పంపించాలని కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎయిడెడ్ అధ్యాపకులను ఏయూలో కొనసాగించుకుంటారా? లేదా అని ఇటీవల డైరెక్టర్ నుంచి లేఖ వచ్చింది. దీనిపై తమ పరిధిలో నిర్ణయం తీసుకుని వారిని పంపించేస్తామని నివేదించాం. ఈ నెల 31న నాటికి ఎయిడెడ్ అధ్యాపకులందరినీ ఇక్కడ నుంచి రిలీవ్ చేస్తాం. – ఆచార్య ధనుంజయరావు, రిజిస్ట్రార్ ఏయూలో ప్రొఫెసర్ల కొరత వేళ.. ఎయిడెడ్ అధ్యాపకుల ఉద్వాసన వీసీకి కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లేఖ విద్యార్థుల చదువులపై ప్రభావం -
ఆటోలో మరిచిపోయిన రూ.1.2 లక్షలు
మర్రిపాలెం: తమ కుమారుడి శస్త్రచికిత్స కోసం తీసుకెళ్తున్న రూ.1.20 లక్షలను రాజాబాబు అనే వ్యక్తి ఆటోలో మరిచిపోయారు. కొంతసేపటికి అతను తన పొరపాటును గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు అప్రమత్తమై ఆటోలో నగదుతో ఉన్న బ్యాగును గుర్తించి బాధితుడికి అప్పగించారు. వివరాలివి.. మర్రిపాలెంలో ఉంటున్న రాజాబాబు తన కుమారుడితో కలిసి బుధవారం ఇంటి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మర్రిపాలెం మెయిన్రోడ్డులో సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో జ్ఞానాపురం రైల్వేస్టేషన్కు వెళ్లడానికి ఆటో ఎక్కారు. హడావుడిలో తన వద్ద ఉన్న రూ.1.20 లక్షల నగదు, ఆపరేషన్కు సంబంధించిన పత్రాలు, దుస్తులు ఉన్న బ్యాగును ఆటోలోనే మరిచిపోయారు. ఆ తర్వాత స్టేషన్ వద్ద దిగిపోయారు. కొంత సమయం తర్వాత తన పొరపాటును గ్రహించిన రాజాబాబు వెంటనే 112కు ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపారు. అక్కడే డ్యూటీలో ఉన్న కంచరపాలెం క్రైం ఎస్ఐ సూర్యనారాయణ, ఇతర సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. బాధితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా ఆ ప్రాంతంలోని అన్ని ఆటోలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఒక ఆటో వెనుక సీటులో బ్యాగును గుర్తించారు. డ్రైవర్కు కూడా ఆ బ్యాగు తన ఆటోలో ఉందనే విషయం తెలియదు. పోలీసులు నగదుతో ఉన్న బ్యాగును స్వాధీనం చేసుకుని.. రాజాబాబుకు అప్పగించారు. తన బ్యాగును త్వరగా గుర్తించి, డబ్బులను సురక్షితంగా అందించిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు. బాధితుడికి అప్పగించిన పోలీసులు -
అందాల తీరంపై అలల దాడి
● విశాఖ తీరంలో ఆందోళనకర పరిస్థితులు ● తరచూ కోతకు గురవుతున్న బీచ్లు ● నేలకొరుగుతున్న కొబ్బరి చెట్లు ● ఇంకెప్పుడు రక్షణ చర్యలు? ఏయూక్యాంపస్: వాతావరణ మార్పుల ప్రభావం విశాఖ సుందర తీరంపై తీవ్రంగా పడుతోంది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే సాగరతీరం.. ఇప్పుడు తరచూ కోతకు గురవుతోంది. గత దశాబ్ద కాలంలో జరిగిన నష్టం కంటే ఇటీవల తీర ప్రాంతం ఘోరంగా దెబ్బతింటోంది. రుషికొండ నుంచి ఆర్.కె.బీచ్ వరకు అడుగడుగునా తీరం కోతకు గురవడం ఆందోళనకరంగా మారింది. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చి.. తీరానికి పునరుజ్జీవం పోయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రకృతి విధ్వంసం గతంలో కేవలం తుపానులు, పెను తుపానుల సమయంలో మాత్రమే కనిపించే ఈ పరిస్థితి.. ఇప్పుడు అల్పపీడనాలు, ఆవర్తనాల సమయంలో కూడా తలెత్తుతోంది. యారాడ నుంచి భీమిలి వరకు సుమారు 35 కిలోమీటర్ల తీర ప్రాంతం తరచూ కోతకు గురవుతున్నట్లు నిపుణులు గుర్తించారు. యారాడ బీచ్, కోస్టల్ బ్యాటరీ, ఆర్.కె.బీచ్, కురుసుర సబ్మైరెన్ మ్యూజియం, చిల్డ్రన్స్ పార్క్, జోడుగుళ్లపాలెం, రుషికొండ, భీమిలి వంటి ప్రాంతాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాల సమయంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల తీరం కోతకు గురవుతుంది. కొన్ని సార్లు ఈశాన్య రుతుపవనాల సమయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంటోంది. కొబ్బరి చెట్ల కన్నీళ్లు ఇటీవల పెరిగిన సముద్ర కెరటాల తీవ్రతకు కొబ్బరి వనాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి. ఒక్కొక్కటిగా నేలకొరుగుతున్నాయి. ‘విక్టరీ ఎట్ సీ’ఎదురుగా పచ్చదనంతో కళకళలాడే కొబ్బరి చెట్లు ఇప్పుడు కూలిపోయాయి. వాటి వెనుక ఉన్న మరో రెండు వరసల చెట్లు కెరటాల ధాటికి దెబ్బతినే ప్రమాదంలో ఉన్నాయి. గతంలో ఈ వనాల చుట్టూ రాళ్లతో నిర్మించిన కంచె కూడా కెరటాల ఉధృతిని తట్టుకోలేకపోయింది. ఈ ప్రభావం సమీపంలోని ఇతర కొబ్బరి చెట్లపైనా పడుతుండటంతో.. వాటి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. కూలుతున్న స్తంభాలు సముద్ర కెరటాల తీవ్రతకు తీరంలోని ఇసుక భారీగా కోతకు గురవుతోంది. ప్రస్తుతం కురుసుర సబ్మైరెన్ మ్యూజియం వద్ద ఇసుక పూర్తిగా కొట్టుకుపోయింది. గతంలో ఏర్పడిన కోతను దృష్టిలో ఉంచుకుని అక్కడ రాళ్లు, కాంక్రీట్ దిమ్మెలు ఏర్పాటు చేసినప్పటికీ.. కెరటాల ప్రభావం వాటి పక్కనే ఉన్న ఇసుక మేటలపై పడుతోంది. దీంతో సబ్మైరెన్ సమీపంలోని కొబ్బరి వనం చుట్టూ ఉన్న ఇసుక కూడా కోతకు గురవుతోంది. మరికొన్ని రోజుల్లో ఆ వనం కూడా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో వేసిన మట్టి కూడా కరిగిపోతోంది. తీరంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు, విద్యుత్ దీపాల స్తంభాలూ నేలకొరుగుతున్నాయి. దెబ్బతింటున్న రక్షణ గోడలు కొన్ని ప్రాంతాల్లో రహదారిని తాకేలా ఉధృతంగా కెరటాలు ఎగసిపడుతున్నాయి. దీని వల్ల రహదారికి, సముద్ర తీరానికి మధ్య నిర్మించిన రక్షణ గోడలు దెబ్బతింటున్నాయి. గత ఏడాది కాలంలో రామకృష్ణ బీచ్, పాండురంగాపురం ప్రాంతాల్లో రెండు చోట్ల రక్షణ గోడలు కూలిపోగా.. వాటి స్థానంలో కొత్తవి నిర్మించారు. అయితే కెరటాల తీవ్రత పెరుగుతుండటంతో భవిష్యత్తులో తీర ప్రాంత పరిరక్షణ మరింత సవాల్గా మారనుంది. సమష్టి కృషి అవసరం విశాఖ తీర పరిరక్షణకు తక్షణమే నిపుణుల సూచనలతో కూడిన ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉంది. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, జిల్లా యంత్రాంగం సమష్టిగా ఈ దిశగా కృషి చేయాలి. విశ్వవిద్యాలయాలు, సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు, సివిల్ ఇంజనీరింగ్ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తీరప్రాంత పరిరక్షణకు అనుసరిస్తున్న విజయవంతమైన పద్ధతులను అధ్యయనం చేయాలి. మన పరిస్థితులకు అను కూలంగా ఉండే వాటిని అమలు చేయడంపై అధికారులు ఆలోచించాలని పర్యాటకులు కోరుతున్నారు. సహజసిద్ధంగా వదిలేయాలి విశాఖ సముద్ర తీరానికి ఒకవైపు కొండలు ఉన్నాయి. దీని ఫలితంగా అర్ధచంద్రాకార బీచ్లు ఏర్పడ్డాయి. వీటిని సహజంగా వదిలేయాలి. ఇక్కడ నిర్మాణాలు చేయడం, శాశ్వత కట్టడాలు ఏర్పాటు చేయడం ఎంతమాత్రం సరికాదు. అదే సమయంలో సముద్రానికి అడ్డుగా గోడ కట్టాలనుకోవడం, జియో ట్యూబ్లు ఏర్పాటు చేయడం మరింత నష్టాన్ని చేస్తాయి. ఇప్పటికే వీటిని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఆర్థికంగా, పర్యావరణ పరంగా తీవ్ర నష్టం చవిచూశాం. –ఆచార్య కాకాని నాగేశ్వరరావు, జియో ఇంజినీరింగ్ విభాగం, విశ్రాంత ఆచార్యులు -
రాష్ట్ర స్థాయి శిక్షణ కేంద్రంగా రేఖవానిపాలెం
తగరపువలస: భీమిలి మండలం రేఖవానిపాలెంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం రాష్ట్రస్థాయి శిక్షణ కేంద్రంగా ఎంపికై ందని జిల్లా పంచాయతీ అధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలకు చెందిన పారిశుధ్య కార్మికులు, కార్యదర్శులు, ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఇక్కడ శిక్షణ ఇస్తామని తెలిపారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరణ విషయంలో అవగాహన కల్పించారు. రేఖవానిపాలెం, మూలకుద్దు సర్పంచ్లు సమ్మిడి శ్రీనివాసరావు, కొయ్య రామకృష్ణారెడ్డి, పంచాయతీ విస్తరణాధికారి కె.రమేష్నాయుడు, కార్యదర్శులు ఎన్.కె.సిహెచ్.వి.ప్రసాద్, వైవీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
యువత కృషితోనే పార్టీకి పునర్వైభవం
మహారాణిపేట: కూటమి ప్రభుత్వం తమ పార్టీ కార్య కర్తలు, నాయకులపై చేస్తున్న దాడులకు, కుట్రలకు భయపడాల్సిన పనిలేదనని, ప్రతి ఒక్కరికీ పార్టీ తోడుగా నిలుస్తుందని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి కేకే రాజు భరోసానిచ్చారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకూటి చందు ఆధ్వర్యంలో జిల్లా యువజన విభాగం సమన్వయ సమావేశం బుధ వారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కింది స్థాయి కార్యకర్తల పట్ల అభిమానం, ప్రేమ కలిగిన నాయకుడు జగన్ అని, ఆయన గుండెల్లో ప్రతి కార్యకర్తను గొప్పగా నిలబెట్టాలనే ఆలోచన ఉంటుందన్నారు. 2029లో పార్టీ అధికారంలోకి వచ్చాక నూటికి నూరు శాతం పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేకూరేలా జగన్ 2.0 పాలన ఉంటుందన్నారు. అధికారంలోకి వచ్చాక ఏ కార్యక్రమం చేపట్టినా కింది స్థాయి కార్యకర్త ద్వారా స్థానికంగా ఉన్న ప్రజలకు లబ్ధి చేకూర్చేలా మాత్రమే కార్యాచరణ ఉంటుందన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండేళ్లు కరోనాతో ఇబ్బంది పడ్డామని, తాము ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా కోర్టు కేసులు వేసేవారని ఆక్షేపించారు. మెడికల్ కాలేజీలు, కొత్త కంపెనీలు ఏర్పాటుచేసినా కోర్టు కేసులు వేసేవారని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో లొసుగుల్ని ఆసరాగా తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడేవారని తెలిపారు. పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే యువత పాత్ర చాలా కీలకం అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చెన్నా జానకిరామ్, పి.వి.సురేష్, ఉరుకూటి చందు, ఇమ్రాన్, పార్టీ నాయకులు రవి రెడ్డి, వాసు, రాయపురెడ్డి అనిల్, మువ్వల సంతోష్, ఎల్లపు శ్రీను, వార్డు యూత్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. ఈ కష్ట కాలంలోప్రతి ఒక్కరికీ పార్టీ తోడుంటుంది వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు -
ఉపాధి కల్పించకుంటే మా గతేంటి?
ఉక్కునగరం: ఉపాధి కల్పించకపోతే తమ కుటుంబాల గతేంటని స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండో రోజు బుధవారం జరిగిన ఉక్కు అడ్మిన్ ముట్టడి కార్యక్రమంలో అధికారులు, పోలీసుల వద్దకు వెళ్లి కాంట్రాక్ట్ కార్మికులు తమ గోడు వెల్లబోసుకున్నారు. అనుకున్న ప్రణాళిక ప్రకారం గేట్ల దిగ్బంధానికి కార్మికులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అడ్మిన్ భవనం వద్దకు చేరుకున్నారు. ఒకేసారి బిల్డింగ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాస్త తోపులాట నెలకొంది. పోలీసులు పదే పదే చెప్పినప్పటికీ కార్మి కులు పోలీసు వలయాన్ని దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొంత మంది కింద పడిపోయారు. దీంతో యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంత కాలం పనిచేసిన తమను తీసేస్తే తమ కుటుంబాల గతేంటని ప్రశ్నించారు. సాయంత్రం వరకు అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గురు, శుక్రవారాలు కూర్మన్నపాలెం దీక్షా శిబిరం వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. శుక్రవారం రీజనల్ లేబర్ కమిషన్ చర్యల అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ముట్టడిలో పాల్గొన్న నాయకులపై కేసు నమోదు ఉక్కు అడ్మిన్ ముట్టడిలో పాల్గొన్న నాయకులపై స్టీల్ప్లాంట్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. స్టీల్ప్లాంట్ రాజభాష విభాగం జీఎం లలన్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె నేపథ్యంలో 27, 28 తేదీల్లో కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి చేపట్టాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు, కార్పొరేటర్ గంగారావు, సత్యనారాయణ, కె.ఎం.శ్రీనివాస్, సీఐటీయూ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ కార్యదర్శి నమ్మి రమణ, జి.శ్రీనివాస్, ఆర్.టి.రాజుతో పాటు సుమారు 200 కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాలు చేసి రాకపోకలు సాగించే ఉద్యోగులకు ఇబ్బందులు కల్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదన కొనసాగిన అడ్మిన్ ముట్టడి.. స్వల్ప ఉద్రిక్తత -
వేసవి శిక్షణ శిబిరాలకు మంగళం?
● కూటమి నిర్లక్ష్యం.. పట్టించుకోని జీవీఎంసీ ● మరో 15 రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం ● ప్రభుత్వ తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం డాబాగార్డెన్స్: వేసవి సెలవులంటే పాఠశాల విద్యార్థులకు, చిన్నారులకు పండగనే చెప్పాలి. స్నేహితులతో కలిసి ఆటలాడుకుంటూ వినోదం, ఉల్లాసం, ఉత్సాహాన్ని పొందుతుంటారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, నైపుణ్యాలు పెంపొందించేందుకు ఏటా జీవీఎంసీ వేసవి సమయాన్ని వినియోగించుకుంటూ పలు అంశాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించేది. కానీ ఈ ఏడాది మాత్రం వేసవి శిక్షణ శిబిరాలకు మంగళం పాడేసింది. వార్షిక పరీక్షలు ముగిసి, వేసవి సెలవులు వచ్చి నెల రోజులు దాటినా శిబిరాలు ప్రారంభించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఎంతో ఉత్సాహంగా జరిగే ఈ శిబిరాలు జీవీఎంసీ, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల వేసవి ఆనందాన్ని, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను దెబ్బతీశాయని ఆవేదన చెందుతున్నారు. ప్రణాళిక ఏది? గతంలో వార్షిక పరీక్షలకు నెల రోజుల ముందే వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు పక్కా ప్రణాళికలు సిద్ధమయ్యేవి. పాఠశాలల సంఖ్య, క్రీడా ప్రాంగణాల లభ్యత, కోచ్ల వివరాలు, శిక్షణ సమయాలు వంటి కీలక అంశాలపై కసరత్తు జరిగేది. పరీక్షలు ముగిసిన వెంటనే ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్లతో సమావేశమై విధివిధానాలు ఖరారు చేసేవారు. కానీ ఈ ఏడాది కూటమి ప్రభుత్వం గానీ, జీవీఎంసీ గానీ ఆ దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. జీవీఎంసీకి పూర్తి స్థాయి కమిషనర్ లేరు. ఇన్చార్జి కమిషనర్, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్పై అదనపు బాధ్యతల భారం వంటి సాకులు చెబుతున్నా.. మేయర్ పీలా శ్రీనివాసరావు కూడా ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించడం శోచనీయం. వారి నిర్లక్ష్యం, ముందుచూపు లేకపోవడం వల్లే నేటికీ శిబిరాల నిర్వహణపై స్పష్టత కొరవడింది. ప్రయోజనం లేని సమావేశం నగరంలో వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణపై ఈ నెల 8న విశాఖ కిక్ బాక్సింగ్ అసోసియేషన్లతో మేయర్ పీలా శ్రీనివాస్ ఆర్భాటంగా సమావేశం నిర్వహించి దాదాపు 20 రోజులు గడిచింది. అయితే క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి లేకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. ఈ మొక్కుబడి సమావేశాలు ప్రజలను మభ్యపెట్టడానికేనా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిక్షకులు సైతం ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరాలు సాధారణంగా సెలవులు ముగిసేలోపు పూర్తి చేయాలి. కానీ ఇప్పటివరకు కనీసం కౌన్సిల్ ఆమోదం కూడా పొందకపోవడంతో ఈ శిబిరాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే నెల 6న కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉన్నప్పటికీ అప్పటికి పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడానికి కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంటాయి. దీంతో ఈసారి వేసవి శిక్షణ శిబిరాలకు కూటమి ప్రభుత్వం మంగళం పాడేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగా వేలాది మంది విద్యార్థులు వేసవి సరదాను, కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాన్ని కోల్పోయినట్టే! వేసవి శిక్షణ శిబిరాలు ?అసమర్థ పాలన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. జీవీఎంసీ కమిషనర్ బదిలీ జరిగి నాలుగు నెలలు గడుస్తోంది. 8 జోనల్ కార్యాలయాలు, 98 వార్డులు, 25 లక్షలకు పైగా జనాభా ఉన్న జీవీఎంసీకి ఇంతవరకు కమిషనర్ను నియమించలేని అసమర్థ ప్రభుత్వం ఇది. ఇంకా వేసవి శిక్షణ శిబిరాలను ఏం నిర్వహిస్తుంది? కూటమిలోని పార్టీల మధ్య సమన్వయం కొరవడడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. కనీసం పిల్లల కోసం వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించాలనే ఆలోచన కూడా జీవీఎంసీకి లేకపోవడం బాధాకరం. మేము ఏటా క్రమం తప్పకుండా వేసవి శిబిరాలు నిర్వహించాం. – గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మేయర్, జీవీఎంసీ ఆమోదం కోసం ఎదురుచూపులు వేసవి శిక్షణ శిబిరాలకు సంబంధించిన అంశాన్ని మేయర్ దృష్టికి తీసుకెళ్లాం. 33 క్రీడా అంశాల్లో పిల్లలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే పలువురి కోచ్లతో సమావేశమయ్యాం. కౌన్సిల్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాం. – ఈఏ రాజు, స్పోర్ట్స్ డైరెక్టర్, జీవీఎంసీ -
రాంగ్ రూట్లో రిస్క్ జర్నీ!
జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదురుగారహదారికి మధ్య డివైడర్లు ఏర్పాటు చేశారు. దీంతో జైలురోడ్డు నుంచి జీవీఎంసీ మీదుగా రామ్నగర్ వెళ్లాలంటే ఆర్టీసీ కాంప్లెక్స్(సీఎంఆర్ బస్టాప్) వరకు ప్రయాణించాలి. అటువైపు నుంచి ఆర్టీసీకి కాంప్లెక్స్ వైపు రావాల్సిన వారు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ సిగ్నల్ పాయింట్ వద్ద యూటర్న్ తీసుకోవాలి. ఈ అదనపు ప్రయాసను తప్పించుకునేందుకు కొందరు వాహనచోదకులు ప్రమాదకరమైన దారిని ఎంచుకుంటున్నారు. రాంగ్ రూట్లో అండర్ పాత్ వేలోకి వెళ్లి.. యూటర్న్ తీసుకుంటున్నారు. ఈ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడమే కాకుండా.. ప్రమాదాలు జరిగే ఆస్కారం పెరుగుతోంది. అయినప్పటికీ కొంత మంది వాహనచోదకులు ఇష్టానుసారంగారాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
కుమ్ములాటలు!
కోళ్ల వ్యర్థాల కోసం అంతటా వారే... చెరో వర్గం వైపు కూటమి నేతలుఇప్పటికే కోళ్ల వ్యర్థాల సేకరణలో కూటమి పార్టీలకు చెందిన అనుచరులు ఒక్కో జోన్ను తీసుకున్నారు. ఇప్పుడు మరో వర్గం తమ వ్యక్తులను అనధికారికంగా కోళ్ల వ్యర్థాల సేకరణకు పురమాయించారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవల వ్యవహారం పోలీసు స్టేషన్ వరకూ చేరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గండి బాబ్జీ రంగ ప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. స్టేషన్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తే.. ఇప్పటికే విశాఖ నగరంలో రాత్రి సమయాల్లో గుండాలు, రౌడీలు ముఖానికి మాస్కులు వేసుకొని మరీ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. సాగర్నగర్తో పాటు బీచ్ రోడ్డులోని శాంతి ఆశ్రమంలోనూ రౌడీలు హల్చల్ చేశారు. నగరంలో ఒకవైపు శాంతి భద్రతలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయనే విమర్శలున్నాయి. పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడు నేరుగా పోలీసు స్టేషన్లో చిందులు వేయడంతో పోలీసుల పట్ల గౌరవం మరింతగా దిగజారిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో మహారాణిపేట పోలీసు స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తే మొత్తం వ్యవహారం బయటపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై కలెక్టర్తో పాటు పోలీసు కమిషనర్ కూడా విచారణ చేసి నివేదికను సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. -
ఈ గోపాలుడిలీలలు వేరయా..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సీఐ పేరుతో బెదిరిస్తూ వసూళ్లకు దిగి ఊచలు లెక్కిస్తున్న సుధాకర్కు తెలుగుదేశం నేత, ఓ సంస్థ చైర్మన్తో సత్సంబంధాలు కలిగి ఉండటం చర్చనీయాంశమవుతోంది. ఇద్దరూ కలిసి విమానాల్లో పలుమార్లు గోవా, బ్యాంకాక్ లాంటి ట్రిప్పులకు వెళ్లినట్టు కూడా తెలుస్తోంది. తాను ఏసీబీ సీఐ అని పరిచయం చేసుకుంటూ.. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.5 లక్షలు డిమాండ్ చేసిన వ్యవహారంలో టీడీపీ నేత బలగ సుధాకర్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ కూడా ఊచలు లెక్కబెడుతున్నారు. అయితే, అసలు మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పిన గోపాలుడు మరొకరు ఉన్నట్టు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఓ ప్రభుత్వ సంస్థ చైర్మన్ హోదాలో అధికారం చెలాయిస్తున్నట్టు సమాచారం. నకిలీ ఏసీబీ సీఐ సుధాకర్తో సదరు చైర్మన్ ఎంతో అన్యోన్యంగా గోవా, బ్యాంకాక్ వంటి ట్రిప్పులకు వెళుతూ విమానాశ్రయాల్లో దిగిన ఫొటోలు తెలుగుదేశం పార్టీ అంతర్గత గ్రూపుల్లోనూ సర్క్యులేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సదరు సుధాకర్కు పలువురు పోలీసులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోనూ పరిచయాలు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నగర శివారులోని రిసార్టుల్లో పలువురితో ఉన్న ఫొటోలు కూడా ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాకుండా అందమైన అమ్మాయిల ద్వారా పలువురు నేతలు, అధికారులతో అన్యోన్యంగా మాట్లాడిన ఆడియోలు, వీడియోలు రికార్డు చేసి హనీట్రాప్ ద్వారా లక్షలు గుంజినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో లోతుగా విచారణ చేస్తే సదరు చైర్మన్తో పాటు ఇతర వ్యక్తుల పాత్ర కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.అధిష్టానానికి ఫిర్యాదుల పరంపరచినబాబుతో తనకు మాత్రమే సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ అధికారం చెలాయిస్తున్న సదరు నేతపై టీడీపీ నేతలే గుర్రుగా ఉన్నారు. వివిధ ప్రజాప్రతినిధులకు కూడా విలువ లేకుండా.. మాట చెల్లుబాటు చేసుకుంటుండంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాకుండా నియోజకవర్గాలతో సంబంధం లేకుండా అన్నింటిలోనూ తలదూర్చుతుండటం కూడా ఆ పార్టీ నేతలకు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలోనూ ఇప్పుడు ఈ నకిలీ ఏసీబీ సీఐ వ్యవహారంలో సదరు చైర్మన్పై పలువురు నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. నేరుగా టీడీపీ అధిష్టానం దృష్టికి ఇద్దరూ చనువుగా ఉన్న ఫొటోలను పంపి మరీ బాగోతాన్ని వెలికితీయాలని కోరినట్టు ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఇక సదరు సంస్థలో కూడా ఇష్టారీతిలో ప్రవర్తిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులను కేటాయిస్తూ దండుకుంటున్న విషయాన్ని కూడా ఈ ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. మొత్తంగా నకిలీ ఏసీబీ సీఐ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సినిమా థియేటర్లలో సోదాలు
మహారాణిపేట : జిల్లాలోని సినిమా థియేటర్లలో బుధవారం రెవెన్యూ, అగ్నిమాపక, మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ శాఖల అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. భీమిలి, విశాఖ ఆర్డీవోలు సంగీత్ మాధూర్,పి. శ్రీలేఖ పర్యవేక్షణలో ప్రభుత్వం ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారం రెవెన్యూ అధికారులు వివరాలు సేకరించారు. గోపాలపట్నం, గాజువాక, నగరంలోని పలు థియేటర్లలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లు సమాచారం. సినిమా ప్రదర్శన సమయాలు, పారిశుధ్యం, సీటింగ్, ఎయిర్ కండిషనింగ్ తదితర అంశాలను ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. -
సింహాచలం దేవస్థానం అధికారుల బెయిల్ పిటిషన్ డిస్మిస్
సాక్షి,విశాఖ: సింహాచలం దేవస్థానం అధికారుల బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయ్యింది. చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో అధికారులపై గోపాలపట్నం పీఎస్లో కేసు నమోదైంది. దీంతో ఉద్యోగులు ముందుస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు ఇరు పక్షాల వాదనల అనంతరం జిల్లా న్యాయస్థానం బెయిల్ పిటిషన్ రద్దు చేసింది. గత నెలలో సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి చోటుచేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయింది. ఈ ఘటనలో దేవాలయం అధికారులపై కేసులు నమోదు కాగా.. బెయిల్ కోసం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
రేపు జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
సీతంపేట: ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం ఆంధ్రా యూనివర్సిటీ ప్లాటినం జూబ్లీ హాల్–2 లో జరుగుతుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. అక్కయ్యపాలెంలోని ఒక హోటల్లో మంగళవారం జరిగిన ఫెడరేషన్ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం జరగనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి 70 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్టు తెలిపారు. సమావేశంలో ఐదు తీర్మానాలు ప్రవేశపెట్టి రాష్ట్ర కార్యవర్గ ఆమోదం తీసుకుంటామన్నారు. జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ల మంజూరు, ప్రమాద బీమా పునరుద్ధరణ, పెన్షన్ విధానం వంటి పలు అంశాలపై చర్చిస్తామని తెలిపారు. -
దిగుబడి బాగు.. ధర దిగాలు!
● మామిడి పళ్లతో కళకళలాడుతున్న మార్కెట్లు ● విశాఖ జిల్లా వ్యాప్తంగా 27 వేల హెక్టార్లలో మామిడి తోటలు ● ఈ ఏడాది హెక్టార్కు సగటున 10 టన్నుల వరకు దిగుబడి ● రైతుబజార్లలో కిలో మామిడి పళ్ల సగటు ధర రూ.45 పెందుర్తి: విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాల కలయికే మామిడి పండు.. మనిషి ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుంది. అందుకే మామిడిని పండ్లలో రారాజు అని అంటారు. రంగు, రుచి, సువాసనలతో మనల్ని ముగ్ధులను చేస్తుంది. జిల్లాలో ఈ ఏడాది మామిడి సీజన్ ఊపందుకుంది. జిల్లా వ్యాప్తంగా మార్కెట్లు, రైతు బజార్లు మామిడి సువాసనలతో నిండిపోయాయి. రైతులు, వ్యాపారులు అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించడంతో మామిడి దిగుబడి గణనీయంగా పెరిగింది. జిల్లాలో మామిడి తోటలకు ప్రసిద్ధి చెందిన పద్మనాభంతో పాటు ఆనందపురం, పెందుర్తి, భీమిలి ప్రాంతాల్లో పంట పూర్తిస్థాయిలో పక్వానికి వచ్చింది. రైతులు ఇప్పటికే మామిడి కాయలను దించి విక్రయాలు సాగిస్తున్నారు. అయితే, దిగుబడి పెరిగినప్పటికీ, దానికి తగ్గట్టుగా ధరలు పలకకపోవడంతో మామిడి రైతులు కొంత నిరాశలో ఉన్న మాట వాస్తవం. మరోవైపు గత ఏడాదితో పోలిస్తే ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటంతో వినియోగదారులు బంగినపల్లి, సువర్ణరేఖ, రసాలు, పంచదార కంచెలు, పండూరి, కలెక్టర్, కొబ్బరి మామిడి, పనుకూలు, కోలంగోవ, పరియా, నీలాలు వంటి వివిధ రకాల మామిడి పండ్ల రుచిని ఆస్వాదిస్తున్నారు. ఎకరాకు సగటున 4 టన్నులు జిల్లాలోని గ్రామీణ మండలాలైన పద్మనాభం, ఆనందపురం, భీమిలి, పెందుర్తిలలో మామిడి తోటలు విస్తారంగా ఉన్నాయి. ఈ ఏడాది సుమారు 27 వేల హెక్టార్లలో(దాదాపు 67 వేల ఎకరాలు) మామిడి పండింది. డిసెంబర్, జనవరిలో పూత దశలో పొగమంచు ప్రభావం, రెండు మూడు తుఫాన్ల కారణంగా సుమారు 50 శాతానికి పైగా పంట దెబ్బతింది. అయినప్పటికీ రైతులకు 40–45 శాతం ఫలసాయం దక్కింది. ఇది ఏటా వచ్చే సగటు ఫలసాయంతో పోలిస్తే మెరుగైన దిగుబడే. సీజన్ ముగిసే సమయానికి హెక్టార్కు సగటున 10 టన్నుల వరకు దిగుబడి రావచ్చని రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో మామిడి ధర రూ.50–60 పలుకుతుండగా.. రైతుబజార్లలో సగటున రూ.45గా నిర్ణయించారు. కొందరు రైతులు నిర్ణయించిన ధర కంటే రూ.5–10 తక్కువకే విక్రయిస్తున్నారు. -
ఇథలిన్తోనే పళ్లు మగ్గబెట్టాలి
సీజన్ ఊపందుకోవడంతో జిల్లాలో రైతులు మామిడి దింపుడు కార్యక్రమం ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పక్వానికి వచ్చిన మామిడిని తగిన జాగ్రత్తలు తీసుకుని మగ్గబెట్టాలి. మామిడి పండ్లను కాల్షియం కార్బేట్ సహాయంతో మగ్గబెట్టడం మంచిది కాదు. దీని వలన ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. పక్వానికి వచ్చిన మామిడి పళ్లను ఇథలిన్ వాయువు సహాయంతో మగ్గబెడితే ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదు. మామిడి కాయలను గాలి చొరబడని గదిలో ఉంచాలి. తర్వాత ఇథలిన్ వాయువును 2 పీపీహెచ్ మోతాదులో స్ప్రే చేసి 16 గంటల తరువాత తీయాలి. ఇలా చేస్తే రుచికరమైన, ఆరోగ్యకరమైన మామిడి పండ్లు లభిస్తాయి. లేదా బకెట్ నీటిలో ఇథలిన్ ద్రావణం, క్లాస్కిక్ సోడా కలిపి చల్లిన తర్వాత 24 గంటలు ఉంచాలి. దీని వలన ఇథలిన్ వాయువు విడుదలై మామిడి కాయలు మగ్గుతాయి. – జి.సోని, ఉద్యానశాఖ అధికారి -
దిగుబడి ఉన్నా ధరలు లేవు
మాకు మూడు ఎకరాల మామిడి తోట ఉంది. అందులో బంగినపల్లి, సువర్ణరేఖ జాతులు అధికంగా ఉన్నాయి. మొదట్లో పూత చాలా బాగా వచ్చింది. అయితే పొగమంచు అధికంగా పడడంతో పాటు వర్షాలు కూడా మమ్మల్ని దెబ్బకొట్టాయి. అయినా గతేడాదితో పోల్చితే దిగుబడి బాగానే వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో ధరలు లేవు. వచ్చినంతలో రైతుబజార్కు వచ్చి అమ్ముకుంటున్నాం. మాకు లాభం లేకపోయినా ప్రజలైనా మంచి మామిడి పండ్లు తినాలనే ఉద్దేశంతో ఒక్కోసారి నిర్ణయించిన ధర కంటే తక్కువకే ఇచ్చేస్తున్నాం. – గొర్లి అప్పలనాయుడు, ఆర్లి, కె.కోటపాడు కష్టానికి తగ్గ ధర వస్తే చాలు మా దగ్గర నాలుగు ఎకరాల తోట ఉంది. దాంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. ఈ ఏడాది మొదట్లో వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి ఆశించినంతగా లేదు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి బాగానే పండింది. మా తోటలో సగానికి పైగా దించేశాం. పంట నిలబెట్టుకోవడానికి చాలా ఖర్చు పెట్టాం. సీజన్ పూర్తయ్యేసరికి కనీసం నష్టం రాకుండా ఉంటే చాలని అమ్మకాలు చేస్తున్నాం. –నాగిరెడ్డి అప్పలనాయుడు, కె.కోటపాడు -
మేలు రకం అయితేనే ఆసక్తి చూపుతున్నారు
మేం మూడు ఎకరాల్లో కొన్ని ముఖ్యమైన మామిడి రకాలు వేశాం. నాలుగేళ్ల నుంచి పంట వస్తుంది. పోయిన ఏడాది చాలా నష్టపోయాం. కానీ ఈ ఏడాది దిగుబడి మెరుగుపడింది. అయితే బంగినపల్లి, సువర్ణరేఖ, రసాలే ప్రజలు ఎక్కువ అడుగుతున్నారు. వారికి కావాల్సిన రకాలు సమకూర్చి అందిస్తున్నాం. ఈ ఏడాది భారీగా లాభాలు వచ్చే అవకాశం లేదు. – చప్పా సన్యాసమ్మ, అడ్డూరు, చొడవరం మండలం ధరలు అందుబాటులో ఉన్నాయి సీజన్ ఊపందుకోవడంతో అన్ని రకాల మామిడి పండ్లు దొరుకుతున్నాయి. ఇప్పటివరకు రైతు బజార్లో ఐదారు సార్లు కొనుగోలు చేశాను. మా బంధువులు, మిత్రులకు కూడా ఇక్కడే తీసుకోమని సూచిస్తున్నారు. బయటి మార్కెట్తో పోల్చితే రైతుబజార్లో రూ.20 వరకు తక్కువగానే వస్తున్నాయి. ఏ రకం పళ్లు అయినా సగటున రూ.40–45కి అందిస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఇది చాలా మెరుగైన ధర. – శాస్త్రి, పెందుర్తి, వినియోగదారుడు -
కూటమి పాలనలో దళితులకు రక్షణ లేదు
వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి నాగ మల్లేశ్వరి సాక్షి, విశాఖపట్నం: కూటమి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మంచ నాగ మల్లేశ్వరి మండిపడ్డారు. దళిత హోంమంత్రి ఉన్నా దళితులపై దాడులు ఆగడం లేదని, స్వయంగా హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే దళితులను బహిష్కరించారని ఆమె ఆరోపించారు. మంగళవారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెనాలిలో దళిత యువకుడిపై పోలీసుల దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ‘దళిత యువకుడు తప్పు చేస్తే రోడ్డు మీద ఒక సీఐ కాలుతో తొక్కి, మరో సీఐ కర్రలు విరిగేలా అత్యంత పాశవికంగా కొడుతుంటే, ఇక చట్టాలు, న్యాయవ్యవస్థలు ఈ రాష్ట్రంలో ఎందుకు?’ అని ఆమె ప్రశ్నించారు. మదనపల్లిలో దళితులపై దాడి, చిత్తూరులో టీడీపీ నేతల ముందు చెప్పులు వేసుకుని తిరిగారని, దళితుడి బైక్ను పెట్రోల్ పోసి తగులబెట్టిన పరిస్థితులు చూశామని ఆమె అన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగినా, చిన్నారిపై లైంగికదాడులు జరిగినా స్పందించడం లేదని మండిపడ్డారు. -
రోడ్డు ప్రమాదంలో పీఎఫ్ కార్యాలయ ఉద్యోగి మృతి
గోపాలపట్నం: మర్రిపాలెం వుడా లేఅవుట్లో సూపరిండెంట్గా పనిచేస్తున్న పి.వి. నరేష్ బాబు (60) మంగళవారం సాయంత్రం ఎన్ఏడీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎయిర్పోర్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం పీఎఫ్ కార్యాలయం నుంచి విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై పెందుర్తిలోని ఇంటికి వెళ్తుండగా ఓ కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేష్ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. కంచరపాలెం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని కేజీహెచ్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను విచారించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ సీఐ ఉమామహేశ్వరరావు నేతృత్వంలో ఎస్ఐ ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు.