Visakhapatnam
-
పంచ గ్రామాల భూసమస్యకు చంద్రబాబు తప్పిదమే కారణం
సింహాచలం: పంచగ్రామాల భూ సమస్యకు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని, 1996–97లో ఆయన సీఎంగా ఉన్నప్పుడే సింహాచలం దేవస్థానానికి రైత్వారీ పట్టాలు కట్టబెట్టారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. అప్పటి నుంచే ఈ ప్రాంత ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. పంచగ్రామాల భూసమస్య పరిష్కారం కోరుతూ సీపీఎం గత పది రోజులుగా చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా మంగళవారం సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘గడిచిన మూడు దశాబ్దాలుగా పంచగ్రామాల నివాసితులు, రైతులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. పట్టాలు సాధించే వరకు ఈ పోరాటం ఆగదు. 1996–97లో దేవస్థానానికి ఇచ్చిన పట్టాలను రద్దు చేసి, ప్రస్తుత నివాసితుల పేరిట పట్టాలు ఇవ్వాలి. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం మానుకోవాలి’ అని హెచ్చరించారు. విశాఖ వాసులను నిర్వాసితులుగా మార్చేస్తూ, నగరం పేరును ‘గూగుల్ పట్నం’గా మార్చేస్తున్నారని విమర్శించారు. 12 వేల మంది ప్రజలు దశాబ్దాలుగా సమస్యతో సతమతమవుతుంటే పట్టించుకోని ప్రభుత్వం, కేవలం ఒక కలం పోటుతో 260 ఎకరాల దేవస్థానం భూములను ఎకరం కేవలం 99 పైసలకే గూగుల్ సంస్థకు కట్టబెట్టడం దారుణమని ధ్వజమెత్తారు. ఇది లీజు అగ్రిమెంట్ కాదు, నేరుగా సేల్ అగ్రిమెంట్ అని ఆరోపించారు. పారిశ్రామికవేత్తల తీర్పు కోరుతున్న చంద్రబాబు.. తనను ప్రజలు గెలిపించారో లేక పారిశ్రామికవేత్తలు గెలిపించారో ఆలోచించుకోవాలన్నారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పడం ఒక పెద్ద మోసం అని, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. గూగుల్ ఏర్పాటు కోసం రూ.22వేల కోట్ల రాయితీలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. డేటా సెంటర్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పంచగ్రామాల భూసమస్య పరిష్కారం కాకుంటే చలో అమరావతి నిర్వహిస్తామని ప్రకటించారు. సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ.. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సభలో సీపీఎం నాయకులు బి.గంగారావు, పి. వెంకటరెడ్డి, అజశర్మ, బి.రమణి, పి.వి.ఎస్.ఎన్. శాస్త్రి, సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం కార్యదర్శి టి.వి.కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. సభలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు బహిరంగ సభలో పాల్గొన్న పంచ గ్రామాల ప్రజలు -
కేజీహెచ్లో మెరుగైన వైద్య సేవలందించాలి
మహారాణిపేట: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పరిపాలన, పర్యవేక్షణ, సిబ్బంది వినియోగం, రోగులకు మార్గదర్శక వ్యవస్థను బలోపేతం చేయాలని ఎంపీ శ్రీభరత్ సూచించారు. మంగళవారం ఆంధ్ర వైద్య కళాశాలలో కేజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్తో కలిసి నిర్వహించారు. ఆసుపత్రి సేవలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఎంపీ, సిబ్బంది కొరత లేదా అందుబాటులో లేకపోవడం వల్ల రోగులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోందన్నారు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్, ల్యాబ్ పరీక్షల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని విభాగాల్లో పడకల కొరతతో ఇద్దరు రోగులు ఒకే బెడ్ను వినియోగిస్తుండగా, మరికొన్ని విభాగాల్లో పడకలు ఖాళీగా ఉండటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అత్యవసర విభాగాల్లో సౌకర్యాల విస్తరణ, ఎయిర్ కండీషనింగ్ సమస్యల పరిష్కారం, మరుగుదొడ్ల నిర్వహణ, స్ట్రెచర్లు, పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కొంతమంది సిబ్బంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఎంపీ తీవ్రంగా స్పందించారు. మృతదేహాల తరలింపు, పోస్టుమార్టం సేవల్లో డబ్బులు డిమాండ్ చేయడం సహించబోమని హెచ్చరించారు. ‘మే ఐ హెల్ప్ యూ’ డెస్కులు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ రోగులకు సరైన మార్గదర్శకత్వం అందించేందుకు ఆసుపత్రి పరిధిలో ఎనిమిది ‘మే ఐ హెల్ప్ యూ’ డెస్కులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓపీ విభాగాలు, ల్యాబ్లు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో నర్సింగ్ విద్యార్థులు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందితో సహాయక వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఫోన్ కాల్స్, మెసేజ్ల ద్వారా ఫాలోఅప్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారం కోసం కంప్లైంట్ బాక్సులు, టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నామని, కొంతమంది అవుట్సోర్సింగ్ సిబ్బందిపై ఇప్పటికే సస్పెన్షన్, టర్మినేషన్ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. -
సమష్టి పోరాట ఫలితమే విశాఖ రైల్వే జోన్
అల్లిపురం: విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడం రాజకీయ పార్టీలు, పౌర, ప్రజాసంఘాల సమష్టి విజయం అని రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జె.వి.సత్యనారాయణమూర్తి అన్నారు. మంగళవారం అల్లిపురంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, ప్రజాస్వామ్యవాదుల కృషితో సాగిన పోరాట ఫలితమే నేటి ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’అని ఆయన స్పష్టం చేశారు. ఇది ఏ ఒక్క పార్టీకో లేదా వ్యక్తికో దక్కిన విజయం కాదని, రాష్ట్రంలోని అన్ని శక్తులు ఏకతాటిపైకి వచ్చి చేసిన పోరాటమని గుర్తు చేశారు. జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని, ఈ ప్రకటన వెనుక అనేక మంది త్యాగాలు, ఎదుర్కొన్న నిర్బంధాలు, కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పోరాటంలో సీపీఐ, సీపీఎం సహా ఇతర వామపక్షాలు, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ, లోక్సత్తా, బీజేపీ నాయకుల కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ జోన్ ద్వారా వచ్చే ప్రయోజనాలు ఉత్తరాంధ్ర ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా అందరం కలిసి కృషి చేద్దామని సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ నాయకులు ఎ.విమల, ఎస్.కె.రహిమాన్, కె.సత్యనారాయణ, పి.చంద్రశేఖర్, ఎం.పైడిరాజు, సి.హెచ్.క్షేత్రపాల్ రెడ్డి, ఎం.మన్మధరావు తదితరులు పాల్గొన్నారు. రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్ జేవీ సత్యనారాయణమూర్తి -
● ఏం ఎండరా బాబూ!
నగరంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. సముద్ర తీరం కావడంతో గాలిలో తేమ శాతం పెరిగి, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండ ప్రభావం మొదలవుతోంది. మధ్యాహ్నం అయ్యే సరికి ప్రధాన రహదారులన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. రోడ్లపై వెళ్తుంటే వేడి గాలులు ముఖానికి తగిలి పాదచారులు, ద్విచక్ర వాహనదారులు అల్లాడిపోతున్నారు. ఎండ వేడికి భయపడి ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావడానికి సాహసించడం లేదు.అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే గొడుగులు, టోపీలు ధరించి బయటకు వస్తున్నారు. రోడ్లపై విపరీతమైన వేడిమి వల్ల ఎండమావులు ఏర్పడుతున్నాయి. రోడ్డుపై నీళ్లు ఉన్నట్లు కనిపిస్తూ వాహనదారులను భ్రమింపజేస్తున్నాయి. ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
మహిళలు, బాలికల రక్షణకే తొలి ప్రాధాన్యం
మహిళా పోలీస్ స్టేషన్ సీఐ కంది నీలిమ అల్లిపురం: మహిళలు, బాలికలపై జరిగే నేరాల పట్ల ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మహిళా పోలీస్ స్టేషన్ కొత్త సీఐ కంది నీలిమ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన ఆమె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మహిళా పోలీస్స్టేషన్ ఏసీపీ సీహెచ్ అంబేడ్కర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఏసీపీ అంబేడ్కర్ మాట్లాడుతూ.. మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేయాలని సీఐకి సూచించారు. శక్తి యాప్ వినియోగం, మహిళా చట్టాలపై విద్యార్థినులకు నిరంతరం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఐ నీలిమ మాట్లాడుతూ.. గతంలో తాను ఎస్ఐగా ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని, బాధితులకు, ఫిర్యాదుదారులకు అందుబాటులో ఉంటానని తెలిపారు. -
పూడిక తీశారా? నిధులు నొక్కేశారా?
అక్కడ కాలువ కట్టలేదు.. కనీసం కొత్త స్లాబులు వేయలేదు. కానీ బిల్లులు మాత్రం అక్షరాలా రూ.78 లక్షలు! మధురవాడ జోన్లో జీవీఎంసీ నిధుల దుర్వినియోగం పరాకాష్టకు చేరింది. కొమ్మాది–కార్షెడ్ జంక్షన్ల మధ్య పూడిక తీత పనులు ‘కాసుల వర్షం’ కురిపించగా.. సామాన్య జనం మాత్రం చిన్నపాటి వర్షానికే మురుగు నీటిలో నానుతున్నారు. ఇది ఇంజనీరింగ్ అద్భుతమో లేక పాలకుల ‘పంపిణీ’ పథకమో అర్థం కాక స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. మధురవాడ: జీవీఎంసీ మధురవాడ జోన్లో ప్రజాధనం పక్కదారి పట్టింది. కేవలం కాలువల్లో పూడిక తీయడానికే రూ. 78 లక్షలు ఖర్చు చేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తీరా సమస్య పరిష్కారమైందా? అంటే అదీ లేదు. దీంతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. కూటమి పాలకులు, అధికారులు కుమ్మకై ్క సామాన్యుల పన్నుల సొమ్మును కాలువ పాలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాలువ నిర్మాణానికి ఖర్చయ్యే నిధులను కేవలం చెత్త తీయడానికే వెచ్చించడం గమనార్హం. పేరుకే పనులు.. తీరని కష్టాలు సుమారు 25 ఏళ్ల క్రితం జాతీయ రహదారి నిర్మాణ సమయంలో కొమ్మాది జంక్షన్ నుంచి కార్షెడ్ జంక్షన్ వరకు సర్వీసు రోడ్డును ఆనుకుని భారీ కాలువలు నిర్మించారు. ఈ కాలువలపై ఉన్న స్లాబులు కాలక్రమేణా ధ్వంసం కావడంతో మురుగునీరు, చెత్తాచెదారం పేరుకుపోయి నీరు ప్రవహించే దారి లేకుండా పోయింది. గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో దాదాపు 5 కిలోమీటర్ల మేర ఈ కాలువల్లో పూడిక తొలగించేందుకు రూ. 78 లక్షలతో పనులు చేపట్టారు. అయితే, ఇంత భారీ మొత్తాన్ని కేవలం పూడిక తీతకే కేటాయించడం విస్మయానికి గురిచేస్తోంది. పనులు జరిగిన సమ యంలో పగిలిపోయిన స్లాబులను బాగు చేయడం గానీ, కొత్తవి వేయడం గానీ చేయకుండా.. కేవలం చెత్త తీసినట్లు లెక్కలు చూపి నిధులు మ ళ్లించార నే విమర్శలు వినిపిస్తున్నాయి. అ ప్పట్లో జరిగిన ఖర్చు వివ రాలు ఇప్పటివరకు బయటకు రాకుండా గోప్యంగా ఉంచడం మరి న్ని అనుమానాలకు తావిస్తోంది. మొదటికే వచ్చిన సమస్య ఇంత భారీ ఖర్చుతో పనులు చేపట్టినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే మధురవాడ అప్ బ్రిడ్జి ప్రాంతం మళ్లీ చెరువులా మారిపోయింది. కార్షెడ్, మిథిలాపురి ఉడా కాలనీ, చంద్రంపాలెం, శివశక్తినగర్ జంక్షన్ల వద్ద వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, పాదచారులు నరకయాతన అనుభవించారు. పూడిక తీసినట్లు రికార్డులు చెబుతున్నా, నీటి ప్రవాహం ఎందుకు ఆగడం లేదన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సమగ్ర విచారణ జరపాలి కూటమి పాలకులు కేవలం చెత్త తొలగింపు పేరుతో రూ.78 లక్షల ప్రజాధనం వెచ్చించారు. కనీసం స్లాబులు కూడా వేయకుండా పూడికతీత పేరుతో నిధులు నొక్కేశారు. ఈ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందో తక్షణమే విచారణ జరపాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. –డి. అప్పలరాజు, సీపీఎం నాయకుడు -
మద్దిలపాలెంలో సత్యారెడ్డి అరాచకం
ఎంవీపీకాలనీ: మద్దిలపాలెంలో 23వ వార్డు మాజీ కార్పొరేటర్ భర్త గుడ్ల సత్యారెడ్డి అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ఒకపక్క లిక్కర్ దందాతో, మరోపక్క నిర్మాణ రంగం(బిల్డర్గా)లో బెదిరింపులకు పాల్పడు తూ ఆయన భయాందోళనలు సృష్టిస్తున్నారు. తాజాగా సత్యారెడ్డి, అతని అనుచరులపై నీలాపు మోహనరావు అనే వ్యక్తి ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని అరాచక పర్వం మరోసారి వెలుగులోకి వచ్చింది. మద్దిలపాలెంలోని దేవి హోమ్స్ ఎదురుగా ఉన్న తన 384 గజాల స్థలాన్ని మోహనరావు గతంలో డెవలప్మెంట్కు ఇచ్చారు. అయితే ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన షేర్ ఇవ్వాలని ఆయన కొన్నేళ్లుగా సత్యారెడ్డిని కోరుతున్నారు. ఈ వివాదంపై సత్యారెడ్డి స్పందించకపోవడంతో, మోహనరావు 2024లో కోర్టును ఆశ్రయించారు. విచారణలో సమయంలో కోర్టు సమక్షంలో సత్యారెడ్డి రూ.16 లక్షలు బాధితుడికి చెల్లించారు. అయితే మరికొంత నగదుతో పాటు ఒక ఫ్లాట్, కార్ పార్కింగ్ స్థలం, అద్దె నగదు మోహనరావుకు చెల్లించాల్సి ఉంది. వీటిని కూడా కోర్టు సమక్షంలోనే చెల్లిస్తానని హామీ పత్రం ఇచ్చిన సత్యారెడ్డి, కొంతకాలంగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. మరోవైపు, వివాదంలో ఉన్న ఫ్లాట్లను గుట్టుచప్పుడు కాకుండా ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ కాకపోయినా.. కొందరు తెలియక అడ్వాన్స్ చెల్లిస్తుండటంతో దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. బాధితుడిపై పిడిగుద్దులు : కోర్టు ఆదేశాలను ధిక్కరించి ప్లాట్లు విక్రయిస్తుండటంతో, బాధితుడు మోహనరావు ఈ నెల 8న భవన సముదాయం వద్దకు వెళ్లి కొనుగోలుదారులను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న సత్యారెడ్డి తన అనుచరులు నాగేశ్వరరెడ్డి, రవి, మహేష్, భరత్లతో కలిసి అక్కడికి చేరుకుని మోహనరావుపై దాడి చేశారు. పిడిగుద్దులతో విరుచుకుపడటంతో మోహనరావు తీవ్రంగా గాయపడ్డారు. బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలతో ఉన్న ఆయన ఈ దాడితో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. స్థానికుల సాయంతో వారి నుంచి తప్పించుకుని కేజీహెచ్లో చేరిన ఆయన.. మెరుగైన వైద్యం కోసం ఎంవీపీకాలనీలోని మెడికవర్లో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలు ఎంఎల్సీ నమోదు చేయగా, ఎస్ఐ డి.డి.నాయుడు బాధితుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఎట్టకేలకు కేసు నమోదు : ఫిర్యాదు చేసిన నాలుగు రోజుల వరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేయలేదు. సత్యారెడ్డి మాజీ కార్పొరేటర్ భర్త కావడంతో పాటు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటం వల్లే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా, తీవ్ర వివాదస్పదమైన ఈ ఘటనపై ఎట్టకేలకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎంవీపీ పోలీసు స్టేషన్ వర్గాలు వెల్లడించాయి. తనపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు మోహనరావు డిమాండ్ చేస్తున్నారు. -
ఐఐపీఈ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు
సబ్బవరం: భారతీయ పెట్రోలియం అండ్ శక్తి సంస్థ(ఐఐపీఈ) ఆరో స్నాతకోత్సవాన్ని ఈ నెల 14న వంగలిలోని శాశ్వత క్యాంపస్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం వర్సిటీలో విలేకరుల సమావేశంలో ఐఐపీఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షుడు ఆచార్య పి.కె.బానిక్ వివరాలు వెల్లడించారు. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వి.కె.సరస్వత్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు అందజేస్తారు. ఈ ఏడాది మొత్తం 114 మంది విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు. వీరిలో 97 మంది బీటెక్, 15 మంది పీజీ, ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులు ఉన్నారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్, గోల్డ్, సిల్వర్ మెడల్స్తో పాటు ప్రత్యేక పురస్కారాలు ప్రదానం చేస్తారు. 2025–26 విద్యా సంవత్సరంలో బీటెక్లో 84.82 శాతం ప్లేస్మెంట్స్ నమోదయ్యాయి. కెమికల్ ఇంజనీరింగ్లో అత్యధికంగా రూ.17.90 లక్షలు, పెట్రోలియం ఇంజనీరింగ్లో రూ.16.22 లక్షల వార్షిక వేతనం లభించింది. తొలిసారిగా సొంత శాశ్వత క్యాంపస్లో స్నాతకోత్సవం నిర్వహించడం గర్వకారణమని ఆచార్య బానిక్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో 601 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఐఐపీఈ డైరెక్టర్ ఆచార్య శాలివాహన్, అసోసియేట్ డీన్ హిమాంగ్షు కాకతి, రిజిస్ట్రార్ రామ్ఫల్ ద్వివేది పాల్గొన్నారు. -
అహర్నిశలు శ్రమించిన విద్యార్థులు
నీట్ పరీక్ష కోసం అహర్నిశలు శ్రమించి, ఎన్నో వ్యయప్రయాసలు భరించి పరీక్ష రాసిన విద్యార్థులకు ఈ పరిణామం విషమ పరీక్షగా మారింది. పరీక్ష పూర్తయ్యిందన్న ఆనందంలో ఉన్న విద్యార్థులు ఇప్పుడు మళ్లీ పునశ్చరణకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నీట్ పరీక్షలో తరచూ తలెత్తుతున్న సమస్యలు విద్యార్థుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దీంతో బైపీసీ కోర్సుపై కూడా విద్యార్థుల్లో వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంటోంది. –మల్లెంపల్లి మురళీకృష్ణ, డైరెక్టర్, ఎసెంట్ మెడికల్ అకాడమీ -
సెంట్రల్ జైలులో న్యాయ సహాయక కేంద్రం ప్రారంభం
కాఫీ తాగుతూ.. కార్గో చూస్తూ..సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సముద్ర తీరంలో చల్లని గాలిని ఆస్వాదిస్తూ, వేడి వేడి కాఫీ తాగుతూ.. భారీ నౌకల్లో కార్గో హ్యాండ్లింగ్ ఎలా జరుగుతుందో చూడాలని ఉందా? సముద్రపు అలల సవ్వడి వింటూ... విదేశాల నుంచి వచ్చే క్రూయిజ్ పర్యాటకులకు చిరునవ్వుతో హాయ్ చెప్పాలని భావిస్తున్నారా? భారీ నౌకల్లోకి సరుకుల ఎగుమతులు, దిగుమతులు ఎలా చేస్తారో ఎలాంటి అనుమతులు లేకుండానే దగ్గరి నుంచి చూడాలని ఉందా?.. విశాఖ నగర వాసులకు ఈ కోరికలన్నీ త్వరలోనే తీరనున్నాయి. నగర పౌరుల కోసం విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) సరికొత్త పర్యాటక కానుకను సిద్ధం చేసింది. విశాఖ వాసులకు పర్యాటక కానుక రూ.16 కోట్లతో 600 మీటర్ల పొడవైన అందమైన ‘పబ్లిక్ పోర్ట్ ప్రొమెనేడ్’ను పోర్టు అధికారులు నిర్మించారు. తీర ప్రాంత పర్యాటక మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, ప్రజలకు ఆకర్షణీయమైన విహార ప్రదేశాలను అందించే లక్ష్యంతో మంగళవారం విశాఖ పోర్టు ఇన్చార్జి చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు ఈ ప్రొమెనేడ్ను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పచ్చటి ల్యాండ్స్కేపింగ్తో దీనిని అత్యంత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఎటువంటి ప్రవేశ రుసుం లేకుండానే సముద్రతీరంలో వాకింగ్ చేసుకునే వెసులుబాటు, చిన్నారులు ఆడుకునేందుకు ప్రత్యేక ఆటస్థలం, అలాగే సువిశాలమైన పార్కింగ్ సదుపాయం ఇక్కడ కల్పించారు. ఈ నెలాఖరు నుంచి ఈ ప్రదేశం నగర ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని చైర్మన్ అంగముత్తు తెలిపారు. క్రూయిజ్ టెర్మినల్కు సమీపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న దారి గుండా ఈ ప్రొమెనేడ్ను చేరుకోవచ్చు. లైవ్ మారిటైం వీక్షణ సాధారణంగా ఏ పోర్టులో జరిగే కార్యకలాపాలనైనా సామాన్యులు దగ్గరి నుంచి చూసే అవకాశం ఉండదు. కానీ, విశాఖలో మాత్రం పోర్టులో జరిగే సముద్ర వ్యాపార కార్యక్రమాలను ప్రజలు లైవ్గా వీక్షించేలా ఈ ప్రొమెనేడ్ను డిజైన్ చేయడం విశేషం. భారీ నౌకల నుంచి సరుకుల రవాణా, అంతర్జాతీయ క్రూయిజ్ల రాకపోకలను ప్రజలు సురక్షితంగా చూసి ఆనందించేందుకు వీలుగా ఇక్కడ ప్రత్యేకమైన డెక్స్ను ఏర్పాటు చేశారు. దేశంలోనే ఎంతో ప్రత్యేకం దేశంలో అనేక సముద్ర తీర ప్రాంతాల్లో ప్రొమెనేడ్లను అభివృద్ధి చేశారు. పుదుచ్చేరిలో రాక్ బీచ్ ప్రాంతంలో కిలోమీటరుకుపైగా ఉన్న బీచ్ రాక్ ప్రొమెనేడ్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పర్యాటకులు హాయిగా సేద తీరేందుకు ఏర్పాట్లు చేశారు. కేఫ్ల్లో కాఫీ తాగుతూ సముద్ర అందాలను తిలకించే వీలుంది. ఇక ముంబైలో 3 కిలోమీటర్ల పొడవైన ‘క్వీన్స్ నెక్లెస్ ఆర్క్’ముంబై డ్రైవ్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ముంబై కోస్టల్ రోడ్ ప్రొమెనేడ్ ఏకంగా 7.5 కిలోమీటర్ల పొడవుతో షియోన్ పార్క్ నుంచి షిరోన్ పార్క్ వరకూ అభివృద్ధి చేశారు. ఇక కోల్కతా వద్ద నది తీరం వెంబడి విహార ప్రదేశాన్ని అభివృద్ది చేయగా.. కొచ్చి వద్ద బ్యాక్ వాటర్ వద్ద ఉన్న నడక మార్గం ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే.. విశాఖ ప్రొమెనేడ్ మాత్రం వీటన్నింటికీ భిన్నం. సముద్ర అందాలను ఆస్వాదించడంతో పాటు, నౌకాశ్రయంలో జరిగే లైవ్ వ్యాపార కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కేవలం విశాఖ పబ్లిక్ ప్రొమెనేడ్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. -
కన్నీట్ సుడులు
నీట్ రద్దుతో విద్యార్థుల కన్నీటి పర్యంతంప్రభుత్వ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం రెండేళ్ల శ్రమ బుగ్గిపాలేనని అభ్యర్థుల ఆవేదన రెండేళ్ల కష్టం.. ఎన్నో ఆశలు.. ఒక వైద్య సీటు కోసం జీవితాన్ని పుస్తకాలకే అంకితం చేసిన లక్షలాది విద్యార్థుల కలలను నీట్ రద్దు నిర్ణయం ఒక్కసారిగా ఛిద్రం చేసింది. ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తుండగా.. మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి విద్యార్థులను తీవ్ర మానసిక ఆందోళనలోకి నెట్టేసింది. మద్దిలపాలెం: వైద్యుడై సమాజానికి సేవ చేయాలని, తెల్లకోటు వేసుకుని స్టెతస్కోప్తో రోగి నాడి పట్టుకోవాలని.. లక్షలాది మంది విద్యార్థులు రెండేళ్లుగా కంటిమీద కునుకు లేకుండా శ్రమించారు. మే 3వ తేదీన పరీక్ష రాసి బయటకు వచ్చేటప్పుడు, వారి కళ్లలో ఒక రకమైన సంతృప్తి.. ‘అమ్మా, నాన్నా.. నేను డాక్టర్ అవుతాను’ అన్న ధీమా. కానీ, ఆ సంతోషం చిటికెలో ఆవిరైపోయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నీట్ యూజీ 2026 రద్దు నిర్ణయం, లక్షలాది మంది విద్యార్థుల గుండెల్లో గునపమై దిగినట్టయింది. ప్రతిభావంతులు బలి రాజస్థాన్లో వెలుగు చూసిన ‘పేపర్ లీక్’ ఉదంతం దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ పునాదులను కదిలించింది. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించడం, పరీక్షను ర ద్దు చేయడం సరైన నిర్ణయమే కావచ్చు. కానీ, అక్రమాలకు పాల్పడిన కొందరు స్వార్థపరుల వల్ల, రాత్రింబవళ్లు కష్టపడి చదివిన లక్షలాది మంది సాధారణ విద్యార్థులు ఇప్పుడు అనిశ్చితిలో పడిపోయారు. ఆగిపోయిన కల.. ఆవిరైన శ్రమ చిన్న చిన్న గదుల్లో బందీలై, పుస్తకాలే ప్రపంచంగా బతికిన విద్యార్థుల ఆవేదన వర్ణనాతీతం. ‘రెండేళ్ల శ్రమ.. వేల గంటల సాధన.. అంతా ఒక్క నిర్ణయంతో బూడిదలో పోసిన పన్నీరైంది. మళ్లీ అదే ఏకాగ్రతతో పుస్తకాలు పట్టగలమా? ఆ ఉత్సాహం మళ్లీ వస్తుందా?’ అని విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తల్లిదండ్రుల పరిస్థితి మరింత దయనీయం. తమ పిల్లల చదువు కోసం రెక్కల కష్టం ధారబోసి, కోచింగ్ సెంటర్లకు రూ.లక్షలు కుమ్మరించిన వారు, ఇప్పుడు తమ బిడ్డల నిరాశను చూసి తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటుండగాం తల్లిదండ్రులు వారిని ఓదార్చలేని పరిస్థితి నెలకొంది. ఎన్టీఏ భరోసా సరిపోతుందా? రీ–ఎగ్జామ్ కోసం కొత్తగా దరఖాస్తు చేయక్కర్లేదని, ఫీజు కట్టనవసరం లేదని ఎన్టీఏ చెబుతోంది. కానీ, విద్యార్థులకు కావాల్సింది ఆర్థిక వెసులుబాటు కాదు, మానసికస్థైర్యం. ఒకసారి రాసిన పరీక్షను, అది కూడా లీకేజీ మరకల మధ్య మళ్లీ రాయాల్సి రావడం అంటే, విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే. వ్యవస్థ మారేది ఎప్పుడు? పేపర్ లీక్.. రద్దు.. వేలాది మంది విద్యార్థుల కన్నీళ్లు. ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న అక్రమార్కులకు కఠిన శిక్ష పడాల్సిందే. ఈ రద్దు నిర్ణయం వ్యవస్థను ప్రక్షాళన చేస్తుందేమో కానీ, విద్యార్థుల మనసులకు తగిలిన గాయాన్ని మాత్రం అంత సులభంగా మాన్పలేదు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి నీట్ పరీక్షల్లో వరుసగా వెలుగుచూస్తున్న పేపర్ లీకేజీ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పీడీఎస్వో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ డిమాండ్ చేశారు. మే 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో ‘గెస్ పేపర్’ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారమైన ప్రశ్నలు అసలు పరీక్షలో రావడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందన్నా రు. గత ఏడాది కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నీట్ స్కామ్ల వల్ల ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్వో డిమాండ్ చేసింది. కేంద్ర అసమర్థత వల్లే : ఎస్ఎఫ్ఐ మద్దిలపాలెం: నీట్ పేపర్ లీకేజీ ఘటనకు కేంద్ర ప్రభుత్వ అసమర్థతే కారణమని ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా కమిటీ విమర్శించింది. జిల్లా అధ్యక్షుడు జి.అజయ్, కార్యదర్శి డి.వెంకటరమణ మాట్లాడుతూ, జాతీయ స్థాయి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పూర్తిగా విఫలమైందన్నారు. నీట్లో భారీ స్థాయిలో ప్రశ్నలు లీక్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయని, ఇది పరీక్షల నిర్వహణలో ఉన్న లోపాలను బయటపెడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ కేంద్రీకరణ విధానాల వల్లే ఎగ్జామ్ మాఫియా పెరిగి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. -
పక్కా ప్రణాళికతో లక్ష్య సాధన
కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ మహారాణిపేట: జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల వార్డుల మ్యాపింగ్, మన మిత్ర శిక్షణ, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో మిస్సింగ్ వివరాల నమోదు, మత్స్యకార లబ్ధిదారుల ఈ–కేవైసీ తదితర అంశాల పురోగతిని తెలుసుకున్నారు. స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు సేవలు, పీ4– బంగారు కుటుంబాల అనుసంధానం, కౌశలం పరీక్షలు, ఉద్యో గ మేళాల నిర్వహణ, ఆధార్ ప్రత్యేక శిబిరాల ఏర్పా టు వంటి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల హాజరు పర్యవేక్షణతో పాటు ఏపీ సేవా సేవలు, ఫీల్డ్ పెండెన్సీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అలాగే స్వర్ణ వార్డు–స్వర్ణ గ్రామం సేవలను విస్తృతం చేయాలని, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని సూచించారు. పౌరుల ఈ–కేవైసీ ప్రక్రియను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల వార్డుల మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని, గాజువాకలో అధిక పెండింగ్ ఉండటంపై సంబంధిత జోనల్ కమిషనర్కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. కౌశలం కార్యక్రమం ద్వారా సుమారు 90 వేల మందికి పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు సచివాలయాలకు నేమ్ బోర్డులను ఏర్పాటు చేయాలని, ఎవరైనా సచివాలయాలను తనిఖీ చేస్తే తనకు ముందస్తు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా స్వర్ణగ్రామ–స్వర్ణవార్డు అధికారి పూర్ణిమాదేవి, జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణి, డీడీవో ఉషారాణి, జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి ప్రత్యక్షంగా పాల్గొనగా, అన్ని జోనల్ కమిషనర్లు, ఎంపీడీవోలు వర్చువల్గా హాజరయ్యారు. -
పోర్ట్ స్టేడియం లీజులో రూ.40 కోట్ల కుంభకోణం
జనసేన నేత పీతల మూర్తి యాదవ్ బీచ్రోడ్డు: విశాఖ పోర్ట్ స్టేడియం లీజును తీసుకున్న ‘విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్’సంస్థకు, థర్డ్ పార్టీ అసెస్మెంట్ పేరిట రూ.40 కోట్లు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. మంగళవారం నగరంలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో సహకరిస్తున్న విశాఖ పోర్ట్ అధికారులపై సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖలు తక్షణమే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సదరు సంస్థకు ఎటువంటి చెల్లింపులు చేయకూడదని, ప్రస్తుతం బదిలీపై వెళ్తున్న చైర్మన్ అంగముత్తు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని మూర్తి యాదవ్ పేర్కొన్నారు. రూ.40 కోట్ల పోర్ట్ ధనాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు అధికారు లు అత్యుత్సాహం చూపుతున్నారని ఆరోపించారు. వాస్తవానికి, తమకు రూ.48 కోట్ల పరిహారం చెల్లించాలంటూ విశ్వనాథ్ సంస్థ ఫిబ్రవరి 2న చీఫ్ ఇంజినీర్కు లేఖ రాసిందని.. దీని ఆధారంగా కోర్టు తీర్పులకు విరుద్ధంగా, థర్డ్ పార్టీ అసెస్మెంట్ పేరిట అక్రమ మార్గంలో కోట్లు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తొలుత ఉన్న అంచనాలను కాదని, నష్టపరిహారం తక్కువగా ఉందనే నెపంతో కోల్కతాకు చెందిన ‘మెకాన్’అనే సంస్థకు తిరిగి అంచనాల బాధ్యత అప్పగించారని దుయ్యబట్టారు. పాత అంచనాల కంటే కనీసం 50 శాతం అదనంగా అంచనాలను పెంచాలని సదరు సంస్థకు లోపాయికారీగా ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. విశ్వనాథ్ సంస్థపై ప్రస్తుత చైర్మన్ అంగముత్తు గతంలో చర్యలు తీసుకుని లీజు ఒప్పందాన్ని రద్దు చేశారని, అయితే ఆయన బదిలీ కావడంతో ప్రస్తుతం ఇన్చార్జి చైర్మన్గా కొనసాగుతున్నారని మూర్తి యాదవ్ తెలిపారు. కొత్త చైర్మన్గా జస్మిత్ సింగ్ బింద్రా ఆదివారమే నియమితులైనందున, ఆయన బాధ్యతలు స్వీకరించే వరకు అంగముత్తు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదని డిమాండ్ చేశారు. -
స్టీల్ప్లాంట్ సీఎండీగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ సీఎండీగా ఎం.ఎన్.వి.ఎస్.ప్రభాకర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభాకర్ నాగపూర్లోని వీఆర్సీ నుంచి మెటలర్జీలో బీటెక్ పూర్తి చేసిన తర్వాత 1991లో సెయిల్లో మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్)గా తన కెరీర్ను ప్రారంభించారు. అనంతరం ఆయన హెచ్ఆర్, మార్కెటింగ్ల్లో ఎంబీఏ పూర్తి చేశారు. వివిధ ఆపరేషన్ల యూనిట్లలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన 2025 ఫిబ్రవరి 1న ఎన్.ఎస్.ఎల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేరారు. ఆయన నాయకత్వంలో సంస్థ రేటెడ్ కెపాసిటీకి దగ్గరగా కార్యకలాపాలను స్థిరీకరించడం, సాంకేతిక–ఆర్థిక అంశాల్లో గణనీయమైన మెరుగుదల, ఉత్పాదకతను పెంచడం జరిగింది. ఈ తరుణంలో ఆయన స్టీల్ప్లాంట్ సీఎండీగా నియమితులయ్యారు. -
బాబూ.. అది పుష్పక విమానం కాదు..
విశాఖపట్నం: సాగర తీరంలో ఈ యువకుల ప్రయాణం చూస్తుంటే.. అది బైకులా కాకుండా అందరూ ఇట్టే ఇమిడిపోయే ‘పుష్పక విమానం’లా కనిపిస్తున్నట్టుంది. నిబంధనల ప్రకారం ఇద్దరికే చోటున్నా, ఏకంగా నలుగురు ఎక్కి ‘చతుర్ముఖ’ ప్రయాణంతో ట్రాఫిక్ రూల్స్ను నడిరోడ్డుపై గాలికొదిలేశారు. అటు హెల్మెట్ లేదు.. ఇటు భద్రతా లేదు.. కేవలం సరదా కోసం ప్రాణాలను పణంగా పెడుతూ చేస్తున్న ఈ సాహసం ఏ మాత్రం అదుపు తప్పినా తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తుంది. -
మద్యం మానిపిస్తే ఆత్మహత్య చేసుకుంటా..
విశాఖపట్నం జిల్లా: మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఓ వ్యక్తి, పునరావాస కేంద్రానికి తరలిస్తుండగా నడిరోడ్డుపై హల్చల్ చేశాడు. బలవంతంగా మద్యం మానిపిస్తే బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని అలజడి సృష్టించాడు. రిహాబిలిటేషన్ కేంద్రానికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ద్విచక్ర వాహనం పైనుంచి దిగిపోయి, ఆర్టీసీ బస్సు కింద పడుకుని నానా యాగీ చేశాడు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని అదుపులోకి తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోపాలపట్నం సమీపంలోని బాజీ జంక్షన్కు చెందిన భార్గవ్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో అతడికి మద్యం మానిపించేందుకు చినముషిడివాడలోని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలిస్తున్నారు. అయితే సుజాతనగర్ బీఆర్టీఎస్ రహదారిపై ఒక్కసారిగా వాహనం దిగిపోయిన భార్గవ్.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపేశాడు. వెంటనే బస్సు కింద పడుకుని, తనను కేంద్రానికి తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటానని భీష్మించాడు. దీంతో ప్రయాణికులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని స్టేషన్కు తరలించారు. అనంతరం కౌన్సిలింగ్ నిర్వహించి, అతడికి మెరుగైన మానసిక చికిత్స అందించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. -
● ఆసరాగా అడుగులు.. నమ్మకమే వెలుగులు
కనురెప్పల వెనుక కాంతి లేకపోతేనేం... గుండె లోతుల్లో నమ్మకపు దీపం వెలుగుతుంటే! గమ్యం చేరడానికి దారి చూపించే కళ్లు లేకున్నా.. చేయి విడవని తోడు, గుండె నిండిన ధైర్యమే వీరి బలం! ఈ లోకం వీరికి కనిపించకపోవచ్చు.. కానీ ఒకరి స్పర్శ మరొకరికి కొండంత అండ. చీకటి తెరలను చీల్చుకుంటూ సాగుతున్న ఈ అడుగులు.. మనుషుల మధ్య ఉండాల్సిన మమకారానికి మౌన భాష్యమని స్పష్టం చేస్తున్నాయి. వన్టౌన్ పాత పోస్టాఫీసు ప్రాంతంలో ఒకరికొకరు ఆసరాగా నిలిచిన ఈ దృశ్యం, చూపు లేకున్నా నమ్మకంతో గమ్యాన్ని ముద్దాడవచ్చని చాటిచెబుతోంది. – ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
పరిష్కార వేదిక.. ఫలితం ఎక్కడ?
మహారాణిపేట: సమస్య చిన్నదైనా దానికి పరిష్కారం లభించడం లేదు. ఫలితంగా అదే సమస్యపై పదే పదే అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)పై జనం పెదవి విరుస్తున్నారు. మండల కేంద్రాల్లో తమ గోడు పట్టించుకోకపోవడంతో జిల్లా కేంద్రానికి వచ్చినా.. ఇక్కడ కూడా అదే తంతు కొనసాగుతోందని బాధితులు మండిపడుతున్నారు. ముఖ్యంగా భూ వివాదాలు, ఉపాధి, సంక్షేమ పథకాలు, ఆదాయ ధ్రువపత్రాలు, గృహ స్థలాలు, తాగునీరు, పింఛన్లు వంటి సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. విన్నవించుకున్న 15 రోజుల్లో పరిష్కారం లభించకపోవడంతో బాధితులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు ప్రజలు వివిధ సమస్యలపై మొత్తం 348 వినతులు సమర్పించారు. వాటిలో రెవెన్యూ విభాగానికి 35, జీవీఎంసీకి 76, పోలీస్ శాఖకు 27, ఇతర విభాగాలకు సంబంధించి 210 వినతులు ఉన్నాయి. ఫిర్యాదులు రీ–ఓపెన్ కాకూడదు: కలెక్టర్ పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి వచ్చే వినతులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు మళ్లీ రీ–ఓపెన్ కాకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత విభాగాధిపతులదేనని స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన సమీక్ష నిర్వహించారు. సమస్యకు సరైన పరిష్కారంతో పాటు సంబంధిత ఎండార్స్మెంట్ను కూడా తప్పనిసరిగా ఫిర్యాదుదారులకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో ఎం.విశ్వేశ్వర నాయుడు, ఏడీసీ సత్యవేణి పాల్గొన్నారు. రెవెన్యూ క్లినిక్లో ఆర్డీవోలు, తహసీల్దార్లు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. -
అక్షయపాత్రకు ఇవ్వొద్దు
మహారాణిపేట: మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతలను అక్షయపాత్ర సంస్థకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్లోని పీజేఆర్ఎస్లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పి.మణి మీడియాతో మాట్లాడుతూ.. అక్షయపాత్రకు పథకాన్ని అప్పగిస్తే ఏళ్ల తరబడి నమ్ముకున్న కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్మికుల ఉపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు. జనవరి నెల నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని, పెరిగిన ధరల దృష్ట్యా ప్రభుత్వమే నేరుగా గ్యాస్ సరఫరా చేయాలని కోరారు. యూనియన్ జిల్లా కార్యదర్శి జి.మంగశ్రీ, అధ్యక్షురాలు భవాని, కార్మికులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
నక్కపల్లి : రైతుకు చెందిన భూమిని మ్యూటేషన్ చేసేందుకు రూ.1.50 లక్షలు తీసుకుంటూ నక్కపల్లి మండలం పెదతీనార్ల వీఆర్వో కొప్పిశెట్టి చిట్టిబాబు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కశింకోట మండలం వెదురుపర్తి గ్రామానికి చెందిన ముక్కా శ్రీను అనే రైతు నక్కపల్లి మండలం పెదతీనార్లలో రెండు వేర్వేరు సర్వే నంబర్లలో 5.57 ఎకరాల భూమిని 2023లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఈ భూమిలో కొబ్బరి పంట వేసి సాగు చేసుకుంటున్నాడు. మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒక సర్వే నంబరుకు సంబంధించి 2.14 ఎకరాలకు భూమికి మ్యూటేషన్ జరిగింది. 3.43 ఎకరాల భూమి మ్యూటేషన్ జరగలేదు..రికార్డుల్లో కొనుగోలు చేసిన వ్యక్తి, అమ్మిన వ్యక్తి పేరు లేదు. వేరొక అసామి పేరున నమోదయి ఉంది. బాధితుడు కొనుగోలు చేసిన భూమిలో 2.14 ఎకరాల భూమిని ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్క్ కోసం సేకరించింది. ఈ భూమి మాత్రమే బాధితుడి పేరున రికార్డుల్లో మ్యూటేషన్ అయి నమోదై ఉండడంతో దానికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారు. మిగిలిన భూమికి నష్టపరిహారం ఇవ్వలేదు. దీంతో మిగిలిన భూమిని మ్యూటేషన్ చేయాలని రెవెన్యూ అదికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అధికారులు మాత్రం సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో బాధితుడు శ్రీను వీఆర్వో కొప్పిశెట్టి చిట్టిబాబును సంప్రదించగా, మ్యుటేసన్కు రూ.లక్షల్లో మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అడ్వాన్సుగా రూ.1.50 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం బాధితుడు ఈనెల7వ తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అడ్వాన్సు రూ.1.50 లక్షలు సోమవారం విశాఖపట్నం ఎయిర్పోర్టు సమీపంలో వీఆర్వోకు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నాయకత్వంలో సిబ్బంది వలవేసి పట్టుకున్నారు. అక్కడ నుంచి నిందితుడిని నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. వీఆర్వో సొంత గ్రామం నక్కపల్లి మండలం ఉపమాకలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పట్టుబడ్డ వీఆర్వోపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. -
వార్డుల విభజనలో లోపాలు సరిచేయాలి
మహారాణిపేట: వార్డుల విభజనలో తప్పిదాలు లేకుండా చూడాలని, ఓటరు జాబితాలను వెంటనే సరి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు కోరారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆయన కలెక్టర్ అభిషిక్త్ కిశోర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 19 నుంచి వార్డుల విభజన ప్రక్రియ చేపడుతున్నారని, అందులోని లోపాలను సరిచేసి, ఓటరు జాబితాను పునర్వ్యవస్థీకరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందన్నారు. వార్డుల సంఖ్య పెరిగి, అవి చిన్నవిగా ఉంటేనే పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని, అప్పుడే ప్రజలకు సుపరిపాలన అందుతుందని పేర్కొన్నారు. జిల్లా జనతా వారధి కన్వీనర్ పి.శ్రీనివాసరావు, కో–కన్వీనర్ మూల వెంకట్రావు, నాయకులు దేవర చంద్రశేఖర్, నరసింగరావు, కె.రవిరాజ్, తిప్పనబోయిన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి
మహారాణిపేట: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కార్యదర్శి ఉమ్మడి నితిన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ కాలేదన్నారు. దీంతో అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్పై వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉందని, ఫీజులు చెల్లించలేదనే కారణంతో కొన్ని కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, సర్క్యులర్లను కూడా కొన్ని కళాశాలలు పట్టించుకోవడంలేదన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యార్థుల సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ.5,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
పోర్టులో కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం
సాక్షి, విశాఖపట్నం : మేజర్ పోర్టులతో పోటీపడుతూ 100 మిలియన్ టన్నుల హ్యాండ్లింగ్ లక్ష్యంతో పాటు.. కాలుష్య రహిత పోర్టుగా మార్చడమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తున్నామని విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ డా.అంగముత్తు స్పష్టం చేశారు. పోర్టు పరిధిలో పలు కీలక మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభంతో పాటు కొత్త ప్రాజెక్టులకు సోమవారం శంకుస్థాపనలు చేశారు. పబ్లిక్ ప్రొమెనెడ్ అభివృద్ధి, పోర్టు నిర్వహణ వ్యవస్థ, 38 టీకేఎం రైల్వే ట్రాక్ల విద్యుదీకరణ, పరిపాలన భవనంలోని డిస్ప్లే కారిడార్, ఎస్టీపీ సమీపంలో 170 కిలోవాట్ల రూఫ్టాప్ సోలార్ వ్యవస్థ, ప్రస్తుత ఎంసీహెచ్వీ రైల్వే ట్రాక్ అప్గ్రెడేషన్, ఎస్ఎల్ కాలువ జెట్టీ సమీపంలో మరమ్మతులు, రైల్వే ట్రాక్ల్లో మలుపుల సవరణతో మెరుగుదల పనులతో పాటు కస్టమ్స్ సరిహద్దు గోడ నిర్మాణాన్ని చైర్మన్ డా.అంగముత్తు ప్రారంభించారు. భద్రత, మౌలిక సదుపాయాల బలోపేతానికి సంబంధించిన పలు ముఖ్యమైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. వీటిలో అన్ని గేట్ల వద్ద అండర్ వెహికల్ స్కానింగ్ సిస్టమ్ల ఏర్పాటు, కార్గో గేట్ల వద్ద రేడియోలాజికల్ డిటెక్షన్ పరికరాల ఏర్పాటు, కాన్వెంట్ జంక్షన్ ఆర్చ్ నుంచి హెచ్–7 జంక్షన్ వరకు బీటీ రోడ్డుకు రీగ్రేడింగ్ పనులు, ఓహెచ్సీ లోపలి రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. -
వాణిజ్య మంట
ఇంటి గ్యాస్తోమహారాణిపేట: నగరంలో వంట గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా పడగ విప్పింది. గృహ అవసరాల కోసం కేటాయించిన సిలిండర్లు బహిరంగంగానే పక్కదారి పడుతున్నాయి. అంతర్జాతీయ యుద్ధ వాతావరణాన్ని సాకుగా చూపుతూ, నగరంలోని బ్లాక్ మార్కెట్ వ్యాపారులు అక్రమ విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు. వాణిజ్య సిలిండర్ల ధరలు ఒక్కసారిగా పెరగడం, వాటి లభ్యతపై ఆంక్షలు ఉండటంతో వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ధరల పెరుగుదలే కారణం గత నెలలో రూ.2,165 ఉన్న వాణిజ్య సిలిండర్ ధర ప్రస్తుతం రూ.3,146.50కు చేరింది. వెయ్యి రూపాయల మేర భారం పెరగడంతో చిన్న, పెద్ద వ్యాపార సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు లాభాల కోసం గృహ అవసరాలకు వాడే సిలిండర్లపై ఆధారపడుతున్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొంత మంది గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, డెలివరీ బాయ్స్ కుమ్మకై ్క సామాన్యుడి పొయ్యి కింద సెగ పెడుతున్నారు. అదనపు సొమ్ము ఇస్తే చాలు, నిబంధనలతో సంబంధం లేకుండా సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. ఓటీపీ విధానానికి తూట్లు అసలు ధర కంటే రూ.800 నుంచి రూ.1,000 వరకు అదనంగా వసూలు చేస్తూ గృహ సిలిండర్లను హోటళ్లకు మళ్లిస్తున్నారు. భద్రత కోసం ప్రవేశపెట్టిన ఓటీపీ విధానాన్ని ఇక్కడ పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. అధిక మొత్తంలో డబ్బులిస్తే ఓటీపీ అవసరం లేకుండానే సిలిండర్లు ఇస్తున్నారు. దీని వల్ల సాధారణ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకున్నా, మొబైల్కు ఓటీపీ వచ్చినా 15 రోజులైనా సిలిండర్ చేతికి అందడం లేదు. తమ సిలిండర్ ఎప్పుడు వస్తుందో తెలియక వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పెరిగిన ఆహార ధరలు ఈ విషయంపై వినియోగదారులు నిలదీస్తే.. అంతా డెలివరీ బాయ్స్ చేస్తున్న పనేనని ఏజెన్సీలు తప్పించుకుంటున్నాయి. ఈ కృత్రిమ కొరత వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు గ్యాస్ ధరల పెరుగుదలను సాకుగా చూపి హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ఆహార పదార్థాల ధరలను భారీగా పెంచేశారు. దీంతో సామాన్యులు అటు గ్యాస్ దొరక్క, ఇటు బయట తినలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతగా బహిరంగ దందా సాగుతున్నా సివిల్ సప్లైస్, విజిలెన్స్ శాఖల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రారంభంలో కొన్ని దాడులు చేసినా, ఆ తర్వాత నిఘా పూర్తిగా నిద్రపోతోంది. ఫలితంగా రోడ్ల మీద గృహ సిలిండర్లు పెట్టి విక్రయించే ఆహార వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి, గ్యాస్ ఏజెన్సీల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఓటీపీ విధానం సక్రమంగా అమలయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రపంచ వ్యాప్తంగా విశాఖ ఉత్పత్తులకు గిరాకీ
విశాఖ నుంచి తరలివెళ్లే మత్స్య సంపదకు అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో విపరీతమైన ఆదరణ ఉంది. ప్రస్తుతం భారత్ నుంచి జరిగే ఎగుమతుల్లో అమెరికా 35 శాతం వాటాతో అతిపెద్ద కొనుగోలుదారుగా కొనసాగుతుండగా, చైనా మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే అమెరికాకు జరిగే ఎగుమతులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. చైనాకు మాత్రం ఎగుమతులు ఏకంగా 22 శాతం పెరగడం విశేషం. వీటితో పాటు ఆగ్నేయాసి యా, జపాన్ దేశాలకూ విశాఖ నుంచి భారీగా సముద్ర ఉత్పత్తు ల ఎగుమతులు సాగుతున్నాయి. ప్రధాన మార్కెట్లకు జరిగిన ఎగుమతుల వివరాలివి.. -
జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలపాలి
మహారాణిపేట : జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలపాలని, దానికి ప్రత్యేక కార్యాచరణ, విజన్తో కూడిన కృషి అవసరమని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చర్చించిన అంశాలు, ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యతలు, అమలు చేయాల్సిన కార్యాచరణపై సోమవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేపీఐ, పబ్లిక్ పర్సెప్షన్, పీజీఆర్ఎస్, స్వర్ణవార్డు–స్వర్ణగ్రామ సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, జిల్లా, నియోజకవర్గాల వారీగా పబ్లిక్ పర్సెప్షన్ వివరాలను విశ్లేషించాలని తెలిపారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఫిర్యాదుపై జిల్లా స్థాయి అధికారులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. వ్యవసాయం, వైద్యం, గృహనిర్మాణం, సంక్షేమం, ఇరిగేషన్ తదితర రంగాల్లో నాణ్యమైన సేవలు అందించాలని పేర్కొన్నారు. గంగవరం పోర్టు రహదారి నిర్మాణంలో అధికారులు చొరవ చూపాలని చెప్పారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో స్పెషల్ ఆఫీసర్లు భాగస్వామ్యం కావాలని, స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. పబ్లిక్ పర్సెప్షన్లో రాష్ట్రంలో జిల్లా ద్వితీయ స్థానంలో ఉండటం హర్షణీయమని, అదే ఉత్సాహంతో అన్ని రంగాల్లో విశాఖను నంబర్–1గా నిలపాలని పిలుపునిచ్చారు. కౌశలం, కుసు మ్, సంజీవని పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలని, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, కొత్త ప్రా జెక్టుల గుర్తింపు, యారాడ బీచ్ వద్ద పర్యాటక ప్రా జె క్టులు, ఎకనామిక్ టౌన్షిప్ల ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించాలని సూచించారు. జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో ఎం.విశ్వేశ్వర నాయుడు పాల్గొన్నారు. -
నీలి అలలపై సాహస కేరింతలు
వేసవి భానుడి భగభగలకు విరుగుడుగా చిన్నారులు జలకాలాటల్లో మునిగితేలుతున్నారు. నీలి రంగు నీటి అలలపై తమ సాహస విన్యాసాలతో అబ్బురపరుస్తున్నారు. నిలకడగా ఉన్న పడవ అంచునే వేదికగా చేసుకుని, గాల్లో గంతేస్తూ.. విల్లులా వొంకరలు తిరుగుతూ నీటిలోకి దూకుతున్న తీరు చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఎండ వేడిని మర్చిపోయి, కేరింతల మధ్య సాగుతున్న ఈ చిచ్చరపిడుగుల విన్యాసాలు తీర ప్రాంతంలో సందడిని నింపుతున్నాయి. పడవ ఇంజిన్పై నుంచి గాల్లోకి ఎగురుతూ వారు చేస్తున్న జల విన్యాసాలు సాహసానికి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. – ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
జూలై 28న గిరి ప్రదక్షిణ
సింహాచలం: వరాహ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు అధికారులను ఆదేశించారు. సోమవారం దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం, వైదికులు, వివిధ విభాగాల సెక్షన్ హెడ్లతో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై ఆయన ముందస్తు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జూలై 28న 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ, 29న కొండపై ఆలయ ప్రదక్షిణలు జరుగుతాయని వెల్లడించారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఎక్కడికక్కడ తాగునీరు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు, తాత్కాలిక షెడ్లు, వైద్య శిబిరాలు, మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. మార్గంలో ఏయే ప్రదేశాల్లో ఏ సౌకర్యాలు అవసరమో క్షేత్రస్థాయిలో గుర్తించి, ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. బారికేడ్ల ఏర్పాటు, విద్యుద్దీకరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో దేవస్థానం ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, డిప్యూటీ కలెక్టర్ మధులత, డిప్యూటీ ఈవో రాధ, ఈఈ రాంబాబు, ఏఈ రవిరాజు, ఏఈవోలు రమణమూర్తి, పిల్లా శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
పోలీసు పరిష్కార వేదికకు 130 ఫిర్యాదులు
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 82 వినతులు డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు మొత్తం 82 వినతులు వచ్చాయి. అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, పి.నల్లనయ్య హాజరై నగర ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ వినతుల్లో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి 49 ఫిర్యాదులు అందాయి. మిగిలిన వాటిలో రెవెన్యూ విభాగానికి 12, జోనల్ అడ్మినిస్ట్రేషన్కు 7, ఇంజినీరింగ్ సెక్షన్కు 7, ప్రజారోగ్య విభాగానికి 3, అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 2, హార్టికల్చర్ విభాగానికి ఒకటి, యూసీడీ విభాగానికి ఒకటి చొప్పున వినతులు వచ్చాయి. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్(అమృత్) డి.విజయభారతి, ప్రధాన ఇంజినీర్ పీవీవీ సత్యనారాయణరాజు, సీసీపీ ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి.వాసుదేవరెడ్డి, డీసీఆర్ ఎస్.శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. -
15 నుంచి ‘వైఎస్సార్ సీపీ ఎంఏపీఎల్’ క్రికెట్ టోర్నీ
మహారాణిపేట: వైఎస్సార్ సీపీ మొల్లి అప్పారావు ప్రీమియర్ లీగ్(ఎంఏపీఎల్) క్రికెట్ పోటీలు ఈ నెల 15 నుంచి 18వ తేదీ నిర్వహించేందుకు ఏర్పా ట్లు జరుగుతున్నాయి. ఈ పోటీల పోస్టర్ను సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు జన్మదినం పురస్కరించుకుని.. 10వ వార్డు యువజన విభాగం అధ్యక్షుడు కంటుబోతు తులసీరాం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ పరిశీలకురాలు పేడాడ రమణి కుమారి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జీవీ రామచంద్రరావు, జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్, సునీల్, 10వ వార్డు అధ్యక్షుడు పతివాడ కనకరాజు పాల్గొన్నారు. వీరితో పాటు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు కాగితాల రవికిరణ్ రెడ్డి, నాయకులు కె.కన్నబాబు, దంతిన రామా రావు, చొల్లంగి నాగేశ్వరరావు, మెట్ట సూర్యనారాయణ, మీసాల ప్రదీప్, రవీంద్ర చౌదరి, శశికుమార్, రౌతు సంతోష్, మాచర్ల రవి, గోవింద్ తదితరులు హాజరయ్యారు. -
మరణానంతరం నేత్రదానం
పెందుర్తి: గుండెపోటుతో మరణించిన ఓ వ్యక్తి నేత్రాలను దానం చేసి అతని కుటుంబం మానవత్వం చాటుకుంది. వివరాలివి.. పెందుర్తి పాతూరులో నివాసం ఉంటున్న పెతకంశెట్టి రాము(46) శనివారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ నేత్రదానం కోసం కుటుంబ సభ్యులను సంప్రదించారు. వెంటనే భార్య సత్యవతి, కుమారుడు త్రినాథ్, బావమరిది శరగడం సంతోష్ నేత్రదానానికి ఒప్పుకుని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్సత్యనారాయణ చేతుల మీదుగా అంగీకార పత్రం అందించారు. మొహిసిన్ నేత్రనిధి ప్రతినిధులు మనోజ్, లక్ష్మి మృతుని నేత్రాలను సేకరించారు. -
వైద్యం
పడకేసినయూపీహెచ్సీ, పీహెచ్సీల్లో అందుబాటులో లేని వైద్యులు వైద్యుల అవతారం ఎత్తుతున్న నర్సులు, ఫార్మసిస్టులు కానరాని స్పెషలిస్ట్ వైద్యులు 66 యూపీహెచ్సీలు, 9 పీహెచ్ిసీల్లో అరకొర సౌకర్యాలుకొబ్బరితోట యూపీహెచ్సీలో వైద్యురాలిగా అవతారం ఎత్తిన నర్సు మహారాణిపేట: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వ వైద్యం నేడు పడకేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే ఒకప్పుడు పేదవాడికి ప్రాణవాయువులా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితులు తలకిందులయ్యాయి. నాడి పట్టి చూసే నాథుడే కరువవ్వడంతో, సామాన్యుడు దవాఖానా మెట్లు ఎక్కాలంటేనే వణికిపోతున్నాడు. పర్యవేక్షణ లోపం, పాలకుల నిర్లక్ష్యం వెరసి ప్రభుత్వ వైద్య రంగం ప్రతిష్ట రోజురోజుకూ మసకబారుతోంది. వైద్యులు లేని దవాఖానాలు.. వెలవెలబోతున్న వార్డులు ఒకప్పుడు రోగులతో కళకళలాడే పీహెచ్సీలు, యూపీహెచ్సీలు నేడు వెలవెలబోతున్నాయి. దీనికి ప్రధాన కారణం వైద్యులు అందుబాటులో లేకపోవడమే. విధి నిర్వహణలో ఉండాల్సిన డాక్టర్లు ఆస్పత్రులకు రాకపోవడంతో రోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రోగితో వచ్చే వారు గంటల తరబడి వేచి చూసినా, డాక్టర్ దర్శనం కలగానే మిగులుతోంది. దీంతో ‘సర్కారు దవాఖానాకు పోతే టైం వేస్ట్’ అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోతోంది. మందుల కొరత ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మందుల కొరత తీవ్రస్థాయికి చేరింది. గతంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులకు నెలరోజులకు సరిపడా మందులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు స్టాకు లేదనే నెపంతో కేవలం వారం రోజులకు మాత్రమే ఇస్తుండటంతో సామాన్యులు ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. డాక్టర్లు రాసిచ్చిన మందులు ఆస్పత్రిలో దొరక్కపోవడంతో పేద రోగులు బయట కొనుగోలు చేయలేక, వ్యాధి నయం కాక తీవ్ర అవస్థలు పడుతున్నారు. అటకెక్కిన సేవలు ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సేవలు అటకెక్కినట్లు కనిపిస్తున్నా, పాలకులు, ఆరోగ్య శాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఓపీ సేవల దగ్గర నుంచి అత్యవసర మందుల వరకు ప్రతిచోటా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అడిగే నాథుడే లేకపోవడంతో ప్రభుత్వ వైద్య రంగం ప్రతిష్ట మసకబారుతోంది. ఇప్పటికై నా సర్కార్ స్పందించి, మందుల కొరతను తీర్చి, వైద్యులు విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోకపోతే పేదవాడికి ప్రాణరక్షణ కరువయ్యే ప్రమాదం ఉంది. ఖాళీల భర్తీలో ప్రభుత్వం విఫలం ఆస్పత్రుల్లో బదిలీల వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉన్న వైద్యులలో కొందరు ఆస్పత్రికి వచ్చి కేవలం ముఖ గుర్తింపు హాజరు వేసి, ఆపై తమ వ్యక్తిగత పనులకు లేదా ప్రైవేటు ప్రాక్టీసులకు వెళ్లిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నర్సులు, ఫార్మసిస్టులే ‘డాక్టర్ల’ అవతారం ఎత్తుతున్నారు. తమకున్న పరిమిత వైద్య పరిజ్ఞానంతో వారు మందులు రాసి ఇస్తున్నారు. ఇది ఒకరకంగా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే. అత్యవసర పరిస్థితుల్లో రోగులు చేసేదేమీ లేక, తమ జేబులు ఖాళీ అయినా సరే ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల బాట పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై వెల్లువెత్తుతున్న విమర్శలు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ వైద్యం అటకెక్కిందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓపీ సేవల దగ్గర నుంచి మందుల పంపిణీ వరకు ప్రతిచోటా కొరత వేధిస్తోంది. ఆరోగ్య శాఖాధికారుల పర్యవేక్షణ నామమాత్రంగానే ఉండటంతో వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి పేదలకు వైద్య సేవలు సక్రమంగా అందించాలని పలువురు కోరుతున్నారు. -
అన్నదానానికి విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు విరాళాలు సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విశాఖకు చెందిన సీహెచ్.దుర్గాప్రసాద్ రూ.1,00,001 విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఏఈవో వెంకటరెడ్డి, ఆలయ పర్యవేక్షకుడు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. చికెన్ ధరలు -
శిల్పారామంలో కోలాట సంబరం
పీఎంపాలెం: పీఎం పాలెం శిల్పారామం వేదికగా ఆదివారం సాయంత్రం జానపద కళల కోలాహలం నెలకొంది. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ ప్రదర్శనలో భక్తి, జానపద బాణీలు శిల్పారామం ప్రాంగణంలో మారుమోగాయి. నగరానికి చెందిన శ్రీ శివసాయి కోలాటం గ్రూపు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన అట్టహాసంగా సాగింది. కార్యక్రమం తొలుత శ్రీరాముని కీర్తిస్తూ సాగే ‘రఘుకుల తిలకా రారా’.. అనే భక్తి గీతంతో ప్రారంభమైంది. మహిళా కళాకారులు లయబద్ధంగా కోలాటం ఆడుతూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అనంతరం ‘రావు రావు తల్లీ..’, గోపికలు ఏమయినారు.., రంగని కళ్యాణం, శివశివ మూర్తి ఘననాధ.. వంటి కీర్తనలకు జానపద శైలిలో ప్రదర్శించిన కోలాట రీతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారులు కళ్యాణి, శ్రావణి, నీహారిక, మహాలక్ష్మి, వర్షిణి, శిరీష, మేఘన, జ్యోతి తదితరులు తమ నైపుణ్యంతో అలరించారు. -
శ్రీవారి భక్తులకు సువర్ణావకాశం
కొమ్మాది: తిరుమల శ్రీవారి ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రతి శుక్రవారం స్వామివారికి అలంకరించే మేల్చాట్ (పట్టు) వస్త్రాన్ని సమర్పించే అరుదైన అవకాశాన్ని రుషికొండలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులకు కల్పిస్తోంది. భక్తుల కోరిక మేరకు ఈ సువర్ణ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారికి పట్టు వస్త్రాన్ని అందించే భక్తుల పేరున ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సేవలో పాల్గొనాలని ఆకాంక్షించే భక్తులు ముందుగా 9866397593, 8074404845 నంబర్లను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. -
హాట్ వెదర్.. జూలో షికార్
వేసవి సెలవులు, దానికి తోడు ఆదివారం కావడంతో జూ పార్కు సందర్శకుల తో కళకళలాడింది. ఎండను సైతం లెక్కచేయకుండా నగరవాసులు తమ కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి వన్యప్రాణులను వీక్షించేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. కొందరు గొడుగులు చేతబట్టి తిరగగా, మరికొందరు నడుస్తూ.. చెట్ల కింద సేదతీరుతూ జంతువులను, పక్షులను ఆసక్తిగా తిలకించారు. ఓ చిన్నారి మూడు చక్రాల సైకిల్పై జూలో విహరిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించింది. మరోవైపు భానుడి ప్రతాపానికి వన్యప్రాణులు సైతం విలవిల్లాడాయి. ఎండ వేడికి తట్టుకోలేక చాలా జంతువులు చెట్ల నీడకేపరిమితమయ్యాయి. గజరాజులు నీటి కొలనును వదలకుండా జలకాలాటలాడుతూ కనువిందు చేశాయి. చింపాంజీలు, కోతులు, కనుజులు, నీల్గైస్ ఎన్క్లోజర్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాటాకు పందిళ్ల కింద.. నెమళ్లు, నల్ల హంసలు నీటి స్ప్రింక్లర్ల వద్ద సేదదీరాయి. జిరాఫీలు, జీబ్రాలు చెట్ల నీడను ఆశ్రయించాయి. – ఆరిలోవ/సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
రైల్వే జోన్పై టీడీపీ సంబరాలు సిగ్గుచేటు
డాబాగార్డెన్స్: రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2014లోనే రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటు చేయాల్సి ఉందని, అలాంటిది దాదాపు 13 ఏళ్ల తర్వాత జోన్ ప్రకటించినా.. టీడీపీ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని సిటు రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నరసింగరావు అన్నారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వామపక్షాలు, ప్రతిపక్షాల పోరాట ఫలితంగానే ఇప్పటికి రైల్వే జోన్ సాధించుకున్నామని పేర్కొన్నారు. నగరంలోని సిటు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సిటు రాష్ట్ర కార్యదర్శులు ఆర్కేఎస్వీ కుమార్, పి.మణి, పబ్లిక్ సెక్టార్ కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ జ్యోతీశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత రైల్వేజోన్ ప్రకటించడంపై టీడీపీ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. పేరుకే సౌత్కోస్ట్ జోన్ ప్రకటించినా, జోన్లోని గుండెకాయ వంటి కోరాపుట్ను తొలగించడంతో ఏపీపై కేంద్ర ప్రభుత్వ సవతి తల్లి ప్రేమ బహిర్గతమైందని ఎద్దేవా చేశారు. 2014 నుంచి మోదీ ప్రభుత్వం రైల్వే రిక్రూట్మెంట్ ఆపేసిందని, దీంతో సుమారు 5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సౌత్కోస్ట్లో కలపాలని సీఎం చంద్రబాబు ఇటీవల స్వయంగా కోరినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. జోన్ ఏర్పాటు వల్ల ఏం ప్రయోజనం ఒరుగుతుందో చెప్పాలని టీడీపీ నాయకులకు సవాల్ చేశారు. పేరుకు మాత్రమే సౌత్కోస్ట్ జోన్ ఆంధ్రప్రదేశ్కు వస్తుందని, కేకే లైన్ ఈస్ట్ కోస్ట్కు కేటాయించడంతో లాభాలన్నీ ఒడిశాకే వెళతాయన్నారు. భారతదేశంలో రైల్వే రవాణా అతి చౌకగా, సౌకర్యవంత ప్రయాణమని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైల్వే ప్రైవేటీకరణపై దూకుడుగా ఉందని ఆక్షేపించారు. రైల్వేను ముక్కలు చేసి అమ్మడానికి రంగం సిద్ధం చేసిందని ఆరోపించారు. రైల్వే ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని రైల్వే కార్మికులకు సిటు తరఫున విజ్ఞప్తి చేశారు. -
డీఆర్ఎం కప్ టీటీ విజేత సెర్సా
విశాఖ స్పోర్ట్స్ : రైల్వే ఇండోర్ ఎన్క్లేవ్ వేదికగా రెండు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన డీఆర్ఎం కప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ముగిసింది. ఈ క్రీడా సంగ్రామంలో సెర్సా జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి విజేతగా అవతరించగా, ిస్పీనిక్స్ జట్టు రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో హోరాహోరీ పోరు సాగింది. సెమీఫైనల్ మ్యాచుల్లో పింపుల్ పాంథర్స్పై సెర్సా జట్టు, ముస్తాంగ్ జట్టుపై స్పినిక్స్ జట్టు గెలుపొంది ఫైనల్కు చేరుకున్నాయి. అత్యంత ఆసక్తికరంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో సెర్సా క్రీడాకారులు అంకిత్, బోలిక్, ప్రప్తి త్రయం తమ అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. స్పినిక్స్ జట్టు తరపున బరిలోకి దిగిన ప్రయాష్, కుందు, మహీధర్లు గట్టి పోటీని ఇచ్చినప్పటికీ, కీలక సమయాల్లో సెర్సా క్రీడాకారులు పైచేయి సాధించి టైటిల్ను కై వసం చేసుకున్నారు. ఇక సెమీస్లో ఓడిన జట్ల మధ్య మూడో స్థానం కోసం నిర్వహించిన పోటీలో అరుణ్, ప్రసన్న, జస్సికాతో కూడిన జట్టు విజయం సాధించి తర్వాతి స్థానంలో నిలిచింది. క్రీడాకారుల నైపుణ్యానికి, పట్టుదలకు ఈ టోర్నమెంట్ వేదికగా నిలిచింది. విజేత జట్లకు డీఆర్ఎం లిలిత్ బోహ్రా ట్రోఫీలు అందజేశారు. విజేతలకు ట్రోఫీలు అందజేసిన డీఆర్ఎం -
క్రీడాకారులు ఫూల్
స్విమ్మింగ్ పూల్..విశాఖ అంటేనే క్రీడలకు, ముఖ్యంగా ఆక్వా స్పోర్ట్స్కు కేరాఫ్ అడ్రస్. ఎందరో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈతగాళ్లను అందించిన ఘన చరిత్ర సాగరతీరంలోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ఉంది. ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నీలకు వేదికగా నిలిచి, రాష్ట్ర జట్టులో సింహభాగం స్విమ్మర్లను తయారుచేసిన ఈ ప్రతిష్టాత్మక కేంద్రం ప్రస్తుతం నిర్వహణా లోపాలతో కునారిల్లుతోంది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.2.41 కోట్ల భారీ వ్యయంతో ఈ కాంప్లెక్స్ను ఆధునీకరించారు. 1995 ఆగస్టు 22న అప్పటి మేయర్ సబ్బంహరి సారథ్యంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్, జీవీఎంసీ సంయుక్త నిధులతో ఈ కేంద్రాన్ని నిర్మించారు. నాటి నుంచి క్రీడాకారుల పాలిట దేవాలయంగా విరాజిల్లిన ఈ కాంప్లెక్స్, నేడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో తన ఉనికిని, నాణ్యతను కోల్పోతోంది. – విశాఖ స్పోర్ట్స్ ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతుల్లోకి ఈ కాంప్లెక్స్ వెళ్లినప్పటి నుంచి క్రీడాకారుల శిక్షణ గాలికొదిలేసి, కేవలం లాభార్జనే ధ్యేయంగా కార్యకలాపాలు సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీ ఆస్తులపై పెత్తనం చెలాయిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో సుమారు 1500 నుంచి 1800 మంది వరకు, వింటర్ సీజన్లో కూడా రోజుకు 300 మందికి పైగా శిక్షణ కోసం ఇక్కడికి వస్తుంటారు. సమ్మర్ సీజన్లో ఒక్కొక్కరు నుంచి రూ.3000 వసూలు చేస్తున్నారు. ఇంతమంది వస్తున్నా అందుకు తగ్గట్టుగా కనీస సదుపాయాలు కల్పించడంలో ప్రైవేట్ నిర్వాహకులు ఘోరంగా విఫలమయ్యారు. తీవ్ర ఇబ్బందులు శిక్షణార్థుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. పూల్లో ఈత నేర్చుకోవడం కంటే, ఒడ్డున నిరీక్షించడానికే ఎక్కువ సమయం వృథా అవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మూడు గంటల పాటు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ టైమ్ స్లాట్లు కేటాయించి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, కనీస పర్యవేక్షణ కరువైంది. 16 అడుగుల లోతు గల ప్రధాన పూల్..పక్కనే ఉన్న 3 నుంచి 6 అడుగుల లెర్నింగ్ పూల్లో కలిపి నిత్యం వందలాది మంది కిక్కిరిసిపోతున్నారు. గంట స్లాట్లో ఒక చిన్నారికి కేవలం అరగంట పాటు మాత్రమే నీటిలో స్విమ్మింగ్ చేసే అవకాశం దక్కుతోందని, మిగిలిన 20 నిమిషాల నుంచి అరగంట సమయం కేవలం క్యూలో నిలబడటానికే సరిపోతోందని వాపోతున్నారు. కోచ్ల కొరత వందలాది మంది పిల్లలకు కేవలం ముగ్గురు కోచ్లు, నలుగురు లైఫ్ గార్డులు మాత్రమే అందుబాటులో ఉండటం నిర్వాహకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. శిక్షణ గురించి ప్రశ్నిస్తే ‘కోచ్లు దొరకడం లేదు’ అనే రొటీన్ సమాధానం వస్తోందని, అసలు బాధ్యతాయుతమైన కాంట్రాక్టర్ ఎక్కడ ఉంటాడో కూడా తెలియని పరిస్థితి నెలకొందని క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దలు స్వతంత్రంగా ప్రాక్టీస్ చేద్దామన్నా విపరీతమైన రద్దీ వల్ల నిరాశే ఎదురవుతోంది. ఎంవీపీ కాలనీలోని ఎస్3 స్పోర్ట్స్ కాంప్లెక్స్లోనే ఇదే పరిస్థితి ఇదే తరహా పరిస్థితి ఎంవీపీ కాలనీలోని ఎస్3 స్పోర్ట్స్ కాంప్లెక్స్లోనూ కనిపిస్తోంది. ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల క్రీడాకారుల భద్రత, రక్షణ, నాణ్యమైన శిక్షణ అనే అంశాలు మరుగున పడిపోయి, క్రీడా ప్రాంగణాలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయనేది నగ్న సత్యం. విశాఖ కీర్తి ప్రతిష్టలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇప్పటికై నా జీవీఎంసీ కమిషనర్ , కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, ఈ ప్రైవేట్ సంస్థల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలని, ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు న్యాయం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. -
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడికి గ్లోబల్ విజనరీ అవార్డు
ఆరిలోవ: పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, తోటగరువు జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు మడ్డు శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ విజనరీ సమ్మిట్ ఎక్స్పో అవార్డు ఇన్ ఎడ్యుకేషన్–2026’లభించింది. రుషికొండలోని రిసార్ట్స్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఐకాన్ గ్లోబల్ విజనరీ సంస్థ ప్రతినిధులు ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. గ్రామ అభ్యుదయ కమిటీని ఏర్పాటు చేసి, గ్రామీణ యువతకు విద్యా సంబంధిత పోటీ పరీక్షల్లో విశేష తోడ్పాటునందించినందుకు గాను ఈ అవార్డు దక్కినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ ప్రతినిధులు, ఉపాధ్యాయులు ఆయన్ని అభినందించారు. -
లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు పోరాటం ఆగదు
బీచ్రోడ్డు: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని, తక్షణమే వీటిని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్.నరసింగరావు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద లేబర్ కోడ్స్ నిబంధనల కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కార్మికులను బానిసలుగా చేస్తూ, కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చేలా మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ రూల్స్ను విడుదల చేసిందని విమర్శించారు. దీనికి అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిబంధనలు రూపొందించుకోవాలని కేంద్రం కోరిందన్నారు. ఈ రూల్స్ గనుక అమలైతే కార్మికులు తీవ్రంగా నష్టపోతారని, ఇప్పటివరకు అనుభవిస్తున్న హక్కులన్నీ కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త నిబంధనల్లో పని గంటలు, జీతభత్యాలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై స్పష్టత లేదని.. యాజమాన్యాలకే సర్వహక్కులు కల్పించేలా ఇవి ఉన్నాయని మండిపడ్డారు. ఇది కార్మికులను బానిసలుగా మార్చడమేనని, లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, రాష్ట్ర కార్యదర్శి పి.మణి, విశాఖ జిల్లా పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్.జ్యోతీశ్వరరావు, ఎం.సుబ్బారావు, జి.టి.ప్రకాష్, చిన్నప్పుడు, వి.కృష్ణారావు, ఎం.సూరీడు, పోలేశ్వరరావు, చంద్రమౌళి, సత్యనారాయణ, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. -
● ఆనందాల సాగరం
భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు సముద్ర తీరం ఒక చల్లని చిరునామాగా మారింది. వారాంతం కావడంతో ఆదివారం సాయంత్రం పెద్ద సంఖ్యలో ప్రజలు సాగర తీరానికి పోటెత్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా కేరింతలు కొడుతూ ఉత్సాహంగా కనిపించారు. కొందరు సముద్రంలో స్నానాలు చేయగా.. చిన్నారులు అలలతో ఆటలాడుతూ మురిసిపోయారు. యువత సెల్ఫీలు దిగుతూ, ఇసుక తిన్నెలపై కూర్చుని స్నేహితులతో ముచ్చట్లు పెట్టుకుంటూ సందడి చేశారు. – ఏయూక్యాంపస్/సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
‘ముక్కల మామిడి’కి భలే గిరాకీ
ఎంవీపీకాలనీ: మామిడి సీజన్ రాగానే అందరికీ గుర్తొచ్చేది విభిన్న రుచుల సమ్మేళనం. తీపి, వగరు, కారం కలగలిసిన కమ్మదనాన్ని అందించడంలో మామిడికి సాటి లేదు. ప్రస్తుతం సీజన్లో రైతుబజార్లలో గ్రామీణ రైతులు నేరుగా విక్రయిస్తున్న మామిడికి ఆదరణ పెరిగింది. గత వారం రోజులుగా పండ్లను విక్రయిస్తున్న రైతులు, రెండు రోజులుగా పచ్చళ్లకు అనువైన కాయలను భారీగా అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఎంవీపీ కాలనీ రైతు బజార్తో పాటు నగరంలోని సీతమ్మధార, నరసింహనగర్, కంచరపాలెం, ఆరిలోవ సహా పలు ప్రాంతాల్లోని రైతుబజార్లు మామిడి కాయల కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. వినియోగదారులు పచ్చడి కాయలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపడమే కాకుండా, అక్కడే రైతులతో ముక్కలు కొట్టించుకుంటున్నారు. నగర ప్రజల అభిరుచికి అనుగుణంగా రైతులు సైతం విభిన్న రకాల మామిడి ఉత్పత్తులను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. మంచి నాణ్యత.. అందుబాటులో ధరలు సీజన్ ప్రారంభం కావడంతో మామిడి కాయలు, పండ్లు సామాన్యులకు అందుబాటు ధరల్లోనే దొరుకుతున్నాయని రైతుబజార్ అధికారులు తెలిపారు. వివిధ రకాల రసాల కాయలు కేజీ రూ.40కే లభిస్తున్నాయి. పచ్చళ్ల కోసం ఎక్కువగా వాడే కలెక్టర్ కాయలు రూ.30, సువర్ణరేఖ రూ. 40కి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం రైతులు నేరుగా తోటల నుంచి తీసుకురావడం వల్ల నాణ్యత బాగుందని, అందుకే గిరాకీ ఎక్కువగా ఉందని వెల్లడించారు. రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున వినియోగదారులు ఇప్పుడే కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. తాము విక్రయించే ఉత్పత్తులు రుచికరంగా ఉండటంతో పాటు పచ్చళ్లు నిల్వకు అనువుగా ఉంటాయని రైతులు పేర్కొంటున్నారు. ధరల వివరాలు.. మామిడి రకం ధర (కేజీల్లో) పర్యాలు రూ.30 కలెక్టర్ కాయలు రూ.30 వివిధ రసాలు రూ.40 కొలంగోవా రూ.35 సువర్ణరేఖ రూ.40 -
బాల్య వివాహం నిలిపివేత
పెందుర్తి: పెందుర్తిలో తలపెట్టిన ఒక బాల్య వివాహానికి పోలీసులు అడ్డుకట్ట వేశారు. వివరాలివి. స్థానిక రాచ్చెరువు ప్రాంతంలోని ఒక కల్యాణ మండపంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై స్పందించిన సీఐ కె.వి.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐలు ఎన్వీ భాస్కరరావు, స్వామినాయుడు తమ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. వివాహ వేదిక వద్ద బాలిక కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. సరైన వయసు రాకుండా వివాహం చేయడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను, చట్టపరమైన ఇబ్బందులను వారికి వివరించారు. అనంతరం బాలల సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించి, వివాహాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే తక్షణమే 1098 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. -
● చెట్టు నీడలో..
నగరం నిప్పుల కొలిమిలా మారింది. మధ్యాహ్నం వేళ భానుడి ప్రతాపానికి రోడ్లన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. అయితే రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద జీవులు, ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా తమ కష్టార్జితం కోసం శ్రమిస్తున్నారు. మధ్యాహ్నం వేళ.. కాస్త విశ్రాంతి కోసం.. కాంక్రీట్ వనాల మధ్య ఉన్న ఒక పచ్చని చెట్టును ఆశ్రయించారు. సిమెంట్ రోడ్డుపై వారు పోతున్న ఆ గాఢ నిద్ర వారి దైనందిన పోరాటానికి మౌన సాక్ష్యం. – ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
హెల్మెట్ భారం కాదు.. భరోసా
ఏయూక్యాంపస్: అవగాహన, అప్రమత్తతతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. ఆదివారం బీచ్రోడ్డులో ‘ఆప్ సబ్ కీ ఆవాజ్’సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో హోంగార్డులకు సీపీ చేతులమీదుగా హెల్మెట్లను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం వల్ల ప్రమాదాలను నివారించడమే కాకుండా విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రమాద సమయంలో ప్రాణనష్టాన్ని నివారించడానికి హెల్మెట్ ఎంతో దోహదపడుతుందని, వాహనం నడిపేవారితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ భారం కాదు.. భరోసా అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా నగర పోలీసు శాఖలో పనిచేస్తున్న 400 మంది హోంగార్డులకు హెల్మెట్లు అందజేశారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు హోంగార్డులు, పోలీసు సిబ్బందితో కలిసి బైక్ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి సహకరించిన ఆప్ సబ్ కీ ఆవాజ్ సేవా సంస్థ ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు వడ్లమూడి శివకుమార్, కార్యదర్శి బవిశెట్టి కిరణ్ కుమార్, ఏడీసీపీ(ట్రాఫిక్) కె.ప్రవీణ్ కుమార్, ఏసీపీ (ట్రాఫిక్) ఎం.శ్రీనివాసరావు, పలువురు ట్రాఫిక్ సీఐలు, ఎస్ఐలు, పెద్ద సంఖ్యలో హోంగార్డులు పాల్గొన్నారు. -
హిందూ మహాసముద్రంలో తిరుగులేని శక్తిగా భారత్!
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ సామర్థ్యాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే దిశలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా సముద్రం మధ్యలో యుద్ధనౌకలకు అవసరమైన ఇంధనం, నీరు, మందుగుండు, ఇతర సామగ్రి, రేషన్ను ఎప్పటికప్పుడు అందించే అత్యాధునిక ఐదు భారీ ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ (ఎఫ్ఎస్ఎస్) నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పూర్తిగా స్వదేశీ డిజైన్, పరికరాలతో రూ.19,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా తాజాగా హిందుస్థాన్ షిప్యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)లో ఐదవ, చివరి ఫ్లీట్ సపోర్ట్ షిప్ స్టీల్ కటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.ఈ ఐదవ నౌక నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమానికి ఇండియన్ నేవీ యుద్ధనౌకల నిర్మాణ, నియంత్రణాధికారి వైస్ అడ్మిరల్ సంజయ్సాధు, షిప్యార్డు సీఎండీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త శిఖరాలను అధిరోహించడమే కాకుండా, విదేశాలపై ఆధారపడకుండా సొంతంగా భారీ నౌకలను నిర్మించుకునే సత్తాను చాటిచెబుతోంది. భారత నౌకాదళం హిందూ మహాసముద్రంలో తిరుగులేని శక్తిగా ఎదగడానికి ఈ నౌకలు కీలకంగా మారనున్నాయి. కొన్ని ముఖ్యాంశాలు..⇒ కొచ్చికి చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ స్మార్ట్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్ సొల్యూషన్స్ (ఎస్ఈడీఎస్) రూపకల్పనతో జరుగుతున్న ఈ ప్రాజెక్టులో హిందుస్థాన్ షిప్యార్డు, ఎల్అండ్టీ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి.⇒ ప్రాజెక్టులో రెండు నౌకలు కట్టుపల్లిలో, మిగిలిన మూడు విశాఖపట్నంలో నిర్మీతమవుతున్నాయి. ⇒ కేవలం యుద్ధ అవసరాలకే కాకుండా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టడానికి, విదేశాల్లో చిక్కుకున్న పౌరులను రక్షించడానికి ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ⇒ తమను తాము రక్షించుకోవడానికి, శత్రువులను ఎదుర్కోవడానికి అవసరమైన క్షిపణి వ్యవస్థలు, జలాంతర్గామి వ్యతిరేక ఆయుధాలు, సమీప శ్రేణి రక్షణ వ్యవస్థలను సైతం ఈ నౌకలు కలిగి ఉంటాయి. వీటిలో అమర్చిన ఇంజన్లు, విద్యుత్ ఉత్పత్తి పరికరాలు అత్యంత సమర్థవంతంగా, సురక్షితంగా పనిచేస్తాయి.⇒ ప్రతి ఎఫ్ఎస్ఎస్లో ఒక ధ్రువ్ హెలికాప్టర్ నిలిపేందుకు హ్యాంగర్ సదుపాయం ఉంది. ⇒ మొదటి నౌకను 2027 జూన్లో అప్పగించాలని భావిస్తుండగా, ఆ తర్వాత ప్రతి 10 నుంచి 12 నెలలకోసారి ఒక్కో ఎఫ్ఎస్ఎస్ చొప్పున మూడేళ్లలో 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ని జలప్రవేశం చేసేలా వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించారు. -
10వ తేదీ వచ్చినా జమ కాని వేతనాలు నెలకు రూ.34 కోట్ల భారం ఖాళీ అయిన వర్సిటీ ఖజానా ఇప్పటికే రూ.300 కోట్ల అంతర్గత నిధుల మళ్లింపు శతాబ్ది ఉత్సవాలకే రూ.63.5 కోట్లు ఖర్చు జీతాలు, పెన్షన్ల కోసం ఉద్యోగుల ఆందోళన
విశాఖ సిటీ: శతాబ్ది వేడుకలు ఘనంగా జరుపుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. జ్ఞానాన్ని పంచే గురువుల చేతుల్లో జీతపు చీటీ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏయూ ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాలు వీధిన పడ్డాయి. ప్రతి నెలా ఒకటో తేదీకి ఖాతాల్లో జమయ్యే వేతనాలు ఇప్పుడు 10వ తేదీ దాటినా అందని ద్రాక్షగా మారాయి. పెరుగుతున్న జీవన వ్యయాలు, కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులతో సతమతమవుతున్న ఉద్యోగులు జీతాల కోసం యాజమాన్యం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెల కూడా ఇప్పటివరకు వేతనాలు జమ కాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి గ్రాంట్లు విడుదలయ్యే వరకు వేచి చూడాలని అధికారులు చెబుతున్నట్లు సమాచారం. ఖాళీ అయిన ఖజానా.. జీతాలకే నిధుల కొరత ఏయూలో సుమారు 300 మంది బోధన సిబ్బంది, 1,400 మంది బోధనేతర ఉద్యోగులు, 3,400 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ ప్రతి నెలా సుమారు రూ.34 కోట్ల మేర నిధులు అవసరం అవుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం ‘బ్లాక్ గ్రాంట్’ రూపంలో ఈ మొత్తాన్ని విడుదల చేయాలి. అయితే గత కొన్ని నెలలుగా ప్రభుత్వం నుంచి సరైన గ్రాంట్లు అందకపోవడంతో యూనివర్సిటీ అంతర్గత నిధుల నుంచే వేతనాలు చెల్లిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ నిధులూ పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఇప్పటికే రెండు దఫాల్లో సుమారు రూ.300 కోట్ల యూనివర్సిటీ నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న నిధులు కరిగిపోవడంతో, ప్రస్తుతం జీతాలు చెల్లించడమే యాజమాన్యానికి భారంగా మారింది. శతాబ్ది ఉత్సవాల భారమూ ఏయూపైనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏయూ శతాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఉత్సవాల నిర్వహణ కోసం ఏయూ తన సొంత నిధుల నుంచే సుమారు రూ.63.5 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒకవైపు ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి నిధులు లేక ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ప్రచార ఆర్భాటాల కోసం విశ్వవిద్యాలయ నిధులు ఖర్చు కావడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ గ్రాంట్లు విడుదల చేయకపోతే, రాబోయే నెలల్లో వేతనాల చెల్లింపే అసాధ్యమవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. విద్యార్థులపై ఫీజుల భారం ప్రభుత్వ నిధులు అందకపోవడంతో వర్సిటీ అధికారులు ఇప్పుడు విద్యార్థులపై ఆర్థిక భారం మోపుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫీజులు బకాయి ఉన్నాయనే కారణంతో హాల్టికెట్లు నిలిపివేయడం, గతంలో హాస్టళ్లను మూసివేయడం వంటి చర్యలు విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. ఉన్నత విద్యా వ్యవస్థను రక్షించాల్సిన ప్రభుత్వమే విశ్వవిద్యాలయాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోందని విద్యావేత్తలు మండిపడుతున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఏయూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం రాష్ట్ర ఉన్నత విద్యా రంగానికే ప్రమాద సంకేతమని మేధావులు హెచ్చరిస్తున్నారు. వెంటనే పెండింగ్ గ్రాంట్లు విడుదల చేసి, ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఓ(ఆ)న్ డ్యూటీ!
సాక్షి, విశాఖపట్నం: దేశంలోని ప్రధాన పోర్టులతో పోటీపడుతూ సముద్ర వాణిజ్య రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాఖపట్నం పోర్టు.. ప్రస్తుతం కొందరు అధికారుల ‘సొంత’ ప్రయోజనాలకు వేదికగా మారుతోంది. పోర్టు ప్రగతిని పరుగులు పెట్టించాల్సిన యంత్రాంగం, దిశానిర్దేశం లేక చతికిలపడుతోంది. ముఖ్యంగా మార్కెటింగ్ విభాగం పరిస్థితి ‘అడకత్తెరలో పోకచెక్క’లా తయారైంది. ఏటా ప్రతిష్టాత్మక ఐఐఎంల నుంచి మేధావులను నియమించుకుంటున్నా, వారి మేధస్సు పోర్టు అభ్యున్నతికి కాకుండా.. ట్రాఫిక్ విభాగాధికారుల వ్యక్తిగత పనులకు పరిమితమవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. విధి నిర్వహణలో ఉండాల్సిన సిబ్బందిని అధికారుల సొంత పనులకు వినియోగించుకుంటూ ‘ఆన్ డ్యూటీ’ని కాస్తా ‘ఓన్ డ్యూటీ’గా మార్చేయడం పోర్టు భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. ప్రచారమెక్కడ? ప్రగతి ఏది? ఒక సంస్థ అభివృద్ధి చెందాలంటే కేవలం మౌలిక సదుపాయాలు ఉంటే సరిపోదు.. ఆ వసతులను ప్రపంచానికి చాటిచెప్పే బలమైన ప్రచార యంత్రాంగం ఉండాలి. విశాఖ పోర్టులో కంటైనర్ టెర్మినల్ సహా తొమ్మిది సంస్థలు కార్గో నిర్వహణలో పాలుపంచుకుంటున్నాయి. నిజానికి ఈ సంస్థల నుంచి కార్గో ఉత్పత్తి పెరగాలంటే పోర్టు యాజమాన్యం చొరవ చూపాలి. ఎప్పటికప్పుడు వాణిజ్య వర్గాలతో సమావేశమై, ‘ట్రేడ్ మీట్స్’ నిర్వహిస్తూ ఎగుమతి, దిగుమతిదారులకు అవసరమైన సౌకర్యాలపై చర్చించాలి. కానీ, ఇక్కడ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పోర్టు ఆదాయంలో 90 శాతం కేవలం భూములు, భవనాల లీజుల ద్వారానే వస్తోంది తప్ప, సరకు రవాణా నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయ వృద్ధి శూన్యం. కార్గో నిర్వహణ చేసే ప్రైవేటు సంస్థలు వృద్ధి సాధిస్తున్నా, దానివల్ల పోర్టుకు రావాల్సిన రాబడి పెరగకపోవడం అధికారుల ఉదాసీనతకు నిలువెత్తు నిదర్శనం. ఐఐఎం మేధస్సు.. ఫైళ్లకే పరిమితం పోర్టు కార్యకలాపాలను విస్తరించాలని, అంతర్జాతీయ స్థాయి విక్రయ వ్యూహాలను రచించాలని ప్రతి రెండేళ్లకోసారి ఐఐఎం నిపుణులను నియమించుకుంటున్నారు. వీరిని మార్కెటింగ్ ప్రమోషన్ కోసం వినియోగించాల్సి ఉండగా, ట్రాఫిక్ విభాగాధికారులు వీరిని తమ వ్యక్తిగత వ్యవహారాలు చూసుకునే ‘అసిస్టెంట్లు’గా మార్చేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయ ఫైళ్లను సిద్ధం చేయడం, అధికారుల ఇంటి పనులు, వ్యక్తిగత పనులు చక్కబెట్టడానికే వీరి సమయం సరిపోతోందని సమాచారం. పోర్టు మార్కెటింగ్కు ఊపిరి పోయాల్సిన నిపుణులను ఇలా వినియోగించుకోవడం వల్ల కొత్త వ్యాపార అవకాశాలన్నీ పక్కదారి పడుతున్నాయి. సామర్థ్యం ఉన్నా.. సాఫల్యమెక్కడ? కాగితాల్లో పోర్టు సామర్థ్యం అద్భుతంగా పెరుగుతోంది. 2008–09లో 80 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్న సామర్థ్యం ఇప్పుడు 120 మిలియన్ టన్నులకు చేరింది. కానీ, ఆ సామర్థ్యానికి తగ్గట్టుగా కార్గో నిర్వహణ జరుగుతుందా అంటే సమాధానం ‘లేదు’ అనే వస్తోంది. ఉదాహరణకు కంటైనర్ టెర్మినల్ సామర్థ్యం 1.3 మిలియన్ టీయూవీలు కాగా, ప్రస్తుతం అందులో సగం కూడా వాడకం జరగడం లేదు. ఇతర ప్రాంతాలకు మళ్లుతున్న కార్గోను ఆకర్షించేలా దూకుడుగా వ్యవహరించాల్సిన పోర్టు ట్రాఫిక్ విభాగం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సరకు రవాణా వృద్ధి కూడా అక్కడ ఉన్న ప్రైవేటు సంస్థల సొంత ప్రయత్నాలే తప్ప, పోర్టు అధికారుల చొరవ ఏమాత్రం లేదన్నది బహిరంగ రహస్యం. నిర్లక్ష్యం నీడలో ‘సాగర’ వాణిజ్యం పోర్టుకు వచ్చే నౌకలు బెర్తుల కోసం రోజుల తరబడి బయటే వేచి చూడాల్సిన దైన్యం నెలకొంది. ట్రాఫిక్ విభాగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో, అక్కడ అధికారులదే రాజ్యంగా మారింది. సంస్థ ప్రయోజనాల కంటే వ్యక్తిగత లాభాలకే పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ట్రేడ్ మీట్లు నిర్వహించి పోర్టు సౌకర్యాలను వివరించాల్సిన బాధ్యతను గాలికొదిలేశారు. ఎక్కడో ఒకచోట ఏడాదికో, రెండేళ్లకోసారి తూతూమంత్రంగా సమావేశాలు పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారు. మార్కెటింగ్ విభాగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ విభాగమే సర్వస్వంగా వ్యవహరిస్తోంది. అధికారుల ఈ ‘సొంత’ పోకడల వల్ల విశాఖ పోర్టు అపారమైన నష్టాన్ని చవిచూస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, మార్కెటింగ్ విభాగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి, పోర్టు ప్రగతికి బాటలు వేయకపోతే.. విశాఖ పోర్టు తన పూర్వ వైభవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పోర్టు వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
జోన్ సరే.. కొలువుల బోర్డు ఏది?
సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాల పోరాటం తర్వాత విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటవుతుందన్న సంతోషం నిరుద్యోగ యువతలో కనిపించడం లేదు. 2019లో జోన్ ఏర్పాటుపై ప్రకటన వెలువడినప్పటి నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తూనే ఉంది. దీనిపై మొదటి నుంచి వైఎస్సార్ సీపీ ఆందోళన చేస్తున్నా.. టీడీపీ, జనసేన నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో కేంద్రం ఇక్కడ బోర్డు ఏర్పాటుపై కాలయాపన చేస్తోంది. జోన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ, అందులో ఆర్ఆర్బీపై స్పష్టత ఇవ్వకపోవడం ఉత్తరాంధ్ర నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దేశవ్యాప్తంగా 19 జోన్లలో 21 ఆర్ఆర్బీలు ఉండగా, విశాఖ విషయంలో మాత్రం సాంకేతిక కారణాల సాకుతో జాప్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంప్రతిపత్తి లేని ‘పేపర్ జోన్’? సాధారణంగా భారతీయ రైల్వేలో ఏ జోన్ ఏర్పడినా, ఆ పరిధిలో ఉద్యోగ నియామకాల కోసం ప్రత్యేకంగా ఒక ఆర్ఆర్బీ ఉంటుంది. కానీ కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ విషయంలో కేంద్రం భిన్నమైన వైఖరిని అవలంబిస్తోంది. సికింద్రాబాద్, భువనేశ్వర్లలో ఇప్పటికే బోర్డులు ఉన్నాయని, వాటి ద్వారానే ఇక్కడి నియామకాలు చేపట్టవచ్చనేది అధికారుల వాదనగా కనిపిస్తోంది. అయితే, ఒక భారీ జోన్ను నిర్వహించేటప్పుడు దానికి స్వయంప్రతిపత్తి కలిగిన నియామక మండలి లేకపోతే, అది కేవలం ఒక ‘పేపర్ జోన్’గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఆర్ఆర్బీ ఇవ్వరెందుకు? ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19 ప్రధాన కార్యనిర్వాహక జోన్లు ఉండగా, ఆర్ఆర్బీలు మాత్రం 21 ఉన్నాయి. కొన్ని పెద్ద జోన్ల పరిధిలో ఒకటి కంటే ఎక్కువ బోర్డులు ఉండగా, మరికొన్ని బోర్డులు రెండు, మూడు జోన్ల అవసరాలను తీరుస్తున్నాయి. గతంలో వాల్తేరు డివిజన్ భువనేశ్వర్ బోర్డు పరిధిలో ఉండేది. కానీ ఇప్పుడు కొత్త జోన్ కేంద్రంగా విశాఖ అవతరించిన తర్వాత కూడా పాత బోర్డులపైనే ఆధారపడటం ఈ ప్రాంత అభ్యర్థుల ఉపాధి హక్కులను కాలరాయడమే అవుతుందనే వాదన వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర యువత ఉపాధికి ముప్పు ఆర్ఆర్బీ విశాఖకు కేటాయించకపోతే నియామక ప్రక్రియ మొత్తం ఒడిశా లేదా తెలంగాణలోని బోర్డుల నియంత్రణలోకి వెళ్తుంది. దీని వల్ల నోటిఫికేషన్లు వెలువడినప్పుడు మన అవసరాల కంటే ఆయా బోర్డుల పరిధిలోని ప్రాంతాలకే ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర అభ్యర్థులు తమ సొంత ప్రాంతంలోని రైల్వే లైన్లలో పని చేయాలన్నా.. ఇతర రాష్ట్రాల్లోని ఆర్ఆర్బీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. పరీక్షలు, దరఖాస్తుల పరిశీలన, వైద్య పరీక్షల కోసం అభ్యర్థులు వందల కిలోమీటర్ల దూరంలోని భువనేశ్వర్ లేదా సికింద్రాబాద్ వెళ్లడం భారంగా మారుతుంది. రైల్వే గ్రూప్–డి వంటి పోస్టులకు స్థానిక భాషా పరిజ్ఞానం కీలకం. ఇతర రాష్ట్రాల బోర్డులు నియామకాలు చేపట్టినప్పుడు, తెలుగు అభ్యర్థులకు సమాచారం చేరవేయడంలోనూ, ప్రశ్నపత్రాల రూపకల్పనలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని వల్ల తెలుగు విద్యార్థులు సాంకేతికపరంగా వెనుకబడే ప్రమాదం ఉంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు అనేది కేవలం పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదు, అది ఉత్తరాంధ్ర ఆత్మగౌరవంతో ముడిపడి ఉంది. కేవలం భవనాలు, ప్లాట్ఫాంలు పెంచితే అది అభివృద్ధి అనిపించుకోదు. స్థానిక యువతకు ఉపాధి దొరికినప్పుడే రైల్వే జోన్ కల సాకారమవుతుంది. తక్షణమే కేంద్రం స్పందించి విశాఖకు ఆర్ఆర్బీ మంజూరు చేయాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికతకు ప్రాధాన్యం పెరుగుతుంది విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ వస్తుందని ప్రకటించినప్పుడు ఉత్తరాంధ్ర యువతలో ఎన్నో ఆశలు చిగురించాయి. కానీ ఇప్పుడు ఆర్ఆర్బీ ఏర్పాటుపై స్పష్టత లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఉద్యోగ నియా మకాల్లో స్థానికులకు ప్రాధాన్యం దక్కాలంటే విశాఖలోనే సొంత బోర్డు ఏర్పాటు చేయాలి. ఒకవేళ భువనేశ్వర్ బోర్డు ద్వారానే రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగితే, వారు పరీక్ష కేంద్రాలను కూడా అక్కడే కేటాయించే అవకాశం ఉంది. దీని వల్ల ఇక్కడ అభ్యర్థుల కంటే ఇతర ప్రాంతాల వారికే ఎక్కువ వెసులుబాటు కలుగుతుంది. ఒక స్వతంత్ర జోన్కు స్వయంప్రతిపత్తి కలిగిన నియామక బోర్డు లేకపోతే, అది అధికారాలు లేని కేవలం ఒక నామమాత్రపు కార్యాలయంగానే మిగిలిపోతుంది. – ఎం.మన్మధరావు, ఉద్యోగార్థి జోన్ ఇచ్చి.. బోర్డును విస్మరిస్తే ఎలా? నేను గత మూడేళ్లుగా రైల్వే గ్రూప్–డీ, ఇతర పోటీ పరీక్షల కోసం శ్రమిస్తున్నాను. ఉత్తరాంధ్ర నిరుద్యోగుల కలలు నిజం కావాలంటే విశాఖలో ఆర్ఆర్బీ ఏర్పాటు చేయడం అత్యవసరం. స్థానికంగా బోర్డు అందుబాటులో లేకపోతే, ఉద్యోగ నోటిఫికేషన్లలో దొర్లే తప్పులను గానీ, ఫలితాల జాప్యాన్ని గానీ ప్రశ్నించే హక్కు అభ్యర్థులకు లేకుండా పోతుంది. ఏదైనా చిన్న సమస్య తలెత్తినా, ఫిర్యాదు చేయడానికి పొరుగు రాష్ట్రాల్లోని కార్యాలయాలకు వెళ్లడం మాలాంటి వారికి ఆర్థికంగా, మానసికంగా పెనుభారం. విశాఖను రైల్వే జోన్ కేంద్రంగా ప్రకటించి, ఆర్ఆర్బీని మాత్రం కేటాయించకపోవడం అంటే.. నియామకాల కోసం మమ్మల్ని మళ్లీ ఇతర రాష్ట్రాలపై ఆధారపడేలా చేయడమే. – కె.అప్పారావు, రైల్వే ఉద్యోగ అభ్యర్థి -
కొత్త జిల్లాల్లోనూ త్వరలో నర్సుల సంఘ ఎన్నికలు
మహారాణిపేట: కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కూడా వచ్చే రెండు నెలల్లో ప్రభుత్వ నర్సుల సంఘ కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.రాధమ్మ తెలిపారు. శనివారం కేజీహెచ్ క్లాక్రూమ్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో 13 జిల్లాల్లో మాత్రమే ఎన్నికలు నిర్వహించామని, కొత్త జిల్లాల నుంచి కూడా సంఘాల ఏర్పాటుకు డిమాండ్ వస్తోందని చెప్పారు. అందువల్ల ఆయా జిల్లాల్లో సభ్యత్వ నమోదు చేపట్టి ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తామని వెల్లడించారు. అదే సందర్భంగా విశాఖ జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు ఉపాధ్యక్ష పదవులను ప్రభుత్వ (జీఏడీ) అనుమతితో కో–ఆప్షన్ ద్వారా భర్తీ చేసినట్లు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులుగా ఎ.జయలక్ష్మి, ఎస్.జి.గౌరి, జి.హేమలత, పి.కల్పనలను నియమించగా, కార్యవర్గ సభ్యురాలిగా డి.విజయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఇన్–సర్వీస్ నర్సులు ఎమ్మెస్సీ చదివేందుకు ప్రభుత్వం త్వరలో జీవో విడుదల చేయనుందని, విశాఖ నర్సింగ్ కళాశాలకు 10 సీట్లు కేటాయించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నర్సులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వా టి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నా మని చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట మ్మ, జిల్లా అధ్యక్షురాలు గంగాభవాని, జిల్లా కార్యదర్శి జీవీ ఎస్ వరలక్ష్మి, కోశాధికారి వంశీ, వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వరి, ఈసీ సభ్యులు పద్మజ, వినీల, మెహర్ శాంతి, లిల్లి పాల్గొన్నారు. ప్రభుత్వ నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రాధమ్మ -
ఈ–కేవైసీ కష్టాలు
మహారాణిపేట: పేద ప్రజలకు అందే రేషన్ బియ్యం, సంక్షేమ పథకాలపై ప్రభుత్వం నిబంధనల కత్తి వేలాడదీస్తోంది. తెలుపు/రైస్ కార్డుదారులు ఈనెల 31వ తేదీలోగా తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ–కేవైసీ) ప్రక్రియను పూర్తి చేయాలని కూటమి సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా వేలిముద్రలు నమోదు చేయించుకోని పక్షంలో, వచ్చే నెల నుంచి నిత్యావసర వస్తువుల సరఫరా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మందకొడిగా నమోదు జిల్లాలో ఈ–కేవైసీ ప్రక్రియ ఆశించిన స్థాయిలో సాగడం లేదు. నగర, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈనెల 7వ తేదీ నాటికి సుమారు 80 శాతం మించి కాలేదని తెలుస్తోంది. సర్వర్ లింక్ ఫెయిల్ అవ్వడం, కనెక్టివిటీ సమస్యల వల్ల నమోదు ఆలస్యమవుతోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలకు వేలిముద్రలు సరిగ్గా పడకపోవడం అడ్డంకిగా మారింది. కొందరివి పూర్తిగా చెరిగిపోవడంతో నమోదు ప్రక్రియ నిలిచిపోతోంది. పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఈ–కేవైసీ నత్తనడకన సాగడానికి కారణమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్యాస్ సబ్సిడీపైనా ప్రభావం కేవలం రేషన్ మాత్రమే కాకుండా, గ్యాస్ సబ్సిడీ పొందేందుకు కూడా ఈ–కేవైసీ అడ్డంకిగా మారింది. సాంకేతిక కారణాల వల్ల ఈ–కేవైసీ పూర్తికాని వారు, రేషన్ కార్డు లేని వారు తమకు రావాల్సిన గ్యాస్ రాయితీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనపు వసూళ్లు నిజానికి ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తిగా ఉచితం. కానీ, కొందరు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు దీన్ని లాభసాటిగా మార్చుకుంటున్నారు. రేషన్ డీలర్లు లేదా కంపెనీ ప్రతినిధులమని చెబుతూ కార్డుదారులకు ఫోన్లు చేసి, ఆధార్ వివరాలతో పాటు డబ్బులు తీసుకుని ఈ–కేవైసీ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన కూలీలు, చిరుద్యోగులు ఈ గడువును అందుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి 6 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలి. ప్రతి రేషన్ డిపో వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంది. సభ్యులు తమ ఆధార్ కార్డుతో వెళ్లి తక్షణమే నమోదు చేసుకోవాలి. –వి.భాస్కరరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
విశాఖలో సెమీ రింగురోడ్డు
విశాఖ సిటీ: నగరంలో రానున్న 50 ఏళ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శనివారం వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక ఈ నెలాఖరుకల్లా సిద్ధమవుతుందని చెప్పారు. వీఎంఆర్డీఏ పరిధిలోని 6,836 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రూపొందించిన మాస్టర్ప్లాన్పై సుమారు 3,720 అభ్యంతరాలు వచ్చాయని మంత్రి తెలిపారు. వీటిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించి, ఎమ్మెల్యేలు సూచించిన వినతుల్లో దాదాపు 90 శాతం సమస్యలను పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానిస్తూ నిర్మిస్తున్న ఏడు రహదారులలో మూడు పూర్తయ్యాయని వివరించారు. దీంతో పాటు భోగాపురం నుంచి విశాఖ నగరం వరకు ఒక ప్రత్యేకమైన బీచ్ కారిడార్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ నగర ప్రజల భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం రూ.14 వేల కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలోని 95 శాతం ఇళ్లకు నేరుగా పైపులైన్ల ద్వారా తాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు ఎం.శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్ పాల్గొన్నారు. -
రాయల్ బెంగాల్ టైగర్ ‘మంజునాథ్’ దత్తత
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణుల దత్తత కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ‘మంజునాథ్’ అనే రాయల్ బెంగాల్ టైగర్ను ఏడాది కాలానికి కమల్ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ దత్తత తీసుకుంది. ఆ సంస్థ యజమాని దీపక్ కర్నాని బృందం శనివారం జూ క్యూరేటర్ జి.మంగమ్మను కలిసి, పులి వార్షిక నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.54,000ల చెక్కును అందజేశారు. అనంతరం పులి ఎన్క్లోజర్ వద్ద క్యూరేటర్ ఇతర అధికారులతో కలిసి దాతలకు దత్తత పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా క్యూరేటర్ మాట్లాడుతూ.. వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములు కావడానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. దత్తత తీసుకున్న సంస్థ ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బృందం సభ్యులు బి.భానువెంకట ప్రతాప్, ఉదయ కిరణ్, జూ అసిస్టెంట్ క్యూరేటర్ గోపి, జూ వైద్యుడు డాక్టర్ భాను తదితరులు పాల్గొన్నారు. -
జనసేన Vs టీడీపీ.. ఫ్లెక్సీలో ఫొటోపై రచ్చ..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ, జనసేనలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. విశాఖ సౌత్ నియోజకవర్గంలో తాజాగా టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆధిపత్యం కోసం ఇరు వర్గాల నేతలు మాటల దాడి చేస్తున్నారు. దీంతో, ఈ వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది.విశాఖ సౌత్ నియోజకవర్గంలో కనకమహాలక్ష్మి ఆలయ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, ఫ్లెక్సీలో టీడీపీ ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్ ఫొటోలు కనిపించలేదు. జనసేన నేతలు టీడీపీ నాయకుడి ఫొటోలను పెట్టలేదు. దీంతో, రాజకీయ దుమారం రేగింది. జనసేన నేతల వైఖరిపై సుధాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే, విశాఖ సౌత్లో గత కొంతకాలంగా జనసేన ఎమ్మెల్యే వంశీ, సీతంరాజు సుధాకర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో జనసేన నేతల తీరుపై టీడీపీ అధిష్టానానికి సుధాకర్ ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా టీడీపీ నేతలు.. జనసేన కేడర్పై మండిపడుతున్నారు. జనసేన నాయకులు పొత్తు ధర్మం పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. . -
పైరవీల ‘వల’లో పేదల ‘ఆశ’
మహారాణిపేట: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించే ‘ఆశ’ వర్కర్ల పోస్టులకు గతంలో లేని విధంగా విపరీతమైన డిమాండ్ పెరిగింది. గతంలో ఆరోగ్య రంగంపై కనీస అవగాహన ఉన్న వారితో ఈ పోస్టులను భర్తీ చేసేవారు, కానీ ప్రస్తుతం ఈ ఉద్యోగాలను చేజిక్కించుకోవడానికి పైరవీలు, రాజకీయ సిఫార్సులు ఊహించని స్థాయిలో సాగుతున్నాయి. జిల్లాలో ఖాళీగా ఉన్న కేవలం 68 ఆశ వర్కర్ల పోస్టుల కోసం సుమారు 6 వేల మంది నిరుద్యోగ మహిళలు దరఖాస్తు చేసుకోవడం చూస్తుంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి పోస్టుకు సగటున వంద మందికి పైగా పోటీ పడుతుండటంతో, ఎంపిక ప్రక్రియ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి పెద్ద సవాలుగా మారింది. బ్రోకర్ల దందా మరోవైపు ఈ నియామకాల్లో రాజకీయ జోక్యం పరాకాష్టకు చేరుకుంది. వార్డు, మండల స్థాయి పోస్టుల కోసం సాక్షాత్తూ ఎమ్మెల్యేలే నేరుగా రంగంలోకి దిగడంతో, స్థానిక మాజీ కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేలకు మధ్య తీవ్రస్థాయిలో ‘కోల్డ్ వార్’ నడుస్తోంది. అటు కూటమి నాయకులు, ఇటు మాజీ ప్రజాప్రతినిధులు తమ అనుచరులకు పోస్టులు ఇప్పించుకోవడానికి జిల్లా అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. డీఎంహెచ్వో కార్యాలయం ఇప్పుడు సిఫార్సు లేఖలతో నిండిపోయింది. ఎమ్మెల్యేలు, వారి వ్యక్తిగత సహాయకులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ రాజకీయ ఒత్తిడిని ఆసరాగా చేసుకున్న కొంతమంది మధ్యవర్తులు, శాఖలోని కొందరు ఉద్యోగులు బేరసారాలకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు రేటు నిర్ణయించి, నిరుద్యోగ మహిళలను మాయమాటలతో నమ్మిస్తూ బ్రోకర్లు దందా సాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేల కనుసన్నల్లో.. ప్రస్తుతం పీహెచ్సీలు, యూపీహెచ్సీల పరిధిలో దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. నిబంధనల ప్రకారం 25 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉండి, స్థానిక సచివాలయం పరిధిలో నివసించే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మెరిట్, రోస్టర్ విధానాన్ని అనుసరించి ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే భర్తీ ప్రక్రియ సాగుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. కార్పొరేటర్ల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం అంతా ఎమ్మెల్యేల హవానే నడుస్తోంది. స్థానికంగా ఉండే మాజీ కార్పొరేటర్ల సిఫార్సులను పక్కన పెట్టి, ఎమ్మెల్యేలు నేరుగా వార్డు స్థాయి పోస్టుల్లో జోక్యం చేసుకోవడం స్థానిక నేతల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. పారదర్శకతతో భర్తీ చేయాల్సిన సేవా పోస్టులు కాస్తా, రాజకీయ పైరవీలకు, భారీ బేరసారాలకు వేదికగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంపిక చేసిన జాబితాను జిల్లా అధికారులు ఆమోదించాల్సి ఉన్న నేపథ్యంలో, చివరికి ఎవరికి ఈ పోస్టులు దక్కుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. -
పవర్ గర్జన
పట్టాలపైహెచ్పీ విద్యుత్ ఫ్రైట్ లోకోమోటివ్స్ సాక్షి, విశాఖపట్నం : భారతీయ రైల్వే సరుకు రవాణా ముఖచిత్రాన్ని మార్చే దిశగా ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. అంతర్జాతీయ ఇంజనీరింగ్ దిగ్గజం సీమెన్స్ రూపొందించిన అత్యంత శక్తివంతమైన 9000 హార్స్పవర్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్లు భారతీయ పట్టాలపై అరంగేట్రం చేశాయి. ఈ అత్యాధునిక ఇంజిన్ల మొదటి సెట్ను వాణిజ్య కార్యకలాపాల కోసం రైల్వే శాఖకు అప్పగించారు. ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా లోకోమోటివ్ల నిర్వహణ కోసం దేశంలోనే మొదటి డిపోను విశాఖపట్నంలో ప్రారంభించడం గమనార్హం. ఒప్పందం కుదిరిన 36 నెలల్లోనే 90 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో మొదటి సెట్ని సిద్ధం చేయడం విశేషం. 90 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో.. ఈ ‘డీ9’ మోడల్ 9000 హెచ్పీ లోకోమోటివ్లు యూరోపియన్ ప్రమాణాలతో, 90 శాతం స్వదేశీ సాంకేతికతతో తయారయ్యాయి. గుజరాత్లోని దాహోద్ ఫ్యాక్టరీలో వీటిని నిర్మిస్తున్నారు. ఇందులో వాడిన ‘రైలిజెంట్ ఎక్స్’ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఇంజిన్లో ఏదైనా లోపం తలెత్తే అవకాశం ఉంటే ముందే గుర్తించవచ్చు. అధిక సామర్థ్యం వల్ల విద్యుత్ వినియోగం తగ్గడమే కాకుండా, కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. విశాఖ సహా 4 నిర్వహణ కేంద్రాలు ఈ లోకోమోటివ్ల జీవితకాల నిర్వహణ కోసం ‘లైఫ్సైకిల్ పార్ట్నర్షిప్ మోడల్’లో దేశవ్యాప్తంగా నాలుగు డిపోలను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నంలో తొలి డిపో కార్యకలాపాలు ప్రారంభం కాగా, త్వరలోనే రాయ్పూర్, ఖరగ్పూర్, పూణేలలో కూడా డిపోలను అందుబాటులోకి తీసుకురానున్నారు. -
మృతదేహానికీ వివక్షేనా?
ప్రశ్నార్థకమైన మానవత్వం ఒక ఎంపీటీసీ హోదాలో ఉన్న వ్యక్తికే ఇన్ని ఇబ్బందులు ఎదురైతే, ఇక సామాన్య గిరిజనుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే రోగుల పట్ల కేజీహెచ్ సిబ్బంది వైఖరి మారాలని, మరణంలోనైనా వారికి గౌరవం దక్కాలని స్థానికులు కోరుతున్నారు. చివరికి సుభద్ర, భాగ్యలక్ష్మి బాధితులను పరామర్శించి, వాహనం ఏర్పాటు చేసి పంపించడంతో ఆ విషాద ప్రయాణం ముందుకు సాగింది. మహారాణిపేట : ‘పేదవాడికి ప్రాణం ఉన్నప్పుడు వైద్యం దొరకదు.. ప్రాణం పోయాక గౌరవం దక్క దు’. ఉత్తరాంధ్రకు తలమానికం అని చెప్పుకునే కేజీహెచ్లో గిరిజనుల పట్ల అమానుషత్వం మరోసారి బట్టబయలైంది. ఒక ఎంపీటీసీ హోదాలో ఉన్న గిరిజన నాయకుడి మృతదేహాన్ని తరలించడానికి ‘మహాప్రస్థానం’ వాహనాన్ని నిరాకరించి, వ్యవస్థ ఎంతటి మొద్దునిద్రలో ఉందో చాటిచెప్పారు. ప్రజాప్రతినిధులు రోడ్డెక్కితే తప్ప కదలని ఈ మొండి యంత్రాంగంపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆఖరి ప్రయాణానికి అడ్డంకులు జి.కె.వీధి మండలం దామనాపల్లి ఎంపీటీసీ కొర్ర భీమరాజు (45) అనారోగ్యంతో పోరాడుతూ శుక్రవారం ఉదయం కేజీహెచ్లో తుదిశ్వాస విడిచారు. కొండ కోనల నుంచి మెరుగైన వైద్యం అందుతుందని ఆశతో వచ్చిన ఆ కుటుంబానికి, మరణం తర్వాత కోలుకోలేని చేదు అనుభవం ఎదురైంది. కనీసం మృతదేహాన్ని తరలించడానికి ‘మహాప్రస్థానం’ వాహనాన్ని గానీ, అంబులెన్స్ను గానీ కేటాయించమని వేడుకున్నా.. ఆసుపత్రి అధికారులు కనికరించలేదు. దిక్కుతోచని స్థితిలో అమాయక గిరిజనులు ‘వాహనాలు అందుబాటులో లేవు’ అంటూ సిబ్బంది చెప్పిన మాటలు బాధితుల గుండెల్లో బాణంలా గుచ్చుకున్నాయి. ఆసుపత్రిలోని ఎస్టీ సెల్కు సమాచారం అందించినా, అక్కడ కూడా స్పందన కరువైంది. తమ వారిని కోల్పోయిన బాధ ఒకవైపు, పార్థివ దేహాన్ని ఇంటికి ఎలా తీసుకెళ్లాలో తెలియని అయోమయం మరోవైపు.. ఆ గిరిజనుల వేదన వర్ణనాతీతం. వ్యవస్థల మధ్య సామాన్యుడు, ముఖ్యంగా గిరిజనుడు ఎంతటి అగౌరవానికి గురవుతున్నాడో ఈ దృశ్యాలు కళ్లకు కట్టాయి. నేతల జోక్యంతో కదిలిన యంత్రాంగం ఈ విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్పర్సన్, నేరుగా సూపరింటెండెంట్తో మాట్లాడారు. ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగడంతో నిమిషాల వ్యవధిలోనే ‘లేవన్న’ వాహనాలు ప్రత్యక్షమయ్యాయి. కేజీహెచ్లో మృగ్యమైన మానవత్వం -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు
మహారాణిపేట: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమన్వయ సమీక్షా సమావేశంలో ఆమె పలు కీలక సూచనలు చేశారు. ఈనెల 21 నుంచి జూన్ 2 వరకు జరగనున్న ఈ పరీక్షల కోసం జిల్లాలో మొత్తం 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, లైటింగ్, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, వాచ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థుల రాకపోకలకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. -
దేవస్థానం స్థలంలో నిర్మించిన గోడ తొలగింపు
ఆరిలోవ: జీవీఎంసీ 9వ వార్డు పరిధిలోని ప్రశాంతినగర్ కొండవాలు ప్రాంతంలో నెలకొన్న దారి వివాదంపై సింహాచలం దేవస్థానం అధికారులు స్పందించారు. ఓ వ్యక్తి అక్రమంగా నిర్మించిన ఇంటి గోడను శుక్రవారం దేవస్థానం సిబ్బంది సమక్షంలో తొలగించారు. స్థానిక మెట్ల మార్గానికి అడ్డంగా గోడ నిర్మించడంతో పాటు దారిని మూసివేయడంపై ఇద్దరు వ్యక్తుల మధ్య గత కొంతకాలంగా గొడవ జరుగుతోంది. ఈ వివాదంలో మనస్తాపం చెందిన రాజేశ్వరరావు అనే వ్యక్తి ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఈనెల 2న ‘సాక్షి’ దినపత్రికలో ‘దారి వివాదం.. ఆత్మహత్యాయత్నం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. మెట్ల మార్గానికి అడ్డంగా ఉన్న గేటును సిబ్బంది సమక్షంలో స్థానికులే తొలగించగా, అక్రమంగా నిర్మించిన గోడను అధికారులు కూల్చివేశారు. దేవస్థానం స్థలంలో నిర్మించిన గోడను తొలగించిన అధికారులు.. మరుగుదొడ్డి కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్ను మాత్రం అలాగే వదిలేయడంపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాల తొలగింపులో అధికారులు పక్షపాతం చూపడం సరికాదని కాలనీవాసులు పేర్కొంటున్నారు. -
రక్తదానంతో తలసేమియా రోగులకు ప్రాణదానం
మహారాణిపేట : ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం సందర్భంగా మహారాణిపేటలోని రెడ్క్రాస్ భవనంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డునాంట్కు నివాళులర్పించిన ఆమె, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు అండగా నిలిచేందుకు యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 50కి పైగా సార్లు రక్తదానం చేసిన 25 మంది ప్లాటినం దాతలను ఆమె సత్కరించారు. పేదలకు అందుబాటు ధరల్లో పరీక్షలు అందించేందుకు ఏర్పాటు చేసిన ‘జనతా రేట్ల’ డయాగ్నస్టిక్ ల్యాబ్ను పరిశీలించి, తలసేమియా చిన్నారులతో ముచ్చటించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖపట్నం చైర్మన్ సి హెచ్.బలసతీష్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు, ఐఆర్సీఎస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు మురళీకృష్ణ పట్నాయక్, ఎండి. రెహమ్తుల్లా, నరవ ప్రకాష్ రావు, జి.ప్రసాద్ రావు, విష్ణువర్ధన రెడ్డి, ప్రొఫెసర్ హరనాథ్, పి.రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఈసెట్లో గాజువాక విద్యార్థికి మొదటి ర్యాంకు
గాజువాక : స్థానిక అజీమాబాద్కు చెందిన పండ్ల వ్యాపారి గోవిందరాజు కుమారుడు సింహాద్రి వంశీ ఏపీఈసెట్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో 158 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా కెమికల్ ఇంజనీరింగ్ చదివిన అతడు 93 శాతం మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచాడు. డిఫెన్స్లోగాని, స్పేస్ సెక్టార్లో గాని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉద్యోగం సాధించాలనే తపనతో నిరంతరం శ్రమించానని, రోజుకు 12 గంటల పాటు చదివి విజయం సాధించానని వంశీ పేర్కొన్నాడు. -
రైల్వే ఆధునికీకరణలో సరికొత్త అధ్యాయం
ఇండియన్ రైల్వే ఆధునీకరణలో ఇది సరికొత్త అధ్యాయం. ఈ లోకోమోటివ్స్ ద్వారా భారీ సరుకును వేగంగా తరలించడం ద్వారా సప్లై చైన్లో జాప్యం ఉండదు. అధిక సామర్థ్యం గల ఎలక్ట్రిక్ ఇంజిన్ల వల్ల కర్బన ఉద్గారాలు తగ్గి, సుస్థిర అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాం. దేశీయంగా తయారు చెయ్యడంతో పాటు నిర్వహణ కేంద్రాల ఏర్పాటు ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాం. వేగవంతమైన రవాణా వల్ల పారిశ్రామిక ఉత్పత్తులు త్వరగా మార్కెట్లోకి చేరడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతంలా మారుతుంది. – సునీల్ మాథుర్, సీమెన్స్ ఎండీ, సీఈవో -
మెట్రో సీసీకి భారీ విజయం
విశాఖ స్పోర్ట్స్ : సూపర్ నాకవుట్ వన్డే మ్యాచ్ల్లో మెట్రో సీసీ, గెలాక్సీ సీసీ జట్లు పరుగుల వరద పారించి భారీ విజయాలను అందుకున్నాయి. రైల్వే స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మెట్రో సీసీ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 526 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ హ్రితిక్ కేవలం 45 బంతుల్లోనే 13 సిక్సర్లు, 8 ఫోర్లతో 119 పరుగులు చేయగా, మిడిలార్డర్లో పరమ్వీర్ 147 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరికి తోడుగా కెప్టెన్ యువన్ (85), వినోద్ (87), శ్రావణ్ (52) అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం ఛేదనకు దిగిన వైజాగ్ బ్లూస్ జట్టు 18.1 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. మెట్రో బౌలర్ అచ్యుత్ 5 వికెట్లతో ప్రత్యర్థి నడ్డి విరవడంతో మెట్రో సీసీ 435 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. మరోవైపు వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన హిందూ ట్రోఫీ మ్యాచ్లో గెలాక్సీ సీసీ జట్టు సిటీ పోలీస్పై 360 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గెలాక్సీ సీసీ 478 పరుగులకు ఆలౌటైంది. హిమకర్ (61), భస్వంత్ (76), ధీరజ్ (59) రాణించడంతో జట్టు భారీ స్కోరును అందుకోగలిగింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సిటీ పోలీస్ జట్టు గెలాక్సీ బౌలర్ల ధాటికి తట్టుకోలేక 25.5 ఓవర్లలో 118 పరుగులకే చాపచుట్టేసింది. యశ్వంత్, వాసు, ధీరజ్లు తలో రెండు వికెట్లు తీసి పోలీస్ జట్టును కోలుకోలేని దెబ్బతీశారు. జగదీష్ (21) మినహా మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేకపోవడంతో పోలీస్ జట్టుకు భారీ పరాజయం తప్పలేదు. ఘోరంగా ఓడిన సిటీ పోలీస్ జట్టు -
ఘనంగా సిరి వెంకటేశ్వర డెవలపర్స్ 20వ వార్షికోత్సవం
సీతంపేట: సిరి వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ 20వ వార్షికోత్సవాన్ని శుక్రవారం శంకరమఠం రోడ్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.కె.రాజు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మిత్రులు, శ్రేయోభిలాషులు, మార్కెటింగ్ సిబ్బంది అందించిన నిరంతర సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. 20 ఏళ్లలో 20 వెంచర్లను దిగ్విజయంగా పూర్తి చేశామని, ప్రస్తుతం 6 ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ముఖ్యంగా ఆనందపురం సమీపంలోని గూగుల్ సిటీకి దగ్గరగా సరికొత్త వెంచర్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్ బృందం, ఖాతాదారులు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని సంస్థ పురోగతిని అభినందించారు. -
పతకాల వేటలో సాగర్నగర్ స్టార్లు
క్రీడలు మానసిక ఉల్లాసానికే కాకుండా శారీరక దృఢత్వానికి ఎంతో తోడ్పడతాయి. అయితే నేటి తరం యువత సెల్ ఫోన్లకు బందీలుగా మారుతోంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా రీల్స్, ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో గడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. దీని వల్ల అలసత్వం, మతిమరుపు, కంటి సమస్యలు వంటి అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. దీనిని గమనించిన పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు వేదికగా నిలుస్తోంది సాగర్నగర్ బాస్కెట్బాల్ అకాడమీ(ఎస్ఎన్బీఏ). సాగర్నగర్కు చెందిన విద్యార్థులు ఒకవైపు చదువులో రాణిస్తూనే, మరోవైపు క్రీడల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పలు పోటీల్లో ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 2018లో ప్రారంభమైన ఈ అకాడమీలో, కోచ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన సుమారు 300 మందిలో, ఇప్పటివరకు 20 మంది జాతీయ స్థాయిలో, 30 మంది రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించడం విశేషం. భవిష్యత్లో మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధించడమే తమ లక్ష్యమని విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం సాగర్నగర్ బాస్కెట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో సాగర్నగర్ గ్రౌండ్లో ఇప్పటికే సమ్మర్ క్యాంప్ ప్రారంభమైంది. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 8.30 వరకు, తిరిగి సాయంత్రం 6 నుంచి 8 వరకు శిక్షణ ఇస్తున్నారు. కనీసం 10 ఏళ్ల వయసు పైబడిన వారు శిక్షణకు అర్హులు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోచ్ సూచించారు. దేశం తరఫున ఆడటమే నా కల ఇటీవల డెహ్రాడూన్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం కఠోర సాధన చేస్తున్నాను. ఏదో ఒక రోజు భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, దేశం గర్వపడేలా చేయడమే నా జీవిత లక్ష్యం. – ఎన్. నవ్య, క్రీడాకారిణి దేశానికి కెప్టెన్గా వ్యవహరించాలి గతేడాది డెహ్రాడూన్ జాతీయ పోటీల్లో ఏపీ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప అనుభవం. భవిష్యత్తులో మరింత శ్రమించి, భారత బాస్కెట్ బాల్ జట్టుకు నాయకత్వం వహించాలనేది నా బలమైన ఆశయం. – వి.వి.వాట్సన్ మెరుపు వేగంతో సాగే క్రీడ బాస్కెట్బాల్. ఇటువంటి క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించాలంటే కఠోర సాధన, శ్రమ ఎంతో అవసరం. వాటన్నింటినీ అధిగమించి, జాతీయ స్థాయిలో తమ ముద్ర వేస్తున్నారు సాగర్నగర్ క్రీడాకారులు. ఇటీవల డెహ్రాడూన్ వంటి నగరాల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన నవ్య, వాట్సన్ వంటి క్రీడాకారులు ఇక్కడ శిక్షణ పొందిన వారే.. ప్రతి ఏటా సమ్మర్ క్యాంప్ ద్వారా ఉచితంగా శిక్షణ పొందుతూ.. చాంపియన్లుగా మారుతున్నారు. – కొమ్మాది గొప్ప క్రీడాకారుడిగా ఎదగడమే లక్ష్యం బాస్కెట్ బాల్ నాకు క్రమశిక్షణను నేర్పింది. జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, అత్యుత్తమ క్రీడాకారుడిగా పేరు తెచ్చుకోవడమే నా టార్గెట్. అందుకే నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నాను. – నీల్, క్రీడాకారుడు -
అపార్ట్మెంట్పై నుంచి దూకి వ్యక్తి మృతి
బీచ్రోడ్డు : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి అపార్ట్మెంట్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన మీసాల సత్యనారాయణ (39) తీవ్రమైన మద్యపాన వ్యసనంతో బాధపడుతుండేవాడు. దీని నుంచి అతడిని విముక్తి కలిగించేందుకు కుటుంబ సభ్యులు నగరంలోని మానసిక ఆసుపత్రిలోని డి–ఎడిక్షన్ సెంటర్లో చేర్పించారు. శుక్రవారం ఆసుపత్రి సమీపంలోని ఒక అపార్ట్మెంట్పైకి వెళ్లిన సత్యనారాయణ, అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతుడికి 2016లో చంద్రకళతో వివాహం కాగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యం మత్తులో భార్యను ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మూడేళ్లుగా సత్యనారాయణ తన తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయా తేదీలలో పలు రైళ్ల రీ షెడ్యూల్ తాటిచెట్లపాలెం: సౌత్ ఈస్ట్రన్ రైల్వే పరిధిలోని రూప్స స్టేషన్లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ మార్గంలో నడిచే పలు కీలక రైళ్లను రీషెడ్యూల్ చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. పవన్కుమార్ వెల్లడించారు. ఈ మార్పుల ప్రకారం హౌరా–సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (12703) ఈ నెల 11, 12, 13 తేదీలలో రెండు గంటలు, 14న గంట, 15న గంటన్నర, 17న నాలుగు గంటల ఆలస్యంగా హౌరా నుంచి బయల్దేరనుంది. అదేవిధంగా సికింద్రాబాద్–హౌరా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (12704) ఈ నెల 15న గంట, 16న రెండు గంటల ఆలస్యంగా సికింద్రాబాద్ నుంచి బయల్దేరనుంది. వీటితో పాటు న్యూ జల్పయ్గురి–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 15న గంట ఆలస్యంగా, హౌరా–ఎస్ఎంవీటీ బెంగళూరు దురంతో ఎక్స్ప్రెస్ 16న గంట, 17న రెండు గంటల ఆలస్యంగా హౌరా నుంచి బయల్దేరనున్నాయి. -
గిరి ప్రదక్షిణ వైభవంపై పాట రాస్తా
గేయ రచయిత శ్యామ్సింహాచలం : సింహాచలం పుణ్యక్షేత్రం, గిరిప్రదక్షిణ ఉత్సవ విశిష్టతను చాటిచెప్పేలా త్వరలోనే ఒక అద్భుతమైన పాటను రాస్తానని ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ తెలిపారు. శుక్రవారం ఆయన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని మహిమాన్విత కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న ఆయనకు, అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ ‘బలగం’ సినిమాలోని ‘ఊరూ పల్లెటూరు దీనితీరే అమ్మ తీరు’ పాటకు జాతీయ అవార్డు రావడం ఆ స్వామివారి అనుగ్రహంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆయనకు క్షేత్ర మహత్యాన్ని వివరించి, స్వామివారి వైభవంపై పాటలు రాయాలని కోరగా.. తప్పకుండా గిరిప్రదక్షిణ ఉత్సవంపై పాట రాస్తానని శ్యామ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం పీఆర్వో అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
‘విభజన హామీల సాధనలో టీడీపీ విఫలం’
సాక్షి, విశాఖపట్నం: విభజన హామీలు అమలు చేయమని వైఎస్సార్సీపీ అనేక పోరాటాలు చేసిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రత్యేక హోదా రైల్వే జోన్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని... ఎన్డీఏ టీడీపీ ప్రభుత్వం విభజన హామీలు గాలికి వదిలేశారన్నారు. చంద్రబాబు తన ప్యాకేజీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు 2016లో ఆమరణ నిరాహార దీక్ష చేశాను’’ అని ఆయన గుర్తు చేశారు.‘‘నా మీద అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆత్మహత్యా యత్నం కేసు నమోదు చేయించింది. ఆ కేసులో 6 నెలల జైలు శిక్ష, ఐదు వేలు జరిమానా విధించింది. ఆ కేసు కొట్టివేయాలని చేయాలని హయ్యర్ కోర్టులో అప్పీల్ చేశాము.. వాల్తేర్ డివిజన్తో కూడిన విశాఖ రైల్వే స్టేషన్ కావాలి. ఆదాయం వచ్చే కేకే లైన్ ఒడిశాకు అప్పగించారు. రాష్ట్ర నాయకుల చేతగానితనం వలన కేకే లైన్ ఒడిశాకు పోయింది. విశాఖ వచ్చిన రైల్వే శాఖ మంత్రిని కేకే లైన్ గురించి ఎందుకు అడగలేదు.?. రైల్వే జోన్ గురించి ఎంపీ భరత్కు ఏం తెలుసు? విశాఖ రైల్వే జోన్కు ఆదాయం లేకపోయినా పర్వాలేదని ఎలా మాట్లాడతారు?’’ అంటూ అమర్నాథ్ నిలదీశారు. -
ఏపీకి అలర్ట్.. రాగల మూడు గంటల్లో..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో అనకాపల్లి, అల్లూరి, పోలవరం, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ రోజు, రేపు(శుక్ర,శని) వానలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరో వైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండగా... ఇటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అధిక వేడి, ఉక్కపోతకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు కొబ్బరినీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు డీ హైడ్రేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుందన్నారు. వీటితో పాటు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం. బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీతో పాటు కళ్లజోడు తప్పనిసరిగా పెట్టుకోవాలి. మహిళలు గొడుగులు తప్పనిసరిగా ఉపయోగించాలి. కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరమని వైద్యులు తెలిపారు. -
కూటమికి షాక్.. బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విశాఖ: అమరావతిలో నిర్మాణాలపై జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి, పర్యావరణం విషయంలో కూటమి నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు.జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతిలో పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. అమరావతిలో నిర్మాణాలు నిబంధనలకు లోబడి నిర్మించాలి. రాజధాని నిర్మాణంలో 84 శాతం సాగు, పర్యావరణ భూములు ఉన్నాయి. అమరావతి పరిధిలో ఉన్న నదులు, కాలువలు, వాగులను పరిరక్షించాలి. అవినీతి, పర్యావరణంపై రాజీలేని పోరాటం చేస్తాను. ఈ విషయంలో కూటమి నేతలను కూడా వదిలిపెట్టను. రాజకీయ పార్టీలపై నమ్మకం పోయింది. ఈ సమాజాన్ని మీడియా కాపాడాలి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, అది మనందరి ప్రాథమిక కర్తవ్యం. ప్రభుత్వాలు పారిశ్రామిక వృద్ధి లేదా ఇతర ప్రాజెక్టుల పేరుతో పర్యావరణ నియమాలను విస్మరించినప్పుడు, యువత మరియు పౌర సమాజం ఒక బలమైన నిఘా శక్తిగా (Watchdog) మారడం అత్యవసరం. కేంద్ర సాధికార కమిటీ (CEC) వెల్లడించిన అంశాలు క్షేత్రస్థాయిలో ఉన్న భయంకరమైన వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు. -
‘లక్షింపేట మారణకాండ బాధితులకు న్యాయం చేయాలి’
డాబాగార్డెన్స్: లక్షింపేట మారణకాండ బాధితులకు న్యాయం చేయాలని విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక(విదసం) రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. లక్షింపేట మృతుల కుటుంబాలకు న్యాయం కోసం ప్రభుత్వం నియమించిన ఓపెన్ కోర్టు వల్ల బాధితులకు న్యాయం జరిగేలా లేదని ఆరోపిస్తూ.. విదసం ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వెంకట్రావు మాట్లాడుతూ 2012 జూన్ 12న మాలపల్లిపై తూర్పు కాపులు బాంబులు, బరిశెలు, కత్తులు, గొడ్డలతో వచ్చి కళ్లల్లో కారం చల్లి కిరాతకంగా చేసిన హత్యాకాండలో ఐదుగురు దళితులు చనిపోయారని గుర్తు చేశారు. నాడు దళిత సంఘాల పోరాటం ఫలితంగా ప్రభుత్వం లక్షింపేటలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిందని, 14 ఏళ్లుగా జరుగుతున్న న్యాయ ప్రక్రియ నేడు కీలక దశకు చేరిందన్నారు. రెండేళ్లుగా ఈ కేసు వాదనకు ప్రత్యేక ప్రాసిక్యూటర్ లేరని, బాధితులు కోరినా ప్రభుత్వం నియమించలేదని ఆక్షేపించారు. ప్రస్తుతం జరుగుతున్న న్యాయ విచారణపై తమకు సందేహాలున్నాయని, ప్రస్తుత విచారణ తీరు చూస్తే.. తీర్పుపై బాధితులకు నమ్మకం లేదన్నారు. దీనిపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. నిరసనలో గుడివాడ ప్రసాద్, యడ్ల గోపి, గోడి వెంకటేశ్వరరావు, గుడాల ఈశ్వరరావు, పి.భాస్కరరావు, ఉమా మహేశ్వరి, గుడివాడ భాస్కరరావు, సీహెచ్ రాంబాబు, నావేటి గురుదేవి, ఉదయ్, కై లాస్ నాయక్, చాపల దాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆకలి కేకలు
త్వరితగతిన వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రోడ్లు మహారాణిపేట: అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిర్ణీత సమయంలోనే జీతాలు ఇస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇపుడు వారిని నెలల తరబడి పస్తులు పెడుతోంది. ఏకంగా 13 నెలల పాటు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం నగరంలోని ఎన్జీవో హోమ్కు వచ్చిన ఆంధప్రదేశ్ నాన్ గజిటెడ్, గజిటెడ్ ఆఫీసర్స్(ఏపీఎన్జీజీవోస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ను బాధిత అవుట్సోర్సింగ్ సిబ్బంది కలిసి, తమకు జీతాలు ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. దీంతో ఈ విషయం మరోసారి తెరమీదకు వచ్చింది. గతంలో రెండు సార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో జీతాల కోసం అవుట్ సోర్సింగ్ సిబ్బంది వినతులు ఇచ్చారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో సిబ్బంది కుటుంబ పోషణకు నానా కష్టాలు పడుతున్నారు. కావాలనే ఫైల్ తొక్కిపెట్టారు? కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్), ఆంధ్రా మెడికల్ కాలేజీ(ఏఎంసీ)లో 36 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్నారు. వీరికి గత ఏడాది ఏప్రిల్ నుంచి జీతాలు చెల్లించట్లేదు. దీంతో తమ కుటుంబాల జీవనం సాగించేదెలా? అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అన్ని అనుమతులూ పొందిన ఈ ఫైల్ను ఎంప్లాయిమెంట్ అధికారికి పంపకుండా కేజీహెచ్లోనే తొక్కిపెట్టారని ఆరోపిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం కోసం ఇన్చార్జి మంత్రి, కలెక్టర్ నుంచి అనుమతి వచ్చినా ఫైల్ కదలకుండా తొక్కిపెట్టడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన బాట
మహారాణిపేట: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే, భవిష్యత్తు కార్యచరణను ప్రకటించడానికి త్వరలో నే సమావేశం అవుతామని హెచ్చరించారు. గురువారం నగరంలోని ఎన్జీవో హోమ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సంఘ నేతలతో కలిసి మాట్లాడారు. కొత్త పీఆర్సీ కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే పీఆర్సీ చైర్మన్ను నియమించి, ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పెరిగిన ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగులకు తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న డీఏలు, సరెండర్ లీవ్ బకాయిలను ఒక క్రమపద్ధతిలో వెంటనే విడుదల చేయాలని, యాక్ట్ 30 ప్రకారం అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. సెలవు రోజుల్లో ఒత్తిడి చేయడం తగదు ప్రభుత్వ లక్ష్యాల సాధన కోసం ఉద్యోగులు అహర్నిశలు శ్రమిస్తున్నారని, అయితే సెలవు రోజుల్లో కూడా వారిని పని చేయమని ఒత్తిడి తీసుకురావడం సరికాదని విద్యాసాగర్ పేర్కొన్నారు. విశ్రాంతి ఉంటేనే ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలరని వివరించారు. అలాగే, ఐవీఆర్ఎస్ కాల్స్ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం సమంజసం కాదని, దానిని కేవలం ఒక మోడల్గా మాత్రమే తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డుల ద్వారా పూర్తిస్థాయి ప్రయోజనం అందడం లేదని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ను మంజూరు చేయాలన్నారు. ఏపీ ఎన్జీజీవో ప్రధాన కార్యదర్శి డీవీ రమణ మాట్లాడుతూ.. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, అదే స్ఫూర్తితో రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏపీ ఎన్జీజీవో విశాఖ అధ్యక్షుడు కె.ఈశ్వరరావు, కార్యదర్శి ఎం. రవికుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, పి.అప్పలరాజు, వై.నారాయణరావు, జి. చంద్రరావు, అనిత, రత్నకుమారి, పి. కృష్ణమూర్తి, టి.గోపాలకృష్ణ, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు రవి తదితరులు పాల్గొన్నారు. -
ఆ ప్రాంతాలను విశాఖ న్యాయస్థానాల పరిధిలోనే ఉంచండి
అల్లిపురం: భీమునిపట్నం న్యాయస్థాన పరిధిలోకి చేర్చిన పెందుర్తి, చినగదిలి మండల ప్రాంతాలను విశాఖ న్యాయస్థానాల పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్కు విశాఖ న్యాయవాదులు విన్నవించారు. ఈ మేరకు అమరావతిలో గురువారం కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు మాట్లాడుతూ మధురవాడ, రుషికొండ, విశాలాక్షినగర్, పెందుర్తి, వేపగుంట, సుజాతానగర్, నరవ, ఆరిలోవ ప్రాంతాలలో కొంతభాగం భీమునిపట్నం న్యాయస్థాన పరిధిలోకి వెళ్లాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈప్రాంతాల్లో నివసించే కక్షిదారులు, న్యాయవాదులు వ్యయప్రయాసలకు లోనవుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతాలన్నీ విశాఖ న్యాయస్థానాల పరిధిలోనే ఉండేవన్నారు. న్యాయవాదులు చెప్పిన వివరాలను పరిశీలించిన చీఫ్ జస్టిస్ లిసా గిల్ తప్పకుండా పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. చీఫ్ జస్టిస్ను కలిసిన వారిలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎస్.కృష్ణమోహన్, కె.రామజోగేశ్వరరావు, బి.వి.ఆర్.మూర్తి, కె.ఎల్.డి.నాగశ్రీ, సంఘం నాయకులు గాలి రామిరెడ్డి ఉన్నారు. -
విశాఖకు కొత్తగా ఐదు జిల్లా కోర్టులు
విశాఖ సిటీ: విశాఖ జిల్లాలో కొత్తగా ఐదు అదనపు కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర న్యాయ, శాసనసభ వ్యవహారాల శాఖ కార్యదర్శి గొట్టపు ప్రతిభా దేవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ కేంద్రంగా 14, 15వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టులను మంజూరు చేశారు. నగరంలో కుటుంబ వివాదాల పరిష్కారం కోసం 2వ అదనపు ఫ్యామిలీ కోర్టు–కమ్–అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, అలాగే 3వ అదనపు ఫ్యామిలీ కోర్టు–కమ్–అదనపు జిల్లా సెషన్స్ కోర్టులను ప్రభుత్వం నోటిఫై చేసింది. పారిశ్రామిక కేంద్రంగా ఉన్న గాజువాకలో ప్రత్యేకంగా ఒక ఫ్యామిలీ కోర్టు–కమ్–అదనపు జిల్లా సెషన్స్ కోర్టును ఏర్పాటు చేశారు. నర్సీపట్నంలో కూడా ఒక అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టు అందుబాటులోకి రానుంది. -
కై లాసగిరిపై ఆకర్షణగా త్రిశూలం
ఆరిలోవ: నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కై లాసగిరిపై త్రిశూలం ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 9న దీని ప్రారంభోత్సవం కావడంతో పనులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఇక్కడ ప్లాట్ఫాంపై త్రిశూలం, డమరుకం అమర్చడం పూర్తయింది. ఇంకా ఉద్యానవనం, సందర్శకులు సేదదీరేందుకు సిమెంట్బెంచీల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. డమరుకంతో కూడిన త్రిశూలం ప్రారంభమైతే ఈ పర్యాటక కేంద్రం మరింత ఆకర్షణీయంగా మారనుందని వీఎంఆర్డీఏ అధికారులు భావిస్తున్నారు. రూ.1.55 కోట్లతో కొండ చివరన ఏర్పాటు చేసిన 55 అడుగుల పొడవుండే ఈ త్రిశూలం కై లాసగిరికి వెళ్లే పర్యాటకులతో పాటు నగరంలోని పలు ప్రాంతాల ప్రజలకు కనిపిస్తుంది. జాతీయరహదారిపై డెయిరీఫారం, ఇసుకతోట, మద్దిలపాలెం వరకు, బీచ్రోడ్డు వైపు ఎంవీపీ కాలనీ, ఏయూ వరకు, బీఆర్టీఎస్ రోడ్డులో ఆరిలోవ, ముడసర్లోవ వైపు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. -
ఏయూలో నిలిచిన కొలువుల భర్తీ
విశాఖ సిటీ: చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. రాజకీయ కుతంత్రంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని అధ్యాపకుల పోస్టుల భర్తీ ప్రక్రియను రద్దు చేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందన్న దుర్బుద్ధితో గత నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంది. దీంతో ఏయూలో ఖాళీగా ఉన్న 523 అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న వేలాది మంది ఆశలు ఆవిరైపోయాయి. ఏయూలో దీర్ఘకాలంగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2014–2019 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం కనీసం ఆ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయూలో 523 అధ్యాపక పోస్టుల భర్తీ కోసం 2023లో నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికలకు సమయం ఆసన్నమవడంతో భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. సుదీర్ఘ నిరీక్షణ వృథానేనా? ఎన్నికలకు ముందు భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. కొత్త ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ పూర్తవుతుందని దరఖాస్తుదారులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఆ నోటిఫికేషన్ను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అభ్యర్థులు ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయింది. తాజాగా తీసుకున్న నిర్ణయం అభ్యర్థులకు శరాఘాతంగా మారింది. నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు పరీక్షలు నిర్వహించకపోగా, ఇప్పుడు ఏకంగా రద్దు చేయడంపై దరఖాస్తుదారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కకూడదనే..! గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం నియామకాలు చేపడితే, ఆ ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్న భయంతోనే ప్రస్తుత ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్సిటీల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేసింది. ఏయూలో నాక్ ‘ఏ+’గ్రేడ్ 3.74 స్కోరుతో దూసుకుపోతున్న తరుణంలో, అధ్యాపక కొరతను తీర్చడం వర్సిటీ అభివృద్ధికి ఎంతో కీలకం. కానీ, రాజకీయ స్వార్థం ముందు నిరుద్యోగుల భవిష్యత్తు తృణప్రాయంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నోటిఫికేషన్ రద్దు ఏయూలో ఖాళీగా ఉన్న 523 అధ్యాపక పోస్టుల భర్తీకి గతంలో ఇచ్చిన అనుమతిని ఉపసంహరించినట్లు ఏయూ రిజిస్ట్రార్ రాంబాబు ప్రకటించారు. 2023, నవంబర్ 1న ప్రచురించిన నోటిఫికేషన్ ఉనికిలో లేదని స్పష్టం చేశారు. అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారు దరఖాస్తు రుసుం తిరిగి పొందేందుకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ www. andhrauniversity.edu.inని సందర్శించాలని సూచించారు. పాత నోటిఫికేషన్ రద్దు చేసిన అధికారులు కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మాత్రం చెప్పకపోవడం గమనార్హం. సుదీర్ఘ కాలం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ రద్దు నిర్ణయంపై తీవ్రంగా మండిపడుతున్నారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు -
ఆర్టీసీ బస్ ఢీకొని నర్స్ మృతి
ఆరిలోవ: జాతీయ రహదారిపై బస్ ఢీకొన్న ఘటనలో ఓ నర్స్ మృతి చెందింది. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాలు.. ఆరిలోవ ప్రాంతం గాంధీనగర్కు చెందిన నీలపు ప్రవళిక(22) గీతం ఆస్పత్రిలో నర్స్గా పనిచేస్తోంది. గురువారం సాయంత్రం ఆమె ఆస్పత్రి విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఎండాడ మీదుగా ఇంటికి బయలుదేరింది. హైవేపై విశాఖ వ్యాలీ స్కూల్ కూడలి వద్ద సిగ్నల్ పడటంతో వాహనం నిలిపింది. అదే సమయంలో మధురవాడ నుంచి నగరానికి వస్తున్న ఆర్టీసీ బస్ ఆగివున్న ప్రవళిక స్కూటీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో స్కూటీ పైనుంచి ప్రవళిక కింద పడి తలకు తీవ్రగాయం కావడంతో అధిక రక్త స్రావమైంది. తోటి ఉద్యోగులు, ప్రయాణికులు కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆటోలో సమీపంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. -
కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
40 ఏళ్లు దాటిన వారికి ఈఎస్ఐసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లుసీతంపేట: కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ(ఈఎస్ఐసీ), కొత్త కార్మిక కోడ్ నిబంధనల ప్రకారం 40 ఏళ్లు పైబడిన బీమాదారుల కోసం ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. కార్మికుల్లో ఆరోగ్య స్పృహను పెంపొందించడం,అసంక్రమిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఈఎస్ఐసీ అసిస్టెంట్ డైరెక్టర్ వి.శ్యామ్ప్రసాద్ తెలిపారు. విశాఖపట్నం సబ్ రీజినల్ ఆఫీస్ ఆధ్వర్యంలో మల్కాపురం ఈఎస్ఐఎస్ ఆసుపత్రిలో జాయింట్ డైరెక్టర్(ఇన్చార్జి) కె.ఆర్.రవికుమార్, డాక్టర్ సి.సునీత, ఇతర వైద్యుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫణేందర్ కేతా మాట్లాడుతూ.. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆరోగ్య పరీక్ష నిర్వహిస్తామన్నారు. అర్హులైన కార్మికులు ఉదయం 8 గంటలకు మల్కాపురం ఈఎస్ఐసీ ఆసుపత్రికి చేరుకోవాలని సూచించారు. సీబీసీ, ఆర్ఎఫ్టీ, ఎల్ఎఫ్టీ, ఎఫ్బీఎస్, పీపీబీఎస్, హెచ్బీఏ1సీ, టీఎఫ్టీ, లిపిడ్ ప్రొఫైల్, యూరిన్ రూటీన్, సీరమ్ యూరిక్ యాసిడ్, హెచ్ఐవీ 1–2, హెచ్బీఎస్ఏజీ, యాంటీ హెచ్సీవీ, ఈసీజీ, ఛాతీ ఎక్స్రే తదితర పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షల్లో ఏవైనా అనారోగ్య సమస్యలు గుర్తిస్తే, బాధితులకు అవసరమైన తదుపరి చికిత్స, మందులను ఉచితంగా అందజేస్తామన్నారు. విశాఖ పరిధిలోని అన్ని సంస్థల యజమానులు, యాజమాన్యాలు తమ వద్ద పనిచేస్తున్న అర్హులైన కార్మికులను ఆరోగ్య పరీక్షల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని జాయింట్ డైరెక్టర్ కె.ఆర్.రవికుమార్ కోరారు. మరిన్ని వివరాల కోసం అక్కయ్యపాలెంలోని ఈఎస్ఐసీ సబ్ రీజినల్ ఆఫీస్ను నేరుగా గానీ, లేదా 0891–2733126 నంబర్కు ఫోన్ చేసి గానీ సంప్రదించవచ్చు. అలాగే bfts-vizag@esic.gov.inకు ఈమెయిల్ చేయవచ్చు లేదా సమీపంలోని ఈఎస్ఐసీ బ్రాంచ్ ఆఫీస్/డిస్పెన్సరీని సంప్రదించవచ్చు. -
అల్లూరి ఆశయాలను కొనసాగిద్దాం
తాటిచెట్లపాలెం: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని గురువారం సీతమ్మధార జంక్షన్లోని ఆయన విగ్రహానికి వైఎస్సార్ సీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, పార్టీ నేతలు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు అల్లూరి అని కొనియాడారు. ప్రస్తుత తరుణంలో ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తితో ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. కె.కె.రాజు మాట్లాడుతూ.. అల్లూరి చిన్న వయసులోనే వేదాలు అభ్యసించి, ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉండేవారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అల్లూరి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించి, ఆయన సేవలను భావితరాలకు తెలిసేలా చేశామని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అల్లూరి పోరాట భూమి అయిన ఉమ్మడి విశాఖ ప్రాంతానికి, ఆయన స్మృతి కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధాకరమని విమర్శించారు. సమన్వయకర్తలు తిప్పల దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు, పార్టీ నాయకులు రవిరెడ్డి, సతీష్ వర్మ, కొండా రాజీవ్ గాంధీ, పి.వి.నారాయణ, కిరణ్రాజు, పేర్ల విజయ్చంద్ర, జి.వి.రవిరాజు, ద్రోణంరాజు శ్రీ వత్సవ్, అంబటి శైలేష్, సునీల్, అల్లంపల్లి రాజబాబు, అల్లు శంకరరావు, మారుతీప్రసాద్, శ్రీదేవివర్మ, మేరువ గణేష్, కర్రి రామిరెడ్డి, దేవరకొండ మార్కండేయులు, బోని శివరామకృష్ణ, కేవీఎన్ శశికళ, బిపిన్కుమార్ జైన్, రెయ్యి డేవిడ్, పులగమ శ్రీనివాసరెడ్డి, జీలకర్ర నాగేంద్ర, వానపల్లి ఈశ్వరరావు, విక్టర్, ఉమ్మడి కల్యాణ్, బల్ల శ్రీను, నాగేశ్వరరావు, నూకరాజు, ఎస్కే బాబ్జీ, మువ్వల సంతోష్, మధుసూదన్రెడ్డి, సంపంగి సురేష్, బద్రి, కృష్ణ, సంధ్య, మీసాల ప్రదీప్, కృప, బోని అప్పారవు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మన్యం వీరుడికి నివాళి -
గట్టెక్కేలా!
నష్టాల నుంచి సహజంగాఎల్పీజీ భారం నుంచి పీఎన్జీ వైపు.. వైజాగ్ స్టీల్ప్లాంట్ కీలక నిర్ణయం పశ్చిమాసియా యుద్ధంతో ఆకాశాన్నంటిన ఎల్పీజీ ధరలు గతంలో టన్ను ఎల్పీజీ రూ.70 వేలు.. ప్రస్తుతం రూ. 1.15 లక్షలు ఉత్పత్తి వ్యయం తగ్గించేందుకు యాజమాన్యం చర్యలు రోజుకు 62 వేల క్యూబిక్ మీటర్ల లక్ష్యంతో కొత్త పైప్లైన్ ఇంధన ఆదాతో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నంవిశాఖ సిటీ: విశాఖ ఉక్కు కర్మాగారం ఒక కీలకమైన ఇంధన మార్పునకు శ్రీకారం చుట్టింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల కారణంగా ఎల్పీజీ ధరలు ఆకాశాన్నంటడంతో, స్టీల్ప్లాంట్ యాజమాన్యం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, కర్మాగారాన్ని నష్టాల నుంచి గట్టెక్కించే లక్ష్యంతో పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) వాడకాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ నూతన ఇంధన సరఫరా వ్యవస్థను ప్లాంట్లోని గ్యాస్ మిక్సింగ్ స్టేషన్ వద్ద ప్రారంభించడం ఒక చారిత్రాత్మక మలుపుగా నిలిచింది. ఎల్పీజీ ధరల సెగ : ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి విశాఖ ఉక్కు బడ్జెట్ తలకిందులైంది. అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినడంతో ఎల్పీజీ ధరలు అసాధారణంగా పెరిగాయి. యుద్ధానికి ముందు టన్ను ఎల్పీజీ ధర సుమారు రూ. 70 వేలు ఉండగా, అది ప్రస్తుతం రూ.1.15 లక్షలకు చేరుకుంది. దీంతో దాదాపు 65 శాతం అదనపు భారం ప్లాంట్పై పడింది. ప్లాంట్లోని స్టీల్ బ్లూమ్స్ కటింగ్, రోలింగ్ మిల్లుల వంటి విభాగాల్లో గ్యాస్ వినియోగం అత్యంత కీలకం. పెరిగిన ధరల వల్ల ప్రతి టన్ను ఉక్కు ఉత్పత్తిపై వ్యయం గణనీయంగా పెరిగి, సంస్థను మరింత నష్టాల్లోకి నెట్టింది. పీఎన్జీతో భారీ పొదుపు ఎల్పీజీ భారంగా మారడంతో స్టీల్ప్లాంట్ యాజమాన్యం పీఎన్జీ వైపు మళ్లింది. ఇంధన సామర్థ్యాన్ని శాసీ్త్రయంగా గిగా క్యాలరీలలో కొలిచినప్పుడు ఎల్పీజీ, పీఎన్జీ మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఒక గిగా క్యాలరీ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఎల్పీజీ ద్వారా సుమారు రూ. 9,000 ఖర్చయ్యేది. ఇప్పుడు పీఎన్జీ ద్వారా అదే స్థాయి శక్తిని కేవలం రూ. 6,500కే పొందడం సాధ్యమవుతోంది. అంటే ప్రతి గిగా క్యాలరీ ఇంధనంపై ప్లాంట్కు దాదాపు రూ.2,500 మేర ఆదా అవుతోంది. తద్వారా సుమారు 28 శాతం మేర ఇంధన ఖర్చు తగ్గుతోంది. ప్లాంట్ పూర్తి స్థాయిలో నడవాలంటే గంటకు సుమారు 45 వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ అవసరం ఉంటుంది. ఇందులో ప్రధానంగా కోక్ ఓవెన్ గ్యాస్(సీవోజీ) వాడతారు. అయితే ప్లాంట్లోని ఐదు కోక్ ఓవెన్ బ్యాటరీల పని తీరు మందగించడం వల్ల గంటకు 15 వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ లోటును పూడ్చడానికి గతంలో వాడిన ఎల్పీజీ స్థానాన్ని ఇప్పుడు పీఎన్జీ భర్తీ చేయనుంది. 4.5 కిలోమీటర్ల పైప్లైన్ ఈ ఇంధన మార్పిడి ప్రాజెక్టును ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) సమన్వయంతో చేపట్టారు. విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్ సమీపంలో ఉన్న ఐవోసీఎల్ ఎల్ఎన్జీ హబ్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు ప్రత్యేకంగా 4.5 కిలోమీటర్ల పొడవైన పైప్లైన్ను నిర్మించారు. ఈ పనులు ఏప్రిల్ 2వ తేదీన ప్రారంభం కాగా, కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేసి గ్యాస్ సరఫరాను ప్రారంభించారు. పైప్లైన్ ద్వారా గ్యాస్ నేరుగా ప్లాంట్కు చేరడం వల్ల రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా, సిలిండర్ల నిల్వ, భద్రతా పరమైన ఇబ్బందులు కూడా తొలగిపోయాయి. సరఫరా లక్ష్యాలు.. భవిష్యత్తు ప్రణాళిక మొదటి దశలో భాగంగా ప్రస్తుతం రోజుకు 18 వేల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల పీఎన్జీని ప్లాంట్ అవసరాలకు వినియోగిస్తున్నారు. దీనివల్ల తక్షణమే రోజువారీ ఖర్చుల్లో కొంత ఉపశమనం లభించింది. అయితే ప్లాంట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండో దశ పనులను కూడా వేగవంతం చేశారు. 2027 మే నాటికి పీఎన్జీ సరఫరాను రోజుకు 62 వేల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకుంటే, ప్లాంట్ తన ఇంధన అవసరాల కోసం ఎల్పీజీపై ఆధారపడటాన్ని పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది. -
వీనుల విందుగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు
మద్దిలపాలెం: త్యాగరాజ స్వామి 259వ జయంతి ఉత్సవాన్ని కళాభారతి ఆడిటోరియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ అధ్యక్షుడు మంతెన సత్యనారాయణరాజు, కార్యదర్శి డాక్టర్ రాంబాబు నాదస్వర విద్వాంసులు అప్పన్న, వీణా విద్వాంసులు పద్మ రవిశంకర్, డాక్టర్ బీకేడీ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఏడు నాదస్వరాలు, నాలుగు డోళ్లు కలిపి బృందంగా మంగళకరంగా త్యాగరాజ స్వామి జయంత్యుత్సం ప్రారంభమైంది. త్యాగరాజ ఆరాధనలో భాగంగా 29 వీణలతో గంటసేపు వీణా కచేరీ వీనుల విందుగా సాగింది. ఆహూతులను సంగీత సాగరంలో ఓలలాడించింది. అనంతరం 21 మంది వేణుగానామృతాన్ని అద్భుతంగా ఆలాపించారు. వీరితోపాటు 30 మంది వయోలిన్పై చేసిన కచేరీ మంత్రముగ్ధులను చేసింది. వేదికపై 125 మంది కళాకారులతో జరిగిన బృందగాన కచేరీ ఈ ఉత్సమానికే వన్నె తెచ్చింది. -
ద.కో. ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్గా రాజ్కుమార్
తాటిచెట్లపాలెం: దక్షిణ కోస్తా రైల్వే జోన్కు తొలి ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్గా ఐఆర్ఎస్ఈ 1989 బ్యాచ్కు చెందిన బి.ఎస్.కె.రాజ్కుమార్ నియమితులయ్యారు. ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాజ్కుమార్ భువనేశ్వర్లోని ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అడిషనల్ జనరల్ మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజ్కుమార్ ఏయూ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో గోల్డ్ మెడల్ సాధించారు. ముంబయిలోని ఐఐఎం నుంచి మేనేజ్మెంట్ స్టడీస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రైల్వేలో దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన.. తన సర్వీసులో ట్రాక్లు, బ్రిడ్జిలు, భారీ భవనాల నిర్మాణానికి సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులను పర్యవేక్షించారు. దక్షిణ మధ్య రైల్వే, నార్త్ ఈస్ట్రన్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఆయన పని చేశారు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, డబ్లింగ్, ట్రిపుల్ లైన్ ప్రాజెక్టుల ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కమిషనింగ్లో రాజ్కుమార్కు అపారమైన అనుభవం ఉంది. గతంలో ఆయన ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే చీఫ్ బ్రిడ్జి ఇంజినీర్గా, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్గా కూడా సేవలందించారు. -
221 వెంటిలేటర్లకు త్వరలో మరమ్మతులు
మహారాణిపేట: కేజీహెచ్లోని వెంటిలేటర్ల స్థితిగతులపై బుధవారం ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన ‘శ్వాసకు బ్రేక్.. వెంటిలేటర్ల షాక్’ కథనానికి ఆస్పత్రి యంత్రాంగం స్పందించింది. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి వివరణ ఇస్తూ.. కేజీహెచ్లో మొత్తం 379 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిలో ప్రస్తుతం 158 వెంటిలేటర్లు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయని, మిగిలిన 221 వెంటిలేటర్లు చిన్నపాటి మరమ్మతులకు గురయ్యాయని ఆమె పేర్కొన్నారు. మరమ్మతులకు గురైన వెంటిలేటర్లను రిపేరు చేయించి, త్వరలోనే రోగులకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారం రోజుల్లో ఎన్హెచ్ఎం ఉద్యోగులకు జీతాలు మహారాణిపేట: వైద్యారోగ్య శాఖలో ‘నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం)’కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వారం రోజుల్లోగా జీతాలు అందుతాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి. జగదీశ్వరరావు తెలిపారు. బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘ప్లీజ్.. జీతాలు ఇవ్వండి’అనే వార్తకు డీఎంహెచ్వో స్పందించారు. ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ఉద్యోగులు జీతాల గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పిల్లల ఆరోగ్య సేవలకు ‘ఈసాయ్’ విరాళం
మహారాణిపేట: కేజీహెచ్ పిల్లల శస్త్రచికిత్స విభాగానికి ఈసాయ్ ఫార్మాస్యూటికల్స్ రూ.4.50 లక్షలు విరాళమిచ్చింది. పిల్లల ఆరోగ్య సేవలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ విరాళం ఇచ్చారు. సంబంధిత చెక్కును కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణికి పిల్లల విభాగ వైద్యుల సమక్షంలో ఈసాయ్ ప్రతినిధులు గిరీష్ దీక్షిత్, మదన్ మోహన్, జోసెఫ్ కిరణ్లు బుధవారం అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణ, పిల్లల శస్త్రచికిత్స విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ జి.రాజేంద్ర ప్రసాద్, ఆచార్యులు డాక్టర్ జె. భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విరాళం అందించిన ఈసాయ్ ప్రతినిధులకు సూపరిటెండెంట్ డాక్టర్ వాణి కృతజ్ఞతలు తెలిపారు. -
గ్రామీణ ప్రాంతాల పట్టణీకరణకు ప్రణాళికలు
విశాఖ సిటీ: గ్రామీణ ప్రాంతాల పట్టణీకరణ దిశగా పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వీఎంఆర్డీఏ చైర్మన్ ఎం.వి.ప్రణవ్గోపాల్ తెలిపారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో చైర్మన్ అధ్యక్షతన బుధవారం జరిగిన అథారిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం, విజయనగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, పాయకరావుపేట తదితర మున్సిపాలిటీల్లో కాలువలు, రహదారులు, పార్క్ల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. గాజువాకలో స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణానికి సుమారు రూ.9 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కై లాసగిరిపై త్రిశూల్ను ఈ నెల 9న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ రహదారుల నిర్మా ణం అనుకున్న సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ పార్క్ ఆవరణలో యువగళం యాంటీ డ్రగ్ పార్క్ నిర్మాణం 3 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ మాట్లాడుతూ వీఎంఆర్డీఏ ఇటీవల కొత్తగా రూపొందించిన విస్టా యాప్ వినియోగంతో ఆదా యం గణనీయంగా వృద్ధి చెందిందన్నారు. అనకాపల్లి, విజయనగరంలలో ఉన్న జోనల్ ఆఫీసుల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యకలాపాలను పూర్తి స్థాయిలో చేపడతామన్నారు. సమావేశంలో వర్చువల్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్, అనకాపల్లి జేసీ శౌర్యమన్ పటేల్ పాల్గొనగా వీఎంఆర్డీఏ ఎస్ఈ వినయ్ కుమార్, ఎస్ఈ మధుసూదనరావు తదితరులు హాజరయ్యారు. -
యువకుడి కుటుంబానికి వాసుపల్లి భరోసా
దహన ఖర్చులకు రూ.10 వేలు అందజేత అల్లిపురం: నగరంలోని ఇసుకతోట వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 32వ వార్డుకు చెందిన యువకుడు మృతి చెందడంపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వార్డు అధ్యక్షుడు రాజారెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న ఆయన.. తక్షణమే స్పందించి మృతుడి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వాసుపల్లి.. మృతుడు కొండాపు రాజేష్ రెడ్డి అకాల మరణంతో అతని ఇద్దరు పిల్లలు అనాథలవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పిల్లల చదువుకు తాను పూర్తి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాజేష్రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొని నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు కేవలం చలానాల వసూళ్లకే పరిమితమవుతున్నారని, రోడ్డు భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు. -
బడి బస్సుల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి
గోపాలపట్నం: జిల్లాలోని స్కూల్ బస్సులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని ఇన్చార్జి డీటీసీ మణికుమార్ ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్సుల యజమానులకు, డ్రైవర్లకు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఎంవీఐలు, ఏఎంవీఐలు కలిసి ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. నగరంలో గత నెల 28 నుంచి చేపట్టిన ఈ తనిఖీల్లో భాగంగా.. మొత్తం 1,250 బస్సులకు గానూ ఇప్పటివరకు 368 బస్సులను తనిఖీ చేసినట్లు డీటీసీ తెలిపారు. వీటిలో 76 బస్సులు భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్సుల యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, వారం రోజుల్లోగా లోపాలను సరిచేసుకోవాలని సూచించారు. లేని పక్షంలో ఆ వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు పాటించని 76 బస్సులకు నోటీసులు -
రీ సర్వేలో వసూల్ రాజాలు
మహారాణిపేట: జిల్లాలో జరుగుతున్న భూముల రీ సర్వేలో అవినీతి కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది. కొంత మంది సర్వేయర్లు వసూల్ రాజాలుగా మారుతున్నారు. తమ కార్యాలయంలో అన్నీ తామై చేసేస్తామని రైతులను నమ్మబలుకుతూ రాయ‘బేరాలు’నడుపుతున్నారు. ఇక్కడకు వచ్చే అధికారులు తమ గుప్పిట్లోనే ఉంటారని, వారందరికీ వాటాలు ఇచ్చి.. మీకు అనుకూలంగా పనులు చేస్తామని నమ్మించి, రైతులను నిలువునా ముంచేస్తున్నారు. 64 గ్రామాల్లో రీ సర్వే చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టాక జిల్లాలోని పెందుర్తి, గాజువాక, ఆనందపురం, పద్మనాభం, భీమిలి, విశాఖ రూరల్ మండలాల పరిధి 64 గ్రామాల్లో రీ సర్వే చేపట్టారు. రెండో విడత రీ సర్వే ఇంకా ఓ కొల్కికి రాలేదు. మూడో విడత రీ సర్వే వివాదాలతో ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. చిన్న, సన్నకారు రైతుల భూములు ఏళ్ల తరబడి తమ సాగులో ఉన్నా.. సరైన రికార్డులు లేవన్న సాకుతో పెండింగ్లో పెట్టారు. జిరాయితీ భూముల సర్వేకు కూడా సర్వే బృందం వెనుకడుగు వేస్తోంది. తమ ఆధీనంలో ఉన్న పొలాలకు సంబంధించి ఆన్లైన్లో రైతుల పేర్లు లేకపోవడం, క్రయ విక్రయాలు జరిగినా రికార్డులు అప్డేట్ చేయకపోవడం సమస్యలకు కారణమవుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి కొందరు అధికారులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని రైతులు వాపోతున్నారు. ఆధునిక టెక్నాలజీ.. అయినా తప్పులే! డ్రోన్లు, జీపీఎస్ యంత్రాలతో సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వ, జిరాయితీ, ఇనాం తదితర భూముల రీ సర్వే చేస్తున్నారు. మండల తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్వో తదితరులకు మండల, డివిజనల్ సర్వేయర్లు, చైన్మన్లు, ఇతర సిబ్బంది సహకారం అందిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో ముడుపుల వ్యవహారంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న చిన్న సాంకేతిక సమస్యలను సాకుగా చూపి సర్వేలు నిలుపుదల చేస్తున్నారని సమాచారం. వీటి పరిష్కారం పేరిట సర్వేయర్లు అన్నీ తామై చక్రం తిప్పుతున్నారు. మండలానికి ఇద్దరు ముగ్గురు సర్వేయర్లు కేవలం వసూళ్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. ముడుపులు చెల్లించుకుంటేనే రీ సర్వే పూర్తి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. లేకుంటే ఒకరి సాగులో ఉన్న భూమిని రికార్డుల్లో మరొకరి పేరిట చేర్చుతున్నారని చెప్తున్నారు. మరోవైపు రీ సర్వేలో దళారులు ప్రవేశించి అనధికార వసూళ్లకు పాల్పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు. ‘సాంకేతిక’చిక్కులు.. తప్పని అవస్థలు రెవెన్యూ రికార్డుల్లో ఒకలా, సాగులో ఇంకోలా ఉంటే రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ భూమి, ట్యాంక్ అని ఉంటే రైతుల తిప్పలు వర్ణనాతీతం. అన్నదమ్ముల తగాదాలు, కుటుంబ వివాదాలు, గ్రామ కంఠం, ఇనాం భూముల్లో రీ సర్వే పూర్తవ్వాలంటే చేతులు తడపాల్సిందేనని రైతులు వాపోతున్నారు. కొంత మంది అధికారులు ఇలాంటి జాబితాను వీఆర్వోలకు అందించి, వారిని రైతుల వద్దకు పంపి బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి రైతుల సాగులో ఉన్నా.. రికార్డుల్లేని భూములకు ముడుపులివ్వకుండా పాస్ పుస్తకాలు ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
సముద్రంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
పరవాడ: మండలంలోని తిక్కవానిపాలెం తీరంలో ఈ నెల 4న గల్లంతైన పి.బోనంగి గ్రామానికి చెందిన కావూరి గురునాథరావు(19) మృతదేహం బుధవారం మధ్యాహ్నం తీరానికి చేరింది. మూడు రోజుల నుంచి మృతదేహం కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. తిక్కవానిపాలెం తీరంలో సముద్రంపై తేలియాడుతుండగా గుర్తించిన స్థానికులు మృతదేహన్ని బోట్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో అండమాన్ నుంచి వచ్చిన తన స్నేహితులను వెంటబెట్టుకుని తీరానికి చేరిన గురునాథరావు స్నానానికి సముద్రంలో దిగాడు. స్నానం చేస్తుండగా ఉధృతంగా వచ్చిన రాకాసి అలలు గురునాథరావును లోపలికి లాక్కుపోయాయి. ఈ ప్రమాదంలో గల్లంతైన యువకుడు మృతదేహంగా బుధవారం తీరానికి చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకును రాకాసి అలలు పొట్టన పెట్టుకోవడంతో తమకు దిక్కెవరని రోదిస్తున్న తల్లిని చూసి అక్కడున్నవారు కంటతడి పెట్టుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. -
బాల్యం కేంద్రాల్లో అడ్మిషన్లు ప్రారంభం
అల్లిపురం: జీవీఎంసీ ‘బాల్యం’ విద్యా కేంద్రాల్లో చిన్నారుల ఉచిత ప్రవేశానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. 3 నుంచి 5 ఏళ్ల వయసు గల చిన్నారులను ఈ కేంద్రాల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 2026–27 విద్యా సంవత్సరానికి గాను బాల్యం కేంద్రాల్లో ప్రవేశాలు, సర్వే నిర్వహణకు సంబంధించిన సమాచార, సోషల్ మీడియా పోస్టర్లను బుధవారం ఆయన తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లి బాల్యం కేంద్రాలతో పాటు ఒకటో తరగతిలో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చూడాలని బాల్యం పీడీ హెచ్.శంకరరావును ఆదేశించారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ ఆవుపాటి మోహన్ కుమార్, బాల్యం అధ్యాపకులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
శకం!
ముగిసినచారిత్రక నేపథ్యం● జూన్ 1 నుంచి వాల్తేరు పేరు అధికారికంగా తొలగింపు ● 1,106 కి.మీ. మేర విస్తరించిన వాల్తేరు డివిజన్ ● 696 కి.మీ. రాయగడ డివిజన్లో విలీనం ● 463 కి.మీ.తో కొత్తగా విశాఖపట్నం డివిజన్ ఏర్పాటు ● ఖుర్దాలోని 53 కి.మీ. విలీనం● ఉద్యోగుల సర్దుబాటుపై చర్యలు పూర్తి ● 1893–1902 వరకు తూర్పు కోస్తా రాష్ట్ర రైల్వే జోన్ పరిధి ● 1902–1925 వరకు మద్రాస్ రైల్వే, దక్షిణ మరాఠా రైల్వే పరిధి ● 1925–1952 వరకు బెంగాల్ –నాగ్పూర్ రైల్వే పరిధి ● 1952–1955 వరకు మొదటిసారి రైల్వే పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు తూర్పు రైల్వే పరిధిలోకి వచ్చింది ● 1955–1966 వరకు ఆగ్నేయ రైల్వే పరిధి ● 1966–1977 వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధి ● 1977–2003 వరకు మళ్లీ ఆగ్నేయ రైల్వే పరిధి ● 2003 ఏప్రిల్ 1–2026 మే 31 వరకు తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధి ● 2026 జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో విశాఖపట్నం డివిజన్గా కొనసాగనుంది.గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం లెక్కింపు వాల్తేరు డివిజన్.. ఇ కడాబాగార్డెన్స్: కనకమహాలక్ష్మి దేవస్థాన హుండీల ఆదాయం లెక్కింపు బుధవారం నిర్వహించారు. మార్చి 26 నుంచి ఈ నెల 6 వరకు హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా.. రూ.28,25,338, 43.100 గ్రాముల బంగారం, 320 గ్రాముల వెండితో పాటు యూఎస్ఏ డాలర్లు 8, ఖతార్ కరెన్సీ రియాల్స్ 5 వచ్చాయి. హుండీ లెక్కింపులో ఆలయ కార్యనిర్వహణాధికారి శోభారాణి, జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ అధికారి టి.అన్నపూర్ణ, దేవదాయ శాఖ తనిఖీదారు ఎం.శ్రీధర్, ఆలయ పర్యవేక్షకులు ఎస్.కనకరాజు, ఎంవీ రమణ, కె.పద్మజ, కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ హెచ్ఎస్ఎన్వీఆర్ మూర్తి, వన్టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, గోపాలపట్నం శ్రీహరి సేవ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 133 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ శకం ఇక ముగిసినట్లే. ఇప్పటి వరకూ చరిత్రలో పలు జోన్ల పరిధిలో ఉన్న వాల్తేరు.. ఇకపై విశాఖపట్నంగా దక్షిణ కోస్తా జోన్ పరిధిలో ఉండనుంది. రైలు చక్రాల సవ్వడితో ఉత్తరాంధ్ర జీవనాడిలా విరాజిల్లిన వాల్తేరు ప్రస్థానం ఓ ముగిసిన అధ్యాయం. బ్రిటిష్ కాలం నాటి పునాదుల నుంచి దేశంలోనే అత్యధిక ఆదాయం ఆర్జించే డివిజన్లలో ఒకటిగా ఎదిగిన వాల్తేరు ప్రస్థానం చరిత్ర పుటలకే పరిమితం. సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డివిజన్ ఇక చరిత్రలో మిగిలిపోనుంది. జోన్ ఏర్పాటుతో డివిజన్ విచ్ఛిన్నం అనివార్యంగా మరింది. జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్ కార్య కలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వాల్తేరుని రెండు భాగాలుగా విభజించేశారు. ఖుర్దాలోని పలాస, ఇచ్చాపురం సెక్షన్లతో 53 కి.మీ. ఇందులో కలిపారు. దీంతో 696 కి.మీ. మేజర్ భాగాల్ని రాయగడ డివిజన్గానూ.. మిగిలిన 463 కి.మీ. ప్రాంతాన్ని విశాఖపట్నం డివిజన్గా ఏర్పాటు చేస్తున్నారు. చరిత్రలో చిరస్థాయి.. మద్రాసు నుంచి కలకత్తాను కలిపే తూర్పు తీర రైల్వే నిర్మాణంలో భాగంగా 1893లో వాల్తేరుకు రైలు మార్గం ఏర్పడింది. 1896లో బెంగాల్ నాగ్పూర్ రైల్వే ఆధీనంలోకి వెళ్లిన ఈ ప్రాంతం.. కాలక్రమేణా వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పట్లో విశాఖపట్నం పోర్టు అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. సరకు రవాణాకు వాల్తేరు ఒక ప్రధాన కేంద్రంగా మారింది. భారతీయ రైల్వే వ్యవస్థలో వాల్తేరు డివిజన్ ఒక బంగారు బాతులాంటిది. ముఖ్యంగా ఇనుప ఖనిజం, బొగ్గు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాలో ఎన్నో రికార్డులు సృష్టించింది. ఛత్తీస్గఢ్లోని బైలడిల్లా గనుల నుంచి విశాఖ పోర్టుకి ఇనుప ఖనిజాన్ని చేరవేసే కొత్తవలస–కిరండూల్(కేకే లైన్) మార్గం ఈ డివిజన్ పరిధిలోనే ఉండేది. 56 సొరంగాలు, 87 భారీ వంతెనలు, 1,236 చిన్న వంతెనలతో ఈ మార్గం ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా గుర్తింపు పొందింది. కొత్త జోన్ రాకతో రెండుగా.. కేవలం సరకు రవాణాకే పరిమితం కాకుండా, పర్యాటక రంగంలోనూ వాల్తేరు డివిజన్ ప్రత్యేక ముద్ర వేసింది. బొర్రా గుహలు, అరకు లోయ వంటి ప్రకృతి సిద్ధమైన ప్రాంతాల మీదుగా సాగే రైలు ప్రయాణం పర్యాటకులకు మరుపురాని అనుభూతిని అందిస్తుంది. అద్దాల పెట్టెలు కలిగిన విస్టాడోమ్ రైలును ప్రవేశపెట్టి పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ఈ డివిజన్ ముందు వరుసలో నిలిచింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా, వాల్తేరు డివిజన్ను రెండుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక భాగం రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్, మరో భాగం కొత్తగా ఏర్పాటు చేస్తున్న విశాఖపట్నం డివిజన్గా రూపాంతరం చెందుతోంది. ఈ కారణంగా వాల్తేరు అనే చారిత్రక పేరు ఇకపై రైల్వే పటంలో కనిపించే అవకాశం లేదు. దశాబ్దాల ప్రాంతీయ గుర్తింపుగా, ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్గా ఉన్న వాల్తేరు కనుమరుగు కానుంది. వాల్తేర్ డివిజన్ భవనం(ఫైల్)ఆగస్టు 21 నుంచి ప్రత్యేక లోక్ అదాలత్ మహారాణిపేట: వచ్చే ఆగస్టు 21 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ చిన్నంశెట్టి రాజు తెలిపారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో చేపట్టిన సమాధాన సమారోహ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రత్యేక అదాలత్ను నిర్వహిస్తున్నారు. పెండింగ్లో ఉన్న కేసులను ఉభయ పక్షాలు పరస్పర అవగాహనతో, మధ్యవర్తిత్వం ద్వారా త్వరగా పరిష్కరించుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు. కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, సుదీర్ఘ ప్రక్రియ వల్ల కలిగే సమయం, ధన వ్యయాన్ని తగ్గించుకోవడానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ ప్రకటన ద్వారా కోరారు. వాల్తేరు డివిజన్ విశేషాలు..వాల్తేరు వార్షిక ఆదాయం రూ.11,598.07 కోట్లు సరకు రవాణా 85.1 మిలియన్ టన్నులు ప్రయాణికుల సంఖ్య 3.34 కోట్లు ప్రధాన ఆదాయ వనరు ఇనుప ఖనిజం, బొగ్గు, ఉక్కు వాల్తేరు డివిజన్ మొత్తం విస్తీర్ణం 1,106 కి.మీ. వాల్తేరు విభజన విశాఖపట్నం, రాయగడ డివిజన్లు విశాఖపట్నం డివిజన్ విస్తీర్ణం 463 కి.మీ. రాయగడ డివిజన్ విస్తీర్ణం 696 కి.మీ. -
అంధుల క్రికెట్ సిరీస్ విజేత ఏపీ
తమిళనాడుపై ఏపీ ఆధిక్యంవిశాఖ స్పోర్ట్స్: బియాండ్ సైట్ వుమెన్ క్రికెట్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ జట్టు 3–0తో తమిళనాడు జట్టుపై ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రైల్వే స్టేడియంలో బుధవారం జరిగిన చివరిదైన మూడో టీ20 మ్యాచ్లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ఏపీ జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన తమిళనాడు ఐదు వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేసింది. 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో ఓపెనర్ సింధుకు దీపలక్ష్మి తోడై 51 పరుగుల భాగస్వామ్యంతో స్కోర్ను 66 పరుగులకు చేర్చారు. ప్రియాంక, మిక్కా చెరో వికెట్ తీశారు. ప్రతిగా ఏపీ జట్టు ఓపెనర్ సంధ్య(10) 18 పరుగుల వద్దే వెనుదిరిగినా.. ఇంకో ఓపెనర్ మిక్కా(52)తో కలిసి కెప్టెన్ సత్య(28) మరో వికెట్ కోల్పోకుండానే 9.1 ఓవర్లలో 99 పరుగులు చేసి గెలుపొందారు. సిరీస్ తొలి మ్యాచ్లో తమిళనాడు నాలుగు వికెట్లకు 119 పరుగులు చేయగా ఏపీ జట్టు 10.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. రెండో మ్యాచ్లో తమిళనాడు రెండు వికెట్లు కోల్పోయి 147 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసినా ఏపీ జట్టు 13.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. -
తాడి ప్రకాష్కు ఆచార్య చందు లిటరరీ అవార్డు
సీతంపేట: ప్రముఖ జర్నలిస్టు, రచయిత తాడి ప్రకాష్ ఈ ఏడాది చందు సుబ్బారావు లిటరరీ ట్రస్ట్ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఈ మేరకు ఆచార్య చందు సుబ్బారావు లిటరరీ అండ్ కల్చరల్ ట్రస్ట్ చైర్మన్ పూర్వ యూపీఏసీ సభ్యుడు ఆచార్య కేఎస్ చలం, కార్యదర్శి ఉప్పల అప్పలరాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. చందు 80వ జయంతి సందర్భంగా ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలో ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టు జ్ఞాపకాలతో తాడి ప్రకాష్ రాసిన ‘ఏలూరు రోడ్డు–ఆత్మ గీతం’పుస్తకం అందరి మన్ననలు పొందిందన్నారు. ఈ సభకు జర్నలిస్టులు, రచయితలు, కవులు హాజరుకావాలని ప్రొఫెసర్ చలం, ఉప్పల అప్పలరాజులు కోరారు. -
కేకే లైన్ విశాఖ డివిజన్లోనే కొనసాగించాలి
ఎంవీపీ కాలనీ: కేకే లైన్ను విశాఖ డివిజన్లోనే కొనసాగించాలని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. స్థానిక ఉషోదయ కూడలిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో అంశాలను తక్షణమే కేంద్రం అమలు చేయాలని సూచించారు. రైల్వేజోన్పై గతంలో మాజీ మంత్రి కొణతాల ఆధ్వర్యంలో లోక్ సత్తా, వామపక్షాలు, ప్రజా సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడంతో పాటు కేంద్రంలోని పలు పార్టీల కీలక నాయకులను కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం జోన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం కేకే లైన్ను విశాఖ డివిజన్లో కొనసాగించకపోవడం దారుణమన్నారు. దీనిపై సీఎంతో సహా, రాష్ట్ర ఎంపీలు స్పందించాలని డిమాండ్ చేశారు. కేకే లైన్ను విశాఖలో కొనసాగించడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా రైళ్లు, బోర్డ్ ఉద్యోగాల కేటాయింపులు చేయాలన్నారు. కార్యక్రమంలో లోక్సత్తా నగర అధ్యక్షుడు ఎంఎస్ఎన్ మూర్తి, మార్రపు సుధీర్, ఇప్పలవలస గోపి, శంకర్ పాల్గొన్నారు. -
మన్యం ధీరుడు.. అల్లూరి
● అల్లూరి స్మారకం..అభివృద్ధికి దూరం!● చెదురుతున్న విప్లవ వీరుడి జ్ఞాపకాలు ● నేడు అల్లూరి వర్ధంతి తెలుగుజాతి రోషం.. మన్యం పౌరుషం.. అల్లూరి సీతారామరాజు అడుగుజాడలు నేడు పాలకుల నిర్లక్ష్యపు అడుగుల కింద నలిగిపోతున్నాయి. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన విప్లవ వీరుడి జ్ఞాపకాలు అభివృద్ధికి నోచుకోక వెలవెలబోతున్నాయి. దశాబ్ద కాలంగా వింటున్న పర్యాటక కారిడార్ హామీలు ప్రకటనలకే పరిమితం కాగా, అల్లూరి చరిత్రను కళ్లకు కట్టాల్సిన స్మారక ప్రాంతాలు నేడు శిథిలావస్థకు చేరువవుతున్నాయి. మంప నుంచి రాజేంద్రపాలెం వరకు.. అధికారుల ఉదాసీనతకు సజీవ సాక్ష్యంగా మారుతున్న ఆ ప్రాంతాల దుస్థితిపై నేడు అల్లూరి వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం. కొయ్యూరు: తెలుగుజాతి పౌరుషానికి ప్రతీక, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ పాలకులపై పోరాటం సాగించిన చారిత్రక ప్రాంతాలు నేడు పాలకుల, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. అల్లూరిని బ్రిటీష్ వారు బంధించిన మంప, ఆయనను కాల్చి చంపిన రాజేంద్రపాలెం వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ ఒక భారీ పర్యాటక కారిడార్ ఏర్పాటు చేస్తామని పాలకులు దశాబ్ద కాలంగా హామీలు ఇస్తున్నప్పటికీ, అవి నేటికీ కాగితాలకే పరిమితమయ్యాయి. మంప పార్కు..: కేంద్ర సాంస్కృతిక శాఖ నిధులతో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో రెండేళ్ల క్రితం ఇక్కడ పనులు ప్రారంభమయ్యాయి. అల్లూరి స్నానం చేసే కొలనును ఆధునికీకరించి, చుట్టూ నడక దారిని ఏర్పాటు చేసినప్పటికీ పనులు పూర్తికాలేదు. ● అక్కడ ఉన్న స్మారక స్థూపంపై అల్లూరి జనన, మరణ వివరాలు కనీసం పొందుపరచలేదు. చరిత్రను వివరించేందుకు ఏర్పాటు చేసిన దృశ్య ఫలకాలు కూడా అసంపూర్తిగా ఉండటంతో పర్యాటకులకు సరైన సమాచారం అందడం లేదు. కనీసం చిన్న పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. రాజేంద్రపాలెంలో అదే తీరు : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా రాజేంద్రపాలెంలో అల్లూరితో పాటు ఆయన అనుచరులు గాం గంటన్నదొర, మల్లుదొర, బోనంగి పడాల్ విగ్రహాలను గత ప్రభుత్వంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర ఆవిష్కరించారు. అయితే, ఆ విగ్రహాల చుట్టూ పార్కును సుందరీకరించి, మొక్కలు నాటి నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. అల్లూరి తన పోరాట వ్యూహాలను రచించిన ఉర్లకొండ గుహ మంపలోని కొలనుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఎత్తైన కొండపై ఉండటంతో పర్యాటకులను ఆకర్షించేందుకు ఇక్కడికి రోప్వే నిర్మించాలని ప్రతిపాదనలు నేటికీ ఆచరణకు నోచుకోలేదు. -
ప్రయోగపూర్వక బోధనతో మెరుగైన ఫలితాలు
డీఈవో ప్రేమ కుమార్ సీతంపేట: సైన్స్ ఉపాధ్యాయులు హాండ్స్ ఆన్(ప్రయోగ పూర్వక) పద్ధతుల ద్వారా బోధనా సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ కుమార్ సూచించారు. అక్కయ్యపాలెంలోని ఒక హోటల్లో ఆంధ్రప్రదేశ్ బయలాజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్షాపులో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు అనుభవాత్మక బోధనా పద్ధతులను అవలంబించాలని, బోధనా సామగ్రిని సొంతంగా తయారు చేసుకోవడం ద్వారా విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమవుతాయని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ సాంకేతికతను కూడా బోధనలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జోగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 6, 7 తరగతుల నూతన పాఠ్యపుస్తకాల బోధనలో ఉపాధ్యాయులు తమ అనుభవాలను రంగరించి మెరుగైన వ్యూహాలను రూపొందించుకోవాలన్నారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నీలకంఠ మాట్లాడుతూ.. 6, 7, 8 తరగతుల్లోని సైన్స్ భావనలను ప్రయోగపూర్వకంగా ఎలా వివరించాలో ఈ శిక్షణలో ప్రాక్టికల్గా నేర్పించినట్లు తెలిపారు. ప్రధాన కార్యదర్శి మహ్మద్ గౌస్ మాట్లాడుతూ.. సాంకేతికత, ప్రాక్టికల్స్ కలయికతో బోధన మరింత ప్రభావవంతంగా మారుతుందన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో బోధనా సామగ్రి తయారీ, పాఠ్య ప్రణాళికలు, ప్రజెంటేషన్లు, పోస్టర్లు, విద్యా సంబంధిత వీడియోల తయారీపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే బోధనా పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులందరూ పెదవాల్తేరులోని బయలాజికల్ పార్క్ను సందర్శించారు. అక్కడ ఉన్న ఔషధ మొక్కల గురించి డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ వ్యవస్థాపకుడు రామమూర్తి, విశ్రాంత ఉపాధ్యాయురాలు మంగతాయారు వివరించారు. పర్యావరణ దినోత్సవాలను అర్థవంతంగా నిర్వహించాలని గ్రీన్ కై ్లమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం కోరారు. కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 50 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బీ ఆర్క్, బీ ప్లానింగ్ ఫలితాల్లో ఎసెంట్ సత్తా
మద్దిలపాలెం: జేఈఈ మెయిన్స్ పేపర్–2(బీ ఆర్క్, బీ ప్లానింగ్–2026) ఫలితాల్లో ఎసెంట్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. బీఆర్క్లో సాసనపూరి తోషిణి ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ర్యాంక్ 56, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఆలిండియా 3వ ర్యాంక్, బీ ప్లానింగ్లో సుబుద్ధి కృష్ణ చైతన్య జనరల్ కేటగిరీ ఆలిండియా ర్యాంక్ 9 సాధించినట్లు ఎసెంట్ అకడమిక్ డైరెక్టర్ జి.నాగేశ్వరరావు తెలిపారు. బీఆర్క్లో 45, 79, 90, 102, 121, 146, 201, 374, 433, 441 ఆలిండియా టాప్ ర్యాంకులతోపాటు 72 మంది 5 వేల లోపు ర్యాంకులు సాధించి సత్తాచాటినట్లు పేర్కొన్నారు. బీ ప్లానింగ్లో 15, 21, 23, 29, 39, 47, 60, 88, 105, 117, 127, 127, 139, 143, 150, 166, 179, 184, 226, 250, 255, 272, 280, 316, 326,359, 433 ఆలిండియా టాప్ ర్యాంకులతోపాటు 95 మంది 5 వేల లోపు ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఆధ్యాపకులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. -
కేజీహెచ్కు పరికరాలు అందించిన యూనియన్ బ్యాంక్
మహారాణిపేట: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) కేజీహెచ్ బ్రాంచ్ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్సార్) కింద కేజీహెచ్కు రూ.8 లక్షల 34 వేల 570ల విలువ గల 5 బాయిల్స్ ఆపరేటస్, 15 సెక్షన్ ఆపరేటస్ పరికరాలను విరాళంగా అందించింది. ఈ పరికరాల మంజూరు పత్రాలను యూనియన్ బ్యాంక్ కేజీహెచ్ బ్రాంచ్ మేనేజర్ ఎంవీ శ్రీనివాస్, జోనల్ హెడ్ సోనాలిక, డిప్యూటీ రీజనల్ హెడ్ బీటీ శ్రీనివాస్, రీజనల్ హెడ్ జె.సింహాచలం తదితరులు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణికి అందించారు. వీటిని రోగులకు మత్తు ఇచ్చేందుకు, క్రిటికల్ కేర్, వెంటిలేటర్ మీదున్న రోగులకు అత్యవసర పరిస్ధితుల్లో ప్రాణాలు కాపాడేందుకు, ఆపరేషన్ సమయాల్లో వినియోగిస్తారని అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ కె.శ్రీలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో డీసీఆర్ఎంవో డాక్టర్ ఆర్వీఎస్ కుమార్, ఆర్ఎంవోలు డాక్టర్ ఎ.రాజేష్, డాక్టర్ బంగారయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ బి.ఎస్.సుమతి పాల్గొన్నారు. -
మూడు పార్టీలు కలిసి ఏమి ప్రయోజనం?
విశాఖపట్నం: సామాన్య ప్రజలకు మేలు జరగలేనప్పుడు, ఒక పార్టీని ఓడించేందుకు మూడు పార్టీలు కలిసి రావడంలో ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తూ నగరంలో ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి.‘సంఘమిత్ర సోషల్ సర్వీసెస్’ పేరిట జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన పార్టీలే చేతులు కలపడం ఎందుకని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశాన్ని ప్రభావితం చేస్తున్న 11 ప్రధాన సమస్యలను కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఈ మూడు పార్టీలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీసం ఒక్కో పార్టీ ఒక్క సమస్యనైనా పరిష్కరించి చూపించాలని ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. -
వడదెబ్బతో వృద్ధుడి మృతి
కొమ్మాది: సాగర్నగర్ బీచ్రోడ్డులో మంగళవారం తీవ్రమైన ఎండ వేడిమికి తాళలేక ఒక వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. భీమిలికి చెందిన రేగాని రాంబాబు (58) ఇసుక తోటలో టైలరింగ్ షాపు నిర్వహిస్తున్నారు. ఆయన తన పనుల నిమిత్తం భీమిలి నుంచి బస్సులో బయలుదేరగా, మార్గమధ్యలో ఎండ తీవ్రతకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సాగర్నగర్ సమీపంలో బస్సు దిగిన ఆయన, ఒక్కసారిగా స్పృహ తప్పి బస్టాపులోనే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా, వారు వచ్చి పరీక్షించి అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. -
గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు
పరవాడ: తిక్కవానిపాలెం బీచ్లో సోమవారం రాత్రి గల్లంతైన యువకుడు కావూరి గురునాథరావు ఆచూకీ మంగళవారం నాటికీ లభ్యం కాలేదని పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు చెప్పారు. యువకుడి ఆచూకీ కోసం మెరెన్ పోలీసులు, కోస్ట్గార్డ్ సిబ్బందితో తీరం వెంబడి అప్పికొండ, పూడిమడక ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో జల్లెడ పట్టారు. అయినా ఫలితం కనిపించలేదన్నారు. యువకుడి ఆచూకీ కోసం తీర ప్రాంతం వెంబడి పోలీస్ స్టేషన్లకు సమాచారం అందజేశామన్నారు. బుధవారం ఉదయానికల్లా యువకుడి ఆచూకీ లభించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. -
క్రికెట్ కలలకు వేసవి వేదిక
విశాఖ స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ యవనికపై మెరవాలన్నా లేదా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నా ఏ క్రీడాకారుడికై నా జిల్లా స్థాయి పోటీలే తొలి మెట్టు. నేడు దేశవాళీ క్రికెట్లోకి ఎన్ని ప్రీమియర్ లీగ్లు వచ్చినా, ఒక ఆటగాడి ప్రమాణాలను నిర్ణయించేది మాత్రం జిల్లా స్థాయిలో నేర్చుకున్న ప్రాథమికాంశాలే. ఇక్కడే ఓనమాలు దిద్దిన క్రీడాకారులు క్రమంగా నార్త్ జోన్ స్థాయికి, ఆపై రంజీ ట్రోఫీకి అర్హత సాధిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుత వేసవిలో క్రీడాకారుల సౌకర్యార్థం నాలుగు వేదికల్లో ఈ శిబిరాలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ స్టేడియాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని శిక్షణ ఇస్తుండగా, మున్సిపల్ స్టేడియం, గాజువాక వాసుల కోసం కొరమాండల్ గ్రౌండ్స్, గ్రామీణ ప్రాంత క్రీడాకారుల కోసం ఉక్కు స్టేడియం వేదికలుగా మారాయి. ఈ ఏడాది అండర్ 10, 12, 14, 16 విభాగాల్లో శిక్షణ కోసం ఏకంగా 1839 మంది దరఖాస్తు చేసుకోగా, నాలుగు వేదికల్లో నిర్వహించిన ఎంపికల ద్వారా 484 మందిని తుది శిక్షణకు ఎంపిక చేశారు. వీరిలో దాదాపు 50 మంది వరకు బాలికలు, మహిళా క్రీడాకారిణులు ఉండటం విశేషం. ఈ శిబిరాల్లో క్రీడాకారులకు ప్రాథమిక స్థాయి నుంచి శిక్షణ అందిస్తున్నారు. బ్యాట్ గ్రిప్ పట్టుకోవడం నుంచి స్టాన్స్ వరకు, బంతిని పట్టుకోవడం నుంచి గింగిరాలు తిప్పే స్పిన్ మెళకువల వరకు నిష్ణాతులు నేర్పిస్తున్నారు. మీడియం పేస్ బౌలింగ్, స్పిన్, వికెట్ కీపింగ్ విభాగాల్లో ఇక్కడే పునాది పడుతుందని నిర్వాహక ప్రతినిధి డీఎస్. వర్మ తెలిపారు. అండర్–14 విభాగంలో దరఖాస్తు చేసుకున్న 600 మందిలో 130 మందిని, అండర్–16లో 358 మందిలో 122 మందిని ఎంపిక చేసి జిల్లా జట్టులోకి వెళ్లేలా తీర్చిదిద్దుతున్నారు. సాధారణంగా జిల్లా జట్టు ఎంపిక టోర్నీలు అండర్–14 నుంచే ప్రారంభమైనప్పటికీ, ముందుగానే క్రీడాకారులను సమాయత్తం చేయడానికి అండర్ 10, 12 విభాగాల్లోనూ శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి పార్థసారథి పేర్కొన్నారు. ప్రస్తుతం అండర్ 10లో 96 మందిని, అండర్ 12లో 136 మందిని ఎంపిక చేసి ప్రోత్సహిస్తున్నారు. ఎండ వేడి నుంచి క్రీడాకారులను రక్షించేందుకు రెండు సెషన్లలో శిక్షణ ఇస్తూ, శిబిరం చివర్లో నాలుగు గ్రూపులుగా విభజించి పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని ప్రాబబుల్స్గా ఎంపిక చేసి, భవిష్యత్తులో జిల్లా జట్టు ఎంపికలో వారికి ప్రాధాన్యత కల్పిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో ఈవెంట్ ఆర్గనైజర్ దుర్మరణం
ఎంవీపీ కాలనీ : నగరంలోని మద్దిలపాలెం ఆటోమోటివ్ జంక్షన్ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొండేపు రాజేష్ (34) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే న్యూ కాలనీకి చెందిన రాజేష్ వృత్తిరీత్యా ఈవెంట్ ఆర్గనైజర్. చిప్పాడ గ్రామంలో ఒక ఈవెంట్ నిర్వహించేందుకు తన స్నేహితుడితో కలిసి బైక్పై ఇసుకతోట వైపు బయలుదేరారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆటోమోటివ్ సిగ్నల్ దాటిన తర్వాత, వారి ముందు వెళ్తున్న ఒక మహిళా వాహనదారురాలు ఆకస్మాత్తుగా బ్రేక్ వేశారు. దీంతో రాజేష్ కూడా వెంటనే బ్రేక్ వేయగా, వాహనం అదుపుతప్పి పక్కనే వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ కిందకు దూసుకెళ్లింది. ట్యాంకర్ వెనుక చక్రాలు రాజేష్ పైనుంచి వెళ్లడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్ వెనుక కూర్చున్న అతని స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎంవీపీకాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతివేగం, అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్యాంకర్ ఢీకొని మహిళ మృతి
పరవాడ: అనకాపల్లి–విశాఖ జాతీయ రహదారిపై లంకెలపాలెం కూడలిలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లంకెలపాలెం సమీపంలోని గంజిపేటకు చెందిన గుత్తుల శివపార్వతి (50) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే, శివపార్వతి తన వ్యక్తిగత పనుల నిమిత్తం గాజువాక వెళ్లి తిరిగి తన స్వగ్రామానికి చేరుకునే క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో లంకెలపాలెం కూడలిలో బస్సు దిగారు. అక్కడి నుంచి రోడ్డు దాటుతుండగా..గాజువాక వైపు నుంచి అనకాపల్లి వెళ్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్ ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త సత్యనారాయణ ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసి ఇటీవల పదవీ విరమణ పొందారు, వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆర్. మల్లికార్జునరావు తెలిపారు. -
నీటి సమస్యల పరిష్కారానికి హెల్ప్లైన్ నంబర్
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలోని ప్రజలకు నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. నీటి సరఫరాలో జాప్యం, పైపులైన్ల లీకేజీలు లేదా ఇతర అంతరాయాలపై టోల్ఫ్రీ నంబర్ 1800–4250–0009కు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఆయా వార్డులకు సంబంధించిన మంచినీటి విభాగం సహాయక ఇంజనీర్ల పేర్లు, వారి ఫోన్ నంబర్ల వివరాలను కూడా ఈ టోల్ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. నీటి సరఫరా నిర్ణీత సమయానికి రాకపోయినా లేదా పంపిణీలో ఏవైనా సమస్యలు ఎదురైనా, ప్రజలు వెంటనే ఈ హెల్ప్లైన్ను సంప్రదించి తమ ఫిర్యాదులను పరిష్కరించుకోవాలని కమిషనర్ సూచించారు. -
పాలిసెట్లో 92.38 శాతం ఉత్తీర్ణత
మురళీనగర్ : ఏపీ పాలిసెట్ –2026 ఫలితాల్లో విఽశాఖపట్నం జిల్లా 92.38 శాతం ఉత్తీర్ణత సాధించింది. 14,118 విద్యార్థులకు 13,042 మంది ఉత్తీర్ణత సాధించినట్టు జిల్లా పాలిసెట్ సమన్వయకర్త కేవీ రమణ తెలిపారు. జిల్లాకు చెందిన జామి చేతన్ రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు, శీలం హేమచంద్ర తొమ్మిదో ర్యాంకు, గొర్లె బాలాదిత్య 12 ర్యాంకు సాధించినట్టు పేర్కొన్నారు. వీరందరూ 120 మార్కులకు 120 మార్కులు సాధించినట్టు తెలిపారు. చేతన్ (3వ ర్యాంక్), హేమచంద్ర (9వ ర్యాంక్), బాలాదిత్య (12వ ర్యాంక్)120/120 మార్కులు సాధించిన జిల్లా విద్యార్థులు -
బాబు మాటను బేఖాతరు చేసిన కేంద్రం
వాల్తేరు డివిజన్లో కీలక ఆదాయాన్ని తెచ్చిపెట్టే కేకే లైన్ను విశాఖలోనే ఉంచాలంటూ జోన్ ప్రకటన వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాటం చేస్తూనే ఉన్నారు. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందించలేదు. ఇటీవల డేటా సెంటర్ శంకుస్థాపనకు వచ్చిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో చంద్రబాబు చర్చించారు. అరకుతో కూడిన కేకే లైన్ విశాఖ జోన్లో కలపాలని కోరారు. అప్పుడే చంద్రబాబు అభ్యర్థనను రైల్వే మంత్రి తోసి పుచ్చినట్లు సమాచారం. ఇప్పుడు వాల్తేరు డివిజన్ విభజన తీరు చూస్తుంటే కేంద్రం వద్ద చంద్రబాబు పరపతి ఏపాటిదో అర్థమవుతోంది. కేకే లైన్ను ఒడిశాకే కట్టబెడుతూ గెజిట్ విడుదల చేయడం బాబు అసమర్థతకు నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముడసర్లోవలో కొనసాగుతున్న జోన్ ప్రధాన కార్యాలయం పనులు -
శ్వాసకు ‘బ్రేక్’.. వెంటిలేటర్ల షాక్
మహారాణిపేట: కేజీహెచ్.. ఉత్తరాంధ్ర ప్రజలకే కాక, పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ పేదలకు కూడా ఒక నమ్మకమైన వైద్య కేంద్రం. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో అత్యవసర ప్రాణవాయువును అందించే వెంటిలేటర్ల వ్యవస్థ కుప్పకూలడం రోగుల పాలిట శాపంగా మారింది. రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ఊపిరితిత్తులు సహకరించని సమయంలో శ్వాస అందించేందుకు వెంటిలేటర్ ఎంతో కీలకం. ముఖ్యంగా రోడ్డు ప్రమాద బాధితులకు, అగ్నిప్రమాద క్షతగాత్రులకు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఇది జీవనాధారం. ఇటువంటి కీలకమైన పరికరాలు మెజారిటీ సంఖ్యలో మూలపడటం ఆందోళన కలిగిస్తోంది. పరిమితమైన వనరులు కేజీహెచ్లో అధికారికంగా 1,187 పడకలు ఉన్నప్పటికీ, ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య అంతకు రెట్టింపుగా ఉంటోంది. ప్రతిరోజూ సుమారు 2500 మందికి పైగా ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ఓపీ విభాగం కిటకిటలాడుతుంటుంది. నిత్యం వందలాది మంది ఇన్పేషెంట్లుగా చేరుతుంటారు. సుమారు 26 విభాగాలు కలిగిన ఈ ఆస్పత్రిలో రోగుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెరగకపోగా, ఉన్న సౌకర్యాలు కూడా కంటికి కనిపించకుండా పోతున్నాయి. 92 మాత్రమే పనిచేస్తున్నాయి ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో, అత్యవసర వార్డుల్లో మొత్తం 415 వెంటిలేటర్లు ఉండగా, ప్రస్తుతం అందులో కేవలం 92 మాత్రమే పనిచేస్తుండటం గమనార్హం. మిగిలిన 323 వెంటిలేటర్లు చిన్నపాటి మరమ్మత్తులకు గురయ్యాయి. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో వెంటిలేటర్లను మంజూరు చేసింది. ఆ సమయంలో ఇవి అద్భుతంగా పనిచేసినప్పటికీ, ఆ తర్వాత సరైన నిర్వహణ లేకపోవడంతో పనికిరాకుండా పోయాయి. మరమ్మత్తులు చేయించడంలో అధికారుల అలసత్వం, కొత్త వాటి కొనుగోలులో జాప్యం వెరసి పేద రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తక్షణ చర్యలు అవసరం ఆస్పత్రిలో క్యాజువాలిటీ, ఐసీయూ, ఐఆర్సీ, ఈఎండీ, సీసీయూ వంటి కీలక విభాగాల్లో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ యంత్రాలకు మరమ్మత్తులు చేయించాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి, నిధుల విడుదల, నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించాలని బాధితులు, ప్రజలు కోరుతున్నారు. పేదలకు తప్పని ఆర్థిక భారం కేజీహెచ్ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్ సౌకర్యం ఉచితంగా లభిస్తుంది. అదే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే రోజుకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చు అవుతుంది. అంత భారీ మొత్తంలో బిల్లులు చెల్లించలేక, రోగి కోలుకోక నిస్సహాయ స్థితిలో ఉన్న సామాన్యులు మళ్లీ కేజీహెచ్కే పరుగులు తీస్తున్నారు. కానీ ఇక్కడకు వచ్చాక వెంటిలేటర్లు అందుబాటులో లేవని తెలిసినప్పుడు వారి ఆవేదన వర్ణనాతీతం. -
జూన్ 1 నుంచి కార్యకలాపాలు
రైల్వే చట్టం–1989 ప్రకారం తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే జోన్లను పునర్వ్యవస్థీకరించి దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఏర్పాటు చేశారు. మంగళవారం విడుదలైన గెజిట్ ప్రకా రం జూన్ 1 నుంచి ఈ జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. జోన్ పరిధిలో మొత్తం నాలుగు డివిజన్లు ఉంటాయి. గతంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను ఈ జోన్లో చేర్చారు. అదేవిధంగా వాల్తేరు డివిజన్ను విభజించి.. దానిలో కొంత భాగంతో కొత్తగా విశాఖపట్నం డివిజన్ను ఏర్పాటు చేశారు. మరోవైపు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు కొనసాగనున్నాయి. -
ముగిసిన అంబేడ్కర్ జయంతి పక్షోత్సవాలు
విశాఖ సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి పక్షోత్సవాలను విశాఖ పోర్ట్ అథారిటీ రెండు వారాల పాటు ఘనంగా నిర్వహించింది. మంగళవారం పోర్ట్ పరిపాలన భవనంలోని సాంబమూర్తి ఆడిటోరియంలో వీపీఏ డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరాంజి కొరాటి, ఇతర విభాగాధిపతులు, పోర్ట్ అధికారులు, ఉద్యోగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోర్ట్ ఎస్సీ, ఎస్టీ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేద మహిళలకు చీరలు, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పోర్ట్ ఎస్సీ, ఎస్టీ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.ఉమామహేశ్వరరావు, కార్యదర్శి ఎం.దేవిశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఓ.రామలింగం, కార్యదర్శి జి.శివరామకృష్ణ, కోశాధికారి ఎం.రాజ్కుమార్ పాల్గొన్నారు. -
పెన్షనర్స్కు డీఏ, ఎరియర్స్ విడుదల
మహారాణిపేట: ప్రభుత్వం పెన్షనర్లకు జనవరి 2026లో ప్రకటించిన డీఏ బకాయిలను ఎట్టకేలకు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గత నెల 16న ‘సాక్షి’ దినపత్రికలో ‘పెన్షనర్లకు మొండిచేయి’ శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించిన అధికార యంత్రాంగం, నిలిచిపోయిన నిధుల విడుదలకు చర్యలు చేపట్టింది. వివిధ సాంకేతిక కారణాల వల్ల సీతమ్మధార సబ్ ట్రెజరీ పరిధిలో సుమారు 13,500 మంది పెన్షనర్లకు ఈ ఏరియర్స్ చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన బిల్లులు తాజాగా రాష్ట్ర ఖజానా శాఖ నుంచి సీతమ్మధార ఉప ఖజానాకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ బిల్లుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని, బుధవారం తర్వాత ఈ నిధులను నేరుగా పింఛన్దారుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని జిల్లా ట్రెజరీ అధికారి ఎం. మోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. పెన్షనర్లు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. -
కేకే లైన్ కట్
జోన్ గిఫ్ట్దక్షిణ కోస్తా రైల్వే జోన్కు గెజిట్ విడుదల 3,413 కి.మీ పరిధిలో విశాఖ కేంద్రంగా కొత్త జోన్ కేకే లైన్పై కేంద్రం నిర్ణయంతో అసంతృప్తి సాక్షి, విశాఖపట్నం: రైల్వే జోన్ కోసం విశాఖ వాసులు దశాబ్దాలుగా ఎదురుచూసిన కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రకటన వెలువడిన ఏడేళ్ల తర్వాత దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 1 నుంచి వీఎంఆర్డీఏ భవనంలో తాత్కాలికంగా ఈ జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈ గెజిట్ తీపి కబురు కంటే చేదు నిజాలనే ఎక్కువగా మోసుకొచ్చింది. కీలకమైన ఆదాయ వనరుల పంపిణీ, విభజన అంశాల్లో కేంద్రం తీవ్ర నిరాశకు గురిచేసింది. ‘కామధేనువు’ లాంటి కేకే లైన్ మొత్తాన్ని ఒడిశాలోని రాయగడ డివిజన్కు కట్టబెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్థికంగా దెబ్బకొట్టిన విభజన వాల్తేరు డివిజన్ విభజన తీరు ఏపీకి తీరని అన్యాయం చేసేలా ఉంది. ఇనుప ఖనిజం రవాణా ద్వారా భారీ ఆదాయం తెచ్చే కిరండూల్ మార్గాన్ని రాయగడకు కేటాయించడం ద్వారా కొత్త జోన్ ఆర్థిక వెన్నెముకను కేంద్రం విరిచేసింది. విశాఖకు కేవలం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండి, నిర్వహణ ఖర్చులు భారమయ్యే మార్గాలను మాత్రమే ఇచ్చారు. అంటే, రాబడి వచ్చే మార్గాలన్నీ పక్క రాష్ట్రానికి.. ఖర్చులు పెరిగే మార్గాలు మాత్రం విశాఖకు అన్నట్టుగా ఈ విభజన సాగింది. -
కమర్షియల్ సెగ!
సాక్షి, విశాఖపట్నం : పెరుగుతున్న వాణిజ్య సిలిండర్ల ధరలు నగరంలోని హోటల్ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. మూడు నెలల కాలంలోనే మూడుసార్లు ధరలు (మార్చిలో రూ.144, ఏప్రిల్లో సుమారు రూ.200 పెంచగా.. ఈసారి ఏకంగా రూ.993) పెరగడంతో నిర్వహణ భారం పెరిగి హోటల్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 30 నాటికి కమర్షియల్ సిలెండర్ ధర రూ.2,153 ఉండగా.. ప్రస్తుతం రూ.3,200 కి చేరుకుంది. దీని ప్రభావంతో హోటల్ రంగంపై కోలుకోలేని దెబ్బపడింది. పెరిగిన ముడిసరుకుల ధరలకు తోడు, గ్యాస్ భారం తోడవడంతో వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. ఒకవైపు నిత్యావసరాల ధరలు, మరోవైపు గ్యాస్ మంటతో లాభాలు రాక పెట్టుబడులు కూడా కోల్పోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఈ భారానికి తట్టుకోలేక ఇప్పటికే పలు చిరుహోటళ్లు మూతపడగా, వాటిని నమ్ముకున్న వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ధరలు 10 నుంచి 15 శాతం పెంపు సరైన సమయంలో స్టాక్ దొరక్క పోవడంతో ఈ మధ్య కాలంలో రూ.3 వేలకు బ్లాక్లో కొనుగోలు చేసేవాళ్లు. ఇప్పుడు వాస్తవ ధర రూ.3 వేలకు పైగా ఉండటంతో బ్లాక్లో రూ.4000 నుంచి రూ.4500 వరకూ పలుకుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిలెండర్ల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఆ భారాన్ని భరించేందుకు హోటల్ యజమానులు మెనూ ధరల మార్పుని ఎంచుకున్నారు. నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లు ఇప్పటికే తమ మెనూ ధరలను 10 నుంచి 15 శాతం వరకూ పెంచేశాయి. మూతపడుతున్న చిన్న హోటల్స్ అసలే గ్యాస్ దొరక్క అష్టకష్టాలు పడుతున్న చిన్న చిన్న హోటల్స్ యజమానులు.. ఇప్పుడు ధర పెరగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని చిన్న హోటల్స్, ఫుడ్ కోర్టులు, టిఫిన్, మీల్స్ బండ్ల వ్యాపారుల పరిస్థితి దారుణంగా మారింది. సిలెండర్లు ఇంత ధర పెట్టి కొనుగోలు చేసినా వ్యాపారంలో నష్టాలే తప్ప లాభాలు వచ్చే అవకాశాలు లేవని భావించి.. చిన్న చిన్న హోటల్స్ని మూసేస్తున్నారు. ధర పెంచి అమ్మినా ప్రజలు తినేందుకు వచ్చే సూచనలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 25 శాతం వరకూ చిన్న చిన్న రెస్టారెంట్లు, బళ్లు మూతపడినట్లు తెలుస్తోంది. రోడ్డున పడుతున్న కార్మికులు! హోటళ్లు మూతపడుతుండటంతో మాస్టర్లు, సర్వర్లు, క్లీనర్లుగా పనిచేస్తున్న వేలాది మంది ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అటు హోటల్ యజమానులు ధరలు పెంచితే కస్టమర్లు తగ్గుతారని, పెంచకపోతే నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన ధరల వల్ల సామాన్యులు హోటల్ మెట్లెక్కాలంటేనే భయపడుతుండగా, మరోవైపు కొత్త పనులు దొరక్క కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమర్షియల్ సిలిండర్ ధర ఖర్చులు రెట్టింపయ్యాయి గతంలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య సిలిండర్ ధర లు రూ.3వేల మార్కును దాట డం మా లాంటి హోటల్ నిర్వహకుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. గ్యాస్ ధరలే కాకుండా, నిత్యావసర సరుకులు, విద్యుత్ చార్జీలు కూడా తోడవడంతో రోజువారీ ఖర్చులు రెట్టింపయ్యాయి. కస్టమర్లపై భారం వేయకూడదని ఇన్నాళ్లూ ఓపిక పట్టినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో మెనూ ధరలు పెంచక తప్పడం లేదు. ధరలు పెంచితే కస్టమర్ల సంఖ్య తగ్గుతోంది, పెంచకపోతే నిర్వహణ భారమై నష్టాలు వస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సిబ్బందికి జీతాలు ఇవ్వడం కూడా కష్టమే. – రాజశేఖర్, అతిథి దేవోభవ హోటల్ యజమాని -
దద్దరిల్లిన కలెక్టరేట్
సమస్యల పరిష్కారం కోసం హోరెత్తిన నిరసనలుమహారాణిపేట: సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం విశాఖ జిల్లా కలెక్టరేట్ ధర్నాలు, నిరసనలతో దద్దరిల్లింది. ఉపాధ్యాయులు, కార్మికులు, మత్స్యకారులు, స్థానికులతో పాటు తమ గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చిన దివ్యాంగులతో కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వివిధ వర్గాల ప్రజలు భారీ ర్యాలీలతో తరలివచ్చి జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్కు వినతిపత్రాలు అందజేశారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల గర్జన డీఎస్సీ 1998 మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ఉపాధ్యాయులు తమ ఉద్యోగ భద్రత కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని, కనీస పెన్షన్ సౌకర్యం కల్పించాలని, సమాన పనికి సమాన వేతనంతో పాటు రెగ్యులర్ ఉపాధ్యాయుల వలె అన్ని అలవెన్సులు వర్తింపజేయాలని అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.సూర్యనారాయణ డిమాండ్ చేశారు. హార్బర్ కార్మికులను ఆందోళన ఇక ఫిషింగ్ హార్బర్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వేట సామగ్రి నిల్వకు సదుపాయాలు, విశ్రాంతి గదులు, డీజిల్ సబ్సిడీ, ప్రమాద బీమా, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) నాయకుడు పి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అదానీ పోర్టు కాలుష్యంపై పోరు గంగవరం అదానీ పోర్టు వల్ల కలుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలని గ్రామస్తులు నిరసన చేపట్టారు. కాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని, తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని ఐక్యవేదిక నేత కంబాల రాజు కోరారు. అవసరమైతే గంగవరం పరిధిలోని నాలుగు గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. -
2029లో బిగ్గెస్ట్ విజయం జగన్దే..
డాబాగార్డెన్స్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘనవిజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంపై దక్షిణ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో జగదాంబ జంక్షన్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద 29వ వార్డు అధ్యక్షుడు పీతల వాసు ఆధ్వర్యంలో, అలాగే పూర్ణా మార్కెట్ వద్ద 35వ వార్డు అధ్యక్షుడు అలపున కనకరెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు బాణసంచా కాల్చి, కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. తమిళనాడు ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి, విజయ్ కలిసి ఉన్న ఫొటో చూసి అక్కడి తెలుగు వారు టీవీకే పార్టీకి ఓటు వేసి అత్యధిక స్థానాల్లో గెలిపించారని పేర్కొన్నారు. ఎవరితోనూ పొత్తులు లేకుండా, కేవలం తమ బలాన్నే నమ్ముకుని సింగిల్గా పోటీ చేసి గెలిచిన మొనగాళ్లు జగన్, విజయ్ మాత్రమేనని కొనియాడారు. వారిద్దరి చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ.. ‘సింగిల్ ఇంజన్’ పవర్ ఏంటో తమిళనాడు ప్రజలు చూపించారని, డబుల్ ఇంజన్ అంటూ అక్కడికి వెళ్లిన చంద్రబాబుకు ప్రజలు మొహం చాటేశారని ఎద్దేవా చేశారు. ఏపీలో కూడా 2029 ఎన్నికల్లో ఇదే ఫలితం పునరావృతమవుతుందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ విజయంతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. 2027లో జగన్ చేపట్టబోయే పాదయాత్రలో ప్రతిరోజూ కూటమి ప్రభుత్వానికి సినిమా చూపిస్తారని హెచ్చరించారు. 1000 వాలా టపాకాయలు కాలిస్తే రచ్చ చేయడం హాస్యాస్పదమని, పోలీసులు కూటమి నేతలకు కొమ్ముకాయడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా ధనాన్ని విపరీతంగా దుబారా చేస్తోందని వాసుపల్లి మండిపడ్డారు. అమరావతిలో కేవలం అద్దాల మేడ కోసమే రూ. 2,900 కోట్లు ఖర్చు చేయడం దారుణమని, ప్రతి రూపాయికి చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులను గడువులోగా పరిష్కరించాలని, ప్రజలకు సత్వర న్యాయం చేయడమే అధికారుల ప్రథమ కర్తవ్యమని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వీసు సంబంధిత వినతుల కోసం ప్రత్యేక ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. పరిష్కరించిన ఫిర్యా దులు మళ్లీ రీ–ఓపెన్ కాకూడదని ఆదేశించారు. ముఖ్యంగా సీఎం కార్యాలయం నుంచి బదిలీ అయ్యే ఫిర్యాదులను డీఆర్వో ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ప్రజలు ఇచ్చే వినతుల నమోదుకు ప్రత్యేక రిజిస్టర్ను నిర్వహించాలని, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్కు మొత్తం 354 వినతులు వచ్చాయి. -
సేవల నాణ్యతతోనే ప్రజల్లో సంతృప్తి
మహారాణిపేట : ప్రభుత్వం అందించే సేవలు ప్రజలకు చేరువయ్యేలా అధికారులు నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ సూచించారు. ఈ నెల 7, 8 తేదీల్లో జరగనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ సన్నద్ధతపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐవీఆర్ఎస్ , క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నామని, అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకుని ఏ ప్లస్ ర్యాంకు సాధించేలా లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. జిల్లా ప్రగతికి ప్రాధాన్యతనిస్తూ శాఖల వారీగా డేటా ఎంట్రీని సక్రమంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ర అధికారులు పాల్గొన్నారు. -
పరవాడ తీరంలో గల్లంతైన పాలిటెక్నిక్ విద్యార్థి
పరవాడ: మండలంలోని తిక్కవానిపాలెం తీరంలో సోమవారం సాయంత్రం అలల తాకిడికి గురై కావూరి గురునాథరావు (19) అనే యువకుడు సముద్రంలో గల్లంతయ్యాడు. పరవాడ మండలం పి.బోనంగి గ్రామానికి చెందిన ఇతడు, అండమాన్ నుంచి వచ్చిన స్నేహితులతో కలిసి తీరానికి వెళ్లాడు. సరదాగా స్నానానికి దిగిన సమయంలో రాకాసి అలలు అతడిని లోపలికి లాక్కొని పోయాయి. సమాచారం అందుకున్న పరవాడ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి పడటంతో గాలింపును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. పాలిటెక్నిక్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్న ఏకై క కుమారుడు కళ్లెదుటే గల్లంతవడంతో తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరవుతోంది. -
అకాల వర్షాలతో ఉప్పు సాగుకు విఘాతం
తగరపువలస: ఎండలు మండుతున్న తరుణంలో కురిసిన అకాల వర్షాలు ఉప్పు రైతులకు కష్టాలను తెచ్చిపెట్టాయి. భీమిలి మండలం కొత్త మూలకుద్దు పంచాయతీ పరిధిలోని 99 ఎకరాల్లో సాగవుతున్న ఉప్పు మళ్లు వర్షపు నీటితో నిండిపోయాయి. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు సాగే ఈ సాగులో, మేలో వచ్చే దిగుబడి అత్యంత కీలకం. అయితే ఈ నెల ఒకటో తేదీన కురిసిన భారీ వర్షానికి మళ్లన్నీ నీట మునిగి సాగుకు పనికిరాకుండా పోయాయి. ఆదివారం కూడా వాతావరణం చల్లబడటంతో రైతులు సాగుకు విరామం ప్రకటించారు. సిద్ధంగా ఉన్న ఉప్పు రాశులు తడవకుండా పరదాలు కప్పి భద్రపరుస్తున్నారు. మరోవైపు గ్రామంలో సుత్తమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభం కావడంతో రైతులు పనులకు స్వస్తి చెప్పారు. ఈ నెల 6న పండగ ముగిసిన తర్వాత ఎండలు కాస్తేనే మళ్లీ సాగును పునఃప్రారంభించే అవకాశం ఉందని కౌలు రైతులు వెల్లడించారు. -
ప్రశాంతంగా నీట్
మహారాణిపేట: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్–2026) జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, 98.46 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 8,112 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. వారిలో 7,987 మంది పరీక్ష రాశారు. 125 మంది మాత్రమే గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలన్నింటినీ పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల నిఘాలో ఉంచి పర్యవేక్షించారు. ఉదయం నుంచే విద్యార్థుల సందడి పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరిగింది. అయితే ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ట్రాఫిక్ లేదా ఇతర ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఉరుకులు పరుగులతో సెంటర్లకు వచ్చారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేయడంతో విద్యార్థులు సకాలంలో చేరుకున్నారు. తెలుగు, హిందీ, ఆంగ్లంతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో విద్యార్థులు ఈ పరీక్షను రాశారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీతో పాటు, 104 ఏరియాలోని కేంద్రీయ విద్యాలయం(1), కేంద్రీయ విద్యాలయం(2) తదితర కేంద్రాల వద్ద విద్యార్థులు క్యూల్లో బారులుదీరారు. కఠిన నిబంధనలు అమలు నీట్ నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రాల వద్ద సిబ్బంది కఠిన తనిఖీలు చేపట్టారు. లోపలికి ఎలాంటి ఆభరణాలను అనుమతించలేదు. దీంతో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినులు తమ చెవి దుద్దులు, ముక్కు పుడకలు, చేతి వాచీలు, కాళ్ల పట్టీలను సెంటర్ల బయటే తొలగించి తమ తల్లిదండ్రులకు అందజేశారు. కనీసం తలకు ఉన్న క్లిప్పులను సైతం తీయించేయడంతో విద్యార్థినులు జుట్టు విరబోసుకుని పరీక్షకు హాజరుకావాల్సి వచ్చింది. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే ముందు పలువురు విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం కనిపించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా పరీక్ష ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసిందని అధికారులు వెల్లడించారు. 98.46 శాతం మంది హాజరు -
‘పది’లో తెలుగు తడబాటు
సులభమనుకున్న తెలుగులోనే సున్నా.. ఆరిలోవ: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జిల్లా 89.51 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచింది. అయితే అందరినీ విస్మయానికి గురిచేస్తూ అత్యధిక మంది విద్యార్థులు మాతృభాష తెలుగులోనే తప్పడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు హాజరైన 28,929 మంది విద్యార్థుల్లో 25,894 మంది ఉత్తీర్ణులయ్యారు. మిగిలిన 3,035 మంది విద్యార్థులు ఫైయిల్ అయ్యారు. అన్ని సబ్జెక్టులలోను ఫెయిల్ అయిన విద్యార్థులున్నారు. వారిలో ఎక్కువమంది విద్యార్థులు తెలుగు పరీక్ష తప్పడం విశేషం. సాధారణంగా తెలుగును అత్యంత సులువైన సబ్జెక్టుగా భావించి విద్యార్థులు నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఉపాధ్యాయులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇతర సబ్జెక్టులపై చూపే శ్రద్ధను తెలుగుపై చూపకపోవడం, మాతృభాష పట్ల పెరుగుతున్న ఉదాసీనత ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఆంగ్లం, హిందీ వంటి ఇతర భాషల్లో తక్కువ మంది విద్యార్థులు తప్పినప్పటికీ, సొంత భాషలోనే అత్యధికులు వెనుకబడటం భాషాభిమానులను ఆలోచనలో పడేస్తోంది. తెలుగు భాషా బోధనలో మార్పులు రావాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు నొక్కి చెబుతున్నాయి. -
పంచగ్రామాల భూసమస్య పరిష్కారానికి పాదయాత్ర
సింహాచలం: దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న పంచగ్రామాల భూసమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆదివారం నుంచి పాదయాత్రను చేపట్టింది. తొలిరోజు నాయుడుతోటలో ప్రారంభమైన ఈ యాత్రను సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె. లోకనాథం, జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దాదాపు మూడు దశాబ్దాల నుంచి భూసమస్య కారణంగా రైతులు, ఇళ్ల యజమానులు, స్థలాల యజమానులు రిజిస్ట్రేషన్లు కాక, అభివృద్ధి పనులు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా, మంత్రులు మారినా సమస్య మాత్రం అడుగు ముందుకు పడలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను మభ్యపెడుతోందని ధ్వజమెత్తారు.ప్రజలకు పూర్తిస్థాయి యాజమాన్య హక్కులతో పట్టాలు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని, భూహక్కుల కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్ర ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుతుందని వారు వెల్లడించారు. నాయుడుతోట నుంచి ప్రారంభమైన ఈ యాత్ర సాయిమాధవ్నగర్, భరత్నగర్ మీదుగా సాగింది. కార్యక్రమంలో పంచగ్రామాల కాలనీల సంఘాల ప్రతినిధులు, సీపీఎం నాయకులు బి.జగన్, పి.వెంకటరెడ్డి, బి.వెంకట్రావు, ముద్దాడ ప్రసాద్, యు.రాజు, ప్రభావతి, తిరుపతిరావు, జ్యోతీశ్వరరావు, ప్రభుదేవా, సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. -
వరుణుడు కరుణిస్తేనే మాచ్ఖండ్ పవర్
● కళ తప్పుతున్న జోలాపుట్టు జలాశయం ● గణనీయంగా తగ్గిపోతున్న నీటిమట్టం అంతంతమాత్రంగా నిల్వలున్న ఆంధ్రాకు చెందిన జోలాపుట్టు ప్రధాన జలాశయంపూర్తిగా అడుగంటిన జోలాపుట్టు స్పిల్వే జలాశయంముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి ప్రధాన నీటి వనరు అయిన జోలాపుట్టు జలాశయం నీటి కళ తప్పుతోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా జలాశయంలో నీటి మట్టం వేగంగా పడిపోతోంది. నీరు తగ్గుతుండటంతో జలాశయం గర్భంలోని రాళ్లు బయటపడి కనిపిస్తున్నాయి. ● జోలాపుట్టు జలాశయం నుంచి డుడుమ జలపాతానికి నీటి విడుదల నిరంతరాయంగా కొనసాగుతుండటం, మరోవైపు ఎండల వల్ల నీరు ఆవిరైపోతుండటంతో నిల్వలు కనిష్ట స్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం ఒడిశాకు చెందిన స్పిల్వే డ్యామ్ ప్రాంతం పూర్తిగా అడుగంటిపోయింది. కేవలం ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రధాన జలాశయ భాగంలో మాత్రమే స్వల్పంగా నీటి నిల్వలు ఉన్నాయి. ● ఈ (మే) నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోతే మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. జలాశయం తిరిగి జలకళ సంతరించుకోవాలంటే వర్షాలే దిక్కని స్థానికులు, అధికారులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులపైనే జోలాపుట్టు భవిష్యత్తు ఆధారపడి ఉంది. -
విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచుదాం
సబ్బవరం: విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచుదామని 13వ ఆంధ్రా బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ పిలుపునిచ్చారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో 600 మంది ఎన్సీసీ క్యాడెట్లతో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ శిబిరంలో గ్రీన్ క్లైమేట్ బృందం ఆధ్వర్యంలో ఆదివారం విత్తన బంతులు తయారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశీయ విత్తనాలు వృథా కాకుండా వాటిని సేకరించి విత్తన బంతులు తయారు చేయడం మన బాధ్యత అన్నారు. ప్రతి ఎన్సీసీ క్యాడెట్ పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయడం కూడా ఓ సామాజిక బాధ్యతగా పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా క్యాడెట్లు సుశిక్షితులు కావాలని అభిలషించారు. క్రమశిక్షణ, అభ్యాసం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో సాగుతున్న శిబిరంలో క్యాడెట్లు ఎంతో ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. శిబిరంలో భాగంగా ఉదయం నుంచి క్యాడెట్లకు కఠిన శారీరక శిక్షణ అందించారు. పరుగు, సాగతీత వ్యాయామాలతో వారి శారీరక సామర్థ్యాన్ని పెంపొందించారు. అనంతరం జరిగిన డ్రిల్ పరేడ్లో క్యాడెట్లు కచ్చితత్వం, సమన్వయంతో ఆకట్టుకున్నారు. విద్యాపరమైన సెషన్లలో భారత రక్షణ వ్యవస్థపై అవగాహన కల్పించారు. సైన్యం కార్యాచరణ, ఆయుధాలు–పరికరాలు, ర్యాంక్ నిర్మాణం వంటి అంశాలను వివరించి, భవిష్యత్లో సైనిక రంగంపై ఆసక్తిని పెంపొందించారు. ఇదే సందర్భంలో ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ పద్ధతులు, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అధికారి స్థాయికి చేరేందుకు అవసరమైన నాయకత్వ లక్షణాలు, ఆత్మ విశ్వాసాన్ని పెంచేలా దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు అనంతభాస్కర్, జగదేశ్వరరావు, సన్యాసిరావు, హరికిరణ్, గ్రీన్ క్ల్లైమేట్ ప్రతినిధులు పాల్గొన్నారు. 13వ ఆంధ్ర బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ -
కోచ్ మెయింటెనెన్స్ డిపో @ జగన్నాథపురం
పాత రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని నవీకరించనున్న రైల్వే శాఖ ● 118 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు ● వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల నిర్వహణ ఇక్కడే చేపట్టేలా చర్యలు ● ఈ డిపో అనకాపల్లి, సబ్బవరం ప్రాంతాలకు అనుసంధానం ● ఇందుకోసం ప్రత్యేక మార్గాల ఏర్పాటుకు సన్నాహాలు ● కొత్త మార్గం కోసం 115 ఎకరాలు అవసరమని గుర్తించిన అధికారులు ● ఇందులో కొంత ప్రభుత్వ భూమి ఉండగా.. మిగిలింది సమీకరించే ప్రతిపాదన సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్న నేపథ్యంలో.. కొత్తగా ఏర్పడనున్న విశాఖ డివిజన్లో కొత్త ప్రాజెక్టులపై రైల్వే బోర్డు సన్నద్ధమవుతోంది. వందేభారత్, అమృత్భారత్ రైళ్ల సర్వీసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వహణ డిపోలు దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా విశాఖలోనూ ఓ కోచ్ మెయింటెనెన్స్ డిపో కూడా రాబోతోంది. రూ.వందల కోట్లతో షెడ్ల నిర్మాణానికి అనువైన స్థలం గుర్తించారు. విశాఖ వన్ టౌన్ సమీపంలోని పాత రైల్వే స్టేషన్ ప్రాంతంలో కోచ్ మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ డిపోని అనకాపల్లి, సబ్బవరం ప్రాంతాలకు అనుసంధానం చేసేలా కొత్త లైన్లు ఏర్పాటుకూ రంగం సిద్ధం చేస్తున్నారు. భారతీయ రైల్వే వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన వందేభారత్, అమృత్ భారత్ రైలు సర్వీసులకు ఆదరణ గణనీయంగా పెరుగుతూ వస్తోంది. సౌకర్యవంతంగా.. సదుపాయాలతో కూడిన వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న ఈ రైళ్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. విశాఖ నుంచి రెండు వందేభారత్లు, ఒక అమృత్ భారత్ రైలు సర్వీసులు నడుస్తున్నాయి. త్వరలోనే తిరుపతికి కూడా వందేభారత్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్ రాబోతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ఈ రెండు రైళ్ల సర్వీసులు మరిన్ని పెరగనున్నాయి. అందుకే విశాఖలో ఈ రైళ్ల నిర్వహణ కోసం మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు భావిస్తోంది. రెండున్నరేళ్ల క్రితం వందేభారత్ మెయింటెనెన్స్ డిపో వైజాగ్లో నిర్మించాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. ఆ తర్వాత అధికారులు దీనిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు జోన్ ప్రక్రియ వేగవంతం కావడంతో.. మరోసారి ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. అనకాపల్లి, సబ్బవరం వరకూ అనుసంధానం ఈ కోచ్ డిపో నుంచి అనకాపల్లి మీదుగా సబ్బవరం లైన్లకు అనుసంధానించ నున్నారు. దీనివల్ల అటువైపు వెళ్లే రైళ్లని ఇటుగా మళ్లించేందుకు వీలవుతుంది. రైల్వే స్టేషన్ నుంచి కోచ్ మెయింటెనెన్స్ డిపో మీదుగా వెళ్తే ప్రధాన స్టేషన్పై ట్రాఫిక్ భారం కూడా తగ్గనుంది. ఈ కనెక్టివిటీ కోసం కొత్త లైన్లు వేయనున్నారు. దీనికి సంబంధించిన సర్వే కూడా పూర్తి చేశారు. ఈ కనెక్టివిటీ నెట్వర్క్ కోసం సుమారు 115 ఎకరాలు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. ఈ లైన్లు వెళ్లే మార్గంలో 40 శాతం వరకూ ప్రభుత్వ భూములున్నాయి. మిగిలిన భూముల్ని సమీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నెట్వర్క్ బలోపేతమయ్యేలా.. వందేభారత్, అమృత్భారత్ రైళ్ల మెయింటెనెన్స్ కోసం, డిపోలు, నిర్వహణ కార్యక్రమాల్ని దేశ వ్యాప్తంగా చేపడుతున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న దక్షిణకోస్తా జోన్లో విశాఖలో డిపో రానుంది. ఈ కోచ్ డిపోలో ఈ రైళ్లను నిలిపి ఉంచుతారు. ఈ రైళ్లలో ఇన్స్పెక్షన్ అండ్ మెయింటెనెన్స్ టేబుల్స్ నిర్వహిస్తారు. ఈ టేబుల్స్లో, పర్ఫార్మెన్స్ టెస్ట్లు, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రొసీజర్ల వివరాలు ఉంటాయి. వందేభారత్ రైళ్ల కోసం, ట్రాక్షన్, ప్రధాన ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లకు ప్రివెంటివ్, కరెక్టివ్ మెయింటెనెన్స్ను అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఇక్కడ రాబోతున్న డిపోలో రన్నింగ్ మెయింటెనెన్స్ బేలో ట్రిప్ షెడ్యూల్లు లేదా వీక్లీ షెడ్యూల్లు వంటి కార్యాచరణ నిర్వహణ కోసం సౌకర్యాలు కల్పిస్తారు. ఇందులో అండర్ గేర్, ఓవర్ హెడ్ పరికరాలు, ఇంటీరియర్లను తనిఖీ చేయడం, వాషింగ్, క్లీనింగ్, బ్రేక్ సిస్టమ్లు, డ్రాఫ్ట్ గేర్ (కప్లర్లు), ఎయిర్ కండిషనింగ్, ఇతర ఎలక్ట్రికల్, మెకానికల్ సబ్సిస్టమ్ల మరమ్మతుల సౌకర్యాల్ని ఇక్కడ నుంచి నిర్వహించే అవకాశం ఉంది. ఒకేసారి 10 కిపైగా రైళ్లని ఇక్కడ మెయింటెనెన్స్ చేసేలా నిర్మాణం ఉండబోతుందని వాల్తేరు వర్గాలు చెబుతున్నాయి. ఈ మెగా డిపో ఏర్పాటుతో స్థానికంగా భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విశాఖను దక్షిణ మధ్య రైల్వేలో అతిపెద్ద రైల్వే కార్యకలాపాల కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగానే ఈ ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.త్వరలో డీపీఆర్ కోచ్ మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు అప్పట్లో స్థల పరిశీలన చేశారు. రైల్ ట్రాక్ కనెక్టివిటీ ఉన్న ఖాళీ స్థలాల్ని అధికారులు పరిశీలించారు. తొలుత వడ్లపూడిలోని వ్యాగన్ వర్క్షాప్ పక్కన నిర్మించాలని భావించారు. అయితే రైలు వైజాగ్ స్టేషన్ నుంచి అక్కడికి వెళ్లి తిరిగి వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. అదే సమయంలో స్టేషన్కు రావాలంటే అవుటర్లో ఖాళీ లేకపోతే గంటల తరబడి వేచి ఉండాలి. దీంతో నిర్దిష్ట సమయానికి కొన్ని సార్లు నడపడం వీలవదు. ఈ సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నం పాత రైల్వే స్టేషన్ని ఎంపిక చేశారు. విశాఖ రైల్వే స్టేషన్కు దాదాపు 2 కిమీ దూరంలో ఈ ప్రాంతం ఉంది. ప్రస్తుతం అక్కడ వరకూ ఉన్న ట్రాక్లు, స్థలం కలిపి మొత్తం సుమారు 118 ఎకరాల వరకూ విస్తీర్ణం ఉంది. డిపో నిర్మాణ సమయంలో పాత ట్రాక్లను అనుసంధానం చేస్తే పని సులువవుతుంది. అందుకే ఈ ప్రాంతాన్ని కోచ్ మెయింటెనెన్స్ డిపో నిర్మాణ స్థలంగా ఎంపిక చేశారు. త్వరలోనే డీపీఆర్ సిద్ధం చేసి అనుమతుల కోసం రైల్వే బోర్డుకు పంపించనున్నట్లు వాల్తేరు డివిజన్ అధికారులు వెల్లడించారు. -
కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలకు అక్రమ కేసులే నిదర్శనం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ● పూడి శ్రీహరికి ఘన స్వాగతం మహారాణిపేట: ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ జర్నలిస్టు, బీసీ వర్గ నేత, వైఎస్సార్సీపీ రాష్ట్ర మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ట అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో బెయిల్పై విడుదలై తన నివాసానికి విచ్చేస్తున్న పూడి శ్రీహరికి ఆదివారం విశాఖ విమానాశ్రయంలో కేకే రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి విమర్శలను అణచివేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇలాంటి వేధింపులకు పాల్పడుతోందని ఖండించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనూ, సంక్షేమ పథకాలను అమలు చేయడంలోనూ పూర్తిగా విఫలమైన ప్రభుత్వం, కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు. అనంతరం పూడి శ్రీహరి మాట్లాడుతూ.. మహాభారతంలో శ్రీకృష్ణుడు రాజ్యాన్ని, ప్రజలను కాపాడినట్లే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని, పార్టీని కాపాడగల ఏకై క నాయకుడని విశ్వాసం వ్యక్తం చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టినందుకు వ్యక్తిగతంగా బాధలేదని, జర్నలిస్టులనే లక్ష్యంగా చేసుకోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. సామాన్య వ్యక్తులకు రాజకీయాల్లో అత్యున్నత అవకాశాలు కల్పించిన ఘనత జగన్దేనని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఆయన చేసిన సంస్కరణలు మరువలేనివని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇదే తీరును కొనసాగిస్తే రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్, పార్టీ నాయకులు కొండా రాజీవ్ గాంధీ, అల్లు శంకరరావు, అంబటి శైలేష్, మనోజు, జీలకర్ర నాగేంద్ర, గోద్దేశి శ్రీనివాస్ రెడ్డి, రవికుమార్, వేణుగోపాలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
నగర ప్రాంతాలను జిల్లా కోర్టు పరిధిలోనే ఉంచాలి
హైకోర్టు న్యాయమూర్తులకు వినతి అల్లిపురం: భీమిలిలో నూతనంగా ఏర్పాటు చేసిన కోర్టు పరిధిలోకి నగరానికి సమీపంలో ఉన్న ప్రాంతాలను చేర్చడం వల్ల న్యాయవాదులకు, కక్షిదారులకు వ్యయప్రయాసలు ఎదురవుతాయని, కాబట్టి వాటిని జిల్లా కోర్టు పరిధిలోనే కొనసాగించాలని విశాఖ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఆదివారం భీమిలిలో సివిల్ కోర్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ రవి చీమలపాటిలను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు, కార్యదర్శి సుధాకర్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. షీలానగర్ నుంచి ఎన్ఏడీ కొత్తరోడ్డు, ఆరిలోవ, సాగర్ నగర్, విశాలాక్షి నగర్, పెందుర్తి వంటి ప్రాంతాలన్నీ ప్రస్తుతం భీమిలి కోర్టు పరిధిలోకి వెళ్లాయని, ఇవన్నీ నగరానికి అత్యంత సమీపంలో ఉన్నందున వీటిని విశాఖ కోర్టు పరిధి లోనే ఉంచాలని వారు కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తులు.. న్యాయవాదులకు, ప్రజలకు అనుకూలంగా ఉండేలా పరిధి నిర్ణయంలో మార్పులు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారని అధ్యక్షుడు సన్యాసిరావు తెలిపారు. -
నవ్వుల్లో ముంచెత్తిన కామెడీ స్కిట్లు
సీతంపేట: ఫ్రెండ్స్ కామెడీ క్లబ్(విశాఖ, హైదరాబాద్) ప్రతి నెలా నిర్వహించే వినోదాల విందులో భాగంగా, ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో కామెడీ షో నిర్వహించారు. ఎం.వి.సుబ్రహ్మణ్యం, జబర్దస్త్ ప్రకాష్, రాగన్ నాయుడు, సూర్య మర్రాపు, పుష్యమి, బోను నరసింహారావు చేసిన కామెడీ స్కిట్లు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి. వీటిలో పెళ్లి తప్పిపోయింది. దెబ్బలు ఎలాగా తగిలాయి, నీకు తెలుసా, కూర చీర, లంచ్ బాక్స్, మాటలు మనుషులు, సాటి ఆడవాళ్లు స్కిట్లు నవ్వులు పూయించాయి. ముందుగా శ్రీ వాగ్దేవి నృత్యాలయం నాయుడుతోట గురువు సౌందర్య శిష్య బృందం లక్ష్మీ కార్తీక, మౌనిమా, రూత్విక్, గ్రీష్మశ్రీ, జషిత, పల్లవిక, మేధాశ్రీ, మనస్వి, తోషిని, యశశ్విలు శాసీ్త్రయ నాట్య ప్రదర్శనతో అలరించారు. -
మార్కెట్లోకి ట్రయంఫ్ కొత్త బైక్
మహారాణిపేట: ప్రపంచ ప్రసిద్ధ మోటార్ సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్ నుంచి సరికొత్త ట్రాకర్ 400 మోడల్ను విశాఖలో ఆదివారం ఆవిష్కరించారు. బీచ్రోడ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వరుణ్ బజాజ్ సీఈవో ఆడారి శ్రీనివాస్ కొత్త బైక్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రీమియం ఫీచర్లు, ఆధునిక డిజైన్, శక్తివంతమైన పనితీరుతో రూపొందించిన ఈ మోడల్ రైడర్లను విశేషంగా ఆకట్టుకుంటుందని తెలిపారు. ట్రాకర్ 400 మోడల్ను భారతీయ రైడర్ల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించినట్లు వివరించారు. రోజువారీ ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, అద్భుతమైన స్టైలిష్ లుక్ ఈ బైక్ సొంతమని పేర్కొన్నారు. విశాఖ మార్కెట్లో ఈ మోడల్కు మంచి స్పందన లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బైక్ బ్లాక్, ఎల్లో, సిల్వర్ వంటి మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుందని, దీని ఎక్స్–షోరూమ్ ధర రూ.2.46 లక్షల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో వరుణ్ గ్రూప్ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు. -
వ్యక్తికి దేహశుద్ధి
పిల్లల్ని ఎత్తుకుపోతున్నాడనే అనుమానంతో.. ఆరిలోవ: జీవీఎంసీ 10వ వార్డు పరిధి రవీంద్రనగర్లో ఆదివారం ఓ వ్యక్తి పిల్లలను ఎత్తుకుపోతున్నాడనే వార్త కలకలం రేపింది. స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని, అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని పట్టుకున్నారు. అప్పటికే ఆ వ్యక్తి అక్కడున్న ఇద్దరు పిల్లలకు చేగోడీలు, బిసెట్లు ఇస్తూ కనిపించడంతో స్థానికుల అనుమానం బలపడింది. ఆ వ్యక్తిని వివరాలు అడగగా, అతను సరైన సమాధానాలు చెప్పలేకపోయాడు. దీంతో పిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చాడని భావించిన కొందరు అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఆరిలోవ పోలీసులకు సమాచారం ఇచ్చి, అతన్ని అప్పగించారు. పోలీసులు అతడిని విచారించగా, సదరు వ్యక్తి మతిస్థిమితం లేని వాడిగా గుర్తించారు. మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్ల ఆ వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదని ఎస్ఐ కృష్ణ తెలిపారు. -
పరీక్ష వేళ పోలీసుల మానవత్వం
విద్యార్థినికి అండగా నిలిచిన సీఐ మల్కాపురం: నీట్ రాసేందుకు వచ్చిన ఒక విద్యార్థిని ఆఖరి నిమిషంలో ఎదుర్కొన్న సమస్యను మల్కాపురం సీఐ గొలగాని అప్పారావు యాదవ్ పరిష్కరించి, అభినందనలు అందుకున్నారు. పార్వతీపురం ప్రాంతానికి చెందిన బెహరా హిమబిందు అనే విద్యార్థిని ఆదివారం మల్కాపురంలోని కేవీ–2 పాఠశాలలో నీట్ రాసేందుకు తన తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. అయితే, పొరపాటున ఆమె తన వెంట తీసుకురావాల్సిన పాస్పోర్ట్ సైజు ఫొటోలను మర్చిపోయింది. పరీక్ష నిబంధనల ప్రకారం ఫొటోలు లేకపోవడంతో సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు. సమయం తక్కువగా ఉండటం, పరీక్ష రాయలేనేమో అన్న భయంతో ఆ యువతి అక్కడ కన్నీరు పెట్టుకుంది. అక్కడ విధుల్లో ఉన్న సీఐ ఆ విద్యార్థిని ఆవేదనను గమనించారు. విషయం తెలుసుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తన సిబ్బందిని పిలిచి పోలీసు ద్విచక్ర వాహనంపై ఆ విద్యార్థినిని శ్రీహరిపురంలోని ఫొటో స్టూడియోకు పంపించారు. అక్కడ ఫొటోలు తీయించి, సకాలంలో ఆమె పరీక్ష కేంద్రానికి చేరుకునేలా చొరవ చూపారు. సీఐ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల హిమబిందు పరీక్ష రాయగలిగింది. ఈ సందర్భంగా సీఐకి ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
స్మార్ట్ఫోన్ వద్దు.. పుస్తకమే ముద్దు
చిన్నారులకు 5 వేల పుస్తకాల పంపిణీడాబాగార్డెన్స్: పుస్తక పఠనం కేవలం విజ్ఞానాన్ని మాత్రమే కాదు, మానసిక వికాసాన్ని కూడా అందిస్తుంది. ఈ వేసవి సెలవుల్లో పిల్లలను స్మార్ట్ఫోన్ల నుంచి పుస్తకాల వైపు మళ్లించేందుకు వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మంచి పుస్తకం, కిట్స్, లెర్న్ అండ్ హెల్ప్ సంస్థల సహకారంతో జిల్లా వ్యాప్తంగా పుస్తక పంపిణీ చేపట్టింది. జిల్లాలోని 100 క్లబ్లు, క్రియేటివ్ లెర్నింగ్ సెంటర్లలోని పిల్లల కోసం సుమారు 5 వేల పుస్తకాలను అందజేస్తున్నట్లు క్లబ్ జిల్లా కన్వీనర్ కె.సుశీల తెలిపారు. ఒక్కో కేంద్రానికి 50 పుస్తకాల చొప్పున పంపిణీ చేస్తున్నామని, దాతల సహకారంతో భవిష్యత్తులో వీటిని మినీ లైబ్రరీలుగా తీర్చిదిద్దుతామని వివరించారు. ఈ పుస్తకాలను పిల్లలను ఆకట్టుకునేలా రంగురంగుల బొమ్మలతో, పెద్ద అక్షరాలతో తెలుగు, ఆంగ్ల భాషల్లో రూపొందించారు. వేసవి సెలవుల్లో పిల్లల చేత కథలు రాయించి, వాటిని వైజాగ్ కథలు పేరిట పుస్తక రూపంలో తీసుకురావడానికి కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. పుస్తకాలను విరాళంగా అందించిన శివరామకృష్ణ, సి.ఎ.ప్రసాద్లకు క్లబ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ కె.రమాప్రభ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పుస్తకాలు పిల్లల ఊహాశక్తిని పెంచి, వారిలో సామాజిక స్పృహను కలిగిస్తాయని ఆమె ఆకాంక్షించారు. కాగా.. ఈ పుస్తకాల్లో 5 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు ఉపయోగపడే కథాకదంబం, పుస్తకమాల, టింకు–పెంకు, పుస్తకాలతో స్నేహం, ఫోను ఈ తరం కుర్రాడు, ఈసోపు కథలు, సుతయేవ్ కథలు, కథలంటే మాకిష్టం, ఉక్రేనియన్ జానపద గాథలు, చింటూ–బుజ్జి, వింత దృశ్యం, లెక్కల సారు–రెక్కల గుర్రం, మా పిల్లికి లెక్కలొచ్చు, బావిలో చంద్రుడు, కదిలే టోపీ వంటి ఆసక్తికరమైన శీర్షికలు ఉన్నాయి. కార్యక్రమంలో ఎసెన్స్ గ్రూప్ ప్రతినిధి పోలినా దేవి, చిల్డ్రన్స్ క్లబ్ సభ్యులు పి.సతీష్, భారతి, మణి, మోదాంబిక, ప్రీతితో పాటు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ప్రపంచ శాంతి కోసం ‘సర్వమత నడక’
ఏయూక్యాంపస్: సమాజంలో శాంతియుత జీవనం, మానవత్వమే లక్ష్యంగా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ రిలీజియస్ ఫ్రీడమ్ , యునైటెడ్ రిలీజియన్స్ ఇనీషియేటివ్, గాంధీ సెంటర్, అప్ హోల్డ్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బీచ్రోడ్డులో ‘శాంతి నడక’ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గాంధీ సెంటర్ అధ్యక్షులు ఆచార్య వి.బలమోహన్ దాస్, ఐఏఆర్ఎఫ్ చైర్మన్ నరవ ప్రకాశరావు జెండా ఊపి ప్రారంభించారు. యూత్ హాస్టల్ వద్ద ప్రారంభమైన ఈ నడక సబ్మైరెన్ మ్యూజియం వరకు సాగింది. అనంతరం తిరిగి యూత్ హాస్టల్ వద్దకు చేరుకుని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఆచార్య బలమోహన్ దాస్ మాట్లాడుతూ.. మత నమ్మకాలు ఎన్ని ఉన్నా మానవత్వం ఒక్కటేనని, పరస్పర గౌరవంతో కలిసి జీవించినప్పుడే శాంతియుత సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుమారు వంద మందికి పైగా విభిన్న మతాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రహ్మకుమారి సంస్థ నుంచి రామేశ్వరి, రెవరెండ్ ప్రసాద్, ముస్లిం నాయకులు సూసోడియా, బుద్ధిస్ట్ వేణుగోపాల రావు, గాంధీ సెంటర్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కె.ఎస్.ఎన్.మూర్తి, ఎస్.కె. జైన్, అప్ హోల్డ్ ప్రతినిధి డేవిడ్ రాజు, మానవ హక్కుల కార్యకర్త బి.చిన్నారావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విశాలాక్షి, అనురాధ, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. -
బతికుండగానే చంపేశారు..!
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల వేళ పింఛన్లు పెంచుతామని ఆకాశానికి నిచ్చెనలు వేసిన చంద్రబాబు, అధికారం దక్కగానే పెన్షన్ల కోత విధిస్తూ అవ్వాతాతల నోటికాడ బువ్వను లాగేసుకుంటున్నారు. జిల్లాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులను ఏరివేయాలనే కుట్రతో, ఏకంగా బతికున్నవారిని రికార్డుల్లో చనిపోయినట్లు చూపిస్తూ పేదల కడుపు కొడుతున్నారు. పింఛన్ల తొలగింపు జాబితాల్లో తమ ప్రమేయం లేదని, ఈ పాపంలో తమను భాగస్వాములను చేయవద్దని ఇటీవల కొంతమంది సచివాలయ సిబ్బంది జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. –మహారాణిపేట జిల్లాలో సుమారు 90 మంది లబ్ధిదారుల పింఛన్లను అత్యంత అన్యాయంగా తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. బాధితులు కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ను కలిసి ‘మేము బతికే ఉన్నాం’ అని మొరపెట్టుకోవడంతో ప్రభుత్వ భాగోతం వెలుగులోకి వచ్చింది. బతికున్నవారిని మరణించినట్టుగా..వలస వెళ్లినట్లుగా చిత్రించి జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఖజానాపై భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకే ఈ ప్రక్రియ సాగుతుండగా, రేపు ఏదైనా విచారణ జరిగితే కింది స్థాయి సిబ్బందిని బలిపశువులను చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాజకీయ కక్షసాధింపులే లక్ష్యం 2014 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో సాగిన పింఛన్ల వేటు, ఇప్పుడు మళ్లీ అదే తరహాలో పునరావృతమవుతోంది. రాజకీయ కక్షసాధింపులో భాగంగా తమకు అనుకూలంగా లేని వారిని గుర్తించి ఏరివేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.జిల్లాలో గత మార్చి నెలలో 1,65,891 గా ఉన్న పింఛన్ల సంఖ్య, మే నెల నాటికి 1,57,914కు పడిపోయింది. అంటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే సుమారు 1700 మందికి పైగా లబ్ధిదారులు పింఛన్లకు దూరమయ్యారు. ఆందోళనలో వృద్ధులు ప్రభుత్వం చేపట్టిన ఈ పునఃపరిశీలన ప్రక్రియ అభాగ్యుల పాలిట శాపంగా మారింది. శారీరక ఇబ్బందులతో మంచానికే పరిమితమైన వృద్ధులను సైతం ధృవీకరణ పత్రాల పేరుతో వేధిస్తుండటంతో వృద్ధులు, వితంతువులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తమ పింఛన్ ఎందుకు ఆగిపోయిందో అడిగితే సమాధానం చెప్పే నాథుడే కరువయ్యారు. అధికారుల చుట్టూ తిరగలేక, అటు ఆర్థిక ఆసరా లేక అనేక కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. బాధితుల ఫిర్యాదులతో జీవీఎంసీ కమిషనర్ విచారణకు ఆదేశించినప్పటికీ, సిబ్బందిపై చర్యలు తీసుకుని ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతోంది. -
భవనం పైకి లేపుతుండగా ప్రమాదం
పెదగంట్యాడ: నిన్నటి వరకూ నలుగురు కలిసి నవ్వుతూ గడిపిన ఆ ఇల్లు.. ఒక్కసారిగా మృత్యు కుహరంగా మారింది. దుకాణాన్ని కాపాడుకోవాలని కాస్త ఎత్తు పెంచే ఓ కుటుంబ ఆశలు, మరో కుటుంబ భవిష్యత్తును శిథిలాల కింద సమాధి చేసేశాయి. మండలంలోని వికాస్నగర్లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. వికాస్నగర్ హెచ్ఐజీ–7లో నివసిస్తున్న జయప్రకాష్కు చెందిన 20 ఏళ్ల పాత దుకాణం రోడ్డు కంటే తక్కువ ఎత్తులో ఉంది. దీంతో ఆ భవనాన్ని హైడ్రా జాకీల సాయంతో పైకి లేపేందుకు కాంట్రాక్టర్ ప్రసాద్తో రూ.1.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ పనుల కోసం గాజువాక నుంచి వచ్చిన ఏడుగురు కూలీలు ఆదివారం ఉదయం 12 జాకీలను బిగించి భవనాన్ని కొంతమేర పైకి లేపారు. సాయంత్రం పని ముగించుకుని వారంతా చేతులు కడుక్కుంటున్న సమయంలో భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో గాజువాకకు చెందిన నాగరాజు (34) అనే కార్మికుడు శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న న్యూపోర్ట్ సీఐ టి.కామేశ్వరరావు తన సిబ్బంది, రెస్క్యూ బృందంతో హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కూలీలందరూ మార్కెట్ నుంచి వచ్చిన వారు కావడంతో వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని సీఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన దేవన్ రెడ్డి భవనం కుప్పకూలిన విషయం తెలియగానే వైఎస్సార్ సీపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందిన నాగరాజు -
నాణ్యమైన వైద్య సేవలందించాలి
మహారాణిపేట: కేజీహెచ్లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అక్కడి అధికారులను ఆదేశించారు. శనివారం కేజీహెచ్లోని ఓపీ వార్డు, క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ వార్డులు, సీఎస్సార్ బ్లాక్ను సందర్శించారు. సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లి వైద్యులతో సమావేశమయ్యారు. వివిధ విభాగాల హెచ్వోడీలతో మాట్లాడి ఆయా విభాగాల ద్వారా అందుతున్న సేవలు, అక్కడున్న సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వార్డుల సామర్ధ్యం, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివద్ధి పనులు, ఆధునిక పరికరాల వినియోగం, ఇతర అవసరాల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో పలు అంశాలను ఆయా విభాగాల హెచ్వోడీలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై త్వరలోనే చర్చిద్దామని, రాష్ట్ర స్థాయిలో అంశాలను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో చర్చించి తదుపరి కార్యాచరణ రూపొందిద్దామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన రోగులు, వైద్యులు, సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణితో పాటు, ఇతర వైద్యాధికారులు ఉన్నారు. కేజీహెచ్ను సందర్శించి, వార్డులను పరిశీలించిన కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ -
జనగణన విధులు రద్దు చేయాలి: ఆర్పీలు
మహారాణిపేట: జనగణన విధులను తమకు రద్దు చేయాలని రిసోర్స్ పర్సన్లు (ఆర్పీలు) శనివారం కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ను కోరారు. ఏపీ మెప్మా ఎండీ ఆదేశాల ప్రకారం ఆర్పీలకు జనగణన డ్యూటీలు ఇవ్వకూడదని ఉన్నప్పటికీ, జీవీఎంసీ అధికారులు వాటిని అమలు చేయకుండా డ్యూటీలు విధించారని కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. స్వయం సహాయక ఫెడరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఆర్పీలు అనారోగ్య కారణాల వల్ల మినహాయింపు కోరినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జోనల్ కమిషనర్లు సమస్యలను పరిష్కరించాల్సింది పోయి అమర్యాదగా మాట్లాడుతున్నారని యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పి.మణి తెలిపారు. అలాగే, నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని, లాగిన్ నిలిచిపోయిన వారికి తక్షణం పునరుద్ధరించాలని, అక్షరాంధ్ర నిధులను విడుదల చేయాలని, ఎటువంటి కోతలు లేకుండా పూర్తి వేతనం చెల్లించాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్.ఝాన్సీ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ సమస్యలను సానుకూలంగా పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మణి తెలిపారు. -
ప్రజా వినతుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వండి
అధికారులకు కలెక్టర్ ఆదేశం మహారాణిపేట: ప్రజల నుంచి అందిన వినతులు, ప్రజా ప్రతినిధులు సూచించిన అంశాల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాలోని మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ఆయన సమీక్షించారు. గంగవరం పోర్ట్ నుంచి షీలానగర్ వరకు ప్రతిపాదించిన రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, యారాడ–గంగవరం ప్రాంతాల్లో బ్రేక్ వాటర్ జెట్టి ఏర్పాటును ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పనులతో పాటు చిలకపేట సరస్సు పార్క్ అభివృద్ధి, కోస్టల్ కారిడార్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నగరంలోని డ్రైనేజీ సమస్యల పరిష్కారం, ద్వారకా బస్టాండ్ అభివృద్ధి, హార్బర్ ఆధునికీకరణ పనులపై కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేజీహెచ్లోని ఓపీ, ఎంసీహెచ్ బ్లాకుల ఆధునికీకరణ, కొత్త యూపీహెచ్సీల ఏర్పాటు, మధురవాడ, భీమిలి పరిధిలోని పీహెచ్సీల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే తగరపువలస వద్ద ఆర్టీసీ డిపో ఏర్పాటు, తోటగరువు జూనియర్ కళాశాల ఏర్పాటులో సాంకేతిక అంశాలను పరిశీలించాలని సూచించారు. తీర ప్రాంత రక్షణకు బీచ్ రోడ్డులో అవసరమైన చోట్ల రక్షణ గోడల నిర్మాణం, ఏపీఐఐసీ భూముల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై ఆయా శాఖలు సమన్వయంతో పని చేయా లని స్పష్టం చేశారు. ప్రతి అంశంపై నిర్దిష్ట కాలపరిమితిలోగా పురోగతి నివేదికలను సమర్పించాలని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వేగవంతమైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు శేషశైలజ, సంగీత్ మాధుర్, అన్ని విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
శుభకార్యానికి వెళ్తుండగా.. అనంతలోకాలకు..
రోడ్డు ప్రమాదంలో వంట మాస్టర్ మృతిఆనందపురం: విజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి చెందిన గెడ్డపు ఈశ్వరరావు(32) శనివారం మధ్యాహ్నం గుడిలోవ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విజయవాడలోని ఒక రెస్టారెంట్లో వంట మాస్టర్గా ఈశ్వరరావు పనిచేస్తున్నారు. తన ఇంట్లో జరగబోయే శుభకార్యానికి హాజరయ్యేందుకు బైక్పై వెళ్తుండగా.. ఎన్హెచ్–16పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తన ముందు వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో బైక్ను అకస్మాత్తుగా ఎడమ వైపునకు తిప్పడంతో అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. ఈ క్రమంలో తలకు బలమైన గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతనికి భార్య, పాప, బాబు ఉన్నారు. సమాచారం అందుకున్న ఆనందపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం భీమిలి మార్చురీకి తరలించారు. ఈశ్వరరావు తల్లి గెడ్డపు సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సి.హెచ్.వాసునాయుడు కేసు నమోదు చేయగా, ఎస్ఐ శివ ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. -
విశాఖ భూగర్భంలో జల సంక్షోభం
సాక్షి, విశాఖపట్నం: సాగరతీర నగరం విశాఖ ఇప్పుడు నీటి కోసం విలవిలలాడుతోంది. ఒకప్పుడు నిండుకుండలా ఉండే భూగర్భ జలాలు క్రమంగా అడుగంటిపోతూ, నగరాన్ని తీవ్రమైన సంక్షోభం వైపు నెట్టుతున్నాయి. వేసవి తీవ్రత పెరిగేకొద్దీ పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. నగరవాసులు గుక్కెడు నీటి కోసం వందల అడుగుల లోతుకు పైపులు వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కోర్ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోనూ భూగర్భ జల సంక్షోభం ముదురుతోంది. గతేడాది వరకు అందుబాటులో ఉన్న నీరు ఇప్పుడు మరింత లోతుల్లోకి జారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, నీటి సంరక్షణ పద్ధతుల పట్ల అవగాహన లోపం ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఏడాదిలోనే 30 అడుగుల పతనం భూగర్భ జలవనరుల శాఖ గణాంకాలు పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి. నగరంలోని ఐటీ కారిడార్ పరిసరాల్లో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. ఎండాడ ప్రాంతంలో గతేడాది 64 అడుగుల లోతులో లభించిన నీరు, ఈ ఏడాది 94 అడుగులకు పడిపోయింది. అంటే కేవలం ఏడాదిలోనే 30 అడుగుల మేర తగ్గుదల నమోదైంది. ఇదే విధంగా రుషికొండలో 16 అడుగులు, గోపాలపట్నంలో 9 అడుగులు, అప్పుఘర్లో 5 అడుగులు జలమట్టం పడిపోవడం అక్కడి పరిస్థితి ఎంత తీవ్రమో తెలియజేస్తోంది. స్ట్రెస్ జోన్లుగా మారుతున్నాయి.. సాధారణంగా భూగర్భ జలాలు 10 మీటర్ల (సుమారు 33 అడుగులు)లోపు ఉంటే సురక్షితం. కానీ విశాఖలో సగటు మట్టం ఇప్పటికే ఈ పరిమితిని దాటేసింది. 10 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు నీరు వెళ్తే దానిని ’స్ట్రెస్ జోన్’ అంటారు. విశాఖలో మెజారిటీ ప్రాంతాలు ఇప్పుడు ఈ జోన్లోకి వెళ్తున్నాయి. పొంచి ఉన్న ’సాల్ట్ వాటర్’ ముప్పు తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గితే, సముద్రపు ఉప్పు నీరు భూమిలోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది. ఒకసారి సముద్రపు నీరు భూమిలోకి ప్రవేశిస్తే, ఉన్న కొద్దిపాటి జలాలు కూడా తాగడానికి, వాడుకోవడానికి పనికిరాకుండా పోతాయి. అప్పుఘర్, ఎండాడ, రుషికొండ వంటి ప్రాంతాలు ఈ ముప్పుకు గురయ్యే అవకాశముంది. పర్యావరణ సమతుల్యతదెబ్బతినే ప్రమాదం నగరంలో భూగర్భ జలమట్టం 10 మీటర్ల కంటే దిగువకు పడిపోవడం పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందనే సంకేతం. దీనివల్ల భవిష్యత్తులో భూమి కుంగిపోయే ప్రమాదం కూడా ఉంది. తీర ప్రాంతాలకు సమీపంగా ఉన్న ఎండాడ, రుషికొండ వంటి ప్రాంతాల్లో నీరు అడుగంటితే, సముద్రపు ఉప్పునీరు భూమిలోకి చొచ్చుకువచ్చే ప్రమాదం ఉంది. అపార్ట్మెంట్ యజమానులు కేవలం బోర్లపైనే ఆధారపడకుండా, వర్షపు నీటిని భూమిలోకి మళ్లించే ఇంకుడు గుంతలను శాసీ్త్రయ పద్ధతిలో ఏర్పాటు చేయాలి. ఖాళీ ప్రదేశాల్లో సహజంగా నీరు ఇంకేలా చూడా లి. ప్రభుత్వం కూడా ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ జోన్లలో కొత్త బోర్ల తవ్వకాలపై ఆంక్షలు విధించాలి. –ప్రొ.భానుకుమార్, వాతావరణ నిపుణుడుబోరు బావులు ఎండిపోయాయి గతేడాది మే వరకు బోరులో నీళ్లు వచ్చేవి. కానీ ఈసారి ఏప్రిల్లోనే చుక్క నీరు రావడం లేదు. వీధి మొత్తం ఇదే పరిస్థితి. జీవీఎంసీ నీటి కోసమే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. –అల్లూరి పార్వతి, గృహిణి, ఎండాడ మళ్లీ డిగ్గింగ్ చేయాల్సి వస్తోంది అపార్ట్మెంట్లలో బోర్లకు నీరు అందక పైపులను మరింత లోతుకు దించుతున్నాం. 100 అడుగులు వేస్తే కానీ నీటి చుక్క పడటం లేదు. జీవీఎంసీ స్పందించి నీటి సరఫరా పెంచకపోతే భవిష్యత్తులో ఇక్కడ నివసించడం అసాధ్యం. – మాదురాజు, ఎండాడసంక్షోభానికి కారణాలివే.. కాంక్రీట్ జంగిల్: నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఖాళీ స్థలాలన్నీ సిమెంట్ రోడ్లు, అపార్ట్మెంట్లతో నిండిపోవడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే దారి లేక నేరుగా సముద్రం పాలవుతోంది. అపరిమిత వినియోగం: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వేల సంఖ్యలో బోరు బావులను తవ్వేస్తున్నారు. భారీ అపార్ట్మెంట్లలో నిరంతరం మోటార్ల ద్వారా నీటిని తోడేస్తుండటంతో భూగర్భం ఖాళీ అవుతోంది. లోటు వర్షపాతం: గతేడాది రుతుపవనాల ప్రభా వం తగ్గడం, ‘ఎల్ నినో’ ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమిలోని తేమ ఆవిరైపోతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత.. నీటి సంరక్షణ చర్యల్ని గాలికొదిలేశారు. నిబంధనల ప్రకారం ప్రతి భవనానికి ఉండాల్సిన వర్షపు నీటి నిల్వ వ్యవస్థల్ని సక్రమంగా అమలు చెయ్యలేదు. ఇదే ప్రస్తుతం శాపంగా మారింది. -
నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్లావు..?
విశాఖపట్నం: జాతీయ రహదారిపై చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య గాయాలతో బయటపడింది. పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాలివి. కొమ్మాది శివశక్తినగర్కు చెందిన ఎస్.బలరామ్ (58) గాయత్రీ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆయన తన భార్య తులసమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై మధురవాడ నుంచి ఆనందపురం వైపు బయలుదేరారు. పరదేశిపాలెం కూడలి వద్దకు చేరుకోగానే, విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ నాన్స్టాప్ బస్సు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బలరామ్కు తీవ్రమైన గాయాలు కావడంతో ఆయన సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలారు. వెనుక కూర్చున్న భార్య తులసమ్మకు గాయాలయ్యాయి. తన కళ్ల ముందే భర్త విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన ఆమె, తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ మృతదేహంపై పడి బోరున విలపించడం సంఘటన స్థలంలో ఉన్న వారిని కంటనీరు పెట్టించింది. సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రురాలు తులసమ్మను చికిత్స నిమిత్తం గాయత్రీ ఆసుపత్రిలో చేర్పించారు. బలరామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లక్ష్య సాధనలో వెనుకడుగు వేయొద్దు
మహారాణిపేట: ‘మంచి ఆలోచనే విజయానికి తొలి అడుగు.. నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు’ అని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అభినందించారు. చిన్న వయసులోనే చక్కని ప్రణాళికతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమని, ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని హితవు పలికారు. 10వ తరగతి పరీక్షల్లో 590, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన ప్రభుత్వ విద్యార్థులను శుక్రవారం వీసీ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తూ.. ప్రతి ఒక్కరూ జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాని సాధన కోసం పట్టుదలతో కృషి చేయా లని సూచించారు. ‘మీరు సాధించిన ఈ ఫలితాలు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచేలా ఉన్నాయి. లక్ష్య సాధనలో ఎటువంటి అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేయకండి. మీకు అవసరమైన సహాయం అందించేందుకు నా వంతుగా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను’అని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం 9 మంది విద్యార్థులతో పాటు కేజీబీవీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థినులను ఆయన సత్కరించారు. డీఈవో ఎన్.ప్రేమ కుమార్, సమగ్ర శిక్ష ఏపీసీ చంద్రశేఖర్, ఉప విద్యాశాఖ అధికారి సోమేశ్వరరావు, ప్రభుత్వ పరీక్షల సహాయ సంచాలకుడు రాజశేఖర్, డీసీఈ బోర్డు కార్యదర్శి కృష్ణకుమార్ పాల్గొన్నారు. ‘పది’ విద్యార్థులకు కలెక్టర్ పిలుపు -
గుంతకల్ వరకు తిరుమల ఎక్స్ప్రెస్ పొడిగింపు
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం–కడప–విశాఖపట్నం మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్ప్రెస్ను గుంతకల్ వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ నెల 12వ తేదీ నుంచి గుంతకల్–విశాఖపట్నం (18522) తిరుమల ఎక్స్ప్రెస్ తన ప్రయాణాన్ని గుంతకల్ నుంచే ప్రారంభించనుంది. ప్రతి రోజూ మధ్యాహ్నం 1.30 గంటలకు గుంతకల్లో బయల్దేరే ఈ రైలు, మధ్యాహ్నం 1.55 గంటలకు గుత్తి చేరుకుంటుంది. అక్కడ రెండు నిమిషాల విరామం తర్వాత 1.57 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 2.50 గంటలకు తాడిపత్రికి, 3.13 గంటలకు కొండాపురానికి, 3.58 గంటలకు యర్రగుంట్లకు చేరుకుంటుంది. అనంతరం సాయంత్రం 5.38 గంటలకు కడప చేరుకుని, అక్కడ నుంచి 5.40 గంటలకు బయల్దేరి.. పాత వేళల ప్రకారమే విశాఖపట్నం వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం–గుంతకల్ (18521) తిరుమల ఎక్స్ప్రెస్ ఈ నెల 13వ తేదీ నుంచి రాకపోకలు ప్రారంభిస్తుంది. విశాఖపట్నంలో ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరే ఈ రైలు, మరుసటి రోజు ఉదయం 7.03 గంటలకు కడప చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.05 గంటలకు బయల్దేరి, ఉదయం 7.38 గంటలకు యర్రగుంట్ల, 8.10 గంటలకు కొండాపురం, 8.33 గంటలకు తాడిపత్రి, 9.13 గంటలకు గుత్తి స్టేషన్లకు చేరుకుంటుంది. చివరగా ఉదయం 11.30 గంటలకు ఈ రైలు గుంతకల్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. రైలు పొడిగింపు నేపథ్యంలో ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. -
వైశాఖ జనజాతర
సింహాచలం: వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సింహగిరి భక్తజన సంద్రమైంది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందు కు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, మత్స్యకారులు తమ ఆచార వ్యవహారాలతో అప్పన్న క్షేత్రాన్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తారు. తొలుత కొండ దిగువన ఉన్న వరాహ పుష్కరిణి వద్ద భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, పుష్కరిణి ప్రాంగణంలోనే కుటుంబ సమేతంగా వంటలు వండుకుని సహపంక్తి భోజనాలు చేశారు. తమ సంప్రదాయాన్ని చాటు తూ భక్తులు చేసిన గరిడీ నృత్యాలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామివారి ప్రతిరూపాలుగా భావించే కోలలకు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పుష్కరిణి నుంచి అడవివరం మార్కెట్ కూడలి వరకు ఉన్న మార్గమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా గోపాలపట్నం పోలీసులు, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. భక్తులు మొక్కులు తీర్చుకుంటూ మెట్లమార్గం ద్వారా సింహగిరికి చేరుకున్నారు. కొండపై ఉన్న క్యూలు, కేశఖండన శాల, ప్రసాద విక్రయశాలలు భక్తులతో నిండిపోయాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో నీలాద్రి గుమ్మం వద్ద నుంచే లఘు దర్శనాన్ని కల్పించారు. -
నిప్పుల సెగలో ‘నీటి’ జల్లులు
సాక్షి, విశాఖపట్నం: గత కొద్ది రోజులుగా నిప్పులు చెరుగుతున్న భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరైన విశాఖ నగరానికి ఎట్టకేలకు వరుణుడు ఊరటనిచ్చాడు. శుక్రవారం సూర్యోదయం నుంచే ఆకాశం మేఘావృతమై, భానుడు దోబూచులాడుతుండటంతో నగరవాసులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించింది. ఉదయం నుంచే నగరాన్ని పలకరించిన చల్లని గాలులు, వెనువెంటనే కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారింది. వర్షపు జల్లులతో రోడ్లన్నీ తడిసి ముద్దవ్వగా, అప్పటివరకు సెగలు కక్కుతున్న రహదారుల వేడి తగ్గింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో సముద్రపు గాలులు భూభాగం వైపు మళ్లడమే ఈ వాతావరణ మార్పునకు ప్రధాన కారణమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గవచ్చని, నేడు కూడా నగరంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మండుతున్న ఎండలతో అల్లాడిపోతున్న సామాన్య జనానికి, ముఖ్యంగా పాదచారులు, వాహనదారులకు ఈ చిరుజల్లులు అమృతధారల్లా అనిపించాయి. సాయంత్రం వేళకు సముద్ర తీరం చల్లని గాలులతో మరింత సందడిగా మారింది. ప్రాంతం కురిసిన వర్షపాతం(మిమీల్లో) ఆనందపురం 51.5 కణమాం 40.5 పరదేశీపాలెం 33.5 పద్మనాభం 30.5 వేపగుంట 25.5 మధురవాడ 22.0 సుజాతనగర్ 19.25 పెందుర్తి 19.0 కాపులుప్పాడ 16.5 అక్కిరెడ్డిపాలెం 14.0 జగదాంబ 12.25 ఎండాడ 12.25 ఆరిలోవ 11.75 మహరాణిపేట 10.25 సింహాచలం 9.75 సీతమ్మధార 9.75 -
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ● పార్టీ కార్యాలయంలో మేడే వేడుకలు
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ప్లాంట్ విషయంలో, కార్మికుల ప్రయోజనాలను కాపాడడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. శుక్రవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కేకే రాజు ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్మిక నాయకులు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ప్రతినిధులతో కలిసి ఆయన జెండా ఆవిష్కరించారు. అనంతరం అందరికీ స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మికుల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. కానీ చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. వారి పొట్టకొట్టే విధానాలను అమలు చేస్తూ అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మికులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కార్మికుల కుటుంబాల్లో వెలుగులు పోయి చీకటి మిగిలిందని, చంద్రబాబు సర్కార్ కార్మికుల పట్ల సవతి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం విధిస్తున్న కఠిన నిబంధనలు, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాయడం వల్ల కార్మికులపై భారం పెరిగిందన్నారు. రోజువారీ ఉపాధిపై ఆధారపడే చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులను కూడా వేధిస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాపాడడంలో విఫలమైన ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పార్టీ ముఖ్య నేతలు కోలా గురువులు, రవిరెడ్డి, సతీష్ వర్మ, కొండా రాజీవ్ గాంధీ, పేడాడ రమణి కుమారి, పి.వి. నారాయణ, తాడి జగన్నాథ్ రెడ్డి, పల్లా దుర్గారావు, ఉమ్మడి స్వాతి, పేర్ల విజయ చంద్ర, జి.వి.రవిరాజు, వేంపాడు శ్రీనివాస్ రెడ్డి, భర్కత్ అలీ, సేనాపతి అప్పారావు, ముట్టి సునీల్ కుమార్, దేవి వర్మ, మనోజ్ పట్నాయక్, బోని శివ రామకృష్ణ, రామారెడ్డి, నీలి రవి, సాడి పద్మారెడ్డి, మన్మధ రావు, బిపిన్ కుమార్ జైన్, అలంపల్లి రాజబాబు, రామన్న పాత్రుడు, ఈశ్వరరావు, వై. శ్రీనివాస్ రావు, అప్పన, వెంకట సత్య, పార్వతి, కొట్యాడ సూర్య తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కార్మికులకు అన్యాయం -
మాకొద్దీ.. ప్రైవేటు రోడ్లు
● పీపీపీ ప్లాన్ ఫ్లాప్విశాఖలో రోడ్ల టెండర్లకు బిడ్ దాఖలు కాని పరిస్థితి లాభాలు భారీగా ఉన్నా.. ప్రైవేటు సంస్థల నిరాసక్తత రాజకీయ అనిశ్చితి, 10 ఏళ్ల ఒప్పందమే కారణమా?ప్రభుత్వానికి భారీ షాక్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని ప్రైవేటు శక్తులకు ధారాదత్తం చేయాలన్న ప్రభుత్వ వ్యూహానికి ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. మెడికల్ కాలేజీల నుంచి మున్సిపల్ రోడ్ల వరకు ప్రతిదీ ‘పీపీపీ’ (ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం) ముసుగులో కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టాలని సర్కారు వేసిన ఎత్తుగడలు చిత్తవుతున్నాయి. విశాఖ, విజయవాడ నగరాల్లో ప్రధాన రహదారులను ప్రైవేటు పరం చేసేందుకు పిలిచిన టెండర్లలో ఒక్కటంటే ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడం గమనార్హం. ఇది ప్రభుత్వానికి పెద్ద షాక్గా మారింది. అప్పనంగా అప్పగిస్తున్నా.. ఇటీవల విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో రోడ్ల అభివృద్ధి, నిర్వహణ కోసం పీపీపీ విధానంలో రూ.477 కోట్ల విలువైన ప్రాజెక్టులకు టెండర్లు ఆహ్వానించారు. విశాఖలో రూ.306 కోట్లతో 88.54 కిలోమీటర్లు, విజయవాడలో రూ.171 కోట్లతో 23.54 కిలోమీటర్ల రోడ్లను పదేళ్ల పాటు నిర్వహించే బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. ఇది మొదటిసారి కాదు. మెడికల్ కాలేజీల పీపీపీ టెండర్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రైవేట్ సంస్థలు పూర్తిగా వెనుకంజ వేయడం ప్రభుత్వ విధానాలపై అనుమానాలు రేకెత్తిస్తోంది. వ్యయం ప్రభుత్వానిది.. లాభాలు ప్రైవేటుకి.. ప్రైవేటు సంస్థలకు అపరిమితమైన ప్రయోజనాలు చేకూర్చేలా ఈ టెండర్ నిబంధనలను రూపొందించారు. ప్రాజెక్టు వ్యయంలో 40 శాతాన్ని మున్సిపల్ కార్పొరేషన్లే ముందుగా భరిస్తుండగా, మిగిలిన 60 శాతం మొత్తాన్ని కూడా వడ్డీతో కలిపి ఐదు విడతల్లో కాంట్రాక్టు సంస్థలకే తిరిగి చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ 60 శాతం నిధులను సదరు సంస్థలు సొంతంగా లేదా బ్యాంకు రుణాల ద్వారా సమకూర్చుకోవచ్చు. రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత పదేళ్ల పాటు 20 శాతం సమాన వాయిదాల్లో బ్యాంకు వడ్డీకి అదనంగా 1.25 శాతం కలిపి మరీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అంటే, పెట్టుబడి భారం దాదాపుగా ప్రభుత్వంపైనే పడుతుండగా, నిర్వహణ పేరుతో ప్రైవేటు సంస్థలకు కాసుల వర్షం కురిపించేలా ఈ వ్యూహం ఉంది. ప్రైవేటు సంస్థలకు సర్వాధికారాలు ఈ పీపీపీ విధానం ద్వారా నగరంలోని ప్రధాన రహదారులపై ప్రైవేటు సంస్థలకు సర్వాధికారాలు కట్టబెట్టారు. పదేళ్ల కాలపరిమితిలో రోడ్ల మధ్యలో ఉండే మీడియన్లు, వీధి దీపాలు, బస్టాపుల ద్వారా వచ్చే వాణిజ్య ప్రకటనల ఆదాయం అంతా నేరుగా కాంట్రాక్టు సంస్థ జేబుల్లోకే వెళ్తుంది. అంతేకాకుండా, వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ఇతర సంస్థలు తీసుకునే ‘రోడ్ కటింగ్’ అనుమతుల రుసుములను కూడా ప్రైవేటు ఖాతాలోకే వెళ్లేలా ప్రాజెక్టును అత్యంత తెలివిగా రూపొందించారు. దీనివల్ల భవిష్యత్తులో కీలక రహదారులన్నీ ప్రైవేటు శక్తుల గుప్పిట్లోకి వెళ్లిపోతాయని, చివరికి సాధారణ ప్రజలు ఆ రోడ్లపై నడవాలన్నా ‘వాకింగ్ ఫీజు’ చెల్లించాల్సిన దుస్థితి వస్తుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల ఒప్పందమే ప్రధాన అడ్డంకి? ఇంజనీరింగ్ వర్గాల అంచనాల ప్రకారంం ప్రాజెక్టు వ్యవధి పదేళ్లు ఉండటమే పెద్ద కారణంగా కనిపిస్తోంది. 2–3 సంవత్సరాల ఒప్పందం అయితే సంస్థలు ముందుకు వచ్చేవని అభిప్రాయం. కానీ పదేళ్ల పాటు పాలసీలు, రాజకీయ పరిస్థితులు ఎలా మారతాయో తెలియని అనిశ్చితి సంస్థలను వెనక్కి నెడుతోంది. రాజకీయ ప్రభావమా? పీపీపీ విధానంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. ‘‘పీపీపీ విధానంలో వచ్చిన ప్రాజెక్టులను భవిష్యత్తులో పునఃపరిశీలిస్తాం’’ అన్న సంకేతాలు ప్రైవేట్ సంస్థల్లో సందేహాలు రేకెత్తించాయి. తమ వారికి కట్టబెట్టేందుకు సరికొత్త ప్లాన్? మొదటి విడత టెండర్లు అట్టర్ ప్లాప్ కావడంతో, ఇప్పుడు నిబంధనలను మరింతగా సడలించి, ప్రైవేటు సంస్థలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించి ‘తమ వారికి’ పనులు కట్టబెట్టేందుకు ప్రభుత్వం తెరవెనుక పావులు కదుపుతోంది. పీపీపీ పేరుతో ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టే ఈ కుట్రను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. -
మత్స్యకారుల వలకు కొమ్ము నిధి
మహారాణిపేట : సముద్ర గర్భం అప్పుడప్పుడు అపురూపమైన సంపదను మత్స్యకారులకు కానుకగా ఇస్తుంటుంది. ప్రస్తుతం వేట నిషేధ కాలం కొనసాగుతున్న వేళ, జీవనోపాధి కోసం తెప్పలపై వేటకు వెళ్తున్న మత్స్యకారులకు ఊహించని అదృష్టం వరించింది. విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ కాయం కలిగిన కొమ్ముకోనాం చేపలు సందడి చేశాయి. సముద్ర గర్భాన భారీ సమరం గురువారం తెప్పలపై వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు ఒక్కసారిగా భారీ బరువు తగిలింది. ఏదో పెద్ద చేప చిక్కిందని సంబరపడ్డ వేటగాళ్లకు, అది కొమ్ము కోనాం అని తెలియగానే వారి ఆనందానికి అవధులు లేవు. ఒక్కో చేప సుమారు 12 నుంచి 20 కిలోల వరకు తూగింది. 4 అడుగుల నుంచి ఏకంగా 8 అడుగుల పొడవున్న చేపలు వలకు చిక్కాయి. ఈ భారీ చేపలను పడవలోకి ఎక్కించడం మత్స్యకారులకు ఒక సవాలుగా మారింది. సముద్ర అలల మధ్య అతి కష్టం మీద వాటిని తాళ్లతో బంధించి, సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మార్కెట్లో భలే గిరాకీ.. : ఈ కొమ్ము కోనాం చేపలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ చేపలను కేరళ వాసులు అత్యంత ప్రీతిపాత్రంగా భావిస్తారు. అక్కడి రుచుల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఒక్కో పెద్ద చేప సుమారు రూ. 25,000 వరకు ధర పలికింది. వేట నిషేధ కాలంలో ఉపాధి కరువై ఇబ్బంది పడుతున్న సమయంలో, ఇలాంటి భారీ చేపలు పడటం మాకు నిజంగా దేవుడు ఇచ్చిన వరమే.. అని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హార్బర్లో కొమ్ము కోనాం సందడి


