Visakhapatnam
-
తీరానికి కాలుష్య గండం
నీలి సముద్రపు అందాలతో పర్యాటకులను ఆకట్టుకునే విశాఖ సాగరతీరం ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. నగర మురుగునీరు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు సముద్రంలో కలుస్తుండటంతో దక్షిణ తీర ప్రాంత పర్యావరణం ప్రమాదకర స్థితికి చేరుకుంటోంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని జాతీయ దూరస్పందన కేంద్రం శాస్త్రవేత్తలు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిశోధకులతో కలిసి నిర్వహించిన అధ్యయనంలో ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. –సాక్షి, విశాఖపట్నం సముద్ర కాలుష్యానికి ప్రధాన కారణాలు పెద్ద డ్రైన్లు, గెడ్డలు – 41.6 శాతం పరిశ్రమలు, పోర్టులు – 23.7 శాతం అంతర్గత కాలువలు – 33.2 శాతం ఇతర కారణాలు – 1.5 శాతం ‘మురుగు’తోనే ముప్పు ఎక్కువ తీర ప్రాంత సముద్ర కాలుష్యానికి నగరంలోని మురుగునీటి కాలువలు, డ్రైన్లే ప్రధాన కారణంగా మారాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం కాలుష్యంలో సుమారు 41.6 శాతం వాటా మురుగునీటి ప్రవాహాలదేనని పరిశోధకులు గుర్తించారు. జీవీఎంసీ పరిధిలోని అనేక కాలువలు, గెడ్డల ద్వారా ప్రతిరోజూ భారీగా మురుగునీరు సముద్రంలోకి చేరుతోంది. నిబంధనల ప్రకారం ఈ నీటిని శుద్ధి చేసిన తర్వాతే సముద్రంలోకి విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో శుద్ధి ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. నగర పరిధి, పెదగంట్యాడ, గాజువాక ప్రాంతాలు కాలుష్య ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నట్లు అధ్యయనం పేర్కొంది. ఈ ప్రాంతాల్లో భూపరితల ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవడం ఆందోళన కలిగించే అంశంగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ప్రభావంతో ఏర్పడుతున్న ‘ఉష్ణ ద్వీప’ పరిస్థితులు పర్యావరణ సమతుల్యతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని హెచ్చరించారు. ఉపగ్రహ సాంకేతికత ఆధారంగా రూపొందించిన సముద్ర కాలుష్య సూచిక ప్రకారం గంగవరం పోర్టు, విశాఖ హార్బర్ నుంచి గాజువాక, పెదగంట్యాడ వరకు ఉన్న దక్షిణ తీర ప్రాంతం తీవ్ర కాలుష్య ప్రభావంతో ప్రమాదకర మండలంగా మారుతున్నట్లు తేలింది. మేఘాద్రిగెడ్డ డ్రెయిన్ అవుట్లెట్, మల్కాపురం, గాజువాక, పెదగంట్యాడ పరిసరాల్లో కాలుష్యం అధికంగా నమోదైనట్లు పరిశోధన వెల్లడించింది. సముద్ర జలాల నాణ్యత క్షీణించడంతో పాటు ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సముద్రపు నీటిలో పెరిగిన క్లోరోఫిల్–ఏ కాలుష్య కాసారాలుగా మారిన ఈ ప్రాంతాల్లోని సముద్రపు నీటిలో క్లోరోఫిల్–ఏ సాంద్రత, లవణీయత, నీటి కాలుష్య సాంద్రత, ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. క్లోరోఫిల్–ఏ సాంద్రత పెరిగిపోతే.. సముద్రంలో నాచు దట్టంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. దీన్నే ఆల్గల్ బ్లూమ్ అని పిలుస్తారు. దీనివల్ల నాచు కుళ్లిపోయి నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ని పూర్తిగా లాగేసుకుంటుంది. ఫలితంగా ఆక్సిజన్ కొరత ఏర్పడి చేపలు, ఇతర సముద్ర జీవులు ఊపిరాడక మృత్యువాత పడతాయి. ఇలాంటి ప్రాంతాల్ని డెడ్జోన్లుగా పిలుస్తారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే కష్టమే కాలుష్య ప్రాంతాలుగా మారుతున్న తీరంలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు నడుంబిగించాలి. జీవీఎంసీ, ఏపీపీసీబీ అధికారులు హాట్స్పాట్లను గుర్తించి తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మురుగునీటి శుద్ధి ప్లాంట్లను బలోపేతం చేయడంతో పాటు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలవకుండా కట్టడి చేయకపోతే.. భవిష్యత్తులో మరింత ప్రమాదం ముంచుకొస్తుందని పరిశోధన శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి
గోపాలపట్నం: బుచ్చిరాజుపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెందుర్తికి చెందిన దండు సుబ్బారావు (69) ఎన్ఏడీలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో బుచ్చిరాజుపాలెం బస్స్టాప్ సమీపంలో రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు వెనుక చక్రాలు అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
యువకుడిపై కత్తితో దాడి
ఆరిలోవ: జీవీఎంసీ13వ వార్డు పరిధి గిరిజన గ్రామం శ్రీకృష్ణాపురంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో గాయపడిన యువకుడు విమ్స్లో చికిత్స పొందుతున్నాడు. దీనిపై ఆరిలోవ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఇరువురు యువకులు టీడీపీకి చెందినవారు కావడంతో తూర్పు ఎమ్మెల్యే రంగంలోకి దిగి కేసు లేకుండా చూడాలని ఆరిలోవ పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గాయపడిన యువకుడు మారిక శివకుమార్ తండ్రి జక్కన్న తెలిపిన వివరాలు ప్రకారం.. దగ్గర బంధువైన బత్తిన అప్పలరాజు ఆస్తి వ్యవహారంలో తన కుమారుడితో తరుచూ గొడవకు దిగుతున్నాడన్నారు. కొద్ది రోజుల క్రితం ఇదే వ్యవహారంలో తన కుమారుడిపై దాడి చేయగా..స్థానిక టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చిన తన కుమారుడు శివకుమార్పై అప్పలరాజు కత్తితో దాడి చేశాడని, అప్పలరాజు వల్ల నా కుమారుడు, మా కుటుంబానికి ప్రాణ హాని ఉందని జక్కన్న ఆవేదన వ్యక్తం చేశాడు. దీన్ని రాజకీయం చేకుండా పోలీసులు కేసు నమోదు చేయాలని కోరాడు. ఇదిలా ఉండగా ఇరు కుటుంబీకులు టీడీపీకి చెందిన వారు కావడంతో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సూచనలతో స్థానిక టీడీపీ నాయకులు కొందరు కేసు లేకుండా పోలీసులుపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేస్తారో లేదో వేచి చూడాలి. -
యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి
తాటిచెట్లపాలెం: ఉద్యోగులు తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ సూచించారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆధ్వర్యంలో ఆదివారం రైల్వే ఇండోర్ స్టేడియంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జీఎం మాట్లాడుతూ దేశ సేవలో నిరంతరం విధులు నిర్వర్తించే రైల్వే కుటుంబానికి యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ కోస్ట్ రైల్వే వుమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ చారు మాధుర్, ఆయా విభాగాల ప్రిన్సిపల్ హెడ్స్, యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
‘షియోమీ 17టీ’ సిరీస్ గ్రాండ్ లాంచ్
మహారాణిపేట: ప్రముఖ మొబైల్ రిటైల్ చైన్ ‘బీన్యూ మొబైల్స్’ ఆధ్వర్యంలో సరికొత్త ‘షియోమీ 17టీ’ సిరీస్ స్మార్ట్ఫోన్ లాంచ్ ఈవెంట్ విశాఖ బీచ్లో వైభవంగా జరిగింది. బీన్యూ మొబైల్స్ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి, సీఈవో సాయి నిఖిలేష్, ఈడీ సాయి నితేష్ తమ సేల్స్ అండ్ మార్కెటింగ్ బృందంతో కలిసి ఈ మెగా ఈవెంట్లో కొత్త మొబైల్ను లాంచ్ చేశారు. ఈ ఫోన్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.54,999 కాగా, 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.59,999గా నిర్ణయించారు. లాంచ్ మంత్ ఆఫర్ కింద కొనుగోలు చేసిన ఏడాదిలోపు 60 శాతం గ్యారెంటీ బైబ్యాక్ వాల్యూ కింద రూ.35,999 పొందే సదుపాయాన్ని కల్పించారు. ఈ సందర్భంగా బీన్యూ మొబైల్స్ సీఎండీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తమకు 150కి పైగా స్టోర్లు ఉన్నాయని తెలిపారు. ఈ కొత్త ఫోన్ను కొనుగోలు చేసిన వారికి బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో పాటు కాంప్లిమెంటరీగా యూట్యూబ్ ప్రీమియం, స్పాటిఫై ప్రీమియం స్టాండర్డ్, గూగుల్ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయని వెల్లడించారు. కస్టమర్లందరూ ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అట్టహాసంగా నిర్వహించిన బీన్యూ మొబైల్స్ -
దక్షిణ కోస్తా రైల్వే విశాఖ డివిజన్ పరిధిలో..
తాటిచెట్లపాలెం: సౌత్ కోస్ట్ రైల్వే విశాఖ డివిజన్ డీఆర్ఎం లలిత్బోహ్రా ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శుభం కాంప్లెక్స్లో ఘనంగా నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పలు ప్రధాన రైల్వేస్టేషన్లలో యోగా వేడుకలు చేపట్టారు. డీఆర్ఎం ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎంలు ఇ.శాంతారాం(ఇన్ఫ్రా), కె.రామారావు(ఆపరేషన్స్), సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ జూసుఫ్ కబీర్ అన్సారీ, ఆయా బ్రాంచ్ల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. -
బీచ్ షాక్స్కు వ్యతిరేకంగా వినూత్న నిరసన
మహారాణిపేట: ఆర్కే బీచ్లో బీచ్ షాక్స్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం వినూత్న నిరసన చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఆక్వా స్టోర్స్ కాంప్లెక్స్ వరకు మద్యం ఖాళీ సీసాలను మెడలో ధరించి ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు వై. రాంబాబు, ఎం.ఏ. బేగం, యు. నాగరాజులు మాట్లాడుతూ విశాఖ బీచ్ను కుటుంబాలతో కలిసి సందర్శించే ప్రశాంత ప్రాంతంగా కొనసాగించాలని, జీవో నెం. 362ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజలను ఐక్యం చేసి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన, విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వీసీబీ డివిడెండ్ 10 శాతం
బీచ్రోడ్డు: ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (వీసీబీ) ఈ ఏడాది 10 శాతం డివిడెండ్ను ఇవ్వాలని పాలకవర్గం నిర్ణయించినట్లు బ్యాంక్ చైర్మన్ జె.వి.సత్యనారాయణమూర్తి ప్రకటించారు. ఆదివారం సిరిపురంలోని వుడా చిల్డ్రన్స్ ఎరీనాలో వీసీబీ మహాజన సభ ఘనంగా జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ.. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పాలనా, ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టి ఆమోదించినట్లు తెలిపారు. బ్యాంకు లాభాల్లో డివిడెండ్ మొత్తం రూ.39.24 కోట్లుగా ఉందని, మిగిలిన లాభాలను చట్టపరమైన నిష్పత్తుల్లో ఆయా ఖాతాలకు జమ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి బ్యాంకు రూ.66.15 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని వెల్లడించారు. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం ఈ ఏడాది చివరకు నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, మార్కాపురం జిల్లాలతో పాటు విశాఖ నగరం, తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, ఏపీ రాజధాని ప్రాంతంలో కొత్త బ్రాంచ్లను ప్రారంభించి, బ్రాంచ్ల సంఖ్యను 68కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ పూర్వ అధ్యక్షుడు మానం ఆంజనేయులు, డైరెక్టర్లు వి.చంద్రశేఖర్, సి.కృష్ణ మోహన్, ఉప్పలపాటి పార్వతీదేవి, చలసాని రాఘవేంద్ర రావు, ఎస్.నాగభూషణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
ఏయూపై రాజకీయ రాహు–కేతువులు!
విశాఖ విద్య: వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీ ప్రస్తుతం విద్యా, పరిశోధన అంశాల కంటే రాజకీయ వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత యూనివర్సిటీ అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి పెట్టాల్సిన సమయంలో రాజకీయ ఆరోపణలు, వ్యక్తిగత విభేదాలే ప్రధాన చర్చగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ అభిప్రాయాలకు బలం చేకూరుస్తున్నాయని విద్యావర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మాజీ వైస్ చాన్సలర్, గత పాలకవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కూటమికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తరచూ ఆరోపణలు చేయడం యూనివర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనివల్ల ఏయూ ప్రతిష్ట దెబ్బతింటోందని ఉద్యోగులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరి బాధ ఏమిటి? ఏయూ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిందనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. పోస్టింగులు, పదోన్నతులు, పరిపాలనా నిర్ణయాల్లో రాజకీయ ప్రభావం అధికమైందనే ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లోనూ యూనివర్సిటీ భవిష్యత్తు కంటే గత పాలకవర్గంపై విమర్శలకే ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆధారాలు స్పష్టంగా లేకపోయినా విచారణలు జరపాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే చర్చ జరుగుతోంది. తప్పులు జరిగి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎవరూ వ్యతిరేకించడం లేదని, అయితే రాజకీయ కక్షలతో వ్యవహరిస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్లడం ప్రభుత్వానికే నష్టం చేస్తుందని కూటమి వర్గాల్లోనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గోతికాడ గుంటనక్కలా... ఏయూ ప్రతిష్ట దెబ్బతింటే తమ విద్యాసంస్థలకు లాభం చేకూరుతుందనే ఆలోచనతో మరో ప్రజాప్రతినిధి, టీడీపీకి చెందిన కీలక నేత వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా యూనివర్సిటీ వర్గాల్లో సాగుతోంది. ఏయూకు సంబంధించిన ప్రతి వివాదాన్ని రాజకీయంగా వినియోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ ర్యాంకింగ్స్, గుర్తింపుల విషయంలో ఇప్పటికే సవాళ్లు ఎదుర్కొంటున్న యూనివర్సిటీపై బయటకు ఆందోళన వ్యక్తం చేస్తూనే, లోలోపల దాని బలహీనతలను రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వర్సిటీలోని కొందరు వర్గాలు కూడా అలాంటి ప్రయత్నాలకు సహకరిస్తున్నాయనే ప్రచారం కొనసాగుతోంది. కాపాడతారా... రాజకీయాలకు బలి చేస్తారా? ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో ఆంధ్రా యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి సంస్థపై రాజకీయ కక్షలు, వ్యక్తిగత విభేదాలు, ప్రయోజనాల రాజకీయాలు ప్రభావం చూపడం పట్ల మాజీ ఆచార్యులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలని, తప్పులు జరిగి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అయితే యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఎవరికీ మేలు చేయదని హెచ్చరిస్తున్నారు. విద్యా సంస్థలను రాజకీయాలకు బలి చేయకుండా వాటి అభివృద్ధి, ప్రతిష్ట పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. తప్పులెంచువారు.. ఏయూ వ్యవహారాలపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న ఈ ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంత మేరకు సఫలమయ్యారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికల హామీల అమలు, స్థానిక సమస్యల పరిష్కారంలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే విషయంలో వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలపైనా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో ఎమ్మెల్యేపై కూడా ప్రజల కోసం చెప్పుకోదగ్గ స్థాయిలో పనిచేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత అసంతృప్తులతో ఏయూనే లక్ష్యంగా చేసుకుంటున్నారనే ప్రచారం నేపథ్యంలో విద్యార్థి, ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాసంస్థలను రాజకీయ పోరాటాలకు వేదికలుగా మార్చడం వల్ల నష్టపోయేది విద్యార్థుల భవిష్యత్తేనని వారు హెచ్చరిస్తున్నారు. -
లారీ ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి
అక్కిరెడ్డిపాలెం: ఆటోనగర్ ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్దుల్ గఫార్ (17) అనే ఇంటర్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోనగర్ ఎస్ఆర్ఎంటీ ప్రాంతానికి చెందిన అబ్దుల్ సత్తార్ కుమారుడు గఫార్ స్థానిక కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి ద్విచక్ర వాహనాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. సమీపంలోని పెట్రోల్ బంక్లో బైక్కు పెట్రోల్ పోయించుకుని తిరిగి వస్తుండగా.. ఆటోనగర్ ఎంఎస్ఎంఈ కార్యాలయం వద్దకు రాగానే ఓ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయమై గఫార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న గాజువాక ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యోగా దినచర్య కావాలి
మహారాణిపేట: ఆరోగ్యకర ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించారు. భారీ వర్షం కారణంగా ఆర్కే బీచ్లో జరగాల్సిన ఈ వేడుకను సాగరిక ఫంక్షన్ హాల్కు మార్చి ఘనంగా జరిపారు. హోంమంత్రితో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సామూహిక యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో, ముఖ్యంగా చిన్నారుల్లో పెరుగుతున్న డిప్రెషన్ను తగ్గించడానికి యోగా, ధ్యానం ఎంతో అవసరమన్నారు. కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ.. ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్తో ఈ ఏడాది నెల రోజులుగా జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. నేవీ సహకారంతో పాటు రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్, గోల్ఫ్ క్లబ్ వంటి పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించినట్లు వివరించారు. అనంతరం జిల్లా స్థాయి యోగా పోటీల విజేతలకు, యోగా గురువులకు అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఆంధ్ర యూనివర్సిటీ యోగా విభాగం విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఏయూ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, ఆర్డీవో దిలీప్ చక్రవర్తి, డీఎఫ్వో రవీందర్ ధామా, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, వెంకటరత్నం, యోగా అసోసియేషన్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంగా యోగా డే విశాఖ పోర్ట్ ఆధ్వర్యంలో..మహారాణిపేట: విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం అక్కయ్యపాలెంలోని పోర్ట్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో 500 మందికి పైగా ఉద్యోగులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన పోర్ట్ చైర్పర్సన్ జె.ఎస్.బింద్రా మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారాలని సూచించారు. బెంగళూరు ఆశ్రమానికి చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా గురువు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోర్ట్ ఉద్యోగులతో వివిధ యోగాసనాలు, శ్వాసాభ్యాసాలు, ధ్యాన ప్రక్రియలను సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పోర్ట్ డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి కోరటి, ముఖ్య విజిలెన్స్ అధికారి టి.అరుణ్ప్రసాద్, కార్యదర్శి ఎం.శంకర్బాబు తదితరులు పాల్గొన్నారు.సింహగిరిపై యోగాసనాలు సింహాచలం: సింహగిరిపై 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న మాడవీధిలో జరిగిన ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు ప్రారంభించారు. దేవస్థానం అర్చకులు, అధికారులు, సిబ్బంది, సంస్కృతోన్నత పాఠశాల, వేద విద్యార్థులు, సేవా వలంటీర్లు, భక్తులు సుమారు వెయ్యి మంది యోగాసనాలు వేశారు. వేదికపై దేవస్థానం వేదపాఠశాల విద్యార్థులు వేసిన ‘సూర్యరథం’ ఆసనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యోగా గురువు జి.వెంకటరమణ, యోగా శిక్షకురాలు శ్రీదేవి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ఈఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
తప్పుడు కేసులతో భయపెట్టలేరు
వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు మహారాణిపేట: వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ కానూరు కారుమూరి సునీల్ కుమార్ను అక్రమ మద్యం కేసులో అరెస్ట్ చేయడాన్ని వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం తీవ్రంగా ఖండించింది. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు, అధికార ప్రతినిధి మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజా దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సునీల్ కుమార్పై తప్పుడు కేసు బనాయించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మద్యం సిండికేట్లు నడుస్తున్నాయని, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. విశాఖ, బాపట్ల వంటి తీర ప్రాంతాల్లో గోవా తరహా ‘బీచ్ లిక్కర్ సంస్కృతి’ని తీసుకురావాలని ప్రభుత్వం చూడడం వల్ల మహిళల భద్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీచ్లలో మద్యం విక్రయాల వల్ల మహిళల భద్రత దెబ్బతింటుందని, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతాయని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఈ మద్యం విధానాలను పునఃసమీక్షించాలని, సునీల్ కుమార్పై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు జగ్గుపల్లి నరేష్, రవి కిరణ్, నాగిరెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి చిన్నారి బలి!
మధురవాడ: అధికారుల నిర్లక్ష్యం ముక్కుపచ్చలారని ఒక చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. మధురవాడ సమీపంలోని సాయిరాం కాలనీ జీసీసీ లేఅవుట్లో విద్యుత్ షాక్తో ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా నుంచి ఉపాధి కోసం విశాఖకు వచ్చిన కురిటి నారాయణరావు, చిన్నమ్మలు దంపతులు సాయిరాం కాలనీలోని ఒక అపార్ట్మెంట్లో వాచ్మ్యాన్గా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొడుకు కురిటి అఖిల్(6) స్థానిక మండల ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. బంతి కోసం వెళ్లి... అనంత లోకాలకు! ఆదివారం ఉదయం అఖిల్ తన స్నేహితులతో కలిసి ఇంటి సమీపంలో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో బంతి ప్రమాదవశాత్తు ‘శ్రీ రేణుక అపార్ట్మెంట్’ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ పైపుల వద్దకు వెళ్లింది. బంతిని తెచ్చేందుకు అఖిల్ అక్కడికి వెళ్లగా, తెగిపోయి బయటకు ఉన్న వైర్ తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే చిన్నారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. యూజీడీ పనులే కారణం? సదరు ప్రాంతంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కేబుల్ పనుల వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పనుల క్రమంలోనే ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ వైర్ తెగిపోయి బయటకు వచ్చేసిందని, దానివల్లే విద్యుదాఘాతం సంభవించిందని ఆరోపిస్తున్నారు. ఘటనపై విద్యుత్ శాఖ ఎస్ఈ శ్యామ్బాబు, ఈఈ సింహాచలం నాయుడు, డీఈ కిరణ్కుమార్ తదితరులు క్షేత్రస్థాయికి చేరుకుని పరిశీలించారు. యూజీడీ కేబుల్ పనుల వల్లే ఎర్త్ వైర్ కట్ అయినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలి విద్యుత్ శాఖ, శ్రీ రేణుక అపార్ట్మెంట్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి కురిటి అఖిల్ మృతి చెందాడని, అతని కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేసింది. ఆదివారం రాత్రి బాధితులతో కలిసి సాయిరాం కాలనీలోని రేణుక అపార్ట్మెంట్ వద్ద ధర్నా చేశారు. -
యోగా సాధనతో ఖైదీల్లో క్రమశిక్షణ
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జైలు అధికారులు ఘనంగా నిర్వహించారు. జైలు లోపల సుమారు 1,200 మంది ఖైదీలతో 80 మంది జైలు సిబ్బంది యోగాసనాలు వేయించి, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేయించారు. ఇక్కడ ఖైదీలు, సిబ్బంది వివిధ ఆకారాల్లో ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా జైలు పర్యవేక్షణాధికారి ఎం.మహేష్బాబు మాట్లాడుతూ కారాగారాల్లో యోగ సాధన వల్ల ఖైదీల్లో క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ సూర్యకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మైదానాలు నిర్మించాలి
బీచ్రోడ్డు: జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరిన్ని క్రీడా మైదానాలను నిర్మించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు జీవీ రామచంద్రరావు పేర్కొన్నారు. ఆదివారం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఫుట్బాల్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న క్రీడాకారులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశాఖ నుంచి అనేక మంది ఫుట్బాల్ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారన్నారు. వీరికి ప్రభుత్వం తరఫున మరింతగా సహాయ సహకారాలు అందిస్తే.. అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణిస్తారన్నారు. క్రీడాకారుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం నగరంలో ప్రత్యేకంగా ఒక ఫుట్బాల్ మైదానాన్ని నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ హెడ్ కోచ్ ఎం.శేషు మోహన్, కోచ్లు వి.మోహన్ కుమార్, ఎస్.గణేష్, కె.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా నీట్
పరీక్షా కేంద్రం వద్ద హాల్టికెట్ తనిఖీచెవి రింగులు తీస్తూ...విశాఖ విద్య: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నీట్ రీ–ఎగ్జామ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసింది. జిల్లాలోని మొత్తం 18 పరీక్షా కేంద్రాల్లో అధికారుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్షను నిర్వహించారు. జిల్లాలో వ్యాప్తంగా 8,015 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 7,298 మంది పరీక్షకు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. హాజరైన అభ్యర్థుల్లో మహిళా అభ్యర్థులదే పైచేయిగా నిలిచింది. 5,679 మంది మహిళా అభ్యర్థులు, 1,619 మంది పురుష అభ్యర్థులు పరీక్ష రాశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు నీట్ రీ–ఎగ్జామ్ నేపథ్యంలో అధికారులు ముందస్తుగానే అన్ని పరీక్షా కేంద్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. మెటల్ డిటెక్టర్ల ద్వారా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, అభ్యర్థులను లోపలికి అనుమతించారు. ప్రతి కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ కెమెరాల నిఘాలో పరీక్ష ప్రక్రియ సాగింది. అభ్యర్థులు సకాలంలో చేరుకునేందుకు వీలుగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తాగునీరు, వైద్య సిబ్బంది వంటి కనీస సదుపాయాలను సైతం పరీక్షా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులకు తోడుగా తల్లిదండ్రులు తెల్లవారుజాము నుంచే అభ్యర్థులను తల్లిదండ్రులు స్వయంగా పరీక్షా కేంద్రాలకు తీసుకువచ్చారు. తమ పిల్లలు ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యం చెబుతూ, వెంట తోడుగా నిలిచారు. కొందరు తల్లిదండ్రులు పరీక్ష ముగిసే వరకు కేంద్రాల బయటే వేచి ఉన్నారు. అభ్యర్థుల్లో ఉద్వేగ వాతావరణం నీట్ రీ–ఎగ్జామ్ కావడంతో హాజరైన అభ్యర్థుల్లో ఒక విధమైన ఉద్వేగ వాతావరణం స్పష్టంగా కనిపించింది. చాలా మంది అభ్యర్థుల ముఖాల్లో ముభావత, ఆందోళన ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. మరోసారి పరీక్ష రాయాల్సి రావడంతో మానసికంగా ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, జేసీ విద్యాధరితో కలిసి ఆంధ్రా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ, కేంద్రీయ విద్యాలయ–2 పరీక్షా కేంద్రాలను సందర్శించారు. అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. నాన్నతోడుగా...పరీక్షా కేంద్రం వద్ద తనిఖీలు -
టెకీ రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం
ముస్సోరీ: ఉత్తరాఖండ్లోని ముస్సోరీ హిల్ స్టేషన్లో గల ఒక హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాధా గాయత్రి మృతిపై ఆమె తండ్రి ముస్సోరీ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మృతురాలి భర్త శ్రీచరణ్పై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.తన కుమార్తె మరణం వెనుక బలమైన అనుమానాలు ఉన్నాయని, దీనిని హత్యగా పరిగణించి సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.తన ఫిర్యాదులో శ్రీచరణ్ ప్రవర్తనపై రాధా గాయత్రి తండ్రి పలు సంచలన ఆరోపణలు చేశారు.పెళ్లయినప్పటి నుంచి శ్రీచరణ్ తన కుమార్తెతో సరిగ్గా కలిసి ఉండేవాడు కాదని, ఆమెను తీవ్ర మానసిక వేధింపులకు గురిచేసేవాడని పేర్కొన్నారు. శ్రీచరణ్ ఒక సైకోలా ప్రవర్తించేవాడని, నిరంతరం నిఘా ఉంచేందుకు గాయత్రి బ్యాగులో ట్రాకర్ కూడా పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త పెట్టే వేధింపుల గురించి గాయత్రి గతంలో తమతో పలుమార్లు చెప్పి ఏడ్చిందని ఆయన ఫిర్యాదులో వివరించారు. కుమార్తె మరణంపై భర్త శ్రీచరణ్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.రాధా గాయత్రికి లోబీపీ ఉందని శ్రీచరణ్ అబద్ధాలు చెబుతున్నాడని, కానీ ఆమె ఆరోగ్య చరిత్రలో ఎప్పుడూ బీపీ సమస్యే లేదని స్పష్టం చేశారు. భార్య చనిపోతే శ్రీచరణ్ ఎందుకు మౌనంగా ఉన్నాడని ఆయన ప్రశ్నించారు. అలాగే, హోటల్లో బీరులో మత్తు పదార్థాలు కలిపారనే వార్తలు మీడియాలో వస్తున్నాయని, ఈ కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారణ జరపాలని కోరారు.ఈ కేసులో పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించడంలో నిర్లక్ష్యం వహించారని రాధా గాయత్రి తండ్రి ఆరోపించారు.ఘటన జరిగిన రోజున భర్త శ్రీచరణ్ రక్త నమూనాలను ఎందుకు సేకరించలేదని ఆయన నిలదీశారు. ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా శాస్త్రీయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఘటనకు ముందు జరిగిన 48 గంటల ఆర్థిక లావాదేవీలను పరిశీలించాలని, రాధకు నిజంగానే మత్తు పదార్థాలు ఇచ్చారా లేదా అనేది తేల్చాలన్నారు. దీంతో పాటు హోటల్ రికార్డులు, ఫోన్ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలను తక్షణమే భద్రపరచాలని ముస్సోరీ పోలీసులను కోరారు. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. -
నాన్న ప్రోత్సాహమే డాక్టర్ను చేసింది
నాన్న ప్రోత్సాహం, ఆత్మస్థైర్యమే నన్ను ఈ స్థాయికి చేర్చాయి. చిన్నప్పటి నుంచి నా ప్రతి అడుగును గమనిస్తూ, నా అభీష్టాల మేరకు చదివించి, డాక్టర్ కావాలనే నా లక్ష్యాన్ని నెరవేర్చారు. మెడిసిన్ పూర్తి చేశాక తొలుత హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో చేరినా, నాన్న చెంతనే ఉంటే ధైర్యంగా ఉంటుందనే నమ్మకంతో ప్రస్తుతం విశాఖ విశ్వం హాస్పిటల్స్ క్రిటికల్ కేర్ విభాగంలో డ్యూటీ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. – శ్రీపాద వెంకట శ్రీ అలేఖ్య, డ్యూటీ మెడికల్ ఆఫీసర్, విశ్వం హాస్పటిల్స్ -
‘ఏరా’ ఎలక్ట్రిక్ బైక్ విక్రయాల ప్రారంభం
మహారాణిపేట: భారతీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ‘మ్యాటర్’ రూపొందించిన అత్యాధునిక ‘ఏరా’ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ విక్రయాలు విశాఖలో ప్రారంభమయ్యాయి. దేశంలోనే గేర్లు (4–స్పీడ్ గేర్బాక్స్) కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్గా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. 5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో పనిచేసే ఈ బైక్ కేవలం 25 పైసల వ్యయంతో ఒక కిలోమీటరు ప్రయాణిస్తుందని, కేవలం 2.8 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 3 రైడింగ్ మోడ్స్, 7 అంగుళాల స్మార్ట్ టచ్స్క్రీన్ డిస్ప్లే, నావిగేషన్, స్మార్ట్కీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్న ఈ బైక్కు జీవితకాల బ్యాటరీ వారంటీ ఇస్తున్నట్లు విశాఖ డీలర్లు నరేష్ జైన్, మహావీర్ జైన్ వెల్లడించారు. ఆసక్తి గల వినియోగదారులు ఏరా ఎక్స్పీరియన్స్ హబ్ను సందర్శించి టెస్ట్ రైడ్ చేయవచ్చని వారు కోరారు. -
ఆన్–కాల్ డ్రైవర్లకు ఆర్టీసీ అవకాశం
డాబాగార్డెన్స్: ఆర్టీసీ డిపోల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు ఆన్–కాల్ డ్రైవర్లు, ఐటీఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. రెండేళ్ల హెవీ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు భారీ వాహనాలు నడిపిన అనుభవం ఉండి, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్న పురుష అభ్యర్థులు ఆన్–కాల్ డ్రైవర్లుగా పనిచేసేందుకు అర్హులని పేర్కొన్నారు. డిపోల్లో డ్రైవర్ల కొరత ఉన్న సమయంలో మాత్రమే వీరికి తాత్కాలికంగా విధులు కేటాయించడం జరుగుతుందన్నారు. దీంతో పాటు వివిధ ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసి, అనుభవం కలిగిన అభ్యర్థులు ఔట్సోర్సింగ్ పద్ధతిలో కాంట్రాక్టర్ ద్వారా వేతనాలు పొందేందుకు మొగ్గు చూపితే వారికి కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఆసక్తి, సమ్మతి గల అభ్యర్థులు తమ నివాసానికి సమీపంలో ఉన్న ఆర్టీసీ డిపో మేనేజర్లను ఆధార్ కార్డు, ఇతర అసలు ధ్రువీకరణ పత్రాలతో నేరుగా సంప్రదించాలని ఆయన సూచించారు. -
పోర్టును సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ దర్శన్లో భాగంగా 2025 బ్యాచ్కు చెందిన ట్రైనీ ఐఏఎస్లు విశాఖపట్నం పోర్టును శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పోర్టు చైర్మన్ జేఎస్ బింద్రా.. అసిస్టెంట్ కలెక్టర్స్ అండర్ ట్రైనీస్కు ఆత్మీయ స్వాగతం పలికారు. దేశ ఆర్థికాభివృద్ధిలో పోర్టు పాత్ర, కార్యాచరణ సామర్థ్యాలపై సమగ్ర ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో పోర్టు సరకు నిర్వహణ, ఆధునికీకరణ, సౌర విద్యుదుత్పత్తి, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణ, నూతన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్, ఎగుమతి–దిగుమతి అవకాశాలపై శిక్షణార్థులకు పూర్తి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి కొరటి, పోర్టు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
మాజీ సైనికోద్యోగి ఆత్మహత్య
గోపాలపట్నం: నేవల్ విభాగంలో శుక్రవారం అర్ధరాత్రి ఒక మాజీ సైనికోద్యోగి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్ర లోహరా గ్రామానికి చెందిన మాజీ సైనికుడు మోర్ పరాగ్ సురేష్ రావ్ (43), మాజీ సైనికుల కోటాలో వెపన్ ఎక్యూప్మెంట్ డిపోలో ఉద్యోగం పొంది, నాలుగు నెలల క్రితమే విధుల్లో చేరా డు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి డిఫెన్స్ క్వార్టర్స్లో నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి నౌశక్తినగర్ పోస్టు నంబర్–1లో విధులకు హాజరైన సురేష్ రావ్, అర్ధరాత్రి 2.30 నుంచి 3 గంటల మధ్య టవర్–4 వద్ద తన వద్ద ఉన్న తుపాకీతో దవుడ కింద కాల్చుకున్నాడు. తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే ప్రాణా లు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శంకరనారాయణ ఆధారాలు సేకరించారు. సూసైడ్ నోట్లో...‘నా మృతికి ఎవరూ కారణం కాదు. నాకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలు నా పిల్లలకు చెందేలా చూడాలి’అని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య మయూరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పరిపూర్ణ ఆరోగ్యానికి యోగ సౌభాగ్యం
జీవనశైలి వ్యాధులకు యోగాతో సమర్థ పరిష్కారం ఒక్కో ఆసనంలో వందలాది ఆరోగ్య ప్రయోజనాలు వయోభేదం లేకుండా సాధన చేస్తే ప్రశాంత జీవనం నగరంలో ఉచిత యోగా శిక్షణకు పెరుగుతున్న ఆదరణ ఉరుకుల పరుగుల జీవితం.. నిరంతర ఒత్తిడి.. చిన్న వయసులోనే ఊబకాయం.. వయసుతో సంబంధం లేకుండా గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, బ్రెయిన్ స్ట్రోక్ల వంటి జీవనశైలి వ్యాధులు మనిషి ఆరోగ్యాన్ని సవాలు చేస్తున్నాయి. అయితే వీటన్నింటినీ ఎదుర్కొనే సమర్థ మార్గం యోగానేనని యోగా సాధకులు చెబుతున్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను అందించే యోగా, ఆధునిక జీవనశైలికి అవసరమైన ఉత్తమ ఆరోగ్య సాధనగా మారిందంటున్నారు. ఏళ్ల తరబడి యోగా సాధన చేస్తున్న వారు తమ అనుభవాలను పంచుకుంటూ, వివిధ ఆసనాల ద్వారా పొందిన ప్రయోజనాలను వివరిస్తున్నారు. వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవనం సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. –ఎంవీపీ కాలనీమయూరాసనంతో జీర్ణశక్తి మెరుగుదల నా వయసు 78 సంవత్సరాలు. గత కొన్నేళ్లుగా యోగ సాధన చేస్తున్నాను. మయూరాసనం వంటి క్లిష్టమైన ఆసనాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా సాధన చేస్తే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. – టి.శాంతారాం, యోగా సాధకుడు, సీతమ్మధార ఆరోగ్య సమస్యల నుంచి యోగా గురువుగా... నాలుగేళ్ల క్రితం యోగాలో చేరే సమయానికి స్పాండిలైటిస్, గ్యాస్ట్రిక్, మలబద్ధకం, సైనసైటిస్ వంటి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడేవాడిని. కనకరావు గురువు మార్గదర్శకత్వంలో యోగా శిక్షణ పొందిన తర్వాత ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది. ప్రస్తుతం ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం రావడం లేదు. యోగాపై ఆసక్తితో ఏయూ నుంచి యోగా పీజీ పూర్తి చేసి, ‘బ్లిస్ఫుల్ యోగా’ కేంద్రాన్ని స్థాపించి శిక్షణ అందిస్తున్నాను. వేసవి సెలవుల్లో పిల్లలకు ప్రత్యేక యోగా శిక్షణ కూడా ఇస్తున్నాను. – ఎన్.వి.రమణ, కోక్ ఓవెన్స్ చార్జిమెన్, స్టీల్ప్లాంట్, యోగా గురువువెన్నెముక రక్షణకు భుజంగాసనం మన శరీరానికి వెన్నెముకే ప్రధాన ఆధారం. భుజంగాసనం సాధన ద్వారా వెన్నెముక కండరాలు బలపడటంతో పాటు స్నాయువులకు సాగుదల పెరుగుతుంది. గొంతు, ఉదర భాగాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. సులభంగా చేయగలిగే ఈ ఆసనం ప్రతి ఒక్కరికీ ఉపయోగకరం. –చించాలి నూతన్, విశ్రాంత స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ -
నాన్నే నా హీరో
నా తప్పులు, నిర్లక్ష్యంపై నాన్న వేసిన మందలింపులే ఈరోజు నాకు జీవితపాఠాలుగా మారుతాయని ఊహించలేదు. ఏమీ లేని స్థాయి నుంచి నన్ను ఈ స్థితికి తీసుకురావడంలో నాన్న చేసిన త్యాగాలు, శ్రమ, నాపై ఆయన ఉంచిన నమ్మకమే నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ప్రతి విజయవంతమైన కుమారుడి వెనుక తన కలలను త్యాగం చేస్తూ నిరంతరం కష్టపడే తండ్రి ఉంటాడు. ఈ రోజు నేను ఉన్న ఈ ఉన్నత స్థానానికి నాన్న ప్రేమ, మార్గదర్శనం, ఆశీర్వాదాలే కారణం. నా జీవితంలో నాన్నే నా మొదటి హీరో. – ఈమని అభయ్ కృష్ణ, పాలసీ ఇంప్లిమెంటేషన్ రీజనల్ హెడ్ -
లంచాల ‘గ్రేటర్’
డాబాగార్డెన్స్: జీవీఎంసీని అవినీతి రహితంగా తీర్చిదిద్దుతామని, పారదర్శక పాలనకు కట్టుబడి ఉన్నామని ఉన్నతాధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటిస్తూనే, మరోవైపు కొందరు ఉద్యోగులు లంచాల దందాను కొనసాగిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. అవినీతి నిర్మూలనకు జీవీఎంసీ ప్రత్యేకంగా 1800 4250 0009 టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసింది. ప్రజలు నిర్భయంగా ఫిర్యాదులు చేయవచ్చని, వాటిని స్వయంగా పరిశీలిస్తానని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇటీవల ప్రకటించారు. టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్, ప్రజారోగ్యం, రెవెన్యూ, యూసీడీ, హార్టికల్చర్ తదితర విభాగాల్లో పెండింగ్ ఫైళ్లను రెండు రోజుల్లోగా పరిష్కరించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ హెచ్చరించినా.. కమిషనర్ ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయన్న ప్రశ్నకు తాజాగా వెలుగులోకి వచ్చిన ఏసీబీ కేసు సమాధానంగా నిలుస్తోంది. జీవీఎంసీ పశ్చిమ జోనల్ కార్యాలయం (జోన్–5)లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మురుగుటు శ్రీను, 2023లో మరణించిన ఉద్యోగి వెన్ను అప్పలనారాయణ కుటుంబానికి రావాల్సిన పెన్షన్, ఇతర సర్వీస్ బెనిఫిట్స్ ఫైల్ను ముందుకు పంపేందుకు రూ.30 వేల లంచం డిమాండ్ చేశాడు. బాధిత కుటుంబ సభ్యులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో అదనపు ఎస్పీ హర్షిత, డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉచ్చుపన్ని, బాధితుల నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో శ్రీనును రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. అనంతరం అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. ప్రాథమిక విచారణలో నిందితుడు మూడు రోజుల క్రితమే మరో వ్యక్తి నుంచి కూడా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనతో ఉన్నతాధికారుల హెచ్చరికలు, పారదర్శక పాలనపై ఇచ్చిన హామీలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయన్న అంశంపై మరోసారి చర్చ మొదలైంది. అవినీతి ఉద్యోగులపై కఠిన చర్యలు చేపట్టాలి ప్రజలకు సేవలందించాల్సిన కార్యాలయాల్లో లంచాల కోసం వేధింపులు కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. అవినీతికి పాల్పడే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఫిర్యాదులపై వేగంగా స్పందించి వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. -
యోగాతో విభిన్న ఆరోగ్య ప్రయోజనాలు
ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. దానిని జయించడానికి యోగానే ఉత్తమ మార్గం. వెన్నునొప్పి, సయాటికా, ఊబకాయం, నిద్రలేమి, మహిళల ఆరోగ్య సమస్యలు వంటి అనేక జీవనశైలి వ్యాధులను యోగా ద్వారా నియంత్రించవచ్చు. యోగ సాధన మనిషిలో సానుకూల శక్తిని పెంపొందిస్తుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో మా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉచిత యోగా శిక్షణ అందిస్తున్నాం. శిక్షణకు 93333 33344 నెంబర్లో సంప్రదించవచ్చు. –డాక్టర్ చిలుకా వెంకట రమేష్, ఓం ఫ్రీ యోగా సంస్థ వ్యవస్థాపకులు -
వీసీబీ నికరలాభం రూ. 66.15 కోట్లు
సీతంపేట: విశాఖపట్నం కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (వీసీబీ) ఈ ఏడాది మార్చి నాటికి రూ. 66.15 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు బ్యాంక్ చైర్మన్ జే.వీ.సత్యనారాయణమూర్తి శనివారం ద్వారకానగర్లోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడి యా సమావేశంలో వెల్లడించారు. మొత్తం 1,17,884 మంది సభ్యుల ద్వారా సమకూరిన రూ. 416.29 కోట్ల షేర్ క్యాపిటల్తో దేశంలోని అర్బన్ బ్యాంకుల్లో వీసీబీ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే రూ. 4,594.97 కోట్ల డిపాజిట్లు, రూ. 3,877.42 కోట్ల రుణాల మంజూరుతో కలిపి ప్రస్తుతం మొత్తం రూ. 8,472.39 కోట్ల లావాదేవీలతో బ్యాంక్ నడుస్తోంది. బ్యాంకు సాధించిన నికర లాభాల పంపిణీపై ఆదివారం జరిగే సర్వసభ్య సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో సింహభాగంగా 61 శాతం మేర డివిడెండ్ చెల్లించి, మిగిలిన మొత్తాన్ని ఉద్యోగుల బోనస్, చట్టబద్ధమైన కేటాయింపులకు వినియోగిస్తామన్నారు. ఈ ఏడాది మరో తొమ్మిది కొత్త బ్రాంచ్లను విస్తరించడానికి సిద్ధమవుతోందన్నారు. డైరెక్టర్లు ఎస్. నాగభూషణం చౌదరి, ఏ.జే. స్టాలిన్, వీరఘంట చంద్రశేఖర్, గుల్లపల్లి జనార్ధన రావు, చెరువు ఆదినారాయణ శాస్త్రి, కందపు ప్రసాదరావు, ఉప్పలపాటి పార్వతీదేవి, చిన్నం కోటేశ్వరరావు, సీఈవో వరలక్ష్మి , డిప్యూటీ సీఈవో గణేష్ కుమార్, జీఎం ప్రసాద్ పాల్గొన్నారు. -
సంపద సృష్టి అంటే ఇదేనా?
డాబాగార్డెన్స్: ‘ఆహ్లాదం, ఆనందం, ప్రశాంతతను అందించే బీచ్ ప్రాంతాన్ని బీర్లు, మత్తు పదార్థాల కేంద్రంగా మార్చుతారా? ఇదేనా చంద్రబాబు సంపద సృష్టి అంటే? అంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ మండిపడ్డారు. ‘బీచ్ షాక్స్’ పేరిట విశాఖ తీరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం ఆర్కే బీచ్ కాళీమాతా ఆలయం ఎదురుగా ఆయన ఆధ్వర్యంలో వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టారు. పసుపు చొక్కాలు వేసుకున్న కొందరు.. బీచ్ రోడ్డులో బీర్లు, వైన్లు, చికెన్ దుకాణాలు పెట్టి విక్రయిస్తున్నట్లుగా స్కిట్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ప్లకార్డులు పట్టుకుని చేసిన నినాదాలతో బీచ్ రోడ్డు హోరెత్తింది. మత్స్యకారుల ప్రాణాలతో చెలగాటమా? అనంతరం వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో పాటు వినాయక నిమజ్జనాలు, పౌర్ణమి పుణ్యస్నానాలు, శివరాత్రి వేళ కోటి శివలింగాల పూజలు అందుకునే పవిత్రమైన విశాఖ తీరంలో వైన్ దుకాణాలు పెట్టి యువతను మత్తులో ముంచుతారా అని చంద్రబాబు, లోకేష్, ఎంపీ భరత్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలు, పాఠశాలల సమీపంలో నిబంధనలు పాటించకుండా రాష్ట్రవ్యాప్తంగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నా సరిపోలేదా అని ప్రశ్నించారు. మా మత్స్యకారులు నివసించే ప్రాంతాలే మీకు కావాలా.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. బీచ్లో మద్యం సేవించి సముద్రంలో ఈతకు వెళ్లి ఎవరైనా చనిపోతే దానికి బాధ్యులు ఎవరని నిలదీశారు. తాగి పడేసే మద్యం సీసాల వల్ల చెప్పులు లేకుండా తిరిగే మత్స్యకారులు గాయాలపాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో రద్దు.. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మద్యం దుకాణాలు పెట్టడమే ఏకై క మార్గమా అని వాసుపల్లి విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ‘బీచ్ షాక్స్’ జీవోను బంగాళాఖాతంలో కలిపేస్తామని హెచ్చరించారు. గతంలో 2014లో కూడా విశాఖను గోవా, థాయిలాండ్ తరహా సంస్కృతిగా మారుస్తామంటూ చంద్రబాబు ప్రయత్నిస్తే.. ఇక్కడి ప్రజలు, మహిళా సంఘాలు తగిన గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. ఎన్నికల ముందు సనాతన ధర్మమంటూ ఆలయాల మెట్లు శుభ్రం చేసి పవన్కల్యాణ్ చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు విశాఖ వంటి పవిత్ర తీరంలో ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్న చంద్రబాబు, లోకేష్, భరత్లతో కలిసి పవన్ కల్యాణ్ కూడా సముద్రంలో మూడు సార్లు మునిగి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
మారుతున్న కాలం, మారాల్సిన నాన్న
మనస్తత్వ శాస్త్రవేత్తలు ఇప్పుడు చెప్పేది ఒక్కటే.. తండ్రి పాత్ర కేవలం పోషణకే పరిమితం కాదు. సంపాదనతో పాటు, భావోద్వేగపరంగా పిల్లలకు అందుబాటులో ఉండటం కూడా అంతే ముఖ్యం. క్రమశిక్షణాధికారి అనే పాత నమూనా నుంచి బయటపడి, పిల్లల ఆలోచనలను, అభిప్రాయాలను ఓపికగా వినే నాన్నగా మారాలన్నది నేటి అవసరం. ప్రతి సమస్యలో పిల్లలతో పాటు నడవాలన్నదే వారి కోరిక. ఎందుకంటే ఇంటి పెద్దగా నాన్న ఎంత బలంగా నిలబడ్డా, పిల్లలకు కావాల్సింది ఆయన భుజం మీద చెయ్యి మాత్రమే కాదు..తన మనసులో మాట చెప్పుకునే ఒక స్నేహితుడు కూడా. ఈ ఫాదర్స్ డే సందర్భంగా.. నాన్నతో ఒక్క మాట మాట్లాడండి. ఆయన మౌనంలో దాగున్న ప్రేమను గుర్తించండి. ఎందుకంటే నాన్న అంటే బాధ్యత మాత్రమే కాదు..మాటల్లేకుండా రాసిన ఒక ప్రేమ కవిత్వం. -
సముద్ర రంగంలో సాంకేతిక సామర్థ్యాల విస్తరణ
సింధియా: దేశ సముద్ర రక్షణ, నౌకా నిర్మాణ రంగాల్లో తన ప్రాధాన్యాన్ని మరింత బలోపేతం చేస్తూ హిందూస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) 86వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సాంకేతిక ఆవిష్కరణలు, కార్యాచరణ సామర్థ్యాల పెంపునకు దోహదపడే పలు ఆధునిక కార్యాలయాలు, డాష్బోర్డ్ ఆధారిత సముద్ర పరీక్షల నిర్వహణ వ్యవస్థను సంస్థ సీఎండీ కెప్టెన్ గంటి వెంకటేశ్వర్లు, ఐఎన్ (రిటైర్డ్) ప్రారంభించారు. అలాగే జ్ఞాన విస్తరణకు దోహదపడే 11 ప్రచురణలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎస్ఎల్ నేటి స్థాయికి చేరుకోవడం వెనుక తరతరాల ఉద్యోగుల సమష్టి కృషి ప్రధాన కారణమన్నారు. ఉద్యోగుల సృజనాత్మకత, క్రమశిక్షణ, జట్టుకృషితో సంస్థ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. -
పిడుగుల మోత.. కుండపోత
నగరంలో వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షం వివరాలు ప్రాంతం వర్షం (మిమీ.లలో) ఆరిలోవ 56.0 సీతమ్మధార 53.1 మహరాణిపేట 47.1 వన్టౌన్ 38.8 గురుద్వార 37.3 హనుమంతువాక 37.0 ఆనందపురం 24.5 మధురవాడ 23.0 జూపార్క్ 20.0 సాక్షి, విశాఖపట్నం: ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన విశాఖ నగరం రాత్రికి వరుణుడి ప్రతాపంతో వణికింది. ఉరుములు, మెరుపులు, పిడుగుల మోతల మధ్య ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రుతుపవనాలు క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో కుండపోత వర్షం కురవడంతో ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోయింది. ఆకస్మికంగా కురిసిన వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదించగా, కొన్ని చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటపాటు కురిసిన వర్షంతో నగరం చల్లబడింది. వాహనదారులు పాట్లుబీచ్ రోడ్డులో చెల్లాచెదురైన యోగా మ్యాట్లు -
నీట్కు విస్తృత ఏర్పాట్లు
హాజరుకానున్న 8,015 అభ్యర్థులు మహారాణిపేట: జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్ (యూజీ)–2026 పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 18 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 8,015 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు ఉంటుందని, దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం కేటాయించినట్లు తెలిపారు. అభ్యర్థులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని, అనంతరం కేంద్రాల గేట్లు మూసివేస్తారని పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగానే తమ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి, డీసీపీ మణికంఠ, సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు నీట్ పరీక్షకు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ల పర్యవేక్షణలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
తప్పు చేస్తే ఇక్కడే ఎందుకుంటాను: రాధా గాయత్రి భర్త
సాక్షి, విశాఖపట్నం: భార్య రాధా గాయత్రి మృతిపై భర్త శ్రీచరణ్ స్పందించారు. నా భార్య రాధా గాయత్రి మరణానికి, నాకు ఎలాంటి సంబంధం లేదని.. పోస్ట్ మార్టం నివేదికలో నిజాలు వెల్లడవుతాయని శ్రీచరణ్ అన్నారు. ‘‘మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. ఒకరిపై ఒకరికి ఇష్టం లేకుంటే, విబేధాలు ఉన్నట్టయితే ముస్సోరి ఎలా వెళ్తాం. హోటల్ ప్యాకేజ్లో భాగంగానే మద్యం సప్లయ్ చేశారు’’ అని శ్రీచరణ్ పేర్కొన్నారు.‘‘ఆమె తల్లిదండ్రులు బాధలో ఇలాంటి మాటలు ఆడుతున్నారు. ఇప్పటికీ గాయత్రీ నా భార్య. గాయత్రీ తల్లిదండ్రులు నాకు కూడా తల్లిదండ్రులతో సమానం. ఇది నా ఒక్కడి సమస్య కాదు. మూడు గ్రామాల సమస్య. నాకు బాధ్యత లేకపోతే సంప్రదాయాలు ఎందుకు పాటిస్తాను. నేను తప్పు చేస్తే ఇంకా ఇక్కడే ఎందుకు ఉంటాను’’ అంటూ శ్రీచరణ్ పేర్కొన్నారు.ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో విశాఖపట్నానికి చెందిన యువతి రాధా గాయత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న గాయత్రి తల్లిదండ్రులు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ (సీపీ) కార్యాలయానికి చేరుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గాయత్రి మృతి సహజ మరణం కాదని, ఈ ఘటన వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తమ అల్లుడి పాత్రపై అనుమానం ఉందని.. పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ఏపీకి అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: రాగల మూడు గంటల పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికను ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసింది. మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.శ్రీకాకుళం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ను విపత్తుల సంస్థ ప్రకటించింది. పిడుగులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని.. బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.విశాఖపట్నంలో వర్షం దంచికొడుతోంది. బీచ్ రోడ్డులో వరద నీరు భారీగా చేరింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సుమారు గంట నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. -
జ్యోతి వెలిగించాక ‘గెట్ అవుట్’
సాక్షి, విశాఖపట్నం : పార్లమెంట్లో బిల్లు వీగిపోయినా.. మహిళలంటే మాకున్న గౌరవంతో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామంటూ చంద్రబాబు, లోకేష్ మహానాడు సాక్షిగా చెప్పిన మాటల్లో నిజమెంతో.. రెండేళ్ల సంబరాల్లోనే తేలిపోయింది. భారీ వేదిక.. వేదికపై పదుల సంఖ్యలో నాయకులు. కానీ ఒక్కటంటే ఒక్క కుర్చీ మహిళకు లేకుండా పోయింది. కూటమి నేతలంతా కూడబలుక్కొని అందరి సాక్షిగా అతివలకు ఘోర అవమానాన్ని మిగిల్చారు. కూర్చున్న వేదిక ఎదురుగా మహిళలు కనిపించినా ఒక్కర్ని కూడా వేదికపై కూర్చోండని పిలవకపోవడంతో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవంలో కనీస గౌరవం కొరవడిందంటూ ఆయా పార్టీల మహిళలతో పాటు మహిళా అధికారులూ అవమానకరంగా భావించారు. వేదికపై సుమారు 50 నుంచి 100 మందికి పైగా నేతలు కూర్చున్నారు. కానీ వీరిలో ఒక్క మహిళా నేతకూ చోటు దక్కకపోవడం బాధాకరం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖ మహిళా నేతలు కూడా వేదిక కిందే కూర్చోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తమ పార్టీలో ఇంత మంది మహిళా నేతలు ఉన్నారని గొప్పలు చెప్పుకునే కూటమి నాయకులు, వేదికపై వారికి చోటు కల్పించకపోవడం వారి నిరంకుశత్వానికి నిదర్శనం. మహిళా జాతికిది అవమానమే.! కేవలం వేదికపై చోటు దక్కకపోవడమే కాకుండా, సభలో కూడా మహిళలకు అవమానం ఎదురైంది. వేదికపై ఉన్న నేతలందరి కోసం కుర్చీలు వేసినప్పటికీ, వేదిక కింద ఉన్న మహిళా నేతల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. వారు అలాగే కింద కూర్చోవాల్సి వచ్చింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పుకునే కూటమి ప్రభుత్వం, కనీసం సభలో మహిళలకు కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవడంపై వారంతా బాధని దిగమింగుకున్నారు. జ్యోతి ప్రజ్వలన సమయంలో కొందరు మహిళలు.. వేదికపైకి వెళ్లారు. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే.. వారందరినీ కిందకి దిగిపోవాలంటూ ఎమ్మెల్యేలు హుకుం జారీ చేశారు. ఈ ఘటనపై మహిళా నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమకు రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి, వేదికపై చోటు కల్పించకపోవడం తమను అవమానించడమేనని వారు వాపోతున్నారు. వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న టీడీపీకి చెందిన ఈతలపాక సుజాత, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న సర్వసిద్ధి అనంతలక్ష్మి, జనసేనకు చెందిన పసుపులేటి ఉషాకిరణ్, బీజేపీకి చెందిన రాష్ట్ర మహిళానేత సుహాసినీ ఆనంద్ సహా అనేక మంది మహిళా నేతలు ఉన్నా.. వారందరికీ రెండేళ్ల సంబరాల సందర్భంగా అవమానాన్ని బహుమతిగా అందించారు. స్టాల్స్ వద్ద విభాగాధికారుల కాపలా బీచ్రోడ్డులోని ఏయూ కాన్వకేషన్ హాల్లో నిర్వహించిన విజయోత్సవాల్లో కేవలం మహిళల్నే కాదు.. ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులకూ అవమానం జరిగింది. ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చెయ్యాలంటూ అధికారుల్ని ఆదేశించారు. దీంతో.. 12 ప్రభుత్వ విభాగాలకు చెందిన స్టాల్స్ అక్కడ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ వద్ద.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయా విభాగాలకు చెందిన్న ఉన్నతాధికారుల్ని పర్యవేక్షణ కోసం ఉంచేశారు. దీంతో వారంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ముహూర్తాల జోరు..రిజిస్ట్రేషన్ల హోరు
జేష్ట శుద్ద పంచమి శుక్రవారం కావడంతో పాటు, అత్యంత శ్రేష్టమైన ముహూర్తాలు ఉండటంతో సూపర్బజార్ వద్ద ఉన్న జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జనంతో కిటకిటలాడాయి. స్థలాలు, భవనాల కొనుగోలు దస్తావేజుల రిజిస్ట్రేషన్లతో పాటు, వివాహ రిజిస్ట్రేషన్ల కోసం కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శుభ ముహూర్తాల నేపథ్యంలో ఉదయం నుంచే మొదలైన ఈ రద్దీ సాయంత్రం వరకు నిరంతరాయంగా కొనసాగింది. దరఖాస్తుదారులు, వారి బంధువుల రాకతో కార్యాలయ పరిసరాలన్నీ రోజంతా కోలాహలంగా మారాయి. – మహారాణిపేట/ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
మన్మథలీలలు!
మహిళా వైద్యులతో విమ్స్ డైరెక్టర్పై ఆరోపణల కలకలం డాక్టర్ల గ్రూపులో వైరల్గా వాయిస్ మెసేజ్ మహిళా డాక్టర్లు, సిబ్బందితో అభ్యంతరకర భాష పీజీలను పాస్ చేసేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు మరోసారి వివాదాల్లోకి కేజీహెచ్ జనరల్ సర్జరీ విభాగం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేజీహెచ్ జనరల్ సర్జరీ విభాగం చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇదే విభాగానికి చెందిన డాక్టర్ జనార్దన్రావుపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్న నేపథ్యంలో.. తాజాగా ఆ విభాగానికి గతంలో హెచ్వోడీగా పనిచేసి ప్రస్తుతం విమ్స్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ మన్మథరావుపై కూడా పలు ఆరోపణలు వెలుగులోకి రావడం వైద్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒక మహిళా వైద్యురాలి భర్త అయిన వైద్యుడు.. డాక్టర్ల వాట్సాప్ గ్రూపులో పోస్టు చేసిన వాయిస్ మెసేజ్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఆ వాయిస్ మెసేజ్లో డాక్టర్ మన్మథరావు మహిళా వైద్యులు, సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని, తన భార్య పట్ల ఇతరుల వద్ద అభ్యంతరకర పదజాలం ఉపయోగించారని వాపోయారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా పీజీ వైద్య విద్యార్థులను పరీక్షల్లో ఉత్తీర్ణులను చేయడానికి డబ్బులు తీసుకున్నారంటూ కూడా ఆరోపణలు చేశారు. బోధన కంటే ఇతర అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారని, విద్యార్థులకు తగిన శిక్షణ అందించలేదని వాయిస్ మెసేజ్లో విమర్శించారు. సాయంత్రం వేళల్లో విస్తృతంగా ప్రైవేటు ప్రాక్టీస్ నిర్వహించారన్న ఆరోపించారు. పైసలిస్తేనే పాస్..? కేజీహెచ్ జనరల్ సర్జరీ విభాగానికి మొన్నటివరకు హెచ్వోడీగా ఉన్న డాక్టర్ మన్మథరావుపై తాజాగా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి అండదండలతోనే ఆయనకు విమ్స్ డైరెక్టర్ పదవి దక్కిందన్న చర్చ వైద్య వర్గాల్లో సాగుతోంది. జనరల్ సర్జరీ హెచ్వోడీగా ఉన్నప్పుడు విద్యార్థులకు బోధన చేయకుండా కాలం గడిపారన్న విమర్శలు ఉన్నాయి. పీజీ విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలంటే డబ్బులు చెల్లించాల్సి వచ్చేదన్న ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. బోధన కంటే వసూళ్లకే ప్రాధాన్యం ఇచ్చారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే విభాగంలోని ఇతర అధ్యాపకులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తుండగా, పరిపాలనాపరమైన పెత్తనానికే పరిమితమయ్యారన్న అంశం కూడా వైరల్ అవుతున్న వాయిస్ మెసేజ్లో ప్రస్తావనకు వచ్చింది. ఇక ప్రభుత్వ సేవలో ఉంటూనే సాయంత్రం వేళల్లో ప్రైవేటు ప్రాక్టీస్ నిర్వహించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పీజీ విద్యార్థులను పాస్ చేయడంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలే ఇప్పుడు వైద్య వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ఇదే విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ మహాలక్ష్మి భర్త ఈ వాయిస్ మెసేజ్ను డాక్టర్ల గ్రూపులో పోస్టు చేశారు. తన భార్యను ఎలాంటి కారణం లేకుండానే యూనిట్–1 నుంచి యూనిట్–3కు బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. తాను కూడా రాజాం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడినేనని ఆ సందేశంలో పేర్కొన్నారు. వివాదంలో జనరల్ సర్జరీ విభాగం కేజీహెచ్ గత కొంతకాలంగా వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. వైద్య పరికరాల మరమ్మతులకు నిధుల కొరత కారణంగా గుండె శస్త్రచికిత్సలు నిలిచిపోయిన ఘటన నుంచి మందుల కొరత వరకు పలు అంశాలు ఇప్పటికే చర్చనీయాంశమయ్యాయి. కృత్రిమ గర్భధారణ వ్యవహారంలోనూ కేజీహెచ్కు చెందిన వైద్యులపై ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో జనరల్ సర్జరీ విభాగం మరోసారి వివాదాల కేంద్రంగా మారింది. ఇదే విభాగానికి చెందిన డాక్టర్ జనార్దన్రావుపై పీజీ విద్యార్థులు లైంగిక, మానసిక, వృత్తిపర వేధింపుల ఆరోపణలతో ఏఎంసీ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ ఘటన చల్లారకముందే ఇప్పుడు ఇదే విభాగానికి గతంలో హెచ్వోడీగా పనిచేసిన డాక్టర్ మన్మథరావుపై కూడా పలు ఆరోపణలు వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహిళా వైద్యుల పట్ల వ్యవహరించిన తీరు, పీజీ విద్యార్థుల పరీక్షల విషయంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న వాదనలు, బోధన కంటే ఇతర అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శలు వైద్య వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అలాగే ప్రైవేటు ప్రాక్టీస్ ద్వారా భారీగా ఆదాయం ఆర్జించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. విమ్స్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ మన్మథరావుపై వచ్చిన ఈ ఆరోపణల నేపథ్యంలో సంబంధిత అధికారులు ఎలాంటి విచారణ చేపడతారు, తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. -
ఏసీబీ వలలో జీవీఎంసీ ఉద్యోగి
ఎన్ఏడీ జంక్షన్ : జీవీఎంసీ 52వ వార్డు గౌరీనగర్లో ఉన్న జీవీఎంసీ పశ్చిమ జోనల్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఓ ఉద్యోగిని లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెందుర్తి ప్రాంతానికి చెందిన వెన్ను అప్పలనారాయణ జీవీఎంసీ జోన్–5 పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ విభాగంలో పనిచేసి 2023లో మృతి చెందారు. ఆయన మరణానంతరం రావలసిన పెన్షన్, సర్వీస్ బెనిఫిట్స్ మంజూరు కోసం కుటుంబ సభ్యులు పశ్చిమ జోనల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆరిలోవకు చెందిన మురుగుటు శ్రీనును సంప్రదించారు. దరఖాస్తును సంబంధిత ఉన్నతాధికారులకు పంపించడం మాత్రమే తన విధి అయినప్పటికీ, సర్వీస్ బెనిఫిట్స్ మంజూరు కావాలంటే రూ.30 వేల లంచం ఇవ్వాలని శ్రీను డిమాండ్ చేశాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు గురువారం ఆన్లైన్ , లిఖితపూర్వకంగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఏసీబీ అదనపు ఎస్పీ హర్షిత ఆధ్వర్యంలో, డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉచ్చుపన్ని, జీవీఎంసీ పశ్చిమ జోనల్ కార్యాలయంలో లంచం స్వీకరిస్తున్న మురుగుటి శ్రీనును రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. అతని నుంచి రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రెండు రోజుల క్రితం కూడా మరో వ్యక్తి వద్ద నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు, లక్షణరావు, సుప్రియతో పాటు సిబ్బంది లోకనాథం, సాగర్ పాల్గొన్నారు. -
ఏయూలో కీలక నియామకాలు
పలువురికి డీన్లు, అసోసియేట్ డీన్లుగా ఉత్తర్వులువిశాఖ విద్య: ఏయూ పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా పలువురు డీన్లు, అసోసియేట్ డీన్లను నియమిస్తూ యూనివర్సిటీ అధికారులు ఉత్త ర్వులు జారీ చేశారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ నియామక ఉత్తర్వులను అందజేసి అభినందించారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్గా ఆచార్య ఎం.అన్నపూర్ణ, పీజీ–ప్రొఫెషనల్ కోర్సుల డీన్గా ఆచార్య వై.అబ్బులు, యూజీ పరీక్షల డీన్గా ఆచార్య బి.మునిస్వామి, బ్రాండింగ్–మీడియా అసోసియేట్ డీన్గా ఆచార్య సి.ఎం.వినయ్కుమార్ నియమితులయ్యారు. ఆర్అండ్డీ అసోసియేట్ డీన్లుగా టి.ఆర్.జ్యోత్స్న, పి. ఏడుకొండలు, సీడీవోఈ అసోసియేట్ డైరెక్టర్గా ఆచార్య వి.లక్ష్మి బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే పీజీ–ప్రొఫెషనల్ కోర్సుల అసోసియేట్ డీన్గా ఆచార్య పి.వి.లక్ష్మీనారాయణ, కాన్ఫిడెన్షియల్ (పరీక్షలు) డీన్గా ఎల్.ఎస్.వి.ప్రసాద్, ఆలుమ్ని అఫైర్స్– కార్పొరేట్ రిలేషన్స్ అసోసియేట్ డీన్గా ఆచార్య ఎన్.సాల్మన్ బెన్నీ, విద్యార్థి సంక్షేమ అసోసియేట్ డీన్గా ఆచార్య వి.ధనరాజు నియమితులయ్యారు. ఎన్సీఏ కోఆర్డినేటర్గా ఆచార్య కె.సరస్వతి విద్యార్థి, హాస్పిటాలిటీ–ఫెసిలిటీ మేనేజ్మెంట్ అసోసియేట్ డీన్గా ఆచార్య సి.హెచ్.ఆశ ఇమ్మానియల్ రాజు, స్పాట్ వాల్యుయేషన్ అసోసియేట్ డీన్గా ఆచార్య కె.రమేష్బాబు, సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ గౌరవ డైరెక్టర్గా ఆచార్య సి.వి.నాయుడును నియమించారు. గతంలో ఇతర బాధ్యతల్లో ఉన్న డీన్లు, అసోసియేట్ డీన్ల పదవీకాలాన్ని కూడా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏయూకు ‘గుర్తింపు’ ముప్పు..!
విశాఖ విద్య: శతాబ్ద కాలపు ఘన చరిత్ర కలిగిన అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ఠ మసకబారుతోంది. పాలకవర్గ అలసత్వం.. విద్యార్థులకు శాపంగా పరిణమిస్తోంది. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల జాతీయ స్థాయి ప్రమాణాల గుర్తింపు అయిన ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్’ (ఎన్బీఏ)ను కోల్పోతుందనే వార్త విద్యార్థి లోకాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నగరంలోని చిన్న చిన్న ప్రైవేటు విద్యాసంస్థలు సైతం ఎన్బీఏ గుర్తింపు కోసం పోటీ పడుతుంటే.. ప్రతిష్టాత్మకమైన ఏయూ మాత్రం పాలకవర్గ నిర్లక్ష్యంతో ఉన్న గుర్తింపును పణంగా పెట్టింది. ఉపకులపతి ప్రొఫెసర్ రాజశేఖర్ నాయకత్వంలోని ప్రస్తుత యాజమాన్య వైఫల్యాలు, తాజా మూల్యాంకనంలో ప్రదర్శించిన అలసత్వమే ఈ దుస్థితికి కారణమని మాజీ ఆచార్యులు చేస్తున్న తీవ్ర విమర్శలు దుమారం రేపుతున్నాయి. విద్యా ప్రమాణాలకు తలమానికం.. ఎన్బీఏ గుర్తింపు ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యా నాణ్యతను, జాతీయ ప్రమాణాలను అంచనా వేయడానికి ఎన్బీఏ అక్రిడిటేషన్ అత్యంత కీలకం. ఈ గుర్తింపు ఉన్న కోర్సులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాధాన్యత ఉంటుంది. ప్రముఖ బహుళజాతి సంస్థలు క్యాంపస్ నియామకాల్లో ఎన్బీఏ గుర్తింపు పొందిన విభాగాల విద్యార్థులకే మొదటి ప్రాధాన్యత ఇస్తాయి. అంతేకాకుండా భారతదేశంలోని ఎన్బీఏకు వాషింగ్టన్ అకార్డ్లో సభ్యత్వం ఉన్నందున, ఈ గుర్తింపు ఉన్న డిగ్రీలు పొందిన విద్యార్థులకు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు సులభంగా లభిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే వివిధ రకాల పరిశోధన నిధులు, ఆర్థిక సహాయ కార్యక్రమాలకు కూడా ఈ అక్రిడిటేషన్ ఒక తప్పనిసరి అర్హతగా పనిచేస్తుంది. ప్రదర్శనలో విఫలం.. నిధులపై కోత పడే ఛాన్స్ సాధారణంగా ఎన్బీఏ గుర్తింపు అనేది మొత్తం కళాశాలకు కాకుండా సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్ వంటి నిర్దిష్ట విభాగాలకు విడివిడిగా మంజూరు చేయబడుతుంది. ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలోని సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ విభాగాలు ఇటీవల వరకు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును కలిగి ఉండేవి. అయితే 2025 మధ్యకాలంలో జరిగిన తాజా మూల్యాంకన ప్రక్రియలో, అక్రిడిటేషన్ కమిటీ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఆయా విభాగాల బలాలు, మౌలిక వసతులను సమర్థవంతంగా ప్రదర్శించడంలో విశ్వవిద్యాలయ యాజమాన్యం పూర్తిగా విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. దీని ప్రభావం రాబోయే రోజుల్లో విశ్వవిద్యాలయం సాధించే జాతీయ స్థాయి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్పై కూడా తీవ్రంగా పడే అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కమిటీకి బహుమతుల వివాదం మరోవైపు అక్రిడిటేషన్ పరిశీలన నిమిత్తం వచ్చిన కమిటీ సభ్యులకు వర్సిటీ ప్రతినిధులు బహుమతులు అందించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర కలకలం రేపాయి. ఈ పరిణామంపై తీవ్ర అసంతృప్తికి గురైన కమిటీ సభ్యులు, నేరుగా ఆంధ్ర విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సభ్యులకు తమ చేదు అనుభవాలను వివరిస్తూ లేఖ రాయడం వర్సిటీ చరిత్రలోనే మొదటిసారి అని తెలుస్తోంది. దానిపై ఏయూ అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాజాగా ఈ ఎన్బీఏ గుర్తింపుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎస్ఈ, ఈసీఈ వంటి కీలక విభాగాలకు తిరిగి అక్రిడిటేషన్ సాధించేందుకు తక్షణ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మాజీ ప్రొఫెసర్లు మండిపడుతున్నారు. -
పెదగంట్యాడ తహశీల్దార్పై నేడు లోక్యుక్త విచారణ
మహారాణిపేట: పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పెదగంట్యాడ తహసీల్దార్ తీరుపై లోక్యుక్త ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11 గంటలకు విశాఖ ల్యాండ్ ప్రొటెక్షన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విచారణ జరపనున్నారు. పెదగంట్యాడ తహసీల్దార్ కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ గత ఏడాది అక్టోబర్ 23న ‘సాక్షి’ దినపత్రికలో ‘చిరుద్యోగికి పగ్గాలు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. అలాగే తహసీల్దార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సీనియర్లను కాదని ఒక గ్రేడ్–1 వీఆర్వోకు ఆర్ఐ బాధ్యతలు అప్పగించారని, పలు వ్యవహారాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని సామాజిక కార్యకర్త వెంపాడ అప్పలరాజు ఈ ఏడాది జనవరి 30న లోక్యుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా లోక్యుక్త ఆదేశించడంతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను ఆదేశించింది. -
ఫ్లైయాష్ లారీ బోల్తా
సబ్బవరం: మండలంలోని అసకపల్లి–లంకెలపాలెం రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైయాష్ లోడ్తో వెళ్తున్న డంపర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్కు చెందిన దీపక్ (45) పరవాడ ప్రాంతంలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పరవాడ ఎన్టీపీసీ నుంచి సబ్బవరం–షీలానగర్ సాగరమాల రహదారి నిర్మాణ పనుల కోసం డంపర్ లారీలో ఫ్లైయాష్ తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అసకపల్లి సమీపంలోని బంగారమ్మతల్లి ఆలయం మలుపు వద్దకు రాగానే లారీ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ పూర్తిగా నలిగిపోవడంతో, అందులో చిక్కుకుపోయిన డ్రైవర్ దీపక్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న సబ్బవరం సీఐ జి.రామచంద్రరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేబిన్ నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నదాత దుఃఖీభవ
మహారాణిపేట: రైతులకు ఇస్తున్న పెట్టుబడి సహాయంపై కూటమి సర్కార్ కత్తెర వేసింది. అన్నదాతల ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. పలు రకాల కఠిన నిబంధనలను తెరపైకి తెచ్చి ‘అన్నదాత సుఖీభవ’ పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు భారీగా కోతలు విధించింది. ఈ పథకం కింద ఏడాదికి రూ. 20 వేలు ఇస్తామంటూ ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు హామీలు గుప్పించారు. అయితే అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలోనే ఆ హామీని తుంగలోకి తొక్కేశారు. కూటమి సర్కార్ ఈ ఏడాది విడుదల చేసిన లబ్దిదారుల జాబితాలో వేల సంఖ్యలో అర్హులైన రైతుల పేర్లు కనపడకపోవడం గమనార్హం. 6,499 మంది రైతులకు మొండిచేయి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేవలం 18,573 మంది రైతులను మాత్రమే అర్హులుగా ఎంపిక చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాన మంత్రి కిసాన్ పధకం కింద 18,100 మందిని అర్హులుగా తేల్చారు. అదే గత వైఎస్సార్సీపీ హయాంలో ‘రైతు భరోసా’ కింద ఏకంగా 25,072 మంది రైతులకు నిధులను నేరుగా ఖాతాల్లోకి జమ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న కోతల వల్ల ఏకంగా 6,499 మంది లబ్ధిదారులు అన్నదాత సుఖీభవ పథకానికి దూరమయ్యారు. నిబంధనల పేరిట లబ్ధిదారుల తొలగింపు గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి సర్కార్ సరికొత్త నిబంధనలను అమలు చేస్తోంది. గత వైఎస్సార్సీపీ హయాంలో రైతులందరినీ ఒకేలా పరిగణించి ‘రైతు భరోసా’తో పాటు అన్ని రకాల పథకాలను వర్తింపజేశారు. కానీ కూటమి ప్రభుత్వం కౌలు రైతు నిబంధన, కుటుంబంలో ఒక్కరికే లబ్ధి, పది సెంట్ల లోపు భూమి ఉన్నవారిని తొలగించడం, ఆధార్, ఈ–కేవైసీ, బ్యాంకు ఖాతాల అనుసంధానం కాలేదనే నెపంతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ కారణాలతోనే జిల్లాలో 6,499 మంది రైతులను జాబితా నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించారు. నేడు రైతుల ఖాతాలో జమ అన్నదాత సుభీభవ పథకం కింద రూ.5వేలు , పీఎం కిసాన్ పథకం కింద రూ. 2 వేలు నిధులు శనివారం రైతుల ఖాతలో జమ చేయనున్నారని జిల్లా వ్యవసాయాధికారి అప్పలనాయుడు తెలిపారు. భీమిలి నియోజకవర్గ పరిధిలో ఆనందపురం మండలం బోని గ్రామంలో, గాజువాక పరిధిలో మంగళపాలెంలో, పెందుర్తి పరిధిలో సబ్బవరంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని, రైతులు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారి అప్పలస్వామి కోరారు. -
ఇదండీ జీవీఎంసీ వరస..!
డాబాగార్డెన్స్: నగరంలో మండే ఎండల నుంచి బాటసారులు, వాహనదారులకు ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో జీవీఎంసీ ‘హరితాశ్రయం’ పేరుతో పలు ప్రాంతాల్లో గ్రీన్ షెల్టర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా గత మే నెలలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని గురజాడ విగ్రహం వద్ద గ్రీన్ షేడ్ నెట్ను ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగే వాహనదారులు, పాదచారులు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేలా నీటి తుంపర్లు చల్లే విధానాన్ని కూడా ఇంజినీరింగ్ విభాగం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ ఏర్పాటు ఎక్కువకాలం నిలవలేదు. సుమారు 20 రోజుల క్రితం నగరంలో వీచిన ఈదురుగాలులకు గ్రీన్ షెల్టర్ నెట్ పూర్తిగా దెబ్బతింది. దాన్ని మరమ్మతు చేయడం లేదా పునరుద్ధరించడం పక్కనపెడితే, ఎండాకాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జీవీఎంసీ మరో గ్రీన్ షెల్టర్ను సత్యం జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. దాదాపు రెండున్నర నెలల పాటు నగరవాసులు భానుడి ప్రతాపానికి అల్లాడిన సమయంలో కాకుండా, వర్షాలు కురుస్తున్న వేళ ఈ ఏర్పాట్లు చేపట్టడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవసరం ఉన్న సమయంలో కాకుండా ఆలస్యంగా చేపట్టిన చర్యలతో జీవీఎంసీ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
కూటమి సర్కార్వి కక్షసాధింపు రాజకీయాలు
వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ మహారాణిపేట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులతో ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని ఆ పార్టీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కుమారుడు సునీల్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గత చంద్రబాబు హయాంలో జరిగిన మద్యం అక్రమాల కేసులను మాఫీ చేసుకోవడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. నాడు టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో బెల్టుషాపులతో దోచుకుంటే, వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా ప్రభుత్వమే షాపులు నడిపిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఇకనైనా కక్షసాధింపు చర్యలు మార్చుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో యాదవ సాధికార జిల్లా అధ్యక్షుడు యడ్ల సుమన్, రాష్ట్ర బీసీ విభాగం జనరల్ సెక్రటరీ తుళ్లి చంద్రశేఖర్, బీసీ నాయకుడు చోల్లంగి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సురభి నాటకాలు గిన్నిస్ రికార్డ్స్లో నమోదు కావాలి
మద్దిలపాలెం: అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మించి అద్భుత ప్రదర్శనలు ఇస్తున్న సురభి నాటకాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కావాలని వక్తలు ఆకాంక్షించారు. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో భానోదయ నాట్య మండలి నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం సాయంత్రం ప్రదర్శించిన ‘భూకై లాస్’ నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రంగస్థల నటులు మీగడ రామలింగస్వామి, చలసాని కృష్ణప్రసాద్, కొరిటాల ప్రభాకర్, పైడా కృష్ణప్రసాద్, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రంగస్థల కళాకారుల సంఘం కార్యదర్శి వంకాయల మారుతి ప్రసాద్, కళాపోషకులు నమ్మి అప్పలరాజు, బిల్డర్ రామకృష్ణ, రిటైర్డ్ ఏసీపీ మహమ్మద్ ఖాన్, గాయని మణిపల్లవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సురభి నాటక కళను ఆదరించి, ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అనంతరం ప్రదర్శించిన ‘భూకై లాస్’ నాటకంలో ఒక్కో ఘట్టం సినిమాను తలపించేలా సాగింది. సురభి కళాకారుల అద్భుత నటన, మంత్రముగ్ధులను చేసే స్టేజ్ టెక్నాలజీతో కళాభారతి హాల్ కరతాళ ధ్వనులతో మారుమోగింది. నటి శివజ్యోతి, కోఆర్డినేటర్ భానుప్రసాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా, సీనియర్ జర్నలిస్ట్ నాగనబోయిన నాగేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డ్రైవర్ దుర్మరణం -
విశాఖ అండర్–16 జట్టు ఘన విజయం
విశాఖ స్పోర్ట్స్ : విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అండర్–16 మల్టీ డే క్రికెట్ జట్టు అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా విజయనగరం అండర్–16 జట్టుతో జరిగిన మ్యాచ్లో విశాఖపట్నం జట్టు ఇన్నింగ్స్, 98 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విశాఖపట్నం జట్టు తన మొదటి ఇన్నింగ్స్లో 236 పరుగులకు ఆలౌట్ అయింది. హర్ష గణేష్ (125 నాటౌట్) అద్భుతమైన శతకంతో జట్టుకు భారీ స్కోరును అందించగా, మిగిలిన బ్యాటర్లు కూడా తమ వంతు సహకారాన్ని అందించారు. విశాఖ బౌలర్ల ధాటికి విజయనగరం జట్టు మొదటి ఇన్నింగ్స్లో కేవలం 67 పరుగులకే కుప్పకూలింది. దీంతో విశాఖపట్నం జట్టు ప్రత్యర్థికి ’ఫాలోఆన్’ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్లోనూ పుంజుకోలేకపోయిన విజయనగరం జట్టు కేవలం 71 పరుగులకే పరిమితమై, ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్ విజయంలో విశాఖ బౌలర్ జాజుల యతీష్ చంద్ర అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో వెన్నుదన్నుగా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్లలో కలిపి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు పడగొట్టడంతోపాటు బ్యాటింగ్లోనూ కీలక పరుగులు చేసిన యతీష్ చంద్రకు ’ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. -
అర్హుల సంఖ్య తగ్గించడం అన్యాయం
వ్యవసాయ పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించలేదు.ఇప్పుడు నిబంధనల పేరిట వేలాది మంది అర్హులైన రైతుల పేర్లను జాబితా నుంచి తొలగించారు. ప్రభుత్వం స్పందించి అర్హులందరికీ ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని వర్తింపజేయాలి. – రవ్వ ఈశ్వరరావు, తాటితూరు, భీమిలి మండలం అర్హులందరికీ సాయం అందించాలి వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతుకూ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించాలి. కొందరిని మాత్రమే ఎంపిక చేసి, మరికొందరిని జాబితా నుంచి తొలగించడం అన్యాయం. ఈ సీజన్లో రైతులందరికీ ‘అన్నదాత సుఖీభవ’ పథకం వర్తింపజేస్తే పంటల సాగుకు ఊతమిచ్చినట్టవుతుంది. – తమ్మిన సీతారామ్, టీ.నగరపాలెం, విశాఖ -
‘సీఐపై కేసు.. సాయికృష్ణను చంపేశామని సర్కార్ ఒప్పుకుంది’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో జంగిల్ రాజ్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. సాయికృష్ణను చంపి బూడిద చేశారు. సాయి కృష్ణ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఒక వ్యక్తిని చంపి బూడిద చేసే హక్కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు.సాయికృష్ణ కేసు విషయమై తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. రెండు మూడు కేసులు ఉంటే చంపి బూడిద చేస్తారా?. చంపి బూడిద చేసే హక్కు ఎవరు ఇచ్చారు?. సీఐ మీద కేసు పెట్టడం ద్వారా సాయికృష్ణను చంపేశామని ప్రభుత్వం ఒప్పుకుంది. సాయికృష్ణ తల్లి శోకం మీ కంటికి కనిపించడం లేదా?. ఆ తల్లి కన్నీరు చూసి రాష్ట్ర ప్రజానీకం తల్లడిల్లిపోతుంది.సాయికృష్ణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాయి కృష్ణ ఉదంతం పోలీసులకు కనువిప్పు కావాలి. సాయికృష్ణ హత్య వ్యవహారంలో A1గా చంద్రబాబును పెట్టాలి. లోకేష్, అనిత, డీజీపీ, సీపీ మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. మన రాష్ట్రానికి చేతకాని సీఎం అధికారంలో ఉన్నారు. లాకప్ డెత్ జరిగితే మేకప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాయి కృష్ణ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. -
యాదవులపై దాడిని ఖండిస్తున్నాం..
డాబాగార్డెన్స్: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఈదుమూడి గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకులు, గొర్రెల కాపరులపై జరిగిన దాడులను వైఎస్సార్సీపీ బీసీ విభాగం నేతలు ఖండించారు. గురువారం నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ మాట్లాడుతూ బీసీలపై జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈదుమూడి ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీల హక్కుల పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతామని తెలిపారు. కార్యక్రమలో పార్టీ నాయకులు పల్లా దుర్గారావు, మహంతి పట్నాయక్, మువ్వల సురేష్, రామన్న పాత్రుడు, తుళ్లి చంద్ర శేఖర్, దేవరకొండ మార్కండేయులు, యడ్ల సుమన్, వడ్డాది దిలీప్, పోతిబంతి హరి కృష్ణ, బొండాడ వెంకటరావు, మజ్జి జ్యోతి, బాపూ ఆనంద్, గురజాపు రవి, దశమంతుల మాణిక్యాలరావు, కోన శంకర్, కె.సాగర్, రవికిరణ్, కోరాడ సురేష్, బెవర మహేష్, కోణతాల కృష్ణవేణి, చేపల నూకరాజు, రామలక్ష్మీ, మాదాబత్తుల రమేష్, రాము, సందీప్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ -
గ్రీన్పార్క్లో ‘నేషనల్ సిల్క్ ఎక్స్పో’
డాబాగార్డెన్స్: నగరంలోని హోటల్ గ్రీన్పార్క్లో ఏర్పాటు చేసిన ‘నేషనల్ సిల్క్ ఎక్స్పో’ విశాఖ వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల సంప్రదాయ వస్త్ర సంపదను ఈ ఎక్స్పో ఒకే వేదికపైకి తెచ్చింది. ఈ వస్త్ర ప్రదర్శన–అమ్మకం ఈ నెల 21వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రానున్న వివాహాది శుభకార్యాలకు సరిపోయేలా ఎన్నో రకాల కలెక్షన్లను ఇక్కడ ప్రదర్శనలో ఉంచినట్లు పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన నేతన్నలు నేరుగా రూపొందించిన సిల్క్, కాటన్ వస్త్రాలు, డిజైనర్ చీరలు, బ్లౌజులు, కుర్తీలపై 50 శాతం వరకు తగ్గింపు ధరలు అందిస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర పైథానీ సిల్క్, బెంగళూరు సిల్క్, కాషిదా సిల్క్, చందేరి, మహేశ్వరి, బలుచారి, జమ్దానీ, కాంత వర్క్ స్టిచ్ చీరలతో పాటు కాశ్మీరీ ఎంబ్రాయిడరీ, కాంజీవరం చీరలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. వీటితో పాటు దుప్పట్లు, సల్వార్ మెటీరియల్స్ కూడా లభిస్తాయన్నారు. ఈ ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుందని నిర్వాహకులు వివరించారు. -
బాణసంచా దుకాణంలో అగ్ని ప్రమాదం
గాజువాక: కొత్తగాజువాక మార్కెట్ వద్ద ఉన్న ‘శివ ఫైర్ వర్క్స్’ దుకాణంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. శివ ఫైర్ వర్క్స్ దుకాణం లోపల ఐరన్ స్టాండ్ తయారు చేయడం కోసం గురువారం వెల్డింగ్ పనులు చేపట్టారు. ఈ క్రమంలో వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా నిప్పు రవ్వలు ఎగసిపడి సమీపంలోనే ఉన్న బాణసంచాపై పడ్డాయి. దీంతో క్షణాల వ్యవధిలోనే మంటలు భారీగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అక్కడ వెల్డింగ్ పనులు చేస్తున్న నర్సింగరావు, సూరిబాబులకు మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పెదగంట్యాడ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్లో కేజీహెచ్కు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫైర్ వర్క్స్ దుకాణానికి ఇరువైపులా పలు రకాల హోల్సేల్ దుకాణాలు ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలు పక్క దుకాణాలకు వ్యాపించకుండా అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
జూలో జీబ్రా, నక్షత్ర తాబేలు దత్తత
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో వన్యప్రాణుల దత్తత స్వీకార కార్యక్రమానికి దాతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర గురువారం జూలోని ఒక జీబ్రాను ఏడాది కాలానికి దత్తత తీసుకున్నారు. దత్తత నిమిత్తం రూ.60 వేల విరాళాన్ని జూ క్యూరేటర్ జి.మంగమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా సిరి సహస్రకు క్యూరేటర్ దత్తత స్వీకార పత్రాన్ని అందజేశారు. అలాగే బుక్కవరపు రమాదేవి అనే దాత ఒక నక్షత్ర తాబేలును ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. దీనికోసం ఆమె రూ.10 వేల విరాళాన్ని క్యూరేటర్కు సమర్పించారు. వన్యప్రాణులపై ప్రేమతో దత్తతకు ముందుకు వచ్చిన దాతలిద్దరినీ జూ అధికారులు అభినందించారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం మరింత మంది దాతలు ముందుకు రావాలని క్యూరేటర్ మంగమ్మ కోరారు. ఈ కార్యక్రమంలో జూ అడ్మినిస్ట్రేటర్ ఇ.ఉమాదేవి, అసిస్టెంట్ క్యూరేటర్లు బి.గోపి, పి.వి.చౌదరి, ఎఫ్ఎస్వోలు భారతి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రూ.60 వేల విరాళం అందించిన మజ్జి సిరి సహస్ర -
మా కుమార్తెను అల్లుడే చంపేశాడు
అల్లిపురం: ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పరుపూడి రాధా గాయత్రి కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆమె కుటుంబ సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం నగర పోలీస్ కమిషనరేట్లో డీసీపీ–2 మేరీ ప్రశాంతికి లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు. గాయత్రి మరణం సహజసిద్ధమైనది కాదని, అల్లుడే పథకం ప్రకారం చంపేశాడని, ఈ ఘటనకు సంబంధించి నిజానిజాలు వెలికితీయాలని తల్లిదండ్రులు సత్యవతి, సుధాకర్లు విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాధా గాయత్రి, శ్రీచరణ్లకు గతేడాది నవంబర్ 8న విశాఖలో వివాహం జరిగిందని తెలిపారు. గాయత్రి గతంలో హైదరాబాద్లో ఉద్యోగం చేయగా, ఇటీవల గురుగ్రామ్లోని ఓ సంస్థలో చేరగా, ఆమె భర్త శ్రీచరణ్ పుణెలోని ఓ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల విహారయాత్ర నిమిత్తం ఉత్తరాఖండ్లోని ముస్సోరి వెళ్లిన దంపతులు ఓ హోటల్లో బస చేసిన సమయంలో గాయత్రి మృతి చెందిందని చెప్పారు. ఆమె మరణం వెనుక అల్లుడిపై అనేక ఆరోపణలు వ్యక్తం చేశారు. భర్త అనుమానంతో వేధింపులు తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీచరణ్ భార్య గాయత్రిపై తరచూ అనుమానం వ్యక్తం చేస్తూ మానసిక ఒత్తిడికి గురిచేసేవాడు. హైదరాబాద్లో నివసిస్తున్న సమయంలో ఆమె ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని వాచ్మ్యాన్ సహకారంతో పరిశీలిస్తూ, ఇంటికి వచ్చే వారిపై నిఘా పెట్టేవాడు. ఉద్యోగ రీత్యా వేర్వేరు నగరాల్లో ఉన్నప్పటికీ గాయత్రి కదలికలను నిరంతరం గమనిస్తూ, ఆమె అనుమతి లేకుండానే హ్యాండ్బ్యాగ్లో ట్రాకింగ్ పరికరాన్ని కూడా అమర్చాడు. సహోద్యోగుల గురించి తరచూ ప్రశ్నిస్తూ, వివాహేతర సంబంధాలపై నిరాధార ఆరోపణలు చేసి తీవ్ర మానసిక వేధింపులకు గురిచేసేవాడు. గురుగ్రామ్కు మారిన తర్వాత కూడా గాయత్రి కార్యాలయానికి వెళ్లే సమయంలో వీడియో కాల్స్ చేయాలని ఒత్తిడి తెచ్చేవాడు. నిత్యం ఆమెను మానసికంగా వేధించేవాడు. అన్ని ఆధారాలను పరిశీలించాలి గాయత్రి మృతికి సంబంధించిన పరిస్థితులపై శ్రీచరణ్ను పలుమార్లు ప్రశ్నించినప్పటికీ స్పష్టమైన సమాధానాలు చెప్పడం లేదు. ఘటన జరిగిన హోటల్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, రిజిస్టర్ వివరాలు, కాల్ డేటా రికార్డులు, ఇతర డిజిటల్ ఆధారాలను భద్రపరచి పరిశీలించాలి. పోస్టుమార్టం నివేదికలోని అంశాలను కూడా సమగ్రంగా విశ్లేషించాలని తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కాగా, గాయత్రి మృతిపై ఇప్పటికే ఉత్తరాఖండ్ పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఘటన ఉత్తరాఖండ్లో చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడి దర్యాప్తు వివరాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి. -
ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో జాప్యంపై ఆగ్రహం
మహారాణిపేట: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రారంభం కాకపోవడంపై కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్లో ఉన్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. ఒక్కో బీఎల్వో సుమారు వెయ్యి ఫారాలు పంపిణీ చేయాల్సి ఉంటుందని, ఫారాల పంపిణీతో పాటు మ్యాపింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్ పూర్తయిందో లేదో యాప్ ద్వారా నిర్ధారించుకుని పంపిణీ చేపట్టాలని తెలిపారు. గాజువాక నియోజకవర్గంలోని 181, 240 పోలింగ్ కేంద్రాలు, పెందుర్తి నియోజకవర్గంలోని 253 పోలింగ్ కేంద్ర పరిధిలో ఇంకా ఫారాల పంపిణీ ప్రారంభం కాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్ల తొలగింపుకు సంబంధించి ప్రతి కేసుకు ప్రత్యేక ఫైల్ నిర్వహించి, కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. స్టీల్ప్లాంట్ తదితర ప్రాంతాల్లో డోర్లాక్ సమస్యలు అధికంగా ఉంటే ఇతర శాఖల అధికారుల సహకారం తీసుకుని ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటైజేషన్ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తానని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవో దిలీప్ చక్రవర్తి, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు తదితర అధికారులు పాల్గొన్నారు. -
సూపర్ దగా
అవి విజయోత్సవాలు కాదు.. వెన్నుపోటు సంబరాలుప్రభుత్వం చేసింది గోరంత.. ఆర్భాటం కొండంత రెండేళ్ల కూటమి పాలనలో అడుగడుగునా ప్రజావంచన మహా మోసాల ‘సూపర్ సిక్స్’.. అస్తవ్యస్తమైన విశాఖ రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామంటూ ఆశలు రేపిన బాబు.. అధికారం దక్కాక ఆ ఊసే ఎత్తడం లేదు. రెండేళ్లుగా మహిళలు తమ ఖాతాల్లో డబ్బులు పడతాయేమోనని కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నా.. మిగిలింది మాత్రం గుండుసున్నా. జిల్లాలో అర్హులైన మహిళలు: 8 లక్షల మంది రెండేళ్ల కాలంలో ఒక్కొక్కరికీ రావాల్సింది: రూ.36,000 మహిళల పొట్టగొట్టి బాబు సర్కారు మిగిల్చుకున్నది: రూ.2,880 కోట్లు ఎన్నికల ముందు ఆకాశమే హద్దుగా హామీలిచ్చి.. అధికార పీఠమెక్కాక ప్రజల నమ్మకాన్ని నిలువునా వంచించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ‘విజయోత్సవాల’ పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేస్తోంది. రెండేళ్ల పాలనలో సమాజంలోని ఏ ఒక్క వర్గానికై నా మేలు జరిగిందా? అంటే శూన్యమనే సమాధానం వస్తోంది. పిల్లల చదువుల నుంచి పేదల వైద్యం వరకు, నిరుద్యోగుల భృతి నుంచి మహిళల ‘ఆడబిడ్డల నిధి’ పథకం వరకు అడుగడుగునా దగాన పడ్డ విశాఖ జనం.. ఈ సంబరాలు విజయానికా? లేక ఘోర వైఫల్యాలకా? అని ప్రశ్నిస్తున్నారు. చేసిన తప్పులను, ఇచ్చిన వెన్నుపోటు గాయాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ తప్పుడు ఆర్భాటాలంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, విశాఖపట్నంఉన్నత విద్యకు శాపం! దివంగత వైఎస్సార్, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజు రీయంబర్స్మెంట్ కొండంత అండగా నిలిచింది. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కాలేజీలకు నిధులు విడుదల చేయకుండా బకాయిలు పెట్టడంతో, యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయి. పేదవాడి చదువును దూరం చేసే కుట్ర సాగుతోంది. ఉమ్మడి విశాఖలో లబ్ధిదారులు: సుమారు 60 వేలు రెండేళ్లుగా నిలిపివేసిన ఫీజుల బకాయిలు: సుమారు రూ.300 కోట్లు ‘తల్లి’కి ఎగనామం..! గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ‘అమ్మ ఒడి’ ద్వారా ప్రతి పేద విద్యార్థి చదువుకు భరోసా లభిస్తే, చంద్రబాబు సర్కారు ‘తల్లికి వందనం’ పేరుతో పెద్ద ఎత్తున కోత విధించింది. బడికెళ్లే పిల్లలందరికీ రూ.15 వేలు ఇస్తామని నమ్మించి, తీరా సమయానికి లబ్ధిదారుల సంఖ్యను సగానికి సగం తగ్గించేసింది. జిల్లాలో మొత్తం విద్యార్థులు: 3,26,494 మంది తల్లికి వందనం ఇస్తున్నది : 1,90,907 మందికి చంద్రబాబు మోసం చేస్తోంది: 1,35,587 మంది ‘ఉచిత గ్యాస్’.. ఉత్తుత్తి కబుర్లే! ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటూ ప్రచారం ఊదరగొట్టారు. కానీ క్షేత్రస్థాయిలో సగం మందికి కూడా సిలిండర్లు అందడం లేదు. లబ్ధిదారుల్లో కనీసం 60 శాతం మందికి కూడా రాయితీ డబ్బులు జమకావడం లేదు. ఉచిత గ్యాస్కు అర్హులైన గృహాలు: 5.17 లక్షలు అందుతున్నది అరకొరగానే: 3.71 లక్షల ఇళ్లకు మాత్రమే రెండేళ్లలో ఎగ్గొట్టిన సిలిండర్ల సంఖ్య: 5.50 లక్షల సిలిండర్లు -
కూటమిలో సర్ కలకలం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగిస్తున్నారనే భయాందోళనల నడుమ ప్రారంభమైన ’స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026 (ఎస్ఐఆర్)’ ప్రక్రియ.. ఇప్పుడు కూటమి పార్టీల్లోనే తీవ్ర వివాదానికి దారితీస్తోంది. సొంత పార్టీల నేతల ఓట్లపైనే కోత పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఈ ’సర్’ ప్రక్రియ మొత్తాన్ని అపహాస్యం చేస్తూ.. తన ఆధీనంలోకి తీసుకున్నారని, జనసేన నేతల ఓట్లను సైతం తొలగిస్తున్నారని కూటమి నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. తన సమీప బంధువుల ఓట్లతో పాటు, తన ముఖ్య మద్దతుదారుల ఓట్లను కూడా తొలగిస్తున్నారంటూ జనసేన పార్టీ మాజీ కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపణలు చేశారు. జనసేన నేతలు, కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే వైఖరిని నిలదీస్తున్న సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని.. ఈ ’సర్’ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని ఆక్షేపించారు. సీఈవో, కలెక్టర్కు ఫిర్యాదు ఈ అక్రమాలపై పీతల మూర్తియాదవ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో పాటు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్కు బుధవారం నేరుగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కాపీలను ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కూడా పంపారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఈ ప్రక్రియను ఒక ఆయుధంగా వాడుకుంటూ దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని ఆ లేఖలో మండిపడ్డారు. బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా కాకుండా, టీడీపీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్ల ద్వారా గుండుగుత్తగా ఫారాలు నింపుతున్నారని ఆరోపించా రు. తొలగించాల్సిన ఓట్లను ముందే టిక్ చేసి మరీ ఎమ్మెల్యే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని.. టీడీపీకి చెందిన బీఎల్ఏలు ఏకంగా తలుపులు మూసి మరీ ఫారాలు నింపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ వ్యవహారం విశాఖపట్నంలోని కూటమి నేతల మధ్య తీవ్ర చిచ్చురేపింది. అన్ని నియోజకవర్గాల్లోనూ అదే తంతు..! ఒకవైపు ప్రతిపక్ష పార్టీల ఓట్లకు ఎసరు పెట్టేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు లాగే, ఏజెంట్ల నియామకం కూడా ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అనకాపల్లి: ఇక్కడ పూర్తిస్థాయిలో జనసేనకు చెందిన బీఎల్ఏలను నియమించారని, తమకు కనీస ప్రాతినిధ్యం దక్కలేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. యలమంచిలి, పెందుర్తి, విశాఖ సౌత్: ఈ నియోజకవర్గాల్లో అన్ని బూత్లలోనూ టీడీపీ నేతలను బీఎల్ఏలుగా నియమించలేదని ఆ పార్టీ క్యాడర్ వాపోతోంది. ఇక్కడ మెజారిటీ స్థానాల్లో జనసేన వారికే అవకాశం దక్కడంతో టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. బీజేపీ అసహనం: ఈ గందరగోళంలో తమను అసలు పట్టించుకునే నాథుడే లేడని స్థానిక బీజేపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కేవలం టీడీపీ నేతలకే బీఎల్ఏలుగా అవకాశం కల్పించారని ఇతర కూటమి భాగస్వామ్య పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ అసంతృప్తి లోలోపలే రగిలిపోగా.. ఇప్పుడు విశాఖ తూర్పు నియోజకవర్గంలో జనసేన మాజీ కార్పొరేటర్ నేరుగా వీధికెక్కి రచ్చ చేయడంతో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టిక్ మార్కులతో ఓట్ల తొలగింపు! రాజకీయంగా తమకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను అధికార పార్టీ నేతలు ముందే గుర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటు వేయరని భావించే వారి పేర్లను ఓటర్ల జాబితాలో గుర్తించి, వాటి పక్కన ’టిక్ మార్కు’ పెడుతున్నారు. ఆ జాబితాలను అధికార పార్టీకి చెందిన బీఎల్ఏలకు అందజేస్తున్నారు. వీరి ఒత్తిళ్లకు లొంగి బీఎల్ఓలు ఆయా ఓటర్లకు ఫారాలు అందజేయకపోవడమో.. లేదా సదరు బీఎల్ఏలే తప్పులతడకగా ఫారాలు నింపి, ఆ ఓట్లు త్వరగా తొలగిపోయేలా రంగం సిద్ధం చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. -
స్పా దందా!
సెలూన్ పేరిటసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సంపత్ వినాయగర్ ఆలయానికి కూతవేటు దూరంలో సెలూన్ పేరిట నడుస్తున్న ఓ స్పా సెంటర్ విషయంలో పోలీసులు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెలూన్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఈ కేంద్రం జోలికి పోలీసులు వెళ్లడం లేదని స్థానికులు చెబుతున్నారు. కరోనా సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కేంద్రాన్ని తెరిచి ఉంచడంతో పోలీసులు దాడి చేశారు. అప్పట్లో బాడీ మసాజ్ల పేరుతో జరుగుతున్న కార్యకలాపాలపై నిర్వాహకులు పోలీసులకు అడ్డంగా దొరికినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత మళ్లీ యథావిధిగా సెలూన్ ముసుగులో స్పా కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని పలు స్పా కేంద్రాలపై తరచూ దాడులు జరుగుతున్నప్పటికీ, ఈ కేంద్రం వైపు మాత్రం పోలీసులు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ కేంద్రంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఆ సమాచారం వెంటనే నిర్వాహకులకు చేరుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల నెలా భారీ మొత్తంలో మామూళ్లు అందుతుండటమే ఇందుకు కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చే యువతులకు సెలూన్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, క్రమంగా స్పా కార్యకలాపాల్లోకి దింపుతున్నట్లు సమాచారం. వీఐపీ రోడ్డులో ఉన్న మరో సెలూన్ స్టూడియో విషయంలోనూ ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. బయోమెట్రిక్తో ఎంట్రీకి అడ్డుకట్ట! స్పా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం చట్టబద్ధమే. అయితే మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించేందుకు శాసీ్త్రయ పద్ధతుల్లో మసాజ్ సేవలు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం శిక్షణ పొందిన థెరపిస్టులు ఉండాలి. అయితే విశాఖపట్నంలోని కొన్ని కేంద్రాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. మసాజ్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీల కోసం పోలీసులు లేదా ఇతరులు నేరుగా లోపలికి రాకుండా ఉండేందుకు బయోమెట్రిక్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. స్పా సిబ్బంది మినహా ఇతరులు లోపలికి వెళ్లాలంటే బయోమెట్రిక్ కార్డు తప్పనిసరి చేస్తున్నట్లు సమాచారం. ఈ విధమైన వ్యవస్థలు ఉండకూడదని పోలీసులు చెబుతున్నప్పటికీ, వాటి వినియోగం మాత్రం కొనసాగుతూనే ఉంది. మామూళ్ల వ్యవహారమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది స్పెషల్ స్పా వాస్తవానికి నగరంలో స్పా కేంద్రాల ముసుగులో వ్యభిచారం సాగుతోందన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి మసాజ్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. నగరంలో అడుగడుగునా కనిపిస్తున్న స్పా కేంద్రాల్లో చాలావరకు ఇలాంటి కార్యకలాపాలు సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సంపత్ వినాయక ఆలయానికి సమీపంలోని ఈ కేంద్రంతో పాటు వీఐపీ రోడ్డులోని మరో స్టూడియోపైనా ఇదే తరహా ఆరోపణలు ఉన్నాయి. బయటకు సెలూన్లుగా కనిపిస్తున్నప్పటికీ, లోలోపల వ్యభిచారం సాగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేంద్రాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఆ సమాచారం నిర్వాహకులకు చేరుతుండటంతో వారు ఫిర్యాదు చేసిన వారిని సంప్రదించి వ్యవహారాన్ని ‘మేనేజ్’ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచే.. విశాఖపట్నంలోని అనేక మసాజ్ కేంద్రాల్లో స్థానిక యువతుల కంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొస్తున్నట్లు సమాచారం. వారికి వసతి సదుపాయాలను కూడా కొందరు నిర్వాహకులే కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సెలూన్లు, స్టూడియోల పేర్లతో అనుమతులు తీసుకుని స్పా కేంద్రాలను నిర్వహిస్తుండగా, మరోవైపు ఎలాంటి అనుమతులు లేకుండానే కొన్ని ప్రాంతాల్లో మసాజ్ కేంద్రాలు నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ కేంద్రాలపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడానికి మామూళ్ల వ్యవహారమే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి స్పాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మూసివేసిన గదులకు బదులుగా కర్టెన్లతో మాత్రమే విభజనలు ఉండాలని గతంలో పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిబంధనలను చాలా కేంద్రాలు పాటించకపోయినా చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
‘ఉద్యోగం’ లేదు.. ‘భృతి’ లేదు!
ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ ఊదరగొట్టిన కూటమి సర్కారు, రెండేళ్లు గడుస్తున్నా నిరుద్యోగులకు పైసా విదిల్చలేదు. 2014–19 నాటి పాత మోసాన్నే మళ్లీ పునరావృతం చేస్తూ నిరుద్యోగ యువతను నట్టేట ముంచింది. జిల్లాలో నిరుద్యోగ యువత: 2.05 లక్షల మంది ఒక్కో నిరుద్యోగికి 24 నెలల్లో రావాల్సింది: రూ.72,000 చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టిన మొత్తం సొమ్ము: రూ.1,476 కోట్లు -
నిర్వహణ నైపుణ్యాల పెంపుపై దృష్టిసారించాలి
సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ వ్యవస్థలో నూతన పరిజ్ఞానంపై అవగాహన, నిర్వహణ నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి సూచించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్(సీవోఈఈటీ)లో ఈనెల 15 నుంచి 19 వరకూ 5 రోజుల శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా.. గురువారం జరిగిన సెషన్కు సీఎండీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఐఎం విశాఖపట్నం ఆధ్వర్యంలో ఫైనాన్స్ అండ్ మేనేజిరియల్ అకౌంటింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో ఏపీ విద్యుత్ రంగానికి చెందిన ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎన్ఆర్ఈడీక్యాప్ సంస్థల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎండీ పృథ్వీతేజ్ మాట్లాడుతూ, ఇంధన రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు, ముఖ్యంగా ఎనర్జీ ట్రాన్సిషన్ నేపథ్యంలో ఉద్యోగులు నిరంతర అధ్యయనం, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక నిర్వహణ, నాయకత్వ లక్షణాల అభివృద్ధి ద్వారా సంస్థల పనితీరు మరింత మెరుగుపడుతుందన్నారు. ఐఐఎంవీ అధ్యాపకులు డా.వికాస్ సంగ్వాన్, డా.తమలి చక్రబర్తి ప్రోగ్రామ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ శిక్షణ అందిస్తున్నారు. ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి -
అవ్వాతాతల పింఛన్లకూ ‘కోత’!
వైఎస్ జగన్ పాలనలో ఒకటో తేదీ ఉదయం సూరీడు రాకముందే వలంటీర్లు తలుపు తట్టి పింఛను డబ్బులు చేతిలో పెట్టేవారు. కానీ నేడు పింఛన్ కోసం అవ్వాతాతలు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అంతటితో ఆగకుండా, వేలాది మంది అర్హుల పింఛన్లను బాబు సర్కారు నిర్దాక్షిణ్యంగా తొలగించింది. వైఎస్సార్సీపీ హయాంలో జిల్లాలో పింఛనుదారులు: 1,65,891 బాబు పాలనలో ప్రస్తుత పింఛనుదారులు: 1,57,624 నిర్దాక్షిణ్యంగా తొలగించిన పింఛన్లు: 8,267 -
ఐదు రోజులు.. ఏపీ అంతటా వానలే వానలు
సాక్షి, విశాఖపట్నం: ఐదు రోజులపాటు ఏపీ అంతటా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు విదర్భ నుంచి ఏపీ మీదుగా ద్రోణి కొనసాగుతుందని సముద్ర వాతావరణం అలజడిగా ఉండనుందని అధికారులు పేర్కొన్నారు. ఉత్తర కోస్తా తీరంలో ఐదు రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని.. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లా వేపాడలో 9సెంమి అత్యధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది.మరోవైపు, భారతదేశంలో బలహీనమైన రుతుపవనాలకు కారణమయ్యే ఎల్నినో ప్రభావం ఖరీఫ్ సీజన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, రాజస్తాన్, బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో ఎల్ నినో ముప్పు తీవ్రతను తగ్గించడానికి సమన్వయంతో కూడిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.ఎల్ నినో ప్రభావం సాపేక్షంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న రాష్ట్రాల్లోని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇతర విభాగాలతో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ సూచించారు. ఖరీఫ్–2026 ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో ముందస్తు అత్యవసర ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. వర్షపాతం లోటును దృష్టిలో పెట్టుకొని పత్తి, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని చెప్పారు. ఈ ఏడాదికి సంబంధించి 12 ఎల్ నినో ప్రభావిత రాష్ట్రాల్లోని 326 జిల్లాలకు అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. -
రాధా గాయత్రి మృతిపై మరో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో విశాఖపట్నానికి చెందిన యువతి రాధా గాయత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న గాయత్రి తల్లిదండ్రులు గురువారం విశాఖపట్నం పోలీస్ కమిషనర్ (సీపీ) కార్యాలయానికి చేరుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గాయత్రి మృతి సహజ మరణం కాదని, ఈ ఘటన వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తమ అల్లుడి పాత్రపై అనుమానం ఉందని, పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.మృతిపై అనుమానాలు ఉన్నాయి..ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గాయత్రి తల్లి సత్యవతి.. తమ కుమార్తె మరణానికి సంబంధించి తమకు అనేక సందేహాలు ఉన్నాయని చెప్పారు. ఘటన జరిగిన తీరుపై స్పష్టత లేదని, అందుకే పోలీసుల జోక్యం కోరుతున్నామని తెలిపారు. తన అల్లుడు శ్రీచరణ్పై అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తమకు అందిన సమాచారం, శ్రీచరణ్ చెప్పిన కారణాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంటూ ఈ కేసును అన్ని కోణాల్లో విచారించాలని కోరారు. తన కూతురుతో తమ అల్లుడు సరిగా కలిసి ఉండే వారు కాదని అన్నారు. తమ కూతురికి మద్యం సేవించే అలవాటు లేదు. గాయత్రిపై అనుమానంతోనే హత్య చేసి ఉండొచ్చు. రిషికేశ్, హరిద్వార్ వెళ్తున్నామని చివరి సారిగా నాకు చెప్పింది. విహారయాత్ర ముగించుకొని విశాఖకు వస్తానని చెప్పింది. విశాఖకు రాకుండానే నా కూతుర్ని హతమార్చారు. విశాఖకు వచ్చిన తర్వాత రెండు నెలలు వర్క్ ఫ్రం హోం పెట్టి ఇక్కడే ఉంటాను అని చెప్పింది. మాది సాంప్రదాయమైన కుటుంబం అని ఆవేదన వ్యక్తం చేశారుసీపీ కార్యాలయంలో ఫిర్యాదు..గాయత్రి తల్లిదండ్రులు సీపీ కార్యాలయంలో అధికారులను కలిసి తమ అనుమానాలను వివరించినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి, అవసరమైతే సంబంధిత రాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుని దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ముస్సోరిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. యువతి మృతి వెనుక అసలు కారణాలేమిటి? కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలకు ఆధారాలున్నాయా? అనే అంశాలపై దర్యాప్తు కీలకంగా మారింది. -
కేటగిరి మార్చి డేటా సెంటర్కు పర్యావరణ అనుమతులు
సీతంపేట: విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నిబంధనలను బేఖాతరు చేస్తూ తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతోందని జల్ బిరాదరి జాతీయ కన్వీనర్, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యన్నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ద్వారకానగర్లోని పౌరగ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డేటా సెంటర్ల కారణంగా పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదంటూ స్థానిక ఎంపీ ఎం.శ్రీభరత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పర్యావరణ చట్టాల ప్రకారం అత్యంత కఠినమైన నిబంధనలు వర్తించే కేటగిరి ‘ఏ’ కింద పరిగణించాల్సిన భారీ డేటా సెంటర్లను, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేటగిరి ‘బీ2’ కిందకు మార్చి పర్యావరణ అనుమతులు మంజూరు చేసిందని ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణను, సమగ్ర పర్యావరణ ప్రభావ అంచనా ప్రక్రియలను పూర్తిగా పక్కనబెట్టి అనుమతులు జారీ చేయడం దారుణమన్నారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర పర్యావరణ మంత్రులతో గానీ, ముఖ్యమంత్రితో గానీ మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాలు విసిరారు. ఈ డేటా సెంటర్ల వల్ల భవిష్యత్తులో నగరంలో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడుతుందని, పవర్ గ్రిడ్పై భారం పడి కరెంట్ కోతలు విపరీతంగా పెరుగుతాయని హెచ్చరించారు. అంతేకాకుండా నగర ఉష్ణోగ్రతలు 1 నుంచి 6 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదం ఉందన్నారు. సమగ్ర పర్యావరణ ఆడిట్ నిర్వహించే వరకు ఈ డేటా సెంటర్ పనులను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
అలరించిన ‘పాతాళభైరవి’
మద్దిలపాలెం: సురభి నాటకోత్సవాల్లో ప్రదర్శించిన పాతాళభైరవి ఆహుతులను కట్టపడేసింది. కళాభారతి వేదికగా జరుగుతున్న ఈ వేడుకల్లో రెండో రోజు బుధవారం పాతాళభైరవి నాటకం ప్రదర్శించారు. కళాభారతి అధ్యక్షుడు ఎమ్మెస్ఎన్ రాజు, కార్యదర్శి రాంబాబు, నగర మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాతాళభైరవి నాటకంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. రంగస్థలం నటి శివజ్యోతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో కళా పోషకులు మేడా మస్తాన్ రెడ్డి, భీశెట్టి వెంకటేశ్వరరావు, పోతన రెడ్డి, అక్కు నాయుడు, తిలక్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆర్.భానుప్రసాద్ సంధానకర్తగా వ్యవహరించారు. చురుగ్గా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీమహారాణిపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, వాటి డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 20,23,009 మంది ఓటర్లకు సంబంధించి ఇప్పటివరకు 2,46,018 ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇది మొత్తం ఓటర్లలో 12.16 శాతంగా నమోదైందన్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే, విశాఖ తూర్పు నియోజకవర్గం 16.59 శాతం ఫారాల పంపిణీతో తొలి స్థానంలో ఉండగా, విశాఖ పశ్చిమ నియోజకవర్గం 15.96 శాతంతో రెండో స్థానంలో నిలిచిందన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో కేవలం 6.78 శాతం మాత్రమే నమోదైనందున అక్కడ పంపిణీ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని సూచించారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 983 ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటైజ్ అయినట్లు కలెక్టర్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన ఫారాలను సకాలంలో ఆన్లైన్లో నమోదు చేసి డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. -
కై లాసగిరిపై.. పట్టాలెక్కని ‘టాయ్ ట్రైన్’
ఆరిలోవ: కై లాసగిరిపై అందాల ప్రయాణం అటకెక్కింది. శిఖరంపై నుంచి సాగర సోయగాలు.. సుందర నగర అందాలు తిలకించే భాగ్యం పర్యాటకులకు దూరమైంది. దశాబ్దాలుగా సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచిన ఆ చిన్నారి రైలు కూత ఆగిపోయింది. విశాఖ పర్యాటక రంగానికి మణిహారంగా నిలిచిన కై లాసగిరి ‘టాయ్ ట్రైన్’ ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా పట్టాలపై మూలకు చేరింది. సాంకేతిక లోపమో.. లేక అధికారుల ఉదాసీనతో కానీ, ఏడాదిగా ఆగిపోయిన ఈ రైలు కథ ఇక ముగిసినట్లేనా అన్న ఆందోళన పర్యాటకుల్లో వ్యక్తమవుతోంది. నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కై లాసగిరిపై సందర్శకులను ఎంతగానో అలరించిన ‘విశాఖ దర్శిని’ సర్క్యూట్ రైలు కథ ముగిసినట్లేనా? అంటే అవుననే అంటున్నాయి అక్కడి పరిస్థితులు. పట్టాల పక్కనే అనాథలా.. గత కొన్నాళ్లుగా ఈ టాయ్ ట్రైన్ సాంకేతిక లోపాలతో నడక సాగించలేకపోతోంది. రైలు మరమ్మతులకు గురికావడంతో వీఎంఆర్డీఏ అధికారులు దీన్ని కనీసం షెడ్డుకు కూడా చేర్చకుండా, స్టేషన్కు కొంత దూరంలో పట్టాలపైనే వదిలేశారు. ఈ రైలు అందుబాటులో లేకపోవడంతో కై లాసగిరికి వచ్చే పర్యాటకులు తీవ్ర నిరాశతో వెనుతిరుగుతున్నారు. గతంలో ఇక్కడికి వచ్చే పర్యాటకులు అత్యధికంగా ఈ టాయ్ ట్రైన్ ఎక్కేందుకే ఆసక్తి చూపించేవారు. ఇందులో ప్రయాణిస్తూ సాగర తీరాన్ని వీక్షించి మురిసిపోయేవారు. దీంతో ఈ రైలు కోసం ప్రత్యేకంగా నిర్మించిన స్టేషన్ ఎప్పుడూ సందర్శకులతో కళకళలాడుతూ ఉండేది. కానీ, ఏడాది కాలంగా రైలు నిలిచిపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పూర్తిగా బోసిపోయింది. ఈ రైలు మళ్లీ పట్టాలెక్కే అవకాశం లేదని అక్కడ పనిచేసే సిబ్బంది పేర్కొనడం గమనార్హం. ఇప్పటికై నా వీఎంఆర్డీఏ అధికారులు స్పందించి, తక్షణమే ఈ టాయ్ ట్రైన్కు మరమ్మతులు చేయించి పునరుద్ధరించాలని పర్యాటకులు కోరుతున్నారు. -
జోన్–1 ఆర్జేడీగా సదారావు బాధ్యతల స్వీకరణ
మహారాణిపేట: సమాచార, పౌర సంబంధాల శాఖ జోన్–1 రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ)గా కె.సదారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ప్రభుత్వం జాయింట్ డైరెక్టర్గా పదోన్నతి కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్జేడీ బాధ్యతలతో పాటు విశాఖపట్నం జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారిగా అదనపు బాధ్యతలను కూడా నిర్వహించాలని శాఖ డైరెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్ ఆదేశాలు జారీ చేశారు. కె.సదారావు 1991లో పాడేరులో ఏపీఆర్ఓగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం డివిజనల్ పీఆర్ఓగా పలు ప్రాంతాల్లో సేవలందించారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో డీపీఆర్ఓ, విజయవాడలో అసిస్టెంట్ డైరెక్టర్గా, నెల్లూరులో ఉపసంచాలకుడిగా, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్గా వివిధ హోదాల్లో పనిచేశారు. -
కాందిశీకుల పేరుతో కబ్జా!
ప్రభుత్వ స్థలంలో ఇళ్లుసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ స్థలం అని బోర్డు స్పష్టంగా ఉన్నా.. ఆక్రమణదారుల అడుగులు మాత్రం ఆగడం లేదు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని బర్మా క్యాంప్లో సర్వే నంబర్ 13/ఏ/14లో ఉన్న మూడు ఎకరాల ప్రభుత్వ భూమిపై కాందీశీకుల పేరుతో కబ్జా యత్నాలు జరుగుతున్నాయంటూ స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు లేని పేదలకు ఇళ్లు ఇప్పిస్తామంటూ నమ్మించి.. ఇప్పుడు కొద్ది మంది నాయకులు కాస్తా ఇష్టారీతిలో ఇక్కడ స్థలాన్ని ఆక్రమించి కబ్జాలకు తెగబడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇళ్లు లేని స్థానిక పేదలకు స్థలం ఇవ్వకుండా.. తమ అనుయాయులకు ఇష్టారీతిలో కేటాయించుకుని.. పక్కాగా కాందిశీకుల పేరుతో కబ్జాకు దిగారని విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా రూ.100 కోట్ల విలువైన ఈ ప్రభుత్వ స్థలంలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ నేరుగా కాలనీవాసులు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఇళ్లు ఇస్తామంటూ నమ్మించి..! వాస్తవానికి కాలనీలోని పేదల సంక్షేమ కోసం 2014లో బర్మా కాందిశీకుల సంక్షేమ సంఘం పేరుతో సంఘాన్ని స్థాపించారని స్థానికులు పేర్కొంటున్నారు. కొంత ప్రభుత్వ భూమి ఉందని, ఇల్లు లేని పేదలకు ఇద్దామనే ఉద్దేశంతో సంఘాన్ని స్థాపించామని తమను నమ్మబలికారని స్థానికులు అంటున్నారు. అయితే, వాస్తవంలో మాత్రం కొద్ది మంది సంఘానికి చెందిన నేతలు అక్రమార్కులతో చేతులు కలిపి, గ్రామ ప్రజలను అవమానించారని వాపోతున్నారు. 48, 60, 180 గజాల లెక్కల విభజించి.. తమ అనుయాయుల పేరుతో ఆక్రమణకు దిగారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ గ్రామానికి సంబంధం లేని వ్యక్తులకు, అక్రమార్కులకు స్థలాలను కేటాయించి, ఇప్పుడు దౌర్జన్యానికి దిగుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి కాందిశీకుల పేరుతో జరుగుతున్న కబ్జాను అడ్డుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రూ.100 కోట్ల పైమాటే...! వాస్తవానికి ఇక్కడ గజం మార్కెట్ ధర భారీగా పలుకుతోంది. అంత విలువైన ప్రదేశంలో కబ్జాకు తెగబడుతుంటే.. రెవెన్యూ వర్గాలు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక్కడ మార్కెట్ ధర గజం రూ.80 వేల చొప్పున పలుకుతోంది. అంటే 3 ఎకరాల ధర ఏకంగా రూ.100 కోట్ల మేర ఉంటుందని అంచనా. రూ. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అండదండలున్నాయని సదరు అక్రమార్కులు పేర్కొంటున్నట్టు విమర్శలున్నాయి. అందుకే గ్రామస్తులు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇప్పటివరకూ రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. -
బీచ్లో మద్యం షాపులా?
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం బీచ్ వాతావరణాన్ని కలుషితం చేస్తూ, ‘బీచ్ షాక్స్’ పేరుతో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం జీవోలు 362, 363 విడుదల చేయడం అత్యంత దుర్మార్గమని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం పెదవాల్తేరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అర్ధరాత్రి వేళ కూడా మహిళలు స్వేచ్ఛగా తిరిగే విశాఖ తీరంలో మద్యం దుకాణాలు పెట్టి ప్రజల స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం స్వస్తి పలుకుతోందని ధ్వజమెత్తారు. ఎంపీ భరత్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం విశాఖ పర్యాటక ప్రాంతంలో మద్యం షాపుల ఏర్పాటును మహిళా, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం జీవో జారీ చేయడం దారుణమన్నారు. 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన విశాఖ ఎంపీ శ్రీభరత్ అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీచ్ షాక్స్ ద్వారా ఆదాయం వస్తే తప్పేంటని ఎంపీ ప్రశ్నించడాన్ని తప్పుబడుతూ.. మద్యం షాపులు అంతగా కావాలనుకుంటే ఆయన సొంత విద్యాసంస్థలైన గీతంలో పెట్టుకోవాలని హితవు పలికారు. విశాఖ రైల్వే జోన్ కేకే లైను వేరే రాష్ట్రానికి తరలిపోతున్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు అడుగులు పడుతున్నా నోరు మెదపని ఎంపీ.. మద్యం షాపులను సమర్థించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో పెరిగిన క్రైమ్ రేట్ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని వరుదు కళ్యాణి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో లక్షకు పైగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయని, పర్మిట్ రూమ్ల పేరిట మద్యాన్ని విపరీతంగా అందుబాటులోకి తెచ్చారని విమర్శించారు. మద్యం మత్తు కారణంగానే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, గృహహింసతో పాటు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి బీచ్ షాక్స్కు సంబంధించిన జీవో నెంబర్ 362ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
అదే అక్కసు!
సాక్షి, విశాఖపట్నం: రుషికొండపై నిర్మించిన అద్భుత ప్రభుత్వ భవనాలు కనిపిస్తే చాలు.. చంద్రబాబు ప్రభుత్వం మరోసారి అదే పాత రాజకీయానికి తెరతీస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శాసనసభ సాక్షిగా ఇవి పర్యాటక శాఖకు చెందిన ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తూనే, ప్రజల్లోకి వచ్చాక మాత్రం ‘జగన్ ప్యాలెస్’ అంటూ రాజకీయ విమర్శలకు దిగడం కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వైఎస్సార్సీపీ వర్గాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో, విశాఖ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రుషికొండపై అత్యాధునిక ప్రమాణాలతో ఈ భవన సముదాయాన్ని నిర్మించింది. అయితే ఈ భవనాలను ప్రజల ప్రయోజనాలకు వినియోగించే దిశగా ఆలోచించాల్సిన ప్రభుత్వం.. కేబినెట్ సబ్కమిటీ పేరుతో మరోసారి రాజకీయ రచ్చకు తెరతీసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ ప్రతిష్టను పెంచే నిర్మాణాలు పర్యాటక రంగ అభివృద్ధి, అంతర్జాతీయ సదస్సులు, ఉన్నత స్థాయి సమావేశాల నిర్వహణకు అనువుగా విశాఖలో ప్రభుత్వానికి సొంతంగా అత్యాధునిక వసతి సముదాయం అవసరమనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్టును చేపట్టారని చెబుతున్నారు. సముద్ర తీరానికి ఆనుకుని, పచ్చని ప్రకృతి మధ్య నిర్మించిన ఈ భవనాలు విశాఖకు కొత్త గుర్తింపుగా నిలుస్తాయని భావిస్తున్నారు. అయితే రాష్ట్రానికి శాశ్వత ఆస్తిగా మిగిలే ఈ నిర్మాణాలను రాజకీయ విమర్శల కోసం వాడుకోవడం సరికాదని, వాటిని రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించాలని విశాఖ వాసులు సూచిస్తున్నారు. అభివృద్ధి, ఆస్తుల సృష్టిపై చర్చించాల్సిన చోట రాజకీయ అక్కసు ప్రదర్శించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలే దెబ్బతింటాయని అభిప్రాయపడుతున్నారు. తాత్కాలిక భవనాలకు వేల కోట్లు..! చంద్రబాబు హయాంలో అమరావతిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల కోసం భారీగా ప్రజాధనం ఖర్చు చేసిన విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తాత్కాలిక నిర్మాణాలకే రూ.1,000 కోట్లకు పైగా ఖర్చు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు రాష్ట్రానికి శాశ్వత ఆస్తిగా నిలిచే రుషికొండ భవనాలపై విమర్శలు చేయడం విడ్డూరమని అంటున్నారు. మరోవైపు రుషికొండ భవన సముదాయం సుమారు రూ.450 కోట్ల వ్యయంతో నిర్మితమైందని, అంతర్జాతీయ స్థాయి అతిథులు, విదేశీ ప్రతినిధులు, రాష్ట్రపతులు, ప్రధానులు బస చేయగలిగే స్థాయిలో ఆధునిక సౌకర్యాలతో రూపొందించారని గుర్తుచేస్తున్నారు. రుషికొండ భవనాల పరిశీలనకొమ్మాది: రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను బుధవారం సాయంత్రం మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయస్వామి పరిశీలించారు. ఈ భవన సముదాయంలో నిర్మాణ విషయాలును, నిర్మాణ సామర్థ్యం, పలు అంశాలను టూరిజం ఇజనీర్లు వీరికి వివరించారు. స్పెషల్ సిఎస్ అజయ్ జైన్, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, పలువురు టూరిజం అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్తి.. రాజకీయ లక్ష్యమా? రుషికొండపై నిర్మించిన భవనాలు ప్రభుత్వ ఆస్తి. అవి ఏ వ్యక్తి సొంతం కావు. ఈ విషయం తెలిసినప్పటికీ కేవలం రాజకీయ కక్షసాధింపే లక్ష్యంగా విమర్శలు కొనసాగుతున్నాయని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొంటున్నారు. అసెంబ్లీలో ఒక మాట, బయట మరో మాట మాట్లాడటం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శిస్తున్నారు. -
కై లాసగిరిపై.. పట్టాలెక్కని ‘టాయ్ ట్రైన్’
● బీచ్లో షాక్స్భవన వ్యర్థాలతో రోడ్లు.. కాలువలకు రంగులు!గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026విశాఖ తీరంలోఅధినేతను కలిసిన మాజీ మేయర్ దంపతులుమద్యం కిక్కుఆరిలోవ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని మాజీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు గొలగాని శ్రీనివాస్ బుధవారం అమరావతిలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు శ్రీకృష్ణుడి విగ్రహం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని జగన్మోహన్రెడ్డి సూచించినట్లు హరివెంకటకుమారి తెలిపారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇకపై విశాఖ బీచ్కు వెళ్లేముందు కుటుంబ సభ్యులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి రానుంది. ఆహ్లాదం, ఆనందం కోసం సముద్ర తీరానికి వచ్చే నగరవాసులకు, పర్యాటకులకు ఇక నుంచి మందుబాబుల తిప్పలు తప్పేలా లేవు. విశాఖపట్నం బీచ్ ఒడ్డున ‘బీచ్ షాక్స్’ పేరిట లిక్కర్ విక్రయాలు జరిపేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. ఏకంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ షాక్స్లలో మద్యం విక్రయించుకోవచ్చంటూ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విశాఖ తీరంలో ప్రాథమికంగా రెండు ప్రాంతాల్లో ఈ బీచ్ షాక్స్ ఏర్పాటు కానున్నాయి. గతంలో ఒకసారి ఇటువంటి ప్రయత్నం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రజల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. కానీ, ఈ విడత మాత్రం నగరవాసుల నిరసనలను బేఖాతరు చేస్తూ ముందుకు వెళ్తుండటం గమనార్హం. ‘భోజనం’ పేరిట హంగామా! ఈ బీచ్ షాక్స్లలో బీర్, వైన్తో పాటు రెడీ–టు–డ్రింక్ రకాలను విక్రయించేందుకు అనుమతించారు. అంతేకాకుండా, రాత్రి 8 గంటల తర్వాత కూడా అక్కడ ఆహార పదార్థాలను సరఫరా చేసేందుకు వీలుగా ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. దీంతో రాత్రి పొద్దుపోయే వరకు భోజనం పేరిట మందుబాబులు బీచ్లోనే తిష్టవేసి హంగామా చేసే అవకాశం ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబాలతో కలిసి ప్రశాంతంగా సేదతీరేందుకు వచ్చే వారికి ఇది తీవ్ర ఇబ్బందికరంగా మారనుంది. అధిక ధరల దందా! రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది. ప్రస్తుతం సిండికేట్లు ఇష్టారాజ్యంగా ప్రతి బాటిల్ పై రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తూ దోపిడీకి తెరలేపారు. ఇవన్నీ అధికార పార్టీ నేతల దుకాణాలే కావడంతో ఎకై ్సజ్ అధికారులు సైతం కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. రేపు బీచ్ షాక్స్లలోనూ మద్యం ధరలు ఇష్టారాజ్యంగానే ఉండే ప్రమాదం ఉంది. ఇప్పటికే స్టార్ హోటళ్ల వార్షిక లైసెన్స్ ఫీజును రూ.66 లక్షల నుంచి రూ.25 లక్షలకు తగ్గించిన ప్రభుత్వం.. బీచ్ షాక్స్కు కూడా నామమాత్రపు ఫీజునే ఖరారు చేసింది. అస్మదీయుల కోసమే పాలసీ.. సాధారణ వ్యాపారులు దరఖాస్తు చేసే సాహసం కూడా చేయకుండా.. దరఖాస్తు ఫీజునే ఏకంగా రూ.2 లక్షలుగా నిర్ణయించడం విశేషం. కేవలం అధికార టీడీపీ నేతలు, స్టార్ హోట ళ్ల యజమానులకు లబ్ధి చేకూర్చడానికే ఈ నిబంధనలు పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు షాక్స్ తమకే దక్కేలా అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో పైరవీలు ప్రారంభించారు. తమకు ప్రైవేట్ బీచ్ ఉందంటూ ప్రచారం చేసుకునే రెండు హోటళ్ల యజమానులతో పాటు.. చినబాబు సిఫార్సులతో మరో కీలక నేత రంగంలోకి దిగినట్టు సమాచారం. వార్షిక లైసెన్స్ ఫీజు: రూ. 7.5 లక్షలు దరఖాస్తు రుసుం: రూ. 2 లక్షలు (నాన్–రీఫండబుల్) అద్భుత భవనాలపైఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం విక్రయాలు రెండు చోట్ల ‘బీచ్ షాక్స్’ ఏర్పాటు బీర్, వైన్, రెడీ–టు–డ్రింక్ బ్రాండ్ల అమ్మకాలకు అనుమతి రాత్రి 8 తర్వాత ఆహార సరఫరాకూ సర్కారు గ్రీన్సిగ్నల్ కుటుంబాలతో కలిసి సేదతీరాలంటే ఇక ఇబ్బందులే..! టిడ్కో, పీఎంఏవై గృహాల పనులు వేగవంతం చేయాలికలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేకాధికారి అభిషిక్త్ కిషోర్ ఆదేశంబీచ్ షాక్స్ ఫీజుల వివరాలు గతంలో వెనక్కి.. ఈసారి ముందుకే.. నిజానికి, గతంలోనూ విశాఖ తీరంలో లిక్కర్ విక్రయాలు జరిపేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. ఇందులో భాగంగానే 2016లో బీచ్ బార్ల ఏర్పాటుకు జీవో నంబర్ 470 విడుదల చేసింది. అదే సమయంలో వైజాగ్లో ‘బికినీ ఫెస్టివల్’ నిర్వహిస్తామంటూ చేసిన ప్రకటనలపై నగరవాసులు మండిపడ్డారు. అప్పట్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో చంద్రబాబు వెనక్కి తగ్గక తప్పలేదు. కానీ ఈసారి మాత్రం ప్రజాభిప్రాయాన్ని, మహిళల ఆవేదనను ఏమాత్రం లెక్కచేయకుండా ప్రభుత్వం ఏకంగా జీవో నంబర్లు 362, 363 జారీ చేసి మరీ బీచ్ షాక్స్ ఏర్పాటుకు తెగబడటం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
స్టీల్ప్లాంట్ను సందర్శించిన సెఫీ బృందం
ఉక్కునగరం: స్టీల్ ఎగ్జిక్యూటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సెఫీ) బృందం బుధవారం విశాఖ స్టీల్ప్లాంట్ను సందర్శించింది. సెఫీ చైర్మన్ ఎం.కె.బంచోర్, వైస్చైర్మన్ అజయ్పాండే, ప్రధాన కార్యదర్శి సంజయ్ ఆర్య ఉదయం కోక్ ఓవెన్, స్టీల్ మెల్ట్ షాప్లకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఎస్ఎమ్ఎస్లోని సీసీడీ, బ్లూమ్ స్టోరేజ్ యార్డ్లకు వెళ్లారు. డైరెక్టర్(ఆపరేషన్స్) సుభశిస్ సేన్ గుప్తా, చీఫ్ జనరల్ మేనేజర్ (వర్క్స్) అనింధ్య ఘోష్లను కలిసి స్టీల్ప్లాంట్, అధికారుల సమస్యలపై ఆరా తీశారు. అనంతరం సీఎండీ ఎం.ఎన్.వి.ఎస్.ప్రభాకర్ను కలిసి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వారితో సీఎండీ మాట్లాడుతూ ఉద్యోగులందరి సహకారంతో సమస్యలను పరిష్కరిస్తానన్నారు. డైరెక్టర్ (ఫైనాన్స్) వినయ్ కుమార్ను కలిసి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు. స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తే ఇరు సంస్థలకు లాభదాయకంగా ఉంటుందన్నారు. సాయంత్రం సి–భవన్లో ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమస్యలపై కేంద్ర మంత్రి కుమారస్వామి, కార్యదర్శి సందీప్ పాండ్రిక్లతో మాట్లాడతామన్నారు. సెయిల్ నుంచి అన్ని విధాల సహకారం అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు విద్యుత్ కుమార్ వర్మ, ప్రధాన కార్యదర్శి కె.వి.డి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
యాదవులపై దాడులు చేస్తే ఊరుకోం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా యాదవులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా యాదవ విభాగం అధ్యక్షుడు ఎడ్ల సుమన్ స్పష్టం చేశారు. బుధవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ యాదవ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్చూరు నియోజకవర్గంలోని ఈదుముడి గ్రామంలో గొర్రెలు, మేకలను మేపేందుకు వెళ్లిన యాదవ సామాజిక వర్గానికి చెందిన మధు, అనిల్లపై జరిగిన దాడిని ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత గ్రామంలోనే యాదవ సామాజిక వర్గాన్ని అవమానిస్తూ కులదూషణలకు పాల్పడటం, వారిపై అమానుషంగా దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా చెప్పుకునే పల్లా శ్రీనివాసరావు ఈ ఘటనపై స్పందించకపోవడం విచారకరమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు తక్షణమే న్యాయం చేయాలన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో యాదవుల ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం యాదవుల కోసం కేటాయించిన 50 సెంట్ల భూమి అంశాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ, ఎలాంటి స్పష్టమైన నిర్ణయం లేకుండా వదిలేయడం యాదవ సమాజానికి జరుగుతున్న తీవ్ర అన్యాయమన్నారు. యాదవుల ఓట్లతో రాజకీయంగా ఎదిగి, వారి సమస్యల పట్ల మౌనం వహిస్తే సమాజం ఎన్నటికీ క్షమించదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ యాదవ నాయకులు పల్లా దుర్గారావు, మువ్వల సురేష్, పల్లా పెంటారావు, పీతల మహేష్, వర ప్రసాద్, మొల్లి హేమంత్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
అక్కిరెడ్డిపాలెం: ఆటోనగర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కిరెడ్డిపాలెంకు చెందిన రావాడ తేజేశ్ (20) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఆటోనగర్లోని వెల్డింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ కోసం తేజేశ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బీహెచ్పీవీ–ఆటోనగర్ రహదారిపై పనుల్లో ఉన్న జీవీఎంసీ డెబ్రిస్ క్లీనింగ్ వాహనాన్ని వెనుక నుంచి తేజేశ్ బైక్తో బలంగా ఢీకొట్టాడు. లారీ వెనుక భాగం తలకు బలంగా తగలడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ప్రమాద సమయంలో యువకుడు హెల్మెట్ ధరించకపోవడం వల్లే మృతి చెందాడని గాజువాక ట్రాఫిక్ సీఐ షేక్ హుస్సేన్ తెలిపారు. -
16వ బెటాలియన్ కమాండెంట్గా అనిల్కుమార్
పీఎం పాలెం: ఏపీఎస్పీ 16వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్గా పి.అనిల్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన బెటాలియన్ పరిపాలన, సిబ్బంది శిక్షణ, క్రమశిక్షణ, సంక్షేమ కార్యక్రమాలు, విధుల నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బెటాలియన్ సిబ్బంది వృత్తి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ప్రజల భద్రత, పరిరక్షణ కోసం మరింత సమర్థవంతమైన పోలీసింగ్ను అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే విధి నిర్వహణతో పాటు సిబ్బంది సంక్షేమ కార్యక్రమాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. 16వ బెటాలియన్ను రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
ఉత్తరాంద్ర సంప్రదాయాన్ని అనిత కాలరాస్తున్నారు: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి గుడివాడ్ అమర్నాథ్ తానెప్పుడూ మహిళల గురించి అవమాన కరంగా మాట్లాడలేదని, మా మీద, మా నేత మీద మాట్లాడిన మాటలకు ఖండించానని విశాఖపట్నంలో అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఇలా మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. ఉత్తరాంద్ర సంప్రదాయాన్ని మంత్రి అనిత కాలరాస్తున్నారని అమర్నాథ్ అన్నారు. టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడలేదు. నేను మాట్లాడిన మూడు రోజులు తర్వాత రాజకీయం చేస్తున్నారు. మా సోషల్ మీడియా దేవుళ్ళు వలన గతంలో టీడీపీ నేతలు మాట్లాడిన వీడియోలు మళ్ళీ బయటకు వచ్చాయి. మహిళలు అంటే గౌరవం నాకు ఉందని అమర్నాథ్ పేర్కొన్నారు. నాపై, మా నాయకుడు పై విమర్శలు చేసిన వారి గురించే విమర్శలు చేశాను. నా మాటలకు నేను కట్టుబడి ఉన్నాను. నా పై విమర్శలు చేసిన వారిపై తప్పితే యావత్ మహిళలు కోసం నేను మాట్లాడలేదు. రాజకీయ లబ్ధి కోసం ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మూడు తరాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి నేను వచ్చాను. వాడు వీడు అంటూ ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉన్న ఆమె మాట్లాడవచ్చా. మాజీ సీఎం తల్లి విజయమ్మ, భార్య భారతమ్మ గురించి దారుణంగా మాట్లాడింది. విజయమ్మ భారతమ్మ పై చేసిన విమర్శలు టీడీపీ నేతలకు కనిపించలేదా. వైఎస్ జగన్ ను నత్తి పకోడీ అంటూ మాట్లాడింది. మేము తగిన సమాధానం చెప్పకపోతే ఆమె మరింత పెట్రేగి పోతారు. ఉత్తరాంధ్ర సాంప్రదాయాన్ని కాపాడే ప్రయత్నం చేశాని ఆయన అన్నారు. మా నాన్న మరణం తరువాత నన్ను, నా అక్కను నా తల్లి పెంచింది. నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళ మధ్య పెరిగిన వాడిని. నన్ను చిన్నతనం నుంచి తీర్చి దిద్దింది మహిళలు. నా గురించి మా పార్టీ మహిళలను అడుగు చెపుతారు. నీ లాంటి వాళ్ళకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో చంద్రబాబు,అనితా, చింతమనేని, బాలకృష్ణ, బండారు సత్యనారాయణ, గాలి భాను ప్రకాష్ మహిళలు గురించి ఎలా మాట్లాడారో తెలియదా.. అనిత ఏది పడితే అది మాట్లాడుతాను అంటే కుదరదు.. రాష్ట్రంలో కాదు దేశ అంతర్జాతీయ స్థాయిలో పిర్యాదు ఇచ్చుకొండి.. మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయితే మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. తగ్గేదిలేదు.. ఒక యువకుడిని కాల్చి చంపారు.. దాని గురించి సమాధానం లేదని అమర్నాథ్ ప్రశ్నించారు. -
బీచ్లో మద్యం షాపు ఏర్పాటు చేస్తే తప్పేంటి?
డాబాగార్డెన్స్ (విశాఖ): ‘విశాఖ బీచ్లో బీచ్ షాక్స్ పేరిట మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే తప్పేంటి..? ఈ రోజుల్లో తాగని వారు ఎవరున్నారు? అందరూ తాగుతున్నారు కదా..’ అని టీడీపీ విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఏపీలో మహిళలకు భద్రత, రక్షణ లేదంటున్నారే.. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో మహిళలకు భద్రత, రక్షణ ఉందా..? అని ప్రశ్నించారు. సోషల్ మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు ఎక్కువవుతున్నాయని, అందుకనే వాటిని తొలగిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్తో కలిసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడారు. గోవా తరహాలో విశాఖ బీచ్లో ‘బీచ్ షాక్స్’ పేరిట మద్యం పాలసీ తీసుకొస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆయన వెల్లడించారు. గూగుల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనివ్వకుండా కొంతమంది సోషల్ మీడియా వేదికగా అడ్డుకుంటున్నారని, అబద్ధపు ప్రచారాలు ఆపి, డేటా సెంటర్ను అడ్డుకోవద్దని సూచించారు. డేట్ సెంటర్ ఏర్పాటుతో 200 మీటర్ల పరిధిలో హీట్వేవ్ ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం లేదని చెప్పుకొచ్చారు. డేటా సెంటర్ ఏర్పాటు ప్రారంభంలో కన్స్ట్రక్షన్ సమయంలో 40 నుంచి 50 వేల మందికి ఉపాధి దొరుకుతుందని.. కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత వెయ్యిలోపే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఎంపీ ఒప్పుకున్నారు. విశాఖలో ఉన్న ఎయిర్పోర్టును కొనసాగించాలన్నా..వద్దన్నా పూర్తి హక్కు జీఎంఆర్ దే అన్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడితో నిర్మించిన.. భోగాపురం ఎయిర్పోర్టు జీఎంఆర్ కోసమేనంటూ ఎంపీ భరత్ చెప్పుకొచ్చారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి నియమ నిబంధనల మేరకు 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్టు ఉండకూడదని ఎంపీ వెల్లడించారు. విశాఖ విమానాశ్రయాన్ని కొనసాగించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం అంటున్నారని, అది కుదరదంటూ ఎంపీ తేల్చిచెప్పారు. ఎవరు ఏం చెప్పినా విశాఖ విమానాశ్రయం ఉండదని చెప్పారు. పర్యావరణం పేరిట ఇటీవల బీచ్ రోడ్డులో చేపట్టిన సంతకాల సేకరణ (డేటా సెంటర్కు వ్యతిరేకంగా)కు నగర పోలీస్ కమిషనర్ను పిలిచి మోసం చేశారని ఎంపీ తెలిపారు. సంతకాల సేకరణలో పాల్గొన్న సీపీని తాను ప్రశ్నించగా..పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమమని తనను ఆహ్వానించి మోసం చేసినట్టు తనతో సీపీ చెప్పారన్నారు. -
అమర్నాథ్ చిత్రపటం దహనంపై చర్యలు తీసుకోండి
మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఫిర్యాదుబీచ్రోడ్డు : మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ చిత్రపటాన్ని దహనం చేస్తూ రెచ్చగొట్టే నినాదాలు చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు బోని శివ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎస్సీ సెల్ నాయకులతో కలిసి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 15న సెవెన్హిల్స్ ఆసుపత్రి సమీపంలో టీడీపీకి చెందిన కొందరు మహిళా నాయకులు, కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా అమర్నాథ్ చిత్రపటాన్ని దిష్టిబొమ్మకు అమర్చి దహనం చేశారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే అమర్నాథ్ను లక్ష్యంగా చేసుకుని అత్యంత అభ్యంతరకర నినాదాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని విమర్శించారు. ఇలాంటి చర్యలు రాజకీయ వైరాన్ని పెంచడమే కాకుండా సమాజంలో వివిధ వర్గాలు, కులాల మధ్య విద్వేషాలు రేకెత్తించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భేదాభిప్రాయాలు సహజమేనని, అయితే ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యక్తిగత దూషణలు చేయడం, దిష్టిబొమ్మల దహనాలకు పాల్పడటం సమంజసం కాదన్నారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిని గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగ నాయకులు పాక సత్యనారాయణ, విక్టర్, వెంకటేశ్వర్లు, కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
సురభి నాటకోత్సవాలు ఆరంభం
మద్దిలపాలెం: కళాభారతి వేదికగా సురభి నాటకోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలను నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబత్ర బాగ్చీ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో కళాభారతి కార్యదర్శి రాంబాబు, ప్రముఖ సామాజికవేత్త చెరువు రామకోటయ్య, నగర మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి. రమణమూర్తి, ఉత్తరాంధ్ర కళాకారుల సంఘం కార్యదర్శి మారుతి ప్రసాద్, జీవీఎంసీ కార్మిక నాయకులు వామనరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ పౌరాణిక నాటకాలను ఆధునిక సాంకేతికత, సినిమాటిక్ సెట్టింగ్లతో అద్భుతంగా ప్రదర్శించడం అభినందనీయమన్నారు. కళల పట్ల విశాఖ ప్రజలకు ఉన్న ఆదరణకు ఉత్సవాలకు భారీగా తరలివచ్చిన ప్రేక్షకులే నిదర్శనమని పేర్కొన్నారు. కళలను పరిరక్షించడం, ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. అనంతరం ప్రదర్శించిన ‘భక్త ప్రహ్లాద’ నాటకం ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది. నాటకంలోని నటీనటుల అభినయం, రంగస్థల అలంకరణ, సాంకేతిక విన్యాసాలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కార్యక్రమంలో రంగస్థల నటుడు, రచయిత కొరిటాల ప్రభాకరరావు, నటులు మేడ మస్తాన్రెడ్డి, బ్రహ్మకుమారి రమక్క, బాదంగీర్ సాయి సతీమణి హైమావతి, కార్యక్రమ నిర్వాహకురాలు శివజ్యోతి, భానోదయ నాట్యమండలి అధ్యక్షుడు ఆర్. నాగబాబు, కార్యదర్శి ఆర్. కోటేశ్వరరావు, సమన్వయకర్త భానుప్రసాద్, ఉపాధ్యక్షుడు మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టు ఎన్. నాగేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
యోగాతో ఆరోగ్యం.. పర్యాటకానికి ప్రచారం
విశాఖ స్పోర్ట్స్ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా ప్రాముఖ్యతను చాటిచెబుతూ, పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా మంగళవారం ముడసర్లోవలోని ఈస్ట్పాయింట్ గోల్ఫ్ క్లబ్ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం కలుగుతుందన్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దేశంలోని ప్రముఖ గోల్ఫ్ కోర్స్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డుపై వేలాది మంది పాల్గొనే భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎంపీ ఎం. శ్రీభరత్ మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతను ప్రజల్లో విస్తృతంగా చాటడమే ఇటువంటి కార్యక్రమాల లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జేసీ విద్యాధర, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఏపీ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సతీష్కుమార్, జిల్లా అధికారులు, హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, గోల్ఫ్ క్లబ్ సభ్యులు పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం యోగా గురువులకు, ప్రజ్ఞా యోగా ప్రదర్శించిన చిన్నారులకు జ్ఞాపికలు అందజేశారు. కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ -
ఏయూలో బయోమెట్రిక్కు బైబై..!
విశాఖ విద్య : ఉద్యోగుల విధుల నిర్వహణలో సమయపాలనకు ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో ఏయూలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బోధన సిబ్బంది సమయానికి తరగతులకు హాజరవుతున్నారా లేదా అన్న అంశంపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా తరగతుల నిర్వహణ, అధ్యాపకుల హాజరు విషయంలో యూనివర్సిటీ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కఠినంగా అమలైన బయోమెట్రిక్ గతంలో ఉద్యోగులు, అధ్యాపకులు సమయపాలన పాటించేలా ఏయూ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. ప్రతి విభాగంలో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేసి, విధులకు హాజరైన వెంటనే వేలిముద్ర నమోదు చేయడం తప్పనిసరి చేసింది. దీంతో ఉద్యోగుల హాజరు, తరగతుల నిర్వహణపై నియంత్రణ పెరిగి వ్యవస్థ సజావుగా సాగింది. విద్యార్థుల ఫిర్యాదులే కారణం: ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకులు తరచూ తరగతులకు గైర్హాజరవుతున్నారంటూ గతంలో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ముఖ్యంగా మొదటి సంవత్సరం విద్యార్థులకు సమయానికి తరగతులు జరగకపోవడం తీవ్ర అసంతృప్తికి దారితీసింది. లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి చేరిన విద్యార్థులకు బోధన సక్రమంగా అందకపోవడంపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చింది. పాడైన యంత్రాలు.. తగ్గిన పర్యవేక్షణ ప్రస్తుతం అనేక విభాగాల్లో బయోమెట్రిక్ యంత్రాలు పనిచేయని స్థితికి చేరుకున్నాయి. వాటి మరమ్మతులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్యలు లేకపోవడంతో వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్న విమర్శలు ఉన్నాయి. సమయపాలన విషయంలో పర్యవేక్షణ తగ్గిపోవడంతో కొందరు ఉద్యోగులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎఫ్ఆర్ఎస్ అమలు ఎక్కడ? బయోమెట్రిక్ విధానానికి ప్రత్యామ్నాయంగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలు చేయాలని గతంలో ప్రతిపాదించినా, ఆ ప్రక్రియ ఎక్కడిదాకా వచ్చిందనే విషయంపై స్పష్టత లేదు. అధ్యాపకులు అధికారిక పనుల నిమిత్తం తరచూ బయటకు వెళ్లాల్సి వస్తుందని, అలాంటి పరిస్థితుల్లో బయోమెట్రిక్ అమలు ఎలా ఉంటుందన్న సందేహాలు కూడా ఉన్నాయి. సమయపాలనపై సీరియస్గా ఉండాలి: ఎస్ఎఫ్ఐ ఏ సంస్థలోనైనా క్రమశిక్షణ, సమయపాలన ఉంటేనే మెరుగైన ఫలితాలు సాధ్యమ వుతాయని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి అజయ్ అన్నారు. బయోమెట్రిక్ విధానం కొనసాగించడం అవసరమని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తాత్కాలిక అధ్యాపకులతో బోధన నాణ్యత దెబ్బతింటోందని, పూర్తి స్థాయి నియామకాలు చేపట్టాలని కోరారు. సమయపాలన, హాజరు పర్యవేక్షణ, ఖాళీ పోస్టుల భర్తీ వంటి అంశాలపై యూనివర్సిటీ యంత్రాంగం దృష్టి సారించకపోతే విద్యా ప్రమాణాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏయూలో పనిచేయని బయోమెట్రిక్ మెషీన్లు -
సౌండ్ చేయొద్దమ్మా..
అల్లిపురం: వాహనాల్లో అనధికారిక మార్పులు చేసి భారీ శబ్దాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి హెచ్చరించారు. హై–బీమ్ లైట్లు, మొబైల్ స్టాండ్ల వినియోగం రోడ్డు ప్రమాదాలకు దారితీసే అవకాశమున్నందున వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం నగర పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నగరంలో యువత కంపెనీ సైలెన్సర్లను తొలగించి, శబ్ద, వాయు కాలుష్యాన్ని వెదజల్లే మోడిఫైడ్ సైలెన్సర్లను అమర్చడం వల్ల ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గుండె రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీ తెలిపారు. ప్రజల ఫిర్యాదుల మేరకు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఇప్పటివరకు 142 మోడిఫైడ్ సైలెన్సర్లు, 89 హై–బీమ్ లైట్లు, 270 మొబైల్ స్టాండ్లను తొలగించామన్నారు. బీచ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న 73 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకుని, వారి డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేయాలని డీటీసీకి సిఫార్సు చేశామన్నారు. ఉల్లంఘనలకు కఠిన శిక్షలు మోడిఫైడ్ సైలెన్సర్లు, హై–బీమ్ లైట్లు వాడితే మొదటి విడతగా 3 నెలల జైలు లేదా రూ.10 వేల జరిమానాతో పాటు లైసెన్స్ జప్తు చేస్తారు. రెండోసారి దొరికితే 6 నెలల జైలు లేదా రూ.10 వేల జరిమానాతో పాటు వాహనం స్వాధీనం చేసుకుంటారు. మొబైల్ స్టాండ్లు ఉంటే ఏడాది వరకు జైలు లేదా రూ. వెయ్యి నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారు. బైక్ రేసింగ్కు పాల్పడితే 6 నెలల జైలు లేదా రూ.5 వేల జరిమానా విధిస్తారు. ట్రాఫిక్ పోలీసులకు వేసవి కిట్లు ఎండల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల కోసం డీజీపీ మంజూరు చేసిన రూ.6.75 లక్షల నిధులతో కొనుగోలు చేసిన 450 వేసవి కిట్లను సీపీ శంఖబ్రత బాగ్చి సిబ్బందికి పంపిణీ చేశారు. అనంతరం స్వాధీనం చేసుకున్న మోడిఫైడ్ సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. -
అనితా..మాటలు మితిమీరొద్దు
మహారాణిపేట: హోంమంత్రి వంగలపూడి అనితకు మర్యాద తెలియదని, తన పదవిని కాపాడుకోవడానికే ఇష్టానుసార వ్యాఖ్యలు చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె. సుభద్ర విమర్శించారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమెతో పాటు పలువురు జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏకవచనంతో సంబోధించడం తగదన్నారు. హోంమంత్రి అనిత వైఎస్ జగన్తోపాటు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో హోంమంత్రులుగా పనిచేసిన తానేటి వనిత, మేకతోటి సుచరిత హుందాగా వ్యవహరించారని గుర్తు చేశా రు. వైఎస్ కుటుంబానికి, గుడివాడ అమర్నాథ్కు హోంమంత్రి అనిత బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అవకతవకలపై చర్చకు సిద్ధమా? డీఎస్సీ నియామకాలు, సూపర్ సిక్స్ హామీల అమలుపై బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధమా అని సుభద్ర ప్రశ్నించారు. డీఎస్సీలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ముందుకు రావాలని సవాల్ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ‘పులివెందుల ఎమ్మెల్యే’ అంటూ ఏకవచనంతో సంబోధించడం మంత్రి అనితకు తగదన్నారు. రాజకీ య విమర్శలు హుందాగా ఉండాలని, మర్యాదపూర్వకంగా మాట్లాడితే తాము కూడా అదే విధంగా స్పందిస్తామని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీల పరిస్థితి ఏంటి? అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా సూపర్ సిక్స్ హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని సుభద్ర డిమాండ్ చేశారు. కొత్త పింఛన్లు మంజూరు కాలేదని, కొత్త రేషన్ కార్డుల జారీ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదని అన్నారు. పింఛన్లు, రేషన్ కార్డుల కోసం అనేక మంది అర్హులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 50 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు అమలు కాలేదన్నారు. ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని సుభద్ర డిమాండ్ చేశారు. మహిళల భద్రతపై దృష్టి పెట్టాలి రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగికదాడులు, హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని సుభద్ర అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఘటనలు పెరిగాయని ఆరోపించారు. ఇటీవల ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన గిరిజన మహిళ హత్య ఘటనపై ఇప్పటివరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గానీ, హోంమంత్రి స్పందించలేదన్నారు. మహిళల భద్రతను పక్కనపెట్టి రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. -
డెత్ వారెంట్!
ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందించాలి సేఫ్టీ సర్టిఫికెట్కాగితాలపైనే ‘సేఫ్టీ’.. ఉక్కులో అంతా డొల్లబుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2026యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలిమహారాణిపేట: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం–2026 సందర్భంగా జిల్లాలో నిర్వహించనున్న ‘యోగాంధ్ర’ వేడుకలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవా న్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పలు థీమాటిక్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన కార్యక్రమాన్ని అదే రోజు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం నుంచి విక్టరీ ఎట్ సీ వరకు భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమాల నిర్వహణకు నియమితులైన నోడల్ అధికారులు, వేదిక ఇన్చార్జ్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. సాక్షి, విశాఖపట్నం: ఉదయం నవ్వుతూ విధులకు వెళ్లిన వారు.. సాయంత్రానికి గుర్తుపట్టలేనంతగా కాలిపోయి శవాలుగా ఇంటికి చేరుతుంటే ఆ కుటుంబాల రోదనలు ఉక్కునగరాన్ని కలచివేస్తున్నాయి. ఇది ఒక్కరోజు జరిగిన విషాదం కాదు. విశాఖ ఉక్కు కర్మాగారంలో 2011 నుంచి వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాల పరంపరలో మరో విషాద అధ్యాయం మాత్రమే. భద్రతా లోపాలపై అనేక అధికారిక నివేదికలు, కార్మిక సంఘాల హెచ్చరికలు వచ్చినప్పటికీ యాజమాన్యం వైఖరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ప్రైవేటీకరణ ప్రతిపాదనలు తెరపైకి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్లాంట్ భద్రత అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో కార్మికుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ సేఫ్టీ సర్టిఫికెట్లు సాధించామని యాజమాన్యం చెబుతున్నప్పటికీ.. ఆ భద్రత కాగితాలకే పరిమితమైందనే విషయాన్ని తాజా విషాదం మరోసారి బహిర్గతం చేసింది. సీఎస్ఈ హెచ్చరికలకూ మారని తీరు 2012 జూన్ 13 విశాఖ స్టీల్ప్లాంట్ చరిత్రలో చెరగని విషాదంగా మిగిలిపోయింది. జరిగిన భారీ పేలుడు, అగ్నిప్రమాదంలో 19 మంది సజీవదహనమయ్యారు. అప్పటి యాజమాన్యం దానిని యాదృచ్ఛిక ప్రమాదంగా పేర్కొన్నప్పటికీ, ప్రముఖ పర్యావరణ అధ్యయన సంస్థ ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ (సీఎస్ఈ) మాత్రం తన నివేదికలో అది తీవ్రమైన భద్రతా వైఫల్యాల ఫలితమేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా దేశంలోని 13 ప్రధాన ఉక్కు కర్మాగారాల భద్రతా ప్రమాణాలను పరిశీలించిన సీఎస్ఈ.. విశాఖ స్టీల్ప్లాంట్కు అత్యల్ప రేటింగ్ ఇచ్చింది. అయినప్పటికీ యాజమాన్యం మాత్రం సర్టిఫికెట్లు, ప్రమాణాల పేరుతో భద్రతా లోపాలను కప్పిపుచ్చుకుంటూ వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిలిచిపోయిన ప్రివెంటివ్ మెయింటెనెన్స్ భారీ పరిశ్రమల్లో నిరంతర నిర్వహణ పనులు కార్మికుల భద్రతకు కీలకం. అయితే విశాఖ ఉక్కులో గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిధుల కొరత కారణంగా అరిగిపోయిన కన్వేయర్ బెల్టులు, తుప్పుపట్టిన గ్యాస్ పైప్లైన్లు, కాలం చెల్లిన పరికరాల మార్పిడి పనులు వాయిదా పడుతున్నాయని చెబుతున్నాయి. స్పేర్ పార్ట్స్ కొనుగోలుకు కూడా తగిన బడ్జెట్ లేకపోవడంతో పాత పరికరాలతోనే వ్యవస్థను నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. నివురుగప్పిన నిప్పులా పేరుకుపోతున్న ఈ సమస్యలే ఇటీవల వరుస ప్రమాదాలకు కారణమవుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కాంట్రాక్టు కార్మికులతో ప్రమాదకర పనులు మరోవైపు పదవీ విరమణలు, వీఆర్ఎస్ల కారణంగా ప్లాంట్లో అనుభవజ్ఞులైన ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కొత్త నియామకాలు లేకపోవడంతో ఖాళీలను కాంట్రాక్టు కార్మికులతో భర్తీ చేస్తున్నారు. బ్లాస్ట్ ఫర్నేస్, స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్) వంటి అత్యంత ప్రమాదకర విభాగాల్లో కూడా తగిన శిక్షణ, అనుభవం లేని కాంట్రాక్టు కార్మికులతో పనులు చేయిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సరైన భద్రతా అవగాహన, రక్షణ పరికరాల కొరత కారణంగానే ఇటీవల జరిగిన పలు ప్రమాదాల్లో కాంట్రాక్టు కార్మికులే ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం.. నేడు కార్మికుల పాలిట ప్రమాదాల కేంద్రమై మారడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ప్లాంట్ భద్రత, నిర్వహణ, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కార్మిక, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అనిత వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనంప్రైవేటీకరణ పేరుతో భద్రతకు తూట్లు ఒకప్పుడు ఉత్పత్తి లక్ష్యాల కోసం యంత్రాలపై అధిక ఒత్తిడి పెంచి ప్రమాదాలకు కారణమైన యాజమాన్యం.. ఇప్పుడు ప్రైవేటీకరణ, ఆర్థిక సంక్షోభాన్ని సాకుగా చూపుతూ భద్రతా చర్యలకే కోత పెడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు ‘ఓహెచ్ఎస్ఏఎస్’ సర్టిఫికెట్, ఇప్పుడు ‘ఐఎస్వో’ సర్టిఫికెట్ ఉందంటూ గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. భద్రతా ప్రమాణాల అమలుకు అవసరమైన నిధులను విడుదల చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీట్ పరీక్షార్థులకు ఉచిత బస్సు ప్రయాణం డాబాగార్డెన్స్: ఈ నెల 21న జరగనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. హాల్టికెట్ చూపించిన విద్యార్థులు ఆ రోజు ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరేందుకు ముఖ్య ప్రాంతాల నుంచి అదనపు బస్సులు నడిపేందుకు డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అలాగే ప్రతి బస్స్టేషన్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలంటూ ప్రచారం.. క్షేత్రస్థాయిలో కనిపించని భద్రత నిధుల కొరతతో నిలిచిపోయిన నిర్వహణ పనులు.. పెరుగుతున్న ప్రమాదాలు శిక్షణ లేని కాంట్రాక్ట్ కార్మికులపై ప్రమాదకర పనుల భారం 2012 సీఎస్ఈ హెచ్చరికల నుంచి నేటి దుర్ఘటనల వరకు మారని యాజమాన్య వైఖరిఅంతర్గత ఆడిట్ల హెచ్చరికలూ బేఖాతరు ప్లాంట్లో నిర్వహించిన అంతర్గత భద్రతా ఆడిట్లు కూడా పలు విభాగాల్లో ప్రమాదకర పరిస్థితులపై యాజమాన్యాన్ని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ లోపాల సవరణపై ఆశించిన స్థాయిలో చర్యలు చేపట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాద సూచనలు ముందే ఉన్నప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయడమే వరుస దుర్ఘటనలకు కారణమవుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
శుభగడియలొచ్చాయ్
మహారాణిపేట: శుభకార్యాలకు మళ్లీ శుభగడియలు సమీపించాయి. అధిక జ్యేష్ఠ మాసం ముగియడంతో ఈ నెల 19వ తేదీ నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, నిశ్చితార్థాలు తదితర శుభకార్యాలకు ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. దీంతో నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సందడి నెలకొంటోంది. వేదమంత్రాల నడుమ కొత్త జీవితాలకు శ్రీకారం చుట్టేందుకు వధూవరులు సిద్ధమవుతుండగా, శుభకార్యాలపై ఆధారపడిన వృత్తివర్గాల్లోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అధిక మాసంతో నెలరోజుల విరామం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చిన అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్ 15 వరకు శుభముహూర్తాలకు విరామం ఏర్పడింది. ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి ప్రధాన శుభకార్యాలు నిర్వహించరు. దీంతో దాదాపు 36 రోజుల పాటు కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సేవలు, పూల వ్యాపారులు, పురోహితులు, ఫోటో–వీడియోగ్రాఫర్లు, బ్యాండ్ మేళాలు, టెంట్హౌస్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు తదితర రంగాలు నిశ్శబ్దంగా మారాయి. 19 నుంచి శుభముహూర్తాల సందడి నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 19 నుంచి జూలై 10 వరకు వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలకు అనుకూలమైన ముహూర్తాలు ఉన్నాయి. వేద పండితుల ప్రకారం జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే జులై 1, 2, 3, 4, 5, 8, 9 తేదీల్లోనూ శుభకార్యాలు నిర్వహించవచ్చు. మళ్లీ ఆషాఢ మాసం బ్రేక్ జులై 15 నుంచి ఆగస్టు 12 వరకు ఆషాఢ మాసం (శూన్యమాసం) ఉండటంతో మళ్లీ శుభముహూర్తాలకు విరామం రానుంది. ఆ తర్వాత ఆగస్టు 16 నుంచి మళ్లీ వివాహాలు, ఇతర శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు ప్రారంభమవుతాయి. జోరందుకున్న బుకింగ్స్ ముహూర్తాల ప్రారంభంతో కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సంస్థలు, డెకరేషన్ నిర్వాహకులు, పూల వ్యాపారులు, బంగారు ఆభరణాల దుకాణాలు, వస్త్ర వ్యాపారులు ఇప్పటికే బుకింగ్స్తో బిజీగా మారారు. వివాహాల కోసం జాతకాలు చూపించుకునే వారి రాకతో పురోహితులు, జ్యోతిష్య పండితులు కూడా తీరిక లేకుండా ఉన్నారు. వేలాది కుటుంబాలకు ఉపాధి శుభకార్యాలు కేవలం కుటుంబ వేడుకలే కాదు... వేలాది కుటుంబాల జీవనాధారమూ. వివాహాలు, గృహప్రవేశాల వంటి కార్యక్రమాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడే వంటవాళ్లు, డ్రైవర్లు, లైటింగ్ సిబ్బంది, పూల వ్యాపారులు, సంగీత బృందాలు, మినరల్ వాటర్ సరఫరాదారులు, కూరగాయల వ్యాపారులు, హోటళ్లు, లాడ్జీలు, రవాణా రంగాలకు మళ్లీ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏం చేయవచ్చంటే.. అధిక మాసం, మూఢకాలంలో సాధారణంగా వివాహాలు, గృహప్రవేశాలు నిర్వహించకపోయినా, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతం, రిజిస్ట్రేషన్లు వంటి కార్యక్రమాలు చేపట్టవచ్చని పండితులు సూచిస్తున్నారు. మళ్లీ ముహూర్తాలు ప్రారంభం ఈ నెల 19వ తేదీ నుంచి అన్ని శుభముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. అధిక జ్యేష్ఠ మాసం కారణంగా 36 రోజుల పాటు శుభకార్యాలకు విరామం ఏర్పడింది. దీంతో ఈ రంగాలపై ఆధారపడిన అనేక మందికి ఉపాధి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ ముహూర్తాలు ప్రారంభం కావడంతో వేలాది మందికి పని దొరకనుంది. – గంగవరపు భాస్కర పార్వతీశ్వర శర్మ, యజుస్మార్త పండితుడు, శ్రీ పార్వతీశ్వర ఆలయం, సీతంపేట ఈ నెలలో ప్రధాన ముహూర్తాలు జూన్ : 19, 20, 21, 24, 25, 26, 27, 28 జులై : 1, 2, 3, 4, 5, 8, 9 ఆగస్టు : 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30 సెప్టెంబర్ : 1, 3, 4, 5 అక్టోబర్ : 11, 14, 29, 30 శుభకార్యాల సందడితో మళ్లీ కళకళలాడనున్న వేడుకల సీజన్కు జూన్ 19 నుంచి శ్రీకారం చుట్టనుంది. -
ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందించాలి
మహారాణిపేట: సమాజంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులను నిర్ణీత గడువులో పరిష్కరించి పరిపాలనపై ప్రజల నమ్మకం పెంచాలని సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జెడ్పీ 1 నుంచి 7వ స్థాయీ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించారు. అనకాపల్లి, నర్సీపట్నం డయాలసిస్ కేంద్రాల నిర్వహణ, సికిల్ సెల్ బాధితులకు మెరుగైన వైద్యం, మరో నాలుగు ‘మహాప్రస్థానం’ వాహనాల ఏర్పాటు తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. ఉపాధి కూలీలకు 125 పనిదినాలు: ఉపాధి హామీ పనుల్లో ఫేస్ రికగ్నిషన్ హాజరు నమోదులో సాంకేతిక లోపాల వల్ల కూలీలకు పూర్తి వేతనాలు అందడం లేదని సభ్యులు ప్రస్తావించారు. జూలై నుంచి గరిష్టంగా 125 పనిదినాలు కల్పిస్తామని, పనిస్థలాల్లో ఉదయం 9.30 గంటలలోపు ఓఆర్ఎస్, తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని సుభద్ర అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పనకు డిమాండ్ : సంపతవరం, కొత్తూరు, దార్లపూడి తదితర జగనన్న కాలనీల్లో అప్రోచ్ రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస సదుపాయాలు లేకపోవడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పీఎం జన్మన్ ఇళ్ల బిల్లులు మ్యాపింగ్ జాప్యంతో నిలిచిపోయాయని పేర్కొన్నారు. కింజియా పుట్ట రోడ్డు నిర్మాణానికి వేర్వేరు ఏజెన్సీల ద్వారా ప్రతిపాదనలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాలనీల్లో మౌలిక వసతులు తక్షణమే కల్పించాలని చైర్పర్సన్ కోరారు. కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా అర్హులకు ఒక్క కొత్త పింఛను కూడా మంజూరు కాలేదని సభ్యులు విమర్శించారు. ఈ నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించినప్పటికీ మార్గదర్శకాలు విడుదల కాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని సుభద్ర కోరారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ పి.నారాయణమూర్తి గత సమావేశ నిర్ణయాల అమలు పురోగతిని వివరించారు. డిప్యూటీ సీఈవో కె.రాజ్కుమార్ పాల్గొన్నారు. -
పోస్టుకు రూ.లక్ష
● ‘ఆశ’దోశ.. అప్పనంగా ఇచ్చేస్తామా..మహారాణిపేట: నగర పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన ‘ఆశ’ కార్యకర్తల నియామకాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. సేవా భావంతో పనిచేసే ఈ పోస్టులను కొందరు కూటమి నేతలు కాసుల కురిపించే కామధేనువుగా మార్చుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్హులైన పేద మహిళలకు దక్కాల్సిన ఉద్యోగాలను దొడ్డిదారిన విక్రయిస్తూ, నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి భారీ వసూళ్లకు తెరలేపారు. ఒక్కో పోస్టుకు లక్షలాది రూపాయల రేటు ఫిక్స్ చేసి, అర్హతలను పక్కనబెట్టి అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కూటమి పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. తెర వెనుక రాజకీయం నగర పరిధిలో ఖాళీగా ఉన్న 68 ఆశ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయగా, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే ఆశతో వందలాది మంది పేద, మధ్యతరగతి మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఎంతో ఆశతో ఇంటర్వ్యూలకు హాజరైనప్పటికీ, పారదర్శకంగా జరగాల్సిన ఈ ప్రక్రియ అంతా తెరవెనుక రాజకీయం అయిపోయింది. నిజమైన అర్హులను పక్కనబెట్టి, కూటమి నాయకులు చెప్పిన వారికే పోస్టులు కట్టబెట్టేలా ముందే స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా మొత్తం 68 పోస్టులకు గాను, ఇప్పటివరకు 51 పోస్టులను గుట్టుచప్పుడు కాకుండా అత్యంత రహస్యంగా భర్తీ చేసేశారు. ఎంపికై న వారి జాబితాను కూడా బహిరంగంగా ప్రదర్శించకపోవడంతో ఎవరికి ఏ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంటర్వ్యూలు కేవలం కంటితుడుపు చర్యగానే నిర్వహించారని, మిగిలిన 16 పోస్టుల భర్తీ కోసం కూడా ప్రభుత్వం అనుమతి కోరుతూ లేఖ రాయడం విశేషమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ గతంలోనే ప్రారంభం కావాల్సి ఉన్నా, అప్పట్లో జీవీఎంసీ కార్పొరేటర్ల జోక్యం, సిఫార్సుల పట్టుదల వల్ల ఆలస్యమైంది. అయితే ఇటీవల కార్పొరేటర్ల పదవీకాలం ముగిసిపోవడాన్ని కొందరు కూటమి నేతలు లూప్హోల్గా మార్చుకున్నారు. ప్రజాప్రతినిధులు లేని సమయాన్ని చూసి రంగంలోకి దిగిన నేతలు నియోజకవర్గాల, మండలాల, వార్డుల వారీగా పోస్టులను పంచుకున్నారు. తమ మధ్య గొడవలు రాకుండా ముందే వాటాలు వేసుకుని, రేట్లు ఖరారు చేసి బేరసారాలు సాగించి అమ్ముకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ కాసుల కక్కుర్తిలో అర్హులైన పేద మహిళల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది. వైద్యశాఖ మౌనం ఈ దొడ్డిదారి నియామకాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్తిగా మౌనం వహిస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగి వారు ఇచ్చిన లిస్టులనే ఫైనల్ చేస్తూ ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం వెనుక పెద్ద గూడుపుఠాణీయే ఉందని స్థానికులు మండిపడుతున్నారు. పారదర్శకత లేని ఈ నియామకాలను వెంటనే రద్దు చేసి ప్రతిభ, అర్హత, సీనియారిటీ ఆధారంగానే పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. దొడ్డిదారిన జరిగిన ఈ 51 పోస్టుల భర్తీపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి, అవినీతికి పాల్పడిన నేతలు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు, ప్రజా సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. -
వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి మహారాణిపేట : విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి సంస్థ కాల్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాల్ సెంటర్ పనితీరు, వినియోగదారుల నుంచి అందుతున్న ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యలను సమీక్షించారు. ఫిర్యాదుల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో ఏఈలు వ్యవహరిస్తున్న తీరును ప్రత్యేకంగా పరిశీలించారు. పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్న కొన్ని ఫిర్యాదులపై కాల్ సెంటర్ నుంచే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వివరణ కోరారు. కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్లు 24 గంటలూ అందుబాటులో ఉండి, కాల్ సెంటర్ నంబర్ 1912కు వచ్చే ప్రతి కాల్కు తప్పనిసరిగా స్పందించాలని ఆదేశించారు. అలాగే క్షేత్రస్థాయిలో ఏఈలు అందిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని, ఆలస్యం లేదా నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్లు వినియోగదారులతో మాట్లాడుతున్న తీరును సీఎండీ స్వయంగా పరిశీలించారు. పలువురు వినియోగదారులతో జరిగిన కాల్ రికార్డులను విని, మరింత మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ తనిఖీలో ఆపరేషన్స్ డైరెక్టర్ టి.వి. సూర్యప్రకాశ్, సీజీఎం పి. సోలమన్రాజు పాల్గొన్నారు. -
● అమర్నాథ్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు ● విజయమ్మ, భారతమ్మలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి ● ‘దళిత కార్డు’తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ● వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి ధ్వజం
సాక్షి, విశాఖపట్నం: హోం మంత్రి వంగలపూడి అనిత అధికార మదంతో హద్దులు దాటి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి విమర్శించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల, మహిళల భద్రతను గాలికొదిలేసి హోం మంత్రి అనిత తన బాధ్యతలను విస్మరించి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గుడివాడ అమర్నాథ్తో పాటు వైఎస్సార్సీపీ నేతలపై వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారని ఆరోపించారు. మాజీ మంత్రి అమర్నాథ్ను ‘వాడు, వీడు’ అంటూ ఏకవచనంతో సంబోధించడం ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు. అయితే గతంలో విజయమ్మ, భారతమ్మలతో పాటు జగన్పై కూడా అనిత గౌరవహీనంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. తమ పార్టీ నుంచి ప్రతిస్పందన వస్తే వెంటనే ‘దళిత కార్డు’ను ప్రయోగిస్తున్నారని, దళితుల కోసం పనిచేయని అనితకు అలా మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా ‘రెడ్బుక్ రాజ్యాంగం’ అమలవుతోందని విమర్శించారు. తునిలో బాలిక అదృశ్యమైన ఘటనలో కుటుంబాన్ని పరామర్శించలేదని, పాయకరావుపేటలో సీఐ పోస్టు ఖాళీగా ఉండటమే హోం శాఖ వైఫల్యానికి నిదర్శనమన్నారు. జగన్ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసిన దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు హోం మంత్రి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ పథకాల అమలులో విఫలమై, ‘సూపర్ హిట్’ సమావేశాలు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. మెగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ పోస్టు చేసిన వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించారని, డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
పీఎంవీబీఆర్వై అవగాహన సదస్సుకు ఏర్పాట్లు
మురళీనగర్: ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (పీఎంవీబీఆర్వై) ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈనెల 19న ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు విశాఖపట్నం ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అమర్దీప్ మిశ్రా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మంగళవారం ఈపీఎఫ్వో కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ అర్హులైన ఉద్యోగులు, యజమానులకు పీఎంవీబీఆర్వై కింద ప్రోత్సాహక ప్రయోజనాల విడుదల కోసం జాతీయ స్థాయి ప్రత్యేక కార్యక్రమాన్ని ఈనెల 19న విజ్ఞాన్ భవన్లో ప్రధాన మంత్రి అధ్యక్షతన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా సుమారు 200 పారిశ్రామిక క్లస్టర్లు, రాష్ట్ర రాజధానుల్లో సమాంతర కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ఇవన్నీ న్యూఢిల్లీలో జరిగే ప్రధాన కార్యక్రమంతో అనుసంధానించబడతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఈపీఎఫ్వో ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 19న సాగర్మాల కన్వెన్షన్ సెంటర్లో, అలాగే విజయనగరం ఈపీఎఫ్వో కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సమావేశ భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
వర్షాకాలం జాగ్రత్తలపై సమావేశం
తాటిచెట్లపాలెం: రాబోయే వర్షాకాలంలో రైల్వే అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్(జీఎం) సందీప్ మాధుర్ తన కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైల్వే ట్రాక్లపైకి, ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్లపైకి వచ్చే చెట్ల కొమ్మల తొలగింపు, కత్తిరింపు వంటి అంశాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయాల్లేకుండా చూసుకోవాలన్నారు. భద్రతపరమైన ఆధునికీకరణ పనులను త్వరితగతిన పూర్తిచేసి, తరచుగా ఫీల్డ్ సూపర్వైజర్స్ తనీఖీలు చేయాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో రైళ్ల రద్దీ, పలు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్, గుంటూరు డివిజన్లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు, ఆయా విభాగాల ప్రిన్సిపల్ హెడ్స్, అధికారులు పాల్గొన్నారు. -
కై లాసగిరిపై మరిన్ని నమూనాలు
ఆరిలోవ: OMð ÌêçÜ-W-ÇOò³ Mö™èl¢V> Ð]l$ǰ² ¯]lÐ]lÊ-¯é-ÌS¯]l$ HÆ>µr$ ^ólĶæ$-yé-°MìS çܯé²-àË$ ^ólçÜ$¢-¯]l²r$Ï ÒG…-B-ÆŠ‡yîlH O^ðlÆý‡Ã¯ŒS {ç³×æÐŒæ Vø´ëÌŒæ ™ðlÍ-´ëÆý‡$. OMð ÌêçÜ-W-ǰ Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… BĶæ$¯]l ÒG…-B-ÈŠీyýlzH A«¨-M>-Æý‡$-ÌS™ø MýSÌSíÜ çÜ…§ýlÇØ…^éÆý‡$. Csîæ-Ð]lÌS HÆ>µr$ ^ólíܯ]l {†Ô¶æ*ÌŒæ, V>Ï‹Ü {¼yìlj° ç³Ç-Ö-Í…^éÆý‡$. AMýSPyýl Ð]lÆý‡¢-MýS$ÌS™ø Ð]l*sêÏyìl ÐéÇ çÜÐ]l$-çÜÅË$ ™ðlË$-çÜ$-Mö-¯é²Æý‡$. A¯]l…-™èlÆý‡… BĶæ$¯]l Ð]l*sêÏ-yýl$™èl* {ç³ç³…^èl Ýë¦Æ‡$$ ç³Æ>Å-rMýS MóS…{§ýl…V> OMð ÌêçÜ-Wǰ ¡Ça-¨-§ýlª-yé-°MìS MýS–íÙ fÆý‡$-VýS$™èl$…-§ýl-¯é²Æý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ A§ýl-¯]lç³# MýSÑ$-çÙ-¯]lÆŠ‡ §érÏ MîSÇ¢, ÐøG-‹Üyîl MýS–çÙ~-¯é-Ķæ$MŠS, M>Æý‡Å-§ýlÇØ Ð]l¬Æý‡ä MýS–çÙ~, ™èl¨-™èlÆý‡$Ë$ ´ëÌŸY¯é²Æý‡$. -
‘శాంతి భద్రతల వైఫల్యంపై హోం మంత్రి పచ్చి అబద్ధాలు’
సాక్షి, విశాఖపట్నం: కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఖాకీ దుస్తులను ఎల్లో యూనిఫామ్గా మార్చేశారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో నిత్యం 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. క్రైమ్ రేట్ తగ్గిందంటూ హోంమంత్రి అనిత అధికారుల సమక్షంలో పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని తేల్చి చెప్పారు. చట్టాల అమల్లో ఏపీ దేశంలోనే 36వ స్థానానికి పడిపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేత చీవాట్లు తిన్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ హోంమంత్రి తన సంస్కారహీన భాషను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.ఇప్పటికైనా తిట్ల పురాణం మానేసి.. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, లైంగిక వేధింపుల నిందితుడు ఆదిమూలం, గర్భస్రావానికి కారణమైన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్లను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏ రాష్ట్రంలోనైనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం పోలీసుల విధి. కానీ ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వ 'రెడ్ బుక్ రాజ్యాంగాన్ని' అమలు చేయడానికి పోలీసులను వాడుకుంటున్నారు. పోలీసుల ఖాకీ దుస్తులను 'ఎల్లో యూనిఫామ్'గా మార్చిన ఘనత చంద్రబాబుదే. ఐపీఎస్ (IPS) కాస్తా కూటమి పాలనలో 'ఇండియన్ పొలిటికల్ పనిష్మెంట్ సర్వీస్' గా.. ఏపీపీఎస్ (APPS) కాస్తా 'ఏపీ పొలిటికల్ రివేంజ్ సర్వీస్' గా మారిపోయాయి.దేశవ్యాప్తంగా కేంద్రం తెచ్చిన 'బీఎన్ఎస్' చట్టాలను ప్రజల కోసం వాడుతుంటే, ఏపీలో మాత్రం వాటిని నిర్వీర్యం చేసి 'బాబు రాజకీయ న్యాయసంహిత చట్టాలు' గా మార్చివేశారు. పోలీసు బెల్టుపై ఉండే మూడు సింహాలు న్యాయం, చట్టం, నీతికి ప్రతీకలు. కానీ నేడు ఆ మూడు సింహాలను మూడు కూటమి పార్టీలకు తొత్తులుగా, కీలుబొమ్మలుగా మార్చేశారు.కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు.. పోలీసుల పక్షపాతంసాక్షాత్తూ పోలీసుల సమక్షంలోనే ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా హోం శాఖ చేష్టలుడిగి చూస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు నడిబొడ్డున పోలీసుల ముందే టీడీపీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఇంటిపై జేసీబీతో హత్యాయత్నానికి దిగితే.. దౌర్జన్యకారుడిని వదిలేసి బాధితుడిపైనే పోలీసులు కేసులు పెట్టడం దుర్మార్గం. గతంలో ఎమ్మెల్యే గల్లా మాధవి .. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై పోలీసుల ముందే దాడి చేసి, ఆస్తులు తగలబెడితే.. తిరిగి అంబటి రాంబాబుపైనే కేసులు పెట్టారు తప్ప ఎమ్మెల్యే దంపతులపై చర్యలు లేవు.మరో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులతో దాడి చేసి ఇల్లు తగలబెట్టారు. ఈ చర్యలు చూస్తుంటే పోలీసులు అరాచక శక్తులకు అండగా ఉంటున్నారనేది స్పష్టమవుతోంది. ఎన్నికల్లో పోలీసులకు డీఏ, వీక్లీ ఆఫ్, ఐఆర్, పీఆర్సీ, సరండర్ లీవ్స్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ ఎగ్గొట్టి పోలీసులకే వెన్నుపోటు పొడిచారు.కేంద్ర హోంమంత్రి చీవాట్లు.. దేశంలోనే ఏపీ పోలీస్ ఆఖరి ర్యాంక్హోంమంత్రి అనిత, రాష్ట్ర పోలీస్ శాఖ పనితీరు వైఫల్యాలు జాతీయ స్థాయిలో బయటపడ్డాయి. ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చీవాట్లు పెట్టిన మాట వాస్తవం కాదా? దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ కాల్ సెంటర్ (112) రెస్పాండ్ టైమ్ 18 నిమిషాలు ఉంటే, ఏపీలో అది 26 నిమిషాలు ఎందుకుంది? ప్రజలు రక్షించమని ఫోన్ చేస్తే 26 నిమిషాల దాకా పట్టించుకోని వ్యవస్థను పెట్టుకుని హోంమంత్రి అవార్డులు వచ్చాయని ఎలా చెప్పుకుంటారు? కొత్త చట్టాలైన బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్ అమల్లో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఏపీకి 36వ (చిట్టచివరి) ర్యాంకు వచ్చింది. ఇది కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు.ప్రభుత్వ సర్వేలోనే అట్టడుగు:కూటమి ప్రభుత్వం స్వయంగా చేసిన ఐవీఆర్ఎస్ (IVRS) సర్వేలోనే రాష్ట్రంలోని 21 జిల్లాల్లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తేలింది. అందుకే ఈ రాష్ట్రంలో 'HM' అంటే హోం మంత్రి కాదు.. 'హెరాస్ మెంట్ మంత్రి' (Harassment Minister) లేదా హెడ్ స్ట్రాంగ్ మంత్రి' అని పిలుస్తున్నారు.ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే.. దానికి సమాధానం చెప్పలేక హోంమంత్రి అనిత వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమన్నారు. ఒక మాజీ మంత్రిని పట్టుకుని ‘వాడు, వీడు, ఎవడు వీడు’ అంటూ నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో తూలనాడటం ఆమె సంస్కారహీనతకు నిదర్శనమన్నారు. "గతంలో ఉపాధ్యాయురాలిగా ఉన్న అనిత గారు.. ఆరోజు పిల్లలకు నేర్పించిన సంస్కారం ఇదేనా?"గతంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ని ఏకవచనంతో పిలవడం, టీడీపీ ఆఫీసు వేదికగా గౌరవనీయులైన వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మలపై అత్యంత హేయమైన పదజాలం వాడటం అనితకే చెల్లింది. మేము కూడా అదే భాషలో మాట్లాడగలం, కానీ వైఎస్సార్సీపీ సంస్కారం తమకు అడ్డువస్తోంది. ఎవరినైనా నోటికొచ్చినట్లు తిట్టి.. ఎవరైనా తిరిగి ప్రశ్నిస్తే 'మహిళా ట్యాగ్'ను తెరపైకి తెచ్చి రాజకీయం చేయడం అనితకు అలవాటుగా మారింది, ఆమె ప్రవర్తన చూసి టీడీపీలోని మహిళలే అసహ్యించుకుంటున్నారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు..మహిళా హోంమంత్రిగా ఉండి కూడా రాష్ట్రంలో మహిళల రక్షణను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రంలో రోజుకు కనీసం 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ముగ్గురు-నలుగురు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. హోంమంత్రి పక్క నియోజకవర్గంలో 10 రోజుల క్రితం చిన్నపాప కనిపించకుండా పోతే ఆ తల్లి బాధను పట్టించుకున్న నాథుడే లేడు. ఎలమంచిలి రాంబల్లిలో మైనర్ బాలిక గొంతు కోసి చంపేస్తే ఆ కుటుంబానికి బాధ్యత గల హోంమంత్రి ఎందుకు ధైర్యం చెప్పలేదు? కాపు యువకుడిని లాకప్ డెత్ చేస్తే సదరు సీఐ, పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారు? గంజాయిని నిర్మూలించామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. గంజాయి డాన్ సోహైల్ పోలీసుల నుంచే తప్పించుకున్నాడు. నిందితుడి గురించి మీడియా అడిగితే హోంమంత్రి తెల్లమొహం వేసుకుని అధికారుల వైపు చూడటం ఆమె అసమర్థతకు నిదర్శనం.పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలకు సూటి ప్రశ్నలుహోంమంత్రికి మద్దతుగా మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మాజీ మంత్రి పీతల సుజాత, ఎంపీ బైరెడ్డి శబరిలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. హోంమంత్రి అనిత అత్యంత అసభ్యంగా, రెచ్చిపోయి ప్రతిపక్షాల మీద దిగజారుడు వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఆమెకు ఎందుకు గడ్డిపెట్టలేదు? ఒక ముఖ్యమంత్రి తల్లిని, భార్యని అత్యంత నీచమైన పదజాలం వాడినప్పుడు ఆమెతో ఎందుకు క్షమాపణ చెప్పించలేదు? ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు? మీరు తప్పు చేసి మా పార్టీ మీద తిరిగి నిందలు వేయడం ఎంతవరకు సమంజసం? ప్రజలు ఇవన్నీ గమనించరు అని మీరు అనుకుంటున్నారా? మీ పార్టీ నేత బండారు సత్యనారాయణ మాజీ మంత్రి రోజాపై అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు. ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదు. మీకు బాధ్యత లేదా? ఇక డిప్యూటీ సీఎం ట్వీట్ చేస్తూ హోంమంత్రి గారి మీద వ్యాఖ్యలపై స్పందించారు. సభ్యత, సంస్కారం గురించి మాట్లాడుతున్న మీరు మీ తల్లిని తిట్టిని టీడీపీ నేతలకు సభ్యత, సంస్కారం నేర్పించరా?ఆ రోజు బండారు సత్యనారాయణ మాజీ మంత్రి రోజాపై అసభ్య వ్యాఖ్యలు చేసి పవన్ కళ్యాణ్ను హోటల్లో కలిస్తే.. పవన్ తనను అభినందించారని బండారు స్వయంగా చెప్పుకున్నారు. తోటి కళాకారిణిపై అంత అసహ్యంగా మాట్లాడితే మెచ్చుకోవడం పవన్ కళ్యాణ్ సంస్కారమా? ప్రతిపక్ష మహిళలపై దాడులు జరిగినప్పుడు మీ సంస్కారం ఎక్కడికి పోయింది. ఒక మహిళకు నలుగురైదుగురు సార్లు అబార్షన్ చేయించిన మీ కూటమి ఎమ్మెల్యేపై కనీస చర్యలు ఎందుకు తీసుకోలేదు? సోషల్ మీడియాలో మహిళలను అసభ్యంగా తిడుతూ పోస్టులు పెట్టే సంస్థ 'ఐటీడీపీ' (iTDP) మీ ఆఫీస్ నుంచే నడుస్తోంది కదా.. దానికి సభ్యత నేర్పరా?సీఎం బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ "ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి" అని అసహ్యంగా మాట్లాడితే.. చంద్రబాబు నాయుడు "కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా" అని ఆడబిడ్డ పుట్టుకను అవమానిస్తే.. వారికి పవన్ కళ్యాణ్ సభ్యత, సంస్కారం నేర్పించరా? కూటమిలోని మహిళలకు ఒక న్యాయం, ఎదుటి పార్టీ మహిళలకు మరొక న్యాయమా? ఒక్క మాట పొరపాటుగా మాట్లాడితే మా సీఎం మందలిస్తారని హోంమంత్రి చెబుతున్నారు... మరి విజయమ్మ, భారతమ్మలను దూషించినప్పుడు చంద్రబాబు ఎందుకు మందలించలేదు?.లీగల్ సెల్ నేత ఇంటిపై జేసీబీతో దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను తక్షణమే అరెస్ట్ చేయాలి. కాపు యువకుడిని లాకప్ డెత్ చేసిన పోలీస్ అధికారి (CI)ని వెంటనే అరెస్ట్ చేయాలి. మహిళలను లైంగికంగా వేధించిన కూటమి నేత ఆదిమూలం, మహిళను వేధించి గర్భస్రావం చేయించిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్లను వెంటనే జైలుకు పంపాలి. మహిళా వీఆర్వోను వేధించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, మహిళను వేధించిన సంధ్యారాణి పీఏలను తక్షణమే అరెస్ట్ చేయాలి.హోంమంత్రి అనిత ఇప్పటికైనా తిట్ల పురాణం మానేసి శాంతిభద్రతల అమలుపై, మహిళా రక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. లేనిపక్షంలో పాలనలో విఫలమైన అసమర్థ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, విఫల హోంమంత్రిగా అనిత చరిత్రలో మిగిలిపోతారని, ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హెచ్చరించారు. -
ముస్సోరీలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి
ముస్సోరీ: ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హోమ్స్టేలో ఢిల్లీకి చెందిన ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని పి.రాధా గాయత్రి(27)గా గుర్తించారు. ప్రస్తుతం ఆమె గురుగ్రామ్లోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తూ.. ఢిల్లీలోని కిద్వాయ్ నగర్ ఈస్ట్లో నివసిస్తున్నారు. ఆమె తన భర్త సౌమ్య శ్రీచరణ్తో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఆయన కూడా పూణేలో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయత్రి, ఆమె భర్త జూన్ 13న ఢిల్లీ నుండి రిషికేష్కు ప్రయాణమై.. మరుసటి రోజు (జూన్ 14) అర్ధరాత్రి దాటిన తర్వాత టిప్రి ధార్లోని 'కియానా హోమ్స్టే'కు చేరుకున్నారు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో వారు 'బ్లిస్' అనే పేరున్న గదిలోకి చెక్-ఇన్ అయ్యారు. భర్త తెలిపిన వివరాల ప్రకారం.. ఆ రాత్రి వారిద్దరూ మద్యం సేవించి.. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నిద్రపోయారు. ఉదయం ఆయన నిద్ర లేచేసరికి.. భర్తకు తన భార్య దుస్తులు లేకుండా.. స్పృహ లేకుండా నేలపై పడి ఉండటం కనిపించింది. ఆమె చుట్టూ మూత్రం, ముక్కు నుండి రక్తం కారుతూ ఉందని తెలిపాడు.రూమ్లో ఓ మహిళ స్పృహ లేకుండా పడి ఉందనే సమాచారం సోమవారం ఉదయం ముస్సోరీ పోలీసులకు అందడంతో వారు 108 అంబులెన్స్తో సహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్కు చెందిన ఫార్మసిస్ట్ ఆమెను పరీక్షించి.. ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. వీరికి 2025 నవంబర్ 8న వివాహం జరిగింది. గాయత్రి, శ్రీచరణ్ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందినవారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం పరీక్ష నిమిత్తం డెహ్రాడూన్లోని ఆసుపత్రికి తరలించారు. -
రూ.100 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాపై టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు
మహారాణిపేట (విశాఖపట్నం): పెందుర్తి మండలం, పెందుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నం.107/11లో ఉన్న పెద్దన్న చెరువు ప్రభుత్వ భూమి 8.08 ఎకరాలుని ఆక్రమణదారుల నుంచి పరిరక్షించాలని మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కోరారు. ఈ మేరకు విశాఖపట్నం జాయింట్ కలెక్టర్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. గతంలో ఈ భూమి ఆక్రమణకు జరిగిన ప్రయత్నాలు, అధికారులు చేపట్టిన చర్యలను వివరించారు.అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడుతూ... సర్వే నం.107/11లో ఉన్న 8.08 ఎకరాల పెద్దన్న చెరువు భూమిని పెందుర్తి నియోజకవర్గం టీడీపీ నాయకులే ఆక్రమించారని పరోక్షంగా ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, అతని అనుచరులపై ఆరోపణ చేశారు. వారు ఈ భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. బినామీలను సృష్టించి రూ.100 కోట్ల భూమి కబ్జా లేని రైతులను సృష్టించి బినామీ పేర్లతో రిజి్రస్టేషన్ చేశారని బండారు ఆరోపించారు. గతంలో పెద్దన్న చెరువు అన్యాక్రాంతంపై తాను ఫిర్యాదు చేశానని, అప్పటి కలెక్టర్ శ్యామలరావు విచారణ జరిపి రిజి్రస్టేషన్ను రద్దు చేసి భూమిని ప్రభుత్వ ఆ«దీనంలోకి తీసుకున్నారని గుర్తు చేశారు. మళ్లీ గత రెండు నెలలు నుంచి ఆక్రమణదారులు మరలా చెరువులో పనులు మొదలుపెట్టారని, అధికార టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి చెరువుని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. వామపక్షాల నాయకులు కూడా ఇటీవల చెరువును పరిశీలించి అధికార పార్టీ నాయకులు చెరువును కబ్జా చేస్తున్నారని ఆరోపించారని గుర్తు చేశారు. బినామీ రైతులను సృష్టించి రూ.100 కోట్లు విలువైన భూమిని కొట్టేయాలని చూస్తున్నారని, పరిరక్షించాలని అధికారులను కోరినట్టు బండారు తెలిపారు. -
కలెక్టరేట్ సాక్షిగా ఆకలి కేకలు
మహారాణిపేట: వైద్య, విద్యా రంగాల్లో కీలకమైన సేవలందిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత అగమ్యగోచరంగా మారింది. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో వారి కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఉద్యోగులు అధికారులకు మొరపెట్టుకున్నారు. కేజీహెచ్, ఏఎంసీ సిబ్బంది ఆవేదన కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కాలేజీలలో జనరల్ రిక్రూట్మెంట్ల ద్వారా ఎంపికై , 13 నెలలుగా వివిధ కేటగిరిల్లో విధులు నిర్వహిస్తున్న 36 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా జీతం అందలేదు. ఎనిమిది నెలలకు పైగా ఇల్లు గడవడమే కష్టంగా మారడంతో, జీతాలు వస్తాయనే ఆశతోనే ఇంతకాలం విధులు నిర్వహించినట్లు ఉద్యోగులు వాపోయారు. ఈ సమస్యపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయడం ఇది మూడోసారి అయినప్పటికీ, అధికారులు ఎలాంటి స్పందన చూపకపోగా కొందరు అసహనం ప్రదర్శించారని ఉద్యోగులు ఆరోపించారు. ఇన్చార్జ్ మంత్రి, కలెక్టర్ నుంచి అనుమతులు వచ్చినా కొందరు అధికారులు ఫైల్ను ముందుకు కదపకుండా తొక్కిపెట్టడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 6 నెలలుగా జీతాల్లేవు: మరోవైపు డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ గురుకులాల్లో పనిచేస్తున్న దాదాపు 20 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా గత 6 నెలలుగా జీతాలు అందడం లేదు. జీతాలు లేక ఇబ్బంది పడుతున్నా.. బయటకు చెబితే ఎక్కడ ఉద్యోగాలు ఊడిపోతాయో అన్న భయంతో సిబ్బంది కాలం వెళ్లదీస్తున్నారు. చివరకు సహనం నశించి, ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. గణేష్ నేతృత్వంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ నేత గణేష్ మాట్లాడుతూ.. ఆకలితో అలమటిస్తున్న ఉద్యోగుల సమస్యను కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని, తక్షణమే బకాయి జీతాలు విడుదలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. -
వినతులకు నాణ్యమైన పరిష్కారం
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందే వినతులపై సమగ్ర విచారణ జరిపి, సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంక్లిష్టమైన ఫిర్యాదులను అధికారులు స్వయంగా పరిశీలించి నివేదికలను పోర్టల్లో అప్లోడ్ చేయాలని, బాధ్యత నుంచి తప్పుకోవద్దని స్పష్టం చేశారు. ప్రజల నుంచి మొత్తం 325 వినతులు రాగా.. వాటిలో రెవెన్యూ శాఖవి 104, జీవీఎంసీవి 68, పోలీసు శాఖవి 34, ఇతర శాఖలవి 119 ఉన్నాయి. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇన్చార్జ్ డీఆర్వో గోవిందు, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్, ఏడీసీ సత్యవేణి తదితరులు వినతులు స్వీకరించారు. జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 115 వినతులు డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి మొత్తం 115 వినతులు అందాయి. జీవీఎంసీ అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్ఎస్ వర్మలతో కలిసి కమిషనర్ కేతన్గార్గ్ అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన వినతులలో పట్టణ ప్రణాళికా విభాగానికి అత్యధికంగా 49 వినతులు రాగా.. ఇంజనీరింగ్ సెక్షన్కు 28, రెవెన్యూ సెక్షన్కు 21, ప్రజారోగ్య విభాగానికి 8 , ఇతర విభాగాలకు మరో 9 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.నల్లనయ్య, జాయింట్ డైరక్టర్ డి.విజయభారతి, ప్రధాన ఇంజనీర్ పీవీవీ సత్యనారాయణరాజు, కార్యదర్శి రమణ తదితర అధికారులు పాల్గొన్నారు. -
హోంమంత్రి పదవికి అనిత అనర్హురాలు
మహారాణిపేట: రాష్ట్ర హోంమంత్రి పదవిని నిర్వహించడానికి వంగలపూడి అనిత ఏమాత్రం అర్హురాలు కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నేతలు పల్లా చినతల్లి, శ్రీదేవివర్మ ధ్వజమెత్తారు. సోమవారం మద్దిలపాలెంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అనిత హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మహిళల భద్రత, శాంతిభద్రతలను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. సొంత నియోజకవర్గంలోనే భద్రత శూన్యం : హోంమంత్రి అనిత తన సొంత నియోజకవర్గంలోనే శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారని ఆరోపించారు. అక్కడ జ్ఞానేశ్వరి అనే మూడేళ్ల చిన్నారి కనిపించకుండా పోయి 10 రోజులు దాటినా ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మహిళల పట్ల గౌరవం అనేది కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని హితవుపలికారు. గుడివాడపై వ్యాఖ్యలు దారుణం: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై హోంమంత్రి అనిత బాధ్యతారాహిత్యంగా, అనుచిత విమర్శలు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన హోంమంత్రి పదవిని కాపాడుకోవడం కోసమే ఆమె ఇటువంటి చౌకబారు విమర్శలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ అమర్నాథ్ కుటుంబానికి విశాఖ జిల్లాలో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉందని గుర్తు చేశారు. అటువంటి కుటుంబ నేపథ్యం ఉన్న నేతను అవమానించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమన్నారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే.. రాష్ట్రంలో నిరుద్యోగం, నిత్యావసర ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, మహిళలకు భద్రత లేకపో వడం, సంక్షేమ పథకాల వైఫల్యాలు వంటి అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కూటమి ప్రభుత్వం, హోంమంత్రి అనిత వైఎస్సార్సీపీ నేతలపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నా రని విమర్శించారు. అమర్నాథ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను హోంమంత్రి అనిత వెంటనే ఉపసంహరించుకుని, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పా లని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జియ్యాని వెంకట సత్య, జిల్లా అంగన్వాడీ విభాగం ఉపాధ్యక్షురాలు ఇప్పిలి పార్వతి పాల్గొన్నారు. -
బే సిటీ అభివృద్ధి పనులను వేగవంతం చేయండి
మహారాణిపేట: ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతిపాదిత బే సిటీ అభివృద్ధి పనులను, ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయాన్ని కేంద్రంగా చేసుకుని దాదాపు 49 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ బే సిటీ అభివృద్ధి, బే సిటీ అథారిటీ ఏర్పాటు, మౌలిక సదుపాయాలు, గ్రీన్ కారిడార్లు, పర్యాటకాభివృద్ధిపై సోమవారం కలెక్టరేట్లో ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. జీవీఎంసీ పరిధిలోని సరిహద్దుల నిర్ధారణను వేగవంతం చేయాలని, పర్యావరణ ప్రాంతాలైన ఇందిరా గాంధీ జూ పార్క్, కంబాలకొండల్లో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, జేసీ గొబ్బిళ్ల విద్యాధరి తదితరులు పాల్గొన్నారు. -
కాంక్రీట్ పరిశోధనల్లో ఇన్స్వారెబ్కు గుర్తింపు
అల్లిపురం: న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాల్లో రేడియేషన్ ప్రభావంతో దెబ్బతింటున్న కాంక్రీట్ నిర్మాణాలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా విశాఖకు చెందిన ఇన్స్వారెబ్ సంస్థ చేపట్టిన పరిశోధనలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయని ఫౌండర్ డైరెక్టర్లు భానుమతి, కాళిదాసు తెలిపారు. సోమవారం వారు విశాఖలో మీడియా తో మాట్లాడారు. ఫ్లైయాష్, ఖనిజ వ్యర్థాలు, పారిశ్రామిక ఉప ఉత్పత్తుల్లోని ఎమార్ఫస్లను వినియోగించడం ద్వారా కాంక్రీట్ మన్నికను పెంచే అంశంపై నాలుగు దశాబ్దాలుగా పరిశోధనలు చేసి.. వినూత్న విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు. దీని ద్వారా కాంక్రీట్ బలం, సాంద్రత, మన్నిక పెరగడంతో పాటు రేడియేషన్ నిరోధకత కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తమ పరిశోధనలను తదుపరి దశకు తీసుకెళ్లేందుకు అమెరికాలోని ఇదాహో నేషనల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. -
జీవీఎంసీలో మళ్లీ సైక్లింగ్ డే..
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో ప్రతి సోమవారం సైక్లింగ్ డేని స్వచ్ఛందంగా ఆచరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం తన అధికారిక నివాసం నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి సైకిల్పై వచ్చారు. ఆయనతో పాటు జీవీఎంసీ సిబ్బంది కూడా సైకిళ్లపైనే కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ప్రతి సోమవారం సైక్లింగ్ డేగా ఆచరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
నేడు గోల్ఫ్ క్లబ్లో యోగా వేడుకలు
మహారాణిపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ముడసర్లోవలోని ఈస్ట్ పాయింట్ కాలనీలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో నిర్వహిస్తున్న యోగా వేడుకలను విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా థీమ్కు అనుగుణంగా కార్యక్రమ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు, పాల్గొనే వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. యోగా కార్యక్రమం సజావుగా జరిగేలా సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు తీసుకుని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ డీఆర్వో గోవింద్, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
భోగాపురం భూములపై సమగ్ర విచారణ జరపాలి
డాబాగార్డెన్స్: భోగాపురం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో డీపట్టా, ప్రభుత్వ భూముల విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు, నేషనల్ దళిత్ జేఏసీ జాతీయ అధ్యక్షుడు జాన్ మాస్కు తెలిపారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన సూరెడ్డి త్రిలోక్ 2009లో హైదరాబాద్ నుంచి భోగాపురం ప్రాంతానికి వచ్చి రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ప్రారంభించినట్టు చెప్పారు. భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల, విజయనగరంలో పెద్దఎత్తున భూములు సేకరించినట్టు తెలిపారు. డీపట్టా భూములు భవిష్యత్లో ప్రైవేట్ భూములుగా మారే అవకాశాన్ని ముందుగానే గుర్తించి రైతులకు అడ్వాన్స్లు చెల్లించి వందల ఎకరాల భూములపై ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతో అసైన్డ్ భూములకు ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లు పొందినట్టు, ఈ ప్రక్రియలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. భోగాపురం పరిసర ప్రాంతాల్లో జారీ చేసిన ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లపై ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు, అధికారుల హస్తం ఉందని ఆరోపించారు. నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్ మాస్కు -
సర్ షురూ..!
మహారాణిపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం జిల్లాలో అధికారికంగా ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చేపట్టారు. సోమవారం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. తొలి రోజు బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి సుమారు 21 వేల ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేశారు. వివరాలు నింపిన తర్వాత కొద్ది రోజుల వ్యవధిలో వాటిని తిరిగి సేకరించనున్నారు. 1,980 మంది బీఎల్వోల నియామకం జిల్లాలో ఉన్న 20,23,009 మంది ఓటర్ల ఇళ్లకు ఈ ఫారాలను సకాలంలో చేరవేయడానికి ఎన్నికల యంత్రాంగం 1,980 మంది బీఎల్వోలను నియమించింది. పోలింగ్ స్టేషన్ల వారీగా కేటాయించిన ఇళ్లకు బీఎల్వోలు స్వయంగా వెళ్తున్నారు. వీరితో పాటు గుర్తింపు పొందిన ఎనిమిది రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) కూడా కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. ప్రతి పార్టీ నుంచి ఒక ప్రతినిధి పోలింగ్ స్టేషన్ పరిధిలో పర్యటించి, ఫారాలను భర్తీ చేయడంలో ఓటర్లకు అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు వీలు కల్పించారు. మూడు సార్లు పర్యటన.. ఈ సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్వోలు ప్రతి ఇంటికి రెండు ప్రతులు కలిగిన ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేస్తారు. ఫారం ఎలా నింపాలో ఓటరుకు వివరించి, పూర్తి చేసిన తర్వాత తిరిగి వాటిని సేకరిస్తారు. నింపిన రెండు ఫారాల్లో ఒకదాన్ని బీఎల్వో తన వద్ద ఉంచుకుని, రెండో దాన్ని ఓటరుకు రశీదుగా తిరిగి ఇస్తారు. బీఎల్వోలు వెళ్లిన సమయంలో ఇళ్లకు తాళాలు వేసి ఉంటే, ఎన్యూమరేషన్ ఫారాన్ని అక్కడే ఉంచి వస్తారు. ఆ తర్వాత కూడా మరో రెండు సార్లు ఆ ఇంటిని సందర్శించి వివరాలు సేకరించేలా ప్రణాళిక రూపొందించారు. ఒకవేళ నేరుగా వీలుకాకపోతే, ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసిన తర్వాత తిరిగి యాప్లో అప్లోడ్ చేసి బీఎల్వోకు అందించే డిజిటల్ వెసులుబాటును కూడా కల్పించారు. ఓటరు సవరణ షెడ్యూల్ ఈ సవరణ కార్యక్రమానికి సంబంధించి ఎన్నికల సంఘం ఒక స్పష్టమైన కాలపరిమితిని నిర్ణయించింది. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితాలను విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి ఆగస్టు 20 వరకు ముసాయిదా ఓటరు జాబితాలపై అభ్యంతరాల స్వీకరణతో పాటు కొత్తగా పేరు నమోదు చేసుకునేందుకు అవసరమైన దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ విధంగా వచ్చిన దరఖాస్తులను సెప్టెంబర్ 18 లోగా పరిష్కరిస్తారు. ఆ తర్వాత సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. ఇంకా 6.32 లక్షల మందికి మ్యాపింగ్ జిల్లాలోని మొత్తం ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా మ్యాపింగ్ ప్రక్రియ సాగుతోంది. జిల్లాలో ఉన్న మొత్తం 20.23 లక్షల మంది ఓటర్లలో ఇప్పటివరకు 13,90,310 మందికి (68.72 శాతం) మ్యాపింగ్ పూర్తయింది. ఇంకా 31.28 శాతం అంటే దాదాపు 6,32,699 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి కావాల్సి ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ‘ఫారం–2’ భర్తీపై అవగాహన అవసరం ఈ సవరణ ప్రక్రియలో ప్రతి ఓటరు విధిగా ఎన్యూమరేషన్ ‘ఫారం–2’ను పూరించి ఎన్నికల కమిషన్కు సమర్పించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలను క్షేత్రస్థాయిలో బీఎల్వోలకు అప్పగించారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరక్షరాస్యులు, పనుల నిమిత్తం ఉదయాన్నే బయటకు వెళ్లే సామాన్యులకు ఈ ఫారాల్లోని సాంకేతిక వివరాలు పూర్తి చేయడంపై మరింత అవగాహన కల్పించాల్సి ఉంది. అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఓటర్లకు అవగాహన కల్పిస్తే, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు భద్రంగా ఉండేందుకు వీలవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
సర్
ఓటరుకుపరీక్షమహారాణిపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ఓటర్లలోనూ ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు రాజకీయ పార్టీలు తమ ఓటర్లు జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తమవుతుండగా, మరోవైపు ఈ ప్రక్రియపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రచారం పరిమితంగానే ఉండటంతో, అనేక మంది ఓటర్లు నిర్లక్ష్యం చేస్తే ఓటరు జాబితాలో పేర్లు కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2002 ప్రాతిపదిక ఓటరు జాబితాలను ఆధారంగా తీసుకుని సమగ్ర సవరణ చేపట్టనున్నారు. ఓటరు జాబితా రూపకల్పన, కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జూన్ 15 నుంచి జులై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, నింపిన వివరాలను తిరిగి సేకరిస్తారు. నేటి నుంచి ఇంటింటికీ బీఎల్వోలు సోమవారం నుంచి జులై 14 వరకు బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను సిద్ధం చేసింది. ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం–2ను రెండు ప్రతుల్లో అందజేస్తారు. ఫారం ఎలా నింపాలో బీఎల్వోలు వివరించి, నింపిన ఫారాన్ని తిరిగి స్వీకరిస్తారు. రెండు ప్రతుల్లో ఒకదాన్ని బీఎల్వో తీసుకుని, మరొకదాన్ని రశీదుగా ఓటరికి అందజేస్తారు. బీఎల్వో వెళ్లిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉంటే ఫారాన్ని అక్కడే ఉంచుతారు. అనంతరం మూడుసార్లు వరకు తిరిగి సందర్శించి నింపిన ఫారాన్ని సేకరిస్తారు. అవసరమైతే ఫారాన్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని నింపి అప్లోడ్ చేయడంతో పాటు బీఎల్వోకు కూడా అందజేయవచ్చు. జూలై 21న ముసాయిదా జాబితా జూలై 21న ముసాయిదా ఓటరు జాబితాలను విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, సవరణలు, కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరిస్తారు. అందిన దరఖాస్తులను సెప్టెంబర్ 18లోపు పరిశీలించి పరిష్కరిస్తారు. ముసాయిదా జాబితా విడుదల అనంతరం వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నవారికి లేదా అనుసంధానం కాని వ్యక్తులకు ఓటరు నమోదు అధికారి నోటీసులు జారీ చేస్తారు. సంబంధిత వ్యక్తులకు వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. మ్యాపింగ్ పూర్తికాకపోతే ఇబ్బందులు ప్రతి ఓటరు వివరాలు మ్యాపింగ్ కావాల్సి ఉంటుంది. మ్యాపింగ్ పూర్తి కాని వారు సంబంధిత బీఎల్వోను సంప్రదించి తమ వివరాలను నమోదు చేయించుకోవాలి. అనంతరం బీఎల్వో ఇచ్చే ఫారాన్ని పూర్తిగా నింపి తిరిగి సమర్పించాలి. జిల్లాలో ప్రస్తుతం 20,23,009 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 12,76,527 మంది (63.10 శాతం) మ్యాపింగ్ పూర్తిచేసుకున్నారు. ఇంకా 7,46,482 మంది (37.90 శాతం) మ్యాపింగ్ కావాల్సి ఉంది. మ్యాపింగ్ పూర్తి కాని ఓటర్ల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఓటర్ల తొలగింపుపైనా చర్చ సర్ ప్రక్రియలో భాగంగా చనిపోయిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉన్నవారు, చిరునామా మారిన వారు లేదా గుర్తించలేని ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించనున్నారు. అయితే ఈ ప్రక్రియలో పొరపాట్లు జరిగితే అర్హులైన సజీవ ఓటర్ల పేర్లు కూడా తొలగిపోయే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత జాబితాలో కనీసం 10 శాతం వరకు ఓట్లపై ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 20,22,581 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల ప్రతి ఓటరు తమ వివరాలు సక్రమంగా నమోదు అయ్యాయో లేదో నిర్ధారించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఫారం–2 నింపడం సవాలే సర్ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం–2ను పూరించి సమర్పించాల్సి ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు, కూలీ పనులకు వెళ్లే కార్మికులు, వృద్ధులకు ఈ ప్రక్రియ కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. సమయానికి ఫారం అందకపోవడం, సరైన సమాచారం నింపకపోవడం లేదా బీఎల్వోను సంప్రదించకపోవడం వల్ల అర్హులైన ఓటర్ల పేర్లు కూడా జాబితా నుంచి తప్పిపోయే ప్రమాదం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ మొత్తం పోలింగ్ స్టేషన్లు మ్యాపింగ్. పూర్తి ఇంకా పెండింగ్ భీమిలి 3,67,486 361 2,42,954 1,24,532 తూర్పు 2,92,227 282 1,91,522 1,00,705 దక్షిణ 2,17,795 236 1,62,104 55,691 ఉత్తర 2,84,341 272 1,96,346 87,995 పశ్చిమ 2,13,890 221 1,37,239 76,651 గాజువాక 3,34,768 309 2,45,132 89,636 పెందుర్తి 3,12,502 299 2,15,013 97,489 -
100 మంది రక్తదానం
మధురవాడ: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవళ్లినగర్లోని హజరత్ ముఖ్తియార్ ఆలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అపోలో హాస్పిటల్, రెడ్క్రాస్ సంస్థల సహకారంతో జరిగిన ఈ శిబిరాలను రెడ్క్రాస్ చైర్మన్ బాల సతీష్, ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ ఫకృద్దీన్ అహమ్మద్, డాక్టర్ ఫాజల్ రెహమాన్లు ప్రారంభించారు. ఈ శిబిరంలో మధురవాడ పరిసర ప్రాంతాలకు చెందిన 100 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదాతలకు ఇన్సూరెన్స్తో పాటు డయాగ్నోస్టిక్ సేవలపై 70 శాతం రాయితీ కల్పిస్తామని ఈ సందర్భంగా బాల సతీష్ తెలిపారు. అపోలో హాస్పిటల్ వైద్య బృందం సుమారు 200 మందికి జనరల్, గైనకాలజీ, కార్డియాలజీ, డెంటల్, ఆప్తమాలజీ విభాగాల్లో ఉచిత పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కో–ఆర్డినేటర్ ఖాదర్, మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే రోజు.. ఇద్దరు విద్యార్థుల విషాదాంతం
ఆనందపురం/ పెదగంట్యాడ : ఉన్నత చదువులు పూర్తి చేసి కుటుంబాలకు అండగా నిలవాలని కలలు కంటున్న ఇద్దరు యువ విద్యార్థులు ఆదివారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకరు స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర తీరానికి వెళ్లి మృత్యువాత పడగా, మరొకరు తన క్లాస్మేట్ మృతికి సంతాపం తెలియజేయడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ రెండు ఘటనలు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. క్లాస్మేట్ను పరామర్శించేందుకు వెళ్లి... ఆనందపురం పోలీస్స్టేషన్ పరిధిలోని భీమిలి క్రాస్రోడ్డు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్మీడియట్ విద్యార్థి పతివాడ శశాంక్ (17) దుర్మరణం చెందాడు. ఆరిలోవకు చెందిన శశాంక్ తన క్లాస్మేట్ ఇటీవల మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విజయనగరం వెళ్తానని ఇంట్లో చెప్పి ఆదివారం ఉదయం బయల్దేరాడు.తన స్నేహితురాలితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా భీమిలి క్రాస్రోడ్డు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బైక్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన శశాంక్పై నుంచి లారీ దూసుకెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై వెనుక కూర్చున్న యువతి డివైడర్పై పడటంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రి శ్రీనుకు శశాంక్ పెద్ద కుమారుడు. చదువులో చురుకై న తన కుమారుడు ఇక లేడన్న వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సముద్ర కెరటాలకు బలైన బీటెక్ విద్యార్థి మరోవైపు యారాడ సముద్ర తీరంలో బీటెక్ విద్యార్థి అభిషేక్ పాల్ (20) మృతి చెందాడు. జార్ఖండ్కు చెందిన సంజయ్కుమార్ పాల్ గంగవరం పోర్టులో ఉద్యోగం చేస్తూ భానోజీతోటలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆయన కుమారుడు అభిషేక్ బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం పదిమంది స్నేహితులతో కలిసి యారాడ బీచ్కు వెళ్లిన అభిషేక్ సముద్రంలోకి దిగకుండా ఒడ్డునే ఉండి కాళ్లు కడుక్కుంటుండగా ఒక్కసారిగా భారీ కెరటం అతడిని సముద్రంలోకి లాక్కెళ్లింది. స్నేహితులు ఎంత ప్రయత్నించినా అతడిని రక్షించలేకపోయారు. సమాచారం అందుకున్న న్యూపోర్టు పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని డ్రోన్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం సముద్రంలో చేపల వేటలో ఉన్న మత్స్యకారులు రాజుగారితోట సమీపంలో మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. కలలన్నీ కళ్లముందే కరిగిపోయాయి ఒకరు స్నేహితుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తూ, మరొకరు స్నేహితులతో సరదాగా గడపడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం విషాదకరం. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండు కుటుంబాలు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆదివారం ఉదయం ఇంటి నుంచి నవ్వుతూ బయటకు వెళ్లిన కుమారులు సాయంత్రానికి మృతదేహాలుగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలని కలలు కన్న ఇద్దరు విద్యార్థుల జీవితం అర్ధాంతరంగా ముగియడంతో వారి స్నేహితులు, ఉపాధ్యాయులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకే రోజు జరిగిన ఈ రెండు విషాద ఘటనలు యువతలో రోడ్డు భద్రత, సముద్ర తీరాల్లో అప్రమత్తత ఎంత అవసరమో మరోసారి గుర్తు చేశాయి. -
ఎల్జీ 2026 ప్రీమియం రిఫ్రిజిరేటర్ల శ్రేణి ఆవిష్కరణ
మహారాణిపేట: నగరంలోని డైమండ్ పార్క్ సోనోవిజన్–3 వేదికగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ‘2026 ప్రీమియం రిఫ్రిజిరేటర్ల’ సరికొత్త శ్రేణిని ఆదివారం ఘనంగా ఆవిష్కరించింది. ఎల్జీ ఇండియా హోమ్ సొల్యూషన్స్ డైరెక్టర్ యంగ్మిన్ హ్యాంగ్, ఏపీ రీజినల్ బిజినెస్ హెడ్ కె.వి. కృష్ణాజీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక నీటి కనెక్షన్ అవసరం లేకుండానే మంచు ముక్కలను తయారుచేసే (ఆటో ఐస్ మేకర్) ‘భారతదేశపు తొలి 33 అంగుళాల ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్’ను ప్రదర్శించారు. ఏఐ థిన్క్యూ వైఫై కనెక్టివిటీ, స్మార్ట్ లెర్నర్ వంటి అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫ్రెంచ్ డోర్ మోడళ్ల ధరలు రూ. 1.18 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. వీటితో పాటు ‘మేక్ ఇన్ ఇండియా’ పరిధిలో రూపొందించిన భారీ సామర్థ్యం గల సైడ్ –బై–సైడ్, డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లను కూడా విడుదల చేశారు. ఏపీ మార్కెట్లో ప్రీమియం గృహోపకరణాల విభాగంలో ఎల్జీ తన నంబర్ వన్ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందని సంస్థ ప్రతినిధి యంగ్ మిన్ హ్యాంగ్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీ రీజినల్ బిజినెస్ హెడ్ కేవీ కృష్ణాజీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో ప్రీమియం గృహోపకరణాల విభాగంలో ఎల్జీ తన నాయకత్వస్థానాన్ని మరింతబలోపేతం చేసుకుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిఫ్రిజిరేటర్ ప్రొడక్ట్ మేనేజర్ గియాన్ గ్యాన్, బ్రాంచ్ మేనేజర్ యుగంధర్ ఇల్లిబిల్లి, ఎల్జీ ఉద్యోగులు, సోనో విజన్ యాజమాన్యం, సిబ్బంది, వ్యాపార భాగస్వాములు పాల్గొన్నారు. -
‘ఐలా’ ఓట్ల లెక్కింపులో అక్రమాలు
అక్కిరెడ్డిపాలెం: ఆటోనగర్ ఐలా స్థానిక సంస్థ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రతిపక్ష ప్యానల్ చైర్మన్ అభ్యర్థి కొల్లి ఈశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో పక్షపాత రహితంగా వ్యవహరించాల్సిన అధికారులు తమ బాధ్యతను పూర్తిగా విస్మరించి ఏకపక్ష వైఖరితో వ్యవహరించడం వల్లే తుది ఫలితం తారుమారైందని ఆరోపించారు. చైర్మన్ పదవికి పోటీ చేసిన తనకు, యార్లగడ్డ సాంబశివరావుల మధ్య హోరాహోరీ పోరు సాగిందని, చివరకు కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు నిర్ణయించడం వెనుక అధికారుల ముందస్తు వ్యూహం ఉందని ఆరోపించారు. ఎన్నికల అధికారి ఆదిశేషు పర్యవేక్షణలో మొత్తం 1,030 మంది ఓటర్లకు గాను 704 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లతో కలిపి మొత్తం 815 ఓట్లు నమోదైనట్లు తెలిపారు. పోలింగ్ సమయంలో కనీస నిబంధనలు కూడా పాటించలేదని ఆరోపించారు. తెరపైకి ముద్రల వివాదం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లను గందరగోళానికి గురిచేసే విధంగా ఎన్నికల సిబ్బంది వ్యవహరించారని ప్రతిపక్ష ప్యానల్ నేతలు ఆరోపించారు. ఓటు వేయడానికి ఉపయోగించిన అధికారిక ముద్ర దెబ్బతిన్న స్థితిలో ఉందని, దానిపై ఉండాల్సిన గుర్తు సగం వరకు చెరిగిపోయిందని తెలిపారు. దీనిపై నవభారత్ ఫౌండ్రీస్ అండ్ ఇంజినీరింగ్ వర్క్స్ ప్రతినిధి లంక సుబ్బారావు, శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి లక్ష్మీదేవి అల్లాపర్తి పోలింగ్ సిబ్బందిని ప్రశ్నించారని పేర్కొన్నారు. అయితే ఆ ముద్రతో వేసిన ఓట్లు చెల్లుబాటు అవుతాయని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. కానీ లెక్కింపు సమయంలో అదే ఓట్లను చెల్లనివిగా ప్రకటించడం తీవ్ర అన్యాయమని విమర్శించారు. లెక్కింపులో నిబంధనల ఉల్లంఘన మొత్తం ఎన్నికల ప్రక్రియలో నిబంధనలను పూర్తిగా పక్కనపెట్టారని ప్రతిపక్ష ప్యానల్ ఆరోపించింది. ముఖ్యంగా కొన్ని పోస్టల్ బ్యాలెట్లను సరైన ధ్రువీకరణ లేకుండానే లెక్కింపులో పరిగణనలోకి తీసుకున్నారని, దీనిపై కౌంటింగ్ ప్రారంభానికి ముందే అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. న్యాయపోరాటానికి సిద్ధం ఎన్నికల్లో జరిగిన లోపాలు, అధికారుల పక్షపాత వైఖరికి నిరసనగా తాము ఫలితాల ప్రకటన పత్రంపై సంతకం చేయలేదని కొల్లి ఈశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ప్రకటించిన ఈ ఫలితాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు. ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలకు సంబంధించిన ఆధారాలతో త్వరలోనే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేపడతామని ప్రతిపక్ష ప్యానల్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రతిపక్ష ప్యానల్ చైర్మన్ అభ్యర్థి కొల్లి ఈశ్వరరావు ఆరోపణ -
సేవా విలువలతోనే నైపుణ్య వికాసం
మహారాణిపేట: శ్రీ సత్యసాయి సేవా సంస్థలు–ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఎస్డీపీఎస్)లో శిక్షణ పొందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం విశాఖలోని రైల్వే ఇన్స్టిట్యూట్ హాలులో ఘనంగా జరిగింది. సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పూర్తి చేసిన సుమారు 550 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. శిక్షణ ద్వారా తాము పొందిన ఉపాధి అవకాశాలతో పాటు.. జీవితంలో మానవతా విలువలు, ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకున్నారో విద్యార్థులు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ క్రైమ్ ఏసీపీ భవ్య రెడ్డి మాట్లాడుతూ.. యువత సంప్రదాయ నైపుణ్యాలతో పాటు డిజిటల్ మార్కెటింగ్ వంటి ఆధునిక రంగాలపై పట్టు సాధించి ఉపాధి అవకాశాలను విస్తరించుకోవాలని సూచించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.లక్ష్మణరావు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి బాబా బోధించిన మానవ విలువలు, సేవా తత్వమే సమాజాభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. అనంతరం ఏపీఎస్ఎస్డీసీ నుంచి లభించిన ‘హెల్త్ కేర్ అసిస్టెంట్’ శిక్షణా అనుమతి పత్రాన్ని ఆవిష్కరించారు. -
ప్రవేశాల్లో తీవ్ర జాప్యం
ఫలితాలు వెలువడినా..ప్రవేశాల షెడ్యూల్పై ఎదురుచూపులు పాలిసెట్ ఫలితాలు వెలువడి నెలకు పైగా గడిచినా ప్రవేశాలకు సంబంధించిన ఎలాంటి ప్రకటన వెలువడలేదు. గతంలో ప్రవేశాలు ఆలస్యమవడం వల్ల సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ కాకపోయాయనే ఉద్దేశంతో ఈసారి పరీక్షను ముందుగానే నిర్వహించి ఫలితాలను కూడా త్వరగా విడుదల చేశారు. ఈ సమయానికి మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తై కావాల్సి ఉండగా..ఇప్పటికీ షెడ్యూల్పై స్పష్టత లేకపోవడం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అనేక సీట్లు ఖాళీగా మిగిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కళాశాలల్లో ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమయ్యాయి. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ప్రత్యామ్నాయంగా ఇతర కోర్సుల్లో చేరిపోతున్నారు. ఫలితంగా పాలిటెక్నిక్లకు వెళ్లాల్సిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఇతర విద్యా మార్గాలను ఎంచుకునే పరిస్థితి ఏర్పడుతోంది. మురళీనగర్: పదో తరగతి అనంతరం సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులు ఉత్తమ అవకాశంగా భావిస్తారు. పరిశ్రమలు, కంపెనీలు కూడా డిప్లమా విద్యార్థులకు ఉద్యోగాల కల్పనలో అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పాలిటెక్నిక్లలో చేరేందుకు ఆసక్తి చూపడం సహజం. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్లలో ప్రవేశాల ప్రక్రియ సకాలంలో ప్రారంభం కాకపోవడం వల్ల ప్రతి ఏడాది వేలాది సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఈ సమస్య ఏటా పునరావృతమవుతున్నప్పటికీ, ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పాలిసెట్ పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించి 40 రోజులు గడిచినా, ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యాశాఖ ఇంకా విడుదల చేయలేదు. దీంతో పాలిసెట్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అనిశ్చితిలో ఉన్నారు. జాప్యానికి కారణాలేంటి? ఈసారి ప్రవేశాల జాప్యంపై పలు కారణాలు వినిపిస్తున్నాయి. ప్రతి విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతులు తప్పనిసరి. ప్రభుత్వ పాలిటెక్నిక్లకు అనుమతులు లభించినప్పటికీ, కొన్ని ప్రైవేటు కళాశాలలకు ఇంకా ఆమోదం రాలేదని తెలుస్తోంది. అలాగే కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ యాజమాన్యాలు తమ క్యాంపస్లలో కొత్త పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో కొన్ని కోరుకున్న బ్రాంచ్లకు అనుమతులు రాకపోవడంతో ప్రవేశాల ప్రక్రియలో ఆలస్యం జరుగుతోందనే చర్చ విద్యావర్గాల్లో సాగుతోంది. ప్రభుత్వ కళాశాలల్లో సీట్ల భర్తీ కొంతమేర సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, ప్రైవేటు కళాశాలల్లో అనేక బ్రాంచ్ల్లో సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. వాటిని భర్తీ చేయడానికి యాజమాన్యాలు ప్రత్యక్ష ప్రవేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. వేల సంఖ్యలో సీట్లు.. అయినా పూర్తి భర్తీ లేదు నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్లలో అన్ని కోర్సులు కలిపి మొత్తం 62,456 సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో 87 ప్రభుత్వ, 178 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా, వీటిలో కలిపి సుమారు 84 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక పాలిసెట్లో ఈ ఏడాది 1,48,950 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అయినప్పటికీ ప్రతి ఏడాది వేలాది సీట్లు ఖాళీగా మిగిలిపోతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ప్రణాళికను ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయకపోవడం గమనార్హం. పాలిటెక్నిక్ విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటించి ప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలో మెరుగైన ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్ 25న నిర్వహించిన పాలిసెట్కు జిల్లాలో 44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి 14,759 మంది విద్యార్థులను కేటాయించారు. వీరిలో 14,118 మంది హాజరై 95.66 శాతం హాజరు నమోదు చేశారు. నగర పరిధిలోని 18 కేంద్రాల్లో 6,330 మందికి గాను 6,019 మంది పరీక్షకు హాజరై 95.09 శాతం హాజరు నమోదైంది. పెందుర్తిలో 96.07 శాతం, గాజువాకలో 96.05 శాతం, మధురవాడలో 95.84 శాతం, తగరపువలసలో 95.78 శాతం, భీమిలిలో 97.68 శాతం హాజరు నమోదైంది. మే 5న విడుదలైన ఫలితాల్లో జిల్లా నుంచి 13,042 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 92.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. -
డేటా సెంటర్లకు వ్యతిరేకంగా నిరసన
ఏయూక్యాంపస్: ప్రజల్లో డేటా సెంటర్ల పట్ల అవగాహన కల్పిస్తూ పర్యావరణ ప్రేమికులు బీచ్రోడ్డులో నిరసన తెలిపారు. ఆదివారం బీచ్రోడ్డులో ‘సేవ్ వైజాగ్’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డేటా సెంటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొంతమంది ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టేందుకు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి సంతకాలను సేకరించడం ప్రారంభించారు. అదే సమయంలో మరికొంత మంది విశాఖలో డేటా సెంటర్లు వద్దంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. డేటా సెంటర్ల వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయనేది కేవలం అపోహ మాత్రమేనని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే విశాఖ నగరంలో తీవ్ర నీటి కొరత ఉందని, డేటా సెంటర్లు గనుక వస్తే ఆ నీటి సమస్య మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ డేటా సెంటర్లు కేవలం కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ఉపయుక్తంగా నిలుస్తాయని వారు నినదించారు. నిరసనకారులు ‘సే నో టు డేటా సెంటర్స్’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. డేటా సెంటర్ల నిర్వహణకు ఎంత పెద్ద మొత్తంలో నీరు అవసరమవుతుందో, దానివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో తదితర అంశాలను ప్లకార్డుల రూపంలో చూపిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అయితే అదే సమయంలో అక్కడ జరుగుతున్న మరొక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సైతం విషయం పూర్తిగా గమనించకుండా ‘సేవ్ వైజాగ్’ బ్యానర్పై సంతకం చేశారు. ఆ తర్వాతే ఆయనకు అసలు విషయం తెలిసింది. కోకో ఎరీనా వద్ద.. నగరంలో డేటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆదివారం బీచ్రోడ్డులోని కోకో ఎరీనా వద్ద నగరవాసులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరసనకారురాలు దీక్ష వంగూరు మాట్లాడుతూ.. డేటా సెంటర్ల భారీ సర్వర్ల నిర్వహణకు అత్యధికంగా విద్యుత్, నీరు అవసరమవుతాయని, ఇది నగర పర్యావరణానికి పెద్ద సవాలుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
● ఉప్పొంగిన సాగరం.. హోరెత్తిన కెరటాలు
అమావాస్య సమయం సమీపిస్తున్న వేళ విశాఖ సాగరతీరంలో కెరటాల ఉధృతి పెరిగింది. ఆదివారం ఉదయం భారీ అలలు ఎగసిపడి తీరాన్ని బలంగా తాకాయి. కోకో ఎరీనా వద్ద కొబ్బరి చెట్లను దాటి ఫుట్పాత్ వరకు దూసుకొచ్చిన కెరటాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. అయితే అలల ఉధృతి కారణంగా తీరంలో ఇసుక కోత ఏర్పడుతోంది. యోగా విలేజ్ ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్ల వేర్లను కెరటాలు తాకుతూ నేలను కోసేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే చెట్లు కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సముద్ర స్నానాలు, తీరంలో ఆటలు ప్రమాదకరమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. – ఏయూక్యాంపస్ -
మాస్టర్ స్కెచ్
ఫలితాలు వెలువడినా.. ప్రవేశాల్లో తీవ్ర జాప్యం పచ్చ నేతల వీఎంఆర్డీఏ మాస్టర్ప్లాన్–2041.. టీడీపీ నేతల రియల్ ఎస్టేట్ బ్లూప్రింట్సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షి, విశాఖపట్నం : మహా నగర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయాల్సిన వీఎంఆర్డీఏ సవరించిన ముసాయిదా మాస్టర్ ప్లాన్–2041, అధికార టీడీపీ నేతల రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందించిన ‘మాస్టర్ స్కెచ్’గా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల అభ్యంతరాల పేరుతో చేపట్టిన సవరణల్లో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు చెందిన అధికార పార్టీ నేతలు తమ భూములు, వెంచర్లకు అనుకూలంగా భూవినియోగ మార్పులు చేయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి వచ్చిన 1,241 అభ్యంతరాల్లో కేవలం 399 మాత్రమే పరిగణనలోకి తీసుకున్న అధికారులు, అధికార పార్టీ నేతలకు సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం విస్తృతంగా భూవినియోగ మార్పులు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఓ ఉన్నతాధికారిని సైతం బదిలీ చేసి, తమకు అనుకూలంగా సవరణలు పూర్తి చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పారిశ్రామిక రంగానికి అతి తక్కువ భూకేటాయింపులు చేస్తూ, రియల్ ఎస్టేట్కు లాభదాయకమైన రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల అభ్యంతరాలా.. లేక నేతల సూచనలా? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్లో సవరణలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో, దానిని అధికార పార్టీ నేతలు తమ ప్రయోజనాలకు వినియోగించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించినప్పటికీ, వాటిని పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోకుండా, అధికార పార్టీ నేతల సూచనలకే పెద్దపీట వేశారని విమర్శలు ఉన్నాయి. అందిన 1,241 అభ్యంతరాల్లో 399 ప్రత్యేక అభ్యంతరాలు, సూచనలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని సవరణలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ‘ప్రత్యేక అభ్యంతరాలు’ సామాన్య ప్రజలవి కాకుండా, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో భారీగా భూములు కలిగిన అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు, బినామీలవేనన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ, పరిమిత వినియోగ ప్రాంతాల్లో ఉన్న భూములను నివాస, వాణిజ్య జోన్లుగా మార్చుకునేందుకే ఈ సవరణల ప్రక్రియను ఉపయోగించుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారిశ్రామిక రంగానికి వెన్నుపోటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం, మాస్టర్ ప్లాన్లో మాత్రం పారిశ్రామిక రంగానికి అత్యల్ప ప్రాధాన్యం ఇచ్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి కల్పనకు కీలకమైన పారిశ్రామిక రంగానికి కేవలం 55 చ.కిమీ (1.30 శాతం) మాత్రమే కేటాయించారు. మరోవైపు, రియల్ ఎస్టేట్కు అధిక లాభాలు తెచ్చిపెట్టే నివాస, మిశ్రమ వినియోగ జోన్లకు భారీ స్థాయిలో భూములు కేటాయించారు. దీంతో ముందుగానే భూములు కొనుగోలు చేసి పెట్టుకున్న అధికార పార్టీ నేతల వెంచర్లకు ప్రభుత్వ ముద్ర వేయడానికే ఈ సవరణలు జరిగాయన్న ఆరోపణలు బలపడుతున్నాయి. వీఎంఆర్డీఏ మాస్టర్ప్లాన్కారిడార్ల పేరుతో కమర్షియల్ గేమ్? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ అనుసంధాన రహదారులు, తీరప్రాంత అభివృద్ధి కారిడార్, విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్కు ప్రణాళికలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కారిడార్ల పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అధికార పార్టీ నేతలు, వారి బినామీలు భారీగా భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మార్పులపై అభ్యంతరం వ్యక్తం చేసిన చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్పను బదిలీ చేయించి, తమకు అనుకూలమైన అధికారిని నియమించి సవరణలను వేగంగా పూర్తి చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2041 నాటికి 66.30 లక్షల జనాభా అవసరాల పేరుతో ప్రతిపాదించిన 3,913 కిలోమీటర్ల రహదారి నెట్వర్క్లోని పలు ఎలైన్మెంట్లు అధికార పార్టీ నేతల భూములు, లేఅవుట్లకు అనుకూలంగా రూపొందించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నేతలకు చెందిన భూములు ఉన్న ప్రాంతాలను హై–వాల్యూ జోన్లుగా మార్చేలా అధికారులపై ఒత్తిడి తెచ్చి మాస్టర్ ప్లాన్ను తమ ప్రయోజనాలకు అనుగుణంగా మలిచారన్నదే ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన విమర్శ. పచ్చ నేతల ‘రియల్’ దాహం! వీఎంఆర్డీఏ ప్రతిపాదించిన సవరించిన భూ వినియోగ పట్టికను పరిశీలిస్తే, రియల్ ఎస్టేట్కు అనుకూలమైన కేటాయింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీఎంఆర్డీఏ పరిధిలోని మొత్తం 4,380 చ.కిమీ విస్తీర్ణంలో వ్యవసాయ భూములకు 1,774 చ.కిమీ (40.50 శాతం) కేటాయించారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కీలకమైన రెసిడెన్షియల్ జోన్లకు ఏకంగా 744 చ.కిమీ (17 శాతం) కేటాయించారు. అలాగే నివాస, వాణిజ్య అవసరాలకు ఒకేసారి ఉపయోగించే మిశ్రమ వినియోగ (మిక్స్డ్ యూజ్) జోన్లకు 372 చ.కిమీ (8.5 శాతం) రిజర్వ్ చేశారు. అభ్యంతరాల ముసుగులో తమకనుకూలంగా భారీ మార్పులు టీడీపీ నేతల భూములు, వెంచర్లకు అనుగుణంగా భూవినియోగ సవరణలు 1,241 అభ్యంతరాల్లో కేవలం 399 మాత్రమే పరిగణనలోకి.. సవరణలను వ్యతిరేకించిన చీఫ్ అర్బన్ ప్లానర్ బదిలీ రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లకు 17.20 శాతం కేటాయింపు పారిశ్రామికాభివృద్ధికి నామమాత్రపు ప్రాధాన్యం -
ఏయూలో ‘నకిలీ’ ఉద్యోగాల దందా!
విశాఖ విద్య: ఆంధ్రా యూనివర్సిటీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. వర్సిటీలో అక్రమాలు రోజుకొకటి వెలుగుచూస్తుండటం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఏయూ ఉద్యోగులే బ్రోకర్లుగా మారి నిరుద్యోగులను నట్టేట ముంచారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వవిద్యాలయంలో అటెండర్, రికార్డ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, రూ.లక్షలు వసూలు చేసి, చేతిలో నకిలీ నియామక పత్రాలు పెట్టడం కలకలం రేపుతోంది. కొందరు అవినీతి తిమింగలాల వల్ల ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం పరువు బజారున పడుతోంది. రిజిస్ట్రార్ సంతకమే ఫోర్జరీ! ఉద్యోగాల పేరిట జరిగిన ఈ దందాలో మోసగాళ్లు ఏకంగా రిజిస్ట్రార్ సంతకాన్నే ఫోర్జరీ చేయడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ఏయూ పేరుతో ఉన్న నియామక పత్రాలపై రిజిస్ట్రార్ సంతకం ఉండటాన్ని చూసి అధికారులు షాక్కు గురయ్యారు. తాము మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన నిరుద్యోగులు ప్రస్తుతం ఏయూ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. వారు తెచ్చిన నకిలీ నియామక పత్రాలను చూసి ఏయూ ఉన్నతాధికారులు నోట మాట రాక నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. స్కాం వెనుక వర్సిటీ అధికారి? ఈ నకిలీ నియామక పత్రాల స్కాం వెనుక ఏయూకు చెందిన ఒక కీలక అధికారి చక్రం తిప్పినట్లు గట్టి ప్రచారం జరుగుతోంది. సదరు అధికారి బయటి వ్యక్తులతో మధ్యవర్తిత్వం నడిపిస్తూ నిరుద్యోగులకు వల వేసినట్లు తెలుస్తోంది. వర్సిటీతో సంబంధాలున్న కొందరు బయటి వ్యక్తులను లూప్లోకి తీసుకుని, ఈ భారీ ఉద్యోగాల భర్తీ స్కామ్కు ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఈ ముఠా వలలో చిక్కి ఎంతమంది నిరుద్యోగులు మోసపోయారనేది పూర్తిస్థాయి విచారణలో తేలాల్సి ఉంది. కఠిన చర్యలు తప్పవు నకిలీ నియామక పత్రాల వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు స్పందించారు. విశ్వవిద్యాలయానికి చెడ్డపేరు తీసుకురావాలని చూస్తే ఎంతటివారైనా సరే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోస్టుకు రూ.5 లక్షలు! అటెండర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తామని నమ్మించి సుమారు 30 మంది నిరుద్యోగులను ఈ ముఠా మోసం చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు రూ.5 లక్షలు డిమాండ్ చేయగా.. అభ్యర్థులు తొలి విడతగా రూ.2 లక్షల చొప్పున చెల్లించారు. మిగిలిన సొమ్మును విధుల్లో చేరిన తర్వాత ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, డబ్బులు తీసుకుని ఎన్ని రోజులైనా నియామక పత్రాలు ఇవ్వకపోవడం, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో.. మోసగాళ్లు రిజిస్ట్రార్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ నియామక పత్రాలను చేతిలో పెట్టారు. వాటితో వర్సిటీకి రాగా.. అవి నకిలీవని తేలడంతో బాధితులు లబోదిబోమంటూ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. వర్సిటీ యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే బ్రోకర్లు ఇంతలా రెచ్చిపోతున్నారని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అవినీతి అధికారుల లీలలపై ఏయూ అధికారులు ఎందుకు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నాయి. -
సమస్యల వల.. మత్స్య వేట విలవిల
మహారాణిపేట: సముద్రంలో మత్స్య సంపద వేట ఆశ, నిరాశల మధ్య పునఃప్రారంభమవుతోంది. 61 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మొదలవుతున్న ఈ వేటపై మత్స్యకారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఒకవైపు సబ్సిడీ డీజిల్ అందకపోవడం, మరోవైపు అర్హులకు ‘మత్స్యకార భరోసా’ రాకపోవడం, వీటికి తోడు ‘ఎదురు అమావాస్య’ రావడంతో వేటను ఎలా ప్రారంభించాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే వేట కోసం సుమారు 400 బోట్లు సిద్ధమయ్యాయి. ప్రతి ఏటా ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు సముద్ర తీరంలో మత్స్య సంపద సంరక్షణ, పునరుత్పత్తి కోసం రెండు నెలల పాటు వేట నిషేధం అమలులో ఉంటుందనే సంగతి తెలిసిందే. పది నెలల పాటు అవిశ్రాంతంగా పనిచేసిన మత్స్యకారులకు ఈ రెండు నెలలు విశ్రాంతి లభించింది. నిషేధ కాలం ముగియడంతో జూన్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచే వేటకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ, ఎదురు అమావాస్య ప్రభావం వల్ల దాదాపు 70 శాతం మంది మత్స్యకారులు జూన్ 17 నుంచి వేటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందువల్లే గతంలో ఉన్నంత సందడి ప్రస్తుతానికి ఫిషింగ్ హార్బర్లో కనిపించడం లేదు. డీజిల్ భారం...సబ్సిడీకి నోచుకోని వైనం వేట ప్రారంభ సమయం ఆసన్నమైనప్పటికీ, ప్రభుత్వ రాయితీ డీజిల్ ఆయిల్ ఇంకా హార్బర్కు చేరుకోలేదు. మార్కెట్లో పెరుగుతున్న డీజిల్ ధరలను భరిస్తూ, సొంత డబ్బులతో ఆయిల్ కొనుగోలు చేసి వేటకు వెళ్లడం తమకు కష్టంగా మారిందని మత్స్యకారులు చెబుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అయితే మత్స్యకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చి, దాని ద్వారా ప్రతి నెల ఒక్కో బోటుకు మూడు వేల లీటర్ల చొప్పున రాయితీ డీజిల్ అందించేవారని, కానీ ఇప్పుడు ఆ కార్డులు పనిచేయడం లేదని, ఆయిల్ కూడా రావడం లేదని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు. అర్హులకు అందని మత్స్యకార భరోసా జిల్లాలో వేట నిషేధ కాల భృతి (మత్స్యకార భరోసా) ఇంకా చాలామందికి అందలేదు. ఇస్తామంటూ రోజులు గడుస్తున్నా సాయం అందలేదని మత్స్యకారులు వాపోతున్నారు. జిల్లాలో వేట నిషేధ కాల భృతి కోసం మత్స్యశాఖ 13,597 మంది లబ్ధిదారులను గుర్తించగా, వారిలో 11,224 మందికి మాత్రమే భృతి మంజూరైంది. మిగిలిన 2,373 మందిని వివిధ కారణాలతో ’హోల్డ్’లో పెట్టారు. వీరికి ఇప్పటివరకు ఎలాంటి భరోసా రాలేదని అధికారులు చెబుతున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించాలి ఆదివారం అర్ధరాత్రి నుంచి వేట ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరపడవల్లో తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు, లైఫ్ బోయ్లను అందుబాటులో ఉంచుకోవాలని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.లక్ష్మణరావు తెలిపారు. బోట్లలోని ట్రాన్స్పాండర్లు, జీపీఎస్లను ఎల్లప్పుడూ ఆన్లో ఉంచాలన్నారు. మత్స్యకారులు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వేట సాగించాలని ఆయన సూచించారు. ఐస్ కొరత ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్లో ఐస్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. వేటకు సిద్ధమవుతున్న బోట్లకు గత రెండు రోజుల నుంచి తగినంత ఐస్ అందుబాటులో లేదు. దీంతో మత్స్యకారులు నగరంలోని పలు ఇతర ప్రాంతాల నుంచి ఐస్ను తెచ్చుకున్నారు. ఒక్కొక్క బోటుకు సముద్రంలో వేట కోసం వెళ్లేటప్పుడు భారీ మొత్తంలో ఐస్ అవసరమవుతుంది. ఇది సకాలంలో లభించకపోవడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి: రాగల మూడు గంటల్లో ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లాలో 16 మండలాలు, నంద్యాల జిల్లాలో 10 మండలాల్లో వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లాలో వర్షం తేలిక పాటికే పరిమితమైంది. అయితే కర్నూలు నగరంలో భారీ వర్షం కురిసింది.కర్నూలు రూరల్లో 56.2 మి.మీ, కర్నూలు అర్బన్లో 48.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కాలువలు పొంగిపొర్లాయి. జిల్లా మొత్తంగా సగటున 9 మి.మీ వర్షం కురిసింది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా ఇప్పటి వరకు 46.1 మి.మీ వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా మొత్తంగా సగటున 1.7 మి.మీ వర్షం కురిసింది. నంద్యాల జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం 77 మి.మీ కాగా ఇప్పటి వరకు 58.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తొలకరి నిరాశాజనకంగా సాగుతోంది. -
లయన్స్కు వరుసగా మూడో ఓటమి
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్ ఐదో సీజన్లో సింహాద్రి వైజాగ్ లయన్స్ వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది. శనివారం వైఎస్సార్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భీమవరం బుల్స్ 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భీమవరం బుల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 219 పరుగులు చేసింది. రేవంత్ (58), సాత్విక్ (69) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లయన్స్ బ్యాటర్లు విఫలమవడంతో జట్టు 17.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. బుల్స్ బౌలర్ యశ్వంత్ ఐదు వికెట్లు తీసి మ్యాచ్ను ఏకపక్షం చేశాడు. దీంతో బుల్స్ వరుసగా మూ డో విజయాన్ని నమోదు చేసింది. మరో మ్యా చ్లో కాకినాడ కింగ్స్ 34 పరుగుల తేడాతో తుంగభద్ర వారియర్స్పై విజయం సాధించింది. -
ఎన్టీఏ రద్దు చేయాలి
మహారాణిపేట: నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ ఆన్స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం)లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎన్.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ‘విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దు’ నినాదంతో శనివారం విశాఖలో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో పలువురు విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నీట్ పరీక్షను రాష్ట్రాలే నిర్వహించాలని, పేపర్ లీక్కు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని తీర్మానించారు. అలాగే సీబీఎస్ఈ ఆన్స్క్రీన్ మార్కింగ్లో పారదర్శకత పెంచాలని, బాధిత విద్యార్థులకు ఉచిత పునర్మూల్యాంకనం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జేవీవీ రాష్ట్ర కార్యదర్శులు జి.గిరిధర్, వై.ఎ.ఆర్.కె.ప్రసాద్, సీనియర్ రాష్ట్ర నాయకులు కె.త్రిమూర్తులురెడ్డి, సమతా రాష్ట్ర కన్వీనర్ జి.నిర్మల, ప్రజారోగ్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు, పాల్గొన్నారు. -
బీచ్లో మద్యం విక్రయాల నిర్ణయంపై ‘ఐద్వా’ నిరసన
మహారాణిపేట: సముద్ర తీరంలో మద్యం విక్రయాలకు అనుమతులను నిరసిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో శనివారం ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి.ప్రభావతి, జిల్లా నేతలు ఆర్.ఎన్. మాధవి, సత్యవతి, బి.పద్మ మాట్లాడుతూ.. గోవా కల్చర్ పేరుతో బీచ్లో మద్యం అమ్మకాలు జరపడం దుర్మార్గమన్నారు. ఖజానా నింపుకోవడానికి, మద్యం సిండికేట్ల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. బీచ్లో మద్యం అందుబాటులోకి వస్తే మహిళల రక్షణ గాల్లో కలిసిపోతుందని, పర్యావరణం ధ్వంసమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో బెల్ట్ షాపులు, గంజాయి, డ్రగ్స్ రవాణాను అణచివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐద్వా ప్రతినిధులు డి.కొండమ్మ, ఆర్.వరలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు బి.ఎల్. నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఏయూలో ఉద్యోగాల పేరుతో దళారుల దందా
ఎవరూ నమ్మి మోసపోవద్దన్న అధికారులు విశాఖ విద్య: ఏయూలో ఉద్యోగాల భర్తీ పేరుతో కొందరు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఇటీవల ఏయూ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయగా, మరికొన్ని తాత్కాలిక అధ్యాపక పోస్టుల భర్తీకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలతో పరిచయాలు ఉన్నాయంటూ కొందరు దళారులు నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజులుగా యూనివర్సిటీలోని కొందరు వ్యక్తులు, బయట ఉన్న మధ్యవర్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై ఏయూ యాజమాన్యం స్పందించింది. ఉద్యోగాల భర్తీ పేరుతో ఎలాంటి అక్రమాలు జరిగినట్లు ఇప్పటివరకు తమకు ఫిర్యాదులు అందలేదని ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు స్పష్టం చేశారు. ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయాలని, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశ్వవిద్యాలయం పేరును దుర్వినియోగం చేసినా, ఉద్యోగులు ఇటువంటి చర్యలకు పాల్పడినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఏయూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లు ప్రముఖ దినపత్రికలు, ఏయూ అధికారిక వెబ్సైట్ ద్వారానే విడుదల చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వచ్చే దళారులు, మధ్యవర్తులను నమ్మి ఎవరూ డబ్బులు ఇచ్చి మోసపోవద్దని నిరుద్యోగులకు రిజిస్ట్రార్ సూచించారు. -
గురువు చేతిలో సామాజిక బాధ్యత
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు డి.సంజీవ్కుమార్ ఇప్పటివరకు 24 సార్లు రక్తదానం చేశారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాకుండా రక్తదానంపై అవగాహన కల్పిస్తూ సామాజిక బాధ్యతను నూరిపోస్తున్నారు. విశాఖ బ్లడ్ డోనర్స్ క్లబ్ సభ్యుడిగా అవసరమైనప్పుడు ముందుండి సేవలందిస్తున్నారు. తండ్రి బాటలో.. సూరాడ అప్పారావు స్పూర్తితో ఆయన కుమార్తె, సంఘ సేవకురాలు రమాప్రియ (6 సార్లు రక్తదానం)తో పాటు కుమారులు కూడా ప్రతి ఏటా రక్తదానం చేస్తున్నారు. రక్తదానం ఒక సామాజిక బాధ్యత మాత్రమే కాదు... అది మానవత్వానికి అత్యున్నత రూపమని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. -
లాభాల వేటలో పది ‘ఉక్కు’ కుటుంబాల్లో నిండిన చీకట్లు! నాసిరకం ముడిపదార్థాలు, సిబ్బంది కొరత,పనిఒత్తిడి కలిసి సృష్టించిన విషాదం అధికారుల కమిటీ విచారణలో వెలుగుచూస్తున్న దిగ్భ్రాంతికర వాస్తవాలు
ఉత్పత్తి కోసం భద్రతకు తిలోదకాలు ప్రమాదానికి ముందు నుంచే ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలన్న ఒత్తిడి తీవ్రంగా పెరిగిందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. లాడిల్ పూర్తి సామర్థ్యం 150 టన్నులు కాగా, ప్రమాదం జరిగిన రోజు దాదాపు 140 టన్నుల ద్రవపు ఉక్కుతో ప్రక్రియ నిర్వహించినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి దశను అత్యంత జాగ్రత్తగా అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, సమయాన్ని ఆదా చేయడంపైనే దృష్టి పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఉత్పత్తి వ్యయం తగ్గింపు పేరుతో కొన్ని కీలక భద్రతా ప్రక్రియలను కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని కార్మికులు చెబుతున్నారు. అలాగే కొన్ని విభాగాల్లో 12 గంటల పని విధానాన్ని అమలు చేస్తుండగా, ఉత్పత్తిని వేతనాలతో అనుసంధానించడం ద్వారా ఉద్యోగులపై మరింత ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపిస్తున్నారు. ఫలితంగా భద్రతా ప్రమాణాల కంటే ఉత్పత్తి లక్ష్యాలకే ప్రాధాన్యం దక్కుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ను కుదిపేసిన ఘోర ప్రమాదం వెనుక ఉత్పత్తి లక్ష్యాల కోసం జరిగిన హడావుడి, భద్రతా నిబంధనల పట్ల నిర్లక్ష్యం, నాసిరకం ముడిపదార్థాల వినియోగం ఉన్నట్లు అధికారుల విచారణలో వెల్లడవుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లాడిల్లో ద్రవపు ఉక్కు పేలి 10 మంది కార్మికుల ప్రాణాలు బలిగొన్న ఈ ఘటనపై సాగుతున్న దర్యాప్తులో ఒక్కో వాస్తవం వెలుగులోకి వస్తోంది. సాధారణంగా లాడిల్లోని ద్రవ ఉక్కును శుద్ధి చేసి ఆక్సీకరణ ప్రక్రియ పూర్తిచేసిన తర్వాతే కంటిన్యూయస్ కాస్టింగ్ యంత్రానికి తరలిస్తారు. ఇందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్వోపీ) ప్రకారం కనీసం 18 నిమిషాల సమయం అవసరం. అయితే ఉత్పత్తి వేగం పెంచాలన్న ఒత్తిడితో ఈ ప్రక్రియను కేవలం 10 నిమిషాల్లో ముగించినట్లు విచారణలో తేలినట్టు సమాచారం. ఈ తొందరపాటే చివరకు ఘోర విషాదానికి దారితీసిందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నాసిరకం ముడిపదార్థాల వినియోగం కారణంగా ప్లాంట్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికితోడు ఆక్సీకరణ ప్రక్రియను పూర్తిస్థాయిలో నిర్వహించకపోవడం వల్ల లాడిల్లో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడి పేలుడు సంభవించినట్లు ప్రాథమిక నిర్ధారణలు సూచిస్తున్నాయి. ఆక్సీకరణలో ఏం తప్పు జరిగింది? పిగ్ ఐరన్ను కరిగించిన అనంతరం బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి వచ్చే ద్రవ లోహంలో అవసరాన్ని బట్టి ఫెర్రోమాంగనీస్, ఫెర్రోసిలికాన్ వంటి పదార్థాలను కలుపుతారు. ఆ తర్వాత ఆక్సీకరణ ప్రక్రియ చేపడతారు. ఈ సమయంలో ఆక్సిజన్ను ప్రవేశపెట్టడంతో కార్బన్ మోనాకై ్సడ్, కార్బన్ డయాకై ్సడ్ వంటి వాయువులు ఉత్పత్తి అవుతాయి. కొన్నిసార్లు ఈ వాయువులు ద్రవపు ఉక్కులోనే చిక్కుకుపోయే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆర్గాన్ గ్యాస్ను ఉపయోగించి బాటమ్ పర్జింగ్ నిర్వహిస్తారు. దీంతో ద్రవ ఉక్కులో చిక్కుకుపోయిన వాయువులు, మలినాలు బయటకు వస్తాయి. అలాగే ద్రవపు ఉక్కు నాణ్యతను నిర్ధారించేందుకు నమూనా పరీక్షలు కూడా నిర్వహించాలి. అయితే ఈ కీలక దశలను పూర్తిస్థాయిలో పాటించకపోవడం, శుద్ధి ప్రక్రియను తొందరపాటుతో ముగించడం వల్లే ప్రమాదం సంభవించినట్లు విచారణలో తేలినట్టు సమాచారం. దీంతో లాడిల్లో ఒక్కసారిగా తీవ్ర ప్రతిచర్య చోటుచేసుకుని, సుమారు 1,600 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ద్రవ ఉక్కు భారీగా ఎగసిపడింది. భవనం పైకప్పును తాకిన ద్రవపు ఉక్కు తిరిగి వర్షంలా కురిసి అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడింది. ఘటనాస్థలంలోనే ఎనిమిది మంది మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ప్రమాదంపై విచారణ జరుపుతున్న ముగ్గురు సభ్యుల కమిటీతో పాటు ఫైర్, ఫ్యాక్టరీస్ శాఖల అధికారులు నిర్వహించిన తనిఖీల్లోనూ ఇదే అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. లోకేష్ వ్యాఖ్యలపై ఆగ్రహం ప్రమాదం అనంతరం సిబ్బంది కొరత అంశంపై మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కార్మిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల ప్రమాదం జరగలేదని, అదే కారణంగా బాధితుల సంఖ్య తగ్గిందని ఆయన వ్యాఖ్యానించినట్లు ప్రచారం కావడంతో కార్మికులు మండిపడుతున్నారు. వాస్తవానికి తగిన సిబ్బంది, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉండి ఉంటే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి నివారించే అవకాశం ఉండేదని వారు వాదిస్తున్నారు. సిబ్బంది కొరత, పెరిగిన పనిభారం, ఉత్పత్తి ఒత్తిడి, భద్రతా నిబంధనల ఉల్లంఘనలు కలిసి ఈ ఘోర ప్రమాదానికి కారణమయ్యాయని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.21 మంది పని 11 మందితోనే.. సీ్టల్ ప్లాంట్లో ప్రైవేటీకరణ చర్యలు వేగం పుంజుకున్న తర్వాత సిబ్బంది సంఖ్య భారీగా తగ్గిందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. గత కొన్నేళ్లలో దాదాపు 10 వేల మంది ఉద్యోగులు తగ్గిపోవడంతో మిగిలిన వారిపై పనిభారం విపరీతంగా పెరిగిందని చెబుతున్నాయి. ప్రమాదం జరిగిన విభాగంలో సాధారణంగా 21 మంది పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 11 మంది మాత్రమే విధుల్లో ఉన్నారని సమాచారం. అనుభవజ్ఞులైన ఉద్యోగులు, సాంకేతిక నిపుణుల సంఖ్య తగ్గిపోవడంతో పర్యవేక్షణ వ్యవస్థ బలహీనపడిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
రక్తం పంచే దేవుళ్లుప్రాణం నిలిపే బంధువులు
డాబాగార్డెన్స్/విశాఖ విద్య: ఒకరికి మరొకరితో పరిచయం ఉండదు. బంధుత్వం ఉండదు. కులం, మతం, ప్రాంతం అనే భేదాలూ ఉండవు. అయినా ఒకరు ఇచ్చే చుక్క రక్తం మరొకరి ప్రాణాన్ని కాపాడుతుంది. ఓ కుటుంబంలో ఆరిపోతున్న ఆశాదీపాన్ని మళ్లీ వెలిగిస్తుంది. అందుకే స్వచ్ఛంద రక్తదానాన్ని అన్ని దానాలకన్నా గొప్పదానంగా భావిస్తారు. ప్రాణం విలువ తెలిసినవారే రక్తదానం చేస్తారు. అందుకే రక్తదాతలను మానవత్వానికి ప్రతిరూపాలుగా చూస్తారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి ఏడాది జూన్ 14న నిర్వహించడం వెనుక ఉద్దేశం కూడా ఇదే. ప్రాణదానంగా నిలిచే రక్తదానంపై అవగాహన పెంచడం, కొత్త రక్తదాతలను తయారుచేయడం, ఇప్పటికే సేవలందిస్తున్న వారిని గౌరవించడం. ప్రాణం పోసే మానవత్వం రోడ్డు ప్రమాదాలు, ప్రసవాలు, శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్సలు, తలసేమియా వంటి వ్యాధుల చికిత్సలో రక్తం అత్యవసరం. సమయానికి రక్తం అందకపోతే ప్రాణాలు కోల్పోయే ఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఆస్పత్రికి తీసుకొచ్చినా రక్తదాతలు దొరక్క విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి సమయంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చే రక్తదాతలు నిజమైన ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. వారు ఇచ్చే ఒక్క యూనిట్ రక్తాన్ని మూడు భాగాలుగా విభజించి ముగ్గురికి ఉపయోగించవచ్చు. అంటే ఒక రక్తదాత ముగ్గురి జీవితాల్లో వెలుగు నింపగలడు. శతాధిక రక్తదాత... ఎందరికో ప్రాణదాత వన్టౌన్లోని స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు రక్తదాతలలో స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచారు. ఇప్పటివరకు 118 సార్లు రక్తదానం చేసి అనేక మంది ప్రాణాలను కాపాడారు. 2004లో తన ఆప్తురాలు కళావతికి రక్తం అవసరమైన సందర్భం ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆమెను కాపాడలేకపోయినా, రక్తం విలువను గుర్తించిన అప్పారావు అప్పటి నుంచి రక్తదానాన్ని జీవిత లక్ష్యంగా మార్చుకున్నారు. ఇప్పటికే 118 సార్లు రక్తదానం చేయడమే కాకుండా వందలాది మంది యువతను రక్తదానానికి ప్రోత్సహించారు. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పలు సందర్భాల్లో సత్కరించింది. ఆయన బాటలోనే కుమార్తెలు, కుమారులు కూడా ప్రతి ఏడాది రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రక్తదానం చేసిన సూరాడ అప్పారావు(ఫైల్) రక్తదానం చేయాలంటే.. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఆరోగ్యవంతులైన వ్యక్తులు రక్తదానం చేయవచ్చు. రక్తపోటు, హిమోగ్లోబిన్, శరీర ఉష్ణోగ్రత తదితర పరీక్షల అనంతరం మాత్రమే రక్త సేకరణ చేస్తారు. రక్తదానం వల్ల ఎలాంటి వ్యాధులు సంక్రమించవు. రక్తదానం చేసిన తర్వాత 10 నిమిషాల విశ్రాంతి తీసుకుని అల్పాహారం తీసుకుంటే తిరిగి సాధారణ పనులు చేసుకోవచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. బ్లడ్ డోనర్స్ క్లబ్లే జీవనాధారం రక్తదాతలను అవసరమైన వారికి అనుసంధానించడంలో బ్లడ్ డోనర్స్ క్లబ్ల పాత్ర కీలకంగా మారుతోంది. 2019లో ఏర్పడిన విశాఖ బ్లడ్ డోనర్స్ క్లబ్ ప్రస్తుతం 3,800 మంది యాక్టివ్ డోనర్లతో 24 గంటల సేవలు అందిస్తోంది. క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సాసుపల్లి రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 50 వేల యూనిట్ల రక్తం సేకరించగా, 170 యూనిట్ల ప్లాస్మాను కూడా అవసరమైన వారికి అందించారు. రాష్ట్రేతర ప్రాంతాల క్లబ్లు, రెడ్క్రాస్ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ అత్యవసర సమయాల్లో సేవలందిస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో వచ్చే రక్తం కొరతను తీర్చడానికి లైవ్ డోనర్లను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుతున్నారు. -
కూటమిది నమ్మకద్రోహ సభ
సాక్షి,అమరావతి/నెహ్రూనగర్(గుంటూరు)/సాక్షి,విశాఖపట్నం/నెల్లూరురూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన సభ ‘నమ్మకద్రోహ సభ’ అని వైఎస్సార్సీపీ మహిళా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ముందు అలవిగాని హామీలిచ్చి ప్రతి ఇంటికి వెళ్లి సంతకాలతో కూడిన బాండ్ పేపర్లు పంచి, ఓట్లు వేయించుకున్న చంద్రబాబు.. నేడు ‘ఆడబిడ్డ నిధి’ పథకానికి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా 2 కోట్ల మంది మహిళలను వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తాడేపల్లితోపాటు వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ మహిళా నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించారు. కూటమి పాలకుల తీరుపై ధ్వజమెత్తారు.పీ–4తో వంచన : విడదల రజిని తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ పీ–4 అంటూ ప్రగల్భాలు పలుకుతూ ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మహిళలను బాబు వంచిస్తున్నారని విమర్శించారు. ఆడబిడ్డ నిధి హామీ ప్రకారం.. ఒక్కో మహిళకు రెండేళ్లకు రూ. 36 వేల చొప్పున, రాష్ట్రంలోని 2 కోట్ల మంది మహిళలకు కూటమి ప్రభుత్వం రూ. 72 వేల కోట్లు బాకీ పడిందని వివరించారు. ఎన్నికల ముందు రజినీకాంత్లా హామీలు గుప్పించిన బాబు ఇప్పుడు గజినీలా నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. నారా వారికి ‘నారీ శక్తి’ తడాఖా చూపించి గద్దె దించడం ఖాయమని హెచ్చరించారు.చంద్రబాబు చీటింగ్, బోగస్ నాయుడు: వరుదు కళ్యాణి విశాఖపట్నం మద్దిలపాలెంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. చంద్రబాబు ‘చీటింగ్ బోగస్ నాయుడు’ అని విమర్శించారు. రెండేళ్లుగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, ఆడబిడ్డ నిధి హామీకి తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ‘స్వాతిముత్యం’ సినిమాలో కమల్హాసన్లా అమాయకంగా నటించిన బాబు.. నేడు ‘నాయకుడు’ సినిమాలోని కన్నింగ్ పాత్రలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మహిళల ఉసురు తగులుతుంది : కాకాణి పూజిత బాబు సర్కారు తీరును ఎండగడుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత శనివారం ఓ వీడియో విడుదల చేశారు. సర్కారుకు మహిళల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. టీడీపీ అంటే తప్పుడు దొంగల పార్టీ అని దుయ్యబట్టారు. ఆడబిడ్డ నిధి హామీని బాబు అటకెక్కించారని విమర్శించారు. గతంలో వైఎస్ జగన్ సర్కారు ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాల ద్వారా మహిళలకు భారీ లబ్ధి చేకూర్చారని గుర్తుచేశారు. చీటింగ్ కేసు పెట్టాలి : బండి పుణ్యశీలవైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి బండి పుణ్యశీల మాట్లాడుతూ హామీలు గుప్పించి మోసం చేసిన చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. మహిళలను మోసగించిన చంద్రబాబు సర్కారుకు పతనం తప్పదని ధ్వజమెత్తారు. బాబు సర్కారు ఘోర వైఫల్యం: నూరి ఫాతిమా గుంటూరులోని వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ.. రెండేళ్లలో బాబు సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీల అమల్లో బాబు చతికిల పడ్డారని, ఆడబిడ్డ నిధి పథకానికి ఒక్కరూపాయి కేటాయించలేదని ధ్వజమెత్తారు. బాబు సర్కారు తీరు వల్ల పనిఒత్తిడితో సచివాలయ సిబ్బంది ప్రాణాలొదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ ఆ సభకు వెన్నుపోటు సభ అని పెట్టాల్సింది’
విశాఖ: ఏపీలోని రెండు కోట్ల మంది మహిళలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మంది మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఆ పథకానికి తూట్లు పొడిచారన్నారు. తిరుపతి సభకు వెన్నుపోటు సభ అని పేరు పెడితే బాగుండేదని వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. ‘తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టారు..నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు. సీబీఎన్ అంటే చీటింగ్ బోగస్ నాయుడు. దైర్యం ఉంటే ప్రజలు ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ అమలు చేశామని చెప్పాలి. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. లోకేష్ నీ గల్లా పట్టుకొని నిలదీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాపు మహిళలను పవన్ మోసం చేశారు.సూపర్ సిక్స్ అమలు చేసే వరకు పోరాటం చేస్తాం’ అని హెచ్చరించారు. -
లోకేశ్కు అందుకే ఆ శాఖ అప్పగించారా?
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని తెలిపారు.‘‘విద్యాశాఖను చెడగొట్టాలని లోకేశ్కు ఆ శాఖ అప్పగించారా? ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉందా? కూటమి ప్రభుత్వ వెన్నుపోట్లపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాం. భవిష్యత్తులో ఇలాంటి పోరాటాలు మరిన్ని చేయాల్సిన అవసరం ఉంది. రెండేళ్లలో ఏదో సాధించినట్లు వెన్ను పోటీ పార్టీ చెప్పుకుంటోంది. ఇచ్చిన హామీలను ఈ రెండేళ్లలో ఒక్కటైనా నెరవేర్చారా? సూపర్-6, సూపర్-7 పథకాలు అన్నారు.. ఏమయ్యాయి?’’ అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.‘‘ఏపీలో ఒక్క నిమిషం కూడా ఈ ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు. చంద్రబాబు చాలా బేల మాటలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నడపమంటే మాపై ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ పిలుపు మేరకు మా నాయకులు, ప్రజలు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోరాటంలో పాల్గొన్నారు.. పార్టీ నాయకులు అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ఆడబిడ్డ నిధి పథకాన్ని పూర్తిగా ఎత్తేశారు. బంగారు కుటుంబం అన్నారు.. ఇత్తడి కుటుంబం కూడా లేదు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాలకు ఇంతటి ప్రజాధరణ వచ్చింది. అన్నిటి ధరలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వత్తాసు పలుకుతున్న దళారులు బాగుపడుతున్నారు.సామాన్యులు కొనే నిత్యావసరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లోకేశ్ ఛాలెంజ్ లు దేనికి విద్యా శాఖను బాగు చెయ్యడానికా? నాశనం చెయ్యడానికా..? పాఠశాలల ప్రారంభం నాటికే పేద పిల్లలకు బూట్లు, పుస్తకాలు, బట్టలు, బ్యాగ్ ఇచ్చే వాళ్లం. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏ రంగానికీ మంచి జరగడం లేదు. రైతుకు మద్దతుగా ధర లేదు. జొన్న, మామిడి వంటి వాటికి కూడా ధర లేదు. మా హయాంలో ఆక్వా రంగానికి ఇబ్బంది లేకుండా చేశాం. ఇప్పుడు ఆక్వా రంగం పూర్తిగా కుదేలు అయ్యింది.. ఆక్వా రంగంలో ఉన్న వారు కూడా రోడ్డెకుతున్నారు. ఇది వెన్నుపోటు పార్టీ విధానం’’ అన్నారు.మాధవ్వి తప్పుడు వ్యాఖ్యలు.. ఇక పవన్వి..ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు. ‘‘మీ కేంద్ర మంత్రే మా వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని చెప్పారు. కేంద్ర మంత్రి కుమారస్వామి మాటలు అబద్దమా..? లక్షలాది మంది ప్రజల సాక్షిగా ప్రధానిని స్టీల్ ప్లాంట్ కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి అడిగారు.. పవన్ కల్యాణ్.. ఒకరోజు తెలంగాణ.. మరో రోజు ఏపీ అంటారు.పవన్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. మేము 5 సంవత్సరాల్లో చేసిన అప్పు మీరు రెండేళ్లలో చేశారు. మా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేశారు. మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి డీఎస్సీ సక్రమంగా నిర్వహించలేదు. డీఎస్సీని నిర్వహించలేని ప్రభుత్వం ఇది. గ్రామ సచివాలయ ఉద్యోగాలు పాదర్శకంగా ఇచ్చాం.. నేనే మానిటరింగ్ మినిస్టర్ గా ఉన్నాను గర్వంగా చెబుతున్నా. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడా యూరియా దొరకడం లేదు. ఒడిశా నుంచి యూరియా తెచ్చుకొని దాచుకుంటున్నారు. అది కూడా అధిక ధర రూ. 600 కు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. విజయనగరం జిల్లా రైతులు చెప్పిన వాస్తవాలు ఇవి. భవిష్యత్తులో ఇంకా రేటు పెరిగిపోతుందని రైతులు భయపడుతున్నారు. ఇది ముమ్మాటికీ వెన్నుపోటు ప్రభుత్వం.. టీడీపీది వెన్నుపోటు పార్టీ’’ అని తెలిపారు. -
జేసీ ఎదుటే ఆత్మహత్యాయత్నం
ఆనందపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక ఒక్కసారిగా రణరంగంగా మారింది. భూ కబ్జాదారుల వేధింపులతో విసిగిపోయిన ఓ బాధితుడు ఏకంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఆనందపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘ఒక నెల–ఒక నియోజకవర్గం’ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో.. ముకుందపురం గ్రామానికి చెందిన ఓ అర్జీదారుడు తన భూమిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారని, తనకు న్యాయం చేయాలంటూ సభలోకి దూసుకొచ్చాడు. పెద్దగా కేకలు వేస్తూ అలజడి సృష్టించిన అతడు, అంతటితో ఆగకుండా ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను శరీరంపై కుమ్మరించుకున్నాడు. జేసీతో పాటు అక్కడున్న అధికారులు షాక్కు గురయ్యారు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు స్పందించి, అతడిని గట్టిగా పట్టుకుని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. త్వరితగతిన సమస్యల పరిష్కారం అంతకుముందు జేసీ విద్యాధరి మాట్లాడుతూ ఇప్పటికే నాలుగు శుక్రవారాల సందర్శనలు ముగిశాయని, ఇక సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెడతామన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం ఆనందపురం మండలం నుంచి 30 దరఖాస్తులు రాగా.. ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం 190 అప్లికేషన్లు అందినట్లు తహసీల్దార్ ఎస్.శ్రీనివాసబాబు వెల్లడించారు. అలాగే పొడుగుపాలెం గ్రామస్తులు తమ ప్రాంతంలో రోడ్డు విస్తరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వరరావు, ఆర్డీవో సంగీత్ మాధుర్, ఆనందపురం ఎమ్పీడీవో వి.జానకి, భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
అలసట చదువులు వద్దు..
పరీక్ష రద్దయిందని బాధపడుతూ కూర్చోవద్దు. ఇది మరో అవకాశంగా భావించాలి. గత పరీక్షలో చేసిన పొరపాట్ల జాబితాను తయారుచేసుకోవాలి. దీంతో మరింత మెరుగ్గా పరీక్ష రాసే అవకాశం వస్తుంది. వీలైనన్ని మాక్ టెస్టులు రాయడం వల్ల సమయపాలన, ప్రశ్నల ఎంపిక, ఒత్తిడి నిర్వహణ మెరుగవుతాయి. వీటితో పాటు తగినంత నిద్ర, సరైన ఆహారం, కొద్దిపాటి వ్యాయామం మానసిక ప్రశాంతతను పెంచుతాయి. అలసటతో చదివే గంటల కంటే, ఉత్సాహంగా చదివే కొద్ది గంటలే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని గుర్తుంచుకోవాలి. – అలజంగి ఉదయ్కుమార్, లైఫ్ కోచ్ -
కేజీహెచ్లో ఐయుఐ ల్యాబ్ ప్రారంభం
మహారాణిపేట: కేజీహెచ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రసూతి–సీ్త్ర రోగ విజ్ఞాన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇంట్రా యుటరైన్ ఇన్సెమినేషన్ (ఐయుఐ) లేబొరేటరీని శుక్రవారం కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, ఎమ్మెల్యే సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ రంగంలో నాణ్యమైన రీప్రొడక్టివ్ హెల్త్ సేవలు అందుబాటులోకి రావడం కీలక ముందడుగని తెలిపారు. తక్కువ ఖర్చుతో, సురక్షితంగా నిర్వహించగల ఐయుఐ విధానం ద్వారా గర్భధారణ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ల్యాబ్కు అవసరమైన పరికరాలు, మౌలిక సదుపాయాలను ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (అంకోశా) విరాళంగా అందించింది. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తదితరులు పాల్గొన్నారు. -
ఐఐసీఎఫ్ మెగా షాపింగ్ ఫెస్టివల్ ప్రారంభం
మధురవాడ: ఇండియా ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ ఫెయిర్ (ఐఐసీఎఫ్) మెగా షాపింగ్ ఫెస్టివల్ శుక్రవారం మధురవాడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలోని వైజగ్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 16వ తేదీ వరకు 5 రోజుల పాటు సాగే ఈ ఎగ్జిబిషన్ మొదటి రోజే వినియోగదారుల సందడితో కళకళలాడింది. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలు స్కోడా, మహీంద్రా, మారుతీ అరీనా, మారుతి నెక్సా, హెమ్ మోటార్స్, టీవీఎస్, హార్లీ డేవిడ్సన్ వంటి బ్రాండ్లు ప్రత్యేక స్టాల్స్ను ఏర్పాటు చేశాయి. పండగ రాయితీలు, ఎక్ఛేంజ్ బోనస్లు, ప్రత్యేక ఆఫర్లతో ఈ స్టాల్స్ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. హోమ్ ఫర్నీచర్పై 60 శాతం వరకు ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తున్నారు. రూ.10 వేలకు పైగా కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా ప్రతి రోజూ ఒక విజేతకు డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ను బహుమతిగా అందించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు ఉమేష్పాండే, కులదీప్కాల్ కోరారు. -
ఈసారి ‘నీట్’గా రాసేయండి
విశాఖ విద్య: నీట్ పరీక్ష రద్దు వ్యవహారం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేసింది. నెలలు, సంవత్సరాల తరబడి ప్రత్యేక శిక్షణలతో పరీక్ష రాస్తే.. లీకేజీ భూతం విద్యార్థుల భవిష్యత్తు ఆశలపై నీళ్లు చల్లింది. ఈ నేపథ్యంలో జూన్ 21న మళ్లీ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న వేళ.. విద్యార్థులను ఎన్నో సందేహాలు, అనుమానాలు, భయాలు వెంటాడుతున్నాయి. ఆ భయాలను పటాపంచలు చేస్తూ, మనోధైర్యంతో ముందుకు సాగేందుకు మానసిక నిపుణులు, లైఫ్ కోచ్లు పలు సూచనలు చేస్తున్నారు. ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో పరీక్షను ఎలా ఎదుర్కోవాలో ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు వారి మాటల్లోనే.. -
రక్తదాన శిబిరానికి స్పందన
పెందుర్తి : ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అమృత విద్యాసంస్థలు, లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. దాదాపు 30 యూనిట్లు రక్తాన్ని రక్తదాల నుంచి సేకరించారు. రక్తదానం విశిష్టతను వివరించారు. రక్తం దానం చేసిన తర్వాత మళ్లీ కొత్త రక్తం వస్తుందని, ఎలాంటి అపోహలు పడొద్దని హాజరైన విద్యార్థులకు, సిబ్బందికి తెలిపారు. రక్తదానం అన్నిదానాల్లో కల్లా గొప్పదని తెలిపారు. సమయానికి రక్తం లేక కొన్ని లక్షల ప్రాణాలు పోవడం గమనిస్తున్నామని, రక్తం దానం చేసిన తరువాత మళ్లీ కొత్త రక్తం వస్తుందని.. మళ్లీ మళ్లీ దానం చేయవచ్చని చెప్పారు. కార్యక్రమంలో పెందుర్తి పోలీసులు, అమృత విద్యాసంస్థల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్దులు,లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. -
విశాఖ తీరానికి అంతరిక్ష రక్షణ
విశాఖ విద్య: విశాఖ తీరంలో పర్యాటకుల భద్రత కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒక కీలకమైన పరిశోధన ప్రాజెక్టును చేపట్టింది. బీచ్లలో అత్యంత ప్రమాదకరంగా మారే ‘రిప్ కరెంట్ల’ గుర్తింపునకు ప్రాధాన్యత ఇస్తూ ఈ అధ్యయనం సాగనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (సాక్) ఈ ప్రాజెక్టును ఏయూకు మంజూరు చేసింది. రెండేళ్ల కాలవ్యవధి కలిగిన ఈ పరిశోధన మొత్తం వ్యయం సుమారు రూ.22 లక్షలు. సాక్ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ అరుణ్కుమార్, ఏయూ వాతావరణ–సముద్ర శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ సి.వి.నాయుడు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. కృత్రిమ మేధస్సు, ఉపగ్రహ సాంకేతికత ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా కృత్రిమ మేధస్సు(ఏఐ), ఉపగ్రహ సాంకేతికతను ఉపయోగించనున్నారు. సముద్ర గమనాన్ని, వాతావరణ మార్పులను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా విశాఖ తీరంలో రిప్ కరెంట్లు ఎప్పుడు, ఎక్కడ ఏర్పడతాయో ముందస్తుగానే అంచనా వేస్తారు. ఇందుకోసం ప్రత్యేక ఏఐ ఆధారిత హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు. నాలుగు సంస్థల సమన్వయం ఈ పరిశోధన ద్వారా లభించే సమాచారం, ఫలితాలు తీర ప్రాంత భద్రతా పోలీసులు, జీవీఎంసీ, పర్యాటక శాఖ, బీచ్ నిర్వహణ సంస్థలకు ఎంతో ఉపయోగపడతాయి. ప్రమాద సూచనలు సకాలంలో అందడం వల్ల ఆయా ప్రభుత్వ విభాగాలు వెంటనే స్పందించి నివారణ, రక్షణ చర్యలు చేపట్టే వీలుంటుంది. పర్యాటకులకు పెరగనున్న భద్రత ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే బీచ్లలో ప్రమాదవశాత్తూ మునిగిపోయే ఘటనలు, మరణాల సంఖ్య భారీగా తగ్గుతుందని ఏయూ సముద్ర శాస్త్ర విభాగాధిపతి ఆచార్య సి.వి.నాయుడు తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల పట్ల పర్యాటకులకు ముందే అవగాహన కల్పించవచ్చని, తీర ప్రాంత విపత్తుల నివారణలో, ప్రజా భద్రతలో ఇదొక విప్లవాత్మక మార్పు కానుందని ఆయన స్పష్టం చేశారు. -
ముగిసిన ఐఈఎస్ శిక్షణా కార్యక్రమం
మహారాణిపేట: భారత ఆర్థిక సేవ (ఇండియన్ ఎకనామిక్ సర్వీస్–ఐఈఎస్) ట్రైనీ అధికారుల కోసం విశాఖ పోర్ట్ అథారిటీ నిర్వహించిన ఐదు రోజుల ‘మారిటైమ్ ఎకానమీ అండ్ పోర్ట్ మేనేజ్మెంట్’ శిక్షణా కార్యక్రమం శుక్రవారం పోర్టులో ముగిసింది. ఈ నెల 8న పోర్ట్ చైర్పర్సన్ జె.ఎస్.బింద్రా ప్రారంభించిన ఈ శిక్షణా కార్యక్రమంలో మారిటైమ్ ఇండియా విజన్–2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్–2047, సముద్ర అనుసంధానం, బ్లూ ఫైనాన్స్, పర్యావరణ నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, క్రూయి జ్ టూరిజం, పీపీపీ, లాజిస్టిక్స్, రైల్వే, రోడ్డు అనుసంధానం వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖ పోర్ట్ అథారిటీ, హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్లోని వివిధ విభాగాలను సందర్శించే అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా పోర్ట్ చైర్పర్సన్ జె.ఎస్.బింద్రా, ప్రధాన విజిలెన్స్ అధికారి అరుణ్ ప్రసాద్, కార్యదర్శి ఎం.శంకరబాబు ట్రైనీ అధికారులకు సర్టిఫికెట్లు అందజేశారు. -
గ్రీన్, హెల్తీ వైజాగ్ దిశగా కార్యాచరణ
డాబాగార్డెన్స్: విశాఖ నగరాన్ని పచ్చదనం, ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణహిత రవాణా, వారసత్వ పరిరక్షణకు ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జీవీఎంసీ పలు వినూత్న కార్యక్రమాలను చేపడుతోందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక భాగస్వామ్యం, వారసత్వ ప్రదేశాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. జీవీఎంసీ పరిధిలో మొత్తం 174 పార్కులు ఉండగా, వాటిలో 151 ఎకరాల విస్తీర్ణంలో 139 కాలనీ పార్కులు ఉన్నాయని తెలిపారు. వీటిలో మరింత అభివృద్ధి అవసరమైన 60 పార్కులను గుర్తించి, ఆరు ప్యాకేజీలుగా విభజించి రూ.10.97 కోట్ల అంచనా వ్యయంతో ప్రత్యేక థీమ్ పార్కులుగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. జీవీఎంసీ పరిధిలో ప్రతి సోమవారం ‘సైక్లింగ్ డే’గా స్వచ్ఛందంగా పాటించాలని నిర్ణయించినట్లు కమిషనర్ తెలిపారు. సైక్లింగ్ సంస్కృతిని ప్రోత్సహించేందుకు సాగర్నగర్ బీచ్ సమీపంలో 10 అడుగుల వెడల్పుతో 700 మీటర్ల పొడవున బీచ్ ఫ్రంట్ సైక్లింగ్ ట్రాక్ను రూ.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఆరిలోవ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పరిసరాల్లో 2.70 మీటర్ల వెడల్పుతో 5.20 కిలోమీటర్ల పొడవున రూ.3 కోట్ల వ్యయంతో సిటీ సైక్లింగ్ ట్రాక్ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. -
ఏయూలో తాత్కాలిక అధ్యాపక నియామకాలు
విశాఖ విద్య : ఏయూ పరిధిలోని ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల, సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల (ఏ), మహిళా ఇంజినీరింగ్ కళాశాల, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల, డా. బి.ఆర్.అంబేడ్కర్ లా కళాశాల, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్లలో తాత్కాలిక బోధనా నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏయూ క్యాంపస్ కళాశాలలలోని వివిధ విభాగాల్లో సెమిస్టర్ ప్రాతిపదికన క్లాస్వర్క్ బోధన కోసం అర్హులైన అభ్యర్థులను తాత్కాలిక బోధనా ఏర్పాట్ల కింద నియమించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత శాఖాధిపతులు కేటాయించిన బోధనా గంటల ప్రకారం ప్రతి సబ్జెక్టు/పేపర్కు గంటకు రూ.900, ప్రతి ల్యాబ్కు గంటకు రూ.600 చొప్పున పారితోషికం చెల్లిస్తారు. ఒక అభ్యర్థికి సెమిస్టర్కు గరిష్టంగా రూ.1.32 లక్షల వరకు పారితోషికం లభించే అవకాశం ఉంది. ఆన్లైన్ దరఖాస్తులను జూన్ 22లోగా సమర్పించాలి. షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులు ఈ నెల 29 నుంచి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. -
తీరంలో ‘యోగాంధ్ర’
కొమ్మాది: అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా.. శుక్రవారం రుషికొండ బీచ్లో యోగా వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తి మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి, పిల్లల మానసిక ఎదుగుదలకు యోగా ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. ఆధునిక జీవనశైలిలో మంచి ఆరోగ్యానికి యోగా ఒక ఔషధంలా పనిచేస్తుందని పేర్కొన్నారు. జూన్ 15న ముడసర్లోవ గోల్ఫ్ కోర్స్లో, జూన్ 21న ఆర్కే బీచ్లో ప్రధాన వేడుకలు జరగనున్నాయని, ఈ కార్యక్రమాల్లో ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఆర్డీవో సంగీత్ మాధుర్, జిల్లా టూరిజం అధికారి జె.మాధవి, ఇతర అధికారులు, ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. -
పాత తప్పుల విశ్లేషణ అవసరం
రీ–ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వారిలో పరీక్ష భయం సహజంగానే ఉంటుంది. ఒకే సిలబస్ను 24 నుంచి 36 నెలల పాటు చదవడం వల్ల వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే పూర్తిగా సిలబస్ కవర్ చేశారు కాబట్టి, మళ్లీ మొదటి నుంచి చదవడం కంటే.. పాత పరీక్షలో చేసిన తప్పులను విశ్లేషించుకోవాలి. బలహీనంగా ఉన్న కాన్సెప్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిరంతరాయంగా చదవకుండా, మధ్యమధ్యలో ఆరోగ్యకరమైన స్టడీ బ్రేక్స్ తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్ పూజిత జ్యోస్యుల, సైకాలజిస్ట్ -
నిప్పులు
● రెండేళ్ల దగా.. వీధికెక్కిన విశాఖనయవంచనపైచంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, మానవహారాలు, వినూత్న ప్రదర్శనలతో ఆగ్రహావేశం మాటల గారడీతో మభ్యపెట్టి.. ‘సూపర్’ హామీలతో జనాన్ని బురిడీ కొట్టించి అధికార పీఠమెక్కిన చంద్రబాబు వంచన పర్వానికి రెండేళ్లు నిండాయి. గ్రాఫిక్స్ మాయాజాలం, అనుకూల మీడియా అబద్ధాల ప్రచారంతో సాగుతున్న ఈ రెండేళ్ల కూటమి పాలన.. సామాన్యుడి వీపుపై కత్తులు దింపే ‘నయా వెన్నుపోటు’ జమానాగా మారింది. ఎన్నికల ముందు ఎడాపెడా హామీలు గుప్పించి.. అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి పాతరేసి, దోపిడీకి ఎర్ర తివాచీ పరిచిన పాలకుల తీరుపై విశాఖపట్నం భగ్గుమంది. సంపద సృష్టి పేరిట సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్న మోసకారి పాలనను ఎండగడుతూ.. విశాఖ వీధులు శనివారం నిరసన జ్వాలలతో హోరెత్తాయి. చంద్రబాబు మార్క్ దగాను, రెండేళ్ల ’స్వర్ణాంధ్ర’ మాయాజాలాన్ని ప్రజల కళ్లకు కట్టేలా వైఎస్సార్సీపీ శ్రేణులు మహా నగరంలో ఉప్పెనలా ఎగిసిపడ్డాయి. భీమిలి, తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల్లో వేలాది మందితో నిర్వహించిన వినూత్న ఆందోళనలు ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. ఎటుచూసినా పసుపు పార్టీ పాలకుల అరాచకాలను ఎలుగెత్తి చాటుతూ.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో విశాఖపట్నం కదంతొక్కింది. పోలీసుల ఆంక్షలు, అడ్డంకులను సైతం లెక్కచేయకుండా ప్రజా క్షేత్రంలో పాలకుల వైఫల్యాలను వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కడిగిపారేశారు. – సాక్షి, విశాఖపట్నం -
మెడికల్ టెస్టుల ఖర్చు రీయింబర్స్మెంట్
డాబాగార్డెన్స్: జీవీఎంసీ నాన్ పీహెచ్ ఎంప్లాయిస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ తన సభ్యులకు అండగా నిలిచింది. జనరల్ బాడీ తీర్మానం ప్రకారం.. వైద్యుల సూచనతో మెడికల్ టెస్టులు చేయించుకున్న సభ్యులు కారి యల్లయ్య, ఎ.వెంకటేశ్వరగుప్తా, పి.సాయి అనితలకు సొసైటీ అధ్యక్షుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత వీవీ వామనరావు శుక్రవారం రూ.3వేల రీయింబర్స్మెంట్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ ఉన్నప్పటికీ, అది ఆసుపత్రిలో చేరినప్పుడు మాత్రమే వర్తిస్తుందన్నారు. అవుట్ పేషెంట్గా వెళ్లినప్పుడు మెడికల్ టెస్టుల భారం ఉద్యోగులపై పడుతోందని, వారి ఆర్థిక ఇబ్బందులను గమనించే ఈ రీయింబర్స్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి బుద్దల తాతారావు, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గొండు సీతారాం, ప్రధాన కార్యదర్శి గుమ్మడి నర్సింగరావు, కోశాధికారి డొక్కరి పోలిపిల్లి తదితరులు పాల్గొన్నారు. -
ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు.. సైబర్ ఉచ్చులో పడ్డాడు..
సాక్షి, విశాఖపట్నం: ఓ మాజీ సైనికోద్యోగి తన ప్రాంత సమస్యపై పెట్టిన ఫేస్బుక్ పోస్టు అతడిని సైబర్ నేరగాళ్ల బుట్టలో పడేలా చేసింది. విశాఖలోని పాత రేసపువానిపాలెంకు చెందిన మాజీ సైనికోద్యోగి బి. శ్రీనివాసరెడ్డి సీతంపేట, రాజేంద్రనగర్లోని రూ.20 కోట్ల విలువైన 1,843 గజాల జీవీఎంసీ ఖాళీ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని కోరుతూ ఈ నెల 3న మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, టీడీపీ అధికారిక ఫేస్బుక్ పేజీలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. దీన్ని చూసిన సైబర్ నేరగాళ్లు.. శ్రీనివాసరెడ్డి సమస్యను ఆసరాగా చేసుకుని పక్కా ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 7న శ్రీనివాసరెడ్డికి ఓ వాట్సప్ కాల్ వచి్చంది. దానికి మాజీ మంత్రి దేవినేని ఉమా ఫొటో డీపీగా ఉంది. ఫోన్ చేసిన అగంతకుడు తాను దేవినేని ఉమను మాట్లాడుతున్నానని, పార్కు స్థలం సమస్యను రష్యా పర్యటనలో ఉన్న లోకేశ్ తన దృష్టికి తెచ్చారని, దాన్ని పరిష్కరించే బాధ్యత తనకు అప్పగించారని చెప్పాడు. బాధితుడికి అనుమానం రాకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజులతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తున్నట్లు నటించాడు. అంతేకాకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ తదితరులతో తాను వాట్సాప్లో చాట్ చేసినట్లుగా ఫేక్ స్క్రీన్ షాట్లని సృష్టించి బాధితుడికి పంపాడు. నేరుగా జీవీఎంసీ కమిషనర్తో మాట్లాడి పార్కు సమస్యతో పాటు, బాధితుడికి ఉన్న ఖాళీ స్థలాల పన్ను (వీఎల్టీ) సమస్యను కూడా పరిష్కరిస్తానని మభ్యపెట్టాడు. అనుకున్న పనులు పూర్తి కావాలంటే జీవీఎంసీ కమిషనర్కు ముందుగా కొంత ‘ఫార్మాలిటీ అమౌంట్’ ఇవ్వాలని షరతు పెట్టాడు. దీన్ని నమ్మిన బాధితుడు 7న సైబర్ నేరగాడు పంపిన ‘రాథోడ్ సంతోష్’ అనే పేరుతో ఉన్న యూపీఐ క్యూ ఆర్ కోడ్కు ఫోన్ పే ద్వారా రూ.80 వేలు పంపించాడు. ఆ తర్వాత మరుసటి రోజు సాయంత్రం వరకు ఆ వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, వాట్సాప్ డీపీ కూడా తొలగించడంతో తాను మోసపోయానని బాధితుడు గ్రహించాడు. వెంటనే విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో విశాఖ నేతలకు చోటు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో విశాఖ జిల్లాకు చెందిన పలువురు నాయకులకు కీలక బాధ్యతలు దక్కాయి. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నియామకాల్లో భాగంగా రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా కాండ్రేగుల జగదీశ్వరరావు(విశాఖ దక్షిణ), రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా వుడా శ్రీనివాసరావు(విశాఖ తూర్పు) నియమితులయ్యారు. అలాగే రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా సూరాడ అనుదీప్ (విశాఖ పశ్చిమ), కార్యదర్శిగా ఆడారి హరీష్(విశాఖ పశ్చిమ), సంయుక్త కార్యదర్శిగా రేసపు శ్రీనివాసరెడ్డి(విశాఖ పశ్చిమ) నియమితులయ్యారు. ఇక రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా పిల్లి జయప్రద(విశాఖ ఉత్తర)ను నియమించారు. -
పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు చర్యలు
మహారాణిపేట: ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదల స్థలాలను క్రమబద్ధీకరణ చేసి హక్కులు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో రెవిన్యూ అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రెగ్యులరైజేషన్ చేసిన స్థలాల పట్టాలను సీఎం చేతుల మీదుగా ఆగస్ట్ నెలలో పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అనంతరం 22ఏ భూములు, వాటర్ బాడీస్, పంచ గ్రామాల సమస్యలపై చర్చించారు. ఎమ్మెల్యేలు పలు భూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పి.వి.జి.ఆర్.నాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్రాజు, పంచకర్ల రమేష్బాబు, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్వో ఎం.విశ్వేశ్వర నాయుడు, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్ తదితరులు పాల్గొన్నారు. -
వేటకు సన్నద్ధం
మహారాణిపేట: మత్స్య సంపద సంరక్షణ, పునరుత్పత్తి కోసం ఏటా అమలు చేసే 61 రోజుల సముద్ర వేట నిషేధ కాలం ముగియడంతో ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి మళ్లీ వేట ప్రారంభం కానుంది. దీంతో విశాఖ ఫిషింగ్ హార్బర్లో సందడి నెలకొంది. అయితే కొందరు మత్స్యకారులు ఎదురు అమావాస్య సెంటిమెంట్ కారణంగా జూన్ 17 నుంచి బోట్లను సముద్రంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. వేట పునఃప్రారంభం కానుండడంతో మత్స్యకారులు తమ బోట్లకు ఐస్ సమకూర్చుకోవడం, ఇంజిన్ గేర్ బాక్సులు, వాటర్ కేబిన్లు, పంఖాలు, బుష్లు, వలలకు మరమ్మతులు చేయించుకుని సిద్ధం చేసుకుంటున్నారు. 9న హార్బర్లోని గంగమ్మ తల్లి ఆలయంలో మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించి, కొత్త సీజన్కు సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టారు. జిల్లా పరిధిలోని 32 కిలోమీటర్ల తీరప్రాంతం, 18 మత్స్యకార గ్రామాలు, 15 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలపై ఆధారపడి సుమారు 1.15 లక్షల మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 2,547 పడవలు ఉండగా, అందులో 680 మరపడవలు (మెకనైజ్డ్ బోట్లు), 1,208 మోటారు పడవలు, 350 సంప్రదాయ తెప్పలు ఉన్నాయి. ఈ తూర్పు తీరంలో వేటపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25 వేల మంది ఆధారపడి బతుకుతున్నారు. ఇక్కడ మత్స్యకారులు రెండు పద్ధతుల్లో వేట సాగిస్తుంటారు. 10 నుండి 15 రోజుల పాటు సాగే దీర్ఘకాలిక వేటకు 3 వేల లీటర్ల డీజిల్, 10 టన్నుల ఐస్, సిబ్బంది ఆహార ఖర్చులతో కలిపి సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది. అలాగే 4 నుంచి 6 రోజులు సాగే స్వల్పకాలిక వేటకు ఇందులో సగం వరకు ఖర్చవుతుండగా, సంప్రదాయ పడవల వారు రోజువారీ వేట సాగిస్తుంటారు. వేటకు వెళ్లే ప్రతి మరపడవలోనూ లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్లు, ట్రాన్స్పాండర్లు, జీపీఎస్లు తప్పనిసరిగా అమర్చుకుని ఆన్లో ఉంచాలని, వాతావరణ పరిస్థితులను గమనిస్తూ భద్రతా ప్రమాణాలతో వేట సాగించాలని మత్స్యశాఖ జేడీ పి.లక్ష్మణరావు స్పష్టం చేశారు. -
మృత్యువుతో పోరాటం
ఉత్పత్తికి తగ్గ వేతనంపని చేస్తేనే జీతం ఉంటుందంటూ యాజమాన్యం నిబంధనలు ఉత్పత్తి చూపించకపోతే వేతనాల్లో కోతలు విధింపు ఈ భయంతోనే పరిస్థితులు ఎలా ఉన్నా పనిచేస్తున్న కార్మికులు చంద్రబాబు మార్క్ వంచన.. మరణశయ్యపై విశాఖ ఉక్కు నాడు వీర నినాదాలు.. నేడు కేంద్రానికి వంతపాట సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారంలో పరిస్థితులు రోజురోజుకూ ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఉత్పత్తి లక్ష్యాలను జీతాలతో ముడిపెట్టడం వల్ల వేతనాల్లో కోతల భయంతో కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. మరోవైపు అనుభవజ్ఞులైన ఉద్యోగులను బదిలీలు చేయడం, వీఆర్ఎస్ ద్వారా సిబ్బందిని తగ్గించడం వల్ల నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత ఏర్పడి భద్రతా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. దేశంలోని ఇతర స్టీల్ ప్లాంట్లతో పోలిస్తే విశాఖ ఉక్కులో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో మిగిలిన సిబ్బందిపై పనిభారం పెరిగింది. ప్రైవేటీకరణ చర్యలు, సిబ్బంది కొరత, నిర్వహణ లోపాలు కలిసి ప్లాంట్ను సంక్షోభంలోకి నెడుతున్నాయి. కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్లాంట్ని నిర్వీర్యం చేస్తున్న ఈ దుస్థితికి ముమ్మాటికీ ప్రభుత్వాల బాధ్యతారాహిత్యమే కారణమని కార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేగవంతమైన ప్రైవేటీకరణ ప్రక్రియతో విశాఖ ఉక్కు మరణశయ్యపైకి చేరుకుంటోంది. 2021 జనవరిలోనే పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్ కమిటీ తీర్మానం చేయగా, వైఎస్సార్సీపీ పోరాటంతో అది అడుగు ముందుకు పడలేదు. 2024లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ మరింత వేగవంతమైంది. గతంలో ప్రైవేటీకరణను అడ్డుకుంటామని లక్షలాది మంది సాక్షిగా హామీలు ఇచ్చిన చంద్రబాబు, పవన్,లోకేష్ సహా ఇతర నేతలు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు పూర్తిగా వంతపాడుతున్నారు. పార్లమెంటులో ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానమిస్తూ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కార్మికులను వంచనకు గురిచేస్తోంది. -
అర్చకుడి అనుమానాస్పద మృతి
ఆనందపురం: రెండు రోజులుగా కనిపించకుండా పోయిన గుడిలోవ ఆలయ అర్చకుడు కోట్రా కామేశ్వరరావు శర్మ (70) గురువారం ఉదయం అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించారు. ఆలయ సమీపంలో ఆయన మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. శొంఠ్యాం గ్రామానికి చెందిన కామేశ్వరరావు శర్మ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఈ నెల 9న ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహం వద్ద పురుగుల మందు డబ్బాలు లభ్యమవ్వడంతో ఆర్థిక, అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరణానికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భీమిలి సీహెచ్సీ మార్చురీకి తరలించారు. -
భారత షిఫ్పై అమెరికా దళాలు దాడి.. తెలుగు ఇంజనీర్ మృతి
విశాఖ: ఒమన్ తీరంలో అమెరికా దళాలు జరిపిన దాడుల్లో తెలుగు ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నంకు చెందిన సురేష్ అనే మెరైన్ ఇంజనీర్ మృతిచెందాడు. భారత్కు చెందిన షిప్పై ఒమన్ తీరంలో అమెరికా దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తున్న విశాఖ వాసి సురేష్ మృత్యువాత పడ్డారు. 15 ఏళ్ల క్రితం సురేష వివాహం కాగా, ఇద్దరు కుమారులున్నారు. కొన్నేళ్లుగా మర్చంట్ నేవీలో సురేష్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. దాంతో విశాఖలోని శ్రీహరిపురం శ్రీనివాస నగర్లోని సురేష్ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
విశాఖ : ఆంధ్రప్రదేశ్లో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతు రుతుపవనాలు ఏపీ మీదుగా చురుగ్గా కదులుతూ ఉండటమే ఇందుకు కారణంగా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నేడు అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావారి, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షం పడే అవకాశం ఉండటంతో .. ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రేపు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, నంద్యాల,వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది. భారీ వర్షాలు పడే సమయంలో కోస్తా వ్యాప్తంగా 50-60 కిమీ వేగంతో ఈదురు గాలులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది,. కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, ఈదురు గాలులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మరొకవైపు కొన్ని జిల్లాల్లో మాత్రం వడగాల్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
విశాఖ స్టీల్ప్లాంట్లో తప్పిన పెను ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్లో మరోసారి ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. ప్లాంట్లోని ఎస్ఎంఎస్-1 (స్టీల్ మెల్టింగ్ షాప్-1) విభాగంలో ఉన్న ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్లో ద్రవ ఉక్కు (Molten Steel) ల్యాడిల్ నుంచి నేలపైకి పొర్లిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అత్యంత అధిక ఉష్ణోగ్రత వద్ద ఉండే ద్రవ ఉక్కు ఒక్కసారిగా ల్యాడిల్ నుంచి బయటకు రావడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కార్మికులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. లేకపోతే భారీ ప్రాణనష్టం సంభవించేదే.ఘటన అనంతరం ప్లాంట్ భద్రతా సిబ్బంది, సాంకేతిక నిపుణులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ద్రవ ఉక్కు లీకేజీకి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం.ఇటీవల కూడా(సోమవారం) స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎంఎస్-2 నుంచి సలసలా మరిగే ఉక్కు ద్రవం మీద పడి 9 మంది కార్మికులు మరణించారు. మరికొందరికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో.. భద్రతా ప్రమాణాలపై కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనతో మరోసారి ప్లాంట్లో భద్రతా వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


