breaking news
Visakhapatnam
-
ఏపీలో సమ్మె సైరన్ మోగించిన జూనియర్ డాక్టర్లు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. అత్యవసర సేవలు మినహా విధులను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. దీంతో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. సూపరింటెండెంట్ కార్యాలయం వద్దకు చేరుకున్న జూనియర్ డాక్టర్లు.. స్టైఫండ్ పెంచకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కాగా, ప్రభుత్వ ఆస్పత్రులను నమ్ముకున్న పేద రోగులకు ‘సమ్మె’ కష్టాలు మొదలయ్యాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు (జూడాలు) మంగళవారం నుంచి నిరవధిక సమ్మెబాట పట్టారు. సోమవారం అమరావతి వైద్య ఆరోగ్యశాఖ వైద్య విద్యా డైరెక్టర్(డీఎంఈ), ఇతర అధికారులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో నిరవధిక సమ్మెలోకి దిగుతున్నట్లు జూడాలు ప్రకటించారు. దీంతో కేజీహెచ్తో పాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు విఘాతం కలుగుతుంది.సమ్మెలో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపీ సేవలను జూనియర్ డాక్టర్లు పూర్తిగా నిలిపివేస్తున్నారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతామని వెల్లడించారు. ఆస్పత్రుల్లో రోజూ వార్డుల నిర్వహణ, శస్త్రచికిత్సలు, పరీక్షలు చేయడంలో పీజీ డాక్టర్లు, హౌస్సర్జన్లదే కీలక పాత్ర. వీరంతా విధులకు దూరం కావడంతో దూర ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వచ్చే వేలాది మంది పేద రోగులు, వృద్ధులు, గర్భిణులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.ఈ ఏడాది జనవరి నుంచి రావాల్సిన స్టైపెండ్ పెంపును వెంటనే విడుదల చేయాలని, చెల్లింపులను క్రమబద్దీకరించాలని జూనియర్ డాక్టర్ల సంఘం నాయకుడు డాక్టర్ శిరాజ్ డిమాండ్ చేశారు. డీఎంఈతో చర్చలు విఫలమవడంతోనే సమ్మెకు దిగామన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీలను అమలు చేయాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఏపీజేయూడీఏ నేతలు హెచ్చరించారు. -
తాగునీటి ఇబ్బందులు రాకూడదు
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అల్లిపురం: నగరంలో తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నీటిని సరఫరా చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. రష్యా పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే ఆదివారం రాత్రి టౌన్ సర్వీస్ రిజర్వాయర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీటి సరఫరా పరిస్థితి, డయల్ ఏ ట్యాంకర్, ఆన్లైన్ బుకింగ్ వివరాలను పరిశీలించారు. కేఆర్ఎం కాలనీ, ముడసర్లోవ పరిసరాలు, ఆరిలోవలోని 10, 11, 12, 13 వార్డులు, పెదవాల్తేరు డాక్టర్స్ కాలనీ ప్రాంతాల్లో మూడు రోజులపాటు జీవీఎంసీ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేయాలని చెప్పారు. సోమవారం ఉదయం కేఆర్ఎం కాలనీలో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. -
వేతనాలైనా పెంచండి.. జైల్లోనైనా పెట్టండి!
అఖిలపక్ష కార్మిక సంఘాలు జైల్ భరో డాబాగార్డెన్స్: క్విట్ ఇండియా స్ఫూర్తితో కార్మిక హక్కుల పరిరక్షణ కోరుతూ అఖిలపక్ష కార్మిక సంఘాలు సోమవారం నిర్వహించిన జైల్ భరో నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ‘వేతనాలైనా పెంచండి.. జైల్లోనైనా పెట్టండి’ అంటూ కార్మికులు చేసిన నినాదాలతో జగదాంబ జంక్షన్ మార్మోగింది. సీఐటీయూ కార్యాలయం నుంచి కార్మికులు, నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా కలెక్టరేట్ వైపు బయలుదేరగా పోలీసులు వారిని నిలువరించారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపగా, వారిని పోలీసులు అరెస్ట్ చేసి టూటౌన్, ఫోర్త్టౌన్ స్టేషన్లకు తరలించారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలి ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.31 వేలు చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాలను రద్దు చేసి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఎం.జగ్గునాయుడు, మంత్రి రాజశేఖర్, ఆదినారాయణ, జీఎస్జే అచ్యుతరావు, కనకారావు, లక్ష్మీ, కె.హేమలత, బి.జగన్, ఎం.సుబ్బారావు, వెంకట్రావు, ఆర్.లక్ష్మణమూర్తి, యు.రాజు, బంగారునాయుడు, మేరీ, మంగశ్రీ, ఝాన్సీ, పద్మ, రమణ, ఏఐటీయూసీ నాయకులు ఎం.మన్మథరావు, పడాల రమణ, ఐఎన్టీయూసీ నాయకుడు ఈశ్వరరావు, సీఎఫ్టీయూఐ నాయకుడు నరేష్ పాల్గొన్నారు. -
భీమిలిలో బైఠాయింపు
భీమిలిలో సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆధ్వర్యంలో చిట్టివలస ఫుట్బాల్ గ్రౌండ్ వద్దకు ఉదయం 10.30 గంటలకు పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. ర్యాలీ ప్రారంభానికి ముందే సుమారు 200 మంది పోలీసులు అక్కడికి చేరుకుని నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. చిన్న శ్రీను నోటీసు తీసుకోకపోవడంతో స్థానిక నేతలకు అందించారు. ర్యాలీ నిర్వహించలేదని, అరెస్టు చేసే అధికారం లేదని చిన్న శ్రీను పోలీసులతో వాదించారు. అనంతరం కోలాటం నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరకు అక్కడే కోలాటం, తీన్మార్తో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైదానం వద్ద బైఠాయించి సుమారు గంటన్నరపాటు నిరసన కొనసాగించారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 126 వినతులు
అల్లిపురం : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం జీవీఎంసీకి సంబంధించిన మొత్తం 126 వినతులు అందినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. వీటిలో పట్టణ ప్రణాళిక విభాగానికి 65, ఇంజినీరింగ్కు 24, రెవెన్యూకు 12, ప్రజారోగ్యానికి 9, ఇతర విభాగాలకు చెందిన వినతులు ఉన్నాయి. ప్రతి ఫిర్యాదును అదే రోజు పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే పురమిత్ర, పీజీఆర్ఎస్లో పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను కూడా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. జోనల్ కమిషనర్లు, అధికారులు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. -
ఐటీ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలి
మహారాణిపేట: విశాఖ జిల్లాలో మంజూరైన ఐటీ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా గ్రౌండింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను, కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో 27 ఐటీ కంపెనీల ప్రతినిధులతో వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల గ్రౌండింగ్ పురోగతి, వివిధ అనుమతులు, క్లియరెన్సుల పరిస్థితిని సమీక్షించారు. కంపెనీలకు అవసరమైన అనుమతులను త్వరగా మంజూరు చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కంపెనీల ప్రతినిధులతో విడివిడిగా మాట్లాడి, ఎదురవుతున్న సమస్యలు, పొందాల్సిన అనుమతుల వివరాలను తెలుసుకున్నారు. అక్టోబర్లో విశాఖలో ప్రాంతీయ పెట్టుబడుల సదస్సు జరగనున్న నేపథ్యంలో అప్పటిలోగా ప్రాజెక్టుల గ్రౌండింగ్ పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఆర్డీవో సంగీత్ మాథుర్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆదిశేషు, ఏపీఐఐసీ జెడ్ఎం సింహాచలం, జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
వీఈఆర్తో విస్తృత అవకాశాలు
బీచ్రోడ్డు: విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) అభివృద్ధితో ఆర్థిక, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని నీతి ఆయోగ్ సభ్యుడు ఆర్.బాలసుబ్రహ్మణ్యం ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం వీఎంఆర్డీఏ కార్యాలయంలో వీఈఆర్పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఈఆర్ పరిధిలో పర్యాటకులను ఆకర్షించే ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని, తద్వారా పర్యాటక రంగంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే భారీగా పెట్టుబడులు రావడంతో పలు పరిశ్రమల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ప్రచారం రాష్ట్ర పర్యాటక రంగానికి బ్రాండ్ ఇమేజ్ పెంచేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. పురాతన సంపదను పరిరక్షించడంతో పాటు దివ్యాంగులు సహా అన్ని వర్గాలకు అనుకూలమైన మౌలిక వసతులు కల్పించాలని, నీటి ఆధారిత వినోద కార్యక్రమాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. వీఈఆర్ సీఈవో యువరాజ్.. వీఈఆర్లో భాగంగా విశాఖ బే సిటీ అభివృద్ధి, తీర ప్రాంతంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై వివరించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పట్టణ మౌలిక వసతులు, భూగర్భ డ్రైనేజీ, సీబీడీ అభివృద్ధి, మురికివాడల పునరాభివృద్ధి, తాగునీటి సమస్య పరిష్కారం, ప్రతిపాదిత మెట్రో రైల్ ప్రాజెక్టు తదితర అంశాలను తెలియజేశారు. జిల్లా పర్యాటకాభివృద్ధి అధికారి మాధవీలత ఏపీ హోమ్స్టే పథకానికి లభిస్తున్న ఆదరణను ప్రస్తావించారు. అనంతరం ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్, పరిశ్రమలు, పోర్టులు, హోటళ్లు, బ్యాంకింగ్, సీ ఫుడ్, ఉక్కు, ఫార్మా తదితర రంగాల ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడులు, అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై చర్చించారు. -
డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీకి 41 వినతులు
మహారాణిపేట: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి ఈ వారం 41 వినతులు అందాయి. విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో వినియోగదారులు లో–వోల్టేజ్, విద్యుత్ లైన్ల మార్పు, విద్యుత్ బిల్లులు, రూఫ్టాప్ సోలార్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు తదితర సమస్యలను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. అందిన వినతులను సంస్థ సీఎండీ పృథ్వితేజ్ ఇమ్మడి పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబర్ 9493681912కు సందేశం పంపడం ద్వారా కూడా తమ సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవచ్చని ఏపీఈపీడీసీఎల్ తెలిపింది. కార్యక్రమంలో డైరెక్టర్లు టీవీ సూర్యప్రకాష్, సీజీఎం పి. సోల్మన్ రాజు, జనరల్ మేనేజర్లు ఎం. ఝాన్సీ, వీవీఎస్ఎన్వీ ప్రసాద్, వీవీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా అర్జీలపై నిర్లక్ష్యం వద్దు
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించి ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 403 అర్జీలు అందగా.. జీవీఎంసీకి 64, రెవెన్యూ శాఖకు 30, పోలీసు శాఖకు 27, ఇతర శాఖలకు 282 ఉన్నాయి. అర్జీలను శాఖల వారీగా క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, అంతరశాఖల సమన్వయంతో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారులకు ఎప్పటికప్పుడు పురోగతి వివరాలు తెలియజేయాలని సూచించారు. కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ప్రజలకు లేకుండా అధికారులు సత్వరం స్పందించాలని, అలసత్వం, నిర్లక్ష్యానికి తావివ్వకుండా పనిచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, ఏడీసీ సత్యవేణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పోలీస్ పీజీఆర్ఎస్కు 130 ఫిర్యాదులు
అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 130 ఫిర్యాదులు అందినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని సబ్డివిజన్ ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సీపీ స్వయంగా పాల్గొని బాధితుల సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. అందిన ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, భూ వివాదాలు, భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాలు, మోసాలకు సంబంధించిన కేసులు అధికంగా ఉన్నట్లు తెలిపారు. -
మెగా డీఎస్సీ మోసంపై ప్రశ్నిస్తే అరెస్టులా?
అల్లిపురం: మెగా డీఎస్సీ విషయంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత నిరసనలను అడ్డుకోవడం, నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్ట్లను ఖండిస్తూ సోమవారం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో వారు మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ కల్పించిందన్నారు. నిరుద్యోగుల సమస్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సింది పోయి, ప్రశ్నిస్తున్న వారిని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అరెస్ట్ చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు బాజా నాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ, రాష్ట్ర జనరల్ సెక్రటరీ కర్ణం కృష్ణ, రాష్ట్ర సెక్రటరీ శ్రీనివాస్, గాజువాక నాయకులు గిల్బర్ట్, నార్త్ నియోజకవర్గం సెక్రటరీ వి.చెన్నారావు, పైడితల్లి నాయుడు, సింహాద్రి, అనిల్కుమార్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతల ఆగ్రహం -
అవగాహనతోనే హెచ్ఐవీ నివారణ సాధ్యం
మహారాణిపేట: హెచ్ఐవీ/ఎయిడ్స్పై ప్రజల్లో సరైన అవగాహన పెంపొందించడం ద్వారానే వ్యాధి వ్యాప్తిని అరికట్టడం సాధ్యమవుతుందని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ రూపొందించిన హెచ్ఐవీ/ఎయిడ్స్ అవగాహన ప్రచార పత్రాలు, ఆరోగ్య కరదీపిక పుస్తకాన్ని సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జేసీ జి.విద్యాధరి, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భధారణకు ముందు దంపతులు హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవడం, పరస్పర విశ్వాసంతో జీవించడం, వాడిన సూదులు, సిరంజీలను ఇతరులతో పంచుకోకుండా ఉండడం, అవసరమైనప్పుడు సురక్షిత రక్తాన్నే వినియోగించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ చట్టం–2017 ప్రకారం హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తులపై వివక్ష చూపడం చట్టరీత్యా నేరమని, సమానత్వ భావనతో వ్యవహరించాలన్నారు. అవసరమైన సమాచారం, సలహాల కోసం టోల్ఫ్రీ హెల్ప్లైన్ 1097ను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ నరేంద్ర సింగ్, ఏడీసీ సత్యవేణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తల్లిని కోల్పోయిన చిన్నారికి ప్రభుత్వ ఆసరా కరువు
90 శాతం వైకల్యం.. పింఛన్ మాత్రం దూరం మహారాణిపేట: పుట్టుకతోనే దివ్యాంగురాలైన బాలికకు దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని ఆమె కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో బాలిక తండ్రి షేక్ హామాజ్ వినతిపత్రం సమర్పించారు. అయితే ప్రస్తుతం కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం లేదని అధికారులు తెలియజేయడంతో కుటుంబ సభ్యులు నిరాశ చెందారు. పెదవాల్తేర్కు చెందిన తొమ్మిదేళ్ల షేక్ ఫజిల్లా పుట్టుకతోనే మూగ, చెవిటి దివ్యాంగురాలు. సదరం ధ్రువీకరణ పత్రంలో 90 శాతం వైకల్యం నమోదైనప్పటికీ ఇప్పటి వరకు పింఛన్ మంజూరు కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల బాలిక తల్లి షేక్ దిల్షా మృతి చెందడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చిన్నచిన్న పనులు చేసి జీవనం సాగించే తండ్రి బాలిక సంరక్షణ కోసం పనులకు వెళ్లలేకపోతున్నాడని, ప్రస్తుతం అమ్మమ్మకు వచ్చే నెలకు రూ.4 వేల పింఛన్పైనే కుటుంబం ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు. -
జూనియర్ వైద్యుల సమ్మెబాట
మహారాణిపేట: ప్రభుత్వ ఆస్పత్రులను నమ్ముకున్న పేద రోగులకు ‘సమ్మె’ కష్టాలు మొదలయ్యాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు (జూడాలు) మంగళవారం నుంచి నిరవధిక సమ్మెబాట పట్టారు. సోమవారం అమరావతి వైద్య ఆరోగ్యశాఖ వైద్య విద్యా డైరెక్టర్(డీఎంఈ), ఇతర అధికారులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో నిరవధిక సమ్మెలోకి దిగుతున్నట్లు జూడాలు ప్రకటించారు. దీంతో కేజీహెచ్తో పాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర విఘాతం కలగనుంది. ఓపీలు బంద్.. స్తంభించనున్న సేవలు సమ్మెలో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపీ సేవలను జూనియర్ డాక్టర్లు పూర్తిగా నిలిపివేస్తున్నారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతామని వెల్లడించారు. ఆస్పత్రుల్లో రోజూ వార్డుల నిర్వహణ, శస్త్రచికిత్సలు, పరీక్షలు చేయడంలో పీజీ డాక్టర్లు, హౌస్సర్జన్లదే కీలక పాత్ర. వీరంతా విధులకు దూరం కావడంతో దూర ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వచ్చే వేలాది మంది పేద రోగులు, వృద్ధులు, గర్భిణులు తీవ్ర అవస్థలు పడనున్నారు. హామీలు నెరవేర్చేవరకు తగ్గేదే లేదు ఈ ఏడాది జనవరి నుంచి రావాల్సిన స్టైపెండ్ పెంపును వెంటనే విడుదల చేయాలని, చెల్లింపులను క్రమబద్ధీకరించాలని జూనియర్ డాక్టర్ల సంఘం నాయకుడు డాక్టర్ శిరాజ్ డిమాండ్ చేశారు. డీఎంఈతో చర్చలు విఫలమవడంతోనే సమ్మెకు దిగామన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీలను అమలు చేయాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఏపీజేయూడీఏ నేతలు హెచ్చరించారు. -
పశ్చిమలో ముందుగానే అడ్డుకట్ట
బాజీ జంక్షన్లోని విజేత సూపర్మార్కెట్ సమీపంలో ఉదయం 10.30 గంటలకు ర్యాలీ ప్రారంభించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. నియోజకవర్గ పరిశీలకుడు జహీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభమైన వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వలేదంటూ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగానే పోలీసులు చుట్టుముట్టారు. జహీర్ అహ్మద్, మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు సహా 10 మందిని అరెస్టు చేసి ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్కు తరలించారు. -
వైజాగ్ మారథాన్కు ఏఐఎంఎస్ గుర్తింపు
మహారాణిపేట: వైజాగ్ మారథాన్కు అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మారథాన్స్ అండ్ డిస్టెన్స్ రేసెస్ (ఏఐఎంఎస్) ధ్రువీకరణ లభించింది. వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నవంబర్ 29న నిర్వహించనున్న ‘సంధ్యా మైరెన్స్ వైజాగ్ మారథాన్’ ఐదో ఎడిషన్ వివరాలను నిర్వాహకులు సోమవారం బీచ్రోడ్డులోని ఓ హోటల్లో వెల్లడించారు. నాలుగు కేటగిరీల్లో మారథాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న రన్నర్లు వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. విజేతలకు మొత్తం రూ.12 లక్షల విలువైన బహుమతులు అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంధ్యా మైరెన్స్ లిమిటెడ్ డైరెక్టర్ అరుణ్ కొరగ్రుంట, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, అరిలోవ అపోలో హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ కృష్ణ ప్రసాద్, వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్, ఫైజర్ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సైట్ హెడ్ రవిచందర్ కట్టా, శ్రీకన్య ఐరన్–స్టీల్స్ చైర్మన్ శ్రీనివాస్ దుద్దుపూడి, జ్యువెలరీ హౌస్ చైర్మన్ శ్యామ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రతినిధులు, వైజాగ్ రన్నర్స్ సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్ కంచెటి, కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
పెందుర్తి: పదుల సంఖ్యలో దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్న ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పెందుర్తి పోలీసులు అరెస్టు చేశారు. సుజాతనగర్లోని ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో మొత్తం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం విభాగం డీసీపీ లతామాధురి వివరాలు వెల్లడించారు. సుజాతనగర్ సీ–2 జోన్లో నివాసం ఉంటున్న ఇలపండ షణ్ముఖ శ్రీధర్ ఒక ప్రైవేటు కళాశాలలో మెడిసిన్ పీజీ చదువుతున్నాడు. గత నెల 22న శ్రీధర్ తన కుటుంబంతో కలిసి గుంటూరు వెళ్లి, తిరిగి 31న ఇంటికి వచ్చారు. అయితే ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి, బీరువాలో ఉన్న 6 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి వస్తువులను దుండగులు ఎత్తుకుపోయినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పెందుర్తి క్రైం విభాగం ఎస్ఐ డి.సూరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను గుర్తించారు. దొంగతనానికి పాల్పడింది డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరానికి చెందిన కట్టా శివశంకర్ అలియాస్ లడ్డు (87 దొంగతనం కేసులు), పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన మండెలా నాగభాస్కర్ అలియాస్ బాబీ (82 దొంగతనం కేసులు), కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన మడగల విజయ్కుమార్ (86 దొంగతనం కేసులు) అని తేల్చారు. నిందితుల కోసం గాలిస్తుండగా సోమవారం మధ్యాహ్నం సరిపల్లి వద్ద వారు పట్టుబడినట్లు డీసీపీ వెల్లడించారు. సమావేశంలో ఏడీసీపీ రమ్య, ఏసీపీ వెంకటరావు, సీఐ తిరుమలరావు, ఎస్ఐలు డి.సూరిబాబు, తేజేశ్వరరావు, సూర్యప్రకాషరావుతో పాటు సిబ్బంది శ్రీనివాసరావు, మురళి, పేరయ్యనాయుడు, గణేశ్వరరావు, శివప్రసాద్, జానకిరామ్, శివకృష్ణ, శ్యాంసుందరరెడ్డి, శ్రీనివాసరావు, మహేష్, రామకృష్ణ, దేముడునాయుడు, తాతారావు తదితరులు పాల్గొన్నారు. -
తూర్పులో అరెస్టుల పర్వం
విశాఖ తూర్పు నియోజకవర్గంలో 13వ వార్డు ఆరిలోవ లాస్ట్ బస్టాప్ వద్ద వైఎస్సార్ విగ్రహం నుంచి ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. సుమారు 400 మంది పార్టీ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. ర్యాలీ పాయింట్ వద్ద పోలీసులు నోటీసులు అందించారు. అయినా ర్యాలీకి ప్రయత్నించడంతో సుమారు 100 మంది పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మొల్లి అప్పారావు, నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణకుమారితోపాటు మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారిని చెదరగొట్టారు. అయినప్పటికీ డీఎస్సీ అక్రమాలపై నిరసనకారులు నినాదాలు కొనసాగించారు. తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావును పోలీసు స్టేషన్కు తరలిస్తున్న పోలీసులు -
సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై కేసు నమోదు!
సాక్షి,విశాఖ: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై విశాఖపట్నంలో కేసు నమోదైంది. తనపై బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖలోని ఎంవీపీ కాలనీ పోలీసులు రాహుల్ సిప్లిగంజ్తో పాటు మరో 11 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సదరు యువతి తన ఫిర్యాదులో రాహుల్పై పలు తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు సమాచారం. యువతి సమర్పించిన వివరాలు, ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రస్తుతం కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
అపార ప్రతిభ.. అకాల మరణం!
ఆంధ్రప్రదేశ్: టేబుల్ టెన్నిస్ బోర్డుపై ర్యాకెట్ పట్టి ప్రత్యర్థులను చిత్తుచేస్తూ.. రాష్ట్రస్థాయి పతకాలు సాధిస్తున్న ఆ చిరుచేతులు ఇక కదలవు. పట్టుదలతో కష్టపడి భవిష్యత్తులో దేశం గర్వించే క్రీడాకారుడిగా ఎదుగుతాడనుకున్న ఆ బాలుడి నవ్వులు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఒక చిన్నపాటి శారీరక లోపాన్ని సరిచేసుకుందామని ఆస్పత్రికి వెళ్తే.. విధి వెక్కిరించడంతో ఆ చిన్నారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. కంటికి రెప్పలా కాపాడుకున్న కంటిపాప కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. అంతటి తీరని దుఃఖంలోనూ కుమారుడి నేత్రాలను దానం చేసి మరొకరి జీవితాల్లో వెలుగులు నింపారు.పతకాల రేసులో నిలిచి..బుచ్చిరాజుపాలెంలో నివాసముంటున్న తిరుమలరాజు హరిబాబు, భవానీ దంపతుల కుమారుడు హర్షవర్ధన్వర్మ (12) స్థానిక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చదువుతో పా టు ఆటల్లోనూ ఎంతో చురుగ్గా ఉండే హర్షవర్ధన్.. తనకు ఎంతో ఇష్టమైన టేబుల్ టెన్నిస్ను ఎంచుకున్నాడు. క్రమశిక్షణతో సాధన చేస్తూ అండర్–12 విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాడు. ఎన్నో పతకాలు సాధించాడు.లోపాన్ని సరి చేసుకోవాలనుకుంటే..బాలుడిలో ఉన్న చిన్నపాటి శారీరక లోపాన్ని సరిచేసేందుకు ఇటీవల ఒక ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించారు. అయితే దురదృష్టవశాత్తు ఆరోగ్యం విషమించడంతో మృత్యువుతో పోరాడుతూ ఆదివారం హర్షవర్ధన్ కన్నుమూశాడు. హర్షవర్ధన్ భౌతికకాయాన్ని తరలించేందుకు బంధువు అశోక్ పెందుర్తిలోని ‘సాయి హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్’ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ను సంప్రదించారు. ఆ సమయంలో శ్రీనివాస్ నేత్రదానం కోసం వివరించగా.. పుట్టెడు శోకంలో ఉన్న తల్లిదండ్రులు హరిబాబు, భవానీ ఏమాత్రం సంకోచించకుండా అంగీకరించారు. -
నిరసనలను అడ్డుకోవడం అప్రజాస్వామికం
సాక్షి, విశాఖపట్నం: మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నిరుద్యోగుల హక్కుల సాధన కోసం చేపడుతున్న శాంతియుత నిరసనలపై పోలీసులు ఆంక్షలు విధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును అణచివేయడం సరికాదని విమర్శించారు. యువత, నిరసనకారులపై విధించిన పోలీసు ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే నెరవేర్చాలని, బాధ్యతాయుత ప్రతిపక్షంగా విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. -
ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షించొద్దు
డాబాగార్డెన్స్: ఉపాధ్యాయులు, ప్రభుత్వ విద్యా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి హెచ్చరించారు. ఆదివారం డాబాగార్డెన్స్లో ఎస్టీయూ జిల్లా అధ్యక్షురాలు పి.పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు, మధ్యంతర భృతి ప్రకటన, పెండింగ్ బకాయిల విడుదల, కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులపై వివిధ యాప్ల నిర్వహణ, సర్వేల పేరుతో పెరిగిన బోధనేతర పనుల భారాన్ని తగ్గించి, విద్యాబోధనకే పరిమితం చేయాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి జోసెఫ్ సుధీర్బాబు, నాయకులు కోరారు. పాఠశాలల్లో ఖాళీల భర్తీ, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. సమస్యలపై స్పందించకపోతే అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకుని ఐక్య పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పైడిరాజు, అనకాపల్లి జిల్లా నాయకులు ఐవీ రామిరెడ్డి, పరదేశి, వరహాల దొర తదితరులు పాల్గొన్నారు. -
హోమియో వైద్యంలో నూతన ఆవిష్కరణలు
మహారాణిపేట: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజీషియన్స్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సిరిపురంలోని హోటల్ టైకూన్లో ‘రెమెడీ– రిఫ్రెష్’ అనే అంశంపై నిరంతర వైద్య విద్యా కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పి.రాఘవేంద్రరావు మాట్లాడుతూ వైద్యులు నూతన విద్యా ఆవిష్కరణలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. రెమెడీ–రిఫ్రెష్ అంశంపై డాక్టర్ కె.ప్రీతి, ప్రైమ్ హోమియో ఇన్సైట్స్–అత్యవసర పరిస్థితుల్లో హోమియో చికిత్సలపై డాక్టర్ వాకా సునీత, హోమియో లాక్ రెమిడీస్–వాటి విశిష్టత’పై డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు. డాక్టర్లు జగదాత్రి, ఆర్. శ్రీదేవి హోమియో మెడి క్విజ్ నిర్వహించారు. వచ్చే నవంబర్లో హైదరా బాద్లో జరగబోయే అంతర్జాతీయ హోమి యోపతిక్ సదస్సు బ్రోచర్ను జాతీయ సలహాదారులు కె.శర్మ, జి.రాజేంద్రప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి పి.బి.కె.సతీష్, రాష్ట్ర ఉప కార్యదర్శి పి.చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పి. రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. హోమియో వైద్యులందరూ సదస్సుకు హాజరుకావాలని కోరారు. -
ఏనుగుల సంరక్షణపై అవగాహన ర్యాలీ
మహారాణిపేట: ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఆదివారం ఆర్.కె.బీచ్ నుంచి వైఎంసీఏ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ సెల్ ఆధ్వర్యంలో ర్యాలీతో పాటు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఏనుగుల ప్రాధాన్యంపై పాఠశాల విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సహకారంతో విశాఖ వ్యాలీ స్కూల్లో పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో జూనియర్ (6–8 తరగతులు), సీనియర్ (9–12 తరగతులు) విభాగాల్లో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు ఈ నెల 13న జరిగే కార్యక్రమంలో బహుమతులు అందజేయనున్నారు. కార్యక్రమంలో నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ డైరెక్టర్ జనరల్ నాజ్ రిజ్వీ, చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (సీసీఎఫ్) ఐకేవీ రాజు, జిల్లా అటవీ శాఖాధికారి రవీంద్ర ధామా, విశాఖ జూ క్యూరేటర్ మంగమ్మ, విశాఖ వ్యాలీ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ ఈశ్వరి ప్రభాకర్, శాస్త్రవేత్త డాక్టర్ సీఆర్ మగేష్ తదితరులు పాల్గొన్నారు. -
ముడసర్లోవ జలాశయాన్ని కాపాడుకుందాం!
ఆరిలోవ: గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రీన్ విశాఖ ఆధ్వర్యంలో ముడసర్లోవ వాకర్స్తో కలిసి నిరసన చేపట్టారు. ముడసర్లోవ వాకర్స్ క్లబ్ సభ్యులు, నడకకు వచ్చిన మహిళలు గ్రీన్ విశాఖ ప్రతినిధులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ‘ముడసర్లోవ జలాశయాన్ని కాపాడుకుందాం’, ‘ప్రాణాలకు ముప్పు కలిగించే గూగుల్ డేటా సెంటర్ మాకొద్దు’, ‘పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అంటూ నినదించారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో స్థానికంగా ఎదురయ్యే పరిణామాలు, పర్యావరణానికి కలిగే ముప్పు గురించి గ్రీన్ విశాఖ ప్రతినిధులు వివరించారు. పర్యావరణానికి హాని కలిగించే డేటా సెంటర్ ఏర్పాటును ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. పచ్చదనాన్ని కాపాడుకునేందుకు, డేటా సెంటర్ ప్రతిపాదనను రద్దు చేసే వరకు పోరాడతామని తెలిపారు. కార్యక్రమంలో గ్రీన్ విశాఖ ప్రతినిధులు రామమోహన్రావు, కాంతారావు పాల్గొన్నారు. -
భూములకు గ్రహణం!
22ఏ మాయాజాలం.. మహారాణిపేట: భూమి చేతిలో ఉన్నా.. హక్కులు అనుభవించలేని దుస్థితి. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నా.. రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితి. ప్రభుత్వ రికార్డుల్లో భూమి ఉన్నా.. ‘22ఏ’ నిషేధిత జాబితాలో పడితే చాలు అన్నీ కష్టాలే. ప్రభుత్వం 22ఏ సమస్యల పరిష్కారానికి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. విశాఖ జిల్లాలోని పలు మండలాల్లో భూములకు ‘22ఏ’ చిక్కుముడిగా మారిందని భూ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్లో 120 ఫైళ్లు విశాఖ జిల్లాలో 22ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలంటూ వచ్చిన దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. జిల్లా రెవెన్యూ కార్యాలయంలో సుమారు 60 ఫైళ్లు, ఇద్దరు ఆర్డీవోల వద్ద మరో 60 ఫైళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఫైళ్ల పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంతో బాధితులు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఏడాది పలు దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు సమాచారం. జిరాయితీ భూములకూ తప్పని తిప్పలు ప్రైవేటు (జిరాయితీ) భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేలా ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత ఉన్న భూములపై ఆర్డీవో స్వయంగా విచారణ జరిపి జాబితా నుంచి తొలగించే అవకాశం కల్పించింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని భూయజమానులు వాపోతున్నారు. అసలు ప్రైవేటు భూములను 22ఏ నిషేధిత జాబితాలో ఎలా చేర్చారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. విలువైన భూములు 22ఏలోకి.. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విలువైన భూములు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖ రూరల్, ఆనందపురం, పద్మనాభం, భీమిలి, గాజువాక, పెందుర్తి తదితర మండలాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. నిషేధిత జాబితాలో చేరిన భూములను తిరిగి బయటకు తీసుకురావడం కష్టంగా మారిందని వాటి యజమానులు పేర్కొంటున్నారు. సబ్ డివిజన్ లేక చిక్కులు పలు ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఒకే సర్వే నంబర్ కొనసాగుతుండటం కూడా సమస్యకు కారణమవుతోందని బాధితులు చెబుతున్నారు. పక్కనే ఉన్న భూములకు సబ్ డివిజన్ జరిగినా, కొన్ని భూములకు జరగకపోవడంతో అవి 22ఏలోనే కొనసాగుతున్నాయని అంటున్నారు. సర్వే నంబర్లకు సబ్ డివిజన్ చేస్తే అనేక భూములు నిషేధిత జాబితా నుంచి బయటపడే అవకాశం ఉన్నా.. ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదని విమర్శిస్తున్నారు. ‘జీరో ఖాతా’తో రైతులకు ఇబ్బందులు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను జీరో ఖాతాల్లో చేర్చడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్ 1బీలో నమోదు లేకపోవడంతో రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములు 22ఏలోకి వెళ్లడం, జీరో ఖాతాల్లో నమోదు కావడంతో తమ హక్కులకు భంగం కలుగుతోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీఆర్ఎస్.. రెవెన్యూ క్లినిక్లే దిక్కు 22ఏ సమస్యల పరిష్కారం కోసం బాధితులు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లను ఆశ్రయిస్తున్నారు. పలువురు జిల్లా కలెక్టర్ను కలిసి తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలోనైనా అర్హత ఉన్న భూములను 22ఏ నుంచి తొలగించి, రికార్డులను సరిచేయాలని బాధితులు కోరుతున్నారు. ‘22ఏ’ ఫైల్ అంటేనే వెనకడుగు! రెవెన్యూ శాఖలో 22ఏ ఫైల్ అంటేనే ఒకరకమైన భయం నెలకొందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలో పరిశీలించి పంపిన ఫైళ్లను సైతం కలెక్టరేట్లో తుది నిర్ణయానికి తీసుకురావడంలో జాప్యం జరుగుతోందని బాధితులు చెబుతున్నారు. గతంలో ఫైళ్లను పెండింగ్లో ఉంచేవారని, ప్రస్తుతం ఏదో ఒక కారణం చూపుతూ తిరస్కరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారం కాకపోగా బాధితులు మళ్లీ మొదటి నుంచి ప్రక్రియను ప్రారంభించాల్సి వస్తోందని వాపోతున్నారు. -
న్యాయవ్యవస్థలో అడ్వకేట్ గుమస్తాల పాత్ర కీలకం
అల్లిపురం: న్యాయవ్యవస్థలో అడ్వకేట్ క్లర్కుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఇటీవల మరణించిన సీనియర్ అడ్వకేట్ క్లర్క్ కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణ సుదీర్ఘంగా 53 సంవత్సరాల పాటు గుమస్తాగా అందించిన సేవలను కొనియాడారు. అలాగే న్యాయవాదులు, అడ్వకేట్ క్లార్కుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎం.కె. శ్రీనివాసరావు, ఎస్. నాగేశ్ కుమార్ మాట్లాడుతూ.. అడ్వకేట్ క్లర్కుల సంక్షేమానికి తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. క్లర్కుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని తెలిపారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో క్లార్కుల సంక్షేమం, హక్కులు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. కార్యక్రమంలో విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు, సీనియర్ న్యాయవాదులు బెవర సత్యనారాయణ, కే. సురేష్ కుమార్, గుమస్తాల సంఘం అధ్యక్షుడు పిల్ల బంగారు నాయుడు, కార్యదర్శి నల్ల భాస్కర రావు, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సభ్యులు జి. శివకృష్ణ, గొర్లి కృష్ణతో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, అడ్వకేట్ క్లర్కులు పాల్గొని నివాళులర్పించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు -
ఇదేం దోపిడీ ఆచార్యా..!
విశాఖవిద్య: అవకాశం ఇవ్వాలే కానీ మొత్తం పిండేస్తాం అన్నట్లుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొందరు ఆచార్యులు అడ్డగోలుగా వర్సిటీ సొమ్ము దోచేస్తున్నట్లు తెలుస్తోంది. బోధన పేరుతో రీసెర్చ్ స్కాలర్స్ను అడ్డంగా వాడుకుంటున్న వ్యవహారం ప్రస్తుతం వర్సిటీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఏయూ నిధులను అడ్డదారిలో మళ్లించేందుకు లక్షల విలువైన దొంగ బిల్లులను వైస్ చాన్సలర్ టేబుల్ వద్దకు చేర్చినట్లు ప్రచారం సాగుతోంది. పలు విభాగాల్లో పీహెచ్డీ స్కాలర్లను టెంపరరీ టీచింగ్ అరేంజ్మెంట్స్ కింద పనిచేస్తున్నట్లు చూపించి ఈ దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అడ్డగోలు దోపిడీ ఇలా... : సాధారణంగా ఏయూలో పీహెచ్డీ పూర్తిచేసిన వారికి టీటీఏలుగా అవకాశం కల్పించి విద్యార్థులకు బోధన చేయిస్తారు. వీరికి సెమిస్టర్ చొప్పున ఏయూ రూ.లక్షల్లో ఫీజు చెల్లిస్తుంది. అయితే పీహెచ్డీ స్కాలర్స్తో ఉచితంగా టీచింగ్ సేవలు వినియోగించుకోవాలని యూజీసీ నిబంధన ఉంది. దానికి అనుగుణంగా వైస్ చాన్సలర్లు ప్రొసీడింగ్స్ ఇస్తుంటారు. ఈ నిబంధనను ఆసరాగా చేసుకుని కొందరు విభాగాధిపతులు స్కాలర్లతో ఉచితంగా పాఠాలు చెప్పిస్తూ, వారిని టీటీఏలుగా చూపుతూ దొంగ బిల్లులు పెట్టి వర్సిటీ సొమ్ము దోచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి పీహెచ్డీ పూర్తి చేసి ఉద్యోగం లేని వారికి టీటీఏలుగా అవకాశం కల్పిస్తే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. కానీ కొందరు విభాగాధిపతులు వర్సిటీ యాజమాన్య మెతక వైఖరిని అవకాశంగా తీసుకుని, స్కాలర్లనే టీటీఏలుగా చూపిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. వైస్ చాన్సలర్ కళ్లుగప్పి : ఈ దొంగ బిల్లుల వ్యవహారమంతా వైస్ చాన్సలర్ కళ్లుగప్పి నడుస్తున్నట్లు ఏయూ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వీసీ పర్యవేక్షణ లోపాన్ని అదునుగా చేసుకుని కొందరు ఆచార్యులు ఈ కక్కుర్తికి పాల్పడుతున్నట్లు సమాచారం. పీహెచ్డీ స్కాలర్లకు జరుగుతున్న అన్యాయంపై వైస్ చాన్సలర్కు ఫిర్యాదు వెళ్లడంతో, ఆయన విభాగాధిపతులతో సమావేశం నిర్వహించి ఆరా తీశారు. డిపార్ట్మెంట్ రీసెర్చ్ కమిటీ దృష్టికి ఈ విషయాలను తీసుకువచ్చారా లేదా అని ప్రశ్నించారు. అయితే అప్పటికప్పుడు వీసీని నమ్మించి, డీఆర్సీ రికార్డుల్లో తప్పుడు నమోదులు చేసేందుకు కూడా కొందరు దారులు వెతుక్కుంటున్నట్లు సమాచారం. ఇలా పరిపాలన రంగాన్ని మోసం చేస్తూ లక్షలాది రూపాయల దొంగ బిల్లులను పంపగా, అవన్నీ ప్రస్తుతం వీసీ సంతకం కోసం ఎదురుచూస్తున్నాయి. సమగ్ర విచారణ జరపాలి: ఉద్యోగ సంఘాలు పవిత్రమైన ఆచార్య వృత్తిలో ఉండి కాసులకు కక్కుర్తి పడుతూ, స్కాలర్లను వాడుకుంటూ దొంగ బిల్లులతో వర్సిటీ ఆదాయానికి గండికొడుతున్న విభాగాధిపతులపై తక్షణమే విచారణ జరపాలని ఉద్యోగ సంఘాలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. పీహెచ్డీలు పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారికి అవకాశం దక్కకుండా చేస్తున్న ఇటువంటి పరిస్థితుల నుంచి వర్సిటీని కాపాడాలని కోరుతున్నారు. వర్సిటీ పాలనపై వీసీ పూర్తిస్థాయి దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆత్మగౌరవానికి ప్రతీక ముద్రగడ
పద్మనాభం సంతాప సభలో బొత్స, కన్నబాబు, అమర్నాథ్ పాల్గొన్న కాపు జేఏసీ రాష్ట్ర నాయకుడు తోట రాజీవ్, ఉత్తరాంధ్ర కాపు నేతలు సాక్షి, విశాఖపట్నం: ‘దివంగత మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కాపు జాతి సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేశారని, ఆయన ఆశయం, ఆలోచన, స్ఫూర్తితో కాపులంతా ఒక్కటై అదే బాటలో పోరాటం సాగించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు. ఆదివారం విశాఖలో సిరిపురం జంక్షన్లోని వీఎంఆర్డీఏ ఎరేనాలో ‘విశాఖ కాపునాడు’ ఆధ్వర్యంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కాపునాడు నాయకుడు తోట రాజీవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పార్టీలకతీతంగా కాపు నాయకులు, శ్రేణులు భారీగా హాజరయ్యారు. కాపు జాతికి ముద్రగడ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సభ ప్రారంభానికి ముందు ముద్రగడ చిత్రపటానికి బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తోట రాజీవ్, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎంపీ హర్షకుమార్, కాపునాడు జేఏసీ నాయకులు సాయిసుధాకర్ నాయుడు, చందు జనార్థన్, ఆకుల రామకృష్ణ, ఏసుదాస్, ఆరేటి ప్రకాష్, తోట రామకృష్ణ, అడ్వకేట్ బాలకృష్ణ తదితరులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇది కేవలం ముద్రగడ సంతాప సభ మాత్రమే కాదని, కాపు జాతికి ఒక సందేశ సభ అని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు నాటి ప్రభుత్వం జీవో నెం.30 ఇచ్చినప్పటికీ, అది ఆచరణలో పూర్తిస్థాయి ఫలితాలను ఇవ్వలేదన్నారు. రాజకీయ సిద్ధాంతాల పరంగా వేర్వేరు పార్టీల్లో పనిచేస్తున్నప్పటికీ, ఏ ఒక్కరూ తమ సొంత జాతికి నష్టం చేకూర్చేలా వ్యవహరించకూడదని కోరారు. ‘‘నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ రాజకీయ పార్టీ అధినేత కూడా తమ పార్టీ నాయకులు సొంత సామాజిక వర్గ కార్యక్రమాలకు వెళ్లకూడదని ఆంక్షలు విధించలేదు. కానీ చంద్రబాబు మాత్రం తన పార్టీలోని కాపు నాయకులు ముద్రగడ సంతాప సభకు వెళ్లకూడదని ఆదేశించడం ఆయన శైలికి, రాజకీయ పరిపక్వతకు తగదు’’ అని విమర్శించారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎందరో నాయకులను చూశామని, కానీ కాపు జాతి కోసం ముద్రగడ వేసిన ముద్ర చెరగనిదని కొనియాడారు. చాలామంది రాజకీయ నాయకులు తమ సామాజిక వర్గాల ఉద్యమాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారని, కానీ ముద్రగడ మాత్రం జాతి ప్రయోజనాల కోసం పదవులను, రాజకీయాలను సైతం త్యాగం చేశారని స్పష్టం చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభంతో తమ కుటుంబానికి తరతరాల అనుబంధం ఉందని తెలిపారు. ముద్రగడ తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోలేదన్నారు. కాపు రాష్ట్ర జేఏసీ నాయకుడు తోట రాజీవ్ మాట్లాడుతూ ముద్రగడ తనకు చిరకాల మిత్రుడని, ఆయన మన మధ్య లేరనే వార్త కాపు జాతి అభ్యున్నతకే అడ్డుపడినట్లేనన్నారు. కాపు జాతి కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహోన్నత నాయకుడు ముద్రగడ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. తాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉన్నప్పటి నుంచే ముద్రగడతో పరిచయం ఉందని, తనను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించింది ఆయనేనని తెలిపారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ముద్రగడకు వందలాది ఎకరాల ఆస్తి ఉన్నప్పటికీ, రాజకీయాల్లో ఆర్థికంగా ఎదగలేదని, పైగా సొంత ఆస్తులనే ప్రజల కోసం ఖర్చు చేశారని కొనియాడారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, కాపు నేతలు జియ్యాని శ్రీధర్, బాణాల శ్రీనివాసరావు, కొండా రాజీవ్గాంధీ, పీలా ఉమారాణి, గూటూరు నరసింహమూర్తి, పీవీ సురేష్, కోరాడ రాజుబాబు, కోడిగుడ్ల ఫూర్ణిమ శ్రీధర్, మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
13 నుంచి కనకమహాలక్ష్మి ఆలయంలో శ్రావణమాస పూజలు
డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, విశాఖ వాసుల ఆరాధ్యదైవం శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానంలో ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 11 వరకు శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ‘శ్రావణలక్ష్మి ప్రత్యేక కుంకుమ పూజలు’ ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సుజాత తెలిపారు. నిత్య పూజలు.. సమయాలు నెల రోజుల పాటు రోజూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ పూజలు జరుగుతాయి. అలాగే విశేష దినాలైన గురు, శుక్రవారాల్లో రెండు విడతలుగా ఉదయం 8 నుంచి 9 వరకు, 9.30 నుంచి 10.30 వరకు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తారు. పూజలో భాగంగా సంకల్పం, లక్ష్మీ సహస్రనామార్చన, లక్ష్మీ హోమం, అమ్మవారి దర్శనం మరియు వేదాశీర్వచనం చేపడతారు. భక్తులకు అవసరమైన పూజా సామగ్రిని దేవస్థానమే సమకూర్చనుంది. టికెట్ రుసుము ఈ సామూహిక కుంకుమ పూజలో పాల్గొనదలచే భక్తులు (దంపతులు) రూ.516 టికెట్ రుసుము చెల్లించాలి. పూజ అనంతరం భక్తులకు శేషవస్త్రంగా కండువా, జాకెట్ ముక్క, పావు కేజీ పులిహోర, పావు కేజీ చక్కెర పొంగలి, రాగి శ్రీచక్రయంత్రాన్ని మహాప్రసాదంగా అందజేస్తారు. ముఖ్యమైన పర్వదినాలు శ్రావణమాసంలో వచ్చే మూడో శుక్రవారం (ఆగస్టు 21) వరలక్ష్మీ వ్రతాన్ని, అలాగే ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలను వైభవంగా నిర్వహించనున్నారు. మాసంలో వచ్చే ఐదు శుక్రవారాల్లో (ఆగస్టు 14, 21, 28, సెప్టెంబర్ 4, 11) విశేష కార్యక్రమాలు ఉంటాయి. 13న పూజల ప్రారంభం ఈ నెల 13న ఉదయం 8.20 గంటలకు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పూజలను అధికారికంగా ప్రారంభించనున్నారు. భక్తులందరూ విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని ఈవో కోరారు. పరోక్ష/ఆన్లైన్ సేవల వివరాలు: ఆలయానికి నేరుగా రాలేని స్థానికేతర భక్తుల గోత్రనామాలతో పూజ నిర్వహించి, లక్ష్మీ యంత్రం, కుంకుమ, ప్రసాదాన్ని పోస్టల్ ద్వారా వారి ఇంటి చిరునామాకు పంపుతారు. బ్యాంక్ ఖాతా వివరాలు: 060810011006691 (ఐఎఫ్ఎస్సీ : యూబీఐఎన్ 0806081), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టౌన్ కొత్తరోడ్డు బ్రాంచ్. ఫోన్ నంబర్లు: 0891–2568645, 2566515, 2731250 వెబ్సైట్: www.aptemples.org ఆన్లైన్ పూజల సమాచారం కోసం ‘మనమిత్ర’ వాట్సాప్లో కూడా సంప్రదించాలని ఈవో సుజాత పేర్కొన్నారు. -
మా భూములు మాకిచ్చేయండి!
అగనంపూడి: ఉపాధి కల్పిస్తామనే హామీతో రీఫ్రాక్టరీస్ సంస్థ కోసం సేకరించిన భూములను తిరిగి రైతులకు అప్పగించాలని లేదా తగిన నష్టపరిహారం చెల్లించాలని ఏపీ రీఫ్రాక్టరీస్ భూ నిర్వాసితుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సంస్థకు చెందిన స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ హబ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అగనంపూడి జాతీయ రహదారి జంక్షన్లో నిరసన చేపట్టారు. అనంతరం నిర్వాసితులు జాతీయ రహదారి కూడలి నుంచి బొర్రమాంబ వనం మీదుగా రీఫ్రాక్టరీస్ సంస్థ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు గవర నరసింగరావు, పెదిరెడ్ల హరనాథ్ మాట్లాడుతూ.. రీఫ్రాక్టరీస్ సంస్థ ఉత్పత్తి ప్రారంభించకముందే మూతపడిందన్నారు. సంస్థ భూములను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న యాజమాన్యం అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఇప్పుడు ఐటీ హబ్ పేరుతో మరోసారి నిర్వాసితులకు అన్యాయం చేయొద్దని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు లక్కరాజు గోవిందరాజులు, కొలపర్తి శ్రీనివాసరావు, పెదిరెడ్ల నీలకంఠం, చిత్తా అబ్బాయి, న్యాయవాది ప్రభాకరరావు, మంచాల కన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ రీఫ్రాక్టరీస్ నిర్వాసితుల ఆందోళన -
దాహం తీరేనా?
డాబాగార్డెన్స్: నగరంలో తాగునీటి ఎద్దడిపై ఎట్టకేలకు అధికారుల్లో కదలిక వచ్చింది. ‘మహానగరం.. దాహం.. దాహం’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి జీవీఎంసీ అధికారులు స్పందించారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ ఆదేశాలతో అధికారులు ఆదివారం వేకువజాము నుంచే క్షేత్రస్థాయిలో నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, చీఫ్ ఇంజినీర్ పీవీవీ సత్యనారాయణరాజు, తూర్పు జోన్ జోనల్ కమిషనర్ శివప్రసాద్, నీటి సరఫరా విభాగం ఎస్ఈ పల్లంరాజుతో పాటు సంబంధిత ఈఈలు, డీఈఈలు, ఏఈలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించి, సమస్య ఉన్న ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టారు. ఆరిలోవకు ట్యాంకర్ల ద్వారా నీరు ముడసర్లోవ వాటర్ వర్క్స్ నుంచి జీవీఎంసీ, ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి ఆరిలోవతో పాటు అవసరమైన ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అలాగే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ‘డయల్ ఏ ట్యాంకర్’ సేవతో పాటు ఆన్లైన్లో ట్యాంకర్లను బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్యం ఇస్తూ సంబంధిత ప్రాంతాలకు ట్యాంకర్లను పంపిస్తున్నారు. ఎత్తయిన ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టి అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, తూర్పు జోన్ జోనల్ కమిషనర్ శివప్రసాద్ తదితర అధికారులు ఆదివారం కై లాసనగర్, శ్రీహరినగర్ ప్రాంతాల్లో నీటి సరఫరాను పరిశీలించారు. ఎత్తయిన ప్రాంతాల్లోనూ తగిన ఒత్తిడితో నీరు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. నీటి సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించి, వృథాను నివారిస్తూ జీవీఎంసీకి సహకరించాలని కోరారు. -
నావికుల హత్యలను ఖండిస్తూ ర్యాలీ
మహారాణిపేట: యుద్ధ ప్రాంతాల్లో అమాయక నావికుల హత్యలను ఖండిస్తూ మర్చంట్ నేవీ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎంఎన్వోడబ్ల్యూఏ), విశాఖపట్నం ఆధ్వర్యంలో ఆదివారం మౌన నిరసన నిర్వహించారు. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ, బీచ్ రోడ్ వరకు చేపట్టిన ఈ నిరసనలో సుమారు 40 మంది నావికులు పాల్గొని యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన నావికులు, వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. మర్చంట్ నావికులు పౌరులేనని, కుటుంబాలకు దూరంగా సముద్రంలో విధులు నిర్వర్తిస్తూ ప్రతికూల వాతావరణం, సముద్ర దొంగల ముప్పును ఎదుర్కొంటూ వివిధ ప్రాంతాలకు సరకు రవాణా చేస్తుంటారని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఓడ యజమానులు, ఏజెన్సీలు న్యాయమైన, సకాలంలో నష్టపరిహారంతో పాటు తగిన సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు కెప్టెన్ కాళీ ప్రసాద్ ఆధ్వర్యంలో వీఆర్ సాగి, ప్రసన్నకుమార్, కెప్టెన్ వాసుదేవరావు, కెప్టెన్ మహాపాత్ర, కె.కె.చంద్, బగాడి లక్ష్మణరావు, కెప్టెన్ తివారీ, కెప్టెన్ సరోజ్ మిశ్రా, కెప్టెన్ పక్కి ప్రసాద్, రమణ, శ్రీనివాస్, కెప్టెన్ కుప్పం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధార్ బ్లాక్ ఉపాధికి లాక్!
సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాలుగా విశాఖ ఉక్కు పరిశ్రమనే నమ్ముకుని.. తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్లాంట్ అభివృద్ధిలో భాగస్వాములైన కాంట్రాక్ట్ కార్మికులపై యాజమాన్యం ఉక్కుపాదం మోపుతోంది. ‘కాస్ట్ కటింగ్’ పేరుతో ఏకంగా 4 వేల మందిని అర్ధంతరంగా తొలగించి రోడ్డున పడేయడమే కాకుండా.. వారు తిరిగి ప్లాంట్ గడప తొక్కకుండా కట్టడి చేసేందుకు తీవ్ర చర్యలకు పాల్పడుతోంది. ఉపాధి కోల్పోయిన కార్మికులు ఇతర కాంట్రాక్టు ఏజెన్సీల్లోనైనా పని చేసుకుని కుటుంబాలను పోషించుకునే అవకాశం లేకుండా.. ప్లాంట్ గేట్పాస్ వ్యవస్థలో వారి ఆధార్ నంబర్లు, బయోమెట్రిక్ వివరాలను బ్లాక్లిస్ట్లో పెట్టినట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ప్లాంట్లోని ఇతర ఏజెన్సీల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించినా వారి ఆధార్ వివరాలు ‘బ్లాక్డ్’గా చూపుతున్నాయని చెబుతున్నాయి. ఒకవైపు స్థానిక కార్మికులను తొలగించిన యాజమాన్యం.. మరోవైపు ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కొత్త కాంట్రాక్ట్ కార్మికులను తీసుకురావడం వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. మరోవైపు, ఉక్కు పరిశ్రమను ఉద్ధరిస్తున్నామంటూ ప్రకటనలు గుప్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఈ దారుణాలపై స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆధార్ కార్డూ ‘బ్లాక్’లో పెట్టేశారు ఒక పౌరుడి ఆధార్ కార్డును రద్దు చేసే లేదా బ్లాక్ చేసే అధికారం చట్టబద్ధంగా కేవలం ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా’కి మాత్రమే ఉంది. కానీ, స్టీల్ప్లాంట్ యాజమాన్యం రాజ్యాంగాన్ని, కార్మిక చట్టాలను తుంగలో తొక్కి.. తమ సొంత డేటాబేస్ (గేట్పాస్ సిస్టమ్)లో 4 వేల మంది ఆధార్ నంబర్లను బ్లాక్లిస్ట్లో పెట్టింది. ప్లాంట్లో ఉన్న దాదాపు 600 ఏజెన్సీల్లో వీరు ఎక్కడ పనికి వెళ్లినా.. ఆధార్ ఎంటర్ చేయగానే ‘బ్లాక్డ్’ అని వస్తోంది. ఉపాధి పోయినా ఇతర కాంట్రాక్టర్ల దగ్గరైనా పని చేసుకుని బతుకుదాం అనుకున్న కార్మికుల ఆశలపై యాజమాన్యం ఈ విధంగా నీళ్లు చల్లింది. ఇది ముమ్మాటికీ కార్మికుల జీవించే హక్కును హరించడమేనని న్యాయ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను కాపాడుతున్నామని చంద్రబా బు, పవన్తో సహా టీడీపీ, జనసేన నేతలు మీడి యా ముందు గొప్పలు చెబుతూ ఉద్యోగుల్ని, కార్మికుల్ని మభ్యపెడుతున్నారే తప్ప.. అక్కడ జరుగుతు న్న నిరంకుశ విధానాలపై మాత్రం స్పందించడం లేదు. 4 వేల కుటుంబాలు రోడ్డున పడి ఆకలి కేకలు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు గగ్గోలు పెడుతూ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల దృష్టికి ఈ దారుణాన్ని తీసుకెళ్లినా కనీస స్పందన కరువైంది. ఉపాధికి భద్రత కల్పించాల్సిన ప్రభుత్వమే.. యాజమాన్యం చేస్తున్న చట్టవిరుద్ధమైన పనులకు వత్తాసు పలుకుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రానికి ఫిర్యాదు స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఆధార్ కార్డులను బ్లాక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విశాఖ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పాడి త్రినాథరావు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీపీజ్రామ్స్కు ఈ నెల 5న ఫిర్యాదు చేశారు. స్టీల్ప్లాంట్ యాజమాన్యం 2024లో వేలాది కాంట్రాక్ట్ కార్మికుల ఆధార్ కార్డులను బ్లాక్ చేసిందన్నారు. అందులో ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులు కూడా ఉన్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు.. ప్రభుత్వం జారీ చేసిన పత్రాలను స్వాధీనం చేసుకోవడం, బ్లాక్ చేయడం, స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమన్నారు. ఇది ఆధార్ చట్టం–2016ను ఉల్లంఘించడమేనన్నారు. కార్మికుడిని భవిష్యత్తు ఉపాధి నుంచి ఏకపక్షంగా నిషేధించడం ఆర్టికల్ 21 కింద ఉన్న ప్రాథమిక రాజ్యాంగ రక్షణలను ఉల్లంఘించడమేనన్నారు. దీనిపై జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాలకు గేట్లు తీసి.. కాస్ట్ కటింగ్ పేరుతో ఒకవైపు పాత కార్మికులను తొలగించిన యాజమాన్యం.. అదే స్థానంలో తమకు అనుకూలంగా ఉండే ఇతర రాష్ట్రాల కార్మికులను దిగుమతి చేసుకుంది. ఇప్పటికే ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మందికిపైగా కొత్త కాంట్రాక్ట్ కార్మికులను రప్పించి ప్లాంట్లో ఉపాధి కల్పించింది. స్థానికులైతే తమ హక్కుల కోసం ప్రశ్నిస్తారని, అదే ఇతర రాష్ట్రాల వారైతే తక్కువ వేతనాలకే, ఎలాంటి సంఘాలు లేకుండా పని చేస్తారన్నదే యాజమాన్యం వ్యూహంగా స్పష్టమవుతోంది. -
నీటి ఎద్దడిపై జీవీఎంసీ ‘ట్యాంకర్’ యాక్షన్
అల్లిపురం: నగరంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు జీవీఎంసీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. 102 ట్యాంకర్లతో రోజుకు సుమారు 400 ట్రిప్పులు నిర్వహించి అవసరమైన ప్రాంతాలకు యుద్ధప్రాతిపదికన నీటిని అందించాలని అధికారులను కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. ఆరిలోవ 11, 12, 13వ వార్డులతోపాటు భీమిలి, ముడసర్లోవ పరిసర ప్రాంతాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. నగరంలోని ప్రధాన నీటి వనరుల పరిస్థితి సంతృప్తికరంగానే ఉందని కమిషనర్ తెలిపారు. ముడసర్లోవ రిజర్వాయర్లో నీటిమట్టం 154.11 అడుగులుగా ఉందన్నారు. అయినప్పటికీ నీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ట్యాంకర్ల సంఖ్యను పెంచినట్లు పేర్కొన్నారు. నీటి సరఫరాను అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. 977 అభ్యర్థనలు.. 619 డెలివరీలు ‘డయల్–ఏ–ట్యాంకర్’ సేవకు ఈనెల 8వ తేదీ సాయంత్రం 6.14 గంటల వరకు 977 అభ్యర్థనలు అందాయి. వీటిలో 619 ట్యాంకర్ డెలివరీలు పూర్తయ్యాయి. మరో 50 అభ్యర్థనలు రద్దు లేదా స్పందన లేకపోవడంతో నిలిచిపోగా, 308 అభ్యర్థనలు పెండింగ్లో ఉన్నాయి. ఇంటి నుంచే ట్యాంకర్ బుకింగ్ ప్రజలు జీవీఎంసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఇంటి నుంచే ట్యాంకర్ను బుక్ చేసుకోవచ్చని కమిషనర్ తెలిపారు. ట్యాంకర్ల కేటాయింపు అందుబాటులో ఉన్న ట్యాంకర్ను సమీప ప్రాంతానికి కేటాయించే విధానంలో జరుగుతుందన్నారు. ట్యాంకర్ చార్జీలు ఇవీ.. నీటి చార్జీ కిలో లీటర్కు రూ.40గా నిర్ణయించారు. ట్యాంకర్ సామర్థ్యాన్ని బట్టి డ్రైవర్ చార్జీలు కలిపి మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. సామర్థ్యం మొత్తం చార్జీ 1 కేఎల్ రూ.390 2 కేఎల్ రూ.550 5 కేఎల్ రూ.900 6 కేఎల్ రూ.1,100 10 కేఎల్ రూ.1,820 -
గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో నల్లుల బెడద
నిద్రలేక ప్రయాణికుల నరకయాతనసాక్షి, విశాఖపట్నం: సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ (రైలు నెంబర్ 12739)లో నల్లుల బెడదతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు రోజుల క్రితం ఓ ప్రయాణికుడు గరీబ్ రథ్ లో పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాను ప్రయాణిస్తున్న జీ–10 కోచ్తో పాటు జీ–8 కోచ్లోనూ నల్లులు విపరీతంగా ఉన్నాయని, అవి కుట్టడంతో ప్రయాణికులు రాత్రంతా నిద్రలేక నరకయాతన అనుభవించారని ఆయన వాపోయారు. ఈ సమస్యపై అధికారులకు, టీటీఈకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, రైల్వే శాఖ తక్షణమే స్పందించి కోచ్లను శుభ్రం చేయాలని కోరారు. ప్రయాణికులు తమ ఇళ్లకు చేరుకున్న తర్వాత లగేజీని ఎండలో పెట్టుకోవాలని, లేదంటే నల్లులు ఇళ్లకు కూడా చేరే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
ఫిషింగ్ బోట్ల జెట్టీ ఫీజుపై జీఎస్టీ, వడ్డీ తగ్గించాలి
సాక్షి, విశాఖపట్నం: ఫిషింగ్ హార్బర్లోని సుమారు 700లకు పైగా ఉన్న బోట్లకు పోర్టు అధికారులు విధిస్తున్న జెట్టీ ఫీజుపై అదనపు భారాన్ని తగ్గించాలని విశాఖ డాల్ఫిన్ బోట్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విశాఖపట్నం పోర్టు అథారిటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్(సీఎంఈ) సీహెచ్ రామ్ ప్రసాద్ను అసోసియేషన్ ప్రతినిధులు శనివారం కలిసి వినతి పత్రం అందించారు. ప్రతి బోటుకు రూ.612 జెట్టీ ఫీజుతో పాటు, అదనంగా 18 శాతం జీఎస్టీ, 15 శాతం వడ్డీ చార్జీలను పోర్టు అథారిటీ వసూలు చేస్తోందనీ.. వెంటనే తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ వీర్రాజు, ఉపాధ్యక్షులు సీహెచ్ పోతురాజు, ఎం. రాము, జాయింట్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. -
త్రిపురాంతకస్వామికి సహస్ర ఘటాభిషేకం
ముగిసిన మూడు రోజుల వరుణ జపాలు సింహాచలం: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ సింహగిరి క్షేత్రపాలకుడు త్రిపురాంతకస్వామి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహించిన వరుణ జపాలు శనివారం ఘనంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా స్వామివారికి వైభవంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఉదయం ఏకాదశ రుద్రాభిషేకంతో పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం గంగధార వద్ద నుంచి 1,001 కలశాల్లో తీసుకువచ్చిన పవిత్ర జలాలతో త్రిపురాంతకస్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. అనంతరం వరుణ జపాలు, తర్పణాలు, నిత్య హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితులు కాళ్లకూరి సుబ్రహ్మణ్యేశ్వరశర్మ, అర్చకుడు రమణమూర్తి, వేద విద్యార్థులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
మల్కాపురం: పారిశ్రామిక ప్రాంత పోలీస్స్టేషన్ పరిధిలోని ఎక్స్సర్వీస్మెన్ కాలనీలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 60వ వార్డు పరిధిలోని ఎక్స్సర్వీస్మెన్ కాలనీలో మనీష్కుమార్ తన భార్య సాధన, ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. మనీష్కుమార్ షిప్మెన్గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం ఆయన సమీపంలో నివసించే స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చి తలుపు తట్టినా లోపల నుంచి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి కిటికీ నుంచి చూడగా, భార్య సాధన గదిలోని ఫ్యాన్ హుక్కు వైర్తో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే తలుపులు బలవంతంగా తెరిచి ఆమెను కిందకు దించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న మల్కాపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఫ్లాగ్ ఏదైనా.. ఫ్లాష్లా చెప్పేస్తుంది
డాబాగార్డెన్స్: విశాఖకు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి జాన్య శివాని అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనత సాధించింది. ఇంటర్నేషనల్ స్టార్ కిడ్–2026 అవార్డును కైవసం చేసుకుని ప్రతిభ చాటింది. ప్రపంచంలోని 32 దేశాలకు చెందిన చిన్నారులతో జరిగిన పోటీల్లో జాన్య శివాని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తొలి స్థానం సాధించింది. ఇంటెలిజెన్స్ అండ్ మెమోరీ (ఐక్యూ) విభాగంలో ఈ అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ చిన్నారిని అభినందించారు. గుర్తింపు ఇలా.. జాన్య శివాని ప్రపంచంలోని 195 దేశాల జాతీయ జెండాలను సులభంగా గుర్తించగలదు. జెండాలను తలకిందులుగా చూపించినా వెంటనే చెప్పగలదు. అలాగే 60 చారిత్రక కట్టడాలు, 55 మంది జాతీయ నాయకులు, సౌర కుటుంబం, పండ్లు, కూరగాయలు, శాస్త్రవేత్తల ఆవిష్కరణలను గుర్తించి చెప్పగల ప్రతిభను కనబరిచింది. ఇప్పటికే పలు అవార్డులు జాన్య శివాని గతంలో యంగ్ అచీవర్స్ ఒలింపియాడ్–2025లో తొలి బహుమతి, ఇంటర్నేషనల్ కిడ్స్ ఐకాన్ అవార్డు–2025ను కూడా అందుకుంది. చిన్న వయస్సులోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. -
దిశ చట్టం రద్దు మహిళల భద్రతకు విఘాతం
పోక్సో కోర్టు మాజీ పీపీ కరణం కృష్ణ సాక్షి, విశాఖపట్నం: దిశ చట్టాన్ని రద్దు చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మహిళల భద్రత పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పోక్సో జిల్లా కోర్టు మాజీ పీపీ కరణం కృష్ణ విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళలకు త్వరితగతిన న్యాయం అందించాలనే ఉద్దేశంతో దిశ చట్టాన్ని తీసుకొచ్చి, ఫాస్ట్ట్రాక్ కోర్టులు, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసిందన్నారు. చట్టానికి కేంద్రం ఆమోదం తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సింది పోయి, దానినే రద్దు చేయడం వల్ల మహిళల్లో భయాందోళనలు పెరుగుతాయని అన్నారు. దిశ చట్టం ద్వారా మహిళలపై జరిగే లైంగిక నేరాల కేసుల్లో వేగవంతమైన విచారణ, నిందితులకు త్వరగా శిక్ష పడేలా వ్యవస్థను రూపొందించారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీసుల నియామకం వంటి చర్యలు మహిళల భద్రతకు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ప్రభుత్వం దిశ చట్టం రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆయన కోరారు. -
నావల్ డాక్యార్డ్ ఎన్నికల్లో ‘ఐఎన్సీఈ’ విజయం
సింథియా: నావల్ డాక్యార్డ్ (వీ) షాప్ కమిటీ 2026–28 ఎన్నికల్లో ఇండియన్ నేవీ సివిల్ ఎంప్లాయిస్ (ఐఎన్సీఈ) యూనియన్ ఆధిక్యం సాధించింది. మొత్తం 10 డివిజన్లలోని 62 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఐఎన్సీఈ యూనియన్ నుంచి 24 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఐఎన్సీఈ యూనియన్కు మద్దతు ప్రకటించడంతో మొత్తం 27 స్థానాల్లో యూనియన్ విజయకేతనం ఎగురవేసింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న ప్రతినిధులు కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తూ మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
‘దిశ’ రద్దు అసంబద్ధ చర్య
దిశ బిల్లు ఉపసంహరణపై మండిపడ్డ ఏయూ విద్యార్థినులు మహిళల భద్రతపై బాధ్యత లేదా? రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో చట్టాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ‘దిశ’ వంటి బిల్లును చట్టంగా మార్చేందుకు కృషి చేసి, పకడ్బందీగా అమలు చేయాల్సింది పోయి రద్దు చేయాలనుకోవడం మంచి నిర్ణయం కాదు. ఈ కోపం మహిళలపైనా, లేక గత ప్రభుత్వంపైనా? ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. మహిళలను కాపాడుకోవడం అందరి బాధ్యత. –ఎ.హర్షిత, ఏయూ విద్యార్థిని ప్రభుత్వం పునరాలోచించాలి దిశ బిల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహిళా భద్రతకు పెద్దపీట వేసేలా గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదు, నిబద్ధత మాత్రమే ఉంది. ఆ చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం కృషి చేయాలి తప్ప, రద్దు చేయాలనుకోవడం సరికాదు. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించాలి. –పి.భారతి, ఏయూ ఆర్ట్స్ విద్యాఽర్థి విశాఖ విద్య: మహిళల భద్రత కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ బిల్లు’ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంపై మహిళలు, ముఖ్యంగా విద్యార్థినుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థినులు చంద్రబాబు సర్కారు తాజా నిర్ణయాన్ని తప్పుబట్టారు. చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయడానికి కృషి చేయకుండా, అసలు దిశ చట్టం ఆలోచననే రద్దు చేయాలనుకోవడం అసంబద్ధ చర్య అని దుయ్యబట్టారు. -
విశాఖ దక్షిణ
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ ఆధ్వర్యంలో దీక్ష జరిగింది. 29, 33, 34, 35 వార్డుల వైఎస్సార్ సీపీ శ్రేణులు, యువత పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వరదు కల్యాణి, రాష్ట్ర సాంస్కృతిక విభాగం నాయకురాలు వంగపండు ఉషారాణి, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు జాన్ వెస్లీ, ఉత్తరాంధ్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నా జానీకిరామ్, బీసీ సెల్ అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, మాజీ కార్పొరేటర్ తోట పద్మావతి, బిపిన్ కుమార్ జైన్ సంఘీభావం తెలిపారు. -
‘శశి’ క్యాంపస్లో విద్యార్థులకు అస్వస్థత
ఆనందపురం: మండలంలోని బోయపాలెంలోని శశి ఇంటర్మీడియట్ క్యాంపస్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గత మూడు రోజులుగా సుమారు 50 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. వీరిలో 23 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. విద్యార్థులతో పాటు ఒక వార్డెన్, ఇద్దరు మెస్ సిబ్బంది నగరంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులందరూ కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. విద్యార్థులను వారి ఇళ్లకు పంపించి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది. ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు, డీపీఎంవో డాక్టర్ ఉమావతి, ఆనందపురం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ షేక్ షబీనా భాను కళాశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థుల అస్వస్థతకు ఆహారం వికటించడమా, లేక తాగునీరు కలుషితం కావడమా అనే అంశంపై దర్యాప్తు చేపట్టామని డీఎంహెచ్వో తెలిపారు. ఇందుకోసం ఆహారం, నీటి నమూనాలను సేకరించి ప్రాంతీయ ప్రయోగశాలకు పంపినట్లు చెప్పారు. ఈ నెల 10వ తేదీ నాటికి ల్యాబ్ నివేదిక వచ్చే అవకాశం ఉందని, అప్పుడే అస్వస్థతకు గల అసలు కారణం వెల్లడవుతుందని తెలిపారు. ప్రస్తుతం కళాశాల ప్రాంగణంలో 24 గంటల పాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. -
దిశ చట్టం రద్దు దుర్మార్గమైన నిర్ణయం
వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ మహిళలు, పిల్లలను వేధించే వారికి త్వరగా శిక్ష పడేలా గత ప్రభుత్వం దిశా బిల్లు తీసుకొచ్చిందని, 21 రోజుల్లో శిక్ష పడేలా తీసుకొచ్చిన మార్పును హోంమంత్రి అనిత తప్పుపట్టడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళా రక్షణ కోసం జగనన్న అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపారని, అది కేంద్రం వద్ద పెండింగ్లో ఉందన్నారు. సందేహాలు ఉంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేసి కేంద్రానికి పంపాలన్నారు. జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందనే ఉద్దేశంతో దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నామని, పేరు మార్చినా దిశ చట్టాన్ని కొనసాగించి మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. బీఎన్ఎస్ చట్టాలు కూడా సరిగా అమలు కావడం లేదని, మహిళల రక్షణలో పోలీసు వ్యవస్థ పూర్తిగా వైఫల్యమైందని నివేదికలు చెబుతున్నాయని అన్నారు. పోలీసులను రెడ్బుక్ రాజ్యాంగం కోసమే వాడుతున్నారని, ప్రతిపక్ష పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టడానికే చూస్తున్నారని ఆరోపించారు. మంత్రితో సహా వార్డు స్థాయి నాయకుల వరకు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. -
పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ అల్లిపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధికార ప్రతినిధిగా రెండోసారి నియమించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పాకా సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మీసాల మనోహర్రెడ్డి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు బాజీ నాయుడు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి మజ్జి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, లీగల్ సెల్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సత్యనారాయణ తెలిపారు. -
మహిళల ఆగ్రహం
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన కేబినెట్ నిర్ణయ ప్రతుల దహనం మహిళల భద్రతతో చెలగాటం ఆడొద్దంటూ ప్రభుత్వానికి హెచ్చరికదిశ చట్టం రద్దు ప్రతులను దహనం చేస్తున్న ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్, పార్టీ శ్రేణులు డాబాగార్డెన్స్: మహిళల రక్షణ కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కేబినెట్–2019లో తీసుకొచ్చిన దిశ చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరిస్తూ ఈ నెల 6న కేబినెట్లో తీసుకున్న నిర్ణయంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశా చట్టం రద్దును మహిళలకు బ్లాక్ డేగా అభివర్ణించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ, రక్షణ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తోందని మండిపడ్డారు. అత్యవసర సమయాల్లో మహిళలను కాపాడే దిశ యాప్, రక్షణ వ్యవస్థలను ఎందుకు ఎత్తివేశారని ప్రశ్నిస్తూ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సూచనలతో పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ మేరకు కూటమి సర్కార్ కేబినెట్లో ఆమోదం పొందిన ప్రతులను దహనం చేశారు. ‘చంద్రబాబు.. మరో వెన్నుపోటు’, ‘దిశా చట్టం రద్దు.. మహిళలకు ముప్పు’, ‘రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి’, ‘నేరస్థులకు భయం కావాలి.. మహిళలకు అభయం కావాలి’, ‘దిశా చట్టం మహిళల ధైర్యం.. దాన్ని తీసేయడం ఎవరి కోసం?’, ‘కూటమి ప్రభుత్వం డౌన్.. డౌన్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ముందుగా మహాత్మా గాంధీకి ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్, పార్టీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్వెస్లీ, పార్టీ మహిళా విభాగం నివాళులర్పించారు. దిశ చట్టం అమల్లో ఉంటే చాలామంది జైలుకు వెళ్లేవారు మాజీ ఎమ్మెల్యే, దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ తాను కూడా ఆరోజు అసెంబ్లీలో ఉన్నానని, మహిళలు, పిల్లల రక్షణ కోసం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దిశ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ చట్టాన్ని దేశంలోని పలు రాష్ట్రాలు పరిశీలించాయని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న కొందరు దుర్మా ర్గులు ఈ చట్టం అమల్లోకి వస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే చంద్రబాబు ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. దిశ చట్టం అమల్లో ఉంటే కూటమి ప్రభుత్వంలోని చాలా మంది జైలులో ఉండాల్సి వచ్చేదని విమర్శించారు. దిశా చట్టం రద్దు సహించేది లేదు పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి మాట్లాడుతూ చట్టాన్ని కొనసాగించాల్సిందేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేస్తే సహించేది లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన మంచిని విస్మరిస్తోందన్నారు. ఈ ప్రభుత్వానికి మహిళల కన్నీటి రోదన పట్టడం లేదని మండిపడ్డారు. మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలను గౌరవించడం అంటే కేవలం రాజకీయ వేదికలపై మాటలు చెప్పడం మాత్రమే కాదని, ఆ గౌరవాన్ని ఆచరణలో కూడా చూపించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో మహిళా నాయకులు శ్రీదేవి వర్మ, బయ్యవరపు రాధా, బి.పద్మావతి, షబీరబేగం, సత్యాల సాగరిక, ఎం.విశాలకి, రోజా రాణి, రీసు అనురాధ, రజని, మజ్జి జ్యోతి, పార్వతి, జోషిల, దమయంతి, భాను, శిరీష, కృష్ణవేణి, సత్య, మహిళా సీనియర్ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. -
పెట్టుబడుల బడాయి... ఖజానాకు మళ్లీ చిల్లు
సాక్షి, విశాఖపట్నం: ‘చీమలు పెట్టిన పుట్టలు పామున కిరవైన యట్లు’ అనే సుమతీ శతకంలోని పద్యం ఇప్పుడు చంద్రబాబు బడాయి శతకంలో మాత్రం మరోలా మారిపోయింది. ‘జిల్లా యంత్రాంగం ఖజానాలో పెట్టిన నిధులు.. చంద్రబాబు ప్రచారయావ కిరవైన యట్లు’ అని చదువుకోవాల్సిందే. జిల్లాలోని వివిధ విభాగాలు.. విశాఖ అభివృద్ధికి దాచుకున్న నిధుల్ని.. భారీ ప్రచార సదస్సుల పేరుతో నిధుల్ని నీళ్లలా ఖర్చు చేయించేస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలు వచ్చి లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాయంటూ ప్రపంచమంతా ప్రచారం చేసి.. చివరికి అంతా తూచ్.. వేల కోట్లే వచ్చాయని చెప్పిన చంద్రబాబు సర్కారు.. మరోసారి సీఐఐ పెట్టుబడుల ప్రహసన ప్రచార సదస్సుని నిర్వహించేందుకు సిద్ధమవుతుంటే.. జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే రూపాయి రూపాయి కూడబెట్టుకుంటున్న ఖజానా మళ్లీ ఖాళీ అయ్యే రోజులు వస్తున్నాయా అంటూ ఆందోళన చెందుతున్నారు. గతేడాది విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు జిల్లా యంత్రాంగానికి, జీవీఎంసీ, వీఎంఆర్డీఏని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసింది. వీవీఐపీల రాక, ప్రొటోకాల్, అతిథుల మర్యాదల కోసమే రెవెన్యూ విభాగం ఏకంగా రూ.7 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు నగర సుందరీకరణ, తాత్కాలిక ఏర్పాట్లు, హడావుడి కోసం జీవీఎంసీ రూ.60 కోట్లు, వీఎంఆర్డీఏ రూ.10 కోట్లు వెచ్చించాయి. విశాఖ అభివృద్ధికి ఉపయోగించాల్సిన సొంత నిధులను మళ్లించి మరీ ఈ రూ.77 కోట్లు ఖర్చు పెడితే.. ప్రభుత్వం నుంచి నేటికీ ఒక్క పైసా కూడా రీయింబర్స్ కాలేదు. పాత బకాయిలు ఇవ్వాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సర్కారు కనికరించకపోవడంతో స్థానిక సంస్థలు ఆర్థికంగా కుదేలయ్యాయి. పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైన బడాయి పెట్టుబడుల పేరుతో చంద్రబాబు ఆడే డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. సదస్సుల వేదికగా కాగితాలపై అంకెలు చూపించి.. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఏకంగా రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేశాయంటూ ప్రభుత్వం విపరీతంగా డబ్బా కొట్టుకుంది. తీరా చూస్తే, పార్లమెంటు సాక్షిగా ఆ బండారం బట్టబయలైంది. రూ.లక్షల కోట్లు అని ప్రచారం చేసుకుంటే.. క్షేత్రస్థాయిలో వాస్తవంగా వచ్చింది కేవలం రూ.6,962 కోట్లు మాత్రమేనని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే కుండబద్దలు కొట్టింది. ఇంత ఘోరంగా వాస్తవాలు వెలుగుచూసినా సరే, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అవే అబద్ధాలకు కొత్త రంగులు అద్దుతూ ‘స్వర్ణాంధ్ర–2047’ పేరుతో మరోసారి బోగస్ సదస్సుకు సిద్ధమవుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల గుండెల్లో గుబులు గత బకాయిలే రాక అల్లాడుతున్న అధికారుల నెత్తిన ప్రభుత్వం మరోసారి సదస్సుల పిడుగు వేసింది. ఈ ఏడాది నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహించేందుకు సిద్ధమైంది. దీనికి సన్నాహకంగా అక్టోబర్ 7న ఐఐఎం విశాఖపట్నం క్యాంపస్లో ప్రాంతీయ సదస్సు నిర్వహించాలని ఆదేశించింది. ప్రొటోకాల్, భద్రత, నగర సుందరీకరణ, సాంస్కృతిక, మీడియా తదితర కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా ఉత్తర్వులతో జిల్లా రెవెన్యూ, పోలీసు, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులకు చెమటలు పడుతున్నాయి. జీవోలో పేర్కొన్న సిటీ బ్యూటిఫికేషన్, వీవీఐపీల బస, రవాణా, ఏర్పాట్ల బాధ్యత మళ్లీ విశాఖ యంత్రాంగంపైనే పడనుంది. ‘గతంలో పెట్టిన ఖర్చులకే దిక్కులేదు.. ఇప్పుడు మళ్లీ నిధులు ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడిప్పుడే రూపాయి రూపాయి కూడబెడుతున్న ఖజానాను మళ్లీ చంద్రబాబు ప్రచార యావకోసం తుడిచిపెట్టేయాలా?’ అంటూ అధికారులు పెదవి విరుస్తున్నారు. పెట్టుబడుల ముసుగులో జరుగుతున్న ఈ ఆర్భాటపు సదస్సులతో జీవీఎంసీ, వీఎంఆర్డీఏల మనుగడకే ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రేపు ‘ముద్రగడ’ సంస్మరణ సభ
సీతంపేట: సామాజిక న్యాయం, సమానత్వం, సంక్షేమం కోసం జీవితాంతం అహర్నిశలు పోరాడిన మహనీయుడు ముద్రగడ పద్మనాభంకు ఘన నివాళులు అర్పించేందుకు విశాఖలో భారీ సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్లు కాపునాడు జిల్లా అధ్యక్షుడు తోట రాజీవ్ తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరేనాలో సంస్మరణ సభను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.ముద్రగడ పద్మనాభం తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తిత్వమని, కాపు సమాజంతో పాటు అన్ని వర్గాల ప్రజల గౌరవాన్ని పొందిన ప్రజానాయకుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా జిల్లాలోని అన్ని సామాజిక సంఘాల ఐక్యతతో ‘విశాఖ కాపునాడు’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తోట రాజీవ్ తెలిపారు.ముద్రగడ పద్మనాభం సామాజిక సమానత్వం, కాపు సమాజ హక్కుల పరిరక్షణ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక ఉద్యమాలు చేపట్టి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ పోస్టర్ను తోట రాజీవ్ ఆధ్వర్యంలో నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాపు నాయకులు పీవీ సురేష్, కసిరెడ్డి సత్యనారాయణ, గుంటూరు నరసింహమూర్తి, వంగా ప్రభాకర్ రావు, గుడివాడ లతీష్, నవీన్, సుబ్బా విశ్వనాథ్, రాయుపు రెడ్డి అనిల్, కోసల శ్యామలదేవి, పండుగ్రి జయరాజు నాయుడు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
చేనేత కార్మికులకు అండగా వైఎస్సార్ సీపీ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమానికి వైఎస్సార్ కుటుంబం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కొనియాడారు. శుక్రవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు చిక్కా సత్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేకే రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా ‘నేతన్న నేస్తం’ వంటి సంక్షేమ పథకాన్ని అమలు చేసి వేలాది కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారని పేర్కొన్నారు. భారతదేశానికి చేనేత రంగం గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టిందని, చేనేత కళాకారుల నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిందని కొనియాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పద్మశాలి సామాజిక వర్గానికి పార్లమెంట్, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ల స్థాయిల్లో విస్తృత అవకాశాలు కల్పించామని గుర్తుచేశారు. కార్పొరేషన్లో కో–ఆప్షన్ సభ్యురాలిగా కొప్పుల ప్రభావతికి అవకాశం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కార్యక్రమంలో పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, చేనేత విభాగం నాయకులు వానపల్లి ఈశ్వర్రావు, సూరిశెట్టి సూరిబాబు, యిద్దలపు వేంకటేశ్వర్లు, నీలి రవి, హేమలత, పి.ఈశ్వరి, గాదె రాజు, కాకి పద్మ, కొయ్యపాక అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
వచ్చేనెల12న జాతీయ లోక్ అదాలత్
విశాఖ–లీగల్: వచ్చేనెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) చైర్మన్ చిన్నంశెట్టి రాజు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కోర్టులో లోక్ అదాలత్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న రాజీ కాగల కేసులను గుర్తించి, కక్షిదారులు, న్యాయవాదులతో చర్చలు జరపాలన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని 39 మంది న్యాయమూర్తులతో ఆయన వర్చువల్గా మాట్లాడారు. అలాగే 30 రోజుల మధ్యవర్తిత్వ ప్రచారం గురించి ప్రస్తావించారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
గుక్కెడు నీరియ్యండమ్మా..!
ఆరిలోవ: సీపీఎం మద్దిలపాలెం జోన్ ఆధ్వర్యంలో ఆరిలోవలోని నీటి సరఫరా విభాగం కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన నాటకం స్థానికులను విశేషంగా ఆకట్టుకోవడమే కాక ఆలోచింపజేసింది. ధర్నాలో సీపీఎం వయోధిక నాయకుడు ‘దాహం.. దాహం..’ అంటూ అభినయించిన తీరు ఆకట్టుకుంది. తీవ్ర దాహంతో అల్లాడిపోతూ ఆయన ఇంటింటికీ వెళ్లి తాగునీరు అడిగినా.. ఏ ఇంట్లోనూ నీళ్లు లేకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలు చూపించారు. ఓ మహిళ బిందె బోర్లించినా గుక్కెడు నీరు కూడా రాకపోవడంతో, తీవ్ర దాహంతో ఆ వృద్ధుడు సొమ్మసిల్లి కూలబడతాడు. ప్రస్తుతం ఆరిలోవ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎద్దడిని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ ప్రదర్శన, చూపర్లను తీవ్రంగా కలచివేసి కంటతడి పెట్టించింది. స్కిట్లో ఓ దృశ్యం -
ఆహార భద్రత పథకాల అమలు పక్కాగా ఉండాలి
మహారాణిపేట: ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆహార భద్రత పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, లబ్ధిదారులకు నాణ్యమైన సేవలు అందేలా చూడాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు ఇ.లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, రేషన్దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పెదవాల్తేరు–2, ఆదర్శ్నగర్–1, పెద్దజాలారిపేట అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల హాజరు, గుడ్లు, పాలు, నూనె, రేషన్ సరుకుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఆదర్శ్నగర్–1 అంగన్వాడీ కేంద్రంలో గుడ్ల కొరత, స్టాక్ రిజిస్టర్లు–భౌతిక నిల్వల మధ్య వ్యత్యాసాలు, దెబ్బతిన్న గుడ్లను గుర్తించి అధికారులకు సూచనలు చేశారు. చిన్నబుచ్చిరాజుపాలెం ఎంపీపీ పాఠశాలలో పాత బ్రౌన్ గుడ్లు నిల్వలో ఉండటాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పెదవాల్తేరు, పెద్దజాలారిపేట రేషన్ దుకాణాలతో పాటు సర్కిల్–1 ఎంఎల్ఎస్ పాయింట్ను పరిశీలించి బియ్యం నిల్వలు, ఈ–పాస్ యంత్రాల నిర్వహణ, రికార్డులను తనిఖీ చేశారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి -
రైలు, రోడ్డు, పోర్టు అనుసంధానమే భవిష్యత్తు
మహారాణిపేట: ఓడరేవులు, లాజిస్టిక్స్ ఒకే నాణేనికి రెండు వైపులని, సముద్ర మార్గాలు, పారిశ్రామిక కేంద్రాలు, అంతర్గత మార్కెట్ల మధ్య సరుకు రవాణాను సమర్థవంతంగా అనుసంధానించడంలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయని భారత రైల్వే బోర్డు ట్రాఫిక్ అదనపు సభ్యుడు దేవేంద్ర కుమార్ అన్నారు. సీఐఐ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నోవోటెల్లో నిర్వహించిన సీఐఐ కాన్ఫరెన్స్ ఆన్ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్–2వ ఎడిషన్లో ఆయన మాట్లాడారు. సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు రైల్వే శాఖ అనేక సంస్కరణలు చేపట్టిందని, వాటి వల్ల ఓడరేవులు, పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగానికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. విశాఖలో దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటు వల్ల నిర్ణయాల ప్రక్రియ వేగవంతమై, స్థానిక లాజిస్టిక్స్ సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్లో కంటైనరైజేషన్, మల్టీమోడల్ లాజిస్టిక్స్, ఓడరేవులు–రైల్వేలు–రోడ్ల సమన్వయమే సరుకు రవాణా అభివృద్ధికి కీలకమని చెప్పారు. సీఐఐ విశాఖ జోన్ చైర్మన్ జి.కృష్ణమోహన్, సీఐఐ ఏపీ వైస్ చైర్మన్ డాక్టర్ జి.సాంబశివరావు, ఏపీ మారిటైమ్ బోర్డు రైల్వే–లాజిస్టిక్స్ సలహాదారు ఆర్.ధనంజయులు, విశాఖ పోర్ట్ డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి తదితరులు ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక ప్రధాన, ఐదు చిన్న ఓడరేవులు కలిసి ఏటా సుమారు 30 కోట్ల టన్నుల సరుకు నిర్వహణ సామర్థ్యం కలిగి ఉన్నాయని ధనంజయులు తెలిపారు. కార్యక్రమంలో సీఐఐ విశాఖపట్నం జోన్ వైస్ చైర్మన్ నిలేష్ అగర్వాల్, భద్రతా కార్యకలాపాల సలహాదారు శ్రీనివాస్ నందూరి, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎ. నరసింహమూర్తి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి, సీజీఎస్టీ అదనపు కమిషనర్ బలరామ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కెప్టెన్ ఎస్. దివాకర్, స్పెషల్ ఎకనామిక్ జోన్ జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ రాజశేఖర్, జీఎంఆర్ గ్రూప్ రీజినల్ కార్గో బిజినెస్ సీఈఓ ప్రసాద్, విజయనగరం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ రోహిత్ కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఐఐ సదస్సులో రైల్వే బోర్డు ట్రాఫిక్ అదనపు సభ్యుడు దేవేంద్ర కుమార్ -
దంచికొట్టిన వాన
సాక్షి, విశాఖపట్నం: భానుడి భగభగలతో ఉడికిపోతున్న విశాఖ నగరంలో గురువారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ వేడి ఉక్కిరిబిక్కిరి చేయగా.. ఒక్కసారిగా ఆకాశంలో దట్టమైన మేఘా లు కమ్ముకున్నాయి. నగరమంతటా సుమారు మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ వర్షానికి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వన్టౌన్, కాన్వెంట్ జంక్షన్, బీచ్ రోడ్డు, అక్కయ్యపాలెం, సీతమ్మధారతో పాటు జాతీయ రహదారి కూడా వర్షపు నీటితో చెరువులను తలపించాయి. రోడ్లపై మోకాల్లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. -
క్లాసుల్లేని క్యాంపస్!
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బోధనా సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. వర్సిటీ యాజమాన్య నిర్లిప్తత, నిర్లక్ష్య వైఖరి కారణంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. స్వయంప్రతిపత్తి కలిగిన ప్రతిష్టాత్మక సంస్థపై విజిలెన్స్ విచారణ మకిలి అంటించి, ఉన్నత విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారని మేధావులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూనివర్సిటీ యాక్ట్ 91 ప్రకారం గవర్నర్ నేరుగా జోక్యం చేసుకుని చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. వర్సిటీ ప్రతిష్ట కోర్టు మెట్లెక్కినా వెనక్కి తగ్గకుండా యాజమాన్యం దూకుడుగా వ్యవహరించడంపై గవర్నర్ కార్యాలయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఏయూలో చర్చ జరుగుతోంది. నాక్ కోసం వాడుకుని.. నడిరోడ్డున పడేశారు! గతంలో ఏయూలో అధ్యాపకుల కొరత వేధిస్తున్న సమయంలో, నాక్ ప్రమాణాలను కాపాడుకోవడంతో పాటు విద్యార్థులకు బోధనా లోపం రాకుండా ఉండేందుకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) ఆమోదంతో 2022, 2023లలో అడ్హాక్ అధ్యాపకులను నియమించారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగానే నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూల ద్వారా పారదర్శకంగా వీరందరినీ ఎంపిక చేశారు. ఇంజినీరింగ్, లా, జియాలజీ, పర్యావరణ శాస్త్రం, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి సెల్ఫ్ సపోర్ట్ కోర్సులకు వీరే ప్రధాన బోధకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు లేకున్నా, సాధారణ సిబ్బంది జీతాలతో సంబంధం లేకుండా.. వీరు నిర్వహించే కోర్సుల ద్వారా వచ్చే ఆదాయంతోనే వీరికి వేతనాలు చెల్లిస్తున్నారు. రెగ్యులర్ ప్రొఫెసర్ల లాగా వీరికి ఎలాంటి రీసెర్చ్ ఫండ్స్ కానీ, కాన్ఫరెన్స్ అలవెన్సులు కానీ ఉండవు. అయినా విద్యార్థుల భవిష్యత్తు కోసం మూడేళ్లకు పైగా నిబద్ధతతో పనిచేసిన 25 మందికి పైగా అధ్యాపకులను ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా విశ్వవిద్యాలయం ఉన్నపళంగా పక్కనబెట్టడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఒకరికి రెన్యువల్.. మరొకరిపై కక్షసాధింపా? ఇటీవల కాంట్రాక్ట్ అధ్యాపకులకు సేవల రెన్యువల్ ఇచ్చిన వర్సిటీ యాజమాన్యం, సుమారు 40 మంది వరకు ఉన్న అడ్హాక్, అడ్జంక్ట్ అధ్యాపకులకు మాత్రం రెన్యువల్ నిలిపివేసింది. ఉన్నతాధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో బాధిత అధ్యాపకులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు జూన్ 29న అడ్హాక్ అధ్యాపకులకు, జులై 31న అడ్జంక్ట్ అధ్యాపకులకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘మనీష్ గుప్తా వర్సెస్ అదర్స్’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ప్రస్తావిస్తూ ‘ఒక కాంట్రాక్టు లేదా అడ్హాక్ ఉద్యోగి స్థానంలో మరో కాంట్రాక్టు, అడ్హాక్ ఉద్యోగిని భర్తీ చేయకూడదు. ఆ ఖాళీలను శాశ్వత పోస్టుల ద్వారా మాత్రమే నింపాలి’ అని స్పష్టం చేస్తూ, వీరిని తక్షణమే విధుల్లో కొనసాగించాలని ఆదేశించింది. అయినప్పటికీ, వర్సిటీ యాజమాన్యంలో చలనం రాకపోవడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలను అమలు చేయకపోతే వర్సిటీ ఉన్నతాధికారులను నేరుగా కోర్టుకు పిలిపిస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా? అధికారుల పంతాలు, పట్టింపుల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. గడిచిన నెల రోజులుగా సంబంధిత విభాగాల్లో బోధన పూర్తిగా స్తంభించిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి ఏయూ క్యాంపస్కు వస్తున్న సుమారు 2 వేల మందికి పైగా విద్యార్థులు తరగతులు లేక ఖాళీగా కాలం వెళ్లదీస్తున్నారు. ఒకవైపు సిలబస్ పూర్తికాక, మరోవైపు పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లాభసాటిగా నడుస్తున్న స్వయం ఆర్థిక కోర్సులను నిర్వీర్యం చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతున్న ఏయూ అధికారుల తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
సింహగిరిపై వరుణ జపాలు
సింహాచలం: రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ సింహగిరి క్షేత్రపాలకుడు శ్రీ త్రిపురాంతకస్వామి ఆలయంలో గురువారం నుంచి మూడు రోజులపాటు వరుణ జపాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశనం, త్రిశూలార్చన, రుష్యశృంగ ఆవాహన, దీక్షాధారణ, వేద పారాయణాలు, రుత్విగ్వరణం, వరుణ జపాలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి మృత్సంగ్రహణం, వేద పారాయణాలు, అంకురార్పణ, అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, చూర్ణికా పఠనం, ఆలయ బలిహరణ తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు కార్యక్రమంలో పాల్గొని వేద పండితులకు దీక్షా వస్త్రాలు అందజేశారు. దేవస్థానం వేద పండితుడు కాళ్లకూరి సుబ్రహ్మణ్యశర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చకుడు రమణమూర్తి, వేద విద్యార్థులు కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
స్వాతంత్య్ర దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట: స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరితో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ అభివృద్ధి, సాంస్కృతిక వైభవం, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలను ప్రతిబింబించేలా వినూత్న శకటాలు, ఆకర్షణీయ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. వేడుకల ప్రాంగణంలో వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసే స్టాళ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేదిక, సీటింగ్, ధ్వని వ్యవస్థ తదితర ఏర్పాట్లను నాణ్యంగా పూర్తి చేయాలని సూచించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందిని పురస్కారాలకు సిఫారసు చేయాలని, ఆహ్వాన పత్రికలు, ప్రోటోకాల్ ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. -
గిరిజనుల అభ్యున్నతికి సమష్టి కృషి అవసరం
మహారాణిపేట: గిరిజనుల అభ్యున్నతికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఏపీ శాసనసభ షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషా దేవి అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గురుకులాలతో పోలిస్తే నగర గురుకులంలో మెరుగైన వసతులు ఉన్నాయన్నారు. జీసీసీ ద్వారా గిరిజన విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందుబాటులోకి తేవాలన్నారు. కమిటీ సభ్యుడు నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు పోటీ పరీక్షలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ెసమావేశంలో కమిటీ సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం, రేగం మత్స్యలింగం, జేసీ విద్యాధరి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, జీసీసీ ఎండీ శోభిక, అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ పి.వి.సుబ్బారెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ యు.నాగమునియ్య, డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు పాల్గొన్నారు. -
అధికారులకు అల్లుడి గిల్లుడు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సొంత ఊరుకే చెందడంతో పాటు వరుసకు అల్లుడయ్యే విజయ్కుమార్ నాయుడు వ్యవహారాలు రోజుకు ఒకటి బయటపడుతున్నాయి. ప్రసిద్ధ శైవ క్షేత్రమైన పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్ చేయడంతో పాటు అధికారులకు ఫలానా పనులు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసేవాడని తెలుస్తోంది. అంతేకాకుండా ఫలానా పని చేయాల్సిందేనంటే బెదిరించిన సందర్భాలూ ఉన్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రధానంగా భూమి వ్యవహారాలతో పాటు మైనింగ్ విషయాల్లో అటు రెవెన్యూ, ఇటు మైనింగ్, రవాణా, పోలీసుశాఖలోని అధికారులకు ఫోన్లు చేసి జోక్యం చేసుకునేవారని తెలుస్తోంది. ఫలానా పని చేయాల్సిందేనంటూ అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అన్ని వ్యవహారాల్లో...అధికారులందరికీ ఫోన్లు చేసి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్నికల ముందు నుంచీ సీఎం రమేష్కు అన్నీ తానై వ్యవహరించడంతో పాటు గెలిచిన తర్వాత పోస్టింగుల్లో కూడా ఆయన జోక్యం ఉండేదని తెలుస్తోంది. ఇక పార్లమెంటు పరిధిలోని కొన్ని కాంట్రాక్టుల విషయంలోనూ అల్లుడి పెత్తనం జోరుగా సాగేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే అడ్డంగా అక్రమ మైనింగ్ చేస్తూ దొరికినప్పటికీ కేసు నమోదులో అటు మైనింగ్, ఇటు రాంబిల్లి పోలీసుల వ్యవహారం చూస్తే ఆయన పెత్తనం ఏ స్థాయిలో సాగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా పెద్దలను వదిలి.. కేవలం కిందిస్థాయి అధికారులపైనే ప్రతాపం చూపడమూ ఇప్పుడు ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్ని రోజుల కిందటే పోస్టింగులోకి వచ్చి అక్రమ మైనింగ్ వ్యవహారంలో అసలు పాత్ర లేని తహసీల్దారుపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని వీరు తప్పుపడుతున్నారు. అల్లుడి గిల్లుడికి తాము బలైపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు పెట్టేందుకూ వెనుకంజ..! విజయ్కుమార్ నాయుడు అక్రమ మైనింగ్ చేస్తూ అడ్డంగా దొరికినప్పటికీ అధికారులు స్వామి భక్తిని ప్రదర్శిస్తుండడం విమర్శల పాలవుతోంది. ప్రధానంగా రాంబిల్లి సీఐ తన స్వామిభక్తిని మరింతగా చాటుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్రమ మైనింగ్పై పెట్టిన కేసుల వివరాలను కూడా మీడియాకు వెల్లడించేందుకు ఇష్టపడడం లేదు. అంతేకాకుండా కేసు ఎవరి మీద పెట్టామనే పూర్తి వివరాలను కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయకపోవడం గమనార్హం. నమోదు చేసిన కేసుల్లో కూడా పెద్దగా పస లేకుండా చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ మైనింగ్ విషయంలో జోక్యం చేసుకుంటే కేసులు పెడతానంటూ స్థానికులపై సీఐ బెదిరింపులకు దిగారనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ మైనింగ్ జరిగిందని నివేదిక రావడంతో పాటు ఎంత మేర కొల్లగొట్టారనే విషయం తెలిసినప్పటికీ కేసు నమోదులో ఇంతగా దాచి ఉంచడంతో పాటు తప్పుదోవ పట్టించేలా వివరాల నమోదు చూస్తుంటే.. అంతా సీఎం రమేష్ చూసుకుంటారు..తనకూ ఏమీ కాదనే ధైర్యమే ఇలా చేయిస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పెద్దలను వదిలి...! వాస్తవానికి మైనింగ్ లీజు ఇచ్చే సమయంలోనే ఏ ప్రాంతం వరకు లీజు ఇచ్చారనే విషయాన్ని గనులశాఖ అధికారులు కలర్ కోడింగ్ ఇవ్వడం చేయాలి. లేనిపక్షంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకూ మైనింగ్ తవ్వకాలు జరపాలనే విషయాన్ని సూచిస్తూ పిల్లర్లు వేయాల్సి ఉంటుంది. అయితే, పంచదార్ల కొండలకు మైనింగ్ ఇచ్చే విషయంలో మైనింగ్ అధికారులు కనీసం చర్యలు తీసుకోలేదు. సాధారణంగా ఎంత లోతు తవ్వారు? ఎన్ని మెట్రిక్ టన్నులు తవ్వారనే వివరాలను తహసీల్లార్లకు అవగాహన ఉండదు. అయితే, అన్ని శాఖలు కలిసి సర్వే చేపట్టే సమయంలో మాత్రం తహశీల్దారు ఎంత మేర తవ్వకాలు జరిపారనేది పరిశీలించే అవకాశం ఉంటుంది. కేవలం నిరంభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ వరకే తహసీల్లార్ల పాత్ర ఉంటుందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. అయితే, పంచదార్ల విషయంలో పెద్దలను రక్షించేందుకుగానూ కొత్తగా వచ్చిన తహసీల్దారును బాధ్యుడ్ని చేస్తూ.. ఏకంగా సస్పెండ్ చేయడం ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పెద్దలంతా దోపిడీ చేసి.. తమను బలిపశువును చేయడం ఏమిటంటూ మండిపడుతున్నారు. ఎంపీ సీఎం రమేష్ బంధువు విజయ్కుమార్ నాయుడు లీలలు నియోజకవర్గంలో పనుల కోసం అధికారులకు హుకుం పంచదార్ల అక్రమ మైనింగ్లో అడ్డంగా దొరికిన వైనం అయినా కేసు నమోదులో పోలీసుల దాగుడు మూతలు కిందిస్థాయి అధికారులే బలిపశువులు -
మహానగరం దాహం.. దాహం!
డాబాగార్డెన్స్: మహానగరంలో ‘దాహం’ కేకలు మిన్నంటుతున్నాయి. జీవీఎంసీ పరిధిలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చి, ప్రజల గొంతులు ఎండుతున్నాయి. నగర ప్రజలకు సరిపడా నీళ్లు అందించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఎల్నీనో ప్రభావంతో జలాశయాల్లోనూ నీటి మట్టాలు గణనీయంగా పడిపోయాయి. ఫలితంగా కొళాయిల నుంచి నీరు రాక, జనం చుక్క నీటి కోసం రోడ్లపై బిందెలతో పడిగాపులు కాయాల్సి వస్తోంది. బాకా ఊదడమే.. ప్రత్యామ్నాయం శూన్యం విశాఖ నగరానికి ప్రధానంగా ఏలేరు, గోదావరి, రైవాడ, తాటిపూడి, మేహాద్రిగెడ్డ జలాశయాల నుంచే తాగునీరు సరఫరా అవుతోంది. ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయంటూ రోజూ ప్రగల్భాలు పలికే జీవీఎంసీ అధికారులు.. క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను మాత్రం చేయలేక చేతులెత్తేశారు. తాగునీరు పుష్కలంగా ఉందంటూ ఒకవైపు బాకా కొడుతున్న అధికారులు.. సమస్య జఠిలమయ్యాక ఇప్పుడు సమీక్షలతో హడావుడి చేస్తున్నారు. పాతాళంలో భూగర్భ జలాలు ఆరిలోవ, ఎండాడ, మధురవాడ, రుషికొండ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. అడ్డూ అదుపూ లేని కాంక్రీట్ కట్టడాలు పెరిగిపోవడం, వర్షపు నీరు ఇంకే మార్గం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. శివార్లే కాకుండా, నగర నడిబొడ్డున కూడా ప్రజలు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. వేసవి దాటి వర్షాకాలం వచ్చినా ఎండల తీవ్రత తగ్గకపోవడంతో నీటి వినియోగం ఊహించని రీతిలో పెరిగింది. పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా అధికారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్లు అడిగితే ‘లేవు’ అనే సమాధానం! నగరంలో నీటి కొరత తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాల్సిన అధికారులు, ‘నీరు లేదు’ అని చేతులెత్తేస్తుండటంతో ప్రజలు తీవ్ర వేదనకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిత్యం జనం పనులన్నీ పక్కనబెట్టి నీటి కోసమే రోడ్లపై సమయం వృథా చేయాల్సి వస్తోంది. ట్యాంకర్ బుకింగ్ కోసం టోల్ఫ్రీ నెంబర్ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంగా టీఎస్ఆర్ కాల్ సెంటర్ ద్వారా ట్యాంకర్ బుకింగ్ సౌకర్యం కల్పించాం. ట్యాంకర్ బుకింగ్ కోసం టోల్ఫ్రీ నంబరు 1800 4250 0009ను సంప్రదించాలి. ఈ సేవలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. భీమిలి జోన్ నుంచి అనకాపల్లి జోన్ వరకు ఉన్న 11 ఫిల్లింగ్ పాయింట్ల ద్వారా తాగునీటి ట్యాంకర్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ‘డయల్–ఏ–ట్యాంకర్’ సేవలకు నగర ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. తొలి రోజే సాయంత్రం 7 గంటల వరకు 245 ట్యాంకర్ బుకింగ్లు నమోదయ్యాయి. ప్రజలు ఇంటి నుంచే మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ట్యాంకర్ బుక్ చేసుకునేలా మరో ఒకటి, రెండు రోజుల్లో ఆన్లైన్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. బుకింగ్లు ‘ఫస్ట్ ఇన్–ఫస్ట్ అవుట్’ విధానంలో పూర్తిగా పారదర్శకంగా కేటాయిస్తాం. – కేతన్ గార్గ్, కమిషనర్, జీవీఎంసీ పాలకులు మాటలు మంచినీళ్లలా పారిస్తున్నారు. అధికారులు కాగితాల్లో రిజర్వాయర్లను పొంగిపొర్లిస్తున్నారు. తీరా కుళాయి తిప్పితే చుక్క నీరు రాక.. గాలొచ్చి వెక్కిరిస్తోంది! ఎల్నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేశాడు. వర్షాకాలంలో కూడా భానుడి భగభగలకు భూగర్భ జలాలు పాతాళంలో దాక్కున్నాయి. కుళాయిలు ఎండిపోవడం.. బోర్లు మూగబోవడం.. ట్యాంకర్లు రాకపోవడంతో మహిళలు వీధుల్లో సమరశంఖం పూరిస్తున్నారు. ముందస్తు ప్రణాళికలను గాలికొదిలేసిన అధికారులు.. ఇప్పుడు సమస్య జఠిలమయ్యాక ‘కాల్ సెంటర్లు.. సమీక్షలు’ అంటూ హడావుడి చేస్తున్నారు. -
మొక్కలు నాటిన యూబీఐ అధికారులు
మహారాణిపేట: కార్గిల్ దివస్ సందర్భంగా ఎన్ఎస్టీఎల్–డీఆర్డీవో ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం రీజనల్ హెడ్ జె.సింహాచలం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అదనపు డైరెక్టర్ హెచ్ఎన్ దాస్, సీనియర్ సైంటిస్ట్ మిధిలేష్ సాహూ, యూనియన్ అధ్యక్షుడు అకిరి సునీల్, సెక్రటరీ నాగభూషణం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈబీసీ హెడ్ పి.రాజేష్, ప్రాంతీయ ఇన్స్యూరెన్స్ హెడ్ ఐటీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
సీఎంతో షిప్యార్డ్ సీఎండీ భేటీ
సాక్షి, విశాఖపట్నం: హిందుస్థాన్ షిప్యార్డ్ (హెచ్ఎస్ఎల్) సీఎండీ రియర్ అడ్మిరల్ చంద్రశేఖరన్ రఘురాం గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. రాష్ట్ర తీరప్రాంతాన్ని సముద్ర ఆధారిత ఆర్థికాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సముద్ర రంగ అభివృద్ధి, నౌకా నిర్మాణ సామర్థ్య విస్తరణపై చర్చించారు. మచిలీపట్నం, దుగరాజపట్నంలో ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ షిప్యార్డుల ఏర్పాటుతో దేశ నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనకు తోడ్పాటు అందించాలనే అంశంపై చర్చించినట్లు హెచ్ఎస్ఎల్ తెలిపింది. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే నౌకా నిర్మాణం, మరమ్మతులు, అనుబంధ లాజిస్టిక్స్ రంగాల్లో కలిపి రాష్ట్రంలో సుమారు 18 లక్షల పనిదినాల ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని సీఎండీ పేర్కొన్నారు. అలాగే ఫ్యాబ్రికేషన్, అవుట్ఫిట్టింగ్ విభాగాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.2 వేల కోట్లకు పైగా వ్యాపార అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో స్థానిక పరిశ్రమలకు గణనీయమైన ఊతం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. -
నీటి దందాకు చెక్
డాబాగార్డెన్స్: జీవీఎంసీ నీటి దందాకు ఎట్టకేలకు అధికారులు చెక్ పెట్టారు. ఇకపై ఆన్లైన్లో లేదా అధికారికంగా బుక్ చేసుకున్న వినియోగదారులకే జీవీఎంసీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల నిర్వాహకులు జీవీఎంసీకి నామమాత్రపు రుసుము చెల్లించి నీటిని తీసుకెళ్లి, ప్రజల నుంచి రూ.వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. టీఎస్ఆర్ కేంద్రాల్లో సామాన్య ప్రజలను పక్కనబెట్టి ప్రైవేట్ ట్యాంకర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై ‘సాక్షి’ బుధవారం ‘నీటి దందా’ శీర్షికతో కథనం ప్రచురించడంతో స్పందించిన అధికారులు ప్రైవేట్ ట్యాంకర్లకు నీటి సరఫరాను నిలిపివేశారు. అధికారిక బుకింగ్లకే నీటిని అందించడం ప్రారంభించారు. దీంతో టీఎస్ఆర్ కేంద్రాల వద్ద ప్రైవేట్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. తమకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు ధర్నాకు దిగారు. -
శాటిలైట్ మోడల్లో విశాఖ రైల్వే హబ్
వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో చోటుసాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే స్టేషన్ను 14 ప్లాట్ఫామ్లతో అత్యాధునిక మెగా స్టేషన్గా అభివృద్ధి చేయడంతో పాటు, విశాఖ–సింహాచలం–పెందుర్తి రైల్వే స్టేషన్లను అనుసంధానించే ‘శాటిలైట్ మోడల్’ను రూపొందించనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ తెలిపారు. నగర విస్తరణ అవసరాలకు అనుగుణంగా ప్రధాన స్టేషన్పై ఒత్తిడి తగ్గించడం, కొత్త రైళ్లకు మార్గం సుగమం చేయడం ఈ ప్రణాళికల ప్రధాన లక్ష్యమని చెప్పారు. వీఎంఆర్డీఏ డెక్లోని దక్షిణ కోస్తా రైల్వే జోన్ తాత్కాలిక ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం విశాఖ స్టేషన్లో ప్లాట్ఫామ్లు, స్టేబ్లింగ్ లైన్లు తగినంత లేకపోవడంతో రద్దీ ఎక్కువగా ఉందని, దీనిని అధిగమించేందుకు సుమారు రూ.300 కోట్లతో స్టేషన్ను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. అదే సమయంలో అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద దువ్వాడ, సింహాచలం, కొత్తవలస, పెందుర్తి స్టేషన్లను కూడా ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. విశాఖ, గోపాలపట్నం, సింహాచలం మధ్య నాలుగు లైన్ల విస్తరణ పూర్తయితే రైళ్ల రాకపోకలు మరింత సులభమవుతాయని, అవుటర్ వద్ద రైళ్లు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి తగ్గుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు కూడా ఇది దోహదపడుతుందని తెలిపారు. విశాఖ నుంచి మరిన్ని వందేభారత్ రైళ్లు : విశాఖ నుంచి మరిన్ని వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు కేటాయించాలని రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. విశాఖ–తిరుపతి మధ్య కొత్త రైళ్ల నిర్వహణ ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయని, ట్రాక్ల లభ్యత, ఇతర జోన్ల సమన్వయం పూర్తయిన తర్వాత తుది ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఫీల్డ్ సర్వేలు కొనసాగుతున్నాయని, అలైన్మెంట్ ఖరారైన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. దువ్వాడకు కొన్ని సుదూర రైళ్ల మళ్లింపు: విశాఖ ప్రధాన స్టేషన్లో సాయంత్రం వేళల్లో తీవ్ర రద్దీ ఉండటంతో, ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండే కొన్ని సుదూర రైళ్లను దువ్వాడ స్టేషన్కు మళ్లించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇతర జోన్లతో సమన్వయం పూర్తయిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమయ పాలనపై దృష్టి సారించాం : ప్రయాణికుల భద్రత, సమయపాలనకు ప్రాధాన్యం ఇస్తున్నామని, పాత ఐసీఎఫ్ కోచ్ల స్థానంలో ఎల్హెచ్బీ కోచ్లను ప్రవేశపెడుతున్నామని వివరించారు. మరిన్ని ఎల్హెచ్బీ కోచ్ల కోసం రైల్వే బోర్డును కోరామని చెప్పారు. ఎక్కువ స్టేషన్లలో ఆగడం వల్ల ప్రయాణ సమయం పెరుగుతోందని గుర్తించి, కొత్త రైళ్ల ద్వారా సమర్థవంతమైన నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. సింగిల్ లైన్లన్నీ డబుల్ లైన్లుగా మార్పు : సింగిల్ లైన్లను దశలవారీగా డబుల్ లైన్లుగా మారుస్తున్నామని, సింహాచలంతో పాటు జోన్ పరిధిలోని రైల్వే యార్డులను ఆధునికీకరిస్తామని చెప్పారు. గుంతకల్లు–బళ్లారి మార్గంలో క్వాడ్రప్లింగ్కు ఆమోదం లభించిందని, ఈ ప్రాజెక్టుతో ప్రతిరోజూ నడిచే 30–40 సరుకు రైళ్ల రాకపోకలు మరింత వేగవంతమవుతాయని వివరించారు. సిబ్బంది కొరత ఉన్నా.. దూసుకెళ్తున్నాం : జూన్ 1న 400 మంది సిబ్బందితో కార్యకలాపాలు ప్రారంభించిన దక్షిణ కోస్తా జోన్లో ప్రస్తుతం 600 మంది పనిచేస్తున్నారని, ఇంకా సుమారు 40 శాతం పోస్టులు భర్తీ కావాల్సి ఉన్నప్పటికీ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. గతేడాదితో పోలిస్తే రెండు నెలల్లోనే 3 శాతం వృద్ధితో 29.4 మిలియన్ల మంది ప్రయాణించగా, ప్రయాణికుల ఆదాయం 13 శాతం పెరిగి రూ.671 కోట్లకు చేరిందన్నారు. ఇప్పటివరకు 40 మిలియన్ టన్నుల సరకు రవాణా జరిగిందని, ఈ ఏడాది 108 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. పునర్వ్యవస్థీకరణ కారణంగా తాత్కాలిక ప్రభా వం ఉన్నప్పటికీ సరకు రవాణా, ఆదాయం పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. -
బ్యాంకు, సైబర్ మోసాలపై శిక్షణ
అల్లిపురం: బ్యాంకు మోసాలు, సైబర్ నేరాల దర్యాప్తులో అధికారుల నైపుణ్యాలను మరింత పెంపొందించేందుకు సీఐడీ విశాఖ ప్రాంతీయ కార్యాలయంలో గురువారం ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. సీఐడీ డీజీ డాక్టర్ ఎ.రవిశంకర్ మార్గదర్శకత్వంలో, ఎస్పీ ఎస్.శ్రీధర్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ డాక్టర్ జి.ప్రేమ్కాజల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సైబర్ నిపుణుడు వి.నరసింహారావు, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ వి.సూర్యప్రకాశ్, మాజీ సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.రామకృష్ణ బ్యాంకు మోసాలు, సైబర్ నేరాల నివారణ, దర్యాప్తు విధానాలు, డిజిటల్ సాక్ష్యాల సేకరణ, చట్టపరమైన అంశాలపై అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. శిక్షణలో సీఐడీ విశాఖ ప్రాంతీయ కార్యాలయానికి చెందిన డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొని సైబర్ నేరాల దర్యాప్తుకు సంబంధించిన ఆధునిక విధానాలను తెలుసుకుని తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. -
రానున్న మూడు గంటల్లో.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రానున్న మూడు గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ(గురువారం) రాత్రి మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.విశాఖలో వాతావరణం ఒక్కసారిగా మారింది. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వేడి, ఉక్క పోత వాతావరణంతో అల్లాడుతున్న జనానికి ఉపశమనం కలిగింది. ఎంవిపీ, ఆరిలోవ, ఎండాడ, సాగర్ నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. -
టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీ: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖ: టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీ అని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఒక మహిళను టీడీపీ మంత్రి వేధించడం దారుణం. కూటమిది మంత్రి వర్గమా లేక వేధింపుల వర్గమా అనే అనుమానం కలుగుతోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ మంత్రిని వెంటనే భర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి స్థానంలో ఉన్న ఓ వ్యక్తి.. ఎన్ఆర్ఐ మహిళను వేధించడమేంటి?. తన సేవల కోసం వివరించడానికి ఒక మహిళ తన టీమ్తో వస్తానంటే ఆమెను మాత్రమే సదరు ఒంటరిగా రమ్మని చెప్పారంట. వెంటనే ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలి. టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీ. ఆ మంత్రిపై కేసు పెట్టి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కూటమి నేతలు మన రాష్ట్ర పరువును విదేశాల్లో కూడా తీస్తున్నారు. మహిళల గౌరవం విషయంలో ఇంత జరిగినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?.చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే ఆ మంత్రిని వెంటనే భర్తరఫ్ చేయాలి. ఇంత పెద్ద తప్పు చేసిన మంత్రిని రోడ్డుపై నడిపిస్తారా?. మేక, కోడిని కోస్తే మా పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి రోడ్డుపై నడిపించారు. ఇప్పుడు ఈ మంత్రి విషయంలో ఏం చేస్తారు?. కేబినెట్లో ఉన్న ముగ్గురు మహిళా మంత్రులు ఆ వేధింపుల మంత్రిని మెడ పట్టుకొని బయటకు గెంటేసే దమ్ముందా?. మహిళలపై ఈగ వాలితే నేనుంటా అన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యారు?. ఈ విషయంలో ఎందుకు స్పందించలేదు.ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోగా వేరే దేశంలో ఉన్న తెలుగు మహిళలను మంత్రులు వేధిస్తున్నారు. కూటమి పాలనలో అడుగుకొక కీచకుడు ఉన్నాడు. మా ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు పెట్టడం కోసం టీడీపీ నేత తన భార్య బట్టలు చింపేసాడు. అరవ శ్రీధర్ విషయంలో కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా చర్యలు ఉండవని అంతా అనుకుంటున్నారు. ఆ మంత్రి పేరు బయటపెట్టాలి.. కేసు పెట్టాలి.. మంత్రివర్గం నుంచి ఆయన్ను భర్తరఫ్ చేయాలి. ఒక ఎన్ఆర్ఐ మహిళ తన ఆవేదన చెప్పుకుంటుంటే టీడీపీ సైకోలు పోస్టులు పెట్టి ఆమెను వేధిస్తున్నారు అంటూ మండిపడ్డారు. -
మొనజైట్ కేరాఫ్ కళింగపట్నం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని సుదీర్ఘ సముద్రతీరం ఇప్పుడు సరికొత్త ఆర్థిక విప్లవానికి వేదిక కాబోతోంది. ముఖ్యంగా అత్యంత అరుదైన, ఖరీదైన ఖనిజాల్లో ఒకటైన మొనజైట్కు కేరాఫ్ అడ్రస్గా శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం తీరం ఉందని ప్రముఖ పరిశోధన సంస్థ బీ2కే అనలిటిక్స్ తేల్చింది. కళింగపట్నం తీరంలో దాదాపు 27 కిలోమీటర్ల పొడవున 700 మీటర్ల వెడల్పు మేర విస్తరించి ఉన్న సముద్రతీరంలో ఈ ఖనిజం ఉన్నట్లు తమ పరిశోధనల్లో వెల్లడైనట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని తీరప్రాంతంలో మొనజైట్తో పాటు గార్నెట్, ఇల్మనైట్ మొదలైన ఖనిజాలున్నాయి. ఇప్పటివరకు మన దేశం 80 శాతం వరకు మొనజైట్ని చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది.ఇక కేంద్రప్రభుత్వం వ్యూహాత్మకంగా చేపట్టిన రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాజెక్టు ద్వారా కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. బీ2కే అనలిటిక్స్ సంస్థ దేశంలో హెవీ రేర్ ఎర్త్ ఖనిజాల కొరత, వాటి నిల్వలపై ప్రధానంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఐఎస్), అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ) జరిపిన భూగర్భ పరిశోధన నివేదికలను, కోర్ శాంప్లింగ్ డేటా ఆధారంగా అధ్యయనం చేసింది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల్లో లభించే మొనజైట్ ఇసుకలో ఎక్కువగా లైట్ రేర్ ఎర్త్ మూలకాలే ఉన్నాయని, ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లు, గ్రీన్ ఎనర్జీ పరిశ్రమలకు అత్యంత కీలకమైన డిస్పోసియం, టెర్బియం, వంటి హెవీ రేర్ ఎర్త్ మూలకాల వాణిజ్యపరమైన నిల్వలు మనదేశంలో చాలా తక్కువగా ఉన్నాయని గుర్తించింది. ఈ కొరతను కచ్చితంగా అంచనా వేయడానికి దేశీయ పారిశ్రామిక దిగుమతుల రికార్డులను, అంతర్జాతీయ గనుల లభ్యత గణాంకాలను సరిపోలుస్తూ.. రాబోయే కాలంలో ఈవీ రంగం పెరిగే కొద్దీ భారత్కు హెవీ రేర్ ఎర్త్ లభ్యత ఎంత సవాలుగా మారుతుందో విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది. రాష్ట్రంలో 38 లక్షల టన్నుల మొనజైట్ నిల్వలు 974 కిలోమీటర్ల తీరప్రాంతం కలిగిన మన రాష్ట్రంలో 38 లక్షల టన్నుల మొనజైట్ నిల్వలు ఉన్నట్లు అంచనా. ఇది దేశంలోని మొనజైట్ నిక్షేపాల్లో 30 శాతం. రాష్ట్రంలోని నిల్వల్లోను ఎక్కువభాగం కళింగపట్నం–భావనపాడు బెల్ట్లోనే ఉంది. ఏఎండీ పరిశోధనల ప్రకారం.. కళింగపట్నం డిపాజిట్లలో సగటున 0.5 శాతం మొనజైట్ నిల్వలు ఉన్నాయి. అంటే కళింగపట్నం తీరంలో లభించే ప్రతి వెయ్యికిలోల ఇసుకలో ఐదుకిలోల స్వచ్ఛమైన మొనజైట్ లభిస్తుంది. ఇది రేర్ ఎర్త్ ఆక్సైడ్ల (ఆర్ఈవో) ఉత్పత్తికి ప్రధాన వనరు. మిగిలిన 995 కిలోల ఇసుకలోను టైటానియం తయారీకి వాడే ఇల్మనైట్, రూటైల్.. అదేవిధంగా పరిశ్రమల్లో వాడే గార్నెట్, జిర్కాన్ వంటి ఇతర విలువైన ఖనిజాలు కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి గార్నెట్ నిల్వల్లోను అధునాతన సాంకేతికతలకు అవసరమైన హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తల ఎల్రక్టాన్ ప్రోబ్ మైక్రో అనాలసిస్ (ఎప్మా)లో స్పష్టమైందని నివేదికలో పేర్కొన్నారు. మొనజైట్ని ఎందుకు వినియోగిస్తారంటే.. ప్రస్తుత ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్న సెమీకండక్టర్లు, ఎల్ఈడీలు, మైక్రోప్రాసెసర్లు, సోలార్ సెల్స్, లేజర్స్ వంటి అత్యాధునిక ఎల్రక్టానిక్స్ పరికరాల తయారీలో కీలకమైన ఈ మొనజైట్ ఖనిజం అత్యంత కీలకమైనది. ఇందులో ఉండే సరికొత్త రసాయన మూలకాలు సాంకేతిక రంగానికి ప్రాణాధారంగా మారాయి. చైనా నుంచి దిగుమతికి ఇకపై చెక్ ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ (ఆర్ఈపీఎం) చిప్ల తయారీకి అవసరమైన ముడిసరుకులో 70 నుంచి 80 శాతం వరకు చైనా నుంచే వస్తోంది. భారత్ కూడా తన అవసరాల కోసం చైనాపైనే ఆధారపడుతోంది. భారతదేశంలో భారీగా నిల్వలు ఉన్నప్పటికీ, వాటిని వెలికితీసే సరైన సాంకేతికత, శుద్ధిచేసే పరిశ్రమలు లేవు. చైనా నుంచి దిగుమతులు చేసుకోవడం వల్ల దేశీయంగా తయారీ రంగానికి భారీగా ఖర్చవుతోంది. దీన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేర్ ఎర్త్ ప్రాజెక్ట్, నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ద్వారా దేశీయంగానే వీటిని శుద్ధిచేసి వినియోగించుకునేలా ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒడిశా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ను కలుపుతూ రూ.50 వేల కోట్లతో ప్రత్యేక ఖనిజ కారిడార్లను ఏర్పాటు చేయాలని కేంద్ర బడ్జెట్లో నిర్ణయించింది. మైనింగ్, ఖనిజాల శుద్ధి, పరిశోధనలను ప్రోత్సహించడంతోపాటు అత్యంత శక్తిమంతమైన అయస్కాంతాల తయారీ పరిశ్రమలను నెలకొల్పడమే దీని ప్రధాన లక్ష్యం. మొనజైట్ ఖనిజంలో అణుశక్తికి ఉపయోగపడే థోరియం అనే రేడియోధార్మిక పదార్థం ఉండటం వల్ల దీని వెలికితీత బాధ్యతలను ప్రభుత్వరంగ సంస్థలకే పరిమితం చేసింది. అయితే రాబోయే రోజుల్లో స్పష్టమైన నిబంధనలతో ప్రైవేటు పెట్టుబడులను కూడా ఆహ్వానించే అవకాశం ఉందని బీ2కే సంస్థ వెల్లడించింది. -
రామకొండపై రావణ సైన్యం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రసిద్ధ ప్రాచీన శైవ క్షేత్రమైన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని పంచదార్ల కొండపై అడ్డగోలుగా మైనింగ్ జరిపి.. వైఎస్సార్సీపీ పోరాటాలు, ప్రజా వ్యతిరేకతతో చాప చుట్టేసిన చంద్రబాబు కూటమి నేతలు.. ఇప్పుడు రాంబిల్లిలోని రాముడి కొండపై పడ్డారు. ఇక్కడ భారీ ఎత్తున అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. రాముడి పాదాల సాక్షిగా రావణ విధ్వంసం సృష్టిస్తున్నారు. 5 ఎకరాల్లో రాత్రీ పగలు తేడా లేకుండా తవ్వేస్తూ వందలాది టిప్పర్ల గ్రావెల్ తరలించేస్తున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ.12 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ, పోలీసు, మైనింగ్, రవాణా శాఖ అధికారులకు మామూళ్లు ముట్టజెపుతున్నట్లు సమాచారం. ఎన్నో ప్రకృతి విపత్తుల నుంచి తమను కాపాడిన రామకొండను అక్రమ మైనింగ్తో కనుమరుగు చేస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. రాముడు సేద తీరిన కొండ...! రాంబిల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 142లో ఉన్న ఈ రామకొండకు చారిత్రకంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. శ్రీరాముడు భద్రాచలానికి వెళ్లే ముందు ఈ కొండపై సేద తీరాడని చెబుతారు. అందుకే ఈ కొండను రామ కొండ అంటారు. ఇందుకు గుర్తుగా కొండపై రామస్థూపం కూడా నిర్మాణమై ఉంది. పురావస్తుశాఖ కూడా ఈ స్థూపానికి గుర్తింపు ఇచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాకుండా రాంబిల్లిని గతంలో రాంపల్లి (రాముడి పల్లె అనే అర్థంలో) అని పిలిచేవారని, కాలక్రమంలో ఇది రాంబిల్లి అయ్యిందని కూడా చెబుతున్నారు. ఎన్నో విపత్తుల నుంచి తమను ఈ కొండ కాపాడిందని వాడపాలెం గ్రామస్తులు తెలిపారు. చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి పొందిన ఈ కొండపై ఇప్పుడు చంద్రబాబు కూటమి గద్దల కన్ను పడింది. రాత్రీ పగలు తేడా లేకుండా భారీ పొక్లయిన్లతో ఇప్పటికే కొండలో పెద్ద భాగాన్ని తవ్వేశారు. మొన్నటివరకు ఇదే మండలంలోని శైవక్షేత్రమైన పంచదార్ల కొండలో అక్రమ తవ్వకాల ద్వారా ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసి తన అల్లుడు ద్వారా రూ.10 కోట్ల మేర అక్రమ మైనింగ్ చేసిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అడుగుజాడల్లోనే.. రామకొండపైనా కూటమి నేతలు తవ్వకాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ అక్రమ తవ్వకాల ద్వారా ఇప్పటికే రూ. కోట్ల మేర ఆర్జించినట్టు చెబుతున్నారు. వీరి అక్రమ తవ్వకాలతో రామసూ్థపంతో పాటు రాముడి పాదాలకూ ముప్పు పొంచి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులకూ వాటా..! అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ఉన్న సెజ్లో పరిశ్రమల ఏర్పాటుకు భూమి చదును కోసం గ్రావెల్ అవసరం అవుతుంది. ఇదే అవకాశంగా చంద్రబాబు కూటమి నేతలు అక్రమార్జనకు తెరతీశారు. సాధారణంగా ఒక్కో ట్రిప్పు గ్రావెల్ ధర రూ. 8 వేల నుంచి రూ.10 వేలు ఉంటుంది. అయితే, ఇందులో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు కూడా వాటాలు ఇవ్వాలంటూ ఒక్కో ట్రిప్పునకు రూ. 12 వేలు చొప్పున పరిశ్రమల నుంచి వసూలు చేస్తున్నారు. ఇందులో ప్రతి ట్రిప్పునకు రూ. 2 వేలు చొప్పున రెవెన్యూ, పోలీసు, రవాణాశాఖ, మైనింగ్ అధికారులకు మామూళ్లు ముట్టచెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ 2 వేలల్లో ఏ శాఖ అధికారులకు ఎంతివ్వాలో కూడా వాటాలు వేసినట్లు సమాచారం. స్థానిక ప్రజా ప్రతినిధులకు కూడా మరో రూ.2 వేల చొప్పున ముట్టచెబుతున్నారు. అంటే రోజుకు వంద ట్రిప్పులు తరలిస్తే.. అధికారులకు రూ. 2 లక్షలు, ప్రజా ప్రతినిధికి రూ. 2 లక్షలు వస్తాయి. భారీ ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడకపోవడానికి కారణం మామూళ్లేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
నకిలీ స్కానర్లతో మోసాలు
ఉక్కునగరం: పెట్రోల్ బంకుల్లో స్కానర్లు మార్చి నగదు మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని స్టీల్ప్లాంట్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం గ్రామానికి చెందిన ఎండ భవానీ అలియాస్ బాలాజీ స్టీల్ప్లాంట్ టౌన్షిప్ సెక్టార్–11లోని ఓ పెట్రోల్ బంకులో ఉద్యోగిగా చేరాడు. అనంతరం విజయనగరం జిల్లా నెలిమర్ల మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మత్స రమేష్తో కలిసి బంకులో ఉన్న స్కానర్కు బదులుగా తమ సొంత స్కానర్ను ఉపయోగించి నగదు తమ ఖాతాల్లోకి మళ్లిస్తూ మోసాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారాన్ని గుర్తించిన పెట్రోల్ బంక్ యాజమాన్యం స్టీల్ప్లాంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ నజీర్ దర్యాప్తు చేపట్టి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి అరెస్ట్ -
ముస్తఫా అరెస్ట్ రాజకీయ కక్షసాధింపే
మహారాణిపేట: వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై నమోదు చేసిన కిడ్నాప్ కేసు పూర్తిగా రాజకీయ కక్షసాధింపులో భాగమేనని పార్టీ మైనార్టీ విభాగం నాయకులు జహీర్ అహ్మద్, భర్కత్ అలీ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మైనార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతోందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయిస్తోందని విమర్శించారు. బుధవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా చాలా కాలంగా పొగాకు వ్యాపారం చేస్తున్నారని, పొగాకు కొనుగోలు కోసం సూర్యచంద్రరావు అనే వ్యాపారికి రూ.30 లక్షలు చెల్లించినప్పటికీ సరుకును సరఫరా చేయకుండా మరో వ్యక్తికి తరలించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ముస్తఫా కుమారుడు, ఇతరులు పొగాకుతో వెళ్తున్న లారీని అడ్డుకుని పెదకాకాని పోలీస్ స్టేషన్కు అప్పగించారని చెప్పారు. అనంతరం డబ్బులు తీసుకుని సరుకు ఇవ్వకపోవడంపై సంబంధిత వ్యక్తులను గుంటూరుకు తీసుకువచ్చి మాట్లాడారని, డబ్బులు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు గుర్తించి వారినే పోలీసులకు అప్పగించారని వివరించారు. కిడ్నాప్గా వక్రీకరించి.. అయితే ఈ వ్యాపార లావాదేవీల వివాదాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా ‘కిడ్నాప్’గా ప్రచారం చేసి, ముస్తఫా, ఆయన కుమారుడు, కుటుంబ సభ్యులు, అనుచరులపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు. నిజంగా కిడ్నాప్ చేయాలనే ఉద్దేశం ఉంటే సంబంధిత వ్యక్తులను పోలీసులకు ఎందుకు అప్పగిస్తారని ప్రశ్నించారు. జీవీఎంసీ మాజీ కో–ఆప్షన్ సభ్యుడు ఎండీ షరీఫ్ మాట్లాడుతూ, సమగ్ర విచారణ లేకుండానే మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఈ సమావేశంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు ఎస్.కె.బాబ్జి పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
డాబాగార్డెన్స్: రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కళాశాలల బంద్లో భాగంగా బుధవారం నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల వద్ద ఏబీవీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విశాఖ విభాగ కన్వినర్ నితిన్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెం.77ను రద్దు చేయడంతో పాటు డిగ్రీ సహా అన్ని కోర్సుల ప్రవేశ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. అన్ని విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్ను ప్రకటించాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు శాశ్వత భవనాలు నిర్మించి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ప్రసాద్, నగర కార్యదర్శి ధనుష్, రాష్ట్ర కమిటీ సభ్యులు చందు, లక్ష్యత్, చరణ్, నిఖిల్తో పాటు కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంతో త్వరితగతిన వివాదాల పరిష్కారం
జిల్లా న్యాయసేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి సన్యాసినాయుడు విశాఖ లీగల్: మధ్యవర్తిత్వం ద్వారా కేసులు రాజీ చేసుకుంటే బహుళ ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా న్యాయసేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు పేర్కొన్నారు. జాతీయ న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు ఆధ్వర్యంలో గురువారం 30 రోజుల మధ్యవర్తిత్వ అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వ విధానం సమర్థవంతమైన మార్గమని తెలిపారు. క్రిమినల్ కేసులు మినహా చాలా వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని చెప్పారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో అవగాహన ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది బి.తులసీదాసు, న్యాయవాదులు, న్యాయ సేవా ప్రాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎల్ఐసీ వాటా విక్రయ నిర్ణయంపై నిరసన
డాబాగార్డెన్స్: జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో ప్రభుత్వ వాటాను మరింత తగ్గించే నిర్ణయాన్ని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) తీవ్రంగా ఖండించింది. బుధవారం విశాఖ డివిజనల్ కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి గంటా వరప్రసాద్ మాట్లాడుతూ.. ఈ నెల 3న కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా ఎల్ఐసీలో చెల్లించిన ఈక్విటీలో 2.5 శాతం వాటాలను విక్రయించనున్నట్లు, అదనంగా 4 శాతం గ్రీన్షూ ఆప్షన్ను ప్రకటించిందని తెలిపారు. దీంతో మొత్తం విక్రయం 6.5 శాతానికి చేరుతుందని చెప్పారు. 2022లో జరిగిన ఐపీవో ద్వారా ఇప్పటికే 3.5 శాతం వాటాలను విక్రయించారని గుర్తు చేశారు. ఎల్ఐసీ కేవలం లాభాపేక్ష సంస్థ కాదని, కోట్లాది మంది పాలసీదారుల విశ్వాసంతో నిలిచిన జాతీయ సంస్థ అని గుర్తు చేశారు. ప్రతిపాదిత ఓఎఫ్ఎస్ను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. -
పక్కనే స్కూల్.. కానీ చూపు పడలేదు!
ఆరిలోవ: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ఆరిలోవలోని పి.వి.సింధు షటిల్ అకాడమీ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో గంటన్నర పాటు గడిపిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, కార్యక్రమం పక్కనే ఉన్న తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించకపోవడంపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని అతిపెద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఒకటైన ఈ పాఠశాలకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో హైస్కూల్ ప్లస్ కూడా మంజూరైంది. అలాంటి పాఠశాలను విద్యాశాఖ మంత్రి సందర్శించి, విద్యా బోధన, మౌలిక వసతులు, సమస్యలపై ఆరా తీసి ఉంటే బాగుండేదని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. పాఠశాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తే అక్కడి లోటుపాట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లేవని అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలను పక్కనపెట్టి ప్రైవేట్ అకాడమీ కార్యక్రమానికే పరిమితమయ్యారని, ప్రభుత్వ విద్యపై అదే స్థాయిలో శ్రద్ధ చూపలేదని కొందరు స్థానికులు విమర్శిస్తున్నారు. -
ఒక మలుపు.. రెండు ప్రాణాలు
కొమ్మాది: ఆ పేద కుటుంబంలో పిల్లలను ప్రయోజకులను చేయాలన్న ఆ తల్లి ఆశలు బీచ్రోడ్డు ప్రమాదంలో చిధ్రమయ్యాయి. స్నేహితులను కలిసి సంతోషంగా ఊరికి తిరుగుపయనమైన యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కారు డ్రైవర్ చేసిన తప్పు.. రెండు కుటుంబాల్లో కోలుకోలేని విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా జామికి చెందిన ఎం.పుష్పారావు, గ్రంధి సూరి (22) బుధవారం ఉదయం విశాఖలోని మిత్రులను కలిసేందుకు వచ్చారు. రోజంతా సరదాగా గడిపి, సాయంత్రం బైక్పై స్వగ్రామానికి తిరుగుపయనమయ్యారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో.. బీచ్రోడ్డు మీదుగా వెళ్తుండగా తిమ్మాపురం జంక్షన్ వద్ద నగరం వైపు నుంచి వస్తున్న రాజమండ్రికి చెందిన నాగేశ్వరరావు కారును ఒక్కసారిగా ఎడమవైపునకు తిప్పేశాడు. దాంతో వెనుక నుంచి వస్తున్న బైక్ అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టి, అక్కడే ఉన్న సీసీ కెమెరా స్తంభాన్ని, ఆపై రోడ్డు దాటేందుకు నిలబడి ఉన్న కాసరపు కృష్ణవేణిపైకి దూసుకుపోయింది. ఈ దారుణ ఘటనలో బైక్ వెనుక కూర్చున్న యువకుడు సూరి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. బైక్ నడుపుతున్న పుష్పారావు అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పిల్లల చదువుల కోసం వెళ్తూ.. జీవీఎంసీ 4వ వార్డు పరిధిలోని తిమ్మాపురంకు చెందిన కాసరపు కృష్ణవేణి (43) దిగువ మధ్యతరగతి గృహిణి. భర్త ధనరాజు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుండగా.. కొడుకు చాణుక్య ఐటీఐ, కూతురు మీనాక్షి 8వ తరగతి చదువుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా పిల్లలను గొప్పగా చదివించుకోవాలన్న ఆరాటంతో కృష్ణవేణి రుషికొండలోని ఒక హోటల్లో పనికి వెళుతున్నారు. బుధవారం సాయంత్రం డ్యూటీకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా మృత్యువు బైక్ రూపంలో కబళించింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ కన్నుమూసింది. అమ్మ లేదని తెలిసి ఆ పిల్లలు కన్నీరుమున్నీరవుతున్న తీరు స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదానికి రాజమండ్రికి చెందిన కారు డ్రైవర్ నాగేశ్వరరావు అతివేగం, నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై లీలాదిత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయాలతో పుష్పారావు, ప్రమాదానికి గురైన బైక్ -
బాధ్యత మరిచి.. ఆగ్రహంతో ఊగి!
విశాఖవిద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మూడేళ్లకు పైగా సేవలందిస్తున్న సుమారు 25 మంది అడ్జంక్ట్, అడ్హాక్ అధ్యాపకుల పట్ల వర్సిటీ ఉపకులపతి అత్యంత దారుణంగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. ముందస్తు సమాచారం లేదా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమను విధుల నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ అధ్యాపకులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. కోర్టు ఆదేశాల నేపథ్యంలో తమ విజ్ఞప్తులను వీసీకి సమర్పించి, పరిస్థితిని వివరించేందుకు వెళ్లిన అధ్యాపక బృందానికి వైస్ ఛాన్సలర్ చాంబర్లో చేదు అనుభవం ఎదురైంది. అధ్యాపకుల పట్ల వీసీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ, అత్యంత అవమానకరంగా మాట్లాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం అడిగితే నిందలా? ‘కోర్టును ఆశ్రయించడంతో మీ సమస్యను వినే ఉద్దేశం గానీ, పరిగణనలోకి తీసుకునే ఆలోచన గానీ నాకు లేదు’ అని వీసీ తెగేసి చెప్పినట్లు సమాచారం. ‘విజిలెన్స్ విభాగం మీ జీతాలను తిరిగి వసూలు చేయాలని సూచిస్తోందని, మీలో ఎవరికీ సరిగా బోధించే సామర్థ్యం లేదు’ అని వ్యాఖ్యానించినట్లు అధ్యాపకులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గతంలో తమ సమస్యను చెప్పుకోవడానికి పలుమార్లు కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వకపోవడం వల్లే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా అరుస్తూ దుర్భాషలాడారని ఆరోపిస్తున్నారు. అర్హతలు, సరైన నియామక ప్రక్రియ ద్వారా ఎంపికై న తమను విధుల నుంచి తొలగించి, వారి స్థానంలో గంటల వేతన ప్రాతిపదికన కొత్తవారిని తీసుకోవడానికి ప్రయత్నించడం ఏమాత్రం తగదని స్పష్టం చేశారు. దళిత అధ్యాపకులకు తీవ్ర అవమానం ఈ భేటీ సందర్భంగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన కొంతమంది అధ్యాపకులను పేరుపేరునా ప్రస్తావిస్తూ తీవ్రంగా అవమానించినట్లు తెలుస్తోంది. విక్టర్, విజయ్కుమార్ అనే అధ్యాపకులు పరిస్థితిని వివరించడానికి ముందుకు రాగా.. ‘మీ కుటుంబాలు ఇబ్బందులు పడితే పడనివ్వండి, మిమ్మల్ని వర్సిటీలో చేరమని ఎవరు చెప్పారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు’ అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడినట్లు బాధితులు వాపోయారు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా దళిత అధ్యాపకులను చిన్నచూపు చూస్తూ, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. అధ్యాపకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే వైస్ ఛాన్సలర్ తీరు తీవ్ర మనోవేదనను కలిగించింది. ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా ఈ విధంగా ప్రవర్తించడం సముచితం కాదు. దళిత అధ్యాపకులను చిన్న చూపు చూసే విధంగా వ్యవహరించడం దారుణం. అన్ని అర్హతలు, ఎంపికలతోనే అడ్హాక్, అడ్జంక్ట్ అధ్యాపకులుగా ఎంపికయ్యాం. ఏయూ యంత్రాంగం తీరును హైకోర్టు దృష్టికి తీసుకువెళతాం. – విక్టర్, అడ్హాక్ అధ్యాపకుడు -
ఇక మూడు జెడ్పీలు
మహారాణిపేట: సుదీర్ఘ చరిత్ర కలిగిన విశాఖపట్నం జిల్లా పరిషత్ త్వరలోనే మూడు ముక్కలు కానుంది. గతంలో చేపట్టిన ఉమ్మడి జిల్లాల పునర్విభజన ఆధారంగా విశాఖ జెడ్పీని మూడు కొత్త జిల్లా పరిషత్తులుగా విభజిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) అమల్లోకి రావడంతో.. సెప్టెంబర్ 25 తర్వాత విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ల స్థాయిల్లో అధికారుల సంఖ్యను ఖరారు చేయడంతో పాటు, సీనియారిటీ ప్రాతిపదికన పంచాయతీరాజ్ శాఖలో బదిలీలకు రంగం సిద్ధం చేశారు. సుదీర్ఘ చరిత్రకు ముగింపు విశాఖ జిల్లా పరిషత్కు విశిష్టమైన చరిత్ర ఉంది. 1959లో సమితులు, తాలూకాలు, జిల్లా బ్లాక్ బోర్డుల ఆధారంగా జిల్లా పరిషత్ వ్యవస్థ ఆవిర్భవించింది. అనంతరం 1983లో మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తుల వ్యవస్థకు రూపుదిద్దుకోగా, 1986 నాటికి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. 2021 సెప్టెంబర్ 25న జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో జె.సుభద్ర చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆమె నేతృత్వంలోని పాలకవర్గం పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 24తో ముగియనుంది. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్కు తెరపడనుండగా.. మూడు కొత్త జిల్లా పరిషత్తులు అధికారికంగా ఏర్పాటుకానున్నాయి. జిల్లాల విభజనతో కొత్త జెడ్పీలు 2022లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాను విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా విభజించారు. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. అయితే అప్పట్లో జిల్లా పరిషత్తుల విభజన జరగలేదు. ఇప్పుడు ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో జెడ్పీల విభజన ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే సమయంలో కొత్త జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, అధికారులు, కార్యాలయాల విభజనకు ప్రభుత్వం నిష్పత్తులను ఖరారు చేసింది. ఉద్యోగుల కేటాయింపుపై కసరత్తు ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్లో ప్రస్తుతం 63 మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. కొత్తగా ఏర్పడే ప్రతి జిల్లా పరిషత్లో 65 మంది చొప్పున అధికారులు, సిబ్బంది ఉండేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అలాగే ప్రతి మండల పరిషత్ కార్యాలయంలో 13 మంది సిబ్బంది ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీని కోసం ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని జిల్లా పరిషత్, మండల పరిషత్తులు, పాఠశాలలు, వసతి గృహాలు తదితర పంచాయతీరాజ్ సంస్థల్లో కలిపి మొత్తం 876 మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 39 మండల పరిషత్తులు ఉన్నాయి. ప్రతి మండలంలో ఒక ఎంపీడీవో, ఇద్దరు డిప్యూటీ ఎంపీడీవోలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లు, కార్యాలయ సిబ్బంది, డ్రైవర్లు, నైట్ వాచ్మెన్లు తదితర ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. సీనియారిటీ జాబితాల తయారీ జిల్లా పరిషత్, మండల పరిషత్తులు, ఇతర పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల సీనియారిటీ జాబితాల తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు అనుగుణంగా ఉద్యోగి విధుల్లో చేరిన తేదీ, అర్హతలు, కేడర్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సీనియారిటీ జాబితాలను రూపొందిస్తున్నారు. ఈ జాబితాల ఆధారంగానే కొత్త జిల్లా పరిషత్తులకు ఉద్యోగుల కేటాయింపులు, బదిలీలు చేపట్టనున్నారు. రానున్న 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. -
లోకేష్ పర్యటనతో ఆరిలోవ బంద్!
ఆరిలోవ: మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా బుధవారం ఆరిలోవలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పెదగదిలి జంక్షన్ నుంచి తోటగరువు వరకు బీఆర్టీఎస్ డబుల్ రోడ్డును ఉదయం 9 నుంచి 11.30 వరకు పూర్తిగా మూసివేశారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించలేక వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లే ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ వాహనాలను పెదగదిలి వద్ద నిలిపి సుమారు అర కిలోమీటర్ నడుచుకుంటూ పాఠశాలకు చేరుకోవాల్సి వచ్చింది. అకాడమీ సమీపంలోని ఆరిలోవ రైతుబజార్కు కూడా ఉదయం 11 గంటలు దాటే వరకు వినియోగదారులను అనుమతించకపోవడంతో వ్యాపారులు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ ఉదయం 10 గంటలకు కార్యక్రమానికి చేరుకుని సుమారు గంటన్నర పాటు అక్కడే ఉన్నారు. అయితే ఆయన రాకకు గంట ముందుగానే పోలీసులు రహదారిని మూసివేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ పేరుతో పిలిచి.. మంత్రి లోకేష్ పర్యటనలో డ్వాక్రా మహిళలకు చుక్కలు చూపించారు. మంత్రి లోకేష్ ప్రజలతో సమావేశం నిర్వహిస్తారని చెప్పి డ్వాక్రా మహిళలను తప్పనిసరిగా హాజరుకావాలని టీడీపీ నాయకులు, ఆర్పీల ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఉదయం 8.30 గంటల నుంచే కార్యక్రమం వద్దకు చేరుకుని వేచి చూశారు. మంత్రి రాగానే పూలు చల్లి స్వాగతం పలికించారు. అనంతరం సమావేశానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సమావేశం లేదని, స్వాగత కార్యక్రమం ముగిసిందని చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఈమాత్రం దానికి ఉదయం నుంచి ఎండలో ఎందుకు ఉంచారని మహిళలు మండిపడ్డారు. -
అప్పుడు వద్దు.. ఇప్పుడు ముద్దు
ఆరిలోవ: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు కోసం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో మూడు ఎకరాల స్థలాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పి.వి.సింధుకు కేటాయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నవంబర్ 7న పి.వి.సింధు తన తల్లిదండ్రులతో కలిసి అదే స్థలంలో భూమిపూజ నిర్వహించారు. అయితే, ఆ సమయంలో స్థల కేటాయింపును రద్దు చేసి జూనియర్ కళాశాలకు ఇవ్వాలని కోరుతూ టీడీపీ మాజీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒమ్మి సన్యాసిరావు స్థానిక టీడీపీ, బీజేపీ, సీపీఐ నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. దీంతో పి.వి.సింధు పోలీసులను ఆశ్రయించగా భూమిపూజ కార్యక్రమం పోలీసు బందోబస్తుతో జరిగింది. ఇదే స్థలంలో బుధవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేత పి.వి.సింధు మరోసారి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాకకు ఒమ్మి సన్యాసిరావు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా, తన అనుచరులతో కలిసి ఘన స్వాగతం పలికి పూలు చల్లారు. కార్యక్రమం ముగిసే వరకు అక్కడే ఉన్నారు. గతంలో ఇదే స్థల కేటాయింపును వ్యతిరేకించిన ఒమ్మి సన్యాసిరావు ఇప్పుడు అదే ప్రాజెక్టుకు స్వాగతం పలకడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అప్పట్లో జూనియర్ కళాశాల కోసం ఉద్యమించిన వారు, ఇప్పుడు అదే స్థలంలో అకాడమీ ఏర్పాటుకు మద్దతు ఇవ్వడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గతంలో ఈ నిరసన వెనుక తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రోత్సాహం ఉందన్న ఆరోపణలు వినిపించగా, ఇప్పుడు ఆయన కూడా మంత్రి లోకేష్తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. -
బంగారం షాపులో భారీ చోరీ
20 కేజీల వెండి, 10 గ్రాముల బంగారం అపహరణమధురవాడ: మధురవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది. పీఎంపాలెం క్రైమ్ ఇన్స్పెక్టర్ బీఎస్ఎస్ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడ జోన్ కార్యాలయం ఎదురుగా డైలీ మార్కెట్లోని కొల్లి కాంప్లెక్స్లో ఉన్న రామ్మోహననాయుడు జ్యుయలరీ షాపులో మంగళవారం రాత్రి దొంగలు దోచుకెళ్లారు. బుధవారం ఉదయం దుకాణం తెరిచిన యజమాని షాపు వెనుక గోడకు రంధ్రం ఉన్న విషయాన్ని గమనించాడు. అగంతకుడు గోడను పగలగొట్టి షాపు లోపలికి ప్రవేశించి ఆభరణాలు చోరీ చేసినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి క్రైమ్ ఏసీపీ వెంకటరావు, ఇతర అధికారులు చేరుకుని విచారణ చేపట్టారు. దుకాణంలో ఉన్న 20 కేజీల వెండి, మరో రూ.1.50 లక్షల విలువైన 10 గ్రాముల లక్ష్మీ కాసులు, ఇతర వస్తువులు మొత్తంగా రూ.45 లక్షల విలువైన సొత్తును అపహరించినట్లు యజమాని తెలిపారు. బంగారు లాకర్ తెరుచుకోకపోవడంతో అందులోని బంగారు ఆభరణాలు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిందితుడు తెలివిగా దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలు, ఇతర సామగ్రిని కూడా తీసుకెళ్లడంతో ఆధారాలు లభించలేదు. దీంతో సమీప దుకాణాల సీసీ కెమెరాలు పరిశీలించగా, నిందితుడు స్కూటీపై వచ్చి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉక్కు గుండె!
కరగని గత 16 నెలల్లో రూ.36,363 కోట్ల ఆదాయం అత్యవసర నిధిగా రూ.903 కోట్లు నిల్వ బ్యాంకు ఖాతాల్లో రూ.195 కోట్ల నగదు నెలవారీ వేతన భారం రూ.55 కోట్లు తగ్గినా.. జీతాల చెల్లింపుల్లో జాప్యం ఉద్యోగులు జీతాలు, వీఆర్ఎస్, వితంతువుల పెన్షన్లు కలిపి రూ.590 కోట్లకు పైగా బకాయిలుకోట్లున్నా.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైంది విశాఖ ఉక్కు యాజమాన్యం తీరు. గత 16 నెలల్లో రూ.36,363 కోట్ల ఆదాయం ఆర్జించినా.. ఉక్కు కార్మికులకు మాత్రం ’జీతాల గండం’ తప్పడం లేదు. ఖజానాలో కోట్లాది రూపాయలు నిల్వ ఉన్నా.. ఉద్యోగుల జీతాలు, వీఆర్ఎస్ బకాయిలు, వితంతువుల పెన్షన్లు కలిపి రూ.590 కోట్లకు పైగా చెల్లింపులు పెండింగ్లోనే ఉన్నాయి. యాజమాన్యపు నిర్దయపై శ్రామికలోకం భగ్గుమంటోంది. సాక్షి, విశాఖపట్నం/ఉక్కునగరం: ఉక్కును కరిగించే కొలిమి మండుతోంది.. కానీ యాజమాన్యం మనసు మాత్రం కరగడం లేదు. వేల కోట్ల ఆదాయం కళ్లముందే ఉన్నా.. రాత్రింబవళ్లు చెమటోడ్చి సంస్థను నిలబెడుతున్న ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వాలనే బాధ్యత మాత్రం కనిపించడం లేదు. సంస్థ ఖాతాల్లో కోట్లాది రూపాయలు నిల్వ ఉన్నా.. ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ పొందిన వారి హక్కులు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఇవ్వాల్సిన వితంతు పెన్షన్లను సైతం నిలిపివేయడం ఉక్కు యాజమాన్యం అమానవీయ వైఖరికి అద్దం పడుతోంది. విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరణ వైపు నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యల మధ్య.. యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగుల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు వేలాది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి ఉత్పత్తి భారాన్ని కొద్దిమందిపై మోపింది. మరోవైపు ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గడంతో నెలవారీ వేతన వ్యయం గణనీయంగా తగ్గినా.. ఆ ప్రయోజనాన్ని ఉద్యోగులకు అందించకుండా జీతాల చెల్లింపులనే ఆలస్యం చేస్తోంది. ఇదే సమయంలో ‘స్టీల్ప్లాంట్ను మేమే కాపాడాం’ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న అధికార పార్టీ నేతలు.. ప్లాంట్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న దుస్థితిపై మాత్రం నోరు మెదపడం లేదు. వేల కోట్ల ఆదాయం వస్తున్న సంస్థలో జీతాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? చట్టబద్ధమైన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారే కరువయ్యారు. వేల కోట్ల ఆదాయం స్టీల్ప్లాంట్ 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.27,032 కోట్ల అమ్మకాల ద్వారా ఆదాయం ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై వరకు మరో రూ.9,331 కోట్లు సమకూరాయి. అంటే కేవలం 16 నెలల్లోనే రూ.36,363 కోట్ల ఆదాయం నమోదైంది. అంతేకాదు అత్యవసర పరిస్థితుల కోసం రూ.903 కోట్లను ప్రత్యేక నిధిగా పక్కన పెట్టింది. బ్యాంకు ఖాతాల్లో మరో రూ.195 కోట్ల నగదు నిల్వ ఉన్నట్లు సమాచారం. డబ్బు లేదనే వాదనకు ఈ గణాంకాలే సమాధానం చెబుతున్నాయి. వేతన భారం తగ్గినా..! గత ఏడాది ఫిబ్రవరిలో ప్లాంట్లో 12,249 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారి నెలవారీ వేతన వ్యయం రూ.195 కోట్లు. వీఆర్ఎస్లు, పదవీ విరమణలు, రాజీనామాల కారణంగా ఈ ఏడాది జూలై నాటికి ఉద్యోగుల సంఖ్య 8,498కు పడిపోయింది. దాంతో నెలవారీ జీతాల భారం రూ.140 కోట్లకు తగ్గింది. అంటే ప్రతి నెలా యాజమాన్యానికి రూ.55 కోట్ల మేర ఆదా అవుతోంది. వేతనభారం తగ్గిన తర్వాత కూడా ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించకపోవడం ఉద్యోగులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. డబ్బు లేక కాదు.. డబ్బు ఉండి కూడా జీతాలు నిలిపివేస్తున్నారనే అభిప్రాయం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. బకాయిల చిట్టా జీతాలు ఇవ్వకపోగా, చట్టబద్ధంగా చెల్లించాల్సిన బకాయిలను సైతం పెండింగ్లో పెట్టి రిటైర్డ్ ఉద్యోగులను, బాధిత కుటుంబాలను నడిరోడ్డున పడేసింది. బకాయి రకం పెండింగ్ E§øÅ-VýS$ÌS ò³…yìl…VŠæ i™éË$ -₹383.71 Mør$Ï ç³§ýlÒ ÑÆý‡Ð]l$׿ "ÎÐŒæ Ô>ÌSÈ'- ₹117.00 Mør$Ï ÒB-ÆŠ‡-G-‹Ü&2 ºM>-Ƈ$$-Ë$- -₹58.78 Mør$Ï ÒB-ÆŠ‡-G-‹Ü&3 ºM>-Ƈ$$-Ë$ -₹14.46 Mør$Ï Ñ™èl…-™èl$-Ð]l#ÌS ò³¯]lÛ¯]l$Ï ₹16.75 Mør$Ï మొత్తం రూ.590 కోట్లు నిల్వ నిధులు ఏమవుతున్నాయి? 16 నెలల్లో రూ.36 వేల కోట్లకు పైగా ఆదాయం.. రూ.903 కోట్ల అత్యవసర నిధి.. రూ.195 కోట్ల నగదు నిల్వలు.. నెలకు రూ.55 కోట్ల వేతనభారం తగ్గింపు.. అయినా ఉద్యోగుల జీతాలు, వీఆర్ఎస్ బకాయిలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, వితంతువుల పెన్షన్లు ఎందుకు నిలిచిపోయాయి? ఈ నిధులు ఎక్కడ వినియోగిస్తున్నారు? ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కులను ఎంతకాలం వాయిదా వేస్తారు? వేలాది కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టే ఈ నిర్ణయాలకు బాధ్యత ఎవరు వహిస్తారు? స్టీల్ప్లాంట్ను తామే కాపాడామని చెప్పుకుంటున్న అధికార పక్ష ప్రజాప్రతినిధులు ఇప్పుడు అయినా స్పందిస్తారా? ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తారా? లేక ప్రకటనలకే పరిమితమవుతారా? అన్నది ఉక్కు కుటుంబాలు ఎదురు చూస్తున్న ప్రశ్న. -
ద్వారకా బస్స్టేషన్ తనిఖీ చేసిన సీపీ
డాబాగార్డెన్స్: నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి బుధవారం ఏపీఎస్ఆర్టీసీ ద్వారకా బస్స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్లో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన ఆయన ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళల భద్రత దృష్ట్యా బస్స్టేషన్లో ఉమెన్ సేఫ్టీ కియోస్క్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కియోస్క్ను సీసీ కెమెరాల పర్యవేక్షణలో, పోలీస్ చెక్పోస్ట్కు సమీపంలో ఏర్పాటు చేసి, విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది సమన్వయంతో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ద్వారకా బస్స్టేషన్తో పాటు నగరంలోని ఇతర ప్రధాన స్టేషన్లలో పోలీస్ గస్తీని మరింత పెంచాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ బి.అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కె.పద్మావతి, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గంగాధర్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి దుర్గాప్రసాద్, వాల్తేర్ డిపో మేనేజర్ కేఎస్డీ ప్రసాద్, అసిస్టెంట్ మేనేజర్ ఎస్.ఎస్.నాయుడు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆ భూమిపూజ చెల్లదమ్మా!
సాక్షి, విశాఖపట్నం: పాత ప్రాజెక్టులకే కొత్త రంగులేసి, వాటిని తామే తెచ్చి నట్లుగా కలరింగ్ ఇచ్చే సీఎం నారా చంద్రబాబు, ఆయన కుమారుడైన మంత్రి నారా లోకేశ్ క్రెడిట్ పిచ్చి పీక్స్కు చేరుతోంది. రంగం ఏదైనా.. ప్రాజెక్టు ఎలాంటిదైనా.. క్రెడిట్ కొట్టేస్తాం.. ఎన్నిసార్లైనా భూమిపూజ చేసేస్తాం.. ఎలాంటి మొహమాటం లేదు.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు తండ్రీ కొడుకులు. నాలుగు రోజుల క్రితం భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభించి.. క్రెడిట్ చోరీ కోసం చంద్రబాబు రూ.కోట్లు ఖర్చు చెయ్యగా.. తానేం తక్కువ తినలేదంటూ అదే విశాఖ వేదికగా.. మరో క్రెడిట్ చోరీకి నారా లోకేశ్ సిద్ధమవుతున్నారు. ఐదేళ్ల క్రితం వైఎస్సార్సీపీ హయాంలో భూ కేటాయింపులు జరిగిన పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడెమీకి రెండేళ్ల క్రితం భూమి పూజ జరిగి, నిర్మాణమూ మొదలైంది. ఇప్పుడు.. ఆ భూమి పూజ చెల్లదంటూ లోకేశ్ బుదవారం మరోమారు భూమిపూజకు ఏర్పాట్లు చేశారు. తద్వారా ఈ అకాడెమీని తామే తెచ్చినట్లు క్రెడిట్ కోసం పాకులాడుతున్నారు. ఆ కథాకమామీషు ఇదీ.. 2021లో వైఎస్ జగన్ హయాంలోనే స్థలం కేటాయింపు.. బ్యాడ్మింటన్లో ప్రపంచ ఛాంపియన్గా నిలిచి అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి పతాకను ఎగురవేసిన క్రీడాకారిణి పీవీ సింధును ప్రోత్సహించేందుకు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖలో బ్యాడ్మింటన్ అకాడెమీ ఏర్పాటుకు హామీ ఇచ్చి ంది. ఆ హామీకి కట్టుబడి 2021లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ తోటగరువులో అత్యంత విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఆ తర్వాత అకాడెమీ విస్తరణకు మరికొంత భూమి అవసరమని సింధు అభ్యర్థించడంతో.. మరో ఎకరాన్ని అదనంగా ఇచ్చారు. ఇలా మొత్తం 3 ఎకరాల భూమిలో ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వమే. అయితే, అకాడెమీ నిర్మాణానికి కొంత ఆలస్యం కావడంతో ఆ స్థలాన్ని జూనియర్ కాలేజీకి ఇవ్వాలంటూ టీడీపీ నేతలు ఓ డిమాండ్ తెచ్చి , అకాడెమీకి మోకాలడ్డే ప్రయత్నం చేశారు. 2024 నవంబర్ 7న పీవీ సింధు తన తల్లిదండ్రులతో కలిసి ‘సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ అండ్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్’ పేరుతో బ్యాడ్మింటన్ అకాడెమీ నిర్మాణానికి ఆ స్థలంలో శా్రస్తోక్తంగా భూమి పూజ చేశారు. క్రెడిట్ కోసమే లోకేశ్ ఆరాటం? ఈ బ్యాడ్మింటన్ అకాడెమీ నిర్మాణం కూడా చురుగ్గా సాగుతోంది. కానీ.. ఇప్పుడు కేవలం క్రెడిట్ కోసం చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ శంకుస్థాపన ఏర్పాట్లు చేయడంపై క్రీడా వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. బ్యాడ్మింటన్ అకాడెమీ పూర్తయితే వైఎస్ జగన్కే పూర్తి క్రెడిట్ వెళుతుందన్న అక్కసుతోనే మంత్రి లోకేశ్ బుధవారం హడావుడిగా మరోసారి భూమిపూజ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో స్థలాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నించిన చంద్రబాబు పార్టీ.. ఇప్పుడు క్రెడిట్ కోసం.. అదే స్థలంలో హడావుడి చెయ్యడం హాస్యాస్పదమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు చేసి పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా.. భూమి పూజకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ జీవీఎంసీ, అధికారులు ఏర్పాట్లు చేస్తుండటం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. -
ప్రజల్లో అవగాహనే లక్ష్యం
అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జీవన్దాన్ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. బ్రెయిన్డెడ్ బాధితుల కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి అవయవదానం ప్రాముఖ్యతను వివరిస్తున్నాం. ఇప్పటికే పలువురికి అవయవాలను అందించి కొత్త జీవితాన్ని ప్రసాదించగలిగాం. అయితే చివరి నిమిషంలో కొందరు కుటుంబాలు వెనక్కి తగ్గడం వల్ల అవకాశాలు కోల్పోతున్నాం. ప్రభుత్వం అవయవదానం చేసిన వారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తూ గౌరవిస్తోంది. మరింత మంది ముందుకు వచ్చి అవయవదానానికి సహకరిస్తే ఎన్నో ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. – డాక్టర్ మన్మథరావు, జీవన్ దాన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ -
ఏయూలో శిఖండి రాజకీయం!
క్యాంపస్లో ‘అధికార’ బంధువుల పెత్తనం శతాబ్ది వేడుకల వేళ వివాదాల ముసురు రాజకీయ కక్ష సాధింపులకు కేంద్రంగా వర్సిటీ పాలకవర్గంపై ఒత్తిళ్లు.. వర్సిటీ రూల్స్కు తూట్లు.. దిగజారుతున్న శతాబ్ది వర్సిటీ ప్రతిష్ట విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజకీయ జోక్యం పెచ్చుమీరుతోంది. అధికార పార్టీ రాజకీయ కక్ష సాధింపులకు వేదికవుతోంది. వర్సిటీలో బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని ప్రశ్నించిన వైస్ఛాన్సలర్ను టార్గెట్ చేయడం ఇపుడు ఏయూలో దుమారం రేపుతోంది. అధికారం ఉందన్న అహకారంతో ఏయూ పాలకవర్గంపై ఒత్తిడి చేస్తూ.. మాజీ వీసీపై చర్యలకు ఉపక్రమించడం వర్సిటీలో హాట్ టాపిక్గా మారింది. ప్రతీకార రాజకీయాలకు పరాకాష్ట! ఇటీవల సస్పెన్షన్కు గురైన మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసాదరెడ్డి ఉదంతం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని ఏయూ ఉద్యోగ, విద్యార్థి సంఘాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉండి, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఒక ప్రజాప్రతినిధికి దగ్గరి బంధువైన వ్యక్తిపై ఎన్నికల ప్రచార నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి కలెక్టర్ స్థాయి చర్యలకు అప్పటి వీసీ సిఫార్సు చేశారు. ఆ విషయాన్ని మనసులో ఉంచుకుని, అధికారంలోకి రాగానే సదరు ప్రజాప్రతినిధి కక్షగట్టి మరీ మాజీ వీసీ పదవీ విరమణ రోజునే ఆయనపై సస్పెన్షన్ వేటు వేయించారని ప్రచారం జరుగుతోంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ విద్యాసంస్థలో ఎన్నడూ చూడని ఇటువంటి ప్రతీకార చర్యలు పునరావృతమైతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయంలో రాజకీయ ప్రేరేపిత చర్యల వల్ల ఏయూ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు వేదిక కాదు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా సేవలు అందించి, ఆ తర్వాత రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. అలా ఎదిగిన వారంతా ఏయూ వైభవాన్ని మరింత పెంచారే తప్ప, వర్సిటీ అంతర్గత పరిపాలనలో రాజకీయాలను చొప్పించలేదని విద్యార్థి సంఘాల నేతలు గుర్తుచేస్తున్నారు. పాలకవర్గ అనుమతితో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లి విశాఖ–2 నియోజకవర్గం ఎమ్మెల్యేగా సేవలందించిన ఇంగ్లీష్ విభాగం ప్రొఫెసర్ పిన్నింటి వరలక్ష్మి, రాజ్యసభ సభ్యుడిగా ఎంపికై న హిందీ విభాగం ఆచార్యుడు పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంటివారు ఏయూతో అనుబంధాన్ని కాపాడుకుంటూనే దానికి వన్నె తెచ్చారు. అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆచార్యుడు కుంభా రవిబాబు తన పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించగా, మేరుగ నాగార్జున కూడా ఏయూలో పనిచేసి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. వీరంతా అధికారంలో ఉన్న సమయంలో ఏనాడూ వర్సిటీ యంత్రాంగంపై ఎలాంటి ఒత్తిళ్లు తీసుకురాలేదని, కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మాత్రం అత్యంత దారుణంగా ఉన్నాయని ఏయూ వర్గాలు వాపోతున్నాయి. ఏయూ ప్రతిష్ట తీయకండి ఆంధ్ర యూనివర్సిటీని రాజకీయ ప్రేరేపిత కార్యకలాపాలకు వేదికగా మార్చవద్దు. స్వయంప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం సరికాదు. అసలు ఉన్నత విద్యామండలి ఉందో లేదో అర్థం కావడం లేదు. ఒక మాజీ వీసీని లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకోవడానికి ఆగమేఘాల మీద ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదు. రేపు అధికారం మారితే ఇదే తరహాలో ప్రతీకార రాజకీయాలు కొనసాగిస్తే ఎలా? – డాక్టర్ మీనన్, ఏయూ పూర్వ విద్యార్థి -
బియ్యం బస్తా.. బరువాయె!
మహారాణిపేట: నగరంలో బియ్యం ధరలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చుక్కలు చూపిస్తున్నాయి. గత మూడు నెలలుగా బహిరంగ మార్కెట్లో అన్ని రకాల బియ్యంపై ధరలు క్రమంగా పెరుగుతూ వస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావం, అంతర్జాతీయ యుద్ధాల కారణంగా సరఫరాపై ఒత్తిడి ఏర్పడిందనే వాదనలు వినిపిస్తున్నప్పటికీ, వ్యాపారులు వాటినే సాకుగా చూపించి ధరలను మరింత పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులు, పలు ప్రాంతాల్లో వరి నాట్లు ఆలస్యం కావడం, సాగు విస్తీర్ణం తగ్గడం, దిగుబడిపై అనిశ్చితి వంటి కారణాలతో మార్కెట్లో ముందస్తు భయాందోళనలు నెలకొన్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని బియ్యం ధరలు ఒక్కసారిగా పెరగడంతో ప్రతి కుటుంబంపై నెలకు వందల రూపాయల అదనపు భారం పడుతోంది. పాత బియ్యం దొరక్క.. కొత్త బియ్యమే దిక్కు సాధారణంగా ఎక్కువ మంది వినియోగదారులు పాత బియ్యానికే ప్రాధాన్యం ఇస్తారు. అయితే ప్రస్తుతం పాత బియ్యం లభ్యత తగ్గిపోవడంతో కొత్త బియ్యాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే అవకాశంగా తీసుకుని వ్యాపారులు పాత, కొత్త బియ్యం రెండింటి ధరలనూ పెంచినట్లు వినియోగదారులు చెబుతున్నారు. రైతు బజార్లోనూ పెద్దగా ప్రయోజనం లేదు ధరల పెరుగుదల నేపథ్యంలో రైతు బజార్లలో రూ.50, రూ.52కు రెండు రకాల బియ్యాన్ని విక్రయిస్తున్నప్పటికీ వినియోగదారుల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. కారణం, బహిరంగ మార్కెట్ ధరలకు ఇవి పెద్దగా భిన్నంగా లేకపోవడమే. దీంతో రైతు బజార్ల ద్వారా ఆశించిన ఉపశమనం లభించడం లేదని ప్రజలు చెబుతున్నారు. సిండికేట్ ఆరోపణలు : విశాఖలో బియ్యం వ్యాపారాన్ని ప్రధానంగా ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు నియంత్రిస్తున్నారనే అభిప్రాయం మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ధాన్యం సేకరించి పెద్ద మొత్తంలో మిల్లులు, గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారని, మార్కెట్లో సరఫరాను పరిమితం చేస్తూ ధరలను క్రమంగా పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ప్రజలపై భారమే భారం అంతర్జాతీయ పరిణామాలు, ప్రకృతి విపత్తులు, సాగులో అనిశ్చితి వంటి అంశాల ప్రభావం చివరకు సామాన్యుడి భోజన పళ్లెంపై పడుతోంది. రోజువారీ అవసరమైన బియ్యమే భారంగా మారడంతో కుటుంబాల నెలవారీ బడ్జెట్ గాడి తప్పుతోంది. ధరల నియంత్రణకు ప్రభుత్వం సమర్థ చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం బియ్యం ధరలు వరుసగా పెరుగుతున్నప్పటికీ వాటిని అదుపులోకి తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరలపై నిఘా పెట్టాల్సిన రెవెన్యూ, సివిల్ సప్లయిస్, విజిలెన్స్ శాఖల తనిఖీలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని వినియోగదారుల సంఘాలు పేర్కొంటున్నాయి. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఎల్నినో, యుద్ధాల సాకుతో అమాంతం ధర పెంచేసిన వ్యాపారులు మూడు నెలల్లోనే 25 కిలోల బస్తాపై రూ.300 నుంచి రూ.500 అదనం నిఘా ఏదీ? తనిఖీలేవి? చోద్యం చూస్తున్న పౌరసరఫరాల శాఖ రైతు బజార్లలోనూ నిరాశే.. సామాన్యుడి నెలవారీ బడ్జెట్పై తీవ్ర ప్రభావం 25 కిలోల బియ్యం బస్తా ధరలు రకం ప్రస్తుతం గత ధర సీఆర్ సన్నాలు రూ.1,500 రూ.1,050 స్టీమ్ రైస్ రూ.1,600 రూ.1,300 బాపట్ల సన్నాలు రూ.2,100 రూ.1,800 శ్రీకాకుళం సన్నాలు రూ.1,500 రూ.1,200 కర్నూలు సన్నాలు రూ.2,000 రూ.1,600 నెల్లూరు మొలకొలకులు రూ.2,350 రూ.2,000 దంపుడు బియ్యం (5 కిలో ప్యాకెట్) రూ.550 రూ.400 -
విద్యారంగ సమస్యల పరిష్కారానికి నేడు కళాశాలల బంద్
కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ ధర్నా మహారాణిపేట: రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ విశాఖ విభాగ్ కన్వీనర్ నితిన్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జీవో నెం.77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిగ్రీతో పాటు అన్ని కోర్సుల ప్రవేశ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి అకాడమిక్ క్యా లెండర్ను ప్రకటించాలని కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు శాశ్వత భవనాలు నిర్మించి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని నియంత్రించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఏబీవీపీ నగర కార్యదర్శి ధనుష్, రాష్ట్ర కార్యసమితి సభ్యులు చందు, లక్ష్యత్, చరణ్, లిఖిల్ పాల్గొన్నారు. -
అవయవ దానం..
ఆయువు పోస్తున్నమరణం తర్వాత ఇతరుల జీవితాల్లో వెలుగులు ప్రపంచ అవయవదాన పక్షోత్సవాలుబీచ్రోడ్డు : పాంచభౌతికమైన ఈ శరీరానికి ప్రాణం ఉన్నంత వరకే విలువ అనే పాత మాటను నేటి ఆధునిక వైద్యశాస్త్రం తిరగరాస్తోంది. పార్థివదేహం మట్టిలో కలసిపోయే ముందు, కట్టెలో కాలిపోక ముందే మరొకరికి పునర్జన్మనిచ్చి మృత్యువును జయించవచ్చని నిరూపిస్తోంది. దేహం నిష్క్రమించినా, అవయవాన్ని సజీవంగా ఉంచి తోటి వారి ప్రాణాలను నిలబెట్టడం కంటే మించిన గొప్ప కార్యం మరొకటి లేదు. రోగి ప్రాణాలు కాపాడే వైద్యుడిని శ్రీమన్నారాయణుడితో పోల్చుతాం.. కానీ ఎలాంటి విద్య రాని సామాన్యుడు సైతం ఒక్క నిర్ణయంతో అమరుడై, మరో ఎనిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. ప్రపంచ అవయవ దాన పక్షోత్సవాలు సందర్భంగా ప్రత్యేక కథనం. అవయవ మార్పిడే సంజీవని మన శరీరంలోని గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వంటి కీలక అవయవాలు అవసరానికి కంటే పది రెట్లు అధిక సామర్థ్యంతో పనిచేస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ లేదా తీవ్ర అనారోగ్య సమస్యల వల్ల ఈ మిగులు సామర్థ్యం క్షీణించిపోతుంది. ఉదాహరణకు డయాలసిస్ పై ఆధారపడే వారికి హానికారకాలతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గి గుండెజబ్బుల ముప్పు పెరుగుతుంది. ఇలాంటి తరుణంలో వ్యాధిగ్రస్తుడి ఆయుష్షును పెంచేందుకు ‘ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్’ ఒక్కటే ఏకై క మార్గంగా మారుతోంది. కాలంతో పోటీ.. అత్యంత సురక్షితం సేకరించిన అవయవాలను నిర్ణీత సమయంలోగా మార్పిడి చేయడం అత్యంత కీలకం. గుండె, ఊపిరితిత్తుల జీవిత కాలం సగటున 4 గంటలు మాత్రమే కాగా, కాలేయం 12 గంటలు, మూత్రపిండాలు 30 గంటల వరకు పనిచేస్తాయి. దాత ఆరోగ్యం, బ్లడ్ గ్రూప్, వ్యాధి నిరోధక వ్యవస్థను క్షుణ్ణంగా పరీక్షించాకే వైద్యులు సంపూర్ణ భద్రతతో ఈ ప్రక్రియను చేపడతారు. విశాఖ చైతన్యం.. ప్రభుత్వ ఆసరా మన దేశంలో దాదాపు 2.85 లక్షల మంది అవయవాల కోసం ఎదురుచూస్తుంటే, దాతల సంఖ్య కేవలం 12 వేలుగానే ఉంది. ఈ విషయంలో స్వీడన్, బ్రెజిల్, శ్రీలంక వంటి చిన్న దేశాల కంటే మనం వెనుకబడి ఉన్నాం. అయితే ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ‘జీవన్దాన్’ పథకం ద్వారా ఇప్పటివరకు 122 మంది అవయవ దానానికి ముందుకొచ్చారు. నగరానికి చెందిన సావిత్రిభాయి పూలే ట్రస్ట్ వంటి సంస్థల విస్తృత ప్రచారంతో ఇక్కడ ఒక్క విశాఖలోనే 150 మందికి పైగా శరీర దానాలు చేయడం విశేషం. ముందున్న సవాళ్లు.. కావాల్సిన ప్రోత్సాహం ఒక బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి సిద్ధాంతపరంగా 110 రకాల కణజాలాలు, అవయవాలు సేకరించే వీలున్నా, మన వద్ద అధునాతన సాంకేతిక పరికరాల కొరత వల్ల కేవలం 8 కీలక అవయవాలను మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నాం. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ‘కెడావర్ ట్రాన్స్ప్లాంటేషన్’ యూనిట్లను బలోపేతం చేయడంతో పాటు పాఠశాల స్థాయి నుంచే అవయవదానంపై పాఠ్యాంశాలను చేర్చాల్సిన అవసరం ఉంది. బ్రెయిన్ డెడ్ దాతల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసాతో పాటు అర్హులైన వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే మరింతమంది ఉదారంగా ముందుకు వచ్చి మృత్యువుపై మానవత్వాన్ని గెలిపిస్తారు. ఎవరు అర్హులు? ఏ అవయవాలు ఇవ్వొచ్చు? క్యాన్సర్, హెచ్ఐవీ, తీవ్ర ఇన్ఫెక్షన్లు, అవయవ సంబంధిత వ్యాధులు ఉన్నవారు మినహా మిగిలిన ఆరోగ్యవంతులంతా దానానికి అర్హులే. జీవించి ఉన్నవారు తమ రెండు కిడ్నీల్లో ఒకటి, కాలేయం, ఊపిరితిత్తులు, క్లోమం, చిన్నపేగుల్లో కొంత భాగాన్ని సమీప బంధువులకు చట్టబద్ధంగా దానం చేయవచ్చు. ముఖ్యంగా కాలేయానికి ఉండే పునరుత్పత్తి శక్తి వల్ల దాతలో అది తిరిగి వేగంగా పెరుగుతుంది. ఇక బ్రెయిన్ డెడ్ అయిన దాతల నుంచి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, పాంక్రియాస్, చిన్నపేగు వంటి కీలక అవయవాలతో పాటు కార్నియా, చర్మం, ఎముకలు, గుండె కవాటాలను సేకరించి బాధితులకు అమర్చవచ్చు. -
లాభాల బాటలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్
సాక్షి, విశాఖపట్నం : డ్రెడ్జింగ్ రంగంలో దేశంలోనే నంబర్ వన్గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్) 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అద్భుతమైన పనితీరును కనబరిచి లాభాల బాట పట్టింది. గతేడాది క్యూ1లో రూ.242.24 కోట్లుగా ఉన్న ఆదాయం, ఈసారి ఏకంగా 46.73 శాతం వృద్ధితో రూ.355.43 కోట్లకు చేరుకుంది. అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.23.33 కోట్ల నష్టాలను మూటగట్టుకున్న సంస్థ.. ఈసారి గణనీయంగా లాభాలార్జించింది. ఏకంగా రూ.11.24 కోట్ల నికర లాభాన్ని సాధించింది. సంస్థ స్థూల నిర్వహణ లాభం(ఎబిటా) కూడా గత ఏడాదిలోని రూ.46.90 కోట్లు ఉండగా.. ఈ సారి రూ.61.86 కోట్లకు పెరిగింది. మెరుగైన ప్రాజెక్టుల అమలు, నౌకల సమర్థ వినియోగం, పక్కా వ్యయ నియంత్రణ చర్యల వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధించామని డీసీఐ ఎండీ, సీఈవో కెప్టెన్ దివాకర్ స్పష్టం చేశారు. సవాళ్లను అధిగమించి సంస్థ లాభాల్లోకి రావడం వెనుక సిబ్బంది అంకితభావం, పకడ్బందీ వ్యూహాలు ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇదే ఉత్సాహంతో, అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని దేశ నౌకాయాన, పోర్టుల అభివృద్ధిలో డీసీఐ కీలక పాత్ర పోషిస్తుందని కెప్టెన్ దివాకర్ దీమా వ్యక్తం చేశారు. డీసీఐ లాభాల బాట పట్టడంపై సంస్థ చైర్మన్, వీపీఏ చైర్మన్ జస్మీత్సింగ్ బింద్రా అభినందనలు తెలిపారు. -
విశాఖపట్నం డివిజన్కు ప్రత్యేక గుర్తింపు
తాటిచెట్లపాలెం: దక్షిణ కోస్తా రైల్వే జోన్లోని విశాఖపట్నం డివిజన్కు ప్రత్యేక గుర్తింపు లభించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణకు గాను స్క్రాప్క్యూ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్బన్ ఫుట్ప్రింట్ సేవింగ్ సర్టిఫికెట్ ప్రదానం చేసింది. ఈ సర్టిఫికెట్ను సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ తరఫున సంస్థ ప్రతినిధులు మంగళవారం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రాకు అందజేశారు. ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకు డివిజన్ 97,295 కిలోల వ్యర్థాలను శాసీ్త్రయంగా వేరు చేసి రీసైక్లింగ్ చేయడం ద్వారా సుమారు 300.25 మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆకై ్సడ్ ఉద్గారాలను తగ్గించింది. స్వచ్ఛ భారత్ మిషన్, మిషన్ లైఫ్, నెట్ జీరో–2070 లక్ష్యాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ చర్యలను దక్షిణ కోస్తా రైల్వే జోన్ సమర్థంగా అమలు చేస్తోందనడానికి ఈ గుర్తింపు నిదర్శనమని రైల్వే అధికారులు తెలిపారు. -
మద్యం కోసం గొడవ రైలు కిందపడి వ్యక్తి మృతి
అక్కిరెడ్డిపాలెం : స్థానిక గవర జగ్గయ్యపాలెం క్యాబిన్ సమీపంలోని రైల్వే పట్టాలపై మంగళవారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం గవర జగ్గయ్యపాలెంకు చెందిన ఆళ్ల సత్తిబాబు (45) మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని భార్యతో గొడవపడి ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చి రైలు పట్టాలపై పడి మృతి చెందాడు. రైలు ఢీకొనడంతో మృతుడి తల, మొండెం వేరువేరుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీ సులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన బార్ కౌన్సిల్ సభ్యులు
విశాఖ లీగల్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీజా గిల్ను రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంగళవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్. సిరిపురపు కృష్ణమోహన్ వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని బార్ అసోసియేషన్లకు చెందిన న్యాయవాది మృతి చెందిన సందర్భాల్లో సంతాప సభను గతంలో మాదిరిగానే ఉదయం 10.30 గంటలకు నిర్వహించేలా హైకోర్టు ఉత్తర్వులను సవరించాలని కోరారు. ప్రస్తుతం సంతాప కార్యక్రమాన్ని సాయంత్రం 4.15 గంటలకు నిర్వహిస్తున్నందున అప్పటికే చాలా మంది న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, కక్షిదారులు కోర్టు ప్రాంగణం విడిచి వెళ్లిపోతున్నారని, దీంతో సంతాప కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో హాజరు ఉండడం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి సానుకూలంగా స్పందించినట్లు కృష్ణమోహన్ తెలిపారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షుడు కె. రామ జోగేశ్వరరావు (మురళి), బి.వి.ఆర్. మూర్తి, డి. మంజులత, నాగశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
నీటి దుర్వినియోగంపై ఆస్పత్రులకు వార్నింగ్
ఆరిలోవ: హెల్త్సిటీలోని ఆస్పత్రుల నిర్వాహకులు తప్పనిసరిగా జీవీఎంసీ బల్క్ వాటర్ను వినియోగించాలని జీవీఎంసీ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ పల్లంరాజు సూచించారు. మంగళవారం హెల్త్సిటీలోని పలు ఆస్పత్రులను ఆయన తనిఖీ చేసి, నీటి నిల్వ సంప్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కొన్ని ఆస్పత్రులు అనధికారికంగా భూగర్భ జలాలను వినియోగిస్తున్నట్లు గుర్తించి సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ప్రతి ఆస్పత్రి తప్పనిసరిగా జీవీఎంసీ నుంచి బల్క్ వాటర్ కనెక్షన్ తీసుకుని నీటిని వినియోగించాలని, అనుమతి లేకుండా భూగర్భ జలాలను వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని హెచ్చరించారు. గతంలో బల్క్ వాటర్ కనెక్షన్ తీసుకున్న కొన్ని ఆస్పత్రులు కూడా భూగర్భ జలాలను వినియోగిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఆస్పత్రుల వల్ల భూగర్భ జలాల వినియోగం పెరగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అందువల్ల బల్క్ వాటర్ కనెక్షన్ లేని ఆస్పత్రులు వారం రోజుల్లోగా జీవీఎంసీకి దరఖాస్తు చేసుకోవాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.తనిఖీల్లో నీటి సరఫరా విభాగం ఇంజనీర్లు, ఉప ఇంజనీర్లు, సహాయక ఇంజినీర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నోటీసులు జారీచేసిన జీవీఎంసీ అధికారులు -
జీవితం ఇచ్చిన నేలపైనే.. చివరి శ్వాస
పుట్టింది.. పెరిగింది అక్కడే. పెళ్లయ్యాక కూడా జీవితంలో ఎక్కువ భాగం అదే పాతనగరంలో గడిచింది. కాలం మారింది. పరిస్థితులు మారాయి. నివాసం భీమిలి మంగమారిపేటకు మారింది. అయినా ప్రతి నెలా ఒకసారి పాతనగరానికి రావడం మాత్రం ఆమె జీవితంలో విడదీయరాని భాగంగానే మిగిలింది. చివరికి తనకు జీవితం ఇచ్చిన ఆ నేలపైనే ఆమె చివరి శ్వాస విడిచింది. వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టౌన్కొత్తరోడ్డు వద్ద మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వాసుపల్లి ఎల్లయ్యమ్మ దుర్మరణం చెందింది. – డాబాగార్డెన్స్ వాసుపల్లి అప్పన్న డీఎల్బీలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. దంప తులు ఎన్నోఏళ్లుగా కొబ్బరితోట ప్రాంతంలో నివసించారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పిల్లలందరికీ వివాహాలు జరిపించి జీవితాన్ని గడిపారు. అయితే విధి మరోసారి వారిని పరీక్షించింది. నలుగురు పిల్లల్లో ముగ్గురు వివిధ కారణాలతో మృతిచెందడంతో ఆ కుటుంబంపై విషాదం అలుముకుంది. ప్రస్తుతం వారి కుటుంబంలో మనవరాలు, మనవడు మాత్రమే ఉన్నారు. భర్త అప్పన్న మరణించిన తర్వాత ఎల్లయ్యమ్మ మంగమారిపేటలో నివసిస్తూ ఆయన కుటుంబ పెన్షన్పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి నెలా పెన్షన్ తీసుకోవడానికి పోర్టు సమీపంలోని యూనియన్ బ్యాంక్కు వచ్చి, ఆ తర్వాత పాతనగరంలో ఉన్న తన మనవరాలు, మనవడిని చూసి తిరిగి వెళ్లడం ఆమెకు అలవాటు. అదే అలవాటు... ఈసారి ఆమె ప్రాణాలనే బలి తీసుకుంది మంగళవారం ఉదయం మంగమారిపేట నుంచి పాతనగరానికి చేరుకున్న ఎల్లయ్యమ్మ, బ్యాంక్కు వెళ్తున్న సమయంలో టౌన్కొత్తరోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. జీవితమంతా పాతనగరంతో అనుబంధం పెంచుకున్న ఎల్లయ్యమ్మ... చివరికి అదే పాతనగరం ఆమెకు చివరి మజిలీగా మారడం స్థానికులను కలచివేసింది. ఎల్లయ్యమ్మ మృతదేహానికి కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మంగమారిపేటకు తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సెయింట్ జోసెఫ్ అధ్యాపకురాలికి పురస్కారాలు
కంచరపాలెం: విశాఖలోని సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కెప్టెన్ కంభంపాటి సుజాత శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో మూడు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఇటీవల శ్రీలంకలోని ఎంఐటీఎల్ క్యాంపస్, బొరలెస్గమువలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆమె పలు అంశాలపై ప్రధానోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు కీనోట్ స్పీకర్ గౌరవం, ఇండో–శ్రీలంక రీసెర్చ్ ఎక్స్లెన్స్ అవార్డు–2026, ఎఫ్ఎస్ఎస్ఆర్ గౌరవ పురస్కారం ప్రదానం చేశారు. డాక్టర్ కంభంపాటి సుజాత సాధించిన ఈ విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ షైజీ, అధ్యాపకులు, యాజమాన్యం, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. -
పంచదార్లను వదలమంటే రాములోరి కొండపై పడ్డారు
సాక్షి, అనకాపల్లి: రాంబిల్లి మండలంలో కూటమి నేతలు పవిత్రమైన పంచదార్ల కొండను అక్రమంగా తవ్వేయడాన్ని వైఎస్సార్సీపీ అడ్డుకోవడంతో ఇప్పుడు రాంబిల్లిలోని రాముల వారి కొండను తొలిచేయడం మొదలెట్టారు. దేవుడు కొలువై ఉన్న కొండను అక్రమంగా తవ్వేస్తున్న వైనాన్ని చిత్రీకరించేందుకు మంగళవారం కొండపైకి వెళ్లిన ‘సాక్షి’ టీవీ బృందంపై కూటమి నాయకులు, వారి గూండాలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తాము తల్చుకుంటే ఏ కేసయినా పెడతామని, కారు యాక్సిడెంట్ కేసు కూడా పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇటీవల రాంబిల్లి మండలంలో పవిత్ర పంచదార్ల కొండను చంద్రబాబు కూటమి నేతలు అక్రమ మైనింగ్ చేస్తూ ఇష్టారీతిని తవ్వేస్తుండటంతో వైఎస్సార్సీపీ అడ్డుకొంది. ఈ అక్రమ మైనింగ్ను నిలిపివేయాలని, పంచదార్ల కొండను నోమైనింగ్ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆందోళనలు తీవ్రతరం చేయడంతో ప్రభుత్వం మైనింగ్ నిలిపివేసింది. దీంతో కూటమి అక్రమార్కులు రాంబిల్లిలోనే ఉన్న రాములవారి కొండపై పడ్డారు. అక్కడ దేవుడు ఉన్నాడన్న విషయాన్ని, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన తవ్వకాలు మొదలెట్టారు. ఈ విషయం తెలుసుకుని ‘సాక్షి’ టీవీ బృందం అక్కడకు వెళ్లి అక్రమ తవ్వకాలను చిత్రీకరిస్తుండగా కూటమి నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మైనింగ్ ప్రాంతంలోకి వెళ్లకుండా కూటమి నాయకులు మైలపల్లి నాగరాజు, చింతకాయల కాశిరావు, ఎరిపల్లి గోవిందకృష్ణ, మైలపల్లి పైడిరాజుతో పాటు మరో ఆరుగురు ‘సాక్షి’ బృందంపై దౌర్జన్యానికి దిగారు. మీరు వీడియోలు తీస్తే అక్రమ కేసులు పెడతామని, కారు యాక్సిడెంట్ కేసులు కూడా పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రభుత్వం మాది.. ఎటువంటి కేసయినా పెడతాం అంటూ బెదిరించినట్లు సాక్షి మీడియా బృందం తెలిపింది. సాక్షి టీవీ బృందంపై దౌర్జన్యం చేయడం సమర్ధనీయం కాదు వైఎస్సార్సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, కె.కె.రాజు సాక్షి టీవీ బృందంపై దౌర్జన్యానికి పాల్పడడం అత్యంత దురదృష్టకరమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు అన్నారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించడానికి వీల్లేదంటూ సాక్షి బృందాన్ని అడ్డుకోవడమే కాకుండా, వీడియో తీస్తే అక్రమ కేసులు పెడతామని బెదిరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఏమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో వార్తలను సేకరించి ప్రజలకు చేరవేసే హక్కు, స్వేచ్ఛ మీడియాకు ఉన్నాయని, మీడియాపై దాడులు, బెదిరింపులు, అడ్డంకులు సృష్టించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే సాక్షి బృందాన్ని అడ్డుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అక్రమ మైనింగ్పై సమగ్ర విచారణ జరిపి నిజాలను ప్రజల ముందుంచాలని వారు డిమాండ్ చేశారు. -
వర్షాకాల భద్రతపై రైల్వే అధికారులతో జీఎం సమీక్ష
తాటిచెట్లపాలెం: వర్షాకాలంలో రైల్వే జోన్ పరిధిలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ మంగళవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. జీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, నాలుగు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేషన్లు, యార్డులు, రైల్వే పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని జీఎం ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచాలని, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూడాలని, నీరు నిల్వ ఉంటే వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల ఎలాంటి భద్రతా సమస్యలు తలెత్తినా తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు. రైల్వే ఆధునికీకరణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ బలమైన, స్పష్టంగా కనిపించే బారికేడ్లు ఏర్పాటు చేసి వాటిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో విశాఖ, విజయవాడ, గుంతకల్, గుంటూరు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు, ప్రిన్సిపల్ హెడ్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంపై బొలిశెట్టి ఫైర్
విశాఖపట్నం: ఏపీలో కూటమి ప్రభుత్వ విధానాలు తిరుగుబాటుకి దారి తీసేలా ఉన్నాయని జనసేన పార్టీ మాజీ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విశాఖలో ప్రకృతి విధ్వంసం చేస్తోందని విమర్శించారు. విశాఖలో జరిగే ప్రకృతి విధ్వంసంపై పోరాటం జరగబోతుందని తెలిపారు. రుషికొండ విషయంలో మాట్లాడిన వారే ఇప్పుడు తప్పులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుషికొండ విషయంలో మాట్లాడిన పెద్దలు ఇప్పుడు కూడా మాట్లాడాలని డిమాండ్ చేశారు.పర్వత ప్రాంతాల్లో డేటా సెంటర్ నిర్మాణం చెయ్యడానికి వీల్లేదని, పర్యావరణ చట్టం ప్రకారం 10 కిలోమీటర్ల దూరం ఉండాలని తెలిపారు. ప్రభుత్వం డేటా సెంటర్లకు కేటాయించిన భూములు కంబాల కొండ అడవులకు దగ్గరలో ఉన్నాయన్నారు. డేటా సెంటర్ నిర్మాణం కోసం సింహాచలం, తర్లువాడ కొండలను తవ్వెస్తున్నారని వాపోయారు. దేశంలో ఉన్న పర్యావరణ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా శంకుస్థాపన ఎలా చేశారని ప్రశ్నించారు. డేటా సెంటర్లు విధ్వంసానికి పాల్పడితే ప్రాణం ఉన్నంతవరకు పోరాటం చేస్తానని బొలిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు.డేటా సెంటర్లపై ప్రజల్లో వ్యతిరేకతఅమెరికాలో డేటా సెంటర్లపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ఎక్స్లో పేర్కొన్నారు. డేటా సెంటర్లకు అనుమతి నిలిపివేస్తూ టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ కీలక నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.''టెక్సాస్లో డేటా సెంటర్ల నిర్మాణంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో, గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ సోమవారం రాష్ట్ర విద్యుత్ గ్రిడ్కు అనుసంధానం కోరుతున్న ప్రతిపాదిత డేటా సెంటర్లపై నియంత్రణ సంస్థలు ఆడిట్ పూర్తిచేసే వరకు వాటి అనుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆదేశం ప్రకారం, పబ్లిక్ యుటిలిటీ కమిషన్ ఆఫ్ టెక్సాస్ మరియు ఎలక్ట్రిక్ రిలయబిలిటీ కౌన్సిల్ ఆఫ్ టెక్సాస్ (ERCOT) డేటా సెంటర్లపై సమగ్ర తనిఖీ చేయాలి.ఆడిట్లో డెవలపర్లు పొందే పన్ను రాయితీలు, విద్యుత్ వినియోగం, విద్యుత్ ఉత్పత్తి, నీటి వినియోగం, కూలింగ్ విధానాలు, స్థానిక సమాజాలపై ప్రభావాన్ని చర్యలు, అలాగే ఆ సౌకర్యం యాజమాన్యం వంటి విషయాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఆడిట్లో అవసరమైన ప్రమాణాలు తీరని ఏ ప్రాజెక్టునైనా టెక్సాస్ గ్రిడ్కు అనుసంధానం చేయకూడదని అబ్బాట్ చెప్పార''ని బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetty Satyanarayana) ఎక్స్లో పోస్ట్ చేశారు. చదవండి: చంద్రబాబుఉత్తరాంధ్ర జపం అంతా ఉత్తదే -
ఆ ముగ్గురి నుంచి ప్రాణహాని : కొల్లు శిరీషా
గాజువాక సమీపంలోని భానోజితోట సర్వే నంబర్ 86లో ఇల్లు కట్టుకుని 20 ఏళ్లుగా నివసిస్తున్న తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కొల్లి శిరీషా పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోకనాథం, శకుంతల, గురున్నాథం అనే ముగ్గురు వ్యక్తులు డబ్బులు ఇవ్వాలని తమను తీవ్రంగా వేధిస్తున్నారని, ఇవ్వకపోవడంతో బెదిరింపులకు దిగి దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలిపారు. ఈ విషయంపై గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, సీఐ పిలిచినా వారు రావడం లేదని పోలీసులు చెప్తున్నారని పేర్కొన్నారు. భానోజితోట ఏరియాలో డబ్బుల కోసం దందాలు చేస్తూ, గతంలోనూ కేసులున్న ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె ఉన్నతాధికారులను కోరారు. -
ఆటో బోల్తా.. దారిన వెళ్తున్న వ్యక్తి దుర్మరణం
తగరపువలస: ఆటో బోల్తాపడిన ఘటనలో ప్రమాదానికి ఏమాత్రం సంబంధం లేని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దొరతోట రోడ్డులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొరతోట రోడ్డులో పక్కుర్తి లక్ష్మణ్ (40) రోడ్డుపక్కన విద్యుత్ స్తంభం వద్ద మూత్ర విసర్జన చేస్తున్నాడు. అదే సమయంలో ఆనందపురం క్రాస్రోడ్డు నుంచి భీమిలి వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. బోల్తాపడిన ఆటో లక్ష్మణ్పై పడటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్ను చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య రామయ్యమ్మ, కుమారుడు రవి, కుమార్తె హేమ ఉన్నారు. ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బీచ్లో మద్యం వద్దు
గోవా తరహాలో ఆర్కే బీచ్లో లిక్కర్ షాపులు (బీచ్ శాక్స్) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 362ను వెంటనే రద్దు చేయాలని పౌర చైతన్య వేదిక (పీసీవీ) డిమాండ్ చేసింది. పీసీవీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ కోలవెన్ను చాంద్ ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్కు మెమోరాండం సమర్పించారు. విశాఖవాసులు ప్రశాంతంగా సేదతీరే ఏకై క ప్రాంతమైన బీచ్లో మద్యం షాపులు ఏర్పాటు చేస్తే మహిళలు, పిల్లలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. దీనివల్ల సాంస్కృతిక వాతావరణం దెబ్బతిని, నేరాలు పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్.చంద్రశేఖర్, కార్యదర్శి సిహెచ్ ప్రమీల పాల్గొన్నారు. -
మెరీనా హంగులు
సాగర తీరానికిఅంతర్జాతీయ ప్రమాణాలతో ‘ఇంటర్నేషనల్ మెరీనా’కు వీపీఏ ప్రతిపాదనలు భీమిలి, లైట్హౌస్, డాల్ఫిన్ నోస్, అవుటర్ హార్బర్ ప్రాంతాల పరిశీలన సాగరమాల ప్రాజెక్టులో భాగంగా పీపీపీ విధానంలో నిర్మాణానికి కసరత్తు ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్కు అనుసంధానించే ప్రణాళికదేశంలోని ఇంటర్నేషనల్ మెరీనాసాక్షి, విశాఖపట్నం: సాగర తీరంలో అలల సవ్వడి, కనువిందు చేసే ప్రకృతి అందాలు.. వీటికి త్వరలో అంతర్జాతీయ స్థాయి విలాసాలు తోడవనున్నాయి. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖపట్నం పర్యాటక రంగానికి కొత్త రూపు తీసుకురావాలనే లక్ష్యంతో విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) ప్రణాళికను సిద్ధం చేసింది. సముద్రంపై విహరించే అత్యాధునిక లగ్జరీ బోట్లు, యాట్ల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘ఇంటర్నేషనల్ మెరీనా’ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే సాగరనగరి దేశంలోనే కాకుండా ప్రపంచ పటంలోనూ గ్లోబల్ టూరిజం హబ్గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పీపీపీ భాగస్వామ్యంతో.. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘సాగరమాల’ ప్రాజెక్టులో భాగంగా తీరప్రాంత అభివృద్ధికి విశాఖపట్నం పోర్టు అథారిటీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిధులతో మాత్రమే కాకుండా పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఈ భారీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆసక్తి గల ప్రైవేట్ పెట్టుబడిదారుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఇప్పటికే ఆహ్వానించింది. అలాగే పలు సంస్థలతో ప్రాథమిక స్థాయి చర్చలు నిర్వహించింది. నాలుగు ప్రాంతాల్లో ఒకచోట.. ఇంటర్నేషనల్ మెరీనా నిర్మాణానికి అనువైన ప్రాంతాల ఎంపికలో భాగంగా భీమిలి, లైట్హౌస్, డాల్ఫిన్ నోస్తో పాటు విశాఖ పోర్టు అవుటర్ హార్బర్ లేదా కోస్టల్ బ్యాటరీ సమీప ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. సముద్రపు అలల ప్రభావం తక్కువగా ఉండే ప్రాంతానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్కు సమీపంలోనే మెరీనాను అనుసంధానం చేసే అవకాశాలనూ పరిశీలిస్తున్నారు. గ్లోబల్ టెండర్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈ నాలుగు ప్రాంతాల్లో సాంకేతిక పరీక్షలు నిర్వహించి తుది స్థలాన్ని ఎంపిక చేయనున్నారు. సరికొత్త అనుభూతినిచ్చే మెరీనా ఈ ఇంటర్నేషనల్ మెరీనా కేవలం పడవలు నిలిపే కేంద్రంగా మాత్రమే కాకుండా సమగ్ర వినోద, వాణిజ్య హబ్గా రూపుదిద్దుకోనుంది. అంతర్జాతీయ ప్రమాణాల లగ్జరీ బోట్లు, విలాసవంతమైన యాట్ల కోసం ప్రత్యేక బెర్త్లు ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల కోసం ఆధునిక వాణిజ్య సముదాయాలు, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్, వినోద కేంద్రాలు ఒకేచోట అందుబాటులోకి రానున్నాయి. దీంతో స్థానికులతో పాటు దేశీయ, విదేశీ పర్యాటకులకు సరికొత్త తీరప్రాంత అనుభూతి లభించనుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు పర్యాటక రంగానికే పరిమితం కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ‘బ్లూ ఎకానమీ’ అభివృద్ధికి ఊతమివ్వనుంది. లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, టూరిజం తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అనుమతుల కోసం సమాలోచనలు సముద్ర తీరంలో చేపట్టే ఈ భారీ నిర్మాణానికి సీఆర్జెడ్, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు పొందడం కీలకం. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నివేదికల ఆధారంగానే ప్రాజెక్టు వేగం, తుది రూపురేఖలు ఆధారపడి ఉంటాయని పోర్టు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలు వేగంగా పూర్తయితే కొచ్చి, గోవా, ముంబై, చైన్నె తరహాలో అంతర్జాతీయ మెరీనాతో విశాఖ సాగరతీరం కొత్త శోభను సంతరించుకోనుంది. -
● ఏడు నెలలుగా అందని వేతనాలు ● కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఇబ్బందులు ● శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మికులు
ఆరిలోవ: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు నెలల తరబడి వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికిచ్చే అరకొర వేతనాలను కూడా సకాలంలో చెల్లించకుండా కూటమి ప్రభుత్వం పస్తులు పెడుతోంది. జీతాల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ఎవరూ వీరి పరిస్థితిని పట్టించుకోకపోవడం గమనార్హం. వెట్టిచాకిరీ చేయిస్తూ.. జీతాలు ఎగ్గొడుతూ.. జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో సుమారు 75 మంది ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా హైస్కూళ్లలో పగటిపూట వాచ్మెన్ బాధ్యతలతో పాటు మధ్యాహ్న భోజన విభాగాలు, మరుగుదొడ్ల నిర్వహణ, తరగతి గదుల పరిశుభ్రత వంటి పనులన్నీ భారంగా మోస్తున్నారు. రోజంతా కష్టపడినా వీరికి నెలకు ఇచ్చేది కేవలం రూ.6 వేలు వేతనం మాత్రమే. కనీసం ఆ మొత్తాన్ని కూడా సకాలంలో ఇవ్వకుండా ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏడు నెలలుగా వీరికి నయాపైసా జీతం చెల్లించలేదు. అప్పుల ఊబిలో కుటుంబాలు దీంతో ప్రతి నెలా వేతనాల కోసం ఆశగా ఎదురుచూస్తూ, కుటుంబం గడవక ఆయాలు అల్లాడిపోతున్నారు. కుటుంబ జీవనం, పిల్లల చదువుల కోసం అప్పులు చేసి కాలం వెళ్లదీస్తున్నామని వారు కన్నీటిపర్యంతమవుతున్నారు. చిన్న ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఈ విధంగా ఆడుకోవడం దారుణమని మండిపడుతున్నారు. ప్రకటనలకే పరిమితమైన లోకేష్ ఉపన్యాసాలు ఉద్యోగులందరికీ ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు వేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న ఉపన్యాసాలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయనడానికి వీరే నిదర్శనం. అట్టడుగున ఉండి సేవలు అందించే ఆయాల వేతనాలను నెలల తరబడి బకాయిలు పెట్టడంపై నిరుపేద కార్మికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వెంటనే బకాయి వేతనాలను విడుదల చేసి తక్షణమే తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేటుపరం చేయొద్దు
ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడాన్ని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీపీటీడీ (ఆర్టీసీ) జేఏసీ ఆందోళన చేపట్టింది. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లాలోని అన్ని డిపోల ఉద్యోగుల సంతకాలతో కూడిన బుక్లెట్ను జాయింట్ కలెక్టర్ విద్యాధరికి జేఏసీ కన్వీనర్లు ఏ.కె.శివాజీ, జి.తాతాలు సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ’సీ్త్ర శక్తి’ పథకం కోసం కొత్తగా 4 వేల బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారానే నడపాలని డిమాండ్ చేశారు. పదేళ్లుగా నియామకాలు లేక ఉద్యోగులు డబుల్ డ్యూటీలు చేస్తున్నారని, తక్షణం 15 వేల ఖాళీలను భర్తీ చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పి.వి.వి.మోహన్, జె.ఎం.నాయుడు, అల్లు సురేష్ నాయుడు, సత్యవతి, జిల్లా అధ్యక్షుడు పి.ఎన్.మూర్తి, జిల్లా చైర్మన్, ప్రాన్ మాజీ జోనల్ కార్యదర్శి ఎం.వి.ఆర్.మూర్తి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంబాబు, డివిజన్ చైర్మన్ ఎస్.వి.రమణ, అన్ని డిపోల నాయకులు పాల్గొన్నారు. -
విశాఖలోనే వాణిజ్య విమాన సర్వీసులు కొనసాగించాలి
విశాఖపట్నం విమానాశ్రయంలో వాణిజ్య, విమాన సర్వీసులు కొనసాగించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేసిన అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయానికి వాణిజ్య సేవలను పూర్తిగా తరలించాలన్న నిర్ణయం సరికాదన్నారు. నగరానికి అత్యంత చేరువలో ఉన్న విశాఖ ఎయిర్పోర్టును విద్యార్థులు, వ్యాపారులు, రోగులు, వృద్ధులు ఎంతో వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఇక్కడ సేవలు నిలిపివేస్తే ప్రయాణ సమయం, ఖర్చు పెరగడంతో పాటు నగర పర్యాటకం, పెట్టుబడుల ప్రవాహంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
బీచ్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ఆరిలోవ: ఆరిలోవ పోలీస్స్టేషన్ పరిధిలోని బీచ్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం సోమవారం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. మృతదేహాన్ని పోలీసులు కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఆరిలోవ సీఐ ఎస్. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. తెన్నేటి పార్కు సమీపంలోని బీచ్లో బంగ్లాదేశ్కు చెందిన నౌక సమీపంలో సోమవారం మధ్యాహ్నం మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు సమాచారం అందింది. కమ్యూనిటీ గార్డుల సహాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చి పరిశీలించారు. మృతుడి ఎడమ చేతిపై ‘సతీష్’ అనే టాటూ, కుడి చేతిపై పులి ముఖం టాటూ ఉన్నట్లు గుర్తించారు. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇతర వివరాలు తెలియకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుడిని గుర్తించే సమాచారం ఉన్నవారు..బంధువులు ఆరిలోవ పోలీస్స్టేషన్ను సంప్రదించాలని సీఐ కోరారు. -
ప్రభుత్వ పాఠశాలలో ‘కూటమి’ ఫ్రెండ్షిప్ డే
మధురవాడ: కూటమి నాయకులు బరి తెగించారు. సెలవు రోజున ప్రభుత్వ పాఠశాలలో హల్చల్ చేశారు. స్నేహితుల దినోత్సవం పేరుతో స్కూల్లో సంబరాలు చేసుకోవడం వివాదాస్పదమవుతోంది. ఆదివారం సెలవు రోజున చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోకి టీడీపీ నాయకులు అనధికారంగా ప్రవేశించారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కేక్ కట్ చేసి కేరింతలు కొట్టారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కార్పొరేటర్ భర్తతో పాటు జనసేనకు చెందిన ఓ మహిళా నాయకురాలు, పలువురు నేతలు ఉండటం గమనార్హం. ప్రభుత్వ విద్యా సంస్థలో అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి. -
ఆర్ఆర్బీని తరలిస్తే ఉద్యమమే..
రౌండ్టేబుల్ సమావేశంలో రాజకీయ, ప్రజా సంఘాల నేతల పిలుపు విశాఖ విద్య: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును విశాఖలో కాకుండా అమరావతిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పలు సంఘాలకు చెందిన ప్రతినిధులు పిలుపునిచ్చారు. రైల్వే జోన్ ఎక్కడ ఉంటే ఆర్ఆర్బీ అక్కడే ఉంటుందని, దానికి వ్యతిరేకంగా అమరావతిలో ఏర్పాటు చేయాలంటూ రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్కు ఎలా లేఖరాస్తారని ప్రశ్నించారు. ద్వారకానగర్లోని పౌరగ్రంథాలయంలో లోక్సత్తా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. ఆర్ఆర్బీతో ఎన్నో ప్రయోజనాలు ఆర్ఆర్బీ కోసం భువనేశ్వర్ వెళ్తే తెలుగు వాళ్లమని చావబాదారు. సర్టి ఫికెట్లు చించేశారు. అలాంటిది ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆర్ఆర్బీ వస్తే దాన్ని అమరావతికి తీసుకుపోతే చాలా నష్టం జరుగుతుంది. ఆర్ఆర్బీతో రైల్వే ఉద్యోగాలతో పాటు దానికి అనుబంధ సంస్థలు ఏర్పడి మరికొందరికి ఉపాధి దొరుకుతుంది సన్యాసిరావు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఉత్తరాంధ్రపై బాబుది దొంగప్రేమ ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్ముకుంటే మోసానికి గురవుతారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సం నాడు ఉత్తరాంధ్రకు రెక్కలు అన్నారు. ఇప్పుడేమో ఆర్ఆర్బీ రాకుండా అడ్డుకుంటున్నారు. ఇదేనా చిత్తశుద్ధి. బి.వి.రామ్, అధ్యక్షుడు, తెలుగు శక్తి ఉత్తరాంధ్ర యువతతో ఆటలా.. ఉత్తరాంధ్ర అంటే చిన్నచూపు కొనసాగుతోంది. దేశంలో ఉన్న ఆర్ఆర్బీలన్నీ రైల్వే జోన్ ఉన్న చోటనే ఉన్నాయి. అలా కాదని అమరావతిలో ఆర్ఆర్బీ ఏర్పాటు చేయడం రైల్వే నిబంధనలకు విరుద్ధం. యువతను మోసం చేయడమే. జగన్మోహిని, అబ్దుల్ కలాం స్వచ్ఛంద సంస్థ, విజయనగరం తలొక చోట, మొండెం మరో చోటా ప్రభుత్వ ఆలోచనలు చూస్తుంటే తల ఒక చోట, మొండెం మరో చోట పెట్టేలా ఉంది. విశాఖలో రైల్వే జోన్, అమరావతిలో ఆర్ఆర్బీ ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే భోగాపురం ఎయిర్పోర్టు ఒక్కటే కాదు. సుగుణేశ్వరి, ఆర్ఎంపీ అసోసియేషన్ నేత మన నేతలకు చిత్తశుద్ధి ఉందా ప్రభుత్వ నిర్ణయంతో భావితరాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. చంద్రబాబు ఏది చెబితే అది విన డం కాదు. ఆర్ఆర్బీ విషయంలో కూటమి నేతల వైఖరి బయటపడాలి. విశాఖను కాదని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా యువత నుంచి తిరుగుబాటు తప్పదు. – పి.శ్రీనివాస్, కన్వీనర్, ఏయూ పరిరక్షణ కమిటీ బాబు ఆలోచనలు ఇంతే.. ఉత్తరాంధ్ర రాజకీయ ప్రజాప్రతినిధుల్లో అత్యధికులు వలసవాదులే. వారికి ఉత్తరాంధ్ర ఓట్లు కావాలి కానీ అభివృద్ధి వద్దు. అలాంటి వారు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించలేరు. ఎన్నో ఏళ్లుగా రైల్వే జోన్ కోసం పోరాడితే అత్తెసరుగా జోన్ కేటాయించారు. అందులో ఆర్ఆర్బీ లేకపోతే ఏంటి ప్రయోజనం. ఎన్.శివశంకర్, కన్వీనర్, జర్నలిస్టు ఉత్తరాంధ్ర పరిరక్షణ వేదిక -
టెట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
మహారాణిపేట: జిల్లాలో ఈనెల 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరగనున్న టెట్–2026 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 8 కేంద్రాల్లో 21,522 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, ప్రత్యేక అవసరాలున్న అభ్యర్థుల కోసం 100 మంది స్క్రైబ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భద్రత, ప్రత్యేక బస్సులు, నిరంతర విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేసి ప్రశాంత వాతావరణం కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, డీఈవో ఎన్.ప్రేమ్కుమార్, ఆర్ఐవో మురళీధరన్, పోలీసు, ఆర్టీసీ, విద్యుత్, వైద్య ఆరోగ్య, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మాస్కో ప్రభుత్వంతో జీవీఎంసీ చారిత్రాత్మక ఒప్పందం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ–రష్యా సమాఖ్యలోని మాస్కో ప్రభుత్వం మధ్య కుదిరిన మెమొరాండం ఆఫ్ కోఆపరేషన్ (ఎంవోసీ) విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి స్మార్ట్, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగని జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ తెలిపారు. మాస్కోలో నిర్వహించిన 5వ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ సమ్మిట్లో మాస్కో డిప్యూటీ మేయర్, రవాణా, రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖాధిపతి మక్సిమ్ లిక్సుటోవ్తో కలిసి ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ భాగస్వామ్యం ద్వారా ఆధునిక, సుస్థిర పట్టణ రవాణా వ్యవస్థల అభివృద్ధి, సమగ్ర రవాణా ప్రణాళికలు, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్లు, టికెటింగ్ వ్యవస్థల డిజిటలైజేషన్తో పాటు కృత్రిమ మేధస్సు ఆధారిత రవాణా నిర్వహణ మెరుగవుతుందన్నారు. అలాగే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
పోలీస్ పీజీఆర్ఎస్కు 125 ఫిర్యాదులు
అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 125 ఫిర్యాదులు అందినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. కార్యక్రమంలో నగరంలోని ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. సీపీ స్వయంగా బాధితుల సమస్యలు తెలుసుకుని, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందిన ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, భూ వివాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, మోసాలకు సంబంధించిన కేసులు అధికంగా ఉన్నట్లు తెలిపారు. -
పీజీఆర్ఎస్ సమస్యలపై ప్రత్యేక దృష్టి
మహారాణిపేట: ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, వినతులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ జి. విద్యాధరి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో మొత్తం 354 వినతులు అందాయి. వీటిలో జీవీఎంసీకి 109, రెవెన్యూ శాఖకు 56, పోలీస్ శాఖకు 31, ఇతర శాఖలకు 158 వినతులు నమోదయ్యాయి. ప్రతి వినతిని బాధ్యతాయుతంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జీవీఎంసీకి 85 వినతులు .. డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 85 వినతులు అందాయి. కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్లు ఎస్.ఎస్. వర్మ, డీవీ రమణమూర్తి ఫిర్యాదులు స్వీకరించారు. పట్టణ ప్రణాళికా విభాగానికి అత్యధికంగా 43 వినతులు రాగా, ఇంజినీరింగ్కు 16, రెవెన్యూకు 8, జీవీఎంసీ పరిపాలన–ఖాతాల విభాగానికి 5, ప్రజారోగ్యానికి 5, డీడీహెచ్కు 4, జోనల్ అడ్మినిస్ట్రేషన్కు 2, యూసీడీకి 2 ఫిర్యాదులు అందాయి. వీటి సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ (అమృత్) డి.విజయభారతి, అదనపు కమిషనర్ పి.నల్లనయ్య, ప్రధాన ఇంజినీరు పీవీవీ సత్యనారాయణరాజు, డీసీఆర్ శ్రీనివాసరావు, సీసీపీ ప్రభాకరరావు, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అలల్లో చిక్కుకున్న ఇద్దరిని కాపాడిన లైఫ్గార్డులు
కొమ్మాది: రుషికొండ బీచ్ అలల్లో చిక్కుకున్న ఇద్దరు పర్యాటకులను లైఫ్గార్డులు సకాలంలో రక్షించారు. హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం సోమవారం నగరంలోని పర్యాటక ప్రాంతాలు సందర్శించిన అనంతరం సాయంత్రం రుషికొండ బీచ్కు చేరుకుంది. సముద్రంలో స్నానం చేస్తుండగా కుటుంబ సభ్యులు రమ్య, కుష్వంత్ సాయి అలల ఉధృతికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. విధుల్లో ఉన్న లైఫ్గార్డులు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం మైరెన్ పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. -
ఎయిర్పోర్టు పనులకు వెళ్లిన పారిశుధ్య కార్మికుడు అదృశ్యం
పెదగంట్యాడ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పారిశుధ్య పనుల కోసం వెళ్లిన జీవీఎంసీ పారిశుధ్య కార్మికుడు అదృశ్యమయ్యాడు. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 64వ వార్డు పరిధిలోని యారాడ గ్రామానికి చెందిన పిల్ల పైడిరాజు జీవీఎంసీ జోన్–6లో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత నెల 30న భోగాపురం ఎయిర్పోర్టులో నిర్వహించిన శుభ్రత కార్యక్రమానికి తోటి కార్మికులతో కలిసి వెళ్లాడు. విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం ఇతర కార్మికులంతా ఇళ్లకు చేరుకోగా, పైడిరాజు మాత్రం తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం న్యూపోర్టు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఉదయం హాట్గా.. సాయంత్రం కూల్గా..
విశాఖ విద్య: ఉదయం భగభగ మండిన ఎండతో ఉక్కిరిబిక్కిరైన మహా విశాఖ సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడింది. నగరమంతా దట్టమైన కారుమబ్బులు అలుముకోవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. కొన్నిచోట్ల వర్షం కురవడంతో ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. ఆకస్మికంగా వర్షం ప్రారంభం కావడంతో వాహనదారులు ఆశ్రయం కోసం పరుగులు తీశారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వీచిన బలమైన ఈదురుగాలులు నగరాన్ని చుట్టుముట్టాయి. నేలకొరిగిన భారీ వృక్షం సీతమ్మధార కేఆర్ఎం కాలనీలోని ఆక్సిజన్ టవర్స్ వెనుక ఉన్న భారీ వృక్షం నేలకొరిగి కారుపై పడింది. అదృష్టవశాత్తు కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ఆ రహదారిలో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
డేటా సెంటర్లతో ఉత్తరాంధ్రకు ముప్పు
బీచ్రోడ్డు : ప్రపంచ వ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఉత్తరాంధ్రలో ప్రతిపాదించిన నాలుగు డేటా సెంటర్ల (అనకాపల్లి, అచ్యుతాపురం, ఆనందపురం, విజయనగరం) వల్ల ప్రజల్లో ప్రాణభయం నెలకొందని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు. సోమవారం నగరంలోని ఓ హోటల్లో అఖిలపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సముద్ర తీర ప్రాంతమైన మచిలీపట్నం నుంచి కేబుల్ తీసుకెళ్లి అమరావతిలో ఐదు కాదు, పది డేటా సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలని కూటమి ప్రభుత్వానికి సూచించారు. ఉత్తరాంధ్రలో డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీ స్థాయిలో విద్యుత్ వినియోగం, నీటి వనరుల దుర్వినియోగం, ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ–వేస్ట్) పెరుగుదల వంటి సమస్యలు తలెత్తి పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ మాట్లాడుతూ జూలై 18న అమెరికాలోని 50కి పైగా నగరాల్లో ఏఐ డేటా సెంటర్లకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయని తెలిపారు. ఏఐ మౌలిక సదుపాయాల వేగవంతమైన విస్తరణతో విద్యుత్ డిమాండ్, నీటి వినియోగం పెరగడంతో పాటు శబ్ద కాలుష్యం అధికమవుతోందన్నారు. అలాగే భూ వినియోగంలో మార్పులు చోటుచేసుకుని, ప్రజారోగ్యం, పర్యావరణం, జాతీయ భద్రతపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ఆడాల వెంకట వర్మరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. రహమాన్, సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీమతి మణి, ఎస్సీ దళిత నాయకుడు పెద్దాడ రమణ, సన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సముద్రంలో గల్లంతైన ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు
పెదగంట్యాడ: పాత గంగవరం తీరంలో ఆదివారం సముద్రంలో గల్లంతైన యువతి, యువకుడి ఆచూకీ సోమవారం కూడా లభ్యం కాలేదు. న్యూపోర్టు పోలీస్స్టేషన్ సీఐ కామేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. జాలరిపేట రెల్లివీధికి చెందిన నీతూ (18), పెందుర్తి పురుషోత్తపురానికి చెందిన సరజాల దామోదర్ (31)తో పాటు మరో ఐదుగురు ఆదివారం ఉదయం పాత గంగవరం తీరంలో ఫొటోషూట్ చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద అలలు దూసుకొచ్చాయి. దీంతో నీతూ, దామోదర్ సముద్రంలో కొట్టుకుపోయారు. వారి ఆచూకీ కోసం న్యూపోర్టు పోలీసులు నేవీ, కోస్టుగార్డు సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం నుంచి సోమవారం సాయంత్రం వరకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నేవీ హెలికాప్టర్, డ్రోన్ సాయంతో సముద్ర తీర ప్రాంతాన్ని గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం కూడా గాలింపు కొనసాగిస్తామని సీఐ తెలిపారు. గల్లంతైన ఇద్దరి ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు పాత గంగవరం తీరానికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. -
దుబాయ్ కేంద్రంగా సాగిన సైబర్ మోసం బట్టబయలు
ముగ్గురు అరెస్ట్ అల్లిపురం: నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా జరిగిన రూ.52.16 లక్షల సైబర్ మోసాన్ని ఛేదించి, దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠాకు మ్యూల్ బ్యాంక్ ఖాతాలు అందించిన ముగ్గురు నిందితులను హైదరాబాద్లో విశాఖ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ‘సెలట్రో ఇన్’ పేరుతో నకిలీ ట్రేడింగ్ యాప్ను ఉపయోగించి ఇద్దరు బాధితుల నుంచి మొత్తం రూ.52,16,500 మోసపోయినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాలు, బ్యాంకు లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల బ్యాంకు ఖాతాలను సేకరించి వాటిని సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలుగా అందించినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్కు చెందిన సయ్యద్ అలీ అబ్బాస్ హుస్సేన్ జాఫ్రీ, చాంద్రాయణగుట్టకు చెందిన షేక్ యూసుఫ్, బండ్లగూడకు చెందిన జాకీర్ హుస్సేన్ ఉన్నారు. వీరిని సోమవారం రిమాండ్కు తరలించారు. నిందితుల మొబైల్ ఫోన్లలో లభించిన డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించినట్లు పోలీసులు తెలిపారు. -
అమెరికాలో డాక్టర్ రవిరాజుకు ‘ఆచార్య’ అవార్డు
మహారాణిపేట: ప్రముఖ నెఫ్రాలజిస్ట్, కేజీహెచ్ మాజీ సూపరింటెండెంట్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి, మాజీ డీఎంఈ డాక్టర్ టి. రవిరాజును అమెరికాలో ఘనంగా సన్మానించారు. ఇటీవల వాషింగ్టన్ డీసీలోని హయత్ రీజెన్సీ హోటల్లో నిర్వహించిన ఆంధ్రా మెడికల్ కాలేజీ అలుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా 8వ ద్వైవార్షిక సమావేశంలో ఆయనకు ‘ఆచార్య’ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవిరాజు.. డాక్టర్ ఎం. దాసరాధరం స్మారకోపన్యాసం చేశారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించి అవార్డును అందజేశారు. ఆమ్కానా అధ్యక్షుడు డాక్టర్ మాణిక్యం ముత్యాల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ ప్రసాద్ చలసాని, నూతన అధ్యక్షురాలు డాక్టర్ నిర్మల పిచ్చిక, కోశాధికారి డాక్టర్ మల్లారెడ్డి మద్దుల, బోర్డ్ సభ్యుడు డాక్టర్ నాగేంద్ర మైనేని సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ను ఆమ్కానా ప్రతినిధులు సన్మానించారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్ ఎం. సంధ్యాదేవి, డాక్టర్ టి. రాధను కూడా సత్కరించారు. మరో పూర్వ విద్యార్థి డాక్టర్ పి. రవీంద్రనాథ్ శర్మ ‘మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ అమెరికా’ అంశంపై ప్రసంగించారు. ఈ సమావేశానికి అమెరికా నలుమూలల నుంచి సుమారు 250 మంది ఆంధ్ర మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. -
రైల్వే స్టేడియంలో కూలిన ఫ్లడ్లైట్ స్తంభం
తాటిచెట్లపాలెం: విశాఖలోని రైల్వే స్టేడియంలో ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది. నగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం, వీచిన బలమైన ఈదురుగాలుల ధాటికి స్టేడియంలోని ఒక భారీ ఫ్లడ్ లైట్ స్తంభం నేలకూలింది. సాధారణంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ రైల్వే స్టేడియానికి నగరంలోని వందలాది మంది ప్రజలు, క్రీడాకారులు వాకింగ్, జాగింగ్, ప్రాక్టీస్ కోసం వస్తుంటారు. అయితే, ఫ్లడ్ లైట్ కూలిన సమయంలో వర్షం, ఈదురుగాలులు కారణంగా మైదానం పూర్తిగా ఖాళీగా ఉంది. వాకర్స్ ఎవరూ అక్కడ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో ఒక పెద్ద విపత్తు తప్పినట్లయింది. కొద్దిసేపు వీచిన గాలులకే అంతటి భారీ ఫ్లడ్ లైట్ స్తంభం విరిగి కిందపడిపోవడం స్థానికంగా కలకలం రేపింది. స్టేడియం ఫ్లడ్ లైట్ల నిర్మాణ నాణ్యత ఏ స్థాయిలో ఉందో, వాటి నిర్వహణను అధికారులు ఎలా పర్యవేక్షిస్తున్నారో అనే అంశాలపై ఇప్పుడు పలువురు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. -
హోటల్ గదిలో బ్యూటీషియన్ ఆత్మహత్య
విశాఖపట్నం: ప్రియుడి మృతిని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన ఓ యువతి హోటల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం పీఎం పాలెం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. బొబ్బిలికి చెందిన షేక్ రషీదా బేగం (26) గాజువాకలో బ్యూటీషియన్గా పనిచేస్తోంది. ఆమెకు సన్నిహితుడైన లింగాల వెంకట గణేష్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. ఆ ఘటన తర్వాత రషీదా బేగం తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. శనివారం ఆమె క్రికెట్ స్టేడియానికి ఎదురుగా ఉన్న హోటల్లో ఒక గది అద్దెకు తీసుకుంది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఆమె బయటకు రాలేదు. హోటల్ సిబ్బంది పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు తెరిచి పరిశీలించగా, రషీదా బేగం స్కార్ఫ్తో ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై ఎస్ఐ డి.రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సార్.. మీ హెల్మెట్ ఏది?
సాక్షి, విశాఖపట్నం: ట్రాఫి క్ రూల్స్.. సామాన్యులకేనా? పోలీసులకు వర్తించవా? ఫైన్లు వేసేటప్పుడు ఉండే శ్రద్ధ.. వారు రూల్స్ పాటించడంలో ఎందుకు ఉండదు? ఇది రోడ్లమీద తరచూ వినిపించే సామాన్యుల ఆవేదన. కానీ.. ఓ యువకుడు ఏకంగా రోడ్డుపై వెళ్తున్న పోలీసులనే ‘మీ హెల్మెట్ ఏది సార్? అంటూ ధైర్యంగా నిలదీశాడు. అయితే.. ఆ తర్వాత జరిగిన పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా.. ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది. నగరంలోని శ్రీహరిపురం సమీపంలో జరిగిన సంఘటన ఇది. అసలేం జరిగిందంటే..! శ్రీహరిపురం అన్నమ్మ కాలనీ దాటుతూ.. హెచ్పీసీఎల్ వైపుగా రాత్రి సమయంలో ఇద్దరు పోలీసులు ఓ స్కూటర్పై వెళ్తున్నారు. బండి నడుపుతున్న పోలీసుతో పాటు, వెనుక కూర్చున్న పోలీసుకి కూడా హెల్మెట్ లేదు. అదే సమయంలో వెనుక నుంచి బైక్పై వచ్చిన ఓ యువకుడు వారి పక్కకు వచ్చి.. ‘సార్.. మీ హెల్మెట్ ఏది సార్?’ అని ప్రశ్నించాడు. ఇంతలో డ్రైవ్ చేస్తున్న పోలీస్.. ‘మేము నైట్ బీట్లో ఉన్నాం’ అని బదులివ్వగా.. ఆ యువకుడు ఏమాత్రం తగ్గలేదు. ‘మాకు మాత్రం హెల్మెట్ లేకపోతే.. రూ.10వేలు ఫైన్ వేసేస్తారు. మీరు మాత్రం హెల్మెట్ పెట్టుకోరా?’ అంటూ నిలదీశాడు. ఇంకోసారి ఇలా జరగదు..!: సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సామాన్యులు ప్రశ్నిస్తే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడం.. లేదా అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోతుంటారు. కానీ.. ఇక్కడ ఊహించని పరిణామం ఎదురైంది. యువకుడి ప్రశ్నతో బండి వెనుక కూర్చున్న పోలీసు వెంటనే బండి ఆపమన్నారు. కిందకు దిగి.. ఆ యువకుడు అడిగిన దాంట్లో న్యాయం ఉందని మనస్ఫూర్తిగా అంగీకరించారు. ‘నువ్వు అన్నది వాస్తవమే.. కరెక్టే.. మేం హెల్మెట్ పెట్టుకుని వెళ్లాలి. మాది తప్పే కాదనడం లేదు. క్వశ్చన్ చేయడం నీ తప్పు కాదు.. అది నీ రైట్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పోలీసుతో సమానమే’ అంటూ తన తప్పును అంగీకరించారు. ‘సేఫ్టీ రూల్ అనేది అందరికీ ఒకటే కదా’ అంటూ ఆ యువకుడు చెప్పిన మాటకు ఆ అధికారి సానుకూలంగా స్పందించి.. రైట్..ఈసారి అలా జరగదు అంటూ బదులిచ్చిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చట్టం, ట్రాఫిక్ నిబంధనలు ఎవరికైనా ఒకటేనని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. తప్పు చేసినప్పుడు సాక్షాత్తూ పోలీసులైనా సరే భయపడకుండా ప్రశ్నించిన యువకుడి ధైర్యానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అదే సమయంలో.. ఎదురుగా ఉన్నది సామాన్యుడే కదా అని బెదిరింపులకు దిగకుండా.. చట్టం ముందు అందరూ సమానులే అని అంగీకరించి తప్పు ఒప్పుకున్న పోలీసుల తీరును కూడా ప్రశంసిస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. -
తర్లువాడ.. గుండెదడ..
సాక్షి, విశాఖపట్నం: శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం నగర దాహార్తిని తీర్చే ప్రధాన సహజ జలవనరుల్లో ఒకటైన తర్లువాడ కొండలు నేడు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. అభివృద్ధి పేరుతో డేటా సెంటర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు పర్యావరణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా, చట్టాలను పక్కనపెట్టి మరీ కొండలను పిండిచేస్తూ సహజ జలమార్గాలను ధ్వంసం చేయడం పర్యావరణవేత్తలను, స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సాంకేతిక పురోగతి అవసరమే అయినప్పటికీ.. భవిష్యత్ తరాల తాగునీటి మూలాలను బలిపీఠంపై ఎక్కించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని తర్లువాడ కొండలు కేవలం రాతిగుట్టలు మాత్రమే కాదు. ఇవి తూర్పు కనుమల శ్రేణిలో భాగమైన ఈ కొండలు దశాబ్దాలుగా విశాఖ నగరానికి, భీమిలి, మధురవాడ పరిసర ప్రాంతాలకు సహజ జలసేకరణ వ్యవస్థలుగా పనిచేస్తున్నాయి. 1954 నుంచి ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీరుస్తున్న గంభీరం గెడ్డ రిజర్వాయర్కు ప్రాణం పోసేది ఈ కొండలే. వర్షాకాలంలో తూర్పు కనుమలపై కురిసే ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి, కోట్లాది లీటర్ల నీటిని గంభీరం రిజర్వాయర్కు చేరవేసే ప్రకృతి ప్రసాదించిన జలరక్షణ కవచాలు.. ఛిద్రమైపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇటీవలి కాలంలో డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం ఈ ప్రాంతాన్ని కేటాయించడంతో పరిస్థితి దారుణంగా మారింది. నీటికి కటకటే ఇస్రోకి చెందిన ‘భువన్’ శాటిలైట్ మ్యాపింగ్ యాప్లో ఓసారి పరిశీలిస్తే.. తర్లువాడ కొండలపై నుంచి గంభీరం గెడ్డ వైపు నీలిగీతలు (సహజ జలధారలు) స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఈ సహజ జలప్రవాహ మార్గాలను.. డేటా సెంటర్ పనుల కారణంగా భారీగా తవ్వకాలు జరిపి మట్టితో కప్పేస్తున్నారు. ఈ సహజ జలమార్గాలను మూసేస్తే గంభీరం రిజర్వాయర్కు నీరుచేరే మార్గాలు శాశ్వతంగా మాయమైపోనున్నాయి. ఫలితంగా భవిష్యత్తులో విశాఖ నగర తాగునీటి సరఫరాపై ఇది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ప్రజాప్రతినిధులు, పర్యావరణశాఖ అధికారులు ఈ విధ్వంసాన్ని గమనించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 140 ఎకరాల కొండల్లో విధ్వంసం పచ్చని అటవీ సంపదతో, వర్షాధార వృక్షాలతో కళకళలాడే తర్లువాడ కొండల్లో దాదాపు 140 ఎకరాల విస్తీర్ణంలోని అటవీ ప్రాంతాన్ని చట్టబద్ధమైన పర్యావరణ అనుమతులు లేకుండానే ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండలను చదును చేసేందుకు చేపట్టిన భారీ తవ్వకాల వల్ల పర్యావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటోంది. పనుల తీరు పరిశీలించేందుకు ఎవరు వెళ్తున్నా.. వారిని నిలువరించి అరెస్టు చేసేందుకు సైతం చంద్రబాబు ప్రభుత్వం వెనకాడటం లేదు. విశాఖ ప్రజలు పోరాడాల్సిన సమయం ఈ తర్లువాడ కొండల విధ్వంసంపై జనసేన మాజీ నేత, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ సున్నిత ప్రాంతాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని టీఎన్ గోదావర్మన్ తిరుముల్పాడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణపై స్పష్టమైన తీర్పు ఇచి్చందని చెప్పారు. ఎలాంటి ప్రాజెక్టుకైనా పర్యావరణ అనుమతి లేకుండా పనులు ప్రారంభించడం చట్టవిరుద్ధమన్నారు. పోస్ట్–ఫ్యాక్టో విధానంలో పనులు పూర్తిచేసిన తర్వాత అనుమతులు తెచ్చుకోవచ్చనే విధానాన్ని న్యాయస్థానం ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించదని పేర్కొన్నారు. పర్యావరణ ప్రభావ అంచనా నిర్వహించకుండా కొండలను తొలగించడం, సహజ జలవనరులను పూడ్చేయడం శిక్షార్హమైన నేరమని చెప్పారు. ప్రకృతి వనరులు.. పాలకులు లేదా రాజకీయ శక్తుల సొంత ఆస్తి కాదన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా పోరాడుతున్నారని చెప్పారు. అదే స్థాయి ప్రజా చైతన్యం, పర్యావరణ స్పృహ విశాఖ ప్రజల్లోను రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. -
పోర్టు కార్మికులంతా ఐక్యంగా పోరాడాలి
డాబాగార్డెన్స్: పోర్టు రంగంలో కార్మికుల హక్కుల పరిరక్షణకు శాశ్వత, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని వాటర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూటీడబ్ల్యూఎఫ్ఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి టీవీ నరేంద్రరావు పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన అఖిల భారత ప్రధాన, చిన్న పోర్టు కార్మికుల రెండో రోజు వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం, సామాజిక భద్రత కోసం దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు నిర్మించాలని సూచించారు. డబ్ల్యూటీడబ్ల్యూఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు సీడీ నందకుమార్, జాతీయ ఉపాధ్యక్షుడు రసల్, సంయుక్త కార్యదర్శి సమర మండల్, బి. జగన్ మాట్లాడుతూ పోర్టు రంగంలో ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, నాన్–పర్మనెంట్ కార్మికుల సమస్యలు, వేతన ఒప్పందాలు, ట్రేడ్ యూనియన్ హక్కులు, భద్రతా ప్రమాణాలు, జాతీయ స్థాయి ఉద్యమాల నిర్మాణం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.మణి, విశాఖ పోర్టు నాయకులు కె.సత్యనారాయణ, జక్కన సత్యనారాయణ, సాంబమూర్తి, త్రినాథరావు, వెంకట్రావు, అప్పలరాజు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
భోగాపురంపై చంద్రబాబు క్రెడిట్ చోరీ
మహారాణిపేట: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే కర్త, కర్మ, క్రియ అని, కానీ చంద్రబాబు తన ఘనతగా చెప్పుకుంటూ మరోసారి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. భూసేకరణ నుంచి అన్ని అనుమతుల సాధన వరకు ప్రతి దశను జగన్ స్వయంగా పర్యవేక్షించారని ఆమె గుర్తు చేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే 2,750 ఎకరాల భూసేకరణ పూర్తి చేయడంతో పాటు రైతులకు నష్టపరిహారం, నిర్వాసితులకు పునరావాసం కల్పించారన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో సమన్వయం చేసి విమానాశ్రయానికి అవసరమైన అన్ని అనుమతులను జగన్ సాధించారన్నారు. 2023లోనే ఎయిర్పోర్టుకు భూమిపూజ చేయగా, మొత్తం నిర్మాణంలో 70 శాతం పనులు జగన్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని, మిగిలిన 30 శాతం పనులు చేసి మొత్తం ఘనత తమదేనని చెప్పుకోవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలోనే విశాఖపట్నం–భోగాపురం మధ్య ఆరు లేన్ల రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని జగన్ కోరిన విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఉత్తరాంధ్రలో వలసలను నివారించి ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యంతోనే భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని జగన్ ముందుకు తీసుకెళ్లారని వెల్లడించారు. -
సెలవులో కలెక్టర్
నేడు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ మహారాణిపేట: కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ వ్యక్తిగత పను ల నిమిత్తం సెలవు తీసుకున్నారు. మూడు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆదివారం నుంచి 5వ తేదీ వరకు కలెక్టర్కు సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కాలానికి ఇన్చార్జి కలెక్టర్గా జేసీ జి. విద్యాధరిని నియమించారు. సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కూడా ఇన్చార్జి కలెక్టర్ నిర్వహించనున్నారు.ఇన్చార్జి కలెక్టర్గా జేసీ విద్యాధరిమహారాణిపేట: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ జి. విద్యాధరి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కార్యక్రమాలు జరుగుతాయని, రెవెన్యూ అధికారులతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పూర్తి వివరాలతో సమర్పించాలని సూచించారు. అలాగే ‘మీ కోసం’ కాల్ సెంటర్–1100 సేవలు, సంబంధిత వెబ్సైట్ను వినియోగించుకోవాలని కోరారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొనిలైన్మన్ మృతి
పరవాడ: యలమంచిలి–పరవాడ రహదారిలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పరవాడ సీఐ ఎల్.భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీఈపీడీసీఎల్లోని లంకెలపాలెం సెక్షన్లో కాంట్రాక్టు లైన్మన్గా పనిచేస్తున్న దుర్గారావు విధుల నిర్వహణకు ఆదివారం వాడచీపురుపల్లి ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి పరవాడకు వస్తుండగా పైడిమాంబ ఆలయం సమీపంలో గాజువాక నుంచి అచ్యుతాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆయన బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గారావు తలకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పరవాడ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. -
ఐపీబీఎల్కు బాక్సర్ల పయనం
సింథియా: బెంగళూరులో జరిగే ఇండియన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్ (ఐపీబీఎల్) పోటీల్లో పాల్గొనేందుకు జై భీమ్ బాక్సింగ్ క్లబ్కు చెందిన ఎనిమిది మంది బాక్సర్లు, ఇద్దరు కోచ్లు, ఒక మేనేజర్ ఆదివారం బయలుదేరారు. క్లబ్లో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ఎంఈఎస్ జేఈ రమేష్, అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత యువీ రావు క్రీడాకారులకు టీషర్టులు, క్యాప్లు, హెల్త్ డ్రింక్స్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపకుడు గుర్రాల రామారావు మాట్లాడుతూ.. ఐపీబీఎల్లో పాల్గొనడం ద్వారా ప్రొఫెషనల్ బాక్సింగ్లో జాతీయ, అంతర్జాతీయ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అనంతరం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. -
ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయేలా..!
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో జోన్ పరిధిలో అభివృద్ధి పనులు ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత రద్దీగా ఉండే విశాఖపట్నం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోయేలా అభివృద్ధి పనులు చేపడుతుండగా, మరోవైపు అవుటర్లో వెయిటింగ్ సమస్యకు చెక్ పెట్టే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రైల్వే మంత్రిత్వ శాఖ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న రైల్వే కోచింగ్ యార్డు ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రూ.299 కోట్లతో 2028 డిసెంబర్ నాటికి రీమోడలింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోవైపు, ప్రస్తుతం రైల్వే స్టేషన్లో ఉన్న ప్లాట్ఫామ్ల సంఖ్యను 8 నుంచి 14కు పెంచనున్నారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే నిరీక్షణకు తెరపడి, స్టేషన్కు రైలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడి, ప్రయాణికుల సమస్యలకు ఫుల్స్టాప్ పడనుంది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా విశాఖపట్నం స్టేషన్ సామర్థ్యాన్ని పెంచేందుకు, రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోని విశాఖపట్నం కోచింగ్ యార్డు పునర్నిర్మాణ ప్రాజెక్టుకు రూ.299 కోట్లను మంజూరు చేస్తూ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా స్టేషన్ మౌలిక సదుపాయాలు ఆధునికీకరించడమే కాకుండా, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. అవుటర్లో నిరీక్షణ ఉండదు ప్రస్తుతం విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీదుగా రోజుకు సగటున 113 రైళ్లు ప్రయాణిస్తుండగా, ప్రతిరోజూ దాదాపు 80,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న యార్డు కారణంగా స్టేషన్లోకి వచ్చే, వెళ్లే రైళ్లు ‘సర్ఫేస్ క్రాసింగ్’ అంటే ఒకే ట్రాక్పై ఇతర రైళ్ల రాకపోకల అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనివల్ల రైళ్లు స్టేషన్ బయట సిగ్నల్స్ వద్ద నిమిషాల తరబడి ఆగిపోవడం, ప్లాట్ఫామ్లు ఖాళీ లేకపోవడం వంటి తీవ్రమైన నిర్వహణ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ రీమోడలింగ్ ప్రాజెక్టుతో సర్ఫేస్ క్రాసింగ్ సమస్య తీరనుంది. రైళ్ల నిలిపివేత సమయం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా, రైళ్ల సమయపాలన మెరుగుపడటంతో పాటు మరిన్ని కొత్త రైళ్లను నడిపేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. యార్డు పూర్తయితే.. కొత్తరైళ్లకు అవకాశం.! కోచింగ్ యార్డు రీమోడలింగ్ పూర్తయితే విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు మరిన్ని కొత్త ఎక్స్ప్రెస్, వందే భారత్ రైళ్లను ప్రారంభించే అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే విశాఖ రైల్వే స్టేషన్ ఒక ప్రధాన రవాణా కేంద్రంగా రూపాంతరం చెందనుంది. ఫలితంగా నగర ప్రయాణికులకు, పర్యాటకులకు అత్యుత్తమ ప్రయాణ అనుభూతిని అందిస్తుందని దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో కీలకమైనవివే.. ప్రస్తుతం ఉన్న 8 ప్లాట్ఫారమ్లను వెడల్పు చేయడంతో పాటు, అన్ని ఆధునిక సౌకర్యాలతో మరో 6 కొత్త ప్లాట్ఫామ్లను నిర్మించనున్నారు. అలాగే రైళ్ల రాకపోకల కోసం అదనంగా మరో 6 రైల్వే ట్రాక్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు పరిధిలోని పాత లూప్ లైన్లను తొలగించి, పాయింట్ జోన్లను శాసీ్త్రయంగా పునర్వ్యవస్థీకరిస్తారు. ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే స్టేషన్ తూర్పు వైపున కొత్త ప్రవేశ ద్వారాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి అనుగుణంగా ప్రయాణికుల రిజర్వేషన్ కేంద్రాన్ని కూడా అక్కడికే తరలిస్తారు. సిగ్నలింగ్ వ్యవస్థను అత్యంత సురక్షితంగా, వేగవంతంగా మార్చేందుకు అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సాంకేతికతను కోచింగ్ యార్డులో ఏర్పాటు చేయనున్నారు. వెడల్పు చేసిన ప్లాట్ఫామ్లపై ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించేందుకు లిఫ్టు లు, ఎస్కలేటర్లు, ర్యాంప్లు నిర్మిస్తారు. ప్రయాణికుల వాహనాల కోసం విశాలమైన సర్ఫేస్ పార్కింగ్తో పాటు, స్టేషన్ బయట ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సక్రమమైన సర్క్యులేటింగ్ ఏరియా ప్లాన్ను అమలు చేయనున్నారు. విశాఖలో రైల్వే కోచింగ్ యార్డ్ రీ మోడలింగ్కు బోర్డు ఆమోదం -
హోటల్ గదిలో యువతి ఆత్మహత్య
పీఎం పాలెం: ప్రియుడి మృతిని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన ఓ యువతి హోటల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం పీఎం పాలెం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. బొబ్బిలికి చెందిన షేక్ రషీదా బేగం (26) గాజువాకలో బ్యూటీషియన్గా పనిచేస్తోంది. ఆమెకు సన్నిహితుడైన లింగాల వెంకట గణేష్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. ఆ ఘటన తర్వాత రషీదా బేగం తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. శనివారం ఆమె క్రికెట్ స్టేడియానికి ఎదురుగా ఉన్న హోటల్లో ఒక గది అద్దెకు తీసుకుంది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఆమె బయటకు రాలేదు. హోటల్ సిబ్బంది పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు తెరిచి పరిశీలించగా, రషీదా బేగం స్కార్ఫ్తో ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై ఎస్ఐ డి.రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐటీలో టాప్.. వసతుల్లో ఫ్లాప్..!
సాక్షి, విశాఖపట్నం: ఐటీ ఉద్యోగాల సృష్టిలో దూసుకుపోతున్న విశాఖకు మౌలిక వసతుల లేమి శాపంగా మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పకడ్బందీ ప్రణాళికలతో పునాదులు పటిష్టంగా మారిన విశాఖ ఐటీ రంగానికి.. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కనీస వసతులు కల్పించలేక నీరుగారుస్తోంది. తాజాగా ప్రముఖ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ విడుదల చేసిన సర్వే నివేదిక కూటమి సర్కారు నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. ఆ సర్వేలో విశాఖ ఐటీ ప్రగతిని కీర్తిస్తూనే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని కళ్లకు కట్టింది. దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాల్లో విశాఖ అగ్రస్థానంలో ఉందని చెబుతూనే.. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం దారుణంగా వెనుకబడి ఉందనే కఠోర వాస్తవాన్ని ఈ సర్వే బహిర్గతం చేసింది. బీచ్ ఐటీ కాన్సెప్ట్తో బూస్ట్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ రంగానికి విశేష ప్రాధాన్యత దక్కిన విషయం తెలిసిందే. ముఖ్యంగా.. ‘బీచ్ ఐటీ’ కాన్సెప్ట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రమోట్ చేయడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి కల్పించే స్టార్టప్లకు, బహుళజాతి సంస్థలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించింది. ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలు విశాఖలో పాగా వేసిన తర్వాత.. వరుసగా ఐటీ సంస్థలు క్యూ కట్టాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. నిరంతర పర్యవేక్షణ, కృషితోనే నేడు విశాఖపట్నం దేశంలోనే టైర్–2 నగరాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ‘టాప్ ఎమర్జింగ్ ఐటీ హబ్’గా లింక్డ్ఇన్ నివేదికలో ఫస్ట్ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. ఇదంతా నాణేనికి ఒక వైపు అయితే, నివేదిక ఎత్తిచూపిన మరో కోణం ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ డొల్లతనాన్ని, పాలకుల చిత్తశుద్ధి లేమిని నిలదీస్తోంది. మౌలిక వసతులు ఘోరం.! ఐటీ రంగం ఉరుకులు పరుగులు పెడుతున్నా, ఆ అద్భుతమైన వృద్ధికి తగ్గట్లుగా నగరంలో ఆధునిక మౌలిక వసతుల కల్పన మాత్రం అత్యంత ఘోరంగా ఉందని నివేదిక తేల్చిచెప్పింది. రెండేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం కేవలం అద్భుతమైన గ్రాఫిక్స్.. ఉదయం లేస్తే చెప్పే ప్రగల్భాలకే పరిమితమైందనీ.. క్షేత్రస్థాయిలో ఆచరణలో శూన్యమన్న విమర్శలకు ఈ సర్వే నిలువుటద్దంలా నిలిచింది. గుజరాత్లోని సూరత్ నగరంతో విశాఖను పోల్చిన లింక్డ్ఇన్ నివేదిక.. పట్టణ మౌలిక సదుపాయాల్లో విశాఖ ఎంత వెనుకబడి ఉందో.. స్పష్టంగా వివరించింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు, నగర ప్రజలకు అత్యంత అవసరమైన ‘మెట్రో రైలు’ ప్రాజెక్టు, అలాగే పర్యాటకానికి ప్రాణం పోసేలా.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రాచబాటగా మారే ప్రతిష్టాత్మక ‘బీచ్ కారిడార్’ నిర్మాణాల్లో సూరత్తో పోలిస్తే విశాఖ బాగా వెనుకబడి ఉందని రిపోర్ట్ కుండబద్దలు కొట్టింది. సూరత్ లాంటి నగరాలు ఫ్లైఓవర్లు, ఆధునిక వసతులతో దూసుకుపోతుంటే, విశాఖలో మాత్రం ఆ ఊసే లేదు.మాటలు కాదు.. ఐటీ అవసరాలు తీర్చండి! పెరుగుతున్న జనాభా, ఐటీ నిపుణుల అవసరాలను తీర్చేలా ప్రజా రవాణా మెరుగుపరచడం, ఆధునిక రోడ్ల విస్తరణ వంటివి చేపట్టడంలో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలమైందన్నది కాదనలేని సత్యం. కేవలం గత ప్రభుత్వం తెచ్చిన కంపెనీల ఖాతాలో పడుతూ పబ్బం గడుపుకోవడం తప్ప, ఈ ప్రభుత్వం కొత్తగా సాధించిన, చేపట్టిన మౌలికాభివృద్ధి ఏమీ లేదన్నది సర్వేలో వెల్లడైన నిజాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికై నా మాటలు కట్టిపెట్టి.. యుద్ధప్రాతిపదికన మెట్రో, బీచ్కారిడార్ వంటి ఆధునిక మౌలిక వసతుల ప్రాజెక్టులను పట్టాలెక్కించకపోతే.. భవిష్యత్తులో ఐటీ రంగంలో విశాఖ తీవ్ర కుంగుబాటును చవిచూడక తప్పదని నిపుణులు తీవ్రస్థాయిలో హెచ్చరిస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేని నగరానికి భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు రావడం కలగానే మిగిలిపోతుందన్న వాస్తవాన్ని పాలకులు ఇప్పటికై నా గుర్తించాలని సర్వే హెచ్చరిస్తోంది. -
యార్లగడ్డకు సత్కారం
విశాఖవిద్య: మాజీ రాజ్యసభ సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ను అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఓక్ల్యాండ్లో నిర్వహించిన సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకల్లో ఘనంగా సత్కరించారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి యార్లగడ్డ 14 వేల పుస్తకాలను విరాళంగా అందించారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆ విశ్వవిద్యాలయ గ్రంథాలయానికి ఆయన పేరు పెట్టారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర సంస్థతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను కూడా సన్మానించారు. సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు ఆనంద్ కూచిభొట్ల చేతుల మీదుగా ఈ సత్కార కార్యక్రమం జరిగింది. -
బళ్లారి రాఘవ సేవలు చిరస్మరణీయం
అల్లిపురం: తెలుగు నాటకరంగానికి బళ్లారి రాఘవ అందించిన సేవలు అమూల్యమని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. ప్రముఖ నాటకకర్త, న్యాయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు, నాటక కళాప్రపూర్ణ బళ్లారి రాఘవ (తాడిపత్రి రాఘవాచార్యులు) జయంతి సందర్భంగా ఆదివారం నగర పోలీస్ కమిషనరేట్లో ఆయన చిత్రపటానికి సీపీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు నాటకరంగాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన మహనీయుల్లో బళ్లారి రాఘవ ఒకరని కొనియాడారు. కళారంగానికి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. -
55 ఏళ్లైనా వీడని స్నేహబంధం
మల్కాపురం: కాలం గడిచినా, వయసు పెరిగినా వారి స్నేహబంధం మాత్రం చెక్కుచెదరలేదు. ఏకంగా 55 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహానికి నిదర్శనంగా షిప్యార్డ్ గాంధీగ్రామ్ హైస్కూల్లో 1970–71 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆత్మీయంగా కలుసుకున్నారు. పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఈ సమావేశానికి పుణే, హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కతా తదితర నగరాల నుంచి స్నేహితులు హాజరయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకున్న వారు చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. స్నేహానికి సంబంధించిన పాటలను ఉత్సాహంగా ఆలపిస్తూ, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. గత 13 ఏళ్లుగా ప్రతి ఏటా స్నేహితుల దినోత్సవం రోజున 30 మంది ఇదే విధంగా కలుసుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. -
ఆకట్టుకున్న ఆఫ్తాల్మాలజీ ఫొటో ప్రదర్శన
సీతంపేట: విశాఖపట్నంలోని ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల హారోల్డ్ రిడ్లీ హాల్లో ఆదివారం నిర్వహించిన ఆఫ్తాల్మాలజీ ఫొటో ఎగ్జిబిషన్–2026 విశేషంగా ఆకట్టుకుంది. ఆఫ్తాల్మాలజీ పోస్ట్గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం పోటీ రూపంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని 10 వైద్య కళాశాలలు, ఐదు పోస్ట్గ్రాడ్యుయేట్ శిక్షణా సంస్థలకు చెందిన సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ వి.వి.ఎల్.నరసింహారావు ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమాన్ని డా.అజయ్ శంకర్ నిర్వహించగా, ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్, ఆఫ్తాల్మాలజీ విభాగాధిపతి డాక్టర్ వి.మీనాక్షి పర్యవేక్షించారు. ప్రదర్శనలో అరుదైన నేత్ర వ్యాధులు, క్లిష్టమైన వైద్య పరిస్థితులకు సంబంధించిన అత్యుత్తమ క్లినికల్ ఫొటోగ్రాఫ్లను ప్రదర్శించగా, సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుమారు 100 మంది నేత్ర వైద్య నిపుణులు, 50 మంది పోస్ట్గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రముఖ నేత్ర వైద్యులు సి.వి.గోపాలరాజు, బి.ధర్మరాజు, యు.ఎస్.ఎన్.మూర్తి, ఎం.ఎస్.ఆర్.మూర్తి, టి.జ్యోతిర్మయి, భాస్కరరావు, తారకేశ్వరరావు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ ఎస్ఐపై దాడికి యత్నం
ఎంవీపీకాలనీ: సత్యం జంక్షన్ జాతీయ రహదారిపై హోమ్ గ్యాడ్జెట్లు విక్రయిస్తున్న చిరువ్యాపారులు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావుతో వాగ్వాదానికి దిగిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నుంచి నగరానికి అవయవాలను తరలిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆదివారం మధ్యాహ్నం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఎంవీపీ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు సత్యం జంక్షన్లో ట్రాఫిక్ను నియంత్రిస్తూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో అవయవాలను తరలిస్తున్న వాహనం హనుమంతవాక వైపు నుంచి సత్యం జంక్షన్కు చేరుకుంటుండటంతో, జాతీయ రహదారిపై హోమ్ గ్యాడ్జెట్లు విక్రయిస్తున్న రాజస్థాన్కు చెందిన చిరువ్యాపారులను రహదారి పక్కకు వెళ్లాలని ఎస్ఐ సూచించారు. ఎస్ఐపైకి కర్రతో దూసుకొచ్చిన యువకుడు అయితే వారు అందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. వారిలో ఓ యువకుడు కర్రతో ఎస్ఐపైకి దూసుకొచ్చి బెదిరించడంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే అవయవాలను తరలిస్తున్న వాహనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎస్ఐ శ్రీనివాసరావు సంయమనం పాటించారు. గ్రీన్ ఛానల్ పూర్తయి వాహనాలు వెళ్లిపోయిన అనంతరం వ్యాపారులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, అప్పటికే వారు అక్కడి నుంచి జారుకోవడం గమనార్హం. -
గాజువాకలో నూతన కోర్టుల ప్రారంభం
గాజువాక: గాజువాక కోర్టు కాంప్లెక్స్లో కొత్తగా ఏర్పాటు చేసిన సీనియర్ సివిల్ జడ్జి కోర్టులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోర్ట్ఫోలియో జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు త్వరితగతిన, పారదర్శకమైన సత్వర న్యాయాన్ని అందించడమే లక్ష్యంగా ఈ నూతన కోర్టులను అందుబాటులోకి తెచ్చామని, బాధితులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ జడ్జి చిన్నంశెట్టి రాజు, 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.ఎం.ఫణికుమార్, గాజువాక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వేణు, కార్యదర్శి కె.జ్యోతితో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
పారిశుధ్య కార్మికుల ఆకలి కేకలు
మహారాణిపేట: నెలల తరబడి జీతాలు అందక గ్రామ పంచాయతీ, స్వచ్ఛభారత్, క్లాప్ మిత్ర పారిశుధ్య కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని వందలాది కార్మికులు కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో థర్డ్ పార్టీ కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కనీస వేతనాలతో పాటు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో తమను విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అరకొర జీతాలు.. నెలనెలా రావు విశాఖ జిల్లాలోని 79 గ్రామ పంచాయతీల్లో సుమారు 240 మంది, అనకాపల్లి జిల్లాలోని 645 పంచాయతీల్లో సుమారు 900 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి నెలకు ఇచ్చేది కేవలం రూ.6 వేలు మాత్రమే. అది కూడా గత మూడు నెలలుగా ఇవ్వలేదు. ఈ అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న తమకు నెలల తరబడి జీతాలివ్వకపోతే.. కుటుంబంతో బతికేదెలా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశుభ్రతకు అవార్డులు.. కార్మికులకు వెతలు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించేది పారిశుధ్య కార్మికులే. కరోనా సమయంలో వీరి సేవలు అసమానం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీధులు, కాల్వలు శుభ్రం చేయడంతోపాటు, అధికారుల సూచన మేరకు ఇతర పారిశుధ్య పనులు కూడా నిర్వర్తిస్తున్నారు. దీంతో ప్రభుత్వాల నుంచి పంచాయతీలు అవార్డులు పొందుతున్నాయి. అయినా వీరి జీతాల కోసం అధికారులు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. పీజీఆర్ఎస్ ద్వారా జీతాల బకాయిలపై వినతులు సమర్పించినా స్పందించట్లేదని ఆక్షేపిస్తున్నారు. కనీస వేతనాలివ్వాలి పంచాయతీ పారిశుధ్య కార్మికుల కరోనా టైంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబ సభ్యుల్ని వదిలి పనిచేశారు. ఆ కనికరం కూడా అధికారులు చూపట్లేదు. మా జీతాలు కొంచెం అయినా పెంచిన దాఖలాల్లేవు. కార్మి కులకు కనీస వేతనంగా రూ.26 వేలు చెల్లించాలి. –పడాల రమణ, జిల్లా గౌరవ అధ్యక్షుడు, ఏపీ గ్రామ పంచాయితీ, స్వచ్ఛభారత్ వర్కర్స్ యూనియన్ జీవో 680 అమలు చేయాలి పంచాయతీ కార్మికులకు జీవో నం.680 అమలు చేసి నెలకు రూ.10 వేల జీతం ఇవ్వాలి. డీపీవో లేదా ఎంపీడీవో ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ప్రమాదం, సహజ మరణం పొందిన కార్మికులకు మట్టి ఖర్చులిచ్చి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. –సీహెచ్ శంకర్, కార్మికుడు, శొంఠ్యాం, ఆనందపురం కార్మిక చట్టాలు అమలు చేయాలి మేజర్ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేసి, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి. పంచాయతీలో పనిచేస్తున్న శానిటేషన్, వాటర్ సప్లై, ఎలక్ట్రికల్ కార్మికులకు బీమా వర్తింపజేయాలి. పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రభుత్వమే జీతాలివ్వాలి. –ఎద్దు పైడమ్మ, పాండ్రింగి, పద్మనాభం గత ప్రభుత్వంలో భరోసా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించింది. రూ.6 వేల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతూ జీవో నం.680 జారీ చేసింది. అది అమల్లోకి రాకముందే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం ఈ ఉత్తర్వులను పక్కన పెట్టేసింది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి జీతాలు చెల్లించాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ అమలు చేయట్లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. జీతాలు అడిగితే పనులు మానుకుని, వెళ్లిపోండని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. -
ప్రజాభిప్రాయం తర్వాతే డేటా సెంటర్ల ఏర్పాటు
డాబాగార్డెన్స్: ఏఐ డేటా సెంటర్ల వంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను బహిరంగ ప్రజా చర్చ, సమగ్ర అధ్యయనం అనంతరమే చేపట్టాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సాంకేతిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ అవసరమే అయినప్పటికీ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం, దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలతో సమతుల్యత పాటించాలని సూచించారు. విశాఖలో ప్రతిపాదిత ఏఐ డేటా సెంటర్లకు సంబంధించిన చట్టపర, పర్యావరణ, ప్రజా విధాన అంశాలపై ఆదివారం డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్రీన్ విశాఖ కమిటీ అధ్యక్షుడు కె.రాజారామ్మోహన్రాయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రభావం, చట్టపర అంశాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో గ్రీన్ విశాఖ కమిటీ కార్యదర్శి డాక్టర్ ఎన్.చంద్రశేఖర్, ఎన్.వెంకటేశ్వరరావు, పి.సత్యనారాయణ, కేవై మణి, డీవీ అనీల్కుమార్, ఎ.సుధాకర్, బి.అప్పలరెడ్డి, కె.హరిత, జి.అనూషకుమారి, హ్యూమన్ రైట్స్ ఫోరం ప్రతినిధి వీఎస్ కృష్ణ, పౌర చైతన్య వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ కేకేకే చంద్, కార్యదర్శి సీహెచ్ ప్రమీలా, ప్రొఫెసర్ బైరాగిరెడ్డి, గ్రీన్ విశాఖ బృంద సభ్యులు జి.కాంతారావు, సాయి ఫణీంద్ర, తిరుపతిరావు, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధికార ప్రతినిధి, న్యాయవాది పాకా సత్యనారాయణ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. -
జూలో వన్యప్రాణులను దత్తత తీసుకున్న చిన్నారులు
ఆరిలోవ: ఇద్దరు చిన్నారులు జూలోని వన్యప్రాణులను దత్తత తీసుకొని ఆదర్శంగా నిలిచారు. ఆదివారం చిన్నారులు సహారి, ఆర్యన్ తమ తల్లిదండ్రులతో కలిసి జూను సందర్శించి ఒక ఘరియల్, రెండు రాక్ పైథాన్లు (కొండచిలువలు)ను ఏడాది కాలానికి, ఒక మకావ్ పక్షిని నెల రోజుల పాటు దత్తత తీసుకున్నారు. ఇందుకోసం ఘరియల్కు రూ.25 వేలు, రెండు పైథాన్లకు రూ.10 వేలు, మకావ్ పక్షికి నెలకు రూ.240 చొప్పున విరాళాన్ని జూ క్యూరేటర్ జి. మంగమ్మకు అందజేశారు. అనంతరం ఆమె చిన్నారులకు దత్తత స్వీకార పత్రం, సావనీర్ను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మరింత మంది దాతలు వన్యప్రాణులను దత్తత తీసుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు శ్వేత, అనిల్, జూ అసిస్టెంట్ క్యూరేటర్లు బి. గోపి, పి.వి. చౌదరి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరిలోవలో నీటి సమస్యపై సీపీఎం ర్యాలీ
ఆరిలోవ: ఆరిలోవ ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నాయకులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ 40 గజాల కాలనీ నుంచి దుర్గాబజార్ మీదుగా లీలాసుందరి నగర్ వరకు సాగింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి. కుమార్ మాట్లాడుతూ 10 నుంచి 13 వార్డుల్లో మూడు, నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే జీవీఎంసీ కుళాయి నీరు సరఫరా చేస్తోందని, బోర్లు ఎండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పందించకపోవడం దారుణమన్నారు. జీవీఎంసీ అధికారులు స్పందించి ప్రతిరోజూ గంట చొప్పున కుళాయి నీరు అందించాలని డిమాండ్ చేశారు. నీటి సమస్య పరిష్కారం కోసం ఈ నెల 7న బాలాజీనగర్లోని జీవీఎంసీ నీటి సరఫరా విభాగం కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి. కృష్ణారావు, స్థానిక నేతలు వి.ఎన్. కుమార్, పి. శంకర్, కె. కుమారి, వెంకటరావు, రమణమ్మ పాల్గొన్నారు. -
సిబ్బందికి ఆర్టీసీ ఆర్ఎం అభినందనలు
అల్లిపురం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని, ముఖ్యమంత్రి తదితర వీఐపీల రాకపోకల కోసం సుమారు 2 వేల ఆర్టీసీ బస్సులను ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ఆయా డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ సిబ్బంది, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు, యూనియన్ ప్రతినిధులను రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు అభినందించారు. ప్రభుత్వం, ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నుంచి జిల్లా సిబ్బంది పనితీరుకు ప్రశంసలు లభించడం గర్వకారణమన్నారు. సింహాచలం గిరి ప్రదక్షిణ, భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సమర్థవంతమైన రవాణా సేవలు అందించినందుకు ప్రభుత్వం నుంచి ప్రశంసలు దక్కాయని తెలిపారు. -
యువకుడిపై హత్యాయత్నం
కంచరపాలెం: బర్మా క్యాంప్ మసీదు సమీపంలో ఆదివారం రాత్రి యువకుడిపై కత్తితో దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్మా క్యాంప్కు చెందిన జశ్వంత్ (22), పాల్, యశ్వంత్ల మధ్య గత కొంతకాలంగా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం పాల్, యశ్వంత్లు మద్యం సేవిస్తుండగా అక్కడికి వచ్చిన జశ్వంత్ వారిని బెదిరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాత్రి మసీదు సమీపంలో జశ్వంత్పై యశ్వంత్ కత్తితో దాడి చేశాడు. దీంతో జశ్వంత్ శరీరంపై మూడు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కంచరపాలెం పోలీసులు రక్తపుమడుగులో పడి ఉన్న జశ్వంత్ను కేజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన అనంతరం యశ్వంత్ను స్థానికుల సహాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ ప్రదీప్తి పర్యవేక్షణలో కంచరపాలెం సీఐ కోరాడ రామారావు దర్యాప్తు చేపట్టారు. తనను జశ్వంత్ హత్య చేస్తాడనే భయంతో ముందుగానే కత్తిని వెంట తీసుకెళ్లినట్లు యశ్వంత్ విచారణలో చెప్పినట్లు సమాచారం. పోలీసుల అదుపులో యశ్వంత్ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న జశ్వంత్ -
విశాఖ యారాడ బీచ్లో ఇద్దరు గల్లంతు
సాక్షి, విశాఖపట్నం: స్నేహితుల దినోత్సవం రోజు విషాదం చోటుచేసుకుంది. యారాడ బీచ్లో యువతి, యువకుడు గల్లంతయ్యారు. ఫోటోలు తీసుకుంటున్న క్రమంలో సముద్రంలో గల్లంతయినట్లు సమాచారం. యువతి నీతుని రక్షించబోయి మరో యువకుడు రాము గల్లంతయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన న్యూ పోర్టు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.విశాఖ వచ్చే పర్యాటకులు యారాడ బీచ్, ఆర్కే బీచ్, తేన్నేటి పార్క్, సాగర్ నగర్, రుషి కొండ బీచ్, ఐటీ హిల్స్, భీమిలి బీచ్ ప్రాంతాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇక్కడి తీరంలో పెద్ద పెద్ద రాళ్లు ఉండడంతో వాటిపై నిల్చుని సాగరం అందాలను వీక్షిస్తుంటారు. అయితే కొంత మంది సరదాగా స్నానాలు చేసేందుకు, ఫోటోలు తీసుకోవడానికి దిగడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అకస్మాత్తుగా వచ్చే అలలకు బలైపోతున్నారు.విశాఖ తీరం చుట్టూ కొండలు ఉండడంతో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రిప్ కరెంట్ వల్ల ఒక్కొక్కసారి భారీ అలలు వస్తుంటాయి. ఇలా రిప్ కరెంట్ వల్ల అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు వస్తుంటాయి. ఆ సమయంలో తీరంలో ఉన్న వారు వాటికి చిక్కితే క్షణాల్లో కొన్ని కిలోమీటర్ల లోనికి వెళ్లిపోతుంటారు. సాధారణంగా అలలు ఎవరినైనా లోనికి లాగితే కొద్ది దూరంలోనే విడిచిపెట్టేస్తాయి. అటువంటి వారిని లైఫ్గార్డ్స్ రక్షించే అవకాశం ఉంటుంది. ఈ రిప్ కరెంట్ వల్ల వచ్చే కెరటాలకు చిక్కితే మాత్రం సురక్షితంగా బయటపడడం అసాధ్యం. -
‘భోగాపురం.. జీఎంఆర్తో ఎందుకు మాట్లాడించలేదు’
సాక్షి, విశాఖ: ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు చేయడం చంద్రబాబుకు అలవాటే అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. భోగాపురం ఎయిర్పోర్టుపై క్రెడిట్ చోరీ చేసిన చంద్రబాబు.. కుప్పం ఎయిర్పోర్టు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకే అబద్దాలు చెప్తే ఇక ప్రజల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవాలి. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో జీఎంఆర్తో ఎందుకు మాట్లాడించలేదు అని ప్రశ్నించారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్ట్ కీలకం. నిర్మాణం చేసిన జీఎంఆర్ సంస్థకు కూడా అభినందనలు. దేశ ప్రధాని ముందే సీఎం, డిప్యూటీ సీఎం.. వైఎస్ జగన్పై విమర్శలు చేయడమేంటి?. ప్రధాని ముందే అబద్దాలు చెప్పారు. ప్రధానికే అబద్దాలు చెప్తే ఇక ప్రజల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ కష్టం ఎవరిది అనేది అందరికీ తెలుసు. కొబ్బరికాయ కొట్టి.. గుమ్మడికాయ కట్టింది మాత్రమే బాబు.. ఎయిర్పోర్ట్ కట్టింది మాత్రం వైఎస్ జగన్.2019లో బాబు ఎయిర్పోర్టుకి శంకుస్థాపన చేసినప్పటికి కేవలం 270 ఎకరాలు మాత్రమే సేకరించారు. ఉమ్మడి ఏపీలో బాబు వేసిన శిలాఫలకాలు వందల్లో ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చాక 2020లో జీఎంఆర్తో ఎయిర్పోర్ట్ ఇన్ కార్పొరేషన్ అయ్యింది. వైఎస్సార్సీపీ హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్టు పనులు వేగంగా జరిగాయి. 150కి పైగా న్యాయ వివాదాలు పరిష్కరించి ఎయిర్పోర్టు నిర్మాణం చేశాం. వైఎస్సార్సీపీ హయాంలో భోగాపురం ఎయిర్పోర్టు కోసం 2700 ఎకరాల భూసేకరణ చేశాం. అన్ని అనుమతులు వచ్చాకనే వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన రోజు 2026లో ఎయిర్పోర్టును ప్రారంభిస్తామని వైఎస్ జగన్ చెప్పారు.ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో జీఎంఆర్తో ఎందుకు మాట్లాడించలేదు. ప్రారంభోత్సవంలో జీఎంఆర్ మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయని మాట్లాడించలేదు. భోగాపురం ఎయిర్పోర్టులో క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు.. కుప్పం ఎయిర్పోర్టు ఏమైందో చెప్పాలి. 2017లోనే చంద్రబాబు కుప్పం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు.. దాని సంగతేంటి?. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఏంటి?. ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. వైఎస్సార్సీపీ హయంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది. చంద్రబాబు ఓటు బ్యాంకుగా ఉత్తరాంధ్రను వాడుకున్నారు. అబద్దాలు చెప్పే నాయకుడి కోటాలో బాబుకి గిన్నిస్ బుక్ రికార్డ్ ఇవ్వాలి. రాష్ట్రంలో అయితే రెడ్ బుక్ లేకపోతే గిన్నిస్ బుక్ నడుస్తుంది. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వం వదిలేసింది. ఈ రెండున్నర సంవత్సరాల్లో రెడ్ బుక్, గిన్నిస్ బుక్, బాబు ఫేస్ బుక్ తప్ప ఏమీ లేదు. ఎవరికో పుట్టిన బిడ్డకి బాబు ఘనంగా బారసాల చేసినట్టు ఉంది. -
పాచిపోయిన ఉప్మా, బిర్యానీ... ఉండలు కట్టిన పెరుగన్నం
విశాఖపట్నం జిల్లా: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వం సుదూర ప్రాంతాల నుంచి తరలించిన ప్రజలకు శనివారం పాచిపోయిన ఉప్మా, బిర్యానీ, పులిహోర, ఉండలు కట్టిన పెరుగన్నం ప్యాకెట్లు అందించింది. ఆనందపురం మండలం పెద్దిపాలెంలో వీటిని శుక్రవారం రాత్రి 11 గంటలకు వండి వేడిగా ఉన్నప్పుడే డబ్బాలలో ప్యాకింగ్ చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉదయం బ్రేక్ఫాస్ట్కు ఉప్మా అందించారు. రాత్రి ప్యాకింగ్ చేసిన ఉప్మా ఉదయానికి పాచిపోయింది. మధ్యాహ్నం అందించిన 150 గ్రాముల బిర్యానీ ప్యాకెట్లో మీల్మేకర్ తప్ప ఎలాంటి కూరగాయలు వాడలేదు. రాత్రి చేసింది కావడంతో బిర్యానీ కూడా పాచిపోయిన వాసన వచ్చింది. దీంతోపాటు అందించిన 100 గ్రాముల పెరుగన్నం కూడా ఉండలు ఉండలుగా మారడంతో తినడానికి ఎవరూ ఇష్టపడలేదు. -
త్వరలో విశాఖ–బెంగళూరు వందేభారత్ స్లీపర్ రైలు!
సాక్షి, విశాఖపట్నం: ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే వందేభారత్ ఏసీ ఎక్స్ప్రెస్ సర్వీస్ను వైజాగ్ నుంచి ఐటీ రాజధాని బెంగళూరుకు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు ప్రధాన నగరాల మధ్య అధునాతన వందేభారత్ స్లీపర్ను నడపాలని దక్షిణ కోస్తా రైల్వే జోన్ తాజాగా ప్రతిపాదించింది. ఇందుకు సాధ్యాసాధ్యాలు, మార్గమధ్యంలో ఇతర రైళ్ల క్రాసింగ్స్, ప్రతిపాదిత టైమింగ్స్, తలెత్తే ఇబ్బందులు తదితర అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ దక్షిణ పశ్చిమ రైల్వే జోన్తో పాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డీఆర్ఎంలకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ సీపీటీఎం షిఫాలీ కుమార్ ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఆయా డివిజన్ల నుంచి ఫీజిబిలిటీ రిపోర్టు వచ్చిన అనంతరం రైల్వే బోర్డుకు తుది ప్రతిపాదనలు పంపుతారు. రైల్వే బోర్డు ఆమోదం తెలిపిన వెంటనే దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ వందేభారత్ స్లీపర్ రైలు విశాఖ నుంచి పట్టాలెక్కనుంది. ప్రతిపాదనల ప్రకారం వారంలో ఆరు రోజుల పాటు రాత్రిళ్లు ఈ సర్వీస్ నడుస్తుంది. రైలు విశాఖలో బయలుదేరిన తర్వాత దువ్వాడ, విజయవాడ, కృష్ణా కెనాల్ జంక్షన్, గుంటూరు, నంద్యాల, గుత్తి, ధర్మవరం మీదుగా బెంగళూరు చేరుకుంటుంది.


