● ముగిసిన జీవీఎంసీ ఆఖరి సర్వసభ్య సమావేశం ● మిగిలిన పనుల
మిగతా 8వ పేజీలో
చివరి సమావేశం కావడంతో కౌన్సిల్ హాల్లో క్రమశిక్షణ కంటే ఆత్మీయ పలకరింపులకే ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశానికి మేయర్ పీలా శ్రీనివాసరావు కాస్త ఆలస్యంగా రావడంతో 11.30 గంటలకు సభ మొదలైంది. ఈలోపు సభ్యులంతా పిచ్చాపాటి కబుర్లు, సెల్ఫీలతో సందడి చేశారు. సభకు హాజరైన ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సైతం సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ ఫొటోలు దిగారు.
సుదీర్ఘంగా జీరో అవర్..
సమావేశం ప్రారంభమైన వెంటనే మేయర్ జీరో అవర్ను ప్రకటించారు. సభ్యులకు తమ వార్డుల సమస్యలు చెప్పుకునేందుకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో ఉదయం 11.30కి మొదలైన జీరో అవర్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. భోజన


