Visakhapatnam District Latest News
-
భూముల అభివృద్ధికి పలు సంస్థల ఆసక్తి
విశాఖ సిటీ: మధురవాడలోని భూముల అభివృద్ధికి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు ఆసక్తి చూపించినట్లు వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రమేష్ తెలిపారు. వీఎంఆర్డీఏకు చెందిన 87.80 ఎకరాల భూమిని పీపీపీ విధానంలో సంయుక్త అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలను వివరించేందుకు శనివారం బెంగుళూరులో నైట్ ఫ్రాంక్ కార్యాలయంలో రోడ్ షో నిర్వహించారు. ఇందులో ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థలైన గోద్రేజ్ ప్రాపర్టీస్, ఉషా శ్రీరామ్ ప్రాపర్టీస్, స్థానిక రియల్ ఎస్టేట్ సంస్థలు హాజరైనట్లు పేర్కొన్నారు. భూముల అభివృద్ధిపై సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ రోడ్ షోలో వీఎంఆర్డీఏ చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్ప, సీఈ భవానీశంకర్, నైట్ ఫ్రాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
పార్టీకి సోషల్ మీడియా కార్యకర్తలే బలం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీకి సోషల్ మీడియా కార్యకర్తలే కొండంత బలమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో సోషల్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. జిల్లాలో 8 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై రాష్ట్రంలోని పలు పోలీస్స్టేషన్లలో 50కి పైగా అక్రమ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మద్దిలపాలేనికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త బోస రమణారెడ్డిపై ఆరు కేసులు, గాజువాక మండలం గొల్లజగ్గరాజుపేటకు చెందిన బొడి వెంకటేష్పై మొత్తం 17 కేసులు, విశాఖకు చెందిన ఇంటూరి రవికిరణ్పై రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొత్తం 21 కేసులు, అలాగే ప్రసాద్ సిద్దు, గోపిరాజు వంకా, సదరం జ్ఞానేష్లపై మార్టూరు పోలీస్స్టేషన్లో కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేశారన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి అధికారిని గుర్తుపెట్టుకోండన్నారు. రానున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని, మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేయడం తథ్యమన్నారు. ప్రజా సంకల్ప యాత్ర దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలు అండగా నిలిచారని గుర్తు చేశారు. మరోమారు పార్టీకి, అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, పార్టీ కార్యాలయ ఇన్చార్జి రవిరెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, కార్పొరేటర్లు, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు -
పద్మం సిల్వర్ జ్యూయలరీ షోరూం ప్రారంభం
మద్దిలపాలెం: మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్లో పద్మం 92.5 సిల్వర్ జ్యూయలరీ షోరూం శనివారం ఘనంగా ప్రారంభమైంది. సీఎంఆర్ వ్యవస్థాపకుడు, చైర్మన్ మావూరి వెంకటరమణ ఈ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్లుగా నమ్మకమైన సేవలందిస్తూ.. వినియోగదారుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నామన్నారు. అదే నమ్మకానికి నిదర్శనంగా సీఎంఆర్ గ్రూప్ నుంచి పద్మం 92.5 సిల్వర్ జ్యూయలరీ షోరూంను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుత ట్రెండ్కు తగిన బ్రాండ్లతో.. సరికొత్త వెండి ఆభరణాలతో సీఎంఆర్ సెంట్రల్ గ్రౌండ్ ఫ్లోర్లో షోరూంను ప్రారంభించామని వెల్లడించారు. ప్రారంభోత్సవ కానుకగా అన్ని రకాల వెండి ఉత్పత్తులపై ఫ్లాట్ 20 శాతం తగ్గింపు, ఆభరణాల కొనుగోలుపై గ్యారెంటీ కార్డుతోపాటు కచ్చితమైన బైబ్యాక్ పాలసీ అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల మనసుకు హత్తుకునే సరికొత్త డిజైన్లతో సిల్వర్ జ్యూయలరీ ఆభరణాలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. -
మరోసారి సీజీఆర్ఎఫ్ చైర్మన్గా సత్యనారాయణ
మహారాణిపేట: ఎలక్ట్రిసిటీ కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్రసల్ ఫోరం(సీజీఆర్ఎఫ్) చైర్మన్గా బి.సత్యనారాయణ రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ఈపీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. శనివారం సత్యనారాయణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. 2022 నుంచి 2025 వరకు సత్యనారాయణ సీజీఆర్ఎఫ్ చైర్మన్గా సేవలందించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో 1998 నుంచి 2022 వరకు పలు హోదాల్లో న్యాయమూర్తిగా పనిచేశారు. 2022లో జిల్లా జడ్జిగా పదవీ విరమణ పొందారు. విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో తీర్పులిచ్చారు. కాగా సత్యనారాయణ పునర్నియామకం పట్ల రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడు, కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ, ఏపీ ఈపీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.హరిబాబు(ఫైనాన్స్), సీజీఆర్ఎఫ్ సభ్యులు ఎ.మురళీకృష్ణ (ఇండిపెండెంట్), ఎస్.సుబ్బారావు (ఫైనాన్స్), బి.సులేఖరాణి (టెక్నికల్) హర్షం ప్రకటించారు. -
కదల్లేని వయసులో కష్టం
● ఈ నెలా పింఛన్ల కోసం వృద్ధుల అవస్థలు ● 92.61 శాతం మందికి పింఛన్ల అందజేత మహారాణిపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా.. పింఛన్దారుల కష్టాలు తీరకపోగా మరింత పెరిగాయి. గత ప్రభుత్వ హయాంలో ఇంటికే వచ్చి పింఛన్లు అందించే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి.. ఇప్పుడు వృద్ధులు, వికలాంగులు, మహిళలను సచివాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. నెలవారీ పింఛన్ కోసం గంటల తరబడి ఎండలో నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. శనివారం పెదజాలారిపేట సచివాలయం వద్ద మధ్యాహ్నం 11 గంటల తర్వాత గానీ పింఛన్ల పంపిణీ ప్రారంభం కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఒకే దగ్గర లబ్ధిదారులను చేర్చి.. పింఛన్లు పంపిణీ జరిగింది. బయోమెట్రిక్ ద్వారానే పంపిణీ అని చెబుతున్నా.. అనేక చోట్ల సాంకేతిక సమస్యతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర అవస్థలు పడ్డారు. పింఛన్లలో భారీ కోత ఎన్నికల ముందు 50 ఏళ్లు దాటిన వారందరికీ పింఛన్లు ఇస్తామని హామీల వర్షం కురిపించి.. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చకపోగా.. 60 ఏళ్ల పైబడి అర్హులైన వారి పింఛన్లలోనూ భారీగా కోత పెడుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 1.68 లక్షల మంది పింఛనుదారులు ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలివిగా ప్రతి నెలా దాదాపు వెయ్యి మంది చొప్పున లబ్ధిదారులను తొలగిస్తూ వచ్చింది. దీంతో జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య 1,59,085కు పడిపోయింది. గడిచిన ఏడాది కాలంలోనే సుమారు 9 వేలకు పైగా అర్హులైన పింఛన్దారులను అన్యాయంగా తొలగించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక్క రోజు ముందుగానే.. జిల్లాలో శనివారం ఎన్టీఆర్ సామాజికభద్రత పింఛన్ల కార్యక్రమం జరిగింది. జూన్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. జిల్లాలో మొత్తం 1,59,085 పింఛన్లు ఉండగా.. ప్రభుత్వం రూ.69.64 కోట్లను విడుదల చేసింది. శనివారం రాత్రి ఏడు గంటలకు 1,47,826 మందికి రూ.64.45 కోట్లను సచివాలయం సిబ్బంది అందజేశారు. జిల్లాలో మొత్తం 92.92 శాతం మందికి పింఛన్లు పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీపతి తెలిపారు. మిగిలిన వారికి సోమవారం అందజేస్తామని వెల్లడించారు. -
నేడు వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జూన్ 4వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఆదివారం జరగనుంది. మద్దిపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు హాజరుకానున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నాయకులు, మాజీ శాసనసభ్యులు, సమన్వయకర్తలు హాజరుకావాలని కేకేరాజు పిలుపునిచ్చారు. -
నేటి నుంచి డిపోల్లో రేషన్ పంపిణీ
ఎండీయూ వాహనాలను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం మహారాణిపేట: జిల్లాలో ఆదివారం నుంచి రేషన్ సరకులు నేరుగా రేషన్ డిపోల వద్ద పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎండీయూ వాహనాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసి ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని 642 డిపోల ద్వారా 5.34 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార వంటివి పంపిణీ చేయనున్నారు. ఈ ఏర్పాట్లను జిల్లా ప్రత్యేక అధికారి భగవన్నారాయణ పర్యవేక్షించారు. ఆయన ఇప్పటికే డీలర్లతో సమావేశాలు నిర్వహించి, గోదాముల్లో సరకుల లభ్యత, డిపోల వద్ద ఏర్పాట్లు, ధరల పట్టికలు వంటి విషయాలను సమీక్షించారు. డీఎస్వో వి.భాస్కరరావు పోస్ మెషీన్ల మరమ్మతులు కూడా పూర్తి చేశారు. కాగా, ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 310 ఎండీయూ వాహనాలను రద్దు చేయడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాహనాల ద్వారా అనేక మంది ఉపాధి పొందారు. వీటిని నిలిపివేయడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇదిలా ఉండగా.. చాలా మంది కార్డుదారులకు డిపోలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు ఎండీయూ వాహనాల ద్వారా ఇంటికే సరుకులు వచ్చేవి కాబట్టి డిపోల గురించి చాలా మందికి అవగాహన లేదు. స్థానికంగా ఉన్న కొందరికి కూడా డిపోలు ఎక్కడున్నాయో తెలియకపోవడం గమనార్హం. -
దళిత మహిళను మోసం చేసిన ఇద్దరికి రిమాండ్
తగరపువలస: భూమి రిజిస్ట్రేషన్ పేరుతో నగరానికి చెందిన దళిత మహిళ కుంచంగి లక్ష్మిని మోసం చేసి రూ.97 లక్షలు కాజేసిన ఆనందపురానికి చెందిన మీసాల అప్పలనాయుడు, శ్రీదేవి దంపతులను పోలీసులు శనివారం రిమాండ్కు తరలించారు. భీమిలి 15వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వారికి 15 రోజుల పాటు రిమాండ్ విధించారు. బాధితురాలు ఆనందపురం మండలం చందక పంచాయతీలో మధ్యవర్తుల సాయంతో 30 సెంట్ల భూమిని కొనుగోలు చేసింది. అప్పటికే నకిలీ పత్రాలతో నిందితులు ఆ భూమి తమదిగా చూపించి బాధితురాలి నుంచి డబ్బులు కాజేశారు. భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకోవడంతో పాటు బాధితురాలిపై దాడి కూడా చేశారు. దీంతో పోలీసులు వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
హాస్టళ్లలో సెల్ఫోన్ల చోరీ కేసు ఛేదన
నిందితుడి అరెస్ట్, 12 ఫోన్లు స్వాధీనం తాటిచెట్లపాలెం: ద్వారకానగర్లోని హాస్టళ్లలో జరిగిన సెల్ఫోన్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసి.. అతని వద్ద నుంచి 12 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్ను స్వాధీనం చేసుకున్నట్లు క్రైం ఏడీసీపీ మోహనరావు తెలిపారు. ద్వారకా పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. ద్వారకానగర్లోని శ్రీ చక్ర బాయ్స్ హాస్టల్ను కొవ్వూరి సోమిరెడ్డి నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 7న ఆ హాస్టల్లో ఉంటున్న గణేష్ అనే విద్యార్థి తన ఫోన్ కనిపించడం లేదని సోమిరెడ్డికి తెలిపాడు. దీంతో ఆయన హాస్టల్లో విచారించగా.. హాస్టల్లో మొత్తం ఆరు ఫోన్లు, అదే ప్రాంగణంలోని మరో హాస్టల్లో ఐదు ఫోన్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో సోమిరెడ్డి ద్వారకా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో నిందితుడు కనకం దామోదర్గా గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మే 27న అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 12 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్ను స్వాధీనం చేసుకున్నారు. కనకం దామోదర్పై గతంలో కూడా వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో సుమారు 20 సెల్ఫోన్ దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని ఏడీసీపీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన ద్వారకా సబ్ డివిజన్ క్రైం సీఐ వి.చక్రధరరావు, ఎస్ఐ ఎస్.రాజు, సిబ్బంది వి.అప్పలరాజు, ఎస్.హరిప్రసాద్ (ఎంవీపీ క్రైం), ఎన్.జగత్కిరణ్(ఎంవీపీ క్రైం)లను ఏడీసీపీ అభినందించారు. సమావేశంలో ఏసీపీ లక్ష్మణరావు పాల్గొన్నారు. -
యోగా వేడుకల విజయవంతానికి చర్యలు
● రవాణా, పార్కింగ్పై దృష్టి సారించాలి ● ఏర్పాట్లను సమీక్షించిన నోడల్ అధికారి డాక్టర్ మల్లికార్జున మహారాణిపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్దేశిత సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా పక్కా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్, యోగా ఉత్సవాల మొబలైజేషన్, ట్రాన్స్పోర్టు నోడల్ అధికారి డాక్టర్ ఎ.మల్లికార్జున జిల్లా అధికారులను ఆదేశించారు. యోగా ఉత్సవాల నిర్వహణ, రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శనివారం జిల్లాకు వచ్చిన ఆయన.. కలెక్టరేట్లో కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జేసీ కె.మయూర్ అశోక్, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్లతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లక్ష్యాన్ని చేరుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. బీచ్రోడ్డులో ఎంత మంది కూర్చోగలరు. అదనపు వేదికల్లో ఎంత మందికి అవకాశం ఉంటుందనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ప్రతి 24 చదరపు అడుగులకు ఒకరు యోగాసనాలు వేసేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రజల వాహనాల పార్కింగ్కు తగిన జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. కంపార్ట్మెంట్ల వారీగా బస్సులు కేటాయించాలని, ఆయా వాహనాలకు నిర్దేశిత స్థలాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనాల రాకపోకల విషయంలో గందరగోళం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో చేపట్టిన చర్యలను కలెక్టర్ హరేందిర ప్రసాద్ మ్యాప్ల ద్వారా వివరించారు. భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
నిబద్ధతకు మారుపేరు మల్లికార్జునరావు
మహారాణిపేట: సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్గా విశేషమైన సేవలందించిన సీహెచ్ మల్లికార్జునరావుకు జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్.వి.రమణ ఘన వీడ్కోలు పలికారు. జిల్లా సమాచార కార్యాలయంలో శనివారం జరిగిన మల్లికార్జునరావు ఉద్యోగ విరమణ సభలో రమణ మాట్లాడారు. మల్లికార్జునరావు తన 33 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో నిబద్ధతతో, సంయమనంతో పనిచేశారని కొనియాడారు. ప్రాంతీయ సమాచార ఇంజినీర్ కార్యాలయం సూపరింటెండెంట్ అన్నమ్మ మాట్లాడుతూ మల్లికార్జునరావు సున్నిత మనస్కుడని, అదే సమయంలో తన బాధ్యతల పట్ల ఎంతో నిబద్ధత కలిగి ఉండేవారన్నారు. డివిజనల్ పీఆర్వో నారాయణరావు మాట్లాడుతూ మల్లికార్జునరావు తన వృత్తికి అంకితమయ్యారని కొనియాడారు. అసిస్టెంట్ ఇంజినీర్ బాలాజీ, ఏపీఆర్వో శ్రీనివాసరావు, ఏవీఎస్ వెంకట్రావు, సీనియర్ అసిస్టెంట్ మాధవి, పీఆర్వో కిశోర్, పాత్రికేయులు శ్రీనివాసరావు, భగవాన్ తదితరులు మల్లికార్జునరావు చేసిన సేవలను ప్రశంసించారు. అనంతరం మల్లికార్జునరావు దంపతులను ఘనంగా సత్కరించారు. -
క్రీడలతో క్రమశిక్షణ
మద్దిలపాలెం: క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందని, తద్వారా సమాజానికి అత్యుత్తమ మానవ వనరులుగా నిలుస్తారని ఎమ్మెల్యేలు గణబాబు, గౌతు శిరీష అన్నారు. రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఎంపికై న డాక్టర్ డి.భగీరథ కుమార్, ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికై న డి.ప్రసన్న కుమార్ సత్కార కార్యక్రమం శనివారం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ క్రీడలకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో విశాఖ తన స్థానాన్ని పదిలం చేసుకుంటోందన్నారు. నగరానికి చెందిన భగీరథ కుమార్, ప్రసన్నకుమార్లు జాతీయ స్థాయిలో ఉన్నత పదవులను అందుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. విశాఖ నగరానికి, చేపట్టిన పదవులకు మరింత పేరు తెచ్చే విధంగా కృషి చేయాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. అనంతరం భగీరథ కుమార్, ప్రసన్న కుమార్లను ఎమ్మెల్యేలు సత్కరించారు. విశాఖ జిల్లా రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ చంద్ర, కార్యదర్శి శీలం లక్ష్మణ్, ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కార్యదర్శి థామస్ అయ్య, కళాభారతి కార్యదర్శి జి.రాంబాబు పాల్గొన్నారు. -
ఐఐఎంవీలో ‘ఈపీజీడీపీఎం’ ప్రారంభం
తగరపువలస: గంభీరంలోని ఐఐఎం విశాఖపట్నం(ఐఐఎంవీ)లో రక్షణ రంగ అధికారులు, కార్యనిర్వాహకుల కోసం ఏడాది పాటు నిర్వహించే ‘ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ (ఈపీజీడీపీఎం)’శనివారం ప్రారంభమైంది. హిందూస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ విశ్రాంత సీఎండీ హేమంత్ ఖత్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డిజిటల్ మౌలిక వసతులు, వందే భారత్ వంటి ఆవిష్కరణలు, 6జీ టెక్నాలజీ వైపు సాగుతున్న ప్రయాణంలో దేశ నాయకత్వ పాత్రను కొనియాడారు. విమర్శనాత్మక ఆలోచన, భావోద్వేగ మేధస్సు, అనుకూలత, సృజనాత్మక సమస్య పరిష్కార సామర్థ్యాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఐఐఎంవీ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ డైనమిక్, టెక్నాలజీ ఆధారిత ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా రక్షణ సిబ్బందిని సిద్ధం చేయడానికి ఈ కోర్సును రూపొందించినట్లు చెప్పారు. అడ్మిషన్స్ చైర్ ప్రొఫెసర్ ప్రశాంత్ ప్రేమ్కుమార్ నాయర్ మాట్లాడుతూ ఈ బ్యాచ్లో సగటు వయసు 38 సంవత్సరాలు కాగా.. 13 సంవత్సరాల పని అనుభవం కలిగిన వారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో రక్షణ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. ప్రోగ్రాం చైర్ ప్రొ.శ్రీరంగాచార్యులు మాట్లాడుతూ ఈ కోర్సు మాడ్యులర్ ఎంబీఏగా హైబ్రిడ్ ఫార్మాట్లో రూపొందించినట్లు చెప్పారు. డీన్ కావేరీ కృష్ణన్ మాట్లాడారు. -
పేరు అబద్ధంకబ్జా నిజం!
● భూముల విలువ రూ. 50 కోట్ల పైమాటే! ● పంట నష్టపరిహారం, బీమా సైతం కాజేత ● ప్రశ్నిస్తే హోం మంత్రి పేరుతో బెదిరింపులు మోసగించి కాజేశారు.. ఈ భూములను సాగు చేసుకునేందుకు మా పూర్వీకులకు ప్రభుత్వం పట్టా ఇచ్చింది. వెంకటాపురం గ్రామానికి చెందిన ‘అబద్ధం’ అనే టీడీపీ నాయకుడు, జగన్మోహన్రావు అనే వ్యక్తి మమ్మల్ని మోసం చేసి భూములను లాక్కున్నారు. ఒక్క పైసా లీజు ఇవ్వకపోగా పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్నారు. వారి ఆగడాలకు తట్టుకోలేక ఏం చేయాలో తోచక భయంతో జీవిస్తున్నాం. మా దగ్గర పట్టాలు ఉన్నాయి. –తంతట సూర్యారావు, వెంకటాపురం, ఎస్.రాయవరం మండలం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పేరులోనే కాదు అక్రమ వ్యవహారాల్లోనూ ఓ టీడీపీ నేత సార్థక నామధేయుడినని నిరూపించుకున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం మండలం టీడీపీ నేత అమలకంటి అబద్ధం హోంమంత్రి అనితకు ముఖ్య అనుచరుడు. దళిత వర్గానికి చెందిన అనిత హోంమంత్రిగా ఉన్నప్పటికీ ఆమె అనుచరుడు మాత్రం నిరుపేద దళితుల భూములను ఆక్రమించి దర్జాగా సాగు చేసుకోవడం గమనార్హం. తమ తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న డీ పట్టా భూములను ఆక్వా సాగు పేరుతో లీజుకు తీసుకుని అనిత ముఖ్య అనుచరుడు కాజేశారని బాధితులు వాపోతున్నారు. రూ.50 కోట్ల విలువ చేసే 103 ఎకరాల భూముల రికార్డులను విశాఖ ఆక్వాఫారానికి చెందిన జగన్మోహన్రావుతో కలిసి మార్పు చేసి తనపరం చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. తమ భూములను తమకివ్వాలని కోరితే కేసులు నమోదు చేయించి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆక్రోశిస్తున్నారు. మరోవైపు ఈ భూముల రికార్డులన్నీ తారుమారు చేసి... పంట నష్టపరిహారంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ, రాయితీలు పొందుతుండటం గమనార్హం. ఆక్వా సాగు పేరుతో.. ఎస్.రాయవరం మండలం వాకపాడు రెవెన్యూ పరిధిలోని 73, 74, 75, 77, 78, 344, 345, 346, 347, 348, 351, 352, 353, 354, 435, 438, 439, 441, 442, 443, 445 సర్వే నంబర్లలో సుమారు 103 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ప్రభుత్వం వీటిని సుమారు 30 ఏళ్ల క్రితం తంతట సూర్యారావు (పట్టానెం 41/98), దండా కొండయ్య (42/98), పెయ్యిల నాగరాజు (43/98), గారా నర్సింహులు, జల్లూరి అప్పారావు, దండా త్రిమూర్తులు, దండా అప్పన్న, దండా తాతబ్బాయి, గారా అప్పయ్యమ్మ, బీరా నాగన్న, గారా అప్పారావు, కొప్పిశెట్టి మాణిక్యం, కొప్పిశెట్టి అప్పారావు, కొప్పిశెట్టి అయ్యన్న తదితర స్థానిక పేద రైతుల పేరుతో డీ–ఫారం పట్టాలు మంజూరు చేసింది. అప్పటినుంచి వీరంతా ఈ భూములను సాగుచేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ భూములపై కన్నేసిన టీడీపీ నేత ‘అబద్ధం’.. తనకు లీజుకు ఇస్తే ఆక్వా లాభాల్లో వాటా ఇస్తానని నమ్మబలికి పదేళ్ల క్రితం వారి నుంచి తీసుకున్నాడు. ఎమ్మెల్యే అనిత అండదండలతో 2014లో ఈ భూమిని 42 సబ్ డివిజన్లుగా విభజించి.. ఈ ప్రాంతానికి సంబంధం లేని విశాఖ ఆక్వాఫారానికి చెందిన జగన్మోహన్రావు తండ్రి వీరభద్రరావును తెరమీదకు తీసుకు వచ్చి అతని పేరున మ్యూటేషన్ (వెబ్ల్యాండ్లో) చేశారు. ఈ 42 సబ్ డివిజన్లకు 42 ఖాతా నెంబర్లు ఇచ్చారు. ఈ భూముల్లో ఆక్వా కాకుండా వరి సాగు చేస్తున్నాడు. తమ భూములకు లీజు చెల్లించాలని లేదంటే వెనక్కి ఇవ్వాలని కోరిన రైతులను బెదిరిస్తూ హోంమంత్రి సహకారంతో పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్నాడు. పట్టాలున్నాయి.. ప్రభుత్వం మా పూర్వీకులకు ఇచ్చిన భూములను అబద్ధం అనే టీడీపీ నాయకుడు ఆక్రమించుకున్నాడు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి మమ్మల్ని భూముల్లోకి రానివ్వకుండా బెదిరిస్తున్నారు. కేసులు బనాయిస్తున్నారు. మా దగ్గర పట్టాలు ఉన్నాయి.ఇద్దరూకలిసికబ్జా మా తాత, తండ్రులకు డీ–ఫారం పట్టాలు ఇచ్చారు. ఈ భూముల్లో గంటి, జొన్న సాగు చేసే వాళ్లం. పెట్టుబడులు పెట్టలేక ఆకుల జగన్మోహన్రావు అనే వ్యక్తికి లీజుకు ఇస్తే టీడీపీ నాయకుడు అబద్ధంతో కలిసి కబ్జా చేశారు. మా భూములు మాకు అప్పగించాలని కోరితే కేసులు పెట్టి వేధిస్తున్నాడు. మావద్ద ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. – దండా తాతబ్బాయి, వాకపాడు, ఎస్.రాయవరం మండలం సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 4వ తేదీన తలపెట్టిన ‘వెన్నుపోటు దినం‘ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పొల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. శనివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ‘వెన్ను పోటు దినం పోస్టర్’ను ఆయన ఆవిష్కరించారు. 2024 ఎన్నికల్లో అమలుకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతూ వెన్నుపోటు దినానికి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, కార్పొరేటర్లు అల్లు శంకరరావు, కె.అనిల్కుమార్ రాజు, రెయ్యి వెంకట రమణ, బర్కత్ అలీ, సేనాపతి అప్పారావు, పేడాడ రమణి కుమారి, పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. దళితులకు చెందిన 103 ఎకరాలను కాజేసిన టీడీపీ నేతవెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ నేడు కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష మా భూములు మాకు అప్పగించాలి మాకు ఈ భూములు మినహా వేరే ఆధారం లేదు. వయసు పైబడటంతో కష్టంగా ఉంది. అబద్దం అనే నాయకుడు మా భూములు ఆక్రమించి సాగుచేస్తున్నాడు. మా భూములు మాకు అప్పగించి న్యాయం చేయాలి. –దండా మాణిక్యం, వాకపాడు – పెయ్యిల నాగరాజు, వాకపాడు -
నచ్చిన చోట కొలువు కోసం పైరవీలు
మహారాణిపేట: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గడువు దగ్గర పడుతుండటంతో, తమకు నచ్చిన చోటకు పోస్టింగ్ల కోసం పైరవీలు ఊపందుకున్నాయి. కూటమి ప్రజా ప్రతినిధుల సిఫార్సులకోసం రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లోని కొంతమంది అధికారులు నిమగ్నమయ్యారు. నగరంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారు అక్కడి నుంచి కదలకుండా ఉండేందుకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నగరంలో పోస్టింగ్లు దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా భీమిలి, విశాఖ రూరల్, ఆనందపురం, పెందుర్తి, సీతమ్మధార తహసీల్దార్ పోస్టులకు మంచి డిమాండ్ ఉంది. వీటిని పొందేందుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు ఆరుగురు సిద్ధపడినట్టు ప్రచారం జరుగుతోంది. నిబంధనలివీ.. జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం తెలిసిందే. ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన వారికి స్థాన చలనం కల్పించాలి. మన్యం ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన వారికి బదిలీల్లో ప్రాధాన్యమివ్వాలి. ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయడమే కాకుండా అన్ని క్యాడర్లు, పోస్టుల్లో చేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకుని, ఎంత కాలం ఒకే ప్రాంతంలో పని చేశారనేది లెక్కించాలి. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు మించి పనిచేసిన వారికి, 40 శాతానికి మించి వైకల్యం ఉన్న ఉద్యోగులకు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే బదిలీల్లో ప్రాధాన్యమివ్వాలి. రెవెన్యూలో సిఫార్సులకే పెద్దపీట? ఉమ్మడి విశాఖలోని రెవెన్యూ శాఖలో అన్ని క్యాడర్లలో బదిలీలు విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ చేయాల్సి ఉంది. దీనిపై ఆయన ఇప్పటికే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి కలెక్టర్లతో సమావేశమై చర్చించారు. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, తహసీల్దార్ కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర క్యాడర్ల బదిలీలపై తుది నిర్ణయం విశాఖ కలెక్టర్ తీసుకోవాల్సి ఉంది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆయన కార్యాలయానికి 68 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. ఇవి కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కూడా సిఫార్సు లేఖలు, ఫోన్లు వచ్చినట్లు సమాచారం. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు తహసీల్దార్లు విశాఖ జిల్లాలో పోస్టింగ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొంతమంది నచ్చిన చోట పోస్టింగ్ల కోసం ఎమ్మెల్యేల సిఫార్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కూటమి ఎమ్మెల్యేల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు పోస్టు కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధం -
కూటమి వైఫల్యాలను ఎండగట్టేందుకు ‘4న వెన్నుపోటు దినం’
విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపు సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు, కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసగించిన తీరును ఎండగడుతూ జూన్ 4వ తేదీన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. శుక్రవారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో కేకే రాజు అధ్యక్షతన విశాఖ ఉత్తర నియోజకవర్గం సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్కు చిన్నచూపు తప్ప, ఈ ప్రాంత అభివృద్ధి చేసేందుకు వారు నోచుకోలేదని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ విశాఖకు వచ్చిన ప్రాజెక్టులను అమరావతికి తరలించుకుపోతున్నారని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కేవలం పచ్చ మీడియాలో తప్ప మరెక్కడా కనబడట్లేదని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేవరకు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాటిని అమలు చేసేవరకు వైఎస్సార్సీపీ తరపున ప్రతీ కార్యకర్త పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, కార్పొరేటర్లు అల్లు శంకర్రావు, కె.అనిల్ కుమార్ రాజు, రెయ్యి వెంకటరమణ, భర్కత్ అలీ, సేనాపతి అప్పారావు, పేడాడ రమణి కుమారి, గుజ్జు వెంకటరెడ్డి, పైడి రమణ, దుప్పలపూడి శ్రీనివాసరావు, పి.సునీత, నీలి రవి, దల్లి రామకృష్ణ రెడ్డి, సప్పంగి శ్రీనివాసరావు, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, బొడ్డేటి కిరణ్, గుడ్ల అశోక్ రెడ్డి, భీశెట్టి ప్రసాద్, కర్రి రామరెడ్డి, నూకరాజు, ప్రసాద్, సదరం జ్ఞానేశ్, షేఖ్ బాబ్జి, అశోక్ రెడ్డి, బి.శ్రీనివాస్, మువ్వల సంతోష్, రాఘవులు, పద్మ శేఖర్, నాగమణి, జగదీష్, సాయి, గాలి ప్రసాద్, కోట్యాడ సూర్య, గోవింద్, భోగవల్లి గోవింద్, సారిపల్లి సంతోష్, రత్నం, అప్పారావు, సొండి సురే ష్, జగదీశ్, చందనసాయి, ఈశ్వరావు పాల్గొన్నారు. -
పంచతంత్రం
‘బ్లూ ఫ్లాగ్ బీచ్లో రుషికొండ సాగరతీరం 2020 అక్టోబర్ 11న ‘బ్లూఫ్లాగ్’గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో రుషికొండ బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.7.35 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో అప్పటి ప్రభుత్వం వివిధ పనులు చేపట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఏటా జ్యూరీ సభ్యులు బీచ్ను పరిశీలించి, ఈ ధ్రువీకరణ పత్రాన్ని పునరుద్ధరిస్తారు. 2023 వరకు సుందరంగా కనిపించిన బీచ్.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘బ్లూ ఫ్రాడ్’గా మారిపోయింది. ఇది అంతర్జాతీయ బీచ్ అనే విషయాన్ని కూడా మర్చిపోయింది. దీంతో డెన్మార్క్ సంస్థ రుషికొండ బీచ్కు ప్రపంచస్థాయి గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేయడతో కూటమి సర్కారు ఉలిక్కిపడింది. హడావుడిగా తా త్కాలిక పనులు చేపట్టి.. మళ్లీ సర్టిఫికెట్ను పునరుద్ధరించేసుకుంది. ఇప్పు డు ఇదే బీచ్ను తమకు కాసులు కురిపించే కేంద్రంగా మార్చేందుకు చకచకా పావులు కదుపుతోంది. ఓ అండ్ ఎం కోసం టెండర్లు.. కానీ.. తాజాగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం), కాలుష్య నియంత్రణ, రెవెన్యూ సేకరణ కోసం గత నెలలో ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రక్రియలోనే జనసేన నాయకుడు చక్రం తిప్పినట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అదే పార్టీకి చెందిన నేత కావడంతో.. ఆయన అండదండలతో విశాఖ రీజియన్ పర్యాటక శాఖను తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. దీంతో ఆ నేత అడుగులకు మడుగులొత్తుతూ జిల్లా ఏపీటీడీసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. టెండర్లలో పాల్గొనేందుకు ఎవరూ రాకుండా ఉండేలా చూడాలంటూ ఆ నేత హుకుం జారీ చేయడం.. టూరిజంలో ‘జగ’మంతా తెలిసిన అధికారి వెంటనే టెండరు నిబంధనలు కఠినతరం చేయడం చకచకా జరిగిపోయాయి. టెండర్లలో పాల్గొన్నారో.? ఆర్ఎఫ్పీ పిలిచేముందు.. ఆసక్తి కలిగిన సంస్థలతో టూరిజం అధికారులు గత నెలలోనే ఆన్లైన్లో ప్రీబిడ్డింగ్ మీట్ను నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సంస్థలకు టెండర్ నియమ నిబంధనల గురించి వివరించగా.. కష్టతరంగా ఉన్నాయని, గతంలో ఉన్న నిబంధనలే ఉంచాలని కొందరు కోరారు. ఈ సూచనలను టూరిజం అధికారులు తోసిపుచ్చారు. ఎవరెవరు ఆసక్తిగా ఉన్నారనే వివరాలను టూరిజం ప్రాంతీయ అధికారులు సేకరించి.. ఆ జాబితాను భీమిలి నేత చేతిలో పెట్టారు. ఇంకేముందు ఆ నేత ఆయా సంస్థల ప్రతినిధులకు ఫోన్లు చేసి బ్లూఫ్లాగ్ టెండర్లలో పాల్గొనవద్దని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. కొందరు ఎదురించి మాట్లాడితే ‘ఈ టెండర్లో పాల్గొంటే, టూరిజంకి సంబంధించి భవిష్యత్తులో ఏ టెండరూ మీకు రాదు’అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో వారంతా టెండర్ వేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ నేత పాచిక పారింది. త్వరలోనే సెకండ్ కాల్కి టెండర్లు ఆహ్వానించి.. తమ అనుయాయులకు అప్పగించేలా అంతా సెట్ చేశాడు. జిల్లా టూరిజం అధికారులు జనసేన నేతకు అనుకూలంగా బ్లూఫ్లాగ్ బీచ్ నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు యత్నిస్తున్నారే తప్ప.. పర్యాటక శాఖ ఆదాయం, బీచ్ అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్లూఫ్లాగ్ బీచ్పై భీమిలి జనసేన నేత కన్ను రుషికొండ బీచ్ నిర్వహణకు టెండర్ల ఆహ్వానం అధికారుల అండతో దోపిడీకి రంగం సిద్ధం? -
జూలై 9న గిరి ప్రదక్షిణ
సింహాచలం: సింహాచలం క్షేత్రంలో జూలై 9న గిరి ప్రదక్షిణ ఉత్సవం జరగనుందని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఈవో వి. త్రినాథరావు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామన్నారు. గిరి ప్రదక్షిణ ఉత్సవం నిర్వహణపై శుక్రవారం దేవస్థానం వైదికులు, ఇంజినీరింగ్ అధికారులు, సెక్షన్ హెడ్లతో ఈవో ముందస్తు సమీక్ష నిర్వహించారు. జూలై 9న 32 కిలోమీటర్ల సింహగిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు, అలాగే జూలై 10న ఆలయ ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొంటారని ఈవో అంచనా వేశారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం కొండచుట్టూ స్టాల్స్, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు విషయంపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ఈ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులకు ముందుగానే లేఖలు రాయాలని సూచించారు. జీవీఎంసీ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ, ఫైర్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. గిరి ప్రదక్షిణ ఉత్సవంలో దాతల సహకారం కూడా ఎంతో ముఖ్యమని ఈవో పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ దీపాలు, మంచినీటి సదుపాయాల కోసం జీవీఎంసీ సహకారం తీసుకుంటామన్నారు. సమావేశంలో స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, డిప్యూటీ ఈవో ఎస్.రాధ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి, ఈఈ రాంబాబు, ఏఈవోలు రమణమూర్తి, ఆనంద్కుమార్, పిల్లా శ్రీనివాసరావు, పంతం శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు కె.మూర్తి, రాజ్యలక్ష్మి, సునీల్, పద్మనాభరాజు, త్రిమూర్తులు, పీఆర్వో నాయుడు పాల్గొన్నారు. ఏర్పాట్లపై దేవస్థానం ఈవో త్రినాథరావు సమీక్ష -
ఎయిడెడ్ ఆచార్యులు ఔట్
● ఏయూ నుంచి 38 మంది రిలీవ్ ● కన్నీటి పర్యంతమైన మహిళా ఆచార్యులు ● పరిశోధక విద్యార్థులకు తప్పని అగచాట్లు విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలో ఫారిన్ సర్వీసు/డిప్యుటేషన్పై పనిచేస్తున్న 38 మంది ఆచార్యులు శుక్రవారం ఇక్కడ నుంచి రిలీవ్ అయ్యారు. వైస్ చాన్సలర్ ఆదేశాలతో డిప్యూటీ రిజిస్ట్రార్(అకడమిక్) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి పోస్టింగ్ నిమిత్తం మంగళగిరిలోని కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ కార్యాలయంలో తక్షణమే రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో డిప్యుటేషన్పై పని చేస్తున్న ఆచార్యులంతా శుక్రవారం సాయంత్రం క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపాళ్ల ఆమోదంతో తమ విధుల నుంచి రిలీవ్ అయ్యారు. సాగనంపడమే లక్ష్యంగా.. రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాలల నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఫారిన్ సర్వీసు/డిప్యుటేషన్ ప్రాతిపదికన 2023 జూన్లో 80 మంది ఆచార్యులు వచ్చారు. అనివార్య కారణాల వల్ల 40 మంది అప్పుడే వెనక్కి వెళ్లిపోగా, ఒకరు మరణించారు. మరొకరు ఇటీవలే తమ మాతృస్థానానికి వెళ్లారు. ప్రస్తుతం 38 మంది ఆచార్యులు పనిచేస్తున్నారు. విశ్వవిద్యాలయంలో వెయ్యికి పైగా రెగ్యులర్ ఆచార్యులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం రెండు వందల లోపే ఉన్నారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డిప్యుటేషన్ పై పనిచేస్తున్న సీనియర్ ఆచార్యులను ఈ సంవత్సరం కొనసాగిస్తారని అందరూ భావించారు. కానీ నాటకీయ పరిణామాల నడుమ వారందరినీ ఆగమేఘాల మీద రిలీవ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అగౌరవంగా.. అవమానకరంగా.. డిప్యుటేషన్ పై వచ్చిన ఆచార్యులను ఏయూ నుంచి పంపించేస్తారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై కలత చెందిన కొంత మంది ఆచార్యులు మూడు రోజుల కిందట వీసీని కలిసి తమ ఇబ్బందులను చెప్పుకున్నారు. పిల్లల చదువుల దృష్ట్యా ఈ సంవత్సరం కొనసాగించాలని, విశ్వవిద్యాలయం వంద ఏళ్ల ఉత్సవాల్లో భాగస్వాములయ్యే అవకాశం కల్పించాలని విన్నవించినట్లు తెలిసింది. అదే సమయంలో కూటమికి చెందిన కొంతమంది ప్రజా ప్రతినిధులను కూడా కలిసినప్పటికీ, ఉన్నట్టుండి రిలీవ్ చేయడంతో డిప్యుటేషన్ పై వచ్చిన ఆచార్యులు షాక్కు గురయ్యారు. వర్సిటీ నాక్ గ్రేడ్ సాధించడంలో ఎంతో కీలకంగా పనిచేసిన తమను ఇలా అగౌరవంగా, అవమానకరంగా రిలీవ్ చేయడంపై కొంతమంది మహిళా ఆచార్యులు వర్సిటీ పెద్దల ముందు కన్నీటి పర్యంతమైనట్లు తెలిసింది. రీసెర్చ్ స్కాలర్ల దారెటు? డిప్యుటేషన్ పై వచ్చిన వారంతా సీనియర్ ఆచార్యులు కావడంతో విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఒక్కో ఆచార్యుని వద్ద నలుగురు లేదా ఐదుగురు పరిశోధక విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం 38 మంది ఆచార్యులను వర్సిటీ నుంచి రిలీవ్ చేయడంతో.. ఇప్పటివరకు వారి మార్గదర్శకత్వంలో ఉన్న పరిశోధక విద్యార్థుల పరిస్థితి ఏమిటనేది తేలాల్సి ఉంది. గైడ్ షిప్ మారే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వర్సిటీ అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పరిశోధక విద్యార్థులు కోరుతున్నారు. -
పొగ.. జీవితాలకు సెగ
● దృఢ సంకల్పంతో వ్యసనానికి దూరం కావొచ్చు ● నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం డాబాగార్డెన్స్: సిగరెట్.. గుట్కా.. పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం ఎన్నో అనార్థాలకు, అనారోగ్యాలకు కారణం. ఈ చేదు నిజాన్ని గ్రహించే లోపే.. సిగరెట్ పొగలా మన ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. దృఢ సంకల్పంతో ఈ వ్యసనాన్ని దూరం చేసుకోవచ్చు. మన ఆరోగ్యంతో పాటు మన చుట్టూ ఉన్న వారి శ్రేయస్సు కోసం ఈ మహమ్మారిపై పోరాడాల్సిన అవసరం ఉంది. నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా అది ప్రమాదకరమే. దీని వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఒక సిగరెట్లో 400 పైగా హానికరమైన రసాయనాలు ఉంటాయి. వీటి లో 48కి పైగా క్యాన్సర్ కారకాలున్నాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రసాయనాలు ఊపిరితిత్తులు, గొంతు, నాలుక వంటి భాగాలకు అతి సులువుగా క్యాన్సర్ను కలిగిస్తాయి. గర్భిణులు ధూమపానం చేస్తే, కడుపులోని శిశువు సున్నితమైన అవయవాలపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. ధూమపానం చేసే వారు తమ చుట్టూ ఉన్నవారి ఊపిరితిత్తుల్లోకి దాదాపు 25 శాతం విష వాయువులను ఉచితంగా పంపి.. వారి అనారోగ్యానికి కారణమవుతున్నారు. ఆర్థికంగా చితికిపోయి, అనారోగ్యంతో మంచానపడి జీవితం దుర్భరంగా మారుతుంది. చేయి చేయి కలుపుదాం పొగతాగడం వల్ల కొత్త జబ్బులు వస్తున్నాయి. శారీరక రోగాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యల వలనే చాలా మంది పొగాకుకు బానిసలవుతున్నారు. ఈ అలవాటు మానేందుకు చాలా మంది ఇష్టపడడం లేదు. మందులు వాడినా మెడిటేషన్ చాలా ముఖ్యం. పొగాకు మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా.. మన చుట్టూ ఉన్న వారికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – డాక్టర్ సునీల్కుమార్, చెస్ట్ ఫిజీషియన్, ప్రభుత్వ చాతి ఆసుపత్రి -
10న విశాఖలో రాష్ట్రపతి పర్యటన
మహారాణిపేట: నగరంలో జూన్ 10వ తేదీన జరగనున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో శుక్రవారం గిరిజన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ టి.వి.కట్టిమణితో కలిసి వివిధ అంశాలపై సమీక్షించిన కలెక్టర్.. కార్యక్రమ నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతి జూన్ 10వ తేదీ ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాలుకు చేరుకుంటారు. అక్కడ జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు జరిగే కార్యక్రమం అనంతరం, ఆమె రోడ్డు మార్గం ద్వారా విమానాశ్రయానికి చేరుకుని తిరిగి ప్రయాణం అవుతారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు మార్గంలో రానున్న నేపథ్యంలో సుందరీకరణ పనులు, మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. జ్ఞానాపురం రైల్వే అండర్ పాస్ వద్ద నీరు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని, ఒకవేళ వర్షం పడినట్లయితే మోటార్ల ద్వారా నీటిని తొలగించాలని జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఐఎన్ఎస్ డేగా నుంచి కన్వెన్షన్ హాలు వరకు ఎలాంటి హోర్డింగులు, విద్యుత్ తీగలు, ఇతర అడ్డంకులు లేకుండా తొలగించాలని సూచించారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రానున్న క్రమంలో ప్రత్యేక గ్రీన్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీఆర్వో బిహెచ్ భవానీ శంకర్, ఆర్డీవోలు పి.శ్రీలేఖ, సంగీత్ మాధుర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశం -
విజయనగరం వరకే రాయగడ ఎక్స్ప్రెస్
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ పరిధి రాయగడ–విజయనగరం సెక్షన్లో జరుగుతున్న మూడో లైన్ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను జూన్ 2,3 తేదీల్లో రద్దు చేశారు. మరికొన్నింటిని గమ్యం కుదించడంతో పాటు రీషెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు చేసిన రైళ్లు ● జూన్ 2న విశాఖపట్నం–కోరాపుట్–విశాఖపట్నం(58538 / 58537) పాసింజర్, విశాఖపట్నం–కోరాపుట్(18512) బై–వీక్లీ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం–రాయ్పూర్–విశాఖపట్నం(58528/58527) పాసింజర్ ● జూన్ 3న కోరాపుట్–విశాఖపట్నం(18511) బై–వీక్లీ ఎక్స్ప్రెస్ గమ్యం కుదించిన రైళ్లు ● జూన్ 1న గుంటూరు–రాయగడ(17243) ఎక్స్ప్రెస్ విజయనగరం వరకు మాత్రమే నడుస్తుంది. జూన్ 2న రాయగడ–గుంటూరు(17244) ఎక్స్ప్రెస్ విజయనగరం నుంచి బయలుదేరుతుంది. రీషెడ్యూల్ చేసిన రైళ్లు ● జూన్1న ఎర్నాకుళం– టాటా (18190) ఎక్స్ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా ఉదయం 10.15 గంటలకు బయలుదేరుతుంది. అలప్పుజ–ధన్బాద్(13352) బోకారో ఎక్స్ప్రెస్ 2 గంటలు ఆలస్యంగా ఉదయం 8 గంటలకు బయలుదేరుతుంది. ● జూన్ 2న దుర్గ్–విశాఖపట్నం(20829) వందేభారత్ ఎక్స్ప్రెస్ నాలుగున్నర గంటలు ఆలస్యంగా ఉదయం 10.15 గంటలకు, విశాఖపట్నం–దుర్గ్(20830) వందేభారత్ ఎక్స్ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా రాత్రి 6.50 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైళ్లు అంతే ఆలస్యంగా ఆయా స్టేషన్లకు రాకపోకలు సాగిస్తాయని, ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని డీసీఎం సూచించారు. -
అతివేగమే ఆయువు తీసింది
● ఫ్లై ఓవర్పై ఘోర ప్రమాదం ● ఇద్దరు యువకుల దుర్మరణం అల్లిపురం: అతివేగం ఇద్దరు యువకుల ఆయువు తీసింది. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి తెలుగుతల్లి ఫ్లైఓవర్పై గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. టూటౌన్ సీఐ ఎం.శ్రీను, ఎస్ఐ కె.శ్రీలక్ష్మి తెలిపిన వివరాలివి. గోపాలపట్నం సమీపంలోని నరసింహనగర్కు చెందిన ఎస్.ప్రసన్నకుమార్, అతని స్నేహితుడు సాయి కిరణ్ బుధవారం రాత్రి 11.30 గంటలకు ఎలక్ట్రిక్ స్కూటర్పై వైఎంసీఏ ఎదురుగా బీచ్కు వెళ్లారు. తిరిగి తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా రైల్వేస్టేషన్ వైపు ప్రయాణిస్తుండగా.. డీఆర్ఎం కార్యాలయం సమీపంలోని మలుపు వద్ద వాహనం అదుపు తప్పింది. అతివేగంగా ఉండటం వల్ల వాహనాన్ని నియంత్రించలేకపోయారు. దీంతో వారు మధ్య డివైడర్పై ఉన్న పూలకుండీని బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ప్రసన్నకుమార్, సాయి కిరణ్లు ఒకరు డివైడర్పై, మరొకరు రోడ్డుపై పడిపోయారు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్ ట్రాఫిక్ సీఐ ఎం.శ్రీను సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అప్పటికే మృతి చెందిన యువకుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ప్రసన్నకుమార్ తండ్రి ఎస్.వెంకట అప్పలరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నరసింహనగర్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
జూన్ 9న వర్కింగ్ జర్నలిస్టుల ఆందోళన
విశాఖ విద్య: జర్నలిస్టులకు సంబంధించిన రెండు కీలక చట్టాలను కేంద్రం రద్దు చేయడాన్ని నిరసిస్తూ జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నట్లు ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వెంకటరావు, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు ప్రకటించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ హాలులో గురువారం ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం ఇటీవల 44 కార్మిక చట్టాలను రద్దు చేసిందని, అందులో రెండు జర్నలిస్టులకు సంబంధించినవి ఉన్నాయన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతనాల చెల్లింపులు చట్టం 1958 రద్దు చేసిన వాటిలో ఉన్నట్లు వెల్లడించారు. వీటిని తక్షణమే పునరుద్ధరించాలనే డిమాండ్తో జూన్ 9న నిర్వహించే జాతీయ కార్మిక సంఘాల ఆందోళనలో జర్నలిస్టులు కూడా పాల్గొనా లని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో దశలవారీగా ఆందోళన తప్పదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న నేటికి కొత్త అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయలేదన్నారు. అలాగే జర్నలిస్టులు ఇళ్ల స్థలాలకు సైతం నోచుకోలేదన్నారు. పెన్షన్ పథకం అమలు చేయాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా పునరుద్ధరించాలని తీర్మానించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాలను త్వరలోనే ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సమావేశంలో భాగంగా వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్కు సంబంధించిన నూతన వెబ్సైట్ను ఆవిష్కరించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విశాఖ వేదికగా త్వరలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎన్ఏజే సెక్రటరీ జనరల్ ఎం.కొండయ్య, జెండర్ ఈక్విటీ కౌన్సిల్ చైర్మన్ కె.మంజరి, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ, కార్యదర్శి జి.శ్రీనివాసరావు, బ్రాడ్కాస్ట్ అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కె.మదన్, చిన్న మధ్య తరహో పత్రికల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్, కె.శ్రీనివాస్ రావు, పలు జిల్లాల ఫెడరేషన్ నేతలు పాల్గొన్నారు. నూతన వెబ్సైట్ను ఆవిష్కరిస్తున్న నాయకులు -
నేడు విశాఖ–కిరండూల్ పాసింజర్ రద్దు
తాటిచెట్లపాలెం: కొత్తవలస–కోరాపుట్ సెక్షన్ తైడ–చిమిడిపల్లి పరిధిలో ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. బుధవారం ఇక్కడ గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరా, ఏడీఆర్ఎం(ఇన్ఫ్రా) ఈ.శాంతారం స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. పునరుద్ధరణ పనుల కారణంగా ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లను శుక్రవారం రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. రద్దయిన రైళ్లు : విశాఖపట్నం–కిరండూల్(58501) పాసింజర్, కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్, కిరండూల్–విశాఖపట్నం(18516) నైట్ ఎక్స్ప్రెస్. -
సంద్రం.. కల్లోలం
● నిన్న ఇసుక.. నేడు రాళ్లు.. రేపు.? గురువారం ఇలాబుధవారం నాటి పరిస్థితిసాగరతీరంలో కొన్ని గంటల్లో చోటుచేసుకున్న అనూహ్యమైన మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. అంబికా సీ గ్రీన్ హోటల్ ఎదురుగా ఉన్న బీచ్ రోడ్డు ప్రాంతంలో బుధవారం కనిపించిన దృశ్యం.. ఒక్క రాత్రిలోనే పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు ఇసుక మేటలతో నిండి ఉన్న ఈ ప్రాంతం.. గురువారం ఉదయానికి కెరటాల తీవ్రతకు ఇసుకంతా కొట్టుకుపోయింది. ఇప్పుడు అక్కడ గతంలో వేసిన రాళ్లు దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో తీరంలోని కొబ్బరి వనాలకు కూడా తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. గతంలోనూ ఇదే ప్రాంతం భారీగా కోతకు గురైన విషయం తెలిసిందే. అప్పట్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన మట్టి, రాళ్లు డంపింగ్ చేసి తాత్కాలికంగా కోతను నివారించారు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. అధికారులు తక్షణమే స్పందించి, తగిన చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు. – ఏయూ క్యాంపస్ తేమతో నిండిన బీచ్రోడ్డు -
జాబ్స్ @ గైస్
ఉద్యోగ సాధనలో తగ్గేదేలే! ●● ఐదేళ్లలో 732 ఉద్యోగాలు సొంతం ● సత్తా చాటుతున్న కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు మురళీనగర్: కొలువు ఎవరి సొంతం కాదు.. సత్తా ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు. ఇదే విషయాన్ని కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్(గైస్) విద్యార్థులు నిరూపిస్తున్నారు. ఒకప్పుడు ఫలానా ఇంజినీరింగ్ కోర్సులు చేస్తేనే ఉద్యోగాలు వస్తాయనే అభిప్రాయం ఉండేది. కానీ గైస్ విద్యార్థులు తమకు నచ్చిన కెమికల్ ఇంజినీరింగ్ రంగంలో రాణిస్తూ.. సులువుగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఈ కళాశాలలో చేరితే ఉద్యోగం ఖాయమనే నమ్మకాన్ని నిజం చేస్తున్నారు. ప్రతి క్యాంపస్ డ్రైవ్లోనూ అత్యుత్తమ వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందుతూ తమ ప్రతిభను చాటుతున్నారు. ఐదేళ్లలో రికార్డ్ స్థాయి ఉద్యోగాలు ఒక ప్రభుత్వ డిప్లమో కళాశాలలో పదుల సంఖ్యలో ఉద్యోగాలు రావడమే గొప్పగా చెప్పుకునే రోజుల్లో.. గైస్ విద్యార్థులు కేవలం ఐదేళ్లలో ఏకంగా 732 ఉద్యోగాలు పొందడం విశేషం. ఒకే కళాశాల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రావడం ఒక రికార్డు. వీరిలో 484 మంది బాలురు, 248 మంది బాలికలు ఉన్నారు. సంవత్సరాల వారీగా చూస్తే.. 2020–21లో 178 మంది, 2021–22లో 105 మంది, 2022–23లో 165 మంది, 2023–24లో 105 మంది, 2024–25లో 179 మంది ఉద్యోగాలు సాధించారు. ప్రతి సంవత్సరం సగటున 147 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందుతుండటం గమనార్హం. ఇక గైస్లో కెమికల్ ఇంజినీరింగ్లో నాలుగు విభాగాలు ఉన్నాయి. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో 204 మంది, పెట్రో కెమికల్స్లో 183 మంది, ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్లో 203 మంది, ఆయిల్ టెక్నాలజీలో 142 మంది ఉద్యోగాలు సాధించారు. బాలికల విషయానికి వస్తే.. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో 76 మంది, పెట్రో కెమికల్స్లో 64 మంది, ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్లో 55 మంది, ఆయిల్ టెక్నాలజీలో 53 మంది ఉద్యోగాలు పొందారు. అధిక ప్యాకేజీల్లో బాలికల హవా అత్యధిక వార్షిక వేతనం సాధించడంలో బాలికలు ముందంజలో ఉన్నారు. డిప్లమో స్థాయిలోనే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు దీటుగా అధిక జీతాలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా డి.వంశీప్రియాంక (ఏసియన్ పెయింట్స్) రూ. 6.73 లక్షలు, ఎస్కే జఫ్రీన్ అరాఫాతి(ఏసియన్ పెయింట్స్) రూ.6 లక్షలు, ఎస్.వైశాలి(ఏసియన్ పెయింట్స్) రూ. 6 లక్షలు, జి.గీతా భవాని (అల్ట్రాటెక్ సిమెంట్స్) రూ.4 లక్షలు, ఎల్.తేజస్విని (అల్ట్రాటెక్ సిమెంట్స్) రూ.4 లక్షలు, టి.సంధ్య (టెక్నిప్ ఎనర్జీస్) రూ.3 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు పొందారు. బాలురు కూడా మంచి ప్యాకేజీలు సాధించారు. జీఎస్కే చైతన్య (అల్ట్రాటెక్ సిమెంట్స్) రూ.4 లక్షలు, ఐ.మాధవరావు(ది ఆంధ్ర పెట్రో కెమికల్స్ లిమిటెడ్) రూ.3.6 లక్షలు, డి.సాయిలోకేష్ (సెయింట్ గోబెయిన్) రూ. 2.8 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు పొందారు. కొన్ని కంపెనీలు వీరికి ఇతర ఆర్థిక ప్రయోజనాలు, ప్రయాణ సౌకర్యాలు, క్యాంటీన్లో రాయితీ భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాయి. వెయ్యి ఉద్యోగాలే లక్ష్యం వచ్చే ఏడాది నాటికి తమ కళాశాల విద్యార్థుల ఉద్యోగాల సంఖ్య వెయ్యికి చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. క్యాంపస్ డ్రైవ్కు వెళ్లిన ప్రతి విద్యార్థి ఉద్యోగం సాధించాలి. ఇందుకోసం ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నాం. మల్టీ నేషనల్ కంపెనీలు, నవరత్న కంపెనీల్లో మా విద్యార్థులు పని చేస్తున్నారు. బాలురతో పాటు బాలికలకు సమ ప్రాధాన్యమిస్తూ ఉద్యోగాల సాధనకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. టెక్నికల్ ఎడ్యుకేషన్ బ్రోచర్స్, స్టడీ మెటీరియల్స్లో మా విద్యార్థుల ఫొటోలు ప్రచురించడం మాకు గర్వకారణం. –డాక్టర్ కె.వెంకటరమణ, ప్రిన్సిపాల్, గైస్ -
డీటీవో భవనం మెట్లు కూలి ఒకరికి గాయాలు
కొత్త భవనం ప్రారంభోత్సవంపై కలెక్టర్ ఆరామహారాణిపేట: కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఉన్న జిల్లా ట్రెజరీ కార్యాలయం(డీటీవో) మెట్లు పాక్షికంగా కూలిపోయాయి. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ట్రెజరీ కార్యాలయానికి వెళ్లే ఐరన్ మెట్లలో ఓ భాగం పడిపోయింది. ఈ ఘటనలో ఆఫీస్ సబార్డినేట్ ప్రసాద్ తలకు గాయమైంది. తృటిలో ప్రాణాపాయం తప్పిందని సిబ్బది ఊపిరి పీల్చుకున్నారు. వర్షం కురిస్తే భయం ఎప్పుడు వర్షం కురిసినా ట్రెజరీ కార్యాలయ పరిస్థితి దారుణంగా ఉంటుంది. 2014లో వచ్చిన హుద్హుద్ తుపానుకు పూర్తిగా ధ్వంసమైన భవనంలోనే ఇప్పటికీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వర్షం పడితే ఆ భవనంలో ఉండేందుకు భయపడే పరిస్థితి. కొన్ని రోజుల క్రితం ఇదే కార్యాలయానికి చెందిన ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ పూర్తిగా కూలిపోయింది. సిబ్బంది విధుల్లో లేని సమయంలో ఆ సంఘటన జరగడంతో ప్రాణనష్టం వాటిల్లలేదు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం కార్యాలయ మార్పునకు చొరవచూపట్లేదు. పక్కనే పక్కా భవనం..! జిల్లా ట్రెజరీ కార్యాలయానికి నూతన భవనాన్ని జిల్లా పరిషత్ పక్కన నిర్మించారు. ఎలక్ట్రిక్, చిన్నచిన్న పనులు మినహా భవనం సిద్ధంగా ఉంది. అయినప్పటికీ వివిధ సాంకేతిక కారాణాల పేరిట ఇంకా దీన్ని ప్రారంభించలేదు. తాజా ఘటనతో జిల్లా ట్రెజరీ అధికారి వై.సుధాకర్ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ దృష్టికి కార్యాలయ సమస్యను తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ స్పందించి కొత్త భవనం ప్రారంభోత్సవానికి ఉన్న ఆటంకాలపై ఆరా తీశారు. -
టెన్షన్.. టెన్షన్!
● ఓ పక్క బదిలీలు, మరో పక్క పదోన్నతులు ● 86 మంది గ్రేడ్–2 హెచ్ఎంలకు బదిలీ ఉత్తర్వులు ● 75 మంది స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి ● సాంకేతిక చిక్కులతో రోస్టర్ కూర్పులో జాప్యం ● ఎస్ఏ, ఎస్జీటీల బదిలీలకు సిద్ధమైన సీనియార్టీ జాబితాలు విశాఖ విద్య: విద్యాశాఖలో బదిలీల పర్వం మొదలైంది. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న 86 మందికి స్థానచలనం కలిగింది. వెబ్ ఆప్షన్స్లో హెచ్ఎంలు కోరుకున్న పాఠశాలల్ని కేటాయిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీల షెడ్యూల్లో భాగంగా గురువారం జిల్లా విద్యాశాఖాధికారులు స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2 హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించారు. జోన్–1 పరిధిలోకి వచ్చే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 8 మంది స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2 హెచ్ఎంలుగా ప్రమోషన్ కల్పించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1, జిల్లా పరిషత్ మేనేజ్మెంట్ పరిధిలోని 66 మంది స్కూల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు దక్కాయి. ఆర్జేడీ బి.విజయభాస్కర్, ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ పర్యవేక్షించారు. ప్రమోషన్ పొందిన స్కూల్ అసిస్టెంట్లు అంతా ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల నుంచి ఈ నెల 31న రిలీవ్ అయి, 1న హెచ్ఎంగా బాధ్యతలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులు ఆదేశించారు. సాంకేతిక చిక్కులతో జాప్యం గ్రేడ్–2 హెచ్ఎం ప్రమోషన్స్ జాబితాలో ఉన్న ఉపాధ్యాయులంతా విశాఖ నగరంలోని సీతమ్మధారలో ఉన్న ఎస్ఎఫ్ఎస్ స్కూల్కు గురువారం ఉదయం 10 గంటలకే చేరుకున్నారు. కౌన్సెలింగ్ మాత్రం సాయంత్రం 6 తర్వాత ప్రారంభమై, రాత్రి 10 వరకు కొనసాగింది. జిల్లా విద్యాశాఖాధికారులు సీనియార్టీ జాబితా సిద్ధం చేసినప్పటికీ, కమిషనరేట్ నుంచి గురువారం సాయంత్రం వరకు ప్రమోషన్స్ కౌన్సెలింగ్కు గ్రీన్సిగ్నల్ రాలేదు. పదోన్నతుల రోస్టర్ కూర్పుపై కొందరు ఉపాధ్యాయులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా దీనిపై కమిషనరేట్ నుంచి సకాలంలో ఆమోదం లభించకపోవటంతో ఇక్కడి అధికారులు నిరీక్షించక తప్పలేదు. సిద్ధమైన ఎస్ఏ, ఎస్జీటీల జాబితాలు స్కూల్ అసిస్టెంట్, సెకడరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ) బదిలీలు భారీగానే ఉంటాయని విద్యాశాఖాధికారులు అంచనా వేస్తున్నారు. బదిలీ కోసం వచ్చిన దరఖాస్తులను ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ పర్యవేక్షణలో వడపోతను ముమ్మరం చేస్తున్నారు. షెడ్యూల్ మేరకు స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు పూర్తయ్యాక, అందుబాటులో ఉన్న ఖాళీల మేరకు అర్హులైన ఎస్జీటీలకు పదోన్నతులిస్తారు. అనంతరం ఎస్జీటీలకు బదిలీలు నిర్వహిస్తారు. పుట్టెడు దుఃఖంలోనూ.. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ అంతా ఉమ్మడి జిల్లా నోడల్ అధికారిగా విశాఖ డీఈవో ప్రేమ్కుమార్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఆయన మామయ్య తీవ్ర అనారోగ్యంతో వారం రోజులుగా చైన్నెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. సమచారం తెలిశాక పుట్టెడు దుఃఖంలోనూ ప్రమోషన్స్, బదిలీలపై ఇక్కడి యంత్రాంగానికి దిశానిర్దేశం చేసి, ఉన్నతాధికారుల అనుమతితో అప్పటికప్పుడు బయలుదేరి వెళ్లారు. -
కూటమి నేతలు ఫిర్యాదు చేసినా...!
● వాస్తవానికి మైనింగ్ వ్యవహారంలో కూటమి నేతల మధ్యనే వివాదాలు రాజుకుంటున్నాయి. ఇష్టారీతిలో సాగుతున్న మైనింగ్ వ్యవహారంపై కూటమి పార్టీలోని నేతలే ఫిర్యాదు చేసే పరిస్థితి ఏర్పడింది.● చోడవరం నియోజకవర్గంలో లక్కవరం, గవరవరం, శేమునాపల్లి, వెంకన్నపాలెం, నరసాపురం, జుత్తాడ, భోగాపురం వంటి గ్రామాల్లో విచ్చలవిడిగా మైనింగ్ దందా జరుగుతోందని స్వయంగా జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎస్ఎన్ రాజు తహసీల్దారుతో పాటు విశాఖలోని విజిలెన్స్ ఎస్పీకి కూడా ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. శారదా నదిలోని ఇసుకను ఏ విధంగా ఇష్టారీతిలో తవ్వేస్తున్నారో కూడా ఫొటోలతో సహా వివరించారు. ఫిర్యాదుల పరంపర వారం రోజులుగా సాగుతున్నా.. చడీచప్పుడు లేకుండా పోయింది.● పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి, సబ్బవరం మండలాల్లో సాగుతున్న గ్రావెల్ దందాపై కూడా కూటమి పార్టీలోని నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నారు.● భీమిలిలోనూ అదే పరిస్థితి ఉంది. కూటమి పార్టీల పేరుతో కబ్జాల ఘనుడు చేస్తున్న వ్యవహారంతో పాటు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలపై కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం ఉండటం లేదు.● అనకాపల్లి జిల్లాలో కూడా నేరుగా అనుమతి లేని లారీలు పదుల సంఖ్యలో తిరుగుతున్నాయంటూ స్వయంగా ఎమ్మెల్యే అధికారులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ఎలా తిరగనిస్తున్నారని నిలదీశారు. అయినప్పటికీ రెండు, మూడు రోజులు నిలిచిన వ్యవహారం ఇప్పుడు యథావిథిగా సాగుతూనే ఉంది.● యలమంచిలి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే అవినీతి వ్యవహారాలపై టీడీపీ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు నేరుగా ధ్వజమెత్తుతున్నారు. రాంబిల్లి వద్ద నిర్మిస్తున్న నేవల్ బేస్కు బండరాళ్ల తరలింపులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని.. అధిక లోడుతో అనేక వాహనాలు వస్తున్నాయని అక్కడి టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇందులో ఎమ్మెల్యే భారీగా వాటాలు తీసుకుంటున్నారని కూడా పరోక్షంగా ధ్వజమెత్తుతున్నారు.● ఇలా అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమిలోని ఒక పార్టీ చేస్తున్న మైనింగ్ దందాను మరో పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదంటే కూటమి ప్రభుత్వంలో పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
వర్షాలతో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు
సింహాచలం: ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా సింహగిరికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాల్సిన ఏర్పాట్లపై దేవస్థానం ఈవో వి.త్రినాథరావు గురువారం పరిశీలించారు. స్వామి దర్శనానికి భక్తులు వెళ్లే ఉచిత, రూ.100, రూ.300 క్యూల్లో నడుస్తూ ఎక్కడెక్కడ వర్షం నీరు వస్తోందో ఆయా ప్రాంతాలను గుర్తించారు. నీరు భక్తులపై పడకుండా ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ప్రసాదాల విక్రయశాలకు వెళ్లి, సిబ్బంది పనితీరును పర్యవేక్షించారు. భక్తులతో మార్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. ప్రసాదాల నిల్వ గది ఇరుగ్గా ఉండటంతో, ప్రత్యామ్నాయ గదిలోకి మార్చాలన్నారు. ప్రసాదాల నాణ్యతలో అలసత్వం ప్రదర్శించవద్దని హెచ్చరించారు. ఆయన వెంట దేవస్థానం ఈఈ రాంబాబు, డీఈ హరి, ఏఈవో పిళ్లా శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ జీవీవీఎస్కే ప్రసాద్, పీఆర్వో నాయుడు పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్ లీలలు!
● వీఎంఆర్డీఏ టెండర్లలో నిబంధనలకు తిలోదకాలు ● కూటమి నేతల లబ్ధికి అధికారుల తాపత్రయం ● ‘ది డెక్’ నిర్వహణకుసింగిల్ టెండర్.. అయినా ఓకే ● సీ హారియర్ నిర్వహణ టెండర్ దక్కించుకున్న సంస్థకు చెక్ ● తమ వారికి దక్కలేదని టెండర్ రద్దు విశాఖ సిటీ: విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) ఇంజనీరింగ్ అధికారుల లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిబంధనలకు తిలోదకాలిస్తూ కూటమి ప్రజాప్రతినిధుల అనుచరులకు టెండర్లు కట్టబెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. అందుకు అనుగుణంగా టెండర్లలో రూల్స్ మార్చేస్తున్నారు. అంతటితో ఆగకుండా టెండర్ వేయొద్దని కాంట్రాక్టర్లకు ఫోన్ చేయడం.. తాజాగా వేరొక కాంట్రాక్టు సంస్థకు ఆ టెండర్ దక్కిందన్న అక్కసుతో దాన్ని రద్దు చేయడంపై దుమారం రేగుతోంది. అలాగే మరో నిర్వహణ పనులకు ఒకే టెండర్ దాఖలైనప్పటికీ.. వారికి కేటాయించడంతో ఇతర కాంట్రాక్టర్లు విస్తుపోతున్నారు. సీ హారియర్ టెండర్ రద్దు బీచ్ రోడ్డులోని సీ హారియర్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం నిర్వహణ టెండర్ను అనుకున్నట్లుగానే అధికారులు రద్దు చేశారు. మ్యూజియం నిర్వహణ కోసం 11 నెలలకు గాను రూ.35.05 లక్షల అంచనా వ్యయంతో ఈ ఏడాది ఏప్రిల్లో వీఎంఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఈ నిర్వహణ పనిలో భారీగా ఆదాయం వచ్చే అవకాశముంది. దీంతో ఒక కాంట్రాక్టు సంస్థ అధికారులతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగానే ఈ మ్యూజియం టెండర్లో పాల్గొనవద్దని స్వయంగా ఇంజనీరింగ్ అధికారులే కాంట్రాక్ట్ సంస్థలకు చెప్పినట్లు వార్తలు వినిపించాయి. అయినప్పటికీ పలువురు ఇతర పేర్ల మీద టెండర్లు దాఖలు చేశారు. ఇందులో అత్యల్పంగా 15 శాతం తక్కువకు రూ.29,48,036కు ఒక సంస్థ టెండర్ వేసింది. ఆ తరువాత 9.09 శాతం తక్కువకు రూ.31,86,753కు మరో కాంట్రాక్టు సంస్థ దాఖలు చేసింది. వాస్తవానికి తక్కువకు టెండర్ వేసిన సంస్థకే పనులను అప్పగించాలి. కానీ ఇంజనీరింగ్ అధికారులు రెండో స్థానంలో ఉన్న సంస్థకు పనులు అప్పగించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సంస్థ తక్కువకు టెండర్ వేయకపోవడంతో వారి ఆశలు నిరాశయ్యాయి. దీంతో ఈ టెండర్ను వదులుకోవాలని తక్కువ బిడ్ చేసిన కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నించినప్పకీ అది ఫలించనట్లు సమాచారం. ఫలితంగా తక్కువకు టెండర్ వేసిన కాంట్రాక్టు సంస్థకు వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా తాత్సారం చేశారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఊహించినట్లుగానే ఈ టెండర్ను అధికారులు రద్దు చేశారు. అర్హత సాధించిన సంస్థ నిర్వాహకులకు కనీసం సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. సింగిల్ టెండర్కే ఆమోదం సిరిపురం జంక్షన్లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అండ్ కమర్షియల్ బిల్డింగ్ను వీఎంఆర్డీఏ నిర్మించింది. త్వరలోనే ఈ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ భవన నిర్వహణకు 11 నెలలకు గాను రూ.1.33 కోట్లకు టెండర్లు ఆహ్వానించారు. ఇందులో పాల్గొనేందుకు అనేక కాంట్రాక్టు సంస్థలు ఆసక్తి చూపించాయి. కానీ ఈ పనులపై కూటమి ప్రజాప్రతినిధి కన్నేశారు. తమ అనుచరులకు ఈ టెండర్ను కట్టబెట్టేందుకు చక్రం తిప్పారు. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి సదరు సంస్థకు అనుకూలంగా టెండర్ నిబంధనలను మార్చివేశారు. అంతేకాకుండా ఈ టెండర్ విషయంలో కూడా ఎవరూ దరఖాస్తులు దాఖలు చేయొద్దని కాంట్రాక్టర్లకు ఫోన్లు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంట్రాక్టును ఇప్పటికే వీఎంఆర్డీఏలో మూడు భవనాల టెండర్లు దక్కించుకున్న సంస్థకే కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ పనులకు కేవలం ఒక టెండర్ మాత్రమే దాఖలైంది. నిబంధనల ప్రకారం సింగిల్ టెండర్ను తిరస్కరించాల్సి ఉంటుంది. కానీ ఇంజనీరింగ్ అధికారులు ఈ నిబంధన అమలు విషయంలో వింత భాష్యం చెపుతున్నట్లు సమాచారం. గ్లోబల్ టెండర్ల ద్వారా ఏ సంస్థ వచ్చినా ఆ భవనం నిర్వహణ అంత తేలికై న విషయం కాదని, అందుకే ఇక్కడి సంస్థకే అప్పగిస్తే నిర్వహణ బాగుంటుందని చెప్పి సింగిల్ టెండర్ వేసిన సంస్థకే పనులు అప్పగించడం విశేషం. దీనిపై ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. దీని వెనుక స్థానిక కూటమి ప్రజాప్రతినిధి హస్తం ఉండడంతోనే ఎవరూ ది డెక్ టెండర్పై నోరెత్తలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది. -
ఈ గోపాలుడిలీలలు వేరయా..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సీఐ పేరుతో బెదిరిస్తూ వసూళ్లకు దిగి ఊచలు లెక్కిస్తున్న సుధాకర్కు తెలుగుదేశం నేత, ఓ సంస్థ చైర్మన్తో సత్సంబంధాలు కలిగి ఉండటం చర్చనీయాంశమవుతోంది. ఇద్దరూ కలిసి విమానాల్లో పలుమార్లు గోవా, బ్యాంకాక్ లాంటి ట్రిప్పులకు వెళ్లినట్టు కూడా తెలుస్తోంది. తాను ఏసీబీ సీఐ అని పరిచయం చేసుకుంటూ.. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.5 లక్షలు డిమాండ్ చేసిన వ్యవహారంలో టీడీపీ నేత బలగ సుధాకర్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ కూడా ఊచలు లెక్కబెడుతున్నారు. అయితే, అసలు మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పిన గోపాలుడు మరొకరు ఉన్నట్టు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఓ ప్రభుత్వ సంస్థ చైర్మన్ హోదాలో అధికారం చెలాయిస్తున్నట్టు సమాచారం. నకిలీ ఏసీబీ సీఐ సుధాకర్తో సదరు చైర్మన్ ఎంతో అన్యోన్యంగా గోవా, బ్యాంకాక్ వంటి ట్రిప్పులకు వెళుతూ విమానాశ్రయాల్లో దిగిన ఫొటోలు తెలుగుదేశం పార్టీ అంతర్గత గ్రూపుల్లోనూ సర్క్యులేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సదరు సుధాకర్కు పలువురు పోలీసులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోనూ పరిచయాలు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నగర శివారులోని రిసార్టుల్లో పలువురితో ఉన్న ఫొటోలు కూడా ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాకుండా అందమైన అమ్మాయిల ద్వారా పలువురు నేతలు, అధికారులతో అన్యోన్యంగా మాట్లాడిన ఆడియోలు, వీడియోలు రికార్డు చేసి హనీట్రాప్ ద్వారా లక్షలు గుంజినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో లోతుగా విచారణ చేస్తే సదరు చైర్మన్తో పాటు ఇతర వ్యక్తుల పాత్ర కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.అధిష్టానానికి ఫిర్యాదుల పరంపరచినబాబుతో తనకు మాత్రమే సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ అధికారం చెలాయిస్తున్న సదరు నేతపై టీడీపీ నేతలే గుర్రుగా ఉన్నారు. వివిధ ప్రజాప్రతినిధులకు కూడా విలువ లేకుండా.. మాట చెల్లుబాటు చేసుకుంటుండంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాకుండా నియోజకవర్గాలతో సంబంధం లేకుండా అన్నింటిలోనూ తలదూర్చుతుండటం కూడా ఆ పార్టీ నేతలకు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలోనూ ఇప్పుడు ఈ నకిలీ ఏసీబీ సీఐ వ్యవహారంలో సదరు చైర్మన్పై పలువురు నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. నేరుగా టీడీపీ అధిష్టానం దృష్టికి ఇద్దరూ చనువుగా ఉన్న ఫొటోలను పంపి మరీ బాగోతాన్ని వెలికితీయాలని కోరినట్టు ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఇక సదరు సంస్థలో కూడా ఇష్టారీతిలో ప్రవర్తిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులను కేటాయిస్తూ దండుకుంటున్న విషయాన్ని కూడా ఈ ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. మొత్తంగా నకిలీ ఏసీబీ సీఐ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
కలెక్టర్కు ఏపీయూడబ్ల్యూజే వినతి మహారాణిపేట: జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు నాలుగు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు యూనియన్ నేతలు కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్ర ప్రసాద్ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వారికి ఆనందపురం, సబ్బవరం, పెందుర్తి మండలాల్లోని ప్రభుత్వ భూముల్లో స్థలాలు కేటాయించాలని యూనియన్ అధ్యక్షుడు కె.రాము, ప్రధాన కార్యదర్శి ఆర్.రామచంద్రరావు కోరారు. ఈ విషయంపై ప్రభుత్వానికి నివేదిక పంపుతానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు రామచంద్రరావు తెలిపారు. యూనియన్ ప్రతినిధులు బి.నారాయణరావు, డి. హరినాథ్, రవి తదితరులు పాల్గొన్నారు. -
యువత కృషితోనే పార్టీకి పునర్వైభవం
మహారాణిపేట: కూటమి ప్రభుత్వం తమ పార్టీ కార్య కర్తలు, నాయకులపై చేస్తున్న దాడులకు, కుట్రలకు భయపడాల్సిన పనిలేదనని, ప్రతి ఒక్కరికీ పార్టీ తోడుగా నిలుస్తుందని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి కేకే రాజు భరోసానిచ్చారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకూటి చందు ఆధ్వర్యంలో జిల్లా యువజన విభాగం సమన్వయ సమావేశం బుధ వారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కింది స్థాయి కార్యకర్తల పట్ల అభిమానం, ప్రేమ కలిగిన నాయకుడు జగన్ అని, ఆయన గుండెల్లో ప్రతి కార్యకర్తను గొప్పగా నిలబెట్టాలనే ఆలోచన ఉంటుందన్నారు. 2029లో పార్టీ అధికారంలోకి వచ్చాక నూటికి నూరు శాతం పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేకూరేలా జగన్ 2.0 పాలన ఉంటుందన్నారు. అధికారంలోకి వచ్చాక ఏ కార్యక్రమం చేపట్టినా కింది స్థాయి కార్యకర్త ద్వారా స్థానికంగా ఉన్న ప్రజలకు లబ్ధి చేకూర్చేలా మాత్రమే కార్యాచరణ ఉంటుందన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండేళ్లు కరోనాతో ఇబ్బంది పడ్డామని, తాము ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా కోర్టు కేసులు వేసేవారని ఆక్షేపించారు. మెడికల్ కాలేజీలు, కొత్త కంపెనీలు ఏర్పాటుచేసినా కోర్టు కేసులు వేసేవారని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో లొసుగుల్ని ఆసరాగా తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడేవారని తెలిపారు. పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే యువత పాత్ర చాలా కీలకం అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చెన్నా జానకిరామ్, పి.వి.సురేష్, ఉరుకూటి చందు, ఇమ్రాన్, పార్టీ నాయకులు రవి రెడ్డి, వాసు, రాయపురెడ్డి అనిల్, మువ్వల సంతోష్, ఎల్లపు శ్రీను, వార్డు యూత్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. ఈ కష్ట కాలంలోప్రతి ఒక్కరికీ పార్టీ తోడుంటుంది వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు -
ఆటోలో మరిచిపోయిన రూ.1.2 లక్షలు
మర్రిపాలెం: తమ కుమారుడి శస్త్రచికిత్స కోసం తీసుకెళ్తున్న రూ.1.20 లక్షలను రాజాబాబు అనే వ్యక్తి ఆటోలో మరిచిపోయారు. కొంతసేపటికి అతను తన పొరపాటును గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు అప్రమత్తమై ఆటోలో నగదుతో ఉన్న బ్యాగును గుర్తించి బాధితుడికి అప్పగించారు. వివరాలివి.. మర్రిపాలెంలో ఉంటున్న రాజాబాబు తన కుమారుడితో కలిసి బుధవారం ఇంటి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మర్రిపాలెం మెయిన్రోడ్డులో సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో జ్ఞానాపురం రైల్వేస్టేషన్కు వెళ్లడానికి ఆటో ఎక్కారు. హడావుడిలో తన వద్ద ఉన్న రూ.1.20 లక్షల నగదు, ఆపరేషన్కు సంబంధించిన పత్రాలు, దుస్తులు ఉన్న బ్యాగును ఆటోలోనే మరిచిపోయారు. ఆ తర్వాత స్టేషన్ వద్ద దిగిపోయారు. కొంత సమయం తర్వాత తన పొరపాటును గ్రహించిన రాజాబాబు వెంటనే 112కు ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపారు. అక్కడే డ్యూటీలో ఉన్న కంచరపాలెం క్రైం ఎస్ఐ సూర్యనారాయణ, ఇతర సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. బాధితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా ఆ ప్రాంతంలోని అన్ని ఆటోలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఒక ఆటో వెనుక సీటులో బ్యాగును గుర్తించారు. డ్రైవర్కు కూడా ఆ బ్యాగు తన ఆటోలో ఉందనే విషయం తెలియదు. పోలీసులు నగదుతో ఉన్న బ్యాగును స్వాధీనం చేసుకుని.. రాజాబాబుకు అప్పగించారు. తన బ్యాగును త్వరగా గుర్తించి, డబ్బులను సురక్షితంగా అందించిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు. బాధితుడికి అప్పగించిన పోలీసులు -
సినిమా థియేటర్లలో సోదాలు
మహారాణిపేట : జిల్లాలోని సినిమా థియేటర్లలో బుధవారం రెవెన్యూ, అగ్నిమాపక, మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ శాఖల అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. భీమిలి, విశాఖ ఆర్డీవోలు సంగీత్ మాధూర్,పి. శ్రీలేఖ పర్యవేక్షణలో ప్రభుత్వం ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారం రెవెన్యూ అధికారులు వివరాలు సేకరించారు. గోపాలపట్నం, గాజువాక, నగరంలోని పలు థియేటర్లలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లు సమాచారం. సినిమా ప్రదర్శన సమయాలు, పారిశుధ్యం, సీటింగ్, ఎయిర్ కండిషనింగ్ తదితర అంశాలను ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. -
రాష్ట్ర స్థాయి శిక్షణ కేంద్రంగా రేఖవానిపాలెం
తగరపువలస: భీమిలి మండలం రేఖవానిపాలెంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం రాష్ట్రస్థాయి శిక్షణ కేంద్రంగా ఎంపికై ందని జిల్లా పంచాయతీ అధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలకు చెందిన పారిశుధ్య కార్మికులు, కార్యదర్శులు, ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఇక్కడ శిక్షణ ఇస్తామని తెలిపారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరణ విషయంలో అవగాహన కల్పించారు. రేఖవానిపాలెం, మూలకుద్దు సర్పంచ్లు సమ్మిడి శ్రీనివాసరావు, కొయ్య రామకృష్ణారెడ్డి, పంచాయతీ విస్తరణాధికారి కె.రమేష్నాయుడు, కార్యదర్శులు ఎన్.కె.సిహెచ్.వి.ప్రసాద్, వైవీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మీ సేవలు చాలు.. వెళ్లిపోండి.!
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలో ఫారిన్ సర్వీసుపై పనిచేస్తున్న ఎయిడెడ్ అధ్యాపకులందరినీ తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేయాలని కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ భరత్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు బుధవారం వర్సిటీకి చేరాయి. దీంతో రాష్ట్రంలోని వేర్వేరు ఎయిడెడ్ కాలేజీల నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చిన వారంతా నేడో రేపో ఇక్కడ నుంచి రిలీవ్ కానున్నారు. ఏయూలో రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 2023 జూన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ కాలేజీల నుంచి ఫారిన్ సర్వీసు/డిప్యుటేషన్ కింద 80 మంది అధ్యాపకులను తీసుకున్నారు. వర్సిటీ పాలక మండలి ఆమోదంతో జరిగినందున ఉన్నత విద్యామండలి అధికారులు ఇందుకు అనుమతించారు. తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో 40 మంది వెంటనే వెనక్కి వెళ్లిపోయారు. ఒకరు మృతి చెందగా, మరొకరు ఇటీవలే మాతృస్థానానికి వెళ్లారు. ప్రస్తుతం 38 మంది ఏయూలో పనిచేస్తున్నారు. వీసీ కీలక నిర్ణయం ఆంధ్ర యూనివర్సిటీకి ఆర్థిక భారమవుతున్న వారిని పంపించేయాల్సిందేనని వర్సిటీలోని కొంతమంది కొంతకాలంగా పట్టుబడుతున్నారు. ప్రస్తుత వీసీ ఆచార్య రాజశేఖర్ ఇటీవల క్యాంపస్ కాలేజీల డీన్లు, ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులతో సమావేశమయ్యారు. ఎయిడెడ్ అధ్యాపకుల విషయంలో వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారిని పంపించేయాల్సిందేనని మెజార్టీ విభాగాధిపతులు, ప్రిన్సిపాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో వీసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారిని వర్సిటీ నుంచి రిలీవ్ చేస్తామని ఈ నెల 19న కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు నివేదించారు. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ అధ్యాపకులంతా తదుపరి పోస్టింగ్ కోసమని కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనరేట్లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆచార్యుల కొరత తీరేదెలా.? ఏయూలో రెగ్యులర్ ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. వెయ్యి మందికి పైగా అధ్యాపకులు ఉండాల్సిన ఏయూలో ప్రస్తుతం రెండు వందల్లోపే రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. దీంతో ఎయిడెడ్, కాంట్రాక్టు, అతిథి అధ్యాపకులే బోధనలో కీలకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం 38 ఎయిడెడ్ అధ్యాపకులు రిలీవ్ చేస్తే.. ఆ స్థానాలను వేరే మార్గాల్లో భర్తీ చేయాలి. 2025–26 విద్యా సంవత్సరానికి సిద్ధమవుతున్న సమయంలో ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు వీసీ దృష్టి సారించాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు 31 నాటికి రిలీవ్ చేస్తాం ఏయూలో పనిచేస్తున్న ఎయిడెడ్ అధ్యాపకులను వెంటనే పంపించాలని కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎయిడెడ్ అధ్యాపకులను ఏయూలో కొనసాగించుకుంటారా? లేదా అని ఇటీవల డైరెక్టర్ నుంచి లేఖ వచ్చింది. దీనిపై తమ పరిధిలో నిర్ణయం తీసుకుని వారిని పంపించేస్తామని నివేదించాం. ఈ నెల 31న నాటికి ఎయిడెడ్ అధ్యాపకులందరినీ ఇక్కడ నుంచి రిలీవ్ చేస్తాం. – ఆచార్య ధనుంజయరావు, రిజిస్ట్రార్ ఏయూలో ప్రొఫెసర్ల కొరత వేళ.. ఎయిడెడ్ అధ్యాపకుల ఉద్వాసన వీసీకి కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లేఖ విద్యార్థుల చదువులపై ప్రభావం -
రాంగ్ రూట్లో రిస్క్ జర్నీ!
జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదురుగారహదారికి మధ్య డివైడర్లు ఏర్పాటు చేశారు. దీంతో జైలురోడ్డు నుంచి జీవీఎంసీ మీదుగా రామ్నగర్ వెళ్లాలంటే ఆర్టీసీ కాంప్లెక్స్(సీఎంఆర్ బస్టాప్) వరకు ప్రయాణించాలి. అటువైపు నుంచి ఆర్టీసీకి కాంప్లెక్స్ వైపు రావాల్సిన వారు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ సిగ్నల్ పాయింట్ వద్ద యూటర్న్ తీసుకోవాలి. ఈ అదనపు ప్రయాసను తప్పించుకునేందుకు కొందరు వాహనచోదకులు ప్రమాదకరమైన దారిని ఎంచుకుంటున్నారు. రాంగ్ రూట్లో అండర్ పాత్ వేలోకి వెళ్లి.. యూటర్న్ తీసుకుంటున్నారు. ఈ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడమే కాకుండా.. ప్రమాదాలు జరిగే ఆస్కారం పెరుగుతోంది. అయినప్పటికీ కొంత మంది వాహనచోదకులు ఇష్టానుసారంగారాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
కుమ్ములాటలు!
కోళ్ల వ్యర్థాల కోసం అంతటా వారే... చెరో వర్గం వైపు కూటమి నేతలుఇప్పటికే కోళ్ల వ్యర్థాల సేకరణలో కూటమి పార్టీలకు చెందిన అనుచరులు ఒక్కో జోన్ను తీసుకున్నారు. ఇప్పుడు మరో వర్గం తమ వ్యక్తులను అనధికారికంగా కోళ్ల వ్యర్థాల సేకరణకు పురమాయించారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవల వ్యవహారం పోలీసు స్టేషన్ వరకూ చేరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గండి బాబ్జీ రంగ ప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. స్టేషన్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తే.. ఇప్పటికే విశాఖ నగరంలో రాత్రి సమయాల్లో గుండాలు, రౌడీలు ముఖానికి మాస్కులు వేసుకొని మరీ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. సాగర్నగర్తో పాటు బీచ్ రోడ్డులోని శాంతి ఆశ్రమంలోనూ రౌడీలు హల్చల్ చేశారు. నగరంలో ఒకవైపు శాంతి భద్రతలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయనే విమర్శలున్నాయి. పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడు నేరుగా పోలీసు స్టేషన్లో చిందులు వేయడంతో పోలీసుల పట్ల గౌరవం మరింతగా దిగజారిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో మహారాణిపేట పోలీసు స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తే మొత్తం వ్యవహారం బయటపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై కలెక్టర్తో పాటు పోలీసు కమిషనర్ కూడా విచారణ చేసి నివేదికను సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. -
మాజీ సీఎం ఎన్టీఆర్కు ఘన నివాళి
మహారాణిపేట: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లా యంత్రాంగం అధికారికంగా ఈ కార్యక్రమాలను నిర్వహించింది. బీచ్రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తన క్రమశిక్షణ, అంకితభావంతో రాష్ట్ర ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, ప్రత్యేక ఉప కలెక్టర్లు మధుసూదనరావు, శేష శైలజ, సీఎంవో నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అందాల తీరంపై అలల దాడి
● విశాఖ తీరంలో ఆందోళనకర పరిస్థితులు ● తరచూ కోతకు గురవుతున్న బీచ్లు ● నేలకొరుగుతున్న కొబ్బరి చెట్లు ● ఇంకెప్పుడు రక్షణ చర్యలు? ఏయూక్యాంపస్: వాతావరణ మార్పుల ప్రభావం విశాఖ సుందర తీరంపై తీవ్రంగా పడుతోంది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే సాగరతీరం.. ఇప్పుడు తరచూ కోతకు గురవుతోంది. గత దశాబ్ద కాలంలో జరిగిన నష్టం కంటే ఇటీవల తీర ప్రాంతం ఘోరంగా దెబ్బతింటోంది. రుషికొండ నుంచి ఆర్.కె.బీచ్ వరకు అడుగడుగునా తీరం కోతకు గురవడం ఆందోళనకరంగా మారింది. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చి.. తీరానికి పునరుజ్జీవం పోయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రకృతి విధ్వంసం గతంలో కేవలం తుపానులు, పెను తుపానుల సమయంలో మాత్రమే కనిపించే ఈ పరిస్థితి.. ఇప్పుడు అల్పపీడనాలు, ఆవర్తనాల సమయంలో కూడా తలెత్తుతోంది. యారాడ నుంచి భీమిలి వరకు సుమారు 35 కిలోమీటర్ల తీర ప్రాంతం తరచూ కోతకు గురవుతున్నట్లు నిపుణులు గుర్తించారు. యారాడ బీచ్, కోస్టల్ బ్యాటరీ, ఆర్.కె.బీచ్, కురుసుర సబ్మైరెన్ మ్యూజియం, చిల్డ్రన్స్ పార్క్, జోడుగుళ్లపాలెం, రుషికొండ, భీమిలి వంటి ప్రాంతాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాల సమయంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల తీరం కోతకు గురవుతుంది. కొన్ని సార్లు ఈశాన్య రుతుపవనాల సమయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంటోంది. కొబ్బరి చెట్ల కన్నీళ్లు ఇటీవల పెరిగిన సముద్ర కెరటాల తీవ్రతకు కొబ్బరి వనాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి. ఒక్కొక్కటిగా నేలకొరుగుతున్నాయి. ‘విక్టరీ ఎట్ సీ’ఎదురుగా పచ్చదనంతో కళకళలాడే కొబ్బరి చెట్లు ఇప్పుడు కూలిపోయాయి. వాటి వెనుక ఉన్న మరో రెండు వరసల చెట్లు కెరటాల ధాటికి దెబ్బతినే ప్రమాదంలో ఉన్నాయి. గతంలో ఈ వనాల చుట్టూ రాళ్లతో నిర్మించిన కంచె కూడా కెరటాల ఉధృతిని తట్టుకోలేకపోయింది. ఈ ప్రభావం సమీపంలోని ఇతర కొబ్బరి చెట్లపైనా పడుతుండటంతో.. వాటి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. కూలుతున్న స్తంభాలు సముద్ర కెరటాల తీవ్రతకు తీరంలోని ఇసుక భారీగా కోతకు గురవుతోంది. ప్రస్తుతం కురుసుర సబ్మైరెన్ మ్యూజియం వద్ద ఇసుక పూర్తిగా కొట్టుకుపోయింది. గతంలో ఏర్పడిన కోతను దృష్టిలో ఉంచుకుని అక్కడ రాళ్లు, కాంక్రీట్ దిమ్మెలు ఏర్పాటు చేసినప్పటికీ.. కెరటాల ప్రభావం వాటి పక్కనే ఉన్న ఇసుక మేటలపై పడుతోంది. దీంతో సబ్మైరెన్ సమీపంలోని కొబ్బరి వనం చుట్టూ ఉన్న ఇసుక కూడా కోతకు గురవుతోంది. మరికొన్ని రోజుల్లో ఆ వనం కూడా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో వేసిన మట్టి కూడా కరిగిపోతోంది. తీరంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు, విద్యుత్ దీపాల స్తంభాలూ నేలకొరుగుతున్నాయి. దెబ్బతింటున్న రక్షణ గోడలు కొన్ని ప్రాంతాల్లో రహదారిని తాకేలా ఉధృతంగా కెరటాలు ఎగసిపడుతున్నాయి. దీని వల్ల రహదారికి, సముద్ర తీరానికి మధ్య నిర్మించిన రక్షణ గోడలు దెబ్బతింటున్నాయి. గత ఏడాది కాలంలో రామకృష్ణ బీచ్, పాండురంగాపురం ప్రాంతాల్లో రెండు చోట్ల రక్షణ గోడలు కూలిపోగా.. వాటి స్థానంలో కొత్తవి నిర్మించారు. అయితే కెరటాల తీవ్రత పెరుగుతుండటంతో భవిష్యత్తులో తీర ప్రాంత పరిరక్షణ మరింత సవాల్గా మారనుంది. సమష్టి కృషి అవసరం విశాఖ తీర పరిరక్షణకు తక్షణమే నిపుణుల సూచనలతో కూడిన ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉంది. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, జిల్లా యంత్రాంగం సమష్టిగా ఈ దిశగా కృషి చేయాలి. విశ్వవిద్యాలయాలు, సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు, సివిల్ ఇంజనీరింగ్ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తీరప్రాంత పరిరక్షణకు అనుసరిస్తున్న విజయవంతమైన పద్ధతులను అధ్యయనం చేయాలి. మన పరిస్థితులకు అను కూలంగా ఉండే వాటిని అమలు చేయడంపై అధికారులు ఆలోచించాలని పర్యాటకులు కోరుతున్నారు. సహజసిద్ధంగా వదిలేయాలి విశాఖ సముద్ర తీరానికి ఒకవైపు కొండలు ఉన్నాయి. దీని ఫలితంగా అర్ధచంద్రాకార బీచ్లు ఏర్పడ్డాయి. వీటిని సహజంగా వదిలేయాలి. ఇక్కడ నిర్మాణాలు చేయడం, శాశ్వత కట్టడాలు ఏర్పాటు చేయడం ఎంతమాత్రం సరికాదు. అదే సమయంలో సముద్రానికి అడ్డుగా గోడ కట్టాలనుకోవడం, జియో ట్యూబ్లు ఏర్పాటు చేయడం మరింత నష్టాన్ని చేస్తాయి. ఇప్పటికే వీటిని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఆర్థికంగా, పర్యావరణ పరంగా తీవ్ర నష్టం చవిచూశాం. –ఆచార్య కాకాని నాగేశ్వరరావు, జియో ఇంజినీరింగ్ విభాగం, విశ్రాంత ఆచార్యులు -
వేసవి శిక్షణ శిబిరాలకు మంగళం?
● కూటమి నిర్లక్ష్యం.. పట్టించుకోని జీవీఎంసీ ● మరో 15 రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం ● ప్రభుత్వ తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం డాబాగార్డెన్స్: వేసవి సెలవులంటే పాఠశాల విద్యార్థులకు, చిన్నారులకు పండగనే చెప్పాలి. స్నేహితులతో కలిసి ఆటలాడుకుంటూ వినోదం, ఉల్లాసం, ఉత్సాహాన్ని పొందుతుంటారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, నైపుణ్యాలు పెంపొందించేందుకు ఏటా జీవీఎంసీ వేసవి సమయాన్ని వినియోగించుకుంటూ పలు అంశాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించేది. కానీ ఈ ఏడాది మాత్రం వేసవి శిక్షణ శిబిరాలకు మంగళం పాడేసింది. వార్షిక పరీక్షలు ముగిసి, వేసవి సెలవులు వచ్చి నెల రోజులు దాటినా శిబిరాలు ప్రారంభించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఎంతో ఉత్సాహంగా జరిగే ఈ శిబిరాలు జీవీఎంసీ, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల వేసవి ఆనందాన్ని, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను దెబ్బతీశాయని ఆవేదన చెందుతున్నారు. ప్రణాళిక ఏది? గతంలో వార్షిక పరీక్షలకు నెల రోజుల ముందే వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు పక్కా ప్రణాళికలు సిద్ధమయ్యేవి. పాఠశాలల సంఖ్య, క్రీడా ప్రాంగణాల లభ్యత, కోచ్ల వివరాలు, శిక్షణ సమయాలు వంటి కీలక అంశాలపై కసరత్తు జరిగేది. పరీక్షలు ముగిసిన వెంటనే ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్లతో సమావేశమై విధివిధానాలు ఖరారు చేసేవారు. కానీ ఈ ఏడాది కూటమి ప్రభుత్వం గానీ, జీవీఎంసీ గానీ ఆ దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. జీవీఎంసీకి పూర్తి స్థాయి కమిషనర్ లేరు. ఇన్చార్జి కమిషనర్, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్పై అదనపు బాధ్యతల భారం వంటి సాకులు చెబుతున్నా.. మేయర్ పీలా శ్రీనివాసరావు కూడా ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించడం శోచనీయం. వారి నిర్లక్ష్యం, ముందుచూపు లేకపోవడం వల్లే నేటికీ శిబిరాల నిర్వహణపై స్పష్టత కొరవడింది. ప్రయోజనం లేని సమావేశం నగరంలో వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణపై ఈ నెల 8న విశాఖ కిక్ బాక్సింగ్ అసోసియేషన్లతో మేయర్ పీలా శ్రీనివాస్ ఆర్భాటంగా సమావేశం నిర్వహించి దాదాపు 20 రోజులు గడిచింది. అయితే క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి లేకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. ఈ మొక్కుబడి సమావేశాలు ప్రజలను మభ్యపెట్టడానికేనా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిక్షకులు సైతం ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరాలు సాధారణంగా సెలవులు ముగిసేలోపు పూర్తి చేయాలి. కానీ ఇప్పటివరకు కనీసం కౌన్సిల్ ఆమోదం కూడా పొందకపోవడంతో ఈ శిబిరాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే నెల 6న కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉన్నప్పటికీ అప్పటికి పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడానికి కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంటాయి. దీంతో ఈసారి వేసవి శిక్షణ శిబిరాలకు కూటమి ప్రభుత్వం మంగళం పాడేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగా వేలాది మంది విద్యార్థులు వేసవి సరదాను, కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాన్ని కోల్పోయినట్టే! వేసవి శిక్షణ శిబిరాలు ?అసమర్థ పాలన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. జీవీఎంసీ కమిషనర్ బదిలీ జరిగి నాలుగు నెలలు గడుస్తోంది. 8 జోనల్ కార్యాలయాలు, 98 వార్డులు, 25 లక్షలకు పైగా జనాభా ఉన్న జీవీఎంసీకి ఇంతవరకు కమిషనర్ను నియమించలేని అసమర్థ ప్రభుత్వం ఇది. ఇంకా వేసవి శిక్షణ శిబిరాలను ఏం నిర్వహిస్తుంది? కూటమిలోని పార్టీల మధ్య సమన్వయం కొరవడడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. కనీసం పిల్లల కోసం వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించాలనే ఆలోచన కూడా జీవీఎంసీకి లేకపోవడం బాధాకరం. మేము ఏటా క్రమం తప్పకుండా వేసవి శిబిరాలు నిర్వహించాం. – గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మేయర్, జీవీఎంసీ ఆమోదం కోసం ఎదురుచూపులు వేసవి శిక్షణ శిబిరాలకు సంబంధించిన అంశాన్ని మేయర్ దృష్టికి తీసుకెళ్లాం. 33 క్రీడా అంశాల్లో పిల్లలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే పలువురి కోచ్లతో సమావేశమయ్యాం. కౌన్సిల్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాం. – ఈఏ రాజు, స్పోర్ట్స్ డైరెక్టర్, జీవీఎంసీ -
ఉపాధి కల్పించకుంటే మా గతేంటి?
ఉక్కునగరం: ఉపాధి కల్పించకపోతే తమ కుటుంబాల గతేంటని స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండో రోజు బుధవారం జరిగిన ఉక్కు అడ్మిన్ ముట్టడి కార్యక్రమంలో అధికారులు, పోలీసుల వద్దకు వెళ్లి కాంట్రాక్ట్ కార్మికులు తమ గోడు వెల్లబోసుకున్నారు. అనుకున్న ప్రణాళిక ప్రకారం గేట్ల దిగ్బంధానికి కార్మికులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అడ్మిన్ భవనం వద్దకు చేరుకున్నారు. ఒకేసారి బిల్డింగ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాస్త తోపులాట నెలకొంది. పోలీసులు పదే పదే చెప్పినప్పటికీ కార్మి కులు పోలీసు వలయాన్ని దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొంత మంది కింద పడిపోయారు. దీంతో యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంత కాలం పనిచేసిన తమను తీసేస్తే తమ కుటుంబాల గతేంటని ప్రశ్నించారు. సాయంత్రం వరకు అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గురు, శుక్రవారాలు కూర్మన్నపాలెం దీక్షా శిబిరం వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. శుక్రవారం రీజనల్ లేబర్ కమిషన్ చర్యల అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ముట్టడిలో పాల్గొన్న నాయకులపై కేసు నమోదు ఉక్కు అడ్మిన్ ముట్టడిలో పాల్గొన్న నాయకులపై స్టీల్ప్లాంట్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. స్టీల్ప్లాంట్ రాజభాష విభాగం జీఎం లలన్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె నేపథ్యంలో 27, 28 తేదీల్లో కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి చేపట్టాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు, కార్పొరేటర్ గంగారావు, సత్యనారాయణ, కె.ఎం.శ్రీనివాస్, సీఐటీయూ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ కార్యదర్శి నమ్మి రమణ, జి.శ్రీనివాస్, ఆర్.టి.రాజుతో పాటు సుమారు 200 కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాలు చేసి రాకపోకలు సాగించే ఉద్యోగులకు ఇబ్బందులు కల్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదన కొనసాగిన అడ్మిన్ ముట్టడి.. స్వల్ప ఉద్రిక్తత -
కూటమి పాలనలో దళితులకు రక్షణ లేదు
వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి నాగ మల్లేశ్వరి సాక్షి, విశాఖపట్నం: కూటమి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మంచ నాగ మల్లేశ్వరి మండిపడ్డారు. దళిత హోంమంత్రి ఉన్నా దళితులపై దాడులు ఆగడం లేదని, స్వయంగా హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే దళితులను బహిష్కరించారని ఆమె ఆరోపించారు. మంగళవారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెనాలిలో దళిత యువకుడిపై పోలీసుల దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ‘దళిత యువకుడు తప్పు చేస్తే రోడ్డు మీద ఒక సీఐ కాలుతో తొక్కి, మరో సీఐ కర్రలు విరిగేలా అత్యంత పాశవికంగా కొడుతుంటే, ఇక చట్టాలు, న్యాయవ్యవస్థలు ఈ రాష్ట్రంలో ఎందుకు?’ అని ఆమె ప్రశ్నించారు. మదనపల్లిలో దళితులపై దాడి, చిత్తూరులో టీడీపీ నేతల ముందు చెప్పులు వేసుకుని తిరిగారని, దళితుడి బైక్ను పెట్రోల్ పోసి తగులబెట్టిన పరిస్థితులు చూశామని ఆమె అన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగినా, చిన్నారిపై లైంగికదాడులు జరిగినా స్పందించడం లేదని మండిపడ్డారు. -
దిగుబడి బాగు.. ధర దిగాలు!
● మామిడి పళ్లతో కళకళలాడుతున్న మార్కెట్లు ● విశాఖ జిల్లా వ్యాప్తంగా 27 వేల హెక్టార్లలో మామిడి తోటలు ● ఈ ఏడాది హెక్టార్కు సగటున 10 టన్నుల వరకు దిగుబడి ● రైతుబజార్లలో కిలో మామిడి పళ్ల సగటు ధర రూ.45 పెందుర్తి: విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాల కలయికే మామిడి పండు.. మనిషి ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుంది. అందుకే మామిడిని పండ్లలో రారాజు అని అంటారు. రంగు, రుచి, సువాసనలతో మనల్ని ముగ్ధులను చేస్తుంది. జిల్లాలో ఈ ఏడాది మామిడి సీజన్ ఊపందుకుంది. జిల్లా వ్యాప్తంగా మార్కెట్లు, రైతు బజార్లు మామిడి సువాసనలతో నిండిపోయాయి. రైతులు, వ్యాపారులు అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించడంతో మామిడి దిగుబడి గణనీయంగా పెరిగింది. జిల్లాలో మామిడి తోటలకు ప్రసిద్ధి చెందిన పద్మనాభంతో పాటు ఆనందపురం, పెందుర్తి, భీమిలి ప్రాంతాల్లో పంట పూర్తిస్థాయిలో పక్వానికి వచ్చింది. రైతులు ఇప్పటికే మామిడి కాయలను దించి విక్రయాలు సాగిస్తున్నారు. అయితే, దిగుబడి పెరిగినప్పటికీ, దానికి తగ్గట్టుగా ధరలు పలకకపోవడంతో మామిడి రైతులు కొంత నిరాశలో ఉన్న మాట వాస్తవం. మరోవైపు గత ఏడాదితో పోలిస్తే ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటంతో వినియోగదారులు బంగినపల్లి, సువర్ణరేఖ, రసాలు, పంచదార కంచెలు, పండూరి, కలెక్టర్, కొబ్బరి మామిడి, పనుకూలు, కోలంగోవ, పరియా, నీలాలు వంటి వివిధ రకాల మామిడి పండ్ల రుచిని ఆస్వాదిస్తున్నారు. ఎకరాకు సగటున 4 టన్నులు జిల్లాలోని గ్రామీణ మండలాలైన పద్మనాభం, ఆనందపురం, భీమిలి, పెందుర్తిలలో మామిడి తోటలు విస్తారంగా ఉన్నాయి. ఈ ఏడాది సుమారు 27 వేల హెక్టార్లలో(దాదాపు 67 వేల ఎకరాలు) మామిడి పండింది. డిసెంబర్, జనవరిలో పూత దశలో పొగమంచు ప్రభావం, రెండు మూడు తుఫాన్ల కారణంగా సుమారు 50 శాతానికి పైగా పంట దెబ్బతింది. అయినప్పటికీ రైతులకు 40–45 శాతం ఫలసాయం దక్కింది. ఇది ఏటా వచ్చే సగటు ఫలసాయంతో పోలిస్తే మెరుగైన దిగుబడే. సీజన్ ముగిసే సమయానికి హెక్టార్కు సగటున 10 టన్నుల వరకు దిగుబడి రావచ్చని రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో మామిడి ధర రూ.50–60 పలుకుతుండగా.. రైతుబజార్లలో సగటున రూ.45గా నిర్ణయించారు. కొందరు రైతులు నిర్ణయించిన ధర కంటే రూ.5–10 తక్కువకే విక్రయిస్తున్నారు. -
ఇథలిన్తోనే పళ్లు మగ్గబెట్టాలి
సీజన్ ఊపందుకోవడంతో జిల్లాలో రైతులు మామిడి దింపుడు కార్యక్రమం ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పక్వానికి వచ్చిన మామిడిని తగిన జాగ్రత్తలు తీసుకుని మగ్గబెట్టాలి. మామిడి పండ్లను కాల్షియం కార్బేట్ సహాయంతో మగ్గబెట్టడం మంచిది కాదు. దీని వలన ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. పక్వానికి వచ్చిన మామిడి పళ్లను ఇథలిన్ వాయువు సహాయంతో మగ్గబెడితే ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదు. మామిడి కాయలను గాలి చొరబడని గదిలో ఉంచాలి. తర్వాత ఇథలిన్ వాయువును 2 పీపీహెచ్ మోతాదులో స్ప్రే చేసి 16 గంటల తరువాత తీయాలి. ఇలా చేస్తే రుచికరమైన, ఆరోగ్యకరమైన మామిడి పండ్లు లభిస్తాయి. లేదా బకెట్ నీటిలో ఇథలిన్ ద్రావణం, క్లాస్కిక్ సోడా కలిపి చల్లిన తర్వాత 24 గంటలు ఉంచాలి. దీని వలన ఇథలిన్ వాయువు విడుదలై మామిడి కాయలు మగ్గుతాయి. – జి.సోని, ఉద్యానశాఖ అధికారి -
దిగుబడి ఉన్నా ధరలు లేవు
మాకు మూడు ఎకరాల మామిడి తోట ఉంది. అందులో బంగినపల్లి, సువర్ణరేఖ జాతులు అధికంగా ఉన్నాయి. మొదట్లో పూత చాలా బాగా వచ్చింది. అయితే పొగమంచు అధికంగా పడడంతో పాటు వర్షాలు కూడా మమ్మల్ని దెబ్బకొట్టాయి. అయినా గతేడాదితో పోల్చితే దిగుబడి బాగానే వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో ధరలు లేవు. వచ్చినంతలో రైతుబజార్కు వచ్చి అమ్ముకుంటున్నాం. మాకు లాభం లేకపోయినా ప్రజలైనా మంచి మామిడి పండ్లు తినాలనే ఉద్దేశంతో ఒక్కోసారి నిర్ణయించిన ధర కంటే తక్కువకే ఇచ్చేస్తున్నాం. – గొర్లి అప్పలనాయుడు, ఆర్లి, కె.కోటపాడు కష్టానికి తగ్గ ధర వస్తే చాలు మా దగ్గర నాలుగు ఎకరాల తోట ఉంది. దాంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. ఈ ఏడాది మొదట్లో వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి ఆశించినంతగా లేదు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి బాగానే పండింది. మా తోటలో సగానికి పైగా దించేశాం. పంట నిలబెట్టుకోవడానికి చాలా ఖర్చు పెట్టాం. సీజన్ పూర్తయ్యేసరికి కనీసం నష్టం రాకుండా ఉంటే చాలని అమ్మకాలు చేస్తున్నాం. –నాగిరెడ్డి అప్పలనాయుడు, కె.కోటపాడు -
మేలు రకం అయితేనే ఆసక్తి చూపుతున్నారు
మేం మూడు ఎకరాల్లో కొన్ని ముఖ్యమైన మామిడి రకాలు వేశాం. నాలుగేళ్ల నుంచి పంట వస్తుంది. పోయిన ఏడాది చాలా నష్టపోయాం. కానీ ఈ ఏడాది దిగుబడి మెరుగుపడింది. అయితే బంగినపల్లి, సువర్ణరేఖ, రసాలే ప్రజలు ఎక్కువ అడుగుతున్నారు. వారికి కావాల్సిన రకాలు సమకూర్చి అందిస్తున్నాం. ఈ ఏడాది భారీగా లాభాలు వచ్చే అవకాశం లేదు. – చప్పా సన్యాసమ్మ, అడ్డూరు, చొడవరం మండలం ధరలు అందుబాటులో ఉన్నాయి సీజన్ ఊపందుకోవడంతో అన్ని రకాల మామిడి పండ్లు దొరుకుతున్నాయి. ఇప్పటివరకు రైతు బజార్లో ఐదారు సార్లు కొనుగోలు చేశాను. మా బంధువులు, మిత్రులకు కూడా ఇక్కడే తీసుకోమని సూచిస్తున్నారు. బయటి మార్కెట్తో పోల్చితే రైతుబజార్లో రూ.20 వరకు తక్కువగానే వస్తున్నాయి. ఏ రకం పళ్లు అయినా సగటున రూ.40–45కి అందిస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఇది చాలా మెరుగైన ధర. – శాస్త్రి, పెందుర్తి, వినియోగదారుడు -
రేపు జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
సీతంపేట: ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం ఆంధ్రా యూనివర్సిటీ ప్లాటినం జూబ్లీ హాల్–2 లో జరుగుతుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. అక్కయ్యపాలెంలోని ఒక హోటల్లో మంగళవారం జరిగిన ఫెడరేషన్ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం జరగనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి 70 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్టు తెలిపారు. సమావేశంలో ఐదు తీర్మానాలు ప్రవేశపెట్టి రాష్ట్ర కార్యవర్గ ఆమోదం తీసుకుంటామన్నారు. జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ల మంజూరు, ప్రమాద బీమా పునరుద్ధరణ, పెన్షన్ విధానం వంటి పలు అంశాలపై చర్చిస్తామని తెలిపారు. -
కేఎంఆర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఆందోళన
మధురవాడ: ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చి విద్యార్థులను మోసం చేసిన కేఎంఆర్ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి యు. నాగరాజు డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఐదుగురు విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆర్ఐవో సమగ్ర విచారణ జరిపించాలని, బాధిత విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు. ప్రైవేట్ కళాశాలలు విద్యను వ్యాపారంగా మార్చేశాయని ఆయన విమర్శించారు. ఏబీవీపీ నిరసన : కేఎంఆర్ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఐదుగురు విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడిందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. ఎంసెట్ ఆశలు నీరుగారిపోవడంతో మంగళవారం కళాశాల వద్ద వారు నిరసన తెలిపారు. ప్రైవేట్ కళాశాలల ఇష్టారాజ్య పాలనను అధికారులు పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆర్ఐవోను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో పీఎఫ్ కార్యాలయ ఉద్యోగి మృతి
గోపాలపట్నం: మర్రిపాలెం వుడా లేఅవుట్లో సూపరిండెంట్గా పనిచేస్తున్న పి.వి. నరేష్ బాబు (60) మంగళవారం సాయంత్రం ఎన్ఏడీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎయిర్పోర్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం పీఎఫ్ కార్యాలయం నుంచి విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై పెందుర్తిలోని ఇంటికి వెళ్తుండగా ఓ కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేష్ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. కంచరపాలెం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని కేజీహెచ్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను విచారించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ సీఐ ఉమామహేశ్వరరావు నేతృత్వంలో ఎస్ఐ ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. -
పబ్జిగేమ్ ఆడొద్దన్నందుకు మనస్తాపంతో..
● ఇంటి నుంచి పారిపోయిన విద్యార్థి ● టూటౌన్ పోలీసులకు చిక్కిన యువకుడు ● కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు అల్లిపురం: పబ్జీ గేమ్స్ ఆడవద్దని తండ్రి మందలించడంతో ఓ యువకుడు ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు వెతికి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. టూటౌన్ సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు తెలిపిన వివరాల ప్రకారం, ఏలూరు జిల్లా..ఉంగుటూరుకు చెందిన ఐటీఐ విద్యార్థి.. పబ్జీ గేమ్స్కు బానిస కావడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థి సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న తండ్రి వెంప శివకుమార్ ఏలూరు పరిసర ప్రాంతాలలో వెతికినా అతని ఆచూకీ తెలియరాలేదు. దీంతో ఆయన నిడమర్రు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే సదరు విద్యార్థి ఒక వ్యక్తి సెల్ నుంచి తాను హైదరాబాద్లో ఉన్నట్లు తండ్రి సెల్కు మెసేజ్ పెట్టాడు. ఆ ఫోన్ నంబరు ఆధారంగా నిడమర్రు పోలీసులు సాంకేతికత ద్వారా విద్యార్థి విశాఖలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో విశాఖ చేరుకున్న తల్లిదండ్రులు టూటౌన్ పోలీసులను సంప్రదించారు. ఎస్.ఐ ఎన్. సింహాచలం, హెచ్సీ టీ. శ్రీనివాసరాజు సహకారంతో గాలించగా సదరు విద్యార్థి కల్లుపాకల వద్ద ఉన్నట్లు గుర్తించారు. అతడిని తీసుకువచ్చి సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. -
పోర్టులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ప్రారంభం
విశాఖ సిటీ: విశాఖ పోర్టు పరిపాలన భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను చైర్పర్సన్ డాక్టర్ ఎం.అంగముత్తు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది గ్రీన్ ఎనర్జీ, సస్టెయినబుల్ ట్రాన్స్పోర్ట్ మౌలిక సదుపాయాల ఏర్పాటులో కీలకమైన ముందడుగుగా నిలుస్తోందని తెలిపారు. రెండు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, రెండు ఏసీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటి ద్వారా ఒకేసారి ఆరు ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడం సాధ్యమవుతుందని వివరించారు. -
క్లబ్బుతో
గెస్టులతో పేకాట నిర్వహణ ● కేసులు లేకుండా చూసుకుంటానని హామీ ● నెలవారీ మాముళ్లు ఇవ్వాలని డిమాండ్ ● కూటమి ఎమ్మెల్యే బరితెగింపు ● కొద్దిరోజుల క్రితం క్లబ్బుపై టాస్క్ఫోర్స్ దాడి ● కేసులు పెట్టకుండా విడిపించిన సదరు ఎమ్మెల్యే ● వాటాల వ్యవహారం తేలిన వెంటనే ప్రారంభించేందుకు సన్నాహాలు 8లోబుధవారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2025ప్రశాంతంగా డిప్లొమా లేటరల్ ఎంట్రీ ప్రవేశ పరీక్ష మురళీనగర్: ఇండస్ట్రియల్ ట్రైనింగ్ (ఐటీఐ) పూర్తి చేసి బ్రిడ్జి కోర్సు చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ పరీక్ష కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మంగళవారం ప్రశాంతంగా జరిగింది. ఉత్తరాంధ్రలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో కోర్సు పూర్తి చేసిన 145 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ర్యాంకుల ఆధారంగా డిప్లొమా రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తామని పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నారాయణరావు తెలిపారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: క్లబ్బుతో గలీజు ఆటను ప్రారంభించారు ఓ కూటమి ఎమ్మెల్యే. విశాఖ నగరంలో ఎంతో చరిత్ర ఉన్న పాత క్లబ్బులో పేకాటను నిర్వహించుకునేందుకు అండదండలు అందించేందుకు ముందుకొచ్చారు. ఇందుకుగానూ తన మనుషులకు క్లబ్బులో పేకాటాడేందుకు అనుమతితో పాటు నెలవారీ మామూళ్లు ఎంత ఇస్తారో తేల్చాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం క్లబ్బులో పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించగా.. కేసులు పెట్టకుండా సదరు ఎమ్మెల్యేనే విడిపించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా తాను చూసుకుంటానని.. ఇందుకోసం మాముళ్లు ఎంత మొత్తం ఇస్తారో నిర్ణయించుకోవాలని ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాటాల వ్యవహారం తేలకపోవడంతో తాత్కాలికంగా పేకాట నిలిచినప్పటికీ త్వరలో భారీగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిబంధనల మేరకు 50 మంది సీనియర్ సభ్యులు మాత్రమే పేకాట ఆడుకునేందుకు అవకాశం ఉన్న సదరు క్లబ్బులో మరో 200 మందిని గెస్టుల రూపంలో ఆడేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే క్లబ్బులో బార్ నిర్వహణను తన మనిషికి ఇప్పించుకున్న ఎమ్మెల్యే.. మొత్తం క్లబ్నే తన ఆధీనంలోకి తీసుకునేలా పథక రచన చేస్తున్నట్టు సమాచారం. గెస్టుల రూపంలో..! నిబంధనల మేరకు క్లబ్బులో సభ్యత్వం ఉన్న అత్యంత సీనియర్లు మాత్రమే పేకాట ఆడుకునేందుకు అవకాశం ఉంది. ఈ సంఖ్య సదరు క్లబ్బులో 50 మందికి మించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే క్లబ్బుతో ఎలాంటి సంబంధం లేని 200 మంది వరకూ తన అనుచరులతోపాటు బయటి వ్యక్తులు గెస్టులుగా వచ్చి ప్రతీ రోజూ పేకాట ఆడుకునేందుకు అవకాశం కల్పించాలని సదరు కూటమి ఎమ్మెల్యే కోరుతున్నారు. అంతేకాకుండా వారి నుంచి రోజుకు ఇంత మొత్తం వసూలు చేసుకోవాలంటూ క్లబ్బు యాజమాన్యానికి సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి సదరు క్లబ్బులో అప్పటికే సీనియర్ సభ్యులు కానీ వారు కూడా పేకాటాడుతున్న వ్యవహారంపై కొద్దిరోజుల క్రితం నేరుగా కొందరు పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసు సిబ్బందితో పాటు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి కొద్ది మందిని స్టేషన్కు తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే సదరు ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొచ్చి ఎటువంటి కేసులు నమోదు కాకుండా వారిని పోలీసు స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే గత మూడు రోజులుగా నిలిచిన పేకాట వ్యవహారాన్ని తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నెలవారీగా తనకు ఇంత మొత్తం ముట్టచెప్పేలా క్లబ్బు యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం తేలిన అనంతరం క్లబ్బు పేకాటతో కళకళలాడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. న్యూస్రీల్గెస్టులతో పేకాట నిర్వహణ కేసులు లేకుండా చూసుకుంటానని హామీ నెలవారీ మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ కూటమి ఎమ్మెల్యే బరితెగింపు కొద్దిరోజుల క్రితం క్లబ్బుపై టాస్క్ఫోర్స్ దాడి కేసులు పెట్టకుండా విడిపించిన సదరు ఎమ్మెల్యే వాటాల వ్యవహారం తేలిన వెంటనే ప్రారంభించేందుకు సన్నాహాలు -
అంతర్జాతీయ స్థాయిలో యోగా దినోత్సవ ఏర్పాట్లు
చెక్ బౌన్స్ కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారికి జైలు 8లోమహారాణిపేట: వచ్చే నెల 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. యోగా దినోత్సవ ఏర్పాట్లపై ఆయన మంగళవారం కలెక్టర్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి కంపార్టుమెంట్ వద్ద అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. కంపార్టుమెంట్ లోపలికి వచ్చే వారిని వలంటీర్ల సాయంతో సాంకతిక పరికరాలను ఉపయోగించి లెక్కించాలని, దానికి ముందుగా ప్రతి ఒక్కరికీ క్యూఆర్ కోడ్లను అందించాలని సూచించారు. దీనికి ముందు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీర పాండియన్, ఆయుష్ డైరెక్టర్ దినేశ్కుమార్లతో కలిసి ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు కార్యక్రమం జరిగే వివిధ ప్రాంతాలను పరిశీలించారు. వచ్చే నెల 19న ఫుల్ డ్రెస్ రిహార్సల్ జూన్ 19న ఫుల్ డ్రెస్ రిహార్సల్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రధాన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ప్రతి రోజూ ఒక గంట యోగా ప్రాక్టీస్ చేయించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన చర్యల గురించి కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ పీపీటీ సాయంతో వివరించారు. కార్యక్రమంలో డీఐజీ గోపీనాథ్ జెట్టీ, డీసీపీ అజిత, వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, జేసీ కె.మయూర్ అశోక్, డీఆర్వో భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
జూలో సీడ్ బాల్స్ తయారీ
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో జూ, గ్రీన్ క్లైమేట్ సంస్థ సంయుక్తంగా మంగళవారం సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం నిర్వహించాయి. ఎన్సీసీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సీడ్ బాల్స్ తయారు చేసి జూలోని వివిధ ప్రాంతాల్లో చల్లారు. జూ క్యూరేటర్ మంగమ్మ మాట్లాడుతూ విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచడం అభినందనీయమన్నారు. ఏపీ ఎన్సీసీ పదమూడో బెటాలియన్ ఎల్.టి కల్నల్ నీరజ్కుమార్ మాట్లాడుతూ సామాజిక వనాల పెంపులో అందరి భాగస్వామ్యం అవసరమని తెలిపారు. కార్యక్రమంలో ఎన్సీసీ డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్ట్నెంట్ కల్నల్ స్వర్నిం, సుభేదార్లు మేజర్ శ్రీనివాస్, సుహాస్సింగ్, సునీల్సింగ్ రవీంద్రసింగ్, సుహాస్ సింగ్, జూ అధికారులు, సిబ్బంది, గ్రీన్ క్లైమేట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
పార్టీ కోసం పనిచేసేవారికే ప్రాధాన్యం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజుసీతంపేట: వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో విశాఖ అభివృద్ధికి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యమిచ్చారని, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేశారని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. పార్టీ అనుబంధ కమిటీల నియామకంపై చేస్తున్న కసరత్తుల్లో భాగంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో కూడా ఉత్తరాంధ్ర, విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. విశాఖకు జగన్, వైఎస్సార్ ఎటువంటి మేలు చేశారు.. చంద్రబాబు ఏం చేశారనే విషయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి, పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. పార్టీకి మొదటి నుంచి అండగా ఉండి, నిజంగా కష్టపడుతున్న వారిని గుర్తించి ప్రోత్సహిస్తామన్నారు. వారి ద్వారానే పార్టీకి భవిష్యత్తులో మేలు జరుగుతుందన్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ.. అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానన్నారు. విశాఖకు అడుగడుగునా అన్యాయం 2014 ఎన్నికల్లో విశాఖను సౌత్ ఇండియాకు గేట్వేగా అభివృద్ధి చేస్తామని హామీలిచ్చిన టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చాక కేవలం అమరావతిపై ప్రేమతో విశాఖపై సవతి ప్రేమ చూపించారని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తే.. తప్పుడు ప్రచారాలు, కేసులతో దానిని అడ్డుకున్నారని పేర్కొన్నారు. మళ్లీ 2024 ఎన్నికల సమయంలో అదే తరహా హామీలిచ్చి, అమరావతి అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని పేపర్లకే పరిమితం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని పునరుద్ఘాటించారు. సూపర్ సిక్స్ హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చి.. ఏడాది కావస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామన్నారు. 2014 నుంచి 2024 వరకు వైఎస్సార్సీపీ కోసం ఎంతో మంది కష్టపడ్డారని, అయితే ఎన్నికలు వచ్చే సరికి కొంత మంది న్యూట్రల్ అయిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి రాకుండా వైఎస్సార్సీపీ నా పార్టీ అన్న భావనతో, ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుని పనిచేసే కార్యకర్తలు, నాయకులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. -
ఫైలు కదలాలంటేపైసలివ్వాల్సిందే!
● లేఅవుట్ల అనుమతికి ముప్పుతిప్పలు ● ఎకరాకు ఇంత అని ముట్టజెప్పాల్సిందే.. ● ఇంజినీరింగ్లో పర్సంటేజీలు ● అకౌంట్స్లోనూ అదే తీరు.. ● కాంట్రాక్టులను పంచుకుంటున్న అధికారులు అకౌంట్స్లో చెక్కులకు మామూళ్లు సంబంధిత విభాగాల్లో అధికారుల ఆమోద ముద్ర తరువాత పైళ్లు చివరిగా పేమెంట్ కోసం అకౌంట్స్ విభాగానికి వెళతాయి. అక్కడ ఒక కాంట్రాక్టర్ల బిల్లులే కాకుండా వీఎంఆర్డీఏ చేసే చెల్లింపులన్నింటికీ శల్యపరీక్షలు జరుగుతాయి. ఈ విభాగంలో బిల్లుల చెల్లింపులకు జాప్యం సర్వసాధారణమన్న టాక్ వినిపిస్తోంది. చెక్కులు చేతికందాలంటే మామూళ్లు సమర్పించుకోవాలన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు అటవీ విభాగంలో కూడా పనుల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. సిబ్బందిలోనే కొందరు బినామీ కాంట్రాక్టర్ల ద్వారా పనులు చేజిక్కించుకుని భారీగానే వెనకేసుకుంటున్నారని విభాగం సిబ్బందే చెవులు కొరుక్కుంటున్నారు. ఇలా వీఎంఆర్డీఏలో ఒక్కో విభాగంపై ఒక్కో రకమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ సిటీ: అక్కడ ఫైలు కదలాలంటే పైసలివ్వాల్సిందే. లేదంటే వారాలు, నెలలు గడిచినా ముందుకు కదలదు. ఈ విభాగం.. ఆ విభాగం.. అని తేడా లేదు. అన్నింట్లోను అదే పరిస్థితి. ఎక్కడైనా.. ఏ పనికై నా మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. లేదంటే లేఅవుట్లకు అనుమతులు రావు. ఇంజినీరింగ్లో బిల్లులు మంజూరు కావు. అకౌంట్స్లో చెక్కులు అవ్వవు. ఇదీ విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ)లో దుస్థితి. ప్లానింగ్, ఇంజినీరింగ్, అకౌంట్స్, ఫారెస్ట్ ఇలా ఏ విభాగంలో పని పూర్తి కావాలన్నా అధికారుల చేతులు తడపాల్సిందే అన్నది బహిరంగ రహస్యమే. అంతా ‘ప్లానింగ్’ ప్రకారమే.. వీఎంఆర్డీఏలో అంతా ఒక ‘ప్లానింగ్’ ప్రకారమే చక్కబెట్టేస్తున్నారు. సంస్థ పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి కోసం రియల్ ఎస్టేట్ సంస్థలు ప్లానింగ్ విభాగంలో దరఖాస్తులు చేస్తాయి. వీటికి అనుమతులు ఇవ్వాలంటే విభాగంలో పలువురి చేతులు తడపాల్సిందే. ఫైలు కదలాలంటే ఎకరాకు ఇంత అని అనధికార చెల్లింపులు చదివించుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. విస్తీర్ణం, ప్రాంతాన్ని బట్టి ఈ రేటు మారుతూ ఉంటుంది. ప్లానింగ్ ఆఫీసర్ నుంచి సర్వేయర్ వరకు అంతా ఏకమైపోతారు. డబ్బులు ముట్టిన ఫైళ్లను మాత్రమే క్లియరెన్స్కు పంపుతారు. రేటు నిర్ణయం కాని వాటిని ముట్టుకోరు. ఒకవేళ నిబంధనల ప్రకారం నిర్ణీత గడువు దాటిన తరువాత వాటికి ఆటోమేటిక్గా అనుమతి లభించినప్పటికీ.. కొర్రీలు వేస్తూ ముప్పుతిప్పలు పెడతారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించింది. దీంతో వీఎంఆర్డీఏ పరిధిలో కొత్త లే అవుట్లకు దరఖాస్తులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం మూడు వరకు మాత్రమే లేఅవుట్ల కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవి ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. వీఎంఆర్డీఏలో ఎక్కడి ఫైళ్లు అక్కడే..పర్సంటేజీల్లో కింగ్.. ఇంజినీరింగ్ వీఎంఆర్డీఏలో ఇంజినీరింగ్ విభాగం అత్యంత కీలకం. రూ.వందల కోట్లతో జరిగే పనులను ఈ విభాగమే పర్యవేక్షిస్తుంది. దీంతో ఈ విభాగంలో పోస్టింగ్లకు భలే గిరాకీ ఉంది. జగనన్న లేఅవుట్ల అభివృద్ధి, మాస్టర్ ప్లాన్ రహదారులు, ది డెక్ వాణిజ్య సముదాయం.. ఇలా అనేక భారీ ప్రాజెక్టు పనులను ఈ విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే మౌలిక సదుపాయాల పనులను రూ.వందల కోట్ల వీఎంఆర్డీఏ నిధులతో చేపడుతున్నారు. వీటితో పాటు వీఎంఆర్డీఏ మ్యూజియాలు, పర్యాటక కేంద్రాల నిర్వహణ, నిర్మాణ టెండర్లతో బిజీగా ఉన్నారు. టెండర్లు దక్కించుకున్న నాటి నుంచి కాంట్రాక్టర్లకు పర్సంటేజీ బెదడ ప్రారంభమవుతుంది. వారు చేసిన పనులన్నీ ఎప్పటికప్పుడు ఫీల్డ్ మెజర్మెంట్ పుస్తకంలో నమోదు చేస్తేనే వాటికి బిల్లులు మంజూరవుతాయి. దీనికి ఇంజినీరింగ్ అధికారులకు పర్సంటేజీలు తప్పనిసరి. లేనిపక్షంలో ఆ బిల్లుల ఫైల్ మాయమైపోతుంది. కాంట్రాక్టర్ ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫైల్ కనిపించదు. పర్సంటేజ్ ఇచ్చిన వెంటనే బిల్లు ఉన్నతాధికారులకు వెళ్లిపోతుంది. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో టెండర్ల వ్యవహారంపై కూడా దుమారం రేగుతోంది. తమ వారికి పనులు అప్పగించేందుకు టెండర్ల సమయంలోనే కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. -
15సార్లు ఫిర్యాదు చేశా..
నేను కోట వీధిలో నివసిస్తున్నాను. ఇంటి కోసం నేను ఇప్పటికి 15 సార్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో దరఖాస్తు చేశా. భర్తతో విడాకులు అయ్యాయి. ఇద్దరు పిల్లలతో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాను. నాకు అనకాపల్లి, ఎన్.ఎన్.పురం వద్ద టిడ్కో ఇల్లు మంజూరైంది. దీనికి సంబంధించిన డబ్బులు కూడా కట్టాను, ఈకేవైసీ చేశారు, జియోట్యాగింగ్ కూడా పూర్తయ్యింది. అయితే ఇప్పుడు జాబితాలో నా పేరు లేదు. పేరును ఎందుకు తొలగించారని పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేశా..ఎలాంటి సమాధానం రాలేదు. అసలు ఏం జరిగిందో నాకు తెలియడం లేదు. నా లాంటి మహిళలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? దయచేసి నాకు ఇల్లు ఇప్పించండి. –షేక్ రహీమ్ తున్నీ, కోటవీధి -
వీఎంఆర్డీఏ ప్రాంగణాల్లో పనులు వేగవంతం
విశాఖ సిటీ: వీఎంఆర్డీఏ బాలల ప్రాంగణం, గురజాడ కళాక్షేత్రంలో జరుగుతున్న మరమ్మతులు, నిర్వహణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్. విశ్వనాథన్ అధికారులను ఆదేశించారు. సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఆయన ఆయా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే, నిర్వహణ గుత్తేదారుడికి పలు మార్పులు, చేర్పులు చేయాల్సిందిగా సూచించారు. ఈ పర్యటనలో కమిషనర్తో పాటు కార్యదర్శి మురళీకృష్ణ, ఎస్ఈ భవానీశంకర్, ఈఈలు రామరాజు, దుర్గా ప్రసాద్, పరిపాలనాధికారిహేమంత్, సిబ్బంది పాల్గొన్నారు. -
● మాస్టర్ప్లాన్ రహదారుల అభివృద్ధికి టెండర్లు ● రూ.154.60 కోట్లతో ఏడు రహదారుల విస్తరణ, నిర్మాణం ● ఏడాదిలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు
విశాఖ సిటీ: విశాఖ నగరంలో కొత్త రహదారుల అభివృద్ధికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూపొందించిన మాస్టర్ప్లాన్ రోడ్ల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రూ.154.60 కోట్ల అంచనా వ్యయంతో ఏడు ప్రాంతాల్లో 26.77 కిలోమీటర్ల మేర కొత్త రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. ఏడాదిలో ఈ రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రణాళికలు భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే ఆ రహదారిలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వీఎంఆర్డీఏ మాస్టర్ప్లాన్లో కొత్త రహదారుల అభివృద్ధికి చోటు కల్పించారు. అలాగే, ప్రస్తుతమున్న రోడ్ల విస్తరణ చేపట్టేందుకు ఆమోద ముద్ర వేశారు. ఇందులో భాగంగా 15 రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయగా, వాటిలో 8 రోడ్ల విస్తరణతో పాటు ఏడు రహదారులను కొత్తగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ 15 రహదారుల నిర్మాణాల్లో కొన్నింటిని జీవీఎంసీ, ఆర్అండ్బీ చేపట్టనున్నాయి. వీఎంఆర్డీఏ ఏడు రోడ్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియను చేపట్టింది. ప్రాంతం కి.మీ. వ్యయం(రూ.కోట్లలో) దివీస్ రోడ్ (చిప్పాడ) 6.45 36,93 నేరెళ్లవలస 3.90 19,74 బోయపాలెం రోడ్ 3.10 8,92 గంభీరం రోడ్–1 1.46 5,69 గంభీరం రోడ్–2 2.18 14,73 శివశక్తినగర్ రోడ్ 1.67 7,77 అడవివరం శొంఠ్యాం రోడ్ 8.03 60,82 మొత్తం 26.77 రూ.154.60 కోట్లుఏడాదిలో పూర్తికి కసరత్తు ఈ మాస్టర్ప్లాన్ రహదారుల్లో భాగంగా చిప్పాడ–పోలిపల్లి (దివీస్ రోడ్డు), నేరెళ్లవలస–తాళ్లవలస, బోయపాలెం–మంగమారిపేట, పరదేశిపాలెం–గంభీరం, గంభీరం–గంభీరం హైవే, శివశక్తినగర్–హరిత ప్రాజెక్ట్స్, అడవివరం జంక్షన్–గండిగుండం రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయ్యే సమయానికి వీటిని సిద్ధం చేయాలన్న లక్ష్యంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విశాఖ నుంచి ఎయిర్పోర్టుకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా సునాయాసంగా రాకపోకలు సాగించడానికి అనువుగా ప్రత్యామ్నాయ రోడ్లను తీర్చిదిద్దనున్నారు. వీటితో పాటు జీవీఎంసీ, ఆర్అండ్బీ కూడా ఇతర రహదారుల నిర్మాణాలకు సమాయత్తమవుతున్నాయి. -
కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల స్వీకరణ: జేసీ
ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి కేజీహెచ్లో ఏఎన్ఎంగా ఉద్యోగం కోల్పోయానని, తనకు న్యాయం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ను దివ్యాంగురాలు నాగమణి వేడుకున్నారు. దివ్యాంగురాలిని కావడంతో ఉద్యోగం ఎవరూ ఇవ్వడం లేదని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఏపీ పారామెడికల్ బోర్డు ద్వారా శిక్షణ పొంది, ఏఎన్ఎం పోస్టుకు తాను అర్హురాలినని నాగమణి తెలిపారు. కేజీహెచ్లో పనిచేసిన తనను నిధులు లేవని తొలగించారని వివరించారు. తన భర్త అనారోగ్యంతో మంచంపై ఉన్నారని, ఇద్దరు పిల్లలతో తన జీవితం భారంగా సాగుతోందని చెప్పారు. ప్రస్తుతం పింఛనుతోనే కుటుంబాన్ని పోషిస్తున్నానని, గతంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో దరఖాస్తు చేసినా స్పందన లేదని, ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. మహారాణిపేట: జిల్లాలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోందని, అర్హులైన ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కోరారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు, రేషన్ కార్డుల విభజన, కొత్త సభ్యుల చేరిక, తప్పుగా నమోదైన ఆధార్ నంబర్ సవరణ, చిరునామా మార్పులు, ఇతర వివరాల సవరణ, మరణించిన వారి పేర్ల తొలగింపు, వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపు, కార్డులు సరెండర్ చేయడం వంటి ఆరు రకాల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అనాథాశ్రమాల్లో ఉండే వృద్ధులు కూడా రేషన్ కార్డులు లేకపోతే దరఖాస్తు చేసుకోవచ్చని జేసీ మయూర్ అశోక్ స్పష్టం చేశారు. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత జూన్ నెలలో క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారుల చిరునామాకు పంపడం జరుగుతుందని ఆయన వివరించారు. -
ఎన్నిసార్లు ఫిర్యాదు చేయాలి
జీవీఎంసీ జోన్–2 పరిధిలోని మధురవాడలో ప్రభుత్వ పార్కు స్థలాలు కబ్జాకు గురై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏడవ వార్డు బొట్టవానిపాలెం ఈడబ్ల్యూఎస్ లేఅవుట్, స్వతంత్ర నగర్లో సుమారు మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన జీవీఎంసీ పార్కులో 150 గజాల స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆలయం పేరుతో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ఈ నెల 5న జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈ నెల 19న జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించగా, సమస్య పరిష్కారమైనట్లు మెసేజ్ వచ్చింది. కానీ వాస్తవంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అదే విధంగా, ఏడో వార్డులోని కళానగర్, కృష్ణ నగర్ పార్కులు, స్వతంత్ర నగర్లోని బ్రహ్మంగారి గుడి ఎదురుగా ఉన్న మరో జీవీఎంసీ పార్కు స్థలాలు కూడా కబ్జాకు గురై, అనధికారికంగా కరెంటు మీటర్లు కూడా ఏర్పాటు చేశారు. జోనల్ కమిషనర్ ఆక్రమణదారులకు మద్దతు పలుకుతున్నారు. కబ్జాలను అరికట్టి, ప్రభుత్వ పార్కు స్థలాలను కాపాడాలి. –రజిని, సామాజిక కార్యకర్త -
ఇంతేనా...!
అంతాభ్రాంతియేనా...అర్జీల గతి ● అర్జీ సమర్పించినా పరిష్కారం కాని సమస్యలు ● పరిష్కారం కాకుండానే పరిష్కరించినట్టు మెసేజ్లు ● కాళ్లరిగేలా తిరుగుతున్న అర్జీదారులు ● ప్రజలతో కూటమి ప్రభుత్వం ఆటలు ● పీజీఆర్ఎస్ అంతా డిజిటల్ మాయ అంటూ బాధితుల గగ్గోలు పీజీఆర్ఎస్: ‘పరిష్కారం’ అనే భ్రమ కలెక్టరేట్ మెట్లు : సమస్యల ‘తిరుగు ప్రయాణం’ మొదలయ్యే చోటు అర్జీ..: ‘క్లోజ్డ్’ అని కనిపించినా, సమస్య మాత్రం ‘ఓపెన్’లోనే.. ఆహా! ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అద్భుతాలు ఇవి.. ప్రతి సోమవారం కలెక్టరేట్ మెట్లు ఎక్కే భాగ్యం సామాన్య ప్రజలకు కల్పిస్తూ, వారి సమస్యలకు ‘శాశ్వత పరిష్కారం’ చూపే అద్భుతమైన వేదిక ఇది. వినతులు ఇచ్చి, అవి పరిష్కారం కాకుండానే ‘పరిష్కారమైపోయినట్లు’ రికార్డుల్లో చూసి, కంగుతిని మళ్లీ మళ్లీ కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేసే అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి హ్యాట్సాఫ్!. పీజీఆర్ఎస్ ఓ అంతులేని ప్రహసనం.. ప్రతి సోమవారం కలెక్టరేట్ గేటు దగ్గర ఒక పండగ వాతావరణం. జన సందోహం, ఆశలు చిగురించిన మొహాలు. పీజీఆర్ఎస్కు వచ్చామంటే సమస్య తీరినట్లే అనే భరోసా. కానీ లోపల జరిగే తతంగం మాత్రం వేరు. ఫిర్యాదు ఇచ్చామా, అది ఓపెన్ అయ్యిందా, అధికారులు చూశారా అనే కన్నా, ‘పరిష్కారమైపోయింది’ అని స్టేటస్ మారడం ముఖ్యమని అధికార యంత్రాంగం నిరూపిస్తోంది. సమస్య అలాగే ఉన్నా, కాగితాలపై మాత్రం క్లోజ్ ! ఇది కదా అసలైన ‘డిజిటల్ ఇండి యా’ అంటే!..‘గత సోమవారం ఇదే సమస్య ఇచ్చానండి, పరిష్కారం కాలేదు. మళ్లీ వచ్చాను’ అని చెప్పే నిస్సహాయుల మాటలు కలెక్టరేట్ గోడలు కూడా వింటున్నాయి. అయినా అధికారులకు మాత్రం వినిపించవు. ఎందుకంటే, వారికి కనిపించేది స్క్రీన్ మీద ‘క్లోజ్డ్’ అని. సమస్య తీరకపోయినా, అది తీరినట్లు నమోదు చేయడం అనేది ఒక వినూత్నమైన ఆవిష్కరణ. దీని వల్ల ప్రజల ఆత్మస్థైర్యం పెరుగుతుందేమో ! మళ్లీ మళ్లీ పోరాడాలనే స్ఫూర్తి వస్తుందేమో!.. సమస్య పరిష్కారం కాలేదని తెలిసి లబోదిబోమంటూ, ‘నా సమస్య ఎలా పరిష్కారం అయినట్లు?’ అని అడిగే ఫిర్యాదుదారులను చూస్తే, అధికారులు ఆశ్చర్యపోతారు. బహుశా వారికి తెలియదేమో, కాగితాలపై పరిష్కారం అయితే, నిజంగానే సమస్య తీరిపోతుందని! ఈ ‘షాక్ థెరపీ’తోనైనా ప్రజలు తమ సమస్యల గురించి ఆలోచించడం మానేస్తారేమో..!ఏదేమైనా, పీజీఆర్ఎస్ అనేది నిరంతరాయంగా కొనసాగే ఓ ప్రహసనం. ప్రజల ఓర్పుకు, అధికారుల ‘సామర్థ్యానికి’ అద్దం పడుతోంది. మళ్లీ వచ్చే సోమవారం కొత్త ఆశలతో, పాత సమస్యలతో ఎంతమంది కలెక్టరేట్ మెట్లెక్కుతారో చూడాలి. –మహారాణిపేట -
పార్టీ కోసం కష్టపడేవారికే కమిటీల్లో చోటు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ బలోపేతానికి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ మండల, వార్డు కమిటీల్లో అవకాశం కల్పిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మండల, వార్డు కమిటీలపై పార్టీ సీనియర్ నాయకులు, వార్డు అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. వార్డుల వారీగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే యువతకు అవకాశం కల్పించేలా వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. విశాఖ ఉత్తర, దక్షిణ, విశాఖ పశ్చిమ, విశాఖ తూర్పు, గాజువాక నియోజకవర్గాల నుంచి పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. నియోజకవర్గాల్లోని వార్డుల వారీగా ప్రతి ఒక్కరితో మాట్లాడి, పార్టీ కోసం పనిచేసి కూడా ఇప్పటివరకు పదవులు రాని కార్యకర్తల పేర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ కమిటీల నిర్మాణంపై చర్చించారు. కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ నేతలు స్వాతి దాస్, పేడాడ రమణికుమారి, పీలా వెంకటలక్ష్మీ, సీహెచ్ లావణ్య, నీలి రవి, బి. పద్మావతి, మంచ నాగ మల్లేశ్వరి, జీలకర్ర నాగేంద్ర, గుండుపల్లి సతీష్, భీశెట్టి ప్రసాద్, చొక్కర శేఖర్, వరలక్ష్మీ, రాఘవులు, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి శిక్షణ తరగతులు ప్రారంభం
డాబాగార్డెన్స్: యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ, హైదరాబాద్) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ద్వారకా బస్టేషన్ కాంప్లెక్స్ సమీపంలోని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తరగతులు ప్రారంభించారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి సాలిడ్ వర్క్స్లో 30 మందికి, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ విభాగంలో 30 మందికి శిక్షణ తరగతులు ప్రారంభించినట్టు ‘స్కిల్’ ఇన్స్టిట్యూట్ సీఈవో ఇంతియాజ్ అర్షద్, సీఐటీడీ డిప్యూటీ డైరెక్టర్ వెంకట కృష్ణ తెలిపారు. నెల రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందని, ఇంజినీరింగ్ డిప్లమో, బీటెక్/ఎంటెక్ చివరి సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్షిప్ అందిస్తామన్నారు. అలాగే స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్ డిప్లమో, బీటెక్/ఎంటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ శిక్షణ(కోర్సును బట్టి) నెల, మూడు నెలలు, ఆరు నెలలు ఉంటుందని, ఇప్పటికే ఉపాధి పొందుతున్న వారు కూడా వారి నైపుణ్యాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించే వ్యక్తులకు తర్ఫీదు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 79950 14167లో లేదా www.sdivisakh.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు. -
జీవీఎంసీకి 58 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) తూతూమంత్రంగా సాగింది. కార్యక్రమంలో మేయర్ పీలా శ్రీనివాసరావు పాల్గొనలేదు. అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి 58 వినతులు స్వీకరించారు. జీవీఎంసీ పరిపాలన, ఖాతాల విభాగానికి 7, రెవెన్యూ విభాగానికి 9, ప్రజారోగ్య విభాగానికి 6, పట్టణ ప్రణాళికా విభాగానికి 25, ఇంజినీరింగ్ విభాగానికి 9, మొక్కల విభాగం, యూసీడీ విభాగానికి ఒక్కో ఫిర్యాదు అందింది. కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావు, ఫైనాన్స్ అడ్వైజర్ మల్లికాంబ, పర్యవేక్షక ఇంజినీర్లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఫుట్పాత్ ఆక్రమణలపై చర్యలేవి? : జీవీఎంసీ 33, 34, 35 వార్డుల్లో ఫుట్పాత్ ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయని, దీని వల్ల పాదాచారులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని ఆయా వార్డులకు చెందిన పలువురు అదనపు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఫుట్పాత్లను ఆక్రమించడమే కాకుండా రోడ్లపై ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయనివ్వడం లేదని.. ఈ విషయాన్ని సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించడం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. అధికారులు స్పందించి ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించాలని కోరారు. అపరిష్కృతంగా మంచినీటి సమస్య రైల్వే న్యూకాలనీలో నివాసం ఉంటున్న తనకు మంచినీటి కుళాయి కనెక్షన్ విషయంలో అన్యాయం జరిగిందని గుళ్ల కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తనది నివాస ప్రాంతమైనప్పటికీ, కమర్షియల్ ట్యాక్స్ విధిస్తున్నారని, 2016–2017 నుంచి ఇప్పటి వరకు అధికారుల చుట్టూ తిరుగుతున్నానని తెలిపారు. కమర్షియల్ నుంచి డొమెస్టిక్గా మార్చినప్పటికీ, ఇప్పటివరకు పాత బిల్లును సరిచేయలేదని అదనపు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల పరిధిలో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. -
మొక్కలు నాటి సంరక్షించండి
కొమ్మాది: ప్రతి ఒక్కరూ ‘తల్లికి వందనం’పేరుతో మొక్కలు నాటి వాటిని జాగ్రత్తగా పెంచాలని ఎన్సీసీ 13 బెటాలియన్ ఎల్టీ కల్నల్, కమాండింగ్ అధికారి నీరజ్కుమార్ పిలుపునిచ్చారు. రుషికొండలోని గాయత్రి విద్యా పరిషత్ వద్ద సోమవారం నిర్వహించిన ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పర్యావరణం దెబ్బతినడం వల్ల జరుగుతున్న అనర్థాలను క్యాడెట్లకు వివరించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొంతకాలానికి వర్షాలు లేక తాగడానికి నీరు దొరకని పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ అవకాశం మేరకు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. శిక్షణ పొందుతున్న 600 మంది క్యాడెట్లు ఒక్కొక్కరు కనీసం పది మొక్కలు నాటాలని సూచించారు. నిషేధిత ప్లాస్టిక్ను వినియోగించవద్దని, ఈ విషయంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం, ఎన్సీసీ డిప్యూటీ క్యాంప్ లెఫ్టినెంట్ కల్నల్ స్వర్నిం, సుబేదార్ మేజర్ శ్రీనివాస్, ఎన్సీసీ అధికారులు కెప్టెన్ అనంత్ భాస్కర్, కెప్టెన్ కల్యాణ్ అశోక్, కెప్టెన్ ఉమానాగేశ్వరి పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు బీభత్సం
గాయపడిన వ్యక్తి బంగారు ఉంగరాల చోరీ ఆరిలోవ: విజయనగరం నుంచి కూర్మన్నపాలెం వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సు సోమవారం మధ్యాహ్నం హనుమంతవాక కూడలి వద్ద బీభత్సం సృష్టించింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు కార్లు, ఒక ద్విచక్ర వాహనం పాక్షికంగా దెబ్బతిన్నాయి. ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఆరిలోవ ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును, దెబ్బతిన్న ఇతర వాహనాలను రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ సబ్బి రాజుపై లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇదిలా ఉండగా ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సంబంధించిన రెండు బంగారు ఉంగరాలు చోరీకి గురయ్యాయి. ఘటనా స్థలంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రధానార్చకుడిగా సీతారామాచార్యులకు పదోన్నతి
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ప్రధానార్చకుడు–2గా కరి సీతారామాచార్యులు పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఉప ప్రధానార్చకులుగా ఉన్న ఆయన పురోహిత్ అలంకారిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్వామి ఆర్జిత సేవలు, నిత్య సేవలు, ప్రముఖ ఉత్సవాల రోజుల్లో వైదికపరంగా సీతారామాచార్యులు సేవలు కీలకం. స్వామివారి ఉత్సవమూర్తుల వస్త్రాలంకరణలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. పాంచరాత్ర ఆగమశాస్త్ర పండితుడిగా పేరుప్రఖ్యాతులు గడించారు. ఆయన ప్రధానార్చకుడిగా పదోన్నతి పొందడంతో ఖాళీ అయిన ఉప ప్రధానార్చకుడి పోస్టును త్వరలో భర్తీచేయనున్నారు. -
ఆన్లైన్ చిక్కులు.. గురువులకు తిప్పలు
విశాఖ విద్య: టీచర్ల బదిలీల్లో ఆన్లైన్ దరఖాస్తులు ఓ ప్రహసనంగా మారాయి. సర్వీసు పరమైన వివరాలు సవ్యంగా నమోదుకాక తీవ్రంగా నష్టపోతున్నారు. దరఖాస్తు సమయంలో వెబ్సైట్లో చూపిస్తున్న వివరాలకు భిన్నంగా ఫైనల్ జాబితాలో చూపిస్తుండటంతో ఏ మారుమూలకు కొట్టుకుపోతామోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఖాళీలపై స్పష్టతేదీ? బదిలీల నేపథ్యంలో క్లియర్ వేకెన్సీ, 5/8 లాంగ్స్టాండింగ్ వేకెన్సీల ప్రకటనలో జిల్లా విద్యాశాఖ నుంచి ఇప్పటికీ స్పష్టత లేదు. తొలుత 4,788 ఖాళీలు ప్రకటించారు. ఆ తర్వాత 4,811గా బయటకు లీకులిచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మళ్లీ దీనిపై కసరత్తు చేశారు. ఇదంతా తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది యూపీ స్కూళ్లలో పోస్టులు మాయం ప్రాథమికోన్నత(యూపీ) పాఠశాలల్లో పోస్టుల కోతను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల కోరిక మేరకు, డిమాండ్ ఉన్న చోట యూపీ స్కూళ్లను కొనసాగిస్తున్నట్లు చెప్పిన కూటమి ప్రభుత్వం, లోపాయికారీగా వాటిని నిర్వీర్యం చేస్తోంది. కొత్తగా జిల్లా విద్యాశాఖ చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియ ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. మోడల్ స్కూల్ హెచ్ఎంలు ఎవరో..? ఉమ్మడి విశాఖ జిల్లాలో 565 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. రేషనలైజేషన్లో భాగంగా మిగిలిన 277 మంది స్కూల్ అసిస్టెంట్లను వీటికి హెచ్ఎంలుగా నియమిస్తామని తొలుత ప్రకటించారు. కానీ, బదిలీల సమయంలో దీనిపై స్పష్టత లేకపోవటంతో అంతా అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ల బదిలీ దరఖాస్తుకు ఆదివారంతో గడువు ముగిసింది. త్వరలోనే వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. దీనిపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవటంతో సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాబితాల తయారీకి తలనొప్పులు బదిలీల నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు వెబెక్స్ సమీక్షల పేరుతో రోజుకో ఆదేశం ఇస్తున్నారు. ఆ మేరకు సీనియార్టీ జాబితాలను తయారు చేసేందుకు జిల్లా విద్యాశాఖ సిబ్బంది తర్జనభర్జనలు పడుతున్నారు. క్షణానికో ఉత్తర్వుతో కేడర్ల వారీగా జాబితాల నమోదులో జాప్యం నెలకొంటోంది. దీంతో సాంకేతిక సమస్యల పరిష్కారం పేరిట నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. దీని వల్లనైనా తమ ఇబ్బందులు పరిష్కరిస్తే చాలని గురువులు కోరుకుంటున్నారు. కొనసాగుతున్న బదిలీల గందరగోళం సర్వీస్ పాయింట్ల లెక్కతేలక అయోమయం సాంకేతిక సమస్యలతో దరఖాస్తుకు ఇబ్బందులు -
నేత.. మేత
వ్యర్థాల● రూ.కోట్లు కొల్లగొడుతున్న ఓ చోటానేత ● అనధికారికంగా సేకరిస్తున్న ఓ జనసేన ఎమ్మెల్యే అనుచరుడు ● ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని జీవీఎంసీ అధికారులు ● నెలవారీ మామూళ్లతో చెట్టాపట్టాలు ● పట్టుకున్న వాహనాలను వదిలేస్తున్న సిబ్బంది బెదిరిస్తూ.... బలవంతంగా! చికెన్ వ్యర్థాలతో చెడుగుడు అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు ఈ వ్యవహారంపై ఇప్పటికే పలు ఫిర్యాదులు ఉన్నప్పటికీ, జనసేన ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరిస్తుండటంతో అధికారులు మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, ఈ వ్యర్థాలతో పెంచిన రొయ్యలు, చేపలను ప్రజలు తినడం ద్వారా అనేక రోగాల బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, జీవీఎంసీలోని ప్రజారోగ్య విభాగ అధికారులు ఈ చికెన్ వ్యర్థాల అక్రమ తరలింపును చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నంలో చికెన్, మటన్ వ్యర్థాల అక్రమ తరలింపు వివాదాస్పదంగా మారింది. జీవీఎంసీ 8 జోన్లకు వ్యర్థాల సేకరణకు టెండర్లు కేటాయించినా, కూటమి నేతల పేరుతో కొందరు వ్యక్తులు అక్రమంగా వ్యర్థాలను సేకరిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలోని షాపుల నుంచి వ్యర్థాలను సేకరించి కాపులుప్పాడకు తరలించాల్సి ఉండగా, వీరు తూర్పుగోదావరితో పాటు అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట, యలమంచిలి, మాడుగుల నియోజకవర్గాల్లోని చేపలు, రొయ్యల చెరువులకు తరలిస్తున్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు. పది మంది యువకులతో మూడు బొలెరో వాహనాల్లో బెదిరింపులకు పాల్పడుతూ వ్యర్థాలను సేకరిస్తున్నారని ఆరోపణలున్నాయి. జీవీఎంసీ ప్రజారోగ్య విభాగ అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ, జనసేన, టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. జీవీఎంసీలోని ఓ అధికారికి నెలవారీగా భారీగా ముట్టచెబుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. చికెన్ వ్యర్థాలతో పెంచిన రొయ్యలు, చేపలు తినడం వల్ల అనేక రోగాలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, ప్రజారోగ్య విభాగ అధికారులు ఈ అక్రమ తరలింపును చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం విశాఖ చికెన్, మటన్ వ్యర్థాల అక్రమ తరలింపు జోరుగా సాగుతోంది. అక్రమంగా, అనుమతి లేకుండా జీవీఎంసీ పరిధిలో ఈ వ్యర్థాలను తరలిస్తున్నారంటూ ఫిర్యాదులు రావడంతో జీవీఎంసీ అధికారులు కొన్ని వాహనాలను పట్టుకున్నారు. అయితే, ఆశ్చర్యకరంగా ఈ వాహనాలను సీజ్ చేయకుండా, కేసు నమోదు చేయకుండా వదిలేసినట్లు తెలుస్తోంది. దీనికి కూటమి ఎమ్మెల్యే అండదండలే కారణమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కోరాడ సాయి సుదర్శన్పై ఆరోపణలు విశాఖ సిటీలోని ఓ జనసేన ఎమ్మెల్యే అనుచరుడని చెప్పుకుంటున్న కోరాడ సాయి సుదర్శన్ ఈ వ్యవహారం వెనుక ఉన్నట్లు ఆరోపణలున్నాయి. లాసన్స్ బే కాలనీలో నివసించే సదరు వ్యక్తి, తన వెంట పది మంది యువకులను పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ షాపుల నుంచి అనధికారికంగా చికెన్ వ్యర్థాలను సేకరిస్తున్నాడు. మూడు బొలెరో వాహనాల ద్వారా ఈ వ్యర్థాలను తూర్పు గోదావరి జిల్లాలోని రొయ్యల చెరువులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ విధంగా కోళ్ల వ్యర్థాలతో కోట్లు గడిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం...! జీవీఎంసీ పరిధిలో చికెన్ వ్యర్థాల అక్రమ తరలింపు దందా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. ఈ వ్యర్థాలను సేకరిస్తున్న ముఠా వాటిని అధిక ధరలకు చేపలు, రొయ్యల చెరువులకు తరలిస్తోంది. ఈ వ్యర్థాలను మేతగా వేయడం వల్ల చేపలు, రొయ్యలు త్వరగా బరువు పెరుగుతాయని, మేత ఖర్చు కూడా తగ్గుతుందని చెరువుల యజమానులు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. జీవీఎంసీ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని అక్కడికక్కడే తొక్కేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ దందా జరుగుతున్నప్పటికీ, జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం, మత్స్యశాఖ, పోలీసుశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కాపులుప్పాడలో నిర్ణీత మొత్తంలో చికెన్ వ్యర్థాలు వస్తున్నాయా లేదా అని పరిశీలించాల్సిన అధికారులు కూడా ఇందులో భాగస్వామ్యమై తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారని తెలుస్తోంది. చికెన్ వ్యర్థాలను తిన్న చేపలు, రొయ్యలను మనం తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అధ్యయనాల ప్రకారం, ఇటువంటి వ్యర్థాలను తిన్న రొయ్యలు, చేపలను తినడం వల్ల కాలేయ, జీర్ణకోశ సమస్యలు, న్యూరో సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా, పేగులో పుండ్లు, మలబద్ధకం, పైల్స్ వంటి వ్యాధులు, ముఖ్యంగా మహిళల్లో నెలసరి సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి రోగాలకు కూడా ఇది కారణమవుతుందని తేలింది. ఈ వ్యర్థాలను నిల్వ ఉంచే ప్రాంతంలో గాలిలో వైరస్ వ్యాపించి, ఆ గాలి పీల్చితే శ్వాసకోశ సంబంధ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లే ఈ వ్యవహారంపై ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యర్థాల -
చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్లో ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన సమీర్(26) నీటిలో మునిగి చనిపోయాడు. మారికవలసకు చెందిన సమీర్కు ఈత రాదు. అయితే ఐదుగురు వ్యక్తులతో కలిసి రిజర్వాయర్లో దిగిన సమీర్ ఈ ప్రమాదానికి గురయ్యాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు తాళ్లవలస అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమీర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన తండ్రి ఫిర్యాదు మేరకు ఆనందపురం సీఐ వాసునాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్సాహంగా యోగాంధ్ర
ఏయూక్యాంపస్: అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహకంలో భాగంగా నిర్వహిస్తున్న నెలరోజుల కార్యక్రమాలు ఆదివారం కూడా కొనసాగాయి. బీచ్రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా పతంజలి సంస్థ ఆధ్వర్యంలో యోగా సాధన కార్యక్రమం జరిగింది. వేదికపై నుంచి శిక్షకుల పర్యవేక్షణలో నగరవాసులు యోగాసనాలు వేశారు. జూన్ 21న విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. -
నాణెం.. చరిత్రకు సాక్ష్యం
తగరపువలస: జీవీఎంసీ ఒకటో వార్డు చిట్టివలసకు చెందిన రంగూరి గిరిధర్ ఇంట కాలచక్రంలో కరిగిపోని ఓ అపురూప నిధి ఉంది. అది బంగారం, వజ్రాలు కాదు.. వందలాది పాతకాలపు నాణేలు, పదుల సంఖ్యలో అప్పటి కరెన్సీ నోట్లు! అవును.. ఇవి చరిత్రకు సజీవ సాక్షాలు. గిరిధర్ వద్ద భద్రంగా ఉన్న ఈ నాణేలన్నీ ఒకప్పటి మన జీవన విధానానికి, ఆర్థిక వ్యవస్థకు అద్దం పడతాయి. వీటిలో అణా, ఒక పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు, ఇరవై, ఇరవై ఐదు, యాభై పైసల నాణేలున్నాయి. ఆనాటి అవసరాలకు అనుగుణంగా అల్యూమినియం, ఇత్తడి, కంచు వంటి లోహాలతో తయారైన ఈ నాణేలు చూడటానికి చిన్నవే అయినా.. అవి మోసుకొచ్చిన చరిత్ర ఆసక్తికరం. ఈ నాణేలు ఇప్పుడు చలామణిలో లేకపోవచ్చు. కానీ వాటి విలువ ఏమాత్రం తగ్గలేదని గిరిధర్ చెబుతున్నారు. నిజమే.. వీటి చారిత్రక, సాంస్కృతిక విలువ వెలకట్టలేనిది. పూర్వం చాలా మంది ఇలాంటి పాత నాణేలను ఇచ్చి వెండి వస్తువులు కొనుగోలు చేసేవారని, ఆ లెక్కన చూసుకున్నా ఇప్పటికీ ఈ లోహపు నాణేలకు విలువ ఉంటుందని కొందరు అంటుంటారు. కానీ గిరిధర్ కుటుంబానికి మాత్రం ఈ నాణేలను అలా మార్చుకోవడం ఇష్టం లేదు. వీటిని చూస్తూ మురిసిపోతుంటుంది. నాణేల వెనుక కథలు.. ఈ నాణేల వెనుక ఉన్న కథలను, అప్పటి వాటి కొనుగోలు శక్తిని తన తల్లిదండ్రులు అరుణకుమారి, ప్రసాదరావు వివరిస్తుండేవారని గిరిధర్ చెబుతున్నారు. ఒక అణాతో ఏమేమి కొనుగోల చేశాం? ఒక పైసా విలువ ఎలా ఉండేది? వంటి విషయాలు వారి మాటల్లో వింటుంటే ఆ కాలంలోకే వెళ్లినట్టు అనిపించేదని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు గిరిధర్ కూడా తన తర్వాతి తరాలకు ఈ నాణేలను చూపిస్తూ.. వాటి గొప్పతనాన్ని, మన పూర్వీకుల జీవన విధానాన్ని వివరిస్తున్నారు. ఈ నాణేల చప్పుడులో ఒకప్పటి చరిత్ర ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. నాన్న జ్ఞాపకం ఈ నాణేలు మా నాన్న ప్రసాదరావు భీమిలి మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్. ఆయనకు స్వదేశీ, విదేశీ నాణేలు సేకరించడం హాబీగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం, రాజుల పాలనతో నాణేలు కూడా ఉండేవి. పదేళ్ల కిందట ఆయన మరణించడం, ఇల్లు మారడంలో చాలా వరకు నాణేలు కనిపించకుండా పోయాయి. ఇప్పుడు ఉన్న విలువైన వీటిని పదిలం చేసుకున్నాం. – రంగూరి గిరిధర్, చిట్టివలస -
నేడు ‘ఉక్కు’ చర్చలు
ఉక్కునగరం: కేంద్ర కార్మిక శాఖ రీజనల్ లేబర్ కమిషనర్(ఆర్ఎల్సీ) సోమవారం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు, ఉక్కు యాజమాన్యం, కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 16న జరిగిన చర్చలు విఫలం కావడంతో సమావేశాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 20 నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తుండటంతో ఈ చర్చలు కీలకంగా మారనున్నాయి. ఈ సమావేశంలో యాజమాన్యం తీసుకునే నిర్ణయంపై అంతటా ఆసక్తి నెలకొంది. గ్రాస్ రూట్స్ ఫుట్బాల్ డే విజేత శ్రీకాకుళం తగరపువలస: మధురవాడలోని శాప్ గ్రౌండ్లో ఈ నెల 23న గ్రాస్ రూట్స్ డే సందర్భంగా నిర్వహించిన ఫుట్బాల్ టోర్నమెంట్–2025లో శ్రీకాకుళం ఫుట్బాల్ క్లబ్ జట్టు విజేతగా నిలిచింది. అండర్ బాయ్స్ జట్టు రన్నరప్ సాధించింది. ఉత్తరాంధ్ర జోనల్ అండర్–14 బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్లో మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ఆదివారం ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీవో జూన్ గాలియట్, లోసో సుష్మిత, రాకేష్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ నరసింహారెడ్డి, జిల్లా ఒలింపిక్స్ ఎగ్జిక్యూటివ్ శరత్, వీడీఎఫ్ కార్యదర్శి అక్కరమాని చినబాబు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఎస్జీ రామకృష్ణ, స్టార్ ఫెక్స్ సన్నిబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
కంటి క్యాన్సర్పై అవగాహన అవసరం
ఏయూక్యాంపస్: కంటి క్యాన్సర్పై అవగాహనకల్పిస్తూ ఎల్.వి ప్రసాద్ నేత్ర వైద్య శాల ఆధ్వర్యంలో బీచ్రోడ్డులో ఆదివారం వైటాథాన్ కార్యక్రమం జరిగింది. ముందుగా ఆర్.కె బీచ్ నుంచి వైఎంసీఏ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎంఆర్ వరలక్ష్మి క్యాంపస్ ముఖ్య వైద్యుడు డాక్టర్ వీరేంద్ర సచ్దేవ రెటినోబ్లాస్టోమా(కంటి క్యాన్సర్) లక్షణాలను వివరించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా సమాచారం పొందిన వ్యక్తులు.. ఆ వివరాలను ఇతరులతో పంచుకోవాలని సూచించారు. తద్వారా కంటి దృష్టిని, ప్రాణాన్ని కాపాడటం సాధ్యపడుతుందన్నారు. పిల్లల కంటిలో తెల్లని ప్రతిబింబం కనిపించిన వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచించారు. వైటాథాన్ ద్వారా సేకరించిన నిధులను ఆర్థికంగా వెనుకబడిన పిల్లల్లో రెటినోబ్లాస్టోమా చికిత్సను ఉపయోగిస్తామని తెలిపారు. మూడేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులను ఎక్కువగా ప్రభావితం చేసే కంటి వ్యాధి రెటినోబ్లాస్టోమా అని అన్నారు. మెల్లకన్ను, ఎరుపెక్కిన కళ్లు, వాచిన కనురెప్పలు, ఉబ్బిన కళ్లు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కంటి వైద్య నిపుణులను సంప్రదించాలని సూచించారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, నగరవాసులు పాల్గొన్నారు. ముందుగా కాళీమాత ఆలయం వద్ద కంటి క్యాన్సర్కు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. -
జర్నలిస్ట్లు సమాజ ప్రగతి సాధకులు
బీచ్రోడ్డు: జర్నలిస్టులు సమాజ ప్రగతి సాధకులని, వారి వల్లే ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం లభిస్తోందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు అన్నారు. వైజాగ్ మీడియా అవార్డ్స్, స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, భవిష్యత్తులో అపారమైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. ఏయూ రిజిస్ట్రార్ ఎన్.ధనుంజయరావు మాట్లాడుతూ నేటి విద్యార్థులు రేపటి ఆశాకిరణాలని, ఉన్నత విద్యతో వారు కోరుకున్న ఉపాధి అవకాశాలు పొందవచ్చని తెలిపారు. అవార్డు, ఉపకారవేతనాల నిర్వాహక కమిటీ చైర్మన్ గంట్ల శ్రీనుబాబు, చీఫ్ ఆర్గనైజర్ ఆర్.నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ ఎంబీఏ, ఎంబీబీఎస్, ఎంఎల్, బీఎల్, నర్సింగ్, ఇంజినీరింగ్ చదువుతున్న 33 మందికి, క్రీడలు, సంగీతం వంటి విభాగాల్లో 11 మందికి ప్రతిభా పురస్కారాలను అందజేసినట్లు తెలిపారు. ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు అత్యధిక మార్కులు సాధించిన 126 మంది జర్నలిస్టుల పిల్లలకు స్కాలర్షిప్లు పంపిణీ చేశామన్నారు. ప్రముఖ సంఘ సేవకుడు కమల్ బెయిద్, బెహరా భాస్కరరావు, స్థిత ప్రజ్ఞ ఫౌండేషన్ చైర్మన్ వై.వి.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
67 మంది కళాకారులకు ఘన సత్కారం
మద్దిలపాలెం: ఆల్ ఇండియా రేడియో ద్వారా గుర్తింపు పొందిన 67 మంది బి–హైగ్రేడ్ కళాకారులను విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సత్కరించారు. అకాడమీ అధ్యక్షుడు ఎం.ఎస్.ఎన్. రాజు, కార్యదర్శి డాక్టర్ గుమ్ములూరి రాంబాబు, కోశాధికారి పైడా కృష్ణప్రసాద్ల చేతుల మీదుగా ఈ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటకం, హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట, జానపద, సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ కళాకారులను విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ప్రోత్సహిస్తుందని తెలిపారు. త్వరలో సన్మానం పొందిన కళాకారులతో వంకాయల వెంకటరమణ మృదంగం గ్లోబల్ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో సన్నాయిలు, డోళ్లతో లయ విన్యాస కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రముఖ గాత్రవిద్వాంసులు డాక్టర్ ద్వారం త్యాగరాజు బృందం అద్భుతమైన గాత్రకచేరి నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పంతులు గోపాలరావు, శారదా సుబ్రహ్మణ్యం కూడా పాల్గొన్నారు. -
బీసీ బాలుర హాస్టల్ ప్రారంభం
పెదగంట్యాడ: విద్యా రంగ అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు సహకారం అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ అన్నారు. జీవీఎంసీ 77వ వార్డు పరిధిలోని ఇస్లాంపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు రూ. 97 లక్షలతో నిర్మించిన బీసీ బాలుర వసతి గృహాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే విద్యా రంగంలో మరింత రాణించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైజాగ్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రవీంద్రనాథ్, బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీదేవి, డీఎస్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
సైనిక్ స్కూల్కు తగరపువలస విద్యార్థి ఎంపిక
తగరపువలస: కోరుకొండ సైనిక్ స్కూల్లో 9వ తరగతిలో ప్రవేశానికి ఇటీవల జరిగిన ప్రవేశ పరీక్షలో జోగావారి వీధికి చెందిన తెడ్లాపు దినేష్ ఎంపికయ్యాడు. ఈ పరీక్షలో 400 మార్కులకు గాను దినేష్ 370 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 108వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం భీమిలి ఐఎన్ఎస్ కళింగలో దినేష్ 8వ తరగతి పూర్తి చేశాడు. తల్లిదండ్రులు నరేంద్రకుమార్, లక్ష్మీదేవి మాట్లాడుతూ చైన్నెలోని నేషనల్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆన్లైన్లో దినేష్కు కోచింగ్ ఇప్పించినట్టు తెలిపారు. -
● ఏనుగమ్మా.. ఏనుగు
పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షించే ఏనుగు ఊరేగింపుగా వెళ్తోంది. అయితే ఇది నిజమైన ఏనుగు కాదు.! కళాకారుల నైపుణ్యానికి అద్దం పట్టేలా వెదురుతో చేసిన ఏనుగు! నగరంలోని ఓ గ్రామ దేవత పండగ కోసం సిద్ధం చేసిన ఈ వెదురు ఏనుగును ‘ఏనుగమ్మా.. ఏనుగు..’ అంటూ ఆదివారం పండగ కమిటీ సభ్యులు తీసుకువెళ్లారు. ఈ దృశ్యం చూపరుల మనసు దోచుకుంది. వెదురు బద్దలు ఉపయోగించి.. ఎంతో ఓర్పుతో.. కళాత్మక దృష్టితో ఈ ఏనుగు నమూనాను రూపొందించడం విశేషం. ఇదికళాకారుల సృజనాత్మకతకు, వారి అంకిత భావానికి నిదర్శనం. –ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
రాజకీయ కుట్రతోనే రేషన్ వెహికల్స్ రద్దు
బీచ్రోడ్డు: కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రకోణంతోనే రేషన్ వాహనాల జీవోను రద్దు చేసిందని వైస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆరోపించారు. ఎండీయూ వాహనాలను కొనసాగించి, తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎండీయూ డ్రైవర్స్, హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్, ఎల్ఐసీ బిల్డింగ్ మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఆదివారం శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. వీరికి మద్దతుగా పాల్గొన్న కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రేషన్ డిపోల వద్ద గంటల తరబడి క్యూలో నిల్చుని, నానా ఇబ్బందులు పడుతున్న పేదల దుస్థితిని చూసే.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటి వద్దకే రేషన్ అందించాలని సరికొత్త వ్యవస్థను రూపొందించారని పేర్కొన్నారు. తద్వారా 20 వేల కుటుంబాలకు ఉపాధి కూడా చేకూరిందన్నారు. ఈ వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పని చేసిందంటే.. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా దీన్ని అమలు చేసేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. ఈ సమయంలో, జగన్మోహన్రెడ్డికి మంచి పేరు వస్తుందనే దుగ్ధతో, కేవలం రాజకీయ కుట్ర కోణంలో ఈ వ్యవస్థను రద్దు చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజలు కూటమి ప్రభుత్వంను అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ రేషన్ వెహికల్స్ ప్రజల్లో తిరిగితే గత వైఎస్సార్సీపీ సుపరిపాలన ప్రజలకు గుర్తుకు వస్తుందనే రద్దు చేశారన్నారు. ఈ వ్యవస్థ రద్దు ద్వారా సుమారు 20 వేల ఎండీయూ ఆపరేటర్స్, హెల్పర్ల కుటుంబాలతో పాటు కోటీ 50 లక్షల లబ్ధిదారులు ఇబ్బందులకు గురవడాన్ని వైఎస్సార్సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబువన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని, ఎవరు మంచి చేసినా ఆయనకు నచ్చదన్నారు. ప్రధాని మోదీ పాకిస్తాన్ ఉగ్రవాదులపై చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ మాదిరిగానే, ఆంధ్రప్రదేశ్లో మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్న చంద్రబాబు పాలనపై ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇంటింటికీ రేషన్ అందించడం ద్వారా 1.5 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చారని, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారని తెలిపారు. చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే ఈ పథకాలను రద్దు చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. పవన్ కల్యాణ్ ఆధీనంలో ఉన్నప్పటికీ ఈ శాఖపై నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. హామీలు అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు, పవన్ కల్యాణ్లు జగన్ చేసిన మంచి పనులను తొలగించడం అవివేకమన్నారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన ర్యాలీలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, కార్పొరేటర్ బిపిన్ జైన్, నాయకులు మార్కండేయులు, బి.పద్మావతి, ఆపరేటర్స్ అసోసియేషన్ నాయకులు ఎన్.బి.సతీష్, స్వామి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబువన్నీ డైవర్షన్ పాలిటిక్సే.. ‘ఎండీయూ’ నిరసన ర్యాలీలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు -
డిగ్రీ కాలేజీల్లో తనిఖీలెప్పుడో.!
● ఉన్నత చదువులపై పర్యవేక్షణ కరువు ● నిబంధనలకు విరుద్ధంగా కళాశాలల నిర్వహణ ● ఎఫిలియేషన్ పేరిట ప్రైవేట్ కాలేజీల నుంచి వసూళ్లు? విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో 196 డిగ్రీ, పీజీ కళాశాలలున్నాయి. వీటి పరిధిలో ఏటా సుమారు 25 వేలకు పైగా విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి కళాశాలల నిర్వహణకు అనుమతులు ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది. విశ్వవిద్యాలయంలోని కాలేజీ డెవలప్మెంట్ కమిటీ (సీడీసీ) ఈ మొత్తం వ్యవహారాలను చూస్తోంది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు, రిజిస్ట్రార్లతో ఈ నెల 28న ఉన్నత విద్యామండలి పెద్దలు సమావేశం ఏర్పాటు చేసినందున.. వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాలపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏయూ అధికారులు విశ్వవిద్యాలయ క్యాంపస్ కళాశాలలతో పాటు అనుబంధ కళాశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. కళాశాలల నిర్వహణకు ఇవి ఉండాల్సిందే.. డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆరు వేలు, పట్టణ ప్రాంతాల్లో ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన పక్కా భవనాలు ఉండాలి. విద్యార్థుల సంఖ్య, నిర్వహించే కోర్సులకు అనుగుణంగా తరగతి గదులు, గ్రంథాలయం, కార్యాలయ గది, స్టాఫ్ రూం, బాలికలకు వెయింటింగ్ రూం, సరిపడా మరుగుదొడ్లు, సైన్సు ప్రయోగాలకు అనువైన ప్రయోగశాలలు ఉండాలి. విద్యార్థులు ఆడుకునేందుకు మైదానం, పార్కింగ్ ప్రదేశం, అర్హత గల అధ్యాపకులు ఉండాలి. కళాశాలల నిర్వాహకులు వీటన్నింటికీ సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఉన్నత విద్యామండలి రూపొందించిన పోర్టల్లో అప్లోడ్ చేయాలి. పరిశీలనకు నిజ నిర్ధారణ కమిటీలు కళాశాల యాజమాన్యాలు పొందుపరిచిన వివరాల మేరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి నియమించిన నిజ నిర్ధారణ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి ఇచ్చిన నివేదిక మేరకు రిజిస్ట్రార్ ధ్రువీకరించి, దానిని వైస్ చాన్సలర్కు నివేదిస్తారు. అన్నీ సక్రమంగా ఉన్న కళాశాలల జాబితాను ప్రవేశాల వెబ్సైట్లో పెట్టేందుకు ఉన్నత విద్యామండలికి పంపిస్తారు. ప్రైవేటు కళాశాలలను కట్టడిచేసే క్రమంలో గత ప్రభుత్వం ప్రవేశాలలో ఆన్లైన్ విధానం తీసుకొచ్చింది. ఇదే రీతిలో 2025–26 విద్యా సంవత్సరం ప్రవేశాల ప్రక్రియకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు కళాశాలల లాబీయింగ్? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రైవేటు కళాశాలల నిర్వాహకులకు రెక్కలొచ్చాయి. మౌలిక వసతులు, అర్హత గల అధ్యాపకులు లేకున్నా విశ్వవిద్యాలయం నుంచి అనుమతులు పొందేందుకు అప్పుడే లాబీయింగ్ బృందం సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. అడిగినంత ఇస్తే, విశ్వవిద్యాలయం నుంచి అఫిలియేషన్ వచ్చేలా తాము చూసుకుంటామని కూటమి నేతలతో అంటకాగే విశ్వవిద్యాలయంలోని ఓ వర్గం వసూళ్లకు తెరలేపినట్లు తెలుస్తోంది. విశాఖ నగరంలోని ద్వారకానగర్లో బీబీఏ, బీసీఏ కోర్సుల పేరుతో కళాశాల నిర్వహిస్తున్నప్పటికీ, ఇక్కడి విద్యార్థులకు వేరే కళాశాలలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే, అకాడమీల పేరుతో దర్జాగా కళాశాలలను నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడలోని ఓ కళాశాలలో ఒడిశాకు చెందిన విద్యార్థులను ఎక్కువగా చేర్పించుకుంటున్నారు. కేవలం పరీక్షలప్పుడే ఈ కళాశాల విద్యార్థులతో కళకళలాడుతోంది. ఇక్కడ విజిటింగ్ అధ్యాపకులతోనే కళాశాల నిర్వహిస్తున్నారనే ప్రచారం ఉంది. ఇవే కాదు.. ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో సగానికి పైగా డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు నిర్వహించే కళాశాలలు ఇదే తీరుగా కొనసాగుతున్నాయి. విశాఖ జిల్లా ఎన్ఏడీ సెంటర్లోని ఓ డిగ్రీ కళాశాల పైఅంతస్తులో రేకుల షెడ్డు వేసి తరగతులు నిర్వహిస్తున్నారు. గాలి, వెలుతురు సరిగా లేవు. కళాశాలలో సరైన వసతులు లేవు. ఇరుకు గదుల్లో పాఠాలు బోధిస్తున్నారు. సైన్సు గ్రూప్ విద్యార్థులు ప్రయోగాలు చేసేందుకు సరైన ప్రయోగశాలలు కూడా లేవు. కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయ అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. -
ప్రశాంతంగా యూపీఎస్సీ పరీక్షలు
మహారాణిపేట: జిల్లాలో ఆదివారం నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (యూపీఎస్సీ)సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ప్రశాంతంగా నిర్వహించారు. ఈ పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం పలు ఏర్పాట్లు చేసింది. మొత్తం 8,422 మంది విద్యార్థులకు కోసం 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి సెషన్ పరీక్షకు 8,422 మందిలో 4,523 మంది పరీక్షకు హాజరయ్యారు. రెండో సెషన్ పరీక్షకు(మధ్యాహ్నం) 8,422 మందికి 4.496 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం ఇద్దరు పరిశీలకులను నియమించారు. యూపీపీఎస్ నుంచి ఒక పరిశీలకుడుగా డైరెక్టర్ పట్నాయక్ను, రాష్ట్ర పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు, జిల్లా కో ఆర్డినేటర్ మయూర్ అశోక్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ స్థానికంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి, ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా దువ్వాడ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీ, అక్కయ్యపాలెం కేంద్రీయ విశ్వవిద్యాలయం కేంద్రాలను ఆయన సందర్శించారు. ఆయన వెంట రెవెన్యూ, పోలీస్, విద్యా శాఖల అధికారులున్నారు. -
సేంద్రియ మామిడి మేళాకు స్పందన
ఆరిలోవ: విశాలాక్షినగర్లోని బీవీకే జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన రెండో విడత సేంద్రియ మామిడి పండ్ల మేళా విజయవంతంగా ముగిసింది. గత వారం రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ మేళాకు విశేషమైన స్పందన రావడంతో.. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ప్రతినిధులు రెండో విడతగా శని, ఆదివారాల్లో మళ్లీ మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళాలో రసాయనాలు వాడకుండా సహజ పద్ధతుల్లో పండించిన వివిధ రకాల మామిడి పండ్లను ప్రదర్శించారు. విశాలాక్షినగర్తో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి మామిడి పండ్లను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి చవ్వాకుల అశోక్ మాట్లాడుతూ సేంద్రియ పద్ధతిలో పండించిన మామిడి పండ్లను ఈ మేళాలో విక్రయించడానికి రైతులు మందుకు రావడం, వినియోగదారులు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేళాలో పంచదార కలిశాలు, కొత్తపల్లి కొబ్బరి, పండూరి మామిడి, స్వాగతం, అమృతం, పాపారాజు గోవా, బంగినపల్లి, సువర్ణరేఖ, చిన్న రసాలు, కొబ్బరి అంటు, ముంత మామిడి, నాగులపల్లి రసాలు, హైదర్ సాయిబు, జహంగీర్ పెద్ద రసాలు, ఇమామ్ పసందు వంటి అనేక రకాల మామిడి పండ్లను రైతులు విక్రయించారు. -
బదిలీలతో ఎంటీఎస్ టీచర్లు బలి..!
విశాఖ విద్య: దశాబ్దాల పోరాటంతో కొలువు దక్కించుకున్నామనే ఆనందం మినిమమ్ టైం స్కేల్(ఎంటీఎస్)తో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎన్నో రోజులు మిగల్లేదు. కొన్నాళ్లు ఏజెన్సీలో పనిచేస్తే ఆ తర్వాత స్వగ్రామాలకు సమీపంలో పోస్టింగ్ ఇస్తామని చెబితే ఉద్యోగాల్లో చేరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారనే ఏకై క కారణంతో కూటమి ప్రభుత్వం విషం కక్కుతోంది. టీచర్ల బదిలీలకు తెరలేపిన ప్రభుత్వం, ఎంటీఎస్ టీచర్లను గాల్లోపెట్టి, వారు పనిచేస్తున్న స్థానాలను ఖాళీలుగా చూపించారు. దీంతో మళ్లీ ఎక్కడికి పోవాలో తెలియక సతమతమవుతున్నారు. న్యాయ చిక్కుల్ని పరిష్కరించి.. న్యాయపరమైన సమస్యల్ని పరిష్కరించి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ–98 సెలక్టెడ్ అభ్యర్థులు 324 మంది, డీఎస్సీ–2008 అభ్యర్థులు 296 మందికి ఎంటీఎస్ ప్రాతిపదికన ఉద్యోగాలిచ్చారు. డీఎస్సీ–2008 వారికి మైదాన ప్రాంతంలోనే పోస్టింగ్లు ఇచ్చారు. డీఎస్సీ–98కి చెందిన 93 మందిని మైదాన ప్రాంతంలో, మిగిలిన 231 మందిని అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ మండలాలకు కేటాయించారు. 98 డీస్సీకి చెందిన వారిలో కొందరు ఇప్పటికే రిటైర్ కూడా అయ్యారు. జీతం మినిమం.. పని మాగ్జిమం రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా ఎంటీఎస్ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నెలకు రూ.32,470లు వేతనం చెల్లిస్తున్నారు. దీంతో సొంత మండలాలు, లేదా సమీప మండలాల్లోని స్కూళ్లలోనే పోస్టింగ్లు ఇవ్వాలని నాటి ప్రభుత్వం ఆదేశించింది. కానీ మైదాన ప్రాంతంలో అన్ని ఖాళీలు లేనందున చాలా మందిని ఏజెన్సీలో నియమించారు. దశల వారీగా వారిని మైదాన ప్రాంతానికి తీసుకురావాలని అప్పటి ప్రభుత్వం విద్యాశాఖాధికారులకు దిశా నిర్దేశం చేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో.. డీఎస్సీ–98 ఎంటీఎస్ టీచర్లను 2023లో కౌన్సిలింగ్ ద్వారా స్కూళ్లు కేటాయించారు. 2024లో ఎక్కడివారినక్కడే రెన్యువల్ చేశారు. ప్రస్తుతం టీచర్ల బదిలీల నేపథ్యంలో 620 ఎంటీఎస్ స్థానాలను ఖాళీలుగా చూపారు. దీంతో రెగ్యులర్ టీచర్లు కోరుకోగా మిగిలిన ఖాళీలు మాత్రమే వీరికి దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో బడులు తెరిచాక.. ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో తెలియని అయోమయంలో ఎంటీఎస్ టీచర్లున్నారు. ఖాళీల జాబితాలో వారు పనిచేస్తున్న స్కూళ్లు మళ్లీ ఏజెన్సీ బాట తప్పదని ఆందోళన భద్రత, కనీస అలవెన్సులకు నోచుకోని వైనం ఉమ్మడి విశాఖలో 620 మంది ఎంటీఎస్ టీచర్లు పోస్టింగ్ ఎక్కడిస్తారో.. మా కుటుంబం ఉండేది విశాఖలోని ఎన్ఏడీ. ప్రస్తుతం అల్లూరి జిల్లాలోని డుంబ్రిగుడ మండలం పరిడి గిరిజన ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్నా. లా చదివినా, ఉపాధ్యాయ వృత్తిపై ఇష్టంతో ఇందులో చేరా. కానీ.. తీసుకొచ్చి ఏజెన్సీలో పడేశారు. ఈ ఏడాదైనా మా జిల్లాలో పోస్టింగ్ ఇస్తారని ఆశగా ఎదురుచూస్తున్నా. – దాట్ల లక్ష్మీదేవి రిటైరయ్యే ముందైనా.. మాది విశాఖ జిల్లా అగనంపూడి. ఆగస్టులో రిటైర్ అయిపోతా. ముంచంగిపుట్ మండలం కెండుగుడ మండల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నా. ఈ ఏడాది పోస్టింగ్ ఎక్కడిస్తారో కూడా తెలియట్లేదు. రెండు నెలల కోసం మళ్లీ మకాం మార్చాల్సిందేనా. కనీసం.. రిటైరయ్యే ముందైనా విశాఖ జిల్లాలో పనిచేసే అవకాశం ఇవ్వాలి. – ఎం.అనిత -
మిస్సింగ్
ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి తియ్యని మాటలకు ప్రే‘మాయ’లో పడిపోయి ఒకరు.. వివాహేతర సంబంధంతో పిల్లలను తీసుకొని మరొకరు.. తల్లిదండ్రులు మందలించారని ఇంకొకరు.. ఇలా విశాఖలో వరుసగా మహిళల అదృశ్య సంఘటనలు కలవరం రేపుతున్నాయి. దాదాపుగా ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట మహిళలు మాయమవుతూనే ఉన్నారు. బాలికల నుంచి వివాహితుల వరకు వయోభేదాలు లేకుండా కనిపించకుండా పోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు.. తిరిగి ఇంటికి చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వీరి కోసం కుటుంబసభ్యులు.. సమీప బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో మిస్సింగ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కేవలం నాలుగు నెలల్లోనే 175 మంది మహిళలు అదృశ్యమైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. విశాఖ సిటీ: విశాఖ నగరంలో మహిళల అదృశ్యాలకు ప్రధానంగా ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలే కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కనిపించకుండా పోయిన యువతుల్లో ఎక్కువ మంది ప్రేమించుకోవడం, ప్రేమికుడిని దక్కించుకోవడం కోసమే ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మధ్య వయస్కులైన మహిళలు కూడా వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాన్ని వదిలి వెళ్తున్నారు. మిస్సింగ్ కేసుల్లో సుమారు 75 శాతం వరకు ఈ రెండు కారణాలే ఉన్నాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఇది నగరంలో పెరుగుతున్న ఆందోళనకరమైన ధోరణిగా మారింది. 175 మంది మాయం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మిస్సింగ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. గత ఐదేళ్లలో ప్రతి ఏటా 50 నుంచి 186 కేసులు వరకు రాగా.. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే 175 కేసులు నమోదవడం విశాఖ పరిస్థితికి అద్దం పడుతోంది. జనవరిలో 37, ఫిబ్రవరిలో 49, మార్చిలో 43, ఏప్రిల్లో 46 మంది అదృశ్యమయ్యారు. వీరిలో 133 మంది ఆచూకీని పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా 42 మంది ఆచూకీ తెలియరాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వీరు ప్రేమ, ఇతర కారణాలతో కావాలనే వెళ్లిపోయారా? లేదా ఏదైనా దురదృష్ట సంఘటన జరిగిందా? అన్నది తెలియాల్సి ఉంది. మిస్సింగ్ కేసుల పరిష్కారం కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. పోలీసులకు సవాల్ వీరిని పట్టుకోవడం పోలీసులకు సైతం సవాలుగా మారుతోంది. కొంతమంది ఆచూకీ తెలుసుకున్నప్పటికీ.. మేజర్లు, చట్టాలు, హక్కులు పేరుతో పోలీసులకు కూడా చుక్కులు చూపించిన సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి కేసుల్లో అదృశ్యమైన వారి ఆచూకీని పోలీసులు గుర్తించడం మినహా వారిని కుటుంబ సభ్యులకు అప్పగించడం కూడా ఒక పెద్ద సమస్యగా మారుతోంది. విశాఖలో పెరుగుతున్న మహిళల అదృశ్యం కేసులు 4 నెలల్లో 175 మంది మాయం ఇప్పటి వరకు 133 మంది ఆచూకీ లభ్యం మిస్టరీగానే 42 మంది మహిళల అదృశ్యం ప్రేమ, వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాలే కారణం -
పోలీస్ శాఖకు దివీస్ డ్రోన్లు
విశాఖ సిటీ: దివీస్ ల్యాబ్స్ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా విశాఖ నగర పోలీస్ శాఖకు రెండు అత్యాధునిక డ్రోన్లను అందజేసింది. ఈ డ్రోన్లను సీపీ శంఖబ్రత బాగ్చికి అందజేశారు. ఈ డ్రోన్లలో హెచ్చరికలు, సూచనలు చేసే లౌడ్స్పీకర్, డే అండ్ నైట్ విజన్ కెమెరా, 5 కిలోమీటర్ల పరిధి, 45 నిమిషాలకు పైగా ఎగిరే సమయం, డిటెక్షన్, రికగ్నిషన్, ఐడెంటిఫికేషన్, లైవ్ స్ట్రీమింగ్ కనెక్టివిటీ, సెర్చ్లైట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు దివీస్ జీఎం వై.ఎస్.కోటేశ్వరరావు, లైజన్ కన్సల్టెంట్ ఎం.ఎన్.వరహాలరెడ్డి, సీఎస్ఆర్ మేనేజర్ డి.సురేష్కుమార్ పాల్గొన్నారు. -
అనాథ బాలలకుఆధార్ కార్డులు
● జడ్జి సన్యాసినాయుడు విశాఖ లీగల్ : అనాథలు, వృద్ధులు, వితంతువులకు ఆధార్ కార్డులు అందించాలని విశాఖ జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. సన్యాసినాయుడు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యాలయంలో అంగన్వాడీ, ఐసీడీఎస్ తదితర సంస్థలతో నిర్వహించిన అవగాహన శిబిరంలో ఆయన మాట్లాడారు. ఐసీడీఎస్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వీరికి తక్షణమే ఆధార్ కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమగ్ర శిశు సంక్షేమ శాఖ, జిల్లా విద్యాశాఖ, జిల్లా బాలల అభివృద్ధి ప్రాజెక్టు, స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేసి అర్హులకు వెంటనే ఆధార్ కార్డులు మంజూరు చేయాలని న్యాయమూర్తి వివరించారు. -
చందనోత్సవం ఘటనకు మంత్రుల కమిటీదే బాధ్యత
సింహాచలం: చందనోత్సవం రోజున సింహాచలం కొండపై ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనకు కూటమి ప్రభుత్వ మంత్రుల కమిటీ బాధ్యత వహించాలని మాజీ దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏర్పాట్లపై మైక్రో లెవెల్లో జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పుకున్న మంత్రులు, భక్తుల మృతికి కూడా బాధ్యత తీసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు రెండు చందనోత్సవాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామని, 1.60 లక్షల మంది భక్తులకు నిజరూప దర్శనం కల్పించామని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడం లేదని, పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అమరావతి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, తమ వారికి లాభాలు చేకూర్చే విధంగానే కూటమి ప్రభుత్వ పాలన ఉందని విమర్శించారు. -
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధం
విశాఖ విద్య: ఈ నెల 25న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించారు. నగరంలోని 19 పరీక్షా కేంద్రాల్లో 8,424 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లో జామర్లు, తాగునీరు, టాయిలెట్లు వంటి కనీస వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. యూపీఎస్సీ పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని, ఏమైనా సమస్యలుంటే తెలియజేయడానికి కంట్రోల్ రూమ్ (నం. 0891–2590100, 0891–2590102) ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు రెండు సెషన్లలో జరుగుతుంది. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, యూపీఎస్సీ డైరెక్టర్ పట్నాయక్ సమావేశంలో పాల్గొన్నారు. -
విమ్స్లో కోవిడ్ ప్రత్యేక వార్డు
ఆరిలోవ/మహారాణిపేట: నగరంలో కోవిడ్ కలకలం రేపుతుండటంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా, విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో శుక్రవారం 20 పడకలతో కూడిన ప్రత్యేక కోవిడ్ వార్డును సిద్ధం చేశారు.విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. రాంబాబు వార్డును పరిశీలించి, పడకలు, ఆక్సిజన్ యంత్రాలను తనిఖీ చేశారు. కొత్త కోవిడ్ వేరియంట్లైన జేఎన్–1, ఎల్ఎఫ్7, ఎన్బీ 1.8 పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్ పరీక్షల కోసం రాపిడ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, పాజిటివ్ వస్తే వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్షలకు పంపిస్తామని తెలిపారు. కేజీహెచ్లో 20 పడకలతో కోవిడ్ వార్డును సిద్ధం చేసినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ తెలిపారు. ఈ వార్డుకు అవసరమైన పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచామన్నారు. -
మహారాజా బ్యాంకుకు అవార్డులు
విశాఖసిటీ: ది మహారాజా కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు జాతీయ స్థాయిలో రెండు అవార్డులు లభించాయి. ‘బెస్ట్ చైర్పర్సన్ ఆఫ్ ది ఇయర్’ , ‘బెస్ట్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ – ఆంధ్రప్రదేశ్ స్టేట్’ అవార్డులను శుక్రవారం ముంబైలో జరిగిన ‘భారత్ రత్న సహకారిత సమ్మాన్ 2025’ కార్యక్రమంలో అందుకున్నారు. బ్యాంకు 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అవార్డులు రావడం సంతోషంగా ఉందని వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.రామకృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా 999 రోజులకు 9 శాతం వడ్డీతో ‘మహారాజా స్పెషల్ డిపాజిట్ స్కీం’ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మొత్తం వ్యాపారం రూ.492 కోట్లుగా, నికర లాభం రూ.3.24 కోట్లుగా వెల్లడించారు. త్వ రలో విజయవాడ, రాజమండ్రి, రామచంద్రాపురంల లో కొత్త శాఖలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. -
మరికొంతకాలంప్రత్యేక రైళ్ల పొడిగింపు
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం–ఎస్ఎంవీ బెంగళూరు, విశాఖపట్నం–షాలిమర్ మధ్య నడుస్తున్న స్పెషల్ రైళ్లను మరికొంత కాలం పొడిగించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖపట్నం–ఎస్ఎంవీ బెంగళూరు(08581) వీక్లీ స్పెషల్ ప్రతి ఆదివారం విశాఖలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.45 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు జూన్ 29 వరకు పొడిగించారు. ఎస్ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం (08581) వీక్లీ స్పెషల్ ప్రతి సోమవారం మధ్యాహ్నం బెంగళూరులో 3.50 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు జూన్ 30 వరకు పొడిగించారు. ● విశాఖపట్నం–షాలిమర్(08508) స్పెషల్ ప్రతి మంగళవారం విశాఖపట్నంలో ఉదయం 11.20 గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారుజాము 3 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు జూన్ 24 వరకు పొడిగించారు. షాలిమర్–విశాఖపట్నం (08507) స్పెషల్ ప్రతి బుధవారం షాలిమర్లో తెల్లవారు 5 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 8.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ జూన్ 25 వరకు పొడిగించారు. -
కౌంటీ సీసీ కెప్టెన్ హరీష్ వీరవిహారం
విశాఖ స్పోర్ట్స్: వీడీసీఏ ఒకటో డివిజన్ క్రికెట్ లీగ్లో కౌంటీ సీసీ కెప్టెన్ హరీష్కుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగి అజేయ డబుల్ సెంచరీతో (202) కదంతొక్కాడు. పీఎంపాలెంలోని వైఎస్సార్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో రాయల్ సీసీ జట్టుపై 307 పరుగుల భారీ తేడాతో కౌంటీ సీసీ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కౌంటీ సీసీ నిర్ణీత 40 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 367 పరుగులు చేసింది. ఓపెనర్ దేవాశిష్ 75 పరుగులు చేయగా చరణ్ 61 పరుగులతో రాణించాడు.కెప్టెన్ హరీష్ 15 ఫోర్లు, 12 సిక్సర్లతో చెలరేగాడు. నవవసంత్ రెండు వికెట్లను తీశాడు. ప్రతిగా రాయల్ సీసీ 21.5 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 60 పరుగులే చేసింది. శివ మూడు, ఆదిత్య రెండు వికెట్లు తీశారు. -
అదృశ్యం కాదు.. హత్య!
అల్లిపురం: మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. దాదాపు మూడున్నరేళ్ల కిందట అదృశ్యమైన వివాహిత పల్లా గీత(45) హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి అలుగు దివాకర్ను అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని తరలించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. మరో నిందితుడు వరప్రసాద్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో సీపీ ఈ వివరాలు వెల్లడించారు. ఇదీ కేసు మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న పల్లా గీత 2021 డిసెంబర్ 21న అదృశ్యమైనట్లు ఆమె కుమార్తె ఆబోతు సునీత 2022 జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ‘వుమెన్ మిస్సింగ్’కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆమె ఆచూకీ లభించకపోవడంతో 2022 అక్టోబర్లో కేసును ‘అన్డిటెక్టెడ్’గా మూసివేశారు. తన తల్లి ఆచూకీ దాదాపు మూడున్నరేళ్లుగా తెలియకపోవడం.. తనకు న్యాయం జరగలేదని ఆవేదన చెందిన సునీత ఈ ఏడాది మే మొదటి వారంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చిని కలిసి అభ్యర్థించారు. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు పీసీఆర్ ఇన్స్పెక్టర్ షేక్ హుస్సేన్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, కేసును పునఃవిచారణ చేపట్టారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన నిజాలు ప్రత్యేక బృందం పది రోజుల్లోనే కేసు మిస్టరీని ఛేదించింది. పలు ప్రదేశాలను సందర్శించి, అనేక మంది సాక్షులను విచారించి, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి, గీత హత్యకు గురైందని తేల్చారు. గీతతో సన్నిహితంగా ఉన్న అలుగు దివాకర్ ఆమెను పాశవికంగా హత్య చేసి.. ఏమీ తెలియనట్లు సమాజంలో తిరుగుతున్నాడని పక్కా ఆధారాలు సేకరించి అరెస్ట్ చేశారు. ఘోరంగా హత్య.. మృతదేహం మాయం 2021 డిసెంబర్ 26న గీత మరోసారి ద్విచక్ర వాహనంపై దివాకర్ ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై గొడవపడింది. సాయంత్రం వరకు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దివాకర్ పెళ్లికి అంగీకరించకపోవడంతో గీత ప్రతిఘటించింది. ఈ ఘర్షణలో గీత గోళ్లతో రక్కడంతో దివాకర్ ముఖం, చేతులపై గాయాలయ్యాయి. దీంతో ఆమె తనను జీవితాంతం వేధిస్తుందని భావించిన దివాకర్.. ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. గీతను బలంగా గోడకు గుద్ది, ప్రాణం పోయే వరకు కొట్టి చంపాడు. అదే సమయానికి హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ స్నేహితుడు వరప్రసాద్ రావడంతో, అతని సహాయంతో మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి, తన ఫోర్డ్ ఐకాన్ కారు వెనుక సీట్లో ఉంచాడు. తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం వద్ద పారుతున్న ఎర్ర కాలువలో అర్ధరాత్రి ఆ మృతదేహాన్ని పడేశారు. నేరాన్ని కప్పిపుచ్చే యత్నం హత్య అనంతరం దివాకర్ హైదరాబాద్ వెళ్లి కొన్ని రోజులు అక్కడే ఉండి, తర్వాత నగరానికి తిరిగి వచ్చాడు. గీత తన స్నేహితులతో కలిసి అదే రోజు తిరుపతి వెళ్లిందని ఒక కథ అల్లి.. బంధువులను, కుమార్తెను నమ్మించాడు. ఆమె సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి, చైన్నె తీసుకెళ్లి ఆన్ చేసి కాలువలో పడేశాడు. కొన్ని రోజుల తర్వాత గీత ద్విచక్ర వాహనాన్ని ఆమె కుమార్తెకు అప్పగించి, సహాయం చేస్తున్నట్లు ఎంతో తెలివిగా నటిస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. తాజాగా సునీత ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ కేసులో దివాకర్ పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. గీత బైక్ను ఆమె కుమార్తెకు అప్పగించడం, తిరుపతి వెళ్లిందని నమ్మించడం, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నిందితుడిని విచారించారు. తానే హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో తగిన సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని రవాణా కొరకు ఉపయోగించిన ఫోర్డ్ ఐకాన్ కారును స్వాధీనం చేసుకున్నారు. మూసివేసిన కేసును పది రోజుల్లోనే ఛేదించిన ఇన్స్పెక్టర్ షేక్ హుస్సేన్ను పోలీస్ కమిషనర్ ప్రశంసాపత్రంతో సత్కరించారు. అలాగే ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన సీసీఎస్ ఏఎస్ఐ పి.చంద్రశేఖర్, మహారాణిపేట క్రైం కానిస్టేబుల్ ఎన్.ఎ.రాజు, టూటౌన్ కానిస్టేబుల్ ఎ.వినోద్, త్రీటౌన్ కానిస్టేబుల్ వి.రామరాజులను సీపీ అభినందించారు. వివాహిత మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది మూడున్నరేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘోరం కుమార్తె పోరాటంతో కదిలిన డొంక రియల్ ఎస్టేట్ వ్యాపారి దివాకర్ అరెస్ట్ హత్యకు దారితీసిన పరిస్థితులివీ.. భర్తతో విబేధాల కారణంగా పిల్లలను అతని వద్దే విడిచిపెట్టి.. మెలోడీ థియేటర్ ఎదురుగా తన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఫ్లాట్లో గీత ఒంటరిగా నివసిస్తూ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేసేది. ఫ్లాట్ నిర్మాణ సమయంలో బిల్డర్తో వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో దివాకర్ సహాయం చేయడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కృతజ్ఞతతో గీత తన ప్లాట్లోని ఒక గదిని దివాకర్కు రియల్ ఎస్టేట్ ఆఫీస్ కోసం ఇచ్చింది. ఆమె దివాకర్ను నమ్మి అతను చెప్పిన కొంత మందికి లక్షల్లో అప్పు ఇచ్చింది. ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో పెళ్లి చేసుకోవాలని దివాకర్ను గీత ఒత్తిడి చేయడం ప్రారంభించింది. అయితే దివాకర్కు ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో క్రమంగా దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఇది గ్రహించిన గీత బుచ్చిరాజుపాలెంలో నివసిస్తున్న దివాకర్ ఇంటికి వెళ్లి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. 2021 నవంబర్ 20న అతని ఇంటికి వెళ్లి.. అతని ఆఫీస్ సిబ్బంది ముందే పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చింది. దీంతో దివాకర్ తన సిబ్బందితో కలిసి ఇంటికి తాళం వేయకుండానే అక్కడి నుంచి కారులో వెళ్లిపోయాడు. -
‘అమృత్ భారత్’ పనులు వేగవంతం
అధికారులకు వాల్తేర్ డీఆర్ఎం ఆదేశంఅగనంపూడి: దువ్వాడ రైల్వే స్టేషన్లో అమృత భారత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా, సీనియర్ డీసీఎం సందీప్లతో కూడిన బృందం పరిశీలించింది. ముందుగా డీఆర్ఎం ఒకటో నంబర్ ప్లాట్ఫాం వైపు నిర్మిస్తున్న ప్రధాన పరిపాలన భవన నిర్మాణాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఒకటి, నాలుగు ప్లాట్ఫాంలను కలుపుతూ నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించి, వాటి పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్లాట్ఫాం నంబర్ నాలుగు వైపు జరుగుతున్న సుందరీకరణ, రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం అధికారులతో మాట్లాడుతూ నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. తూర్పు కోస్తా రైల్వే జోనల్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు కంచుమూర్తి ఈశ్వర్, దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డీఆర్ఎంను కలిసి ఇక్కడి సమస్యలపై వినతపత్రం సమర్పించారు. విశాఖ–తిరుపతి డబుల్ డెక్కర్ రైలులో శాశ్వత ప్రాతిపదికన థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్లు ఏర్పాటు చేయాలని, కోచ్లకు నీటి సరఫరా సౌకర్యం కల్పించి సిబ్బందిని నియమించాలని, ఎస్కలేటర్లు, లిఫ్ట్లను ఏర్పాటు చేయాలని వారు కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో జాషువా, కామేశ్వరరావు ఉన్నారు. -
విశాఖలో టూరిజం సర్క్యూట్
విశాఖ సిటీ: విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం సర్క్యూట్కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో బుధవా రం ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధు లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ఏకరవు పెట్టారు. జీవీఎంసీ వాటర్ పైప్లైన్ పనులు పూర్తి చేయాలని, నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని, పుష్ కార్ట్లు లేకపోవడంతో పారిశుధ్య పనులకు ఇబ్బందులు, 2014లో పేదల ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం డీడీలు కట్టించుకున్న వారికి ఇళ్ల స్థలాల మంజూరు, సదుపాయాలు కల్పించాలని కోరారు. ఏకపక్ష నిర్ణయాలు వద్దు : ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, ప్రాజెక్టుల విషయంలో అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతితో పాటు విశాఖపై కూడా దృష్టి పెట్టాలని చెప్పారు. దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. కోస్టల్ కారిడార్ నుంచి భీమిలి వరకు బీచ్ కారిడార్ అభివృద్ధిపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వీకేపీసీపీఐఆర్, మాస్టర్ప్లాన్–2041, ఎంఐజీ లేఅవుట్లు, ప్రతిపాదిత లేఅవుట్లు, మాస్టర్ప్లాన్ రహదారుల నిర్మాణాలు, తీర ప్రాంత కోత ప్రాజెక్టు, కై లాసగిరి, రుషికొండ సమగ్రాభివృద్ధి, భోగాపురం నుంచి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్డు, సింహాచలం స్థలాలకు సంబంధించిన సమస్యలు, అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ వంటి అంశాలపై చర్చించారు. ఇకపై ప్రతి నెలా సమావేశం నిర్వహించి ఉత్తరాంధ్ర అభివృద్ధి పనులపై సమీక్షిస్తామన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సంపత్ కుమార్, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు హరేందిర ప్రసాద్, విజయకృష్ణన్, అంబేడ్కర్, మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్ పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై మంత్రి నారాయణ సమీక్ష అమరావతిపైనే కాదు.. విశాఖపై కూడా దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేల విజ్ఞప్తి -
ఉపాధ్యాయుల బదిలీలు షురూ
విశాఖ విద్య: విద్యాశాఖలో బదిలీల కోలాహలం మొదలైంది. బుధవారం నుంచి బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో, ఇందుకనుగుణంగా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. తొలుత గ్రేడ్–2 హెచ్ఎంలుగా పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా వెబ్సైట్లో వివరాలు పొందుపరిచారు. గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులు 93 ఖాళీగా ఉన్నట్లు ఉమ్మడి విశాఖ జిల్లా నోడల్ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. క్లియర్ వేకెన్సీ 46 పోస్టులు ఉండగా, రేషనలైజేషన్లో భాగంగా 24 పోస్టులు ఖాళీ చూపించారు. ఫారిన్ సర్వీసుపై వెళ్లిన వారి ఖాళీలు రెండు ఉన్నాయి. ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. కంపల్సరీ ట్రాన్స్ఫర్ అయ్యే జాబితాలో 15 మంది లెక్క తేలారు. వీరు గురువారం సాయంత్రం 5 గంటల్లోగా బదిలీ కోసమని దరఖాస్తు చేసుకోవాలి. కంపల్సరీ ట్రాన్స్ఫర్ జాబితాలో ఉన్న వారెవరైనా బదిలీ చేయనట్లయితే, వారికి చివరిగా మిగిలిన ఖాళీల్లో పోస్టింగ్ కేటాయించనున్నారు. ఇదిలా ఉండగా, బాలికల పాఠశాలలో 50 ఏళ్ల లోపు ఉన్న వారిని కూడా బదిలీ చేస్తున్నారు. ఇలా ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు గుర్తించి, వారి జాబితాను వెబ్సైట్లో పొందుపరిచారు. వీరు కూడా తప్పనిసరిగా బదిలీ కోసమని దరఖాస్తు చేసుకోవాలని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. బదిలీల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని డీఈవో వెల్లడించారు. విశాఖలోని సీతమ్మధారలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని స్కూళ్లలో పనిచేస్తున్న అన్ని క్యాడర్ల వారీగా ఖాళీల జాబితాలను సిద్ధం చేస్తున్నామన్నారు. తొలుత గ్రేడ్–2 హెచ్ఎంలకు బదిలీ ఉమ్మడి విశాఖ జిల్లాలో 93 ఖాళీలు మొదలైన దరఖాస్తుల ప్రక్రియ బాలికల పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులకే చోటు ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో హెల్ప్ డెస్క్ -
సీఎస్ఆర్ఎంవోగాడాక్టర్ శ్రీహరి
మహారాణిపేట: కేజీహెచ్లో ఎట్టకేలకు సివిల్ సర్జన్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(సీఎస్ఆర్ఎంవో) పోస్టు భర్తీ అయింది. ఎన్నో ఏళ్లుగా ఈ పోస్టు భర్తీ కాలేదు. ఇన్చార్జిలతో ఈ పోస్టు నడుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సీహెచ్ శ్రీహరిని కేజిహెచ్ సీఎస్ఆర్ఎంవోగా నియమించారు. ఈ మేరకు బుధవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇన్చార్జిగా డీఎస్ఆర్ఎంవో డాక్టర్ మోహర్ కుమార్ పనిచేస్తున్నారు. తొలుత కేజీహెచ్కు చేరుకున్న డాక్టర్ సీహెచ్ శ్రీహరి సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ను మర్యాద పూర్వకంగా కలిశారు. పలువురు వైద్యులు, సిబ్బంది ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
రాదండి!
ఇంటింటికీరేషన్ బండి.. మహారాణిపేట: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు భారాలు, కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు అన్నింటిపైనా భారం మోపుతూ.. మరోవైపు ఉన్న సౌకర్యాలను దూరం చేస్తోంది. తాజాగా ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్)లో నెలా నెలా ఠంచనుగా ఇంటి వద్దకే వచ్చే రేషన్(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్–ఎండీయూ) బండికి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బంది పడరాదన్న ఆశయంతో గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి స్వస్తి పలికింది. ఇప్పటికే కార్డుదారులకు అరకొర సరుకులను అందిస్తున్న ప్రభుత్వం.. జూన్ 1 నుంచి ఎండీయూ వాహనాలతో రేషన్ సరఫరాను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఎండీయూ ఆపరేటర్లు భగ్గుమంటున్నారు. ప్రజల ఇబ్బందులు తీర్చాలనే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాక ముందు రేషన్ సరకులు తీసుకోవడం ఓ ప్రహసనం. రోజంతా పనులు మానుకుని మరీ రేషన్ డీపోల దగ్గర పడిగాపులు కాసేవారు. బియ్యానికి ఒక రోజు, పంచదారకు ఓ రోజు.. ఇలా ఒక్కో సరకుకు ఒక్కో రోజున వెళ్లాల్సి వచ్చేది. చాంతాడంత లైన్లలో గంటల తరబడి నిరీక్షించేవారు. ఇక సర్వర్లు మొరాయిస్తే ఉస్సూరుమంటూ తిరుగుముఖం పట్టాల్సిందే. ఈ కష్టాలను తెలుసుకున్న గత సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం జనవరి 2021లో ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి నుంచి ఇంటి ముందుకే వ్యాన్ల ద్వారా సరకులు అందించడం మొదలెట్టారు. దీంతో రేషన్ కోసం తిప్పలు పడాల్సిన పని తప్పింది. ఆరేళ్లకు అగ్రిమెంట్ నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎండీయూ వాహనాలను బ్యాంకు రుణాల ద్వారా ఇప్పించి, ఆరేళ్ల(72 నెలలు)కు అగ్రిమెంటు చేశారు. జనవరి 2027 వరకు ఆ గడువు ఉంది. అప్పటికి వాహనాల బ్యాంకు రుణాలు కూడా దాదాపు ముగిసి, వాహనం నిరుద్యోగ యువత సొంతమవుతుంది. అయితే 20 నెలల ముందుగానే దీనికి ముగింపు పలకడంతో ఎండీయూ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డున పడ్డ సిబ్బంది ఈ పథకం ద్వారా జిల్లాలో 351 మంది ప్రత్యక్షంగా, మరికొంత మంది పరోక్షంగా బతుకున్నారు. నెలకు కుటుంబానికి సరిపడా వచ్చే సొమ్ముతో ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. ఇప్పుడు అర్ధంతరంగా ఈ పథకానికి మంగళం పలకడంతో ఆపరేటర్లు, ఇతర సిబ్బంది రోడ్డున పడ్డారు. దశల వారీ ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. దీనిపై రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించి, భవిష్యత్తు ప్రణాళికను రూపొందించనున్నారు.కష్టం తెలియకుండా ఇంటి వద్దే రేషన్ తీసుకోవడం ఇక గత చరిత్రే. టీడీపీ ప్రభుత్వ నిత్యకృత్యాలైన నిత్యావసరాల కోసం కిలోమీటర్ల మేర కాలినడక, నెత్తిన బరువుల మోత, గంటల తరబడి నిరీక్షణ మళ్లీ ప్రజలు అనుభవించాల్సిందే. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల సౌకర్యార్థం అమల్లోకి తెచ్చిన ఒక్కో పథకాన్ని నీరుగార్చే ప్రక్రియలో కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. తాజా నిర్ణయంతో జిల్లాలోని 351 ఎండీయూ వాహనాల డీలర్లు, సహాయకుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎండీయూ వాహనాలకు మంగళం జిల్లాలో 351 ఎండీయూ వాహనాలు రోడ్డున పడ్డ 702 కుటుంబాలు జూన్ 1 నుంచి రేషన్ డిపోల ద్వారానే సరకులు ఎండీయూ వాహనాలు 351 ఆధారపడ్డ సిబ్బంది 702 జిల్లాలో వివరాలు తెలుపు రేషన్ కార్డులు 5,12,619 చౌక ధరల డిపోలు 625 ప్రభుత్వమే ఆదుకోవాలి ఈ వాహనాల మీదే ఆధారపడి బతుకుతున్నాం. ఎండీయూ ఆపరేటర్లకు న్యాయం చేయాలి. వీటిపై వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఇప్పుడు ఆకస్మాత్తుగా నిలుపుదల చేయడంతో రోడ్డున పడ్డాం. ఈ వయస్సులో ఎక్కడకై నా వెళ్లి పనిచేయలేం. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. మాలాంటి చిన్నస్థాయి బతుకులకు రాజకీయాలు అంటగట్టడం సరికాదు. – నీరు కొండ సతీష్, ఎండీయూ ఆపరేటర్అగ్రిమెంట్ గడువు ఇంకా ఉంది 2027 జనవరి వరకు అగ్రిమెంటు ఉంది. ఇంతలోనే తొలగించడం అన్యాయం. ఒక వేళ తొలగిస్తే రానున్న 20 నెలల జీతాలు చెల్లించాలి. కరోనా సమయంలో ఎండీయూ డీలర్లు ఎన్నో సేవలు అందించారు. వైరస్కు భయపడకుండా పనిచేశారు. రాజకీయ కారణాలతో తీసుకున్న నిర్ణయాల వల్ల మేమంతా రోడ్డున పడతాం. మా కుటుంబాలకు అన్యాయం చేయొద్దు. – ఎన్.సతీష్ కుమార్, అధ్యక్షుడు, ఎండీయూ ఆపరేటర్స్ యూనియన్ -
రాజకీయ అండదండలతో..
నగరంలో పలువురు రౌడీషీటర్లకు కూటమి నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. సాధారణంగా యాక్టివ్గా ఉండే రౌడీషీటర్లు ప్రతిరోజు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్కు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే, కొంతమంది రౌడీషీటర్లు తమకు సన్నిహితంగా ఉండే రాజకీయ నేతలతో పోలీసులపై ఒత్తిడి చేయించి రోజువారీ హాజరు నుంచి మినహాయింపు పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.రాజకీయ నేతలే స్వయంగా ఫోన్ చేసి ఆదేశించడంతో పోలీసులు రౌడీషీటర్ల జోలికి వెళ్లడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగా పోలీసులు వీరిని పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి నగరంలో శాంతిభద్రతలకు సవాలుగా మారింది -
● తల్లీబిడ్డ అవస్థలు
అమ్మైన ఆ సంతోషం కళ్లల్లో నిండాలి. పసిబిడ్డను అక్కున చేర్చుకొని, ప్రభుత్వ వాహనంలో సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి. కానీ తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగుల సమ్మె ఆ ఆశలపై నీళ్లు చల్లింది. వాహనాలు నిలిచిపోవడంతో బాలింతలు అవస్థలు పడ్డారు. మంగళవారం కేజీహెచ్లో డిశ్చార్జ్ అయిన చోడవరం ఎడ్లవీధికి చెందిన సౌందర్య జ్యోతికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. బిడ్డతో ఆటోలో ఇంటికి వెళుతున్న ఈ దృశ్యం, సమ్మె కారణంగా సాధారణ పౌరులు ఎదుర్కొంటున్న కష్టాలకు అద్దం పట్టింది. సౌందర్య జ్యోతి ఒక్కరే కాదు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లాల్సిన ఎంతో మంది తల్లులు, పసిబిడ్డలతో కలిసి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి ఆశలకు భంగం కలిగి, ప్రభుత్వ సేవలు అందక, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. –మహారాణిపేట/ –ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
ఖైదీల సమస్యలు తెలుసుకున్న డీఎల్ఎస్ఏ కార్యదర్శి
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారాన్ని మంగళవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు సందర్శించారు. జైలు అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. సన్యాసినాయుడు ఖైదీలు ఉండే బ్యారక్లు, పరిసరాలను పరిశీలించి, వారికి కల్పించిన సౌకర్యాలు, వైద్యం, భోజన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలు సమావేశ మందిరంలో ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. ఏ కేసుల్లో జైలుకు వచ్చారు, ఎప్పటి నుంచి రిమాండ్లో ఉన్నారు అనే వివరాలను తెలుసుకొని, వారికి అవసరమైన న్యాయ సహాయం గురించి వివరించారు. ఖైదీలు మంచి నడవడికతో ఉండాలని, విడుదలయ్యాక బాహ్య ప్రపంచంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జైలు పర్యవేక్షణాధికారి ఎం.మహేష్ బాబు, ఉప పర్యవేక్షణాధికారులు ఎన్.సాయిప్రవీణ్, సీహెచ్.సూర్యకుమార్, జైలర్లు, డీఎల్ఎస్ఏసిబ్బంది పాల్గొన్నారు. -
ఐసెట్లో మెరిసిన మనోళ్లు
● విశాఖ జిల్లాకే నంబర్వన్ ర్యాంక్ ● టాప్టెన్లో ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి చోటు ● రాష్ట్రంలో విశాఖ నుంచే అత్యధిక మంది హాజరు విశాఖ విద్య: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశ పరీక్ష ఐసెట్–2025 ఫలితాల్లో ఉమ్మడి విశాఖ జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది మొత్తం 32,719 మంది ఐసెట్లో ఉత్తీర్ణత సాధించగా, విశాఖ జిల్లాకు చెందిన మేక మనోజ్ రాష్ట్రంలోనే నంబర్ వన్ ర్యాంకు సాధించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాఖ ఖ్యాతిని ఇనుమడింపజేశాడు. టాప్–10లో ముగ్గురు విశాఖ వాసులే.. టాప్–10 ర్యాంకుల్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు చోటు దక్కించుకోవడం విశేషం. అనకాపల్లి జిల్లాకు చెందిన షేక్ బషీరున్నీషా 6వ ర్యాంకు సాధించగా, పెదగంట్యాడ మండలంలోని శరగడ గణేష్ రెడ్డి 9వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అధిక సంఖ్యలో బాలికల ఉత్తీర్ణత ఐసెట్ పరీక్షకు అనకాపల్లి జిల్లా నుంచి 169 మంది హాజరుకాగా, వారిలో 167 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణులైన వారిలో 120 మంది బాలికలు ఉన్నారు. అదే విధంగా, విశాఖపట్నం జిల్లా నుంచి 4,397 మంది పరీక్ష రాయగా, వీరిలో 4,303 మంది క్వాలిఫై అయ్యారు. విశేషమేమిటంటే, ఉత్తీర్ణులైన వారిలో 2,377 మంది బాలికలు ఉండటం గమనార్హం. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల పట్ల బాలికలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని దీని ద్వారా తెలుస్తోంది. అత్యధిక హాజరు విశాఖ నుంచే రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి ఐసెట్కు హాజరైన విద్యార్థుల్లో విశాఖ నుంచే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు హాజరుకావడం మరో విశేషం. ఇది జిల్లాలో విద్యాభ్యాసం పట్ల ఉన్న ఆసక్తిని, ఉన్నత విద్యపై విద్యార్థులకున్న ఆకాంక్షను స్పష్టం చేస్తోంది. శభాష్ గణేష్రెడ్డి పెదగంట్యాడ: ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన ఏపీ ఐసెట్–2025 ఫలితాల్లో మండలంలోని పెదకోరాడ గ్రామానికి చెందిన విద్యార్థి శరగడ గణేష్రెడ్డి 9వర్యాంకు సాధించి సత్తాచాటాడు. పెదకోరాడకు చెందిన శరగడ ఎల్లయ్యరెడ్డి, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు గణేష్రెడ్డి ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా గణేష్రెడ్డి మాట్లాడుతూ, ఎంబీఏ పూర్తి చేసి మార్కెటింగ్ రంగంలో స్థిరపడతానని తన లక్ష్యాన్ని వెల్లడించాడు. అతని ప్రతిభకు గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అభినందనలు తెలిపారు. -
ట్రాన్స్ఫర్మేటివ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్పై సమీక్ష
డాబాగార్డెన్స్: నగరంలో విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్ట నివారణకు చేపట్టే చర్యలపై యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ(యూఎన్యూ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్(ఎన్ఐయూఏ), ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్(టీఈఆర్ఐ) ప్రతినిధులు నగర మేయర్ పీలా శ్రీనివాస్ను మంగళవారం కలిసి వివరించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లో ఆయా సంస్థల ప్రతినిధులు ట్రాన్స్ఫర్మేటివ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ఆవశ్యకతను తెలిపారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో కలిగే విపత్తులు, వడగాల్పులు, వరదలు తదితర వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల సహకారంతో నష్ట నివారణ ఎలా తగ్గించుకోవచ్చో వివరించారు. -
చరిత్ర సృష్టించేలా యోగా దినోత్సవం
మహారాణిపేట: విశాఖలో జూన్ 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ రికార్డు స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నందున, దీనిని చారిత్రక కార్యక్రమంగా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణపై మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, బుధవారం నుంచి జూన్ 21 వరకు ‘యోగా మాసం’ పాటించాలని సూచించారు. ఈ నెల రోజులు జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగా ప్రాక్టీస్ జరగాలన్నారు. బుధవారం ఉదయం 6:30 నుంచి 8 గంటల మధ్య ఆర్కే బీచ్ రోడ్లో 1,000 మందితో ప్రాథమిక వేడుకలు ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే మండల, గ్రామ స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు, శిక్షణలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీసీపీలు మేరీ ప్రశాంతి, అజిత వేజెండ్ల, రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్తో పాటు జిల్లా అధికారులు, యోగా టీచర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఉప మేయర్గా దల్లి ఏకగ్రీవం
● మేయర్ చాంబర్లో దాచిపెట్టి మరీ.. సభ్యుల్ని తీసుకొచ్చారు! ● సోమవారంనాటి పరాభవంతో ముందుజాగ్రత్త ● పనిచేసిన బుజ్జగింపులు, తాయిళాలు? డాబాగార్డెన్స్: జీవీఎంసీ ఉప మేయర్గా కూటమి తరఫున జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రక్రియకు ప్రిసైడింగ్ అధికారిగా జేసీ మయూర్ అశోక్ వ్యవహరించారు. బీ ఫారం అందుకున్న గోవిందరెడ్డికి పోటీగా మరెవరైనా ఉన్నారా? అని అడుగుతూ, ఎన్నికల నియమ నిబంధనలను వివరించారు. ఎవరూ పోటీ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. గోవిందరెడ్డిని ఉప మేయర్గా టీడీపీ నుంచి పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, బీజేపీ నుంచి ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు ప్రతిపాదించారు. పోటీ లేకపోవడంతో ఎన్నికల అధికారి గోవిందరెడ్డికి నియామక పత్రం అందించారు. అనంతరం ప్రమాణస్వీకారం చేయించారు. అంతా.. పావుగంట లోపే.. ఉదయం 10.55 గంటలకు నలుగురు ఎమ్మెల్యేలు(జనసేన నుంచి పంచకర్ల రమేష్బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, బీజేపీ నుంచి విష్ణుకుమార్రాజు, టీడీపీ నుంచి గణబాబు), వివిధ పార్టీలకు చెందిన 41 మంది కౌన్సిల్ సభ్యులు సభకు హాజరయ్యారు. 11 గంటలకు ఎన్నికల అధికారి మయూర్ ఆశోక్ చేరుకున్నారు. ఆ సమయంలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు(కొణతాల రామకృష్ణ, వెలగపూడి రామకృష్ణబాబు) వచ్చారు. తర్వాత 5 నిమిషాలకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో ఇంకో 11 మంది కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్కు చేరుకున్నారు. దీంతో సభ్యుల సంఖ్య 59కి చేరింది. ఈలోగా ఎన్నికకు సంబంధించి నియమ నిబంధనలు వివరించారు. మరో 8 నిమిషాల్లో ఉప మేయర్ ఎన్నిక తంతు పూర్తి చేశారు. ముందు జాగ్రత్త! ఉప మేయర్ ఎన్నికలో సోమవారం నాటి సీన్ రిపీట్ కారాదని జాగ్రత్త పడ్డారు. అసంతృప్త సభ్యుల్ని ముందుగానే రప్పించి మేయర్ చాంబర్లో కూర్చోబెట్టారు. మేయర్ పీలా శ్రీనివాసరావు తన చాంబర్ నుంచి లిస్ట్ ప్రకారం టిక్ పెట్టి మరీ సభ్యుల్ని కౌన్సిల్ హాల్లోకి పంపారు. ముందు రోజు డుమ్మాకొట్టిన వారికి బుజ్జగింపులు, తాయిళాలు అందినట్లు సమాచారం. యాదవ, కాపులకు వెన్నుపోటు జీవీఎంసీ మేయర్, ఉప మేయర్ ఎన్నికల్లో యాదవ, కాపు సామాజిక వర్గాలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ఆ సామాజిక వర్గ కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మేయర్గా గొలగాని హరివెంకట కుమారి(యాదవ), ఉప మేయర్గా జియ్యాని శ్రీధర్(కాపు)లకు అవకాశం ఇచ్చారు. కౌన్సిల్లో బలం లేకపోయినా దొడ్డిదారిన వారిని దించేసిన కూటమి నేతలు, విశాఖలో కూటమి మనుగడకు కారణమైన ఈ రెండు వర్గాలను విస్మరించడంపై ఆయా సామాజిక వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. -
ల్యాండ్ సెటిల్మెంట్ల దందా
● మొన్న మంగమారిపేటలో వాచ్మన్ను కిడ్నాప్ చేసి భూకబ్జాకు ప్రయత్నం ● నిన్న లాసెన్స్ బే కాలనీలో ఆశ్రమాన్ని ఖాళీ చేయాలని నిర్వాహకులకు బెదిరింపులు ● కొంతమందికి రాజకీయ నేతల అండదండలు ● సంఘటన జరిగినప్పుడే పోలీసుల హడావుడి ● వరుస ఘటనలతో హడలిపోతున్న ప్రజలు విశాఖ సిటీ: ప్రశాంత విశాఖలో సుపారీ గ్యాంగ్లు అలజడి సృష్టిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా వీరిని పూర్తిస్థాయిలో కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతున్నా రన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నంలో సుపారీ గ్యాంగ్ల ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నెలలోనే జరిగిన రెండు ఘటనలు జిల్లాలో పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
కశింకోట: మండలంలోని బయ్యవరం పాల డెయిరీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఎస్ఐ లక్ష్మణరావు అందించిన వివరాల ప్రకారం...విశాఖపట్నం నుంచి నరసాపురం వెళుతున్న కారు, బయ్యవరం పాల డెయిరీ వద్ద అవతలి రోడ్డులోకి అకస్మాత్తుగా మలుపు తిరుగుతున్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న బుంగా వెంకట నరసమ్మ (72) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు నరేష్, మేనకోడలు సువర్ణ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజిహెచ్కు వైద్యులు సిఫారసు చేశారు. విశాఖలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న నరేష్, తమ తల్లి నరసమ్మ, కుటుంబ సభ్యులు సువర్ణ, ముగ్గురు పిల్లలతో కలిసి కారులో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బంధువుల ఇంటికి పెళ్లికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. నరసమ్మ మృతదేహానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జయి దెబ్బతింది. తన కళ్లముందే తల్లి నరసమ్మ మృతి చెందడంతో నరేష్, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
భగ్గుమన్న కార్మిక సంఘాలు
బీచ్రోడ్డు: స్టీల్ప్లాంట్లోని కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులను తక్షణమే నిలిపివేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేయాలని విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణ పోరాట జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ప్లాంట్ నుంచి పోలీసులను వెనక్కి రప్పించాలని కూడా ఆయన కోరారు. సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, జూలై 9కి వాయిదా పడిన అఖిల భారత సమ్మెకు మద్దతుగా కాంట్రాక్ట్ కార్మికులు నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. అక్రమ తొలగింపులు, పెండింగ్ జీతాలు, హెచ్ఆర్ఏ అమలు, నాయకులపై సస్పెన్షన్ల రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రదర్శన, సభ జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేపట్టిన స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా ఖండించిన జేఏసీ నాయకులు, సొంత గనులు కేటాయించాలని గత నాలుగేళ్లుగా పోరాడుతున్నామన్నారు. ఎన్నికల ముందు స్టీల్ప్లాంట్ను రక్షిస్తామని చెప్పిన రాష్ట్ర కూటమి నాయకులు, ఇప్పుడు 5,400 మంది కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా తొలగిస్తుంటే ఎక్కడున్నారని ప్రశ్నించారు. కార్మికులను భయభ్రాంతులకు గురిచేయడం, ప్లాంట్లో పోలీసులను మోహరించడం దుర్మార్గమన్నారు. స్టీల్ప్లాంట్ను ప్రభుత్వరంగంలో కొనసాగించడానికి, కార్మికుల ఉపాధిని రక్షించడానికి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్టీల్ప్లాంట్, తల్లీబిడ్డల ఎక్స్ప్రెస్ కార్మికుల సమ్మెలకు సంఘీభావంగా భారీ ర్యాలీ నిర్వహించారు. జూలై 9న జరిగే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, ఆశా, అంగన్వాడీ వంటి వివిధ ప్రభుత్వ పథకాల కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆటో, ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, ఈపీఎస్ పెన్షన్ దారులకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జేఏసీ చెర్మన్ ఎం.జగ్గునాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎం.మన్మథరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, సీఎఫ్టీయూఐ అఖిలభారత అధ్యక్షుడు కనకారావు ఇతర కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులపై ఆందోళన -
స్టీల్ప్లాంట్లో కార్మిక సమ్మె ప్రశాంతం
● బైక్ ర్యాలీకి యత్నం ● పోలీసుల అదుపులో కార్మిక నాయకులు ఉక్కునగరం: స్టీల్ప్లాంట్లో మంగళవారం జరిగిన కార్మిక సమ్మెలో ఆరుగురు కార్మిక సంఘ నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం మినహా ప్రశాంతంగా జరిగింది. స్టీల్ప్లాంట్ కార్మికులకు సక్రమంగా జీతాల చెల్లింపు, హెచ్ఆర్ఏ పునరుద్ధరణ, కరెంట్ చార్జీల తగ్గింపు, సొంత గనుల కేటాయింపు తదితర డిమాండ్లపై శాశ్వత కార్మికులు ఒక రోజు సమ్మె చేశారు. ఇక కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలని, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పాత పద్ధతిలో అందరికీ ఎస్ఎంఏ, ఏఎస్ఎంఏలను చెల్లించాలని తదితర డిమాండ్లపై కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల షిఫ్ట్ వేళల్లో ప్లాంట్ లోపలికి వెళ్లినప్పటికీ, గేట్ల వద్ద బయోమెట్రిక్ నమోదు చేయించుకోలేదు. షిఫ్ట్–ఎలో కొంత మంది విధులకు హాజరైనప్పటికీ ఆ తర్వాత కొంత మంది కార్మికులు వారికి నచ్చచెప్పి విధుల నుంచి బయటకు తీసుకు వెళ్లిపోయారు. పోలీసుల అదుపులో కార్మిక నాయకులు సెంట్రల్ స్టోర్స్ నుంచి కూర్మన్నపాలెం టెంట్ వరకు బైక్ ర్యాలీగా వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు నమ్మి రమణ, యు.సోమేష్, అప్పలరాజు, వంశీ, బి.అప్పారావు, ఉరుకూటి అప్పారావులను జీపులో ఎక్కించి స్టీల్ప్లాంట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేయనున్నట్లు సీఐ కేశవరావు తెలిపారు. అధిక శాతం విధులకు హాజరు ఇదిలా ఉండగా శాశ్వత ఉద్యోగులు రెండు షిఫ్ట్లలో 85–90 శాతం వరకు విధులకు హాజరు కాగా, కాంట్రాక్ట్ కార్మికులు 60–70 శాతం హాజరయ్యారు. సర్వీసు విభాగాలకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువగా విధులకు హాజరు కాగా, కొన్ని ఉత్పత్తి విభాగాలకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో గైర్హాజరయ్యారు. ఉత్పత్తికి అంతరాయం కలగకుండా యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు కార్మికుల సమ్మె సందర్భంగా పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. సౌత్ ఏసీపీ టి.త్రినాథ్ నేతృత్వంలో ఇద్దరు ఏసీపీలు, తొమ్మిది మంది సీఐలు, 19 మంది ఎస్ఐలతో పాటు సుమారు 500 మంది సిబ్బందిని ఆయా గేట్ల వద్ద, ఈడీ(వర్క్స్) బిల్డింగ్, అడ్మిన్ బిల్డింగ్, సెంట్రల్ స్టోర్స్ కూడలితో పాటు అన్ని ముఖ్య విభాగాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. విధులకు వెళ్లే కార్మికులను సమ్మె చేస్తున్నవారు అడ్డుకోకుండా చర్యలు చేపట్టారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు అన్నారు. ఇప్పటికే వందలాది మందిని తొలగించడంతో వారు రోడ్డున పడ్డారన్నారు. వారి కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. -
వైఎస్సార్సీపీ తూర్పు సమన్వయకర్తగా మొల్లి
ఆరిలోవ: విఽశాఖ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు మొల్లి అప్పారావు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధిష్టానం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గ పరిధి మద్దిలపాలేనికి చెందిన ఆయన పార్టీలో ప్రారంభం నుంచి సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య మొల్లి లక్ష్మి 16వ వార్డు నుంచి వైఎస్సార్సీపీ కార్పొరేటర్గా ఉన్నారు. ఆయన్ని సమన్వయకర్తగా నియమించడంపై పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ మరింత అభివృద్ధి సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధినేత జగన్కు, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
దంచి కొట్టిన వర్షం
మహారాణిపేట: పగలంతా భానుడి తీవ్రతకు తోడు.. గాలిలో తేమ కారణంగా ఉక్కబోత. సాయంత్రానికి కాస్త మబ్బులు పట్టిన ఆకాశం. అర్ధరాత్రి దాటాక దంచికొట్టిన వాన. ఇదీ సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు నగరంలో వాతావరణ పరిస్థితి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు రెండు గంటలపాటు ఉరుములు మెరుపులతో కూడిన హోరు వాన నగరాన్ని ముంచెత్తింది. కాసేపు విరామమిచ్చి మళ్లీ కురిసింది. మంగళవారం ఉదయం కూడా ఇదే పరిస్థితి. వర్షం తగ్గాక.. ఉదయం 9 గంటల నుంచి మళ్లీ ఎండలు షరామామూలే. ఉక్కబోత వాతావరణం గత కొద్ది రోజులుగా ఉదయం పూట ఎండ తీవ్రత వల్ల విశాఖ వాసులు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. వర్షం కురిసిన తర్వాత కూడా ఎండ వచ్చాక, అదే పరిస్థితి. బంగాళాఖాతంలో రుతుపవనాలు, అల్పపీడనం, పశ్చిమ, నైరుతి నుంచి వీస్తున్న గాలుల వల్ల వర్షాలు పడుతున్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం భారీ వర్షంతో నగరంలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. జ్ఞానాపురం రైల్వే వంతెన వర్షపు నీటితో నిండిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూర్ణామార్కెట్ ఏరియాలో పలు ప్రాంతాల్లో గంటల తరబడి నీరు నిలిచిపోయింది. ఇక్కడే ఓ రోడ్డు కుంగిపోయింది. రైల్వే స్టేషన్ రోడ్డు, డాబాగార్డెన్స్, రైల్వే న్యూకాలనీ, దొండపర్తి, చావులమదుం అక్కయ్యపాలెం, వెలంపేట, పూర్ణామార్కెట్, ఆశీలమెట్ట, కంచరపాలెం, ఎన్ఏడీ కొత్తరోడ్డు, పాతపోస్టాఫీసు, సీతమ్మధార, కేఆర్ఎం కాలనీ, మద్లిపాలెం తదితర ప్రాంతాల్లో చాలా వీధులు జలమయమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, వైఎస్సార్ సెంట్రల్ పార్కు వద్దనున్న నైట్ ఫుడ్ కోర్టులో వర్షపు నీరు భారీగా చేరింది. వర్షం తగ్గాక చుర్రుమన్న ఎండలు నగరంలో కురిసిన వర్షపాతం ప్రాంతం వర్షపాతం (మి.మీ.) విశాఖ రూరల్ 72.4 సీతమ్మధార 65.0 మహారాణిపేట 38.2 గోపాలపట్నం 29.4 భీమునిపట్నం 26.2 ఆనందపురం 24.6 పెదగంట్యాడ 18.6 గాజువాక 18.6 పద్మనాభం 10.4 పెందుర్తి 4.8 -
36 గంటల్లో హత్య కేసు నిందితుల అరెస్ట్
పరవాడ: ముత్యాలమ్మపాలెంలో ఈ నెల 18న మైలపల్లి బంగార్రాజుపై కత్తులు, రాళ్లతో దాడి చేసి, హతమార్చిన నిందితులను 36 గంటల వ్యవధిలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అదే గ్రామానికి చెందిన ముద్దాయి చింతకాయల ఎర్రయ్య, మృతుడు బంగార్రాజు వద్ద గతంలో రూ.63 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ మొత్తం నుంచి రూ.45 వేలు చెల్లించి, ఇంకా రూ.18 వేలు బాకీ ఉన్నాడు. ఈ విషయమై ఎర్రయ్యను పలుమార్లు బంగార్రాజు అడిగాడు. అంతే కాకుండా అందరికీ చెప్తూ తనను అబాసుపాల్జేస్తున్నాడని ముద్దాయి కోపంతో మృతుడిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 18న రాత్రి 9.30 సమయంలో పథకం ప్రకారం ప్రథమ మద్దాయి కొవిరి కామేష్, కొవిరి శివాజీ, కొవిరి ముత్యా లు(ఆర్మీ), చింతకాయల ఎర్రయ్య, కొవిరి ముత్యాలు, వాసుపల్లి ప్రవీణ్కుమార్, కొవిరి ముత్యాలమ్మలు కలసి కత్తులు, రాళ్లు, ఐరన్ రాడ్తో బంగార్రాజుపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బంగార్రాజును వైద్యం కోసం గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో మృతుడి సోదరుడు మైలపల్లి పోలరాజు గాయపడినట్లు డీఎస్పీ చెప్పారు. మృతుడి భార్య మైలపల్లి బంగారం ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వీరిని మడుతూరు జంక్షన్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు, అచ్యుతాపురం సీఐ గణేష్, రాంబిల్లి ఎస్ఐ నరసింగరావు, పరవాడ ఎస్ఐలు బి.కృష్ణారావు, వి.సత్యనారాయణ, సిబ్బందిని అభినందించారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ఒక ఐరన్ రాడ్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన ఈ ఘటనను ఆసరాగా తీసుకుని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సీఐ ఆర్.మల్లికార్జునరావు, ఎస్ఐలు బి.కృష్ణారావు, సత్యనారాయణ, ఏఎస్ఐ బి.ఎర్రునాయుడు పాల్గొన్నారు. ఏడుగురు నిందితులకు రిమాండ్ -
కిరాణాషాపులో ఫ్రిడ్జ్ షాక్ కొట్టి విద్యార్థి మృతి
తగరపువలస: ఆనందపురం మండలం చందకలో మంగళవారం కిరాణా షాపులో పనిచేస్తున్న 6వ తరగతి విద్యార్థి రెడ్డి దశ్వంత్(13) ఫ్రిడ్జ్ డోర్ తీయడానికి ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనందపురం పంచాయతీ దండువారి కళ్లాలలకు చెందిన లారీ డ్రైవర్ అయిన రెడ్డి శివ, కుమారి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిద్దరూ ఆనందపురం ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. వేసవి సెలవుల కారణంగా పెద్ద కుమారుడు చందకలో మహేష్ అనే వ్యక్తికి చెందిన కిరాణా షాపులో పని చేస్తున్నాడు. మంగళవారం కురిసిన వర్షానికి తడిసిన ఫ్రిడ్జ్ను తాకడంతో షాక్కు గురై పడిపోయాడు. అందుబాటులో ఉన్న గ్రామీణ వైద్యుని వద్దకు తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో, మధురవాడలోని గాయత్రి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయినట్టు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఆనందపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పరవాడలో యువకుడి హత్య
పరవాడ: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో ఆదివారం రాత్రి చీటి డబ్బుల విషయంలో జరిగిన ఘర్షణలో మైలపల్లి బంగార్రాజు (35) అనే యువకుడు కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న బంగార్రాజు చీటిల వ్యాపారం చేస్తుండగా, అదే గ్రామానికి చెందిన చింతకాయల ఎర్రయ్య అతనికి రూ.18 వేలు బాకీ ఉన్నాడు. ఈ విషయంపై ఫోన్లో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఇద్దరూ ఘర్షణ పడ్డారు. అక్కడే ఉన్న ఎర్రయ్య మేనల్లుడు కొవిరి కామేష్ కత్తితో బంగార్రాజును పొడవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు, పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్, క్లూస్ టీం ఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కామేష్తో పాటు మరో ఆరుగురు దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. భర్తను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంగార్రాజు భార్య బంగారమ్మ, కుటుంబ సభ్యులు సోమవారం పరవాడ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చీటి డబ్బుల వివాదమే కారణం -
పల్లా శ్రీనివాసరావుపై న్యాయపోరాటం
● అన్ని పార్టీల మద్దతు కోరతా ● ఎమ్మెల్యే పదవి నుంచి గాజువాక ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలి ● తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ తాటిచెట్లపాలెం: గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుపై అన్ని పార్టీల మద్దతుతో న్యాయపోరాటం చేస్తానని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ తెలిపారు. తాను వ్యక్తిగతంగానే పోరాడుతున్నానని, ఈ పోరాటానికి కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ, లోక్సత్తా తదితర పార్టీల మద్దతు కోరుతున్నట్లు ఆయన చెప్పారు. సోమవారం హోటల్ సింకా గ్రాండ్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల సమావేశంలో పాల్గొన్న పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీకి ఈ విషయమై వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపేస్తారా? అని రామ్ ప్రశ్నించారు. పల్లా శ్రీనివాస్ తనపై హత్యాయత్నం చేశారని, గాజువాకలో భూకబ్జాల మాఫియాకు మారుపేరుగా పల్లా శ్రీనివాస్ నిలిచారని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించి, చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై జరిగిన దాడి విషయమై గాజువాక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని, పోలీస్ కమిషనర్ను కూడా కలిశానని, ఆయనపై నమ్మకం ఉందన్నారు. పల్లా శ్రీనివాసరావుపై సీబీఐ, కేంద్ర హోం శాఖకు కూడా ఫిర్యాదు చేశానని రామ్ తెలిపారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని భావించానని, కానీ టీడీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారని మండిపడ్డారు. పల్లా శ్రీనివాసరావు దగ్గర ఉండే మురళీ అతని వ్యవహారాలన్నీ చూస్తూ సెటిల్మెంట్లు, కలెక్షన్స్ చేస్తుంటాడని ఆరోపించారు. అన్ని పార్టీలతో కలిసి న్యాయపోరాటం చేస్తానని, ఈ విషయమై ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును కలిశానని, కాంగ్రెస్ నాయకులను కలిశానని, త్వరలోనే వైఎస్సార్ సీపీ, కమ్యూనిస్టులు, లోక్సత్తా నాయకులను కలుస్తానని రామ్ తెలిపారు. ప్రాణ రక్షణ కోసం తనకు గన్ లైసెన్స్ ఇప్పించాలని పోలీస్ కమిషనర్ను కోరనున్నట్లు బీవీ రామ్ తెలిపారు. -
షర్మిలతో కాంగ్రెస్ పూర్తి నిర్వీర్యం
తాటిచెట్లపాలెం: పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని వివిధ జిల్లాల కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో సోమవారం విశాఖలో జరిగిన ప్రత్యేక సమావేశంలో వీరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి షర్మిలకు, ఆమె తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మెమోరాండంలు కిల్లి కృపారాణికి అందజేశారు. నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో గెలిచే వారికి కాకుండా.. అధినాయకత్వం ప్రకటించిన వారిని కాదని షర్మిల కొత్త వారికి టికెట్లిచ్చి కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమయ్యారని మండిపడ్డారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి కూడా ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పక్షంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కలిసిపోయిందని.. ప్రభుత్వంపై పోరాడాల్సింది పోయి, గత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తూ, దూషిస్తూ పచ్చ మీడియాలో పతాక శీర్షికలో నిలిచేందుకు తప్ప మరేమి చేయడంలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పోసుకోవాలంటే రాష్ట్ర నాయకత్వ మార్పు అత్యవసరమని నేతలంతా కుండబద్దలు కొట్టారు. కిల్లి కృపారాణి మాట్లాడుతూ ఇక్కడి విషయాలను సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీలకు తెలియజేసి, వినతులను పార్టీ అధిష్టానానికి అందజేస్తానన్నారు. -
నాణ్యతే ప్రామాణికం..అవగాహనే కీలకం
● వస్తువులు కొనుగోలు చేసేటప్పడు జాగ్రత్తలు పాటించాలి ● కొలతల్లో మోసాలు జరిగితే అధికారులను సంప్రదించాలి ● నేడు ప్రపంచ లీగల్ మెట్రాలజీ దినోత్సవం తాటిచెట్లపాలెం: వినియోగదారులు నాణ్యమైన ఉత్పత్తులు పొందడం ఎంత ముఖ్యమో, వాటి గురించి సరైన అవగాహన కలిగి ఉండటం కూడా అంతే కీలకం. కొనుగోలు చేసే ప్రతి వస్తువు నాణ్యతను పరిశీలించడంతో పాటు, వాటి తయారీ, కొలతలు, ధర వంటి వివరాలపై అవగాహన పెంచుకుంటే మోసాల నుంచి బయటపడొచ్చు. ప్రజలు కొనుగోలు చేసే ప్రతి వస్తువులోనూ తూనికలు, కొలతల విషయంలో జాగ్రత్త వహించాలని లీగల్ మెట్రాలజీ ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కే థామస్ రవికుమార్ సూచించారు. మంగళవారం ప్రపంచ లీగల్ మెట్రాలజీ దినోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయమై మాట్లాడారు. ప్రతి సంవత్సరం మే 20న ప్రపంచ లీగల్ మెట్రాలజీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1875లో పారిస్లో జరిగిన మీటర్ కన్వెన్షన్కు గుర్తుగా ఈ దినోత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరం లీగల్ మెట్రాలజీ 150వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 2025 లీగల్ మెట్రాలజీ డే ‘కొలతలు అన్ని కాలాలకు – అందరు ప్రజలకు’ నినాదంతో సాగుతుంది. ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా లీగల్ మెట్రాలజీ విభాగం ఈ నెల 8 నుంచి 19 వరకు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అవగాహన శిబిరాలు, తనిఖీలు నిర్వహించింది. ఆయా ప్రాంతాలలో వస్తువులను కొనుగోలు చేసేటపుడు ప్రజలు ఎలా మోసపోతారో, ప్రజలను వ్యాపరులు ఎలా మోసగిస్తారో వివరించారు. తూనికలు, కొలతలు, ప్యాకేజీ వస్తువుల విషయంలో వినియోగదారులు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపారు. బంగారు ఆభరణాల విషయంలో... బంగారు ఆభరణాలు కొనేటప్పుడు రాళ్లు, బంగారం వేర్వేరుగా తూకం వేస్తున్నారో లేదో చూడాలి. బిల్లులో నికర బరువు, ధర, స్వచ్ఛత వివరాలు పరిశీలించాలి. కొనుగోలు సమయంలో మిల్లీగ్రాము వరకు ఖచ్చితత్వమున్న ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలను, వాటికి లీగల్ మెట్రాలజీ సీల్ ఉందో లేదో గమనించాలి. పెట్రోలు బంకుల్లోనూ.. పెట్రోల్, డీజిల్ కొనే ముందు పంప్ మీటర్ 0 తో మొదలయ్యేలా చూడాలి. సరైన ధర చెల్లిస్తున్నారో లేదో గమనించాలి. అనుమానం ఉంటే, పెట్రోల్ బంకుల్లో ఉండే లీగల్ మెట్రాలజీ సీల్ ఉన్న ఐదు లీటర్ల కొలత పాత్రతో పరిమాణం సరిచూసుకోవాలి. ప్యాకేజీ వస్తువుల విషయంలో.. ప్యాకేజీ వస్తువులు కొనే ముందు బరువు, కొలత, తయారీ తేదీ, గరిష్ట అమ్మకపు ధర, కస్టమర్ కేర్ వివరాలు చూడాలి. ఎంఆర్పీ కంటే ఎక్కువ చెల్లించకూడదు. ఎవరైనా ఎక్కువ ధర డిమాండ్ చేస్తే లీగల్ మెట్రాలజీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, సినిమా థియేటర్లు, హోటళ్లు, మార్కెట్లు, కిరాణా, సూపర్ మార్కెట్లలో ఎంఆర్పీ కంటే ఎక్కువ చెల్లించకూడదు. 2024–25 సంవత్సరంలో లీగల్ మెట్రాలజీ గణాంకాలు... జిల్లాలో నమోదు చేసిన కేసులు – 1500 స్టాంపింగ్ ఫీజు – రూ.2,34,88,983 కాంపౌండింగ్ ఫీజు (అపరాధరుసుము/ జరిమానాలు)– రూ.1,16,75,710 -
ప్రభుత్వ స్థలాల ఆక్రమణ
జీవీఎంసీ జోన్–2, మధురవాడలోని ప్రభుత్వ పార్కు స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. బొట్టవానిపాలెంలోని ఈడబ్ల్యూఎస్ లేఔట్, స్వతంత్ర నగర్లోని కోట్ల రూపాయల విలువైన జీవీఎంసీ పార్కులో 150 గజాల స్థలాన్ని కొందరు ఆలయం పేరుతో ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. ఈ నెల 5న జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. కళానగర్లోని కృష్ణ నగర్ పార్కు, బ్రహ్మంగారి గుడి ఎదురుగా ఉన్న మరో పార్కు స్థలం కూడా కబ్జాకు గురయ్యాయి. ఆక్రమణదారులకు జోనల్ కమిషనర్ మద్దతు ఇస్తున్నారు. కలెక్టర్, జీవీఎంసీ అధికారులు స్పందించి పార్కులను కాపాడాలి. –చేకూరి రజని, సామాజిక కార్యకర్త, మధురవాడ -
కృత్రిమ ఆవాసాలు, సీ వీడ్కు మంచి గిరాకీ
మంత్రి అచ్చెన్నాయుడుమహారాణిపేట: ఉత్తరాంధ్ర సముద్ర జలాల్లో మత్స్య సంపద వృద్ధి కోసం మొదటి విడతగా 22 కృత్రిమ ఆవాసాల యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మత్స్య, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జాలారి ఎండాడ సముద్రంలో కృత్రిమ ఆవాసాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిషింగ్ హార్బర్లో మరపడవల బోట్లకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద 634 ట్రాన్స్పాండర్లను 100 శాతం సబ్సిడీపై అందజేసినట్లు తెలిపారు. ట్రాన్స్పాండర్ల వాడకం వల్ల సముద్రంలో బోటు స్థానాన్ని తెలుసుకోవడం, తుఫానులు, ప్రమాదాల సమయంలో ఉపయోగపడుతుందని చెప్పారు. మత్స్యకారులకు జీపీఎస్, బోట్లు, ఇంజన్లు, వలలు వంటి పరికరాలను సబ్సిడీపై సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు. ఫిషింగ్ హార్బర్లో క్రేన్, క్రెడిల్స్ ఏర్పాటుకు పోర్టు చైర్మన్తో మాట్లాడతానని చెప్పారు. ఆర్కే బీచ్ ఎదురుగా ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్, సీ వీడ్ కల్చర్ యూనిట్ను మంత్రి సందర్శించారు. వసీవీడ్కు విదేశాల్లో మంచి గిరాకీ ఉందని, రాష్ట్రవ్యాప్తంగా 22 సీవీడ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా 45 రోజుల్లోనే ఆదాయం వస్తుందని మంత్రి తెలిపారు. కేజ్ కల్చర్ ద్వారా మత్స్య సంపదను అభివృద్ధి చేసుకోవచ్చని, సీవీడ్ను ఆధారం చేసుకుని చిన్న పరిశ్రమగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్, మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, విశాఖ మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.లక్ష్మణరావు, సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జోయ్ కిజాకుద్దీన్, మరపడవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.లక్ష్మణరావు, మాజీ అధ్యక్షుడు పీసీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సీ కేజ్ అమ్మకాలు ద్వారా వచ్చిన రూ.3.25 లక్షల చెక్కును లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. -
అర్జీల రీ ఓపెన్పై కలెక్టర్ అసంతృప్తి
● వచ్చే వారం అర్జీదారులతోస్వయంగా నేనే మాట్లాడతా ● అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు ● కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు 225 వినతులు మహారాణిపేట: జిల్లాలో గ్రామ సభల్లోని సమర్పించిన అర్జీలు రీ–ఓపెన్ అవుతుండడంపై కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండిం గ్ అర్జీలపై సమీక్షించి, అర్జీదారులతో స్వయంగా మాట్లాడి, కచ్చితమైన సమాచారంతో పొరపాట్లు లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు, అర్జీదారులు మీకోసం.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్లో లేదా 1100 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. వచ్చే సోమవారం పీజీఆర్ఎస్ సందర్భంగా అధికారుల సమక్షంలో అర్జీదారులతో ఫోన్లో మాట్లాడతానని, అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను 24 గంటల్లో తెరిచి, పూర్తిగా విచారణ చేసి, మళ్లీ రాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆయన అర్జీదారుల సమస్యలు వింటూ, వాటిని సంబంధిత అధికారులకు పంపి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ సిటీ ప్లానర్ ధనుంజయ రెడ్డి కూడా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సోమవారం మొత్తం 225 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 91 ఉండగా, పోలీసు శాఖకు సంబంధించి 18, జీవీఎంసీ సంబంధించి 51 ఉన్నాయి. అలాగే ఇతర విభాగాలకు సంబంధించి 65 వినతులు వచ్చాయి. -
కూటమిలోడిప్యూటీ చిచ్చు
● జనసేనకు డిప్యూటీ మేయర్ కేటాయింపుపై ససేమిరా అంటున్న టీడీపీ నేతలు ● 22 రోజుల క్రితం ఉన్న ఐక్యతా రాగం ‘కౌన్సిల్ సాక్షిగా’ విచ్ఛిన్నం ● కూటమి పార్టీల్లో బయటపడ్డ లుకలుకలు మంగళవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2025ముగ్గురు సీఐలకు స్థానచలనంవిశాఖ సిటీ: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు సీఐలకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోపాలపట్నం లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ జి.అప్పారావును మల్కాపురం లా అండ్ ఆర్డర్కు బదిలీ చేశారు. ఇక్కడ సీఐగా విధులు నిర్వర్తించిన విద్యాసాగర్పై ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఆయనపై వేటు పడింది. ఒక ఫిర్యాదు చేయడానికి ఆమె స్టేషన్కు వస్తే.. సీఐ ఫోన్లు, మెసేజ్లతో వేధింపులకు గురిచేస్తున్నారని సీపీ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. విచారణ అనంతరం విద్యాసాగర్ను రేంజ్కు సరెండర్ చేశారు. దీంతో ఆ స్థానంలో అప్పారావును నియమించారు. అలాగే సీఎస్బీ–3లో ఉన్న ఎన్.వి.ప్రభాకరరావును గోపాలపట్నం లా అండ్ ఆర్డర్కు, వీఆర్–1లో ఉన్న జి.గోవిందరావును సీఎస్బీ–3కు బదిలీ చేశారు. హాజరైన ఎమ్మెల్యేలు పల్లా, వెలగపూడి, ఎమ్మెల్సీ వేపాడ డాబాగార్డెన్స్ : ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవనేది నానుడి. దీనికి తగ్గట్టుగానే జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ, జనసేన మధ్య చిచ్చురేపింది. మొన్నటి మేయర్ ఎన్నిక వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇరుపార్టీల నేతల్లో అసహనం వ్యక్తమైంది. ఇన్నాళ్లు కూటమి పార్టీలంతా ఒక్కటేనని బయటకు చెబుతున్నా.. ఈ ఎన్నిక సందర్భంగా లుకలుకలు బయటపడ్డాయి. సంఖ్యాబలం ఉండి కూడా కోరం లేక సమావేశం వాయిదా పడిందంటే.. పదవుల కోసం తప్ప ప్రజలకు మేలు చేయాలని వారు కలవలేదని తేలిపోయింది. డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశం సోమవారం జరిగింది. ఈ పదవిని జనసేనకు కేటాయించగా టీడీపీ ఆశావహులు సమావేశానికి డుమ్మా కొట్టారు. ఎలాగైనా తమకే ఈ పదవి దక్కాలని భీష్మించారు. దీంతో కోరం లేక సమావేశం మంగళవారం నాటికి వాయిదా పడింది. జనసేన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో అలిగి అక్కడ నుంచి వెళ్లిపోయారు. చివరి వరకు ఆశావహుల ప్రయత్నాలు మేయర్గా పీలా శ్రీనివాసరావును కూటమి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. టీడీపీ ఆశావాహులు మాత్రం గత వారం రోజులుగా ఈ పదవి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఎవరికి వారు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ తనకే పదవి వచ్చేలా చూడాలంటూ శతవిధాలా ప్రయత్నాలు చేశారు. అయితే జనసేన పార్టీకే డిప్యూటీ మేయర్ పదవి కేటాయించారు. ఆ పార్టీకి చెందిన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డికి ఆ పార్టీ నేతలు బీ ఫారం అందజేశారు. కారాలు మిరియాలు జనసేనకు చెందిన దల్లి గోవిందరెడ్డికి బీ ఫారం ఇవ్వడంతో టీడీపీ కార్పొరేటర్లు జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికకు వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించారు. మంగళవారం ఉదయం నగరంలోని ఓ హోటల్లో భేటీ అయిన టీడీపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయారు. హోటల్ నుంచి ఓ వర్గం టీడీపీ కార్పొరేటర్లు వేరే చోటికి వెళ్లిపోయారు. ఓ వర్గం టీడీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి హాజరైనా.. కోరానికి సరిపడా సభ్యులు లేకపోవడంతో జనసేన ఆశలు ఆవిరైనట్టయింది. దీంతో ఇరు పార్టీల నేతలు కారాలు మిరియాలు నూరుకున్నారు. న్యూస్రీల్జంప్ జిలానీలు తెల్లముఖంస్వార్థ రాజకీయాలు, డబ్బులకు అమ్ముడుపోయి వైఎస్సార్ సీపీ నుంచి జనసేనలో చేరిన కార్పొరేటర్లు, ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు వారు ఆశించినట్టు సాగకపోవడంతో తెల్లముఖం వేసినట్టయింది. ఎందుకు పార్టీని వీడామని మధనపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతలోనే అంత.. దల్లిపై ఎన్ని ఫిర్యాదులో.. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటీవలే వైఎస్సార్ సీపీ నుంచి జనసేనలో చేరిన పలువురు కార్పొరేటర్లు.. తొలి నుంచి జనసేన పార్టీలో ఉన్న దల్లి గోవిందరెడ్డిపై అధిష్టానానికి పలు ఫిర్యాదులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దల్లి గోవిందరెడ్డి గుట్కా వ్యాపారితో అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారంటూ ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. అవి అవాస్తవమని నమ్మిన పార్టీ అధిష్టానం దల్లి గోవిందరెడ్డికే డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపింది. బీ ఫారం అందజేయడంతో ఆ పార్టీలో చేరిన వారంతా ఖంగుతిన్నట్టయింది. టీడీపీలో ముసలానికి కారణంవీరే.. డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు ముసలం పెట్టారని ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు బాహాటంగా అంటున్నారు. మేయర్ పీలా శ్రీనివాస్ గాజవాక నియోజకవర్గానికి చెందిన గంధం శ్రీనివాస్కు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆ నియోజకవర్గ యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ మంగవేణికి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆ నియోజకవర్గం యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ మొల్లి హేమలతకు హామీ ఇచ్చి వారిలో ఆశలు రెక్కిత్తించారనే ఆరోపణలు భగ్గుమంటున్నాయి. ఏది ఏమైనా కూటమిలో చిచ్చుకు కారకులు వీరేనంటూ పలువురు కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. గత నెల 28న మేయర్ ఎన్నిక నిర్వహించారు. కుట్రలు, కుతంత్రాలతో నిర్వహించిన ఎన్నికలో పీలా శ్రీనివాస్ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 22 రోజుల తర్వాత నిర్వహించిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో కూటమి పార్టీల్లో లుకలుకలు బయటపడ్డాయి. కేవలం అధికారం కోసం ఏర్పడిన పొత్తు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు. చరిత్రలోనే లేదు.. కోరం లేక సమావేశం వాయిదా పడడం జీవీఎంసీ చరిత్రలోనే లేదని వైఎస్సార్ సీపీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల సత్య శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కూటమిలో సఖ్యత లేదనడానికి సోమవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికే నిదర్శనమని పేర్కొన్నారు. 63 మంది కార్పొరేటర్లలో 20 మంది వరకు డిప్యూటీ మేయర్ ఎన్నికకు డుమ్మా కొట్టారంటే కూటమిలో లుకలుకలు తేటతెల్లమయ్యాయన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేసే ఆలోచనే తప్ప.. ప్రజాసమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. -
బుద్ధిస్ట్ సర్క్యూట్స్ కోసం డీఎంవో
సాక్షి, విశాఖపట్నం: బౌద్ధారామాల్ని పర్యాటక ప్రాంతాలుగా మరింత అభివృద్ధి చేసేందుకు ఏపీ టూరిజం అథారిటీ(ఏపీటీఏ) కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బౌద్ధారామాల్ని గుర్తిస్తూ.. ఆయా ప్రాంతాల్లో ఉన్నవాటిని బుద్ధిస్ట్ సర్క్యూట్స్గా అభివృద్ధి చేయాలని సంక ల్పించింది. గత ప్రభుత్వ హయాంలోనే దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. దానికనుగుణంగా విశాఖలోనూ బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు కోసం రెండు సర్క్యూట్స్ను ప్రతిపాదించారు. కంప్లీట్ బుద్ధిస్ట్ సర్క్యూట్గా విశాఖలోని బౌద్ధారామాలు, అమరావతిలోని బౌద్ధారామాల్ని గుర్తించారు. అదేవిధంగా విశాఖపట్నం సర్క్యూట్గా శ్రీకాకుళంలోని శాలిహుండం, విశాఖలోని బావికొండ, తొట్లకొండ, అనకాపల్లిలోని బొజ్జనకొండ, తూర్పుగోదావరి జిల్లాలోని అదుర్రు బౌద్ధారామాల్ని గుర్తించారు. ఈ సర్క్యూట్స్ అభివృద్ధి, నిర్వహణ, మార్కెటింగ్, ప్రమోషన్ కోసం రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్స్(డీఎంవో)ను ఏర్పాటు చేస్తూ టూరిజం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్జైన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డీఎంవోకు విశాఖ జిల్లా కలెక్టర్ చైర్మన్గానూ, అనకాపల్లి జిల్లా కలెక్టర్ కో–చైర్మన్గా వ్యవహరిస్తారు. వీఎంఆర్డీఏ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, ఏయూ ప్రొఫెసర్, కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల ప్రతినిధులు, టూరిజం శాఖ విశాఖ ఆర్డీ, విశాఖ, అనకాపల్లి జిల్లా టూరిజం అధికారులు, ఏపీటీడీసీ విశాఖ డివిజనల్ మేనేజర్, ఈఈలు మెంబర్లుగా వ్యవహరించనున్నారు. బుద్ధిస్ట్ సర్క్యూట్స్ వద్ద మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం, స్థానిక సంస్థలు, అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీలు, స్పాన్సర్షిప్ల సహాయంతో బౌద్ధారామాల వద్ద పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడం మొదలైనవన్నీ డీఎంవోలు చూస్తాయని పేర్కొన్నారు. -
స్టీల్ప్లాంట్ సమ్మెకు వైఎస్సార్ సీపీ మద్దతు
పెదగంట్యాడ: అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20న చేపట్టనున్న స్టీల్ప్లాంట్ పర్మినెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు వైఎస్సార్ సీపీ మద్దతు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు. స్థానిక బీసీ రోడ్డులోని టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్నో పోరాటాలు, ఎంతో మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్టీల్ప్లాంట్ను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామన్నారు. నిర్వాసితుల నుంచి 26 వేల ఎకరాల భూమిని తీసుకుని కేవలం 16,500 మందికి ఆర్ కార్డులు ఇచ్చి అందులో కేవలం 8 వేల మందికి ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరిపి స్టీల్ప్లాంట్ను ప్రైవేటుపరం కాకుండా కాపాడాలని కోరారు. నిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నారని.. ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపేస్తున్నారని.. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి, నాయకులు మార్టుపూడి పరదేశి, పల్లా చినతల్లి, ధర్మాల శ్రీను, కోమటి శ్రీనివాసరావు, మంత్రి శంకర్నారాయణ, బొడ్డ గోవింద్, సిరట్ల శ్రీనివాస్ గౌడ్, చిత్రాడ వెంకటరమణ, మద్దాల అప్పారావు, డీవీ రమణారెడ్డి, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. -
జనసేనకు టీడీపీ జెల్ల
● పొత్తు ధర్మం విస్మరించి డిప్యూటీ మేయర్ ఎన్నిక సమావేశానికి డుమ్మా కొట్టిన పలువురు టీడీపీ కార్పొరేటర్లు ● ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే కూడా గైర్హాజరు ● కోరంకు 56 మంది అవసరం కాగా 54 మంది హాజరు ● నేటికి ఎన్నిక వాయిదా వేస్తూ ఎన్నికల అధికారి ప్రకటన డాబాగార్డెన్స్: జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికలో జనసేనకు మిత్రపక్షమైన టీడీపీ జెల్ల కొట్టింది. పొత్తు ధర్మం మరిచి డిప్యూటీ మేయర్ కుర్చీ కోసం కుయుక్తులు పన్నింది. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించగా.. సోమవారం జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి పలువురు టీడీపీ ఆశావహులు డుమ్మా కొట్టారు. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ మంగళవారం నాటికి సమావేశం వాయిదా వేశారు. ముందస్తు సమాచారం మేరకు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభం కావాల్సి ఉంది. ఆ సమయానికి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, ఆ పార్టీ కార్పొరేటర్ కవితతోపాటు సీపీఎం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, సీపీఐ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ హాజరయ్యారు. 11.10 గంటలకు జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్బాబు కౌన్సిల్కు వచ్చారు. 11.15 గంటలకు జనసేనకు చెందిన 14 మంది కార్పొరేటర్లు సమావేశ మందిరానికి చేరుకున్నారు. 11.20 గంటలకు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు వచ్చారు. 11.30 గంటలకు టీడీపీ కార్పొరేటర్లు(కాకి గోవిందరెడ్డి తప్ప) ఎవరూ హాజరు కాలేదు. మరో అరగంట మాత్రమే సమావేశం నిర్వహించేందుకు సమయం ఉంది. ఇంతలో ఒకరినొకరు చెవులు కొరుక్కునే పనిలో పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్ 11.40 గంటలకు కౌన్సిల్ హాల్లోకి అడుగుపెట్టారు. అప్పటికే మేయర్ పీలా శ్రీనివాస్తో పాటు జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మళ్లగుల్లాలు పడుతున్నారు. 11.53 గంటలకు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి రాక ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ 11.53 గంటలకు సమావేశానికి హాజరయ్యారు. (వాస్తవానికి సభ్యులకు ఇచ్చిన సమయానికే రావాలి). వచ్చిన వెంటనే ఎంత మంది సభ్యులు వచ్చారో లెక్కించాలని అధికారులను ఆదేశించారు. కోరం సరిపడా సభ్యులు లేకపోయినా ఇద్దరు అధికారులు (ఏడీసీ డి.వి.రమణమూర్తి, కార్యదర్శి బి.వెంకటరమణ) అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇంకా వస్తారా.. సార్ అంటూ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగారు. 12.10 గంటలైనా అధికారులిద్దరూ లెక్కపెడుతూనే ఉన్నారు. అప్పటికే సమయం మించిపోవడంతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ నేరుగా సభ్యులను లెక్కించారు. ఎన్నికకు 56 మంది అవసరం కాగా 54 మందే హాజరయ్యారని.. కోరం తగ్గట్టు సభ్యులు లేరని గుర్తించారు. దీంతో సమావేశాన్ని మంగళవారం నాటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
సమ్మెతో చావో రేవో తేల్చుకుందాం..
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మంగళవారం జరగనున్న సమ్మెతో చావో రేవో తేల్చుకుందామని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్సేన్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం స్మృత్యంజలి పార్కు వద్ద జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోవడం కార్మికుల జీవన్మరణ సమస్యగా ఉందన్నారు. ప్లాంట్ ఉద్యమం ఒంటరి కాదని దీనికి దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు మద్దతు ఇస్తున్నాయన్నారు. కార్మికవర్గం మరింత ఐక్యంగా ప్రభుత్వ, యాజమాన్యాల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా మరింత పోరాటాలు చేయాల్సి ఉందన్నారు. స్టీల్ ఇంటక్ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యం నిర్భందాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మె విజయవంతం చేయాలన్నారు. స్టీల్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ మాట్లాడుతూ యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య విధానాలకు స్వస్తి పలకాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు, కార్పొరేటర్ గంగారావు, జిల్లా సీఐటీయూ నాయకులు జగ్గునాయుడు, ఆర్.ఎస్.వి.కుమార్, కె.ఎం.శ్రీనివాస్, నాయకులు వై.టి.దాస్, గణపతిరెడ్డి, కె.ఎస్.ఎన్.రావు, కె.సత్యనారాయణ, నమ్మి రమణ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్సేన్ నేడు స్టీల్ప్లాంట్ పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె -
రేపు డీఈవో కార్యాలయం ముట్టడిస్తాం..
● ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక అల్టిమేటం ● కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం ● డీఈవోకు నోటీస్ అందజేసిన నాయకులు విశాఖ విద్య: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సోమవారం ఉమ్మడి జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న విశాఖ డీఈవో ఎన్.ప్రేమ్కుమార్కు ముందస్తు నోటీస్ అందజేశారు. తమ సమస్యలకు పరిష్కారం లభించేంత వరకు దశలవారీగా పోరాటాలకు సిద్ధమన్నారు. అంతకుముందు డీఈవో కార్యాలయం వద్ద సమావేశమైన ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి ఇమంది పైడిరాజు మాట్లాడుతూ 117 జీవో రద్దు చేసి, ప్రత్యామ్నాయంగా కూటమి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు విద్యారంగానికి తీవ్ర నష్టం చేకూర్చేలా ఉన్నాయన్నారు. తొమ్మిది రకాల బడులు విద్యారంగాన్ని మరింత ప్రమాదంలో నెట్టే అవకాశం ఉందన్నారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించి అసంబద్ధమైన నిర్ణయాలతో ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఐక్యవేదిక పిలుపులో భాగంగా చేపట్టే డీఈవో కార్యాలయ ముట్టడికి ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు అంతా తరలిరావాలన్నారు. ప్రభుత్వానికి ఉపాధ్యాయుల గళాన్ని వినిపించేలా ముట్టడిని విజయవంతం చేయాలన్నారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక జిల్లా స్టీరింగ్ కమిటీ చొక్కాకుల సూర్యనారాయణ(వైఎస్సార్టీఏ), వేణుగోపాల్ (ఏపీహెచ్ఎంఏ), టి.రామకృష్ణ (ఏపీటీఎఫ్–257) జి.చిన్నబ్బాయి (యూటీఎఫ్), అరుణ్ కుమార్ (ఏపీయూఎస్) ఎన్.ధనుంజయరావు (ఏపీటీఎఫ్–1938)బి.చిన్నారావు, పీఆర్టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఈపీడీసీఎల్ సీఎండీ పేరుతో ఫేక్ వాట్సాప్!
సాక్షి, విశాఖపట్నం: ‘నేను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఫృథ్వీతేజ్ ఇమ్మడి. మీ విద్యుత్ కనెక్షన్ల విషయంలో గందరగోళం ఉంది. కాబట్టి.. మీపై యాక్షన్ తీసుకుంటాను..’ అంటూ ఓ ఫేక్ నంబర్తో కొందరు వినియోగదారులకు వాట్సాప్ల్లో మెసేజ్లు వెళ్లాయి. మరికొందరికి తొలుత హాయ్.. అని మెసేజ్పెట్టిన తర్వాత రిప్లయ్ ఇస్తుంటే.. అర్జెంట్గా లక్ష రూపాయిలు కావాలంటూ మెసేజ్లు చేస్తున్నారు. వాట్సాప్ డిస్ప్లే పిక్చర్(డీపీ)లో సీఎండీ ఫృథ్వీతేజ్ ఇమ్మడి ఫొటో ఉండటంతో.. కొందరు అధికారులకు అనుమానం వచ్చి స్వయంగా సీఎండీకి కాల్ చేసి చెప్పారు. వెంటనే ఆయన అప్రమత్తమయ్యారు. 9702068556 అనే నంబర్ నుంచి పలువురికి వాట్సాప్ ద్వారా మెసేజ్లు చేస్తున్నట్లు గుర్తించారు. ఇది స్పామ్ నంబర్ అనీ.. ఈ నంబర్తో వచ్చే మెసేజ్లకు ఎవరూ స్పందించొద్దంటూ సీఎండీ ఫృథ్వీతేజ్ అందరికీ విజ్ఞప్తి చేశారు. తన పేరుతో మెసేజ్లు చేస్తున్న సైబర్ నేరగాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సీఎండీ తెలిపారు. -
స్టీల్ప్లాంట్ సమ్మెకు జేఏసీ మద్దతు
● కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి.. బకాయిలకు జమ చేసుకుంది ● జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు డాబాగార్డెన్స్: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ గళమెత్తింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకోవడం కోసం ఈ నెల 20న శాశ్వత కార్మికులు, 20 నుంచి కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు నగరంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో శనివారం జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్టీల్ప్లాంట్లోని వేలాది మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తోందని.. పర్మినెంట్ ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో ఇళ్లకు పంపిస్తోందని మండిపడ్డారు. రూ. 11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ, ఆ నిధులను కార్మికుల జీతభత్యాలకు, ప్లాంట్ అభివృద్ధికి వినియోగించకుండా ఆంక్షలు పెట్టిందన్నారు. రూ.9,654 కోట్లను కేంద్ర జీఎస్టీకి, బ్యాంకు బకాయిలకు జమ చేసుకుందని ఆరోపించారు. స్టీల్ప్లాంట్ను రక్షిస్తామని హామీలిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిచిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీ భరత్ ఇప్పుడు నోరు మెదపడంలేదని మండిపడ్డారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం కోసం కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించిందన్నారు. ఈ సమ్మెకు జేఏసీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. ఈ నెల 18న నిర్వాసిత గ్రామాల్లో పాదయాత్రలు, బైక్ యాత్రలు, 19న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వద్ద నిరసనలు, 20న ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన, సభ నిర్వహించాలని జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం.మన్మధరావు, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.నాగభూషణం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, సీఎఫ్టీయూ జాతీయ అధ్యక్షుడు ఎ.కనకారావు, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆర్.అనిల్కుమార్, ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల పోరుబాట
విశాఖ విద్య: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులలో అసంబద్ధమైన ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పోరుబాటకు సిద్ధమైంది. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 21న జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ మేరకు డాబాగార్డెన్స్ ఆర్బీఎం ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం సమావేశమైన ఉపాధ్యాయ సంఘాల నాయకులు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ అధ్యక్షుడు గోపీనాథ్, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి ఇమంది పైడిరాజు మాట్లాడుతూ 117 జీవో రద్దు పేరుతో ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన తొమ్మిది రకాల బడులు విద్యారంగాన్ని మరింత ప్రమాదంలో నెట్టే అవకాశం ఉందన్నారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించి అసంబద్ధమైన నిర్ణయాలతో ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సంఘాల నాయకుల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం సరైందికాదన్నారు. బదిలీలు, పదోన్నతులు, రేషనలైజేషన్కు సంబంధించిన 16 రకాల డిమాండ్లతో పోరాటానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈనెల 21న డీఈవో కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులు తరలిరావాలని పిలుపునిచ్చారు. దీనిని పెద్ద ఎత్తున విజయవంతం చేసేలా జిల్లా స్థాయిలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. సభ్యులుగా వి.ఎస్.వేణుగోపాల్ (ఏపీహెచ్ఎంఏ), గోపీనాథ్ (పీఆర్టీయూ), ఇమంది పైడిరాజు (ఎస్టీయూ) టి.రామకృష్ణ (ఏపీటీఎఫ్ –257), జి.చిన్నబ్బాయి (యూటీఎఫ్), ఎ.అరుణ్ కుమార్ (ఏపీయూఎస్) ఎన్. ధనుంజయరావు (ఏపీటీఎఫ్–1938), బి.చిన్నారావు (ఏపీపీటీఏ) చొక్కాకుల సూర్యనారాయణ (వైఎస్సార్టీఏ) లను ఎన్నుకున్నారు. సోమవారం సాయంత్రం స్టీరింగ్ కమిటీ సమావేశమై డీఈవో కార్యాలయ ముట్టడికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. 21న డీఈవో కార్యాలయం ముట్టడి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక సన్నద్ధత సమావేశం 9 రకాల బడులపై తీవ్ర వ్యతిరేకత -
సీపీఆర్తో ఏపీఈపీడీసీఎల్ ఒప్పందం
విశాఖ సిటీ: ఏపీఈపీడీసీఎల్ డేటా ఆధారిత నిర్ణయాలను బలోపేతం చేసుకునేందుకు సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్(సీపీఆర్)తో అవగాహన ఒప్పందం చేసుకుంది. శనివారం సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం సీజీఎం పి.శ్రీనివాస్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అధ్యక్షుడు చొక్కాకుల శ్రీనివాస్ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని కమర్షియల్ ట్యాక్స్, ఎకై ్సజ్, మున్సిపల్ శాఖ వంటి అనేక శాఖలతో కలిసి పనిచేసిన అనుభవంతో ఇకపై ఏపీఈపీడీసీఎల్తో పనిచేయనుంది. విద్యుత్ పంపిణీ సామర్థ్యం, ఆదాయ వృద్ధే లక్ష్యంగా సీపీఆర్ సంస్థ ఏపీఈపీడీసీఎల్కు డేటా ఆధారిత విశ్లేషణలు చేయడంతో పాటు సంస్థ సిబ్బందికి అధ్యయనాలు, సూచనలు చేయనుంది. ఈపీడీసీఎల్లో ఏర్పాటు చేసిన డేటా అనలిటిక్ యూనిట్ (డీఏయూ)ను అభివృద్ధి పరచడం ద్వారా సంస్థ అంతర్గత వ్యవస్థ సామర్థ్యాలను పెంచడం, ఏపీఈపీడీసీఎల్ బిల్లింగ్ వ్యవస్థలోని రెవెన్యూ నష్టాలను తగ్గించడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి డేటా విశ్లేషణలు, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో సీపీఆర్ సహకరిస్తుంది. -
మెట్రో భూసేకరణ ప్రక్రియపై సమీక్ష
మహారాణిపేట: మెట్రోతోపాటు జిల్లాలో చేపట్టనున్న రైల్వే, హెచ్పీసీఎల్, ఇరిగేషన్, విద్యుత్, ఐవోసీఎల్, జాతీయ రహదారులు, అంతర్గత రోడ్ల విస్తరణ తదితర ప్రాజెక్టులపై కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సమీక్షించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జేసీ మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్తో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన.. భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. డీపీఆర్కు అనుగుణంగా మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి తుది చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇతర ప్రాజెక్టుల కోసం నిర్దేశించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. విశాఖ, భీమిలి ఆర్డీవోలు పి.శ్రీలేఖ, సంగీత్ మాథుర్, ఎస్డీసీ సుధాసాగర్ పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంపై ఇక పోరాటమే..
తీర్మానాలు ● ఈ నెలాఖరులోగా పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్ కమిటీలు ఏర్పాటుకావాలి. ● జూన్, జూలై నెలాఖరు నాటికి గ్రామ కమిటీలు పూర్తిచేయాలి. ● ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నాటికి బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలి. ● 20 రోజులకు ఒకసారి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలి. ● వార్డు, జిల్లా స్థాయి ప్రజా సమస్యలపై పార్టీ తరపున పోరాడాలి. ● 19న జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నిక వైఎస్సార్ సీపీ బహిష్కరణ. సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముందుగా విశాఖ జిల్లా నూతన అధ్యక్షుడిగా కె.కె.రాజు, విశాఖ పార్లమెంట్ పరిశీలకుడిగా కదిరి బాబూరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రంలో సంక్షేమం లేదు.. అభివృద్ధి లేదు అంతా శూన్యమే.. ఉన్నదల్లా రూ.1.5 లక్షల కోట్లు అప్పులు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, గిట్టుబాటు ధర లేక, ధాన్యం కొనుగోలు జరగక కళ్లాల్లోనే నిలిచిపోయిన పరిస్థితులు చూస్తున్నామన్నారు. మెట్ట ప్రాంతాల్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో పొగాకు రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం దాహంతో విర్రవీగుతున్న కూటమి ప్రభుత్వం బోల్తా పడకతప్పదని జోస్యం చెప్పారు. గతంలో రుషికొండ బోడిగుండు అంటూ పచ్చ పత్రికలు అదేపనిగా కథనాలు రాశాయి.. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అడ్డంగా దోచుకుంటుంటే ఎందుకు వార్తలు రాయడం లేదని ప్రశ్నించారు. న్యాయస్థానాలు మెట్టికాయలు వేసినా కూటమి ప్రభుత్వం తీరు మారడం లేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో హ్యూమన్ ట్రాకింగ్ జరిగిందని హడావుడి చేశారు.. మరి ఇప్పుడు ఎందుకు దృష్టి సారించలేదని ప్రశ్నించారు. జీవీఎంసీ కమిషనర్ లేకపోవడంతో నగర వీధుల్లో ఎక్కడిపడితే అక్కడ చెత్త పేరుకుపోతుందన్నారు. కమిషనర్ను నియమించుకోలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. పార్టీ నేతలు తమ ప్రాంతంలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ జగనన్న 2.ఓలో కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. 20 రోజులకు ఒకసారి నియోజకవర్గ స్థాయి సమావేశం, ఆరు నెలలకు ఒకసారి జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకుందామన్నారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది అరాచక పాలన నా రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అక్రమంగా కేసులు నమోదు పెడుతున్నారన్నారు. దేశంలో పరిస్థితులు చూస్తే ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కదిరి బాబూరావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. అబద్ధపు హామీలతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, సమన్వయకర్తలు మజ్జి శ్రీనివాసరావు, దేవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ కె.సతీష్, ముఖ్యనేతలు రవిరెడ్డి, పార్టీ అనుబంధ విభాగ రాష్ట్ర అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ, పోతిన శ్రీనివాసరావు, పార్టీ నాయకులు కొండా రాజీవ్గాంధీ, రొంగళి జగన్నాథం, ఉడారవి, ఫరూఖీ, రవిరాజు, మొల్లి అప్పారావు, బా ణాల శ్రీనివాసరావు, ఉరుకూటి అప్పారావు, గొలగాని శ్రీనివాస్, నడింపల్లి కృష్ణంరాజు, ద్రోణంరాజు శ్రీవాస్తవ, పి.వి.నారాయణ్, జియ్యాని శ్రీధర్, కార్పొరేటర్లు అనిల్కుమార్రాజు, అల్లు శంకర్రావు, అక్కరమాని పద్మ, దౌలపల్లి ఏడుకొండలు, కోరుకొండ వెంకటరత్న స్వాతి, నక్కిల లక్ష్మి, సాడి పద్మారెడ్డి, బిపిన్ కుమార్ జైన్, చెన్నా జానకిరామ్, గుండపు నాగేశ్వరరావు, వావి లపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, శశికళ, పి.వి.సురేష్, బల్లా లక్ష్మణ్, గులివిందల లావణ్య, మహమ్మద్ ఇమ్రాన్, గుడివాడ సాయి అనుషా, ఊరుకూటి రామచంద్రరావు, కె.భూపతిరాజు సుజాత, జిల్లా అధికార ప్రతినిధి బింగి హరికిరణ్రెడ్డి, పల్లా దుర్గారావు, దొడ్డి రామనాథ్, డా.మంచా నాగమల్లీశ్వరి, ఆల్ఫా కృష్ణ, షేక్ మహ్మద్ గౌస్, తదితరులు పాల్గొన్నారు. జగన్ 2.ఓలో కార్యకర్తలకే ప్రాధాన్యం ప్రజా సమస్యలపై పోరాటలకు సిద్ధంకండి కూటమి నేతల దోపిడీకి విశాఖ అడ్డాగా మారింది జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కేకే రాజు -
పచ్చదనం పెంపుపై దృష్టి
నగర ప్రజలకు మేయర్ పిలుపు ఎంవీపీకాలనీ: నగర ప్రజలు పచ్చదనం పెంపుపై దృష్టిసారించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శివాజీ పార్కులోని యోగా సాధన సెంటర్ వేదికగా శనివారం ‘బీట్ ద హీట్’నినాదంతో స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో పర్యావరణ పరిరక్షణకు అన్ని వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్డుల్లోని ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, టెర్రస్ గార్డెన్లు అభివృద్ధి చేయాలని సూచించారు. నీటి వృథాను అరికట్టడంతో పాటు ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఉండాలని స్పష్టం చేశారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ వేసవి ఉపశమనం కోసం నగరంలో గ్రీన్ షేడ్స్, 106 చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు భవనాలపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, విశాఖ జిల్లా ప్రత్యేక అధికారి ఎస్.ఢిల్లీరావు, కార్పొరేటర్లతో కలిసి మేయర్, కలెక్టర్ బీట్ ద హీట్ పోస్టర్ను ఆవిష్కరించారు. పార్కులో మొక్కలు నాటారు. తొలుత కేంద్ర సబ్సిడీ నిధులు రూ.1.5 కోట్లతో కొనుగోలు చేసిన ఆరు వాహనాలను మేయర్, కలెక్టర్ ప్రారంభించారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెర్రస్ గార్డెన్ నమూనా, వరి కంకులు, వాటర్ బౌల్స్, చిరుధాన్యాల స్టాళ్లను పరిశీలించి.. నిర్వాహకులను అభినందించారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి, ప్రధాన ఇంజినీర్ శివప్రసాద్ రాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, జోనల్ కమిషనర్లు శివప్రసాద్, కనకమహాలక్ష్మి పాల్గొన్నారు. -
సాంకేతిక ఆవిష్కరణలతోనే సుస్థిర భవిష్యత్తు
● హిందుస్థాన్ జింక్ సీఈవో అరుణ్ మిశ్రా ● ఘనంగా ఐఐపీఈ స్నాతకోత్సవం విశాఖ విద్య: విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగాలని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ సీఈవో అరుణ్ మిశ్రా పిలుపునిచ్చారు. నగరంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) 5వ వార్షిక స్నాతకోత్సవం శనివారం నోవాటెల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరుణ్ మిశ్రా మాట్లాడుతూ విద్యార్థులు భిన్నంగా ఆలోచించాలన్నారు. చదువుకునే రోజుల్లోనే దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. హిందుస్థాన్ జింక్ ఇన్నోవేషన్ జర్నీలోని ఉదాహరణలను వివరిస్తూ.. సుస్థిర ఇంధన భవిష్యత్తును రూపొందించడంలో కృత్రిమ మేధ, హైడ్రోజన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల పాత్రను తెలియజేశారు. ఐఐపీఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పరితోష్ కె.బానిక్ మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ పరివర్తన భారతదేశానికి అత్యంత ఆవశ్యకమని, ఈ దిశగా సుస్థిర ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఐఐపీఈ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. క్లిష్టమైన ఇంధన సవాళ్లను పరిష్కరించడానికి పరిశ్రమలు, ఇతర భాగస్వాములతో కలిసి పనిచేయాలని గ్రాడ్యుయేట్లకు సూచించారు. రూ.150 కోట్లతో రీసెర్చ్ పార్కు సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ శాలివాహన్ మాట్లాడుతూ రూ.150 కోట్లతో ఐఐపీఈ–మాగ్నివియా బిజినెస్ అండ్ ఎనర్జీ రీసెర్చ్ పార్క్ను సబ్బవరంలోని సొంత క్యాంపస్లో త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఐఐపీఈ చరిత్రలో ఒక మైలురాయి అని పేర్కొన్నారు. సహజ హైడ్రోజన్పై భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. కెమ్ టెక్ ఫౌండేషన్ నుంచి ఎనర్జీ ఎక్సలెన్స్ అవార్డు–2025ను అందుకోవడంతో సంస్థ ప్రతిష్ట పెరిగిందన్నారు. 15 శాతం అంతర్జాతీయ ప్రాజెక్టులు, గ్లోబల్ ఎలెక్టివ్లతో అంతర్జాతీయ స్థాయిలో ఐఐపీఈ ముందంజలో ఉందన్నారు. 51 మందికి డిగ్రీలు ప్రదానంస్నాతకోత్సవంలో మొత్తం 51 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో ఇద్దరికి పీహెచ్డీ, ఎమ్మెస్సీ అప్లైడ్ జియాలజీలో 15 మందికి, బీటెక్లో 34 మందికి(పెట్రోలియం ఇంజినీరింగ్–8, కెమికల్ ఇంజినీరింగ్–26) డిగ్రీలు అందించారు. ఈ సందర్భంగా పలువురు ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు, వెండి పతకాలను ప్రదా నం చేశారు. ఆల్బర్ట్ ఇజాక్ మొహంతి (బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్) అకడమిక్ ఎక్సలెన్స్, ఆల్ రౌండ్ ప్రతిభకు గాను ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్లో అహోల్జియా నందీష్ అమిత్కుమార్ (గోల్డ్), ఆయుష్ గుప్తా (వెండి), బీటెక్ పెట్రోలియం ఇంజినీరింగ్లో బిశ్వజిత్ పాటి (గోల్డ్), బోకం శ్రీరామ మణికంఠ గణేష్ (వెండి), ఎమ్మెస్సీ అప్లైడ్ జియాలజీలో డెబాసిస్ సాహు (గోల్డ్), సుజాత మాఝీ (వెండి) ప్రతిభ చూపా రు. బాలికలను ప్రోత్సహించే ఉద్దేశంతో అందించే బెస్ట్ అవుట్ గోయింగ్ గర్ల్ స్టూడెంట్ మెడల్ను ఎమ్మెస్సీ అప్లైడ్ జియాలజీ విద్యార్థిని సుజాత మాఝీకి ప్రదానం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రామ్ ఫాల్ ద్వివేది, సెనేట్ సభ్యులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఒక్కో పోస్టుకు 43 మంది పోటీ
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025భారీగా దరఖాస్తులుఉమ్మడి విశాఖ జిల్లా ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగనుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉన్న ఖాళీలు, రోస్టర్ వారీగా అందిన దరఖాస్తులు ఇలా ఉన్నాయి. 19న డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు డాబాగార్డెన్స్: జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 19న నిర్వహించే డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు.. ఆ రోజు ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఉదయం 11 గంటలకు తమ గుర్తింపు కార్డులతో సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని జేసీ సూచించారు.విశాఖ విద్య: మెగా డీఎస్సీకి దరఖాస్తు గడువు ముగిసింది. చాలా కాలం తర్వాత వెలువడిన నోటిఫికేషన్ కావడంతో ఉపాధ్యాయ పోస్టు సాధించేందుకు శిక్షణార్థులు భారీగా పోటీపడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని మేనేజ్మెంట్లలో 1,139 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 29,779 మంది అభ్యర్థులు 49,658 దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సారి డీఎస్సీకి పోటీ తీవ్రంగానే ఉండనుంది. అంటే ఒక్కో పోస్టుకు 43 మంది పోటీపడుతున్నారు. ఎలాగైనా కొలువు సాధించాలనే లక్ష్యంతో ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులు అర్హతలను బట్టి ఆయా సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్నారు. సమయం తక్కువ.. ఒత్తిడి ఎక్కువ డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరగనున్నాయి. మరో 20 రోజుల్లో పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు డీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ కలిగిస్తోంది. సమయం పెంచి, అందరికీ ఒకే రోజు పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రేయింబవళ్లు పుస్తకాలతో అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. భర్తీ కానున్న పోస్టులు ఇవే.. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మేనేజ్మెంట్ పరిధిలోని పాఠశాలల్లో 734(ఓపెన్ 290 + ఇతర కేటగిరీల మొత్తం 444) పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అదే విధంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో 400 పోస్టులు ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జువనైల్ హోమ్లో 5 ఖాళీలు కలుపుకుని మొత్తంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 1,139 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇవి కాకుండా జోనల్ స్థాయిలో ఏపీ రెసిడెన్షియల్/మోడల్ స్కూల్స్/సోషల్ వెల్ఫేర్/బీసీ వెల్ఫేర్/ట్రైబల్ వెల్ఫేర్(గురుకులాలు) పరిధిలోని విద్యాలయాల్లో జోనల్ ప్రాతిపదికన 400 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. బీసీ–ఈ 423 ఎస్సీ–1 479 ఎస్సీ–2 876 ఎస్సీ–3 2,821 ఎస్టీ 10,523 ఈడబ్ల్యూఎస్ 890 కేటగిరీ వచ్చిన దరఖాస్తులు ఓసీ 1,626 బీసీ–ఏ 1,940 బీసీ–బీ 2,563 బీసీ–సీ 198 బీసీ–డీ 8,330 వీటితో పాటు దివ్యాంగ కేటగిరీకి దరఖాస్తులు వచ్చాయిన్యూస్రీల్ఉపాధ్యాయ కొలువుకు దరఖాస్తుల వెల్లువ 1,139 పోస్టులకు 49,658 పైగా దరఖాస్తులు కొలువు కొట్టాలంటే కష్టపడాల్సిందే..దరఖాస్తులు ఇలా.. మొత్తం అభ్యర్థులు 29,779 సబ్జెక్టుల వారీగా దరఖాస్తులు 49,658 పురుషులు 11,773 మహిళలు 18,006 -
మధురవాడలో 87.8 ఎకరాల అభివృద్ధికి ప్రణాళికలు
విశాఖ సిటీ: మధురవాడలోని 87.80 ఎకరాల వీఎంఆర్డీఏ భూమిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చైర్మన్ ప్రణవ్గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ తెలిపారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో క్రెడాయ్, నేరెడ్కో, అప్రెడా ప్రతినిధులతో శుక్రవారం సమావేశమై ఈ ప్రాజెక్టుకు గల అవకాశాలను వివరించారు. ఈ భూమికి బీచ్ కారిడార్, డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో రైలు ప్రాజెక్టు, ఐటీ సిటీ, కన్వెన్షన్ సెంటర్లతో పాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో ఉండడం అదనపు ఆకర్షణ అని వివరించారు. ఈ నెల 23న హైదరాబాద్లో, 30న బెంగళూరులో ఈ భూమికి సంబంధించి రోడ్ షో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జాయింట్ కమిషనర్ రమేష్, చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్ప, కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధాన ఇంజినీర్ వినయ్ కుమార్, పర్యవేక్షక ఇంజినీర్లు భవానీ శంకర్, బలరామరాజు, ప్రణాళికాధికారులు వెంకటేశ్వరరావు, అరుణవల్లి, చామంతి, మౌనిక తదితరులు పాల్గొన్నారు. 23న హైదరాబాద్, 30న బెంగళూరులో రోడ్ షో -
ఇద్దరు యువకులను రక్షించిన బీచ్గార్డ్స్
బీచ్రోడ్డు: ప్రమాదకరమైన అలల్లో చిక్కుకుపోయిన ఇద్దరు యువకులను బీచ్గార్డ్స్ అతికష్టం మీద రక్షించారు. వివరాలివి. తాడేపల్లిగూడెంకు చెందిన యువకులైన సాయి, కృష్ణ శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఆర్కేబీచ్ను సందర్శించారు. ఆ తర్వాత స్నానం కోసం సముద్రంలోకి వెళ్లిన వారిని ఓ పెద్ద కెరటం ఒక్కసారిగా లోపలకు లాగేసింది. ఈ విషయాన్ని గమనించిన పర్యాటకులు వెంటనే మైరెన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు బీచ్గార్డ్స్ రాకేష్, సాగర్ను ఘటన స్థలానికి పంపారు. బీచ్గార్డ్స్ అతికష్టం మీద సంద్రంలో చిక్కుకుపోయిన వారిద్దరినీ రక్షించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని బంధువులకు అప్పగించారు. -
వాల్తేర్ డిపో కండక్టర్, డ్రైవర్ నిజాయితీ
ఎంవీపీకాలనీ: బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగును బస్సులో మర్చిపోయిన ఓ ప్రయాణికురాలికి ఆర్టీసీ సిబ్బంది తిరిగి అప్పగించారు. గురువారం రాత్రి 999 నంబర్ గల బస్సులో ప్రయాణించిన ఓ మహిళ ఐదు తులాల బంగారంతో పాటు దుస్తులున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయి దిగిపోయింది. కొద్దిసేపటి తర్వాత బ్యాగును గమనించిన ఆ బస్సు కండక్టర్ జి.గిరిబాబు, డ్రైవర్ డి.ఎ.బాబు దానిని వాల్తేరు డిపో సూపరింటెండెంట్కు సెక్యూరిటీ సమక్షంలో అప్ప గించారు. తమ బ్యాగు పోగొట్టుకున్నట్లు గుర్తించిన ప్రయా ణికురాలి కుటుంబ సభ్యులు శుక్రవారం డిపోను సంప్రదించగా.. అధికారులు ఆ బ్యాగును వారికి అందజేశారు. దీంతో ఆనందం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు.. కండక్టర్, డ్రైవర్ల వివరాలు తెలుసుకుని వారు విధుల్లో ఉన్న బస్సు వద్దకు వెళ్లారు. అక్కడ వారికి ఘనంగా సన్మానించారు. అనంతరం సిబ్బంది చేతులమీదుగా తమ ఆభరణాలను తిరిగి తీసుకుని సంతోషించారు. ఆర్టీసీ ప్రతిష్టను పెంచిన కండక్టర్, డ్రైవర్ను డిపో యాజమాన్యంతో పాటు ఉద్యోగులు అభినందించారు. -
స్టీల్ప్లాంట్ మాజీ ఉద్యోగికి అంతర్జాతీయ టైటిల్
ఉక్కునగరం: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో స్టీల్ప్లాంట్ మాజీ ఉద్యోగి బి.వి.ఎస్.కె.లింగేశ్వరరావు జంట విజేతగా నిలిచింది. ఈ నెల 10 నుంచి 14 వరకు తైపీలో తైవాన్ ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 12 దేశాలకు చెందిన 2,500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 55+ కేటగిరీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సుజానే వెంగిలెట్తో లింగేశ్వరరావు పాల్గొన్నారు. సెమీఫైనల్స్లో మలేషి యాతో పోటీపడి గెలిచిన లింగేశ్వరరావు జంట.. ఫైనల్స్లో జపాన్ను ఓడించి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన్ని స్టీల్ప్లాంట్ అధికారులు, పలువురు క్రీడాకారులు అభినందించారు. -
అయ్యవార్లకు తిప్పలు
● మెడికల్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం ● ‘అపస్’ ఫిర్యాదుతో తేరుకున్న కేజీహెచ్ వైద్యులు ● హడావుడిగా డీఈవో కార్యాలయానికిఅందజేత ● ఉమ్మడి విశాఖ జిల్లాలో1,200 మంది పీహెచ్ టీచర్లు ● వీరిలో 442 మంది వైకల్యంపై నిశిత పరిశీలన విశాఖ విద్య: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు తీవ్ర కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం జారీ చేసిన బదిలీల చట్టం మేరకు ఖాళీల గుర్తింపు ఒక కొలిక్కి వచ్చింది. పాఠశాలల పునర్నిర్మాణంపై ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చినా.. బదిలీలు చేపట్టేలా విద్యాశాఖాధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యతల పాయింట్లు కేటాయింపునకు సంబంధిత ఉపాధ్యాయులు నమోదు చేసుకోవాలని డీఈవో కార్యాలయ అధికారులు ప్రత్యేక గూగుల్ ఫాంను విడుదల చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, దివ్యాంగ ఉపాధ్యాయులు వెంటనే ఈ ఫాం పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే జిల్లా స్థాయి ప్రత్యేక శిబిరానికి హాజరైనా.. నేటికి కూడా మెడికల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా గూగుల్ ఫాం పూర్తి చేయాలని ఆదేశించడంతో అయ్యవార్లకు తిప్పలు తప్పడం లేదు. వైకల్యం నిజమేనా? బదిలీల సందర్భంగా ప్రాధాన్యత కోరుతున్న ఉపాధ్యాయులు గతంలో సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్లు చెల్లవని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాటి కోసం మళ్లీ వైద్యుల ముందు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలో 1,200 మంది వరకు ప్రాధాన్యత పాయింట్లు పొందే ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 56 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు గతంలో సమర్పించిన సర్టిఫికెట్లలో వాస్తవమెంత అనేది తేల్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా మెడికల్ బోర్డు ముందు 442 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. సర్టిఫికెట్ల జారీ కోసం కొంతమంది ఉపాధ్యాయులు వైద్యులను మేనేజ్ చేశారని ప్రచారం సాగుతోంది. 20 రోజులు గడిచినా అందని సర్టిఫికెట్లు జిల్లా స్థాయి మెడికల్ బోర్డు ముందు హాజరై 20 రోజులు గడుస్తున్నా.. వైకల్య ధ్రువీకరణ పత్రాలు(మెడికల్ సర్టిఫికెట్లు) అందకపోవడంపై కొంతమంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయమై అపస్ సంఘం జిల్లా నాయకులు శుక్రవారం కేజీహెచ్ సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. దీంతో తేరుకున్న కేజీహెచ్ పాలనాధికారులు ఆయా విభాగాల్లో ఉన్న సర్టిఫికెట్లు సేకరించి, హుటాహుటిన డీఈవో కార్యాలయానికి పంపించారు. ఎంఈవోలకు పంపించాం కేజీహెచ్ నుంచి శుక్రవారం మెడికల్ సర్టిఫికెట్లు అందాయి. వాటిని అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా డీఈవోలకు వెంటనే పంపించాం. విశాఖ జిల్లాకు సంబంధించి ఎంఈవోల ద్వారా సంబంధిత ఉపాధ్యాయులకు అందించాలని ఆదేశించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశాం. – ఎన్.ప్రేమ్ కుమార్, నోడల్ అధికారి, ఉమ్మడి విశాఖ జిల్లా దివ్యాంగులకు న్యాయం చేయాలి దివ్యాంగుల చట్టాన్ని ప్రభుత్వం విస్మరించింది. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా బదిలీల్లో ప్రాధాన్యం కల్పించి దివ్యాంగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. –ఎ.శ్రీనివాసరావు, వికలాంగుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, విశాఖపట్నం -
ఏపీఎస్పీ బెటాలియన్లో సేవా పతకాల ప్రదానం
పీఎంపాలెం: బక్కన్నపాలెం సమీపంలోని ఏపీఎస్పీ పోలీస్ బెటాలియన్లో విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి 16వ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ సేవా పతకాలు అందజేశారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఐదు ఉత్కృష్ట, రెండు అతి ఉత్కృష్ట, నాలుగు 75 సంవత్సరాల సేవా పతకాలను అందించారు. అలాగే 8వ ఎన్డీఆర్ఎఫ్ స్థాయి సీఎస్ఎస్ఆర్ పోటీల్లో మూడవ స్థానంలో నిలిచి రూ.50 వేలు నగదు బహుమతి సాధించిన బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రవాదుల ప్రాబల్యం ఉండే ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఇన్చార్జ్ అడిషనల్ కమాండెంట్ పి.సత్యం, అసిస్టెంట్ కమాండెట్లు వి. నారాయణరావు, జి.ఇలయా సాగర్, బి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మూడుముక్కలాట
● జీవీఎంసీలో తారాస్థాయికి కూటమి రాజకీయం ● టీడీపీ, జనసేన అధిష్టానం దృష్టికి పంచాయితీ ● తమకే ఇవ్వాలంటూపట్టుబడుతున్న జనసేన ● ససేమిరా అంటున్న టీడీపీ ● ఇరు పార్టీల మధ్య అగ్గిరాజేస్తున్న డిప్యూటీ మేయర్ పదవిడాబాగార్డెన్స్: జీవీఎంసీలో కూటమి రాజకీయం తారాస్థాయికి చేరింది. అవిశ్వాసం ద్వారా గత మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్లను పదవుల నుంచి తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత మేయర్ను తొలగించి, తెలుగుదేశం పార్టీకి చెందిన పీలా శ్రీనివాస్ను కూటమి సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాజాగా డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయానికి వస్తే, కూటమిలో విభేదాలు మొదలయ్యా యి. మేయర్ పదవిని తీసుకున్నందున, డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ వివాదం తెలుగుదేశం పార్టీ అధిష్టానం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ల దృష్టికి చేరింది. తమకంటే తమకు కావాలంటూ.. మేయర్ పదవిని తెలుగుదేశం పార్టీ తీసుకున్నందున, పొత్తులో భాగంగా డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ కార్పొరేటర్లు, పెద్దలు పట్టుబడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తే తాను రాజీనామా చేస్తానని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పార్టీ అధినేతకు బహిరంగంగా లేఖ పంపారు. దీంతో కూటమి రాజకీయం వేడెక్కింది. పొత్తు ధర్మంలో భాగంగా డిప్యూటీ మేయర్ పదవి తమకు కావాలని జనసేన పార్టీ ఎప్పటి నుంచో ఆశిస్తోంది. ఇదిలా ఉండగా, జనసేన పార్టీ నుంచి డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటీవలే వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన పెద్దిరెడ్డి ఉష, వంశీరెడ్డి, మాసిపోగు మేరీజోన్స్, ఇండిపెండెంట్గా గెలిచి ఆ పార్టీలో చేరిన మహ్మద్ సాదిక్, కందుల నాగరాజుతో పాటు ఆ పార్టీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి కూడా పోటీలో ఉన్నారు. తాడోపేడో.. డిప్యూటీ మేయర్ ఒక్క పోస్టు కోసం రెండు పార్టీలు పట్టువిడవకుండా ఉన్నాయి. ఈ విషయంలో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నాయి. డిప్యూటీ మేయర్ తమకే ఇవ్వాలని జనసేన గట్టిగా పట్టుబడుతుండగా, తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ పోస్టును వదులుకోవడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ పోస్టు కోసం ఈ నెల 19న ఎన్నిక జరగనుంది. మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకోవడంతో, డిప్యూటీ మేయర్ తమకు కేటాయించాలని జనసేన కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. లేనిచో రాజీనామా చేస్తామని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ శుక్రవారం పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేఖ పంపడంపై కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. అంత సీన్ లేదు.. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్కే డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలంటూ సాక్షాత్తు నూతనంగా ఎన్నికై న మేయరే అధిష్టానానికి లేఖ పంపినట్టు భోగట్టా. వీరిద్దరి మధ్య నేను అర్హురాలినేనంటూ బీజేపీ కార్పొరేటర్ కూడా రేస్లో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కూటమిలో అంతర్గత తగాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఈ కుమ్ములాటలే నిదర్శనం. నువ్వా..నేనా? డిప్యూటీ మేయర్ పదవిపై పార్టీల అధినాయకులు తేల్చకపోవడంతో ఇరు పార్టీల్లోనూ ఆశావాహుల సంఖ్య పెరిగింది. టీడీపీలో 10 మంది వరకు ఈ పదవి కోసం పోటీ పడతుండగా, జనసేనలో ఉన్న వారంతా (ఒక్క మూర్తి యాదవ్ తప్ప..ఎందుకంటే మూర్తి యాదవే తనను మినహాయించి ఎవరికై నా ఇవ్వాలని పవన్ కల్యాణ్కు పంపిన లేఖలో పేర్కొన్నారు) రేసులో ఉన్నట్టు తెలిసింది. ఎవరి స్థాయిలో వారు సీనియర్ల ద్వారా అధినాయకుడి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇరు పార్టీల నుంచి ఇద్దరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుకు డిప్యూటీ మేయర్ కట్టబెట్టాలని ఆ పార్టీలో పలువురు కార్పొరేటర్లు భావిస్తూ..ఆ పేరు ప్రతిపాదించినట్టు సమాచారం. ఇక జనసేన విషయానికొస్తే..ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్బాబు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మేయర్గా టీడీపీ నేత ఉండడంతో డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ పదవిని జనసేన వదులుకునే ప్రసక్తే లేదంటూ తెగేసి చెబుతున్నారు. జనసేన నుంచి ఎందరో ఆశావాహులున్నా..ఎమ్మెల్యేలు మాత్రం ఉషశ్రీ పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా కూటమిలో డిప్యూటీ మేయర్ పదవి పెద్ద రాద్ధాంతం చేస్తోంది. -
చదువులు తిరోగమనం
● అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు మంగళం ● ఉమ్మడి విశాఖ జిల్లాలో 82 స్కూళ్లు రద్దు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 52 స్కూళ్ల మూత ● దూరం కానున్న హైస్కూల్ చదువులు ● గ్రామాల్లో డ్రాపౌట్ కానున్న విద్యార్థులు గ్రామీణ విద్యకు విఘాతం కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించనుంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారు. గతంలో దూరం ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఐదో తరగతి తర్వాత చదువు మానేసేవారు. అందుకే గత ప్రభుత్వాలు ప్రాథమికోన్నత పాఠశాలలను అందుబాటులోకి తెచ్చాయి. కానీ, ప్రస్తుత నిర్ణయంతో గ్రామీణ విద్యార్థులకు హైస్కూల్ చదువులు మళ్లీ దూరమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్లు పెరిగే అవకాశం ఉందని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు కూటమి ప్రభుత్వం మంగళం పాడుతోంది. తాజాగా 82 యూపీఎస్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా పాఠశాలల్లోని విద్యార్థులను సమీప హైస్కూళ్లకు తరలించనున్నారు. అనకాపల్లి జిల్లాలో అత్యధి కంగా 52 స్కూళ్లను మూసివేయనుండటంతో, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు హైస్కూల్చదువులు దూరం కానున్నాయి. ఈ చర్యల వల్ల గ్రామాల్లో డ్రాపౌట్లు పెరిగే ప్రమాదం ఉందని విద్యావర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ జిల్లా లోనూ డ్రాపౌట్లుపెరిగే అవకాశం ఉంది. విశాఖ విద్య: జిల్లాలో పద్మనాభం మండలం కొత్తకొవ్వాడ ప్రాథమికోన్నత పాఠశాలను రద్దు చేయడంతో ఇక్కడ 6, 7, 8 తరగతులు చదువుతున్న 14 మంది విద్యార్థులు 4 కిలోమీటర్ల దూరంలోని అనంతవరం జెడ్పీహెచ్ఎస్కు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే భీమునిపట్నం మండలం రెండో వార్డు మున్సిపల్ యూపీఎస్ను రద్దు చేసి 17వ వార్డులోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్కు మ్యాప్ చేశారు. ఇక్కడ 6, 7, 8 తరగతుల్లో 40 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ పాఠశాలను రద్దు చేయడం గమనార్హం. జిల్లాలో ఇలా మూడు యూపీఎస్లను రద్దు చేశారు. ఈ నిర్ణయాల వల్ల విద్యార్థులు హైస్కూల్ చదువు కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం విద్యారంగంపై ప్రయోగాల పేరుతో పాఠశాలలను మూసివేసేందుకు సిద్ధమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొమ్మిది రకాల పాఠశాలల పేరుతో పాఠశాల విద్య పునర్నిర్మాణం చేపట్టడం గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువుకు దూరం చేసే చర్యగా ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలలను అప్గ్రేడ్ చేయడం సాధారణంగా జరిగే ప్రక్రియ కాగా, ప్రస్తుత ప్రభుత్వం పాఠశాలలను డీగ్రేడ్ చేస్తోందని వారు ఆందోళన వ్యక్తం మిగతా IIవ పేజీలో -
పర్యాటక ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష
మహారాణిపేట: జిల్లాలోని పర్యాటక ప్రాజెక్టుల స్థితిగతులు, ఔత్సాహిక కంపెనీలకు భూ కేటాయింపులు, ప్రభుత్వ సహకారం వంటి అంశాలపై రాష్ట్ర పర్యాటక, గృహనిర్మాణ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ జిల్లా అధికారులతో చర్చించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ కేటాయింపులు చేయాలని ఆదేశించారు. అలాగే పర్యాటక శాఖకు అశోక్ లేల్యాండ్, పోర్ట్లు అందిస్తున్న డబుల్ డెక్కర్ బస్సుల కోసం చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం, జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాల పురోగతిని సమీక్షించి, నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ ఎం. ఎన్. హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ జగదీష్, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి జె. మాధవి, గృహనిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్టు అధికారి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.