Visakhapatnam District Latest News
-
పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
● జిల్లాలో 134 పరీక్ష కేంద్రాలు ● హాజరుకానున్న 29,927 మంది విద్యార్థులు విశాఖ విద్య: పదో తరగతి పరీక్షలకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈవో ఎన్.ప్రేమ్కుమార్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 29,927 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. వీరిలో 26,523 మంది రెగ్యులర్గా, 1,404 మంది ప్రైవేట్గా, 2,124 మంది ఒకేషనల్ ట్రేడ్ పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 15,094 మంది బాలురు, 13,429 మంది బాలికలు ఉన్నారన్నారు. 265 మంది దివ్యాంగ విద్యార్థుల సౌలభ్యం కోసం గ్రౌండ్ ఫ్లోర్లో పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షల నిర్వహణకు 134 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇందులో 48 ఏ కేటగిరీ కేంద్రాలు, 71 బీ కేటగిరీ కేంద్రాలు, 9 సీ కేటగిరీ కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలో ముందస్తుగా గుర్తించిన 6 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 134 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 134 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 1,472 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయన్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాల్ టికెట్ ఆధారంగా పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు పేర్కొన్నారు. -
భూసేకరణ ప్రక్రియ వేగవంతం
అధికారులకు కలెక్టర్ ఆదేశం మహారాణిపేట: జిల్లాలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం నిర్దేశించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్లో జేసీ కె.మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్తో కలిసి శనివారం పలు ప్రాజెక్ట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపట్టనున్న రైల్వే, హెచ్పీసీఎల్, ఇరిగేషన్, విద్యుత్, ఐవోసీఎల్, జాతీయ రహదారులు, అంతర్గత రోడ్లు తదితర ప్రాజెక్ట్లకు నిర్ణీత కాలంలో అవసరమైన భూములను సేకరించి, నివేదిక అందేజేయాలని ఆదేశించారు. భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆఫ్లైన్లో టికెట్లు లేనట్టేనా?
● 24న లక్నో సూపర్ జెయింట్స్తో డీసీ ఢీ ● ఆన్లైన్లోనే టికెట్ల విక్రయాలు విశాఖ స్పోర్ట్స్: వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడనున్న తొలి ఐపీఎల్ మ్యాచ్కు ఆఫ్లైన్లో టికెట్ల విక్రయం లేనట్టేనా? ఇటీవల ఏసీఏ నిర్వహించిన సమావేశంలో ఆఫ్లైన్లో కూడా టికెట్లు విక్రయిస్తామని ప్రకటించినప్పటికీ, అందుకు తగ్గట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) బృందం ఏర్పాట్లు చేయకపోవడంతో కౌంటర్ల ద్వారా టికెట్ల విక్రయం లేదని తెలిసింది. ఈ నెల 24న లక్నో సూపర్ జెయింట్స్తో డీసీ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఈ నెల 13వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఆన్లైన్లో డీసీ టికెట్లను విక్రయించడం ప్రారంభించింది. ప్రస్తుతం తక్కువ ధరల్లో టికెట్లు అందుబాటులో లేవు.రూ.2,200, రూ.2,500,రూ.3,000, రూ.3,500, అత్యధికంగా రూ.5,000 విలువ గల టికెట్ల ఖాళీలే కనిపిస్తున్నాయి. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారు వాటిని ఫిజికల్ టికెట్లుగా మార్చుకోవడానికి మున్సిపల్ స్టేడియం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, వైఎస్సార్ స్టేడియం బి గ్రౌండ్ వద్ద కౌంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందు వరకు టికెట్లు మార్చుకునే అవకాశం ఉంది. భద్రతా ఏర్పాట్ల పరిశీలన ఐపీఎల్ నేపథ్యంలో వైఎస్సార్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను శనివారం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పరిశీలించారు. ఆటగాళ్లు విశ్రాంతి తీసుకునే హోటల్తో పాటు స్టేడియంలోని ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు తగిన సూచనలు చేశారు. ఇరుజట్లకు సీజన్లో ఇదే తొలిమ్యాచ్ కావడంతో నెట్ ప్రాక్టీస్ చేసుకునే బీ గ్రౌండ్లోనూ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
● కళ్లెం వేయకపోతే.. కడుపు కోతే..
నగరంలో మైనర్లు ద్విచక్ర వాహనాలపై రెచ్చిపోతున్నారు. లైసెన్స్ లేకుండానే బైక్లు నడుపుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా హెల్మెట్లు ధరించకుండా, ట్రిపుల్, జిగ్జాగ్ డ్రైవింగ్తో ఇతర వాహనచోదకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. వారికి సరైన డ్రైవింగ్ నైపుణ్యాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన ఉండదు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వంటివి కూడా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వారి ప్రాణాలకే కాకుండా.. ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి మైనర్లకు బైక్లు ఇవ్వకుండా చూడాలి. – ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
మొదలైన న్యాయవాదుల నామినేషన్ పర్వం
విశాఖ లీగల్: విశాఖ న్యాయవాదుల సంఘం ఎన్నికల ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. ఎన్నికల అధికారి, ప్రముఖ న్యాయవాది జీఎం రెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్లు పర్వం మొదలైంది. శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పలువురు న్యాయవాదులు నామినేషన్లు దాఖలు చేశారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, గ్రంథాలయ కార్యదర్శి, సాంస్కృతి కార్యదర్శి, తొమ్మిది మంది కార్యవర్గ సభ్యుల కోసం ఎన్నికలు జరుగుతాయి. 18వ తేదీ సాయంత్రం వరకు నామినేషన్ పర్వం కొనసాగుతుంది. 19న నామినేషన్ల పరిశీలన, 20 వరకు ఉపసంహరణ, అదే రోజు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 28వ తేదీ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు రాత్రి ఫలితాలు వెల్లడిస్తారు. -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను తరిమేద్దాం
తాటిచెట్లపాలెం: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నగరం నుంచి తరిమివేయాలని మేయర్ గొలగాని హరివెంకటకుమారి పిలుపునిచ్చారు. రైల్వే న్యూకాలనీలోని సుబ్బలక్ష్మీ కల్యాణ మండపంలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర అవగాహన కార్యక్రమం జరిగింది. కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ తదితరులతో కలిసి ఆమె స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించి, పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించాలన్నారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేసి.. నగర పరిశుభ్రతకు పాటుపడాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువులను వాడి క్యాన్సర్ బారిన పడొద్దని హెచ్చరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్లే కలిగే నష్టాలను డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా వస్త్ర లేదా నార సంచులను వినియోగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు డి.వి.రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ, ఆర్.సోమనారాయణ, కార్పొరేటర్లు ఉషశ్రీ, రాజశేఖర్, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. మేయర్ హరివెంకటకుమారి పిలుపు -
జూ పార్కులో రాప్టర్ల ప్రదర్శన ప్రారంభం
ఆరిలోవ: పర్యావరణ పరిరక్షణలో రాప్టర్ల(గెద్ద జాతి) పాత్ర ఎంతో కీలకమని చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ శాంతిప్రియ అన్నారు. ఇందిరాగాంధీ జూ పార్కులో డబ్ల్యూడబ్ల్యూఎఫ్–ఇండియా వింగ్ ఆఫ్ వండర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రాప్టర్స్ ఎగ్జిబిషన్ను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా శాంతి ప్రియ మాట్లాడుతూ రాప్టర్లు మాంసాహార పక్షులని, ఇవి ఎలుకలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయని చెప్పారు. అంతేకాకుండా, చనిపోయిన జంతువుల కళేబరాలను తొలగించడం ద్వారా పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయని వివరించారు. విద్యార్థులు రాప్టర్ల ప్రాముఖ్యతను తెలుసుకోవాలని సూచించారు. 90 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్లో రాప్టర్ల చిత్రపటాలు, వాటికి సంబంధించిన సమాచార బోర్డులు ఏర్పాటు చేశారు. జూ క్యూరేటర్ జి.మంగమ్మ, అసిస్టెంట్ క్యూరేటర్లు గోపి, గోపాల నాయుడు, డబ్ల్యూడబ్ల్యూఎఫ్–ఇండియా వింగ్ ఆఫ్ వండర్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
గాజువాకలో దారుణం
● పదేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం ● కామాంధుడిని పట్టుకున్న స్థానికులు అక్కిరెడ్డిపాలెం: పదేళ్ల బాలికపై 45 ఏళ్ల కామాంధుడు లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై.. నిందితుడిని పట్టుకుని గాజువాక పోలీసులకు అప్పగించారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ఎ.పార్థసారధి తెలిపారు. సీఐ తెలిపిన వివరాలివి.. గాజువాక డ్రైవర్స్ కాలనీలో కూరగాయలు అమ్ముకుంటూ దాడి భాను ఒంటరిగా నివసిస్తున్నాడు. అతని ఎదురింట్లో పదేళ్ల బాలికతో కలిసి ఒక కుటుంబం నివాసం ఉంటోంది. శనివారం బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి భాను ప్రవేశించాడు. బాలికను సుత్తి కావాలని అడిగి ఆమైపె లైంగికదాడికి యత్నించాడు. దీంతో బాలిక పెద్దగా కేకలు వేయడంతో.. స్థానికులు ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇది గమనించి పారిపోతున్న భానును పట్టుకుని గాజువాక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని భానును అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
నేల నుంచి నీటిలోకి..
సముద్రంలోకి ఆలీవ్ రిడ్లే తాబేలు పిల్లలు కొమ్మాది: బుల్లి ఆలివ్ రిడ్లే తాబేళ్లు బుడిబుడి అడుగులు వేసుకుంటూ తమ సహజ ఆవాసమైన సముద్రంలోకి చేరుకున్నాయి. ఈ మనోహరమైన దృశ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. జోడుగుళ్లపాలెం, చేపలుప్పాడ, పెదనాగమయపాలెం ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు పెట్టిన గుడ్లను అటవీ శాఖ అధికారులు సేకరించి సాగర్నగర్లోని తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో సంరక్షించారు. వీటి నుంచి వచ్చిన పిల్లలను డీఎఫ్వో శ్రీవాణి శనివారం సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోడుగుళ్లపాలెం నుంచి పెదనాగమయపాలెం వరకు మొత్తం 57,372 గుడ్లను సేకరించి సంరక్షించినట్లు తెలిపారు. తొలి దశలో శనివారం ఉదయం 237 తాబేలు పిల్లలను సముద్రంలో విడిచిపెట్టినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లోనూ విడతల వారీగా మరిన్ని తాబేలు పిల్లలను సముద్రంలోకి విడుదల చేస్తామని ఆమె వివరించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
మీరు అగ్నివీర్ అవుతారా?
సాక్షి, విశాఖపట్నం: దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలనుకునే యువతకు శుభవార్త. అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రిక్రూట్మెంట్ చరిత్రలో తొలిసారిగా ప్రవేశ పరీక్షను ఏకంగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. మరోవైపు రాష్ట్రంలోని 13 జిల్లాల అభ్యర్థుల కోసం ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి విశాఖపట్నం మరోసారి వేదిక కానుంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ అంబేడ్కర్, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ కృష్ణా, మచిలీపట్నం జిల్లాల అభ్యర్థులకు విశాఖలో ఎంపికలు నిర్వహించాలని ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయించింది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఏప్రిల్ 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ కేటగిరీల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు. అగ్నివీర్ ట్రేడ్స్మెన్కు 8వ తరగతి, జనరల్ డ్యూటీ కేటగిరీలకు 10వ తరగతి అర్హతగా నిర్ణయించారు. అలాగే 17 1/2 నుంచి 21 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులే అర్హులు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు మాత్రమే ఈ రిక్రూట్మెంట్కు హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు. అగ్నివీర్ నియామకాలకునోటిఫికేషన్ జారీ 13 భాషల్లో ప్రవేశ పరీక్ష ఎన్సీసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమో అభ్యర్థులకు బోనస్ మార్కులు ఏప్రిల్ 10 వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం ఈ ఏడాది కీలక మార్పులు ఈ సారి అగ్నివీర్ రిక్రూట్మెంట్లో పలు ముఖ్యమైన మార్పులు చేశారు. గతంలో అభ్యర్థులు ఒక కేటగిరీకి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, ఈసారి రెండు కేటగిరీల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎన్సీసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమో వంటి అదనపు విద్యార్హతలు కలిగిన వారికి బోనస్ మార్కులు లభిస్తాయి. గతంలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (సీఈఈ)ను ఇప్పుడు తెలుగుతో సహా 13 భాషల్లో రాసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన అడ్మిట్ కార్డులను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అడ్మిట్ కార్డులో ర్యాలీకి హాజరుకావాల్సిన తేదీ, సమయం వంటి వివరాలు ఉంటాయి. అభ్యర్థుల సౌకర్యం కోసం రిక్రూ ట్మెంట్ జరిగే ప్రదేశంలో ప్రత్యేక రిపోర్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో పారదర్శకంగా జరుగుతుందని రక్షణ శాఖ తెలిపింది. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం లైవ్ చాట్ సదుపాయంతో పాటు ‘ఆర్మీ కాలింగ్’ అనే ఆన్లైన్ మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సమాచారం కో సం www.joinindianarmy. nic.in వెబ్సైట్ ను సందర్శించవచ్చు లేదా విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయాన్ని 0891– 2756959, 0891–2754680 నంబర్లలో సంప్రదించవచ్చు. -
మన్యంలో చిన్నారుల మృత్యు ఘోష
● అల్లూరి జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది గైర్హాజరుపై జెడ్పీ చైర్పర్సన్ ఆగ్రహం ● నోటీసులు జారీ చేయాలని సీఈవోకు ఆదేశం ● కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలైనా కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంపై సభ్యుల ఆగ్రహం ● వాడీవేడిగా జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు మహారాణిపేట: కీలకమైన జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు వివిధ శాఖల అధికారులు డుమ్మా కొట్టారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన పలు స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఏజెన్సీలో వైద్య సదుపాయాలపై, పిల్లల మరణాలపై చర్చ జరిగింది. కానీ సమాధానం చెప్పడానికి అధికారులే లేరు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు నోటీసులు జారీ చేయాలని చైర్పర్సన్ సీఈవోను ఆదేశించారు. తొలుత అరకు జెడ్పీటీసీ చెట్టి రోష్ని మాట్లాడుతూ అరకు మండలం బస్కి గ్రామంలో పిల్లలు ఆకస్మికంగా మృతి చెందారని, ఈ విషయం గురించి మాట్లాడడానికి తాను హెల్త్ సబ్ సెంటర్కు కాల్ చేసినా ఎవరూ ఫోన్ ఎత్తడం లేదన్నారు. పలు వైద్య ఆరోగ్యశాఖ సబ్ సెంటర్లకు వైద్యులు రావడం లేదని, వారిని అడిగే నాథులే లేరని ఆమె వాపోయారు. గిన్నెల, మాడగూడ తదితర ప్రాంతాల్లో చిన్న పిల్లలు వరుసగా చనిపోయారని, కారణం తెలియక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, ఈ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వివరణ ఇవ్వాలని చైర్పర్సన్ జె.సుభద్ర కోరారు. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఒక్క అధికారి కూడా రాలేదని, జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలకు రాని అధికారులను గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆమె సీఈవోను ఆదేశించారు. గిరిజన ప్రజలను మన్యం నుంచి కేజీహెచ్కు తరలించడానికి 108 అంబులెన్సు అవసరం ఉంటుందని, కానీ ఫోన్ చేసినా 108 అంబులెన్సులు రావడం లేదని చైరపర్సన్ అన్నారు. పింఛన్ల మీద వివక్ష : కొత్తగా పింఛన్లు మంజూరు కాకపోవడంపై పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో పింఛన్లు తీసుకుంటూ చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్లో అర్హులుంటే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారని, దరఖాస్తు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారన్నారు. అలా గే అర్హులకు పింఛన్లు ఇస్తామని చెప్పారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 9 నెలలు అవుతున్నా ఎక్కడా కొత్త పింఛన్లు ఇవ్వలేదని, ఇది అన్యాయమన్నారు. జెడ్పీటీసీ సభ్యులను పట్టించుకోని హౌసింగ్ అధికారులు హౌసింగ్ అధికారులు జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులను పట్టించుకోవడం లేదని పలువురు చైర్పర్సన్ దృష్టికి తెచ్చారు. తమ మండలాల్లో గృహ నిర్మాణ అధికారులు సర్వే చేస్తున్న సమయంలో, కొత్త పేర్ల నమోదు చేసేటప్పుడు తమను సంప్రదించడం లేదని, దీనివల్ల స్థానికంగా తాము ఇబ్బంది పడుతున్నామని, గతంలో ఎప్పుడూ ఇలా లేదని వారన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ కోరారు. పోస్టుమార్టంలో జాప్యం కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహణలో జాప్యంపై చైర్పర్సన్తోపాటు పలువురు జెడ్పీటీసీలు ప్రశ్నించారు. మార్చురీ వద్ద అనధికారికంగా డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎక్కువగా గిరిజన ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఎందుకు జాప్యం జరుగుతోందని చైర్పర్సన్ సుభద్ర ప్రశ్నించారు. దీనికి కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ బదులిస్తూ.. రోడ్డు ప్రమాదాల్లో మృతులకు పోస్టుమార్టం జరిగే ముందు పోలీసులు శవ పంచనామా నిర్వహించాలని, ఇందులో జాప్యం జరిగితే అన్నీ ఆలస్యం అవుతాయన్నారు. పాయరావుపేట నుంచి అనకాపల్లి వరకు ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని, అందువల్ల అనకాపల్లిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని మునగపాక జెడ్పీటీసీ పెంటకోట సోమ సత్యనారాయణ కోరారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తితోపాటు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ భూతం.. అడ్డుకట్టతో ఆరోగ్యం
స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేస్తున్న మహిళలు, ర్యాలీలో పాల్గొన్న మేయర్ హరివెంకటకుమారి, కలెక్టర్ హరేందిర ప్రసాద్, ప్రత్యేక అధికారి కాటమనేని భాస్కర్ఏయూక్యాంపస్: ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలను చూపే ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని మేయర్ జి.హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు. బీచ్రోడ్డులోని కాళీమాత ఆలయం వద్ద శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. క్యాన్సర్ వంటి వ్యాధులు రావడానికి ప్లాస్టిక్ ప్రధాన కారణంగా నిలుస్తోందని, ఇటువంటి వాటికి పూర్తిగా స్వస్తి పలకాలని కోరారు. ప్లాస్టిక్ సంచుల్లో వేడి ఆహారం ప్యాకింగ్ చేయడం, వాటిని తినడం ప్రమాదకరమన్నారు. కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెలా ఒక ప్రత్యేక నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. జూన్ 1 నుంచి ప్లాస్టిక్ వస్తువుల క్రయ విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, దాడులు నిర్వహించి అమ్మే వారిపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అనంతరం ర్యాలీని జిల్లా ప్రత్యేక అధికారి కాటమనేని భాస్కర్ ప్రారంభించారు. వంద అడుగుల వస్త్రంతో చేసిన బ్యానర్ పట్టుకుని మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజల చేత స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. వస్త్రంతో చేసిన సంచులను పంపిణీ చేశారు. జీవీఎంసీ అదనపు కమిషనర్లు సోమన్నారాయణ, వర్మ, రమణ, మూర్తి, సీఎంవో నరేష్, వివిధ జోనల్ కమిషనర్లు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మోసం జరిగితే ధైర్యంగా ఫిర్యాదు చెయ్యాలి
వినియోగదారుల్లో ప్రశ్నించేతత్వం పెరగాలి. అప్పుడే వ్యాపారుల్లో మోసపూరిత ధోరణులు మారతాయి. వస్తువు కొనుగోలు చేసే సమయంలో తూకాలను నిశితంగా గమనించాలి. మోసాలకు పాల్పడతున్నట్లు అనుమానం వస్తే వెంటనే తూనికలు, కొలతల శాఖ టోల్ఫ్రీ నంబర్ 1967, లేదా 0891–27995511 నంబర్కి ఫోన్చేసి ధైర్యంగా ఫిర్యాదు చెయ్యండి. ప్రజలు కూడా ఏదైనా వస్తువు కొనే ముందు కొలతలు సరిగా చేస్తున్నారా లేదా గమనించడం అలవాటు చేసుకోవాలి. – కె.థామస్ రవికుమార్, ఏపీ లీగల్ మెట్రాలజీ ఉమ్మడి జిల్లా డిప్యూటీ కంట్రోలర్ -
కిలో
జోష్ హైలీ..ఆనందపు రంగులను మొహానికి పూసుకున్నారు, అందమైన క్షణాలను, జ్ఞాపకాలుగా నిక్షిప్తం చేసుకున్నారు. సప్తవర్ణాల చిరుజల్లుల్లో తడిసి ముద్దయ్యారు. ఆత్మీయులతో ప్రేమానుబంధాలు వసంతంగా వికసించేలా హోలీ జరుపుకున్నారు. విశాఖలోని సాగరతీరాల్లో హోలీ జోష్ కనిపించింది. ప్రముఖ హోటళ్లలో హోలీ సందర్భంగా రెయిన్ డ్యాన్స్లు ఏర్పాటు చేశారు. కురుసుర మ్యూజియం పక్కనే ఏర్పాటు చేసిన రెయిన్ డ్యాన్స్ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో యువత పాల్గొని రంగులు పూసుకుంటూ జోష్ నింపారు. సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్లో అపార్ట్మెంట్ వాసులు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. –ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం అంటే 900గ్రాములే..! శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025సాధారణంగా ఒక కేజీకి ఎన్ని గ్రాములు అంటే.. ఠక్కున 1000 గ్రాములు అని చెప్పేస్తాం. కానీ ఇక్కడ లెక్కలు మారిపోయాయి. కేజీ అంటే 900 గ్రాములు..అంతకంటే తక్కువేనంటూ కొత్త భాష్యం చెబుతున్నారు కొందరు వ్యాపారులు. నమ్మట్లేదా.? ఇది పచ్చి నిజం.. మహరాణిపేటకు చెందిన రాజేశ్వరి పూర్ణామార్కెట్కు వెళ్లి కేజీ వెల్లుల్లి కొన్నారు. – సాక్షి, విశాఖపట్నం/డాబాగార్డెన్స్/ ఆరిలోవ/తాటిచెట్లపాలెంధర్నాలో పాల్గొన్న వివిధ కార్మిక సంఘాల నేతలు కూర్మన్నపాలెం: నిర్బంధాలతో ఉద్యమాన్ని అణచలేరని ఉక్కు కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు అన్నారు. స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం శాంతియుతంగా పోరాటాలు చేస్తుంటే.. వాటిని విఫలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేయడం మంచి పరిణామం కాదని హెచ్చరించారు. విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణకు కూర్మన్నపాలెం దీక్ష శిబిరం వద్ద కార్మిక సంఘాల నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం పాత గాజువాకలో ధర్నా నిర్వహించాలని ముందుగా నిర్ణయించి, అనుమతి కూడా తీసుకున్నట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం కుటిల రాజకీయం చేసిందని ఆరోపించారు. ధర్నాకు పిలుపునిచ్చిన నేతలను పోలీసుల ద్వారా నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది నాయకులను స్టీల్ప్లాంట్ పోలీసులు ఉదయాన్నే అరెస్టు చేయడం దారుణమన్నారు. ఈ విషయం నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. ప్రభుత్వ అడ్డంకుల మధ్య చివరకు కూర్మన్నపాలెం జంక్షన్లో దీక్ష శిబిరం వద్దే ధర్నా చేసినట్లు నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వల్ల ఉక్కు కర్మాగారానికి పైసా ప్రయోజనం కలగలేదని తేల్చి చెప్పారు. కనీసం ప్లాంట్ అభివృద్ధికి గాని, ఉపాధి కల్పనకు గాని, ఉత్పత్తి వ్యయానికి గాని, కనీసం కార్మికుల వేతనాలు చెల్లింపునకు గాని ప్యాకేజీ దోహదపడలేదన్నారు. ధర్నాలో 78వ వార్డు కార్పొరేటర్ గంగారావు, పోరాట కమిటీ చైర్మన్ బి.ఆదినారాయణ, హెచ్ఎంఎస్ నాయకులు గణపతిరెడ్డి, సీఐటీయూ నేత ఎన్.రామారావు, సన్యాసిరావు, ఐఎన్టీయూసీ నాయకులు రామచంద్రరావు, మద్ది అప్పలరాజు రెడ్డి, వరసాల శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పల్లా చినతల్లి తదితరులు మాట్లాడుతూ ఉక్కు యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలన్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ధర్నా సందర్భంగా ఏసీపీ త్రినాథ్ నేతృత్వంలో సీఐలు మల్లేశ్వరరావు, కేశవరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉక్కు కార్మిక నాయకుల నిర్బంధం గాజువాక : విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాతగాజువాక జంక్షన్లో శుక్రవారం ధర్నా తలపెట్టిన కార్మిక సంఘాల నాయకులను స్టీల్ప్లాంట్ పోలీసులు నిర్బంధించారు. పాతగాజువాక జంక్షన్లో ధర్నాకు అనుమతి లేదని పేర్కొంటూ నాయకులను స్టీల్ప్లాంట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిర్బంధించిన వారిలో నాయకులు డి.ఆదినారాయణ, కె.ఎస్.ఎన్.రావు, రామస్వామి, సుబ్బయ్య, పల్లా పెంటారావు, కామేశ్వరరావు తదితరులున్నారు. ఆరిలోవ టీఐసీ పాయింట్కు చెందిన కూరగాయల వ్యాపారి దగ్గర కిలో క్యారెట్ కొనుగోలు చేశారు. అనుమానం వచ్చి పక్కన ఉన్న పండ్ల దుకాణంలో తూకం వేయిస్తే 740 గ్రాములు మాత్రమే కనిపించింది. ఇక్కడ రెండూ ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్లే కావడం గమనార్హం.దాడులు జరుగుతున్నా తూకంలో మోసాలెందుకు? రాష్ట్ర తూనికలు కొలతల శాఖ నిరంతరం దాడులు నిర్వహిస్తోంది. కానీ వినియోగదారులు ఏదో ఒక చోట మోసపోతూనే ఉన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం.. అడపాదడపా దాడులు చేస్తూ.. వెయింగ్ మెషీన్లకు సీల్ ఉందా.? సాంకేతికంగా ఏమైనా మోసాలకు పాల్పడుతున్నారా లేదా అని చెక్ చేస్తూ.. మోసం చేస్తున్న వ్యాపారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. 2023–24లో ఇప్పటి వరకూ ఉమ్మడి విశాఖ జిల్లాలో 2,227 కేసులను వ్యాపారులపై నమోదు చేశారు. బరువు తూచే యంత్రాల తయారీ, మరమ్మతు, యంత్రాలు సరిచూసి అధికారుల ఆమోదంతో ధ్రువీకరించేందుకు కొందరికి తూనికలు, కొలతల శాఖ అనుమతులిస్తుంది. అవి పొందిన లైసెన్స్దారులు ఆయా ప్రాంతాల్లో వ్యాపారులు బరువు తూచే యంత్రాల్ని ఏటా మరమ్మతు చేసి తనిఖీ అధికారి ద్వారా ధ్రువీకరించి వ్యాపారికి ధ్రువపత్రం ఇవ్వాలి. అంతా సక్రమంగా ఉంటేనే సీల్ వేస్తారు. అయినా వ్యాపారి మోసానికి పాల్పడితే వ్యాపారిపై చర్యలు తీసుకుంటున్నారు. మోసాన్ని తూకమేస్తున్నారు.! జిల్లాలో ఎక్కడ చూసినా.. ఏదో ఒక చోట తూనికలు, కొలతల మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు అడపాదడపా దాడులు జరుగుతున్నా.. వ్యాపారులు మాత్రం తమ హస్తలాఘవాన్ని చూపిస్తూనే ఉన్నారు. పండ్లు, కూరగాయలు, కిరాణా సరుకుల విక్రయాల్లో కొనుగోలుదారులు మోసపోవడం పరిపాటిగా మారిపోయింది. మెషీన్లకు వేసిన సీళ్లు వేసినట్లే ఉంటున్నాయి. కానీ మోసం మాత్రం జరుగుతూనే ఉంది. దీంతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. పలు రైతు బజార్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్యాకింగ్లోనూ మోసాలు ఇక సూపర్ మార్కెట్లలోనూ మోసాలు జోరందుకుంటున్నాయి. ప్యాకింగ్ చేసి సొంత స్టిక్కర్లు వేసి విక్రయాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. సూపర్ మార్కెట్లో అక్కడ తూకం వేసి చూసుకునేందుకు యంత్రాలు ఏర్పాటు చెయ్యాలి. కానీ ఏ సూపర్ మార్కెట్లోనూ ఇవి కనిపించడంలేదు. అంతేకాదు ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్న పదార్థాలపై ఎప్పుడు తయారు చేశారు. ఎంత బరువు ఉంది. ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకూ ఉంటుందనే విషయాలు కూడా ముద్రించడం లేదు. ఎంవీపీ కాలనీలోని విశాఖ సూపర్ మార్కెట్లో ఇదే జరుగుతోంది. ఫ్రెంచ్ఫ్రైస్ని తమ సొంత ప్యాకింగ్లలో విక్రయిస్తున్నారు. కానీ దానిపై ఎంఎఫ్జీ డేట్, ఎక్స్పైరీ డేట్ కూడా లేదు. అదేవిధంగా తినుబండారాలపై కేవలం ధర స్టిక్కర్ మాత్రమే అతికించి అమ్మేస్తున్నారు. దానిపై ఎక్కడ తయారు చేశారు.? ఏఏ పదార్థాలతో తయారు చేశారన్న వివరాలూ కనిపించడం లేదు. కేవలం ఈ ఒక్క సూపర్ మార్కెట్లోనే కాదు.. నగరంలో ఉన్న సగానికిపైగా సూపర్ మార్కెట్లు నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అయినా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. స్థానికులకు ఉపాధి కరువు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల స్థానికులకు ఉపాధి మృగ్యమైపోయింది. అన్ని రకాల పనులు జిందాల్, మిట్టల్ కంపెనీలకు అప్పగించే కుట్ర జరుగుతోంది. దీని వల్ల రాష్ట్ర ప్రజలు అన్యాయమైపోతారు. కర్మాగారానికి పూర్తి స్థాయి సీఎండీని కూడా నియమించడం లేదు. సంబంధం లేని వ్యక్తిని ఇన్చార్జి సీఎండీగా నియమించి.. కర్మాగారాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. –డి.ఆదినారాయణ, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఉద్యోగులను తొలగించేస్తున్నారు ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విషయాలలోనూ అణచివేతకు గురిచేస్తున్నాయి. అందువల్లే కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఇప్పటికే వందలాది మందిని స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా ఇంటి దారి పట్టించారు. ఇంకా కాంట్రాక్టు, శాశ్వత ఉద్యోగులను అనేక రూపాల్లో తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. – జి.గణపతిరెడ్డి, ఉక్కు హెచ్.ఎం.ఎస్. ప్రధాన కార్యదర్శి ఉక్కు కార్మిక సంఘాల హెచ్చరిక విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణకు కూర్మన్నపాలెం వద్ద ధర్నా గాజువాకలో ధర్నా అడ్డుకోవడంపై ధ్వజం -
‘సాక్షి’తో వినియోగదారుల హక్కుల మండలి..
వినియోగదారుడు మోసపోకుండా ప్రతి దుకాణం కన్జ్యూమర్ రైట్స్ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాలంటూ జాతీయ వినియోగదారుల హక్కుల మండలితో కలిసి ‘సాక్షి’ బృందం.. ప్రజల్లోనూ, వ్యాపారుల్లోనూ చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డా.వికాస్పాండే, జాతీయ అధికారప్రతినిధి బాలకృష్ణతో కూడిన బృందంతో కలిసి పలు దుకాణాలకు, సూపర్ మార్కెట్లకు వెళ్లి.. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న విక్రయాలను వ్యాపారుల దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే నిబంధనలకు అనుగుణంగా ప్యాకింగ్, తూనికలు సరిచేసుకోవాలని సూచించారు. -
ఘనంగా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు జయంతి ఉత్సవాలు
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠంలో హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ చైతన్య మహా ప్రభువు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీగౌర పూర్ణిమ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకృష్ణ చైతన్య మహా ప్రభువు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హరేకృష్ణ మూవ్మెంట్ భక్తులు ముందుగా శీకృష్ణబలరాముల విగ్రహాలకు, అనంతరం శ్రీకృష్ణ చైతన్య మహా ప్రభువుకు పంచామృతాలు, పంచగంధ్య, సువాసనలతో కూడిన పుష్పాలు, వివిధ పండ్ల రసాలతో మహా అభిషేకం నిర్వహించారు. స్వామి వారికి విశేషంగా పిండి వంటలతో నైవేద్యం పెట్టి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. వేడుకలను అంబరీష దాస పర్యవేక్షించారు. అనంతరం హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస గౌరలీల గురించి ప్రవచించారు. -
గుండెపోటుతో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
● బంధువులు, కార్మిక సంఘాల ఆందోళన కూర్మన్నపాలెం : విధులు నిర్వహిస్తూ ఉక్కు కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి చెందాడు. వివరాలివి. పెదగంట్యాడ దరి ముసలినాయుడుపాలెంలో నివాసం ఉంటున్న వేపాడ సూర్యవెంకటరమణ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్టర్ వద్ద ట్రాక్టర్ డైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. యథావిధిగా శుక్రవారం విధులకు హాజరై జోన్ ఎంఎంజెడ్లో ట్రాక్టర్ను నడుపుతుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో సహచర కార్మికులు వైద్యులకు సమాచారం అందించి రప్పించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న బంధువులు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో ఉక్కు ప్రధాన ద్వారం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. బంధువులకు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. అదే సమయంలో అంబులెన్స్లో మృతదేహం ఉక్కు ప్రధాన గేటు వద్దకు చేరుకుంది. దీంతో అంబులెన్స్ను కదలనీయకుండా బంధువులు, కార్మికులు ఆందోళన చేశారు. కాంట్రాక్టర్, బంధువులతో పోలీసులు, యూనియన్ నేతలు చర్చలు జరి పారు. మృతుని బంధువులకు పరిహారం కింద రూ.2 లక్షలు, మట్టి ఖర్చుల నిమిత్తం మరో రూ.30 వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదరడంతో ఆందోళకారులు శాంతించారు. మృతదేహాన్ని సొంత గ్రామమైన చోడవరం ప్రాంతానికి బంధువులు తీసుకువెళ్లారు. -
వైభవంగా గౌర పూర్ణిమ ఉత్సవాలు
కొమ్మాది : బీచ్రోడ్డు సాగర్నగర్ ఇస్కాన్ టెంపుల్లో శుక్రవారం గౌర పూర్ణిమ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. శ్రీ కృష్ణభగవానుని భక్త అవతారమైన శ్రీ చైతన్య మహా ప్రభు ఆవిర్భావ దినోత్సవంగా నిర్వహించిన ఈ ఉత్సవాలు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యాయి. శ్రీ కృష్ణుని భజన సంకీర్తనలు, పుష్పాభిషేకం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా చైతన్య లీలల్లో ఒకటైన చాంద్కాజీ ఉద్ధరణ నాటకం అద్భుతంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో ఇస్కాన్ అధ్యక్షుడు సాంబాదాస్ ప్రభూజీ, మాతాజీ నితాయి సేవిని, వంశీకృష్ణ ప్రభు, భక్తులు పాల్గొన్నారు. -
ఇసుకకొండకు పౌర్ణమి తాకిడి
డాబాగార్డెన్స్: ఇసుకకొండ(బాబాజికొండ)పై వెలసిన రమా సహిత సత్యనారాయణస్వామి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. పౌర్ణమి సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు చేశారు. వేకువజాము 3 గంటల నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులుదీరారు. నగరం నుంచే గాక ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ మండపంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు జరిగాయి. ఆలయ ఈవో రాజగోపాల్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామికి పూజలు చేస్తున్న అర్చకుడు -
హెచ్ఎస్ఎల్ ఫైనాన్స్ డైరెక్టర్గా కిరణ్
సింథియా: హిందూస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ నూతన డైరెక్టర్గా కిరణ్ సణికరాలా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1997లో చార్టర్డ్ అకౌంటెంట్గా అర్హత సాధించిన ఆయన 1998లో ఆర్ఐఎన్ఎల్లో చేరి కార్పొరేట్ ఖాతాలు, ట్రెజరీ, ప్రాజెక్ట్ ఫైనాన్స్, బడ్జెట్, ఇంటర్నెల్ ఆడిట్ వంటి రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించారు. ఆర్ఐఎన్ఎల్ ఐవోపీ నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ అవార్డును కూడా గెలుచుకున్నారు. హిందూస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్లో ఫైనాన్స్ అండ్ కమర్షియల్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేశారు. -
మోసపోయారా? మేం పోరాడతాం
● వినియోగదారుడికి అండగా ఉన్నాం ● ఏడేళ్ల కాలంలో విశాఖలో 86 కేసులు ఫైల్ చేశాం ● 90శాతం కేసుల్లో పరిహారం అందించగలిగాం ● వినియోగదారుల హక్కుల మండలి జాతీయ అధ్యక్షుడు డా.వికాస్పాండే సాక్షి, విశాఖపట్నం: వస్తు సేవల్లో నాణ్యత కొరవడినా, నష్టపోయినా వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం–1986 ప్రకారం బాధితుల తరఫున పోరాడేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని వినియోగదారుల హక్కుల మండలి జాతీయ అధ్య క్షుడు డా.వికాస్ పాండే తెలిపారు. కన్జ్యూమర్ రైట్స్ డే సందర్భంగా నగరంలో పలు వ్యాపార సముదాయాలు, దుకాణాల్లో మండలి తరఫున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. 13 ఏళ్లుగా పోరాడుతున్నాం వినియోగదారుడి సమస్య.. మండలి సమస్య గా భావించి 13 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. చట్ట ప్రకారం ఏ ఒక్క వినియోగదారుడు మోసపోకూడదు. దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో మండలి తరఫున కేసులు వేస్తూ న్యాయం కోసం పోరాడు తున్నాం. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. వినియోగదారుడు కోర్టుల చుట్టూ తిరగా ల్సిన అవసరం లేకుండా.. ఎలాంటి ఫీజులు తీసుకోకుండా కేసు గెలిచేంత వరకు అండగా ఉంటాం. దేశ వ్యాప్తంగా 300 కేసుల ఫైలింగ్ మా మండలి తరఫున దేశ వ్యాప్తంగా గడిచిన ఐదేళ్లలో 300కిపైగా కేసులు వేశాం. విశాఖలో 86 కేసులు నమోదు చేశాం. ఈ ఏడాది ఇప్పటి వరకు విశాఖ జిల్లాలో 7 కేసులు ఫైల్ చేశాం. దాదాపు 90 శాతం కేసుల్లో విజయం సాధించాం. 6–7 నెలల్లో మిగిలిన కేసులు కూడా పరిష్కారం కానున్నాయి. సైబర్ నేరాలపైనా పోరాటం.. ఇప్పుడు సైబర్ నేరాలు రాజ్యమేలుతున్నాయి. అందుకే వాటిపైనా దృష్టిసారించాం. బ్యాంకుల పేరు తో మోసాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో విశాఖలో ఎస్ సెక్యూరిటీస్ పేరుతో నకిలీ యాప్ ద్వారా హరికుమార్ అనే వ్యక్తి రూ.15 లక్ష లు నష్టపోయారు. కొటక్ సెక్యూరిటీస్ పేరుతో వెంకటరమణ అనే వ్యక్తి రూ.15 లక్షలు పోగొట్టుకున్నా రు. దీనిపైనా కేసులు ఫైల్ చేశాం. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. చట్టం ఎంతో ఉపయోగపడుతుంది వినియోగదారుల హక్కుల చట్టం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజలు దీనిపై అవగాహన పెంచుకోవాలి. ఎవరికి ఏ మోసం జరిగినా మండలిని ఆశ్రయిస్తే.. పరిష్కారం చూపుతాం. చట్టం విలువ అందరికీ తెలియజెప్పేందుకు దేశ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. -
సొంత గనుల కోసం కార్మికుల పోరాటం
సీతమ్మధార: స్టీల్ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం మహా ధర్నా చేశారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా గురజాడ అప్పారావు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ, గాజువాకలో తలపెట్టిన ధర్నాకు పోలీసులు అడ్డుపడి నాయకులను అక్రమంగా నిర్బంధించడాన్ని ఖండిస్తున్నామన్నారు. తొలగించిన సుమారు 400 మంది కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. స్టీల్ప్లాంట్లోని ఆఫీసర్లు, శాశ్వత ఉద్యోగులకు మూడు నెలల బకాయి జీతాలు విడుదల చేయాలని, స్టీల్ప్లాంట్ క్వార్టర్లలో విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో ఉద్యమాలు నిర్వహిస్తున్న స్టీల్ప్లాంట్ సీఐటీయూ నాయకుడు జె.అయోధ్యరామ్కు ఇచ్చిన షోకాజ్ నోటీసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, నాయకులు వై.రాజు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బి.పద్మ, పి.మణి, కె.ఎం.కుమార మంగళం, ఎం.సుబ్బారావు, పి.వెంకటరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు టి.నూకరాజు, ప్రధాన కార్యదర్శి ఉరుకూటి రాజు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం.మన్మధరావు, ఐఎన్టీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగవిల్లి నాగభూషణం, ఏఐటీయూసీ కార్యవర్గ సభ్యులు ఎస్.కె.రెహమాన్, జె.డి.నాయుడు పాల్గొన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహా ధర్నా, మానవహారం -
ఫిర్యాదు చేస్తే 90 రోజుల్లో పరిష్కారం
సాక్షి, విశాఖపట్నం: చట్టాలపై ప్రజలు అవగాహన పొందడం ద్వారా మోసపోకుండా ఉండవచ్చని జిల్లా వినియోగదారుల ఫోరం–1 ప్రెసిడెంట్ జి.తనూజరెడ్డి అన్నారు. వస్తు సేవలు, నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణాలు, ఇలా ఎందులో మోసం జరిగిందని భావించినా.. నిరభ్యంతరంగా జిల్లా వినియోగదారుల మండలిని ఆశ్రయించవచ్చని సూచించారు. ఎవరైనా.. ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసే సాంకేతికత ఈ–జాగృతి పేరుతో అందుబాటులోకి వస్తోందని వెల్లడించారు. వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఫిర్యాదు చేయడం ఎలా అంటే.? వినియోగదారుల మండలికి ఫిర్యాదు చేసి విధానం చాలా సులువు. తెల్ల కాగితంపై ఫిర్యాదు వివరాలు రాసి పంపవచ్చు. ఏ న్యాయవాది అవసరం లేకుండా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశాం. మీరెలా మోసపోయారో చెబితే అంతా వారే సహకారం అందిస్తారు. అన్ని రకాల వస్తువులపై ఫిర్యాదు చేసే హక్కు వినియోగదారులకు ఉంది. లోపాలు, ఇబ్బందులు తలెత్తితే వస్తువు కొన్న రెండేళ్లలోపు ఫిర్యాదు చేయాలి. ఆలస్యమైతే పూర్తి ఆధారాలతో డిలే పిటిషన్ వేయవచ్చు. ప్రతివాది సంస్థ నోటీసులు అందిన 45 రోజుల్లో కౌంటర్ ఫైల్ చేయకపోతే.. తదుపరి ప్రొసీడింగ్స్ లేకుండానే కేసు పరిష్కృతమయ్యే అవకాశం ఉంది. బిల్లు తప్పకుండా తీసుకోవాలి వినియోగదారుడు ఏదైనా వస్తువును కొన్న తర్వాత బిల్లు తప్పకుండా తీసుకోవాలి. ఇదే ప్రాథమిక ఆధారం. అప్పుడే కేసు స్వీకరించేందుకు అవకాశం ఉంటుంది. వస్తు సేవల్లో నాణ్యత కొరవడినా, నష్టపోయినా పరిహారం పొందవచ్చు. రూ.5లక్షల లోపు వస్తువు ధర ఉంటే ఎలాంటి రుసుం లేకుండా వినియోగదారుల ఫోరం(కోర్టు)లో కేసులు వేయవచ్చు. రూ.5 లక్షలపైబడి ఉంటే.. రూ.400 నుంచి రూ.2 వేల వరకు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా 30 నుంచి 40 ఫిర్యాదులు ప్రతి నెలా 30 నుంచి 40 ఫిర్యాదులొస్తుంటాయి. ఇందులో టూ వీలర్, ఫోర్ వీలర్, వాటర్ ఫిల్టర్, గ్యాస్, పెట్రోల్ దుకాణాలు, ధరల వ్యత్యాసం, బీమా, వైద్యం వంటివి ఎక్కువగా ఉంటాయి. వచ్చిన ఫిర్యాదుల్లో బీమా కంపెనీల మోసాలపై 50 శాతం వరకు.. మోటర్ వాహనాలపై 30 శాతం ఉంటున్నాయి. ప్రస్తుతం వస్తున్న ఫిర్యాదుల్లో న్యాయవాది సాయంతో వస్తున్న ఫిర్యాదులే అధికంగా ఉన్నాయి. త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారంపూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే.. 90 రోజుల్లో పరిష్కృతమై వినియోగదారుడికి పరిహారం అందించగలుగుతున్నాం. కొన్ని కేసులు మాత్రం ఎక్కువ సమయం పడుతున్నాయి. ప్రతి నెలా 30 కిపైగా కేసులు పరిష్కరిస్తున్నాం. ప్రస్తుతం 190 కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. పరిధి లేదు.. ఫిర్యాదు చేయవచ్చు ఒకప్పుడు ఎక్కడ వస్తువు కొనుగోలు చేస్తే ఆ పరిధిలోనే ఫిర్యాదు చేసేవారు. చట్టంలో వచ్చిన మార్పులు వినియోగదారుడికి వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఎవరు ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు. త్వరలోనే ఈ–జాగృతి అమల్లోకి రానుంది. అంటే పేపర్లెస్ విధానం. ప్రొసీడింగ్స్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటాయి. భయపడకుండా రావాలి అన్యాయమైన వాణిజ్య విధానాలు, మోసపూరిత పద్ధతుల నుంచి న్యాయబద్ధమైన రక్షణ పొందడం వినియోగదారుల హక్కు. జిల్లా వినియోగదారుల ఫోరం ద్వారా నష్ట పరిహారం రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు, రాష్ట్ర కమిషన్ ద్వారా రూ. కోటి నుంచి రూ. 10 కోట్ల వరకు పొందవచ్చు. రూ.10 కోట్లు దాటితే జాతీయ వినియోగదారుల కమిషన్లో కేసులు వేసుకునే అవకాశం ఉంటుంది. మోసం జరిగిందని గుర్తిస్తే ప్రతి ఒక్కరూ భయపడకుండా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని కోరుతున్నాం. చట్టాలపై అవగాహనతో మోసాలకు చెక్ ఈ–జాగృతితో మరింత వెసులుబాటు జిల్లా వినియోగదారుల ఫోరం–1ప్రెసిడెంట్ తనూజరెడ్డి -
ముగ్గురి మధ్య ఘర్షణ.. ఒకరికి కత్తిపోట్లు
కూర్మన్నపాలెం: గాజువాక శివారు 77వ వార్డు మద్దివానిపాలెంలో శుక్రవారం జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు ప్రస్తుతం గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి.. మద్దివానిపాలేనికి చెందిన వివాహిత మద్ది వెంకటలక్ష్మిని అదే గ్రామానికి చెందిన కర్రి సతీష్రెడ్డి కొంత కాలంగా వేధిస్తున్నాడనే పుకార్లు గ్రామంలో వ్యాపించాయి. వెంకటలక్ష్మి భర్త పైడి రెడ్డి విదేశాల నుంచి ఇటీవల తిరిగి వచ్చాడు. ఆనోట.. ఈనోట ఈ విషయం విన్న పైడి రెడ్డి.. వరసకు తమ్ముడైన మద్ది అప్పలరాజు (రాజు)కు తెలియజేశాడు. దీంతో శుక్రవారం ఉదయం గ్రామంలో సతీష్ రెడ్డిని రాజు నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి అది కొట్లాటకు దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న సతీష్రెడ్డి తమ్ముడు ఏకాంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నాడు. అనంతరం ముగ్గురి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఆవేశంతో ఊగిపోయిన రాజు, తన వద్ద ఉన్న కత్తితో ఏకాంత్ రెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఏకాంత్ రెడ్డి తల, చేయి, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని గాజువాకలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఏకాంత్ రెడ్డి చికిత్స పొందుతున్నాడని సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసి రాజును అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా.. అనుమానం ఎంతటి ఘోరానికై నా దారి తీస్తుందనడానికి ఈ సంఘటనే నిదర్శనమని స్థానికులు చర్చించుకున్నారు. -
అట్టహాసంగా జాతీయ నాటకోత్సవాలు ప్రారంభం
మురళీనగర్: కేవీ మెమోరియల్ ఆర్ట్స్, విశాఖ పోర్ట్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మురళీనగర్ వైశాఖీ స్పోర్ట్స్ పార్క్ సంయుక్త ఆధ్వర్యంలో మురళీనగర్లోని వేములపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం జాతీయస్థాయి ఆహ్వాన నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రదర్శించిన నాటికల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారాలు పొందిన రంగస్థల నటులు తమ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ముందుగా గుంటూరు అభినయ ఆర్ట్స్ బృందం ప్రదర్శించిన ‘ఇంద్రప్రస్థం’యువతను ఆలోచింపజేసింది. నేటి యువత జీవితంలో స్థిరత్వం లేకుండా ప్రేమ, పెళ్లి మోజులో పడటం, అనంతరం జీవితంలో వారికి ఎదురయ్యే పరిణామాలు, వారి కష్టాలను కళ్లకు కట్టినట్లు నటీనటులు ప్రదర్శించారు. ‘వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి అందరూ డబ్బు మోజులో సాఫ్ట్వేర్, ఇతర ఉద్యోగాల్లోకి వెళ్లిపోతే రానున్న కాలంలో రైతులనేవారు కనిపించరు. దీని వల్ల తిండి కొరత ఏర్పడితే మానవ మనుగడ పరిస్థితి ఏమిటి?’అనే సందేశాత్మక అంశంతో చిలకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ నటులు‘మా ఇంట్లో మహా భారతం’ నాటికను అద్భుతంగా ప్రదర్శించారు. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు జనరల్ బోగీల్లో ఉన్న ప్రయాణికుల గురించి ఎవరూ పట్టించుకోరు. ఒక రైలు ప్రమాదం సమయంలో జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న తన కొడుకు ఆచూకీ తెలియక ఒక తల్లి అనుభవించే ఆవేదనను తెలిపే ‘జనరల్ బోగీలు’ నాటికను కొలకలూరు సాయి ఆర్ట్స్ బృందం ప్రదర్శించింది. పార్కు అధ్యక్ష, కార్యదర్శులు సనపల వరప్రసాద్, పి.వెంకట సూర్యనారాయణరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాకర్స్ డిస్ట్రిక్ట్–101 ఆర్సీ–5 యు. శుభ, వాకర్స్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు పల్లా చంద్రమౌళి సహకరించారు. శనివారం సాయంత్రం 6.15కు ఒంగోలు పండు క్రియేషన్స్ వారిచే ‘పక్కింటి మొగుడు’, రాత్రి 8.15 గంటలకు విశాఖ జాస్మిన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ మహిళలచే ‘సంకల్పం’ నాటికల ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
అప్పన్న పెళ్లికి ముహూర్తం ఖరారు
సింహాచలం: సింహాచలంపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి కల్యాణోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వివాహం కోసం శుక్రవారం సింహగిరి నుంచి కొండ దిగువకు వచ్చి న స్వామి.. పిల్లనివ్వమని తన సోదరి, అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారిని కోరారు. ఏం చూసి నీకు పిల్లనివ్వాలని తొలుత నిరాకరించిన అమ్మవారు.. ఆ తర్వాత స్వామి వైభవాన్ని, ఆయనకున్న అసంఖ్యాకమైన భక్తజనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. చివరకు పిల్లనివ్వడానికి అమ్మవారు అంగీకరించారు. దీంతో ఈ నెల 30న ఉగాది రోజు పెళ్లిరాట ఉత్సవం, వచ్చే నెల 8వ తేదీ చైత్ర శుద్ధ ఏకాదశి నాడు స్వామి వార్షిక కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సింహగిరిపై పెళ్లి సందడి నెలకొంది. ఘనంగా డోలోత్సవం ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి డోలోత్సవం ఘనంగా జరిగింది. ఏటా చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామికి జరిగే వార్షిక కల్యాణోత్సవానికి ముందు వచ్చే ఫాల్గుణ పౌర్ణమి రోజు అడవివరంలో స్వామికి డోలోత్సవం విశేషంగా నిర్వహించడం ఆనవాయితీ. తనకు పిల్లనివ్వాలంటూ తన సోదరి అయిన పైడితల్లి అమ్మవారిని స్వామి అర్ధించే విధానాన్నే అడవివరం గ్రామస్తులు బొట్టెనడిగే పున్నమి ఉత్సవం(డోలోత్సవం)గా అభివర్ణిస్తారు. కాగా.. కొండదిగువ పుష్కరిణి ఉద్యానవన మండపంలో ఈ ఉత్సవాన్ని దేవస్థానం అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తి అయిన గోవిందరాజస్వామి ని విశేషంగా అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేతంగా సింహగిరిపై నుంచి పల్లకీలో మెట్లమార్గం ద్వారా తొలిపావంచా వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్వామికి దేవస్థానం ఈవో కె.సుబ్బారావు దంపతులు, అధికారులు, గ్రామస్తులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి స్వామిని ఊరేగింపుగా పైడితల్లి అమ్మవారి ఆలయం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ స్వామికి గ్రామస్తులు విశేషంగా హారతులు పట్టారు. అనంతరం స్వామిని పుష్కరిణి సత్రం వద్దకు తీసుకొచ్చి ఉద్యానవన మండపంలో ఏర్పాటు చేసిన డోలీపై అధిష్టింపజేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. చూర్ణోత్సవం, వసంతోత్సం నిర్వహించారు. పూజలు చేసిన వసంతాలను స్వామికి సమర్పించారు. అనంతరం నాళాయిర దివ్య ప్రబంధాన్ని ఆలపిస్తూ డోలోత్సవం నిర్వహించారు. తదుపరి స్వామికి సమర్పించిన వసంతాలను అర్చకులు భక్తులపై చల్లారు. స్వామి కి పెళ్లికుదిరిన ఆనందంలో భక్తులు, దేవస్థానం ఉద్యోగులు ఒకరిపై ఒకరు వసంతాలను జల్లుకుని ఆనంద డోలికల్లో మునిగితేలారు. అనంతరం భక్తులకు పానకాన్ని ప్రసాదంగా అందజేశారు. తర్వాత అడవివరంలో తిరువీధి నిర్వహించారు. పెళ్లి కొడుకు అలంకరణలో తమ ఇంటి ముందుకు వచ్చిన స్వామికి గ్రామస్తులు మంగళ హారతులిచ్చా రు. తదుపరి స్వామిని మరల పైడితల్లి ఆలయానికి తీసుకెళ్లి అక్కడి నుంచి సింహగిరికి చేర్చారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ఇన్చార్జి ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, వేద పండితులు, పారాయణదారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు, డిప్యూటీ ఈవో రాధ తదితరులు స్వామిని దర్శించుకున్నారు. ఈ నెల 30న ఉగాది రోజు పెళ్లిరాట ఏప్రిల్ 8న వార్షిక కల్యాణోత్సవం ఉద్యానవన మండపంలోఘనంగా డోలోత్సవం శాస్త్రోక్తంగా వసంతాల సమర్పణ -
సాగరతీరంలో..సంప్రదాయ హోలీ
ఏయూక్యాంపస్: నగరంలో నివాసం ఉంటున్న మార్వాడీలు హోలీ వేడుకలను ముందుగానే ప్రారంభించారు. గురువారం ఉదయం ఆవు పేడతో చేసిన పిడకలను సముద్ర తీరానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ప్రతీ కుటుంబం నుంచి ఒక పిడకల దండను సేకరించి, వాటి తో సాగరతీరంలో పెద్ద కుప్పగా పేర్చారు. ఈ పిడకల కుప్పకు మహిళలు పూజలు చేశారు. గురువారం రాత్రి 11.34 గంటలకు పిడకలకు నిప్పు వెలిగించి హోలికా దహన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పిడకల నుంచి వచ్చి బూడిదను విభూతిగా భావించి ప్రతి ఇంటికి తీసుకెళ్లి పూజలు చేశారు. శుక్రవారం జరిగే వేడుకల్లో ఆ విభూతిని నుదుటన తిలకంగా ధరిస్తారు. ఆ తర్వాత మార్వాడీలందరూ కుటుంబ సమేతంగా హోలీ వేడుకల్లో పాల్గొంటారు. -
అప్పన్న పెళ్లిచూపులు నేడు
● కొండదిగువ ఉద్యాన మండపంలో డోలోత్సవం ● బొట్టెనడిగే పున్నమి ఉత్సవంగా అడవివరం ప్రజల ఆచారం సింహాచలం: పాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి శుక్రవారం పెళ్లి చూపులు జరగనున్నాయి. స్వామి పెళ్లికుమారుడిగా ముస్తాబై సింహగిరి దిగి, కొండ దిగువ పుష్కరిణి సత్రంలో ఉన్న ఉద్యానమండపంలో కొలువుండి, డోలోత్సవం నిర్వహించుకోనున్నాడు. పెళ్లి నిశ్చయం అనంతరం అడవివరం గ్రామంలో తిరువీధి చేసుకోనున్నాడు. అనంతరం పైడితల్లి ఆలయం వద్దకు కెళ్లి, అక్కడి నుంచి మెట్లమార్గంలో కొండకి చేరుకుంటాడు. డోలోత్సవం కథ ఇదీ.. సింహాచలేశుడికి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి రోజు వార్షిక కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. దీనికి ముందు వచ్చే పాల్గుణ పౌర్ణమి రోజున స్వామివారి పెళ్లిచూపుల తంతుతో డోలోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. దీన్నే అడవివరం గ్రామస్తులు బొట్టెనడిగే పున్నమిగా చెప్తారు. అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారిని స్వామికి అక్కగా అభివర్ణిస్తుంటారు. పైడితల్లి అమ్మవారి కుమార్తెనే స్వామి మనువాడినట్లు చెప్తారు. సింహగిరిపై నుంచి కొండదిగువకు వచ్చిన స్వామి తొలుత తన సోదరి పైడితల్లి ఆలయం వద్దకు వెళ్లి పిల్లనివ్వాల్సిందిగా అమ్మవారిని అడగ్గా.. నీకు ఆస్తిపాస్తులేం ఉన్నాయని, ఏం చూసి పిల్లనివ్వాలని అమ్మవారు తొలుత ఒప్పుకోరు. దీంతో స్వామి అలిగి అక్కడి నుంచి వెళ్లి, పుష్కరిణి సత్రంలోని ఉద్యాన మండపంలో వేంచేస్తాడు. అక్కడ వైభవంగా డోలోత్సవం, వసంతోత్సవం, చూర్ణోత్సవం చేసుకుంటాడు. ఈ వేడుక గురించి తెలుసుకున్న పైడితల్లి అమ్మవారు స్వామికి ఎంతో మంది భక్తులు ఉన్నారని, వారే ఆయన ఆస్తిగా భావించి పిల్లనివ్వడానికి ఒప్పుకుంటుంది. స్వామికి పెళ్లి నిశ్చయమైన ఆనందంలో గ్రామస్తులు, భక్తులు, దేవస్థానం ఉద్యోగులు, వైదికులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని వసంతోత్సవం జరుపుతారు. దీన్నే డోలోత్సవంగా అభివర్ణిస్తారు. డోలోత్సవం నిర్వహణ అనంతరం ఉగాది రోజున పెళ్లిరాట, చైత్రశుద్ధ ఏకాదశిన వార్షిక కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. డోలోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం ఈవో కె.సుబ్బారావు ఆధ్వర్యంలో వైదికులు,అధికారులు ఏర్పాట్లు చేశారు. కొండదిగువ ఉద్యానవనమండపాన్ని విశేషంగా ముస్తాబు చేశారు. -
వైభవంగా అనంతుని రఽథోత్సవం
పద్మనాభం: పద్మనాభంలోని కుంతీ మాధవ స్వామి ఆలయంలో అనంతుని కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి అనంత పద్మనాభ స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా విశేష హోమం, గ్రామ బలిహరణం, మంగళాశాసనం వంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కుంతీ మాధవ స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి ఉత్సవ విగ్రహాలను వేద పండితులు వేద మంత్రోచ్ఛరణలు, నాద మునీశ్వరుల స్వరాల నడుమ రథంపైకి తోడ్కొని వచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రథం ముందు కుంభం(అన్నం) పోశారు. స్థానిక సీఐ సిహెచ్.శ్రీధర్ ప్రథమ పూజ అనంతరం గాలి గోపురం వద్ద నుంచి రథోత్సవం ప్రారంభమైంది. పూలమాలలు, అరటి చెట్లు, విద్యుద్దీపాలతో అలంకరించిన రఽథం భక్తుల గోవింద నామస్మరణల నడుమ ముందుకు సాగింది. రాజ వీధి గుండా అనంత పద్మనాభ స్వామి రథచక్రాలు వడివడిగా ముందుకు కదిలాయి. ఈవో నానాజీ బాబు పర్యవేక్షణలో జరిగిన ఈ రథోత్సవంలో ఎంపీపీ రాంబాబు, పద్మనాభం సర్పంచ్ టి.పాప, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 85 శాతం ఓకేనట మూతపడనున్న ప్రాథమిక పాఠశాలలు అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆందోళన
విశాఖ విద్య : ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణ ప్రక్రియ తుదిదశకు చేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 117 జీవోను రద్దు చేసి... దానికి ప్రత్యామ్నాయంగా మోడల్ స్కూళ్లను తెరపైకి తీసుకొచ్చింది. ప్రతి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ను ఏర్పాటు చేసి, చుట్టు పక్కల పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఇందులో విలీనం చేసేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో దూరంగా వెళ్లే విద్యార్థులకు రవాణా చార్జీలు ఇస్తామని ప్రభుత్వం మభ్యపెడుతోంది. ప్రాథమిక విద్యకు విఘాతం కలిగేలా కూటమి ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయంపై విద్యావేత్తలు, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ పేరిట స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఆమోదం పొందాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ క్షేత్రస్థాయిలో ఇది పారదర్శకంగా జరగడం లేదు. పాఠశాలల పునర్నిర్మాణంపై వ్యతిరేకత లేకుండా చూడాలనే కూటమి ప్రభుత్వం మౌఖిక ఆదేశాలతో దీనిపై నేరుగా జిల్లా కలెక్టర్లు రంగంలోకి దిగారు. దీంతో బడిలో బలవంతపు తీర్మానాలు జరిగిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో విలీనానికి సై అంటున్నారా..? కూటమి ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు గణనీయంగా తగ్గిపోయాయి. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ఇంకా తగ్గిపోతాయని ఉపాధ్యాయులు బాహాటంగానే చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రస్తుత నిర్ణయాలతో చాలా స్కూళ్లలో 1, 2 తరగతుల నిర్వహణకు విద్యార్థులు లేక, స్కూళ్లకు తాళాలు వేయాల్సిందే. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా పాఠశాలలు మూతపడనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల నుంచి ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్మానాలు వస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. భవిష్యత్లో తమ బడి మూతపడుతుందనే విషయం వారికి తెలిసే, ఇదంతా జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభిప్రాయ సేకరణ పూర్తయిన స్కూళ్లుఅభిప్రాయ సేకరణలో ఆమోదం శాతంప్రభుత్వ స్కూళ్లుజిల్లాపంచాయతీలుమండలాలుమిగులు ఉపాధ్యాయుల దారెటో.. ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటి వరకు ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులు (ఎస్జీటీ) పనిచేస్తున్నారు. విశాఖపట్నంలో 783 మంది, అనకాపల్లిలో 2,114 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,566 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉన్నారు. 3, 4, 5 తరగతులను మోడల్ స్కూళ్లకు తరలించినట్లయితే, ఆయా పాఠశాలల్లో ఇక ఒక్కరే ఉపాధ్యాయుడు పనిచేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన మూడు జిల్లాల్లో కలిపి ఆరు వందలకు పైగానే ఉపాధ్యాయులు సర్ప్లస్గా ఉంటారు. రేషనలైజేషన్ పేరుతో వీరిలో ఎక్కువ మందిని అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి పంపించాల్సి ఉంటుంది. 117 జీవో అమల్లో భాగంగా జరిగిన రేషనలైజేషన్తో ఏజెన్సీకి వెళ్లిన ఉపాధ్యాయులు ఇప్పట్లో వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం తాజాగా చేపడుతున్న చర్యలతో మిగులు ఉపాధ్యాయులు దారెటనేది ప్రశ్నార్థకమే.స్కూళ్ల పునర్నిర్మాణంపై అభిప్రాయ సేకరణ ఇలా.. విశాఖపట్నం 11 161 560 440 81.63 అనకాపల్లి 24 667 1,408 1,159 84.85 అల్లూరి 22 421 1,673 1,587 98.02 -
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లు
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక ఎంవీపీకాలనీ : రాష్ట్ర స్థాయి పోటీలకు విశాఖ జిల్లా బాలురు, బాలికలు జట్లను ఎంపిక చేసినట్లు విశాఖ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాదరెడ్డి తెలిపారు. ఎంపికై న జట్లు ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని వైఎస్సార్ ఇంటిగ్రేడ్ స్పోర్ట్స్ అకాడమిలో జరగనున్న 34వ రాష్ట్ర సబ్ జూనియర్ బాలురు, బాలికల కబడ్డీ చాంపియన్షిప్ పోటీల్లో విశాఖ జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. గత వారం రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో బాలురు, బాలికల జట్లుకు శిక్షణ అందించినట్లు తెలిపారు. బాలురు జట్టుకు మేనేజర్గా ఎం.శివ, కోచ్గా కె.జయ వ్యవహరించనుండగా ప్రదీప్, దుర్గాప్రసాద్, శ్రీను, సంపత్, సందీప్, ప్రసాద్, మణికంఠ, కార్తీక్, హేమంత్, హేమసతీష్, శ్రీను, హేమసుందర్ సభ్యులుగా ఎంపికై నట్లు పేర్కొన్నారు. మహిళల జట్టుకు కోచ్గా చైతన్య వ్యవహరిస్తుండగా ద్రాక్ష, మేఘన, పుణ్యమ, జానకి, కుసుమ, ప్రణీత, హరిక, అనురాధ, సౌమ్య, అక్షయ, కావ్య, పావని ఎంపికై నట్లు వెల్లడించారు. ఎంపికై న ఆయా జట్ల క్రీడాకారులకు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రసాదరెడ్డితో పాటు జాయింట్ సెక్రటరీ సిహెచ్ గోవిందు, కోశాధికారిగా లక్ష్మణరావు, జాతీయ క్రీడాకారులు వై.వి.శ్రీనివాస్, వి.కనకరాజు అభినందనలు తెలిపారు. -
అవయవదానంపై అవగాహన అవసరం
● కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఏయూక్యాంపస్: అవయవదానంపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించి, అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎం.ఎన్ హరేందిర ప్రసాద్ అన్నారు. ప్రపంచ కిడ్నీ డే పురస్కరించుకుని జీవన్దాన్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం బీచ్రోడ్డులో అవయవదాన అవగాహన నడక జరిగింది. ఈ సందర్భంగా కాళీమాత ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఎక్కువగా కూర్చోవడం, మూత్ర విసర్జనకు సకాలంలో వెళ్లకపోవడం వంటివి మానుకోవాలని హితవు పలికారు. దీర్ఘ కాలంలో ఇవి సమస్యలకు కారణాలుగా మారుతాయన్నారు. మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గతేడాది 210 మందికి అవయవాలు మార్పిడి చేశారని, ప్రస్తుతం జిల్లాలో 4,312 మంది అవయవాల కోసం నమోదు చేసుకున్నట్లు తెలిపారు. జీవనశైలిలో మార్పులతోనే చక్కని ఆరోగ్యం సాధ్యమని సూచించారు. సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ ఇటీవల కాలంలో కిడ్నీ సంబంధ వ్యాధులు పెరగడం ఆందోళనకరమన్నారు. బ్రెయిడ్ డెడ్ అయిన వ్యక్తి దానం చేసే అవయవాలు మరొక ఎనిమంది మందికి ప్రాణదానంగా నిలుస్తాయన్నారు. అవయవదానంపై ప్రతీ ఆస్పత్రి బయట ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేస్తే ప్రజల్లో అవగాహన పెరుగుతుందన్నారు. జీవన్దాన్ రాష్ట్ర ఇన్చార్జి డాక్టర్ కె.రాంబాబు మాట్లాడుతూ కిడ్నీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని, ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలిని కలిగి ఉండాలన్నారు. రెండున్నర నెలల కాలంలో 54 అవయవాలు మార్పిడి చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వి.ఎస్.ఎం.సంధ్యాదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైద్య, నర్సింగ్ విద్యార్థులు, వివిధ ఆస్పత్రుల సిబ్బందితో కలిసి కలెక్టర్, సీపీ తదితరులు నడిచారు. -
జపాన్ దేశస్తుడికి సెల్ ఫోన్ అప్పగింత
భీమునిపట్నం: సైకిల్పై ప్రపంచ యాత్ర చేస్తున్న జపాన్ దేశస్తుడు గురువారం తన సెల్ఫోన్ పోగొట్టుకోగా క్రైం పోలీసులు వెతికి అతనికి అప్పగించారు. వివరాలివి. జపాన్కు చెందిన తొషియుకి షిషిడా తన యాత్రలో భాగంగా ఒడిశా నుంచి హైవేపై విశాఖపట్నం వస్తున్నారు. అయితే తగరపువలస సమీపంలోకి వచ్చేసరికి తన సెల్ఫోన్ పోయిన విషయాన్ని గుర్తించారు. వెంటనే అతను భీమిలి క్రైం స్టేషన్కు వచ్చి ఎస్ఐ సూర్యప్రకాశ్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. అయితే అది జాతీయ రహదారిపై భోగాపురం పరిధిలోని మహరాజుపేట వద్ద ఉంది. ఆ ప్రాంతం తమ పరిధిలోనిది కానప్పటికీ ఎస్ఐ సూర్యప్రకాశ్, కానిస్టేబుల్ రాజేష్తో అక్కడకు వెళ్లి సెల్ఫోన్ను సేకరించారు. అనంతరం జపాన్ దేశస్తుడికి అందజేశారు. ఫిర్యాదు అందిన గంట వ్యవధిలోనే ఫోన్ను వెతికి అప్పగించిన పోలీసులకు షిషిడా ధన్యవాదాలు తెలిపారు. -
అపరిశుభ్రంగా భోజన శాల
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్లను గురువారం ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హాస్టళ్లలో భోజనం సరిగా పెట్టడం లేదని, ఇతర సమస్యలపై బుధవారం రాత్రి విద్యార్థులు ఖాళీ కంచాలతో ఏయూ ప్రధాన గేటు ముందు ధర్నా చేపట్టడంతో అధికారుల్లో చలనం వచ్చింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆచార్య రాజశేఖర్ హాస్టళ్లను పరిశీలించారు. ఆర్ట్స్ కళాశాల భోజన శాలలో అపరిశుభ్ర వాతావరణం ఉండటం గమనించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులతో కలసి అక్కడే అల్ఫాహారం తీసుకున్నారు. భోజన నాణ్యత, మెనూ అమలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్ పరిసరాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వాష్ బేసిన్కు వెళ్లే మార్గాన్ని తరచూ శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు. వంటశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. భోజనశాలలో కుర్చీలు కొన్ని చోట్ల విరిగి ఉండటాన్ని గమనించి, వెంటనే మార్పు చేయాలన్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను మెరుగుపరచడంలో, పర్యవేక్షణలో విద్యార్థులను భాగస్వాములు చేస్తామని, ఇందుకు తక్షణమే చర్యలు తీసుకుంటామని వీసీ స్పష్టం చేశారు. హాస్టల్ మెస్లపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని విద్యార్థులకు హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజన సమయంలో వీసీ మరో మెస్ను ఆకస్మికంగా తనిఖీ చేసి, భోజన నాణ్యతను పరిశీలించారు. సాయంత్రం అకడమిక్ సెనేట్ మందిరంలో విద్యార్థులతో సమావేశమయ్యారు. హాస్టల్లో ఉన్న సమస్యలపై సమగ్ర వివరాలు తీసుకున్నారు. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం డిస్పెన్సరీని తనిఖీ చేసి, అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. అసంతృప్తి వ్యక్తం చేసిన ఏయూ వీసీ క్యాంపస్ హాస్టళ్ల ఆకస్మిక తనిఖీ -
భూముల క్రమబద్ధీకరణపై ప్రత్యేక శ్రద్ధ
మహారాణిపేట: అభ్యంతరం లేని అనధికారిక ఆక్రమణలు, నివాసయోగ్యమైన కట్టడాల క్రమబద్ధీకరణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఇటీవల తీసుకొచ్చిన జీవో నంబర్ 30 ఉద్దేశాలు, ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. 2019కి ముందు జరిగిన ఆక్రమణలను పరిగణలోకి తీసుకుని క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో గురువారం వేర్వేరుగా విశాఖ, భీమిలి రెవెన్యూ డివిజన్లపై సమీక్ష జరిగింది. జేసీ కె.మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, ఆర్డీవోలు పి.శ్రీలేఖ, సంగీత్ మాధుర్, కలెక్టరేట్ ఏవో ఈశ్వరరావు, సర్వే శాఖ ఏడీ సూర్యారావులతో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వినతులు, పీజీఆర్ఎస్ వేదికగా వచ్చిన వినతుల పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. ప్రజల సంతృప్తే కొలమానంగా రెవెన్యూ సిబ్బంది పనితీరును అంచనా వేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. రీ సర్వే, మ్యుటేషన్ల ప్రక్రియలో పారదర్శకత లోపించకుండా పని చేయాలన్నారు. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని, ఆక్రమణల వివరాలను ప్రతి సచివాలయంలో ప్రదర్శించాలని ఆదేశించారు. జీవో నంబర్ 301 ప్రకారం గాజువాక పరిధిలోని భూముల క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో తహసీల్దార్లు, డీటీలు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు. విశాఖ, భీమిలి డివిజన్ల రెవెన్యూ సమీక్షలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశం -
స్వచ్ఛ సర్వేక్షణ్, పీ–4 సర్వేపై ప్రత్యేక దృష్టి
డాబాగార్డెన్స్: స్వచ్ఛ సర్వేక్షణ్.. స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ ఎంఎన్ హరేందిరప్రసాద్ ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం జోనల్, వార్డు స్థాయి స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ విశాఖ నగరంలో స్వచ్ఛ సర్వే క్షణ్ సర్వే బృందం కొద్ది రోజుల్లో సర్వే నిర్వహించనుందని, అందుకు తగిన పారామీటర్లలో లోపా లు గుర్తించి సవరించేలా చూడాలన్నారు. సచివాలయ పరిధిలో ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలపై వార్డు స్థాయి స్పెషల్ ఆఫీసర్లు నిత్యం పర్యవేక్షణ జరుపుతూ నేరుగా ప్రజలను కలిసి సంబంధిత విషయాలపై అడిగి, వారి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు. నగరంలో జరుగుతున్న పి–4 సర్వేను 18లోగా పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులకు ప్రజలు గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
రేపు వినియోగదారుల హక్కులపై జాతీయ స్థాయి సదస్సు
డాబాగార్డెన్స్: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 15న వినియోగదారుల చట్టం అమలుపై అవగాహన కల్పించడంతోపాటు జాతీయ స్థాయి శిక్షణా సదస్సు నిర్వహించనున్నట్లు కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వికాస్ పాండే తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించనున్న ఈ సదస్సులో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు వినియోగదారుల హక్కుల మండలి జిల్లా, రాష్ట్ర, జాతీ య స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ సివిల్ సప్లయ్ ఆఫీసర్ మురళీనాథ్, చంద్రశేఖర్, ప్రసాద్రాజు, బాలకృష్ణ పాల్గొన్నారు. -
కష్టజీవులను కబళించిన టిప్పర్
కూర్మన్నపాలెం : విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న ఇద్దరు కార్మికులను టిప్పర్ రూపంలో మృత్యువు కబళించింది. ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. స్టీల్ సిటీ డిపో ఎదురుగా జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దువ్వాడ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. దువ్వాడ ఉప్పర కాలనీకి చెందిన డి.రాంబాబు(45), నక్కా కృష్ణ(43), నక్కా శ్రీను స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి విధులకు హాజరయ్యారు. విధులు ముగించుకొని గురువారం ఉదయం ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు. స్టీల్ సిటీ డిపో ఎదురుగా జాతీయ రహదారి వద్ద మలుపు తిరుగుతుండగా అనకాపల్లి నుంచి గాజువాక వైపు వస్తున్న టిప్పర్ బైక్ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో రాంబాబు, కృష్ణ చక్రాల కింద నలిగిపోయి దుర్మరణం పాలయ్యారు. బైక్పై వెనుక కూర్చున్న నక్కా శ్రీను ఎగిరి పడడంతో గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాంబాబుకు భార్య చంటమ్మ, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. కృష్ణకు భార్య సింహాచలంతో పాటు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఈ సమాచారం తెలియగానే కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గుండెలవిసేలా రోదించారు. కాగా.. ప్రమాదం జరిగే సమయంలో కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు మలుపు తిరుగుతోంది. దానిని కూడా టిప్పర్ ఢీకొని కొంత దూరం ఈడ్చుకు పోయింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. అప్పుడే డిపో నుంచి బయలుదేరడంతో బస్సులో ప్రయాణికులెవరూ లేరు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం ఇద్దరు దుర్మరణం.. ఒకరికి గాయాలుబంధువుల ఆందోళన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని బంధువులు, కాలనీవాసులు ఘటనా స్థలం వద్ద ఆందోళనకు దిగారు. టిప్పర్ యజమాని ఘటనా స్థలానికి రావాలని, అంతవరకూ మృతదేహాలు తరలించడానికి వీలులేదని పట్టుబట్టారు. రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడి, వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఏడీసీపీ కె.ప్రవీణ్కుమార్ అక్కడకు చేరుకుని, వాహనాలను దారి మళ్లించారు. మధ్యాహ్నం వరకు ఆందోళన కొనసాగించడంతో.. పోలీసులు టిప్పర్ యాజమాన్య ప్రతినిధులను రప్పించి పోలీస్స్టేషన్లోనే చర్చలు జరిపారు. ఏసీపీ టి.త్రినాథ్ సమక్షంలో జరిగిన ఈ చర్చల్లో సవర సంఘం ప్రతినిధులు జి.రాజేష్, నూకరాజు, తాతారావు యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వడానికి ఒప్పందం కుదరడంతో బంధువులు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. టిప్పర్ డ్రైవర్ను అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు. సీఐ మల్లేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కలెక్టరేట్లో ఘనంగా మొల్లమాంబ జయంతి
మహారాణిపేట: కవయిత్రి, మొల్ల రామాయణం రచయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు గురువారం కలెక్టరేట్లో జరిగాయి. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె జీవిత విశేషాలను గుర్తు చేసుకున్నారు. మొల్ల రచనా శైలి సరళమైనదని, ఆమె జీవితం అనుసరణీయమైనదని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి బి.శ్రీదేవి, కుమ్మరి శాలివాహన సంఘం డైరెక్టర్ చిరంజీవులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
గీతాకృష్ణ వ్యాఖ్యలపై మహిళా న్యాయవాదుల నిరసన
సీతమ్మధార: మహిళలపై టాలీవుడ్ దర్శకుడు గీతా కృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను వుమెన్స్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్(వావా) అధ్యక్షురాలు పప్పు అనురాధ ఖండించారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వావా ఆధ్వర్యంలో గురువారం మహిళా న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గీతాకృష్ణ వివిధ చానల్స్లో మహిళలను అసభ్యకరంగా వర్ణిస్తూ వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఆయన వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. అసోసియేషన్ తరఫున అతనిపై పోలీస్ కమిషనర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని, ఆయన మాట్లాడిన వీడియోలు ఆధారంగా గీతాకృష్ణపై చర్యలు తీసుకోవాలని అనురాధ కోరారు. నిరసనలో అసోసియేషన్ కార్యదర్శి హేమమాలిని, కోశాధికారి బి.రమాదేవి, ఉపాధ్యక్షురాలు కె.లక్ష్మీదుర్గ, డి.పద్మారాణి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాహితమే లక్ష్యం
మహారాణిపేట: వైఎస్సార్ సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ప్రజాహితమే లక్ష్యంగా 15 ఏళ్లుగా పార్టీ పనిచేస్తుందని నేతలు తెలిపారు. విశాఖ జిల్లా వలంటీర విభాగం అధ్యక్షురాలు పీలా ప్రేమ్ కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, మళ్ల విజయ ప్రసాద్, తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగం అధ్యక్షులు పేర్ల విజయ్ చందర్, జాన్ వెస్లీ, పార్టీ ముఖ్య నాయకులు డాక్టర్ జహీరాబాద్, ఉడా రవి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నడింపల్లి కృష్ణంరాజు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీ వాస్తవ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి హరికిరణ్ రెడ్డి, డాక్టర్ మంచా నాగ మల్లీశ్వరి, అనుబంధ విభాగ అధ్యక్షులు పేడాడ రమణి కుమారి, బోని శివ రామకృష్ణ, బొండా మహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
ఏయూలో ఆకలి కేకలు..!
● భోజనం కోసం రోడ్డెక్కిన విద్యార్థులు ● మెయిన్ గేట్ వద్ద ఖాళీ కంచాలతో నిరసన విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు బుధవారం రాత్రి రోడ్డెక్కారు. హాస్టళ్లలో సరిగా భోజనం పెట్టడటం లేదంటూ వర్సిటీ ప్రధాన గేటు ముందు భైఠాయించి ఖాళీ కంచాలతో నిరసన తెలిపారు. తమ గోడు పట్టించుకోని వర్సిటీ అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘ఇదేమి రాజ్యం.. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం’ అంటూ నినదిస్తూ ఖాళీ కంచాలను నేలపై కొడుతూ తమ ఆకలి బాధను తీర్చాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ హాస్టళ్లలో భోజనం సరిగా పెట్టడం లేదని కొన్ని రోజుల క్రితం విద్యార్థులు వీసీ భవనం ముందు నిరసన చేపట్టారు. విద్యార్థులు, వర్సిటీ ఆచార్యులతో కమిటీ ఏర్పాటు చేసి, వారి ఆధ్వర్యంలోనే హాస్టళ్ల నిర్వహణ సాగేలా చూస్తామని వీసీ, రిజిస్ట్రార్ చెప్పడంతో అప్పట్లో విద్యార్థులు తమ ఆందోళన విరమించారు. మళ్లీ వారం రోజులు తిరిగేసరికి వర్సిటీ అధికారుల మాటల బుట్టదాఖలు చేస్తూ, హాస్టళ్ల అధికారులు ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ.. తమను ఖాళీ కడుపుతో ఉండేలా చేస్తున్నారని విద్యార్థులు వర్సిటీ పెద్దల దృష్టికి తీసుకొచ్చారు. పురుగులు ఉన్నాయన్నా పట్టించుకోలేదు బుధవారం మధ్యాహ్న భోజనంలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు హాస్టళ్ల నిర్వాహకులకు తెలిపారు. దీనిపై ఎవరూ పట్టించుకోకపోగా రాత్రి భోజనం కూడా పరిశుభ్రత లేకుండా వండిపెట్టారు. దీంతో విద్యార్థులు రాత్రి భోజనాలు తినడటం మానేసి.. ఖాళీ కంచాలతో హాస్టళ్ల నుంచి నినాదాలు చేసుకుంటూ వర్సిటీ ప్రధాన గేటు వద్దకు వచ్చారు. వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటకీ తమ బాధను అర్థం చేసుకోవాలని కోరుతూ విద్యార్థులంతా ప్రధాన గేట్లు మూసేసి రోడ్డుపై భైఠాయించారు. వర్సిటీ అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఈస్ట్ డివిజన్ ఏసీపీ లక్ష్మణమూర్తి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఏయూకు చేరుకున్నారు. విద్యార్థులతో వారు మాట్లాడే ప్రయత్నం చేయగా మధ్యాహ్నం పురుగులతో కూడిన అన్నం పెట్టినట్లుగా తమ సెల్ఫోన్లలో తీసిన ఫొటోలు, వీడియోలను పోలీసు అధికారులకు చూపించడంతో వారు మిన్నుకుండిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వానికి విద్యార్థుల బాధలు పట్టవా..?: వర్సిటీ క్యాంపస్ హాస్టళ్ల విద్యార్థులు అర్ధాకలితో అలమటించే పరిస్థితులు దాపురించాయని, ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎన్నడూ లేవని ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కమిటీ కార్యదర్శి వెంకటరమణ అన్నారు. ప్రభుత్వం తమ బాధలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. స్కాలర్షిప్పులు మంజూరు కాకపోవటంతో తమపైనే హాస్టళ్ల నిర్వహణ భారం వేస్తున్నారని, చివరకు సిబ్బంది జీతాలకు చెల్లించాల్సిన డబ్బులను కూడా విద్యార్థుల నుంచే వసూలు చేస్తున్నారన్నారు. తమ బాధలను ప్రభుత్వానికి తెలియజేయాలనే నిరసన చేపట్టామన్నారు. విద్యార్థుల ఆందోళన రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు కొనసాగింది. -
సృజనతో మెరిసి.. విజేతగా నిలిచి..
● ఉత్సాహంగా చిత్రలేఖనం పోటీలు కొమ్మాది: గిరిజన స్వాభిమాన ఉత్సవాలు–2025లో భాగంగా రుషికొండలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ మిషన్(టీసీఆర్టీఎం) ఆధ్వర్యంలో గాయత్రి కళాశాల ప్రాంగణంలో గిరిజన విద్యార్థులు, కళాకారులకు నిర్వహించిన బుధవారం రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ముందుగా ఈ కార్యక్రమాన్ని టీసీఆర్టీఎం ఈడీ డా.రాణిమందా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజన విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహ దపడతాయని అన్నారు. ఈ పోటీల్లో 8 ఐటీడీఏల పరిధిలోని 17 జిల్లాల నుంచి 250 మంది పాల్గొన్నారని వెల్లడించారు. ఏయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం ఆచార్యులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారని తెలిపారు. నెల్లూరు ఐటీడీఏకు చెందిన సీహెచ్ మణి విజేతగా నిలవగా, పాడేరు ఐటీడీఏకు చెందిన బి.నందిని, ఆర్.రాజేష్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అనంతరం విజేతలకు ఈడీ బహుమతులు ప్రదానం చేశారు. గాయత్రి కళాశాల ప్రొఫెసర్ పి.వి.శర్మ, టీసీఆర్టీఎం సభ్యులు పాల్గొన్నారు. 9వ తరగతి విద్యార్థి బాలచందర్ గీసిన చిత్రం -
ప్రశ్నిస్తేనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట
● పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ● ముగిసిన సైబర్ సెక్యూరిటీ బూట్ క్యాంప్ విశాఖ విద్య: యువతరం సైబర్ నేరాలను నియంత్రించే నిపుణులుగా తయారు కావాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఐదు రోజుల బూట్ క్యాంప్ బుధవారంతో ముగిసింది. సైబర్ దాడులు, సైబర్ నేరాలు అనేక దేశాలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న తీరును ఈ సందర్భంగా సీపీ వివరించారు. వ్యవస్థలోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుని సైబర్ మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్న విధానాన్ని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారని, వీరు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రశ్నించడం మొదలు పెడితేనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని, యువత సైబర్ సెక్యూరిటీ రంగంలో నిష్ణాతులుగా మారడానికి అవసరమైన కోర్సులు చేయాలని సూచించారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ తరగతి గదిలో నేర్చుకున్నదానికి భిన్నంగా బూట్ క్యాంపులో నైపుణ్యాలు వృద్ధి చెందుతాయని చెప్పారు. పోలీస్ శాఖ నేడు అనేక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటోందన్నారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. శశిభూషణరావు మాట్లాడుతూ సైబర్ నిపుణులను తయారు చేయడం, విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీపై శిక్షణ అందించడం, ప్రజల్లో అవగాహన కలిగించడం ఈ కార్యక్రమ లక్ష్యాలన్నారు. ఆచార్య వి. వల్లి కుమారి, కంప్యూటర్ సైన్స్ విభాగ ఆచార్యులు ఆచార్య ఎం. శశి, ఆచార్య జి. లావణ్య దేవి తదితరులు మాట్లాడిన అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కంప్యూటర్ సైన్స్ విభాగం ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కనుల పండువగా అనంతుని తెప్పోత్సవం
పద్మనాభం: అనంతుని కల్యాణోత్సవాల్లో భాగంగా నాల్గో రోజైన బుధవారం అనంతుని తెప్పోత్సవం కనుల పండువగా జరిగింది. కుంతీ మాధవ స్వామి కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభస్వామి ఉత్సవ విగ్రహాలను హంస వాహనంపై ఊరేగింపుగా పద్మనాభం జంక్షన్కు సమీపంలో ఉన్న అనంతుని పుష్కరిణి వద్దకు వేద పండితులు వేద మంత్రోచ్ఛరణలు, నాద మునీశ్వరు స్వరాల నడుమ తొడ్కొని వచ్చారు. ఇక్కడ కోనేరు గట్టుపై విశ్వేక్షణ పూజ, పుణ్యాహ వచనం నిర్వహించారు. తదుపరి ఉభయ దేవేరులతో అనంత పద్మనాభ స్వామి హంస వాహనంపై ఆశీనులు అయ్యారు. నెల్లిమర్ల శ్రీదుర్గ మహా పీఠం పీఠాధిపతి శ్రవణ చైతన్యానంద చిన్న స్వామి ప్రవచనాలు అనంతరం తెప్పోత్సవం మొదలైంది. స్వామి మూడు సార్లు పుష్కరిణిలో హంస వాహనంపై విహరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ భీమునిపట్నం నియోజకవర్గ సమన్వయ కర్త మజ్జి రశ్రీనివాసరావు(చిన్నశ్రీను), ఎంపీపీ కంటుబోతు రాంబాబు, ఈవో నానాజీ బాబు, వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ, తాలాడ పద్మనాభం, కంటుబోతు ఎర్నాయుడు, కాళ్ల నగేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పులివేషాలు, కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భారీ బాణసంచా కాల్చారు. -
లిఫ్ట్లో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
మధురవాడ: ఓ ఫంక్షన్ హాలు లిఫ్ట్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఆరుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాలివి.. పీఎంపాలెం మాస్టర్ ప్లాన్ రోడ్డులోని డీవీఆర్ ఫంక్షన్ హాలులో మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో 3వ అంతస్తు నుంచి కిందకు దిగేందుకు 8 మంది ఎక్కారు. ఈ క్రమంలో లిఫ్ట్ అదుపు తప్పింది. రెండో అంతస్తులో ఆపే ప్రయత్నం చేసినా ఆగకుండా నేరుగా కింది ఫ్లోర్కు పెద్ద శబ్దంతో వచ్చి పడిపోయింది. ఈ ప్రమాదంలో మర్రిపాలెం సాయినగర్కి చెందిన వైశ్యరాజు సౌందర్య, ఆమె చెల్లి చంద్రకుమారి మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరిని ఎన్ఆర్ ఆస్పత్రి తరలించి చికిత్స అందించారు. మిగిలిన ఆరుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఎంవీవీ సిటీలో.. పీఎంపాలెం క్రికెట్ స్టేడియంనకు ఎదురుగా ఉన్న ఎంవీవీ సిటీలో 10వ అంతస్తు నుంచి కిందకు దిగేందుకు పి.రోజామణి లిఫ్ట్ ఎక్కింది. ఆ లిఫ్ట్ 6వ ఫ్లోర్కు వచ్చి పెద్ద శబ్దంతో కుదుపుతో ఆగిపోయింది. ఈ ఘటనలో ఆమె కాలుకు గాయాలయ్యాయి. గత నెల 28న జరిగిన ఈ ఘటనకు సంబంధించి బుధవారం ఆమె పీఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ బాలకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్థిక సహాయం అందరికీ కాదు..
● 24,696 మందిలో 8,619 మంది ఇళ్ల లబ్ధిదారులే అర్హులు ● ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అదనపు సాయం ● కలెక్టర్ హరేందిర ప్రసాద్ వెల్లడి సాక్షి, విశాఖపట్నం: గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం అందరికీ ఇవ్వడం లేదని కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ స్పష్టం చేశారు. జిల్లాలో పీఎంఏవై అర్బన్, గ్రామీణం కింద ఒకటి రెండు ఆప్షన్లో 24,696 గృహాలు నిర్మాణ దశలో ఉండగా.. ఇందులో 8,619 మందికి మాత్రమే ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఏంఏవైలో ఇల్లు మంజూరై వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న గృహాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వివిధ దశల్లో నిర్మాణాల్లో ఇళ్లకు ఉన్న ప్రస్తుత యూనిట్ విలువ రూ.1.80 లక్షలు కాగా.. అదనంగా ఎస్సీలు, బీసీలకు రూ. 50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, పీవీజీటీలకు రూ.లక్ష చొప్పున సాయం అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పీఎంఏవై కింద 8,619 మంది లబ్ధిదారులకు రూ.43.40 కోట్ల అదనపు సాయం అందుతుందని వెల్లడించారు. నిర్మాణం పూర్తి చేసుకునే దశల వారీగా అదనపు మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాకు నేరుగా జమ చేస్తారని చెప్పారు. జిల్లాలో మే నెలాఖరు నాటికి 7,750 గృహాలు పూర్తి చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల నిర్మాణ దశలను గుర్తించి అదనపు సాయం మంజూరు జరుగుతుందన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు ప్రత్యేక ర్యాంపులను కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. త్వరలో బ్లూఫ్లాగ్ జ్యూరీ బృందం రాక రుషికొండ బీచ్కు బ్లూఫ్లాగ్ను ఇటీవల తాత్కాలికంగా గుర్తింపు రద్దు చేసిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. తాత్కాలికంగా జీవీఎంసీ సహకారంతో మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశామని, బ్లూఫ్లాగ్కు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. త్వరలోనే సర్టిఫికెట్ జారీ చేసే జ్యూరీ బృందం రుషికొండ వస్తుందన్నారు. ఈలోగా సమగ్ర ఏర్పాట్లు చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జ్యూరీ బృందం సంతృప్తి పడే విధంగా బీచ్ను సుందరీకరించి.. సర్టిఫికెట్ రెన్యువల్ చేసేందుకు వంద శాతం కృషి చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. -
జూలో పెరుగుతున్న రేచు కుక్కల సంతతి
ఆరిలోవ: జూలో రేచు కుక్కల సంతతి పెరుగుతోంది. ప్రస్తుతం వీటి సంఖ్య 56కు చేరింది. ఏటా జనవరి నుంచి మార్చి వరకు రేచు కుక్కల పునరుత్పత్తికి అనుకూలమైన సమయం. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇంత వరకు జూలో మూడు ఆడ అడవి కుక్కలకు 16 పిల్లలు పుట్టినట్లు క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. ఇవి ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. పునరుత్పత్తి కేంద్రంలో పిల్లలు తల్లి కుక్కలతో కలిసి హుషారుగా తిరుగుతున్నాయన్నారు. జంతు మార్పిడి విధానంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇతర జూ పార్కుల నుంచి వన్యప్రాణులను విశాఖ జూకి తీసుకువచ్చినప్పుడు వీటిలో కొన్నింటిని ఆయా జూ పార్కులకు తరలిస్తున్నారు. -
పది పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
● జిల్లాలో 134 పరీక్ష కేంద్రాలు ● హాజరుకానున్న 29,927 మంది విద్యార్థులు ● సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ● డీఈవో ప్రేమ్ కుమార్ వెల్లడి విశాఖ విద్య: పదో తరగతి పరీక్షలకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్కుమార్ అన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ పరీక్షలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని 448 మంది పాఠశాలల నుంచి 28,528 మంది విద్యార్థులు రెగ్యులర్గా, మరో 1,404 మంది ప్రైవేటుగా పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. ఇందుకోసం జిల్లాలో 134 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఎంపిక చేసిన కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించామన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు. విధులకు అంతా సిద్ధం కావాలి పరీక్షల నిర్వహణకు 134 మంది సీఎస్లు, 134 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 14 మంది రూట్ ఆఫీసర్లు, మరో 14 మంది అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లను పరీక్షల పర్యవేక్షణకు వినియోగిస్తున్నామన్నారు. ఎగ్జామినేషన్ విధులు కేటాయించిన వారికి గురువారం శిక్షణ ఇచ్చేలా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అనకాపల్లి జిల్లా నుంచి 240 మంది ఉపాధ్యాయులను రిజర్వ్లో ఉంచామన్నారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా జిల్లాలో గుర్తించిన ఐదు సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు. పరీక్షల్లో ఎటువంటి మాస్ కాపీయింగ్కు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రశ్నా పత్రాలు కేంద్రాలకు సమీపంలోని పోలీసు స్టేషన్లలో భద్రపరచటం జరిగిందన్నారు. జిల్లాలో రవాణా సౌకర్యం, మార్కెట్ సముదాయాలకు దగ్గరగా, పోలీసు స్టేషన్లకు దూరంగా ఉన్న 9 పరీక్ష కేంద్రాలను సీ– కేటగిరీలో ఉన్నాయన్నారు. వీటిపై పర్యవేక్షణకు ప్రతీ కేంద్రంకు ఒక కస్టోడియన్ను అదనంగా నియమించామన్నారు. ఐదు ప్లైయింగ్ స్క్వాడ్ టీమ్లను ఏర్పాటు చేశామని, వీరు ప్రతీ రోజూ జిల్లా అంతటా పర్యటించి, కేంద్రాలను తనిఖీ చేస్తారన్నారు. 14 కేంద్రాల్లో ఓపెన్ టెన్త్ పరీక్షలు ఈ సారి రెగ్యులర్ వారితో పాటు సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్) ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 938 మంది పరీక్షలకు హాజరుకానున్నారని, వీరి కోసం 14 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రెగ్యులర్ కేంద్రాల్లోనే వీరికి కూడా గదులు కేటాయించటం జరిగిందన్నారు. నో మొబైల్ జోన్గా పరీక్ష కేంద్రాలు పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లకూడదన్నారు. ఇన్విజిలేషన్ సిబ్బంది, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కూడా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకురావద్దన్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ సూచనలకు అనుగుణంగా జిల్లాలోని మిగతా శాఖల సమన్వయంతో పరీక్షల విజయవంతానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. పది పరీక్షలపై సీఎస్ కాన్ఫరెన్స్ మహారాణిపేట: పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణ కోసం చేపడుతున్న ఏర్పాట్లను, అదేవిధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అమలు తీరు, పి4 మోడల్ సర్వే, ప్రజలకు అవగాహన కార్యక్రమాల గురించి వివరించారు. -
డిగ్రీ ప్రవేషాలు
● అఫిలియేషన్ గ్రీన్ సిగ్నల్రాకముందే అడ్మిషన్ల వేట ● ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో తనిఖీలు శూన్యం ● ఇతర రాష్ట్రాల బోర్డు సర్టిఫికెట్లకు జెన్యూనిటీ ఎంత? ● కాలేజీల నిర్వహణపై దృష్టి పెట్టని ఏయూ విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల నిర్వాహకులు అప్పుడే అడ్మిషన్ల వేట మొదలుపెట్టారు. ‘మా కళాశాలలో చేరితే ఫీజు రాయితీ, ప్లేస్మెంట్ గ్యారెంటీ’ అంటూ ఆకర్షణీయమైన బ్రోచర్లను చేతుల్లో పెట్టి విద్యార్థులకు వల వేస్తున్నారు. విశాఖ నగరంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద ఎక్కడ చూసినా ఈ హడావిడి కనిపిస్తోంది. ఉన్నత విద్యా మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకముందే 2025–26 విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్లు చేస్తుండటం గమనార్హం. దీని వెనుక కూటమి ప్రభుత్వంలోని పెద్దలతో అంటకాగే ఆంధ్ర యూనివర్సిటీలోని కొంతమంది అధికారుల ప్రమేయం ఉందనే ప్రచారం సాగుతోంది. వర్సిటీ నుంచి అఫిలియేషన్ వచ్చేలా తాము చూసుకుంటామని భరోసా ఇస్తుండటంతోనే ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏటా 25 వేల మందికి పైగానే డిగ్రీలో చేరిక ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేషన్తో ఉమ్మడి విశాఖ జిల్లాలో 196 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 38 కళాశాలల్లో డిగ్రీ, పీజీ కోర్సులు కలిపి ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. వీటిలో ఏటా డిగ్రీ మొదటి సంవత్సరంలో 25 వేల మందికి పైగానే విద్యార్థులు చేరుతుంటారు. ఈ కళాశాలల నిర్వహణకు ఏటా ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేషన్ (గుర్తింపు) ఇవ్వాల్సి ఉంటుంది. ఉన్నత విద్యా మండలి ఆన్లైన్ ప్రవేశాల వెబ్సైట్లో వర్సిటీ అఫిలియేషన్ పొందిన కళాశాలల జాబితానే పెడతారు. ఇతర రాష్ట్రాల బోర్డు సర్టిఫికెట్లపై పరిశీలన నిల్ ఉద్యోగ, ఉపాధి, వ్యాపార పరమైన వ్యవహారాలతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు నగరంలో స్థిరపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ స్థాయిలో ఇతర రాష్ట్రాలకు చెందిన బోర్డులు జారీ చేసే సర్టిఫికెట్లతో ఇక్కడ డిగ్రీలో ప్రవేశాలు పొందుతున్నారు. అయితే వీటిలో జెన్యూనిటీ ఎంత అనేది పరిశీలన లేకపోవడంతో కొన్ని కళాశాలల్లో నకిలీ సర్టిఫికెట్లతో డిగ్రీ అడ్మిషన్లు పొందుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ద్వారకానగర్లోని ఓ డిగ్రీ కళాశాలలో ఇలాంటివి వెలుగులోకి వచ్చినప్పటికీ కళాశాల యాజమాన్యం వీటిని తొక్కిపెట్టినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ అధికారులు ఇలాంటి వాటితో తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుండటంతో కొంతమంది ఏజెంట్లు ఇతర రాష్ట్రాల బోర్డుల్లో ఓపెన్ విధానంలో చదివినట్లు విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అఫిలియేషన్ ఇవ్వడమే మా పని ప్రైవేట్ కాలేజీల నిర్వహణకు అఫిలియేషన్ ఇవ్వడమే యూనివర్సిటీ పని. మిగతా వ్యవహారాలన్నీ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో జరుగుతుంది. డిగ్రీలో చేరే విద్యార్థులు సమర్పించే సర్టిఫికెట్లు జెన్యూనిటీ పరిశీలన కూడా కాలేజీల వారే చూసుకోవాలి. – ఆచార్య టి.వి.కృష్ణ, ఆంధ్రా యూనివర్సిటీ సీడీసీ డీన్ ప్రైవేట్ కళాశాలలపై తనిఖీలేవీ.? ప్రైవేట్ కళాశాలల నిర్వహణకు అనువైన భవనాలు, తరగతి గదులు, అర్హత గల అధ్యాపకులు, ఆటస్థలం, లైబ్రరీ, సైన్స్ ప్రయోగశాలలు, పార్కింగ్ ప్రదేశం ఉండాలి. పోలీసు, జీవీఎంసీ, అగ్నిమాపక శాఖల నుంచి పొందిన ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో సవ్యంగా ఉన్నాయా లేదా అనేది వర్సిటీ నుంచి వెళ్లే బృందం తనిఖీ చేసి నిజనిర్ధారణ నివేదిక ఇచ్చిన తర్వాతనే అఫిలియేషన్ జారీ అవుతుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వర్సిటీలోని కాలేజీ డెవలప్మెంట్ కమిటీ (సీడీసీ) పర్యవేక్షిస్తుంది. అయితే కళాశాలల తనిఖీలు సవ్యంగా జరగడం లేదు. దీంతో నగరంలోని కొన్ని కళాశాలల్లో కనీస వసతులు, అర్హత గల అధ్యాపకులు లేకుండానే చదువులు సాగుతున్నాయి. -
ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె చర్చలు అసంపూర్ణం
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై రీజనల్ లేబర్ కమిషనర్(ఆర్ఎల్సీ) మొహంతి సమక్షంలో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసుపై ఆర్ఎల్సీ మంగళవారం ఉక్కు యాజమాన్యం, కాంట్రాక్టర్ల అసోసియేషన్, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమైంది. కార్మికుల తొలగింపుపై కమిటీ వేస్తామని యాజమాన్యం ప్రతినిధులు తెలపగా పోరాటం కొనసాగిస్తామని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. కార్మిక నాయకులు అందించిన వివరాలు.. తొలగింపు అంశాన్ని కార్మిక సంఘాలు ప్రస్తావించగా, కంపెనీ పరిస్థితుల దృష్ట్యా సిబ్బంది తగ్గింపు చేపట్టామని యాజమాన్యం తెలిపింది. సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో ఇటీవల బయోమెట్రిక్ నుంచి తొలగించిన 248 కాంట్రాక్ట్ కార్మికులను పునరుద్దరించాలని యాజమాన్యానికి ఆర్ఎల్సీ సూచించారు. పర్మినెంట్ కార్మికుల వలే కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు నచ్చినట్లు చేయకూడదన్నారు. దీనిపై కమిటీ ఏర్పాటు చేస్తామని యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు. కార్మికుల తొలగింపు పూర్తి నిలుపుదలపై యాజమాన్యం హామీ ఇవ్వకపోవడంతో తమ పోరాటం కొనసాగుతుందని కార్మిక సంఘాల నాయకులు ఆర్ఎల్సీకు రాతపూర్వకంగా తెలిపారు. సమావేశంలో యాజమాన్యం తరపున జీఎం ఎం.మధుసూదనరావు, ఖర్, వైహెచ్ శంకర్, వివిధ కార్మిక సంఘాల నాయకులు కె.ఎం.శ్రీనివాస్, జి.శ్రీనివాసరావు, నమ్మి రమణ, మంత్రి రవి, కె.వంశీకృష్ణ, జి.సత్యారావు, టి.గుర్నాథ్, జి.అప్పన్న, యు.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
యువత పోరు
భవిత కోసం సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల చెల్లింపులపై మీనమేషాలు లెక్కిస్తూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. కొన్ని త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు కళాశాలల నుంచి విద్యార్థులను వెల్లగొట్టడం, పరీక్షల సమయాల్లో హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం చేస్తున్నాయి. దీంతో పేదింటి తల్లిదండ్రులు ఇళ్లు, పొలాలు, పుస్తెలు తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చి ఫీజులు చెల్లిస్తున్న పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా యువత కూడా కూటమి ప్రభుత్వం చేతిలో మరోసారి మోసపోయింది. ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి మొత్తం 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. మెగా డీఎస్సీ దగా అయిపోయింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల సహా ప్రభుత్వ నంస్థలను ప్రైవేటుబాట పట్టిస్తోంది. సచివాలయ ఉద్యోగులను అనిశ్చితి పరిస్థితుల్లోకి నెట్టేసింది. రూ.5వేలు కాదు రూ.10 వేలు ఇస్తామని వలంటీర్లలో ఆశలు కల్పించి తీరా అధికారంలోకి వచ్చాక వారిని రోడ్డున పడేసింది. ఇక నిరుద్యోగ భృతి హామీ కూడా టీడీపీ 2014–19 పాలనలో మాదిరిగానే ఎగనామం పెట్టేసింది. ఈ హామీలను అమలుచేయాలని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మంగళవారం వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’ బాట పడుతోంది. జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య 4.5 లక్షలు కొత్తగా వచ్చిన పరిశ్రమలు 0 రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు 42 వేలు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.35 కోట్లు ● 2023–24 విద్యా సంవత్సరంలో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 38,017 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రూ.29.87 కోట్లు విడుదల చేసింది. ● 2023–24 విద్యా సంవత్సరంలో 3,929 ఎస్సీ విద్యార్థులకు రూ.4.74 కోట్లు మంజూరు చేసింది. ● జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరంలో 42 వేల మందికిపైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ తదితర కోర్సులు చదువుతున్నారు. వీరికి ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. మొత్తం రూ.35 కోట్లు బకాయిలు ఉన్నాయి. భృతి భూటకమేనా..! జిల్లాలో 6,39,699 కుటుంబాల్లో దాదాపుగా 4.5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సగటున ప్రతీ నెలా నిరుద్యోగ భృతి కింద ప్రభుత్వం రూ.135 కోట్లు చెల్లించాల్సింది. 9 నెలల కూటమి పాలనలో రూ.1215 కోట్లు నిరుద్యోగులకు బకాయిపడింది. ప్రైవేట్ కళాశాలలు వేధింపులు విశాఖలో పలు ప్రైవేట్ ఇంజినీరింగ్, పీజీ కళాశాలలు విద్యార్థులను ఫీజు చెల్లించాలని వేధింపులకు పాల్పడుతున్నాయి. తరగతి గది నుంచి బయటకు పంపించేయడం, పరీక్షల సమయంలో హాల్ టికెట్లు ఇవ్వకపోవడం వంటి ఘటన చోటుచేసుకున్నాయి. విశాఖలో కూటమి ఎంపీకి చెందిన ఓ కళాశాలలో ఫీజులు చెల్లించకపోతే హాల్ టికెట్లు ఇవ్వబోమని బెదిరించగా విద్యార్థులు ఎదురుతిరిగారు. కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులే ఈ విధంగా ప్రవర్తించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
విద్యారంగంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
విశాఖ విద్య: విద్యారంగంపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ అడ్వైజర్ బోరుగడ్డ మోహన్బాబు, రాష్ట్ర కార్యదర్శి తెడబారిక సురేష్కుమార్, విశాఖ జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి అన్నా రు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం చేపట్టనున్న ‘యువత పోరు’ను విజయవంతం చేయాలని మంగళవారం ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు పోస్టర్లు ఆవిష్కరించారు. విద్యారంగాన్ని పట్టించుకోని కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమలులో విఫలమైందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులకు చదువులు భారమవుతున్నాయన్నారు. నిరుపేద విద్యార్థులను చదువులకు దూరం చేసి, తద్వారా ప్రైవేట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. విద్యార్థులు, యువతను నిలువునా మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై అందరూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాకు విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శెట్టి సుబ్రహ్మణ్యం, సాగర్, అజయ్ కుమార్, రోహిత్, ఖాసీం, పిల్లి సాగర్ తదితరులు పాల్గొన్నారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి నేటి ‘యువత పోరు’ విజయవంతానికి వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం పిలుపు -
చంద్రబాబును నమ్మి మరోసారి దగాపడ్డ యువత
వైఎస్సార్సీపీ హయాంలో ఉద్యోగాల కల్పన వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లాలోని సచివాలయాల్లో 4,700 శాశ్వత ఉద్యోగాలు, 9,800 వలంటీర్లను నియమించింది. వైద్యారోగ్య శాఖలో వైద్యులు, పారామెడికల్, ఇతర ఉద్యోగాలు 8,500కుపైగా భర్తీ చేసింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా 43,074 మందికి ఉద్యోగాలు కల్పించింది. 2019–20లో 4,001 యూనిట్లు ఏర్పాటు చేసి 8,091 ఉద్యోగాలు, 2020–2021లో 4,450 యూనిట్లు ఏర్పాటు 15,100 మందికి ఉద్యోగాలు, 2022–23లో 4276 యూనిట్లు ఏర్పాటుచేసి 16,145 మందికి ఉద్యోగాలు, 2023–24లో 2414యూనిట్లను ఏర్పాటుచేసి 13,173 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటికే 5 కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. మిగిలిన మెడికల్ కళాశాలలు సగానికి పైగా నిర్మాణపనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేయడానికి యత్నిస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించారు. వీటిలో పాడేరు మెడికల్ కశాశాల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పూర్తి కాగా.. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో సగానికిపైగా నిర్మాణం జరిగింది. ఈ దశలో వచ్చిన కూటమి ప్రభుత్వం రూ.500 కోట్లతో నిర్మిస్తున్న కళాశాలను ప్రైవేట్ చేతులకు అప్పగించే కుట్రలకు పాల్పడుతోంది. ఇది అందుబాటులోకి వస్తే ఏటా 150 ఎంబీబీఎస్ సీట్లలో విద్యార్థులకు ప్రవేశం లభించేది. తర్వాత పీజీ వైద్య కోర్సులు వచ్చేవి. బోధన కోసం 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చేది. కానీ ఇప్పుడది కలగా మిగిలింది. -
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం..
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, ఎన్నికల ముందు చెప్పిన విధంగా నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కొత్త మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడాన్ని నిరసిస్తున్నాం. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ ‘యువత పోరు’ నిర్వహిస్తున్నాం. జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు హాజరై ఈ పోరుబాటను విజయవంతం చేయాలి. – గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
జూలో వన్యప్రాణులకు బర్డ్ ఫ్లూ దెబ్బ
ఆరిలోవ: బర్డ్ఫ్లూ వ్యాధి ప్రభావం జూలో వన్యప్రాణులపై పడింది. రోజూ చికెన్ తినే జంతువులు, పాములకు సుమారు నెల రోజులకు పైగా ఆహారం మారిపోయింది. చికెన్ రుచి తగలకపోవడంతో పాపం వన్యప్రాణులు వేరే రుచికి అలవాటుపడేందుకు ఇబ్బంది పడుతున్నాయి. ఇక్కడ పులులు, సింహాలు, హైనాలు, చిరుతలు తదితర వాటికి బీఫ్తో పాటు చికెన్ కూడా రోజూ ఆహారంగా వేస్తారు. పాములకు కోడి పిల్లల్ని అందిస్తారు. బర్డ్ ఫ్లూ వల్ల సీజెడ్ఏ అధికారుల ఆదేశాలతో వన్యప్రాణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఆహారం అందిస్తున్నట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. ఆయా జంతువులకు చికెన్కు బదులుగా ప్రస్తుతం పంది మాంసం(ఫోర్క్), పాములకు కోడి పిల్లలకు బదులుగా కుందేళ్ల పిల్లలు(చిన్నవి) ఆహారంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. -
రేవిడి జట్లమ్మకు అరిసెలతో అలంకరణ
తగరపువలస: పద్మనాభం మండలం రేవిడి జట్లమ్మ అమ్మవారిని మంగళవారం అక్కడి ఆలయ కమిటీ ప్రతినిధులు అరిసెలు, సున్నిపాకుండలు, పువ్వులతో ప్రత్యేకంగా అలంకరించారు. మరగడ నాగ, కుమారి, ఇషితరెడ్డి ఈ అలంకరణకు సహాయ సహకారాలు అందించారు. అలాగే భీమిలి మండలం మజ్జివలస గ్రామదేవత రాస పోలమాంబ అమ్మవారిని ఆలయ కమిటీ ప్రతినిధులు కొబ్బరికాయలు, పువ్వులతో అలంకరించారు. గ్రామానికి చెందిన నీలాపు సూర్యనారాయణ, అనసూయ దంపతులు ఈ అలంకరణకు సహాయ సహకారాలు అందించగా.. తుపాకుల అప్పల రాసయ్య, రాసమ్మ దంపతులు భక్తులకు ప్రసాదాలు అందించారు. -
16 నుంచి హోలీ స్పెషల్ రైళ్లు
తాటిచెట్లపాలెం: హోలీ సందర్బంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ–పాట్నా–విశాఖ మధ్య స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ● విశాఖపట్నం–పాట్నా(08537) హోలీ స్పెషల్ ఈ నెల 16, 23, 30 తేదీ(ఆదివారా)ల్లో విశాఖలో రాత్రి 7.30కు బయల్దేరి మరుసటి రోజు(సోమవారా)ల్లో రాత్రి 9 గంటలకు పాట్నా చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో పాట్నా–విశాఖపట్నం(08538) హోలీ స్పెషల్ 17, 24, 31 తేదీ(సోమవారా)ల్లో రాత్రి 10.30కు పాట్నాలో బయల్దేరి బుధవారం తెల్లవారుజాము 3.50కు విశాఖ చేరుకుంటాయి. ఈ స్పెషల్ రైళ్లు 3 సెకండ్ ఏసీ, 4 థర్డ్ ఏసీ ఎకానమీ, 7 స్లీపర్ క్లాస్, 4 జనరల్ సెకండ్ క్లాస్, 1 సెకండ్ క్లాస్ కం లగేజి కం దివ్యాంగ కోచ్, 1 జనరేటర్ మోటార్ కార్ కోచ్లతో నడుస్తాయి. -
● వీఎంఆర్డీఏ పార్కుకు నూతన శోభ
చాపల్లో గంజాయి రవాణా తాటిచెట్లపాలెం: గంజాయి రవాణాకు నిందితులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా చాపల్లో చుట్టి గంజాయిని రవాణా చేస్తుండగా విశాఖపట్నం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలివి.. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కె.రామకృష్ణ తన సిబ్బందితో కలిసి మంగళవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. 8వ నంబర్ ప్లాట్ఫాంపై పశ్చిమ బెంగాల్కు చెందిన మాన్సింగ్ ఘోష్, కృష్ణపాల్లను తనిఖీ చేయగా.. వారి వద్ద గంజాయి లభించింది. వారు ఎవరికీ అనుమానం రాకుండా ప్లాస్టిక్ చాపల్లో గంజాయిని కట్టలుగా కట్టి తీసుకువెళ్తున్నారు. ఒడిశాలోని పాడువా నుంచి ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు గంజాయిని రవాణా చేస్తుండగా దొరికిపోయారు. వారి వద్ద నుంచి రూ.89,500 విలువైన 17.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని.. ఇద్దరినీ జీఆర్పీ ఎస్ఐ అబ్దుల్ మారూఫ్కు అప్పగించారు. పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. విశాఖ–బెంగళూరు స్పెషల్కు జోలర్పేట్లో హాల్ట్ తాటిచెట్లపాలెం: విశాఖపట్నం–ఎస్ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం మధ్య నడుస్తున్న వీక్లీ స్పెషల్ రైలుకు జోలర్పేట్లో అదనపు హాల్ట్ కల్పిస్తున్నట్లు సందీప్ తెలిపారు. ● విశాఖపట్నం–ఎస్ఎంవీ బెంగళూరు(08549) స్పెషల్ ఎక్స్ప్రెస్కు ఈ నెల 16 నుంచి, తిరుగు ప్రయాణంలో బయల్దేరే ఎస్ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం(08550) స్పెషల్ ఎక్స్ప్రెస్కు 17 నుంచి జోలర్పేట్లో హాల్ట్ కల్పించారు. విశాఖ రైల్వే స్టేషన్లో నిందితుల అరెస్ట్ జీవీఎంసీ అధికారులతోస్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ -
దైన్యం.. జూలో మూగ జీవాల వైద్యం
● ఇటీవల పుట్టిన రెండు సింహం పిల్లలు మృతి ● వారాల తరబడి పోటీ పడి మరీ సెలవుల్లో వైద్యులు ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో మూగ జీవాలకు వైద్యం ప్రశ్నార్థకంగా మారింది. వైద్యులు వారాల తరబడి పోటాపోటీగా సెలవులు పెట్టడం, విధులకు హాజరైన రోజుల్లో కూడా సరిగా వైద్య సేవలు అందించకపోవడంతో మూగ జీవాల ఆరోగ్యం అగమ్యగోచరంలో పడింది. ఇటీవల ఇక్కడ శివంగి(ఆడ సింహం)కి పుట్టిన రెండు పిల్లలు మృత్యువాత పడ్డాయి. జూ పార్కుల్లో సింహాలకు పిల్లలు పుట్టడం దేశంలో ఇదే మొదటిసారి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన జూ వైద్యులు నిర్లక్ష్యం కారణంగా.. పుట్టిన రెండు సింహం పిల్లల్లో ఒకటి రెండు రోజుల వయసులో, మరొకటి 12 రోజుల వయసులో ప్రాణాలు కోల్పోయాయి. ఏడాదిన్నర క్రితం ఇక్కడ జిరాఫీ పిల్ల తల్లి కడుపులోనే మరణించిన విషయం తెలిసిందే. ఇతర దేశాల నుంచి ఇక్కడకు తీసుకువచ్చిన పలు అరుదైన వన్యప్రాణులు సైతం సరైన వైద్యం అందకపోవంతో మృత్యువాత పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాంగ్ లీవ్లో డాక్టర్ శ్రీనివాస్ జూ పార్కు ఏర్పాటైనప్పటి నుంచి పశు సంవర్ధక శాఖకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ ఇక్కడి మూగజీవాలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన వ్యక్తిగత కారణాలతో రెండేళ్ల క్రితం లాంగ్(ఐదేళ్ల) లీవ్ పెట్టారు. అప్పటి నుంచి పరిస్థితులు దిగజారాయి. ప్రస్తుతం ఇక్కడ ముగ్గురు వైద్యులున్నారు. వారిలో నెల క్రితం నియమించిన పశు సంవర్ధక శాఖకు చెందిన ప్రభుత్వ వైద్యుడున్నారు. మిగిలిన ఇద్దరు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వారిలో ఒక యువ వైద్యుడు ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. ఆయనకు హైదరాబాద్లో సొంతంగా వెటర్నరీ మందుల సంస్థ ఉంది. ఆ సంస్థ నుంచే గతంలో అవసరానికి మించి మందులు కొనుగోలు చేయించేవారని సమాచారం. సదరు వైద్యుడు నెలలో సగం రోజులు సిక్ లీవ్ల పేరిట జూ డ్యూటీకి ఎగనామం పెడుతున్నారు. మరో మహిళా వైద్యురాలు నాలుగు నెలల క్రితం జూలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో చేరారు. ఆమె గతంలో కొన్నాళ్లు ఇక్కడ వైద్యురాలిగా పనిచేశారు. ఇక్కడ మానేసిన తర్వాత జీవీఎంసీ మొబైల్ వెటర్నరీ క్లినిక్లో చేరారు. ప్రస్తుతం ఆమె రెండు ఉద్యోగాలు చేస్తున్నట్లు జూ సిబ్బంది చెప్తున్నారు. అక్కడో వారం.. ఇక్కడో వారం అన్నట్లుగా ఆమె సేవలందిస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరు డ్యూటీకి వెళ్లిన రోజుల్లో కూడా వన్యప్రాణులను సరిగా పరిశీలించట్లేదని యానిమల్ కీపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగానే గర్భం దాల్చిన సింహానికి సరైన వైద్యం, అవసరమైన మందులు అందక నీరసించిన పిల్లలు పుట్టాయన్న ఆరోపణలున్నాయి. వీరిద్దరు ఇటీవల నియమించిన ప్రభుత్వ వెటర్నరీ వైద్యుడికి కూడా సహకరించకుండా సెలవుల్లో గడుపుతున్నారని సమాచారం. ఇంత జరుగుతున్నా అటవీశాఖ సీఎఫ్, జూ ఉన్నతాధికారులు సర్దుబాటు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. -
ఇద్దరిపై కూలిన విద్యుత్ స్తంభం
● విశాఖ డెయిరీ జంక్షన్ వద్ద వేచి ఉండగా ఘటన ● ఒకరి పరిస్థితి విషమం అక్కిరెడ్డిపాలెం: ప్రమాదం ఎప్పుడు, ఎలా వస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు మన ప్రమేయం లేకున్నా ఆ ప్రమాదానికి బాధితులం అవుతాం. మంగళవారం విశాఖ డెయిరీ జంక్షన్లో వేచి ఉన్న ఇద్దరిపై విద్యుత్ స్తంభం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలను మార్చడంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివి.. జాతీయ రహదారిపై తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలు కూలుతున్నా.. జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల కిందట విశాఖ డెయిరీ జంక్షన్లో విద్యుత్ స్తంభం కూలిపోగా, అక్కడే విధుల్లో ఉన్న కమ్యూనిటీ గార్డు ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. తాజాగా మరో స్తంభం కూలి ఇద్దరిపై పడిపోయింది. మంగళవారం మధ్యాహ్నం ఆటోనగర్ నుంచి షీలానగర్ వైపు ఆర్టీసీ బస్సు వస్తోంది. విశాఖ డెయిరీ ఎదురుగా జంక్షన్ వద్దకు వచ్చేసరికి జీవీఎంసీ విద్యుత్ స్తంభం నుంచి వెళ్తున్న తీగ బస్సు టాప్కు తగలడంతో ఇరుక్కుపోగా, బస్సు లాక్కొని పోయింది. దీంతో తుప్పు పట్టిన విద్యుత్ స్తంభం విరిగి నేలకొరిగింది. అదే సమయంలో భెల్ ప్రవేశ గేటు వైపు నుంచి విశాఖ డెయిరీ వైపు రోడ్డు దాటడానికి బైక్పై వేచి ఉన్న బొత్స కామేశ్వరరావు, పక్కనే నిల్చొని ఉన్న దొడ్డి సత్యవతిపై ఆ విద్యుత్ స్తంభం పడింది. తీవ్ర గాయాల పాలైన కామేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్లో కేజీహెచ్కు తరలించారు. సత్యవతికి తలకు తీవ్ర గాయం కావడంతో షీలానగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కె.కోటపాడు, వారాడ సంతపాలేనికి చెందిన కామేశ్వరరావుకు విశాఖ డెయిరీలో పని కుదిరింది. మొదటి రోజు పనికి వెళ్లేందుకు వచ్చి ఇలా ప్రమాదానికి గురికావడం పలువురిని తీవ్రంగా కలచివేసింది. తల్లితో కలిసి అతను నివసిస్తున్నట్లు బంధువులు తెలిపారు. 69వ వార్డు నాతయ్యపాలేనికి చెందిన సత్యవతి అనకాపల్లిలో ఉంటున్న తన కుమార్తెను చూడటానికి వెళ్లేందుకు పళ్లు కొనుగోలు చేసింది. అనంతరం విశాఖ డెయిరీ వైపు రోడ్డు దాటడానికి వేచి ఉండగా ప్రమాదానికి గురైంది. కాగా.. జరిగిన ప్రమాదం ట్రాఫిక్ పరిధిలోకి వస్తుందా లేదా లా అండ్ ఆర్డర్ పరిధిలోకి వస్తుందా అనే సందిగ్ధతతో పోలీసులు సాయంత్రం వరకు కేసు నమోదు చేయలేదు. -
సరికొత్త హంగులతో వైఎస్సార్ స్టేడియం
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్ ప్రస్తుత సీజన్కు విశాఖలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం సిద్ధమవుతోంది. మరో సారి ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ హోం గ్రౌండ్గా విశాఖ స్టేడియాన్ని ఎంచుకోవడమే కాకుండా తొలి మ్యాచ్ను ఇక్కడే ఆడి సీజన్కు శ్రీకారం చుట్టనుంది. 27,251 మంది అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్ను వీక్షించే అవకాశం ఉన్న వైఎస్సార్ స్టేడియంలో డీసీ తొలి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్తో 24వ తేదీ రాత్రి ఏడున్నర గంటలకు ఆడనుంది. అలాగే ఈ నెల 30వ తేదీ ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నరకే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ల నిర్వహణకు వీలుగా స్టేడియంలో ఆధునిక హంగులు సమకూరుస్తున్నారు. ఆటగాళ్ల గ్రీన్రూమ్స్తో సహా డగౌట్స్ను ఆధునికీకరించారు. మ్యాచ్ల్లో డ్రెస్సింగ్ రూమ్కి చాలా ప్రాధాన్యం ఉన్నా.. టీ–20లో ఆటగాళ్లు కూర్చునేందుకు మైదానానికి ఇరువైపులా ఉండే డగౌట్స్ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. డీసీ మేనేజ్మెంట్ సూచనల మేరకు ఏసీఏ ప్రత్యేక దృష్టి పెట్టి సాధారణ ప్రేక్షకులతో పాటు కార్పొరేట్కు పెద్దపీట వేసింది. అందుకు అనువుగా 34 వీఐపీ కార్పొరేట్ బాక్స్లతో పాటు రెండు టీమ్ బాక్స్లను ఆధునికీకరించింది. ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్తో సహా నాలుగు లిఫ్ట్ల్లో ఒకేసారి 64 మంది వెళ్లే విధంగా తీర్చిదిద్దింది. దాదాపు రూ.40 కోట్ల వరకు వెచ్చించి స్టేడియంలో సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లతో పాటు అభిమానులకు బాత్రూమ్లను సైతం మూడింతలు పెంచి సౌకర్యాలు కల్పించింది. స్టేడియంలో ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేసి 14 ఏళ్లు దాటిపోవడంతో.. వాటి స్థానంలో రూ.9.5 కోట్లు వెచ్చించి ఆధునిక టెక్నాలజీతో పూర్తి నైట్ మ్యాచ్కు అనువుగా ఆధునికీకరించింది. పెవిలియన్ ఎండ్ సౌత్ బ్లాక్లో ఆటగాళ్ల రూమ్, డగౌట్కు పైన 1,640 మంది కూర్చునే కార్పొరేట్ బాక్స్లు అన్ని హంగులతో సిద్ధమయ్యాయి. ఆటగాళ్లకు దగ్గరగా ఉండే అప్పర్ వెస్ట్, జి, ఐ స్టాండ్స్లోనూ సిట్టింగ్ ఏర్పాట్లను మెరుగుపరిచారు. స్టేడియంలో మొత్తంగా కార్పొరేట్ బాక్స్లతో సహా 22 స్టాండ్స్ ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్లకు టికెట్లను త్వరలో ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మండు టెండలో.. చంటి బిడ్డలతో..
పేదలు గూడు కోసం ఎంత పరితపిస్తున్నారో ఈ చిత్రమే సాక్ష్యం. ఇల్లు లేని పేదలతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా దరఖాస్తులతో బాధితులంతా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. మండుటెండలో చంటి బిడ్డలతో తరలివచ్చారు. ఎండ అధికంగా ఉండడంతో ఓ తల్లి తన చంటిబిడ్డను కుమారుడి చేతిలో పెట్టి దరఖాస్తు అందజేయడానికి కార్యాలయం లోపలకు వెళ్లింది. ఆ ప్రాంగణంలో నీడ లేకపోవడంతో కార్యాలయం గోడ పక్కన.. కాలువ గట్ట్టుపై ఉన్న నీడలో చిన్నారిని ఆడిస్తూ కనిపించాడు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
‘యువత పోరు’తో నిలదీద్దాం..
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ముందు అబద్దపు హామీలిచ్చి అఽధికారం చేపట్టిన తర్వాత యువతను, విద్యార్థులను, నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఉపసంహరణ అంశాలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న ‘యువత పోరు’ పేరిట నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ‘యువత పోరు’ పోస్టర్ను సోమవారం ఆవిష్క రించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడు తూ గతంలో వైఎస్సార్సీపీ చేపట్టిన రైతు పోరు బాట, విద్యుత్ చార్జీలపై నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, అదే తరహాలో యువత పోరును మరింత విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు, యువతకు పిలుపునిచ్చారు. పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలనే ఆకాంక్షతో మహానేత, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని, దాన్ని ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మరింత సమర్థవంతంగా అమలుచేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.4 వేల కోట్లు ఫీజు బకాయి పెట్టిందన్నారు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరై, వాటిలో సగానికి పైగా పూర్తయ్యామని, మిగిలినవి నిర్మాణంలో ఉన్నాయని, వాటి ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుండటం శోచనీయమన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకట్రామయ్య, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు జాన్వెస్లీ, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పేడాడ రమణికుమారి, దొడ్డి కిరణ్, పులగమ కొండారెడ్డి, సనపల రవీంద్ర భరత్, కోఆప్షన్ సభ్యుడు ఎండీ షరీఫ్, పార్టీ ముఖ్య నాయకులు నాగేంద్ర, మువ్వల సంతోష్కుమార్, ఇల్లపు శ్రీనివాస్, కార్తీక్, నిఖిల్ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. నిరసనకు తరలిరండి ఈ నెల 12న ఉదయం 10 గంటలకు జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున జిల్లా యువత, తల్లిదండ్రులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొంటాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.4 వేల కోట్ల ఫీజు బకాయిలు నిరుద్యోగులకు రూ.3 వేలు భృతిగా ఇస్తామని చెప్పి మాట తప్పారు 12న వైఎస్సార్ సీపీ యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ -
తాజాగా వియత్నాం సర్వీసు
తాజాగా వియత్నాం సర్వీసు కూడా వెళ్లిపోయింది. గతేడాది సెప్టెంబర్లో వైజాగ్లో జరిగిన వియత్నాం టూరిజం కాంక్లేవ్లో ఆ దేశ రాయబారి ఇక్కడి నుంచి వియత్నాంలోని ప్రధాన నగరం హొచిమిన్ సిటీకి 2025లో సర్వీసు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఎయిర్ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధుల కృషితో కొత్త సర్వీసు రాబోతోందని అంతా భావించారు. అయితే మరోసారి వియట్జెట్ ఎయిర్లైన్స్ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, వైజాగ్ ఎయిర్పోర్టు అధికారుల్ని అసోసియేషన్ కోరింది. అయినా స్పందించకపోవడంతో వియట్జెట్ హైదరాబాద్ ఎయిర్పోర్టుతో సంప్రదింపులు జరిపింది. దీంతో వియర్జెట్ సర్వీసుతో పాటు.. వియత్నాం గవర్న్మెంట్ ఎయిర్లైన్స్ సర్వీసు కూడా హైదరాబాద్కు తరలిపోయింది. ఫలితంగా రెండు నెలల కాలంలో రెండు విదేశీ సర్వీసులు వైజాగ్కు రాకుండా పోయాయి. దీనంతటికీ కేంద్ర మంత్రి నిర్లక్ష్యం, కూటమి సర్కారు వివక్షే కారణమని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
తప్పుల తడకగా సీనియారిటీ జాబితా
● అప్పీళ్లకు ముగిసిన గడువు ● సవరణల కోసం 250 మంది దరఖాస్తు విశాఖ విద్య: ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా లు ప్రకటించేందుకు విద్యాశాఖాధికారులు ఆపసోపాలు పడుతున్నారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టీఐఎస్)లో సమగ్ర వివరాలు నమోదు సమ యంలో ఉపాధ్యాయుల అలసత్వం, డీడీవోల నిర్లక్ష్యంతో జాబితాలు తప్పులతడకగా మారాయి. వీటి ఆధారంగానే త్వరలోనే ప్రమోషన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో ఉపాధ్యాయుల్లో కలవరం మొదలైంది. దీంతో సీనియారిటీ జాబితా లోపాలను సవరించి, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఉమ్మడి విశాఖ జిల్లాకు సర్వీసు విషయాల్లో నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న విశాఖ జిల్లా డీఈవోకు తమ మొర విన్నవించుకునేందుకు ఉపాధ్యాయులు క్యూ కట్టారు. అప్పీళ్లకు సోమ వారం చివరి రోజు కావటంతో ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 250 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. అప్పీళ్ల పరిశీలనకు ప్రత్యేక కమిటీ వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించే నిమిత్తం 12 మంది సీనియర్ ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు ఎంఈవోలతో జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతీ దరఖాస్తును వారు పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాతనే టీఐఎస్ లాగిన్లో వాటిని సరిచేశారు. ఇలా 210 దరఖాస్తులను సోమవారం నాటికి ఒక కొలిక్కి తీసుకొచ్చి, ఉపాధ్యాయులు లేవనెత్తిన అంశాలను సరిచేశారు. మరో 40 వరకు దరఖాస్తులు అభ్యంతరాలతో కూడినవి కావటంతో.. మరోసారి క్షేత్రస్థాయి నుంచి నివేదికలను తెప్పించుకున్న తరువాతనే వాటిని సీనియారిటీ జాబితాలో చోటు కల్పించేలా చర్యలు చేపట్టారు. జాబితాలపై ఉన్నత స్థాయి సమీక్ష ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు, సవరణల కోరుతూ వచ్చిన అప్పీళ్ల విషయమై సోమవారం విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి డీఈవో ప్రేమ్కుమార్, సర్వీసు వ్యవహరాలు చూసే అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ జ్యోతి, సంబంధిత సెక్షన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొని, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఆందోళన వద్దు సీనియారిటీ జాబితాల్లో తప్పిదాలపై ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉమ్మడి జిల్లాలో అన్ని క్యాడర్ల వారీగా పూర్తి స్థాయిలో సమగ్ర పరిశీలన చేసిన తరువాతనే తుది జాబితాలను వెల్లడిస్తాం. జాబితాల్లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా.. ఉపాధ్యాయులు నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చు. – ఎన్.ప్రేమ్కుమార్, నోడల్ అధికారి, ఉమ్మడి విశాఖ జిల్లా -
మొన్న దుబాయ్ విమానం
విశాఖపై రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష, స్లాట్లపై నౌకాదళ ఆంక్షలు.. మొదలైన కారణాలన్నీ ఎయిర్పోర్టుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో విభాగాలలో అపారమైన వృద్ధి సామర్థ్యం విశాఖకు ఉన్నా.. ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం మానేసింది. దీంతో కొత్త సర్వీసులు గగనమైపోతున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాలకు సర్వీసులు నడిపించేందుకు వైజాగ్ బెస్ట్ డెస్టినేషన్గా విమానయాన సంస్థలు భావిస్తుంటాయి. ఇటీవల మిడిల్ ఈస్ట్ దేశాల్లో ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ ఎమిరేట్స్.. ఏపీ నుంచి దుబాయ్కు విమాన సర్వీసు నిర్వహించేందుకు సిద్ధమైన తరుణంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఆ సర్వీసుని విజయవాడ నుంచి నడపాలని ఒత్తిడి తీసుకొచ్చింది. దీని వెనుక మంత్రి రామ్మోహన్నాయుడు చక్రం తిప్పడంతో.. ఇష్టం లేకపోయినా ఎమిరేట్స్ సంస్థ.. దుబాయ్ సర్వీసును విజయవాడ నుంచి ప్రారంభించేసింది. -
మరో విదేశీ విమానం పాయె
● ఇటీవల దుబాయ్ విమానం విజయవాడకు.. ● తాజాగా వియత్నాం విమానం హైదరాబాద్కు తరలింపు ● పట్టించుకోని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ● వైజాగ్ నుంచి సర్వీసులకు ఆసక్తి చూపిస్తున్న ఆకాశా ఎయిర్లైన్స్ ● స్పందించని కేంద్ర మంత్రి, ఎయిర్పోర్టు అధికారులు సాక్షి, విశాఖపట్నం : అంతర్జాతీయ విమాన సర్వీసులు విరివిగా నడిపేందుకు అన్ని అర్హతలున్నా.. కూటమి సర్కారు నిర్లక్ష్యం విశాఖ ఎయిర్పోర్టు పాలిట శాపంగా మారుతోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఉత్తరాంధ్రకు చెందిన వారే అయినా.. వస్తున్న విమాన సర్వీసులు కూడా ల్యాండ్ అవ్వకుండా టేకాఫ్ అయిపోతున్నాయి. ఇటీవల దుబాయ్ విమానాన్ని విశాఖ రానీయకుండా కూటమి సర్కారు అడ్డుకొని విజయవాడకు తరలించేసింది. ఇప్పుడు కింజరాపు రామ్మోహన్నాయుడు నిర్లక్ష్యంతో వియత్నాం విమాన సర్వీసు హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయింది. డొమెస్టిక్ సర్వీసుల విషయంలోనూ అదే నిర్లిప్తంగా ఎయిర్పోర్టు వర్గాలు వ్యవహరిస్తున్నారు. విశాఖ నుంచి చక్కర్లు కొట్టేందుకు ఆకాశా ఎయిర్లైన్స్ సిద్ధంగా ఉన్నా.. అధికారుల నుంచి ‘సిగ్నల్’ అందకపోవడంతో అది గాల్లోనే నిలిచిపోయింది. మేం వస్తామన్నా.. పట్టించుకోరా.? విదేశీ సర్వీసుల పరిస్థితి ఇలా ఉంటే.. డొమెస్టిక్ సర్వీసుల పెంపుపైనా అదే వైఖరి కనిపిస్తోంది. ప్రముఖ ఎయిర్లైన్స్ ఆకాశా సంస్థ.. వైజాగ్ నుంచి హైదరాబాద్తో పాటు దేశంలోని వివిధ నగరాలకు సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు వైజాగ్ ఎయిర్పోర్టు అధికారులకు నెల రోజుల క్రితమే సమాచారం పంపించింది. అయినా ఎవరూ స్పందించకపోవడంతో ఆకాశా ఎయిర్లైన్స్ ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
దివ్యాంగుల స్కూల్కు నాట్స్ ఆర్థికసాయం
ఎంవీపీ కాలనీ: జీవీఎంసీ 17వ వార్డులోని సన్ఫ్లవర్ దివ్యాంగుల స్కూల్కు నార్త్ అమెరికా తెలుగు సంఘం(నాట్స్) రూ.20 లక్షలు ఆర్థిక సాయం అందజేసింది. నాట్స్ ప్రతినిధులు సోమవారం స్కూల్ యాజమాన్యానికి సంబంధిత చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాట్స్ సమన్వయకర్త వెంకన్న చౌదరి, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ మదన్ పాములపాటిలు మాట్లాడుతూ భాషే రమ్యం– సేవే మార్గం నినాదంతో నాట్స్ మాతృభూమి రుణం తీర్చుకోవడానికి విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగా సన్ప్లవర్ దివ్యాంగుల స్కూల్ విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించేందుకు రూ.10 లక్షలు, నాట్స్ పూర్వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ఎవోలైటెజ్ వ్యవస్థాపకుడు(విశాఖ) శ్రీనివాస్ అరసాడ మరో రూ.10 లక్షలు ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో నాట్స్ కన్వెన్షన్ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందడి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల స్థలాల కోసం తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
ఆరిలోవ: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం రూరల్ తహసీల్దారు కార్యాలయాన్ని ముట్టడించింది. ఆరిలోవ, మధురవాడ, ఎండాడ, రుషికొండ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఇళ్లులేని పేదలు తహసీల్దారు కార్యాలయం సమీపానికి చేరుకొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జిల్లా నాయకులు, పేదలతో కలిసి జాతీయరహదారిపై విశాఖ వ్యాలీ స్కూల్ కూడలి నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ఎర్ర జెండాలు పట్టుకొని ర్యాలీ చేశారు. అనంతరం తహసీల్దారు కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం పేదలు నుంచి ఇళ్ల స్థలాలు కోసం దరఖాస్తులు సేకరించి తహసీల్దారు పాల్కిరణ్కు అందజేశారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడి తర్వాత అమలు చేయలేదన్నారు. ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఇంతవరకు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు పైడిరాజు, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన -
సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే
సాక్షి, విశాఖపట్నం : మహిళల సమానత్వం కోసం, వారి అభ్యున్నతి కోసం ఉద్యమం చేసిన సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గుడివాడ అమర్నాథ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
● అంబరం.. తొలేళ్ల సంబరం
పైడిమాంబ ప్రతిమలతో భారీ ఊరేగింపు కంచరపాలెం : కంచరపాలెం పరిధి రామ్మూర్తిపంతులుపేట ఆరాధ్య దైవం పైడిమాంబ అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలేళ్ల సంబరం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణం నుంచి అమ్మవారి ప్రతిమలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. గౌరీ సేవా సంఘం గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు కొణతాల గోవిందరాజు, బొడ్డేటి నర్సింగరావు నేతృత్వంలో సాయంత్రం 4 గంటల సమయంలో వందలాది అమ్మవారి ప్రతిమలను రామ్మూర్తి పంతులుపేట నుంచి జ్ఞానాపురం, డాబాగార్డెన్స్, జగదాంబ కూడలి, కాన్వెంట్ కూడలి మీదుగా తిరిగి అమ్మవారి మూలవిరాట్, ఆర్పీపేట రైల్వే గేటు వద్దకు తీసుకొచ్చారు. అమ్మవారి ప్రధాన విగ్రహాన్ని ఎమ్మెల్యే గణబాబు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ దంపతులు, గ్రామ కమిటీ సభ్యులు తోడ్కొని వచ్చి తొలేళ్ల సంబరాన్ని ప్రారంభించారు. పలు వేషధారణలు, నేలవేషాలు ఆకట్టుకున్నాయి. సుమారు 385 అమ్మవారి ప్రతిమలు ఊరేగింపుగా తీసుకొచ్చారు. వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మంగళవారం ప్రధాన ఉత్సవం జరగనుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. -
పోలీస్ శాఖలో బదిలీలు
విశాఖ సిటీ: విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఎస్ఐల నుంచి కానిస్టేబుళ్ల వరకు 34 మందికి స్థానచలనాలు కలిగాయి. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఉత్తర్వులు జారీ చేశారు. ఎంవీపీ లాండ్ ఆర్డర్ ఏఎస్ఐగా ఉన్న పి.నరసింగరావును త్రీటౌన్కు, మల్కాపురం క్రైమ్ ఏఎస్ఐ జియా రుక్సానాను మహారాణిపేట లా అండ్ ఆర్డర్కు, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కె.సుబేదాబేగంను కంచరపాలెం లా అండ్ ఆర్డర్కు బదిలీ చేశారు. వీరితో పాటు 20 మంది హెడ్కానిస్టేబుళ్లు, 11 మంది కానిస్టేబుళ్లకు బదిలీ అయ్యాయి. -
ఏయూలో టెక్నో కల్చరల్ ఫెస్ట్
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ మహిళా ఇంజినీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘రీబూట్–2కే25’పేరిట రెండు రోజుల పాటు నిర్వహించనున్న టెక్నో కల్చరల్ ఫెస్ట్ సోమవారం ప్రారంభమైంది. ఇంజినీరింగ్ విద్యార్థులు శసాంకేతిక అంశాల్లో నైపుణ్యత సాధించేలా సదస్సు నిర్వహిస్తున్నట్లు కాలేజీ ఫ్రిన్సిపాల్ ఆచార్య ఆర్.పద్మశ్రీ తెలిపారు. ముఖ్య అతిఽథిగా హాజరైన మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి.మల్లేశ్వరి విద్యార్ధినులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్, లైంగిక హింసలను ఎలా ఎదుర్కోవాలి, పోలీసుల సహాయం ఎలా తీసుకోవాలో వివరించారు. సీఎస్సీ అండ్ ఐటీ హెచ్వోడీ ఆచార్య బి.ప్రజ్ఙ, కో–ఆర్డినేటర్స్ డాక్టర్ బి.ఎస్తేర్ సునంద, ఎం.కుమారి, డాక్టర్ ఎస్.అరుణ, జి.శిరీష తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. -
మధురవాడలో ఆలయాల నిర్మాణానికి శంకుస్థాపన
మధురవాడ: మధురవాడ వైఎస్సార్ కాలనీలోని శ్రీ వాసవి మాత ఆలయ ఆవరణలో శివుడు, వేంకటేశ్వర స్వామి ఆలయాలతోపాటు వారాహి మాత ఆలయాలు నిర్మాణానికి సోమవారం కమిటీ ప్రతినిధులు, పలువురు ఆర్య వైశ్య ప్రముఖులు, అధికార పార్టీ నాయకులు శంకుస్థాపన చేశారు. గరివిడి శ్రీ విద్యా సౌరశక్తి పీఠానికి చెందిన ఆగమశాస్త్ర పండితులు సూర్యసదనంచే ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం సేవా సంఘం ప్రతినిధులు, నిర్మాణ కమిటీ ప్రతినిధి, వేంకటేశ్వర విద్యాసంస్థల అధినేత యేటూరి వేంకటేశ్వర్లు, పైడా విద్యాసంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్, కంకటాల మల్లికార్జునరావు, వైభవ్ జ్యూయలర్స్ గ్రంధి మల్లికా మనోజ్, మేఘాలయ గ్రంధి సురేష్, శ్రీకన్య, సినీపోలీస్ ఎన్వీఎస్ గురుమూర్తి, ఏఎస్ స్టీల్ ట్రేడర్స్ ఎ.నగేష్, వీ కన్వెన్షన్స్ పీవీ నరసింహారావు, జేకే లాజిస్టిక్స పి.శోభన్ ప్రకాష్, శ్రీకన్య ఫార్ూచ్యన్ కె. గురుమూర్తి, ఏయా ఆచార్యులు మద్దుల రామ్జీ, తిరుమల స్టీల్స్ గ్రంధి రాంజీ, లివింగ్ లైన్స్ శ్రీనివారావు, కార్పొరేటర్లు మొల్లి హేమలత, పిళ్ల మంగమ్మ, జెడ్సీ కనకమహాలక్ష్మి, నిర్మాణ కమిటీ ప్రతినిధులు పి.జగదీశ్, లక్ష్మీనారాయణ, కొల్లి వాసు పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదుల వెల్లువ
డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జీవీఎంసీలో నిర్వహించారు. పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ జోన్లలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అధికంగా వచ్చాయి. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తితో కలిసి నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి పీజీఆర్ఎస్ను నిర్వహించారు. మొత్తం 90 వినతులు రాగా..అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 50 ఫిర్యాదులు అందాయి. నిర్ణీత సమయంలో వీటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను మేయర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ సోమన్నారాయణ, ప్రధాన ఇంజినీరు శివప్రసాద్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు. జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 90 వినతులు -
కమిషనర్ను నియమించకపోవడం కూటమి వైఫల్యమే..
డాబాగార్డెన్స్ : రాష్ట్రంలోనే విశాఖ కీలక నగరం..జీవీఎంసీ ఆయువుపట్టు..అలాంటి సంస్థకు కమిషనర్ను నియమించకపోవడం దారుణమని సీపీఎం, సీపీఐ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్లు డాక్టర్ బి గంగారావు, ఏజే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభు త్వం ఏర్పడిన తరువాత జీవీఎంసీ కమిషనర్గా సంపత్కుమార్ను నియమించారు. ఐదు నెలలు తిరగకముందే ఆఘమేఘాలపై ఆయనను చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేయడం వెనుక ఆంతర్యమేంటో అర్థం కావడం లేదన్నారు. తక్షణం జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ను నియమించాలని డిమాండ్ చేస్తూ సంస్థ ప్రధాన కార్యాలయ ద్వారం వద్ద సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం ఫ్లోర్ లీడర్ గంగారావు మాట్లాడుతూ ఐదు నెలల కాలంలోనే డాక్టర్ సంపత్కుమార్ కమిషనర్గా సమర్థవంతంగా పని చేశారన్నారు. అటువంటి కమిషనర్ను ఐదు నెలలు తిరగకముందు కూటమి నేతల స్వార్థం కోసం ఆయనను అమరావతికి బదిలీ చేశారని ఆరోపించారు. కమిషనర్ బదిలీఅయి రెండు నెలలు కావస్తున్నా..జీవీఎంసీకి కమిషనర్ను నియమించాలని ఆలోచన చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. కూటమికి అనుకూలంగా ఉన్న వ్యక్తిని కమిషనర్గా నియమించేందుకు మీలో గలాటా జరుగుతుందని తెలిసింది. ఇది సరైనది కాదన్నారు. సీపీఐ ఫ్లోర్ లీడర్ ఏజే స్టాలిన్ మాట్లాడుతూ కమిషనర్ను నియమించకపోవడం దారుణమన్నారు. కూటమికి అనుకూల వ్యక్తి కోసమే ఆలస్యం సీపీఎం, సీపీఐ నేతల ఆందోళన -
కమనీయం.. అనంతుని కల్యాణం
పద్మనాభం: పద్మనాభంలోని కుంతీ మాధవ స్వామి ఆలయంలో సోమవారం రాత్రి అనంత పద్మనాభ స్వామి కల్యాణం కనుల పండువగా జరిగింది. ముందుగా కుంతీ మాధవ స్వామి ఆలయం వద్ద ధ్వజారోహనం నిర్వహించారు. తదుపరి అనంత పద్మనాభ స్వామిని హనుమంతు వాహనంపైన, శ్రీదేవిని హంస వాహనంపై, భూదేవిని గజ వాహనంపై రాజవీధుల్లోఇ తీసుకు వెళ్లి ఎదురు సన్నాహ మహోత్సవం నిర్వహించారు. అనంత పద్మనాభ స్వామిని తూర్పు వైపున, శ్రీదేవి, భూదేవి విగ్రహాలను పడమర వైపున ఉంచి ఈ ఎదురు సన్నాహ మహోత్సవం జరిపారు. వేదపండితుల వేద మంత్రోచ్ఛరణలు, నాద మునీశ్వరుల స్వరాల నడుమ అనంత పద్మనాభ స్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. పరిసర ప్రాంతాలైన మద్ది, కృష్ణాపురం, రెడ్డిపల్లి, విలాస్కాన్పాలెంల నుంచే కాకుండా దూర ప్రాంతాలైన విజయనగరం, తగరపువలసల నుంచి తరలి వచ్చిన భక్తులు అనంతుని కల్యాణాన్ని కనులారా వీక్షించారు. ఈవో నానాజీబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కంటుబోతు రాంబాబు, వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు, పద్మనాభం సర్పంచ్ తాలాడ పాప, భక్త బృందం సభ్యులు తాలాడ పద్మనాభం, కాళ్ల నగేష్ కుమార్, కంటుబోతు ఎర్నాయుడు, సుంకర నారాయణరావు,తాలాడ పైడిరాజు పాల్గొన్నారు. -
ఘనంగా సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే
కంచరపాలెం: విశాఖ పోర్ట్ అథారిటీ 56వ సీఐఎస్ఎఫ్ రైజింగ్డే సాలిగ్రామపురం సీఐఎస్ఎఫ్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పోర్ట్ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల రక్షణలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. సీఐఎస్ఎఫ్ యూనిట్ తన సత్తా, నైపుణ్యాలను ప్రదర్శిస్తూ డాగ్ షో, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన, పిరమిడ్ ఫార్మేషన్, ఫైర్ డ్రిల్ నిర్వహించారు. సీఐఎస్ఎఫ్ యూనిట్ సీనియర్ కమాండెంట్ సతీష్కుమార్ బాజ్పాయ్, పీఎస్ఎల్ స్వామి, టి.వేణుగోపాల్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు
విశాఖ సిటీ : నగరంలోని హోటళ్లు, లాడ్జీల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జోన్–1, జోన్–2 పరిధిలో 78 బృందాలతో 96 హోటళ్లు, లాడ్జీల్లో ఏకకాలంగా బాడీ వార్న్, మొబైల్ కెమెరాలను వినియోగిస్తూ సోదాలు చేపట్టారు. అతిథుల జాబితాలో పరారీ నిందితులు, ఎన్బీడబ్ల్యూలు ఉన్న వారు, వీసా, పాస్పోర్ట్ లేని, వీసా అనుమతికి మించి ఉన్న వారి కోసం తనిఖీ చేశారు. అసాంఘిక కార్యక్రమాలపైనే కాకుండా ఫైర్ ఎన్వోసీ, ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ, ఫుడ్ లైసెన్స్, మద్యం అమ్మకాలు, సీసీ టీవీల పనితీరు ఇలా అన్ని అంశాలను పరిశీలించారు. అనుమతులు లేకుండానే వ్యాపారాలు : పోలీసుల తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఫైర్ ఎన్వోసీ, జీఎస్టీ, ట్రేడ్ లైసెన్సులు లేకుండానే హోటళ్లు, లాడ్జీలు నిర్వహిస్తున్నట్లు మరోసారి వెల్లడైంది. ఇప్పటికే పలుమార్లు పోలీసుల తనిఖీల్లో ఈ విషయం నిర్ధారణ అయినప్పటికీ.. సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికీ వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పోలీసుల తాజాగా తనిఖీల్లో కూడా పదుల సంఖ్యలో హోటళ్లు, లాడ్జీలు అనుమతులు లేకుండా వ్యాపారాలు చేస్తున్నట్లు స్పష్టమైంది. 42 హోటళ్లు, లాడ్జీలలకు అగ్నిమాపక ఎన్వోసీలు లేనట్లు గుర్తించారు. అలాగే 12 సముదాయాలకు ట్రేడ్ లైసెన్సులు, మరో 12 హోటళ్లకు ఫుడ్ లైసెన్సులు, 17 వ్యాపారాలకు జీఎస్టీ సర్టిఫికెట్లు లేనట్లు నిర్ధారణైంది. అదే విధంగా రెండు హోటళ్లలో సందర్శకుల రికార్డులు నిర్వహించడం లేదని, 14 హోటళు, లాడ్జీలలో విజిటర్స్ మోనిటరింగ్ సిస్టమ్లో సందర్శకుల సమాచారాన్ని అప్డేట్ చేయ డం లేదని, 2 హోటళ్లలో సీసీటీవీలను పర్యవేక్షించడం లేదని వెల్లడైంది. వ్యాపారులు తప్పనిసరిగా నిబంధనలు అనుసరించాలని, పాటించని వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి నిర్వాహకులను హెచ్చరించారు. 78 పోలీస్ బృందాలతో 96 హోటళ్లు, లాడ్జీల్లో సోదాలు ఫైర్ ఎన్వోసీలు లేకుండా 42 హోటళ్లు, లాడ్జీల నిర్వహణ -
హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి జిల్లా కోర్టు సమస్యలు
విశాఖ–లీగల్ : విశాఖ జిల్లా కోర్టు ప్రాంగణంలో పలు సమస్యలు పరిష్కరించే దిశగా రాష్ట్ర హైకో ర్టు తమ వంతు చేయూతనిస్తుందని విశాఖ జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బెవర సత్యనారాయణ తెలిపారు. సోమవారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పది నెలలుగా మూతపడ్డ విశాఖ న్యాయవాద సంఘం క్యాంటీన్ తిరిగి ప్రారంభించడానికి హైకోర్టు న్యాయమూర్తి సుముఖంగా ఉన్నారని తెలిపారు. అలాగే న్యాయవాదుల సంఘం ప్రాంగణంలో ఏసీలను అమర్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. న్యాయవాదులు సమర్పించిన వినతి పత్రాలపై ప్రివిలేజ్ కమిటీలో పెడతామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వివరించారు. గత నెల 23న న్యాయవాద సంఘాలు తీర్మానం చేసిన హైకోర్టు బెంచ్ క్యాట్ ట్రిబ్యునల్ వంటివి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తుల సంఘంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన వారిలో న్యాయవాదుల సంఘం కార్యదర్శి దంతి నరేష్, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, సభ్యులు ఉన్నారు. -
అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను 24 గంటలలోపు ఓపెన్ చేసి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, పునరావృతం కాని విధంగా సంతృప్తి కరమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్తో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ స్వీకరించారు. అధికారులతో సమీక్ష : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రారంభానికి ముందుగా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జిల్లాలో రీ–ఓపెన్ అర్జీలు తరచుగా రావడంపై అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీపం పథకం అమలు, లబ్ధిదారుల ఖాతాలకు సబ్సిడీ అందుతున్నది లేనిది గమనించాలని సివిల్ సప్లై అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇసుక లభ్యత, వినియోగంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పీ4 సర్వేపై అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 332 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 131 ఉండగా, పోలీసు శాఖకు సంబంధించినవి 24, జీవీఎంసీ సంబంధించి 111 ఉన్నాయి. అలాగే ఇతర విభాగాలకు సంబంధించి 66 వినతులు వచ్చాయి. పీజీఆర్ఎస్లో వినతులు స్వీకరించిన కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
నిర్ణీత గడువులోగా వినతులు పరిష్కరించాలి
విశాఖ సిటీ: ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ అధికారులను ఆదేశించారు. సోమవారం వీఎంఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి మొత్తం 16 ఫిర్యాదులు వచ్చాయి. ప్రైవేట్ లేఅవుట్లకు సంబంధించి ప్లాట్ల విషయంలో ఎక్కువగా ఫిర్యాదులు రాగా.. వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. ప్రజాదర్బార్కు వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. అలాగే మాస్టర్ ప్లాన్కు సంబంధించి పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటిని త్వరలో పరిశీలిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జేసీ కె.రమేష్, ప్రధాన అర్బన్ ప్లానర్ శిల్ప, ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్, కార్యదర్శి మురళీకృష్ణ పాల్గొన్నారు. -
జగన్ హయాంలోనే మహిళా సాధికారత
● మాజీ మంత్రి గుడివాడ్ అమర్నాథ్ ● వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షి, విశాఖపట్నం: వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే మహిళా సాధికారత, స్వావలంబన లక్ష్యంగా పాలన సాగిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కె.భాగ్య లక్ష్మి, శోభా హైమావతి అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమర్నాథ్ కేక్ కట్ చేసి.. రమణికుమారికి తినిపించారు. మహిళలంతా స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. అనంతరం వైఎస్సార్ సీపీలో కీలకంగా పనిచేస్తున్న మహిళలను సత్కరించారు. తర్వాత అమర్నాథ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాల నలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలకు సంబంధించిన డబ్బు లు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేశారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతంకుపైగా మహిళలకే కేటాయించారని, చట్టసభల్లో, మంత్రి పదవుల్లో, రాజకీయ పదవుల్లో అన్నింటా మహిళలకే పెద్దపీట వేశారన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని మహిళలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వానికి మహిళలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. మేయర్ హరివెంకటకుమారి, మాజీ ఎంపీ మాధవి, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి, భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు, తల్లికి వందనం, ఆసరా వంటి పథకాలు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. పేడాడ రమణికుమారి మాట్లాడుతూ వైఎస్జగన్ దిశ చట్టం ద్వారా మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యం కల్పించారన్నారు. అనంతరం అతిథులను ఆమె ఘనంగా సత్కరించారు. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ విభాగంలో బండి ప్రియను, అధునాతన కాస్మో టాలజీ అండ్ ట్రైకాలజీ క్లినిక్ విభాగంలో రాజ్యలక్ష్మి, బొటిక్ షాపు యాజమాని కోశెట్టి రాజ్యలక్ష్మి, పార్టీ కార్యాలయంలో పని చేసే మీసాల సంధ్యను సన్మానించారు. పార్టీ సమన్వయకర్తలు కేకే రాజు, తిప్పల శ్రీనివాస్ దేవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, కార్పొరేటర్లు తోట పద్మావతి, ముర్రువాణి, సాడి పద్మారెడ్డి, మహిళా నేతలు బి.పద్మావతి, శ్రీదేవీవర్మ, పిల్లి సుజాత, సత్యాల సాగరిక, పల్లా చిన్న తల్లి, అడ్డాల కృపా జ్యోతి, బయవరపు రాధా, డా.మంచా నాగ మల్లీశ్వరి, సలాది భాను, రాజేశ్వరి, జోష్ణ, బంగారమ్మ, రత్నం, కాకి పద్మ, రోజారాణి, మళ్ల ధనలత, రజనీ, రామలక్ష్మి, పి.వి.లక్ష్మి, సంషాద్ భేగం, నీలాపు లక్ష్మి, అమ్మాజీ, రేణుక, నాగమణి, పద్మ, రాజీ, సునీత, కుమారి, పద్మ, జోత్స్న, చందక రత్నం, శిరీష, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
సమర్థంగా పీ4 సర్వే
మహారాణిపేట: పీ4 సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించి, సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కలెక్టర్ను ఆదేశించారు. పోర్టు గెస్ట్ హౌస్లో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి శనివారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పీ4 సర్వే నిర్వహించాలన్నారు. ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా సిటిజెన్ సర్వీసెస్ అమలు చేసి.. జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ను ఆదేశించారు. జిల్లాలో శాంతిభద్రతలపై సీపీతో చర్చించి.. మెరుగైన సేవలందించాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు అధికార యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. కలెక్టర్కు జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదేశం -
కుటుంబంలో మహిళ పాత్ర కీలకం
సీపీ సతీమణి సువశ్రీ బాగ్చిమహారాణిపేట: కేజీహెచ్ ఆంకాలజీ విభాగంలో శనివారం మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ సతీమణి సువశ్రీ బాగ్చి మాట్లాడుతూ ప్రతి ఇల్లు ఆనందమయంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మహిళ పాత్ర కీలకమని.. ఝాన్సీ లక్ష్మీబాయిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మహిళలు క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, విధిగా ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ మాట్లాడుతూ క్యాన్సర్కు సంబంధించిన అంశాలపై కేజీహెచ్లో ఉచిత వైద్య సేవలందించే దిశగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులు, వారి పిల్లలను కలిశారు. పిల్లలకు అతిథులు బొమ్మలను బహుమతులుగా అందించారు. క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్న మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ కె.శిల్ప సేవలను ప్రశంసించారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ ముఖ్య అతిథి సువశ్రీ బాగ్చితోపాటు ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి, డాక్టర్ కె.శిల్పలను ఘనంగా సత్కరించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ జి.వాసవీలత, డీసీహెచ్ఎస్ ఆర్ఎంవో డాక్టర్ మెహర్ కుమార్, గ్రేడ్ వన్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి, ఆయా విభాగాలకు చెందిన నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు ప్రాధాన్యం
● జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ● ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం బీచ్రోడ్డు: రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తోందని, అందులో భాగంగానే ‘శక్తి’ యాప్ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సిరిపురంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో శనివారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో విజయాలు సాధించిన మహిళలను గుర్తించి, వారిని గౌరవించాలన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. మహిళల హక్కులు, సమానత్వం, సాధికారత గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా ఉన్నత విజయాలు సాధిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం ఇళ్ల పట్టాలను మహిళల పేరునే మంజూరు చేస్తుందని తెలిపారు. మహిళల పై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన చేకూర్చుకునేందుకు షియో ఆటోలు, ద్విచక్ర వాహనాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలు తయారుచేసిన ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మకాల ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కించుకోనున్నాయని వెల్లడించారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థితికి చేరేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా ప్రతీ మహిళ ఆర్థికంగా స్థిరపడాలన్నారు. జిల్లాలో ర్యాపిడో ద్వారా 200 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కళాకారులు, చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తర్వాత మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. వ్యాసరచన, క్రీడలు, తదితర పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలను ఘనంగా సన్మానించారు. మహిళా సంఘాల లబ్ధిదారులకు ర్యాపిడో స్కూటీలు, ఆటోలను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమ ప్రాంగణంలో మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, విష్ణుకుమార్ రాజు, మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జి చిన్నయిదేవి, విశాఖ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు వై.గంగాభవానీ, జిల్లా సమైక్య కార్యదర్శి సూరమ్మ తదితరులు పాల్గొన్నారు. పీఎం అజయ్ పథకం చెక్కు అందజేత ఎంవీపీకాలనీ: జిల్లాలోని ఎస్హెచ్జీ మహిళలకు పీఎం అజయ్ ఉన్నతి పథకంలో భాగంగా రూ.35 లక్షల చెక్కును అందజేశారు. ఈ పథకం ద్వారా రూ.50 వేల రాయితీ రుణం కోసం జిల్లాలోని 25 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యపద్మ తెలిపారు. ఈ నిధుల చెక్కును మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమక్షంలో లబ్ధిదారులకు అందజేసినట్లు వివరించారు. -
గ్రీన్పార్క్లో సంప్రదాయ వస్త్రాల ప్రదర్శన
డాబాగార్డెన్స్: ఉగాది పండగ పురస్కరించుకుని నగరంలో ప్రత్యేక వస్త్ర ప్రదర్శన ప్రారంభమైంది. వాల్తేర్ మెయిన్రోడ్డులోని హోటల్ గ్రీన్ పార్క్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పో ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుతుంది. సంప్రదాయ దుస్తులకు ప్రాధాన్యమిచ్చే వారికి ఇది ఒక చక్కటి వేదిక. సరికొత్త ఫ్యాషన్ వస్త్రాలతో పాటు అన్ని రకాల సంప్రదాయ దుస్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రదర్శనలో మహిళలను ఆకట్టుకునేలా వివిధ రకాల దుస్తులు కొలువుదీరాయి. పట్టు చీరలు, కాటన్ వస్త్రాలు, సల్వార్లు, టాప్స్ వంటి వా టితో పాటు అనేక రకాల ఉపకరణాలు, డిజైనర్ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రత్యేకంగా పోచంపల్లి, కలంకారి చీరలు, కోల్కత్తా, భాగల్పురి ప్రింట్లు, లక్నో చికాన్ వర్క్ చీరలు, బెనారస్ పట్టు చీరలు వంటివి ఇక్కడ లభిస్తున్నాయి. అంతేకాకుండా మగ్గాలపై నేసిన, రంగులు వేసిన, ముద్రించిన, ఎంబ్రాయిడరీ వస్త్రాలు ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. మట్కా సిల్క్ చీరలు, మధ్యప్రదేశ్, పాట్లీ పల్లు, మల్బరీ సిల్క్, చందేరి చీరలు కూడా సరసమైన ధరలకే విక్రయిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 11 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ప్రదర్శన, విక్రయాలు ఉంటాయని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. -
కేజీహెచ్లో పిల్లల కోసం అత్యాధునిక వైద్యం
మహారాణిపేట: కేజీహెచ్లోని పీడియాట్రిక్ వార్డులో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నూతన సౌకర్యాలు పిల్లల్లో వ్యాధులను క్షణాల్లో గుర్తించడంతో పాటు, మెరుగైన చికిత్సను అందించడానికి దోహదపడతాయని పిల్లల వార్డు విభాగాధిపతి డాక్టర్ చక్రవర్తి తెలిపారు. పాయింట్–ఆఫ్–కేర్ అల్ట్రాసౌండ్ (పీవోసీయూఎస్), 2డీ, ఈకో ప్రోబ్, న్యూరో సోనోగ్రఫీ వంటి అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ పరికరాల ఏర్పాటులో రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ బుజ్జిబాబు అందించిన సహకారం వెలకట్టలేనిదని డాక్టర్ చక్రవర్తి అన్నారు. డాక్టర్ బుజ్జిబాబు సత్వర స్పందన, సహాయ సహకారాలు, సాంకేతిక మార్గదర్శకత్వం ఎంతో విలువైనవని కొనియాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇవీ ప్రయోజనాలు : నూతన పరికరాలు పలు పరీక్షలను వేగంగా నిర్వహించి, వ్యాధులను నిర్ధారించడంలో సహాయపడతాయి. తద్వారా అత్యవసర సమయాల్లో రోగులకు సత్వర చికిత్సను అందించవచ్చు. రక్తనాళాల స్థితిని అంచనా వేయడానికి, కష్టతరమైన ఇంట్రావీనస్ (ఐవీ) యాక్సెస్, ఇన్ఫీరియర్ వెనా కావా (ఐవీసీ) స్థితిని అంచనా వేయడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయి. గుండె సంబంధిత పరీక్షలు, హృదయ స్పందనల అంచనా, పెరికార్డియల్ ఎఫ్యూషన్, హీమోడైనమిక్ అస్థిరత్వాలను గుర్తించడానికి తక్షణ ఎకో కార్డియోగ్రఫీ సేవలు అందుబాటులో ఉంటాయి. నవజాత శిశువుల్లో మెదడు సంబంధిత వ్యాధులను గుర్తించడంలో న్యూరోసోనోగ్రఫీ పరికరం సహాయపడుతుంది. ఆకస్మిక కడుపు నొప్పి, అసిటీస్, కాలేయ సంబంధిత సమస్యలు, ప్రేగు వ్యాధులను బెడ్సైడ్ వద్దే పరీక్షించడానికి వీలుంటుందని డాక్టర్ చక్రవర్తి వివరించారు. గేమ్ చేంజర్గా నూతన పరికరాలు ఈ అత్యాధునిక పరికరాలు పీడియాట్రిక్ వార్డులో గేమ్ చేంజర్గా మారనున్నాయని డాక్టర్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. రేడియాలజీ విభాగంపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించాల్సిన అవసరాన్ని కూడా తగ్గిస్తాయి. క్షణాల్లో వ్యాధి నిర్ధారణ జరగడం వల్ల, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లలను కాపాడే అవకాశాలు మెరుగుపడతాయని ఆయన వెల్లడించారు. నూతన పరికరాలతో మెరుగైన సేవలు -
బైక్ రేసర్లపై పోలీసుల ఉక్కుపాదం
బీచ్రోడ్డు: నగరంలో అర్ధరాత్రి బైక్ రేసులు నిర్వహిస్తున్న యువకులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వారం రోజుల కిందట 38 మంది యువకులను అరెస్ట్ చేసి వారి బైక్లను సీజ్ చేసిన పోలీసులు.. తాజాగా మరో 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మూడో పట్టణ పోలీస్స్టేషన్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ట్రాఫిక్ విభాగం అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ ఈ వివరాలు వెల్లడించారు. అర్ధరాత్రి నగరంలో రోడ్లపై హల్చల్ చేస్తూ పాదచారులు, వాహన చోదకులను బైక్ రేసర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై అందిన ఫిర్యాదుల మేరకు జోన్–1 ట్రాఫిక్ ఏసీపీ వాసుదేవరావు పర్యవేక్షణలో త్రీటౌన్, ద్వారకా, నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 16 మంది బైక్ రేసర్లను అరెస్ట్ చేసి, 16 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి విధించే శిక్షల్లో సమూల మార్పులు చేసినట్లు వెల్లడించారు. కఠిన చర్యలతో పాటు భారీ జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ట్రాఫిక్ సీఐ అమ్మినాయుడు తదితరులు పాల్గొన్నారు. 16 మంది అరెస్ట్, బైక్ల సీజ్ -
రూ.2.5 లక్షలు!
● మామూళ్లు.. గమ్మత్తుగా! ఒక్కో దుకాణానికి ● మద్యం షాపుల నుంచి నెలవారీ వసూళ్లు షురూ ● బెల్టు షాపులకు రూ.10 అధిక ధరకు అమ్మకం ● సమావేశం పెట్టి మరీ టార్గెట్ విధింపు ● వచ్చే ఏడాది నుంచి రూ.3 లక్షలు ఇవ్వాలని ఆదేశాలు ● బెంగళూరు నుంచి వచ్చిన నేత ద్వారా కలెక్షన్లు బెంగళూరుకు చెందిన వ్యక్తి ద్వారా..! వాస్తవానికి సదరు నేతకు ఏళ్లుగా నమ్మినబంటుగా ఉన్న వ్యక్తి ద్వారా అన్ని వ్యవహారాలు నడిపేవారు. అయితే సదరు వ్యక్తిపై సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేయడంతో పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ స్థానంలో తనకు నమ్మిన బంటుగా ఉన్న మరో వ్యక్తిని బెంగళూరు నుంచి ప్రత్యేకంగా పిలిపించినట్టు ఆ పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. మద్యం సిండికేట్ల ద్వారా వసూలు చేసే మొత్తం కూడా సదరు బెంగళూరు వ్యక్తి చేతికి చేరుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొద్దిరోజుల క్రితం సెజ్లోని ఒక కంపెనీలో సీసీ కెమెరాలను బిగించే పని ఇప్పించడం కోసం కూడా రూ.3 లక్షల మేర వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ తతంగమంతా కూడా బెంగళూరు వ్యక్తి ద్వారానే నడిచినట్టు సమాచారం. మొత్తంగా పీఏలు మారుతున్నారు తప్ప వసూళ్ల కార్యక్రమం మాత్రం తమకు తప్పడం లేదని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. బెంగళూరు వ్యక్తిపై కూడా ఫిర్యాదు చేసేందుకు ఆ పార్టీ నేతలే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటికే ప్రైవేటు పీఏ వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న కూటమి నేత ఒకరు... ఇప్పుడు కలెక్షన్ల కోసం ఏకంగా బెంగళూరు నుంచి ఓ వ్యక్తిని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ముందుగా నియోజకవర్గంలోని మొత్తం మద్యం షాపుల నుంచి మామూళ్లు వసూలు చేయాలని భావించారు. ఇందుకు అనుగుణంగా మద్యం షాపు సిండికేట్లతో గత నెలలో సమావేశం ఏర్పాటు చేసి మరీ టార్గెట్లు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ప్రతి మద్యం షాపు యజమాని ప్రతి నెలా రూ.2.5 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా సదరు ప్రైవేటు మద్యం దుకాణదారుడు బెల్టు షాపులకు ఎమ్మార్పీ మీద రూ.10 అధికంగా విక్రయించుకునేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఆయా దుకాణాల పరిధిలో బెల్టు షాపులకు మద్యం సరఫరా బాధ్యత కేవలం వారికే దక్కేలా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆయా మద్యం షాపులతో పాటు బెల్టు షాపుల జోలికి ఎకై ్స జ్శాఖ అధికారులు వెళ్లకుండా కూడా ఆదేశాలు జారీ కావడం విశేషం. వచ్చే ఏడాది నుంచి ప్రతి నెలా వసూళ్ల మొత్తం రూ.3 లక్షలకు పెంచనున్నట్టు కూడా ముందుగానే ప్రకటించినట్టు సమాచారం. మొత్తంగా ఒక ప్రైవేటు పీఏ వ్యవహారంలో విమర్శల నేపథ్యంలో దూరంగా పెట్టిన సదరు నేత.. ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చిన మరో వ్యక్తి ద్వారా వసూళ్లకు దిగడం చర్చనీయాంశమవుతోంది. విచ్చలవిడిగా బెల్టు షాపులు! ఇప్పటికే పేకాట, కోడి పందేల వ్యవహారంలో వార్తలకెక్కిన సదరు నేత.. ఇప్పుడు విచ్చలవిడిగా మద్యం బెల్టు దుకాణాలకు కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా పేకాట డెన్ల నిర్వహణలో కొంత మొత్తం వసూలు చేసేందుకు మరీ అనుమతి ఇచ్చారు. వాటి జోలికి వెళ్లకుండా కూడా కొద్దిరోజుల పాటు నియంత్రించగలిగారు. అయితే అంతర్గత విభేదాల కారణంగా ఈ వ్యవహారం కాస్తా బయటకు వచ్చింది. దీంతో తాత్కాలికంగా పేకాట శిబిరాలు మూతపడ్డాయి. ఇక కోడి పందేల శిబిరాలు ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఏకంగా మూడు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. అధికారికంగా సదరు నేత పాల్గొనకపోయినా వారి అండతోనే ఈ వ్యవహారం నడిచింది. దీంతో అటువైపు పోలీసులు కన్నెత్తి చూడలేదు. పైగా కోడి పందేల శిబిరాల ప్రాంతంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కూడా జరిగాయి. బహిరంగంగానే మద్యాన్ని విక్రయించారు. వీటి ఏర్పాట్లకు కూడా వేలం పాట నిర్వహించి మరీ వసూళ్లకు తెగబడ్డారు. మరోవైపు ఇప్పటికే సదరు నేత నియోజకవర్గంలో భారీగా బెల్టు షాపులు వెలిశాయి. బెల్టు షాపుల కోసం వేలం పాట నిర్వహించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయినా సదరు నేత అండదండలతో చర్యలు తీసుకోలేదని విమర్శలున్నాయి. కేవలం ఈ నియోజకవర్గంలోనే ఏకంగా వందకుపైగా బెల్టు షాపులు ఏర్పాటైనట్టు సమాచారం. మద్యం దుకాణదారులు ఆయా బెల్టు షాపులకు ఎమ్మార్పీకి రూ.10కి అధికంగా మద్యం విక్రయించుకుంటున్నారు. ఇందులో వచ్చే సగం ఆదాయాన్ని సదరు నేతకు ముట్టచెబుతున్నట్టు తెలుస్తోంది. -
నేటి నుంచి పీ–4 సర్వే
గేట్ల దగ్గర నుంచి గెట్ అవుట్● మరోసారి స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుమహారాణిపేట: పేదరిక నిర్మూలన లక్ష్యంగా పీ–4 సర్వేను శనివారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే జరుగుతుందని శుక్రవారం పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా పది సూత్రాల్లో ప్రథమంగా పేదరిక నిర్మూలన,పేదరికం లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో పీ–4 సర్వేకు రూపకల్పన చేశామన్నారు. 27 ప్రశ్నలతో కూడిన హౌస్ హోల్డ్ సర్వేను గ్రామ సభల్లో కూడ ప్రవేశ పెడతారని, లబ్ధిదారుల ఎంపిక కూడా గ్రామ సభల ద్వారా జరుగుతుందన్నారు. పీ4 సర్వేకు సంబంధించి ప్రజల అభిప్రాయాలు, సూచనలను, నిర్దేశిత క్యూర్ కోడ్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని కలెక్టర్ కోరారు. పారదర్శకంగా సర్వే నిర్వహించాలి తగరపువలస: రైతులకు ఇబ్బంది లేకుండా పారదర్శకంగా రైతులు రీ సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ సూచించారు. శుక్రవారం ఆయన ఆనందపురం మండలం గొట్టిపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా రీ సర్వే జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. డ్రోన్, రోవర్ ద్వారా రీ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. రీ సర్వే పంట ప్రక్రియలను పరిశీలించారు. సర్వే పూర్తయిన తరువాత గ్రామసభ నిర్వహించి రైతులకు పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. గొట్టిపల్లి గ్రామ సచివాలయంతో పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయన వెంట సర్వే విభాగం ఏడీ సూర్యారావు, తహశీల్దార్ శ్యాంప్రసాద్, ఎంపీడీవో జానకి తదితరులు పాల్గొన్నారు. సాక్షి, విశాఖపట్నం: స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ మళ్లీ మొదలైందని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం విధులకు వెళ్లిన కాంట్రాక్ట్ కార్మికులు ఆయా ప్రవేశ గేట్ల వద్ద బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం ప్రయత్నించినప్పటికి వీలు కాలేదు. సుమారు 250 మంది కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు కాకపోవడంతో సాంకేతిక సమస్య అనుకున్నారు. తీరా కార్మిక సంఘాల నాయకులు వాకబు చేయగా వారిని బయోమెట్రిక్ నుంచి తొలగించినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలియవచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం మేరకు తొలగింపు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ జరుగుతున్నట్టు సమాచారం. ఈ అంశంపై విభాగంలోని అధికారులను వివిధ సంఘాల నాయకులు ప్రశ్నించగా తమకు ఏం తెలియదంటూ దాట వేశారని ఆరోపించారు. ఈ అంశంపై పోరాటానికి సన్నద్ధమవుతున్నామని కార్మిక నాయకులు తెలిపారు. 28న విశాఖ న్యాయవాదుల సంఘం ఎన్నికలు విశాఖ లీగల్ : ప్రతిష్టాత్మకమైన విశాఖ న్యాయవాదుల సంఘం నూతన వార్షిక ఎన్నికలు ఈనెల 28వ తేదీన జరుగుతాయని సంఘం అధ్యక్షుడు బెవర సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఎన్నికల అధికారిగా ప్రముఖ న్యాయవాది జి.ఎం. రెడ్డి నియమితులయ్యారు. 15 రోజులు ముందు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇప్పటికే వివిధ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. న్యాయవాదులందరూ ఓటు హక్కు పొందడానికి తక్షణమే తమ సభ్యత్వ రుసుము చెల్లించాలని సంఘం కార్యదర్శి డి.నరేష్ కోరారు. ప్రధానంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష,కార్యదర్శి పదవులకు గట్టి పోటీ ఉంది. 12 లేదా 13 తేదీల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. -
షోకాజ్ నోటీసులతో ఉద్యమాన్ని అణచలేరు
ఉక్కునగరం: స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు జె.అయోధ్యరామ్కు ఇచ్చిన షోకాజ్ నోటీసును తక్షణం ఉపసంహరించుకోవాలని సిటు జిల్లా అధ్యక్షుడు ఎన్.రామారావు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అయోధ్యరామ్కు షోకాజ్ నోటీసు జారీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉక్కు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ప్రభావితం చేసే విధంగా కార్మిక సంఘాల ప్రతినిధులపై ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందన్నారు. కర్మాగారంలో నేటి వరకు ఉన్న ప్రతి ప్రయోజనం పోరాటాల ద్వారానే సాధించుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. పోరాటంలో అనైక్యతను సృష్టించడం కోసం ప్రభుత్వం, యాజమాన్యాలు ఎంత ప్రయత్నించినా.. స్టీల్ కార్మికులు మరింత ఐక్యంగా ముందుకు సాగుతారన్నారు. గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ద్వారా స్టీల్ పరిశ్రమలో సమస్యలు పరిష్కారం కావని ఆయన వివరించారు. దీన్ని సమర్ధవంతగా నడపడం కోసం సమర్థవంతమైన నాయకత్వం కావాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారని ఆయన గుర్తు చేశారు. సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులతో కార్మిక ఉద్యమాన్ని అణచలేరన్నారు. వెంటనే యాజమాన్యం నోటీసును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ సిటు గౌరవాధ్యక్షుడు జె. అయోధ్యరామ్, అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వై.టి.దాస్, యు.రామస్వామి, అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు కె.ఎస్.ఎన్.రావు, రమణమూర్తి, డి.వి.రమణారెడ్డి, దొమ్మేటి అప్పారావు, డి. సురేష్బాబు, రామ్కుమార్, రామ్మోహన్కుమార్, పరంధామయ్య, డేవిడ్ తదితరులు యాజమాన్యం వైఖరిని నిరసించారు. వెంటనే ఉపసంహరించుకోవాలి ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల డిమాండ్ -
వైద్య వృత్తి.. సేవా కీర్తి
విశాఖ విద్య: విశాఖ నగరంలోని మర్రిపాలెం వుడా లే అవుట్ కాలనీకి చెందిన కంచిపాటి శిరీష దంతవైద్యురాలు. భర్త శ్రీనివాసరావు కూడా వైద్యుడే. ఎంచక్కా ఏ ప్రైవేటు ఆస్పత్రో పెట్టుకొని ప్రాక్టీస్పై దృష్టి పెడితే, బోలెడంత వెనుకేసుకోవచ్చు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి పాస్తులు, కుటుంబ పరంగా ఉన్న అండదండలతో లగ్జరీ లైఫ్ గడిపేయవచ్చు. డాక్టర్ శిరీష ఆలోచనలు వేరు..తల్లిదండ్రులు పీవీఎస్రావు, విజయలక్ష్మి నేర్పి న విలువలతో ఆమె స్ఫూర్తివంతమైన జీవ నం గడుపుతున్నారు. మర్రిపాలెం వుడా లే అవుట్ కాలనీ అంటే నగరంలోని ప్రముఖుల నివాస స్థావరంగా గుర్తింపు ఉంది. ఇలాంటి చోట, కాలనీ అసోసియేషన్లో డాక్టర్ శిరీష కీలకంగా వ్యవహరిస్తున్నారు. సన్నిహితుల ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పారి శ్రామిక ప్రాంతాలతో పాటు, నగర శివారు కాలనీలో వైద్య శిబిరాలను ఏర్పా టు చేసి ఉచితంగా రోగులకు మందులను అందజేస్తున్నారు. అంతేకాకుండా కళలు, సాహిత్య రంగాల్లో కూడా పేరుతెచ్చుకున్నారు. మహిళ పాత్ర ఎంతో కీలకం మహిళ అంటే భార్యగా, తల్లిగా సక్సెస్ అయితేనే సరిపోదు. నేటి రోజుల్లో మహిళ పాత్ర కీలకంగా మారింది. మహిళ బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది. ఆడపిల్ల అనే చిన్నచూపు చూసే రోజులు పోయాయి. దేన్నైనా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి గల మహిళలు ఎంతో మంది ఉన్నారు. –డాక్టర్ కంచిపాటి శిరీష -
No Headline
సీతమ్మధార : ఆమె వయసు 94. ఇంట్లో హాయిగా మనమలు, మనవరాళ్లతో కాలక్షేపం చేసే వయసు. వృద్ధాప్యాన్ని పక్కన పెట్టి..ఓపిక ఉన్నంతవరకు కష్టపడతానంటోంది. సీతమ్మధార రైతు బజార్లో ఓ స్టాల్లో గ్రీన్పీస్, క్యారెట్ అమ్మూతూ జీవనం సాగిస్తోంది. భీమిలి మండలం చేపలుప్పాడకు చెందిన వృద్ధ రైతు పేరు నారాయణమ్మ. అందరూ శబరి అని పిలుస్తారు. ఇప్పటికీ ఎంతో హుషారుగా రైతు బజార్కు వచ్చి వెళుతుంటుంది. 20 ఏళ్లుగా సీతమ్మధార రైతు బజార్లో గ్రీన్పీస్, క్యారెట్ విక్రయాలు జరుపుతూ అందరికీ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తోంది. భర్త మృతి చెందగా..ఐదుగురు సంతానం. ఇంట్లో ఖాళీగా ఉండడం నచ్చదు..అందుకే ఇప్పటికీ రైతు బజార్లో విక్రయాలు జరుపుతున్నానని శబరి చెప్పింది. రైతు బజార్కు వచ్చినవాళ్లంతా ఆమెను చూసి వహ్వా..అవ్వా అంటూ శబరి వద్ద కొనుగోలు చేస్తున్నారు. -
అతివల ఆర్థిక స్వేచ్ఛకు అడుగులు
సాక్షి, విశాఖపట్నం : ఆర్థిక వనరుల నిర్వహణ అబలలకు కొత్తేమీ కాదు. ఇంట్లో మగవారిపై ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మ విశ్వాసం దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటిరాదు. అందుకే ఆర్థిక వ్యవహారాల్లో మహిళలను మించిన ఆర్తికవేత్తలు మరొకరు ఉండరని చెబుతుంటారు. అంతటి శక్తి ఉన్న మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలనే సంకల్పంతో ప్రారంభమైంది ది విశాఖ మహిళా మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆ పరేటివ్ సొసైటీ. పాతికేళ్ల ప్రస్థానంలో... నగరానికి చెందిన బి. ప్రసూనాంబ సాధారణ గృహిణి. రైతుబజారుకు వెళ్లిన సమయంలో అక్కడ మహిళా వ్యాపారులు డైలీకలెక్షన్, కాల్మనీ వ్యాపారుల నుంచి డబ్బులు అప్పులు తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్న వైనాన్ని చూశారు. మహిళలు అప్పుల కోసం ఎందుకు ఇబ్బంది పడాలి.. వారి డబ్బుల్ని వారే పొదుపు చేసి వాడుకునేలా వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలని సంకల్పించారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ది విశాఖ మహిళా మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆ పరేటివ్ సొసైటీ. సీతమ్మధారలో 10 మంది సభ్యులతో 2020 ఆగస్టులో ప్రారంభమైంది. పాతికేళ్ల ప్రస్థానంలో ఇప్పుడు ఉత్తరాంధ్రలో 16 శాఖలుగా విస్తరించింది. 816 మంది సభ్యులుండగా.. 10 వేల మంది వరకూ పొదుపు చేసుకునే మహిళలున్నారు. ఇప్పటి వరకూ 2 వేల మంది మహిళలకు రుణాలు మంజూరు చేసి.. వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దిందీ సొసైటీ. ఈ మహిళల సొసైటీలో పనిచేసే వారు కూడా మహిళలే కావడం విశేషం. మొత్తం 50 మంది ఉద్యోగులున్నారు. జీవితంలో ఆర్థికంగా, కుటుంబ పరంగా చితికిపోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందీ సొసైటీ. ఉపాధి అవసరమైన వారిని ఎంపిక చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నామని చైర్పర్సన్ వైబీ ప్రసూనాంబ చెబుతున్నారు. సొసైటీ తరఫున సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ.. బాలికలకు, మహిళలకూ చేయూతగా నిలుస్తున్నారు. -
రైలు ప్రయాణంలో తోడు.. మేరీ సహేలీ
రైతుబజార్ స్టాల్లో శబరి సాక్షి, విశాఖపట్నం: రైల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా భారతీయ రైల్వే.. వినూత్న విధానాలను అవలంబిస్తోంది. ఎవరి తోడు లేకుండా ప్రయాణిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు అనుసరిస్తున్న సరికొత్త ఆలోచనే ‘మేరీ సహేలి’. అంటే.. నా స్నేహితురాలు అని అర్థం. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి గమ్యస్థానానికి చేరుకునేంత వరకూ ఆర్పీఎఫ్ ఏర్పాటు చేసిన మేరీ సహేలి బృంద సభ్యులు వారి స్నేహితులుగా తోడుంటారు. అంతేకాదు.. అసౌకర్యాలకు గురవుతున్న మహిళా ప్రయాణికులకు సహాయం చేయడంతో పాటు భద్రతను పెంచే లక్ష్యంతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ పరిధిలో ‘సుభద్ర వాహిని’ పేరుతో ప్రత్యేక మహిళా రైల్వే సిబ్బంది బృందం సేవలందిస్తోంది. మేరీ సహేలి, సుభద్ర వాహినిలో మొత్తం 16 మంది మహిళా ఆర్పీఎఫ్ సిబ్బంది సేవలందిస్తున్నారు. మేరీ సహేలీ..: వాల్తేరు డివిజన్ పరిధిలోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి నిత్యం రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. రైలు ప్రయాణికుల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళలుంటారు. వీరి వివరాల్ని ఆర్పీఎఫ్ సేకరిస్తుంది. ఇందుకోసం రైలు ప్రయాణికుల రిజర్వేషన్ల ఆధారంగా ఇలాంటి మహిళల వివరాల్ని గుర్తించేందుకు రైల్వే శాఖ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (క్రిస్) యాప్ను వినియోగిస్తోంది. మేరీ సహేలీ బృంద సభ్యులు తమ ట్యాబ్ల ద్వారా వివరాలు సేకరించి.. వారి వద్దకు వెళ్లి వారికి అవగాహన కల్పిస్తారు. ఏదైనా అవసరం ఉంటే సమాచారం అందించాలంటూ ఫోన్ నంబర్ కూడా ఇస్తారు. రైలుదిగేంత వరకూ వారితో టచ్లో ఉంటారు. మహిళల బోగీల్లో పురుషులు చొరబడినా వారిపై కేసులు నమోదు చేస్తుంటారు. ఇలా మహిళల భద్రతకు సంబంధించి విశాఖ స్టేషన్ పరిధిలో గత ఏడాది 1,151 మందిపై కేసులు నమోదు చేయగా.. ఈ ఏడాది ఇప్పటి వరకూ 89 కేసులు నమోదు చేసినట్లు ఆర్పీఎఫ్ సీఐ కిమిడి రామకృష్ణ తెలిపారు. సుభద్ర వాహిని : సుభద్ర వాహిని మహిళా ప్రయాణికులను అప్రమత్తం చేయడం, ప్లాట్ఫామ్లపై, రైళ్లలో మహిళలపై నేర కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. తక్షణ సహాయం కోరుకునేవారు ఎవరైనా ఉంటే సులభంగా గుర్తించడానికి సుభద్ర వాహిని సభ్యులకు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉంటుంది. విశాఖపట్నం, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో ఈ బృందం విడతల వారీగా ప్రయాణిస్తూ మహిళలకు రక్షణ కవచంలా నిలుస్తున్నారు. హెల్ప్లైన్ నంబర్కు వచ్చిన ఫిర్యాదులపైనా స్పందించి.. వాటిని పరిష్కరించడంలో సుభద్రవాహిని బృందం దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రతి ఏటా దాదాపు 3500 మంది మహిళలకు రక్షణ కవచంలా సుభద్ర వాహిని బృందాలు వ్యవహరిస్తున్నాయని ఆర్పీఎఫ్ సీఐ రామకృష్ణ వివరించారు. మహిళలకు రైల్లో ఏ సమస్య తలెత్తినా కంట్రోల్ రూమ్ 8978080777 నంబర్కు గానీ.. రైల్వే టోల్ఫ్రీ నంబర్ 139లో సంప్రదించాలని ఆయన మహిళలకు సూచించారు. మహిళా ప్రయాణికులకు రక్షణగా ప్రత్యేక బృందంసుభద్ర వాహిని పేరుతో మరో రక్షణ బృందంమేరీ సహేలీ ద్వారా ప్రతిరోజు 10 మంది మహిళలకు రక్షణ -
రాష్ట్రంలో ఎల్ఎల్డీ చేసిన తొలి వ్యక్తి ఆచార్య సీతామాణిక్యం
ఏయూక్యాంపస్: చదువుకు ఎక్కువగా ప్రాధాన్యత లేని రోజుల్లో 17 ఏళ్ల వయసులో పెళ్లిపీటలపై కూర్చున్నారు. పెళ్లిచూపుల సమయంలో పెళ్లికొడుకు చదువుకుంటావా అని అడిగిన ప్రశ్న ఆమెలో కొత్త ఆశలను చిగురించేలా చేసింది. అలా భర్త సహకారంతో తన చదువును కొనసాగించారు. నేడు దేశంలో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రవిశ్వవిద్యాలయం న్యాయ కళాశాలకు ప్రిన్సిపాల్గా బాధ్యతలను నిర్వహించే స్థాయికి ఎదిగారు ఆచార్య కె.సీతామాణిక్యం. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక సీ్త్ర ఉంటుందంటారు. కానీ ఆచార్య సీతామాణిక్యం విజయం వెనుక ఆమె భర్త తమ్మిరెడ్డి ఉన్నారు. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా విద్యపై ఉన్న ఆసక్తితో ఆమెను ప్రోత్సహించారు. ప్రైవేటుగా డిగ్రీ పూర్తిచేసి అనంతరం ఎం.ఏ హిస్టరీ, బ్యాచ్లర్ ఆఫ్ లా, ఎం.ఏ ఇగ్లీషు, ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్లా(ఎల్ఎల్ఎం) పూర్తిచేశారు. ఒకవైపు కుటుంబం, పిల్లల బాధ్యతలను నిర్వహిస్తూ ఒడిశాలోని బ్రహ్మపుర విశ్వవిద్యాలయం నుంచి 2000 సంవత్సరంలో సైబర్ నేరాలపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. 2014లో పోస్ట్ డాక్టోరల్ ఇన్ లా(ఎల్ఎల్డీ)ని అందుకున్నారు. రాష్ట్రం నుంచి ఈ డిగ్రీ సాధించిన తొలి వ్యక్తి ఆచార్య సీతామాణిక్యం కావడం విశేషం. వివాహం, కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే తన ఆకాంక్షలను సాకారం చేసుకోవచ్చు అనడానికి ఆచార్య సీతామాణిక్యం జీవితం ఒక ఉదాహరణ మాత్రమే. అనంతరం ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఏయూలో 2006లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. 2021లో ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టారు. 24 జూన్ 2024 నుంచి న్యాయ కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ టీచర్ అవార్డును అందుకున్నారు. -
24 ఏళ్లుగా నవ్విస్తూ...
సీతంపేట: ఆమె స్టేజి ఎక్కితే కడుపుచెక్కలుకావాల్సిందే..ఆమె టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. హాస్య నటిగా శివజ్యోతి సుపరిచితురాలు. 2000 సంవత్సరంలో రావి కొండలరావు స్థాపించిన హ్యూమర్ క్లబ్లో ఆమె సభ్యురాలు..నాటి నుంచి నేటి వరకు నవ్వులు పంచుతున్నారు. కష్టాలు..కన్నీళ్లు..బాధలు..వీటినన్నింటినీ చిటికెలో మాయం చేసేది హాస్యం. నా స్కిట్లకు ప్రేక్షకులు నవ్వుతుంటే ఆ ఆనందం వేరు అంటున్నారు జ్యోతి. ప్రస్తుతం ఫ్రెండ్స్ కామెడీక్లబ్తో పాటు మరో రెండు కామెడీక్లబ్స్లో ప్రతి ఆదివారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో స్కిట్స్ చేసి ప్రేక్షకులను నవ్విస్తున్నా... దాదాపు 24 ఏళ్లుగా నవ్విస్తుంటం నా అదృష్టంగా భావిస్తున్నా. 1978 నుంచి కూచిపూడి డ్యాన్సర్గా, 1989 నుంచి రంగస్థల కళాకారిణిగా వందలాది స్టేజి ప్రదర్శనలు ఇచ్చా. జేవీ సోమయాజులతో కలిసి బుచ్చమ్మ పాత్ర (కన్యాశుల్కం)ధారిగా 500లకు పైగా ప్రదర్శనలు ఇచ్చా..కందుకూరి, నంది అవార్డు, కళాభినేత్రి, హాస్య నటి శిరోమణి, నాట్య మయూరిగా ఎన్నో అవార్డులు అందుకున్నా. -
24 ఏళ్లుగా నవ్విస్తూ...
సీతంపేట: ఆమె స్టేజి ఎక్కితే కడుపుచెక్కలుకావాల్సిందే..ఆమె టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. హాస్య నటిగా శివజ్యోతి సుపరిచితురాలు. 2000 సంవత్సరంలో రావి కొండలరావు స్థాపించిన హ్యూమర్ క్లబ్లో ఆమె సభ్యురాలు..నాటి నుంచి నేటి వరకు నవ్వులు పంచుతున్నారు. కష్టాలు..కన్నీళ్లు..బాధలు..వీటినన్నింటినీ చిటికెలో మాయం చేసేది హాస్యం. నా స్కిట్లకు ప్రేక్షకులు నవ్వుతుంటే ఆ ఆనందం వేరు అంటున్నారు జ్యోతి. ప్రస్తుతం ఫ్రెండ్స్ కామెడీక్లబ్తో పాటు మరో రెండు కామెడీక్లబ్స్లో ప్రతి ఆదివారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో స్కిట్స్ చేసి ప్రేక్షకులను నవ్విస్తున్నా... దాదాపు 24 ఏళ్లుగా నవ్విస్తుంటం నా అదృష్టంగా భావిస్తున్నా. 1978 నుంచి కూచిపూడి డ్యాన్సర్గా, 1989 నుంచి రంగస్థల కళాకారిణిగా వందలాది స్టేజి ప్రదర్శనలు ఇచ్చా. జేవీ సోమయాజులతో కలిసి బుచ్చమ్మ పాత్ర (కన్యాశుల్కం)ధారిగా 500లకు పైగా ప్రదర్శనలు ఇచ్చా..కందుకూరి, నంది అవార్డు, కళాభినేత్రి, హాస్య నటి శిరోమణి, నాట్య మయూరిగా ఎన్నో అవార్డులు అందుకున్నా. -
షోకాజ్ నోటీసులతో ఉద్యమాన్ని అణచలేరు
ఉక్కునగరం: స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు జె.అయోధ్యరామ్కు ఇచ్చిన షోకాజ్ నోటీసును తక్షణం ఉపసంహరించుకోవాలని సిటు జిల్లా అధ్యక్షుడు ఎన్.రామారావు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అయోధ్యరామ్కు షోకాజ్ నోటీసు జారీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉక్కు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ప్రభావితం చేసే విధంగా కార్మిక సంఘాల ప్రతినిధులపై ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందన్నారు. కర్మాగారంలో నేటి వరకు ఉన్న ప్రతి ప్రయోజనం పోరాటాల ద్వారానే సాధించుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. పోరాటంలో అనైక్యతను సృష్టించడం కోసం ప్రభుత్వం, యాజమాన్యాలు ఎంత ప్రయత్నించినా.. స్టీల్ కార్మికులు మరింత ఐక్యంగా ముందుకు సాగుతారన్నారు. గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ద్వారా స్టీల్ పరిశ్రమలో సమస్యలు పరిష్కారం కావని ఆయన వివరించారు. దీన్ని సమర్ధవంతగా నడపడం కోసం సమర్థవంతమైన నాయకత్వం కావాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారని ఆయన గుర్తు చేశారు. సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులతో కార్మిక ఉద్యమాన్ని అణచలేరన్నారు. వెంటనే యాజమాన్యం నోటీసును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ సిటు గౌరవాధ్యక్షుడు జె. అయోధ్యరామ్, అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వై.టి.దాస్, యు.రామస్వామి, అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు కె.ఎస్.ఎన్.రావు, రమణమూర్తి, డి.వి.రమణారెడ్డి, దొమ్మేటి అప్పారావు, డి. సురేష్బాబు, రామ్కుమార్, రామ్మోహన్కుమార్, పరంధామయ్య, డేవిడ్ తదితరులు యాజమాన్యం వైఖరిని నిరసించారు. వెంటనే ఉపసంహరించుకోవాలి ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల డిమాండ్ -
‘వరుణ్ హాస్పిటాలిటీ’పై ఏపీసీజెడ్ఎంఏ సీరియస్
విశాఖ సిటీ: బీచ్ రోడ్డులో వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన స్టార్ హోటల్ నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ(ఏపీసీజెడ్ఎంఏ) స్పందించింది. సీఆర్జెడ్ పరిధిలో బోర్లు తవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే దీనిపై స్వయంగా విచారించి తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ను ఆదేశించింది. గేట్ వే హోటల్ స్థలంలో వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం చేపడుతోంది. ఇందుకోసం సదరు సంస్థ తీర ప్రాంతానికి 150 మీటర్ల లోపే బోర్లు తీస్తోంది. దీనిపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఏపీసీజెడ్ఎంఏకు ఫిర్యాదు చేశారు. సీఆర్జెడ్ నోటిఫికేషన్ 2011 ప్రకారం తీర ప్రాంతానికి 150 మీటర్ల లోపు బోర్లు వేయడమే కాకుండా హైకోర్టు ఆదేశాల ప్రకారం తీర ప్రాంతానికి సమీపంలో భూగర్భం నుంచి నీటిని తోడడం నిషేధమని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఏపీసీజెడ్ఎంఏ స్పందిస్తూ. కలెక్టర్కు లేఖ రాసింది. వెంటనే జీవీఎంసీ కమిషనర్, గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్లు నేరుగా నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని తనిఖీ చేయాలని ఆ లేఖలో పేర్కొంది. అలాగే దానిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో సమర్పించాలని ఏపీసీజెడ్ఎంఏ మెంబర్ సెక్రటరీ ఎస్.శ్రీ శరవణన్ ఆదేశించారు. -
నేటి నుంచి పీ–4 సర్వే
గేట్ల దగ్గర నుంచి గెట్ అవుట్● మరోసారి స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుమహారాణిపేట: పేదరిక నిర్మూలన లక్ష్యంగా పీ–4 సర్వేను శనివారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే జరుగుతుందని శుక్రవారం పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా పది సూత్రాల్లో ప్రథమంగా పేదరిక నిర్మూలన,పేదరికం లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో పీ–4 సర్వేకు రూపకల్పన చేశామన్నారు. 27 ప్రశ్నలతో కూడిన హౌస్ హోల్డ్ సర్వేను గ్రామ సభల్లో కూడ ప్రవేశ పెడతారని, లబ్ధిదారుల ఎంపిక కూడా గ్రామ సభల ద్వారా జరుగుతుందన్నారు. పీ4 సర్వేకు సంబంధించి ప్రజల అభిప్రాయాలు, సూచనలను, నిర్దేశిత క్యూర్ కోడ్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని కలెక్టర్ కోరారు. పారదర్శకంగా సర్వే నిర్వహించాలి తగరపువలస: రైతులకు ఇబ్బంది లేకుండా పారదర్శకంగా రైతులు రీ సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ సూచించారు. శుక్రవారం ఆయన ఆనందపురం మండలం గొట్టిపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా రీ సర్వే జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. డ్రోన్, రోవర్ ద్వారా రీ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. రీ సర్వే పంట ప్రక్రియలను పరిశీలించారు. సర్వే పూర్తయిన తరువాత గ్రామసభ నిర్వహించి రైతులకు పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. గొట్టిపల్లి గ్రామ సచివాలయంతో పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయన వెంట సర్వే విభాగం ఏడీ సూర్యారావు, తహశీల్దార్ శ్యాంప్రసాద్, ఎంపీడీవో జానకి తదితరులు పాల్గొన్నారు. సాక్షి, విశాఖపట్నం: స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ మళ్లీ మొదలైందని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం విధులకు వెళ్లిన కాంట్రాక్ట్ కార్మికులు ఆయా ప్రవేశ గేట్ల వద్ద బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం ప్రయత్నించినప్పటికి వీలు కాలేదు. సుమారు 250 మంది కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు కాకపోవడంతో సాంకేతిక సమస్య అనుకున్నారు. తీరా కార్మిక సంఘాల నాయకులు వాకబు చేయగా వారిని బయోమెట్రిక్ నుంచి తొలగించినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలియవచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం మేరకు తొలగింపు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ జరుగుతున్నట్టు సమాచారం. ఈ అంశంపై విభాగంలోని అధికారులను వివిధ సంఘాల నాయకులు ప్రశ్నించగా తమకు ఏం తెలియదంటూ దాట వేశారని ఆరోపించారు. ఈ అంశంపై పోరాటానికి సన్నద్ధమవుతున్నామని కార్మిక నాయకులు తెలిపారు. 28న విశాఖ న్యాయవాదుల సంఘం ఎన్నికలు విశాఖ లీగల్ : ప్రతిష్టాత్మకమైన విశాఖ న్యాయవాదుల సంఘం నూతన వార్షిక ఎన్నికలు ఈనెల 28వ తేదీన జరుగుతాయని సంఘం అధ్యక్షుడు బెవర సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఎన్నికల అధికారిగా ప్రముఖ న్యాయవాది జి.ఎం. రెడ్డి నియమితులయ్యారు. 15 రోజులు ముందు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇప్పటికే వివిధ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. న్యాయవాదులందరూ ఓటు హక్కు పొందడానికి తక్షణమే తమ సభ్యత్వ రుసుము చెల్లించాలని సంఘం కార్యదర్శి డి.నరేష్ కోరారు. ప్రధానంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష,కార్యదర్శి పదవులకు గట్టి పోటీ ఉంది. 12 లేదా 13 తేదీల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. -
వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్, విడుదల
డాబాగార్డెన్స్: గుడివాడ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త శ్యాంసుందర్ను విశాఖ వన్టౌన్ పోలీసులు తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టకుండా వైఎస్సార్సీపీ కేడర్ని టార్గెట్ చేస్తూ, వేధించడం సరికాదన్నారు. శ్యామ్సుందర్ కుటుంబ సభ్యుల పరిస్థితి తెలుసుకుని వారికి యువకుడికి ష్యూరిటీ ఇప్పించి 41 నోటీసు ద్వారా విడిపించి, తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అప్రమత్తమైన వైఎస్సార్సీపీ కేడర్ : వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త శ్యాంసుందర్ను వన్టౌన్ పోలీసులు అరెస్టు చేయడాన్ని తెలుసుకున్న వాసుపల్లి, స్థానిక నాయకుల్ని అప్రమత్తం చేశారు. తక్షణమే పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిందిగా సూచించారు. పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సనపల రవీంద్రభరత్, పలు వార్డుల నాయకులు పీతల వాసు, ముత్తాబత్తుల రమేష్, యువజన విభాగం అధ్యక్షుడు, తాడి రవితేజ, సోషల్ మీడియా ప్రెసిడెంట్ బెవర మహేష్, కంటుముచ్చు సాగర్, సూర్యనాయుడు, గోపిరాజు వన్టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సీఐతో మాట్లాడారు. ష్యూరిటీ ఇప్పించి, 41 నోటీస్ ద్వారా శ్యామ్ సుందర్ను విడిపించారు. అనంతరం శ్యామ్సుందర్ మాట్లాడుతూ వాసుపల్లి గణేష్కుమార్కు, నియోజకవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
మహిళలకిచ్చిన హామీలేమయ్యాయి?
సీతమ్మధార: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా దినోత్సవం స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయని ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిలి విమల విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా సమాఖ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ‘గౌరవప్రదమైన జీవితం దాతృత్వం కాదు.. అది మన హక్కు’ అనే నినాదంతో శుక్రవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా విమల మాట్లాడుతూ పాలకుల మాటల్లోనే మహిళా సాధికారత ఉందని, చేతల్లో లేదని విమర్శించారు. శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తి క్రమంగా కనుమరుగు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం ఓటు బ్యాంకు రాజకీయాలకు వేదికగా మారిపోతోందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసం కురిపించిన హామీలు ఒక్కటి కూడా అమలు కావడం లేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం హామీలే ఇందుకు నిదర్శనమన్నారు. రాజ్యాంగం అందించిన సమానత్వం 75 ఏళ్లు అయినా సాధ్యం కాలేదని, నిత్యం మహిళా సమాజంపై దాడులు పెరుగుతున్నా పాలకులకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పాలనలో మహిళా సమాజం మరో వంద ఏళ్లు వెనక్కి వెళ్లిపోతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా దినోత్సవం అందించిన పోరాట స్ఫూర్తితో మహిళలు మరింత చైతన్యవంతంగా ఉద్యమాల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి ఎం.ఎ.బేగం, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కె.వనజాక్షి, నాయకులు ఎ.దేవుడమ్మ, అరుణ, అన్నపూర్ణ, జి.జయ, బి.పుష్పలత, పావని పాల్గొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం,తల్లికి వందనం అమలు ఎప్పుడు? మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమల -
విజయోస్తు సీ్త్రరస్తు...!
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025విజయోస్తు సీ్త్రరస్తు..! ఆటోతో జీవన ప్రయాణం ఆటో నడుపుతూ వాణికుమారి డాబాగార్డెన్స్: ఆటో డ్రైవర్ అనగానే మనకు పురుషులే గుర్తుకొస్తారు. డ్రైవింగ్ ఫీల్డ్ కష్టంతో కూడుకున్నది కావడంతో.. మహిళలు ఈ రంగంవైపు పెద్దగా ఆసక్తి చూపరు. డ్రైవింగ్ ఫీల్డులోకి వచ్చిన మహిళల్లోనూ ఎక్కువ మంది కొన్నేళ్లు మాత్రమే ఈ రంగంలో ఉంటారు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ మీరు ఇప్పుడు చూస్తున్న మహిళ మాత్రం 23 ఏళ్లుగా.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆరిలోవకుచెందిన వాసంశెట్టి వాణికుమారికి భర్త లేడు..కుమార్తెతో కలిసి జీవిస్తోంది. డ్రైవింగ్ నేర్చుకుంది. దీంతో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుమార్తెను డిగ్రీ వరకు చదివించింది. ఆరిలోవ..జగదాంబ జంక్షన్, తిరిగి జగదాంబ జంక్షన్–ఆరిలోవ వరకు టికెట్ సర్వీస్ చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా టికెట్ సర్వీస్ చేస్తూ ఆదాయం పొందుతోంది. తనకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందని, రుణం తీసుకుని సొంతంగా ఆటో కొనుగోలు చేశానని వాణి కుమారి చెప్పారు. -
సైబర్ నేరాల కట్టడికి 12 మంది నియామకం
విశాఖ సిటీ: నగరంలో సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు కంప్యూటర్ నైపుణ్యం ఉన్న 12 మందిని బీ కేటగిరీ హోంగార్డులుగా నియమించారు. వీరికి శుక్రవారం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి నియామక పత్రాలు అందజేశారు. మరో ఇద్దరిపై పీడీ యాక్ట్ అల్లిపురం: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్ పరిధి అంబేడ్కర్ కాలనీకి చెందిన రావాడ ఉదయ్ భాస్కర్, ఈతలపాక రాజ్కుమార్లపై పీడీ యాక్ట్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వీరిద్దరూ పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఏడాది కాలం పాటు వీరికి నగర బహిష్కరణ విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
‘హోలీ’కి ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: హోలీ సందర్భంగా ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ ఓ ప్రకటనలో తెలిపారు. ● భువనేశ్వర్–చర్లపల్లి(08479) స్పెషల్ ఈ నెల 10, 17, 24వ తేదీల్లో భువనేశ్వర్లో మధ్యాహ్నం 12.10 గంటలకు బయల్దేరి సాయంత్రం 6.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 6.32 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు చర్లపల్లి వెళ్తుంది. చర్లపల్లి–భువనేశ్వర్(08480) హోలీ స్పెషల్ ఈ నెల 11, 18, 25వ తేదీల్లో ఉదయం 9.50గంటలకు చర్లపల్లిలో బయల్దేరి అదే రోజు రాత్రి 9.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 9.32 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.10గంటలకు భువనేశ్వర్ వెళ్తుంది. ● విశాఖపట్నం–ఎస్ఎంవీ బెంగళూరు(08549) స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 9, 16, 23వ తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరి, మరుసటిరోజు మధ్యాహ్నం 12.45 గంటలకు ఎస్ఎంవీ బెంగళూరు చేరుకుంటుంది. ఎస్ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం(08550) స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 10, 17, 24వ తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు ఎస్ఎంవీ బెంగళూరులో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ● బనారస్–విశాఖపట్నం(05042) వన్ వే స్పెషల్ ఈ నెల 8వ తేదీ రాత్రి 10.50 గంటలకు బనారస్లో బయల్దేరి 10వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ● ఆజంఘడ్–విశాఖపట్నం (05040) వన్ వే స్పెషల్ ఈ నెల 8న రాత్రి 11.55 గంటలకు ఆజంఘడ్లో బయల్దేరి 10వ తేదీ సాయంత్రం 4.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. జిల్లా టూరిజం ఇన్చార్జ్ అధికారిగా సుధాసాగర్ సాక్షి, విశాఖపట్నం: రుషికొండ బ్లూఫ్లాగ్ బీచ్ సర్టిఫికేషన్ కోల్పోయిన తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టిన పర్యాటక శాఖ.. ఏం చెయ్యాలనే దానిపై తర్జనభర్జనలు పడుతోంది. ఇన్చార్జ్ ఆర్డీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రమణ ప్రసాద్ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో.. బ్లూఫ్లాగ్ బీచ్ ఆనవాళ్లు కోల్పోయి.. గుర్తింపు కూడా రద్దైన విషయం తెలిసిందే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన.. హడావిడిగా ప్రభుత్వం అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టింది. ఈ ప్రక్రియ నిర్వహించిన నాలుగు రోజులకే మళ్లీ ఆర్డర్లు మార్చేశారు. ముందుగా జిల్లా టూరిజం అధికారిగా ప్రస్తుతం అల్లూరి జిల్లా డీటీవోగా వ్యవహరిస్తున్న గరికిన దాసుని నియమిస్తూ పర్యాటక శాఖ ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బాధ్యతలు చేపట్టేలోపే.. మరొకరికి బాధ్యతలు అప్పగిస్తూ మరో సర్క్యులర్ జారీ చేసింది. వాస్తవానికి దాసు శుక్రవారం డీటీవోగా బాధ్యతలు చేపట్టనున్నట్లు కలెక్టర్కు తెలిపారు. ఈలోగా.. గురవారం అర్ధరాత్రి డీటీవోగా డిప్యూటీ కలెక్టర్ సుధాసాగర్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పర్యాటకశాఖ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. ప్రస్తుతం సుధాసాగర్ హెచ్పీసీఎల్ ల్యాండ్ ఎక్విజిషన్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనకాపల్లిలో బీబీఎస్ వీక్లీ ఎక్స్ప్రెస్కు హాల్ట్ ఎంవీపీకాలనీ: రామేశ్వరం–భువనేశ్వర్ మధ్య ప్రయాణించే బీబీఎస్ వీక్లీ ఎక్స్ప్రెస్(20895/96) అనకాపల్లి స్టేషన్లో ఆగనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ బి.సునీత శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా ఈ రైలు అనకాపల్లిలో హాల్ట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
హెల్త్సిటీలో రక్త రుగ్మతల కేంద్రం ప్రారంభం
ఆరిలోవ: హెల్త్సిటీ యునిక్ ఆస్పత్రిలో మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో రక్త రుగ్మతుల కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రాన్ని ప్రముఖ వైద్యుడు డాక్టర్ మామ్మెన్ చాందీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సికిల్ సెల్, తలసేమియాతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారన్నారు. అలాంటి వారికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఈ కేంద్రాన్ని నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కేంద్రం విశాఖలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఊన్న మురళీకృష్ణను అభినందించారు. నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడు మాట్లాడుతూ విశాఖలో రక్త రుగ్మతుల కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య సంరక్షణలో కీలక ముందుడుగు పడిందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. అలాంటి సమస్యల నివారణకు ఈ కేంద్రం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఏపీతోపాటు ఒడిశా, చత్తీస్గఢ్లలో ఎక్కడా రక్త వ్యాధులను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా హెమటాలజీ కేంద్రం లేదన్నారు. ఈ లోటును భర్తీ చేయడానికి ఇక్కడ సమగ్ర రక్త రుగ్మతల కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పలువురు ఆంకాలజీ విభాగం వైద్యులు పాల్గొన్నారు. -
ఆ రోజుల్లో.. అండగా.!
సాక్షి, విశాఖపట్నం : మహిళలు రుతుక్రమంలో శుభ్రంగా ఉండటం ఎంతో అవసరం. అందుకు కావాల్సిన ఉత్పత్తులు ఆ సమయానికి అందుబాటులో లేకపోతే.? పనిలో ఉన్నా.. కార్యాలయంలో ఉన్నా.. సినిమా హాల్లో ఉన్నా.. అకస్మాత్తుగా పీరియడ్స్ వస్తే..? ఏం చేయాలి. ఎక్కడికి వెళ్లాలి.? ఎలా శానిటరీ ప్యాడ్స్ కొనుగోలు చేయాలి.? దీనిపై ఇప్పటికీ మహిళలకు ఎన్నో సందేహాలున్నాయి. గతంలో ఎదురైన అనుభవాలు ఆమెకు పాఠాలు నేర్పాయి. భవిష్యత్తులో ఆ రోజుల్లో మహిళలు సులువుగా ప్యాడ్స్ పొందేందుకు శానిటరీ న్యాప్కిన్స్ వెండింగ్ మెషీన్లు తయారు చేయాలన్న ఆలోచన అంకురించి.. మార్కెట్లోకి తీసుకొచ్చారు బొడ్డేటి ఝాన్సీ రాణి. మహిళల అవసరాలకు అనుగుణంగా వెండింగ్ మెషీన్ల తయారీ సంస్థ ఎన్సీకోడ్ వెండింగ్ సిస్టమ్స్ కో ఫౌండర్గా వ్యవహరిస్తున్న ఝాన్సీ రాణి.. 2021 నుంచి మహిళలకు అవసరమైన మెషీన్ల తయారు చేస్తూ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అధునాతన శానిటరీ న్యాప్కిన్ వెండింగ్ మెషీన్లు అందుబాటులోకి తీసుకొచ్చి.. మహిళల్లో రుతుస్రావ సమయంలో అభయమిచ్చేలా రూపొందిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ స్టార్టప్ హబ్ (ఆ హబ్లో)లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ఉత్తమ నాణ్యత గల శానిటరీ న్యాప్కిన్లను సులభంగా అందించే ఏర్పాటు చేశారు. నాణెం లేదా టోకెన్లు వేస్తే న్యాప్కిన్స్ అందుబాటులోకి వచ్చేస్తాయి. ఏవైనా సంస్థలు తమ మహిళా ఉద్యోగులకు అండగా నిలిచేలా ఉచితంగా ప్యాడ్స్ పంపిణీ చేయాలంటే.. మెషీన్లో ఏర్పాటు చేసిన వ్యవస్థలో ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే.. ఓటీపీ వస్తుంది. ఓటీపీ కొడితే.. ప్యాడ్ పొందేలా మెషీన్ని రూపొందించామని ఝాన్సీరాణి తెలిపారు. ఈ తరహా మెషీన్లు విద్యా సంస్థల్లోనూ, కార్యాలయాల్లో అందుబాటులో ఉంటే.. ఆ రోజుల్లో సెలవులు పెట్టే అవసరం ఉండబోదని ధీమాగా చెబుతున్నారు. ఇది మహిళా ఉద్యోగులు, విద్యార్థుల్లో మనోబలాన్ని పెంచుతుందని ఝాన్సీరాణి స్పష్టం చేస్తున్నారు. మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్ వెండింగ్ మెషీన్లు ప్రధాన కంపెనీల్లో ప్రత్యేకంగా ఏర్పాటు -
నైవేద్యం హోటల్ ప్రారంభం
సింహాచలం: హనుమంతవాక నుంచి అడవివరం వెళ్లే బీఆర్టీఎస్ రోడ్డు.. సింహాచలం కొండపైకి వెళ్లే రెండో ఘాట్రోడ్డు టోల్గేట్కు సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన నైవేద్యం అల్పాహార హోటల్ను త్రిదండి చినజీయర్స్వామి ప్రారంభించారు. ఈసందర్భంగా చినజీయర్స్వామి మాట్లాడుతూ పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ పెంకుటింట్లో సంప్రదాయ రుచులతో నైవేద్యం హోటల్ను ఏర్పాటు చేయడం ఎంతో బాగుందన్నారు. ఈ సందర్భంగా హోటల్ యజమాని వాకాడ రాజశేఖర్రెడ్డి, ఆయన సోదరుడు వాకాడ శరత్కుమార్రెడ్డిలకు ఆశీసులు అందజేశారు. ఈనెల 14 నుంచి హోటల్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. హోటల్లో ఏర్పాటు చేసిన కిచెన్ను సైకాలజిస్ట్ కర్రి భాగ్యార్కసిన్హా ప్రారంభించారు. కర్రి పాపారాయుడు, సీఐ డాక్టర్ బెండి వెంకట్రావు, వర్మ, నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
No Headline
సీతమ్మధార : ఆమె వయసు 94. ఇంట్లో హాయిగా మనమలు, మనవరాళ్లతో కాలక్షేపం చేసే వయసు. వృద్ధాప్యాన్ని పక్కన పెట్టి..ఓపిక ఉన్నంతవరకు కష్టపడతానంటోంది. సీతమ్మధార రైతు బజార్లో ఓ స్టాల్లో గ్రీన్పీస్, క్యారెట్ అమ్మూతూ జీవనం సాగిస్తోంది. భీమిలి మండలం చేపలుప్పాడకు చెందిన వృద్ధ రైతు పేరు నారాయణమ్మ. అందరూ శబరి అని పిలుస్తారు. ఇప్పటికీ ఎంతో హుషారుగా రైతు బజార్కు వచ్చి వెళుతుంటుంది. 20 ఏళ్లుగా సీతమ్మధార రైతు బజార్లో గ్రీన్పీస్, క్యారెట్ విక్రయాలు జరుపుతూ అందరికీ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తోంది. భర్త మృతి చెందగా..ఐదుగురు సంతానం. ఇంట్లో ఖాళీగా ఉండడం నచ్చదు..అందుకే ఇప్పటికీ రైతు బజార్లో విక్రయాలు జరుపుతున్నానని శబరి చెప్పింది. రైతు బజార్కు వచ్చినవాళ్లంతా ఆమెను చూసి వహ్వా..అవ్వా అంటూ శబరి వద్ద కొనుగోలు చేస్తున్నారు. -
కల్లుగీత కులాలకు వైన్షాపుల కేటాయింపు
విశాఖ సిటీ: కల్లుగీత కులాలకు వైన్షాప్ల లాటరీ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో సాయంత్రం 4 గంటలకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ చేతుల మీదుగా లాటరీ తీసి షాపులను కేటాయించారు. జిల్లాలో మొత్తం 14 షాపులకు గాను 316 దరఖాస్తులు వచ్చాయి. జీవీఎంసీ పరిధిలో ఉన్న 11 షాపుల్లో గౌడ, యాత కులాలకు ఒక్కోటి, శెట్టిబలిజకు తొమ్మిది, ఆనందపురంలో ఒకటి గౌడకు, భీమిలి, పద్మనాభం మండలాల్లో ఒక్కోటి శెట్టిబలిజకు కేటాయించారు. వీరిలో కొందరు రెండు, మూడు దరఖాస్తులు చేశారు. మొత్తంగా 121 మంది 14 షాపుల కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జీవీఎంసీ పరిధిలో ఒక షాపు కోసం మొత్తం 35 దరఖాస్తులు రావడం గమనార్హం. దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.6.32 కోట్లు ఆదాయం సమకూరింది. దరఖాస్తుదారుల సమక్షంలో జాయింట్ కలెక్టర్ లాటరీ తీసి షాపులు పొందిన వారి పేర్లను ప్రకటించారు. షాపులు దక్కించుకున్న 14 మంది తొలి వాయిదా కింద మొత్తంగా రూ.94,16,750 చెల్లించారు. వీరికి ప్రొవిజినల్ లైసెన్సులు మంజూరు చేశారు. ఈ లాటరీ ప్రక్రియలో ప్రొహిబిషనల్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఉక్కును కాపాడుకోవడమే నా విధానం : అయోధ్యరామ్
స్టీల్ప్లాంట్ నోటీసులపై స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్ గట్టిగానే స్పందించారు. నోటీసులతో గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే.. వేల గొంతులు ఒక్కటై పిక్కటిల్లేలా ఉద్యమిస్తామని హెచ్చరించారు. నోటీసుకు ప్రతిస్పందనగా యాజమాన్యానికి లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల హక్కుల గురించి పోరాడటమే తన విధానమనీ.. స్టీల్ప్లాంట్ని కాపాడుకునేంత వరకూ రోడ్డెక్కి ఉద్యమిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. సీఐటీయూ నాయకునిగా కార్మికుల సమస్యలపై పోరాడటం తమ బాధ్యత అన్నారు. నోటీసులో పేర్కొన్న సమస్యలపై తమ పోరాటం కొనసాగిస్తామే తప్ప భయపడేది లేదని తెగేసి చెప్పారు. -
ఉక్కు పరిరక్షణకు 14న నిరసన
డాబాగార్డెన్స్: విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేయాలన్న డిమాండ్లతో ఈ నెల 14న అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని విజయవాడలో జరిగిన రాష్ట్ర జేఏసీ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు విశాఖ జిల్లాలో నిరసన ప్రదర్శనలు జయప్రదం చేసేందుకు కార్యాచరణపై సిటూ కార్యాలయంలో అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ గురువారం సమావేశమైంది. సమావేశంలో జేఏసీ చైర్మన్ మరడాన జగ్గునాయుడు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించిన నుంచి ఇప్పటి వరకు జేఏసీ ఆధ్వర్యంలో పోరాడుతున్నామన్నారు. కార్మికుల సమస్యలపై మాట్లాడినందుకు యూనియన్ గౌరవ అధ్యక్షుడు అయోధ్యరామ్కి షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ నెల 14న జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి నిర్వహించనున్న నిరసన ప్రదర్శనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిటూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్, ఏపీఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి దేవా, సీఎఫ్టీయూఐ జిల్లా కార్యదర్శి లక్ష్మి, ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ కమిటీ కో కన్వీనర్ కుమార మంగళం, శ్రామిక మహిళా కన్వీనర్ పి.మణి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఐజే నాయుడు, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.సంతోష్, మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
షోకాజ్!
ఉక్కు ఉద్యమంపై● నినదించే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న స్టీల్ప్లాంట్ యాజమాన్యం ● స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్కు షోకాజ్ నోటీసు ● యాజమాన్య వైఖరికి నిరసనగా నేడు స్టీల్ సీఐటీయూ ధర్నా సాక్షి, విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలా గాడిలో పెట్టాలన్నదానిపై ఆలోచనలు చేయకుండా.. ఉక్కు భవిష్యత్తు కోసం పోరాడుతున్న వారిపై జులుం ప్రదర్శించడంలో స్టీల్ప్లాంట్ యాజమాన్యం అత్యుత్సాహం చూపిస్తోంది. వైజాగ్ స్టీల్ప్లాంట్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న ఉక్కు సంకల్పంతో పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకుల్ని భయపెట్టేందుకు యాజమాన్యం షోకాజ్లు జారీ చేస్తోంది. ఆది నుంచి పోరుబాటలో ముందున్న స్టీల్ప్లాంట్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిరంతర పోరాటాల వల్లే.. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నోట నుంచి వచ్చినప్పటి నుంచి ఉద్యమ జ్వాల ఎగసిపడింది. అప్పటి నుంచి విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు అన్ని సంఘాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం, నిరంతరం రోడ్లపై ఉద్యోగ కార్మిక సంఘాలు పోరాటం చేయడం వల్ల.. నాలుగేళ్లుగా విశాఖ స్టీల్ప్లాంట్ జోలికి కేంద్రం రాలేకపోయింది. తాజాగా దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లుగా రూ.11 వేల కోట్లు ప్యాకేజీని ప్రకటించింది. తాత్కాలిక ఉపశమనం కల్పించినా.. ఆర్ఐఎన్ఎల్కు ప్రైవేటీకరణ ముప్పు మాత్రం ఇంకా పొంచి ఉండటంతో ఉద్యమ నాయకులు పోరాటం ఆపలేదు. అయితే స్టీల్ప్లాంట్ గురించి ఎక్కడా మాట్లాడకూడదు.. వీఆర్ఎస్, హెచ్ఆర్ఏ, ఉద్యోగులు, కార్మికుల జీతాల కోసం ఎక్కడా నోరు మెదపకూడదంటూ యాజమాన్యం ఆంక్షలు విధించింది. అయినా.. కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు ఎక్కడా వెనకడుగు వేయకుండా హెచ్ఆర్ఏ, విద్యుత్ చార్జీలు, వీఆర్ఎస్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై నిరంతరం రోడ్డెక్కి పోరాడుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టీల్ప్లాంట్ సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్కు యాజమాన్యం గురువారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా సీఐటీయూ గౌరవాధ్యక్షునిగా ప్రచారం చేశారంటూ మండిపడుతూ.. ఈ చర్యలపై ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఎంఎంఎస్ఎం డిపార్ట్మెంట్ డిసిప్లినరీ అథారిటీ డీజీఎం(ఎలక్ట్రికల్) ఉమాకాంత్ గుప్తా నోటీసులో పేర్కొన్నారు. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ.. స్టీల్ యాజమాన్యం అయోధ్యరామ్కు షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై సీఐటీయూ శ్రేణులు మండిపడుతున్నాయి. అధికారుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 8 నుంచి స్టీల్ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం వద్ద ధర్నా చేస్తామని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రామస్వామి తెలిపారు. నోటీసులు వెనక్కు తీసుకునేంత వరకూ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. -
విద్యా సంస్థలతో పరిశ్రమల సమావేశం నేడు
మద్దిలపాలెం: స్థానిక డాక్టర్ వీఎస్ కృష్ణా కళాశాలలో విద్యా సంస్థలతో పారిశ్రామిక వ్యవస్థల అనుసంధానంపై శుక్రవారం సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ.విజయబాబు తెలిపారు. ఈమేరకు గురువారం కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 50 పరిశ్రమలు భాగస్వామ్యం కానున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకునేందుకు, ఇంటర్న్షిప్లు, పరిశోధన అవకాశాలకు సదస్సు దోహదపడుతుందన్నారు. పారిశ్రామిక సంస్థలు ఏ అంశాల్లో విద్యార్థుల నైపుణ్యతను ఆశిస్తున్నాయో తెలుసుకునే వీలుంటుందన్నారు. దానికి అనుగుణంగా విద్యార్థులకు విద్యా సంస్థల్లో శిక్షణ అందించి, ఉద్యోగులుగా తీర్చిదిద్దే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. -
కల్లుగీత కులాలకు వైన్షాపుల కేటాయింపు
విశాఖ సిటీ: కల్లుగీత కులాలకు వైన్షాప్ల లాటరీ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో సాయంత్రం 4 గంటలకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ చేతుల మీదుగా లాటరీ తీసి షాపులను కేటాయించారు. జిల్లాలో మొత్తం 14 షాపులకు గాను 316 దరఖాస్తులు వచ్చాయి. జీవీఎంసీ పరిధిలో ఉన్న 11 షాపుల్లో గౌడ, యాత కులాలకు ఒక్కోటి, శెట్టిబలిజకు తొమ్మిది, ఆనందపురంలో ఒకటి గౌడకు, భీమిలి, పద్మనాభం మండలాల్లో ఒక్కోటి శెట్టిబలిజకు కేటాయించారు. వీరిలో కొందరు రెండు, మూడు దరఖాస్తులు చేశారు. మొత్తంగా 121 మంది 14 షాపుల కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జీవీఎంసీ పరిధిలో ఒక షాపు కోసం మొత్తం 35 దరఖాస్తులు రావడం గమనార్హం. దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.6.32 కోట్లు ఆదాయం సమకూరింది. దరఖాస్తుదారుల సమక్షంలో జాయింట్ కలెక్టర్ లాటరీ తీసి షాపులు పొందిన వారి పేర్లను ప్రకటించారు. షాపులు దక్కించుకున్న 14 మంది తొలి వాయిదా కింద మొత్తంగా రూ.94,16,750 చెల్లించారు. వీరికి ప్రొవిజినల్ లైసెన్సులు మంజూరు చేశారు. ఈ లాటరీ ప్రక్రియలో ప్రొహిబిషనల్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జనతాబజార్లో జెడ్సీ పేరుతో దందా
అడ్డంగా బుకై ్కన అసోసియేషన్ నాయకులు జగదాంబ: జనతా బజార్లో జోనల్ కమిషనర్ పేరుతో జరుగుతున్న వసూళ్ల దందా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీవీఎంసీ జోన్–4 పరిధిలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న జనతా బజార్లో అసోసియేషన్ నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఇరువర్గాల తగాదాలో బయటపడింది. 72 దుకాణాలు కలిగిన ఈ బజారు సముదాయం నుంచి జీవీఎంసీకి రూ.9కోట్లకు పైగా అద్దె బకాయిలు పేరుకుపోయాయి. బకాయిల వసూలుకు జెడ్సీ ఎం.మల్లయ్యనాయుడు బుధవారం సిబ్బందితో బజార్కు వచ్చారు. బకాయిలు వెంటనే చెల్లించాలని, లేదంటే దుకాణాలు ఖాళీ చేయాల్సి వస్తుందని వ్యాపారులను హెచ్చరించి వెళ్లారు. ఇది జనతా బజార్ వ్యాపారులకు, అసోసియేషన్ నాయకులకు మధ్య చిచ్చు రేపింది. ‘అద్దె చెల్లింపులకు జోనల్ కమిషనర్ నుంచి సమయం తీసుకువస్తామని నమ్మించి, నెల నెలా జెడ్సీ పేరుతో డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు జెడ్సీ ఎందుకు వచ్చారు.’ అని వ్యాపారులు అసోసియేషన్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో ఒక్కో దుకాణం నుంచి రూ.10వేల చొప్పున రూ.3లక్షల వరకు బలవంతంగా వసూలు చేశారని వ్యాపారులు ఆరోపించారు. వసూలు చేసిన డబ్బుల లెక్కలు తేల్చాలని నిలదీయడంతో తోపులాట జరిగింది. ఈ ఘర్షణతో అసోసియేషన్ నాయకుల గుట్టు రట్టయింది. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ తన పేరుతో డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. జనతా బజార్లో వేలం పాటలు లేకుండా అక్రమంగా దుకాణాలను అద్దెలకు ఇస్తున్న వారిపై కూడా చర్యలు తప్పవన్నారు. కార్పొరేషన్ ఆస్తిని అక్రమంగా అనుభవిస్తూ.. పైగా జోనల్ కమిషనర్ పేరును ఉపయోగించుకుని మోసం చేసిన వారిని వదిలి పెట్టేదిలేదన్నారు. -
చందనోత్సవ ఏర్పాట్లపై ముందస్తు సమీక్ష
● త్వరలో కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం ● సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు సింహాచలం: వచ్చే నెల 8న జరిగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం, 30న జరిగే చందనోత్సవంలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తామని సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు తెలిపారు. ఈ వేడుకల నిర్వహణపై దేవస్థానం విభాగాధిపతులతో గురువారం ముందస్తు సమీక్ష నిర్వహించారు. గత చందనోత్సవాల్లో చోటుచేసుకున్న లోటుపాట్లపై చర్చించారు. వాటిని పునరావృతం కానీయరాదన్నారు. వారం రోజులపాటు జరిగే వార్షిక కల్యాణోత్సవాల్లో వైదిక కార్యక్రమాలు, చందనోత్సవం రోజు జరిగే వైదిక కార్యక్రమాలపై ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసచార్యులతో చర్చించారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని సూచించారు. క్యూల ఏర్పాటు, శానిటేషన్, ఇంజినీరింగ్ పనులు, అన్నదానం తదితర పనులపై కూలంకషంగా చర్చించారు. త్వరలోనే జిల్లా కలెక్టర్తో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో దేవస్థానం డిప్యూటీ ఈవో రాధ, ఈఈలు శ్రీనివాసరాజు, రాంబాబు, డీఈ హరి, ఏఈవో శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు నరసింగరావు, రాజ్యలక్ష్మి, త్రిమూర్తులు, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. -
దారి తప్పిన ‘మహా ప్రస్థానం’
మహారాణిపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన నిరుపేద రోగుల మృతదేహాలను ఉచితంగా వారి స్వగ్రామాలకు తరలించేందుకు ప్రభుత్వం మహా ప్రస్థానం వాహనాలను ప్రవేశపెట్టింది. అయితే అవి నేడు కొందరి అత్యాశకు దారి తప్పుతున్నాయి. ఉచితంగా అందించాల్సిన సేవలకు సైతం కొందరు డ్రైవర్లు డబ్బులు వసూలు చేస్తూ పేద ప్రజలను మరింత బాధిస్తున్నారు. ఒక్కో మృతదేహాన్ని తరలించేందుకు రూ. 2వేల నుంచి రూ. 3 వేల వరకు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2017లో పేద ప్రజలకు మృతదేహాల తరలింపు భారం కాకూడదని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ప్రైవేట్ వాహనాలు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న నేపథ్యంలో మహాప్రస్థానం వాహనాల ద్వారా ఉచితంగా మృతదేహాలను తరలించే సౌకర్యాన్ని కల్పించింది. కేజీహెచ్లో ప్రారంభంలో ఆరు వాహనాలను ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం వాటి సంఖ్యను తొమ్మిదికి పెంచారు. రోజుకు 25 నుంచి 30 మృతదేహాలను ఈ వాహనాల ద్వారా తరలిస్తున్నారు. అయితే కొందరు డ్రైవర్లు మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి, ఉచితంగా అందించాల్సిన సేవలకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రుల్లో, రోడ్డు ప్రమాదాల్లో, ఎంఎల్సీ కేసుల్లో మరణించిన వారి బంధువుల నుంచి బలవంతంగా డబ్బులు గుంజుతున్నారని సమాచారం. డబ్బులు ఇవ్వకపోతే మృతదేహాలను మధ్యలోనే వదిలి వెళ్లిపోతామని బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులు డ్రైవర్లు అడిగినంత డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. వాస్తవానికి కేజీహెచ్ నుంచి అనకాపల్లి, విజయనగరం వరకు మహాప్రస్థానం వాహనాల ద్వారా ఉచితంగా మృతదేహాలను తరలించేందుకు అనుమతి ఉంది. అంతేకాకుండా మృతుల బంధువుల అభ్యర్థన మేరకు, సంబంధిత అధికారుల అనుమతితో అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలకు కూడా ఈ వాహనాల ద్వారా మృతదేహాలను తరలిస్తున్నారు. వాహనాల డ్రైవర్ల జీతాలు, ఇంధన ఖర్చులు, ఇతర నిర్వహణ ఖర్చులను ఇంటిగ్రేటెడ్ హెల్త్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తోంది. పేద ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుంటారు. వీరు ఆర్థికంగా చితికిపోయి ఉంటారు. ఇటీవల ఓ తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై పాడేరుకు తీసుకువెళ్లిన సంఘటన పేదల కష్టాలను కళ్లకు కట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో.. మహాప్రస్థానం వాహనాల డ్రైవర్లు డబ్బులు డిమాండ్ చేయడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా అధికారులు పట్టించుకోవడం లేదని రోగుల బంధువులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, పేదలను దోచుకుంటున్న డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మృతదేహాల తరలింపునకు రూ.2 వేలు వసూలు చేస్తున్న వాహన డ్రైవర్లు వాస్తవానికి ఈ తరలింపు పూర్తి ఉచితం వాహనాల నిర్వహణ బాధ్యత కేజీహెచ్దే.. కానీ మరణించిన వారి కుటుంబ సభ్యుల నుంచి దౌర్జన్యంగా డబ్బుల వసూళ్లు -
రేపు జాతీయ లోక్ అదాలత్
విశాఖ లీగల్ : విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన జిల్లాలో అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటారు ప్రమాదాల నష్టపరిహారాల కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్, బ్యాంకు, మనీ రికవరి కేసులు, ల్యాండ్ అక్విజిషన్ కేసులు, కార్మిక, కుటుంబ తగదాలు(విడాకులు కేసులు కాకుండా), పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. -
వీఎంఆర్డీఏ తహసీల్దార్పై ఫిర్యాదులు
విశాఖ సిటీ: వీఎంఆర్డీఏలో తహసీల్దార్(భూసేకరణ)గా విధులు నిర్వర్తిస్తున్న కోరాడ వేణుగోపాల్పై వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఎస్.రాయవరం మండలం తహసీల్దార్గా పనిచేసిన సమయంలో చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయా లని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆయనపై చట్టపరంగానే కాకుండా సర్వీస్ నిబంధనల ప్రకారం చర్య లు తీసుకోవాలని సీఎం, డిప్యూటీ సీఎం, హెచ్ఆర్డీ మంత్రి, డీజీపీ, సీసీఎల్ఏ, ఇతర అధికారులతో పాటు వీఎంఆర్డీఏ చైర్మన్కు కూడా రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. గతంలో తప్పుడు ధృవపత్రాలు సమర్పించి ఎంపీటీసీ, ఎంపీపీలుగా గెలిచినట్లు నిర్ధారణ అయినప్పటికీ.. ఎన్నికల్లో వారిని అనర్హులుగా ప్రకటించకపోవడంపై వేణుగోపాల్పై విచారణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఆయన ఎస్.రాయవరంలో తహసీల్దార్గా పనిచేసిన సమయంలో అనేక అవకతవకలకు పాల్పడి భూ అక్రమాలకు అండగా నిలిచారని.. దీనిపై కూడా విచారించాలని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి అవినీతి ఆరోపణలు ఉన్న వేణుగోపాల్ను హోం మంత్రి వంగలపూడి అనిత పీఎస్గా నియమించాలని ప్రయత్నిస్తుండడం సరైన నిర్ణయం కాదని వారు లేఖలో పేర్కొన్నారు. -
మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం
● మహిళా చేతన ప్రధాన కార్యదర్శి పద్మ సీతమ్మధార: మహిళలపై జరుగుతున్న అణచివేత, హింస, దాడులకు వ్యతిరేకంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కె.పద్మ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా చేతన ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ఇంటా బయటా మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల హక్కుల కోసం రాజ్యాంగం రూపొందించిన చట్టాలను పాలకులు నీరుగారుస్తున్నారని విమర్శించారు. మణిపూర్లో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. తల్లి, కుమార్తైపె పోలీసులు రోజులు తరబడి అత్యాచారం చేసిన ఘటన, ప్రేమించినందుకు ఓ యువతిని అడవిలోకి తీసుకెళ్లి తండ్రి హత్య చేసిన ఉదంతం వంటి దారుణాలు ఇటీవల జరిగాయని ఆమె గుర్తు చేశారు. కుల రాజకీయాలు, మతతత్వ దాడుల్లో మహిళలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు పోరాడి సాధించుకున్న గృహ హింస, వరకట్న వేధింపుల చట్టాలను కూడా బలహీనపరుస్తున్నారని ఆందోళన చెందారు. ప్రగతి శీల కార్మిక సమాఖ్య నాయకులు అన్నపూర్ణ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న మహిళా హక్కులను నేడు తిరిగి కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చట్టాలను అమలు చేస్తేనే ఇటువంటి ఘటనలు నియంత్రణలోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. హెచ్ఆర్ఎఫ్ ప్రతినిధి కె.అనురాధ, షాంశాద్ బేగం, లావణ్య, భారత నాస్తిక సమాజం జిల్లా కార్యదర్శి వై. నూకరాజు, రాం ప్రభు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
ఆత్మహత్యాయత్నంనకు పాల్పడిన తండ్రి మృతి
ఆరిలోవ: ఆత్మహత్యాయత్నం చేసిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 13వ వార్డు పరిధి దుర్గాబజార్లో నివాసముంటున్న బి.మణికంఠ(45) 10వ తరగతి చదువుతున్న తన కుమార్తెను ఫోన్ చూడవద్దంటూ హెచ్చరించారు. దీంతో కుమార్తె నిరాకరించడంతో మనస్తాపంతో ఆయన గత నెల 24న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అప్పటికే కొన ఊపిరితో ఉన్న మణికంఠను కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఆయన మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆరిలోవ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాంట్రాక్ట్ కార్మికునికి గాయాలు
ఉక్కునగరం : స్టీల్ప్లాంట్ యుటిలిటీస్ విభాగంలో జరిగిన ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికునికి గాయాలయ్యాయి. స్టీల్ప్లాంట్ పోలీసులు అందించిన వివరాలివి.. విభాగంలో స్కిల్డ్ కార్మికునిగా విధులు నిర్వహిస్తున్న సిహెచ్.ఆనందరెడ్డి (40) గురువారం విభాగంలోని ఏఎస్యూ–1 సెక్షన్లో పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో ఆక్సిజన్ పంప్ బరస్ట్ అయింది. దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో ఆనందరెడ్డికి గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఉక్కు జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి గాజువాకలోని ప్రైవేటు ఆస్పపత్రికి తీసుకెళ్లారు. అతనికి సుమారు 40 శాతం గాయాలయ్యాయి. స్టీల్ప్లాంట్ యాజమాన్యం భద్రతపై దృష్టి సారించాలని స్టీల్ ఐఎన్టీయూసీ చీఫ్ పేట్రన్ నీరుకొండ రామచంద్రరావు డిమాండ్ చేశారు. -
నలుగురు నేరస్తుల నగర బహిష్కరణ
అల్లిపురం: నగరంలో ప్రజా జీవనానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ పలు తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులకు నగర బహిష్కరణ విధిస్తూ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధి ఆర్.హెచ్.కాలనీకి చెందిన కొలగాని పవన్ రాజ్ కుమార్ అలియాస్ పవన్, దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి వడ్లపూడికి చెందిన కాండ్రేగుల లోకనాథ్ వీర సాయి శ్రీనివాస్ అలియాస్ లోకేష్, ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధి ఆర్ అండ్ బీ ప్రాంతానికి చెందిన రావాడ జగదీష్, ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధి చినగదిలి ప్రాంతానికి చెందిన నక్కా లోకేష్ అలియాస్ కిట్టులపై ఈ చర్యలు చేపట్టారు. వీరు అక్రమ రవాణా, దోపి డీలు, మాదకద్రవ్యాల వ్యాపారం, గూండాయిజం, అనైతిక కార్యకలాపాలు, భూ కబ్జాలు వంటి అనేక నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. వీరంతా అనేక నేరాల్లో శిక్షలు అనుభవించినప్పటికీ, వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సెక్షన్–3(1) అండ్ (2) రెడ్ విత్ సెక్షన్ 2(ఎఫ్) అండ్ 2(జీ) కింద అక్రమ రవాణాదా రులు, దోపిడీదారులు, మాదక ద్రవ్యాల నేరస్తులు, గూండాలు, అనైతిక రవాణా నేరస్తులు, భూ కబ్జాదారుల చట్టం, 1986(చట్టం నం.1) కింద వీరిని ఏడాది పాటు నగరం నుంచి బహిష్కరిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది -
భారతదేశం సనాతన ధర్మానికి పుట్టినిల్లు
బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ విజేత విశాఖ ఉక్కు ఉక్కునగరం: జాతీయ స్థాయి ఇంటర్ స్టీల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ను విశాఖ స్టీల్ప్లాంట్ జట్టు కై వసం చేసుకుంది. స్టీల్ప్లాంట్స్ స్పోర్ట్స్ బోర్డు (ఎస్పీఎస్బీ) ఆధ్వర్యంలో దుర్గాపూర్లో మార్చి 3 నుంచి 5 వరకు ఇంటర్ స్టీల్ బ్యాడ్మింటర్ చాంపియన్షిప్ 2024–25 పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విశాఖ స్టీల్ప్లాంట్, దుర్గాపూర్, బిలాయ్, భద్రావతి, బొకారో, సేలం, రూర్కెలా, ఐఎస్పీ బర్న్పూర్ తదితర 9 జట్లు పాల్గొన్నాయి. బుధవారం దుర్గాపూర్తో జరిగిన ఫైనల్స్ పోటీల్లో విశాఖ స్టీల్ప్లాంట్ జట్టు చాంపియన్షిప్ గెలుపొందింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో దుర్గాపూర్ స్టీల్ప్లాంట్ ఈడీ పి.మురుగేషన్ విశాఖ స్టీల్ప్లాంట్ జట్టుకు బంగారు పతకం, ట్రోపీ అందజేశారు. ఈ సందర్భంగా స్టీల్ప్లాంట్ ఇన్చార్జ్ సీఎండీ ఎ.కె.సక్సేనా విజేతలను అభినందించారు. -
సమానత్వంతోనే సమాజాభివృద్ధి
సీతమ్మధార : సమానత్వంతోనే సమాజాభివృద్ధి జరుగుతుందని, మహిళా హక్కులను పోరాడి సాధించుకోవాలని సీఐటీయూ,ఐద్వా, డీవైఎఫ్ఐ ప్రతినిధులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆశీలుమెట్ట, లలితా జ్యుయలర్స్, ఆర్టీసీ కాంప్లెక్స్, గురజాడ సెంటర్, సెంట్రల్ పార్కు మీదుగా గాంధీపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలకు అవకాశాలు ఇస్తే అన్ని రంగాల్లో ముందుకువెళతారన్నారు. నేటికీ చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం దానిని ఆదాయ వనరుగా చూడటం, అదనంగా మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వడం దుర్మార్గం అన్నారు. అంగన్వాడీ, ఆశా, ఆర్పీ, హాస్పిటల్, షాప్స్లో పనిచేస్తున్న మహిళా కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కుమార్, సీతాలక్ష్మి, వెంకటరెడ్డి, అప్పలరాజు, ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, వై.సత్యవతి, సంతోష్, వరలక్ష్మి, కె.మణి, వి.ప్రభావతి, లీలావతి, బొట్టా ఈశ్వరమ్మ, కె. కుమారి తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల చెంతకు తల్లి
సీతమ్మధార: విశాఖపట్నం రైల్వేస్టేషన్లో దిక్కుతోచని స్థితిలో కనిపించిన అమ్ము అనే మహిళకు ఏయూటీడీ సిబ్బంది పునర్జన్మనిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా మూలస్థానం గ్రామానికి చెందిన అమ్ము భర్త తాగుబోతు. ఆయన చిత్రహింసలు భరించలేక మానసిక వేదనకు గురైన ఆమె కొన్నేళ్ల కిందట ఇల్లు వదిలి వెళ్లిపోయింది. స్నేహాలయ సంస్థ సహకారంతో కో లుకుని మేనమామ సంరక్షణలో ఉన్న పిల్లల వద్దకు చేరినా, మందులు మానేయడంతో మూడేళ్ల కిందట మళ్లీ రోడ్డున పడింది. అలా విశాఖ చేరిన ఆమెను ఏయూటీడీ సంస్థ చేరదీసింది. ఆమెను ద్వారకానగర్లోని జీవీఎంసీ–ఏయూటీడీ వసతి గృహానికి తరలించి శ్రద్ధా ఫౌండేషన్ ద్వారా వైద్య సహాయం అందించారు. కోలుకున్న అమ్మును గురువారం డిప్లమో చదివిన కుమారుడు, ఇంటర్ చదువుతున్న కుమార్తెకు, వారి మేనమామ సమక్షంలో అప్పగించారు. తమ తల్లి తిరిగి రావడంతో పిల్లలు ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఏయూటీడీ, శ్రద్ధా ఫౌండేషన్ సంస్థలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
భారతీయ మహిళలు ధైర్యవంతులు
విశాఖ విద్య: భారతీయ మహిళలు ఎంతో ధైర్యవంతులని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు ఎస్.విజయభారతి అన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో దుర్గాబాయి దేశముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్, ఏబీఆర్ఎస్ఎం–లేడీ టీచర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం–2025 వర్క్షాప్ ఆక్సెలరేట్ యాక్షన్ను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీ్త్ర విద్యతో సమాజాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. సంస్కారవంతమైన యువతకు తల్లిదండ్రులే కీలకమని చెప్పారు. సమాజం కోసం, దేశం కోసం అనే భావనతో యువత ముందుకెళ్లాలని సూచించారు. వివేకానందుడు కలలుగన్న విధంగా యువతరం ఉజ్వల తారలుగా మారి, తమ ఆశయాలను సాకారం చేసుకోవాలన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో మహిళల విజయగాథలను వివరించారు. కార్యక్రమంలో ఆచార్య ఎ.పల్లవి ఆంధ్రప్రదేశ్ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ పి.శ్రీదేవి, ఐఏఎస్ఈ ప్రిన్సిపాల్ ఆచార్య డి.నగరాజకుమారి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలు విజయభారతిని వైస్ఛాన్సలర్ ఆచార్య రాజశేఖర్, రిజిస్ట్రార్ ధనుంజయరావు జ్ఞాపిక అందించి, సత్కరించారు. జాతీయ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి -
పినగాడిలో తన్నుకున్న ‘తమ్ముళ్లు’
పెందుర్తి: ెపందుర్తి మండలం పినగాడిలో అధికార తెలుగుదేశం పార్టీలోని వర్గపోరు మరోసారి రోడ్డెక్కింది. గ్రామం నడిబొడ్డున టీడీపీలోని రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు తన్నుకున్నారు. గ్రామంలోని శివాలయం వార్షికోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన ఊరేగింపులో ఈ ఘటన చోటుచేసుకుంది. పల్లకీ మోయడం విషయంలో తలెత్తిన వివాదంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు, టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జీ వర్గీయులు బాహాబాహికి దిగారు. ఈ వివాదంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొట్లాట అనంతరం ఇరు వర్గాల నాయకులు పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే కేసు నమోదు కాకుండా రాజీ కుదిర్చేందుకు ఇరు వర్గాల ముఖ్య నేతలు పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇదీ వివాదం.. : పినగాడిలోని బుధవారం శివాలయం వార్షికోత్సవం జరిగింది. రాత్రి 7 గంటల సమయంలో ఆలయం నుంచి శివుని ఉత్సవ మూర్తుల ఊరేగింపు ప్రారంభించారు. రాత్రి 9 దాటాక గ్రామంలోకి ఊరేగింపు ప్రవేశించింది. ఈ క్రమంలో పల్లకీని టీడీపీకి చెందిన ఒకే వర్గం(ఎమ్మెల్యే పంచకర్ల వర్గీయులు) పట్టుకోవడంపై మరో వర్గం (గండి బాబ్జీ వర్గం) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అరుపులు, తోపులాటలతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ‘మీ అంతు చూస్తాం’ ‘మీ సంగతి తెలుస్తాం’అంటూ ఇరు పక్షాలు సవాళ్లు విసురుకుంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లిపోయారు. అయితే అధికార పార్టీ నాయకుల కొట్లాట కావడంతో వెనువెంటనే చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకంజ వేశారు. ఈ నేపథ్యంలో కేసులు లేకుండా ఇరు వర్గాలు రాజీ చేసుకునే విధంగా ఆయా వర్గాల పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా.. గ్రామంలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీధి రౌడీల్లా కొట్టుకోవడం చూసి గ్రామస్తులు తీవ్ర భయాందోళకు గురయ్యారు. ఆధిపత్యం కోసం ఇరువర్గాలు ఇంతలా దిగజారాలా అని దుమ్మెత్తిపోస్తున్నారు. ‘శివుని’ఊరేగింపులో చెలరేగిన వివాదం కొట్టుకున్న టీడీపీ రెండు వర్గాలనాయకులు పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయితీ రాజీకి ముఖ్యనేతల మంతనాలు -
బెయిల్పై సీపీఐ నేత జేవీఎస్మూర్తి విడుదల
ఆరిలోవ: ఎల్జీ పాలిమర్స్ కేసులో వారం క్రితం అరెస్టయి జైల్కు వెళ్లిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తికి బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన గురువారం విడుదలయ్యారు. విష యం తెలుసుకొన్న సీపీఐ జిల్లా నాయకులు విశాఖ కేంద్ర కారాగారానికి చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జేవీ మాట్లాతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న వారిని అరెస్టులు చేసి రిమాండ్కు తరలించడం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడమేనని తెలిపారు. కోర్టుకు హాజరైన సమయంలో న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో రీకాల్ చేసుకుంటానని చెప్పినా వినకుండా గోపాలపట్నం పోలీసులు విచక్షణారహితంగా వ్యవ హరించారన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పైడిరాజు మాట్లాడుతూదొంగలు, ఇసుక మాఫియా, భూకబ్జాలు, లిక్కర్ మాఫియా చేసేవారు బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారన్నారు. అలాంటి వారిని పోలీసులు విడిచిపెడుతున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు విమల, సత్యనారాయణ, శ్రీనివాస్, రెహమాన్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రణాళికా విభాగం పనితీరు మెరుగుపడాలి
విశాఖ సిటీ: ప్రణాళిక విభాగం పనితీరును మెరుగుపర్చుకోవాలని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం ఆయన తన చాంబర్లో అధికారులతో సమీక్షించారు. సంస్థ చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో పనులను వేగవంతం చేయాలని, స్థానిక ఎమ్మెల్యేల సహకారం, సమన్వయంతో ముందుకు సాగా లని సూచించారు. పూర్తయిన పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అదే విధంగా ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్కు వచ్చే వినతులను సకాలంలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కమిషనర్ రమేష్, కార్యదర్శి మురళీకష్ణ, ప్రధాన ఇంజినీర్ వినయ్ కుమార్, ప్రధాన అర్బన్ ప్లానర్ శిల్ప, ఎస్టేట్ అధికారి దయానిధి, ప్రధాన గణంకాధికారి హరిప్రసాద్, డివిజనల్ అటవీ అధికారి శివానీ తదితరులు పాల్గొన్నారు. -
అడ్డగోలు అడ్మిషన్లకు తెరతీసిన ‘ప్రైవేట్’
విశాఖ విద్య: విద్యా రంగంపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో వెనుకబడిన, నిరుపేద వర్గాలకు చదువులు భారమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు ఉన్న విశాఖ జిల్లాలో ప్రస్తుతం ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. కూటమిలో కొంత మంది పెద్దల సహకారంతో కార్పొరేట్ శక్తులు నగరంలో విద్యా వ్యాపారానికి స్కెచ్ వేస్తున్నాయి. సర్కారు బడుల్లో ఇంగ్లిష్ చదువులు సవ్యంగా సాగకపోవడంతో.. తమ పిల్లల భవిష్యత్ దృష్ట్యా చాలా మంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల వైపు మోజు చూపిస్తున్నారు. ఇదిగో సాక్ష్యం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 1,387 పాఠశాలలు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ లెక్కల ప్రకారం 2024–25 విద్యా సంవత్సరంలో 3,81,262 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లు 610 ఉండగా వీటిలో 79,166 మంది చదువుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లు 777 ఉండగా, వీటిలో 3,02,096 మంది చదువుతున్నారు. 2023–24లో (వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు) ప్రైవేటు స్కూళ్లలో 2,98,330 మంది ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2024–25లో గతం కంటే 3,766 మంది ఎక్కువగా చేరారు. ప్రభుత్వ స్కూళ్లు నుంచి విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లిపోతున్నారనడానికి ఈ అంకెలే నిదర్శనం. కార్పొరేట్కు మేలు చేసేలా స్కూళ్ల రేషనలైజేషన్ కూటమి ప్రభుత్వం 117 జీవో రద్దు పేరిట చేపట్టిన రేషనలైజేషన్తో జిల్లాలోని 31 ప్రాథమికోన్నత స్కూళ్లలో 20కు పైగానే ప్రైమరీ స్కూళ్లుగా మారబోతున్నాయి. దీంతో ఇప్పటి వరకు అక్కడ 6,7,8 తరగతులు చదివే విద్యార్థులను ఎగరేసుకుపోయేందుకు సమీపంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల నిర్వాహకులు వారి తల్లిదండ్రులతో మంతనాలు మొదలుపెట్టారు. అలాగే మోడల్ స్కూల్ పేరిట, ప్రైమరీ స్కూళ్లలో 3, 4, 5 తరగతులు తీసేస్తుండటంతో.. బస్సులు పెడతాం మా స్కూళ్లకు పంపించండి అంటూ ప్రైవేటు యాజమన్యాలు ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నాయి. ఇలాంటి పరిణామాలతో 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లాలో మరింత మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. సర్కారు చదువులపై సన్నగిల్లుతున్న ఆశలు ఇంగ్లిష్ మీడియం చదువులకు మంగళం కార్పొరేట్కు కొమ్ముకాస్తున్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు క్యూ కడుతున్న విద్యార్థులు ఇదే అదునుగా ఫీజులు పెంచేస్తున్న యాజమాన్యాలు -
స్కూటీ అదుపు తప్పి.. మహిళా పోలీస్ దుర్మరణం
మల్కాపురం: స్కూటీ అదుపు తప్పిన ఘటనలో మహిళా పోలీసు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి మల్కాపురం ఎస్ఐ శ్యామలరావు తెలిపిన వివరాలివి. అంగనపూడి ప్రాంతానికి చెందిన మీను భూషణ్(46) కూర్మన్నపాలెం సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వర్తి స్తున్నారు. ఆమె భర్త స్టీల్ప్లాంట్లో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో మీను భూషణ్ తన కుమార్తెతో కలిసి స్కూటీపై షీలానగర్ నుంచి పోర్టు ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా నగరం వైపు వెళ్తున్నారు. బ్రిడ్జి ఎక్కుతుండగా, ఆమె వెళ్తున్న మార్గంలో ఇద్దరు వ్యక్తులు గడ్డి పట్టుకుని రోడ్డు దాటుతున్నారు. వారిని గుర్తించిన మీను భూషణ్ వెంటనే తన స్కూటీకి అకస్మాత్తుగా బ్రేక్ వేశారు. దీంతో వాహనం అదుపు తప్పి పక్కనున్న డివైడర్ను ఆమె ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మీను భూషణ్కు తలకు, ఆమె కుమార్తెకు శరీరంపై గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మీను భూషణ్ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. -
బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణకు చర్యలు
కొమ్మాది: బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ జరిగేలా రుషికొండ బీచ్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. రుషికొండ బీచ్ను బుధవారం ఆయన సందర్శించారు. సమష్టి కృషి చేసి బీచ్కు పూర్వ వైభవం తీసుకుని రావాలని, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా ప్రణాళికలతో పనులు చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్, కూర్చొని సేద తీరే ప్రాంతాలు, దుకాణ సముదాయాలు, పారిశుధ్య నిర్వహణ, గ్రీనరీ తదితర అంశాలను పరిశీలించిన ఆయన.. అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. అలాగే పర్యాటకుల భద్రత ప్రమాణాలు పాటించాలని పోలీసు అధికారులకు సూచించారు. దుకాణ సముదాయాల నిర్వహణ, ఆహార పదార్థాల తయారీ, ధరల నియంత్రణ, తదితర అంశాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. టూరిజం శాఖ ఇన్చార్జి ఆర్డీ జగదీశ్, టూరిజం అధికారి గరికిన దాసు, వీఎంఆర్డీఏ, టూరిజం, పోలీసు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశం -
అర్ధరాత్రి ఘోరం..
చెట్టును బైక్తో ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం సీతమ్మధార: రైల్వే న్యూ కాలనీ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. కంచరపాలెం పరిధిలోని ధర్మానగర్, వాడపేటలో మంగళవారం స్థానిక అమ్మవారి పండగ జరిగింది. తిక్కవానిపాలేనికి చెందిన గోపి(20), అచ్చిరాజు(20) బైక్లో బయలుదేరి.. సాయంత్రం అక్కడ జరిగిన పరసలో పాల్గొన్నారు. అప్పటికే వారు మద్యం మత్తులో ఉన్నారు. తిరిగి అర్ధరాత్రి దాటాక రైల్వే న్యూ కాలనీ నుంచి కంచరపాలెం వైపు వెళుతున్నారు. అతివేగంతో వెళ్తూ రైల్వే న్యూ కాలనీ సాయిబాబా గుడి ఎదురుగా చెట్టుకు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. పండగలో సరదాగా గడిపిన యువకులు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల కన్నీటిపర్యంతమయ్యారు. యువకుల మృతితో తిక్కవానిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ట్రాఫిక్ సీఐ దాశరధి నేతృత్వంలో కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎం, కేంద్ర మంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట : జిల్లాలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గురువారం గీతం యూనివర్సిటీలో జరిగే పుస్తక ఆవిష్కరణలో పాల్గొంటారని.. శాంతి భద్రతలు, సెక్యూరిటీ పరమైన అంశాల్లో పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవాల న్నారు. పరిశుభ్రత చర్యలు చేపట్టాలని, వారు ప్రయాణించే మార్గంలోని రోడ్లపై బ్యానర్లు, విద్యుత్ తీగలు, పోస్టర్లు తొలగించాలని జీవీఎంసీ, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విశాఖ ఎయిర్పోర్టు వద్ద స్వాగతం, వీడ్కోలుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని ఆర్డీవోకు సూచించారు. డీసీపీ అజిత, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, ఆర్డీవో పి.శ్రీలేఖ, డిప్యూటీ కలెక్టర్ సత్తిబాబు పాల్గొన్నారు. ముందుగా గీతంలో పర్యటన ఏర్పాట్లను ఎంపీ ఎం.శ్రీభరత్, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ స్వయంగా పరిశీలించారు. సీఎం పర్యటన ఇలా..: సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ నుంచి గీతం వర్సిటీకి గురువారం ఉదయం 10.30 గంటలకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడ జరిగే పుస్తక ఆవిష్కరణలో భాగస్వామ్యమవుతారు. అనంతరం అక్కడ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీ బయలుదేరుతారు. సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
నేడు మద్యం దుకాణాల లాటరీ
● జిల్లాలో గీత కులాలకు 14 మద్యం దుకాణాల కేటాయింపు ● 121 మంది నుంచి 316 దరఖాస్తులు రాక విశాఖ సిటీ: కల్లు గీత కులాల మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ చేతుల మీదుగా లాటరీ ద్వారా షాపులను కేటాయించనున్నారు. విశాఖ జిల్లాలో 14 మద్యం దుకాణాలను గీత కులాలకు కేటాయించారు. జీవీఎంసీ పరిధిలో 11, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో మూడు దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. కల్లు గీత కులాలకు జనాభా దామాషా పద్ధతిలో రెండు నెలల క్రితం లాటరీ ప్రక్రియ ద్వారా 14 మద్యం దుకాణాలను కేటాయించారు. ఇందులో జీవీఎంసీ పరిధిలో గౌడ, యాత కులాలకు ఒక్కోటి, మిగిలిన తొమ్మిది దుకాణాలు శెట్టిబలిజ కులానికి దక్కాయి. అలాగే ఆనందపురంలో ఒకటి గౌడకు, భీమిలి, పద్మనాభం మండలాల్లో ఒక్కోటి శెట్టిబలిజకు లాటరీ ద్వారా అవకాశం లభించింది. వాస్తవానికి గత నెల 7వ తేదీన లాటరీ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ మహాకుంభమేళా, బసంత్ పంచమీ, రాధా సప్తమీ వంటి ఆధ్యాత్మిక యాత్రలు ఉండడంతో దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించారు. తరువాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో లాటరీ ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా ఎన్నికల నియమావళి తొలగిపోవడంతో గురువారం లాటరీ నిర్వహించనున్నారు. 14 దుకాణాలకు 316 దరఖాస్తులు గీత కార్మికులకు కేటాయించిన 14 మద్యం దుకాణాలకు 316 దరఖాస్తులు వచ్చాయి. కొందరు రెండు, మూడు దరఖాస్తులు సమర్పించడంతో 121 మంది ఈ లాటరీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దరఖాస్తుదారులందరూ లాటరీ సమయానికి గంట ముందుగా మధ్యాహ్నం 2 గంటలకే వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాకు రావాల్సి ఉంటుంది. 3 గంటలకు కలెక్టర్ హరేందిర ప్రసాద్ లాటరీ ప్రక్రియను ప్రారంభి షాపులు కేటాయించనున్నారు. -
‘లే అవుట్’ నిబంధనలు సరళతరం
విశాఖ సిటీ: పురపాలక మంత్రిత్వ శాఖ జారీ చేసిన కొత్త జీవోల ప్రకారం భవన నిర్మాణాలు, లేఅవుట్ల అభివృద్ధి విషయంలో నిబంధనలు పాటించాలని డీటీసీపీవో పి.నాయుడు సూచించారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ థియేటర్లో ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోలు 3, 4, 5, 20లపై ఎల్టీపీలు, ఇంజినీర్లు, ప్లానింగ్ సెక్రటరీలకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త జీవోల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించినట్లు తెలిపారు. లేఅవుట్లకు 21 రోజుల్లో అనుమతి ఇవ్వాలని నిర్దేశించినట్లు చెప్పారు. యుటిలిటీస్, ఎమినిటీస్ బ్లాక్లకు నిర్ధిష్టమైన నిబంధనలు పెట్టారని వెల్లడించారు. ఐదు ఎకరాలలోపు లే అవుట్లలో 40 అడుగుల రహదారి ఒకటి, అంతకు మించిన లేఅవుట్లలో రెండు రహదారులు ఉండాలని వివరించారు. జాతీయ రహదారి, రాష్ట్ర హైవేలకు ఆనుకుని ఉన్న లేఅవుట్ల విషయంలో సంబంధిత అధికారుల నుంచి ఎన్వోసీ ఉండాలని స్పష్టం చేశారు. లే అవుట్లలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. నదులకు సమీపంలో అభివృద్ధి చేసే లేఅవుట్ల విషయంలో బఫర్ జోన్ 100 మీటర్ల నుంచి 50 మీటర్లకు తగ్గించారని తెలిపారు. వీఎంఆర్డీఏ చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్ప, ప్లానింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర రావు, డీసీపీలు హరిదాసు, రామ్మోహన్, పీవో మౌనిక, డీటీసీపీ ఆర్డీ పి.నాయుడు, పీసీపీఐఆర్ పీవో చైతన్య పాల్గొన్నారు. -
భారతీయ సంప్రదాయమే సైన్స్ భాండాగారం
గోపాలపట్నం: భారతీయ సంప్రదాయమే సైన్స్ భాండాగారమని డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ అవినాష్ చందర్ అన్నారు. ఎన్ఎస్టీఎల్ మానసి ఆడిటోరియంలో బుధవారం జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన అంబేడ్కర్ విగ్రహం వద్ద, వేదికపై సర్ సి.వి.రామన్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ చందర్ మాట్లాడుతూ మన పూర్వీకుల్లో భాస్కరాచార్య, చక్ర, సుశ్రుత, వరాహమిహిర, ఆర్యభట్ట వంటి ఎందరో మహానుభావులు అనేక కొత్త విషయాలను ఆవిష్కరించారన్నారు. భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉత్తమ ప్రతిభ చూపుతోందని, యువకులు నూతన ఆలోచనలతో ఆవిష్కరణలు చేస్తున్నారని పేర్కొన్నారు. శాసీ్త్రయత శిక్షణ కలిగి ఉండేలా విద్యా విధానంలో మార్పు రావడం స్వాగతించదగినదన్నా రు. పదేళ్ల కిందట 471 స్టార్టప్స్ ఉండగా.. నేడు 1.40 లక్షలకు అవి పెరగడంతో ఉద్యోగాలు కూడా పెరిగాయని చెప్పారు. విజేతలకు బహుమతుల ప్రదానం సైన్స్ డే సందర్భంగా ఎన్ఎస్టీఎల్లో చేపట్టిన కార్యక్రమాలను డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ వివరించారు. సైంటిస్ట్ డి.ఉదయానంద్కు సిలికాన్ మెడల్, సర్టిఫికెట్ను బహూకరించారు. పలు పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. నరవ హైస్కూల్ విద్యార్థులు మొదటి బహుమతి, ఎన్ఎస్టీఎల్ రామ్ నాథ్ సెకండరీ స్కూల్ విద్యార్థులు ద్వితీయ బహుమతి సాధించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ సైంటిస్ట్ బోని రమేష్బాబు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ అవినాష్ చందర్ ఎన్ఎస్టీఎల్లో ఘనంగా జాతీయ సైన్స్ డే వేడుకలు -
మెడపై కత్తి
ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులవిశాఖపట్నం : స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మి కుల తగ్గింపు ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ అంశంపై కాంట్రాక్టర్లకు యాజమాన్యం సమాచారం అందజేసింది. స్టీల్ప్లాంట్ ఆర్థిక పున రుద్ధరణ, పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగులకు వీఆర్ఎస్, ఇతర స్టీల్ప్లాంట్లకు డిప్యూటేషన్, కాంట్రాక్ట్ కార్మికుల తగ్గింపు వంటి చర్యలకు సిఫా ర్సు చేశారు. ఈ చర్యల్లో భాగంగా గతంలో ఒకేసారి సుమారు 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల ఆన్లైన్ గేటు పాసులను నిలిపి వేశారు. ఈ వివాదం పెద్దది కావడంతో కొన్ని గేటు పాసులను పునరుద్ధరించారు. వివిధ కారణాల వల్ల సుమారు 600 మంది కాంట్రాక్ట్ కార్మికుల పాస్లు పునరుద్ధరించలేదు. దీంతోపాటు ఎస్ఎంఏ, ఏఎస్ఎంఏ నిలిపివేత తదితర అంశాలపై ఈ నెల 7న సమ్మె చేస్తామని కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు యాజమాన్యానికి నోటీసు అందజేశాయి. ఈ అంశంపై ఈ నెల 11న సమావేశం ఏర్పాటు చేస్తామని రీజనల్ లేబర్ కమిషనర్ హామీ ఇవ్వడంతో సమ్మె వాయిదా వేశారు. కాంట్రాక్ట్ కార్మికుల తగ్గింపుపై చర్చ మంగళవారం కేంద్ర ఉక్కు కార్యదర్శి స్టీల్ప్లాంట్కు వచ్చారు. ఉన్నత యాజమాన్యంతో జరిపిన సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల తగ్గింపుపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. దీంతో యాజమాన్యం సక్రమంగా విధులు నిర్వహించని, క్రమశిక్షణారాహిత్యం కలిగిన కార్మికుల వివరాలు ఇవ్వాలని కాంట్రాక్టర్లను ఆదేశించింది. దీంతో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు రీజనల్ లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై యాజమాన్యంతో తేల్చుకోవడానికి కార్మిక సంఘాల నాయకులు సమాయత్తమవుతున్నారు. మళ్లీ తెరపైకి కార్మికుల తగ్గింపు ప్రక్రియ కాంట్రాక్టర్లకు సమాచారం ఆర్ఎల్సీకు ఫిర్యాదు -
సెంట్రల్ జైలులో ఓపెన్ ఇంటర్ పరీక్షలు
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో ఓపెన్ ఇంటర్(సార్వత్రిక విద్య) పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఓపెన్ ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర కారాగారంలో ఖైదీలకు ప్రత్యేకంగా ఓ సెంటర్ ఏర్పాటు చేశారు. బుధవారం తెలుగు పరీక్ష జరిగింది. 15 మంది ముద్దాయిలు ఓపెన్ ఇంటర్లో చేరినట్లు జైలు సూపరింటెండెంట్ ఎం. మహేష్బాబు తె లిపారు. ఇందులో నలుగురిని ఇటీవల రాజమండ్రి కేంద్ర కారాగారానికి బదిలీ చేయగా.. బుధవారం 11 మంది పరీక్ష రాసినట్లు వివరించారు. -
విశాఖలో హైకోర్టు బెంచ్ కోసం త్వరలో అఖిలపక్ష సమావేశం
విశాఖ లీగల్ : విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ త్వరలో ఆరు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఇతర నాయకులతో కలిసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బెవర సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఏడు జిల్లాల(శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ) న్యాయవాదులతో ఒక సదస్సును ఏర్పాటు చేసి.. మద్దతు కూడగట్టామని పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై అఖిలపక్ష సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజా ప్రతినిధులు, ఇతర నేతల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ఈ ఆరు జిల్లాల ప్రజాభిష్టాన్ని వివరించనున్నట్లు తెలిపారు. హైకోర్టు బెంచ్ కోసం తాము చేస్తున్న కార్యక్రమాలకు అన్ని వర్గాలు సహకారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
విశాఖ చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి
గోపాలపట్నం: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ నుంచి బుధవారం రాత్రి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర మంత్రులు అనిత, పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, కలెక్టర్ హరేందిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి, బీజేపీ మహిళా నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గంలో నోవాటెల్ హోటల్కి చేరుకున్నారు. గురువారం గీతంలో జరిగే పుస్తక ఆవిష్కరణలో పాల్గొంటారు. మధ్యాహ్నం బడ్జెట్ అంశంపై నోవాటెల్ హోటల్లో నిర్వహించే సదస్సులో అధికారులు, పారిశ్రామికవేత్తలు, నిపుణులతో భేటీ అవుతారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడతారు. -
నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం
ముగ్గురు విద్యార్థినులపై చర్యలు జగదాంబ: డీడీఆర్ నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఇందుకు కారణమైన విద్యార్థినులపై ప్రిన్సిపాల్ దయాకర్రెడ్డి చర్యలు తీసుకున్నారు. వన్టౌన్ షాదీఖానా వెనుక ఈ కళాశాల ఉంది. ఈ కళాశాలలో మూడేళ్ల కోర్సుకు సంబంధించి 80 మంది విద్యార్థినులు నగరంతో పాటు చత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి వచ్చి అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది చేరిన 18 మంది విద్యార్థినులను చివరి సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు ర్యాగింగ్ చేశారు. దీంతో వారందరూ కళాశాల ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయగా.. ర్యాగింగ్కు పాల్పడిన ముగ్గురు విద్యార్థినులను ప్రిన్సిపాల్ పిలిచి మందిలించారు. ‘మీరు హాస్టల్లో ఉండకూడదు. ఇంటి వద్ద నుంచే డేస్కాలర్గా కళాశాలకు రావాలి’అని చెప్పడంతో ఆ విద్యార్థినులు హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపాల్ దయాకర్రెడ్డిని వివరణ కోరగా.. ‘విద్యార్థినులు ర్యాగింగ్ చేయడంతో మందలించి ఇంటికి పంపించిన మాట వాస్తవమే’ అని అన్నారు. వారు స్థానికులు కావడంతో హాస్టల్లో ఉండకూడదని హెచ్చరించామని, దీనిపై వస్తున్న వదంతులు అవాస్తమని చెప్పారు. ఈ విషయం వన్టౌన్ పోలీసు స్టేషన్కు తెలియజేసినట్లు వెల్లడించారు. -
సింహగిరి మాస్టర్ప్లాన్ సవరణకు పరిశీలన
సింహాచలం: సింహగిరి మాస్టర్ప్లాన్ మార్పులు–చేర్పులపై దేవదాయశాఖ టెక్నికల్ అడ్వైజర్ కొండలరావు బుధవారం పరిశీలన జరిపారు. 2000 నుంచి సింహగిరి దివ్యక్షేత్రం అభివృద్ధి పనులు ప్రారంభమవగా, ఆరేళ్ల క్రితం వరకు జరిగిన అభివృద్ధి పనులతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఆ తర్వాత సింహగిరిపై కొన్ని అభివృద్ధి పనుల్లో మార్పులు చేర్పులతోపాటు, ఏడాదిన్నర కిందట ప్రసాద్ పథకం పనులు ప్రారంభమయ్యాయి. దీంతో మాస్టర్ ప్లాన్లో మార్పులు చేర్పులు అనివార్యమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రసాద్ పథకం పనులతో పాటు ఇంకా దేవస్థానం తరఫున చేయాల్సిన అభివృద్ధి పనుల వివరాలను చేర్చి మాస్టర్ ప్లాన్ని పక్కాగా తయారుచేయాలని దేవదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ టెక్నికల్ అడ్వైజర్ తన బృందంతో వచ్చి ప్రసా ద్ పథకం పనులను పరిశీలించారు. అధికారులు, వైదికులతో చర్చించి పక్కాగా మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు నివేదికలను కమిషనర్కు పంపిస్తామన్నారు. -
నేషనల్ యూత్ పార్లమెంట్కు 9 వరకు గడువు
ఏయూక్యాంపస్: నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2025కి విద్యార్థులు తమ వివరాలు నమోదు చేసుకోవడానికి ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఉంది. mybharat.gov.inను సందర్శించి ‘వికసిత్ భారత్ అంటే ఏమిటి’ అనే అంశంపై ఒక నిమిషం వీడియోను అప్లోడ్ చేయాలి. అదే పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకోవాలి. ఈ కార్యక్రమానికి నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ మహేశ్వర రావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.వి.జి రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్ పర్యవేక్షిస్తారు. -
ఈపీడీసీఎల్ లైన్మన్కు జాతీయ అవార్డు
విశాఖ సిటీ: చింతూరు లైన్ ఇన్స్పెక్టర్ కె.గణేష్ జాతీయస్థాయిలో ఉత్తమ లైన్మన్ అవార్డు సాధించారని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన లైన్మెన్ దివస్ కార్యక్రమంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ ఘనశ్యామ్ చేతుల మీదుగా ఉత్తమ లైన్మన్ అవార్డును గణేష్ అందుకున్నారని పేర్కొన్నారు. గణేష్తో పాటు ఉత్తమ లైన్మన్గా ప్రశంసలు పొందిన అనకాపల్లి సర్కిల్కు చెందిన బి.మాణిక్యాలరావు, పార్వతీపురం సర్కిల్ పి.సింహాచలంకు సీఎండీతో పాటు సంస్థ డైరెక్టర్లు డి.చంద్రం, వి.విజయలలిత, బి.రామచంద్రప్రసాద్ అభినందనలు తెలిపారు.