breaking news
Visakhapatnam District Latest News
-
యథేచ్ఛగా మత్తుమందుల విక్రయం
‘మెడ్ప్లానెట్’ యజమానిపై కేసు నమోదు ఎంవీపీకాలనీ: డాబాగార్డెన్స్లోని మెడ్ప్లానెట్ ఫార్మసీపై సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా మత్తు మందులు విక్రయిస్తున్నారన్న సమాచారంతో.. డ్రగ్ ఇన్స్పెక్టర్ సమక్షంలో శుక్రవారం ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో భారీ ఎత్తున మత్తుమందు ఔషధాలను సీజ్ చేశారు. ప్రధానంగా టెర్మిలైఫ్ మత్తు ఇంజక్షన్లు, అల్ప్రాజోలామ్ టాబ్లెట్లను యథేచ్ఛగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫార్మసీ నుంచి 48 టెర్మిలైఫ్ ఇంజక్షన్లు, 15 అల్ప్రాజోలామ్ టాబ్లెట్ స్ట్రిప్స్ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఫార్మసీ యజమానిపై డ్రగ్ కంట్రోల్ విభాగం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
ప్రేమలు పండిన తీరం భీమిలి లోగిలి సారం
వెండితెరపై ‘మరోచరిత్ర’ రాసిన భీమిలి అద్భుత చిత్రాల షూటింగ్లకు వేదిక వేలంటైన్స్ డే సందర్భంగా ‘లవ్లీ’ జ్ఞాపకం వాలంటైన్స్ డే సందర్భంగా ‘లవ్లీ’ జ్ఞాపకం భీమునిపట్నం: ప్రేమకథా చిత్రాలకు భీమిలి తీరానికి విడదీయలేని అనుబంధం ఉంది. ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఇక్కడ రూపుదిద్దుకుని ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా 1978లో విడుదలైన దర్శక శిఖరం కె. బాలచందర్ దృశ్యకావ్యం ‘మరోచరిత్ర’ ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. కమల్ హాసన్, సరిత జంటగా నటించిన ఈ చిత్రంలోని మెజారిటీ సన్నివేశాలు భీమిలి తీరంలోనే చిత్రీకరించారు. అప్పట్లో అంటే సుమారు 1850 ప్రాంతంలో బ్రిటీష్ గవర్నర్ నివాసం కోసం సముద్ర తీరాన నిర్మించిన అరుదైన బంగ్లా ‘గాలిమేడ’ ఈ సినిమాతోనే ప్రజలకు చేరువైంది. డచ్ గవర్నర్ బంగ్లాగా పిలవబడే ఈ కట్టడం సినిమా హిట్ అయ్యాక ఒక పర్యాటక కేంద్రంగా మారిపోయింది. అయితే దురదృష్టవశాత్తూ 1990వ దశకంలో ప్రైవేటు వ్యక్తులు ఈ స్థలాన్ని కొనుగోలు చేసి ఆ చారిత్రక గాలిమేడను కూల్చివేసినప్పటికీ, నేటికీ పాతతరం ప్రేక్షకులు ఆ ఖాళీ స్థలాన్ని చూసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే ఉంటారు. బాలచందర్ మెచ్చిన తీరం బాలచందర్ దర్శకత్వంలోనే వచ్చిన ‘కోకిలమ్మ’ సినిమాతో మొదలైన ఈ సినీ ప్రస్థానం ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలకు వేదికై ంది. 1986లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా సత్యరాజ్, రేఖలతో తీసిన ‘కడలోర కవిదైగళ్’ చిత్రాన్ని భీమిలిలోని గ్రంథాలయం ఎదురుగా ఉన్న సరస్వతి సమాజం పరిసరాల్లోనే చిత్రీకరించారు. ఇదే సినిమాను 1987లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆరాధన’ పేరుతో రీమేక్ చేసినప్పుడు కూడా భీమిలినే ప్రధాన లొకేషన్గా ఎంచుకున్నారు. సుహాసిని టీచర్గా ఉన్న స్కూల్, ఆమె బడికి రావద్దని చెబితే చిరంజీవి ఒంటికాలిపై నిలబడే దిమ్మ, లైట్ హౌస్ కీపర్ క్వార్టర్స్లో ఉన్న చిరంజీవి ఇల్లు.. ఇవన్నీ ఇప్పటికీ అలాగే ఉండి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఎన్నో చిత్రాల నిర్మాణం శుభలేఖ, ముద్దమందారం, మహర్షి వంటి క్లాసిక్ చిత్రాలే కాకుండా హిందీ, తమిళ సినిమాలు కూడా ఈ తీరంలో సందడి చేశాయి. 1992లో నటి రోజా, ఆమె భర్త సెల్వమణి కాంబినేషన్లో వచ్చిన ‘చామంతి’, నాగార్జున ‘రావోయి చందమామ’, ప్రభుదేవా ‘టైమ్’ వంటి సినిమాల చిత్రీకరణ బ్యాంక్ రోడ్డులోని ‘ఓషన్ వ్యూ’ బంగ్లా వద్ద జరిగింది. అయితే మారుతున్న కాలంతో పాటు ఆ బంగ్లా కూడా కూల్చివేతకు గురైంది. గాలిమేడ, ఓషన్ వ్యూ బంగ్లా వంటి కొన్ని కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయినా, ‘ఆరాధన’ సినిమా స్కూల్, ఆనాటి దిమ్మ, నరసింహస్వామి ఆలయ పరిసరాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. భీమిలి అందాలు వెండితెరపై ఎంతటి మాయాజాలాన్ని సృష్టించాయో చెప్పడానికి ఈ లొకేషన్లే సజీవ సాక్ష్యాలు. సందడిగా ఉండేది ఇక్కడ షూటింగ్లు జరగడవల్ల ఎంతో సందడిగా ఉండేది, ముఖ్యంగా ఆరాధన షూటింగ్ రెండు నెలలకు పైనే జరిగింది. ఇందులో చిరంజీవి హీరోకావడంతో విశాఖ, విజయనగరం ప్రాంతాల నుంచి ప్రతి రోజు భారీ ఎత్తున జనం వచ్చేవారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు, చిత్ర యూనిట్ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. –రాంబోతు సత్యనారాయణ, భీమిలి భీమిలికి మంచి గుర్తింపు ఇక్కడ షూటింగ్లు తరచూ జరుగుతుండడంతో భీమిలి ప్రాంతానికి మంచి గుర్తింపు వచ్చింది. దీనికి చారిత్రిక, పర్యాటక ప్రాంతంగా గుర్తింపు ఉండడంతో వివిధ రాష్ట్రాల నుంచి సందర్శకులు వస్తున్నారు. సినిమా షూటింగ్ల వల్ల ఈ ప్రాంతం మరింత గుర్తింపు లభించింది. ప్రభుత్వం చారిత్రక కట్టడాలకు మెరుగులు దిద్దాలి. –కంటుభుక్త ముత్యాలరావు, భీమిలి కాలేజ్కు వెళ్లేవాళ్లం కాదు ఆరాధన షూటింగ్ ఇక్కడే ఎక్కువ రోజులు జరిగింది. చిరంజీవి, సుహాసిని, రాధికను చూడాలని ఎంతో ఆసక్తి ఉండేది. స్నేహి తులంతా కలిసి కాలేజ్కి డుమ్మా కొట్టి షూటింగ్ చూడడానికి వెళ్లేవాళ్లం. –అయ్యగారి లలితారమేష్, భీమిలి -
బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతం
విశాఖ లీగల్ : రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. 2020 తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొనగా, మొత్తం 82.2 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో ఓటు హక్కు కలిగిన 3,513 మంది న్యాయవాదులకు గాను 2,888 మంది తమ ఓటును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 39,400 మంది ఓటర్లు ఉండగా, 143 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. న్యాయవాదులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారి, విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె. శ్రీనివాస్, కార్యదర్శి లాలం పార్వతీ నాయుడు తెలిపారు. ఓటింగ్ ప్రక్రియను విజయవంతం చేసిన న్యాయవాదులందరికీ వారు ధన్యవాదాలు తెలియజేశారు. -
పది, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
మహారాణిపేట: జిల్లాలో త్వరలో జరగనున్న ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఎటువంటి అక్రమాలకు తావులేకుండా, అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు, రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియట్, మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లను పూర్తిగా నిషేధించామని స్పష్టం చేశారు. జిరాక్స్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, పోస్టల్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు, డీ–హైడ్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర అభివృద్ధి పనులపై సమీక్ష వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ప్రభుత్వ భవన నిర్మాణాలకు భూ సేకరణ వంటి అంశాల పురోగతిని సీఎస్కు కలెక్టర్ వివరించారు. అలాగే రేషన్, పెన్షన్ల పంపిణీ, అకౌంటింగ్ వ్యవస్థలపై కూడా అధికారులతో చర్చించారు. ఇన్చార్జి డీఆర్వో సత్తిబాబు, డీఈవో ప్రేమకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
నేవీ విన్యాసాలు
అదరహో..యుద్ధ నౌకలనౌకాదళాల పండగకు భారీ ఏర్పాట్లుహారంనీలి సాగరం.. వియత్నాం బృందానికి స్వాగతం పలుకుతున్న తూర్పు నౌకాదళం రూ.37 కోట్లు ఖర్చు చేస్తున్న జిల్లా యంత్రాంగం వీవీఐపీల ఏర్పాట్లకే రూ.1.20 కోట్లు రహదారుల వెంబడి బారికేడ్ల కోసం రూ.1.05 కోట్లు పారిశుధ్యం, సివిల్ వర్క్స్, సుందరీకరణకు రూ.30.07 కోట్లు ఏర్పాట్ల కోసం ఒక్క రూపాయీ విదల్చని చంద్రబాబు సర్కార్ సాక్షి, విశాఖపట్నం : భారత నౌకాదళం ఆధ్వర్యంలో ఆదివారం నుంచి ఈనెల 25వ తేదీ వరకు విశాఖ తీరాన ‘అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ’, ‘మిలాన్–2026’ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. 135 దేశాల ప్రతినిధులు, 40 యుద్ధనౌకలు, 50 యుద్ధ విమానాలు పాల్గొనే ఈ మెగా ఈవెంట్ ద్వారా భారత్ తన సముద్ర శక్తిని ప్రపంచానికి చాటిచెప్పనుంది. 18న రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ, 19న సిటీ పరేడ్ వంటి కీలక కార్యక్రమాలు జరగనున్నాయి. అయితే, ఇంతటి ప్రతిష్టాత్మక వేడుకలకు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. జిల్లా యంత్రాంగమే వివిధ శాఖల ఖజానాల నుంచి రూ.37 కోట్లు వెచ్చించి ఏర్పాట్లు చేస్తోంది. నిధుల కొరత ఉన్నప్పటికీ, విశాఖ గౌరవం నిలబెట్టేలా అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నారు. భారత సైనిక సంపత్తిలో కీలక కేంద్రంగా ఎదిగిన విశాఖ తీరం, మరో అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనకు సిద్ధమైంది. గతంలో 2022, 2024లలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ విన్యాసాలను విజయవంతంగా నిర్వహించిన విశాఖ, ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఎఫ్ఆర్, మిలాన్–2026 మరియు ఐఓఎన్ఎస్లకు ఆతిథ్యమిస్తోంది. చంద్రగుప్తుని కాలం నాటి సముద్రయాన చరిత్ర నుండి నేటి అణు జలాంతర్గాముల తయారీ వరకు భారత్ సాధించిన ప్రగతిని ఈ వేడుకలు ప్రపంచానికి చాటిచెప్పనున్నాయి. ఈ నెల 15 నుంచి 25 వరకు జరిగే ఈ ప్రదర్శనతో విశాఖ నగరం మరోసారి ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించనుంది. సాంస్కృతిక వారధిగా... విశాఖలో జరగనున్న నౌకాదళ వేడుకలు రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పనున్నాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ. 70 లక్షల వ్యయంతో 200 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. కూచిపూడి, ధింసా, తప్పెటగుళ్లు, కోలాటం, కొమ్ముకోయ వంటి 10 రకాల జానపద కళారూపాలతో విదేశీ ప్రతినిధులకు మన సంప్రదాయాలను పరిచయం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత, మౌలిక వసతులే కీలకం. రాష్ట్రపతి, సీఎం వంటి ప్రముఖుల రాక నేపథ్యంలో హోం శాఖ భారీ భద్రతా చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ. 2.85 కోట్లతో డ్రోన్ కెమెరాలు, 100 మంది స్విమ్మర్లు, గస్తీ బోట్లను సిద్ధం చేశారు. అతిథుల కోసం 218 వాహనాలను ఏర్పాటు చేయగా, ఇంధనం, అద్దె ఖర్చుల కోసం రూ. 1.45 కోట్లు వెచ్చిస్తున్నారు. అలాగే వేట నిలిపివేసిన మత్స్యకారులకు రూ. 1.12 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం కేటాయించింది. పైసా విదల్చని చంద్రబాబు ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో దేశంతో పాటు రాష్ట్రం, విశాఖ నగర గౌరవంతో ముడిపడి ఉన్న ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ల నిర్వహణకూ ప్రభుత్వం రూపాయి విదిల్చలేదు. ఇప్పటికే 2025 పార్టనర్షిప్ సమ్మిట్, యోగాడే, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్లో ఉండటంతో జిల్లా యంత్రాంగంపై ఐఎఫ్ఆర్ కార్యక్రమాలతో మరింత భారం పడింది. పాత బకాయిలు చెల్లించకపోవడంతో హోటల్ యజమానులు, సర్వీస్ ఏజెన్సీలు కొత్తగా సేవలందించేందుకు వెనుకాడుతున్నారు. ఇంతటి కీలక సమయంలో చంద్రబాబు ప్రభు త్వం నుంచి అదనపు నిధులు అందకపోవడం, జిల్లా ఖజానా ఖాళీ అవ్వడం అధికారులను కలవరపెడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక బడ్జెట్ విడుదల కాకపోతే ఈ భారీ నిర్వహణను సమర్థవంతంగా పూర్తి చేయడం సవాలుగా మారే అవకాశం ఉంది. అన్ని విభాగాల్ని ఈ ఏర్పాట్లు నిర్వహణ పనుల్లో భాగస్వామ్యం చేస్తూ.. ఉన్న ఖజానాని ఊడ్చేసి నిర్వహించేందుకు జిల్లా అధికారులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. గత బకాయిల క్లియరెన్స్ లేకపోవడంతో పాటు, ఇప్పుడు అవసరమైన రూ. 37 కోట్ల ఖర్చుకు ముందస్తుగా అనుమతులు మంజూరు చేయాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి లేఖ రాయడం.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. శాఖల వారీగా వ్యయ అంచనాలు మొత్తం నిధులు సుమారు రూ.37 కోట్లు జీవీఎంసీ, వీఎంఆర్డీఏ రూ.30 కోట్లు పోలీస్ శాఖ రూ.2.9 కోట్లు రహదారులు, భవనాల శాఖ రూ.1.1 కోట్లు ప్రోటోకాల్ విభాగం రూ.1.3 కోట్లు మత్స్యశాఖ రూ.1.2 కోట్లు పర్యాటక శాఖ రూ.75 లక్షలు భారీ ఏర్పాట్లు అంతర్జాతీయ నౌకాదళ ఈవెంట్ల కోసం జిల్లా యంత్రాంగం రూ. 37 కోట్లతో యుద్ధప్రతిపదికన పనులు చేపడుతోంది. ఆర్కే బీచ్ రోడ్డులో 3.5 కి.మీ. మేర బారికేడ్లు, విద్యుత్ దీపాల అలంకరణ మరియు సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రజల కోసం 12 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు, విదేశీ అతిథుల కోసం ‘మిలాన్ విలేజ్’ స్టాళ్లను సిద్ధం చేస్తున్నారు. వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, ఆర్అండ్బీ శాఖలు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. తొమ్మిది రోజుల పాటు సందడి వాతావరణం.. నౌకాదళ వేడుకలు 17న రాష్ట్రపతి విందుతో అధికారికంగా ప్రారంభమై 25 వరకు సాగనున్నాయి. ప్రధానంగా 18న రాష్ట్రపతి చేతుల మీదుగా ఫ్లీట్ రివ్యూ, 19న ఆర్కే బీచ్లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహించనున్నారు. 20న ఐఓఎన్ఎస్ కాంక్లేవ్, 21 నుండి 25 వరకు సముద్ర గర్భంలో ‘మిలాన్’ యుద్ధ విన్యాసాలు జరగనున్నాయి. ఈ నెల 25న ముగింపు వేడుకలతో ఈ అంతర్జాతీయ ఉత్సవం పూర్తికానుంది. -
కూటమి మాస్టర్ ప్లాన్ ఫెయిల్
బెడిసి కొట్టిన చంద్రబాబు ‘కుట్ర’ ప్రణాళిక వీఎంఆర్డీఏ మాస్టర్ప్లాన్పై బూటకపు ప్రకటనలని నిర్థారణ వైఎస్సార్సీపీ హయాంలో శాసీ్త్రయంగానే బృహత్తర ప్రణాళిక సిద్ధం విశాఖ సిటీ : చంద్రబాబు ప్రభుత్వం ‘మాస్టర్ ప్లాన్’ బెడిసికొట్టింది. వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళికపై చేసిన ఆరోపణలు తప్పని తేటతెల్లమైంది. వైఎస్సార్సీపీ హయాంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిపెట్టుకుని శాసీ్త్రయంగా ‘మాస్టర్ ప్లాన్–2041’ సిద్ధం చేసినట్లు నిరూపణైంది. బృహత్తర ప్రణాళికపై బురద జల్లుతూ.. పునః పరిశీలన పేరుతో 9 నెలలుగా అభ్యంతరాలు స్వీకరిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు గత ప్లాన్లో లోటు పాట్ల ఒక్క అభ్యంతరం రాకపోవడమే కూటమి కుట్ర ప్రణాళికకు నిదర్శనం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, నీతి అయోగ్ సిఫార్సుల మేరకు మాత్రమే మాస్టర్ప్లాన్లో స్వల్ప సవరణలు చోటు చేసుకోనున్నాయి. 2021లోనే మాస్టర్ ప్లాన్ పూర్తి నిజానికి 2011లో ఈ ప్రణాళికకు శ్రీకారం చుట్టినప్పటికీ, 2019 వరకు అది అడుగు ముందుకు పడలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 17,460 అభ్యంతరాలను, సలహాలను సేకరించి, క్షేత్రస్థాయిలో అధికారులతో సంయుక్త తనిఖీలు నిర్వహించి 2021 నవంబర్ 8న ఈ బృహత్తర ప్రణాళికకు తుది ఆమోదం తెలిపింది. అయితే ఈ ప్లాన్పై అప్పట్లో కూటమి నేతలు చేసిన అశాసీ్త్రయ ఆరోపణలు ఇప్పుడు వీగిపోయాయి. మే 19 నుంచి స్వీకరించిన 3722 అభ్యంతరాల్లో మెజారిటీ ఫిర్యాదులు ఒకే అంశంపై రావడంతో వాటిని పక్కన పెట్టి, కేవలం 717 విలక్షణ అభ్యంతరాలను మాత్రమే అధికారులు వడపోశారు. ఇందులో కూడా 427 అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని, మిగిలిన వాటిని తోసిపుచ్చారు. గత ప్రణాళికలో అవకతవకలు జరిగాయని నిరూపించాలని చూసిన ప్రభుత్వానికి ఈ గణాంకాలు మింగుడు పడని అంశంగా మారాయి. మార్చి 10 వరకు అభ్యంతరాల స్వీకరణ మార్చి 10వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ కొనసాగనుంది. వచ్చిన అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, మార్చి 15 నాటికి సాంకేతిక నిపుణుల కమిటీకి నివేదికను పంపేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మార్చి నెలాఖరు నాటికి తుది బృహత్తర ప్రణాళిక ప్రభుత్వానికి అందుతుంది. తాజా మార్పుల్లో భాగంగా భోగాపురం ఎయిర్పోర్ట్కు రహదారులు, విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టులు, పర్యావరణ పరిరక్షణ కోసం అటవీ ప్రాంతాల సరిహద్దుల గుర్తింపు వంటి అంశాలను మాత్రమే పొందుపరుస్తున్నారు. ఈ పరిణామాలన్నీ గత ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ పటిష్టతను చాటిచెబుతున్నాయి.వాటిలో ప్రధానంగా.. రవాణా, కనెక్టివిటీ: విశాఖ పోర్ట్ కంటైనర్ టెర్మినల్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు సవరించిన కోస్టల్ కారిడార్ అలైన్మెంట్ను మాస్టర్ ప్లాన్లో చేర్చారు. ● అనకాపల్లి నుంచి కొత్తవలస వరకు ప్రతిపాదిత రైల్వే లైను రైల్వే డివిజన్ నుంచి వచ్చిన సరిహద్దుల ప్రకారం ఖరారు చేశారు.● రాయ్పూర్ ఎక్స్ప్రెస్వేను ఒక ప్రధాన ప్రాంతీయ కనెక్టివిటీ కారిడార్గా గుర్తించి మాస్టర్ ప్లానన్లో పొందుపరిచారు.● సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడానికి విజయనగరం రూరల్, అనకాపల్లి, విశాఖ పరిధిలో కొత్త రోడ్లను ప్రతిపాదించారు. ● వీఎంఆర్డీఏ, జీవీఎంసీ సిద్ధం చేసిన 37 రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లను (ఆర్డీపీ) బేస్ డేటాలో చేర్చారు. ● పర్యావరణ పరిరక్షణ కోసం కంబాలకొండ ఎకో–సెన్సిటివ్ జోన్ సరిహద్దులను అటవీ శాఖ నివేదికల ప్రకారం అప్డేట్ చేశారు.● పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో 9.17 హెక్టార్ల విస్తీర్ణంలో 20 ప్రాంతాలలో ‘మియావాకీ’ పద్ధతిలో దట్టమైన అడవుల అభివృద్ధిని ప్రతిపాదించారు. ● చిప్పాడ అటవీ ప్రాంత సరిహద్దులను అటవీ శాఖ నిబంధనల ప్రకారం నోటిఫై చేశారు. ● సుజల స్రవంతి, పోలవరం, తారకరామ కాలువలకు సంబంధించి ఇరిగేషన్ శాఖ సూచనల మేరకు అలైన్మెంట్లను ఖరారు చేశారు. ● విజయనగరం రెవెన్యూ శాఖ ఇచ్చిన డేటా ప్రకారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ సరిహద్దులను అప్డేట్ చేశారు. ● మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా 300 ఏపీడీపీఎంఎస్ లేఅవుట్లు, 780 ఎల్ఆర్ఎస్ లేఅవుట్లు, 90 వన్–సెంట్ లేఅవుట్లను బేస్ డేటాలో చేర్చారు. ● మాస్టర్ ప్లాన్ 2041లో మొత్తం రోడ్ల పొడవు సుమారు 3961 కిలోమీటర్లు. అదనంగా 418.9 కిలోమీటర్ల మేర కొత్త కనెక్టివిటీ రోడ్లను ప్రతిపాదించారు. శరవేగంగా మాస్టర్ప్లాన్ రహదారులు ఉత్తరాంధ్రను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వీఎంఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్ వెల్లడించారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు పలు కీలక ప్రకటనలు చేశారు. అభ్యంతరాలను పరిశీలించి, సవరించిన మాస్టర్ ప్లాన్ను మార్చిలో ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తామన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి సంబంధించిన 7 ప్రధాన రహదారులను మే నాటికి పూర్తి చేస్తామన్నారు. రూ.113.61 కోట్లతో నిర్మించిన ఎన్ఏడీ రైల్వే ఓవర్ బ్రిడ్జిని ఆదివారం ప్రారంభిస్తామన్నారు. కైలాసగిరిపై రూ.2.5 కోట్లతో నిర్మిస్తున్న 65 అడుగుల త్రిశూల్, డమరుకం ప్రాజెక్టును ఉగాది నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. విశాఖలో ఐకానిక్ 50 అంతస్తుల టవర్లు, వర్చువల్ రియాల్టీ ఎరీనా, త్రీ స్టార్ హోటల్ వంటి భారీ ప్రాజెక్టులను పీపీపీ విధానంలో త్వరలోనే ఫైనలైజ్ చేస్తామని తెలిపారు. మిలాన్ వేడుకల దృష్ట్యా వీఎంఆర్డీఏ పరిధిలోని మ్యూజియాలు, పార్కులను రూ.2 కోట్లతో సుందరీకరిస్తున్నట్లు వారు వివరించారు. -
ముస్తాబైన శివాలయాలు
మహారాణిపేట: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఈ నెల 15న ఆదివారం మహాశివరాత్రి, మరుసటి రోజు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తే అవకాశం ఉండటంతో దేవదాయ శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని దేవదాయ శాఖ సహాయ కమిషనర్ టి.అన్నపూర్ణ తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు శివరాత్రి రోజున ఉపవాస దీక్షలతో వచ్చే భక్తుల కోసం ఆలయాల వద్ద చలువ పందిళ్లు, లైటింగ్, క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, ఉచిత ప్రసాద వితరణకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. దివ్యాంగుల సౌకర్యార్థం వీల్ చైర్లను కూడా అందుబాటులో ఉంచారు. అప్పికొండపై ప్రత్యేక దృష్టి మహాశివరాత్రి మరుసటి రోజు సముద్ర స్నానాలకు భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అప్పికొండ శివాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్నానాల ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను నియమించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఏసీ అన్నపూర్ణ శుక్రవారం అప్పికొండలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు. జిల్లాలోని పూర్ణామార్కెట్ వద్ద శ్రీ దుర్గాలమ్మ ఆలయం, అప్పికొండ శివాలయాలకు పది వేల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చురుగ్గా ఏర్పాట్లు వీటితో పాటు జిల్లాలోని వన్టౌన్ భీమేశ్వర రాజరాజేశ్వరస్వామి ఆలయం, సూర్యబాగ్ విశ్వేశ్వర స్వామి ఆలయం, ఆర్.కె.నగర్ రామలింగేశ్వర స్వామి ఆలయం, వెంకోజిపాలెం రామానంద ఆశ్రమం, సీతంపేట పార్వతీశ్వర అమ్మవారి ఆలయం, అస్సాం గార్డెన్స్లోని శ్రీ శివరామకృష్ణ స్వామి ఆలయం, నీలమ్మ వేపచెట్టు ఆలయం, రైల్వే న్యూకాలనీ ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం, సత్యనగర్ సోమేశ్వర స్వామి ఆలయం, మర్రిపాలెంకాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, బీచ్రోడ్డు ప్రసన్న పాండురంగ స్వామి ఆలయం, నక్కవానిపాలెం ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం, ఎన్ఏడీ కొత్తరోడ్డు ప్రమధ ఉమా విశ్వేశ్వర స్వామి ఆలయం, దొండపర్తిలోని శ్రీ రామమందిరం, పరదేశమ్మ అమ్మవారి దేవస్థానం, ఎరుకుమాంబ అమ్మవారి ఆలయం, లాసన్స్ బే కాలనీ వేంకటేశ్వర స్వామి ఆలయం, గుడిలోవ రంగనాథ స్వామి ఆలయం, పెందుర్తి పినగాడి గణేష్ పార్వతీ సమేత చౌడేశ్వర స్వామి ఆలయం తదితర ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటేషన్పై సిబ్బంది నియామకం శివ భక్తులు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ఈ విషయమై జిల్లాలోని అన్ని ఆలయాల ఈవోలు, మేనేజర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు శివాలయాల్లో అదనపు సిబ్బందిని డిప్యూటేషన్పై నియమించాం. రెండు రోజుల పాటు భక్తులకు సేవలు అందించడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది. – టి.అన్నపూర్ణ, సహాయ కమిషనర్, దేవదాయ శాఖ -
పోర్టు సెక్రటరీగా శంకర్బాబు
సాక్షి, విశాఖపట్నం : మేజర్ పోర్టులతో పోటీ పడుతున్న విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ)లో జరుగుతున్న కార్యకలాపాలు సజావుగా పూర్తయ్యేలా బాధ్యతగా వ్యవహరిస్తానని పోర్టు సెక్రటరీ ఎం శంకర్బాబు అన్నారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కార్యదర్శిగా ఎం. శంకర్ బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలల క్రితం గతంలో పనిచేసిన సెక్రటరీ వేణుగోపాల్ డిప్యూటీ చైర్మన్గా పదోన్నతి పొందుతూ పారాదీప్ పోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కేంద్ర పోర్టులు నౌకా జల రవాణా శాఖ మంత్రిత్వ శాఖ శంకర్బాబుని నియమించింది. విశాఖపట్నం పోర్ట్కు రాక పూర్వం ఆయన గోవా పోర్టు కార్యదర్శిగా సేవలందించారు. వీపీఏ డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి కొరాటిని మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన శంకర్బాబుకు పోర్ట్ విభాగాధిపతులు, ఉన్నతాధికారులు, సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. -
జిల్లా అనుబంధ విభాగ కమిటీల్లో పలువురికి చోటు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అనుబంధ విభాగంలో పలువురికి చోటు కల్పించారు. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా కళింగ కోమటి విభాగం అధ్యక్షుడిగా తలాసు సాయి మోహన్రావు(విశాఖ నార్త్), జిల్లా రజక విభాగం అధ్యక్షుడిగా కోడూరు సత్యనారాయణ(విశాఖ నార్త్), జిల్లా గవర విభాగం అధ్యక్షుడిగా కొణతాల ఉమా మహేశ్వరరావు(విశాఖ పశ్చిమ), జిల్లా నాయీ బ్రాహ్మణ విభాగం అధ్యక్షుడిగా పి.సూర్యారావు(విశాఖ పశ్చిమ), జిల్లా నూర్ భాష/దూదేకుల విభాగం అధ్యక్షుడిగా షేక్ ఖాన్(విశాఖ పశ్చిమ), జిల్లా శిష్టకరణాల విభాగం అధ్యక్షుడిగా ఎం.ఎస్.ఎస్.ఎస్ పట్నాయక్(గాజుకవాక), జిల్లా యాత విభాగం అధ్యక్షుడిగా అండిబోయిన అప్పారావు(గాజువాక), జిల్లా విశ్వబ్రాహ్మణ విభాగం అధ్యక్షుడిగా దంతిన రామారావు(విశాఖ తూర్పు)తో పాటు విశాఖ దక్షిణ నియోజకవర్గం అంగన్వాడీ వింగ్ అధ్యక్షుడిగా కండిపల్లి ఆదిలక్ష్మిని నియమించారు. -
పెళ్లి కళ
వచ్చేసిందిసుదీర్ఘ విరామం తర్వాత తెలుగు లోగిళ్లలో మళ్లీ పెళ్లికళ సంతరించుకోనుంది. దాదాపు 90 రోజుల పాటు గురు, శుక్ర మూఢాల కారణంగా నిలిచిపోయిన శుభకార్యాలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇన్నాళ్లూ అడ్డంకిగా మారిన శూన్యమాసాలు తొలగిపోవడంతో.. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యేందుకు జంటలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 19 నుంచి మే 13 వ తేదీ వరకు బలమైన ముహూర్తాలు ఉండటంతో వివాహాలు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, నిశ్చితార్థాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. – మహారాణిపేట 19 నుంచి మే 13 వరకు పెళ్లిళ్ల జోరు మూడు నెలల విరామం తర్వాత మళ్లీ శుభకార్యాల కళ వ్యాపారాల్లోనూ ‘శుభ’ కళ ముహూర్తాలు లేక గత మూడు నెలలుగా స్తబ్దుగా ఉన్న వివాహ సంబంధిత వ్యాపారాలు ఇప్పుడు మళ్లీ కళకళలాడుతున్నాయి. కల్యాణ మండపాలు, క్యాటరింగ్, డెకరేషన్, బ్యాండ్ మేళాలు, ఫొటోగ్రాఫర్లు, ఈవెంట్ మేనేజర్లు, వస్త్ర, బంగారు వ్యాపారులు తిరిగి బిజీ అయిపోయారు. ముహూర్తాలు ఖరారు చేసుకునేందుకు జనం పండితుల వద్దకు క్యూ కడుతుండగా, ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. మూఢాల్లో కేవలం అన్నప్రాసన, నామకరణం వంటి చిన్న కార్యక్రమాలకే పరిమితమైన వారు.. ఇప్పుడు భారీ వేడుకలకు సిద్ధమవుతున్నారు. మే 13 వరకు సందడి గత ఏడాది నవంబర్ 26 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీ వరకు మూఢాల కారణంగా శుభకార్యాలకు బ్రేక్ పడింది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అధిక మాసం మినహా, మిగిలిన మాసాల్లో శుభముహూర్తాలు ఉన్నాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో కూడా అధిక సంఖ్యలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అయితే.. మే 14 నుంచి జూన్ 13వ తేదీ వరకు అధిక జ్యేష్ట మాసం రానుండటంతో ఆ నెల రోజులు మళ్లీ ముహూర్తాలకు విరామం ఉంటుంది. తిరిగి నిజ జ్యేష్ట మాసం, ఆ తర్వాత వచ్చే మాసాల్లో శుభకార్యాలు ఊపందుకుంటాయి. -
చర్చలు విఫలం.. ఉద్యమానికి సిద్ధం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ పోరుబాట పట్టారు. యూనివర్సిటీ అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో, గురువారం రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఇకపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అతిథి అధ్యాపకుల యూనియన్ నాయకుడు డాక్టర్ ఎం.సురేష్ మీనన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించాలని, నిబంధనల ప్రకారం గంటకు రూ. 1500 చొప్పున పారితోషికం లేదా నెలకు రూ. 50,000 వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలను ప్రస్తావించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వర్సిటీ పరిధిలోని ఎమ్మెల్యేలను వారు కోరారు. నిరసనలో డాక్టర్ శేషు, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ శిరీష్, మురళీ, నారాయణ, పవన్, ఫణి, దాస్, దేవదానం, మాథ్యూస్, గిరీష్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.ఏయూ గెస్ట్ ఫ్యాకల్టీ నిరసన -
నేడే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు
విశాఖ లీగల్: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం జరగనున్న ఈ ఎన్నికల కోసం విశాఖలో అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసినట్లు విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె. శ్రీనివాస్, కార్యదర్శి లాలం పార్వ తీ నాయుడు తెలిపారు. 2020 తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో న్యాయవాదుల్లో ఆసక్తి నెలకొంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయవాది పర్యవేక్షణలో జరగనున్న ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖలోని 2,000 మందికి పైగా న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 143 మంది పోటీ చేస్తుండగా, ఒక్క విశాఖ నగరం నుంచే 24 మంది బరిలో నిలవడం విశేషం. మిగిలిన జిల్లాల అభ్యర్థులు కూడా విశాఖ ఓటర్లపైనే ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఎన్నికల ద్వారా బార్ కౌన్సిల్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి తదితర కీలక పదవులను ఎన్నుకోనున్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో ప్రతి న్యాయవాది కనీసం ఐదు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఓటును అంకెల రూపంలో కాకుండా, అక్షర రూపంలో రాయాలి. ఓటు వేయడానికి వచ్చే న్యాయవాదులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జారీ చేసిన ఐడీ కార్డు లేదా విశాఖ న్యాయవాద సంఘం ఐడీ కార్డును తప్పనిసరిగా చూపించాలి. అర్హులైన న్యాయవాదులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బార్ కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షులు కె. రామజోగేశ్వరరావు, ఎస్.కృష్ణమోహన్, ఇతర సభ్యులు కోరారు. బరిలో విశాఖ నుంచి 24 మంది న్యాయవాదులు -
బార్ ఏర్పాటుపై మహిళల ఆగ్రహం
మహారాణిపేట : నివాస ప్రాంతంలో, దేవాలయం సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలనే యత్నంపై స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఆఫిషియల్ కాలనీలో, శ్రీ బెల్లం వినాయక దేవాలయం వద్ద బార్ ఏర్పాటు చేయడాన్ని జాలారిపేట, పెద జాలారిపేట, రెల్లివీధి, జబ్బరతోట ప్రాంతాల మహిళలు వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. బార్కు సమీపంలో దేవదాయశాఖకు చెందిన శ్రీ బెల్లం వినాయకుడు దేవాలయం, జీవీఎంసీకి చెందిన అచ్చుతరామ పాఠశాల, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి చెట్టు, భూలోకమాత గుడి ఉన్నాయని వారు తెలిపారు. దేవాలయం, పాఠశాల పక్కన మద్యం షాపు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. మద్యం సేవించిన వారి ప్రవర్తన వల్ల మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ పొలిపిల్లి జ్యోతి, స్థానికులు సురకాల వేణు పోలరాజు, దశమంతుల చిన్ని, దశమంతుల మాణిక్యలరావు తదితరులు కలెక్టర్ పరిపాలనాధికారి బి.వి.రాణిని కలిసి వినతిపత్రం సమర్పించారు. బార్ ఏర్పాటును తక్షణం నిలిపివేయాలని వారు కోరారు. తెరవెనుక జనసేన నాయకుడు ఈ బార్ ఏర్పాటు వెనుక జనసేన ప్రసాద్ ఉన్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ప్రసాద్కు దక్షిణ, ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గాల్లో బార్లు, మద్యం షాపులు ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు జననివాసాలు, బెల్లం వినాయకుడు, స్కూల్ వద్ద బార్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం పట్ల మహిళా సంఘాలు ఆగ్రహంతో ఉన్నారు. -
ఐఎఫ్ఆర్ ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి
కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మహారాణిపేట: ఐఎఫ్ఆర్–2026 నిర్వహణకు సంబంధించి మిగిలిన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చితో కలిసి కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఏర్పాట్ల పురోగతిని పరిశీలించారు. ఈ నెల 17 నుంచి 20 వరకు జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, ఐఎన్ఎస్ కాన్క్లేవ్, సిటీ పరేడ్ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రపతి, కేంద్ర రక్షణ మంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి తదితర ప్రముఖుల పర్యటనల దృష్ట్యా ప్రోటోకాల్ ఏర్పాట్లు కచ్చితంగా పాటించాలని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫిషింగ్ బోట్ జెట్టీలోని పడవలను తాత్కాలికంగా తరలించాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశించారు. కోస్ట్ గార్డ్, మైరెన్ పోలీసులు తీర భద్రత పర్యవేక్షించాలని తెలిపారు. మిలాన్ విలేజ్ స్టాళ్లు, సిటీ పరేడ్ సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను టూరిజం శాఖ చేపట్టాలని చెప్పారు. 18న జరిగే ఫుల్ డ్రస్ రిహార్సల్కు ముందే అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, పటిష్టమైన బారికేడింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. హోల్డింగ్ పాయింట్ల వద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరమైన మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని వైద్య శాఖను ఆదేశించారు. అలాగే వంతెన, రోడ్డు పనులు వేగవంతం చేయాలని, అగ్నిమాపక యంత్రాలు సిద్ధంగా ఉంచాలని, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎయిర్పోర్టు వద్ద రిసెప్షన్ డెస్క్, విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, నేవీ అధికారులు, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఐసీఏఐ అధ్యక్షుడిగా విశాఖ వాసి ప్రసన్నకుమార్
మద్దిలపాలెం: విశాఖకు చెందిన ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ డి.ప్రసన్నకుమార్ ‘ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ (ఐసీఏఐ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు సంస్థ ఉపాధ్యక్షుడిగా సేవలందించిన ఆయన గురువారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఐసీఏఐ అధ్యక్షుడిగా ఎన్నికై న తొలి వ్యక్తి కావడం విశేషం. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా నెడంబరం గ్రామం ఆయన స్వస్థలం. సీఏలో ఉత్తీర్ణత సాధించిన అనంతరం 1985లో విశాఖపట్నంలో స్థిరపడ్డారు. ఇక్కడి ‘శ్రీరామమూర్తి అండ్ కో’ సంస్థలో వృత్తి జీవితం ప్రారంభించారు. విద్యార్థి దశలోనే దక్షిణ భారత సీఏ విద్యార్థి సంఘంలో ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అంతర్జాతీయ వేదికలపై భారత గళం ప్రసన్నకుమార్ ఐఎఫ్ఏసీ బోర్డులో ఐసీఏఐ ప్రతినిధికి టెక్నికల్ అడ్వైజర్గా వ్యవహరించారు. ఎస్ఎస్ఏలోనూ కీలక కమిటీలకు అధ్యక్షత వహించారు. కార్పొరేట్ చట్టాలు, బ్యాంక్ ఆడిట్ వంటి అంశాలపై వందలాది ఐసీఏఐ సెమినార్లలో ప్రసంగించారు. 2022లో వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్లో పత్రం సమర్పించారు. 2025లో మెక్సికో సిటీలో కృత్రిమ మేథస్సుపై, జకార్తాలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్పై జరిగిన ఐఎఫ్ఏసీ సమావేశాల్లో ప్రసంగించారు. అంచెలంచెలుగా ఐసీఏఐ శిఖరానికి.. ప్రసన్నకుమార్ ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్కు 2019–22, 2022–25, 2025–29 కాలాలకు ఎన్నికయ్యారు. 2025–26లో సంస్థ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. యూడీఐఎన్ అమలు, ఐసీఏఐ ఈఆర్పీ వ్యవస్థల అభివృద్ధి, పీర్ రివ్యూ బోర్డు, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కమిటీ వంటి కీలక కమిటీలకు నాయకత్వం వహించారు. అదనంగా మూడు సంవత్సరాల పాటు బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్కు అధ్యక్షుడిగా సేవలందించారు. -
జీవీఎంసీని సందర్శించిన ఇండోర్ మున్సిపల్ కౌన్సిలర్లు
డాబాగార్డెన్స్: ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కౌన్సిలర్లు గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అదనపు కమిషనర్లు పీఎం సత్యవేణి, పి.నల్లనయ్య, డీవీ రమణమూర్తి, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్ వారితో సమావేశమై నగర అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణపై వివరించారు. పారిశుధ్య కార్మికుల పనితీరు, వ్యర్థాల సేకరణ–తరలింపు, క్లోజ్డ్ కాంపాక్టర్ సిస్టం, గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్వహణ, నీటి సరఫరా వ్యవస్థ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు, త్రిబుల్ ఆర్ సెంటర్లు, సోలార్ ప్లాంట్లు, నీటి శుద్ధి కేంద్రాలు, ఎల్ఆర్ఎస్, బీపీఎస్ అమలు వంటి అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఇండోర్ సీనియర్ కౌన్సిలర్లు సురేష్ తక్కల్కర్, కాంచన గిద్వానీ విశాఖ నగర పరిశుభ్రత, సుందరీకరణను ప్రశంసించారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, సోలార్ ప్రాజెక్టులు, మురుగునీటి శుద్ధి విధానం ఆదర్శనీయమని పేర్కొన్నారు. అనంతరం పరస్పరం జ్ఞాపికలు అందజేసుకున్నారు. -
కదం తొక్కిన కార్మిక లోకం
బీచ్రోడ్డు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేసే వరకు ఎలాంటి పోరాటాలకై నా కార్మిక వర్గం సిద్ధంగా ఉందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక చర్యలకు నిరసనగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సరస్వతి పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు వేలాది మంది కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద జరిగిన బహిరంగ సభలో నర్సింగరావు మాట్లాడుతూ కార్పొరేట్ల లాభాల కోసం కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని తాకట్టు పెడుతోందని విమర్శించారు. బ్రిటిష్ కాలం నుంచే పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్గా మార్చారని అన్నారు. ఈ కోడ్స్ అమల్లోకి వస్తే సంఘం ఏర్పాటు చేసే హక్కు, సమ్మె హక్కు, ఎనిమిది గంటల పనిదినం, ఉద్యోగ భద్రత, సెలవులు వంటి హక్కులు దెబ్బతింటాయని తెలిపారు. ఎనిమిది గంటల పని దినాన్ని 14 గంటలకు పెంచే ప్రయత్నం జరుగుతోందని, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ పేరుతో శాశ్వత ఉద్యోగాలను తగ్గించే విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఏకమై సమ్మెకు పిలుపునిచ్చిందని, కోట్లాది మంది కార్మికులు పాల్గొన్నారని చెప్పారు. నగరంలో మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా మున్సిపల్ కమిషనర్ చెత్త బయట వేయవద్దని ప్రకటించారని, ఇది కార్మికుల ఐక్యతకు నిదర్శనమని అన్నారు. జిల్లాలో బ్యాంకులు, ఎల్ఐసీ, జీఐసీ, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులతో పాటు ఆశా, అంగన్వాడీ, వీవీఓఏ, ఆర్పీ కార్మికులు కూడా పనులు నిలిపివేశారని తెలిపారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతపడ్డాయని, పలు చోట్ల ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించారని చెప్పారు. సభలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి నాగభూషణం, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, సీఐటీయూ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్కే ఎస్వీ కుమార్, జీజేఎస్ అచ్యుతరావు, తదితరులు పాల్గొన్నారు. -
పలు రైళ్లకు అదనపు కోచ్లు
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల సౌకర్యార్థం వాల్తేర్ డివిజన్ పరిధిలో నడుస్తున్న పలు రైళ్లకు ఆయా తేదీల్లో అదనంగా థర్డ్ ఏసీ కోచ్లను జతచేస్తున్నారు. భువనేశ్వర్–కేఎస్ఆర్ బెంగళూరు(18463) ప్రశాంతి ఎక్స్ప్రెస్కు ఈ నెల 16, 21వ తేదీల్లో, తిరుగు ప్రయాణంలో కేఎస్ఆర్ బెంగళూరు–భువనేశ్వర్ (18464) ప్రశాంతి ఎక్స్ప్రెస్కు ఈ నెల 17, 22వ తేదీల్లో ఒక థర్డ్ ఏసీ కోచ్ను జతచేస్తున్నారు. భువనేశ్వర్–తిరుపతి(22879)సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు ఈ నెల 21, 28వ తేదీల్లో, తిరుగు ప్రయాణంలో తిరుపతి–భువనేశ్వర్(22880)సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు ఈ నెల 22, మార్చి 1వ తేదీల్లో ఒక థర్డ్ ఏసీ కోచ్ను జతచేస్తున్నారు -
రేషన్
రూటు మార్చినమాఫియాప్రజాప్రతినిధుల అండతో పేదల బియ్యం పక్కదారి కంటైనర్ టెర్మినల్లో పటిష్ట నిఘాతో గంగవరం మార్గంగా విదేశాలకు తరలింపు వైజాగ్ పోర్టు నుంచి పెరిగిన బల్క్ బియ్యం ఎగుమతులు వీసీటీపీఎల్లో నెలకు 6 వేల కంటైనర్ల నుంచి 4 వేలకే పరిమితంసాక్షి, విశాఖపట్నం: పేదవాడి ఆకలి తీర్చాల్సిన రూపాయి బియ్యం అక్రమార్కుల జేబులు నింపుతోంది. ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని, రాజకీయ అండదండలతో రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. విశాఖ కంటైనర్ టెర్మినల్లో నిఘా కట్టుదిట్టం కావడంతో స్మగ్లర్లు తమ రూట్ను మార్చినట్లు సమాచారం. నిఘా తక్కువగా ఉన్న గంగవరం, వైజాగ్ పోర్టుల ద్వారా బల్క్ రూపంలో విదేశాలకు బియ్యం తరలిస్తూ కోట్లు గడిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవస్థల కళ్లుగప్పి సాగుతున్న ఈ ‘బియ్యం’ బాగోతం వెనుక అసలు సూత్రధారులు ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొందరు కూటమి నేతల అండతోనే ఇదంతా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు నిఘా పెంచామని ప్రకటిస్తూనే, మరోవైపు అక్రమ రవాణాకు సరికొత్త మార్గాలు సుగమం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విదేశాలకు భారీ ఎగుమతులు విశాఖ నుంచి ఆసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు బియ్యం ఎగుమతులు జరుగుతుంటాయి. ఆఫ్రికాలో బెనిన్, ఐవరీకోస్ట్, గినియా, టోగో, జిబౌటీ, కామెరూన్ వంటి దేశాలకు, ఆసియాలో చైనా, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, వియత్నాం దేశాలకు, మిడిల్ ఈస్ట్లో యూఏఈ, ఇరాన్, కువైట్ దేశాలకు బియ్యం తరలింపులు అధికంగా ఉంటాయి. ఆయా దేశాలు బియ్యాన్ని ఆహారంగానే కాకుండా, ఆహార పదార్థాల తయారీ, సౌందర్య సాధనాల ఉత్పత్తుల్లోనూ వినియోగిస్తుంటాయి. ఈ డిమాండ్ను ఆసరాగా చేసుకుని, పేదల కోసం సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు, కొందరు అధికారులు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేదలకు బియ్యం చేరకపోయినా పరవాలేదన్నట్లుగా వ్యవస్థలు వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కంటైనర్ టెర్మినల్లో తగ్గిన ఎగుమతులు విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ (వీసీటీపీఎల్) నుంచి చైనా, యెమెన్, వియత్నాం దేశాలకు అధికంగా బియ్యం ఎగుమతి అవుతోంది. ప్రతి నెలా సుమారు 6,000 కంటైనర్లు (ఒక్కోటి 28 టన్నులు) వెళ్లేవి. అంటే నెలకు దాదాపు 1,68,000 టన్నుల ఎగుమతి జరిగేది. 2024 డిసెంబర్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ (సీఎఫ్ఎస్)ల్లో తనిఖీలు నిర్వహించి 483 టన్నుల బియ్యాన్ని సీజ్ చేసినట్లు ప్రకటించారు. అయితే అనంతరం ఆ బియ్యం రేషన్ బియ్యం కాదని ఈ ఏడాది జనవరి 2న కలెక్టర్ సర్క్యులర్ జారీ చేశారు. అదే సమయంలో పోర్టులో చెక్పోస్ట్ ఏర్పాటు చేసి పౌర సరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులతో ప్రత్యేక నిఘా బృందాన్ని నియమించారు. దీంతో వీసీటీపీఎల్ నుంచి బియ్యం రవాణా గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం నెలకు సుమారు 98,000 టన్నులే ఎగుమతి అవుతున్నట్లు సమాచారం. అంటే 3,000–4,000 కంటైనర్లకు పరిమితమైందని తెలుస్తోంది. తనిఖీలొద్దు.. సాఫీగా సాగిపోనీ అధికార పార్టీకి చెందిన కీలక నేతల అండదండలతో ఓ కార్గో వ్యాపారి వేర్హౌస్ల నుంచి బియ్యం గంగవరం పోర్టుకు చేరుతోందన్న విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా మిగిలిన చోట్ల నుంచి జరుగుతున్న ఈ మొత్తం అక్రమ వ్యవహారంలో కూటమి ప్రభుత్వంలోని కొందరు ’చోటా’ నేతల పాత్ర కీలకంగా మారింది. గాజువాక, ఆనందపురం, పెందుర్తి ప్రాంతాల నుంచి సేకరించిన బియ్యం పెద్దిపాలెం, చోడవరం పరిసరాల రైస్ మిల్లులకు చేరి అక్కడి నుంచి పోర్టులకు తరలుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసినా అధికారులు మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో బియ్యం విషయంలో ఎలాంటి తనిఖీలు చెయ్యొద్దంటూ అధికార పార్టీకి చెందిన నేతల నుంచి ఆదేశాలు అందుతున్నట్లు సమాచారం. ఇదే అదనుగా పౌర సరఫరాల అధికారులు కూడా తమ చేతివాటం ప్రదర్శిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మండల స్థాయి నుంచి పోర్టుల వరకు సమగ్ర నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడే ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు పోర్టుల్లో పెరిగిన బల్క్ ఎగుమతులు విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశాలకు బియ్యం రవాణా పెరిగింది. గతంలో సంవత్సరానికి 6 నుంచి 7 లక్షల టన్నుల వరకూ ఎగుమతులు జరిగేవి. అయితే 2024–25లో దాదాపు 10 లక్షల టన్నుల వరకు ఎగుమతులు జరిగాయని సమాచారం. ప్రతి నెలా 30 వేల టన్నులకు పైగా రవాణా జరుగుతోందని తెలుస్తోంది. గంగవరం పోర్టు నుంచి కూడా గత ఆరు నెలల్లో 10 వేల టన్నులకు పైగా బియ్యం ఎగుమతి జరిగినట్లు సమాచారం. కంటైనర్ టెర్మినల్లో చెక్పోస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత బల్క్ రూపంలో గంగవరం నుంచి రేషన్ బియ్యం తరలింపులు పెరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. నిఘా ఒకచోట అక్రమాలు మరోచోట.. కంటైనర్ టెర్మినల్లో నిఘా కట్టుదిట్టం కావడంతో అక్రమార్కులు తమ ఎగుమతులను గంగవరం, వైజాగ్ పోర్టుల వైపు మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి సమాచారం ఉన్నప్పటికీ, అక్కడ సమగ్ర నిఘా ఏర్పాటు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది అధికార పార్టీలకు చెందిన నేతలే ఈ అక్రమ ఎగుమతులకు పరోక్ష మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే రేషన్ బియ్యంపై నిఘాను ఒకేచోట పరిమితం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
అందరికీ ఉపాధి లభిస్తుంది
ఈ నెల 19వ తేదీ నుంచి బలమైన శుభముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి. 90 రోజులుగా మూఢాల వల్ల శుభకార్యాలకు బ్రేక్ పడటంతో, ఈ రంగంపై ఆధారపడిన పురోహితులు, కళాకారులు, ఇతర వృత్తుల వారికి ఉపాధి లేకుండా పోయింది. ఇప్పుడు వరుస ముహూర్తాలు వస్తుండటంతో వారందరికీ మళ్లీ చేతి నిండా పని దొరుకుతుంది. – వెలవలపల్లి కోటీశ్వర శర్మ, ప్రముఖ వేద పండితుడు, మునగపాక చైత్ర, వైశాఖ మాసాల్లోనే అధికం చైత్ర మాసంలో సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం, శ్రీరామ నవమి తర్వాత వివాహాది శుభ కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చైత్ర, వైశాఖ మాసాల్లో ముహూర్తాలు బలంగా ఉన్నాయి. ఇన్నాళ్లూ మూఢాల వల్ల ఖాళీగా ఉన్న అర్చకులు, పండితులు, ఇతర అనుబంధ రంగాల వారికి ఈ సీజన్ మంచి ఉపాధినిస్తుంది. – అయిలూరి శ్రీనివాస దీక్షితులు, శైవాగమ పండితుడు, విశాఖపట్నం -
వాచ్మన్ అనుమానాస్పద మృతి
పందుల ఫారంలో పనిచేస్తున్న తూ.గో.వాసి ఆనందపురం: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఓ అనుమానాస్పద మృతి కేసు నమోదైంది. ఆనందపురం పంచాయతీ శివారులో మధురవాడకు చెందిన ఓ వ్యక్తి నిర్వహిస్తున్న పందుల పెంపక కేంద్రంలో.. శివ (38) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కొండగుంటూరుకు చెందిన శివ, తన భార్యతో కలిసి గత ఆరు నెలలుగా ఈ పందుల ఫారంలో వాచ్మన్గా పనిచేస్తున్నాడు. శివ మృతదేహాన్ని గమనించిన స్థానికులు 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో సహా ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో, దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వాసునాయుడు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
సమన్వయంతోనే ఐఎఫ్ఆర్ విజయవంతం
బీచ్రోడ్డులో ఏర్పాట్లను పరిశీలించి కలెక్టర్ ఏయూ క్యాంపస్: విశాఖ వేదికగా జరగనున్న ఐఎఫ్ఆర్–2026, సిటీ పరేడ్ ఏర్పాట్లను కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ బుధవారం పరిశీలించారు. వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, జీవీఎంసీ, నేవీ అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు జరుగుతున్న పనులను కలెక్టర్ సమీక్షించారు. ప్రధాన వేదిక, వీఐపీల గ్యాలరీలు, వాహనాల రాకపోకలు, పార్కింగ్ వసతి, బారికేడ్లు, క్యూలు, కంట్రోల్ రూమ్, ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జెట్టీ ప్రాంతంలోని పడవలను తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు తరలించాలని, ఫైర్ షో, డ్రోన్ షో నిర్వహణకు అవసరమైన అనుమతులు ముందుగానే తీసుకోవాలని సూచించారు. సమన్వయం కోసం అదనపు వైర్లెస్ కమ్యూనికేషన్ సెట్లను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ప్రాంగణంలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు, మెడికల్ క్యాంపులు, స్ట్రెచర్లతో కూడిన అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని, ఏపీఐఐసీ గ్రౌండ్ వద్ద మైదానాన్ని చదును చేయాలని ఆదేశించారు. ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి, లైవ్ స్ట్రీమింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, సాధారణ ప్రజల కోసం 100 మొబైల్ టాయిలెట్లు, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఐఎఫ్ఆర్, మిలాన్కు ఏర్పాట్లు పూర్తి మహారాణిపేట: నగరంలో ఈ నెల 17 నుంచి 25 వరకు జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), మిలాన్ విన్యాసాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. బుధవారం తన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ.. 18న రిహార్సల్స్, 19న ఆర్.కె.బీచ్లో సిటీ పరేడ్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సిటీ పరేడ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారని, సుమారు లక్ష నుంచి రెండు లక్షల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పరేడ్లో భాగంగా బాణసంచా, డ్రోన్ షో, సముద్రంలో నేవీ విన్యాసాలు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. పలు దేశాలకు చెందిన నేవీ బృందాలు, దేశంలోని వివిధ ప్రాంతాల కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు, అభివృద్ధిని ప్రతిబింబించేలా శకటాల ప్రదర్శన ఉంటుందని వివరించారు. పార్కు హోటల్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు ఈ ప్రదర్శనలు సాగుతాయని, ఇందుకు సంబంధించి బీచ్రోడ్డులో పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. -
డిఫెండింగ్ చాంపియన్కు షాక్
క్వార్టర్స్కు అవెంజర్స్, గౌరీ యూత్ విశాఖ స్పోర్ట్స్: వీడీసీఏ డీఎస్ఆర్ స్మారక ట్రోఫీలో అవెంజర్స్ సీసీ, గౌరీ యూత్ సీసీ జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. రైల్వే స్టేడియం వేదికగా బుధవారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్స్లో డిఫెండింగ్ చాంపియన్ పీఎం పాలెం సీసీపై అవెంజర్స్ సీసీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పీఎం పాలెం సీసీ నిర్ణీత 18 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. శ్యాం (48) రాణించగా, వసంత్ (23), రంజిత్ (10) ఫర్వాలేదనిపించారు. అవెంజర్స్ బౌలర్లు యష్, విజయ్, సత్యదేవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అవెంజర్స్ సీసీ.. ఆరంభంలోనే 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో విజయ్ (53 నాటౌట్), జగదీష్ (36 నాటౌట్) అద్భుత బ్యాటింగ్తో ఆదుకున్నారు. విజయ్ అర్ధ సెంచరీతో మెరవగా, ఇద్దరూ అజేయంగా నిలిచి 14.4 ఓవర్లలోనే జట్టును విజయతీరాలకు చేర్చారు. పీఎం పాలెం బౌలర్ దేవాశిష్ రెండు వికెట్లు తీశాడు. గౌరీ యూత్ విజయం త్రిష్ణా గ్రౌండ్లో జరిగిన మరో మ్యాచ్లో గౌరీ యూత్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గౌరీ యూత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. సంతోష్ (30) రాణించాడు. వైజాగ్ వీకింగ్ సీసీ బౌలర్లలో భాస్కరరావు 4 వికెట్లు తీయగా, ధన 2 వికెట్లు దక్కించుకున్నాడు. లక్ష్య ఛేదనలో వైజాగ్ వైకింగ్స్ సీసీ 17.4 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ యాదగిరి (35), మిడిలార్డర్లో చిన్నా (31) పోరాడినా ఫలితం లేకపోయింది. గౌరీ యూత్ బౌలర్ ప్రకాష్ 4 వికెట్లతో చెలరేగగా.. వినీత్, శశాంక్ చెరో రెండు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు. -
పెందుర్తిలో మేయర్ కక్షసాధింపు చర్యలు
పెందుర్తి: కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల అండతో జీవీఎంసీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎంసీ 96వ వార్డులో అధికారులు వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పెందుర్తి సమీపంలోని శిరిడిసాయి కాలనీలో కేవలం 8 అడుగుల కాలువ నిర్మాణం కోసం 30 అడుగుల స్థలాన్ని చదును చేసేందుకు బుధవారం ప్రయత్నించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, ఆయన అనుచరుల సూచనలతో, స్థానికంగా నివసిస్తున్న వైఎస్సార్సీపీ సానుభూతిపరుల స్వాధీనంలో దాదాపు 40 ఏళ్లుగా ఉన్న స్థలాన్ని అధికార బలంతో లాక్కోవాలనే ప్రయత్నం జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్ఈసీ సభ్యుడు, మన్యం పార్వతీపురం జిల్లా పరిశీలకుడు, స్థానిక మాజీ కార్పొరేటర్ శరగడం చిన్న అప్పలనాయుడు ఘటనాస్థలికి చేరుకుని అధికారుల తీరును ప్రశ్నించారు. కేవలం 8 అడుగుల కాలువ కోసం 30 అడుగుల స్థలాన్ని ఎందుకు చదును చేస్తున్నారని ఆయన నిలదీశారు. కాలువ నిర్మాణానికి అడ్డంకి కాని దశాబ్దాల నాటి చెట్లను ఎందుకు తొలగించాలనుకుంటున్నారని మండిపడ్డారు. దీంతో అధికారులు తాత్కాలికంగా చదును చేసే పనులను నిలిపివేశారు. అరాచకాలకు పరాకాష్ట : శరగడం చిన్న అప్పలనాయుడు ప్రశాంతంగా ఉన్న పెందుర్తిలో కూటమి ప్రభుత్వం అనవసరమైన వివాదాలు సృష్టిస్తోందని శరగడం చిన్న అప్పలనాయుడు ఆరోపించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు స్థానిక పేదలు, వైఎస్సార్సీపీ సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని అన్నారు. ‘‘కేవలం 8 అడుగుల కాలువ కోసం 30 అడుగుల స్థలం చదును చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదు. స్థలాన్ని ఆక్రమించేందుకే మేయర్, ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 20 మంది టీడీపీ కార్యకర్తలు అక్కడికి రావడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా పేదలకు అన్యాయం జరగనివ్వం. అధికారులు నిబంధనల ప్రకారం, తమ పరిధిలోనే పనులు చేయాలి,’’ అని ఆయన హెచ్చరించారు. -
పీడియాట్రిక్ ఐసీయూకు ఆధునిక వెంటిలేటర్ల విరాళం
మహారాణిపేట: ఆంధ్రా మెడికల్ కాలేజీ అలుమ్నీ సంఘం (1966 బ్యాచ్) ఆధ్వర్యంలో కేజీహెచ్, ఏఎంసీ పరిధిలోని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ)కు రూ.48 లక్షల విలువైన ఆరు అత్యాధునిక మాక్వెట్ వెంటిలేటర్లు విరాళంగా అందజేశారు. వీటిని ఏఎంసీ 1966 బ్యాచ్కు చెందిన ప్రముఖ అలుమ్నీ సభ్యులు డాక్టర్ నాగుల సీతారామయ్య, డాక్టర్ జి. గురుప్రసాద్ అందజేశారు. శ్వాస క్రియ చికిత్సకు సంబంధించిన ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ వెంటిలేటర్లు అత్యవసర స్థితిలో ఉన్న శిశువులు, పిల్లలకు సమర్థవంతమైన చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సందర్భంగా కలెక్టర్ హరేందిర ప్రసాద్ వెంటిలేటర్లను ప్రారంభించి పీడియాట్రిక్ ఐసీయూ విభాగానికి అందజేశారు. ప్రభుత్వ వైద్య సంస్థలను బలోపేతం చేయడంలో అలుమ్నీ భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొని ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ఈ సందర్భంగా అలుమ్నీ సభ్యులకు పీడియాట్రిక్స్ విభాగం తరఫున డాక్టర్ చక్రవర్తి, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చాన్స్లర్, మాజీ డీఎంఈ డాక్టర్ టి.రవిరాజు, డాక్టర్ పి.వి.సుధాకర్, పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ బి.ఎస్.చక్రవర్తి, డాక్టర్ టి.రాధ, డాక్టర్ పెద వీర్రాజు, డాక్టర్ వి.వి.జి. మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళ దారుణ హత్య
ఆరిలోవ: ఆరిలోవలో ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. రెక్కీ నిర్వహించిన ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమెను హత్య చేసి, బీరువాలో ఉన్న నగదు, బంగారం దోచుకుపోయాడు. పట్టపగలే జరిగిన ఈ ఘటనతో ఈ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విషయం తెలుసుకున్న ద్వారకా ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, ఆరిలోవ సీఐ హెచ్.మల్లేశ్వరరావు, ఎస్ఐలు, క్లూస్ టీం సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో మంచంపై నిర్జీవంగా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా, ఒకే వ్యక్తి దొంగతనానికి పాల్పడి, అడ్డుగా వచ్చిన మహిళను హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. జీవీఎంసీ 12వ వార్డు పరిధిలోని దుర్గానగర్లో కాపు లక్ష్మి (48) తన భర్త రమణతో నివసిస్తోంది. వీరి ఇద్దరు పిల్లలకు వివాహం కావడంతో వారు వేర్వేరు చోట్ల ఉంటున్నారు. రమణ జీవీఎంసీలో ఉద్యోగి. బుధవారం ఉదయం ఆయన విధులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి చేరుకునే సరికి బయట గేటు, గుమ్మం తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లగా, భార్య లక్ష్మి మంచంపై రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె మెడ, ముఖంపై గాయాలు ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని మృతదేహాన్ని, పరిసరాలను పరిశీలించారు. ఇంటి సీసీ కెమెరాలు, సమీప ఇళ్ల కెమెరా దృశ్యాలను పరిశీలించగా, ఉదయం 10 గంటల సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి, మధ్యాహ్నం 12.32 గంటలకు చేతిలో బ్యాగ్తో బయటకు వచ్చినట్లు గుర్తించారు. అతను స్థానిక వ్యక్తే కావచ్చని అనుమానిస్తున్నారు. ఇంట్లో ఉన్న చీటి డబ్బులు సుమారు రూ.5 లక్షలు, అలాగే మహిళ ధరించిన కొన్ని బంగారు ఆభరణాలు అపహరించబడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఏసీపీ నర్సింహమూర్తి వెల్లడించారు. ఇంట్లో చీటి డబ్బులు ఉన్న విషయం తెలిసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. కొంతసేపు వీధిలో రెక్కీ నిర్వహించి, సమయం చూసుకుని ఇంట్లోకి ప్రవేశించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా, ఇదే ప్రాంతానికి సమీపంలోని దుర్గానగర్లో సుమారు ఎనిమిదేళ్ల క్రితం కూడా ఇదే తరహాలో ఓ వృద్ధురాలిని హత్య చేసి బంగారం దోచుకుపోయిన ఘటనను స్థానికులు గుర్తు చేస్తున్నారు. తాజా ఘటనతో ప్రాంతంలో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి. -
టాప్–3 లక్ష్యం
స్వచ్ఛ సర్వేక్షణ్లోడాబాగార్డెన్స్: నగరంలో మురికివాడల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, రోడ్ల విస్తరణ, జంక్షన్ల సుందరీకరణ, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. బుధవారం తన చాంబర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన నగర అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో తొలి మూడు ర్యాంకుల్లో.. గతేడాది స్వచ్ఛ సర్వేక్షణ్లో విశాఖ 9వ ర్యాంకు సాధించిందని, ఈసారి మొదటి మూడు ర్యాంకుల్లో నిలిచేలా కృషి చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. పారిశుధ్యం, వ్యర్థాల సేకరణ, తరలింపు ప్రక్రియలను నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు. త్వరలో కేంద్ర బృందం పర్యటించనున్న నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం ఆర్కే బీచ్ నుంచి రుషికొండ వరకు 6 ప్రాంతాల్లో కొత్తగా సులభ్ కాంప్లెక్స్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. మహిళా హాస్టళ్ల నిర్మాణం ఉద్యోగినుల (వర్కింగ్ వుమెన్స్) కోసం మధురవాడ జోన్–5లోని బుట్టవానిపాలెం లేవుట్లో రూ.26.12 కోట్లతో చేపట్టనున్న హాస్టల్ పనులకు ఇటీవలే భూమిపూజ చేశామన్నారు. అలాగే గాజువాక, ముడసర్లోవలో హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. ఇవి జీ+4 అంతస్తులతో, 96 గదులు, 248 మంది నివసించే సామర్థ్యంతో ఆధునిక వసతులతో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఐఎఫ్ఆర్ పనులు, ట్రాఫిక్ నియంత్రణ నగరంలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) దృష్ట్యా రూ.18.5 కోట్లతో 119 అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందులో 90 శాతం శాశ్వత పనులేనని స్పష్టం చేశారు. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు బీచ్రోడ్లోని సెంట్రల్ మీడియన్, పారిశుధ్యం, నగర సుందరీకరణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. భోగాపురం ఎయిర్పోర్టు కనెక్టివిటీ కోసం రూ.14.29 కోట్లతో వేపగుంట–పినగాడి, రూ.11.5 కోట్లతో వేపగుంట–జుత్తాడ రోడ్ల పనులు ప్రారంభించామన్నారు. ఆదాయం, జోన్ల పునర్విభజన జీవీఎంసీ పరిపాలన సౌలభ్యం కోసం జోన్లను 8 నుంచి 10కి పెంచినట్లు తెలిపారు. పన్నుల వసూలులో ఈ ఏడాది రూ.1,200 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, ఫిబ్రవరి, మార్చి నెలల్లో దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నగరంలోని 21 ప్రాంతాల్లో వెండర్స్ జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రస్తుతం 3 ప్రాంతాలను తుది ఎంపిక చేశామన్నారు. వీటిని జీవీఎంసీ, మెప్మా, లబ్ధిదారులతో కలిసి ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఆపరేషన్ 3.0 కింద సెల్లార్ ఆక్రమణలు తొలగిస్తున్నామని, ఆర్కే బీచ్, భీమిలి వై జంక్షన్, పోతినమల్లయ్యపాలెం వద్ద మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వివరించారు. పైలట్ ప్రాజెక్టుగా వెలంపేట, ఇందిరానగర్ నగరంలోని మురికివాడల అభివృద్ధిలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద పాతనగరంలోని వెలంపేట, శ్రీకన్య థియేటర్ సమీపంలోని ఇందిరానగర్ను ఎంపిక చేసినట్లు కమిషనర్ తెలిపారు. వెలంపేటలో 59 సెంట్ల స్థలంలో పీపీపీ పద్ధతిలో రూ.23.17 కోట్లతో జీ+11 అంతస్తుల సముదాయాన్ని నిర్మించి, 177 మంది లబ్ధిదారులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో కేంద్రం వాటా రూ.1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.లక్ష ఉంటుందని, జీవీఎంసీ తరఫున రూ.8.85 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఈ పనులు మార్చిలో ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. అలాగే ఇందిరానగర్లో జీ+6 పద్ధతిలో 110 మందికి గృహాలు నిర్మించనున్నట్లు తెలిపారు. -
మబ్బు!
పెందుర్తిలో మేయర్ కక్షసాధింపు చర్యలు మందులసెంట్రల్ డ్రగ్ స్టోర్లో నిల్వలు శూన్యం జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో కొరత బీపీ, సుగర్, ఇన్సులిన్ వంటి అత్యవసర ఔషధాలు దొరక్క పేదల ఆవేదన నెల రోజుల సరఫరా తగ్గి వారానికే పరిమితంగురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026మహారాణిపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అత్యవసర మందులు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. బీపీ, సుగర్, ఇన్సులిన్, ఫిట్స్ నివారణ మందులు, యాంటీబయాటిక్స్ వంటి నిత్యావసర ఔషధాలు దొరకక రోగులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నవాల్తేర్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లో మందుల నిల్వలు నిండుకున్నాయి. ఆయా ఆస్పత్రులకు సరైన సరఫరా జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘‘స్టాక్ లేదు’’ అనే సమాధానం రోగులకు సాధారణంగా మారింది. సూదులు, గ్లౌజులు, ఇంజెక్షన్లు వంటి ప్రాథమిక వైద్య సామగ్రి కూడా కొరతగా ఉన్నట్టు తెలుస్తోంది. మందుల లభ్యతలో గణనీయ తగ్గుదల గత ప్రభుత్వ కాలంలో మొత్తం 614 రకాల మందులు అందుబాటులో ఉండేవని సమాచారం. ప్రస్తుతం ఆ సంఖ్య 413కు తగ్గిపోయింది. యూపీహెచ్సీలు, పీహెచ్సీల్లో అయితే కేవలం 172 రకాల మందులు మాత్రమే లభ్యమవుతున్నాయి. మందులు సెంట్రల్ పర్చేజింగ్ విధానంలో కొనుగోలు చేసి సెంట్రల్ ఫార్మసీకి తరలిస్తారు. అక్కడి నుంచి ఇండెంట్ ప్రకారం వివిధ ఆస్పత్రులకు సరఫరా చేస్తారు. అయితే ప్రస్తుతం ఇండెంట్ పెట్టినా సరఫరా ఆలస్యమవుతోందని, విజయవాడ నుంచి మందులు రావడం లేదని అధికారులు చెబుతున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే మందుల నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి. వారానికే పరిమితమైన సరఫరా గతంలో రోగులకు నెలరోజులకు సరిపడే మందులు అందించేవారు. ప్రస్తుతం మందుల కొరత కారణంగా వారం రోజులకు సరిపడేంత మాత్రానే ఇస్తున్నారు. కొన్ని రకాల మందులు పూర్తిగా నిల్వలో లేకపోవడంతో, ‘‘ప్రస్తుతం స్టాక్ లేదు, మళ్లీ రండి’’ అనే సమాధానం వినిపిస్తోంది. గతంలో ఆస్పత్రిలో మొత్తం 614 రకాల మందులు అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 413కు తగ్గిపోయింది. యూపీహెచ్సీల్లో అయితే కేవలం 172 రకాల మందులు మాత్రమే లభ్యమవుతున్నాయి. అనేక సాధారణ మరియు దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన మందులు కూడా అందుబాటులో లేవని తెలుస్తోంది. ఆస్పత్రిలో మందులు లేకపోవడంతో వైద్యులు రోగులకు బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు. ‘‘రోగం త్వరగా తగ్గాలంటే మందులు తప్పనిసరిగా వాడాలి, ఇక్కడ లేవు కాబట్టి బయట కొనండి’’ అని చెప్పి రోగులను పంపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తీవ్ర ప్రభావం జిల్లాలో 66 యూపీహెచ్సీలు, 9 పీహెచ్సీలు, అగనంపూడిలో ఒక ఏరియా ఆస్పత్రి, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలిలో మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో 54 విలేజ్ హెల్త్ క్లినిక్స్ పనిచేస్తున్నాయి. ఈ ఆరోగ్య కేంద్రాలకు రోజూ వందలాది పేద రోగులు చికిత్స కోసం వస్తున్నారు. అయితే ఇటీవల నెలలుగా మందుల కొరత తీవ్రంగా పెరిగింది. గతంలో నెలరోజులకు సరిపడే మందులు రోగులకు అందించేవారు. ప్రస్తుతం వారం రోజులకు మాత్రమే మందులు ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అవి కూడా పూర్తిగా అందడం లేదు. మళ్లీ రావాలని సూచిస్తూ రోగులను తిరిగి పంపిస్తున్నారు. బయట కొనుగోలు చేశాను ‘‘నా వయస్సు 63 సంవత్సరాలు. భర్త లేడు. పిల్లలతో ఉంటున్నాను. బీపీ, సుగర్ సమస్యలతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వెళ్లాను. అక్కడ మందులు లేవని చెప్పారు. వైద్యుడు బయట కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు బయట కొనుగోలు చేసి వాడుతున్నాను. ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు లభిస్తే మాకు చాలా ఉపశమనం కలుగుతుంది.’’ – సిరిపురపు నరసమ్మ, కొత్తపాలెం, గోపాలపట్నం బీపీ మాత్రలు లేవన్నారు.. ‘‘నాకు బీపీ సమస్య ఉంది. సమీప పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాను. వైద్యుడు మందులు రాసినా అక్కడ బీపీ మాత్రలు లేవన్నారు. బయట కొనుగోలు చేసి వాడుతున్నాను. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడింది. కానీ ప్రతి నెలా బయట కొనడం భారంగా ఉంది.’’ – వాడమోదుల లక్ష్మి, చినవాల్తేరు కొరతగా ఉన్న ప్రధాన మందులు ప్రస్తుతం కొరతగా ఉన్న మందుల జాబితా ఆందోళన కలిగిస్తోంది. కొన్ని మందులు వచ్చినా రెండు మూడు రోజుల్లోనే అయిపోతున్నాయి. మళ్లీ సరఫరా అయ్యే వరకు రోగులు వేచి చూడాల్సి వస్తోంది. సిబ్బంది కూడా రోగులకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. బీపీ మాత్రలు సుగర్ మందులు, ఇన్సులిన్ ఫిట్స్, మూర్ఛ నివారణ మందులు పలు రకాల యాంటీబయాటిక్స్ హిమోగ్లోబిన్ పెంచే మందులు రక్తహీనత నివారణ ఔషధాలు థైరాయిడ్ చికిత్స మందులు క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే కొన్ని మందులు -
అప్పికొండలో శివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు
భద్రత, మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్ సమీక్షమహారాణిపేట: అప్పికొండ సోమేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 15న జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. పలు అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చే అవకాశం ఉన్నందున భద్రత, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్, వైద్య సదుపాయాలు వంటి అన్ని మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. ట్రాఫిక్ మళ్లింపుపై పోలీస్ శాఖ ప్రణాళిక రూపొందించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలు సక్రమంగా ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైన చోట తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాఖ ఆర్డీవో సుధాసాగర్, డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ టి.అన్నపూర్ణ, ఆలయ ఈవో పద్మావతి, పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కూటమి వైఫల్యాలపై పోరుబాట
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల గొంతుకగా యువజన విభాగం నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం అత్యంత బలంగా మారనుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.70 లక్షల మంది యువజన విభాగం సైనికులు తయారవుతున్నారని తెలిపారు. బుధవారం ఎండాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర యువజన విభాగం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు హాజరయ్యారు. ముందుగా రాజాకు ఉత్తరాంధ్ర యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, ఇతర యువజన విభాగం నాయకులతో కలిసి రాజా.. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. యువజన విభాగమే గొంతుక కావాలి ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. పార్టీ అనుబంధ విభాగాల్లో యువజన విభాగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విద్యార్థి దశ నుంచే వైఎస్సార్ సీపీలో పని చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, గతంలో యువజన విభాగంలో పని చేసిన వారికి ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా అనేక అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. పార్టీ బలోపేతానికి ఎవరైతే శ్రమిస్తారో వారికి భవిష్యత్తులో కచ్చితంగా అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. ‘చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, ఏటా జాబ్ క్యాలెండర్ వంటి హామీలను తుంగలో తొక్కింది. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెట్టింది. ఎండీయూ వాహన ఆపరేటర్లు, వలంటీర్లు సహా అనేక సంస్థల్లో పనిచేస్తున్న చిరుద్యోగులను రోడ్డున పడేసింది. విభజన చట్టం హామీలను, ప్రత్యేక హోదా అంశాన్ని గాలికి వదిలేసింది. వీటిపై యువత పోరాటం చేయాలి’అని రాజా పిలుపునిచ్చారు. దాడి చేసిన వారికి బెయిల్.. ప్రశ్నించిన అంబటికి జైలా? ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతోనే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని జక్కంపూడి రాజా ఆరోపించారు. ఇళ్లు ధ్వంసం చేసి పెట్రోల్ బాంబులు విసిరిన వారికి స్టేషన్ బెయిల్ ఇస్తూ, ప్రభుత్వాన్ని నిలదీసిన వారిని అరెస్ట్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. జగన్ 2.0లో కార్యకర్తలకే పెద్దపీట జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. యువజన విభాగమే పార్టీ భవిష్యత్తుకు బాటగా మారుతుందన్నారు. జగన్ 2.0లో కార్యకర్తల ద్వారానే పాలన సాగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే అదీప్రాజ్ మాట్లాడుతూ.. గతంలో వైఎస్సార్ హయాంలో యూత్ కాంగ్రెస్లో కష్టపడి పనిచేశానని, అందుకే తనను పిలిచి వైఎస్సార్ సీపీ లో ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారని గుర్తుచేసుకున్నారు. రాజకీయంగా ఎదగాలనుకునే వారికి, ప్రజా సేవ చేయాలనుకునే వారికి యువజన విభాగం మంచి అవకాశం కల్పిస్తుందన్నారు. గాజువాక సమన్వయకర్త దేవన్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అంటే ‘ఉత్తి ఆంధ్ర’కాదు ‘ఉద్యమాంధ్ర’అని చరిత్ర చూస్తే తెలుస్తుందన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే.. కుటుంబ బాధ్యతలను కూడా సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మహ్మద్ ఇమ్రాన్, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు ఉరుకూటి చందు, పుల్లేటి వెంకటేష్, గబ్బిడి శేఖర్, అల్లు అవినాష్, ఎం.పృథ్వీ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దొడ్డి కిరణ్, పాలిశెట్టి సురేష్, యువజన విభాగం కార్యదర్శులు చింతకాయల వరుణ్, మలసాల కుమార్ రాజా, కనకల ఈశ్వరరావు, చందక అప్పలస్వామి, సంయుక్త కార్యదర్శులు జె.నరేష్, ధీరజ్ కుమార్, నియోజకవర్గం, మండల, వార్డు యువజన విభాగం అధ్యక్షులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్ల రద్దుకై నేడు మహాధర్నా
డాబాగార్డెన్స్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడాన్ని నిరసిస్తూ గురువారం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో విశాఖలోనూ భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. గతంలో అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ.. 2019లో వేతనాల కోడ్, 2020లో పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రతా కోడ్, వృత్తి భద్రత–ఆరోగ్యం కోడ్లను కేంద్రం చట్టాలుగా మార్చింది. దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర వ్యతిరేకత కారణంగా ఐదేళ్లుగా వీటిని అమలు చేయలేదు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం కార్పొరేట్ల ఒత్తిడి మేరకు ఎన్డీఏ ప్రభుత్వం ఈ కోడ్ల అమలుకు నోటిఫికేషన్ జారీ చేయడంపై కార్మిక లోకం భగ్గుమంటోంది. నేడు భారీ ర్యాలీ కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు సిటు ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు సరస్వతి పార్క్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగనుంది. ఈ సమ్మెలో జిల్లా వ్యాప్తంగా సుమారు 5 లక్షల మందికి పైగా సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు, ఉద్యోగులు పాల్గొననున్నట్లు కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. -
విశాఖ మెట్రోకు లైన్ క్లియర్!
సాక్షి, విశాఖపట్నం: ఎట్టకేలకు విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సుమారు రూ.11,498 కోట్ల అంచనా వ్యయంతో, రెండు దశల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రితో భేటీ అయిన సందర్భంగా.. స్వల్ప మార్పులతో కూడిన మెట్రో డీపీఆర్ను ఆమోదించేందుకు మంత్రి సమ్మతించారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. అనంతరం.. హోం, రక్షణ శాఖలతో సహా మొత్తం 12 మంత్రిత్వ శాఖల నుంచి అభ్యంతరాలు లేదా అభిప్రాయాలను సేకరించనున్నారు. ఆ తర్వాత నలుగురు కేంద్ర కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు సమావేశంలో ప్రాజెక్టుకు తుది ఆమోదముద్ర వేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. డీపీఆర్పై మల్లగుల్లాలు: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్ను పక్కనబెట్టి, ప్రస్తుత ప్రభుత్వం అందులో పలు మార్పులు చేర్పు లు చేసింది. తొలుత పాత నివేదికను, కొత్త డీపీఆర్ను సరిపోల్చిన కేంద్రం.. పాత నివేదికే బాగుందంటూ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయి తే, కొత్త డీపీఆర్నే ఆమోదించాలంటూ చంద్రబాబు ప్రభుత్వం పట్టుబట్టడంతో, ఎట్టకేలకు సవరించిన ప్రతిపాదనలకే కేంద్రం ఓకే చెప్పినట్లు సమాచారం. టెండర్లకు మోక్షమెప్పుడో? మరోవైపు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం గతేడాది జూలై 25న టెండర్లను ఆహ్వానించింది. ఫేజ్–1లో భాగంగా 46.23 కిలోమీటర్ల మేర మూడు కారిడార్ల పనుల కోసం ఈపీసీ ప్రాతిపదికన ఏఎంఆర్సీ టెండర్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఇందుకోసం రూ.6,250 కోట్లు (జీఎస్టీ అదనం) వ్యయం అవుతుందని అంచనా. అయితే డీపీఆర్ ఆమోదం లేకుండా టెండర్లలో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొనడంతో నిర్మాణ సంస్థలేవీ తొలుత ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి, నిబంధనలలో కొంత వెసులుబాటు కల్పించింది. గత అక్టోబర్లో టెండర్ల గడువు ముగియగా, రెండు మూడు సంస్థలు మాత్రమే బిడ్లను దాఖలు చేశాయి. అయితే, డీపీఆర్ ఆమోదం పొందిన తర్వాతే టెండర్లను తెరవాల్సి ఉండటంతో ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా కేంద్ర మంత్రితో భేటీలో డీపీఆర్ ఆమోద అంశం కొలిక్కి రావడంతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఊపిరి పీల్చుకుంది. డీపీఆర్ అధికారికంగా అప్రూవ్ అయిన వెంటనే టెండర్ల ప్రక్రియ ముందుకు సాగుతుందని అధికారులు భావిస్తున్నారు. డీపీఆర్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ రూ.11 వేల కోట్లతో రెండు దశల్లో నిర్మాణానికి అంగీకారం త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశంవిశాఖపట్నం మెట్రో రైల్–ఫేజ్ 1 వివరాలివి.. కారిడార్ మార్గం పొడవు స్టేషన్ల (కి.మీలలో) సంఖ్య కారిడార్–1 స్టీల్ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాది జంక్షన్ 34.40 29 కారిడార్–2 గురుద్వారా నుంచి పాతపోస్ట్ ఆఫీస్ 5.07 6 కారిడార్–3 తాటిచెట్లపాలెం నుంచి చిన వాల్తేరు 6.75 7 మొత్తం 46.23 42 -
నమ్మితే.. కారు చీకట్లే!
ఎంవీపీకాలనీ: మీ ఇంట్లో కారు ఖాళీగా ఉంటోందా? దాన్ని అద్దెకు ఇస్తే ఈఎంఐలు, ఇతర ఖర్చులకు డబ్బులు వస్తాయని ఎవరైనా ట్రావెల్ ఏజెంట్లు మిమ్మల్ని సంప్రదిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! నగరంలో కార్ ట్రావెల్ మాఫియా విజృంభిస్తోంది. అమాయక కారు యజమానులకు అద్దె ఆశ చూపి, ఆపై కార్లను మాయం చేస్తూ కోట్లలో దండుకుంటోంది. ప్రస్తుతం ఈ తరహా కేసులు నగరంలో పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. మోసం తీరు ఇలా.. సామాన్యులే లక్ష్యంగా ఈ ముఠా వల విసురుతోంది. ‘మీ కారును మా ట్రావెల్స్లో పెట్టండి.. నెలకు వేలల్లో అద్దె చెల్లిస్తాం.. ఈఎంఐ భారం తగ్గుతుంది’అంటూ నమ్మబలుకుతారు. మొదట్లో ఒకటి, రెండు నెలలు సక్రమంగానే డబ్బులు చెల్లించి నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అద్దె ఇవ్వడం మానేస్తారు. యజమాని నిలదీస్తే.. కారు అక్కడ ఉంది.. ఇక్కడ ఉంది అంటూ మభ్యపెడతారు. చివరికి కారును కూడా తిరిగి ఇవ్వకుండా మాయం చేస్తుండటంతో, బాధితులు లబోదిబోమంటున్నారు. ఆ రెండు సంస్థలపైనే ఆరోపణలు నగరంలో వైజాగ్ సెల్ఫ్ డ్రైవ్ కార్స్, భవానీ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అనే ఏజెన్సీలపై అత్యధిక ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై ఎంవీపీ, ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్తో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. ఈ సంస్థల నిర్వాహకు లు బాషా, వెంకటేష్లు కలిసి అనేక మందిని మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. వీరిపై ఎంవీపీ పోలీస్స్టేషన్లో హరీష్, తూర్పు గోదావరి జిల్లా నగరం పోలీస్స్టేషన్లో సత్యనారాయణ, హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో హరి అనే బాధితులు ఫిర్యాదులు చేశారు. కేసులు నమోదవుతున్నా, ఈ ముఠా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది. గుంటూరు, హైదరాబాద్లలో ఉన్నామంటూ పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారు. నిత్యం ఇళ్లు, ఆఫీసులను మారుస్తూ, ఫోన్ లొకేషన్లకు దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ పోలీసుల ఒత్తిడి పెరిగితే.. ‘కొంత సమయం ఇవ్వండి, కారు ఇచ్చేస్తాం’ అని చెప్పి మళ్లీ పరారవుతున్నారు. పోలీసుల నెట్వర్క్కు, టెక్నాలజీకి కూడా దొరక్కుండా దర్యాప్తు బృందాలకు చుక్కలు చూపిస్తున్నారు. ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా? బాధితులు నెలల తరబడి స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు ఈ మాఫియా పట్ల కఠినంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బైండోవర్ రాసినా భయం లేదు! డిసెంబర్లో నా కారు విషయమై ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులు అతికష్టం మీద లోకేషన్ ఆధారంగా వెంకటేష్, బాషాలను పట్టుకుని స్టేషన్కు రప్పించారు. కారు తిరిగిచ్చేస్తామని వారు ఎస్ఐ సమక్షంలో ఒప్పంద పత్రం(బైండోవర్) రాసిచ్చారు. 10 రోజులు గడువు అడిగి, ఇప్పుడు ఆ గడువు దాటినా కారు ఇవ్వలేదు. వారు కనిపించడం లేదు. మూడు నెలలుగా స్టేషన్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా న్యాయం జరగడంలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నా కారు నాకు ఇప్పించాలి. – హరీష్, బాధితుడు -
టిడ్కో ఇళ్ల రుణమాఫీపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి
బీచ్రోడ్డు: 2024 ఎన్నికల ముందు టిడ్కో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల రుణాలను మాఫీ చేస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చినా, రెండేళ్లు గడిచినా అమలు కాలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు చెల్లించలేదని బ్యాంకులు నోటీసులు జారీ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఒక్కో లబ్ధిదారుడిపై రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు బకాయిలు ఉన్నాయని, చెల్లించకపోతే ఇళ్లు స్వాధీనం చేసుకుంటామని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయని ఆరోపించారు. రోజు కూలీపై జీవించే లబ్ధిదారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో టిడ్కో ఇళ్ల రుణమాఫీపై చర్చించి తీర్మానం చేయాలని, బ్యాంకుల వేధింపులను వెంటనే అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఎస్.వెంకటలక్ష్మి, ఎంఎన్ఎస్ఎస్ నగర కన్వీనర్ ఈ.లక్ష్మి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రామకృష్ణ, భారత నాస్తిక సమాజం జిల్లా కార్యదర్శి నూకరాజు, ఐపీఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి పి.లక్ష్మి పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈ వృద్ధికి మద్దతుగా బైక్ ర్యాలీ
మర్రిపాలెం: ఎంఎస్ఎంఈలపై దృష్టి సారించిన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ సారథి ఫైనాన్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బ్రాండ్ గుర్తింపును బలోపేతం చేయడం, ఉద్యోగుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, స్థానిక వ్యాపార సముదాయాలతో అనుసంధానాన్ని విస్తరించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ర్యాలీలో సుమారు 30 మంది ఉద్యోగులు పాల్గొ న్నారు. క్రెడిట్, లీగల్, టెక్నికల్, బిజినెస్ విభాగాల మధ్య సహకారాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన సారథి ఫైనాన్స్ చీఫ్ క్రెడిట్ ఆఫీసర్ రోనక్ జైన్ మాట్లాడుతూ, స్థానిక వ్యాపార సముదాయాలతో బలమైన సంబంధాలు ఆర్థిక సమావేశానికి కీలకమని అన్నారు. బాధ్యతాయుతమైన, సులభంగా అందుబాటులో ఉండే ఆర్థిక పరిష్కారాలతో ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇస్తామని తెలిపారు. -
ఐవోబీ ఆరోగ్య పరీక్ష శిబిరాలు
విశాఖ సిటీ: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విశాఖ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో పలు ఆరోగ్య పరీక్ష శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాలను వుడా బ్రాంచ్, అక్కయ్యపాలెం, ఎన్ఏడీ, పెదవాల్తేరు, మెయిన్ బ్రాంచ్లలో చేపట్టారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఐవోబీ విశాఖ ప్రాంతీయ మేనేజర్ రవికుమార్గుప్తా బ్యాంక్ సిబ్బందితో కలిసి జనరేషన్ యువ అనాథాశ్రమంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా నర్సాపురంలో బ్యాంక్కు చెందిన 75వ శాఖను ప్రారంభించినట్లు బ్యాంక్ చీఫ్ మేనేజర్ కె.వి.వి.ప్రసాద్ తెలిపారు. -
బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
సింహాచలం: జిల్లాలోని మహాత్మా జ్యోతి బాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు, 6 నుంచి 8 తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి, అలాగే సింహాచలంలోని జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గుణుపూరు పురుషోత్తం తెలిపారు. 5వ తరగతికి సింహాచలం గురుకుల పాఠశాలలో 160, పెదనరవలో 80, అన్నవరం బాలికల గురుకుల పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయని తెలిపారు. మార్చి 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 12న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. 6 నుంచి 8 తరగతుల ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఇంటర్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుందని, శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. పూర్తి వివరాలకు https:// apbcwr eist.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. -
తిరుమల లడ్డూపై రాజకీయాలు ఆపాలి
అల్లిపురం : తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని చంద్రబాబు ప్రభుత్వానికి సీపీఐ జాతీయ సమితి సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి హితవు పలికారు. పాలకులే పనిగుట్టుకుని లడ్డూ అంశాన్ని వివాదాస్పదం చేస్తుండడాన్ని ఆక్షేపించారు. మంగళవారం ఆయన అల్లిపురంలో గల సీపీఐ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్టు వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కమ్యూనిజంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలో మెడికల్ మాఫియా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మోదీ అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తోందని ఆక్షేపించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటుకు ఇవ్వాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్యం అందడం లేదని, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట లేకుండా పోయిందని పేర్కొన్నారు. మెడికల్ మాఫియాను పెంచి పోషిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 14న సీపీఐ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చినట్టు పేర్కొన్నారు. నగరంలోని అంతర్గత రహదారులను పీపీపీ పద్ధతుల్లో ప్రైవేట్కు ఇవ్వాలని జీవీఎంసీ ప్రతిపాదనను తప్పుబట్టారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్, కార్యవర్గ సభ్యులు ఎం.పైడిరాజు, ఎం మన్మధరావు, సిఎన్ క్షేత్రపాల్ రెడ్ది, ఎం.మన్మధరావు, ఎన్.నాగభూషణం పాల్గొన్నారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి -
స్టీల్ప్లాంట్ పర్సనల్ డైరెక్టర్ బాధ్యతల స్వీకరణ
ఉక్కునగరం : స్టీల్ప్లాంట్ డైరెక్టర్ (పర్సనల్)గా డాక్టర్ రాకేష్ నందన్ సహాయ్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఈ బాధ్యతలు నిర్వహించిన ఎస్.సి.పాండే పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో సహాయ్ బాధ్యతలు చేపట్టారు. హెచ్ఆర్లో 29 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సహాయ్ పవర్, మైనింగ్, రిన్యూవబుల్ ఎనర్జీ, రీసెర్చ్ తదితర సెక్టార్లలో స్ట్రాటజిక్ హెచ్ఆర్, ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ తదితర కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇంతకు ముందు ఆయన ఎన్టీపీసీలో జనరల్ మేనేజర్గా విధులు నిర్వహించారు. పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్లో గోల్డ్ మెడల్ సాధించిన సహాయ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్లో పీహెచ్డీ చేశారు. ప్రతి మూడు నెలలకు స్కానింగ్ కేంద్రాల తనిఖీలు మహారాణిపేట: ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) ఎస్. సుధాసాగర్ ఆదేశించారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం (పీసీపీఎన్డీటీ) అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. స్కానింగ్ కేంద్రాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి అవసరమైన సూచనలు ఇవ్వాలని, డికాయ్ ఆపరేషన్లు కొనసాగించాలని తెలిపారు. ఆడ పిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టవిరుద్ధమని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తనిఖీల సమయంలో స్కానింగ్ కేంద్రాల్లోని రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మహిళా ఆరోగ్య అధికారి డాక్టర్ ఎన్.వి.సమత, విక్టోరియా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషాప్రసాద్తో పాటు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
విక్టోరియా ఆస్పత్రికి ఐఎస్వో గుర్తింపు
మహారాణిపేట: పేద ప్రజలకు ప్రసూతి సేవలందిస్తున్న ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రికి ఐఎస్వో సర్టిఫికెట్ లభించింది. మంగళవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సమక్షంలో హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రతినిధి శివయ్య.. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.ఉషా ప్రసాద్కు ఈ సర్టిఫికెట్ను అందజేశారు. ఇటీవల ఐఎస్వో అధికారుల బృందం ఆస్పత్రిలో విస్తృతంగా పర్యటించింది. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను వారు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నిశితంగా పరిశీలించారు. రోగుల భద్రత, సేవల నాణ్యత, ఆస్పత్రి నిర్వహణ విధానాలు, రికార్డుల నిర్వహణ, మౌలిక వసతులు, సేవల అమలులో ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి ఐఎస్వో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు బృందం నిర్ధారించింది. ఇందులో భాగంగా ఆస్పత్రికి ఐఎస్వో సర్టిఫికెట్ను మంజూరు చేసింది. భవిష్యత్తులోనూ రోగులకు నాణ్యమైన, సురక్షితమైన వైద్య సేవలందించేందుకు కట్టుబడి ఉన్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
కల్తీ పడగ విప్పె..
ఆరోగ్యం అటకెక్కె..జిల్లాలో ఆహార భద్రత వ్యవస్థ కుప్పకూలింది. ఆహార భద్రత సూచికలో రాష్ట్రం అట్టడుగు స్థానానికి పడిపోవడం ఇక్కడి దారుణ స్థితికి అద్దం పడుతోంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువవ్వడం, సిబ్బందిని నియమించకపోవడం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. కాగితాలకే పరిమితమైన తనిఖీలు, నిరుపయోగంగా మారిన కోట్ల రూపాయల యంత్రాలు.. జిల్లాలో ఆహార కల్తీ మాఫియాకు అడ్డు లేకుండా చేస్తున్నాయి. – బీచ్రోడ్డు దేశంలోనే ఆహార భద్రత సూచికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది చివరి స్థానం. ఇందుకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం. రాష్ట్రంలో ఆహార తనిఖీలు, పరీక్షల కేంద్రాల్లో సిబ్బంది లేకపోవడంతో నిఘా వ్యవస్థ పూర్తిగా పడకేసింది. ఆహార తనిఖీల శాఖలో దేశంలోనే అత్యల్ప సిబ్బంది కలిగిన రాష్ట్రం కూడా ఏపీనే కావడం గమనార్హం. ఫలితంగా కల్తీ ఆహారం విచ్చలవిడిగా మార్కెట్లోకి వస్తోంది. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 85 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో కల్తీ, నాణ్యత లేని ఆహారాన్ని అధికారులు గుర్తించారు. ఇలాంటి ఆహారాన్ని తిని ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నా, ప్రభుత్వం మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తక్షణమే ఖాళీలను భర్తీ చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. విశాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత భారత ఆహార భద్రత నియమాల ప్రకారం.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఆహార భద్రత అధికారి ఉండాలి. దేశంలో చాలా రాష్ట్రాలు ఈ నిబంధనను పక్కాగా అమలు చేస్తున్నాయి. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో వందల సంఖ్యలో అధికారులు ఉండగా, మన రాష్ట్రంలో మాత్రం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకరు మాత్రమే ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 50 మందిలోపే సిబ్బంది ఉండటం గమనార్హం. ఇక పెదవాల్తేరులోని ఉమ్మడి విశాఖ జిల్లా కార్యాలయంలో 15 మంది అధికారులు అవసరం ఉండగా, గత 15 ఏళ్లుగా కేవలం ముగ్గురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఉన్న వారు కూడా చాలా ఏళ్లుగా ఇక్కడే ఉండటం ఆహార భద్రతను గాలికొదిలేశారు. దీంతో తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు సరిగ్గా జరగడం లేదు. కార్యాలయంలో సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. నిరుపయోగంగా విలువైన పరికరాలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆహార భద్రత కోసం రూ.110 కోట్లు కేటాయించి, రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఆహార పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రంతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా విశాఖలో అత్యాధునిక ఆహార పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 2024 ఫిబ్రవరి నాటికి ఈ భవన నిర్మాణం పూర్తి కాగా.. ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. అలాగే ఈ కేంద్రంలో రూ.10 కోట్ల విలువైన పరికరాలు కూడా సిద్ధం చేశారు. అయితే.. ఇక్కడ పని చేయాల్సిన సుమారు 70 మంది సిబ్బంది నియామకం ఎన్నికల వల్ల ఆగిపోయింది. తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టకపోవడంతో విలువైన పరికరాలు తుప్పుపడుతున్నాయి. భవనం నిరుపయోగంగా మారింది. రాష్ట్ర ఆహార ప్రయోగశాలఆహార తనిఖీ, పరీక్ష కేంద్రాల్లో వేధిస్తున్న సిబ్బంది కొరత తనిఖీలు లేకపోవడంతో విచ్చలవిడిగా కల్తీ ఆహార విక్రయాలు దేశంలోనే అతి తక్కువ సిబ్బంది కలిగిన ఏకై క రాష్ట్రం ఏపీనే.. నిరుపయోగంగా మారిన మొబైల్ ఆహార పరీక్షల వాహనం ఏడాదిలో కేవలం 161 తనిఖీలే సిబ్బంది లేకపోవడంతో గడిచిన ఏడాది కాలంలో విశాఖ జిల్లాలో కేవలం 161 తనిఖీలు మాత్రమే చేశారు. వీటిలో 52 కేసులు నమోదు చేసి రూ.4.25 లక్షల జరిమానా విధించారు. ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడ, తిరుపతిలో చేసిన ఆకస్మిక తనిఖీల్లో 85 శాతం కల్తీ బయటపడటం విస్తుగొలుపుతోంది. తక్షణమే సిబ్బంది నియామకాలు చేపడితేనే ఈ ప్రమాదాన్ని అరికట్టడం సాధ్యమవుతుందని నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. -
శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
డాబాగార్డెన్స్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. శివరాత్రి జాగరణ అనంతరం సముద్ర స్నానాలు ఆచరించే భక్తుల కోసం ఈ నెల 14 అర్ధరాత్రి నుంచి 15వ తేదీ సాయంత్రం వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. మంగళవారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీని బట్టి అధికారుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. జీరో బ్రేక్ డౌన్స్ సాధించాలని, కాలుష్యం లేకుండా బస్సుల నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ గంగాధరరావు, ఏటీఎం కె.గంగాధరరావు, పర్సనల్ ఆఫీసర్ జె.తిరుపతి, అకౌంట్స్ ఆఫీసర్ వి.వంశీమోహన్, అన్ని డిపోల మేనేజర్లు, ట్రాఫిక్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. ప్రత్యేక బస్సులు ఇలా.. ● గాజువాక, కూర్మన్నపాలెం, అగనంపూడి ప్రాంతాల నుంచి అప్పికొండకు 94 ప్రత్యేక బస్సులు, తగరపువలస, భీమిలి, ఆరిలోవ కాలనీ, రవీంద్రనగర్, పెందుర్తి, కొత్తవలస, సింహాచలం, గాజువాక, కూర్మన్నపాలెం నుంచి ఆర్.కె. బీచ్కు 110 బస్సులు, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మత్స్యగుండంకు 15 బస్సులు, కల్యాణపులోవకు 5 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. -
ఆరోగ్యశ్రీ
ఐసీయూలో మొదటి నుంచి ఆరోగ్యశ్రీపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. అడపా దడపా బకాయిలు విడుదల చేస్తున్నా, అవి కనీసం ఆస్పత్రుల రోజువారీ ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. దీంతో నెట్వర్క్ ఆస్పత్రులు ఒక్కొక్కటిగా ఆరోగ్యశ్రీ సేవలకు స్వస్తి పలుకుతున్నాయి. ఈ పరిస్థితి పేదవాడి పాలిట మరణశాసనంగా మారుతోంది. క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలతో అత్యవసర శస్త్రచికిత్సలు అవసరమైన రోగులు ఇప్పుడు ఆస్పత్రుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేని నిరుపేదలకు ‘ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదు.. మేము వైద్యం చేయలేం’ అంటూ ఆస్పత్రులు ముఖం చాటేస్తుండటం దారుణం. ప్రభుత్వ అసమర్థతకు, నిధుల మళ్లింపునకు సామాన్యుడి ప్రాణాలు బలికావాల్సిందేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ విమర్శలు, పథకాల పేర్ల మార్పుల మీద చూపిస్తున్న శ్రద్ధ, రోగి ప్రాణాలను కాపాడటంలో చూపకపోవడం ప్రభుత్వ ప్రాధాన్యతలను శంకిస్తోంది. మొత్తానికి ఒక గొప్ప సామాజిక భద్రత కవచంగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకం, నేడు పాలకుల నిర్లక్ష్యంతో పడకేసింది. వైఎస్సార్ ఆశయం.. జగన్ విస్తరణ ఆరోగ్యశ్రీ అంటే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తుకు వచ్చే పేరు స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర రెడ్డి. 2008లో ఆయన ప్రారంభించిన ఈ పథకం రెండు దశాబ్దాలుగా పేదలకు ప్రాణదాతగా నిలిచింది. ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు కొన్ని నిబంధనలతో దీనిని పరిమితం చేసినప్పటికీ, వై.ఎస్. జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ పథకాన్ని విప్లవాత్మకంగా మార్చారు. చికిత్సల సంఖ్యను 1800 నుంచి ఏకంగా 3,257కు పెంచి, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఉచిత చికిత్సను చేర్చారు. కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తూ, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు వంటి నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా సేవలు పొందేలా విస్తరించారు. కేవలం వైద్యమే కాకుండా, శస్త్రచికిత్స అనంతరం రోగి కోలుకునే వరకు జీవనోపాధి కోసం ‘ఆరోగ్య ఆసరా’ కింద రోజుకు రూ. 225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5 వేలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసి అండగా నిలిచారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యానికి కుట్ర పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, రాజకీయ కారణాలతో వ్యవస్థలను నిర్వీర్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కేవలం సామాన్యులే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల హెల్త్ స్కీమ్ , జర్నలిస్టుల వైద్య సేవలు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. నిరుపేదల సంజీవనిగా పేరుగాంచిన ఈ పథకానికి ఉరి బిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని బాధితులు వాపోతున్నారు. పథకం పేరు మార్చి, కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా ఇన్సూరెన్స్ పద్ధతిని తీసుకువస్తే, సామాన్యుడికి ఉచిత వైద్యం అందడం కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. నూతన హెల్త్ పాలసీ.. ఆరోగ్యమిత్రల ఆందోళనఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజల మనసుల నుంచి తుడిచిపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం రహస్యంగా పావులు కదుపుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవీఓ నంబర్ 162 ద్వారా ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ని తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. దీనికోసం ఇప్పటికే టెండర్లు పిలవడం, పలువురు బిడ్డర్లు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏప్రిల్ నుంచి ఈ కొత్త పాలసీని అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయుష్మాన్ భారత్ , ఇతర ఇన్సూరెన్స్ మోడల్స్ను కలిపి కొత్త విధానం తెస్తే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ రద్దవుతుందన్న భయం ప్రజల్లో నెలకొంది. ఈ మార్పుల వల్ల ఆస్పత్రుల్లో రోగులకు మార్గదర్శకులుగా ఉంటూ సేవలందిస్తున్న ‘ఆరోగ్యమిత్ర’ల భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా మారింది. వారి ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వందలాది కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఒకప్పుడు నిరుపేదల గుమ్మం వద్దకు కార్పొరేట్ వైద్యాన్ని చేర్చి, చావు అంచుల్లో ఉన్న వేలాది మందికి పునర్జన్మ ప్రసాదించిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం నేడు ఐసీయూలో కొట్టుమిట్టాడుతోంది. ధనవంతులకే పరిమితమైన కార్పొరేట్ ఆస్పత్రుల గడపను సామాన్యుడు కూడా ధైర్యంగా తొక్కవచ్చన్న నమ్మకాన్ని కలిగించిన ఈ వ్యవస్థ, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ ఉదాసీనత వల్ల కుప్పకూలుతోంది. నిన్నటి వరకు పేదవాడి గుండెల్లో ధైర్యం నింపిన ఈ పథకం, నేడు అదే గుండెల్లో ఆందోళన నింపుతూ ‘అనారోగ్యశ్రీ’గా మారుతోంది. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలను పెండింగ్లో పెట్టడంతో, చికిత్సల ప్రక్రియ స్తంభించిపోయింది. అప్పులు తెచ్చి వైద్యం అందించలేమని ఆస్పత్రుల యాజమాన్యాలు మొండికేస్తుంటే, చికిత్స కోసం కార్డు పట్టుకుని వెళ్తున్న సామాన్యుడికి ఆస్పత్రి గేట్ల దగ్గరే చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. – మహారాణిపేట బకాయిల సెగ.. అందని ‘ఆసరా’ చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి తలకిందులైంది. జిల్లా విషయానికొస్తే, సుమారు 92 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. ఇందులో 50 నెట్వర్క్ ఆస్పత్రులు, 19 ప్రభుత్వ ఆస్పత్రులు, 23 డెంటల్ ఆస్పత్రులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆస్పత్రులకు సుమారు రూ.90 కోట్ల మేర బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. బకాయిల కోసం కార్పొరేట్ ఆస్పత్రులు సమ్మెకు దిగడం, ప్రభుత్వం నామమాత్రంగా 5 శాతం నిధులు విడుదల చేయడంతో తాత్కాలికంగా సేవలు కొనసాగుతున్నా, పూర్తిస్థాయి భరోసా కరువైంది. మరోవైపు గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ‘ఆరోగ్య ఆసరా’ పథకం ఇప్పుడు పూర్తిగా మూలనపడింది. డిశ్చార్జ్ అయిన రోజూనే ఖాతాల్లో పడాల్సిన నగదు ఇప్పుడు అందని ద్రాక్షలా మారింది. -
ఫాగింగ్ ముసుగులో ఫుడ్ పాయిజన్?
కొమ్మాది: స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ప్రస్తుతం పెను వివాదంగా మారింది. పాఠశాల యాజమాన్యం చెబుతున్న కారణాలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులకు పొంతన లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెల్లువెత్తుతున్న అనుమానాలు పాఠశాలలో ఫాగింగ్ చేయడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని యాజమాన్యం బుకాయిస్తున్నప్పటికీ, వాస్తవానికి ఇది ఫుడ్ పాయిజన్ అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యటనలో వెలుగు చూసిన అంశాలు ఈ అనుమానాలను మరింత బలపరిచాయి. ఫాగింగ్ వల్లే అనారోగ్యం కలిగితే, మరి నీటి నమూనాలను ల్యాబ్కు పంపాల్సిన అవసరం ఏమొచ్చిందని, మురుగు పేరుకుపోయిన డ్రైనేజీలు, అపరిశుభ్రమైన వాటర్ ట్యాంకులు దేనికి సంకేతమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో దారుణ పరిస్థితులు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాఠశాల వంటగదిని పరిశీలించినప్పుడు అక్కడ నిల్వ ఉంచిన మొలకెత్తిన బంగాళదుంపలు, వాడిపోయిన కూరగాయలు కనిపించడం యాజమాన్యం నిర్లక్ష్యాన్ని చాటి చెబుతోంది. వారం రోజుల క్రితం కూరగాయలను వాడటంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్నాక్స్గా ప్యాకేజీ ఫుడ్ తీసుకోవడం వల్లే వాంతులు, విరేచనాలు అయ్యాయని ప్రాథమికంగా తెలుస్తోంది. పైగా చికిత్స అందించిన వైద్యులు కూడా ఇది ఫుడ్ పాయిజన్ అని ధ్రువీకరించడం గమనార్హం. యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే నెపంతో ఫుడ్ పాయిజన్ను ఫాగింగ్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఒక విద్యార్థికి మలేరియా సోకడం అక్కడ పారిశుధ్య లోపానికి నిదర్శనం. ఇంత పెద్ద ఘటన జరిగినా యాజమాన్యం పత్రికా సమావేశం నిర్వహించి వివరణ ఇవ్వకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చర్యలకు డిమాండ్ పాఠశాల నిర్వహణ లోపం వల్ల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు విమర్శించారు. కలెక్టర్ ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
చందనోత్సవం విజయవంతానికి సమష్టి కృషి అవసరం
సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావు సింహాచలం : సింహగిరిపై ఏప్రిల్ 20న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం విజయవంతంగా నిర్వహించేందుకు దేవస్థానం ఉద్యోగులందరూ సమష్టిగా కృషి చేయాలని ఈవో జె. వెంకటరావు పిలుపునిచ్చారు. సోమవారం దేవస్థానంలోని పలు విభాగాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. చందనోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో తాగునీరు, ప్రసాదం పంపిణీలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుధ్యం, విద్యుద్దీకరణ, భద్రత, రవాణా సదుపాయాలపై సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. సింహగిరిపై కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ఈ నేపథ్యంలో నిర్మాణ పనులపై ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లు, చలువ పందిళ్లు, తాత్కాలిక షెడ్ల నిర్మాణంపై చర్చించారు. భక్తులకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్డీసీ గీతాంజలి, డిప్యూటీ ఈవొ రాధ, ఈఈలు రమణ, రాంబాబు, రామకృష్ణ, డీఈ తాతాజీ, ఏఈవొలు తిరుమలేశ్వరరావు, రమణమూర్తి, నరసింహరాజు, పిల్లా శ్రీనివాసరావు, పి. శ్రీనివాస్తో పాటు సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
ఐఎఫ్ఆర్కు ఏర్పాట్లు వేగవంతం
ఏయూ క్యాంపస్ : ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు నగరం ముస్తాబవుతోంది. ఇప్పటికే కొత్త రోడ్లు వేసిన అధికారులు, రంగులు వేయడం ద్వారా పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దే పనులను వేగవంతం చేస్తున్నారు. డివైడర్ మధ్యలో ప్రత్యేక ఇనుప స్తంభాలను ఏర్పాటు చేసి ఐఎఫ్ఆర్కు సంబంధించిన జెండాలను ఎగురవేశారు. బీచ్రోడ్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో గోడలకు సముద్రం, లైట్హౌస్, నౌకలు వంటి థీమ్లతో ఆకట్టుకునే చిత్రలేఖనాలు చేపడుతున్నారు. ఈ పనుల్లో కార్మికులు నిమగ్నమై ఉన్నారు. మరోవైపు సందర్శకులు కూర్చుని వీక్షించేందుకు వీలుగా వేదికల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఫుట్పాత్లపై సందర్శకుల కోసం ప్రత్యేక తెరలను ఏర్పాటు చేస్తున్నారు. ఇనుప తిన్నెలపై కూడా బారికేడ్లు నిర్మించే పనులు కొనసాగుతున్నాయి. సోమవారం రక్షణ రంగానికి చెందిన విమానాలు పలుమార్లు ఆకాశంలో చక్కర్లు కొడుతూ దర్శనమిచ్చాయి. -
వక్ఫ్ భూముల సేకరణను నిలిపివేయాలి
మహారాణిపేట: గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని వక్ఫ్ భూముల సేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలని వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ సీఎంఏ జహీర్ అహ్మద్ మాట్లాడుతూ.. మంగళగిరి మండలంలో అంజుమన్ సొసైటీకి చెందిన సుమారు 71.57 ఎకరాల వక్ఫ్ భూముల సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. ఇవి మతపరమైన, విద్యా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములని, వీటిపై వచ్చే ఆదాయంతో రాష్ట్రవ్యాప్తంగా పేద విద్యార్థులకు, మసీదుల నిర్వహణకు నిధులు అందుతున్నాయని పేర్కొన్నారు. వైసీపీ రాష్ట్ర మైనార్టీ విభాగం జనరల్ సెక్రటరీ కేవీ బాబా మాట్లాడుతూ.. వక్ఫ్ చట్టం–1995 ప్రకారం వక్ఫ్ ఆస్తులు బదిలీ చేయడానికి వీల్లేదని గుర్తుచేశారు. వక్ఫ్ బోర్డును సంప్రదించకుండా, నోటీసులు ఇవ్వకుండా భూసేకరణ చేపట్టడం వల్ల ముస్లిం సమాజానికి కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన యంత్రాంగం స్పందించి వక్ఫ్ స్వభావాన్ని కాపాడాలని కోరారు. కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమాచార హక్కు చట్టం అధ్యక్షుడు షేక్ బాబ్జి, తూర్పు నియోజకవర్గ మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఎం.డీ.మక్బుల్, సౌత్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఎం.డీ.యాసిన్, 36 వార్డు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు షకిల్, నాయకులు అనిఫ్. జకీమ్, ఎండీ నజీమ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్కు వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం వినతి -
రాయపుర అగ్రహారంలో భూసేకరణ సెగ
సబ్బవరం: మండలంలోని రాయపుర అగ్రహారంలో ముందస్తు సమాచారం లేకుండా రెవెన్యూ అధికారులు చేపట్టిన భూ సర్వే తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో తమ భూములను సేకరించేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో రైతులు కలెక్టర్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ నిరసన చేపట్టారు. మూడు రోజులుగా గ్రామంలో వివిధ బృందాలుగా విడిపోయి అధికారులు సర్వే నిర్వహిస్తుండగా, దీనిపై ఎలాంటి గ్రామసభ నిర్వహించకపోవడం లేదా రైతులకు అధికారిక నోటీసులు ఇవ్వకపోవడంపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏపీఐఐసీ అవసరాల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ చేపడుతున్నామని అధికారులు చెబుతుండగా, ఇక్కడి రైతులంతా పేద, వెనుకబడిన వర్గాలకు చెందినవారని, వ్యవసాయమే తమ ఏకై క జీవనాధారమని రైతులు వాపోతున్నారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లో పంటలు పండించుకుంటూ జీవిస్తున్నామని, ఇప్పటికే పోలవరం కాలువ విస్తరణలో కొంత భూమిని కోల్పోయామని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మిగిలిన భూములను కూడా తీసుకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా సర్వే చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శిస్తూ, తక్షణమే ఈ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ జీవన హక్కులను కాలరాస్తోందని, ఒకవేళ సర్వే కొనసాగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రైతులు హెచ్చరించారు. వినతిపత్రం అందజేసినవారిలో రైతులు నంబారు రాము, కోన రాముడు, భీశెట్టి వెంకటరావు, పిల్లల సోమేశ్వరరావు, పిల్లల అప్పనాయుడు, ఇసరపు వెంకటరావు, పిల్లల అప్పలనాయుడు, కోన గంగరాజు, నక్కెళ్ల అచ్చిబాబు,ిపిల్లల పరదేశి, సింగంపల్లి సన్యాసిరావు, అధిక సంఖ్యలో రైతులు ఉన్నారు. -
టౌన్ ప్లానింగ్ విభాగంపై కలెక్టర్ ఆగ్రహం
మహారాణిపేట: ప్రజా వినతుల పరిష్కారంలో టౌన్ ప్లానింగ్ విభాగం అనుసరిస్తున్న తీరుపై కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. 25 శాతం కంటే ఎక్కువ పెండింగ్ ఉన్న అధికారులకు మెమోలు జారీ చేయాలని, ముఖ్యంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన టీపీవో–6కు చార్జ్ మెమో ఇవ్వాలని నోడల్ అధికారిని ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ పనితీరును తానే స్వయంగా నెల రోజుల పాటు పరిశీలిస్తానని, ఈ లోగా మార్పు రాకపోతే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యల కోసం కలెక్టరేట్ వరకు రాకుండా క్షేత్రస్థాయిలోనే పరిష్కారం లభించేలా అధికారులు పనిచేయాలని, ఎస్.ఎల్.ఎ కాలపరిమితి దాటకుండా వినతులను పారదర్శకంగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇన్చార్జి డీఆర్వో సత్తిబాబు, అడిషనల్ కమిషనర్ సత్యవేణి తదితరులు ప్రజల నుంచి మొత్తం 383 వినతులను స్వీకరించారు. వీటిలో జీవీఎంసీకి సంబంధించి 106, రెవెన్యూ విభాగంపై 94, పోలీసు శాఖకు 25, ఇతర విభాగాలకు చెందిన 158 వినతులు ఉన్నాయి. -
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన వ్యక్తులు అరెస్టు
తాటిచెట్లపాలెం : ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసగించిన వ్యక్తులను ఫోర్త్ టౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ం లోచన్కుమార్ అనే వ్యక్తి తాను పోలీస్ శాఖలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నానని చెప్పుకుంటూ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించాడు. ఈ క్రమంలో మెడికల్ పరీక్షలు, ఆరోగ్య భద్రత పేరుతో బాధితుల నుంచి మొత్తం రూ.10.80 లక్షలు వసూలు చేసి, వారికి ఎలాంటి ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేసినట్లు బాధితులు ఇటీవల ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు లోచన్కుమార్ను సోమవారం అరెస్టు చేసి, రిమాండ్కు పంపినట్లు తెలిపారు. సెక్రటేరియట్లో ఉద్యోగినని చెప్పి మోసం మరో కేసులో గుంటూరు జిల్లాకు చెందిన ఆరిమండ తేజ కృష్ణకమల్ అమరావతిలోని సెక్రటేరియట్లో గ్రూప్–1 అధికారినని చెప్పుకుంటూ, ఏపీ హైకోర్టులో తనకు పరిచయాలు ఉన్నాయని, అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తానని విశాఖపట్నానికి చెందిన రాజు, అప్పారావు, దేవి నుంచి సుమారు రూ.10.55 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోసానికి పాల్పడిన తేజ కృష్ణకమల్ను అరెస్టు చేసి, రిమాండ్కు పంపినట్లు వెల్లడించారు. -
డయల్ యువర్ ఈపీడీసీఎల్ సీఎండీకి విశేష స్పందన
సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ఈపీడీసీఎల్ ప్రారంభించిన డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి తొలిరోజున విశేష స్పందన లభించిందని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 48 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటులో ఇబ్బందులు, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడిలో జాప్యం, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల అంచనాలు, విద్యుత్ లైన్ల మార్పు, బిల్లులు, విద్యుత్ లైన్లు స్తంభాల మార్పిడి, స్తంభాలపై వైర్లు వేలాడుతుండడం, సరఫరాలో అంతరాయాలు, తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా సీఎండీ పృథ్వీతేజ్ మాట్లాడుతూ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912 కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబరు 9493681912కు చాట్ చేయడం ద్వారా కూడా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సీజీఎం వి.విజయలలిత, జీఎం ఎం.ఝాన్సీ పాల్గొన్నారు. -
మలేషియా టూరిజం విస్తరణకు ప్రణాళిక
కొమ్మాది: 2026లో 2.1 మిలియన్ల పర్యాటకులు సందర్శించే లక్ష్యంతో మలేషియా టూరిజాన్ని విస్తరించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మలేషియా టూరిజం చైర్మన్ దాతూక్ మనోహరస్ పెరియసామి అన్నారు. సాగర్నగర్లో ఉన్న రాడిసన్ బ్లూ రిసార్టులో సోమ వారం మలేషియా అసోసియేషన్ ఆఫ్ టూర్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ భాగస్వామ్యంతో జరిగిన టూరిజం మలేషియా సేల్స్ మిషన్–2026 సదస్సులో ఆయన పాల్గొన్నారు. వాణిజ్య భాగస్వాములను పటిష్టం చేసి విభిన్న పర్యాటక శాఖలను ప్రోత్సహించడంపై మలేషియా దృష్టి సారించిందన్నారు. దక్షిణ భారతంలో టూరిజం మలేషియా ఉనికిని విస్తరించడం.. తద్వారా మార్కెట్లో మలేషియా భాగస్వామ్యం బలోపేతం చేయడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం అన్నారు. 2024లో 13,65,387 మంది పర్యాటకులు మలేషియాను సందర్శించగా 2025లో 15,65,194 మంది సందర్శించారన్నారు. 2026లో పర్యాటకుల సంఖ్య మరింత ఎక్కువ పెరిగేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భారత్, మలేషియా దేశాల మధ్య పర్యాటకుల డిమాండ్కు మద్దతుగా దేశంలోని 14 నగరాల నుంచి 47,399 సీట్ల కెపాసిటీతో 238 డైరెక్ట్ వీక్లీ విమానాలతో అనుసంధానం ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టూరిజం మలేషియా ఇంటర్నేషనల్ ప్రమో షన్స్ విభాగం సీనీయర్ డైరెక్టర్ నువాల్ ఫాథిలా బింటీ, హిషాముద్దీస్ ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. -
వెట్టిచాకిరి రహిత జిల్లాగా విశాఖను తీర్చిదిద్దాలి
సీతంపేట: వెట్టిచాకిరి రహిత జిల్లాగా విశాఖను తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల సమన్వయం అవసరమని కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఎం.రామారావు పిలుపునిచ్చారు. ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలో నేచర్, వెట్టిచాకిరి విమోచన కమిటీతో కలిసి కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎం.రామారావు మాట్లాడుతూ వెట్టిచాకిరి రహిత సమాజ నిర్మాణానికి ఈ చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉప కమిషనర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ త్వరలోనే జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ కమిటీలను క్రియాశీలం చేసి సంపూర్ణ చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ లైన్ డిపార్ట్మెంట్లు, మహిళా , శిశు సంక్షేమ శాఖ, బీసీ వెల్ఫేర్ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 95 అర్జీలు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు మొత్తం 95 ఫిర్యాదులు అందాయి. ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, పి.నల్లనయ్యలతో కలిసి కమిషనర్ కేతన్ గార్గ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదులలో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 52 అందగా, ఇంజినీరింగ్కు 13, రెవెన్యూకు 11, ప్రజారోగ్య విభాగానికి 9, అడ్మినిస్ట్రేషన్కు 6, మొక్కల పెంపకానికి 2, యూసీడీ విభాగానికి 2 వినతులు వచ్చాయి. -
ప్రైవేటుకే!
ఇక రోడ్లూ చంద్రబాబు ప్రభుత్వంలో పీక్స్కు చేరిన ‘పీపీపీ’ పిచ్చి నగరంలో 88.35 కి.మీ రోడ్లను పీపీపీలో అప్పగింతకు నిర్ణయంబిడ్డర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.306.95 కోట్లు జీవీఎంసీ వాటా 40 శాతం.. ప్రైవేటు వాటా 60 శాతం ప్రైవేటు వాటా ఖర్చును వడ్డీతో కలిపి పదేళ్లలో జీవీఎంసీ చెల్లించేలా టెండర్లు రోడ్లు పూర్తయిన తర్వాత పదేళ్లపాటు నిర్వహణ ఈ రోడ్లపై వచ్చే ప్రకటనల ఆదాయం కూడా ప్రైవేటుకే.. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ‘పీపీపీ’ పిచ్చి ముదురుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పూనుకున్న బాబు సర్కారు.. ఇపుడు విశాఖ రహదారులను సైతం ప్రైవేటుకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ‘నగర రోడ్ల అభివృద్ధి కార్యక్రమం’ పేరుతో కావాల్సిన వారికి జీవీఎంసీ ఖజానాను దోచి పెట్టాలని నిర్ణయించింది. విశాఖ వాసులపై ‘హైబ్రిడ్’ భారం మోపుతూ.. నగరంలోని 88.35 కిలోమీటర్ల మేర 53 రహదారులను పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) కింద ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. పైలట్ ప్రాజెక్టు కింద చేపడుతున్న దీని అంచనా వ్యయం అక్షరాలా రూ.306.95 కోట్లు. ఇందుకు సంబంధించి జీవీఎంసీ గతేడాది డిసెంబర్ 31న బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులు ఆహ్వానించింది. బిడ్ దాఖలు గడువు ఈనెల 12వ తేదీతో ముగుస్తుంది. -
బస్సు ఢీకొని జూ పార్కు కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
ఆరిలోవ: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తమ్మినేని మోహనరావు (45)మృతి చెందాడు. కంచరపాలేనికి చెందిన మోహనరావు జూ పార్కులో కాంట్రాక్ట్ పనులు చేస్తుండగా, సోమవారం తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై పనికి వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయమై మోహనరావు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించి, మృతుడి కుమారుడి సాయి మణికంఠ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వరహాలునాయుడు తెలిపారు. -
పోర్ట్ను సందర్శించిన ఐఏఎస్ శిక్షణార్థులు
విశాఖసిటీ : సివిల్స్ 2025 బ్యాచ్కు ఐఏఎస్ శిక్షణార్థుల బృందం సోమవారం విశాఖపట్నం పోర్ట్ అథారిటీని (వీపీఏ) సందర్శించింది. వింటర్ స్టడీ టూర్లో భాగంగా వచ్చిన వీరికి పోర్టు అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోర్టులో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం, ఆధునికీకరణ, యాంత్రీకరణ పనుల గురించి అధికారులు సమగ్రంగా వివరించారు. ప్రధానంగా సోలార్ పవర్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి ప్లాంట్ మొదలైన పర్యావరణహిత కార్యక్రమాలతోపాటు కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్, ట్రక్ పార్కింగ్ టెర్మినల్ గురించి అధికారులు వారికి వివరించారు. కార్యక్రమంలో వీపీఏ విభాగాధిపతులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ సంస్థకు కాసుల వర్షమే
ఈ ప్రాజెక్టు దక్కించుకునే కాంట్రాక్ట్ సంస్థకు కాసుల వర్షం కురుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాంట్రాక్టర్ పెట్టే 60 శాతం పెట్టుబడి ఖర్చును కూడా బ్యాంక్ వడ్డీతో పాటు అదనంగా మరో 1.25 శాతం కలిపి జీవీఎంసీ తిరిగి చెల్లిస్తుంది. రోడ్ల నిర్మాణాలు పూర్తయిన తర్వాత పదేళ్ల పాటు ప్రైవేటు సంస్థ వాటిని నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి అయ్యే ఖర్చును కూడా జీవీఎంసీ విడిగా వాయిదాలతో సంబంధం లేకుండా చెల్లిస్తుంది. ఈ ప్రాజెక్టుకు పెట్టిన పెట్టుబడితోపాటు ఆ రోడ్ల వెంట వాణిజ్య ప్రకటనల లబ్ధిని కాంట్రాక్టర్కు కట్టబెడుతున్నారు. రోడ్డు మధ్యలో ఉండే మీడియన్లు, వీధి దీపాలు, బస్టాపులు, స్ట్రీట్ ఫర్నిచర్ ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయాన్ని సదరు కాంట్రాక్టు సంస్థే దక్కించుకుంటుంది. అంతేకాకుండా, రోడ్డు కటింగ్ పర్మి షన్ల ద్వారా వచ్చే ఫీజులు కూడా ఆ సంస్థకే చెల్లించేలా నిబంధనలు రూపొందించారు. అంటే.. ఒకవైపు ప్రజల పన్నుల రూపంలో రూ.కోట్లు ఆన్యుటీ చెల్లిస్తూనే.. మరోవైపు నగరంలోని విలువైన ప్రకటనల ఆదాయాన్ని కూడా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం గమనార్హం. ఇప్పటికే 2025 డిసెంబర్ 31న టెండర్ నోటిఫికేషన్ జారీచేసిన జీవీఎంసీ అధికారులు జనవరి 20వ తేదీన ప్రీ బిడ్ సమావేశం కూడా నిర్వహించారు. బిడ్లను సమర్పించేందుకు ఫిబ్రవరి 12వ తేదీ వరకూ గడువు విధించడంతో పాటు ఫిబ్రవరి 27న ప్రైస్ బిడ్ను తెరవనున్నట్టు కూడా ప్రకటించారు. అనంతరం ఒప్పందం చేసుకున్న తర్వాత 12 నెలల్లోగా రోడ్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ రోడ్లను సదరు కాంట్రాక్టు సంస్థలే 10 ఏళ్లపాటు నిర్వహించనున్నారు. తద్వారా ఈ రోడ్లపై జీవీఎంసీ నుంచి పూర్తిస్థాయిలో ప్రైవేటు చేతుల్లోకి పోనున్నాయన్నమాట. అంతేకాకుండా పీపీపీ కింద గుర్తించిన రోడ్లన్నీ నగరంలో కీలకమైన ప్రాంతాలకు చెందినవి కావడం గమనార్హం. ఈ రోడ్లపై వచ్చే ప్రకటనల ద్వారా ప్రస్తుతం జీవీఎంసీ ఖజానాకు భారీగా ఆదాయం వస్తోంది. ఈ ఆదాయం మొత్తం తాజా నిర్ణయంతో ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లడం వల్ల జీవీఎంసీ గుల్ల అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
మల్కాపురం : భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన 60వ వార్డు జవహర్నగర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వేములపూడి జయ (29), పెయింటర్గా పనిచేస్తున్న పట్టాలు భార్యాభర్తలు. పట్టాలు మద్యానికి బానిసై, భార్యపై అనుమానంతో తరచూ గొడవపడేవాడు. ఆదివారం రాత్రి కూడా గొడవపడి అతను బయటకు వెళ్లిపోగా, మనస్తాపానికి గురైన జయ ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. తండ్రి వెంట ఏడుస్తూ రోడ్డుపైకి వచ్చిన ఐదేళ్ల కుమారుడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపటి తరువాత ఇంటికి వచ్చిన పట్టాలు, జయ తలుపు తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా మృతదేహం వేలాడుతూ కనిపించింది. మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. తల్లి మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. -
రయ్ రయ్..తాటతీశారోయ్..!
అల్లిపురం : నగరంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏడీసీపీ కె. ప్రవీణ్కుమార్ హెచ్చరించారు. సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘రమ్..రయ్..రిస్క్ రోయ్..’ ఫొటో కథనానికి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి స్పందించారు. సీపీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, డ్రైవింగ్ చేసే సమయంలో లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరి అని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని అవగాహన కల్పించారు. పట్టుబడిన ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్.ఐ ఉమాశంకర్ తెలిపారు. మరోసారి నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో ట్రాఫిక్ సీఐ శ్రీను, ఎస్.ఐ ఉమా శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడి లేని ప్రైవేటు వ్యాపారం
ఇలా ఇవ్వడమంటే కాంట్రాక్టు సంస్థకు పైసా పెట్టుబడి లేని వ్యాపారమే అవుతుంది. ఈ ప్రాజెక్టులో నిర్మాణ వ్యయం కంటే నిర్వహణ, ఇతర రుసుముల పేరిట కేటాయించిన నిధులు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మొత్తం రూ.306.95 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో.. రోడ్ల నిర్మాణానికి కేవలం రూ. 168.03 కోట్లు మాత్రమే కేటాయించారు. మిగిలిన మొత్తంలో 10 ఏళ్ల నిర్వహణ కోసం రూ.86.20 కోట్లు, ఇతర పన్నులు, ప్రాజెక్టు నిబంధనల కోసం ఏకంగా రూ.52.71 కోట్లు ఖర్చు చేయనున్నారు. అంతేకాకుండా, ఎంపికై న కాంట్రాక్ట్ సంస్థకు ప్రాజెక్టు వ్యయంలో 1.25 శాతం (ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫీజు) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారీ వ్యయం చూస్తుంటే.. సాధారణ రోడ్ల మరమ్మతు పనులను కూడా అత్యంత ఖరీదైన ప్రాజెక్టులుగా మార్చి నగరపాలక సంస్థ ఖజానాను ఖాళీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ వచ్చే 10 ఏళ్ల పాటు భారీ మొత్తంలో వడ్డీతో కూడిన వాయిదాలు చెల్లించాల్సి రావడం భవిష్యత్తులో నగర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. -
కంచిపీఠం పాఠశాల ప్రవేశాలకు విశేష స్పందన
సీతంపేట: భారతీయ సనాతన ధర్మాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించడమే లక్ష్యంగా సేవలందిస్తున్న కంచి కామకోటి పీఠం సంప్రదాయ పాఠశాలల ప్రవేశాల ప్రక్రియకు విశేష స్పందన లభించింది. ఆదివారం స్థానిక శంకరమఠంలో నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠం ఇంటిగ్రేటెడ్ పాఠశాలల చీఫ్ కోఆర్డినేటర్ లక్ష్మి మాంధాత మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిని పెంపొందించడం, భావి తరాలకు అందించడం కోసం బ్రాహ్మణ బాలికలకు సంప్రదాయ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈ దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. ఈ పాఠశాలల్లో నాలుగో తరగతి నుంచి డిగ్రీ వరకు సమగ్ర విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు. కేవలం బ్రాహ్మణ సామాజిక వర్గానికే కాకుండా, అన్ని కులాల వారికి వారి వృత్తుల్లో నైపుణ్య శిక్షణతో పాటు విద్యావకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎంచుకున్న కేంద్రం, కోర్సు ఆధారంగా వివిధ ప్రాంతాల్లో విద్యార్థులకు సీట్లు కేటాయిస్తున్నామన్నారు. -
తీరాన వెండి వెన్నెల సోయగం.. అలలపై సీతాకోకచిలుకల నృత్యం
విశాలమైన నీలి సాగరం, నింగిలోని జాబిలిని ప్రేమగా హత్తుకున్న వేళ.. విశాఖ ఆర్కే బీచ్ ఒక అద్భుత వర్ణచిత్రంగా ఆవిష్కృతమైంది. వెండి వెన్నెల కెరటాలపై కురిసి, అలలన్నీ కాంతిపుంజాలై మెరిసిపోతుంటే ప్రకృతి ప్రేమికులు పరవశించిపోయారు. సముద్రంలో వేట సాగిస్తున్న మత్స్యకారుల తెప్పలు, ఆ వెన్నెల వెలుగుల్లో కెరటాలపై లయబద్ధంగా ఊగుతుంటే.. నీటిపై రంగురంగుల సీతాకోకచిలుకలు విహరిస్తున్నాయా అన్నట్లుగా భ్రమను కల్పించాయి. గాలి తరగలకు అనుగుణంగా, అలల ఊయలలో తేలియాడుతున్న ఆ నావల సోయగం సందర్శకుల మనసులను దోచుకుంది. ఆదివారం సాగరతీరంలో అలలపై సాగిన యాటింగ్ బోట్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిరు నావలను జాతీయ స్థాయి చాంపియన్షిప్ల సాధన కోసం ఉపయోగిస్తున్నట్లు సెయిలర్స్ తెలిపారు. అటు ప్రకృతి సౌందర్యం, ఇటు సాహస విన్యాసాల కలయికతో విశాఖ తీరం ఒక అపురూప కావ్యంలా మెరిసిపోయింది. – ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం సరదా కోసం చేసే పనులు ప్రాణాల మీదకు వస్తాయని తెలిసినా, యువతలో మార్పు రావడం లేదు. ఆదివారం సాగర తీరంలో ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు చేస్తూ సాగిన ఈ ప్రయాణం పర్యాటకులను విస్మయానికి గురిచేసింది. మూడు ద్విచక్ర వాహనాలపై యువతీ యువకులు ‘ట్రిపుల్ రైడింగ్’ చేస్తూ అత్యంత వేగంతో దూసుకుపోయారు. ఒక్కో బైకుపై ముగ్గురేసి చొప్పున కూర్చుని, మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ బీచ్ రోడ్డులో హల్చల్ చేశారు. చిత్రమేమిటంటే ఈ మూడు వాహనాలపై వెనుక కూర్చున్న వారు యువతులే కావడం గమనార్హం. హెల్మెట్ లేకపోగా, ముగ్గురు కూర్చుని అతి వేగంగా వెళ్లడం వల్ల ఏ మాత్రం అదుపు తప్పినా ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. ఇటువంటి విన్యాసాలపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సందర్శకులు కోరుతున్నారు. – ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నంరయ్.. రయ్.. రిస్క్ రోయ్..! -
ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం
మహారాణిపేట: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి, విజయనగరం జిల్లా సంఘం అధ్యక్షుడు సీహెచ్ మురళి ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఎస్.సత్తిబాబు(సూపరింటెండెంట్, పీఐయూ డివిజన్), ప్రధాన కార్యదర్శిగా డి.వి.సీతారామరాజు, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎల్.పూర్ణయ్య ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా ఆర్వీ నాగరాజు, డి.వి.ఎస్ గౌరీపతిరావు, పి.శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలుగా పి.రామకృష్ణ, ఎం.వి.హెచ్.ఆర్.స్వామి, వై.రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా సుధారాణి, డి.వి.రమణారాజు, ఎస్.రవికుమార్, బి.వి.ఎస్.ఫణికుమార్, కోశాధికారిగా బి.అర్చన, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా జి.గంగాధర్, ఎస్.త్రినాథ్, సీహెచ్ సింహాచలం, జి.ఎల్.నర్సింహారావులను ఎన్నుకున్నారు. సత్తిబా బు, సీతారామరాజు అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికవడం ఇది నాలుగోసారి. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు నారాయణరావు, విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సహాయ ఎన్నికల అధికారులుగా బి.హెచ్.వి.రమణబాబు, యు.కూర్మారావు వ్యవహరించారు. -
భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం
సింహాచలం : వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా తృప్తిగా దర్శనం చేసుకునేలా చూడడమే ప్రథమ ప్రాధాన్యత అని సింహాచలం దేవస్థానం నూతన ఈవో జె.వెంకటరావు తెలిపారు. ఆదివారం బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసి బేడామండపంలో ప్రదక్షిణ చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాన్ని ఏఈవో తిరుమలేశ్వరరావు అందజేశారు. ఇన్ఛార్జ్ ఈవోగా పనిచేసిన ఎన్.సుజాత నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆలయ పవిత్రత, ఆస్తుల పరిరక్షణను రెండవ ప్రాధాన్యతగా తీసుకుంటానన్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయ ఆస్తులను కాపాడుతామని తెలిపారు. ఏప్రిల్ 20న జరిగే చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడం అత్యవసర ప్రాధాన్యతగా తీసుకుంటామని, రానున్న 50 రోజులు ఆ ఏర్పాట్లపైనే దృష్టి పెడతానన్నారు. దేవస్థానంలో లోపాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సింహాచలం దేవస్థానం ఈవోగా వెంకటరావు బాధ్యతల స్వీకరణ -
అలరించిన ‘శ్రీకృష్ణ లీలలు’
తగరపువలస: మండలంలోని గంభీరం ఐఐఎంవీ రోడ్డులో ఉన్న హరేకృష్ణ వైకుంఠంలో ఆదివారం ‘శ్రీకృష్ణ అర్పణం’ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శ్రీరాధా మదన్ మోహనుల మందిరంలో జరిగిన ఈ వేడుకలో చైతన్య డాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణ లీలలు’ నృత్య రూపకం భక్తులను అలరించింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న బుక్కపట్నం ఇందిర, లీలభాను, పూజిత, శాంతిప్రియ తదితర చిన్నారులను హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు నిష్కించన భక్తదాస ప్రత్యేకంగా అభినందించారు. -
సామాన్యులకు అత్యాధునిక వైద్య సేవలే లక్ష్యం
కొమ్మాది: వైద్య శాస్త్రంలో వస్తున్న నూతన ఒరవడితో కూడిన అంశాలను ఏకీకృతం చేసి, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే నేషనల్ ఇంటిగ్రేటెడ్ బ్యాలెన్స్ ఫోరమ్ ప్రధాన లక్ష్యమని ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ప్రదీప్ ఉండవల్లి అన్నారు. రుషికొండలోని సాయిప్రియ రిసార్టులో మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరిలో కళ్లు తిరగడం, నడుస్తున్నప్పుడు తూలిపోవడం వంటి సమస్యలపై సదస్సులో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. చెవిలో బాహ్య, మధ్య, అంతర అనే మూడు విభాగాలు ఉంటాయని వివరించారు. సాధారణంగా కళ్లు తిరగడం వంటి సమస్యలు తలెత్తినప్పుడు 80 శాతం మంది అది కంటికి సంబంధించిన సమస్యగా భావిస్తారని, అయితే చెవిని మెదడుతో అనుసంధానించే నరం ద్వారా కూడా ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఐబీఎఫ్ కన్వీనర్లు డి. శ్రీనివాస్, సూరత్, అవినాష్, రమేష్, మాలిక్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛత వేడుకలు
ఏయూక్యాంపస్ : జీవీఎంసీ, సులభ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్వహించిన ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛత అవగాహన కార్యక్రమాలు ఆదివారం ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్, సైక్లోథాన్తో ముగిశాయి. జీవీఎంసీ అదనపు కమిషనర్ పి. నల్లనయ్య ముఖ్య అతిథిగా పాల్గొని అందరితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యర్థాలను కాలువల్లో వేసి సముద్రాలను కలుషితం చేయవద్దని, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. సులభ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్, ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.పి. సింగ్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో.. ఔత్సాహికులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసి సైక్లోథాన్ నిర్వహించారు. అనంతరం 20 కిలోమీటర్ల సైక్లింగ్ పూర్తి చేసిన విజేతలకు, ఫిషర్మెన్ కమ్యూనిటీ ప్రతినిధులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. -
శిక్ష!
కక్ష..స్టీల్ప్లాంట్ బకాయిలతో డిస్కమ్కు దెబ్బఏడాది కాలంలో రూ.550 కోట్ల విద్యుత్ బిల్లులు బకాయిల చెల్లింపులో ప్లాంట్కు సహకరించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫలితంగా యూనిట్ సగటు వ్యయం–రాబడి మధ్య భారీ వ్యత్యాసం డిస్కమ్ పనితీరు సరిగా లేదంటూ తప్పుపట్టిన కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసే కుట్రలో బలవుతున్న ఈపీడీసీఎల్ పలుమార్లు నివేదించినా పట్టించుకోని ప్రభుత్వం ఉక్కుపైఈపీడీసీఎల్కు సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రుల హకై ్కన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా కేంద్రం కొనసాగిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు స్టీల్ ప్లాంట్ను ఆర్థికంగా దెబ్బతీస్తూ, మరోవైపు ఉద్యోగుల తగ్గింపుతో ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్లాంట్ నిలదొక్కుకునేలా సాయం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర నిర్ణయాలకు తానా–తందానా అంటూ వ్యవహరించడంతో విశాఖ స్టీల్ ప్లాంట్కు విద్యుత్ సరఫరా చేసే ఏపీఈపీడీసీఎల్పై భారం పడింది. ప్లాంట్ నుంచి వందల కోట్ల రూపాయల బకాయిలు మొండిబకాయిలుగా మారడంతో కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 13వ వార్షిక గ్రేడింగ్లో ఎప్పుడూ ‘ఏ’ గ్రేడ్లో ఉండే ఈపీడీసీఎల్ తొలిసారిగా ‘బీ’ గ్రేడ్కు పడిపోయింది. బకాయిల వసూలులో వెనుకబాటే కారణంగా యూనిట్ సగటు వ్యయం–రాబడి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడిందని కేంద్రం స్పష్టం చేయగా, ఇందులో ఈపీడీసీఎల్ తప్పేమీ లేకపోయినా శిక్ష మాత్రం అనుభవించాల్సి వచ్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెల్లింపులు జరుగుతాయా.. లేదా..? బిల్లు బకాయిల కోసం పలుమార్లు స్టీల్ ప్లాంట్తో, ప్రభుత్వంతో ఈపీడీసీఎల్ చర్చలు జరిపినా ఫలితం మాత్రం శూన్యంగానే మిగిలింది. డిస్కమ్ పనితీరు అద్భుతంగా ఉన్నా.. ప్లాంట్కు కనీసం విద్యుత్ బిల్లులు కట్టే స్తోమత లేకుండా చేసి, ఆ నెపాన్ని డిస్కమ్పై నెట్టి మొత్తానికి విశాఖ ఉక్కు ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పాలన సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ ఉక్కుకు గనుల కేటాయింపు చేయకపోవడం, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకపోవడం ద్వారా ప్లాంట్ను ఎండగడుతున్న కేంద్ర తీరుపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం వెనుక మర్మం ప్రజలకు అర్థమవుతోందనే వ్యాఖ్యలు ఉన్నాయి. బకాయిల వల్ల ఏపీ ఈపీడీసీఎల్కు వార్షిక నష్టం రూ.7,155 కోట్లకు చేరుకున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కంటే కేంద్రంలోని పెద్దల మెప్పుకోసమే చంద్రబాబు ప్రభుత్వం తాపత్రయపడుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్లాంట్ నుంచి చెల్లింపులు జరుగుతాయా లేదా అన్న మీమాంశలో ఈపీడీసీఎల్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. సమగ్ర కారణాలు వివరించి గ్రేడ్ మార్పు కోసం మరోసారి కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు ఈపీడీసీఎల్ అధికార వర్గాలు తెలిపాయి. మొత్తంగా ప్లాంట్పై ప్రభుత్వ వైఖరి ఈపీడీసీఎల్ ప్రతిష్టను దెబ్బతీసిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్లాంట్ బకాయిలే ప్రధాన కారణం..! విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఈపీడీసీఎల్కు రావాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్ విషయాన్ని పూర్తిగా విస్మరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటీకరణ కోసం కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వంతపాడుతూ విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసే పనిలోనే ప్రభుత్వం నిమగ్నమైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ బకాయిలపై గతంలో స్టీల్ ప్లాంట్కు ఈపీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు వెనక్కి తీసుకోవాలని, బకాయిలపై దృష్టిసారిస్తామని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఈపీడీసీఎల్ అధికారులు మౌనం వహించారు. ఫలితంగా 2024 అక్టోబర్ నుంచి ఏడాది కాలంలోనే సుమారు రూ.550.40 కోట్ల మేర విద్యుత్ బిల్లులు బకాయిలుగా మారి డిస్కమ్ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశాయి. సహకారమెక్కడ చంద్రబాబూ..? స్టీల్ ప్లాంట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లుల చెల్లింపునకు ఎలాంటి సహకారం అందించకపోవడంతో ఈ భారం ఈపీడీసీఎల్ మెడకు చుట్టుకుంది. డిస్కమ్ పరిధిలో యూనిట్ సగటు వ్యయం–రాబడి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఒక యూనిట్ సగటు వ్యయం, సగటు రాబడి మధ్య వ్యత్యాసాన్ని విద్యుత్ శాఖ పరిభాషలో ఏసీఎస్–ఏఆర్ఆర్ గ్యాప్గా పేర్కొంటారు. ఇది 2023–24లో 0.36 శాతంతో అద్భుతంగా ఉండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ బకాయిల కారణంగా ఈ వ్యత్యాసం ప్లస్ నుంచి మైనస్లోకి వెళ్లిపోయింది. 2024–25లో –0.09 శాతానికి పడిపోయింది. ఈ కారణంగా ఈపీడీసీఎల్ గ్రేడ్ మార్కులను భారీగా కోల్పోయింది. ఏపీ ఈపీడీసీఎల్ కేంద్రం విడుదల చేసిన 13వ వార్షిక గ్రేడింగ్ నివేదికలో ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘బీ’ గ్రేడ్కు పడిపోయింది. గతంలో 65.12 మార్కులు సాధించిన డిస్కమ్, తాజాగా 50.46 మార్కులకు పరిమితమైంది. స్టీల్ ప్లాంట్ బకాయిలు సకాలంలో చెల్లించి ఉంటే ఈపీడీసీఎల్ 71.34 మార్కులు సాధించి ‘ఏ’ గ్రేడ్లోనే కొనసాగేది. -
నల్ల చొక్కాలతో ఉక్కు నిర్వాసిత రైతుల ఉద్యమం
గాజువాక: విశాఖ స్టీల్ప్లాంట్ కోసం భూములిచ్చిన నిర్వాసితులు తమ హక్కుల సాధన కోసం తమిళనాడు ‘పెరియార్ ’ తరహాలో నల్లచొక్కాలు ధరించి నిరసన తెలపాలని రిటైర్డ్ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త జె.పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. ఆదివారం లంకా మైదానంలో ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగర్జన సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. వేల ఎకరాల భూములిచ్చిన రైతులు 35 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వాల్లో చలనం లేదని ఆయన విమర్శించారు. ధర్నాలు, రాస్తారోకోల కంటే వినూత్నంగా నల్లచొక్కాల ఉద్యమం ద్వారా పాలకులను నిలదీయాలని కోరారు. తమిళనాడులో సేలం స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్న స్ఫూర్తితో ఇక్కడి నిర్వాసితులు, కార్మికులు ఉద్యమించాలన్నారు. అమరావతి రైతులకు ఇచ్చిన తరహాలోనే స్టీల్ప్లాంట్ నిర్వాసితులకు ఎకరానికి 1250 గజాల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు, నాయకులు వై.మహాదేవ్, పరంధామయ్య తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ డీఎస్పీ పూర్ణచంద్రరావు పిలుపు -
ఎంఎస్ఎంఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీ రతన్కుమార్ అల్లిపురం: ఎంఎస్ఎంఈ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిదని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ. రతన్కుమార్ అన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన ఎంఎస్ఎంఈ రుణ ప్రోత్సాహక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి సృష్టి, స్థానిక వ్యాపారాల అభివృద్ధిలో ఎంఎస్ఎంఈ రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఎంఎస్ఎంఈ వ్యాపారులకు ఆర్థిక సహకారం అందించడంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ ముందుంటుందన్నారు. సరైన మార్గదర్శకత్వం, అనుకూలమైన రుణ పథకాల ద్వారా వ్యాపారుల ఎదుగుదలకు బ్యాంక్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉన్నతాధికారులతో పాటు డి.వి.ఎస్.ఆర్. మూర్తి (అసిస్టెంట్ డైరెక్టర్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్), ఆదిశేషు (జనరల్ మేనేజర్, డీఐసీ) పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సబ్సిడీలు, వాటి అర్హత ప్రమాణాలు, ప్రయోజనాలపై అధికారులు వివరించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, డా. బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, పార్వతీపురం జిల్లాల పరిధిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల నుంచి పాల్గొన్న కస్టమర్లకు మొత్తం రూ.94.22 కోట్ల విలువైన ఎంఎస్ఎంఈ రుణ మంజూరు పత్రాలను అందజేశారు. -
ఆయన జ్ఞాన నిధి.. ఆస్తిక హేతువాది
సీతంపేట: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం(అరసం) జిల్లా శాఖ ఆధ్వర్యంలో.. విశాఖ పౌర గ్రంథాలయంలో సాహితీవేత్త, ఏయూ విశ్రాంత ఆచార్యుడు చందు సుబ్బారావు సంస్మరణ సభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్తలు చందు సుబ్బారావు చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన సాహితీ సేవలను కొనియాడారు. అరసం రాష్ట్ర నాయకుడు ఉప్పల అప్పలరాజు పర్యవేక్షణలో జరిగిన ఈ సభకు యూపీఎస్సీ పూర్వ సభ్యుడు ఆచార్య కె.ఎస్.చలం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చందు సుబ్బారావుతో తనకు 50 ఏళ్ల పరిచయం ఉందని, ఆయన అటు సైన్స్కు, ఇటు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఆయన ఒక ఆస్తిక హేతువాది అని పేర్కొన్నారు. అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ చందు సుబ్బారావును జ్ఞాన నిధిగా అభివర్ణించారు. విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. తన పుస్తకాలన్నింటినీ సుబ్బారావు క్షుణ్ణంగా చదివి విశ్లేషించేవారని గుర్తు చేసుకున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య బాలమోహన్ దాస్ మాట్లాడుతూ.. సుబ్బారావు పద్య జ్ఞానాన్ని, ఆయన ధారణా శక్తిని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, జీఎస్ చలం, ఆచార్య వెలమల సిమ్మన్న, డాక్టర్ డి.వి.సూర్యారావు, ఆచార్య రాజేంద్రప్రసాద్, డాక్టర్ మాటూరు శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ తాడి ప్రకాష్ తదితర ప్రముఖులు పాల్గొని సుబ్బారావుకు నివాళులర్పించారు. చందు సుబ్బారావుకు సాహితీవేత్తల నివాళి -
ఐటీ హిల్స్కు మరో రెండు బస్సులు
మద్దిలపాలెం: ఐటీ ఉద్యోగుల కోసం మధురవాడ ఐటీ హిల్స్కు అదనంగా మరో రెండు ప్రత్యేక బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి శనివారం మద్దిలపాలెం డిపోలో ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న 8 బస్సులకు అదనంగా వీటిని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక బస్సు కొత్తవలస నుంచి, మరొకటి విజయనగరం నుంచి మధురవాడకు నడపనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు చేయనున్న 700 ఎలక్ట్రికల్ బస్సుల్లో, 100 బస్సులను విశాఖ జిల్లాకే కేటాయిస్తున్నట్లు తెలిపారు. సీ్త్ర శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించడంలో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. సంక్రాంతి సీజన్లో అధిక ఆదాయాన్ని సాధించినందుకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే అర్హులైన కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లకు పదోన్నతి పత్రాలను మంత్రి పంపిణీ చేశారు.కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కిలాడీ టెక్కీ.. పోలీసులకు చిక్కి..
అల్లిపురం: పగలు కంప్యూటర్ ముందు కూర్చు ని కోడింగ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజినీర్.. రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లకు కన్నం వేయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, 15 ఏళ్ల వయసులోనే దొంగతనాలు మొదలుపెట్టాడు. నేడు 60 నేరాల రికార్డున్న గజదొంగగా మారిన అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీని విశాఖ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నగర పోలీస్ కమిషనరేట్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఈ వివరాలను వెల్లడించారు. నిందితుడి నుంచి 699 గ్రాముల బంగారం, 3.8 కేజీల వెండి, నేరాలకు ఉపయోగించిన బీఎండబ్ల్యూ కారు, నంబర్ ప్లేట్ లేని స్కూటీ, ఐరన్ రాడ్, డ్రిల్లింగ్ మెషిన్, సుత్తి, స్క్రూడ్రైవర్, కట్టింగ్ ప్లయిర్, ఫేస్ మాస్కులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విశాఖ నగరంలో జరిగిన 26 దొంగతనం కేసుల్లో మొత్తం 108.494 తులాల బంగారం, 633.35 తులాల వెండి, నగదు రూ.40,500ను సన్నీ చోరీ చేసినట్లు సీపీ వెల్లడించారు. అసలేం జరిగిందంటే? గత ఏడాది అక్టోబర్ 10న గాజువాకలోని ఎన్టీఆర్ నగర్లో నివాసం ఉంటున్న కన్నా శివ రామకృష్ణ తన కుమార్తె డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం తన కుటుంబంతో అరుణాచలం వెళ్లారు. కాకినాడకు చెందిన సన్నీ వారి ఇంటి తాళాలు పగలగొట్టి 17 తులాల బంగారం, 30 తులాల వెండిని ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న గాజువాక క్రైం ఇన్స్పెక్టర్ కల్లూరి శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే గాజువాక, ఆరి లోవ, మల్కాపురం, పెందుర్తి, దువ్వాడ ప్రాంతాల్లో ఒకే తరహా దొంగతనాలు జరగడంతో పోలీసులు దీనిని సవాలుగా తీసుకున్నారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నగరంలోని మాధవస్వామి కల్యాణ మండపం సమీపంలోని పార్క్ స్ట్రీట్లో నివాసం ఉంటున్న సన్నీని శనివారం గాజువాకలోని మింది ఆర్చ్ రోడ్ వద్ద క్రైం ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇదీ సన్నీ నేర చరిత్ర నిందితుడు మహేష్ రెడ్డి పీజీ పూర్తి చేశాడు. హైదరాబాద్లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయితే చిన్నతనం నుంచే విలాసాలకు అలవాటు పడటంతో 15 ఏళ్లకే దొంగతనాలకు శ్రీకారం చుట్టాడు. పీఎంపాలెం పరిధిలో నాలుగు దొంగతనాలు చేసి తొలిసారి జువైనెల్ హోంకి వెళ్లాడు. అక్కడి నుంచి విడుదలైన తర్వాత కాకినాడ, సర్పవరం, రామచంద్రాపురం, రాజమండ్రి పరిసరాల్లో 32 దొంగతనాలు చేశాడు. ఈ క్రమంలో పట్టుబడి రాజమండ్రి జైలులో 14 నెలలు శిక్ష కూడా అనుభవించాడు. ఇలా మొత్తం 60కి పైగా దొంగతనాలు చేశాడు. అప్పుడప్పుడు విశాఖ వచ్చి దొంగతనాలు చేసి, మళ్లీ హైదరాబాద్ వెళ్లి విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. ఎట్టకేలకు అతన్ని విశాఖ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. -
దుమ్మురేపిన రైడర్లు
ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్విశాఖ స్పోర్ట్స్: జీవీఎంసీ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా శనివారం రాత్రి నేషనల్ సూపర్ క్రాస్ చాంపియన్షిప్ ఉత్కంఠగా సాగింది. ఎంఆర్ఎఫ్ మోగ్రిప్–ఎఫ్ఎంఎస్సీఐ ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారిగా జరిగిన ఈ సీజన్ కై ్లమాక్స్ మోటార్ స్పోర్ట్స్ ప్రేమికులను మంత్రముగ్ధులను చేసింది. రాష్ట్ర క్రీడలు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ పోటీలను జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ఇలాంటి జాతీయ స్థాయి సాహస క్రీడలు నిర్వహించడం నగర ప్రతిష్టను పెంచుతుందని, యువతకు ఇదొక మంచి స్ఫూర్తి అని పేర్కొన్నారు. హోరాహోరీగా సాగిన రేస్ ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వచ్చిన సుమారు 120 మంది రేసర్లు పాల్గొని 9 విభిన్న విభాగాల్లో(క్లాస్ల్లో) పోటీపడ్డారు. సాధారణ మోటోక్రాస్ మాదిరిగా కాకుండా, స్టేడియంలో ప్రత్యేకంగా రూపొందించిన సూపర్క్రాస్ ట్రాక్పై ఈ రేస్ సాగింది. టైట్ టర్న్లు, రిథమ్ సెక్షన్స్, ఎత్తైన టెక్నికల్ జంప్లతో కూడిన ఈ ట్రాక్పై రైడర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఫ్లడ్లైట్ల వెలుతురులో, దుమ్ము రేపుతూ బైకులు గాలిలో ఎగురుతూ చేసిన విన్యాసాలు క్రీడాభిమానులను ఉర్రూతలూగించాయి. గ్రాండ్ ఫినాలే విజేతలు సీజన్ పొడవునా పాయింట్లు సాధించి ఫైనల్స్కు చేరిన రైడర్లు ఇక్కడ తమ సత్తా చాటారు: ఎస్ఎక్స్1 ప్రీమియర్ కేటగిరీలో శ్లోక్, ప్రజ్వల్, ఇక్షన్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఎస్ఎక్స్2 విభాగంలో ర్యాన్, జాబీ, సుహైల్లు తమ బైకులతో మెరుపులు మెరిపించారు. ఇండియన్ ఎక్స్పర్ట్స్, జూనియర్ క్లాస్లో ఇమ్రాన్, జినేంద్ర, షిండే. చైతన్య వంటి రైడర్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఎస్ఎక్స్1 ఫారిన్ ఓపెన్ క్లాస్ రేస్లోనూ తీవ్ర పోటీ జరిగింది. నిర్వాహకులు ఈ పోటీలకు ఉచిత ప్రవేశం కల్పించడంతో విశాఖ వాసులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. ఇంజిన్ల మోత, అభిమానుల కేరింతల మధ్య పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ఆకట్టుకుంటున్న నేషనల్ సిల్క్ ఎక్స్పో
అల్లిపురం: తెలుగు సంవత్సరాది ఉగాది, వివాహాల సీజన్ను పురస్కరించుకుని ‘నేషనల్ సిల్క్ ఎక్స్పో’ సంప్రదాయ వస్త్ర ప్రదర్శనను వాల్తేరు మెయిన్ రోడ్డులోని హోటల్ గ్రీన్ పార్క్లో నిర్వహిస్తున్నారు. శనివారం ప్రారంభమైన ఈ ఎక్స్పో ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత పట్టు చీరలు, డిజైనర్ వస్త్రాలు, బ్లౌజులు, కుర్తీలు, దుపట్టాలు, సల్వార్ మెటీరియల్ ఒకేచోట ప్రదర్శనలో ఉన్నాయి. పైథానీ, బెంగళూరు సిల్క్, కంజీవరం, బనారస్, చందేరి, మహేశ్వరి, జమ్దానీ, బలుచారి, బంధిని, భాగల్పూర్, కశ్మీర్ సిల్క్ తదితర ప్రసిద్ధ చేనేత ఉత్పత్తులు లభిస్తున్నాయి. దేశ నలుమూలల నుంచి వచ్చిన నేత కార్మికులు తమ ఉత్పత్తులను 50 శాతం వరకు తగ్గింపుతో విక్రయిస్తున్నారు. ఈ ప్రదర్శన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ప్రవేశం ఉచితం. అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులు స్వీకరిస్తారు. -
ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ వేగవంతం
కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశం మహారాణిపేట: అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జేసీ జి.విద్యాధరితో కలసి డీఆర్వో సత్తిబాబు, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఆర్ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రమబద్ధీకరణ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ నెల 18లోగా పట్టాలు పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. మిగిలిన వాటిని మార్చి 31లోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీవో 388 పరిధిలో దరఖాస్తు చేసుకుని ఒక్క రూపాయి కూడా చెల్లించని దరఖాస్తులను రద్దు చేసి, ఆ దరఖాస్తుదారులను జీవో 30 కింద కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించాలన్నారు. గాజువాక ప్రాంతంలో జీవో 45 కింద ఆమోదం పొందిన దాదాపు 1,000 పట్టాలను సిద్ధం చేసి, ఈ నెల 18 నాటికి పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. జీవో 296, 388 కింద ఉన్న కన్వేయన్స్ డీడ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, సుమారు 2,000 కన్వేయన్స్ డీడ్లను మార్చి నెలాఖరు కల్లా పూర్తి చేయాలని తెలిపారు. ఈ ప్రక్రియలో ఉన్న పెండింగ్ పనులను ఈ నెల చివరి నాటికి ప్రాథమికంగా ముగించాలని స్పష్టం చేశారు. జీవో 84, 27 ప్రకారం యూఎల్సీ భూములపై అధికారులతో సమీక్షించారు. అలాగే 22ఏ డీ–నోటిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్పై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. -
డబ్బులిస్తే పాస్?
మహారాణిపేట: కేజీహెచ్ అనుబంధ ప్రభుత్వ నర్సింగ్ స్కూల్లో నిర్వహిస్తున్న జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ(జీఎన్ఎం) వార్షిక పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరీక్షల్లో భారీగా మాస్ కాపీయింగ్ జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో.. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ అధికారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముగ్గురు విద్యార్థినులు కాపీ కొడుతూ దొరికిపోవడంతో వారిని డిబార్ చేశారు. అయినప్పటికీ మాస్ కాపీయింగ్ ఆగలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీఎన్ఎం వార్షిక పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ నర్సింగ్ స్కూళ్లలో ఈ నెల 5 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 13వ తేదీ వరకు జరుగుతాయి. కేజీహెచ్లో జరుగుతున్న పరీక్షల్లో మొదటి, రెండో ఏడాది నుంచి 1,200, మూడో ఏడాది నుంచి 800 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. అయితే పరీక్షల నిర్వహణ తీరు, మాస్ కాపీయింగ్కు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏపీ నర్సింగ్ కౌన్సిల్ డైరెక్టర్ సునీత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థిలను గుర్తించి డిబార్ చేశారు. జీఎన్ఎం కోర్సు ప్రాధాన్యత : జీఎన్ఎం అనేది మూడున్నర ఏళ్ల డిప్లమో కోర్సు. ఇందులో మూడేళ్ల విద్యాభ్యాసం తర్వాత ఆరు నెలల పాటు తప్పనిసరి ఇంటర్న్షిప్ ఉంటుంది. ప్రసూతి సంరక్షణ, మానసిక ఆరోగ్య సంరక్షణ, పోస్ట్ ట్రామాటిక్ కేర్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి తక్షణ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అందుకే ఈ కోర్సు పూర్తి చేయడానికి కొంత మంది అడ్డదారులు తొక్కుతున్నారు. అధ్యాపకులపై ఆరోపణలు : ఈ పరీక్షల నిర్వహణలో కొంతమంది అధ్యాపకుల పాత్రపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థినులను ఉత్తీర్ణులు చేస్తామని నమ్మబలికి, కాపీయింగ్కు సహకరించేందుకు కొంతమంది సిబ్బంది పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పరీక్ష హాల్లోనే విద్యార్థులకు సహకరించడం, మొబైల్ ఫోన్లు లేదా చిట్టీల ద్వారా సమాచారాన్ని అందించడం వంటి అక్రమా లు జరుగుతున్నాయని స్థానికంగా చర్చ నడుస్తోంది. కాగా.. ఈ ఆరోపణలను ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ బి.మంగాదేవి ఖండించారు. పరీక్షలు పారదర్శకమైన వాతావరణంలో జరుగుతున్నాయని, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. మాస్ కాపీయింగ్ను అరికట్టేందుకు ప్రత్యేక స్క్వాడ్లను కూడా నియమించామని, ఎటువంటి అక్రమాలకు తావు లేదని స్పష్టం చేశారు. -
అరాచకం!
ప్రభుత్వ నీడలో ఏయూలో ఖాళీ పేపర్లపై సంతకాలు పెట్టాలంటూ ఒత్తిళ్లు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఆంధ్రా యూనివర్శిటీలో సంబరాల సందడి కంటే, బెదిరింపుల హడావుడే ఎక్కువగా వినిపించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఒక పవిత్రమైన విద్యా వ్యవస్థలో నాన్–టీచింగ్ స్టాఫ్కు చెందిన ఓ వ్యక్తి రిజిస్ట్రార్ పేరుతో బెదిరింపులకు దిగిన ఘటన ఇప్పుడు ఏయూలో చర్చనీయాంశంగా మారింది. ప్రింటింగ్ ప్రెస్కు సంబంధించిన ఐటెమ్స్, స్టేషనరీని గత ప్రభుత్వ హయాంలో బయట విక్రయించారంటూ ఫిర్యాదు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు, ఖాళీ పేపర్లపై సంతకాలు చేసి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం మొత్తం ఏయూ రిజిస్ట్రార్ పేరుతోనే సాగుతున్నట్టు సమాచారం. ఖాళీ పత్రాలపై సంతకాలు చేయకపోతే పదోన్నతులు ఇవ్వమంటూ బెదిరింపులకు దిగినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఏయూ వాతావరణాన్ని కలవరపెట్టడమే కాకుండా, సిబ్బందిలో భయాందోళనలు సృష్టిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఏయూ సౌత్ క్యాంపస్లోని ఏయూ ప్రెస్ సిబ్బంది నేరుగా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయడంతో పాటు, గవర్నర్ పీఎస్, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి కూడా ఫిర్యాదు కాపీ పంపడం గమనార్హం. మూల్యాంకన సమయంలో అనధికార జోక్యం ఏయూలోని వాల్యూయేషన్ క్లస్టర్లో పరీక్షా పత్రాల మూల్యాంకనం జరుగుతున్న సమయంలోనే, ఈ నెల 4వ తేదీన బెదిరింపుల వ్యవహారం చోటుచేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన నాన్–టీచింగ్ స్టాఫ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి, గత ప్రభుత్వ హయాంలో ప్రింటింగ్ ప్రెస్లో అవకతవకలు జరిగాయని, స్టేషనరీని బయట విక్రయించారంటూ ఫిర్యాదు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ఖాళీ పత్రాలపై సంతకాలు చేస్తే మిగతా విషయాలు తామే రాసుకుంటామని చెప్పినట్టు ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రార్ పేరుతో బెదిరింపులు ఫిర్యాదు చేయకపోతే పదోన్నతులు ఉండవంటూ భయపెట్టినట్టు ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రిజిస్ట్రార్ పేరును ప్రస్తావించడమే అసలు వ్యవహారంలో కీలకంగా మారింది. దీనిపై రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయడంతో పాటు, అదే కాపీని ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, గవర్నర్ పీఎస్కు కూడా పంపారు. మొత్తంగా ఈ వ్యవహారం ఏయూ ప్రతిష్టను దెబ్బతీసి, ఓ ప్రైవేటు విద్యా సంస్థకు లబ్ధి చేకూర్చే కుట్రలో భాగమేనన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నాడు ఘనచరిత్ర గత ప్రభుత్వ హయాంలో దేశంలోనే అరుదైన గౌరవంగా ఏయూకు న్యాక్ ‘ఏ++’ గ్రేడ్ లభించింది. క్యూములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (సీజీపీఏ) 3.74గా నమోదై, ఈ స్థాయి స్కోరు సాధించిన దేశంలోని మూడు యూనివర్శిటీల్లో ఒకటిగా ఏయూ నిలిచింది. స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లు, చైర్ ప్రొఫెసర్ల నియామకం, 100 పేటెంట్లకు దరఖాస్తులు వంటి అనేక వినూత్న చర్యలు చేపట్టారు. ‘ఏ హబ్’ ద్వారా యువతకు ప్రోత్సాహం అందించడంతో సుమారు 150 స్టార్టప్స్ ఏర్పడ్డాయి. దూరవిద్యలో డిఫెన్స్ కోర్సులు ప్రవేశపెట్టి డిఫెన్స్ రంగంలో పనిచేసేవారికి ఉపయోగకరంగా మార్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యంశాల్లో మార్పులు తెచ్చారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ల విషయంలో కూడా ఏయూ కొత్త చరిత్రను లిఖించిందనే చెప్పవచ్చు. ఏయూను దెబ్బతీసే యత్నమా? ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఒక పద్ధతి ప్రకారం ఏయూను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిఫెన్స్ కోర్సులను దూరవిద్య నుంచి తొలగించడం, క్యాంపస్ ప్లేస్మెంట్లను తగ్గించడం, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసి ఏయూ నుంచి దూరం చేసే యత్నం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లు తగ్గిపోవడంతో ఇంజనీరింగ్ విద్యార్థులు ఇతర ప్రైవేటు కాలేజీల్లో జరిగే డ్రైవ్స్పై ఆధారపడాల్సి వస్తోంది. హాస్టళ్లలో అన్నం సరిగా పెట్టడం లేదంటూ విద్యార్థులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో ఏయూ ప్రగతిని ముందుకు తీసుకెళ్లే చర్యలు చేపట్టకుండా, ప్రింటింగ్ ప్రెస్లో సమావేశాలు పెట్టి తప్పుడు ఫిర్యాదులకు ఒత్తిడి తెస్తున్న ఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. లేవంటే ప్రమోషన్లు దక్కవంటూ హెచ్చరికలు వాల్యూయేషన్ సెంటర్లో అనధికారిక సమావేశాలు రిజిస్ట్రార్ పేరుతో నాన్–టీచింగ్ స్టాఫ్కు చెందిన రమణ అడ్డగోలు వ్యవహారం -
‘శిఖర్ సే సాగర్ తక్’ స్ఫూర్తిదాయకం
ఏయూక్యాంపస్: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ, సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఎస్ఎస్ఓ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛత, అవగాహన కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. రెండు రోజుల కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఉదయం బీచ్ రోడ్లోని జోడుగుల్లపాలెం, కై లాసగిరి రోప్వే వద్ద 5, 10 కిలోమీటర్ల స్వచ్ఛత రన్, 3 కిలోమీటర్ల స్వచ్ఛత వాక్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కే బీచ్లో సైకత శిల్పాల తయారీ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం జీవీఎంసీ అదనపు కమిషనర్లు పి.నల్లనయ్య, డీవీ రమణమూర్తి, సులభ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్, మాజీ ఐఏఎస్ అధికారి పంకజ్ జైన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్.పి.సింగ్ తదితరులతో కలిసి ప్రజలతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్లు మాట్లాడుతూ హిమాలయాల నుంచి సముద్రాల వరకు పరిశుభ్రతపై సులభ్ ఇంటర్నేషనల్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాయన్నారు. సులభ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు నాలుగు దశలుగా నిర్వహిస్తామని, విశాఖలో మొదటి దశ విజయవంతంగా ప్రారంభమైందన్నారు. కార్యక్రమం ముగింపులో స్వచ్ఛత రన్, వాక్, సైకత శిల్పాలు, పెయింటింగ్ పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ.ఎన్.వి. నరేష్కుమార్, జోనల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. -
వికసిత భారత్ దిశగా అడుగులు వేయాలి
20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ లంక దినకర్ మహారాణిపేట: ‘వికసిత భారత్’ సంకల్పం, ‘స్వర్ణాంధ్ర–2047’ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలని 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ లంక దినకర్ కోరారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజులతో కలసి విద్య, వైద్యం, జలజీవన్ మిషన్, పీఎం.సూర్యఘర్ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖను వికసిత విశాఖ జిల్లాగా తీర్చిదిద్దడానికి అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజల ఆరోగ్యానికి స్వచ్ఛమైన నీరు అత్యంత అవసరమని, అందుకే జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, పథకంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. జిల్లాలో వైద్య, విద్య శాఖల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నందుకు అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రోత్ రేట్ పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
దాడులకు భయపడం
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామలగాజువాక : తిరుమల లడ్డూ వివాదంలో తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు. శుక్రవారం గాజువాకలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ నివేదికలోనే స్పష్టమైందని, దీంతో ఏం చేయాలో పాలుపోక కూటమి నేతలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ చేసిన తప్పుడు ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి నేతల ఇళ్లపై పెట్రోలు బాంబులతో దాడులు చేయడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని దాడులు చేసినా తాము వెనకడుగు వేయబోమని, తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కోసం ప్రాణాలకు తెగించి పోరాడతామని శ్యామల స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులను ప్రశ్నించకుండా అడ్డుకోవాలనుకోవడం భ్రమ అని, 2029లో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గాజువాక మహిళా విభాగం అధ్యక్షురాలు పల్లా చినతల్లి, 68వ వార్డు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు సండ్రాన నూకరాజు పాల్గొన్నారు. -
మరమ్మతుల బిల్లులు!
నామినేషన్ పద్ధతిలో అప్పగింత జీవీఎంసీ అధికారుల అవినీతి లీలలు సమావేశంలో ఆమోదం పొందకున్నా బిల్లుల చెల్లింపులా? చక్రం తిప్పుతున్న ఓ అధికారి, అనధికారిక పీఏ ఇద్దరిపై ఇప్పటికే ఏసీబీ ఆరాసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : మొబైల్ టాయిలెట్లు, బండరాళ్ల తొలగింపుతో పాటు ఆర్కే బీచ్ సాక్షిగా జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారుల అవినీతికి ఇది మరో సజీవ ఉదాహరణగా నిలుస్తోంది. వాస్తవానికి ఈ ఎకో బజార్ను ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వినియోగంలో లేకుండా మూసివేశారు. అయినప్పటికీ యోగా డే సందర్భంగా హఠాత్తుగా మరమ్మతుల పేరిట రూ.3.5 లక్షలు వెచ్చించారు. అంతేకాదు, ఈ పనులను నామినేషన్ పద్ధతిలో చేపట్టామని పేర్కొంటూ ఆమోదం కోసం స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రతిపాదనలు సమర్పించారు. దీనికి స్టాండింగ్ కమిటీ కూడా ఆమోదముద్ర వేసింది. మూసివేసిన షాప్నకు మరమ్మతులు చేశామంటూ ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సమర్పించడం, స్టాండింగ్ కమిటీ కళ్లు మూసుకుని ఆమోదించడం జరిగిపోయాయి. ఇదిలా ఉండగా, యోగా డే సందర్భంగా కొత్తవాటిని కొనుగోలు చేసే ధరతో సమానంగా, కేవలం ఒకరోజు ఉపయోగానికి రూ.16,200 అద్దె చెల్లించి మొబైల్ టాయిలెట్ల ఏర్పాటును నామినేషన్ పద్ధతిలో అప్పగించిన వ్యవహారంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే యోగా డే సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీలో పెద్ద పెద్ద బండరాళ్ల తొలగింపు పేరిట నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించి భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలూ ఉన్నాయి. తాజాగా అసలు ఎప్పుడూ తెరవని షాప్నకు మరోసారి రూ.3 లక్షలకు పైగా వ్యయంతో మరమ్మతులు చేపట్టినట్లు కొద్దిరోజుల క్రితం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రతిపాదనలు సమర్పించి ఆమోదింపచేసుకున్న విషయం గమనార్హం. వసూళ్ల వ్యవహారమే..! జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాల తీరుపై ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి. నామినేషన్ పద్ధతిలో చేపట్టిన పనులకు ఏకంగా 15 శాతం కమీషన్ జీవీఎంసీలోని ముఖ్య నేతలతో పాటు అనధికారిక పీఏకు అందితేనే ఆమోదం లభిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమావేశానికి ముందే వాటా అందకపోతే, సమావేశంలో ఆమోదించనట్టుగా చెప్పి, సమావేశం అనంతరం కాంట్రాక్టర్లు ముఖ్య నేతలు, అనధికారిక పీఏలను కలిసి ‘అమ్యామ్యాలు’ అందజేసిన తర్వాత రికార్డుల్లో మాత్రం ఆమోదించినట్లుగా నమోదు చేస్తున్నారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. దీనికి డిసెంబర్ 6న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశమే నిదర్శనమని వాదనలు వినిపిస్తున్నాయి. ఆ రోజు ఏకంగా 257 భారీ ప్రతిపాదనలతో సమావేశం జరిగింది. ఇందులో 2025 జూన్ 21న విశాఖలో ప్రధాని హాజరైన యోగా డే సందర్భంగా చేపట్టిన నామినేషన్ పనుల ఆమోదానికి ప్రతిపాదనలు తెచ్చారు. అంటే దాదాపు ఆరు నెలల తర్వాత, అదీ నామినేషన్ పద్ధతిలో అప్పగించిన పనులకు ఆమోదం కోరినట్టుగా తెలుస్తోంది. వీటిలో మొబైల్ టాయిలెట్ల అద్దె పేరిట రూ.1.6 కోట్ల చెల్లింపుల అంశం, ఆంధ్రా యూనివర్సిటీలో భారీ బండరాళ్ల తొలగింపునకు రూ.30 లక్షలకు పైగా వ్యయం చేసిన అంశాలు ఉన్నాయి. మొబైల్ టాయిలెట్ల అద్దె అసాధారణంగా ఎక్కువగా ఉండటంతో చెల్లింపులు చేయవద్దని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. అలాగే ఏయూ గ్రౌండ్లో తరచూ ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు జరుగుతుంటే భారీ బండరాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న ప్రశ్న తలెత్తడంతో విచారణకు ఆదేశించింది. అయితే, విచిత్రంగా ఒక సంస్థకు మినహా మిగతా కొన్ని కంపెనీలకు మొబైల్ టాయిలెట్ల అద్దె చెల్లింపుల కోసం రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సమావేశంలో లేని బండరాళ్లు తర్వాత ‘నడుచుకుంటూ వచ్చి’ బండరాళ్ల తొలగింపు చేశామంటూ బిల్లుల చెల్లింపులకు ఆమోదం లభించిందన్న సమాచారం సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో జీవీఎంసీలోని ఓ ముఖ్య నేత, ఒక అధికారి, అలాగే ఆ ముఖ్యనేత అనధికారిక పీఏ కీలకంగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారి, అనధికారిక పీఏలపై ఏసీబీ ఆరా! స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రావాలి? సీరియస్ అంశాలు వస్తే సదరు అధికారులు లేకుండా ఎలా చూసుకోవాలి? అనే విషయంలో జీవీఎంసీలోని ఓ అధికారి కీలకంగా చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలున్నాయి. తన ఆమోదం లేకుండా అజెండాలో ఏ అంశం చేరదంటూ, అజెండాలో చేర్చాలంటే సదరు అనధికారిక పీఏను కలవాలంటూ కాంట్రాక్టర్లను ఆదేశిస్తున్నట్టు తెలుస్తోంది. అజెండాలో చేర్చే అంశాలపై నిర్ణయం తీసుకునే ఈ అధికారి వద్ద ముందుగానే ‘దర్శనం’ చేసుకుంటే తప్ప కాంట్రాక్టర్ల ప్రతిపాదనలు అజెండాలో చేరడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యనేత, ఆయన అనధికారిక పీఏతో చేతులు కలిపిన సదరు అధికారిం ఆమోదం పొందని అంశాలను కూడా ఆమోదించినట్లుగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారాలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు ఏసీబీ అధికారులకు అందినట్టు సమాచారం. సదరు అధికారి, అనధికారిక పీఏ వ్యవహారాలపై ఏసీబీ అధికారులు కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలోని మూసివేసిన జీవీఎంసీ ఎకో బజార్ను చూశారా? గత ప్రభుత్వ హయాంలో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగానికి ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత బ్యాగులను ప్రోత్సహించేందుకు 2022 జూన్ 5న జీవీఎంసీ ఏర్పాటు చేసిన ఎకో బజార్ షాప్ ఇది. ఆర్కే బీచ్కు వెళ్లిన ప్రతీసారి ఈ షాప్ మూసివుండటం గమనించ వచ్చు. అయితే, ఈ మూసివున్న షాప్ మరమ్మతుల పేరిట జీవీఎంసీ అధికారులు ఏకంగా రూ.3.5 లక్షలు ఖర్చు చేశారు. అదీ యోగా డే సందర్భంగా! యోగా డేకు ఈ షాప్కు సంబంధం ఏమిటని మాత్రం జీవీఎంసీ అధికారులను అడగవద్దు. మూసివేసిన షాప్నకు మరమ్మతులేమిటని ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. -
● ఒకే వైపు రెండు రైళ్లు!
సాధారణంగా రైల్వే ట్రాక్పై ఒక రైలు వస్తుంటేనే వాహనదారులు, ప్రయాణికులు ఎంతో జాగ్రత్తగా గమనిస్తుంటారు. అలాంటిది ఒకేచోట పక్కపక్క ట్రాక్లపై రెండు రైళ్లు ఒకేవైపు వెళ్తూ ఏకకాలంలో కనిపిస్తే ఆ ఉత్కంఠే వేరు. శుక్రవారం డుంబ్రిగుడ రైల్వే గేటు సమీపంలో ఇలాంటి అరుదైన దృశ్యమే స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తున్నాయేమోనని మొదట కొందరు ఆందోళన చెందినప్పటికీ.. తీరా చూస్తే అవి రెండూ రైల్వే విభాగానికి చెందిన ప్రత్యేక వాహనాలని అర్థమైంది. అందులో ఒకటి ట్రాక్ మరమ్మతులు చేసే యంత్రం కాగా, మరొకటి విద్యుత్ లైన్ల తనిఖీ కోసం వాడే రైలు. ఈ రెండు రైళ్లు పక్కపక్కనే ఉన్న పట్టాలపై ప్రయాణించడంతో ప్రయాణికులు ఆ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. అమ్మో రెండు రైళ్లా!.. అని కంగారు పడినవారు, అవి పని నిమిత్తం వెళ్తున్న వాహనాలని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. – డుంబ్రిగుడ -
ఐఎఫ్ఆర్ వేడుకలకు రెడీ
ఆర్.కె.బీచ్ అంతర్జాతీయ నౌకల ప్రదర్శన వేడుకలకు ముస్తాబవుతోంది. ఒకవైపు సముద్ర తీరంలో యుద్ధ నౌకల సందడి నెలకొనగా, మరోవైపు నగర సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఐఎఫ్ఆర్ ఏర్పాట్లలో భాగంగా బీచ్ రోడ్డులోని విద్యుత్ స్తంభాలకు రంగులు వేస్తూ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక వేడుకల కోసం అటు అధికారులు, ఇటు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
గాల్లో విన్యాసాలు
నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అల్లిపురం : నగరంలో శనివారం నిర్వహించనున్న ఎంఆర్ఎఫ్ మోగ్రిప్ ఎఫ్ఎంఎస్సీఐ నేషనల్ సూపర్ క్రాస్ చాంపియన్షిప్ రేసింగ్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ నిబంధనలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గాజువాక , కంచరపాలెం మీదుగా కాన్వెంట్ జంక్షన్ వైపు వచ్చే వారు పోర్ట్ లోపల రోడ్డు పక్కన వాహనాలను పార్క్ చేసి, చిలకల జంక్షన్ మీదుగా నడుచుకుంటూ వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. పూర్ణా మార్కెట్ , టౌన్ కొత్త రోడ్ నుంచి వచ్చేవారు గోపాల్ ఆటో జంక్షన్ వద్ద ఉన్న జీవీఎంసీ సీవేజ్ వాటర్ ట్యాంక్ వద్ద తమ వాహనాలను పార్కింగ్ చేయాలి. అలాగే నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి డాల్ఫిన్, అద్వానీ మీదుగా కాన్వెంట్ జంక్షన్కు వచ్చే వారు కూడా పోర్ట్ లోపల కేటాయించిన స్థలంలోనే వాహనాలను నిలపాలి. కేవలం వీఐపీ, వీవీఐపీ పాసులు ఉన్న వారికి మాత్రమే మున్సిపల్ స్టేడియం లోపల వాహనాల పార్కింగ్కు అనుమతి ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు ప్రశాంతంగా సాగేందుకు ప్రజలందరూ ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ముగిసిన ఎన్ఎస్జీ విన్యాసాలు
మహారాణిపేట: తూర్పు నావికదళం, ఎన్ఎస్జీ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా జరిగిన ‘వ్యాయాస్’ విన్యాసాలు శుక్రవారం విజయవంతంగా ముగిశాయి. పీఎం పాలెం సమీపంలోని కంబాలకొండ ఫారెస్ట్ వద్ద జరిగిన ముగింపు కార్యక్రమ వివరాలను గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ డాక్టర్ సుమిత్ గరుడ్ వెల్లడించారు. నక్సల్స్ కార్యకలాపాలను ఎదుర్కోవడం, అత్యవసర సమయాల్లో వివిధ విభాగాల మధ్య సమన్వయం లక్ష్యంగా ఈ శిక్షణ సాగింది. ఇందులో ఏపీ పోలీస్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలతో పాటు అటవీ, అగ్నిమాపక, వైద్య విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా ఎలా స్పందించాలో ఈ విన్యాసాలు చాటిచెప్పాయని కమాండర్ పేర్కొన్నారు. -
అక్రమ నిర్బంధాలపై ప్రజాపోరాటానిదే విజయం
డాబాగార్డెన్స్: అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్, ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టుల కోసం జరుగుతున్న బలవంతపు భూసేకరణను అడ్డుకున్నారన్న నెపంతో, సీపీఎం నేత అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ చెల్లదని తేలిపోయింది. అడ్వైజరీ కమిటీ సమీక్షలో ప్రభుత్వ ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని స్పష్టం కావడంతో 45 రోజుల జైలు శిక్ష అనంతరం శుక్రవారం ఆయన విడుదలయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎలాంటి నేరం చేయకపోయినా అప్పలరాజును అక్రమంగా నిర్బంధించి చంద్రబాబు ప్రభుత్వం తన నిరంకుశత్వాన్ని చాటుకుందని మండిపడ్డారు. పాత కేసులను సాకుగా చూపి ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూడటం దారుణమని, ప్రజల ఆగ్రహానికి తలొగ్గే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎద్దేవా చేశారు. మరోవైపు పర్యావరణాన్ని ధ్వంసం చేసే పరిశ్రమల కోసం ప్రభుత్వం పాకులాడుతోందని శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిర్వీర్యం చేస్తూ, మిట్టల్ వంటి ప్రైవేటు సంస్థల కోసం కూటమి ప్రభుత్వం ఢిల్లీ చుట్టూ తిరగడం సిగ్గుచేటన్నారు. తనపై మోపిన అక్రమ కేసుల రికార్డులను ప్రదర్శిస్తూ, న్యాయస్థానాలు కొట్టేసిన కేసులను కూడా పీడీ యాక్ట్లో చేర్చి తనను వేధించారని జైలు నుంచి విడుదలైన అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ బాధితుల పక్షాన తమ పోరాటం ఆగదని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ఈ సందర్భంగా సీపీఎం నేతలు స్పష్టం చేశారు. -
విశాఖ తల్లఢిల్లీ
మించిపోయిన వైజాగ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టుఏయూక్యాంపస్: పర్యాటక కేంద్రంగా వెలుగొందుతున్న విశాఖలో గాలి నాణ్యత రోజురోజుకూ దిగజారుతోంది. తాజా గణాంకాల ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో నమోదైన 195 ఏక్యూఐ కంటే ఎక్కువగా విశాఖలో 205 ఏక్యూఐ నమోదు కావడం నగరవాసులను ఉలిక్కిపడేలా చేస్తోంది. ముఖ్యంగా ఫిబ్రవరి 6వ తేదీ మధ్యాహ్నం నాటికి హైదరాబాద్, ఢిల్లీ వంటి మెట్రో నగరాలను సైతం వెనక్కి నెట్టి విశాఖ కాలుష్యంలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. గత జనవరి నెలలో మెజారిటీ రోజులు గాలి నాణ్యత అనారోగ్యకరమైన స్థాయిలోనే కొనసాగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి జరిపిన పరీక్షల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పోలీస్ బ్యారక్స్ వంటి ప్రాంతాల్లో ఏక్యూఐ ఏకంగా 305కు చేరుకుని ‘వెరీ పూర్’ విభాగంలోకి వెళ్లగా, మాధవధార వంటి నివాస ప్రాంతాల్లో కూడా కాలుష్యం పరిమితికి లోబడే ఏమీ లేదు. మింది, ఆటోనగర్, మల్కాపురం, సీతమ్మధార వంటి పారిశ్రామిక, రద్దీ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. గాలిలో పీఎం 2.5, పీఎం 10 కణాలు పెరిగిపోవడంతో పాటు కార్బన్ మోనాౖక్సైడ్, సల్ఫర్ డయాకై ్సడ్ వంటి విషవాయువులు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు, పెరుగుతున్న వాహన రద్దీ విశాఖలో గాలి విషతుల్యం కావడానికి ప్రధానంగా పోర్ట్ కార్యకలాపాలు, భారీ పరిశ్రమలు కారణమవుతున్నాయి. పోర్ట్ ప్రాంతంలో బొగ్గు, ఇతర లోహాల ఎగుమతి దిగుమతుల సమయంలో వెలువడే ధూళి గాలిని కలుషితం చేస్తోంది. దీనికి తోడు హెచ్పీసీఎల్, స్టీల్ ప్లాంట్, ఫార్మా రంగానికి చెందిన ఉద్గారాలు తోడవుతున్నాయి. నగరంలో నానాటికీ పెరుగుతున్న వాహనాల సంఖ్య, డీజిల్ యంత్రాల వినియోగం మరియు నిర్మాణ రంగం నుంచి వెలువడే దుమ్ము ధూళి వాతావరణాన్ని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. ఇవన్నీ కలిసి నగరాన్ని కాలుష్య కాసారంగా మారుస్తున్నాయి. నగర ప్రజలపై తీవ్ర ప్రభావం ప్రస్తుతం విశాఖలో గాలి నాణ్యత క్షీణత ఏ స్థాయిలో ఉందంటే, నగరంలో నివసించే ప్రతి వ్యక్తి రోజుకు సగటున మూడు సిగరెట్లు కాల్చినప్పుడు ఊపిరితిత్తులకు ఎంత నష్టం జరుగుతుందో, అంత నష్టానికి గురవుతున్నారు. అంటే నెలకు దాదాపు 81 సిగరెట్లు తాగినంత ప్రభావం ఆరోగ్యంపై పడుతోంది. దీనివల్ల ఆస్తమా, సైనస్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాస్కులు ధరించడం, అవసరమైతే ఎయిర్ ప్యూరిఫైర్లను వాడటం, రద్దీ సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండటం ప్రాణరక్షణకు అత్యవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
సైక్లోథాన్ జాతీయ ఉద్యమంగా అవతరణ
సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ శరవణన్ మహారాణిపేట : సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వందేమాతరం సైక్లోథాన్–2026’ కార్యక్రమం దేశవ్యాప్తంగా జాతీయ భద్రత, తీరప్రాంత రక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించే శక్తివంతమైన ఉద్యమంగా మారిందని సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ శరవణన్ అన్నారు. ఈ కార్యక్రమం సీఐఎస్ఎఫ్ కుటుంబంలో నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పారు. ఈ నెల 28న ‘సురక్షిత తట–సమృద్ధ్ భారత్’ నినాదంతో సైక్లోథాన్ రెండో ఎడిషన్ ప్రారంభమైందని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ స్టేడియం నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని వివరించారు. చిన్న స్థాయిలో మొదలైన ఈ కార్యక్రమం నేడు ప్రజల భాగస్వామ్యంతో దేశభక్తిని పెంపొందించే జాతీయ ఉద్యమంగా రూపాంతరం చెందిందన్నారు. విశాఖలో ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పారు. ఇది కేవలం 6,600 కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం మాత్రమే కాకుండా ప్రజలతో నేరుగా మమేకమై భద్రతపై అవగాహన కల్పించే యజ్ఞమని పేర్కొన్నారు. ఇప్పటివరకు సైక్లిస్టులు 2,400 కిలోమీటర్లు పూర్తి చేశారని తెలిపారు. ఈ ప్రయాణంలో సుమారు 6 లక్షల మందిని ప్రత్యక్షంగా కలుసుకుని, డిజిటల్ మాధ్యమాల ద్వారా మిలియన్ల మందితో సంభాషించామని చెప్పారు. ఈ పర్యటనలు భద్రత, సాంస్కృతిక వారసత్వం, జాతీయ అస్తిత్వం పరస్పర సంబంధాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు చేరుకున్న సైక్లిస్టులకు సీఐఎస్ఎఫ్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విశాఖ పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్మన్ రోషిణి అపరంజి, సీఐఎస్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బినితా ఠాకూర్, సీఐఎస్ఎఫ్ డీఐజీలు రాఘవేంద్ర కుమార్, ఎన్.ప్రకాష్ రెడ్డి, ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీమతి రేఖా నంబియార్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వి.పి.ఎ.అరుణ్ ప్రసాద్, సీనియర్ కమాండెంట్ సతీష్ కుమార్ బాజ్పాయ్ పాల్గొన్నారు. దేశ భద్రతకు ప్రజలే ప్రథమ రక్షకులు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్తో భాగస్వామ్యం కావడానికి ప్రపంచం ఎదురు చూస్తోందని, ఇలాంటి సమయంలో మన దేశం ఎంత భద్రంగా ఉందో ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం ఆర్కే బీచ్లో నిర్వహించిన వందేమాతరం తీర సైక్లోథాన్–2026ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఒక సాధారణ సైక్లథాన్ మాత్రమే కాదని, దేశాన్ని మరింత సురక్షిత దిశగా నడిపించే ఉద్యమమని అభివర్ణించారు. దేశ రక్షణలో సామాన్యులను భాగస్వాములను చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన సీఐఎస్ఎఫ్ అభినందనీయమని స్పష్టం చేశారు. సుదీర్ఘ సైకిల్ యాత్ర చేసిన సైక్లిస్టులను ప్రత్యేకంగా అభినందిస్తూ మెడల్స్తో సత్కరించారు. -
రంజీ సమరంలో విశాఖ కుర్రాళ్ల జోరు
విశాఖ స్పోర్ట్స్ : కల్యాణ్ వేదికగా బెంగాల్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ నాకౌట్ పోరులో ఆంధ్ర జట్టు తొలి రోజే తన ఆధిపత్యాన్ని చాటుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినా, విశాఖ కుర్రాళ్లు పట్టుదలతో రాణించడంతో ఆంధ్ర గౌరవప్రదమైన స్థితికి చేరుకుంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్ రికీ భుయ్ తన ఫామ్ను కొనసాగిస్తూ 83 పరుగులతో (8 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును ముందుండి నడిపించాడు. లీగ్ దశలోనే పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న రికీ, ఈ కీలక మ్యాచ్లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ అర్ధ సెంచరీకి చేరువగా వచ్చి 47 పరుగుల వద్ద రెండో వికెట్గా వెనుదిరిగినప్పటికీ, జట్టుకు మంచి పునాది వేశాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డితో కలిసి రికీ భుయ్ ఐదో వికెట్కు ఏకంగా 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి బెంగాల్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 33 పరుగులు చేసిన నితీష్ కుమార్, ముకేశ్ బౌలింగ్లో అవుట్ కావడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర ఆరు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం శశికాంత్ ఏడు పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. గత రికార్డులను పరిశీలిస్తే బెంగాల్పై ఆంధ్ర జట్టుకే పైచేయి కనిపిస్తోంది. ఇప్పటివరకు తలపడిన ఐదు మ్యాచ్లలో ఆంధ్ర రెండుసార్లు విజయం సాధించగా, మిగిలిన మూడు మ్యాచ్లు డ్రా అయ్యాయి. బెంగాల్పై రికీ భుయ్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 175 పరుగులు కాగా, బౌలింగ్లో శశికాంత్ 55 పరుగులకే 5 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. బెంగాల్ పేసర్ షమీ బౌలింగ్ను ఎదుర్కొంటూ మిగిలిన రోజుల్లో ఆంధ్ర బ్యాటర్లు భారీ స్కోరు సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. భరత్నితీష్శశికాంత్రికీ,నితీష్ సెంచరీ భాగస్వామ్యం -
సింహాచలం దేవస్థానం ఈవోగా వెంకటరావు
సింహాచలం : సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జే.వెంకటరావు నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయశాఖ ఎక్స్ అఫీషియో ప్రభుత్వ కార్యదర్శి ఎం. హరిజవహర్లాల్ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కాకినాడ డీఆర్వోగా విధుల్లో ఉన్న వెంకటరావును ఏడాది కాలపరిమితితో డిప్యుటేషన్పై సింహాచలానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నూతన ఈవోగా నియమితులైన వెంకటరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గత బుధవారమే ప్రిన్సిపాల్ సెక్రటరీ నుంచి బదిలీ ఉత్తర్వులు రాగా, శుక్రవారంతో దేవదాయశాఖ ప్రక్రియ కూడా పూర్తయింది. జీవీఎంసీ అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ శుక్రవారం జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులతో సమీక్షించారు. పూర్ణామార్కెట్ సమీపాన వెలంపేట మురికివాడ ప్రాంతంలో నివసిస్తున్న 177 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి మంత్రి నారాయణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇళ్ల నిర్మాణంలో ఆర్థికపరమైన అంశాల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, టౌన్ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత ఇతర అధికారులతో సమీక్షించారు. పాత స్పెషల్ రైళ్లే కొత్తవిగా ప్రకటనతాటిచెట్లపాలెం : ప్రస్తుతం నడుస్తున్న పాత స్పెషల్ రైళ్లను హోలీ స్పెషల్స్గా రైల్వే అధికారులు తెలియజేస్తున్నారు. అంతేగానీ కొత్తగా హోలీ పండక్కి కొత్త రైళ్లేమీ వేయలేదు. ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో నడుస్తున్న సుమారు 62 స్పెషల్ రైళ్లు మార్చి నెలాఖరు వరకు హోలీ స్పెషల్స్ పేరుతో నడుపుతున్నారు. సంబల్పూర్–ఈరోడ్–సంబల్పూర్, విశాఖపట్నం–తిరుపతి–విశాఖపట్నం, విశాఖపట్నం–ఎస్ఎంవీబి బెంగళూరు–విశాఖపట్నం, విశాఖపట్నం–చర్లపల్లి–విశాఖపట్నం, విశాఖపట్నం–షాలిమర్–విశాఖపట్నం, పూరీ–పాట్నా–పూరీ, పూరీ–ఉధ్నా–పూరీ, భువనేశ్వర్–యశ్వంత్పూర్–భువనేశ్వర్, భువనేశ్వర్–ధన్బాద్–భువనేశ్వర్ రైళ్లు మార్చి వరకు నడుస్తాయి. -
యాత్రకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
ఆరిలోవ : బీఆర్టీఎస్ రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. కాకినాడకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన బంధువులు శ్రీకాకుళం జిల్లాలోని రాజులమ్మ యాత్రకు వెళ్తూ మార్గమధ్యలో సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో సింహాచలం నుంచి హనుమంతవాక మీదుగా ప్రయాణిస్తుండగా, బీఆర్టీఎస్ మధ్య లైన్లో మితిమీరిన వేగంతో వెళ్తున్న వీరి కారు ఎదురుగా వస్తున్న 68 నంబర్ సిటీ బస్సును బలంగా ఢీకొంది. ప్రమాదంలో కారు నడుపుతున్న బంగారు రాజేష్ (37) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం కూడా ధ్వంసమవడంతో డ్రైవర్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హెల్త్ సిటీ ఆస్పత్రికి, మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. కేవలం బస్సులు, వీఐపీ వాహనాలకు కేటాయించిన మధ్య లైన్లోకి కారు అతివేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేశారు. -
దళిత భూముల్లో పెట్రోల్ బంకా?
అగనంపూడి: గతంలో తమకు కేటాయించిన భూములను ఐవోసీ పెట్రోల్ బంక్కు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తూ అగనంపూడి ప్రాంతానికి చెందిన దళితులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గాజువాక మండలం, అగనంపూడి రెవెన్యూ సర్వే నంబర్ 56 పార్ట్ 1ఏలో గల 1.60 ఎకరాల స్థలాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఐఓసీ పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం కేటాయించింది. అయితే నాలుగు దశాబ్దాల క్రితమే ఈ భూములు తమకు డీ–ఫారం పట్టాల రూపంలో మంజూరయ్యాయని, ప్రస్తుతం న్యాయస్థానంలో స్టే ఆర్డర్ కూడా ఉందని బాధితులు వాదిస్తున్నారు. గతంలో పిలకవానిపాలెం, నక్కవానిపాలెం నిర్వాసితులకు ఈ భూములను ఇచ్చే ప్రయత్నం జరగగా, పట్టాదారులు కోర్టును ఆశ్రయించి యథాతథ స్థితి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. భూముల విలువ పెరగడంతో ప్రభుత్వం పాత పట్టాలను రద్దు చేసి, రెండేళ్ల క్రితం ఇక్కడ రైతు బజార్ ఏర్పాటుకు ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి, ఐవోసీకి స్థలాన్ని కేటాయించడంతో వివాదం మళ్లీ మొదలైంది. గురువారం ఉదయం ఐవోసీ సిబ్బంది సదరు స్థలంలో పనులు ప్రారంభించగా, పట్టాదారులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. దీంతో ఐవోసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. ఈ క్రమంలో 13 మంది మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అనంతరం పూచీకత్తుపై విడుదల చేశారు. తమ భూములను అక్రమంగా వేరే సంస్థలకు కట్టబెట్టడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జర్నలిస్టులకు అండగా ఉంటాం
మహారాణిపేట: వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్లు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. గురువారం ఏపీ ఎన్జీవో హోంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ సభ్యత్వ నమోదు, రెన్యువల్ ప్రక్రియకు అనూహ్య స్పందన లభించింది. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పి.నారాయణ్, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావులతో కలిసి గంట్ల శ్రీనుబాబు మీడియాతో మాట్లడారు. అక్రిడేషన్ కమిటీల్లో సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించడం శుభపరిణామమని, అలాగే పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాలు, పెన్షన్ల సమస్యలను ప్రభుత్వం దశలవారీగా పరిష్కరించాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు 400 మందికి పైగా సభ్యత్వం తీసుకున్నారని, ఫిబ్రవరి 9తో ఈ ప్రక్రియ ముగుస్తుందన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు పి నగేష్ బాబు, బ్రాడ్ కాస్టింగ్ అధ్యక్షుడు ఈరోతి ఈశ్వరరావు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
బంగారు నగలు దొంగిలించిన కిలాడీ మహిళల అరెస్ట్
అల్లిపురం: శ్రీకాకుళం వెళ్లే క్రమంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలి నుంచి బంగారు ఆభరణాలు తస్కరించిన ఇద్దరు మహిళా దొంగలను ఫోర్త్ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బుధవారం జరిగిన ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను క్రైం డీసీపీ కె. లతా మాధురి గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన వోల్లా జ్యోతి .. తన తల్లితో కలిసి శ్రీకాకుళం వెళ్లేందుకు ఈ నెల 3వ తేదీన రత్నాచల్ ఎక్స్ప్రెస్లో విశాఖ చేరుకున్నారు. రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆ ప్రయాణ సమయంలోనే గుర్తుతెలియని వ్యక్తులు జ్యోతి బ్యాగులోని బంగారు ఆభరణాలను దొంగిలించారు. మరుసటి రోజు నగలు కనిపించకపోవడంతో విషయాన్ని గమనించిన బాధితురాలు, తన భర్త ద్వారా ‘డయల్ 112’ కు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు, ఆటోలో తమతో పాటు ప్రయాణించి సంగం శరత్ థియేటర్ వద్ద దిగిపోయిన ఇద్దరు మహిళలపై అనుమానం వ్యక్తమైంది. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షణలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టగా, రైల్వే న్యూ కాలనీ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా కనిపిస్తూ తప్పించుకోబోతున్న ఇద్దరు మహిళలను వెంబడించి పట్టుకున్నారు. నిందితులు విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన మేకల గంగ, అనకాపల్లి జిల్లా కె. కోటపాడుకు చెందిన రావుల ఎల్లారమ్మలుగా గుర్తించారు. వారి నుంచి రూ.6 లక్షల విలువైన 280 గ్రాముల బంగారు ఆభరణాలను (రెండు నెక్లెస్లు, ఆరు గాజులు) స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్కు తరలించారు. కేవలం గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి సొత్తును రికవరీ చేసిన పోలీసు బృందాన్ని అధికారులు అభినందించారు. -
మురుగు ‘నీరే’ ఆధారం
ఫిషింగ్ హార్బర్ సమీపంలోని జాలారిపేటలో కనిపిస్తున్న ఈ దృశ్యం చూస్తుంటే సామాన్యుడి ప్రాణాలకు విలువే లేదనిపిస్తోంది. తాగడానికి గుక్కెడు నీరు కావాలంటే కలుషితమైన మురుగు కాలువలోకి దిగాల్సిన దుస్థితి నెలకొంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒకవైపు నగరం సుందరీకరణ కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న పాలకులు, మరోవైపు ప్రాథమిక అవసరమైన తాగునీరు కూడా అందించలేకపోవడం దారుణం. మురికివాడల అభివృద్ధిని విస్మరించి, కేవలం ఆడంబరాలకే పరిమితమైన వ్యవస్థల తీరును ఈ చిత్రం ప్రశ్నిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్యులకు స్వచ్ఛమైన గాలి, నీరు అందని ద్రాక్షగా మారాయని ఈ దృశ్యం కళ్లకు కడుతోంది. – ఫొటో : సాక్షిఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
దంపతుల ఆత్మహత్యాయత్నం
రక్షించిన బ్లూకోల్ట్ కానిస్టేబుల్ అగనంపూడి: కుటుంబ కలహాల నేపథ్యంలో రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన దంపతులను పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి రక్షించారు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన పంకజ్ దాస్ (27), మంజూ దాస్ (24) దంపతులు ఉపాధి నిమిత్తం విశాఖకు వలస వచ్చి అగనంపూడిలో నివాసముంటున్నారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన దంపతులు గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అగనంపూడి సాయినగర్ కాలనీ ఎదురుగా ఉన్న రైలు పట్టాలపైకి చేరుకుని ఆత్మహత్యకు సిద్ధమయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే ‘112’కు సమాచారం అందించారు. వెంటనే బ్లూకోల్ట్ కానిస్టేబుల్ వీవీఎస్ఎస్ సాయితేజ అత్యంత వేగంగా ఘటనా స్థలానికి చేరుకుని, పట్టాలపై ఉన్న దంపతులను పక్కకు లాగి ప్రాణాలు కాపాడారు. అనంతరం వారికి ప్రాథమిక కౌన్సెలింగ్ నిర్వహించి, జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. సమయానికి చేరుకుని ఇద్దరి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ సాయితేజను ఉన్నతాధికారులు, స్థానికులు అభినందించారు. -
కేజీహెచ్లో డబ్బు జబ్బు
కట్టు కట్టాలన్నా వసూళ్లే.. ఆగని సిబ్బంది ఆగడాలు వైరల్ అవుతున్న వీడియోమహారాణిపేట: ఉత్తరాంధ్ర జిల్లాలకే కాక పొరుగు రాష్ట్రాల పేద ప్రజలకు సైతం ఆశాదీపంగా నిలిచిన కేజీహెచ్ ఇప్పుడు సమస్యల నిలయంగా మారింది. నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందాల్సిన ఈ మహోన్నత సంస్థలో అడుగడుగునా అవినీతి, అలసత్వం రాజ్యమేలుతున్నాయి. ఆస్పత్రిలో వైద్య సేవలు కుంటుపడడమే కాకుండా, క్షేత్రస్థాయిలో రోగులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఒక వీడియో కేజీహెచ్లో ఉన్న దయనీయ స్థితికి అద్దం పడుతోంది. కేజీహెచ్ క్యాజువాలిటీలో తన తల్లికి కట్టు కట్టడానికి, ఇంజెక్షన్ చేయడానికి సిబ్బంది డబ్బులు అడిగారని, తన వద్ద చిల్లిగవ్వ లేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని ఓ బాధిత కుమార్తె ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోను విడుదల చేసింది. ‘పైసలిస్తేనే సేవలు’ అన్నట్లుగా తయారైన అక్కడి సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రికి ప్రాణధార వంటి క్యాజువాలిటీ విభాగంలో ఓపీ టికెట్ దగ్గర నుంచి ప్రాథమిక చికిత్స వరకు ప్రతి దశలోనూ పేద రోగుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నాలుగో తరగతి సిబ్బంది ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి అత్యవసర స్థితిలో వచ్చే వారిని కూడా వదిలిపెట్టడం లేదని బాధితులు వాపోతున్నారు. ఆస్పత్రిలో సూపరింటెండెంట్తో పాటు భారీ సంఖ్యలో ఆర్ఎంవోలు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఇతర పరిపాలనా అధికారులు ఉన్నప్పటికీ, వార్డుల్లో పర్యవేక్షణ మచ్చుకై నా కనిపించడం లేదు. అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితమై, సంతకాలతోనే కాలక్షేపం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కేవలం ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు వేయించుకోవడం పైనే చూపిస్తున్న శ్రద్ధ, రోగుల సంరక్షణపై చూపడం లేదని స్పష్టమవుతోంది. రోగులకు నిరాశే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం ఉచితమని నమ్మి వచ్చే పేదలకు నిరాశే ఎదురవుతోంది. వైద్యులు ఉంటే మందులు ఉండవు, మందులు ఉంటే సిబ్బంది అందుబాటులో ఉండరు. పోనీ పరీక్షలు చేయించుకుందామంటే ఎక్స్రే, ఎంఆర్ఐ, స్కాన్ల కోసం రోజులు తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. బయట ప్రైవేటు ల్యాబ్లలో పరీక్షలు చేయించుకోవడానికి డబ్బులు లేక సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఉన్నతాధికారులు సైతం ఈ సమస్యలను పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో కేజీహెచ్ ప్రతిష్ట మసకబారుతోంది. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, కేజీహెచ్లో పేరుకుపోయిన ఈ అవినీతి వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు న్యాయం చేయాలని రోగులు వేడుకుంటున్నారు. -
ఏసీబీ వలలో విశ్రాంత ఎస్ఈ
మధురవాడ/ మహారాణి పేట: పంచాయతీరాజ్ శాఖలో సూపరింటెండెంట్ ఇంజినీర్గా పనిచేసి రిటైర్ అయిన సీహెచ్ శ్రీనివాసరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో గురువారం ఏకకాలంలో సోదాలు జరిగాయి. ముఖ్యంగా విశాఖలోని మధురవాడ ఎంవీవీ సిటీలో ఉన్న ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు విలువైన డాక్యుమెంట్లు, బ్యాంకు డిపాజిట్లు, బంగారం, ఇతర స్థిర, చర ఆస్తుల వివరాలను సేకరించారు.శ్రీనివాసరావు తన సర్వీసులో ఎక్కువ కాలం విశాఖలోనే ఈఈగా, ఎస్ఈగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో భారీగా కమీషన్లు తీసుకోవడం, ఎస్టిమేషన్లు పెంచడం, కాంట్రాక్టర్లను బెదిరించడం వంటి అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు ఏసీబీ దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా 2022 నుంచి 2024 వరకు ఈఈగా, అనంతరం ఇన్చార్జి ఎస్ఈగా పనిచేసి గత ఏడాది సెప్టెంబర్ 30న ఆయన పదవీ విరమణ పొందారు. పాడేరు ప్రాంతానికి చెందిన బిల్లుల చెల్లింపుల్లోనూ ఆయన కీలకంగా వ్యవహరించి భారీ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టు పనుల మంజూరు నుంచి బిల్లుల చెల్లింపు వరకు ప్రతి దశలోనూ పర్సంటేజీలు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా మూడు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, రెండు ఫ్లాట్లు, 18.57 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించారు. వీటితో పాటు రూ. 61.87 లక్షలు సుమారు రెండున్నర కిలోల బంగారం, 20 కిలోలకు పైగా వెండి, ఒక కారు, ద్విచక్రవాహనం, విలువైన గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఐదు బ్యాంక్ లాకర్ల తాళాలు లభించాయని, శుక్రవారం ఆ లాకర్లను తెరిచి పరిశీలిస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఒక ఉన్నత స్థాయి రిటైర్డ్ అధికారి ఇంట్లో ఈ స్థాయిలో సోదాలు జరగడం ప్రస్తుతం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
గీతంకు భూ కేటాయింపులు నిలిపివేయాలి
మహారాణిపేట : చంద్రబాబు ప్రభుత్వం గీతం విశ్వవిద్యాలయానికి ప్రభుత్వ భూములను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే.కే.రాజు నేతృత్వంలో పార్టీ నేతలు గురువారం కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడిన కే.కే.రాజు ఎండాడ, రుషికొండ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూమిని ఒక గీతం యూనివర్సిటీకి బదలాయించే ప్రతిపాదనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. జీవీఎంసీ కమిషనర్ ద్వారా ఈ భూమి బదలాయింపు ప్రక్రియ మొదలైందని, జనవరి 30న జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి ప్రజాస్వామిక చర్చ లేకుండా, సభ్యుల ఆమోదం పొందకుండానే ఏకపక్షంగా దీనిని అజెండాలో చేర్చి ఆమోదించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. సదరు 54.79 ఎకరాల్లో గెడ్డ పోరంబోకు, ఇతర ప్రభుత్వ భూముల వివరాలను ప్రజలకు బహిర్గతం చేయాలని, ఈ కేటాయింపులకు సంబంధించిన పూర్తి ఫైల్ను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కలెక్టర్పై ఉందని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఈ బదలాయింపును వెంటనే నిలిపివేయాలని కోరారు. ఎమ్మెల్సీ డాక్టర్ కుంబా రవిబాబు మాట్లాడుతూ పేదలకు చెందిన అసైన్డ్ భూములు గీతం యాజమాన్యానికి ఎలా దక్కాయని ప్రశ్నించారు. పేదల భూములను ఆక్రమించి భవనాలు నిర్మించడం అన్యాయమని, ఆ భూములను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, ఎస్సీసీ సభ్యులు బాణాల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి పీవీ నారాయణ, కోరుకొండ వెంకటరత్న స్వాతి దాస్, పల్లా దుర్గారావు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉరుకూటి రామచంద్రరావు (చందు), పేడాడ రమణికుమారి, బర్కత్ అలీ, బొండా ఉమా మహేశ్వరరావు, బోని శివ రామకృష్ణ, జీలకర్ర నాగేంద్ర, కార్పొరేటర్లు దౌలపల్లి ఏడుకొండల రావు, సాడి పద్మారెడ్డి, బిపిన్ కుమార్ జైన్, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకట రమణ, శశికల, పీవీ సురేష్, గుడివాడ సాయి అనూష లతీష్, వార్డు అధ్యక్షులు బొడ్డేటి గోవింద్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మువ్వల సురేష్, జిల్లా కార్యదర్శి ఉమ్మడి దాస్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కంచి పీఠం సంప్రదాయ పాఠశాలల్లో ప్రవేశాలు
రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్కు ‘ఆంధ్రా’ సిద్ధం.. నేడు బెంగాల్తో ఢీ విశాఖ స్పోర్ట్స్ : దేశవాళీ టెస్ట్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న క్వార్టర్ ఫైనల్స్లో బెంగాల్ జట్టుతో ఆంధ్ర జట్టు తలపడనుంది. ఎలైట్ ‘ఎ’ గ్రూప్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో నాలుగింటిలో విజయం సాధించి, మరో మూడింటిని డ్రా చేసుకున్న ఆంధ్రా జట్టు.. అపజయమనేదే లేకుండా 31 పాయింట్లతో క్వార్టర్స్కు దూసుకెళ్లింది. ఇదే గ్రూప్లో జార్ఖండ్, విధర్భ కూడా 31 పాయింట్లతో నిలిచినప్పటికీ, మెరుగైన రన్ రేట్ కారణంగా ఆంధ్రా, జార్ఖండ్ జట్లు తదుపరి దశకు అర్హత సాధించాయి. కల్యాణ్ వేదికగా ఐదు రోజుల పాటు జరిగే ఈ పోరులో ఆంధ్రా జట్టు రికీ భుయ్ నాయకత్వంలో బరిలోకి దిగుతోంది. జట్టులో వికెట్ కీపర్గా భరత్, బ్యాటర్లుగా అశ్విన్ హెబ్బర్, షేక్ రషీద్, ఆల్రౌండర్గా సౌరబ్ కీలక పాత్ర పోషించనుండగా.. పృధ్వీరాజ్, సత్యనారాయణ, విజయ్ బౌలింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. గత సీజన్లో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న ఆంధ్రా జట్టు, ఈసారి లీగ్ దశలో వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉంది. -
పరిశ్రమల్లో భద్రతపై కలెక్టర్ సమీక్ష
మహారాణిపేట: జిల్లా ఆఫ్–సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన క్రైసిస్ గ్రూప్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల్లో పాత యంత్రాలు, స్క్రాప్ను తొలగించి భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా ఈ నెల 17 నుంచి జరిగే ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ’ దృష్ట్యా పరిశ్రమలు అప్రమత్తంగా ఉండాలని, కాలుష్య నిబంధనలు ఉల్లంఘించకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సురేష్, పరిశ్రమల కేంద్రం జీఎం ఆదిశేషు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ఏపీటీయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా వాసుపల్లి
ఆరిలోవ: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ యూనియన్ (ఏపీటీయూ) నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. గురువారం అక్కయ్యపాలెంలో రాష్ట్ర అధ్యక్షుడు వై.దేవుడు అధ్యక్షతన జరిగిన అత్యవసర జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ను, రాష్ట్ర అధ్యక్షుడిగా వై.దేవుడును ఎన్నుకున్నారు. వీరితో పాటు 18 మంది కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్కుమార్ను యూనియన్ నేతలు ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా హరికృష్ణ, నాయకులు కె.జె కృపానందం, కె.బ్రహ్మారెడ్డి, కె.వెంకటేశ్వర్లు, గౌరీశంకర్ పాల్గొన్నారు. -
ఐఎఫ్ఆర్ పనుల పర్యవేక్షణ
ఏయూక్యాంపస్: ఈ నెల 18, 19 తేదీల్లో విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న అంతర్జాతీయ యుద్ధ నౌకల విన్యాసాల నేపథ్యంలో, వీఎంఆర్డీఏ పరిధిలోని పర్యాటక ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. గురువారం వారు క్షేత్రస్థాయిలో పర్యటించి కుర్సుర సబ్ మైరెన్, సీహారియర్, హెలికాప్టర్ మ్యూజియం, టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియంలతో పాటు కై లాసగిరి, తెన్నేటి పార్కుల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో మరమ్మత్తులు, పచ్చదనం పెంపు పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ అంతర్జాతీయ వేడుకను విజయవంతం చేయాలని ఆదేశించారు. -
భూచి
రిజిస్ట్రేషన్ల విశాఖ సిటీ: సంపద సృష్టిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి సామాన్యులను నిలువునా ముంచుతోంది. ధరల పెంపు ఎత్తుగడలతో ప్రజలకు కుచ్చు టోపీ పెడుతోంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే విద్యుత్ చార్జీలు, భూముల ధరలు పెంచి నడ్డివిరిచింది. వరుసగా రెండో ఏడాది కూడా భూముల విలువ పెంపు పేరుతో క్రయ, విక్రయదారులను గందరగోళానికి గురిచేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి భూముల మార్కెట్ విలువను పెంచుతున్నట్లు ప్రభుత్వం లీకులు ఇచ్చింది. ఇందుకు అవసరమైన సవరణలకు కసరత్తు చేయాలని జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు జిల్లాలో ప్రధానంగా జీవీఎంసీ పరిధిలో 15 నుంచి 50 శాతం మేర ధరల పెంపునకు కసరత్తు చేపట్టారు. ఈనెల ఒకటో తేదీ నుంచి భారీగా భూములు విలువ పెరుగుతుందని ప్రకటించారు. దీంతో భూముల క్రయ విక్రయదారులు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు క్యూ కట్టారు. భూముల విలువ పెరగక ముందే అప్పులు చేసైనా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి పోటీ పడ్డారు. దీంతో జనవరి చివరి వారంలో జిల్లాలో ఉన్న 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడాయి. ప్రభుత్వం ‘డెడ్ లైన్’ రాజకీయం? ఈ నెల ఒకటో తేదీ నుంచి రేట్లు పెరుగుతాయన్న ప్రచారంతో జనవరి చివరి వారంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడాయి. పెరిగే భారం నుంచి తప్పించుకోవడానికి మధ్యతరగతి ప్రజలు అప్పులు చేసైనా సరే జనవరి 31వ తేదీలోపు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని పరుగులు తీశారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు ఒక్కసారిగా భారీ ఆదాయం సమకూరింది. కేవలం జనవరి నెలలోనే విశాఖ జిల్లాలో సుమారు రూ.113.79 కోట్ల ఆదాయం లభించినట్లు తెలుస్తోంది. ఇది గత ఏడాది జనవరితో పోలిస్తే 10.56 శాతం వృద్ధి నమోదైంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి విశాఖ జిల్లాలోని 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రూ.1,349.80 కోట్ల లక్ష్యం విధించగా, డిసెంబర్ నాటికే రూ.848.34 కోట్లు వసూలయ్యాయి. జనవరి నాటికి మరో రూ.వంద కోట్లకు పైగా ఖజానాకు చేరింది. ఒడిదుడుకుల్లో రియల్ ఎస్టేట్ రంగం విశాఖలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం ఒడిదుడుకుల్లో ఉంది. ఇలాంటి సమయంలో మార్కెట్ విలువను భారీగా పెంచితే అది సామాన్యుడి సొంతింటి కలను దూరం చేయడమే అవుతుంది. ఈ అంశం రాజకీయంగా నష్టం కలిగిస్తుందని భావించే ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా వాయిదా వేసి ఉండొచ్చని స్థిరాస్తి రంగ నిపుణులు చెబుతున్నారు. భూములు విలువ పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నా.. లీకులతో భూముల కొనుగోలుదారులు భయపడి ముందస్తు రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలను ఒత్తిడికి గురిచేసి ఆదాయం పిండుకోవడం వంటి చర్యలపై విశాఖ వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భూముల విలువ పెంపుపై సర్కారు హడావుడి ఈనెల ఒకటి నుంచి కొత్త ధరలు అంటూ లీకులు 25 నుంచి 50 శాతం వరకు పెరుగుతాయని లీకులు ఆ భయంతో జనవరిలో రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు జనాలు పరుగులు దీంతో జనవరి నెలలో రూ.113.79 కోట్ల ఆదాయం నెలాఖరు నాటికి పెంపు నిర్ణయం వాయిదా వేస్తున్న ప్రకటన ఆదాయం కోసం ప్రభుత్వం మైండ్ గేమ్? ప్రజల వ్యతిరేకతతో యూటర్న్? బురిడీ కొట్టించి.. జేబులు ఖాళీ చేసి..! తీరా గత నెల చివరిలో ధరల పెంపుపై చంద్రబాబు ప్రభుత్వం తూచ్ అంది. భూముల విలువ సవరణకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీనిని బట్టి చూస్తే, కేవలం ఆర్థిక సంవత్సరం ముగింపులో ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం ఆడిన ‘మైండ్ గేమ్’ అని ప్రజలు మండిపడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పటికే కుదేలై, రియల్టర్లు దివాలా తీస్తున్న తరుణంలో, ఇలాంటి హడావుడి ప్రకటనలతో జనాన్ని బురిడీ కొట్టించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పెంపు నిర్ణయం వాయిదా వేయడం వెనుక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూముల ధరల పెంపుపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు పలువురు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రతిసారి ముందస్తు లీకులు ఇవ్వడం.. ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తే చివరి నిమిషంలో వాటిని వెనక్కు తీసుకోవడం పరిపాటిగా మారింది. -
14 నుంచి 21 వరకు చేపల వేట నిషేధం
ఎంవీపీకాలనీ : విశాఖ సాగర తీరంలో ఈ నెల 15వ తేదీ నుంచి 25 తేదీ వరకు జరగనున్న ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్), మిలాన్ నేపథ్యంలో చేపల వేట నిషేధిస్తున్నట్లు తూర్పు నావికాదళం, జిల్లా మత్స్యకారశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు 19వ వార్డు పెదజాలరిపేటలో గురువారం జిల్లా మత్స్యకార శాఖ, ఈస్ట్రన్ నేవల్ కమాండ్, మైరెన్ పోలీసు విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో మత్స్యకారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్స్యకారులు చేపల వేట విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యకార శాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణరావు మాట్లాడుతూ మిలాన్ నేపథ్యంలో భద్రతా చర్యలు దృష్ట్యా ఈనెల 14 నుంచి 21వ తేదీ వరకు చేపల వేటను నిషేధిస్తున్నట్లు తెలిపారు. కోస్టల్ సెక్యురిటీ, హైసైనిక్ కండిషన్, కమ్యూనికేషన్, కలర్ కోడ్, సేఫ్ ఫిషింగ్ యాక్టివిటీకి సంబంధించిన అంశాలపై మత్స్యకారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫిషరీస్ డవలప్మెంట్ ఆఫీసర్ ఎం.ఆర్.ఆశాజ్యోతి, నావికాదళాధికారులు, మైరెన్ పోలీసులు పాల్గొన్నారు. -
నూతన ఒప్పందాలతో సీ ఫుడ్ ఎగుమతులకు ప్రోత్సాహం
ఏయూ క్యాంపస్: అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)లతో భారత్ చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు భారతీయ సముద్ర ఆహార(సీ ఫుడ్) ఎగుమతుల రంగంలో నూతన ఉత్తేజాన్ని నింపుతాయని సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏఐ) అధ్యక్షుడు జి.పవన్కుమార్ అన్నారు. బీచ్రోడ్డులోని ఓ హోటల్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూరోపియన్ యూనియన్(ఈయూ)తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) విజయవంతంగా ముగియడం, అమెరికాతో జరిగిన తాజా వాణిజ్య అవగాహన వల్ల భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల దిగుమతి సుంకాల్లో భారీ తగ్గింపు లభిస్తుందన్నారు. 2024–25లో సుమారు 2.78 బిలియన్ డాలర్ల ఎగుమతులతో భారత్ సీఫుడ్స్కు అతిపెద్ద మార్కెట్గా కొనసాగిన అమెరికా ఆగస్టు 2025 నుంచి విధించిన 50 శాతం టారిఫ్లతో ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. అమెరికాతో కుదిరిన తాజా ఒప్పందం వల్ల టారిఫ్లు 18 శాతానికి తగ్గాయన్నారు. ఈయూతో ఎఫ్టీఏ వల్ల ప్రపంచవ్యాప్త పోటీదారులతో సమానంగా భారతీయ ఎగుమతిదారులకు సమాన అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఆక్వాకల్చర్ మరియు సీఫుడ్ ఎగుమతులకు ఒక ప్రధాన కేంద్రంగా ఏపీ నిలుస్తోందన్నారు. ఈ రంగం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మద్దతుగా నిలిచిన ప్రధాని మోదీ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ఏపీ అధ్యక్షుడు ఆనంద్కుమార్ మాట్లాడుతూ ఈ నిర్ణయాలు ఏపీలో ఆక్వా రైతులకు చాలా మేలు చేస్తాయన్నారు. ధరలు స్థిరంగా ఉంటూ, ఎగుమతులు పెరిగేందుకు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి దిలీప్ తదితరులు పాల్గొని మాట్లాడారు. -
ఐఎఫ్ఆర్, మిలాన్కు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట: అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష(ఐఎఫ్ఆర్)–2026, మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కార్యక్రమాల నిర్వహణకు అన్ని విభాగాలు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు నేవీ, పోలీస్, ఇతర విభాగాల అధికారులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో బుధవారం సమీక్ష జరిపారు. కోస్ట్ గార్డ్ డీఐజీ రాజేష్ మిట్టల్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీలు, ఆర్డీవోలు, ఇతర అధికారులతో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతి, రక్షణ శాఖ మంత్రి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులతోపాటు, 2 నుంచి 3 లక్షల వరకు ప్రజలు రానున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మౌలిక వసతుల కల్పన, వైద్య సేవలు అత్యంత సమర్థవంతంగా ఉండాలని ఆదేశించారు. 17న రాష్ట్రపతి రాక ఈ నెల 17న రాష్ట్రపతి రాకతో కార్యక్రమాలు మొదలవుతాయని, 18న నౌకాదళ ఫ్లీట్ రివ్యూ, 19న ఉదయం మిలాన్ ప్రారంభోత్సవం, సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్డులో అంతర్జాతీయ సిటీ పరేడ్ ఉంటుందన్నారు. వెద్యం, అగ్నిమాపక, తాగునీరు, మొబైల్ టాయిలెట్లు, పరిశుభ్రత చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. బస్సులను ఇటు జగదాంబ, అటు పార్క్ హోటల్ జంక్షన్ వరకు నడపాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాటుచేయాలి: సీపీ ప్రజా భద్రత దష్ట్యా సీసీ కెమెరాలు, నైట్ విజన్ పరికరాలు, కంట్రోల్ రూమ్ ద్వారా లైవ్ మానిటరింగ్కు చర్యలు తీసుకోవాల్సి ఉందని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సూచించారు. నో–డ్రోన్, నో కై ట్ జోన్ అమలు చేస్తామన్నారు. పార్కింగ్ ప్రాంతాల్లో, ప్రముఖులు రాకపోకలు సాగించే ప్రధాన రహదారుల్లో లైటింగ్ సదుపాయం కల్పించాలన్నారు. సమావేశంలో ఇండియన్ నేవీ అధికారులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
సింహాచలం దేవస్థానం ఈవోగా వెంకటరావు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో)గా రెవెన్యూశాఖకు చెందిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జె.వెంకటరావు నియమితులయ్యారు. కాకినాడలో డీఆర్వోగా పనిచేస్తున్న ఆయన్ని రెవెన్యూ నుంచి దేవదాయశాఖకు డిప్యూటేషన్పై బదిలీచేసి, ఏడాది కాలపరిమితికి సింహాచలం ఈవోగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హ్యాండ్లింగ్లో అదానీ గంగవరం పోర్టు కొత్త రికార్డు పెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టు మరో కొత్త రికార్డు నెలకొల్పింది. ఒకేసారి 3,400 టీఈయూలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఈ సందర్భంగా పోర్టు యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ ఎంఎస్సీ ట్రేసీ వీ ఒకేసారి నిర్వహించడం తమ సిబ్బంది పనితీరుకు నిదర్శనమన్నారు. ఈ మైలురాయిని సాధించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమైందని చెప్పారు. అనంతరం సిబ్బందితో కలసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రేపు నగరానికి సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ మహారాణిపేట: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో చేపట్టిన ‘సీఐఎస్ఎఫ్ వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్–2026’ఈ నెల 6న ఆర్కే బీచ్కు చేరుకుంటుందని సంస్థ సీనియర్ కమాండెంట్(వీపీటీ) సతీష్కుమార్ బుధవారం తెలిపారు. ఈ సైకిల్ ర్యాలీకి ఘన స్వాగతం పలికేందుకు ఆర్కే బీచ్లో భారీ స్థాయిలో ప్రజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 7న కాకినాడకు సైకిల్ యాత్ర కొనసాగుతుందన్నారు. -
సమర భేరి
సాగర తీరానవిశాఖ సిటీ : భారత నావికాదళ చరిత్రలో మరో కీలక ఘట్టానికి విశాఖ వేదిక అవుతోంది. దశాబ్ద కాలం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు మెగా ఈవెంట్లకు ముస్తాబవుతోంది. ఈ నెల 15 నుంచి 25 వరకు తీరం అంతర్జాతీయ నౌకా బలగా లతో కిక్కిరిసిపోనుంది. ఈ నెలలో 18వ తేదీన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), 19న మిలాన్– 2026 విన్యాసాలతో పాటు 20న ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం(ఐఓఎన్ఎస్) సదస్సుకు అతిథ్యమిస్తోంది. ప్రపంచ దేశాల మధ్య మైత్రిని పెంపొందించడం, సముద్ర భద్రతలో పరస్పర సహకారాన్ని చాటుతూ ఈనెల 21 నుంచి 25 వరకు భారత నౌకాదళం నిర్వహించే ప్రతిష్టాత్మక ‘మిలాన్–2026 సీ ఫేజ్’ విన్యాసాలకు మెరుగులు దిద్దుకుంటోంది. దశాబ్ద కాలం తర్వాత ఐఎఫ్ఆర్ సముద్ర భద్రత, సహకారం, స్థిరత్వం, సమన్వయాన్ని పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా ఈ ఫ్లీట్ రివ్యూ ఉంటుంది. దేశ చరిత్రలోనే మొదటి సారిగా అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్షను 2016లో ఇక్కడే నిర్వహించారు. దాదాపు పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మకమైన ఐఎఫ్ఆర్–2026కు సాగరతీరం రెండోసారి ఆతిథ్యమిస్తోంది. ఈనెల 15 నుంచి 20వ తేదీల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈసారి ఫ్లీట్ రివ్యూకు ’యునైటెడ్ త్రూ ఓషన్స్’ (సముద్రాల ద్వారా ఏకమవుదాం) అనే ప్రత్యేక థీమ్తో నిర్వహిస్తున్నారు. తీరప్రాంత భద్రత, బ్లూ ఎకానమీ, కొత్త సాంకేతికత అనే అంశాలపై ఫ్లీట్ రివ్యూలో చర్చించనున్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు సముద్ర గర్భంలో భారత రక్షణ శక్తి సామర్థ్యాలు ఆవిష్కృతం కానున్నాయి. రాష్ట్రపతి సమక్షంలో ‘ఫ్లీట్ రివ్యూ’ ఈ ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం ఈనెల 18న జరగనుంది. భారత రాష్ట్రపతి, త్రివిధ దళాల సర్వసైన్యాధ్యక్షురాలు ద్రౌపదీ ముర్ము విశాఖ తీరంలో జరిగే నౌకల కవాతుకు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆమె ప్రెసిడెన్షియల్ యాచ్లో నౌకాదళ విన్యాసాలను పరిశీలిస్తారు. భారత నౌకాదళానికి చెందిన సుమారు 90 యుద్ధ నౌకలు, 45 విమానాలతో పాటు సుమారు 20కి పైగా విదేశీ యుద్ధ నౌకలు సముద్రంలో బారులు తీరి రాష్ట్రపతికి వందనం సమర్పిస్తాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఒళ్లు గగుర్పొడిచేలా విన్యాసాలు ఐఎఫ్ఆర్, మిలాన్ విన్యాసాలకు భారతదేశం తన స్వదేశీ రక్షణ పరిజ్ఞానాన్ని ఈ వేదికపై ప్రపంచానికి చాటి చెప్పనుంది. సముద్రం పైన యుద్ధ నౌకలు ఉంటే, ఆకాశంలో యుద్ధ విమానాలు గర్జించనున్నాయి. విమానవాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈ విన్యాసాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటు ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మోర్ముగావ్ వంటి శక్తివంతమైన డిస్ట్రాయర్లు, కల్వరి క్లాస్ సబ్ మైరెన్లు పాల్గొంటాయి. అలాగే అత్యాధునిక డిస్ట్రాయర్లు ఐఎన్ఎస్ విశాఖపట్నం, తారాగిరి సముద్ర గర్భం నుంచి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే యుద్ధ విన్యాసాలను భారత నేవీ ప్రదర్శించనుంది. గగనతలంలో నౌకాదళానికి చెందిన మిగ్–29కె ఫైటర్ జెట్లు, పి–8ఐ నిఘా విమానాలు, సముద్రపు గద్దలుగా పేరుపొందిన ఎంహెచ్–60ఆర్ రోమియో హెలికాప్టర్లు, సీ కింగ్, ధృవ్ హెలికాప్టర్లు ఆకాశంలో అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించనున్నాయి. విదేశీ వైమానిక దళాలకు చెందిన ఆధునిక విమానాలు కూడా ఈ ప్రదర్శనలో భాగం కానున్నాయి. 60కి పైగా దేశాల భాగస్వామ్యం ఐఎఫ్ఆర్, మిలాన్ కోసం భారత నౌకాదళం మొత్తం 137 దేశాలకు ఆహ్వానం పింపింది. ఇందులో ఇప్పటి వరకు 60కి పైగా దేశాలు భాగస్వామ్యం అవుతున్నట్లు ధృవీకరణ వచ్చింది. ఇందులో 4 వేల మంది విదేశీ ప్రతినిధులు పాల్గొననున్నారు. అలాగే విదేశీ నౌకాదళాధిపతులు 25 నుంచి 30 మంది వరకు రానున్నారు. ఇందులో అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, ఇరాన్ వంటి దేశాల నుంచి 23కి పైగా యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచే వివిధ దేశాల నౌకలు విశాఖ తీరానికి చేరుకోవడం ప్రారంభమవుతుంది. పాల్గొనే దేశాలు, ప్రతినిధులు అంశం వివరాలు మొత్తం ఆహ్వానిత దేశాలు 137 భాగస్వామ్యాన్ని ధృవీకరించిన దేశాలు 60+ విదేశీ ప్రతినిధుల సంఖ్య సుమారు 4వేలు విదేశీ నౌకాదళాధిపతులు 25 నుంచి 30 మందివిశాఖ ముంగిట ప్రపంచ నౌకాదళాల కవాతు! ఈ నెలలో మిలాన్–2026, ఐఎఫ్ఆర్ సంబరం 60కి పైగా దేశాల నుంచి యుద్ధ నౌకల రాక 18న రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ఫ్లీట్ రివ్యూ’ 19న మిలాన్ ప్రారంభం, అదే రోజు సాయంత్రం సిటీ పరేడ్విన్యాసాల షెడ్యూల్ ఇలా.. ఈ నెల 15న నావల్ బేస్ వద్ద ‘మిలాన్ విలేజ్’ ప్రారంభమవుతంది. 21వ తేదీ వరకు భారతీయ హస్తకళలు, సంస్కృతి, సంప్రదాయాలు అద్దం పట్టే కార్యక్రమాలు, రుచికరమైన వంటకాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 18వ తేదీ ఉదయం అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ప్రారంభమవుతుంది. 19వ తేదీ ఉదయం మిలాన్–2026 రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఆరంభమవుతుంది. 19వ తేదీ సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్డులో అంతర్జాతీయ సిటీ పరేడ్ జరగనుంది. ఇందులో దేశ విదేశీ నౌకాదళాల కవాతు, ఎయిర్ పవర్ డెమో (వైమానిక ప్రదర్శన) ఉంటాయి. 19, 20 తేదీల్లో మిలాన్ విన్యాసాల్లో భాగంగా ’హార్బర్ ఫేజ్’లో అంతర్జాతీయ సెమినార్లు, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. 20న ఐవోఎన్ఎస్ సదస్సు జరగనుంది. ఇందులో హిందూ మహాసముద్ర దేశాల నౌకాదళాధిపతులు భేటీ అవుతారు. ఇందులో 25 సభ్యదేశాలు, 9 అబ్జర్వర్ దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. 21 నుంచి 25 వరకు ‘మిలాన్’ సీ ఫేజ్ విన్యాసాలు జరుగుతాయి.ప్రధాన ఆకర్షణగా ‘సిటీ పరేడ్’ ఈ నెల 19వ తేదీ సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్డులో నిర్వహించే ‘ఇంటర్నేషనల్ సిటీ పరేడ్’ విశాఖ ప్రజలకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వివిధ దేశాల నావికా దళాల కవాతుతో పాటు, భారత నేవీకి చెందిన ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు ఆకాశంలో అద్భుతమైన విన్యాసాలు ప్రదర్శిస్తాయి. అదే విధంగా ఈనెల 15 నుంచే నావల్ బేస్ వద్ద ‘మిలాన్ విలేజ్’ సందర్శకులకు అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ భారతీయ హస్తకళలు, సంప్రదాయ వంటకాలు, రక్షణ రంగ ప్రదర్శనలు ఉంటాయి. రక్షణ దళాల సమీకరణ (బలగాల వివరాలు) మొత్తం యుద్ధ నౌకలు 110కి పైగా (భారత్ + విదేశీ) భారత నౌకాదళ నౌకలు 90 వరకు విదేశీ యుద్ధ నౌకలు 23 నుంచి 25 విమానాలు హెలికాప్టర్లు 60కి పైగా ప్రధాన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, విక్రమాదిత్య -
మిత్ర దేశాల కలయిక.. మిలాన్–2026
ఈనెల 19న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ చేతుల మీదుగా ‘మిలాన్–2026’ విన్యాసాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ‘సౌభ్రాతృత్వం, సహకారం, సమన్వయం‘ అనే నినాదంతో ఈ విన్యాసాలు జరగనున్నాయి. దీనికి సుమారు 137 దేశాలను ఆహ్వానించారు. ఇప్పటివరకు 60కి పైగా దేశాలు తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించాయి. మిలాన్ విన్యాసాలు రెండు దళల్లో జరుగుతాయి. ఈ నెల 19, 20 తేదీల్లో ‘హార్బర్ ఫేజ్’లో భాగంగా అంతర్జాతీయ సెమినార్లు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. 21 నుంచి 25 వరకు ‘సీ ఫేజ్’ ప్రారంభమవుతుంది. ఈ దశలో సముద్ర తీరంలో వివిధ దేశాల నౌకలు ఉమ్మడిగా యుద్ధ విన్యాసాలు, కమ్యూనికేషన్ డ్రిల్స్ నిర్వహిస్తాయి. -
2 నెలల్లో ఉక్కు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ ఉద్యోగుల వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు రెండు నెలల్లో పరిష్కారిస్తామని స్టీల్ప్లాంట్ ఇన్చార్జ్ సీఎండీ మనీష్ రాజ్ గుప్తా అన్నారు. బుధవారం స్టీల్ప్లాంట్ ఎల్డీసీ ఆడిటోరియంలో కేంద్ర ఉక్కు కార్యదర్శి సందీప్ పాండ్రిక్ అధికారులు, కార్మికులతో జరిగిన ఇంటాక్ట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సెయిల్కు చెందిన ఇతర ప్లాంట్లతో పోలిస్తే విశాఖ స్టీల్ప్లాంట్ పనితీరు ప్రైవేటు ప్లాంట్ల స్థాయిలో ఉందన్నారు. ఉత్పత్తి వ్యయం టన్నుకు 7 వేల వరకు తగ్గించే కీలక విభాగాలను గుర్తించామన్నారు. వాటిపై ప్రధాన దృష్టి సారిస్తామన్నారు. ప్రతీ విభాగం వారీగా సామర్ధ్యం పెంచడం, ఖర్చులు తగ్గించడం ఎలా అన్నదానిపై యోచించాల్సి ఉందన్నారు. కేంద్ర ఉక్కు కార్యదర్శి సందీప్ పాండ్రిక్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ప్లాంట్కు తక్కువ అంచనాలతో వచ్చామని, ఊహించిన దాని కంటే మంచి ఫలితాలు ఇచ్చారని ప్రశంసించారు. విశాఖ ఉక్కు ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మంచి బ్రాండ్ విలువ ఉందన్నారు. వెళ్లిపోయిన కస్టమర్లను తిరిగి తీసుకు రావాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ఆర్థిక శాఖ, ఉక్కు మంత్రిత్వశాఖల్లో విశాఖ స్టీల్ప్లాంట్ పట్ల దృక్పథం మారిందన్నారు. స్టీల్ప్లాంట్ రుణాలపై వడ్డీ రేటు 14 శాతం నుంచి 8.9 శాతానికి తగ్గిందన్నారు. ఇంకో సంవత్సరం ఇదే ఉత్సాహంతో పని చేసి ప్లాంట్ను మరింత ప్రగతి పథంలోకి తీసుకు వెళ్లాలన్నారు. ఈ ఏడాది ఏప్రిల్కు పదోన్నతులు ఇస్తామన్నారు. 5, 10 ఏళ్ల తర్వాత సమస్యలు రాకుండా కొత్త మేనేజ్మెంట్ ట్రైనీల నియామకాలు చేపడతామన్నారు. అధికారులు, కార్మికులను జిందాల్ వంటి ప్రైవేటు స్టీల్ప్లాంట్ల విజిట్కు పంపుతామన్నారు. కార్యక్రమంలో ఉక్కు ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు. ఇన్చార్జ్ సీఎండీ మనీష్ రాజ్ గుప్తా -
14 నుంచి 21 వరకు బోట్ల నిలుపుదల
మహారాణిపేట: ఇండియన్ నేవీ నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), మిలాన్ కార్యక్రమాల నేపథ్యంలో ఈ నెల 14 నుంచి 21 వరకు నేవీ నౌకలు, బోట్లు నిలిపే ప్రాంతాల్లో చేపల వేట, మత్స్యకార బోట్ల సంచారంపై నిషేధం అమల్లో ఉంటుందని మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు మూలపాలెం గ్రామంలో మత్స్యకారులకు బుధవారం అవగాహన కల్పించారు. ప్రపంచ ప్రసిద్ధ కార్యక్రమాల సమర్థ నిర్వహణకు మత్స్యకారులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా నేవీ సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. బీచ్లు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. మత్స్యశాఖ జేడీతోపాటు ఎఫ్డీవో మురళి, మైరెన్ పోలీసులు బీకేవీ ప్రసాద్, శ్రీనివాస్, నేవీ అధికారులు మధుసూదన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్ఆర్, మిలాన్ నేపథ్యంలో మత్స్యకారులకు విజ్ఞప్తి -
ఆరోగ్యానికి అభాయం
మహారాణిపేట: వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు విశాఖ కేంద్ర బిందువుగా మారుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అమలులో జిల్లా దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు జిల్లాలో 9,11,697 మంది ఈ డిజిటల్ కార్డుల కోసం నమోదు చేసుకోగా, వారిలో 75.66 శాతం మంది ఈ–కేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేసుకున్నారు. ఏమిటీ ‘అభా’ గతంలో ఆసుపత్రికి వెళ్లాలంటే పాత రిపోర్టులు, స్కానింగ్ ఫిల్మ్స్, ప్రిస్కిప్షన్ల కట్టలు మోసుకెళ్లాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ‘అభా’విధానాన్ని తీసుకొచ్చింది. ఇది 14 అంకెలు ఉండే ఒక విశిష్టమైన ఐడీ. బ్యాంకు ఖాతాలో డబ్బులు దాచుకున్నట్లే, మన ఆరోగ్య సమాచారాన్ని ఇందులో డిజిటల్ రూపంలో భద్రపరచవచ్చు. దేశంలో ఏ ఆసుపత్రికి వెళ్లినా ఈ ఐడీ చెల్లుబాటవుతుంది. అందుబాటులో సేవలు నెట్వర్క్: కేజీహెచ్, విక్టోరియా, ఈఎన్టీ, టీబీ ఆసుపత్రులతో పాటు అన్ని పీహెచ్సీలు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఈ విధానం అమలవుతోంది. సచివాలయాల్లో ఏఎన్ఎంల ద్వారా కూడా నమోదు చేస్తున్నారు.ఆధార్ కచ్చితంగా మొబైల్ నంబర్కు లింక్ అయి ఉండాలి. బీమా సౌకర్యం: ఈ కార్డు ఉన్నవారికి ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తించే అవకాశం ఉంటుంది. ఈ–కేవైసీ తప్పనిసరి: కార్డు నమోదు చేసుకున్న తర్వాత ఈ–కేవైసీ పూర్తి చేస్తేనే కార్డులు జారీ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఆధార్కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే ప్రక్రియ మరింత సులభమవుతుంది. అభా వల్ల ఎన్నో ప్రయోజనాలు ప్రతి ఒక్కరూ అభా యాప్లో నమోదు చేసుకోవడం ద్వారా వైద్య సేవలను సులభతరం చేసుకోవచ్చు. దీని వల్ల దేశంలో ఎక్కడైనా మన ఆరోగ్య రికార్డులను చూపించే వెసులుబాటు కలుగుతుంది. అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ బీమా ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. ఇప్పటికే ఈ నమోదు ప్రక్రియలో విశాఖ జిల్లా దేశంలోనే రెండో స్థానంలో నిలవడం గర్వకారణం. రోగులు ఓపీ కోసం ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా ఈ డిజిటల్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ కె.అప్పారావు, జిల్లా సమన్వయకర్త, ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ సులభమైన ఓపీ విధానం స్మార్ట్ఫోన్ ఉన్నవారు ప్లేస్టోర్ నుంచి అభా యాప్ను డౌన్లోడ్ చేసుకుని, ఆధార్ వివరాలతో నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆసుపత్రికి వెళ్లాక, అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే నేరుగా టోకెన్ నంబర్ వస్తుంది. దీనిని కౌంటర్లో చూపిస్తే ఓపీ చీటీ జారీ చేస్తారు. దీనివల్ల క్యూలో గంటల తరబడి నిలబడే శ్రమ తప్పుతుంది. -
అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న కాపు నేతలు
సాక్షి, విశాఖపట్నం: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా, ఆయన ఇంటిపై టీడీపీ గుండాలతో చంద్రబాబు దాడులు చేయించారని ఉమ్మడి విశాఖకు చెందిన కాపు నేతలు ఆక్షేపించారు. ఈ నెల 7న విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన కాపునేతలు పార్టీలకు అతీతంగా అంబటి కుటుంబాన్ని పరామర్శించను న్నారు. వందకు పైగా కార్ల ర్యాలీతో వెళ్లి, అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి, కుమార్తెలు మౌనిక, మనోజ్ఞలకు ధైర్యం చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కాపు నేతలు బుధవారం సమావేశమయ్యారు. కాపునేతలపై చంద్రబాబు కక్ష తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తేలడంతో గోరంట్లలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు చేసి వస్తున్న అంబటి.. గోరంట్లలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై అభ్యంతరం వ్యక్తం చేశారనే దాడి చేయించారన్నారు. ఫ్లెక్సీని తొలగించాలని కోరితే టీడీపీ మూకలు నడిరోడ్డుపై బహిరంగంగా కర్రలు, రాడ్లతో దాడికి తెగబడినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆక్షేపించారు. గంటల తరబడి కొనసాగిన రౌడీ మూకల దాడిపై డీజీపీ, అదనపు డీజీపీలకు ఫిర్యాదు చేసేందుకు శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఫోన్లు చేసినా స్పందించలేదని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీని కలిసేందుకు మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత వెళితే ఎస్పీ ఇంటి గేటు బయటే నిలబెట్టారంటే ఏ స్థాయిలో పోలీసు వ్యవస్థ ఉందో అర్ధమవుతుందంటూ మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కాపు నేత వంగవీటి రంగాను హత్య చేయించారని, మళ్లీ చంద్రబాబు హయాంలోనే మరో కాపు ఉద్యమనేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభంను, ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారని గుర్తుచేశారు. కాపులను ఏదో విధంగా అడ్డుతొలగించుకోవాలన్నదే చంద్రబాబు తాపత్రయంగా కనిపిస్తోందని కాపునేతలు మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకట్రామయ్య, కాపు నేతలు బాణాల శ్రీనివాసరావు, వీసం రామకృష్ణ, కోరుకొండ స్వాతి, పీవీ సురేష్, గుడివాడ అనూష, గుండపు నాగేశ్వరరావు, రామజోగి, రాయపూడి అనిల్కుమార్, గుడివాడ లతీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
దేవస్థానానికి ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వాల్సిందే..
సింహాచలం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి చెందిన పలు సంస్థలకు గతంలో ఇచ్చిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం స్థలాలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ స్థలాలు ఇవ్వాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని బుధవారం ఆయన దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా మాధవ్ స్థానిక విలేకర్లతో మాట్లాడారు. దేవుడి భూములు దేవుడికే చెందాలన్నారు. దేవుడి భూములు తీసుకుంటే ప్రత్యామ్నాయంగా భూములు ఇవ్వాల్సిందే అన్నారు. సింహాచలం దేవస్థానం భూములు తీసుకున్న ప్రభుత్వ రంగ సంస్థలకు బదులుగా ప్రభుత్వం దేవస్థానానికి స్థలాలు ఇవ్వాల్సిందే అన్నారు. దేవస్థానానికి చెందిన 9 వేల ఎకరాల భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. ఒకవేళ అన్యాక్రాంతం జరిగితే తిరిగి తెచ్చుకోవాలన్నారు. సింహగిరిపై భక్తుల సౌకర్యార్థం నిర్మించే అన్ని కట్టడాలు మాస్టర్ ప్లాన్ ప్రకారమే జరగాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరగితే గడచిన చందనోత్సవం రోజు జరిగినటువంటి దుర్ఘటనలు పునరావృతం కావన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 54కోట్లతో ప్రసాద్స్కీమ్ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రసాద్ పథకం, స్వదేశీ దర్శనం పేరిట కేంద్ర ప్రభుత్వ నిధులతో పలు ఆలయాల అభివృద్ధి జరుగుతోందన్నారు. సింహాచలం దేవస్థానంతో ముడిపడి ఉన్న పంచగ్రామాల భూమస్య తొందరలోనే పరిష్కారమవుతుందన్నారు. -
గ్రేటర్ బడ్జెట్ రూ.4,047.12 కోట్లు
డాబాగార్డెన్స్: మహా విశాఖ నగర పాలక సంస్థ 2026–27 వార్షిక బడ్జెట్కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరిగింది. కూటమి సభ్యులు(తెలుగుదేశం, జనసేన, బీజేపీ), వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ సభ్యులు బడ్జెట్ను ఆమోదించడం గమనార్హం. ముందుగా బడ్జెట్కు సంబంధించి మేయర్ పీలా శ్రీనివాసరావు క్లుప్తంగా వివరించారు. అనంతరం ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి వివిధ విభాగాలకు సంబంధించి ఎంతెంత కేటాయించారో సవివరంగా తెలిపారు. బడ్జెట్ ఇలా..: ప్రారంభ నిల్వ రూ.365.96 కోట్లు. అన్ని పద్దుల కింద జమలు రూ.3,814.41 కోట్లు కాగా, మొత్తంగా రూ.4,180.37 కోట్లు ఆదాయంగా పేర్కొన్నారు. అన్ని పద్దుల కింద ఖర్చులు రూ.4,047.12 కోట్లుగా, ముగింపు నిల్వగా రూ.133.25 కోట్లుగా నిర్ణయించినట్టు చెప్పారు. 2025–26 సవరించిన బడ్జెట్ రూ.4,070.19 కోట్లుగా చూపారు. పన్నులు ఇలా.. : జీవీఎంసీ వసూలు చేస్తున్న ఇంటిపన్ను, ఖాళీ జాగా పన్ను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు చార్జీలు, పారిశ్రామిక సంస్థలు చెల్లించాల్సిన పన్నులు, సర్వీసు చార్జీలు, ప్రకటన చార్జీలు, సెల్టవర్స్ చార్జీలు తదితరాలు ఈ పద్దు కింద రూ.680 కోట్లుగా చూపారు. పన్నులు కాని ఇతర ఆదాయాలు : నీటి సరఫరా చార్జీలు, పట్టణ ప్రణాళికా విభాగం వసూళ్లు. షాపురూముల అద్దెలు, కల్యాణమండపాల అద్దెలు, లీజులు, బల్క్, సెమీబల్క్, ఇతర నీటి సరఫరా చార్జీలు, వ్యాపార సంస్థల లైసెన్స్ ఫీజులు తదితరవి రూ.869.55 కోట్లుగా చూపారు. ప్రభుత్వం నుంచి సంక్రమించే ఆదాయం : స్టాంప్ డ్యూటీపై సర్చార్జ్, వృత్తిపన్ను, తలసరి గ్రాంటు, మోటారు వాహనాల పన్ను, ఆస్తిపన్ను రాయితీ నష్టపరిహారాలు, మెజిస్టీరియల్ జరీమానాలు తదితరాలు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం రూ.200 కోట్లుగా చూపారు. ప్రభుత్వ గ్రాంట్లు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అర్బన్ ఛాలెంజ్ నిధుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ.162.50 కోట్లు, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం నిధులు రూ.35 కోట్లు, పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.10 కోట్లు, 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.240 కోట్లు, అమృత్కు రూ.102 కోట్లు, అసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా రూ.58 కోట్లు వస్తాయని ఆశించారు. బ్యాంకులు/ఆర్థిక సంస్థలు/బాండ్లు ద్వారా రుణాలు: జోన్–2 మధురవాడ ప్రాంతంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అభివృద్ధికి, జీవీఎంసీకి అవసరమైన వాటా సొమ్మును 2026–27 ఏడాదికి రూ.457.50 కోట్లు బ్యాంకులు/ఆర్థిక సంస్థలు/బాండ్లు/ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకొని నిధుల సమకూర్చుకునేందుకు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఆమోదించిన పాలకవర్గం -
ఐఎఫ్ఆర్, మిలాన్, ఐయాన్స్ నిర్వహణపై సమీక్ష
అల్లిపురం: నగరంలో ఈ నెల 14 నుంచి 25 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఐ.ఎఫ్.ఆర్, మిలాన్, ఐయాన్స్– కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ కార్యక్రమాల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ అంతర్జాతీయ సదస్సులకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు, విశిష్ట అతిథులు పెద్ద సంఖ్యలో రానున్న నేపథ్యంలో, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన వ్యూహాన్ని సిద్ధం చేశారు. ముఖ్యంగా విదేశీ ప్రతినిధుల రాకను పురస్కరించుకుని ఇమిగ్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయడం, వారు బస చేసే ప్రాంతాలు, కార్యక్రమ వేదికల వద్ద బందోబస్తు నిర్వహించడంపై కమిషనర్ సుదీర్ఘంగా చర్చించారు. వీఐపీల రాకపోకల కోసం కేటాయించిన రోడ్డు మార్గాలు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ప్రాంతాల గుర్తింపు, భద్రతా దృష్ట్యా నగరాన్ని ‘నో డ్రోన్ జోన్’గా ప్రకటించడం వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తూ, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కీలక సమావేశంలో నేవీ ఉన్నతాధికారులు, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ప్రతినిధులు, ఎయిర్పోర్టు, సీపోర్టు అధికారులు పాల్గొనగా.. వారితో పాటు రైల్వే, సీఐఎస్ఎఫ్, ఫిషరీస్, ఫైర్ సర్వీస్ విభాగాల అధికారులు కూడా హాజరయ్యారు. పోలీస్ శాఖ తరఫున డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు పాల్గొని క్షేత్రస్థాయిలో భద్రతా ప్రణాళికల అమలుపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. -
ఆకట్టుకుంటున్న ‘వసుంధర’ నగల మేళా
ఏయూక్యాంపస్: వివాహ శుభకార్యాలకు మరింత శోభను చేకూర్చేలా ‘వసుంధర’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆభరణాల ఎగ్జిబిషన్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్థానిక వెల్కమ్ గ్రాండ్ బే హోటల్లో మంగళవారం ప్రారంభమైన ఈ రెండు రోజుల బంగారు, వజ్రాల నగల ప్రదర్శనను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైవిధ్యమైన, నూతన డిజైన్లతో కూడిన ఈ ప్రదర్శన విశాఖ వాసులకు మంచి అవకాశమని కొనియాడారు. సంస్థ వ్యవస్థాపకురాలు వసుంధర కాసరనేని మాట్లాడుతూ.. విశాఖలో తమ ఆభరణాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన ప్రత్యేక కలెక్షన్ల గురించి సంస్థ ఉపాధ్యక్షురాలు, విశాఖ బ్రాంచ్ అధిపతి శ్రీదేవి తొట్టెంపూడి వివరించారు. వందలాది వినూత్న డిజైన్లు, మెరిసే వజ్రాల నగల కలెక్షన్ మగువులను మంత్రముగ్ధులను చేస్తోంది. తొలిరోజే పెద్ద సంఖ్యలో మహిళలు విచ్చేసి తమకు నచ్చిన ఆభరణాలను ఆసక్తిగా కొనుగోలు చేశారు. బుధవారం కూడా ఈ ప్రదర్శన కొనసాగనుంది. -
తాబేళ్లను రక్షించిన ఇండియన్ నేవీ
విశాఖ సిటీ : సముద్ర సరిహద్దులను కాపాడటమే కాకుండా, సముద్ర గర్భంలోని మూగజీవాలను సంరక్షించడంలోనూ భారత నావికాదళం తమ దాతృత్వాన్ని చాటుకుంది. విశాఖ తీరంలో గస్తీ నిర్వహిస్తున్న ‘ఐఎన్ఎస్ తార్ముగ్లి’ యుద్ధ నౌక సిబ్బంది.. మృత్యువుతో పోరాడుతున్న రెండు అరుదైన తాబేళ్లను ప్రాణాలతో రక్షించారు. కోస్టల్ సెక్యూరిటీ పెట్రోలింగ్లో భాగంగా ఐఎన్ఎస్ తార్ముగ్లి సిబ్బంది సముద్రంపై గస్తీ నిర్వహిస్తుండగా నీటిపై తేలుతున్న పాత చేపల వలలో ఏదో కదలిక ఉండడాన్ని గమనించారు. నిశితంగా పరిశీలించగా, అంతర్జాతీయంగా అంతరించిపోతున్న జాబితాలో ఉన్న రెండు ‘ఆలివ్ రిడ్లే’ తాబేళ్లు ఆ వలలో చిక్కుకున్నట్లు గుర్తించారు. వెంటనే యుద్ధనౌకలోని నేవీ డైవర్లు సముద్రంలోకి దూకి ఆ వలను కోసి తాబేళ్లను విడిపించారు. గాయాలపాలైన ఆ తాబేళ్లకు ప్రాథమిక చికిత్స అందేలా చూసి, వాటిని సురక్షితంగా తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టారు. -
పలుకు సరస్వతి
పేరు లక్ష్మి..అవధాన రంగంలో జయలక్ష్మి అద్భుత ప్రతిభ పుష్కర ప్రాయంలోనే ‘అష్టావధానం’ అక్షరం ఆమెకు ఆటవస్తువు.. సంస్కృతం ఆమెకు ప్రాణవాయువు.. పన్నెండేళ్ల చిరుప్రాయంలోనే ఉద్ధండ పండితులు సైతం విస్తుపోయేలా సంస్కృత అష్టావధానాలు చేస్తూ అసాధారణ ప్రతిభను చాటుతోంది నరసింహదేవర జయలక్ష్మి. మైథిలీనాథ్, కిరణ్మయి దంపతుల పుత్రికగా, కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి నామానుగ్రహంతో జన్మించిన ఈ బాలిక, నేడు సాహితీ లోకంలో ఒక సంచలనంగా మారింది. ప్రస్తుతం బెంగళూరులోని పూర్ణప్రమతి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న జయలక్ష్మి, అటు ఆధునిక విద్యలోనూ, ఇటు ప్రాచీన సంస్కృత సాహిత్యంలోనూ అద్వితీయమైన ప్రజ్ఞను కనబరుస్తోంది. గురువుల శిక్షణలో.. గురువుల శిక్షణలో రాటుదేలిన ప్రతిభ ప్రవచన రాజహంస, అభినవ వాల్మీకి వంటి బిరుదాంకితులు, సంస్కృతాంధ్రా అవధానాల్లో అగ్రగణ్యులైన దూళిపాళ మహాదేవమణి సుశిక్షణలో జయలక్ష్మి అవధానిగా రూపుదిద్దుకుంది. అలాగే మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, కవితాకళానిధి నరసింహదేవర ఉమామహేశ్వరశాస్త్రి వంటి దిగ్గజాల మార్గదర్శకత్వం ఈమె ప్రతిభా వికాసానికి బలమైన పునాదిగా నిలిచింది. కేవలం నాలుగేళ్ల వయసు నుండే శ్లోక రచన ప్రారంభించిన జయలక్ష్మి, ఏడేళ్లకే ‘శ్యమంతకోపాఖ్యానం’, తొమ్మిదేళ్లకే ‘పిబరే రామరసం’ పేరుతో సంక్షిప్త రామాయణాన్ని రచించి తన మేధాశక్తిని నిరూపించుకుంది. ఇప్పటివరకు సుమారు 800 శ్లోకాలతో పాటు, తన సొంత ముద్రతో 16 దేవతా కృతులను సృజించడం సామాన్యమైన విషయం కాదు. కాశీ నుంచి విశాఖ వరకు.. కాశీ నుంచి విశాఖ వరకు.. జయలక్ష్మి అవధాన ప్రయాణం అత్యంత పవిత్రంగా ప్రారంభమైంది. 2025 అక్టోబర్ 26న కాశీ విశ్వనాథుని సన్నిధిలో జగద్గురువుల ఆశీస్సులతో, సామవేదం షణ్ముఖ శర్మ వంటి మహామహుల సమక్షంలో తన తొలి సంస్కృత అవధానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. ఆ తర్వాత పల్లిపాలెంలో విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి సమక్షంలో రెండో అవధానం, ఈ ఏడాది జనవరిలో అనంతపురం శంకరమఠంలో శలాక రఘునాథశర్మ అధ్యక్షతన మూడో అవధానం పూర్తి చేసి పండితుల ప్రశంసలు పొందింది. కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమస్యాపూరణ పోటీలో ద్వితీయ స్థానం సాధించడం ఆమె ప్రతిభకు మరో నిదర్శనం. నాలుగో అవధానం మంగళవారం విశాఖ ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో పూర్తి చేసింది. పండితుల ప్రశంసలు తన గురువు దూళిపాళ మహాదేవమణి సంచాలకత్వంలో జయలక్ష్మి మంగళవారం తన నాలుగవ సంస్కృత అష్టావధానంతో పండితులను ఔరా అనిపించింది. ఈ అవధానంలో నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, న్యస్తాక్షరి, ఆశువు, ఘంటావధానం, అప్రస్తుత ప్రసంగం వంటి క్లిష్టమైన ఎనిమిది అంశాలను ఆమె అవలీలగా ఎదుర్కోంది. అపారమైన ధారణా శక్తి, అప్పటికప్పుడు పద్యాలను అల్లగలిగే సృజనాత్మకత కలిగిన జయలక్ష్మి, భావితరాలకు మన ప్రాచీన భాషా వైభవాన్ని చాటిచెప్పే స్ఫూర్తిప్రదాతగా నిలుస్తోంది. భగవద్గీత పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, చిన్న వయస్సులోనే ఇంతటి పాండిత్యాన్ని సంపాదించిన ఈ బాల మేధావి ప్రస్థానం సాహితీ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం. ఏకాగ్రత, అపార జ్ఞాపకశక్తి, భాషా పరిజ్ఞానం మేళవిస్తేనే సాధ్యమయ్యే ‘అష్టావధానం’ వంటి క్లిష్టమైన ప్రక్రియను చిరు ప్రాయంలోనే అవలీలగా చేస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది నరసింహదేవర జయలక్ష్మి. బెంగళూరులో ఏడో తరగతి చదువుతున్న ఈ చిచ్చరపిడుగు, ఇప్పటికే మూడుసార్లు సంస్కృత అవధానం నిర్వహించి శభాష్ అనిపించుకుంది. మంగళవారం సాయంత్రం విశాఖ ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో జరిగిన తన నాలుగవ సంస్కృత అష్టావధానంలో సాహితీ దిగ్గజాల మధ్య తన ప్రతిభను చాటింది. పృచ్ఛకులు విసిరిన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, పద్యాలను అప్పటికప్పుడు అల్లి, ధారణా శక్తితో వాటిని తిరిగి చెప్పిన తీరు చూసి సాహితీవేత్తలు విస్మయం చెందారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ఈ బాలిక వారధిలా నిలుస్తోందని పండితులు ప్రశంసల జల్లు కురిపించారు. – సీతంపేట -
బాల మేధావి అపూర్వ అష్టావధానం
అబ్బురపడ్డ సాహితీవేత్తలు సీతంపేట: విశాఖ సాహితి ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో జరిగిన నరసింహదేవర జయలక్ష్మి సంస్కృత అష్టావధానం సభికులను మంత్రముగ్ధులను చేసింది. బెంగళూరులో 7వ తరగతి చదువుతున్న ఈ బాలిక, మహాదేవ మణి శిష్యురాలిగా తన అద్భుత మేధాశక్తిని ప్రదర్శించింది. ఎనిమిది మంది పృచ్ఛకులు సంధించిన కఠినమైన సాహిత్య సవాళ్లు, నిషిద్ధాక్షరి, దత్తపది వంటి అంశాలను ఏకాగ్రతతో ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు అల్లి తన ధారణా శక్తితో అందరినీ నివ్వెరపరిచింది. శ్రీలలితాపీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతీ స్వామి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ సభకు ఆచార్య కోలవెన్ను మలయవాసిని అధ్యక్షత వహించగా, డాక్టర్ ధూళిపాళ మహదేవమణి సంచాలకులుగా వ్యవహరించారు. పీబీవీ శివప్రసాద్, డా.ధూళిపాళ అన్నపూర్ణ వంటి ప్రముఖులు పృచ్ఛకులుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో, చిన్న వయస్సులోనే సంస్కృత భాషపై జయలక్ష్మి కనబరిచిన పట్టును చూసి సెంచురియన్ వర్సిటీ వీసీ ఆచార్య జి.యస్.ఎన్.రాజు, విశ్రాంత ఐఏఎస్ వై.వి. అనురాధ తదితర ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. -
మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యం
సబ్బవరం: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో నూతనంగా ఎంపికై న 6 వేల మంది కానిస్టేబుల్ శిక్షణార్థులకు మాదకద్రవ్యాల నియంత్రణ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంతో రాష్ట్ర పోలీస్ శాఖ మంగళవారం ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జరిగిన ఈ ఒప్పందం ద్వారా, ప్రస్తుతం శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు మాదకద్రవ్యాల కేసుల నమోదు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణపై నిష్ణాతులైన న్యాయ నిపుణులచే శిక్షణ ఇప్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 పోలీస్ శిక్షణ కళాశాలలు, 5 బెటాలియన్లు మరియు 9 పోలీస్ శిక్షణ కేంద్రాలలో తొమ్మిది నెలల పాటు కొనసాగే ఈ శిక్షణలో భాగంగా, ఈ నెల 22వ తేదీ నుంచి ప్రత్యేక ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ తరగతుల ద్వారా ఎన్.డి.పి.ఎస్ చట్టంలోని మెళకువలు, క్షేత్రస్థాయిలో చట్టాన్ని అమలు చేసే విధానాలపై శిక్షణార్థులకు పట్టు సాధించేలా బోధించనున్నారు. ఈ శిక్షణ వల్ల రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసు యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ డి. రామచంద్రరాజు, డీఎస్ఎన్ఎల్యూ ఉపకులపతి ఆచార్య డి. సూర్యప్రకాశరావు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఐజీపీ (ట్రైనింగ్) సత్య యేసు బాబు తదితర ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొని మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ఈ విద్యా–పోలీస్ భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పోలీస్ శాఖ – డీఎస్ఎన్ఎల్యూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం -
సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ–ఏక్సిస్ ఆవిష్కరణ
బీచ్రోడ్డు: సుజుకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఈ–ఏక్సిస్‘ను సిరిపురంలోని పద్మజ సుజుకి షోరూంలో సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, ఎంవీఐ బుచ్చిరాజు, వరుణ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ దేవ్, ఈడీ టి.వినోద్కుమార్లు గౌరవ అతిథులుగా హాజరై మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యతను వివరించారు. సుజుకి ఈ–ఏక్సిస్ ఆధునిక సాంకేతికత, డిజైన్, ఫీచర్లతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. వాహనాన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 95 కి.మీ. ప్రయాణించవచ్చన్నారు. మూడేళ్లలోపు విక్రయించేవారి బై బ్యాక్ ఆఫర్ 80 శాతం అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పద్మజ సుజుకి జీఎం రఫీ, సుజుకి ఏరియా సేల్స్ మేనేజర్ సురేందర్, ఏరియా సర్వీస్ మేనేజర్ సాయి, పద్మజ సుజుకి సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు. -
ఫస్ట్ అండ్ లాస్ట్ బడ్జెట్!
మేయర్ కాలానికి మోగిన ముగింపు గంట నేడు 2026–27 జీవీఎంసీ బడ్జెట్ సమావేశం మరో నెలన్నరలో పాలకవర్గానికి తెర డాబాగార్డెన్స్ : జీవీఎంసీ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. నగర పాలకవర్గం కాలపరిమితి ముగియడానికి మరో నెలన్నర రోజులే గడువు ఉండటంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు నగర ప్రజల్లో భవిష్యత్తు పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెల 18వ తేదీతో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం అధికారికంగా ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో మేయర్ పీలా శ్రీనివాసరావు బుధవారం ప్రవేశపెట్టనున్న 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్, ఆయన పదవీ కాలంలో మొదటిది, చివరిది కావడం గమనార్హం. నిబంధనల ప్రకారం మార్చి 7వ తేదీ తర్వాత ఎటువంటి కౌన్సిల్ సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో, ఉన్న కొద్దిపాటి సమయంలోనే వీలైనన్ని స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించి పెండింగ్ పనులను చక్కబెట్టే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. మళ్లీ చంద్రకాలమేనా? నగర చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, మళ్లీ పాత రోజులే పునరావృతమవుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2012 ఫిబ్రవరి 27 నుంచి సుమారు ఎనిమిదేళ్ల పాటు జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించలేదు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, అధికారుల పాలనే సుదీర్ఘకాలం కొనసాగింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 2021లో గ్రేటర్ విశాఖకు ఎన్నికలు నిర్వహించగా, వైఎస్సార్ సీపీ ఘనవిజయం సాధించి పాలనా పగ్గాలు చేపట్టింది. ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, గతంలో లాగే మళ్లీ అధికారుల పాలన మొదలవుతుందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పట్లో ఎన్నికలు లేనట్టే.. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఇప్పట్లో ఎన్నికలు వచ్చే సూచనలు కనిపించడం లేదు. పాలకవర్గ పదవీకాలం ముగియగానే సహజంగానే అధికారుల పాలన అమల్లోకి రానుంది. ఇదే తరుణంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. తన నియోజకవర్గ పరిధిలోని 64 పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేయాలని కోరుతూ ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు సాఫీగా రాకపోకలు సాగడానికి, భీమిలి పరిధిలో ప్రతిపాదించిన ఏడు కీలక మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణానికి ఈ విలీనం ఎంతో అవసరమని ఆయన వాదిస్తున్నా రు. ఒకవేళ ప్రభుత్వం ఈ విలీన ప్రక్రియను చేపడితే, అది పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండదు కాబట్టి, మరోసారి సుదీర్ఘకాలం పాటు నగర పాలన అధికారుల చేతుల్లోనే ఉండే అవకాశం ఉంది. విద్యారంగంపై నిర్లక్ష్యం గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విద్యకు మంచి ప్రాధాన్యతనిచ్చారు. బాల్యం పథకం కింద 3 నుంచి 7 ఏళ్లలోపు బాలలకు చిన్నబడి కార్యక్రమం కింద అంగన్వాడీ కేంద్రాలతో మున్సిపల్ పాఠశాలలను అనుసంధానం చేసి పౌష్టికాహారం, విద్య, క్రీడా సదుపాయాలు కల్పించేందుకు రూ.15 కోట్లు కేటాయిస్తే..ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విద్యకు కేవలం రూ.2.25 కోట్లు మాత్రమే కేటాయించారు. గత బడ్జెట్ అలా.. నేటి బడ్జెట్ ఇలా.. నగర ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబించే బడ్జెట్ గణాంకాల్లో కూడా భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ప్రారంభ నిల్వ రూ.482.26 కోట్లుగా ఉండగా, ప్రస్తుత 2026–27 బడ్జెట్లో అది రూ.365.96 కోట్లకు పడిపోయింది. అంటే ప్రారంభ నిల్వలోనే సుమారు రూ.116.3 కోట్ల మేర కోత పడింది. గతేడాది అన్ని పద్దుల కింద మొత్తం ఆదాయం రూ.4,761.87 కోట్లుగా చూపగా, ఈ ఏడాది అది రూ.4,180.37 కోట్లకు పరిమితమైంది. అంటే ఆదాయం పరంగా చూస్తే ఈ ఏడాది ఏకంగా రూ.370 కోట్లు తగ్గినట్లు స్పష్టమవుతోంది. ముగింపు నిల్వలో సైతం రూ.27 కోట్ల మేర తేడా ఉండటం గమనార్హం. -
ఫిర్యాదులు
పచ్చనేతల తప్పుడు ప్రచారాలపై సాక్షి, విశాఖపట్నం: కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు లేదని సీబీఐ ఆధ్వర్యంలో సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తప్పుడు ఆరోపణలు చేసిన పాపం ఎక్కడ తమకు అంటుకుంటుందోనన్న భయం కూటమి నేతల్లో మొదలైంది. అసత్య ఆరోపణలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పలేక తప్పించుకునేందుకు విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు తెరతీసింది. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, ౖవైవీసుబ్బారెడ్డి, కరుణాకర్రెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తోంది. హిందూ ధర్మాన్ని, హిందువుల మనోభావాలను దెబ్బతిస్తూ అసత్య ఆరోపణలు చేస్తోంది. ఈ ఫ్లెక్సీలు పెట్టిన వారిపైనా, వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినిపై దాడులకు పాల్పడిన వారిపైనా చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్లలో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. ● గాజువాక నియోజకవర్గంలో సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి న్యూపోర్టు పోలీసుస్టేషన్లో సీఐ కామేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, వైవీ.సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డిలపై దుష్ప్రచారం చేస్తున్న, సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్న కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదు చేయాలని కోరారు. కార్పొరేటర్లు గుడివాడ అనూష, మహ్మద్ ఇమ్రాన్, ఉరుకూటి చందుతో పాటు పార్టీ నేతలు మార్టుపూడి పరదేశి, కోమటి శ్రీనివాసరావు పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ● విశాఖ తూర్పు నియోజకవర్గంలో సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో ఎంవీపీ పోలీస్స్టేషన్ సీఐ ప్రసాదరావుకు వైఎస్సార్ సీపీ నాయకులు ఫిర్యాదును అందజేశారు. తిరుమల లడ్డూపై నిరాధార ఆరోపణలతో వైఎస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేయడమే కాకుండా తమ పార్టీ నేతల ఇళ్లపై దాడులకు తెగబడిన కూటమి నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, కార్పొరేటర్లు మువ్వల లక్ష్మి, మొల్లి లక్ష్మి, పల్లా దుర్గారావు, పార్టీ ముఖ్యనేతలు పేర్ల విజయచందర్, అల్లంపల్లి రాజుబాబుతోపాటు వైఎస్సార్సీసీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ● విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానికీరామ్ ఆధ్వర్యంలో వన్టౌన్ పోలీస్స్టేషన్లో సీఐ వరప్రసాద్కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నేతలు సనపల రవీంద్ర భరత్, ముజిఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 31వ వార్డు అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రామానంద్ ఆధ్వర్యంలో టూటౌన్ సీఐకి ఫిర్యాదు చేశారు. 27వ వార్డు సర్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఫోర్తు టౌన్ పోలీస్స్టేషన్ సీఐకి ఫిర్యాదు చేశారు. 29వ వార్డు అధ్యక్షుడు పీతల వాసు ఆధ్వర్యంలో మహారాణిపేట పోలీస్ స్టేషన్ సీఐకి ఫిర్యాదు చేశారు. ● విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 56వ వార్డు కార్పొరేటర్ గుండాపు నాగేశ్వరరావు, బల్ల లక్ష్మణ్రావు, పీవీ సురేష్ మల్కాపురం సీఐ గొలగాని అప్పారావుకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు మళ్ల ధనలత, రేవల్ల సత్యనారాయణ, వై.రాజు, పిలకా రాము పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
రూ. 4,180 కోట్ల అంచనాతో జీవీఎంసీ వార్షిక బడ్జెట్
రేపు ప్రవేశపెట్టనున్న మేయర్ బడ్జెట్ ప్రొఫైల్డాబాగార్డెన్స్: జీవీఎంసీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను మేయర్ పీలా శ్రీనివాసరావు బుధవారం కౌన్సిల్ హాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఐదేళ్ల పాలనలో మొదటి నాలుగేళ్లు వైఎస్సార్ సీపీకి చెందిన గొలగాని హరి వెంకటకుమారి మేయర్ హోదాలో బడ్జెట్ను ఆమోదింపజేయగా, ప్రస్తుత పాలకవర్గంలో మేయర్ పీలా శ్రీనివాసరావుకు ఇది చివరి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశంగా నిలిచింది. బుధవారం నిర్వహించనున్న ఈ బడ్జెట్ సమావేశానికి సంబంధించి గత నెల 12నే జీవీఎంసీ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో మేయర్, స్థాయీ సంఘం చైర్మన్ సమక్షంలో ప్రాథమిక చర్చలు జరిగాయి. ఆ సమావేశంలో వివిధ విభాగాల వారీగా కేటాయింపులు, జమలు, ఖర్చులపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించి, కొన్ని మార్పులు చేర్పులతో ముసాయిదాకు ఆమోదం తెలిపారు. బడ్జెట్ అంచనాలు ఇలా.. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనాలను పరిశీలిస్తే, ప్రారంభపు నిల్వ రూ.365.96 కోట్లుగా ఉండగా, అన్ని పద్దుల కింద వచ్చే జమలు రూ.3814.41 కోట్లుగా లెక్కించారు. వెరసి మొత్తం ఆదాయం రూ.4180.37 కోట్లు కాగా, వివిధ అభివృద్ధి పనులు మరియు నిర్వహణ కోసం రూ.4047.12 కోట్లను ఖర్చుగా ప్రతిపాదించారు. చివరగా రూ.133.25 కోట్లను ముగింపు నిల్వగా నిర్ణయించారు. శాఖల వారీగా చూస్తే సాధారణ పరిపాలన విభాగంలో రూ.1232.60 కోట్ల జమలు, రూ.375.82 కోట్ల ఖర్చులు ఉండగా, అత్యధికంగా ఇంజనీరింగ్ విభాగంలో రూ.1018.18 కోట్ల ఖర్చులను ప్రతిపాదించారు. లైటింగ్ విభాగం కోసం రూ.129.19 కోట్లు, ప్రాజెక్టుల కోసం రూ.67.35 కోట్లు, టౌన్ ప్లానింగ్ కోసం రూ.23.98 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రజారోగ్యం విభాగానికి రూ.455.94 కోట్లు, నీటి సరఫరా విభాగానికి రూ.260.08 కోట్లు కేటాయించగా, విద్య, పార్కుల అభివృద్ధికి కూడా తగిన ప్రాధాన్యతనిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల విషయానికి వస్తే అమృత్ పథకం కింద రూ.388 కోట్లు, ఆర్థిక సంఘం నిధుల నుండి రూ.215 కోట్లు, అర్బన్ చాలెంజింగ్ ఫండ్ ద్వారా రూ.650 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు డిపాజిట్లు, అడ్వాన్సుల కింద రూ.340.82 కోట్ల వ్యయాన్ని బడ్జెట్ అంచనాల్లో పొందుపరిచారు. రూ.1018.18 కోట్లుఇంజినీరింగ్ విభాగం రూ.650 కోట్లు అర్బన్ చాలెంజింగ్ ఫండ్ ప్రజారోగ్యం విభాగానికి రూ.455.94 కోట్లునీటి సరఫరా విభాగానికి రూ.260.08 కోట్లు రూ.129.19 కోట్లులైటింగ్ విభాగం కోసం టౌన్ ప్లానింగ్ కోసం రూ.23.98 కోట్లు అన్ని పద్దుల కింద జమలు రూ.3814.41 కోట్లు ముగింపు నిల్వ రూ.133.25 కోట్లు -
కుట్రలు బట్టబయలయ్యేసరికి అబద ్ధపు ఫ్లెక్సీలు
సాక్షి, విశాఖపట్నం: తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన కుట్రలు సీబీఐ చార్జీషీట్తో విఫలమయ్యాయని, అందుకే దిక్కుతోచక వైఎస్సార్సీపీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో అక్కయ్యపాలెం కూడలిలో గుర్తుతెలియని వ్యక్తులు వై.ఎస్. జగన్మోహన్నెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల ఫొటోలతో అబద్ధపు ఆరోపణలున్న భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ తేల్చిచెప్పిన నేపధ్యంలో, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కూటమి మద్దతుదారులు విశాఖలో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇలా తప్పుడు ప్రచారం చేయడం తీవ్రమైన నేరమన్నారు. ఈ ఘటనపై కేకే రాజు ఫోర్త్ టౌన్ సీఐ ఉమాకాంత్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఎంఎస్ఎంఈలు, మౌలిక వసతులపై దృష్టి రాష్ట్రానికి అనుకూలం
బీచ్రోడ్డు: కేంద్ర బడ్జెట్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. నగరంలోని ఓ హోటల్లో మీడియాతో సోమవారం మాట్లాడిన ప్యాప్సీ మాజీ అధ్యక్షుడు కంకటాల మల్లికార్జునరావు మాట్లాడారు. బడ్జెట్లో ఆత్మనిర్భర్ ఇండియా ఫండ్కు ప్రతిపాదించిన రూ.4,000 కోట్లు చిన్న వ్యాపారాల మూలధన ప్రాప్తిని మెరుగుపరుస్తుందన్నారు. ఈ బడ్జెట్లో ఎలాంటి ఉచితాలు లేవని, ఇందుకు కేంద్రం వద్ద బడ్జెట్ సరిపడా లేకపోవడం కారణం కావొచ్చన్నారు. వీసీసీఐ అధ్యక్షుడు ఎం.సుదర్శన్ స్వామి మాట్లాడుతూ లాజిస్టిక్స్, పోర్టులు, తీర రవాణా, ఫ్రైట్ కారిడార్లపై దృష్టి రాష్ట్ర సముద్ర ఆధారిత సామర్థ్యాలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పి.శోభన్ ప్రకాష్ మాట్లాడుతూ మూలధన వ్యయాన్ని రూ.12.22 లక్షల కోట్లకు పెంచడం ఉపాధి, పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. భారత డేటా సెంటర్లను వినియోగించే ఏఐ, క్లౌడ్ సంస్థలకు 2047 వరకు పన్ను రాయితీలు ఇవ్వడం విశాఖను డిజిటల్ మౌలిక వసతుల ప్రధాన కేంద్రంగా నిలబెడుతుందని అభిప్రాయపడ్డారు. -
మాట నిలబెట్టుకున్నాం
మా మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తామని వారి కుటుంబాలకు మాట ఇచ్చాం, ఆ మాట నిలబెట్టుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. బంగ్లాదేశ్ అధికారులతో మాట్లాడి, జైలులో ఉన్న మనవారికి ధైర్యం చెప్పడమే కాకుండా.. వారి విడుదల కోసం నాలుగు నెలల పాటు నిరంతరం శ్రమించాం. ఈ మానవతా ప్రయత్నంలో సహకరించిన భారత హైకమిషన్ (ఢాకా), ఖుల్నా అసిస్టెంట్ హైకమిషన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. అందరి సమన్వయంతోనే ఈ విజయం సాధ్యమైంది. –వాసుపల్లి జానకి రామ్ -
గడువులోగా అర్జీలకు పరిష్కారం చూపాల్సిందే
బీచ్రోడ్డు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులో పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ హెచ్చరించారు. కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో పాల్గొని అర్జీలు రీ–ఓపెన్ అయ్యే పరిస్థితి రావద్దని స్పష్టం చేశారు. రెవెన్యూ క్లినిక్లకు వచ్చే భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో జాప్యం సహించబోమని పేర్కొన్నారు. ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగేలా రెవెన్యూ క్లినిక్లను అర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వినతులకు సరైన సమాధానం ఇవ్వకుండా పదేపదే రీ–ఓపెన్కు కారణమవుతున్న పద్మనాభం వ్యవసాయ శాఖ ఏవోకు నోటీసు ఇచ్చి, 48 గంటల్లోగా వివరణ తీసుకుని తనకు నివేదించాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ విద్యాధరి, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ సత్యవేణిలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు 444 వినతులు సమర్పించారు. వాటిలో రెవెన్యూకి సంబంధించి 154, జీవీఎంసీకి చెందినవి 105, పోలీసు 10, ఇతర శాఖలకు సంబంధించినవి 175 వినతులు ఉన్నాయి. ఐఎఫ్ఆర్ కు సన్నద్దంగా ఉండండి ఇటీవల జరిగిన విశాఖ ఉత్సవ్ నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేసి, విజయవంతం చేశారని ప్రశంసించారు. ఇదే తీరున మరి కొన్ని రోజుల్లో జరగనున్న ఐఎఫ్ఆర్ను కూడా విజయవంతం చేయాలని సూచించారు. ‘స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు శాఖ’ పోస్టర్ ఆవిష్కరణ స్వర్ణాంధ్ర మన సంకల్పం(విజన్–2047) లక్ష్యంతో ఇటీవల పేరు మార్చిన గ్రామ సచివాలయాలకు సంబంధించిన పోస్టర్ను సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. స్వర్ణ గ్రామం– స్వర్ణ వార్డు పేరిట రూపొందించిన ఈ పోస్టర్ను గ్రామవార్డు సచివాలయ కో–ఆర్డినేటర్ ఉషారాణి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, జేసీ, ఇతర అధికారులు ఆవిష్కరించారు. జర్నలిస్టులకు వారం రోజుల్లో ఆరోగ్య పరీక్షలు విశాఖ జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు వారం రోజుల్లో ఆరోగ్య పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి(ఎన్ఏజే), ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు కలెక్టర్ను పీజీఆర్ఎస్లో కలిసి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్టుల బస్ పాస్ల గడువు ముగిసిన నేపథ్యంలో కొత్త అక్రిడిటేషన్లు జారీ అయ్యే వరకు మరో నెల రోజుల పాటు పాసుల్ని రెన్యువల్ చేయాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ. ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావు బ్రాడ్కాస్ట్ కార్యదర్శి కింతాడ మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చక్రి, సంజీవ్, రాజశేఖర్, జి.జగన్ తదితరులున్నారు పోలీస్ పీజీఆర్ఎస్కు 102 ఫిర్యాదులు విశాఖ సిటీ: పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులపై దృష్టి పెట్టి చట్టపరంగా వాటిని పరిష్కరించాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీస్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు 102 ఫిర్యాదులు వచ్చాయి. సీపీ స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జీవీఎంసీ జోన్–3 ఏసీపీపై చర్యలు తీసుకోవాలి నా సొంత స్థలంలో ఉన్న షాపును ఓ ప్రైవేట్ వ్యక్తితో చేతులు కలిపి జీవీఎంసీ జోన్–3 ఏసీపీ గత ఏడాది జూన్ 2న ఫుట్పాత్ ఆక్రమణ పేరిట తొలగించారు. నా షాప్ పక్కన చాలా షాపులున్నా.. కేవలం రాజకీయ ఒత్తిడితో నా షాపును మాత్రమే తొలగించారు. గత 30 ఏళ్లుగా కరెంట్ బిల్లు, టాక్స్లు కడుతున్నాను. వేరే వ్యక్తులు అక్కడ ఫుట్పాత్ను ఆక్రమించి మటన్ షాపులు నిర్వహిస్తున్నారు. వాటికి ఏసీపీ సహకరిస్తున్నారు. తక్షణమే ఏసీపీపై విచారణ జరిపి, నాకు న్యాయం చేయాలి. – ఎం.శ్యామ్కుమార్, చినవాల్తేరు -
రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి
ఉక్కునగరం: విధులకు వెళ్తున్న స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుడు మార్గమధ్యలో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. స్టీల్ప్లాంట్ పోలీసులు అందించిన వివరాలివి.. వడ్లపూడి అప్పికొండ ఆర్హెచ్ కాలనీకి చెందిన జి.సంజీవరావు(41) స్టీల్ప్లాంట్ టీపీపీ విభాగంలో స్కిల్డ్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. సోమవారం యథావిధిగా బైక్పై విధులకు బయల్దేరాడు. సీఐఎస్ఎఫ్ యూనిట్ కాంప్లెక్స్ కూడలి వద్ద స్పీడ్ బ్రేకర్ దాటే క్రమంలో ముందున్న బైక్ను ఢీకొట్టాడు. దీంతో కింద పడి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ఉద్యోగులు అతన్ని వెంటనే కారులో ఉక్కు జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. స్టీల్ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏప్రిల్ నాటికి పేదల గృహాలకు సోలార్ వెలుగులు
కొమ్మాది: రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ద్వారా విద్యుత్ లబ్ధి చేకూరుతుందని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వితేజ్ అన్నారు. సోమవారం సాగర్నగర్లో నిర్వహించిన వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం సూర్యఘర్–ముఫ్త్ బిజిలీ యోజన’ కింద పేద కుటుంబాలకు సౌర విద్యుత్ అందించడంలో ఏపీ ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 328 మెగావాట్ల సామర్థ్యంతో 94 వేల కనెక్షన్లు ఉండగా, కేవలం ఈపీడీసీఎల్ పరిధిలోనే 142 మెగావాట్ల సామర్థ్యంతో 44,452 ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. క్లస్టర్ విధానంలో 41 సంస్థలకు టెండర్లు కేటాయించామని, ప్రతిరోజూ 250 కొత్త కనెక్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును ఏప్రిల్ 2026 నాటికి మెజారిటీ భాగం, మే నాటికి పూర్తిస్థాయిలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పృథ్వితేజ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంఎన్ఆర్ఈ డైరెక్టర్ ఆదిత్య ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం
కొమ్మాది: జీవీఎంసీ 8వ వార్డు ఎండాడలో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) బ్రాంచ్ను బ్యాంక్ జోనల్ మేనేజర్ వందన పాండే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువలో ఉండేందుకు అన్ని చోట్ల బ్రాంచ్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇది తమ 69వ బ్రాంచ్ అన్నారు. ప్రతి బ్రాంచ్లో రిటైల్, అగ్రి సంబంధిత అన్ని బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రానున్న 132వ వ్యవస్థాపన దినోత్సవం నాటికి డిజిటల్ లెండింగ్లో రూ.లక్ష కోట్ల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంక్ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో సచివాలయ ఉద్యోగి
రూ.16వేలు లంచం తీసుకొంటుండగా పట్టివేత గాజువాక: జీవీఎంసీ 74వ వార్డు నెహ్రూనగర్ సచివాలయ అడ్మిన్ సెక్రటరీ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఇంటి పన్ను మార్పు కోసం వచ్చిన ఒక వ్యక్తి నుంచి అడ్మిన్ సెక్రటరీ గణేష్ రూ.16వేలు లంచం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం రాత్రి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వార్డులోని పైడిమాంబ కాలనీకి చెందిన పల్లా సత్తిబాబు ప్రభుత్వ భూమిలో ఒక షెడ్డు నిర్మించుకొని జీవీఎంసీకి ఆస్తి పన్ను, నీటి కొళాయి పన్ను చెల్లిస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వం ఆ షెడ్డుకు సత్తిబాబు భార్య పేరుమీద పట్టా మంజూరు చేసింది. దీంతో తన షెడ్డుకు గల ఆస్తి పన్నును తన భార్య పేరుమీద మార్చాల్సిందిగా సత్తిబాబు దరఖాస్తు చేసుకున్నాడు. పని చేయాల్సిన నెహ్రూనగర్ సచివాలయ అడ్మిన్ సెక్రటరీ గణేష్ రూ.25వేలు లంచం డిమాండ్ చేయగా..ఇటీవల రూ.9 వేలు చెల్లించాడు. మిలిగిన రూ.16 వేలు డిమాండ్ చేయడంతో సత్తిబాబు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు మిగిలిన సొమ్ము ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ హర్షిత నేతృత్వంలో రెడ్హ్యాండెడ్గా పట్టుపడ్డాడు. ఏసీబీ అధికారులు నిందితుడి నివాసం, ఆఫీసు ప్రాంగణంలో ఈ సోదాలను కొనసాగించారు. దీనికి సంబంధించి రాత్రి 12 గంటలకు కూడా విచారణ కొనసాగింది. నిందితుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నగరంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. -
సాంస్కృతిక పోటీల్లో దివ్యాంగుల ప్రతిభ
ఆరిలోవ: సమగ్ర శిక్ష, జిల్లా సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో తోటగరువు వద్ద ఎర్నిమాంబ కల్యాణ మండపంలో సోమవారం ప్రత్యేక అవసరాల(దివ్యాంగ) పిల్లలకు సాంస్కృతిక, కళా, హస్తకళ ప్రదర్శన పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 11 భవిత కేంద్రాల నుంచి సుమారు 60 మంది పిల్లలు పాల్గొన్నారు. వివిధ వేషధారణలో పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఈవో ఎన్.ప్రేమకుమార్ ప్రతిభ కనబరిచిన పిల్లల్ని అభినందించి, బహుమతులు అందించారు. అనంతరం అయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఇలాంటి పోటీలు ఇక్కడ నిర్వహించడం ఇదే తొలిసారన్నారు. ఈ పోటీల్లో విభాగాలవారీగా 17 మందికి ప్రథమ, 11 మందికి ద్వితీయ, 10 మందికి తృతీయ బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ జె.చంద్రశేఖర్, ఏయూ ప్రొఫెసర్ ఎం.పుష్పరాజ్యం, ప్రియదర్శిని వికలాంగుల సంస్థ ప్రిన్సిపాల్ పి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్
తాటిచెట్లపాలెం: తిరుమల లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారం చేస్తూ విశాఖలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆధ్వర్యంలో ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నాయకులు, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలో రూ. 5 వేల కోట్ల భూములను గీతం సంస్థకు కట్టబెట్టడంపై తాము చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకే టిడిపి ఈ కుట్రలకు పాల్పడుతోందని, సనాతన ధర్మం గురించి మాట్లాడే బీజేపీ నాయకులు ఈ విష ప్రచారంపై ఎందుకు మౌనంగా ఉన్నారని వారు ప్రశ్నించారు. లడ్డూ ఆరోపణలు రాజకీయ కుట్రే : కేకే రాజు తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని సీబీఐ చార్జీషీట్, సిట్ నివేదికలతో స్పష్టమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జంతువుల కొవ్వు కలిసిందంటూ భక్తుల విశ్వాసాలతో ఆడుకోవడం దారుణమన్నారు. తమ అబద్ధాలు బయటపడటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైఎస్సార్ సీపీ నేతల ఇళ్లపై దాడులు చేయిస్తూ, ప్రశ్నించే గొంతుకలను కేసులతో నొక్కేస్తున్నారని మండిపడ్డారు. భక్తుల మనోభావాలను గాయపరిచినందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్లు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో అక్రమంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి : ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న విధ్వంసం చూస్తుంటే మనం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై పెట్రోల్ బాంబులతో దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణమన్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఆయనను అంతం చేసే కుట్రలా కనిపిస్తోందని ఆరోపించారు. లడ్డూ వివాదంలో పన్నిన కుట్రలు బయటపడటం, గీతం సంస్థకు భూముల కేటాయింపు వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. అధికార పార్టీ నేతలే స్వయంగా దాడుల్లో పాల్గొంటూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నందున, గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఎస్ఈసీ సభ్యులు రొంగలి జగన్నాథం, రాష్ట్ర సంయక్త కార్యదర్శి కిరణ్రాజు, తాడి జగన్నాథ్రెడ్డి, పల్లా దుర్గారావు రాష్ట్ర అనుబంధ విభాగాల కార్యనిర్వాహక అధ్యక్షులు జీవీ రవిరాజు, మాజీ చైర్మన్లు అల్లంపల్లి రాజబాబు, ఆల్ఫా కృష్ణ, జోనల్ అనుబంధ అధ్యక్షులు పీవీ సురేష్, ఎం.సునీల్కుమార్, సేనాపతి అప్పారావు, జిల్లా అనుబంధ అధ్యక్షులు బర్కత్ ఆలీ, బోని శివరామకృష్ణ, రాయపురెడ్డి అనిల్కుమార్, కర్రి రామారెడ్డి, పీలా ప్రేమ్కిరణ్ జగదీష్, దేవరకొండ మార్కండేయులు, బొండా ఉమామహేశ్వర్రావు, కార్పొరేటర్లు అల్లు శంకర్రావు, సాడి పద్మారెడ్డి, రెయ్యి వెంకటరమణ, కేవీఎన్ శశికళ, వార్డు అధ్యక్షుల చొల్లంగి నాగేశ్వర్రావు, భీశెట్టి విలియం ప్రసాద్, జక్కంపూడి సత్యనారాయణ, పైడిరమణ, బి.గోవింద్రాజు, డొప్ప శ్రీను, లాలం వేణు, గొపాలస్వామి, మెట్ట దమయంతి, యర్రంశెట్టి శ్రీనివాస్, గొడేసి శ్రీనివాసరెడ్డి, బొడ్డ గొవింద్, పార్టీ నాయకులు విక్టర్, రామన్నపాత్రుడు, దుళ్ల రామకృష్ణరెడ్డి, బొట్టా రాజు, పద్మశేఖర్, సుశీల, గంగామహేష్, గాలిప్రసాద్, బొడ్డేటి కిరణ్, మువ్వలసంతోష్, లక్ష్మణరావు, షేక్ బాబ్జీ, బంగారు భవాని శంకర్, తదితరులు పాల్గొన్నారు. కుట్రలు బట్టబయలయ్యేసరికి అబద్ధపు ఫ్లెక్సీలు -
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 129 వినతులు
58 అర్జీలతో పట్టణ ప్రణాళికా విభాగం టాప్! ఙడాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు 129 వినతులు అందాయి. వీటిలో అత్యధికంగా 58 ఫిర్యాదులు పట్టణ ప్రణాళికా విభాగానివే కావడం విశేషం. పీజీఆర్ఎస్ను అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ సంయుక్తంగా నిర్వహించారు. అందిన వినతుల్లో జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 9, రెవెన్యూ 14, ప్రజారోగ్య విభాగం 8, ఇంజినీరింగ్ సెక్షన్ 33, హార్టికల్చర్ 4, యూసీడీకి 3 అందాయి. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్కుమార్, ప్రధాన సిటీ ప్లానర్ ప్రభాకరరావు, డీసీఆర్ శ్రీనివాసరావు, ఏడీహెచ్ వాసు, స్పోర్ట్స్ డైరెక్టర్ అప్పలరాజు, పర్యవేక్షక ఇంజినీర్లు, డీసీపీలు, ఏసీపీలు, కార్యనిర్వాహక ఇంజినీర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
చావు అంచుల నుంచి క్షేమంగా..
నాలుగు నెలల చీకటి వీడింది.. గంగ పుత్రుల కన్నీళ్లు తుడిచింది. బంగ్లాదేశ్ చెర నుంచి విముక్తులై, చావు అంచుల్లో నుంచి ప్రాణాలతో తిరిగి వచ్చిన మత్స్యకారులు సోమవారం ఉదయం తమ సొంత గడ్డపై అడుగుపెట్టారు. ఆత్మీయుల ఆలింగనాలతో ఫిషింగ్ హార్బర్ కన్నీటి సంద్రమైంది. – బీచ్రోడ్డు ఇంజిన్ వైఫల్యంతో అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లి, బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు చిక్కిన 9 మంది మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా ఇళ్లకు చేరారు. గత ఏడాది అక్టోబర్ 14న వేటకు వెళ్లిన వీరు అక్టోబర్ 22న అరెస్ట్ అయ్యి బాగర్హాట్ జైలులో నాలుగు నెలల పాటు మగ్గారు. కేంద్ర ప్రభుత్వం, మత్స్యకార సంఘాల చొరవతో జైలు నుంచి విముక్తి పొంది, సోమవారం ఉదయం ప్రత్యేక షిప్లో విశాఖ ఫిషింగ్ హార్బర్కు చేరుకున్నారు. మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు, మైరెన్ పోలీసులు వీరికి స్వాగతం పలికి, కలెక్టర్ ఆదేశాల మేరకు నిత్యావసరాలు అందజేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చావు అంచుల్లో నుంచి తిరిగి వచ్చామంటూ మత్స్యకారులు కన్నీటి పర్యంతమయ్యారు. కీలకపాత్ర పోషించిన జానకిరామ్ 9 మంది మత్స్యకారుల విడుదలలో వైఎస్సార్ సీపీ నాయకులు, బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ కీలక పాత్ర పోషించారు. స్వయంగా బంగ్లాదేశ్ వెళ్లిన ఆయన, అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపి మత్స్యకారుల విముక్తికి కృషి చేశారు. జైల్లో ఉన్న సమయంలో బాధితులతో వీడియో కాల్స్ మాట్లాడించి, వారి కుటుంబాల్లో ధైర్యం నింపారు. భావోద్వేగలతో నిండిన హార్బర్ బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన తొమ్మిది మంది మత్స్యకారులు విశాఖ తీరానికి చేరుకోవడంతో హార్బర్లో భావోద్వేగ దృశ్యాలు నెలకొన్నాయి. అసలు తిరిగి వస్తామో లేదో అన్న భయం నుంచి విముక్తి పొంది.. తమ కుటుంబ సభ్యులను చూడగానే మత్స్యకారులు ఆనంద భాష్పాలతో వారిని ఆలింగనం చేసుకున్నారు. ప్రాణాలతో తిరిగి వచ్చిన తమ వారిని చూసి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. విడుదలైన మత్య్సకారులు వీరే.. విశాఖ జిల్లాకు చెందిన మారుపల్లి చిన్న అప్పన్న, మారుపల్లి ప్రవీణ్ ,నక్క రమణ, మారుపల్లి రమేష్, విజయనగరం జిల్లాకు చెందిన వాసుపల్లి సీతయ్య, మైలపల్లి అప్పన్న , సురపటి రాము, మారుపల్లి చిన్న అప్పన్న, సూరడ అప్పలకొండ.ప్రాణాలతో వస్తారనుకోలేదు నా భర్త సంపాదన మీదే ఇద్దరు పిల్లలు, ఇల్లు గడవాలి. ఆయన బంగ్లా జైలులో ఉన్నారని తెలియగానే ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. అసలు తిరిగి వస్తారో లేదో తెలియక, ఈ నాలుగు నెలలు తిండి కూడా సహించలేదు. మత్స్యకార నాయకులు మమ్మల్ని ఆదుకున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించింది, వచ్చిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నాం. ఆయన క్షేమంగా తిరిగి రావడం మాకు పునర్జన్మ లాంటిది. –మరుపల్లి జ్యోతి, మత్యకారుడు చిన్న అప్పన్న భార్య బిడ్డ ముఖం చూశాక.. కష్టమంతా మర్చిపోయా భార్య గర్భిణిగా ఉన్నప్పుడు ఆసుపత్రి ఖర్చుల కోసం వేటకు వెళ్లా. బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన సమయంలోనే బాబు పుట్టాడని తెలిసింది. వాడిని ఎప్పుడు చూస్తానా అని క్షణమొక యుగంలా గడిపాను. నెల రోజుల బాబును ఇవాళ చేతుల్లోకి తీసుకోగానే ఆ జైలు కష్టాలు, భయాలన్నీ మర్చిపోయాను. మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చిన వారందరికీ రుణపడి ఉంటాను. –సూరాడ అప్పలకొండ, మత్స్యకారుడు -
జోన్.. జటిలం
సాక్షి, విశాఖపట్నం: పార్లమెంట్లో విత్తమంత్రి బడ్జెట్ ప్రసంగం.. వైజాగ్ వాసుల్ని నిరుత్సాహంలోకి నెట్టేస్తే.. సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో.. రైల్వే మంత్రి మరింత నిస్పృహలోకి నెట్టేశారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న జోన్ కార్యకలాపాలు ప్రారంభించే అంశం కాస్తా జటిలంగా ఉందని, దీని కోసం ఫాస్ట్ట్రాక్ పద్ధతిలో పనిచేస్తున్నామంటూ అశ్వినీ వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలతో.. నీలినీడలు మళ్లీ కమ్ముకున్నాయి. ఇప్పట్లో గెజిట్ విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదన్నది స్పష్టమవుతోంది. మరోవైపు వాల్తేరు డివిజన్కు బడ్జెట్ కేటాయింపుల్లోనూ మొండిచెయ్యి చూపించారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటన వచ్చి ఆరేళ్లు గడిచినా కార్యకలాపాలకు మరికొంత సమయం వేచి చూడాల్సిందేనని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది. ఓవైపు.. జోన్ ప్రధాన కార్యాలయం పనులు జరుగుతుండగా.. మరోవైపు తాత్కాలిక కార్యాలయం సిద్ధమైనా.. గెజిట్ విడుదలకు మాత్రం ఇంకా దక్షిణ కోస్తా రైల్వే జోన్ నోచుకోలేదు. గతేడాది దసరాకు గెజిట్ వస్తుందని ఊరించారు. తర్వాత దీపావళి.. క్రిస్మస్.. సంక్రాంతి.. ఇలా పండగలు వస్తూ వెళ్తున్నా.. కార్యకలాపాలు మాత్రం మొదలవ్వకపోవడం చూస్తే... ఈ వ్యవహారం జటిలంగా మారుతోందని అర్థమవుతోంది. తాజాగా.. రైల్వే మంత్రి చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూర్చాయి. ‘దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ జఠిలమైన వ్యవహారం. జోన్కోసం ఫాస్ట్ట్రాక్ పద్ధతిలో పనిచేస్తున్నాం. కంట్రోల్ కమాండ్ టైమ్టేబుల్, సిబ్బంది సహా మొత్తం మార్చాల్సి ఉంది. ఈ మార్పిడి ప్రక్రియ సజావుగా జరిగేలా పనిచేస్తున్నాం..’ అంటూ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడటం చూస్తే.. జోన్ ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదని రైల్వే వర్గాలు పెదవి విరుస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ జోన్కు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు గాని, ఇతర ప్రకటనలు కానీ చెయ్యకపోవడం చూస్తే.. వైజాగ్లో జోన్ అధికారులు తమ విధుల్ని నిర్వర్తించేందుకు అవసరమైన గెజిట్ విడుదలయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. చురుగ్గా జోన్ పనులు : డీఆర్ఎం లలిత్ బోరా విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులు చురుగ్గా సాగుతున్నాయని వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోరా తెలిపారు. సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వే బడ్జెట్లో కేటాయింపుల వివరాల్ని వెల్లడించారు. 2009–14 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో వార్షిక సగటు బడ్జెట్ కేవలం రూ.886 కోట్లు ఉండగా, 2026–27 నాటికి రూ.10,134 కోట్లకు చేరడం శుభపరిణామమన్నారు. దశాబ్ద కాలంలో రైల్వే బడ్జెట్ దాదాపు 11 రెట్లు బడ్జెట్ పెరిగిందనీ.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రూ.92,649 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాన్నారు. ‘అమృత్భారత్ స్టేషన్ పథకం’ కింద 73 స్టేషన్ల ఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో 8 జతల వందే భారత్, 8 జతల అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. త్వరలోనే డివిజన్ వారీగా కేటాయింపుల వివరాల్ని రైల్వే బోర్డు ప్రకటిస్తుందని డీఆర్ఎం లలిత్ బోరా స్పష్టం చేశారు. -
ఎన్నికల హామీల మేరకు బడ్జెట్ కేటాయింపులు ఉండాలి
బీచ్రోడ్డు: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం రద్దయిన ఎస్సీల సంక్షేమ పథకాల పునరుద్ధరణకు, 50 ఏళ్లకే పింఛన్, డీబీటీ, ఇతర పద్దుల్లో ఎస్సీల వాటా నిధులకు రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ సబ్ ప్లాన్ కింద కనీసం రూ.40 వేల కోట్లు కేటాయించాలని విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండు చేశారు. బడ్జెట్ కేటాయింపులపై సబ్ ప్లాన్ వాటాదారులైన ఎస్సీ, ఎస్టీలతో సంప్రదించాలన్నారు. విదసం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద జరిగిన సోమవారం ధర్నాలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలకు అనుగుణంగా రద్దయిన 20 పథకాల పునరుద్ధరణకు, ఇతర కేటాయింపులకు అదనపు నిధులు ప్రకటించాలన్నారు. గతేడాది పేర్కొన్న రూ.20 వేల కోట్ల నిధుల్ని కూటమి ప్రభుత్వం డీబీటీ పథకాలకు కేటాయించేసిందని ఆక్షేపించారు. పౌర హక్కుల నేత తుంపాల శ్రీరామమూర్తి మాట్లాడుతూ గతేడాది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలిస్తామని జీవో ఇచ్చి, ఇప్పుడు వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ఇస్తామనడం పచ్చి మోసమని మండిపడ్డారు. డి.నిర్మల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విదసం విశాఖ జిల్లా నాయకులు గుడాల ఈశ్వరరావు, కొత్తపల్లి వెంకటరమణ, బాగం గోపాల్, బి.ఉమామహేశ్వరి, రాజేంద్రప్రసాద్, జేవీ భాస్కరరావు, సబ్బవరపు శ్రీనివాసరావు, గుడివాడ భాస్కరరావు, బాణాస రామ్ ప్రభు, తదితరులు పాల్గొన్నారు. -
అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలి: ఎస్ఎఫ్ఐ
జిల్లాలో కళాశాలలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆయా సమయాల్లో అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు కలెక్టర్ను కోరారు. విద్యార్థులకు ఉచిత లేదా రాయితీ బస్ పాసులు అందించాలన్నారు. విద్యార్థుల విద్యా హక్కును కాపాడేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని లేకుంటే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.అజయ్, డి.వెంకటరమణతో పాటు కమిటీ సభ్యులు నరేష్, భరత్, ప్రగతి, ధనుష్, పలు కళాశాలల విద్యార్థులు ఉన్నారు. -
రెండు బైకులు ఢీకొని యువకుడి మృతి
సబ్బవరం: మండలంలోని అనకాపల్లి–నారపాడు ప్రధాన రహదారిపై అమ్ములపాలెం చర్చి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్ రెహ్మాన్ (27) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారపాడు శివారు బలిజపాలెంకు చెందిన రెహ్మాన్ సబ్బవరంలోని ఒక చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. పని నిమిత్తం సబ్బవరం వెళ్లి తిరిగి వస్తుండగా, ఎదురుగా వస్తున్న గోర్లి శ్రీనివాసరావు ద్విచక్రవాహనం రెహ్మాన్ బైకును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైన రెహ్మాన్ మరణించగా, శ్రీనివాసరావుకు స్వల్ప గాయాలయ్యాయి. సీఐ జి. రామచంద్రరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య షకీనా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డీఎస్పీగా లోచన్కుమార్ ఎంపిక
అల్లిపురం: గ్రూప్–1 ఫలితాల్లో జీవీఎంసీ 34వ వార్డు భూపేష్నగర్ ప్రాంతానికి చెందిన చెల్లుబోయిన లోచన్కుమార్ సత్తా చాటాడు. డీఎస్పీగా ఎంపికయ్యాడు. అతని తండ్రి రవిశంకర్ శ్రీనివాస్ నేవల్ డాక్యార్డులో ఉద్యోగి కాగా తల్లి సత్యవతి గృహిణి. లోచన్కుమార్ ప్రాథమిక విద్యాభ్యాసం నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో, ఇంటర్ గాయత్రి కాలేజీలో, డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీలో కొనసాగించాడు. 2024లో ఆర్ఎస్ఐగా సెలక్ట్ అయ్యాడు. జాబ్ చేస్తూనే గ్రూప్–1కి ప్రిపేర్ అయిన లోచన్కుమార్ గ్రూప్–1లో డీఎస్పీగా ఎంపికయ్యాడు. ఈ మేరకు అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రుల కోరిక మేరకు కష్టపడి చదివి డీఎస్పీగా ఎంపికయ్యాయనని లోచన్కుమార్ స్పష్టం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆరిలోవ: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణాపురం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుబ్బల మహేష్ (37) మృతి చెందాడు. అమలాపురానికి చెందిన మహేష్ తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై బీఆర్టీఎస్ రోడ్డులో వెళ్తుండగా, డివైడర్పై ఉన్న పూల మొక్కల కొమ్మలు తలకు తగలడంతో బైక్ అదుపు తప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో తల కు తీవ్ర గాయమై మహేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వెనుక కూర్చున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఆరిలోవ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
12న జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె
అల్లిపురం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని జీవీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు పడాల రమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్లు నల్లనయ్య, సత్యవతిలకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, మున్సిపల్ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను వీడాలని డిమాండ్ చేశారు. సమ్మెలో జీవీఎంసీ రెగ్యులర్, అవుట్సోర్సింగ్ , కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె. సత్యనారాయణ, వాసు, శివ, ప్రసాద్, కోటి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు సంతృప్తిగా సేవలందించాలి
కలెక్టర్ హరేందిర ప్రసాద్ బీచ్రోడ్డు: జిల్లా ప్రజలు సంతృప్తి చెందే విధంగా అధికార యంత్రాంగం పనిచేయాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా, జోనల్, మండల అధికారులతో పాజిటివ్ పబ్లిక్, పర్సెప్షన్, కుటుంబ సర్వే, ఎలక్టర్స్ మ్యాపింగ్ తదితర అంశాలపై కలెక్టర్ వెబ్ ఎక్స్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలపై ఐవీఆర్ఎఫ్, క్యూఆర్ కోడ్ పద్ధతిలో అభిప్రాయాలను సేకరిస్తున్నందున అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ వైద్యులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. రోగులకు ఉచితంగా మందులు అందించాలని కోరారు. లంచం అడిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్టీసీ బస్సులు సమయానికి నడిచేలా, ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. జీవీఎంసీ పరిధిలో గ్రామ పంచాయతీల్లో తాగునీరు, పారిశుధ్యం, అన్న క్యాంటీన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అక్రమంగా మత్తు మందులు అమ్మేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి సరఫరా చేసేవారికి శిక్ష తప్పదన్నారు. రెవెన్యూలో డిజిటల్ అసిస్టెంట్లు దరఖాస్తులు తీసుకునేటప్పుడు వీఆర్వో సంతకం ఉంటేనే తీసుకుంటామని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, సర్వే నెంబర్తో దరఖాస్తు ఇస్తే రిజిస్టర్ చేయాలన్నారు. ఐఎఫ్ఆర్–2026, మిలాన్ అంతర్జాతీయ నౌకాదళ కార్యక్రమాల నిర్వహణను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ హరేందిర ప్రసాద్ జ్ఞానాపురం నుంచి నేవీ హెడ్క్వార్టర్స్ వరకు కొనసాగుతున్న రహదారి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈనెల 15వ తేదీలోగా పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, టూరిజం, విద్యుత్, ఫైర్, రెవెన్యూ, పోలీసు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సమష్టి సహకారంతో విశాఖ ఉత్సవ్ విజయం
ఏయూక్యాంపస్: అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమష్టి సహకారంతో ఎనిమిది రోజుల పాటు సాగిన విశాఖ ఉత్సవ్–2026 శనివారం సాయంత్రం ఆర్కే బీచ్లో ఘనంగా ముగిసింది. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ.. నగరవ్యాప్తంగా వివిధ వేదికల్లో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడా పోటీలు ప్రజలను విశేషంగా అలరించాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు జరిగాయని, భవిష్యత్తులో మరిన్ని మెరుగైన ఏర్పాట్లతో ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. ఆర్కే బీచ్తో పాటు భీమిలిలోనూ పడవ పోటీలు, బీచ్ స్పోర్ట్స్, రంగోలి వంటి కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వివిధ పోటీల విజేతలకు, సహకరించిన అధికారులకు కలెక్టర్ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ముగింపు వేడుకల్లో భాగంగా ప్రముఖ నాట్యాచార్యులు బాల కొంటలరావు పర్యవేక్షణలో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు, సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, గాయని మాళవికల సంగీత విభావరి సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి. కార్యక్రమంలో సమాచార కమిషనర్ పి.ఎస్. నాయుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
విశాఖలో పుణే, వెల్లింగ్టన్ డిఫెన్స్ స్టాఫ్ కాలేజీ విద్యార్థులు
సాక్షి, విశాఖపట్నం: దేశ రక్షణలో తూర్పు నౌకాదళం కీలకంగా వ్యవహరిస్తోందని ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సుశీల్ మీనన్ అన్నారు. తమిళనాడు వెల్లింగ్టన్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ 81వ స్టాఫ్ కోర్సుకి చెందిన 225 మంది విద్యార్థి అధికారులు, పుణే డీఎస్ఎస్సీకి చెందిన 90 మంది అధికారులు పారిశ్రామిక ప్రదర్శన పర్యటనలో భాగంగా విశాఖలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్ను సందర్శించారు. పర్యటనలో భాగంగా అధికారులు ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సుశీల్ మీనన్ను కలిసి.. నౌకాదళ కార్యకలాపాలపై కమాండ్ ప్లాన్స్ ఆఫీసర్ ఇచ్చిన ప్రజెంటేషన్లో పాల్గొన్నారు. అనంతరం ‘ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలు–భారత నౌకాదళ వ్యూహం’ అనే అంశంపై చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (ఆపరేషన్స్) నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విశాఖలోని ఈస్టర్న్ ఫ్లీట్ యుద్ధ నౌకలు, సబ్–మైరెన్లను క్షేత్రస్థాయిలో సందర్శించి, దేశ సముద్ర రక్షణ సామర్థ్యాలు, నౌకాదళం నిర్వహిస్తున్న బాధ్యతలను పరిశీలించారు.


