బస్సు ఢీకొని జూ పార్కు కాంట్రాక్ట్‌ కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని జూ పార్కు కాంట్రాక్ట్‌ కార్మికుడి మృతి

Feb 10 2026 8:12 AM | Updated on Feb 10 2026 8:12 AM

బస్సు ఢీకొని జూ పార్కు కాంట్రాక్ట్‌ కార్మికుడి మృతి

బస్సు ఢీకొని జూ పార్కు కాంట్రాక్ట్‌ కార్మికుడి మృతి

ఆరిలోవ: ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తమ్మినేని మోహనరావు (45)మృతి చెందాడు. కంచరపాలేనికి చెందిన మోహనరావు జూ పార్కులో కాంట్రాక్ట్‌ పనులు చేస్తుండగా, సోమవారం తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై పనికి వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయమై మోహనరావు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి, మృతుడి కుమారుడి సాయి మణికంఠ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వరహాలునాయుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement