breaking news
Visakhapatnam District News
-
వరదనీటిలో స్వయంభూ లింగం
●ముంపునకు గురైన వామలింగేశ్వర ఆలయం వరదనీటితో నిండిన వామలింగేశ్వర ఆలయం, (ఇన్సెట్) వరద నీటి మధ్యలో దర్శనమిస్తున్న స్వయంభూ లింగం మాకవరపాలెం: పెద్దమిల్లు జంక్షన్లో ఉన్న వామలింగేశ్వరాలయం వరద నీటిలో చిక్కుకుంది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి ఆలయంలో లోపలకు భారీగా నీరు చేరింది. ఆలయ ఆవరణే కాకుండా గర్భగుడిలో ఉన్న స్వయంభూ లింగం సైతం నీట మునిగింది. దీంతో కార్తీక మాసంలో జరిగే నిత్య పూజలకు అవకాశం లేకుండా పోయింది. భారీ వర్షాలు కురిసినపుడల్లా ఆలయం పక్కనే ఉన్న జంగం గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వర్షాలకు ఈ గెడ్డ నుంచి వెళ్లే వరదనీటి కారణంగా ఈ ఆలయం ముంపునకు గురైంది. చాలాకాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. శాశ్వత నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
విపత్తు వచ్చే కంటే ముందు సన్నద్ధత, విపత్తు తీవ్రతను నివారించేందుకు తీసుకునే చర్యలు అత్యంత కీలకం. జిల్లా యంత్రాంగం ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణితో వేలాది ఎకరాల పంట నేలపాలవ్వడమే కాక అనేక గ్రామాలు నీటమునిగాయి. రాంబిల్లి, ఎస్.రాయవరం సరిహద్దుల్లో ఏర్పాటవుతున్
● ప్రమాదాన్ని అంచనా వేయలేకపోయిన అధికారులు ● కొరవడిన అప్రమత్తత, సన్నద్ధత వైఫల్యానికి మూల్యం.. వరద బీభత్సం రాంబిల్లి (అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలో మేజర్, మైనర్ శారదా నదులకు బుధవారం అర్ధరాత్రి గండిపడింది. బుధవారం తుపాను తీవ్రత తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ముందున్న గండాన్ని అంచనా వేయలేకపోయారు. వారి అలసత్వానికి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. రైవాడ జలాశయం నుంచి భారీ ఎత్తున నీటిని విడుదల చేసిన అధికారులు.. అందుకు తగ్గట్టుగా ప్రభావిత ప్రాంతాలను అప్రమత్తం చేయలేకపోయారు. సముద్రతీరానికి ఆనుకొని ఉన్న రాంబిల్లితోపాటు, యలమంచిలి, అచ్యుతాపురం, మునగపాక, కశింకోట మండలాలకు ఆనుకొని ఉన్న శారదా నదీ ప్రవాహ ప్రాంతాల్లో పరిస్థితి చేజారుతుందని గతంలో అప్రమత్తం అయ్యేవారు. కానీ ఇప్పుడు రాంబిల్లి, మునగపాక మండలాల్లో మారుతున్న పరిస్థితిని అధికారులు అంచనా వేయలేకపోయారు. తదనుగుణంగానే మునగపాక మండలంలోని యాదగిరిపాలెం వరద ముంపులోకి వెళ్లిపోయింది. రాంబిల్లి మండలంలోని నారాయణపురం వద్ద మైనర్ శారదా నదికి గండిపడటంతో ఆ ప్రాంత పరిసరాలన్నీ నీటి దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. మేజర్ శారదా నదికి రజాల అగ్రహారం, కొప్పుగొండుపాలెం పరిసరాల్లో గండి పడటంతో సుమారు రెండు వేల ఎకరాలకు పైగా పంట భూములు ,చేపల చెరువులు వరదమయం అయ్యాయి. శారదా నదికి గండి పడిన వైపు ఉన్న మర్రిపాలెం, కట్టబోలు, మురకాడ, తెరువుపల్లి, దిమిలి, నారాయణపురం గ్రామాల పరిధిలోని పంటంతా నీటి పాలవ్వడంతో గురువారం రాత్రి ఎలా గడుస్తుందోనన్న ఆందోళన నెలకొంది. అప్రమత్తమై ఉంటే.. మైనర్ శారదా నది గట్లు బలహీనంగా ఉన్నాయని అప్పటికే రైతులు ఇసుక బస్తాలు వేసుకొని గట్లను పటిష్టం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో అధికార గణం అప్రమత్తమై ఉంటే కాస్త నష్ట తీవ్రత తగ్గి ఉండేది. నారాయణపురం కెనరా బ్యాంక్ వద్ద పడిన గండి, రజాల అగ్రహారం పరిధిలోని మేజర్ శారదా నదికి పడిన గండితో అధికారుల్లో కలవరం మొదలయ్యింది. సహాయక చర్యలు చేపట్టాల్సిన కొందరు సిబ్బంది దిమిలి పరిసరాల్లో వాహనాల్లో సేద తీరినట్లు కొందరు గుర్తించారు. కొత్తూరు వద్ద నిమ్మతోటలో చిక్కుకుపోయిన ఒక వ్యక్తిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. అష్ట దిగ్భంధనంలో వై.లోవ శారదా నదికి రెండో వైపున్న కలవలాపల్లి, వై.లోవ గ్రామాల్లోకి శారదా నది నుంచి వచ్చిన వరద నీటితో తమ పుట్టీలు, వలలు కొట్టుకుపోయాయని స్థానికులు చేసిన ఫిర్యాదుకు స్పందన లేకపోయింది. భవిష్యత్ అవసరాల కోసం నేవల్ బేస్ తీసుకున్న కొండల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడం వై.లోవ ముంపు తీవ్రత పెరిగేందుకు కారణం అయ్యింది. వై.లోవ పరిధిలో నిరాశ్రయులైన 30 కుటుంబాలను రాంబిల్లి పునరావాసానికి గురువారం తరలించారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్సార్సీపీ నేతలు కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ.. కాంట్రాక్టర్కు సహకరిస్తున్న అఽధికారులు గ్రామాల తరలింపు, పునరావాసం, నదుల గట్ల పటిష్టత, అప్రమత్తతపై శ్రద్ధ చూపలేదని ఆరోపించారు. వరద వల్ల ఐదు వేల ఎకరాలు నీట మునగగా..1056 ఎకరాలు మాత్రమే ముంపునకు గురయ్యాయని జిల్లా స్థాయి అధికారి సెలవివ్వడం గమనార్హం. వరద ఉధృతికి నీట మునిగిన వై.లోవ గ్రామం -
ఎక్మోపై 500 కి.మీ. ప్రయాణం
మహారాణిపేట: ఒకటి కాదు, రెండు కాదు.. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం.. ఇలా శరీరంలోని కీలక అవయవాలన్నీ ఒక్కసారిగా విఫలమయ్యాయి. 25 ఏళ్ల యువ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకున్నాడు. ఒడిశాలోని భువనేశ్వర్లో ఆశలు వదులుకున్న తరుణంలో.. విశాఖపట్నం కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి వైద్యులు ముందడుగు వేశారు. అత్యాధునిక పోర్టబుల్ ఎక్మో సపోర్ట్తో 500 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి.. అరుదైన క్యాన్సర్కు సైతం చికిత్స అందించి ఆ యువకుడికి పునర్జన్మ ఇచ్చారు. ఈ సంక్లిష్టమైన కేసుకు సంబంధించిన వివరాలను కిమ్స్ ఐకాన్ క్రిటికల్ కేర్, ఎక్మో విభాగాధిపతి డాక్టర్ రవికృష్ణ గురువారం మీడియాకు వివరించారు. భువనేశ్వర్ నుంచి విశాఖకు.. భువనేశ్వర్లోని ఓ ఆస్పత్రిలో చేరిన యువకుడు, బహుళ అవయవాల వైఫల్యంతో ‘కార్డియోజెనిక్ షాక్’లోకి వెళ్లాడు. పరిస్థితి చేయిదాటిపోవడంతో అక్కడి వైద్యులు కిమ్స్ ఐకాన్ను సంప్రదించారు. తక్షణమే డాక్టర్ రవి కృష్ణ నేతృత్వంలోని ప్రత్యేక ‘ఎక్మో రిట్రీవల్ బృందం’ భువనేశ్వర్ బయల్దేరింది. ‘మేము అక్కడికి చేరుకునేసరికే రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వెంటనే అక్కడే అతనికి పోర్టబుల్ ఎక్మో అమర్చాము. ఊపిరితిత్తులు, గుండె పనిని ఆ యంత్రమే చూసుకుంటుండగా, 500 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని అంబులెన్స్లో ప్రారంభించాం. మధ్యలో రక్త పరీక్షల కోసం కేవలం ఒక్కసారి మినహా, ఎక్కడా ఆగకుండా విశాఖకు తీసుకొచ్చాం’అని డాక్టర్ రవికృష్ణ తెలిపారు. ఇక్కడికి తీసుకువచ్చాక, యువకుడికి ఊపిరితిత్తులు పూర్తిగా పనిచేయకపోవడం, మెదడులో రక్తస్రావం, కాలేయం, మూత్రపిండాల వైఫల్యం ఉన్నట్లు నిర్ధారించారు. ఎక్మోపైనే ఉంచి నైట్రిక్ ఆకై ్సడ్ వంటి అత్యాధునిక చికిత్సలు అందించారు. ఈ చికిత్సలకు రోగి శరీరం వేగంగా స్పందించింది. అవయవాలు తిరిగి కోలుకోవడం ప్రారంభించాయి. కేవలం ఐదు రోజుల్లోనే ఎక్మో సహా అన్ని సపోర్ట్ సిస్టమ్స్ను తొలగించి, యువకుడిని ప్రాణాపాయం నుంచి బయటపడేశారు. బయటపడిన అరుదైన క్యాన్సర్ రోగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాక, అసలు ఈ పరిస్థితికి కారణమేంటని వైద్యులు లోతుగా పరిశీలించారు. రెండేళ్లుగా అతనికి తీవ్రమైన ఆందోళన, చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. పరీక్షల్లో ఫియోక్రోమోసైటోమా అనే అత్యంత అరుదైన, ప్రాణాంతక సమస్య ఉన్నట్లు తేలింది. అడ్రినల్ గ్రంథిపై ఏర్పడిన క్యాన్సర్ కణితి కారణంగా, అడ్రినలిన్ హార్మోన్ నియంత్రణ లేకుండా అధికంగా స్రవించడమే ఈ అవయవాల వైఫల్యానికి అసలు కారణమని గుర్తించారు. 9 రోజుల చికిత్స అనంతరం రోగిని డిశ్చార్జ్ చేసి, నాలుగు వారాల తర్వాత తదుపరి శస్త్రచికిత్స కోసం పిలిపించారు. సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీనారాయణ, ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ శ్రావణి పర్యవేక్షణలో, సీనియర్ అనస్థటిస్టులు డాక్టర్ సోమరాజు, డాక్టర్ అప్పలరాజుల సహకారంతో లాప్రోస్కోపిక్ పద్ధతిలో ఆ కణితిని విజయవంతంగా తొలగించారు. అది మొదటి దశ క్యాన్సర్గానే ఉందని, ఇతర భాగాలకు విస్తరించలేదని నిర్ధారించారు. ప్రస్తుతం ఆ యువ ఇంజినీర్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నాడని డాక్టర్ రవికృష్ణ వెల్లడించారు. -
నేడు ఈఎన్సీ చీఫ్ పదవీ విరమణ
సాక్షి, విశాఖపట్నం : ఈస్ట్రన్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. 2023 ఆగస్ట్ 1న తూర్పు నౌకాదళాధిపతిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 1987లో భారత నౌకాదళంలో ప్రవేశించిన ఆయన యాంటీ సబ్మైరెన్ వార్ఫేర్ స్పెషలిస్ట్గా తక్కువ కాలంలోనే పేరు సంపాదించారు. పలు యుద్ధ నౌకల కెప్టెన్గా విధులు నిర్వర్తించి.. మహారాష్ట్ర నేవల్ ఏరియా ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్గా పదోన్నతి పొందారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడెమీ ఇన్స్ట్రక్టర్గా వ్యవహరించారు. కమాండర్ హోదాలో స్టాఫ్ రిక్రూట్మెంట్ డైరెక్టర్గానూ, నెట్సెంట్రిక్ ఆపరేషన్స్లో ప్రిన్సిపల్ కమాండర్గా, నేవల్ డైరెక్టరేట్(పర్సనల్)లో ప్రిన్సిపల్ డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు. 2016లో రియర్ అడ్మిరల్ హోదాలో డిఫెన్స్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీలో అసిస్టెంట్ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ నౌకాదళం చీఫ్ స్టాఫ్ ఆఫీసర్గా, ఫ్లాగ్ ఆఫీసర్గా, ఇండియన్ కోస్ట్గార్డ్, నేవీలో సీ ట్రైనింగ్ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఈఎన్సీ చీఫ్గా రాకముందు.. నేవల్ హెడ్క్వార్టర్స్లో డైరెక్టర్ జనరల్ నేవల్ ఆపరేషన్స్(డీజీఎన్వో)గా బాధ్యతలు చేపట్టారు. మిలాన్–2024తో పాటు మలబార్, టైగర్ ట్రయాంఫ్.. ఇలా ఎన్నో కీలక నౌకాదళ విన్యాసాలు వైస్ అడ్మిరల్ పెంధార్కర్ సారథ్యంలో విశాఖలో విజయవంతంగా నిర్వహించారు. పెంధార్కర్కు వీడ్కోలు కార్యక్రమం శుక్రవారం నిర్వహించేందుకు తూర్పు నౌకాదళంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
తునిపొలంలో తీవ్ర విషాదం
గెడ్డలో విద్యార్థిని గల్లంతు పద్మనాభం : స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు గెడ్డలో పడి విద్యార్థిని గల్లంతవడంతో తునిపొలం గ్రామంలో విషాదం నెలకొంది. మద్ది పంచాయతీ తునిపొలం గ్రామానికి చెందిన కాళ్ల ధనుశ్రీ (12) గురువారం మధ్యాహ్నం మరో ముగ్గురితో కలిసి గ్రామ సమీపంలోని పల్లె గెడ్డ వద్దకు వెళ్లింది. అక్కడ కాలు జారి పడిపోయింది. విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గెడ్డ వద్దకు చేరుకునేసరికే ధనుశ్రీ గల్లంతైంది. కాళ్ల శ్రీను, గౌరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో ధనుశ్రీ చిన్నది. పెద్ద కుమార్తె పద్మనాభం మండలం కృష్ణాపురంలోని కస్తూర్బా విద్యాలయంలో చదువుతోంది. ధనుశ్రీ మద్ది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ధనుశ్రీ గల్లంతు విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ భీమునిపట్నం నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), జెడ్పీ వైస్ చైర్మన్ సుంకర గిరిబాబు, ఎంపీపీ కంటుబోతు రాంబాబు సంఘటన స్థలాన్ని సందర్శించారు. ధనుశ్రీ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. భీమునిపట్నం ఆర్డీవో సంగీత్ మాధుర్ సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు. -
రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలి
మహారాణిపేట: విశాఖ ఫిషింగ్ హార్బర్ సెంట్రల్ డాక్ ప్రాంతంలో మత్స్యకారుడు మేరుగ ధనరాజుకు చెందిన బోటు తుపాను అలల తాకిడికి మునిగిపోయింది. బాధిత మత్స్యకారుడికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ దక్షిణ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మునిగిపోయిన బోటును పరిశీలించి, బాధిత మత్స్యకారుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ పాలనలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా.. అప్పటి ప్రభుత్వం ముందుండి తక్షణ సహాయక చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. గతంలో ఇక్కడ ఒక బోటు కాలిపోతే.. అప్పటికప్పుడే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ మత్స్యకారుడికి రూ.36 లక్షలను అందించిందన్నారు. నేటి కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మునిగిపోయిన బోటుకు తక్షణమే ప్రభుత్వం రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించి, మత్స్యకారుడిని ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, స్థానిక మత్స్యకారులు ఉన్నారు. -
అరకుకు ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.పవన్కుమార్ తెలిపారు. ● అరకు–యళ్లహంక(08551) స్పెషల్ ఎక్స్ప్రెస్ నవంబరు 13, 23వ తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు అరకులో బయల్దేరి అదే రోజు మధ్యాహ్నం 3.28 గంటలకు దువ్వాడకు, మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు యళ్లహంక చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో యళ్లహంక–అరకు(08552) స్పెషల్ ఎక్స్ప్రెస్ నవబంరు 14, 24వ తేదీల్లో మధ్యాహ్నం 1.30 గంటకు యళ్లహంకలో బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 10 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 2.30 గంటలకు అరకు చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు ఇరువైపులా బొర్రాగుహలు, ఎస్.కోట, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నంద్యాల, గుత్తి, ధర్మవరం, సత్యసాయిప్రశాంతి నిలయం స్టేషన్లలో ఆగుతాయి. ● అరకు–యళ్లహంక(08555) స్పెషల్ ఎక్స్ప్రెస్ నవంబరు 17, 24వ తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు అరకులో బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 3.28 గంటలకు దువ్వాడకు, మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు యళ్లహంక చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో యళ్లహంక–అరకు(08556) స్పెషల్ రైలు నవబంరు 18, 25వ తేదీల్లో మధ్యాహ్నం 2గంటలకు బయల్దేరి యళ్లహంకలో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 10 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 2.30 గంటలకు అరకు చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు ఇరువైపులా బొర్రాగుహలు, ఎస్.కోట, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నంద్యాల, గుత్తి, ధర్మవరం, సత్యసాయిప్రశాంతి నిలయం స్టేషన్లలో ఆగుతాయి. ● శ్రీకాకుళం రోడ్–బెంగళూరు కంటోన్మెంట్ (08553) స్పెషల్ ఎక్స్ప్రెస్ నవంబరు 21న మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి అదేరోజు సాయంత్రం 5.05 గంటలకు విశాఖపట్నం, మరుసటిరోజు మధ్యాహ్నం 2.45 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు కంటోన్మెంట్–శ్రీకాకుళం రోడ్ (08554) స్పెషల్ రైలు నవంబరు 24వ తేదీన మధ్యాహ్నం 2గంటలకు బెంగళూరు కంటోన్మెంట్లో బయల్దేరి, మరుసటిరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖపట్నం, అదేరోజు సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. ● భువనేశ్వర్–బెంగళూరు కంటోన్మెంట్ (08463) స్పెషల్ ఎక్స్ప్రెస్ నవంబరు 16వ తేదీ ఉదయం 6.15 గంటలకు భువనేశ్వర్లో బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 3.28 గంటలకు దువ్వాడకు, మరుసటి రోజు మధ్యాహ్నం 11.55 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు కంటోన్మెంట్–భువనేశ్వర్ (08464) స్పెషల్ రైలు నవంబరు 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్లో బయల్దేరి, మరుసటిరోజు తెల్లవారు 2గంటలకు దువ్వాడకు, అదేరోజు ఉదయం 10.15గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. -
కై లాసగిరి ఘాట్లో విరిగిపడిన కొండచరియలు
ఆరిలోవ: మోంథా తుపాను ప్రభావం ప్రముఖ పర్యాటక కేంద్రమైన కై లాసగిరిని కూడా తాకింది. నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కై లాసగిరి ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన వాహనాల రాకపోకలు లేని తెల్లవారుజామున జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వరుస వర్షాలకు ఘాట్ రోడ్డు అంచులు బాగా నానిపోయాయి. గురువారం వేకువజామున కురిసిన వర్షానికి కొండ అంచుల్లోని మట్టి, రాళ్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. కొన్ని చోట్ల మట్టి గుట్టలుగా జారిపడగా.. మరికొన్ని చోట్ల పెద్ద పెద్ద బండరాళ్లు సైతం రోడ్డు మధ్యలోకి దొర్లాయి. గురువారం ఉదయం విధులకు వెళ్లిన సిబ్బంది వెంటనే స్పందించి.. అడ్డుగా పడిన బండరాళ్లను, మట్టిని తొలగించి రోడ్డును కొంతవరకు శుభ్రం చేశారు. రాళ్లను రోడ్డు అంచున కుప్పలుగా వేశారు. ప్రస్తుతం ఘాట్ రోడ్డులోని మలుపుల వద్ద కొండ అంచులు ఇంకా బలహీనంగా, ఊగుతున్నట్లుగా కనిపించడం పర్యాటకులను, సిబ్బందిని కలవరపరుస్తోంది. అధికారులు తక్షణమే ఘాట్ రోడ్డులో భద్రతా చర్యలు చేపట్టాలని సందర్శకులు కోరుతున్నారు. బీచ్రోడ్డులో.. అలాగే బీచ్రోడ్డులోని సీతకొండ మలుపు, తెన్నేటి పార్కు, కై లాసగిరి కొండ మలుపు వద్ద మట్టితో రాళ్లు జారిపడ్డాయి. సీతకొండ మలుపు వద్ద సుమారు 20 మీటర్ల వరకు పెద్ద బండలు ఫుట్పాత్ నుంచి రోడ్డు మధ్య వరకు చేరాయి. వాటిని జీవీఎంసీ సిబ్బంది తొలగించి కొండ అంచున కుప్పగా వేశారు. మలుపు వద్ద కొంత ఎత్తులో రక్షణ గోడ నిర్మించాలని వాహనచోదకులు, స్థానికులు కోరారు. -
హెచ్ఆర్ఏ పునరుద్ధరణ ఎప్పుడు?
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ ఉద్యోగులు కోల్పోయిన ఇంటి అద్దె భత్యం(హెచ్ఆర్ఏ) పునరుద్ధరణ కోసం నిరీక్షిస్తున్నారు. ప్రతి నెలా కనీసం రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ కీలక అంశానికి సంబంధించి యాజమాన్యంపై ఉక్కు అధికారుల సంఘం, కార్మిక సంఘాలు గట్టిగా ఒత్తిడి తీసుకురాకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది స్టీల్ప్లాంట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినప్పుడు.. యాజమాన్యం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కొన్ని ఆర్థిక ప్రయోజనాలకు కోత విధించింది. మొదట్లో 50 శాతం జీతం మాత్రమే చెల్లించడం ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా 65 శాతం, ఒక్కోసారి 75 శాతం జీతం చెల్లిస్తూ.. మిగిలిన మొత్తాన్ని బకాయిలుగా చూపించారు. ఆ సమయంలో కార్మికులకు బేసిక్, డీఏ తర్వాత అతిపెద్ద కాంపొనెంట్గా ఉన్న హెచ్ఆర్ఏను పూర్తిగా నిలిపివేశారు. దాని ఫలితంగా, సగటు కార్మికుడు నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేలు చొప్పున, వెరసి సంవత్సరానికి సుమారు రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షల వరకు నష్టపోయారు. ఆ సమయంలో కార్మిక సంఘాలు అనేక ఆందోళనలు నిర్వహించాయి. ఈ క్రమంలో రీజినల్ లేబర్ కమిషనర్ (ఆర్ఎల్సీ) సమక్షంలో జరిగిన చర్చల్లో, ప్లాంట్ పరిస్థితి మెరుగుపడినప్పుడు హెచ్ఆర్ఏను పునరుద్ధరిస్తామని, బకాయిలు కూడా చెల్లిస్తామని యాజమాన్యం అంగీకరించింది. లాభాల బాట పట్టినా... స్టీల్ప్లాంట్ ఉద్యోగుల కష్ట ఫలితంగా, మూడు బ్లాస్ట్ఫర్నేస్లు ప్రారంభమై ప్రస్తుతం 90 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో ముందుకు సాగుతున్నాయి. రెండు ఫర్నేస్లు ప్రారంభించిన నాటి నుంచి వెనుదిరిగి చూడకుండా కొన్ని నెలలు లాభాలు కూడా వచ్చాయి. మూడవ ఫర్నేస్ కూడా విజయవంతంగా కొనసాగుతుండటంతో, ఈ నెల నుంచి మరింత లాభాలు సాధించగలమని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఉద్యోగుల ఆర్థిక సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి. 13 నెలల తర్వాత ఉద్యోగులు నూరు శాతం జీతం అందుకున్నప్పటికీ.. వారి వేతన బకాయిలు మాత్రం 355 శాతానికి చేరుకున్నాయి. ఇదిలా ఉండగా ప్లాంట్ పరిస్థితి మెరుగుపడితే హెచ్ఆర్ఏను పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని యాజమాన్యం నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సెయిల్తో సమానంగా 2017 నుంచి జరగాల్సిన వేతన ఒప్పందం జరగకపోవడంతో ఇప్పటికే వేల రూపాయలు ఆర్థికంగా నష్టపోతున్న కార్మికులు.. ఇప్పుడు హెచ్ఆర్ఏను కూడా పొందలేకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘాల వైఫల్యంపై ఉద్యోగుల ఆగ్రహం ఈ ముఖ్యమైన విషయంలో యాజమాన్యంతో నిరంతరం చర్చించి ఒప్పించాల్సిన అధికారుల అసోసియేషన్, కార్మిక సంఘాలు విఫలమయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా గుర్తింపు సంఘం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. గుర్తింపు సంఘం ఇతర కార్మిక సంఘాలను కలుపుకుని యాజమాన్యంతో చర్చించి, తక్షణమే హెచ్ఆర్ఏ పునరుద్ధరణకు కృషి చేయాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
తగ్గని గోస్తనీ ఉధృతి
ముంపులోనే టి.నగరపాలెంతగరపువలస: గోస్తనీ నది గురువారం కూడా ఉధృతంగా ప్రవహించింది. తాటిపూడి రిజర్వాయర్ నుంచి మంగళవారం 9,114 క్యూసెక్కులు, గురువారం 5 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. మరో రెండు రోజుల పాటు 5వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయనున్నారు. దీంతో గోస్తనీ నది పరీవాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గోస్తనీ నది ప్రవాహానికి టి.నగరపాలెంలోకి భారీ వరద నీరు చేరింది. పంచాయతీలో గొల్లలపాలెం వెళ్లే రహదారితో పాటు శివాలయం ముంపునకు గురయ్యాయి. దీంతో భీమిలి తహసీల్దార్ పైల రామారావు పర్యవేక్షణలో సిబ్బంది పొక్లెయిన్తో తాత్కాలిక కాలువలు తవ్వి నీటిని గోస్తనీ నదిలోకి పంపించారు. తాటితూరు ఆంజనేయస్వామి కూడలిలో బుధవారం నాటి ప్రవాహానికి అప్రోచ్ రోడ్డు కోతకు గురైంది. పంచాయతీలో చాలా వరకు గింజ పట్టిన వరి పంట నేలపాలైంది. తాటితూరు నుంచి బయటకు వెళ్లే రహదారులు, కల్వర్టులు బలహీనంగా ఉండటంతో ఆర్అండ్బీ అధికారులు పలు చోట్ల హెచ్చరికల బోర్డులు పెట్టారు. కొయ్యవారి కల్లాలకు చెందిన కాకర వెంకట అప్పారావు ఇల్లు తుపానుకు కూలిపోయింది. జీవీఎంసీ భీమిలి జోన్ సబ్బివానిపేట సర్వీస్రోడ్డులో వరద నీరు ప్రవహిస్తుండటంతో సిటీ బస్సులను తగరపువలస అంబేడ్కర్ కూడలి మీదుగా కాకుండా వెంకటేశ్వరమెట్ట వద్ద జాతీయ రహదారి మీదుగా మళ్లించారు. ఆనందపురం మండలం శిర్లపాలెం, పేకేరు పంచాయతీల మధ్య 33 ఏళ్ల నాటి కల్వర్టు తుపానుకు కొట్టుకుపోవడంతో రూ.2 లక్షలతో తాత్కాలికంగా పునరుద్ధరిస్తున్నారు. రూ.8 లక్షలతో శాశ్వత ప్రాతిపదికన దీని పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. -
మార్గశిర మాసోత్సవాల పందిరి రాటకు ఆహ్వానం
మహారాణిపేట : మార్గశిర మాసోత్సవాల నేపథ్యంలో శనివారం జరగనున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి పందిరి రాట మహోత్సవానికి కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ను ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. ఆలయ ఈవో కె.శోభారాణి, ఇతర అధికారులు, అర్చకులు కలెక్టర్ను గురువారం తన చాంబర్లో కలిసి ఆహ్వాన పత్రికను, అమ్మవారి ప్రసాదాన్ని అందజేసి ఆహ్వానం పలికారు. అమ్మవారి ఆలయంలో శనివారం మార్గశిర మాసోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా.. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
తప్పుల్లో స్మార్ట్
మహారాణిపేట: ఎంతో ఆర్భాటంగా కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పాత బియ్యం కార్డుల స్థానంలో వచ్చిన ఈ స్మార్ట్ కార్డులు అందుకున్నామని సంతోషించే లోపే, వాటిలోని అంతులేని తప్పులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పేర్లు తారుమారు కావడం, వయసులు తప్పుగా పడటం, చిరునామాలు మారిపోవడంతో.. ఇవి ప్రయోజనం చేకూర్చకపోగా, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు ఎక్కడ దూరం చేస్తాయోనని కార్డుదారులు లబోదిబోమంటున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా 642 రేషన్ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 5,17,155 రేషన్ కార్డులున్నాయి. గతంలో కార్డుదారులకు మాన్యువల్గా తయారుచేసిన రేషన్ కార్డులను పంపిణీ చేసేవారు. ఇలా కాదని.. తాము వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టామని, స్మార్ట్ కార్డులు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అనుకున్నదే తడవుగా ఎలాంటి పరిశీలన లేకుండానే ఇష్టమొచ్చినట్లు కార్డులు ముద్రించేసింది. పంపిణీ బాధ్యతను గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి, రేషన్ డీలర్లకు అప్పజెప్పింది. ఇలా జిల్లాకు చేరిన మొత్తం 5,17,155 స్మార్ట్ కార్డులను సెప్టెంబర్ 26 నుంచి పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు 4,58,759 కార్డులు అంటే 89 శాతం పంపిణీ చేసినట్లు డీఎస్వో వి.భాస్కరరావు తెలిపారు. ఇంకా 58,396 కార్డులు పంపిణీ కావాల్సి ఉంది. అయితే కార్డుల కోసం చాలా మంది లబ్ధిదారులు రేషన్ డిపోలు, వార్డు సచివాలయాలు, ఏఎస్వో, డీఎస్వో కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ‘మా దగ్గర లేవు’ అనే సమాధానమే వస్తోందని వాపోతున్నారు. చిరునామాలు గల్లంతయ్యాయ్.. కొత్తగా ముద్రించిన స్మార్ట్ కార్డుల్లో తప్పులకు కొదవే లేదు. భార్య స్థానంలో కూతురి పేరు, ఒక ప్రాంతంలో నివసించే వారికి మరో ప్రాంతం చిరునామా(ఉదాహరణకు కంచరపాలెంలో ఉన్నవారికి వేపగుంట, పెందుర్తి అని ముద్రించడం), పిల్లల పేర్లు పూర్తిగా గల్లంతు కావడం, వయసుల్లో భారీ తేడాలు, పేర్లలో అక్షరదోషాలు, చివరకు జిల్లాలు కూడా తప్పుగా ముద్రించి ఉన్నాయని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ రేషన్ కార్డు కేవలం నిత్యావసర సరుకులకే కాకుండా, పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, ఆరోగ్య ప్రయోజనాలకు అత్యంత కీలకం. ఆధార్, మొబైల్ నంబర్తో అనుసంధానించే ఈ కీలక పత్రంలో వివరాలు తప్పుగా ఉంటే, భవిష్యత్తులో అధికారులు పథకాలను తిరస్కరించే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. అయితే, ఈ తప్పులను ఎలా సవరించుకోవాలో తెలియక ప్రజలు పూర్తి అయోమయంలో ఉన్నారు. సచివాలయాలకు వెళితే ‘ఇంకా సవరణకు ఆప్షన్ రాలేదు’ అని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. తప్పులతో కార్డులు ముద్రించి, ఇప్పుడు సవరణకు అవకాశం ఇవ్వకపోవడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి.. తప్పుల సవరణకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కార్డుల ముద్రణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. ప్రజల నుంచి ఛీత్కారాలు అనుకున్నదొకటి..అయ్యిందొకటి.. అన్న చందంగా ఉంది కూటమి సర్కారు తీరు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాల ముద్రను చెరిపేసేందుకు కూటమి సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అమ్మ ఒడి, రైతు భరోసా, పెన్షన్ కానుక,ఆరోగ్యశ్రీ వంటి వాటి పేర్లు మార్చేసింది. తాజాగా రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులు అందిస్తోంది. అయితే ఈ ప్రక్రియ హడావుడిగా చేపట్టడంతో స్మార్ట్ కార్డులు తప్పుల తడకలుగా ఉన్నాయని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. స్మార్ట్ కార్డుల పేరిట హడావుడి చేసి.. క్రెడిట్ కొట్టేద్దామనుకున్న ప్రభుత్వానికి చివరకు ప్రజల నుంచి ఛీత్కారాలే ఎదురవుతున్నాయి. -
నష్టాన్ని మిగిల్చి..
మోంథా మోగించి.. భారీ వర్షాలు, గాలులతో అపార నష్టంమోంథా తుపాను వల్ల జిల్లాకు అపార నష్టం సంభవించింది. ఈదురుగాలులు, కుండపోత వర్షంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రహరీలు నేలమట్టమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు విలవిల్లాడాయి. రూరల్ ప్రాంతాల్లో పంటలు, తీరంలో మత్స్యకారులు భద్రపరిచిన పడవలు, వలలు నీట మునిగాయి. రోడ్లు ఛిద్రమయ్యాయి. స్తంభాల మీద చెట్లు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగ్గా.. యుద్ధప్రాతిపాదన మరమ్మతులు పూర్తి చేశారు. రిజర్వాయర్లు పూర్తి సామర్థ్యంతో కళకళలాడుతున్నాయి. – మహారాణిపేట -
హార్బర్లో మునిగిన మరబోటు
మహారాణిపేట: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోని సెంట్రల్ డాక్ ఏరియాలో నిలిపి ఉంచిన ఒక మరబోటు మోంథా తుపాను ప్రభావం కారణంగా నీటిలో మునిగిపోయింది. మరమ్మతుల కోసం హార్బర్లో ఉంచిన ఈ బోటు పూర్తిగా దెబ్బతినడంతో రాష్ట్ర మరపడవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.లక్ష్మయ్య స్పందించారు. మునిగిపోయిన ఐఎన్డీ ఏపీ వీ5 ఎంఎం–90 నంబరు గల మరబోటు యాజమాని మేరుగు ధనరాజుకు రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మునిగిపోయిన బోటును పరిశీలించడంతో పాటు, బాధిత బోటు యజమానిని పరామర్శించారు. ఈ సంఘటన తమ దృష్టికి కూడా వచ్చిందని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు తెలిపారు. -
విశాఖ–బొబ్బిలి సెక్షన్లో భద్రతా ఆడిట్
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ పరిధిలోని విశాఖపట్నం–బొబ్బిలి రైల్వే సెక్షన్లో బుధవారం సేఫ్టీ ఆడిట్ జరిగింది. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకు చెందిన భద్రతా ఆడిట్ బృందం ఈ తనిఖీలను చేపట్టింది. ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ ఉత్తమ్ ప్రకాష్ నేతృత్వంలో ఈ బృందం సెక్షన్ పరిధిలోని పలు స్టేషన్లలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించింది. పెందుర్తి–కొత్తవలస మధ్య గల మలుపులు, కొత్తవలస స్టేషన్లో పాయింట్లు, యార్డులు, క్రాసింగ్లు, అలమండ–కోరుకొండ మధ్య నిర్మించిన ప్రధాన బ్రిడ్జిలు, బొబ్బిలి స్టేషన్లోని రిలేరూం, కోమటిపల్లి యార్డ్, ట్రాక్షన్ సబ్స్టేషన్, లెవెల్ క్రాసింగ్ గేట్, కోచింగ్ క్రూ లాబీ, విశాఖపట్నం యార్డులో యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ వ్యాన్, యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్, న్యూ కోచింగ్ కాంప్లెక్స్, రన్నింగ్ రూంలు, రూట్ రిలే ఇంటర్లాకింగ్ కేబిన్లను పరిశీలించింది. సీనియర్ రైల్వే అధికారుల పర్యవేక్షణలో వివిధ రైల్వే జోన్ల మధ్య ఇటువంటి ఇంటర్ జోన్ సేఫ్టీ ఆడిట్లు తరచూ జరుగుతుంటాయని వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఆడిట్ ప్రారంభానికి ముందు డీఆర్ఎం లలిత్ బోహ్రా డివిజన్ భద్రతా అంశాలను ఆడిట్ బృందానికి వివరించారు. తనిఖీల్లో వాల్తేర్ డివిజన్ ఏడీఆర్ఎం(ఆపరేషన్స్) కె.రామారావు, సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ ఆనంద్కుమార్ ముటట్కర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. రైల్వే సేఫ్టీ ప్రమాణాలను పరిశీలించిన నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే బృందం -
● జిల్లాలో 83 పునరావాస కేంద్రాల ఏర్పాటు ● విద్యుత్, మౌలిక సదుపాయాలు లేకుండానే హడావుడి ● ఈ కేంద్రాలకు 1,516 మందిని తరలించినట్లు లెక్కలు ● అనేక చోట్ల భోజనాలు కూడా ఏర్పాటు చేయని అధికారులు
జిల్లాలో పునరావాస కేంద్రాలు మండలం మొత్తం తెరిచిన నిర్వాసితులు కేంద్రాలు కేంద్రాలు పద్మనాభం 05 01 25 భీమిలి 11 02 44 సీతమ్మధార 08 03 62 విశాఖ రూరల్ 07 03 48 ఆనందపురం 01 00 00 గాజువాక 13 01 24 పెదగంట్యాడ 05 00 00 ములగాడ 08 01 782 పెందుర్తి 09 00 00 గోపాలపట్నం 09 01 11 మహారాణిపేట 07 04 520 -
తుపాను తదుపరి చర్యలపై దృష్టి సారించండి
కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట : మోంథా తుపాను నష్టాలను జాగ్రత్తగా అంచనా వేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా తుపాను అనంతరం తీసుకోవలసిన చర్యలపై జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, జోనల్ అధికారులు, రెవెన్యూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పారిశుధ్యం, నీటి వనరుల క్లోరినేషన్, దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణపై జోనల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న గృహాలను నమోదు చేయాలని, పంట, పశు నష్టం, బోట్ల నష్టం అంచనాలను తయారు చేయాలన్నారు. దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లు, భవనాలు, మైనర్ ఇరిగేషన్, పాఠశాలల భవనాలు అంచనాలు తయారు చేయాలని, నిరాశ్రయులైన వారికి, తుపాను వల్ల ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను గుర్తించి పరిహారం అందించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. నష్టం అంచనాలను గురువారం సాయంత్రానికి పూర్తి చేయాలని ఆదేశించారు. తుపాను వల్ల నిరాశ్రయులైన వారికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ ఆయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళ దుంపలు, కేజీ పంచదార ఇవ్వాలని, మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. నిరాశ్రయులై రిలీఫ్ కేంద్రాలకు వచ్చిన వారికి ఒక్కరికి వెయ్యి రూపాయలు, ఒక కుటుంబంలో గరిష్టంగా రూ.3 వేలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. -
తుపాను బాధితులకు పరిహారం అందించాలి
సాక్షి, విశాఖపట్నం: మోంథా తుపాను ప్రభావంతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి విధ్వంసం సృష్టించాయని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. పంట నష్టపోయి, ఇళ్లు ధ్వంసమై కష్టాల్లో ఉన్న బాధితులకు ప్రభుత్వం తక్షణం నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బుధవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, మజ్జి శ్రీనివాసరావు, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్కుమార్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్రెడ్డి, ధర్మశ్రీతో పాటు పలువురు ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోంథా తుపాను వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి, పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. తుపాను బాధితులను పరామర్శించి, సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలందరినీ అభినందించారు. ప్రజలు ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని మరోసారి నిరూపించాయంటూ ప్రశంసించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ కె.సతీష్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, ఎస్ఈసీ సభ్యులు ఐహెచ్ ఫరూఖీ, సతీష్ వర్మ, పీలా వెంకటలక్ష్మి, రాష్ట్ర, జోనల్ అనుబంధ విభాగాల అధ్యక్షులు పేర్ల విజయ్ చందర్, ద్రోణంరాజు శ్రీవత్సవ్, చెన్న జానకిరామ్, కార్పొరేటర్లు బర్కత్ అలీ, శశికళ, మహమ్మద్ ఇమ్రాన్, బిపిన్ కుమార్, జోనల్ యువజన జోనల్ ఇన్చార్జి అంబటి శైలేష్, జిల్లా పార్టీ కమిటీ అధికార ప్రతినిధులు ఆల్ఫా కృష్ణ, పల్లా దుర్గ, మంచ నాగమల్లేశ్వరి, హరి కిరణ్ రెడ్డి, జిల్లా అనుబంధ కమిటీ అధ్యక్షులు బోని శివరామకృష్ణ, నీలి రవి, సనపల రవీంద్ర భరత్, శ్రీదేవి వర్మ, శంకర్ బత్తుల ప్రసాద్, మార్కండేయులు, బొండా ఉమామహేశ్వరరావు, సకలబత్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జలంలో జనం.. పడవపై గంటా
పెదనాగమయ్యపాలెంలో ఎమ్మెల్యే చుట్టపుచూపు పెదనాగమయ్యపాలెం గ్రామం వరద నీటితో చిక్కుకోగా.. బుధవారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వారి గోడు వినడానికి వచ్చారు. అయితే ప్రజలు నీటితో ఇబ్బందులు పడుతుంటే.. ఆయన మాత్రం పడవ ఎక్కారు. గ్రామం ఎంత మేర నీటిలో తేలుతుందో పరిశీలించినట్లుగా సాగింది ఆయన పర్యటన! కనీసం ఆదుకుంటాం అనే ఒక్క హామీ మాట అయినా చెప్తారేమో అని ఆశగా ఎదురుచూసిన మత్స్యకారులకు నిరాశే మిగిలింది. బంధువుల ఇంటికి వచ్చిన చుట్టపులా.. కాసేపు పడవపై షికారు చేసి ఆయన వెళ్లిపోయారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బహుశా వరద సమయంలో బోటింగ్ అనుభూతిని పరిశీలించడానికి, ఆపై ఫొటోలకు ఫోజులివ్వడానికి మాత్రమే ఆయన ఈ పర్యటన చేపట్టారేమో అని ప్రజలు గుసగుసలాడారు. -
ఉపాధి కూలీలకు ఈకేవైసీ కష్టాలు
మహారాణిపేట: జిల్లాలో ఉపాధి హామీ పథకం కూలీల ఈకేవైసీ(ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే పనులు కల్పించి, మస్టర్ వేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే గడువు ముగియడానికి కేవలం రెండు రోజులే మిగిలి ఉన్నా.. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 80 శాతం మాత్రమే ఈకేవైసీ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి మొత్తం 3.65 లక్షల మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. అయితే వారిలో 2.89 లక్షల మంది మాత్రమే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. ఇంకా సుమారు 76 వేల మంది కూలీల ప్రక్రియ పెండింగ్లో ఉంది. మిగిలిన రెండు రోజుల్లో 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈకేవైసీ పూర్తి అయిన వారికే మస్టర్ వేస్తారు. వాస్తవంగా హాజరైన కూలీల వేలిముద్ర లేదా కంటి పాపలు(ఐరిష్) ఆధారంగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈకేవైసీ జిల్లాలో లక్ష్యానికి ఇంకా చేరుకోలేదు. ఈ జాప్యానికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) అధికారుల అలసత్వమే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే.. ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. చాలా చోట్ల కూలీలు పనులకు రాకపోయినా వచ్చినట్టు చూపుతున్నారు. కొన్ని చోట్ల చనిపోయిన వారి పేర్లు, దేశంలో ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటున్న వారి పేర్లతో మస్టర్లు వేస్తున్నారు. ఇలా క్షేత్ర స్థాయిలోనే సిబ్బంది, అధికార పార్టీ నాయకులు ఆయా మొత్తాలను స్వాహా చేస్తున్నారు. స్థానిక నాయకులు చెప్పినట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు నకిలీ ఫొటోలు అప్లోడ్ చేసి వేతనాలు పొందుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం ఈకేవైసీని తప్పనిసరి చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ఆధార్తో అనుసంధానమైన ఈకేవైసీ పూర్తి చేసి, ప్రతిరోజూ రెండు పూటలా పని ప్రదేశంలో ముఖ గుర్తింపు (ఫొటో) ద్వారా హాజరు నమోదు చేసుకోవాలి. అయితే, అధికారుల నిర్లక్ష్యం కారణంగా గడువులోగా ఈకేవైసీ పూర్తికాని వేలాది మంది నిజమైన కూలీలు, నవంబర్ 1 నుంచి ఉపాధి కోల్పోతామేమోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
జీవీఎంసీలోకి నాలుగు మండలాలు!
అల్లిపురం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) త్వరలో రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించనుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా విభజన అనంతరం మిగిలిపోయిన నాలుగు మండలాలైన భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తిలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతమైంది. ప్రస్తుతం 98 వార్డులతో ఉన్న జీవీఎంసీ ఈ నాలుగు మండలాల విలీనంతో 120 వార్డులకు విస్తరించనుంది. ఈ విస్తరణతో విశాఖపట్నం భారతదేశంలో 18వ అతిపెద్ద నగరంగా కూడా గుర్తింపు పొందనుంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలను(భీమిలి, పద్మనాభం, ఆనందపురం) జీవీఎంసీలో కలపాలని అక్కడి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేయగా.. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు అధికారులు పనులను వేగవంతం చేసినట్లు సమాచారం. ఈ ప్రక్రియలో భాగంగా జీవీఎంసీ అధికారులు విలీనం కానున్న నాలుగు మండలాల పరిధిలోని రెవెన్యూ, గ్రామ పంచాయతీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విలీన ప్రక్రియలో ప్రభుత్వం జీవీఎంసీకి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. విలీనమయ్యే ప్రాంతాల్లోని పంట పొలాల విస్తీర్ణంపై అధికారులు ప్రత్యేకంగా సర్వే చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవసాయ భూములకు జీవీఎంసీ పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసే నాటికి, తదుపరి జీవీఎంసీ ఎన్నికల లోపు... భూ సర్వే, గృహాలు, పంట పొలాలు, దేవాలయాలు వంటి అన్ని అంశాలపై సమగ్ర జాబితాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ గ్రామ పంచాయతీల్లో గత 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్యాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, వాటర్ సప్లై, విద్యుత్ సిబ్బంది, గుర్ఖాలను జీవీఎంసీలోకి తీసుకునేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. -
విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాల్లో ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ
విశాఖ సిటీ : మోంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యల్లో భాగంగా తిరుపతి నుంచి ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ బుధవారం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే ఏపీఎస్పీడీసీఎల్ నుంచి సుమారు 1,500 మంది అధికారులు, సిబ్బంది తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. సీఎండీ శివశంకర్, ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్లు డి.చంద్రం, టి.వనజ, సీజీఎం వి.విజయలలిత, ఎస్ఈ సురేఖ తదితరులతో సమావేశమై క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన మెటీరియల్ సరఫరా, మద్దతు చర్యలపై సమీక్షించారు. -
గోస్తనీ ఉగ్రరూపం
తగరపువలస: తాటిపూడి రిజర్వాయర్ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో గోస్తనీ నది ఉగ్రరూపం దాల్చింది. భీమిలి డివిజన్లోని తగరపువలస, పరిసర ప్రాంతాలు బుధవారం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా భీమిలి మండలం పెదనాగమయ్యపాలేనికి మూడు అడుగుల మేర వరద నీరు పోటెత్తడంతో అతలాకుతలమైంది. తీరంలో ఉంచిన బోట్లు, వలలు నీట మునిగాయి. పెదనాగమయ్యపాలెంలోని 0327044 నంబరు రేషన్ డిపో గొడౌన్లోకి నీరు చేరింది. గొడౌన్లోని మొత్తం 400 బియ్యం బస్తాలకు గాను 120 బస్తాలు పూర్తిగా తడిచిపోయాయి. నీరు చేరిన సమయంలో అక్కడ 400 పంచదార ప్యాకెట్లు కూడా ఉన్నట్లు తెలిసింది. బియ్యం బస్తాలు నీట మునగడంతో నిరుపేదలకు రేషన్ పంపిణీకి ఆటంకం కలిగింది. వరద ప్రభావంతో తగరపువలస నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మహరాజుపేట–పద్మనాభం రహదారిపై మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. తాటితూరులోని తాటాకు ఇళ్లలోకి వరదనీరు చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నవరం వెళ్లే మార్గంలో ఉప్పుటేరు నీరు భారీగా చేరింది. దీంతో దివీస్ పరిశ్రమ ఉద్యోగులతో పాటు చిప్పాడ, తూడెం, గుడివాడ వంటి గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయరహదారి నుంచి భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాలను కలిపే మార్గంలోని శివాలయం వద్ద చప్టా పూర్తిగా మునిగిపోయింది. ఈ ప్రవాహంలో ఒక పాడి ఆవు కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. టి.నగరపాలెంలో స్నానాల ఘాట్ పూర్తిగా నీట మునిగింది. -
ముడసర్లోవకు జలకళ
మోంథా తుపానుతో పెరిగిన నీటి మట్టం ఆరిలోవ: ముడసర్లోవ రిజర్వాయర్లో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. మోంథా తుపాను ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు ఈ రిజర్వాయర్కు జలకళ వచ్చింది. రిజర్వాయర్ చుట్టూ కంబాలకొండలు, సింహాచలం కొండలు ఉన్నాయి. మోంథా తుపాను వర్షాల వల్ల ఈ కొండల నుంచి రిజర్వాయర్లోకి 7.1 అడుగుల వరకు కొత్త నీరు చేరిందని ముడసర్లోవ నీటి సరఫరా విభాగం అధికారులు తెలిపారు. తుపానుకు ముందు రిజర్వాయర్లో 157.5 అడుగుల నీరు ఉండేది. వరద నీటితో కలిసి ప్రస్తుతం నీటి మట్టం 164.6కు చేరింది. సాధారణంగా ఈ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 170 అడుగులు. దీనిని ఓవర్ఫ్లో చేయడానికి మరో 5.4 అడుగుల నీరు మాత్రమే అవసరం. తుపాను ప్రభావంతో ఎక్కువ మొత్తంలో కొత్త నీరు చేరడంతో, ప్రస్తుతం ఆరిలోవ ప్రాంతంలో భూగర్భ జలమట్టం పెరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. -
గ్రీన్మైనా ఇంపాక్ట్ ఇదీ
బీచ్లో కలిశారు.. ‘గ్రీన్ వెడ్డింగ్’తో ఒక్కటయ్యారు ● పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ‘గ్రీన్మైనా’ ఏర్పాటు ● మైదాన్ సాఫ్ పేరుతో క్రికెట్ స్టేడియాల్లో పరిశుభ్రత 2018.. ముంబయిలో బీచ్ క్లీనింగ్ జరుగుతోంది. చాలామంది యువత కార్యక్రమంలో పాల్గొని ఫొటోలు తీసుకుంటున్నారు. కానీ.. ఓ యువకుడు, యువతి మాత్రం.. నిజాయతీగా బీచ్లో చెత్తను పోగేస్తూ.. మొదటి సారి కలుసుకున్నారు. ‘నా పేరు అశ్విన్ మాల్వాడే.. మర్చంట్ నేవీలో ఫస్ట్ ఆఫీసర్’ అని యువకుడు, ‘నా పేరు నుపూర్ అగర్వాల్.. మార్కెట్ రీసెర్చర్’ అని యువతి ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. మాటలు కలిశాయి.. మనసులు దగ్గరయ్యాయి. పర్యావరణంపై ఉన్న ప్రేమ వారిని మరింత దగ్గర చేసింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక, ఓ స్నేహితుడి వివాహంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార వృథా చూసి చలించిపోయారు. తమ పెళ్లిని పర్యావరణ హితంగా.. ‘గ్రీన్ వెడ్డింగ్’ కాన్సెప్ట్లో చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అప్పుడే ‘గ్రీన్మైనా’స్వచ్ఛంద సంస్థ రెక్కలు తొడిగింది. తమ పెళ్లి నుంచి మొదలుపెట్టిన గ్రీన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ను ముంబయితో పాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించారు. ఇప్పుడు క్రికెట్ మైదానాల్లో చెత్తపై సమరం ప్రారంభించారీ పర్యావరణ జంట. – సాక్షి, విశాఖపట్నం వివాహ సమయంలో అశ్విన్, నుపూర్2019 డిసెంబర్లో అశ్విన్, నుపూర్ పెళ్లి పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా జరిగింది. తమ పెళ్లి వేడుకలు సున్నా కర్బన ఉద్గారాలుగా ఉండాలని వెడ్డింగ్ ప్లానర్లని కోరితే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో వీరే వెడ్డింగ్ ప్లానర్లుగా మారి.. సమాజానికి సరికొత్త వివాహాన్ని పరిచయం చేశారు. ఆ పెళ్లిలో వాడిన ప్రతి వస్తువూ పర్యావరణ హితమైనదే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చేతితో నేసిన కాటన్ దుస్తుల్నే పెళ్లిలో ధరించారు. నుపూర్ తన వెడ్డింగ్ లెహెంగాపై ‘బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్.. సేవ్ ది ప్లానెట్’అని.. అశ్విన్ ‘క్లైమేట్ క్రైసిస్.. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్’అని నినాదాలు రాసి ధరించారు. అలంకరణకు తాజా పువ్వులు, గాజు సీసాలు, పునర్వినియోగ కాగితాలు వాడారు. మట్టి కప్పులు, వెదురు స్పూన్లు ఉపయోగించారు. పెళ్లి పత్రికను సైతం నాటితే మొక్కలు మొలిచేలా విత్తనాలతో తయారుచేశారు. ఊరేగింపునకు ఎలక్ట్రిక్ కారు వాడారు. పెళ్లికి ప్లాస్టిక్ వస్తువులు బహుమతిగా తేవద్దని కార్డులోనే ముద్రించారు. ఇలా జరిగిన అశ్విన్, నుపూర్ వివాహం అందరినీ ఆకట్టుకుంది. ‘గ్రీన్మైనా’ఆవిర్భావం తమ ఇంట్లో పెళ్లి కూడా ఇలాగే చేయాలంటూ చాలా మంది అశ్విన్, నూపూర్ జంటను సంప్రదించారు. తమ పెళ్లి స్ఫూర్తితో, పర్యావరణ హిత వివాహాలను ప్రోత్సహించడానికి వారు ‘గ్రీన్మైనా’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి 2020లో గ్రీన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ని ముంబయికి పరిచయం చేశారు. తర్వాత కోవిడ్ వచ్చినా.. క్రమంగా దేశ వ్యాప్తంగా గ్రీన్ వెడ్డింగ్ కార్యకలాపాలు విస్తరింపజేశారు. ఈ కాన్సెప్ట్తో ఇప్పటివరకు ముంబయి, ఢిల్లీ, రాయ్పూర్, జైపూర్, బెంగళూరు వంటి నగరాల్లో 50కి పైగా వివాహాలు జరిపించారు. 2022లో రాయ్పూర్లో జరిగిన ఓ పెళ్లిలో 1,225 కిలోల తడి చెత్తను, 800 కిలోల ప్లాస్టిక్ను భూమిపైకి రాకుండా కాపాడారు. మిగిలిన ఆహారాన్ని 1,200 మందికి పంచారు. నూతన దంపతులతో 50 చెట్లు నాటించారు. ప్రస్తుతం ఈ సంస్థలో 10 మంది ప్రధాన సభ్యులు ఉండగా.. పదుల సంఖ్యలో వలంటీర్లు చేరారు. గ్రీన్మైనా సంస్థ ద్వారా గ్రీన్ వెడ్గింగ్స్, మైదాన్ సాఫ్ వంటి కార్యక్రమాలతో పర్యావరణంపై అశ్విన్, నుపూర్ దంపతులు గణనీయమైన ప్రభావాన్ని చూపారు. ఆ ఫలితాలను పరిశీలిస్తే.. కర్బన ఉద్గారాల నియంత్రణ 2,39,000 కిలోలు నాటిన మొక్కల సంఖ్య 5,860 ఆహార పంపిణీ(మిగిలిన ఆహారం) 12,000 మందికి పొడి చెత్త రీసైక్లింగ్ 30,750 కిలోలు తడి చెత్త కంపోస్టింగ్ 41,155 కిలోలు -
శ్రీవారి పుష్పయాగానికి పువ్వుల తరలింపు
ఎంవీపీ కాలనీ: శ్రీ వేంకటేశ్వరస్వామి పుష్పయాగానికి విశా ఖ నుంచి పువ్వులు తరలివెళ్లాయి. ఆధ్యాత్మికవేత్త హిమాన్షు ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన పూలను యాగానికి పంపించారు. బుధవారం ఎంవీపీ కాలనీలోని టీటీడీ ఈ–దర్శనం కౌంటర్ వద్దనున్న హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత టీటీడీ సలహా కమిటీ చైర్మన్ పట్టాభిరామ్ దంపతులు, మహిళా భక్తులు పూలకు సంకల్పం చేశారు. 3 వేల కలువలు, 2 వేల తామరలతోపాటు వివిధ రకాల పూలను తిరుమలకు తరలించారు. -
జీవీఎంసీ పరిధిలో..
డాబాగార్డెన్స్: మోంథా తుపాను నేపథ్యంలో జీవీఎంసీ పలు సహాయక చర్యలు చేపట్టింది. ఆయా జోనల్ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన 13 పునరావాస కేంద్రాలకు మొత్తం 138 మందిని నిర్వాసితులను తరలించింది. వివిధ ప్రాంతాల్లో 161 చెట్లు కూలిపోగా అధికారులు వెంటనే 157 చెట్లను క్లియర్ చేయించారు. పడిపోయిన 10 విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించారు. ప్రజల నుంచి యూజీడీకి సంబంధించి 20 ఫిర్యాదులు రాగా 19 పరిష్కరించారు. వర్షం నీరు నిలిచిపోయిన 30 ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కూలిపోయిన 8 ప్రహరీలను క్లియర్ చేశారు. తుపాను కారణంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ల ద్వారా 229 ఫిర్యాదులు అందగా 224 పరిష్కరించారు. -
రైతు ఆశలపై ‘మోంథా’ నీళ్లు
మహారాణిపేట: ‘మోంథా’తుపాను జిల్లా రైతాంగంపై పెను ప్రభావం చూపుతోంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, తీవ్రమైన ఈదురు గాలులతో అన్నదాతలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో వేలాది ఎకరాల పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, విశాఖ రూరల్ మండలాల పరిధిలో ఈ సీజన్లో రైతులు 4,602 హెక్టార్లలో వరి, 10 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు రూ. 25,000 నుంచి రూ.35,000 వరకు పెట్టుబడి పెట్టి, ఈసారి మంచి దిగుబడి వస్తుందని ఆశించారు. నవంబర్ రెండు, మూడు వారాల్లో పంటలు కోతకు సిద్ధమవుతున్న కీలక తరుణంలో తుపాను విరుచుకుపడటం వారి ఆశలపై నీళ్లు చల్లింది. తుపాను ధాటికి ఇప్పటికే 29 హెక్టార్లలో వరి పంట, 10 హెక్టార్లలో మొక్కజొన్న పంట పూర్తిగా నీట మునిగినట్లు ప్రాథమిక సమాచారం. భారీ ఈదురు గాలులకు ఏపుగా పెరిగిన వరి చేలు అక్కడక్కడ నేలకొరిగాయి. చెరువులు, జలాశయాలు నిండిపోవడంతో, పొలాల్లో చేరిన వర్షపు నీటిని బయటకు తీయలేని నిస్సహాయ స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. పొలాల్లో నీరు ఇలాగే నిలిచిపోతే ధాన్యం నాణ్యత పూర్తిగా దెబ్బతింటుందని, దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. వర్షాలు తగ్గిన తర్వాత గానీ నష్టం పూర్తిస్థాయిలో అంచనా వేయలేమని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్లో వచ్చే తుపాన్లు తమను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
పునరావాస కేంద్రంలో చిమ్మచీకట్లు
కొమ్మాది: జీవీఎంసీ 4వ వార్డు మంగమారిపేట వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో విద్యుత్ సౌకర్యం లేక చిమ్మచీకట్లు అలముకున్నాయి. గతంలో మంగమారిపేటలో తుపాను రక్షిత భవనం ఉండేది. అయితే అది పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరుకోవడంతో.. జిల్లా పరిషత్ హైస్కూల్ను సోమవారం తాత్కాలిక పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ హైస్కూల్ భవనంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు ప్రధానంగా చీకట్లు అలుముకోవడంతో.. తీరప్రాంత మత్స్యకారులు అక్కడి నుంచి వెనుతిరిగారు. అధికారుల తీరుపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాగా.. పునరావాస కేంద్రం కోసం జనరేటర్ను ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు దానిని ఉపయోగించడం లేదు. దీనిపై అధికారులను ప్రశ్నించగా.. ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తే జనరేటర్ ఆన్ చేస్తామని చెప్పడం గమనార్హం. -
కొండచిలువ కలకలం
ఆరిలోవ: జీవీఎంసీ 12వ వార్డు పరిధి టి.ఐ.సి పాయింట్ సమీపం క్రాంతినగర్లో మంగళవారం ఉదయం ఒక కొండచిలువ కలకలం రేపింది. కంబాలకొండ వెనుక భాగాన్ని ఆనుకొని ఈ కాలనీ ఉంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ ప్రాంతం నుంచి కొండచిలువ ఈ కాలనీలోకి ప్రవేశించింది. రోడ్డు పక్కన చిన్న కాలువలో చేరిన సుమారు 12 అడుగుల ఈ పామును స్థానికులు గమనించి ఆందోళనకు గురయ్యారు. కొందరు భయంతో ఇళ్ల తలుపులు మూసుకున్నారు. స్థానిక యువకులు ధైర్యం చేసి ఆ పామును చాకచక్యంగా పట్టుకుని ఖాళీ డ్రమ్ములో వేశారు. అనంతరం అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చి అప్పగించారు. కొండ ప్రాంతం నుంచి పాములు రాకుండా నివాసాలను ఆనకుని ఇనుప మెస్ ఏర్పాటు చేయాలని స్థానికులు జీవీఎంసీ అధికారులను కోరుతున్నారు. -
అప్పన్న భక్తుల రక్షణకు చర్యలు
సింహాచలం: తుపాను నేపథ్యంలో ిసింహాచలం దేవస్థానంలోని అన్ని విభాగాలను ఈవో ఎన్.సుజాత అప్రమత్తం చేశారు. కొండపైన, కొండ దిగువ ఉన్న విభాగాలను సందర్శించి, తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సూచనలు చేశారు. ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలపై పర్యవేక్షించాలని, వర్షం నీరు నిల్వ ఉండకుండా వెంటనే తొలగించాలని ఆదేశించారు. తాగునీటి ట్యాంకులు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. తుపాను ప్రభావం తగ్గేవరకు ఉద్యోగులంతా అధికారుల మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరమైతే దేవస్థానం హెల్ప్లైన్ నంబర్ల(93987 34612, 0891–2954944)ను సంప్రదించాలన్నారు. ఆమె వెంట ఏఈవో తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ఉన్నారు. -
విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిద్ధం
విశాఖ సిటీ: మోంథా తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఏర్పడే అంతరాయాలను అత్యంత వేగంగా పునరుద్ధరించేందుకు ఏపీఈపీడీసీఎల్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. సంస్థ పరిధిలోని 11 జిల్లాల అధికారులను ముందుగానే అప్రమత్తం చేశామని చెప్పారు. ఇందు కోసం సుమారు 15 వేల విద్యుత్ స్తంభాలు, 950 ట్రాన్స్ఫార్మర్లు, 115 క్రేన్లు, 80 జేసీబీలు, 144 వైర్లెస్ హ్యాండ్సెట్లు, 285 పవర్సాలు, 254 పోల్ డ్రిల్లింగ్ యంత్రాలు, మొబైల్ డీటీఆర్ రిపేర్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. తుపాను పునరుద్ధరణ చర్యలు పూర్తయ్యే వరకు ఉద్యోగుల సెలవులను రద్దు చేసినట్లు చెప్పారు. సంస్థ పరిధిలోని ఇతర జిల్లాల నుంచి సుమారు 7 వేల మంది సిబ్బంది, అవసరమైన సామగ్రిని పెద్ద ఎత్తున తుపాను ప్రభావిత ప్రాంతాలకు తరలించామన్నారు. రాష్ట్రంలోని ఇతర విద్యుత్ సంస్థల నుంచి కూడా సుమారు 2 వేల మంది సిబ్బంది సహాయక చర్యల కోసం చేరుకున్నారన్నారు. అత్యవసర సేవలైన తుపాను సహాయక కేంద్రాలు, హాస్పిటళ్లు, మొబైల్ టవర్లు, సబ్ స్టేషన్లు వంటి వాటికి నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు జనరేటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 లేదా స్థానిక కంట్రోల్ రూమ్ నంబర్లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. కంట్రోల్ రూమ్ నంబర్లు విశాఖపట్నం కార్పొరేట్ కార్యాలయం – 8331018762 విశాఖ జోన్–1 – 9490610018 జోన్–2 – 9490610020 జోన్–3 – 9491030721 -
కమ్యూనికేషన్ రిపీటర్ పరిశీలన
తగరపువలస: ఆనందపురం కొండపై ఉన్న పోలీస్ కమ్యూనికేషన్ రిపీటర్ను మంగళవారం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పరిశీలించారు. ఒకటిన్నర కిలోమీటరు దూరం కాలినడకన కొండపైకి వెళ్లి.. అక్కడ ఉన్న కమ్యూనికేషన్ రిపీటర్ను సీపీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మొబైల్ నెట్వర్క్ పనిచేయని అత్యవసర పరిస్థితుల్లో రిపీటర్ సేవలకు పవర్ బ్యాకప్ అందుబాటులో ఉందా లేదా అని ఆరా తీశారు. తుపాను కారణంగా కమ్యూనికేషన్కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం సీపీ ఆనందపురం పోలీస్ స్టేషన్ను సందర్శించారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించి, స్టేషన్ పరిసరాలు, నిర్వహణలో చేయాల్సిన మార్పులను సిబ్బందికి సూచించారు. -
సమయం
చేజారనీయొద్దు! మహారాణిపేట: మెదడుకు రక్తప్రసరణ ఒక్కసారిగా ఆగిపోవడం లేదా తగ్గిపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. మెదడు కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందకపోవడంతో నరాల సంబంధిత వ్యాధులు సోకుతాయి. అందులో కీలకమైనది బ్రెయిన్ స్ట్రోక్. రక్తనాళాలు పగలడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఇలాంటి వారికి వీలైనంత వేగంగా అత్యవసర వైద్య సేవలు అందించాలి. లేకుంటే ప్రాణం మీదకు వస్తుంది. కేజీహెచ్లోనే నెలకు 160 కేసులు కేజీహెచ్లో సగటున నెలకు సుమారు 160 స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. వీరిలో సుమారు 70 శాతం మంది పురుషులు, మిగిలిన వారు సీ్త్రలు. మొత్తం స్ట్రోక్లలో 17% హెమరైజ్డ్ స్ట్రోక్లు కాగా, మిగతా 83% ఇస్కిమిక్ స్ట్రోక్లేనని వైద్యులు చెప్తున్నారు. 2024 ఆగస్టు నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 14 నెలల్లో 54 మందికి థ్రాంబోలైసిస్ చేశారు. గత ఆరు మాసాల్లో ఈ రకమైన చికిత్స అవసరమైన కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మధ్య వయసు, వృద్ధ పురుషుల్లో స్ట్రోక్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరే కేసుల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య పదింతలున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలవాట్లే ప్రధాన కారణం పలు ఆహారపు అలవాట్ల వల్లే ఇలాంటి వ్యాధులు వస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రధాన ప్రమాద కారకాలు రక్తపోటు, మధుమేహం, అధిక కొవ్వు, పొగ త్రాగడం, మద్యపానం, ఊబకాయం, వ్యాయామం లేకపోవడం వల్ల ఎక్కువ మందికి ఈ స్ట్రోక్ వస్తోంది. నిద్రలో శ్వాస ఆగడం, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, దంత దోషాలు, గాలిలో కాలుష్యం, పండ్లు, కూరగాయలు తక్కువగా తినడం కూడా కారణాలే. ఈ లక్షణాలుంటే.. ముఖం వంకరగా మారడం, చేతులు బలహీనమవడం, మాటలు స్పష్టంగా రాకపోవడం, ఎదుటివారి మాటల్ని అర్థం చేసుకోలేకపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఒక్కసారిగా చూపు తగ్గిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తే దాన్ని స్ట్రోక్గానే భావించొచ్చు. ఇలాంటి సమయంలో నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుని, సత్వర వైద్య సేవలు పొందితే ముప్పు తప్పించుకోవచ్చు. ఒకప్పుడు 50–60 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే బ్రెయిన్ స్ట్రోక్ మాట వినేవాళ్లం. ప్రస్తుత దురలవాట్ల కారణంగా పిల్లల్లో కూడా ఈ సమస్య చూస్తున్నాం. ఇటీవల తరచూ 20–35 ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా ఈ సమస్యతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. వీటిలో 80–90 శాతం మంది సత్వర చికిత్సతో కోలుకుంటున్నా.. కొందరు స్ట్రోక్ కారణంగా పక్షవాతానికి గురై కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అక్టోబర్ 29 వరల్డ్ స్ట్రోక్ డే. ఈ ఏడాది ప్రతి నిముషం లెక్కలోకి(ఎవ్విరీ మినిట్ కౌంట్స్) థీమ్తో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముందు జాగ్రత్తలే మేలు స్ట్రోక్ నివారణకు రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచడం, పొగ త్రాగకపోవడం, మద్యపానం తగ్గించడం, వ్యాయా మం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించడం, మంచి నిద్ర అలవాటు చేసుకోవడం, గాలి కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. అలవాట్లలో మార్పు తప్పనిసరి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారికి వైద్యం అందిస్తున్నాం. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. అన్ని రకాల స్ట్రోక్లకు వైద్యం అందించాం. చాలా మందికి తగ్గింది. కొంత మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ఒక సారి స్ట్రోక్ వచ్చిన వారు అలవాట్లలో మార్పు చేసుకోవాలి. – డాక్టర్ ఎస్.గోపి, న్యూరాలజీ విభాగాధిపతి, ఏఎంసీ/కేజీహెచ్ సత్వర వైద్యంతో మేలు పక్షవాతాన్ని త్వరితగతిన గుర్తించి వైద్యం అందిస్తే కాపాడే వీలుంటుంది. ఆలస్యం జరిగితే ప్రాణాలకే ముప్పు. నూతన చికిత్సా విధానాలైన థ్రాంబోలైసిస్ లేదా థ్రాంబెక్టమీ ద్వారా మనిషి పూర్తిగా కొలుకునే అవకాశం ఉంటుంది. ఎంత వేగంగా చికిత్స అందిస్తే అంత మంచిది. – డాక్టర్ సీహెచ్ విజయ్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కిమ్స్ ఐకాన్ -
మళ్లీ పోటీలా..
ఆరిలోవ : అండర్–17 స్కూల్ గేమ్స్లో భాగంగా బాలికలకు మరోసారి జిల్లా స్థాయి వాలీబాల్ ఎంపికలు నిర్వహించనున్నారు. బుధవారం ఈ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో ఎన్.ప్రేమకుమార్ ప్రకటించడంతో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వాహకులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇటీవల జిల్లా స్థాయి అండర్–14, అండర్–17 స్కూల్ గేమ్స్ జరిగాయి. ఈ పోటీల్లో పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా అండర్–17 బాలికలకు వాలీబాల్ పోటీలు నిర్వహించి విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వారి ఎంపిక సరిగా జరగలేదని కొందరు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అండర్–17 వాలీబాల్ బాలికల విభాగం ఎంపికను రద్దుచేసి.. బుధవారం ఉదయం 9 గంటలకు గోపాలపట్నం ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మళ్లీ పోటీలు నిర్వహించడానికి డీఈవో ఎన్.ప్రేమకుమార్ మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వాహకులను ఆదేశించారు. ముందు నిర్వహించిన ఎంపిక కమిటీని రద్దుచేసి కొత్త కమిటీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు డీఈవో తెలిపారు. కూటమి ఎమ్మెల్యే ఒత్తిడితోనేనా పోటీలు మళ్లీ వాలీబాల్ పోటీలు జరిపించి తమకు అనుకూలమైనవారిని ఎంపిక చేయాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, విద్యాశాఖ అధికారులపై కూటమి పార్టీలకు చెందిన నగరంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసినట్లు సమాచారం. వారి ఒత్తిడితోనే అండర్–17 వాలీబాల్ బాలికల విభాగం ఎంపిక రద్దు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే జరిగిన పోటీని రద్దు చేశారంటే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సక్రమంగా ఎంపికలు నిర్వహించలేదనే విమర్శలు కూడా సర్వత్రా వినిపిస్తున్నాయి. సెలవు లేదా..? ఓ పక్క స్కూల్ గేమ్స్ షెడరేషన్ నిర్వాహకులు విద్యార్థులకు పోటీలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. మరో పక్క మోంథా తుఫాన్ ప్రభావంతో అన్ని పాఠశాలలకు బుధవారం కూడా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ సెలవు ప్రకటించారు. అయినా కలెక్టర్ ఆదేశాలు ఈ క్రీడా పోటీల ఎంపికకు వర్తించవన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. -
ముందస్తు చర్యలు ఫలితాలనిచ్చాయి
తుపాను ప్రత్యేకాధికారి అజయ్ జైన్ మహారాణిపేట: మోంథా తుపాను దృష్ట్యా ఇప్పటివరకు జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలు మంచి ఫలితాలనిచ్చాయని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగామని ప్రత్యేక అధికారి అజయ్ జైన్, కలెక్టర్ ఎం. ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. అయితే, రాబోయే 12 గంటలు అత్యంత కీలకం కాబట్టి ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ వీసీ హాలులో ఎంపీ శ్రీ భరత్, కలెక్టర్ హరేందిర ప్రసాద్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన అజయ్ జైన్.. మోంథా తుపాను తాజా పరిస్థితిని వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలోని 10 జోన్లలో ఒక్కో జోన్కు రెండేసి చొప్పున క్యూఆర్టీ బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం 8 పునరావాస శిబిరాల్లో 144 మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు. చెట్ల కొమ్మలు, డ్రెయిన్లలో పూడికలు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ములగాడ, సీతకొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా, ఇతర చోట్ల రాళ్లు జారినట్లు గుర్తించామన్నారు. జిల్లాలోని 14 చెరువులు ప్రమాదకర స్థితిలో ఉన్నందున, ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వివరించారు. 119 చెట్లు కూలిపోగా 60 తొలగించామని, 9 విద్యుత్ స్తంభాలు పడిపోగా ఏడింటిని పునరుద్ధరించినట్లు తెలిపారు.8 గోడలు కూలిపోగా 4 చోట్ల చర్యలు చేపట్టామన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా 35 ట్యాంకులను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ వెల్లడించారు. అత్యవసరమైతే 0891–2590100, 96669 09192, 180042 500009 హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
బస్సులకు డిమాండ్
డాబాగార్డెన్స్: తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు ద్వారకా బస్ స్టేషన్కు క్యూ కట్టారు. కొంతమేర ఆర్టీసీ బస్సుల వద్ద (ఇచ్ఛాపురం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం వరకు వెళ్లేందుకు) రద్దీగా ఉండగా.. ఓఎస్ఆర్టీసీ బస్సులకు పెద్ద సంఖ్యలో ప్రయాణికుల తాకిడి కనిపించింది. ద్వారకా బస్ స్టేషన్లో నిత్యం ఖాళీగా కనిపించే ఓఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్ కౌంటర్ రైళ్ల రద్దు కారణంగా మంగళవారం కిటకిటలాడింది. తుఫాన్ కారణంగా చాలా మంది ప్రయాణికులు రద్దు చేసుకోవడంతో నిత్యం రద్దీగా కనిపించే ఆర్టీసీ బుకింగ్ కౌంటర్లు మంగళవారం ఖాళీగా దర్శనమిచ్చాయి. -
బోసిపోయిన రైల్వేస్టేషన్
తాటిచెట్లపాలెం: తుపాను దృష్ట్యా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. వీటిలో ఇక్కడ నుంచి బయల్దేరాల్సిన, విశాఖపట్నం చేరుకోవలసిన పలు రైళ్లు ఉన్నాయి. మరికొన్ని రైళ్లు దారిమళ్లించారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా ఈ సమాచారాన్ని ముందుగానే ప్రయాణికులకు చేరవేయడంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. దీంతో విశాఖ రైల్వేస్టేషన్ మంగళవారం నిర్మానుష్యంగా మారింది. సమాచారం తెలియక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నారు. మంగళవారం మొత్తంగా 19 రైళ్లను రద్దు చేయగా 11 రైళ్లు ఆలస్యంగా బయలుదేరాయి. మరో రెండు రైళ్లను దారి మళ్లించారు. బుధవారం కిరండూల్–విశాఖపట్నం(18516)నైట్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం–మచిలీపట్నం(17220) ఎక్స్ప్రెస్, రాయగడ–గుంటూరు(17244)ఎక్స్ప్రెస్, భువనేశ్వర్–హైదరాబాద్(07166) స్పెషల్ ఎక్స్ప్రెస్, ప్రశాంతి ఎక్స్ప్రెస్లను రద్దు చేశారు. 30వ తేదీన లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం(18520) ఎల్టీటీ ఎక్స్ప్రెస్, ముంబయి–భువనేశ్వర్(11019)కోణార్క్ ఎక్స్ప్రెస్, పూరీ–తిరుపతి(17479)ఎక్స్ప్రెస్లు రద్దయ్యాయి. నిర్మానుష్యంగా ఒకటో నంబర్ ప్లాట్ఫాం -
గరిష్ట స్థాయికి మేహాద్రి నీటిమట్టం
రికార్డు స్థాయిలో 9,200 క్యూసెక్కుల నీరు విడుదలపెందుర్తి : మేహాద్రిగెడ్డ జలాశయం నీటిమట్టం రికార్డు స్థాయికి చేరుకుంది. రిజర్వాయర్కు వస్తున్న అన్ని కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో మంగళవారం రికార్డు స్థాయిలో 8 వేల క్యూసెక్కుల వరదనీరు చేరింది. దీంతో రిజర్వాయర్ నీటిమట్టం గరిష్ట(60/61)స్థాయి రెండు రోజులుగా నిలకడగా ఉంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం నుంచి నాలుగు గేట్ల ద్వారా 9,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 2021 (నవంబర్లో 7 వేల క్యూసెక్కులు విడుదల చేశారు) తరువాత ఈ స్థాయిలో నీటిని విడుదల చేయడం ఇదే ప్రథమం. మంగళవారం అర్ధరాత్రి నుంచి వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో రిజర్వాయర్ గేట్లు అన్నీ ఎత్తే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా మేహాద్రిని సందర్శించిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పరిస్థితిని ఆరా తీశారు. ఇన్ఫ్లో, అవుట్ ఫ్లోపై సమీక్షించారు. రిజర్వాయర్ పరివాహక ప్రాంతాల్లో ఉన్న కాలనీల వాసులను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. నీటిపారుదలశాఖ ఎస్ఈ పి.అప్పలనాయుడు, డీఈ జె.స్వామినాయుడు, పెందుర్తి తహసీల్దార్ ఐ.వెంకటఅప్పారావు, ఏఈ పి.నళిని పాల్గొన్నారు. -
విశాఖపై పంజా
● జీవీఎంసీ 12వ వార్డు పరిధిలోని బీసీకాలనీ కొండవాలు ప్రాంతంలో రక్షణ గోడ, రహదారి కూలిపోయింది. ● 13వ వార్డు శ్రీకృష్ణాపురంలో ఖాళీ స్థలం చుట్టూ ఉన్న రక్షణ గోడ కూలిపోయింది. చెట్టు నెలకొరిగింది. ● 34వ వార్డు కొబ్బరితోట, తారకరామ కాలనీల్లో రెండు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ● 40వ వార్డు రాజీవ్కాలనీ సుమారు 3 అడుగుల మేర నీట మునిగింది. నౌసేనాభాగ్, మల్కాపురం, మల్కాపురం మరిడిమాంబ కల్యాణమండపం, పల్లివీధి, సులభ్ కాంప్లెక్స్ ఏరియా, ఎంఈఎస్ క్వార్టర్స్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ● యారాడ ఘాట్ మార్గంలో తొలి మలుపు వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ● గురుద్వారా సమీపంలోని దీపక్ పంజాబీ ధాబా వద్ద పెద్ద చెట్టు కూలిపోవడంతో ట్రాఫిక్కు స్వల్ప అంతరాయం కలిగింది. ● గురుద్వారా కూడలి సమీపంలో గెడ్డపై ఉన్న రహదారి, కల్వర్టు, రిటైనింగ్ వాల్ కుంగిపోయాయి. రహదారి దెబ్బతిని పెద్ద గొయ్యి ఏర్పడింది. ● 51వ వార్డులోని మాధవస్వామి ఆలయంలో జలధార ఉప్పొంగింది. మాధవస్వామి ఆలయం, శివాలయం ప్రాంగణాలు పూర్తిగా నీట మునిగాయి. ● 4వ వార్డులో హైవే నుంచి పరదేశిపాలెం మీదుగా కాపులుప్పాడకు వెళ్లే మార్గమధ్యలో గెడ్డపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ● పరదేశిపాలెం నుంచి డంపింగ్ యార్డుకు వెళ్లే మార్గంలో వరద నీరుతో రాకపోకలు నిలిచిపోయాయి. ● సాగర్నగర్, రుషికొండ, మంగమారిపేట, భీమిలి బీచ్ పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ● గోస్తనీ నదిలోకి గెడ్డలు, వాగుల ద్వారా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నది నిండుగా కనిపిస్తోంది. ● 5వ వార్డు బోయిపాలెం సమీపంలోని జేఎన్ఎన్యూఆర్ఎం పీపీ 2 కాలనీలో 4 బ్లాకుల్లో ఉన్న సుమారు 100 ఇళ్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. పక్కనే ఉన్న గెడ్డ పొంగడంతో నీరు నివాసాల్లోకి చేరింది. ● తుమ్మిరిగెడ్డ మినీ రిజర్వాయర్ నిండుగా కనిపిస్తోంది. ● అనంతవరం సమీపంలో గెడ్డ పక్కన ఉండే అప్రోచ్ రోడ్డు వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. గంథవరం ప్రజలు కొత్తకొవ్వాడ, పెంట, అనంతవరం రోడ్డు మీదుగా పద్మనాభం చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ● గాజువాకలోని 70వ వార్డులో దశమికొండ కాలనీ, చిట్టినాయుడు కాలనీ, డ్రైవర్స్ కాలనీ కొండవాలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ● కృష్ణానగర్ ప్రాంతంలో రెండు ఇళ్లపైన, పెంటయ్యనగర్ కొండపై మూడు ఇళ్లపైన మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. ● 87వ వార్డులోని సిద్ధార్థనగర్, టిజిఆర్ నగర్ల మధ్య గల రహదారిలో నిలువెత్తు నీరు చేరడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ● 77వ వార్డు అప్పికొండ సమీపంలోని వెలమపేట నీట మునిగింది. ● 64వ వార్డు పరిధిలోని గంగవరం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. ● గుల్లేపల్లి–సబ్బవరం రోడ్డులో ఆదిరెడ్డిపాలెం వద్ద ఉన్న కాజ్వే పైనుంచి భారీగా నీరు ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ● ఎంవీపీ కాలనీ సెక్టార్–9 అప్పుఘర్ గొల్లవీధి రహదారిలో చెట్టు విరిగిపడటంతో ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. లాసన్స్ బే కాలనీలో కారు తీవ్రంగా దెబ్బతింది. ● జీవీఎంసీ 16వ వార్డు హెచ్బీ కాలనీ జంక్షన్లో హౌసింగ్ బోర్డు నిర్మిస్తున్న దుకాణ సముదాయం కోసం తవ్విన గోతిలో.. దానికి ఆనుకుని ఉన్న ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలు జారి పడిపోయాయి. మరో రెండు విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోయాయి. ● దువ్వాడలోని వీఎస్ఈజెడ్ సబ్స్టేషన్కు అనుసంధానం చేసే 33కేవీ కండక్టర్ తెగిపడటంతో జంపర్లు ఊడిపోయాయి. ● భీమిలి మండలం టి.నగరపాలెం వద్ద హైవేతో పాటు సర్వీస్ రోడ్లపై మూడు అడుగుల మేర వరద నీరు చేరడంతో వాహనాలకు తీవ్ర అంతరాయం కలిగింది. ● ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ మిందివానిపాలెం, వెల్లంకి పంచాయతీల్లో వరద నీరు హైవేతో పాటు సర్వీస్ రోడ్ల మీదుగా ప్రవహిస్తోంది. ● గాజువాక–సింథియా ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. ● గొట్టిపల్లి అంగన్వాడీ కేంద్రంలోకి నీరు ప్రవేశించింది. సరుకులు, రికార్డులు, ఫర్నిచర్ నీటిలో తడిచిపోయాయి. ● తాటితూరు, దత్తప్ప చెరువులు నిండిపోవడంతో ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ● గొరపల్లి, పురుషోత్తపురం, చీమలాపల్లి, రాంపురం, అక్కిరెడ్డిపాలెం ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ● పెందుర్తి, సబ్బవరం ప్రాంతాల్లో వందలాది ఎకరాల పంట భూమిలోకి నీరు చేరింది. -
నవంబర్ 30న వైజాగ్ మారథాన్
ఏయూక్యాంపస్: ఆరోగ్యం, ఐక్యతను ప్రోత్సహించే సంధ్యామైరెన్ వైజాగ్ మారథాన్–4 ను నవంబర్ 30న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన టీ షర్ట్, మెడల్స్ను బీచ్ రోడ్డులో ఆవిష్కరించారు. ఈ సంవత్సరం 5 కి.మీ., 10 కి.మీ., 21 కి.మీ. పరుగులతో పాటు కొత్తగా 32 కిలోమీటర్ల విభాగాన్ని కూడా ప్రవేశపెడుతున్నట్లు సంధ్యా మైరెన్ ప్రతినిధి కె. ఆనంద్ తెలిపారు. వైజాగ్ రన్నర్స్ సొసైటీ కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ అనుకూల, మాదకద్రవ్య రహిత విశాఖను ప్రోత్సహించడమే ఈ మారథాన్ ఉద్దేశమని తెలిపారు. ఈ ఏడాది టీ–షర్ట్ను భూమి నుంచి స్ఫూర్తి పొంది ఆకుపచ్చ రంగులో రూపొందించారు. కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ కృష్ణ ప్రసాద్, లక్ష్మి, ప్రద్యుమ్న, రవి కట్టా, టి.వి.ఎన్ సత్యమూర్తి, డాక్టర్ ఎస్.రాజు, వైజాగ్ వలంటీర్స్ సతీష్ తదితరలు పాల్గొన్నారు. -
దివ్యాంగుల పింఛన్లపై వేటు
మహారాణిపేట : దివ్యాంగుల పింఛన్లపై కూటమి ప్రభుత్వం వేటు వేసింది. వీరిపై కనికరం లేకుండా వివిధ పరీక్షల పేరుతో అష్టకష్టాలు పెడుతోంది. జిల్లాలో ఇప్పటికే 1,178 మంది దివ్యాంగుల పెన్షన్లు తొలగించాలని జాబితాను సిద్ధం చేసింది. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. దివ్యాంగులు అపీల్ చేసుకోవడంతో వారికి గత నెల పింఛన్లు మంజూరు చేసింది. తాజాగా అపీల్ చేసుకోలేదని కారణంగా 101 మంది దివ్యాంగుల పింఛన్లను రద్దు చేసింది. ఆందోళనలో దివ్యాంగులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ పింఛన్లకు ఎప్పుడు ఎసరు వస్తుందోనన్న భయాందోళనతో దివ్యాంగులు కాలం వెళ్లదీస్తున్నారు. రీవెరిఫికేషన్ పేరుతో ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పునఃపరిశీలనలో తమ వైకల్య శాతాన్ని తగ్గిస్తారో.. లేదా సర్టిఫికెట్ను పూర్తిగా రద్దు చేస్తారేమోనని మదనపడుతున్నారు. అనారోగ్యం లేదా ఇతర కారణాలతో వెరిఫికేషన్కు హాజరు కాలేకపోతే పూర్తిగా పింఛన్ రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వారికి పింఛన్ లేనట్లే.. జిల్లాలో 1,178 మంది పింఛన్లను తొలగించేందుకు జాబితా సిద్ధం చేసింది. వ్యతిరేకత రావడంతో గత నెల పింఛన్లు విడుదల చేసినప్పటికీ, ఇప్పుడు మళ్లీ పరీక్షల పేరుతో వారిని వేధిస్తున్నారు. వైద్యుల ప్యానెల్ను ఏర్పాటు చేసి, బుధ, గురు, శుక్రవారాల్లో నగరంలోని నిర్దేశిత ఆస్పత్రుల్లో సర్టిఫికెట్లను రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. అయితే రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోలేదని కారణంతో జిల్లాలో 101 మంది దివ్యాంగులు పింఛన్లు రద్దు చేశారు. వీరికి నవంబర్ నెల నుంచి పింఛన్ అందదు. పుట్టుకతోనే వైకల్యంతో బాధపడుతూ, మరొకరి సాయం లేనిదే కదలలేని తమపై ప్రభుత్వం ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం అమానవీయమని, ఈ రీవెరిఫికేషన్ నిబంధనలు తమకు శాపంగా మారాయని దివ్యాంగులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
వాసుపల్లి దాతృత్వం
జగదాంబ : ఆయనకు కష్టం విలువ.. పేదవాళ్ల సాదక బాధకాలు తెలుసు. తన పుట్టినిల్లు అయిన వన్టౌన్లో ఎవరికి కష్టం వచ్చినా ముందుంటారు. ఆయనే మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్. సోమవారం జీవీఎంసీ 35వ వార్డు అధ్యక్షుడు అలపన కనకరెడ్డి ఆధ్వర్యంలో వార్డులోని లక్ష్మీనగర్ లోతట్టు ప్రాంతంలో నివసించే సుమారు 250 కుటుంబాలకు రూ.1.25 లక్షలు విలువ చేసే నిత్యావసర వస్తువులు అందజేశారు. వర్షం కురుస్తున్నప్పటికీ ఆయన ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ తుఫాన్ సమయంలో పేదలు నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 3 కేజీల బియ్యం, ఆయిల్ ప్యాకెట్, కూరగాయలు, చికెన్ వంటివి అందజేశామన్నారు. రాజకీయాలు చేసే ఉద్దేశం తమకు లేదని, తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు సాయం అందించడంలో ముందుంటారన్నారు. ప్రభుత్వం తీర ప్రాంత మత్స్యకారులందరికీ 50 కేజీల బియ్యంతో పాటు రేషన్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నా జానకీరామ్, జిల్లా సెక్రటరీ ఆదివిష్ణురెడ్డి, మాజీ కార్పొరేటర్ పచ్చిరపల్లి రాము, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, సౌత్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సువార్తరాజు, సౌత్ పబ్లిక్ వింగ్ అధ్యక్షుడు బీరు సూర్యనారాయణ, మల్ల విజయ్, పీతలవాసు, రాజారెడ్డి, మాదాబత్తుల రమేష్, లండా రమణ, లింగం శ్రీను, వినోద్, రామరాజు, బెవర మహేష్, అప్పారావు, నాగిరెడ్డి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఏ సంస్థ పురోగతికై నా నైతిక విలువలే పునాది
విశాఖ సిటీ: ఏ సంస్థ పురోగతికై నా నైతిక విలువలే పునాది అని విశాఖ పోర్ట్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అరుణ్ ప్రసాద్ పేర్కొన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను విశాఖ పోర్ట్ అథారిటీలో సోమవారం ఘనంగా నిర్వహించారు. సోమవారం నుంచి నవంబర్ 2వ తేదీ జరిగే ఈ వారోత్సవాలను పోర్ట్ పరిపాలనా భవనంలోని సాంబమూర్తి ఆడిటోరియంలో ప్రారంభించారు. ముందుగా పోర్ట్ విభాగాధిపతులతో కలిసి అధికారులు, సిబ్బందితో విజిలెన్స్ ప్రమాణం చేయించారు. అనంతరం చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అరుణ్ ప్రసాద్ అవినీతి నిరోధకతపై అవగాహన కల్పించారు. విజిలెనన్స్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి కర్తవ్యనిష్టతో పనిచేయాలని సూచించారు. వారోత్సవాల్లో భాగంగా ఉద్యోగుల కోసం వివిధ పోటీలతో పాటు నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
దొంగనోట్ల కేసులో మరో ముగ్గురి అరెస్ట్
ఎంవీపీకాలనీ: నగరంలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టును ఇటీవల రట్టు చేసిన కేసులో ఎంవీపీ పోలీసులు మరో ముగ్గురు నిందితులను సోమవారం రిమాండ్కు పంపారు. ద్వారకా ఏసీపీ అన్నెపు నరసింహామూర్తి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీరామ్ అలియాస్ గుప్తాను ముందుగా అరెస్టు చేశారు. తాజాగా పాల వరప్రసాద్, కొత్త ఆనంద్, కొప్పల గంగాధర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరిలో ఇద్దరిపై రౌడీషీట్లు ఉన్నాయని, గతంలోనూ వీరు పలు నేరాలకు పాల్పడ్డారని ఏసీపీ తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎంవీపీ, సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులను ఆయన అభినందించారు కార్యక్రమంలో ఎంవీపీ సీఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారుల వలల భద్రతకు చోటేది?
ఆరిలోవ: ‘మోంథా’ తుఫాను ప్రభావంతో జోడుగుళ్లుపాలెం తీరం వద్ద వలలు భద్రపరుచుకోవడానికి వీలులేని పరిస్థితి నెలకొందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను కారణంగా వేటకు వెళ్లని మత్స్యకారులు తమ వలలను అమ్మవారి గుడి ప్రాంగణంలో, చిన్న రేకుల షెడ్లలో తాత్కాలికంగా దాచుకున్నారు. వలల భద్రత కోసం పక్కా భవనం నిర్మించాలని చాలాసార్లు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును కోరామన్నారు. అయితే అటవీశాఖ అడ్డుపడుతోందని ప్రజాప్రతినిధులు తప్పించుకుంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇదే ప్రాంతంలో శివాలయం పేరుతో పక్కా నిర్మాణాలు చేపడితే అధికారులు అడ్డుచెప్పడం లేదని, తమ అవసరాల కోసం మాత్రం నిబంధనలు అడ్డుపెట్టడం సరికాదని మత్స్యకారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వలలు భద్రపరుచుకోవడానికి భవన నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు. -
పూర్వ డీఎంహెచ్వో రామారావు మృతి
మద్దిలపాలెం: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పూర్వపు అధికారి డాక్టర్ పెంటకోట రామారావు (79) కన్నుమూశారు. ఆదివారం రాత్రి గుండెపోటుతో సీతమ్మధార డాక్టర్స్ కాలనీలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. డాక్టర్ రామారావు కేజీహెచ్లో చాలాకాలం వైద్యుడిగా సేవలు అందించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ సీనియర్ ఉద్యమనేతగా, విశాఖ కన్జ్యూమర్ కౌన్సిల్ కార్యదర్శిగా కూడా డాక్టర్ రామారావు పనిచేశారు. ఆయన మరణవార్త తెలియగానే, సీతమ్మధారలోని డాక్టర్ రామారావు నివాసానికి ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యదర్శి ఎ.అజశర్మ, సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి. కుమార్, పి.మణి, వి.కృష్ణారావు, ప్రజారోగ్య వేదిక నాయకులు డాక్టర్ వై.ఎల్. నర్సింగరావు, కేవీపీ చంద్రమౌళి, వార్వా నాయకులు జి.వి. రమణ, పి. లచ్చిరాజు, సీఐటీయూ మద్దిలపాలెం జోన్ కార్యదర్శి పి.వెంకటరావు తదితరులు వెళ్లి డాక్టర్ రామారావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. -
● కార్తీక శోభ
ఎంవీపీ కాలనీ శివాలయంలో ప్రత్యేక పూజలు కార్తీక మాసం ఆరంభమైంది... పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో తొలి సోమవారం నగరంలోని శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారు జాము నుంచే భక్తుల రాకతో ఆలయాలు కిటకిటలాడాయి. ఉపవాస దీక్షతో పుణ్యస్నానాలు ఆచరించి, క్యూలైన్లలో నిలబడి శివనాథుడ్ని దర్శించుకున్నారు. శివలింగానికి పాలధారతో అభిషేకం చేస్తూ, బిల్వదళాలతో పూజలు చేసి, తమ భక్తిని చాటుకున్నారు. పలు ఆలయాల్లో భక్తులు దీపాలు వెలిగించారు. హరహర మహాదేవ, శంభో శంకర నామస్మరణతో, భక్తుల జయజయధ్వానాలతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్తీక సోమవారం సందర్భంగా నగరమంతా శివతత్వంతో నిండిపోయింది. – ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా పాత రేసపువానిపాలెం శివాలయంలో ప్రత్యేక పూజలు -
మేహాద్రి రిజర్వాయర్ గేటు ఎత్తివేత
రెండో గేటు నుంచి 1,050 క్యూసెక్కుల నీరు విడుదలపెందుర్తి : తుఫాన్ కారణంగా మేహాద్రిగెడ్డ రిజర్వాయర్కు సోమవారం ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది. మేహాద్రి ప్రధాన కాలువతో పాటు ఇతర గెడ్డల నుంచి కూడా రిజర్వాయర్కు నీరు పోటెత్తడంతో సోమవారం సాయంత్రానికి నీటిమట్టం 60/61 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో గేటును అడుగున్నర మేర ఎత్తి 1050 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటిపారుదలశాల ఏఈ పి.నళిని, తహసీల్దార్ వెంకటఅప్పారావు, ఆర్ఐ హరిప్రసూన, వర్క్ ఇన్స్పెక్టర్ ఎస్.సుబ్బరాజు ముందుగా రిజర్వాయర్ నీటిమట్టాన్ని సమీక్షించారు. -
వర్ష బీభత్సం
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దుమంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025వేట సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళుతున్న మత్స్యకారులులోతట్టు ప్రాంతాలు జలమయం పలు చోట్ల నేలకొరిగిన చెట్లు 58 పునరావాస కేంద్రాల ఏర్పాటుమహారాణిపేట : మోంథా తుఫాన్ ప్రభావంతో సోమవారం విశాఖలో వర్షం దంచికొట్టింది. రోజంతా ఏకధాటిగా కురిసి అలజడి సృష్టించింది. జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. వీఎంఆర్డీఏ పార్కు, పెదజాలారిపేట, పెదవాల్తేరు, ఎంవీపీకాలనీ తదితర ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు, చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గోపాలపట్నంలో ఒక ఇల్లు గోడ కూలింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో తీరప్రాంతమంతటా అల్లకల్లోలంగా మారింది. చాలా వరకు తీరం కోతకు గురైంది. తీర ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఉద్యోగులంతా తుపాన్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. నేడు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో మంగళవారం కూడా జిల్లాలోని అన్ని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఏయూకు సెలవులు ప్రకటించారు. కాగా మోంథా తుఫాన్ ప్రస్తుతం కాకినాడకు 450 కిలోమీటర్ల దూరంలోను విశాఖకు 500 కిలోమీటర్ల దూరంలో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. మంగళవారం ఉదయం మోంథా తీవ్ర తుఫాన్గా బలపడనుంది. కాకినాడ– అమలాపురం మధ్యలో బుధవారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 110 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాలు జలమయం వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పూర్ణామార్కెట్, వెలంపేట, రామకృష్ణ థియేటర్ ఏరియా, న్యూకాలనీ, వాల్తేరు, చావులమదుం, జ్ఞానాపురం, అల్లిపురం, జాలారిపేట, బీచ్రోడ్డు తదితర ప్రాంతాల్లో నీరు చెరువులను తలపిస్తోంది. చావులమదుం–కాన్వెంట్ జంక్షన్ రోడ్డులో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బీచ్రోడ్డులో కూడా నీరు చేరడంతో వాహనచోదకులు ఇబ్బందిపడ్డారు. అనేక ప్రాంతాల్లో మ్యాన్హోల్స్ నుంచి నీరు పొంగి ప్రవహించింది. పునరావాస కేంద్రాల ఏర్పాటు కొండవాలు, పల్లపు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీవీఎంసీ, జిల్లాలో మొత్తం 58 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీవీఎంసీ పరిధిలో 38, గ్రామీణ ప్రాంతాల్లో 20 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. పునరావాస కేంద్రాలకు వచ్చే వారికి తాగునీరు, ఆహారం, మందులు, పిల్లలకు పాలు, జనరేటర్, తదితర అన్ని వసతులు కల్పిస్తున్నారు. సోమవారం నమోదైన వర్షపాతం మండలం మొత్తం (మి.మీ) సీతమ్మధార 89.2 గాజువాక 77.4 పెదగంట్యాడ 85.2 విశాఖ (రూరల్) 86.0 భీమునిపట్నం 74.6 పద్మనాభం 30.6 ఆనందపురం 62.4 పెందుర్తి 79.9 మహారాణిపేట 86.4 గోపాలపట్నం 71,0 ములగాడ 84.6 -
కార్పొరేటర్ బొండాపై అట్రాసిటీ కేసు
కూర్మన్నపాలెం: జీవీఎంసీ 87వ వార్డు కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద దువ్వాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వార్డులోని సిద్ధార్థనగర్లో నివసించే తాడిగిరి ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగన్నాథంపై కేసు నమోదు చేసి, ఎస్.ఐ. డెంకాడ శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు. బీహెచ్పీవీలో ఉద్యోగ విరమణ చేసిన ప్రకాశ్.. సిద్ధార్థనగర్లో కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. ఆయన మొదటి భార్య 1997లో మరణించడంతో, రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు కూడా ఒక కుమార్తె జన్మించగా, అందరూ కలిసి జీవిస్తున్నారు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. తనకున్న అప్పులు తీర్చిన తర్వాతే అందరికీ ఆస్తులు పంచుతానని ప్రకాశ్ తన భార్యకు చెబుతూ వచ్చారు. ఈ సమయంలో అదే కాలనీలో నివసించే జాన్ రమేష్ అనే వ్యక్తి ఈ కుటుంబ వివాదంలో జోక్యం చేసుకుని, సమస్యను వీధిలోకి తెచ్చాడు. అంతటితో ఆగకుండా, వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం దగ్గరకు తీసుకువెళ్లి పంచాయితీ పెట్టించాడు. అనంతరం భార్యకు రూ. 30 లక్షలు, తమకు కమీషన్ కింద మరో రూ.3 లక్షలు ఇవ్వాలని జాన్ రమేష్, జగన్నాథం తనపై ఒత్తిడి తెచ్చారని బాధితుడు ప్రకాశ్ తెలిపారు. అంతేకాకుండా తాము చెప్పినట్లు వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జాన్ రమేష్ బెదిరించినట్లు ప్రకాశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది మే నుంచి తరచూ ఫోన్ చేసి బెదిరించడం, దుర్భాషలాడడం వల్ల మనశ్శాంతి లేకుండా పోయిందని ఆయన వివరించారు. ప్రకాశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు జాన్ రమేష్ను ఏ–1గా, కార్పొరేటర్ బొండా జగన్నాథంను ఏ–2గా నిర్థారిస్తూ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. -
పేదలే లక్ష్యంగా కూటమి అరాచక పాలన
గాజువాక/ మల్కాపురం : కూటమి ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా అరాచక పాలన సాగిస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు విద్య, వైద్య రంగాలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి. గౌతమ్రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం సోమవారం గాజువాక, 60వ వార్డు గుల్లలపాలెంలో జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కొనసాగింది. ఇప్పటికే 50 లక్షల సంతకాలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో భాగంగా వీఆర్ఎస్ ద్వారా 1,600 మంది ఉద్యోగులను, 5,500 మంది కాంట్రాక్టు కార్మికులను చట్ట వ్యతిరేకంగా తొలగించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గౌతమ్రెడ్డి ఆరోపించారు. పెదగంట్యాడను ఆనుకుని అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిందాల్ స్టీల్ప్లాంట్ రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు వెళ్లిపోవడం, ఎమ్మెల్యేల ఇష్టారాజ్య వ్యవహారాలు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వంటి చర్యల వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మాట్లాడుతూ, స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చిన టీడీపీ, అధికారంలోకి వచ్చాక ప్లాంట్ కార్మికులపై ఎదురుదాడి చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్,, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి పాల్గొన్నారు. -
వాల్తేర్ డివిజన్ ప్రత్యేక చర్యలు
పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు తాటిచెట్లపాలెం : తుఫాన్ నేపథ్యంలో విశాఖ నుంచి బయల్దేరే, విశాఖ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. కొన్ని రైళ్లను దారి మళ్లించగా.. మరికొన్ని రైళ్లను గమ్యం కుదించింది. అలాగే వాల్తేర్ డివిజన్ పరిధిలోని స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటుచేసింది. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డీఆర్ఎం లలిత్బోహ్ర ఆయా విభాగాల అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అయితే ముందుగా సుమారు 43 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించినా, సాయంత్రానికి కొన్ని రైళ్లు యథావిథిగా బయల్దేరాయి. 28న రద్దు చేసిన రైళ్లు ● కిరండూల్–విశాఖ(18516)నైట్ ఎక్స్ప్రెస్ ● విశాఖపట్నం–కిరండూల్(58501)పాసింజర్ ● కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్ ● విశాఖపట్నం–కోరాపుట్(58538)పాసింజర్ ● కోరాపుట్–విశాఖపట్నం(58537)పాసింజర్ ● కోరాపుట్–విశాఖపట్నం(18511)ఎక్స్ప్రెస్ ● రాజమండ్రి–విశాఖపట్నం(67285)మెము ● విశాఖపట్నం–రాజమండ్రి(67286)మెము ● విశాఖపట్నం–కాకినాడ(17268) ఎక్స్ప్రెస్ ● కాకినాడ–విశాఖపట్నం(17267) ఎక్స్ప్రెస్ ● విశాఖపట్నం–గుంటూరు(22875) డబుల్ డెక్కర్ఎక్స్ప్రెస్ ● గుంటూరు–విశాఖపట్నం(22876) డబుల్డెక్కర్ఎక్స్ప్రెస్ ● బ్రహ్మపూర్–విశాఖపట్నం(18525)ఎక్స్ప్రెస్ ● విశాఖపట్నం–పలాస(67289)మెము ● పలాస–విశాఖపట్నం(67290)మెము ● విజయనగరం–విశాఖపట్నం(67288) మెము ● బ్రహ్మపూర్–విశాఖపట్నం(58531)పాసింజర్ ● విశాఖపట్నం–బ్రహ్మపూర్(58532)పాసింజర్ ● విశాఖపట్నం–గుణుపూర్(58506) పాసింజర్ ● గుణుపూర్–విశాఖపట్నం(58505) పాసింజర్ ● భువనేశ్వర్–కేఎస్ఆర్ బెంగళూరు(18463) ప్రశాంతి ఎక్స్ప్రెస్ ● భువనేశ్వర్–సికింద్రాబాద్(17015)విశాఖ ఎక్స్ప్రెస్ ● భువనేశ్వర్–పుదుచ్చేరి(20851) వీక్లీ ఎక్స్ప్రెస్ వాల్తేర్ డివిజన్ పరిధిలో హెల్ప్లైన్ డెస్క్లు ● విశాఖపట్నం–0891–2746330 / 2744619 ● దువ్వాడ– 0891–2883456 ● అరకు–08936–249832 -
చిన్నపాటి దుర్ఘటనా జరగకూడదు
మహారాణిపేట: మోంథా తుపాను దృష్ట్యా అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, చిన్నపాటి దుర్ఘటన కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా సైక్లోన్ ప్రత్యేకాధికారి, స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్లతో సహా జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగం సన్నద్ధత కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ... తుపానును ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. కొండవాలు ప్రాంతాల్లో సుమారు 12,755 ఇళ్లు ఉన్నాయని, వాటిల్లో 96 ప్రమాదకర పరిస్థితుల్లో ఉండగా, సంబంధిత నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని వివరించారు. 20 సైక్లోన్ షెల్టర్లు, 23 పునరావాస కేంద్రాలలో 9,290 మందిని ఉంచడానికి ఏర్పాట్లు చేశామన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో 430 బృందాలు, నేవీ, కోస్ట్ గార్డు సహకారంతో ఆరు మెకనైజ్డ్ బోట్లు, హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. జీవీఎంసీ పరిధిలో అదనంగా 38 పునరావాస కేంద్రాలు, 20 క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (క్యూఆర్టీ) నియమించినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. ప్రతి బృందం జేసీబీ, ట్రిప్పర్, ట్రీ కట్టర్ వంటి పరికరాలతో సిద్ధంగా ఉందని తెలిపారు. ఇలా చేయాల్సిందే.. ● తుపాను తీరం దాటే దిశ మారవచ్చని, మంగళవారం ఉదయం నుంచి గాలుల తీవ్రత పెరుగుతుందని అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా సైక్లోన్ ప్రత్యేకాధికారి, స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఆదేశించారు. ● మ్యాన్ హోల్స్ను సరిచేయాలి. ప్రమాద ప్రాంత ప్రజలను రక్షిత భవనాలకు తరలించాలి. ● రక్షిత కేంద్రాలలో తాగునీరు, ఆహారం, పాలు, మందులు అందుబాటులో ఉంచాలి. ● నష్టం వాటిల్లిన ప్రాంత ప్రజలకు, ప్రయాణికులకు అందించేందుకు 29న టిఫిన్, భోజనం ప్యాకెట్లను సిద్ధం చేయాలి. ● దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, డ్రైన్లను డ్రోన్ల సహాయంతో గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలి. -
సిటీ ఆపరేషన్ సెంటర్ పరిశీలన
డాబాగార్డెన్స్: తుఫాన్ నేపథ్యంలో నగరంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తక్షణమే చేపట్టాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సిటీ ఆపరేషన్ సెంటర్ను, పునరావాస కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెట్లు, హోర్డింగ్లు కూల కుండా చర్యలు తీసుకోవాన్నారు. శిథిలావస్థ భవనాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. విద్యుత్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. సిటీ ఆపరేషన్ సెంటర్లో 24 గంటల కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి, అన్ని జోన్ల కార్యాలయాలకు టోల్ ఫ్రీ నంబర్, ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచామన్నారు. -
ఏసీబీ వలలో ఆర్ఐ, సచివాలయ సెక్ర టరీ
తగరపువలస: జీవీఎంసీ భీమిలి జోన్ బొగ్గురోడ్డు–2 సచివాలయ పరిధిలో చిట్టివలసకు చెందిన ఒక వ్యక్తి ఇంటిపన్ను పేరు మార్చడానికి రూ.30 వేలు లంచం తీసుకుంటూ సచివాలయ అడ్మిన్ సెక్రటరీ వై.స్వామినాయుడును ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం డిమాండ్ చేసి స్వామినాయుడును ప్రోత్సహించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ముగడ రాజును అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. తాత పేరు మీదు ఉన్న ఇంటి పన్ను తన పేరిట మార్చాలని సెప్టెంబరులో బాధితుడు సచివాలయాన్ని సందర్శించారు. తరువాత అడ్మిన్, భీమిలి జోనల్ కార్యాలయంలో ఉన్న ఆర్ఐ వద్దకు తీసుకెళ్లగా రూ.60 వేలు డిమాండ్ చేశారు. రెండు నెలలుగా జరుగుతున్న బేరసారాల అనంతరం రూ.30 వేలు ఇచ్చేందుకు బాధితుడు అంగీకరించి, విశాఖలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో డీఎస్పీతో సహా సీఐలు శ్రీనివాసరావు, లక్ష్మణరావు, సుప్రియ మాటు వేసి తాతా థియేటర్ డౌన్లోకి మార్చిన సచివాలయంలో బాధితుడు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు. తరువాత ఆర్ఐ రాజును చిట్టివలసలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని మంగళవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్లో ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు. -
రుషికొండలో డీఐజీ పర్యటన
కొమ్మాది: తుఫాన్ నేపథ్యంలో రుషికొండ బీచ్ను డీఐజీ గోపినాథ్ జెట్టీ, అడిషనల్ ఎస్పీ మధుసూదన్తో కలిసి సోమవారం సాయంత్రం పర్యటించారు. పర్యాటకులు బీచ్కు రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. మత్స్యకారులను మైరెన్ పోలీసులు అప్రమత్తం చేయాలని, సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. పర్యటక ప్రాంతాల్లోని దుకాణాలు మూసివేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు తుఫాన్ గురించి అవగాహన కలిగించాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూసుకోవాలని, తీర ప్రాంతాలకు ఆనుకొని నివాసాల్లో ఉన్న మత్స్సకారులను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో మైరెన్ పోలీసులు సమన్వయంగా పనిచేసి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. -
పోలియో రహిత సమాజమే మన లక్ష్యం
ఏయూక్యాంపస్: పోలియో రహిత సమాజం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. విశాఖపట్నం రోటరీ క్లబ్స్ ఆధ్వర్యంలో పోలియో నిర్మూలనపై వైఎంసీఏ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్ ద్వారా పోలియోను పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందన్నారు. గతంలో వ్యాక్సినేషన్ ద్వారా మశూచిని నిర్మూలించగలిగామని గుర్తు చేస్తూ.. అదే విధంగా పోలియో నిర్మూలనకు కూడా కృషి చేయాలని సూచించారు. రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా పోలియో కేసులు కొద్ది సంఖ్యలో ఉన్నప్పటికీ.. వాటిని పూర్తిగా రూపుమాపేందుకు నిరంతర పర్యవేక్షణ, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించాలని కోరారు. పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాల కోసం రోటరీ సభ్యులు ఉదారంగా విరాళాలు అందించాలని, ముఖ్యంగా పేద దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయడం అత్యవసరమని సూచించారు. డీజీఎన్డీ శోభన్ ప్రకాష్, సామ్ మెవ్వ, పీజీడీ పార్థసారథి, డిస్ట్రిక్ట్ పోలియో చైర్ రాంబాబు, రీజినల్ పోలియో చైర్ కాళీప్రసాద్ సహా నగరంలోని 15 రోటరీ క్లబ్లకు చెందిన సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్లాష్మాబ్ అందరినీ ఆకట్టుకుంది. సీపీ శంఖబ్రత బాగ్చి -
క్రికెట్ లైవ్.. ఆర్ట్ క్రియేటివ్
విశాఖ స్పోర్ట్స్: సాధారణంగా అంతర్జాతీయ క్రీడా మ్యాచ్ల్లోని ముఖ్య సంఘటనలను సజీవంగా కాన్వా స్పై చిత్రించే సంస్కృతి విదేశాల్లో అధికంగా కనిపిస్తుంది. ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. విశాఖ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్ కప్ చివరి రోజు మ్యాచ్ సందర్భంగా ఓ కళాత్మక కార్యక్రమం జరిగింది. స్థానిక ఇంజినీరింగ్ విద్యార్థులు కలిసి ‘కళాకృతి క్రియేటివ్ ఆర్ట్స్ క్లబ్’గా ఏర్పడి ఆదివారం ఈ లైవ్ పెయింటింగ్కు శ్రీకారం చుట్టారు. ఈ క్లబ్లోని 16 మంది ఔత్సాహిక విద్యా ర్థులు మ్యాచ్ జరుగుతున్న తీరును, క్రీడాకారుల ఉత్సాహాన్ని, స్టేడియం వాతావరణాన్ని ప్రత్యక్షంగా చిత్రీకరించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ బృందం మొత్తంగా ఏడు లైవ్ పెయింటింగ్స్ను రూపొందించింది. స్టేడియంలోని మీడియా బాక్స్ నుంచి ఐదుగురు ఔత్సాహిక చిత్రకారులు మ్యాచ్ను వీక్షిస్తూ పెయింటింగ్స్ వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా విద్యార్థిని శోభిత మాట్లాడుతూ.. ‘మేము గ్రూపులుగా ఏర్పడి ఏడు పెయింటింగ్స్ను కాన్వాస్పై రూపొందించాం. ఈ మ్యాచ్లోని ప్రత్యేక సందర్భాలను, వైజాగ్కు ఉన్న ప్రత్యేక గుర్తింపును ఈ కళాఖండాలు ప్రతిబింబిస్తాయి.’అని వివరించారు. -
నిందితుడిని పట్టించిన ‘గాండీవ’ యాప్
మధురవాడ: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘గాండీవ’ యాప్ సహాయంతో విశాఖ నార్త్ జోన్ పోలీసులు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన కెమెరా చోరీ కేసును ఛేదించారు. ఈ యాప్ పోలీసులకు బ్రహ్మాస్త్రంగా మారిందని నార్త్ జోన్ ఇన్చార్జి క్రైం ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి ఆదివారం మీడియాకు తెలిపారు. పీఎంపాలెం పరిధిలోని వైఎస్ రాజశేఖర రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆంధ్రా ప్రీమియం లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సుమారు రూ. 3 లక్షలు విలువ చేసే సోనీ కెమెరా, లెన్స్, బ్యాటరీ చోరీకి గురయ్యాయి. ఆగస్టు 23న జరిగిన ఈ చోరీపై ద్వారకానగర్కు చెందిన బాధితుడు కోమరెడ్డి ఫణి చైతన్య పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ సొత్తు విలువ తక్కువే అయినప్పటికీ, అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఘటన కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. పీఎంపాలెం క్రైం ఎస్ఐ రంభ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెండు విచారణ బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతికతతో సాయంతో.. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘గాండీవ’ యాప్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును విచారించారు. దొంగతనం జరిగిన సమయంలో కెమెరాకు దగ్గరగా వచ్చిన వ్యక్తుల ఇమేజ్లను సీసీ కెమెరాల ద్వారా సేకరించి యాప్లో అప్లోడ్ చేశారు. ఈ విశ్లేషణ ఆధారంగా కర్ణాటక మహాబూబే కాలనీకి చెందిన మహమ్మద్ ముస్తాఖ్ హుస్సేన్పై అనుమానం రావడంతో విచారణ ప్రారంభించారు. అనుమానితుడి ఇమేజ్లకు చెందిన ఫోన్ కాల్ డేటాను మ్యాచ్ చేయగా, సెల్ సిగ్నల్ ఆధారంగా అతను భోగాపురం ఎయిర్పోర్ట్, కర్ణాటక ప్రాంతాల్లో సంచరించినట్టు గుర్తించారు. నిందితుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకు కాంట్రాక్ట్ లేబర్ను సప్లై చేసి, పనులు ముగిసిన తర్వాత కర్ణాటకకు వెళ్లిపోయినట్టు తేలింది. కొద్దికాలంగా నిందితుడి సెల్ సిగ్నల్ను ట్రేస్ చేస్తూ ఫాలో అవుతున్న పోలీసులు.. ఆదివారం పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్కు ముస్తాఖ్ హుస్సేన్ వచ్చినట్టు గుర్తించి వలపన్ని పట్టుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన విశాఖ నార్త్ జోన్ సీఐ బీఎస్ఎస్ ప్రకాశ్, ఎస్ఐ రంభ శ్రీనివాస్, ఆనందపురం ఏఎస్ఐ గోవిందరాజు, పీఎంపాలెం పోలీసు స్టేషన్ సిబ్బంది రవికుమార్, చంద్రశేఖర్, నాగేశ్వరరావులను ఏసీపీ నరసింహమూర్తి అభినందించారు. ఉత్తమ ప్రతిభ చూపిన వీరు సీపీ రివార్డ్కు ఎంపికై నట్లు ఏసీపీ ప్రకటించారు. -
గల్లంతైన మత్స్యకారుడు క్షేమం
ఆదుకున్న ఉప్పాడ జాలర్లు మహారాణిపేట: పెదజాలరిపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు రామోలు ఎల్లాజీ ఆచూకీ లభ్యమైంది. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఎల్లాజీ క్షేమంగా ఉన్నట్టు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 24న ఎల్లాజీ చేపల వేటకు వెళ్లగా.. ఆయన ఆచూకీ తెలియకుండా పోయింది. అయితే 25న కాకినాడ జిల్లా, తొండంగి మండలం, హూకుంపేట సమీపంలోని ఉప్పాడ సముద్ర తీరంలో ఎల్లాజీ ఆచూకీ లభించినట్టు జాయింట్ డైరెక్టర్ వివరించారు. సముద్రంలో కొట్టుకు వచ్చిన ఎల్లాజీని ఉప్పాడకు చెందిన మత్స్యకారులు గమనించి, ఒడ్డుకు తీసుకువచ్చి ఆదరించారు. పెదజాలరిపేటకు చెందిన పెద్దలు తెడ్డు రాజు, పర్సన్న ఆదివారం ఉప్పాడ వెళ్లి.. ఎల్లాజీని విశాఖపట్నం తీసుకొచ్చారు. ఎల్లాజీ క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు, తోటి మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. -
అమెరికాలో విశాఖ వైద్యుడికి అరుదైన గౌరవం
డాక్టర్ కల్యాణ్కు రెండు పురస్కారాలు మహారాణిపేట: విశాఖపట్నానికి చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ కె.కల్యాణ్ రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఆదివారం అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో.. మానసిక వైద్య విద్యారంగంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డులను ప్రకటించారు. 2015లో అమెరికా వెళ్లడానికి ముందు డాక్టర్ కల్యాణ్ విశాఖలోని ఒక ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన వైద్య ప్రస్థానం భారత్లోనే ప్రారంభమైందని, ఈ పురస్కారాలు కేవలం వ్యక్తిగత మైలురాయి మాత్రమే కావని పేర్కొన్నారు. విశాఖకు చెందిన వ్యక్తిగా ఈ గౌరవం దక్కడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. -
20 ఐరన్ టాబ్లెట్లు మింగిన చిన్నారికి పునర్జన్మ
7 వారాల పాటు చికిత్స అందించిన వైద్యులు మహారాణిపేట: 20 ఐరన్ టాబ్లెట్లు మింగి ప్రాణాపాయ స్థితికి చేరిన రెండేళ్ల చిన్నారికి జగదాంబ జంక్షన్లోని మెడికవర్ హాస్పిటల్ వైద్యు లు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. చిన్నారి ఆసుపత్రికి వచ్చే సరికే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ సాయి సునీల్ కిశోర్ నేతృత్వంలోని బృందం.. వెంటనే చికిత్స ప్రారంభించింది. ముందుగా ‘కీలేషన్ థెరపీ’ద్వారా శరీరంలోని అధిక ఐరన్ను తొలగించారు. అయితే చికిత్స సమయంలో చిన్నారికి అనేక కొత్త సమస్యలు తలెత్తాయి. మొదటి వారంలో కాలేయం దెబ్బతిన్నా, వైద్యుల సకాల స్పందనతో అది తిరిగి కోలుకుంది. అనంతరం రెండు ఊపిరితిత్తుల్లో గాలి లీక్ (బైలాటరల్ న్యుమోథోరాక్స్) కావడం, తీవ్రమైన సెప్సిస్ సోకడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. వైద్య బృందం వెంటిలేటర్ సాయంతో పాటు పునరావృతమయ్యే గాలి లీక్ సమస్యకు ‘బ్లడ్ ప్యాచ్ ప్లూరోడెసిస్’ అనే నూతన చికిత్సను, సెప్సిస్ కోసం ఐవీఐజీ థెరపీని అందించింది. ఏడు వారాల పాటు ఐసీయూలో నిరంతర పర్యవేక్షణ, అధునాతన చికిత్సల అనంతరం చిన్నారి కాలేయం, ఊపిరితిత్తులు పూర్తిగా కోలుకున్నాయి. ప్రస్తుతం చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు డాక్టర్ సాయి సునీల్ తెలిపారు. -
మోంథా ముప్పు
ఆదివారం రాత్రి ద్వారకానగర్లో కురుస్తున్న వర్షంఆరిలోవ: తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున, జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు రెండు రోజుల పాటు అత్యవసర సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమకుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశాల మేరకు సోమవారం , మంగళవారం సెలవు దినాలుగా ప్రకటించారు. సెలవులు ప్రకటించినప్పటికీ, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఏఈవోలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని డీఈవో సూచించారు. జిల్లా స్థాయిలో డీఈవో కార్యాలయంలో, మండల స్థాయిలో ఎంఈవో కార్యాలయాలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారని తెలిపారు. సెలవు ఆదేశాలను ఉల్లంఘించి ఈ రెండు రోజులలో పాఠశాలలను తెరిచిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు. తుఫాన్ పరిస్థితులు చక్కబడే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఏయూకు సెలవులు మద్దిలపాలెం: ఆంధ్రాయూనివర్సిటికి సోమ, మంగళవారం సెలవు ప్రకటిస్తున్నట్టు ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలను రెండు రోజులు పాటుసెలవులుప్రకటించాలని ఆదేశించడంతో ఏయూ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. వాల్తేర్ డివిజన్ అప్రమత్తం తాటిచెట్లపాలెం: తుఫాన్ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, గాలుల కారణంగా రైల్వే ట్రాక్లు, బ్రిడ్జిలు, సిగ్నలింగ్ వద్ద ఎటువంటి అంతరాయం కలగకుండా నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు డివిజన్ అధికారులు తెలిపారు. తక్షణ సహాయక చర్యల కోసం స్థానిక ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని, వాతావరణ శాఖ సూచనలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.డివిజన్ పరిధిలోని స్టేషన్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రయాణాలను రద్దు చేసుకునే వారికి రిఫండ్స్ అందించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, దువ్వాడ, రాయగడ స్టేషన్లలో సోమవారం నుంచి సమాచారం కోసం హెల్ప్డెస్క్లు అందుబాటులో ఉంటాయన్నాని డీఆర్ఎం లలిత్ బోహ్రా తెలిపారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. అధికారుల అప్రమత్తం విద్యాసంస్థలకు నేడు, రేపు సెలవులు సాగరతీరాలు, పర్యాటక ప్రాంతాల మూసివేత కలెక్టరేట్, భీమిలిలో కంట్రోల్ రూంల ఏర్పాటు కొండవాలు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కలెక్టర్, సీపీ ఆధ్వర్యంలో పర్యవేక్షణనేడు, రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు మహారాణిపేట: సోమవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తమ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు 108 భవ్య అంబులెన్స్ జిల్లా మేనేజర్ సురేష్ తెలిపారు. కలెక్టర్, డీఎంహెచ్వో, సంస్థ నుంచి అందిన ఆదేశాల మేరకు 108 సిబ్బంది సెలవులను రద్దు చేసినట్లు ఆయన ఆదివారం ప్రకటించారు. 108 కాల్ సెంటర్ను కూడా అప్రమత్తం చేసి, అత్యవసర కాల్స్ వచ్చిన వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. అలాగే డీఎంహెచ్వో అభ్యర్థన మేరకు ఐదు అంబులెన్సులను ప్రత్యేకంగా సిద్ధంగా ఉంచామని మేనేజర్ సురేష్ తెలిపారు. -
పది తరాలకు గుర్తుండేలా ఏయూ వందేళ్ల పండగ
సీతంపేట: ఆంధ్ర విశ్వకళా పరిషత్ వందేళ్ల పండగను పది తరాలకు గుర్తుండేలా ఏదైనా వినూత్నంగా చేయాలని ఆర్జీకేటీయూ పూర్వ వీసీ ప్రొఫెసర్ కె.సి. రెడ్డి పిలుపునిచ్చారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ‘విశాఖ రసజ్ఞవేదిక’ ఆధ్వర్యంలో డాక్టర్ గండికోట రఘురామారావు నేతృత్వంలో ఏయూ శతవసంతాల సందర్భంగా ఆత్మీయ సభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కె.సి. రెడ్డి, ఏయూ విశిష్టతను వివరించారు. సీ.ఆర్. రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్, వాసిరెడ్డి శ్రీకృష్ణ వంటి మహనీయులు ఏయూకు సేవలందించారని గుర్తు చేశారు. ఏయూ చరిత్రను భావి తరాలకు తెలియజేసే బాధ్యత అందరిపై ఉందన్నారు. వందేళ్ల చరిత్రకు గుర్తుగా మంచి భవనం లేదా టవర్ నిర్మాణంతో పాటు, ఏం చేస్తే బాగుంటుందో ఏయూ పాలకవర్గం చొరవ తీసుకుని చర్చించాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘురామారావు మాట్లాడుతూ ఏయూ ఆంధ్రులంతా గర్వించదగిన యూనివర్సిటీ అని, యూనివర్సిటీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా 20 మంది అధ్యాపకులను సత్కరించారు. ఈ సభలో ఏయూ పూర్వ వీసీలు ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు, ఆచార్య బీల సత్యనారాయణ, విశాఖ రసజ్ఞ వేదిక కార్యదర్శి ప్రయాగ సుబ్రహ్మణ్యం, మీడగ రామలింగస్వామి, డాక్టర్ ఈదర పెదవీర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
తీర ప్రాంతాల్లో ముందస్తు చర్యలు
కొమ్మాది/అల్లిపురం: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసులు, జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందనే వాతావరణ శాఖ ప్రకటన మేరకు సాగరతీరంలోని అన్ని బీచ్లను అధికారులు మూసివేశారు. నగరంలో ఆర్కేబీచ్, పామ్బీచ్, ఎంవీపీకాలనీ, తెన్నేటి పార్కు, జోడుగుళ్లపాలెం బీచ్లతో పాటు సాగర్నగర్, రుషికొండ బీచ్లను సైతం మూసివేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ప్రకటించారు. సందర్శకులెవరూ బీచ్లలోకి ప్రవేశించరాదని ఆదేశించారు. ఈదురు గాలుల ప్రభావం మోంథా తుఫాన్ కారణంగా ఆదివారం సాయంత్రం నుంచే ప్రభావం చూపించింది. ఆదివారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు కూడా వీచాయి. సోమ, మంగళవారాల్లో ఈదురు గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. లైఫ్గార్డ్స్, మైరెన్ పోలీసులు, బ్లూ ఫ్లాగ్ సిబ్బంది పర్యాటకులు బీచ్లలోకి వెళ్లకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వెనక్కి పంపిస్తున్నారు. ఆర్డీవో పర్యటన, పునరావాస కేంద్రాల ఏర్పాటు తుఫాను నేపథ్యంలో తీర ప్రాంతాలైన మంగమారిపేట, చేపలుప్పాడ, తిమ్మాపురం ప్రాంతాలతో పాటు మధురవాడ ప్రాంతాల్లో ఆర్డీవో సంగీత్ మాధుర్ పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని ఆయన సూచించారు. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మహారాణిపేట: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సోమ, మంగళ, బుధవారాల్లో జిల్లాలో భారీ వర్షాలు, పెనుగాలులు వీచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ● ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ప్రయాణాలు రద్దు చేసుకోవాలి. ● గాలులు వీచే సమయంలో చెట్ల కింద, హోర్డింగ్ల సమీపంలో నిలబడవద్దని కోరారు. పల్లపు ప్రాంతాలు, కొండ వాలు ప్రాంతాలు, నది ఒడ్డున నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి ● మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, వేటకు వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలి ● సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీచ్లలో స్నానాలకు దిగవద్దు కంట్రోల్ రూమ్ ఏర్పాటు తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టరేట్లో 24 గంటలూ పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, 0891–2590102 , 0891–2590100 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. రైతులు సైతం వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి పంటలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. -
కొండవాలు..గుబులు
ఆరిలోవ: తుఫాన్ హెచ్చరికలతో విశాఖ తూర్పు నియోజకవర్గంలోని కొండవాలు ప్రాంతాల వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాధారణ వర్షాలకే బితుకుబితుకుమంటూ గడిపే వేల సంఖ్యలో ఉన్న ఈ నివాసితులు, భారీ గాలులు, తుఫాన్ హెచ్చరికలు జారీ కావడంతో మరింత గుబులు పడుతున్నారు. నియోజకవర్గంలో హెచ్బీకాలనీ, సింహాద్రిపురం, వెంకోజీపాలెం, హనుమంతవాక, సంజయ్గాంధీకాలనీ, సింహగిరికాలనీ, పెదగదిలి, చినగదిలి, బి.ఎన్.ఆర్ నగర్, సుందర్నగర్ వంటి పలు కొండవాలు ప్రాంతాలలో వేలకొలది నివాసాలున్నాయి. ఇక్కడ లక్షల సంఖ్యలో ప్రజలు తలదాచుకుంటున్నారు. వెంటాడుతున్న గత ప్రమాదాలు వర్షాకాలం వచ్చిందంటేనే ఈ ప్రాంత ప్రజల్లో గుబులు రేగుతుంది. ముఖ్యంగా గతంలో జరిగిన దుర్ఘటనలను వారు గుర్తు చేసుకుంటున్నారు. తుఫాన్ల సమయంలో కొండచరియలు విరిగిపడటం, గోడలు నానిపోయి ఇళ్లు కూలిపోవడం వంటి సంఘటనల్లో ఆస్తి, ప్రాణ నష్టాలు కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా హుదూద్ తుఫాన్ ధాటికి వందల నివాసాలు నేలమట్టమై, వేలమంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి సంఘటనలు గుర్తుచేసుకుంటూ మొంథా తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుందోనని కొండవాలు వాసులు ఆవేదన చెందుతున్నారు. రక్షణ గోడలు లేక.. జాతీయ రహదారిని ఆనుకొని హనుమంతవాక, వెంకోజీపాలెం, బీఆర్టీఎస్ను ఆనుకొని సంజయ్గాంధీకాలనీ, సింహగిరికాలనీ ప్రాంతాలలో భారీగా నివాసాలున్నాయి. వీటిలో చాలాచోట్ల రక్షణ గోడలు, సరైన మెట్లు మార్గాలు కూడా లేవు. దీంతో వర్షాలకు మట్టి నానిపోయి ఇళ్లను ఆనుకొని కిందకు జారి కూలిపోయే ప్రమాదం ఉంది. గతంలో సంజయ్గాంధీకాలనీలో గోడ కూలి ఓ వృద్ధుడు మృతిచెందడం, హనుమంతవాక వద్ద కొండచరియలు విరిగిపడి రేకుల షెడ్లు నేలమట్టమవడం వంటి సంఘటనలు జరిగాయి. ఇలాంటి ప్రమాదాల నేపథ్యంలో, తుఫాన్ హెచ్చరికలు తమలో మరింత భయాందోళనను పెంచుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. కొండవాలు ప్రాంతాల్లో పర్యటన తుఫాన్ నేపథ్యంలో కొండవాలు ప్రాంతాల ప్రజలను విశాఖ రూరల్ తహసీల్దార్ పాల్ కిరణ్ అప్రమత్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా జీవీఎంసీ జోన్–2 జెడ్సీ కె.కనకమహాలక్ష్మి సిబ్బందితో కలిసి హనుమంతవాక, సంజయ్గాంధీకాలనీ, పెదగదిలి, చినగదిలి సహా పలు కొండవాలు ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. పునరావాస ఏర్పాట్లు తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున కొండపై భాగంలో ఉన్న నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. పైనాపిల్కాలనీ, శ్రీకృష్ణాపురం, రామకృష్ణాపురం ప్రాంతాల వాసుల కోసం డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులంలో షెల్టర్ ఏర్పాటు చేశారు. పెదగదిలి, హనుమంతవాక, చినగదిలి తదితర కొండవాలు వాసుల కోసం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సిద్ధం చేశారు.ప్రమాదం తలెత్తే అవకాశం ఉన్న కొండవాలులోని వారు తమ బంధువులు, తెలిసినవారి ఇళ్లకు ముందుగానే చేరుకోవడం మంచిదని తహశీల్దార్ సూచించారు. -
బార్ వర్కర్ బలిపశువు..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : సాధారణంగా ఒక బార్లో పని చేసుకునే వ్యక్తి కొంటే ఒకటి లేదా రెండు.. మహా అయితే 3 బాటిల్స్ ఒకేసారి కొనుక్కోగలరు. కానీ పోలీసులు అరెస్ట్ చేసిన బార్లో పనిచేసే వ్యక్తి ఏకంగా 112 మద్యం బాటిల్స్తో దొరికాడు. ఒక్కో బాటిల్పై అదనంగా రూ.50 వసూలు చేస్తూ పట్టుబడ్డాడు. తీగ లాగితే కూటమి నేతల డొంక కదులుతుందనే భయంతో.. పోలీసులు సదరు బార్లో వర్కర్ని బలిపశువుని చేసి రిమాండ్కు తరలించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్విగ్గీ జొమాటో బార్గా విమర్శలున్న సదరు బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యంపై ఎలాంటి కేసు పెట్టకుండా చేతులు దులిపేసుకున్నారని సమాచారం. తనిఖీలు చేసేందుకు వెళ్లిన పోలీసులపైనా దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం.. బయటకు రానీయకుండా జాగ్రత్తపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ మీద ఎలాంటి దురుసు ప్రవర్తన జరగలేదని పోలీసులు చెబుతున్నారు. పందిమెట్టలోని శివసాయి బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేసే కనకరాజు అనే వ్యక్తిని మహరాణిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బాటిల్పై రూ.50 వసూలు చేసి.. విక్రయిస్తున్న కనకరాజు నుంచి ఏకంగా 112 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. మహరాణిపేట పోలీసులు కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని రిమాండ్కు పంపించారు. ఇదంతా ఒకత్తయితే... ఒక బార్లో పనిచేసే వ్యక్తి దగ్గర అన్ని మద్యం బాటిల్స్ ఎలా ఉంటాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే 2021లో ఎకై ్సజ్ శాఖలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం ఒక మనిషి 3 బాటిల్స్ మించి కొనడానికి లేదు. నిల్వ చేసుకోడానికి లేదు. అలా చేస్తే అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంది. అలాంటిది ఒక బార్లో పనిచేసే వ్యక్తి ఏ ధైర్యంతో భారీ స్థాయిలో 112 బాటిల్స్ని కొనుగోలు చేసి తన దగ్గర ఉంచుకుంటారనేదానిపై పోలీసుల నుంచి సమాధానం లేదు. ఇది.. స్విగ్గీ జొమాటో బార్..! నగరంలో మూడు బార్ అండ్ రెస్టారెంట్లు స్విగ్గీ జొమాటో బార్లుగా పేరొందాయి. అందులో ఈ బార్ కూడా ఉందని సమాచారం. ఈ బార్లకు పగలు రాత్రి తేడా లేదు. 24/7 మందు సర్వీసు అందుబాటులో ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడికి ఎప్పుడు వెళ్లినా.. మద్యం అందుబాటులో ఉంటుంది. అయితే అర్థరాత్రి 12 గంటల తర్వాత వెళ్లిన మద్యం ప్రియుల దగ్గర నుంచి మాత్రం బాటిల్పై 50 రూపాయిలు అదనంగా వసూలు చేస్తుంటారు. అందులో భాగంగానే తాజాగా పట్టుబడినట్లు తెలుస్తోంది. అందులో పనిచేసే వ్యక్తికే ఈ బాటిల్స్తో సంబంధం ఉందనీ.. అందుకే ఆయన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ.. వాస్తవానికి నగరంలోని ఈ మూడు బార్లపై ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం.. ఈ స్విగ్గీ జొమాటో బార్ల నుంచి స్థానిక ఎకై ్సజ్ పోలీసులకు, స్థానిక పోలీసులకు నెల వారీ మామ్మూళ్లు అందుతుండటమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలకు వెళ్లిన పోలీసులపైనా జులుం కనకరాజుని అదుపులోకి తీసుకున్న సమయంలో బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం తనిఖీలకు వెళ్లిన స్థానిక స్టేషన్ ఎస్సై మొహం మీదనే షట్టర్లు మూసేసినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం నగరంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ యజమాని కూడా తనిఖీలకు వెళ్లిన ఎకై ్స్సజ్ సీఐతో దురుసుగా ప్రవర్తించిన సంఘటన మరవకముందే ఇలాంటి సంఘటన మరోసారి చోటు చేసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అలాంటి సంఘటనలేమీ జరగలేదని మహరాణిపేట సీఐ దివాకర్ యాదవ్ ‘సాక్షి’తో చెబుతుండటం గమనార్హం. అల్లుడి గిల్లుడుతో గప్చుప్ ఈ తతంగం వెనుక బార్ ప్రమేయం లేకుండా ఇన్ని బాటిల్స్ ఒక పనిచేసే వ్యక్తి దగ్గర ఉంటాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బార్ కూటమి పార్టీలోని కీలక నేత అల్లుడికి చెందిన బార్ కావడమే ఈ వ్యవహారంలో బార్పై చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. కేవలం అందులో పనిచేసే వారిపై కేసులు పెట్టి.. బార్ అండ్ రెస్టారెంట్ని కేసు నుంచి తప్పించినట్లు సమాచారం. బార్లో పనిచేసే వ్యక్తి యాజమాన్యం మద్దతు లేకుండా.. భారీ మొత్తంలో బాటిల్స్ నిల్వ చెయ్యలేరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా కూటమి నేతల ఒత్తిళ్లతోనే కేవలం అందులో పనిచేసే వ్యక్తిని బలిపశువు చేశారనే ఆరోపణలున్నాయి. -
కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ రద్దు
మహారాణిపేట: ‘మొంథా’ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాన్ ముందస్తు చర్యలు చేపట్టే కార్యక్రమంలో అధికారులు పూర్తిగా నిమగ్నమై ఉంటారు కాబట్టి, వారు పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అందుబాటులో ఉండరని కలెక్టర్ పేర్కొన్నారు. పోలీసు పీజీఆర్ఎస్.. అల్లిపురం: సోమవారం నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ రద్దు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందుబాటులో 5 అంబులెన్సులు -
పేకాట శిబిరంపై దాడి.. 11 మంది అరెస్ట్
పరవాడ: పెదముషిడివాడ శివారులోని నక్కవానిపాలెం పొలిమేరలో ఈ నెల 21న పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.19.20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పరవాడ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. నక్కవానిపాలెం గ్రామ పొలిమేరల్లో ఒక రహస్య ప్రదేశంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సీఐ ఆర్.మల్లికార్జునరావు తన సిబ్బందితో కలిసి ఈ నెల 21న రాత్రి 9 గంటల సమయంలో శిబిరంపై దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న జెర్రిపోతుల శివ(డొంకాడ కాలనీ), కె. నాగఅప్పలరాజు (సిహెచ్ అగ్రహారం), చింతల అప్పారావు (మల్కాపురం దరి త్రినాథపురం), గాలి రమేష్ కుమార్ (అప్పికొండ కాలనీ), జి. బాలాజీ (దువ్వపాలెం), కర్రి శివప్రసాద్ (యలమంచిలి), పోలవరపు సుధాకర్(అనకాపల్లి), కర్రి అప్పారావు(అసకపల్లి), కర్రి నేతాజీ (గాజువాక), కె.నాగేశ్వరరావు (రాంబిల్లి మండలం కొత్తూరు), టి. శ్రీనివాసరావు(అనకాపల్లి)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం రూ.19.20 లక్షల నగదు, 17 మొబైల్ ఫోన్లు, 2 బైక్లు, ఒక కారు, పేక ముక్కలు, చార్జింగ్ లైట్లు, టార్పాలిన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు పరారీలో ఉన్నారని, వారి కోసం దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. దాడిలో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం రైల్వేస్టేషన్లో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి జీఆర్పీ తెలిపిన వివరాలివి. గురువారం సాయంత్రం గోదావరి ఎక్స్ప్రెస్ 8వ నంబర్ ప్లాట్ఫాంపైకి వస్తుండగా.. 7వ నంబర్ ప్లాట్ఫాం ట్రాక్పై నుంచి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి రైలు కింద పడ్డాడు. దీంతో శరీరం రెండు భాగాలు గా విడిపోయి అతను అక్కడికక్కడే మరణించాడు. అతను స్కై బ్లూ ఫుల్ హ్యాండ్స్ షర్ట్, ముదురు సిమెంట్ రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని, అతని గురించి తెలిసినవారు గవర్నమెంట్ రైల్వే పోలీసులను స్వయంగా గానీ లేదా 86398 65434/94406 27547 నంబర్లలో గానీ సంప్రదించాలని ఎస్ఐ రామారావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గ చర్య
సాక్షి, విశాఖపట్నం : ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కూటమి ప్రభుత్వం చేస్తున్న చారిత్రాత్మక తప్పిదమని, దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ‘ప్రజా ఉద్యమం’ చేపడుతుంది. గురువారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో కేకే రాజు ఆధ్వర్యంలో ‘ప్రజా ఉద్యమం‘ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రను తిరగరాసి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే కేజీహెచ్ దిక్కుగా ఉండేదని.. వారి కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాడేరులో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారని కొనియాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకునేవరకూ వైఎస్సార్ సీపీ ఆందోళన కొనసాగిస్తుందన్నారు. అందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్కుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, ఎస్ఈసీ సభ్యులు జియ్యాని శ్రీధర్, బాణాల శ్రీనివాసరావు, రొంగలి జగన్నాథం, డాక్టర్ జహీర్ అహ్మద్, పి.సతీష్ వర్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర మత్స్యకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయ చంద్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పేడాడ రమణికుమారి, ఎస్.రవీంద్ర భరత్, బర్కత్ అలీ, సేనాపతి అప్పారావు, రాయపురెడ్డి అనిల్కుమార్, శ్రీదేవి వర్మ, మారుతీ ప్రసాద్, ఎస్.ప్రసాద్ రావు, దేవరకొండ మార్కెండేయులు, కేవీ బాబా, బోండా ఉమామహేశ్వరరావు, నీలి రవి, స్టాండింగ్ కమిటీ మెంబర్ సాడి పద్మారెడ్డి, కార్పొరేటర్లు పీవీ సురేష్, కె.అనిల్ కుమార్ రాజు, అక్కరమాని పద్మ, బిపిన్ కుమార్ జైన్, చెన్నా జానకిరామ్, మహ్మద్ ఇమ్రాన్, కోఆప్షన్ సభ్యుడు ఎండీ షరీఫ్, ముఖ్యనేతలు ద్రోణంరాజు శ్రీ వాస్తవ్, ఆల్ఫా కృష్ణ, మంచా నాగమల్లేశ్వరి, అల్లంపల్లి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
విశాఖ సిటీ: క్రికెట్ బెట్టింగ్ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీగా లాభాలు వస్తాయని చెప్పి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారు. బుధవారం నలుగురు బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎక్స్చేంజ్ 666 అనే అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఆ వెబ్సైట్లో డబ్బు పెడితే అధిక లాభాలు వస్తాయని అమాయకులకు ఆశచూపిస్తూ బెట్టింగ్ రొంపిలోకి దించుతున్నట్లు గుర్తించారు. బెట్టింగ్ ఆడడంతో పాటు ఇతరులకు వారి సొంత ఐడీలు ఇస్తూ దాని ద్వారా అనేక మందిని బెట్టింగ్లో పాల్గొనేలా చేస్తున్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి చెందిన మాసారపు దక్షిణామూర్తి(35), చుక్కా రఘురామ్(26)లను అరెస్టు చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. పోలీసులు వీరి ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీల సమాచారాన్ని తెలుసుకున్నారు. వారిపై నిఘా పెట్టారు. -
● సాగర తీరాన మాయా ప్రపంచం!
ఏయూక్యాంపస్: గదిలో అడుగుపెట్టాక ఎక్కడ ఉన్నామో తెలియకపోతే? అనంతమైన విశ్వంలో తేలియాడుతున్న అనుభూతి కలిగితే? మన కళ్లే మనల్ని మోసం చేస్తే.? విదేశాల్లో మాత్రమే కనిపించే అద్భుత మాయా ప్రపంచం ఇప్పుడు మన విశాఖ నగరానికి వచ్చేసింది. బీచ్రోడ్డులోని టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం ప్రాంగణంలోనే ఇమ్మర్సివ్ మ్యూజియం(ఆర్ట్ మ్యూజియం) రూపుదిద్దుకుంటోంది. ఇది పర్యాటకులకు, ముఖ్యంగా యువతకు, పిల్లలకు సరికొత్త అనుభూతిని పంచనుంది. ఈ మ్యూజియంలో మొత్తం 8 ఇన్ఫినిటీ రూమ్స్ ఉంటాయి. ఒక్కో గది ఒక్కో ప్రత్యేకమైన థీమ్తో మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. గదిలోకి అడుగుపెట్టగానే.. ఆ గది పొడవు, వెడల్పు అంచనా వేయడం అసాధ్యం. గదికి ఆరు వైపులా (నేల, పైకప్పు, నాలుగు గోడలు) అద్దాలు ఉండటంతో.. మన కళ్లు కనికట్టుకు గురవుతాయి. ప్రతి గది ఒక ప్రత్యేక ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అద్దాల మండపం, మిర్రర్ ఇమేజ్, కెలిడోస్కోప్, రివాల్వింగ్ టన్నెల్, స్టార్ ఇన్ స్కై, అవతార్ రూమ్, రెయిన్బో కలర్, పెరల్ కర్టెన్స్ వంటి థీమ్స్.. అద్భుత ఊహ లోకంలోకి తీసుకెళ్లనున్నాయి. నేవీలో పని చేసి పదవీ విరమణ చేసిన రమణ కుమార్ ఈ అద్భుత ప్రపంచానికి రూపకల్పన చేస్తున్నారు. ఆయన దుబాయ్లో ఉన్న సమయంలో అక్కడ చూసిన ఇలాంటి మ్యూజియం స్ఫూర్తితో.. ఆ సరికొత్త అనుభూతిని నగరవాసులకు, పర్యాటకులకు అందించాలనే సంకల్పంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ అద్దాల మాయా లోకం ప్రారంభమై.. సాగర తీరానికి కొత్త ఆకర్షణగా నిలవనుంది. -
శ్రీ ఆంజనేయం..
సహస్రం.. సంపూర్ణంభగవంతుని చేరడానికి భక్తి, సేవ రెండు ప్రధాన మార్గాలు. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ.. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని అక్షరాలా ఆచరిస్తున్నారు సద్గురు సేవాశ్రమం వ్యవస్థాపకుడు యోగా రాజు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆధ్యాత్మిక చైతన్యం నింపేందుకు ఆయన ఎంచుకున్న మార్గం హనుమాన్ విగ్రహాల ప్రతిష్ట. ఆంజనేయుడు భక్తికి, సేవకు, ధైర్యానికి ప్రతీక. అలాంటి హనుమంతుని స్వరూపాలను గిరిజనుల చెంతకు చేర్చేందుకు ఎనిమిదేళ్ల కిందట ప్రారంభించిన మహా సంకల్పం.. దాతల సహకారంతో నేటికి వెయ్యి విగ్రహాల ప్రతిష్ట అనే బృహత్తర మైలురాయిని చేరుకుంది. ఇది కేవలం విగ్రహాల ప్రతిష్ట మాత్రమే కాదు.. గ్రామాల్లో నిరంతర భక్తి భావాన్ని నింపిన ఒక ఆధ్యాత్మిక యజ్ఞం. – తగరపువలస జీవీఎంసీ భీమిలి జోన్, రామయోగి అగ్రహారంలోని సద్గురు సేవాశ్రమం వ్యవస్థాపకుడు యోగా రాజు అలియాస్ సాయిరామ్ స్వామీజీ.. గిరిజన ప్రాంతాల్లో అపూర్వమైన ఆధ్యాత్మిక సేవకు శ్రీకారం చుట్టారు. ఎనిమిదేళ్ల కిందట 2017లో హుకుంపేట మండలం రాళ్లగడ్డలో తన తండ్రి కోన కుంచయ్య పేరుతో ప్రారంభించిన హనుమత్ ప్రతిష్టా యాగం ఈ విజయదశమి నాటికి వెయ్యి ఆంజనేయ విగ్రహాల ప్రతిష్టను పూర్తి చేసుకుంది. మొదటి మూడేళ్లలో 116 విగ్రహాలు ప్రతిష్టించిన స్వామీజీ గిరిజనుల్లో పెరుగుతున్న భక్తిభావాన్ని గమనించి, దైవబలం, దాతల సహకారంతో ఈ సేవను మారుమూల గ్రామాలకు విస్తరించారు. పెదబయలు, జీకే వీధి, డుంబ్రిగుడ, జి.మాడుగుల, కొయ్యూరు, చింతపల్లి, అరకు, పాడేరు, హుకుంపేట, అనంతగిరి వంటి ఏజెన్సీ మండలాలతో పాటు, ఒడిశాలోని నవరంగ్పూర్, కోరాపుట్, మల్కన్గిరి, సునాబెడ ప్రాంతాల్లో కూడా ఈ విగ్రహాలను ప్రతిష్టించారు. ఏజెన్సీ ముఖద్వారాలైన వడ్డాది, ముకుందపురంలలో 7, 8, 9, 12 అడుగుల హనుమ సిమెంట్ విగ్రహాలను తయారు చేయించారు. రహదారులు సరిగా లేని మారుమూల కొండ గ్రామాలకు సైతం గిరిజనుల సాయంతో విగ్రహాలను తరలించారు. భీమిలి పరిసరాల్లోని చేపలుప్పాడ, కాపులుప్పాడ, అన్నవరం, జేవీ అగ్రహారం గ్రామాల్లో కూడా పదుల సంఖ్యలో విగ్రహాలు నెలకొల్పారు. అన్నవరంలో ప్రతిష్టించిన 15 అడుగుల విగ్రహమే ఇప్పటి వరకు అతి పెద్దది. వెయ్యి విగ్రహాల మైలురాయిని అందుకున్న స్వామీజీ.. తన తదుపరి లక్ష్యాన్ని ప్రకటించారు. 1001వ విగ్రహంగా విశాఖ–తగరపువలస హైవేపై ప్రయాణికులకు స్పష్టంగా కనిపించేలా 30 అడుగుల భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని రూ.30 లక్షల వ్యయంతో నిర్మించేందుకు సంకల్పించారు. ఆసక్తి కలిగిన దాతలు ఈ మహా కార్యంలో పాలుపంచుకోవాలని కోరారు. అనాథలకు అండగా.. : స్వామీజీ సేవ కేవలం విగ్రహాల ప్రతిష్టకే పరిమితం కాలేదు. దాతల సహకారంతో సుమారు రూ.5 కోట్లు వెచ్చించి పదుల సంఖ్యలో శివాలయాలు, వైష్ణవాలయాలు, అమ్మవారి ఆలయాలను నిర్మించారు. పునరుద్ధరించారు. వీటిలో జి.మాడుగులలో రూ.50 లక్షలతో నిర్మించిన పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం, మద్దిపేటలో శివాలయం, ములుసోబలో వేంకటేశ్వరస్వామి ఆలయాలు ముఖ్యమైనవి. 2010లో విజయసాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రామయోగి అగ్రహారంలో షిర్డీసాయి, నూకాంబిక, శ్రీకృష్ణుని ఆలయాలు నిర్మించారు. ఎవరూ లేని 60 మంది వృద్ధులకు తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. 100 దేశీయ ఆవులతో గోశాలను కూడా నిర్వహిస్తున్నారు. విగ్రహం ప్రతిష్టించి వదిలేయకుండా.. ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మికత నిరంతరం కొనసాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిష్టించిన అన్ని చోట్లా ఏడాది పాటు నెలకు రూ.5 లక్షల విలువైన పూజా సామగ్రిని ఆశ్రమం తరపున అందిస్తున్నారు. ప్రతిష్ట సమయంలో భక్తులకు భగవద్గీత, రామకోటి పుస్తకాలు, దేవుళ్ల చిత్రపటాలు, దుప్పట్లు, చీరలు, స్టీల్ కంచాలు పంపిణీ చేస్తున్నారు. కార్తీకమాసం, శివరాత్రి వంటి పర్వదినాల్లో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ఉచిత యోగా శిక్షణ, వైద్య శిబిరాలు, తాగునీటి బోర్ల తవ్వకం, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా వంటివి నిరంతరం కొనసాగిస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యం జీవీఎంసీ పరిధిలో జాతీయ రహదారిని ఆనుకుని 30 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు కోసం స్థలాన్ని ఆన్వేషిస్తున్నాం. ఆసక్తి గలవారు ఎవరైనా ఉంటే 98486 49067, 85005 09067 నంబర్లలో సంప్రదించవచ్చు. సనాతర ధర్మం పరిరక్షణ, సేవాభావం లక్ష్యంగా కార్యక్రమాలు, విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. – యోగా రాజు ఏజెన్సీ, భీమిలి తీర ప్రాంతాల్లో ప్రతిష్టించిన విగ్రహాలు -
దొంగనోట్లు ముద్రిస్తున్న వ్యక్తి అరెస్ట్
విశాఖ సిటీ : దొంగనోట్లు ముద్రించి నగరంలో చెలామణి చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి కరెన్సీ ముద్రించడానికి వినియోగిస్తున్న పేపర్, ప్రింటర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ(లా అండ్ ఆర్డర్) మేరీ ప్రశాంతి తెలిపారు. గురువారం పోలీస్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఎంవీపీ కాలనీ సెక్టార్–11లో ఒక ఇంట్లో దొంగ నోట్లను ముద్రిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎంవీపీ సీఐ కె.ఎన్.ఎస్.వి.ప్రసాద్, ఎస్ఐ ఎస్కే ఖాదర్బాషా, టాస్క్ఫోర్స్ సీఐ ఆర్.అప్పలనాయుడు, ఎస్ఐ హరీష్, సిబ్బందితో కలిసి ఆ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం బర్వానీ జిల్లా, బల్వాడీ మండలానికి చెందిన శ్రీరామ్ అలియాస్ గుప్తా(60) ల్యాప్టాప్, ప్రింటర్ ద్వారా రూ.500, రూ.200 కరెన్సీ నోట్లను ముద్రిస్తుండగా పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. వరప్రసాద్, ఆనంద్ అనే వ్యక్తులతో కలిసి శ్రీరామ్ కొద్ది రోజుల క్రితం రూ.10 లక్షల దొంగ నోట్లను ముద్రించి నగరంలో చెలామణి చేయడానికి విఫలయత్నం చేసినట్లు తెలుసుకున్నారు. శ్రీరామ్ ఇండోర్, ఉజ్జయిని, ముంబై, బరవాని ప్రాంతాల్లో కూడా దొంగ నోట్లు తయారు చేయగా.. ఉజ్జయిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు డీసీసీ తెలిపారు. అతడు నోట్లను ముద్రించడానికి ముంబై నుంచి పేపర్ను రప్పించినట్లు చెప్పారు. దొంగనోట్లను ముద్రించడానికి ఉపయోగిస్తున్న ల్యాప్టాప్, ప్రింటర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో ద్వారకా ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జగన్కు ఇచ్చిన మాట
విశాఖలో రెండో విడత పెట్టుబడులకు ‘రహేజా’ సంసిద్ధత సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్న ఇన్ఫినిటీ రూమ్స్సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా ఫలాలను అందిస్తున్నాయి. 2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసిన, దక్షిణాదిలోనే అతి పెద్దదిగా భావిస్తున్న ఇనార్బిట్మాల్ పనులు తుది దశకు చేరుకున్నాయి. శంకుస్థాపన సమయంలో రహేజా గ్రూప్ ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటోంది. విశాఖలోనే రెండో దశలో ఐటీ బిజినెస్ పార్క్ అభివృద్ధి చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని కార్యరూపం దాల్చే దిశగా సంస్థ అడుగులు వేస్తోంది. రూ.2,172.26 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రహేజా కార్పొరేషన్ ఆసక్తి వ్యక్తం చేసింది. ఇది పూర్తయితే 9,681 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. తుది దశకు చేరుకున్న దక్షిణాదిలోనే అతిపెద్ద మాల్ పనులు 2023 ఆగస్ట్ 1న సాలిగ్రామపురంలో రహేజా గ్రూప్ నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఫేజ్–1లో భాగంగా ఇనార్బిట్ మాల్, ఐటీ పార్క్ నిర్మాణానికి రహేజా గ్రూప్ రూ.600 కోట్లు వ్యయం చేస్తోంది. 6 లక్షల చదరపు అడుగుల మాల్, 4 లక్షల చదరపు అడుగుల పార్కింగ్ ప్రాంతాన్ని నిర్మిస్తోంది. 2026 నాటికి దీన్ని పూర్తి చేసేలా పనులు చురుగ్గా సాగుతున్నాయి. దాదాపు 80 శాతం వరకూ పనులు పూర్తయ్యాయి. ఇందులో 250 జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ స్టోర్లు, మల్టీఫ్లెక్స్లు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్, ఫుడ్ కోర్టు, టెర్రస్ గార్డెన్, షాపింగ్ స్పేస్ అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి కలగనుంది. ఈ నిర్మాణాలన్నీ ‘గ్రీన్ బిల్డింగ్’ ప్రమాణాలకు అనుగుణంగా చేపడుతున్నారు. ఇది దక్షిణాదిలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ కావడం విశేషం. ఈ శంకుస్థాపన సమయంలో రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా మాట్లాడుతూ.. రెండో దశలో భాగంగా త్వరలోనే విశాఖలో ఐటీ స్పేస్ నిర్మించి.. ఐటీ రంగంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. రూ.2,172.26 కోట్లతో ఆసక్తి వ్యక్తీకరణ 2023లో చెప్పిన విధంగానే రహేజా గ్రూప్ విశాఖలో తమ కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఐటీ సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాల సముదాయాలు నిర్మించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం రూ.2,172.26 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రెండు దశల్లో మొత్తం 28.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ, అనుబంధ, వాణిజ్య కార్యకలాపాలకు అనువైన సముదాయాలు నిర్మించనుంది. మొదటి దశలో 2028 నాటికి వాణిజ్య భవనాలు, 2030 నాటికి నివాస సముదాయాలకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేయాలని రహేజా ఆసక్తి చూపిస్తోంది. ఇక రెండో దశలో భాగంగా 2031 నాటికి మిగిలిన కమర్షియల్ భవనాలు, 2035 నాటికి నివాస సముదాయాలు పూర్తి చేయనుంది. మొత్తంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీకి కట్టుబడి రహేజా సంస్థ పెట్టుబడులకు ముందుకు రావడం శుభపరిణామమని విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహా విశాఖ అభివృద్ధి ప్రస్థానంలో మరో కీలక అడుగు పడింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ.. ప్రఖ్యాత రహేజా గ్రూప్ విశాఖలో రెండో దశ భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. ఫేజ్–1లో భాగంగా రూ.600 కోట్లతో నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ పనులు తుది దశకు చేరుకోగా.. ఇప్పుడు దానికి అదనంగా రూ.2,172 కోట్లకు పైగా వ్యయంతో భారీ ఐటీ, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ నూతన పెట్టుబడి ద్వారా 9,681 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. -
● భానుడు వర్సెస్ వరుణుడు!
సాక్షి, విశాఖపట్నం : మహా విశాఖ నగరంలో భిన్నమైన యుద్ధం జరిగింది. భానుడు, వరుణుడు.. నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డారు. ఒకసారి.. వరుణుడిది పైచేయి అయితే.. మరోసారి భానుడు భగభగలతో విజయం సాధించాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ దోబూచులాటలే జరిగింది. సూర్యోదయం అయిన కాసేపటికే నగరం మేఘావృతమైంది. ఒక్కసారిగా వర్షం కురిసింది. ఇక రోజంతా వర్షం పడుతుందేమో అని నగరవాసులు అనుకునే సరికి.. సూర్యుడు విజృంభించాడు. ఇక వర్షం పడదు అనుకునే సరికి మళ్లీ వర్షం కురిసింది. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎండ వానతో భిన్న వాతావరణం కనిపించింది. గత రెండు రోజులుగా జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తీవ్ర వాయుగుండంగానైనా, తుఫాన్గా అయినా బలపడే సూచనలున్నాయి. దీని ప్రభావంతో ఈనెల 27 నుంచి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గురువారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకూ జిల్లాలో కురిసిన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. ప్రాంతం వర్షం(మి.మీలలో) మహారాణిపేట 33 పెదగంట్యాడ 32.8 ములగాడ 28.25 సీతమ్మధార 27.0 పద్మనాభం 26.75 గాజువాక 26.25 శ్రీనగర్ 24.5 పరదేశిపాలెం 23.75 గురుద్వార 23.0 మదీనాబాగ్ 23.0 ఆరిలోవ 19.0 మధురవాడ 15.75 -
కూటమివి గ్యాస్కబుర్లే..
మహారాణిపేట: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన ‘ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల’పథకం అమలు అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా మూడో విడత చెల్లింపుల్లో లబ్ధిదారులకు చుక్కలు కనబడుతున్నాయి. సిలిండర్ డెలివరీ తీసుకుని రోజులు గడుస్తున్నా.. రాయితీ డబ్బులు మాత్రం ఖాతాల్లో జమ కాకపోవడంతో మహిళలు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయితీ కోసం ఎదురుచూపు విశాఖ జిల్లా గణాంకాలే ఈ పథకం అమలులోని డొల్లతనాన్ని స్పష్టం చేస్తున్నాయి. మూడో విడతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 3,46,110 మంది లబ్ధిదారులు సిలిండర్లను డెలివరీ తీసుకున్నారు. అయితే వీరిలో కేవలం 87 వేల మందికి మాత్రమే ఇప్పటివరకు రాయితీ సొమ్ము రూ.8.35 కోట్లు వారి ఖాతాలకు జమ అయ్యింది. అంటే సుమారు 2.59 లక్షల మంది లబ్ధిదారులు తాము చెల్లించిన డబ్బుల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఆగస్టులో ప్రారంభమైన మూడో విడత బుకింగ్లు నవంబర్ 30తో ముగియనున్నాయి. అక్టోబర్ చివరి వారం నడుస్తున్నా.. ఇంత భారీ సంఖ్యలో చెల్లింపులు నిలిచిపోవడం గమనార్హం. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు రాయితీ డబ్బుల కోసం లబ్ధిదారులు సివిల్ సప్లైస్ డీఎస్వో, ఏఎస్వో కార్యాలయాలకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఈ రోజు, రేపు అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారే తప్ప, స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. అనుమానాల నివృత్తి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్(1800–2333–555) కూడా ఏమాత్రం ఉపయోగపడటం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాటలకు, చేతలకు పొంతన ఏది? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోగా డీబీటీ విధానం ద్వారా లబ్ధిదారుల ఖాతాలో నేరుగా రాయితీ సొమ్ము జమ అవుతుందని డీఎస్వో వి.భాస్కర్ చెబుతున్నారు. కానీ, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సిలిండర్లు తీసుకున్న వారికి కూడా అక్టోబర్ చివరి నాటికి డబ్బులు పడలేదు. అధికారుల ప్రకటనలకు, క్షేత్రస్థాయి అమలుకు మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. నిబంధనలతో అవస్థలు ఎన్నికల ముందు ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికీ మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం మెలికలు పెడుతోందని మహిళలు ధ్వజమెత్తుతున్నారు. తెలుపు రేషన్ కార్డు (రైస్ కార్డు) పనిచేస్తేనే ఉచిత గ్యాస్ అని నిబంధన పెట్టడం వల్ల మధ్యతరగతి మహిళలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీనికి తోడు ఈకేవైసీ, ఆధార్–బ్యాంకు ఖాతా అనుసంధానం వంటి సాంకేతిక కారణాలతో చాలా మందికి రాయితీ సొమ్ము దక్కడం కష్టంగా మారింది. ఎన్నికల ముందు ఒకలా, ఇప్పుడు మరోలా వ్యవహరించడం మోసమేనని వారు మండిపడుతున్నారు. -
ఏయూకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి
సీతంపేట: ఘన చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి, సమృద్ధి, ఆర్ధిక పరిపుష్టి కల్పించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కోరారు. ముగ్గురు వీసీలు రాసిన ‘ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రగతి నిర్దేశకులు’పుస్తకావిష్కరణ సభ సిడార్ ఆధ్వర్యంలో బుల్లయ్య కళాశాలలో బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఏయూ వందేళ్ల చరిత్రను తెలుగు, ఇంగ్లిష్లో రాయడం అభినందనీయమన్నారు. 1958లో ఏయూ విద్యార్థిగా తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పుస్తక రచయితల్లో ఒకరైన ఆచార్య వి.బాలమోహన్దాస్ మాట్లాడుతూ ఏయూలో వీసీల నియామకం ప్రారంభం, ఎంతమంది వీసీలుగా పనిచేశారో వివరించారు. మిగిలిన రచయితలు ప్రొఫెసర్ ఎస్వీ సుధాకర్, ఎస్.రామకృష్ణారావులు మాట్లాడుతూ ఏయూ చరిత్ర కలకాలం నిలిచిపోయేలా పుస్తకాన్ని రూపొందించామన్నారు. కార్యక్రమంలో ఏయూ పూర్వ వీసీ జీఎస్ఎన్ రాజు, మాజీ వీసీలు కేసీ రెడ్డి, జేవీ ప్రభాకర్, జ్ఞానమణి, ఎన్.వెంకట్రావు, ఏవీ ప్రసాదరావు, సూర్యనారాయణ, ఉమామహేశ్వరరావు, హరినారాయణ, నిరూపారాణి, రైటర్స్ అకాడమీ చైర్మన్ వీవీ రమణమూర్తి, బుల్లయ్య కళాశాల కరస్పాండెంట్ జి.మధుకుమార్ పాల్గొన్నారు. -
పెళ్లికి వెళ్లొస్తూ మృత్యుఒడికి..
కడియం: ఆగిఉన్న లారీని కారు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. జాతీయ రహదారిపై రాజమహేంద్రవరం సమీపంలో కడియపులంక వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా అగనంపూడి ఫార్మాసిటీ నిర్వాసితకాలనీ కొత్తపాలెంకు చెందిన దాసరి కిరణ్ కుమార్ (28) మంగళవారం మధ్యాహ్నం తన కారులో విజయవాడకు వివాహానికి వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా బుధవారం మధ్యాహ్నం కడియపులంక గోకుల్ నర్సరీ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారు క్యాబిన్లో ఇరుక్కుపోయిన కిరణ్ కుమార్ మృతి చెందాడు. నేషనల్ హైవే సేఫ్టీ అధికారులు క్రేన్ సహాయంతో లారీ నుంచి కారును లాగి, కిరణ్ కుమార్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కిరణ్కుమార్ తండ్రి నీలకంఠరావు ఫిర్యాదు మేరకు కడియం ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు అగనంపూడి: దాసరి నీలకంఠరావు, శాంతి దంపతులకు కిరణ్ కుమార్ ఒక్కడే కుమారుడు. అతడు ఫార్మా సిటీలోని ఫార్మా కంపెనీలో సేఫ్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. కిరణ్ కుమార్ మృతి వార్త వినగానే ఆ దంపతులిద్దరూ సొమ్మసిల్లి పడిపోయారు. వివాహానికి వెళ్లిన కుమారుడు ఇలా మృత్యువాత పడడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుని తల్లిదండ్రులు, బంధువులు రాజమండ్రిి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. దీంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికి అందొచ్చిన కొడుకు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో మృతుని బంధువులు గుండెలవిసేలా రోదించారు. -
చిరుద్యోగికి పగ్గాలు!
మహారాణిపేట : అతడు ఒక చిన్న ఉద్యోగి.. అయినా మొత్తం కార్యాలయ బాధ్యతలన్నీ అతనికే అప్పగించారు. ఆ కార్యాలయంలో ఏ ఫైల్ ముందుకు వెళ్లాలన్నా తొలుత ఈ ఉద్యోగిని ప్రసన్నం చేసుకోవాలి. అతని చెయ్యి తడిపితేనే ఫైల్ కదులుతుంది. లేదంటే ఎన్ని నెలలైనా సరే ఆ ఫైలు అక్కడే ఉంటుంది. కార్యాలయం ఉన్నతాధికారులతోపాటు కొంత మంది రెవెన్యూ ఉన్నతాధికారుల అండ ఉండడంతోనే ఆ చిరుద్యోగి మాట చెల్లుబాటు అవుతోంది. ఇది ఎక్కడో కాదు.. విశాఖ జిల్లాలోని పెదగంట్యాడ తహసీల్దార్ కార్యాలయంలో.. ఇక్కడ గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో)కి తహసీల్దార్ ఏకంగా ఇన్చార్జి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు అప్పగిస్తూ ప్రొసిడింగ్ కూడా జారీ చేశారు. దీనిపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో ఫిర్యాదు కూడా నమోదైంది. చిరుద్యోగికి అందలం పెదగంట్యాడ మండలంలో క్లస్టర్–3లో వీఆర్వో దాకురి లక్ష్మీకాంతరావును ఇన్చార్జి ఆర్ఐగా తహసీల్దార్ నియమించారు. ఈ కార్యాలయంలో తహసీల్దార్తోపాటు డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, 33 మంది గ్రేడ్–2 సచివాలయ వీఆర్వోలు, ముగ్గురు గ్రేడ్–1 వీఆర్వోలు ఉన్నారు. ఇక్కడ ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ను కాదని.. వీఆర్వో డి.లక్ష్మీకాంతరావును ఇన్చార్జి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నియమిస్తూ గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన తహసీల్దార్ ప్రొసిడింగ్ ఇచ్చారు. తహసీల్దార్ విశాఖపట్నం ఆర్డీవో ద్వారా జాయింట్ కలెక్టర్కు ప్రొసిడింగ్ కాపీని పంపారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నియామకాన్ని జిల్లా కలెక్టర్ చేపడుతుంటారు. ఇక్కడ తహసీల్దార్ తనకు వత్తాసు పలికే వీఆర్వోని ఏకంగా ఇన్చార్జి ఆర్ఐగా నియమిస్తూ ప్రొసిడింగ్ ఇచ్చేశారు. ఉద్యోగిపై ఫిర్యాదుల వెల్లువ ఈ ఉద్యోగిపై ఇప్పటికే పీజీఆర్ఎస్లో ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మీద విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని విశాఖ ఆర్డీవోకు కలెక్టర్కు సూచించారు. అయినా ఈ ఫిర్యాదు మీద నేటి వరకు ఎలాంటి విచారణ చేయలేదు.. సమాధానం కూడా లేదు. అలాగే మండలంలో అనేక మంది ఫిర్యాదులు చేశారు. వాటిని పట్టించుకునే నాథుడు లేడు. దీంతో కార్యాలయంలో ఇన్చార్జి ఆర్ఐ పెత్తనం ఇంకా నడుస్తోంది. కార్యాలయంలో ఎలాంటి పనులైనా అతడు ఆమోదం పొందాల్సి ఉంటుంది.వసూళ్లకు కూడా పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. -
సీఐఐ సదస్సుకు నగరాన్ని సుందరీకరించండి
డాబాగార్డెన్స్: విశాఖలో వచ్చే నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు నగరాన్ని సుందరీకరించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఆదేశించారు. నగరానికి బుధవారం విచ్చేసిన ఆయన సదస్సుకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ హరేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్, ఏయూ వీసీ రాజశేఖర్, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లతో కలిసి వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సదస్సుకు సంబంధించి నగరంలో జరుగుతున్న పనుల వివరాలను వివరించారు. అనంతరం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున వస్తారని, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రధాన రోడ్లు, ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ రోడ్డులో వ్యర్థాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని.. వెంటనే పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా చెట్టు పొదలు ఉన్నందున వెంటనే తొలగించాలని సూచించారు. భవన నిర్మాణ వ్యర్థాలు, సామగ్రి రోడ్లపై లేకుండా చూడాలని, సీఅండ్డీ ప్లాంట్ నిర్వహణకు చర్యలు చేపట్టాలని చీఫ్ సిటీ ప్లానర్ను ఆదేశించారు. తీర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని, బీచ్లో వ్యాపారస్తులు తప్పనిసరిగా డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. ఓపెన్, క్లోజ్డ్ కాలువల్లో పూడికలు తొలగించాలని, వీధి కుక్కలు, పశువులు, సంచరించకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. సదస్సు ప్రాంతంలో తాత్కాలిక మరుగుదొడ్లు, కంపార్టర్లు, వ్యర్థాలు తరలించే వాహనాలు, నీటి సరఫరా, తగినంత వర్కర్లు, పార్కింగ్ ఏరియాలో సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రధాన వైద్యాధికారిని ఆదేశించారు. వీధి విక్రయదార్లను గుర్తించి.. వెండింగ్ జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని యూసీడీ పీడీ సత్యవేణిని ఆదేశించారు. డిసెంబర్ నాటికి ఆస్తిపన్ను వసూలు జరగాలని డీసీఆర్ శ్రీనివాసరావును ఆదేశించారు. సమీక్షలో అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, ప్రధాన సిటీ ప్లానర్ ప్రభాకరరావు, వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రమేష్, ప్రధాన ఇంజనీర్ వినయ్కుమార్ పాల్గొన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్కుమార్ -
మత్స్యకారులకు అండగా ఉంటాం
నక్కపల్లి: వందలాదిమంది పోలీసులను దించారు.. దారులన్నీ దిగ్బంధం చేశారు.. సంఘీభావం తెలిపే నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.. రాజయ్యపేట మత్స్యకారులను ఒంటరి వాళ్లను చేసేందుకు యత్నించారు. వారం రోజులుగా అమలవుతున్న కూటమి నేతల కుటిల నీతిని తుత్తునియలు చేస్తూ వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. మేమున్నామని భరోసా ఇచ్చింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశంతో ‘చలో రాజయ్యపేట’కు పిలుపునిచ్చి పార్టీ అగ్ర నేతలు గ్రామాన్ని సందర్శించారు. కడ వరకు మీకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్రాజ్, కన్నబాబురాజు, చెంగల వెంకటరావు, తైనాల విజయ్కుమార్, పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమావతి, సూర్యనారాయణరాజు, సీఈసీ సభ్యులు డాక్టర్ బి.వి.సత్యవతి, రాష్ట్ర కార్యదర్శులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, పైల శ్రీనివాసరావు, మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కోలా గురువులు, పేర్ల విజయచందర్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు జాన్ వెస్లీ, ఉత్తరాంధ్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, ముఖ్యనేతలు శరగడం చినఅప్పలనాయుడు, బోదెపు గోవింద్, జియ్యాని శ్రీధర్, అల్లంపల్లి రాజుబాబు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, మహిళా నేతలు నాగమల్లేశ్వరి, సుందరలత, విశాఖ బోట్ ఆపరేటర్ల సంఘ అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్, వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, తదితరులు ఉన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
విశాఖ సిటీ : భారీగా లాభాలు వస్తాయని ఆశ చూపించి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రికెట్ బెట్టింగ్ విషయంలో పోలీసులు ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో మరికొంత మంది పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. సాంకేతికత సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఎక్స్చేంజ్ 666 అనే అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆ వెబ్సైట్ ద్వారా డబ్బు పెడితే అధిక లాభాలు వస్తాయని అమాయకులకు ఆశ చూపించి వారి జీవితాలను నాశనం చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. నిరంతరం బెట్టింగ్ ఆడడంతో పాటు ఇతరులకు కూడా ఈ బెట్టింగ్ విధానాన్ని వివరిస్తూ, తమ సొంత ఐడీ ద్వారా అనేక మందిని బెట్టింగ్లో పాల్గొనేలా చేస్తున్న నలుగురి ముఠాను గుర్తించారు. రాంబిల్లి మండలం లోవపాలెంకు చెందిన గనగళ్ల బంగార్రాజు(31) అచ్యుతాపురం మండలం దొప్పర్ల గ్రామానికి చెందిన కొరుప్రోలు పూర్ణ కిశోర్(29), పరవాడ మండలం ఫార్మా సిటీకి చెందిన మేడిశెట్టి రాజు(38), విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం భూపాలరాజపురానికి చెందిన గడిదేశి ఈశ్వరరావు(39)లను అరెస్టు చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. వీరి ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీల సమాచారాన్ని తెలుసుకున్నారు. వారిపై నిఘా పెట్టారు. -
నీటిని పరీక్షించే సదుపాయాలూ లేవు
మహారాణిపేట: ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని బలోపేతం చేసేందుకు శాసన సభాపక్ష ఫిర్యాదుల కమిటీ కృషి చేస్తుందని కమిటీ చైర్మన్, డిప్యూటీ స్పీకర్ ఆర్.రఘురామకృష్ణంరాజు అన్నారు. ఫుడ్ సేఫ్టీపై బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫుడ్ సేఫ్టీ విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా 500 మంది ఉద్యోగులు అవసరం కాగా.. ప్రస్తుతం కేవలం 25శాతం సిబ్బంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నాలుగు లేబొరేటరీలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని, నీరు, పాల ఉత్పత్తుల కల్తీని పరీక్షించే సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అధికారులను ఆదేశించారు. నవంబర్ మొదటి వారంలో మొట్టమొదటి రీజనల్ ఫుడ్ లేబొరేటరీ విశాఖపట్నంలో ప్రారంభం కానుందని వెల్లడించారు. ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో ప్రస్తుతం దేశంలో 29వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని వచ్చే ఏడాదికి కనీసం 15వ స్థానానికి, ఆపై టాప్ 5లోకి తీసుకురావాలని కమిటీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అర్హత కలిగిన గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందిని ఈ విభాగంలోకి తీసుకోవడం, ఖాళీల భర్తీని వేగవంతం చేయడంపై చర్చించినట్లు తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. హీమోఫీలియా చికిత్సను డే కేర్లోకి తీసుకురావడం, కేజీహెచ్లో వసతులు మెరుగుపరచడంపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రతి మూడు నెలలకోసారి పిటిషన్స్ కమిటీ సమావేశాలు విశాఖలోనే జరుగుతాయని ప్రకటించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తమ పరిధిలో చర్చించిన అంశాలను మీడియాకు వివరించారు. అనంతరం ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్రాజు, కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు -
ఉక్కిరిబిక్కిరి
ఉక్కులో కాంట్రాక్టు కార్మికులతాజాగా 500 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపు మొత్తంగా ఉపాధి కోల్పోయిన 5 వేల మందికిపైగా కాంట్రాక్టు కార్మికులు జిల్లా కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని ఉక్కు యాజమాన్యం కుటుంబాలతో రోడ్డున పడ్డామని కార్మికుల ఆవేదన కనీసం స్పందించని కూటమి ప్రభుత్వం గాజువాక : విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నిర్ధాక్షిణ్యంగా ఉక్కు యాజమాన్యం ఇంటికి పంపించేస్తోంది. తాజాగా తొలగించిన 500 మందితో సహా ఇప్పటివరకు సుమారు 5 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించింది. మరో 1200 మంది కాంట్రాక్టు కార్మికుల మెడలో కత్తి వేలాడుతూనే ఉంది. ఈ విషయంలో నిర్వాసితులకు మరింత అన్యాయం జరుగుతోంది. ఇంతమంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తున్నా కూటమి ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. ఇక్కడ కార్మికులు అవసరానికి మించి ఉన్నారంటూ సాక్ష్యాత్తూ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రచారం చేస్తుండటంతో యాజమాన్య చర్యలకు అడ్డులేకుండా పోయింది. నిర్వాసిత కార్మికులను తొలగించవద్దంటూ స్వయానా కలెక్టర్ హరేందిర ప్రసాద్ స్టీల్ప్లాంట్ యాజమాన్యాన్ని కోరారు. ఆయన విజ్ఞప్తిని యాజమాన్యం కనీసం పట్టించుకోలేనట్టు తెలుస్తోంది. కార్మికుల కొరత కార్మికులను ఎడాపెడా తొలగించడంతో చాలా విభాగాల్లో కార్మికుల కొరత ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆర్ఎంహెచ్పీ విభాగం పై భాగంలో గల కన్వేయర్ల నుంచి మెటీరియల్ కింద పడిపోతోంది. దీన్ని ఎప్పటికప్పుడు తొలగించకపోతే జామ్ అయిపోతుంది. అక్కడ కాంట్రాక్టు కార్మికులను తొలగించడంతో ఇటీవల జామ్ అయిన సంఘటనలు తలెత్తాయి. దీంతో వీఆర్ఎస్ పెట్టిన పర్మినెంట్ కార్మికులకు అక్కడ డ్యూటీ వేశారు. ఇదిలా ఉండగా, ప్లాంట్లో అత్యవసర విభాగాలు కొన్ని ఉన్నాయి. అక్కడ విధులకు కాంట్రాక్టు కార్మికులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. సాధారణంగా కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చే గేటు పాసులు మూడు, ఆరు నెలల వ్యాలిడిటీ కలిగి ఉంటాయి. ఇప్పుడు వైట్పాసులు ఇస్తున్నారు. వాటిని ఐదు రోజులు, పది రోజుల వ్యాలిడిటీ పొడిగిస్తున్నారు. దీంతో వారిని ఎప్పుడు తొలగిస్తారో తెలియని పరిస్థితి నెలకొందని కార్మికులు పేర్కొంటున్నారు. భారీగా తగ్గిన పర్మినెంట్ ఉద్యోగులు స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చాక పర్మినెంట్ ఉద్యోగులు కూడా భారీగా తగ్గిపోయారు. ప్లాంట్లో 12 వేల మందికి పైగా గల ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 9,800 మందికి పడిపోయింది. మొదటిసారి వీఆర్ఎస్ కింద 1,126 మందిని, తాజాగా అమలు చేసిన వీఆర్ఎస్ కింద మరో 464 మందిని పంపించేసింది. ఇదికాక గత ఏడాది కాలంలో 2,300 మంది పదవీ విరమణ పొందారు. రానున్న ఏడాది మరో 1,000 మంది పదవీ విరమణ పొందనున్నారు. ఇక్కడి పరిస్థితిని గమనించిన యువ కార్మికుల్లో సుమారు 300 మంది తమ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయినట్టు కార్మికులు చెబుతున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు చోటుచేసుకున్నప్పటికీ ప్రభుత్వం గాని, ప్రజాప్రతినిధులు గాని కనీసం పట్టించుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో 500 మంది చిరు కార్మికులు కూడా.. స్టీల్ప్లాంట్ యాజమాన్య చర్యలతో ప్లాంట్లో పని చేస్తున్న చిన్నా, చితకా కలిపి మరో 500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. స్టీల్ప్లాంట్లోని వివిధ విభాగాల్లో ఏర్పాటు చేసిన ప్రైవేట్ క్యాంటీన్లను యాజమాన్యం నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయా క్యాంటీన్లలో పనిచేస్తున్న కార్మికులు పని కోల్పోయారు. -
పశు సంవర్ధక శాఖ ఏడీ ప్రసాద్కు రైతునేస్తం అవార్డు
మహారాణిపేట: పద్మశ్రీ ఐవీ సుబ్బారావు రైతు నేస్తం పురస్కారానికి డాక్టర్ మాదిన ప్రసాదరావును ఎంపిక చేసినట్టు రైతు నేస్తం చైర్మన్ పద్మశ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పురస్కారాన్ని ఈ నెల 26న హైదరాబాద్లోని స్వర్ణభారత్ ట్రస్ట్లో రైతు నేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమంలో పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందిస్తారని పేర్కొన్నారు. ప్రసాదరావు విశాఖలో పశు సంవర్థక శాఖలో సహాయ సంచాలకునిగా పనిచేస్తున్నారు. పశు సంవర్ధక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రైతుల్లో అవగాహన పెంచేలా విశేష సేవలు అందించారు. 31 ఏళ్లుగా మూగ జీవాలకు సేవలు అందిస్తూనే రైతులకు, పశు వైద్య సిబ్బందికి ప్రయోగాత్మక శిక్షణ ఇచ్చేందుకు పలు లఘు చిత్రాలను, 300 పైగా వీడియోలను రూపొందించారు. మాదినకు రైతునేస్తం పురస్కారం ప్రకటించడం పట్ల రాష్ట్ర పశు సంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడు, అదనపు డైరెక్టర్ డాక్టర్ ఎండ సింహాచలం, విశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శంకరరావు, ఉప సంచాలకులు డాక్టర్ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. -
వియత్నాం టూరిజంతో ఏపీ ఒప్పందం
విశాఖ సిటీ : ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరం అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ వియత్నాంలోని డానాంగ్ టూరిజం అసోసియేషన్తో ఎంవోయూ చేసుకుంది. వియత్నాంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ టూరిజం ఫోరం అసోసియేషన్ అధ్యక్షుడు కె.విజయ్మోహన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆసియా దేశాల్లో 280 మిలియన్ల బౌద్ధులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న బౌద్ధ క్షేత్రాల సందర్శనకు వారిని రప్పించేందుకు ఇది ఒక ముందడుగు అని చెప్పారు. -
రెండు గంటల్లోనే 217 అంశాలపై చర్చ!
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘం సమావేశం తుఫాన్ వేగంతో ముగిసింది. మేయర్, స్థాయీ సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే 217 అజెండా అంశాలను చర్చించి.. అందులో 213 అంశాలకు ఆమోద ముద్ర వేయడం విమర్శలకు తావిస్తోంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం.. ఆలస్యంగా 11.50కి మొదలైంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా అజెండాలోని అంశాలన్నీ పూర్తి చేసి మమా అనిపించారు. అసలు 217 అంశాలున్న అజెండాను సభ్యులకు ఒక్క రోజు ముందు ఇస్తే.. వారు ఎప్పుడు చదివారు? అంశాలపై ఎంత పట్టు సాధించారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సమావేశం మొక్కుబడిగా సాగినా.. కొన్ని కీలక అంశాలపై మాత్రం వాడివేడిగా చర్చ జరిగింది. అయితే వాటికీ పూర్తిస్థాయి సమాధానాలు లభించలేదు. విధి విధానాలేవి? : స్థాయీ సంఘం విధి విధానా లు చెప్పమంటూ సభ్యురాలు సాడి పద్మారెడ్డి మూడో సారి అడిగినా అధికారుల నుంచి స్పందన కరువైంది. మేయర్ దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత కార్యదర్శి బి.వెంకటరమణ ‘ఈరోజే పంపిస్తా’నని బదులివ్వడం గమనార్హం. 8 జోన్లలో జీవీఎంసీ దుకా ణాలు, సముదాయాలు, సబ్–లీజుల వివరాలు, బకాయిలపై సభ్యులు ప్రశ్నించగా.. రెండు మూడు రోజుల్లో వివరాలివ్వాలని మేయర్ అధికారులను ఆదేశించారు. నగరంలో కుక్కలు, పందుల బెడదపై సభ్యులు ఆవేదన వ్యక్తం చేయగా..‘చర్యలు తీసుకుంటున్నాం’అనే రొటీన్ సమాధానమే అధికారుల నుంచి వచ్చింది. స్నేక్ క్యాచర్ను సస్పెండ్ చేయండి పాములు పట్టే రొక్కం కిరణ్ డబ్బులు వసూలు చేస్తున్నాడని ఓ సభ్యుడు ఫిర్యాదు చేయగా.. అలాంటప్పుడు అతనికి మనమెందుకు జీతం ఇవ్వాలని మేయర్ అన్నారు. వెంటనే అతన్ని సస్పెండ్ చేయా లని ఆదేశించారు. ఏ జోన్కు సంబంధించి ఆ జోన్లో స్నేక్ క్యాచర్లను నియమించాలని సూచించారు. డ్రమ్ములు ఏమయ్యాయి? సింహగిరి ప్రదక్షిణకు సంబంధించి జూలై 9, 10 తేదీల్లో 120 లీటర్ల కెపాసిటీ గల 300 వాటర్ డ్రమ్ములు.. ఒక్కో డ్రమ్ము రూ.1,200 చొప్పున రూ.3,60,000లతో కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ డ్రమ్ములు ఏమయ్యాయని సభ్యులు నిలదీయగా.. పూర్తి వివరాలివ్వాలని మేయర్ ఆదేశించారు. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా డ్రోన్ ఆపరేటర్కు గౌరవ వేతనం(గతేడాది అక్టోబర్ 7 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 6 వరకు) నెలకు రూ.25 వేలు చొప్పున చెల్లించే అంశంపై సభ్యురాలు సాడి పద్మారెడ్డి స్పందించారు. ఏడాదిగా జీతం ఇవ్వని డ్రోన్ ఆపరేటర్ అసలు ఉన్నాడా? లేడా? అని అధికారులను ప్రశ్నించారు. ఏడాది జీతం(నెలకు రూ.25వేలు) ఒకేసారి చెల్లించే ప్రతిపాదనపై ఆమె సందేహాలు లేవనెత్తారు. కేర్ టేకర్లకు జీతాల కట్ గాజువాక జోన్ 64వ వార్డు గంగవరంలో 11 సులభ్ కాంప్లెక్స్ల్లో పని చేస్తున్న 22 మంది కేర్ టేకర్లకు జీతభత్యాలు చెల్లించే విషయమై మేయర్ స్పందించారు. అక్కడ వారికి జీతాలిస్తే.. మిగిలిన 98 వార్డుల్లో ఉన్న సులభ్ కాంప్లెక్స్ కేర్టేకర్లందరికీ ఇవ్వాలి. ఇక నుంచి సులభ్ కాంప్లెక్స్ కేర్ టేకర్లకు జీతాలిచ్చేది లేదని మేయర్ స్పష్టం చేశారు. అదనపు కార్మికులపై అభ్యంతరం డిప్యూటీ మేయర్ వార్డు(64)కు అదనంగా 15 మంది పారిశుధ్య కార్మికుల నియామకంపై సభ్యులు అభ్యంతరం తెలిపారు. జీవీఎంసీ పరిధిలోని అన్ని వార్డులకు అదనపు సిబ్బంది అవసరం ఉందని.. ఆ ఒక్క వార్డులోనే 15 మందిని అదనంగా నియమిస్తే.. మా పరిస్థితి ఏంటని మేయర్ను ప్రశ్నించారు. మీరు కూడా కమిషనర్కు లేఖ పెట్టండి. కమిషనర్ ఓకే అంటే స్థాయీ సంఘం వద్దకు వస్తుందని మేయర్ బదులిస్తూనే.. వారిని 15 రోజులు వేరే జోన్లో పనిచేయించి, పని తీరు చూశాక నిర్ణయిద్దామన్నారు. జోన్–8లో ఏరియా సిల్ట్, చెట్ల కొమ్మలు తొలగించేందుకు కనకమహాలక్ష్మి టిప్పర్ ట్రాన్స్పోర్టుకు ఒక పొక్లెయిన్కు రోజుకి 8 గంటలు చొప్పున, గంటకు రూ.1,400 చెల్లించే విషయంపై మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జీవీఎంసీకి వాహనాలు ఉండగా, అదనంగా ప్రైవేట్ వాహనాలు ఎందుకు పెడతున్నారని అధికారులను ప్రశ్నించారు. దీనిపై పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు. మొత్తంగా 217 అంశాల్లో 4 వాయిదా వేసి.. 213 అంశాలకు స్థాయీ సంఘం ఆమోదం తెలిపింది. కేవలం 130 నిమిషాల్లో 217 అంశాలను చదివి.. 213 అంశాలను చర్చించి ఎలా ఆమోదించారన్నది ఆశ్చర్యం కలిగిస్తోంది. -
మరో 1,200 మంది తొలగింపునకు చర్యలు?
స్టీల్ప్లాంట్లోని వివిధ విభాగాల్లో 13,500 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేసేవారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ముందుకు రావడంతో దఫదఫాలుగా తొలగిస్తున్నారు. ఉక్కులో మొదటిసారి 1,503 మందిని తొలగించిన యాజమాన్యం రెండోసారి 1,600 మందిని తొలగించింది. అప్పుడప్పుడు పది మంది.. ఇరవై మంది చొప్పున సుమారు 550 మందిని ఇంటికి పంపించేసింది. తాజాగా దీపావళి రోజు మరో 500 మందిని తొలగించింది. ఈ తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని వార్తలొస్తున్నాయి. త్వరలోనే మరో 1,200 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తారని తెలుస్తోంది. వీరుగాక టెండర్లు పూర్తవడంతో సుమారు వెయ్యి మంది కాంట్రాక్టు కార్మికులు పనికోల్పోయారు. టెండరు పూర్తయిన కాంట్రాక్టర్కు రీ టెండర్ ఇవ్వకపోవడంతో వారి వద్ద పనిచేస్తున్న కార్మికులకు పని దొరకని పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఇప్పటివరకు సుమారు 5 వేల మంది కాంట్రాక్టర్ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. -
నిర్వాసితులకు తీరని వేదన
స్టీల్ప్లాంట్లో చోటుచేసుకున్న ప్రస్తుత పరిస్థితులు నిర్వాసితులకు తీరని వేదనను మిగిల్చాయి. ప్లాంట్ నిర్మాణం కోసం తమ భూములు, ఇళ్లు ఇచ్చినవారిని ఇప్పుడు నిర్వాసితులు కాదనే కొత్తవాదనను స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ముందుకు తెచ్చారు. కేవలం ఆర్ కార్డు ఉన్నవారు మాత్రమే నిర్వాసితులని, వారి వారసులు నిర్వాసితులు కాదని పేర్కొనడంతో నిర్వాసితులను పని నుంచి తొలగించడం సులువైపోయిందని కంపెనీవర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం ఎంప్లాయిమెంట్ ద్వారా విధుల్లో చేరిన 250 మందిని మాత్రమే నిర్వాసితులుగా పరిగణించి మిగిలిన వారిని విధుల నుంచి తొలగించారని కార్మికులు చెబుతున్నారు. -
అష్ఫాకుల్లా ఖాన్ను విస్మరించడం దురదృష్టకరం
సీతంపేట: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవడం దురదృష్టకరమని ఆలిండియా బహుజన సమాజ్ పార్టీ(ఏఐబీఎస్పీ) జాతీయ సమన్వయకర్త, విశ్రాంత డీజీపీ జె.పూర్ణచంద్రరావు అన్నారు. విశాఖ ముస్లిమ్స్ కల్చరల్ అండ్ లిటరరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో బుధవారం షహీద్ అష్ఫాకుల్లా ఖాన్ 125వ జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకోరి రైలు దాడిలో పాల్గొన్నందుకు అష్ఫాకుల్లా ఖాన్ను బ్రిటిష్ ప్రభుత్వం 1927 డిసెంబరు 19న ఉరి తీసిందని గుర్తుచేశారు. ఆ సమయానికి ఆయన వయసు కేవలం 27 ఏళ్లు మాత్రమే అన్నారు. భగత్సింగ్, చంద్రశేఖర ఆజాద్ లాగే దేశం కోసం పోరాటం చేసిన అష్ఫాకుల్లా ఖాన్ గురించి పెద్దగా తెలియక పోవడం మత వివక్షే కారణమన్నారు. డిసెంబరు 19న అష్ఫాకుల్లా ఖాన్ వర్ధంతిని ప్రభుత్వ తరపున నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముస్లిం ఎమ్మెల్యేలు ముగ్గురే ఉన్నారని, మన రాష్ట్రం కంటే తక్కువ ముస్లిం జనాభా ఉన్న తమిళనాడులో 9 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. ఏఐబీఎస్పీ ముస్లిం హక్కుల కోసం పోరాటం చేస్తుందన్నారు. ముందుగా అష్ఫాకుల్లా ఖాన్ చిత్రపటానికి నివాళులర్పించారు. విశ్రాంత సీఐ ఎలియాజ్ అహమ్మద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీపీఐ నాయకులు క్షేత్రపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు, కార్పొరేటర్ బర్కత్ ఆలీ, ప్రొఫెసర్ ఇక్బాల్, డాక్టర్ ఖాజా, తులసీదాస్, ఫసుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు. ఆయన వర్ధంతిని ప్రభుత్వమే నిర్వహించాలి: విశ్రాంత డీజీపీ -
తాత్కాలిక వసతులకే రూ.36 లక్షలా?
డాబాగార్డెన్స్: విశాఖ ప్రపంచ యోగా దినోత్సవం జరిగి నాలుగు నెలలు గడిచిపోయినా.. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఖర్చుల బిల్లులు ఇప్పుడు ఆమోదం కోసం రావడం చర్చనీయాంశమైంది. ‘అయిపోయిన పెళ్లికి మేళాలు’ అన్నట్లుగా.. జీవీఎంసీ అధికారులు కార్యక్రమం ముగిసిన నెలల తర్వాత తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి ఏర్పాట్లకు అయిన ఖర్చుల ఆమోదం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సుమారు 3 నుంచి 4 లక్షల మంది హాజరవుతారని అంచనా వేసి, జీవీఎంసీ తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, వీధిలైట్లు వంటి కనీస సదుపాయాలను కల్పించింది. ఈఈ–2 డివిజన్ పరిధిలోని జోన్–3, 4, 5లలో ఏర్పాటు చేసిన వసతి కేంద్రాలకు 20 లీటర్ల నీటి బబుల్స్, వాటర్ బాటిళ్లు, పేపర్ గ్లాసుల ద్వారా తాగు నీటిని సరఫరా చేశారు. తాత్కాలిక మరుగుదొడ్లకు పీవీసీ ఫిట్టింగులతో అవుట్లెట్లు ఏర్పాటు చేయడం, తాగునీటి కోసం డ్రమ్ములు, బకెట్లు, జగ్గులు సమకూర్చడం వంటి పనులను జీవీఎంసీ అధికారులు నామినేషన్ పద్ధతిలో ఐదుగురు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ పనుల కోసం నవీన్ ఎంటర్ప్రైజెస్కు రూ.13.85లక్షలు, రామిశెట్టి సురేష్కు రూ.12లక్షలు, ఎల్జేఆర్వీ కోటేశ్వరరావుకు రూ.4.89 లక్షలు, జి.అప్పన్నకు రూ.3.60 లక్షలు, టి.వీరారెడ్డికి రూ.1.70 లక్షలు కలిపి సుమారు రూ. 36 లక్షలు ఖర్చు చేసినట్లు చూపుతున్నారు. కేవలం తాత్కాలిక మరుగుదొడ్లు, నీటి డ్రమ్ముల వంటి పనులకు రూ.36 లక్షలకు పైగా ఖర్చు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం జరగనున్న జీవీఎంసీ స్థాయీ సంఘం సమావేశంలో ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్నారు. నాలుగు నెలల ఆలస్యంగా వస్తున్న ఈ బిల్లులపై సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.! నాలుగు నెలల తర్వాత యోగా డే ఖర్చులపై నేడు చర్చ -
డీఆర్వో, ఆర్డీవోల బదిలీ
మహారాణిపేట : విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) బి.హెచ్.భవానీశంకర్, విశాఖ డివిజనల్ రెవెన్యూ అధికారి(ఆర్డీవో) పి.శ్రీలేఖకు బదిలీ అయింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇద్దరికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జేఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. బాధ్యతల స్వీకరణ : ఇన్చార్జి డీఆర్వోగా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ఇన్చార్జి విశాఖ ఆర్డీవోగా హెచ్పీసీఎల్ భూసేకరణ అధికారి, డిప్యూటీ కలెక్టర్ ఎస్.సుధాసాగర్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కలకలం సృష్టించిన శ్రీలేఖ రెవెన్యూ శాఖలో వ్యవహారాలపై విశాఖ ఆర్డీవో శ్రీలేఖ రాసిన లేఖ కలెక్టరేట్లో కలకలం సృష్టించింది. జిల్లా రెవెన్యూ అధికారిపై పలు అవినీతి ఆరోపణలు చేయడం రెవెన్యూ శాఖను కుదిపేసింది. తహసీల్దార్ల నుంచి నెలవారి మామూళ్లు, సరకులు తీసుకుంటున్నట్టు ఆమె నేరుగా డీఆర్వోపై కలెక్టర్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ విషయంపై వాడిగా వేడిగా చర్చ సాగింది. ఇద్దరిపై బదిలీ వేటు పడడంతో ఈ వ్యవహారం ఇక్కడే సద్దుమణిగింది. -
టపాసుల మోత.. కాలుష్యం పడగ
విశాఖ సిటీ : విశాఖలో దీపావళి పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. టపాసుల మోత మోగింది. తారాజువ్వలు, రంగు రంగుల షాట్స్ వెలుగుల నడుమ మహానగరం మురిసిపోయింది. సుమారు రూ.30 కోట్ల బాణసంచా వ్యాపారం జరిగింది. భారీ ఎత్తున కాల్చిన మందుగుండు సామగ్రి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపగా.. వాటి నుంచి వెలువడిన కాలుష్యం నగరాన్ని కమ్మేసింది. కాలుష్య మేఘాలు ఊపిరి సలపనివ్వకుండా చేసేశాయి. కేవలం గంటల వ్యవధిలోనే కాలుష్య కారకాలైన సల్ఫర్ డయాకై ్సడ్, నైట్రోజన్, ఆకై ్సడ్లు గాలిలో కలిసిపోయి రెట్టింపు స్థాయికి కాలుష్యం పెరిగిపోయింది. సాయంత్రం కేవలం ఆరు గంటల వ్యవధిలోనే గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) రెండు రెట్లు అధికంగా నమోదైంది. ఒకపక్క వాయు కాలుష్యం, మరోపక్క శబ్ద కాలుష్యంతో విశాఖ వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సాధారణంగా పార్టికులెట్ మేటర్– పీఎం 10, పీఎం 2.5 కారకాలు ఎక్కువగా నమోదు కావడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆందోళనకరంగా గాలి నాణ్యత దీపావళి వేళ కాల్చిన టపాసులు గాలిని తీవ్రంగా కలుషితం చేశాయి. గాలి కాలుష్య రేణువులు క్యూబిక్ మీటరుకు 60 మైక్రో గ్రాములు మించితే ప్రమాదం. కానీ పీఎం 2.5 రేణువులు సాయంత్రం 7 గంటలకు 68గా ఉండగా.. రాత్రి 11 తర్వాత నుంచి 12 వరకు ఏకంగా 500 మైక్రోగ్రాములుగా, పీఎం 10 రేణువులు 67 నుంచి 464 మైక్రోగ్రాములుగా నమోదయ్యాయి. గతేడాది దీపావళిలో కూడా ఇదే స్థాయిలో పీక్ అవర్ గణాంకాలు నమోదైనట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత నుంచి మళ్లీ కాలుష్యం తగ్గడం ప్రారంభమైంది. ఈ తరహా వాయు, శబ్ద కాలుష్యం కారణంగా కేవలం మనుషులకే కాదు.. పక్షులు, జంతువులపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. టపాసులు కాల్చడం వల్ల వెలువడే అధిక కాంతి, శబ్దాల కారణంగా పక్షులు సురక్షిత ప్రాంతానికి తమ ఆవాసాల నుంచి భయంతో వెళ్లిపోతాయి. ఇవి తిరిగి వెనక్కి రావు. జీవ వైవిధ్యానికి ఇది చేటు కలిగిస్తుంది. వాయు కాలుష్యం ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపుతోంది. ఊపరితిత్తుల ఇన్ఫెక్షన్, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. చిన్నారుల్లో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దుమ్ము, ధూళి, రసాయన అవశేషాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. ఏక్యూఐ 45 నుంచి 141కి పెరుగుదల దీపావళి రోజు సాయంత్రం టాపాసుల మోతతో తీవ్ర స్థాయిలో కాలుష్యం పెరిగిపోయింది. సాయంత్రం 6 గంటలకు ఏక్యూఐ 45 ఉండగా.. అర్ధరాత్రి 12 గంటలకు 141కి చేరుకుంది. సాధారణంగా ఎయిర్క్వాలిటీ ఇండెక్స్ 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తిగా, అదే ఏక్యూఐ 101 నుంచి 200 అయితే మోడరేట్గా, అంతకు మించి 201 నుంచి 300 అయితే పూర్, 301 నుంచి 400 వరకు అయితే వెరీ పూర్, 401 నుంచి 500 అయితే తీవ్ర ఆందోళనకర పరిస్థితిగా పేర్కొంటారు. అయితే విశాఖలో మాత్రం ప్రతి గంటకు గాలి నాణ్యత సూచీ పెరుగుతూ పోయింది. సాయంత్రం 6 గంటలకు ఏక్యూఐ 45 ఉండగా.. 7 గంటలకు 47, 8కి 55, 9కి 78, 10కి 105, 11కి 125, అర్ధరాత్రి 12 గంటలకు అత్యధికంగా 141కి చేరుకుంది. -
గూగుల్ వార్
కూటమిలోనేవిశాఖ సిటీ: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1.8 లక్షల ఉద్యోగాలు రావా? జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయా? ఈ డేటా సెంటర్ ఏర్పాటులో అనేక సవాళ్లు ఉన్నాయా? భవిష్యత్తులో విద్యుత్, నీటి సమస్య ఉత్పన్నమవుతుందా? ఇప్పటి వరకు ఐటీ, పర్యావరణ నిపుణులు సందేహాలు లెవనెత్తగా.. తాజాగా ఏపీ బీజేపీ పెద్దలు సైతం వీరితో గొంతు కలపడం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. దీంతో కూటమిలో ‘గూగుల్’ వార్ మొదలైంది. టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం అగ్గిరాజేస్తోంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ను టీడీపీ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. కూటమి భాగస్వామ్య పార్టీ బీజేపీ దానికి చెక్పెట్టే పనిలో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది. ఈ డేటా సెంటర్ ఘనతను కొట్టేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు చూస్తుంటే.. బీజేపీ ముఖ్య నేతలు తండ్రీ, కొడుకుల గాలి తీసేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుందని చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఊదరగొడుతుంటే.. ఏపీ బీజేపీ చీఫ్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు వారి బండారాన్ని బట్టబయలు చేశారు. ఈ గూగుల్ డేటా సెంటర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్, విశాఖ ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు చేసిన కీలక వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఒకవైపు గూగుల్పై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శిస్తూనే.. మరోవైపు చంద్రబాబు, లోకేష్ చెప్పినవన్నీ అబద్ధాలే అని కొట్టిపారేసేలా మాట్లాడడం ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అన్నీ అవాస్తవాలే.. విశాఖలో గూగుల్ డేటా సెంటర్పై వాస్తవాలను దాచి.. 1.8 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయని కల్లబొల్లి మాటలు చెబుతోందని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలతో పాటు ఐటీ నిపుణులు సైతం కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ డేటా సెంటర్ కోసం మూడు ప్రాంతాల్లో 480 ఎకరాలను కేటాయించనుంది. ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో 200 ఎకరాలు, అడవివరం ప్రాంతంలో 120 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 160 ఎకరాల కేటాయింపులకు భూములను సిద్ధం చేస్తోంది. అలాగే రూ.22 వేల కోట్ల రాయితీలను ప్రకటించేయడం పట్ల అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంద. అయితే నిర్ధిష్టమైన ప్రణాళికలు లేకుండా డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్తులో విశాఖతో పాటు రాష్ట్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐటీ, పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అనేక సందేహాలను లేవనెత్తుతున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు వైఎస్సార్ సీపీ నేతలు సైతం గూగుల్ డేటా సెంటర్ ద్వారా డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తేనే ఉద్యోగాలు వస్తాయని, ఆ దిశగా సదరు కంపెనీపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ సందేహాలకు, వైఎస్సార్ సీపీ నేతల సూచనలపై ఇప్పటి వరకు నోరుమెదపడం లేదు. ఏపీ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు గూగుల్ డేటా సెంటర్పై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటులో అనేక సవాళ్లు ఉన్నాయని మీడియా సమావేశంలోనే స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ అతి పెద్ద సమస్యగా పరిణమించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డేటా సెంటర్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పలేమని తేల్చి చెప్పారు. డేటా సెంటర్ ఏర్పాటులో అదాని కూడా భాగస్వామి అని చెప్పుకొచ్చారు. ఈ సెంటర్ హీట్ను ప్రొడ్యూస్ చేస్తుందని, విద్యుత్ వినియోగం విపరీతంగా ఉంటుందని అంగీకరించారు. గాలి, భూ కాలుష్యాన్ని అధిగమించాల్సి ఉంటుందన్నారు. అతడితో పాటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు కూడా గూగుల్ డేటా సెంటర్లో ఉద్యోగాలపై అసలు వాస్తవాలను వెల్లగక్కారు. డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదని, దీని ద్వారా 1.8 లక్షల ఉద్యోగాలు వస్తాయనడం కరెక్ట్ కాదని తేల్చి చెప్పారు. వీరి వ్యాఖ్యలతో చంద్రబాబు ప్రభుత్వం ఇరుకునపడింది. ఇప్పటి వరకు లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు, లోకేష్లు చేస్తున్న ప్రచారాలను బీజేపీ పెద్దలే తిప్పికొట్టినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ చీఫ్, ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు ఇప్పటి వరకు టీడీపీ పెద్దలు కౌంటర్ చేయలేకపోతున్నారు. కూటమి పార్టీల నేతలు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తుండడం రాజకీయంగా దుమారం రేపుతోంది. టీడీపీ, బీజేపీ పరస్పర విరుద్ధ ప్రకటనలు డేటా సెంటర్పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు ఇందులో అనేక సవాళ్లు ఉన్నాయని అంగీకారం పర్యావరణ పరిరక్షణ అతి పెద్ద సమస్య అని వెల్లడి 1.8 లక్షల ఉద్యోగాలు వస్తాయనడం కరెక్ట్ కాదన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు బీజేపీ నేతల వ్యాఖ్యలతో ఇరకాటంలో ప్రభుత్వం -
కూటమి పాలన వైఫల్యాలపై గళమెత్తాలి
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై గళమెత్తాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా యువజన విభాగం పోరాడాలని, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఎండాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అదీప్రాజ్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర యువజన విభాగం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి యువజన విభాగం ఉత్తరాంధ్ర జోనల్ ఇన్చార్జి అంబటి శైలేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, ఉత్తరాంధ్ర జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు హాజరయ్యారు. తొలుత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదీప్రాజ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. రానున్న రోజుల్లో గ్రామ, మండల యువజన విభాగం కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి, పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని.. వారి సూచనలు, సలహాల మేరకు యువజన విభాగ కమిటీలను వేగంగా పూర్తిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాడుదాం.. అంబటి శైలేష్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మండల, గ్రామ, వార్డు స్థాయిలో యువజన విభాగ కమిటీలను నవంబర్ 20 లోపు పూర్తి చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలే లక్ష్యంగా మీ పరిధిలో సమస్యలు, ప్రజా సమస్యలపై పోరాడి.. వాటిని ప్రభుత్వం పరిష్కరించే వరకూ శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగించాలని తెలిపారు. రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని, ప్రధానంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, యువతకు ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేసిందని ఆరోపించారు. వీటిపై పోరాటం చేయడంలో యువజన విభాగం ఎప్పుడూ ముందుండాలని సూచించారు. విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, కార్పొరేటర్ ఉరుకూటి చందు మాట్లాడుతూ.. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి అనుబంధ కమిటీల్లో అత్యంత ప్రధానమైనది యువజన విభాగం.. అలాంటి విభాగంలో ఉన్న మనమందరం పార్టీ బలోపేతంలో ముఖ్య భూమిక పోషించాలన్నారు. మన రాజకీయ భవిష్యత్తులో ముందుకు దూసుకెళ్లడానికి ప్రధాన మార్గం కూడా ఇదే అవుతుందని, పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొని విజయవంతం చేసే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పుల్లేటి వెంకటేష్(అనకాపల్లి), శరత్బాబు(పార్వతీపురం), పృథ్వీరాజ్(శ్రీకాకుళం), అల్లు అవినాష్(విజయనగరం), గాబడి శేఖర్(అల్లూరి), రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి, కార్పొరేటర్ ఇమ్రాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాలిశెట్టి సురేష్ రాజ్, దొడ్డి కిరణ్, కార్యదర్శులు చింతకాయల వరుణ్, జగుపిల్ల నరేష్, కనకాల ఈశ్వర్ రావు, సత్యం నాయుడు, శివాజీ, వివిధ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
భాగస్వామ్య సదస్సుకు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట: విశాఖలో వచ్చే 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో జేసీ కె. మయూర్ అశోక్, సీఐఐ ప్రతినిధులు, ఇతర జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. ఎక్కడా లోపాలు తలెత్తకుండా సీఐఐ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని, నవంబర్ 13 సాయంత్రం నుంచే కార్యకలాపాలు మొదలవుతాయి కాబట్టి అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాలన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని వెంటనే స్వాధీనం చేసుకొని, లెవెలింగ్, చిన్న రాళ్లను తొలగించి, బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలన్నారు. ఆకర్షణీయంగా ఉండేలా పెయింటింగులు వేయించాలన్నారు. వీఐపీలు, అతిథుల కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు, పక్కాగా ఎంట్రీ.. ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు, మొబైల్ టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బుధవారం నుంచే ఏయూ మైదానంలో అంబులెన్స్, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు తప్పకుండా పాటించి, తనిఖీలు పూర్తిచేయాలని అగ్నిమాపక శాఖ అధికారికి సూచించారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే అతిథులకు సరిపడా హోటల్ రూమ్లను, హోం స్టేలను ముందుగానే బుకింగ్ చేసుకోవాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే, విద్యుత్ సరఫరా, బీఎస్ఎన్ఎల్, ఇతర నెట్వర్క్ల ద్వారా కనెక్టివిటీ కల్పించాలని సూచించారు. సదస్సు విజయవంతం కావడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. -
షాడో ఫ్యాక్స్ కంపెనీలో కార్మికుడి మృతి
గాజువాక : స్థానిక ఆటోనగర్లోని షాడో ఫ్యాక్స్ టెక్నాలజీ షిప్మెంట్ డెలివరీ కంపెనీలో పనిచేస్తున్న ఎల్లబిల్లి ఆకాష్ షిప్మెంట్ బెల్టు వద్ద జారిపడి మృతి చెందాడు. బెల్టువద్ద జారిపడ్డ ఆకాష్ను సహచర సిబ్బంది స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించినట్టు పోలీసులు తెలిపారు. గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ కంపెనీ షిప్మెంట్ బెల్టువద్ద ఎలక్ట్రికల్ షాక్ తగులుతుందని కార్మికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకాష్కు ఎలక్ట్రికల్ షాక్ తగిలిందా, గుండెపోటుకు గురయ్యాడా అనే విషయాన్ని పోస్టుమార్టం నివేదిక తరువాత తెలుస్తుందని సీఐ పార్థసారధి తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ కంపెనీలో చిన్నపిల్లలు కూడా పని చేస్తున్నారని కార్మికులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
తమ్ముడిని రాడ్తో కొట్టి చంపిన అన్న
పెదగంట్యాడ: మండలంలోని వికాస్నగర్లో అన్న చేతిలో తమ్ముడు దారుణంగా హత్యకు గురయ్యాడు. బైక్ వేగంగా నడపడంపై జరిగిన గొడవ ఈ హత్యకు దారి తీసింది. న్యూ పోర్ట్ పోలీసులు తెలిపిన వివరాలివి. వికాస్నగర్ నివాసి అయిన కరణం తిరుపతిరావుకు నాగరాజు, గోవింద్, శేఖర్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరికి ఇంకా వివాహం కాలేదు. వీరిలో పెద్ద కుమారుడు నాగరాజు నేవల్ డాక్యార్డ్లో షిప్ బిల్డింగ్లో ఫిట్టర్గా పనిచేస్తుండగా, మూడో కుమారుడు శేఖర్ బైక్ మెకానిక్ షెడ్ను నిర్వహిస్తున్నాడు. ఇటీవల శేఖర్ బైక్ను వేగంగా నడుపుతున్నాడని నాగరాజుకు ఒక స్నేహితుడు చెప్పాడు. దీంతో ఆగ్రహించిన నాగరాజు.. శేఖర్కు ఫోన్ చేసి మందలించాడు. కాగా.. దీపావళి సందర్భంగా టపాసులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన నాగరాజుకు శేఖర్ ఫోన్ చేసి దుర్భాషలాడాడు. అనంతరం శేఖర్ నిర్వహిస్తున్న మెకానిక్ షెడ్డు వద్దకు నాగరాజు వచ్చి మళ్లీ తమ్ముడిని మందలించే ప్రయత్నం చేయగా.. శేఖర్ ఎదురు తిరిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి ఒకరినొకరు తోసుకునే వరకు వచ్చింది. అక్కడ ఉన్న శేఖర్ స్నేహితుడు వారిని వారించేందుకు ప్రయత్నించినా గొడవ ఆగలేదు. ఈ క్రమంలో మెకానిక్ షెడ్డులో ఉన్న ఒక రాడ్తో నాగరాజు తమ్ముడు శేఖర్ తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన శేఖర్ను వెంటనే అగనంపూడి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన తరువాత మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతూ శేఖర్ మంగళవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి తిరుపతిరావు ఫిర్యాదు మేరకు న్యూ పోర్ట్ సీఐ కామేశ్వరరావు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లభించని గల్లంతైన యువకుల ఆచూకీ
పెదగంట్యాడ: యారాడ తీరంలో గల్లంతైన ఇద్దరు యువకుల ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది స్నేహితులు ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో సరదాగా గడిపేందుకు యారాడ తీరానికి వచ్చారు. సముద్రంలో దిగిన వారిలో బొత్స పవన్ కుమార్, పగడాల గణేష్ అలల ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. వారి జాడ కోసం మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం కనిపించలేదు. మంగళవారం కోస్ట్ గార్డ్స్ సిబ్బంది, న్యూ పోర్ట్ సీఐ కామేశ్వరరావు గాలింపు బోటుతో, ఎస్ఐ శ్యామ్ సుందర్ డ్రోన్ల సాయంతో తీరం వెంబడి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. -
‘రియల్ హీరోస్కి మా వందనం’ బుక్లెట్ల ఆవిష్కరణ
విశాఖ సిటీ: పోలీస్ అమరవీరులకు నివాళిగా ‘రియల్ హీరోస్కి మా వందనం’ పేరుతో రచించిన శౌర్యం, స్మృతి తెలుగు, ఆంగ్ల బుక్లెట్లను పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తన చాంబర్లో మంగళవారం ఆవిష్కరించారు. అమరులైన పోలీసుల ధైర్య సాహసాలు, త్యాగాలు అనితర సాధ్యమైనవని పేర్కొన్నారు. యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తూ అనేక స్వచ్ఛంద, సామాజిక సేవా చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న యూనివర్సల్ యూత్ వాకర్స్ బృందాన్ని, వాకర్స్ ఇంటర్నేషనల్ యూత్ చైర్పర్సన్ వంశీ చింతలపాటిని అభినందించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు ఈ శౌర్యం, స్మృతి బుక్లెట్లను అంకితం చేస్తున్నట్లు చైర్పర్సన్ వంశీ చెప్పారు. ఈ బుక్లెట్లను ద్రోణ కన్సల్టీ అధినేత సురేష్ బేత రచించారని యూత్ సమన్వయకర్త లికిత్బేత తెలిపారు. కార్యక్రమంలో యూత్ వాకర్స్ కార్యదర్శి పి.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
దీపావళిలో అపశ్రుతి
మహారాణిపేట/మద్దిలపాలెం: దీపావళి సంబరాల్లో అపశ్రుతి చోటుచేసుకున్నాయి. జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతో సహా మొత్తం 18 మంది గాయపడ్డారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి పర్యవేక్షణలో, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మోహనరావు గాయపడ్డవారికి చికిత్స చేశారు. తీవ్రంగా గాయపడ్డిన వారి పరిస్థితి నిలకడగా ఉందని, వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని డాక్టర్ మోహనరావు తెలిపారు. వివరాలివి. నగరంలో నివసిస్తున్న విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన ఎం. శ్రీనివాసరావు (14) చేతిలో మతాబులు పేలడం వల్ల చేతి వేళ్లు తెగి పడిపొయాయి. శ్రీకాకుళం జిల్లా గార మండలం రాళ్లపల్లికి చెందిన ఇంజిరాపు సూర్యనారాయణ (64) 37 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు. క్రాకర్ పేలుడు కారణంగా 14 ఏళ్ల బాలుడు పి. బాలచంద్రరావు చేతికి గాయమైంది. అలాగే సోమవారం అర్ధరాత్రి ఏయూ విద్యార్థులు జానకీరాం(ఆంత్రోపాలజీ), సాయికృష్ణ, హరిక్రిష్ణ (పాలిటిక్స్ అండ్ అడ్మిస్ట్రేషన్) టపాసులు కాల్చేందుకు బీచ్రోడ్కు వెళ్లారు. రాత్రి 12 గంటల సమయంలో బీచ్రోడ్లోని కోకోనాట్ ప్లాంట్ వద్ద టపాసులు కాలుస్తుండగా.. చేతిలో ఉన్న టపాసులకు నిప్పు రవ్వలు తగలడంతో అవి ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ఘటనలో జానకీరాంకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి అదుపులో ఉంది. సాయికృష్ణ, హరికృష్ణలకు ముఖం, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన కేజీహెచ్కు తరలించారు. ఏయూ అధికారులు మంగళవారం కేజీహెచ్కు వెళ్లి విద్యార్థుల పరిస్థితిని, అందుతున్న వైద్యాన్ని అడిగి తెలుసుకున్నారు. స్వల్పంగా గాయపడ్డ వారికి ప్రాథమిక చికిత్స అందించి డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్ మోహనరావు తెలిపారు. -
ఆరిపోయిన ఆశల దీపాలు
గాజువాక/కూర్మన్నపాలెం: దీపావళి రోజున విషాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి పాత గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ఉపాధి కోసం వలస వచ్చిన రెండు నిరుపేద కుటుంబాల ఆశలను ఛిద్రం చేసింది. వారి ఇళ్లలో చీకట్లను నింపింది. కుటుంబానికి ఆసరా అవుతారనుకున్న కుమారులు.. వారిని శోకసంద్రంలో ముంచి.. అనంత వాయువుల్లో కలిసిపోయారు. ఇదే ఘటనలో మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి.. కూర్మన్నపాలెం ప్రాంతంలో నివాసం ఉంటున్న మారేడుపల్లి అజయ్ కుమార్ (18), వెందుర్తి మనోజ్ కుమార్ (17), కె.మధు(17) ముగ్గురూ స్నేహితులు. సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంపై నగరంలోని ఆర్కే బీచ్కు వెళ్లేందుకు బయలుదేరారు. అజయ్ బైక్ నడుపుతుండగా, మనోజ్, మధు వెనుక కూర్చున్నారు. సరిగ్గా పాతగాజువాక జంక్షన్కు వచ్చేసరికి వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ముగ్గురూ తుళ్లిపోయి రోడ్డుపై పడిపోయారు. ఇది గమనించిన సమీపంలోని ఆటో డ్రైవర్లు వెంటనే స్పందించి, వారిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అజయ్ కుమార్, మనోజ్ కుమార్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన మధును మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించిన గాజువాక ట్రాఫిక్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నూకరాజు సేవలు చిరస్మరణీయం
మహారాణిపేట: కొయ్యూరు మండలం జెడ్పీటీసీ వారా నూకరాజు అత్యంత సౌమ్యుడు, నిగర్వి, నిబద్ధత కలిగిన ప్రజా సేవకుడని జిల్లా పరిషత్ ముఖ్య కార్వనిర్వహణాధికారి(సీఈవో) పి.నారాయణమూర్తి కొనియాడారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వారా నూకరాజు సంతాప సభ నిర్వహించారు. తొలుత నూకరాజు చిత్రపటానికి సీఈవో పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఈవో నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నూకరాజు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. డిప్యూటీ సీఈవో కె.రాజ్కుమార్ మాట్లాడుతూ నూకరాజు మరణం జిల్లా ప్రజా పరిషత్కు తీరని లోటు అన్నారు. నూకరాజు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ అధికారులు, పరిపాలనాధికారులు, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్. సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈవో నారాయణమూర్తి -
సిరోభూషణం సుజాతకు అరుదైన అవకాశం
విశాఖ సిటీ : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐఎల్)లో సీనియర్ మహిళా ఉద్యోగిగా ఉన్న సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ సిరోభూషణం సుజాతకు అరుదైన అవకాశం లభించింది. కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ వద్ద డీసీఐఎల్ డ్రెడ్జ్ గోదావరి నౌకను ప్రారంభించే గౌరవం దక్కింది. ఈ కార్యక్రమంలో విశాఖ పోర్టు, డీసీఐఎల్ చైర్మన్ ఎం.అంగముత్తుతోపాటు సుజాత పాల్గొన్నారు. ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు, సీనియర్ ఉద్యోగుల సేవలను గౌరవించేందుకు సుజాతకు ఈ అవకాశం కల్పించారు. దీంతో ఆమె చైర్మన్, ఇతర సీనియర్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. -
వలస కుటుంబాల్లో తీరని వేదన
ఈ ప్రమాదం ఉపాధి కోసం సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వలస వచ్చిన రెండు నిరుపేద కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. మృతుడు అజయ్ కుమార్ స్వస్థలం చీడికాడ మండలం వరహాపురం గ్రామం. అతని తండ్రి అర్జున్ ఇటీవల కుటుంబాన్ని వదిలి వెళ్లిపోవడంతో, తల్లి లోవలక్ష్మితో కలిసి 87వ వార్డు కాశీపాలెంలో ఒక అపార్ట్మెంట్లో వాచ్మన్గా పని చేస్తున్నాడు. తల్లి కష్టాన్ని చూసిన అజయ్ ఐటీఐ చదువుతూనే, మరోవైపు కోళ్ల వ్యానులో పనిచేస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నాడు. తన చెల్లి ఐశ్వర్యను ఇంటర్ చదివిస్తున్నాడు. కొడుకు ప్రయోజకుడై తమ కష్టాలు తీరుస్తాడనుకున్న ఆ తల్లికి.. అజయ్ మరణం తీరని పుత్రశోకాన్ని మిగిల్చింది. మరో మృతుడు వెందుర్తి మనోజ్ కుమార్ కుటుంబానిది కూడా ఇలాంటి దీన గాథే. ఏడేళ్ల కిందట విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బోనంగి నుంచి ఉపాధి కోసం నగరానికి వలస వచ్చారు. అతని తల్లిదండ్రులు ముత్యాలు, దేముడమ్మ.. కూర్మన్నపాలెం 86వ వార్డు అశోకనగర్లోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మన్గా పనిచేస్తున్నారు. మనోజ్ కుమార్ ఐటీఐ మధ్యలో ఆపేసినట్టు పోలీసులు తెలిపారు. మనోజ్కు కూడా ఒక చెల్లి ఉంది. కొడుకు మరణవార్త విని తల్లి దేముడమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. గంటల ముందు తమ కళ్లెదుట దీపావళి సంబరాల్లో పాల్గొన్న పిల్లలు.. ఒక్కసారిగా విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి రోదనలతో కూర్మన్నపాలెం ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
క్రికెట్ పోటీల విజేత విశాఖ రెవెన్యూ జట్టు
విశాఖ స్పోర్ట్స్: జోన్–1 రెవెన్యూ ఉద్యోగుల క్రికెట్ టోర్నీ టైటిల్ పోరులో విశాఖ రెవెన్యూ జట్టు ఏడు వికెట్ల తేడాతో అనకాపల్లి రెవెన్యూ జట్టుపై విజయం సాధించింది. రైల్వే స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో జోన్ పరిధిలోని ఆరు జట్లు పోటీ పడగా ఆదివారం ఫైనల్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన అనకాపల్లి జట్టు 16 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌటైంది. విశాఖ కెప్టెన్ రాజేంద్ర నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ బెస్ట్గా నిలిచాడు. ప్రసన్న కుమార్ రెండు వికెట్లు తీశాడు. ప్రతిగా విశాఖ జట్టు 14 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్నందుకుంది. భవానీశంకర్ 36 పరుగులతో రాణించాడు. -
దివాళీ ధోకా
విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో బాణసంచా స్టాళ్ల అనుమతుల వ్యవహారం రచ్చకు దారితీసింది. ఎప్పుడూ లేని విధంగా దుకాణాల లీజు అంశం దుమారం రేపింది. ఈ విషయంలో ఏకంగా రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ జోక్యం చేసుకోవడం వర్సిటీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించడం, ఆ తర్వాత అనుమతుల కోసం కలెక్టర్ ఉన్నత విద్యా శాఖకు లేఖ రాయడం, అనంతరం అనుమతులు ఇవ్వాలని అక్కడి నుంచి వీసీకి లేఖ రావడం, చివరకు 14వ తేదీ నుంచి పనులకు అనుమతులు ఇచ్చినట్లు 16న ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. అది కూడా ఏయూ వీసీ కాకుండా.. రిజిస్ట్రార్ పేరుతో అసిస్టెంట్ రిజిస్ట్రార్(అకౌంట్స్) సంతకంతో అనుమతులు ఇవ్వడం మరింత చర్చనీయాంశమైంది. కాగా.. ఏయూలోని స్టాళ్లలో సగానికి పైగా ఎటువంటి లైసెన్సులు లేకుండానే ఏర్పాటైనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పోలీసులు ఆదివారం మధ్యాహ్నం కొంత సేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. ఉన్నత విద్యా శాఖ జోక్యం ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో బాణసంచా స్టాళ్లను ప్రతి ఏటా ఏర్పాటు చేయడం సాధారణం. దీనికి ఏయూ వీసీ అనుమతులు ఇవ్వడం సర్వసాధారణ విషయం. కానీ ఈ సారి మాత్రం స్టాళ్ల అనుమతుల అంశం గందరగోళంగా, వివాదాస్పదంగా మారింది. ఏయూ మైదానాలను, ప్రాంగణాలను ప్రైవేట్ కార్యక్రమాల కోసం అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది నెలల కిందట బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సినిమా ఈవెంట్కు అనుమతులు ఇవ్వడం తీవ్ర దుమారం రేగింది. దీంతో అప్పటి నుంచి ప్రైవేట్ కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వడం లేదు. ఇటీవలే క్రెడాయ్ ఒక కార్యక్రమ నిర్వహణకు ఈ మైదానాన్ని లీజుకు కోరగా.. ఇదే కారణంతో తిరస్కరించారు. అయితే.. దీపావళి సందర్భంగా ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఇంజినీరింగ్ గ్రౌండ్లో స్టాళ్ల ఏర్పాటుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. దుకాణాల కోసం మైదానాన్ని లీజుకు ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ కేతర్ గార్గ్ ఏయూ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్కు లేఖ రాశారు. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు దుకాణాల పనులకు, 18 నుంచి 20వ తేదీ వరకు అమ్మకాలకు, 21న స్టాళ్ల తొలగింపునకు అనుమతులు ఇవ్వాలని కోరారు. దీనిపై వీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ 13వ తేదీ నుంచే గ్రౌండ్లో పనులు చేపట్టేశారు. దీనిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో కలెక్టర్ హరేందిర ప్రసాద్ సీరియస్ అయ్యారు. అనుమతులు లేకుండా ఎలా స్టాళ్లు ఏర్పాటు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే తొలగించాలని ఆదేశించారు. అనంతరం ఆయన అనుమతుల కోసం రాష్ట్ర ఉన్నత విద్యా శాఖకు లేఖ రాశారు. దీంతో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కార్యాలయం నుంచి ఏయూ వీసీకి లేఖ వచ్చింది. కలెక్టర్ లేఖపై సమస్యను పరిష్కరించి, 14 నుంచి అనుమతులు ఇవ్వాలని 15న లేఖ పంపించడం ఇక్కడ విశేషం. పనులు ప్రారంభించాక అనుమతులు కలెక్టర్ ఆదేశాలతో ఇంజినీరింగ్ కాలేజ్ హెలిప్యాడ్ మైదానంలో ఉన్న స్టాళ్ల పనులను తొలగించారు. రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ జోక్యంతో కొత్తగా దుకాణాలను పార్కింగ్ మైదానానికి మార్చారు. ఇదిలా ఉండగా.. 15న ఉన్నత విద్యా శాఖ నుంచి లేఖ వస్తే, 16న ఏయూ అధికారులు అనుమతులు ఇచ్చారు. అది కూడా 14న పనులకు అనుమతులు ఇస్తున్నట్లు 16న ఉత్తర్వులు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రధానంగా ఈ అనుమతుల పత్రంపై ఏయూ వీసీ సంతకంతో కాకుండా, రిజిస్ట్రార్ పేరుతో అసిస్టెంట్ రిజిస్ట్రార్ (అకౌంట్స్) సంతకం ఉండడం గమనార్హం. తమ చేతికి మట్టి అంటకుండా, ఏదైనా సమస్య వస్తే దాన్ని కింది వారిపైకి నెట్టేసే ఉద్దేశంతోనే ఈ విధంగా చేశారన్న చర్చ జరుగుతోంది. అనుమతులు లేకుండా స్టాళ్లు నగరంలో అనుమతులు లేకుండా బాణసంచా నిల్వలు, వ్యాపారాలపై పోలీసులు వారం రోజులుగా వరుస దాడులతో హడావుడి చేశారు. కానీ ఏయూలో అనేక దుకాణాలు అనుమతులు లేకుండా ఏర్పాటు చేసినా పట్టించుకోలేదు. బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు. కానీ ఏయూలో ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తున్నా పోలీసులు చూసీచూడనట్లు వదిలేశారు. ఆదివారం మధ్యాహ్నం డీసీపీ, ఏసీపీలు వెళ్లి అనుమతులు లేని స్టాళ్లను వెంటనే మూసేయాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసి వెళ్లిపోయారు. కానీ ఏ ఒక్కరూ పోలీసుల హెచ్చరికులు పట్టించుకోకుండా అనుమతులు లేకుండా బాణసంచా విక్రయాలు చేపట్టడం గమనార్హం. -
రుషికొండ భవనాలను మ్యూజియంగా ప్రకటించాలి
బీచ్రోడ్డు: రుషికొండపై నిర్మించిన భవనాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించకుండా వాటిని రాష్ట్ర మ్యూజియంగా ఏర్పాటు చేయాలని బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రైవేటు సంస్థలకు భవనాలను అప్పగించేందుకు ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అసోసియేషన్ ప్రతినిధులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రుషికొండ భవనాలపై హైకోర్టులో రిట్ పిటిషన్లు(241/2021, 257/2021), సీసీ నంబర్ 1425/2022 కేసులు పెండింగ్లో ఉన్నాయి. భవనాలను నిపుణులతో పరిశీలించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు, కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించినా, ఆ నివేదిక ఇంకా కోర్టుకు అందలేదని తెలిపారు. అనేక కేసులు పెండింగ్లో ఉండగా.. హైకోర్టు తుది తీర్పు కోసం ఆగకుండా, ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటం సరికాదని వారు మండిపడ్డారు. విశాఖపట్నం చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని.. బౌద్ధ, జైన అవశేషాలు ఇక్కడ విరివిగా ఉన్నాయని గుర్తు చేశారు. తెలుగుజాతి ఔన్నత్యం, భావితరాలకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఈ మ్యూజియం ఎంతో అవసరమని తెలిపారు. మ్యూజియం ఏర్పాటు చేయడం ద్వారా జపాన్, చైనా, థాయిలాండ్ వంటి బౌద్ధ దేశాల నుంచి పర్యాటకులు వస్తారని.. విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందని, కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కూడా రాబట్టుకోవచ్చని సూచించారు. పెండింగ్ కేసుల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుద్ధిస్టుల నిరసన -
యారాడ బీచ్లో ఇద్దరు యువకుల గల్లంతు
పెదగంట్యాడ: యారాడ తీరంలో సరదాగా గడుపుతున్న ఇద్దరు యువకులు సముద్రపు అలల ఉధృతికి గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ కామేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది స్నేహితులు మూడు ద్విచక్ర వాహనాలపై ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో యారాడ తీరానికి చేరుకున్నారు. వీరంతా సముద్రం వద్ద ఇసుకలో ఆటలాడుతుండగా, వారిలో ఇద్దరు.. ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న జీవీఎంసీ 76వ వార్డుకు చెందిన బొత్స పవన్కుమార్ (26), డిగ్రీ చదువుతున్న గాజువాక కై లాస్నగర్కు చెందిన పగడాల గణేష్ (17) సముద్ర స్నానానికి దిగారు. ఈ సమయంలో సముద్రపు కెరటాల ఉధృతి పెరగడంతో వారు లోపలికి కొట్టుకుపోయారు. వారిని రక్షించడానికి తోటి స్నేహితులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న వెంటనే న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ కామేశ్వరరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ సిబ్బందితో కలిసి గాలించినప్పటికీ యువకుల ఆచూకీ లభించలేదు. గల్లంతైన యువకుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
డాబాగార్డెన్స్: నగర ప్రజలకు మాజీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు హరిత దీపావళి, స్వచ్ఛ దీపావళి, శుభ దీపావళిని రంగు రంగుల దీపాలతో ఆనందంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. మతాబులు, మందుగుండు సామగ్రిని కాల్చడం వల్ల వాయు, శబ్ద కాలుష్యం పెరుగుతుందన్నారు. శబ్ద కాలుష్యం చిన్న పిల్లలు, వృద్ధులు, పశువులు, మూగజీవులకు ఆందోళన కలిగించి ప్రమాదాలకు గురి చేస్తుందని, వాయు కాలుష్యం అనారోగ్యానికి దారితీస్తుందని ఆమె హెచ్చరించారు. ప్రజలందరూ బాణసంచాకు బదులుగా అందమైన దీపాలు వెలిగించి కాలుష్యం లేని పండగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
మార్కెట్లకు వెలుగుల సందడి
జగదాంబ: దీపావళి పురస్కరించుకుని విశాఖ మహా నగరం పండగ శోభను సంతరించుకుంది. సోమవారం దీపావళి కావడంతో.. ఆదివారం నగరంలోని ప్రధాన మార్కెట్లన్నీ జనసంద్రంగా మారాయి. ముఖ్యంగా పూర్ణా మార్కెట్, జగదాంబ కూడలి, అక్కయ్యపాలెం, కంచరపాలెం, గాజువాక, మధురవాడ, తదితర ప్రాంతాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పండగకు అత్యంత ముఖ్యమైన లక్ష్మీ పూజ కోసం అవసరమైన పూజా సామగ్రి, పూల దండలు, పండ్లు, మట్టి ప్రమిదలు, చెరుకు గడలు, దివ్వెలు వెలిగించేందుకు ఆముదం కర్రలు కొనుగోలు చేసేందుకు ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మార్కెట్లలో ఎక్కడ చూసినా పండగకు అవసరమైన వస్తువులతో దుకాణాలు వెలిశాయి. ఈ సందడి దీపావళి వెలుగులతో పాటు కార్తీక మాసం ఆగమనానికి దర్పణం పట్టింది. అంబరాన్నంటిన ధరలు పండగను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. ముఖ్యంగా పూల ధరలు ఆకాశాన్నంటాయి. కేవలం 50 గ్రాముల పూలు రూ.150కి పైగా పలకడం గమనార్హం. పండ్ల ధరలు కూడా వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. నిన్నమొన్నటి వరకు కిలో రూ.200 ఉన్న యాపిల్ పండ్లు.. నేడు రూ. 350కి చేరాయి. దానిమ్మ పండ్ల ధరల గురించి చెప్పనక్కర్లేదు. చిన్నవి కిలో రూ. 350 ఉండగా, పెద్దవి రూ. 500 వరకు పలికాయి. అరటి పండ్లు కిలో రూ.100, బత్తాయిలు రూ.120కి విక్రయించారు. వీటితో పాటు కొబ్బరికాయలు, అరటి డొప్పలు, తమలపాకుల ధరలు కూడా పెరిగిపోయాయి. జోరుగా టపాసుల అమ్మకాలు దీపావళి సంబరాల్లో ముఖ్యమైన బాణసంచా కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్, ఏఎస్ రాజా గ్రౌండ్తో పాటు గోపాలపట్నం, మల్కాపురం, సుజాతనగర్, పెందుర్తి, గాజువాక, షీలానగర్, కంచరపాలెం, ఎన్ఏడీ కూడలి వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద సందడి నెలకొంది. కొందరు చిరు వ్యాపారులు పూర్ణా మార్కెట్ సమీపంలోని స్ప్రింగ్రోడ్డు, వన్టౌన్ రహదారి, బ్యారెక్స్ రోడ్డు తదితర ప్రాంతాల్లో బండ్లపై గ్రీన్కాకర్స్ విక్రయించారు. ధరల భారం ఉన్నప్పటికీ.. ప్రజలు వెలుగుల పండగను సంతోషంగా జరుపుకునేందుకు ఉత్సాహంగా కొనుగోళ్లు పూర్తి చేశారు. -
రాష్ట్ర అవతరణ దినోత్సవంపై భేషజాలు వీడండి
మద్దిలపాలెం: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న అధికారికంగా నిర్వహించాలని తెలుగుదండు డిమాండ్ చేసింది. ఈ మేరకు మద్దిలపాలెం కూడలిలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆదివారం నిరసన జరిగింది. తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు ఫణిశయన సూరి నేతృత్వంలో సాహితీవేత్తలు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘ఈ ఏడాది నుంచైనా నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. తెలంగాణ విడిపోయినా, నవంబర్ 1వ తేదీ యథావిధిగా మన రాష్ట్ర అవతరణ దినోత్సవమే. దీనిపై భేషజాలకు పోకుండా అవతరణ దినోత్సవాన్ని జరిపించాలి.’అని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, అధికార భాషా సంఘం స్థానంలో మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని ఫణిశయన సూరి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆచార్య ప్రసాద్, చిన్న సూర్యనారాయణ, అడపా రామకృష్ణ, రాజమన్నార్, హేమ, ఉండవిల్లి సుజాత, ప్రజా గాయకుడు దేవీశ్రీ తదితర సాహితీవేత్తలు, కవులు పాల్గొన్నారు. -
● పల్లెకు చలో చలో..
వెలుగుల పండగను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలనే ఉత్సాహంతో నగరవాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. పండగకు ముందు ఆదివారం సెలవు కలసిరావడంతో.. పట్టణ జీవితానికి తాత్కాలిక విరామం ఇచ్చి, పల్లె బాట పట్టారు. దీంతో ద్వారకా కాంప్లెక్స్ జనసందోహంతో కిటకిటలాడింది. అయితే బస్సుల్లో సీటు సంపాదించడం కోసం ప్రయాణికులు పడిన పాట్లు వర్ణనాతీతం. చంటి బిడ్డలను పట్టుకుని బస్సుల్లో సీట్ల కోసం తల్లులు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే బస్సులన్నీ ఖాళీ లేకుండా ప్రయాణించాయి. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
పచ్చ పాతమే..
స్టాళ్ల కేటాయింపులోనూసాక్షి, విశాఖపట్నం: 2, 5, 7, 12, 12ఏ, 13, 14, 15, 16... ఈ నంబర్లు చూసి.. ఐఐటీ, ఎంసెట్, నీట్ ర్యాంకులు అనుకుంటే పొరపాటే.. అధికారాన్ని పక్కన పెట్టేసి.. ప్రభుత్వ పార్టీలకు తలొగ్గి.. ‘పచ్చ’పాతంతో కూటమి నేతల అనుచరులకు అధికారులు కేటాయించిన దీపావళి స్టాల్స్ నంబర్లివి. చెప్పుకుంటే.. చాంతాండంత లిస్టు ఉంది. అసలు స్టాల్స్ కేటాయింపుల్లో నంబర్ల గోలేమిటంటే..! దీపావళి సామాగ్రిని విక్రయించేందుకు ఏటా రిటైల్ స్టాల్స్ని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఏయూ గ్రౌండ్స్, ఏఎస్ రాజా మైదానం, షీలానగర్, గాజువాక మొదలైన ప్రాంతాల్లో స్టాల్స్ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం అనుమతులు మంజూరు చేస్తుంటుంది. ఈసారి అనుమతుల విషయంలో గందరగోళం నెలకొంది. వందల మంది దరఖాస్తులు చేసుకున్నా.. కూటమినేతలు చెప్పిన వారికే అనుమతులు ముందస్తుగా ఇచ్చేసి.. సాధారణ వ్యాపారులకు ఆదివారం రాత్రి వరకూ పర్మిషన్లు ఇవ్వలేదు. ఎప్పటిలాగానే దరఖాస్తు చేసుకున్న వ్యాపారులు.. లాటరీ పద్ధతిద్వారా తమకు స్టాల్స్ కేటాయించేస్తారనే ఉద్దేశంతో స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. వీరిపై అధికారులు జులుం ప్రదర్శించి.. అనుమతులు మంజూరు చెయ్యకుండానే స్టాల్స్ ఏర్పాటు చేశారంటూ ఫైన్లు వేసేశారు. కొందరికి మాత్రమే అనుమతులు వచ్చాయి. కారణం.. వారంతా కూటమి నేతలు సిఫార్సు చేసిన వారు కాబట్టి.. ఎమ్మెల్యేల అసోసియేషన్లకే జై..! సాధారణంగా.. స్టాల్స్ ఏర్పాటుకు సంబంధించిన అనుమతులే ఓ గాంబ్లింగ్గా మారింది. కొందరు వర్తకులు కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పాటై.. ఇన్ని స్టాల్స్ కావాలంటూ దరఖాస్తు చేసుకుంటారు. అన్ని విభాగాల్ని ప్రసన్నం చేసుకుంటేనే పర్మిషన్లు వెంటనే మంజూరైపోతాయి. కానీ ఈసారి మాత్రం కూటమి ఎమ్మెల్యేలే చక్రం తిప్పేశారు. తమ పార్టీలకు చెందిన అనుచరులు, వ్యాపారులతో అసోసియేషన్లు ఏర్పాటు చేసి.. ఆ జాబితాల్నే అధికారులకు పంపించారు. వాటికే అధికారులు ఓకే చెప్పారు. సాధారణంగా ఎప్పటిమాదిరిగా ఉన్న అసోసియేషన్ల జాబితాల్ని పక్కనపెట్టేశారు. దీంతో వారంతా అయోమయంలో పడ్డారు. మరోవైపు కూటమి నేతలు ఇచ్చిన అసోసియేషన్లలోనూ పచ్చపాతంతో వ్యవహరించారు. కొందరు వ్యాపారుల్ని వారి జాబితాలో చేర్చారు. కానీ వారికి చివరి స్టాళ్లు కేటాయింపులు చేసి.. ప్రధానమైనవి, ప్రజలు వచ్చిన వెంటనే కనిపించే స్థానాల్లో ఉన్న స్టాల్స్ మొత్తం కూటమి నేతలు తమ అనుచరులకు కేటాయించారు. దీంతో.. పచ్చ లిస్టులోని స్టాల్స్కే వ్యాపారాలు సాగుతున్నాయి. మిగిలిన వారు మాత్రం.. తమకు బేరాలు రావట్లేదంటూ లబోదిబోమంటున్నారు. మొత్తంగా.. మతాబుల వెలుగుల్లో జరగాల్సిన దీపావళి పండగ.. కూటమి నేతల మతలబులతో అయోమయంగా మారింది. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు కూడా పచ్చ నేతలకే జై కొట్టి.. మమా అనిపించారంటూ వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
‘డ్యూడ్’కి అద్భుత రెస్పాన్స్
డాబాగార్డెన్స్: యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం ‘డ్యూడ్’.. దీపావళి కానుకగా విడుదలైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తి శ్వరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మమితా బైజు కథానాయికగా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 17న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన స్పందనతో బ్లాక్బస్టర్ సక్సెస్ను అందుకుని, హౌస్ఫుల్ కలెక్షన్లతో విజయవంతమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ‘డ్యూడ్ ’దివాళీ టూర్ను చేపట్టారు. తమ సినిమాను అద్భుతంగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు విశాఖ విచ్చేసిన హీరో ప్రదీప్ రంగనాథన్.. నగరంలోని రామా టాకీస్, సంగం శరత్ థియేటర్లలో ప్రేక్షకులతో ‘డ్యూడ్ దివాళీ బ్లాస్ట్’ పేరుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమిళనాడులోనూ గత చిత్రాల కంటే ‘డ్యూడ్’కు ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయని తెలిపారు. ‘నా గత చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కంటే తొలి, మలి రోజుల్లోనే నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్లు ‘డ్యూడ్’ సినిమాకు వచ్చాయని మా నిర్మాతలు చెబుతుంటే చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఈ ఘన విజయానికి కారణమైన దర్శకుడికి, నిర్మాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
సొంత గనులతోనే విశాఖ ఉక్కు మనుగడ సాధ్యం
ఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారం మనుగడ సాగించాలంటే సొంత గనులు తప్పనిసరి అని స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి లలిత్ మిశ్రా స్పష్టం చేశారు. ఆదివారం ఉక్కునగరంలోని గురజాడ కళాక్షేత్రంలో జరిగిన స్టీల్ ప్లాంట్ సీఐటీయూ 12వ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలు, కార్మికుల పట్ల అవలంబిస్తున్న నిరంకుశ విధానాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘నేషనల్ పైప్లైన్’ పేరుతో 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి, 12–13 గంటల పని విధానాన్ని బలవంతంగా అమలు చేస్తోందని విమర్శించారు. కర్మాగార పరిరక్షణ, కార్మిక హక్కుల కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా లలిత్ మిశ్రా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. నర్శింగరావు, ఎన్. రామారావు, సీపీఎం నాయకులు ఎం. జగ్గునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నత్త నడకన ఈ–క్రాప్
మహారాణిపేట: పంట నష్టపరిహారం, పంటల బీమా, రుణాలు, సున్నా వడ్డీ, కనీస మద్దతు ధర వంటి ప్రభుత్వ రాయితీలు పొందాలంటే తప్పనిసరి అయిన ఇ–క్రాప్ నమోదు ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఎంతో కీలకమైన ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తొలుత సెప్టెంబర్ 30వ తేదీని చివరి గడువుగా నిర్ణయించినప్పటికీ, లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో దీన్ని అక్టోబర్ నెలాఖరు వరకు పొడిగించారు. ఈ–క్రాప్ బుకింగ్లో రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానశాఖ సిబ్బందికి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా నెట్వర్క్ సమస్యలు, పలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపం, సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత ఆలస్యానికి కారణాలని తెలుస్తోంది. ముఖ్యంగా భూమి రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇ–క్రాప్ బుకింగ్లో జిల్లాలో ఇప్పటివరకు సుమారు 80 శాతం పూర్తయింది. జిల్లాలో 11,599 ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులో 75 శాతం అంటే 8,247 ఎకరాల్లో ఇ–క్రాప్ నమోదు పూర్తయ్యింది. నెలాఖరునాటికి పూర్తి :జిల్లా వ్యవసాయ అధికారి అప్పలస్వామి మాట్లాడుతూ... ఈ–క్రాప్ ద్వారా ఏ రైతు ఏ సర్వే నంబర్లో ఏ రకం పంట, ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ నెలాఖరు నాటికి నూరు శాతం ఇ–క్రాప్ నమోదు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ప్రభుత్వ ఫలాలు సులభంగా అందేందుకు రైతులు అధికారులకు సహకారం అందించాలని ఆయన కోరారు. -
ఏఎంసీలో మరో 8 పీజీ సీట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్
మహారాణిపేట: ఆంధ్ర వైద్య కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను మరో 8 పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో ప్రస్తుతం ఉన్న పీజీ సీట్ల సంఖ్య 368 నుంచి 376కు చేరుకుంది. ఈ కొత్తగా పెరిగిన 8 సీట్లలో, పీడియాట్రిక్స్లో నాలుగు సీట్లు, ఎమెర్జెన్సీ మెడిసిన్లో తొలిసారిగా నాలుగు పీజీ సీట్లు మంజూరయ్యాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర వైద్య కళాశాలకు చెందిన 27 వైద్య విభాగాల్లో 131 పీజీ సీట్లు పెరిగాయి. అంతకుముందు 38 వైద్య విభాగాల్లో 237 సీట్లు ఉండగా, ఈ 131 సీట్లు కలపడం ద్వారా మొత్తం సీట్ల సంఖ్య 368కి చేరుకుంది. ఇప్పుడు అదనంగా పెరిగిన ఈ 8 సీట్లతో కలిపి, ఏఎంసీలో మొత్తం పీజీ సీట్ల సంఖ్య 376కు పెరిగింది. పెరిగిన సీట్ల సంఖ్య పట్ల వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవిని కలిసి, డాక్టర్ చక్రవర్తి, రాజేంద్రప్రసాద్, నవీన్ తదితర వైద్యులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. భర్తీకి ఏర్పాట్లు : పెరిగిన ఈ సీట్లను త్వరలో అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ, వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఆంధ్ర వైద్య కళాశాల కూడా ఏర్పాట్లు చేస్తోంది. సీట్లు పెరగడం చాలా సంతోషంగా ఉందని, అందరి సహకారం వల్లే ఇది సాధ్యమైందని ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి తెలిపారు. -
కార్తీక శోభకు ముస్తాబవుతున్న శివాలయాలు
మహారాణిపేట: ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. శివనామ స్మరణలు, దీపాల సందళ్లతో నెల రోజుల పాటు ఆలయాలు కళకళలాడనున్నాయి. కార్తీక మాసం సందర్భంగా మంగళవారం సాయంత్రం నుంచే ఆలయాల్లో ఆకాశ దీపం వెలిగిస్తారు. శివునికి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసం కోసం జిల్లాలోని శివాలయాలను దేవాదాయ శాఖ ముస్తాబు చేస్తోంది. మంగళవారం నవంబర్ 20 వరకు కార్తీక మాసోత్సవాలు జరుగుతాయి. ఏర్పాట్లపై దృష్టి దేవాదాయ శాఖ ఉప కమిషనర్ సుజాత పర్యవేక్షణలో జిల్లా సహాయ కమిషనర్ ఇన్చార్జ్ ప్రసాదరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, పందిళ్లు, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్లు, మంచి నీటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు దీపాలు పెట్టే ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏసీ ప్రసాదరావు సూచించారు. కార్తీక మాసంలో విధులు నిర్వహించడానికి సుమారు 100 మంది ప్రత్యేక సిబ్బందిని వివిధ దేవాలయాల్లో నియమించారు. జిల్లా పరిధిలో భక్తులు అధికంగా వచ్చే 9 ప్రధాన శివాలయాల్లో అదనపు సిబ్బందిని నియమించామని, క్యూలైన్లలో భక్తులు వేచి ఉండకుండా చర్యలు తీసుకుంటామని ఏసీ ప్రసాదరావు తెలిపారు. కార్తీక సోమవారాల ఏర్పాట్లను తాను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని ఆయన పేర్కొన్నారు. కార్తీక సోమవారాలు ఈనెల 27 (మొదటి), నవంబర్ 3 (రెండో), నవంబర్ 10 (మూడో), నవంబర్ 17 (నాలుగు). కార్తీక పౌర్ణమి/జ్వాలా తోరణం: నవంబర్ 5 పోలి స్వర్గం: నవంబర్ 21 -
నేడు సింహగిరిపై నరకాసురవధ
సింహాచలం : నరకచతుర్దశిని పురస్కరించుకుని సోమవారం రాత్రి సింహగిరిపై జరిగే నరకాసురవధ ఉత్సవానికి దేవస్థానం వైదిక, అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవంలో భాగంగా నరకాసురుడి విగ్రహాన్ని ఒక పల్లకిలోనూ, శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను మరొక పల్లకిలోనూ వేంజింపజేస్తారు. అనంతరం సింహగిరి మాడవీధిలో ఈ రెండు పల్లకీలను ఎదురెదురుగా ఉంచి, శాస్త్రోక్తంగా నరకాసుర వధ ఘట్టాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా యుద్ధ సన్నివేశాలు, నరకాసుర వధ ఘట్ట విన్నపం పూజలు జరుపుతారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తారు. సోమవారం రాత్రి 7 గంటల వరకు మాత్రమే స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని దేవస్థానం డిప్యూటీ ఈవో సింగం రాధ తెలిపారు. -
ట్రంప్ వాణిజ్య యుద్ధంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
డాబాగార్డెన్స్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం భారతదేశంతో సహా ప్రపంచ దేశాలన్నిటిపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తపల్లి లోకనాథం ఆందోళన వ్యక్తం చేశారు. కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం జగదాంబ జంక్షన్ సమీపాన కార్మిక భవనంలో ఎండీ ఆనంద్బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ ట్రంప్ విధించిన టారీఫ్ సుంకాల వల్ల మన దేశంలోని వ్యవసాయ రంగం ధ్వంసమై, పారిశ్రామికోత్పత్తి దెబ్బతింటోందన్నారు. సేవా రంగం గందరగోళంలో పడి మొత్తం ఆర్థిక సంక్షోభాన్ని తీవ్రం చేస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా, టెక్స్టైల్, గార్మెంట్, పట్టు వంటి రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయన్నారు. దీని ఫలితంగా ఉద్యోగులు, కార్మికులు, రైతాంగం రోడ్డున పడి ఇంటా బయటా ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని, విద్యార్థులు, యువత భవిష్యత్తు ఆగమ్యగోచరమవుతుందని ఆయన పేర్కొన్నారు. మన దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అందిపుచ్చుకోవాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ట్రంప్ అడుగులకు మడుగులొత్తే లొంగుబాటు వైఖరిని ప్రదర్శిస్తోందని లోకనాథం విమర్శించారు. భారత్ నుంచి దిగుమతయ్యే టెక్స్టైల్, దుస్తులు, రొయ్యలు, చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తులు, లెదర్, వజ్రాభరణాలు వంటి అన్నింటిపైనా ట్రంప్ ప్రభుత్వం సుంకాలు పెంచిందన్నారు. గతంలో 2.5 శాతం ఉన్న సుంకాలను 50 శాతానికి పెంచడం వల్ల దాదాపు 7 లక్షల కోట్లకు పైగా భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని అంచనా వేశారు. మన ఉత్పత్తులకు మార్కెట్ తగ్గడంతో పరిశ్రమలు, సేవారంగం దెబ్బతిని, ఉద్యోగులు, కార్మికులు వీధిన పడతారని ఆయన వివరించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, ఉపాధ్యక్షులు తిరుకోటి చిరంజీవి, బొమ్మల రఘురామ్, కె. రంగమ్మ, కె. క్రాంతిబాబు, ఎ. తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తపల్లి లోకనాథం -
● క్రాకర్స్.. స్వీట్స్
శ్రీహరిపురంలోని శ్రీనివాస్ స్వీట్ స్టాల్ వినూత్నంగా ఆలోచించింది. వినియోగదారులను ఆకట్టుకునే విధంగా అచ్చం బాణసంచా ఆకారంలో స్వీట్లను అందుబాటులో ఉంచారు. ఆదివారం ఉదయం నుంచే నార్త్ ఇండియన్స్ మాత్రమే కాక, స్థానిక సౌత్ ఇండియన్ చిన్నారులు, పెద్దలు ఈ విభిన్నమైన స్వీట్లను చూసి ముచ్చట పడి కొనుగోలు చేస్తున్నారు. పాల కోవాతో తయారు చేసిన భూచక్రాలు, చిచ్చు బుడ్లు, విష్ణు చక్రాలు, బాంబులు, కాకర పువ్వొత్తులు వంటి రకరకాల ఆకారాల్లోని స్వీట్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ స్వీట్లకు దీపావళి క్రాకర్ రూపాన్ని ఇవ్వడం ద్వారా శ్రీనివాస్ స్వీట్ స్టాల్ యజమాని పండుగ వాతావరణాన్ని మరింత పెంచారు. – మల్కాపురం -
విద్యుత్ విప్లవంలో స్టార్టప్ల కోసం హ్యాకథాన్
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ సరఫరా, వినియోగంలో సరికొత్త ఆధునిక విప్లవాన్ని సృష్టిస్తూ.. డిస్కమ్లకు, వినియోగదారులకు ఉపయుక్తమ య్యే స్టార్టప్ల కోసం హ్యాకథాన్ నిర్వహిస్తున్నామని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి అన్నారు. సృజనాత్మక ఆవిష్కరణలను రూపొందించే స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశంతో వచ్చే నెలలో హ్యాకథాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆయన శనివారం సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, కై ్లమేట్ కలెక్టివ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హ్యాకథాన్ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నామన్నారు. హ్యాకథాన్లో ఎంపికై న స్టార్టప్లు తమ పరిష్కారాలను రాష్ట్ర విద్యుత్ రంగ ప్రముఖుల సమక్షంలో ప్రద ర్శించే అవకాశంతో పాటు విజేతలకు పైలెట్ ప్రాజెక్టులు, 3 డిస్క మ్ల్లో పూర్తి స్థాయి ప్రాజెక్టులను అమలు చేసుకునే అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ హ్యాకథాన్ను ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్లు సంయుక్తంగా నిర్వహిస్తున్నా యన్నారు. ఈ నెల 22 రాత్రి 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. -
బంతి.. ధరల కాంతి
● దీపావళి సందర్భంగా పెరిగిన ధర ● బుట్ట బంతి రూ.150 ● కొనుగోలుకు పోటీపడిన వర్తకులు ● గిరి రైతుల ఆనందంసాక్షి, పాడేరు: జిల్లాలో బంతి పూలకు భలే డిమాండ్ ఏర్పడింది. దీపావళి పండగ నేపథ్యంలో మన్యంలోని బంతిపూలకు గిరాకీ ఏర్పడింది.తెలుగు రాష్ట్రాలతో పాటు ఈఏడాది తొలిసారిగా ఒడిశాలోపలు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు కూడా పూలను కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. పాడేరు పాతబస్టాండ్లో శనివారం మార్కెట్కు గిరిజనులు భారీగా బంతిపూలను తీసుకువచ్చారు. బుట్టడు బంతి పూలను రూ.150లకు వర్తకులు కొనుగోలు చేశారు. హుకుంపేట, పాడేరు, పెదబయలు, జి.మాడుగుల మండలాల పరిధిలోని పలు గ్రామాల గిరిజనులు ఉదయం నుంచే పూల అమ్మకాలను చేపట్టారు. మధ్యాహ్నం వరకు సీతమ్మకాటుక (చిన్నబంతి) రకం పూల వ్యాపారం పోటాపోటీగా జరిగింది. ముద్దబంతి పూలను బుట్ట రూ.100లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఈ పూలను కొనుగోలు చేసి విశాఖ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాలకు తరలించారు. ఒడిశా వ్యాపారులు తమ రాష్ట్రానికి వ్యాన్ల ద్వారా పూలను రవాణా చేశారు. పండగ వేళ ఆదాయం దీపావళి పండగ సందర్భంగా బంతిపూల అమ్మకాలు పెరగడంతో గిరిజన రైతులకు మంచి ఆదాయం లభించింది. శుక్రవారం నుంచి బంతిపూల ధరలు పెరగడంతో బుట్ట పూలకు రూ.150 వరకూ ధర లభించింది. ప్రతి గిరిజన రైతు పాడేరు మార్కెట్లో రోజుకు ఐదు నుంచి పది బుట్టల వరకు బంతి పూలను విక్రయిస్తున్నారు. కార్తీకమాసం ప్రారంభం కానుండడంతో బంతిపూల ధర మరింత పెరగనుంది. ఒడిశా పూల వ్యాపారులు నేరుగా వాహనాలతో పాడేరు మార్కెట్కు వచ్చి బుట్ట పూలను రూ.150 ధరతో కొనుగోలు చేస్తుండడంతో పోటీ ఏర్పడింది. స్థానిక వ్యాపారులు కూడా అదే ధరతో కొనుగోలు చేస్తుండడంతో గిరిజన రైతులకు కలిసి వచ్చింది. గిరిజన రైతులు పూలసేకరణ,అమ్మకాలతో బిజీగా ఉన్నారు. -
ఇళ్ల స్థలాల కోసం పోరాటం తప్పదు
మధురవాడ: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే పోరాటం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. శనివారం ఆయన రుషికొండలో అదానీ డేటా సెంటర్కు కేటాయించిన భూములను ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాధం, ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విలువైన భూములను బడా కంపెనీలకు కేటాయించడం వల్ల పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు అని విమర్శించారు. కూటమి నాయకులు ఎన్నికల సందర్భంగా పట్టణాల్లో పేదలకు రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. విశాఖలోనే 1.20 లక్షల మంది ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. భూములు తీసుకుని ఉత్పత్తి ప్రారంభించని సంస్థల నుంచి వాటిని వెంటనే వెనక్కి తీసుకుని పేదలకు ఇవ్వాలని, లేకపోతే తాము పోరాటానికి దిగుతామని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇళ్ల స్థలాల కోసం లోకేష్ సొంత నియోజకవర్గం మంగళగిరిలో శుక్రవారం పేదలు ఆందోళన చేశారని గుర్తుచేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాధం మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పి.. ఇప్పుడు అక్కడ 5 వేల మంది ఉద్యోగాలు తీసేసినా కూటమి నాయకులు ఇంకా కల్లబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. పరిశీలనలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్కేఎస్వీ కుమార్, నాయకులు డి.అప్పలరాజు, నరేంద్రకుమార్, రాజ్కుమార్, గురుమూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు -
వెలుగుల వైభవం
ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలు డాబాగార్డెన్స్: నగరంలో వెలుగుల పండగ దీపావళి సందడి నెలకొంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే ఈ పండగ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ సందర్భంగా నగర వాసుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ముఖ్యంగా బాణసంచా మార్కెట్ల వద్ద సందడి కనిపిస్తోంది. జీవీఎంసీ పరిధిలో 530 దుకాణాలకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్, ఏఎస్ రాజా గ్రౌండ్తో పాటు గోపాలపట్నం, మల్కాపురం, సుజాతనగర్, పెందుర్తి, గాజువాక, షీలానగర్, కంచరపాలెం, ఎన్ఏడీ కూడలి తదితర ముఖ్య ప్రాంతాల్లో స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్ల వద్ద ప్రజలు తమకు నచ్చిన బాణసంచా సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. గ్రీన్ క్రాకర్లకు కూడా గిరాకీ కనిపిస్తోంది. పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది స్టాల్స్ వద్ద నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి స్టాల్ వద్ద తప్పనిసరిగా నీరు, ఇసుక బకెట్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లను అందుబాటులో ఉంచాలని, రెండు స్టాళ్ల మధ్య నిర్దిష్ట దూరం పాటించాలని అధికారులు నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక దీపావళి అంటే కేవలం బాణసంచా మాత్రమే కాదు.. లక్ష్మీ పూజ కూడా అత్యంత ప్రధానమైన ఘట్టం. ఈ నేపథ్యంలో నగరంలోని మార్కెట్లు పూజా సామగ్రి, ప్రమిదలతో కళకళలాడుతున్నాయి. సంప్రదాయ మట్టి ప్రమిదలతో పాటు, వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించిన విభిన్న ఆకృతులు, రంగురంగుల డిజైన్లతో కూడిన అలంకరణ దీపాలు మార్కెట్లో లభిస్తున్నాయి. ‘అనుమతి లేకుండా బాణసంచా విక్రయించవద్దు’ డాబాగార్డెన్స్: బాణసంచా సామగ్రిని అనధికారికంగా విక్రయిస్తే చర్యలు తప్పవని జీవీఎంసీ అగ్నిమాపక అధికారి కృపావరం హెచ్చరించారు. జీవీఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను శనివారం పరిశీలించి, వ్యాపా రులకు తగిన సూచనలు చేశామన్నారు. జీవీఎంసీ పరిధిలో బాణసంచా దుకాణాల ఏర్పాటుకు 535 దరఖాస్తులు రాగా.. ఐదింటిని తిరస్కరించినట్లు చెప్పారు. ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్ వేదికగా 130, ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా గ్రౌండ్లో 48, ఓజోన్ వేలీలో 29తో పాటు గోపాలపట్నం, సుజాతనగర్, మల్కాపురం, గాజువాక తదితర ప్రాంతాల్లో దుకాణాల ఏర్పాటుకు సంబంధించి అందిన దరఖాస్తులు పరిశీలించి, కమిషనర్కు పంపించామన్నారు. ఆయన సూచనల మేరకు 530 దుకాణాలకు అనుమతులు మంజూరు చేశామన్నారు. దుకాణాల పరిశీలనలో జిల్లా అగ్నిమాపక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలలో హెచ్చరించారు. ఇప్పటికే అనుమతులు లేని వారిపై చట్టపర చర్యలు తీసుకున్నటు పేర్కొన్నారు. నగరంలో దీపావళి సందడి కళకళలాడుతున్న మార్కెట్లు బాణసంచా కొనుగోళ్ల జోరు -
వక్ఫ్ రికార్డుల కంప్యూటరీకరణపై దిశానిర్దేశం
సీతంపేట: ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ రికార్డుల కంప్యూటరీకరణపై ఓరియెంటేషన్ కార్యక్రమాలు నిర్వహించినట్లు వక్ఫ్ బోర్డ్ సీఈవో షేక్ మహమ్మద్ ఆలీ అన్నారు. అక్కయ్యపాలెంలోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కమ్యూనిటీ హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి ఎన్.మహమ్మద్ ఫరూఖ్ ఆదేశాల మేరకు.. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ముతవల్లీ(కమిటీ)లు, నిర్వహణ కమిటీల కోసం వక్ఫ్ రికార్డుల కంప్యూటరీకరణపై దిశానిర్దేశం చేశామన్నారు. వక్ఫ్ రికార్డులు, ఆస్తులు, ఆదాయం నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో పాటు, మిగిలిన ఆదాయాన్ని ముస్లిం సమాజ సంక్షేమం కోసం ఎలా ఉపయోగించాలో ముతవల్లీలకు వివరించినట్లు చెప్పారు. ఆన్లైన్ పోర్టల్లో సమాచారాన్ని అప్లోడ్ చేసే సమయంలో డీఆర్వో, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సహాయం తీసుకోవాలని సూచించామన్నారు. మిగులు ఆదాయాన్ని పేద, నిరుపేద ముస్లిం మహిళలు, వితంతువుల కోసం వినియోగించాలని నిర్ణయించామని, ఈ నిధులతో ‘ఖాలీమే హున్నర్’ అనే ఒక సంప్రదాయ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతిపాదించినట్లు వివరించారు. ఇందులో భాగంగా విశాఖలోని హజరత్ ఇషాక్ ఆలీ మదీనా దర్గా దగ్గర ఉన్న భవనంలో శిక్షణ పొందిన వారికి ఒక కుట్టు మిషన్, సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. గౌరవ సభ్యులు డాక్టర్ రఫియా, ముకర్రం ముజీబి తదితరులు పాల్గొన్నారు. -
పైసలెక్కడున్నాయ్ సార్..!
జిల్లాకు రావాల్సిన బకాయిలు వివిధ కార్యక్రమాలకు నిధులు విదల్చని కూటమి ప్రభుత్వం యోగాంధ్ర రూ.40 కోట్లు ఇతరత్రా కార్యక్రమాలకు సుమారు రూ.20 కోట్లు సార్వత్రిక ఎన్నికలు రూ.7 కోట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు – రూ.3 కోట్లు ప్రోటోకాల్ – రూ.30 కోట్లు సాక్షి, విశాఖపట్నం: మాటలు కోటలు దాటుతాయి.. చేతలు మాత్రం గడప దాటవు అన్న చందంగా.. కూటమి ప్రభుత్వం చేసింది తక్కువ.. ప్రచారం మాత్రం పీక్స్లో ఉంటోంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు అండ్ కో... ప్రచారం కోసం విచ్చలవిడిగా వినియోగిస్తుండటంతో జిల్లా ఖజానా ఖాళీ అయిపోయింది. వరుసగా ప్రభుత్వ కార్యక్రమాలు, భారీ ప్రచారాల నిర్వహణ కారణంగా జిల్లా ఖజానాపై ఆర్థిక భారం తీవ్రమైంది. ప్రభుత్వం నుంచి రూ.100 కోట్ల వరకు నిధులు పెండింగ్లో ఉన్నప్పటికీ, కొత్తగా సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ వంటి ప్రధాన ఈవెంట్లకు ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశాలు రావడంతో జిల్లా అధికారులు నిధుల సర్దుబాటుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రోటోకాల్ పనులకు ఉన్న నిధులే వెచ్చించాల్సి వస్తుండగా, ఆ మొత్తం తిరిగి మంజూరు కావడం లేదని, దీంతో జిల్లా అభివృద్ధి పనులకు నిధులు కరువవుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల బిల్లులకూ దిక్కులేదు.! 2024 ఏప్రిల్ నుంచి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికల నిర్వహణకు రూ.20 కోట్లకు పైగా ఖర్చు చేశారు. దీనికి సంబంధించిన బిల్లులు ప్రభుత్వానికి పంపించగా.. పలు దఫాలుగా విదిలిస్తూ కేవలం రూ.3 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ.7 కోట్లకు పైగా పెండింగ్లో ఉంది. జనరల్ ఎన్నికల అనంతరం ఈ ఏడాది ప్రారంభంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు రూ.3 కోట్లు ఖర్చు కాగా ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. తరువాత జరిగిన యోగాంధ్ర కార్యక్రమానికి బడ్జెట్కు మించి 10 రెట్లు ఎక్కువ ఖర్చయింది. యోగాంధ్ర నిర్వహణకు జిల్లా ఖజానా నుంచి రూ.70 కోట్ల వరకూ ఖాళీ అయిపోయింది. ఈ డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వానికి అనేకసార్లు మొరపెట్టుకుంటే.. కేవలం రూ.28 కోట్లు మాత్రమే విదిల్చింది. ఇలా ప్రతి కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించడం.. తర్వాత నిధులిచ్చేందుకు నిరాకరించడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయింది. సీఐఐ సమ్మిట్టా.? బాబోయ్.! 2014 –19 మధ్య కాలంలో 2 సార్లు సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్స్ను చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించింది. దానికి సంబంధించి రూ.కోట్ల బిల్లుల్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చెల్లించింది. ఇప్పుడు మరోసారి సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చెయ్యాలంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహణకు దాదాపు రూ.50 కోట్లకు పైగా ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించిన ఆదేశాలు ఇచ్చారే తప్ప.. రూపాయి ఇవ్వలేదు. ఇప్పటికే రూ.కోట్లలో బకాయిలు ఉన్న పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులేమో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ లేఖలు రాస్తోంది. అయినా కూటమి ప్రభుత్వం కనికరించడం లేదు. దీంతో భాగస్వామ్య సదస్సు నిర్వహణ ఏర్పాట్లు ఎలా చెయ్యాలా అంటూ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.ప్రోటోకాల్ పేరుతో ఊడ్చేస్తున్నారు.. వారానికో రాష్ట్ర మంత్రి, పదిరోజులకో కేంద్ర మంత్రి.. పదిహేను రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి.. ఇలా ప్రతినెలా.. ప్రోటోకాల్ డ్యూటీలు, ఖర్చులే జిల్లాకు భారంగా మారుతున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏర్పాట్లు, వాహనాల కాన్వాయ్, ఇతర సౌకర్యాల కోసం నిధులు వెచ్చిస్తున్నారు. ఇవి కూడా పెండింగ్ పెడుతున్నారే తప్ప.. రూపాయి ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వానికి మనసురావడం లేదు. ఇలా ప్రోటోకాల్ ఖర్చులు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి రూ.30 కోట్ల వరకూ జిల్లాకు రావాల్సి ఉంది. ఇవి కూడా మంగళం పాడేందుకు చంద్రబాబు సర్కారు ప్రయత్నిస్తోంది. -
అనంతునికి పవిత్రాల సమర్పణ
పద్మనాభం: పద్మనాభంలోని కుంతీ మాధవస్వామి ఆలయంలో అనంతుని పవిత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం పవిత్రాలు సమర్పించారు. ఆలయంలోని కుంతీ మాధవస్వామి, శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభస్వామి పెద్ద ఉత్సవ విగ్రహాలు, శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి చిన్న ఉత్సవ విగ్రహాలు, రుక్ష్మిణి, సత్యభామ సమేతుడైన వేణుగోపాల స్వామి, లక్ష్మీదేవిలకు గిరిపై ఉన్న అనంత పద్మనాభ స్వామికి పవిత్రాలు సమర్పించారు. ముందుగా కుంతీ మాధవస్వామి, ఆనంత పద్మనాభ స్వాములకు అష్టకలశ స్నపనం, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పవిత్రాలను సమర్పించారు. -
పేదోడి వైద్యంపై కూటమి నిర్లక్ష్యం
మహారాణిపేట: కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యంపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగా జిల్లాలో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. పట్టణాల్లో కార్పొరేట్ వైద్యాన్ని అందించే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ నిలిచిపోగా.. పల్లెల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) వైద్యులు లేక బోసిపోయాయి. దీంతో వైద్యం అందక పేద రోగులు అల్లాడిపోతున్నారు. బకాయిలు చెల్లించక ఆరోగ్యశ్రీ బంద్ జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.162 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించకపోవడమే గత ఎనిమిది రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా) పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఈనెల 10 నుంచే ఎన్టీఆర్ వైద్య సేవ సేవలను నెట్వర్క్ ఆస్పత్రులు నిలిపివేశాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సమ్మె చేస్తున్న ఆస్పత్రుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మొదట 27 ఆస్పత్రులు సేవలు నిలిపివేయగా, నేడు ఆ సంఖ్య 34కు పెరిగింది. బకాయిలు చెల్లించకుండా వైద్యం అందించలేమని ఆస్పత్రుల యాజమాన్యాలు తేల్చిచెప్పడంతో.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రా క్షగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు సైతం వైద్యం అంతంత మాత్రంగానే అందుతోంది. సమ్మైపె ఉదాసీనత : పట్టణాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. పల్లెల్లో వైద్యం పూర్తిగా పడకేసింది. పీహెచ్సీ వైద్యులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 18 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. జీవో నంబర్ 99 ద్వారా కోత విధించిన పీజీ కోటా పునరుద్ధరణ, పదోన్నతులు, అలవెన్సుల వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైద్యులు సమ్మెబాట పట్టారు. జిల్లాలోని భీమిలి, రేవిడి, ఆనందపురం, ఆర్. తాళ్లవలస, గాజువాక, పెదగంట్యాడ సహా 10 పీహెచ్సీల్లో 20 మంది వైద్యులు సమ్మెలో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ వందలాది మంది ఓపీ చూసే ఈ కేంద్రాలు ఇప్పుడు బోసిపోయాయి. వైద్యులు లేక స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులే వైద్యుల అవతారం ఎత్తుతున్నారంటే పరి స్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు బకాయిలు చెల్లించక ఆరోగ్యశ్రీని, మరోవైపు వైద్యుల సమస్యలు పరిష్కరించక పీహెచ్సీలను నిర్వీ ర్యం చేస్తూ.. కూటమి ప్రభుత్వం పేదోడి ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని ప్రజలు మండిపడుతున్నారు. -
అనధికార మద్యం, డ్రగ్స్పై పటిష్ట నిఘా
మహారాణిపేట: జిల్లాలో అనధికార మద్యం అమ్మకాలు జరగకుండా గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పటిష్టమైన నిఘా ఉంచాలని కలెక్టర్ ఎం. ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఎకై ్సజ్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, జోనల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ పలు సూచనలు చేశారు. అక్రమ మద్యం అమ్మకాలపై సమాచారం అందించడానికి గ్రామ/వార్డు కార్యదర్శులు, వీఆర్వోలు, వీఆర్ఏలు, శానిటేషన్ సిబ్బంది ఎకై ్సజ్ శాఖకు సహకరించాలన్నారు. గంజాయి, గంజాయి చాక్లెట్లు వంటి మాదక ద్రవ్యాల అమ్మకాలను కూడా పసిగట్టి నిరోధించాలని ఆదేశించారు. స్థానికంగా మద్యం తయారీ లేదా కల్తీ మద్యం అమ్మకాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ ఉంచాలని, లేబుల్ లేని బాటిల్స్ అమ్మకూడదని స్పష్టం చేశారు. తక్కువ రేటుకు వస్తోందని నాసిరకం మద్యం తాగవద్దని ప్రజలకు సూచించారు. మహిళలకు అక్రమ మద్యం నిరోధంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎకై ్సజ్ సూపరిండెంటెంట్ ఆర్.ప్రసాద్ మాట్లాడుతూ.. అక్రమ మద్యం గుర్తించడానికి ప్రభుత్వం ‘ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్’ను తీసుకొచ్చిందని, దీని ద్వారా ప్రతి బాటిల్ను స్కాన్ చేసి అమ్మకాలు చేయాలని సూచించారు. బెల్ట్ షాపుల సమాచారంపై ఎకై ్సజ్ సిబ్బంది చర్య తీసుకోకపోతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. జేసీ మయూర్ అశోక్, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి పాల్గొన్నారు. -
చిరు వ్యాపారిపైకి దూసుకొచ్చిన లారీ
పెదగంట్యాడ: శనివారం.. తెలవారుతున్న వేళ.. ఓ చిరు వ్యాపారిపై మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఆమె సంఘటన స్థలంలోనే మృతి చెందగా, ఆమె మనవడు తీవ్రంగా గాయపడ్డాడు. వుడా డబుల్ రోడ్డులో శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి న్యూపోర్టు ట్రాఫిక్ ఎస్ఐ సూర్యనారాయణ తెలిపిన వివరాలివి. పెదగంట్యాడ మండలం వియ్యపువానిపాలేనికి చెందిన వియ్యపు అప్పయ్యమ్మ (48) వుడా డబుల్ రోడ్డులో కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. ప్రతి రోజూ ఉదయాన్నే ఆమె తన దుకాణాన్ని తెరుస్తూ ఉంటుంది. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో తన మనవుడు బంధం సాకేత్(5)తో కలసి దుకాణానికి వచ్చింది. అక్కడ కొబ్బరి బొండాలు సర్దుతుండగా శ్రీకాకుళం నుంచి పెదగంట్యాడకు ఇసుక లోడుతో వస్తున్న లారీ దుకాణంపైకి దూసుకొచ్చింది. దీంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఆమె మనవడు సాకేత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే వియ్యపువానిపాలేనికి చెందిన అప్పయ్యమ్మ బంధువులు అక్కడకు చేరుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న న్యూపోర్టు ట్రాఫిక్ ఎస్ఐ సూర్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనకాపల్లికి చెందిన లారీ డ్రైవర్ బారా గోవింద్ (35)ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. గాయపడిన సాకేత్ స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కుమారుడు వియ్యపు శ్రీను ఫిర్యాదు మేరకు ఎస్ఐ సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సాకేత్(ఫైల్) అప్పయ్యమ్మ(ఫైల్) -
బంగారు భవిష్యత్కు చదువే మూలం
ఆరిలోవ: ఆడ బిడ్డలను ఇంటికే పరిమితం చేయకుండా.. తప్పకుండా చదివించాలని తల్లిదండ్రులకు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సూచించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లాలో అన్ని మండలాల నుంచి ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న బాలికలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామని బాలికలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆడ బిడ్డలు బంగారం లాంటివారన్నారు. వారిని ఉన్నత చదువులు చదువుకోవడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. కలలు సాధనకు, బంగారు భవిష్యత్కు చదువే మూలమన్నారు. బాలికలు క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. బాలికలకు ఎలాంటి సమస్యలు వచ్చినా టోల్ప్రీ నంబర్ 1098కు ఫోన్ చేయాలని సూచించారు. అనంతరం ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పాఠశాలల్లో బాలికలకు జరిపిన వ్యాసరచన, క్విజ్ తదితర పోటీల్లో విజేతలకు కలెక్టర్ హరేందిర ప్రసాద్, డీఈవో ఎన్.ప్రేమకుమార్, ఐసీడీఎస్ పీడీ రామలక్ష్మితో కలసి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఏపీసీ చంద్రశేఖర్, డిప్యూటీ డీఈవో, ఎంఈవోలు రవీంద్రబాబు, అనురాధ, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
గళమెత్తిన కలం
విశాఖపట్నంజీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్ట్ల భారీ నిరసన 9శనివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్ శ్రీ 2025‘సాక్షి’పై దాడులను ఆపాలని డిమాండ్డాబాగార్డెన్స్: ‘సాక్షి’ మీడియా సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ జర్నలిస్ట్లు భగ్గుమన్నారు. ప్రజా సమస్యలను, ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న ‘సాక్షి’ గొంతు నొక్కేందుకు పోలీసులను ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వివిధ జర్నలిస్ట్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నకిలీ మద్యం దందాను వెలుగులోకి తెచ్చినందుకు ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి, నెల్లూరు బ్యూరో ఇన్చార్జికి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని జర్నలిస్ట్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించారు. నిరసనలో భాగంగా పాత్రికేయులు చేతులకు సంకెళ్లు వేసుకుని, నల్ల రిబ్బన్లు ధరించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ‘కూటమి నిరంకుశ పాలన నశించాలి’, ‘అక్షరంపై దాడి సిగ్గు సిగ్గు’, ‘పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా?’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలు జర్నలిస్ట్ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మీడియాపై అణచివేత ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమని, ఇలాంటి చర్యల ద్వారా జర్నలిజాన్ని భయపెట్టలేరని హెచ్చరించారు. ప్రభుత్వం తన దాష్టీకాన్ని ఆపి, పత్రికా స్వేచ్ఛను గౌరవించాలని డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్లు కె.చంద్రమోహన్, డి.హరనాథ్, యర్ర నాగేశ్వరరావు, ఇరోతి ఈశ్వరరావు, బి.ఆనందరావు, పీఏ రావు, రామునాయుడు, సత్యనారాయణ, శ్రీనివాసరెడ్డి, కింతాడ మదన్తో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్ట్లు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లో విశాఖ ముందంజలో ఉండాలి
మహారాణిపేట : విశాఖ జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా అధికారులు కృషి చేయాలని ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ–మానటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి ప్రాజెక్టులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారులను.. నగర రహదారులకు అనుసంధానం చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణ పథకాల్లో ప్రగతి సాధించాలని, పీఎం సూర్యఘర్ యూనిట్లను ఎక్కువ సంఖ్యలో నెలకొల్పాలన్నారు. అభివృద్ధి పేరుతో తవ్వుతున్న రోడ్లను నిర్ణీత కాలంలో పూడ్చివేయాలన్నారు. అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. వర్కింగ్ వుమెన్స్ వసతి గృహాలను త్వరితగతిన పట్టాలెక్కించాలన్నారు. మేజిక్ డ్రైన్లను నిర్మించాలని, వాటి ద్వారా కలిగే ఫలితాలను పరిశీలించి నివేదించాలని చెప్పారు. తుఫాన్లు, వర్షాల సమయంలో రక్షణ ఉండేలా గ్రేట్ గ్రీన్వాల్ పేరుతో నాటే మొక్కల విధానాన్ని కొనసాగించాలన్నారు. క్రీడలకు అనుగుణంగా వసతులను కల్పించాలన్నారు. జలవనరులను సంరక్షించాలని, భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అమృత్, జలజీవన్ మిషన్ పథకం ద్వారా తాగునీరు అందించాలని చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించాలని, డస్ట్ బిన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటీవల తొలగించిన దుకాణాల ఏర్పాటులో అర్హులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని తేల్చి చెప్పారు. ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పలు ప్రజా సమస్యలను ప్రస్తావించారు. డైమండ్ పార్కు వద్ద జీవీఎంసీ స్థలంలో మల్టీలెవెల్ పార్కింగ్ ప్రాజెక్టు చేపడితే ప్రయోజనం ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ కె.మయూర్ అశోక్, జెడ్పీ సీఈవో, దిశా కన్వీనర్ నారాయణమూర్తి, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. అధికారులను ఆదేశించిన ఎంపీ శ్రీ భరత్ -
డివైడర్ను ఢీకొని విద్యార్థి దుర్మరణం
ఆరిలోవ: బీఆర్టీఎస్ రోడ్డు మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని విజయనగరానికి చెందిన చిలకలపల్లి విశాల్ (21)గా గుర్తించారు. విశాల్ గీతం విశ్వవిద్యాలయంలో నాలుగో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆయన పెందుర్తి ప్రాంతంలోని పురుషోత్తమపురంలో తన మామయ్య ఇంట్లో ఉంటూ కళాశాలకు వెళ్తున్నాడు. గురువారం సాయంత్రం విశాల్ తన స్నేహితుడు సూర్యతో కలిసి కళాశాల నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. హనుమంతవాక మీదుగా బీఆర్టీఎస్ రోడ్డులో వెళ్తున్న క్రమంలో.. శ్రీకృష్ణాపురం సమీపంలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిన విశాల్ గుండెకు తీవ్ర గాయం తగిలి అంతర్గత రక్తస్రావం జరిగింది. సూర్యకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన విశాల్ను స్థానికులు.. ఆరిలోవ పోలీసుల సహాయంతో విమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విశాల్ మృతిచెందాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శుక్రవారం మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి, అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అప్పన్న ఆలయ లీకేజీ పనులు పూర్తి
సింహాచలం: సింహగిరిపై శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ పైకప్పు మరమ్మతు పనులు శుక్రవారంతో పూర్తయ్యాయి. వర్షాలకు ఆలయ పైకప్పు నుంచి నీరు లోపలికి చేరుతుండటంతో ఆలయంతోపాటు, ఆలయ ప్రాంగణంలోని కల్యాణమండపం, నివేదనశాల, మ్యూజియం ఉన్న భవనంలో లీకేజీలు అరికట్టేందుకు 9 నెలల కిందట శాసీ్త్రయ పద్ధతిలో పనులు ప్రారంభించారు. ఆ పనులు పూర్తికావడంతో సింహగిరిపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి పురావస్తుశాఖ డైరెక్టర్ ముణిరత్నంరెడ్డి సంబంధిత వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో తొలుత శ్రీకాళహస్తి ఆలయంలో వర్షం నీరు లీకేజీని అరికట్టే పనులు చేపట్టామన్నారు. ఆ రోజుల్లో నిర్మాణ పనులు ఎలా చేశారో అదే పద్ధతిలో శ్రీకాళహస్తి ఆలయంలో లీకేజీలను అరికట్టేందుకు పుణేకి చెందిన శ్రీవెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్(వెంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్)ను సంప్రదించామన్నారు. అక్కడ ఉత్తమ ఫలితాలు రావడంతో ఆ తర్వాత శ్రీశైలం ఆలయంలో పనులు చేపట్టామన్నారు. సింహాచలం ఆలయం పైకప్పు లీకేజీ పనుల విషయాన్ని ఎమ్మెల్యే గంటా సూచనలతో వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రూ.5 కోట్ల సొంత వ్యయంతో 9 నెలల్లో లీకేజీ నిర్మూలన పనులను ట్రస్ట్ పూర్తిచేసిందన్నారు. మరో 200 ఏళ్ల వరకు ఎలాంటి లీకేజీలు ఉండవన్నారు. గంటా మాట్లాడుతూ అప్పన్న ఆలయంలోకి వర్షం నీరు చేరకుండా గతంలో పలుమార్లు నివారణ పనులు జరిగినా పూర్తిగా సఫలీకృతం కాలేదన్నారు. దీంతో వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించి, పురాతన ఆలయాల నిర్మాణ సాంకేతికతను ఉపయోగించి వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ లీకేజీలను అరికట్టే పనుల్ని చేసిందన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో వి.త్రినాథరావు, అర్చకులు, 98వ వార్డు కార్పొరేటర్ పీవీ నరసింహం, తదితరులు పాల్గొన్నారు. రూ.5 కోట్లతో పూర్తి చేసిన శ్రీవెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ -
డీఆర్వోకు కలెక్టర్ క్లాస్?
రెవెన్యూలో ‘లేఖ’ప్రకంపనలు మహారాణిపేట: ఆర్డీవో శ్రీలేఖ రాసిన లేఖ వ్యవహారంపై ‘రెవెన్యూలో శ్రీలేఖ కలకలం’ శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం జిల్లా రెవెన్యూ శాఖలో ప్రకంపనలు సృష్టించింది. ఉన్నతాధికారుల మధ్య కోల్ట్వార్ వెలుగులోకి రావడంతో రెవెన్యూ, నిఘా వర్గాల ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి.. ఏం జరుగుతుందోనని ఆరా తీశారు. జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్ శుక్రవారం హుటాహుటిన కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ను కలిశారు. ఈ అంశంపై వారిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో డీఆర్వో తీరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఆయనకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వివాదంపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు కూడా స్పందించారు. కలెక్టర్ను కలిసి, శాఖ ప్రతిష్టకు భంగం కలగకుండా తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని, అనవసర రాద్ధాంతం చేయవద్దని కలెక్టర్ వారికి సూచించినట్లు సమాచారం. -
శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం పురోగతి
డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ హరప్రసాద్ మద్దిలపాలెం : శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం పురోగతి సాధిస్తోందని డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్.వి.హర ప్రసాద్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఎన్ఎస్టీఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అకడమిక్ కాన్ఫరెన్స్–2025ను శుక్రవారం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన పలు సాంకేతికతలు సమర్ధవంతంగా వినియోగించి సత్ఫలితాలను సాధించిన విధానాన్ని వివరించారు. డీఆర్డీవో సమిష్టిగా విశ్వవిద్యాలయాలు సాంకేతిక విద్యాసంస్థలతో కలసి పరిశోధనలు నిర్వహించే దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 100 విద్యాసంస్థలకు చెందిన 500 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో భాగస్వామ్యం అయ్యారన్నారు. నీటిలోపల లోతైన ప్రదేశంలో సమాచారాన్ని సంగ్రహించి, విశ్లేషించే నూతన వ్యవస్థలు, స్టైల్త్ టెక్నాలజీ, సెన్సార్లు వంటివి దేశీయంగా అభివృద్ధి చేయడం, వినియోగించడం జరుగుతోందని తెలిపారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ సాంకేతికతలో స్వీయ వికాసం కలిగి ఉండాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల నుంచి నూతన ప్రొజెక్టర్ టామ్సేజ్ సాంకేతికతలను అభివృద్ధి చేసే దిశగా పరిశోధనలో పెరగాలని సూచించారు. ఐడీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ మను కోరుల్లా వర్చువల్ విధానంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో 100 పేటెంట్లు సాధించడం లక్ష్యంగా కలిసి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ అబ్రహం వర్గీస్, ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి.శశిభూషణరావు, కార్యక్రమ సమన్వయకర్త ఆచార్య టి.వి.కె భానుప్రకాష్, ఏఐఓ, ఎన్ఎస్టీఎల్ శాస్త్రవేత్త విఎప్ సాజీ, డిప్యూటి శాస్త్రవేత్త టి.వేణుగోపాలరావు, డీఆర్డీవో శాస్త్రవేత్తలు తదితరులు ప్రసంగించారు. -
కాసుల వేట
కమర్షియల్ ట్యాక్స్కు కాసులు కురిపిస్తున్న దీపావళి సాక్షి, విశాఖపట్నం: జిల్లా శివారు ప్రాంతానికి ఒడిశా నుంచి ఓ పెద్ద వ్యాన్ వచ్చింది. ముందస్తు సమాచారం మేరకు వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది ఆ వ్యాన్ను అడ్డగించారు. తెరిచి చూస్తే.. అందులో భారీగా బాణసంచా సామగ్రి ఉంది. కానీ, దానికి సంబంధించిన ఎలాంటి బిల్లులూ లేవు. సీజ్ చేస్తామంటూ హడావుడి చేశారు. కానీ అరగంటలోనే అంతా సద్దుమణిగింది. పట్టుకున్నప్పుడు మతాబులా వెలిగిన కేసు.. కాసేపటికే చైనా టపాసులా తుస్సుమనిపోయింది. ఇందుకు కారణం.. అందులోని టపాసులు కాస్తా ‘కాసులు’గా మారి అధికారుల జేబుల్లోకి చేరడమే? వాణిజ్య పన్నుల శాఖలోని కొందరు సిబ్బందికి దీపావళి కాసుల వర్షం కురిపిస్తోంది. బిల్లులు లేకుండా వస్తున్న వాహనాలను పట్టుకోవడం, వ్యాపారులతో బేరసారాలు జరిపి పండగ చేసుకోవడం.. గత వారం రోజులుగా ఇదే తంతు సాగుతోంది. సరకు విలువను బట్టి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. చివరికి.. క్రాకర్స్ దుకాణాల లైసెన్సుల విషయంలోనూ పక్కా ‘కమర్షియల్’గా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దొడ్డిదారిన బాణసంచా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండగను జరుపుకొంటాం. కానీ, వాణిజ్య పన్నుల శాఖలోని కొందరికి మాత్రం ఇది కాసులు కురిపించే పండగగా మారింది. బాణసంచా కొనుగోళ్లు, దిగుమతులు, స్టాల్స్ అనుమతుల పేరుతో ప్రభుత్వ ఖజానాకు వచ్చేది గోరంత అయితే.. సిబ్బంది జేబుల్లోకి చేరుతున్నది కొండంత అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పదుల సంఖ్యలో వాహనాలు ఎలాంటి బిల్లులు లేకుండా జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించాయి. ఈ సమాచారం తెలుసుకున్న నిఘా బృందాలు విజయనగరం, ఒడిశా మార్గాల్లో పహారా కాశాయి. అయితే, ఒకట్రెండు వాహనాలను పట్టుకున్నట్లు చూపించిన సిబ్బంది.. మిగిలిన వాటిని చూసీచూడనట్లు వదిలేశారని తెలుస్తోంది. వ్యాపారులతో కుమ్మక్కై.. భారీగా మామూళ్లు అందుకొని విడిచిపెట్టారని సమాచారం. ఈ వాహనాల్లోని బాణసంచా విలువ ఆధారంగా రేటు కట్టి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. వీటిని నిజాయతీగా పట్టుకొని, విలువ ఆధారంగా పన్ను విధిస్తే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేరేది. కానీ, కొందరు సిబ్బంది తమ జేబులు నింపుకోవడానికి సొంత శాఖకే కన్నం వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా రూ. కోట్ల విలువైన బాణసంచా ఎలాంటి అనుమతులు, బిల్లులు లేకుండా నగరంలోకి దొడ్డిదారిన చేరిందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. నీకూ లాభం.. మాకూ లాభం నగర పరిధిలో బాణసంచా అమ్మకాల కోసం జీవీఎంసీ, రెవెన్యూ, అగ్నిమాపక, విద్యుత్, పోలీస్ శాఖల అధికారులతో కూడిన కమిటీ నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరి. ఇక్కడే వాణిజ్య పన్నుల విభాగం సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. తాత్కాలిక విక్రయదారులకు డీలర్షిప్ ఉండదు కాబట్టి, వారికి అడ్వాన్స్డ్ లైసెన్స్లు జారీ చేస్తారు. దీని ప్రకారం తాము విక్రయించబోయే సరకు విలువపై 18శాతం జీఎస్టీని ముందుగానే చెల్లించాలి. ఉదాహరణకు రూ.లక్ష విలువైన సరకు అమ్మితే రూ.18వేలు పన్నుగా చెల్లించాలి. వ్యాపారం ముగిశాక, అమ్మిన సరకు విలువ అంచనా కన్నా ఎక్కువైతే మిగిలిన పన్ను చెల్లించాలి లేదా తక్కువైతే అదనంగా కట్టిన డబ్బును అధికారులు వాపసు ఇవ్వాలి. అయితే, ఇక్కడే కొందరు సిబ్బంది వ్యాపారులతో కుమ్మక్కవుతున్నారు. ‘ఎంత సరకై నా అమ్ముకో.. ప్రభుత్వానికి కొద్దిగా పన్ను కట్టి, మాకు కొంత మామూలు ఇస్తే చాలు. నీకూ లాభం, మాకూ లాభం’ అంటూ లెక్కలతో సహా వివరిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం డివిజన్ కార్యాలయంలోని ఓ అధికారి ఆదేశాలతో.. సర్కిళ్ల వారీగా వసూళ్లకు ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని కింది నుంచి పై స్థాయి వరకు పంచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ విధంగా కొందరు అధికారులు బాణసంచా వ్యాపారం పేరుతో ‘అడ్డగోలు వసూళ్ల దీపావళి’ని ఘనంగా జరుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా బాణసంచా దిగుమతి చేస్తున్న వ్యాపారులు పట్టుకొని వదిలేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది బాణసంచా విలువను బట్టి.. వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు లైసెన్సులు మంజూరు విషయంలోనూ చేతివాటం -
ఆకట్టుకున్న క్రీడా పరికరాల ప్రదర్శన
విశాఖ స్పోర్ట్స్: సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్లో భాగంగా శుక్రవారం డీఎస్ఏ జిమ్నాస్టిక్స్ ఇండోర్ హాలులో క్రీడా పరికరాలు, హస్తకళల ప్రదర్శన, విక్రయాలను ఏర్పాటు చేశారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, సెట్విస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనను క్రీడాకారులు, నగర ప్రజలు వీక్షించారు. ముఖ్యంగా క్రీడా పరికరాల కొనుగోలుకు ఆసక్తి చూపించారు. ఎగ్జిబిషన్ను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సందర్శించి అందుబాటులో ఉన్న వస్తువుల నాణ్యతను పరిశీలించారు. జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వరరావు, సెట్విస్ సీఈవో కవిత, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
గల్లంతైన శ్రీను మృతదేహం లభ్యం
మూలకుద్దు వద్ద శ్రీను మృతదేహం లభ్యం తగరపువలస: జీవీఎంసీ భీమిలి జోన్, ఒకటో వార్డులోని బాలాజీనగర్ వద్ద గోస్తనీ నదిలో మంగళవారం స్నానానికి దిగి గల్లంతైన తమ్మిన శ్రీను (36) మృతదేహం శుక్రవారం మూలకుద్దు తీరంలో లభించింది. శ్రీను ఆచూకీ కోసం మూడు రోజులుగా భీమిలి పోలీసులు, తాళ్లవలస అగ్నిమాపక సిబ్బంది, బంధువులు, మత్స్యకారులు, ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందం టి.నగరపాలెం, తగరపువలస ప్రాంతాల్లోని గోస్తనీ నదిలో గాలించారు. కాగా.. శుక్రవారం శ్రీను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాలాజీనగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. శ్రీనుకు భార్య సుగుణతో పాటు 10, 12 ఏళ్ల వయసు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 13న మృతుడి బావ పీసా త్రిమూర్తులు ఆత్మహత్య చేసుకున్నారు. 14న జరిగిన ఆయన అంత్యక్రియల అనంతరం, శ్రీను నదిలో స్నానానికి దిగి గల్లంతైన సంగతి తెలిసిందే. కేవలం రెండు రోజుల వ్యవధిలో బాలాజీనగర్కు చెందిన బంధువులు ఇద్దరు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈ రెండు సంఘటనలకు సంబంధించి భీమిలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
స్వచ్ఛత జీవితంలో భాగం కావాలి
ఏయూక్యాంపస్: స్వచ్ఛత మానవ జీవితంలో అంతర్భాగం కావాలని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.సూర్యప్రకాశరావు అన్నారు. ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం బీచ్ రోడ్డులో నిర్వహించిన స్వచ్ఛత 5.0 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా కాళీమాత ఆలయం నుంచి చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి, కోకో ఎరీనా వద్ద నిర్వహించిన బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశరావు మాట్లాడుతూ స్వచ్ఛత ప్రాధాన్యం దేశం తెలుసుకుందని, ఈ దిశగా ప్రతి వ్యక్తి అడుగులు వేస్తున్నారన్నారు. ఆదాయపు పన్ను శాఖ–1 ప్రిన్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛత ప్రాధాన్యం, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలుసుకోవాలన్నారు. తడి, పొడి వ్యర్థాలను వేరుచేయడం, సక్రమంగా నిర్వహించడం ఎంతో అవసరమన్నారు. స్వచ్ఛత ప్రాముఖ్యతను ప్రజలకు చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ ఆఫీస్, వ్యర్థాల విభజన, పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగుల్లో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో ఆదాయ పన్ను(అపీల్స్)–3 కమిషనర్ సత్యసాయి రథ్, ఆదాయ పన్ను శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీ.. వివాహిత మృతి
భర్తకు తీవ్ర గాయాలు కూర్మన్నపాలెం: కూర్మన్నపాలెం కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున మృత్యువు కాపు కాసింది. పైళ్లె ఏడాదైన జంట స్కూటీపై ప్రయాణిస్తుండగా.. ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు వారి జీవితాలను కబళించింది. నిండు నూరేళ్ల దాంపత్యం ఒక్క క్షణంలోనే విషాదంగా ముగిసింది. కూర్మన్నపాలెం ముఖ్య కూడలి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పెదగంట్యాడ మండలానికి చెందిన వియ్యపు ఉమాదేవి(22) మృతి చెందగా, ఆమె భర్త పైడిరాజు గాయపడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి దువ్వాడ పోలీసులు అందించిన వివరాలివి.. విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న వియ్యపు పైడిరాజు, తన తల్లిదండ్రులు, భార్యతో కలిసి పెదగంట్యాడ మండలం సీతానగరంలో నివాసం ఉంటున్నాడు. అనకాపల్లి మండలం కొత్తూరులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాల్సి ఉండడంతో శుక్రవారం తెల్లవారుజామున భార్య ఉమాదేవితో కలిసి స్కూటీపై ఇంటి నుంచి బయలుదేరాడు. కూర్మన్నపాలెం కూడలికి సమీపిస్తున్న సమయంలో.. సింథియా నుంచి చోడవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వారి స్కూటీని బలంగా ఢీకొంది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ఉమాదేవి కుడి వైపునకు, పైడిరాజు ఎడమ వైపునకు పడిపోయారు. ఉమాదేవిపై నుంచి బస్సు చక్రాలు దూసుకుపోవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పైడిరాజుకు నడుము భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా.. ఉమాదేవికి, పైడిరాజుకు వివాహం జరిగి ఏడాది కావస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఉమాదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. సీతానగరంలో విషాదఛాయలు పెదగంట్యాడ: కూర్మన్నపాలెం కూడలి వద్ద జరిగిన ప్రమాదంలో ఉమాదేవి దుర్మరణంతో సీతానగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పైళ్లెయిన ఏడాదికే ఆమెను మృత్యువు బస్సు రూపంలో కబళించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
గోదావరి ఎక్స్ప్రెస్లో చోరీ కేసు ఛేదన
రూ. 7 లక్షల విలువైన బంగారు నగలు, మొబైల్ రికవరీ తాటిచెట్లపాలెం: రైలులో చోరీకి గురైన బంగారు ఆభరణాలను గుర్తించి, దొంగతనానికి పాల్పడిన మైనర్ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గవర్నమెంట్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాలివి. ఈ నెల 14న హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చే గోదావరి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న చిగురువలసకు చెందిన అట్లూరి హేమకుమారి బంగారు నగలు చోరీకి గురయ్యాయి. దీనిపై బాధితులు విశాఖపట్నం గవర్నమెంట్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీఆర్పీ సీఐ సిహెచ్.ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ కేటీఆర్ లక్ష్మి, సిబ్బంది ఎల్. ఉదయ్భాస్కర్, జి. దుర్గాప్రసాద్, ఎం.రాజేష్లతో కూడిన బృందం ఈ కేసును దర్యాప్తు చేపట్టింది. రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్కు ఈ చోరీలో సంబంధం ఉన్నట్లు గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.7లక్షల విలువైన చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు. ఇందులో రెండు వరుసల బంగారు చంద్రమాల(24 గ్రాములు), బంగారు నల్లపూసల గొలుసు(17.24 గ్రాములు), లాకెట్ ఉన్న బంగారు గొలుసు(17.068 గ్రాములు), ఒక శాంసంగ్ మొబైల్ ఫోన్ ఉన్నాయి. మైనర్ను జువైనెల్ హోమ్కు పంపించినట్లు జీఆర్పీ సిబ్బంది తెలిపారు. -
‘గోదావరి’ కోసం అంత తొందరేంటో?
సాక్షి, విశాఖపట్నం: సంస్థలన్నింటిలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) తీరు వేరు అన్నట్లుగా ఉంది ఇక్కడి అధికారుల వ్యవహారం. నిర్మాణం పూర్తికాకుండానే డ్రెడ్జర్ను ప్రారంభించేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కొచ్చిన్ షిప్యార్డులో నిర్మితమవుతున్న భారీ డ్రెడ్జర్ ‘గోదావరి’ని ఈ నెల 18న ప్రారంభించేందుకు (కమిషనింగ్) డీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి దీని పనులు పూర్తవ్వాలంటే మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కానీ కొత్తగా ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్న ఓ అధికారి.. తన హయాంలోనే ఈ అతిపెద్ద డ్రెడ్జర్ ప్రారంభమైందని చెప్పుకోవాలనే అత్యాశతోనే ఈ అడ్డగోలు కార్యక్రమానికి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. డీసీఐలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు అమలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉన్నతాధికారి పదవిలో ఉన్నా లేకపోయినా.. అన్నీ తానై చక్రం తిప్పుతున్న ఓ అధికారి అర్థం లేని నిర్ణయాలు తీసుకుంటూ డీసీఐ పరువును బంగాళాఖాతంలో కలిపేసేందుకు ప్రయత్నిస్తున్నారని సంస్థ వర్గాలే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కాంట్రాక్టుల నుంచి బదిలీల వరకు అన్నింటా ఆయన చెప్పిందే శాసనంగా మారిందని అంటున్నారు. తాజాగా ‘గోదావరి’ డ్రెడ్జర్ ప్రారంభోత్సవం విషయంలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. బాస్ వస్తే.. తనకు పేరు రాదని..! భారతదేశంలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత అధునాతనమైన ‘గోదావరి’ డ్రెడ్జర్ను ఈ నెల 18న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు పూర్తికాకుండా కమిషనింగ్ చేయడం వెనుక సదరు అధికారి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన నియామకంపై ఉత్తర్వులు వెలువడేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం. ఆయన మరో మూడు నెలల పాటు ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మూడు నెలల తర్వాత పూర్తిస్థాయి బాస్ వస్తే.. ఈ ఘనత తన ఖాతాలో చేరదనేది ఆ అధికారి దూరదృష్టిగా కనిపిస్తోంది. అందుకే అతిపెద్ద డ్రెడ్జర్ ప్రారంభోత్సవం తన హయాంలోనే జరిగిందన్న పేరు నిలిచిపోవాలని ఆదరాబాదరాగా ఈ కార్యక్రమానికి తెరలేపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, డీసీఐ ఉన్నతాధికారి పోస్టుకు బోర్డు ప్యానల్ ముగ్గురు అనుభవజ్ఞులను ఎంపిక చేసింది. వీరిని ఇంటర్వ్యూ చేసి ఒకరిని నియమించాల్సి ఉంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరు ఎంపికై నా తన ప్రాధాన్యత తగ్గుతుందనే భయంతో ఆ అధికారి.. ఆ ఫైల్ ముందుకు కదలకుండా అడ్డుకుంటున్నారని కూడా తెలుస్తోంది. ‘గోదావరి’వస్తే డీసీఐ బలోపేతం ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ‘గోదావరి’ట్రయిలింగ్ సక్షన్ హాపర్ డ్రెడ్జర్(టీఎస్హెచ్డీ)ని డీసీఐ నిర్మిస్తోంది. సుమారు రూ.950 కోట్ల వ్యయంతో ఇది రూపుదిద్దుకుంటోంది. భారత సముద్ర రవాణా సామర్థ్యంలో ‘గోదావరి’ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. ఇది 127 మీటర్ల పొడవు, 28 మీటర్ల వెడల్పుతో నిర్మితమవుతోంది. ప్రస్తుతం డీసీఐ వద్ద 10 ట్రయిలింగ్ సక్షన్ హాపర్ డ్రెడ్జర్లు, ఒక కట్టర్ సెక్షన్ హాపర్ డ్రెడ్జర్, ఒక బ్యాక్ హో డంబ్నాన్ ప్రొపెల్లడ్, ఒక ఇన్లాండ్ కట్టర్ సక్షన్ డ్రెడ్జర్లు ఉన్నాయి. వీటన్నింటి సామర్థ్యం 59,000 క్యూబిక్ మీటర్లు కాగా.. ‘గోదావరి’ ఒక్కదాని సామర్థ్యమే 12,000 క్యూబిక్ మీటర్లు. అంటే.. గోదావరి చేరిన తర్వాత డీసీఐ మొత్తం సామర్థ్యం 71,000 క్యూబిక్ మీటర్లకు చేరనుంది. ఇంతటి ప్రతిష్టాత్మక డ్రెడ్జర్ తయారీ విషయంలో సదరు అధికారి తన స్వప్రయోజనం చూసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పనులు పూర్తి కాకున్నా.. ప్రారంభించేద్దాం! భారతదేశంలోనే అతిపెద్ద డ్రెడ్జర్ను డీసీఐ నిర్మిస్తోంది. నెదర్లాండ్స్కు చెందిన రాయల్ ఐహెచ్సీ సహకారంతో కొచ్చిన్ షిప్యార్డులో తయారవుతున్న ఈ డ్రెడ్జర్ కీల్ (నిర్మాణంలో ప్రధాన దశ)ను 2024 సెప్టెంబర్లో కేంద్ర షిప్పింగ్, జలరవాణా శాఖామంత్రి సర్బానంద సోనోవాల్ వర్చువల్గా ప్రారంభించారు. వాస్తవానికి ఈ డ్రెడ్జర్కు ‘బ్రహ్మపుత్ర’అని కేంద్ర మంత్రిత్వ శాఖ పేరు సూచించగా.. తర్వాత ‘గోదావరి’గా మార్చారు. ప్రస్తుతం ఈ నౌకా నిర్మాణం ట్రయల్ రన్ దశలో ఉంది. ఒకటి రెండు ట్రయల్ రన్స్ నిర్వహించి, లోటుపాట్లను గుర్తించి, వాటిని సరిచేశాకే కమిషనింగ్ చేస్తారు. ఇందుకు మరో మూడు నెలల సమయం పడుతుందని షిప్యార్డు వర్గాలు స్పష్టం చేస్తున్నా.. డీసీఐ మాత్రం పనులు పూర్తి కాకున్నా ఫర్వాలేదు, ఈ నెలలోనే ప్రారంభించేద్దామని తొందరపెడుతోంది.


