breaking news
Visakhapatnam District News
-
మహామంత్ర భజనతో భక్తి పారవశ్యం
పీఎం పాలెం: వైజాగ్ కన్వెన్షన్ హాలులో శని వారం హరేకృష్ణ మహామంత్ర భజన కార్య క్రమం భక్తులను ఆధ్యాత్మిక ఆనంద లోకాలకు తీసుకెళ్లింది. నగరంలోని ‘హరేకృష్ణ మూవ్మెంట్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ‘మహామంత్ర భజన క్లబ్బింగ్’ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ సంకీర్తనలో ‘హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే –హరేరామ హరేరామ రామ రామ హరేహరే’ అనే మహామంత్రాన్ని వివిధ సంగీత వాయిద్యాల మేళవింపుతో వీనులవిందుగా ఆలపించారు. హరేకృష్ణ మూవ్మెంట్ ప్రెసిడెంట్ శ్రీమాన్ నిష్కించన భక్తదాస, యదురాజా దాస మాట్లాడుతూ.. మానసిక ప్రశాంతత ద్వారానే భగవంతుని సన్నిధిని పరిపూర్ణంగా ఆస్వాదించగలమని పేర్కొన్నారు. విశ్వశాంతికి భగవన్నామ స్మరణ, భజనలే రాజమార్గమన్నారు. -
41 అంశాలు ఆమోదం...రెండు తిరస్కరణ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థాన ట్రస్ట్బోర్డు సమావేశం శనివారం శ్రీకృష్ణాపురంలోని గోశాలలో జరిగింది. చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో జల్లేపల్లి వెంకటరావు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అజెండాలో చేర్చిన మొత్తం 43 అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన బోర్డు.. అందులో 41 అంశాలకు ఆమోదం తెలపగా, రెండు ప్రతిపాదనలను ఏకగ్రీవంగా తిరస్కరించింది. ముఖ్యంగా వచ్చేనెల 28న జరిగే గిరిప్రదక్షిణ ఏర్పాట్లు, కొండపైన సత్రాల నిర్వహణ, ఇంజనీరింగ్ సెక్షన్ ద్వారా చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులపై బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరస్కరించిన రెండు ప్రధాన అంశాలు దేవస్థానానికి సంబంధించిన రెండు ప్రతిపాదనలపై సభ్యులంతా అసమ్మతి వ్యక్తం చేస్తూ పక్కన పెట్టారు. సింహగిరిపై ‘ప్రసాద్’ పథకం కింద నిర్మించిన మల్టీ పర్పస్ హాల్ను కల్యాణ మండపంగా మార్చి అద్దెకు ఇవ్వాలనే ప్రతిపాదనను బోర్డు పూర్తిగా తోసిపుచ్చింది. ఆ భవనాన్ని కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని, పెళ్లిళ్లకు అద్దెకు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. అలాగే నగరంలోని వైభవ్ వేంకటేశ్వర స్వామి ఆలయ కోనేరు నిర్మాణం కోసం దేవస్థానానికి చెందిన స్థలాన్ని కేటాయించే అంశాన్ని కూడా సభ్యులు తిరస్కరించారు. ఈ విషయంపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని బోర్డు అభిప్రాయపడింది. ఆమోదం పొందిన ముఖ్యమైన పనులు భక్తుల సౌకర్యార్థం, ఆలయ అభివృద్ధి కోసం పలు కీలక ప్రాజెక్టులకు ట్రస్ట్బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింహగిరిపై నీటి కొరత రాకుండా దీర్ఘకాలిక అవసరాల కోసం రూ.8.82 కోట్లతో జీవీఎంసీ ద్వారా కొండ దిగువ నుంచి కొండపైకి పైప్లైన్లు నిర్మించే పనులకు ఆమోదం తెలిపారు. అలాగే శ్రీనివాసనగర్లో కొత్తగా నిర్మించిన నాలుగు కల్యాణ మండపాలను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వకుండా, దేవస్థానమే స్వయంగా నిర్వహించాలని నిర్ణయించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రూ.38 లక్షల వ్యయంతో కొండపైన, కొండ దిగువన ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఓకే చెప్పారు. దీనితో పాటు రూ.39 లక్షలతో కొండ దిగువన గల తొలిపావంచా వద్ద కొత్త మండపం, డ్రైనేజీల నిర్మాణ పనులకు బోర్డు అనుమతి ఇచ్చింది. సమావేశంలో ట్రస్ట్బోర్డు సభ్యులు కరక దేవుడు, కసిరెడ్డి దామోదర్, చలుమూరి భారతి, నీటిపల్లి మహేష్, గుత్తికొండ శ్రీలత, పెద్దిశెట్టి ఉషశ్రీ, మధుపాడ సన్యాసిరావు, మాకేన సీతారాం పాత్రుడు, కనకాల మురళీమోహన్, వెంపడాపు అన్నపూర్ణ, బీతల నీరజ లక్ష్మీకుమారి, డాక్టర్ శ్రీధరణి బండ్ల, లలిత జ్యోతి, సుసరపు గణపతిరావు, చల్లంగి జ్ఞానేశ్వరి, పావులూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రత్యేక ఆహ్వానితులు బోకం స్వామినాయుడు, వేదుల దక్షిణామూర్తి, ఎక్స్ అఫీషియో సభ్యుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు. సింహాచలం ట్రస్ట్ బోర్డు సమావేశం -
ఉండవల్లిలో దాడుల వెనుక చంద్రబాబు కుట్ర
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సాక్షి, విశాఖపట్నం: ఉండవల్లిలో వైఎస్సార్సీపీ నాయకులు, రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కోడిగుడ్లతో దాడులకు పాల్పడటం వెనుక సీఎం చంద్రబాబు కుట్ర ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు ఆరోపించారు. శనివారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతి, అప్పులు, రైతుల సమస్యలు ప్రజల దృష్టికి రాకుండా చేయడానికే ఈ దాడులను ప్రోత్సహించారని విమర్శించారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు ప్రయాణిస్తున్న వాహనాలు ధ్వంసం కాగా, గాయపడిన ఒక పోలీస్ కానిస్టేబుల్ను వైఎస్సార్సీపీ నాయకులే ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు.బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతుల ఆహ్వానం మేరకు వారి భూములను పరిశీలించేందుకు వెళ్లిన ప్రతినిధులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కె.కె. రాజు మండిపడ్డారు. పెనుమాకలో భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి నీటిని మళ్లిస్తున్నారని, సాగు కాకుండా మట్టి తవ్వకాలు, కాలువలు, రహదారుల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. బాధితుల అనుమతి లేకుండానే వారి భూములను రికార్డుల్లో ప్లాట్లుగా చూపించి రిజిస్ట్రేషన్లు చేశారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయన్నారు. కొంతమంది పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, దాడులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అమరావతి కోసం ఇప్పటికే రూ.47,385 కోట్ల భారీ అప్పులు చేశారని, ఆ భారం వల్లే రాష్ట్రంలో విద్య, వైద్యం, సంక్షేమ రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో, వివాదాస్పద రిజిస్ట్రేషన్లపై పూర్తి వివరాలు వెల్లడించాలని, రైతుల భూముల్లో జరిగిన మట్టి తవ్వకాలపై స్వతంత్ర విచారణ జరపాలని కె.కె. రాజు డిమాండ్ చేశారు. దాడికి తెగబడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులపై కొనసాగుతున్న వేధింపులను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేస్తూ, రాజధాని పేరుతో జరుగుతున్న కాంట్రాక్టు అక్రమాలను, అధికార దౌర్జన్యాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తామని హెచ్చరించారు. రైతుల న్యాయపోరాటానికి వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. -
భానుడు బ్రేక్.. వరుణుడి ఎంట్రీ
● జాబిలికి కరోనా..! ఏంటి.. ఆశ్చర్యపోతున్నారా.! మహమ్మారిని మర్చిపోతున్న తరుణంలో మళ్లీ కరోనా ఏంటని సందేహపడుతున్నారా.! అదీ.. మామ కాని మామ చందమామకి కరోనా ఏంటని ఆశ్చర్యపోతున్నారా.! నిజమేనండీ బాబూ.. నిజంగానే జాబిల్లికి కరోనా వచ్చింది. కానీ. ఇది మనుషులకి వచ్చిన కరోనా కాదండోయ్. ఇది లూనార్ కరోనా.. దీనినే చంద్ర పరివేషం అంటారు. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండి, పల్చటి మేఘాల్లోని నీటి బిందువులు లేదా మంచు స్ఫటికాల గుండా చంద్రకాంతి వివర్తనం చెందడంతో ఈ అరుదైన సహజ దృశ్యం ఏర్పడుతుంది. రైతులు దీనిని త్వరలో వర్షాలు లేదా అల్పపీడనం వచ్చే సూచనగా భావిస్తుంటారు. –సాక్షి,విశాఖపట్నం: ఫొటో : సాక్షిఫొటోగ్రాఫర్ ర్యాంప్పై అపు‘రూపాలు’ -
బాకై ్సట్ తవ్వకాలపై రగడ
మహారాణిపేట: గిరిజన చట్టాలను గౌరవించాలని, గిరిజన ప్రాంతాల హక్కుల రక్షణలో ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర కోరారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ గిరిజన వనరుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పోడియం వద్ద నిరసన సమావేశం ప్రారంభం కాగానే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాకై ్సట్ తవ్వకాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించి రహస్యంగా సర్వేలు జరుగుతున్నాయని అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు గంగరాజు ఆరోపించారు. అరకు, అనంతగిరి, హుకుంపేట మండలాల్లో డ్రోన్లు, హెలికాప్టర్ల వినియోగం, భారీ వాహనాల రాకపోకలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి మద్దతుగా ఈర్లె అనురాధ, పైలా సన్యాసిరాజు, సోము సత్యనారాయణ, సుంకరి గిరిబాబు, దొండా రాంబాబు తదితర సభ్యులు పోడియంను చుట్టు ముట్టి, అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. తక్షణమే ఈ సర్వేలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్పందించిన చైర్పర్సన్ జె. సుభద్ర, గిరిజనుల హక్కులను కాలరాసే ఏ చర్యకై నా సహకరించవద్దని అధికారులను ఆదేశించారు. తవ్వకాలపై జీవోలు లేవు: జేసీ శ్రీపూజ అల్లూరు జిల్లాలో బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి ఎటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు జరగడం లేదని జేసీ తిరుమణి శ్రీపూజ స్పష్టం చేశారు. బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి ఎలాంటి జీవోలు విడుదల కాలేదని, సర్వేలు నిర్వహించేందుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎటువంటి అనుమతులు జారీ చేయలేదని వెల్లడించారు. అనంతరం సమావేశంలో పలు ప్రజా సమస్యలపై చర్చ జరిగింది. అల్లూరి జిల్లా డీఎంహెచ్వో పనితీరుపై అసంతృప్తి వ్యక్తం కాగా, ఆయనను సరెండర్ చేయాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సూచించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యులు, మందులను అందుబాటులో ఉంచాలని చైర్పర్సన్ సుభద్ర కోరారు. ● అక్రమ మైనింగ్, హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై గిరిజనులు వ్యతిరేకంగా ఉన్నారని అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం గుర్తు చేశారు. ఈ సమావేశంలో కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, విశాఖ జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో రాజ్కుమార్, అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
మహారాణిపేట: ఈ నెల 30న భారత రాష్ట్రపతి విశాఖపట్నం పర్యటించనున్న నేపథ్యంలో భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ శనివారం సంయుక్తంగా పరిశీలించారు. రాష్ట్రపతి బస చేయనున్న ఐఎన్ఎస్ చోళతో పాటు నోవాటెల్లోని సభా వేదిక, ప్రయాణ మార్గాలను అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, పారిశుధ్యం, విద్యుత్, తాగునీరు, వైద్య సేవల సిద్ధతపై సంబంధిత శాఖలకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భద్రత, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ బాగ్చీ తెలిపారు. ఈ పరిశీలనలో డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్ తదితరులు పాల్గొన్నారు. డ్రోన్ల వినియోగంపై నిషేధం అల్లిపురం: రాష్ట్రపతి విశాఖ పర్యటన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి జూలై 1 మధ్యాహ్నం 2 గంటల వరకు విమానాశ్రయం నుంచి నోవోటెల్ హోటల్ వరకు మార్గానికి ఇరువైపులా 2 కిలోమీటర్ల పరిధిని తాత్కాలిక రెడ్ జోన్గా ప్రకటించినట్లు నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ ప్రాంతంలో డ్రోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
షాడో చైర్మన్
వీఎంఆర్డీఏలోచక్రం తిప్పడంలో ఎంతో ‘వినయ’ంయుద్ధ విమానాలు,సబ్మైరెన్ మ్యూజియంల నిర్వహణ కాంట్రాక్ట్పై ఆరోపణలు విశాఖలో మాత్రమే రిజిస్ట్రేషన్ ఉండాలనే నిబంధనలపై కాంట్రాక్టర్ల భగ్గు నేవీకి ఫిర్యాదు చేసే యోచనలో పలువురు కాంట్రాక్టర్లు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ)లో ఒక షాడో చైర్మన్ చక్రం తిప్పుతున్నారు. వీఎంఆర్డీఏలో యాప్ అభివృద్ధి మొదలుకొని నిర్వహణ కాంట్రాక్టుల వరకూ అన్నింటిలోనూ సదరు షాడో చైర్మన్ వ్యవహారాలు నడుపుతున్నారు. అత్యంత ‘వినయ’ంగా వ్యవహరిస్తున్న సదరు షాడో చైర్మన్ వసూళ్ల వ్యవహారం రోజురోజుకీ మరింత పెరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా యుద్ధ విమానాలు, సబ్మైరెన్ మ్యూజియంల నిర్వహణ కాంట్రాక్టును ఒక హౌస్ కీపింగ్ సంస్థకు అప్పగించేందుకు జరుగుతున్న వ్యవహారంపై ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో గతంలో ఎన్నడూ ఏ టెండర్లోనూ లేని విధంగా, కేవలం విశాఖపట్నంలోనే కాంట్రాక్టు సంస్థ రిజిస్ట్రేషన్ ఉండాలన్న నిబంధన పెట్టడంపై కాంట్రాక్టర్లు భగ్గుమంటున్నారు. ఈ వ్యవహారంలో యుద్ధ విమానాలు, సబ్మైరెన్లను అప్పగించిన నేవీ అధికారులకు ఫిర్యాదు చేసే యోచనలో కొద్ది మంది కాంట్రాక్టర్లు ఉన్నట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యుద్ధ విమానాల మ్యూజియంల నిర్వహణ మరింత నాసిరకంగా తయారయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో, నేవీ అధికారులు దీనిపై దృష్టి సారించాలంటూ ఈ ఫిర్యాదులో పేర్కొననున్నట్టు సమాచారం. ఇదే జరిగితే వీఎంఆర్డీఏ పిలిచిన టెండర్లలో పెట్టిన నిబంధనల బాగోతం అధికారుల మెడకూ చుట్టుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేవీకి ఫిర్యాదు చేసే యోచనలో.. విశాఖ తీరంలో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్న యుద్ధ విమానాలు, సబ్మైరెన్ మ్యూజియంల నిర్వహణను మాత్రమే వీఎంఆర్డీఏకు నేవీ అప్పగించింది. అయితే, వీటి నిర్వహణ సరిగ్గా ఉందా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు నేవీ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. తాజాగా వీటి నిర్వహణ కాంట్రాక్టు అప్పగింత కోసం పిలిచిన టెండర్లో పేర్కొన్న వింత నిబంధనలను నేవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ–ప్రొక్యూర్మెంట్ విభాగంలో రాష్ట్రంలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ ఉన్న సంస్థ టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు ఉన్నాయి. అయితే, విచిత్రంగా కేవలం విశాఖలోనే రిజిస్ట్రేషన్ ఉండాలనే నిబంధనతో పాటు... రూ. 71 లక్షల విలువైన పనికి ఏకంగా రూ. 5 కోట్ల టర్నోవరు కావాలంటూ పెట్టిన నిబంధనపైనా కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. కేవలం ముందుగానే ఎంపిక చేసిన సంస్థకు మాత్రమే టెండర్ దక్కేలా చేయడంలో భాగంగానే ఈ వ్యవహారం సాగుతుందంటూ టెండర్ డాక్యు మెంట్లతో కూడిన ఆధారాలతో నేవీ అధికారులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే వీఎంఆర్డీఏలో జరుగుతున్న వింతలు మరింతగా అభాసుపాలయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలోనూ..వాస్తవానికి వీఎంఆర్డీఏలో జరుగుతున్న వ్యవహారాలపై ఇప్పటికే అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యాప్కు వెచ్చించిన మొత్తంతో పాటు అప్పగించిన సెక్యూరిటీ కాంట్రాక్టుల వరకూ అనేక విమర్శలున్నాయి. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలోనూ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా అధికారపార్టీకి చెందిన నేతల భూములకు మరింత విలువ పెంచేందుకు అనుగుణంగా వ్యవహారం సాగించారనే విమర్శలున్నాయి. ఇక వీఎంఆర్డీఏ కమిషనర్ బంగ్లాలో చేపట్టిన హోం థియేటర్ నిర్మాణ వ్యయం విషయంలోనూ, ఈ కాంట్రాక్టును అప్పగించి న సంస్థతోనూ షాడో చైర్మన్ వ్యవహారాలు చక్కబెట్టారనే ఆరోపణలున్నాయి. ఇక కైలాసగిరి కొండపై చేపట్టిన త్రిశూల్ నిర్మా ణ వ్యయం విషయంలోనూ రోజుకో మా ట చెబుతూ... ఏకంగా నిర్మా ణ వ్యయాన్ని మొదటగా రూ. 1.55 కోట్లుగా శంకుస్థాప న సందర్భంగా చెప్పిన వీఎంఆర్డీఏ అధికారులు... ప్రారంభోత్సవ సమయానికి ఏ కంగా రూ. 6 కోట్లకు పెంచారు. ఈ నిర్మాణ వ్యయం పెంపు వ్యవహారంలోనూ షాడో చైర్మన్దే కీలకపాత్ర అనే విమర్శలున్నాయి. ఇదే నేపథ్యంలో తాజాగా ఏకంగా యుద్ధ విమానాలు, సబ్మైరెన్ల నిర్వహణ కాంట్రాక్టును... ఇప్పటికే ఎండాడ, చీమలాపల్లిలోని కన్వెన్షన్ సెంటర్ల నిర్వహణ కాంట్రాక్టును అప్పగించిన సంస్థకే అప్పగించేందుకు వీలుగా తాజాగా ఒప్పందం కుదిరిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, మొదటగా ఇప్పటికే డెక్ నిర్వహణతో పా టు గతంలో యుద్ధ విమానాలు, సబ్మైరెన్ మ్యూజియంల నిర్వహణ కాంట్రాక్టును జనసేనకు చెందిన ఒక మహిళా నేత సంస్థ కు అప్పగించాలని వ్యవహారం సాగింది. ఇదే సంస్థకు అప్పగించాలని మొదట్లో అనుకున్నప్పటికీ... తాజాగా షాడో చైర్మన్ చక్రం తిప్పి జనసేనకు చెందిన సదరు మహిళా నేతకు కూడా ఢోకా ఇచ్చినట్టు తాజాగా తెలుస్తోంది. -
68 కేసులు.. 48 ఛేదన.. 59 మంది అరెస్ట్
అల్లిపురం: నగర పరిధిలో గత మే నెలలో నమోదైన 68 కేసుల్లో 48 కేసులను ఛేదించి, 59 మంది నిందితులను అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. నిందితుల నుంచి రూ.31.14 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు, వాహనాలు. ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా 506మిస్సింగ్ మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించారు. ఈ మొబైళ్ల విలువ రూ.74.45 లక్షలు కాగా, మొత్తం రికవరీ చేసిన ఆస్తుల విలువ రూ.1,06,59,121కు చేరుకుందని సీపీ తెలిపారు. ఈ మేరకు శనివారం నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సొత్తులో బంగారం,వెండి, రూ.1.72 లక్షల నగదు, 10 మోటార్ సైకిళ్లు, ఒక వ్యాన్, 506 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్, 90 కిలోల కాపర్ కేబుల్ ఉన్నాయన్నారు. మే నెలలో ఛేదించిన కేసుల్లో హత్య కోసం దోపిడీ కేసు ఒకటి, రోబరీ కేసులు రెండు, చైన్ స్నాచింగ్ కేసులు ఏడు, మోటార్ సైకిల్ చోరీ కేసులు పది, సాధారణ చోరీ కేసులు 25 ఉన్నాయని సీపీ వివరించారు. నేరాల నివారణలో భాగంగా మేలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో 367 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు, 367 అవగాహన సమావేశాలు నిర్వహించామన్నారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు మొత్తం 10,875 మిస్సింగ్ మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. మొబైళ్ల చోరీలపై తప్పనిసరిగా సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. -
డీసీఐఎల్లో ముగిసిన మూడు రోజుల ‘రోజ్గార్ మేళా’
మహారాణిపేట: దేశ నిర్మాణంలో ఉపాధి కల్పనకు తన నిబద్ధతను చాటుతూ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్) విశాఖలోని తన ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మూడు రోజుల రోజ్గార్ మేళా విజయవంతంగా ముగిసింది. ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పిలుపునకు అనుగుణంగా జూన్ 23 నుంచి 25 వరకు హెచ్ఆర్ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 500 మందికి పైగా అభ్యర్థులు హాజరై ఫ్లీట్ సిబ్బంది విభాగాల పోస్టుల ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. డీసీఐఎల్ చైర్మన్ జస్మీత్ సింగ్ బింద్రా, ఎండీ – సీఈఓ కెప్టెన్ ఎస్.దివాకర్ మార్గదర్శకత్వంలో ఈ నియామకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఛైర్మన్ జస్మీత్ సింగ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి కల్పన లక్ష్య సాధనలో తాము భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. ఎండీ కెప్టెన్ ఎస్.దివాకర్ మాట్లాడుతూ సముద్ర రంగ భవిష్యత్ అవసరాలను తీర్చగల సమర్థవంతమైన సిబ్బందిని తీర్చిదిద్దేందుకు డీసీఐఎల్ ఇటువంటి నియామక కార్యక్రమాలను సంవత్సరం పొడవునా కొనసాగిస్తుందన్నారు. ‘వికసిత్ భా రత్’ లక్ష్య సాధనకు స ముద్ర శ్రామిక శక్తిని తీ ర్చిదిద్దే దిశగా ఈ మే ళా మైలురాయిగా నిలిచిందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. -
ర్యాంప్పై అపు‘రూపాలు’
డాబాగార్డెన్స్: చూడటానికి ఒకేలా ఉండే కవలలు.. ఒకే రకమైన ట్రెండీ దుస్తులు ధరించి ర్యాంప్పై క్యాట్వాక్ చేస్తూ అదరగొడితే ఆ మజానే వేరు.. సరిగ్గా ఇలాంటి వినూత్న దృశ్యమే శనివారం సాయంత్రం నగరంలోని రిలయన్స్ సెంట్రో వేదికగా ఆవిష్కృతమైంది. కవలల్లో దాగి ఉన్న ప్రతిభను, వారి మధ్య ఉండే ప్రత్యేక అనుబంధాన్ని ప్రోత్సహించేందుకు ‘ది ట్విన్స్ ఎడిట్’ పేరిట నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోకు విశేష స్పందన లభించింది. చిన్నారుల నుంచి యువతీ యువకుల వరకు మొత్తం 15 జతల కవలలు ఈ పోటీలో పాల్గొని సందడి చేశారు. ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ వారు చేసిన ర్యాంప్ వాక్, క్విజ్, ఇతర ప్రదర్శనలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సెంట్రో ఎస్జీఎం వెంకట్ నారాయణ మాట్లాడుతూ.. కవలల మధ్య ఉండే స్టైల్, ప్రత్యేక బంధాన్ని ఈ వేదిక ప్రతిబింబించిందన్నారు. అనంతరం నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో శాన్వి–శైవి ప్రథమ స్థానంలో నిలవగా, శ్రీరమ్య–శ్రీలిఖిత ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. పోటీలో పాల్గొన్న కవలలందరికీ గిఫ్ట్ హ్యాంపర్లు అందజేశారు. -
‘పది’ంతల ప్రతిభకు పురస్కారాలు
మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లాలో జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో చదివి ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 11 మంది విద్యార్థులకు శనివారం పురస్కారాలు అందజేసి, ఘనంగా సన్మానించారు. జెడ్పీ సమావేశం మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాకు చెందిన సేనాపతి పునీత్ కుమార్(592), ఇమంది దేవిక (592), వంగపండు శివసాయి అతిథి(591), అనకాపల్లి జిల్లాకు చెందిన ఆడారి ప్రణతి(593), తనకాల ఉషా(592), కనిగిరి హరిణి(591), అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పరుంబుడి దేవి(593), పెరుశెట్టి ఊర్మిళ(515), కె.కీర్తన(505) పురస్కారాలు అందుకున్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, విశాఖ, అల్లూరి జేసీలు విద్యాధరి, శ్రీపూజ, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, ఎమ్మెల్యేలు మత్స్యలింగం, బండారు, డిప్యూటీ సీఈవో రాజ్కుమార్, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
అప్పన్నను దర్శించుకున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారిని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ చావ్లా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి వద్ద ఆయనకు అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోని పవిత్ర కప్పస్తంభాన్ని జస్టిస్ నవీన్ చావ్లా ఆలింగనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు శాస్త్రోక్తంగా అష్టోత్తర పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం అందజేశారు. ఏఈవో తిరుమలేశ్వరరావు ఆయనకు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. -
తాతగారు..‘గ్లాస్’వాక్
ఆరిలోవ: నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కై లాసగిరిపై కొన్ని నెలల క్రితం అందుబాటులోకి వచ్చిన గ్లాస్ బ్రిడ్జి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నిత్యం దీనిపై పర్యాటకులు పెద్ద సంఖ్యలో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నగరంలోని సీతమ్మధారకు చెందిన 94 ఏళ్ల వృద్ధుడు సూర్యనారాయణమూర్తి తన మనవడితో కలిసి కై లాసగిరిని సందర్శించారు. అక్కడ ఎంతో ఎత్తులో ఉన్న గ్లాస్ బ్రిడ్జిపై ఆయన ఉత్సాహంగా నడుస్తూ సందడి చేశారు. బ్రిడ్జి అంచుల వరకు వెళ్లి ధైర్యంగా ఫొటోలు దిగారు. 94 ఏళ్ల వయసులోనూ ఆయన చూపిన ఉత్సాహాన్ని చూసి తోటి సందర్శకులు ఆశ్చర్యపోతూ, ఆయనను ఎంతగానో అభినందించారు. -
యుద్ధ విమానాల కాంట్రాక్టా?
హౌస్ కీపింగ్ సంస్థకుసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: బీకాంలో ఫిజిక్స్ ఉంటుందా? ఉంటుందనే బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఘనత వహించిన విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) అధికారులు. హౌస్ కీపింగ్ కాంట్రాక్టరు ఏకంగా యుద్ధ విమానాలు, సబ్మైరెన్ల నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకునేలా టెండర్లను రూపొందించడం గమనిస్తే ఇది నిజమేనని అర్థమవుతోంది. విశాఖ సముద్ర తీరంలో పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తున్న సబ్మైరెన్లు, యుద్ధ విమానాలు, మ్యూజియంల నిర్వహణ కాంట్రాక్టును కేవలం హౌస్ కీపింగ్లో అనుభవం ఉన్న సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం గతంలో ఉన్న నిబంధనలను సైతం తోసిరాజని టెండర్లను ఆహ్వానించారు. అంతేకాకుండా విశాఖలోనే ఏజెన్సీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలనే షరతు కూడా విధించారు. జనసేన పార్టీకి చెందిన మహిళా నేతకు పనులు అప్పగించేందుకే ఈ టెండర్ నిబంధనలను రూపొందించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. యుద్ధ విమానాలు, సబ్మైరెన్లు, మ్యూజియంల నిర్వహణ అనుభవం ఉన్న సంస్థ మాత్రమే టెండర్లలో పాల్గొనేలా ఉన్న నిబంధనను తీసివేసి.... కేవలం హౌస్ కీపింగ్ చేసిన అనుభవం ఉంటే చాలు అన్న నిబంధన విధించారు. నేవీకి చెందిన ఎంతో విలువైన చారిత్రక విశేషాలను కలిగి ఉండి... ఎంతో మంది పర్యాటకులకు, విద్యార్థులకు మన పోరాట చరిత్రను బోధిస్తున్న విలువైన సబ్మైరెన్లు, మ్యూజియం, యుద్ధ విమానాల నిర్వహణను హౌస్ కీపింగ్ సంస్థలకు అప్పగించడం ద్వారా వాటి పర్యవేక్షణ మూలకు చేరుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో ఒక కార్పొరేషన్ చైర్మన్తో పాటు జనసేన నేత, ఎమ్మెల్యే కీలకపాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో విలువైన యుద్ధ విమానాలు, సబ్మైరెన్ల నిర్వహణ నాసిరకంగా మారిపోయే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో నేవీ అధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమకు అనుకూలంగా నిబంధనలు వాస్తవానికి గతంలో యుద్ధ విమానాలు, సబ్మైరెన్లు, మ్యూజియంల నిర్వహణ పనుల కోసం వీఎంఆర్డీఏ టెండర్లను ఆహ్వానించినప్పుడు... టెండర్లలో స్పష్టంగా కాంట్రాక్టు సంస్థకు గతంలో యుద్ధ విమానాలు, సబ్మైరెన్లు, మ్యూజియంల నిర్వహణలో అనుభవం ఉండాలనే నిబంధన ఉండేది. నేవీకి చెందిన వీటి నిర్వహణ సాంకేతిక అంశాలతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఈ నిబంధనను విధించేవారు. ఇందుకు అనుగుణంగా టెండర్లను అప్పగించడంతో పాటు వాటి నిర్వహణ పక్కాగా ఉండేటట్టుగా చూసుకునేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిబంధనను కాస్తా పక్కనపెట్టారు. హౌస్ కీపింగ్లో అనుభవం ఉంటే చాలు అనే విధంగా టెండర్ నిబంధనలను మార్చివేశారు. గతంలో విడివిడిగా టెండర్లను ఆహ్వానించేవారు. కానీ ఈ దఫాలో మాత్రం కురుసుర సబ్మైరెన్ మ్యూజియం, కల్వరి ఫిన్, టీయూ–142 మ్యూజియం, సీ హ్యారియర్ ఎయిర్క్రాఫ్ట్, యుహెచ్3హెచ్ మ్యూజియంల నిర్వహణ కోసం సింగిల్ టెండర్ను ఆహ్వానించారు. ఇందులో పేర్కొన్న నిబంధనలన్నీ కేవలం జనసేన మహిళా నేతకు పనులు అప్పగించేందుకే అన్న చందంగా మార్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనసేన మహిళా నేత కోసమే...! విడివిడిగా టెండర్లను ఆహ్వానించకుండా... అన్నీ ఒకేసారి కలిపి, కేవలం సదరు జనసేన మహిళా నేత సంస్థకు అనుకూలంగా ఉండే నిబంధనలను మాత్రమే టెండర్లలో పేర్కొన్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఈ–టెండర్లను నిర్వహించడం అంటేనే... పోటీ పెరిగి రాష్ట్రమే కాదు దేశం నలుమూలల నుంచి సంస్థలు టెండర్లలో పాల్గొనేలా చేయడమే ప్రధాన ఉద్దేశం. సాధారణంగా దేశంలో ఎక్కడి సంస్థకై నా రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్ ఉండాలనే నిబంధన విధించడం సర్వసాధారణం. ఎందుకంటే సదరు సంస్థ కార్యకలాపాల ద్వారా వచ్చే పన్నుల ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరాలనేది దీని వెనుక ఉన్న ఉద్దేశం. అయితే తాజాగా వీఎంఆర్డీఏ పిలిచిన టెండర్లలో విచిత్రంగా విశాఖలోనే ఏజెన్సీ రిజిస్ట్రేషన్ ఉండాలంటూ వింత నిబంధనను తెరమీదకు తెచ్చారు. అంతేకాకుండా విడివిడిగా కాకుండా అన్నిటి నిర్వహణను ఒకే టెండర్ ద్వారా పిలవడం ద్వారా రూ. 1.42 కోట్ల విలువైన సింగిల్ కాంట్రాక్టు చేసిన అనుభవం ఉండాలనే నిబంధన విధించారు. తద్వారా కేవలం ఈ సంస్థకు మాత్రమే అర్హత దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా అన్ని విధాలుగా కేవలం సదరు జనసేన మహిళా నేతకే పనులు దక్కేలా చేయడమే ప్రధాన ఉద్దేశమని స్పష్టమవుతోంది. వీఎంఆర్డీఏలో ‘బీకామ్లో ఫిజిక్స్’ రాజకీయం టెండర్లలో వింతలు విశాఖలోనే ఏజెన్సీ రిజిస్ట్రేషన్ ఉండాలంటూ వింత కొర్రీలు విమానాలు, సబ్మైరెన్ల నిర్వహణలో అనుభవం ఉండాలన్న నిబంధనకు పాతర జనసేన మహిళ నేతకు అప్పగించేందుకే వ్యవహారమని విమర్శలు నాసిరకంగా యుద్ధ విమానాలు, సబ్మైరెన్ల నిర్వహణ నేవీ అధికారులు దృష్టి సారించేనా? -
లక్ష్యం ‘సామాజికం’.. మార్గం ‘సాంకేతికం’!
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చైర్ ప్రతిభా పాటవాలతో దేశంలోనే అత్యుత్తమ అంబేడ్కర్ చైర్గా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అనేక అవార్డులు, ఆవిష్కరణలు, వినూత్న పరిశోధనలతో దీని ప్రగతి ప్రస్థానం నిరంతరాయంగా కొనసాగుతోంది. 2016లో స్థాపించబడిన ఈ చైర్, 2021–22లో సవరణ పథకం కింద మరింత బలోపేతమైంది. అనంతరం 2022, ఏప్రిల్ 22న డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం మధ్య చారిత్రాత్మక జాతీయ స్థాయి ఒప్పందం కుదిరింది. అప్పటినుంచి సరికొత్త కార్యక్రమాలతో ఈ చైర్ తన పరిధిని మరింతగా విస్తరిస్తోంది. సామాజిక న్యాయం–ఆధునిక సాంకేతికత కలయికే లక్ష్యం డిజిటల్ ఇండియా, మానవ అభివృద్ధి, అంతరశాఖ ఆలోచనల కలయికే ధ్యేయంగా ఈ చైర్ ముందుకు సాగుతోంది. సామాజిక న్యాయాన్ని ఆధునిక జ్ఞాన వ్యవస్థలతో అనుసంధానించడమే దీని ప్రధాన లక్ష్యం. పరిశోధనలు, పరస్పర సహకారాలు, అకడమిక్ కార్యక్రమాలు, వనరుల నిర్వహణ వంటి విభాగాల్లో ఈ చైర్ అద్భుత వృద్ధిని సాధించిందని ఏయూ వర్గాలు గర్వంగా చెబుతున్నాయి. జాతీయ నోడల్ కేంద్రంగా అరుదైన గుర్తింపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డాక్టర్ అంబేడ్కర్ చైర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘నేషనల్ పోర్టల్’కు ఏయూ అంబేడ్కర్ చైర్ జాతీయ నోడల్ కేంద్రంగా గుర్తింపు పొందడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక కేంద్రానికి నోడల్ అధికారిగా ఆచార్య జేమ్స్ స్టీఫెన్ వ్యవహరిస్తున్నారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పరిశోధనలు కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే ఎన్నో పరిశోధనలను ఈ చైర్ చేపట్టింది. ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సీకేడీ)పై క్షేత్రస్థాయి పరిశోధనలు నిర్వహించి, వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు కృత్రిమ మేధ(ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) మోడళ్లను ఇక్కడి పరిశోధకులు అభివృద్ధి చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేకంగా ఏఐ ఆధారిత డిజిటల్ లిటరసీ ప్లాట్ఫాంను సైతం రూపొందించారు. వ్యవసాయ రంగంలో మేలు చేసేందుకు ‘అగ్రిఐ’ అనే స్మార్ట్ పెస్ట్ మేనేజ్మెంట్ పరికరాన్ని అభివృద్ధి చేసి అందుబాటులోకి తెచ్చారు. అలాగే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) స్థానికీకరణపై ఫీల్డ్ డేటాతో ప్రత్యేక అధ్యయనాలు చేపట్టడమే కాకుండా, దీర్ఘకాలిక పరిశోధనల కోసం ఐదు గ్రామాలను దత్తత తీసుకోవడం గమనార్హం. విశ్వవ్యాప్తంగా ఏయూ కీర్తిపతాకం ఏయూ అంబేడ్కర్ చైర్ ద్వారా 25కి పైగా పేటెంట్లు దాఖలు చేశాం. దక్షిణాఫ్రికా నుంచి రెండు అంతర్జాతీయ గ్రాంట్లు సాధించాం. 15కి పైగా స్కోపస్ జర్నల్స్లో పరిశోధనా పత్రాలు ప్రచురించాం. ఐదు పుస్తకాలు రచించి, ఐదు సంపుటాలు ప్రచురించాం. ఈ కృషికి గాను గ్లోబల్రీసెర్చ్ ఎక్సెలెన్స్ అవార్డు, యూనివర్సల్ ఐకాన్ అచీవర్ అవార్డు, ప్రొఫైల్ ఇన్వెంటర్ అవార్డు సాధించడం గర్వంగా భావిస్తున్నాము. ప్రపంచదేశాల సదస్సులో పాల్గొనే అవకాశం రావడం నా అదృష్టం. ఆచార్య జేమ్స్ స్టీఫెన్, నోడల్ అధికారి, అంబేడ్కర్ చైర్ -
అనుబంధ సంఘాలే పార్టీకి వెన్నెముక
మహారాణిపేట: పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత బలోపేతం చేసి, పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కే.కే.రాజు పిలుపునిచ్చారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కే.కే.రాజు మాట్లాడుతూ యువజన, విద్యార్థి, మహిళ, కార్మిక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ తదితర విభాగాలు పార్టీకి వెన్నెముక వంటివని, ఇవి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని సూచించారు. ప్రతి అనుబంధ సంఘం నెలవారీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, మండలాలు, సచివాలయాల స్థాయిలో సమావేశాలు నిర్వహించడంతో పాటు, చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత భేదాభిప్రాయాలకు తావులేకుండా అందరూ ఒకే కుటుంబంలా ఐక్యంగా పనిచేస్తూ, ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమన్వయంతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని, క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, పార్టీ జిల్లా కార్యాలయం పర్యవేక్షకుడు రవి రెడ్డి, పార్టీ నేతలు సతీష్ వర్మ, కట్టమూరి సతీష్, బోని బంగారు నాయుడు, అల్లు శంకర్ రావు, రెయ్యి డేవిడ్ రాజు, కోమటి శ్రీనివాసరావు, బాకీ శ్యామ్ కుమార్ రెడ్డి, కటారి అనిల్ కుమార్ రాజు, దొడ్డి రామనాథ్, ఆల్ఫా కృష్ణ, మనలత జోబ్దాస్ (చిన్ని), హరి కృష్ణారెడ్డి, గోవింద్, ఉరుకూటి రామచంద్రరావు, కోడిగుడ్ల పూర్ణిమ, రాయపురెడ్డి అనిల్ కుమార్, కర్రి రామారెడ్డి, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, వంకాయల మారుతీ ప్రసాద్, వడ్డాది దీలీప్ కుమార్, సకలభక్తుల ప్రసాద్ రావు, దేవరకొండ మార్కెండేయులు, బోండా ఉమా మహేశ్వర రావు, నీలిరవి, చుక్క పైడి రాజు, రెడ్ల వేణు గోపాల కృష్ణ, దంతిని రామారావు, సాయిమోహన్ రావు, మానాపురం పట్నాయక్, ఎండీ షరఫీ, బోని శివరామకృష్ణ, కిరణ్ రాజు, జీలకర్ర నాగేంద్ర, దేముడు మాస్టర్, భద్రినాథ్, పద్మా రెడ్డి , లావణ్య, కృష్ణ పాల్గొన్నారు. -
నంబర్–1 క్యాన్సర్ ఆసుపత్రిగా ‘మహాత్మాగాంధీ’
సీతంపేట: విశాఖలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎంజీసీహెచ్ఆర్ఐ) ప్రతిష్టాత్మక అవుట్లుక్ బెస్ట్ హాస్పిటల్ ర్యాంకింగ్–2026లో దేశంలోని ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రుల జాబితాలో 9వ స్థానం దక్కించుకుందని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో నంబర్–1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా 2 లక్షలకుపైగా రోగులకు చికిత్స అందించడంతో పాటు 25 వేలకుపైగా ప్రధాన శస్త్రచికిత్సలు, 30 వేలకుపైగా రేడియేషన్ చికిత్సలు, 500కుపైగా రోబోటిక్ శస్త్రచికిత్సలు, 200కుపైగా బోన్మారో మార్పిడి చికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ గుర్తింపు వైద్యులు, సిబ్బంది కృషికి, రోగులు ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్టాలిన్ చౌదరి, సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పాత్రో ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఆధునిక క్యాన్సర్ చికిత్స విధానాలను వివరించారు. -
ఘరానా దొంగ అరెస్ట్
గోపాలపట్నం: జైలు నుంచి రాగానే మళ్లీ చేతివాటం ప్రదర్శించిన ఘరానా దొంగను గోపాలపట్నం క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ జరిగిన నెల రోజుల్లోనే గోతిలో పాతిపెట్టిన బంగారాన్ని రికవరీ చేసి పాత నేరస్తుడు నూనెల కృష్ణను మళ్లీ కటకటాల్లోకి పంపించారు. శుక్రవారం గోపాలపట్నం క్రైమ్ పోలీస్స్టేషన్లో ఏసీపీ(క్రైమ్) ఎ.వెంకటరావు మీడియాతో కేసు వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. గత నెల 24న గోపాలపట్నంలోని ప్రియా గార్డెన్స్లో చోరీ జరిగింది. బాధితురాలు ఉలిమిరి కావ్యహర్షిత ఆ రాత్రి తన ఫ్లాట్కు తాళం వేసి, అదే అపార్ట్మెంట్లో ఉన్న తన స్నేహితురాలి ఫ్లాట్లో పడుకునేందుకు వెళ్లింది. ఉదయం లేచి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. లోపల సామాగ్రి మొత్తం చిందరవందరగా పడి ఉండడంతో షాక్కు గురైన ఆమె వెంటనే గోపాలపట్నం క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. సాంకేతిక ఆధారాలతో దొరికిపోయాడు! గతంలో 30కి పైగా దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండి, జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన మల్కాపురంకు చెందిన నూనెల కృష్ణపై పోలీసులకు అనుమానం వచ్చింది. నిఘా పెట్టిన సమయంలో అతను అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో వారి అనుమానం మరింత బలపడింది. ప్రత్యేక బృందాలతో సాంకేతిక ఆధారాల సహాయంతో కృష్ణను ఈ నెల 24న ఇందిరానగర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. పాతిపెట్టిన బంగారం స్వాధీనం దొంగిలించిన బంగారాన్ని ఎక్కడైనా అమ్మితే దొరికిపోతానని భయపడిన కృష్ణ.. ఆ నగలను విజయనగరంలోని ఒక రహస్య ప్రాంతంలో గొయ్యి తవ్వి పూడ్చిపెట్టాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితుడు నిజం కక్కేశాడు. కృష్ణ ఇచ్చిన సమాచారంతో ఆ స్థలంలో తవ్వకాలు జరిపి చోరీ సొత్తును వెలికితీశారు. 100 గ్రాములకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కేసులో ప్రతిభ కనబరిచిన వెస్ట్ సబ్ డివిజన్ సీఐ ఎం.చంద్రమౌళి, గోపాలపట్నం ఎస్ఐ తేజేశ్వరరావు, హెచ్సీలు ఎం.గణేశ్వరరావు, ఎల్.త్రిమూర్తులు, కానిస్టేబుళ్లు శంకరరావు, సుధాకరరావులను సీపీ అభినందించారు. -
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
ఎంవీపీకాలనీ: అప్పుఘర్ జంక్షన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దౌలపిల్లి కనకరాజు (45) అనే వ్యక్తి మృతి చెందాడు. గణేష్నగర్కు చెందిన కనకరాజు ఈ నెల 25వ తేదీ రాత్రి తన భార్య మందుల కోసం కాలినడకన మెడికల్ షాపునకు వెళ్లి తిరిగి వస్తుండగా, అప్పుఘర్ వద్ద కై లాసగిరి వైపు నుంచి అతివేగంగా వచ్చిన రాయల్ ఇన్ఫీల్డ్ బైక్ అతడిని బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కనకరాజును స్థానికులు 108 అంబులెన్సులో కేజీహెచ్కు తరలించగా, అప్పటికే మృతి చెందాడు. బైక్ నడిపిన అదపాక శ్రీనుపై ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాహసం అతని ఊపిరి... సంగీతం అతని ఆత్మ
రెండు రంగాల్లో ఆయన ‘మాస్టర్’విశాఖ నుంచి లడక్ వరకు బైక్పై సాహసయాత్ర15 రోజులు... 6500 కిలోమీటర్లు ప్రయాణంగిన్నిస్బుక్లో చోటుఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పడం వృత్తి అయితే..పర్వతాలను జయించడం, మోహనరాగాలు పలికించడం అతని ప్రవృత్తి. అగనంపూడి షిర్డీసాయినగర్ నివాసి, కన్నీడి కృష్ణమోహన్ (55) జీవితం ఒక సాహస కావ్యం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని పెదపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఆయన..తరగతి గదిలో నాలుగు గోడలకే పరిమితం కాలేదు. యువతలో చొచ్చుకుపోయిన నిర్లిప్తత, నిర్లక్ష్యాన్ని పారదోలాలని, తానే ఒక ఉదాహరణ కావాలని నిర్ణయించుకున్నారు. – అగనంపూడివేసవి సెలవులను సద్వినియోగపర్చుకొని విశాఖ నుంచి భారత్–చైనా సరిహద్దు లడక్ వరకు.. 6,500 కిలోమీటర్లు..రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్పై ఒంటరిగా దూసుకుపోయారు. ఆక్సిజన్ కొరత, ఎముకలు కొరికే చలి, క్షణాల్లో మారే వాతావరణం, మృత్యువు మోసే మలుపులు..ఏదీ అతన్ని ఆపలేదు. జోజిలా పాస్ (11,575 అడుగులు)... ఖార్దుంగ్లా పాస్ (17,582 అడుగులు)... నమికిలా పాస్ (12,139 అడుగులు)... బరలాచాలా పాస్ (16,040 అడుగులు)... ఒక్కొక్క శిఖరాన్ని ఛేదిస్తూ చివరకు ఉమ్లింగ్లా పాస్కు చేరుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటార్బుల్ రహదారి సముద్రమట్టానికి 19,024 అడుగులు (5,798 మీటర్లు) పై పక్షం రోజుల్లో ఈ యాత్ర పూర్తిచేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరు చిరస్థాయిగా నిలిపారు.సంగీతం, సేవ, సాధనసాహసం మాత్రమే కాదు.. కృష్ణమోహన్ జీవితంలో సంగీతానికీ విశేష స్థానముంది. అనేక ఆర్కెస్ట్రాల్లో గాయకుడిగా, వాయిద్య కళాకారుడిగా ఉత్తమ బిరుదులు అందుకున్నారు. 1991లో విద్యార్థిగా ఉన్నప్పుడే ఢిల్లీ రిపబ్లిక్ పరేడ్లో పాల్గొని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రశంసాపత్రం స్వీకరించారు. ఉపాధ్యాయుడిగా జిల్లా, రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్గా వ్యవహరించారు. కళాజాత నిర్వహించి, సాంస్కృతిక వేదికలను సజీవంగా ఉంచారు. అంతే కాదు..టీచర్ ఎంపిక పరీక్షలు, గ్రూప్–1,2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించి, ఎందరో యువతకు బంగారు భవిష్యత్తుకు దారి చూపారు.అభినందనల వర్షంలడక్ సాహసయాత్రలో గిన్నిస్ రికార్డ్ సాధించిన కృష్ణమోహన్ను అనకాపల్లి విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు, ఉప విద్యాశాఖాధికారి పెన్నాడ అప్పారావుతోపాటు, పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఒక ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు చెప్పడానికే పుట్టాడనుకుంటే..కృష్ణమోహన్ ఆ అభిప్రాయాన్ని తలకిందులు చేశారు. సాహసమే పాఠం... జీవితమే తరగతి గదిగా నిరూపించారు.యువతలో నిర్లిప్తతను తొలగించే లక్ష్యంతో...నేటి యువతలో పెరుగుతున్న నిరాసక్తి, నిర్లక్ష్యాన్ని తొలగించి వారిలో ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంపొందించాలనే లక్ష్యంతోనే ఈ సాహస యాత్ర చేపట్టా. దృఢ సంకల్పంతో కృషి చేస్తే ఎంతటి లక్ష్యమైనా సాధించవచ్చనే సందేశాన్ని యువతకు అందించాలనేదే నా ఉద్దేశ్యం. నా విజయాన్ని ఉపాధ్యాయ లోకానికి, విద్యార్థులకు అంకితం చేస్తున్నాను.– కృష్ణమోహన్, ప్రధానోపాధ్యాయుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత -
విశాఖలో ‘మా ఇంటి బంగారం’
ఏయూక్యాంపస్: సమంత ప్రధాన పాత్రలో ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్ను శుక్రవారం రాత్రి బీచ్రోడ్డులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక సమంత మాట్లాడుతూ.. సినిమాను ఆదరించి, ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సినీనటి గౌతమి మాట్లాడుతూ.. ‘మా ఇంటి బంగారాన్ని’ ప్రేక్షకులు తమ ఇంటి బంగారంగా భావించి ఆదరించారని ఆనందం వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలో దర్శకురాలు నందినీ రెడ్డితో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలను ఆమె పంచుకున్నారు. నటీనటులంతా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఈ సినిమా చేశామని చెప్పారు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్లో దర్శకురాలు నందినీ రెడ్డి, సమంత భర్త, ప్రముఖ ఫిల్మ్మేకర్ రాజ్ నిడిమోరు, సీనియర్ నటి శ్రీలక్ష్మి , చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని సందడి చేశారు. -
రాష్ట్ర స్థాయి షూటింగ్లో విశాఖ కుర్రాడికి 5 పతకాలు
బీచ్రోడ్డు: గచ్చిబౌలి లోని సాట్ షూటింగ్ రేంజ్లో జరిగిన 26వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీల్లో విశాఖకు చెందిన యువ క్రీడాకారుడు నాసిర్ అలీ అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఎయిర్ స్మాల్ బోర్, షాట్ గన్ ఈవెంట్లలో పాల్గొన్న నాసిర్ అలీ.. తన కచ్చితత్వంతో ప్రత్యర్థులను వెనక్కి నెట్టి 2 బంగారు, 2 వెండి, 1 కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఐదు పతకాలను కై వసం చేసుకున్నాడు. ఈ నెల 20న జరిగిన ఈ పోటీలలో నిరంతర సాధన, క్రమశిక్షణతో రాణించిన నాసిర్ అలీని పలువురు ప్రముఖులు, క్రీడా నిపుణులు అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి కీర్తి తీసుకురావడమే తన లక్ష్యమని నాసిర్ అలీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. -
పారిశుధ్య కార్మికుడిపై దాడి.. మృతి
ఎంవీపీకాలనీ: మద్యం మత్తులో ఓ యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన జీవీఎంసీ పారిశుధ్య కార్మి కుడు వి.అప్పారావు (58) కేజీహెచ్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వన్టౌన్కు చెందిన కాసారపు పైడిరాజు (29) అనే యువకుడు గత మంగళవారం లుంబినీ పార్క్ సమీపంలో అప్పారావుపై వెనుక నుంచి కర్రతో బలంగా కొట్టి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన అప్పారావును స్థానికులు కేజీహెచ్కు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. జీవీఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీసులు పైడిరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
రేపు పీవీ నరసింహారావు జయంతి ఉత్సవం
సీతంపేట: భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు, భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి కార్యక్రమాన్ని ఈ నెల 28న నగరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు పి.వి.నరసింహారావు జయంతి ఉత్సవాల కమిటీ ప్రకటించింది. శుక్రవారం శంకరమఠంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్షుడు కేశాప్రగడ నరసింహమూర్తి, కన్వీనర్ చెరుకు రామకోటయ్య కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు, పార్టీలకు, కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు పి.వి.నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, 10 గంటలకు దసపల్లా హోటల్లో ప్రధాన సభ జరుగుతుందని తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేసిన పి.వి.నరసింహారావు విగ్రహానికి మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కమిటీ ఆధ్వర్యంలోనే విగ్రహానికి మరమ్మతులు చేయించి, జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సమావేశంలో కమిటీ ప్రతినిధులు వేదుల హనుమంత రావు, రాచకొండ దశరథ రామయ్య, గంటి రవికుమార్, చరణ్ కుమార్, గంటి మురళి, శివ గణేష్ శర్మ, గాడేపల్లి ప్రభాకర శాస్త్రి, వేదుల రామకృష్ణ, నేరెళ్ల కామేశ్వర శర్మ, కొలిగట్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
గండి బాబ్జ్జ్జీపై చర్యలు తీసుకోవాలి
బీచ్రోడ్డు: పెందుర్తి గ్రామం సర్వే నంబర్ 107/11లో ఉన్న 8.8 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీపై చర్యలు తీసుకోవాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) జిల్లా అధ్యక్షురాలు ఎస్.వెంకటలక్ష్మి డిమాండ్ చేశారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదరు భూమి ప్రభుత్వానిదేనని 2023 ఫిబ్రవరి 28న సీసీఎల్ఏ కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. అయినప్పటికీ, గండి బాబ్జీ అధికారుల అండతో భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, పర్మినెంట్ నిర్మాణాలు చేపడుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ప్రజాప్రతినిధులకు, కలెక్టర్, జేసీ, ఇతర అధికారులకు ఫిర్యాదులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా జిల్లా ఇన్చార్జ్ మంత్రి, విశాఖ ఎంపీ తక్షణమే జోక్యం చేసుకుని ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని, అక్కడ నివసిస్తున్న పేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి ఇందిర, మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం కన్వీనర్ ఈసర లక్ష్మి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విశాఖ జిల్లా అధ్యక్షులు డి.ఏడుకొండలు, కాలనీవాసులు కటారి నాగేశ్వరరావు, దమ్ము దేవుడమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్ల జాబితా సవరణ స్పెషల్ డ్రైవ్
మహారాణిపేట: జిల్లావ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ–2026 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ విజయవంతంగా సాగింది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ,డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 20,23,009 మంది ఓటర్లకు గానూ, ఇప్పటివరకు 16,37,424 ఫారాలను పంపిణీ చేసి 80.94 శాతం పూర్తి చేశారు. అలాగే 75,427 ఫారాలను డిజిటైజ్ (3.73శాతం) చేశారు. నియోజకవర్గాల వారీగా చూస్తే.. ఫారాల పంపిణీలో విశాఖ దక్షిణ (86.12శాతం), డిజిటైజేషన్లో విశాఖ ఉత్తరం (5.90శాతం) మొదటి స్థానాల్లో నిలిచాయి. ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పనులను సమీక్షించారు. ఫారాల పంపిణీ, డిజిటైజేషన్ ప్రక్రియను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని ఈఆర్వోలు, బీఎల్వోలను ఆదేశించారు. ఈ డ్రైవ్కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. -
కూటమి ‘మట్టి’ దందా..!
సబ్బవరం: సబ్బవరం మండలంలో సాగునీటి చెరువులు అక్రమార్కులకు కాసులు కురిపించే గనులుగా మారిపోయాయి. వ్యవసాయం ముసుగులో చెరువుల నుంచి మట్టిని తోడేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది డంపర్లతో మట్టిని అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ రూ.కోట్లలో దందా సాగిస్తున్నారు. కళ్లెదుటే సహజ వనరులు లూటీ అవుతున్నా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. వ్యవసాయ అనుమతుల ముసుగులో.. మండలంలోని సాగునీటి చెరువులు ప్రస్తుతం అక్రమ మట్టి తవ్వకాలకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. వ్యవసాయ అవసరాల కోసం భూములను మెరక చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే అనుమతులను కొందరు అధికార కూటమి నేతలు, వారి అనుచరులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. స్థానిక ఆదిరెడ్డిపాలెం పరిధిలోని పోతురాజు చెరువు, పెదనాయుడుపాలెంలోని నాయనప్ప చెరువు, బాటజంగాలపాలెంలోని చిక్కాలవాని చెరువులతో పాటు గొల్లలపాలెం చెరువుల్లో గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. అనుమతులు ఒక చోట.. తరలింపు మరో చోట వ్యవసాయ భూములను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రభుత్వం రైతులకు పరిమిత స్థాయిలో మాత్రమే మట్టి తరలింపు అనుమతులు జారీ చేస్తోంది. అయితే సబ్బవరం మండలంలో ఆ అనుమతుల ఉద్దేశాన్నే పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. అనుమతి పొందిన రైతు భూమికి కాకుండా, పూర్తిగా భిన్నమైన ప్రాంతాలలోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు, లేఅవుట్లకు, కమర్షియల్ ప్రాజెక్టులకు తరలిస్తున్నారు. అనుమతుల్లో పేర్కొన్న పరిమాణానికి మించి, కేవలం కొద్ది ట్రిప్పుల పత్రాలతో వందలాది ట్రిప్పుల మట్టిని దోచేస్తున్నారు. భారీ యంత్రాలతో చెరువులపై దాడి చెరువుల్లో జేసీబీలు, పొక్లెయిన్లు, ఎక్స్కవేటర్ల వంటి భారీ యంత్రాలతో మట్టిని తోడేస్తున్నారు. చెరువుల అడుగు భాగాన్ని లోతుగా తవ్వుతూ సహజ స్వరూపాన్ని మార్చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం భారీ డంపర్లు, లారీలు, ట్రాక్టర్లలో మట్టిని నింపి నిరంతరాయంగా రవాణా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో కూడా ఈ యంత్రాలు, వాహనాలు జోరుగా పనిచేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నియంత్రణ లేని తవ్వకాల వల్ల చెరువుల లోతు, కట్టల భద్రత, నీటి నిల్వ సామర్థ్యం దెబ్బతిని భవిష్యత్తులో సాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా అధికారులు ఈ అక్రమ మట్టి దందాకు చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు చెరువుల్లో ప్రభుత్వం అనుమతించిన పరిమితుల్లోనే మట్టి తవ్వకాలు జరిగేలా పర్యవేక్షణ చేపడుతున్నాం. రైతులు వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఈ మట్టిని వినియోగించాలి. అనుమతుల నిబంధనలకు విరుద్ధంగా బేస్మెంట్లు, లేఅవుట్లు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు మట్టిని తరలిస్తే వెంటనే అనుమతులు రద్దు చేస్తాం. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – కార్తీక్, ఏఈ, ఇరిగేషన్ శాఖ, సబ్బవరం మండలం -
ఎన్ఏడీ ఫ్లైఓవర్పై తప్పిన ముప్పు
ఎన్ఏడీ జంక్షన్: ఎన్ఏడీ కొత్తరోడ్డు ఫ్లైఓవర్పై గురువారం అర్ధరాత్రి భారీ ప్రమాదం తృటిలో తప్పింది. గాజువాక నుంచి తాటిచెట్లపాలెం వైపు వెళ్తున్న ఓ ట్రాలర్పై ఉన్న భారీ కంటైనర్ అదుపుతప్పి రహదారిపై జారిపడింది. పోలీసుల కథనం ప్రకారం.. దుంగల లోడు కంటైనర్తో వెళ్తున్న ట్రాలర్ ఫ్లైఓవర్ రోటరీ సమీపానికి చేరుకోగానే కంటైనర్ ఒక్కసారిగా ట్రాలర్ నుంచి జారిపడి రహదారిపై పడింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను మళ్లించారు. అనంతరం క్రేన్ సహాయంతో కంటైనర్ను తొలగించారు. ట్రాలర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మూడో విడత చందనం అరగదీత ప్రారంభం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి మూడో విడత చందనం అరగదీత కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 29న జ్యేష్ట పౌర్ణమిని పురస్కరించుకుని ఆ రోజు స్వామివారికి సమర్పించే మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) పచ్చిచందనాన్ని సమకూర్చేందుకు ఈ ప్రక్రియను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సుమారు 20 మంది సిబ్బంది చందనం అరగదీతలో పాల్గొన్నారు. మరో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా సాగనుంది. ఈ అరగదీత ప్రక్రియను దేవస్థానం స్థానాచార్యులు టీపీ రాజగోపాల్, ఏఈవో తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. -
ఏయూలో వసతి సెగ!
ఏయూలోని అశోకవర్ధన్ హాస్టల్ విశాఖ విద్య: పేద విద్యార్థుల కలల నిలయమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్లో అడుగుపెట్టక ముందే వేలాది మంది విద్యార్థులకు నిరాశే ఎదురవుతోంది. ఉన్నత విద్యా రంగంపై సైతం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. ఏయూ ఆన్ క్యాంపస్లో చదువుకున్న పేద విద్యార్థుల పరిస్థితి రోజురోజుకూ ఘోరంగా తయారవుతోంది. గత రెండేళ్ల కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించిన దాఖలాలు లేవు. దీనికి తోడు వసతి దీవెన కూడా సరిగా అమలు కాకపోవడంతో పేద విద్యార్థుల పైన మెస్ ఛార్జీల భారం మోయలేనంతగా పడుతోందని విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హాస్టళ్లలో 5 వేల మంది వేదన ఏయూలో వివిధ జిల్లాలకు చెందిన సుమారు 5,200 మంది విద్యార్థులు ఆన్ క్యాంపస్ వసతి సౌకర్యాన్ని పొందుతున్నారు. మొత్తం 33 వసతి గృహాల్లో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు చెందిన పేద విద్యార్థులకు ఏయూ ఆతిథ్యమిస్తోంది. ఇందులో 23 బాయ్స్ హాస్టల్స్లో 3,200 మంది విద్యార్థులు, 10 గర్ల్స్ హాస్టల్స్లో 2 వేల మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారు. వీరు కాకుండా వందలాది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంటర్నేషనల్ విద్యార్థులకు వర్సిటీ వసతి కల్పిస్తోంది. ఏయూలో వసతిగృహాల్లో ఉండి చదువుకునే వారిలో 80 శాతం మంది పేద వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్లతోనే తమ డిగ్రీలు పూర్తిచేసుకుని ఎందరో ఉన్నత స్థాయిల్లో స్థిరపడ్డారు. నిధుల లేమితో మెస్ బకాయిల వేధింపులు వేలాది మంది విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన నిధులు సకాలంలో విడుదల కాకపోవడం క్యాంపస్లో కలకలం రేపుతోంది. దీనివల్ల విద్యార్థులపై ఆర్థిక భారం పడుతోంది. ప్రభుత్వం వసతి దీవెన నిధులు ఆయా విద్యార్థుల ఖాతాలోకి వేసిన వెంటనే వారు విద్యాలయానికి చెల్లించాల్సి ఉంటుంది. ఒకరో ఇద్దరో తప్ప చాలా మంది మెస్ ఛార్జీలు సక్రమంగానే చెల్లిస్తారు. లేదంటే ఇక్కడ భోజన వసతి ఉండదు. కానీ రెండేళ్లుగా ప్రభుత్వ చెల్లింపులు ఆగిపోవడంతో ఆ భారం విద్యార్థులపై పడింది. పైగా మెస్ బకాయిల పేరుతో విద్యార్థులను వేధింపులకు గురిచేయడం, వారి తల్లిదండ్రులకు సైతం లేఖలు రాయడం పట్ల విద్యార్థి లోకం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. వసతి దీవెన బకాయిలు రూ.5 కోట్లు ప్రభుత్వం నుంచి వసతి దీవెన నిధులు ఇప్పటికే సుమారు రూ.5 కోట్ల వరకు రావాల్సి ఉంది. అయినా పాలకులు నిధులు విడుదల చేయడం లేదు. ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా సర్కారులో చలనం లేదు. కొత్తగా ఏయూలో చదవాలనే విద్యార్థులకు ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తాయి. – వి.లక్ష్మి, జిల్లా కార్యదర్శి, పీడీఎస్వోఏయూలో 90 శాతం మంది పేద విద్యార్థులే ఏయూలో చదివేది 90 శాతం మంది పేదలే అని విశాఖ ఎంపీ భరత్ స్వయంగా చెప్పారు. ఇక్కడి విద్యార్థుల పరిస్థితి తెలిసి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంలో నిర్లక్యం చేస్తోంది. సంబంధిత మంత్రితో మాట్లాడి నిధులు విడుదల చేయిస్తే ఏయూపై భారం తగ్గుతుంది. – మీనన్, విద్యార్థి నేత -
29న గవర్నర్ అబ్దుల్ నజీర్ విశాఖ రాక
మహారాణిపేట: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 29న విశాఖ రానున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని నగరంలోని ఓ హోటల్లో బస చేస్తారు. 30వ తేదీన నగరానికి రానున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన అనంతరం, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4.45 గంటలకు పుట్టపర్తికి బయలుదేరుతారు. అలాగే అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కోట శుక్రవారం విశాఖ చేరుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని నగరంలో బస చేస్తారు. 27న శ్రీకాకుళం వెళ్లి రాత్రి అక్కడే బస చేయనుండగా, 28న మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి విశాఖకు చేరుకుని అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. -
ఘనంగా మనోజ్కుమార్ గ్రంధి జయంతి
మహారాణిపేట: మనోజ్ వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లిమిటెడ్ (వైభవ్ జ్యువెలర్స్) వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత మనోజ్కుమార్ గ్రంధి 60వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో పలు సామాజిక, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఏఎస్ రాజా వలంటరీ బ్లడ్ బ్యాంక్ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 50 మందికి పైగా సిబ్బంది రక్తదానం చేశారు. అలాగే మ్యాక్సివిజన్ ఐ ఆస్పత్రి ఆధ్వర్యంలో 120 మందికి ఉచిత కంటి పరీక్షలు, మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి–శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ సౌజన్యంతో 63 మంది మహిళా సిబ్బందికి ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరాలను ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ శశికిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్పర్సన్ భారత మల్లికా రత్నకుమారి గ్రంధి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింధూరి, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, వైభవ్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు ‘భజన క్లబ్బింగ్’
డాబాగార్డెన్స్: హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మధురవాడ వైజాగ్ కన్వెన్షన్లో ‘భజన క్లబ్బింగ్’పేరిట వినూత్న కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రతినిధి యదురాజ దాస తెలిపారు. గురువారం వీజెఫ్ ప్రెస్క్లబ్లో ఆయన వివరాలు వెల్లడించారు. విశాఖలో తొలిసారిగా సంకీర్తన మ్యూజిక్ బ్యాండ్తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. శక్తివంతమైన సంగీతం, కీర్తనలు, మంత్ర ధ్యానంతో పాటు సామూహిక నృత్యాల ద్వారా మానసిక ప్రశాంతత, విశ్వశాంతి చేకూర్చడమే దీని ఉద్దేశమని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు పేర్లు నమోదు కోసం 9100201291 నంబరులో సంప్రదించాలని కోరారు. -
మాదకద్రవ్యాల నిర్మూలనకు సమష్టి కృషి
మహారాణిపేట: మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించి యువతకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందించాలని ఎంపీ ఎం. భరత్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత విశాఖ నిర్మాణంతో పాటు ఆనందభరితమైన సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నషా ముక్త్ భారత్ సప్తాహ్’ వారోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం బీచ్ రోడ్డు కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు భారీ అవగాహన వాక్థాన్ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఏపీ గ్రోవర్ ఆయిల్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ.. ఇటీవల సెంట్రల్ జైలును సందర్శించినప్పుడు గణనీయమైన సంఖ్యలో యువత, గిరిజన ప్రాంతాల వారు డ్రగ్స్ కేసుల్లో ఉండటం చూశానని, ఇది సమస్య తీవ్రతను తెలియజేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. సమష్టి కృషి వల్ల గత రెండేళ్లలో విశాఖలో డ్రగ్స్ కేసులు తగ్గాయన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కవిత, సెట్విస్ సీఈవో రమ్య, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు
మహారాణిపేట: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవ ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం, వర్సిటీ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నోవోటెల్, వీ–కన్వెన్షన్లలో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి కార్యాలయ ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. వేదిక, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, నిరంతర విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులను ముందస్తుగా సిద్ధం చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం వైద్య బృందాలు, ఫైర్ సర్వీసెస్ అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ పర్యటన సమన్వయం కోసం జేసీ విద్యాధరిని నోడల్ అధికారిగా నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్, ట్రైబల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మిశ్రా, ఇతర ఆచార్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. నంతరం కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, సీపీ శంఖబ్రత బాగ్చి నోవాటెల్లోని వీ–కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాట్లను పరిశీలించారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి సంబంధించిన భద్రత, ప్రోటోకాల్, పార్కింగ్, అతిథుల వసతి తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. -
244 మంది పోలీస్ సిబ్బందికి రివార్డులు
అల్లిపురం: సిబ్బంది సంక్షేమంతో పాటు విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 244 మంది పోలీసులకు నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి రివార్డు మంజూరు ఉత్తర్వులను అందజేశారు. గురువారం నిర్వహించిన క్రైమ్ రివ్యూ సమావేశంలో ఆయన ఈ రివార్డులను పంపిణీ చేశారు. హోం గార్డుల నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల వరకు ప్రతి నెలా ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా సిబ్బందిలో ఉత్సాహం, బాధ్యత పెరుగుతాయని సీపీ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా అడ్డుకున్నవారు, చోరీ సొత్తు రికవరీ చేసిన దర్యాప్తు బృందాలు, సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థులను పట్టుకున్నవారు, సైబర్ క్రైమ్ కేసులను ఛేదించిన సిబ్బందికి ఈ రివార్డులు దక్కాయి. -
పదోన్నతి పొందిన ఆరుగురు పోలీసులకు సత్కారం
అల్లిపురం: పోలీసు కమిషనరేట్ పరిధిలో వివిధ హోదాల్లో పదోన్నతులు పొందిన ఆరుగురు సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి గురువారం నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో ర్యాంకులు, పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో ఒకరు ఏఆర్ ఎస్ఐగా, ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు ఏఆర్ ఎస్ఐలుగా, ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్ పొందారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని ఈ సందర్భంగా సీపీ తెలిపారు. పదోన్నతి పొందిన సిబ్బందిని వారి కుటుంబ సభ్యులతో సహా ఆహ్వానించి, ఉన్నతాధికారులతో కలిసి నూతన ర్యాంకులను స్వయంగా తగిలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పదోన్నతులు ఉద్యోగి సేవలకు లభించే గుర్తింపు మాత్రమే కాదని, మరింత బాధ్యతతో విధులు నిర్వహించేందుకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. -
తీరపు శ్వాసలో పడవల కవిత్వం
మేఘాల కౌగిలిలో ఆకాశం.. అలల జోలపాటతో సముద్రం.. రంగురంగుల పడవల నిద్ర.. ఇది కేవలం ఒక ఫొటో కాదు.. ఒక కథ, ఒక జ్ఞాపకం, ఒక భావన ప్రకృతి పరిపూర్ణమైన కూర్పు.. మానవ శ్రమకు సాక్ష్యం.. హార్బర్లో ప్రకృతి అద్భుతం.. –ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
కలెక్టర్ కళ్లకు గంతలు
సాక్షి, విశాఖపట్నం: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ(సర్).. విశాఖ జిల్లాలోని అధికార పార్టీ జేబులో వ్యవహారంగా మారిపోయిందా.? స్వేచ్ఛగా జరగాల్సిన ఓటరు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా టీడీపీ నేతల కనుసన్నల్లోకి వెళ్లిపోయిందా.? ఎన్నికల సంఘం నిబంధనలు.. జిల్లాలో అమలుకావా.? ఎలక్షన్ కమిషన్ నిబంధనల కంటే.. స్థానిక టీడీపీ నేతల ఆదేశాలకే ఎక్కువ పవర్ ఉందా.? అవుననే చెబుతున్నాయి.. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు. నిబంధనల ప్రకారం గడపగడపకూ వెళ్లాల్సిన బీఎల్వోలు.. స్థానిక టీడీపీ నేతలు ఎక్కడ ఏర్పాట్లు చేస్తే అక్కడే తిష్టవేస్తున్నారు. అధికారం అడ్డం పెట్టుకొని బీఎల్వోలపై పెత్తనం చెలాయిస్తుండటంతో.. వారితో పెట్టుకుంటే తమకే నష్టమంటూ తూచ తప్పకుండా పాటిస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఫిర్యాదులు వెళ్తుంటే.. వివరణ ఇవ్వాలంటూ ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్) కళ్లకు గంతలు కడుతున్నారు. అబ్బే.. తాము ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వడం లేదని కేవలం ఫారం వెరిఫికేషన్లు మాత్రమే చేస్తున్నామంటూ వివరణిస్తూ తప్పించుకుంటున్నారు. కలెక్టర్ విచారణకు ఆదేశించినా, కిందిస్థాయి సిబ్బంది అసత్యాలతో నివేదికలు పంపుతూ వ్యవస్థనే తప్పుదోవ పట్టిస్తుండటం గమనార్హం. సర్లో భాగంగా బీఎల్వోలు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లాలి. ఓటర్ల ఎన్యుమరేషన్ ఫామ్లను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేయాలి. అక్కడ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను బట్టి ఓటరు వివరాలను పారదర్శకంగా నమోదు లేదా సవరణ చేయాలి. కానీ విశాఖలోని భీమిలి, పెందుర్తి, తూర్పు నియోజకవర్గాల్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. బీఎల్వోలు ఇంటి గడప తొక్కడం లేదు. స్థానిక కాలనీల వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టి.. మేము ఫలానా చోట ఉన్నాం.. అక్కడికే వచ్చి ఫామ్లు తీసుకోండి’ అంటూ ఓటర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం జరగాల్సిన ఇంటింటి సర్వే కాస్తా.. ఒకే చోట గుంపులు గుంపులుగా జాతరలా సాగుతోంది. విచారణలో అధికారులకు కల్లబొల్లి మాటలు.! బీఎల్వోల వ్యవహారశైలిపై ‘సాక్షి’ పత్రికలో కథనాలు ప్రచురితమవుతుంటే.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ అక్రమాలపై స్పందించిన జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్) విచారణకు ఆదేశించారు. అయితే, బీఎల్వోలు మాత్రం.. కలెక్టర్కు తప్పుడు వివరణలిస్తున్నట్లు తెలుస్తోంది. తాము గుంపులుగా ఎన్యుమరేషన్ ఫామ్లు పంపిణీ చేయడం లేదని.. కేవలం దరఖాస్తుల వెరిఫికేషన్ కోసమే ఒక చోట కూర్చుంటున్నామంటూ వివరణలో స్పష్టం చేస్తుంటే.. అదే నమ్ముతూ.. పత్రికల కథనాలకు ఖండనల పేరుతో విడుదల చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చినా, క్షేత్రస్థాయిలో అమలయ్యే తీరు చూస్తుంటే విస్మయం కలుగుతోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బంది ఇచ్చే నివేదికలపై ఆధారపడకుండా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలపై ఆకస్మిక తనిఖీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీఎల్వోలపై అధికార పార్టీ నేతల పెత్తనం ఈ తతంగం వెనుక అధికార టీడీపీ నేతల పెత్తనం స్పష్టంగా కనిపిస్తోంది. బీఎల్వోలు స్వతంత్రంగా వ్యవహరించకుండా స్థానిక టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డంపెట్టుకొని.. వారిని తాము చెప్పినట్లుగా నడుచుకోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో సదరు నేతలు ఎక్కడ మకాం ఏర్పాటు చేస్తుంటే అక్కడే కూర్చుంటున్నారు. ‘మీరు ఇళ్లకు వెళ్లొద్దు.. మేమే అందరినీ ఇక్కడికి తీసుకొస్తాం, ఇక్కడే పని కానిచ్చేయండి‘ అని అధికార పార్టీ నేతల మాటలకు చేసేది లేక బీఎల్వోలు తలొగ్గుతున్నారు. వారి మాట వినకపోతే తమపై ఎక్కడ కక్షగడతారోనన్న భయంతో.. నిబంధనలను పక్కనపెట్టి అధికార నేతలు చెప్పిన చోటకే వెళ్లి ఓటర్లకు ఫామ్లు అందజేస్తున్నారు. -
పికిల్బాల్ లీగ్ లోగో ఆవిష్కరణ
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర పికిల్ బాల్(ఏపీఎల్) లీగ్ విశాఖతో పాటు విజయవాడ వేదికలుగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ లీగ్లో ఎనిమిది జట్లు పోటీపడనుండగా త్వరలో క్రీడాకారుల రిజిస్ట్రేషన్, వేలం ప్రక్రియకు ఫ్రాంచైజీలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు,సెప్టెంబర్ మాసాల్లో ఈ లీగ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ క్రికెటర్ నితీష్కుమార్రెడ్డి స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో లోగోను విడుదల చేశారు. కార్యక్రమంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వాహక కమిటీ ప్రతినిధి సుజయ్ కృష్ణా రంగారావు పాల్గొన్నారు. -
ముగిసిన విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు
విజయనగరం: విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో విజయవాడ క్రీడాకారులు సత్తా చాటారు. వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ స్పోర్ట్స్ కౌన్సిల్ నేతృత్వంలో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు రాజీవ్ క్రీడా మైదానంలో నిర్వహించిన ఇంటర్ సర్కిల్ పురుషుల వాలీబాల్, అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన పోటీల్లో వాలీబాల్ పోటీల్లో విజయవాడ జట్టు విజేతగా నిలవగా.... ద్వితీయ, తృతీయ స్థానాలను విశాఖ, ఆతిధ్య విజయనగరం జట్లు చేజిక్కించుకున్నాయి. అథ్లెటిక్స్లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ను విజయవాడ జట్టు దక్కించుకోగా.. రెండు, మూడుస్థానాల్లో తిరుపతి, విజయనగరం జట్లు నిలిచాయి. దాసన్నపేట విద్యుత్ భవనం ప్రాంగణంలో విజేతలకు ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ టి.వి.సూర్యప్రకాష్, ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.హరిబాబు, ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు, పార్వతీపురం–మన్యం జిల్లా ఎస్ఈ పెద్దింటి త్రినాథరావులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టి.వి.సూర్యప్రకాష్, ఎస్.హరిబాబు మాట్లాడుతూ నిరంతరం విధి నిర్వహణలో ఒత్తిడి జీవనం సాగించే విద్యుత్ ఉద్యోగులకు క్రీడా పోటీలు ఉపశమనం కలిగించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని పేర్నొన్నారు. కార్యక్రమంలో విజయనగరం డివిజన్ ఈఈ పి.హరి, ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యుడు వడివేలు, స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. -
వియత్నాం నుంచి బయలుదేరిన భారత నేవీ నౌకలు
సింథియా: ఆగ్నేయాసియా ప్రాంతంలో తమ పోర్ట్ కాల్ను విజయవంతంగా పూర్తి చేసుకుని భారత నావికాదళ నౌకలు ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ కవరత్తి తదుపరి మోహరింపు కోసం వియత్నాంలోని హో చి మిన్ సిటీ నుంచి బయలుదేరాయి. తూర్పు ఫ్లీట్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ రియర్ అడ్మిరల్ అలోక్ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ నౌకలు పర్యటించాయి. పర్యటనలో భాగంగా హో చి మిన్ సిటీ పీపుల్స్ కమిటీ, వియత్నామీస్ పీపుల్స్ నేవీ ఉన్నతాధికారులను భారత నౌకాదళ ప్రతినిధులు కలుసుకున్నారు. సముద్ర సహకారం, వృత్తిపరమైన సమన్వయం, ప్రాంతీయ సముద్ర భద్రతపై ఇరు దేశాల అధికారులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ కవరత్తి కమాండింగ్ ఆఫీసర్లు.. అధ్యక్షుడు హో చి మిన్ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం భారత నౌకాదళం, వియత్నాం పీపుల్స్ నేవీ సిబ్బంది పలు వృత్తిపరమైన సంభాషణలు, ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎన్ఎస్ కవరత్తి నౌకలో సంయుక్తంగా యోగా సెషన్ నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఆరిలోవ: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వన్టౌన్లోని జాలారిపేటకు చెందిన చింతపల్లి తాతాజీ (28) మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై హనుమంతవాక మీదుగా జాతీయ రహదారిపై మధురవాడ వెళుతున్నాడు. జూపార్క్ సమీపంలో బైక్ అదుపు తప్పి డివైడర్ మీదకు దూసుకుపోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో తాతాజీ కిందపడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్టీల్ప్లాంట్ కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలి
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ కార్మికుల ప్రాణాలకు తగిన భద్రత కల్పించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 8న స్టీల్ మెల్ట్ షాప్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కూర్మన్నపాలెం కూడలి వద్ద అశృనివాళి అర్పించారు. అనంతరం కార్మికులు, నాయకులు కొవ్వొత్తులతో భారీ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ ప్లాంట్లో కనీస భద్రతా ప్రమాణాలు లోపించడం వల్లే 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై తక్షణమే న్యాయ విచారణ జరిపించి, బాధ్యులైన దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు సి.హెచ్.నర్సింగరావు, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జె.అయోధ్యరామ్, కె.ఎస్.ఎన్.రావు, నీరుకొండ రామచంద్రరావు, పి.వి.రమణమూర్తి, యు.రామస్వామి, బి.డేవిడ్, డి.సురేష్బాబు, చీకటి శ్రీనివాస్, కోరాడ వెంకటరావుతో తదితరులు పాల్గొన్నారు. -
అండర్–16 విశాఖ జట్టు విజయం
విశాఖ స్పోర్ట్స్: ఏసీఏ అండర్–16 మల్టీడే అంతర జిల్లాల నార్త్జోన్ క్రికెట్ పోటీల్లో విశాఖ జట్టు ఇన్నింగ్స్ 596 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన తూర్పుగోదావరి జట్టు తొలి ఇన్నింగ్స్లో 61 పరుగులకే ఆలౌటైంది. విశాఖ బౌలర్లలో యతీష్ మూడు వికెట్లు పడగొట్టగా, రామ్చరణ్, లోహిత్, భాను తలో రెండు వికెట్లు తీశారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన విశాఖ జట్టు 6 వికెట్ల నష్టానికి 749 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఓపెనర్ చైతన్య 82 పరుగులు చేయగా, గణేష్కృష్ణ 210 పరుగులతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. రామ్చరణ్ (119), రుత్విక్ (నాటౌట్ 100) సెంచరీలతో రాణించగా, చెరిష్వర్ధన్ 86 పరుగులు చేశాడు.భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తూర్పుగోదావరి జట్టు 92 పరుగులకే ఆలౌటైంది. మణివర్ధన్ 54 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. విశాఖ బౌలర్లలో లోహిత్ నాలుగు వికెట్లు, భాను మూడు వికెట్లు, యతీష్ రెండు వికెట్లు పడగొట్టారు.దీంతో విశాఖ జట్టు ఇన్నింగ్స్ 596 పరుగుల తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. -
ఆటో బోల్తా.. డ్రైవర్ మృతి
పరవాడ: అనకాపల్లి–విశాఖ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. పరవాడ సీఐ భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాకలోని పంతులుగారి మేడ సమీపంలో నివసిస్తున్న దుంగా అప్పలనాయుడు (46) ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆయన నర్సీపట్నం నుంచి ఆటోలో గాజువాక వైపు వస్తుండగా, లంకెలపాలెం జీపీఆర్ లేఅవుట్ సమీపంలో ఆటో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అప్పలనాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో ఆయనను కేజీహెచ్కు తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పలనాయుడు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు వినయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ భీమరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గేట్పాస్ విధానం పునరుద్ధరణ
మహారాణిపేట: కేజీహెచ్లోని అన్ని వార్డుల్లో గేట్ పాసుల విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టి, దానిని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయ పరిధిలోని మినీ సెమినార్ హాలులో జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి ఆయన వివిధ అంశాలపై సమీక్షించారు. ముందుగా అజెండా అంశాలను కేజీహెచ్ సూపరింటెండెండ్ డాక్టర్ ఐ. వాణి, అడ్మినిస్ట్రేటర్ బీవీ రమణ కమిటీకి వివరించారు. సాక్షి కథనంతో .. మొదట కేజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశాన్ని వైద్యులు, పలు విభాగాధిపతులు లేకుండానే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ‘సాక్షి’ దినపత్రికలో ‘కేజీహెచ్ రహస్య అజెండా’ అనే శీర్షికతో బుధవారం కథనం ప్రచురితమైంది. దీనికి అధికారులు తక్షణమే స్పందించారు. సమావేశ వివరాలు తమకు తెలియజేయకపోవడంపై, తగిన సమాచారం లేకుండా రహస్యంగా మీటింగ్ పెట్టడంపై అంతకుముందు హెచ్వోడీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హెచ్డీఎస్ మీటింగ్ నిర్వహణ తీరుపై కొంతమంది వైద్యులు, విభాగాధిపతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కథనం ప్రభావంతో అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకుని, కేజీహెచ్లో ఉన్న 26 మంది విభాగాధిపతులను, ఆర్ఎంవోలను అత్యవసరంగా సమావేశానికి ఆహ్వానించారు. వైద్యులు, హెచ్వోడీలు, ఆర్ఎంవోలందరూ ఈ సమావేశానికి హాజరుకావడంతో చివరకు వివాదం సద్దుమణిగింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి, అడ్మినిస్ట్రేటర్ బీవీ రమణ రూ.43.70 కోట్ల విలువైన 14 అభివృద్ధి ప్రతిపాదనలను కమిటీ ముందు ఉంచారు. ఇందులో కొత్త ఓపీ, ఎంసీహెచ్ బ్లాక్ల నిర్మాణాలు, యూజీడీ నెట్వర్క్, ఆర్థో ఐసీయూ, లిఫ్టులు, అంతర్గత రోడ్లు, ఫైర్ సేఫ్టీ వంటి మౌలిక వసతుల కల్పనలు ఉన్నాయి. కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ స్పందిస్తూ.. సొంత ఆక్సిజన్ ప్లాంట్ల వినియోగంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని, ఫైర్ సేఫ్టీకి పెద్దపీట వేయాలని ఆదేశించారు. గైనకాలజీ సేవలు పెంచాలని, పెథాలజీ స్లైడ్స్ నాణ్యత లోపాన్ని వెంటనే సరిచేయాలని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులను కోరారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, హెచ్.డి.ఎస్. నూతన కమిటీ సభ్యులు , ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యా దేవి, కేజీఎచ్ అడ్మినిస్ట్రేటర్ బి.వి. రమణ, జీవీఎంసీ ఏడీసీ నల్లనయ్య, ఏపీఎంస్ఐడీసీ ఈఈ విజయ్ భాస్కర్, డీఎంహెచ్వో డాక్టర్ పి. జగదీశ్వరరావు, పలు విభాగాల హెచ్వోడీలు పాల్గొన్నారు. -
ఏయూ స్పెషల్ డ్రైవ్ పరీక్షలు వాయిదా
విశాఖ విద్య: ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించనున్న స్పెషల్ డ్రైవ్ పరీక్షలను వాయిదా వేస్తూ కొత్త షెడ్యూల్ను విడుదల చేస్తూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టి. చిట్టిబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 26 నుంచి నిర్వహించాల్సిన పలు కోర్సుల స్పెషల్ డ్రైవ్ పరీక్షలు పరిపాలనా కారణాల రీత్యా వచ్చే నెలకు వాయిదా పడ్డాయి తెలియ జేశారు . బి.ఆర్క్, బి.టెక్, బి.టెక్+ఎం.టెక్, ఎం.టెక్, ఎం.ప్లానింగ్, ఎంఎస్సీ, బి.ఫార్మసీ, ఎం.ఏ., ఎంబీఏ, ఎం.కాం, ఎంహెచ్ఆర్ఎం, ఎంసీఏ, మూడేళ్ల ఎల్.ఎల్.బి, ఐదేళ్ల బి.ఎ. ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం, బి.ఎడ్ కోర్సులకు సంబంధించిన ప్రత్యేక డ్రైవ్ పరీక్షలు తొలుత 26న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాల్సి ఉండగా, ఇప్పుడు కొత్త తేదీలకు మార్చారు. పరీక్ష తేదీ మాత్రమే మారిందని, పరీక్ష సమయాల్లో ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు. అన్ని పరీక్షలు యథావిధిగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు తాజా షెడ్యూల్ను గమనించి, కొత్త తేదీలకు అనుగుణంగా పరీక్షలకు సిద్ధం కావాలని ఆంధ్రా యూనివర్సిటీ పరీక్షల విభాగం సూచించింది. కొత్త పరీక్ష తేదీలు ఇలా....... బి.ఆర్క్ –జూలై 22, బి.టెక్, బి.టెక్+ఎం.టెక్–జూలై 22, ఎంఎస్సీ (అన్ని కోర్సులు) , జూన్ 30, బి.ఫార్మసీ– జూలై 15,ఎం.ఏ., ఎంబీఏ, ఎం.కాం, ఎంహెచ్ఆర్ఎం –జూలై 6, ఎంసీఏ–జూలై 6, మూడేళ్ల ఎల్.ఎల్.బి, ఐదేళ్ల బి.ఎ. ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం–ఆగస్టు 5, బి.ఎడ్ (ఒక సంవత్సరం), బి.ఎడ్ –జూలై 3 -
గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు
సింహాచలం: వచ్చే నెల 28, 29 తేదీల్లో జరిగే గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా నిర్వహించనున్నట్టు ఈవో జె. వెంకటరావు తెలిపారు. బుధవారం దేవస్థానం పరిపాలనా కార్యాలయంలో పోలీస్, జీవీఎంసీ, విద్యుత్, ఫైర్, రెవెన్యూ, ఆరోగ్యశాఖ తదితర అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఉత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, వైద్య సేవలు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, విశ్రాంతి కేంద్రాలు, ప్రసాదాల పంపిణీ, మొబైల్ టాయిలెట్లు, అత్యవసర సేవల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు ఈవో సూచించారు. అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు, సీసీ కెమెరాల ఏర్పాటు అంశాలపై కూడా చర్చించారు. -
తల్లిదండ్రులే మన ముందున్న దేవుళ్లు
మద్దిలపాలెం (విశాఖ): నిత్యం మన కళ్లెదుట కనిపించే తల్లిదండ్రులే ప్రతి ఒక్కరికీ ప్రత్యక్ష దైవాలని ప్రఖ్యాత గజల్ గాయకుడు, గిన్నిస్ ప్రపంచ రికార్డుల గ్రహీత డాక్టర్ గజల్ శ్రీనివాస్ అన్నారు. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ, గజల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన ‘గజల్ శ్రీనివాస్ భారతీయం’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి కళాభారతి అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ, కార్యదర్శి డాక్టర్ జి.ఆర్.కె. ప్రసాద్ (రాంబాబు), కోశాధికారి పైడా కృష్ణ ప్రసాద్ అతిథులుగా హాజరై మూడు రోజుల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువతలో బాధ్యత, విలువలు, కుటుంబ బంధాల పట్ల అవగాహన పెంచేలా గజల్ శ్రీనివాస్ ఆలపించిన గేయాలు ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయని పేర్కొన్నారు. సమాజానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తుల్లో గజల్ శ్రీనివాస్ ఒకరని కొనియాడారు. రెండు గంటల పాటు గజల్తో అలరింపు దాదాపు రెండు గంటల పాటు సాగిన కార్యక్రమంలో తల్లిదండ్రుల గొప్పతనం, గురువుల పట్ల గౌరవం, దేశభక్తి, మానవ విలువలను ప్రతిబింబించే గజల్స్ను గజల్ శ్రీనివాస్ ఆలపించి ప్రేక్షకులను అలరించారు. భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ దేశం పట్ల తమ బాధ్యతను గుర్తుంచుకోవాలని ఆయన గేయాల ద్వారా సందేశమిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కేర్లో 500 రోబోటిక్ మోకాలి శస్త్ర చికిత్సలు
ఆరిలోవ: విశాఖలో కేర్ హాస్పిటల్స్లో గత ఏడాది 500 రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేసినట్లు ఆసుపత్రి ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రవిచంద్ర వట్టివల్లి తెలిపారు. హెల్త్సిటీలో ఉన్న కేర్లో బుధవారం విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్లో కేర్ అగ్రగామిగా నిలిచిందన్నారు. తీవ్రమైన మోకాలి ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగులకు అత్యాధునిక శస్త్ర చికిత్సలను కేర్లో అందిస్తున్నామని చెప్పారు. కొన్నేళ్లుగా నడవలేనివారు ఈ శస్త్ర చికిత్స తర్వాత సాధారణ జీవితం గడుపుతున్నారని వెల్లడించారు. వయసు పెరగడం, ఊబకాయం, మధుమేహం, వ్యాయామం లేకపోవడం, పాత గాయాలు, చికిత్సపై అలసత్వం తదితర కారణాలతో ఆర్థరైటిస్, కీళ్ల క్షీణత వ్యాధులు పెరుగుతున్నాయన్నారు. రోబోటిక్ సాంకేతిక మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలో ఖచ్చితత్వం ఉంటుందన్నారు. ఇది నొప్పిలేని శస్త్ర చికిత్స అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్ వైద్యులు, సహాయక సిబ్బంది పాల్గొన్నారు. -
కారాగారం నిర్వహణలో ఉత్తమ ప్రమాణాలకు ప్రాధాన్యం
ఆరిలోవ: కారాగారం నిర్వహణలో ఉత్తమ ప్రమాణాలకు ప్రాధాన్యమివ్వాలని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సూచించారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఖైదీలతో మాట్లాడి వారి పరిస్థితుల గురించి ఆరా తీశారు. వంటశాల, ఖైదీల ఆహారం, జైల్ లోపల పరిసరాలు తదితర వాటిని పరిశీలించారు. అనంతరం జైల్ అధికారులు నిర్వహించిన భద్రతా సమీక్షలో ముఖ్య అతిథిగా సీపీ పాల్గొన్నారు. సెంట్రల్ జైల్లో భద్రతా ఏర్పాట్లు, నిఘా వ్యవస్థ, అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన నిర్వహణ చర్యలు, పరిశుభ్రత, భద్రత వ్యవస్థల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జైల్లో ఖైదీలకు ఉపాధి అవకాశాలు బాగున్నాయని కితాబిచ్చారు. ఇది ఖైదీలకు సమాజంలో పునఃస్థాపనకు దోహదపడుతుందన్నారు. కారాగారం నిర్వహణలో భద్రత, నిరంతర అప్రమత్తత, సమర్థవంతమైన సమన్వయం, ఉత్తమ విధానాల అమలుకు మరింత ప్రాధాన్యమివ్వాల్సిన అవసరముందని జైల్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జైల్ పర్యవేక్షణాధికారి ఎం.మహేష్బాబు, ఉప పర్యవేక్షణాధికారి సిహెచ్.సూర్యనారాయణ, జైలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
హోం మంత్రి మెప్పు.. జనానికి ముప్పు!
ఎంవీపీకాలనీ: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మెప్పు కోసం అధికారులు తెగ తాపత్రయపడుతున్నారు. నగరంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నిధులు లేవనే సాకులు చెప్పే అధికారులు.. మంత్రి నివాసం వద్ద మాత్రం అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. గతంలో ప్రత్యేక నిధులతో రోడ్డు వేసి విమర్శలు పాలైన అధికారులు.. తాజాగా అదే రోడ్డుపై ఎవరికీ అవసరం లేకపోయినా డబుల్ జంప్ స్పీడ్బ్రేకర్లు ఏర్పాటు చేసి వాహనదారుల నడ్డి విరుస్తున్నారు. ఎంవీపీ కాలనీ సెక్టార్–11లో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నివాసం ఎదుట ఏర్పాటు చేసిన ఈ స్పీడ్బ్రేకర్లు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. అవసరం లేకపోయినా, అధికారాన్ని ఉపయోగించి అశాసీ్త్రయంగా నివాసానికి ఇరువైపులా ఈ స్పీడ్బ్రేకర్లు ఏర్పాటు చేయించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంద మీటర్లలోనే నాలుగు.. మంత్రి నివాసానికి సమీపంలోని ఓ ప్రైవేట్ అపార్ట్మెంట్ వద్ద ఇప్పటికే రెండు స్పీడ్బ్రేకర్లు ఉన్నాయి. వాటికి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఇప్పుడు మరో రెండు డబుల్ జంప్ స్పీడ్బ్రేకర్లు ఏర్పాటు చేశారు. దీంతో స్వల్ప దూరంలోనే వాహనదారులు నాలుగు స్పీడ్బ్రేకర్లను దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అశాసీ్త్రయ బ్రేకర్ల వల్ల వాహనాలు దెబ్బతినడమే కాకుండా, ప్రయాణం నరకంగా మారిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి మెప్పు కోసం ట్రాఫిక్, జీవీఎంసీ అధికారులు ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రహదారి భద్రత, ప్రజా అవసరాల ఆధారంగా మాత్రమే స్పీడ్బ్రేకర్లు ఏర్పాటు చేయాలి తప్ప, వీఐపీల కోసమే ప్రాధాన్యమివ్వడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. -
విద్యార్థులకు ‘సర్టిఫికెట్ల’ కష్టాలు
మహారాణిపేట: వాట్సాప్ గవర్నెన్స్ అంటూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ఊదరగొట్టింది. చేతిలోనే ప్రభుత్వ శాఖల సేవలు మొత్తం పొందవచ్చంటూ ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించింది. త్వరితగతిన అన్ని రకాల సర్వీసులు ప్రజల చెంతకు అందుబాటులోకి వచ్చేశాయంటూ పదే పదే డప్పు కొట్టుకుంటోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు చేసుకుంటుంటే వారాలు గడిచిపోతున్నా ఆ సర్టిఫికేట్లు మాత్రం చేతికి రావడం లేదు. సచివాలయాలకు, తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి అడిగితే.. ‘సర్’పనుల్లో బిజీగా ఉన్నామంటూ అధికారులు, సిబ్బంది సమాధానాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. దీంతో విద్యార్థులు, సంక్షేమ పథకాల దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు తెరిచినా కదలని కాగితం పాఠశాలలు, కాలేజీలు తెరిచి ఇప్పటికే 12 రోజులు దాటుతోంది. పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు తెరుచుకోవడంతో విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు, కాలేజీల్లో కౌన్సిలింగ్లకు పలు రకాల సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో సర్టిఫికేట్లను పరిశీలించాల్సిన గ్రామ, వార్డు రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది అంతా ‘సర్’ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా బీఎల్వోలుగా విధులు నిర్వహిస్తూ ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. వీరు కార్యాలయాల్లో దొరకకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అష్టకష్టాలు పడుతున్నారు. పెండింగ్ మెసేజ్లతో దరఖాస్తుదారుల ఆవేదన ఆన్లైన్లో చూస్తే దరఖాస్తు ఆర్ఐ వద్ద, లేదా తహసీల్దార్ వద్ద పెండింగ్లో ఉందని సమాచారం వస్తోంది. ఈ సమాచారంతో బుధవారం జనాలు పెద్ద సంఖ్యలో కార్యాలయాలకు చేరుకున్నా ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఊసురుమంటూ వెనుదిరిగారు. ఇక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం వచ్చే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కేంద్ర పథకాలపై అవగాహన
ఎంవీపీకాలనీ: కేంద్ర ప్రభుత్వ స్వయం ఉపాధి పథకాలపై ఎస్సీ యువతకు బుధవారం ఎంవీపీ కాలనీ సెక్టార్–6లోని బుద్ధభవన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్సీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీఎంఈజీపీ, పీఎం అజయ్, ముద్ర, పీఎం విశ్వకర్మ, స్టాండప్ ఇండియా పథకాల కోసం వివరించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యపద్మ, ఏపీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య, స్కిల్ డెవలప్మెంట్ అధికారులు పాల్గొని యువతకు ఉపాధి అవకాశాలతో పాటు చిరు వ్యాపారాలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించారు. అనంతరం నిర్వహించిన జాబ్ మేళాలో ఎస్సీ యువతీ, యువకులు పాల్గొన్నారు. ఇంటర్వ్యూల ద్వారా పలు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు వీరిని ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఆరోపణలతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు
సింహాచలం: ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విశాఖకు చెందిన రాధాగాయత్రి దశదిన కర్మ కార్యక్రమం బుధవారం సింహాచలంలోని వరాహ పుష్కరిణి వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి రాధాగాయత్రి అత్తయ్య, మావయ్య (శ్రీచరణ్ తల్లిదండ్రులు) హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రాధాగాయత్రి తమతో ఎంతో అన్యోన్యంగా ఉండేదని, ఆమె మృతి తమకు తీవ్ర బాధను కలిగించిందన్నారు. ఆమె అనుమానాస్పద మృతి విషయంలో పోస్టుమార్టం రిపోర్టు వస్తే పూర్తి వాస్తవాలు బయటపడతాయని చెప్పారు. బయటి వ్యక్తులు వచ్చి హత్య చేసే ప్రసక్తే లేదన్నారు. రాధాగాయత్రి అంత్యక్రియలకు తాము వెళ్లామని, తన కుమారుడు శ్రీచరణ్ కూడా వచ్చాడని తెలిపారు. అయితే, అక్కడ అమ్మాయి తరపు బంధువులు దాడి చేస్తారేమోనన్న ఆందోళనతో, వారిలోనే కొందరు శ్రీచరణ్ను ఒక గదిలో ఉంచి తాళం వేశారని పేర్కొన్నారు. బ్యాగులో ట్రాకర్ పెట్టలేదని.. రాధాగాయత్రిని అనుమానిస్తూ బ్యాగులో జీపీఎస్ ట్రాకర్ ఏమైనా పెట్టావా అని అడిగితే... అలాంటిదేమీ లేదని శ్రీచరణ్ తనకు స్పష్టం చేశాడన్నారు. భార్యపై శ్రీచరణ్ ఎప్పుడూ పెద్దగా ఫిర్యాదులు చేయలేదని, కేవలం కాస్త లావుగా ఉందని మాత్రమే అనేవాడని, అది పెద్ద విషయం కాదనిపించిందన్నారు. కేవలం ఒక ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పోలీసులు శ్రీచరణ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, బలమైన ఆధారాలు లేకుండా ఎలా కేసు ఫైల్ చేస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం అన్ని విభాగాల అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే పూర్తి నిజాలు నిగ్గుతేలుతాయని దుర్గాప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
కరిగిపోయిన కలలు
నిప్పుల గుండంలో దక్షిణ్ ఎనర్జీ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు సజీవ దహనంప్రమాదం జరిగిన ప్రదేశం ఇదే పరవాడ : ఆ తెల్లవారుజామున వారిద్దరూ ఎప్పటిలాగే తమ విధుల్లో మునిగిపోయారు. కుటుంబాలను సాకుతున్నామన్న తృప్తి, రేపటి జీవితంపై ఎన్నో ఆశలు.. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ పరిశ్రమే వారికి చితిగా మారింది. పరవాడ జేఎన్ ఫార్మాసిటీ సమీపంలోని ఇండస్ట్రీయల్ పార్క్(ఏపీఐఐసీ జోన్–3)లో గల ’దక్షిణ్ ఎనర్జీ’ పరిశ్రమలో మంగళవారం తెల్లవారుజామున సంభవించిన ఘోర అగ్నిప్రమాదం ఇద్దరు యువ కార్మికులను సజీవ దహనం చేసింది. ఈ హఠాత్పరిణామంతో అనకాపల్లి జిల్లాలోని రెండు గ్రామాలు ఒకేసారి కన్నీటి సముద్రంలో మునిగిపోయాయి. క్షణాల్లో జరిగిన ఘోరం ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్, ఇంధన నూనెలను తయారు చేసే ఈ పరిశ్రమను గతేడాది సెప్టెంబరులోనే ప్రారంభించారు. సోమవారం రాత్రి షిఫ్ట్ విధులకు హాజరైన ఆపరేటర్ వేపాడ వెంకటేష్(34), ఫిట్టర్ బోడపు త్రినాథ్(24)లు మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో రియాక్టర్ వద్ద ప్రాసెసింగ్ పనిలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక రియాక్టర్ పైపులైన్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి షెడ్డు పైకప్పు ఎగిరిపోయింది, గోడలు బీటలు వారాయి. క్షణాల వ్యవధిలో పరిశ్రమను దట్టమైన మంటలు అలుముకున్నాయి. రియాక్టర్ వద్దే ఉన్న వెంకటేష్, త్రినాథ్లు తప్పించుకునే లోపే మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అనకాపల్లి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. గుండెలు పగిలేలా రోదనలు ఈ ప్రమాదం సృష్టించిన బీభత్సం ఒకవైపు అయితే, మృతుల కుటుంబాల గాథలు కంటతడి పెట్టించాయి. పరిశ్రమ గేటు వద్ద తల్లిదండ్రులు, భార్య, బంధువుల రోదనలు చూసిన ప్రతి ఒక్కరి హృదయం కదిలిపోయింది. అధికారుల సందర్శన ప్రమాద వార్త తెలియగానే పరవాడ డీఎస్పీ మోహన్రావు, సీఐ భాస్కరరావులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనకాపల్లి జేసీ శౌర్యమాన్ పటేల్, ఆర్డీవో ఆయేషా, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివశంకర్రెడ్డి తదితరులు పరిశ్రమను సందర్శించి ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు ఘటనా స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించారు. ఒక్కొక్కరికి రూ.33 లక్షలు నష్టపరిహారం రాంకీ కమర్షియల్ హబ్లో ఆర్డీవో ఆధ్వర్యంలో యాజమాన్యం, పోలీసు అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. మృతి చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.33 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి, పరవాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాలకు కేజీహెచ్లో పోస్టుమార్టం మహారాణిపేట: ‘దక్షిణ్ ఎనర్జీ’ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఇద్దరు కార్మికులు వేపాడ వెంకటేష్, బొడ్డాపు త్రినాథ్ల మృతదేహాలకు మంగళవారం కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించారు. తెల్లవారుజామున ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోలీసులు పంచనామా పూర్తి చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
చెల్లి పెళ్లి చేయాలనుకున్న త్రినాథ్
అచ్యుతాపురం మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన బోడపు త్రినాథ్ది అత్యంత నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు పారునాయుడు, రమణమ్మలతో పాటు చెల్లి మాధవిని తనే పోషిస్తున్నాడు. త్వరలోనే చెల్లికి పెళ్లి చేసి, ఆ తర్వాత తాను వివాహం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. ఆ కళ్లల్లో ఆశలు ఇంకా మిగిలి ఉండగానే, 24 ఏళ్ల ప్రాయంలోనే త్రినాథ్ అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ వృద్ధ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. రోదిస్తున్న త్రినాథ్ బంధువులు -
ముగ్గురు ఆడపిల్లల తండ్రి వెంకటేష్
చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన వేపాడ వెంకటేష్కు భార్య కోమలి, ముగ్గురు చిన్నారి ఆడపిల్లలు ఉన్నారు. గతంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసిన వెంకటేష్, అది మూతపడటంతో ఐదు నెలల క్రితమే ఈ పరిశ్రమలో చేరాడు. తన ముగ్గురు కూతుళ్లను బాగా చదివించుకోవాలని ఆశపడ్డ ఆ తండ్రి, ఇలా మంటల్లో కలిసిపోవడంతో.. ‘ఇక మాకు దిక్కెవరు?’ అంటూ ఆ భార్యాపిల్లలు చేస్తున్న రోదనలు అక్కడున్న వారి గుండెలను పిండేశాయి. రోదిస్తున్న వెంకటేష్ భార్య కోమలి -
మోడల్ ట్రాఫిక్ మేళాలో 538 కేసుల పరిష్కారం
అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మోడల్ ట్రాఫిక్ మేళా’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలానాలు, కేసులు, ఇతర ట్రాఫిక్ సంబంధిత సమస్యలను ఒకే వేదికపై పరిష్కరించే లక్ష్యంతో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోడల్ ట్రాఫిక్ మేళాలో మొత్తం 538 కేసులను పరిష్కరించామని వెల్లడించారు. ఇప్పటి వరకు నిర్వహించిన ఆరు మేళాల ద్వారా మొత్తం 2,120 కేసులు పరిష్కారమైనట్లు చెప్పారు. ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలను అందించేందుకు ఈ తరహా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. అనంతరం బాధితులకు వాహనాలు అందజేశారు. -
కేజీహెచ్ రహస్య అజెండా!
మహారాణిపేట: కేజీహెచ్ అభివృద్ధిపై చర్చించాల్సిన సమావేశం ఇప్పుడు ‘రహస్య సమావేశం’గా మారిందా? ఆసుపత్రి భవిష్యత్ను ప్రభావితం చేసే కీలక నిర్ణయాలపై చర్చించబోయే అభివృద్ధి కమిటీ సమావేశానికి వైద్యులకే ప్రవేశం లేకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. రోగులకు ప్రత్యక్షంగా సేవలందించే విభాగాధిపతులు, సీనియర్ వైద్యులను పూర్తిగా పక్కనపెట్టి అజెండాను సిద్ధం చేయడం వెనుక ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు ఆసుపత్రి వర్గాల్లో వినిపిస్తున్నాయి. నేడు కీలక సమావేశం సుదీర్ఘ విరామం తర్వాత బుధవారం కేజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశం జరగనుంది. కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో ఆసుపత్రి వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సమావేశం ప్రారంభానికి ముందే వివాదాలు చెలరేగడం గమనార్హం. అజెండా ‘సీక్రెట్’ ఎందుకు? సాధారణంగా ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన అంశాలపై విభాగాధిపతుల అభిప్రాయాలు సేకరించడం ఆనవాయితీ. కానీ ఈసారి అలాంటి ప్రక్రియ ఏదీ జరగలేదని తెలుస్తోంది. సమావేశంలో ఏ అంశాలు చర్చించబోతున్నారు? ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అనే విషయాలపై వైద్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆసుపత్రి అవసరాలు, రోగుల ఇబ్బందులు, విభాగాల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వైద్యులను పక్కనపెట్టి కేవలం కొద్దిమంది అధికారులే అజెండా ఖరారు చేయడాన్ని పలువురు సీనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. సభ్యులు వీరే.. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసరావు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి, ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి తదితర సభ్యులు పాల్గొననున్నారు. అయితే ఆసుపత్రి సేవల్లో కీలక పాత్ర పోషించే విభాగాధిపతులకు మాత్రం సమావేశంలో స్థానం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ‘రావద్దు.. కానీ అందుబాటులో ఉండండి!’ సమావేశ నిర్వహణకు సంబంధించి అధికారుల వైఖరి మరింత వివాదాస్పదంగా మారింది. సమావేశానికి రావాల్సిన అవసరం లేదని చెబుతూనే, భేటీ సమయంలో సూపరింటెండెంట్ కార్యాలయం సమీపంలో అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించినట్లు సమాచారం. ఒకవైపు ‘నో ఎంట్రీ’ అంటూ తలుపులు మూసేస్తూ, మరోవైపు అవసరమైతే పిలుస్తామంటూ పక్క గదిలో వేచి ఉండాలని చెప్పడంపై వైద్య వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఏ నిర్ణయాలు దాగున్నాయి? కేజీహెచ్లో మౌలిక సదుపాయాల విస్తరణ, కొత్త భవనాలు, పరికరాల కొనుగోలు, విభాగాల అభివృద్ధి, రోగులకు సేవల మెరుగుదల వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్న నేపథ్యంలో అజెండాను రహస్యంగా ఉంచడం మరిన్ని ప్రశ్నలకు దారితీస్తోంది. ఆసుపత్రి భవిష్యత్తును నిర్ణయించే సమావేశంలో వైద్యుల పాత్రను ఎందుకు కుదించారన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. -
బాధిత వర్గాలకు అండగా నిలవాలి
మహారాణిపేట: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, బాధిత వర్గాలకు అండగా నిలుస్తూ న్యాయబద్ధమైన పరిష్కారం చూపాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్ కనుమూరు రఘురామకృష్ణరాజు ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్రాజు, కొణతాల రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాజువాక ఎమ్మెల్యే సమర్పించిన 14 ప్రజా పిటిషన్లపై కమిటీ సమీక్ష నిర్వహించింది. ఏపీఐఐసీ భూసేకరణలతో నిర్వాసితులైన కుటుంబాల సమస్యలు, పునరావాస చర్యలు, భూ నిర్వాసితులకు ప్లాట్ల కేటాయింపు, భూముల పునఃస్వాధీనం, అప్పారెల్ పార్కు పరిధిలోని అంశాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకుంది. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. అలాగే జీవీఎంసీ పరిధిలో భూసేకరణ, రహదారి విస్తరణ, పరిహారం చెల్లింపులు, టీడీఆర్ జారీ, గృహస్థలాల కేటాయింపు అంశాలపై సమీక్ష నిర్వహించింది. రెవెన్యూ శాఖ పరిధిలో 22–ఏ భూముల సమస్యలు, ఫార్మాసిటీ పునరావాస కాలనీల్లో ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్, భూ రికార్డుల నవీకరణ వంటి అంశాలను కూడా పరిశీలించింది. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా అధికారులు సానుకూల దృక్పథంతో పనిచేయాలని రఘురామకృష్ణరాజు సూచించారు. పల్లా శ్రీనివాసరావు విజ్ఞప్తి మేరకు యారాడ జెట్టీ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ను త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులకు పిటిషన్ల కమిటీ చైర్మన్ రఘురామకృష్ణరాజు ఆదేశం -
జీతం కోసం వెళ్తే.. జీవచ్ఛవం కావాలా?
సాక్షి, అనకాపల్లి/విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీ, అచ్యుతాపురం సెజ్ ప్రాంతాల్లో కార్మికుల భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. విధులకు వెళ్లిన కార్మికుడు సాయంత్రం క్షేమంగా ఇంటికి చేరతాడన్న గ్యారంటీ లేకుండా పోయింది. ఎంఎన్సీ స్థాయి పరిశ్రమల్లోనూ వరుసగా అగ్నిప్రమాదాలు, గ్యాస్ లీకేజీలు, రియాక్టర్ పేలుళ్లు చోటుచేసుకుంటుండటం పారిశ్రామిక భద్రతలోని డొల్లతనాన్ని బట్టబయలు చేస్తోంది. తాజాగా మంగళవారం పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ్ ఎనర్జీ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహనమయ్యారు. ఈ ఘటనతో గత రెండేళ్లుగా పరవాడ–అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాల పరంపర మరోసారి చర్చనీయాంశమైంది. గ్యాస్ లీకేజీలు, రియాక్టర్ పేలుళ్లు, అగ్నిప్రమాదాల రూపంలో ఇప్పటికే 20 మందికిపైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం, యాజమాన్యాలు, పర్యవేక్షణ సంస్థల వైఖరిలో మార్పు కనిపించడం లేదు. ఎసైన్షియా తర్వాత ఏమైంది? ఎసైన్షియా ప్రమాదం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘటనాస్థలికి చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సేఫ్టీ ఆడిట్లు నిర్వహించని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడతామని ప్రకటించారు. పరిశ్రమలు, ఏపీపీసీబీ అధికారులను నిలదీశారు. కానీ రెండేళ్లు పూర్తవుతున్నా పరిస్థితుల్లో గణనీయమైన మార్పు కనిపించలేదు. నాటి ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దక్షిణ్ ఎనర్జీ ప్రమాదం తర్వాత మళ్లీ సేఫ్టీ ఆడిట్ల అంశం తెరపైకి రావడం ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. నివేదికలు కాగితాలకే పరిమితం ప్రమాదకర రసాయన పరిశ్రమల్లో రియాక్టర్లు, పైప్లైన్లు, ట్యాంకర్లు, ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను నిరంతరం తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఐఎస్వో ప్రమాణాలు, ఫ్యాక్టరీస్ చట్టం ప్రకారం ప్రతి ఏడాది సేఫ్టీ ఆడిట్ నిర్వహించి నివేదిక సమర్పించాలి. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పరిశ్రమలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే నివేదికలు సిద్ధమవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కొత్త అనుమతులు, విస్తరణలు, బ్యాంకు రుణాలు, లైసెన్స్ రెన్యూవల్స్ కోసమే ఆడిట్లు నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రమాదాలపై కమిటీలు సమర్పించిన నివేదికలు కూడా ప్రజల ముందుకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తనిఖీలు ఎక్కడ? పరిశ్రమల్లో లోపాలను గుర్తించి సరిచేయాల్సిన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబర్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావుడిగా తనిఖీలు చేసి, ఆ తర్వాత మళ్లీ యథాతథ స్థితికి చేరుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జిల్లా కలెక్టర్ పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి భద్రతా ప్రమాణాలపై చర్చించిన నెల రోజుల్లోనే మూడు ప్రమాదాలు చోటుచేసుకోవడం అధికార యంత్రాంగం పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రక్షణ లేని కార్మిక జీవితాలు ప్రమాదకరమైన రియాక్టర్ల వద్ద నైపుణ్యం కలిగిన సిబ్బందికి బదులుగా కాంట్రాక్ట్, తాత్కాలిక కార్మికులతో పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రియాక్టర్లలో ఒత్తిడి పెరగడం, రసాయనిక చర్యలు అదుపు తప్పడం వంటి పరిస్థితులను సకాలంలో గుర్తించే నిపుణులు లేకపోవడంతో ప్రమాదాలు తీవ్రమవుతున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అధిక లాభాల కోసం తక్కువ వేతనాలతో వలస కార్మికులను నియమించడం, వారికి తగిన శిక్షణ ఇవ్వకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోందని అంటున్నారు. భద్రతా లోపాలపై ప్రశ్నించిన కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్లు ఎక్కడ? పరవాడ ఫార్మాసిటీ, అచ్యుతాపురం సెజ్లలో కలిపి 300కు పైగా పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి పరిశ్రమ వద్ద అగ్నిమాపక వ్యవస్థలు, అత్యవసర వైద్య సదుపాయాలు, అంబులెన్స్లు అందుబాటులో ఉండాలి. కానీ ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడంలో జాప్యం జరుగుతోంది. చాలా కంపెనీల్లో అత్యవసర వైద్య సిబ్బంది, అంబులెన్స్లు, సమర్థవంతమైన ఫైర్ ఫైటింగ్ వ్యవస్థలు లేకపోవడం బయటపడుతోంది. దీంతో తీవ్రంగాా గాయపడిన కార్మికులు ఆసుపత్రికి చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సమాధానం చెప్పాల్సింది ఎవరు? ప్రమాదం జరిగిన ప్రతిసారీ పరిహారాలు ప్రకటించడం, కమిటీలు వేయడం, విచారణలు జరపడం పరిపాటిగా మారింది. కానీ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? గత నివేదికలపై ఏ చర్యలు తీసుకున్నారు? సేఫ్టీ ఆడిట్ల ఫలితాలు ఏమయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం రావడం లేదు. ఎసెన్షియా నుంచి దక్షిణ్ వరకు జరిగిన ప్రమాదాల పరంపర ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ పేరుతో కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టలేరు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు.. ప్రమాదం జరగకుండా చూసే వ్యవస్థను నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులు, యాజమాన్యాలపై ఉంది. లేకపోతే జీతం కోసం వెళ్లిన కార్మికుడు జీవచ్ఛవంగా తిరిగి రావాల్సిన దుస్థితి మరింత విషాదకరంగా మారుతుంది. జేఎన్ ఫార్మాసిటీ ముఖ చిత్రంకూటమి ప్రభుత్వంలో వరుస ప్రమాదాల పరంపర 2024 ఆగస్టు 21: అచ్యుతాపురం సెజ్లోని ‘ఎసైన్షియా అడ్వాన్స్డ్ ఫార్మా’లో జరిగిన భారీ పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘోర ఘటనలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. 2025 జూన్: ’సాయి శ్రేయస్ ఫార్మాస్యూటికల్స్’లో హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. 2025 సెప్టెంబర్: ’డెక్కన్ రెమెడీస్’లో మెథనాల్ గ్యాస్ లీక్ అయి మరో కార్మికుడి ప్రాణాన్ని బలిగొంది. 2026 జనవరి: అచ్యుతాపురంలోని ’ఎస్వీఎస్ కెమికల్స్’లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పినప్పటికీ ఆస్తి నష్టం సంభవించింది. 2026 జూన్ 23: పరవాడ ఫార్మాసిటీలోని ’దక్షిణ్ ఎనర్జీ’ కెమికల్ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహనమవడం పారిశ్రామిక భద్రతపై మళ్లీ పెను ప్రశ్నలు లేవనెత్తింది. రెండేళ్లుగా వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు పారిశ్రామిక భద్రతా విభాగాల వైఫల్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. -
వైద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రశంసలు
మహారాణిపేట: కేజీహెచ్, ఆంధ్ర మెడికల్ కాలేజీలో అమలవుతున్న కృత్రిమ మేధస్సు ఆధారిత వైద్య సేవలను ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు జోహన్నెస్ జుట్ ప్రశంసించారు. సోమవారం కేజీహెచ్, ఏఎంసీని సందర్శించిన ఆయనకు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వి.ఎస్.ఎమ్. సంధ్యాదేవి సంస్థల చరిత్ర, వైద్య విద్య, పరిశోధన, వైద్య సేవల వివరాలను తెలియజేశారు. అనంతరం వైద్య నిపుణులు గర్భిణులలో ప్రసవానికి ముందు శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఏఐ ఆధారిత డిజిటల్ ఫీటల్ మానిటరింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్న విధానాన్ని పీడియాట్రిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ బి.ఎస్. చక్రవర్తి, గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఉషా ప్రసాద్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సాంకేతికత ద్వారా ప్రమాద సూచనలను ముందుగానే గుర్తించి తక్షణ చికిత్స అందించవచ్చని తెలిపారు. వైద్య సేవల్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగం పట్ల జోహన్నెస్ జుట్ సంతృప్తి వ్యక్తం చేస్తూ, కేజీహెచ్, ఏఎంసీలో అమలవుతున్న వినూత్న కార్యక్రమాలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ కె. పద్మావతి, ప్రపంచ బ్యాంక్ హెల్త్ టీమ్ ప్రతినిధి అమిత్ నాగరాజ్, జేసీ విద్యాధరి, డీఎంహెచ్వో డాక్టర్ పి. జగదీశ్వరరావు, కేజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ బీవీ రమణ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ డి. రాధకృష్ణన్, డీసీఎస్ ఆర్ ఎం.వో డాక్టర్ కుమార్, డీసీహెచ్ డాక్టర్ నరేంద్ర సింగ్, ఆర్ఎంవో డాక్టర్ బి. కిరణ్ కుమార్ పాల్గొన్నారు హబ్ ఐటీఐగా కంచరపాలెం ప్రభుత్వ ఐటీఐ ఎంపిక కంచరపాలెం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం–సీఈటీయూ పథకం కింద కంచరపాలెంలోని ప్రభుత్వ పాత పారిశ్రామిక శిక్షణ కేంద్రాన్ని హబ్ ఐటీఐగా ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ ఎన్. సోలోమాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు జోహన్నెస్ జుట్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం ఐటీఐని సందర్శించింది. ఈ సందర్భంగా శిక్షకులు, శిక్షణార్థుల నైపుణ్యాభివృద్ధితో పాటు పరిశ్రమల అనుసంధానంపై దృష్టి సారించాలని జుట్ సూచించారు. అనంతరం బృందం వివిధ ల్యాబ్లను పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించింది. కార్యక్రమంలో వరల్డ్ బ్యాంక్ సీనియర్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ మార్గరెట్ కార్నీ, ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సీఎస్ఆర్ సభ్యులు వికాస్ యద్వందు, రాష్ట్ర స్కిల్ డెవెలప్మెంట్ అండ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ డైరెక్టర్ జి.గణేష్కుమార్, రాష్ట్ర ఎస్డీఈటీ అడిషనల్ డైరెక్టర్ జి.బాలసుబ్రహ్మణ్యం, జోన్–1 ఐటీఐ వైస్ ప్రిన్సిపాల్ డి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. నగరంలో పర్యటించిన ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు జోహన్నెస్ జుట్ బృందం -
గంభీరం రిజర్వాయర్లో మునిగి యువకుడి మృతి
ఆనందపురం: స్నేహితులతో కలిసి సరదాగా సూర్యోదయాన్ని చూసేందుకు వెళ్లిన ఓ యువకుడు రిజర్వాయర్లో మునిగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొట్టు ముక్కల శ్రీధర చక్రవర్తి (28) సోమవారం తెల్లవారుజా మున 4.30 గంటల సమయంలో తన స్నేహితులు ప్రశాంత్, శౌవిక్ చౌదరీతో కలిసి గంభీరం రిజర్వాయర్కు వెళ్లాడు. ముగ్గురూ కలిసి ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు. అయితే లోపలికి వెళ్లే కొద్దీ లోతు పెరగడంతో శ్రీధర చక్రవర్తి నీటిలో మునిగిపోయాడు. మిగిలిన ఇద్దరూ సురక్షితంగా ఒడ్డుకు చేరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆనందపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం భీమిలి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతుడి తండ్రి ఏయూ కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ మధు జగన్నాఽథ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సీహెచ్.వాసు నాయుడు ఆదేశాలతో ఎస్ఐ ఎం.హరీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్టీల్ ప్లాంట్ ప్రమాదాలపై జ్యుడీషియల్ విచారణ జరపాలి
మహారాణిపేట: స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న ప్రమాదాలపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ నిర్వహించి, బాధ్యులపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా అనంతరం పీజీఆర్ఎస్లో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ప్రైవేటీకరణ విధానాల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి, గాయపడిన వారికి రూ.50 లక్షల పరిహారం చెల్లించడంతో పాటు బాధిత కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని కోరారు. ధర్నాలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. లక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు ఎస్. వెంకటలక్ష్మి, కార్యదర్శి రోహిణిదేవి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి
మహారాణిపేట: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సేకరిస్తున్న ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను కచ్చితత్వంతో, వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో బీఎల్వోలు, బీఎల్ఏల నియామకం, ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ పురోగతిని ఆయన సమీక్షించారు. ఫారాల పంపిణీ, సేకరణపై ఈఆర్వోలు, ఏఈఆర్వోలు ప్రత్యేక దృష్టి సారించాలని, జోనల్ కమిషనర్లు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. సేకరించిన ఫారాలను ఆలస్యం లేకుండా డిజిటలైజ్ చేసి పోర్టల్లో నమోదు చేయాలని, ఓటర్ల జాబితా సవరణ విధుల్లో ఉన్న బీఎల్వోలకు ఇతర పనులు అప్పగించవద్దని స్పష్టం చేశారు. మరణించిన వారు, వలస వెళ్లిన వారు, తప్పుగా నమోదైన ఓటర్లు, ఇతర పోలింగ్ కేంద్రాలకు మారిన వారి వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు, ఎన్నికల సెల్ అధికారులు పాల్గొన్నారు. -
గండి బాబ్జీ దౌర్జన్యాలను అరికట్టాలి
మహారాణిపేట: పెందుర్తి మండలం రాణివారి కల్లాలు (సర్వే నెంబర్ 107/11) పరిధిలోని పేద ప్రజల నివాసాలపై టీడీపీ నాయకుడు గండి బాబ్జీ, ఆయన అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలను, భూ కబ్జాలను కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. లక్ష్మి, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులతో కలిసి బాధితుడు కె. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాణివారి కల్లాల్లో దాదాపు 40 కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్నాయని, ఆ ఇళ్లను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. గండి బాబ్జీ అనుచరులు జేసీబీలతో వచ్చి ఇళ్లను నేలమట్టం చేస్తూ దౌర్జన్యానికి తెగబడుతున్నారని, దీనిపై రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి పేదలకు రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఎస్. వెంకటలక్ష్మి, ఈసరాపు లక్ష్మి పాల్గొన్నారు. -
డేటా సెంటర్ పర్యటనకు వెళితే కేసులా?
మద్దిలపాలెం: అడవివరం వద్ద గూగుల్ డేటా సెంటర్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సీపీఎం నాయకులపై కేసులు నమోదు చేయడాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు తీవ్రంగా ఖండించారు. సోమవారం సీపీఎం జిల్లా కార్యాలయంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కుమార్, క్రిష్ణారావు, జగన్తో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజలకు జరుగుతున్న నష్టం, పర్యావరణ ప్రభావాలను తెలుసుకునేందుకే తాము పర్యటించామని, ఎలాంటి విధ్వంసక చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. డేటా సెంటర్ నిర్మాణం వల్ల ముడసర్లోవ జలాశయం, నీటి వనరులు, పర్యావరణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా, ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. పరిశ్రమలు, వివిధ సంస్థలకు కేటాయించిన భూములు, వాటి ద్వారా కల్పించిన ఉద్యోగాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడం, వాటిపై స్పందించడం రాజకీయ పార్టీల బాధ్యతేనని, అలాంటి పర్యటనలను నేరంగా పరిగణించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని, సీపీఎం నాయకులపై నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు సీపీఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు -
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 107 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 107 వినతులు అందాయి. కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అందిన ఫిర్యాదుల్లో పట్టణ ప్రణాళికా విభాగానికి అత్యధికంగా 53 వినతులు రాగా, ఇంజనీరింగ్ విభాగానికి 25, రెవెన్యూ విభాగానికి 21 ఫిర్యాదులు వచ్చాయి. మిగిలినవి ఇతర శాఖలకు సంబంధించినవిగా నమోదయ్యాయి. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ నల్లనయ్య, జాయింట్ డైరక్టర్(అమృత్) డి.విజయభారతి, ప్రధాన ఇంజనీర్ సత్యనారాయణరాజు, కార్యదర్శి రమణ, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ ఎస్.శ్రీనివాసరావు, స్పోర్ట్స్ డైరెక్టర్ ఈఏ రాజు, పర్యవేక్షక ఇంజినీర్లు, యూసీడీ పీవో ప్రసన్నవాణి, డీసీవోలు, డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు. -
ముగిసిన జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు
విశాఖ స్పోర్ట్స్: జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారంతో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ముగిశాయి. పోటీల ముగింపు కార్యక్రమానికి వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ హాజరై విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల జీవితంలో కీలకమని పేర్కొన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ పీలా శ్రీనివాస్, టోర్నీ నిర్వాహక కార్యదర్శి ఉష తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలకు సత్వర పరిష్కారం
కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులకు అధికారులు నిర్దేశిత గడువులోపు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆయన ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావివ్వకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 313 వినతులు వచ్చాయి. ఇందులో జీవీఎంసీకి 74, పోలీసు శాఖకు 19, రెవెన్యూ శాఖకు 17, ఇతర శాఖలకు 203 అర్జీలు అందాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఆర్డీవో ఎం. విశ్వేశ్వరనాయుడు, ఏడీసీ సత్యవేణి, నోడల్ అధికారి శేషశైలజ తదితరులు పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. -
బీచ్లను మద్యం కేంద్రాలుగా మార్చొద్దు
మహారాణిపేట: బీచ్లలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.362ను వెంటనే రద్దు చేయాలని మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి, అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఎ.విమల మాట్లాడుతూ మద్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు, కుటుంబ కలహాలు, మహిళలు, చిన్నారులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో బీచ్లలో మద్యం విక్రయాలకు అవకాశం కల్పించడం సమాజానికి హానికరమన్నారు. మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో సందర్శించే బీచ్ ప్రాంతాల్లో రెడీ టు డ్రింక్ కేంద్రాలు, బీచ్ షాక్స్, ఇతర వినోద కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల జీవో నెం.362ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసనలో సీఎంఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి.లలిత, జె.శ్యామల, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఆర్.ఎన్.మాధవి, కార్యదర్శి వై.సత్యవతి తదితర మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బీమా కార్మికులకు ఆశ్రిత ప్రయోజన పింఛన్లు అందజేత
సీతంపేట: కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఆశ్రిత ప్రయోజనం ఒక ముఖ్యమైన ప్రయోజనమని సంస్థ జాయింట్ డైరెక్టర్ కె.ఆర్.రవికుమార్ అన్నారు. ఉద్యోగ నిర్వహణ సమయంలో, ఉద్యోగ సంబంధిత ప్రమాదాల కారణంగా మరణించిన బీమా కార్మికుల కుటుంబ సభ్యులకు ఈ పథకం కింద నెలవారీ పింఛను అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంబంధిత ప్రమాదాల్లో మరణించిన గాజువాక ఈ.ఎస్.ఐ బ్రాంచ్ ఆఫీసు పరిధిలోని ముగ్గురు బీమా కార్మికుల కు టుంబ సభ్యులకు నగరంలోని ఈఎస్ఐసీ ఉప ప్రాంతీయ కార్యాలయంలో ఆశ్రిత ప్రయోజనం కింద మంజూరైన పింఛను చెక్కులు అందజేశారు. హిందుస్థాన్ షిప్యార్డ్లో పనిచేస్తూ వేగి వెంకట కృష్ణ గుండెపోటుతో మృతి చెందగా అతని భార్య, కుటుంబ సభ్యులకు నెలకు రూ.21,204లు ఆశ్రిత ప్రయోజన పింఛను మంజూరు చేశారు. నాగార్జున వైజాగ్ ప్రొఫైల్స్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో హెల్పర్గా పనిచేస్తున్న ఎం.నాగార్జున రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అతని భార్యకు పార్వతికి నెలకు రూ.10,479 పెన్షన్ మంజూరు చేశామన్నారు. తులసి ఇంజినీరింగ్ వర్క్స్ సంస్థలో కాంట్రాక్ట్ ప్రతినిధిగా ఉక్కు కర్మాగారంలోని ఎంజీఎం యార్డ్లో విధులు నిర్వహిస్తుండగా మృతి చెందిన కె.సూర్యారావు భార్యకు భవానికి నెలకు రూ.12,388లు ఆశ్రిత ప్రయోజన పింఛను మంజూరైందన్నారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ కేఆర్ రవి కుమార్ మాట్లాడుతూ మృతి చెందిన బీమాదారుని భార్యకు నామమాత్రపు రుసుంతో ఏడాదికి రూ. 600 ముందస్తు చెల్లింపుతో ఈ.ఎస్.ఐ డిస్పెన్సరీలు, హాస్పిటల్స్లో వైద్య సదుపాయం, పిల్లలకు ఈఎస్ఐిసీ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లలో ప్రత్యేక కోటాకు అర్హత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో బెనిఫిట్స్ శాఖ అధికారి వేమూరి శ్యామ్ ప్రసాద్, అకౌంట్స్ ఆఫీసర్ రోహిత్ కుమార్ సాహూ, గాజువాక ఈఎస్ఐ బీఎం పుచ్చల రమేష్ కుమార్, ఆయా సంస్థల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. -
సర్!
మీరెలా చెబితే అలానేటీడీపీ నేతలు చెప్పినట్లు చేస్తున్న బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లకుండా ఓటర్లను తమ వద్దకే రప్పించుకుంటున్న వైనం టీడీపీ నేతలు సూచించిన ప్రాంతాలకే రావాలంటూ ఆదేశాలు మరికొన్ని చోట్ల టీడీపీ నేతలు చెప్పినవారికే ఫారాల పంపిణీ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బూత్ లెవల్ ఆఫీసర్లు సాక్షి, విశాఖపట్నం: ఓటర్ల ముంగిటకు వెళ్లాల్సిన అధికారుల అడుగులు.. అధికార పార్టీ నేతల గడపల వైపు పడుతున్నాయి. విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) కొందరు పూర్తిగా టీడీపీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనలను పక్కనపెట్టి, అధికార పార్టీ నాయకులు చెప్పినట్లే వ్యవహరిస్తూ ఓటర్ల నమోదు ప్రక్రియను జిల్లాలో కొందరు బీఎల్వోలు తమ ఇష్టారాజ్యంగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘మీరెలా చెబితే అలా సర్’ అన్నట్లుగా టీడీపీ నేతల సూచనల మేరకే పనిచేస్తూ, ఎన్నికల సంఘం నిబంధనలను బహిరంగంగానే అపహాస్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విశాఖ జిల్లాలో క్షేత్రస్థాయిలో సాగుతున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల దృష్టికి ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫారాల పంపిణీలోనూ వివక్షే..! ఓటర్ల నమోదు, సవరణలకు సంబంధించిన ఫామ్–6, 7, 8ల పంపిణీలోనూ కొందరు బీఎల్వోలు వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలు సూచించిన వారికి, వారి అనుచరులకు మాత్రమే ఫారాలు అందజేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. సామాన్య ప్రజలు లేదా ఇతర పార్టీల సానుభూతిపరులు ఫారాలు కోరితే కాలయాపన చేస్తూ, వివిధ కారణాలు చెబుతూ తిప్పి పంపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తున్నా..! జిల్లాలో జరుగుతున్న ఈ పరిణామాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఓటర్ల జాబితా రూపకల్పన వంటి అత్యంత కీలకమైన ప్రజాస్వామ్య ప్రక్రియలో బీఎల్వోలు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓట ర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడేందుకే ఈ తరహా చర్యలకు దిగుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఎల్వోల వ్యవహారశైలి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా చర్యలు తీసుకోకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం తక్షణమే విచారణ జరిపి, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న బీఎల్వోలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పచ్చ చొక్కాలతో బీఎల్ఏలు..! సాధారణంగా బీఎల్వోలతో పాటు వివిధ రాజకీయ పార్టీల బీఎల్ఏలు కూడా ఇంటింటికీ తిరుగుతూ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీలో పాల్గొంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో బీఎల్వోలు ఇతర పార్టీల ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా, టీడీపీ నాయకులకు మాత్రమే సమాచారం అందిస్తూ వారితో కలిసి తిరుగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా టీడీపీకి చెందిన బీఎల్ఏలు నిబంధనలకు విరుద్ధంగా పసుపు చొక్కాలు, పసుపు చీరలు ధరించి ఇంటింటికీ వెళ్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎన్నికల సిబ్బంది స్పందించకపోవడం గమనార్హం. -
పెన్కాక్ సిలాట్ పోటీలకు కై లాష్రాజ్ ఎంపిక
మహారాణిపేట : ఈ ఏడాది జులై 5 నుంచి 8వ తేదీ వరకు మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని జిమ్నాజియం హాల్లో జరిగే 14వ సీనియర్ నేషనల్ పెన్ కాక్ సిలాట్ ఛాంపియన్షిప్ పోటీలకు విశాఖ విద్యార్థి అల్లాడ లిఖిల్కైలాష్ రాజ్ ఎంపికయ్యాడు. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో బీసీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న కై లాష్ రాజ్ ఇటీవల ఒంగోలులో జరిగిన పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాడు. సౌత్ జోన్ పోటీల్లో గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. కై లాస్ రాజ్ తండ్రి శివరాం ప్రసాద్ లీలామహల్ ఏరియాలో చిరు వ్యాపారి. 65–70 కేజీల విభాగంలో కై లాష్ రాజ్ ఈ పోటీల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రీడలో చేతులు, కాళ్లతోనే ప్రత్యర్థితో పోటీ పడి గెలవాలి. రామాయణంలో వాలీ, సుగ్రీవుల మధ్య జరిగిన యుద్ధాన్ని ఇండోనేషియా అభివృద్ధి చేసి పెన్ కాక్ సిలాట్గా నామకరణం చేసింది. ప్రస్తుతం ఏషియన్ గేమ్స్లో ఈ పోటీలను గుర్తించారు. ఈ పోటీలకు ఎంపికై న కై లాష్ రాజ్కు పెన్ కాక్ సిలాట్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటరావు శుభాకాంక్షలు తెలిపారు. -
ఏయూ లెక్క తప్పుతోందా?
విశాఖ విద్య : ఏ సంస్థకై నా ఆర్థిక క్రమశిక్షణ, బడ్జెట్ ప్రణాళిక తప్పనిసరి. ఒక ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఆదాయ వ్యయాలకు సంబంధించి పూర్తిస్థాయి వార్షిక నివేదికను రూపొందించుకుని, ఆ తర్వాతే తదుపరి సంవత్సరానికి బడ్జెట్ ప్రణాళికను ఆమోదించుకోవడం సంప్రదాయం. అయితే ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్సిటీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. అసలు బడ్జెట్ ప్రణాళిక రూపొందించడం, దానిని ప్రవేశపెట్టడం, పాలకమండలి ఆమోదం పొందడం వంటి ప్రాథమిక ప్రక్రియలేవీ జరగకుండానే వర్సిటీలో యథేచ్ఛగా లెక్కలేనన్ని ఖర్చులు పెట్టేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి నెల ముగిసి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా బడ్జెట్ ఊసే లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అకౌంట్స్ నిర్వహణపై అనుమానాలు వర్సిటీ అకౌంట్స్ నిర్వహణకు సంబంధించి పారదర్శకత కోసం ఫైనాన్స్ ఆఫీసర్ను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది. పదేళ్లుగా ప్రభుత్వమే ఏయూ ఆదాయ వ్యయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వస్తోంది. అయితే గత ఏడాది మే 31న అప్పటి ఫైనాన్స్ ఆఫీసర్ పదవీ విరమణ చేసిన తర్వాత, ఆ స్థానంలో సమర్థుడైన పూర్తిస్థాయి అధికారిని నియమించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ట్రెజరీ, కాగ్, ఆడిట్ లేదా ఇతర యూనివర్సిటీల నుంచి ఎంపిక చేసి ఈ పోస్టును భర్తీ చేయాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తాత్కాలిక పద్ధతిలో బాధ్యతలు అప్పగించాలనుకుంటే వర్సిటీలో ప్రస్తుతం ఏడుగురు డిప్యూటీ రిజిస్ట్రార్లు ఉన్నారు. సీనియార్టీ ప్రాతిపదికన వారిలో ఒకరికి అకౌంట్స్ విభాగం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా, కావాలనే జూనియర్ అయిన ఒక అధికారికి ఈ బాధ్యతలు కట్టబెట్టడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ పోస్టు ఖాళీ అయిన రెండు నెలల్లోనే భర్తీ చేయగా, ఇప్పుడు ఏడాది దాటినా పట్టించుకోకపోవడం వెనుక పెద్ద కథే నడుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ ఆమోదం లేకుండానే ఎడాపెడా కేటాయింపులు జరిగిపోతుండటం వర్సిటీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ 50 కోట్లకు లెక్కలు ఏవీ? పూర్తిస్థాయి ఫైనాన్స్ ఆఫీసర్ లేకపోవడం, బడ్జెట్ ఆమోదం కాకపోవడం వంటి పరిణామాల మధ్యే.. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఏయూ శతాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల కోసం సుమారు రూ.50 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు సమాచారం. అయితే ఈ ఖర్చులకు సరైన లెక్కలు ఉన్నాయా లేదా అనేదానిపై ఏయూ వర్గాల్లో రకరకాల ప్రచారం సాగుతోంది. ఏ విభాగానికి ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారనే వివరాలను అత్యంత రహస్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ఏయూ ఆర్థిక వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి పెత్తనం ఉన్నప్పటికీ, జరుగుతున్న అక్రమాలపై అధికార యంత్రాంగం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని విశ్వవిద్యాలయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తూ, ఖాతాల నిర్వహణను రహస్యంగా ఉంచుతోందని, ‘ఏయూ ఎలా పోతే మనకేంటి’ అనే ధోరణిలో వ్యవహరిస్తోందని మాజీ ఆచార్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చీవాట్లు? ఏయూలో అకౌంట్స్ నిర్వహణ లోపభూయిష్టంగా సాగుతోందనే అంశంపై గత మార్చి నెలలో విశాఖ పర్యటనకు వచ్చిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లెక్కల విషయంలో పారదర్శకత లోపించడంపై కమిటీ సభ్యులు అధికారులను గట్టిగా మందలించి నట్లు సమాచారం. ఇప్పటికై నా ప్రభుత్వం, వర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి ఏయూ ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దకపోతే, ఈ శతాబ్దాల చరిత్ర గల ప్రతిష్టాత్మక సంస్థ భవిష్యత్తు ఎటు వైపు దారితీస్తుందోనని విద్యావేత్తలు, వర్సిటీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. -
ఓటర్లనే తమ వద్దకు రప్పిస్తూ...
ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు–చేర్పుల కోసం బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలను అందజేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లాల్సింది పోయి, ఓటర్లనే తమ వద్దకు రప్పించుకుంటున్నారు. అంతేకాకుండా స్థానిక టీడీపీ నాయకులు సూచించిన ప్రదేశాలకు వచ్చి ఫారాలు తీసుకోవాలంటూ కాలనీల వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కాలనీ వాసులు ఫారాల కోసం నిర్దేశించిన ప్రదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
పర్యావరణ రక్షణకు ‘సైకిల్’ సవారి!
డాబాగార్డెన్స్: పర్యావరణ పరిరక్షణ కేవలం మాటల్లోనే కాదు.. చేతల్లోనూ చూపించాలని జీవీఎంసీ అధికారులు సరికొత్త బాట పట్టారు. నగరంలో పెరుగుతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడినీ భాగస్వామిని చేయాలనే లక్ష్యంతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇచ్చిన పిలుపుతో నగర పాలక సంస్థలో సరికొత్త మార్పునకు నాంది పడింది. ప్రతి సోమవారం ‘సైక్లింగ్ డే’ పాటించాలని కమిషనర్ ఆదేశాలతో నిత్యం కార్లు, విలాసవంతమైన వాహనాల్లో తిరిగే ఉన్నతాధికారులు సైతం సోమవారం ఉదయం సైకిళ్లపై విధులకు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో ఎన్నడూ సైకిల్ తొక్కని వారు సైతం పర్యావరణం కోసం పెడల్ తొక్కడం విశేషం. -
ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్రలను సాగనివ్వం
మహారాణిపేట: ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు సమరశంఖం పూరించాయి. సోమవారం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జాయింట్ కలెక్టర్కు సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ సమన్వయకర్తలు తిప్పల దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆర్టీసీ కార్మికులకు జరిగిన మేలును గుర్తుచేశారు. ఇచ్చిన హామీ మేరకు 2020 జనవరి 1న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, వేలాది మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ఘనత వైఎస్ జగన్దే అన్నారు. లాభాపేక్షే ధ్యేయంగా పనిచేసే ప్రైవేట్ శక్తులకు ఆర్టీసీని ధారాదత్తం చేయాలనుకోవడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వానికి నిజంగానే ఆర్టీసీని బలోపేతం చేయాలనే సంకల్పం ఉంటే.. సంస్థకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించి, స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దాలన్నారు. వైఎస్సార్ట్రేడ్ యూనియన్ నాయకులు పీవీ సురేష్, రాయపురెడ్డి అనిల్కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో జిల్లా పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్ వెస్లీ, పేర్ల విజయచంద్ర, నియోజకవర్గ పరిశీలకుడు జహీర్ అహ్మద్, ముఖ్య నాయకులు సునీల్, బోని శివరామకృష్ణ, గోడబా మనోజ్, ఎండీ షరీఫ్, ఏడుకొండలరావు, షేక్ ఖాన్, బీపీఎన్ కుమార్ జైన్, నక్క వెంకటరమణ, మార్దుపూడి పరదేశి, బీఆర్ పాత్రుడు, పిట్టరెడ్డి, డీవీ రమణ, దాలి నాయుడు, చంద్రశేఖర్, నాగబాబు, శ్రీను, గోదేశి శ్రీనివాస్రెడ్డి, నూకరాజు తదితరులు పాల్గొని తమ గళాన్ని వినిపించారు. కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ నిరసన -
తీరానికి కాలుష్య గండం
నీలి సముద్రపు అందాలతో పర్యాటకులను ఆకట్టుకునే విశాఖ సాగరతీరం ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. నగర మురుగునీరు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు సముద్రంలో కలుస్తుండటంతో దక్షిణ తీర ప్రాంత పర్యావరణం ప్రమాదకర స్థితికి చేరుకుంటోంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని జాతీయ దూరస్పందన కేంద్రం శాస్త్రవేత్తలు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిశోధకులతో కలిసి నిర్వహించిన అధ్యయనంలో ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. –సాక్షి, విశాఖపట్నం సముద్ర కాలుష్యానికి ప్రధాన కారణాలు పెద్ద డ్రైన్లు, గెడ్డలు – 41.6 శాతం పరిశ్రమలు, పోర్టులు – 23.7 శాతం అంతర్గత కాలువలు – 33.2 శాతం ఇతర కారణాలు – 1.5 శాతం ‘మురుగు’తోనే ముప్పు ఎక్కువ తీర ప్రాంత సముద్ర కాలుష్యానికి నగరంలోని మురుగునీటి కాలువలు, డ్రైన్లే ప్రధాన కారణంగా మారాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం కాలుష్యంలో సుమారు 41.6 శాతం వాటా మురుగునీటి ప్రవాహాలదేనని పరిశోధకులు గుర్తించారు. జీవీఎంసీ పరిధిలోని అనేక కాలువలు, గెడ్డల ద్వారా ప్రతిరోజూ భారీగా మురుగునీరు సముద్రంలోకి చేరుతోంది. నిబంధనల ప్రకారం ఈ నీటిని శుద్ధి చేసిన తర్వాతే సముద్రంలోకి విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో శుద్ధి ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. నగర పరిధి, పెదగంట్యాడ, గాజువాక ప్రాంతాలు కాలుష్య ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నట్లు అధ్యయనం పేర్కొంది. ఈ ప్రాంతాల్లో భూపరితల ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవడం ఆందోళన కలిగించే అంశంగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ప్రభావంతో ఏర్పడుతున్న ‘ఉష్ణ ద్వీప’ పరిస్థితులు పర్యావరణ సమతుల్యతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని హెచ్చరించారు. ఉపగ్రహ సాంకేతికత ఆధారంగా రూపొందించిన సముద్ర కాలుష్య సూచిక ప్రకారం గంగవరం పోర్టు, విశాఖ హార్బర్ నుంచి గాజువాక, పెదగంట్యాడ వరకు ఉన్న దక్షిణ తీర ప్రాంతం తీవ్ర కాలుష్య ప్రభావంతో ప్రమాదకర మండలంగా మారుతున్నట్లు తేలింది. మేఘాద్రిగెడ్డ డ్రెయిన్ అవుట్లెట్, మల్కాపురం, గాజువాక, పెదగంట్యాడ పరిసరాల్లో కాలుష్యం అధికంగా నమోదైనట్లు పరిశోధన వెల్లడించింది. సముద్ర జలాల నాణ్యత క్షీణించడంతో పాటు ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సముద్రపు నీటిలో పెరిగిన క్లోరోఫిల్–ఏ కాలుష్య కాసారాలుగా మారిన ఈ ప్రాంతాల్లోని సముద్రపు నీటిలో క్లోరోఫిల్–ఏ సాంద్రత, లవణీయత, నీటి కాలుష్య సాంద్రత, ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. క్లోరోఫిల్–ఏ సాంద్రత పెరిగిపోతే.. సముద్రంలో నాచు దట్టంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. దీన్నే ఆల్గల్ బ్లూమ్ అని పిలుస్తారు. దీనివల్ల నాచు కుళ్లిపోయి నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ని పూర్తిగా లాగేసుకుంటుంది. ఫలితంగా ఆక్సిజన్ కొరత ఏర్పడి చేపలు, ఇతర సముద్ర జీవులు ఊపిరాడక మృత్యువాత పడతాయి. ఇలాంటి ప్రాంతాల్ని డెడ్జోన్లుగా పిలుస్తారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే కష్టమే కాలుష్య ప్రాంతాలుగా మారుతున్న తీరంలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు నడుంబిగించాలి. జీవీఎంసీ, ఏపీపీసీబీ అధికారులు హాట్స్పాట్లను గుర్తించి తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మురుగునీటి శుద్ధి ప్లాంట్లను బలోపేతం చేయడంతో పాటు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలవకుండా కట్టడి చేయకపోతే.. భవిష్యత్తులో మరింత ప్రమాదం ముంచుకొస్తుందని పరిశోధన శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఏయూపై రాజకీయ రాహు–కేతువులు!
విశాఖ విద్య: వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీ ప్రస్తుతం విద్యా, పరిశోధన అంశాల కంటే రాజకీయ వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత యూనివర్సిటీ అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి పెట్టాల్సిన సమయంలో రాజకీయ ఆరోపణలు, వ్యక్తిగత విభేదాలే ప్రధాన చర్చగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ అభిప్రాయాలకు బలం చేకూరుస్తున్నాయని విద్యావర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మాజీ వైస్ చాన్సలర్, గత పాలకవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కూటమికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తరచూ ఆరోపణలు చేయడం యూనివర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనివల్ల ఏయూ ప్రతిష్ట దెబ్బతింటోందని ఉద్యోగులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరి బాధ ఏమిటి? ఏయూ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిందనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. పోస్టింగులు, పదోన్నతులు, పరిపాలనా నిర్ణయాల్లో రాజకీయ ప్రభావం అధికమైందనే ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లోనూ యూనివర్సిటీ భవిష్యత్తు కంటే గత పాలకవర్గంపై విమర్శలకే ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆధారాలు స్పష్టంగా లేకపోయినా విచారణలు జరపాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే చర్చ జరుగుతోంది. తప్పులు జరిగి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎవరూ వ్యతిరేకించడం లేదని, అయితే రాజకీయ కక్షలతో వ్యవహరిస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్లడం ప్రభుత్వానికే నష్టం చేస్తుందని కూటమి వర్గాల్లోనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గోతికాడ గుంటనక్కలా... ఏయూ ప్రతిష్ట దెబ్బతింటే తమ విద్యాసంస్థలకు లాభం చేకూరుతుందనే ఆలోచనతో మరో ప్రజాప్రతినిధి, టీడీపీకి చెందిన కీలక నేత వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా యూనివర్సిటీ వర్గాల్లో సాగుతోంది. ఏయూకు సంబంధించిన ప్రతి వివాదాన్ని రాజకీయంగా వినియోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ ర్యాంకింగ్స్, గుర్తింపుల విషయంలో ఇప్పటికే సవాళ్లు ఎదుర్కొంటున్న యూనివర్సిటీపై బయటకు ఆందోళన వ్యక్తం చేస్తూనే, లోలోపల దాని బలహీనతలను రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వర్సిటీలోని కొందరు వర్గాలు కూడా అలాంటి ప్రయత్నాలకు సహకరిస్తున్నాయనే ప్రచారం కొనసాగుతోంది. కాపాడతారా... రాజకీయాలకు బలి చేస్తారా? ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో ఆంధ్రా యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి సంస్థపై రాజకీయ కక్షలు, వ్యక్తిగత విభేదాలు, ప్రయోజనాల రాజకీయాలు ప్రభావం చూపడం పట్ల మాజీ ఆచార్యులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలని, తప్పులు జరిగి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అయితే యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఎవరికీ మేలు చేయదని హెచ్చరిస్తున్నారు. విద్యా సంస్థలను రాజకీయాలకు బలి చేయకుండా వాటి అభివృద్ధి, ప్రతిష్ట పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. తప్పులెంచువారు.. ఏయూ వ్యవహారాలపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న ఈ ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంత మేరకు సఫలమయ్యారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికల హామీల అమలు, స్థానిక సమస్యల పరిష్కారంలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే విషయంలో వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలపైనా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో ఎమ్మెల్యేపై కూడా ప్రజల కోసం చెప్పుకోదగ్గ స్థాయిలో పనిచేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత అసంతృప్తులతో ఏయూనే లక్ష్యంగా చేసుకుంటున్నారనే ప్రచారం నేపథ్యంలో విద్యార్థి, ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాసంస్థలను రాజకీయ పోరాటాలకు వేదికలుగా మార్చడం వల్ల నష్టపోయేది విద్యార్థుల భవిష్యత్తేనని వారు హెచ్చరిస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి
గోపాలపట్నం: బుచ్చిరాజుపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెందుర్తికి చెందిన దండు సుబ్బారావు (69) ఎన్ఏడీలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో బుచ్చిరాజుపాలెం బస్స్టాప్ సమీపంలో రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు వెనుక చక్రాలు అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
యోగా దినచర్య కావాలి
మహారాణిపేట: ఆరోగ్యకర ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించారు. భారీ వర్షం కారణంగా ఆర్కే బీచ్లో జరగాల్సిన ఈ వేడుకను సాగరిక ఫంక్షన్ హాల్కు మార్చి ఘనంగా జరిపారు. హోంమంత్రితో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సామూహిక యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో, ముఖ్యంగా చిన్నారుల్లో పెరుగుతున్న డిప్రెషన్ను తగ్గించడానికి యోగా, ధ్యానం ఎంతో అవసరమన్నారు. కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ.. ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్తో ఈ ఏడాది నెల రోజులుగా జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. నేవీ సహకారంతో పాటు రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్, గోల్ఫ్ క్లబ్ వంటి పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించినట్లు వివరించారు. అనంతరం జిల్లా స్థాయి యోగా పోటీల విజేతలకు, యోగా గురువులకు అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఆంధ్ర యూనివర్సిటీ యోగా విభాగం విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఏయూ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, ఆర్డీవో దిలీప్ చక్రవర్తి, డీఎఫ్వో రవీందర్ ధామా, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, వెంకటరత్నం, యోగా అసోసియేషన్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంగా యోగా డే విశాఖ పోర్ట్ ఆధ్వర్యంలో..మహారాణిపేట: విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం అక్కయ్యపాలెంలోని పోర్ట్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో 500 మందికి పైగా ఉద్యోగులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన పోర్ట్ చైర్పర్సన్ జె.ఎస్.బింద్రా మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారాలని సూచించారు. బెంగళూరు ఆశ్రమానికి చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా గురువు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోర్ట్ ఉద్యోగులతో వివిధ యోగాసనాలు, శ్వాసాభ్యాసాలు, ధ్యాన ప్రక్రియలను సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పోర్ట్ డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి కోరటి, ముఖ్య విజిలెన్స్ అధికారి టి.అరుణ్ప్రసాద్, కార్యదర్శి ఎం.శంకర్బాబు తదితరులు పాల్గొన్నారు.సింహగిరిపై యోగాసనాలు సింహాచలం: సింహగిరిపై 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న మాడవీధిలో జరిగిన ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు ప్రారంభించారు. దేవస్థానం అర్చకులు, అధికారులు, సిబ్బంది, సంస్కృతోన్నత పాఠశాల, వేద విద్యార్థులు, సేవా వలంటీర్లు, భక్తులు సుమారు వెయ్యి మంది యోగాసనాలు వేశారు. వేదికపై దేవస్థానం వేదపాఠశాల విద్యార్థులు వేసిన ‘సూర్యరథం’ ఆసనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యోగా గురువు జి.వెంకటరమణ, యోగా శిక్షకురాలు శ్రీదేవి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ఈఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా నీట్
పరీక్షా కేంద్రం వద్ద హాల్టికెట్ తనిఖీచెవి రింగులు తీస్తూ...విశాఖ విద్య: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నీట్ రీ–ఎగ్జామ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసింది. జిల్లాలోని మొత్తం 18 పరీక్షా కేంద్రాల్లో అధికారుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్షను నిర్వహించారు. జిల్లాలో వ్యాప్తంగా 8,015 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 7,298 మంది పరీక్షకు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. హాజరైన అభ్యర్థుల్లో మహిళా అభ్యర్థులదే పైచేయిగా నిలిచింది. 5,679 మంది మహిళా అభ్యర్థులు, 1,619 మంది పురుష అభ్యర్థులు పరీక్ష రాశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు నీట్ రీ–ఎగ్జామ్ నేపథ్యంలో అధికారులు ముందస్తుగానే అన్ని పరీక్షా కేంద్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. మెటల్ డిటెక్టర్ల ద్వారా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, అభ్యర్థులను లోపలికి అనుమతించారు. ప్రతి కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ కెమెరాల నిఘాలో పరీక్ష ప్రక్రియ సాగింది. అభ్యర్థులు సకాలంలో చేరుకునేందుకు వీలుగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తాగునీరు, వైద్య సిబ్బంది వంటి కనీస సదుపాయాలను సైతం పరీక్షా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులకు తోడుగా తల్లిదండ్రులు తెల్లవారుజాము నుంచే అభ్యర్థులను తల్లిదండ్రులు స్వయంగా పరీక్షా కేంద్రాలకు తీసుకువచ్చారు. తమ పిల్లలు ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యం చెబుతూ, వెంట తోడుగా నిలిచారు. కొందరు తల్లిదండ్రులు పరీక్ష ముగిసే వరకు కేంద్రాల బయటే వేచి ఉన్నారు. అభ్యర్థుల్లో ఉద్వేగ వాతావరణం నీట్ రీ–ఎగ్జామ్ కావడంతో హాజరైన అభ్యర్థుల్లో ఒక విధమైన ఉద్వేగ వాతావరణం స్పష్టంగా కనిపించింది. చాలా మంది అభ్యర్థుల ముఖాల్లో ముభావత, ఆందోళన ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. మరోసారి పరీక్ష రాయాల్సి రావడంతో మానసికంగా ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, జేసీ విద్యాధరితో కలిసి ఆంధ్రా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ, కేంద్రీయ విద్యాలయ–2 పరీక్షా కేంద్రాలను సందర్శించారు. అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. నాన్నతోడుగా...పరీక్షా కేంద్రం వద్ద తనిఖీలు -
యోగా సాధనతో ఖైదీల్లో క్రమశిక్షణ
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జైలు అధికారులు ఘనంగా నిర్వహించారు. జైలు లోపల సుమారు 1,200 మంది ఖైదీలతో 80 మంది జైలు సిబ్బంది యోగాసనాలు వేయించి, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేయించారు. ఇక్కడ ఖైదీలు, సిబ్బంది వివిధ ఆకారాల్లో ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా జైలు పర్యవేక్షణాధికారి ఎం.మహేష్బాబు మాట్లాడుతూ కారాగారాల్లో యోగ సాధన వల్ల ఖైదీల్లో క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ సూర్యకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి
తాటిచెట్లపాలెం: ఉద్యోగులు తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ సూచించారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆధ్వర్యంలో ఆదివారం రైల్వే ఇండోర్ స్టేడియంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జీఎం మాట్లాడుతూ దేశ సేవలో నిరంతరం విధులు నిర్వర్తించే రైల్వే కుటుంబానికి యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ కోస్ట్ రైల్వే వుమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ చారు మాధుర్, ఆయా విభాగాల ప్రిన్సిపల్ హెడ్స్, యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
బీచ్ షాక్స్కు వ్యతిరేకంగా వినూత్న నిరసన
మహారాణిపేట: ఆర్కే బీచ్లో బీచ్ షాక్స్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం వినూత్న నిరసన చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఆక్వా స్టోర్స్ కాంప్లెక్స్ వరకు మద్యం ఖాళీ సీసాలను మెడలో ధరించి ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు వై. రాంబాబు, ఎం.ఏ. బేగం, యు. నాగరాజులు మాట్లాడుతూ విశాఖ బీచ్ను కుటుంబాలతో కలిసి సందర్శించే ప్రశాంత ప్రాంతంగా కొనసాగించాలని, జీవో నెం. 362ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజలను ఐక్యం చేసి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన, విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మైదానాలు నిర్మించాలి
బీచ్రోడ్డు: జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరిన్ని క్రీడా మైదానాలను నిర్మించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు జీవీ రామచంద్రరావు పేర్కొన్నారు. ఆదివారం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఫుట్బాల్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న క్రీడాకారులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశాఖ నుంచి అనేక మంది ఫుట్బాల్ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారన్నారు. వీరికి ప్రభుత్వం తరఫున మరింతగా సహాయ సహకారాలు అందిస్తే.. అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణిస్తారన్నారు. క్రీడాకారుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం నగరంలో ప్రత్యేకంగా ఒక ఫుట్బాల్ మైదానాన్ని నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ హెడ్ కోచ్ ఎం.శేషు మోహన్, కోచ్లు వి.మోహన్ కుమార్, ఎస్.గణేష్, కె.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వీసీబీ డివిడెండ్ 10 శాతం
బీచ్రోడ్డు: ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (వీసీబీ) ఈ ఏడాది 10 శాతం డివిడెండ్ను ఇవ్వాలని పాలకవర్గం నిర్ణయించినట్లు బ్యాంక్ చైర్మన్ జె.వి.సత్యనారాయణమూర్తి ప్రకటించారు. ఆదివారం సిరిపురంలోని వుడా చిల్డ్రన్స్ ఎరీనాలో వీసీబీ మహాజన సభ ఘనంగా జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ.. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పాలనా, ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టి ఆమోదించినట్లు తెలిపారు. బ్యాంకు లాభాల్లో డివిడెండ్ మొత్తం రూ.39.24 కోట్లుగా ఉందని, మిగిలిన లాభాలను చట్టపరమైన నిష్పత్తుల్లో ఆయా ఖాతాలకు జమ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి బ్యాంకు రూ.66.15 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని వెల్లడించారు. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం ఈ ఏడాది చివరకు నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, మార్కాపురం జిల్లాలతో పాటు విశాఖ నగరం, తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, ఏపీ రాజధాని ప్రాంతంలో కొత్త బ్రాంచ్లను ప్రారంభించి, బ్రాంచ్ల సంఖ్యను 68కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ పూర్వ అధ్యక్షుడు మానం ఆంజనేయులు, డైరెక్టర్లు వి.చంద్రశేఖర్, సి.కృష్ణ మోహన్, ఉప్పలపాటి పార్వతీదేవి, చలసాని రాఘవేంద్ర రావు, ఎస్.నాగభూషణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
తప్పుడు కేసులతో భయపెట్టలేరు
వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు మహారాణిపేట: వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ కానూరు కారుమూరి సునీల్ కుమార్ను అక్రమ మద్యం కేసులో అరెస్ట్ చేయడాన్ని వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం తీవ్రంగా ఖండించింది. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు, అధికార ప్రతినిధి మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజా దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సునీల్ కుమార్పై తప్పుడు కేసు బనాయించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మద్యం సిండికేట్లు నడుస్తున్నాయని, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. విశాఖ, బాపట్ల వంటి తీర ప్రాంతాల్లో గోవా తరహా ‘బీచ్ లిక్కర్ సంస్కృతి’ని తీసుకురావాలని ప్రభుత్వం చూడడం వల్ల మహిళల భద్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీచ్లలో మద్యం విక్రయాల వల్ల మహిళల భద్రత దెబ్బతింటుందని, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతాయని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఈ మద్యం విధానాలను పునఃసమీక్షించాలని, సునీల్ కుమార్పై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు జగ్గుపల్లి నరేష్, రవి కిరణ్, నాగిరెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
దక్షిణ కోస్తా రైల్వే విశాఖ డివిజన్ పరిధిలో..
తాటిచెట్లపాలెం: సౌత్ కోస్ట్ రైల్వే విశాఖ డివిజన్ డీఆర్ఎం లలిత్బోహ్రా ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శుభం కాంప్లెక్స్లో ఘనంగా నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పలు ప్రధాన రైల్వేస్టేషన్లలో యోగా వేడుకలు చేపట్టారు. డీఆర్ఎం ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎంలు ఇ.శాంతారాం(ఇన్ఫ్రా), కె.రామారావు(ఆపరేషన్స్), సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ జూసుఫ్ కబీర్ అన్సారీ, ఆయా బ్రాంచ్ల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. -
‘షియోమీ 17టీ’ సిరీస్ గ్రాండ్ లాంచ్
మహారాణిపేట: ప్రముఖ మొబైల్ రిటైల్ చైన్ ‘బీన్యూ మొబైల్స్’ ఆధ్వర్యంలో సరికొత్త ‘షియోమీ 17టీ’ సిరీస్ స్మార్ట్ఫోన్ లాంచ్ ఈవెంట్ విశాఖ బీచ్లో వైభవంగా జరిగింది. బీన్యూ మొబైల్స్ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి, సీఈవో సాయి నిఖిలేష్, ఈడీ సాయి నితేష్ తమ సేల్స్ అండ్ మార్కెటింగ్ బృందంతో కలిసి ఈ మెగా ఈవెంట్లో కొత్త మొబైల్ను లాంచ్ చేశారు. ఈ ఫోన్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.54,999 కాగా, 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.59,999గా నిర్ణయించారు. లాంచ్ మంత్ ఆఫర్ కింద కొనుగోలు చేసిన ఏడాదిలోపు 60 శాతం గ్యారెంటీ బైబ్యాక్ వాల్యూ కింద రూ.35,999 పొందే సదుపాయాన్ని కల్పించారు. ఈ సందర్భంగా బీన్యూ మొబైల్స్ సీఎండీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తమకు 150కి పైగా స్టోర్లు ఉన్నాయని తెలిపారు. ఈ కొత్త ఫోన్ను కొనుగోలు చేసిన వారికి బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో పాటు కాంప్లిమెంటరీగా యూట్యూబ్ ప్రీమియం, స్పాటిఫై ప్రీమియం స్టాండర్డ్, గూగుల్ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయని వెల్లడించారు. కస్టమర్లందరూ ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అట్టహాసంగా నిర్వహించిన బీన్యూ మొబైల్స్ -
యువకుడిపై కత్తితో దాడి
ఆరిలోవ: జీవీఎంసీ13వ వార్డు పరిధి గిరిజన గ్రామం శ్రీకృష్ణాపురంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో గాయపడిన యువకుడు విమ్స్లో చికిత్స పొందుతున్నాడు. దీనిపై ఆరిలోవ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఇరువురు యువకులు టీడీపీకి చెందినవారు కావడంతో తూర్పు ఎమ్మెల్యే రంగంలోకి దిగి కేసు లేకుండా చూడాలని ఆరిలోవ పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గాయపడిన యువకుడు మారిక శివకుమార్ తండ్రి జక్కన్న తెలిపిన వివరాలు ప్రకారం.. దగ్గర బంధువైన బత్తిన అప్పలరాజు ఆస్తి వ్యవహారంలో తన కుమారుడితో తరుచూ గొడవకు దిగుతున్నాడన్నారు. కొద్ది రోజుల క్రితం ఇదే వ్యవహారంలో తన కుమారుడిపై దాడి చేయగా..స్థానిక టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చిన తన కుమారుడు శివకుమార్పై అప్పలరాజు కత్తితో దాడి చేశాడని, అప్పలరాజు వల్ల నా కుమారుడు, మా కుటుంబానికి ప్రాణ హాని ఉందని జక్కన్న ఆవేదన వ్యక్తం చేశాడు. దీన్ని రాజకీయం చేకుండా పోలీసులు కేసు నమోదు చేయాలని కోరాడు. ఇదిలా ఉండగా ఇరు కుటుంబీకులు టీడీపీకి చెందిన వారు కావడంతో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సూచనలతో స్థానిక టీడీపీ నాయకులు కొందరు కేసు లేకుండా పోలీసులుపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేస్తారో లేదో వేచి చూడాలి. -
లారీ ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి
అక్కిరెడ్డిపాలెం: ఆటోనగర్ ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్దుల్ గఫార్ (17) అనే ఇంటర్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోనగర్ ఎస్ఆర్ఎంటీ ప్రాంతానికి చెందిన అబ్దుల్ సత్తార్ కుమారుడు గఫార్ స్థానిక కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి ద్విచక్ర వాహనాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. సమీపంలోని పెట్రోల్ బంక్లో బైక్కు పెట్రోల్ పోయించుకుని తిరిగి వస్తుండగా.. ఆటోనగర్ ఎంఎస్ఎంఈ కార్యాలయం వద్దకు రాగానే ఓ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయమై గఫార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న గాజువాక ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి చిన్నారి బలి!
మధురవాడ: అధికారుల నిర్లక్ష్యం ముక్కుపచ్చలారని ఒక చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. మధురవాడ సమీపంలోని సాయిరాం కాలనీ జీసీసీ లేఅవుట్లో విద్యుత్ షాక్తో ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా నుంచి ఉపాధి కోసం విశాఖకు వచ్చిన కురిటి నారాయణరావు, చిన్నమ్మలు దంపతులు సాయిరాం కాలనీలోని ఒక అపార్ట్మెంట్లో వాచ్మ్యాన్గా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొడుకు కురిటి అఖిల్(6) స్థానిక మండల ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. బంతి కోసం వెళ్లి... అనంత లోకాలకు! ఆదివారం ఉదయం అఖిల్ తన స్నేహితులతో కలిసి ఇంటి సమీపంలో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో బంతి ప్రమాదవశాత్తు ‘శ్రీ రేణుక అపార్ట్మెంట్’ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ పైపుల వద్దకు వెళ్లింది. బంతిని తెచ్చేందుకు అఖిల్ అక్కడికి వెళ్లగా, తెగిపోయి బయటకు ఉన్న వైర్ తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే చిన్నారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. యూజీడీ పనులే కారణం? సదరు ప్రాంతంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కేబుల్ పనుల వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పనుల క్రమంలోనే ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ వైర్ తెగిపోయి బయటకు వచ్చేసిందని, దానివల్లే విద్యుదాఘాతం సంభవించిందని ఆరోపిస్తున్నారు. ఘటనపై విద్యుత్ శాఖ ఎస్ఈ శ్యామ్బాబు, ఈఈ సింహాచలం నాయుడు, డీఈ కిరణ్కుమార్ తదితరులు క్షేత్రస్థాయికి చేరుకుని పరిశీలించారు. యూజీడీ కేబుల్ పనుల వల్లే ఎర్త్ వైర్ కట్ అయినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలి విద్యుత్ శాఖ, శ్రీ రేణుక అపార్ట్మెంట్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి కురిటి అఖిల్ మృతి చెందాడని, అతని కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేసింది. ఆదివారం రాత్రి బాధితులతో కలిసి సాయిరాం కాలనీలోని రేణుక అపార్ట్మెంట్ వద్ద ధర్నా చేశారు. -
వీసీబీ నికరలాభం రూ. 66.15 కోట్లు
సీతంపేట: విశాఖపట్నం కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (వీసీబీ) ఈ ఏడాది మార్చి నాటికి రూ. 66.15 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు బ్యాంక్ చైర్మన్ జే.వీ.సత్యనారాయణమూర్తి శనివారం ద్వారకానగర్లోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడి యా సమావేశంలో వెల్లడించారు. మొత్తం 1,17,884 మంది సభ్యుల ద్వారా సమకూరిన రూ. 416.29 కోట్ల షేర్ క్యాపిటల్తో దేశంలోని అర్బన్ బ్యాంకుల్లో వీసీబీ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే రూ. 4,594.97 కోట్ల డిపాజిట్లు, రూ. 3,877.42 కోట్ల రుణాల మంజూరుతో కలిపి ప్రస్తుతం మొత్తం రూ. 8,472.39 కోట్ల లావాదేవీలతో బ్యాంక్ నడుస్తోంది. బ్యాంకు సాధించిన నికర లాభాల పంపిణీపై ఆదివారం జరిగే సర్వసభ్య సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో సింహభాగంగా 61 శాతం మేర డివిడెండ్ చెల్లించి, మిగిలిన మొత్తాన్ని ఉద్యోగుల బోనస్, చట్టబద్ధమైన కేటాయింపులకు వినియోగిస్తామన్నారు. ఈ ఏడాది మరో తొమ్మిది కొత్త బ్రాంచ్లను విస్తరించడానికి సిద్ధమవుతోందన్నారు. డైరెక్టర్లు ఎస్. నాగభూషణం చౌదరి, ఏ.జే. స్టాలిన్, వీరఘంట చంద్రశేఖర్, గుల్లపల్లి జనార్ధన రావు, చెరువు ఆదినారాయణ శాస్త్రి, కందపు ప్రసాదరావు, ఉప్పలపాటి పార్వతీదేవి, చిన్నం కోటేశ్వరరావు, సీఈవో వరలక్ష్మి , డిప్యూటీ సీఈవో గణేష్ కుమార్, జీఎం ప్రసాద్ పాల్గొన్నారు. -
ఆన్–కాల్ డ్రైవర్లకు ఆర్టీసీ అవకాశం
డాబాగార్డెన్స్: ఆర్టీసీ డిపోల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు ఆన్–కాల్ డ్రైవర్లు, ఐటీఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. రెండేళ్ల హెవీ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు భారీ వాహనాలు నడిపిన అనుభవం ఉండి, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్న పురుష అభ్యర్థులు ఆన్–కాల్ డ్రైవర్లుగా పనిచేసేందుకు అర్హులని పేర్కొన్నారు. డిపోల్లో డ్రైవర్ల కొరత ఉన్న సమయంలో మాత్రమే వీరికి తాత్కాలికంగా విధులు కేటాయించడం జరుగుతుందన్నారు. దీంతో పాటు వివిధ ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసి, అనుభవం కలిగిన అభ్యర్థులు ఔట్సోర్సింగ్ పద్ధతిలో కాంట్రాక్టర్ ద్వారా వేతనాలు పొందేందుకు మొగ్గు చూపితే వారికి కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఆసక్తి, సమ్మతి గల అభ్యర్థులు తమ నివాసానికి సమీపంలో ఉన్న ఆర్టీసీ డిపో మేనేజర్లను ఆధార్ కార్డు, ఇతర అసలు ధ్రువీకరణ పత్రాలతో నేరుగా సంప్రదించాలని ఆయన సూచించారు. -
లంచాల ‘గ్రేటర్’
డాబాగార్డెన్స్: జీవీఎంసీని అవినీతి రహితంగా తీర్చిదిద్దుతామని, పారదర్శక పాలనకు కట్టుబడి ఉన్నామని ఉన్నతాధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటిస్తూనే, మరోవైపు కొందరు ఉద్యోగులు లంచాల దందాను కొనసాగిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. అవినీతి నిర్మూలనకు జీవీఎంసీ ప్రత్యేకంగా 1800 4250 0009 టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసింది. ప్రజలు నిర్భయంగా ఫిర్యాదులు చేయవచ్చని, వాటిని స్వయంగా పరిశీలిస్తానని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇటీవల ప్రకటించారు. టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్, ప్రజారోగ్యం, రెవెన్యూ, యూసీడీ, హార్టికల్చర్ తదితర విభాగాల్లో పెండింగ్ ఫైళ్లను రెండు రోజుల్లోగా పరిష్కరించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ హెచ్చరించినా.. కమిషనర్ ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయన్న ప్రశ్నకు తాజాగా వెలుగులోకి వచ్చిన ఏసీబీ కేసు సమాధానంగా నిలుస్తోంది. జీవీఎంసీ పశ్చిమ జోనల్ కార్యాలయం (జోన్–5)లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మురుగుటు శ్రీను, 2023లో మరణించిన ఉద్యోగి వెన్ను అప్పలనారాయణ కుటుంబానికి రావాల్సిన పెన్షన్, ఇతర సర్వీస్ బెనిఫిట్స్ ఫైల్ను ముందుకు పంపేందుకు రూ.30 వేల లంచం డిమాండ్ చేశాడు. బాధిత కుటుంబ సభ్యులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో అదనపు ఎస్పీ హర్షిత, డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉచ్చుపన్ని, బాధితుల నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో శ్రీనును రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. అనంతరం అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. ప్రాథమిక విచారణలో నిందితుడు మూడు రోజుల క్రితమే మరో వ్యక్తి నుంచి కూడా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనతో ఉన్నతాధికారుల హెచ్చరికలు, పారదర్శక పాలనపై ఇచ్చిన హామీలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయన్న అంశంపై మరోసారి చర్చ మొదలైంది. అవినీతి ఉద్యోగులపై కఠిన చర్యలు చేపట్టాలి ప్రజలకు సేవలందించాల్సిన కార్యాలయాల్లో లంచాల కోసం వేధింపులు కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. అవినీతికి పాల్పడే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఫిర్యాదులపై వేగంగా స్పందించి వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. -
యోగాతో విభిన్న ఆరోగ్య ప్రయోజనాలు
ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. దానిని జయించడానికి యోగానే ఉత్తమ మార్గం. వెన్నునొప్పి, సయాటికా, ఊబకాయం, నిద్రలేమి, మహిళల ఆరోగ్య సమస్యలు వంటి అనేక జీవనశైలి వ్యాధులను యోగా ద్వారా నియంత్రించవచ్చు. యోగ సాధన మనిషిలో సానుకూల శక్తిని పెంపొందిస్తుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో మా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉచిత యోగా శిక్షణ అందిస్తున్నాం. శిక్షణకు 93333 33344 నెంబర్లో సంప్రదించవచ్చు. –డాక్టర్ చిలుకా వెంకట రమేష్, ఓం ఫ్రీ యోగా సంస్థ వ్యవస్థాపకులు -
పోర్టును సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ దర్శన్లో భాగంగా 2025 బ్యాచ్కు చెందిన ట్రైనీ ఐఏఎస్లు విశాఖపట్నం పోర్టును శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పోర్టు చైర్మన్ జేఎస్ బింద్రా.. అసిస్టెంట్ కలెక్టర్స్ అండర్ ట్రైనీస్కు ఆత్మీయ స్వాగతం పలికారు. దేశ ఆర్థికాభివృద్ధిలో పోర్టు పాత్ర, కార్యాచరణ సామర్థ్యాలపై సమగ్ర ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో పోర్టు సరకు నిర్వహణ, ఆధునికీకరణ, సౌర విద్యుదుత్పత్తి, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణ, నూతన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్, ఎగుమతి–దిగుమతి అవకాశాలపై శిక్షణార్థులకు పూర్తి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి కొరటి, పోర్టు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
సముద్ర రంగంలో సాంకేతిక సామర్థ్యాల విస్తరణ
సింధియా: దేశ సముద్ర రక్షణ, నౌకా నిర్మాణ రంగాల్లో తన ప్రాధాన్యాన్ని మరింత బలోపేతం చేస్తూ హిందూస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) 86వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సాంకేతిక ఆవిష్కరణలు, కార్యాచరణ సామర్థ్యాల పెంపునకు దోహదపడే పలు ఆధునిక కార్యాలయాలు, డాష్బోర్డ్ ఆధారిత సముద్ర పరీక్షల నిర్వహణ వ్యవస్థను సంస్థ సీఎండీ కెప్టెన్ గంటి వెంకటేశ్వర్లు, ఐఎన్ (రిటైర్డ్) ప్రారంభించారు. అలాగే జ్ఞాన విస్తరణకు దోహదపడే 11 ప్రచురణలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎస్ఎల్ నేటి స్థాయికి చేరుకోవడం వెనుక తరతరాల ఉద్యోగుల సమష్టి కృషి ప్రధాన కారణమన్నారు. ఉద్యోగుల సృజనాత్మకత, క్రమశిక్షణ, జట్టుకృషితో సంస్థ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. -
పిడుగుల మోత.. కుండపోత
నగరంలో వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షం వివరాలు ప్రాంతం వర్షం (మిమీ.లలో) ఆరిలోవ 56.0 సీతమ్మధార 53.1 మహరాణిపేట 47.1 వన్టౌన్ 38.8 గురుద్వార 37.3 హనుమంతువాక 37.0 ఆనందపురం 24.5 మధురవాడ 23.0 జూపార్క్ 20.0 సాక్షి, విశాఖపట్నం: ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన విశాఖ నగరం రాత్రికి వరుణుడి ప్రతాపంతో వణికింది. ఉరుములు, మెరుపులు, పిడుగుల మోతల మధ్య ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రుతుపవనాలు క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో కుండపోత వర్షం కురవడంతో ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోయింది. ఆకస్మికంగా కురిసిన వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదించగా, కొన్ని చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటపాటు కురిసిన వర్షంతో నగరం చల్లబడింది. వాహనదారులు పాట్లుబీచ్ రోడ్డులో చెల్లాచెదురైన యోగా మ్యాట్లు -
పరిపూర్ణ ఆరోగ్యానికి యోగ సౌభాగ్యం
జీవనశైలి వ్యాధులకు యోగాతో సమర్థ పరిష్కారం ఒక్కో ఆసనంలో వందలాది ఆరోగ్య ప్రయోజనాలు వయోభేదం లేకుండా సాధన చేస్తే ప్రశాంత జీవనం నగరంలో ఉచిత యోగా శిక్షణకు పెరుగుతున్న ఆదరణ ఉరుకుల పరుగుల జీవితం.. నిరంతర ఒత్తిడి.. చిన్న వయసులోనే ఊబకాయం.. వయసుతో సంబంధం లేకుండా గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, బ్రెయిన్ స్ట్రోక్ల వంటి జీవనశైలి వ్యాధులు మనిషి ఆరోగ్యాన్ని సవాలు చేస్తున్నాయి. అయితే వీటన్నింటినీ ఎదుర్కొనే సమర్థ మార్గం యోగానేనని యోగా సాధకులు చెబుతున్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను అందించే యోగా, ఆధునిక జీవనశైలికి అవసరమైన ఉత్తమ ఆరోగ్య సాధనగా మారిందంటున్నారు. ఏళ్ల తరబడి యోగా సాధన చేస్తున్న వారు తమ అనుభవాలను పంచుకుంటూ, వివిధ ఆసనాల ద్వారా పొందిన ప్రయోజనాలను వివరిస్తున్నారు. వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవనం సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. –ఎంవీపీ కాలనీమయూరాసనంతో జీర్ణశక్తి మెరుగుదల నా వయసు 78 సంవత్సరాలు. గత కొన్నేళ్లుగా యోగ సాధన చేస్తున్నాను. మయూరాసనం వంటి క్లిష్టమైన ఆసనాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా సాధన చేస్తే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. – టి.శాంతారాం, యోగా సాధకుడు, సీతమ్మధార ఆరోగ్య సమస్యల నుంచి యోగా గురువుగా... నాలుగేళ్ల క్రితం యోగాలో చేరే సమయానికి స్పాండిలైటిస్, గ్యాస్ట్రిక్, మలబద్ధకం, సైనసైటిస్ వంటి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడేవాడిని. కనకరావు గురువు మార్గదర్శకత్వంలో యోగా శిక్షణ పొందిన తర్వాత ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది. ప్రస్తుతం ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం రావడం లేదు. యోగాపై ఆసక్తితో ఏయూ నుంచి యోగా పీజీ పూర్తి చేసి, ‘బ్లిస్ఫుల్ యోగా’ కేంద్రాన్ని స్థాపించి శిక్షణ అందిస్తున్నాను. వేసవి సెలవుల్లో పిల్లలకు ప్రత్యేక యోగా శిక్షణ కూడా ఇస్తున్నాను. – ఎన్.వి.రమణ, కోక్ ఓవెన్స్ చార్జిమెన్, స్టీల్ప్లాంట్, యోగా గురువువెన్నెముక రక్షణకు భుజంగాసనం మన శరీరానికి వెన్నెముకే ప్రధాన ఆధారం. భుజంగాసనం సాధన ద్వారా వెన్నెముక కండరాలు బలపడటంతో పాటు స్నాయువులకు సాగుదల పెరుగుతుంది. గొంతు, ఉదర భాగాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. సులభంగా చేయగలిగే ఈ ఆసనం ప్రతి ఒక్కరికీ ఉపయోగకరం. –చించాలి నూతన్, విశ్రాంత స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ -
నాన్నే నా హీరో
నా తప్పులు, నిర్లక్ష్యంపై నాన్న వేసిన మందలింపులే ఈరోజు నాకు జీవితపాఠాలుగా మారుతాయని ఊహించలేదు. ఏమీ లేని స్థాయి నుంచి నన్ను ఈ స్థితికి తీసుకురావడంలో నాన్న చేసిన త్యాగాలు, శ్రమ, నాపై ఆయన ఉంచిన నమ్మకమే నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ప్రతి విజయవంతమైన కుమారుడి వెనుక తన కలలను త్యాగం చేస్తూ నిరంతరం కష్టపడే తండ్రి ఉంటాడు. ఈ రోజు నేను ఉన్న ఈ ఉన్నత స్థానానికి నాన్న ప్రేమ, మార్గదర్శనం, ఆశీర్వాదాలే కారణం. నా జీవితంలో నాన్నే నా మొదటి హీరో. – ఈమని అభయ్ కృష్ణ, పాలసీ ఇంప్లిమెంటేషన్ రీజనల్ హెడ్ -
మాజీ సైనికోద్యోగి ఆత్మహత్య
గోపాలపట్నం: నేవల్ విభాగంలో శుక్రవారం అర్ధరాత్రి ఒక మాజీ సైనికోద్యోగి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్ర లోహరా గ్రామానికి చెందిన మాజీ సైనికుడు మోర్ పరాగ్ సురేష్ రావ్ (43), మాజీ సైనికుల కోటాలో వెపన్ ఎక్యూప్మెంట్ డిపోలో ఉద్యోగం పొంది, నాలుగు నెలల క్రితమే విధుల్లో చేరా డు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి డిఫెన్స్ క్వార్టర్స్లో నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి నౌశక్తినగర్ పోస్టు నంబర్–1లో విధులకు హాజరైన సురేష్ రావ్, అర్ధరాత్రి 2.30 నుంచి 3 గంటల మధ్య టవర్–4 వద్ద తన వద్ద ఉన్న తుపాకీతో దవుడ కింద కాల్చుకున్నాడు. తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే ప్రాణా లు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శంకరనారాయణ ఆధారాలు సేకరించారు. సూసైడ్ నోట్లో...‘నా మృతికి ఎవరూ కారణం కాదు. నాకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలు నా పిల్లలకు చెందేలా చూడాలి’అని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య మయూరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సంపద సృష్టి అంటే ఇదేనా?
డాబాగార్డెన్స్: ‘ఆహ్లాదం, ఆనందం, ప్రశాంతతను అందించే బీచ్ ప్రాంతాన్ని బీర్లు, మత్తు పదార్థాల కేంద్రంగా మార్చుతారా? ఇదేనా చంద్రబాబు సంపద సృష్టి అంటే? అంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ మండిపడ్డారు. ‘బీచ్ షాక్స్’ పేరిట విశాఖ తీరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం ఆర్కే బీచ్ కాళీమాతా ఆలయం ఎదురుగా ఆయన ఆధ్వర్యంలో వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టారు. పసుపు చొక్కాలు వేసుకున్న కొందరు.. బీచ్ రోడ్డులో బీర్లు, వైన్లు, చికెన్ దుకాణాలు పెట్టి విక్రయిస్తున్నట్లుగా స్కిట్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ప్లకార్డులు పట్టుకుని చేసిన నినాదాలతో బీచ్ రోడ్డు హోరెత్తింది. మత్స్యకారుల ప్రాణాలతో చెలగాటమా? అనంతరం వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో పాటు వినాయక నిమజ్జనాలు, పౌర్ణమి పుణ్యస్నానాలు, శివరాత్రి వేళ కోటి శివలింగాల పూజలు అందుకునే పవిత్రమైన విశాఖ తీరంలో వైన్ దుకాణాలు పెట్టి యువతను మత్తులో ముంచుతారా అని చంద్రబాబు, లోకేష్, ఎంపీ భరత్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలు, పాఠశాలల సమీపంలో నిబంధనలు పాటించకుండా రాష్ట్రవ్యాప్తంగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నా సరిపోలేదా అని ప్రశ్నించారు. మా మత్స్యకారులు నివసించే ప్రాంతాలే మీకు కావాలా.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. బీచ్లో మద్యం సేవించి సముద్రంలో ఈతకు వెళ్లి ఎవరైనా చనిపోతే దానికి బాధ్యులు ఎవరని నిలదీశారు. తాగి పడేసే మద్యం సీసాల వల్ల చెప్పులు లేకుండా తిరిగే మత్స్యకారులు గాయాలపాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో రద్దు.. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మద్యం దుకాణాలు పెట్టడమే ఏకై క మార్గమా అని వాసుపల్లి విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ‘బీచ్ షాక్స్’ జీవోను బంగాళాఖాతంలో కలిపేస్తామని హెచ్చరించారు. గతంలో 2014లో కూడా విశాఖను గోవా, థాయిలాండ్ తరహా సంస్కృతిగా మారుస్తామంటూ చంద్రబాబు ప్రయత్నిస్తే.. ఇక్కడి ప్రజలు, మహిళా సంఘాలు తగిన గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. ఎన్నికల ముందు సనాతన ధర్మమంటూ ఆలయాల మెట్లు శుభ్రం చేసి పవన్కల్యాణ్ చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు విశాఖ వంటి పవిత్ర తీరంలో ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్న చంద్రబాబు, లోకేష్, భరత్లతో కలిసి పవన్ కల్యాణ్ కూడా సముద్రంలో మూడు సార్లు మునిగి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
మారుతున్న కాలం, మారాల్సిన నాన్న
మనస్తత్వ శాస్త్రవేత్తలు ఇప్పుడు చెప్పేది ఒక్కటే.. తండ్రి పాత్ర కేవలం పోషణకే పరిమితం కాదు. సంపాదనతో పాటు, భావోద్వేగపరంగా పిల్లలకు అందుబాటులో ఉండటం కూడా అంతే ముఖ్యం. క్రమశిక్షణాధికారి అనే పాత నమూనా నుంచి బయటపడి, పిల్లల ఆలోచనలను, అభిప్రాయాలను ఓపికగా వినే నాన్నగా మారాలన్నది నేటి అవసరం. ప్రతి సమస్యలో పిల్లలతో పాటు నడవాలన్నదే వారి కోరిక. ఎందుకంటే ఇంటి పెద్దగా నాన్న ఎంత బలంగా నిలబడ్డా, పిల్లలకు కావాల్సింది ఆయన భుజం మీద చెయ్యి మాత్రమే కాదు..తన మనసులో మాట చెప్పుకునే ఒక స్నేహితుడు కూడా. ఈ ఫాదర్స్ డే సందర్భంగా.. నాన్నతో ఒక్క మాట మాట్లాడండి. ఆయన మౌనంలో దాగున్న ప్రేమను గుర్తించండి. ఎందుకంటే నాన్న అంటే బాధ్యత మాత్రమే కాదు..మాటల్లేకుండా రాసిన ఒక ప్రేమ కవిత్వం. -
‘ఏరా’ ఎలక్ట్రిక్ బైక్ విక్రయాల ప్రారంభం
మహారాణిపేట: భారతీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ‘మ్యాటర్’ రూపొందించిన అత్యాధునిక ‘ఏరా’ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ విక్రయాలు విశాఖలో ప్రారంభమయ్యాయి. దేశంలోనే గేర్లు (4–స్పీడ్ గేర్బాక్స్) కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్గా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. 5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో పనిచేసే ఈ బైక్ కేవలం 25 పైసల వ్యయంతో ఒక కిలోమీటరు ప్రయాణిస్తుందని, కేవలం 2.8 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 3 రైడింగ్ మోడ్స్, 7 అంగుళాల స్మార్ట్ టచ్స్క్రీన్ డిస్ప్లే, నావిగేషన్, స్మార్ట్కీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్న ఈ బైక్కు జీవితకాల బ్యాటరీ వారంటీ ఇస్తున్నట్లు విశాఖ డీలర్లు నరేష్ జైన్, మహావీర్ జైన్ వెల్లడించారు. ఆసక్తి గల వినియోగదారులు ఏరా ఎక్స్పీరియన్స్ హబ్ను సందర్శించి టెస్ట్ రైడ్ చేయవచ్చని వారు కోరారు. -
నీట్కు విస్తృత ఏర్పాట్లు
హాజరుకానున్న 8,015 అభ్యర్థులు మహారాణిపేట: జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్ (యూజీ)–2026 పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 18 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 8,015 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు ఉంటుందని, దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం కేటాయించినట్లు తెలిపారు. అభ్యర్థులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని, అనంతరం కేంద్రాల గేట్లు మూసివేస్తారని పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగానే తమ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి, డీసీపీ మణికంఠ, సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు నీట్ పరీక్షకు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ల పర్యవేక్షణలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
నాన్న ప్రోత్సాహమే డాక్టర్ను చేసింది
నాన్న ప్రోత్సాహం, ఆత్మస్థైర్యమే నన్ను ఈ స్థాయికి చేర్చాయి. చిన్నప్పటి నుంచి నా ప్రతి అడుగును గమనిస్తూ, నా అభీష్టాల మేరకు చదివించి, డాక్టర్ కావాలనే నా లక్ష్యాన్ని నెరవేర్చారు. మెడిసిన్ పూర్తి చేశాక తొలుత హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో చేరినా, నాన్న చెంతనే ఉంటే ధైర్యంగా ఉంటుందనే నమ్మకంతో ప్రస్తుతం విశాఖ విశ్వం హాస్పిటల్స్ క్రిటికల్ కేర్ విభాగంలో డ్యూటీ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. – శ్రీపాద వెంకట శ్రీ అలేఖ్య, డ్యూటీ మెడికల్ ఆఫీసర్, విశ్వం హాస్పటిల్స్ -
పెదగంట్యాడ తహశీల్దార్పై నేడు లోక్యుక్త విచారణ
మహారాణిపేట: పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పెదగంట్యాడ తహసీల్దార్ తీరుపై లోక్యుక్త ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11 గంటలకు విశాఖ ల్యాండ్ ప్రొటెక్షన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విచారణ జరపనున్నారు. పెదగంట్యాడ తహసీల్దార్ కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ గత ఏడాది అక్టోబర్ 23న ‘సాక్షి’ దినపత్రికలో ‘చిరుద్యోగికి పగ్గాలు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. అలాగే తహసీల్దార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సీనియర్లను కాదని ఒక గ్రేడ్–1 వీఆర్వోకు ఆర్ఐ బాధ్యతలు అప్పగించారని, పలు వ్యవహారాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని సామాజిక కార్యకర్త వెంపాడ అప్పలరాజు ఈ ఏడాది జనవరి 30న లోక్యుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా లోక్యుక్త ఆదేశించడంతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను ఆదేశించింది. -
ఏయూలో కీలక నియామకాలు
పలువురికి డీన్లు, అసోసియేట్ డీన్లుగా ఉత్తర్వులువిశాఖ విద్య: ఏయూ పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా పలువురు డీన్లు, అసోసియేట్ డీన్లను నియమిస్తూ యూనివర్సిటీ అధికారులు ఉత్త ర్వులు జారీ చేశారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ నియామక ఉత్తర్వులను అందజేసి అభినందించారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్గా ఆచార్య ఎం.అన్నపూర్ణ, పీజీ–ప్రొఫెషనల్ కోర్సుల డీన్గా ఆచార్య వై.అబ్బులు, యూజీ పరీక్షల డీన్గా ఆచార్య బి.మునిస్వామి, బ్రాండింగ్–మీడియా అసోసియేట్ డీన్గా ఆచార్య సి.ఎం.వినయ్కుమార్ నియమితులయ్యారు. ఆర్అండ్డీ అసోసియేట్ డీన్లుగా టి.ఆర్.జ్యోత్స్న, పి. ఏడుకొండలు, సీడీవోఈ అసోసియేట్ డైరెక్టర్గా ఆచార్య వి.లక్ష్మి బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే పీజీ–ప్రొఫెషనల్ కోర్సుల అసోసియేట్ డీన్గా ఆచార్య పి.వి.లక్ష్మీనారాయణ, కాన్ఫిడెన్షియల్ (పరీక్షలు) డీన్గా ఎల్.ఎస్.వి.ప్రసాద్, ఆలుమ్ని అఫైర్స్– కార్పొరేట్ రిలేషన్స్ అసోసియేట్ డీన్గా ఆచార్య ఎన్.సాల్మన్ బెన్నీ, విద్యార్థి సంక్షేమ అసోసియేట్ డీన్గా ఆచార్య వి.ధనరాజు నియమితులయ్యారు. ఎన్సీఏ కోఆర్డినేటర్గా ఆచార్య కె.సరస్వతి విద్యార్థి, హాస్పిటాలిటీ–ఫెసిలిటీ మేనేజ్మెంట్ అసోసియేట్ డీన్గా ఆచార్య సి.హెచ్.ఆశ ఇమ్మానియల్ రాజు, స్పాట్ వాల్యుయేషన్ అసోసియేట్ డీన్గా ఆచార్య కె.రమేష్బాబు, సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ గౌరవ డైరెక్టర్గా ఆచార్య సి.వి.నాయుడును నియమించారు. గతంలో ఇతర బాధ్యతల్లో ఉన్న డీన్లు, అసోసియేట్ డీన్ల పదవీకాలాన్ని కూడా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏసీబీ వలలో జీవీఎంసీ ఉద్యోగి
ఎన్ఏడీ జంక్షన్ : జీవీఎంసీ 52వ వార్డు గౌరీనగర్లో ఉన్న జీవీఎంసీ పశ్చిమ జోనల్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఓ ఉద్యోగిని లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెందుర్తి ప్రాంతానికి చెందిన వెన్ను అప్పలనారాయణ జీవీఎంసీ జోన్–5 పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ విభాగంలో పనిచేసి 2023లో మృతి చెందారు. ఆయన మరణానంతరం రావలసిన పెన్షన్, సర్వీస్ బెనిఫిట్స్ మంజూరు కోసం కుటుంబ సభ్యులు పశ్చిమ జోనల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆరిలోవకు చెందిన మురుగుటు శ్రీనును సంప్రదించారు. దరఖాస్తును సంబంధిత ఉన్నతాధికారులకు పంపించడం మాత్రమే తన విధి అయినప్పటికీ, సర్వీస్ బెనిఫిట్స్ మంజూరు కావాలంటే రూ.30 వేల లంచం ఇవ్వాలని శ్రీను డిమాండ్ చేశాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు గురువారం ఆన్లైన్ , లిఖితపూర్వకంగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఏసీబీ అదనపు ఎస్పీ హర్షిత ఆధ్వర్యంలో, డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉచ్చుపన్ని, జీవీఎంసీ పశ్చిమ జోనల్ కార్యాలయంలో లంచం స్వీకరిస్తున్న మురుగుటి శ్రీనును రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. అతని నుంచి రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రెండు రోజుల క్రితం కూడా మరో వ్యక్తి వద్ద నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు, లక్షణరావు, సుప్రియతో పాటు సిబ్బంది లోకనాథం, సాగర్ పాల్గొన్నారు. -
మన్మథలీలలు!
మహిళా వైద్యులతో విమ్స్ డైరెక్టర్పై ఆరోపణల కలకలం డాక్టర్ల గ్రూపులో వైరల్గా వాయిస్ మెసేజ్ మహిళా డాక్టర్లు, సిబ్బందితో అభ్యంతరకర భాష పీజీలను పాస్ చేసేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు మరోసారి వివాదాల్లోకి కేజీహెచ్ జనరల్ సర్జరీ విభాగం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేజీహెచ్ జనరల్ సర్జరీ విభాగం చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇదే విభాగానికి చెందిన డాక్టర్ జనార్దన్రావుపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్న నేపథ్యంలో.. తాజాగా ఆ విభాగానికి గతంలో హెచ్వోడీగా పనిచేసి ప్రస్తుతం విమ్స్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ మన్మథరావుపై కూడా పలు ఆరోపణలు వెలుగులోకి రావడం వైద్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒక మహిళా వైద్యురాలి భర్త అయిన వైద్యుడు.. డాక్టర్ల వాట్సాప్ గ్రూపులో పోస్టు చేసిన వాయిస్ మెసేజ్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఆ వాయిస్ మెసేజ్లో డాక్టర్ మన్మథరావు మహిళా వైద్యులు, సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని, తన భార్య పట్ల ఇతరుల వద్ద అభ్యంతరకర పదజాలం ఉపయోగించారని వాపోయారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా పీజీ వైద్య విద్యార్థులను పరీక్షల్లో ఉత్తీర్ణులను చేయడానికి డబ్బులు తీసుకున్నారంటూ కూడా ఆరోపణలు చేశారు. బోధన కంటే ఇతర అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారని, విద్యార్థులకు తగిన శిక్షణ అందించలేదని వాయిస్ మెసేజ్లో విమర్శించారు. సాయంత్రం వేళల్లో విస్తృతంగా ప్రైవేటు ప్రాక్టీస్ నిర్వహించారన్న ఆరోపించారు. పైసలిస్తేనే పాస్..? కేజీహెచ్ జనరల్ సర్జరీ విభాగానికి మొన్నటివరకు హెచ్వోడీగా ఉన్న డాక్టర్ మన్మథరావుపై తాజాగా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి అండదండలతోనే ఆయనకు విమ్స్ డైరెక్టర్ పదవి దక్కిందన్న చర్చ వైద్య వర్గాల్లో సాగుతోంది. జనరల్ సర్జరీ హెచ్వోడీగా ఉన్నప్పుడు విద్యార్థులకు బోధన చేయకుండా కాలం గడిపారన్న విమర్శలు ఉన్నాయి. పీజీ విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలంటే డబ్బులు చెల్లించాల్సి వచ్చేదన్న ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. బోధన కంటే వసూళ్లకే ప్రాధాన్యం ఇచ్చారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే విభాగంలోని ఇతర అధ్యాపకులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తుండగా, పరిపాలనాపరమైన పెత్తనానికే పరిమితమయ్యారన్న అంశం కూడా వైరల్ అవుతున్న వాయిస్ మెసేజ్లో ప్రస్తావనకు వచ్చింది. ఇక ప్రభుత్వ సేవలో ఉంటూనే సాయంత్రం వేళల్లో ప్రైవేటు ప్రాక్టీస్ నిర్వహించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పీజీ విద్యార్థులను పాస్ చేయడంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలే ఇప్పుడు వైద్య వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ఇదే విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ మహాలక్ష్మి భర్త ఈ వాయిస్ మెసేజ్ను డాక్టర్ల గ్రూపులో పోస్టు చేశారు. తన భార్యను ఎలాంటి కారణం లేకుండానే యూనిట్–1 నుంచి యూనిట్–3కు బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. తాను కూడా రాజాం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడినేనని ఆ సందేశంలో పేర్కొన్నారు. వివాదంలో జనరల్ సర్జరీ విభాగం కేజీహెచ్ గత కొంతకాలంగా వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. వైద్య పరికరాల మరమ్మతులకు నిధుల కొరత కారణంగా గుండె శస్త్రచికిత్సలు నిలిచిపోయిన ఘటన నుంచి మందుల కొరత వరకు పలు అంశాలు ఇప్పటికే చర్చనీయాంశమయ్యాయి. కృత్రిమ గర్భధారణ వ్యవహారంలోనూ కేజీహెచ్కు చెందిన వైద్యులపై ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో జనరల్ సర్జరీ విభాగం మరోసారి వివాదాల కేంద్రంగా మారింది. ఇదే విభాగానికి చెందిన డాక్టర్ జనార్దన్రావుపై పీజీ విద్యార్థులు లైంగిక, మానసిక, వృత్తిపర వేధింపుల ఆరోపణలతో ఏఎంసీ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ ఘటన చల్లారకముందే ఇప్పుడు ఇదే విభాగానికి గతంలో హెచ్వోడీగా పనిచేసిన డాక్టర్ మన్మథరావుపై కూడా పలు ఆరోపణలు వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహిళా వైద్యుల పట్ల వ్యవహరించిన తీరు, పీజీ విద్యార్థుల పరీక్షల విషయంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న వాదనలు, బోధన కంటే ఇతర అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శలు వైద్య వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అలాగే ప్రైవేటు ప్రాక్టీస్ ద్వారా భారీగా ఆదాయం ఆర్జించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. విమ్స్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ మన్మథరావుపై వచ్చిన ఈ ఆరోపణల నేపథ్యంలో సంబంధిత అధికారులు ఎలాంటి విచారణ చేపడతారు, తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. -
ఏయూకు ‘గుర్తింపు’ ముప్పు..!
విశాఖ విద్య: శతాబ్ద కాలపు ఘన చరిత్ర కలిగిన అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ఠ మసకబారుతోంది. పాలకవర్గ అలసత్వం.. విద్యార్థులకు శాపంగా పరిణమిస్తోంది. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల జాతీయ స్థాయి ప్రమాణాల గుర్తింపు అయిన ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్’ (ఎన్బీఏ)ను కోల్పోతుందనే వార్త విద్యార్థి లోకాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నగరంలోని చిన్న చిన్న ప్రైవేటు విద్యాసంస్థలు సైతం ఎన్బీఏ గుర్తింపు కోసం పోటీ పడుతుంటే.. ప్రతిష్టాత్మకమైన ఏయూ మాత్రం పాలకవర్గ నిర్లక్ష్యంతో ఉన్న గుర్తింపును పణంగా పెట్టింది. ఉపకులపతి ప్రొఫెసర్ రాజశేఖర్ నాయకత్వంలోని ప్రస్తుత యాజమాన్య వైఫల్యాలు, తాజా మూల్యాంకనంలో ప్రదర్శించిన అలసత్వమే ఈ దుస్థితికి కారణమని మాజీ ఆచార్యులు చేస్తున్న తీవ్ర విమర్శలు దుమారం రేపుతున్నాయి. విద్యా ప్రమాణాలకు తలమానికం.. ఎన్బీఏ గుర్తింపు ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యా నాణ్యతను, జాతీయ ప్రమాణాలను అంచనా వేయడానికి ఎన్బీఏ అక్రిడిటేషన్ అత్యంత కీలకం. ఈ గుర్తింపు ఉన్న కోర్సులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాధాన్యత ఉంటుంది. ప్రముఖ బహుళజాతి సంస్థలు క్యాంపస్ నియామకాల్లో ఎన్బీఏ గుర్తింపు పొందిన విభాగాల విద్యార్థులకే మొదటి ప్రాధాన్యత ఇస్తాయి. అంతేకాకుండా భారతదేశంలోని ఎన్బీఏకు వాషింగ్టన్ అకార్డ్లో సభ్యత్వం ఉన్నందున, ఈ గుర్తింపు ఉన్న డిగ్రీలు పొందిన విద్యార్థులకు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు సులభంగా లభిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే వివిధ రకాల పరిశోధన నిధులు, ఆర్థిక సహాయ కార్యక్రమాలకు కూడా ఈ అక్రిడిటేషన్ ఒక తప్పనిసరి అర్హతగా పనిచేస్తుంది. ప్రదర్శనలో విఫలం.. నిధులపై కోత పడే ఛాన్స్ సాధారణంగా ఎన్బీఏ గుర్తింపు అనేది మొత్తం కళాశాలకు కాకుండా సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్ వంటి నిర్దిష్ట విభాగాలకు విడివిడిగా మంజూరు చేయబడుతుంది. ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలోని సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ విభాగాలు ఇటీవల వరకు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును కలిగి ఉండేవి. అయితే 2025 మధ్యకాలంలో జరిగిన తాజా మూల్యాంకన ప్రక్రియలో, అక్రిడిటేషన్ కమిటీ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఆయా విభాగాల బలాలు, మౌలిక వసతులను సమర్థవంతంగా ప్రదర్శించడంలో విశ్వవిద్యాలయ యాజమాన్యం పూర్తిగా విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. దీని ప్రభావం రాబోయే రోజుల్లో విశ్వవిద్యాలయం సాధించే జాతీయ స్థాయి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్పై కూడా తీవ్రంగా పడే అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కమిటీకి బహుమతుల వివాదం మరోవైపు అక్రిడిటేషన్ పరిశీలన నిమిత్తం వచ్చిన కమిటీ సభ్యులకు వర్సిటీ ప్రతినిధులు బహుమతులు అందించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర కలకలం రేపాయి. ఈ పరిణామంపై తీవ్ర అసంతృప్తికి గురైన కమిటీ సభ్యులు, నేరుగా ఆంధ్ర విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సభ్యులకు తమ చేదు అనుభవాలను వివరిస్తూ లేఖ రాయడం వర్సిటీ చరిత్రలోనే మొదటిసారి అని తెలుస్తోంది. దానిపై ఏయూ అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాజాగా ఈ ఎన్బీఏ గుర్తింపుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎస్ఈ, ఈసీఈ వంటి కీలక విభాగాలకు తిరిగి అక్రిడిటేషన్ సాధించేందుకు తక్షణ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మాజీ ప్రొఫెసర్లు మండిపడుతున్నారు. -
ముహూర్తాల జోరు..రిజిస్ట్రేషన్ల హోరు
జేష్ట శుద్ద పంచమి శుక్రవారం కావడంతో పాటు, అత్యంత శ్రేష్టమైన ముహూర్తాలు ఉండటంతో సూపర్బజార్ వద్ద ఉన్న జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జనంతో కిటకిటలాడాయి. స్థలాలు, భవనాల కొనుగోలు దస్తావేజుల రిజిస్ట్రేషన్లతో పాటు, వివాహ రిజిస్ట్రేషన్ల కోసం కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శుభ ముహూర్తాల నేపథ్యంలో ఉదయం నుంచే మొదలైన ఈ రద్దీ సాయంత్రం వరకు నిరంతరాయంగా కొనసాగింది. దరఖాస్తుదారులు, వారి బంధువుల రాకతో కార్యాలయ పరిసరాలన్నీ రోజంతా కోలాహలంగా మారాయి. – మహారాణిపేట/ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
జ్యోతి వెలిగించాక ‘గెట్ అవుట్’
సాక్షి, విశాఖపట్నం : పార్లమెంట్లో బిల్లు వీగిపోయినా.. మహిళలంటే మాకున్న గౌరవంతో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామంటూ చంద్రబాబు, లోకేష్ మహానాడు సాక్షిగా చెప్పిన మాటల్లో నిజమెంతో.. రెండేళ్ల సంబరాల్లోనే తేలిపోయింది. భారీ వేదిక.. వేదికపై పదుల సంఖ్యలో నాయకులు. కానీ ఒక్కటంటే ఒక్క కుర్చీ మహిళకు లేకుండా పోయింది. కూటమి నేతలంతా కూడబలుక్కొని అందరి సాక్షిగా అతివలకు ఘోర అవమానాన్ని మిగిల్చారు. కూర్చున్న వేదిక ఎదురుగా మహిళలు కనిపించినా ఒక్కర్ని కూడా వేదికపై కూర్చోండని పిలవకపోవడంతో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవంలో కనీస గౌరవం కొరవడిందంటూ ఆయా పార్టీల మహిళలతో పాటు మహిళా అధికారులూ అవమానకరంగా భావించారు. వేదికపై సుమారు 50 నుంచి 100 మందికి పైగా నేతలు కూర్చున్నారు. కానీ వీరిలో ఒక్క మహిళా నేతకూ చోటు దక్కకపోవడం బాధాకరం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖ మహిళా నేతలు కూడా వేదిక కిందే కూర్చోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తమ పార్టీలో ఇంత మంది మహిళా నేతలు ఉన్నారని గొప్పలు చెప్పుకునే కూటమి నాయకులు, వేదికపై వారికి చోటు కల్పించకపోవడం వారి నిరంకుశత్వానికి నిదర్శనం. మహిళా జాతికిది అవమానమే.! కేవలం వేదికపై చోటు దక్కకపోవడమే కాకుండా, సభలో కూడా మహిళలకు అవమానం ఎదురైంది. వేదికపై ఉన్న నేతలందరి కోసం కుర్చీలు వేసినప్పటికీ, వేదిక కింద ఉన్న మహిళా నేతల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. వారు అలాగే కింద కూర్చోవాల్సి వచ్చింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పుకునే కూటమి ప్రభుత్వం, కనీసం సభలో మహిళలకు కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవడంపై వారంతా బాధని దిగమింగుకున్నారు. జ్యోతి ప్రజ్వలన సమయంలో కొందరు మహిళలు.. వేదికపైకి వెళ్లారు. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే.. వారందరినీ కిందకి దిగిపోవాలంటూ ఎమ్మెల్యేలు హుకుం జారీ చేశారు. ఈ ఘటనపై మహిళా నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమకు రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి, వేదికపై చోటు కల్పించకపోవడం తమను అవమానించడమేనని వారు వాపోతున్నారు. వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న టీడీపీకి చెందిన ఈతలపాక సుజాత, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న సర్వసిద్ధి అనంతలక్ష్మి, జనసేనకు చెందిన పసుపులేటి ఉషాకిరణ్, బీజేపీకి చెందిన రాష్ట్ర మహిళానేత సుహాసినీ ఆనంద్ సహా అనేక మంది మహిళా నేతలు ఉన్నా.. వారందరికీ రెండేళ్ల సంబరాల సందర్భంగా అవమానాన్ని బహుమతిగా అందించారు. స్టాల్స్ వద్ద విభాగాధికారుల కాపలా బీచ్రోడ్డులోని ఏయూ కాన్వకేషన్ హాల్లో నిర్వహించిన విజయోత్సవాల్లో కేవలం మహిళల్నే కాదు.. ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులకూ అవమానం జరిగింది. ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చెయ్యాలంటూ అధికారుల్ని ఆదేశించారు. దీంతో.. 12 ప్రభుత్వ విభాగాలకు చెందిన స్టాల్స్ అక్కడ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ వద్ద.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయా విభాగాలకు చెందిన్న ఉన్నతాధికారుల్ని పర్యవేక్షణ కోసం ఉంచేశారు. దీంతో వారంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
సురభి నాటకాలు గిన్నిస్ రికార్డ్స్లో నమోదు కావాలి
మద్దిలపాలెం: అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మించి అద్భుత ప్రదర్శనలు ఇస్తున్న సురభి నాటకాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కావాలని వక్తలు ఆకాంక్షించారు. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో భానోదయ నాట్య మండలి నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం సాయంత్రం ప్రదర్శించిన ‘భూకై లాస్’ నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రంగస్థల నటులు మీగడ రామలింగస్వామి, చలసాని కృష్ణప్రసాద్, కొరిటాల ప్రభాకర్, పైడా కృష్ణప్రసాద్, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రంగస్థల కళాకారుల సంఘం కార్యదర్శి వంకాయల మారుతి ప్రసాద్, కళాపోషకులు నమ్మి అప్పలరాజు, బిల్డర్ రామకృష్ణ, రిటైర్డ్ ఏసీపీ మహమ్మద్ ఖాన్, గాయని మణిపల్లవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సురభి నాటక కళను ఆదరించి, ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అనంతరం ప్రదర్శించిన ‘భూకై లాస్’ నాటకంలో ఒక్కో ఘట్టం సినిమాను తలపించేలా సాగింది. సురభి కళాకారుల అద్భుత నటన, మంత్రముగ్ధులను చేసే స్టేజ్ టెక్నాలజీతో కళాభారతి హాల్ కరతాళ ధ్వనులతో మారుమోగింది. నటి శివజ్యోతి, కోఆర్డినేటర్ భానుప్రసాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా, సీనియర్ జర్నలిస్ట్ నాగనబోయిన నాగేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డ్రైవర్ దుర్మరణం -
ఫ్లైయాష్ లారీ బోల్తా
సబ్బవరం: మండలంలోని అసకపల్లి–లంకెలపాలెం రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైయాష్ లోడ్తో వెళ్తున్న డంపర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్కు చెందిన దీపక్ (45) పరవాడ ప్రాంతంలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పరవాడ ఎన్టీపీసీ నుంచి సబ్బవరం–షీలానగర్ సాగరమాల రహదారి నిర్మాణ పనుల కోసం డంపర్ లారీలో ఫ్లైయాష్ తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అసకపల్లి సమీపంలోని బంగారమ్మతల్లి ఆలయం మలుపు వద్దకు రాగానే లారీ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ పూర్తిగా నలిగిపోవడంతో, అందులో చిక్కుకుపోయిన డ్రైవర్ దీపక్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న సబ్బవరం సీఐ జి.రామచంద్రరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేబిన్ నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నదాత దుఃఖీభవ
మహారాణిపేట: రైతులకు ఇస్తున్న పెట్టుబడి సహాయంపై కూటమి సర్కార్ కత్తెర వేసింది. అన్నదాతల ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. పలు రకాల కఠిన నిబంధనలను తెరపైకి తెచ్చి ‘అన్నదాత సుఖీభవ’ పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు భారీగా కోతలు విధించింది. ఈ పథకం కింద ఏడాదికి రూ. 20 వేలు ఇస్తామంటూ ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు హామీలు గుప్పించారు. అయితే అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలోనే ఆ హామీని తుంగలోకి తొక్కేశారు. కూటమి సర్కార్ ఈ ఏడాది విడుదల చేసిన లబ్దిదారుల జాబితాలో వేల సంఖ్యలో అర్హులైన రైతుల పేర్లు కనపడకపోవడం గమనార్హం. 6,499 మంది రైతులకు మొండిచేయి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేవలం 18,573 మంది రైతులను మాత్రమే అర్హులుగా ఎంపిక చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాన మంత్రి కిసాన్ పధకం కింద 18,100 మందిని అర్హులుగా తేల్చారు. అదే గత వైఎస్సార్సీపీ హయాంలో ‘రైతు భరోసా’ కింద ఏకంగా 25,072 మంది రైతులకు నిధులను నేరుగా ఖాతాల్లోకి జమ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న కోతల వల్ల ఏకంగా 6,499 మంది లబ్ధిదారులు అన్నదాత సుఖీభవ పథకానికి దూరమయ్యారు. నిబంధనల పేరిట లబ్ధిదారుల తొలగింపు గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి సర్కార్ సరికొత్త నిబంధనలను అమలు చేస్తోంది. గత వైఎస్సార్సీపీ హయాంలో రైతులందరినీ ఒకేలా పరిగణించి ‘రైతు భరోసా’తో పాటు అన్ని రకాల పథకాలను వర్తింపజేశారు. కానీ కూటమి ప్రభుత్వం కౌలు రైతు నిబంధన, కుటుంబంలో ఒక్కరికే లబ్ధి, పది సెంట్ల లోపు భూమి ఉన్నవారిని తొలగించడం, ఆధార్, ఈ–కేవైసీ, బ్యాంకు ఖాతాల అనుసంధానం కాలేదనే నెపంతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ కారణాలతోనే జిల్లాలో 6,499 మంది రైతులను జాబితా నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించారు. నేడు రైతుల ఖాతాలో జమ అన్నదాత సుభీభవ పథకం కింద రూ.5వేలు , పీఎం కిసాన్ పథకం కింద రూ. 2 వేలు నిధులు శనివారం రైతుల ఖాతలో జమ చేయనున్నారని జిల్లా వ్యవసాయాధికారి అప్పలనాయుడు తెలిపారు. భీమిలి నియోజకవర్గ పరిధిలో ఆనందపురం మండలం బోని గ్రామంలో, గాజువాక పరిధిలో మంగళపాలెంలో, పెందుర్తి పరిధిలో సబ్బవరంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని, రైతులు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారి అప్పలస్వామి కోరారు. -
విశాఖ అండర్–16 జట్టు ఘన విజయం
విశాఖ స్పోర్ట్స్ : విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అండర్–16 మల్టీ డే క్రికెట్ జట్టు అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా విజయనగరం అండర్–16 జట్టుతో జరిగిన మ్యాచ్లో విశాఖపట్నం జట్టు ఇన్నింగ్స్, 98 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విశాఖపట్నం జట్టు తన మొదటి ఇన్నింగ్స్లో 236 పరుగులకు ఆలౌట్ అయింది. హర్ష గణేష్ (125 నాటౌట్) అద్భుతమైన శతకంతో జట్టుకు భారీ స్కోరును అందించగా, మిగిలిన బ్యాటర్లు కూడా తమ వంతు సహకారాన్ని అందించారు. విశాఖ బౌలర్ల ధాటికి విజయనగరం జట్టు మొదటి ఇన్నింగ్స్లో కేవలం 67 పరుగులకే కుప్పకూలింది. దీంతో విశాఖపట్నం జట్టు ప్రత్యర్థికి ’ఫాలోఆన్’ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్లోనూ పుంజుకోలేకపోయిన విజయనగరం జట్టు కేవలం 71 పరుగులకే పరిమితమై, ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్ విజయంలో విశాఖ బౌలర్ జాజుల యతీష్ చంద్ర అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో వెన్నుదన్నుగా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్లలో కలిపి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు పడగొట్టడంతోపాటు బ్యాటింగ్లోనూ కీలక పరుగులు చేసిన యతీష్ చంద్రకు ’ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. -
కూటమి సర్కార్వి కక్షసాధింపు రాజకీయాలు
వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ మహారాణిపేట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులతో ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని ఆ పార్టీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కుమారుడు సునీల్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గత చంద్రబాబు హయాంలో జరిగిన మద్యం అక్రమాల కేసులను మాఫీ చేసుకోవడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. నాడు టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో బెల్టుషాపులతో దోచుకుంటే, వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా ప్రభుత్వమే షాపులు నడిపిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఇకనైనా కక్షసాధింపు చర్యలు మార్చుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో యాదవ సాధికార జిల్లా అధ్యక్షుడు యడ్ల సుమన్, రాష్ట్ర బీసీ విభాగం జనరల్ సెక్రటరీ తుళ్లి చంద్రశేఖర్, బీసీ నాయకుడు చోల్లంగి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అర్హుల సంఖ్య తగ్గించడం అన్యాయం
వ్యవసాయ పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించలేదు.ఇప్పుడు నిబంధనల పేరిట వేలాది మంది అర్హులైన రైతుల పేర్లను జాబితా నుంచి తొలగించారు. ప్రభుత్వం స్పందించి అర్హులందరికీ ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని వర్తింపజేయాలి. – రవ్వ ఈశ్వరరావు, తాటితూరు, భీమిలి మండలం అర్హులందరికీ సాయం అందించాలి వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతుకూ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించాలి. కొందరిని మాత్రమే ఎంపిక చేసి, మరికొందరిని జాబితా నుంచి తొలగించడం అన్యాయం. ఈ సీజన్లో రైతులందరికీ ‘అన్నదాత సుఖీభవ’ పథకం వర్తింపజేస్తే పంటల సాగుకు ఊతమిచ్చినట్టవుతుంది. – తమ్మిన సీతారామ్, టీ.నగరపాలెం, విశాఖ -
ఇదండీ జీవీఎంసీ వరస..!
డాబాగార్డెన్స్: నగరంలో మండే ఎండల నుంచి బాటసారులు, వాహనదారులకు ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో జీవీఎంసీ ‘హరితాశ్రయం’ పేరుతో పలు ప్రాంతాల్లో గ్రీన్ షెల్టర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా గత మే నెలలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని గురజాడ విగ్రహం వద్ద గ్రీన్ షేడ్ నెట్ను ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగే వాహనదారులు, పాదచారులు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేలా నీటి తుంపర్లు చల్లే విధానాన్ని కూడా ఇంజినీరింగ్ విభాగం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ ఏర్పాటు ఎక్కువకాలం నిలవలేదు. సుమారు 20 రోజుల క్రితం నగరంలో వీచిన ఈదురుగాలులకు గ్రీన్ షెల్టర్ నెట్ పూర్తిగా దెబ్బతింది. దాన్ని మరమ్మతు చేయడం లేదా పునరుద్ధరించడం పక్కనపెడితే, ఎండాకాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జీవీఎంసీ మరో గ్రీన్ షెల్టర్ను సత్యం జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. దాదాపు రెండున్నర నెలల పాటు నగరవాసులు భానుడి ప్రతాపానికి అల్లాడిన సమయంలో కాకుండా, వర్షాలు కురుస్తున్న వేళ ఈ ఏర్పాట్లు చేపట్టడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవసరం ఉన్న సమయంలో కాకుండా ఆలస్యంగా చేపట్టిన చర్యలతో జీవీఎంసీ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో జాప్యంపై ఆగ్రహం
మహారాణిపేట: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రారంభం కాకపోవడంపై కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్లో ఉన్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. ఒక్కో బీఎల్వో సుమారు వెయ్యి ఫారాలు పంపిణీ చేయాల్సి ఉంటుందని, ఫారాల పంపిణీతో పాటు మ్యాపింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్ పూర్తయిందో లేదో యాప్ ద్వారా నిర్ధారించుకుని పంపిణీ చేపట్టాలని తెలిపారు. గాజువాక నియోజకవర్గంలోని 181, 240 పోలింగ్ కేంద్రాలు, పెందుర్తి నియోజకవర్గంలోని 253 పోలింగ్ కేంద్ర పరిధిలో ఇంకా ఫారాల పంపిణీ ప్రారంభం కాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్ల తొలగింపుకు సంబంధించి ప్రతి కేసుకు ప్రత్యేక ఫైల్ నిర్వహించి, కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. స్టీల్ప్లాంట్ తదితర ప్రాంతాల్లో డోర్లాక్ సమస్యలు అధికంగా ఉంటే ఇతర శాఖల అధికారుల సహకారం తీసుకుని ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటైజేషన్ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తానని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవో దిలీప్ చక్రవర్తి, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు తదితర అధికారులు పాల్గొన్నారు. -
మా కుమార్తెను అల్లుడే చంపేశాడు
అల్లిపురం: ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పరుపూడి రాధా గాయత్రి కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆమె కుటుంబ సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం నగర పోలీస్ కమిషనరేట్లో డీసీపీ–2 మేరీ ప్రశాంతికి లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు. గాయత్రి మరణం సహజసిద్ధమైనది కాదని, అల్లుడే పథకం ప్రకారం చంపేశాడని, ఈ ఘటనకు సంబంధించి నిజానిజాలు వెలికితీయాలని తల్లిదండ్రులు సత్యవతి, సుధాకర్లు విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాధా గాయత్రి, శ్రీచరణ్లకు గతేడాది నవంబర్ 8న విశాఖలో వివాహం జరిగిందని తెలిపారు. గాయత్రి గతంలో హైదరాబాద్లో ఉద్యోగం చేయగా, ఇటీవల గురుగ్రామ్లోని ఓ సంస్థలో చేరగా, ఆమె భర్త శ్రీచరణ్ పుణెలోని ఓ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల విహారయాత్ర నిమిత్తం ఉత్తరాఖండ్లోని ముస్సోరి వెళ్లిన దంపతులు ఓ హోటల్లో బస చేసిన సమయంలో గాయత్రి మృతి చెందిందని చెప్పారు. ఆమె మరణం వెనుక అల్లుడిపై అనేక ఆరోపణలు వ్యక్తం చేశారు. భర్త అనుమానంతో వేధింపులు తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీచరణ్ భార్య గాయత్రిపై తరచూ అనుమానం వ్యక్తం చేస్తూ మానసిక ఒత్తిడికి గురిచేసేవాడు. హైదరాబాద్లో నివసిస్తున్న సమయంలో ఆమె ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని వాచ్మ్యాన్ సహకారంతో పరిశీలిస్తూ, ఇంటికి వచ్చే వారిపై నిఘా పెట్టేవాడు. ఉద్యోగ రీత్యా వేర్వేరు నగరాల్లో ఉన్నప్పటికీ గాయత్రి కదలికలను నిరంతరం గమనిస్తూ, ఆమె అనుమతి లేకుండానే హ్యాండ్బ్యాగ్లో ట్రాకింగ్ పరికరాన్ని కూడా అమర్చాడు. సహోద్యోగుల గురించి తరచూ ప్రశ్నిస్తూ, వివాహేతర సంబంధాలపై నిరాధార ఆరోపణలు చేసి తీవ్ర మానసిక వేధింపులకు గురిచేసేవాడు. గురుగ్రామ్కు మారిన తర్వాత కూడా గాయత్రి కార్యాలయానికి వెళ్లే సమయంలో వీడియో కాల్స్ చేయాలని ఒత్తిడి తెచ్చేవాడు. నిత్యం ఆమెను మానసికంగా వేధించేవాడు. అన్ని ఆధారాలను పరిశీలించాలి గాయత్రి మృతికి సంబంధించిన పరిస్థితులపై శ్రీచరణ్ను పలుమార్లు ప్రశ్నించినప్పటికీ స్పష్టమైన సమాధానాలు చెప్పడం లేదు. ఘటన జరిగిన హోటల్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, రిజిస్టర్ వివరాలు, కాల్ డేటా రికార్డులు, ఇతర డిజిటల్ ఆధారాలను భద్రపరచి పరిశీలించాలి. పోస్టుమార్టం నివేదికలోని అంశాలను కూడా సమగ్రంగా విశ్లేషించాలని తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కాగా, గాయత్రి మృతిపై ఇప్పటికే ఉత్తరాఖండ్ పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఘటన ఉత్తరాఖండ్లో చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడి దర్యాప్తు వివరాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి. -
గ్రీన్పార్క్లో ‘నేషనల్ సిల్క్ ఎక్స్పో’
డాబాగార్డెన్స్: నగరంలోని హోటల్ గ్రీన్పార్క్లో ఏర్పాటు చేసిన ‘నేషనల్ సిల్క్ ఎక్స్పో’ విశాఖ వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల సంప్రదాయ వస్త్ర సంపదను ఈ ఎక్స్పో ఒకే వేదికపైకి తెచ్చింది. ఈ వస్త్ర ప్రదర్శన–అమ్మకం ఈ నెల 21వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రానున్న వివాహాది శుభకార్యాలకు సరిపోయేలా ఎన్నో రకాల కలెక్షన్లను ఇక్కడ ప్రదర్శనలో ఉంచినట్లు పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన నేతన్నలు నేరుగా రూపొందించిన సిల్క్, కాటన్ వస్త్రాలు, డిజైనర్ చీరలు, బ్లౌజులు, కుర్తీలపై 50 శాతం వరకు తగ్గింపు ధరలు అందిస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర పైథానీ సిల్క్, బెంగళూరు సిల్క్, కాషిదా సిల్క్, చందేరి, మహేశ్వరి, బలుచారి, జమ్దానీ, కాంత వర్క్ స్టిచ్ చీరలతో పాటు కాశ్మీరీ ఎంబ్రాయిడరీ, కాంజీవరం చీరలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. వీటితో పాటు దుప్పట్లు, సల్వార్ మెటీరియల్స్ కూడా లభిస్తాయన్నారు. ఈ ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుందని నిర్వాహకులు వివరించారు. -
బాణసంచా దుకాణంలో అగ్ని ప్రమాదం
గాజువాక: కొత్తగాజువాక మార్కెట్ వద్ద ఉన్న ‘శివ ఫైర్ వర్క్స్’ దుకాణంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. శివ ఫైర్ వర్క్స్ దుకాణం లోపల ఐరన్ స్టాండ్ తయారు చేయడం కోసం గురువారం వెల్డింగ్ పనులు చేపట్టారు. ఈ క్రమంలో వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా నిప్పు రవ్వలు ఎగసిపడి సమీపంలోనే ఉన్న బాణసంచాపై పడ్డాయి. దీంతో క్షణాల వ్యవధిలోనే మంటలు భారీగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అక్కడ వెల్డింగ్ పనులు చేస్తున్న నర్సింగరావు, సూరిబాబులకు మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పెదగంట్యాడ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్లో కేజీహెచ్కు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫైర్ వర్క్స్ దుకాణానికి ఇరువైపులా పలు రకాల హోల్సేల్ దుకాణాలు ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలు పక్క దుకాణాలకు వ్యాపించకుండా అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
జూలో జీబ్రా, నక్షత్ర తాబేలు దత్తత
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో వన్యప్రాణుల దత్తత స్వీకార కార్యక్రమానికి దాతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర గురువారం జూలోని ఒక జీబ్రాను ఏడాది కాలానికి దత్తత తీసుకున్నారు. దత్తత నిమిత్తం రూ.60 వేల విరాళాన్ని జూ క్యూరేటర్ జి.మంగమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా సిరి సహస్రకు క్యూరేటర్ దత్తత స్వీకార పత్రాన్ని అందజేశారు. అలాగే బుక్కవరపు రమాదేవి అనే దాత ఒక నక్షత్ర తాబేలును ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. దీనికోసం ఆమె రూ.10 వేల విరాళాన్ని క్యూరేటర్కు సమర్పించారు. వన్యప్రాణులపై ప్రేమతో దత్తతకు ముందుకు వచ్చిన దాతలిద్దరినీ జూ అధికారులు అభినందించారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం మరింత మంది దాతలు ముందుకు రావాలని క్యూరేటర్ మంగమ్మ కోరారు. ఈ కార్యక్రమంలో జూ అడ్మినిస్ట్రేటర్ ఇ.ఉమాదేవి, అసిస్టెంట్ క్యూరేటర్లు బి.గోపి, పి.వి.చౌదరి, ఎఫ్ఎస్వోలు భారతి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రూ.60 వేల విరాళం అందించిన మజ్జి సిరి సహస్ర -
యాదవులపై దాడిని ఖండిస్తున్నాం..
డాబాగార్డెన్స్: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఈదుమూడి గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకులు, గొర్రెల కాపరులపై జరిగిన దాడులను వైఎస్సార్సీపీ బీసీ విభాగం నేతలు ఖండించారు. గురువారం నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ మాట్లాడుతూ బీసీలపై జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈదుమూడి ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీల హక్కుల పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతామని తెలిపారు. కార్యక్రమలో పార్టీ నాయకులు పల్లా దుర్గారావు, మహంతి పట్నాయక్, మువ్వల సురేష్, రామన్న పాత్రుడు, తుళ్లి చంద్ర శేఖర్, దేవరకొండ మార్కండేయులు, యడ్ల సుమన్, వడ్డాది దిలీప్, పోతిబంతి హరి కృష్ణ, బొండాడ వెంకటరావు, మజ్జి జ్యోతి, బాపూ ఆనంద్, గురజాపు రవి, దశమంతుల మాణిక్యాలరావు, కోన శంకర్, కె.సాగర్, రవికిరణ్, కోరాడ సురేష్, బెవర మహేష్, కోణతాల కృష్ణవేణి, చేపల నూకరాజు, రామలక్ష్మీ, మాదాబత్తుల రమేష్, రాము, సందీప్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ -
సూపర్ దగా
అవి విజయోత్సవాలు కాదు.. వెన్నుపోటు సంబరాలుప్రభుత్వం చేసింది గోరంత.. ఆర్భాటం కొండంత రెండేళ్ల కూటమి పాలనలో అడుగడుగునా ప్రజావంచన మహా మోసాల ‘సూపర్ సిక్స్’.. అస్తవ్యస్తమైన విశాఖ రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామంటూ ఆశలు రేపిన బాబు.. అధికారం దక్కాక ఆ ఊసే ఎత్తడం లేదు. రెండేళ్లుగా మహిళలు తమ ఖాతాల్లో డబ్బులు పడతాయేమోనని కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నా.. మిగిలింది మాత్రం గుండుసున్నా. జిల్లాలో అర్హులైన మహిళలు: 8 లక్షల మంది రెండేళ్ల కాలంలో ఒక్కొక్కరికీ రావాల్సింది: రూ.36,000 మహిళల పొట్టగొట్టి బాబు సర్కారు మిగిల్చుకున్నది: రూ.2,880 కోట్లు ఎన్నికల ముందు ఆకాశమే హద్దుగా హామీలిచ్చి.. అధికార పీఠమెక్కాక ప్రజల నమ్మకాన్ని నిలువునా వంచించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ‘విజయోత్సవాల’ పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేస్తోంది. రెండేళ్ల పాలనలో సమాజంలోని ఏ ఒక్క వర్గానికై నా మేలు జరిగిందా? అంటే శూన్యమనే సమాధానం వస్తోంది. పిల్లల చదువుల నుంచి పేదల వైద్యం వరకు, నిరుద్యోగుల భృతి నుంచి మహిళల ‘ఆడబిడ్డల నిధి’ పథకం వరకు అడుగడుగునా దగాన పడ్డ విశాఖ జనం.. ఈ సంబరాలు విజయానికా? లేక ఘోర వైఫల్యాలకా? అని ప్రశ్నిస్తున్నారు. చేసిన తప్పులను, ఇచ్చిన వెన్నుపోటు గాయాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ తప్పుడు ఆర్భాటాలంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, విశాఖపట్నంఉన్నత విద్యకు శాపం! దివంగత వైఎస్సార్, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజు రీయంబర్స్మెంట్ కొండంత అండగా నిలిచింది. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కాలేజీలకు నిధులు విడుదల చేయకుండా బకాయిలు పెట్టడంతో, యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయి. పేదవాడి చదువును దూరం చేసే కుట్ర సాగుతోంది. ఉమ్మడి విశాఖలో లబ్ధిదారులు: సుమారు 60 వేలు రెండేళ్లుగా నిలిపివేసిన ఫీజుల బకాయిలు: సుమారు రూ.300 కోట్లు ‘తల్లి’కి ఎగనామం..! గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ‘అమ్మ ఒడి’ ద్వారా ప్రతి పేద విద్యార్థి చదువుకు భరోసా లభిస్తే, చంద్రబాబు సర్కారు ‘తల్లికి వందనం’ పేరుతో పెద్ద ఎత్తున కోత విధించింది. బడికెళ్లే పిల్లలందరికీ రూ.15 వేలు ఇస్తామని నమ్మించి, తీరా సమయానికి లబ్ధిదారుల సంఖ్యను సగానికి సగం తగ్గించేసింది. జిల్లాలో మొత్తం విద్యార్థులు: 3,26,494 మంది తల్లికి వందనం ఇస్తున్నది : 1,90,907 మందికి చంద్రబాబు మోసం చేస్తోంది: 1,35,587 మంది ‘ఉచిత గ్యాస్’.. ఉత్తుత్తి కబుర్లే! ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటూ ప్రచారం ఊదరగొట్టారు. కానీ క్షేత్రస్థాయిలో సగం మందికి కూడా సిలిండర్లు అందడం లేదు. లబ్ధిదారుల్లో కనీసం 60 శాతం మందికి కూడా రాయితీ డబ్బులు జమకావడం లేదు. ఉచిత గ్యాస్కు అర్హులైన గృహాలు: 5.17 లక్షలు అందుతున్నది అరకొరగానే: 3.71 లక్షల ఇళ్లకు మాత్రమే రెండేళ్లలో ఎగ్గొట్టిన సిలిండర్ల సంఖ్య: 5.50 లక్షల సిలిండర్లు -
స్పా దందా!
సెలూన్ పేరిటసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సంపత్ వినాయగర్ ఆలయానికి కూతవేటు దూరంలో సెలూన్ పేరిట నడుస్తున్న ఓ స్పా సెంటర్ విషయంలో పోలీసులు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెలూన్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఈ కేంద్రం జోలికి పోలీసులు వెళ్లడం లేదని స్థానికులు చెబుతున్నారు. కరోనా సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కేంద్రాన్ని తెరిచి ఉంచడంతో పోలీసులు దాడి చేశారు. అప్పట్లో బాడీ మసాజ్ల పేరుతో జరుగుతున్న కార్యకలాపాలపై నిర్వాహకులు పోలీసులకు అడ్డంగా దొరికినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత మళ్లీ యథావిధిగా సెలూన్ ముసుగులో స్పా కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని పలు స్పా కేంద్రాలపై తరచూ దాడులు జరుగుతున్నప్పటికీ, ఈ కేంద్రం వైపు మాత్రం పోలీసులు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ కేంద్రంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఆ సమాచారం వెంటనే నిర్వాహకులకు చేరుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల నెలా భారీ మొత్తంలో మామూళ్లు అందుతుండటమే ఇందుకు కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చే యువతులకు సెలూన్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, క్రమంగా స్పా కార్యకలాపాల్లోకి దింపుతున్నట్లు సమాచారం. వీఐపీ రోడ్డులో ఉన్న మరో సెలూన్ స్టూడియో విషయంలోనూ ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. బయోమెట్రిక్తో ఎంట్రీకి అడ్డుకట్ట! స్పా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం చట్టబద్ధమే. అయితే మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించేందుకు శాసీ్త్రయ పద్ధతుల్లో మసాజ్ సేవలు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం శిక్షణ పొందిన థెరపిస్టులు ఉండాలి. అయితే విశాఖపట్నంలోని కొన్ని కేంద్రాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. మసాజ్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీల కోసం పోలీసులు లేదా ఇతరులు నేరుగా లోపలికి రాకుండా ఉండేందుకు బయోమెట్రిక్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. స్పా సిబ్బంది మినహా ఇతరులు లోపలికి వెళ్లాలంటే బయోమెట్రిక్ కార్డు తప్పనిసరి చేస్తున్నట్లు సమాచారం. ఈ విధమైన వ్యవస్థలు ఉండకూడదని పోలీసులు చెబుతున్నప్పటికీ, వాటి వినియోగం మాత్రం కొనసాగుతూనే ఉంది. మామూళ్ల వ్యవహారమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది స్పెషల్ స్పా వాస్తవానికి నగరంలో స్పా కేంద్రాల ముసుగులో వ్యభిచారం సాగుతోందన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి మసాజ్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. నగరంలో అడుగడుగునా కనిపిస్తున్న స్పా కేంద్రాల్లో చాలావరకు ఇలాంటి కార్యకలాపాలు సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సంపత్ వినాయక ఆలయానికి సమీపంలోని ఈ కేంద్రంతో పాటు వీఐపీ రోడ్డులోని మరో స్టూడియోపైనా ఇదే తరహా ఆరోపణలు ఉన్నాయి. బయటకు సెలూన్లుగా కనిపిస్తున్నప్పటికీ, లోలోపల వ్యభిచారం సాగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేంద్రాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఆ సమాచారం నిర్వాహకులకు చేరుతుండటంతో వారు ఫిర్యాదు చేసిన వారిని సంప్రదించి వ్యవహారాన్ని ‘మేనేజ్’ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచే.. విశాఖపట్నంలోని అనేక మసాజ్ కేంద్రాల్లో స్థానిక యువతుల కంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొస్తున్నట్లు సమాచారం. వారికి వసతి సదుపాయాలను కూడా కొందరు నిర్వాహకులే కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సెలూన్లు, స్టూడియోల పేర్లతో అనుమతులు తీసుకుని స్పా కేంద్రాలను నిర్వహిస్తుండగా, మరోవైపు ఎలాంటి అనుమతులు లేకుండానే కొన్ని ప్రాంతాల్లో మసాజ్ కేంద్రాలు నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ కేంద్రాలపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడానికి మామూళ్ల వ్యవహారమే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి స్పాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మూసివేసిన గదులకు బదులుగా కర్టెన్లతో మాత్రమే విభజనలు ఉండాలని గతంలో పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిబంధనలను చాలా కేంద్రాలు పాటించకపోయినా చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
కూటమిలో సర్ కలకలం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగిస్తున్నారనే భయాందోళనల నడుమ ప్రారంభమైన ’స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026 (ఎస్ఐఆర్)’ ప్రక్రియ.. ఇప్పుడు కూటమి పార్టీల్లోనే తీవ్ర వివాదానికి దారితీస్తోంది. సొంత పార్టీల నేతల ఓట్లపైనే కోత పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఈ ’సర్’ ప్రక్రియ మొత్తాన్ని అపహాస్యం చేస్తూ.. తన ఆధీనంలోకి తీసుకున్నారని, జనసేన నేతల ఓట్లను సైతం తొలగిస్తున్నారని కూటమి నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. తన సమీప బంధువుల ఓట్లతో పాటు, తన ముఖ్య మద్దతుదారుల ఓట్లను కూడా తొలగిస్తున్నారంటూ జనసేన పార్టీ మాజీ కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపణలు చేశారు. జనసేన నేతలు, కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే వైఖరిని నిలదీస్తున్న సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని.. ఈ ’సర్’ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని ఆక్షేపించారు. సీఈవో, కలెక్టర్కు ఫిర్యాదు ఈ అక్రమాలపై పీతల మూర్తియాదవ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో పాటు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్కు బుధవారం నేరుగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కాపీలను ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కూడా పంపారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఈ ప్రక్రియను ఒక ఆయుధంగా వాడుకుంటూ దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని ఆ లేఖలో మండిపడ్డారు. బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా కాకుండా, టీడీపీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్ల ద్వారా గుండుగుత్తగా ఫారాలు నింపుతున్నారని ఆరోపించా రు. తొలగించాల్సిన ఓట్లను ముందే టిక్ చేసి మరీ ఎమ్మెల్యే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని.. టీడీపీకి చెందిన బీఎల్ఏలు ఏకంగా తలుపులు మూసి మరీ ఫారాలు నింపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ వ్యవహారం విశాఖపట్నంలోని కూటమి నేతల మధ్య తీవ్ర చిచ్చురేపింది. అన్ని నియోజకవర్గాల్లోనూ అదే తంతు..! ఒకవైపు ప్రతిపక్ష పార్టీల ఓట్లకు ఎసరు పెట్టేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు లాగే, ఏజెంట్ల నియామకం కూడా ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అనకాపల్లి: ఇక్కడ పూర్తిస్థాయిలో జనసేనకు చెందిన బీఎల్ఏలను నియమించారని, తమకు కనీస ప్రాతినిధ్యం దక్కలేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. యలమంచిలి, పెందుర్తి, విశాఖ సౌత్: ఈ నియోజకవర్గాల్లో అన్ని బూత్లలోనూ టీడీపీ నేతలను బీఎల్ఏలుగా నియమించలేదని ఆ పార్టీ క్యాడర్ వాపోతోంది. ఇక్కడ మెజారిటీ స్థానాల్లో జనసేన వారికే అవకాశం దక్కడంతో టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. బీజేపీ అసహనం: ఈ గందరగోళంలో తమను అసలు పట్టించుకునే నాథుడే లేడని స్థానిక బీజేపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కేవలం టీడీపీ నేతలకే బీఎల్ఏలుగా అవకాశం కల్పించారని ఇతర కూటమి భాగస్వామ్య పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ అసంతృప్తి లోలోపలే రగిలిపోగా.. ఇప్పుడు విశాఖ తూర్పు నియోజకవర్గంలో జనసేన మాజీ కార్పొరేటర్ నేరుగా వీధికెక్కి రచ్చ చేయడంతో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టిక్ మార్కులతో ఓట్ల తొలగింపు! రాజకీయంగా తమకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను అధికార పార్టీ నేతలు ముందే గుర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటు వేయరని భావించే వారి పేర్లను ఓటర్ల జాబితాలో గుర్తించి, వాటి పక్కన ’టిక్ మార్కు’ పెడుతున్నారు. ఆ జాబితాలను అధికార పార్టీకి చెందిన బీఎల్ఏలకు అందజేస్తున్నారు. వీరి ఒత్తిళ్లకు లొంగి బీఎల్ఓలు ఆయా ఓటర్లకు ఫారాలు అందజేయకపోవడమో.. లేదా సదరు బీఎల్ఏలే తప్పులతడకగా ఫారాలు నింపి, ఆ ఓట్లు త్వరగా తొలగిపోయేలా రంగం సిద్ధం చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. -
నిర్వహణ నైపుణ్యాల పెంపుపై దృష్టిసారించాలి
సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ వ్యవస్థలో నూతన పరిజ్ఞానంపై అవగాహన, నిర్వహణ నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి సూచించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్(సీవోఈఈటీ)లో ఈనెల 15 నుంచి 19 వరకూ 5 రోజుల శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా.. గురువారం జరిగిన సెషన్కు సీఎండీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఐఎం విశాఖపట్నం ఆధ్వర్యంలో ఫైనాన్స్ అండ్ మేనేజిరియల్ అకౌంటింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో ఏపీ విద్యుత్ రంగానికి చెందిన ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎన్ఆర్ఈడీక్యాప్ సంస్థల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎండీ పృథ్వీతేజ్ మాట్లాడుతూ, ఇంధన రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు, ముఖ్యంగా ఎనర్జీ ట్రాన్సిషన్ నేపథ్యంలో ఉద్యోగులు నిరంతర అధ్యయనం, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక నిర్వహణ, నాయకత్వ లక్షణాల అభివృద్ధి ద్వారా సంస్థల పనితీరు మరింత మెరుగుపడుతుందన్నారు. ఐఐఎంవీ అధ్యాపకులు డా.వికాస్ సంగ్వాన్, డా.తమలి చక్రబర్తి ప్రోగ్రామ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ శిక్షణ అందిస్తున్నారు. ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి -
‘ఉద్యోగం’ లేదు.. ‘భృతి’ లేదు!
ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ ఊదరగొట్టిన కూటమి సర్కారు, రెండేళ్లు గడుస్తున్నా నిరుద్యోగులకు పైసా విదిల్చలేదు. 2014–19 నాటి పాత మోసాన్నే మళ్లీ పునరావృతం చేస్తూ నిరుద్యోగ యువతను నట్టేట ముంచింది. జిల్లాలో నిరుద్యోగ యువత: 2.05 లక్షల మంది ఒక్కో నిరుద్యోగికి 24 నెలల్లో రావాల్సింది: రూ.72,000 చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టిన మొత్తం సొమ్ము: రూ.1,476 కోట్లు -
అవ్వాతాతల పింఛన్లకూ ‘కోత’!
వైఎస్ జగన్ పాలనలో ఒకటో తేదీ ఉదయం సూరీడు రాకముందే వలంటీర్లు తలుపు తట్టి పింఛను డబ్బులు చేతిలో పెట్టేవారు. కానీ నేడు పింఛన్ కోసం అవ్వాతాతలు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అంతటితో ఆగకుండా, వేలాది మంది అర్హుల పింఛన్లను బాబు సర్కారు నిర్దాక్షిణ్యంగా తొలగించింది. వైఎస్సార్సీపీ హయాంలో జిల్లాలో పింఛనుదారులు: 1,65,891 బాబు పాలనలో ప్రస్తుత పింఛనుదారులు: 1,57,624 నిర్దాక్షిణ్యంగా తొలగించిన పింఛన్లు: 8,267 -
అదే అక్కసు!
సాక్షి, విశాఖపట్నం: రుషికొండపై నిర్మించిన అద్భుత ప్రభుత్వ భవనాలు కనిపిస్తే చాలు.. చంద్రబాబు ప్రభుత్వం మరోసారి అదే పాత రాజకీయానికి తెరతీస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శాసనసభ సాక్షిగా ఇవి పర్యాటక శాఖకు చెందిన ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తూనే, ప్రజల్లోకి వచ్చాక మాత్రం ‘జగన్ ప్యాలెస్’ అంటూ రాజకీయ విమర్శలకు దిగడం కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వైఎస్సార్సీపీ వర్గాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో, విశాఖ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రుషికొండపై అత్యాధునిక ప్రమాణాలతో ఈ భవన సముదాయాన్ని నిర్మించింది. అయితే ఈ భవనాలను ప్రజల ప్రయోజనాలకు వినియోగించే దిశగా ఆలోచించాల్సిన ప్రభుత్వం.. కేబినెట్ సబ్కమిటీ పేరుతో మరోసారి రాజకీయ రచ్చకు తెరతీసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ ప్రతిష్టను పెంచే నిర్మాణాలు పర్యాటక రంగ అభివృద్ధి, అంతర్జాతీయ సదస్సులు, ఉన్నత స్థాయి సమావేశాల నిర్వహణకు అనువుగా విశాఖలో ప్రభుత్వానికి సొంతంగా అత్యాధునిక వసతి సముదాయం అవసరమనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్టును చేపట్టారని చెబుతున్నారు. సముద్ర తీరానికి ఆనుకుని, పచ్చని ప్రకృతి మధ్య నిర్మించిన ఈ భవనాలు విశాఖకు కొత్త గుర్తింపుగా నిలుస్తాయని భావిస్తున్నారు. అయితే రాష్ట్రానికి శాశ్వత ఆస్తిగా మిగిలే ఈ నిర్మాణాలను రాజకీయ విమర్శల కోసం వాడుకోవడం సరికాదని, వాటిని రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించాలని విశాఖ వాసులు సూచిస్తున్నారు. అభివృద్ధి, ఆస్తుల సృష్టిపై చర్చించాల్సిన చోట రాజకీయ అక్కసు ప్రదర్శించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలే దెబ్బతింటాయని అభిప్రాయపడుతున్నారు. తాత్కాలిక భవనాలకు వేల కోట్లు..! చంద్రబాబు హయాంలో అమరావతిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల కోసం భారీగా ప్రజాధనం ఖర్చు చేసిన విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తాత్కాలిక నిర్మాణాలకే రూ.1,000 కోట్లకు పైగా ఖర్చు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు రాష్ట్రానికి శాశ్వత ఆస్తిగా నిలిచే రుషికొండ భవనాలపై విమర్శలు చేయడం విడ్డూరమని అంటున్నారు. మరోవైపు రుషికొండ భవన సముదాయం సుమారు రూ.450 కోట్ల వ్యయంతో నిర్మితమైందని, అంతర్జాతీయ స్థాయి అతిథులు, విదేశీ ప్రతినిధులు, రాష్ట్రపతులు, ప్రధానులు బస చేయగలిగే స్థాయిలో ఆధునిక సౌకర్యాలతో రూపొందించారని గుర్తుచేస్తున్నారు. రుషికొండ భవనాల పరిశీలనకొమ్మాది: రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను బుధవారం సాయంత్రం మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయస్వామి పరిశీలించారు. ఈ భవన సముదాయంలో నిర్మాణ విషయాలును, నిర్మాణ సామర్థ్యం, పలు అంశాలను టూరిజం ఇజనీర్లు వీరికి వివరించారు. స్పెషల్ సిఎస్ అజయ్ జైన్, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, పలువురు టూరిజం అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్తి.. రాజకీయ లక్ష్యమా? రుషికొండపై నిర్మించిన భవనాలు ప్రభుత్వ ఆస్తి. అవి ఏ వ్యక్తి సొంతం కావు. ఈ విషయం తెలిసినప్పటికీ కేవలం రాజకీయ కక్షసాధింపే లక్ష్యంగా విమర్శలు కొనసాగుతున్నాయని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొంటున్నారు. అసెంబ్లీలో ఒక మాట, బయట మరో మాట మాట్లాడటం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శిస్తున్నారు. -
యాదవులపై దాడులు చేస్తే ఊరుకోం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా యాదవులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా యాదవ విభాగం అధ్యక్షుడు ఎడ్ల సుమన్ స్పష్టం చేశారు. బుధవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ యాదవ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్చూరు నియోజకవర్గంలోని ఈదుముడి గ్రామంలో గొర్రెలు, మేకలను మేపేందుకు వెళ్లిన యాదవ సామాజిక వర్గానికి చెందిన మధు, అనిల్లపై జరిగిన దాడిని ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత గ్రామంలోనే యాదవ సామాజిక వర్గాన్ని అవమానిస్తూ కులదూషణలకు పాల్పడటం, వారిపై అమానుషంగా దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా చెప్పుకునే పల్లా శ్రీనివాసరావు ఈ ఘటనపై స్పందించకపోవడం విచారకరమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు తక్షణమే న్యాయం చేయాలన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో యాదవుల ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం యాదవుల కోసం కేటాయించిన 50 సెంట్ల భూమి అంశాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ, ఎలాంటి స్పష్టమైన నిర్ణయం లేకుండా వదిలేయడం యాదవ సమాజానికి జరుగుతున్న తీవ్ర అన్యాయమన్నారు. యాదవుల ఓట్లతో రాజకీయంగా ఎదిగి, వారి సమస్యల పట్ల మౌనం వహిస్తే సమాజం ఎన్నటికీ క్షమించదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ యాదవ నాయకులు పల్లా దుర్గారావు, మువ్వల సురేష్, పల్లా పెంటారావు, పీతల మహేష్, వర ప్రసాద్, మొల్లి హేమంత్ తదితరులు పాల్గొన్నారు. -
16వ బెటాలియన్ కమాండెంట్గా అనిల్కుమార్
పీఎం పాలెం: ఏపీఎస్పీ 16వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్గా పి.అనిల్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన బెటాలియన్ పరిపాలన, సిబ్బంది శిక్షణ, క్రమశిక్షణ, సంక్షేమ కార్యక్రమాలు, విధుల నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బెటాలియన్ సిబ్బంది వృత్తి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ప్రజల భద్రత, పరిరక్షణ కోసం మరింత సమర్థవంతమైన పోలీసింగ్ను అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే విధి నిర్వహణతో పాటు సిబ్బంది సంక్షేమ కార్యక్రమాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. 16వ బెటాలియన్ను రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
జోన్–1 ఆర్జేడీగా సదారావు బాధ్యతల స్వీకరణ
మహారాణిపేట: సమాచార, పౌర సంబంధాల శాఖ జోన్–1 రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ)గా కె.సదారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ప్రభుత్వం జాయింట్ డైరెక్టర్గా పదోన్నతి కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్జేడీ బాధ్యతలతో పాటు విశాఖపట్నం జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారిగా అదనపు బాధ్యతలను కూడా నిర్వహించాలని శాఖ డైరెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్ ఆదేశాలు జారీ చేశారు. కె.సదారావు 1991లో పాడేరులో ఏపీఆర్ఓగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం డివిజనల్ పీఆర్ఓగా పలు ప్రాంతాల్లో సేవలందించారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో డీపీఆర్ఓ, విజయవాడలో అసిస్టెంట్ డైరెక్టర్గా, నెల్లూరులో ఉపసంచాలకుడిగా, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్గా వివిధ హోదాల్లో పనిచేశారు. -
అలరించిన ‘పాతాళభైరవి’
మద్దిలపాలెం: సురభి నాటకోత్సవాల్లో ప్రదర్శించిన పాతాళభైరవి ఆహుతులను కట్టపడేసింది. కళాభారతి వేదికగా జరుగుతున్న ఈ వేడుకల్లో రెండో రోజు బుధవారం పాతాళభైరవి నాటకం ప్రదర్శించారు. కళాభారతి అధ్యక్షుడు ఎమ్మెస్ఎన్ రాజు, కార్యదర్శి రాంబాబు, నగర మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాతాళభైరవి నాటకంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. రంగస్థలం నటి శివజ్యోతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో కళా పోషకులు మేడా మస్తాన్ రెడ్డి, భీశెట్టి వెంకటేశ్వరరావు, పోతన రెడ్డి, అక్కు నాయుడు, తిలక్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆర్.భానుప్రసాద్ సంధానకర్తగా వ్యవహరించారు. చురుగ్గా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీమహారాణిపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, వాటి డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 20,23,009 మంది ఓటర్లకు సంబంధించి ఇప్పటివరకు 2,46,018 ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇది మొత్తం ఓటర్లలో 12.16 శాతంగా నమోదైందన్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే, విశాఖ తూర్పు నియోజకవర్గం 16.59 శాతం ఫారాల పంపిణీతో తొలి స్థానంలో ఉండగా, విశాఖ పశ్చిమ నియోజకవర్గం 15.96 శాతంతో రెండో స్థానంలో నిలిచిందన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో కేవలం 6.78 శాతం మాత్రమే నమోదైనందున అక్కడ పంపిణీ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని సూచించారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 983 ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటైజ్ అయినట్లు కలెక్టర్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన ఫారాలను సకాలంలో ఆన్లైన్లో నమోదు చేసి డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. -
కాందిశీకుల పేరుతో కబ్జా!
ప్రభుత్వ స్థలంలో ఇళ్లుసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ స్థలం అని బోర్డు స్పష్టంగా ఉన్నా.. ఆక్రమణదారుల అడుగులు మాత్రం ఆగడం లేదు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని బర్మా క్యాంప్లో సర్వే నంబర్ 13/ఏ/14లో ఉన్న మూడు ఎకరాల ప్రభుత్వ భూమిపై కాందీశీకుల పేరుతో కబ్జా యత్నాలు జరుగుతున్నాయంటూ స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు లేని పేదలకు ఇళ్లు ఇప్పిస్తామంటూ నమ్మించి.. ఇప్పుడు కొద్ది మంది నాయకులు కాస్తా ఇష్టారీతిలో ఇక్కడ స్థలాన్ని ఆక్రమించి కబ్జాలకు తెగబడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇళ్లు లేని స్థానిక పేదలకు స్థలం ఇవ్వకుండా.. తమ అనుయాయులకు ఇష్టారీతిలో కేటాయించుకుని.. పక్కాగా కాందిశీకుల పేరుతో కబ్జాకు దిగారని విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా రూ.100 కోట్ల విలువైన ఈ ప్రభుత్వ స్థలంలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ నేరుగా కాలనీవాసులు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఇళ్లు ఇస్తామంటూ నమ్మించి..! వాస్తవానికి కాలనీలోని పేదల సంక్షేమ కోసం 2014లో బర్మా కాందిశీకుల సంక్షేమ సంఘం పేరుతో సంఘాన్ని స్థాపించారని స్థానికులు పేర్కొంటున్నారు. కొంత ప్రభుత్వ భూమి ఉందని, ఇల్లు లేని పేదలకు ఇద్దామనే ఉద్దేశంతో సంఘాన్ని స్థాపించామని తమను నమ్మబలికారని స్థానికులు అంటున్నారు. అయితే, వాస్తవంలో మాత్రం కొద్ది మంది సంఘానికి చెందిన నేతలు అక్రమార్కులతో చేతులు కలిపి, గ్రామ ప్రజలను అవమానించారని వాపోతున్నారు. 48, 60, 180 గజాల లెక్కల విభజించి.. తమ అనుయాయుల పేరుతో ఆక్రమణకు దిగారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ గ్రామానికి సంబంధం లేని వ్యక్తులకు, అక్రమార్కులకు స్థలాలను కేటాయించి, ఇప్పుడు దౌర్జన్యానికి దిగుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి కాందిశీకుల పేరుతో జరుగుతున్న కబ్జాను అడ్డుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రూ.100 కోట్ల పైమాటే...! వాస్తవానికి ఇక్కడ గజం మార్కెట్ ధర భారీగా పలుకుతోంది. అంత విలువైన ప్రదేశంలో కబ్జాకు తెగబడుతుంటే.. రెవెన్యూ వర్గాలు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక్కడ మార్కెట్ ధర గజం రూ.80 వేల చొప్పున పలుకుతోంది. అంటే 3 ఎకరాల ధర ఏకంగా రూ.100 కోట్ల మేర ఉంటుందని అంచనా. రూ. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అండదండలున్నాయని సదరు అక్రమార్కులు పేర్కొంటున్నట్టు విమర్శలున్నాయి. అందుకే గ్రామస్తులు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇప్పటివరకూ రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. -
కై లాసగిరిపై.. పట్టాలెక్కని ‘టాయ్ ట్రైన్’
ఆరిలోవ: కై లాసగిరిపై అందాల ప్రయాణం అటకెక్కింది. శిఖరంపై నుంచి సాగర సోయగాలు.. సుందర నగర అందాలు తిలకించే భాగ్యం పర్యాటకులకు దూరమైంది. దశాబ్దాలుగా సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచిన ఆ చిన్నారి రైలు కూత ఆగిపోయింది. విశాఖ పర్యాటక రంగానికి మణిహారంగా నిలిచిన కై లాసగిరి ‘టాయ్ ట్రైన్’ ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా పట్టాలపై మూలకు చేరింది. సాంకేతిక లోపమో.. లేక అధికారుల ఉదాసీనతో కానీ, ఏడాదిగా ఆగిపోయిన ఈ రైలు కథ ఇక ముగిసినట్లేనా అన్న ఆందోళన పర్యాటకుల్లో వ్యక్తమవుతోంది. నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కై లాసగిరిపై సందర్శకులను ఎంతగానో అలరించిన ‘విశాఖ దర్శిని’ సర్క్యూట్ రైలు కథ ముగిసినట్లేనా? అంటే అవుననే అంటున్నాయి అక్కడి పరిస్థితులు. పట్టాల పక్కనే అనాథలా.. గత కొన్నాళ్లుగా ఈ టాయ్ ట్రైన్ సాంకేతిక లోపాలతో నడక సాగించలేకపోతోంది. రైలు మరమ్మతులకు గురికావడంతో వీఎంఆర్డీఏ అధికారులు దీన్ని కనీసం షెడ్డుకు కూడా చేర్చకుండా, స్టేషన్కు కొంత దూరంలో పట్టాలపైనే వదిలేశారు. ఈ రైలు అందుబాటులో లేకపోవడంతో కై లాసగిరికి వచ్చే పర్యాటకులు తీవ్ర నిరాశతో వెనుతిరుగుతున్నారు. గతంలో ఇక్కడికి వచ్చే పర్యాటకులు అత్యధికంగా ఈ టాయ్ ట్రైన్ ఎక్కేందుకే ఆసక్తి చూపించేవారు. ఇందులో ప్రయాణిస్తూ సాగర తీరాన్ని వీక్షించి మురిసిపోయేవారు. దీంతో ఈ రైలు కోసం ప్రత్యేకంగా నిర్మించిన స్టేషన్ ఎప్పుడూ సందర్శకులతో కళకళలాడుతూ ఉండేది. కానీ, ఏడాది కాలంగా రైలు నిలిచిపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పూర్తిగా బోసిపోయింది. ఈ రైలు మళ్లీ పట్టాలెక్కే అవకాశం లేదని అక్కడ పనిచేసే సిబ్బంది పేర్కొనడం గమనార్హం. ఇప్పటికై నా వీఎంఆర్డీఏ అధికారులు స్పందించి, తక్షణమే ఈ టాయ్ ట్రైన్కు మరమ్మతులు చేయించి పునరుద్ధరించాలని పర్యాటకులు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
అక్కిరెడ్డిపాలెం: ఆటోనగర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కిరెడ్డిపాలెంకు చెందిన రావాడ తేజేశ్ (20) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఆటోనగర్లోని వెల్డింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ కోసం తేజేశ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బీహెచ్పీవీ–ఆటోనగర్ రహదారిపై పనుల్లో ఉన్న జీవీఎంసీ డెబ్రిస్ క్లీనింగ్ వాహనాన్ని వెనుక నుంచి తేజేశ్ బైక్తో బలంగా ఢీకొట్టాడు. లారీ వెనుక భాగం తలకు బలంగా తగలడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ప్రమాద సమయంలో యువకుడు హెల్మెట్ ధరించకపోవడం వల్లే మృతి చెందాడని గాజువాక ట్రాఫిక్ సీఐ షేక్ హుస్సేన్ తెలిపారు. -
బీచ్లో మద్యం షాపులా?
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం బీచ్ వాతావరణాన్ని కలుషితం చేస్తూ, ‘బీచ్ షాక్స్’ పేరుతో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం జీవోలు 362, 363 విడుదల చేయడం అత్యంత దుర్మార్గమని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం పెదవాల్తేరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అర్ధరాత్రి వేళ కూడా మహిళలు స్వేచ్ఛగా తిరిగే విశాఖ తీరంలో మద్యం దుకాణాలు పెట్టి ప్రజల స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం స్వస్తి పలుకుతోందని ధ్వజమెత్తారు. ఎంపీ భరత్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం విశాఖ పర్యాటక ప్రాంతంలో మద్యం షాపుల ఏర్పాటును మహిళా, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం జీవో జారీ చేయడం దారుణమన్నారు. 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన విశాఖ ఎంపీ శ్రీభరత్ అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీచ్ షాక్స్ ద్వారా ఆదాయం వస్తే తప్పేంటని ఎంపీ ప్రశ్నించడాన్ని తప్పుబడుతూ.. మద్యం షాపులు అంతగా కావాలనుకుంటే ఆయన సొంత విద్యాసంస్థలైన గీతంలో పెట్టుకోవాలని హితవు పలికారు. విశాఖ రైల్వే జోన్ కేకే లైను వేరే రాష్ట్రానికి తరలిపోతున్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు అడుగులు పడుతున్నా నోరు మెదపని ఎంపీ.. మద్యం షాపులను సమర్థించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో పెరిగిన క్రైమ్ రేట్ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని వరుదు కళ్యాణి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో లక్షకు పైగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయని, పర్మిట్ రూమ్ల పేరిట మద్యాన్ని విపరీతంగా అందుబాటులోకి తెచ్చారని విమర్శించారు. మద్యం మత్తు కారణంగానే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, గృహహింసతో పాటు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి బీచ్ షాక్స్కు సంబంధించిన జీవో నెంబర్ 362ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
కేటగిరి మార్చి డేటా సెంటర్కు పర్యావరణ అనుమతులు
సీతంపేట: విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నిబంధనలను బేఖాతరు చేస్తూ తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతోందని జల్ బిరాదరి జాతీయ కన్వీనర్, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యన్నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ద్వారకానగర్లోని పౌరగ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డేటా సెంటర్ల కారణంగా పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదంటూ స్థానిక ఎంపీ ఎం.శ్రీభరత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పర్యావరణ చట్టాల ప్రకారం అత్యంత కఠినమైన నిబంధనలు వర్తించే కేటగిరి ‘ఏ’ కింద పరిగణించాల్సిన భారీ డేటా సెంటర్లను, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేటగిరి ‘బీ2’ కిందకు మార్చి పర్యావరణ అనుమతులు మంజూరు చేసిందని ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణను, సమగ్ర పర్యావరణ ప్రభావ అంచనా ప్రక్రియలను పూర్తిగా పక్కనబెట్టి అనుమతులు జారీ చేయడం దారుణమన్నారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర పర్యావరణ మంత్రులతో గానీ, ముఖ్యమంత్రితో గానీ మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాలు విసిరారు. ఈ డేటా సెంటర్ల వల్ల భవిష్యత్తులో నగరంలో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడుతుందని, పవర్ గ్రిడ్పై భారం పడి కరెంట్ కోతలు విపరీతంగా పెరుగుతాయని హెచ్చరించారు. అంతేకాకుండా నగర ఉష్ణోగ్రతలు 1 నుంచి 6 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదం ఉందన్నారు. సమగ్ర పర్యావరణ ఆడిట్ నిర్వహించే వరకు ఈ డేటా సెంటర్ పనులను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
స్టీల్ప్లాంట్ను సందర్శించిన సెఫీ బృందం
ఉక్కునగరం: స్టీల్ ఎగ్జిక్యూటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సెఫీ) బృందం బుధవారం విశాఖ స్టీల్ప్లాంట్ను సందర్శించింది. సెఫీ చైర్మన్ ఎం.కె.బంచోర్, వైస్చైర్మన్ అజయ్పాండే, ప్రధాన కార్యదర్శి సంజయ్ ఆర్య ఉదయం కోక్ ఓవెన్, స్టీల్ మెల్ట్ షాప్లకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఎస్ఎమ్ఎస్లోని సీసీడీ, బ్లూమ్ స్టోరేజ్ యార్డ్లకు వెళ్లారు. డైరెక్టర్(ఆపరేషన్స్) సుభశిస్ సేన్ గుప్తా, చీఫ్ జనరల్ మేనేజర్ (వర్క్స్) అనింధ్య ఘోష్లను కలిసి స్టీల్ప్లాంట్, అధికారుల సమస్యలపై ఆరా తీశారు. అనంతరం సీఎండీ ఎం.ఎన్.వి.ఎస్.ప్రభాకర్ను కలిసి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వారితో సీఎండీ మాట్లాడుతూ ఉద్యోగులందరి సహకారంతో సమస్యలను పరిష్కరిస్తానన్నారు. డైరెక్టర్ (ఫైనాన్స్) వినయ్ కుమార్ను కలిసి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు. స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తే ఇరు సంస్థలకు లాభదాయకంగా ఉంటుందన్నారు. సాయంత్రం సి–భవన్లో ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమస్యలపై కేంద్ర మంత్రి కుమారస్వామి, కార్యదర్శి సందీప్ పాండ్రిక్లతో మాట్లాడతామన్నారు. సెయిల్ నుంచి అన్ని విధాల సహకారం అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు విద్యుత్ కుమార్ వర్మ, ప్రధాన కార్యదర్శి కె.వి.డి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కై లాసగిరిపై.. పట్టాలెక్కని ‘టాయ్ ట్రైన్’
● బీచ్లో షాక్స్భవన వ్యర్థాలతో రోడ్లు.. కాలువలకు రంగులు!గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026విశాఖ తీరంలోఅధినేతను కలిసిన మాజీ మేయర్ దంపతులుమద్యం కిక్కుఆరిలోవ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని మాజీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు గొలగాని శ్రీనివాస్ బుధవారం అమరావతిలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు శ్రీకృష్ణుడి విగ్రహం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని జగన్మోహన్రెడ్డి సూచించినట్లు హరివెంకటకుమారి తెలిపారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇకపై విశాఖ బీచ్కు వెళ్లేముందు కుటుంబ సభ్యులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి రానుంది. ఆహ్లాదం, ఆనందం కోసం సముద్ర తీరానికి వచ్చే నగరవాసులకు, పర్యాటకులకు ఇక నుంచి మందుబాబుల తిప్పలు తప్పేలా లేవు. విశాఖపట్నం బీచ్ ఒడ్డున ‘బీచ్ షాక్స్’ పేరిట లిక్కర్ విక్రయాలు జరిపేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. ఏకంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ షాక్స్లలో మద్యం విక్రయించుకోవచ్చంటూ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విశాఖ తీరంలో ప్రాథమికంగా రెండు ప్రాంతాల్లో ఈ బీచ్ షాక్స్ ఏర్పాటు కానున్నాయి. గతంలో ఒకసారి ఇటువంటి ప్రయత్నం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రజల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. కానీ, ఈ విడత మాత్రం నగరవాసుల నిరసనలను బేఖాతరు చేస్తూ ముందుకు వెళ్తుండటం గమనార్హం. ‘భోజనం’ పేరిట హంగామా! ఈ బీచ్ షాక్స్లలో బీర్, వైన్తో పాటు రెడీ–టు–డ్రింక్ రకాలను విక్రయించేందుకు అనుమతించారు. అంతేకాకుండా, రాత్రి 8 గంటల తర్వాత కూడా అక్కడ ఆహార పదార్థాలను సరఫరా చేసేందుకు వీలుగా ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. దీంతో రాత్రి పొద్దుపోయే వరకు భోజనం పేరిట మందుబాబులు బీచ్లోనే తిష్టవేసి హంగామా చేసే అవకాశం ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబాలతో కలిసి ప్రశాంతంగా సేదతీరేందుకు వచ్చే వారికి ఇది తీవ్ర ఇబ్బందికరంగా మారనుంది. అధిక ధరల దందా! రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది. ప్రస్తుతం సిండికేట్లు ఇష్టారాజ్యంగా ప్రతి బాటిల్ పై రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తూ దోపిడీకి తెరలేపారు. ఇవన్నీ అధికార పార్టీ నేతల దుకాణాలే కావడంతో ఎకై ్సజ్ అధికారులు సైతం కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. రేపు బీచ్ షాక్స్లలోనూ మద్యం ధరలు ఇష్టారాజ్యంగానే ఉండే ప్రమాదం ఉంది. ఇప్పటికే స్టార్ హోటళ్ల వార్షిక లైసెన్స్ ఫీజును రూ.66 లక్షల నుంచి రూ.25 లక్షలకు తగ్గించిన ప్రభుత్వం.. బీచ్ షాక్స్కు కూడా నామమాత్రపు ఫీజునే ఖరారు చేసింది. అస్మదీయుల కోసమే పాలసీ.. సాధారణ వ్యాపారులు దరఖాస్తు చేసే సాహసం కూడా చేయకుండా.. దరఖాస్తు ఫీజునే ఏకంగా రూ.2 లక్షలుగా నిర్ణయించడం విశేషం. కేవలం అధికార టీడీపీ నేతలు, స్టార్ హోట ళ్ల యజమానులకు లబ్ధి చేకూర్చడానికే ఈ నిబంధనలు పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు షాక్స్ తమకే దక్కేలా అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో పైరవీలు ప్రారంభించారు. తమకు ప్రైవేట్ బీచ్ ఉందంటూ ప్రచారం చేసుకునే రెండు హోటళ్ల యజమానులతో పాటు.. చినబాబు సిఫార్సులతో మరో కీలక నేత రంగంలోకి దిగినట్టు సమాచారం. వార్షిక లైసెన్స్ ఫీజు: రూ. 7.5 లక్షలు దరఖాస్తు రుసుం: రూ. 2 లక్షలు (నాన్–రీఫండబుల్) అద్భుత భవనాలపైఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం విక్రయాలు రెండు చోట్ల ‘బీచ్ షాక్స్’ ఏర్పాటు బీర్, వైన్, రెడీ–టు–డ్రింక్ బ్రాండ్ల అమ్మకాలకు అనుమతి రాత్రి 8 తర్వాత ఆహార సరఫరాకూ సర్కారు గ్రీన్సిగ్నల్ కుటుంబాలతో కలిసి సేదతీరాలంటే ఇక ఇబ్బందులే..! టిడ్కో, పీఎంఏవై గృహాల పనులు వేగవంతం చేయాలికలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేకాధికారి అభిషిక్త్ కిషోర్ ఆదేశంబీచ్ షాక్స్ ఫీజుల వివరాలు గతంలో వెనక్కి.. ఈసారి ముందుకే.. నిజానికి, గతంలోనూ విశాఖ తీరంలో లిక్కర్ విక్రయాలు జరిపేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. ఇందులో భాగంగానే 2016లో బీచ్ బార్ల ఏర్పాటుకు జీవో నంబర్ 470 విడుదల చేసింది. అదే సమయంలో వైజాగ్లో ‘బికినీ ఫెస్టివల్’ నిర్వహిస్తామంటూ చేసిన ప్రకటనలపై నగరవాసులు మండిపడ్డారు. అప్పట్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో చంద్రబాబు వెనక్కి తగ్గక తప్పలేదు. కానీ ఈసారి మాత్రం ప్రజాభిప్రాయాన్ని, మహిళల ఆవేదనను ఏమాత్రం లెక్కచేయకుండా ప్రభుత్వం ఏకంగా జీవో నంబర్లు 362, 363 జారీ చేసి మరీ బీచ్ షాక్స్ ఏర్పాటుకు తెగబడటం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
● అమర్నాథ్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు ● విజయమ్మ, భారతమ్మలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి ● ‘దళిత కార్డు’తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ● వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి ధ్వజం
సాక్షి, విశాఖపట్నం: హోం మంత్రి వంగలపూడి అనిత అధికార మదంతో హద్దులు దాటి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి విమర్శించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల, మహిళల భద్రతను గాలికొదిలేసి హోం మంత్రి అనిత తన బాధ్యతలను విస్మరించి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గుడివాడ అమర్నాథ్తో పాటు వైఎస్సార్సీపీ నేతలపై వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారని ఆరోపించారు. మాజీ మంత్రి అమర్నాథ్ను ‘వాడు, వీడు’ అంటూ ఏకవచనంతో సంబోధించడం ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు. అయితే గతంలో విజయమ్మ, భారతమ్మలతో పాటు జగన్పై కూడా అనిత గౌరవహీనంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. తమ పార్టీ నుంచి ప్రతిస్పందన వస్తే వెంటనే ‘దళిత కార్డు’ను ప్రయోగిస్తున్నారని, దళితుల కోసం పనిచేయని అనితకు అలా మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా ‘రెడ్బుక్ రాజ్యాంగం’ అమలవుతోందని విమర్శించారు. తునిలో బాలిక అదృశ్యమైన ఘటనలో కుటుంబాన్ని పరామర్శించలేదని, పాయకరావుపేటలో సీఐ పోస్టు ఖాళీగా ఉండటమే హోం శాఖ వైఫల్యానికి నిదర్శనమన్నారు. జగన్ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసిన దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు హోం మంత్రి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ పథకాల అమలులో విఫలమై, ‘సూపర్ హిట్’ సమావేశాలు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. మెగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ పోస్టు చేసిన వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించారని, డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.


