ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఆద్యంతం దేశభక్తిని, దేశ సమగ్రతను చాటి చెప్పాయి. నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే జయహో జానకి అనే గేయ నృత్య ప్రదర్శనతో ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆసాంతం అలరింపజేశాయి. సంఘటనం ఒక యజ్ఞం అంటూ మేఘాద్రి గెడ్డ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం విద్యార్థులు, ఏ దేశమేగినా అంటూ మధురువాడ సన్ స్కూల్ విద్యార్థులు, జయ భారత జనని అంటూ తగరపువలస కేథరిన్ పాఠశాల విద్యార్థులు, ఖూబ్ నహీ ఫర్ జష్న్ యే భారత్ అంటూ విశాఖ వ్యాలీ పాఠశాల విద్యార్థులు, నెత్తురు మరిగితే ఎత్తర జెండా అంటూ పద్మనాభం కేజీబీవీ విద్యార్థులు, దేశ రంగీలా పేరుతో సేక్రడ్ హార్ట్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, యే వతస్, వతస్ అంటూ పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేశారు. జిల్లాలోని 8 పాఠశాలలకు చెందిన 440 మంది సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
ఏ దేశమేగినా..
జైహింద్
అలరించిన సాంస్కృతిక ప్రదర్శన
మేరా భారత్ మహాన్
పాడవోయి భారతీయుడా...
జయ భారత జననీ..
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు


