breaking news
Parvathipuram Manyam
-
మహిళా సాధికారతకు ‘మన్యం’ దిక్సూచి
● జిల్లాలో 8వేల మంది కొత్త పారిశ్రామికవేత్తలు ● రూ. 447.25 కోట్ల రుణాల పంపిణీ ● కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి పార్వతీపురం రూరల్: ప్రతి ఇంట్లోనూ ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలని, ఆర్థిక స్వతంత్రతతోనే మహిళలకు సమాజంలో గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురంలోని ఒక ప్రైవేట్ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం కంటే అధికంగా 8వేల మంది మహిళలు కొత్తగా పారిశ్రామికవేత్తలుగా నమోదు చేసుకోవడం గర్వకారణమన్నారు. ఆడపిల్లలను కనీసం డిగ్రీ వరకు చదివించాలని, నెలకు రూ.10–20 వేల ఆదాయం సంపాదించే స్థాయికి చేరాకే వివాహం చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. మహిళల రక్షణ కోసం ‘శక్తి యాప్’, వన్స్టాప్ సెంటర్లు, ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఇంటి పట్టాలను మహిళల పేరుతో మంజూరు చేయడం వల్ల వారికి సామాజిక భద్రత చేకూరిందని తెలిపారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం చిన్న వ్యాపారులు, సాధారణ మహిళలకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరుస్తోందన్నారు. అనంతరం జిల్లాలోని 9,337 స్వయం సహాయక సంఘాల్లోని 62,954 మంది సభ్యులకు రూ. 447,25,00,000/– విలువైన చెక్కును అతిథులు అందజేశారు. అంతకు ముందు డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను కలెక్టర్ సందర్శించారు. కార్యక్రమంలో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్ఓ కె.హేమలత, ఐసీడీఎస్ పీడీ డా. టి.కనకదుర్గ, వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆదివారం మహిళా శక్తి కదం తొక్కింది. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీని కలెక్టర్ ప్రభాకరరెడ్డి, ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు సాగిన ఈ ప్రదర్శనలో విద్యార్థినులు, మహిళా పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా హక్కులపై నినాదాలు చేశారు. కోలాటాలు, థింసా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డి, ఐసీడీఎస్ అధికారి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026
అటవీ ఫలసాయాల సేకరణకు వెళ్తున్న గిరిజనులు ఈ సీజన్లో కొండలపైనే ఉంటాం. అటవీ ఉత్పత్తులు సేకరించే పనిలో నిమగ్నమౌతాం. ఇంటిళ్లపాది కొండపోడు వ్యవసాయంలో భాగంగా అన్ని రకాల ఉత్పత్తులు సేకరించి ఇంటికి వస్తాం. ఉదయాన్నే వంటలు ముగించుకుని కొండపోడు వద్దకు తీసుకువెళ్తాం. పిల్లాపాపలతో పాటు వెళ్లి అటవీ ఉత్పత్తులు సేకరిస్తాం. సేకరించిన ఉత్పత్తులను సంతల్లో విక్రయించినా.. దళారుల బారిన పడి మోసపోతున్నాం. – ఎస్.జమ్మమ్మ, ఈతమానుగూడ కొండకోనల్లో వేసవిలో పండిన ఉత్పత్తులు సేకరించడం కష్టమైన పని. గ్రామంలో 90 శాతం మంది కొండపోడు పనుల్లో ఉంటాం. వేసవిలో ఎటువంటి పనులు ఉండకపోవడంతో కొండపోడు పనుల్లో నిమగ్నమౌతాం. గిట్టుబాటు ధరలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటాయి. అటవీ ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేస్తే.. బాగుంటుంది. కానీ ఆ పని చేయడం లేదు. దీంతో కొండపోడును నమ్ముకొని పనులు చేస్తున్నా... జీవనం కష్టంగానే ఉంటుంది. – ఎస్. రాజ్కుమార్, జన్నోడిగూడ పార్వతీపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్), కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం పార్వతీపురంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్, టెన్నిస్ (మాస్టర్స్) పోటీలు నిర్వహించారు. స్థానిక ఆఫీసర్స్ క్లబ్ ఇండోర్ స్టేడియం, ప్రకాశం టౌన్ క్లబ్ వేదికలుగా జరిగిన ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి మొత్తం 68 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో బ్యాడ్మింటన్ విభాగంలో 56 మంది, టెన్నిస్ విభాగంలో 12 మంది క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి సబ్బవరపు మురళి, వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.వాసుదేవరావు నాయుడు, జాకబ్ దయానంద్, రెడ్డి శివకుమార్, డి.శ్రీనివాసరావు తదితరుల ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి డాక్టర్ కె.శ్రీధర్రావు మాట్లాడుతూ.. ఇక్కడ ఎంపికై న విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్టు తెలిపారు. పోటీల నిర్వహణకు సహకరించిన ఆఫీసర్స్ క్లబ్, టౌన్ క్లబ్ నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన రామనారాయణంలో ద్వాదశ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్టు ఎన్సీఎస్ ట్రస్టీ నారాయణం శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆలయ ఆవరణలో కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానప్రతులను ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు చాణిక్య హర్ష, మేనేజర్ రమణ, తదితరులు పాల్గొన్నారు. కొండపోడు బాటలోసీతంపేట: వేసవి వచ్చిందంటే చాలు ఎండలో బయటకు వెళ్లాలంటే దిమ్మతిరుగుద్ది. కానీ ఏజెన్సీలోని గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులు మాత్రం అడవి బాట పడతారు. అడవుల్లో దొరికే అటవీ ఫలసాయాలు సేకరిస్తారు. వాటిని సంతల్లో విక్రయించడం ద్వారా ఆదాయ మార్గాలు వెదుక్కుంటారు. ఎక్కువగా ఫలసాయాలు ఉత్పత్తి అయ్యే కాలం ఎండకాలమే. మార్చి నుంచి ప్రారంభమయ్యే సీజన్ మే వరకు ఉంటుంది. అనంతరం వీరు ఖరీఫ్ సీజన్లో వరి, ఇతర పంటలు వేసే పనిలో నిమగ్నమౌతారు. ఆరుగాలం శ్రమించి సేకరించే అటవీ ఉత్పత్తులకు, వరి పంటలకు మద్దతు ధరలు ఉంటే పరవాలేదు. లేకపోతే నష్టాలు చవి చూస్తామని గిరిజనులు చెబుతున్నారు. పొద్దు పొడవక ముందే అడవుల్లోకి... వేసవి కాలం ప్రారంభమైందంటే పొద్దు పొడవక ముందే గిరిజనులు కొండపోడు పనిలో భాగంగా కొండలపైకి వెళ్తారు. ఎంతో శ్రమకోర్చి చింతపండు సేకరిస్తారు. చింతపండు బొట్లు వలిచి చింతపండును తయారు చేస్తారు. బుట్టలు, కావుళ్లలో వేసి విక్రయానికి సిద్ధం చేస్తారు. ఇప్పుడు కిలో చింతపండు జీసీసీ రూ.36లకు కొనుగోలు చేయగా, బయట వ్యాపారులు కిలో రూ.50పైనే కొనుగోలు చేస్తున్నారు. అలాగే కొండచీపుర్లు పంటను వేస్తారు. కొండచీపుర్లను సేకరించి ఇంటి వద్ద కొద్ది రోజులు ఆరబెట్టి వాటిని చీపుర్లుగా కట్టలు కట్టి విక్రయిస్తారు. కొండచీపురు రూ.30 నుంచి 45 వరకు విక్రయిస్తారు. నరమామిడి తొక్కను సేకరిస్తారు. ఇంటిళ్లపాది నరమామిడి చెక్కను సేకరించి ఇంటివద్ద ఆరబెట్టి ఇదే సీజన్లో కిలో రూ.25పైనే అమ్మకాలు జరుపుతారు. నల్లజీడి పిక్కలు కూడా ఎక్కువగా సేకరిస్తారు. పళ్లు కిలో రూ.30 వరకు విక్రయించగా, నల్లజీడి పిక్కలు కిలో రూ.20 లకు గిరిజనులు విక్రయిస్తారు. నులక తాళ్ల నారను సేకరించి నులక మంచానికి ఉపయోగపడే నులక తాళ్లను తయారీ చేస్తారు. ఒక్కో ఉండ రూ.100 నుంచి 150 మధ్య విక్రయిస్తారు. మరికొద్ది రోజుల్లో జీడిపిక్కలు సీజన్ ప్రారంభమౌతుంది. ఈ సంవత్సరం పూత బాగా వచ్చింది. పంట దిగుబడి సమయానికి ధరలు బాగుంటే మంచి ఆదాయ వనరులు సమకూరుతాయని, లేదంటే నష్టాల బాట పడతామని గిరిజనులు చెబుతున్నారు. కొండచీపుర్లు తయారీలో నిమగ్నమైన గిరిజనుడు టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ జట్టు న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్లో మూడుసార్లు విజేతగా నిలిచి జయహో అనిపించుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో భారత్ జట్టు క్రికెటర్లు జయహో భారత్ అన్న రీతిలో రాణించి వరల్డ్ కప్ను ముద్దాడారు. దీంతో స్టేడియం జయహో భారత్ అంటూ మార్మోగింది. సొంత గడ్డపై నెగ్గిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఇదిలా ఉండగా ఫైనల్ మ్యాచ్ను తిలకించేందుకు విజయనగరంలోని రింగురోడ్డులో క్రికెట్ అభిమానులు పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి సందడి చేశారు. భారత్ విజయంతో బాణసంచా కాల్చి జయహో భారత్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం వేసవి ఆరంభం అటవీ ఉత్పత్తుల సీజన్ ప్రారంభం అడవికి వెళ్తేనే.. పూట గడిసేది.. ఉత్పత్తులకు గిట్టుబాటు కల్పించని జీసీసీ దళారుల బారిన పడి మోసపోతున్న వైనం -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
డెంకాడ: విజయనగరం – విశాఖ జాతీయ రహదారిపై మండలంలోని అయినాడ జంక్షన్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై ఎ.సన్యాసినా యుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా ఆనందపురంలో జరగనున్న వాహనాల వేలంలో పాల్గొనేందుకు విజయనగరానికి చెందిన పులప అప్పారావు శనివారం ఉదయం బయలుదేరాడు. తిరుగు ప్రయాణంలో విజయనగరం వస్తుండగా.. రాత్రి 9.30 గంటల సమయంలో అయినాడ జంక్షన్ వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. దీంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భామిని: సతివాడ గ్రామానికి చెందిన పున్నాన తేజ (7) చెరువులో పడి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. తేజ తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని కర్ర చెరువు వద్ద ఆటలాడుతూ.. చేపలు పట్టే క్రమంలో చెరువులో దిగారు. ఈక్రమంలో తేజ ప్రమాదవశాత్తూ చెరువులో కూరుకుపోయి మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లి జయలక్ష్మి బోరున విలపిస్తోంది. చిన్నారి తండ్రి లక్ష్మణరావు కూడా రెండేళ్ల కిందటే మృతి చెందడంతో ఆశలన్నీ కుమారుడిపైనే పెట్టుకుని జయలక్ష్మి జీవిస్తోంది. ఇంతలో ఇలా జరగడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
మహిళల నెత్తిన బండ!
● వంటింట్లో సిలిండర్ మంట ● గ్యాస్ ధరలు భారీగా పెంపు ● గృహావసరాల బండపై రూ.60 భారం సాక్షి, పార్వతీపురం మన్యం: చమురు సంస్థలు మహిళలకు ‘కానుకిచ్చాయి’. మహిళా దినోత్సవం సందర్భంగా నెత్తిన పెద్ద ‘బండే’ వేశాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండరుపై రూ.60 (14.2 కిలోలు), వాణిజ్య సిలిండరుపై రూ.115 (19 కిలోలు) చొప్పున వడ్డించాయి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇంధన కొరతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం విదితమే. ఈ పరిస్థితుల్లో దీనికి ఊతమిస్తూ.. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే స్థితి కొనసాగితే.. గ్యాస్ మరింత కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ప్రజలు భావిస్తున్నారు. రాయితీ అంటూ.. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 16 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. సాధారణ, దీపం, సీఎస్ఆర్, ఉజ్వల యోజన సర్వీసులు కలిపి 2.72 లక్షల మంది గ్యాస్ వినియోగదారులున్నారు. సగటున నెలవారీ సుమారు 1.50 లక్షల సిలిండర్లు వినియోగమవుతాయని అంచనా. ప్రస్తుతం పెరిగిన ధరతో గృహ అవసర సిలిండర్ ధర రూ.880.50 పైసల నుంచి రూ.940.50 కానుంది. వాణిజ్య సిలిండర్ రూ.1,824 నుంచి రూ.1,968 కానుంది. ఈ లెక్కన సాధారణ గ్యాస్ వినియోగదారులపై నెలకు రూ.కోటి వరకు అదనపు భారం పడనుంది. ఉజ్వల పథకం సిలిండర్లపై భారం లేకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఓవైపు గతంలో రూ.వందల్లో ఉండే రాయితీ అమాంతం తగ్గిపోయింది. ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న రాయితీ రూ.3 చొప్పునే తిరిగి బ్యాంకు ఖాతాలో జమవుతోంది. దీనివల్ల వినియోగదారులు పూర్తి మొత్తమిచ్చే సిలిండర్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇది కూడా సగం మందికి అందని పరిస్థితి. గతంలో గ్యాస్ ధరలు పెరిగినప్పుడు, వినియోగదారులపై ఆ భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ మొత్తం భరించేవి. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేకపోయింది. గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ పార్వతీపురం రూరల్: వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ పార్వతీపురం పట్టణంలో శనివారం నిరసన తెలిపారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్పై రూ.60, వాణిజ్య సిలిండర్పై రూ.115 మేర భారాన్ని మోపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలు నిరసన గళమెత్తాయి. పట్టణంలోని పాత బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నినదించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి గొర్లి వెంకటరమణ, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు, ప్రజా సంఘాల నాయకుడు బంకురు సూరిబాబు మాట్లాడుతూ.. సామాన్యుడిపై గ్యాస్ భారం మోపడం తగదని, పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్న తరుణంలో ఈ పెంపు సామాన్య కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలి
● జేఎన్టీయూ జీవీ ఉపకులపతి సుబ్బారావు విజయనగరం రూరల్: మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జేఎన్టీయూ జీవీ ప్రాంగణంలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఆండ్ గ్రీవెన్స్సెల్ ఆధ్వర్యంలో శనివారం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి సుబ్బారావు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది మహిళాశక్తి అని అన్నారు. ఏ పనినైనా ధైర్యంగా చేయాలని, కష్ట, నష్టాలను పోరాటపటిమతో ఎదుర్కొనే శక్తి మహిళలకు ఉందని అన్నారు. సీ్త్ర ఎల్లప్పుడు సూర్యునిలా ప్రకాశవంతంగా ఉండాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, అలాగే విశ్వవిద్యాలయం అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని రిజిస్ట్రార్ జి.జయసుమ అన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన విశాఖ జిల్లా కన్జూమర్స్ డిస్పూట్స్ రెడ్రస్సుల్ కమిషన్ సభ్యులు రహీమున్నీసా బేగం మాట్లాడుతూ విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యా ర్థినులకు బహుమతులు, ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు వి.లక్ష్మి, ఎం.రమ్య, బి.దేవి మాధవి, వివిధ విభాగాల అధిపతులు, ఆచార్యులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
వలపు వల నిందితుల అరెస్టు
విజయనగరం క్రైమ్: ఫేస్బుక్లో పరిచయంతో ఓ యువకుడికి గాలం వేసి, బంగారు చైన్ను దోచుకున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను విజయనగరం ఏఎస్పీ సౌమ్యలత వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తంపురానికి చెందిన పాండ్రంకి కిరణ్, ఉష భార్యాభర్తలు. భర్త కిరణ్ సోషల్ మీడియాలో ప్రొఫైల్స్ను పరిశీలించి, ఎంపిక చేసుకున్న కొంతమంది వ్యక్తులకు యువతిగా నమ్మించి మెసేజ్లు చేస్తారు. వారితో పరిచయం పెరిగాక దగ్గర ఉండి తన భార్య ఉషతో వాట్సాప్కాల్ మాట్లాడిస్తాడు. ఆ ట్రాప్లోనే భీమిలికి చెందిన వెలవలపల్లి సాయిరమేష్ (28) అనే కుర్రాడు చిక్కుకున్నాడు. సాయిరమేష్తో వాట్సాప్ కాల్లో ఉష తరచూ మాట్లాడేది. ఆమె కోరిక మేరకు గతనెల 14న జామి మండలం అలమండ సంత వద్దకు వెళ్లాడు. పథకం ప్రకారం అక్కడికి చేరుకున్న ఉష, కిరణ్తో పాటు ప్రసాద్, జామికి చెందిన బోని ఎర్నిబాబుతో కలిసి ఒక్కసారిగా రమేష్పై దాడిచేశారు. తన భార్యకు మెసేజ్లు, వాట్సాప్ కాల్స్చేసి వేధిస్తున్నాడంటూ స్థానికులను నమ్మించి బలవంతంగా బైక్పై రమేష్ ను భీమసింగివైపు తీసుకెళ్లారు. అక్కడ కత్తితో బెదిరించారు. మెడలోని 18 గ్రాముల బంగారు చైన్ను బలవంతంగా తీసుకొని, అదనంగా మరో రూ.80 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దంటూ భయపెట్టారు. యువకుడు తేరుకుని తన తప్పులేదని భావించి మార్చి 3న జామి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వై.వీర జనార్దన్ కేసునమోదు చేసి, ఫేస్బుక్ ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్టు ఏఎస్పీ సౌమ్యలత తెలిపారు. వారి నుంచి మొబైల్, పల్సర్ బైకు, బంగారం చైన్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. సోషల్ మీడియాలో పరిచయాలను నమ్మవద్దని, గుర్తు తెలియని వ్యక్తుల ప్రలోభాలకు గురికావద్దని ఆమె హెచ్చరించారు. సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు, ఎస్.కోట రూరల్ సీఐ ఎల్.అప్పలనాయుడు, జామి ఎస్ఐ పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని ఆటో డ్రైవర్ దుర్మరణం
కొత్తవలస : మండలంలోని కొత్తవలస – విజయనగరం రహదారిలో అర్ధన్నపాలెం గ్రామ జంక్షన్ సమీపంలో శనివారం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ అప్పికొండ పరదేశి(38) అక్కడికక్కడే మృతి చెందాదు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు.. లక్కవరపుకోట మండలం భీమాళి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అప్పికొండ పరదేశి కొత్తవలస ప్రాంతంలో సర్వీసు చేసుకొని మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో విజయనగరం నుంచి అనకాపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సు అర్ధన్నపాలెం జంక్షన్ సమీపంలో ఆటోను ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగం, ఆటో పూర్తిగా నుజ్జయ్యాయి. ప్రమాదంలో ఆటో డ్రైవర్ పరదేశి తుళ్లిపడి రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయాలు కావడంతో అధిక రక్తస్రావం జరిగింది. స్థానికులు వెంటనే 108 వాహనానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 108 వాహనానికి ఫోన్ చేయగా అందుబాటులో లేదని సిబ్బంది సమాధానం చెప్పారు. సుమారు అర్ధ గంటకు పైగా క్షతగాత్రుడు రోడ్డుపై ఉండిపోయి అధిక రక్తస్రావం కావడంతో అక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య శశి, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె రేష్మ, మూడో తరగతి చదువుతున్న జైరామ్ ఉన్నారు. భార్య రేష్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్సీకి తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ జోగారావు తెలిపారు. -
సాధికారతలో జిల్లా అగ్రగామిగా నిలవాలి
● కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి పార్వతీపురం రూరల్: మహిళా సాధికారతలో పార్వతీపురం మన్యం జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు అందరూ కృషిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీఎన్జీజీఓ, మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శనివారం మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని పరుగు పందెం, టాగ్ ఆఫ్ వార్, షాట్ఫుట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆత్మవిశ్వాసంతో తమ సమస్యలపై గళమెత్తాలని, అదే వారి విజయానికి ప్రాతిపదిక అని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహిళా మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఒక డ్రైవ్లా చేపడుతున్నామని, సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. మహిళా ఉద్యోగులకు రూ.4 వేల విలువైన వైద్య పరీక్షల నిర్వహణ కోసం త్వరలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి మాట్లాడుతూ.. జిల్లాలో మహిళల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ డాక్టర్ టి.కనకదుర్గ, ఏపీఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆర్.ఎస్.కిశోర్, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యా యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
అతివదేవోభవ..!
‘అటు ఇటు అన్నింటా.. నువ్వే జగమంతా.. పరుగులు తీస్తావు ఇంటా బయటా!’ అని సమాజంలో మహిళల ప్రస్తుత పాత్రను వర్ణించాడు ఓ సినీ కవి. అంతగా శ్రమిస్తున్నా, ఆమెలో అలుపు రాదు.. చిరునవ్వు తప్ప! ఆమె నడిచే దారంతా వెలుగులు పూస్తాయి. అదే మహిళల గొప్పతనం. అమ్మగా.. భార్యగా.. తోబుట్టువుగా.. బిడ్డగా.. ఓ కుటుంబానికి దారి దీపం ఆమె. అన్నం పెట్టే అన్నపూర్ణ.. జీవిత పాఠాలు చెప్పే గురువు.. నాడి పట్టి ఆయువు పెంచే వైద్యురాలు.. గమ్యాన్ని చేర్చే చోదకురాలు.. అల్లరి మూకల భరతం పట్టే పోలీసు.. ఇలా సమాజంలో ఏ పాత్ర అయినా తనకు కొట్టిన పిండే. ఆమె లేని చోటు లేదు.. ఆమె చేయని పని లేదు.. ఆమె లేకుండా ఈ జగతే లేదు! అవనిని మోసే భూమాత సీ్త్ర. నేడు మహిళా దినోత్సవం. ఆమె గురించి ఈ ఒక్క రోజు కాదు.. ఏడాదంతా కేటాయించినా తక్కువే. అటువంటి ‘అతివ’రథ మహారథులపై ‘సాక్షి’ అక్షర రూపం. – సాక్షి పార్వతీపురం మన్యం/ పార్వతీపురం రూరల్ ● అలుపనిఅనవే రవ్వంత.. వెలుగులు నింపుతావు దారంతా! ● అన్నింటా ఆమె.. జగమంతా ● నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేల తల్లిని నమ్ముకుని బతుకుతున్న గ్రామీణ మహిళలు జిల్లాలో కోకొల్లలు. వ్యవసాయ కార్మికులుగా, ఉపాధి వేతనదారులుగా, శ్రామిక మహిళలుగా శ్రమైక జీవన సౌందర్యాన్ని చాటి చెబుతున్నారు. జిల్లాలో సుమారు 2 లక్షల మంది రైతులు వ్యవసాయాన్నే నమ్ముకుని ఉంటే... అందులో సగం మంది మహిళలు చేదోడుగా ఉంటున్నారు. ఉపాధి హామీ పనుల్లోనూ వీరి భాగస్వామ్యం అధికం. జిల్లాలో 2025 సంవత్సరానికి సంబంధించి మొత్తం 4.53 లక్షల మంది వేతనదారులు ఉపాధి పనులు వినియోగించుకోగా.. ఇందులో 2.62 లక్షల మంది మహిళలే కావడం విశేషం. పార పట్టాలన్నా.. తట్ట మోయాలన్నా.. తామేమీ తక్కువ కాదని అంటున్నారు. వ్యవ‘సాయం’లో ముందుంటున్నారు. కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. జిల్లాలో ప్రజా ప్రతినిధులుగా, ఉన్నత అధికారులుగా రాణిస్తున్నారు మన వనితలు. మారుమూల కురుపాం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, డిప్యూటీ సీఎంగా పని చేశారు పాముల పుష్ప శ్రీవాణి. సాలూరు నుంచి మంత్రి అయ్యారు గుమ్మిడి సంధ్యారాణి. సాధారణ ఉద్యోగిగా జీవితం మొదలు పెట్టి.. గిరిజన బిడ్డగా ఎమ్మెల్యే అయ్యారు విశ్వాసరాయి కళావతి. ప్రభుత్వ విప్గా వ్యవహరిస్తున్నారు తోయక జగదీశ్వరి. పంచాయతీ, పట్టణ ప్రథమ పౌరులుగా సమర్ధవంతమైన పాలన అందిస్తున్నారు మన అతివలు. పలువురు జిల్లా ఉన్నతాధికారులుగానూ ‘రాణి’స్తున్నారు. పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, ఏఎస్పీ మనీషా రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హేమలత వంటి వారు ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని, చిన్న వయసులోనే ఈ స్థాయికి వచ్చారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్లో తమదైన ముద్ర వేస్తున్నారు. వీరే కాదు.. జిల్లా పరిపాలనలో చూసుకుంటే ప్రతి శాఖలోనూ సగం మంది ఉద్యోగినులే ఉంటున్నారు. పాలిచ్చి పెంచే తల్లులకు పాలించడం ఓ లెక్కా! -
పురుడు పోయడమే కాదు.. ప్రాణం నిలుపుతారు!
అమ్మ జన్మనిస్తే.. వైద్యులు ప్రాణం పోస్తారు. వైద్యులుగా, వైద్య సిబ్బందిగా ప్రజలకు సేవ చేయడంలో మహిళల పాత్రను తక్కువ చేయలేం. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో వైద్యులు 34 మంది, ఏఎన్ఎంలు 350, ఎంఎల్హెచ్పీలు 282, స్టాఫ్ నర్సులు 110, ఆశ వర్కర్లు 1,500, హెల్త్ సూపర్వైజర్ 60 మంది చొప్పున పని చేస్తున్నారు. ప్రజారోగ్యంలో కీలక భూమిక పోషిస్తున్నారు. బతుకు బండినే నడిపే వారికి విమానాలు, రైళ్లు, బస్సులు, ఆటోలు నడపడం ఏ మాత్రం? ఆయా రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారు నేటి ఆధునిక వనితలు. ఇంటి పనులు చూసుకుంటూనే.. క్లిష్టతరమైన కండక్టర్ ఉద్యోగాల్లోనూ నెట్టుకొస్తున్నారు. ఆర్టీసీలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 90 మంది మహిళా కండక్టర్లు ఉన్నారు. పనిచేసే చోట ఎంతో ఒత్తిడి.. వెకిలి చేష్టలు.. అన్నిటినీ ధైర్యంగానే తట్టుకుని నలబడుతున్నారు మన ధీర వనితలు. ఇవే కాదు.. నేడు అన్ని రంగాల్లోనూ అతివల పాత్ర అమోఘం. కార్మికులుగా, వ్యాపారులుగా.. ఎన్నో.. ఎన్నెన్నో! ఎంతటి కష్టాన్ని అయినా.. పనినైనా చిరునవ్వుతో స్వీకరిస్తున్నారు. -
రూ.49 కోట్లతో ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి
రామభద్రపురం: జిల్లాలోని రూ.49 కోట్ల అంచనాలతో సీహెచ్సీ భవనాల నిర్మాణాల పనులతో పాటు ఆధునీకరణ పనులు, ఆయుష్ భవనాల నిర్మాణ పనులు చేపడుతున్నామని ఏపీఎంఎస్ ఐడీసీ ఈఈ నాగిరెడ్డి భారతి అన్నారు. స్థానిక పీహెచ్సీ ఆవరణలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న ఆయుష్ భవన నిర్మాణ పనులు శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ఎస్.కోట, భోగాపురం, నెల్లిమర్ల, బాడంగి, గజపతినగరం తదితర ప్రాంతాలలో రూ.46.78 కోట్లతో సీహెచ్సీ భవనాలు నిర్మాణాలు జరగుతున్నాయన్నారు. వీటిలో పలు చోట్ల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మరికొన్ని చోట్ల పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. జిల్లాలోని ఎనిమిది చోట్ల ఆయుష్ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని, వీటిని పీహెచ్సీల ఆవరణలో నిర్మాణం చేపడుతున్న ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ.20 లక్షలు, వేరే ప్రాంతాలలో నిర్మాణాలకు ఒక్కో భవనానికి రూ.30 లక్షలు చొప్పున్న నిధులు మంజూరయ్యాయన్నారు. పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు నిర్మాణ పనులు పరిశీలించి నాణ్యత ఉండేలా చూడాలని సంబంధిత డీఈ ప్రసన్నకుమార్కు సూచించారు. ఏపీఎంఎస్ ఐడీసీ ఈఈ భారతి -
నాటు వైద్యం శ్రేయస్కరం కాదు
● కలెక్టర్ ప్రభాకరరెడ్డి సీతంపేట: గిరిజనులు నాటువైద్యం, ఆర్ఎంపీల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి సూచించారు. పీహెచ్సీల్లో ఆధునిక వైద్యపరికరాలు, మందులు అందుబాటులో ఉన్నాయని, వైద్యసిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీతంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆయన శనివారం పర్యటించారు. ముందుగా సీతంపేటలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఇప్పగూడ గ్రామంలో గ్రామముస్తాబును పరిశీలించారు. నూతనంగా నిర్మించిన సవర సాంస్కృతిక భవనాన్ని ప్రారంభించారు. గ్రామాన్ని శ్రమదానంతో సుందరంగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. అనంతరం పర్యాటక ప్రాంతమైన జగతపల్లి వ్యూపాయింట్ను సందర్శించారు. అక్కడ రీసార్ట్స్ను ప్రారంభించారు. పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకునేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామన్నారు. అడ్వంచర్పార్కులో ఫ్లవర్ గార్డెన్ను ప్రారంభించారు. వివిధ రకాల దేశీ, విదేశీ పుష్పాలతో ముస్తాబైన ఈ గార్డెన్ చూడముచ్చటగా ఉందన్నారు. పర్యాటకుల వినోదం కోసం ఏర్పాటు చేసిన క్వాడ్బైక్ను నడుపుతూ పార్క్లో కలియతిరిగారు. గల్లీదండా క్రీడా, పంచ్బ్యాగ్, గానుగరాట్నంను ప్రారంభించారు. కార్యక్రమంలో పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్, ఏపీఓ జి.చిన్నబాబు, ఎంపీడీఓ బి.బి మిశ్రో, తహసీల్దార్ శ్రీకన్య, పీహెచ్ఓ వెంకటగణేష్, డిప్యూటీ ఈఓ నారాయుడు, సీడీపీఓ సిమ్మాలమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు 352 మంది విద్యార్థుల గైర్హాజరు
పార్వతీపురం రూరల్ : జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షకు సంబంధించిన హాజరు వివరాలను జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి వై.నాగేశ్వరరావు విడుదల చేశారు. జనరల్ విభాగంలో మొత్తం 1,597 మంది విద్యార్థులకుగాను 1,436 మంది హాజరు కాగా, 161 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్యలో (ఒకేషనల్) 1,585 మందికి 1,394 మంది పరీక్షకు హాజరు కాగా, 191 మంది రాలేదు. జిల్లా వ్యాప్తంగా 3,182 మంది అభ్యర్థులకుగాను 2,830 మంది హాజరయ్యారని, 352 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్టు ఆయన తెలిపారు. ‘పవన్ కళ్యాణ్ సార్... మా ఊరికి రోడ్డు వేయండి.. రోడ్డులేక రోజూ సుమారు 17 మంది చిన్నారులం రాళ్లు, రప్పలు దాటుకుంటూ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూడి గ్రామంలోని పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాం... రోడ్డు నిర్మించి కష్టాలు తీర్చండి’ అంటూ పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కేరంగి పంచాయతీ పరిధిలోని కోదులమడ గ్రామ చిన్నారులు విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ఫొటోలు పట్టుకుని తమ కష్టాలు వివరించారు. రోడ్డు కోసం ప్రాథేయపడుతున్న చిన్నారుల వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. – పాచిపెంట -
అనారోగ్యంతో నాలుగో తరగతి విద్యార్థిని మృత్యువాత
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని పి.టి మండ గ్రామానికి చెందిన నాలుగో తరగతి విద్యార్థిని కొండగొర్రి సాయి సార్విని మలేరియా, పచ్చ కామెర్లు వ్యాధితో విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కన్ను మూసింది. కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు కొండగొర్రి నూకం దొర, జయశ్రీలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల కురుపాం రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు అంజలి, కల్పన, కవితలే కాకుండా పలువురు గిరిజన విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మొదటి సంతకం ఏమైందో కానీ ఇప్పటి వరకు ఒక్క ఆరోగ్య కార్యకర్తను వేసిన దాఖలాలు లేవని, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో, వసతిగృహాల్లో ఆరోగ్య కార్యకర్తను వేసి ఉంటే ఇంత మంది గిరిజన విద్యార్థుల చావులు ఉండేవి కాదని తమ కుమార్తె జ్వరమే అనుకున్నాం కానీ పచ్చకామెర్లు వచ్చిన సంగతి గుర్తించలేక పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మొదటి సంతకాన్ని నిలబెట్టుకుంటే ఇంతమంది గిరిజన విద్యార్థులు చనిపోయేవారు కాదని తల్లిదండ్రులు వాపోతున్నారు. చనిపోయిన విద్యార్థిని సాయి సార్విని కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు. -
నిర్ణీత గడువులోగా పరిష్కారం
● ఐటీడీఏ పీఓ యశ్వంత్కుమార్ రెడ్డి పార్వతీపురం రూరల్: గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే వినతులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ సి. యశ్వంత్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని ‘గిరిమిత్ర’ హాల్లో గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ ఏ.మురళీధర్, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. 224 మంది గైర్హాజరు పార్వతీపురం రూరల్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. జంతుశాస్త్రం, అర్ధశాస్త్రం పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 224 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ విద్యాశాఖాధికారి వై. నాగేశ్వరరావు తెలిపారు. 5,987 మంది విద్యార్థులకు గాను 5,763 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. -
విజ్ఞానంతో మానసిక వికాసం
వీరఘట్టం: విజ్ఞానంతోనే మానవ వికాసం సాధ్యమని పాలకొండ ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి విజ్ఞాన వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప విద్యాశాఖాధికారి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సుకు శాస్త్ర విజ్ఞానం ఎంతో దోహదపడుతుందన్నారు. సృజనాత్మక, నూతన ఆవిష్కరణలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ఫ్యాన్సీ డ్రెస్, సెమినార్స్, క్విజ్, డిబేట్, పోస్టర్ ప్రజెంటేషన్లలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా.. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జి,లక్ష్మణరావు, విద్యాశాఖాధికారులు సీహెచ్ రత్నాకరరావు, జి.రవిప్రసాద్, బి.సొంబర, ఎం.ఈశ్వరరావు, కేపీ నాగమణి, పెంట రామకృష్ణ, చొక్కాపు శ్రీనివాసరావు, కె.శివ, శిర్లాపు ఉమామహేశ్వరరావు, మరడాన సంపత్కుమార్, తదితరులు పాల్గొన్నారు. సీనియర్స్ పోస్టర్ ప్రజెంటేషన్ విభాగంలో విజేతలు వీరే.. పోస్టర్ ప్రజంటేషన్లో గరుగుబిల్లి మండలం రావివలస జెడ్పీహెచ్ఎస్కు చెందిన కె,ప్రసన్న మొదటి బహుమతి.. సాలూరు మండలం బోరబంద జెడ్పీహెచ్ఎస్కు చెందిన జి.హారిక రెండో బహుమతి, భామిని మండలం ఏపీఎంఎస్కు చెందిన ఎస్.రేష్మ తృతీయ బహుమతి పొందారు. ఫ్యాన్సీ డ్రెస్ విభాగంలో.. సాలూరు జెడ్పీహెచ్ఎస్కు చెందిన కె.భువనచంద్ర, పాచిపెంట మండల పాంచాలి జెడ్పీహెచ్ఎస్కు చెందిన కె.వంశీకృష్ణ, వీరఘట్టం మండలం రేగులపాడు కేజీవీకి చెందిన ఎం.గీత విజేతలుగా నిలిచారు. డిబేట్లో.. గరుగుబిల్లి మండలం రావివలస జెడ్పీహెచ్ఎస్కు చెందిన జి.తేజశ్వని, వీరఘట్టం మండలం పాలమెట్ట యూపీ స్కూల్ విద్యార్థిని పి.సౌజన్య వరుస స్థానాల్లో నిలిచారు. క్విజ్ పోటీలో.. సీతానగరం జెడ్పీహెచ్ఎస్కు చెందిన వై.తేజశ్వని, బి.కీర్తి, పి.అక్షయలు మొదటి స్థానంలో.. పార్వతీపురం మండలం ములగ జెడ్పీహెచ్ఎస్కు చెందిన సీహెచ్, భవిక, వై.గాయత్రి, వై.సంతోషికుమారి ద్వితీయ స్థానంలో.. గరుగుబిల్లి మండలం రావివలస జెడ్పీహెచ్ఎస్కు చెందిన బి.కావ్య, సీహెచ్.సుధీర్, బి.గుణశేఖర్ తృతీయ స్థానాలు సాధించారు. జూనియర్స్ విభాగం పోస్టర్ ప్రజెంటేషన్లో.. పాలకొండ నగరపంచాయతీలోని వెంకమ్మపేట జెడ్పీహెచ్ఎస్కు చెందిన జె.కారుణ్య, సీతంపేట జీటీడబ్ల్యూఏహెచ్ఎస్కు చెందిన ఎం.హిమశ్రీ, సాలూరు ఎంపీఎల్పీఎస్కు చెందిన జి.నికేష్నందన్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో.. పార్వతీపురం మున్సిపల్ ప్రైమరీ స్కూల్కు చెందిన రితిక్ రెడ్డి, జీఎల్ పురం జీటీడబ్ల్యూఏజీహెచ్ఎస్కు చెందిన ఎం.సుమతి, సాలూరు ఎంజేపీఎస్కు చెందిన వై.శరణ్య విజేతలుగా నిలిచారు. క్విజ్ పోటీల్లో.. వీరఘట్టం మండలం పాలమెట్ట యూపీ స్కూల్ విద్యార్థులు ఎన్.అక్షయ, ఎం,హిమశ్రీ, జేఆర్ లాస్యప్రియ మొదటి స్థానంలో.. పాలకొండ నగరపంచాయతీలోని వెంకమ్మపేట జెడ్పీహెచ్ఎస్కు చెందిన విద్యార్థులు టి.జ్ఞానశ్రీ, జి.మోక్షిత, డి.శిరీషా ద్వితీయ స్థానంలో.. పార్వతీపురం దత్తుపేట ఎంపీఎల్పీఎస్కు చెందిన ఎం.లీలాకుమార్ తృతీయ స్థానాల్లో నిలిచారు. ఘనంగా విజ్ఞాన వారోత్సవాలు -
హైకోర్టు ఆదేశాల మేరకు ప్రమోషన్లు
రేగిడి: జలవనరుల శాఖలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీనియార్టీ జాబితా తయారుచేసి ఉద్యోగోన్నతులు కల్పించాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ శాసనమండలిలో శుక్రవారం కోరారు. మండలిలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. జోన్ –1, జోన్ –4లకు సంబంధించి వాటర్ రిసోర్స్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. 1975లో వెనుబడిన ప్రాంతాల అభ్యున్నతికి రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి, ఆయా ప్రాంతాల్లో విద్య, ఉద్యోగ, పదోన్నతులు ఆ ప్రాంత ప్రజలకు, ఉద్యోగులకు వర్తించేలా ఉత్తర్వులు జారీచేయడం జరిగిందన్నారు. ఈ ఉత్తర్వుల వల్లే వెనుకబడిన ప్రాంతాలు, వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. 1975 నుంచి ఈ ఉత్తర్వులు అన్నిశాఖల్లో అమలులో ఉన్నాయన్నారు. 2017లో గత ప్రభుత్వం 6 పాయింట్ ఫార్ములా ఫ్రెసిడెన్సియల్ ఆర్డర్ని తుంగలోకి తొక్కి, సుమారు 50 మంది ఉత్తరాంధ్ర ఇంజినీర్లను రివర్స్ చేసిందన్నారు. ఇది కేవలం జలవనరులశాఖలో మాత్రమే జరుగుతోందని సభ దృష్టికి తీసుకువచ్చారు. నష్టపోయిన ఇంజినీరింగ్ అధికారులు హైకోర్టు, సుప్రీంకోర్టులలో అప్పీల్ చేయగా, హైకోర్టులో 2019లో జడ్జిమెంట్ వచ్చిందనన్నారు. ఆ తీర్పు ప్రకారం 2017లో ఇచ్చిన అడ్డగోలు ప్రమోషన్లు రద్దుచేసి, రాజ్యాంగం ప్రకారం జోనల్ సిస్టమ్, సీనియార్టీ జాబితాలు తయారు చేసి ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ విక్రాంత్ -
నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలి
సీతంపేట: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల వసతిగృహాలకు నాసిరకం సరుకులు పంపిణీ చేస్తున్నారని ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబు అన్నారు. జీసీసీ ద్వారా నిర్వహించే టెండర్ల ప్రక్రియలో నాణ్యమైన శాంపిల్స్ చూపించి సరఫరాలో మాత్రం కొందరు చేతివాటం చూపిస్తున్నారని అన్నారు. ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిత్యవసర సరుకుల పంపిణీకి (కంది, వేరుశనగ, ఇడ్లీనూక, మినపగుళ్లు, నూనెలు) శుక్రవారం టెండర్లు నిర్వహించారు. మొత్తం 26 సరుకుల సరఫరాకు 12 మంది కాంట్రాక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీఓ మాట్లాడుతూ.. పలు ఆశ్రమ పాఠశాలల వసతిగృహాలు సందర్శించినప్పుడు నాణ్యత లేని సరుకులు కనిపించాయన్నారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాణ్యత ఉన్న సరుకులు అందించకపోతే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో జీసీసీ డీఎం దాసరి కృష్ణ, మేనేజర్ గొర్లె నరసింహులు, హెచ్డబ్ల్యూఓలు పాలక అమల, హెచ్.శారద, పి.రాజారావు పాల్గొన్నారు. ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు -
ఈ నెల 22న బాడీబిల్డింగ్ పోటీలు
విజయనగరం: మహాబలుడు కోడి రామ్మూర్తినాయుడు స్ఫూర్తిని యువతలో కలిగించేందుకు విజయనగరం జిల్లా బాడీబిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 22న ఉమ్మడి విజయనగరం జిల్లా బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శంకరరావు తెలిపారు. స్థానిక గురజాడ కళాభారతిలో పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక బాడీ ఫిట్నెస్ జిమ్లో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావుతో కలిసి పోటీలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించార. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ..55 నుంచి 75 కిలోల విభాగాల్లో ఆరు కేటగిరీల్లో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. పోటీల్లో బాడీబిల్డర్లు పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు నమ్మి ప్రసాద్, జాయింట్ సెక్రటరీ అజయ్, అసిస్టెంట్ సెక్రటరీ డి.సన్నిబాబు, ఎల్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
గంజాయితో ఇద్దరి అరెస్ట్
రామభద్రపురం: మండలంలోని బాడంగి రూట్లో ఎస్సై వి.ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టగా.. ఇద్దరు వ్యక్తులు రెండున్నర కిలోల గంజాయితో పట్టుబడ్డారు. ఈ మేరకు స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి కుమ్మరివీధికి చెందిన గొండేల దిలీప్, గరివిడి మండలం బాగువలసకు చెందిన నడిమింటి అఖిల్ మరికొంతమందితో కలిసి సుమారు మూడేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. వీరు గంజాయికి బానిసలు కావడంతో పాటు మరికొంతమందికి విక్రయిస్తున్నారు. ఒడిశాలోని సుంకి నుంచి గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా విక్రయాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో వీరిపై నిఘా ఉంచిన పోలీసులు తనిఖీలు చేపట్టగా దిలీప్, అఖిల్ పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రెండున్నర కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. గొండేల దిలీప్పై పెదమానాపురం పోలీస్స్టేషన్లో గంజాయి అక్రమ రవాణాపై గతంలో కేసు నమోదైంది. జాతీయ విలువిద్య పోటీల్లో గిరిజన క్రీడాకారుల ప్రతిభ పార్వతీపురం రూరల్: కేరళలో ఇటీవల నిర్వహించిన 38వ తలక్కల్ చందు మెమోరియల్ జాతీయ స్థాయి విలువిద్య పోటీల్లో పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. విజేతలను జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్కుమార్ రెడ్డి శుక్రవారం తన చాంబర్లో అభినందించారు. ఈ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపిక కాగా.. మహిళల విభాగంలో పువ్వల వసంత తృతీయ బహుమతి సాధించారు. మరో క్రీడాకారుడు దంగభద్ర పవన్కుమార్ కూడా విజేతగా నిలిచారు. గిరిజన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి విజయాలు దోహదపడతాయని పీఓ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఎ. విజయశాంతి, ఏపీఓ ఎ.మురళీధర్, తదితరులు పాల్గొన్నారు. నేడు ఎస్సీ కమిషన్ సభ్యుడి రాక పార్వతీపురం రూరల్: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం శనివారం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో ఎస్సీ సంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం. శ్యామల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతి సంతకవిటి: గడ్డిమందు తాగిన మహిళ చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మామిడిపల్లి గ్రామానికి చెందిన టి. లక్ష్మి (60) గురువారం రాత్రి పొరపాటున ఇంటిలో ఉన్న గడ్డిమందు తాగేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రాజాంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతురాలి కుమార్తె రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణపల్లికి చెందిన వృద్ధురాలు.. పార్వతీపురం రూరల్: గుర్తు తెలియని వ్యక్తి చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణపల్లి పంచాయతీకి చెందిన పోరాపు తెరీజమ్మ (81) ఫిబ్రవరి 28న పింఛన్ తీసుకుంది. అదేరోజు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఇంట్లోకి చొరబడి ఫించను నగదుతో పాటు ఇంట్లో ఉన్న మరికొంత నగదు దోచుకునే క్రమంలో వృద్ధురాలిని తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన తెరీజమ్మ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. క్లూస్ టీమ్ ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 4న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
వన్యప్రాణులకు అండగా..మేమున్నాం...
పార్వతీపురం అటవీ రేంజ్ పరిధిలో అగ్నిప్రమాద నివారణకు చర్యలు చేపడుతున్న అధికారులుపాలకొండ రూరల్: అడవుల్లో సంచరించే వన్యప్రాణులు వేసవిలో వాటి మనుగడ కోసం అనేక సమస్యలు అధిగమించాల్సి ఉంటుంది. నీరు, ఆహారం కొరత వల్ల ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటుంటాయి. మరోవైపు ఎండలకు చెట్లు, ఆకులు ఎండి రాలిపోతుంటాయి. కొందరు తమ స్వలాభాల కోసం అడవులను తగలబెట్టం పరిపాటిగా మారింది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. సమీపంలో జీవించే జీవరాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో వన్యప్రాణులు తమ దాహార్తిని తీర్చుకోవడానికి, కడుపు నింపుకోవడానికి జనావాసాల వైపు అడుగులు వేస్తుంటాయి. ఏనుగుల గుంపులు జనావాల్లోకి తరచూ వస్తుండడమే ఇందుకు నిదర్శనం.. దీనిని ఆసరాగా చేసుకుని వేటగాళ్లు ఉచ్చు బిగిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఫైర్ లైన్స్.. ఫైర్ బ్లోయర్స్.. అడవిలో అగ్ని ప్రమాదాలు తలెత్తే సమయంలో వాటిని అధిగమించేందుకు 3 మీటర్ల వెడల్పులో గడ్డిని చెక్కి ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఫైర్ బ్లోయర్ అనే ప్రత్యేక పరికరాలు వినియోగించి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయనున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మానటరింగ్ సెల్లో అడవికి సంబంధించి ఒక కోడ్ను నమోదు చేస్తారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం వచ్చేలా ఏర్పాట్లు చేపట్టారు. 20 చోట్ల నీటి కుంటలు.. వేసవిలో వన్యప్రాణులు తాగునీటి సమస్యతో మృత్యువాత పడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చుక్కల దుప్పులు, అడవి మేకలు, కుందేళ్లు, తదితర జీవాలు దాహార్తిని తీర్చుకునేందుకు జనావాసాల్లోకి వస్తూ ప్రమాదాలకు గురికావడం, మృత్యువాత పడడం జరుగుతుంది. దీనిని అధిగమించేందుకు కనీస నీటివసతి లేని ప్రాంతాల్లో 20 చోట్ల సాసర్పిట్లు (నీటి కుంటలు) ఏర్పాటు చేశారు. నీటి కోసం వచ్చే జంతువులకు ఇవి ఎంతోగానో ఉపయోగపడతాయి. కుంటల్లో నిరంతరం నీరు అందుబాటులో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా చర్యలు తీసుకుంటున్నారు. ట్యాంక్లతో నీటిని నింపుతున్నారు. భద్రతకై నిఘా.. జీవరాశుల కదిలికలు ఎక్కువగా ఉన్నచోట, దాహార్తిని తీర్చుకునే ప్రాంతాల్లో భద్రతకు ప్రాధాన్యత కల్పించారు. వేటగాళ్ల ఉచ్చులకు చిక్కకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండు వారాలకోసారి వీటిని పరిశీలిస్తున్నారు. నిరంతరం ఈ కెమెరాల ద్వారా అటవీ ప్రాంతానికి విజుబుల్ రక్షణ అందిస్తుంది. గతేడాది చివరి నుంచి ప్రత్యేక యాప్ సహాయంతో జీవాల కదలికలు, వాటి ఆనవాళ్లు గుర్తించి ఫొటోలు తీసి విశ్లేషిస్తున్నారు. అడవి పందులు, కుందేళ్లు, పునుగు పిల్లులు, చుక్కల దుప్పులు, అడవి మేకలు ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు వేస్తున్నారు.స్వీయ పర్యవేక్షణ.. ఉన్నతాధికారుల సూచనలతో జిల్లాలోని నాలుగు రేంజ్లలో మా సిబ్బంది అడవి జంతువులు, వన్యప్రాణుల రక్షణకు స్వీయ పర్యవేక్షణ చేపడుతున్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా.. జీవాల దాహార్తి తీర్చేలా.. వేటగాళ్ల నుంచి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. అటవీ ప్రాంత పరిసర గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అటవీ సంరక్షణకు ప్రజాల సహకారం అవసరం. – జీఏపీ ప్రసూన, జిల్లా అటవీ శాఖాధికారి, పార్వతీపురం మన్యం 1,07,721 హెక్టార్లలో.. మన్యం జిల్లాలోని పార్వతీపురం, పాలకొండ, సాలూరు, కురుపాం నియోజకవర్గాల పరిధిలో 1,07,721 హెక్టార్ల వరకు అడవులు విస్తరించి ఉన్నాయి. ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో చింతపండు, విప్పపువ్వు, జీడిపిక్కలు, కొండ మామిడి, ఇతర అటవీ ఫలసాయం సేకరణకు పలువురు అడవుల్లో సంచరిస్తుంటారు. వీరిలో కొంతమంది అనుకోకుండా చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. -
పరీక్ష కేంద్రాల వద్ద ‘ప్రత్యేక’ ఏర్పాట్లు
పాలకొండ రూరల్: మరికొద్ది రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ పి. బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ మేరకు ఆయన పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచనలు చేస్తున్నారు. ● ఈ నెల 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా నుంచి ఈ ఏడాది 10,644 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. 15 మండలాల పరిధిలో 68 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు 99 మంది ఉన్నారు. వీరి సౌకర్యార్థం మార్కుల్లోనూ మార్పులు చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ● శారీరకంగా దివ్యాంగులైన విద్యార్థులకు ఏదైనా ఒక లాంగ్వేజ్ పరీక్ష రాయకుండా మినహాయింపు కల్పించారు. మిగిలిన పరీక్షల్లో 20 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ● కంటిచూపు సరిగా లేని విద్యార్థులకు ఒక లాంగ్వేజ్ పరీక్ష మినహాయింపుతో పాటు మిగిలిన పరీక్షల్లో 20 మార్కులు రావాలి. ● వినికిడి లోపం గల వారు రెండు లాంగ్వేజ్ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. మిగిలిన పరీక్షల్లో 20 మార్కులు పొందాలి. ● మాట లోపం గలవారు ఒక్కో సబ్జెక్ట్లో 20 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అభ్యసనా వైకల్యం గల విద్యార్థులకు ఆంగ్లం మినహా మిగిలిన సబ్జెక్ట్ల్లో 15 మార్కులు పొందాల్సి ఉంటుంది. ● ఈ తరహా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కేంద్రాల వద్ద వీల్చైర్లు, ర్యాంపులు, వైద్య పరమైన సేవలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సదరు విద్యార్థులు సహాయకుల కోసం (స్రైబ్) దరఖాస్తు చేసుకుంటే అనుమతులు మంజూరు చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. డీఈఓ బ్రహ్మాజీరావు -
త్వరితగతిన ఈ పంట నమోదు
డెంకాడ: రబీ సీజన్లో ఈ పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి వ్యవసాయ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని పెదతాడివాడలో శుక్రవారం ఆయన పర్యటించి, సాగులో ఉన్న నువ్వు పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉద్యానవన పంటల ద్వారా అధిక ఆదాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ డీడీ చిట్టిబాబు, ఏడీఏ నాగభూషణరావు, ఆర్.శ్రీనివాసరావు, ఏఓ సంగీత, ఉద్యానవన అధికారి ఉమాభారతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ రాంసుందర్రెడ్డి -
కారు బోల్తా..
గజపతినగరం రూరల్: మండలంలోని మరుపల్లి గ్రామ సమీపంలో గల పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై కిరణ్కుమార్ నాయుడు తెలియజేసిన వివరాల ప్రకారం.. దత్తిరాజేరు మండలం మానాపురం గ్రామానికి చెందిన రౌతు ధనుంజయరావు, రౌతు సాయిశంకర్, రౌతు చంద్రశేఖర్ తమ స్నేహితుడితో కలిసి విజయనగరం వైపు నుంచి మానాపురం కారులో వస్తున్నారు. తెల్లవారుజాము రెండున్నర గంటల సమయంలో మరుపల్లి పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో రౌతు ధనంజయరావు అక్కడికక్కడే మృతి చెందగా.. సాయిశంకర్, చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే డ్రైవర్కు, మరో వ్యక్తిగి పెద్దగా గాయాలు కాలేదు. క్షతగాత్రులిద్దరూ ప్రస్తుతం విజయనగరం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడి తండ్రి రౌతు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు -
మా గోడు వినేదెవరు..సర్వేశా..!
సాక్షి, పార్వతీపురం మన్యం : తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించకపోతే మార్చి 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సహాయ నిరాకర ణ చేపడతామని ప్రకటించిన గ్రామ సర్వేయర్ల అసోసియేషన్.. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో అందుకనుగుణంగా కార్యాచరణలోకి దిగింది. గ్రామ సర్వేయర్లు గురువారం పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు చేపట్టగా.. శుక్రవా రం సైతం విధులకు హాజరు కాలేదు. జిల్లా సర్వే శా ఖ ప్రధాన కార్యాలయం వద్ద ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. రీసర్వే, స్వామిత్వ, భూసర్వేలకు సంబంధించిన పనులకు సహాయ నిరాకరణ చేశారు. ఆ శాఖ ఏడీకి వినతిపత్రం అందజేశారు. గ్రామ సర్వేయర్లు జనవరి 27 నుంచి మూడు రోజు ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. జనవరి 30న రెవెన్యూ మంత్రి సమక్షంలో కమిటీ తో చర్చలు జరిపారు. స్వర్ణ గ్రామ వ్యవస్థలో సహచర సాంకేతిక ఉద్యోగుల వలె సమాన పే రోల్తో బేసిక్ పే, ఉద్యోగోన్నతులు కల్పిస్తామని.. ఫిబ్రవరి 15న ప్రపోజల్ ఫైలు నివేదిక తయారు చేస్తామని, రీ సర్వే నిర్వహణ కోసం ప్రతి గ్రామానికీ ఒక ల్యాప్టాప్, రోవర్, ప్రతి మండలానికీ ఒక ప్రింట ర్ ఏర్పాటు అందిస్తామని.. రీ సర్వే బిల్లులు ఫిబ్రవ రి మొదటి వారంలో విడుదల చేస్తామని హామీలిచ్చారు. గడువు దాటినా వాటిని అమలు చేయలేదు. కనీస వేతనం కూడా ఇవ్వకుండా వచ్చే ఆర్థిక సంవత్సర ఇంక్రిమెంట్ను కలిపి ప్రస్తుతం ఉన్న జీతాన్నే కేవలం పోస్టు పేరు మార్చి, పైసా ప్రయోజనం లేకుండా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. దీనిపై ఫిబ్రవరి 23న సర్వే శాఖ డైరెక్టర్కు నోటీసు అందజేశారు. మార్చి 4వ తేదీలోపు ప్రధా న డిమాండ్లు పరిష్కరించకపోతే సర్వేలకు సహాయ నిరాకరణ చేపడతామని స్పష్టం చేశారు. ఆ ప్రకా రం రాష్ట్ర యూనియన్ నిర్ణయంతో ఆందోళనకు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 965 రెవెన్యూ గ్రామాల పరిధిలో 5,71,888 ఎకరాల్లో రీసర్వే చేయాల్సి ఉంది. మూడో విడత చివరి దశకు రాగా.. నాలుగో విడత ప్రస్తుతం జరుగుతోంది. ఓ వైపు రీసర్వే జరుగుతుండగానే.. అధికారులు రూపొందించిన ముసాయిదా రికార్డులను రైతుల సమక్షంలో ఉంచి, ఈకేవైసీ ద్వారా ఆమోదం తీసుకుంటున్నారు. పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి రీ సర్వే చేయాల్సిన 612 గ్రామాలనూ పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓ వైపు పనిభారం పెరుగుతోంది. ఉన్నతాధికారుల ఒత్తిడి అధికమవుతోంది. అందుకనుగుణంగా పరికరాలను, సౌకర్యాలను ప్రభుత్వం కల్పించడం లేదు. జిల్లాలో 237 మంది గ్రామ సర్వేయర్లు పని చేస్తున్నారు. తాము ప్రభుత్వానికి, రీసర్వేకు గానీ వ్యతిరేకం కాదని.. తమ 30 సంవత్సరా ల ఉద్యోగ భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని వారంతా చెబుతున్నారు. సుమారు ఆరేళ్లుగా అహర్నిశలూ శ్రమిస్తూ, అడవుల్లో సర్వే నిర్వ హిస్తూ.. ప్రమాదాలకు గురై, అధిక ఒత్తిడితో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వతమైన రికార్డుల రూపకల్పన కోసం తగిన పరికరాలు, సమయం కల్పించాలని కోరుతున్నారు. రూ.25,220 బేసిక్ పే, రూ.6 వేలు గ్రేడ్ పే ప్రతిపాదనపై తాము విముఖత వ్యక్తం చేస్తున్నట్లు చెప్పా రు. రూ.29,980 బేసిక్ పే, మూడు వేల అసిస్టెంట్ సర్వేయర్ పోస్టుల ప్రతిపాదన సరికాదని అంటున్నారు. బేసిక్ పే రూ.30 వేలు ఉండాలన్నది తమ ప్రధాన డిమాండు అని చెబుతున్నారు. ప్రభుత్వం వీటిపై సానుకూలంగా స్పందించడంతో పాటు.. తమ నాయకులపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని కోరుతున్నారు. క్షేత్ర స్థాయి విధుల్లో కీలమైన గ్రామ సర్వేయర్లు సహాయ నిరాకరణ చేయడంతో ఆ ప్రభావం రీ సర్వేపై పడనుంది. -
15లోగా సీఎస్సీ పనులు పూర్తి చేయాలి : కలెక్టర్
పార్వతీపురం: జిల్లాలోని కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్(సీఎస్సీ) పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ డా.ప్రభాకర్రెడ్డి అధికారులకు ఆదేశించారు. తన కార్యాలయం నుంచి ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఇంజినీరింగ్ అధికారి తమ రోజువారీ ప్రగతిని వివరించాలన్నారు. పనుల నిర్వహణలో ప్రతీ అధికారి కి ఒక స్పష్టమైన ప్రణాళిక, వ్యూహం ఉండాలన్నా రు. నిర్మాణాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఐటీడీఏ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మా ణం తప్పనిసరిగా చేయాలన్నారు. సమావేశంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర–2047 క్యాలెండర్ ఆవిష్కరణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన స్వర్ణాంధ–2047 క్యాలెండర్ను కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్రెడ్డి, జేసీ సి.యశ్వంత్కుమార్రెడ్డి, డీఆర్ఓ కె.హేమలత, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలితో పాటు పలువురు అధికారులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లా అధికారుల చొరవ, సహకారంతో మన్యం జిల్లా ముందంజలో ఉందన్నారు. జిల్లా ముందంజలో ఉండాలి స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించడంలో జిల్లా ముందంజలో ఉండాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ప్రాధమిక రంగాల్లో పురోగతి కనిపించాలన్నారు. రాష్ట్ర స్థాయి డేటాను పరిశీలించి దానిని మండలాల వారీగా విశ్లేషించుకొని క్షేత్ర స్థాయి లక్ష్యాలను చేరుకొనేందుకు దిశా నిర్దేశం చేయాలన్నారు. ప్రతీ జిల్లా అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ముస్తాబు గ్రామంగా తయారు చేయాలన్నారు. ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేయడానికి వినూత్నంగా ‘ఈ–టామ్టామ్’ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. సమీక్షలో జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి, డీఆర్ఓ హేమలత తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు ఆయుధాలపై అవగాహన
పార్వతీపురం రూరల్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ రకాల ఆయుధాలు, సాంకేతిక పరికరాల గురించి విద్యార్థులకు వివరించారు. ఏకే–47, ఇన్సాస్ రైఫిల్స్, ఎస్.ఎల్.ఆర్, పిస్టల్స్, గ్రనేడ్లు, టియర్ గ్యాస్ గన్ వంటి ఆయుధాలతో పాటు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, డ్రోన్ల వినియోగాన్ని ఆర్మీడ్ రిజర్వు సిబ్బంది ప్రత్యక్షంగా చూపారు. నేర పరిశోధనలో కీలకమైన వేలిముద్రల సేకరణ (క్లూస్ టీం), సెల్ఫోన్ నెట్వర్క్ లేని ప్రాంతాల్లో సమాచార మార్పిడికి వాడే వీహెచ్ఎఫ్ సెట్ల పనితీరుపై అవగాహన కల్పించా రు. నేరస్తులను పట్టుకోవడంలోనూ, బాంబులను గుర్తించడంలోనూ శిక్షణ పొందిన జాగిలాలు (బిందు, జూలీ, చార్లీ, శాండీ) ప్రదర్శించిన విన్యాసాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. వివిధ పాఠశాలల నుంచి సుమారు 400 మంది విద్యార్థులు, మహిళా పోలీసులు తరలివచ్చారు. ఏఎస్పీ మనీషారెడ్డి, ఏఆర్ డీఎస్పీ థామస్రెడ్డి, సీఐ వెంకట్రావు, ఆర్.ఐ లు రాంబాబు, నాయుడు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు కలెక్టర్ పర్యటన
సీతంపేట: మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ ప్రభాకరరెడ్డి శనివారం పర్యటించనున్నట్టు ఎంపీడీఓ బిబి.మిశ్రో శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. పీపీ ఈతమానుగూడ పరిధిలో ఇప్పగూడ గ్రామ ముస్తాబు కార్యక్రమానికి ఉదయం 10 గంటలకు హాజరవుతారన్నారు. అనంతరం జగతపల్లి గ్రామాన్ని కూడా సందర్శించనున్నట్టు తెలిపారు. సీతంపేట: ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించి న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ వినతులు స్వీకరించారు. మొత్తం 23 వినతులు వచ్చాయి. అర్హత కలిగిన ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలని మూలపేటకు చెందిన సింహాచలం కోరారు. జంబాడ పాఠశాలలో సవరభాషా వలంటీర్లను నియమించాలని సవర గణేష్ తెలిపారు. టెంట్హౌస్ పెట్టుకోవ డానికి రుణం ఇప్పించాలని చింతలగూడకు చెందిన సుక్కు కోరారు. మర్రిపాడు పంచాయ తీ పరిధిలో వీధిరోడ్లు, కాలువలు నిర్మించాలని సవర మంగయ్య తెలిపారు. పవర్ టిల్లర్లు ఇప్పించాలని సీహెచ్ భారత్కుమార్ కోరారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జియ్యమ్మవలస రూరల్: మూడు నెలలుగా ప్రశాంతంగా ఉన్న జియ్యమ్మవలస ప్రాంతంలో శుక్రవారం ఏనుగుల గుంపు రాకతో రైతుల లో భయం నెలకొంది. పరజపాడు సమీపంలో గజరాజులు కనిపించడంతో చింతల బెలగాం, సింగనాపురం, పరజపాడు తదితర గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. బొప్పా యి, మొక్కజొన్న తదితర పంటలకు ఏనుగు లు నష్టం కలిగించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని ఏనుగు ల గుంపును తరలించాలని రైతులు కోరుతున్నారు. విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ వైద్య కళాశాల లో పీజీ విద్యార్థుల ప్రవేశాలకు సంబంఽధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ అకడమిక్ సెల్ను ప్రారంభించినట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.దేవి మాధవి శుక్రవారం తెలిపారు. అకడమిక్ సెల్ చైర్మన్గా డాక్టర్ కె.వెంకటాచలం,పోగ్రామ్ కోఆర్డినేట ర్ గా డాక్టర్ కె.శారద,వ్యవహరిస్తారని తెలిపారు. -
సారూ.. మా బాధలు చూడరూ..!
● విద్యా శాఖ మంత్రిగారూ మా బాధలు పట్టవా..! ● చినమేరంగి పాలిటెక్నికల్ కళాశాల విద్యార్థుల ఆవేదన జియ్యమ్మవలస రూరల్: కటిక నేలపై పడక, తాగునీరు లేక అవస్థలు, చీకటి గదిలో నివాసాలు.. ఇది జియ్యమ్మవలస మండలంలోని చినమేరంగి ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల వసతిగృహంలో విద్యార్థుల దుస్థితి. పిఠాపురం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, పెందుర్తి వంటి సుదూర ప్రాంతాల నుంచి పాలిటెక్నికల్ విద్యను అభ్యసించేందుకు వచ్చిన విద్యార్థులకు ఇక్కడ తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. కళాశాలలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ మూడు బ్రాంచ్ల్లో బోధన బాగున్నప్పటికీ వారు ఉండేందుకు సరైన వసతి సౌకర్యాలు లేక మొదటి ఏడాది కళాశాలలో జాయిన్ అయి రెండవ ఏడాది నుంచి వేర్వేరు ప్రాంతాలకు విద్యార్థులంతా వెళ్లిపోతున్నారు. ఈ విషయాన్ని కళాశాల అధికారులు, సిబ్బందే చెబుతున్నారు. ఇక్కడ తమకు కనీస వసతులు కూడా లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చినమేరంగిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ వసతిగృహం పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని తలుపులు, కిటికీలు లేకుండా కటిక నేలపై నిద్రిస్తున్నామని వాపోతున్నారు. వసతిగృహాన్ని ఆనుకుని ఉన్న నేల బావి నీరే ఆధారమని, నాచు పట్టిన నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఇక్కడ ఉండాలంటే భయమేస్తుందని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితిని విద్యాశాఖ మంత్రి లోకేష్ కనరా... మా బాధ వినరా... అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా కనీస సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు. -
సాగునీటి పథకాలకు మొండిచేయి
సీతంపేట ఏజెన్సీలో మర్రిపాడు పంచాయతీ పరిధిలో ఎనిమిది చెక్డ్యాంలు పూర్తిగా మరమ్మతులకు గురయ్యాయి. చుక్కనీరు కూడా నిల్వ ఉండదు. వీటి పరిధిలో దాదాపు 300ల ఎకరాల్లో వరి పంట సాగవుతుంది. చెక్డ్యాలు పూర్తిగా పాడవ్వడంతో సాగు నీరు నిల్వలేక వర్షాధారంపై ఆధారపడి పండించాల్సి వస్తుంది. వర్షాలు సకాలంలో పడితే పరవాలేదు.. లేకపోతే పంటలు పోతాయని, పెట్టిన మదుపులు కూడా పోతాయని కొందరు గిరిజన రైతులు సాగు కూడా చేయడం లేదు. పూతికవలస, శంబాం, కుశిమి ఇలా చెప్పుకుంటూ పోతే ఐటీడీఏ పరిధిలో సబ్ప్లాన్ మండలాల దుస్థితి ఇలా తయారైంది. ఇటు ఖరీఫ్, అటు రబీ పంటలు లేక, కొండపోడు పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు అవస్థలు పడుతున్నారు. సాగునీటి వనరులకు ఇబ్బందులు తప్పడం లేదు. గెడ్డలపై ఆధారపడు తున్నాం. మా ప్రాంతంలో పూర్తిగా సాగునీటి వనరు లు లేవు. గతంలో పలుమార్లు ఐటీడీఏలో విన తులు కూడా ఇచ్చాం. కొత్త నిర్మాణాలు లేవు. మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. – వి.చలపతిరావు, మర్రిపాడు సాగునీటి పథకాలకు చంద్రబాబు ప్రభుత్వం చెక్ పెట్టేసింది. గిరిజన ప్రాంతాల్లో పూర్తిగా సాగునీటి వనరులు లేవు. దీంతో వివి ధ రకాల పంటల సాగుకు ఇబ్బందులు పడుతున్నారు. చెక్డ్యాంలు, చెరువులు, కాలువలకు నిధులు మంజూరు చేసి వెంటనే నిర్మాణాలు చేపట్టాలి. – విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ సీతంపేట: ఐటీడీఏ పరిధిలో సమగ్ర గిరిజనాభ్యుదయ సంస్థ పరిధిలో సాగునీటి కష్టాలు గిరిజనులకు తప్పడం లేదు. నూతన చెక్డ్యాలు, చెరువులు వంటి నిర్మాణాలు లేవు. గిరిజన రైతులకు రానున్న ఖరీఫ్ సీజన్లో సాగునీటి కష్టాలు తప్పేలా లేవు. గతంలో ఇక్కడ పని చేసిన చిన్ననీటి వనరుల విభాగం నిర్వీర్యమైంది. ఈ విభాగాన్ని శ్రీకాకుళం క్వాలిటీ కంట్రోల్ కింద మూడేళ్ల కిందట మార్చారు. కేవలం డీఈ కార్యాలయాన్ని మాత్రమే ఇక్కడ ఉంచారు. దాని పరిధిలో సాగునీటి వనరులు కల్పించాల్సి ఉంది. ఈ శాఖను ఇక్కడ ఉంచినప్పటికీ సిబ్బంది మాత్రం ఎవ్వరూ లేరు. ముఖ్యంగా ఎస్ఎంఐ శాఖ ద్వారా గిరిజన ప్రాంతాల్లో అవసరమైన చోట సాగునీటి వనరులు కల్పించాలి. వర్షాలు పడేటప్పుటు నీటిని నిల్వ ఉండేటట్టు చూడడం, అవసరమైనపుడు చెక్డ్యాం, చెరువులు వంటి వాటి ద్వారా నీటిని పంటల సాగుకు వాడేలా చూడాలి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి గిరిజన ఉప ప్రణాళికా విభాగం ద్వారా 20 మండలాల్లో చిన్ననీటి పారుదల పథకాలైన చెరువులు, చెక్ డ్యాంలు, చెరువుల అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. పిల్ల కాలు వలను అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా టీపీఎంయూ మండలాలైన సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి, మంద స మండలాల పరిధిలో పనులు అధికంగా జరగా ల్సి ఉంది. కానీ ఈ శాఖకు నిధుల లేమి కారణంగా పనులు చేపట్టలేని పరిస్థితి ఉందని సంబంధిత శాఖ అధికారులే చెబుతున్నారు. కొన్నాళ్లుగా చెక్ డ్యాం, చెరువుల నిర్మాణాలు, మరమ్మతులు లేవు. కేవలం గెడ్డల్లో ఉన్న నీటి నిల్వల మీద ఆధారపడి సాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పని కష్టాలు ఏజెన్సీలో ఖరీఫ్ సీజన్తో పాటు రబీ పంటల సాగు కష్టంగా మారింది. ఐటీడీఏ పరిధిలో 20 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు పండుతాయి. జూన్ నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్లో 12 వేల హె క్టార్ల వరకు వరి, కంది, రాగుల పంటలు వేస్తారు. గెడ్డలు ఆనుకుని ఉన్న గతంలో నిర్మించిన చెక్డ్యాంలు, చెరువులలో నీరు లేదు. అసలు నీరు నిల్వలు ఉండాలనే ఉద్దేశంతో చెక్డ్యాంలు, చెరువులు, కాలువలు నిర్మించారు. గతంలో కురిసిన అడపాద డపా వర్షాలకు చుక్కనీరు లేని దుస్థితి ఉంది. వీటి మరమ్మతులు కూడా చేసిన దాఖలాలు లేవు. దీంతో ఖరీఫ్, రబీ సాగు ఎండమావిగా మారింది. ఉద్యానవనాల పంటలకు నష్టాలు తప్పడం లేదు. సుమారు 40 వేల ఎకరాల వరకు ఉద్యానవనాల పంటలైన జీడి, మామిడి, పనస వంటి పంటలను గిరిజనులు పండిస్తున్నారు. ఐటీడీఏ కూడా కొన్ని వేల ఎకరాల ఉద్యానవన పంటలను ప్రోత్సాహించినప్పటకీ వాటికి అవసరమైన నీరు అందివ్వలేని పరిస్థితి. శంభాం పరిధిలో ముక్కలైన మద్దిమానుగూడ చెక్డ్యాం జిల్లేపాడు పరిధిలో అభివృద్ధికి నోచుకోని బుద్దిమాను చెరువు -
కమాండెంట్ను కలిసిన అసోసియేషన్ ప్రతినిధులు
డెంకాడ: చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ వై.రవిశంకర్రెడ్డిని 5వ ఏపీఎస్పీ మినిస్టీరియల్ నూతన అసోసియేషన్ కార్యవర్గం మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ జె.హరిబాబు, వైస్ ప్రెసిడెంట్ టి.తవిటినాయుడు, సెక్రటరీ కేజేవీ ప్రసాదరావు, ట్రెజరర్ బి.బాబీశ్యామిలి, జాయింట్ సెక్రెటరీ బి.గీత, ఆర్గనైజింగ్ సెక్రెటరీ జి.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఐ.భవాని, ఎం.ప్రవీణ్, వి.రోహిణి, ఎం.సీత, యు.గోవింద తదితరులు ఉన్నారు. డిప్యూటీ కలెక్టర్గా శ్రీరాములనాయుడు విజయనగరం కలెక్టరేట్: డిప్యూటీ కలెక్టర్గా శ్రీరాములనాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతిపై ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడకు వచ్చారు. ఇదిలా ఉండగా మెంటాడ తహసీల్దార్గా విజయ్ భాస్కర్ను నియమించారు. దత్తిరాజేరు తహసీల్దార్గా ఉన్న ఆయన గత కొన్ని నెలలుగా సెలవులో ఉన్న విషయం తెలిసిందే. కుక్కల దాడిలో 18 మందికి గాయాలు బొండపల్లి: మండలంలోని నెలివాడ గ్రామంలో వీధి కుక్కలు గ్రామస్తులపై దాడి చేసి పలువురిని గాయపరిచాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు.. నెలివాడలో గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో 18 మందిని వీధి కుక్కలు గాయపరిచాయి. వీరంతా జిల్లా కేంద్రంలోని కేంద్ర సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందారు. కుక్కల దాడిలో గ్రామానికి చెందిన నెట్టి అనురాధ, ముడిదాన కనకమహాలక్ష్మి, పెండి అరసవల్లి, శివుడు రాజు, కోమ్మా రమ, లక్ష్మి, కె.నూకరాజు, సత్తిబాబుతో పాటు పురమనేని లక్ష్మినాయుడు ఉన్నారు. దీనిపై స్పందించిన సర్పంచ్ తాళ్లపూడి కీర్తి, ఈఓపీఆర్డీ ఎ.రఘుపతిరావు కుక్కల నుంచి ఎటువంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఆలయ చోరీ నిందితుల పట్టివేత నెల్లిమర్ల: పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో చోరీ చేసిన నిందితులను పట్టుకున్నట్టు ఎస్ఐ బి.గణేష్ తెలిపారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నిందితులు ఇద్దరూ జిల్లా కేంద్రంలోని లంకాపట్నంకి చెందిన మైనర్లని, వీరికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని తెలిపారు. వీరిద్దరూ మద్యానికి బానిసలుగా మారి చెడు వ్యసనాలతో దొంగతనాలు చేస్తున్నారని, వాహన తనిఖీల్లోభాగంగా ఇద్దరినీ పట్టుకున్నామని చెప్పారు. నిందితులు నుంచి దొంగతనానికి ఉపయోగించిన ఒక పల్సర్ బైక్ సీజ్ చేశామన్నారు. నిందితులు హుండీలో దొంగిలించిన సొమ్మును పూర్తిగా ఖర్చు చేశారని, వారిని కోర్టు ఆదేశాల మేరకు జువైనల్ హోంకు తరలించినట్టు తెలిపారు. రైల్వే ట్రాక్పై మృతదేహం విజయనగరం క్రైమ్ : విజయనగరం – కోరుకొండ రైల్వేస్టేషన్ల మధ్య, జొన్నవలస రైల్వేగేట్ రైల్వే ట్రాకై ్ప గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించామని జీఆర్పీ హెచ్సీ శ్రీనివాస్ ప్రసాద్ గురువారం తెలిపారు. సుమారు 60 సంవత్సరాల వయస్సు కలిగిన మృతదేహం 5 అడుగుల 2 అంగుళాల పొడవు కలిగి ఉంటాడరన్నారు. చామన ఛాయ రంగుతో, నీలం రంగు గల రౌండ్ నెక్ టీ షర్టు, వైలెట్ కలర్ నిక్కర్ ధరించి ఉందన్నారు. మృతదేహం పక్కనే తెలుపు, ఎరుపు గీతల గల తువ్వాలు ఉందన్నారు. మృతదేహాన్ని గుర్తించిన వాళ్లు 9247585742, 9440170317 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎస్ఐ బాలాజీరావు ఆదేశాలతో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
క్రమశిక్షణతో విధి నిర్వహణే ఉద్యోగులకు రక్షణ
విజయనగరం అర్బన్: ఉత్తమ క్రమశిక్షణతో విధులు నిర్వహించడం ఉద్యోగుల రక్షణకు శ్రీరామరక్షగా ఉంటుందని ఎన్ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు వై.శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణా తరగతులకు గురువారం హాజరై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్ఎంయూఏ ఉద్యోగులకు బలపరుస్తూ క్రమశిక్షణతో విధులు నిర్వహించడం, యూనియన్ బలోపేతానికి ఇదే ప్రధాన మార్గమని తెలిపారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన తరువాత వచ్చిన మార్పులు, వాసా రూల్స్ ప్రకారం జారీ అయిన జీవోలలో ఉన్న మార్పులను వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు లభిస్తున్న సౌకర్యాలు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు. ఎన్ఎంయూఏను రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 96 ద్వారా గుర్తింపు సంఘంగా ప్రకటించిందని అలాగే జీవో నెంబర్ 129 ద్వారా స్టాఫ్ కౌన్సిల్లో అవకాశం కల్పించి ఉద్యోగుల సమస్యలను నేరుగా ప్రభుత్వానికి విన్నవించుకునే అవకాశం కల్పించిందని చెప్పారు. అందువల్ల ప్రతి ఉద్యోగి సర్క్యులర్లు తెలుసుకుని యాజమాన్యంతో సంప్రదింపులు జరిపేటప్పుడు సర్క్యులర్ ప్రకారం మెమోరాండం ఇవ్వాలని సూచించారు. ఉద్యోగుల ఆర్థిక అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలించాలను విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీ రమణారెడ్డి, కోశాధికారి పీవీమోహన్, జోనల్ అధ్యక్షుడు బీఎస్రాములు, జోనల్ కార్యదర్శి ప్రదీప్కుమార్, జిల్లా కార్యదర్శి పీజీరాఫెల్ తదితరులు పాల్గొన్నారు. జోన్ పరిధిలోని 18 డిపోల ముఖ్య నాయుకులు, వర్క్షాప్ నాయకులు కూడా హాజరయ్యారు. ఎన్ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు వై.శ్రీనివాస్ -
తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు : పీఓ
పార్వతీపురం రూరల్ : వినియోగదారులకు నాణ్యమైన సరుకులను తక్కువ ధరలకే అందించడమే లక్ష్యంగా పని చేయాలని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ ప్రాజెక్టు అధికారి సి.యశ్వంత్కుమార్ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఆయన పార్వతీపురం పట్టణంలోని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సూపర్ బజార్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరుకుల నిల్వలు, నాణ్యతను పరిశీలించిన ఆయన, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరపాలని స్పష్టం చేశారు. వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ధరల పట్టికను ప్రదర్శించాలని, తేనె, కాఫీ వంటి గిరిజన ఉత్పత్తుల నాణ్యతలో రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. నిల్వల రిజిస్టర్లను ఎప్పటికప్పుడు తాజాపరుస్తూ, సరుకుల కొరత లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జీసీసీ మేనేజర్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
పొదల మాటున విగతజీవిగా...
పార్వతీపురం రూరల్ : మతిస్థిమితం లేక మంగళవారం నుంచి అదృశ్యమైన శ్రీపతి మాధవరావు చివరకు విగతజీవిగా లభ్యమయ్యాడు. కుటుంబ సభ్యు ల తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరావు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పట్టణ పోలీసుల కు ఫిర్యాదు చేశారు. గురువారం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలో ఉన్న పొదల్లో స్థానికు లు మృతదేహాన్ని గుర్తించి పో లీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరు కున్న పోలీసులు మృతుడు మాధవరావుగా గుర్తించి కు టుంబ సభ్యులకు సమాచా రం చేరవేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
వీడిన రాజాం చోరీ మిస్టరీ
● చోరీ సొత్తులో 470 గ్రాముల రికవరీ ● పోలీసుల అదుపులో ఇద్దరు ● పరారీలో మరో ఇద్దరు ● ఏఎస్సీ సౌమ్యలత వెల్లడి విజయనగరం క్రైమ్ : రాజాం జీఎంఆర్ క్వార్టర్స్లోని రెండిళ్లలో గత నెల 1వ తేదీన జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు, వారి నుంచి 470 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు విజయనగరం అడిషనల్ ఎస్పీ సౌమ్యలత తెలిపారు. స్థానిక డీపీఓలోని గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. రాజాం జీఎంఆర్ క్వార్టర్స్లో జీఎంఆర్ కేర్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ నగేష్ దసర్వార్, జీఎంఆర్ ఐటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న గడ్డం మాధవ కృష్ణారెడ్డి ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఫిబ్రవరి 1న చోరీకి పాల్పడ్డారని చెప్పారు. ఒక ఇంట్లో 1279 గ్రాముల బంగారు ఆభరణాలు, మరో ఇంట్లో 245 గ్రాముల ఆభరణాలు దొంగిలించుకుపోయినట్టు అందిన ఫిర్యాదుల మేరకు సంతకవిటి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారన్నారు. వీటిని ఛేదించేందుకు సీసీఎస్ పోలీసుల సహకారంతో నలుగురు ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో 12 మంది ఎస్ఐలతో ఐదు బృందాలను ఏర్పాటు చేసి నిందితులను ట్రాక్ చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. సాంకేతికతతో సీసీటీవీ పుటేజ్తో చోరీకి పాల్పడిన వారు మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాకు చెందిన గ్యాంగ్గా గుర్తించామని తెలిపారు. ఆ గ్యాంగ్ను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు ధార్ జిల్లాకు వెళ్లాయన్నారు. గ్యాంగ్లోని ఇద్దరు నిందితులైన ధార్ జిల్లా సర్దార్పూర్ తహశీల్, ధకన్బారికి చెందిన రక్ష ఉరఫ్ రాక్సింగ్(36), ఖనియాంబాకు చెందిన మోహన్సింగ్ దౌదావే(28)లను పట్టుకున్నామని తెలిపారు. ఈ ఇద్దరూ మళ్లీ దొంగతనం చేసేందుకు రాజాం వచ్చినట్టు అందిన సమాచారంతో బూరాడపేట జంక్షన్ వద్ద ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి నుంచి సుమారు రూ.70 లక్షల విలువ చేసే 470 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశామన్నారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయని, వీరిని కూడా త్వరలోనే పట్టుకుంటామని అదనపు ఎస్పీ సౌమ్యలత తెలిపారు. సమావేశంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్రరావు, సీసీ ఎస్ ఎస్ఐ కె.లక్ష్మణరావు, సంతకవిటి ఎస్ఐ ఆర్.గోపాలరావు, హెడ్ కానిస్టేబుళ్లు ఇమ్రాన్ఖాన్, డి.శంకరరావు పాల్గొన్నారు. -
ఆత్మాన్వేషణే ప్రధాన ఇతివృత్తంగా ‘రవం’
విజయనగరం టౌన్: ఆత్మల అన్వేషణే ప్రధాన ఇతివృత్తంగా రవం చిత్ర నిర్మాణం చేపట్టామని సినీనటి కళ్యాణి పేర్కొన్నారు. తారక్ ఫిల్మ్ హౌస్ బ్యానర్పై నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం ఆహా ఓటీటీ ద్వారా విడుదలవుతుందన్నారు. సౌండ్ ఆఫ్ సోల్ క్యాప్షన్తో ప్రశాంత్, అనుశ్రీవర్మలు హీరోహీరోయిన్లుగా శ్రీరామ్ దర్శకత్వంలో అద్భుతంగా చిత్రం రూపుదిద్దుకుందన్నారు. నిర్మాత, సంగీత దర్శకునిగా తారక్ వ్యవహరిస్తున్నారన్నారు. నిర్మాతలుగా తారక రామారావు, కళ్యాణిలు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రెస్క్లబ్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో చిత్రం ఫస్ట్లుక్ టీజర్ను ఆవిష్కరించారు. నిర్మాత తారకరామారావు మాట్లాడుతూ హారర్ , థ్రిలర్స్, సస్పెన్స్తో సాగే ఈ చిత్రం ఆద్యంతం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. శ్రీగురునారాయణ కళాపీఠం వ్యవస్థాపకులు బిఎ.నారాయణ మాట్లాడుతూ విద్యలనగరమైన విజయనగరంలో హరికథ, సంగీతంలో రాణించి సినీ ఇండస్ట్రీలో జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన కళ్యాణి, ఆమె సోదరుడు తారక్లు తొలిసారిగా నిర్మాతలుగా తీసిన రవం చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఈపు విజయకుమార్, గెద్ద వరప్రసాద్, భోగరాజు సూర్యలక్ష్మి, థీరజ్ వజ్రాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
పార్వతీపురం రూరల్ : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. పార్వతీపురం పట్టణంలోని భాస్కర, ఆర్.కె.జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న పరీక్షల సరళిని, అక్కడ ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్న్ అమలులో ఉన్నందున బయటి వ్యక్తులు గుంపులుగా ఉండకూడదని ఆదేశించారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలపై కఠిన నిషేధం అమలు చేయాలని సిబ్బందికి సూచించారు. మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్కు తావులేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రశ్న పత్రాల తరలింపు, సమాధాన పత్రాల భద్రత విషయంలో తగిన ఎస్కార్ట్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో పార్వతీపురం టౌన్ ఇన్స్పెక్టర్ వెంకట్రావుతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్న గిరిజన విద్యార్థులు
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని పీడమండ గ్రామానికి చెందిన నాలుగో తరగతి విద్యార్థిని కొండగొర్రి సాయి సార్విని మలేరియా జ్వరంతో బాధపడుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అనారోగ్యానికి గురైన సాయి సార్వినిని పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి కుటుంబ సభ్యులు మంగళవారం తీసుకురాగా వైద్యులు పరీక్షించారు. పరిస్థితిని గమనించి చిన్నారిని విశాఖపట్నం కేజీహెచ్కి తరలించారు. అయితే చిన్నారికి సరైన వైద్యం అందడం లేదని తల్లిదండ్రులు కొండగొర్రె నూకందొర, జయశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి కొన్నాళ్లుగా పాఠశాలకు రాకపోవడంతో సాధారణ జ్వరమేనని పాఠశాల సిబ్బంది అనుకున్నారు. ఆరా తీయగా మలేరియాగా గుర్తించడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సార్వినిని కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య విషయమై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా మేల్కొని గిరిజన చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
కార్మిక నమోదుతో ఆర్థిక భరోసా..!
విజయనగరం గంటస్తంభం: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన కార్మికులు వినియోగించుకోవాలని జిల్లా కార్మిక శాఖ అధికారులు సూచిస్తున్నారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వివాహం, ప్రసూతి, సహజ మరణం, దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందించే పథకాలను అమలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఉపాధి హామీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇటుక బట్టీలలో పని చేసే వారు, రాయి పనులు చేసే వారు, వెల్డర్లు తదితరులు రూ.110 చెల్లించి ఐదు సంవత్సరాలకు కార్మికులుగా నమోదు చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. రెన్యువల్కు మరో అవకాశం 2019 నుంచి 2025 వరకు కార్డు రెన్యువల్ చేయించుకోని కార్మికులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రూ.110 చెల్లించి కార్డులను రెన్యువల్ చేసుకోవాలని కార్మిక శాఖ అధికారులు సూచించారు. కార్డు రెన్యువల్ చేసుకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. వివాహ కానుకగా రూ.40 వేల సాయం భవన నిర్మాణ కార్మికుల పిల్లల వివాహాలకు ప్రభుత్వం రూ.40 వేల ఆర్థిక సాయం అందజేస్తుంది. కార్మికుడికి లేబర్ కార్డు ఉండి వివాహ సమయానికి రెన్యువల్ అయి ఉండాలి. ఏపీ సేవా పోర్టల్ నుంచి వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకొని, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా నకలు కాపీలతో కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. 2026 మార్చి నుంచి జరిగే వివాహాలకు ఈ పథకం వర్తిస్తుంది. జిల్లాలో 90వేల కార్మికుల నమోదు ఇప్పటి వరకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 90 వేల మంది కార్మికులు నమోదు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మీసేవా కేంద్రాలు, గ్రామ లేదా వార్డు సచివాలయాల్లోని ఏపీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కార్మికులకు అవగాహన దీనికి సంబంధించి కార్మికుల్లో అవగాహన పెంపొందించేందుకు కార్మిక శాఖాధికారులు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇటీవల విజయనగరం పెద్ద చెరువు వద్దనున్న దివంగత వైఎస్సార్ విగ్రహం వద్ద పని చేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు సభ్యత్వ నమోదు విధానం, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. జిల్లా కార్మిక శాఖ కమిషనర్ ఎస్డీవీ ప్రసాదరావు, ఏఎల్ఓ జీఎస్ఎస్కే శ్రీనివాసరావు, లేబర్ అసిస్టెంట్ కమిషనర్ బి.రమాదేవి, సిబ్బంది అవగాహన కల్పించిన వారిలో ఉన్నారు. 18 – 60 ఏళ్ల కార్మికుల నమోదుకు సువర్ణావకాశం రూ.110తో నమోదు..కార్మికులకు అనేక సంక్షేమ ప్రయోజనాలు లేబర్ కార్డు ఉంటే పెళ్లి, ప్రసూతి, మరణానికి ఆర్థిక సాయం రెన్యువల్ చేసుకోని కార్మికులకు మరో అవకాశం ఉమ్మడి విజయనగరం జిల్లాలో 90 వేల మంది కార్మికుల నమోదుప్రసూతి సాయం భవన నిర్మాణ కార్మికుల కుమార్తెలకు రెండు కాన్పులకు ప్రభుత్వం రూ.20 వేల చొప్పున సాయం అందజేస్తుంది. ఆస్పత్రి ప్రసూతి ధ్రువపత్రం, డిశ్చార్జి సర్టిఫికెట్, శిశువు జనన ధ్రువపత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. సహజ మరణానికి రూ.60 వేల సాయం నమోదైన కార్మికుడు మరణిస్తే అతని కుటుంబానికి ప్రభుత్వం రూ.60 వేల ఆర్థిక సాయం అందజేస్తుంది. మరణ సమయానికి కార్డు రెన్యువల్ అయి ఉండాలి. మరణ ధ్రువీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో దరఖాస్తు చేయాలి. దహన సంస్కారాలకు తక్షణ సాయం మరణించిన కార్మికుడి దహన సంస్కారాల కోసం ప్రభుత్వం రూ.20 వేల తక్షణ సాయం అందజేస్తుంది. సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. -
మండలిలో డోలపేట భూముల అంశాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్సీ
రాజాం : పట్టణ పరిధి డోలపేట గ్రామానికి సంబంధించిన భూములు ఎన్నో ఏళ్లుగా దేవదాయ శాఖ పరిధిలో ఉండడంతో గ్రామప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శాసనమండలి సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ప్రస్తావించారు. గురువారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో డోలపేట భూముల అంశాన్ని సభాధ్యక్షులు దృష్టికి తీసుకువెళ్లారు. బొబ్బిలి ఎస్టేట్ ఉద్యోగిగా పనిచేసిన అయ్యగారి పాపయ్య పంతులు 1848లో డోలపేట (అప్పటి సీతారాంపురం అగ్రహారం) గ్రామంలో ఉమామహేశ్వర, లక్ష్మీనారాయణస్వామి ఆలయాన్ని నిర్మించారని పేర్కొన్నారు. అయితే 1941 మరియు 1944లలో ఆస్తి రిజిస్టర్ రూపొందించినా ఈ ఆలయం పేరుతో ఎటువంటి భూములు లేవని అందులో పేర్కొన్నారని తెలిపారు. 2002, 2012 సంవత్సరంలో దేవదాయ శాఖ తయారు చేసిన ప్రాపర్టీ రిజిస్టర్లో రైతుల జిరాయితీ భూమి 207.33 ఎకరాలను ఉమామహేశ్వర, లక్ష్మీనారాయణ దేవాలయం పేరున రెవెన్యూ అధికారులు చట్టవిరుద్దంగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారని పేర్కొన్నారు. అప్పటి రైతుల నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అప్పటి బొబ్బిలి సర్వే సెటిల్మెంట్ అధికారి రైతులు, ప్రజలతో ఎలాంటి గ్రామసభ నిర్వహించకుండా, రైతులకు తెలియకుండా అనేక దిద్దుబాటులతో చట్టవిరుద్దంగా ఇందులో కొన్ని భూములకు స్వామివారి పేరున పట్టా ఇచ్చారని తెలిపారు. దేవదాయ శాఖ రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈ భూములకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సబ్రిజిస్ట్రార్కు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్లాన్ అనుమతులు ఇవ్వొద్దని పురపాలక సంఘానికి ఆదేశాలు ఇవ్వడంతో వేల మంది డోలపేట గ్రామప్రజలు, రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని డోలపేట గ్రామ ప్రజలకు భూములపై సర్వ హక్కులు కల్పించేలా చట్టం తీసుకురావాలని కోరారు. -
కోట సీతారాంపురంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి : కలెక్టర్
పార్వతీపురం: సీతానగరం మండలంలోని కోట సీతారాంపురంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు తక్కువ శ్రమతో అధిక దిగుబడులు సాధించి తద్వారా అధిక రాబడులను పొందేలా ప్రోత్సహించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతను వివరించి ప్రోత్సహించాలన్నారు. నిరుద్యోగ యువతను గుర్తించి వారిచే కొత్త పరిశ్రమల ను స్థాపించేలా తోడ్పాటును అందించాలని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు. మార్ట్తో అభివృద్ధికి ముందడుగు జిల్లాలో మన్యం అగ్రి రూరల్ ట్రాన్స్ఫార్మేషన్ (మా ర్ట్) ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా అభివృద్ధిలో ముందడుగు వేయనుందని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. రైతులు, మహిళలు ఆదాయం రెట్టింపు కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు పంట మార్పిడి చేసి ఆధునిక పద్ధతులను అవలంభించాలన్నారు. రైతుల తలసరి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా మార్ట్ పని చేస్తుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల్లో దాగివున్న నైపుణ్యాలను వెలికి తీయాలన్నారు. రీసర్వేను వేగవంతం చేయాలి జిల్లాలో నిర్వహిస్తున్న రీసర్వే, పట్టాదారు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. అమరావతి నుంచి కలెక్టర్లు, జేసీలు, డీఆర్ఓలు, ఆర్డీలతో సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జి.జయలక్ష్మి బుధవారం సమీక్షించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ నిషేధిత జాబితాలో వున్న భూమి వివరాలను గుర్తించాలన్నారు. రెవెన్యూ క్లినిక్ ద్వారా వచ్చిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులకు సూచించారు. -
రూ.1.32 కోట్లు
● ప్రభుత్వంపై నమ్మకం లేక... గతేడాది బీమా చెల్లించిన మామిడి, జీడిమామిడి రైతులు 10,670 మంది రైతులు చెల్లించిన ప్రీమియం మొత్తం జిల్లాలో సాగులో ఉన్న మామిడి పంట 32 వేల హెక్టార్లు గతేడాది పంటల బీమా రాకపోవడంతో ఈ ఏడాది ఒక్క రైతు కూడా బీమా ప్రీమియం చెల్లించేందుకు ముందుకు రాలేదు. బీమా ప్రీమియం వసూలులో చూపుతున్న శ్రద్ధ చెల్లింపులో ప్రభుత్వం చూపడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఒక్క రైతు కూడా బీమా ప్రీమియం చెల్లించేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది. జిల్లాలో సాగులో ఉన్న జీడి మామిడి పంట 5,600 హెక్టార్లు విజయనగరం ఫోర్ట్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. విపత్తు సమయంలో సాయం అందక విలవిల్లాడుతున్నారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన ఉచిత పంటల బీమాకు మంగళం పాడేసిన కూటమి సర్కారు.. ప్రీమియం చెల్లించిన రైతులు పంట నష్టపోయినా పరిహారం అందించడంలో నిర్లక్ష్యంవహిస్తోంది. రైతన్నను ఆవేదనకు గురిచేస్తోంది. ఉద్యానసాగును ప్రోత్సహిస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనలు వాస్తవానికి భిన్నమని, విపత్తుల సమయంలో ఎలాంటి సాయం అందడంలేదంటూ రైతులు గగ్గోలుపెడుతున్నారు. బీమా కంపెనీ నుంచి రైతులకు చెల్లించాల్సిన బీమా సొమ్మును ఇప్పించడంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. బీమా ప్రీమియం చెల్లించినా... 2025–26లో మామిడి తోటలకు ఎకరాకు రూ.2, జీడి మామిడి తోటలకు ఎకరాకు రూ.1500 చొప్పున రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. 10,104 మంది రైతులు 6,358 ఎకరాల మామిడితోటలకు రూ.1,27,16,000లు, జీడి మామిడి రైతులు 566 మంది 378 ఎకరాలకు రూ.5,67,000లు బీమా ప్రీమియంగా చెల్లించారు. పంట నష్టపోతే మామిడి పంటకు ఎకరాకు రూ.40 వేలు, జీడిమామిడికి రూ.30 వేలు బీమా అందాలి. గతేడాది కొన్ని తోటలు పూర్తిగా పూతపూయకపోగా, మరికొన్నిచోట్ల తుఫాన్ వర్షాలకు నష్టంవాటిల్లింది. మామిడి, జీడి మామిడి పంటలు దెబ్బ తిన్నాయి. పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. ప్రకృతి వైపరీత్యాలు కారణంగా పంట దెబ్బతినడంతో బీమా వర్తిస్తుందని మామిడి, జీడిమామిడి రైతులు ఆశించినా ఇంతవరకు పైసా కూడా అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు బీమా ప్రీమియం డబ్బులు, మరోవైపు పంట నష్టపోయామని చెబుతున్నారు. బీమా.. లేదండి ధీమా..! గతేడాది పంటలు నష్టపోయిన రైతులకు అందని బీమా ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోతున్న వైనం ఆవేదనలో రైతాంగం 0గతేడాది మామిడికి ఎకరానికి రూ.2 వేలు, జీడి మామిడికి రూ.1500 చొప్పున రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. తుఫాన్ వర్షాలకు పంట నష్టపోయినా ఒక్క రూపాయి బీమా చెల్లించకపోవడం దారుణం. రైతులు రెండు విధాలా నష్టపోయారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదు. వారి సమస్యలను పరిష్కరించడం లేదు. – బుద్దరాజు రాంబాబు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఈ ఏడాది మామిడి, జీడిమామిడి పంటలకు రైతులు పంటల బీమా ప్రీమియం కట్టలే దు. గతేడాది పంటల బీమా కోసం వివరాలు అడిగితే కమిషనర్ కార్యాలయానికి పలు మార్లు పంపించాం. ఒక్క రైతుకు కూడా బీమా డబ్బులు అందలేదు. – కె.చిట్టిబాబు, జిల్లా ఉద్యానశాఖాధికారి -
జ్వరాల బారిన గిరిపుత్రులు
కొమరాడ: మండలంలోని పెదఖేర్జిల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహం విద్యార్థులపై జ్వరాలు పంజావిసురుతున్నాయి. వైరల్ జ్వరాల వ్యాప్తితో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. ఆస్పత్రుల బాట పడుతున్నారు. వసతిగృహానికి చెందిన నలుగురు విద్యార్థులు తీవ్ర జ్వరంతో బాధపడుతూ కొమరాడ పీహెచ్సీని బుధవారం ఆశ్రయించారు. 304 మంది విద్యార్థులు చదుతున్న వసతి గృహంలో మౌలిక సదుపాయాలు లోపించాయి. పడుకునేందుకు సరిపడా గదులు లేవు. పారిశుద్ధ్యం లోపించడంతో జ్వరాలు వ్యాప్తిచెందుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. వైద్యాధికారులు స్పందించి వసతిగృహంలో వైద్యశిబిరం నిర్వహించి సేవలు అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. వైద్యం అందిస్తున్నాం.. పెదఖేర్జిల వసతిగృహం నుంచి ప్రతిరోజు ముగ్గురు నుంచి నలుగురు విద్యార్థులు జ్వరంతో బాధపడుతూ వస్తున్నారు. వారికి వైద్యసేవలు అందిస్తున్నాం. విద్యార్థులకు చర్మవ్యాధుల సమస్య కూడా ఉంది. వసతిగృహంలో సిక్ రూమ్ సమస్యతో పాటు పారిశుద్ధ్యం, పౌష్టికాహారం లోపం లేకుండా చర్యలు తీసుకుంటే విద్యార్థులకు ఆరోగ్యం సమకూరుతుంది. -
పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ముమ్మర తనిఖీ ల నడుమ సాగాయి. బోర్డు ప్రత్యేక పరిశీలకు లు జె.వి.ఎస్.ఎస్.సుబ్రహ్మణ్యం క్షేత్ర స్థాయి పర్యవేక్షణ చేపట్టారు. ఉదయం 8.15 గంటలకే స్థానిక పార్వతీపురం రూరల్ పోలీస్స్టేషన్ లో భద్రపరిచిన ప్రశ్నపత్రాల కస్టడీ, రికార్డుల ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం పార్వతీపురం, సీతానగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించారు. డీఆర్డీసీ లో జరుగుతున్న స్పాట్ కోడింగ్, సంస్కృత మూల్యాంకన పనులను నిశితంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. 96.5 శాతం హాజరు బుధవారం నాటి పరీక్షకు జిల్లా వ్యాప్తంగా మొ త్తం 6,728 మంది విద్యార్థులకుగాను 6,499 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 229 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారి వై.నాగేశ్వరరావు తెలిపారు. పార్వతీపురం రూరల్: ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై దాడి చేసి నగదు దొంగిలించిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన పోరాపు తేరేజమ్మ అనే వృద్ధురాలు గత నెల 28న రాత్రి తన ఇంట్లో నిద్రిస్తుండగా, అదే గ్రామానికి చెందిన తామరకండి రాజేష్ (26) గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. ఆమె వద్ద ఉన్న నగదును దొంగిలించే క్రమంలో ప్రతిఘటించడంతో, రాయి వంటి వస్తువుతో తలపై కొట్టి గాయపరిచాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న రూ.12,400 నగదుతో పారిపోయాడు. ఈ క్రమంలో బాధితురాలి కుమార్తె పత్తికట్ల తవిటమ్మ ఫిర్యాదు మేరకు పార్వతీపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి ఆదేశాలతో మూడు బృందాలు దర్యాప్తు చేపట్టి, బుధవారం తెల్లవారుజామున నిందితుడిని కృష్ణపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. మద్యం, అప్పుల బాధ వల్లే ఈ నేరానికి పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడు. అతని నుంచి రూ.12,400 నగదు, దాడికి వాడిన చేతి కడియం, మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో రూరల్ సీఐ రంగనాథం, ఎస్సైలు రాజేష్, సింహాచలం పాల్గొన్నారు. కురుపాం: గిరిజనులు ఆరుగాలం శ్రమించి సాగుచేసిన అటవీ ఉత్పత్తుల రవాణాలో అటవీశాఖ అధికారులు అడ్డంకులు సృష్టిస్తూ లంచాలు వసూలు చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు ఆరోపించారు. కురుపాంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీశాఖ అధికారులు అధికార దుర్వినియోగంతో గిరిజనుల జీవనాధారంపై దెబ్బ కొడుతున్నారని మండిపడ్డారు. వబ్బంగి పంచాయతీలోని తోలుంగూడ గ్రామానికి చెందిన మండంగి రవి, మండంగి సంతోష్ కొండచీపుర్లను విక్రయించేందుకు సీతంపేట, కొత్తూరు తరలిస్తుండగా చినబగ్గ కాలనీ కూడలి వద్ద అటవీశాఖ అధికారులు వాహనాన్ని అడ్డగించి రూ.10వేలు వసూలు చేయడం దారుణమన్నారు. పంటను అమ్ముకునే హక్కును కూడా అధికారులు దోచుకుంటురన్నారన్నారు. జీసీసీ అధికారులు స్పందించి మద్దతు ధరకు గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు కోరంగి సీతారాం పాల్గొన్నారు. -
మీరు వడ్డీ చెల్లించండి!
మేము అప్పుచేస్తాం... రాజాం సిటీ: ‘విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేందుకు మేము అప్పుచేస్తున్నాం.. దానికి అయ్యే వడ్డీ 7.5 శాతం భారాన్ని కళాశాలల యాజమాన్యాలే భరించాలి.. అలా అయితేనే 2024–25 సంబంధించి ఆర్టీఎఫ్లు విడుదల చేస్తాం... మీకు చెల్లించాల్సిన మొత్తంలో 7.5 శాతం వడ్డీ మినహాయించి మిగిలినది కళాశాల బ్యాంకు ఖాతాలకు జమచేస్తాం.. దీనికి మీరు అగ్రిమెంట్ ఇవ్వాలి.. దీనికి సమ్మతమైతే ఆర్టీఎఫ్ విడుదల అవుతుంది.’ అంటూ ఇటీవల రౖపైవేటు కళాశాలల అసోసియేషన్ సభ్యులు సంప్రదించిన సమయంలో సీసీఈ సభ్యుడు భరత్గుప్తా చెప్పిన మాట. దీనిపై ప్రైవేటు కళాశాలల అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. ఇప్పటికే రెండేళ్లుగా వడ్డీలకు అప్పులుతెచ్చి కళాశాలలు నిర్వహిస్తున్న సమయంలో ఆర్టీఎఫ్లు విడుదలకు తెచ్చిన సొమ్ముకు 7.5 శాతం వడ్డీ చెల్లించాలంటే కష్టమని, ఇలా అయితే కళాశాలల యాజమాన్యాలు నష్టపోతాయని తేల్చిచెప్పామనే విషయాన్ని అసోసియేషన్ సభ్యులు వాట్సాప్ గ్రూపుల ద్వారా మిగతా కళాశాలల యాజమాన్యాలకు వివరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. గత ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమచేసేదని, వారు ఫీజులు చెల్లించేవారని, ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందంటూ ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు సర్కారు నేరుగా కళాశాలల బ్యాంకు ఖాతాలకే ఆర్టీఎఫ్ నిధులు జమచేస్తామని చెప్పి ఇప్పుడు ఈ మెలిక పెట్టడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో ఉన్న సుమారు 35 ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 20వేల మంది, 11 ఇంజినీరింగ్ కళాశాలల్లో 15వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వం కళాశాలలకు నేరుగా ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తుందన్న భరోసాతో విద్యార్థులు ఆయా కళాశాలల్లో చదువుకుంటున్నారు. విద్యాసంవత్సరం ముగిసే సమయం దగ్గరపడుతున్నా ఇంత వరకు చంద్రబాబు సర్కారు కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయలేదు. దీంతో అటు కళాశాలల యాజమాన్యాలు, ఇటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు కళాశాలలకు చంద్రబాబు సర్కారు సరికొత్త ఆఫర్ 7.5 శాతం వడ్డీ చెల్లిస్తేనే ఫీజురీయింబర్స్మెంట్ విడుదల! అప్పుతెచ్చిన నిధులకు కళాశాలలే వడ్డీ చెల్లించాలని మెలిక నిధుల విడుదలలో జాప్యం దిక్కుతోచని స్థితిలో కళాశాలల యాజమాన్యాలు -
పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి
జియ్యమ్మవలస (రూరల్): పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ ఎస్.వి. మాధవరెడ్డి పోలీసులను ఆదేశించారు. చినమేరింగి పోలీస్ స్టేషన్ను ఆయన మంగళవారం సందర్శించారు. కేసుల రికార్డులు పరిశీలించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. మండలంలో క్రైమ్ రేటు తగ్గించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ టి.వి.తిరుపతిరావు, ఎస్ఐ అనిషి, తదితరులు పాల్గొన్నారు. ఉచిత ఇసుక విధానం అమలెక్కడ? బొబ్బిలి: కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానం రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక విక్రయాలకు రెండింతల ధరలు పలుకుతున్నాయని ఉత్తరాంధ్ర సాధన సమితి కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మునాయుడు ఆరోపించారు. తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉచిత ఇసుక పేరుతో ఇసుక మాఫీయా నడుస్తోందని, నదులు, వాగుల, గెడ్డల్లో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక విధానం అమలు కావడం లేదని, టన్ను ఇసుక ధర గతం కంటే రెండింతలు పెరిగిందని ఆరోపించారు. వేగావతి పరీవాహక ప్రాంతంలో 10 అడుగుల లోతుల్లో ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల భవిష్యత్లో ఆ ప్రాంత ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పవన్నారు. -
ఏడిపింఛెన్!
● చంద్రన్న పింఛన్ గొప్పలు.. లబ్ధిదారులకు తప్పని తిప్పలు! ● అర్హులకు మంజూరుకాని పింఛన్ ● అధికారులచుట్టూ ప్రదక్షణలు పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ కొత్తవలస గిరిజన గ్రామానికి చెందిన ఈ వృద్ధ దంపతుల పేర్లు కొర్రా తిరునాథ, చిన్నమ్మి. 70 ఏళ్లకుపైగా వయస్సున్న తిరునాథకు గతంలో పింఛన్ అందేది. వీరి ఇంట్లోనే వితంతువుగా ఉన్న కోడలు ఉండటం.. ఆమెకు కూడా వితంతు పింఛను రావడంతో ఈయన లబ్ధిని నిలిపివేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన వీరికి పింఛనే ఆధారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నడవలేడు, కూర్చోలేడు. ఎన్నోమార్లు పింఛన్ కోసం అడిగాడు. పోనీ, తన భార్యకు అయినా లబ్ధి కలిగించాలని ప్రాథేయపడ్డాడు. కొత్త పింఛన్లేవీ మంజూరు కాకపోవడంతో వీరి మొర వినేవారే లేకపోయారు. ఈ చిత్రంలోని మహిళల పేర్లు చొక్కాపు పార్వతి, పాపమ్మ. సాలూరు మండలం అన్నంరాజువలస పంచాయతీ రెయ్యివానివలస గ్రామం. కొన్ని నెలల కిందట వీరి భర్తలు చనిపోయారు. అప్పటి నుంచి జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భర్త పెన్షన్ ఇప్పించాలని ఎన్నోమార్లు అధికారులను కలిసి వేడుకున్నారు. ఇప్పటికీ మంజూరు కాలేదు. అధికారులు దయతలచి తమకు న్యాయం చేయాలని ప్రాథేయపడుతున్నారు. -
ప్రపంచ మేధావి అంబేడ్కర్
● మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు విజయనగరం రూరల్: భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించి, ప్రపంచ దేశాలకు ప్రజాస్వామ్య విలువలను తెలియజేసిన ప్రపంచ మేధావి అంబేడ్కర్ అని మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు జూపూడి ప్రభాకరరావు అన్నారు. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో మంగళవారం నిర్వహించిన జిల్లా దళిత సమ్మేళన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ముందుగా మాలమహానాడు, శ్రీ పైడిమాంబ అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన అంబేడ్కర్ విగ్రహాన్ని జూపూడి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దురలవాట్లు మానుకొని, పిల్లలను చదివించి ఉన్నత విలువలతో పెంచితేనే అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషిచేసినట్లు అవుతుందన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేసి సమాజంలో అసమానతలు, కులబేధాలు లేకుండా మెలగినప్పుడే నిజమైన రాజ్యాంగం అమలు జరిగినట్టుగా భావించాలని పేర్కొన్నారు. మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు లోగిశ రామకష్ణ మాట్లాడుతూ జిల్లాలో దళితులపై అంటరానితనం, హత్యాచారాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దళిత సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కల్యాణ్రావు మాట్లాడుతూ ఎస్సీలంతా ఏకమై రాజ్యాధికారం సాధించే దిశగా ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి సియ్యాదుల శ్రీనివాసరావు, ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు మరువాడ ఈశ్వరరావు, కార్యవర్గ సభ్యులు జూరిరాజు, జిల్లా మాలమహానాడు అధ్యక్షురాలు వర్రి సంతోషి, కార్యదర్శి తాలాడ పైడిరాజు, విజయనగరం జిల్లా నియోజకవర్గం కన్వీనర్ భీమపల్లి సంధ్యారాణి, పైడిమాంబ అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కోరాడ నారాయణరావు, కోరాడ రమణ, బంగార్రాజు, మెట్ట కార్తీక్, కె.సత్యనారాయణ, పొన్నకాయల రామలక్ష్మి, చందక నూకరాజు, చీడి రామకృష్ణ, అక్కివరపు రాజు, తదితరులు పాల్గొన్నారు. -
వాతలు.. కోతలు!
రామకోనేరు వద్ద స్వామివారికి చక్రతీర్థస్నానం జరిపిస్తున్న అర్చకులు పార్వతీపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులోని వెనుకబడిన తరగతుల కళాశాల బాలుర వసతి గృహంలో పరిస్థితి చూస్తే ’చదువు అటకెక్కి.. తిండి గాలికి పోయినట్లు’ కనిపిస్తోంది. అద్దె భవనంలో అగచాట్లు, అందని వసతులు, అస్తవ్యస్తంగా ఉన్న మెనూ మధ్య విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం అంతా ‘అరకొర’ తంతుగానే సాగుతోంది. వసతి గృహంలో మొత్తం 79 మంది విద్యార్థులకు సోమవారం 72 మంది హాజరయ్యారు. మెనూ ప్రకారం మజ్జిగ, వెజిటబుల్ కర్రి, సాంబార్, ఫ్రూట్ అందించాలి. 72 మంది విద్యార్థులకు కేవలం 3 లీటర్ల పెరుగు ప్యాకెట్లు, 36 పండ్లు మాత్రమే సిద్ధం చేశారు. అంటే ఒక్కో విద్యార్థికి సగం పండు, చుక్క మజ్జిగే దిక్కు!. ఇక వంటశాలలో బెండకాయ కూర, సాంబార్ పరిమాణం చూస్తే అది విద్యార్థుల ఆకలి తీరుస్తుందా? లేక ఆశ చూపిస్తుందా? అన్నట్లుగా ఉంది. అద్దె భవనంలో కొనసాగుతున్న ఈ వసతి గృహంలో మౌలిక వసతులు మచ్చుకై నా కానరావు. సరిపడా మరుగుదొడ్లు లేక విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఇక నిద్రించే గదుల పరిస్థితి మరీ ఘోరం. కిటికీలకు తలుపులు లేకపోవడంతో, చలి, దోమల నుంచి రక్షణ కోసం విద్యార్థులు కిటికీలకు తమ దుప్పట్లనే తెరలుగా కట్టుకోవడం ఇక్కడి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. మెనూ అమలుపై హాస్టల్ వెల్ఫేర్ అధికారి సీహెచ్ హారిక వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 52 ఖర్చు చేస్తోందని, నిబంధనల మేరకే 120 గ్రాముల కూరను అందిస్తున్నామని సెలవిచ్చారు. 72 మంది విద్యార్థులకు సోమవారం రాత్రి భోజనానికి సిద్ధం చేసిన బెండకాయ కూర, సాంబారు -
కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా
● విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి ● ఏపీటీఎఫ్ (1938) డిమాండ్విజయనగరం గంటస్తంభం: విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్–1938) ఉమ్మడి విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. జిల్లా నాయకత్వం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపింది. కార్యక్రమానికి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఉపాధ్యాయుల డిమాండ్లు న్యాయసమ్మతమైనవని, ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. 12వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడం, 30 శాతం ఐఆర్ ప్రకటించడం, పెండింగ్ బకాయిలు చెల్లించడం అత్యవసరమని పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నెం.57ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయడం, హైస్కూల్ ప్లస్ ఖాళీల భర్తీ, కారుణ్య నియామాకాలు చేపట్టడం, జీవో 342 ప్రకారం ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయులకు ఉన్నత విద్యాభ్యాసానికి అనుమతులు ఇవ్వడం, ఎంటీఎస్ టీచర్ల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచడం వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అనుమానిత స్థావరాలపై ఎకై ్సజ్ శాఖ దాడులు
పార్వతీపురం రూరల్: ప్రొహిబిషన్ – ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎ.సంతోష్ ఆధ్వర్యంలో పెదరేల్లివీధి, ఇందిరాకాలనీ, బాలగుడబ గ్రామాల్లోని అనుమానిత స్థావరాలపై దాడులు నిర్వహించారు. నాటుసారా అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇటీవల నాలుగు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను డ్రోన్ కెమెరాల సాయంతో నిర్వహించడంతో పాటు 23 అంతర్రాష్ట్ర దాడులు చేపట్టినట్టు అధికారులు మంగళవారం తెలిపారు. సారా విక్రయాలకు పాల్పడుతున్న పెదరేల్లివీధికి చెందిన వ్యక్తిపై జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ అమలు చేసి, విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించినట్టు తెలిపారు. గతంలోనూ ఇదే తరహాలో ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు ఏఎస్పీ సంతోష్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలుడెంకాడ: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ప్రమాదకర మలుపులు, ప్రాంతాల వద్ద స్టాపర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. విజయనగరం–విశాఖపట్నం జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు, ఏకే ఇన్ఫ్రా ప్రతినిధి బీబీ ప్రభూజీలు కలిసి రాజపులోవ నుంచి చింతలవలస ఏపీఎస్పీ బెటాలియన్ వరకు 26 నంబర్ జాతీయ రహదారిలోని అత్యంత ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, ఆయా చోట్ల ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు. రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి పొనుగుటివలస గ్రామంలో ఇంటి ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనం గత ఏడాది ఫిబ్రవరి 15న అపహరణకు గురైంది. అప్పట్లో వాహనం మిస్సింగ్పై సంతకవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. సంతకవిటి ఎస్సై ఆర్.గోపాలరావు వద్ద ప్రస్తా వించగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి : ఎన్టీఏ
విజయనగరం గంటస్తంభం: ఉపాధ్యాయులు, ఉద్యోగుల పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్(ఎన్టీఏ) డిమాండ్ చేసింది. విజయనగరం యూత్ హాస్టల్లో జిల్లా అధ్యక్షుడు కె.జోగారావు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక హామీలను అమలు చేయడంలో ఆలస్యం జరుగుతోందన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ పలువురు ఉపాధ్యాయుల బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు. 12వ పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ 30 శాతం ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరారు. పీఆర్సీ ఎరియర్లు, సరెండర్ లీవులు, పీఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. వేసవి సెలవుల్లోనే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమగ్రశిక్షలో పని చేస్తున్న ఐఈఆర్పీ ప్రత్యేక ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఒత్తిడిని తగ్గించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర అదనపు కార్యదర్మి ఎం.మురళి, రాష్ట్ర కార్యదర్మి చిప్పాడ సూరిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు వై.శ్రీనివాసరావు, పి.రాంబాబు, జి.రవి, జిల్లా కార్యదర్ములు టి.నాగేశ్వరరావు, జి.కోటరావు, నాయుడు, ఐఈఆర్పీ ఉపాధ్యాయులు అప్పలనాయుడు, గీత పాల్గొన్నారు. -
హైకోర్టు తీర్పును అమలు చేయాలి
సాలూరు రూరల్: హైకోర్టు తీర్పును అమలు చేయకపోతే కలెక్టరేట్ను, అసెంబ్లీని ముట్టడిస్తామని షెడ్యూల్డ్ ఏరియా న్యాయపోరాట సభలో గిరిజన నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండలంలోని జగ్గుదొరవలస గ్రామంలో షెడ్యూల్డ్ ఏరియా న్యాయపోరాట సభ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు నిమ్మక జయరాజు, నిమ్మక సింహచలం, మండల గిరిధర్ మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో షెడ్యూల్డ్ గ్రామాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత నెల 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. షెడ్యూల్డు ఏరియా భూభాగాల జాబితాను వెంటనే అధికార వెబ్సైట్లో పొందుపరచాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎమ్మెల్యే, మంత్రులు నివాసాల వద్ద ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు నిమ్మక అన్నారావు, మంచాల ఈశ్వరరావు, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. -
మహిళా రక్షక భటులకు ఆరోగ్య రక్షణ
● కేన్సర్పై అప్రమత్తతే ఆయుధం: ఎస్పీపార్వతీపురం రూరల్: మహిళా సాధికారిత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్లో మహిళా అధికారులు, సిబ్బందికి సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార), బ్రెస్ట్ (స్తన) క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వృత్తిపరమైన సవాళ్లతో పాటు కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకునే మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. ముఖ్యంగా గర్భాశయ, స్తన క్యాన్సర్ల బారిన పడకుండా ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముప్పును నివారించవచ్చని ఆయన స్పష్టం చేశారు. మార్చి 1 నుంచి 8 వరకు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా కేవలం సిబ్బందికే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. శిబిరంలో పాల్గొన్న వైద్యులు డాక్టర్ రజిని ప్రియ, సౌజన్యలు కేన్సర్ వ్యాధులపై సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించారు. ప్రతి మహిళ నెలకు ఒకసారి స్వీయ స్తన పరీక్ష చేసుకోవాలని, అవసరమైతే మెమోగ్రఫీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. శిబిరంలో సివిల్, ఏఆర్, డీపీవో, కమ్యూనికేషన్ విభాగాలకు చెందిన మహిళా సిబ్బందితో పాటు హోంగార్డులు, నాలుగో తరగతి ఉద్యోగులు పరీక్షలు చేయించుకున్నారు. అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, పట్టణ సీఐ వెంకట్రావు, ఏఆర్ ఆర్ఐలు నాయుడు, రాంబాబు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
గొల్జాంలో అగ్ని ప్రమాదం
● కాలిబూడిదైన వరి గడ్డివాములు ● పాక్షికంగా కాలిపోయిన ఆవు ● రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టంలక్కవరపుకోట: మండలంలో గొల్జాం గ్రామ సమీపంలోని జామివారి కల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆరు గడ్డివాములు పూర్తిగా కాలి బూడిదవగా ఒక ఆవు పాక్షికంగా కాలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించి గ్రామస్తులు, వీఆర్ఓ గణేష్ తెలిపిన వివరాలు.. జామి వారి కల్లాల్లో మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మండ వెంకటరావు, తూర్పాటి సూర్యప్రకాష్, తూర్పాటి కనకమహేశ్వరరావు, తూర్పాటి విజయరామగణపతి, తూర్పాటి నీలకంఠం, తూర్పాటి కోటేశ్వరరావులకు చెందిన ఆరు గడ్డి వాములు కాలి బూడిదయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన ఎస్.కోట అగ్నిమాపక సిబ్బందికి ప్రమాద స్థలానికి వెళ్లే దారి లేకపోవడంతో మిన్నకున్నారు, చెంతనే గల గెడ్డలో నీటి ఇంజిన్లు ఏర్పాటు చేసి పెద్ద పెద్ద పైప్లతో రైతులే మంటలను అదుపు చేసుకున్నారు. ఈ ప్రమాదంలో తూర్పాటి నీలకంఠంకు చెందిన ఒక ఆవు పాక్షికంగా కాలిపోయింది. కాగా వేసవి కాలం ప్రారంభంలోనే పలు గ్రామాల్లో ఇప్పటికే జరిగిన అగ్నిప్రమాదాలతో గడ్డివాములు కాలిపోయాయి. వరుస ప్రమాదాలు కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. -
జిల్లా జేఏసీ ఏర్పాటు
● విజయనగరం జేఏసీ చైర్మన్గా పైడిరాజు ● పార్వతీపురం అధ్యక్షుడిగా కిషోర్విజయనగరం కలెక్టరేట్: జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) విజయనగరం జిల్లా అధ్యక్షులుగా ఎ.సురేష్ , కార్యదర్శిగా పైడిరాజు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని విజయనగరం ఏపీ ఎన్జీఓ హోంలో మంగళవారం ఎన్నుకున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు సభ్యులుగా ఉన్న జేఏసీలో 35 మందితో కూడిన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నూతన చైర్మన్గా సురేష్ను మళ్లీ ఎన్నుకున్నారు. కోశాధికారిగా కె.చంద్ర శేఖర్, అసోసియేషన్ కో చైర్మన్లుగా వలిరెడ్డి రవీంద్ర నాయుడు, పి.జి.రాఫెల్, టి.శ్రీధర్ బాబు, వైస్చైర్మన్లుగా అప్పారావు, వి.రమణ, కె. శ్రీనివాసరావు, ఎం.మదన్మోహన్, ఎస్.రాము, సి.హెచ్ మురళి, కె.శ్రీనివాసరావు, కె.ఆదిలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాయింటు సెక్రటరీలుగా బి.శ్రీనివాస్, టి.వెంకటరావు, డి.శ్యామ్, ఎం.సూర్యనారాయణ మూర్తి, కె.రాజు ఎస్ఆర్సీ హెచ్.కృష్ణారావు, లక్ష్మణరావు, ఐ.వి.సత్యనారాయణ ఎన్నిక కాగా ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కొందరు, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 14 మందిని ఈసీ మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఏసీ చైర్మన్ సురేష్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.పార్వతీపురం రూరల్: మన్యం జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానికంగా నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొని కార్యవర్గాన్ని ప్రకటించారు. జేఏసీ ఆవశ్యకతను, రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు ఉద్యోగుల ఐక్యతను బలోపేతం చేయాల్సిన బాధ్యతను జి.వి.ఆర్.ఎస్.కిషోర్ వివరించారు. సమావేశంలో ఏపీఎన్జీఓ జిల్లా కార్యదర్శి రంగాచారి, ఆర్టీసీ(ఎన్.ఎం.యూ), వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడుగా జి.వి.ఆర్.ఎస్.కిషోర్, కో–చైర్మన్లుగా ఎన్.బాలకృష్ణ, కె.శంకరరావు, కె.రంగాచారిలు, వైస్ చైర్మన్లుగా కె.భాస్కరరావు, అమరాపు సూర్యనారాయణ, పి.కూర్మి నాయుడు, మజ్జి మురళి బాబు, సెక్రటరీ జనరల్గా చల్లా రాము, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె.విజయ్ కుమార్, కోశాధికారిగా సువ్వాడ దుర్గాప్రసాద్, జాయింట్ సెక్రటరీలుగా పి.శ్రీరాములు, సిహెచ్.గణపతి, ఎ.బాలాజీ రావు, డి.గణపతిరావు, జి.ఎం.రత్నం, జ్యోత్స్న ఎన్నికయ్యారు. ప్రతి నెలా జిల్లా జేఏసీ సమావేశం నిర్వహించాలని, రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పెండింగ్ డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి సమస్యలపై ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉండాలని సమావేశంలో తీర్మానించారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి : యూటీఎఫ్
విజయనగరం గంటస్తంభం: బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా యూటీఎఫ్ తరఫున కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా పరిషత్ మినిస్టీరియల్ భవనంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ భాస్కరరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మోహనరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా రంగాన్ని సంరక్షించడం యూటీఎఫ్ బాధ్యతని అన్నారు. ఉపాధ్యాయుల 12వ వేతన సంఘం నియామకం సహా ఆర్థిక డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించాలని సూచించారు. డిమాండ్ల సాధనకు మార్చి 24న నియోజకవర్గ కేంద్రాల్లో, ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో, ఏప్రిల్ 15 నుంచి 19 వరకు రాష్ట్ర స్థాయిలో నిరాహార దీక్షలు, ఏప్రిల్ 28న చలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
జీసీసీ డీఎంగా అదనపు బాధ్యతలు
సీతంపేట: సీతంపేట గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్గా దాసరి కృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం ఈయన స్థానిక బ్రాంచ్ మేనేజర్గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయనకు డీఎం పోస్టులో ఎఫ్ఏసీగా నియమించారు. ఇప్పటి వరకు జీసీసీ జనరల్ మేనేజర్ జి.సంధ్యారాణి ఇక్కడ ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహించే వారు. యువకుడి అదృశ్యంపై కేసు సంతకవిటి: మండలంలోని వాసుదేవపట్నం గ్రామానికి చెందిన మజ్జి గిరిబాబు(35) 2024వ సంవత్సరంలో ఇంటి నుంచి పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. అనంతరం కొద్ది రోజులు తల్లి దండ్రులతో ఫోన్లో సంభాషణలు జరిపారు. కొద్ది నెలల నుంచి గిరిబాబు తల్లిదండ్రులతో మాట్లాడడం లేదు. దీంతో తోడు చాలా రోజుల నుంచి ఇంటికి తిరికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల నుంచి సమాచారం సేకరించారు. ఎవరింటికీ రాలేదని చెప్పడంతో తండ్రి వెంకన్న స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశాడు. అందిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఆర్.గోపాలరావు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం భామిని: మండలంలోని మనుమకొండకు చెందిన బిడ్డిక వెంకన్న(55) శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్టు బత్తిలి ఎస్ఐ జి.అప్పారావు తెలిపారు. సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంలో బత్తిలి నుంచి మనుమకొండ వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుడు వెంకన్న తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే 108 వాహనంలో సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. భార్య బిడ్డిక రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చెరువులో పడి వివాహిత మృతి శృంగవరపుకోట: పట్టణంలోని స్థానిక జగ్గు చెరువులో పడి వివాహిత మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పుణ్యగిరి రోడ్డులో నివాసం ఉంటున్న కోట దేవి(33) మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లి వస్తానంటూ భర్తతో చెప్పి చెరువుకి వెళ్లింది. కాగా ఆమె ఎంతకీ తిరిగి ఇంటికి రాకపోవటంతో భర్త కోట గోపి చెరువు వద్దకు వెళ్లి చూడగా భార్య దేవి చెరువులో పడి శవమై తేలి ఉంది. మృతురాలి భర్త గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.కోట సీఐ నారాయణమూర్తి తెలిపారు. 18.54 లీటర్ల మద్యం ధ్వంసం సీతానగరం: పార్వతీపురం అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరిటెంటెండ్ ఎ.సంతోష్ ఆధ్వర్యంలో మంగళవారం సీతానగరం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో వివిధ దాడుల్లో పట్టుబడి అక్రమ మద్యం 18.54 లీటర్లు ధ్వంసం చేసినట్టు ఇన్స్పెక్టర్ డి.పద్మావతి తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు తన సిబ్బందితో కలిసి స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 18.54 లీటర్లఅక్రమ మద్యం ధ్వంసం చేసినట్టు తెలిపారు. -
పేదలకు ఇక సాధారణ బియ్యమే..!
● ఫోర్టిఫైడ్ రైస్ తాత్కాలికంగా నిలిపివేత ● జీఓ జారీ చేసిన ప్రభుత్వంవిజయనగరం కలెక్టరేట్: పోషకాలు తక్కువగా ఉండే బియ్యం పేదలు మళ్లీ తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోషకాహార లోపాన్ని అధిగమించడానికి ఇన్నాళ్లు సాధారణ బియ్యంలో కలిపే ఫోర్టిఫైడ్ నిలిపివేయడం ఇందుకు కారణం. ఇది ఒకవైపు పేదలకు నష్టం కలిగిస్తే మిల్లర్లకు కాస్తా మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. ప్రధానమంత్రి గరబీ కళ్యాన్ అన్నయోజన పథకం కింద పేదలకు కోటా ద్వారా సరఫరా చేస్తున్న బియ్యం, విద్యార్థులకు వసతిగృహాల్లో అందిసున్న బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న బియ్యానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు విడుదల చేస్తుంది. అందులో అదనంగా కలిపేందుకు కూడా ఫోర్ట్టిఫైడ్ రైస్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది. పోషకాహారం ఎక్కువగా అందించేందుకు ఈ బియ్యం ఇస్తోంది. క్వింటా బియ్యంలో కేజీ ఫోర్టిఫైడ్ రైస్ కలపడం జరుగుతోంది. తాత్కాలికంగా నిలిపివేత ఈ బియ్యం తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీఓ విడుదల చేసింది. వాస్తవానికి ఈ ఏడాది 4.11 మెట్రిక్ టన్నులు ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. దాదాపు ధాన్యం అన్నీ సేకరణ పూర్తయి మిల్లులకు కూడా తరలించారు. వీటిని మిల్లింగ్ చేసి సుమారు 2.33 లక్షల బియ్యం ఇవ్వాలి. ఇందులో ఇప్పటికి సుమారు 60వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. సాధారణ బియ్యంలో కలిపేందుకు తయారు చేసే పోర్టుఫైడ్ రైస్ కెనల్ రాకపోవడం అందుకు సరఫరా రావడం ఇందుకు కారణం. దీంతో మిల్లింగ్ కూడా ఆగింది. కేంద్ర ప్రభుత్వం జీఓతో ఇక ఈ సమస్య లేకపోవడంతో మిల్లింగ్ వేగం పెరిగి ధాన్యం మిల్లింగ్ పెరిగి బియ్యం రానున్నాయి. పేదలకు ఇబ్బందే.. ఫోర్టిఫైడ్ రైస్ రావడంతో మిల్లింగ్కు ఇబ్బందులు తొలిగాయి. దీంతో మిల్లులు వద్ద కుప్పలుగా నిల్వ ఉన్న ధాన్యం మరపట్టి ఇచ్చేందుకు మిల్లర్లుకు సమస్య తీరింది. డిపోలకు వచ్చే నెలకు ఇచ్చేందుకు బియ్యం ఏమి చేయాలన్న అధికారులు సమస్య తీరింది. కానీ పేదలకు నాణ్యమైన రైస్ రావడం కష్టమే. ఫోర్ట్టిఫైడ్ రైస్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాధారణ బియ్యం వల్ల పోషకాహార లోపం పెరుగుతుంది.జీఓ వచ్చింది ఫోర్టిఫైడ్ రైస్ తాత్కాలికంగా నిలిపి వేసినట్టు జీఓ వచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టత రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత మిల్లర్లు నుంచి మరపట్టి మూమూలు బియ్యం తీసుకుంటాం. దీనిపై తదుపరి ఆదేశాలు ఇస్తాం. – బి.శాంతి, డీఎం, పౌర సరఫరాల సంస్థ -
సత్వర పరిష్కారమే లక్ష్యం..
● కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి పార్వతీపురం రూరల్: ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదుకూ సత్వర పరిష్కారం చూపడమే అధికారుల లక్ష్యం కావాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ దిలీప్ చక్రవర్తితో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా మండల స్థాయిలో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసి సమస్యలను స్థానికంగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ప్రతి అధికారీ జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. పీజీఆర్ఎస్కు వచ్చే ఫిర్యాదులు అత్యంత సున్నితమైనవని, వాటిని నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీదారుడి సమస్య క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. మొత్తం 106 అర్జీలు రాగా అందులో రెవెన్యూ విభాగానికి సంబంధించినవి 50, ఇతర శాఖలకు చెందినవి 56 ఫిర్యాదులున్నాయని తెలిపారు. -
ఫిర్యాదులపై చర్యలు చేపట్టండి
● ఎస్పీ మాధవరెడ్డిపార్వతీపురం రూరల్: అర్జీదారులు తెలియజేసిన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురి నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ ఎస్సై సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
జీడితోటలతో ఆర్థిక భరోసా..
● ఏజెన్సీలో విస్తారంగా సాగుగుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీ ప్రాంత రైతులు జీడిమామిడి సాగుతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. గిరిజనులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ‘సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ’ (ఐటీడీఏ– పార్వతీపురం) 1980 – 90 సంవత్సరాల మధ్య చేపట్టిన బృహత్తర ప్రణాళికే జీడితోటల పెంపకం. ఇందుకు బీజం వేసింది మొదటిగా గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో కాగా తర్వాత రోజుల్లో జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, సాలూరు, తదితర సబ్ప్లాన్ ఏరియా అంతటా విస్తరించారు. అయితే రైతుల కష్టపడే తత్వం, అధికారుల చిత్తశుద్ధితో అనతికాలంలోనే మంచి ఫలితాలు రాబట్టారు. ఈ ప్రక్రియలో అప్పటి ప్రాజెక్ట్ అధికారులైన ఆర్పీ సిసోడియా, బి.జగన్నాఽథం, తదితరుల నిరంతర కృషి ప్రసంశనీయం. ఇదే తరహాలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో గల గిరిశిఖర గ్రామాలైన పొల్ల, దొనుబాయి, పెదరాం మొదలుకొని ఏజెన్సీ ప్రాంతమంతటా జీడితోటల పెంపకం విరివిగా చేపట్టి గిరిజనుల ఆర్థిక పరిపుష్టికి బాసటగా నిలిచారు అక్కడి ప్రాజెక్ట్ అధికారులు. గిరిజన రైతులు జీడి తోటల పెంపకంపై మరింత ఆశక్తి కనబరచడంతో పార్వతీపురం – సీతంపేట ఏజెన్సీ ప్రాంతమంతటా జీడిమామిడి తోటలు విస్తరించాయి. ఈ ఏడాది మంచి పూత రావడంతో గిరిజన రైతులు జీమిమామిడిపై ఆశలు పెంచుకున్నారు. తాడికొండలో పూతతో నిండిన జీడిమామిడి చెట్టు -
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
● 20 మందికి గాయాలుగజపతినగరం: ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో సుమారు 20 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. సాలూరు నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గజపతినగరం వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీని ఒక్కసారిగా ఢీ కొట్టింది. లారీ సడన్ బ్రేక్ వేయడంతో జరిగిన ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న సుమారు 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన గూడెపు సంతోష్, వర్రి లక్ష్మి, కె.పార్వతి, కె.లచ్చమ్మ, తూ ముల రామకృష్ణ, అలమండ కొండ, ఎం.నాగ మణి, జి.సత్తెమ్మ, పి.నిర్మల, కె.సత్తయ్య, కె.రాము, ఎం.నాగమణి, కె.వాసు, ఎ.కొండమ్మ, జి.పార్వతి, గౌరినాయుడు, తదితరులను స్థానిక సీహెచ్సీకి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
బలిజిపేట: మండలంలని వంతరాం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పి. చిన్నారావు (25) గాయపడినట్లు ఎస్సై సింహాచలం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. సతివాడ పంచాయతీ గొలుగువలస గ్రామానికి చెందిన చిన్నారావు ద్విచక్ర వాహనంపై సోమవారం ఉదయం వంతరాం నుంచి గొలుగువలస వైపు వెళ్తుండగా.. రాజాం నుంచి బలిజిపేట వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారావుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి రాజాం కేర్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సింహాచలం తెలిపారు. -
లారీ ఢీకొని మాజీ సర్పంచ్ దుర్మరణం
పార్వతీపురం రూరల్: లారీ ఢీ కొనడంతో సంగంవలస మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు గంట రామకృష్ణ (58) దుర్మరణం పాలైన సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. రామకృష్ణ ఉదయం 6 గంటల సమయంలో బెలగాం అగ్రహారం వీధి సమీపంలోని ప్రధాన రహదారిపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన లారీ ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలివిజయనగరం టౌన్: విద్యార్థులకు అందివ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ, గండేటి శ్రీను, టి.వి.దుర్గారావులు ప్రభుత్వాన్ని కోరారు. ఇదే విషయమై వారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరై, కనీస సదుపాయాలు లేక విద్యార్థులు పడుతున్న అవస్థలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికీ జిల్లాలోని చాలా బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలకు సొంత భవనాలు లేవని, చాలాచోట్ల విద్యార్థులకు బెడ్లు లేక నేలమీదే నిద్రిస్తున్నారని, సరిపడ మెస్ చార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు పెంచాలని కోరారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వారి సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పీఎఫ్ చెల్లించకపోవడంపై జేసీకి ఫిర్యాదువిజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్యసేవ) పథకంలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలంతా తమకు పీఎఫ్ చెల్లించకపోవడంపై జేసీ సేతుమాధవన్కు ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రంలో సోమవారం జేసీని కలిసి తమ సమస్యలు విన్నవించారు. జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 72 ఆరోగ్యమిత్రలకు శ్రీమేన్ పవర్ సర్వీసెస్ అనే ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా జీతాలు చెల్లిస్తున్నారని, అయితే సదరు ఏజెన్సీ గత ఏడు నెలలుగా ఆరోగ్యమిత్రల పీఎఫ్ను జమ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు రావాల్సిన పీఎఫ్ బకాయిలను తమ ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆరోగ్యమిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు జెర్రిపోతుల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ తీర్మానం లేకుండా పనులెలా? విజయనగరం ఫోర్ట్: పెదవేమలి గ్రామంలోని ఎస్సీల శ్మశానవాటికలో అక్రమంగా పనులు చేపడుతుండడంపై ఆ గ్రామ సర్పంచ్ వర్రి పాపునాయుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఆయన వెళ్లి, గ్రామసభ, పంచాయతీ తీర్మానం లేకుండానే శ్మశానవాటికలో పనులు చేస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెరుగైన పశువైద్యం అందించండి నెల్లిమర్ల: నగరపంచాయతీలోని పాడిరైతుల పశువులకు మెరుగైన వైద్యం అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు కిల్లంపల్లి రామారావు డిమాండ్ చేశారు. స్థానిక పశుసంవర్థక శాఖ ఏడీ చక్రవర్తిని ఆయన సోమవారం కలిసి పాడి పశువుల ఆరోగ్య సమస్యలను వివరించారు. పశువులు అనారోగ్యానికి గురై పాల దిగుబడి తగ్గిపోతోందన్నారు. ముఖ్యంగా దేశవాళీ ఆవుల్లో నట్టలు చేరడం వల్ల పాల దిగుబడి తగ్గిపోతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రతి పశువు ఆరోగ్యం తనిఖీ చేసి, అవసరమైన వాటికి మందులు అందివ్వడం జరుగుతుందని ఏడీ తెలిపారు. -
దేశాభివృద్ధిలో యువతే కీలకం
● ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడువిజయనగరం రూరల్: దేశానికి యువ జనాభా గొప్ప ఆస్తి అని, దేశాభివృద్ధిలో యువతదే కీలకపాత్ర అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. స్థానిక జేఎన్టీయూ జీవీ ప్రాంగణంలో జేఎన్టీయూ జీవీ, మేరా యువభారత్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వికసిత్ భారత్ యువజన పార్లమెంట్– 2026 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత తమ జ్ఞానాన్ని, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి వినియోగించాలన్నారు. యువజన పార్లమెంట్ కార్యక్రమాలు ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంట్ విధానాలపై అవగాహన పెంచుతాయని అభిప్రాయపడ్డారు. నేటి యువతే, రేపటి దేశ నాయకులని.. ప్రతిఒక్కరూ నాయకత్వ లక్షణాలతో పాటు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఉపకులపతి వీవీ సుబ్బారావు మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా ఇతర రంగాల్లో రాణించి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని కోరారు. అనంతరం జిల్లాలోని వివిధ యువ క్లబ్ల ప్రతినిధులకు ఎంపీ కలిశెట్టి చేతులమీదుగా క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేరా యువభారత్ జిల్లా యువజన అధికారి ఎన్పీ భారత్కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. -
భద్రతా ప్రమాణాలు పాటించాలి..
● జిల్లా అగ్నిమాపక అధికారి సింహాచలంపార్వతీపురం రూరల్: జిల్లాలోని మందుగుండు త యారీ కేంద్రాల్లో తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని జిల్లా అగ్నిమాపక అధికారి సింహాచలం స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఇటీవల మందుగుండు తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఆదేశాల మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని పార్వతీపురం మండలం తాళ్లబురిడిలోని అగ్ని గంగమ్మ ఫైర్ వర్క్స్.. పాచిపెంట మండలం శ్యామలగౌరీపురంలోని అమూల్య మేఘన ఫైర్ వర్క్స్.. సీతానగరం మండలం సుభద్ర గ్రామంలోని రుగడ పోలమాంబ ఫైర్ వర్క్స్ కేంద్రాలకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి దుకాణం వద్ద ఫైర్ ఎగ్జిట్ డోర్లు, ఇసుక బస్తాలు, నీటి డ్రమ్ములు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో జిల్లా బాల కార్మికుల నిర్మూలన అధికారి సువర్ణ పాల్గొన్నారు. -
రంగుపడుద్ది..
తేడా వస్తేఇటువంటి రంగులతో ప్రమాదంకళ్లల్లో పడితే ప్రమాదం.. మార్కెట్లో లభిస్తున్న రంగుల్లో రసాయనాలు కలుస్తున్నాయి. ఇవి కళ్లల్లో పడితే కంటి చూపునకే ప్రమాదం. కళ్లకు రక్షణగా అద్దాలు ధరించాలి. కళ్లల్లో రంగుపడితే వెంటనే నీటితో కడిగి వైద్యులను సంప్రదించాలి. – ఎస్.వసంతరావు, ఆప్థాలమిక్ అధికారి, రాజాంరాజాం సిటీ: హోలీ అందరిలో ఉత్సాహం నింపుతుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ రంగుల్లో మునిగి తేలుతుంటారు. నాటి తరం జరుపుకునే వేడుకలకు నేటి యువత చేసుకుంటున్న సంబరాలకు పోలిక ఉండడం లేదు. గతంలో సహజ రంగులతో హుందాగా జరుపుకుంటే.. నేడు రసాయనాలతో తయారుచేసిన రంగులు పూసుకుంటున్నారు. ప్రస్తుతం వాడుతున్న రంగుల్లో ప్రమాదకరమైన క్రోమియం, అల్యూమినియం, మెర్క్యురీ ఆకై ్సడ్లు కలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. చేయండిలా.... పలు రకాల పూలు, పండ్లతో ఇళ్లల్లోనే సహజసిద్ధమైన రంగులు తయారుచేసుకోవచ్చు. వీటితో చర్మానికి మేలు కలగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. ఎర్ర గులాబీ, మందారం పూలు, ఎర్రచందనం, టమాటా గుజ్జు, క్యారెట్, బీట్రూట్లతో ఎరుపు రంగు తయారవుతుంది. పసుపు పొడి, తంగేడు, బంతి, చామంతి, తుమ్మ పూలతో పసుపురంగు ద్రావకం సిద్ధమవుతుంది. వేసవిలో విరివిగా లభించే మోదుగ పూలతో కాషాయరంగు ద్రావణం తయారుచేసుకోవచ్చు. ఎండిన గోరింటాకు పొడి లేదా పచ్చి గోరింటాకు, పాలకూర, పుదీనా, కొత్తిమీర వంటి ఆకు కూరలను మెత్తగా రుబ్బి నీరు కలిపితే ఆకుపచ్చ రంగు తయారుచేసుకోవచ్చు. ఇవీ సూచనలు.. హోలీ ఆడడానికి ముందు శరీరానికి మాయిశ్ఛరైజర్ని, తలకు నూనెను రాసుకోవాలి. దీని వల్ల రంగులు శరీరంలోకి ఇంకవు. ముఖంపై పడిన రంగులను శుభ్రంగా కడుక్కోవాలి. చాలా మంది హోలీ ఆడే సమయంలో రంగులలో ఆయిల్స్ కలుపుతారు. ఈ కారణంగా రంగులను శుభ్రం చేసుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. రంగుల్లో ఎలాంటి నూనెలు, నీళ్లు కలపకుండా చల్లుకుంటే మంచిది.చిన్నపిల్లలు దూరం.. హోలీ అంటే చిన్నపిల్లల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. రంగులు ఎలా చల్లుకోవాలో వారికి తెలియదు. నోరు, ముక్కులోకిపోయే అవకాశం ఉంది. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పిల్లలను హోలీకి దూరంగా ఉంచడం మంచిది. – డాక్టర్ కె.హరిబాబు, సూపరింటెండెంట్, ప్రాంతీయ ఆస్పత్రి, రాజాం. -
కష్టపడ్డారు..
కొలువులు సాధించారు..● ఒక్కొక్కరికీ నాలుగేసి బ్యాంక్ పోస్టులుబొబ్బిలి: వారంతా కష్టాన్ని నమ్ముకున్నారు. ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఒకేసారి నాలుగేసి ఉద్యాగాలకు ఎంపికై పలువురికి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. బొబ్బిలి పట్టణంలోని నాయుడు కాలనీకి చెందిన కళ్యంపూడి భానుప్రకాష్ ఎన్ఐటీలో చదువు పూర్తి చేసి నాలుగు నెలలుగా బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాడు. మొదటి ప్రయత్నంలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా పీఓగా, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పీఓగా, ఎస్బీఐ క్లర్క్గా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్గా ఎంపికయ్యాడు. భానుప్రకాష్ తండ్రి సూర్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి జయలక్ష్మి గృహిణి. అలాగే ఇదే కాలనీకి చెందిన పెంట రాకేష్కుమార్ కూడా కెనరా బ్యాంక్ పీఓగా, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పీఓగా, ఎస్బీఐ క్లర్క్గా, యూనియన్ బ్యాంక్ క్లర్క్గా ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు ఎంపికయాడు. ఈయన తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి సుశీల గృహిణి. దీంతో విజేతలను పలువురు అభినందిస్తున్నారు. గృహిణిగా ఉంటూ... చీపురుపల్లికి చెందిన మారోజు గాయత్రి స్థానిక నాయుడు కాలనీలో నివసిస్తోంది. ఈమె బీఎస్పీ చదువుకుంది. తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో సపర్యలు చేసుకుంటూ ఎటువంటి కోచింగ్ లేకుండా ఇంటివద్దనే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఈక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా జూనియర్ మేనేజర్గా ఎంపికై ంది. దీంతో ఈమెను పట్టణ వాసులు అభినందిస్తున్నారు. -
పీజీఆర్ఎస్కు పోటెత్తిన అర్జీదారులు
● 200 వినతులు స్వీకరించిన అధికారులువిజయనగరం కలెక్టరేట్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్), ’రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై వినతిపత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. మొత్తం 200 వినతులు రాగా అత్యధికంగా 95 అర్జీలు రెవెన్యూ శాఖకు చెందినవి కావడం విశేషం. ప్రజలు తెలియజేసిన సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని కలెక్టర్ ఎం.రామ్సుందరరెడ్డి రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటలో భాగంగా చీపురుపల్లిలో ఇచ్చిన హామీల అమలుకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్య తీవ్రత తెలుసుకోవాలని సూచించారు. పీజీఆర్ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి ఇ.మురళి, జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, బి.శాంతి, కళావతి, ఆర్డీఓలు, జిల్లా సర్వే శాఖ ఎ.డి ఆర్.విజయకుమార్, సీపీఓ బాలజీ, డీఆర్డీఏ, హౌసింగ్, మైక్రో ఇరిగేషన్ పీడీలు, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, మార్క్ఫెడ్ మేనేజర్ డి.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవీప్రసాద్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. శాఖల వారీగా వచ్చిన వినతులు.. రెవెన్యూ శాఖకు సంబంధించి 95 వినతులు వచ్చాయి. అలాగే డీఆర్డీఏ–24, పంచాయతీరాజ్: 17, మున్సిపల్–6 విద్యుత్ శాఖ–5, హౌసింగ్–4, డీఎంహెచ్ఓ–1, డీసీహెచ్ఎస్–3, గ్రామ సచివాలయ శాఖ–4, విద్య శాఖ–1, ఇతర శాఖలకు సంబంధించి 40 వినతులు అందాయి. -
గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించాలి
పార్వతీపురం: జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణా ల లక్ష్యాలను ఉగాదినాటికి సాధించాలని ఇన్చార్జి జేసీ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గృహనిర్మాణ ప్రగతిపై సోమవారం సమీక్షించారు. జిల్లాలో 34,965 గృహాలు మంజూరుకాగా ఇంత వరకు 20,859 గృహనిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఉగాది నాటికి 7,087 గృహ నిర్మాణాలను పూర్తిచేయాలని పేర్కొన్నారు. సీతంపేట, కురు పాం, గుమ్మలక్ష్మీపురం మండలాలు ముందువరుస లో ఉండగా, మిగిలిన మండలాల్లో గృహనిర్మాణా లు మందకొడిగా సాగుతున్నాయని తెలిపారు. సమావేశంలో డీపీహెచ్ఐఓ వంశీకృష్ణ పాల్గొన్నారు. వినతులను తక్షణమే పరిష్కరించాలి పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల ద్వారా వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించాలని తహసీల్దార్లను ఇన్చార్జి జేసీ ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్ అంశా లు, వినతుల పురోగతిపై తహసీల్దార్లతో ఆయన సమీక్షించారు. భూ సర్వే ప్రక్రియ, హద్దుల నిర్ణయం, సబ్డివిజన్ పనులపై ఎప్పటికప్పుడు జా ప్యం లేకుండా చూడాలన్నారు. నిర్దేశించిన గడువులోగా రెవెన్యూ పనుల్లో పురోగతి చూపకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
భాషా వలంటీర్ల చలో కలెక్టరేట్
పార్వతీపురం రూరల్: తమ న్యాయమైన సమస్యల ను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ మాతృభాష వలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో సోమ వారం ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమం నిర్వహించా రు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లిన వలంటీర్లు, అనంతరం కార్యాలయ ముఖద్వారం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్.మురళీమోహనరావు మాట్లాడుతూ.. 2004 నుంచి సవర భాషా వలంటీర్లు మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో మాతృభాషలో బోధన చేస్తున్నారని తెలిపారు. వీరి కృషివల్ల గిరిజన విద్యార్థుల హాజరుశాతం పెరిగి, డ్రాపౌట్ల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. ప్రస్తుతం వీరికి నెలకు కేవలం రూ.5 వేల వేతనం మాత్రమే అందుతోందని, విధులకు తగినట్లుగా కనీస వేతనం చెల్లించాలని కోరారు. గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గిరిజన విద్యకు కేటాయించే బడ్జెట్తో వలంటీర్ల వేతనాలు పెంచే అవకా శం ఉన్నా, ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. వచ్చే జూన్ నాటికి వేతనాలు పెంచని పక్షంలో ‘చలో సెక్రటేరియట్’ నిర్వహిస్తామని హెచ్చరించా రు. గిరిజన సంఘం నాయకులు రామస్వామి మా ట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో కులీభాషా (జాతాపు) వలంటీర్లను నియమించినట్టు గానే, ఇక్కడ కూడా వెంటనే నియామక ప్రక్రియ చేపట్టాలని కోరారు. అనంతరం ఐటీడీఏ ఏపీఓ, డీడీలు నిరసనకారుల వద్దకు వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించారు. వలంటీ ర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వలంటీర్ల సంఘం నాయకులు బి. వెంకటేష్, డలబు, సుక్కు, భీమారావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
● దివ్యాంగులతో పరేషన్
చిత్రంలో నడవలేని స్థితిలో బియ్యం కోసం రేషన్ దుకాణానికి వెళ్తున్న వృద్ధురాలి పేరు రంపం సూరీడమ్మ. వీరఘట్టం డిపో–2 పరిధిలో ఆమె రైస్ కార్డు ఉంది. ప్రతినెలా బియ్యం కోసం డీలర్ ఇంటివద్దకు వచ్చి వేలిముద్ర తీసుకుంటాడు. బియ్యం మాత్రం డిపో వద్ద ఇస్తారు. ఇంటికి తెచ్చి బియ్యం ఇవ్వాలని ఎన్నిసార్లు ఆమె మొరపెట్టినా ఫలితం లేకపోతోంది. వాస్తవంగా దివ్యాంగులు, వృద్ధులకు ప్రతినెల వారి ఇంటి వద్దకే రేషన్ బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చినా క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదనేందుకు సూరీడమ్మ ఎదుర్కొంటున్న కష్టాలే నిలువెత్తు నిదర్శం. ప్రతినెలా బియ్యం తీసుకునేందుకు నడవలేని స్థితిలో అష్టకష్టాలుపడుతూ రేషన్ డిపోకు వెళ్తున్నట్టు ఆమె వాపోతోంది. – వీరఘట్టం -
చెంతనే ప్రమాదం..
సాక్షి, పార్వతీపురం మన్యం: కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 20 మందికిపైగా మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. బాణసంచా తయారీదారులు, విక్రేతలు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల తరచూ ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గతేడాది దీపావళి సమయంలో విజయ నగరం నుంచి వస్తున్న బస్సులో పెద్ద ఎత్తున బాణసంచాను పార్సిల్ చేసి తరలించారు. పార్వతీపురం బస్ కాంప్లెక్స్లో వీటిని దించుతుండగా.. ప్రమా దం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. జిల్లాలో ఈ తరహా బాణసంచా ప్రమాదాలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. వేట్లపాలెం దుర్ఘటన తర్వా త తీరిగ్గా మేల్కొన్న అధికారులు.. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. మన జిల్లాలోనూ అగ్నిమాపక శాఖ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన శాఖాధికారులు పలు దుకాణాల వద్ద పరిశీలించగా.. అనేక లోపాలు వెలుగు చూశాయి. విక్రయ కేంద్రాలకు నోటీసులు... జిల్లాలో తయారీ కేంద్రాలు లేనప్పటికీ.. విజయ నగరంలోని హోల్సేల్ వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేసి, ఇక్కడ విక్రయిస్తుంటారు. దీపావళి సమయంలో నేరుగా శివకాశి తదితర ప్రాంతాల నుంచి తెప్పిస్తుంటారు. నిబంధనల ప్రకారం బాణసంచా విక్రయ కేంద్రాల వద్ద ఫైర్ ఎగ్జిట్ డోర్స్, ఇసుక బస్తాలు, నీటి డ్రమ్ములు అందుబాటులో ఉండాలి. చాలా వరకు దుకాణాల వద్ద ఇటువంటివేవీ అమలు కాని పరిస్థితి. అధికారుల తనిఖీల సమయంలోనూ ఇటువంటి లోపాలను గుర్తించారు. పార్వతీపురం మండలం తాళ్లబురిడి గ్రామంలోని అగ్ని గంగమ్మ ఫైర్వర్క్స్, పాచిపెంట మండలం శ్యామలగౌరీపురం గ్రామంలోని అమూల్యమేఘన ఫైర్ వర్క్స్, సీతానగరం మండలం సుభద్ర గ్రామంలోని రుగుడ పోలమాంబ ఫైర్ వర్క్స్లకు నోటీసులు జారీ చేశారు. మందుగుండు తయారీదారులు, విక్రేతలు భద్రతా ప్రమాణాలు పాటించాలి. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలు సీజ్ చేస్తాం. పండగల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. అనుమతి లేని ప్రదేశాల్లో బాణసంచా నిల్వచేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవు. ప్రజలు కూడా బాణసంచా వినియోగ సమయంలో జాగ్రత్తలు పాటించాలి. – సింహాచలం, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి -
గణిత పరీక్షకు 375 మంది గైర్హాజరు
పార్వతీపురం రూరల్: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం గణిత పరీక్షకు 5,758 మందికి 5,383 మంది విద్యార్థులు హాజరయ్యారు. 375 మంది గైర్హా జరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వై.నాగేశ్వరరావు తెలిపారు. పైడితల్లి ఆలయం మూసివేత విజయనగరం టౌన్: కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం 3.19 నుంచి సాయంత్రం 6.46 గంటల వరకు పైడితల్లి అమ్మవారి చదురుగుడి, వనంగుడిలో అర్చనలు, దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4వ తేదీ బుధవారం సంప్రోక్షణ అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులకు అమ్మవారి దర్శనం యథాతథంగా కల్పిస్తామన్నారు. భక్తులందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఉదయం 9.30 గంటలకే రామతీర్థం ఆలయం మూసివేత నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి వారి దేవస్థానాన్ని మంగళవారం మూసివేస్తున్నామని ఈఓ వై.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని రోజంతా మూసివేస్తున్నట్టు పేర్కొన్నారు. మధ్యాహ్నం 3.21 నుంచి సాయంత్రం 6.42 గంటల వరుకు గ్రహణం పడుతుందని ఈ కారణంగా ఉదయం 9.30 గంటలకే ఆలయ తలుపులు మూసివేస్తామన్నారు. గ్రహణం అనంతరం సంప్రోక్షణ పూజలు జరిపిస్తామన్నారు. బుధవారం నుంచి యథావిధిగా దర్శనాలు ఉంటాయని, భక్తులు గమనించాలని కోరారు. తెర్లాం: మండల పరిధిలోని తోటపల్లి కుడి ప్రధాన కాలువలో పూడికతీత పనులకు రూ.5 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని ప్రాజెక్టు డీఈ సుబ్బారావు, ఏఈ రఘు తెలిపారు. తోటపల్లి కాలువను ఆయన సోమ వారం పరిశీలించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే కాలువల్లో పూడిక తీసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
వైద్యులు ఉండరు.. సేవలు అందవు!
● మాదలింగి పీహెచ్సీలో కనిపించని డాక్టర్లు, సిబ్బంది ● ఆస్పత్రికి వచ్చే రోగులకు దర్శనమిస్తున్న ఖాళీ కుర్చీలు కొమరాడ: మండలంలోని మాదలింగి పీహెచ్సీ లో పేదలకు వైద్యం అందని దైన్యంలా మారింది. ఆస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో చికిత్స అందించాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బందే వైద్యుల అవతారం ఎత్తుతు న్నారు. కొరిశీల గ్రామానికి చెందిన రెండో తరగతి విద్యార్థి పాలక హర్షకు తీవ్ర జ్వరం రావడంతో తండ్రి రాజేష్ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇద్దరు వైద్యులు కూడా అందుబాటులో లేరు. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. దీంతో ఓ ఏఏన్ఎం మాత్రలు ఇచ్చి చికిత్స అందించారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన బాలుడి తండ్రి ఆస్పత్రిలో కనీసం ఒక్క వైద్యుడు కూడా అందుబాటులో ఉండరా అని ప్రశ్నించారు. నర్సులే వైద్యులుగా వ్యవహరిస్తున్నారని, ల్యాబ్ పరీక్షలు చేసే సిబ్బంది కూడా సక్రమంగా లేకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. దీనిపై ఆస్పత్రి వైద్యాధికారిణిని వివరణ కోరగా.. దలైపేట గ్రామంలో ఓ రోగికి ఎమర్జెన్సీ అని ఆశ వర్కర్ ఫోన్ చేయడంతో అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై నిరసన
పార్వతీపురం రూరల్: తమ సామాజిక వర్గ మనోభావాలను దెబ్బతీసేలా అసెంబ్లీలో మాట్లాడిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వ్యాఖ్యలపై రెల్లి కులస్తులు నిరసన గళం వినిపించారు. పండ్లు, కాయల వ్యాపారం చేసుకుంటూ గౌరవంగా జీవిస్తున్న తమ జాతిపై ‘సారాయి’ ముద్ర వేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రెల్లి ఎస్సీ ఉపకులాల సంక్షేమ సంఘం, పార్వతీపురం పట్టణ రెల్లి సంఘం ప్రతినిధులు సంయుక్తంగా జిల్లా కలెక్టర్ను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తమ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధా కరమని సంఘం నాయకులు పేర్కొన్నారు. హైద రాబాద్లోని దూల్పేట ప్రాంతంతో పోల్చుతూ.. నాటుసారా తయారీ, విక్రయాలు కేవలం రెల్లి జాతి వారే చేస్తున్నారన్నట్లుగా మాట్లాడడం తమ గౌరవానికి భంగం కలిగించడమేనని వివరించారు. ఎమ్మె ల్యే తన మాటలను బహిరంగంగా వెనక్కి తీసుకోవాలని, అసెంబ్లీ రికార్డుల నుంచి ఆ పదజాలాన్ని వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అభివృద్ధిపై దృష్టి సారించండి... అనేక సమస్యలతో సతమతమవుతున్న తమ సామాజిక వర్గాన్ని ఆదుకోవాల్సింది పోయి కించపరచడం తగదని నేతలు పేర్కొన్నారు. రిజర్వేషన్ల ఫలాల్లో అన్యాయం జరుగుతున్నా, ఎస్సీ వర్గీకరణ లో ఆశించిన వాటా దక్కకపోయినా దీన స్థితిలో మౌనంగా భరిస్తున్నాం. ఉషా మెహ్రా కమిషన్ పేర్కొన్న విధంగా విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగా ల్లో తీవ్రంగా వెనుకబడిన మా అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. సారాయి విక్రయాల్లో ఇతర కులస్తుల పాత్ర కూడా ఉన్నప్పటికీ, కేవలం ఒకే వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని వారు స్పష్టం చేశారు. పార్వతీపురం పోలీస్ రికార్డులలో సారాయి కేసుల్లో ఉన్న ఇతర సామాజి క వర్గాల వివరాలను కూడా బహిర్గతం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తమ న్యాయమై న డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కలెక్టర్ను కోరారు. -
● కేజీబీవీ సిబ్బందికి ఏడాదిన్నరగా అందని జీతాలు ● విధుల్లో చేరిన నాటి నుంచి పైసా కూడా అందుకోని ఉద్యోగులు
సుమారు 15 నెలల నుంచి పార్ట్టీం టీచరుగా పని చేస్తున్నాను. ఇప్పటి వరకు జీతాలు అందలేదు. అధికారులను కలసి అడుగుతున్నాం. త్వరలోనే జమ అవుతాయని చెబుతున్నారు. – బి.శైలజ, కురుపాం సాక్షి, పార్వతీపురం మన్యం: అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికనైనా.. ప్రభుత్వ ఉద్యోగమన్న ఆశతో వారంతా విధుల్లో చేరారు. నెలకు ఎంతో కొంత జీతమొస్తే.. కుటుంబానికి చేదోడుగా ఉంటుందని ఆశపడ్డారు. ఇప్పటికి ఉద్యోగంలో చేరి ఏడాదిన్నర కావస్తోంది. నేటికి ఒక్క పైసా కూడా అందుకోలేకపోయారు. వెట్టిచాకిరీనే మిగులుతోందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. జిల్లాలోని పలు కేజీబీవీల్లో టైప్ 3, టైప్ 4 కింద 2024 నుంచి పలువురు నిరుద్యోగులు ఉద్యోగా ల్లో చేరారు. డే వాచ్ ఉమెన్, పార్ట్ టైం టీచర్లు, అసిస్టెంట్ కుక్స్.. ఇలా వివిధ పోస్టుల్లో పని చేస్తున్న 32 మందికి నేటికీ జీతాలు అందలేదు. ఇందులో సుమారు 8 నుంచి 15 నెలల కిందట చేరిన వారూ ఉన్నారు. పలుమార్లు జీతాల కోసం విద్యాశాఖ అధికారులను అడిగినా.. ఏదో సాంకేతిక కారణమని, ఆప్కాస్లో పేరు కలపాలని చెబుతున్నారే గానీ.. సమస్యను పరిష్కరించడం లేదు. దీంతో జీతాల కోసం వారంతా నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. వీరికి పోస్టును బట్టి నెలకు రూ.15 వేల నుంచి రూ.18,500 వరకు చెల్లిస్తామన్నారు. ఇప్ప టికి రూపాయి కూడా అందుకోలేకపోయామని వారంతా వాపోతున్నారు. తమ సమస్యను పరిష్క రించాలని సోమవారం కలెక్టర్ ప్రభాకరరెడ్డికి కలసి మొరపెట్టుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. పదిహేను నెలలైంది విధుల్లో చేరి. కుక్గా పని చేస్తున్నా. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అందుకోలేకపోయాం. ఇన్ని నెలల నుంచి జీతాలు లేకపోతే ఆర్థికంగా కష్టమే. ప్రభుత్వం స్పందించి మా సమస్య పరిష్కరించాలి. – వి.శ్రీదేవి, కాశీపట్నం. ఏడాదిన్నర కిందట విధుల్లో చేరిన కేజీబీవీ సిబ్బందికి ఇప్పటివరకు జీతాలు లేకపోవడం శోచనీయం. అన్ని నెలలుగా ఇవ్వకపోతే వారంతా కుటుంబాలతో ఎలా బతకగలరు. పక్క జిల్లాల్లో ఈ సమస్య లేదు. ఇక్కడే ఎందుకు వస్తోంది? – పి.రంజిత్కుమార్, ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ సంఘం -
కనకదుర్గమ్మకు కోటి పసుపుకొమ్ముల నోము
కొత్తవలస మండలంలోని ముసిరాం– దేవాడ గ్రామాల మధ్యలోని ఉత్తరాంధ్ర కనకదుర్గమ్మ (తోటలో దుర్గమ్మ) దేవాలయంలో సోమవారం కోటి పసుపు కొమ్ముల నోమును వైభవంగా నిర్వహించారు. భక్తులు, వివిధ గ్రామాల నుంచి సేకరించిన కోటి పసుపు కొమ్ములను ఆలయంలో రాశిగా పోసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం లలిత స్తోత్రపారాయణం నిర్వహించారు. మధ్యాహ్నం భారీఎత్తున అన్నసమారాధన జరిపారు. – కొత్తవలస -
పోలీస్ దందా..!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘ఊళ్లో ఒకడే రౌడీ నాకొడుకు ఉండాలి.. వాడు పోలీసోడు అయ్యుండాలి..’ అనే సినిమా డైలాగును చీపురుపల్లిలో పోలీసులు అక్షరాలా అమలు చేస్తున్నారు. గ్రామాల్లో ఏ సందర్భం వచ్చినా ‘అయితే మాకేంటి..?’ అనే కాన్సెప్ట్ కిందకు మార్చేసి దందా చేస్తున్నారు. గ్రామ దేవతల పండగ వచ్చిందంటే చుట్టాలకు భోజనాలకు, మందుకు పెట్టాల్సిన ఖర్చు కన్నా పోలీసోళ్లకు ఇచ్చే మామూళ్ల ఖర్చే ఎక్కువైపోతుందని చిరు వ్యాపారాలు భీతిల్లుతున్నారు. లేదంటే జీపులో మార్కెట్లో తిరుగుతూ స్టైల్గా లాఠీ తిప్పుతూ సినిమా సెకలు పోతున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఆఖరుకు నైట్ పెట్రోలింగ్ సందర్భంగా ఊళ్లో రోడ్డు పక్కన ఏదైనా బైక్ కనిపిస్తే దాన్ని కూడా స్టేషన్కు ఎత్తుకెళ్లి తిరిగి ఇవ్వడానికి రూ.25 వేలు వసూలు చేస్తున్నారు. ఇక ఊళ్లో పండగల సందర్భంగా వసూళ్లకు అంతూ పంతూ లేకుండా పోతోంది. చీపురుపల్లి మండలంలో గ్రామదేవత పండగలు.. అమ్మవారి జాతరలు ఘనంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ జాతరలు సందర్భంగా ఊళ్లో ఆటల పోటీలవంటివి నిర్వహించడం పరిపాటి. ఈ మధ్య చీపురుపల్లి కనకమహాలక్షి అమ్మవారి జాతర సందర్భంగా జాతరలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో జూదం నిర్వహించారు. బహిరంగంగా బోకు ఆటలు, గుండాటలు, ఇతర ఆటలు మూడు రోజుల పాటు యథేచ్ఛగా నిర్వహించారు. వీటిని కంట్రోల్ చేయాల్సిన ఎస్సై దామోదరరావు, ఆయన సిబ్బంది ఈ దందాను ఏమాత్రం చూడకుండా కళ్లకు గంతలు కట్టుకుని ఊరుకున్నారు. కట్ చేస్తే ఒక్కో జూదశాల నిర్వాహకుడి నుంచి భారీగానే ముడుపులు లాగేసినట్టు చీపురుపల్లిలో చెప్పుకుంటున్నారు. అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం మా చిన్నప్పుడు.. ఇలాంటి పెద్ద జూదాలు ఉండేవి.. అవి కూడా ఊళ్లో ఎక్కడో చివరన.. తోటలు, కల్లాల్లో జరిగేవి.. ఇప్పుడు మూడు రోజుల పాటు రాత్రి పగలు ఊరు నడిబొడ్డున ఈ దందా చేస్తున్నారని పెద్దలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ మూడు రోజులూ చీపురుపల్లి పోలీసులు నిద్ర నటించినందుకు ఫీజుగా రూ.రెండు లక్షలు ముట్టినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో మెట్టపల్లిలో జరిగిన గొల్లపేరంటాల అమ్మవారి జాతరలోనూ ఇలాగే బోకు ఆటలు, గుండాటలు ఆడుకునేందుకు అక్కడికి జూదశాల నిర్వాహకులు మరో రూ.2 లక్షల వరకు ఇచ్చినట్లు తెలిసింది. చీపురుపల్లి మండలం కర్లాం గ్రామంలో శివరాత్రికి జరిగిన జాతరలో కూడా బోకు ఆటలు, రికార్డింగ్ డ్యాన్స్లు పెట్టుకోవడానికి భారీగా ఫీజు వసూలు చేసినట్టు తెలిసింది. ఈ జూదం చూసేవాళ్లకు ఎంటర్టైనింగ్గా ఉన్నప్పటికీ యువత ఈ జూదానికి అలవాటు పడి ఆ నాలుగైదు రోజుల్లో రూ.వేలు.. లక్షల్లో నష్టపోతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర పేరు మీద కూడా పోలీసులు బాగానే దండుకున్నట్టు చిరువ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. పండక్కి బోలెడుమంది పోలీసులు వస్తారు.. అందరికీ భోజనాలు పెట్టాలి అంటూ చిరు వ్యాపారాలు.. హోటళ్లు, లాడ్జిలు.. .బట్టల దుకాణాలు, చికెన్ షాపుల నుంచి భారీగా దండేసినట్టు చెబుతున్నారు. బందోబస్తు బాధ్యత పోలీసులది అయినపుడు మానుంచి రౌడీ మామూళ్లు ఎలా వసూళ్లు చేస్తారని వ్యాపారాలు లోలోన బాధపడుతున్నా బయటకు చెప్పుకోలేని పరిస్థితి. ఏమైనా ప్రశ్నిస్తే పోలీసు సార్ మళ్లీ ఏదైనా కేసు పెట్టి ఇబ్బంది పెడతారేమో అనే భయం వారిని మాట్లాడనివ్వలేదు. దీంతో పాటు చీపురుపల్లి లాడ్జీల్లో జరిగే అనైతిక కార్యకలాపాలకు సహకరించేలా లాడ్జ్ ఓనర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఏ లాడ్జిలో ఎవరు వచ్చి వెళ్తున్నారు.. ఎంతసేపు ఉంటున్నారు.. అనేది ఎక్కడా రికార్డ్ కావడం లేదు. ఈ చుట్టుపక్కల చదువుకునే కాలేజీ విద్యార్థులు దారితప్పి ఇలా గంట.. రెండు గంటలు చొప్పున లాడ్జీల్లో గడుపుతున్నా దీనిపై అక్కడా తనిఖీలు లేవు.. ఎందుకంటే ఎస్సై గారికి నెలవారీ మామూళ్లు వచ్చేస్తున్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీన వచ్చే జీతంతో బతకడం ఎస్సై గారికి కష్టమైపోతోంది.. అందుకే మైనింగ్ వ్యాపారాలు.. లిక్కర్ వ్యాపారాలు.. ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసే వాళ్లతో సంబంధం పెట్టుకున్నారు. ఒకటో తేదీకి ప్రభుత్వ జీతం పడినా పడకున్నా ఈ వ్యాపారాలు మాత్రం తమ వాటా బుద్ధిగా స్టేషన్కు తెచ్చి ఇవ్వాల్సిందే. లేకుంటే సారుకు కోపం వస్తుంది. లారీల మీద కేసులు పడతాయ్. లిక్కర్ షాపులు టైం దాటాక ఓపెన్ చేసారంటూ కేసు రాస్తారు. ఓవర్ లోడ్ అంటూ మైనింగ్ వాళ్ల మీదకు పోలీసులు వెళ్తారు. అందుకే వ్యాపారులంతా గంపగుత్తగా తమ వాటా చెల్లించుకుంటూ ఆయన్ను సంతుష్టులని చేస్తున్నారు. పోలీసులు నైట్ పెట్రోలింగ్ ఎందుకు చేస్తారు..? ఊళ్లో దొంగలు.. ఆకతాయిలు.. రౌడీలు ఏమైనా అసాంఘిక కలాపాలు.. తప్పుడు పనులు చేస్తారేమో అని చూసి.. వాళ్లను పట్టుకుని ప్రజల ఆస్తులకు భద్రతా కల్పించడానికి రాత్రి గస్తీ తిరుగుతారు. కానీ ఈ ఎస్సై ఈ మధ్య గస్తీ తిరుగుతూ అర్థరాత్రి నిద్ర మానుకుని గస్తీ తిరిగితే ఏమీ గిట్టుబాటు కాకపోతే ఎలా అనుకున్నాడో ఏమో.. ఒక షాప్ ముందు పార్క్ చేసి ఉంచిన బులెట్ బైక్ను స్టేష్టన్కు పట్టుకెళ్లిపోయారు. మర్నాడు బాధితులు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే కమలాసన్ రేంజిలో యాక్టింగ్ మొదలెట్టి అరె.. అగ్ని.. అగ్ని.. ఇక్కడ.. నేను ఉండగా దొంగతనామా.. తేల్చేద్దామ్.. అని తలా అటూ ఇటూ తిప్పి.. నీ బైక్ రాజమండ్రిలో ఉన్నట్లు తెలిసింది.. దాన్ని తేవాలంటే పాతిక వేలు అవుతుంది అని చెప్పారు.. ఓహో అనుకుంటూ బాధితులు ఇంటికి వచ్చేసారు. తరువాత చూస్తే ఆ బైక్ చీపురుపల్లి స్టేషన్లోనే ఉంది. ఈ దొంగ పోలీస్ అంశం పెద్ద వివాదాస్పదం అయింది. అయినా సరే చీపురుపల్లికి నేనే పోలీస్.. నేనే రౌడీ అంటూ ఆయన వీరవిహారం చేస్తున్నారు. చీపురుపల్లి ఎస్ఐ దామోదర్ వ్యవహారం మీద ఇప్పటికే ఫిర్యాదులు వస్తున్నాయి. గ్రామదేవత ఉత్సవాల్లో విచ్చలవిడి జూదాన్ని ప్రభుత్వం.. చట్టం అనుమతించదు. ఇది నేరం కూడా. అలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను చూస్తూ ఉపేక్షించిన ఎస్ఐ కూడా దీనికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందే. ఈ వ్యవహారాన్ని ఎస్పీ గారికి కూడా తెలియపరిచాం. ఎస్ఐకి సంజాయిషీ నోటీసు ఇస్తున్నాం. – ఎస్.రాఘవులు, సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్, చీపురుపల్లి. -
ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే కుట్ర
శ్రీకాకుళం అర్బన్: ప్రభుత్వరంగ సంస్థలను కార్పోరేట్లకు కట్టబెట్టేందుకే కేంద్రప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు ఆరోపించారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ అతిథిగృహంలో ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ, పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు మాట్లాడుతూ.. ఏఐబీఈఏకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 వేల సభ్యత్వం ఉందన్నారు. ప్రధానంగా బ్యాంక్ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలు కల్పించాలని కోరుతూ ఎనిమిదిన్నర లక్షల మంది ఉద్యోగులు దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారన్నారు. అయితే కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడేందుకే కార్మిక చట్టాల్లో మార్పులు చేశారన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని అదాని, అంబానీలకు కట్టబెట్టేందుకు కేంద్రప్రభుత్వం యత్నిస్తోందని దుయ్యబట్టారు. బ్యాంకింగ్ రంగాన్ని కార్పొరేటర్ల చేతిలో పెడితే పేద, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకే తాము సమ్మె చేపట్టాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణ కోసం ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ ఉద్యోగుల సమస్యల పట్ల కనీస స్పందన లేకుండా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బ్యాంకులలో తగినన్ని నియామకాలు చేపట్టకపోవడం వల్ల బ్యాంకు ఉద్యోగులపై ఒత్తిడి పెరగడమే కాకుండా నిరుద్యోగ సమస్యలు కూడా పెరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం పర్మినెంట్ రిక్రూట్మెంట్లు చేయకుండా తాత్కాలిక నియామకాలు చేపట్టి యువతను మభ్యపెడుతోందన్నారు. వీటన్నిటినీ తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఏఐబీఈఏ ఆధ్వర్యంలో బ్యాంక్ ఉద్యోగుల సమస్యలపై మరిన్ని పోరాటాలు చేసి సమస్యలను పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం పార్వతీపురం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు టి. రవీంద్రనాథ్, ఉదయ్కుమార్, కమలాకర్, వసంతరావు, తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం.. పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడిగా ఎస్. సాయి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎం. చైతన్యతేజ, బి. సోమశేఖర్, కె. బాలకృష్ణ, రజనాన వినారాజ్, సెక్రటరీగా దిలీప్కుమార్ చౌదరి, డిప్యూటీ సెక్రటరీగా కె. కిశోర్కుమార్, జాయింట్ సెక్రటరీలుగా కె. పల్లవి, జి. మధుసూదనరావు, ఎం.సంతోష్, కె.శోభారాణి, ఎంవీ రవికుమార్, ఎస్. సింహగిరి, ఎం. చలపతిరావు, డి.జయశంకర్, ట్రెజరర్గా ఎం.రాధాకుమారి, జాయింట్ ట్రెజరర్గా జి. తేజేశ్వరరావు, కమిటీ మెంబర్స్గా ఆర్.రాజేశ్వరి, పి.నవీన్, వై.విద్యాసాగర్, కె.శ్రీనివాసరావు, శివ శ్రీను, భాస్కరరావు, బి శ్రీనివాసరావు, టి. సతీష్కుమార్ తదితరులు ఎన్నికయ్యారు. దెబ్బతిననున్న పేద, మద్యతరగతి ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకే ఈ సమావేశాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు -
డోలోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
● ఈ నెల 5 నుంచి ఏడు వరకు గుళ్ల సీతారాంపురంలో ఉత్సవాలు ● సీతారాముల ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర సంతకవిటి: మండలంలోని గుళ్ల సీతారాంపురంలో వెలిసిన సీతారాముల ఆలయంలో ఈ నెల 5 నుంచి ఏడో తేదీ వరకు డోలోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు ఈఓ మాధవరావు తెలిపారు. వాస్తవానికి ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి డోలోత్సవాలు నిర్వహించాల్సి ఉన్నా.. గ్రహణం సంభవిస్తుండడంతో ఉత్సవాలను ఐదో తేదీ నుంచి ఏడు వరకు నిర్వహించనున్నారు. అయితే ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారిని ఆంజనేయ, సర్ప వాహనాలపై ఉత్తరముఖ మంటపానికి తీసుకువచ్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవదాయశాఖాధికారులు, గ్రామపెద్దలు ఏర్పాట్లు చేశారు. 500 ఏళ్ల చరిత్ర గుళ్లసీతారాంపురంలో వెలిసిన సీతారాముల ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. స్థల పురాణం ప్రకారం ఆనాడు ఈ ప్రదేశం నిర్మానుష్యంగా అడవితో ఉండేది. బొబ్బిలి రాజులు వేటకై ఈ ప్రదేశానికి వచ్చి సేద దీరే సమయంలో సీతారాములు కలలో కనిపించి, తాము ఇక్కడ వెలిశామని, ఆలయం నిర్మించాలని అనుగ్రహించారు. దీంతో బొబ్బిలి రాజులు వెంటనే అతిసుందరమైన సీతారాముల ఆలయంతో పాటు గ్రామాన్ని కూడా నిర్మించి సీతారాంపురంగా నామకరణం చేశారు. అయితే సీతారాంపురం గ్రామాలు ఎక్కువగా ఉండడంతో ఈ గ్రామం గుడి సీతారాంపురంగా.. కాలక్రమంలో గుళ్లసీతారాంపురంగా పేరుగాంచింది. ఈ ఆలయ నిర్మాణం మొత్తం రాళ్ల పేరుతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. దాదాపు 65 అడుగుల ఎత్తు గల గాలిగోపురం ఉంది. గాలి గోపురం పైకి ఎక్కి చూస్తే బొబ్బిలిలోని వేణుగోపాలుని ఆలయం కనిపిస్తుందని ప్రాశస్త్యం. ఇక్కడ సీతారాములు ఏకశిలపై ఉండడం విశేషం. ఏ ఆలయంలో అయినా సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఉంటారు. కాని ఈ ఆలయంలో లక్ష్మణుడు, ఆంజనేయుడు, ధనుర్బాణాలు, శంఖుచక్రాలు ఉండక పోవడం విశేషం. గోడలపై చెక్కిన శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ప్రధాన ఆలయం చుట్టూ ప్రత్యేక బేడా మంటపం ఏర్పాటు చేశారు. ఈ బేడాను ఆనుకుని అళ్వారులు, రాధాకాంతలు, రామానుజలవారు, నమ్మళ్వాల్, మానవాళ్ల మహాముని, దాసాంజనేయులకు ప్రత్యేక సన్నిధులు ఏర్పాటు చేశారు. ఆలయానికి చేరుకోవడమిలా... రాజాం – సంతకవిటి ప్రధాన రహదారిలో ఉన్న గుళ్లసీతారాంపురం రాజాం పట్టణం నుంచి 8 కిలోమీటర్లు, సంతకవిటి మండల కేంద్రం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరు పక్కల నుంచి గ్రామానికి బస్సు, ఆటోల ద్వారా చేరుకోవచ్చు. -
ఏనుగుల తరలింపునకు ముమ్మర ఏర్పాట్లు
● చురుగ్గా ఏనుగుల సంరక్షణ కేంద్రం పనులు సీతానగరం: ఉమ్మడి విజయనగరం జిల్లాలో దీర్ఘకాలంగా పలు గ్రామాల్లో సంచరిస్తున్న ఏనుగులను కొండ ప్రాంతాలకు తరలించడానికి అటవీశాఖ ఉన్నతాధికారులు చేస్తున్న పనులు పూర్తి కావొచ్చాయి. చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతాల్లోనున్న కుంకి ఏనుగుల రాక కోసం గుచ్చిమి వద్ద ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నారు. కుంకి ఏనుగులు వచ్చిన తర్వాత గుచ్చిమి బీట్ వద్ద సంచరిస్తున్న ఏనుగులను మచ్చిక చేసుకుని తరలించడానికి ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోని రెండు దశాబ్దాలుగా సంచరిస్తూ పంట, ప్రాణ నష్టం కలిగిస్తున్న ఏనుగుల గుంపును దూరప్రాంత కొండలకు (చిత్తూరులో వన్యమృగాల సంరక్షణా కేంద్రానికి) తరలించడానికి పార్వతీపురం రేంజ్ గుచ్చిమి రిజర్వ్ ఫారెస్ట్లో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో తాత్కాలిక ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అప్పయ్యపేట, రేపటివలస, గుచ్చిమి, జోగింపేట గ్రామాల్లో సంచరిస్తున్న ఏనుగులు జనావాసాల్లోకి రాకుండానిరోధించేందుకు అత్యాధునికమైన ఏనుగు నిరోధక కందకాలు, పోలార్ హ్యాంగింగ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పట్టుబడిన ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఎలిఫెంట్ షెడ్లు, వాటర్టబ్ల పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అలాగే మావటిల కోసం ప్రత్యేక క్వార్టర్లు, కిచెన్ షెడ్లు, ఏనుగుల ఆరోగ్య సంరక్షణ కోసం అత్యాధునిక వెటర్నరీ కేర్ సెంటర్ (వైద్య కేంద్రం), అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పార్వతీపురం ప్రాంతంలో గత పదేళ్లలో మానవ, వన్యప్రాణి సంఘర్షణల వల్ల 14 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు 9 ఏనుగులు మృతి చెందాయి. ఈ పరిస్థితుల్లో ఏనుగుల సంరక్షణ కేంద్రం అందుబాటులోకి వస్తే కుంకీ ఏనుగుల సహాయంతో ఏనుగుల గుంపును సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
● డీఎస్పీ గోవిందరావు విజయనగరం క్రైమ్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని స్థానిక మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ గోవిందరావు ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా నగరంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. కోట వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ గురజాడ సర్కిల్, మూడు లాంతర్ల జంక్షన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ గోవిందరావు మాట్లాడుతూ.. మహిళా సాధికారత వారోత్సవాలను ఈ నెల 8 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణించాలన్నారు. మహిళలు, బాలల రక్షణకు పోలీస్ శాఖ ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఆపద సమయంలో పోలీసుల సహాయం, రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ శక్తియాప్ను మొబైల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వన్ టౌన్, టూటౌన్ సీఐలు చౌదరి, శ్రీనివాస్, ఎస్సైలు శిరీష, లీలావతి, తదితరులు పాల్గొన్నారు. విజయనగరం: జాతీయ స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. విజయనగరంలోని రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఇటీవల జరిగిన 7వ పారా బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన యాళ్ల సత్తిబాబు (కొత్తవలస ).. ఆరికతోట నాగభూషణరావు (బొబ్బిలి ).. సుంకర లీల (నెల్లిమర్ల ) వివిధ విభాగాల్లో సత్తా చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. మార్చి 6 నుంచి 10 వరకు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. ఇన్స్పైర్ అవార్డులకు 90 ప్రాజెక్ట్లు వీరఘట్టం: జిల్లా వ్యాప్తంగా ఇన్స్పైర్ అవార్డులకు 90 ప్రాజెక్టులను ఎంపిక చేస్తూ కేంద్ర మానవ వనరులశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లా నుంచి 1120 సైన్స్ ప్రాజెక్ట్లను పంపించగా వీటిలో 90 ప్రాజెక్ట్లను ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. ఎంపికై న ప్రతి ప్రాజెక్ట్కు కేంద్రం రూ.10 వేలు మంజూరు చేస్తుందని జిల్లా సైన్స్ అధికారి జి. లక్ష్మణరావు తెలిపారు. ఈ 90 ప్రాజెక్ట్లను జిల్లా స్థాయిలో ప్రదర్శిస్తే ఇందులో 10 శాతం ప్రాజెక్ట్లను రాష్ట్ర స్థాయికి.. అక్కడి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏప్రిల్లో విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని ఇన్స్పైర్ అవార్డులకు వివిధ మండలాల నుంచి ఎంపికై న పాఠశాలల వివరాలు ఇలా ఉన్నాయి. -
చివర్లో ఎందుకీ పరుగు..!
వీరఘట్టం: జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత, గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టేందుకు విద్యాశాఖ కార్యాచరణ చేపట్టింది. ఫిబ్రవరి 28 నుంచే ఈ ప్రక్రియ చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. అకస్మాత్తుగా ఆదేశాలు జారీ కావడంతో ఎక్కడా మొదలు కాలేదు. మార్చి 2 నుంచి యథావిధిగా తనిఖీలు చేపట్టనున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇదే రోజు నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఫైనల్ పరీక్షలు, 10వ తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్టులు, మార్చి 16 నుంచి పది పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ సమయంలో ఉన్నతాధికారులు బృందాలను పంపిస్తుండడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రణాళిక లేని పద్ధతులు విద్యా వ్యవస్థలో ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు అస్తవ్యస్థంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే 9వ తరగతి విద్యార్థులకు మార్చి నెలాఖరుకు సిలబస్ పూర్తి చేసి ఏప్రిల్లో ఫైనల్ పరీక్షలు నిర్వహించాలి. ఇందుకు విరుద్ధంగా సిలబస్ పూర్తి కాకుండానే మార్చి 2 నుంచి ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తుండటంపై టీచర్లు మండిపడుతున్నారు. సిలబస్ పూర్తికానపుడు విద్యార్థులు పరీక్షలు ఎలా రాయగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ప్రణాళిక లేని పద్ధతులతో సర్కారు విద్య నిర్వీర్యం అవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. జంబ్లింగ్ విధానంలో తనిఖీ బృందాలు ఏర్పాటు వీరఘట్టం మండలంలోని ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసేందుకు సీతానగరం, గుమ్మలక్ష్మీపురం ఎంఈఓలను నియమించారు. ఇలా వేర్వేరు మండలాల ఎంఈఓలు వేర్వేరు మండలాల్లో తనిఖీలు చేసేందుకు జిల్లా విద్యాశాఖ ఏడు బృందాలను ఏర్పాటు చేసింది. వీరు ఫిబ్రవరి 28 నుంచి తనిఖీలు చేయాల్సి ఉన్నప్పటికీ సమాచారం ఆలస్యం కావడంతో సోమవారం నుంచి మార్చి 7 వరకు జిల్లాలోని 183 ఉన్నత పాఠశాలల్లో తనిఖీలు చేయనున్నట్టు పలువురు ఎంఈఓలు తెలిపారు. తనిఖీ చేయనున్న అంశాలు ఇవే.. ప్రతీ ఉన్నత పాఠశాలలో ముస్తాబు అమలు, ప్రాంగణ పరిశుభ్రత, 6–10వ తరగతుల బోధన స్థితి, సిలబస్ ఎంత వరకు పూర్తయింది, ఎస్ఎస్సీ–2026 యాక్షన్ ప్లాన్ అమలు, మధ్యాహ్న భోజన పథకం, కిచెన్ గార్డెన్ నిర్వహణ, ఆట స్థలాలు, క్రీడల పరిస్థితి, పాఠశాల రికార్డులు, పిల్లల హాజరు పట్టీలు పరిశీలించేలా తనిఖీ బృందాలకు జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకే తనిఖీలు చేపడుతున్నాం. టెన్త్ విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు వారికి తగిన గైడ్లైన్స్ ఇస్తారు. మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేసేందుకు ఈ ప్రక్రియ ఎంతగానో దోహదపడుతుంది. – పి.బ్రహ్మాజీరావు, డీఈఓ, పార్వతీపురం మన్యం జిల్లా జిల్లాలో 183 ఉన్నత పాఠశాలల్లో తనిఖీలకు రంగం సిద్ధం ఉప విద్యా శాఖ, ఎంఈఓ, సమగ్ర శిక్ష అధికారులతో ఏడు బృందాలు పరీక్షల వేళ ఏమిటీ గందరగోళమని ప్రశ్నిస్తున్న ఉపాధ్యాయులు -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
రామభద్రపురం: మండలంలోని ముచ్చర్లవలస సాయికృష్ణ కోల్డ్ స్టోరేజ్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. బాడంగి మండలం వాడాడ గ్రామానికి చెందిన కల్లూరి బైరాగి (67) మెంటాడ మండలంలోని కుంటినవలస గ్రామంలో ఉన్న తన కుమార్తె ఇంటికి వెళ్లాడు. అక్కడ నుంచి ఆదివారం ఉదయం తిరిగి స్వగ్రామానికి నడుచుకుంటూ వస్తుండగా.. సాయికృష్ణ కోల్డ్ స్టోరేజ్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైరాగి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు హెచ్సీ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎల్.కోటలో అగ్ని ప్రమాదం
● 60 ధాన్యం బస్తాలు, రెండు గడ్డి వాములు దగ్ధం ● సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టంలక్కవరపుకోట: మండల కేంద్రంలోని అరకు – విశాఖ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కళ్లాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన జామి అప్పలనారాయణకు చెందిన గడ్డివాము, సుమారు 60 బస్తాల ధాన్యం కాలిపోగా ,బూర్లు సూరిబాబుకు చెందిన గడ్డివాము కాలి బూడిదయ్యాయి. గడ్డివాము దగ్గర ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో గుర్తించిన రైతులు అప్రమత్తమై ఎస్.కోట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే వారు వచ్చి మంటలను అదుపు చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు వీఆర్ఓ గణేష్ అంచనా వేశారు. నీలగిరి తోట దగ్ధం.. గజపతినగరం రూరల్: మండలంలోని గుడివాడ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నడిమంటి గాంధీకి చెందిన నీలగిరి తోట దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 15 వేల రూపాయల ఆస్తినష్టం జరిగి నట్లు అగ్నిమాపక అధికారి ప్రసాద్ తెలిపారు. ఎవ రో సిగరెట్/బీడీ తాగి పడేయడం వల్ల ఈ ప్రమా దం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
మెరుగైన వైద్యం అందని ద్రాక్షేనా...!
పార్వతీపురం రూరల్/పార్వతీపురం : మన్యం జిల్లాలో ప్రజలకు సంజీవనిలా నిలవాల్సిన పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి నేడు అరకొర సౌకర్యాలతో, సమస్యల వలయంలో చిక్కుకుంది. నాడు కార్పొరేట్ హంగులతో మెరిసిన ఈ వైద్యాలయం, నేడు పాలకుల నిర్లక్ష్యంతో అరకొర వసతులకు నిలయంగా మారి ఉన్న వనరులతో ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన ఆస్పత్రుల నిర్వహణ సమన్వయ అధికారులకు నిర్వహణ కత్తి మీద సాముల మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర ఆస్పత్రికి అనుసరించి నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ మల్టీ సుపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనం, వైద్య కళాశాల పనులు అటకెక్కడంతో పాటు, దానికి అనుబంధంగా ఉన్న ఈ ఆస్పత్రిని గాలికొదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే పడక.. ఇద్దరు రోగులు! కేంద్ర ఆస్పత్రికి రోగుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది. రోజువారీ ఓపీ దాదాపుగా సీజనల్ వ్యాధుల కాలంలో 450 మార్కును తాకుతుండగా, ఇన్ పేషంట్ల సంఖ్య సామర్థ్యానికి మించిపోతోంది. ఆస్పత్రిలో ఉన్నవి 150 పడకలే అయినా, ప్రస్తుతం దాదాపుగా 286 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో వేరే దారి లేక ఒకే పడకపై ఇద్దరు రోగులను సర్దుబాటు చేయాల్సిన దుస్థితి. కిటకిటలాడే వార్డులు, కనీసం కూర్చోవడానికి సరిపడా కుర్చీలు లేక నేలపైనే పడిగాపులు కాస్తున్న రోగుల దృశ్యాలు ఇక్కడి దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ మాయంతో.. పెరిగిన భారం గత ప్రభుత్వంలో ఇంటి ముంగిటకే వైద్యం అందించిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అటకెక్కడం ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నాడు గ్రామ క్లినిక్లలోనే 105 రకాల మందులు, 14 రకాల పరీక్షలు అందుబాటులో ఉండేవి. నేడు ప్రాథమిక దశలో వైద్యం అందకపోవడంతో ప్రతి చిన్న సమస్యకు రోగులు జిల్లా ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. గతంలో లబ్ధి చేకూర్చిన ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల జిల్లా ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం ఇకనైనా స్పందించి, ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఆస్పత్రిలో మౌలిక వసతులను మెరుగుపరచాలని మన్యం ప్రజలు కోరుతున్నారు. మా నాయకుడు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే సంకల్పంతో మా ప్రభుత్వ హయాంలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, వైద్య కళాశాలను మంజూరు చేశాం. నిధుల కేటాయింపుతో పాటు స్థల సేకరణ పూర్తి చేసి, దాదాపు 60 శాతం నిర్మాణ పనులు కూడా పూర్తి చేశాం. కానీ, నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ పనులను గాలికొదిలేసింది. గతంలో ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష వంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ప్రజల ముంగిటకే వైద్యం అందేది. ఇప్పుడు ఆ వ్యవస్థలను నిర్వీ ర్యం చేయడం వల్లే జిల్లా ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగి రోగులు అల్లాడుతున్నారు. – మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, పార్వతీపురం ఆస్పత్రికి వెన్నెముక లాంటి కీలక పోస్టులు ఖాళీగా ఉండటం రోగుల పాలిట శాపంగా మారింది. సివిల్ సర్జన్ (ఆర్.ఎమ్.ఓ), రేడియాలజీ, మైక్రో బయాలజీ, ఈఎంటీ వంటి విభాగాల్లో నిపుణులు లేక సేవలు కుంటుపడ్డాయి. అల్ట్రా సౌండ్ స్కానింగ్ విభాగం తాళం వేసి ఉండటంతో, నిరుపేదలు ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అత్యవసర స్థితిలో వచ్చిన వారిని సైతం విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలకు రిఫర్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఖాళీగా ఉన్న కీలక పోస్టులు ఉన్న 150 పడకలకు 280 మంది ఇన్ పేషంట్లు సీజనల్ వ్యాధుల కాలంలో అయితే అవస్థలు మెరుగైన చికిత్సకు తప్పని రిఫరల్ గండం నాడు రక్షణ కవచంలా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం -
బస్సు ఒకటే..ప్రారంభోత్సవాలు రెండు..
● ముందుగా ఎమ్మెల్యే, ఆ తర్వాత ఆర్టీసీ జోనల్ చైర్మన్ సర్వీస్ను ప్రారంభించిన వైనం వేపాడ: మండల కేంద్రమైన వేపాడ నుంచి విశాఖపట్నానికి వేసిన ఆర్టీసీ బస్సును స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి.. ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఎస్.దొన్నుదొర ఆదివారం వేర్వేరుగా ప్రారంభించారు. ఉదయం 10.45 గంటలకు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వేపాడ చేరుకుని బస్సును ప్రారంభించి, మొదటి టికెట్ కొనుగోలు చేశారు. అక్కడకు గంట తర్వాత ఆర్టీసీ జోనల్ చైర్మన్ దొన్నుదొర, ఆర్టీసీ డీఎం సుదర్శనరావు గ్రామానికి చేరుకుని జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ప్రజాప్రతినిధుల సమన్వయ లోపమో.. అధికారుల అలసత్వమో తెలియదు కాని ఒకే సర్వీస్ను రెండు సార్లు ప్రారంభించడం మాత్రం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే ఈ బస్సు ఎస్.కోటలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి 6.15కు వేపాడ చేరుకుని పదిహేను నిమిషాల తర్వాత విశాఖకు బయలుదేరుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలాగే ఇదే బస్సు సాయంత్రం 6.30 గంటలకు విశాఖలో బయలుదేరి రాత్రి 8.20 గంటలకు వేపాడ చేరుకుని అక్కడ నుంచి ఎస్.కోట చేరుకుంటుందని చెప్పారు. -
కౌలు రైతులకు కార్డులివ్వాలి
● కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు పార్వతీపురం రూరల్: భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు డిమాండ్ చేశారు. పార్వతీపురంలోని ఏపీ ఎన్జీఓ హోంలో ఆదివారం జరిగిన సంఘం మూడవ జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బెలగాం సుందరయ్య భవనం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రైతులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 60 వేల మంది కౌలు రైతులు ఉండగా, కేవలం 700 మందికే కార్డులు అందాయని పేర్కొన్నారు. 2019 నాటి కౌలు చట్టాన్ని రద్దు చేసి, సాగుదారులకు మేలు చేసేలా కొత్త చట్టం తీసుకురావాలన్నారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల పెట్టుబడి సాయం, పంట రుణాలు, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. జంఝావతి వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సభలో రైతు సంఘం నాయకులు ఎం.కృష్ణమూర్తి, బంటు దాసు, గంగునాయుడు సంఘీభావం తెలిపారు. నూతన కమిటీ ఎన్నిక మహాసభలో 11 మందితో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రెడ్డి వేణు, కార్యదర్శిగా ఆర్.రమణమూర్తి, ఉపాధ్యక్షురాలిగా పి.దమయంతి, సహాయ కార్యదర్శిగా రెడ్డి ఈశ్వరరావు, కోశాధికారిగా ఆవు సాంబమూర్తి ఎన్నికయ్యారు. -
పదండి.. మన ఆస్పత్రికి..!
విజయనగరం ఫోర్ట్: ఈ ఇద్దరు రోగులే కాదు.. సర్వజన ఆస్పత్రిలో నిత్యం ఇదే తంతు జరుగుతున్నట్లు ఆరోపణులు వినిపిస్తున్నాయి. వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే వారిని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు సమాచారం. 108, ప్రైవేట్ అంబులెన్సుల్లో వచ్చే అత్యవసర రోగులు బెడ్పైకి రాకముందే ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించుకుపోతున్నారు. కొంతమంది రోగులకు ఓపీ తీయించి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో ప్రైవేట్ సిబ్బంది.. పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు రోగులను తరలించేందుకు ఉద్యోగులను నియమించుకున్నారు. వారంతా సర్వజన ఆస్పత్రిలో తిష్ట వేసి రోగులను మభ్యపెడుతూ తమ ఆస్పత్రులకు తరలించుకుపోతున్నారు. వీరి హడావిడిని చూసి ఎవరైనా ప్రశ్నిస్తే తాము సర్వజన ఆస్పత్రి సిబ్బందిమని చెబుతూ తప్పించుకుంటున్నారు. ఇదిలా ఉంటే రోగుల తరలింపు విషయంలో సర్వజన ఆస్పత్రికి చెందిన కొంతమంది వైద్యుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోగులను తరలించే వైద్యులకు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కమీషన్లు ముట్టజెప్పుతాయి. చేతిచమురు వదిలించుకోవాల్సిందే.. అమాయక రోగులు ఒకవేళ ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే చేతి చమురు వదులించుకోవాల్సిందే. ప్రభుత్వాస్పత్రిలో ఉచితంగా అందాల్సిన వైద్య సేవలకు అక్కడ లక్షల రూపాయలు గుంజేస్తున్నారు. ఎవరైనా ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా వైద్యం అందించాలని కోరితే.. ఈ రోగానికి ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పి మోసగిస్తున్నారు. మరికొంతమంది విషయంలో ఆరోగ్యశ్రీ వర్తించినా.. ఏదో ఒక పేరు చెప్పి డబ్బులు లాగేస్తున్నారు. సర్వజన ఆస్పత్రికి వస్తున్న రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలింపు ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బంది నియామకం వారికి సహకరిస్తున్న ఆస్పత్రి సిబ్బంది ఉచితంగా అందాల్సిన వైద్యానికి రూ. లక్షల్లో ఖర్చు ఎస్.కోట మండలానికి చెందిన అప్పలనాయుడు అనే వ్యక్తికి కొద్ది రోజుల కిందట పక్షవాతం రావడంతో సర్వజన ఆస్పత్రికి తీసుకొచ్చారు. బెడ్పై రోగిని దించిన వెంటనే అక్కడే కాపు కాసిన ఓ కార్పొరేట్ ఆస్పత్రికి చెందిన వ్యక్తి తమ ఆస్పత్రిలో అయితే మెరుగైన వైద్యం అందిస్తాం.. రోగి త్వరగా కోలుకుంటాడని చెప్పి వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. గంట్యాడ మండలానికి చెందిన ఈశ్వరమ్మ అనే మహిళ చేయి వాపు వచ్చిందని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు నీకు వెంటనే ఆపరేషన్ జరగాలని.. అయితే మెరుగైన వైద్యం త్వరగా అందాలంటే తాను ప్రైవేట్గా నిర్వహిస్తున్న క్లినిక్కు వెళ్లమని సూచించారు. అక్కడ ఎవరిని సంప్రదించాలో సదరు వ్యక్తి ఫోన్ నంబర్ కూడా చీటీపై రాసి ఇచ్చారు. ప్రైవేట్ వ్యక్తులను నిలువరిస్తాం.. సర్వజన ఆస్పత్రికి వచ్చే రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నట్లు ఎటువంటి సమాచారం లేదు. అయినా ప్రైవేట్ వ్యక్తులు ఆస్పత్రిలోకి రాకుండా కట్టడి చేస్తాం. ఇందుకు సంబంధించి సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటిండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
మన్యం అటెన్షన్..!
● వేడెక్కుతున్న వాతావరణం ● మన్యంలో పెరుగుతున్న జ్వరపీడితులు ● నమోదవుతున్న వైరల్, మలేరియా, టైఫాయిడ్ కేసులు ● కిటకిటలాడుతున్న ఏరియా ఆసుపత్రి సీతంపేట: వేసవి ప్రారంభమైంది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని వేడెక్కుతోంది. ఒక్కసారిగా తీవ్ర చలి నుంచి ఎండ వేడిమి వచ్చేసింది. ఏజెన్సీలో వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో వైరల్, టైఫాయిడ్ జ్వరాలు పెరుగుతున్నాయి. మలేరియా పీవీ, పీఎఫ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. వెరసీ మన్యంలో జ్వర పీడితుల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు జ్వరాలతో వైద్యం కోసం వెళ్లే వారి సంఖ్య అధికమౌతుంది. స్థానిక ఏరియా ఆస్పత్రిలో బెడ్లు సైతం నిండిపోతున్నాయి. రక్త పరీక్షల్లో 60 శాతం టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడే ఈ తరహా జ్వరాలు ఉంటే రానున్న మరో రెండు నెలలు ఎండలు కాసే ప్రమాదమున్నందున ఇంకా జ్వరపీడితులు సంఖ్య పెరుగుతుందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. దోమల కారక మలేరియా పాజిటివ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. గత సంవత్సరం సీతంపేట ఏజెన్సీలోని హైరిస్క్ గ్రామాల్లో 300లకు పైగా మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో రోజుకు ప్రాంతీయ ఆస్పత్రికి వెళ్లిన వారిలో ఒకటి, రెండు మలేరియా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. చాపకింద నీరులా మలేరియా పాజిటివ్ వ్యాపిస్తుండడంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ప్రబలుతున్న వ్యాధుల పట్ల అలర్ట్గానే ఉన్నాం. వ్యాధులన్నింటికీ తగిన మందులు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రికి వచ్చే వారికి తగిన వైద్య సేవలు అందిస్తున్నాం. వచ్చిన రోగులకు రక్త పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారణ చేసి అవసరమైన మందులు ఇస్తున్నాం. అన్ని రకాల సేవలకు స్పెషలిస్టు వైద్యులు ఉన్నారు. అవసరమైన రోగులను ఇన్పేషంట్లుగా ఆస్పత్రిలోనే ఉంచుతున్నాం. – బి.శ్రీనివాసరావు, సీతంపేట, ఏరియా ఆస్పత్రి సూపరెంటెండెంట్ -
సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షలో జిల్లా విద్యార్థుల సత్తా
నెల్లిమర్ల రూరల్: సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో నెల్లిమర్ల మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు సత్తా చాటారు. అలుగోలు శ్రీవాణి విద్యానికేతన్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నరౌతు ప్రేమ్సాయి 267 మార్కులు, అంబళ్ల కార్తికేయనాయుడు 253 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఈ మేరకు విద్యార్థులను హెచ్ఎం కృష్ణకూర్మ, కరస్పాండెంట్ చందక వెంకటరమణ, తదితరులు అభినందించారు. విజయనగరం ఫోర్ట్: జిల్లా కేంద్రంలోని శైలజ విద్యానికేతన్లో శిక్షణ తీసుకున్న హన్షిత్ 285 మార్కులు సాధించి తెలుగు రాష్ట్రాల్లో టాపర్గా నిలిచాడు. ఈ మేరకు విద్యార్థినిని విద్యానికేతన్ నిర్వాహకులు అభినందించారు. -
వృద్ధురాలిపై దాడి
పార్వతీపురం రూరల్: పింఛన్ సొమ్ము కోసం గుర్తుతెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలిపై దాడి చేసిన సంఘటన మండలంలోని కృష్ణపల్లి పంచాయతీలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోరాపు తెరీజమ్మ (81) ప్రభుత్వం అందజేసిన పింఛన్ సొమ్మును శనివారం తీసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న ఆమైపె అదే రోజు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. నగదు కాజేసే క్రమంలో ఆమె తలపై బలంగా గాయపరిచారు. ఆదివారం ఉదయం రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్న వృద్ధురాలిని స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని తొలుత స్థానిక ప్రభుత్వాస్పత్రికి.. అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం ఆమె కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీఐ రంగనాథం, ఎస్సై రాజేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, వివరాలు సేకరించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గజపతినగరం రూరల్: మండలంలోని పాతబగ్గాం గ్రామానికి చెందిన పల్లి ప్రసాద్ శనివారం తెల్లవారుజామున కృష్ణా జిల్లాలోని గుడివాడ సమీపంలో ప్రమాదవశాత్తు లారీ నుంచి జారిపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... లారీ క్లీనర్గా పని చేస్తున్న ప్రసాద్ సాలూరు నుంచి లారీ లోడ్తో శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. గుడివాడ సమీపానికి వచ్చేసరికి క్లీనర్ సమీపంలో ఉన్న డోరు ఓపెన్ కావడంతో నిద్రమత్తులో ఉన్న ప్రసాద్ ఒక్కసారిగా రోడ్డుపై పడ్డాడు. ఈ క్రమంలో కొద్ది దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ గమనించి వెనక్కి రాగా అప్పటికే ప్రసాద్ తుదిశ్వాస విడిచాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పల్లి రాము, దేవుడమ్మ కన్నీటి పర్యాంతమయ్యారు. దీంతో పాతబగ్గాంలో విషాదం అలుముకొంది. ప్రసాద్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి..గుమ్మలక్ష్మీపురం: రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన విద్యార్థి బిడ్డిక రాహుల్ (13) విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గుమ్మలక్ష్మీపురం మండలం గాజులగూడ గ్రామానికి చెందిన రాహుల్ సమీపంలో గల కొత్తగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఇంటికెళ్లిన రాహుల్ స్నేహితులతో కలిసి ఈ నెల 26న బొద్దిడి జంక్షన్ వద్ద జరిగిన జాతరకు ద్విచక్ర వాహనంతో వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఒంటరిగా ద్విచక్ర వాహనంపై వస్తుండగా డుమ్మంగి సమీపంలోని మలుపు వద్ద వాహనం అదుపు తప్పడంతో రాహుల్ కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ముఖం, తల భాగాల్లో గాయాల పాలైన రాహుల్ను సమాచారం అందుకున్న కుటుంబీకులు భద్రగిరి ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక వైద్య సేవలు అందించారు. అనంతరం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి విశాఖలోని కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాహుల్ మృతి చెందినట్టు తల్లిదండ్రులు వనిత, అర్జున్ తెలిపారు. శతాధిక వృద్ధురాలు.. బాడంగి: మండలంలోని గొల్లాది గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు ఇజ్జాడ పోలమ్మ(105) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఆమెకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం ఆమె కుటుంబం మునిమనవులు, ముని మనవరాళ్లుతో ఉంది. పోలమ్మ అంత్యక్రియలు శనివారం ఆమె స్వగ్రామం గొల్లాదిలో జరిగాయి. రామభద్రపురం : రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇది. ఎస్సై వెలమల ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 24న తారాపురం అయ్యప్పస్వామి ఆలయం వద్ద పాచిపెంటకు చెందిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వస్తూ సాలూరు మండలం పురోహితునివలసకు చెందిన పి.శ్రీనివాస్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్ను సాలూరు సీహెచ్సీకి తరలించగా అక్కడి నుంచి వైద్యులు విశాఖలోని కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రసాదరావు తెలిపారు. -
రామతీర్థంలో వైభవంగా పునర్వసు నక్షత్ర పూజలు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవనం జరిపించారు. అనంతరం స్వామి సన్నిధిలో శ్రీమద్రామాయణ పారాయణం నిర్వహించి ఆస్థాన మంటపంలో ఉత్సవమూర్తుల వద్ద రామాయణంలో పట్టాభిషేక సర్గ విన్నవించి శ్రీరామచంద్రమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో అభిషేకం, పట్టాభిషేక మహోత్సవం జరిపించారు. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
గరం గరం..!
‘పురం’లో... సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం నియోజకవర్గంలో పేరుకే ‘కూటమి’ అధికారం గానీ.. ఇక్కడ అంతా టీడీపీదే హవా. కూటమి ఎమ్మెల్యేగా గెలుపొందిన టీడీపీకి చెందిన బోనెల విజయ్చంద్ర వ్యవహారశైలి సమస్యాత్మకంగా మారుతోంది. ఏకపక్ష విధానాలతో వేగలేక, ప్రతిసారీ పెద్దల వద్ద పంచాయితీలు పెట్టుకోలేక.. సొంత పార్టీలోని సీనియర్లే సైలెంట్ అయిపోయారు. ఉమ్మడి విజయనగరం టీడీపీకి అధ్యక్షునిగా, ఎమ్మెల్సీగా పని చేసిన సీనియర్ నేత ద్వారపురెడ్డి జగదీశ్ పత్తా లేకుండా పోయారు. బలమైన కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆయన.. పార్టీలో ఏదో ఉన్నారంటే ఉన్నారంతే! ఇంక అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు సైతం రాజకీయ వైరాగ్యంలో ఉన్నారు. వీరిని పొమ్మన లేకుండా పొగ బెట్టేశారన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా ఉంది. చీలిపోతున్న ‘కూటమి’ కూటమి భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య మొదటి నుంచి సఖ్యత కనిపించడం లేదు. జనసేన ఇన్చార్జి ఆదాడ మోహనరావు ఏనాడో నియోజకవర్గ ఎమ్మెల్యే వైఖరిని తప్పుపట్టారు. బహిరంగంగానే విమర్శలు చేశారు. ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరి, అవినీతిపై ఆరోపణలు చేశారు. అధినేత పవన్ కల్యాణ్ దృష్టికీ తీసుకెళ్లారు. ఆయనకు ఎక్కడా న్యాయం జరగకపోవడంతో నియోజకవర్గానికి చుట్టం చూపులా వచ్చి వెళ్తున్నారు. ఇంక జనసేన కార్యకర్తలు సైతం.. ఎన్నికలకు ముందు ఉన్నంత దూకుడు చూపించడం లేదు. ‘తమ్ముళ్ల’ వేగాన్ని తట్టుకోలేక, ఏ పనులూ చేయించుకోలేక.. తమ సొంత పనుల్లో నిమగ్నమైపోయారు. ● ఇప్పటి వరకూ బీజేపీ నాయకులు బయట పడలేదు గానీ.. ఇప్పుడిప్పుడే తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట బీజేపీకి చెందిన సురగాల ఉమామహేశ్వరరావు బహిరంగంగానే ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు సైతం తమకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు. నేరుగా చెప్పుకోలేక.. అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని నెపాన్ని వారిపై నెట్టేశారు. అధికారుల తీరుతో కూటమిలో చిచ్చు రేగుతోందని.. జనసేన, బీజేపీ కార్యకర్తల మనోభావాలు గాయపడుతున్నాయని వాపోయారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కూటమి నేతలను భాగస్వామ్యం చేయడం లేదని, ఎమ్మెల్యే విజయ్చంద్రకు చెప్పినా న్యాయం జరగడం లేదని ఆయన వాపోవడం గమనార్హం. స్థానిక ఎన్నికల వేళ అంజెడా మార్చే ప్రయత్నం చేస్తున్నారని.. అధికారులను హెచ్చరించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని శనివారం మీడియా సమావేశంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిధులు కేంద్రానివి.. ప్రధాని ఫొటో ఏదీ? సీజీఎస్టీ భవన సాక్షిగా ప్రొటోకాల్కు పాతర వేశారని.. కూటమిలో ఉన్న బేజేపీ, జనసేలను విస్మరించడం ధర్మమా? అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని ఫొటో లేకుండానే కేంద్ర నిధులతో స్వచ్ఛభారత్ అభియాన్ కింద పనులు చేపించుకుంటున్నారని విమర్శించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రొటోకాల్ విషయంలో యంత్రాంగం స్పందించడం లేదని చెబుతున్న ఆయన.. జిల్లా మంత్రి, ఇన్చార్జి మంత్రి జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. మొత్తంగా బీజేపీ, జనసేన నాయకుల విమర్శలు నేరుగా ఎమ్మెల్యేపైనే ఉంటున్నాయి. ఆయన ఒక్కరే కూటమిలో ఉంటే సరిపోతుందా? అని లోలోపల రగిలిపోతున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అందుకు కారణమూ లేకపోలేదు. పార్వతీపురంలో శనివారం జీఎస్టీ నిధులతో పింక్ టాయిలెట్ నిర్మాణానికి ఏపీ జీఎస్టీ కమిషనర్ పి.ఆనంద్కుమార్, ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర శంకుస్థాపన చేశారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి, స్థానిక టీడీపీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ నిధులతో చేపట్టిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడి హోదాలోనైనా.. ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గానైనా తనను ఆహ్వానించలేదని ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక భాగస్వామి అని.. ప్రాజెక్టుల మంజూరులో ప్రాధాన్యం ఇవ్వాలని జీఎస్టీ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. అదే ఎన్డీయే కూటమిలో ఉన్న.. బీజేపీ జిల్లా అధ్యక్షునికి ఎందుకు ఆహ్వానించలేదని శ్రీనివాసరావు అనుచరులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర నిధులతో చేపడుతున్నప్పటికీ.. కనీసం ఎక్కడా ప్రధాని ఫొటో వేయకపోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎమ్మెల్యే వద్దన్నారో.. మున్సిపల్ అధికారులు విస్మరించారో గానీ... పింక్ టాయిలెట్స్ నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాఫలకంలో పట్టణ ప్రథమ పౌరురాలు, మున్సిపల్ చైర్పర్సన్ గౌరీశ్వరి పేరు లేకపోవడం గమనార్హం. ఆమెను కనీసం ఈ కార్యక్రమానికీ పిలవక, శిలాఫలకంపై పేరు వేయక అవమానించారని పలువురు వైఎస్సార్సీపీ కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఐటీడీఏ ఇలా..
ఐటీడీఏను నిర్వీర్యం చేశారు.. ఐటీడీఏను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి దక్కుతుంది. గిరిజన ప్రాంతాల్లో పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. ఐటీడీఏకు వచ్చి సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయనేది లేదు. క్షేత్ర స్థాయిలో వివిధ శాఖల పథకాలు అమలు కాని పరిస్థితి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొండపోడు పట్టాలతో పాటు, విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేశాం. ఇప్పుడు ఆ పరిస్థితి మచ్చుకై నా కనిపించడం లేదు. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ, మాజీ ఎమ్మెల్యే సీతంపేట: ఐటీడీఏ అంటే గిరిజనులకు అండగా ఉండి, వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి. నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న ఐటీడీఏ రానురాను ఇటీవల కాలంలో ప్రాభవం కోల్పోతుంది. చంద్రబాబు సర్కార్ గద్దెనెక్కి 20 నెలలు కావస్తున్నా ఐటీడీఏకు దిశానిర్దేశం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హాయంలో ప్రత్యేకంగా ఐటీడీఏకు పీఓలను శాశ్వతంగా నియమించింది. ఇన్చార్జ్లతో నడిపించిన దాఖలాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆన్చార్జ్ పీఓలతో నెట్టుకొస్తున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్ప్లాన్ మండలాలు ఉన్నాయి. 1250 వరకు గిరిజన గ్రామాలున్నాయి. శ్రీకాకుళం జిల్లా పరిధిలో 16, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో 4 మండలాలు ఉన్నాయి. రెండు లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. 13కు పైగా ప్రభుత్వ శాఖలు పని చేస్తున్నాయి. ఇంజినీరింగ్, గిరిజన సంక్షేమ శాఖ, వైద్య శాఖ, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, గిరిజన సహకార సంస్థ వంటివి నిర్వహించబడుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నప్పటకీ ఇప్పటి వరకు ఒక గవర్నింగ్ బాడీ సమావేశం కూడా నిర్వహించలేదు. పాలకవర్గ సమావేశాల ద్వారా గిరిజనులకు ఏఏ పథకాలు అవసరం, ఉన్న పథకాలు ఏమేరకు ఉపయోగపడుతున్నాయో.. క్షేత్ర స్థాయిలో పథకాల పనితీరు మంత్రులు, శాసనసభ్యులు చర్చించడానికి వీలుంటుంది. గవర్నింగ్ బాడీ సమావేశం కూడా ఇంతవరకు నిర్వహించకపోవడం గమనార్హం. మౌలిక వసతులు అంతంతమాత్రమే... గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ద్వారా రహదారులు, భవనాలు నిర్మించాల్సి ఉంది. 120కు పైగా గ్రామాలకు పూర్తి స్థాయిలో కనెక్టివిటీ దారులు లేవు. ఇప్పటికీ కొన్నిచోట్ల రహదారులు రాళ్లు తేలి ఉన్నాయి. చేసిన పనులకు సైతం బిల్లులు లేవంటూ సంబంధిత కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రహదారి సౌకర్యాలు లేక అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రులకు తరలించాలన్నా.. మార్కెట్కు అటవీ ఉత్పత్తులు తీసుకువెళ్లాలంటే బాధలు వర్ణణాతీతం. ఇంకా వరద గోడలు, మల్టిపర్పస్ భవనాల నిర్మాణాలు పూర్తిగా లేవు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు శాశ్వత పరిష్కారం లేదు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల పనులు పూర్తి కాలేదు. వైద్యసేవలు గగనం అవుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. పీహెచ్సీల్లో వైద్య సిబ్బంది కొరత వేధిస్తుంది. కొన్ని పీహెచ్సీల్లో ఒక్కో డాక్టర్తోనే నెట్టుకొస్తున్నారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు సక్రమంగా జరగడం లేదు. మలేరియా నివారణలో భాగంగా దోమ తెరల పంపిణీ లేదు. వెఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2లక్షలకు పైగా దోమతెరలను గిరిజన ప్రాంతాల్లో పంపిణీ చేశారు. అటు తర్వాత పంపిణీ లేదు. అన్నదాత సుఖీభవ పథకం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న రైతులకు 7వేల మందికిపైగా వర్తించలేదు. నిధులు బ్యాంకుల్లో జమకాక అవస్థలు పడుతున్నారు. గిరిజనులు పండిస్తున్న అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేవు. కొండచీపుర్లు, చింతపండు వంటి వాటికి సరైన మద్దతు ధరలు లేక గిరిజనులు అల్లాడుతున్నారు. గిరిజన విద్యా సంస్థల్లో హెల్త్ వాలంటీర్లు లేరు... గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వాలంటీర్లు లేరు. ఐటీడీఏ పరిధిలో 60 గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో సుమారు 12 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థినీ, విద్యార్థుల ఆరోగ్యాలను పరిరక్షించే ఏఎన్ఎంలు లేరు. అత్యవసర సమయాల్లో జ్వరం, ఇతర వ్యాధులు వస్తే విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. కనీసం ప్రాధమిక చికిత్స చేసే వారు లేకపోవడంతో విద్యార్థులు దీనావస్థలో ఉన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి హామీ ఇచ్చినా ఇంతవరకు నెరవేర్చలేదు. కాగా పాఠశాలలు పర్యవేక్షించే ఏటీడబ్ల్యూఓ పోస్టులు కూడా రెండు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఇన్చార్జ్లతోనే నెట్టుకువస్తున్నారు. విద్యార్థులకు వండి వడ్డించే వంట సిబ్బంది కొరత కూడా ఉంది. ఖాళీ అవుతున్న శాఖలు నిర్వీర్యమవుతున్న సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ గవర్నింగ్ బాడీ సమావేశాలు నిల్ క్షేత్ర స్థాయిలో పథకాల అమలు అంతంతమాత్రమే..ఖాళీ అవుతున్న శాఖలు వెలుగు కార్యక్రమాలు సన్నగిల్లాయి. ట్రైబుల్ ప్రాజెక్టు మానటరింగ్ యూనిట్ను ఎత్తివేశారు. ఈ విభాగం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘాలను బలోపేతం చేయడం, వారికి జీవనోపాధి మార్గాలు చూపడం వంటివి చేసేవారు. ఏడాది కిందట ఆ శాఖను కూడా ఎత్తివేశారు. మానటరింగ్ చేసే ఏపీడీ పోస్టుతో పాటు ఏపీఎం పోస్టులు కూడా లేకుండా పోయాయి. అలాగే కొన్నేళ్ల క్రితం ఎస్ఎంఐ విభాగం శ్రీకాకుళం క్వాలిటీ కంట్రోల్ విభాగంలో కలిసింది. ఈ శాఖ ద్వారా గతంలో చెరువులు, చెక్డ్యాంలు వంటివి నిర్మించే వారు. తద్వారా ఖరీఫ్, రబీ పంటలకు సాగునీరు సక్రమంగా అందేది. పుష్కలంగా పంటలు పండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాగునీరు గిరిజన ప్రాంతాల్లో గగనమైంది. రేపో, మాపో ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ కార్యాలయం శ్రీకాకుళంకు తరలివెళ్లిపోనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇందుకు అక్కడ ప్రత్యేక కార్యాలయాన్ని కూడా కలెక్టరేట్లో కేటాయించినట్టు తెలిసింది. -
దిక్కూమొక ్క లేక..!
పాలకొండ రూరల్: క్షేత్రస్థాయిలో పచ్చదనం పెంపొందించడంతో పాటు ఆహ్లాదాన్ని విస్తరింపజేయడం, తద్వారా ఉపాధి వేతనదారులకు పనులు కల్పించేందుకు చేపడుతున్న చర్యలు.. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం కారణంగా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. పర్యావరణ పరిరక్షణకు ఏటా రూ.లక్షల ప్రజాధనం ఖర్చు చేస్తున్నా.. వాటి ఫలాలు ప్రజలకు అందడం లేదు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామ రహదారులకు ఇరువైపులా, చెరువు గట్లపై వేలాది మొక్కలు నాటుతున్నారు. సరైన రక్షణ కల్పించకపోవడం, పర్యవేక్షణ చేపట్టకపోవడంతో వేసిన మొక్కల జాడ రోజుల వ్యవధిలో కానరావడం లేదు. ఉపాధి పనుల్లో భాగంగా.. ఉపాధి హామీ పనుల్లో భాగంగా జిల్లాలోని 15 మండలాల్లో 360కుపైగా పంచాయతీల్లో 788 పనులు చేపట్టారు. ఈ క్రమంలో ప్రస్తుత ఏడాదిలో 49,936 మొక్కలను నిర్దేశిత లెక్కల మేరకు నాటారు. ఒక్కో మొక్కకు రూ.54లు వెచ్చించారు. ఈ మొత్తం రమారమి రూ.76.90 లక్షలుగా రికార్డులు చెబుతున్నాయి. బ్లాక్ ప్లాంటేషన్లో భాగంగా నాటిన ఈ మొక్కల్లో చాలా వరకు క్షేత్రస్థాయిలో కనుమరుగయ్యాయి. గతంలో ఉపాధిహామీ వేతనదారులే మొక్కల సంరక్షణ బాధ్యత చూసే వారు.. ప్రస్తుతం వీటి పరిరక్షణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించారు. వీరు పట్టించుకోకపోవడంతో మొక్కల సంరక్షణ కరువైందన్న వాదన వినిపిస్తోంది. క్షేత్రస్థాయి సిబ్బంది పర్యవేక్షణ లేక మొక్కలకు సకాలంలో నీరందక చనిపోయాయి. గతంలో కంచెలు.. గతంలో ప్రభుత్వం వేసిన మొక్కల రక్షణను దృష్టిలో పెట్టుకుని రూ.70 నుంచి రూ.100 వరకు ఖర్చు చేసి రక్షణ కంచెలను ఏర్పాటు చేసేది. ఉపాధిహామీ వేతనదారులు ఏర్పాటుచేసే రక్షణ కంచెలకు మస్టర్ల రూపంలో నిధులు కేటాయింపులు చేసేవారు. తాజాగా రక్షణ చర్యలు నిలిపివేశారు. దీంతో రక్షణ కొరవడి మొక్కలు మూగజీవాలకు ఆహారంగా మారుతున్నాయి. కాలువ, చెరువు గట్లు, సామాజిక స్థలాల్లో కొబ్బరి మొక్కలు వేశారు. వీటిని నర్సరీల నుంచి యంత్రాంగం తీసుకొచ్చింది. పాలకొండ మండలానికి సంబంధించి నర్సరీ నుంచి కొబ్బరి మొక్కలు కొనుగోలు చేశారు. ఒక్కోమొక్కకు రూ.60, రవాణాకు రూ.5 నుంచి రూ.9 వరకూ ఖర్చు చేశారు. మొక్కనాటే గుంత తీసేందుకు రూ.60, నాటేందుకు రూ.14 చెల్లించారు. ఒక్కో మొక్క పర్యవేక్షణకు నెలకు రూ.15 చెల్లిస్తున్నారు. వేసవి సీజన్లో మొక్కలకు సమృద్ధిగా ఓసారి నీరు అందించేందుకు రూ.4.25 కేటాయించారు. ఈ విధంగా 24 తడులు అందించాల్సి ఉంది. ఇది ఎక్కడా కానరావడం లేదు. దీంతో లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. ఇప్పటికై నా అఽధికారులు అవసరమైన చర్యలపై దృష్టి పెట్టాల్సింది. జిల్లాలో బ్లాక్ ప్లాంటేషన్లో భాగంగా నాటిన మొక్కలకు సంబంధించిన బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం జరిగింది. మొక్కలు చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటాలి. క్షేత్రస్థాయిలో ఉపాధి సిబ్బంది రక్షణ చర్యలపై దృష్టి పెట్టాలి. ప్రస్తుత వేసవిలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక పర్యవేక్షణ చేపడతాం. అవసరమైతే నిధులు అందించేలా చూస్తాం. – కె.రామచంద్రరావు, డ్వామా పీడీ, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉపాధిహామీ నిధులతో 50 వేల పైచిలుకు మొక్కల పెంపకం ఉపాధి హామీ నిధులు రూ.76 లక్షల మేర వెచ్చింపు పర్యవేక్షణలో మీనమేషాలు.. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం సగం మొక్కలు నీరందక చనిపోయిన దుస్థితి.. -
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో అదరగొట్టారు..
శృంగవరపుకోట: సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇందులో దొగ్గపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వజ్రపు శశికుమార్, చుక్క శశాంక్, తొత్తడి రిషిత సత్తా చాటి అర్హత సాధించినట్టు హెచ్ఎం సురేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిని హెచ్ఎంతో పాటు ఇతర ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. ఇదిలా ఉండగా వీరికి అదే పాఠశాలకు చెందిన నాగుబిల్లి ప్రసాద్ శిక్షణ ఇవ్వగా హెచ్ఎం సురేష్, సహోపాధ్యాయిని ఆర్.సాయిగీత సహకరించారు. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.4.30లక్షల జరిమానా విజయనగరం క్రైమ్ : మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానాను విధిస్తూ విజయనగరం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తేజ చక్రవర్తి తీర్పు ఇచ్చినట్టు ఇన్చార్జ్ ఎస్పీ మహేశ్వరరెడ్డి శనివారం తెలిపారు. విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు డీడీలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మద్యం సేవించి, వాహనాలు నడిపిన వారిపై 43 కేసులు నమోదు చేశారు. వీరికి విజయనగరం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద హాజరు పరచగా ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున మొత్తం 43 మందికి రూ.4.30 లక్షల జరిమానా విధించారని తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో ఒకరిపై మాల్ప్రాక్టీస్ వేటు పార్వతీపురం రూరల్: జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం (బాటనీ, హిస్టరీ) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి వై.నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని 33 కేంద్రాల్లో మొత్తం 5,257 మంది విద్యార్థులకుగాను 5,066 మంది (96.3%) హాజరు కాగా, 191 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 2,615 మంది, వృత్తి విద్యా విభాగంలో 2,451 మంది పరీక్ష రాశారు. పాలకొండ డివిజన్ పరిధిలోని భామిని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో హిస్టరీ–2 పరీక్ష రాస్తూ అక్రమాలకు పాల్పడిన ఒక విద్యార్థి మాల్ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. అన్ని కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, పకడ్బందీ తనిఖీల మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మార్చి 14 నుంచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు పార్వతీపురం రూరల్ : రాష్ట్ర స్థాయి మాస్టర్స్ క్రీడా పోటీలు మార్చి 14 నుంచి 29 వరకు వివిధ జిల్లాల్లో నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డా. కె.శ్రీధర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు శాప్ లీగ్ అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. అథ్లెటిక్స్ పోటీలు మార్చి 14, 15 తేదీల్లో గుంటూరు డీఎస్ఏ మైదానంలో 40 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులకు నిర్వహిస్తారని, బ్యాడ్మింటన్ పోటీలు మార్చి 21, 22 తేదీల్లో కోనసీమ డీఎస్ఏ స్టేడియంలో 35 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులకు, 45 ఏళ్లు పైబడిన పురుషులకు జరుగుతాయని తెలిపారు. టెన్నిస్ పోటీలు మార్చి 28, 29 తేదీల్లో విజయనగరం డీఎస్ఏ స్టేడియంలో 35, 45 ఏళ్లు పైబడిన పురుషులకు నిర్వహిస్తారని, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వారు మాత్రమే ఈ పోటీలకు అర్హులన్నారు. ఆసక్తి గల వారు ముందే(హెచ్టిటిపిఎస్://స్పోర్ట్స్.ఏపి.జిఓవి.ఇన్//రిజిస్ట్రేషన్/శాప్–లీగ్–రిజిస్ట్రేషన్) వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకుని, నేరుగా పోటీల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. ఇతర వివరాలకు 7396423490 నంబరును సంప్రదించాలని సూచించారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య శృంగవరపుకోట: మద్యానికి బానిసైన వ్యక్తి భార్య మందలించిందని మనస్తాపానికి గురై తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్.కోట సీఐ నారాయణమూర్తి శనివారం తె లిపారు. పట్టణానికి చెందిన చుక్క శ్రీను(45) మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు. శుక్రవారం మద్యం తాగి ఇంటికొచ్చిన శ్రీను భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడని, ఎంతకూ బయటకు రాకపోవడంతో భార్య సత్యవతి ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు విరగ్గొట్టి చూడగా శ్రీను ఫ్యాన్కు చీరతో ఉచి వేసుకొని మృతి చెందినట్టు కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
ఆక్రమణలను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది
సీతానగరం: మండలంలోని బగ్గందొరవలస గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. సర్వేనంబర్ 1/1లో ఉన్న 15.39 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు పెద్దలు ఆక్రమిస్తున్న వ్యవహారంపై ‘ప్రభుత్వ భూమిపై పెద్దలు కన్ను’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. కబ్జాకు గురైన భూమిని తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్ సూచనల మేరకు ఆర్ఐ ఎన్.శ్రీనివాసరావు, బగ్గందొరవలస ఇన్చార్జి వీఆర్వో, తామరఖండి వీఆర్వోలు పరిశీలించారు. ఆక్రమించిన భూమికి సిమెంట్ స్తంబాలతో వేస్తున్న కంచెను అడ్డుకున్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే క్రిమినల్ చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. -
కష్టపడి పని చేసే వారికి గుర్తింపు
● వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుబలిజిపేట: ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) సమక్షంలో, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో అజ్జాడకు చెందిన అక్కేన ఎల్లంనాయుడు, కాగాన అప్పలనాయుడు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీలో చేరిన బలిజిపేట మండల మాజీ మండల ఉపాధ్యక్షురాలు అక్కేన చెల్లెమ్మ భర్త ఎల్లంనాయుడు, అజ్జాడ ఉప సర్పంచ్ కాగాన అప్పలనాయుడులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి పార్టీలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి గెలుపు కోసం అందరితో కలిసి కష్టపడి పని చేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పోల సత్యనారాయణ, పి.చాకరాపల్లి సర్పంచ్ కె.మోహనరావు, యువజన విభాగం బలిజిపేట మండలం అధ్యక్షుడు రణదేవ్ లక్ష్మణరావు, ఉమ్మడి జిల్లా పార్టీ సీనియర్ జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల ప్రాణాలతో చెలగాటమా..?
విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ప్రాణాధారమైన నీళ్లు కలుషితమవుతున్నాయని, ఆరోగ్యాన్నిచ్చే పాలు కల్తీ కావడంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోయే దుస్థితి నెలకొందని తూర్పారబట్టారు. రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని విమర్శించారు. ధర్మపురిలోని సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పరిస్థితిని సమీక్షించి, సురక్షిత నీటి సరఫరా, ఆహార భద్రత పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. పరిశుభ్రత ప్రమాణాలను కఠినంగా అమలు చేసి, మరిన్ని ప్రాణనష్టాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి అద్భుతాలు ఆశించడం లేదని, కనీసం ప్రాణ రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ● ఎవరైనా బతకడానికి పాలు, నీళ్లు తాగుతారని, కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రెండూ ప్రాణాంతకంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటుంటే ప్రజాప్రతినిధులు ఆట విడుపు కార్యక్రమాల్లో ఆనందిస్తున్నారని, అధికార యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తలెత్తిన సమస్యను పరిష్కరించాల్సింది పోయి... ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే.... శ్రీకాకుళంలో కలుషిత నీటి కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయి, దాదాపు 200 మంది ఆస్పత్రుల పాలయ్యారని తెలిపారు. రాజమహేంద్రవరం నగరంలో కల్తీ పాలు తాగి ఏడుగురు మరణించగా, మరికొందరు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రాణాలు నిలపాల్సిన నీరు, పోషణ ఇవ్వాల్సిన పాలు మరణానికి కారణమవడం ప్రభుత్వ నిర్లక్ష్యపాలనకు నిదర్శనమన్నారు. ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయనగరం జిల్లా గుర్ల మండలం డయేరియా ప్రబలి 11 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వంలో చలనంలేకపోవడం ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తుందన్నారు. అప్పట్లో గుర్లలో పర్యటించిన డీప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఈవిషయంపై దృష్టి సారించకపోవడం అటువంటి పరిస్థితులే మరల పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మరణించిన కుటుంబాలకు ఆర్థిక ఆసరా కల్పించి అండగా నిలిచామని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర అంటే ఎందుకంత వివక్ష కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబుకు గిరిజనలున్నా... ఉత్తరాంధ్ర ప్రాంతమన్నా నిర్లక్ష్యం తగదని మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో గల కురుపాం గిరిజన ఆశ్రమపాఠశాలలో ఇటీవల 16 మంది విద్యార్థినులు డయేరియాతో అస్వస్థతకు గురై, వారిలో ఐదుగురిని ఆస్పత్రికి తరలించిన విషయాన్ని ప్రస్తావించారు. గతంలో కూడా ఇదే పాఠశాలలో కలుషిత నీటి కారణంగా ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, దాదాపు 100 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారని గుర్తుచేశారు. ఇంతటి దారుణ ఘటనల అనంతరం కూడా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇదే విషయమైన ఎస్సీ, ఎస్టీ కమిషన్తో పాటు హ్యూమన్రైట్స్ ప్రతినిధులకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారన్నారు. సాక్ష్యాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సొంత జిల్లాలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నా పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. కలుషిత నీటి ఘటన తరువాత వసతి గృహాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు వసతి సౌకర్యాలు మెరుగుపరుస్తామంటూ జారీ చేసిన జీవో నీటిపై రాతల్లా మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలకు బాధ్యులు ఎవరు చంద్రబాబు..? టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన 22 నెలల్లో రాాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లు, విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్, కలుషిత నీరు, అపరిశుభ్రత కారణంగా దాదాపు 25 ఘటనలు చోటుచేసుకున్నాయని జెడ్పీచైర్మన్ పేర్కొన్నారు. 15 జిల్లాల్లో 900 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ఈ అంశాన్ని జాతీయ మీడియా కూడా ప్రధానంగా ప్రస్తావించిందన్నారు. విజయనగరంతో పాటు చేబ్రోలు, విజయవాడ, గుంటూరు, గుర్ల, శ్రీకాకుళం, తురకపాలెం ప్రాంతాల్లో డయేరియా ప్రబలిందని, వందలాది మంది అస్వస్థతకు గురై, డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయని తెలిపారు. ముఖ్యంగా కలుషిత నీరు, అపరిశుభ్రతే ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ఈ ఘటనలకు బాధ్యులెవరని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు భరోసా కరువు కల్తీ పాలు, కలుషిత నీళ్లు తాగి ప్రాణాలు కోల్పోతున్నా వీడని నిర్లక్ష్యం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల జీవితాలతో ఆటలు డయేరియా ప్రభలుతున్నా కానరాని నివారణ చర్యలు స్పందించని ప్రజాప్రతినిధులు.. కనిపించని అధికార యంత్రాంగం ప్రజల ప్రాణాలు కాపాడండి: జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ప్రధానంగా విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. విద్యార్ధులకు అవసరమైన సదుపాయాలు కల్పించకపోగా.... మధ్యహ్న భోజనపథకాన్ని భ్రష్టుపట్టిస్తోందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రాథమిక సదుపాయాలు కల్పించకపోవడంతో పేదలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చేతి చమురువదిలించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఒక్క యూరియా బస్తా ఇవ్వలేని ప్రభుత్వం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైందని చెప్పారు. మొక్కజొన్నలు క్వింటా రూ.2400 మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో సిండికేట్గా ఏర్పడిన దళారులు రూ.1500కే రైతుల నుంచి పంటను దోచుకుంటున్నారని వాపోయారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి. సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి వర్రి నర్సింహమూర్తి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ కక్షతో నిలిపేసిన పింఛన్ల పంపిణీ
గుర్ల: రాజకీయ కక్షతో నిలిపేసిన పింఛన్లను హైకోర్టు తీర్పుతో తిరిగి పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పున్నపురెడ్డిపేట, గరికివలస, పాలవలస, చోడవరం, గుజ్జింగివలస గ్రామాల్లో ఎనిమిది స్పౌజ్ పింఛన్లను ఆయా గ్రామాలకు చెందిన కూటమి నేతలు రాజకీయ కక్షతో ఏడాది క్రితం నిలిపివేశారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికి కూటమి నేతలకు తలొగ్గి మండల, జిల్లా అధికారులు ఎనిమిది మంది పింఛన్లు పంపిణీ చేయడానికి నిరాకరించారు. బాధితులు మండల, జిల్లా అధికారులకు అనేకసార్లు ఈ సమస్యపై విన్నవించుకున్నప్పటికి స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేయడానికి చొరవ చూపలేదు. దీంతో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు అర్హత ఉన్న ఈ ఎనిమిది పింఛన్లు మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిలిపేసిన పింఛన్లు వెంటనే పంపిణీ చేయాలని శుక్రవారం తీర్పునిచ్చింది. ఏడుగురు పింఛన్దారులకు ఫిబ్రవరి నెల నుంచి పింఛన్ నగదు అందించాలని తీర్పులో పేర్కొంది. గరికివలసకు చెందిన పింఛన్దారుడు కేసు ఇంకా పెండింగ్లో ఉంది. పునరుద్ధరించిన ఏడు పింఛన్ల నగదును వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, జెడ్పీటీసీ శీర అప్పలనాయుడు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద శనివారం అందజేశారు. హైకోర్టు తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురు దెబ్బని వారు పేర్కొన్నారు. పేదలకు అందుతున్న పింఛన్లను రాజకీయం చేసి నిలిపివేయడం దుర్మార్గమన్నారు. హైకోర్టు తీర్పుతో పింఛన్లు నగదు అందుకోవడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు పేర్కొన్నారు. పేదల కోసం పోరాటం చేసిన వైఎస్సార్సీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గుర్ల మండలంలో ఎనిమిది పింఛన్లు నిలిపివేత హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ నేతలు పింఛన్లు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశం -
ఇంటర్ పరీక్ష కేంద్రం పరిశీలన
సీతానగరం: మండలంలోని జోగింపేటలోని ఎస్ఓఈ విద్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను కలెక్టర్ ప్రభాకరరెడ్డి శనివారం పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో వసతలపై ఆరా తీశారు. పరీక్షల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. గిరిజనదారుల్లో ప్రసవ వేదన ● మార్గంమధ్యలోనే బిడ్డకు జన్మనిచ్చిన గిరిజన మహిళ కొమరాడ: గిరిజన గ్రామాల గర్భిణులకు సకాలంలో వైద్యసేవలు అందడం లేదు. పురిటి కష్టాలు వీడడం లేదు. రాళ్లదారుల్లోనే నరకయాతన పడుతూ పిల్లలకు జన్మనిస్తున్నారు. దీనికి కొమరాడ మండలంలో శనివారం చోటుచేసుకున్న ఘటనే నిలువెత్తు నిదర్శనం. పూడేసు పంచాయతీ కోన గ్రామానికి చెందిన నిండు గర్భిణి ఆరిక వనితకు తెల్లవారు జామున పురిటినొప్పులు వచ్చాయి. కూనేరు రామభద్రపురం ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు వెంటనే ఫీడర్ అంబులెన్స్కు ఫోన్చేసి సమాచారం ఇచ్చారు. అంబులెన్సు చేరుకునేసరికి కాస్త ఆలస్యమైంది. అప్పటికే పురిటినొప్పులు ఎక్కువైనా... ఆస్పత్రికి చేర్చేదారిలేక అంబులెన్స్లోనే తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. కప్పలవాడు గ్రామ సమీపంలోకి వచ్చేసరికి నొప్పులు ఎక్కువ కావడంతో స్థానిక మహిళల సాయంతో ప్రసవం జరిపారు. ఆడబిడ్డ జన్మించింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యసేవల కోసం ఇద్దరినీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంతర్వర్సిటీ చెస్ పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థులు రాజాం సిటీ: తమిళనాడు రాష్ట్రం భారతీదశన్ యూనివర్సిటీలో ఈ నెల 2 నుంచి 5 వరకు జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల చెస్ పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థులు షణ్ముఖ శ్రీనివాస్, మణికంఠ ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్ శనివారం తెలిపారు. ఇటీవల టెక్కలి ఐతమ్ కళాశాలలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చూపారన్నారు. చెస్ జట్టుకు కెప్టెన్గా షణ్ముఖ శ్రీనివాస్ బాధ్యతలు నిర్వర్తించనున్నారన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్తో పాటు ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, పీడీ బీహెచ్ అరుణ్కుమార్, విద్యార్థులు అభినందించారు. టీచర్కు ఉమెన్ ఆఫ్ ఎక్స్లెన్స్ అవార్డు విజయనగరం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (మార్చి 8వ తేదీ) పురస్కరించుకుని హైదరాబాద్లో పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఉత్సవాల్లో అందజేసే ఉమెన్ ఆఫ్ ఎక్స్లెన్స్ అవార్డుకు విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన సముద్రాల గిరిజా ప్రసన్న ఎంపికయ్యారు. హర్యానా పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు కుమార్తె, తెలంగాణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సురభివాణిదేవి, సినీనటి ఆమని తదితరుల చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేయనున్నారు. ఉపాధ్యాయ, సామాజిక రంగంలో చేస్తున్న కృషికి ఆమెను అవార్డుకు ఎంపిక చేశారు. -
సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల్య ఆహారం
పార్వతీపురం రూరల్ : గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార భద్రత కల్పించేందుకు ఫుడ్ బాస్కెట్ (ఆహార బుట్ట) విధానం ఎంతగానో దోహదపడుతుందని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.సుధారాణి తెలిపారు. జిల్లా సమాఖ్య కార్యాలయంలో వీఓ ఉప కమిటీలు, ఆరోగ్య పోషణ ఐసీఆర్పీలకు శనివారం నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై సిబ్బంది ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి సాధించవచ్చని ఆర్వైఎస్ఎస్ డీపీఎం ఎం.శ్రావణకుమార్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఏడాది పొడవునా పోషక వనాలు (న్యూట్రీ గార్డెన్) పెంచేలా రైతులకు సహకరించాలన్నారు. ఆర్టీఓ హేమసుందర్ మాట్లాడుతూ ఫుడ్ బాస్కెట్ ప్రయోజనాలను వివరించారు. సెర్ప్, ఆర్వైఎస్ఎస్ సిబ్బంది సమన్వయంతో సేవలందించాలని డీపీఎం జయశ్రీ కోరారు. ప్రకృతి వ్యవసాయంలో మహిళల పాత్ర, బయో ఇన్పుట్ కేంద్రాల ప్రాముఖ్యతపై ఏడీపీఎం పి.ప్రవీణ్కుమార్, ఉత్పత్తుల మార్కెటింగ్పై తిరుపతి, శిక్షణ అంశాలపై శోభ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల ఏపీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫైలేరియా రహిత జిల్లాయే లక్ష్యం : కలెక్టర్
బలిజిపేట: జిల్లాలో ఫైలేరియా వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. పెదపెంకి గ్రామాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఫైలేరియా బాధితురాలు బోనుమద్ది ఈశ్వరమ్మ ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వ్యాధి తీవ్రత, ప్రస్తుతం ఆమెకు అందుతున్న వైద్యసేవలు, మందుల సరఫరా తీరుపై ఆరా తీశారు. మందులను క్రమం తప్పకుండా వాడుతున్నది లేనిది వారిని అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు పలు సూచనలు అందిస్తూ జిల్లాలోని ఫైలేరియా బాధితులందరికి ఎటువంటి అంతరాయం లేకుండా అవసరమైన మందులను నిరంతరం సరఫరా చేయాలన్నారు. దోమల నివారణకు గ్రామాల్లో పారిశుధ్య పనులపై దృష్టి సారించాలన్నారు. ఫైలేరియా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లాను ఫైలేరియా రహితంగా తీర్చిదిద్దేందుకు క్షేత్ర స్థాయి సిబ్బంది అంకితభావంతో పని చేయాలని సూచించారు. సమీక్షలో ఆగ్రహించిన కలెక్టర్ వివిధ శాఖలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గ్రామంలో వ్యాధి ప్రబలడం, పారిశుధ్యంపై ఆగ్రహించారు. పరిసరాల పరిశుభ్రత ఇదేనా అంటూ కార్యదర్శిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు. మహిళా సంఘాలు కొత్త తరహాలో వ్యాపారాలను ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. ఉపాధి పనుల నిర్వహణ, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై అధికారులపై ఆగ్రహించారు. పింఛన్ల పంపిణీ గ్రామంలో పలువురు వృద్ధుల ఇంటి వద్దకు వెళ్లి కలెక్టర్ ప్రభాకరరెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్థిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నేరుగా వారికి పింఛన్లు అందించాలన్నారు. నడవలేని స్థితిలో ఉండే వారు, దివ్యాంగుల ఇంటికి ఉదయమే వెళ్లి ముందుగా వారికి అందించాలని సూచించారు. సచివాలయ సిబ్బంది సేవా దృక్పథంతో పని చేయాలన్నారు. గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కరరావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి విజయ్మోహన్, ఇన్చార్జ్ డీఎంఓ రామచంద్రరావు, డ్వామా పీడీ సుధారాణి, మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
లక్కవరపుకోట : మండలంలోని తలారి గ్రామంలో అచ్చియ్యమ్మ పేరంటాలు తీర్థం సందర్భంగా శనివారం నిర్వహించిన ఎడ్లు పరుగు పందెం పోటీలు ఉల్లాసంగా సాగాయి. ఈ పోటీల్లో అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు చెందిన 11 ఎడ్లు బళ్లు పాల్గొన్నట్టు నిర్వాహుకులు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన ఎడ్లు బళ్లు యజమానులకు వరుసగా రూ.12వేలు, రూ.10వేలు, రూ.8వేలు, రూ.6వేలు, రూ.4వేలు చొప్పున నగదు బహుమతులను అందజేశారు. ఫైర్ అండ్ సేఫ్టీ డిగ్రీకి సువర్ణావకాశం విజయనగరం గంటస్తంభం: పారిశ్రామిక భద్రత రంగంలో నిపుణులను తీర్చిదిద్దే దిశగా ఐఐఎఫ్ఎస్ఈ, కళింగ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఐఐఎఫ్ఎస్ఈ డైరెక్టర్ శ్రీను మహంతి, కళింగ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.సందీప్ గాంధీ సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యంతో ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్లో మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సు ప్రారంభమైంది. యూజీసీ గుర్తింపు పొందిన ఈ కోర్సు ఎన్ఎస్క్యూఎఫ్ లెవల్–7 సమాన హోదాను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారు ఉద్యోగం వదలకుండా ఆన్లైన్ విధానంలో చదివే అవకాశం కల్పించారు. ఇండస్ట్రీయల్ సేఫ్టీ, హజార్డ్ మేనేజ్మెంట్, ఫైర్ ఇంజినీరింగ్ రంగాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఇది మార్గం చూపుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కోర్సులలో చేరాలనుకున్న ఆసక్తి గల అభ్యర్థులు 9704106261 నంబరును సంప్రదించాలని సూచించారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఐఎఫ్ఎస్ఈఇండియా.ఇన్లో వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. -
కష్టపడి పనిచేసినా టీడీపీలో గుర్తింపు ఉండదు
● అందుకే పార్టీని వీడుతున్నాం ● సీహెచ్సీ మాజీ చైర్మన్ మిత్తిరెడ్డి వెంకటరమణ గజపతినగరం: తెలుగుదేశం పార్టీలో 1989వ సంవత్సరం నుంచి క్రీయాశీలక సభ్యత్వం తీసుకొని పార్టీ ఆదేశాలకు అనుగుణం కష్టపడి పనిచేశాం... పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేశాం... ఎంత కష్టపడి పనిచేసినా పార్టీలో గుర్తింపు ఉండదు.. కొత్తగా వచ్చిన నాయకులకు ఉన్నంత విలువు సీనియర్లకు ఇవ్వరు.. అవమానాలు భరించి పార్టీలో ఇమడలేమని అర్థమైంది.. అందుకే పార్టీని వీడుతున్నామంటూ గజపతినగరం కమ్యూనిటీ హెల్త్సెంటర్ (సీహెచ్సీ) మాజీ చైర్మన్ మిత్తి రెడ్డి వెంకటరమణ, విశ్రాంత అధ్యాపకుడు యడ్ల పైడిపునాయుడు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ కర్రి సత్యనారాయణ పేర్కొన్నారు. గజపతినగరంలోని ఓ ప్రైవేటు భవనంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీడీపీలో చేరిన కొంతమంది నాయకులు వ్యక్తిగత కక్షతోను, స్వార్థపూరిత రాజకీయాలతో తమను మంత్రి నుంచి దూరం చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. పార్టీ కార్యకర్తలతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామని, ఇక పార్టీకి శాశ్వతంగా దూరమవుతామని స్పష్టంచేశారు. మంత్రి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న విషయం గుర్తించలేకపోతున్నారన్నారు. టీడీపీలో కలుషిత రాజకీయం ఎక్కువైందని వాపోయారు. చాలామంది పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో మదుపాడకు చెందిన వలిరెడ్డి మురళి, ఇ.గడ్డినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తం కావాలి
జియ్యమ్మవలస రూరల్: వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులకు చదువుతో పాటు మంచి ఆరోగ్యం అందించాలని ఎస్సీ వసతిగృహ సంక్షేమ అధికారి శంకర్రావు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.శ్యామల ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం చినమేరంగి హాస్టల్ను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇస్తున్న మెనూ, వారు వినియోగిస్తున్న రూంల ను ఆమె పరిశీలించారు. స్టడీ అవర్స్ నిర్వహించి శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూఓ స్వర్ణమని, సంక్షేమ అధికారి కె.శంకర్రావు పాల్గొన్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా సాలూరు: డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో ఒక్కొక్కరికి పదివేల రుపాయిలు చొప్పున ఏడుగురికి 70 వేల రుపాయిలను జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జరిమానా విధించినట్టు పోలీసులు శుక్రవారం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో ఏడుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకోవడం జరిగిందన్నారు. వీరిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా వారికి జరిమానా విధించారని తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇటువంటి డ్రైవ్లు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ ఐటీఐ కళాశాల నైపుణ్య కేంద్రంలో జూనియర్ సాఫ్ట్వేర్ డెవలెపర్ కోర్సుకు మూడు నెలల శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఐటీఐ ప్రిన్సిపాల్ టి.వి.గిరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి, ఇంటర్, అంతకంటే పై చదువులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత ధృవపత్రాలు, తాధార్ కార్డు, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలతో విటి.అగ్రహారం, విజయనగరం ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు వచ్చే నెల 5వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. 413 మంది విద్యార్థులు గైర్హాజరు పార్వతీపురం రూరల్ : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర మూడో పరీక్షకు మొత్తం 413 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 840 మంది విద్యార్థులకుగాను 760 మంది హాజరు కాగా, 80 మంది పరీక్షకు రాలేదు. ఒకేషనల్ విభాగంలో 2,957 మందికి గాను 2,624 మంది హాజరు కాగా, 333 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 3,797 మంది విద్యార్థుల్లో 3,384 మంది పరీక్షకు హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి వై.నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. చిన్న పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ తోడ్పాటు పార్వతీపురం రూరల్ : చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో తోడ్పాటు అందిస్తాయని జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ సీతారాం తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కల్లా జగపతి అధ్యక్షతన నిర్వహించిన ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పారిశ్రామికవేత్తలుగా ముందుకు వచ్చే వారికి రూ.3 లక్షల వరకు రుణ సదుపాయంతో పాటు రాయితీ కల్పిస్తామన్నారు. నాణ్యమైన ఉత్పత్తుల తయారీ కోసం కేంద్ర ప్ర భుత్వం జెడ్ (జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్) సర్టిఫికెట్ను ఉచితంగా జారీ చేస్తోందని వివరించారు. కార్యక్రమంలో ఐపీఓ బ్రహ్మ, ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్.సాగర్, సిబ్బంది సయ్యద్ చాన్, రమణ, దాడి సాయి, వివిధ సంఘాల ప్రతినిధులు గౌరీశ్వరరావు, గణపతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం మారింది.. రహదారి నిర్మాణం ఆగింది...
● గత వైఎస్సార్సీపీ పాలనలో ప్రారంభమైన పనులు ● కూటమి పాలనతో పడకేశాయి.. ● నెరవేరని గిరిజనుల కల శృంగవరపుకోట: గిరిశిఖర గ్రామాల ప్రజల దశాబ్దాల కల ఆ రహదారి. వైఎస్సార్సీపీ పాలనలో తొలిసారిగా దారపర్తి పంచాయతీలో గిరిశిఖర గ్రామాలకు రోడ్డు వేయాలని అప్పటి ప్రభుత్వం సంకల్పించింది. నిధులు కేటాయించింది. భూములు బదలాయించింది. పనులు కూడా ప్రారంభించింది. ఇంతలోనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ పనులపై కక్ష కట్టింది. పనులు పూర్తయితే ఎక్కడ గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందోనని ఆలోచన చేసింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఎక్కడి పనులు అక్కడే వదిలేసింది. దీంతో గిరిజనం దశాబ్దాల కల నెరవేరలేదు. మళ్లీ ప్రయాణ కష్టాలు మొదలయ్యాయి. జగనన్న పాలనలో రోడ్డు పూర్తవుతుందని సంబరపడ్డ ఆ గిరిజనానికి నిరాశే మిగిలింది. జగనన్న పాలనలో.. మండలంలోని దారపర్తి పంచాయతీ పరిధి గిరిశిఖర గ్రామాలకు రోడ్డు వేయాలని దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడ వరకూ ఉన్న 12 గ్రామాలకు 7.5కి.మీ దారిలో రహదారి నిర్మాణం చేయాలన్న గిరిజనులు కొన్ని దశాబ్దాలుగా కోరుతున్నా చంద్రబాబు సర్కారు హయాంలో ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. 2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సదరు రోడ్డుకు పి.ఎం.జి.ఎస్.వై–11లో రూ.489.08లు లక్షలు మంజూరు చేసిన పీఆర్ అధికారులు అటవీ శాఖ అనుమతులను కోరారు. అటవీశాఖ అనుమతులు లేక పనులు నిలిచిపోయాయి. ముఖం చాటేసిన చంద్రబాబు ప్రభుత్వం దారపర్తి రోడ్డు పనులు ప్రారంభమై తొలుత ఎర్త్ వర్క్ శరవేగంగా జరిగింది. ఇచ్చిన సమయం అయ్యిందన్న నెపంతో అధికారులు పనులకు మోకాలడ్డారు. తర్వాత ప్రభుత్వం మారింది. కూటమి సర్కారు గిరిజనం సమస్యలపై ముఖం చాటేసింది. దీంతో ఎక్కడి గొంగళి అక్కడే అన్న తీరుగా వర్షాలకు చేసిన ఎర్త్ వర్క్ దెబ్బతింది. రోడ్డులో రాళ్లు రప్పలు తేలాయి. గిరిజనానికి కష్టాలు మిగిలాయి. డోలీ మోతలు మళ్లీ మొదలయ్యాయి.తొలిసారిగా గిరిజనానికి పలకరింపు చరిత్రలో తొలిసారిగా మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కాలినడకన 2020 ఫిబ్రవరి 1వ తేదీన దబ్బగుంట గ్రామానికి వెళ్లి రోడ్డు పరిశీలించారు. 2023 సెప్టెంబర్ 19న గిరిశిఖర గ్రామాలకు వెళ్లి గడప గడపకు వైఎస్సార్సీసీ కార్యక్రమం నిర్వహించి గిరిజనం వెతలు చూసి, పట్టుబట్టి రోడ్డు పనులపై పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులకు, లేఖలు రాసి, అనుమతులు సాధించటంతో దబ్బగుంట–పల్లపుదుంగాడ రోడ్డులో కదలిక వచ్చింది. అటవీశాఖ రోడ్డు నిర్మాణంలో కోల్పోతున్న 6హెక్టార్లు భూమిని ఎస్.కోట మండలంలో పెదఖండేపల్లి రెవెన్యూ గ్రామంలో సర్వే నెం.108లో ఉన్న 15ఎకరాల భూముల్ని అప్పగించటంతో దబ్బగుంట రహదారి సమస్యకు అడ్డంకి తొలగింది. -
పెద్దల ఆక్రమణలో ప్రభుత్వ భూమి
సీతానగరం: మండలంలోని బగ్గందొరవలస గ్రామంలోని ప్రభుత్వ భూమిపై పెద్దల కన్ను పడింది. అంతే.. యంత్రాలతో పగలురాత్రీ తేడా లేకుండా చదును చేయించేస్తున్నారు. రూ.కోట్ల విలువైన భూమిని సాగుభూమిగా మార్చేస్తున్నారు. విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... బగ్గందొరవలస గ్రామంలో 1/1 సర్వే నంబర్లో 15.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దానిని గయ్యాల భూమిగా రెవెన్యూ రికార్డులో నమోదుచేశారు. దానిపై పెద్దల కన్నుపడింది. అధికార బలంతో జేసీబీల సాయంతో చదును చేసేశారు. పనిలోపనిగా పక్కనే ఉన్న మరో 4.84 ఎకరాల భూమిని ఆక్రమణదారుల చేతుల్లోకి తీసుకున్నారు. 1/8లో 1.11 ఎకరాలు, 1/10 లో 1.04 ఎకరాలు, 1/11లో 1.11 ఎకరాలు, 1/14లో 1.14 ఎకరాలు, 2/1లో 0.44 ఎకరాల భూమి బ్యాంకర్ల వేలంలో రాజమండ్రికి చెందిన భద్రగిరి దివాకర్ దక్కించుకున్నారు. దివాకర్ సంబంధిత భూమిని ఎవరికి అప్పగించారా? విక్రయించారా? తెలియదు కానీ లోకాయుక్తలో ఉన్న భూమిపై ఉన్నమట్టిని తీయడం, మడులుగా తయారుచేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఆ భూమి కూడా వదలకుండా చదునుచేస్తున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆక్రమణల అంశాన్ని తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా అది ప్రభుత్వ భూమి అని, ఎవరు ఆక్రమించినా శిక్షతప్పదని హెచ్చరించారు. వీఆర్వోను పంపించి ఆక్రమణలను అడ్డుకుంటామన్నారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో మెరుగైన ఫలితాలు సాధించాలి
విజయనగరం: స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆ దిశగా అందరూ కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి కోరారు. ఇదే విషయమై ఆయన నగరంలోని తన కార్యాలయంలో కార్పొరేషన్ సిబ్బంది, శానిటేషన్ కార్యదర్శులతో శుక్రవారం సమావేశమై పలు సూచనలు చేశారు. ఇంటింటి చెత్త సేకరణ శతశాతం తరలించేలా చూడాలని, మరుగుదొడ్ల నిర్వహణలో మెరుగైన విధానాలు తీసుకురావాలని, ప్రజలతో భాగస్వాములై వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించాలని, పురమిత్ర, ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందే ప్రజల సమస్యలను పరిష్కరించేలా చూడాలన్నారు. డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్లు శతశాతం వసూలు చేయాలన్నారు. సమావేశంలో ప్రజారోగ్యాధికారి కొండపల్లి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
47 మంది డిప్యూటీ వార్డెన్ల మార్పు
సాక్షి, పార్వతీపురం మన్యం: ఇటీవల కాలంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో జరుగుతున్న వరుస ఘటనలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఐటీడీఏ పరిధిలోని డిప్యూటీ వార్డెన్లను మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి ఒకేచోట తిష్ట వేయడం.. పైరవీలు చేసుకుని అక్కడే ఉండిపోవడానికి ప్రాధాన్యమివ్వడం, పర్యవేక్షణను గాలి కొదిలేయడంతో ఆశ్రమ పాఠశాలలు తరచూ వివాదాస్పదమవుతున్నాయి. నీలకంఠాపురం ఘటన తర్వాత మరిన్ని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఐటీడీఏ పరిధిలోని 47 మంది డిప్యూటీ వార్డెన్లను ఒకేసారి మార్పుచేసింది. ఆ స్థానంలో మరోచోట నుంచి ఉపాధ్యాయులను నియమించింది. వారికి అనుకూలమైన చోటుకు ప్రాధాన్యమిస్తూనే.. బదిలీ చేసిన స్థానంలోకి అయిష్టత వ్యక్తం చేసిన వారినీ కచ్చితంగా వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. కొంతమందికి చీటీలు వేసి మరీ.. ఆ స్థానానికి పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పరీక్షల సమయంలో డిప్యూటీ వార్డెన్ల మార్పుపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న విద్యార్థుల విద్యాప్రమాణాల మీద కొత్తగా వచ్చిన వారికి అవగాహన ఉండదని.. దీనివల్ల ప్రత్యేక శ్రద్ధ దూరమవుతుందని, ఈ ప్రభావం ఫలితాలపై పడుతుందని చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే ఆశ్రమ పాఠశాలల్లో రాత్రి పూట కచ్చితంగా ఉపాధ్యాయులు ఉండాలన్న నిబంధనను గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తీసుకొచ్చారు. ఉదయం 9 గంటల్లోపు ఉపాధ్యాయులంతా హాజరైనట్లు బృంద ఫొటోను తీసుకుని గ్రూపులో అప్లోడు చేయాలని పీవో యశ్వంత్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. కొంతమంది ఆలస్యంగా అప్లోడు చేయడం.. కొందరు వదిలేయడంపై మెమోలు కూడా జారీ చేశారు. ఇప్పుడు ఒకేసారి పెద్ద సంఖ్యలో డిప్యూటీ వార్డెన్లను మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపర్చకుండా ఉపాధ్యాయులను బలిచేయడం ఎంత వరకు సమంజసమని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఆర్మీ మాజీ హవల్దార్ మృతి
గజపతినగరం : మండలంలోని బంగారమ్మపేట గ్రామానికి చెందిన ఆర్మీ మాజీ హవల్దార్ తాలాడ గోపాలరావు(70) విశాఖపట్నంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కొన్నాళ్లుగా విశాఖపట్నం అక్కిరెడ్డిపాలెంలో నివాసం ఉంటున్న గోపాలరావు పనుల నిమిత్తం బీహెచ్వీ వైపు వెళ్లారు. మార్గమద్యలో జీవీఎంసీ చెత్త లోడు లారీ వెనుక భాగం నుంచి గోపాలరావు స్కూటీని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించినట్టు చెప్పారు. గోపాలరావుకు భార్య రమణమ్మతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
రామభద్రపురం: మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ద్విచక్ర వాహనాన్ని వ్యాన్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయలైన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రామభద్రపురం చొక్కాపు వీధికి చెందిన చొక్కాపు రామారావు పని నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై బుసాయవలస వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. దాంతో రామారావుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రధమ చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు బాడంగి సీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం : ఎస్పీ
పార్వతీపురం రూరల్ : పోలీసు సిబ్బంది సంక్షేమానికి, వారి ఆరోగ్య, శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బంది తమ వ్యక్తిగత, వృత్తిపరమైన ఇబ్బందులను ఎస్పీకి విన్నవించుకున్నారు. సిబ్బంది నుంచి విజ్ఞాపనలను స్వీకరించిన ఎస్పీ, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా అనారోగ్య కారణాలు, బదిలీలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వచ్చాయని, వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేలా సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్ఐ నాయుడు, సీసీ సంతోష్కుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
● మనవడి కోసం.. అవ్వ సాహసం..
ఆ ఊరి నుంచి బాహ్య ప్రపంచంలోకి రావాలంటే నాగావళి నది దాటాల్సిందే. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు కావడంతో విద్యార్థులు నది దాటేందుకు అవస్థలు పడుతున్నారు. ఇదంతా ఒకటైతే, ఓ అవ్వ.. దివ్యాంగుడైన తన మనవడి కోసం శక్తిని కూడదీసుకుని పెద్ద సాహసమే చేస్తోంది. కొమరాడ మండలం కొట్టు గ్రామానికి చెందిన డొంక కేశవ అనే దివ్యాంగుడు ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం విశాఖపట్నంలో ఉంటున్నారు. గ్రామంలో నాన్నమ్మ వెంకటమ్మ వద్దే కేశవ ఉంటున్నాడు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతుండడంతో.. నడవలేని స్థితిలో ఉన్న మనవడిని తీసుకుని, ఆ వయసులోనూ ఆ వృద్ధురాలు ప్రతిరోజూ నది దాటి వస్తోంది. పరీక్షకు తీసుకెళ్లి, మరలా ఇంటికి చేర్చుతోంది. మనవడి చదువు కోసం అవ్వ పడుతున్న కష్టాన్ని చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. – సాక్షి, పార్వతీపురం మన్యం -
చిన్నారికి సాయం
బలిజిపేట: కిడ్నీ వ్యాధితో బాదపడుతున్న చిన్నారి భారతి కుటుంబానికి సంజీవనాయుడు సేకరించిన మొత్తం రూ.22వేలు వితరణగా అందించారు. ఈ నెల 23వ తేదీన సాక్షి దినపత్రికలో ‘సాయం కోసం చిన్నారి ఎదురుచూపు’ శీర్షికన ప్రచురితమైన కథనంకు స్పందించిన పెదపెంకి గ్రామానికి చెందిన నేతాజీ గ్రంథాలయ వ్యవస్థాపకుడు సంజీవనాయుడు గ్రామస్తుల నుంచి రూ.22,616లు సేకరించారు. ఈ మొత్తాన్ని రేగిడి మండలం సంకిలి గ్రామం వెళ్లి బాధిత చిన్నారి భారతి కుటుంబానికి అందించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన పెదపెంకి ప్రజలకు సంజీవనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. -
టెన్త్ పరీక్షల ఏర్పాట్లు పూర్తి : డీఈఓ
విజయనగరం అర్బన్: వచ్చే నెల మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఈఓ మాణ్యికంనాయుడు తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వాహణలో భాగంగా నియమితులైన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు స్వయంగా సందర్శించి మౌలిక వసతులు సమృద్ధిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలన్నారు. ప్రతి కేంద్రాన్ని నోఫోన్ జోన్గా పరిగణించి మొబైల్ ఫోన్ తీసుకు రాకుండా కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష ప్రారంభమైన అర్ధ గంట తర్వాత విద్యార్థులను అనుమతించరాదన్నారు. -
హెచ్ఓలపై పని భారం
● ఒక హెచ్ఓ ఐదు మండలాల ఇన్చార్జ్ ● ఉద్యానవన సాగుపై నీలినీడలుసీతంపేట: జిల్లాలో హార్టీకల్చర్ ఆఫీసర్ల పోస్టులు, హార్టీకల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు ఎక్కువగా ఖాళీలు ఉండడంతో మిగిలిన వారికి పనిభారం ఎక్కువగా పడుతుంది. జిల్లాలో ఏడు ఉద్యానవనాధికారుల పోస్టులకు ఐదుగురు ఉన్నారు. వీరిలో ఒకరు ప్రసూతి సెలవులో ఉన్నారు. నలుగురు మాత్రమే విధుల్లో ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి నాలుగు నుంచి ఐదు మండలాలు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యానవన సాగుపై నీలినీడలు అలముకుంటున్నాయి. దీనిలో భాగంగా సీతంపేట హెచ్ఓ పి.జయశ్రీ ఏకంగా ఐదు మండలాలు ఇన్చార్జ్ విధులు నిర్వహిస్తున్నారు. ఈమెకు సీతంపేటతో పాటు పాలకొండ, వీరఘట్టం, భామిని, గురుగుబెల్లి మండలాలు పర్యవేక్షిస్తున్నారు. మిగతా మండలాల హెచ్ఓలది కూడా ఇదే పరిస్థితి. క్షేత్ర స్థాయిలో పండ్లతోటల పెంపకం పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు వివిధ ఉద్యానవన సాగు పంటలు, కూరగాయాల పంటలపై రైతులకు సలహాలు సూచనలు ఇవ్వచం వంటివి చేయాలి. రైతులకు అవగాహన, శిక్షణ వంటివి ఏర్పాటు చేయాలి. దీంతో తలకు మించిన భారంగా పరిణమిస్తుందని లోలోపల వారు మదనపడుతున్నారు. ఇక ఉద్యానవన విస్తరణాధికారుల పోస్టుల్లో ఒక్కరు కూడా లేకపోవడంతో వీరు పనులు కూడా హెచ్ఓలే నిర్వర్తించడం గమనార్హం. -
గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ సేవలు విస్తృతం
● డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డైరెక్టర్ రామమోహన్విజయనగరం టౌన్: గ్రామీణ ప్రాంతాల్లో సైతం బీఎస్ఎన్ఎల్ మరింత విస్త్రతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డైరెక్టర్ కె.రామమోహన్ (విజయవాడ) పేర్కొన్నారు. స్థానిక టెలిఫోన్ భవన్లో శుక్రవారం డీజీఎం, ఏజీఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిజిటల్ భారత్ నిధిలో భాగంగా సిగ్నల్ వ్యవస్థ లేని గ్రామీణ ప్రాంతాలలో 48 కొత్త టవర్స్ను ఏర్పాటు చేశామన్నారు. కొండకరకం, బడుకొండపేట గ్రామాల్లో సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా లేదని అందిన వినతుల మేరకు స్వీయ పర్యవేక్షణ చేసి, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సిగ్నల్ వ్యవస్థ లేని ప్రాంతాలను సైతం కవర్ చేస్తూ మరో 70 టవర్స్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ సంస్థ రెండు లక్షల మందికి పైగా వినియోగదారులను కలిగి ఉందన్నారు. ఫోర్జీ నెట్వర్క్తో ఇతర నెట్వర్క్లకు ధీటుగా పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో డీజీఎం దాలినాయుడు, ఏజీఎం మురళి తదితరులు పాల్గొన్నారు. -
అరాచక శక్తుల అడ్డాగా బొబ్బిలి
చికెన్బొబ్బిలి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో బొబ్బిలి ప్రాంతం అరాచక శక్తులకు అడ్డాగా మారిందని, మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలు, వేధింపుల అధికార పార్టీ అండగా నిలబడుతోందని, ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి అక్రమార్జనకు పాల్పడుతున్న పాలకులకు ప్రభుత్వ యంత్రాంగం తలూపుతోందని, పోలీసు యంత్రాంగాన్ని చెప్పుచేతల్లోకి తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ శంబంగి వెంకటచినప్పలనాయుడు ధ్వజమెత్తారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కోమటిపల్లిలో ఒకే రోజు జరిగిన రెండు సంఘటనల్లో గంజాయితో దొరికిన నిందితులను తమ పార్టీ సానుభూతిపరులని ఎమ్మెల్యే చొరవతో పోలీసులు వదిలేశారనాన్నరు. అక్కడే ఫార్మా విద్యార్థులను వేధించిన ఆ గ్రామ కమిటీ టీడీపీ అధ్యక్షుడి కుమారుడుని పోలీసులు ఏమీ చేయలేక ఎమ్మెల్యే చెబితే విడిచిపెట్టారన్నారు. ఇటీవల మున్సిపల్ వైస్చైర్మన్ కారు డ్రైవర్ తన భార్యను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, అతడి కుమారుడే సాక్ష్యం చెప్పినా నిందితుడు డ్రైవర్పై కేసు పెట్టలేదన్నారు. అభ్యుదయ పాఠశాలలో విద్యార్థుల మధ్య కొట్లాటను కోటలో రాజీ చేశారన్నారు. ఇలా వరుస సంఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని విమర్శించారు. పోలీసులను సొంత యంత్రాంగంలా.. ఎమ్మెల్యే పోలీసు యంత్రాంగాన్ని సొంత జాగీరులా వాడుకుంటున్నారని శంబంగి ఆరోపించారు. నేరాల్లో నిందితులను కాపాడేందుకు వారి చెప్పుచేతల్లో ఉన్న వారినే ఉంచుతున్నారని, మాట వినకపోతే సాగనంపుతున్నారన్నారు. ఇటీవల పట్టణ సీఐ సతీష్కుమార్ ఉదంతమే ఇందుకు సాక్ష్యమన్నారు. ఎమ్మెల్యే మాట వినకపోవడంతో సీఐని సాగనంపి, వారి కనుసన్నల్లో ఉండే రూరల్ సీఐని టౌన్కు తెచ్చుకున్నారని, దీంతో అరాచకవాదులకు, నేరప్రవృత్తి ఉన్న వారికి ధైర్యం వస్తోందన్నారు. భూకబ్జాల్లో నెంబర్ వన్ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భూకబ్జాలు పెరిగిపోయాయని, ఏకంగా పాలకులే కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భైరిసాగరం వద్ద గ్రామ కంఠంలో ఉన్న సంతతోట భూమిని ఆక్రమించి పక్క సర్వే నెంబరుతో విక్రయించేశారని, గతంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్న చెలికాని వెంకటరావు ఆ భూమిని రైతుల కోసం సంతతోటగా కేటాయిస్తు గ్రామకంఠంలో చేర్చారని ఇప్పుడు దాన్ని నిర్భయంగా తప్పుడు సర్వే నెంబర్లతో విక్రయించి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. మల్లంపేట రైతులకు 1991లో నాటి మంత్రి పెద్దింటి జగన్మోహనరావు హయాంలో 9 ఎకరాల డీ పట్టా భూమలును కేటాయించగా దాన్ని రైతుల నుంచి తిరిగి లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, బాధిత రైతులు లబోదిబోమంటు నిత్యం నిరసనలు తెలియజేస్తున్నారని తెలిపారు. రామన్నదొరవలసలో గిరిజనులకు ఇచ్చిన 20 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూములను తిరిగి వారి నుంచి బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. కలెక్టర్ దృష్టి సారించాలి.. బొబ్బిలిలో జరుగుతున్న అరాచకాలు, అధికార దుర్వినియోగం, భూకబ్జాలపై కలెక్టర్ దృష్టి సారించాలని శంబంగి కోరారు. గంజాయి, మహిళల పట్ల జరుగుతున్న వేధింపులు, అధికార పార్టీ ఆగడాలను కట్టడి చేయాలన్నారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అనైతిక కార్యక్రమాలను ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయించి దౌర్జన్యాలు, ఆక్రమణలు, భూకజ్జాలు, పోలీసుల పనితీరుపై విచారణ జరపాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు ఇంటి గోపాలరావు, సావు మురళీకృష్ణ, వైఎస్సార్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ శంబంగి వేణుగోపాలనాయుడు, కౌన్సిలర్లు కోట పెదరాములు, పాలవలస ఉమాశంకర్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి బొద్దల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గంజాయి ముఠాలు, మహిళలపై దౌర్జన్యాలు, వేధింపులు రూ.వందల కోట్ల భూకబ్జాలు ఎమ్మెల్యే చెప్పుచేతల్లో పోలీసు యంత్రాంగం కలెక్టర్ దృష్టి సారించాలి పాలకుల పాపాలపై మాజీ ఎమ్మెల్యే శంబంగి ధ్వజం -
గడువుకు ముందే జనగణన పూర్తిచేయాలి
పార్వతీపురం: జిల్లాలో చేపట్టబోయే జనగణన–2027 ప్రక్రియను నిర్ణీత గడువుకు ముందే పూర్తిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి మండల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులు, సాంకేతిక సహాయకులకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జనగణనపై మూడురోజుల పాటు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరగాలని, దీనికోసం ఏప్రిల్ 10వ తేదీలోగా దిగువస్థాయి సిబ్బందికి ఎన్యూమరేషన్ పట్ల శిక్షణ ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె.హేమలత, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్, డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ బీవీఎల్ సాయి శేఖర్ పాల్గొన్నారు. పార్వతీపురం రూరల్: అనారోగ్యంతో మరణించిన సాలూరు రూరల్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై) ఆర్.ఆదినారాయణ కుటుంబాని కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పోలీ స్ శాలరీ ప్యాకేజీ కింద మంజూరైన రూ.10 లక్షల బీమా చెక్కును ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి తన కార్యాలయంలో అధికారులతో కలిసి శుక్రవారం అందజేశారు. సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తూ ఆదినారాయణ 2025, జూలై 8న అనారోగ్యంతో మృతి చెందారు. ఎస్బీఐ పోలీస్ శాలరీ ప్యాకేజీ నిబంధనల ప్రకారం.. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.కోటి, సాధారణ మరణం సంభవిస్తే రూ.10 లక్షల ఆర్థిక సాయం అందుతుందని ఎస్పీ వివరించా రు. ఈ మొత్తాన్ని కుటుంబ అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించా రు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎస్పీ థామస్రెడ్డి, ఎస్బీఐ మేనేజర్ ఎం.ఆర్.దత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పార్వతీపురం రూరల్: సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 2న విజయవాడలో నిర్వహించనున్న ‘మహాధర్నా’ను జయప్రదం చేయాల ని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూ నియన్ పిలుపునిచ్చింది. పార్వతీపురం జిల్లా కలెక్టరేట్ వద్ద గత మూడు రోజులుగా చేపట్టిన రిలేనిరాహార దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి గంట జ్యోతిలక్ష్మి, సీఐటీయూ ఉపాధ్యక్షురాలు వి.ఇందిర మాట్లాడుతూ.. 2019 నుంచి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని, 2023 డిసెంబర్లో జరిగిన సమ్మె సంద ర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే వేతనాల పెంపుపై నిర్ణ యం తీసుకోవాలని, మిగిలిన మినీ అంగన్వా డీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చాల ని కోరారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రాట్యుటీ నిబంధనలు రూపొందించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయా లని విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజశేఖర్, వెంకటరమణ, గౌరమ్మ, సావిత్రి, పార్వతి, సత్యవతి, అంజలి, సూరిబా బు, తదితరులు పాల్గొన్నారు. విజయనగరం క్రైమ్: చీపురుపల్లి మండలం రావివలసలో పింఛన్ల పంపిణీ కోసం సీఎం చంద్రబాబునాయుడు శనివారం రానున్నారు. దీనికోసం 1200 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి శుక్రవారం తెలిపారు. ఏర్పాట్లను ఇన్చార్జి ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డితో కలిసి పరిశీలించారు. -
అదే నిర్లక్ష్యం..
సాక్షి, పార్వతీపురం మన్యం: గిరిజన విద్యార్థుల చదువుల ‘సంక్షేమం’పై నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఏదో ఒక ఘటన జరిగితే స్పందించడం... తర్వాత దానికి శాశ్వత పరిష్కారం చూపకుండా మిన్నకుండడం పరిపాటిగా మారింది. ఈ నిర్లక్ష్యధోరణే ఇప్పుడు కురుపాంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో మరోసారి కలకలం రేపింది. ఆరో తరగతి చదువుతున్న మండంగి హేమలత, కోలక అనసూయ, పొదిలాపు నవిత, కొండగొర్రె అనుశ్రీ, ఆరిక ప్రణవి, జుహితా దేవి తదితరులు కడుపు నొప్పి, వాంతులతో శుక్రవారం కురుపాం సీహెచ్సీలో చేరారు. వీరిలో కొందరికి డయేరియా లక్షణాలు ఉండడంతో వైద్యసేవలు అందిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఇదే పాఠశాల లో పచ్చ కామెర్లు ప్రబలాయి. ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. వందలాదిగా కామెర్లతో కురుపాం ఆస్పత్రితో పాటు.. జిల్లా ఆస్పత్రి, విశాఖ కేజీహెచ్లో చికిత్స కూడా పొందారు. మరలా ఇదే పాఠశాలలో డయేరియా వ్యాప్తి చెందడంతో తల్లిదండ్రులు ఆందోళనకు లోనయ్యారు. ఆశ్రమ పాఠశాలలో తాగునీటి నాణ్యత, ఆహార పరిశుభ్రతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే పాఠశాలలో వందల సంఖ్యలో విద్యార్థులు పచ్చ కామెర్ల బారిన పడ్డారు. తాగునీటి కలుషితం, అధ్వానం పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాల లేమి ఇందుకు కారణమని అంతా భావించారు. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం.. అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవ్వడంతో నీటి నమూనాలను పరీక్షకు కూడా పంపారు. ఇప్పటికీ దాని నివేదికను అధికారులు బహిర్గతం చేయలేదు. వైఎస్సార్ సీపీ నాయకుల ఫిర్యాదు మేరకు జాతీయ ఎస్టీ కమిషన్ కూడా విచారణకు వచ్చి, వెళ్లింది. తర్వాత ఎటువంటి సమాచారం.. ఘటన పట్ల నిరక్ష్యం వహించిన వారిపై చర్యలు.. మృతుల కుటుంబాలకు పరిహారం వంటివేవీ కానరాలేదు. హడావిడిగా ఆర్వో ప్లాంటు, చేతి బోరు మారుస్తామని ప్రజా ప్రతినిధులు, అధికారులు చెప్పారు. ఇప్పటికీ ఎటువంటి చర్యలూ లేవు. విద్యార్థులకు భరోసా కల్పించేలా నేటికీ అక్కడ సౌకర్యాలు కల్పించకపోవడంపై అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇటీవల ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో ఘటనలు జరిగిన తర్వాత.. లోపలికి ఎవరినీ రానీయవద్దని, ముఖ్యంగా మీడియాను అనుమతించకూడదని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కురుపాంలో విద్యార్థుల అస్వస్థత విషయంలోనూ ఇదే ధోరణి పాటించారు. బాలికల అస్వస్థతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో... కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో డయేరియా సోకినట్టు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని పాఠశాల అధికారుల పేరిట శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాలకు చెందిన ఎం. హేమలత, కె.అనసూయ, కె.అనుశ్రీ, ఎ.ప్రణవి, జుహితా దేవి అనే విద్యార్థినులు స్వల్పంగా విరేచనాలతో ఇబ్బంది పడ్డారని.. అంతకుమించి ఎవరికీ వాంతులు, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని వివరణ ఇచ్చారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి విచారణకు ఆదేశించగా... ఆ మేరకు పార్వతీపురం గిరిజన సంక్షేమ అధికారి విచారణ చేపట్టారని, విద్యార్థినులు జాతర నుంచి తమ తల్లిదండ్రులు తీసుకువచ్చిన పచ్చళ్లు, ఖర్జూరాలను తినడం వల్ల తాత్కాలికంగా కడుపు ఉబ్బరానికి గురైనట్లు తేలిందని చెప్పుకొచ్చారు. పాఠశాలలోని ఆర్వో ప్లాంట్ సక్రమంగా పనిచేస్తోందని, విద్యార్థులందరూ శుద్ధి చేసిన నీటినే తాగుతున్నారని తెలిపారు. పారిశుద్ధ్యం, తాగునీటి వనరులు సంతృప్తికరంగా ఉన్నాయని వారికి వారే ఆ ప్రకటనలో సర్టిఫికెట్ ఇచ్చుకోవడం గమనార్హం. సాధారణంగా ఇటువంటి ఘటనల్లో అధికారులు ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. ఇక్కడ మాత్రం ‘పాఠశాల అధికారులు’ పేరిట వివరణ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. కురుపాం: కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు తరుచూ అనారోగ్యంపాలవుతున్నారని, సమగ్ర విచారణ జరిపి సదుపాయాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డయేరియా లక్షణాలతో కురుపాం సీహెచ్సీలో వైద్యసేవలు పొందుతున్న బాలికలను పరామర్శించారు. అనారోగ్య కారణాలను వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ గత ఐదు రోజులుగా పలువురు విద్యార్థులు వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారని, దీనికి అసలు కారణాలు తెలుసుకుని నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
గట్టు గుట్టు ఎవరికెరుక!
● అసెంబ్లీలో ఒక మాట.. పురంలో మరో ‘ఆట’! ● నెల్లి చెరువు స్థలాన్ని గతంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్కు కేటాయింపు ● ఇప్పుడు అదే చెరువు స్థలాన్ని వ్యర్థాలతో పూడ్చివేత ● వారి స్థలాన్ని కప్పివేయడంపై అవాక్కయిన క్రీడాధికారులు సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లా కేంద్రంలోని నెల్లి చెరువు ఆక్రమణల గుట్టు మలుపులు తిరుగుతోంది. ఓ వైపు చెరువుల ను పరిరక్షించాలని స్థానిక ఎమ్మెల్యే విజయ్చంద్ర అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నారు. మరోవైపు వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత తహసీల్దార్లదేనని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అంటున్నారు. ఎవరికి వారు ప్రకటనలిస్తుండగానే..నెల్లి చెరువు గట్టును మున్సిపల్ యంత్రాంగం కప్పేస్తోంది. వ్యర్థాలతో నింపేస్తోంది. ఇది పరోక్షంగా కబ్జాలకు ఊతమివ్వడమేనన్న విమర్శ లు వ్యక్తమవుతుండగానే... ఆ స్థలం తమదంటూ జిల్లా క్రీడాధికారులు ముందుకు రావడం.. నెల్లి చెరువు గట్టు స్థలాన్ని పరిశీలించడం గమనార్హం. అప్పట్లోనే క్రీడా స్టేడియానికి కేటాయింపు.. పార్వతీపురం పట్టణంలోని సర్వే నంబర్ 401లో 11.54 ఎకరాల విస్తీర్ణంలో నెల్లి చెరువు హద్దు ఉంది. దాదాపు 3.78 ఎకరాల్లో అటవీ శాఖ అతిథిగృహం, అటవీ అధికారి క్వార్టర్స్, రైతు బజారు, ఐసీడీఎస్ కార్యాలయం, మెహర్బాబా ఆలయం, యోగా జ్ఞానఆశ్రమం, వృద్ధాశ్రమం, కొంత ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 7.76 ఎకరాల్లో 5.57 ఎకరాల స్థలాన్ని క్రీడా స్టేడియానికి ప్రతిపాదించారు. ఇది ఆయకట్టు లేని చెరువుగా నిర్ధారిస్తూ.. 2016–17లోనే అప్పటి తహసీల్దారు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. అప్పట్లో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో క్రీడా వికాస కేంద్ర(స్పోర్ట్ కాంప్లెక్స్)కు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన జీవోనూ జారీ చేశారు. తర్వాత ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈలోగా చెరువు గట్టు నిండా ఆక్రమణలు జోరందుకున్నాయి. కొత్తగా ఇళ్ల నిర్మాణాలు సైతం ఊపందుకున్నాయి. వాస్తవానికి చెరువులను రక్షించే బాధ్యత రెవెన్యూ, నీటి పారుదల, పంచాయతీ/మున్సిపల్ అధికారులదే. వీరికి హద్దులను నిర్ణయించి, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ఉంది. ఆక్రమణల నుంచి కాపాడటం, పూడిక తీయడం, నీటి వనరులను కాపాడటం ద్వారా చెరువులను రక్షించవచ్చు. ఎవరికి వారు తమకు సంబంధం లేదన్నట్లుగా ఉండిపోవడంతో గట్టు అంతా ఆక్రమణలతో నిండిపోయి, సుమారు 5 ఎకరాలకే పరిమితమైంది. చెరువుల పరిరక్షణ సమితి ఆందోళన కొద్దిరోజులుగా పట్టణంలోని డంపింగుయార్డు రీసైక్లింగ్ వ్యర్థాలను మున్సిపల్ అధికారుల సూచనలతోనే సంబంధిత కాంట్రాక్టరు నెల్లి చెరువు స్థలంలో పారబోస్తున్నారు. దీన్ని స్థానికులు అడ్డుకున్నా వినిపించుకునే పరిస్థితి లేకపోయింది. ప్రస్తుతం గట్టు మొత్తాన్ని ఆ వ్యర్థాలతోనే నింపేస్తున్నారు. గాజు పెంకులు, వాడి పడేసిన సిరంజిలు, సూదులు ఉంటున్నాయని స్థానిక నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి వనరులున్న చెరువును ఇలా ఆక్రమణలపాల్జేయడం సబబు కాదని చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సంబంధిత స్థలాన్ని పరిశీలించి, అధికారుల తీరును ఎండగట్టారు. ఇదే సమయంలో జిల్లా క్రీడా శాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. తమకు కేటాయించిన స్థలాన్ని ఎలా చదును చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండానే జరుగుతుందా? అని చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో ఒక మాట.. ఇక్కడ చేస్తున్నది మరొకటని విమర్శిస్తున్నారు. -
ముగిసిన పారా బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలు
● జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చాటాలి : ఖలీల్ బాబు విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయనగరం రాజీవ్ ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న 7వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలు గురువారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరత్ ఖాదర్ వలి బాబా పుణ్యక్షేత్రం ధర్మకర్త డాక్టర్. మహమ్మద్ ఖలీల్ బాబు హాజరై విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పారా క్రీడాకారుల సంకల్పం గొప్పదని, జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలైన వారు మార్చి 6 నుంచి 10 వరకు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరగబోయే జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో పాల్గొంటారని అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న వారి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు (శాప్) వెంకటేశ్వర్లు, ప్రముఖ న్యాయవాది నాలుగెస్సులరాజు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆర్మీ జవాన్ దుర్మరణం
గరుగుబిల్లి: మండలంలోని గిజబ గ్రామ పరిధిలో శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ మలుపులో గుర్తు తెలియని వాహనం గురువారం ఢీకొన్న సంఘటనలో ఆర్మీ జవాన్ దవళసింగి చంద్రమౌళి(29) మృతి చెందారు. దీనికి సంబంధించి స్థానిక ఎస్ఐ ఫకృద్ధీన్ తెలిపిన వివరాలు.. జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన చంద్రమౌళి తన స్నేహితుని వివాహానికి బుధవారం మండంలోని వల్లరగుడబ గ్రామానికి వెళ్లాడు. తిరిగి గురువారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై శిఖబడి గ్రామం వెళ్తున్న సమయంలో గిజబ శివాలయం సమీపంలోని మలుపు వద్ద చినమేరంగి నుంచి పార్వతీపురం వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఆయన ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో పాటు కాలు విరిగి పోవడంతో ఘటనా స్థలంలోనే చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానిక ఎస్ఐ ఫకృద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు గంగారావు, సత్యవతి తమ కుమారుడ్ని ప్రభుత్వ ఉద్యోగిగా చేయాలనే తలంపుతో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి చదివించారు. తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు 2015లో నిర్వహించిన ఆర్మీ పరీక్షల్లో ప్రతిభ కనబరచి జవాన్గా ఎంపికయ్యాడు. పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్కోట్లో ఉద్యోగిగా విధులను నిర్వహిస్తున్నారు. 2022లో సునీతతో వివాహం చేసుకొని దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. గ్రామంలో నిర్వహించే అగ్నిగంగమ్మ పండగ నిమిత్తం సెలవుపై స్వగ్రామానికి వచ్చారు. స్నేహితుని వివాహానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చేతికందొచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, భార్య సునీత గుండెలు పగిలేలా విలపించారు. మృతునికి ఏడాది వయస్సు గల కుమార్తె ఉంది. అందరితో కలివిడిగా ఉంటూ మంచి వ్యక్తిగా పేరున్న చంద్రమౌళి మృతితో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. -
కలెక్టర్ను కలిసిన పాలకొండ పీఆర్ఈఈ
పార్వతీపురం: పాలకొండ పంచాయతీరాజ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్.రాధారాణి గురువారం కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సాగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై దృష్టిసారించాల ని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధకశాఖాధికారి ఎస్.మన్మథరావు పాల్గొన్నారు.గిరిజన ఉత్పత్తుల విక్రయానికి అడ్వాన్స్ టెండర్లు సీతంపేట: గిరిజనుల నుంచి సేకరించిన కొండచీపుర్లు, కుంకుడికాయలు, నల్లజీడి, పసుపుకొమ్ముల విక్రయానికి వచ్చేనెల 4న సీతంపేట ఐటీడీఏలో అడ్వాన్స్ టెండర్లు నిర్వహిస్తామని పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు సెల్:88972 23650ను సంప్రదించాలని కోరారు.వన్నాంలో ఏనుగుల సంచారంవరి, జొన్నపంటలు ధ్వంసం గగ్గోలు పెడుతున్న రైతులుకొమరాడ: మండలంలోని మాదలింగి చెక్కవలస, పాలెం, వన్నాం తదితర గ్రామాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. జొన్న, పామాయిల్, కర్భూజ, తదితర పంటలను నాశనం చేస్తున్నాయి. చేతికందొచ్చిన పంటలను నష్టపరుస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రాణనష్టం జరిగితే తూతూ మంత్రంగా రూ.5 లక్షలు ఇచ్చి చేతుల దులుపుకుంటున్న అటవీశాఖాధికారులకు పంట నష్టం కనిపించడంలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
లక్కవరపుకోట : మండలంలోని లక్కవరపుకోట – ఖాసాపేట గ్రామాల మధ్య ఉన్న గెడ్డపై గల బ్రిడ్జి కింద వేపాడ మండలం గుడివాడ గ్రామానికి చెందిన గుడివాడ కిశోర్(19) అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మృతుడు తన స్నేహితుడు మహేష్తో కలిసి తన తాతగారి గ్రామమైన లక్కవరపుకోట మండలం కొట్యాడ గ్రామానికి బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వచ్చారు. రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఖాసాపేట బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి ద్విచక్ర వాహనంతో పాటూ బ్రిడ్జి కింద గల గెడ్డలో పడిపోయాడు. దీంతో ద్విచక్ర వాహనంతో పాటు మృతుడు కిశోర్ గెడ్డలో మునిగిపోయారు. అక్కడ నుంచి స్వల్ప గాయాలతో స్నేహితుడు మహేష్ కొట్యాడ గ్రామానికి గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చేరుకున్నాడు. కాగా తనకు తగిలిన దెబ్బలు, జరిగిన ప్రమాదం గురించిగాని మహేష్ బంధువులకు చెప్పలేదు. గురువారం మధ్యాహ్నం గెడ్డ సమీపంలో పశువులు కాపర్లు నీటిలో ద్విచక్ర వాహనాన్ని గుర్తించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని గాలించి ద్విచక్ర వాహనాన్ని, నీటిలో మునిగిపోయిన కిశోర్ను వెలుపలకు తీశారు. మృతుడి జేబులో గల సెల్ఫోన్ ఆధారంగా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. మృతుడి స్నేహితుడు మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నవీన్పడాల్ తెలిపారు. భార్య మందలించిందని.. విజయనగరం క్రైమ్: కట్టుకున్న భార్య మందలించిందన్న కారణంతో భర్త పురుగుల మందు తాగి మృత్యువాత పడ్డాడు. ఇందుకు సంబంధించి విజయనగరం రూరల్ ఎస్ఐ అశోక్ గురువారం తెలిపిన వివరాలు.. కోరుకొండ పాలెంకు చెందిన సిరిపురపు వెంకటసత్యం(40) రోజూ మద్యం సేవించి ఇంటికొచ్చేవాడు. రోజూలాగే గురువారం మందుకొట్టి ఇంటికొచ్చిన భర్త సత్యాన్ని తాగుడు మానమని భార్య కాస్త మందలించింది. దీంతో కట్టుకున్న భార్యే తనను మందలించిందన్న కోపంతో మనస్తాపానికి గురై గడ్డిమందు తాగి ఆస్పత్రి పాలయ్యాడు. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్ఐ అశోక్ తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
122 పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదన
విజయనగరం కలెక్టరేట్: జిల్లాలో 122 కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఇ.మురళి తెలిపారు. తన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్ తొందరగా పూర్తిచేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలన్నీ బీఎల్ఏలను నియమించుకోవాలన్నారు. ఓటర్ల సవరణల జాబితాల ప్రకారం ఫిబ్రవరి 26 నాటికి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 15,76,018 మంది ఓటర్లు ఉన్నారని , ఇందులో రెండుచోట్ల ఓట్లు కలిగిన వారు 2,975 మంది ఉన్నట్లు గుర్తించామన్నా రు. విచారణ అనంతరం వీరి ఓట్లను ఒకచోట ఉంచి మరో చోట తొలగిస్తామని చెప్పారు. జిల్లాలో 1847 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటికి ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు వి.నర్సింహమూర్తి, ఎ.శ్రీనివాసరెడ్డి, సీహెచ్ అప్పారా వు, తదితరులు పాల్గొన్నారు. -
పరీక్ష కేంద్రాల్లో డీఆర్ఓ తనిఖీ
పార్వతీపురం రూరల్: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ తీరును జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) కె.హేమలత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక ఆర్.కె.జూనియర్ కళాశాల, పి.ఎస్.ఎం.వాసవి జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఆమె, పరీక్షల సరళిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గదుల్లోని గాలి, వెలుతురు, తాగునీరు వంటి కనీస సదుపాయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్న్ అమలులో ఉన్నందున ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. మాల్ప్రాక్టీస్కు తావులేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షల విధుల్లో ఉన్న సిబ్బంది ఎవరూ సెల్ఫోన్లు లోపలికి తీసుకురాకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. ఆయన వెంట కళాశాలల ప్రిన్సిపాళ్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 222 మంది గైర్హాజరు జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 8,395 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వై.నాగేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. జనరల్ విభాగంలో 6,067 మందికిగాను 5,968 మంది, వొకేషనల్ విభాగంలో 2,550 మందికిగాను 2,427 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 8,617 మంది విద్యార్థులకుగాను 222 మంది గైర్హాజరైనట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రొఫెసర్ లోక్నాఽథ్కు గోల్డ్ మెడల్
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి చెందిన ఎముకల విభాగం హెచ్ఓడీ డాక్టర్ లాడి లోక్నాథ్ గోల్డ్ మెడల్ సాధించారు. కర్నూల్లో కొద్ది రోజులు క్రితం 56వ ఎముకల వైద్యుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రానికి చెందిన సీనియర్ ఎముకలు వైద్యులు 20 మంది పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వీరిలో గోల్డ్ మోడల్ పేపర్గా డీఆర్యూజే సమస్యకు పరిష్కారాన్ని డాక్టర్ లోక్నాఽఽథ్ కనుగొన్నారు. ఇందుకుగాను ప్రెస్టీజియస్ వాగ్యేశ్వరుడు మోమోరియల్ గోల్డ్మెడల్ను ఆయనకు అందించారు. ఈ మేరకు లోక్నాఽథ్ను సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అభినందించారు. కార్యక్రమంలో ఎముకల విభాగం వైద్యులు బాలాజీ, వంశీకృష్ణ, ప్రభు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చెక్బౌన్స్ కేసులో జైలుశిక్ష గజపతినగరం రూరల్: చెక్బౌన్స్ కేసులో నిందితుడు పూసర్ల రామలింగేశ్వరరావుకు ఏడాది జైలు, రెండు లక్షల 40 వేల రూపాయల జరిమానా విధిస్తూ స్థానిక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎ.విజయ్రాజ్కుమార్ గురువారం తీర్పు చెప్పారు. కోర్టు కార్యాలయ సిబ్బంది అందించిన వివరాలు.. గజపతినగరానికి చెందిన కొల్లా కనకవెంకట సత్యనారాయణ అదే గ్రామానికి చెందిన పూసర్ల రామలింగేశ్వరరావుకు 2022లో 2 లక్షల 40 వేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఇందుకు బదులుగా రామలింగేశ్వరరావు రూ.2,40,000 మొత్తానికి సత్యనారాయణకు చెక్కు అందజేశాడు. ఈ చెక్కు బ్యాంకులో బౌన్స్ కావడంతో సత్యనారాయణ కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో అనేక వాదోపవాదాలు అనంతరం స్థానిక మెజిస్ట్రేట్ విజయ రాజ్కుమార్ ఈ కేసుకు సంబంధించి పై విధంగా తుది తీర్పు వెల్లడించారు. పూరిల్లు దగ్ధం గుర్ల: మండలంలోని పల్లిగండ్రేడులో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పెనుమాల రాములమ్మ పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. రాములమ్మ గురువారం తెల్లవారుజామున కర్రల పొయ్యిలో వంట చేస్తుండగా అగ్ని జ్వాలలు ఒక్కసారిగా ఎక్కువ కావడంతో పురిల్లుకు తాకాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే పూరిల్లు మొత్తం కాలిపోయింది. స్థానికులు వచ్చి మంటలు అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో సుమారుగా రూ.2లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు గొల్లుమంది. ప్రమాదం జరిగిన పురిల్లును రెవెన్యూ అధికారులు పరిశీలించారు. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.5.30 లక్షల జరిమానా విజయనగరం క్రైమ్ : మద్యం సేవించి బైక్ నడిపి, పట్టుబడిన వాహనదారుల ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తూ విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్.ఆర్.తేజ చక్రవర్తి ఆదేశాలు ఇచ్చారని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గురువారం తెలిపారు. విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది డీడీలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 53 కేసులు నమోదు చేశారు. వారందరినీ విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా మొత్తం 53 మందికి రూ.5.30 లక్షలను జరిమానాగా విధించారని ఎస్పీ తెలిపారు. మూడు నెలల కాలంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలుశిక్ష పడిందన్నారు. హత్యాయత్నం కేసులో వ్యక్తి అరెస్టు విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్స్టేషన్ పరిధి గంట్యాడలో ఎల్లమ్మ తల్లి జాతర సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కాళ్ల వెంకటరమణపై దాడికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేశామని సీఐ లక్ష్మణరావు గురువారం తెలిపారు. మద్యం సేవించి కానిస్టేబుల్పై దాడి చేసి ఆపై హత్యాయత్నం చేశాడని సీఐ పేర్కొన్నారు. ఈ మేరకు గంట్యాడలో అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ కోర్టు విధించిందని సీఐ లక్ష్మణరావు పేర్కొన్నారు. ప్రత్యేక అలంకరణలో పైడితల్లి విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి గురువారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో ఆలయ అర్చకులు నేతేటి ప్రశాంత్ అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీషా పర్యవేక్షించారు. -
కలవరం..!
విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగులు కల్పిస్తామని చంద్రబాబు సర్కార్ గొప్పగా సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామిలను గాలికి వదిలేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగాలు మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెట్టేసి విధంగా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తుంది. చైల్డ్లైన్ 1098 సంస్థలో పని చేసే ఉద్యోగులను చంద్రబాబు సర్కార్ అయోమయ స్థితిలోకి నెట్టేసింది. దీంతో వారు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. గత మూడేళ్లుగా పని చేస్తున్న తమ ఉద్యోగాలు ఉంటాయో, ఉండవో తెలియక సతమతమవుతున్నారు. ఏజెన్సీకి అప్పగించే ప్రయత్నం 18 ఏళ్లలోపు పిల్లల రక్షణ, సంరక్షణ కోసం ఏర్పాటైన చైల్డ్లైన్ 1098 సంస్థ ఐసీడీఎస్ ఆధీనంలో నిర్వహిస్తుంది. ఇందులో పనిచేసే ఉద్యోగులు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. 2023 జూలై 7వ తేదీ నుంచి వీరు పని చేస్తున్నారు. అయితే చైల్డ్లైన్ 1098 సంస్థ నిర్వాహణ బాధ్యతలను ఏజెన్సీకి ఇవ్వాలని టీడీపీ సర్కార్ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే టెండర్ కూడా పిలిచేసింది. ఒకటి రెండు రోజుల్లో టెండర్ కూడా ఖరారు కానుంది. టీడీపీకి చెందిన అస్మదీయులకు ఏజెన్సీని కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీకి చైల్డ్లైన్ నిర్వాహణను అప్పగిస్తే తమ ఉద్యోగాలు పరిస్థితి ఏంటని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 31 వరకే కొనసాగించాలని ఆదేశాలు చైల్డ్లైన్ 1098 సంస్థలో పనిచేసే ఉద్యోగులకు మార్చి 31 వరకు మాత్రమే కొనసాగించాలని తర్వాత చైల్డ్లైన్ 1098 సంస్థ బాధ్యతలను ఏజెన్సీ చూసుకుంటుందని ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. ఐసీడీఎస్ అధికారులకు ఇచ్చిన ఆదేశాల్లో కొత్తగా వచ్చే ఏజెన్సీ వారు ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు గుర్తించి ఏమి ప్రస్తావించలేదని తెలిసింది. దీంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. చైల్డ్లైన్ 1098 సంస్థలో ఇద్దరు సూపర్వైజర్లు, ముగ్గురు కేస్ వర్కర్లు పని చేస్తున్నారు. వీరిలో సూపర్ వైజర్కు రూ.19,500, కేస్ వర్కర్కు రూ.15,600 చెల్లిస్తున్నారు. విధులు ఇలా... బాల్య వివాహాలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ట్రోల్ ఫ్రీ నంబరు 1098కు ఫోన్ వస్తే సంబంధిత ప్రాంతానికి పోలీసులు, అంగన్వాడీ, ఐసీడీఎస్ అధికారులతో కలిసి వెళ్లి ఈ వివాహాలు చేయడం చట్ట రీత్యా నేరమని ఇరువురి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బాల్య వివాహాన్ని నిలుపుదల చేస్తారు. తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి పారిపోయి దొరికినట్టయితే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగిస్తారు. ఇంటి నుంచి తప్పిపోయిన పిల్లలు దొరికినట్టయితే తల్లిదండ్రులకు అప్పగించడం, బాలలను ఎవరైనా పనిలో పెట్టుకున్నట్టు సమాచారం వస్తే కార్మిక శాఖ అధికారులతో కలిసి ఆకస్మిక దాడులు చేసి బాలలకు విముక్తి కల్పించడం, 18 ఏళ్లలోపు పిల్లలు ఆపదలో ఉంటే వారికి రక్షణ, సంరక్షణ కల్పించడం వీరి విధి. చైల్డ్లైన్ ఉద్యోగుల్లో అయోమయం 1098 నిర్వహణను ఏజెన్సీకి అప్పగించే యత్నం ఏజెన్సీ కోసం టెండర్ పిలిచిన చంద్రబాబు ప్రభుత్వం మార్చి 31తో ముగియనున్న కాలపరిమితి తమను తొలగిస్తే ఎలా బతికేదని ఆవేదన! మార్చి 31 వరకే.. ఈ ఏడాది మార్చి 31 వరకే చైల్డ్లైన్ సిబ్బందిని కొనసాగించాలని ఆదేశాలు వచ్చాయి. సిబ్బంది గురించి అందులో ఏమి చెప్పలేదు. – ఎల్.సుజాత, ఇన్చార్జ్ పీడీ, ఐసీడీఎస్ -
లిక్విడ్ గంజాయి స్వాధీనం
● ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో... ● రూ. 210 కోట్ల విలువైన సొత్తు సీజ్ ● నలుగురు అరెస్ట్పార్వతీపురం రూరల్ : కొరాపుట్ జిల్లాలో పోలీసులు నిర్వహించిన వేర్వేరు దాడుల్లో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఒడిశా–ఆంధ్రా సరిహద్దులోని జోలాపుట్ రిజర్వాయర్ పరిసర అటవీ ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న లిక్విడ్ గంజాయి (హషీష్ ఆయిల్) తయారీ కేంద్రాన్ని పోలీసులు ఛేదించారు. ఈ ఆపరేషన్లో సుమారు 1800 లీటర్ల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా. వీటితో పాటు రూ.5 కోట్ల విలువైన వెయ్యి కిలోల ఎండు గంజాయిని, తయారీకి ఉపయోగించే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుర్భేద్యమైన అటవీ ప్రాంతం కావడంతో నిందితులు పట్టుబడకుండా ఉండేందుకు తరచూ స్థావరాలను మారుస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో పోలీసు బృందాలు రహస్యంగా పడవల్లో ప్రయాణించి, అనంతరం కాలినడకన వెళ్లి ఈ తయారీ యూనిట్పై దాడి చేశాయి. ఈ దందాకు సంబంధించి అంతరాష్ట్ర ముఠాల ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. కీలక సూత్రధారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరో ఘటనలో 1143 కిలోల గంజాయి సీజ్ జిల్లాలోని నంద్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన మరో దాడిలో పోలీసులు 1143 కిలోల గంజాయిని పట్టుకున్నారు. రెండు పికప్ వాహనాల్లో ప్లాస్టిక్ ట్రేల కింద రహస్యంగా తరలిస్తుండగా వీటిని గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ కేసులో హర్యానా రాష్ట్రానికి చెందిన ఇద్దరు రిసీవర్లు, సెమిలిగూడ ప్రాంతానికి చెందిన ఇద్దరు సరఫరాదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు వాహనాలను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాల్యవివాహాలు జరిపిస్తే జైలుకే...
పార్వతీపురం: ఎక్కడైనా బాల్యవివాహాలు జరిపిస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాల్య వివాహాలపై మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్య వివాహాలు జరిపిన వారిపై పోక్సోకేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి, సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, అడిషనల్ ఎస్పీ వి.మణీషారెడ్డి, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, తదితరులు పాల్గొన్నారు. ●మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీకి కలెక్టర్కు సూచించా రు. మత్తు పదార్థాలవల్ల కలిగే దుష్ఫలితాలు, బా ల్య వివాహాల కలిగే అనర్థాలు, బాలకార్మిక వ్యవస్థలపై అవగాహన కోసం పాఠశాల, కళాశాల స్థాయి లో క్విజ్ పోటీలు నిర్వహించాలన్నారు. ●వాహన చోదకులు రోడ్డు భద్రతా నియమాలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని రహదారి భద్రతపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులను కలెక్టర్ ఆదేశించారు. లైసెన్స్లేని, హెల్మెట్ ధరించని వారి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితులను రక్షించి తక్షణమే ఆస్పత్రికి చేర్చేవారికి ప్రభుత్వం రూ. 25వేలు బహుమతిగా అందిస్తుందన్నారు. దురదృష్ట వశాత్తు రోడ్డు ప్రమాదం జరిగితే 48 గంటల్లోగా ప్రమాదానికి సంబంధించిన పోలీస్ రిపోర్ట్ను సమర్పిస్తే ప్రభుత్వం రూ.1.50 లక్షలు పరిహారం అంద జేస్తుందన్నారు. సమావేశంలో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి, జిల్లా రవాణాధికారి టి.దుర్గా ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ●జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలను ఉగాది నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకరరెడ్డి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించారు. ఉగాది నాటికి జిల్లాలో 7,187 ఇళ్లను పూర్తి చేయాలన్నారు. -
స్కూల్ బ్యానర్ కడుతున్న యువకునికి విద్యుత్ షాక్
● తృటిలో తప్పిన ప్రాణాపాయం ● 11 కేవీ పక్కనే ఏర్పాటు చేసిన హోర్డింగ్వీరఘట్టం: స్థానిక మేజరు పంచాయతీలోని తెలగవీధి మలుపు వద్ద ఓ బిల్డింగ్పై ఉన్న హోర్డింగ్పై స్కూల్ బ్యానర్ కడుతున్న శివ అనే యువకునికి విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ బ్యానర్ కడుతుండగా పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు పాక్షికంగా యువకునికి తగలగా హోర్డింగ్ నుంచి కింద పడిపోయాడని స్థానికులు చెబుతున్నారు. కరెంట్ షాక్ తగలడంతో యువకుని వీపు భాగం బాగా కాలిపోయింది. ప్రమాదం బిల్డింగ్పైన జరగడంతో ఎవరూ పైకి వెళ్లేందుకు మార్గం లేక సహాయక చర్యలు చేపట్టలేకపోయారు. అటుగా వస్తున్న కిమ్మి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నేదూరి శంకరరావు వెంటనే బిల్డింగ్ పైకి ఎక్కి క్షతగాత్రుడు శివను లైన్మెన్ అప్పలనాయుడు సహయంతో కిందకు దించాడు. తన ఆటోలో వీరఘట్టం పీహెచ్సీకి తరలించి వైద్య సేవలు అందేలా చేశాడు. అనంతరం 108 వాహనంలో క్షతగాత్రుడుని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కాపాడడంతో పాటు ఆసుపత్రికి తన ఆటోలో తీసుకువెళ్లిన డ్రైవర్ శంకరరావును అందరూ అభినందించారు. ఈ ప్రమాదంలో గాయపడిన యువకుడు బలజిపేట మండలం గంగాడ గ్రామానికి చెందిన పెదపెంకి శివగా గుర్తించారు. ప్రమాదకరంగా హోర్డింగ్... స్థానిక మేజరు పంచాయతీలోని తెలగవీధి జంక్షన్ వద్ద ఓ బిల్డింగ్పై కడుగుతున్న హోర్డింగ్ ప్రమాదకరంగా ఉందని, పక్కనే 11 కేవీ విద్యుత్ వైర్లు ఉన్నాయని, అనుమతులు లేకుండా కడుతున్న ఈ హోర్డింగ్ను తొలగించాలని ఈ నెల 13న సాక్షిలో కధనం ప్రచురితమైంది. సంబంధిత అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇటువంటి ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు అంటున్నారు. మరో ప్రమాదం జరగక ముందే పంచాయతీ అధికారులు, ట్రాన్స్కో అధికారలు స్పందించి ఈ హోర్డింగ్ను తొలగించాలని పలువురు కోరుతున్నారు. -
పోలిపల్లి పైడితల్లి జాతర ఆదాయం రూ. 27.15 లక్షలు
రాజాం సిటీ: ఎంతో వైభవంగా నిర్వహించిన రాజాంపోలిపల్లి పైడితల్లి అమ్మవారి శతవార్షిక జాతర ఆదాయం రూ.27,15,381లు సమకూరిందని ఈఓ బీవీ మాధవరావు తెలిపారు. ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు జరిగిన జాతరలో వచ్చిన ఆదాయాన్ని గురువారం లెక్కించారు. ప్రత్యేక దర్శనం టికెట్ల అమ్మకంతో రూ.4,62,600, శీఘ్రదర్శనం టికెట్ల విక్రయంతో రూ.3,94,500, మొక్కుబడుల రూపంలో రూ.1,75,240, కానుకలు రూపంలో రూ.1,78,711లు, అద్దాలు, బరినెలు విక్రయించగా రూ.5వేలు, ప్రసాదం విక్రయంతో రూ.92వేలు, మూడు నెలల ఆదాయంతో కలిపి హుండీల నుంచి రూ.14,07,330ల ఆదాయం వచ్చిందన్నారు. గతేడాది రూ.23,94,054లు రాగా ఈ ఏడాది అదనంగా రూ.3,21,327లు వచ్చిందని వెల్లడించారు. లెక్కింపు ప్రక్రియలో సీఎఫ్ఓ, నవదుర్గ ఆలయ ఈఓ పి.శ్యామలరావు, ఆలయ ట్రస్టీ వాకచర్ల దుర్గాప్రసాద్, వాకచర్ల పైడిరాజు, అర్చకులు వేమకోటి సూర్యనారాయణశర్మ, సలాది తులసీదాస్, వెంపల లక్ష్మణరావు, ఆర్నిపల్లి వెంకటినాయుడు, భక్తులు పాల్గొన్నారు. -
గడువు దాటితే.. రామ్రామ్ అనాల్సిందే!
సాక్షి, పార్వతీపురం మన్యం: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉపాధి హామీ పథకం స్వరూపం మారబోతోంది. దీని స్థానంలో కొత్త చట్టం వీబీజీ రామ్జీని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గతం మాదిరి పరిమితి లేకుండా పనులు చేపట్టడం కుదరదు. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు రద్దు కానున్నాయి. ప్రధానంగా కొన్నేళ్లుగా సెల్ఫ్ ఆఫ్ వర్క్స్లో ఉన్న వాటిని తొలగించాల్సి వస్తోంది. ఈ లెక్కన జిల్లాలో దాదాపు 64 వేల పనులు నిలిచిపోనున్నాయని అంచనా. కొద్దిరోజులుగా డ్వామా సిబ్బంది ఇదే పనిలో తలమునకలై ఉన్నారు. ఒకవైపు పాత పనులను తొలగిస్తూనే.. చాలాకాలంగా వదిలేసిన బిల్లులన్నింటినీ పూర్తి చేస్తున్నారు.సమీపిస్తున్న గడువు గ్రామాల్లో గతంలో వేలాది పనులను స్థానిక అవసరాలకు అనుగుణంగా చేపట్టేవారు. వివిధ శాఖలకూ పనులు అప్పగించేవారు. ఉపాధి నిధులతో సచివాలయ భవనాలు, విలేజ్ క్లినిక్లు, గోకులాలు, సీసీ–బీటీ రహదారులు నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల పూర్తి కాగా.. మిగిలిన ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తి కాని పనులన్నీ తొలగిస్తే తప్ప.. కొత్తగా మంజూరయ్యే పరిస్థితి ఉండదు. వీటి బిల్లులు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంది. మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టి న అభివృద్ధి పనులకు గడువు ముగుస్తోంది. మార్చి 15 నాటికి వీటిని పూర్తి చేయాలి. ఈ బిల్లులన్నీ వెనువెంటనే అప్లోడు చేయాల్సి ఉంది. లేకుంటే నిధులు కూడా వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. జిల్లాకు ఉపాధి మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.214 కోట్ల విలువైన పనులు మంజూరయ్యా యి. రూ.114 కోట్ల వరకు పనులు పూర్తి కావాల్సి ఉంది. చేసిన పనులకు గానూ బిల్లులు కూడా పెద్ద మొత్తంలో అప్లోడ్ చేయాల్సి ఉంది. దీంతో ఆ పనులు చేసిన గుత్తేదారులు కూడా బిల్లుల ఆందోళనలో ఉన్నారు. ఓవైపు లక్ష్యం అసంపూర్తిగా ఉండిపోవడమే కాక.. గడువు ముగిసినా వీటికి సంబంధించిన బిల్లులు చెల్లించకుంటే తమ పరిస్థితి ఏమిటని వారంతా ఆందోళన చెందుతున్నారు.డోలీ మోతలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఉపాధి హామీ నిధులతో గిరిశిఖర గ్రామాల్లో మార్గా లు ప్రతిపాదించారు. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రహదారుల నిర్మాణం, చెక్డ్యామ్లు, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, కాలువలు వంటి పనులకు అనుమతులొచ్చాయి. వీటిలో కొన్ని పనులు ప్రారంభం కాకపోగా.. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. బిల్లుల చెల్లింపులు కాకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే నిలిపివేశారు. గడువులోగా పనులు చేయకుంటే.. నిధులు వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.పనులు పరిమితమే..జిల్లాలో 2.07 లక్షల జాబ్కార్డులున్నాయి. 2.79 లక్షల మంది పనులను ఉపయోగించుకుంటున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి నూతన చట్టం కింద వేతనదారులకు అందించే పనులు, వినియోగించే నిధుల్లో గరిష్టంగా 10 మాత్రమే ప్రగతిలో ఉండాలి. ఏదైనా పంచాయతీలో అవసరానికి అనుగుణంగా మరో పని చేపట్టాల్సి ఉన్నా.. అప్పటికే ఉన్న పనుల్లో ఒకటి తొలగించాల్సిందే. ఈ లెక్కన జిల్లాలో సుమారు 3,500 పనులు మాత్రమే ప్రగతిలో ఉంటాయి. -
తప్పని డోలీ కష్టాలు
శృంగవరపుకోట: గిరిశిఖర గ్రామాల ప్రజలకు డోలీ కష్టాలు నిత్యకృత్యంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా రోడ్డు కష్టాలు తీరడం లేదు. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ హడావుడి చేయడమే తప్ప చేసిన పనులు కనిపించడంలేదంటూ గిరిజనులు ఆరోపిస్తున్నారు. అత్యవసర వేళ వైద్యం కోసం రాళ్లదారిలో కిలోమీటర్ల మేర డోలీలో రోగులను తరలించాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గురువారం ఉదయం ఎస్.కోట పంచాయతీ శివారు రేగపుణ్యగిరి గ్రామానికి చెందిన గమ్మెల రేవతి ఉదయం జీడితోటలో పనిచేస్తుండగా విషపురుగు కాటుకు గురైంది. స్పృహకోల్పోయింది. ఆమెను స్థానికులు డోలీ సాయంతో హుటాహుటిన ఎస్.కోటలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె కోలుకోవడంతో తిరిగి సాయంత్రం డోలీలో గిరిశిఖరాన ఉన్న గ్రామానికి తరలించారు. ఓట్లు దండుకోవడం మినహా తమ కోసం పాలకులు చేసింది శూన్యమని గ్రామస్తులు జి.సంజు, ఎం.నాగేశ్వరరావు, బి.చిన్న, ఎం.కృష్ణ, వి.రాములమ్మ, తదితరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
మాజీ మంత్రి జోగి రమేష్కు ఎమ్మెల్సీల పరామర్శ
నెల్లిమర్ల రూరల్: మాజీ మంత్రి జోగి రమేష్ను ఎమ్మెల్సీలు డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణరాజు, పాలవలస విక్రాంత్ గురువారం పరామర్శించారు. ఇటీవల కొంతమంది టీడీపీ నాయకులు, పచ్చమూకలు రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఆయన నివాసంలో కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరి దుశ్చర్యకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఇంటిని తగలబెట్టి కుటుంబ సభ్యులను హతమార్చే కుట్ర జరిగిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఏదైనా ఉంటే చట్టపరంగా చూసుకోవాలన్నారు. ప్రశ్నించే గొంతుకులను నొక్కేసే ప్రయత్నం చంద్రబాబు సర్కార్కు సరికాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
అదును చూసి.. చదునుచేసి..
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పట్టణం నడిబొడ్డున ఉన్న నెల్లి చెరువు ఆక్రమణలతో రూపుకోల్పోతోంది. ఇప్పటికే ఆక్రమణలతో చిక్కిపోయిన చెరువు గర్భాన్ని.. మరింత మంది కబ్జా చేసేందుకు వీలుగా అధికారులే ఊతమిస్తున్నట్లుంది. స్థానిక డంపింగ్యార్డు వద్ద రీసైకిల్ చేసిన వ్యర్థాలను గతంలో ఇక్కడ వేసేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించిన విషయం విదితమే. దీనిని చెరువు సమీపంలో అక్రమంగా ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదలు అడ్డుకున్నారు. తర్వాత వీరిని భయపెట్టి, బెదిరించి మున్సిపల్ సిబ్బంది దారిలోకి తెచ్చుకున్నారు. గొడవలు సద్దుమణగడంతో రీసైక్లింగ్ వ్యర్థాలను పట్టపగలే నెల్లి చెరువులో వేసి, యంత్రాలతో చదును చేస్తున్నారు. పట్టణ నడిబొడ్డున సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన నెల్లి చెరువు.. ఇప్పటికే చాలా వరకు ఆక్రమణలకు గురైంది. ప్రస్తుతం ఐదెకరాలకే పరిమితమైంది. చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలు ఇప్పటికీ జోరుగా సాగుతున్నాయి. అక్రమ కట్టడాలంటూ కొంతమందికి నోటీసులిస్తున్నా.. అందులోనూ వివక్ష.. రాజకీయ కక్ష ఉందన్న విమర్శలున్నాయి. తాజాగా చెరువు పూర్తిగా రూపు కోల్పోయేలా వ్యర్థాలతో చదును చేస్తుండడం వెనుక కూడా కబ్జాల పన్నాగం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. -
ప్రతి ఫైల్కు ఒక రేటు... అదే ఆ సెక్షన్ రూటు
ప్రభుత్వ భూమిని సైతం.. భోగాపురం మండలం పోలిపల్లి రెవెన్యూలో సర్వే నంబర్ 21, 27లో ఉన్న సుమారు 6 ఎకరాలు పక్కా ప్రభుత్వ భూమి. అందుకే క్రయ విక్రయాల జరగకుండా నిషేధిత భూముల జాబితాలో గత రెవెన్యూ అధికారులు చేర్చారు. చాలామంది పెద్దలు అధికారులకు కోట్లాది రూపాయలు ఎరచూపినా ఎవరూ ఆ భూములను 22–ఎ జాబితా నుంచి తొలిగించలేదు. తాజాగా 22–ఎ భూముల సమస్య పరిష్కరించాలని ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఒక జీఓ ప్రకారం టీడీపీ నేతకు కట్టబెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వాస్తవానికి ఆ ప్రకారం కొన్ని అడ్డంకులు ఉన్నా అవేవి చూడకుండా నిషేధిత భూముల జాబితా నుంచి తొలిగించేందుకు అవసరమైన ఫైల్ సిద్ధం చేసేశారు.సాక్షి ప్రతినిధి, విజయనగరం: పొరపాటునో.. గ్రహపాటులో ఏవైనా భూములు వివాదాస్పద భూముల జాబితాలో చేరితే వాటిని రెవెన్యూ అధికారులు సరి చేస్తారు. అసలు హక్కుదారులకు భూమిని.. యాజమాన్య హక్కు పత్రాలను అందిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. వివాదాలు పరిష్కరించుకోండి అంటూ ప్రభుత్వం ఇచ్చిన ఒక సర్క్యులర్ను ఆధారం చేసుకుని విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారులు చెలరేగిపోతున్నారు. ఆ సర్క్యులర్ను అడ్డం పెట్టుకుని తమకు నచ్చిన వారి ఫైళ్లు... దశాబ్దాలుగా పరిష్కారంకాని ఫైళ్లను వెతికి మరీ సెటిల్ చేసేస్తున్నారట. దానికి ప్రతిగా రూ.లక్షల్లో... ఇంకా పెద్ద ఫైల్ అయితే రూ.కోట్లలో బేరాలు కుదుర్చుకుని క్లియర్ చేస్తున్నట్టు సమాచారం. గతంలో తలపండిన రెవెన్యూ అధికారులు సైతం టచ్ చేయడానికి భయపడిన వివాదాస్పద భూములకు చెందిన ఫైళ్లను నేడు సునాయాసంగా క్లియర్ చేసేసి తమ ఉడతాభక్తిని నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలో అందిన ముడుపులు జిల్లాలోని ఒక ప్రధాన సెక్షన్ అఽధికారుల నుంచి పైస్థాయి అధికారులకు, పాలకులకు అందజేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.వివాదాస్పద భూమి ఫైల్కు ఇప్పుడు కదలిక..అప్పటి అధికారులకు తప్పు అనిపించిన ప్రక్రియ ఇప్పుడు అధికారులకు ఒప్పు అనిపించింది. అంతే 22ఏ జాబితా నుంచి తొలిగించడానికి పైల్రెడీ చేసేశారు. తహసీల్దార్, ఆర్డీఓ, సెక్షన్ సూపరింటెండెంట్ ఫైల్ సిద్ధం చేసి కలెక్టర్కు పంపినట్లు సమాచారం. ఈ విషయంలో డీఆర్వో, జేసీ సంతకాలు చేయనట్లు తెలిసింది. సెక్షన్ సూపరింటెండెంట్ నుంచి నేరుగా కలెక్టర్ మెయిల్కు పంపారన్న చర్చ సాగుతోంది. ఈ విషయంలో భారీగా కాసులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. ఫైల్ మీద ఇప్పటివరకు సంతకాలు చేసిన అందరికీ సదరు నేత డబ్బులు ఇచ్చారని రెవెన్యూ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అయితే, ఈ విషయం సమర్దించుకునేందుకు కూడా అధికారులు రెడీగా ఉన్నట్లు సమాచారం. 22ఎ జాబితా నుంచి అర్హులు భూములు తొలిగించడానికి ప్రభుత్వం జనవరి 1న ఒక సర్కిలర్ జారీ చేసింది. ఈ ప్రకారం ఈ బాధ్యత ఆర్డీఓలు, తహసీల్దార్లకు ఇచ్చింది. ముందే జాగ్రత్తపడిన కలెక్టరేట్లో కొందరు అధికారులు ఫైల్లు తొందరగా క్లియర్ చేస్తున్నట్లు చెప్పడం ఇందులో ఒకటి. రెండోది మాజీ సైనికుల వద్ద సరైన ఆధారం ఉంటే 22ఎ నుంచి తొలగించాలని ప్రభుత్వ ఆదేశం ద్వారా సమర్దించుకోవడం. ఏదైనా కాసులు చేతులు మారడం, భూమి మారిపోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.భూమి కథ ఇదీ..భోగాపురం మండలం పోలిపల్లి రెవెన్యూలో సర్వే నంబర్ 21, 27లో ఉన్న ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని దశాబ్దాల కిందట నలుగురు రైతులకు మాజీ సైనికుల కోటాలో ఇచ్చినట్లు అధికారులు చెబుతున్న మాట. ఒక్కొక్కరికి 1.5 ఎకరాల చొప్పున ఇచ్చినట్లు రికార్డులో నమోదు చేశారు. వాస్తవానికి వారు కూడా మాజీ సైనికులు కాదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ భూ మిని పోలిపల్లికి చెందిన అధికార పార్టీ నాయ కుడు ‘రాజు’లా వ్యవహరిస్తూ తన సోదరుడు పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ మేరకు ఫైనల్ చెక్ ఆపరేషన్ (ఎఫ్సీఓ) రికార్డులో నమోదు చేశారు. కానీ తర్వాత అధికారులు ఆ భూమిని ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా 22ఎలో చేర్చారు. ఇదంతా జరిగి దాదాపు 15 ఏళ్లు గడిచిపోయింది. అప్పటినుంచి ‘సత్యం’ను మరుగున పెట్టి ఆ భూమికి 22ఏ జాబితా నుంచి తొలగించాలని అధికారులను అడుగుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు అక్కడ పని చేసిన తహసీల్దార్లు ఫైల్ పంపలేదు. తహసీల్దార్ పంపినా ఆర్డీఓలు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చినా కలెక్టరేట్లో సెక్షన్ సూపరెండెంట్ నుంచి డీఆర్వో, జేసీ, కలెక్టర్లలో ఎక్కడో చోట ఆగడంతో పని జరగలేదు. -
గొలుసు దొంగతనాల కేసుల్లో నిందితుడి అరెస్టు
● రూ.29 లక్షల విలువైన బంగారం స్వాధీనంపార్వతీపురం రూరల్: జిల్లాలో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.29 లక్షల విలువైన 192 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పార్వతీపురం పట్టణానికి చెందిన కొయ్యపు గిరి రాజశేఖర్ విలాసాలకు, బెట్టింగ్లకు బానిసై చెడు వ్యసనాలకు అలవాటు పడి, ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగతనాలకు పాల్పడేవాడు. సీసీ టీవీ పుటేజీలు, కాల్ డేటా విశ్లేషణ ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించారు. బుధవారం ఉదయం సీతానగరం మండలం గుచ్చిమి జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో నిందితుడు జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 గొలుసు దొంగతనాలు చేసినట్టు అంగీకరించాడు. వీటిలో సీతానగరం, వీరఘట్టం, చినమేరంగి, గరుగుబిల్లి, పాలకొండ, బలిజిపేట పోలీస్స్టేషన్ల పరిధిలోని కేసులు ఉన్నాయి. కేసును ఛేదించడంలో చురుగ్గా వ్యవహరించిన రూరల్ సర్కిల్, ఎస్బీ, ఐటీ కోర్, క్రైమ్ బృందాలను ఎస్పీ అభినందించారు. -
పాలల్లో నాణ్యత ఎంత..!
విజయనగరం ఫోర్ట్: మానవుని జీవనాధారంలో గాలి, నీరు మాదిరి పాలు కూడా తప్పనిసరి. ప్రతీ రోజు ఆహారంలో భోజనంతో పాటు పాలు తాగడం కూడా అలవాటు చేసుకున్నారు. పసి పిల్లలు దగ్గర నుంచి పెద్దవారు వరకు అందరికి పాలు అవసరం పెరిగింది. సమాజంలో పాలు, పాల ఉత్పత్తుల వినియోగం భారీ స్థాయిలో పెరిగిపోయింది. అయితే రాజమండ్రిలో జరిగిన ఘటనతో జనంలో వణుకు మొదలైంది. కల్తీపాలు తాగడం కారణంగా ఇప్పటికే ఐదుగురు మృత్యువాత పడగా, మరికొంతమంది ప్రాణాప్రాయ స్థితిలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలు తాగుతున్న పాలల్లో నాణ్యత ఎంత దానిపై సర్వత్రా సందేహాం నెలకొంది. పాలు, పాల ఉత్పత్తులు నాణ్యమైనవేనా, నాణ్యత లేనివా.. అనే అనుమానాలను ప్రజలు వ్యక్తం పరుస్తున్నారు. పాల వినియోగం ఎక్కువే.. ప్రతీ ఇంటిలోనూ నిత్యం పాలు, పాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ముఖ్యంగా పాలు వినియోగించని ఇల్లు ఏది ఉండదు. ఉదయం లేవగానే టీ, కాఫీలు తాగడానికి పాలు వినియోగిస్తారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, ఇలా ప్రతీ ఒక్కరూ పాలు తాగుతారు. అదే విధంగా వివిధ డెయిరీలు పాలతో వివిధ ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నారు. కోవా, బ్రెడ్, మజ్జిగ, నెయ్యి, పన్నీరు, బిస్కెట్స్, లస్సీ వంటి ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. వీటిలో పాల ప్యాకెట్లు కూడా 200 మి.లీ నుంచి, అరలీటరు, లీటరు పాల ప్యాకెట్లు వివిధ డెయిరీ కంపెనీలు ఔట్లెట్స్ పెట్టి విక్రయిస్తున్నారు. అనుమతులు లేకుండానే విక్రయాలు పట్టణ ప్రాంతాల్లో ప్రజలు డెయిరీ పాల ప్యాకెట్లు కంటే వ్యాపారులు బైక్లపై తెచ్చి విక్రయించే పాలును ఎక్కువగా కొనుగోలు చేస్తారు. పాడి రైతులు దగ్గర నుంచి కొనుగోలు చేసి తెస్తారని వీరి దగ్గర ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే ఇలా పాలు విక్రయించేవారు ఎటువంటి అనుమతులు లేకుండా విక్రయించడం గమనార్హం. పాలు, పాల ఉత్పత్తులపై కొరవడిన పర్యవేక్షణ రాజమండ్రి ఘటన చూసిన తర్వాత రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడింది. ప్రజలు ఆహారంలో ప్రధానమైన పాలు తాగడం వల్ల మనుషులు చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పడు ఎక్కడ చూసినా పాలు, పాల ఉత్పత్తులపై చర్చ జరుగుతుంది. వివిధ డెయిరీలు, పాలు, ఉత్పత్తులపై పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డెయిరీలు, పాల వ్యాపారులు విక్రయించే పాలు సురక్షితమైనవేనా, లేదా పాలు చిక్కగా, రుచిగా కనిపించడానికి యూరియా, ఇతర రసాయనాలు ఏమైనా కలుపుతున్నారా.. అనే తనిఖీలు చేపట్టిన దాఖలా లు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాలు తా గడం సురక్షితమేనా.., లేదంటే ప్రాణపాయామా.. అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఏడాదికి 8.36 లక్షల మెట్రిక్ టన్నులు పాల ఉత్పత్తి జిల్లాలో 4,75,805 పాడి పశువులు ఉన్నాయి. వీటిలో ఆవులు 3,77,960, గేదెలు 97,845 ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి 8,36,800 మెట్రిక్ టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. జిల్లాలో వివిధ పాల డెయిరీలు, వ్యాపారులు ద్వారా ఏడాదికి 3,65,000 మెట్రిక్ టన్నులు పాల సేకరణ జరుగుతుంది. జిల్లాలో సుమారుగా 19 లక్షల మంది జనాభా ఉన్నారు. ఒక వ్యక్తికి 570 ఎం.ఎల్ పాలు రోజుకి అవసరం పడుతుంది. రాజమండ్రి ఘటనతో జిల్లా ప్రజల్లో టెన్షన్ జిల్లాలో ఏడాదికి 8.36 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి డెయిరీలు, పాల వ్యాపారులు సేకరిస్తున్నది 3.65 లక్షల మెట్రిక్ టన్నులు డెయిరీలు, పాల వ్యాపారులు విక్రయించే పాలు, ఉత్పత్తులపై కొరవడిన పర్యవేక్షణ ఎటువంటి అనుమతులు లేకుండా పాలు విక్రయించేస్తున్న వ్యాపారులునాణ్యత తనిఖీ చేయాలి.. వివిధ డెయిరీలు, పాల వ్యాపారులు విక్రయించే పాలు, వాటి ఉత్పత్తుల నాణ్యతను ఆహార తనిఖీ అధికారులు చేపట్టాలి. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సి ఉంది. – డాక్టర్ మురళీకృష్ణ, జేడీ, పశు సంవర్ధక శాఖ శాంపిల్స్ తీశాం.. జిల్లాలో వివిధ డెయిరీలు విక్రయించే పాల ప్యాకెట్ల నుంచి శాంపిల్స్ తీశాం. వాటిలో నాణ్యత లోపించినట్టు కనిపించలేదు. – ఈశ్వరి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, విజయనగరం -
బైక్ ఢీకొని రైతు దంపతులకు గాయాలు
వీరఘట్టం: మండలంలోని నడిమికెల్ల గ్రామానికి చెందిన వూళ్ల రామారావు ,ప్రమీల దంపతులు తమ పొలంలో పనులు ముగించుకుని ఇంటికి నడిచి వెళుతుండగా రమేష్ అనే వ్యక్తి బైక్తో వారిని ఢీకొట్టడంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. నడిమికెల్ల సీఎస్పీ రహదారిపై వెళుతున్న వీరిద్దరినీ మద్యం మత్తులో బైక్తో వస్తున్న వ్యక్తి వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను వైద్య చికిత్సల కోసం వీరఘట్టం పీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం తరలించారు. ఈ ప్రమాదంపై జిల్లా ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ షణ్ముఖరావు తెలిపారు. -
ఆల్ ఇండియా తైక్వాండో పోటీలకు అభిలాష్
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి అవంతీ సెయింట్ థెరిసా ఇంజినీరింగు కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ట్రిపుల్ ఈ విభాగం విద్యార్థి జె.అభిలాష్ ఆల్ ఆండియా తైక్వాండో పోటీలకు ఎంపికయ్యాడని కళాశాల ప్రన్సిపాల్ జె.బాలభాస్కరరావు తెలిపారు. ఈ నెల 24వ తేదీన విశాఖపట్నం చైతన్య ఇంజినీరింగు కళాశాలలో గురజాడ స్పోర్ట్సు కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జేఎన్టీయూ గురజాడ అంతర కళాశాల యూనివర్సిటీ సెలక్షన్ ట్రయల్స్ పోటీల్లో 54 కేజీల విభాగంలో అభిలాష్ ప్రతిభ చాటారన్నారు. ఒడిశా రాష్ట్రంలోని డీఏవీ యూనివర్సిటీ జలంధర్లో మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు జరగబోయే ఆల్ ఇండియా తైక్వాండో పోటీల్లో అభిలాష్ ప్రాతినిధ్యం వహిస్తాడని తెలిపారు. అభిలాష్ను ప్రిన్సిపాల్ డా.బాలబాస్కరరావుతో పాటుగా వైస్ ప్రిన్సిపాల్ బి.వెంకటరమణ, ఏఓ జి.అనిల్కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు సీహెచ్.శంకరరావుటివి.సోంబాబులు అభినందించారు. బైక్ల దొంగ అరెస్ట్ ● ఆరు బైక్ల స్వాధీనం విజయనగరం క్రైమ్ : విజయనగరం పరిధిలో పలుచోట్ల బైక్ దొంగతనాలకు పాల్పడిన నిందితుడు గుమ్మడి ఆదినారాయణను బుధవారం అరెస్టు చేసినట్టు టూ టౌన్ సీఐ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. సుంకరి వీధిలో ఉంటున్న ఆదినారాయణను అరెస్టు చేసి ఆరు మోటారుసైకిళ్లను రికవరీ చేశామని చెప్పారు. వన్టౌన్, టూటౌన్ పీఎస్ పరిధిలో ఇటీవల పలు బైక్లు పోయామంటూ ఆయా బైక్ల యజమానులు స్టేషన్లలో ఫిర్యాదు చేశారన్నారు. టూ టౌన్ పీఎస్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ పుటేజి ద్వారా నిందితుడిని గుర్తించి బాబామెట్ట వద్ద పట్టుకున్నామని తెలిపారు. రికవరీ చేసిన మోటారుసైకిళ్ల విలువ సుమారు రూ.2.5లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటకు చెందిన వాడని, గడిచిన ఆరేళ్ల నుంచి విజయనగరం సుంకరివీధిలో కుటుంబంతో ఇక్కడే ఉంటున్నాడని తెలిపారు. డ్రైవరుగా పని చేస్తూ హ్యాండిల్ లాక్ వేయని మోటారుసైకిళ్లను దొంగిలించి తాకట్టుపెట్టి డబ్బులు సంపాదించడం వృత్తిగా అలవాటు చేసుకున్నాడని తెలిపారు. వన్టౌన్లో మూడు కేసుల్లో మూడు మోటారుసైకిళ్లు, టూటౌన్లో మూడు కేసుల్లో మూడు మోటారుసైకిల్లు దొంగిలించాడని చెప్పారు. వీటిని కోర్టు ఆదేశాలతో బైక్ యజమానులకు అందజేస్తామని తెలిపారు. సమావేశంలో ఎస్ఐ ప్రమీలాదేవి పాల్గొన్నారు. రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని మృతదేహం విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్ మూడో ఫ్లాట్ఫామ్పై గుర్తు తెలియని మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు బుధవారం కనుగొన్నారు. షాలీమార్–చైన్నె వెళ్తున్న ట్రైన్ నుంచి జారి పడినట్టు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్ఐ బాలాజీ తన సిబ్బందిని ఘటనా స్థలికి పంపించారు. మృతుని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
ఒత్తిడికి గురయ్యే వైద్య విద్యార్థులను గుర్తించాలి
● ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్విజయనగరం ఫోర్ట్: ఒత్తిడికి గురియ్యే వైద్య విద్యార్థులను ముందుగా గుర్తించి వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా చూడాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలను బుధవారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు, వైద్య విద్యార్థులతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో వైద్య విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఒకపై అటువంటి పరిస్థితి రాకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమాజంలో కొత్త కొత్త జబ్బులు వ్యాప్తి చెందుతున్నాయని, వీటిపై వైద్య విద్యార్థులు పరిశోధన చేయాలన్నారు. వైద్య రంగంలో వచ్చే ఆధునాతన సాంకేతిక పద్ధతులు గురించి వైద్య విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం నుంచి బేసిక్ లైఫ్ సపోర్టుపై వైద్య విద్యార్థులకు చెప్పాలన్నారు. అనంతరం వైస్ చాన్సలర్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఎం.జయచంద్రనాయుడు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.దేవీమాధవి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లోక్నాధ్, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బొలెరో వ్యాన్
చికెన్● మూడు బైక్ల ధ్వంసం ● మహిళకు తీవ్ర గాయాలు బొండపల్లి: వర్షం పడుతుందని తాటాకు టీకొట్టులో తలదాచుకున్న మహిళపై విద్యుత్ స్తంభం పడడంతో తీవ్ర గాయాలు కావడంతో పాటు మూడు బైక్లు ధ్వంసం అయిన సంఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్ఐ యు.మహేష్ తెలిపిన వివరాలు.. మండలంలోని బిల్లలవలస జంక్షన్ వద్ద పూరి పాకలో నిర్వహిస్తున్న టీకొట్టుకు అనుకోని ఉన్న విద్యుత్ స్తంభాన్ని మానాపురం నుంచి విజయనగరం పశువులు లోడుతో వెళ్తున్న బొలెరో వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం విరిగి పడటంతో అక్కడ పార్కు చేసి ఉన్న మూడు బైక్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇదే ప్రమాదంలో విజయనగరంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన రెడ్డి సింహచలంకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో విజయనగరంలోని కేంద్ర ఆస్పత్రికి తరలించారు. స్తంభాన్ని ఢీకొట్టిన తరువాత వ్యాన్ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారైనట్టు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
ఎట్టకేలకు పట్టుబడిన హిట్ అండ్ రన్ వాహనం
● సాంకేతికత ఉపయోగిస్తూ పట్టుకున్న పోలీసులు రామభద్రపురం: గత నెల జనవరి 25వ తేదీన ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన వాహనాన్ని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. సాంకేతికత ఉపయోగిస్తూ ఎస్ఐ వి.ప్రసాదరావుతో కూడిన పోలీసు బృందం చత్తీస్ఘడ్లో పట్టుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఎదురుగా శ్రీరాంనగర్కాలనీ వద్ద గత నెల 25వ తేదీ రాత్రి ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో రామభద్రపురానికి చెందిన మామ, అల్లుళ్లు మైనాపు తాతయ్య, బత్తిన అప్పారావు మృతి చెందిన సంఘటన తెలిసిందే. అయితే సరిగ్గా నెల రోజుల్లో పోలీసులు సీసీ పుటేజీలు ద్వారా చత్తీస్ఘడ్లోని స్వస్తిక్ మినరల్స్ కంపెనీకి చెందిన లారీగా గుర్తించారు. పోలీసు బృందం చత్తీస్ఘడ్ వెళ్లి అక్కడ యాజమాన్యానికి నోటీసు ఇచ్చి బుధవారం లారీని స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చత్తీస్ఘడ్లోని స్వస్తిక్ మినరల్స్ కంపెనీకి చెందిన లారీని గత నెల 23వ తేదీన బొగ్గులోడుతో విశాఖపట్టణంలో అన్లోడు చేయడానికి డ్రైవర్ చోటీలాల్ బయలుదేరాడు. అదే నెల 25వ తేదీన రామభద్రపురం పోలీస్స్టేషన్కు ఎదురుగా ద్విచక్రవాహనంపై వస్తున్న అల్లుడు, మామలను ఢీ కొట్టి ఆపకుండా విశాఖపట్టణం వెళ్లిపోయాడు. అక్కడ బొగ్గు అన్లోడు చేసి తిరిగి 27వ తేదీనాటికి చత్తీస్ఘడ్లోని స్వస్తిక్ మినరల్స్ కంపెనీకి లారీ వదిలేసి డ్రైవర్ చోటీలాల పరారయ్యాడు. సీసీ పుటేజీల ద్వారా లారీని గుర్తించిన పోలీసులు లారీ స్వాధీనం చేసుకుని పరారైన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.


