Parvathipuram Manyam
-
అవమాన భారం తట్టుకోలేక మహిళ ఆత్మహత్య
సంతకవిటి: తమ కుటుంబంపై దొంగ ముద్ర పడడంతో అవమాన భారం తట్టుకోలేక ఓ తల్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. సంతకవిటి మండలంలో జరిగిన ఈ సంఘటనపై రాజాం రూరల్ సీఐ హెచ్ ఉపేంద్రరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రామారాయపురం గ్రామంలో గత నెల 25న ఓ ఇంటిలో నాలుగు తులాల బంగారం, పదివేల రూపాయలు చోరీ జరిగింది. ఈ చోరీ విషయంలో గ్రామానికి చెందిన వై.కళావతి(55), కుమారుడు చిరంజీవిలపై చోరీ జరిగిన ఇంటి బాధితులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రామంలో ఇరు కుటుంబాలు గొడవపడ్డాయి. మంగళవారం ఉదయం చోరీ జరిగిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణలో భాగంగా కళావతితో పాటు కుమారుడిని ఎస్సై స్టేషన్కు రమ్మన్నారు. వారు వచ్చిన సమయానికి స్టేషన్లో ఎస్సై లేకపోవడంతో తల్లీకొడుకులను వెళ్లిపోమని సిబ్బంది చెప్పడంతో వారు తిరిగి వెళ్లిపోయారు. గ్రామస్తులు, బంధువులకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటిముఖం పట్టిన తల్లీకొడుకులు గ్రామస్తులకు ఫోన్ చేసి తమపై దొంగ ముద్ర పడిందని, తమను పోలీసులు స్టేషన్కు పిలుస్తున్నారని తాము గడ్డి మందుతాగి చనిపోతామని బంధువులు, స్నేహితులు, గ్రామపెద్దలకు సమాచారం ఇచ్చి, ఫోన్ స్విచాఫ్ చేశారు. అనంతరం గ్రామస్తులు వెతుకుతున్న క్రమంలో తన తల్లి ట్రైన్ కింద పడి మృతిచెందిందని ఆమె కుమారుడు చిరంజీవి గ్రామస్తులకు సమాచారం అందించాడు. అవమానం భారం తట్టుకోలేకనే.. తమపై దొంగ ముద్ర పడడంతో పాటు, పోలీసులు పిలవడంతో అవమాన భారం తట్టుకోలేక మనస్తాపంతో తన తల్లి రైలు కింద పడి మరణించినట్లు కుమారుడు చిరంజీవి వెల్లడించినట్లు సీఐ తెలిపారు. తామిద్దరం పొందూరు మండలం పెనుబర్తి గ్రామం వద్ద ఈనెల 16న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలనుకుని ట్రైన్కు ఎదురుగా నిల్చున్నామని, ఇంతలో తన తల్లి తనను పట్టాలపైనుంచి పక్కకు తోసేసి, తాను ఆత్మహత్య చేసుకుందని కుమారుడు తెలిపినట్లు సీఐ వివరించారు. ఇదిలా ఉండగా కళావతి ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ప్రాణం తీసిన బతుకు వేట
● మడ్డువలస ప్రాజెక్టులో మత్స్యకారుడి మృతి వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు పడి వంగర గ్రామానికి చెందిన మత్స్యకారుడు కంబాల గణేష్(40) బుధవారం మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. వేకువ జామున 5గంటల సమయంలో తన కుమారుడు ధనుంజయతో కలిసి పడవల సహాయంతో గణేష్ వెళ్లాడు. మొక్కతోట సమీపంలో ఉన్న ప్రాజెక్టు భాగంలో చేపల కోసం వేసే వలలను తీసే ప్రయత్నంలో పడవ నుంచి నీటిలోకి గణేష్ జారిపోయాడు. ఆ ప్రాంతంలో ఉన్న సహచర మత్స్యకారుడు యువరాజు చూసి కేకలు వేశాడు. లోతు ప్రాంతం కావడంతో అప్పటికే గణేష్ నీటిలో మునిగిపోయాడు. కొన్ని గంటల తరువాత ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు పెనుబోతు దుర్గారావు ఆధ్వర్యంలో ఇనుప గేలాలు, ఇసురు వలలతో పలువురు మత్స్యకారులను ప్రాజెక్టులోకి తీసుకువెళ్లి గాలింపు చేపట్టగా కాసేపటికి ఇనుప గేలాలకు తగిలి గణేష్ మృతదేహం లభ్యమైంది. దీంతో మృతుడి కుటుంబసభ్యులు, సహచర మత్స్యకారులు అక్కడికి చేరుకుని భోరున విలపించారు. మృతదేహాన్ని రాజాం సీహెచ్సీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ కె.రామ్మోహనరావు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, భార్య జ్యోతి ఉన్నారు. -
● ఆహ్వానం
రాజాం మండలంలోని బొద్దాం జెడ్పీ హైస్కూల్లో కొత్తగా చేరిన విద్యార్థులకు అక్కడి పాఠశాల హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది వినూత్నంగా ఆహ్వానం పలికారు. పాఠశాలలో 85 మంది విద్యార్థులు కొత్తగా చేరగా, వీరంతా బుధవారం తరగతులకు హాజరయ్యారు. పాఠశాల మెయిన్ గేటు వద్ద ఉపాధ్యాయులు ఇరువైపులా నిల్చొని విద్యార్థులపై పూలు జల్లి, డప్పువాయిద్యాలతో ఆహ్వానం పలికారు. వివిధ కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు నుంచి పాఠశాలలో చేరినట్టు ఉపాధ్యాయులు తెలిపారు. అందరికీ ప్రమాణాలతో కూడిన విద్యను బోధిస్తామని చెప్పారు. – రాజాం -
మోటార్ వైర్లు దొంగలిస్తున్న నిందితుడికి రిమాండ్
గుర్ల: మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వినియోగిస్తున్న విద్యుత్ మోటార్లు, సోలార్ మోటార్లకు సంబంధించిన వైర్లు ఎప్పటికప్పుడు దొంగిలిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యక్తిని గుర్ల పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మోటార్ వైర్లు దొంగిలిస్తున్న మండలంలోని పల్లిగండ్రేడుకు చెందిన గొల్లపల్లి గోవింద్ను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు సీఐ జి.శంకరరావు, ఎస్సై పి.నారాయణ రావు బుధవారం తెలిపారు. కోటగండ్రేడు సమీపంలోని రైతులు మోటారు వైర్లు దొంగిలిస్తుండగా నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు గోవింద్ను విచారణ చేయగా గతంలో చేసిన మోటార్ వైర్ల దొంగతనం గురించి చెప్పినట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని చీపురుపల్లి కోర్టులో హజరుపరచగా నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు. హాస్టల్స్ సమస్యలు పరిష్కరించాలి ● కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆందోళనపార్వతీపురం రూరల్: ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గురుకుల, కేజీబీవీ వసతి గృహాల్లోని విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవికుమార్ మాట్లాడారు. పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. జైళ్లలో ఖైదీల ఆహారానికి రోజుకు రూ.100కు పైగా ఖర్చు చేస్తుండగా, విద్యార్థులకు రోజుకు కేవలం రూ.53 మాత్రమే కేటాయిస్తున్నారన్నారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు నెలకు రూ.1200, ఇంటర్ విద్యార్థులకు రూ.1600 మాత్రమే ఇవ్వడం సరిపోదన్నారు. సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాల్లో కనీస సౌకర్యాలైన తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. పాత భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించాలని కోరారు. పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మెస్ చార్జీలను రూ.2500 నుంచి రూ.3000కు పెంచాలని డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, అటెండర్, కమాటి, ట్యూటర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
ఆర్డీవో బాధ్యతల స్వీకరణ
పార్వతీపురం రూరల్: పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)గా కె.మాధురి బుధవా రం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆమెను కార్యాల యం సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమెకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నేపథ్యం లేనప్పటికీ, తొలి ప్రయత్నంలోనే ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షలో డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. మొదటి పోస్టింగ్లో ఎన్టీఆర్ జిల్లా తి రువూరు ఆర్డీవోగా విధులు నిర్వహించిన ఆమె పార్వతీపురం ఆర్డీవోగా బదిలీ అయ్యారు. పార్వతీపురం రూరల్: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులతో పాటు పకడ్బందీ భద్రత కల్పించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం స్థానిక ’గిరిమిత్ర’ భవనంలో హెచ్ఎంలు, వార్డెన్లతో 2026–27 విద్యా సంవత్సర నిర్వహణపై ఆయన సమీక్షించారు. విద్యార్థుల నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, కిట్లను సకాలంలో అందించాలని పీవో స్పష్టం చేశా రు. అకడమిక్ క్యాలెండర్ను తు.చ తప్పకుండా అమలు చేయాలని, సులభమైన అభ్యాస పద్ధతులను ప్రవేశపెట్టాలని సూచించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. సురక్షిత తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లను నిరంతరం పర్యవేక్షించాలని, కిచెన్ గార్డెన్స్ పెంచి తాజా కూరగాయలను భోజనంలో వినియోగించాలని చెప్పారు. బాలికల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని, ’మంచి స్పర్శ–చెడు స్పర్శ’పై వారికి ప్రత్యేక అవగాహన కల్పించా లని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రగతిని వివరించేందుకు ప్రతి నెలా విధిగా తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ డీడీ ఎ.విజయశాంతి, డిప్యూటీ డీఈవో క్షేమాభాయ్, ఐటీడీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సీఏఎస్ పోస్టులకు ఇంటర్వ్యూలు విజయనగరం ఫోర్ట్: డైరెక్టర్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలో నిర్వహించే ఏరియా ఆస్పత్రులు, సీహెచ్ల్లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్, స్పెషలిస్టు) సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టులకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లోని సమావేశ మందిరంలో బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి (డీసీహెచ్ఎస్) డాక్టర్ పద్మశ్రీరాణి అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేశారు. జనరల్ సర్జరీ ఒక పోస్టుకు ఆరుగురు, సీఎస్ జనరల్ నాలుగు పోస్టులకు 29 మంది అభ్యర్థు లు హాజరయ్యారు. పెథాలజీ–1పోస్టు, ఈఎన్టీ–1, రేడియాలజీ–3, ఆప్తమాలజీ–1 పోస్టుకు అభ్యర్థులు ఎవరూ హాజరుకాలేదు. ● ఆవిష్కరణచిత్రంలో కూలింగ్ క్యాప్ను చూపిస్తున్నది గరివిడి కేజీబీవీ బాలికలు. 2024 సంవత్సరం నుంచి పాఠశాలలో చెప్పిన ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) తరగతుల్లో నేర్చుకున్న అంశాలతో కూలింగ్ క్యాప్ల తయారీ ప్రాజెక్టును రూపొందించారు. రెండు బ్యాటరీలను క్యాప్ లో అమర్చారు. ఒకసారి చార్జ్ చేస్తే 8 గంటలు పనిచేస్తాయి. ఈ క్యాప్లు తలకు పెట్టుకుంటే శరీర ఉష్ణోగ్రతలను తగ్గించి, ఎండల నుంచి ఉపశమనం లభిస్తుందని బాలికలు చెబుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు ఇవి ఎంతగానో ఉపయోగపతాయన్నారు. ప్రాజెక్టును గత నెల 24, 25, 26 తేదీల్లో గీతం యూనివర్సిటీలో జరిగిన ప్రదర్శనల్లో ప్రదర్శించారు. ఇది న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. -
రాష్ట్రస్థాయి ‘యోగాంధ్ర’ పోటీలకు పయనం
పార్వతీపురం రూరల్: విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి ’యోగాంధ్ర’ పోటీలకు పార్వతీపురం మన్యం జిల్లా బృందం బుధవారం పయనమైంది. ఈ మేరకు కలెక్టరేట్ ఆవరణలో డీఆర్వో, జాయింట్ కలెక్టర్ (ఎఫ్ఏసీ) కె.హేమలత క్రీడాకారుల బృందం వెళ్లే ప్రత్యేక వాహనాన్ని జెండా ఊపి సాగనంపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా నుంచి జూనియర్, యంగ్, సీనియర్ కేటగిరీల్లో మొత్తం 35 మంది అభ్యర్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గడిచిన మూడు రోజులుగా జిల్లాస్థాయిలో నిర్వహించిన సోలో, గ్రూప్ యోగా, ప్రాణాయామం, క్విజ్, స్లోగన్, వ్యాసరచన, పాటలు, షార్ట్ ఫిల్మ్ తదితర విభాగాల్లో ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసినట్లు నోడల్ అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు తెలిపారు. ప్రయాణంలో క్రీడాకారుల సౌకర్యార్థం బస్సులో వైద్య సిబ్బందిని, ప్రథమ చికిత్స కిట్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందానికి గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయశాంతి నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో ఆయుష్ జిల్లా ఇన్న్చార్జి అధికారి డాక్టర్ టి.హేమాక్షి, వైద్యాధికారులు వర్మ, మహేష్, యోగా గురువులు మోహన్ గంతాయత్, జనార్దనరావు, పీడీ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనం కన్నీటి కష్టాలు
గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026● సుదూర ప్రాంతాల నుంచి బిందెలతో నీళ్లమోత●మంత్రి ఇలాకాలో తాగునీటి ఇబ్బందులు సాలూరు రూరల్: మన్యం ప్రజలను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. బిందెడు నీటికోసం సుదూర ప్రాంతాలకు పయనిస్తున్నారు. చలమ లు, చేతిపంపుల నీటితో దాహం తీర్చుకుంటున్నారు. ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడు తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో ప్రభు త్వం నిర్లక్ష్యం గిరిజన గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. ప్రస్తుతం చాలా గిరిజన గ్రామాల్లో తాగునీటి పరిస్థితి అధ్వానంగా ఉంది. బోరుబావులు మరమ్మతులకు గురై నెలలు గడుస్తున్నా బాగుచేసేవారు లేరు. మరమ్మతులు చేసేందుకు నిధులు లేవని పంచాయతీ కార్యదర్శులు చేతులెతేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నియోజకవర్గంలో గిరిజనులు తాగునీటికి కటకటలాడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జల్జీవన్ మిషన్ పథకం ఉన్నప్పటికీ నిర్వహణ లోపంతో సాలూరు మండలంలోని పలు గ్రామాల ప్రజలు తాగునీటికి అవస్థలు పడక తప్పడం లేదు. డెన్సరాయి గ్రామంలో రెండు నెలలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ కార్యదర్శికి ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో పక్క గ్రామమైన రేవడి వలసకు వెళ్లి గ్రామంలో చిన్నాపెద్ద తేడా లేకుండా బిందెలతో నీళ్లు మోసుకుని అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ●కొట్టుపరువు పంచాయతీ బూర్జివలస గ్రామంలో నెలరోజులుగా తాగునీటి బోరు మరమ్మతులకు గురైనా ఇప్పటివరకు బాగుచేయలేదు. గ్రామస్తులు గ్రామంలో ఉన్న చేతి బోరు వద్ద నీళ్లు తోడుకుంటూ అవసరాలు తీర్చుకుంటున్నారు. వ్యవసాయ పనులు చేసుకునే సమయంలోనూ తాగునీరు కోసం సమయం కేటాయించాల్సి వస్తోందని గిరిజనులు వాపోతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలి మండలంలోని పలు గ్రామాల్లో గిరిజనులు తాగునీటికి అవస్థలు పడుతున్నారని అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సీపీఎం నాయకుడు మర్రి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. డెన్సరాయి, బూర్జివలస గ్రామాల్లో వెంటనే తాగునీటి సమస్య పరిష్కరించాలని దీనిపై కలెక్టర్ చర్యలు చేపట్టాలని కోరారు. -
క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం
● ఎస్పీ ఏఆర్ దామోదర్ విజయనగరం క్రైమ్: క్రీడలు జీవితంలో ఆనందం కలిగించి, ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని నింపుతాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఈ మేరకు స్థానిక విజ్జి స్టేడియంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ బుధవారం వైద్యులకు క్రికెట్ పోటీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ పోటీలను ఎస్పీ దామోదర్ ప్రారంభించి మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగం, ఇతర దైనందిన జీవితంలో కలిగిన మానసిక ఒత్తిడిని దూరం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోయి, వృత్తిలో మరింత ఏకాగ్రత పెరగడంతో పాటు, వృత్తి నైపుణ్యం కూడా మెరుగవుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ కూడా క్రికెట్ ఆడి క్రీడాభిమానులను అలరించారు. పిడుగుపాటుతో దుక్కి పశువుల మృతివేపాడ: మండలంలోని కరకవలస గ్రామపంచాయతీ శివారు మారిక గిరిజన గ్రామంలో పిడుగుపాటుకు గురై రెండు దుక్కి పశువులు మృతిచెందాయి. బుధవారం మధ్యాహ్నం ఈదురుగాలులు, వర్షంతో పాటు ఉరుములు, పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో పడిన పిడుగుకు గ్రామానికి చెందిన పాతబోయిన పైడితల్లికి చెందిన రెండు పశువులు మృతి చెందాయి. వాటి విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని స్థానికులు తెలిపారు. పిడుగుపాటుతో ఏడు ఆవులు.. శృంగవరపుకోట: మండలంలోని ధారపర్తి పంచాయతీ పరిఽధి పల్లపుదుంగాడ గ్రామంలో బుధవారం మద్యాహ్నం వర్షం కురుస్తున్న సమయంలో గిరిజన రైతులు జరత లచ్చన్న, కినబెరి రామన్న, పోరి అప్పన్న, జన్ని భీమన్నలకు చెందిన ఏడు ఆవులు పిడుగుపాటుకు చనిపోయాయి. దీంతో సుమారు మూడు లక్షల రూపాయల మేర ఆస్తినష్టం సంభవించిందని, గిరిజన రైతులు వాపోయారు. బాధిత గిరిజన రైతుల్ని ఆదుకోవాలని గిరిజన సంఘం నేతలు కోరారు. వత్తాడలో కింగ్కోబ్రా..! ● ఇంట్లో చొరబడి గంటల తరబడి తిష్ఠ ● అటవీశాఖ చొరవతో పట్టుకున్న స్నేక్క్యాచర్స్గుమ్మలక్ష్మీపురం: మండలంలోని వత్తాడ గ్రామంలో బుధవారం కింగ్ కోబ్రా(గిరినాగు) ఆందోళన సృష్టించింది. ఈమేరకు గ్రామానికి చెందిన ఆలుగు పొట్టిందొర బుధవారం ఉదయం నిద్రలేచిన కొద్దిసేపటికి శబ్దం వినిపించగా బీరువావైపు చూడడడంతో ఏ సమయంలో దూరిందోగానీ బీరువాపై భాగంలో కింగ్ కోబ్రా ముడుచుకుని (చుట్టుకుని) కనిపించింది. దీంతో భయాందోళన చెందిన పొట్టిందొర కుటుంబీకులతో పాటు బయటికి వచ్చి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో..పాముకు ఎటువంటి హాని చేయకుండా స్థానికులు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. స్పందించిన అటవీశాఖ అధికారులు వత్తాడ గ్రామానికి వెళ్లి కింగ్కోబ్రాగా గుర్తించి..స్నేక్క్యాచర్స్కు సమాచారం అందించారు. విశాఖపట్నం నుంచి వత్తాడ గ్రామానికి మధ్యాహ్నం చేరుకున్న స్నేక్ క్యాచర్స్ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. ఇంతలో కింగ్కోబ్రా తన నోట్లోంచి మరో చచ్చిన పాము (జెర్రిపాము)ను బయటకు కక్కడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కింగ్ కోబ్రా మరోపామును అమాంతం మింగడం వల్లనే ఎవరికీ హాని చేయకుండా బీరువాపై తనంతటతాను చుట్టుకుని ఉండిపోయిందని, లేకుంటే పెనుప్రమాదమే జరిగుండేదంటూ స్థానికులంతా వాపోయారు. కింగ్ కోబ్రాను పట్టుకున్న స్నేక్క్యాచర్స్ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు తీసుకెళ్లడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
సర్కారు అభాసుపాలు
● సక్రమంగా అందని పౌష్టికాహారం ● పాలకోసం అంగన్వాడీ లబ్ధిదారుల ఎదురుచూపులు ● అంగన్వాడీలకు చేరని ఇతర సరుకులు పార్వతీపురం రూరల్/ రామభద్రపురం: చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలే పునాది. వయసుకు తగ్గ బరువు, ఎత్తు ఉంటేనే వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా నిలబడతారు. మాతాశిశువులు పోషకాహార లోపం, రక్తహీనత బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాయి. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ పంపిణీ ప్రక్రియ గాడితప్పడంతో అసలు లక్ష్యం అందని ద్రాక్షలా మారుతోంది. మాతాశిశువులకు తప్పని నిరీక్షణ జిల్లా వ్యాప్తంగా 1,425 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. వాటి పరిధిలో 4,226 మంది గర్భిణులు, నెలల వయసు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 39,647 మంది ఉన్నారు. ఇంత భారీ స్థాయిలో లబ్ధిదారులు పౌష్టికాహారం కోసం ఎదురుచూస్తుంటే.. అధికారులు మాత్రం సరుకులు జిల్లాకు చేరుకున్నాయని, నేడో రేపో పంపిణీ చేస్తామంటూ దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సకాలంలో పంపిణీ జరగకపోవడంతో మాతాశిశువులకు నిరీక్షణ తప్పడం లేదు. విజయనగరం జిల్లాలో.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులలో 2499 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో గర్భిణులు 7388 మంది, బాలింతలు 7492 మంది ఉన్నారు.అలాగే 3 నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులు 20,127 మంది, 7 నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 35,482 మంది, 6 నెలల లోపు చిన్నారులు 6913 మంది ఉన్నారు.అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం వారిలో చినారులకు అంగన్వాడీ కేంద్రాలలో వండి పెడుతున్న మధ్యాహ్న భోజనంతో పాటు ఒక్కొక్కరికీ నెలకు 2.50 లీటర్లు పాలు ఇవ్వాలి. అలాగే బాలింతలు,గర్భిణులకు ఒక్కొక్కరికీ నెలకు 5 లీటర్లు చొప్పున పాలు అందజేయాల్సి ఉంది.ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 2,15,768 లీటర్ల పాలు అవసరమని అంగన్వాడీ కేంద్రాల టీచర్ల నుంచి నివేదికలు తీసుకుని ఆయా శాఖాధికారులు ఇండెంట్ పెట్టినట్లు సమాచారం.అయితే ఆ పాలు ఈ నెల 5వ తేదీ లోపు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా కావాల్సి ఉన్నా ఇప్పటికీ కేంద్రాలకు సరఫరా కాని పరిస్థితి ఉంది. దీంతో గర్భిణులు, బాలింతలు ప్రశ్నిస్తుంటే ఏం చెప్పాలో తెలియక అంగన్వాడీ కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు,బాలింతలకు రక్తహీనతకు గురికాకుండా నాణ్యమైన పౌష్టికాహారం అందజేయడమంటే ఇదేనా అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. -
ఎరువు ధర బరువైనా కరువే..!
సాలూరు రూరల్: ఎరువుల ధరలు గత ఏడాది కంటే ఈ ఏడాది పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎరువు కావాలంటే ఆన్లైన్లో ఆధార్కార్డు నమోదు చేసుకుని తీసుకునే పద్ధతితో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో పనులు చేసుకోవాల్సిన సమయంలో ఎరువులకోసం పడిగాపులు కాయాల్సి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బుధవారం సాలూరు మండల రైతులు ఎరువు కోసం ఉదయం 6 గంటలనుంచి గ్రోమోర్ సెంటర్ వద్ద పడిగాపులు పడ్డారు. అయితే షాపు 8 గంటలకు తెరవడం, అలాగే కొంత సమయం ఆన్లైన్ పనిచేయకపోవడంతో రైతులు విసిగిపోయారు. ఎట్టకేలకు పరిమితంగా యూరియా, డీఏపీ ఇవ్వడంతో రైతులు నిరుత్సాహంగా వెనుదిరిగారు. ఇలా చాలీ చాలని ఎరువులతో పంటలు ఎలా పండించగలమని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక ధరలతో భారం గతంలో ఉన్న ధరలకంటే ఈ ఏడాది ఎరువుల ధరలు దాదాపు సగానికి పైగా పెరిగిపోయాయి. అమోనియా గత ఏడాది రూ.700 నుంచి రూ.800 ఉంటే ఈ ఏడాది రూ.1200 నుంచి రూ.1400 వరకు అమ్ముతున్నారు. అలాగే రెడ్ పొటాష్ గత ఏడాది రూ.1400 ఉండగా ప్రస్తుతం రూ.2,200కు అమ్ముతున్నారు. అయినా కూడా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా రైతులను ఈ ప్రభుత్వం ఉసూరుమనిపిస్తోందని వాపోతున్నారు. రైతులపై ప్రభుత్వం చిన్నచూపు -
బంగారం చోరీ కేసులో నిందితురాలి అరెస్టు
చికెన్బొబ్బిలి: బాడంగి మండలం వీరసాగరంలో మంగళవారం జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దీనిపై బుధవారం రూరల్ సీఐ ఎస్ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వీరసాగరం గ్రామానికి చెందిన జాగరాన శంకర రావు, సుజాతలు మంగళవారం మధ్యాహ్నం పొలం పనికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో సుజాత ఆడపడుచు దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన మరడ వసంత మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో శంకరావు, సుజాతల ఇంటిలో చొరబడి బీరువా తాళాలు పగులగొట్టి 8 తులాల బంగారు వస్తువులను చోరీ చేసి వెళ్లిపోయింది. శంకర రావు, సుజాతలు ఇంటికి వచ్చి బట్టలు చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి బంగారు వస్తువులను వెతికి చూడగా లేకపోవడంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదుచేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఎవరెవరు ఆ సమయంలో వారి ఇంటిపరిసరాల్లో సంచరించారన్న విషయం తెలుసుకున్న తరువాత మరడ వసంతపై అనుమానం వచ్చి ఆ గ్రామంలోకి వెళ్లి విచారణ చేయడానికి ముందు అక్కడి జంక్షన్లో ఆమెను పట్టుకుని తనిఖీ చేయగా ఆమె వద్ద ఫిర్యాదు దారు వివరాల ప్రకారం అన్ని బంగారు వస్తువులూ దొరకడంతో అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. సమావేశంలో బాడంగి ఎస్సై సూర్యకుమారి ఉన్నారు. -
గురువుల భవితవ్యంపై అనిశ్చితి
గుమ్మలక్ష్మీపురం: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు రెన్యువల్ ఉత్తర్వులు జారీ కాకపోవడంతో ఆందోళన నెలకొంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై, తరగతులు కొనసాగుతున్నప్పటికీ.. ఉద్యోగ కొనసాగింపుపై స్పష్టత లేకపోవ డం వల్ల వందలాది మంది ఉపాధ్యాయులు అనిశ్చితిలో ఉన్నారు. వెంటనే రెన్యువల్ ఉత్తర్వులు జారీ చేసి, తమ సేవలకు భరోసా కల్పించాలని వారంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉద్యోగం ఉంటుందో..లేదో తెలియక మనోవేదనకు గురవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా సేవలు... రాష్ట్రవ్యాప్తంగా గిరిజన గురుకుల పాఠశాలల్లో సుమారు 15 నుంచి 20 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ విధానంలో 1,659 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరి సర్వీసును, సేవను గుర్తించని చంద్రబాబు ప్రభుత్వం.. 2025 మెగా డీఎస్సీలో నిబంధనలకు విరుద్ధంగా 1,143 గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల పోస్టులను కలిపి భర్తీ చేసింది. ఆ నియామకం వల్ల గిరిజన గురుకుల పాఠశాలల్లో అవుట్సోర్సింగ్ విధానంలో పని చేసిన వారి స్థానంలో డీఎస్సీలో ఎంపికై న రెగ్యులర్ ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. తమను యథావిధిగా విధుల్లో కొనసాగించాలన్న డిమాండ్తో అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులంతా సుమారు 45 రోజుల పాటు సమ్మె చేశారు. అప్పట్లో స్పందించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. 2025 డీఎస్సీ వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని చెప్పారు. ‘డీఎస్సీలో గురుకుల పాఠశాలల్లో ఉద్యోగం పొందిన వారితోపాటు ప్రస్తుతం అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా విధుల్లోనే ఉంటారు.. ఎవర్నీ తీయబోమ’ని హామీనిచ్చి, సమ్మెను విరమింపజేయించారు. దీంతో డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులతోపాటు అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు కూడా ఆయా పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో విధులు నిర్వహించారు. నేటికీ రాని ఉత్తర్వులు 2026–27 విద్యాసంవత్సరం ఈ నెల 12తో ప్రారంభమైంది. అవుట్ సోర్సింగ్ ఉపాధ్యా యులు ఆయా పాఠశాలలకు విధుల నిమిత్తం వెళ్లగా.. అక్కడి ప్రిన్సిపాళ్లు ‘ఉన్నతాధికారుల నుంచి రెన్యువల్ ఉత్తర్వులు రాలేదు. మీకు పోస్టులు లేవు. విధుల్లోకి తీసుకోలేమ’ని చెప్పే యడంతో వీరంతా కంగుతిన్నారు. చాలీచాలని వేతనాలతో.. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా రాత్రనక, పగలనక విధులు నిర్వహిస్తున్నారు. గిరిజన విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన తమ పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారిందని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా తమ ఉద్యోగం రెన్యువల్ ఉత్తర్వుల కోసం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. సరైన స్పష్టత లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సుమారు రెండు దశాబ్దాల నుంచి పని చేస్తున్న తాము.. ఒక్కసారిగా కుటుంబంతో పాటు రోడ్డున పడతామని వాపోతున్నారు. -
కుక్కేసి.. నోరు నొక్కేసి!
● ఆగని పశువుల అక్రమ రవాణా ● ఉమ్మడి జిల్లా మీదుగా వేల సంఖ్యలో తరలింపు ● ఇతర రాష్ట్రాల్లోని వధశాలలకు మూగజీవాలు ●ఇటీవల రాత్రి సమయంలో పార్వతీపురం మీదుగా పశువులను వాహనాల్లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ వాహనాలు ఒక ప్రజా ప్రతినిధికి చెందినవిగా తెలిసింది. వాటిని విడిచిపెట్టాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. ●గతంలో ఒడిశా రాష్ట్రం సిమిలిగుడ నుంచి భారీ వాహనాల ద్వారా సాలూరు మీదుగా 86 పశువులను తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. వాహనాన్ని సీజ్ చేశారు. సాక్షి, పార్వతీపురం మన్యం: ఉమ్మడి జిల్లా మీదుగా పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. విజయనగరం జిల్లాలో పెదమానాపురం సంత ఉత్తరాంధ్రలో పశువుల వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ నుంచే ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతున్నాయి. ఇందులో అధికశాతం వధశాలలకే కావడం గమనార్హం. ఉత్తరాంధ్రలోని ఓ జిల్లా స్థాయి పశుసంవర్థక శాఖ అధికారి ఈ అక్రమ దందాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు విజిలెన్స్కు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువ భాగం కేరళలోని గోవధ శాలలకు తరలిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉమ్మడి జిల్లా మీదుగా వేలాది పశువులు కబేళాలకు అక్రమంగా తరలిపోతున్నాయి. కనికరం, జాలి మరిచి.. అతి కర్కశంగా పశువులను లారీల్లో కుక్కి బలవంతంగా ఎగుమతి చేస్తున్నారు. దీని వెనుక బలమైన రాజకీయ మాఫి యా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దందాలో లక్షలాది రూపాయ లు చేతులు మారుతున్నాయి. అధికారులు, నాయకులకు ముడుపులు అందుతున్నాయ నే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని పార్వతీపురం, నవగాం, సీతంపేట, అడ్డాపుశీల, పరశురాంపురం, గుమడ, పెదమానాపురం, సాలూరు, పాచిపెంట, అలమండ, రాజాం, కందివలస ప్రాంతాల నుంచి పొరుగు రాష్ట్రాలకు నిత్యం పశువుల తరలింపు అవుతోంది. సంతల్లో వ్యాపారులు రైతుల నుంచి పశువులను కొనుగోలు చేస్తున్నారు. వాటిని జాతీయ రహదారి సమీపంలో ఖాళీ ప్రదేశాల్లో ఒక దగ్గరకు చేర్చి రాత్రిపూట లారీ లు, ఇతర వాహనాల్లో తరలిస్తున్నారు. కంటైనర్లలోనూ రహస్యంగా కబేళాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లోనే ఒడిశా నుంచి వందల కిలోమీటర్ల మేర పశువుల ను నడిపించి సంతలకు తరలి స్తున్నారు. ఈ తరలించే క్రమంలో వాహనాల్లో పశువులను పరిమితికి మించి ఎక్కిస్తుండటం వల్ల కొన్ని గోవులు మృత్యువాత పడుతున్నాయి. అలసిపోయి కదల్లేని స్థితిలో వాటిని హింసిస్తూ అత్యంత క్రూరంగా తరలిస్తున్నారు. పశువు ఆరోగ్యంగా ఉంటే రూ.20 వేలు, బక్క చిక్కితే రూ.10 వేలలోపు రైతులకు చెల్లిస్తున్నారు. పశువుల తరలింపు, రవాణాకు అనుమతి పత్రాలు తప్పనిసరి. సుదూర ప్రాంతాలకు వ్యవసాయ పను ల నిమిత్తం, పాడి అవసరాలకు తరలిస్తున్నామని ధ్రువీకరిస్తూ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నుంచి అనుమతి తీసుకోవాలి. వాహనాల విషయంలో సైతం నిబంధనలు పాటించాలి. జిల్లాలో ఇవేవీ పాటించిన దాఖాలాలు లేవు. పశువుల అక్రమ రవాణాపై దాడులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. పార్వతీపురం జిల్లా కేంద్రం, విజయనగరంలోని పెద మానాపురంలో నిర్వహించే సంతల్లో దళారులు అధిక సంఖ్యలో పశువులను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారుల ఏజెంట్లకు విక్రయిస్తుంటారు. సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఒడిశా రాయగడ సమీపంలో పశువులను కొనుగోలు చేసి కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల మీదుగా ఆంధ్ర ప్రాంతానికి తీసుకువచ్చి ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికార పార్టీలకు చెందిన కీలక నాయకుల అండదండలు పశువుల ఎగుమతి వ్యాపారం చేసే వారికి ఉండటంతో యథేచ్ఛగా ఈ దందా సాగుతోంది. అధికార పార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో పాటు జిల్లా అధికారులకు ప్రతి వారం రూ.లక్షల్లో ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి గురువారం పార్వతీపురంలో నిర్వహించే సంత, శనివారం మానాపురంలో సంతలకు పెద్ద ఎత్తున పశువుల రవాణా సాగుతోంది. ఒడిశాలోని నారాయణపట్నం, అలమండ, కొరాపుట్, పొట్టంగి, సిమిలిగుడ, నవ రంగ్ పూర్, జయపూర్, గుణుపూర్ నుంచి ఈ వారపు సంతలకు పశువులను తరలిస్తున్నారు. ఒడిశాలోని పొట్టంగి, సిమిలిగుడ, కొరాపుట్ ప్రాంతాల నుంచి వందలాది పశువులను కాలినడకన మానాపురం సంతకు తరలిస్తున్నారు. రవాణా చేస్తున్న వాహనాల కాంట్రాక్టు వెనుక అధికారపార్టీకి చెందిన ఓ ఉత్తరాంధ్ర మంత్రి సమీప బంధువు హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పోలీసు, రవాణా, పశుసంవర్ధక శాఖ అధికారులు నోరు మెదపడం లేదనే ప్రచారం జరుగుతోంది. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి బడుకొండపేటకు చెందిన సత్యం(65) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి భార్య తవుడమ్మ ఫిర్యాదు చేసినట్లు ఎస్సై అశోక్ బుధవారం తెలిపారు. ఉదయాన్నే రోడ్డుపై వెళ్తున్న సత్యాన్ని లారీ ఢీ కొట్టడంతో పడిపోయాడని చికిత్స కోసం హాస్పిటల్ తరలించే లోగానే మృతిచెందాడని ఆయన భార్య ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిరుపేద విద్యార్థికి చేయూత నెల్లిమర్ల రూరల్: మండలంలోని అప్పయ్యపేట గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి సతీష్కుమార్కు తమన్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాలు, యూనిఫాంతో పాటు ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొడ్డేపల్లి రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి విద్యాభ్యాసానికి దీర్ఘకాలికంగా అండగా నిలుస్తామన్నారు. విద్యార్థికి అవసరమైన పుస్తకాలు, పెన్నులు, యూనిఫాంతో పాటు విద్యా సంవత్సరానికి అవసరమైన ఇతర విద్యా సామిగ్రిని అందజేసినట్లు చెప్పారు. -
గడువులోగా లక్ష్యాలు పూర్తిచేయాలి
పార్వతీపురం: జిల్లాలోని పురపాలక సంఘాలకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠి న చర్యలు తీసుకుంటా మని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి హెచ్చరించా రు. ఈ మేరకు బుధవా రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్వచ్ఛత కార్యక్రమాలు, పారిశుధ్య నిర్వహణ, బల్క్ వేస్ట్ జనరేటర్ల రిజిస్ట్రేషన్ పురోగతిని సమీక్షించారు. పబ్లిక్, కమ్యూనిటీ మరుగుదొడ్ల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టిసారించి, నాలుగు వారాల సమగ్ర నివేదికను శుక్రవారం సాయంత్రంలోగా సమర్పించాలని ఆదేశించారు. బల్క్వేస్ట్ జనరేటర్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించి లక్ష్యాలను పూర్తిచేయాలని సూచించా రు. విధుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో మూడు మున్సిపాల్టీల కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలి జిల్లాలో వరి పంటకు బదులుగా రాగి, జొన్నలు, మొక్కజొన్న, కంది, పత్తి వంటి అధిక ఆదాయం ఇచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాదితో పోలిస్తే వరి సాగు విస్తీర్ణం 50శాతం మేర తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించా రు. అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథ కం లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నా రు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీశంకరరావు, జిల్లా ఉద్యానవన శాఖాధికారి జి. సత్యనారాయణరెడ్డి, జిల్లా పశుసంవర్థక శాఖాధికా రి సీహెచ్.దీనమయ్య తదితరులు పాల్గొన్నారు. జలవనరుల పునరుద్ధరణకు ప్రాధాన్యం జిల్లాలో ప్రతి నీటి చుక్కను సంరక్షించాల్సిన అవస రం ఉందని, జలవనరుల పునరుద్ధరణే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి సూచించారు. జలధార–జలహారతి పనుల్లో జిల్లా 94 శాతం ప్రగతితో ముందజలో ఉందని, మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 9,374 పనుల్లో 8,687 పనులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని, 3,268 పనులు పూర్తయ్యాయన్నారు. కురుపాం, భామిని, సాలూరు మండలాలు శతశా తం గ్రౌండింగ్ పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాయని పేర్కొన్నారు. ఇంకా ప్రారంభించాల్సిన 547 పనులను త్వరితగతిన చేపట్టాలని, ముఖ్యంగా సీతంపే ట, వీరఘట్టం మండలాల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘ఈ డార్’ నిర్వహణలో గుర్ల టాప్..
గుర్ల: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు పరిహారం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ డార్ (ఎలక్ట్రానిక్ డీటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్) పోర్టల్ నిర్వహణలో గుర్ల పోలీస్స్టేషన్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రోడ్డు ప్రమాద బాధితుల వివరాలను ఈ పోర్టల్లో సక్రమంగా నమోదు చేస్తే ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం త్వరగా అందుతుంది. ఈ విషయంలో కానిస్టేబుల్ మురళి చురుగ్గా వ్యవహరిస్తూ, పోర్టల్ నిర్వహణను సక్రమంగా చేపట్టడంతో గుర్ల పోలీస్స్టేషన్కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దీంతో ఎస్పీ ఏఆర్ దామోదర్ కానిస్టేబుల్ మురళిని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ రాఘవులు, సీఐ శంకరరావు, ఎస్సై నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు. విజయనగరం లీగల్: వచ్చేనెల 11న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత పిలుపునిచ్చారు. పూల్బాగ్కాలనీలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీస్, ఎకై ్సజ్ అధికారులతో బుధవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న రాజీ పడదగ్గ క్రిమినల్, ఎకై ్సజ్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎ.కృష్ణప్రసాద్, విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ రాఘవులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువు
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సాలూరు: మహిళలను ఎవరు దూషించినా, అసభ్యకరంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, మంత్రిలోకేష్లు రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న దాడులు, అకృత్యాలపై ఎందుకు స్పందించడం లేదని, ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. మహిళల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా అంతుచూస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు నేడు కనీసం స్పందించక పోవడం శోచనీయమన్నారు. పాలకొండ మండలం తుమరాడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ బిడ్డిక ఉషారాణిని దారుణంగా హత్య చేశారని, దీనిపై పార్వతీపురం మన్యంజిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజనులు పోరాటాలు చేస్తున్నారన్నారు. ఈ పోరాటాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, హోం శాఖమంత్రి అనిత, గిరిజనసంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణిలకు కనిపించకపోవడం, వినిపించకపోవడం శోచనీయమన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణం రెండు జిల్లాల గిరిజనులు ధర్నాలు, ఆందోళనలు చేసి ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ర్యాలీ లు, ధర్నాలు చేస్తూ గగ్గోలు పెడుతున్నా ఈ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. కనీసం నేటి వరకు ఆ కుటుంబాన్ని మంత్రులు సంధ్యారాణి,అనితలైనా పరామర్శించకపోవడం దారుణమని పేర్కొన్నారు. హత్యకు గురైన ఉషారాణి కుటుంబానికి రూ.5 కోట్లు ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని గిరిజన సంఘాలు పోరాటాలు చేస్తున్నాయని, వారి డిమాండ్లను ఈ ప్రభుత్వం పట్టించుకోదా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
శరవేగంగా పైడితల్లి చదురుగుడి ప్రారంభ ఏర్పాట్లు
విజయనగరం టౌన్: స్థానిక మూడులాంతర్లు వద్దనున్న పైడితల్లి చదురుగుడి ఆలయ ప్రారంభ ఏర్పాట్లను దేవాదాయశాఖ సహాయ కమిషనర్, ఆలయ ఈఓ కె.శిరీష మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఈ నెల 23, 24, 25 తేదీల్లో అమ్మవారి చదురుగుడి ప్రారంభోత్సవం కనులపండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. 25న శిఖర ప్రతిష్ట మహోత్సవం తర్వాత నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులందరూ మూడురోజుల పాటు నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొని, తరించాలని కోరారు. -
బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2026
వీరఘట్టం: ● ఈ ఏడాది ఏప్రిల్ 5న పిడుగుపాటుకు వీర ఘట్టం మండలం తెట్టంగి గ్రామంలో వ్యవసాయ పనులు ముగించుకుని వస్తున్న పైల అనసూయమ్మ అనే వ్యవసాయ కూలి బలైంది. వంగర మండలం ఎం.సీతారాంపురంలో పిడుగుపాటుకు ఓ ఇంటిలో వారంతా అపస్మారకస్థితికి చేరుకున్నారు. ● ఏప్రిల్ 6న పిడుగుపాటుకు బలిజిపేట మండలం శ్రీరంగపురం గ్రామానికి చెందిన మహిళా రైతు డి.సింహాచలం, వంగర గ్రామానికి చెందిన ఇనముల నరసమ్మ, వంతరాం గ్రామానికి చెందిన పార్వతి అనే మహిళా రైతు మృతి చెందారు. తెర్లాం మండలం విజయరాంపురంలో ఓ ఎద్దు కూడా మృతి చెందింది. ● ఈ నెల 9న కొత్తవలస మండలం చీపురవలసలో పశువుల శాలపై పిడుగుపడడంతో పాడి గేదె చనిపోగా, పశువుల పాక దగ్గమైంది. ● ఈనెల 12ను వీరఘట్టం మండలం నీలంపేట వద్ద పిడుగుపాటుకు 31 గొర్రెలు, మేకలు చనిపోయాయి. ● ఈనెల 13న రేగిడి మండలం కొండవలసలో క్రికెట్ ఆడుతున్న ఆమిటి పవన్ అనే విద్యార్థి పిడుగుపాటుకు గురై చనిపోయాడు. అదే రోజు బాడంగి మండలం భీమవరం గ్రామంలో పొలానికి వెళుతున్న భవానీ అనే మహిళ పిడుడుపడి అక్కడికక్కడే చనిపోయింది. ● భామిని మండలం సొలికిరి గ్రామ సమీపంలో క్రికెట్ ఆడుకుని ఇంటికి వస్తుండగా పిడుగుపడి రాజశేఖర్ అనే యువకుడు సోమవారం దుర్మరణం చెందాడు. అదే రోజు మొరకముడిదాంలో సాతంవలసలో పూరింటిపై పిడుగుపడి ఇంటిలో ఉన్న గౌరమ్మ అనే మహిళ మృతి చెందింది. మేఘావృతమై గర్జిస్తే చాలు జనం గుండెల్లో దడ పెరుగుతోంది. ఏ వైపు నుంచి పిడుగు పడుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఇటీవల కాలంలో మనుషులు, పశువులను పిడుగులు తాకుతుండడం భయాందోళనకు గురిచేస్తోంది. గతేడాది ఉమ్మడి విజయనగరం జిల్లాలో 20 మంది పిడుగుపాటుకు మృతిచెందగా, ఈ ఏడాది ఇంత వరకు 8 మంది చనిపోయారు. ఆటలాడుకునే విద్యార్థులు, పొలం పనులు చేసే కర్షకులు, పశువులు, జీవాల పెంపకందారులు అధికమంది పిడుగుపాటుకు గురవుతున్నారు. వాతావరణశాఖ పిడుగులు పడే ప్రాంతాల సమాచారాన్ని ముందస్తుగానే తెలియజేస్తున్నా.. నిరక్షరాస్యులైన కర్షకులు, పశువుల కాపర్లకు చేరక మృత్యు ఒడికి చేరుకుంటున్నారు. పిడుగు పాటు నుంచి తప్పించుకొనేందుకు ఎత్తైన ప్రదేశం నుంచి నేరుగా భూమిలో నేరుగా లైట్నింగ్ కండక్టర్ ఏర్పాటు చేయాలి. దీనివల్ల పిడుగులో ఉన్న విద్యుదావేశాన్ని భూమి తనలోకి ఆక్షరించుకుంటుంది. ఎత్తైన టవర్లు ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల పిడుగుపాటు నుంచి తప్పించుకుంటాం. – డాక్టర్ బి.కూర్మనాథ్, రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్, వీరఘట్టం పిడుగుపాటుకు గురైన వ్యక్తిని వెంటనే పొడి ప్రదేశంలో తిన్నగా పడుకోబెట్టాలి. తడి బట్టలు తీసివేయాలి. తలను ఒక పక్కకు తిప్పాలి. రెండు కాళ్లు ఒక అడుగు పైకి ఎత్తాలి. గాలి తగిలే ప్రదేశంలోఉంచి, అవసరమైతే నోటి ద్వారా గాలి ఊది ప్రథమచికిత్స చేయాలి. వెంటనే దగ్గరలో ఉన్న పీహెచ్సీకి తరలించి వైద్య సేవలు అందజేయాలి. – డాక్టర్ జె.రవీంద్రకుమార్, వైద్యులు, జిల్లా సర్వజన ఆస్పత్రి, పార్వతీపురం మెరుపు నుంచి ఏర్పడే అత్యధిక విద్యుత్ ప్రవాహమే పిడుగు. ఒక్కోసారి విద్యుదావేశం పేరుకుపోయిన మేఘాలకు సమీపంలో వ్యతిరేక విద్యుదావేశం మేఘాలు ఉన్నప్పుడు స్థిరంగా విద్యుత్ భూమి వైపు ప్రవహిస్తుంది. ఒక మిల్లీ సెకను కాలంలో మెరుపులతో కూడిన పిడుగు 20 వేల ఆంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని విడుదల చేస్తుంది. అప్పుడు ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత మీటరుకు 2 లక్షల ఓల్టులతో సమానం. మెరుపులు భూమి మీద పడినప్పుడు వస్తువులను బట్టి నష్ట తీవ్రత ఉంటుంది. పిడుగులు ఎక్కువగా క్యుములో నింబస్ మేఘాల వల్ల ఏర్పడతాయి. మేఘాల్లో మంచు, నీరు ఏర్పడినప్పుడు స్ట్రాటోస్పియర్లో చల్లని వాతావరణంలో విరుద్ధ విద్యుదావేశాలు ఏర్పడి స్ధిర విద్యుత్ ప్రవాహంగా మారతాయి. ఆ సమయంలో పిడుగులు ఏర్పడతాయి. – డాక్టర్ బి.ప్రదీప్, మెడికల్ ఆఫీసర్, వీరఘట్టం ప్రాణాలు తీస్తున్న పిడుగులు ‘మెరుపు’ వేగంతో గాలిలో కలుస్తున్న ప్రాణాలు కర్షకులు, విద్యార్థులకు చేరని పిడుగుల సమాచారం గతేడాది పిడుగుపాటుకు ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో 20 మంది మృత్యువాత ఈ ఏడాది ఇంత వరకు 8 మంది మృతి -
అంతర్జాతీయ సదస్సులో పరిశోధన పత్రం ప్రదర్శన
విజయనగరం అర్బన్: స్థానిక గాజులరేగలోని సీతం ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్, డీన్ (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) డాక్టర్ వీజీ ప్రసూన అంతర్జాతీయ స్థాయి సదస్సులో తన పరిశోధన పత్రాన్ని సమర్పించి విశేష గుర్తింపు పొందారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ విశ్వవిద్యాలయం సహకారంతో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో నిర్వహించిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ‘డీప్ టెక్ స్టార్టప్ల కోసం ఆవిష్కరణ, వ్యవస్థాపకత: వ్యవస్థాపక విశ్వవిద్యాలయాల పాత్ర’ అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో డాక్టర్ ప్రసూన ‘ఫాగ్–ఎడ్జ్ డీప్–టెక్ ఎకోసిస్టమ్స్ కోసం ఏఐ–ఆధారిత స్వీయ–స్వస్థత సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్’ అనే శీర్షికతో పరిశోధన ప్రత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసూనను సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి అభినందించారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
శ్రీరస్తు.. శుభమస్తు
విజయనగరం: శుభముహూర్తాల సందడి ప్రారంభమైంది. వరుస మహూర్తాలు వస్తుండడంతో జిల్లాలో పెళ్లి సందడి ప్రారంభమైంది. అధిక జ్యేష్ఠ మాసంతో ఆగిన శుభ ముహూర్తాలు..మళ్లీ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. నిజ జ్యేష్ఠ శుద్ధ పాఢ్యమి నుంచి బహుళ త్రయోదశి జులై 12 వరకు సుముహూర్తాలు ఉన్నాయని వేద పండితుడు కామేశ్వర శర్మ పేర్కొన్నారు. శుభకార్యాలతో జిల్లా అంతటా సందడి మొదలు కానుంది. నిశ్చితార్థాలు, వివాహాలతో పాటు..నూతన గృహ ప్రవేశాలు, దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు చేపట్టనున్నారు. పలు పనుల శంకుస్థాపనకు ఇదే మంచి సమయం. జూన్ నెలలో 16,17, 19,20,21, 22, 24,25, 26,27, 28 తేదీల్లో జులై నెలలో 1,6,7,9,10, 12 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రెండు, మూడు నెలల ముందే వివాహ సంబంధాలు కుదుర్చుకున్న వారు ప్రస్తుతం కల్యాణ మంటపాలను మాట్లాడుకోవడంలో నిమగ్నమయ్యారు. బంగారు ఆభరణాలు, కొత్త దుస్తులు ఇతర సామగ్రి కొనుగోలు చేసే వారు వస్తుండడంతో జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల్లో వ్యాపారాలు జోరందుకోనున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి గిరాకీ పెరిగింది.మంచి ముహూర్తాలు ఉన్నాయి ఈనెల 16 నుంచి మంచి ముహూరాలు ప్రారంభమవుతున్నాయి. జులై 14 వరకు జిల్లా వ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లతో పాటు వివిధ శుభ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటికే చాలా మంది వివాహ ముహూర్తాలను నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జులై 14 నుంచి మూఢం ప్రారంభం అవుతుండగా..మళ్లీ శ్రావణం వరకు మంచి రోజులు లేవు. –పి.కామేశ్వర శర్మ, వేదపండితుడు ప్రారంభమైన శుభముహూర్తాల సందడి జులై 12 వరకు అన్నీ మంచి రోజులే -
జాబ్మేళాకు విశేష స్పందన
రాజాం సిటీ: స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. 213 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 90 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఐటీఐ ప్రిన్సిపాల్ బి.భాస్కరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకుంటే జీవితంలో వేగంగా స్థిరపడగలరన్నారు. బైక్ ఢీ కొని వ్యక్తి మృతివిజయనగరం క్రైమ్: స్థానిక వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి కామాక్షినగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్సై లక్ష్మీ ప్రసన్న కుమార్ వెల్లడించారు. కణపాక ప్రాంతానికి చెందిన కోరాడ శంకరరావు అనే వ్యక్తి ముస్లింల శ్మశాన వాటికకు వెళ్లి తిరిగి వస్తుండగా కామాక్షినగర్ వద్దకు చేరుకునే సరికి ఓ మోటార్ సైకిల్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకర్రావుకు తీవ్ర గాయాలు కావడంతో తక్షణమే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. బైక్ నడిపిన వ్యక్తిని ‘ఢిల్లీ డేవిడ్’గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతుని బంధువు, కోరాడ అరవింద్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు బైక్ నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఉపాధి వేతనదారుకు పాముకాటు
వంగర: మండల పరిధి ఓనె అగ్రహారం గ్రామంలో ఉపాధిహామీ పనులు చేస్తుండగా గ్రామానికి చెందిన పెడన ఈశ్వరమ్మ పాముకాటుకు గురైంది. ఈ మేరకు మంగళవారం స్థానిక బందకాలువ గట్టుపై పనులు చేస్తుండగా రక్తపింజర ఆమెను కాటు వేయడంతో వేతనదారులు పామును హతమర్చారు. బాధితురాలిని వంగర పీహెచ్సీకి తీసుకువెళ్లగా వైద్యాధికారిణి సుస్మిత దయానా ప్రాథమిక చికిత్స అనంతరం రాజాం సీహెచ్సీకి 108 వాహనంలో తరలించారు. సెల్ఫోన్ల రికవరీశృంగవరపుకోట: చోరీకి గురైన సెల్ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడంలో ఎస్.కోట పోలీసులు చురుగ్గా ఉన్నారు. ఇటీవల చోరీకి గురైన సెల్ఫోన్లను ట్రేస్ చేసి రూ.60వేల ఐక్యూ00, రూ.25వేల మోటోరోలా, రూ.16వేల వివో, రూ.20వేల రెడ్మీ, రూ.20వేల ఒప్పో, రూ.15వేల వివో, రూ.19వేల రియల్మీ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని ఎస్.కోట సీఐ నారాయణమూర్తి స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం ఫిర్యాదుదారులకు అందజేశారు. ఫోన్ల వాడకంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, తెతిసీతెలియక చేసే తప్పిదాలతో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని సూచించారు. సెప్టిక్ ట్యాంకర్ ఢీకొని ముగ్గురికి గాయాలుసీతంపేట: సెప్టిక్ ట్యాంకర్ ఢీ కొన్న సంఘటనలో ముగ్గురు గాయాలపాలయ్యారు. సీతంపేటలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. నాయుడు మల్లి గ్రామం నుంచి సీతంపేటకు విద్యుత్ లైన్మన్ పాలక నాగేశ్వరరావు ఆయన కుమారుడు రోహిత్ ద్విచక్రవాహనంపై వస్తున్నారు. కొత్తూరు నుంచి పాలకొండవైపు ఎదురుగా వస్తున్న సెప్టిక్ ట్యాంకర్ కొండపల్లి గ్రామం వద్దకు వచ్చేసరికి వారి బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఇదే క్రమంలో సైకిల్ తొక్కుకుని పక్క నుంచి కె.శివశంకర్ అనే విద్యార్థి వస్తుండగా ట్యాంకర్ తగిలి కిందపడడంతో స్వల్పగాయాలైనట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎస్బీఐ ఆధ్వర్యంలో ఉచిత ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ శిక్షణ విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన నిరుద్యోగ గ్రామీణ యువతీ యువకులకు ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఎస్బీఐఆర్సెటీ) సువర్ణావకాశం కల్పిస్తోంది. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోర్సుల్లో శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డి.భాస్కరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. మొత్తం 31 రోజుల పాటు సాగే ఈ ఉచిత శిక్షణలో ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ రంగాల్లో స్వయం ఉపాధి సాధించడానికి అవసరమైన పూర్తి స్థాయి నైపుణ్యాలను, మెలకువలను నిపుణులు నేర్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పదోతరగతి ఉత్తీర్ణులు లేదా ఫెయిల్ అయిన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి, గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో ఈనెల 17వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఫోన్ 9959521662, 9985787820 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
కేరళ రాష్ట్ర పంచాయతీల పాలనపై అధ్యయనం
విజయనగరం: సుపరిపాలనకు నిదర్శనంగా నిలిచే గ్రామ పంచాయతీల అభివృద్ధే దేశాభివృద్ధి అని ఉమ్మడి విజయనగరం జిల్లాపరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) పేర్కొన్నారు. అటువంటి గ్రామ పంచాయతీలను మరింత ప్రగతి పథంలోకి నడిపిస్తూ, గ్రామీణ ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం జిల్లా పరిషత్ నిరంతరం ఎన్నో సమీక్షలు, సమావేశాలు నిర్వహించిందని తెలిపారు. తద్వారా ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజలకు మంచి సుపరిపాలన అందించామన్నారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రజలకు ఇంకా మెరుగైన సుపరిపాలన అందించే లక్ష్యంతో, అందుకు అవసరమైన మరిన్ని ప్రణాళికలు రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో, గ్రామ పంచాయతీ ద్వారా ఉత్తమమైన సుపరిపాలనను అందిస్తున్న కేరళ రాష్ట్రంలోని అలుప్పుజా జిల్లాలో గల కంజికుజి గ్రామ పంచాయతీ గురించి తెలుసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రాదేశిక సభ్యులతో కలిసి మంగళవారం కంజికుజి గ్రామ పంచాయతీని సందర్శించినట్టు తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు నేతృత్వంలో జెడ్పీటీసీ సభ్యుల బృందానికి అలుప్పుజా జిల్లాలోని కంజికుజి గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షులు, వార్డు సభ్యులు, డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అశ్విన్, పంచాయతీ కార్యదర్శి డీఎఫ్ సుభాష్, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. పంచాయతీ ప్రజలతో జెడ్పీటీసీల ఆరా జెడ్పీటీసీ సభ్యుల బృందం తొలుత గ్రామ సందర్శన చేసి, కంజికుజి గ్రామంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించింది. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పౌర సేవలు, సంక్షేమ పథకాల గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంజికుజి గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి అక్కడి పంచాయతీ అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై గ్రామ పంచాయతీల బలోపేతం గురించి పలు అంశాలను వారి నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల బలోపేతంగ్రామ పంచాయతీల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును జెడ్పీటీసీల బృందం అధ్యయనం చేసింది. స్థానిక సంస్థల బలోపేతానికి కృషి ఈ పర్యటన ద్వారా అనేక అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం తమకు లభించిందని జెడ్పీటీసీ సభ్యులు తెలిపారు. కేరళలో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి తమ ప్రాంతాల్లో కూడా స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. నిత్యం ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించేలా తమకు మరింత అవగాహన పెంపొందించుకునేందుకు తన సొంత ఖర్చులతో కేరళ టూర్ ప్రోగ్రాం నిర్వహించిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు జెడ్పీటీసీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలుప్పుజా జిల్లా కంజికుజి గ్రామాన్ని సందర్శించిన జెడ్పీటీసీలు మరింత మెరుగైన సుపరిపాలన అందించే లక్ష్యంతో పర్యటన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
వేతనదారులకు ఉద్వాసన...!
● గణనీయంగా తగ్గిన ఉపాధి వేతనదారులు ● గత ఏడాది కంటే 61 వేల మంది తొలగింపు ● తగ్గిన 19 వేల జాబ్ కార్డులువిజయనగరం ఫోర్ట్: అడిగిన వారికి ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ జాబ్ కార్డు ఇస్తున్నాం. అడిగిన వెంటనే పని కల్పిస్తున్నామంటూ టీడీపీ సర్కార్ గొప్పలు చెప్పుకుంటుంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అడిగిన ప్రతి ఒక్కరికీ జాబ్కార్డు ఇచ్చి పని కల్పించినట్లయితే జాబ్ కార్డుల సంఖ్య ఏటా పెరగాల్సి ఉంది. తద్వారా వేతనదారుల సంఖ్య కూడా పెరగాలి. పెరగ డం మాట దేవుడెరుగు చంద్రబాబు ప్రభుత్వంలో జాబ్ కార్డులు, వేతనదారులు గణనీయంగా తగ్గిపోయారు. జాబ్కార్డులు, వేతనదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 61 వేల మంది తగ్గిన వేతనదారులు జాతీయగ్రామీణ ఉపాధి పథకంలో పనిచేసే వేలాది మంది వేతనదారులను టీడీపీ సర్కార్ తొలగించేసింది. 2025–26లో జిల్లాలో 3.53 లక్షలు జాబ్ కార్డులు ఉండేవి. 2026–27 నాటికి అందులో 19 వేల జాబ్ కార్డులను తొలిగించేశారు. దీంతో జాబ్ కార్డుల సంఖ్య 3.34 లక్షలకు చేరింది. 2025 –26 లో వేతనదారులు 5.95 లక్షలు ఉండేవారు. 2026–27 నాటికి 61 వేల మంది వేతనదారులను తొలిగించేశారు. దీంతో వేతనదారుల సంఖ్య 5. 34 లక్షలకు చేరింది. వలసలు వెళ్లారని వేతనదారుల తొలగింపు బతుకు తెరువు కోసం తాత్కాలికంగా వలస వెళ్లిన వారిని శాశ్వతంగా వెళ్లినట్లు నిర్ధారించి వేతనదారులను, జాబ్ కార్డులను తొలగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాది కాలంలో వేల సంఖ్యలో తొలగించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. వేతనదారుల సంఖ్యను తగ్గించడం ద్వారా వారికి పని కల్పించడం ద్వారా వెచ్చించే వ్యయం తగ్గుతుందనే వేతనదారులను తొలగించేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ సర్కార్ హయాంలో ఇబ్బందులే టీడీపీ సర్కార్ హాయంలో అనేక ఇబ్బందులు ఎదురువుతున్నట్లు వేతనదారులు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో టీడీపీ నేతలు చెప్పిన వారికే పని కల్పించడం. టీడీపీ నేతలు చెబితే పని ఆపివేయడం వంటివి చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకంలో పనిచేసిన మేట్లను పూర్తి స్థాయిలో మార్చేసినట్లు తెలుస్తోంది. నిబంధనలను పక్కన బెట్టి టీడీపీ నేతలు సూచించిన వారిని మేట్లుగా నియమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.డబుల్ ఎంట్రీలు తొలిగించాం శాశ్వతంగా వలస వెళ్లిన వారిని, మృతి చెందిన వారు, డబుల్ ఎంట్రీ ఉన్న వారి జాబ్ కార్డులు, వేతనదారులను తొలగించాం. – ఎస్. శారదాదేవి, డ్వామా పీడీ -
రోడ్డుపై కూటమి కార్యక్రమం.. ట్రాఫిక్కు అంతరాయం!
విజయనగరం జిల్లా కేంద్రంలో మంగళవారం ట్రాఫిక్కు అంతరాయం నెలకొంది. బాలాజీ జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కు వెళ్లే దారిలో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి పేరిట కార్యక్రమం నిర్వహించడంతో ఆ దిశగా వాహనాల రాకపోకలు ఎక్కువయ్యాయి. రోడ్డుపైనే టెంటు వేసి, సభ పెట్టడంతో ఆ వైపుగా వెళ్లే వాహనదారులు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. ఎండలో చాలాసేపు వేచి ఉండాల్సి రావడంతో అధికార పార్టీది ఇదేం తీరు అని, రోడ్లపై ప్రజలను ఇబ్బంది పెట్టేలా సభలా అని అసహనం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ జామ్ కారణంగా రోడ్డుపై నిలిచిన వాహనాలు, వాహనదారులను ఈ చిత్రాల్లో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం -
సయోధ్య కుదిరినట్లేనా?
సాక్షి, పార్వతీపురం మన్యం: కొన్నాళ్లుగా పార్వతీపురం నియోజకవర్గంలో అధికారులు, ఎమ్మెల్యేకు మధ్య ఉన్న విభేదాలకు తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడినట్లు తెలుస్తోంది. జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ జోనల్ కో ఆర్డినేటర్ ఎ.రాధాకృష్ణల సమక్షంలో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చినట్లు సమాచారం. జిల్లా పర్యటనకు మంగళవారం మంత్రి అచ్చెన్నాయుడు, జోనల్ కో–ఆర్డినేటర్ ఎ.రాధాకృష్ణ వచ్చారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి విచ్చేశారు. సమావేశం ముందు, తర్వాత ప్రత్యేకంగా కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ ప్రభాకరరెడ్డి, టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలు.. ఎమ్మెల్యే విజయ్ చంద్ర – కలెక్టర్ ప్రభాకరరెడ్డి మధ్య ఉన్న విభేదాలు.. ఎమ్మెల్యే విజయ్ చంద్ర – టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి నడుమ వివాదాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. విభేదాలకు దూరంగా ఉండాలని హితవు పలికినట్లు సమాచారం. పార్వతీపురం పట్టణంలో స్థల రిజిస్ట్రేషన్లపై కలెక్టర్కు ఎమ్మెల్యే బహిరంగ సవాల్ విసిరారు. వాస్తవానికి డీఆర్సీ సమావేశంలో అధికారులపై ఎమ్మెల్యే విజయ్ చంద్ర బహిరంగంగానే విరుచుకుపడతారని అంతా భావించారు. రాజీ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలించడంతో సమావేశంలో చర్చ పెట్టి.. ఎమ్మెల్యే చెప్పిన మాట అధికారులంతా వినాల్సిందేనన్న భావనతో ముగించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్న మంత్రి మాట అధికారులకు ఉపశమనం కల్పించింది. డోలీలోనే మృత్యు ఒడికి కొమరాడ: డోలీలోనే ఓ గిరిజనుడు ప్రాణాలు విడిచిన విషాదకర ఘటన కొమరాడ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. నయా పంచాయతీ వాటాకోస్ గ్రామానికి చెందిన మెల్లిక వెంకటరావు(60) నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను కుటుంబ సభ్యులు గ్రామం నుంచి డోలీలో వనకబడికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి 108లో పార్వతీపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి మంగళవారం డోలీలో తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. దీంతో ఆయన భార్య పారమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ● హాజరుకానున్న 1801 మంది అభ్యర్థులు విజయనగరం అర్బన్: జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న రీ–నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 1,801 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్షను అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే 08922–236947 నంబర్ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. నీట్ అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం నీట్ రీ–ఎగ్జామ్కు హాజరయ్యే అభ్యర్థులకు ఆర్టీసీ ప్రత్యేక ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయనగరం నుంచి శ్రీకాకుళం, పార్వతీపురం, రాజాం, విశాఖపట్నం, గాజు వాక, కూర్మన్నపాలెం, ఎస్.కోట, ఆండ్ర, జక్కువ, సింహాచలం, అనకాపల్లి ప్రాంతాలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. వసంత, షికారుగంజి, బొప్పడాం, గరికివలస, కొండగండ్రేడు, కందివలస, చింతపల్లి, తిప్పలవలస తదితర గ్రామాల అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సు నడపనున్నట్లు వెల్లడించారు. -
ఆయిల్ మిల్లులో అగ్నిప్రమాదం
● తప్పిన పెనుప్రమాదంరాజాం సిటీ: మండల పరిధి సోపేరు రోడ్డులోని ఎస్ఆర్ ఆయిల్ ఫ్యాక్టరీలో మంగళవారం వేకువజామున 3 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు రావడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సిబ్బంది అంతా అప్రమత్తమై ఒక్కసారిగా పరుగులు తీశారు. వెంటనే రాజాం ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఈ ఘటనలో ఒక ట్రాన్స్ఫార్మర్తోపాటు ప్రయోగశాల పరికరాలు, ఎలక్ట్రికల్ ఫ్యానళ్లు, ఇండోర్ వీసీబీ, విద్యుత్ వైరింగ్ కాలిపోగా శ్లాబ్ కొంతభాగం పాడైంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫ్యాక్టరీ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ ఎస్సై అశోక్ తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2 కోట్లు మేర ఆస్తినష్టం సంభవించిందని అంచనా వేశామన్నారు. -
తోటపల్లి దుస్థితి చూడండి : ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్
తోటపల్లి పాత రెగ్యులేటర్ దుస్థితి, ఆధునికీకరణ పనులు నిలిచిపోవడంపై ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు సమయానుకూలంగా సాగునీరు పొందడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. తోటపల్లి పాత రెగ్యులేటర్ కాలువ వ్యవస్థలోని ఎడమ, కుడి ప్రధాన కాలువల హెడ్ స్లూయిస్ షట్టర్లు రెండేళ్లుగా సరిగా పనిచేయడం లేదన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, కనీస మరమ్మతులు కూడా చేపట్టలేదని వివరించారు. ఫలితంగా నీటి నియంత్రణ లోపిస్తోందని, కాలువ వ్యవస్థ దెబ్బతింటోందని చెప్పారు. ఎల్ఎంసీ హెడ్ స్లూయిస్కు దిగువ భాగంలో ఉన్న రక్షణ గోడలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ కీలక అడ్డంకులను, ముఖ్యంగా ప్రధాన హెడ్ స్లూయిస్ షట్టర్లు పునరిద్ధరించి పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవస్థ కింద ఉన్న ఆయకట్టుదారుల్లో ఎక్కువమంది చిన్న, సన్నకారు రైతులే అని.. సమస్యలను తొందరగా పరిష్కరించకపోతే పంట ఉత్పత్తి, రైతుల ఆర్థిక స్థితి తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని వివరించారు. సమీక్ష సమావేశంలో శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, శాసనమండలి సభ్యులు గాదె శ్రీనివాసులు నాయుడు, పాలవలస విక్రాంత్, శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఐఐబీఎంిపీలో ప్రవేశాలకు నోటిఫికేషన్
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ–గురజాడలో అంతర్జాతీయ సమగ్ర బ్యాచిలర్ – మాస్టర్స్ ప్రోగ్రామ్ (ఐఐబీఎంపీ) 2026 ప్రవేశాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. జేఎన్టీయూ జీవీ జర్మనీలోని నాలెడ్జ్ ఫౌండేషన్–ర్యూట్లింగెన్ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐఐబీఎంపీతో విద్యార్థులు జేఎన్టీయూ–జీవీ నుంచి బీటెక్ డిగ్రీతో పాటు జర్మనీ ర్యూట్లింగెన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందే అరుదైన అవకాశాన్ని పొందనున్నారు. ఈ అంతర్జాతీయ విద్యా కార్యక్రమం విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య, విదేశీ విద్యా అనుభవం, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూపొందించిందని జేఎన్టీయూ జీవీ అధికారులు తెలిపారు. జర్మనీ విద్యావిధానం, పరిశోధన, పరిశ్రమలతో అనుసంధానమైన అభ్యాసంతో విద్యార్థుల భవిష్యత్తుకు మరింత బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు. అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లు బీటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – ఎంఎస్సి (ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్) బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్) – ఎంఎస్సి (డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్) కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు జేఎన్న్టీయూ–గురజాడ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో ర్యూట్లింగెన్ యూనివర్సిటీ, జర్మనీ నుంచి మాస్టర్స్ డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఫోన్ 78915 88999, 78914 88999 నంబర్లను, విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. -
చెరువుల ఆక్రమణలపై కఠిన చర్యలు
● నిబంధనల ప్రకారం ముందుకెళ్లండి.. ● జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు సాక్షి, పార్వతీపురం మన్యం: చెరువుల ఆక్రమణల విషయంలో తరతమ భేదాలు వద్దని.. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన శాఖలతో పాటు నీటిపారుదల తదితర శాఖల ద్వారా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను, ప్రగతిని మంత్రికి వివరించారు. మంత్రి మాట్లాడుతూ.. రాజకీయాలతో సంబంధం లేకుండా చెరువుల ఆక్రమణపై దృష్టి సారించాలని హితవు పలికారు. కలెక్టర్ ప్రభాకరరెడ్డి తొలుత మాట్లాడుతూ.. చెరువుల ఆక్రమణలపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని, పార్వతీపురం ఎమ్మెల్యే కూడా ఇదే విషయం చెప్పారని తెలిపారు. జలధార–జల హారతి కార్యక్రమంలో భాగంగా.. చెరువుల హద్దులను గుర్తించి, ఆక్రమణలను తొలగిస్తామని కలెక్టర్ తెలిపారు. పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ.. నియోజక వర్గ కేంద్రంలో దేవుని బంద, బిళ్ల బంద చెరువుల ఆక్రమణల విషయంలో అధికారులు నోటీసులిచ్చి సరిపెట్టారని, తదుపరి చర్యలు తీసుకోలేదని వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. పట్టణంలో పలుచోట్ల కాలువలు, చెరువుల మీద అక్రమ కట్టడాలు ఉన్నాయని.. న్యాయంగా ముందుకు వెళ్లాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. ఇసుక తరలింపును అడ్డుకోవద్దు : ఎమ్మెల్యే ట్రాక్టర్లు, ఎడ్ల బళ్ల ద్వారా ఇసుకను తరలించుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్నారని.. పార్వతీపురంలోనే ఎందుకు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర లేవనెత్తారు. సీతానగరం మండలంలోని సువర్ణముఖి నది నుంచి ఇసుకను తరలిస్తే అధికారులు ట్రాక్టర్లను పట్టుకొని వారంరోజులపాటు ఉంచేస్తున్నారని.. ఇది సమంజసం కాదని చెప్పారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. నిబంధనల ప్రకారం వెళ్లాలని, అడ్డగోలుగా వ్యాపారం కోసం తరలిస్తుంటే చూస్తూ ఊరుకోవద్దని స్పష్టం చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉద్యోగి కుటుంబ సభ్యులకు టెండర్లు ఎలా కట్టబెడతారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రశ్నించారు. దీనిపై మంత్రి జోక్యం చేసుకుంటూ.. ఘటనపై ఆరా తీశారు. శాఖలోని ఉద్యోగులకే టెండర్లు ఇస్తే ఈ విధంగానే మాట పడాల్సి వస్తుందని అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పైనాపిల్, అరటి ఎగుమతులకు చర్యలు సీతంపేట గిరిజన ప్రాంతంలో పైనాపిల్ (అనాస) సాగు సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని, దానిపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పైనాపిల్, అరటి ఎగుమతులకు చర్యలు తీసుకోవాలన్నారు. జలధార – జలహారతి కార్యక్రమం శరవేగంగా సాగాలని తెలిపారు. -
రిజిస్ట్రేషన్లో చేతివాటం.. నివేదికలో క్లీన్చిట్!
సాక్షి, పార్వతీపురం మన్యం: సాలూరులోని డగ్లస్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందనే ఆరోపణలు, మ్యుటేషన్ ప్రక్రియలో చోటు చేసుకున్న పరిణామాలు, శాఖాపరమైన విచారణలో ఫిర్యాదుదారుడు రేగు మహేష్ లేవనెత్తిన కీలక అంశాలకు సమాధానం లేకపోవడం వంటివి ఈ వ్యవహారంపై మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. సొంత శాఖ అధికారుల విచారణతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయా? లేక వివాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమే జరిగిందా? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఫిర్యాదుదారుడు లేవనెత్తిన కీలక అంశాలకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ నిబంధనల ప్రకారమే జరిగిందని అధికారులు క్లీన్ చిట్ ఇవ్వడం విమర్శలకు దారితీస్తోంది. అంతా సవ్యమైతే.. ఇన్ని రోజులు దాగుడు మూతలు ఎందుకు? గత నెల 16న సాలూరు ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్ రమణమూర్తి ఆధ్వర్యంలో పట్టణంలోని సర్వే నంబర్ 175/1లో 1.40 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. సాలూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ భూమిని వాణిజ్య భూమిగా కాక.. వ్యవసాయ భూమిగా పరిగణించి రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.5 కోట్ల మేర ఆదాయ నష్టం కలిగిందన్న ఆరోపణలున్నాయి. భూమి మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ విషయంలోనే అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ అంశాన్ని రెగ్యులర్ సబ్రిజిస్ట్రార్ నాగరాజు విచారణ సందర్భంగా జిల్లా రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయినప్పటికీ జిల్లా రిజిస్ట్రార్ పార్వతి.. తన నివేదికలో రిజిస్ట్రేషన్ నిబంధనల మేరకే చేశారని చెప్పుకోవడం వివాదాస్పదంగా మారింది. 1978లో ఏర్పాటైన డగ్లస్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్కు సంబంధించిన చైర్మన్ శామ్యూల్ గోడే వారసుడిగా, ఆయన కుమారుడు జోసెఫ్ డేనియల్ గోడేను రెవెన్యూ అధికారులు ధ్రువీకరించిన రికార్డులు లేవు. ఈ పరిస్థితుల్లో 2025లో కొత్తగా ఏర్పాటైన మరో సొసైటీ పేరుతో భూమి మ్యుటేషన్ జరగడం వెనుక కూడా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. గత నెల 16న మ్యుటేషన్ ప్రక్రియ పూర్తికావడం, అదే రోజు రెగ్యులర్ సబ్రిజిస్ట్రార్ నాగరాజు సెలవులో ఉండడం, ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ పూర్తి కావడం యాధృచ్ఛికమా లేక ప్రణాళికాబద్ధమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల పాత్రపై అనుమానాలు ఈ మొత్తం వ్యవహారంలో రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి ఆదేశాలు, ఒత్తిళ్లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మ్యుటేషన్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు జరిగిన చర్యలన్నీ ఉన్నతస్థాయి పర్యవేక్షణలోనే అయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం చేకూరిందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్పై ఎలాంటి శాఖాపరమైన చర్యలనూ జిల్లా రిజిస్ట్రార్ సిఫార్సు చేయకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలు, శాఖ ఉన్నతాధికారుల ప్రోత్సాహం వల్లే ఈ రిజిస్ట్రేషన్ జరిగిందని ఫిర్యాదుదరారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సర్వే నంబర్ 175/1లోని మొత్తం 3.14 ఎకరాల్లో 1.40 ఎకరాల రిజిస్ట్రేషన్ మాత్రమే అయ్యింది. ఇప్పుడు మిగిలిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. ఈ నేపథ్యంలో మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని, లేకుంటే న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని ఫిర్యాదుదారులు చెబుతున్నారు. సాలూరు ‘డగ్లస్’సొసైటీ స్థల వ్యవహారంలో నిజాలు దాచిన నివేదిక సొంత శాఖ అధికారులతో విచారణపై అనుమానాలు మ్యుటేషన్ మిస్టరీ... రిజిస్ట్రేషన్ రహస్యం -
మృత్యు పిడుగు
● పిడుగుపాటుకు ఇద్దరు బలి ● విషాదంలో కుటుంబ సభ్యులు భామిని/మెరకముడిదాం: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు చోట్ల సోమవారం సాయంత్రం పిడుగుల వాన కురిసింది. ఇద్దరి ప్రాణాలు తీసింది. శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేటకు చెందిన పెనుగుదురు రాజశేఖర్(20) భామిని మండల సొలికిరి గ్రామంలోని తాతగారి ఇంటికి వేసవిసెలవుల కోసం వచ్చాడు. సొలికిరి గ్రామ యువకులతో కలిసి వంశధార తీరంలో సాయంత్రం క్రికెట్ ఆడుతుండగా మేఘావృతమై వర్షం ప్రారంభమైంది. ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో రాజశేఖర్ పిడుగుపాటుకు గురయ్యాడు. వెంటనే మిగిలిన జట్టు సభ్యులు బాలేరు పీహెచ్సీకి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. యువకుడి మృతితో తోటి స్నేహితులు, తాత, అమ్మమ్మలు పూడి సింహాచలం, సరస్వతి బోరున విలపించారు. మెరకముడిదాం మండలంలోని సాతాంవలస గ్రామంలో సోమవారం సాయంత్రం పల్లికల గౌరమ్మ (53) పూరింటిపై పిడుగు పడింది. దీంతో పూరిగుడిసెలో ఉన్న గౌరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. గౌరమ్మ భర్త ఇదివరకే మృతి చెందగా, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బుదరాయవలస ఎస్ఐ జె.లోకేష్కుమార్ కేసునమోదు చేశారు. గిరిజన బిడ్డలకు హేతుబద్ధీకరణ కష్టాలు ● చదువుకు దూరమవుతున్న గిరిజన విద్యార్థులు సాక్షి, పార్వతీపురం మన్యం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హేతుబద్ధీకరణతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. హేతుబద్ధీకరణలో అశాసీ్త్రయత వల్ల గిరిజన పిల్లలు తీవ్రంగా నష్టపోనున్నారు. గతేడాది వరకు 3 నుంచి పదో తరగతి వరకు ఆశ్రమోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేవారు. హేతుబద్ధీకరణ కారణంగా ఈ ఏడాది అయిదు నుంచి పదో తరగతి వరకు కొన్ని, 3 నుంచి 7వ తరగతి వరకు ఇంకొన్ని ప్రత్యేకంగా పాఠశాలలు నడవనున్నాయి. ఒక్క పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోనే పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల్లోని 3 నుంచి 7వ తరగతి వరకు నిర్వహణకు గుర్తించిన పాఠశాలలు బీరుపాడు, గొరడ, కెమిశీల, కోసంగిభద్ర, ఎండభద్ర, పీటీమండ, రావికోన, నేరెళ్లవలస ఉన్నాయి. ఇవన్నీ మారుమూల కొండకోన ప్రాంతాల్లో ఉండటం వల్ల ఇష్టమైన పాఠశాలలో చదువుకునే అవకాశం పిల్లలకు ఉండదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో తమ బిడ్డలను ఎక్కడ చేర్చాలో తెలియక అయోమయానికి లోనవుతున్నారు. వీరిని చేర్చుకోవడంపై ఉపాధ్యాయులు కూడా సందిగ్ధంలో ఉన్నారు. హేతుబద్ధీకరణ వల్ల జియ్యమ్మవలస, కురుపాం మండలం టొంపలపాడు పాఠశాలలు పూర్తిగా మూసివేతకు గురవుతున్నాయి. ఐదో తరగతి వరకు కొనసాగించాలి.. హేతుబద్ధీకరణ వల్ల గిరిజన విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉందని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పాలక రంజిత్కుమార్, తాడంగి సాయిబాబు, బొండపల్లి జనార్దన ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లోని జీపీఎస్ పాఠశాలల్లో ఐదో తరగతి వరకు కొనసాగించి, అదనంగా మరో ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రతి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 6 నుంచి పదో తరగతి వరకు కొనసాగించాలని, కొన్నింటిని ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయాలని కోరారు. నేడు తల్లికి వందనంపై సమీక్ష పార్వతీపురం: పార్వతీపురంలోని జూనియర్ కళాశాల మైదానంలో తల్లికి వందనం పేరిట మంగళవారం ఉదయం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్లో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించనున్నట్టు తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా మంత్రి జి.సంధ్యారాణి, ప్రభుత్వ విప్ టి.జగదీశ్వరీ, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు పాల్గొంటారన్నారు. -
మన్యంపై జ్వరాల పంజా
పాచిపెంట: సీజన్ మారింది.. వానలు కురుస్తున్నాయి. గిరిజన గూడల్లోని తాగునీటి వనరులు కలుషితమవుతున్నాయి. కలుషిత నీటిని తాగిన ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ఏ గ్రామం చూసినా జ్వరపీడితులే దర్శనమిస్తున్నారు. విష జ్వరాలు విజంభిస్తుండడంతో అల్లాడిపోతున్నారు. ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. పాచిపెంట మండలంలోని గరిసిగుడ్డి పంచాయతీ పరిధి తాడివలస, జిలుకువలస గ్రామాలకు చెందిన సుమారు 25 మంది గిరిజన ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఇటీవల గురువునాయుడుపేట పీహెచ్కి గరిసిగుడ్డి పంచాయతీ నుంచి అధిక సంఖ్యలో జ్వర పీడితులు రావడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆయా గ్రామాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ జ్వరాలు అదుపులోకి రాకపోవడంతో, వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 15 మందికి మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సాలూరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కలుషిత నీరే దిక్కు... గ్రామాల్లో మంచినీటి పథకం బోర్లు ఉన్నప్పటికీ సక్రమంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో మంచినీటి పథకం బోర్లు పనిచేయడం లేదు. దీంతో సమీప వాగుల నుంచి తీసుకువచ్చిన కలుషిత నీరు తాగి విషజ్వరాల బారిన పడుతున్నాం. అధికారులు స్పందించి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని గరిసిగుడ్డి పంచాయతీ, జిలికవలస గ్రామ ప్రజలు కోరుతున్నారు. జ్వరపీడిత గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నాం. మలేరియాతో బాధ పడుతూ సాలూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గరిసిగుడ్డి పంచాయతీకి చెందిన గిరిజనుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. మరో రెండు రోజుల్లో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తాం. – శివకుమార్, నియోజకవర్గ హెల్త్ ప్రొగ్రాం ఆఫీసర్ ఒకే రోజు 495 ఓపీ నమోదు 132 మంది జ్వర పీడితులు 13 మందికి మలేరియా పాజిటివ్ సీతంపేట: స్థానిక ఏరియా ఆస్పత్రికి సోమవారం రోగుల తాకిడి ఎక్కువైంది. ఒకే రోజు 495 ఓపీ నమోదైంది. వీరిలో 132 మంది జ్వరంతో బాధపడుతుండగా, వైద్య పరీక్షల్లో 13 మందికి మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రోగులకు అవసరమైన వైద్యసేవలు అందించి మందులు పంపిణీ చేసినట్టు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు తెలిపారు. అవసరమైన వారిని ఇన్పేషెంట్లుగా ఉంచి సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఆస్పత్రులకు పెరుగుతున్న రోగులు వైద్యపరీక్షల్లో మలేరియా కేసుల నిర్ధారణ కలుషిత నీరే కారణ మంటున్న వైద్యులు -
ప్రజల అవసరాలపై మౌనం.. ప్రైవేటు స్థలాలపై గళం!
● పార్వతీపురంలో ఏం జరుగుతోంది? ● ప్రజా సమస్యలు పక్కన.. భూములపై రాజకీయం ● ప్రశ్నిస్తున్న నియోజకవర్గ ప్రజలు సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం నియోజకవర్గంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా.. వాటిపై ప్రజా ప్రతినిధుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాగునీటి సమస్యలు, అస్తవ్యస్త రహదారులు, పారిశుద్ధ్య లోపాలు, డ్రైనేజీ వ్యవస్థ సమస్యలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వంటి అంశాల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిని పక్కనపెట్టి.. ప్రైవేటు స్థలాల రిజిస్ట్రేషన్ల అంశంపై రాజకీయ దుమారం రేపడం ఎంతవరకు సమంజసమనే చర్చ ప్రజల్లో సాగుతోంది. ప్రజల అవసరాలపై ఎందుకు మౌనం? గత 2024 ఎన్నికల సమయంలో అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని చెప్పిన ప్రస్తుత ఎమ్మెల్యే విజయచంద్ర.. అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సమస్యలపై పెద్దగా స్పందించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్వతీపురం మున్సిపల్ పాలక వర్గాన్ని రాజకీయ కక్షతో డమ్మీగా చేసి.. పట్టణంలో అభివృద్ధి పనులకు విఘాతం కలిగించారు. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కొరతపై ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ కనిపించడం లేదు. అభివృద్ధి కంటే వివాదాలకే ప్రాధాన్యమా? నియోజకవర్గంలో నిరుద్యోగం, తాగునీటి సమస్యలు, రోడ్ల దుస్థితి, పారిశుద్ధ్య సమస్యలు, ప్రభుత్వ సేవలలో జాప్యం వంటి అనేక అంశాలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిపై చర్చ జరగాల్సిన సమయంలో ప్రైవేట్ భూముల వ్యవహారాలే ప్రధాన రాజకీయ అజెండాగా మారడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ● నియోజకవర్గంలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. బలిజిపేట, సీతానగరం మండలాల్లోని నదుల నుంచి ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇది అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు నష్టం కలిగించేదే. దీనిపై ఏనాడూ ఎమ్మెల్యే నోరు మెదపలేదు. ● పార్వతీపురం పట్టణ నడిబొడ్డున మున్సిపల్ స్థలం మూడెకరాలు కబ్జాకు గురైంది. దీనిపై అధికార పార్టీ నేత హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి. రూ.కోట్ల విలువ చేసే వరహాలగెడ్డపై గెద్దలు వాలాయి. వీటిపై అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నా, నెల్లి చెరువును కప్పేస్తున్నా.. పెద్ద మనసుతో స్థానిక ఎమ్మెల్యే ప్రశ్నించిన దాఖలాలు లేవు. ● శివారు కాలనీలు, పట్టణంలోని పలు వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కాలనీల్లోని వీధుల్లో వర్షపు నీరు నిల్వ ఉండిపోతోంది. మురుగు కాలువల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో దుర్ఘంధంతోపాటు, దోమల బెడద వేధిస్తోంది. దీని గురించి అధికార పార్టీ నాయకులు పట్టించుకునే పరిస్థితి లేదు. ● వారానికి ఒకరోజు మున్సిపల్ కుళాయిల్లో తాగునీరు వస్తోంది. అది కూడా బురదనీరే దిక్కవుతోంది. గత పాలకవర్గ సమయంలోనే తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.2.41 కోట్లు మంజూరయ్యాయి. ప్రతిపాదిత పనులు చేయడానికి కౌన్సిల్ కూడా తీర్మానం తెలిపింది. రాజకీయ గ్రహణంతో గత పాలకవర్గం ఆమోదం తెలిపిన పనులకు అడ్డుకట్ట వేశారు. దీంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ప్రజల గొంతు తడిపేందుకు ఎమ్మెల్యే గానీ, ఇతర టీడీపీ నాయకులు గానీ ప్రయత్నించిన పరిస్థితులు కానరావడం లేదు. ● ప్రజాస్వామ్యంలో పాలకుల ప్రధాన బాధ్యత ప్రజాసమస్యలకు పరిష్కారం చూపడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం. ప్రైవేట్ భూముల రిజిస్ట్రేషన్లపై చట్టపరమైన సందేహాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం సహజమే. నియోజకవర్గంలో అందుకు భిన్నంగా సాగుతోంది. ప్రజల నిత్యజీవితాన్ని ప్రభావితం చేస్తున్న సమస్యలను పక్కనపెట్టి.. కేవలం స్థల వివాదాలనే ప్రధాన రాజకీయ అంశంగా మార్చడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న పార్వతీపురం నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది. ప్రైవేట్ లావాదేవీలపై రాజకీయ రగడ ఇటీవల ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన స్థలాల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో అధికార పార్టీకి చెందిన నాయకులు రాద్ధాంతం చేయడం చర్చనీయాంశంగా మారింది. అక్రమాలు జరుగుతున్నాయంటూ ఎమ్మెల్యే విజయచంద్ర తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఇతర సమస్యలను వదిలి.. భూముల చుట్టూనే తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోకస్ ఉంటుందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా, టీడీపీ జిల్లా కార్యాలయం స్థలంపై రగడ, అడ్డాపుశీల ఆక్రమణలంటూ వివాదం, వెంకంపేటలోని స్థలం రిజిస్ట్రేషన్.. ఇలా అన్ని విషయాల్లోనూ అధికార పార్టీకి ఎమ్మెల్యే వెనుకున్నారన్న విమర్శలున్నాయి. నియోజకవర్గ కేంద్రంతోపాటు.. సీతానగరం వంటి ప్రాంతాల్లో టీడీపీ వారికి కప్పం కట్టలేదని రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు నిలిచిపోతున్న ఉదాహరణలు కోకొల్లలు. తాజాగా ఓ స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో ఎమ్మెల్యే రూ.లక్షల్లో లంచం అడిగారని ఓ మహిళ సెల్ఫీ వీడియోను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. చట్టబద్ధంగా జరిగే ప్రైవేట్ ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు సంబంధిత శాఖల పరిధిలోని అంశాలని, వాటిలో ఏదైనా అక్రమం జరిగితే దానిని చట్టపరంగా ప్రశ్నించాల్సిందే తప్ప రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని పలువురు పేర్కొంటున్నారు. -
న్యాయం కోసం పోరాటం
సీతంపేట: గిరిజన యువతి బిడ్డిక ఉషారాణిని అత్యంత దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సీతంపేటలో సోమవారం న్యాయపోరాట ర్యాలీ నిర్వహించారు. సంతమార్కెట్ నుంచి ఐటీడీఏ వరకు 2 కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. అనంతరం ఐటీడీఏ ముఖద్వారం వద్ద బైఠాయించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను బహిరంగంగా ఉరితీయాలని నినదించారు. బాధిత కుటుంబానికి రూ.5 కోట్లు ఎక్స్గ్రేషియో ప్రకటించి, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభు త్వ ఉద్యోగం ఇవ్వాలని జేఏసీ అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నిందితుల ఆస్తులను జప్తుచేసి ఉషారాణి కుటుంబానికి అప్పగించాలన్నారు. నిరసన ప్రదేశానికి కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్ చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని స్పష్టంచేశారు. అంతకముందు కలెక్టర్కు ఆదివాసీ నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ నాయకులు కె.ధర్మారావు, బి.ఉమామహేశ్వరరావు, ఎ.సుందరరావు, వాబయోగి, యూకే రవికుమార్, బి.రామ్మోహన్రావు, పి.పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు. -
హద్దులు గీద్దాం.. ఆక్రమణలను అడ్డుకుందాం
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోని చిన్న నీటిపారుదల చెరువుల పరిరక్షణ, నీటి నిల్వ సామర్థ్య పెంపు, ఆక్రమణల నివారణ లక్ష్యంగా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లాలో మొత్తం 2,816కు పైగా చెరువులున్నాయి. పార్వతీపురం, పాలకొండ, సాలూరు వంటి పట్టణాలతోపాటు, గ్రామాల్లోనూ అనేక చెరువులు ఆక్రమణలతో కుచించుకుపోతున్నాయి. దీనివల్ల వీటి పూర్తి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. ఫలితంగా వర్షాకాలంలో నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. రైతులు సాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చెరువుల అసలు హద్దులను గుర్తించేందుకు రెవెన్యూ శాఖ ద్వారా పెగ్ మార్కింగ్ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం చేపట్టింది. అనంతరం ఉపాధి హామీ పథకం వేతనదారులతో చెరువు హద్దుల వెంట సరిహద్దు కందకాలు తవ్విస్తున్నారు. ప్రస్తుతం 116 చెరువులకు సంబంధించి పెగ్ మార్కింగ్ పూర్తయ్యింది. 61 చెరువుల్లో సరిహద్దు కందకాల తవ్వకం ప్రారంభించారు. రెవెన్యూ, నీటిపారుదల, గ్రామ పంచాయతీ, ఉపాధిహామీ విభాగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాయి. చెరువుల రక్షణ, నీటి సంరక్షణ, రైతు సంక్షేమం లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీని ద్వారా చెరువుల హద్దులు స్పష్టంగా గుర్తించవచ్చు. భవిష్యత్తులో ఆక్రమణలను అరికట్టడంతో పాటు చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెరిగి రైతులకు మరింత సాగునీరు అందుబాటులోకి రానుంది. మిగిలిన అన్ని చెరువుల్లోనూ త్వరితగతిన పెగ్ మార్కింగ్, సరిహద్దు కందకాల పనులు పూర్తి చేయనున్నాం. – ఎన్.ప్రభాకరరెడ్డి, కలెక్టర్ -
ఎనిమిదో తరగతి విద్యార్థి ఎస్సై అయ్యాడా?
● అధికారుల ’మ్యాపింగ్’ మాయాజాలం.. ● కళ్లెదుట తప్పు కనిపిస్తున్నా సరిదిద్దలేని దుస్థితిలో ప్రభుత్వ యంత్రాంగంపార్వతీపురం రూరల్: క్షేత్రస్థాయిలో వాస్తవాలు పట్టవు.. ఆన్లైన్లో రికార్డులు తప్పుల తడకలైనా సరిదిద్దే నాథుడు ఉండడు. చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగం పనితీరుకు, పాలకుల నిర్లక్ష్యానికి వీరఘట్టం మండలం తుడి గ్రామంలో జరిగిన ఈ ఘటనే సజీవ సాక్ష్యం. ఒకే గ్రామంలో ’అన్ను ప్రసాదరావు’ అనే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉండడమే ఈ అనర్థానికి మూలం. ఒక ప్రసాదరావు కుమారుడు సాత్విక్ ఎనిమిదో తరగతి చదువుతుండగా, మరో ప్రసాదరావు కుమారుడు పోలీసు శాఖలో ఎస్సైగా ఉన్నారు. కానీ, ప్రభుత్వ అధికారుల ’హౌస్ మ్యాపింగ్’ నిర్వాకం పుణ్యమా అని ఎనిమిదో తరగతి పిల్లాడు కాస్తా రికార్డుల్లో ’ఎస్సై’గా మారిపోయాడు. ఫలితంగా ఆ పేద విద్యార్థి సాత్విక్కు రావాల్సిన ‘తల్లికి వందనం’ సాయాన్ని గడిచిన రెండేళ్లుగా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నిలిపివేసింది. సాంకేతిక లోపంతో జరిగిన ఈ చిన్న తప్పును సరిదిద్దలేని చేతకానితనంలో పాలకుల వ్యవస్థ ఉందా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘తప్పు మీరే చేసి, శిక్ష పేద విద్యార్థికి వేస్తారా?‘ అంటూ బాధితుడు అధికారుల చుట్టూ రెండేళ్లుగా కాళ్లు అరిగేలా తిరుగుతున్నా కనీస స్పందన కరవైంది. ప్రభుత్వ పెద్దల మాటలు కోటలు దాటుతున్నా.. కింది స్థాయిలో కనీస సమస్యలు పరిష్కారం కావడం లేదు. విసిగిపోయిన ఇద్దరు ప్రసాదరావులు సోమవారం నేరుగా కలెక్టరేట్ మెట్లెక్కారు. మనుషులు ఎదురుగా కనిపిస్తున్నా.. సాక్ష్యాలు ఇంత స్పష్టంగా ఉన్నా.. ఓ చిన్న ఆన్లైన్ తప్పును సరిదిద్ది పేద విద్యార్థికి న్యాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం పాలకుల పనితీరుకు అద్దం పడుతోంది. -
యోగాంధ్ర జిల్లా స్థాయి పోటీల నిర్వహణ
పార్వతీపురం: యోగాంధ్ర జిల్లాస్థాయి పోటీలను కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించారు. జూనియర్ విభాగం విద్యార్థులకు సోలోయోగా, ప్రాణాయామం, గ్రూప్ యోగా విభాగాల్లో పోటీలు నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయి పోటీలకు విజేతలను ఎంపిక చేయనున్నట్లు జిల్లానోడల్ అధికారి డా. టి. జగన్మోహన్రావు తెలిపారు. యువతలో యోగా పట్ల ఆశక్తి పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి ఆదేశాల మేరకు జిల్లాస్థాయి యోగాంధ్ర పోటీలను నిర్వహించినట్ల తెలిపారు. కార్యక్రమంలో ఆయుష్శాఖ జిల్లా ఇన్చార్జ్ అధికారి డా.టి. హేమాక్షి యోగా గురువులు మోహన్ గంతాయత్, కె.జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు. మహరాజుపేట గాయత్రి స్కూల్ గుర్తింపు రద్దుపూసపాటిరేగ : భోగాపురం మండలంలోని మహరాజుపేట గాయత్రి ఇంగ్లీషు మీడియం స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడినట్లు ఆ మండల విద్యాశాఖ అధికారి రమణమూర్తి తెలియజేశారు. పాఠశాలను ఎటువంటి అనుమతులు తీసుకోకుండా వేరే చోటకు మార్పు చేయడంతో విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించినందున గుర్తింపు రద్దు చేసినట్లు తెలిపారు. అడ్మిషన్లు, తరగతులు నిలిపివేయాలని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. పాఠశాలలో ఇప్పటివరకు చదివిన విద్యార్థులను సమీప ప్రభుత్వ పాఠశాలలోను లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చేర్పించాలని తెలియజేశారు. గుర్తింపు లేని పాఠశాలలో విద్యార్థులను చేర్చవద్దని తల్లిదండ్రులకు ఎంఈఓ సూచించారు. బంగారం మారు తాకట్టు పెట్టి దంపతుల పరారీబొబ్బిలి: పట్టణంలోని దావాల వీధి తదితర ప్రాంతాలకు చెందిన ఐదుగురి నగలను ప్రైవేట్ బ్యాంకులో అధిక ధరలకు కుదువ పెట్టి పాత బొబ్బిలికి చెందిన జిల్లెళ్ల ప్రతాప్ అతని భార్య సరోజినిలు పరారయ్యారు. దీంతో బాధితులు బి.సాయికృష్ణ, సొండి లత, కంచెర్ల శ్రీను, శివకుమార్, తులసి తదితరులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రతాప్, సరోజినిలు డబ్బులు అప్పుగా ఇస్తామని సాయికృష్ణ తదితరులకు చెందిన 18గ్రాములు, 30 గ్రాములు, 12 గ్రాములు బంగారం కుదువ పెట్టుకున్నారు. అలాగే ఇతరులు కూడా వారి వద్ద బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బు తీసుకున్నారు. అయితే ఆ దంపతులు కుదువ పెట్టుకున్న బంగారాన్ని ఓ ప్రైవేట్ బ్యాంకులో అధిక డబ్బుకు కుదువ పెట్టి ఆడబ్బుతో పరారయ్యారు. దీంతో ఆ దంపతుల దగ్గర బంగారం కుదువ పెట్టిన వారంతా లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించి దంపతుల ఆచూకీ కనుగొని తమ బంగారం తిరిగి ఇప్పించాలని పోలీసులను ఫిర్యాదులో కోరారు. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్యపార్వతీపురం రూరల్: తనకు ప్రమేయం లేని విషయంలో ఇతరులు అనుమానిస్తున్నారనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిన్నింటిరాంనాయుడు వలస గ్రామ శివారులో ఆదివారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చందనపల్లి రాము (32) అలియాస్ రవి అనే యువకుడిని గ్రామంలోని ఓ విషయమై కొందరు అనుమానించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రాము గ్రామ శివారులో ఉన్న జీడిమామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి అన్న చందనపల్లి మురళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
పేదల బియ్యం పందికొక్కుల్లా..!
విజయనగరం ఫోర్ట్: ఈనెల 6వతేదీన గంట్యాడ మండలం రామభద్రపురంలో పీడీఎస్ బియాన్ని ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా సీఎస్డీటీ పట్టుకున్నారు. ఆటోలో ఉన్న 731 కేజీల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసిన ముమ్మిడి శెట్టి నూకరాజుపై 6ఎ కేసు నమోదు చేశారు. ● రాజాం నుంచి పొందూరు వైపు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అందులో ఉన్న 1040 కేజీల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. పీడీఎస్ బియ్యం విక్రయించిన వెంకటరావు, సురేష్, కృష్ణారావులపై కేసులు నమోదు చేశారు. ● గత ఏడాది బొండపల్లి మండలం కొండకిండాం, కిండాం ఆగ్రహారంలో 149 క్వి్ంటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. అయితే మొత్తం బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేసిన నార సంచులతోనే అక్రమంగా తరలించడం అప్పట్లో సంచలనమైంది. అయినప్పటికీ నార సంచులతో నేరుగా తరలించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇవి అధికారులు అడపాదడపా చేసిన తనిఖీల్లో పట్టుబడినవి. గుట్టుగా జిల్లాలో పీడీఎస్ బియ్యం రాకెట్ పెద్ద ఎత్తున జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీడీఎస్ బియ్యం వ్యాపారులకు పచ్చ నేతల అండదండలు ఉన్నాయని సమాచారం. అందుచేతనే జిల్లాలో పీడీఎస్ బియ్యం తరలించే వ్యాపారులు జంకూబొంకు లేకుండా ఇష్టారాజ్యం అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలకు అనుకూలంగా ఉన్నవారు పట్టుబడినా వారిని గుట్టుగా విడిపించేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తూతూమంత్రంగా తనిఖీలు పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపును అరికట్టాల్సి న పౌరసరఫరాల శాఖ అధికారులకు ప్రతినెలా వ్యాపారులు వాటాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే తనిఖీలు కూడా తూతుమంత్రంగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల కళ్ల ముందే పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం తరలిపోతున్నా పట్టించుకోవడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పీడీఎస్ బియ్యం తరలించే వ్యాపారుల వివరాలు కూడా పౌరసరఫరాల అధికారుల వద్ద ఉన్నప్పటికీ అక్రమ తరలింపు ఆగడం లేదంటే ఏమనుకోవాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు కన్నెర్ర చేస్తే కచ్చితంగా పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపునకు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయ పడుతున్నారు. రీసైక్లింగ్ చేసి తరలింపు పీడీఎస్ బియ్యాన్ని బియ్యం వ్యాపారులు కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ బియ్యాన్ని వారు రీ సైక్లింగ్ చేసి ప్రభుత్వానికే మళ్లీ విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం చాలా మంది అధికారులకు కూడా తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో రైస్ కార్డులు 5,77,487 జిల్లాలో 1249 రేషన్ షాపులు ఉన్నాయి. వాటి పరిధిలో 5,77,487 రైస్ కార్డులు ఉన్నాయి. లబ్ధిదారులకు నెలకు సుమారు 8,222 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతాయి. అందులో నెలకు సుమారు 4 వేల మెట్రిక్ టన్నుల వరకు పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నేతల కనుసన్నల్లో పీడీఎస్ బియ్యం దందా ప్రభుత్వం సరఫరా చేసిన సంచులతోనే పక్కదారి పట్టుబడిన వారిపై చర్యలు శూన్యం రెచ్చిపోతున్న బియ్యం వ్యాపారులుప్రతినెలా ఆకస్మిక తనిఖీలు ప్రతినెలా సీఎస్డీటీలు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. పీడీఎస్ బియ్యంతో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. పీడీఎస్ బియ్యం తరలించడం నేరం. జి.మురళీ నాథ్, జిల్లా పౌరసరఫరా అధికారి, విజయనగరంజిల్లాలోనే అత్యధికంగా బియ్యం దందా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కంటే విజయనగరం జిల్లాలోనే రేషన్ బియ్యం అక్రమ తరలింపు దందా ఎక్కువగా జరుగుతోందని సమాచారం. పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసిన వ్యాపారులు జిల్లా నుంచి విశాఖపట్నం, తూర్పు గోదావరి, ఒడిశాలోని జిల్లాలకు బియ్యం తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పొరుగున ఉన్న విశాఖపట్నం జిల్లాలోని రైస్ మిల్లులకు అత్యధికంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. -
బొల్లినేని విద్యార్థుల ప్రతిభ
శ్రీకాకుళం రూరల్: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన బీఎస్సీ ఎలైడ్ అండ్ హెల్త్కేర్ సైన్సెన్స్ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర ఫలితాల్లో రాగోలులోని బొల్లినేని మెడిస్కిల్స్ విద్యార్థులు విజయదుందుభి మోగించారని కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ స్థాయిలో వివిధ కోర్సుల్లో ఆరుగురు విద్యార్థులు మొదటి ర్యాంకులు సాధించగా, ముగ్గురు రెండో ర్యాంకు, ఒకరు మూడో ర్యాంకు, ఇద్దరు నాలుగో ర్యాంకు, ఒకరు ఐదో ర్యాంకు, ముగ్గురు ఆరో ర్యాంకు, ఒకరు ఏడో ర్యాంకు, ముగ్గురు ఎనిమిదో ర్యాంకు, ఇద్దరు తొమ్మిదో ర్యాంకు, మరొకరు పదోర్యాంకు సాధించారని వివరించారు. తృతీయ ఏడాదిలో తొమ్మిది మంది ఉన్నత శ్రేణిలో, 45 మంది ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 20 మంది ఉన్నత శ్రేణిలో, 35 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. -
ఆ ఇంటికి దిక్కెవరు?
రాజాం సిటీ: భార్య అనారోగ్యంతో ఉన్నా ఆ కుటుంబపెద్ద ఏనాడూ అధైర్యపడలేదు. దివ్యాంగురాలైన ముప్పైఏళ్ల కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ కుటుంబాన్ని గుట్టుగా నెట్టుకొస్తున్నాడు. తీర్థయాత్రలకు వెళ్లే వారికి వంటలు చేసేందుకు టూరిస్టు బస్సుతో వెళ్లేవాడు. ఖాళీ సమయాల్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆ కుటుంబంపై విధి కన్నెర్ర జేసి విధి వంచితురాలైన కుమార్తెకు తండ్రిని, మంచంపట్టిన భార్యకు భర్తను దూరం చేసింది. ఈ విషాదకర ఘటన రాజాం మున్సిపాల్టీ పరిధి కొత్తవలస గ్రామంలో ఆదివారం జరిగింది. ఈ విషాద ఘటనపై గ్రామస్తులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఉంగటి లక్ష్మునాయుడు (55), అదే గ్రామానికి చెందిన మరో ఐదుగురు ఈ నెల 3న కాశీ యాత్రకు టూరిస్టు బస్సుతో వెళ్లారు. అక్కడ యాత్రికులతో సరదాగా గడిపి అన్ని తీర్థయాత్రలు ముగించుకుని బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లా అఃతపుర పోలీస్ స్టేషన్ సమీపంలో ఆదివారం వేకువజామున 4గంటల సమయంలో తీర్థయాత్ర బస్సు రోడ్డు ప్రమాదానికి గురికాగా ఈ ప్రమాదంలో లక్ష్ము నాయుడు మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. రాజాం పరిసర ప్రాంతాలైన నందబలగ, బొద్దాం, ఇప్పిలిపేట గ్రామాలకు చెందిన మరో ఇరవై మంది వరకు అదే బస్సులో యాత్రకు వెళ్లారు. వారంతా క్షేమంగా ఉన్నట్లు కొత్తవలస నుంచి వెళ్లిన యాత్రికులు తెలిపారు. గ్రామంలో విషాదం.. అందరితో కలివిడిగా ఉండే లక్ష్మునాయుడు తీర్థయాత్రలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. దివ్యాంగురాలైన కుమార్తె ఆదిలక్ష్మితో పాటు అనారోగ్యంతో బాదపడుతున్న భార్య అసిరప్పకు ఇకపై దిక్కెవరంటూ గ్రామస్తులంతా నిట్టూరుస్తూ శోకసంద్రంలో మునిగిపోయారు. చీపురుపల్లి రూరల్ (గరివిడి): గరివిడి మండలంలోని ఎం.దుగ్గివలస గ్రామంలో ముచ్చర్ల గొల్లోడుకు చెందిన మూడు మేకలు పిడుగు పడి ఆదివారం మృతి చెందాయి. గ్రామానికి చెందిన పొదిలాపు సింహాచలం ఆమె భర్త సాంబయ్యతో పాటు ముచ్చర్ల గొల్లోడు ఆవులు, మేకలను తీసుకుని పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కురిసిన వర్షం, గాలులకు వారు ఉండే ప్రాంతంలో పిడుగులు పడడంతో గొల్లోడుకు చెందిన మూడు మేకలు మృతి చెందాయి. అదే విధంగా పక్కనే ఉన్న మహిళ సింహాచలం స్పృహ కోల్పోయింది. ఇంటికి తీసుకువచ్చి ప్రథమ చికిత్స చేయగా స్పృహ నుంచి ఆమె కోలుకుంది.అనకాపల్లి టౌన్: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో శంకరం గ్రామం వద్ద రైలు నుంచి జారి పడి ఆదివారం ఓ వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీఎఫ్ ఎస్సై కేటీఆర్ లక్ష్మి తెలిపారు. విశాఖపట్నం– విజయవాడ ట్రాక్ మధ్యలో మృతదేహాన్ని గుర్తించామని, మృతుడి వయసు 35 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. బ్లాక్ కలర్ ట్రాక్ ఫ్యాంట్, మెరూన్ రంగు టీషర్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి వద్ద టచ్ ఫోన్, ఆధార్ కార్డు, చిరిగిన జనరల్ రైల్వే టికెట్ లభించాయని, వాటి ప్రకారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల గ్రామంలోని కీర్తివీధికి చెందిన ఇట్లా భాస్కరరావుగా మృతుడిని గుర్తించామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, బంధువులకు సమాచారం అందించినట్లు ఎస్సై చెప్పారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబపెద్ద మృతి -
సంపూర్ణ కన్యాశుల్కం నాటక ప్రదర్శనకు ప్రణాళిక
విజయనగరం టౌన్: మహాకవి గురజాడ వెంకట అప్పారావు రచించిన సంపూర్ణ కన్యాశుల్కం ఎనిమిది గంటల నాటక ప్రదర్శన సెప్టెంబరు 20న కాకినాడలో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని నాటక నిర్మాత, అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మొలకల పేర్కొన్నారు. ఈ మేరకు మహాకవి స్వగృహంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. నవయువ ఆర్ట్స్ సొంటినేని కిశోర్ దర్శకత్వంలో కాకినాడలో కన్యాశుల్కం పదో సంపూర్ణ నాటక ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 45 మంది నటీనటులతో ప్రదర్శన ఉంటుందన్నారు. కార్యక్రమంలో దర్శకులు రామకృష్ణ, పెద్దింటి అప్పారావు, రౌతు వాసుదేవరావు, చీకటి దివాకర్,ఆర్.సూర్యపాత్రో, జిఎస్.చలం నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. -
సరిహద్దులు దాటుతున్న పీడీఎస్ బియ్యం!
పార్వతీపురం రూరల్: పేదలకు పంపిణీ చేయాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం పక్కదారి పడుతున్నాయి. పార్వతీపురం పట్టణ, మండల పరిధిలో కొందరు వ్యక్తులు అధికార పార్టీ అండదండలతో సిండికేట్గా ఏర్పడి ఈ అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్డుదారుల నుంచి తక్కువ ధరకు సేకరిస్తున్న ఈ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా పొరుగు రాష్ట్రానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒత్తిడి తెచ్చి సేకరణ పార్వతీపురం ప్రాంతంలో సుమారు 10 మంది వరకు చిరు వ్యాపారులు కార్డుదారుల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచరుడైన పట్టణ నాయకుడి ప్రమేయం పెరగడంతో ఈ వ్యాపార శైలి మారింది. సేకరించిన బియ్యాన్ని వేరే ఎవరికీ అమ్మకుండా, కేవలం తనకే విక్రయించాలంటూ సదరు వ్యక్తి చిరు వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అధికారులతో కేసులు పెట్టిస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నట్లు స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిల్వలు ఇక్కడే..ఒడిశాకు రవాణా ఈ విధంగా అత్యంత చవకగా (కిలో రూ.20 లోపు) సేకరించిన రేషన్ బియ్యాన్ని స్థానిక మార్కెట్ యార్డ్ ఎదురుగా గల వివేకానంద కాలనీలో నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి అనుకూల సమయాల్లో ఆటోల ద్వారా నేరుగా ఒడిశా రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఇక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసిన బియ్యాన్ని అక్కడ కిలో రూ.25 నుంచి రూ.30 వరకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నట్లు తెలుస్తోంది. కరువైన తనిఖీలు గతంలో రెవెన్యూ, విజిలెన్న్స్, పోలీస్ అధికారులు నిరంతరం దాడులు నిర్వహించి బియ్యం అక్రమ తరలింపును అడ్డుకుని స్వాధీనం చేసుకునేవారు. నిందితులపై 6–ఎ కింద కేసులు నమోదు చేసేవారు. కానీ, కొద్ది నెలలుగా తనిఖీలు గానీ, కేసుల నమోదు గానీ లేకపోవడంతో ఈ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి పేదల బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ఇదేం చోద్యం..!
● చిరుద్యోగులతో టీడీపీ మండల నాయకుడి సమీక్ష ● మేం చెప్పిట్లు వినాలంటూ ఆదేశాలుసాలూరు రూరల్: మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, సచివాలయ సిబ్బందితో మంత్రి సంధ్యారాణి ఇంటి పక్కన గల ఇంటిలో టీడీపీ మండల నాయకుడు అనధికారికంగా ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏ అధికారి కానీ, ప్రజా ప్రతినిధికానీ లేకుండానే సమీక్ష నిర్వహించడంపై సమీక్షకు హాజరైన సిబ్బందితో పాటు పలువురు ఇదేం చోద్యమంటూ ముక్కున వేలేసుకున్నారు. మంత్రి పిలిచారని చెప్పడంతో సమావేశానికి వచ్చామని తీరా మంత్రి సమావేశంలో లేకపోవడంతో మండల నాయకుడు సమావేశం నిర్వహిస్తున్నారని తెలుసుకుని సమావేశానికి వచ్చిన వారమంతా అవాక్కయ్యామని చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు లేకుండానే ఆదివారం పూట అనధికారికంగా సమీక్ష నిర్వహిస్తే మరి అధికారులు ఏంచేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీలో ఉద్యోగులను బెదిరించి పార్టీపై పట్టు సాధించాలన్న ఆలోచనతో ఇలా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రభుత్వ ఉద్యోగులపై పెత్తనం చెలాయించే విధంగా ముందుకు వెళ్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ సమీక్షలో మండలంలో సంక్షేమ పథకాలు, ఓటర్ల జాబితా తదితర అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల దృష్టిలో పెట్టుకుని గిరిశిఖర గ్రామాలపై పట్టు సాధించడం కోసం ఇలా ప్రభుత్వ ఉద్యోగులపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలకు బలం చేకూర్చేలా ఇలా పార్టీ నాయకులు నిర్వహిస్తున్న అనదికార సమీక్షసమావేశాలు స్పష్టం చేస్తున్నాయి. మంత్రి పేరు చెప్పి ఇలా ప్రభుత్వ చిరుద్యోగులపై పెత్తనం చెలాయించి ఆదివారం పూట మండుటు ఎండలో చిన్నపిల్లలతో వచ్చిన పలువురు ఆశవర్కర్లు, అంగనవాడీలు ఇబ్బందులకు గురైనట్లు చెబుతున్నారు. కార్యకర్తలే మంత్రి శాఖలు నడుపుతారా? గిరిజన, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి శాఖలు కార్యకర్తలే నడుపుతారా? అనధికారికంగా ఆదివారం పూట మంత్రి సంధ్యారాణి ఇంటి వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, ఆశవర్కర్లు, ిసచివాలయ ఉంద్యోగులతో సహెచ్డబ్ల్యూఓలతో ఒక పార్టీ మండల నాయకుడు ఆముదాల పరమేషు ఏ హోదాలో సమీక్ష సమావేశం నిర్వహించారని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ప్రశ్నించారు. గతంలో కూడా పట్టణంలోని డబ్బివీధిలో ఒక గదిలో ఇదే సిబ్బందితో సమీక్ష నిర్వహించారని ఆరోపించారు. అధికారులు అవసరమా? ప్రభుత్వ ఉద్యోగులతో తెలుగుదేశం కార్యకర్తలే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తే అధికారులు ఎందుకు? మహిళా సీ్త్ర సంక్షేమ శాఖకు పీడీ అవసరమా? కలెక్టర్, జేసీలు అవసరమా? అని రాజన్నదొర ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలే సమీక్షలు నిర్వహిస్తుంటే ప్రజాప్రతినిధులు ఎందుకని సందేహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీపీ, ప్రజా ప్రతినిధి హోదాలో సమీక్ష నిర్వహిస్తే సరే కానీ ఏ పదవీ లేకుండా అంగన్వాడీ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించడమంటే ఆ శాఖ అధికారులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్ దర్యాప్తుచేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల అంగన్వాడీ కేంద్రాలకు సక్రమంగా గుడ్లు పాలు ఇవ్యడం లేదని పత్రికల్లో వార్తలు వచ్చినా ఇంతవరకు ఏంచర్యలు తీసుకున్నారో కలెక్టర్, పీడీలు సమాధానం చెప్పాలని కోరారు. -
చాకుతో బెదిరించి బంగారం, డబ్బు దోపిడీ
కొత్తవలస: తన ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నిల్చున్న ఒక వ్యక్తి వద్దకు ఇద్దరు యువకులు స్కూటీపై వచ్చి చాకు, బీరు బాటిల్ చూపించి భయపెట్టి ఆ వ్యక్తి జేబులో గల రూ.800 నగదు, చేతికి ఉన్న పావుతులం బంగారు ఉంగరం, సెల్ఫోన్ దోచుకుని పారిపోతూ పోలీసులు వెంబడిస్తున్నారన్న ఆందోళనలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ప్రధాన నిందితుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు గాయాల పాలయ్యాడు. కొత్తవలస పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై ఎస్సై జోగారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరానికి చెందిన అముజురు శంకర్సాయి అనే యువకుడు ఆఫ్టింగ్ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.ఈ క్రమంలో శనివారం రాత్రి వేరొకరికి చెందిన కారులో ప్రయాణికులను అనకాపల్లిలో దింపి అక్కడే కారును వదిలేసి వేరే వ్యాన్లో కొత్తవలస వరకు వచ్చాడు. అప్పటికే తెల్లవారుజాము సుమారు 3 గంటలైంది. అక్కడి నుంచి వేరే వాహనం దొరికితే విజయనగరం వెళ్లిపోదామనే ఉద్దేశంతో కొత్తవలస జంక్షన్లో వేచి ఉండగా ఇద్దరు యువకులు స్కూటీపై వచ్చి శంకర్సాయిని బెదిరించి దోచుకున్నారు. ఇంతలో అటుగా వస్తున్న పోలీసులను చూసి తమను వెంబడిస్తున్నారని భావించి ఆందోళన చెంది ఎస్.కోట రూట్లో జోరుగా వెళ్తుండగా ఫైర్స్టేషన్ వద్దకు వెళ్లే సరికి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. దీంతో స్కూటీ నడుపుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె.రోహిత్(19) అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చున్న విశాఖపట్నం జిల్లాకు చెందిన గొంప కుమార్స్వామి(22) తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు గుర్తించారు.అలాగే ఆటో డ్రైవర్ బి.కొండలరావు, అందులో ప్రయాణిస్తున్న ఆయన భార్య చిన్నతల్లికి గాయాలు కావడంతో విశాఖపట్నం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన నిందితుడు రోహిత్పై విశాఖపట్నం, విజయనగరం,అనకాపల్లి జిల్లాల్లో గల పలు పోలీస్స్టేషన్లో 8 కేసులు నమోదైనట్లు ఎస్సై తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆటో ఢీకిని ఒక నిందితుడి మృతి -
అధికారులు ఎమ్మెల్యే
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రంలో పాలన ఏ స్థాయిలో అపహాస్యం పాలవుతోందో చెప్పడానికి పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలే సజీవ సాక్ష్యం. ఏకంగా అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడే, తన సొంత ప్రభుత్వ అధికారులపై బహిరంగ సవాళ్లకు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారులు ఒక మాట, ఎమ్మెల్యే ఇంకో మాట చెబుతూ.. ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నారు. వెంకంపేట స్థల వివాదంలో చట్టప్రకారమే నడుచుకుంటున్నామని అధికారులు పదేపదే స్పష్టం చేస్తున్నప్పటికీ, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అధికారులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలేం జరిగిందంటే..? పార్వతీపురం పరిధిలోని వెంకంపేటలో ఇరిగేషన్ శాఖకు చెందిన ప్రభుత్వ స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని, ఆ నిర్మాణాల వల్ల ఎగువన ఉన్న 500 ఇళ్లు నీట మునిగే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే రెండుసార్లు ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేశారు. అయితే, ఈ వివాదంపై జాయింట్ కలెక్టర్, ఎమ్మార్వో, రిజిస్ట్రార్ ఇప్పటికే పూర్తి క్లారిటీ ఇచ్చారు. సదరు స్థల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగానే జరిగిందని, అందులో ఎలాంటి అక్రమాలు లేవని అధికారికంగా ప్రకటించారు. వర్సెస్తన ప్రభుత్వమే నియమించిన కలెక్టర్, అధికారుల పనితీరుపై అధికార పార్టీ ఎమ్మెల్యేకే నమ్మకం లేకపోతే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ప్రభుత్వ యంత్రాంగం స్పష్టమైన ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా, అధికార పార్టీ ఎమ్మెల్యే తీరు మారలేదు. అధికారుల వివరణను బేఖాతరు చేస్తూ..నేరుగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎమ్మార్వో తదితరులకు ఎమ్మెల్యే ఆదివారం సామాజిక మాధ్యమాల్లో బహిరంగ సవాల్ విసిరారు. టెక్నికల్గా నిరూపిస్తే.. బహిరంగంగా నా చెంపలు వేసుకోవడానికి సిద్ధం‘ అంటూ సవాళ్లు విసరడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ఏది ఏమైనా.. అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం ప్రభుత్వ ప్రతిష్టను బజారున పడేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కలెక్టర్కు అధికార పార్టీ ఎమ్మెల్యే సవాల్ ముక్కున వేలేసుకుంటున్న స్థానిక ప్రజానీకం సొంత అధికారుల పైనే ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కన్నెర్ర తేల్చుకుందామంటూ సవాల్ -
రక్తదానం ప్రాణదానం
● రెడ్ క్రాస్ చైర్మన్ వెంకటరమణ విజయనగరం ఫోర్ట్: రక్తదానం ప్రాణదానమని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కె. వెంకటరమణ అన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో సాధన యువజన సంఘం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అత్యధికసార్లు రక్తదానం చేసిన వ్యక్తులను సన్మానించారు. మనిషి మాత్రమే ఆపదలో ఉన్న సాటిమనషికి రక్తం దానం చేసి ప్రాణాలు కాపాడగలడన్నారు. రక్తాన్ని తయారు చేయలేం కాబట్టి రక్తదానం ద్వారానే రక్తం కొరతను తీర్చవచ్చునన్నారు. రక్తదానంపై అపొహలు విడనాడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ రావు, అకోక్, మణికంఠ, స్వామి, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. అదుపులో ఇద్దరు అనుమానితులు● స్వర్ణకారుడిపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం పార్వతీపురం రూరల్: చౌకగా బంగారం ఇప్పిస్తానని నమ్మించి..విజయవాడకు చెందిన స్వర్ణకారుడిపై ఇటీవల ఆంధ్ర–ఒడిశా సరిహద్దు బట్టివలస వద్ద దుండగులు దాడి చేసి రూ.2 లక్షలు దోచుకెళ్లిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒడిశాలోని అలమండ బ్లాక్ పిప్పల భద్ర గ్రామానికి చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నేరానికి ఉపయోగించిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీ వెనుక సుమారు పది మంది హస్తం ఉన్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. బాధితుడికి ’డమ్మీ రాజు’ పేరుతో వలవేసిన ఈ ముఠాకు గతంలో సదరు వ్యాపారితో ఏవైనా లావాదేవీలు ఉన్నాయా? లేక ఇతర చీకటి వ్యాపారాల నేపథ్యం ఉందా? అన్న కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. కేవలం ఈ ఘటనే కాకుండా, ఇటీవల సరిహద్దుల్లో జరిగిన పలు ఇతర నేరాలతో వారికి ఉన్న సంబంధాలపై కూడా విచారణ చేస్తున్నారు. ఒడిశా వైపు వెళ్లే మార్గాల్లోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తూ, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మిగిలిన నిందితులను పట్టుకునేందుకు చర్యలు వేగవంతం చేశారు. -
నాయనా కళ్లు తెరువు నాయనా..!
● నువ్వే ఆశ, ఆధారమనుకున్నాం ● రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి ● విషాదంలో తల్లిదండ్రులుచీపురుపల్లిరూరల్(గరివిడి): మా కొడుకు బాగా చదివి మంచి స్థాయికి చేరాలని ఎన్నో కలలు కన్నాం, మా కుటుంబానికి మా కొడుకే ఆశ, ఆధారం అనుకున్నాం. నాయనా..లే.. కళ్లు తెరువు..అంటూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు రోదిస్తుంటే చూపరుల కళ్లు చెమ్మగిల్లాయి. ఈ విషాద వార్త వివరాలిలా ఉన్నాయి. గరివిడి పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన పదో తరగతి విద్యార్థి గుంటు అవినాష్(15) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యార్థి అవినాష్ గరివిడిలో గల గోదావరి దేవి షరాఫ్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 12న స్కూల్ ప్రారంభం రోజున పాఠశాల ముగిసిన అనంతరం సైకిల్పై ఇంటికి వెళ్తుండగా చీపురుపల్లి నుంచి విజయనగరం వైపు వెళ్తున్న మ్యాక్సీక్యాబ్ అవినాష్ సైకిల్ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అవినాష్ను వెంటనే విజయనగరంలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూశాడు. తల్లిదండ్రులు మోహన్, పుష్పలకు ఒక కుమార్తె, కుమారుడు కాగా కుమారుడు మృతి చెందడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుమారుడిని పట్టుకుని తల్లిదండ్రులు విలపించిన తీరు అందరికీ కన్నీళ్లు తెప్పించింది. కుమారుడి జ్ఞాపకాలను తలుచుకుంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
ఎత్తిపోతల ఎత్తేశారా..?
● రెండేళ్లుగా జంఝావతి సాగునీరందక రైతుల ఆందోళనకొమరాడ: మండలంలోని రాజ్యలక్ష్మీపురం గ్రామం వద్ద జంఝావతి నదిపై 1976లో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టగా ఒడిశాతో ఏర్పడిన చిక్కుముడితో ఆ నిర్మాణం కాస్తా అసంపూర్ణంగా అగిపోయింది. ఎన్నో ప్రభుత్వాలు మారినా కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ నేపథ్యంలో దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని 2006లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో జంఝావతిపై రబ్బర్ డ్యాం ఏర్పాటు చేసి లోలెవెల్ కెనాల్ ద్వారా 12 వేల ఎకరాలకు సాగు నీరు అందించారు అప్పట్లో కుడికాలువకు ఎత్తి పోతల పథకం ఏర్పాటు చేసి దాని ద్వారా రాజ్యలక్ష్మీపురం, కుమ్మరిగుంట, కందివలస, కంబవలస, కోనవలస తదితర గ్రామాల రైతులకు సుమారు 800 ఎకరాలకు సాగునీరు కోసం మోటార్లు అమర్చి సాగు నీరు అందించే వారు అయితే గడిచిన రెండేళ్లుగా ఎత్తి పోతల పథకం ద్వారా సాగునీరు అందక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఎండలు త్రీవంగా ఉండడంతో ఎత్తిపోతల పథకం ద్వారా నీరు రాకపోతే సుమారు 800 ఎకరాల్లో పంటనష్ట పోయే ఆస్కారం ఉంది. ఇప్పటికే అధికారులకు ఎంతలా మొరపెట్టుకున్నప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదని ఈ ప్రాంత రైతులు వాపోతున్నారు. జంఝావతి రిజ్వయర్పై ఉన్న ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న తమకు గడిచిన రెండేళ్లుగా నిరాశే ఎదురవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జంఝావతి ఎత్తిపోతల పథకం త్రీవ నిర్లక్ష్యానికి గురైందని ప్రతి ఏడాది సాగు సీజన్ ప్రారంభమైనప్పడల్లా సాగునీరు కోసం ఎదురుచూడవలసిన పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. ఆ పథకం నిర్వహణ, మరమ్మతులు, విద్యుత్ సరఫరా వంటి ఆంశాల్లో అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల సాగునీరు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా జంఝావతి అధికారులు నిర్లక్ష్యం వీడి రైతులకు సాగునీరు అందివ్వాలని కోరుతున్నారు. గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ నాయకులు ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరందించేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. జంఝావతి నదిపై నిర్మాణం చేసిన రిజర్వాయర్ను ఎన్నో ప్రభుత్వాలు గాలికి వదిలేస్తే మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి పుణ్యామా అని రబ్బర్ డ్యాం నిర్మాణం చేసి ఈ ప్రాంత రైతులకు మేలు చేశారు. ప్రతి ఏడాదీ సాగునీరు పుష్కలంగా అందించేవారు. జంఝావతి అధికారుల నిర్లక్ష్యంతో గత రెండేళ్లుగా ఎత్తిపోతల పథకం నిర్వహణ గాలికి వదలేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే సాగునీరు అందించకపోతున్నారు. దీని వల్ల మా ప్రాంత రైతులు సాగునీరు అందక త్రీవంగా నష్టపోతున్నాం. –వంగల ఈశ్వర్ రావు, రైతు -
ఆశలన్నీ.. వరుణుడిపైనే...
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో నీటి నిల్వలు ఆశాజనకంగా లే వు. వర్షాలుపైనే నీటి నిల్వ ఆధారపడి ఉంది. ఈ నెల ఆరంభంలో స్వల్పంగా వర్షపాతం నమోదు కావడంతో ప్రాజెక్టులో అనుకున్న స్థాయిలో నీటి నిల్వలు లేవు. ప్రాజెక్టులో నీటి నిల్వలు ఇలా.. మడ్డువలస ప్రాజెక్టులో 65 మీటర్లు లెవెల్ కెపాసిటీ నీటి మట్టం ఉండాల్సి ఉంది. ప్రస్తుతం 62.19 మీటర్లు లెవెల్ నీటిమట్టం ఉంది. ఈ లెక్కన 1.22 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులో ఉంది. ప్రాజెక్టు పరిధిలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని తొమ్మిది మండలాల్లో 31వేల ఎకరాల ఆయకట్టు భూములున్నాయి. వీటన్నింటికీ సాగు నీరందించాలంటే సుమారు రెండు టీఎంసీల నీరు తక్షణ అవసరం. ప్రస్తుతం నీటినిల్వ తక్కువగా ఉండడంతో మరో 15 రోజులు నీటి సరఫరాలో ఆలస్యం ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.సాక్షి, పార్వతీపురం సెల్ : 90102 04441 -
బడుగులపై పిడుగు
● ఏడుగురు మహిళలకు అస్వస్థతవీరఘట్టం/పాలకొండ: ఉపాధి పనులకు వెళ్తున్న మహిళా వేతనదారులపై పిడుగుపడింది. ఈ ప్రమాదవార్త గ్రామంలో తెలియడంతో ఊరంతా ఒక్కసారిగా ఘొల్లుమంది. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్య చికిత్స సకాలంలో అందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ఊరంతా ఊపిరిపీల్చుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వీరఘట్టం మండలం అడారు పంచాయతీ పరిధి చేబియ్యంవలస గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఉపాధి పనులకు వెళ్తున్న ఏడుగురు మహిళలు పిడుగు పాటు బారిన పడి అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన గుడుపూరు జ్యోతి, చిన్ని సంగమ్మ, నాగళ్ల యశోదమ్మ, ముద్దాడ గంగమ్మ, నాగళ్ల లక్ష్మి, చిన్న గౌరమ్మ, నాగళ్ల సిమ్మమ్మలు గ్రామ సమీపంలో ఉన్న చెరువు వద్ద ఉపాధి పనులు చేసేందుకు వెళ్తున్న క్రమంలో వారికి సుమారు 50 మీటర్ల దూరంలో ఓ చెట్టుపై పెద్ద శబ్దంతో పిడుగు పడింది. దీంతో వారంతా ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే స్థానికులు వారిని బిటివాడ పీహెచ్సీకి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం 108 వాహనంలో పాలకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే క్షతగాత్రులకు చికిత్స అందజేశారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బంది ధనుంజయ, శంకరరావు, రేరాజు, రాములను క్షతగాత్రుల బంధువులు, వైద్యాధికారులు అభినందించారు. -
రెండేళ్ల పాలనలో జిల్లాకు ఒరిగిందేమిటి?
విజయనగరం గంటస్తంభం: రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో విజయనగరం జిల్లాకు జరిగిన అభివృద్ధిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ఎల్బీజీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాకు కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి నిధులు ఎంత మేరకు వచ్చాయో ప్రభుత్వం వెల్లడించాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సహాయం వంటి హామీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కొరత కొనసాగుతోందని, మండల స్థాయి ఆస్పత్రుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా కొత్త పరిశ్రమలు తీసురావాలని సూచించారు. అభివృద్ధి పేరుతో భూముల సేకరణకు బదులుగా స్థానిక ప్రజలకు ప్రయోజనం చేకూరే చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడంతో పాటు జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే ప్రజల తరఫున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రెడ్డి శంకరరావు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ‘జల రక్షణ’
పార్వతీపురం: జిల్లాలో సోమవారం నుంచి జల రక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జలవనరుల శాఖ ఇంజినీర్లు, డ్వామా అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ సమీక్షించారు. చెరువుల సంరక్షణ, హద్దుల గుర్తింపే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతీ మండలంలోని ఒక గ్రామంలో తప్పనిసరిగా కార్యక్రమాన్ని అమలు చేయా లని సూచించారు. చెరువుల హద్దుల సర్వేను పూర్తిచేసి, సోమవారం నుంచి క్షేత్రస్థాయి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ట్రెంచ్ తవ్వకాల్లో సాంకేతిక నిబంధనలు పాటిస్తూ, రెండు వరుసల్లో మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు తమ పరిధిలోని చెరువుల వద్ద ఫొటోలు తీసి పంపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జలరక్షణ కార్యక్రమాన్ని సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇన్చార్జి జేసీ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. కొత్త బాధ్యతలు జియ్యమ్మవలస రూరల్: మండలంలోని డంగభద్ర గ్రామానికి చెందిన పట్లాసింగి కరుణ్ కుమార్ను రాష్ట్ర వైఎస్సార్ సీపీ గ్రీవెన్స్ విభాగం సంయుక్త కార్యదర్శిగా ఎంపిక చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ కోట రమేష్నాయుడు ఆధ్వర్యంలో చినమేరంగిలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాములు శ్రీవాణిను ఆయన కలిశారు. పార్టీ కొత్త బాధ్యతలు అప్పగించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో బెజ్జిపరుపు మురళి, వావిలిపల్లి సత్యనారాయణ, గంగునాయుడు, వేణుగోపాల్ నాయుడు, నాగభూషణరావు, శివకుమార్, జీవ, సంతోష్కుమార్, అల్లు ఈశ్వరరావు, బలగ వెంకటరమణ, ఎం.సింహాచలం, వాండ్రాసి కృష్ణ, శంకరరావు, తదితరులు పాల్గొన్నారు. విజయనగరం క్రైమ్: విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు డెమోలో భాగంగా శనివారం ఏఆర్ ఏఎస్పీ కల్యాణ్ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో రెండు గంటల పాటు నాకాబందీ నిర్వహించారు. మొత్తం 160 మంది ట్రైనీ కానిస్టేబుళ్లు, 700 మంది పోలీస్ సిబ్బంది 150 చోట్ల వాహన తనిఖీలు చేపట్టారు. వై జంక్షన్, వీటీ అగ్రహారం, ఎత్తుబ్రిడ్జి, ఆర్అండ్బీ, మహిళా పోలీస్ స్టేషన్, కలెక్టరేట్, ద్వారపూడి బ్రిడ్జి, కంటోన్మెంట్, గూడ్స్ షెడ్, సీఎంఆర్ కూడలి, గంటస్తంభం, ఆర్టీసీ కాంప్లెక్స్, రింగ్రోడ్డు, కోట, సింహాచలం మేడ తదితర చోట్ల ఏకకాలంలో వాహనతనిఖీలు జరిపారు. వాహనదారుల వివరాలు నమోదుచేశారు. తనిఖీల్లో డీపీటీసీ డీఎస్పీ వీర్ కుమార్, ఏఆర్ డీఎస్పీ కోటిరెడ్డి, సీఐలు ఆర్.వి.కె.చౌదరి, శ్రీనివాస్, ఎస్ఐలు సురేంద్ర నాయుడు, మురళీ, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన పిడుగు
● పిడుగుపాటుకు క్రికెట్ ఆడుతున్న విద్యార్థి, పశువుల కాపరి దుర్మరణం ● వారి కుటుంబాల్లో విషాదం ఓ వైపు ఎల్నినో ప్రభావంతో ఉదయమంతా భగభగమండే ఎండలు... మరో వైపు సాయంత్రం పిడుగుల వాన మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. విభిన్నవాతావరణ పరిస్థితులు జిల్లా ప్రజల్లో దడపుట్టిస్తున్నాయి. జిల్లాలో శనివారం సాయంత్రం వేర్వేరు ప్రదేశాల్లో పిడుగుపాటుకు ఓ విద్యార్థి, పశువుల కాపరి ప్రాణాలు విడిచారు. భవిష్యత్తును బంగారం చేసుకునేందుకు ముందుకు సాగుతున్న విద్యార్థి... పశువులు మేపుతూ కుటుంబ భారాన్ని మోస్తున్న మహిళ మృతితో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. రేగిడి: పాఠశాలలు, కళాశాలలకు రెండో శనివారం సెలవు కావడంతో రేగిడి మండలం కొండవలస గ్రామానికి చెందిన విద్యార్థులందరూ ఒక చోటకు చేరారు. సరదాగా క్రికెట్ ఆడుకుంటున్నారు. మేఘావృతమైనా ఆటలో నిమగ్నమయ్యారు. ఇంతలోనే పిడుగుల వాన ఆరంభమైంది. తలదాచుకునేందుకు పరుగు తీసే సమయంలో క్రికెట్ ఆడుతున్న విద్యార్థు ల్లో ఆమిటి పవన్ (17)ను పిడుగుతాకింది. అంతే అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పవన్ రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకెండియర్ సీఈసీ చదువుతున్నాడు. ఆదుకుంటాడనుకున్న కొడుకు అకాల మర ణంతో ఆర్ఎంపీ అయిన తండ్రి సత్యనారాయ ణ, తల్లి సత్యవతి బోరున విలపిస్తున్నారు. బాడంగి: మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన లచ్చుపతుల భవాని (42) తమ ఆవులను మేత కోసం చినమంత పొలా నికి తీసుకువెళ్లింది. అక్కడ ఆవులు మేస్తుండగా సాయంత్రం 4.30 సమయంలో వర్షం ఆరంభమైంది. ఇంటికి ఆవుల ను తోలుకెళ్లేందుకు సిద్ధపడుతున్న సమయం లో పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతురాలి భర్త వెంకటరమణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సూర్యకుమారి కేసు నమోదు చేశారు. -
తిలా పాపం.. తలా స్థలం!
● పార్వతీపురానికి చెందిన యడ్ల నరేష్ కుమార్ సీతానగరం మండలం పెదభోగిలి సర్వే నంబర్ 258/2, 5, 8లో ఎకరా 11 సెంట్లు 2021లో కొనుగోలు చేశాడు. తన స్నేహితులు కొనుగోలు చేసిన కొంత స్థలంతో కలిపి అక్కడ ఏడు ఎకరాల వరకూ వీరి ఆధీనంలో ఉంది. ఆ స్థలం 1బీ కోసం, మ్యుటేషన్ చేయాలని రెవెన్యూ అధికారులను పలుమార్లు కలిశాడు. వారు ఏదో కొర్రీ పెడుతూనే ఉన్నారు. ఆ స్థలం రైలు రోడ్డులో ఉందని కొన్నాళ్లు పేచీ పెట్టారు. అందుకు సంబంధించిన రికార్డులన్నీ ఆయన సేకరించాడు. అది పూర్తిగా జిరాయితీ అని.. రైలు రోడ్డులో కేవలం 25 సెంట్లు మాత్రమే ఉందని.. అది కూడా తన స్థలానికి వచ్చిన నష్టం ఏమీ లేదని పక్కా ఆధారాలు సేకరించి చూపాడు. కొద్ది రోజుల కిందట.. టీడీపీ నాయకులను కలవాలని తహసీల్దార్ ఆయనకు సూచించినట్లు తెలిసింది. ఇటీవల తహసీల్దార్ కార్యాలయంలోనే.. టీడీపీకి చెందిన ఇసుక మాఫియాలో కీలకంగా వ్యవహరించే ఓ వ్యక్తిని కలిశాడు. కొంత మొత్తం ‘కప్పం’ కట్టేస్తే పని అయిపోతుందని ఆ వ్యక్తి స్థల యజమానికి సలహా ఇచ్చాడు. ఎకరాకు రూ.లక్ష వరకూ డిమాండ్ చేసినట్లు సమాచారం. అన్ని ఆధారాలూ ఉన్నప్పటికీ తాను అంత డబ్బులు ఎందుకు కట్టాలని అధికారుల చుట్టూ స్థల యజమాని తిరుగుతూనే ఉన్నాడు. =========== ● కొద్ది రోజుల కిందట సాలూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 175/1లో రూ.కోట్ల విలువైన 3.14 ఎకరాల భూమికి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం విదితమే. ఇందులో కొంతమంది అధికార పార్టీకి చెందిన నాయకుల ప్రమేయంతో పాటు.. రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పాత్రపై ఆరోపణలు వ్యక్తమయ్యాయి.సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ప్రభుత్వ భూములు, వాగులు, గెడ్డలు, పోరంబోకు స్థలాలు దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. ప్రైవేట్ వ్యక్తులు ఏదైనా స్థలం కొనుగోలు చేసినా.. స్థానికంగా నివాసం లేకున్నా అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు గెద్దల్లా వాలిపోతున్నారు. నయానో, భయానో ‘కప్పం’ వసూలు చేస్తున్నారు. రూ.లక్షల్లో అనధికార పన్ను వేస్తున్నారు. డబ్బులు ఇచ్చే వరకూ వేధిస్తున్నారు. అంతా సవ్యంగా ఉన్నా సరే.. రెవెన్యూ కార్యాలయంలో మ్యుటేషన్లు కాకుండా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయకుండా అడ్డు పడుతున్నారు. కొందరు అధికారులు కూడా వారికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోనే అధికార పార్టీకి చెందిన వారికి కుర్చీలు వేసి మరీ రాజీలు కుదుర్చుతుండడంపై సభ్యసమాజం ఆందోళన చెందుతోంది. కొన్నింటిపై మౌనం.. కొన్నింటికి రాద్ధాంతం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ వంటి పట్టణాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణ చెరలో ఉన్నాయి. చెరువులు, గెడ్డలు ఆక్రమణదారుల చేతిలో పడి చిక్కిపోతున్నాయి. వీటికి ప్రజా ప్రతినిధులు, డాక్యుమెంటు రైటర్ల డైరెక్షన్లో ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. తమకు ‘అనుకూలంగా’ ఉన్న స్థలాల విషయంలో మౌనం వహిస్తున్న అధికార పార్టీకి చెందిన నేతలు.. కొన్ని చోట్ల రాద్ధాంతం చేస్తున్నారు. పార్వతీపురం పట్టణ పరిధిలో అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలను అక్రమార్కులు రాజకీయ నాయకుల అండతో ఆక్రమించుకుంటున్నారు. వివాదాస్పద వెంకంపేట గెడ్డ పోరంబోకు స్థలంతో పాటు పట్టణంలోని వరహాలగడ్డ, నెల్లిచెరువు, బిళ్ల బంద, దేవుని బంద, మున్సిపల్ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి. మున్సిపల్ స్థలం పట్టణ నడిబొడ్డులో మూడు ఎకరాల స్థలాన్ని అధికార పార్టీకి చెందిన ముఖ్య వ్యక్తి కాజేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అడ్డాపుశీల పరిధిలోని ఓ స్థలం విషయమై వివాదం నడుస్తోంది. జిల్లాలోని భూములు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై తరచూ వివాదాలు చోటుచేసుకోవడంతో స్థలాలు, భూములు, ఇళ్లు కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్న సామాన్యులు భయాందోళన చెందుతున్నారు. ఏది కొంటే.. ఎలాంటి సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుందో అని భయపడుతున్నారు. తిలా పాపం.. తలా పిడికెడు అన్నట్లు.. ప్రజాప్రతినిధులు, కొందరు అధికారులు ఈ వ్యవహారంలో ఒకే మాట మీద వెళ్తూ, సామాన్యులకు చుక్కలు చూపెడుతున్నారు. దొందూ దొందే.. అక్రమార్కులకు విందే.. జిల్లాలో యథేచ్ఛగా ఆక్రమణలు.. అక్రమ రిజిస్ట్రేషన్లు ప్రజా ప్రతినిధులకు కప్పం కట్టకుంటే చిందులే సహకారం అందిస్తున్న అధికార యంత్రాంగం పార్వతీపురం మండలం వెంకంపేట రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 121–1లోని 0.13 సెంట్ల భూమి రిజిస్ట్రేషన్పై ఇటీవల స్థానిక శాసనసభ్యులు బోనెల విజయ్చంద్ర తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విదితమే. అది ఇరిగేషన్ స్థలం అని ఆయన వాదన. గతంలోనూ ఈ స్థలంలో కట్టిన నిర్మాణాలను తొలగించారు. ఆ తర్వాత రూ.లక్షల్లో టీడీపీ నాయకులకు బాధితులు ‘కప్పం’ కట్టారు. ఆ మొత్తం కూడా చాలకపోవడంతో మళ్లీ రాద్ధాంతం చేస్తున్నారని వారి ఆరోపణ. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ విషయంలో జరిగిన ఇబ్బందులపై స్థల యజమాని గ్రంధి నిర్మల.. జిల్లా కలెక్టర్, ఐజీ (రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ), ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగానే జరిగిందని రిజిస్ట్రార్, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పార్వతీపురం మండలంలోని ఎంఆర్ నగరం గ్రామానికి చెందిన ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులకు 2025లో అప్పటి తహసీల్దారు ఇంటి పట్టాలు మంజూరు చేశారు. గ్రామంలో సర్వే నెంబర్ 386/1లో వీరికి పట్టాలు మంజూరయ్యాయి. ఇద్దరికీ ఇది వరకే నివాస స్థలాలు, ఇళ్లు కూడా ఉన్నాయి. అది కూడా ఆర్యవైశ్యులకు చెందిన ప్రైవేట్ స్థలంలో ఆక్రమణలు చేసి, పట్టాలు ఇవ్వడం వివాదం అయ్యింది. దీనిపై బాధితులు ఇటీవల పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. -
విద్యాశాఖలో రింగ్ మా‘స్టార్’
మాస్టారి చరిత్రంతా అవినీతిమయం సాక్షి, పార్వతీపురం మన్యం: ఒక సాధారణ మాస్టారి హవా.. విద్యాశాఖ, సమగ్రశిక్ష మొత్తం వ్యాపించింది. అక్కడితో ఆగిపోతే ఆ శాఖకే పరిమితమయ్యేదేమో! కలెక్టరేట్ విభాగాల్లో సైతం ఆయనే చక్రం తిప్పుతున్నారు. విద్యాశాఖలో షాడో డీఈవోగా వ్యవహరిస్తున్న ఆ మాస్టారి అవినీతిపై బాధితులు గగ్గోలు పెట్టినా, ఫిర్యాదులు చేసినా చర్యలు ఉండవు. ఆయన కన్నెర్ర చేయడంతో అక్రమంగా బదిలీ అయిపోయి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన ఉపాధ్యాయులు అనేక మంది ఉన్నారు. జిల్లా విద్యాశాఖాధికారిగా ఎవరు వచ్చినా.. ఆయన ‘కిందే’ పని చేయాల్సి వస్తోంది. పేరుకు వారు డీఈవో, సమగ్రశిక్ష ఏపీసీ గానీ.. పెత్తనమంతా ఆ మాస్టారిదే! చివరకు ఆ ‘శంకరుడు’ ఏ మాయ చేస్తారో గానీ.. జిల్లాకు కలెక్టర్లుగా వచ్చిన వారు సైతం ఈయన చెప్పిన మాట వినాల్సిందే. గత కలెక్టర్ శ్యామ్ప్రసాద్ నుంచి ప్రస్తుత కలెక్టర్ ప్రభాకరరెడ్డి వరకూ ఇందుకు మినహాయింపు లేదన్నవాదన వినిపిస్తోంది. కాంట్రాక్టులు ఆయన కుటుంబ సంస్థవే.. జిల్లా యంత్రాంగం పరంగా ఏ కాంట్రాక్టు పనులు చేయాలన్నా సదరు మాస్టారు భార్య పేరిట ఉన్న సంస్థకే బాధ్యతలు అప్పగిస్తారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి, ఆయన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టర్లు అప్పగించడం నిబంధనలకు విరుద్ధమైనా.. అధికారులు ఈ విషయంలో ప్రత్యేక సడలింపు ఇస్తున్నారు. జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలలల్లో విద్యార్థులకు యోగాభ్యాసం చేయించేందుకు అవసరమైన మ్యాట్, చొక్కా(షర్టు) సరఫరా చేసేబాధ్యతను ఏకపక్షంగా ఈ మాస్టారి భార్య సంస్థకు అప్పగించారు. ఇందుకోసం రూ.19.55 లక్షల నిధులు మంజూరు చేశారు. కనీసం టెండర్లు ఆహ్వానించకుండానే.. కొటేషన్లతో మమ అనిపించేసి ఆ మాస్టారి మాట ప్రకారం బాధ్యతలు అప్పగించి తమ ప్రేమను చాటుకున్నారు. ఆ సామగ్రి రాకుండానే బిల్లులు కూడా చెల్లించడం గమనార్హం. – అక్కడే కాదు, కలెక్టరేట్లో చీపురు కదలాలన్నా.. షెడ్డు వేయాలన్నా, భవనం కట్టాలన్నా.. కథలు, కార్యాలు జరగాలన్నా.. ఆ మాస్టారి సంస్థకే బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇలా ఒక ఉద్యోగి భార్యకు చెందిన సంస్థకు రూ.కోట్ల విలువ చేసే పనులు ఎలా అప్పగిస్తారన్నది ఉద్యోగవర్గాల్లో ప్రశ్నార్థకంగా మారింది. డిప్యుటేషన్పై జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సదరు ఉపాధ్యాయునిపై ఆది నుంచి తీవ్ర ఆరోపణలున్నాయి. గతంలో జిల్లా విద్యాశాఖ నిర్వహించే అనేక కార్యక్రమాలతోపాటు, పదో తరగతి పరీక్షల సమయంలో అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు విమర్శలున్నాయి. ఉపా ధ్యాయుల బదిలీల్లోనూ ఈయన పాత్ర కీలకం. తనకు అనుకూలంగా ఉంటే మంచి స్థానాలు కేటాయించడం.. లేకుంటే చింతపల్లికి బదిలీ చేయించడం పరిపాటిగా మారింది. గతంలో పార్వతీపురం ఐటీడీఏలో డిప్యుటేషన్పై పని చేసిన సమయంలోనూ ఆయన సస్పెండ్ అయ్యారు. ఆ వివరాలు నేటికీ ఎస్ఆర్లో చేర్చలేదు. డిప్యుటేషన్ సమయంలో ‘రిలీవింగ్, ‘జాయినింగ్‘ వంటి ప్రక్రియ, లిఖిత పూర్వక ఉత్తర్వులు వ్యవహారంలోనూ ఆయన మీద పలు ఆరోపణలున్నాయి. ఈ మాస్టారి అవినీతి, అక్రమాలపై గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ గతంలో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు విచారణ చేపట్టాలని డీఈవోకు పై నుంచి ఆదేశాలొచ్చాయి. వ్యవస్థలను మేనేజ్ చేసే సత్తా ఉన్న ఆ మాస్టారు.. విచారణను సైతం తుంగలో తొక్కించేశారు. జిల్లా విద్యాశాఖకు ఏ డీఈవో వచ్చినా డమ్మీలుగానే మిగిలిపోతున్నారని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు నచ్చకపోతే డీఈవో లను సైతం మార్చగల సామర్థ్యం ఆయనకు ఉందని చెబుతున్నారు. పెత్తనం నుంచి కాంట్రాక్టుల వరకు అన్నింటా ‘శంకరుని’ లీలలే.. విద్యాశాఖలో కొనసాగుతున్న మాస్టారి హవా కలెక్టరేట్లోనూ పెత్తనం -
నాణ్యతకు పాతరేద్దాం..
మారుమూల ప్రాంతం.. సీతంపేట: ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం.. కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తి.. అధికార బలం వెరసి గిరిజన గ్రామాల రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. నచ్చినట్టు రోడ్లు వేస్తున్నారు. నిర్మించిన వెంటనే రోడ్లు పాడవుతున్నా కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ నెల 30వ తేదీలోగా ఉపాధిహామీ నిధులతో చేపట్టే పనులు పూర్తిచేస్తే బిల్లుల చెల్లింపు వెంటనే జరుగుతుంది. వచ్చేనెల నుంచి ఉపాధిహామీ పేరు వీబీజీరామ్జీగా మారనుంది. ఈ నేపథ్యంలో పనులు ఆదరబాదరగా పూర్తిచేసే పనిలో పలువురు కాంట్రాక్టర్లు ఉండడం గమనార్హం. మారుమూల కొండ శిఖర గ్రామాల్లోని పనులను ఎవరూ పర్యవేక్షించరన్న ఉద్దేశంతో కనీస నిబంధనలు పాటించడం లేదు. దీనికి జగతపల్లి రోడ్డు నిర్మాణమే నిలువెత్తు సాక్ష్యం. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్లో రూ.80 లక్షల అంచనా వ్యయంతో జగతపల్లి గ్రామానికి 1.2 కిలో మీటర్ల సీసీ రోడ్డు మంజూరైంది. కొద్ది రోజులుగా చేపడుతున్న పనుల్లో నాణ్యతకు పాతరేస్తున్నారు. రోడ్డు లెవెలింగ్ లేదు. రోలింగ్ చేయడంలేదు. జీఎస్బీ(గ్యాన్యులర్ సబ్ బేస్) నాలుగు ఇంచీలు వేయాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదు. వాటరింగ్ చేసిన దాఖలా లేవు. ఏఈ పర్యవేక్షణ లేకుండానే సిమెంట్, చిప్స్, ఇసుక మిక్స్ర్ ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు. పెద్ద వాహనాలు ఈ రోడ్డుగుండా వెళ్తే రోడ్డు వెంటనే మూడుముక్కలవుతుందని స్థానికులు చెబుతున్నారు. శాశ్వత నిర్మాణాలను నాసిరకంగా చేపట్టడంపై ఆందోళన చెందుతున్నారు. పనుల్లో నాణ్యత లోపించడంతో ఎన్నిరోజులు ఉంటుందో, ఊడుతుందోనని గిరిజనులు వాపోతున్నారు. నెలరోజుల కిందట ఉప్పరజమ్మి–రేగుమానుగూడ వరకు రూ.50 లక్షలతో చేపట్టిన రోడ్డు పనుల్లోనూ నాణ్యత పాటించడం లేదని హడ్డుబంగి మాజీ సర్పంచ్ సూర్యారావుతో పాటు పలువురు గిరిజనులు స్వయంగా పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. అది మరిచిపోకముందే దేవనాపురం పంచాయతీ పరిధిలో జగతపల్లి రహదారి కూడా నాణ్యతడొల్ల కనిపిస్తుండడం ఇంజినీరింగ్ అధికారుల పనితీరుకు అద్దంపడుతోంది. కొండపైకి రోలర్ వెళ్లకపోవడంతో రోలింగ్ చేయలేదు. నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయో? లేదా? అనేది పర్యవేక్షిస్తాం. – నాగభూషణరావు, డీఈ, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ విభాగం నాసిరకంగా జగతపల్లి సీసీ రోడ్డు నిర్మాణం రోలింగ్ లేదు.. వాటరింగ్ అంతంతమాత్రమే.. నిధులు కాజేతే లక్ష్యంగా ఆదరబాదరగా పనులు -
కన్నబిడ్డను చూసేందుకు వెళ్తూ.. మృత్యు ఒడిలోకి...
కళ్లేదుటే.. కన్నబిడ్డ దుర్మరణం● మోటార్ సైకిల్ను ఢీకొన్న కారు ● మృతి చెందిన ఓ వ్యక్తిగజపతినగరం రూరల్ : కన్నబిడ్డను చూసేందుకని వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఇటీవలె తండ్రి కావడంతో బిడ్డను చూసొద్దామని వెళ్తే విధికి కన్నెర్ర చేసింది. బిడ్డను చూడకుండానే అనంతలోకాలకు తీసుకుపోయింది. దీంతో ఆ ఇంట రోదనలు మిన్నంటాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మరుపల్లి సమీపాన గల ఓలౌ కంపెనీ వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు కథనం ప్రకారం... రామభద్రపురం గ్రామానికి చెందిన చొక్కాపు శేఖర్రావు (29) మండలంలోని గుడివాడ గ్రామం నుంచి మోటార్సైకిల్పై గజపతినగరం వైపు వస్తుండగా... విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న కారు స్థానిక ఓలౌ కంపెనీ వద్ద బలంగా ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన శేఖర్రావును గజపతినగరం ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఇటీవలే తండ్రి అయిన శేఖర్ తన కుమారుడిని చూసేందుకు మెంటాడ మండలం గుర్ల తమ్మిరాజుపేట గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శేఖర్కు భార్య ధనలక్ష్మి ఉన్నారు. తల్లి చొక్కాపు లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ భాస్కరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెరకముడిదాం: కన్నబిడ్డ కళ్లేదుటే మృతి చెందిన ఘటన ఓ తండ్రికి విషాదం మిగిల్చింది. మండలంలోని పులిగుమ్మి గ్రామంలో ట్రాక్టర్ బోల్తాపడి బాలుడి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని పులిగుమ్మి గ్రామంలో శనివారం సాయంత్రం గ్రామానికి చెందిన బెజవాడ కృష్ణ తన మామిడితోట దున్నడానికి తన కుమారుడు బెజవాడ జశ్వంత్(13)తో కలిసి వెళ్లాడు. తోట దున్నిన తరువాత వెళ్లిపోయేందుకు ట్రాక్టర్ డ్రైవర్ చిన్నంనాయుడు గట్టుఎక్కించే క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పడంతో బోల్తా పడింది. అదే సమయంలో అదే గట్టుపై కృష్ణ కుమారుడు జశ్వంత్ వుండడంతో ట్రాక్టర్ జశ్వంత్పై పడిపోయింది. దీంతో జశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. కన్నబిడ్డ కళ్లేదుటే మృతి చెందడంతో తండ్రి గొల్లుమన్నాడు. జశ్వంత్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న బుదరాయవలస ఎస్ఐ జె.లోకేష్కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, బంధువుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తు విద్యార్థి మృతి బొబ్బిలి రూరల్: మండలంలోని అలజంగి గ్రా మంలో చోటుచేసుకున్న ప్రమాదంలో మున్సిపాలిటీలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన రాంబా ర్కి పవన్కుమార్ (13) అనే విద్యార్థి మృతి చెందాడు. ఇటీవల వేసవి సెలవులు కాగా తాతగారి గ్రామమైన అలజంగి వెళ్లగా శ శనివారం గ్రామంలోని శివాలయం వద్ద స్నేహితులతో ఆడుతుండగా అక్కడే ఉన్న కూర్చునే పలకపై కూర్చున్నాడు. ఇంతలో పలక పగిలిపోయి విద్యార్థి గుండెల మీద పడింది. దీంతో స్థానికులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థి తల్లిదండ్రులు సావిత్రమ్మ, శంకర్రావులు బోరున విలపిస్తున్నారు. సోమవారం నుంచి పాఠశాలకు వెళతానని ఈ రెండు రోజులు తాతగారి ఇంటి విద్దనే ఉంటానని చెప్పి మృత్యువాత పడ్డాడని గొల్లుమంటున్నారు. విద్యార్ధి పవన్ గొల్లపల్లి హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. దీనిపై సీఐ నారాయణరావు వద్ద ప్రస్తావించగా తమకెలాంటి సమాచారం లేదని, ఫిర్యాదు అందలేదని తెలిపారు. ట్రాక్టర్ బోల్తా పడి బాలుడి మృతి -
కేరళ పర్యటనకు జెడ్పీటీసీ సభ్యులు
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సొంత నిధులతో పర్యటన ఏర్పాట్లు విజయనగరం రూరల్: ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు కేరళ పర్యటనకు శనివారం బయలుదేరి వెళ్లారు. నిరంతరం ప్రజా సేవలో, ప్రజల మధ్యనే ఉంటూ, గత ఐదేళ్లుగా జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీటీసీ సభ్యులందరికీ ప్రత్యేక గుర్తింపుగా జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు తన సొంత ఖర్చులతో ఐదు రోజుల కేరళ పర్యటనకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి జెడ్పీ చైర్మన్తో పాటు సభ్యులు ప్రయాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు వి.నరసింహమూర్తి, జెడ్పీటీసీ ప్రతినిధి వల్లి రెడ్డి శ్రీను జన్మదిన వేడుకలను హైదరాబాద్ విమానాశ్రయంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సమక్షంలో అందరూ కలిసి కేక్ కట్ చేసి ఆనందంగా జరిపారు. పోలీసుల అదుపులో పేకాటరాయుళ్లు సీతానగరం: మండలంలోని చినబోగిలి పొలిమేరల్లో పామాయిల్ తోటలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ హేమలత తెలిపారు. వీరి నుంచి రూ.3,130లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. డ్రోన్ కెమెరా సాయంతో పేకాట ఆడుతున్న ప్రదేశాన్ని గుర్తించి సిబ్బందితో వెళ్లి దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. సిరిపురంలో వీధికుక్కల స్వైర విహారం రాజాం/సంతకవిటి : సంతకవిటి మండలంలోని సిరిపురం గ్రామంలో వీధి కుక్కల స్వైర విహారం అధికమైంది. కుక్కల బాధ తాళలేక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆరునెలలు క్రితం ఈ వీధి కుక్కల స్వైర విహారంతో పలువురు గ్రామస్తులు గాయాల పాలయ్యారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్న సమయంలో వీధి కుక్కలు కళ్లాల్లోని మూగజీవాలపై విరుచుకుపడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో ఈ కుక్కల దాడిలో గ్రామానికి చెందిన పలువురు రైతులకు సంబంధించి 12 లేగ దూడలు మృతి చెందాయి. అప్పుడే పుట్టిన దూడలు, రెండు మూడు వారాలు వ్యవధి ఉన్న లేగదూడలపై దాడి చేసి హతమార్చుతున్నాయి. కళ్లాల్లో పశువుల శాలల్లో కడుతున్న దూడలపై దాడి చేసి గాయపర్చడం, ఒక్కోదపా పొలాల్లోకి లాక్కెళ్లి తినేయడం చేస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో వీధి కుక్కల అధికమయ్యాయని, ఇతర గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ సంచరించడమే కాకుండా రాత్రిళ్లు పెద్దపెద్ద అరుపులతో ప్రజలకు ఇబ్బందులు కల్గిస్తున్నాయని గ్రామస్తులు వెల్లడించారు. వీటిని అదుపు చేయాలని, యాంటీ బర్త్ ఇంజక్షన్లు చేయాలని పంచాయతీ సచివాలయలంలో ఫిర్యాదు చేసామని, ఇంతవరకూ ఏ ఒక్కరూ పట్టించుకోలేదని గ్రామానికి చెందిన రైతు రాంబాబు వెల్లడించారు. ఇప్పటికై నా పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ● వారం రోజుల వ్యవధిలో 12 లేగదూడలు మృతి ● ఫిర్యాదు చేసినా పట్టించుకోని పంచాయతీ శాఖ -
పిడుగుపాటుకు ఎద్దు మృతి
వంగర: మండల పరిధి శ్రీహరిపురం గ్రామానికి చెందిన గార కంచినాయుడు అనే రైతుకు చెందిన ఎద్దు పిడుగు పాటుకు శనివారం మృతి చెందింది. గ్రామ సమీపంలోని దేవకివాడ పొలంలోకి పశువులను మేతకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో భారీ ఉరుములతో కూడిన వర్షం కురవడంతో ఒక్కసారిగా పిడుగుపాటుకు గురై ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతు కోరాడు. విద్యుత్ షాక్తో చూడు గేదె.. వేపాడ: మండలంలో బొద్దాం పంచాయతీ శివారు కొత్త బొద్దాం గ్రామానికి చెందిన ఎర్రా అప్పారావు చూడు గేదె విద్యుత్ షాక్తో మృతి చెందిన సంఘట చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు... శనివారం గ్రామానికి చెందిన ఎర్రా అప్పారావు చూడు పశువును గంగువాని చెరువు వద్ద మేపుతున్నారు. గేదె మేస్తూ విద్యుత్ స్తంభం వద్ద తెగి పడిపోయిన విద్యుత్ తీగను తాకడంతో విద్యుత్ షాకు గురై అక్కడిక్కడే మృతి చెందింది. దీంతో స్థానికులు విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో సరఫరా నిలుపు చేశారు. విద్యుత్ షాకు గురై మృతి చెందిన చూడు గేదె సుమారు రూ.లక్షా 50వేలు విలువ వుంటుందని స్థానికులు తెలిపారు. -
వ్యక్తి ఆత్మహత్య
రాజాం సిటీ: ఏం కష్టం వచ్చిందో ఏమో మండల పరిధి గార్రాజుచీపురుపల్లి గ్రామానికి చెందిన కోడూరు రాము (35) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజయ్యపేట సమీపంలోని తోటపల్లి కాలువ గట్టు పక్కన చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. అందరితో కలసిమెలసి సరదాగా ఉండే రాము ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడేశారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతునికి భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి ర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
రక్తదాతే.. ప్రాణదాత
● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ● వైద్య రంగంలో రక్తదాతల పాత్ర కీలకంవిజయనగరం ఫోర్ట్: సమాజంలో వైద్యులకు ఎంత ప్రాధాన్యత ఉందో రక్తం దానం చేసే రక్తదాతలకు అంతటి ప్రాధాన్యత ఉంది. ప్రాణపాయ స్థితిలో ఉన్న రోగికి వైద్యుడు చికిత్స అందించి ప్రాణాలు పోస్తే, రక్తదాతలు రక్తం దానం చేసి ప్రాణాలు నిలుపుతారు. రక్తం అవసరమైన రోగికి సకాలంలో రక్తం ఎక్కించకపోతే మరణించే ప్రమాదం ఉంది. ఆపదలో ఉన్న సాటి మనిషి ప్రాణాలు నిలబెట్టాలన్న గొప్ప మనసు ఉన్న వ్యక్తే రక్తదాత. ఆదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్బంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కధనం. చాలా మంది తమ కుటుంబ సభ్యులు ఆపదలో ఉన్నా సరే రక్తదానం చేయడం ముందుకు రారు. రక్తదానం చేస్తే అనారోగ్యం వచ్చేస్తుందనే భ్రమ ఇప్పటకీ చాలా మందిలో ఉంది. కానీ ఇది అవాస్తవం. రక్తదాతల మానవత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రక్తదాతలు లేని సమాజం ఊహించలేం రక్తాన్ని మిగతా వస్తువులు మాదిరి పరిశ్రమల్లో తయారు చేయలేం. రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించలేం. రక్తదాతలు రక్తం దానం చేయడం ద్వారా మాత్రమే సమాజంలో ఆపదలో ఉన్న రోగులు బ్రతికి బట్టగట్టగలుగుతున్నారు. రక్తదాన శిబిరాల్లో రక్తదాతలు దానం చేసిన రక్తాన్ని బ్లడ్ బ్యాంక్ల్లో భద్రపరిచి రక్తం అవసరమైన రోగులకు అందిస్తున్నారు. ఏటా 25 వేల మంది రక్తదానం జిల్లాలో ఏటా వేలాది మంది రక్తదానం చేస్తున్నారు. జిల్లాలో ఉన్న బ్లడ్బ్యాంక్లు, స్వచ్ఛంద రక్తదాన శిబిరాల్లో ఏటా 22 వేలు నుంచి 25 వేలు మంది వరకు రక్తదానం చేస్తున్నారు. దీనిని బట్టి రక్తదాతలు అవసరం ఎంతో ఉందో అర్ధం అవుతుంది. జిల్లాలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం, రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం, నెల్లిమర్ల మిమ్స్ రక్తనిధి కేంద్రం, ఎన్వీఎన్ బ్లడ్ బ్యాంక్, రోటరీ బ్లడ్ బ్యాంక్, విజయ బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ బ్యాంక్, బొబ్బిలి బ్లడ్ బ్యాంక్, జీఎంఆర్ బ్లడ్ బ్యాంక్లు ఉన్నారు. వీరు రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తం సేకరిస్తూ ఉంటారు. అరుదైన బ్లడ్ గ్రూపు రక్తదాతలు రక్తదాతల్లో అరుదైన గ్రూపు ఉన్న రక్తదాతల పాత్ర అత్యంత కీలకం. ఏ పాజిటివ్, బీ పాజిటివ్, ఓ పాజిటివ్ గ్రూపు రక్తం ఎక్కువ మందిలో ఉంటుంది. ఈ గ్రూపు రక్తం సులభంగా లభిస్తుంది. ఏ నెగిటివ్, బీనెగిటివ్, ఏబీ పాజిటివ్, ఏబీ నెగిటివ్ గ్రూపు రక్తం చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఇటువంటి అరుదైన గ్రూపు రక్తం వివరాలు బ్లడ్ బ్యాంక్ల వద్ద ఉన్నాయి. అవసరమైనప్పుడు వీరు ఆ రక్తదాతలకు ఫోన్ చేస్తే వచ్చి రక్తం దానం చేస్తున్నారు. -
వ్యక్తిగత విమర్శలు చేసిన వారిని విడిచిపెట్టేది లేదు..
● మాజీ ఉప ముఖ్యమంత్రిపీడిక రాజన్నదొర సాలూరు: తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన, చేయించిన వారిని విడిచిపెట్టేది లేదని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర హెచ్చరించారు. పట్టణంలోని తన గృహంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. మంత్రి సంధ్యారాణి తన స్థాయిని మరచి మా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అత్యంత హేయమైన రీతిలో విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాజాగా ఆమె కొందరు గిరిజనులతో తనపై కూడా వ్యక్తిగత విమర్శలు చేయిచారని పేర్కొన్నారు. తానెప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాణ్పై రాజకీయ విమర్శలే చేశాను తప్ప వ్యక్తిగత విమర్శలు చేయలేదని గుర్తు చేశారు. తన భార్య లేదా పిల్లలు ఏనాడూ ఏ అధికారికి ఫోన్లు చేయలేదన్నారు. ప్రస్తుత మంత్రి సంధ్యారాణి ఇంట్లో మంత్రి కాకుండా వారి కుటుంబీకులు అధికారులతో ఏమేమి మాట్లాడుతున్నారో అందరికీ తెలుసునన్నారు. మంత్రి సంధ్యారాణి, ఆ పార్టీ నేతలు ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని లేకుంటే తాము అటువంటి విమర్శలు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని విషయాలు ప్రజలకు తెలుసునని చెప్పారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పుడు పనులను ప్రజా క్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. నియోజకవర్గంలో నాసిరకంగా పనులు చేపట్టి బిల్లులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. కలెక్టర్ను అనేక రకాలుగా టీడీపీ నేతలు ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. నాసిరకం పనులపై కలెక్టర్ స్పందించి విచారణ చేయించి పీఆర్, ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే నాసిరకం పనులపై ఆధారాలతో కేంద్ర విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. -
విశాఖలో ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు
విజయనగరం గంటస్తంభం: విశాఖపట్నంలో జూలై 13, 14, 15 తేదీల్లో జరగనున్న ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వి.చిన్నబాబు, జిల్లా కార్యదర్మి డి.రాము పిలుపునిచ్చారు. స్థానిక ఎల్బీజీ భవన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత పదేళ్లలో ఎన్టీఏ నిర్వహించిన పరీక్షల్లో అనేకసార్లు పేపర్ లీకేజీలు జరిగాయని, నీట్, సీయూఈటీ, సీబీఎస్ఈ, ఎస్ఎస్సీ తదితర పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్మించారు. జిల్లాలో అనుమతులు లేకుండా కొన్ని విద్యా సంస్థలు నడుస్తున్నప్పటికీ సంబంఽధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. విశాఖలో జరిగే అఖిల భారత మహాసభలకు దేశ వ్యాప్తంగా విద్యార్థి నాయకులు హాజరవుతారని, విద్యారంగ సమస్యలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. మహాసభల విజయానికి మేధావులు, విద్యార్థులు, యువత, ప్రజలు ఆర్థికంగా, నైతికంగా సహకరించాలని కోరారు. సమావేశంలో జిల్లా గర్ల్స్ కన్వీనర్ ఆర్.శిరీష, జిల్లా ఉపాధ్యక్షుడు కె.జగదీష్, సహాయ కార్యదర్ములు సోమేష్, వంశీ పాల్గొన్నారు. -
నమ్మించి గొంతు నులిమేశాడు..
చికెన్పాలకొండ/పాలకొండ రూరల్: మండలంలో సంచలనం సృష్టించిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి(32) హత్య కేసు మిస్టరీ వీడింది. ఐదేళ్ల పాటు ప్రేమాయణం నడిపి, శారీరకంగా అనుభవించి పెళ్లి అనగానే ప్రియుడే గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని కారులో ఉంచి సినీ పక్కీలో చక్కెర్లు కొట్టారు. ఈ హత్యకు కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఓ స్టాఫ్నర్సు, మరో మిత్రుని సహకారం తీసుకున్న నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. మృతదేహాన్ని మాయం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి ఒక్క రోజులోనే పోలీసులకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వివరాలను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పాలకొండ డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం వెల్లడించారు. పాలకొండ మండలం జంపరకోట పంచాయతీ బర్నసీతంపేట గ్రామానికి చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణికి, ఎం.సింగుపురం గ్రామానికి చెందిన రెడ్డి భువనేశ్వరకుమార్ అలియాస్ భువన్కు ఐదేళ్ల క్రిందట పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఉషారాణిని శారీరకంగా అనుభవించాడు. ఇంతలో ఎం.సింగుపురం ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న వీరఘట్టం మండలం బొడ్లపాడు గ్రామానికి చెందిన కృపారాణితో భువన్కు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య కూడా శారీరక సంబంధం కొనసాగుతోంది. తనను దూరం పెడుతున్నాడని గ్రహించిన ఉషారాణి తనను పెళ్లి చేసుకోవాలని భువన్పై వత్తిడి చేసింది. ఈ విషయం స్టాఫ్నర్సు కృపారాణితో భువన్ చెప్పడంతో అందుకు ఉషారాణి అడ్డు తొలగించుకునేందుకు హత్య చేయాలని కృపారాణి సలహా ఇచ్చింది. పక్కా ప్లాన్తో హత్య తన ప్రేయసి ఉషారాణిని హత్య చేసేందుకు ప్రియుడు భువన్, స్టాఫ్నర్స్ కృపారాణితో కలిసి పక్కా ప్లాన్ చేశారు. ఉషారాణి స్పృహలో లేకుండా చేసి సులువుగా హత్య చేయవచ్చునని కృపారాణి సలహా ఇచ్చింది. ఇందులో భాగంగా రెండు స్ట్రిప్పుల నిద్రమాత్రలను కృపారాణి భువన్కు ఇచ్చింది. ఈ నిద్ర మాత్రలను డ్రింక్లో కలిపి ఉషారాణిచే తాగించాలని చెప్పింది. ఈ పథకం మేరకు ఈ నెల 5న సాయంత్రం ఉషారాణికి ఫోన్ చేసి 6వ తేదీన ఉదయం రాయిగఢ వెళదామని భువనేశ్వర్ పిలిచాడు. అప్పటికే తన తమ్ముడు వరసైన ఎం.సింగుపురం గ్రామానికి చెందిన సవిరిగాన తేజకు హత్య పధకం విషయాన్ని భువనేశ్వర్ తెలియజేశాడు. ఇందుకు తేజ ఓకే చెప్పి తన అన్నయ్యకు చెందిన ఎర్టిగా కారును తీసుకువచ్చాడు. భువనేశ్వర్ మాటలు నమ్మిన ఉషారాణి ఈ నెల 6న ఉదయం 9 గంటల సమయంలో బర్నసీతంపేట నుంచి బయలుదేరి డోలమడ గ్రామ సమీపానికి చేరుకుంది. అప్పటికే భువనేశ్వర్, తేజ కారుతో సిద్ధంగా ఉన్నారు. ఉషారాణిని కారులో ఎక్కించుకున్న వీరు దారిలో పల్పి ఆరెంజ్ డ్రింక్ కొనుగోలు చేసి ఆ డ్రింక్లో నిద్రమాత్రలు కలిపారు. వీరఘట్టం చేరుకునే సరికి ఉషారాణికి వాంతులు కావడంతో నిద్రమాత్రలు కలిపిని పల్పీ ఆరెంజ్ ఇచ్చారు. కొంచెం డ్రింక్ తాగిన ఉషారాణి సరే పదండి అనడంతో రాయిఘడ చేరుకున్నారు. అప్పటికే రాయిఘడ ఆలయం మూసివేసి ఉంది. దీంతో తిరుగు ప్రయాణం అయ్యారు. మధ్యలో భోజనం చేద్దామని భువనేశ్వర్ అడగగా తనకు ఆకలిగా లేదని ఉషారాణి తెలపడంతో కనీసం ఈ పల్పీ ఆరెంజ్ అయినా తాగు అని చెప్పి నిద్ర మాత్రలు కలిపిన డ్రింక్ మొత్తం ఉషారాణితో తాగించారు. అక్కడి నుండి పాలకొండ మండలం నవగాం సెంటర్కు చేరుకుని ఉషారాణి తెలివిలో ఉందా.. లేదా.. అని పరీక్షించారు. అప్పటికే ఆమె పలుకుతుండడంతో ఈ విషయాన్ని స్టాఫ్నర్సు కృపారాణికి తెలిపారు. తాను బూర్జ సెంటర్ వద్ద ఉన్నానని, మీరు ఉషారాణిని తీసుకుని ఇటువైపు రమ్మని కృపారాణి తెలిపింది. బూర్జ సెంటర్కు వచ్చిన కారులో కృపారాణి ఎక్కింది. అక్కడి నుంచి శ్రీకాకుళం వైపు వీరంతా కారులో ప్రయాణం చేశారు. కొల్లివలస చేరే సరికి ఉషారాణి పూర్తిగా స్పృహ కోల్పోయిందని గుర్తించారు. కొల్లివలస దాటిన తర్వాత నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం వైపు కారు తీసుకువెళ్లారు. అక్కడ భువనేశ్వర్, తేజలు ఉషారాణి ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఉషారాణి చనిపోయిందని కృపారాణి నిర్దారించిన తర్వాత మృతదేహాన్ని కారులో తీసుకువెళ్లి ఆమదాలవలస సమీపంలో ఉన్న జియో పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న చెరువులో ఉషారాణి మృతదేహాన్ని, ఆమె సెల్ఫోన్ను అక్కడ పడేసారు. ఇంతలో కారు యజమాని తనకు బేరం ఉందని కారు కావాలని ఫోన్ చేసి అడగడంతో శ్రీకాకుళంలో కారును అప్పగించేశారు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నారు. మృతదేహం అక్కడుంటే దొరికిపోతామని నర్సు కృపారాణి చెప్పింది. దీంతో భువనేశ్వర్, తేజ గ్రామంలో తెలిసిన వారి వద్ద కారు తీసుకుని అదే రోజు రాత్రి 1 గంట సమయంలో మృతదేహం వద్దకు వెళ్లారు. మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని పాలకొండ వైపు తీసుకువచ్చారు. దారిలోనే ఓ పెద్ద రాయిని సేకరించి కారులో పెట్టుకున్నారు. తొలుత పాలకొండలోని వెంకటరాయుని కోనేరులో పడేద్దామని అనుకున్నారు. అక్కడ జనసంచారం ఉండడంతో తుమరాడ సమీపంలో ఉన్న కామినాయుడు చెరువు వద్దకు వచ్చి మృతదేహం కాళ్లు చేతులు వెనక్కికట్టి, నడుముకు రాయికట్టి చెరువులో ఉషారాణి మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. పక్కా ప్లాన్తో ఉషారాణిని భువనేశ్వర్, కృపారాణి, తేజ హత్య చేశారు. ఒక్కరోజులోనే నిందితులు అరెస్టు ఉషారాణి కనిపించడం లేదని ఈ నెల 10న తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇంతలో తుమరాడ సమీపంలోని చెరువులో మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో ఆ మృతదేహం ఉషారాణిదేనని అందరూ గుర్తించారు. దీంతో డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో సీఐ ప్రసాదరావు, ఎస్ఐ డోల వెంకన్న ఉషారాణి కాల్డేటా ఆధారంగా వివరాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులను గుర్తించిన పోలీసులు శుక్రవారం సాయంత్రం కారులో వెళ్తున్న ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిన హత్యానేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ మాధవరెడ్డి వివరించారు. ఈ ముగ్గురుపై హత్యా నేరం నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేనును త్వరితగతిలో ఛేధించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. పక్కా ప్లాన్తో ప్రియురాలి హత్య తన స్నేహితుడు, మహిళా నర్సు సాయంతో యువతి హత్య 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ మాధవరెడ్డి -
బాల కార్మిక వ్యవస్థ అంతం అందరి బాధ్యత
● రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సూర్యనారాయణ రాజువిజయనగరం ఫోర్ట్: బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడం అందరి బాధ్యత అని ప్రభుత్వంతో పాటు అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వి.సూర్యనారాయణ రాజు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చదువుకునే వయసులో చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. చిన్న పిల్లలతో భిక్షాటన చేస్తూ కనపడితే చైల్డ్హెల్ప్ లైన్ 1098కు ఫోన్ చేయాలని తెలిపారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ చిన్న వయసులోనే పిల్లలను ఇటుక బట్టీల్లో, హోటల్స్, ఫ్యాక్టరీల్లో పెట్టడం వల్ల వారి శారీరక, మానసిక ఎదుగుదల దెబ్బతింటుందన్నారు. తల్లిదండ్రులు పేదరికం, నిస్సహాయత, సరైన అవగాహన లేకపోవడం దీనికి ప్రధాన కారణమన్నారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి కె.వి.బాలామణి, కార్మిక శాఖ ఉప కమిషనర్ ప్రసాదరావు, జెడ్పీ సీఈఓ నాగమణి, డీఈఓ మాణిక్యంనాయుడు, సీడబ్ల్యూసీ చైర్మన్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు. -
సర్వజన ఆస్పత్రిలో.. నిలిచిన కల్చర్ పరీక్షలు..!
విజయనగరం ఫోర్ట్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో బ్లడ్, యూరిన్ కల్చర్ పరీక్షలు కొద్ది రోజులుగా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇటీవల కాలంలో బ్లడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ల బారిన ఎక్కువ మంది పడుతున్నారు. వీరికి ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గదు. బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్న వారికి బ్లడ్ కల్చర్, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వారికి యూరిన్ కల్చర్ చేయాలి. కల్చర్ పరీక్షలో ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఏ యాంటి బయాటిక్ మందులు వాడాలో తెలుస్తుంది. ఆ మందులు వాడితే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అంతటి ప్రాధాన్యత గల కల్చర్ పరీక్షల విషయంలో సర్వజన ఆస్పత్రి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 20 రోజులుగా నిలిచిన కల్చర్ పరీక్షలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో గత 20 రోజులుగా యూరిన్, బ్లడ్ కల్చర్ పరీక్షలు నిలిచిపోయాయి. బోధనాస్పత్రి కావడంతో అన్ని వసతులు ఉంటాయని జిల్లా నలుమూలలు నుంచి అధిక సంఖ్యలో ఇక్కడకు రోగులు వస్తారు. జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా నుంచి కూడా రోగులు ఇక్కడకు వస్తారు. అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉంటాయని రోగులు ఇక్కడకు వస్తారు. ఏదైనా వైద్య పరికరం పని చేయకపోతే వాటిని సకాలంలో బాగు చేయించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రోగులు ప్రైవేటు ల్యాబ్లను ణాశ్రయించాల్సిన పరిస్థితి. ఘోషాస్పత్రి నుంచి కూడా బ్లడ్, యూరిన్ కల్చర్ పరీక్షల కోసం ఇక్కడకు శాంపిల్స్ పంపిస్తారు. ప్రస్తుతం పరీక్షలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. గత 20 రోజులుగా జరగని వైనం అవస్థలు పడుతున్న రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు బ్లడ్, యూరిన్ కల్చర్ పరీక్షలకు రూ.500 నుంచి రూ.800 వరకు వెచ్చింపు గంట్యాడ మండలానికి చెందిన అప్పలనాయడుకు జ్వరం రావడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు బ్లడ్ కల్చర్ పరీక్ష రాశారు. అది పట్టుకుని ఆస్పత్రిలోని మైక్రో బయాలజీ ల్యాబ్కు వెళ్లగా కల్చర్ పరీక్ష చేయడం లేదని చెప్పడంతో ప్రైవేటు ల్యాబ్లో రూ.700 పెట్టి చేయించాడు. విజయనగరం పట్టణానికి చెందిన గణేష్కు మూత్ర విసర్జన ఎక్కువ కావడంతో కొద్ది రోజులు క్రితం సర్వజన ఆస్పత్రికి వచ్చాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు యూరిన్ కల్చర్ పరీక్ష చేయమని చెప్పారు. మైక్రో బయాలజీ ల్యాబ్లో యూరిన్ పరీక్ష చేయాలని అడగ్గా యూరిన్ కల్చర్ చేయడం లేదని చెప్పడంతో ప్రైవేటు ల్యాబ్లో రూ.600 పెట్టి కల్చర్ పరీక్ష చేయించుకున్నాడు.ప్రైవేటు ల్యాబ్లకు.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కల్చర్ పరీక్షలు నిలిచిపోవడం వల్ల రోగులు ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి కల్చర్ పరీక్షలు చేయించుకుంటున్నారు. యూరిన్ కల్చర్ పరీక్షకు రూ.500 నుంచి రూ.600, బ్లడ్ కల్చర్కు రూ.700 నుంచి రూ.800 వరకు వెచ్చిస్తున్నారు. వాస్తవమే.. సర్వజన ఆస్పత్రిలో యూరిన్, బ్లడ్ కల్చర్ పరీక్షలు నిలిచిన మాట వాస్తవమే. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సమస్య వచ్చింది. త్వరలో సమస్య పరిష్కరించి యూరిన్, బ్లడ్ కల్చర్ పరీక్షలు అందుబాటులోకి తెస్తాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
సిబ్బంది సమస్యలు సత్వరమే పరిష్కారం : ఎస్పీ
పార్వతీపురం రూరల్: పోలీసు సిబ్బంది సంక్షేమానికి, వారి శాఖాపరమైన, ఆరోగ్య సమస్యల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తామని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం పోలీస్ వెల్ఫేర్(గ్రీవెన్స్ డే) నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పోలీస్ సిబ్బంది తమ సమస్యలను ఎస్పీకి స్వయంగా విన్నవించుకున్నారు. సిబ్బందితో విడివిడిగా సమావేశమైన ఎస్పీ వారి అర్జీల పూర్వాపరాలను పరిశీలించి సానుకూల చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కాగా, సిబ్బంది నుంచి ప్రధానంగా బదిలీలు, అనారోగ్య సమస్యలకు సబంధించిన విజ్ఞాపనలే ఎక్కువగా వచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో సీసీ సంతోష్కుమార్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తెర్లాం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడిన సంఘటన ఇది. దీనికి సంబంధించి ఎస్ఐ సాగర్బాబు శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఆమిటి గ్రామానికి చెందిన కరణం రామకృష్ణ, బి.గౌరవ్ అనే ఇద్దరు యువకులు గురువారం రాత్రి మండలంలోని గొలుగువలస–సతివాడ గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గురువారం ఉదయం ఆమిటికి చెందిన రామకృష్ణ, గౌరవ్లు మోటార్ సైకిల్పై వంగర మండలం కురుంపురం గ్రామంలో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. అక్కడ నుంచి గురువారం రాత్రి సొంత గ్రామమైన ఆమిటి మోటార్ సైకిల్పై వస్తుండగా తెర్లాం మండలం గొలుగువలస–సతివాడ గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించబోయి పొలాల్లోకి వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో వాహనం వచ్చి చికిత్స నిమిత్తం రాజాంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఇద్దరికి చికిత్స చేసి గౌరవ్కు తీవ్ర గాయాలు కావడంతో శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. రామకృష్ణ ప్రస్తుతం రాజాం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. రోడ్డు ప్రమాద విషయం తెలియగానే ఎస్ఐ సాగర్బాబు సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గాయపడిన యువకుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. మద్దాల వంశీపై పీడీ యాక్ట్ విజయనగరం క్రైమ్ : గంజాయి, ఇతర మత్తు పదార్ధాల అక్రమ రవాణా నిరోధక చట్టం క్రింద నిందితుడు మద్దాల వంశీ(24 )కి ఏడాది పాటు బెయిల్ లేకుండా జైలు శిక్ష విధించడం జరిగిందని ఎస్పీ దామోదర్ శుక్రవారం తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మరోసారి హెచ్చరించారు. 2 గంజాయి కేసుల్లో సుమారు 540 కిలోల గంజాయి తరలిస్తూ నిందితుడిగా అరెస్టు అయి ప్రస్తుతం సంవత్సర కాలం నిర్భంధించేందుకు సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. నిందితుడు మద్దాల వంశీపై ఇప్పటికే జిల్లాలో సస్పెక్ట్ షీట్ ఉందన్నారు. విజయనగరం జిల్లా, ఎస్.కోట మండలం, తెన్ను బోడ్డవర గ్రామానికి చెందిన మద్దాల వంశీపై పి.డి.యాక్ట్ (గంజాయి, ఇతర మత్తు పదార్ధాల అక్రమ రవాణా నిరోధక చట్టం) చట్టాన్ని ప్రయోగించామని ఎస్పీ తెలిపారు. వంశీ చెడు వ్యసనాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో, వ్యవస్థీకృత నేరస్తుడు శెట్టి ఉమా మహేశ్వరరావుతో కలిసి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడేవాడన్నారు. వంశీ కూడా వ్యవస్థీకృత నేరగాడిగా మారాడని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. వంశీ ప్రవర్తన సమాజానికి హానికరంగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తిగా మారాడని భావించి పి.డి.యాక్ట్ ప్రయోగించి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించామని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. -
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం
● ఆర్టీసీ ఎన్ఎంయూ జిల్లా శాఖ హెచ్చరిక ● రెండో రోజు కొనసాగిన గేట్ మీటింగ్ విజయనగరం అర్బన్: ఆర్టీసీ జోన్ పరిధిలో ఉన్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కమిటీ హెచ్చరించారు. జోనల్ కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని డిపోల కార్యాలయాల ఎదుట రెండో రోజు శుక్రవారం కూడా కార్మికులు ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. స్థానిక విజయనగరం డిపో ఎదుట నిర్వహించిన గేట్ మీటింగ్లో పలువురు మాట్లాడారు. గత ఆరు నెలలుగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి పలుమార్లు మెమోరాండం ఇచ్చినప్పటికీ సరైన స్పందన లేకపోవడం వల్లే తాము ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందన్నారు. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన సర్క్యులర్లను సైతం ఈ జోన్లో అమలు చేయకపోవడం విచారకరమన్నారు. సీ్త్ర శక్తి పథకంతో విపరీతమైన ఒత్తిడి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సీ్త్ర శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు. 50 మంది ఎక్కవలసిన బస్సులో 150 మంది వరకు ఎక్కుతున్నారని దీనికి తోడు టికెట్లు జారీ చేసే టిమ్లు సరిగా పని చేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మొత్తం 26 డిమాండ్లతో కూడిన నోటీసులు యాజమాన్యానికి అందించామని తెలిపారు. డిమాండ్లలో షెడ్యూళ్లను ‘మోటార్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్’ చట్టం ప్రకారం రూపొందించాలి. డిపోల మేనేజర్లు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను, ఇతర యూనియన్లకు అనుకూలంగా వ్యవహరించే విధానాలను విడనాడాలన్నారు. జిల్లా కార్యదర్శి పీజీరాఫెల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జోనల్ సహాయ కార్యదర్శి డీఎస్రావు, జోనల్ కమిటీ సభ్యులు బి.రామారావు, జిల్లా కమిటీ సభ్యులు ఎల్డీ ప్రసాద్, డిపో ముఖ్య కార్యదకర్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఒడిశాలో ఎకై ్సజ్ దాడులు
పార్వతీపురం రూరల్ : నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా ఏపీ ఎకై ్సజ్ అధికారులు పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో శుక్రవారం దాడులు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పార్వతీపురం ఏఈఎస్ ఎ.సంతోష్ ఆధ్వర్యంలో కోరాపుట్ జిల్లా బండుగం బ్లాక్ పరిధిలోని గ్రామాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. ఒడిశాలోని గుణుపూర్ పోలీసుల సహకారంతో పార్వతీపురం ఎకై ్సజ్, ఈఎస్టీఎఫ్, విజయనగరం ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. దాడుల్లో అక్రమ మద్యం తయారీకి నిల్వ ఉంచిన 4 వేల లీటర్ల బెల్లం ఊట (ఎఫ్జే వాష్), 1000 కిలోల నల్లబెల్లం, 100 కిలోల అమ్మోనియా, 50 లీటర్ల సారాను గుర్తించి ధ్వంసం చేశారు. సరిహద్దుల్లో నిఘా ముమ్మరం చేశామని, అక్రమ మద్యం రవాణా, తయారీపై దాడులు కొనసాగుతాయని ఏఈఎస్ సంతోష్ స్పష్టం చేశారు. 4 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం -
తప్పిన ప్రమాదం
గుమ్మలక్ష్మీపురం: మండల కేంద్రంలో ఆర్టిసీ బస్సుకు, అందు లోని ప్రయానికులకు ప్రమాదం తప్పింది. శుక్రవారం సాయంత్రం పార్వతీపురం నుంచి గుమ్మలక్ష్మీపురం వచ్చిన ఆర్టీసీ బస్సు యూనియన్ బ్యాంకు దగ్గరికి చేరుకోగా ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సుకు దారి ఇచ్చే క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి ముందరి టైరు దిగిపోయింది. దీంతో బస్సు ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ ఒరిగిన బస్సును నిలుపుదల చేయడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
పిడుగుపాటుకు 31 గొర్రెలు, మేకలు మృతి
వీరఘట్టం: మండలలలోని హుస్సేనుపురం పంచాయతీ పరిధిలోని నీలంపేట సమీపంలో పొలాల్లో శుక్రవారం సాయంత్రం పిడుగు పడడంతో అక్కడ ఉన్న 10 గొర్రెలు, 21 మేకలు మృతి చెందాయి. హుస్సేనుపురం గ్రామానికి చెందిన చిన్ని చిట్టిబాబు, గణపతి, దుర్గారావు పంట పొలంలో మందవేశారు. ఇంతలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇంతలో పెద్ద శబ్దంతో పిడుగు పడడంతో గొర్రెలు, మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు రూ.5 లక్షల నష్టం ఉంటుందని బాధితులు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. -
శరత్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
పార్వతీపురం : పార్వతీపురం మండలం వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షులు నంగిరెడ్డి శరత్ గుండెపోటుతో అకాల మరణం చెందడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శరత్ కుటుంబ సభ్యుల్ని ఫోన్లో పరామర్శించారు వైఎస్ జగన్. ఈ మేరకు శరత్ భార్య, తల్లితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. శరత్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంచితే.. రాజ్యలక్ష్మిపురంలో శరత్ కుటుంబాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు పరామర్శించారు. -
అధికారుల తీరుపై.. అధికార పార్టీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో పార్వతీపురం పరిధిలోని పెద్దకాన గెడ్డ కాలువ ప్రవాహ స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు నకిలీ పత్రాలతో ‘జిరాయితీ’ భూమిగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు యత్నించారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ రిజిస్ట్రేషన్ను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సబ్ రిజిస్ట్రార్ తొలుత నిలిపివేశారని ఎమ్మెల్యే తెలిపారు. అయితే, సదరు ప్రైవేటు వ్యక్తి కోసం రిజిస్ట్రేషన్ చేయాలంటూ జిల్లా డీఆర్వో జోక్యం చేసుకుని సబ్ రిజిస్ట్రార్కు మెమో జారీ చేయడం విస్మయం కలిగించిందని ఎమ్మెల్యే ఆరోపించారు. సమావేశానికి ముందే జిల్లా రిజిస్ట్రార్తో తాను ఫోన్లో మాట్లాడినట్లు ఆయన వెల్లడించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ను వెంటనే రద్దు చేయాలని, లేకుంటే సీఎం, ఇరిగేషన్ మంత్రి దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తానని ఎమ్మెల్యే విజయ్ చంద్ర మీడియా సమావేశంలో హెచ్చరించారు. సొంత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం గమనార్హం. -
కస్సుబుస్సు..!
సాక్షి, పార్వతీపురం మన్యం : ప్రశ్నించే గొంతు ఎప్పుడూ ఆగదని చెబుతు న్న పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్చంద్ర.. ప్రభు త్వ వ్యవస్థలోని లోపాలను రోజుకొకలా బయటపెడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ.. తమ ప్రభుత్వంలో భాగమైన అధికార యంత్రాంగాన్నే లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. మొన్న రెవెన్యూ అధికారులు.. ఆ తర్వాత కలెక్టరు, జేసీ, సబ్ కలెక్టరు.. నిన్న విద్యా శాఖ.. నేడు సబ్ రిజిస్ట్రార్.. ఇలా ఒక్కొక్కరిపైనా చిందులు తొక్కుతున్నారు. దీని వెనుక అంతిమ లక్ష్యం కలెక్టరు ప్రభాకరరెడ్డి. ఎమ్మెల్యే భాషలో చెప్పాలంటే.. ‘చిత్తూరు రెడ్డి’! ప్రశ్నించే గొంతు కంటే.. ఫ్రస్టేషన్నే ఆయనలో ఎక్కువగా కనిపిస్తోందని నలువైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మన దారికొస్తే.. అంతా రైట్! లేకుంటే రాంగ్!! అన్నట్లు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర వ్యవహార శైలి ఉంది. నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాల కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. చెరువులను, ప్రభుత్వ భూములను ఆక్రమించి దర్జాగా నిర్మాణాలు సాగిపోతున్నా యి. అక్రమ వ్యవహారాలు, ఇసుక దందాలు విపరీతంగా సాగుతున్నాయి. ఇందులో టీడీపీ నాయకుల హస్తం ఉందన్నది బహిరంగంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి పనికీ ఓ రేటు కట్టేసి, కమీషన్లతో దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంగన్వాడీ, ఫీల్డ్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు వంటి పోస్టులను అమ్మేసుకుంటున్నారని, ఈ వ్యవహారంలో, నియోజకవర్గ నేత ధన దాహానికి సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా బలైపోతున్నార ని సొంత పార్టీలోనే విమర్శలు లేకపోలేదు. తాము చెప్పిన పని చేయకపోయినా, చెప్పిన వారిపై వేటు వేయకపోయినా అధికారుల మీద కస్సుబుస్సుమంటున్నారు. పార్టీ శ్రేణులను రెచ్చ గొట్టి ధర్నాలు చేయిస్తున్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో చాలావరకు ఆక్రమణలున్నా.. కొన్నింటిపైనే యుద్ధం ప్రకటిస్తున్నారు. దీని వెనుక కూడా అడిగినంత కమీషన్ ఇవ్వకపోవడ మే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక ట్రాక్టర్లు అడ్డుకున్నందుకు, తమకు అనుకూలంగా భూములను ఆన్లైన్లో మార్చలేనందుకు రెవెన్యూ అధికారులపై చిందులు తొక్కారు. తాము అడిగిన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం లేదని కలెక్టరు, జేసీలనే టార్గెట్ చేశారు. బలిజిపే ట మండలం పెదపెంకిలో పనుల వివాదం ఇందుకు ఉదాహరణ. విద్యా శాఖలో తాము చెప్పిన వారికి పోస్టులు వేయలేదని, ఓ కాంట్రాక్టు విషయమై అడిగినంత కమీషన్ ఇవ్వలేదని ఆ శాఖ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా పార్వతీపురంలోని వెంకంపేట పంచా యతీ పరిధిలోని సర్వే నంబరు 127లో ఇరిగేషన్ ప్రాంతంగా చెబుతున్న ఓ స్థలం రిజిస్ట్రేషన్ వ్యవహారంపై ఎమ్మెల్యే విజయ్చంద్ర మీడియా సమావేశం పెట్టి మరీ, నిప్పులు చెరిగారు. మీడి యా ముందే జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లకు ఫోన్ చేసి.. వారి మనోభావాలకు, విధులకు భంగం కలిగించేలా వ్యవహరించారు. విద్యాశాఖలో అవినీతి విషయంలోనూ, వెంకంపేట స్థల రిజి స్ట్రేషన్ విషయంలోనూ కలెక్టర్ ప్రభాకరరెడ్డిని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా పావులు కదిపా రు. వాస్తవానికి ఈ స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో ఎమ్మెల్యేకు పెద్ద ఎత్తున ముడుపులు రిజిస్ట్రేషన్ చేసుకున్న గ్రంథి వాసు కుటుంబం అందించిన ట్లు సమాచారం. దీంతోపాటు, ఎమ్మెల్యే సొంత ఇంటి నిర్మాణానికి రూ.లక్షలు విలువ చేసే సిమెంట్, ఐరన్ ఉచితంగా అందించారని తెలుస్తోంది. అప్పటికీ ఎమ్మెల్యే వేధింపులు ఆపకపోవడం వల్లే న్యాయం కోసం కొద్ది రోజులుగా కలెక్టరు చుట్టూ తిరిగామని వారు చెబుతున్నారు. తన మాటను కాదని స్థలాన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయడంతో ఎమ్మె ల్యే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మీడియా సమావేశం పెట్టి మరీ, అధికారులపై చిందులు వేశారు. ఇదే సమయంలో వెంకంపేటలో వివాదానికి కారణమైన స్థలానికి సాక్షి సంతకం పెట్టింది కూడా ఎమ్మెల్యే విజయ్చంద్ర ముఖ్య అనుచరుడు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు జి.క్రాంతికుమార్ కావడం గమనార్హం. ఇక్కడే తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వంద్వ వైఖరి బయటపడిందని అధికారులు చెబుతున్నారు. -
● ఎన్నికల హామీలు గాలికి.. ● చంద్రబాబు నయవంచన పాలనపై జిల్లాలో వైఎస్సార్సీపీ ర్యాలీలు నేడు ● విజయవంతం చేయాలని శ్రేణులకు నాయకుల పిలుపు
సాక్షి, పార్వతీపురం మన్యం : ఎన్నికలకు ముందు గెలుపు కోసం హామీలు గుప్పించిన చంద్రబాబు.. రెండేళ్లలో వాటిని అమలు చేయక, ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. గత ఎన్నికల సమయంలో జిల్లాలో పర్యటించిన చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డూఅదుపు లేకుండా వాగ్దానాలు చేసేశారు. గెలిచాక వెన్ను చూపారు. మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను నిలువునా మోసగించారు. తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ, వెంగళరాయ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేశారు. కనీసం నిర్వహణ పనులకు కూడా నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చూపారు. పూర్ణపాడు–లాభేసు వంతెనంటూ ఆశ చూపించి ముఖం చాటేశారు. మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపిస్తామన్న హామీని అటకెక్కించారు. జిల్లాలో ఏనుగుల సమస్య పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటికీ నెరవేర్చుకోలేకపోయారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు తిలోదకాలిచ్చి, వేలాది మందిని లబ్ధికి దూరం చేశారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం తదితర పథకాల్లో భారీగా కోత విధించారు. మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పెన్షన్ వంటి హామీలను విస్మరించారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో వ్యవసాయం సంక్షోభం దిశగా సాగింది. రెండేళ్లలో అకాల వర్షాలు, గాలులకు జిల్లాలో వేలాది ఎకరాల్లో అరటి, మొక్కజొన్న, చెరకు, వరి, పత్తి, జీడి వంటి పంటలకు నష్టం వాటిల్లినా ఏ ఒక్కరికీ నష్ట పరిహారం అందించలేదు. అధికారుల నుంచి ప్రతిపాదనలైతే వెళ్తున్నాయి గానీ, 33 శాతం నిబంధన రైతులకు శరాఘాతంగా మారింది. సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవక, రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే బస్తా వద్ద రూ.500 నుంచి రూ.700 వరకు నష్టాలను చవిచూశారు. మొక్కజొన్న, పత్తి పంటలకు కొనుగోలు కేంద్రాలే తెరవడం లేదు. ఎరువులు, విత్తనాల కోసం రోడ్లెక్కాల్సి వచ్చింది. జిల్లాలో వైద్య, విద్యా రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. రూ.600 కోట్ల వ్యయంతో ప్రారంభించాల్సిన ప్రభుత్వ వైద్య కళాశాలను అంపశయ్యపై కూర్చొండబెట్టారు. గత ప్రభుత్వ హయాంలో 80 శాతానికిపైగా పూర్తయిన పార్వతీపురం, సీతంపేట ల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాలు.. ప్రభు త్వం మారాక అక్కడే ఆగిపోయాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మృగ్యమయ్యాయి. కురుపాంలో గిరిజన ఇంజినీరింగు కళాశాల పను లు సగంలోనే నిలిచిపోయాయి. రూ.153 కోట్ల అంచనా వ్యయంతో కళాశాల భవన నిర్మాణం ప్రారంభించగా.. సుమారు రూ.43 కోట్ల మేర పనులు అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల మధ్యలోనే నిర్మాణం నిలిచిపోయింది. ప్రభుత్వ బడుల్లో నాడు–నేడు పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ఆశ్రమ విద్యాలయాల్లో అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో రెండేళ్ల కాలంలోనే 15 మందికిపైగా విద్యార్థులు మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకున్న దాఖలాలూ లేవు. గిరిజన ప్రాంతాలకు రోడ్లు లేక డోలీ మోతలు తప్పడం లేదు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన రోడ్డుకే నేటికీ దిక్కులేదు. పల్లెల్లో, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. పార్వతీపురం, సాలూరు, పాలకొండ తదితర పట్టణాల్లో కుళాయిల ద్వారా నాలుగైదు రోజులకోసారి నీటి సరఫరా అవుతోంది. అది కూడా బురదనీరే దిక్కవుతోంది. చంద్రబాబు రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయిన నయవంచన పాలనను నిరసిస్తూ.. ప్రజల తరఫున వైఎస్సార్సీపీ కొద్ది రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజ లు తరలివచ్చి విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఉప ముఖ్యమంత్రులు, పీఏసీ సభ్యులు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు పిలుపునిచ్చారు. -
చీపురుపల్లిలో టీడీపీ రాజ్యాంగం అమలు
● ఆ సీటులో మీరు కూర్చోవద్దు.. ● తహసీల్దార్కు టీడీపీ నేతల హుకుం ● డీటీ కుర్చీలో కూర్చుంటున్న తహసీల్దార్ ● కలెక్టర్ ఉత్తర్వులు బేఖాతరు ● పోస్టింగ్ ఆర్డర్ పడి వారం గడుస్తున్నా.. ఇదే పరిస్థితి ● ఎమ్మెల్యే కళా నియోజకవర్గంలో తహసీల్దార్ దుస్థితి ● నిలిచిపోయిన రెవెన్యూ సేవలు చీపురుపల్లి: ‘తహసీల్దార్ కుర్చీలో మీరు కూర్చోవద్దు.. మీకు ఎవరు పోస్టింగ్ ఇచ్చారు... మేము వేరొకరికి పోస్టింగ్ ఇస్తాం.. మీరు అంతవరకు తహసీల్దార్ కుర్చీలో కూర్చోవద్దు... అంతే కాదు.. ఎక్కడికై నా వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండండి..’ ఇదీ ఎమ్మెల్యే కళా వెంకటరావు సొంత నియోజకవర్గ కేంద్రమైన చీపురుపల్లిలో టీడీపీ నాయకుల మార్క్ పాలన. ఇక్కడ కొత్తగా పదోన్నతి పొంది తహసీల్దార్ పోస్టింగ్ ఆర్డర్తో వచ్చిన సూర్యకాంతంకు టీడీపీ నేతలు పై విధంగా హుకుం జారీ చేశారు. ఇదేంటి ఇలా జరిగిందని తహసీల్దార్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదిస్తే మా వాళ్లు ఏం చెబితే అదే.. అనడంతో ఆమెకు అక్కడ కూడా చుక్కెదురైంది. దీంతో చేసేదేమీ లేక తహసీల్దార్గా స్వయాన కలెక్టర్ ఇచ్చిన పోస్టింగ్ ఆర్డర్ ఉన్నప్పటికీ డిప్యూటీ తహసీల్దార్ కుర్చీలోనే కూర్చుంటూ ఎలాంటి సంతకాలు చేయకుండా ఎక్కడ పోస్టింగ్ వేస్తారో తెలియక లోలోపల మదన పడుతూ వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. వారం క్రితమే పోస్టింగ్ జిల్లా వ్యాప్తంగా 11 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ ఈ నెల 4న కలెక్టర్ రాంసుందర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగానే చీపురుపల్లి డిప్యూటీ తహసీల్దార్కి తహసీల్దార్గా పదోన్నతి లభించింది. దీంతో అప్పటికే తహసీల్దార్గా ఉన్న ధర్మరాజు డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి లభించడంతో క్లియర్ వెకెన్సీగా ఉన్న చీపురుపల్లి తహసీల్దార్గా ఆమెను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. కలెక్టర్ ఆర్డర్ బేఖాతరు సాక్షాత్తూ కలెక్టర్ ఇచ్చిన పోస్టింగ్ ఆర్డర్కు గౌరవం లేదని రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినా ఎమ్మెల్యే చెబితే తప్ప అధికారులు కుర్చీలో కూర్చునే పరిస్థితి జిల్లాలో లేకుండా పోయిందని వాదన వినిపిస్తోంది. తహసీల్దార్ స్థాయి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పోస్టు పరిస్థితి ఇలా ఉంటే ఇక సాధారణ ఉద్యోగుల సంగతి ఏంటనే ప్రశ్న రెవెన్యూ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. తప్పని అవస్థలు ఇదిలా ఉంటే తహసీల్దార్గా పోస్టింగ్ ఆర్డర్తో వచ్చినప్పటికీ టీడీపీ నాయకులు ఆ కుర్చీలో కూర్చోవద్దని చెప్పడంతో జిల్లా అధికారులు సదరు తహసీల్దార్కు డిజిటల్ సిగ్నేచర్ అనుమతి కూడా ఇవ్వలేదు. దీంతో విద్యార్థుల కుల, ఆదాయ ధ్రువీకరణలు నుంచి ఇతర రెవెన్యూ పనులు అన్ని నిలిచిపోయినట్టు తెలుస్తోంది. తహసీల్దార్గా పదోన్నతి లభించడం, వెంటనే పని చేస్తున్న చోటే పోస్టింగ్ రావడంతో తహసీల్దార్ సూర్యకాంతం అదే రోజు సాయంత్రం వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. వెంటనే అధికార టీడీపీ నేతలను కలిసేందుకు వెళ్లారు. పాపం పూలబోకెలు, జీడిపప్పు ప్యాకెట్లు తీసుకు వెళ్లినప్పటికీ అక్కడి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. మీరు ఎందుకు వచ్చారు.. మాకు అవసరం లేదు. కుర్చీలో కూర్చోవద్దు అంటూ టీడీపీలో మూడు మండలాల్లో పదవులు అలంకరించిన ఓ నాయకుడు ఆమెకు తేగెసి చెప్పేశాడు. పదోన్నతి పొంది సంతోషంలో ఉన్న ఆమెకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడంతో ఏమి చేయాలో పాలుపోలేదు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు, ఎమ్మెల్యే కార్యాలయానికి చెప్పుకున్నప్పటికీ ఎలాంటి సపోర్టు లేకపోవడంతో వారం రోజులుగా డీటీ కుర్చీలోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఎన్నాళ్లీ సమగ్రశిక్ష..!
● సీఆర్ఎంటీల ఆవేదన ● ఉద్యోగ భద్రత కరువు ● రెగ్యులర్ చేయరు.. జీతాలు పెంపు లేదు గుమ్మలక్ష్మీపురం: వారంతా విద్యాభివృద్ధికి ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో శ్రమ దోపిడికి గురవుతున్నారు. ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యూటీ లేక అల్లాడుతున్నారు. వారే సమగ్ర శిక్ష విద్యా శాఖలో మండల విద్యా వనరుల కేంద్రం, స్కూల్ కాంప్లెక్స్లకు అనుబంధంగా పని చేస్తున్న సీఆర్ఎంటీలు. విద్యా శాఖలో భాగమైన వీరు మండల విద్యాశాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ ఎంల పర్యవేక్షణలో విధులు నిర్వర్తిస్తున్నారు. పాఠ శాల ప్రారంభ సమయానికి ముందు పాఠశాలలకు వెళ్లి పర్యవేక్షణ చేయడం, డ్రాపౌట్ పిల్లల్ని బడిలో చేర్పించి విద్యార్థుల శాతాన్ని పెంచడం, మధ్యాహ్న భోజన పథకం పరిశీలన, పాఠశాలలకు యూనిఫా మ్స్, పాఠ్యపుస్తకాల సరఫరా, ప్రభుత్వ పరంగా పాఠశాలల్లో అమలయ్యే వివిధ కార్యక్రమాలను అనుసంధానం చేస్తుండడం వీరి కర్తవ్యం. వీరంతా విధులు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నప్పటికీ.. వీరి సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరిస్తోంది. వీరికి న్యాయపరంగా కల్పించాల్సిన సదుపాయాలు కల్పించకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. 2011 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3318 మంది వరకూ అన్ని మండలాల్లోని విద్యా వనరుల కేంద్రానికి అనుసంధానంగా సీఆర్ఎంటీలు పని చేస్తున్నారు. వీరంతా కొన్నాళ్లుగా తమను రెగ్యులర్ చేయాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కల్పించాలని, గ్రాట్యూటీ ఇవ్వాలని కోరుతూనే ఉన్నారు. తాజాగా గత నెల 15న తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులంతా చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అయినా చంద్రబా బు ప్రభుత్వం స్పందించి, డిమాండ్లు పరిష్కరించ డం లేదు. ఈ ఉద్యోగాన్నే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న వీరిలో పలువురు అరవై ఏళ్లకు దగ్గర్లో ఉన్నారు. త్వరలో రిటైర్మెంట్ కానున్నారు. రిటైర్మెంట్ అయ్యాక ఎటువంటి బెనిఫిట్స్ లేకపోవడంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలోనన్న ఆందోళన వారిది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బేసిక్ పే స్కేల్ అమలు చేయాలి. టీఏ, డీఏ వర్తింపజేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగా లను క్రమబద్దీకరించే వరకు ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలి. –ఎన్.కాంతారావు, ఏపీ సీఆర్ఎంటీ హక్కుల సాధన సమితి కన్వీనర్ 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరు పడుతున్న ఇక్కట్లను గుర్తించి అధికారం చేపట్టిన కొద్ది నెలల్లోనే (2020 మార్చి), వీరెవరూ ఎటువంటి డిమాండ్లు, నిరసనలు చేపట్టకుండానే రూ.17,755లు వేతనంతో ఉన్న వీరికి రూ.23,500కు పెంపుదల చేస్తూ, అంటే రూ. 5,745లు పెంపుదల చేసి సీఆర్ఎంటీలను ఆదుకున్నారు. -
18 నాటికి ఏడీపీ, ఏబీపీ పనులు పూర్తి చేయాలి
పార్వతీపురం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీతి అయోగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం (ఏడీపీ), ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం (ఏబీపీ) కింద చేపట్టిన అభివృద్ధి పనులను ఈ నెల 18లోగా నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి పనులపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ఆయా ప్రాజెక్టుల వారీగా జరు గుతున్న పనుల స్థితిగతులను, సాధించిన ప్రగ తిని శాఖల వారీగా ఆరా తీశారు. జిల్లాలోని 10 పాఠశాలల్లో స్మార్ట్ ఐసీటీ ల్యాబ్ల ఏర్పాటు పనులు వేగవంతం కావాలని, ఎనిమిది పాఠ శాలల్లో జరుగుతున్న మరుగుదొడ్లు నిర్మాణ పనులను ఈ నెల 18 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పనులను త్వరితగతిన ప్రారంభించాలని, సాగునీటి పనుల కోసం తగిన నోట్ ఫైల్ ను సిద్ధం చేసి ఆమోదానికి పంపాలని ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్, సీపీఓ, పీఆర్, విద్యుత్, వ్యవసాయ శాఖ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. గరుగుబిల్లి: భూ రీ–సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని గిజబ గ్రామంలో జరుగుతున్న రీ–సర్వే పనులను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు చిన్న పొరపాట్లుకు కూడా తావు లేకుండా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రౌండ్ ట్రూతింగ్కు రెండు రోజుల ముందే రైతులకు నోటీసులు అందజేయాలని, ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు. ముందస్తు షెడ్యూల్ రూపొందించి రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించాలని తెలిపారు. ప్రతీ రోజు ప్రగతి వివరాలను అప్డేట్ చేయడంతో పాటు ఎఫ్పీఓఎల్ఆర్ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, నోషనల్ ఖాతాల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. తోటపల్లి రిజర్వాయ ర్ పరిధిలో సరిహద్దు మార్కింగ్ను వెంటనే చేపట్టి, రీ–సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. రైతుల ఫిర్యా దులను వెంటనే పరిష్కరించి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పని చేయాల ని అధికారులకు సూచించారు. ఇన్చార్జ్ జేసీ పవర్ స్వప్నిల్, తహసీల్దార్ బాల, సర్వేయర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం : వైఎస్సార్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా విభాగం సంయుక్త కార్యదర్శిగా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రౌతు ధావన్కుమార్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియామకం చేపట్టినట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. -
15న సీతంపేటలో యోగాంధ్ర
పార్వతీపురం: సీతంపేటలోని ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్లో ఈ నెల 15న ఉదయం ఆరు గంటలకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్టు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి గురువారం తెలిపారు. అదే రోజు ఉదయం 10 గంటల నుంచి సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పార్వతీపురం రెవెన్యూ డివిజన్ సమస్యలను పార్వతీపురంలోని రెవెన్యూ క్లినిక్లో అర్జీలు అందజేయవచ్చునని తెలిపారు. పాలకొండ డివిజన్కు సంబంధించిన రెవెన్యూ క్లినిక్ సీతంపేటలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. జూన్ 22 నుంచి పీజీఆర్ఎస్ కార్యక్రమం యధావిధిగా కలెక్టర్ కార్యాలయంలోనే నిర్వహిస్తామని, ప్రజలు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు. -
యువతి దారుణ హత్య.. కాళ్లు, చేతులు కట్టి చెరువులో పడేశారు!
ప్రశాంతతకు మారుపేరైన పాలకొండలో ఓ గిరిజన యువతి అనుమానాస్పద మృతి ఈ ప్రాంత వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఓ గిరిజన యువతిని అత్యంత కిరాతకంగా కాళ్లు, చేతులు వెనక్కి విరిచికట్టి చెరువులో పడేసిన ఘటన బుధవారం సాయంత్రం వెలుగు చూడటంతో సర్వత్రా భయాందోళనలు నెలకున్నాయి. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు అందించిన వివరాలు.. పాలకొండ మండలం తుమరాడ వయా చింతాడ గ్రామం మధ్య గల చెరువులో యువతి మృతదేహం తేలుతున్నట్లు పోలీసులకు బుధవారం సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. కాళ్లు, చేతులు వెనక్కి విరిచికట్టి చెరువులో పడేసినట్లు గుర్తించారు. అప్పటికే మండల పరిధిలో బర్నసీతంపేట గ్రామానికి చెందిన బిడ్డిక ఉషారాణి (32) కనిపించటం లేదని ఆమె తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 6వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన తమ కుమార్తె తిరిగి ఇంటికి చేరకపోవటంతో తల్లిదండ్రులు చిన్నారావు, కామమ్మ పోలీసులకు బుధవారం ఉదయం తెలియజేశారు. చెరువులో యువతి మృతదేహాం ఉండటంతో పోలీసులు చిన్నారావుకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా నీటిలో నాని రూపు కోల్పోవటంతో దుస్తుల ఆధారంగా మృతురాలు తమ కుమార్తె అని నిర్ధారించారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలనే తపనతో బీఈడీ పూర్తి చేసిన కుమార్తె ఇలా ఘోరమైన స్థితిలో శవంగా మారటంతో మృతురాలి తల్లిదండ్రులు, అన్నదమ్ములు సతీష్ సురేష్, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఆస్పత్రికి తరలించారు. వలంటీరుగా సేవలు గత ప్రభుత్వంలో గ్రామ వలంటీర్గా సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్న ఉషారాణి ఇలా చెరువులో దారుణమైన స్థితిలో శవమై కనిపించటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలె శ్రీకాకుళంలో బీఈడీ పూర్తి చేసిన ఉషారాణి ఈ నెల 6వ తేదీన చదువుకు సంబంధించి అప్లికేషన్ పెట్టేందుకు ఇంట్లో చెప్పి పాలకొండ వెళ్లాలని తండ్రి వద్ద రూ.500 తీసుకుని వెళ్లినట్లు బంధువులు చెబుతున్నారు. తిరిగి ఇంటికి రాకపోవటంతో స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉంటుందని భావించామన్నారు. శనివారం రాత్రి నుంచి తన సెల్ కూడా అందుబాట్లోకి రాలేదన్నారు. ఘటనా స్థలానికి, మృతురాలి స్వగ్రామానికి దాదాపు 15 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఉషారాణి మృతి తీరు అనుమానాలకు తావిస్తుంది. ఏం జరిగిందోగాని కాళ్లు చేతులు వెనక్కి విరిచి, తాళ్లతో కట్టి చెరువులోకి తోసేయటం వెనుక కారణాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇది ఒక్కరి పనేనా.. లేక ఎంతమంది ఉన్నారు... ఈ ఘటనకు కారణమేమన్న కోణాల్లో దర్యాప్తు చేపడతామని ఎస్ఐ డోల వెంకన్న తెలిపారు. మహిళలకు రక్షణ కరువు కూటమి అధికారం చేపట్టిన తరువాత మహిళలకు రక్షణకు కరువైందని మాజీ ఎమ్మెల్యే విశ్వాçసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు, దాడులు జరుగుతున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గిరిజన యువతి అత్యంత దారుణంగా హత్యకు గురవడం అమానుషం అన్నారు. ఈ ప్రభుత్వం మహిళలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించకపోవటంతో ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతున్నాయన్నారు. ఉషారాణిని హత్య చేసిన వారిని త్వరితగతిన గుర్తించాలన్నారు. వారిని కఠినంగా శిక్షించి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులతో పాటు గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. భవిష్యత్లో ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలని కోరారు.పాలకొండ రూరల్/పాలకొండ: -
ఉద్యోగాల పేరుతో టోకరా
బొండపల్లి: రైల్వేలోను, షిప్యార్డులోను ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి తన నుంచి రూ.8 లక్షలు నగదు తీసుకున్న వ్యక్తుల నుంచి తన నగదు ఇప్పించాలని కోరుతూ కనిమెరక గ్రామానికి చెందిన మలిసెట్టి మహేశ్వర్రావు స్థానిక ఎస్సై యు.మహేష్కు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గజపతినగరానికి చెందిన పోట్టా వీర్రాజు, పోట్టా శ్రీనివాసరావుతో పాటు, పోట్టా గుణరాజులు తమ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి తన వద్ద నుంచి దఫా ధఫాలుగా రూ.8 లక్షలు తీసుకున్నారని ,ఉద్యోగాలు ఇప్పించకపోగా, డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులను ఆరశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఽబాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మరిపల్లి ప్రాంతంలో ఏనుగుల సంచారంసాలూరు రూరల్: మండలంలోని మరిపల్లి, రేగాపువలస గ్రామాల మధ్యలో ఏనుగులు సంచరిస్తున్నాయి. బుధవారం మరిపల్లి, గంగన్న దొర వలస గ్రామాల మధ్యలో ఏనుగుల గుంపు రోడ్డు పైకి వచ్చింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా వచ్చిపోయే వారంతా కొంత సమయం ఆగిపోయారు. అలాగే పంటపొలాల్లో వ్యవసాయ బోర్లు, డ్రిప్ పైపులను ఏనుగులు ధ్వంసం చేసినట్లు రైతులు తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యంపూసపాటిరేగ : భోగాపురం మండలం చేపలకంచేరు తుఫాన్ బిల్డింగ్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నట్లు భోగాపురం సీఐ కూన దుర్గాప్రసాద్ బుధవారం తెలియజేశారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. ఎయిర్పోర్టులో పనుల నిమిత్తం వచ్చి వడగాడ్పుల కారణంగా తట్టుకోలేక గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ఎరుపురంగు బనియన్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు భోగాపురం పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ఒడిశా విలేకరులపై మంత్రి ఆగ్రహం
సాలూరురూరల్: ఆంధ్రా ఒడిశా వివాదాస్పద కొఠియా గ్రామాల్లో బుధవారం జరిగిన రహదారి ప్రారంభ సమావేశంలో మంత్రి సంధ్యారాణి ఒడిశా నుంచి వచ్చి కవరేజ్ చేస్తున్న పత్రికా విలేకరులపై విరుచుకు పడ్డారు. వివాదాస్పద గ్రామాల్లో ఒకటైన నేరెళ్ల వలసలో నిర్వహించిన బహిరంగ సభకు గంజాయి భద్ర, సారిక తదితర పంచాయతీల్లోని గిరిజనులను తీసుకువచ్చారు. వివాదాస్పద గ్రామాలు కావడంతో ఒడిశాకు సంబంధించిన విలేకరులు కూడా ఈ సభకు హాజరయ్యారు. వారు విధి నిర్వహణలో భాగంగా కార్యక్రమాన్ని ఫొటోలు వీడియోలు తీసుకుంటున్న సమయంలో వేదికపై కూర్చున్న మంత్రి సంధ్యారాణి మీరు ఎవరు? ఎందుకు వచ్చారు? ఎందుకు ఫొటోలు తీస్తున్నారని ప్రశ్నించారు. దీంతో పత్రికా స్వేచ్ఛను తుంగలో తొక్కుతారా? అంటూ ఒడిశా పత్రికా విలేకరులు అంతా అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు మంత్రి సంధ్యారాణి ఒడిశా విలేకరులను ప్రశ్నించిన తీరును మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తప్పుబట్టారు. వివాదాస్పద గ్రామాల విషయంలో తొలి తప్పు తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. ప్రశాంతంగా ఉన్న గిరిజన గ్రామాల్లో జన్మ భూమి కార్యక్రమాన్ని పెట్టి ఒడిశా ప్రభుత్వంతో గొడవకు కారణమయ్యారన్నారు. అప్పటినుంచి ఏ ఒక్క టీడీపీ నాయకుడు కూడా వివాదాస్పద గ్రామాల్లోకి వెళ్లింది లేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాలి నడకన వివాదాస్పద గ్రామాలు తిరిగి అక్కడికి చేరుకున్న విషయం గుర్తు చేశారు. ఆర్టికల్ 19 ప్రకారం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించకూడదన్న విషయం మంత్రి సంధ్యారాణి తెలుసుకోవాలని హితవు పలికారు. -
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
సంతకవిటి: మండలంలోని మండాకురిటి గ్రామంలో బుధవారం విజిలెన్స్ ఎస్సై రామారావు తన సిబ్బంది, మండల వ్యవసాయాధికారితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా విత్తనాలు అమ్ముతున్న ఓ వ్యక్తి వద్ద రూ.5.33 లక్షల విలువచేసే అమూల్య గోల్డ్ వరి విత్తనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదే గ్రామంలో మరో ప్రైవేట్ ఎరువుల దుకాణంలో దాడులు చేసి 1334 యూరియా బస్తాలు ఉండాల్సిన చోట 1260 బస్తాలు మాత్రమే ఉండడంతో 74 బస్తాలు తేడా రాగా ఆ షాప్లోని 1260 బస్తాలు స్వాధీనం చేసుకుని 6ఎ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
మూడు గడ్డివాములు దగ్ధం
తెర్లాం: మండలంలోని గొలుగువలస గ్రామంలో మంగళవారం రాత్రి మూడు గడ్డివాములు ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయని వీఆర్ఓ ఎల్.గణపతి బుధవారం తెలిపారు. గ్రామానికి చెందిన పల్ల శ్రీరాములు, సాకేటి సూర్యనారాయణ, సాకేటి జనార్దన అనే ముగ్గురు రైతులకు సంబంధించిన గడ్డివాములు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగిందా? మరేవిధంగా జరిగిందా? అనేది తెలియడంలేదని బాధిత రైతులు అంటున్నారు. ఏడాది పొడవునా పశువులకు గ్రాసంగా ఉపయోగించేందుకు సిద్ధం చేసుకున్న గడ్డివాములు కాలిపోవడంతో బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిడుగుపాటుతో పాడి ఆవు మృతినెల్లిమర్ల రూరల్: మండలంలోని గొర్లిపేట గ్రామంలో పిడుగుపాటుకు ఓ పాడి ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన గొర్లి ఎల్లంనాయుడు తన పాడి ఆవును కళ్లంలోని చెట్టు కింద కట్టి ఉంచగా బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడింది. దీంతో చెట్టు కింద ఉన్న ఆవు ఒక్కసారిగా కుప్పకూలి మృత్యువాత పడగా రైతు కు టుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గరివిడి మండలంలో మరో ఆవు.. చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని నీలాద్రిపురం గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో గ్రామంలోని నాకమ్మ చెరువు సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభంపై పిడుగు పడడంతో విద్యుత్ వైర్లు తెగి పక్కనే మేత మేస్తున్న ఆవుపై పడ్డాయి. ఈ ఘటనలో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతి చెందిన ఆవు ఆరు నెలలు చూడితో ఉందని, ఆవు విలువ రూ.80వేల వరకు ఉంటుందని బాధితురాలు చందక బారతి తెలిపింది. ఆవు మృతితో తమ కుటుంబానికి తీవ్ర ఆర్థిక నష్టం జరిగిందని, జీవనాధారంగా ఉన్న పాడి సంపదను కోల్పోయామని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. ప్రభుత్వం,పశు సంవర్థకశాఖ అధికారులు స్పందించి నష్టపరిహారం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.ఎండ వేడికి 200 కోళ్లు మృతిగుర్ల: మండలంలోని దమరసింగి గ్రామంలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదర్కొంటున్నారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అంతరాయం, భరించలేని ఎండ కారణంగా గ్రామంలో 200 కోళ్లు మృతి చెందాయని ఫారం నిర్వాహకుడు సంచాన ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ కోళ్ల మరణంతో ఆర్థిక నష్టం జరిగిందని వాపోయాడు. ఉపాధి హామీ పనులు ముగించుకుని మండుటెండల్లో ఇంటికి చేరుకుంటున్న కూలీలు విద్యుత్ కోతల కారణంగా తీవ్ర అసౌకార్యానికి గురవుతున్నారు. సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. యువతి అదృశ్యంసంతకవిటి: మండలంలోని మల్లయ్యపేట గ్రామానికి చెందిన యువతి(22) మతి స్థిమితం లేక మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఇదివరకు రెండు సార్లు అదృశ్యం కావడం వేరే చోట ఆచూకీ లభ్యమైందని, అనంతరం హైదరాబాద్లోని సిటీ నర్సింగ్ హోమ్లో జాయిన్ చేశామని, 15 రోజుల క్రితం ఇంటికి వచ్చి మళ్లీ ఎటో వెళ్లి పోయిందని తండ్రి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
అమ్మ ఒడి నుంచే అనంతలోకాలకు
● రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం ● తల్లికి గాయాలుశృంగవరపుకోట: పేగుతెంచి జన్మనిచ్చిన తల్లి తన చిన్నారి బిడ్డను తాను చూస్తుండగానే కోల్పోవడంతో ఆ తల్లి పేగు తల్లడిల్లిపోయింది. ఈ ప్రమాద ఘటన ఆ తల్లి కడుపు తరుక్కుపోయేలా చేసింది. అప్పటి వరకూ ఆడిపాడిన చిన్నారిని తల్లిదండ్రులు చూస్తుండగానే మృత్యువు తన ఒడిలోకి లాక్కుపోయింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట మండలంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన తోనంగి రామదాసు–కుసుమలు తమ రెండవ కుమార్తె భారతిని విశాఖ జిల్లా, పద్మనాభం మండలం, చిన్నాపురం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి కడుభట్ల రాంబాబుకు ఇచ్చి కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు. ఇటీవల రాంబాబు ఆర్మీ నుంచి రిటైర్ అయి గ్రామంలోనే ఉంటున్నారు. వారికి ఐదేళ్ల రిత్విక్రోషన్, పదకొండు నెలల చిన్నారి కౌశిక్లు ఉన్నారు. రాంబాబు భార్యాబిడ్డలతో ఆదివారం కృష్ణాపురంలో గ్రామదేవత మొక్కు తీర్చుకునేందుకు అత్తారింటికి వచ్చారు. గ్రామంలో మొక్కులు తీర్చుకున్న దంపతులు గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో సీతంపేట గ్రామంలోని బండెమ్మ అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి పల్సర్బైక్పై పిల్లలతో బయల్దేరారు. ఆలయానికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న రిగ్బోరు లారీని తప్పించే క్రమంలో బైక్ రోడ్డు పక్క ఉన్న చిన్న గుంతలో పడి అదుపుతప్పి స్కిడ్ అయ్యింది. దీంతో బైక్పై వెనుక చిన్నకొడుకు కౌశిక్ను ఎత్తుకుని కూర్చున్న భారతి కింద పడిపోయింది. ఆమె చేతిలో నుంచి చిన్నారి కౌశిక్ తూలిపోయాడు. భారతి కుడి చేయి లారీ టైర్ కింద పడి ఫ్రాక్చర్ అయ్యింది. కింద పడి స్వల్ప గాయాలపాలైన కౌశిక్ స్పృహ కోల్పోయాడు. దీంతో హుటాహుటిన స్థానికుల సహాయంతో తల్లీ బిడ్డలను ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే చిన్నారి కౌశిక్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భారతి చేతికి స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించారు. కాగా చిన్నారి కౌశిక్ మరణం గ్రామంలో విషాదం నింపింది. తమ బిడ్డ చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనతో ఆస్పత్రి వాతావరణం గంభీరంగా మారిపోయింది. ముక్చుపచ్చలారని ముద్దులొలికే చిన్నారి మృతదేహాన్ని పట్టుకుని కుటుంబసభ్యులు ఏడుస్తున్న తీరు చూపరుల కళ్లు చెమర్చేలా చేసింది. -
● కాళ్లు.. చేతులు వెనక్కి విరిచికట్టి చెరువులో పడేసిన వైనం ● గత ప్రభుత్వంలో వలంటీర్గా సేవలు ● కూటమి సర్కారులో మహిళలకు రక్షణ కరువు ● దోషులను కఠినంగా శిక్షించాలన్న విక్రాంత్, కళావతి
తుమరాడ వయా చింతాడ గ్రామాల మధ్య చెరువులో గుర్తు పట్టలేని స్థితిలో ఉషారాణి మృతదేహం పాలకొండ రూరల్/పాలకొండ: ప్రశాంతతకు మారుపేరైన పాలకొండలో ఓ గిరిజన యువతి అనుమానాస్పద మృతి ఈ ప్రాంత వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఓ గిరిజన యువతిని అత్యంత కిరాతకంగా కాళ్లు, చేతులు వెనక్కి విరిచికట్టి చెరువులో పడేసిన ఘటన బుధవారం సాయంత్రం వెలుగు చూడటంతో సర్వత్రా భయాందోళనలు నెలకున్నాయి. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు అందించిన వివరాలు.. పాలకొండ మండలం తుమరాడ వయా చింతాడ గ్రామం మధ్య గల చెరువులో యువతి మృతదేహం తేలుతున్నట్లు పోలీసులకు బుధవారం సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. కాళ్లు, చేతులు వెనక్కి విరిచికట్టి చెరువులో పడేసినట్లు గుర్తించారు. అప్పటికే మండల పరిధిలో బర్నసీతంపేట గ్రామానికి చెందిన బిడ్డిక ఉషారాణి (32) కనిపించటం లేదని ఆమె తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 6వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన తమ కుమార్తె తిరిగి ఇంటికి చేరకపోవటంతో తల్లిదండ్రులు చిన్నారావు, కామమ్మ పోలీసులకు బుధవారం ఉదయం తెలియజేశారు. చెరువులో యువతి మృతదేహాం ఉండటంతో పోలీసులు చిన్నారావుకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా నీటిలో నాని రూపు కోల్పోవటంతో దుస్తుల ఆధారంగా మృతురాలు తమ కుమార్తె అని నిర్ధారించారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలనే తపనతో బీఈడీ పూర్తి చేసిన కుమార్తె ఇలా ఘోరమైన స్థితిలో శవంగా మారటంతో మృతురాలి తల్లిదండ్రులు, అన్నదమ్ములు సతీష్, సురేష్, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఆస్పత్రికి తరలించారు. వలంటీరుగా సేవలు గత ప్రభుత్వంలో గ్రామ వలంటీర్గా సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్న ఉషారాణి ఇలా చెరువులో దారుణమైన స్థితిలో శవమై కనిపించటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలె శ్రీకాకుళంలో బీఈడీ పూర్తి చేసిన ఉషారాణి ఈ నెల 6వ తేదీన చదువుకు సంబంధించి అప్లికేషన్ పెట్టేందుకు ఇంట్లో చెప్పి పాలకొండ వెళ్లాలని తండ్రి వద్ద రూ.500 తీసుకుని వెళ్లినట్లు బంధువులు చెబుతున్నారు. తిరిగి ఇంటికి రాకపోవటంతో స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉంటుందని భావించామన్నారు. శనివారం రాత్రి నుంచి తన సెల్ కూడా అందుబాట్లోకి రాలేదన్నారు. ఘటనా స్థలానికి, మృతురాలి స్వగ్రామానికి దాదాపు 15 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఉషారాణి మృతి తీరు అనుమానాలకు తావిస్తుంది. ఏం జరిగిందోగాని కాళ్లు చేతులు వెనక్కి విరిచి, తాళ్లతో కట్టి చెరువులోకి తోసేయటం వెనుక కారణాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇది ఒక్కరి పనేనా.. లేక ఎంతమంది ఉన్నారు... ఈ ఘటనకు కారణమేమన్న కోణాల్లో దర్యాప్తు చేపడతామని ఎస్ఐ డోల వెంకన్న తెలిపారు. కూటమి అధికారం చేపట్టిన తరువాత మహిళలకు రక్షణకు కరువైందని మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు, దాడులు జరుగుతున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గిరిజన యువతి అత్యంత దారుణంగా హత్యకు గురవడం అమానుషం అన్నారు. ఈ ప్రభుత్వం మహిళలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించకపోవటంతో ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతున్నాయన్నారు. ఉషారాణిని హత్య చేసిన వారిని త్వరితగతిన గుర్తించాలన్నారు. వారిని కఠినంగా శిక్షించి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులతో పాటు గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. భవిష్యత్లో ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. -
అన్నీ ఉంటేనే తల్లికి వందనం..!
● నిబంధనలు వర్తిస్తాయి ● గత ఏడాది అర్హత ఉన్నా పలువురికి లబ్ధి సున్నాసాంకేతిక సమస్య పేరిటమాది మధ్య తరగతి కుటుంబం. నేను రోజువారీ పనులు చేసి కుటుంబాన్ని పోషించడంతో పాటు నా బిడ్డ తనుశ్రీని చదివిస్తున్నాను. అర్హత ఉన్నా గత ఏడాది పథకం వర్తించలేదు. నా బిడ్డకు తల్లి పేరు మారడంతో వారి ఆస్తులు మా అకౌంట్కు లింక్ అయ్యాయి. ఇది సాంకేతిక సమస్య. అప్పట్లో అన్నీ సరిచేయించాను. సచివాలయంలో నగదు జమ చేయనున్న అర్హుల జాబితాలో మా పేర్లు వచ్చాయి. అయినా నగదు జమకాలేదు. దీంతో ఈ ఏడాది పరిస్థితిని ముందుగానే సరిచేసుకునేందుకు క్రమం తప్పకుండా ఉపాధ్యాయులను సంప్రదిస్తున్నాను. బి.లక్ష్ముంనాయుడు, విద్యార్థిని తండ్రి, పాలకొండ మండలంపాలకొండ రూరల్: అన్నీ ఉన్నా అర్హుల నోట్లో శని అన్నట్లుంది సర్కారు తీరు. అన్నివర్గాల పిల్లల తల్లిదడ్రులు వారి బిడ్డల చదువులకు ఆర్థిక భారం అడ్డుకాకూడదని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘అమ్మ ఒడి’ పేరిట బృహత్తర పథకాన్ని రూపొందించారు. నాడు వలంటీర్ల వ్యవస్థ ఇంటింటి సర్వే చేపట్టి చదువుతున్న పిల్లను గుర్తించి, వారికి సంబంధించిన వివరాలను సచివాలయాల ద్వారా నమోదు చేయించారు. అప్పట్లో అర్హత ఉన్న ఏఒక్క తల్లి ఈ పథకాన్ని కోల్పోకుండా జగన్ ప్రభుత్వం పారదర్శకంగా చర్యలు చేపట్టింది. ఆపై అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు ఈ పథకం పేరు మార్చింది. ఇంట్లో ఎంత బిడ్డలు చదువుకుంటే అంతమందికి రూ.15వేలు అందిస్తామంది. అధికారం చేపట్టిన ఏడాది పథకం ఎగ్గొట్టిన బాబు ప్రభుత్వం గత ఏడాది అర్హత ఉన్నా వందల సంఖ్యలో తల్లులకు నగదు జమచేయలేదు. యంత్రాంగం చేసిన తప్పులకు తల్లితండ్రులనే బాధ్యులుగా చేసి లబ్ధికి దూరం చేశారు. ఈ ఏడాది మళ్లీ పథక వర్తింపునకు నిబంధనలు వర్తిస్తాయని..ప్రభుత్వం చూపిస్తున్న అన్ని రూల్స్ అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తోంది. దీంతో అర్హత ఉండి లబ్ధి కోల్పోయిన అర్హులు ఈ ఏడాదైనా తమకు న్యాయం జరుగుతుందా? లేదా? అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ ఉండాల్సిందే.. ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే తల్లికి వందనం పథకం వర్తింపచేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో అర్హుల జాబితా ప్రదర్శించిన వెంటనే అర్హులు సచివాలయ సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది. మై ఆధార్ సెక్షన్లోకి వెళ్లి ఆధార్ సర్వీసెస్లో చెక్ ఆధార్ బ్యాంక్ లింకేజీ స్టేషన్ ఎంపిక చేయాలి. ముఖ్యంగా తల్లి, లేదా విద్యార్థి ఆధార్ నంబర్ను ఎంటర్ చేయాలి. ఆపై సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆధార్కు లింక్ అయిన సెల్ఫోన్కు మెసేజ్ వస్తుంది. తద్వారా మీ ఆధార్ ఏ బ్యాంక్ ఖాతాకు అనుసంధానమై ఉందో తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో అర్హులు తమ బ్యాంక్ ఖాతా ఏశాఖ పరిధిలో ఉందో తెలుసుకుని ఖాతా ప్రస్తుతం మనుగడలో ఉందో లేదో సరిచూసుకోవాలి. సమస్యలు గుర్తిస్తే అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో బ్యాంక్కు వెళ్లి అప్డేట్ చేయించాలి. ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, సెల్ నంబర్ అనుసంధానం ఒకేలా ఉండేలా సరి చేయించాలి. లేకుంటే గత అనుభవాలను మళ్లీ చవిచూడాల్సి ఉంటుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కు మీ ఖాతా వివరాలు అనుసంధానమైన వెంటనే మీ సెల్ఫోన్కు లబ్ధికి సంబంధించిన సమాచారం వస్తుందని గుర్తించాలి.నాడు అర్హతే ప్రామాణికంగా.. నాడు జగనన్న హయాంలో తల్లులకు ఎటువంటి జంఝాటం లేకుండా అర్హతే ప్రామాణికంగా తల్లుల ఖాతాలకు చెప్పిన సమయానికి నగదు జమ అయ్యేందని లబ్ధి పొందిన వారు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో వలంటీర్ల వ్యవస్థ, సచివాలయ అధికారులు సమన్వయంతో విద్యాశాఖ పర్యవేక్షణలో తల్లులకు నగదు అందింది. నేడు ఈ పరిస్థితి లేదు. ముఖ్యంగా గ్రామాల్లో అవగాహన లేక అర్హత ఉన్నా సమస్యలు తప్పడం లేదు. దీనిని అదిగమించే ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో అనేక మంది అవస్థలు పడుతున్నారు. దీంతో గత అనుభవాలను గుర్తు చే సుకుంటున్నారు. నాడు అర్హత ఉన్నా లబ్ధి కోల్పోయిన తల్లులకు నేటికీ తమకు న్యాయం జరగలేదని వాపోతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాదైనా అర్హుల జాబితాల్లో తామ పిల్లలు ఉండాలని అన్నీతామై ఏ యాప్లో ఏం చెక్ చేయమన్నా తక్షణమే స్పందిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారిని, పాఠశాలల యాజమాన్యాలను, ఉపాధ్యాయులను సంప్రదించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే విషయమై విద్యాశాఖ అధికారులు ఏమంటున్నారంటే ఇప్పటికే ఉపాధ్యాయులు అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. గత అనుభవాలను దష్టిలో పెట్టుకుని ఒకటి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల తల్లిడండ్రులకు ముందస్తు సమాచారం అందిస్తున్నామంటున్నారు. జిల్లాలో పరిస్థితి.. పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 1,507 పాఠశాలల్లో ఈ ఏడాది లక్షా 30వేల మంది బోధన పొందుతున్నారు. ఇదే క్రమంలో జూనియర్ కళాశాలలు 30 ఉండగా వాటిలో 19వేల మంది అభ్యసిస్తున్నారు. మొత్తంగా జిల్లా పరిధిలో లక్షా 49వేల మంది ఒకటి నుంచి ఇంటర్ మధ్య చదువుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. గత ఏడాది జిల్లా పరిధిలో లక్షా 22వేల మందికి పథకం వర్తింపజేశామని, 8వేలకు పైచిలుకు మందికి వివిధ కారణాలతో లబ్ధి చేకూరలేదని అధికారులు చెబుతున్నారు. -
ఒకదానికే దిక్కులేదు..మరొకటా..?
● ఎంఎస్ఎంఈ పార్కుకు భూములివ్వం ● కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన రైతులుబొండపల్లి: ఒక పక్క ఎంఎస్ఎంఈ పార్కు పేరుతో పార్కును ఏర్పాటు చేసి అక్కడ ఒక్క పరిశ్రమ కూడా రాని పరిస్థితుల్లో రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న జిరాయితీ, డీపట్టా భూముల్లో మరో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పి భూములు లాక్కునే ప్రయత్నం విరమించుకోవాలని రైతు సంఘం, సీపీఎం నాయకులు డిమాండ్ చేస్తూ తహఽసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతుల నుద్దేశించి సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ కొండకిండాంలో ఏడాది క్రితం ప్రారంభించిన పార్కుకే ఇంతవరకు దిక్కు లేదని ఇప్పడు కొండకిండాం, కిండాం అగ్రహారం, రాచకిండాం గ్రామాల పరిధిలో 175 ఎకరాలు పార్కు పేరుతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పి అరఎకరం,ఎకరం ఉన్న సన్న, చిన్న కారు రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మూడు గ్రామాలకు చెందిన రైతులు వారం రోజులుగా అందోళనలు చేడుతున్నా,సంబంధింత మంత్రి, నియోజకవర్గం ఎమ్మేల్యే కనీసం బాధిత రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయానికి సమీక్షా సమావేశం నిమిత్తం వచ్చిన కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అలాగే తహసీల్దార్ డోలా రాజేశ్వర్రావుకు కూడా వినతిపత్రం అందజేసి కార్యాలయం వద్దనే భోజనాలు చేసి సాయంత్రం వరకు నిరసన తెలియ చేసి తమకు న్యాయం చేయాలని అధికారులును కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తొత్తడి పైడిపు నాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గొర్లె శ్రీనివాసరావు, పోరాట కమిటీ నాయకులు, మూడు గ్రామాలకు చెందిన బాధిత రైతులు పాల్గొన్నారు. -
స్మార్ట్ పోలీసింగ్తో మెరుగైన సేవలందించాలి
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ఏఆర్ దామోదర్విజయనగరం క్రైమ్: స్మార్ట్ పోలీసింగ్తో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్హెచ్ఓలతో బుధవారం జిల్లాపోలీస్ కార్యాలయంలో ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్యాప్తులో ఉన్న లాంగ్ పెండింగ్, గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్డీపీఎస్, పోక్సో, అట్రాసిటీ, మిస్సింగ్, చోరీ, రోడ్డు ప్రమాద, సోషల్ మీడియా కేసులను సమీక్షించి, అధికారులకు దర్యాప్తుపరమైన పలు సూచనలు చేసి, దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పోలీసుశాఖ ప్రత్యేకంగా రూపొందించిన 360 డిగ్రీ మొబైల్ యాప్ లో మిస్సింగ్, ఓవీ క్రిమినల్స్, పోయిన వాహనాల ఫొటోలను అప్లోడ్ చేసి, ఫేస్ రికగ్నైజింగ్ కెమెరాలతో వచ్చిన అలెర్ట్ మెసేజ్ లకు తక్షణమే స్పందించి మిస్సింగ్, ఓవీ క్రిమినల్స్, పోయిన వాహనాల ఆచూకీని కనుగొనాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. సీసీ కెమెరాల వినియోగం పెంచాలి క్షేత్రస్థాయిలో సాంకేతికతను, డ్రోనన్స్, సీసీ కెమెరాల వినియోగాన్ని మరింత పెంచి, నేరాలను నియంత్రించాలన్నారు. మహిళల భద్రత, గంజాయి, రహదారి భద్రత, సైబర్ భద్రత పట్ల ప్రజలకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో మహిళా సంరక్షణ పోలీసుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. చోరీ వస్తువులు, బంగారు ఆభరణాలను వ్యాపారులు కొనుగోలు చేయకుండా చర్యలు చేపట్టాలని, పాత బంగారు వస్తువులు కొనుగోలు చేసేందుకు బంగారు వ్యాపారులు ప్రత్యేకంగా ఒక రికార్డులో కొనుగోలు చేసే వస్తువుల వివరాలను నమోదు చేయాలన్నారు. ఏవైనా నేరాలు జరిగినప్పుడు నేర స్థలం నుంచి ఆధారాల సేకరణకు తప్పనిసరిగా క్లూస్ టీం సహాయం తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. దర్యాప్తులో ఉన్న కేసుల్లో ఫోరెన్సిక్ సైన్స్ నివేదికలను సంబంధిత కార్యాలయాల నుంచి త్వరితగతిన పొందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా పెట్టాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నేరాలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఆర్.గోవిందరావు, ఎస్.రాఘవులు, ఎం.వీరకుమార్, డీటీపీసీ డీఎస్పీ నారాయణరావు, న్యాయ సలహాదారులు వై.పరశురాం, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలనలో అవినీతిపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం
పార్వతీపురం రూరల్ : రాష్ట్రంలో సాగుతున్న చంద్రబాబు పాలనలో అవినీతి ఏ రకంగా జడలు విప్పిందో, అధికారుల ఇష్టారాజ్యం ఏ స్థాయికి చేరిందో అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడే స్వయంగా బట్టబయలు చేశారు. పార్వతీపురం నియోజకవర్గంలో విద్యా శాఖ అధికారుల అక్రమ సంపాదనే ధ్యేయంగా సాగుతున్న వ్యవహారాలపై సొంత పార్టీ ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఈఓ కార్యాలయంలో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన బుధవారం మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. తమ ప్రభుత్వ హయాంలోనే అధికారులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు క్షేత్ర స్థాయి పాలనా వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. నిబంధనలను కాదని.. బంధుప్రీతికి పీఠం విద్యా శాఖలో ప్రక్షాళన జరుగుతోందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా, లోపల మాత్రం నిధుల దోపిడీ నిరాటంకంగా సాగుతోందని ఎమ్మెల్యే ఆరోపణల ద్వారా స్పష్టమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ‘యూనిక్ కనస్ట్రక్షన్’ అనే ప్రైవేట్ సంస్థకు డీఈఓ కార్యాలయం నుంచి ఏకంగా రూ.19 లక్షల 55 వేలను నేరుగా బదిలీ చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారుల బంధువులకు ఇలాంటి కాంట్రాక్టులు ఇవ్వకూడదనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి, సదరు కార్యాలయంలోనే పని చేస్తున్న ఒక ఉపాధ్యాయుని భార్యకు చెందిన సంస్థకు ఈ నిధులను కట్టబెట్టారని ధ్వజమెత్తారు. యోగా మ్యాట్లు ఏవి? నిధులు ఏమయ్యాయి? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన యోగాంధ్రా పేరుతో ఈ నిధుల మాయాజాలం సాగిందని ఎమ్మెల్యే విజయ్చంద్ర వివరించారు. విద్యార్థుల కోసం యోగా మ్యాట్లు, టీ షర్టులు కొనుగోలు చేసేందుకు ఈ నిధులను విడుదల చేసినప్పటికీ, సొమ్ము చెల్లించి 45 రోజులు దాటినా ఇంతవరకు ఆఫీసుకు ఒక్క మ్యాట్ కానీ, టీషర్టు కానీ రాలేదని ఆరోపించారు. ఈ కొనుగోళ్లకు సంబంధించి కనీసం టెండర్ ప్రక్రియ నిర్వహించారా, కొటేషన్లు పిలిచారా, ఎల్–1గా ఎలా ఖరారు చేశారు అనే వివరాలు కూడా లేవని, అధికారులు ఇష్టానుసారంగా నిధులను దండుకుంటున్నారని విమర్శించారు. గుట్టు రట్టు చేసిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల డీఈఓ కార్యాలయంలో నిధుల గోల్మాల్పై మండిపాటు సొంత వారికే రూ.19.55 లక్షల దోపిడీ జిల్లా విద్యా శాఖపై సంచలన ఆరోపణలు పత్రాలు ఇవ్వకుంటే నేరుగా కార్యాలయానికే.. ఈ అక్రమ వ్యవహారాలపై గత నెల రోజులుగా డీఈఓను వివరణ కోరుతున్నా ఆయన సమాధానం దాటవేస్తున్నారని, కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఎమ్మెల్యే వాపోయారు. ప్రొక్యూర్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్న కలెక్టర్ ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని, ఈ దోపిడీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల అవినీతి పత్రాలను తాము లిఖితపూర్వకంగా అడిగామని, రేపటికల్లా ఆ డాక్యుమెంట్లను బయటపెట్టకపోతే తామే స్వయంగా డీఈఓ ఆఫీసుకు వెళ్లి ఫైళ్లను స్వాధీనం చేసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. సొంత పార్టీ అధికారంలో ఉండీ, ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఈ స్థాయిలో అవినీతిపై వీధికెక్కి ఆరోపణలు చేయడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
ఇరాన్లో చిక్కుకున్న చింతపల్లి యువకుడు
పూసపాటిరేగ: మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఇరాన్ సమీపంలోని బందర్ అబ్బాస్ పోర్టు సమీపంలో తాను పనిచేస్తున్న ఎంవీ పాస్కల్ అనే నౌక మరమ్మతులకు గురవడంతో చిక్కకున్నట్లు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. గ్రామానికి చెందిన కొమర సోమరాజు 12 నెలల క్రితం ఇరాన్కు ఏజెంట్ ద్వారా పని నిమిత్తం వెళ్లాడు. అక్కడ నౌకలో పనిచేస్తుండగా యుద్ధం నేపథ్యంలో బిక్కుబిక్కు మంటూ గడిపాడు. తాజాగా తాను ట్రైనీ వైపర్గా పనిచేస్తున్న ఎంవీ పాస్క్ల్ అనే నౌక మరమ్మతులకు గురవడంతో సముద్రంలోనే నౌకలో గడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం కుటుంబసభ్యులతో మాట్లాడుతూ ఎంవీ పాస్కల్ నౌక మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పినట్లు చింతపల్లికి చెందిన మత్స్యకార నాయకుడు బర్రి చినఅప్పన్న తెలియజేశారు. సోమరాజుకు తల్లి కొమర అప్పమ్మ, తండ్రి కొమర అప్పన్న ఉన్నారు. ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత ఇరాన్లో చిక్కకున్న చింతపల్లి గ్రామానికి చెందిన కొమర సోమరాజును స్వదేశానికి తెప్పించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవికి సోమరాజు కుటుంబసభ్యులు వినతిపత్రం అందజేశారు. సురక్షితంగా స్వదేశానికి వచ్చే విధంగా తమ వంతు సహకారం అందిస్తామని బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. -
ఉసురు తీసిన ఉపాధి
బొబ్బిలి రూరల్: ఉపాధినిస్తున్న డ్రైవర్ కొలువే ఓ డ్రైవర్ ఉసురు తీసింది. బాడంగి మండలం పినపెంకికి చెందిన బోనకల సింహాచలం(55) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో బొబ్బిలి పట్టణానికి కుటుంబంతో వచ్చి ఇక్కడే పనిచేస్తున్నాడు. సింహాచలానికి సొంత వాహనం లేకపోవడంతో ఇతరుల వాహనాలకు డ్రైవర్ లభ్యత లేనిపక్షంలో వెళ్తుంటాడు.ఈ క్రమంలోనే బుధవారం మరొకరి వాహనానికి డ్రైవర్గా స్టోన్ క్రషర్ వద్ద లభించే బుగ్గి(క్రషర్ బుగ్గి) కోసం మండలంలోని భోజరాజపురం రోడ్డులో గల క్రషర్కు వెళ్లాడు. ఆ సమయంలో ట్రాక్టర్కు ఉండే వెనుక హైడ్రాలిక్ తొట్టె ఆకస్మాత్తుగా మీదకు లేచి ఉండిపోయింది. ఇది గమనించిన సింహాచలం ట్రాక్టర్ను నిలిపి లేచిన తొట్టెను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా తొట్టె కిందికి వాలుతూ సింహాచలంపై పడిపోయింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సింహాచలం భార్య లక్ష్మి కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. వారికి ఇద్దరు కుమార్తెలుండగా పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. రెండో కుమార్తె సంధ్యారాణి ఇంటివద్దనే సహాయకారిగా ఉంటోంది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ సంఘటనపై సింహాచలం కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్సీ కాశి దర్యాప్తు చేస్తున్నారని సీఐ కె.నారాయణ రావు విలేకరులకు తెలిపారు. -
‘వెన్నుపోటుకు రెండేళ్లు’ ర్యాలీ రేపు
● మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర సాలూరు రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు వెన్నుపో టు పాలనకు గుర్తుగా వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట ఈ నెల 12న సాలూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించనున్నట్టు మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర వెల్లడించారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు చీకటి పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. మెగా డీఎస్పీ అంటూ నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని తెలిపారు. చంద్రబాబు పాలనను నిరసిస్తూ చేపడుతున్న ర్యాలీలో ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏనుగుల సమస్య పాలకులకు పట్టదా.. సాలూరు మండలంలో గత కొద్ది రోజులుగా ఏనుగులు సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని దీనిపై ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం శోచనీయమని రాజన్నదొర పేర్కొన్నా రు. సాలూరు నియోజకవర్గంలో ఏనుగులు ప్రవేశించి వారం రోజులు కావస్తున్నా తరలించే విషయంలో స్థానిక మంత్రి ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదన్నారు. ఒక వైపు గ్రామాల్లో ప్రవేశి స్తూ మరోవైపు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయ న్నారు. వ్యవసాయ బోర్లు పూర్తిగా నాశం చేస్తున్నాయని తెలిపారు. ఏనుగుల సమస్యపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రి సంధ్యారాణిపై ఉందన్నారు. -
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
● అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడువిజయనగరం ఫోర్ట్: నేలల్లో కర్బన శాతాన్ని పెంచడానికి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలని అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ సీహెచ్. ముకుందరావు అన్నారు. ఈ మేరకు గాజులరేగ వ్యవసాయ పరిశోధన స్థానంలో గిరిజన రైతులకు గిరిజన ఉప ప్రణాళికలో భాగంగా వ్యవసాయ ఉప కరణాలు పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవశ్యకత ఎంతో ఉందన్నారు. జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువుల వినియోగాన్ని పెంచాలని కోరారు. సిఫార్సు మేరకు మాత్రమే ఎరువులు వేయాలని సూచించారు. ప్రకృతి సాగు పద్ధతిలో వ్యవసాయం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో అఖిల భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ప్రతినిధి కె. శ్రీనివాసబాబు, వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి. టీఎస్ఎస్కే పాత్రో, జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు, ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ కెల్ల లక్ష్మణ్, శాస్త్రవేత్తలు డాక్టర్ కె.తేజేశ్వరావు, డాక్టర్ ఎంవీవీ శ్రీనివాస రావు, డాక్టర్ ఎన్.అనూరాధ, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ త్రివేణి, డాక్టర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్త కుటుంబానికి జెడ్పీ చైర్మన్ ఆసరా
● ఇంటర్ విద్యకోసం రూ.లక్షా, 10 వేలు ఆర్థిక సాయంవిజయనగరం: కార్యకర్తలే ఏ పార్టీకై నా పునాదులు. పునాది లాంటి కార్యకర్తల హదయాలు గెలుచుకున్న వారే నేతలుగా, నాయకులుగా నాలుగు కాలాలు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. పార్టీలో ఉండే ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యుడిగా భావించిన నాయకుడు మాత్రమే వారిని, వారి కుటుంబాలను కష్టకాలంలో ఆదుకుంటాడు. అలాంటి అరుదైన రాజకీయ నాయకుల్లో ఒకరిగా, తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకునే నాయకుడు విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ భీమిలి నియోజకవర్గం ఇన్చార్జ్ మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను)అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తాజాగా మరోసారి తమ పార్టీ కార్యకర్త కుటుంబం పట్ల తనకున్న వాత్సల్యాన్ని, ఉదారతను ఆయన చాటుకున్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం, పద్మనాభం గ్రామానికి చెందిన వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంటుభుక్త శ్రీను కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని గురించి నియోజకవర్గ నాయకుల ద్వారా తెలుసుకున్న జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మానవతా ధృక్పథంతో ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. మృతి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త కుమార్తె కంటుభుక్త మాధురిని ఇంటర్మీడియట్ విద్యలో చేర్పించడానికి అవసరమైన ఆర్థిక సాయం అందించారు. బోయపాలెం శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఆమెను ఇంటర్ విద్య కోసం చేర్పించి విద్యాభ్యాసానికి అవసరమైన రూ. లక్షా, 10 వేలు ఫీజును చెల్లించి వారి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యార్థిని మాధురి, ఆమె తల్లితో కలిసి వచ్చి క్యాంప్ కార్యాలయంలో చిన్న శ్రీను, సిరిసహ్రలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని, మాధురి ఉన్నత స్థాయికి ఎదగాలని చిన్నశ్రీను ఆకాంక్షించారు. కార్యక్రమంలో పద్మనాభం ఎంపీపీ కంటుభుక్త రాంబాబు, పద్మనాభం సర్పంచ్ తాలాడ పద్మనాభం ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
వెన్నుపోటుపై మండిపాటు
పాలకొండ: రాష్ట్రంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సాలూరు, పాలకొండలో రౌండ్ టేబుల్ సమావేశాలు మంగళవారం నిర్వహించారు. సాలూరులోని పార్టీ కార్యాలయంలో, పాలకొండలోని ఏఎంజీ కన్వర్షన్ హాల్లో ఈ సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతిపై పాలకొండలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ అందరినీ ఆలోచింపజేసింది. దీని ద్వారా ప్రజలకు చంద్రబాబు పాలనలో ఏం జరిగిందో ఇట్టే అర్ధమైంది. సాలూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాలకొండలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. -
బరితెగింపు
● సీజ్ చేసిన ఇసుక తరలింపు ● అధికారుల ఆగ్రహం ● నడిమికెల్లలో యథేచ్ఛగా ఇసుక దందా వీరఘట్టం: మండలంలోని నడిమికెల్లలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. గత నెల 23న గ్రామంలో నిల్వ చేసిన ఇసుక కుప్పలను అధికారులు సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన ఇసుకను రాత్రి పూట తరలించుకుపోతూ అక్రమ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయం రెవెన్యూ, పోలీసులకు మంగళవారం తెలియడంతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గ్రామంలో ఉన్న ట్రాక్టర్లు, జేసీబీల వివరాలు కావాలని తహసీల్దార్ రాజేశ్వరరావు తమ సిబ్బందికి సూచించారు. అనంతరం ఎస్.ఐ షణ్ముఖరావుతో మాట్లాడారు. ఇసుక దందాకు పాల్పడుతున్న వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని సూచించారు. నడిమికెల్లలో ఏం జరుగుతోంది... మండలంలోని నడిమికెల్ల గ్రామం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. గ్రామానికి సమీపంలో ఉన్న నాగావళి నది నుంచి ఇసుకను అక్రమంగా తీసుకువచ్చి తమకు అనుకూలంగా ఉన్న చాలా చోట్ల డంపింగ్ చేస్తున్నారు. ఇలా డంపింగ్ చేసిన ఇసుకను లారీలు, ట్రాక్టర్లతో రాత్రి పూట ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దర్జాగా అక్రమ వ్యాపారం చేస్తున్నారు. గ్రామానికి చెందిన కొంత మంది ఈ ఇసుక దందా చేస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. మైనింగ్ అధికారులు ఎక్కడున్నారు... నడిమికెల్లలో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా జరుగుతున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. బహిరంగంగానే లారీలు, ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తూ కొంత మంది అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా మైనింగ్ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా మైనింగ్ అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 16 మందిపై బైండోవర్ కేసులు అనుమతులు లేకుండా ఆక్రమంగా ఇసుక పెరుగుతున్నారనే ఆరోపణలు ఉన్న నడిమికెల్ల గ్రామానికి చెందిన 16 మందిపై మంగళవారం సాయంత్రం తహసీల్దార్ రాజేశ్వరరావు సమక్షంలో బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు ఎస్ఐ షణ్ముఖరావు తెలిపారు. -
ఇంజినీర్ల వినూత్న ఆలోచనతోనే దేశంలో మార్పు
● కలెక్టర్ ప్రభాకరరెడ్డి పార్వతీపురం: ఇంజినీర్ల వినూత్న ఆలోచనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమన్వయంతోనే క్షేత్ర స్థాయిలో మార్పు సాధ్యమవుతుందని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న జలధార పనులను జూలై 10వ తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. చెరువుల ఆక్రమణలకు గురికాకుండా సంరక్షించాల్సిన బాధ్యత ఇంజనీర్లేదేనన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నందున రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి మండలంలో ప్రజల సమస్యలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. రైతులను, సాగునీటి సంఘాలను భాగస్వామ్యం చేస్తూ ఖరీఫ్కు సాగునీటిని సక్రమంగా ఆయకట్టు శివారు వరకు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో జియో కోఆర్డినేటర్ల ఆధారంగా ఇరిగేషన్ స్టార్టింగ్ పాయింట్లను మ్యాప్ చేసుకోవచ్చునని, తద్వారా సమస్యలను ఒక క్లిక్తో విశ్లేషించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో ఇరిగేషన్ ఈఈ డిఎస్.ప్రదీప్తో పాటు వివిధ మండలాల డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను సాధించాలి
● దిశానిర్దేశం చేసిన డీఈవోపార్వతీపురం రూరల్: ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతులు చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందిస్తూ ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను నూరుశాతం సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) పి.బ్రహ్మాజీరావు పేర్కొన్నారు. ఈ మేరకు పార్వతీపురంలోని డీవీఎం మున్సిపల్ హైస్కూల్లో ప్రాథమిక ఉపాధ్యాయులకు ఆరు రోజుల పాటు నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. కోర్సు డైరెక్టర్, బలిజిపేట ఎంఇఓ–1 సామల సింహాచలం అధ్యక్షతన జరిగిన ముగింపు సభకు డీఈవో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారుల్లో కనీస విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. శిక్షణ విజయవంతానికి సహకరించిన ఉపాధ్యాయులు, సంఘం నాయకులకు కోర్సు డైరెక్టర్ సింహాచలం ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శిక్షణకు కీ రిసోర్స్ పర్సనన్స్ (కేఆర్పీలు)గా వ్యవహరించిన వనజాక్షి, జి.రవికుమార్లతో పాటు డీఆర్పీలను ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడిగా శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో బి.రాజకుమార్, ఏఎంవో కోటేశ్వరరావు, ఎంఈఓలు వై.విమలకుమారి, సూరిదేముడు, కర్రి ప్రసాదరావు, మువ్వల వెంకటరమణ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పువ్వుల ధనంజయరావు, గంట శశికుమార్, జగన్నాథం, కూర్మినాయుడు, రెడ్డి రమణ, ప్రసాదరావు, గోపాలకృష్ణ వివిధ మండలాల నుంచి వచ్చిన సుమారు 260 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుతో పాడి గేదె మృతి, పశువుల శాల దగ్ధం
కొత్తవలస: మండలంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. పెద్ద పెద్ద ఉరుములుతో కూడిన వర్షం కురవగా పిడుగుపడడంతో మండలంలోని చీపురువలస గ్రామానికి చెందిన ఉల్లి అక్కమ్మ పాడిగేదె మృతి చెందింది. గేదె సుమారు రూ 70వేలకు పైగా ఉంటుందని జీవనాధారమైన గేదె మృతి చెందడంతో అక్కమ్మ లబోదిబో మంటూ రోదించింది.అలాగే వర్షం మరికొద్ది సమయంలో కురుస్తుందన్నప్పుడు పడిన భారీ పిడుగుకు తుమ్మికాపల్లి పంచాయతీ సీతంపేట గ్రామం సమీపంలో పొలమరశెట్టి పద్మజ్యోతికి చెందిన పశువుల పాక దగ్ధమైంది. ఆ సమయంలో పాకలో ఎవరూ లేకపోవడంతో అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. -
సర్తో ఓటర్లకు శిరోభారమే..!
విజయనగరం అర్బన్: ప్రభుత్వాల మనుగడ, ప్రజల భవిష్యత్తును శాసించే ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు జిల్లాలో పెను సంచలనంగా మారింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ ప్రక్రియ పారదర్శకత పేరుతో సాగుతున్నప్పటికీ తెరవెనుక వేలాది మంది అర్హులైన ఓటర్ల హక్కుకు ముప్పు తెచ్చేలా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓటరుగా సజీవంగా ఉన్న సామాన్యుడికి ఈ ప్రక్రియ శాపంగా మారబోతోందా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఏజెంట్ల ఇష్టారాజ్యం–రాజకీయ పక్షపాతం? ఈ సర్వేలో బూత్ లెవెల్ ఏజెంట్లదే (బీఎస్ఏ) కీలక పాత్ర కానుంది. ఇంటింటి సర్వేలో వారి సమ్మతి ప్రకారమే మార్పులు జరుగుతాయి. అధి కార పార్టీతో పాటు ప్రతిపక్షాలు తమకు అనుకూలమైన ఓటర్లను ఉంచుకుని, ప్రత్యర్ధి పార్టీల సానుభూతిపరుల ఓట్లను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఏజెంట్లు లేని ప్రాంతాల్లో ఓటర్ల జాబితా తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఏజెంట్ల నియామకంలో ఫారం–2 పూరించడంతో జరుగుతున్న హడావుడి చూస్తుంటే అర్హులైన ఓటర్లు చేజారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లాలో 1.5లక్షల మంది ఓట్లు గాల్లో కలిసే ప్రమాదం ఫారం–2 నింపడం సామాన్యుడికి తలనొప్పి ఏజెంట్ల ఇష్టారాజ్యంతో ఓట్ల తొలగింపు -
స్టీల్ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో గాదెలవలస ఉద్యోగి మృతి
సీతానగరం: విశాఖ స్టీల్ ప్లాంట్లో సోమవారం జరిగిన ప్రమాదంలో పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం, గాదెలవలస గ్రామానికి చెందిన గొట్టాపు త్రినాఽథ్ (50) మృతి చెందడంతో కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. మృతుడు త్రినాథ్కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. పెద్దకుమారుడు పవన్ విజయవాడలో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండవ కుమారుడు భరత్ చైన్నెలోని కాంగో కంపెనీలో సాఫ్టవేర్ ఉద్యోగం చేస్తున్నాడని కుటుంబసభ్యులు తెలియ జేశారు. సామాన్యరైతుకుటుంబానికి చెందిన త్రినాథ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం సంపాదించుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న సమయంలో ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కు పోయిందని బోరున విలపిస్తున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి..పాలకొండ రూరల్: మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన అల్లు సీతారాం(46) శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. దీనిపై పోలీసులు అందించిన వివరాల మేరకు తీవ్ర ఆనారోగ్యం కారణంగా పది రోజుల క్రితం సీతారాం తన ఇంట్లో క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అప్పట్లో ఆయనను కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా వైద్య సేవలు పొందుతూ మరణించినట్లు ఎస్సై డోల వెంకన్న తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. మృతుడికి భార్య భవాని, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో భార్యా పిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు.విద్యుత్ షాక్తో ఆవు..తెర్లాం: మండలంలోని లింగాపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం విద్యుత్ షాక్కు గురై పాడిఆవు మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు కునుకు వెంకటరావు మేత కోసం గ్రామానికి సమీపంలో ఉన్న ఖాళీ స్థలానికి ఆవును తోలుకుని వెళ్లాడు. అదే స్థలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వైర్లకు ఆవు తగలడంతో వెంటనే విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఎన్నోఏళ్లుగా కష్టపడి పెంచుకున్న ఆవు విద్యుత్ షాక్కు గురై మృతి చెందడంతో రైతు వెంకటరావు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయంపై గ్రామ రెవెన్యూ అధికారి తహసీల్దార్కు సమాచారం ఇచ్చారు. మండల ట్రాన్స్కో ఏఈ తెంటు శ్రీనివాసరావు, మండల పశువైద్యాధికారి డాక్టర్ జె.నరేంద్రకుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి మృతి చెందిన ఆవును పరిశీలించారు. ఏడుగురు గంజాయి నిందితుల అరెస్ట్విజయనగరం క్రైమ్: రెండున్నర కిలోల గంజాయితో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని విజయనగరం రూరల్ ఎస్సై అశోక్ మంగళవారం తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన ఎల్.కల్యాణ్ అరకు నుంచి మూడు కిలోల గంజాయిని తెచ్చి నాగరాజు అనే వ్యక్తికి అమ్మినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ మేరకు ఇద్దరినీ పట్టుకుని పూర్తి స్థాయిలో విచారణ చేయగా ఎం,సతీష్ వర్మ(24), ఎం.సాయి వర్మ(22) వై. తిరుపతి దాలయ్య (33), కె.గణేష్ (23),పి.అశోక్ (22) పట్టుబడ్డారన్నారు. ఇందులో కల్యాణ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాడు కాగా విజయనగరంలోని అలకానంద కాలనీలో ఉంటూ స్నేహితులకు అరకు నుంచి తెచ్చిన గంజాయిని కొండకరకాం వద్ద అమ్ముతున్నాడన్న సమాచారంతో అదుపులో తీసుకుని అరెస్ట్ చేశామని ఎస్సై అశోక్ తెలిపారు. వారి దగ్గర నుంచి సుమారు రెండున్నర కేజీల గంజాయి, నాలుగు బైక్ లు, ఏడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై అశోక్ వివరించారు. -
రైతుబజార్లలో పైనాపిల్ విక్రయానికి చర్యలు
సీతంపేట: 82 రైతు బజార్లలో పైనాపిల్ విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నట్టు పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన రైతులు పండించిన నాణ్యమైన పైనాపిల్ పండ్లకు సరైన గిట్టుబాటు ధర లభించేలా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ పరిసరాల్లో రైతు బజార్లలో రైతులు విక్రయించుకోవడానికి అవకాశం లభించనున్నట్టు తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు పాల్గొని అమ్మకాలు చేపట్టవచ్చన్నారు. ఈ మార్కెటింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి ఆసక్తి గల గిరిజన రైతులు, ఎఫ్పీవో, ఎస్హెచ్జీ సంఘాలు తమ వివరాలతో ఐటీడీఏ సీతంపేట కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 23 నుంచి పైడిమాంబ ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవాలు విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు చదురుగుడి పునః ప్రతిష్ఠ మహోత్సవాలు ఈ నెల 23 నుంచి 25 వరకూ మూడు రోజుల పాటూ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని దేవదాయ శాఖ సహాయ కమిషనర్, ఆలయ ఈఓ కె.శిరీషా తెలిపారు. స్థానిక చదురుగుడి ప్రాంగణంలో విజయనగరం ఎమ్మెల్యే అతిధి గజపతిరాజు ఆధ్వర్యంలో ఉత్సవాల కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది నవంబర్ 10వ తేదీన సోమవారం అమ్మవారి చదురుగుడి విస్తరణ పనుల్లో భాగంగా కళాప్రకర్షణ చేపట్టి, పక్కనే బాలాలయం నిర్మించామని, అప్పటి నుంచి నేటి వరకు బాలాలయంలోనే అమ్మవారి దర్శనం కల్పించామన్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే చదురుగుడి విస్తరణ పనులు శరవేగంగా చేపట్టగలిగామన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ రూ.కోటీ 80లక్షల వ్యయంతో ఆలయ అభివృద్ధిపనులు ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకిచ్చిన హామీలు అమలు చేయాలి ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు విజయనగరం గంటస్తంభం: విద్యార్థులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలో జూలై 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యాలయం అమర్ భవన్లో శిక్షణా తరగతుల కరపత్రాలను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీ విద్యార్థులకు ఇబ్బందిగా మారిన జీవో నెం.77ను రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి మరమ్మతులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి విద్యా దోపిడిని అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్.నాగభూషణం, ఉపాధ్యక్షుడు సుమన్, సహాయ కార్యదర్మి గౌరీశంకర్, పట్టణ నాయకులు చరణ్, గణేష్ పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి వినతి విజయనగరం క్రైమ్: అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి సాయిరాజేష్ను విజయనగరం ఉమ్మడి జిల్లా అగ్నిమాపక శాఖ ఉద్యోగుల సంఘం నేతలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు విజయనగరం అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఇటీవల జిల్లాలో పునః ప్రారంభించిన సిబ్బంది ముఖ హాజరు వల్ల తలెత్తే సమస్యలను డీఎఫ్ఓ దృష్టికి తీసుకువెళ్లినట్టు అగ్నిమాపక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అధికారి రమేష్ తెలిపారు. తమ శాఖలో సిబ్బంది కొరత వల్ల 24 గంటలూ విధుల్లో ఉంటున్నామని, అగ్ని ప్రమాదాలు రెస్క్యూ, అవుట్ డ్యూటీలు, బందోబస్తు, వీఐపీ కాన్వాయ్ ఇతర విధుల నిమిత్తం బయటకు వెళ్లే పరిస్థితుల్లో ఉన్నామన్నారు. -
● వాటాల్లో తేడాలా? పంపకాల్లో పేచీలా? ● వెనకుండి నడిపించిన ఎంపీపీ ● మన్యం జిల్లాలో వైరల్ అవుతున్న వీడియోలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రభుత్వ పాలనలో అధికారులు, ప్రజాప్రతినిధులు రెండు చక్రాల్లా? జోడెడ్ల మాదిరి సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రగతి రధాన్ని నడిపించాలి. కానీ మన్యం జిల్లాలోని ఓ మండలంలో మండల స్థాయిలోని ఓ అధికారికి, సదరు ప్రజాప్రతినిధికి ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ ఏకంగా మండల పరిషత్ కార్యాలయంలోనే రౌడీల మాదిరి బూతులు తిట్టుకుని చిల్లర మనుషుల మాదిరిగా కొట్టుకునే వరకు వచ్చింది పరిస్థితి. దీని వెనుక వాటాల పంపిణీలో తేడాలు వచ్చాయా? ఇద్దరి ఇగోలు గట్టిగా ఢీకొన్నాయా తెలియదు కానీ దరువులు మాత్రం పడ్డాయి. అక్కడే ఉన్న కొందరు ఔత్సాహికులు దీన్ని ఉత్సుకతతో చూడడమే కాకుండా వారి మధ్య సంవాదాన్ని వీడియోలు కూడా తీశారు. దీంతో అవి కాస్తా వీధికెక్కాయి. ● ఎంపీడీవో వస్తూనే నిధులపై కన్ను అల్లూరి సీతారామరాజు జిల్లాలో పని చేస్తూ సస్పెండ్ అయి చాన్నాళ్లుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న శశిభూషణరావు మూడు నెలల క్రితం జియ్యమ్మవలస ఎంపీడీవోగా వచ్చారు. వస్తూనే ఎంపీడీవో ఖాతాలో ఎంత డబ్బు ఉంది.. దాని లెక్కలేమిటి ? తేల్చేయాలన్న ఆలోచనల్లో పడ్డారు. ఈ క్రమంలోనే వివిధ పథకాలు, పనులకు సంబంధించి తన ఖాతాలో ఉన్న ప్రభుత్వ నిధులు దాదాపు రూ.10 లక్షలను మే 5 నుంచి 21 తేదీ మధ్య డ్రా చేసి సొంతానికి వాడుకున్నారు. ఎందుకు నిధులు తీశారు.. దేనికి ఖర్చు చేశారన్న దానికి సంబంధించి ఆయన ఎవరికీ, కనీసం మండల పరిషత్కు కూడా సమాచారం ఇవ్వకుండా నేరుగా చెక్కులతో నిధులు వాడేశారు. ఈ అవినీతికి సూపరింటెండెంట్ కొండగొర్రె రామారావు, ఆఫీస్ సబార్డినేట్ చొక్కాపు శ్రీనివాసరావు సైతం సహకరించినట్లు తెలుస్తోంది. ఈ డబ్బు డ్రా చేసిన అంశం తనకు తెలియలేదన్న కోపమో, అందులో తనకు వాటా రాలేదన్న ఆగ్రహమో తెలియదు కానీ మండల పరిషత్ అధ్యక్షుడు బొంగు సురేష్ ఈ అంశం మీద ఎంపీడీవోను ప్రశ్నించారు. దీనికి ఆయన సరైన సమాధానం ఇవ్వకపోవడమే కాకుండా నీకెందుకు చెప్పాలి.. ఇదంతా నా ఇష్టం అన్నట్లుగా మాట్లాడినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ఆఫీస్ సబార్డినేట్ శ్రీనివాస్ కూడా ఇరుక్కోవడంతో ఆయన్ను రెచ్చగొట్టి ఆయనతో ఎంపీడీవోను ఏకంగా ఆఫీసులో కొట్టించినట్లు తెలిసింది. అందులో తనకు వాటా రాకపోగా అవినీతిలో మాత్రమే తనకు భాగం దక్కడాన్ని సహించలేకపోయిన శ్రీనివాస్ ఏకంగా ఎంపీడీవోపై దాడి చేసారని తెలుస్తోంది. అయితే ఈయన వెనుక ఎంపీపీ సురేష్ ఉన్నారని, ఆయన ప్రోద్బలంతోనే శ్రీనివాస్ ఇలా దాడి చేశారని అంటున్నారు. ఈ సందర్భంగా కార్యాలయం మొత్తం గలాటా నెలకొనగా ఈ తంతు చూస్తున్న వాళ్లు వాటికి సంబంధించిన వీడియోలు సైతం రికార్డ్ చేయడంతో ఈ వ్యవహారం కాస్త రచ్చకెక్కింది. సురేష్ అక్కడితో ఆగకుండా నిధుల దుర్వినియోగం మీద ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ టివి.తిరుపతిరావు కేసు నమోదు చేశారు. మరోవైపు నిధులు డ్రా చేసిన ఎంపీడీవో రెండ్రోజులుగా పరారీలో ఉన్నారు. ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ వస్తోందని తెలుస్తోంది. ఈ అంశం ఉమ్మడి విజయనగరం జెడ్పీ సీఈవో వరకు చేరడంతో శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఎంపీడీవో, ఎంపీపీల మధ్య రగడ ఏమిటి? కొట్లాట ఎందుకు.. డబ్బుల పంపిణీల తేడాలొచ్చి తన్నుకున్నారా? ఆ వ్యవహారం వెనుక ఏం జరిగిందన్న అంశాలను సీఈవో దర్యాప్తు చేసినట్లు తెలిసింది. వాటాల్లో తేడాలే తన్నులాటకు దారి తీసిందా? ఇదిలా ఉండగా ఎంపీపీ, ఎంపీడీవోల మధ్య డబ్బుల పంపకాల్లో వచ్చిన పొరపొచ్చాలు ఏకంగా కొట్లాటకు దారి తీసిందని స్థానికంగా విషయం తెలిసిన ఉద్యోగులు అంటున్నారు. మొత్తం పది లక్షలు ఎంపీడీవో ఒక్కరే మింగేయడంతో ఎంపీపీకి ఆగ్రహం వచ్చి అప్పటికే కేసులో ఇరుక్కున్న ఆఫీస్ సబార్డినేట్ శ్రీనివాస్ను రెచ్చగొట్టి ఎంపీడీవో మీద దాడికి పురిగొల్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి మన్యం ఎంపీడీవో ఆఫీసులో ‘పెది’్ద తరహా కుస్తీ సీన్లు జరుగుతున్నాయని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. -
మహిళా సాధికారత ఎక్కడ?
● ఎమ్మెల్సీ విక్రాంత్రాజాం: రాష్ట్రంలో మహిళా సాధికారత కనిపించడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం రాజాంలో ఓపైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల నాలుగు పార్లమెంట్ స్థానాలు కూటమికి భర్తీచేసే అవకాశం వస్తే నాలుగింటిలో ఒక్కటి కూడా మహిళలకు కేటాయించలేదని ఆరోపించారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 50 శాతం దాటి మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. గ్రామ వలంటీర్లలో 53 శాతం, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం, స్థానిక సంస్థల్లో 50 శాతం అమలుచేశారని గుర్తుచేశారు. అప్పట్లో మంత్రివర్గంలో ఐదుగురికి మించి మహిళలు మంత్రులుగా ఉన్నారన్నారు. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల్లో 14 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మహిళలు కాగా, 7 శాతంగా నమోదైందని వివరించారు. కూటమి క్యాబినెట్లో కేవలం ఇద్దరు మాత్రమే మంత్రులుగా ఉన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు రాజ్యసభ సీట్లలో ఒకటి నుంచి రెండు సీట్లు మహిళలకు ఇస్తే ఎంతో బాగుండేదని, మహిళల అభివృద్ధిని చంద్రబాబునాయుడు ఓర్వలేకనే సీట్లు కేటాయించలేదని ఆరోపించారు. ‘తోటపల్లి’ పునః ప్రారంభించక పోతే రైతులకు తీవ్రనష్టం వంగర: తోటపల్లి ఆధునికీకరణ పనులు పునః ప్రారంభించకపోతే ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. మంగళవారం మండల పరిధి మగ్గూరు గ్రామంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గడిచిన రెండేళ్లుగా తోటపల్లి ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడంతో వంగర మండల రైతాంగం సాగునీటికి ఇబ్బందులు పడతున్నారన్నారు. కుడి ప్రధాన కాలువ ఎగువ భాగంలో కాలువ మరమ్మత్తులకు గురైందని, గడిచిన రెండేళ్లుగా సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో అన్నదాతలు సాగునీటికి అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. రైతు సేవా కేంద్రాల ద్వారా సకాలంలో రైతులకు ఎరువులు విత్తనాలు అందడంలేదని, రైతుల పట్ల ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని హితవు పలికారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు పుష్కలంగా అందించారని గుర్తు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, షూస్ పాఠశాలలు తెరిచే నాటికి అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ ముఖర్జీ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కరణం సుదర్శనరావు, మండల పార్టీ యూత్ అధ్యక్షుడు బొక్కేల వెంకటప్పలనాయుడు, పార్టి నాయకులు గేదెల రామకృష్ణ, పోలిరెడ్డి రమేష్, ఏగిరి ముత్యాలరావు పాల్గొన్నారు. -
నెత్తుటి మడుగులో ఆవు.. తల్లడిల్లిన లేగదూడ
పార్వతీపురం రూరల్: తల్లికి ఏమైందో ఆ లేగ దూడకు తెలియదు.. రక్తపు మడుగులో చలనం లేకుండా పడి ఉన్న తల్లిని చూసి లేగదూడ తల్ల డిల్లిపోయింది. ఎవరైనా వచ్చి తన తల్లికి ప్రాణం పోస్తారేమోనని రోడ్డు వైపు దీనంగా చూసిన ఆ మూగజీవి ఆవేదన పాదచారులను సైతం కంటతడి పెట్టించింది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పరిధిలోని రాయగడ రహదారిపై ఈ హృదయ విదారక ఘటన మంగళవారం జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం రోడ్డుపై ఉన్న ఆవును బలంగా ఢీకొట్టి, కనీసం ఆపకుండా అక్కడి నుంచి పరారైంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ గోమాత సుమారు మూడు గంటల పాటు ప్రాణాపాయ స్థితిలో రోడ్డుపైనే నరకయాతన అనుభవించింది. తల్లి ఎంతకీ కదలకపోవడంతో ఆవేదనకు గురైన దూడ.. పక్కనే కాపలాగా ఉంటూ తన మూతితో పదేపదే తట్టి లేపేందుకు ప్రయత్నించింది. కళ్లలో నీళ్లు నింపుకుని సాయం కోసం అటుగా వెళ్లే వారి వైపు ఆశగా చూసింది. గుండె బరువెక్కే ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు, పాదచారులు తీవ్రంగా చలించిపోయారు. ప్రమాదానికి కారకుడైన వాహనదారు కర్కశత్వంపై మండిపడుతూనే.. లేగదూడ ఆవేదనను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. -
‘ప్రత్యేక’ విద్యార్థులకు సహాయక పరికరాల పంపిణీ
విజయనగరం అర్బన్: ప్రత్యేక అవసరాలు (దివ్యాంగులు)గల విద్యార్థులను అత్యంత శ్రద్ధతో చూసుకోవాల్సిన బాధ్యత సమాజం మొత్తానిదని కలెక్టర్ ఎం.రాంసుందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, ఎమ్మెల్యే పి.అదితి గజపతిరాజు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల విద్యార్ధులకు అవసరమైన విద్య, వైద్య, పునరావాస సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేసి వారి అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. శారీరక పరిమితులు ప్రతిభకు అడ్డంకి కాదని, ప్రతి చిన్నారి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. డీఈఓ, సమగ్ర శిక్ష ఏపీసీ యూ.మాణిక్యం నాయుడు మాట్లాడుతూ జిల్లాలోని 27 మండలాల్లో భవిత కేంద్రాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్పీడబ్ల్యూడీ చట్టం–2016 ప్రకారం 1 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల వివిధ రకాల వైకల్యాలున్న పిల్ల లకు ప్రత్యేక విద్య అందిస్తున్నట్లు చెప్పారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రవాణా భత్యం, సహాయక భత్యం, ఇంటి వద్ద విద్యాభత్యం, దివ్యాంగ బాలికల ఉపకార వేతనాలు డీబీటీ విధానంలో వేలాది మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. 518 సహాయ పరికరాల పంపిణీ అనంతరం జిల్లాలోని 474 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మొత్తం 518 సహాయక పరికరాలను పంపిణీ చేశారు. వాటిలో 56 డిజిటల్ హియరింగ్ ఎయిడ్లు, 41 కమోడ్ వీల్ చైర్లు, 53 వీల్ చైర్లు, 337 టీఎల్ఎం కిట్లు, 17 క్రచ్లు, 12 ట్రైసైకిళ్లు, ఒక స్క్రీన్ రీడర్ సదుపాయం కూడిన స్మార్ట్ఫోన్, ఒక బ్రెయిలీ కిట్ ఉన్నాయి. కార్యక్రమం అనంతరం కలెక్టర్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకురాలు జి.చంద్రిక, సమగ్ర శిక్ష అకౌంట్స్ అధికారి ఆర్ఏఎస్కుమార్, కో ఆర్డినేటర్లు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రత్యేక ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
ఎదిరిద్దాం..
● మోసం చేయడం చంద్రబాబు నైజం ● వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు ధ్వజం ● కూటమి పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతిపై ఫొటో ఎగ్జిబిషన్ ● స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి ● ఉమ్మడి విజయనగరం జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, పరీక్షిత్రాజు సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు పార్వతీపురం: చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగిస్తూ, అక్రమ కేసులతో ప్రజల ను భయబ్రాంతులకు గురిచేస్తోందని విజయనగ రం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తా రు. పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత గడిచిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతి, కార్యకర్తలు, నాయకులపై జరిగి న దాడులపై నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నా వెరవకుండా, ప్రజల తరఫున పోరాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్తుండడం అభినందనీయమన్నారు. రానున్నది మన ప్రభుత్వమేనని, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు 2.0లో తగిన గుర్తింపు, సముచిత స్థానం కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి స్పష్టంచేశారన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల లో చంద్రబాబు ప్రభుత్వం సుమారు రూ.4లక్షల కోట్లు అప్పుచేసి అనుయాయులకు దోచిపెడుతోందన్నారు. ఆ భారాన్ని ప్రజలపై మోపి మరింత ఆర్థిక సంక్షోభానికి గురిచేస్తోందని తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు చెబుతున్నా సీఎం చంద్రబాబు స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. సర్ కార్యక్రమంపై కార్యకర్తలు, నాయకులు, ప్రజ లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓట్ల చేర్పులు, తొలగింపులపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయదుందుబి మోగించేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్వతీపురం మండలం, మున్సిపాల్టీ, సీతానగరం, బలిజిపేట మండలాల నుంచి వందలాదిమంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మున్సిపల్ మాజీ వైస్చైర్మన్లు యిండుపూరు గున్నేశ్వరరావు, కొండపల్లి రుక్మిణి, ఎంపీపీ మజ్జి శోభారాణి, వైస్ ఎంపీపీలు సిద్దా జగన్నాథం, బి.రవికుమార్, బలిజిపేట, సీతానగరం జెడ్పీటీసీలు అలజంగి రవికుమార్, మామిడి బాబ్జి, పార్వతీపురం, బలిజిపేట మండలాల అధ్యక్షులు బొమ్మి రమేష్, పాలవలస మురళీకృష్ణ, అనుబంధ పార్టీ సభ్యులు పోల సత్యనారాయణ, కొండలల్లి బాలకృష్ణ, బలగ శ్రీరాములనాయుడు, నాగమణి పాల్గొన్నారు. గత రెండేళ్ల పాలనలో ప్రజలు అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతీ ఇంటికి వెళ్లి వివరిద్దాం. రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయడం లేదు. మహిళలకు ఆడ బిడ్డ నిధి కింద నెలకు రూ.1500లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. నిరుద్యోగులకు జాబ్క్యాలెండర్ లేదు. నిరుద్యోగ భృతి అందించడం లేదు. గ్రామాల్లో టీడీపీ నాయకులు దళారులుగా వ్యవహరిస్తున్నారు. ఉపాధిహామీ పథకం వేతనదారుల నుంచి వారానికి రూ.230 చొప్పున వసూలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు అన్నివర్గాల ప్రజలు సిద్ధమవుతున్నారు. – అలజంగి జోగారావు, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే నమ్మించడం, ఓట్లు దండుకోవడం, మోసం చేయడం చంద్రబాబుకు అలవాటైన విద్య. మాజీ సీఎం వైఎస్ జగన్మో హన్రెడ్డి కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేసి ప్రజలకు అండగా నిలిచారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారు. – బోను గౌరీశ్వరి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చి న హామీలు అమలు చేయ కుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. అన్నివర్గాల వారిని మోసంచేశారు. సమస్యలు పరిష్కరించకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. అరాచక పాలనకు వ్యతిరేకంగా జనంతో కలిసి పోరాడదాం. ప్రజలకు అండగా నిలబడదాం. – బలగ రేవతమ్మ, జెడ్పీటీసీ, పార్వతీపురం -
ఇసుక నాటకంలో అడ్డంగా దొరికారు..
సాక్షి, పార్వతీపురం మన్యం: కొమరాడ మండలం కోరిశీల గ్రామం సర్వే నంబర్ 54–2ఏ పరిధిలోని నాగావళి నదీ తీరం నుంచి ఇసుక తవ్వుకోవడానికి గత నెల 20న నిబంధనల ప్రకారం మైనింగ్ కంపెనీకి అనుమతులు ఇచ్చారు. గత నెల 21న కలెక్టరేట్ వద్ద కొంతమంది టీడీపీ వారు.. గిరిజనులను తీసుకొచ్చి నిరసన చేయించారు. ఆ భూమిపై ఏళ్ల నాటి నుంచి ఉన్నామని.. అధికారులు కుమ్మకై ్క ఇసుక రీచ్కు అనుమతులు ఇచ్చారని వారి ఆరోపణ. ఇది వరకే కలెక్టర్కు, జేసీకి, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీనిపై ఒక్క రోజులోనే కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నారు. అంతా ఆగమేఘాల మీద జరిగిపోయింది. కోర్టు జోక్యంతో అక్కడ రీచ్కు బ్రేక్ పడింది. ఇదే మండలం కూనేరు–రామభద్రపురం వద్ద మరో రీచ్కు అధికారిక అనుమతి ఇచ్చారు. సీన్ కట్ చేస్తే.. అప్పట్లో నిరసనను ముందుండి నడిపించిన కొంతమంది సోమవారం రాష్ట్ర మంత్రి సంధ్యారాణి హాజరైన కలెక్టర్ కార్యాలయ పీజీఆర్ఎస్కు వచ్చి మరోసారి వినతి పత్రం అందజేశారు. అవే ఆరోపణలు మళ్లీ చేశారు. తహసీల్దార్, మైనింగ్ అధికారులు, కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, న్యాయం జరగడం లేదని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా? అని మంత్రి అడిగితే.. అవునని వారు బదులిచ్చారు. వెంటనే మంత్రి వారందరినీ పిలిపించారు. కురుపాం ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడారు. ఎవరికీ ఫిర్యాదు అందలేదని అటు నుంచి సమాధానం. వెంటనే సదరు వ్యక్తులు సర్దుకుని.. తాము నేరుగా ఎవరినీ కలవలేదని చెప్పుకొచ్చారు. స్పీడ్ పోస్టులో పంపించామని చెప్పారు. దీంతో మంత్రి, కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ స్థానానికి వెళ్లి చెప్పుకున్నారు గానీ, జిల్లా అధికారుల వద్దకు వచ్చి అభ్యంతరం చెప్పలేకపోయారా? అని ప్రశ్నించారు. వారు ఫిర్యాదు చేసిన వీడియోలు, ఫొటోలు కూడా ఇక్కడివి కావని.. ఎవరో తప్పుడు ఆరోపణలతో వెంట నడిపిస్తున్నారని కలెక్టర్ స్పష్టం చేశారు. ‘మీ వెనుక వైసీపీ వారు ఉన్నారా? ఎందుకు ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు’ అని మంత్రి ప్రశ్నిస్తే.. తాము ఆది నుంచి టీడీపీ వారమని ఓ వ్యక్తి బదులిచ్చాడు. ఆ వ్యక్తి ఫోన్ వెనుక భాగాన ముఖ్యమంత్రి చంద్రబాబు స్టిక్కర్ కూడా అతికించుకోవడం గమనార్హం. ఇసుక వివాదం డ్రామాలో కలెక్టర్ ప్రభాకరరెడ్డిని ఇరికిద్దామని మాఫియా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. జిల్లాలో చాలా వరకు ఇసుక తరలింపు వెనుక అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల పాత్ర ఉందన్నది తెలిసిందే. కొద్ది రోజు లుగా ఇసుక అక్రమ రవాణాపై అధికారులు దాడి చేయడం.. పెద్దఎత్తున జరిమానాలు విధించడంతో వారంతా గుర్రు మీద ఉన్నారు. దాడుల వెనుక కలెక్టర్ పాత్ర ఉందన్న అనుమానంతో తప్పుడు ప్రచారం, ఫిర్యాదులకు తెగించారు. సోమవారం పీజీఆర్ఎస్కు వచ్చి ఇసుక విషయంలో గగ్గోలు పెట్టిన వారంతా టీడీపీ వారే కావడం గమనార్హం. సమస్య లకు వారే కారణం అవుతూ.. తిరిగి వారే ఫిర్యాదు లు ఇవ్వడం విశేషం. తాము ఇసుక వ్యాపారాన్ని నమ్ముకుని ట్రాక్టర్లు కొనుక్కున్న నిరుపేదలమని.. ఇలా దాడులు చేసి వాహనాలు తీసుకుపోతే ఎలా అని సీతానగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రశ్నించాడు. ఆయన వద్ద 20 వరకూ ట్రాక్టర్లు ఇసుక వ్యాపారం మీద ఆధారపడి నడుస్తున్నాయని సమాచారం. ఇలా తరలిస్తున్న బళ్లలో ట్రాక్టరుకు రూ.350 చొప్పు న ఓ ఎమ్మెల్యేకు ముడుపులు ఇస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఒకటవ శ్రేణి నుంచి మూడవ శ్రేణి నదులలో పరిసర ప్రాంత అవసరాలకు ఇసుకను ట్రాక్ట ర్లు లేదా ఎడ్లబండ్ల ద్వారా తీసుకువచ్చన్న నిబంధనలు ఉన్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. దొరికినంత తవ్వేసి, దండిగా వ్యాపారం చేసుకుంటున్నారు. సీతానగరం మండలం లక్ష్మీపురం, బూర్జ, బలిజిపేట మండలంలోని వంతరాం, నారాయణపురం నదీ ప్రవాహ ప్రాంతాలు తవ్వకాలకు ఆమోదయోగ్యంగా లేవు. ప్రమాదకర స్థితిలో ఉన్నా.. ఇసుక అక్రమార్కులు వదలడం లేదు. ఈ క్రమంలోనే కొన్ని ట్రాక్టర్లను పట్టుకుని జరిమానా విధించారు. అవి టీడీపీకి చెందినవి కావడంతో వివాదం రేగింది. మా వాటా ఇస్తేనే రీచ్లు... కొమరాడ మండలంలో ఇసుక రీచ్లపై పెద్ద దుమారమే రేగుతోంది. వాస్తవానికి ఇక్కడ రీచ్ కోసం ఒక మంత్రి ఆశీస్సులున్న ఓ ఏజెన్సీ రూ.40 లక్షల వరకూ ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇందుకోసం ఎవరి స్థాయిలో వారికి ముడుపులు కూడా అందించినట్లు తెలిసింది. తొలుత ముడుపులకు అంగీకరించిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు.. తర్వాత అమ్మకాల్లో వాటాలు డిమాండ్ చేసినట్లు భోగట్టా. అందుకు సదరు ఏజెన్సీ చేతులెత్తేయడంతో తమ భూములు ఉన్నాయని ఓ వర్గాన్ని రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. పదేళ్లుగా ఆ భూమి వైపు వెళ్లలేదని సదరు వ్యక్తులు స్వయంగా కలెక్టర్, మంత్రి ఎదుటే అంగీకరించారు. వీరి మీద విచారణ చేయాలని మంత్రి సూచించారు. ●ఇటీవల కాలంలో కురుపాం, పార్వతీపురం నియోజక వర్గాల్లో భారీగా ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కురుపాంలోని ఓ పాఠశాల ఆవరణలో పెద్ద ఎత్తున అనధికారికంగా పోగు చేసిన ఇసుక నిల్వలను రెండు రోజుల కిందట గుర్తించారు. ఇవన్నీ టీడీపీ వారి కనుసన్నల్లో తరలిస్తున్నవే. నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక మేట వేసిన చోటే, తవ్వుకోవడానికి అనుమతి ఉంటుంది. ఇక్కడ మాత్రం నిబంధనలను కాలారసి, తవ్వేస్తున్నారు. సొంత అవసరాలకు అని అధికారులను ఏమార్చి పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకుంటున్నారు. అడ్డు వచ్చిన అధికారుల మీద తప్పుడు ఫిర్యాదులతో దాడి చేయిస్తున్నారు. రెండు రోజుల్లో కలెక్టర్ వెళ్లిపోరా! ‘కలెక్టర్ ఎన్ని రోజులుంటారు.. ఓ రెండు రోజులు. వెళ్లిపోవడం పక్కా. లేదంటే నెల, పోనీ, ఆరు నెలలో, ఏడాదో! అంతకుమించి ఉండరు. ఇసుకను తరలిస్తే, అడ్డుకునేదానికి ఆయనెవరు? ట్రాక్టర్లు కొనుక్కొని మూలన దాచుకుంటామా? ఇసుక ఉచితమే కదా! నా మీద ఆయన సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏమిటి? నేను ఎమ్మెల్యే మనిషినే. అయితే.. ఏంటంట?.. ఆయన ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నట్లు ఉంది!’ ●‘ఇసుక తరలిస్తున్నామని ప్రతిసారీ అధికారులు పట్టుకుంటామంటే ఎలా కుదురుతాది? ఎవరితో ఫోన్ చేయించాలి? చంద్రబాబుతో ఫోన్ చేయించాలా.. చెప్పండి!’ ●తమ ట్రాక్టర్లు పట్టుకున్నారని సీతానగరానికి చెందిన ఓ ఇసుక మాఫియా బహిరంగంగానే విసరుతున్న సవాళ్లు ఇవీ.. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు వచ్చి మంత్రి సంధ్యారాణికి వినతిపత్రం అందించారు. అక్కడ అనుమతులు లేనివి అక్రమంగా ఎలా తరలిస్తారు.. మీకు ఎవరైనా తవ్వుకోమని చెప్పారా?’ అని కలెక్టర్ ప్రభాకరరెడ్డి ప్రశ్నించడంతో.. అనంతరం బయటకు వచ్చిన ఇసుక మాఫియా మైనింగ్ అధికారుల వద్దే బెదిరింపులకు దిగారు. ఈ నెల పదో తేదీలోగా కలెక్టర్ను బదిలీ చేయిస్తానని ఓ ప్రజా ప్రతినిధి భరోసా ఇవ్వడంతోనే వారు ఈ విధంగా రెచ్చిపోతున్నారని వినిపిస్తోంది. -
అర్జీదారులకు రాతపూర్వక సమాధానం తప్పనిసరి
● అధికారులకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశంపార్వతీపురం రూరల్: జిల్లా ప్రజల నుంచి వచ్చే సమస్యలకు ఇక్కడే పరిష్కారం చూపాలని, ఆయా దరఖాస్తులు ముఖ్యమంత్రి వరకు వెళ్లే పరిస్థితి తీసుకురాకూడదని రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురంలోని కలెక్టరేట్లో సమావేశ మందిరంలో కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆమె ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇకపై ప్రతి సోమవారం జిల్లా కేంద్రాల్లో, ప్రతి శుక్రవారం నియోజకవర్గాల పరిధిలో గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఒకే నియోజకవర్గ కేంద్రంలో నెలలో నాలుగుసార్లు గ్రీవెనన్స్ సెల్ నిర్వహించడం ద్వారా రెవెన్యూ తదితర సమస్యల కోసం బాధితులు పదేపదే తిరిగే అవసరం లేకుండా అక్కడికక్కడే పరిష్కారమవుతాయన్నారు. గ్రీవెన్స్ సెల్కు వచ్చే ప్రజల పట్ల అధికారులు ఓపికగా వ్యవహరించాలని, ఏదైనా సమస్య పరిష్కారం సాధ్యపడకపోతే అందుకు గల కారణాలను వివరిస్తూ అర్జీదారునికి సంబంధిత మండల కార్యాలయం నుంచి రాతపూర్వకంగా లేఖ పంపాలని ఆమె స్పష్టం చేశారు. వెల్లువెత్తిన దరఖాస్తులు ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి మొత్తం 75 అర్జీలు రాగా, వాటిలో 45 సాధారణ, 30 రెవెన్యూ వినతులు ఉన్నాయి. కార్యక్రమంలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఉప కలెక్టర్ ధర్మరాజు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగుల వద్దకు ఎస్పీ స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లా డి, నిర్దేశిత గడువులోగా సమస్యలను పరిష్కరించి కార్యాలయానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, ఆస్తి వివాదాలు, వేధింపులు, ఆన్న్లైన్ వంచన తదితర అంశాలపై మొత్తం 12 ఫిర్యాదులు అందాయి. ప్రజలు ఎటువంటి భయం లేకుండా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావచ్చని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ బి.రమణమూర్తి, డీసీఆర్బీ ఎస్సై అశోక్ చక్రవర్తి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్లో 21 వినతుల స్వీకరణ సీతంపేట: ఐటీడీఏలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఐటీడీఏ పరిపాలనాధికారి వి.సునీల్ నిర్వహించి గిరిజన ప్రజల నుంచి 21 వినతులు స్వీకరించారు. మల్లమ్మకొండ గ్రామానికి చెందిన సవర బంబడు తమ గ్రామానికి కరెంటు స్తంభాలు మంజూరు చేయాలని ప్రతిపత్రం సమర్పించాడు. టెక్కలి మండలం కోదండపురం గ్రామానికి చెందిన మల్లేశ్వరరావు గ్రామానికి రోడ్డు, బ్రిడ్జి సదుపాయం కల్పించాలని అర్జీ అందజేశాడు. సారవకోట మండలం సవర శివరాంపురం గ్రామానికి చెందిన అప్పారావు ఆయిల్ ఇంజిన్ మంజూరు చేయాలని, సవరబంగి గూడ గ్రామానికి చెందిన సవర మంగులు టీవీఎస్ బైక్ ఇప్పించాలని కోరారు. సిరికొండ గ్రామానికి చెందిన కొండగొర్రె సోమయ్య మినీ ట్రాక్టర్ మంజూరు చేయాలని, గదబవలస గ్రామానికి చెందిన బాలరాజు తన సస్పెన్షన్ను రద్దు చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విన్నవించారు. అక్కన్నగూడ గ్రామానికి చెందిన సవర బంబడమ్మ సీసీ రోడ్డు మంజూరు చేయాలని, అంబలగండి గ్రామానికి చెందిన కుష్టయ్య కమ్యూనిటీ హాల్ నిర్మించాలని వినతిపత్రాలు అందజేశారు. గుజ్జి గ్రామానికి చెందిన భాస్కరరావు పవర టిల్లర్ మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించాడు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ ఎ.డి శ్రీనివాసరావు, డీడీ సెక్షన్ సూపరింటెండెంట్ అప్పారావు, వెలుగు డీపీఎం రమణ, డిప్యూటీ డీఈఓ నారాయుడు,స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానందం, జీసీడీఓ రాములమ్మ, ఏవో వాహిని ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
● హాజరైన హోం మంత్రి వంగల పూడి అనితవేపాడ: భూములపై శాశ్వతమైన హక్కులు ప్రజలకు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ మేరకు సోమవారం వేపాడ మండలంలోని బల్లంకి గ్రామంలో తహసీల్దార్ జె.రాములమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఆర్డీఓ సుధాసాగర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న హోంమంత్రి అనిత మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఎటువంటి తప్పులు లేకుండా పారదర్శకంగా పట్టాదారు పాస్పుస్తకాలు అందించేందుకు రీసర్వే నిర్వహించి రాజముద్ర తో పూర్తివివరాలతో చట్టబద్ధమైన భరోసా కల్పించేలా పట్టాదారు పాస్పుస్తకాలు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 983 గ్రామాలకు గాను 519 గ్రామాల్లో రీ సర్వే పూర్తి అయ్యిందని మరో 464 గ్రామాల్లో చేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీసీసీబీ చైర్మన్ గొంప కృష్ణ, తహసీల్దార్ రాములమ్మ, ఎంపీడీఓ సూర్యనారాయణ మండల ప్రత్యేకాధికారి లక్ష్మీనారాయణ, ఎస్కోట రూరల్ సీఐ అప్పలనాయుడు, ఎస్సై సుదర్శన్, ఎంపీటీసీ గొంప తులసి, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుడి మనస్తాపం బల్లంకిలో నిర్వహించిన పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ వేపాడ మండల అధ్యక్షుడు లట్టాల పవన్ కుమార్ను స్టేజిపైకి ఆహ్వానించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర మండలాల నుంచి వచ్చిన టీడీపీ మండల అద్యక్షులు, జనసేన నాయకులను ఆహ్వానించి అధికారులు బీజేపీని విస్మరించడం బాధాకరమని పవన్ అన్నారు. ఈ విషయాన్ని జిల్లా, నియోజకవర్గ బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు పవన్ తెలిపారు. -
విశాఖ స్టీల్ప్లాంట్ దుర్ఘటనపై చిన్నశ్రీను దిగ్భ్రాంతి
● మృతుల కుటుంబాలకు సంతాపం చీపురుపల్లి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద దుర్ఘటనపై జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సోమవారం సాయంత్రం స్టీల్ ప్లాంట్లో స్టీల్ లిక్విడ్ పడి తొమ్మిది మంది కార్మికులు మృతి చెందడం, మరికొంత మంది గాయాల భారిన పడడం విషాదకరమన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసి క్షతగ్రాతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, మృతుల కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. -
కట్టెల పొయ్యే గతి..!
వ్యాధులబారిన నిర్వాహకులు బయట పనులు లేక, ఉపాధి పనులు ఏడాది పొడవునా ఉండకపోవడంతో చాలా మంది మహిళలు వంట నిర్వాహకులుగా ఉండిపోతున్నారు. ఒక్కో నిర్వాహకురాలికి ఇచ్చే జీతాన్ని ఇద్దరు నుంచి ముగ్గురు పంచుకుంటున్నారు. కట్టెల పొయ్యిలతో వంటలు చేయడం కారణంగా చాలా మంది వంటనిర్వాహకులు కళ్ల సమస్య ఎదుర్కొంటున్నారు. వాటితో పాటు ఇప్పుడు కొత్తగా శ్వాసకోస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని వాపోతున్నారు. చాలా పాఠశాలల్లో వంట షెడ్డులు ఇరుగ్గా ఉండడంతో ఆయా షెడ్డుల్లో ఈ పొగలోనే మగ్గిపోతున్నారు. కూటమివచ్చి రెండేళ్లు కావస్తున్నా మధ్యాహ్నభోజన పథకానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి ప్రణాళికలు లేవు. శ్రమదోపిడీ కనిపిస్తోంది. – కె.సురేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఈ ఏడాది చర్యలు తీసుకుంటాం అన్ని పాఠశాలల్లో గా్యాస్ పొయ్యిలమీదనే వంటలు వండాల్సిఉంది. గతేడాది నిధుల లేమి కారణంగా పెద్దపెద్ద పాఠశాలల్లో ఇబ్బందులు వచ్చాయి. ఈ ఏడాది ఆ కష్టాలకుచెక్ పెట్టే ఆలోచనలో ఉన్నాం. విద్యార్థులు అందరికీ సరిపడేలా వంటలు వండేందుకు గ్యాస్ పొయ్యిల వినియోగంపై ఉన్నతాధికారులతో మాట్లాడాం. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల వరకూ ఎటువంటి ఇబ్బందులులేవు. ఉన్నత పాఠశాలల్లో ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అధిగమిస్తాం. – యాగాటి దుర్గారావు, ఎంఈఓ, రాజాంరాజాం: గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రస్తుతం నీరుగారే పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వం శుచి, రుచికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా వంట నిర్వాహకుల కష్టాలకు చెక్పెట్టే దిశగా పలుచర్యలు తీసుకుంది. వంట వండేవారికి నెలకు రూ.3 వేల వేతనంతో పాటు కట్టె పొయ్యిల సమస్యలకు చెక్పెట్టి, గ్యాస్ బండల వినియోగాన్ని తెరమీదికి తీసుకొచ్చింది. ఈ మేరకు పలు పాఠశాలల అభివృద్ధి నిధులతో గ్యాస్ పొయ్యిలు కొనుగోలు చేసి అప్పగించింది. కొన్నిచోట్ల దాతలు, మరికొన్నిచోట్ల కమిటీలు వాటిని కొనుగోలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గ్యాస్ సిలిండర్లకు నిధులు విడుదల తగ్గిస్తూ వచ్చింది. చివరకు చాలీచాలనీ ఆ డబ్బులతో గ్యాస్ సిలిండర్లు విడిపించలేక కట్టెలపొయ్యిలమీదే నిర్వాహకులు వంటలు వండేవారు. ఈ ఏడాది అదే పరిస్థితి కనిపిస్తోంది. నిర్వాహకులను ఆదుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో వంట నిర్వాహకులు వివరాలు మండలం – వంట నిర్వాహకులు రాజాం – 145రేగిడి – 178సంతకవిటి – 162వంగర – 142 చాలీచాలని డబ్బులు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో వంట నిర్వాహకులకు చాలీచాలని డబ్బులు అందుతున్నాయి. ప్రాథమిక పాఠశాలకు ఒకరు, ప్రాథమికోన్నత పాఠశాలకు ఇద్దరు, ఉన్నత పాఠశాలలో ముగ్గురు నుంచి నలుగురు వంట నిర్వాహకులు మాత్రమే ఉండాలి.ఉన్నత పాఠశాలల్లో వంటలు వండాలంటే 200 మంది విద్యార్థులు దాటితే కనీసం ఆరుగురు సిబ్బంది ఉండాలి. చాలా పాఠశాలల్లో 500 మంది విద్యార్థులు దాటి ఉన్నారు. ఆయా పాఠశాలల్లో ఎనిమిది మంది నుంచి పదిమంది నిర్వాహకులు ఉంటేగానీ వంటలు జరుగడంలేదు. ఈ ప్రభుత్వం ఇస్తున్న అరాకొర డబ్బులను ఆ పదిమంది సర్దుబాటుచేసుకుని వంటలు వండుతున్నారు. వాటికి తోడు 10 సంవత్సరాల్లోపు విద్యార్థికి రూ.5.88, 10 నుంచి 15 సంవత్సరాల మద్య విద్యార్థులకు రూ. 8.57 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుండడంతో ఈ డబ్బులు ఆయా పాఠశాలల్లో కట్టెలు, ఇతర వంట సామగ్రి కొనుగోలు చేసుకునేందుకు కూడా చాలని పరిస్థితి ఉందని వంట నిర్వాహకులు వాపోతున్నారు. ప్రస్తుతం వంటసామగ్రి ధరలు పెరిగాయని, పప్పుతో పాటు ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు అధికంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వంటనిర్వాహకులు వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అందని గ్యాస్ సిలిండర్లు కట్టెల పొయ్యిలమీదే గతేడాది ఎండీఎం వంటలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులబారిన నిర్వాహకులు ఈ ఏడాది అదే పరిస్థితి -
అర్జీల పరిష్కారంలో మతలబు?
విజయనగరం అర్బన్: జిల్లా నలుమూలల నుంచి ఆశతో తరలివచ్చే పేద ప్రజల సమస్యలు తీర్చే ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ’రెవెన్యూ క్లినిక్’లో అర్జీలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనం పోటెత్తారు. ఎండను సైతం లెక్కచేయకుండా, వందల రూపాయలు ఆటో చార్జీలు భరించి, చేతిలో అర్జీలతో క్యూలో నిలబడ్డ బాధితుల ఆవేదన చూస్తే.. క్షేత్రస్థాయిలో పాలన ఎంతగా ’స్తంభించిందో’ అర్థమవుతోంది. తాజా వినతుల వెల్లువను పరిశీలిస్తే ప్రభుత్వ శాఖల పనితీరు, ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థ ఎంతగా నిర్వీర్యమైందో స్పష్టంగా తెలుస్తోంది. శాఖల వారీగా ’సమస్యల’ కుప్ప ఇదే! సోమవారం ఒక్కరోజే పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లలో కలిపి మొత్తం 229 వినతులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా 110 వినతులు కేవలం రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. భూ సమస్యలు, సర్వే వివాదాల చుట్టూ పేదలు ఏళ్ల తరబడి తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. వివిధ శాఖల్లో వచ్చిన వినతుల వివరాలు ఇలా ఉన్నాయి: రెవెన్యూశాఖకు 110, డీఆర్డీఏ 31, పంచాయతీ రాజ్ 16, విద్యాశాఖ 13, మున్సిపల్ శాఖ 11, విద్యుత్ శాఖ 10, గ్రామ సచివాలయ శాఖ 10, జిల్లా వైద్యారోగ్య శాఖ 6, గృహ నిర్మాణ శాఖ 3, డీసీహెచ్ఎస్ 2, ఇతర శాఖలకు 17 వచ్చాయి. ఆన్లైన్లో ’డిస్పోజ్’.. క్షేత్రస్థాయిలో సున్నా.. పెండింగ్ వినతులను పరిష్కరించిన వెంటనే ఆన్న్లైన్లో ’డిస్పోజ్’ చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) సీహెచ్. సత్తిబాబు అధికారులను ఆదేశించాల్సి రావడం చూస్తే.. వెబ్సైట్లలో గణాంకాలను చూపించడానికి అధికారులు ఎంత తహతహలాడుతున్నారో అర్థమవుతోంది. క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కాకపోయినా, కేవలం ఆన్లైన్లో ’క్లోజ్’ చేస్తున్నారనే విమర్శలు అర్జీదా రుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు వెబ్సైట్ చూసుకోవడమే తప్ప, బాధితుడి ఇంటికెళ్లి సమస్యను రూపుమాపే నాథుడే కరువయ్యాడు. అర్జీదారును కలవకుండానే ఎండార్స్మెంట్లు ‘ఆర్జీదారులను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడిన తర్వాతే ఎండార్స్మెంట్ (ముగింపు నివేదిక) ఇవ్వాలి. మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్టులో రాయాలి‘ అంటూ డీఆర్వో ఆదేశాలు జారీ చేయడం ద్వారా, ఇప్పటివరకు అధికారులు అర్జీదారులను కలవకుండానే, ఆఫీసుల్లో కూర్చుని తప్పుడు నివేదికలతో ఫైళ్లను మూసేస్తున్నారనే చేదు నిజం బట్టబయలైంది. 1100 టోల్ ఫ్రీ.. ఒరిగింది శూన్యం! ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ’1100 టోల్ ఫ్రీ’ నంబర్ ద్వారా అందిన కాల్స్ పట్ల అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో డీఆర్వో క్లాస్ పీకిన తీరే చెబుతోంది. టోల్ ఫ్రీ నంబర్ పై ప్రజల్లో అవగాహన లేకపోగా, వచ్చిన కాల్స్కు కూడా అధికారులు బాధ్యతారాహిత్యంగా సమాధానాలు ఇస్తూ కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పీజీఆర్ఎస్ జిల్లా నోడల్ అధికారి ఇ.మురళి, జిల్లా స్పెషల్ డిప్యూటి కలెక్టర్ ఎస్. వెంకటేశ్వరరావు, కళావతి, అరుణ కుమారి, శాంతి, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఎస్పీ పీజీఆర్ఎస్కు 36ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకార్యక్రమంలోఫిర్యాదు దారులనుంచి ఎస్పీ 36 ఫిర్యాదులు స్వీకరించారు.ప్రజల సమస్యలను ఎస్పీ శ్రద్ధగా విని సంబంధిత పోలీసు అధికారులతో ఫిర్యాదు దారుల ముందే మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, వారికి న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ ఏఆర్దామోదర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్మీ సీఐ కె.కుమారస్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. గుట్టలుగా అర్జీలు..కానరాని పరిష్కారం క్షేత్రస్థాయిలో అంతులేని అలసత్వం కాగితాలకే పరిమితమవుతున్న ’డిస్పోజల్స్’ ఒక్క రోజే 229 వినతులు -
● చంద్రబాబు పాలనపై నమ్మకం పోయింది
చంద్రబాబు ఉచిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. సంక్షేమ పథకాలను ఎగ్గొట్టేశారు. రెండేళ్లలో ఆయన పాలనపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసికట్టుగా పనిచేద్దాం. జగన్ 2.0లో పార్టీ కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యం లభిస్తుంది. పార్వతీపురంలో పార్టీ పటిష్టతకు జోగారావు కృషి ఎనలేనిది. – శత్రుచర్ల పరీక్షిత్రాజు, వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా ఽఅధ్యక్షుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 704 రోజులు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసింది. ఎన్నికల సమయంలో ఆరు హామీల పేరుతో ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చింది. వాటిని అమలుచేయడంలో విఫలమై ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీని రాజకీయంగా ఎలా అడ్డుకోవాలనే అంశంపైనే కూటమి నాయ కులు దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాడినప్పుడే పార్టీ కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుంది. పార్టీ మరింత బలపడుతుంది. – మామిడి శ్రీనివాసరావు, పార్వతీపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకుడు -
నవ్విపోదురు గాక..!
● శ్మశాన వాటికకు పసుపు రంగువిజయనగరం ఫోర్ట్: గురివింద గింజ తన నలుపు తాను ఎరగనట్లు టీడీపీ నేతలు తాము చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అన్న చందగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలు అంతా సచివాలయాలకు, ప్రభుత్వ భవనాలకు వేసే రంగులపై నానాయాగీ చేశారు. వైఎస్సార్సీపీ రంగులు వేసుకుంటున్నారంటూ తెగ ప్రచారం చేసేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు ఏర్పాటు చేసే శిలాఫపలకాలు, శ్మశాన వాటికలకు కూడా ప్రస్తుతంఅధికార పార్టీ పసుపు రంగు వేస్తున్నారు. -
కోటదుర్మమ్మ ఆలయ ఈఓకు తోటపల్లి దేవస్థానం బాధ్యతలు
గరుగుబిల్లి: పాలకొండలోని కోటదుర్గమ్మ ఆల యం ఈఓ వి.వి.సూర్యనారాయణ గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి వేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి ఆలయాల కార్యనిర్వహణాధికారిగా సోమవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈఓగా విధులు నిర్వహిస్తున్న బి.శ్రీనివాస్ జూన్ 21 వరకు మెడికల్ లీవ్ పెట్టారు. దీంతో సూర్యనారాయణకు అద నపు బాధ్యతలు అప్పగిస్తూ దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీతంపేట: సీతంపేట ఏరియా ఆస్పత్రిలో ఒక్క రోజు 10 మలేరియా కేసులు నమోదు కావడం అటు ప్రజలు, ఇటు వైద్యవర్గాలను ఆందోళన కు గురిచేస్తోంది. తీవ్రమైన ఎండలు, అకాల వర్షాలకు ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. సోమవారం మొత్తం 357 ఓపీలు నమోదయ్యా యి. జ్వరంతో బాధపడుతున్న వారిని పరీక్షించగా.. మలేరియా ఆర్డీటీ కిట్ పాజిటివ్ 7, స్లైడ్ పాజిటివ్– 3 కేసులు నిర్ధారణ అయినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు తెలిపారు. మలేరియా పీడితులకు వెంటనే చికిత్స ప్రారంభించామన్నారు. మిగిలిన వారికి వ్యాధి నిర్ధారణ బట్టి వైద్యసేవలు అందించి మందులు అందజేశామని చెప్పారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
విజయనగరం ఫోర్ట్: ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక విజయనగరంలోని దాసన్నపేటలో సోమవారం జరిగింది. సంఘ రీజనల్ కార్యదర్శిగా సురగాల లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా అధ్యక్షుడిగా గేదెల రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్గా గుమ్మడి దేముడు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.రామునాయుడు, సెక్రటరీగా డి.శ్రీనివాస్కుమార్, కోశాధికారిగా బి.కూర్మారావు, ఉపాధ్యక్షులుగా బి.రమణమూర్తి, జి.చంద్రరావు, జె.రాజబాబు, కె.ప్రసాదరావు, ఎ.రవి, ఎస్.నాగరాజు, మహిళా ఉద్యోగుల ప్రతినిధిగా బాలకుమారి ఎంపికయ్యారు. పేకాట శిబిరంపై దాడిరామభద్రపురం: మండలంలోని చందాపురం గిరిజన గ్రామం శివారులో సోమవారం పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి ఆరుగురు జూదరులను పట్టుకున్నారు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ శివారులో కోత ముక్కల పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేసి ఆరుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు.వారి నుంచి రూ.11,500లు నగదు,ఆరు సెల్ఫోన్లు,మూడు బైక్లు,ఒక ఆటో స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఎస్సై జ్ఞానప్రసాద్ కేసునమోదుచేశారు. పెంచిన ‘పెట్రో’ ధరలు తగ్గించాలి పెట్రో ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ, సీపీఎంలు పోరుబాట పట్టాయి. విజయనగరం జిల్లా కేంద్రంలోని గంటస్తంభం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నేత బుగత అశోక్, రామకృష్ణనగర్లో సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకుడు రెడ్డి శంకరరావు పాల్గొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ పదేపదే పెంచుతున్నా ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామి అయిన రాష్ట్రంలోని కూటమి సర్కారు నోరు మెదపడం లేదని విమర్శించారు. పెంచిన పెట్రో ధరలతో పాటు పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జూన్ 9న వామపక్షాలు చేపట్టే దేశవ్యాప్త నిరసనలకు ప్రజలంతా మద్దతు తెలపాలని కోరారు. – విజయనగరం గంటస్తంభం -
సీ్త్ర‘నిధి’ స్వాహా..!
కొత్తవలస: తీసుకున్న సీ్త్రనిధి రుణాలను నిబంధనల ప్రకారం 22నెలల 15 రోజుల్లో చెల్లించాం.. కానీ మరో నెలన్నర డబ్బులను (24 నెలలు కట్టించుకున్నారు) అదనంగా వసూలు చేశారు.. ఆ డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్లాయో చెప్పాలి.. తక్షణమే తిరిగి చెల్లించాలంటూ కొత్తవలస మండలం పాతసుంకరపాలెంకు చెందిన పొదుపు సంఘాల మహిళలు సోమవారం ఆందోళన చేశారు. గ్రామానికి వెళ్లిన ఏపీఎం ఎ.వెంకటరమణతో పాటు నలుగురు సీసీలు, సీ్త్రనిధి మేనేజర్ పి.ధనలక్ష్మిని నిలదీశారు. ఏళ్లతరబడి అదనంగా వసూలు చేసిన డబ్బులను ఎవరి ఖాతాలోకి వెళ్లాయో చెప్పాలంటూ చుట్టుముట్టారు. 2018 నుంచి సుమారుగా రూ.2 కోట్ల వరకు సీ్త్రనిధి రుణాలు తీసుకుంటూ సకాలంలో వాయిదాల ప్రకారం చెల్లిస్తున్నామన్నారు. ఒక్కో గ్రూపు నుంచి నెలన్నర వాయిదా చొప్పున అదనంగా డబ్బులు వసూలు చేసి రూ.లక్షల్లో కాజేశారంటూ పొదుపు సంఘాల సభ్యులు ధనలక్ష్మి, లెంక కనకేశ్వరి, బెహరా శ్రీదేవి తదితరులు ఆరోపించారు. వెలుగు అధికారులు, బుక్ కీపర్ను ప్రశ్నించినా సమాధానం లేదన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొదుపు సంఘాల మహిళలకు ఆర్థిక న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు. ఆందోళనకు దిగిన పాతసుంకరపాలెం మహిళలు ఏళ్లతరబడి అదనపు వసూళ్లపై ఆందోళన నెలన్నర చొప్పున డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ -
యోగాంధ్ర తెచ్చిన తంటా..!
విజయనగరం క్రైమ్: చంద్రబాబు సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన యోగాంధ్ర కార్యక్రమం ఆదివారం రెండు శాఖల మధ్య తంటా తెచ్చిపెట్టింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద ఉదయం ఆరున్నర గంటలకు యోగాంధ్ర పేరుతో మహిళలతో యోగాసనాలు వేయించారు. ఇందుకోసం ఆ రోడ్డులో ముందుగానే ఎడమవైపు శివాలయం వీధి, కుడిపైపు కోరాడ వీధిని మున్సిపల్ కార్పొరేషన్ శాఖ దిగ్బంధం చేయంచింది. వాస్తవానికి అక్కడే యోగా కార్యక్రమం ఉంటుందని పోలీస్ శాఖకు ముందుగానే చెప్పాలి. పోలీస్ శాఖకు వచ్చే ఆదేశాలతో ట్రాఫిక్ విభాగాన్ని అప్రమత్తం చేస్తుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా కార్యక్రమం జరిగిపోతుంది. అనుకున్న ప్రకారం ఉదయం ఆరున్నర గంటలకు మున్సిపల్ శాఖ యోగా ఇన్ స్ట్రక్టర్స్తో పైడితల్లి దేవాలయం వద్దే మహిళలతో యోగాసనాలు వేయించి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించింది. ఆదే సమయంలో అటు శివాలయం వీధి నుంచి ఇటు కోరాడ వీధి నుంచి ప్రజలు రాకుండా బారికేడ్స్తో పాటు హర్డిల్స్ పెట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో ఇటు మున్సిపల్ శాఖ, అటు ట్రాఫిక్ పోలీసులకు ప్రజలు అక్షింతలు వేశారు. సరిగ్గా 7.45కు కార్యక్రమం అయిపోయిన వెంటనే అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై సత్యం నాయుడికి ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఫోన్ చేసి మరీ అక్షింతలు వేశారు.యోగాంధ్ర కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రజలు ఇబ్బందులు పడ్డారని కంట్రోల్ రూమ్ కు ఫోన్ ల ద్వారా ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనికి ఏఎస్సై నాయుడు బదులిస్తూ మున్సిపల్ శాఖ ముందుగా సమాచారం ఇవ్వలేదని, ఎస్సై భాస్కర్, తాను,హెచ్సీ హరి ఉదయం ఆరు గంటలకే యోగాంధ్ర కార్యక్రమం జరిగే స్థలానికి వచ్చి ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టామని వివరణ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం ప్రజలను కాస్త ఇబ్బంది పెట్టింది. పైగా అటు మున్సిపల్ శాఖ, ఇటు ట్రాఫిక్ విభాగాల మధ్య తంటా తెచ్చిపెట్టింది. -
731 కిలోల పీడీఎస్ బియ్యం పట్టివేత
గంట్యాడ: మండలంలోని రామభద్రపురం గ్రామం మెయిన్ రోడ్డులో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 731 కిలోల పీడీఎస్ బియ్యాన్ని అధి కారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. సీఎస్ డీటీ వీవీఎస్ మూర్తి, వీఆర్వోతో కలిసి వాహనాల ను తనిఖీ చేయగా ఓ ఆటోలో 15 ప్లాస్టిక్ సంచుల్లో బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఆటో డ్రైవర్తో పాటు బియ్యం కొనుగోలు చేసిన వ్యక్తిపై 6ఎ కేసు నమోదు చేయాలని కలెక్టర్, పౌర సరఫరాల శాఖకు నివేదిక పంపించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మధ్యవర్తుల సమక్షంలో స్థానిక రేషన్ దుకాణం డీలర్కు, ఆటోను గంట్యాడ పోలీసులకు అప్పగించారు. -
సోమవారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షి, పార్వతీపురం మన్యం: చమురు సంస్థలు మరోసారి షాక్ ఇచ్చాయి. ఈ సారి మహిళల వంటింటిపై బాంబు పేల్చాయి. గృహవసరాల గ్యాస్ సిలిండర్ల ధరను ఆదివారం రూ.29 చొప్పున పెంచాయి. చివరిగా గత మార్చి నెలలో రూ.60 చొప్పున వడ్డించిన విషయం విదితమే. మూడు నెలల వ్యవధిలోనే రెండోసారి ధరలు పెంచడంపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 16 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. తాజాగా పెరిగిన ధరలతో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రూ.969.50 అయ్యింది. జిల్లాలో సాధారణ, సీఎస్ఆర్, పీఎంయూవై, దీపం, ట్రైబుల్ కలిపి మొత్తం 3.16 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సగటున నెలకు 1.50 లక్షల సిలిండర్లు వినియోగం అవుతాయని అంచనా. దీనివల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజల వంటింటి ఖర్చుపై అదనపు భారం పడనుంది. రాయితీకీ మంగళం ఓ వైపు గతంలో రూ.వందల్లో ఉండే రాయితీ అమాంతం తగ్గిపోయింది. ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న రాయితీ రూ.3 చొప్పునే తిరిగి బ్యాంకు ఖాతాలో జమవుతోంది. దీనివల్ల వినియోగదారులు పూర్తి మొత్తమిచ్చే సిలిండర్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది కాక.. ఇంటికి తీసుకొచ్చి బండ ఇచ్చినందుకు డెలివరీ బాయ్స్కు అదనంగా రూ.50 ఇవ్వాల్సి వస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇది కూడా సగం మందికి అందని పరిస్థితి. గతంలో గ్యాస్ ధరలు పెరిగినప్పుడు, వినియోగదారులపై ఆ భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ మొత్తం భరించేవి. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేకపోయింది. ధరలతో దడదడ ఓ వైపు పెట్రో ధరలు, మరోవైపు గ్యాస్ ధరలు కొద్ది రోజులుగా పెరుగుతూ పోతుండడంతో సామాన్యు లు విలవిలలాడుతున్నారు. మోయలేని భారాలతో సతమతమవుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు పెరిగిన ధరలను భరించలేకపోతున్నారు. చేసేది లేక మోయలేని భారాలు మోస్తున్నామని పలువురు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో సామాన్యుని జీవనం అతలాకుతలమవుతుందని ఆవేదన చెందుతున్నారు. ఈ ధరలు ఇలా పెరుగుతూ పోతే భవిష్యత్లో మరిన్ని కష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మొదలు.. ఆ సాకును చూపుతూ చమురు సంస్థలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి. మూడు నెలల వ్యవధిలోనే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు రెండు సార్లు.. నెల రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగు సార్లు పెంచాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.118, డీజిల్ రూ.105 వరకు ఉంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్ ధర గత ఫిబ్రవరిలో రూ.1,824 ఉండగా... విడతల వారీగా పెంచుతూ ప్రస్తుతం రూ.3,228 అయ్యింది. వాణిజ్య సిలిండర్లపై ఎటువంటి రాయితీ ఉండదు. ఈ ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార ఉత్పత్తుల సంస్థలపై పడుతోంది. ఈ మూడు, నాలుగు నెలల కాలంలోనే ఆహార పదార్థాల ధరలను హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు పెంచేశాయి. గ్యాస్ కొరత బూచిగా చూపుతూ, పెద్ద రెస్టారెంట్లు బిల్లుతో పాటు, గ్యాస్ చార్జీలు అంటూ అదనపు మొత్తం వడ్డిస్తున్నాయి. మొత్తంగా ఈ భారం కూడా ప్రజల మీదే పడుతోంది. ఇలా పెరుగుతున్న చమురు ధరల కారణంగా తమ నెలవారీ బడ్జెట్ తలకిందులు అయ్యిందని సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాపోతున్నారు. గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెంపు రూ.29లు పెంపు వంటింటిపై మరింత భారం సామాన్యుల నడ్డి విరుస్తున్న ధరల పెంపు గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుతో విలవిల -
ఇంత జాప్యమా..!
గంట్యాడ మండలానికి చెందిన ఆర్.భైరాగి వయసు అరవై ఏళ్లు పైబడి ఉంటుంది. కానీ అతని ఆధార్ కార్డులో వయసు తక్కువగా నమోదైంది. దీంతో వృద్ధాప్య పింఛన్ పొందేందుకు తనకు వయసు నిర్ధారణ పత్రం మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు చేసి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు అతనికి వయసు నిర్ధారణ పత్రం మంజూరు కాలేదు. విజయనగరం పట్టణంలోని దాసన్నపేటకు చెందిన కె.సూర్యనారాయణ వయసు అరవై ఏళ్లు పైబడి ఉంటుంది. కానీ అతని ఆధార్ కార్డులో వయసు తక్కువగా నమోదైంది. దీంతో వృద్ధాఫ్య పింఛన్ పొందేందుకు తనకు వయసు నిర్ధారణ పత్రం మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఇప్పటి వరకు ఈ ధ్రువీకరణ పత్రం మంజూరు చేయలేదు. ఇంతలోనే ఈ వృద్ధుడు ఇటీవల మృతి చెందాడు. విజయనగరం ఫోర్ట్: అది ఎన్నికల సమయం.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నేతలు ఊరూవాడ.. ఒక్కటిగా 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని గొప్పగా ప్రచారం చేశారు. పింఛన్ మంజూరు సంగతి దేవుడెరుగు.. వృద్ధాప్య వయసు నిర్ధారణ పత్రాలకు కూడా ఇప్పుడు ఏళ్ల తరబడి తిప్పుతున్నారు. ఈ పత్రాల మంజూరులో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి కొందరు వృద్ధులకు 60 ఏళ్లు పైబడి వయసు ఉన్నా.. ఆధార్ కార్డులో తక్కువగా వయసు నమోదు కావడంతో వృద్ధాప్య పింఛన్ మంజూరు కాని పరిస్థితి నెలకొంది. ఇంతలోనే కొందరు వృద్ధులు తనువు చాలిస్తున్నారు. ఆధార్ కార్డులో వయసు తక్కువగా నమోదైతే అటువంటి వారు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వయసు నిర్ధారణ ధ్రువీకరణ పత్రాలు ఇప్పిస్తామని అధికారులు చెప్పడంతో జిల్లా వ్యాప్తంగా 3733మంది వృద్ధులు దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్లుగా.. వృద్ధులకు వయసు నిర్ధారణ పత్రాలు మంజూరు చేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఆర్డీఏ అధికారులు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అధికారులు ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకోవడంతోనే కాలం వెళ్లదీస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో ఒక్కరికి కూడా ఈ ధ్రువీకరణ పత్రం ఇచ్చిన దాఖలాల్లేవు. ఈ విషయమై సర్వజన ఆస్పత్రి అధికారులు అంత మందికి ఒకేసారి వయసు నిర్ధారణ పత్రాలు ఇవ్వలేమని, విడతల వారీగా పంపిస్తే చేస్తామని చెబుతున్నారు. డీఆర్డీఏ అధికారులు మాత్రం విడతల వారీగా పంపిస్తామనిగాని, పంపించమనిగాని ఏదీ చెప్పడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ రెండు శాఖల సమన్వయ లోపం వృద్ధుల పాలిట శాపంగా మారిందనే ఆరోపణలున్నాయి. వయసు నిర్ధారణ పత్రాల కోసం వృద్ధులను ఎందుకు పంపించడం లేదని డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణిని ఫోన్లో అడిగేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. వృద్ధుల వయసు నిర్ధారణ ధ్రువీకరణ పత్రాల కోసం 3733 మంది జాబితాను డీఆర్డీఏ అధి కారులు అందించారు. అయితే అంత మందికి ఒకేసారి ఈ పత్రాలు ఇవ్వలేం. విడతల వారీగా పంపిస్తే పత్రాలు మంజూరు చేస్తామని చెప్పాం. ఇంత వరకు ఎవరినీ పంపించలేదు. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
మలేరియాతో తస్మాత్...!
ప్రాణాలైనా ఇస్తాం.. భూములివ్వం... సీతంపేట: ఎపిడమిక్ సీజన్ ప్రారంభమైంది. జూన్ నుంచి అక్టోబరు వరకు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే జ్వరాలతో స్థానిక ఏరియా ఆస్పత్రి, పీహెచ్సీలు, సీహెచ్సీలతో పాటు ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా చలి, జ్వరంతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు అధికమౌతుంది. జిల్లాలో వందల సంఖ్యలో జ్వర పీడితులు వైద్యం కోసం వస్తుంటే అందులో రోజుకు కనీసం 50 కేసులు వరకు మలేరియా పీవీ, పీఎఫ్ కేసులు నమోదౌతున్నట్టు అధికారిక సమాచారం. కానీ వీటికి రెండింతలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కేసులు నమోదౌతుండడం బట్టి చూస్తే ఈ ఏడాది మలేరియా తీవ్రత ఎంత ఉందో ఇట్టే అవగతమౌతుంది. పలు జాగ్రత్తలతోనే ఈ వ్యాధిని నిర్మూలించుకోవచ్చని వైద్య శాఖ చెబుతుంది. మలేరియా ఎలా వస్తుంది? ప్లాస్మోడియం పరాన్న జీవి ద్వారా ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడంతో మలేరియా వస్తుంది. ఈ దోమలు మురుగునీటి నిల్వల్లో పెరుగుతాయి. ప్లోస్మోడియ జాతికి చెందిన నాలుగు రకాల పేరసైట్స్ వలన వస్తుంది. ప్లాస్మోడియం వైవాక్స్, ఫాల్సీఫారం, ఒవెల్ రకాల్లో మొదటి రెండు రకాల వలన మలేరియా జ్వరం వస్తుంది. ఎలా మొదలౌతుంది.. ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం వలన ఏడు నుంచి పది రోజుల లోపల మలేరియా వస్తుంది. చలి, వణుకు, ఒళ్లు నొప్పులతో కూడిన విపరీతమైన జ్వరం రోజు మార్చి రోజు వస్తుంది. చెమటలు ఎక్కువగా పట్టడంతో జ్వరం తగ్గుతుంది. ఈ లక్షణాలు ఉన్న వారు వెంటనే మీ దగ్గర్లోని ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలి. ఆర్డీటీ కిట్ ద్వారా రక్తపూత పరీక్షల ద్వారా మలేరియా వ్యాధిని నిర్దారించవచ్చు. ఆర్డీటీ కిట్ ప్రతీ ఆశా, మహిళా ఆరోగ్య కార్యకర్త వద్ద ఉంటుంది. వ్యాధిని బట్టి చికిత్స అందజేస్తారు. చికిత్స రక్తపూత పరీక్షల్లో నిర్ధారించిన ప్లాస్మోడియం రక్తాన్ని బట్టి వైద్యాధికారి చికిత్స అందజేస్తారు. ప్లాస్మోడియం వైవాక్స్ అయితే 14 రోజులు, ప్లాస్మోడియం ఫాల్సిఫారం అయితే మూడు రోజులు సంబంధిత మందులు ఇస్తారు. మందులు క్రమం తప్పకుండా వాడకపోయినా, సరైన సమయంలో వైద్య సిబ్బంది సలహా తీసుకోకపోయినా మలేరియా జ్వరం తీవ్ర స్థాయికి చేరి మెదడుకు వ్యాపించే ప్రమాదం ఉంది. బొండపల్లి: తమకు జీవనాధారంగా ఉన్న భూములను ఎట్టి పరిస్థితుల్లోననూ ఫుడ్ ప్రాసెసింగ్ యూ నిట్కు ఇచ్చేది లేదని మూడు గ్రామాల రైతులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ భూములను ప్రభు త్వం బలవంతంగా లాక్కోవాలని చూస్తే ప్రాణాలై నా.. ఇస్తామని, భూముల మాత్రం ఇవ్వమని తేల్చి చెప్పారు. మండలంలోని కిండాం అగ్రహరం గ్రా మంలో సీపీఎం, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో బాధిత మూడు గ్రామాలకు చెందిన రైతులు ఆదివా రం సమావేశమయ్యారు. రైతు సంఘం జిల్లా ప్రధా న కార్యదర్శి బుద్దరాజు రాంబాబు, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ నేతృత్వంలో వీరు ఏకమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన పది రోజులుగా రెవె న్యూ అధికారులు, తహసీల్దార్ మూడు గ్రామాల పరిధిలో తాము సాగు చేసుకుంటున్న భూములను సర్వే చేసి తమను భయభ్రాంతులకు గురి చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొండకిండాం గ్రామంలో గత ఏడాది ఎంఎస్ఎంఈ పార్కు పేరుతో సుమారు 58 ఎకరాల భూములను లాక్కొన్నారని, అందులో ఎస్సీ, ఎస్టీలు సాగు చేస్తున్న మామిడి, జీడితోటలు 12 ఎకరాల వరకు ఉన్నా.. వారికి న్యాయం చేసి నష్టం పరిహారం అందజేస్తామని చెప్పిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని నేతలు ధ్వజమెత్తారు. ఈ భూ ముల్లో ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేదన్నారు. తాజాగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో కొండ కిండాం, కిండాం అగ్రహరం, రాచకిండాం గ్రామా ల పరిధిలో 175 ఎకరాలు రైతులు దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములను రెవెన్యూ అధికారులు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారని దీన్ని ఖండిస్తున్నామని తెలిపారు. మూడు గ్రామాల పరిధిలో 40 ఎకరాల డి పట్టా భూములతో పాటు 50 ఎకరా ల జిరాయితీ పల్లపు భూములను, 85 ఎకరాల వరకు జిరాయితీ మామిడి తోటలను బలవంతంగా లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని రైతు సంఘం, సీపీఎం నేతలు ధ్వజమెత్తారు. వీరికి తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూసేకరణను నిరసిస్తూ ఈ నెల 8న సోమవారం మూడు గ్రామాల బాధిత రైతులతో కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నట్టు రైతు సంఘం, సీపీఎం నేతలు తెలిపారు. భూసేకరణను నిరసిస్తూ పోరాట కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. పోరాట కమిటీ కన్వీనర్గా చొక్కాకు సన్యాసినాయుడు, కో కన్వీనర్గా బొంగు అప్పారావు, భోపారపు శ్రీను, పెంట శివప్రసాద్, భోపారపు ఈశ్వరరావును ఎన్నుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లె శ్రీనివాసరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తొత్తడి పైడిపునాయుడు, మూడు గ్రామాల బాధిత రైతులు పాల్గొన్నారు. చేయాల్సినవి... నీరు నిల్వ ఉంచిన తొట్లు, ఇతర పాత్రలు మూసివేయాలి. ఇంటిలో ఉన్న నీటి కుళాయిల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. వారానికి ఒక సారి నీటి తొట్టెలను, ఇతర పాత్రలను శుభ్రంగా కడిగి, తుడిచి మరల నీరు నింపుకోవాలి. దోమ తెరలను తప్పనిసరిగా వాడుకోవాలి. ఉదయం, సాయంత్రం 5 గంటల నుంచి ఆరు గంటల సమయంలో తలుపులు మూసి ఉంచాలి. మలేరియా సిబ్బందితో సహకరించి ఇంటి లోపల దోమల నివారణా మందును స్ప్రేయింగ్ చేయించుకోవాలి. ఇంటిలోపల పనికిరాని చెత్తను ఉంచరాదు. చేయకూడనవి.. మూతలు పెట్టకుండా నీరు నిల్వ ఉంచడం. ఉదయం, సాయంత్రం సమయంలో తలుపులు తెరచి ఉంచడం. దోమల మందును పిచికారీ చేసిన తరువతా గోడలు, తలుపు మూలలు శుబ్రం చేయడం. వాటర్ ట్యాంకులు మూతలు తెరిచి ఉంచడం. నీరు చేరే చోట పనికిరాని వస్తువులు, ఖాళీ డబ్బాలు ఉంచడం. జాగ్రత్తలతోనే నిర్మూలన ఎపిడమిక్ సీజన్ ప్రారంభం రోజురోజుకు పెరుగుతున్న మలేరియా కేసులు జ్వరపీడితులతో నిండుతున్న ఆస్పత్రులు పరిసరాల పరిశుభ్రత పాటించకుంటే ప్రమాదమే.. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉన్నాం. జ్వరపీడితులు వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేస్తున్నాం. మలేరియా పీవీ, పీఎఫ్లు వస్తే వెంటనే రోగికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మందులు అందజేస్తున్నాం. అన్ని వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయి. – బి.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి, సీతంపేట హైరిస్క్ మలేరియా గ్రామాల్లో దోమల నివారణా మందు స్ప్రేయింగ్ చేస్తున్నాం. జ్వరాల వ్యాప్తిని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. లార్వా వేట కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని గ్రామాలకు దోమ తెరలను కూడా పంపిణీ చేశాం. – జె.మోహన్రావు, సబ్ యూనిట్ ఆఫీసర్, మలేరియా నివారణ శాఖ -
ఇదేం బాదుడు ‘బాబు’
అధికారంలోకి వస్తే సంపద సృష్టించేస్తామన్నారు. సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టారు. మహిళలకు, ఆడబిడ్డలకు రాయితీలు, నిధులు కేటాయిస్తామన్నారు. ఉచితంగా మూడు సిలిండర్లు అంటూ గ్యాస్ కొట్టారు. అంతా బూటకమని ప్రజలు గుర్తించారు. వంట గ్యాస్ ధరలు రూ.వెయ్యికి చేరింది. మూడు నెలల క్రితమే రూ.60 పెంచారు. దీంతో రూ.2 కోట్లు భారం జిల్లా వాసులపై మోపారు. తాజాగా రూ.29 పెంచారు. మళ్లీ రూ.కోటి మేర భారం పెట్టారు. వాణజ్య సిలిండర్ల ధరలు పెరగటంతో చిరు వ్యాపారులు కుదేలయ్యారు. పెరుగుతున్న ధరలతో సాధారణ, పేద, మధ్య తరగతి, గిరిజనులపై భారం పడుతుంటే ప్రభుత్వ పెద్దలు చేష్టలుడిగి చూస్తున్నారు. ప్రజలు నారా వారి పాలనతో ఇదేం బాదుడు బాబు అంటూ మండిపడుతున్నారు. విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ ● -
ధర పెంచుకుంటూ పోతున్నారు..
పేదల బతుకులపై గ్యాస్ బండ గుది బండగా మారుస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా వంట గ్యాస్ ధరలు పెరుగుతుంటే పాలకులు ఏం చేస్తున్నారో అర్ధం కావటం లేదు. కొద్ది రోజుల కిందట గ్యాస్ బండపై ఒకేసారి రూ.60 పెంచారు. ఇప్పుడు మరో రూ.29 పెంచారు. ఇది అన్యాయం. పేద, మధ్య తరగతి కుటుంబాలు రూ.వెయ్యి వరకూ చెల్లించి గ్యాస్ గొనుగోలు చేసే స్థితిలో లేవు. ప్రభుత్వం ప్రజలపై భారం లేకుండా చేయటం మానేసి రోజుకో రకంగా నిత్యవసర సరుకులపై ధరలు పెంచుతూ ప్రజలపై భారం వేయటం అన్యాయం. పి.హైమావతి, డోలమడ, పాలకొండ మండలం ● -
మరింత వాతలు
అధికారంలోకి వస్తే ధరలు అదుపు చేస్తామన్న ప్రభుత్వం మహిళలపై కక్ష కట్టినట్లుంది. గ్యాస్ ధరలు నెలల వ్యవధిలో పెంచుతూ మరింత వాతలు పెడుతుంది. తాజాగా పెరిగిన ధరతో వంట గ్యాస్ బండ ధర నాలుగు నెలల వ్యధిలో దాదాపు వెయ్యికి చేరింది. ఈ భారం ప్రభుత్వమే భరించాలి. పేద, మధ్య తరగతి కుటుంబాలు బతకటమే భారంగా మారుతున్న తరుణంలో గ్యాస్, నిత్యవసర సరుకుల ధరలు పెంచటం ఆందోళనకు గురి చేస్తుంది. ఏడాదికి మూడు బండలు ఉచితమన్నారు. ఎవరికి వర్తిస్తుందో తెలియటం లేదు. చివరికి కట్టెలు ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి. కె.చిన్నమ్మడు, పాలకొండ మండలం ● -
నకిలీ నియామక ప్రకటనలు నమ్మొద్దు
● కేంద్రీయ గిరిజన వర్సిటీ ఇన్చార్జి వీసీ శ్రీనివాసన్ విజయనగరం రూరల్: కేంద్రీయ విశ్వ విద్యాలయం పేరుతో సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ వేదికల్లో కొన్ని నకిలీ నియామక ప్రకటనలు, ఉద్యోగ అవకాశాల సమాచారంతో తప్పుడు సందేశాలు ప్రచారంలో ఉన్నట్లు విశ్వవిద్యాలయం దృష్టికి వచ్చిందని, నిరుద్యోగులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్సిటీ ఇన్చార్జి వీసీ టి.శ్రీనివాసన్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఇటువంటి సమాచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. అభ్యర్థులు నకిలీ ప్రకటనలు నమ్మొద్దని, తమ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలకు సంబంధించి ధ్రువపత్రాలు అందించవద్దని, ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరపొద్దని ఆయన కోరారు. విశ్వవిద్యాలయం పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా వ్యక్తులు, సంస్థలు సంప్రదిస్తే వర్సిటీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయంలో జరిగే అన్ని నియామకాలు, ఉద్యోగ ప్రకటనల సమాచారం విశ్వ విద్యాలయం వెబ్సైట్లో అధికారికంగా జారీచేస్తామన్నారు. -
ఇదెక్కడి ఘోరమయ్యా...
మేము నిరుపేదలం... మా ఇల్లు చూడండి.. కూలి చేస్తేగానీ కడుపునిండదు.. మేము రాజకీయాలు చేయగలమా?.. మాపై వైఎస్సార్సీపీ సానుభూతిపరులమంటూ రాజకీయ ముద్రవేశారు. రోడ్డు పక్కన చిన్నస్థలంలో పూరిపాక వేసుకుని తొమ్మిదేళ్లుగా ఇద్దరు పిల్లలతో జీవిస్తుంటే ఇప్పుడు అధికారులకు ఫిర్యాదు చేసి ఖాళీ చేయిస్తున్నారు. ఇది న్యాయమేనా.. ఇదెక్కడి ఘోరమయ్యా.. పేదలం ఎలా బతకాలయ్యా.. గూడుకు చోటుకూడా కరువేనా?.. ఇక్కడేమైనా ఆఫీసులు కడతారా?.. అంటూ బాధితురాలు ఎన్నికల సీత విలేకరుల ముందు వాపోయింది. తమ కష్టాల జీవనాన్ని చెబుతూ విలపించింది. నిరుపేద గిరిజన కుటుంబాన్ని గ్రామబహిష్కరణకు పూనుకోవడం సరికాదంటూ వాపోయింది. ఇప్పటికిప్పుడు ఎక్కడకు పోతామంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు స్పందించి మాకు గూడు చూపాలంటూ వేడుకుంది. -
అమ్మో ఫైలేరియా..!
● చాప కింద నీరులా విస్తరిస్తున్న మహమ్మారి ● 45 గ్రామాల్లో మొత్తం 169 మంది బాధితులు ● ఒక్క ఒమ్మి గ్రామంలోనే 69 కేసులు ● ప్రజల్లో కొరవడిన అవగాహన నెల్లిమర్ల రూరల్: ఒకప్పుడు అరుదుగా కనిపించే ఫైలేరియా వ్యాధి ఇప్పుడు నెల్లిమర్ల మండలంలో ఆందోళన కలిగించే స్థాయిలో కొనసాగుతోంది. వైద్యారోగ్య శాఖ గణాంకాల ప్రకారం మండలంలోని 45 గ్రామాల్లో ప్రస్తుతం 169 మంది ఫైలేరియా బాధితులు ఉన్నారు. ముఖ్యంగా ఒమ్మి గ్రామంలోనే 69 మంది బాధితులు ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రజారోగ్య వ్యవస్థతో పాటు గ్రామీణ పారిశుద్ధ్య పరిస్థితులపై ఈ గణాంకాలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రెండు పీహెచ్సీల పరిధిలో బాధితులు ఇలా మండలంలో రెండు పీహెచ్సీలు ఉండగా..సతివాడ పీహెచ్సీ పరిధిలోని 31 గ్రామాల్లో 149 ఫైలేరియా కేసులు ప్రస్తుతం ఉన్నాయి. అందులో ఒమ్మిలో అత్యధికంగా 69 మంది బాధితులుండగా, సతివాడలో 21 మంది, మిగిలిన 28 గ్రామాల్లో 59 మంది బాధితులు ఉన్నారు. కొండవెలగాడ పీహెచ్సీ పరిధిలోని 15 గ్రామాల్లో మరో 20 కేసులు ఉన్నాయి. అందులో కొండవెలగాడలోనే 11 మంది బాధితులు ఉండడం గమనార్హం. ప్రజల్లో కొరవడిన అవగాహన ఫైలేరియా దోమల ద్వారా వ్యాపించే వ్యాధి. ఈ వ్యాధి శరీరంలోని లింఫ్ వ్యవస్థను దెబ్బతీస్తుంది. మొదట్లో సాధారణ జ్వరం, వాపు వంటి లక్షణాలు కనిపించినా, క్రమంగా కాళ్లు, చేతులు లేదా ఇతర అవయవాలు అసాధారణంగా వాపుగా మారతాయి. వ్యాధి తీవ్రమైతే బాధితులు జీవితాంతం శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇన్ని కేసులు ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం అవగాహన కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూతూమంత్రంగానే పారిశుద్ధ్య పనులు గ్రామాల్లో తూతూమంత్రంగానే పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారనే విమర్శలు ప్రజల నుంచే వినిపించడం గమనార్హం. వాస్తవానికి ఎక్కడా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. ఫాగింగ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఆ విధానం అమలు కావడం లేదు. కొన్ని గ్రామాల్లో తాగునీటి పైపు లైన్ల వద్ద లీకులను అరికట్టకపోవడంతో ఆ నీరే మురుగుగా మారే పరిస్థితి ఉంది. ప్రజల సహకారం కూడా లేకపోవడం వ్యాధి వ్యాప్తికి మరో కారణంగా తెలుస్తోంది. ఎక్కడబడితే అక్కడ చెత్త వేయడం, కాలువలను ఆక్రమించి భవనాలు కట్టడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో దోమల సంతతి పెరిగి రోగాలకు కారణమవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రజల నిర్లక్ష్యం కూడా పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోందని అధికారులు చెబుతున్నారు. ఎంపీపీ చొరవతో ప్రైవేట్ కంపెనీ సేవలు: ఒమ్మి గ్రామంలో వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతో ఎంపీపీ అంబళ్ల సుధారాణి, ఏంఎసీ మాజీ చైర్మన్ శ్రీరాములు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. జర్మనీకి చెందిన కంపెనీ ప్రతినిధులను సంప్రదించడంతో వారు మూడేళ్లుగా గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు కూడా గతంలో వ్యాధి తీవ్రతపై ఎన్నో అధ్యయనాలు చేశారు. దోమ తెరలు, దోమలను ఆకర్షించే అధునాతన బుట్టలు ఇంటింటీకీ పంపిణీ చేశారు. కాలువల వద్ద దోమల నియంత్రణకు ఫాగింగ్ చర్యలు కొంత కాలం పాటు నిర్వహించారు. కలెక్టరేట్లో ఫిర్యాదుతో ఫైలేరియా పరీక్షలు: ఇటీవల ఒమ్మి గ్రామానికి చెందిన పలువురు.. ఫైలేరియా వ్యాధి విజృంభణపై కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉందని, ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఉన్నతాధికారుల స్పందనతో ఎన్ఎఫ్సీపీ యూనిట్ జిల్లా అర్బన్ రూరల్ బృందాలు ముమ్మరంగా రక్త నమూనాల సేకరణ చేపట్టారు. సుమారు 400 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించగా ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. -
ప్రారంభ దశలో గుర్తిస్తే నియంత్రణ సాధ్యం:
ఫైలేరియా వ్యాధి ఒక రోజులో వచ్చేది కాదు. దీని ప్రభావం కొన్ని సంవత్సరాల తరువాత కనిపిస్తుంది. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే నియంత్రించడం సాధ్యమవుతుంది. ప్రజలు ఇంటి ముందు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వైద్య సిబ్బంది పంపిణీ చేసే ఫైలేరియా నియంత్రణ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి. ఒమ్మితో పాటు అన్ని గ్రామాల్లోనూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. –డాక్టర్ అనిల్కుమార్, వైద్యాధికారి, సతివాడ పీహెచ్సీ -
24న ఉపముఖ్యమంత్రి రాక?
సాక్షి, పార్వతీపురం మన్యం: బలిజిపేట మండలంలోని పెదపెంకి గ్రామానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 24న వచ్చే అవకాశాలున్నాయి. గ్రామంలో నూతనంగా నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తానని జిల్లా అధికారులకు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. పెదపెంకి గ్రామంలో అభివృద్ధి పనులపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం సమీక్ష నిర్వహించారు. గ్రామంలో వందకు పైగా ఫైలేరియా కేసులు ఉన్న విషయం విదితమే. తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో గ్రామంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. గ్రామంలో మురుగునీరు వెళ్లే మార్గాలు సరిగ్గా లేకపోవడంతోపాటు, కొన్నిచోట్ల కాలువలు అక్రమణలకు గురవడాన్ని అధికారులు ఆయనకు వివరించారు. ఆయన సూచనలతో ఆక్రమణలు తొలగించి గ్రామంలో మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మిస్తున్నారు. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా పెదపెంకిని తీర్చిదిద్దాలన్న ఆలోచనలో జిల్లా యంత్రాంగం ఉంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు 24వ తేదీన వస్తానని పవన్ కల్యాణ్ జిల్లా అధికారులతో చెప్పారు. అప్పటికి గ్రామంలో పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. పెదపెంకిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలిపార్వతీపురం: బలిజిపేట మండలంలోని పెదపెంకి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెలలో ఉప ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య సేవలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఈనెల 20లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫైలేరియా నియంత్రణలో కృషిచేసిన అధికారులను కలెక్టర్ అభినందించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 12 సబ్ రేషన్ డిపోలు ప్రారంభంసీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని మారుమూల గిరిజన గ్రామాలకు 12 సబ్ రేషన్ డిపోలు శనివారం ప్రారంభమైనట్లు డీఎస్వో బి.అశోక్ తెలిపారు. ఈ మేరకు మండలంలోని శిలిగాం గ్రామంలో సబ్ రేషన్డిపోను ఏఎంసీ చైర్పర్సన్ సంధ్యారాణి ప్రారంభించారు. మొత్తం 25 సబ్డిపోలు మంజూరు కాగా వాటిలో 13 డిపోలు ఘాట్రోడ్లలో ఉండడంతో వాటికి ఎటువంటి రవాణా సదుపాయాలు లేవని అందుచేత ప్రారంభించలేదన్నారు. ఇప్పటికే ప్రారంభించిన డిపోలకు మెయిన్ రేషన్ డిపోల నుంచి సరుకులు వ్యాన్లు, ఇతర వాహనాల ద్వారా చేరవేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పవన్, చంద్రరావు, తహసీల్దార్ డి.శ్రీకన్య,ఎంపీడీవో మిశ్రో, జీసీసీ మేనేజర్ డి.కృష్ణ, ఆర్ఎస్డీటీ శ్రీ విద్య తదితరులు పాల్గొన్నారు. టెట్ నిబంధనల్లో మార్పులు చేపట్టాలి పార్వతీపురం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్, నిబంధనలలో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘ రాష్ట్ర కార్యదర్శి నల్లా బాలకృష్ణ, పార్వతీపురం మన్యం జిల్లా బాధ్యులు మహేష్, అప్పలనాయుడు శనివారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ అభ్యర్థుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పరీక్ష ఫీజును పూర్తిగా మినహాయించాలని, లేదంటే తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. పరీక్ష నిర్వహణను ప్రభుత్వ బాధ్యతగా పరిగణించాలే తప్ప, అభ్యర్థుల నుంచి నిధులు సమకూర్చుకునే మార్గంగా చూడకూడదన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సంబంధించి పలు సవరణలు అవసరమని పేర్కొన్నారు. నూతన అభ్యర్థులకు, ఇన్–సర్వీస్ టీచర్లకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాలని, అర్హత మార్కులను తగ్గించాలని కోరారు. 50 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష కష్టతరంగా ఉంటుందని, వారికి ఆఫ్లైన్ ఓఎంఆర్ పద్ధతిలో అవకాశం కల్పించాలని విన్నవించారు. స్కూల్ అసిస్టెంట్లను మళ్లీ పరీక్ష రాయమనడం సమంజసం కాదని, వారి సర్టిఫికెట్ల చెల్లుబాటును యథాతథంగా కొనసాగించాలని కోరారు. -
ఫిజియో టీ20 లీగ్ విజేత ’హంగ్రీ చీతాస్’
● మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా పార్వతీపురం వైద్యుడు ఉమాకాంత్ పార్వతీపురం రూరల్: ఆంధ్ర ఫిజియో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గుంటూరులోని డీఎస్ఏ, ఎంఎస్కే మైదానాల్లో ఐదు రోజుల పాటు జరిగిన ’ఆంధ్ర ఫిజియో క్రికెట్ లీగ్ టీ20 (సీజన్–1)’లో గుంటూరుకు చెందిన హంగ్రీ చీతాస్ జట్టు విజేతగా నిలిచింది. రెండు రాష్ట్రాలకు చెందిన పది ఫిజియోథెరపీ డాక్టర్ల జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో 33 బంతుల్లో 59 పరుగులు చేసిన హంగ్రీ చీతాస్ ఆటగాడు, పార్వతీపురం వాసి డాక్టర్ జీరు ఉమాకాంత్ రెడ్డి ’మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యారు. ఈయన పార్వతీపురం జిల్లా అంధత్వ నివారణ సంస్థ నేత్ర వైద్యాధికారి డాక్టర్ జీరు నగేష్ రెడ్డి చిన్న కుమారుడు. గతంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పలు క్రికెట్ పోటీల్లో పాల్గొని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించారు. టోర్నీకి స్పాన్సర్లుగా వ్యవహరించిన గుంటూరు చంద్ర హాస్పిటల్స్ అధినేతలు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రవితేజ చేతుల మీదుగా విజేత జట్టుకు ట్రోఫీ, నగదు బహుమతి అందజేశారు. -
పంట పొలాల్లో ఏనుగులు
● భయాందోళనలో రైతులుసాలూరు రూరల్: మండలంలోని మావుడి పంచాయతీ పురిగానివలస సమీప గ్రామాల పంటపొలాల్లో ఏనుగులు బస చేస్తూ గడిచిన మూడు రోజులుగా ఆయా గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక వైపు రైతులు మరోవైపు అటవీ శాఖ సిబ్బంది ఏనుగులను తరిమేందుకు కసరత్తు చేస్తున్నప్పటికి అవి అక్కడే పంట పొలాలను ధ్వంసం చేస్తూ పక్కనే ఉన్న గొలుసుల మెట్ట రిజర్వాయర్లో నీళ్లు తాగుతూ జీడి తోటలో బస చేస్తున్నాయి. అయితే శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో పెద్దవలస సమీప కొండలపైకి ఏనుగులను తరిమివేసినట్లు స్థానిక రైతులు తెలిపారు. గ్రామస్తుడు కె.రాజాకు సంబంధించిన చెరుకు తోటను ఏనుగులు శనివారం ధ్వంసం చేశాయి. అలాగే పక్కనే ఉన్న రైతుల అరటి తోటలను నాశనం చేశాయి. మూడురోజులుగా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పంటనష్టాలు ఇస్తారా? ఏనుగుల కారణంగా రైతులకు జరిగిన పంటనష్టాలు ప్రభుత్వం ఇస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం పంట నష్టాలు అంచనా వేసేందుకు ఒక్క అధికారి కూడా రాలేదని వాపోతున్నారు. ఇలాగే ఏనుగులు పంటలు నష్టపరిస్తే రైతుల పరిస్థితి ఏమిటని వాపోతున్నారు. -
సామాజిక సేవకు ఎస్పీ పిలుపు
● ‘గ్లోబల్ స్ఫూర్తి’ సొసైటీ లోగో ఆవిష్కరణ పార్వతీపురం రూరల్: ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి పిలుపునిచ్చారు. తన కార్యాలయంలో పట్టణానికి చెందిన ’గ్లోబల్ స్ఫూర్తి డెవలప్మెంట్ సొసైటీ’ లోగోను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువతను తప్పుదోవ పట్టిస్తున్న మత్తు పదార్థాలు, గంజాయి వినియోగం, గ్రామాల్లోని చిల్లంగి వంటి మూఢనమ్మకాలపై స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సొసైటీ అధ్యక్షుడు బలగ రాధానాయుడు మాట్లాడుతూ.. బాల్యవివాహాల నివారణ, మూఢనమ్మకాల నిర్మూలన, మత్తు పదార్థాల అనర్థాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. అధికారుల, ప్రజల సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఎస్పీని సొసైటీ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వానపల్లి శంకరరావు, ఎస్.ఎ.బి. లక్ష్మణరావు, ఎస్. వెంకటమహేష్, బి.బాబ్జి రావు పాల్గొన్నారు. -
మన్యంలో దీనంగా వనం..!
–10లోపరిశ్రమలు ఏర్పాటు చేయని వారికి నోటీసులివ్వండి స్థానిక గ్రోత్సెంటర్లోని భూములను ఏపీఐఐసీ ఎం.డి దినేష్ కుమార్ శనివారం సందర్శించారు. స్కూల్ బస్సులపై కొరడా..! మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న వేళ జిల్లాలో వేలాది మంది విద్యార్థులు రోజూ స్కూల్ బస్సులపైనే ఆధారపడనున్నారు. ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026పచ్చని చెట్టుపై గొడ్డలి వేటు పడుతోంది. మైనింగ్, క్వారీలంటూ అక్రమార్కులు పచ్చని చెట్లను మాయం చేసి రహదారులు వేస్తూ మార్గం సుగమం చేసుకుంటున్నారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. ఈ వేసవిలో పలు ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. వేడి గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇందుకు కారణం భూతాపాన్ని తగ్గించే చెట్లు, అడవుల వాతావరణం తగ్గిపోవడమేనని పర్యావరణ వేత్తలు అంటున్నారు. –సాక్షి, పార్వతీపురం మన్యంమన్యం అంటేనే పచ్చని కొండలు.. ఎటుచూసినా దట్టమైన చెట్లు.. ఆహ్లాదాన్ని పంచే చల్లని ఏజెన్సీ వాతావరణం. ఇది ఒకప్పటి మాటే.. ప్రస్తుతం ఆ వాతావరణమే మన్యంలో ఎక్కడా కానరావడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా భౌగోళిక విస్తీర్ణం 3,659 చదరపు కిలోమీటర్లు కాగా.. 1,077 చదరపు కిలోమీటర్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. మొత్తంగా 29.4 శాతం అడవులే ఉన్నాయి. మన్యంలో ఎటు చూసినా దట్టమైన చెట్లు, ఎత్తయిన కొండలు, నాగావళి, వంశధార, సువర్ణముఖి, వేగావతి నదుల పరవళ్లతో ఆహ్లాదకర వాతావరణం ఉండేది. కొన్నాళ్లుగా అభివృద్ధి పనుల పేరిట అడవుల రూపురేఖలు కోల్పోతున్నాయి. రోడ్లు, టవర్లు, ఆర్వోఎఫ్ఆర్ అంటూ పలు అభివృద్ధి పనులకు మార్గం సుగమం కావడం ఒకటైతే.. ఇదే సందర్భంలో మైనింగ్, క్వారీ తవ్వకాలు అంటూ కొండలను పిండి చేసేస్తున్నారు. వాటిని తరలించేందుకు చెట్లను తొలగించి రహదారులు చేస్తున్నారు. వంట చెరకు పేరిట కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మునుపటితో పోల్చుకుంటే అడవుల విస్తీర్ణం పెంపునకు కసరత్తు జరగడం లేదు. విలువైన చెట్లు తరలించుకుపోతున్నా అటవీ శాఖ పర్యవేక్షణ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. టేకు, ఇతర విలువైన దుంగల తరలింపులో పెద్ద హస్తాలే ఎక్కువ ఉండడంతో ఏమీ చేయలేకపోతున్నారు. వనాలకు నిప్పు.. పోడు వ్యవసాయం పేరుతో గిరిజనులు ఏటా నిప్పు పెట్టి ఆకులను కాల్చి వేస్తున్నారు. వేసవి సీజన్లో జీడి చెట్ల వద్ద ఈ పరిస్థితి మరింతగా ఉంటోంది. నిప్పు పెట్టిన సమయంలో నిర్లక్ష్యంగా రాత్రి అంతా వదిలేయడం వల్ల కార్చిచ్చు వ్యాపిస్తోంది. దీనివల్ల ఎత్తయిన చెట్లు కూడా అగ్నికి ఆహుతవుతున్నాయి. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకూ జిల్లాలోని నాలుగు అటవీ రేంజ్ల పరిధిలో 342 చోట్ల వనాల వద్ద మంటలు వ్యాపించిన ఘటనలు సంభవించాయి. ఇందులో అత్యధికంగా సాలూరు రేంజ్ పరిధిలో 116, పాలకొండ 111, పార్వతీపురం 81, కురుపాం 34 చొప్పున ఉన్నాయి. 24 గంటలూ మంటలు ఆరని పాయింట్లు కూడా కొన్ని ఉన్నాయని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. జిల్లాలో అటవీ రేంజ్లు: 4 (పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం) బ్లాక్స్ : 102 అటవీ విస్తీర్ణం : 1,07,721.38 హెక్టార్లు చెట్లు కొట్టివేయడం, అడవుల్లో కూడా కట్టడాలు పెరిగిపోవడం వల్ల వన్య ప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో రెండు ఏనుగుల గుంపులు గ్రామాల్లోకి చొరబడి ఇటు ప్రజలకు, అటు అటవీ శాఖాధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి. 13 మంది వరకూ మనుషులను పొట్టన పెట్టుకున్నాయి. సుమారు రూ.2.79 కోట్ల మేర పంటలను నష్టపరిచాయి. గ్రామాల్లోకి సమీప కొండల నుంచి ఎలుగు బంట్లు, నక్కలు, అడవి దున్నలు, జింకలు వంటివి వస్తున్నాయి. ప్రమాదకర విష సర్పాలు కూడా ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. కురుపాం మండలం ఊసకొండ గ్రామంలో ఇళ్లలోకి ప్రవేశించిన కింగ్ కోబ్రా బాబూరావు అనే గిరిజనుడిని కాటు వేసింది. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. కొద్దిరోజుల క్రితం సీతంపేట ఐటీడీఏ పీవో కార్యాలయంలోకి నల్ల త్రాచు ప్రవేశించి భయాందోళన కలిగించింది. అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమై పట్టుకున్నారు. గతంలో రక్త పింజరి కూడా మరో చోట ఆందోళన కలిగించింది. ఇటీవల సాలూరు మండలం బాగువలస సమీపంలో అరుదైన పంట్ల పాము తారసపడింది. అడవుల్లోనే కనిపించే కింగ్ కోబ్రాలు తరుచూ గ్రామాల్లోకి రావడం వెనుక కారణం కూడా.. వాటికంటూ ఒక ఆవాస ప్రాంతాల్ని లేకుండా చేయడమే. అటవీ ప్రాంతాలను నాశనం చేస్తుండడం వల్ల అటు ఉష్ణ తాపం విపరీతంగా పెరగడంతో పాటు.. ఇటు వన్య ప్రాణులు కూడా వనాలను వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయి. కరిగిపోతున్న అడవి.. కాలిపోతున్న అవని పచ్చదనం తగ్గితే.. భవిష్యత్తు ప్రశ్నార్థకమే జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పచ్చని చెట్ల మధ్య కార్చిచ్చు జనావాసాల్లోకి వన్యప్రాణులు అటవీ ప్రాంతాలను కాపాడేందుకు అన్ని చర్యలనూ తీసుకుంటున్నాం. కంపా, నరేగా నిధులతో మొక్కలు విరివిగా నాటి సంరక్షిస్తున్నాం. కార్చిచ్చు వల్ల కలిగే నష్టంపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. కొండలపై ఉన్న గిరిజన గ్రామాలకు కూడా అటవీ సిబ్బంది వెళ్లి వివరిస్తున్నారు. ఎవరైనా మంటలు పెట్టినా ఆర్పేశాక వెళ్లండి. – జీఏపీ ప్రసూన, జిల్లా అటవీ శాఖాధికారి -
నవచేతన యాప్పై అవగాహన
విజయనగరం రూరల్: మండలంలోని జొన్నవలస గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు నవచేతన యాప్ వినియోగంపై శనివారం అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ పీడీ బాలామణి ఈ కార్యక్రమంలో పాల్గొని, పలు సూచనలు చేశారు. ఆరేళ్ల వయసు లోపు చిన్నారులకు స్క్రీనింగ్ నిర్వహించి, వారి శారీరక, మానసిక స్థితి వివరాలను యాప్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ఏ పిల్లల్లో అయినా చిన్నచిన్న లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే డీఈసీఐ రిఫరల్కు పంపించాలన్నారు. మూడేళ్ల వయసు లోపు పిల్లలతో వారి కుటుంబ సభ్యుల్లా వ్యవహరిస్తూ ఆటపాటలతో వారిని అలరిస్తే వారిలో నిమిషానికి 10 లక్షల న్యూరాలస్ వృద్ధి చెందుతాయన్నారు. రాకోడు పీహెచ్సీ వైద్యాధికారిణి కార్తీక..ఆరేళ్ల వయసులోపు పిల్లల ఏడీహెడ్ మైల్డ్ స్టోన్స్, ఆర్బీఎస్కేలపై అవగాహన కల్పించారు. పౌష్టికాహారం లోపంతో పిల్లలు బాధపడకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీవో రేఖావాణి, ఏసీడీపీవో సత్యవతి తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ బస్సులపై కొరడా..!
● జిల్లాలో 518 స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు ● 90 బస్సుల్లో లోపాల గుర్తింపు..నోటీసులు జారీ ● స్కూల్స్ తెరుచుకునేలోపు ప్రతి బస్సుపై నిఘాపిల్లల ప్రాణాలపై ప్రయోగాలు వద్దు స్కూల్ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్వషర్, ఎమర్జెన్సీ డోర్, సురక్షిత సీట్లు, సరైన బ్రేక్ వ్యవస్థ, అనుభవజ్ఞులైన డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలని తల్లిదండ్రులు సూచిస్తున్నారు. కేవలం పత్రాల పరిశీలనతో సరిపెట్టకుండా వాహనం రోడ్డుపై ఎలా పనిచేస్తోందో కూడా పరీక్షించాలని కోరుతున్నారు.తూతూ మంత్రం తనిఖీలు వద్దంటున్న తల్లిదండ్రులు: గతంలో కొన్ని సందర్భాల్లో తనిఖీలు కేవలం నామమాత్రంగా జరిగాయనే విమర్శలు వినిపించాయి. ఈసారి మాత్రం ప్రతి బస్సును క్షుణ్ణంగా పరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పేపర్ మీద సర్టిఫికెట్ ఇచ్చేయడం కాకుండా బస్సు నిజంగా సురక్షితమా కాదా అనేది చూడాలని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. -
రాజుల పాలనలో పేదలకు కష్టాలు
బొబ్బిలిరూరల్: బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల పైత్యం పెచ్చుమీరుతోంది. మూడుపూటలూ తిండికి లేక, నిస్సహాయులైన నిరుపేద గిరిజన కుటుంబాలపై జలుం ప్రదర్శిస్తున్నారు. రాజకీయ కక్షతో ఏళ్లతరబడి నివాసముంటున్న పూరిపాకలను ఖాళీ చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇటీవల బొబ్బిలి మండలం అలజంగి గ్రామంలో పూజారి రాపాక జోగినాయుడు కుటుంబాన్ని పంచాయతీ స్థలంలో ఇల్లు ఉందని గెంటే యత్నం చేయగా, ఆ కుటుంబం కోర్టును ఆశ్రయించడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. కాశిందొరవలస పంచాయతీ డొంగురువలసలో అలాంటి దుశ్చర్యకు మళ్లీ పూనుకున్నారు. గ్రామంలో గెడ్డ పోరంబోకు స్థలంలో చిన్న పూరిపాకను వేసుకుని ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్న ఎన్నికల కళ్యాణ్, సీతపై వైఎస్సార్సీపీ సానుభూతిపరులన్న ముద్రవేసి కక్షసాధింపులకు దిగారు. గెడ్డపోరంబోకు స్థలంలో అక్రమంగా పూరిపాక వేసుకున్నారని, దానిని తొలగించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ నేతతో ఒత్తిడి చేయించారు. దీంతో ఆర్డీఓ ఆక్రమణను సీరియస్గా తీసుకుని వెంటనే ఇల్లు ఖాళీ చేయించాలని, వారికి నోటీసులు పంపాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఆ మేరకు శనివారం ఆర్ఐ రామకుమార్, వీఆర్వో సుధాకర్, పోలీసులు అక్కడకు చేరుకుని పూరిపాకను తొలగించాలంటూ నిరుపేదకుటుంబానికి నోటీసులిచ్చారు. రెండు రోజుల్లో ఖాళీ చేయకుంటే తామే పూరిల్లును కూల్చేస్తామని, బలవంతంగానైనా ఖాళీ చేయిస్తామని కళ్యాణ్ భార్య సీతకు నోటీసులిచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమయం ఇవ్వలేమని, వెంటనే ఖాళీ చేయాల్సిందేనని ఆదేశించారు. దీంతో బాధిత కుటుంబం గగ్గోలుపెడుతోంది. ఉన్నఫలంగా ఎక్కడ తలదాచుకోవాలో తెలియక తల్లఢిల్లుతోంది. అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం, ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పిన టీడీపీ నేతలు... ఇప్పుడు పేదలపై ప్రతాపం చూపుతున్నారని, సభ్యసమాజం తలదించుకునే పనులకు పూనుకుంటున్నారంటూ గ్రామస్తులు పలువురు విమర్శిస్తున్నారు. రోడ్డుపక్కన చాలా పూరిపాకలు, పశువుల శాలలు ఉండగా కేవలం గిరిజన కుటుంబం పూరిపాకనే ఖాళీ చేయాలని ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బొబ్బిలిలో అరాచక పాలన బొబ్బిలిలో రెండేళ్లుగా అరాచక పాలన సాగుతోంది. అధికార బలంతో పదవులను లాక్కోవడమే కాదు పేద గిరిజనులు సాగుచేస్తున్న భూములను దౌర్జన్యంగా కాజేస్తున్నారు. వారి ఇళ్లను కూలదోస్తున్నారు. పథకాలు అందకుండా చేస్తున్నారు. రాజరికం కాదు మాది రాక్షసపాలన అంటూ చేతల్లో చూపిస్తుండడంపై బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. పేదలను ఆదుకోవాల్సిన చేతులు కష్టాలపాలచేస్తుండడంపై జనం మండిపడుతున్నారు. కోటలు చూసి మురిసిపోవడం కాదని... పేదల కష్టాలు చూడాలని, వారిపై కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవుపలుకుతున్నారు. వీరు పూర్వీకుల వలే రాజులు కాదు.. రాక్షసులంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. నిలువ నీడలేకుండా గెంటే యత్నం పూరిపాకను ఖాళీ చేయించేలా అధికారులకు ఫిర్యాదు రెవెన్యూ అధికారుల నోటీసుతో ఆందోళనలో గిరిజన కుటుంబం తిండికి లేనివారం రాజకీయాలు చేయగలమా అంటూ నిట్టూర్పు ఆదుకోవాలంటూ వేడుకోలు -
ప్రణాళిక యుత బోధనతో సత్ఫలితాలు
పార్వతీపురం: ఉపాధ్యాయులు రొటీన్ బోధనకు స్వస్తి చెప్పి, ప్రణాళిక యుత బోధనకు ప్రాధాన్యమివ్వాలని, దీనివల్ల సత్ఫలితాలు వస్తాయని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్లో శనివారం మాట్లాడారు. వృత్తిని ప్రేమించి స్వయం తృప్తి కోసం పనిచేయాలని సూచించారు. విద్యార్థుల్లో మంచి అలవాట్లు పెంపొందించేందుకు చెట్లు నాటడం, పరిశుభ్రత పాటించడం వంటి అంశాలను బోధించాలని సూచించారు. విద్యాసంవత్సరం తొలి మూడు నెలలు ఆటలు, పాటలు, నృత్యాలతో బోధన నిర్వహించాలన్నారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించేలా శిక్షణ ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలకు అరగంట ముందుగానే హాజరై శుభ్రతను పర్యవేక్షించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఈఓ పి.బ్రహ్మాజీరావు, ఏపీఓ వై.శంకరరావు, తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమలు ఏర్పాటు చేయని వారికి నోటీసులివ్వండి
● ఏపీఐఐసీ అధికారులకు ఎం.డి దినేష్ కుమార్ ఆదేశాలు బొబ్బిలి: స్థానిక గ్రోత్సెంటర్లోని భూములను ఏపీఐఐసీ ఎం.డి దినేష్ కుమార్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రామమోహన రావు, ఏపీఐఐసీ అధికారులతో ఆయన మాట్లాడుతూ ఎన్ని పరిశ్రమలున్నాయి? ఎంతమందికి భూములు కేటాయించారన్న వివరాలను నోట్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం భూములను తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయని వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఆర్వీఆర్ పరిశ్రమలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడ ఏపీఐఐసీకి సంబంధించి ఎవరూ ఉండడం లేదని, సమస్యలు తెలుపుకునేందుకు శ్రీకాకుళం, విజయనగరం వెళ్లాల్సి వస్తోందని పారిశ్రామిక వేత్తలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అలాగే నీరు, విద్యుత్ సమస్య ఉందని వాపోయారు. వెంటనే ఆర్డీఓ రామమోహన రావుతో ఎం.డి మాట్లాడుతూ ఇక్కడ తహసీల్దార్ స్థాయి అధికారిని స్పెషలాఫీసర్గా నియించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా వచ్చి అలా వెళ్లపోతారా? ఏపీఐఐసీ ఎం.డి లాంటి అధికారి ఎన్నో సమస్యలున్న గ్రోత్ సెంటర్కు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం సరికాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పొట్నూరు శంకర రావు, మండల కార్యదర్శి సింగిరెడ్డి గోపాలం విమర్శించారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ స్థానిక గ్రోత్సెంటర్లో కార్మికులకు తాగునీరు లేక, పరిశ్రమలకు విద్యుత్, నీటి వసతి, రోడ్లు లేక అవస్థలు పడుతున్నారన్నారు. ఎవరిని కలిసి వినతిపత్రం ఇద్దామన్నా ఎవరూ లేని పరిస్థితుల్లో ఎం.డి వచ్చి వెంటనే వెళ్లిపోవడం, కనీసం మీడియాకు కూడా సమాచారం లేకపోవడం దారుణమన్నారు. -
10 కేజీల గంజాయితో ఇద్దరు నిందితుల అరెస్ట్
విజయనగరం క్రైమ్ : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని స్థానిక రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంలపై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దీనిపై జీఆర్పీ ఎస్ఐ బాలాజీ రావు చెప్పిన వివరాల ప్రకారం...ప్లాట్ ఫాంలపై జీఆర్పీ, ఆర్పీఎఫ్ లు తనిఖీలు చేస్తుండగా కర్ణాటక రాష్ట్రం పాత హుబ్లీ, ధర్వాద్ జిల్లాలకు చెందిన అఖిలేష్ యార్మశల్, షబాజ్ రఫీ అమ్మద్ ఖాతిబ్లు ఒడిశా రాష్ట్రంలోని టికిరి నుంచీ పది కేజీలు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు. ప్లాట్ ఫాం లపై తనిఖీలు చేస్తున్న పోలీస్ సిబ్బందిని చూసి వారు కంగారు పడటంతో జీఆర్పీ ఎస్సై బాలాజీరావుకు అనుమానం వచ్చి ఆర్పీఎఫ్ సిబ్బందితో ఇద్దరి వద్ద ఉన్న బ్యాగ్ లను తనిఖీ చేయగా గంజాయి అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి విశాఖ రైల్వే కోర్ట్ కు తరలించామని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు.లారీ బోల్తా● త్రుటిలో తప్పిన ప్రమాదం జియ్యమ్మవలస రూరల్: మండలంలోని పెదమేరంగి కూడలి సమీపాన గల గౌరవంపేట మలుపు వద్ద మామిడి పండ్లతో వస్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. శనివారం ఉదయం విజయనగరం నుంచి ఒడిశా మీదుగా ఢిల్లీ వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న స్కూటర్ను తప్పించబోయి అదుపుతప్పింది. దీంతో అటువైపు వస్తున్న ప్రయాణికులు ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ హాని జరగలేదని స్థానికులు తెలిపారు. పిడుగు పడి ఆవు మృతిజామి: మండల కేంద్రమైన జామిలో పిడుగుపడి ఆవు మృతి చెందింది. ఈ ఘటనపై బాధితులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పెద్ద వర్రి వాని కళ్లాల వద్ద శనివారం మధ్యాహ్నం పిడుగుపడి రైతు కె. పరసన్న ఆవు మృతిచెందింది. పశువైద్యాధికారి సంతోష్కుమమార్ మృతి చెందిన ఆవును పరిశీలించారు. సుమారు రూ. 60వేలు ఖరీదు అయిన ఆవు మృతిచెందిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. అప్పు తీసుకున్న వ్యక్తి పరారీబొండపల్లి: మండలంలోని బి.రాజేరు గ్రామానికి చెందిన బండారు వెంకటేష్ తన ఇద్దరు కూతుళ్ల వద్ద నుంచి అప్పుగా తీసుకున్న నగదు ఇవ్వకుండా పరారీ అయినట్లు అంబటివలస గ్రామానికి చెందిన నరవ సత్యం వాపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బి.రాజేరు గ్రామానికి చెందిన వెంకటేష్ అదే గ్రామానికి చెవిన ఇసినిగిరి బంగారమ్మ, ధర్మవరపు పార్వతిల నుంచి నాలుగు లక్షల రుపాయలు అప్పుగా తీసుకుని గ్రామం నుంచి పరారీ అయ్యాడు. వెంకటేష్ మామ గ్రామంలోనే ఉన్నా, తనకు అప్పుకు ఏమీ సంబంధం లేదని చెబుతున్నాడని, పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినా అప్పు తీసుకున్న వ్యక్తి ఆచూకీ కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారని నరవ సత్యం చెప్పాడు. తన కూతుళ్ల వద్ద తీసుకున్న అప్పుకు గ్రామంలో గానీ, పోలీసుల వద్ద గానీ ఎటువంటి న్యాయం జరగలేదని న్యాయం చేసేలా చూడాలని కోరాడు. -
జర్మన్ సంస్థతో జేఎన్టీయూ జీవీ ఒప్పందం
విజయనగరం రూరల్: ఉన్నత విద్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే దిశగా స్థానిక జేఎన్టీయూ జీవీ కీలక ముందడుగు వేసింది. జర్మనీ దేశానికి చెందిన ప్రముఖ విద్యాసంస్థ రోత్లాంగేన్ యూనివర్సిటీ నాలెడ్జ్ ఫౌండేషన్ (కెఎఫ్ఆర్యు)తో శనివారం విద్యా సహకార ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఇరు సంస్థల ప్రతినిధులు జేఎన్టీయూలో నిర్వహించిన కార్యక్రమంలో ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది నుంచే అంతర్జాతీయ సమగ్ర డిగ్రీ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఒప్పందంతో విద్యార్థులు కేవలం ఐదేళ్లలోనే భారతీయ డిగ్రీతోపాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన జర్మన్ ఎంఎస్సీ డిగ్రీని సొంతం చేసుకునే అవకాశం లభిస్తుందని జేఎన్టీయూ జీవీ ప్రతినిధులు తెలి పారు. పలు కోర్సులు అందుబాటులో ఉంటాయ ని, నాణ్యమైన విద్య, తక్కువ ఫీజు, పరిశ్రమలతో అనుసంధానమైన విద్యావిధానం, ప్రపంచ ప్రఖ్యా త పరిశ్రమల్లో భారతీయ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు. ఇంటర్మీ డియట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల్లో ఎంపీసీ గ్రూపులో కనీసం 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు వాటికి ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది ఈ కోర్సుల్లో ప్రవేశాలకు కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 7288873337 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
సంపూర్ణ పారిశుధ్య విజయనగరానికి సహకరించండి
విజయనగరం: విజయనగరాన్ని సంపూర్ణ పారిశుధ్య నగరంగా తీర్చిదిద్దాలని నగరపాలక సంస్థ కమిషనర్ బి.బాలస్వామి కోరారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా స్థానిక వసంత విహార్లోని బహుళ నివాస సముదాయాల వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శనివారం తొలగించారు. కమిషనరే స్వయంగా చెత్తను ఎత్తి ట్రాక్టరులో పోసి డంపింగ్ యార్డుకు తరలించారు. ప్రజారోగ్యం, స్వచ్ఛ విజయనగరమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం వేయకుండా రోజూ ఉదయం ఇంటి వద్దకు వస్తున్న పారిశుధ్య సిబ్బందికి చెత్తను అందించాలని చెప్పారు. నెల రోజుల పాటు ఎల్లో, రెడ్ స్పాట్లను శుభ్రపరిచే కార్యక్రమం చేపడతామన్నారు. ఈ వారం బహుళ నివాస, వాణిజ్య సముదాయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టామని, వచ్చేవారం సామాజిక మరుగుదొడ్ల పరిశుభ్రత చేపట్టనున్నామన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
విజయమే ఇంటిపేరు.. విజయదుర్గ మరో ఘనత
నెల్లిమర్ల రూరల్: ఎక్కడో మారుమూల గ్రామం.. సాధారణ రైతు కుటుంబం..ప్రభుత్వ పాఠశాలలోనే చదువు..కానీ అసాధారణమైన లక్ష్యాలు, అచంచలమైన పట్టుదల విజయనగరం జిల్లా యువతి మీసాల విజయదుర్గను తెలంగాణ లా–సెట్లో తొలి ర్యాంక్ సాధించేలా చేశాయి. నెల్లిమర్ల మండలం ఆత్మారాముని అగ్రహారం గ్రామానికి చెందిన విజయదుర్గ గురువారం విడుదలైన తెలంగాణ లా–సెట్ ఫలితాల్లో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకుంది. తండ్రి మీసాల వెంకట్రావు రైతు కాగా, తల్లి రామలక్ష్మి గృహిణి. సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ కుమార్తె చదువుకు తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం ఆమె విజయానికి బలమైన పునాది అయింది. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసంరామతీర్థం ఉన్నత పాఠశాలలో చదివిన విజయదుర్గ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ వచ్చింది. పదోతరగతిలో 568 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొంది అక్కడే ఆరేళ్లు బీటెక్ విద్యను పూర్తి చేసింది. చదువు అనంతరం క్యాంపస్ ప్లేస్మెంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి ఐదేళ్ల పాటు ఆ రంగంలో పనిచేశారు. ఉన్నత లక్ష్యాలే ముఖ్యమని భావించిన విజయదుర్గ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ పోటీ పరీక్షలపై దృష్టి సారించారు. పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించేందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రూప్–2కు సన్నద్ధమయ్యారు. గ్రూప్–2లో సత్తా..డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం..పట్టుదలతో కష్టపడి చదువుకున్న విజయదుర్గ 2023 ఏపీపీఎస్పీ గ్రూప్–2 నోటిఫికేషన్ పరీక్ష రాశారు. ఇటీవల ఆ ఫలితాలు విడుదల కాగా ఉత్తమ ప్రతిభ కనబరిచి డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తరువాత కూడా చదువును కొనసాగించి న్యాయవృత్తిపై ఉన్న ఆసక్తి కారణంగా తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2026 పరీక్షకు హాజరై రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ ర్యాంకు సాధించారు. పోటీ తీవ్రంగా ఉన్న పరీక్షలో అగ్రస్థానంలో నిలవడం ద్వారా తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. ఆమె విజయం ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది. సరైన లక్ష్యం, కృషి ఉంటే ఏ నేపథ్యం నుంచైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విజయదుర్గ నిరూపించారు.న్యాయమూర్తిగా సేవలందించడమే లక్ష్యంనా విజయ ప్రస్థానంలో తల్లిదండ్రులు వెంకట్రావు, రామలక్ష్మి ప్రోత్సాహంతో పాటు కాబోయే జీవిత భాగస్వామి శ్రావణ్ కుమార్ పటేల్ కృషి దాగి ఉంది. శిక్షణలో గురువుగా, మార్గదర్శకుడిగా ఆయన కీలకపాత్ర పోషించారు. డిప్యూటీ తహసీల్దార్గా ఎంపిక కావడంతో పాటు టీజీ లాసెట్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రజాసేవతో పాటు న్యాయరంగంలోనూ విశిష్ట స్థానాన్ని సంపాదించి, సమాజానికి ఉపయోగపడే న్యాయమూర్తిగా ఎదిగి ప్రజాసేవకు అంకితమవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతాను. –మీసాల విజయదుర్గ -
రేపటి నుంచి 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
పార్వతీపురం: జిల్లాలో జూన్ 7 నుంచి 21వ తేదీ వరకు ‘యోగాంధ్ర – 2026’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం తెలిపారు. ‘ఒక జిల్లా–ఒకే ఇతివృత్తం’ నినాదంతో యోగా ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు, పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జూన్ 11న తోటపల్లిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, జూన్ 15న సీతంపేటలోని ఎన్టీఆర్ అడ్వెంజర్ పార్క్, జూన్ 20న పాలకొండ, పార్వతీపురం, సాలూ రులలో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వ హిస్తామని పేర్కొన్నారు. జూన్ 21న పార్వతీ పురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లాస్థాయిలో యోగా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పార్వతీపురం రూరల్: భావితరాలకు సురక్షితమైన భూమిని అందించేందుకు ప్రతి పౌరుడూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి ఎం.మాధురి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పార్వతీపు రం మన్యం జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. అనంత రం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, నీటి సంరక్షణ, చెట్ల పెంపకం, వ్యర్థాల సక్రమ నిర్వహణ ద్వారానే పర్యావరణాన్ని కాపాడుకోగలమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించి, కోర్టు ప్రాంగణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్రీధర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఓణీల ఫంక్షన్కు కలెక్షన్ల తంటా..!
● పాలకురాలి కుమార్తె ఫంక్షన్ కోసం అధికారులపై ఒత్తిడి ● మండలాల వారీగా టార్గెట్లు ● విస్తుపోతున్న ఉద్యోగవర్గాలు సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అంటే ఇదే మరి... మన నాయకురాలి ఇంట్లో ఫంక్షన్ ఉంది.. మనమంతా దారుకోవాలి.. పూనుకోవాలి.. రాసుకోవాలి.. పూసుకోవాలి అని పూనకాలు తెచ్చుకున్న పచ్చపార్టీ నాయకులు అలవిమాలిన స్వామిభక్తిని చాటుకోవడం.. దీనికోసం మండలాల వారీగా అధికారులకు టార్గెట్లు ఇవ్వడం మన్యంలో చర్చనీయాంశంగా మారింది. అసలే గిరిజన ప్రాంతం... ఆపై ప్రైవేటు కార్యక్రమానికి టార్గెట్లు ఇవ్వడం ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అమ్మగారి ఇంటిలో ఓణీల ఫంక్షన్ ధూమ్ధామ్ అయిపోవాలి.. మూడు జిల్లాల్లో హోరెత్తిపోవాలి.. ‘ఈశ్వరి’ని ఆశీస్సులు అందేలా.. రెండు మూడు తరాలు చెప్పుకునేలా ఉండాలి అంటూ వేపకొమ్మలతో కొట్టుకునే రేంజిలో పచ్చపార్టీ నేతలు ఊగిపోవడం... ఆ ఖర్చు భరించాలంటూ ఉద్యోగులపై రుద్దడం విమర్శలకు తావిస్తోంది. ఏకంగా నియోజకవర్గ నేత ఇంటిలో ఐదు మండలాలకు చెందిన అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి మండలానికి రూ.4లక్షల చొప్పున కలెక్షన్ చేయాలంటూ టార్గెట్లు ఇచ్చారన్న ప్రచారం జోరందుకుంది. మండలాధికారులకు టార్గెట్లు అంటే అది వారి పరిధిలోనే ఉపాధి హామీ సిబ్బందితోపాటు సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడిపడుతుంది. మండలాధికారి ఆదేశాల మేరకు ఆయా ఉద్యో గులు చందాలు వేసుకుని ఆ నాలుగు లక్షలు పోగేసి ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖల ఉద్యోగులు అలవిమాలిన పని ఒత్తిడి.. దండగమారి సర్వేలు, సమీక్షలతో నలిగిపోతున్న తరుణంలో ఓణీల ఫంక్షన్ కోసం ఇప్పు డు ఏకంగా చందా వసూళ్ల బాధ్యతలు పెట్టడంతో వారు అవుననలేక.. కాదనలేక లోలోన కుమిలిపోతున్నారు. మొత్తం మీద అమ్మవారి ఇంట ఫంక్ష న్లో డీజేల ముందు డ్యాన్స్లు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులను అనివార్యంగా కార్యకర్తలు ముందుకు నెడుతున్నారంటూ కొందరు బహిరంగంగానే మండిపడుతున్నారు. ఇదెక్కడి తీరు.. పచ్చపార్టీ కార్యకర్తలు.. నాయకులకు రోకు ఉంటే వాళ్లువెళ్లి టెంట్లువేయాలి... పందిరి బొంగులు పాతాలి.. గాడి పొయ్యిలు తవ్వాలి... నీళ్ల కావిళ్లు మోయాలి కానీ ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్న మేమెందుకు ఈ పాలేరు పనిచేయాలంటూ ఉద్యోగులు లోలోన మదనపడుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇలాంటి చందాల సంస్కృతి ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఎవరైనా నాయకుల ఇళ్లలో ఫంక్షన్ ఉంటే అధికారులు తమ భక్తికొద్దీ త్రుణమోపణమో సీక్రెట్గా సమర్పించుకుని వచ్చేవారు. ఇప్పటిలా ఏకంగా సిబ్బంది మొత్తం పులివేషాలు వేసుకుని ఆటాడే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలా అని మండలాధికారులు ఆలోచనలు చేస్తుండగా, కొత్తగా ఓ మండలానికి వచ్చిన అధికారి ఆ స్థాయిలో కలెక్షన్ చేయలేనని కరాఖండిగా చెప్పడంతో టార్గెట్లో రూ.లక్షన్నర తగ్గించారట. మరికొన్ని శాఖలకు కూడా వేర్వేరుగా టార్గెట్లు ఫిక్స్ చేశారన్న ప్రచారం సాగుతోంది. ఊరి సొమ్ము రాంభజన అన్నట్లుగా ఉద్యోగుల చందాలతో ఫంక్షన్ చేసేందుకు పూనుకున్న నేత ‘ఛీప్’ట్రిక్స్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భోజనం కోసం పిలవాలే గానీ చందాలు పట్టుకుని భోజనానికి రండి అంటూ ఆర్డర్వేయడంపై మండిపడుతున్నారు. మొత్తానికి అమ్మగారింట్లో ఫంక్షన్ అటు నాయకులకు మోదం.. ఉద్యోగులకు ఖేదంగా మారింది.


