breaking news
Parvathipuram Manyam
-
గ్రామస్థాయి నుంచే పార్టీ పటిష్టత
పార్వతీపురం రూరల్: రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా మంగళవారం పార్వతీపురంలోని ఆర్యవైశ్య కల్యాణ మంటపంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, కమిటీల నియామకంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి, పరిశీలకులు శరగడం చిన్నప్పలనాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావుడి శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. పార్టీ పటిష్టతలో గ్రామస్థాయి కమిటీలే కీలకమని, క్షేత్రస్థాయిలో కేడర్కు నాయకత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 5 నుంచి ఫిబ్రవరి 18 వరకు కేటాయించిన 45 రోజుల గడువులోగా గ్రామస్థాయి నుంచి అన్ని అనుబంధ విభాగాల కమిటీల పునర్నిర్మాణం పూర్తి చేయాలని నేతలకు సూచించారు. ఇప్పటికే మండల స్థాయి ప్రక్రియ ముగిసినందున, ఇప్పుడు ప్రతి రెండు గ్రామాలకు ఒక ఇన్చార్జిని నియమించి సమన్వయం చేయాలని కోరారు. కమిటీల నియామకంలో సమర్థులైన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని, పారదర్శకత కోసం డిజిటల్ మేనేజర్ల సేవలను వినియోగించుకోవాలని నాయకులు పేర్కొన్నారు. ఎంపికై న సభ్యులకు పార్టీ గుర్తింపు కార్డులు అందజేస్తామని, వారికి మార్గనిర్దేశం చేసేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన ‘టాస్క్ ఫోర్స్’ బృందాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. 45 రోజుల్లో కమిటీల పునర్నిర్మాణం పూర్తి కావాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో నేతల పిలుపు -
వైభవంగా పెదపోలమాంబ ప్రధానోత్సవం
● నేడు అనుపోత్సవం మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి మేనత్త, పెదపోలమాంబ అమ్మవారి ప్రధానోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. చదురుగుడిలో అమ్మవారి ఘటాలకు బంగారుపూత పూసి, పూజలు నిర్వహించారు. చదురుగుడినుంచి అమ్మవారి ఘటాలను మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తులు జయజయధ్వానాల మధ్య శంబర గ్రామంలోని ప్రధానరహదారి వద్ద నున్న అమ్మవారి గద్దెవద్దకు తీసుకువచ్చారు. ముందుగా రెవిన్నాయుడు, పూడి,కరణం, కుప్పిలి వారింటికి ఆనవాయితీ ప్రకారం అమ్మవారి ఘటాలు చేరుకున్నాయి. అక్కడ పూజలు జరిపించిన అనంతరం గ్రామంలోని అన్నివీధుల్లో అమ్మవారి ఘటాలకు తిరువీధి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 9.30గంటల సమయానికి అమ్మవారి గద్దె వద్దకు అమ్మవారి ఘటాలు చేరుకుంటాయి. గద్దెవద్ద అమ్మవారికి ఉయ్యాల కంబాల కార్యక్రమం నిర్వహించి, అనంతరం అనుపోత్సవం చేపడతారు. శంబరపోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి తెచ్చేందుకు బుధవారం చాటింపు వేస్తారు. కార్యక్రమంలో ఈవో బి.శ్రీనివాస్, ట్రస్ట్బోర్డుచైర్మన్ తిరుపతిరావు, సభ్యులు, మాజీట్రస్ట్బోర్డు చైర్మన్లు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
ఆస్పత్రి భవనాలు, మ్యూజియం ప్రారంభం
● నిర్మాణాలకు పాలగెడ్డ–నూలు గెడ్డలోని సాగునీరు చౌర్యం ● రూ.1000 నుంచి రూ.1500 పలుకుతున్న ట్యాంకర్ ్చ ● చోద్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులుసీతంపేట: స్థానిక ఏరియా ఆస్పత్రి అదనపు భవనాలను, గిరిజన మ్యూజియాన్ని గిరిజన సంక్షేమశాఖ మంత్రి జి.సంధ్యారాణి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్లు మంగళవారం ప్రారంభించారు. వైద్యసేవలతో పాటు రోగులకు తోడుగా ఉండేందుకు కలెక్టర్ ప్రవేశపెట్టిన హెల్పింగ్ హ్యాండ్స్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. వచ్చేనెలలో సాలూరులో నూతన ఆస్పత్రిని ప్రారంభించనున్నామన్నారు. అనంతరం అడ్వెంచర్ పార్కులోని జలవిహార్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలు వదిలారు. కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పి.భూదేవి, ఏఎంసీ చైర్మన్ సంధ్యారాణి, టీడీపీ నాయకురాలు తేజోవతి, ముఖలింగం, పవన్, ప్రసాద్, ఏపీఓ చిన్నబాబు, డీఎంహెచ్వో భాస్కరరావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త నాగభూషణరావు, డిప్యూటీ డీఎంహెచ్వో విజయపార్వతి, ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు, ఆర్ఎంవో డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానమిచ్చి అవమానం స్థానిక ఏరియా ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ఆహ్వానించి అవమానించారని ఎంపీపీ బి.ఆదినారాయణ ఆరోపించారు. ఆస్పత్రి భవనాలను ప్రారంభిస్తున్న సమయంలో తాము వచ్చినప్పటికీ పిలవలేదన్నారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రూ.19.07 కోట్ల నిధులు వెచ్చించి ఆస్పత్రి నిర్మాణం చేపట్టారని, 80 శాతం వరకు పనులు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, నాటి ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతిల చొరవతో పూర్తయ్యాయన్నారు. గిరిజన వైద్యానికి పెద్దపీటకు బీజం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలోనే పడిందన్నారు. దీనిలో భాగంగా ఏరియా ఆస్పత్రికి అదనపు భవనాలు, 30 నుంచి వంద పడకల ఆస్పత్రిగా మార్పు జరిగిందని గుర్తు చేశారు. సీతంపేటలో రూ.50 కోట్లతో కార్పొరేట్ తరహాలో సూపర్ మల్టీస్ఫెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఘనత జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. 70 శాతం వరకు ఆ పనులు కూడా పూర్తయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా పూర్తిస్థాయిలో పనులు చేయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఫీవర్ సర్వే డోర్టూ డోర్ జరిగేదని, సురక్ష పేరుతో గ్రామాలకు వెళ్లి అందరికీ వైద్యసేవలు అందించేవారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వాపోయారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు చంద్రశేఖర్, గణేష్, వైఎస్సార్సీపీ నాయకులు ఎస్.రాము, రంగారావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జలగల్లా తోడేస్తున్నారు..! -
జాతర నాటికి నిర్మాణం పూర్తిచేస్తాం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఆలయం విస్తరణ పనులు పైడితల్లి సిరిమాను జాతర నాటికి పూర్తిచేస్తామని దేవదాయశాఖ రాష్ట్ర కమిషనర్ కె.రామచంద్రమోహన్ అన్నారు. అమ్మవారి ఆలయ నిర్మాణ పనులను మంగళవారం స్వీయపర్యవేక్షణ చేశారు. బాలాలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే చుట్టుపక్కల సేకరించిన స్థలాన్ని సద్వినియోగం చేసుకుని భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేలా నిర్మాణాలు చేయాలన్నారు. కార్యక్రమంలో దేవదాయశాఖ సహాయ కమిషనర్, పైడితల్లి ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష, ఉపకార్యనిర్వహక ఇంజినీరు కేవీసీ కృష్ణ, సహాయ ఇంజినీరు సాయికృష్ణ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడలను ప్రోత్సహించేందుకు శ్రీకారం
● ఆసక్తిగల విద్యార్థులను గుర్తించాలని కలెక్టర్ ఆదేశాలు పాలకొండ: క్రీడలను పోత్సహించడం ద్వారా గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులతో పాలకొండ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులను గుర్తించి వారిని పోత్సహించేందుకు క్రీడా పాఠశాల కాన్సెప్ట్ అమలు చేయాలని సూచించారు. దీని ప్రకారం విద్యార్థులకు ఏ క్రీడలో ఆసక్తి ఉందో గుర్తించి వారిని ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఒక్కో క్రీడకు సంబంధించి ఒక్కో పాఠశాలను ఎంపిక చేయాలని సూచించారు. ఆ పాఠశాలలన్నింటికీ ఒకే తరహాలో అంతర్జాతీయ క్రీడా శిక్షణ అందించాల్సి ఉంటుందన్నారు. ఒకే క్రీడ ఆడే విద్యార్థులను ఒకే పాఠశాలకు చేర్చడం ద్వారా వారికి ఆ క్రీడలో శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆటల్లో శిక్షణతో పాటు వారికి ఆరోగ్యకరమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని క్రీడలకు ఒకే పాఠశాలలో శిక్షణ అందించడం కష్టంగా ఉన్న ఉపాధ్యాయులకు ఈ విధానం ద్వారా మంచి క్రీడాకారులను తయారు చేయడానికి అవకాశం కలుగుతుందని అభిప్రాయ పడ్డారు. ఈ విధానం తక్షణం అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయనతో పాటు మండల ప్రత్యేకాధికారి ఎస్.మన్మథరావు, ఎంపీడీవో విజయరంగారావు, తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. పనికి వెళ్లకుండానే మస్తర్లు ● మేట్లు, ఫీల్డు అసిస్టెంట్ కలిసి వేతనాల కై ంకర్యం ● ప్రశ్నిస్తే జాబ్కార్డులు తొలగిస్తామంటూ హెచ్చరిక ● ఎంపీడీఓకు వేతనదారుల ఫిర్యాదు గుమ్మలక్ష్మీపురం: పనికి వెళ్లకుండానే మస్తర్లు వేస్తారు.. వారి ఖాతాల్లో వేతనాల రూపంలో జమైన డబ్బులను తీసుకుంటారు. మేట్లు, ఫీల్డు అసిస్టెంట్లు కలిసి ఉపాధిహామీ నిధులు కై ంకర్యం చేస్తున్నారు.. దీనిపై ప్రశ్నించిన వేతనదారుల జాబ్కార్డులు తొలగిస్తామంటూ హెచ్చరిస్తున్నారని గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట పంచాయతీ కోళ్లఫారానికి చెందిన వేతనదారులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. ఉపాధిహామీ పనుల్లో అవకతవకలను వివరించారు. 32 మంది పనికి హాజరైతే 82 మంది హాజరైనట్టు మస్తర్లు నమోదు చేస్తున్నారని వేతనదారులు రవికుమార్, శ్రీధర్, చంద్రమ్మ, సునీత తదితరులు పేర్కొన్నారు. విచారణ జరిపి అక్రమాలను అడ్డుకోవాలని, సంబంధిత మేట్లు, ఫీల్డు అసిస్టెంట్పై చర్యలు తీసుకోవాలని కోరారు. -
రెండు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
● జిల్లాకేంద్రంలోని ఎత్తు బ్రిడ్జిపై ప్రమాదం ● మినీవ్యాన్ను ఢీకొన్న బైక్ ● బోల్తాపడిన వ్యాన్విజయనగరం క్రైమ్: స్థానిక ఎత్తు బ్రిడ్జిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. కొత్తవలస నుంచి బలిజిపేటకు మట్టి పెంకులను తీసుకువెళ్తున్న మినీవ్యాన్ను ఎదురుగా సాలూరు నుంచి వస్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో వ్యాన్ రోడ్డు మధ్యలో బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్ను ఢీ కొట్టిన ద్విచక్రవాహన చోదకుడు ఘటనా స్థలి నుంచి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో సాలూరు రోడ్డు నుంచి విజయనగరం వస్తున్న హైవే మొత్తం వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రెండు గంటల పాటు ఎత్తు బ్రిడ్జి ప్రాంతంలో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ఈ సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాదంలో గాయాల పాలైన మినీ వ్యాన్ డ్రైవర్ గోపీని చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
9న జిల్లాస్థాయి నృత్య పోటీలు
పార్వతీపురం: జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు–2026ను పురస్కరించుకుని నృత్యపోటీలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ పోటీలు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పోటీలను రెండు కేటగిరీల్లో నిర్వహించాలని 15ఏళ్ల లోపు వారు ఒక కేటగిరిలోను 15ఏళ్లకంటే ఎక్కువ ఉన్నవారిని రెండో కేటగిరిగా విభజించనున్నట్లు తెలిపారు. పోటీల్లో గిరిజన నృత్యాలు, జానపద నృత్యాలు, దేశభక్తి నృత్యాలు మాత్రమే ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. మండల స్థాయి పోటీలను జనవరి 7లోగా నిర్వహించి విజేతలను ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. మండల స్థాయి విజేతలకు జిల్లాస్థాయిలో జనవరి 9న మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ బహుమతిగా రూ.5వేలు, ద్వితీయ బహుమతి రూ. 2,500లు, తృతీయ బహుమతి రూ.1500లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. డీఈఓను నోడల్ అధికారిగా నియమించి ఎంపీడీఓలు, ఎంఈఓలు, సాంస్కృతిక కమిటీ సభ్యులతో ఈ పోటీలను నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. -
ఉత్సాహంగా అంతర్ కళాశాలల క్రీడా పోటీలు
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాలలో అంతర కళాశాలల క్రీడా సాంస్కృతిక పోటీలు ఉల్లాసంగా..ఉత్సాహంగా సాగుతున్నాయి. కళాశాల అసోసియేట్ డీన్ మక్కేన శ్రీను ఆధ్వర్యంలో జరుగుతున్న 14వ విశ్వవిద్యాలయ క్రీడాసాంస్కతిక పోటీల్లో వివిధ కళాశాలల నుంచి 530 మంది విద్యార్థులు పాల్గొనగా మంగళవారం పలు కళాశాలలకు చెందిన విద్యార్ధులకు పలు క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. ఈ క్రీడా పోటీల్లో తొలి దశలో బాలుర విబాగంలో వాలీబాల్ క్రీడాంశంలో గరివిడి, ప్రొద్దుటూరు కళాశాలలు విజేతగా నిలిచాయి. కేరమ్స్లో గన్నవరం వెటర్నరీ కళాశాల, టేబుల్ టెన్నిస్లో తిరుపతి, గరివిడి వెటర్నరీ కళాశాలలు విజేతలుగా నిలిచాయి. వాలీబాల్ రెండో దశలో ప్రొద్దుటూరు కళాశాల విజేతగా నిలిచింది. అదేవిధంగా బాలికల విబాగంలో బాస్కెట్బాల్, వాలీబాల్ క్రీడాంశాల్లో గరివిడి వెటర్నరీ కళాశాల విజయం సాధించగా బాల్ బ్యాడ్మింటన్లో గన్నవరం వెటర్నరీ కళాశాల, టేబుల్ టెన్నిస్లో తిరుపతి వెటర్నరీ కళాశాల విజయం సాధించాయి. -
ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసంపై ఫిర్యాదు
రామభద్రపురం: మండలంలోని ఆరికతోటలో ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అంజనేయ స్వామి విగ్రహ ధ్వంసానికి పాల్పడిన ఘటనపై చర్యలు తీసుకోవాలని గ్రామపెద్దలు, ప్రజలు, హిందూ భక్తులు మంగళవారం బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి, తహసీల్దార్ అజూ రఫీజాన్లకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని ఆరికతోట నుంచి పాతరేగ గ్రామానికి వెళ్లే జంక్షన్ పక్కన ఉన్న స్థలం యజమాని బోదంకి రామేశ్వరరావు గడిచిన 40 ఏళ్ల క్రితం ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టించారు. అయితే కొద్ది సంవత్సరాల తర్వాత గజపతినగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సత్యనారాయణకు ఆ స్థలం విక్రయించగా ఆంజనేయ విగ్రహం ఆ స్థలంలో నిర్మాణాలకు అడ్డుగా ఉందన్న ఉద్దేశంతో రియల్ఎస్టేట్ వ్యాపారి ఆ విగ్రహాన్ని గునపాలతో తవ్వేసి ఇటీవల తొలగించాడు. దీంతో గ్రామ పెద్దలు, ప్రజలు, హిందూ భక్తులు ఆగ్రహం వ్యక్తంచేసి ఫిర్యాదు చేశారు. బాధ్యులైన స్థల యజమానిపై చర్యలు తీసుకుని మళ్లీ విగ్రహం ప్రతిష్టించేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. డీఎస్పీ భవ్యరెడ్డి, సీఐ కె. నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావులు స్పదించి ఆరికతోట గ్రామ పెద్దలు, ప్రజలతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించిన బాధ్యుడు సత్యనారాయణను స్థానిక పోలీస్ స్టేషన్కు పిలిచి విచారణ చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మళ్లీ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టించేలా చర్యలు తీసుకోవాలని గ్రామపెద్దలు వారి అభిప్రాయం తెలియజేయగా, పూర్తి దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని డీస్పీ చెప్పారు. -
సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం
● గురుకులాల జిల్లా సమన్వయకర్త చీపురుపల్లి: సమాజంలో ప్రతి అంశంలోనూ పారదర్శకతే లక్ష్యంగా ఏర్పడిన సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలు, పాఠశాలల జిల్లా సమన్వయకర్త ఎం.మాణిక్యం అన్నారు. చీపురుల్లి పట్టణంలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల కళాశాలలో మంగళవారం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు/కళాశాలల్లో పని చేస్తున్న ప్రిన్సిపాళ్లు, బోధనేతర సిబ్బందికి సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆమె మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వచ్చాక వ్యవస్థల్లో పారదర్శకత పెరిగిందన్నారు. గురుకుల కళాశాలలు, పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది చట్టంపై పూర్తిస్థాయిలో పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఎ.రాణీశ్రీ పాల్గొన్నారు. పీడీఎస్ బియ్యం పట్టివేతసంతకవిటి: మండలంలోని మల్లయ్యపేట గ్రామంలో సోమవారం సాయంత్రం 980 కేజీల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ ఎస్సై బి.రామారావు పట్టుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మూల కృష్ణమూర్తి అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో దాడి చేసి స్వాధీనం చేసుకుని స్థానిక డీలర్కు అందజేశారు. పట్టుకున్న బియ్యం విలువ దాదాపు రూ.44,500 అని విజిలెన్స్ ఎస్సై బి.రామారావు తెలిపారు. రోడ్డు ప్రమాద మృతుడి గుర్తింపువిజయనగరం క్రైమ్: పట్టణ సమీప ధర్మపురిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుడిని గుర్ల మండలానికి చెందిన పిన్నింటి రాంబాబుగా పోలీసులు మంగళవారం గుర్తించారు. ఎంవీజీఆర్ కాలేజీవద్ద రాడ్ బైండింగ్ షాప్లో పని చేస్తున్న ధర్మపురికి చెందిన ముగ్గురు వ్యక్తులు ధర్మపురం నుంచి బైక్పై విజయనగరం వస్తుండగా విజయనగరం నుంచి ధర్మపురికి జావా బైక్పై వస్తున్న వ్యక్తి ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై హాస్పిటల్కు తీసుకువెళ్తుండగా రాంబాబు మృతిచెందాడని ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ లక్ష్మణరావు తెలిపారు. మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించామన్నారు. ఆన్లైన్లో బాలల ఆరోగ్య వివరాలు పార్వతీపురం రూరల్: బాలల ఆరోగ్య వివరాలు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని రాష్ట్ర ఐటీ కన్సల్టెంట్ జి.శ్రీనివాసరావు ఆదేశించారు. మండలంలోని జగన్నాథపురం యూపీహెచ్సీ సహా అక్కడి అంగన్వాడీ కేంద్రాలు, జోగింపేట వసతిగృహాన్ని మంగళవారం సందర్శించిన ఆయన పలు సూచనలు చేశారు. రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా చిన్నారులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షల నివేదికలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్ చిన్నారుల చేతుల్లోనే ఉందని, అటువంటి వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆయన వెంట జిల్లా అధికారి జగన్మోహనరావు తదితరులు ఉన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి సీతానగరం: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పీఏసీఎస్(ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం) ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై వారు మండల కేంద్రంలోని డీసీసీబీ వద్ద మండల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నాకు దిగారు. జీవో నంబర్ 36 వెంటనే అమలు చేయాలని, ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ లేకుండా ఆరోగ్య బీమా పథకం అమలు చేయాలని, ప్రతి ఉద్యోగికి సంబంధించి రూ.20 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ చేయించి, వారి కుటుంబాలకు అందజేయాలన్నారు. ఎప్పటి జీతాలు అప్పుడే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. -
జాతీయ స్థాయి పోటీలకు బాలికల పాఠశాల విద్యార్ధిని
విజయనగరం అర్బన్: న్యూఢిల్లీలో ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు రాష్ట్రం తరఫున పోటీపడే జట్టులో పట్టణంలోని దాసన్నపేటకు చెందిన ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాల విద్యార్థిని ఎన్.లావణ్య ఎంపికై ంది. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.రమణమ్మ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో 38 కేజీల విభాగంలో లావణ్య బంగారు పతకం సాధించి ఈ పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో లావణ్యను ప్రధానోపాధ్యాయురాలితో పా టు సీనియర్ ఉపాధ్యాయులు ఈ.రామునాయుడు, వ్యాయామ ఉపాధ్యాయురాలు పి.ప్రమీల, బి.ఆషారాణి, సీహెచ్వీ రత్నం అభినందించారు. -
ప్రచారం మీదా?
ఘనత మాది..● ప్రభుత్వంపై మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే ధ్వజంపార్వతీపురం రూరల్: గత ప్రభుత్వం నిర్మించిన భవనాలు, ఆస్పత్రులు, ప్రాజెక్టులకు రంగులు మార్చి, రిబ్బన్లు కట్ చేసి తామే నిర్మించామంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఎద్దేవా చేశారు. ఈ మేరకు పార్వతీపురంలోని ఆర్యవైశ్య కల్యాణ మంటపంలో మంగళవారం వైఎస్సార్సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అప్పుల్లో రికార్డు..అభివృద్ధిలో శూన్యం అధికారం చేపట్టిన 18 నెలల్లోనే రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. గత ప్రభుత్వంపై అప్పుల నిందలు వేసిన వారు, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వద్ద క్యూ కట్టి మరీ అప్పులు తెస్తున్నారని దుయ్యబట్టారు. సాలూరు ఆస్పత్రికి ఒక్క ఇటుక కూడా వేయని మంత్రి, ఇప్పుడు 80 శాతం పనులు పూర్తయిన తర్వాత తానే కట్టించానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల పనులను నిలిపివేసి, పార్టీ మారితేనే రోడ్లు వేస్తామంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పర్మిషన్లు తెచ్చింది జగన్.. ఫోజులు బాబువి భోగాపురం విమానాశ్రయం విషయంలో చంద్రబాబు ‘క్రెడిట్ చోర్’లా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జోగారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2019కి ముందు ఎలాంటి అనుమతులు లేకుండా కొబ్బరికాయ కొట్టిన చంద్రబాబు, ఇప్పుడు తానే విమానాశ్రయాన్ని కట్టానని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. కోర్టు కేసులను పరిష్కరించి, గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు సాధించి, 2,751 ఎకరాల భూసేకరణ జరిపి, రైతులకు పరిహారం అందించి పనులు పరుగులు పెట్టించింది తమ అధినేత జగన్మోహన్ రెడ్డేనని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి కృషిని ప్రశంసించిన వీడియోలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2026 నాటికి విమానాశ్రయం పూర్తి చేస్తామని ఆనాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారని, ఆ దిశగానే పనులు సాగాయని గుర్తు చేశారు. అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి ‘తల్లికి వందనం’ అని పేరు మార్చిన చంద్రబాబు, అచ్చమైన ‘నేమ్ చేంజర్’ అని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావుడి శ్రీనివాసరావు, జెడ్పీ వైస్ చైర్మన్ బాపూజీ నాయుడు, అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
పంట మార్పిడి విధానంతో ప్రయోజనాలు
● జిల్లా వ్యవసాయ అధికారిణి అన్నపూర్ణకురుపాం: పంట మార్పిడి విధానంతో రైతులకు పలు ప్రయోజయనాలు కలుగుతాయని జిల్లా వ్యవసాయాధికారిణి రెడ్డి అన్నపూర్ణ అన్నారు. ఈ మేరకు కురుపాం మండలంలోని దురిబిలి గ్రామంలో ఖరీఫ్లో వరి పంట తరువాత పంట మార్పిడి విధానంలో భాగంగా రబీలో ప్రధాన పంట మినుముతో పాటు పెసలు, వేరుశనగ, నువ్వులు, పొద్దు తిరుగుడు, కూరగాయలు, ఆకుకూరలు, తదితర 12 రకాల పంటలు సాగు చేస్తున్న రైతుల క్షేత్రాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట మార్పిడి విధానం రైతులు పాటించడం వల్ల భూమి సారవంతం చెందుతుందని, పంటలకు పురుగులు, తెగుళ్లు తట్టుకునే సామర్థ్యం కలిగి, అధిక దిగుబడులు సాధించే అవకాశం కలుగుతుందన్నారు. మొక్కలలో జీవవైవిద్యం పెంపొందుతుందని చెప్పారు. మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ నేల చిన్న పదును ఉన్నా ఏదో ఒక పంట వేస్తే మధ్యలో వర్షం చిన్నగా పడినా, లేదా మంచు ద్వారా పంట ఎంతో కొంత వస్తుందని, భూమి ఖాలీగా ఉండకుండా చూసుకోవాలని అందరూ రైతులు తమకున్న పూర్తిస్థాయి విస్తీర్ణంలో పంట సాగు చేసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో ఏఈఓ భార్గవ్, మాస్టర్ ట్రైనర్ బి.శ్రీరామ్, సత్యం, రైతులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రిక్ బగ్గీ విరాళం
విజయనగరం రూరల్: జేఎన్టీయూ, గురజాడ విజయనగరం విశ్వవిద్యాలయానికి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆండ్ మేనేజ్మెంట్ (ఏఐటీఏఎం) కళాశాల మంగళవారం ఎలక్ట్రిక్ బగ్గీని విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా జేఎన్టీయూ జీవీ ప్రాంగణంలో ఉపకులపతి వీవీ సుబ్బారావు బగ్గీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ బగ్గీ విద్యార్థులకు, బోధన, బోధనేతర సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ ఎలక్ట్రిక్ బగ్గీ అందించిన ఏఐటీఎఎం యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ, బగ్గీ రూపొందించడానికి కృషి చేసిన ఏఐటీఏఎం విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ఇటువంటి నూతన ఆవిష్కరణలు చేపట్టి సమాజానికి, దేశానికి ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. ఇటువంటి నూతన ఆవిష్కరణలు చేపట్టి మిగిలిన విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. విద్యార్థులు రూపొందించిన బగ్గీని జేఎన్టీయూ జీవీ ఉపకులపతి సుబ్బారావు స్వయంగా నడిపారు. ఈ బగ్గీలో రిజిస్ట్రార్ జి.జయసుమ, ఏఐటీఎఎం డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు, విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు బి.రాజేష్ ప్రయాణించారు. కార్యక్రమంలో జేఎన్టీయూ జీవీ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయాల్లో వీఆర్ఓల చాంబర్ తప్పనిసరి
వీరఘట్టం: సచివాలయాల్లో వీఆర్ఓలకు చాంబర్ ఉండాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన వీరఘట్టం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..సచివాలయాలను తరచూ తనిఖీ చేపట్టాలని సూచించారు. వాటి పనితీరును మెరుగుపర్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, అదేవిధంగా మండంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కవిత, ఆర్ఐ రవితేజ, వీఆర్ఓలు వి.రమేష్నాయుడు, కోట శ్రీనివాసరావు, జి.రాజేంద్ర ప్రసాద్లు కలెక్టర్ను శాలువాతో సత్కరించారు. చెట్టు పైనుంచి పడి గీతకార్మికుడి మృతిడెంకాడ: మండలంలోని వెలంపేట గ్రామానికి చెందిన ఒనుము పాపయ్య(42) తాటిచెట్టు పైనుంచి పడిపోయి మరణించినట్లు ఎస్సై ఎ.సన్యాసినాయుడు మంగళశారం తెలిపారు. వెలంపేట గ్రామం శివారులో ఉన్న తాటిపెండిలో తాటిచెట్టు ఎక్కి పడిపోయిన పాపయ్య తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన పాపయ్యను చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి తల్లి ఒనుము తౌడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బరోడా, పంజాబ్ జట్ల విజయం
విజయనగరం రూరల్: బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్–15 మహిళల వన్డే టోర్నీలో (ఎలైట్ గ్రూప్) బరోడా, పంజాబ్ జట్లు విజయం దుందుభి మోగించాయి. స్థానిక విజ్జి క్రికెట్ మైదానంలో బరోడా, హైదరాబాద్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్లో బరోడా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి నిర్ణీత 35 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు సాధించింది. హైదరాబాద్ జట్టు ఓపెనింగ్ బ్యాటర్లు పి.శాన్వి (44 పరుగులు), భవిష్యరెడ్డి (41 పరుగులు) తొలి వికెట్కు 16 ఓవర్లలో 80 పరుగులు భాగస్వామ్యం అందించారు. అయితే మిగతా బ్యాటర్లు విఫలమవడంతో స్వల్ప స్కోర్కే పరిమితమవుతుంది. అనంతరం 138 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బరోడా జట్టు 24.2 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టపోయి 141 పరుగులు చేసి విజయం సాధించింది. 27 పరుగుల తేడాతో పంజాబ్ విజయం డెంకాడ మండలంలోని చింతలవలసలో గల డాక్టర్ పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ క్రికెట్ మైదానంలో పంజాబ్, విదర్భ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్లో 27 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టు నిర్ణీత 35 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 166 పరుగులు సాధించింది. అనంతరం 167 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విదర్భ జట్టు 33.1 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ పంజాబ్ బౌలర్లలో కౌర్ సంధూ 3 వికెట్లు, ఆస్తా 4 వికెట్లు సాధించి జట్టు విజయానికి కృషి చేశారు. -
లోపల కత్తులు!
బీజేపీ.. సొంతంగా ఎదగాలనుకుంటుందా? సాక్షి, పార్వతీపురం మన్యం : ●పాలకొండ నియోజకవర్గం వండువలో గత ప్రభుత్వ హయాంలో రైతులకు అందిన రైతుభరోసా.. నేడు ఇవ్వడం లేదని జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ బహిరంగంగానే అంగీకరించారు. ఇదే విషయమై అధికారులకూ ఫిర్యాదు అందించారు. ●పాలకొండ నియోజకవర్గంలో అక్రమ ఇసుక, మైనింగ్ వ్యాపారం జోరుగా సాగుతోందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి ఇటీవల ఫిర్యాదు చేశారు. తమ కార్యకర్తలకు పథకాలేవీ అందకుండా అడ్డుకుంటున్నారని.. కనీసం తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ●పార్వతీపురంలో జనసేనను అసలు పట్టించుకోవడం లేదని.. ఎమ్మెల్యే తీరుపై ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆదాడ మోహనరావు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వైఖరి, పనితీరు పట్ల విసుగు చెంది ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో సమస్యలపై నేరుగా పోరాడుతానని గతంలో ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ●తాజాగా బీజేపీ నాయకులు ‘జనతా వారధి’ అంటూ సోమవారం ఓ కార్యక్రమం చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆ పార్టీ నాయకులు కలెక్టరేట్ వద్ద హడావిడి చేశారు. విచిత్రమేమిటంటే.. వీరంతా కూటమిలో భాగమే.. మిత్రపక్షమే. అదంతా పైస్థాయిలోనే. క్షేత్రస్థాయికి వచ్చేసరికి.. పైకి పొత్తులు, లోపల కత్తుల మాదిరి ఉంది పరిస్థితి. జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య సఖ్యత లేదనడానికి ఇవన్నీ కొన్ని ఉదాహరణలే. పాలకొండ నియోజకవర్గంలో జనసేన–టీడీపీ మధ్య ఎప్పటినుంచో భగ్గుమంటోంది. పార్వతీపురం నియోజకవర్గంలోనూ జనసేన అంటూ ఒకటుందని టీడీపీ ఎమ్మెల్యే గుర్తించిన పరిస్థితి లేదు. పాలకొండలో టీడీపీ నేత.. పార్వతీపురంలో జనసేన నాయకుడు ఈ విషయాన్ని తమ అధినేతల దృష్టికీ తీసుకెళ్లారు. సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో జనసేన ఉనికే లేకుండా చేశారు. ఇక కేంద్రంలో అధికారలో ఉన్న కూటమి మరో కీలక మిత్రపక్షం బీజేపీ. అసలు ఆ పార్టీని ఎక్కడా కలుపుకొని వెళ్లే పరిస్థితి ఈ ఏడాదిన్నర కాలంలో జిల్లాలో కనిపించలేదు. ఏడాదిన్నర కాలంలో జిల్లాలో బీజేపీ అంటూ ఒకటుందని ఏ నియోజకవర్గంలోనూ గుర్తించిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని ఆ పార్టీనే కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే సొంతంగా తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. మిత్రపక్షంలో ఉన్నప్పటికీ.. సోమవారం కలెక్టరేట్ వద్ద ఓ కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర నేత రెడ్డి పావని, జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, ఇతర నాయకులు.. పీజీఆర్ఎస్కు వచ్చిన ప్రజలను ఆరా తీశారు. వారి సమస్యలు తెలుసుకుని, వాటిని వారే స్వయంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మిత్రపక్షంలో ఉండి.. ప్రజా సమస్యలను అధికారుల వద్దకు తీసుకెళ్లడమంటే పరోక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించినట్లే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో తమకంటూ సొంతంగా ఒక గుర్తింపును బీజేపీ కోరుకుంటున్నట్లు ఉందని తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం.. అధికారులు కూడా తమను గుర్తించకపోవడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వినిపిస్తోంది. -
పరిష్కారానికి ఎన్నాళ్లో..!
కదిపితే కన్నీళ్లు..ఈ దీనుల మొర ఎవరు ఆలకిస్తారు. వారి ఆవేదన ఎవరు పట్టించుకుంటారు. ఏ దేవుడు వారిని కరుణిస్తాడు. ఏ ప్రజాప్రతినిధి, ఏ అధికారి వారికి న్యాయం చేస్తారు. ఏదో సమస్యతో ప్రతి సోమవారం కలెక్టరేట్కు వచ్చి వినతిపత్రాలు ఇస్తున్న అభాగ్యుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కన్నీళ్లు కారుస్తున్నారు. – సాక్షి, పార్వతీపురం మన్యం ఎవరిని కదిపినా కన్నీళ్లే..ఆవేదనలే. పింఛన్లు కావాలని.. అన్యాయంగా విధుల నుంచి తొలగించారని..తమ స్థలాన్ని ఆక్రమించారని..రహదారులు వేయాలని..ఇలా ఒకటా, రెండా వందలకొద్దీ సమస్యలు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంపై ఎంతో నమ్మకంతో అర్జీలిచ్చేందుకు వస్తున్న వివిధ వర్గాల వారికి నిరాశే ఎదురవుతోంది. సుదూర ప్రాంతం నుంచి వచ్చి, కలెక్టరేట్లో ప్రతి సోమవారం ఉన్నతాధికారులకు వినతులిస్తున్నప్పటికీ అవన్నీ బుట్టదాఖలే అవుతున్నాయి. ప్రతి వారం వివిధ సమస్యలపై వందకుపైగా విజ్ఞప్తులొస్తున్నాయి. వాటిని పరిశీలించిన అధికారులు..పరిష్కరించేసినట్లుగానే చెప్పుకుంటున్నారు. బాధితులు ఇంకా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు సైతం కాళ్లీడ్చుకుంటూ, మరొకరి సాయంతో పింఛన్ కోసం వస్తున్నారు. కొండలు దిగి వస్తున్నామని, తమ ప్రాంతానికి రహదారి వేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు. వారి కష్టం చూసైనా ప్రభుత్వ యంత్రాంగం మనసు కరగడం లేదని ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. పాచిపెంట మండలం కేసలి గ్రామానికి చెందిన కిర్ల శ్రీనివాసరావు కుమారుడు రితిక్ పుట్టుక నుంచి వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. వైద్యానికి, మందులకు అధిక మొత్తం ఖర్చవుతోంది. 84 శాతంతో పర్మినెంట్ డిజేబులిటీ ఉందని వైద్యులు కూడా ధ్రువీకరించారు. సుమారు రెండేళ్లుగా పింఛన్ ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. పింఛన్ మొత్తం వస్తే మందుల ఖర్చయినా ఒడ్డెక్కుతుందని తండ్రి శ్రీనివాసరావు అంటున్నాడు. ఏ ఒక్కరూ తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
ౖపైపె మెరుగులతో మ్యూజియం..!
ఏరియా ఆస్పత్రిని ప్రారంభించనున్న మంత్రి● వైఎస్సార్సీపీ హయాంలోనే 80 శాతం పనుల పూర్తిసీతంపేట: గిరిజన మ్యూజియానికి ౖపైపె మెరుగులేసి ప్రారంభించడానికి సన్నద్ధం చేశారు. సీతంపేటలోని పీఎంఆర్సీ (ప్రాజెక్టు మానిటరింగ్ రిసోర్స్ సెంటర్) పాత భవనానికి మెరుగులు దిద్దారు. హడావిడిగా మ్యూజియంలో కొంతసామగ్రి పెట్టి, గిరిజన గ్రామ వాతావరణం ఏర్పా టు చేయడానికి పూరిగుడిసె వంటివి నిర్మించి అక్కడ గిరిజనుల బొమ్మలు ఏర్పాటు చేస్తున్నా రు. పూలమొక్కలు వంటివి ముందు భాగంలో వేసి మ్యూజియం వాతావరణం కల్పించి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో ప్రారంభానికి సిద్ధం చేశారు. ఎనిమిదేళ్లుగా పూర్తిస్థాయిలో తర్చిదిద్దలేని మ్యూజియాన్ని ఒక్కరోజులో ఎలా చేశారో అధికారులకే ఎరుక. రూ.కోటి అంచనా వ్యయంతో 2017లో ఈ మ్యూజియానికి శంకుస్థాపన జరిగింది. 2018 ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాటికి పనులు పూర్తిచేసి ఆ రోజున మ్యూజియాన్ని ప్రారంభిస్తామని అప్పట్లో చెప్పారు. అనంతరం ఈ మ్యూజియానికి కావాల్సిన పరికరాలను, విలువైన సామగ్రిని ఒక గదిలో ఉంచారు. అయి తే అవి చెదలు పట్టి సగం వరకు పోయాయి. వివిధ రకాల బొమ్మలు తయారు చేసి అలాగే వదిలేశారు. అనంతరం మళ్లీ కొద్ది రోజుల కింద ట పనులు అరకొరగా చేపట్టారు. మంగళవారం ప్రారంభానికి సిద్ధం చేశారు. ఇది పరిస్థితి.. 8 రాష్ట్రాల్లో విస్తృతంగా గిరిజనులు నివసిస్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నివసించే గిరిజనులతోపాటు సీతంపేట ఏజెన్సీలో ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, మహరాష్ట్ర, బీహార్లలో ఉన్న ఆదివాసీలు, ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉండే ఆదివాసీల జీవన విధానం కంటికి కనిపించేలా బొమ్మల రూపంలో మ్యూజియంలో చూపించాలని నిర్ణయించారు. గిరిజనులు ఇంట్లో వాడే వస్తువులు, కట్టుబాట్లు, వేటాడే వస్తువులు, పూర్వం నుంచి ఇప్పటివరకు దశలవారీగా జరిగిన మార్పులను చిత్ర రూపంలో బొమ్మలను ప్రదర్శించాలి. ఇందుకు స్థానిక పీఎంర్సీలో 10 వరకు బ్లాకులను విభజించి సుందరంగా తీర్చిదిద్ది అందులో ప్రదర్శనకు ప్రతిపాదనలు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఏ గదిలో కూడా పూర్తిస్థాయిలో గిరిజన సంస్కృతి, ఆచార సంప్రదాయలు ఉట్టిపడే బొమ్మలు కనిపించన దాఖలాలు లే వు. అరకు, శ్రీశైలం, భువనేశ్వర్ వంటి చోట మ్యూజియాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఆ స్థాయిలో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే పూర్తిస్థాయిలో పూర్తికాకుండానే ప్రారంభానికి సిద్ధమవడం విశేషం. సీతంపేట: ఆధునికీకరించిన సీతంపేట ఏరియా ఆస్పత్రిని మంత్రి సంధ్యారాణి మంగళవారం ప్రారంభించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 30 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు ముందడుగు వేసింది. నాటి ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ప్రత్యేక చొరవతో యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం నుంచి రూ.19.07 కోట్లు మంజూరు చేయించారు. దశల వారీగా 80 శాతం పనులు పూర్తయిన విషయం తెలిసిందే. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేసింది. -
టీడీపీ పదవి..
సమయం సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట అవుతోంది. కలెక్టరేట్ ఆవరణంతా వినతులిచ్చేందుకు వచ్చిన ప్రజలతో కిటకిటలాడుతోంది. అప్పుడే ప్రధాన గేటులో నుంచి.. కుయ్ కుయ్మని శబ్దం (సైరన్) చేసుకుంటూ నల్లరంగు కారు ఒకటి లోపలికి దూసుకొచ్చింది. వచ్చింది ఎవరా? అని అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యంగా చూశారు. కారు తిన్నగా వచ్చి కలెక్టరేట్ మెట్ల వద్ద ఆగింది. (సాధారణంగా కలెక్టరేట్, జేసీ వంటి ఉన్నతాధికారులు.. రాష్ట్రస్థాయి అధికారులు, మంత్రి వంటివారు వచ్చినప్పుడే ఆ ప్రదేశంలో కారును నిలుపుచేస్తారు). అందులో నుంచి ఠీవీగా తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి దిగారు. అంతే.. ముక్కున వేలేసుకోవడం అందరి వంతైంది. సైరన్ మోగించే కారును కలెక్టర్, ఎస్పీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వంటివారు మాత్రమే వినియోగించాలి. కేబినెట్ హోదా ఉన్న మంత్రులకు కూడా పోలీస్ ఎస్కార్ట్ వాహనం, ప్రోటోకాల్ వాహనం ఈ విధమైన సైరన్ మోగించుకుంటూ ముందువెళ్తాయి. ఎమ్మెల్యేలు సైతం ఇలాంటి వాహనాలను వినియోగించరు. అలాంటిది ఇటీవలే టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తేజోవతి.. ఏకంగా బుగ్గకారు బిల్డప్ ఇస్తూ.. సైరన్ మోగించుకుంటూ నేరుగా కలెక్టరేట్లోకే రావడం గమనార్హం. పార్టీ పదవికే ఈ విధమైన బిల్డప్ ఇస్తే.. భవిష్యత్తులో ఏదైనా రాజ్యాంగ పదవివస్తే... ఇంకెంత రేంజులో వస్తారో అని అక్కడున్న వారంతా చర్చించుకోవడం కనిపించింది. – సాక్షి, పార్వతీపురం మన్యం -
హైకోర్టు న్యాయమూర్తితో ఎస్పీ భేటీ
పార్వతీపురం రూరల్: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్.మానవేంద్రనాథ్ రాయ్ ను ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలో ఉన్న న్యాయమూర్తి నివాసానికి వెళ్లిన ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలి యజేసి, పూలమొక్కను అందజేశారు. పార్వతీపురంటౌన్: విశ్రాంత ఉద్యోగులు తమ పింఛన్కు సంబంధించి లైఫ్ సర్టిఫికెట్లను జిల్లా కేంద్రంలో గల పింఛన్ దారుల భవనంలో చేసుకునే విధంగా అవకాశం కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వ పింఛన్ దారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గంటా జగన్నాథం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటవరకు ఉద్యోగులకు లైఫ్ సర్టిఫికెట్లకు సంబంధించి వార్షిక వెర్ఫికేషన్ సర్టిఫికెట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు ప్రతి వర్కింగ్ డేలోను ఈ కార్యక్ర మం ఉంటుందని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్వతీపురం రూరల్: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. ఉపాధ్యాయుల ఐక్యతే మార్గంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) పార్వతీపురం మన్యం జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా కొలువుదీరింది. స్థానిక ప్రభుత్వ పింఛన్దారుల భవనంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈవీ రామారావు పర్యవేక్షణలో సోమవారం జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశం ఎన్నికల వేదికై ంది. జిల్లా అధ్యక్షుడిగా మర్రావు మహేష్, ప్రధాన కార్యదర్శిగా నల్లా బాలకృష్ణారావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికై సారథ్య బాధ్యతలు చేపట్టారు. ఉపాధ్యక్షులు గా రావాడ అప్పలనాయుడు, కె. పద్మజ, జి.సత్యనారాయణ, డి.అప్పలనాయుడు, మరడాన సంపత్ కుమార్ బాధ్యతలు స్వీకరించగా.. కార్యదర్శులుగా ఎంవీ గౌరీశంకర్, బీవీఏ నా యుడు, ఎ.జగదీశ్వరరావు, జి. శ్రీనివాసరావు, జి.సూర్యనారాయణలను సభ ఎన్నుకుంది. రాష్ట్ర కౌన్సిలర్గా బీవీ రమణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఉపాధ్యాయ హక్కుల రక్షణే శ్వాసగా, సంఘం బలోపేతమే ధ్యాసగా పనిచేస్తామని ప్రతినబూనారు. త్వరలోనే జిల్లా సబ్ కమిటీల ను నియమిస్తామని ప్రధాన కార్యదర్శి తెలిపా రు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాల ప్రతినిధులు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ మేనత్త పెదపోలమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవాన్ని సోమవారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. చదురుగుడిలో పోలమాంబ అమ్మవారి సన్నిధిలో ఈవో బి. శ్రీనివాస్, ట్రస్ట్భోర్డు చైర్మన్ నైదాన తిరుపతి రావు, కమిటీ సభ్యులు, మాజీట్రస్ట్బోర్డు చైర్మ న్లు, గ్రామపెద్దలు, కుప్పిలి, కరణం, రెవిన్నాయుడు, జన్నివారి కుటుంబసభ్యులు, గ్రామపెద్దలు పెదపోలమాంబ అమ్మవారి ఘటాల కు వెండిపూతను పట్టించి అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని, అమ్మవారి ఘటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఘటాలకు గ్రామంలో తిరువీధి నిర్వహించారు. మంగళవారం పెదపోలమాంబ అమ్మవారి ప్రధాన ఉత్సవం నిర్వహిస్తారు. -
చేతికి అందివచ్చాడనుకుంటే..
● ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణంపార్వతీపురం రూరల్: విధి ఆ కుటుంబంపై పగబట్టింది. చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరమైన ఆ బిడ్డ.. పెరిగి పెద్దవాడై చేతికి అందివచ్చాడనుకునేలోపే మృత్యువు కబళించింది. కష్టాల కడలిని ఈది రెండు కుటుంబాలకు ’పెద్ద దిక్కు’గా నిలిచిన ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మరణం ఎత్తుకెళ్లిపోయింది. గరుగుబిల్లి మండలం తోటపల్లిలో ఆదివారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు.. తోటపల్లి గ్రామానికి చెందిన రాయపల్లి సతీష్(29) బొబ్బిలిలోని ఓ నిర్మాణ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగానే ఆదివారం విధులు ముగించుకుని, రాత్రి 10.30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై స్వగ్రామం బయలుదేరాడు. మార్గమధ్యంలో అడ్డాపుశీల గ్రామం వద్దకు రాగానే.. ఎదురుగా అతివేగంగా దూసుకొచ్చిన ట్రాక్టర్ సతీష్ బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సతీష్ ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచాడు. ’అమ్మ లేని లోటు తెలియకుండా.. సతీష్ చిన్నతనంలోనే కన్నతల్లిని కోల్పోయాడు. తండ్రి రాయపల్లి సుదర్శనన్రావు కూలి పనులు చేస్తూ కొడుకును చదివించాడు. మరోవైపు సతీష్ చిన్నాన్న, పిన్నిలకు సంతానం లేకపోవడంతో..సతీష్నే తమ కన్నబిడ్డగా పెంచుకున్నారు. రెండు పేద కుటుంబాలకు సతీష్ ఒక్కడే ఆధారం. సూపర్వైజర్గా స్థిరపడి, తన జీతంతో రెండు ఇళ్లనూ పోషిస్తూ, వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు. ఇంతలోనే మృత్యువు ఆ ఇంటి వెలుగును ఆర్పివేసింది. ‘మా కష్టాలు తీరుస్తాడనుకున్న కొడుకు.. కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ‘ తండ్రి సుదర్శన్నరావు, కుటుంబసభ్యులు గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు చూపరులను కలిచివేసింది. -
దాడి చేసిన వ్యక్తులపై చర్యలు
● ఎస్పీ దామోదర్భోగాపురం: దళితులపై దాడి చేసిన వ్యక్తులపై విచారణ చేపడుతున్నామని నేరం రుజువైతే వెంటనే వారిపై కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఈ మేరకు మండలంలోని ముంజేరు పంచాయతీ, సిద్ధార్థ్నగర్ కాలనీ చెందిన దళితులు తమపై దాడిచేసి దౌర్జన్యంగా తమ కాలనీ మీదుగా మురుగుకాలువ నిర్మించిన ముంజేరు వాసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గడిచిన 30 రోజులుగా ఎంపీడీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎస్పీ దామోదర్, సీఐ కె దుర్గాప్రసాద్, ఎస్సైలు వి.పాపారావు, సూర్యకుమారిలు సోమవారం దీక్ష శిబిరం వద్దకు చేరుకుని, దీక్ష చేస్తున్న దళితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ దళితులతో మాట్లాడుతూ మీపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నామని చెప్పారు. మీరంతా ఫిర్యాదు ఇవ్వడంతో విచారణ జరిపి 35 మందిపై కేసులు నమోదు చేసి నోటీసులు కూడా ఇచ్చి కోర్టులో హాజరు పరిచామని చెప్పారు. తదుపరి కోర్టు అదేశాల మేరకు వారిపై చర్యలు తీసుకుంటామని, దీక్ష విరమించుకోవాలని దళితులను కోరారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ మండలంలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించి ప్రమాదాల నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని సిబ్బందిని అదేశించినట్లు తెలిపారు. త్వరలో ఈ ప్రాంతంలో విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై దృష్టి పెడుతున్నామన్నారు. సిబ్బందిని ఎక్కడెక్కడ ఏవిధంగా సర్దుబాటు చేయాలనే విషయాలపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. -
వందేళ్ల పోరాట చరిత్ర సీపీఐదే
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్యవిజయనగరం గంటస్తంభం: చరిత్ర పరిశీలిస్తే దేశానికి ఎవరు సేవ చేశారో స్పష్టంగా తెలుస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం నుంచి ప్రజాహక్కుల పోరాటాల వరకూ వందేళ్లకు పైగా సీపీఐ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈనెల 18న ఖమ్మం పట్టణంలో జరిగే సీపీఐ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే నిమిత్తం స్థానిక అమర్ భవన్లో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ముందుండి పోరాడింది కమ్యూనిస్టులేనని గుర్తు చేశారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలు కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఉన్నాయని విమర్శించారు. ఎర్రజెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల రక్షణకు కట్టుబడి ఉంటారన్నారు. వందేళ్ల ఉద్యమ చరిత్రలో భూ పోరాటాలు, ప్రజా ఉద్యమాల ద్వారా పేదలకు న్యాయం జరిగిందని తెలిపారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తావించారు. అంతకుముందు పట్టణంలోని మయూరి కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదగా సీపీఐ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎర్రజెండాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు, సహాయ కార్యదర్శి బుగత అశోక్, అలమండ ఆనందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, మహిళలు, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు, కార్మికులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు పునరావృతం కాకూడదు: కలెక్టర్ ప్రభాకరరెడ్డి
పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు అందిన అర్జీలపై సత్వరమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావేదికకు 117 వినతులు అందాయి. ఇందులో 39 రెవెన్యూ,79 వివిధ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ అర్జీలపై ఆడిటింగ్ జరుగుతుందన్నారు. జిల్లా అధికారులు ఆయా వినతులను స్వయంగా పరిశీలించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీ పునరావృతం కారాదన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాధ్, డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి తదితరులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని ఇలా.. ● జియ్యమ్మవలస పంచాయితీలో ప్రత్యేక నిధులతో కాలువలను శుభ్రం చేసినట్లు, గ్రీన్ అంబాసిడర్లకు 24 నెలల జీతం చెల్లించినట్లు తప్పుడు నివేదికలను ఎంపీడీవో చూపించి నిధులు దుర్వినియోగం చేశారని తక్షణమే దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఏఎంసీ డైరెక్టర్ ఎల్.తాతబాబు దరఖాస్తు చేశారు. ● పార్వతీపురం పట్టణానికి చెందిన పి.గౌరీశంకరరావు చనిపోగా వితంతు పింఛన్ మంజూరు చేయాలని పి.రజని కోరారు. ● పొట్ట కేన్సర్తో బాధ పడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చికిత్సకు అవసరమైన సాయం మంజూరు చేయాలని బలిజిపేట మండలం పెదపెంకి గ్రామానికి చెందిన ఎన్.నర్సింగరావు దరఖాస్తు అందజేశాడు. ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి బాధితుల నుంచి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఈ వారం కార్యక్రమంలో కుటుంబకలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీల వేధింపులు, ఆన్లైన్ మోసాలకు సంబంధించి 3 ఫిర్యాదులు అందాయి. బాధితులతో మాట్లాడిన ఎస్పీ, వారి సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులు అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా విచారించి, వాస్తవాల ఆధారంగా చట్టపరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. తీసుకున్న చర్యలపై నివేదికను జిల్లా కార్యాలయానికి పంపాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్ నాయుడు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 10 అర్జీలు సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 10 వినతులు వచ్చాయి. చిన్నబగ్గ ఆశ్రమ పాఠశాలలో స్వీపర్, వాచ్మన్ పోస్టు ఇప్పించాలని గ్రామానికి చెందిన వి.బాజన్న కోరాడు. కిరాణా షాపు పెట్టుకోవడానికి రుణం మంజూరు చేయాలని బుతలగూడకు చెందిన అప్పలమ్మ కోరింది. బైదలాపురం పీహెచ్సీలో నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు చేసినందుకు బెదిరిస్తున్నారని మువ్వల అచ్చమ్మ వాపోయింది. సరడాం ఎంపీపీ స్కూల్కు అదనపు భవనం మంజూరు చేయాలని సవర బాలరాజు వినతిపత్రం అందజేశాడు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ రమాదేవి, పీహెచ్వో ఎస్.వి.గణేష్, వ్యవసాయాధికారిణి వాహిని తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో స్నేహభావం
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ● ఏపీఎస్పీ 5వ బెటాలియన్ 37వ క్రీడాపోటీలు ప్రారంభండెంకాడ: శారీరక, మానసిక సామర్థ్యంతో పాటు స్నేహభావం పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు చింతలవలస ఏపీఎస్పీ 5 వ బెటాలియన్ లో 37వ క్రీడా పోటీలను ఆయన బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి క్రీడాపోటీల వల్ల పోలీసుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయవచ్చన్నారు. క్రీడల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడాస్ఫూర్తితో ఆడాలన్నారు. బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతిఒక్కరూ నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసులే కాకుండా వారి పిల్లలు, కుటుంబ సభ్యులు కూడా క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కలెక్టర్ ముందుగా కవాతును తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా 9 బెటాలియన్ బృందాలు మధ్యలో బ్యాండు మేళా వాయిద్యాలతో కన్నుల పండువగా కవాతు ప్రదర్శన నిర్వహించాయి. పోటీల్లో వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన సురేష్, సత్యారావు, దివాకర్లకు కలెక్టర్ మెడల్స్, ప్రశంసా పత్రాలను బహూకరించారు. కార్యక్రమంలో బెటా లియన్ అడిషనల్ కమాండెంట్ రాజారెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్లు ప్రభాకర్, రమణమూర్తి, లక్ష్మీనారాయణ, బాపూజీ, గోపాలకృష్ణ, టీం కెప్టెన్లు, పోలీసు అధికారులు, సిబ్బంది, కు టుంబ సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం 11 వ్యక్తిగత, సామూహిక క్రీడా పోటీలు నిర్వహించగా, సుమారు 207 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు.80 లీటర్ల సారాతో ఇద్దరి అరెస్ట్కురుపాం: సారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జియ్యమ్మవలస మండలంలోని పాత్రునివలస గ్రామ పరిధిలో సారా రవాణా చేస్తున్న చినమేరంగి గ్రామానికి చెందిన బొమ్మాళి అరుణ్ కుమార్ వద్ద 80 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే సారా రవాణాకు సహకరించిన బొత్స అఖిల్ ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు. సారా తయారీకి ముడిసరుకు సరఫరా చేసిన ఒడిశాకు చెందిన మీసాల తిరుపతి రావుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సై రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యాన్ డ్రైవర్ మృతిపూసపాటిరేగ: మండలంలోని సీహెచ్ అగ్రహారం సమీపంలో గల మేట్రిక్స్ కంపెనీ వద్ద జాతీయరహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యాన్ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..విజయవాడ నుంచి టెక్కలికి సామగ్రితో వెళ్తున్న వ్యాన్ను సీహెచ్ అగ్రహారంలోని మేట్రిక్స్ కంపెనీ సమీపంలో జాతీయరహదారిపై పక్కకు ఆపి కాలకృత్యాలు తీర్చుకోవడానికి డ్రైవర్ గురజాపు నగేష్ (30) రహదారి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ఈనెల 4వతేదీన ఉదయం విజయవాడలో బయలుదేరిన వ్యాన్ 5 వతేదీ ఉదయం 7 గంటలకు పూసపాటిరేగ మండలం సీహెచ్ అగ్రహారం వద్దకు వచ్చే సరికి ఆపిన డ్రైవర్ రహదారి దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు మృతుడి భార్య గురజాపు భవాని తెలిపింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు బైక్లు ఢీకొని యువకుడి మృతి విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మపురిలో సోమవారం రాత్రి రెండు బైక్లు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించి రూరల్ ఎస్సై అశోక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎంవీజీఆర్ కాలేజీ నుంచి ముగ్గురు యువకులు బైక్పై విజయనగరం వస్తున్నారు. విజయనగరం నుంచి జావా వెహికల్పై మరో యువకుడు ధర్మపురి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ధర్మపురి దగ్గర రెండు బైక్లు ఢీ కొనగా స్పాట్లోనే బైక్పై వస్తున్న ముగ్గురు యువకుల్లో ఒకరు దుర్మరణం చెందాడు. ఆస్పత్రిలో మిగిలిన ముగ్గురు చికిత్స పొందుతుండగా ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. -
అర్జీదారులకు నిరాశ
● పీజీఆర్ఎస్లో మంత్రి పాల్గొన్నా అర్జీదారులకు దక్కని మాట్లాడే అవకాశంవిజయనగరం అర్బన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో అర్జీదారులకు నిరాశే ఎదురైంది. కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా పాల్గొన్నప్పటికీ అర్జీదారులు మంత్రితో నేరుగా మాట్లాడి సమస్యలు చెప్పుకునే అవకాశం దక్కకపోవడంతో నిరాశ వ్యక్తం చేశారు. మంత్రితోపాటు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ సహా పదుల సంఖ్యలో జిల్లా అధికారులు ఒకే వేదికపై పాల్గొని తమ అర్జీలను తీసుకుంటున్నారని, మంత్రికి నేరుగా చెప్పుకోవడానికి అవకాశం లభించలేదని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిని ఎలాగైనా కలవాలనుకునే కొందరు కారు దగ్గర నిరీక్షించి సమస్యలు చెప్పుకున్నారు. 297 వినతుల స్వీకరణ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 297 వినతులు స్వీకరించగా వాటిలో అత్యధికంగా 149 వినతులు ఒక్క రెవెన్యూ శాఖకు చెందినవే ఉన్నాయి. డీఆర్డీఏ64, పంచాయతీ రాజ్ శాఖ22, మున్సిపల్ పరిపాలన2, విద్యుత్ శాఖ4, గృహ నిర్మాణ శాఖ2, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ8, డీసీహెచ్ఎస్1, విద్యాశాఖ3, ఇతర శాఖలు 42 అర్జీలు ఉన్నాయి. అయితే మంత్రి పాల్గొన్న నేపధ్యంలో స్వీకరించిన ఈ వినతుల పరిష్కారంలో ఎలాంటి కొత్త చర్యలు గానీ, తక్షణ పరిష్కారాలుగానీ జరగలేదు. గతంలో జరిగిన కార్యక్రమాల్లోలాగానే సాధారణ ఆదేశాలతోనే పరిమితమైందని అర్జీదారులు విమర్శించారు. పీజీఆర్ఎస్కు స్పందన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన లభిస్తోందని, వినతులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇలాంటి ఆదేశాలు గత కార్యక్రమాల్లోనూ ఇచ్చినవే అని అమలులో ఎలాంటి పురోగతి లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినతులు త్వరగా పరిష్కరించాలి కలెక్టర్ ఎస్రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆలస్యం చేస్తే సహించేది లేదని ప్రతి వారం సమీక్ష చేస్తామని తెలిపారు. అధికారులు అర్జీదారులతో మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్టులో నమోదు చేయాలని టోల్ ఫ్రీ నంబర్ 1100కు వచ్చిన కాల్స్కు సరైన స్పందన అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, బి.శాంతి, సర్వే శాఖ ఎ.డి ఆర్.విజయకుమార్, డీఈఓ మాణిక్యం నాయుడు, వ్యవసాయ శాఖ జేడీ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అన్నపూర్ణమ్మ, బీసీ సంక్షేమ అధికారిణి జ్యోతిశ్రీ, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పంచాయతీరాజ్ ఎస్ఈ, ఆర్డబ్ల్యూస్ ఎస్ఈ, ఆర్అండ్ బీఎస్ఈ, వివిధ శాఖల జిల్లా అధికారులు, విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి ఆర్డీఓలు, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. ఎస్పీ పీజీఆర్ఎస్కు 31 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: స్థానిక డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. ఎస్పీ దామోదర్ తన చాంబర్లోనే ఫిర్యాదుదారుల నుంచి విజ్ఙాపనలను స్వీకరించారు. ఏఎస్పీ సౌమ్యలత డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 31 ఫిర్యాదులను స్వీకరించగా అందులో భూతగాదాలకు సంబంధించి 10, కుటుంబ కలహాలకు సంబంధించి 3, మోసాలకు సంబంధించి 3 నగదు వ్యవహారాలకు సంబంధించి 2, ఇతర అంశాలకు సంబంధించినవి 13 ఫిర్యాదులు వచ్చాయి. సంబంధిత సిబ్బంది ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని ఎస్పీ ఆదేశంచారు. వాటి పూర్వాపరాలపై విచారణ జరిపి, ఫిర్యాదు అంశాల్లో వాస్తవాలను గుర్తించి చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఎస్సైలు రాజేష్, ప్రభావతి, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. -
లబ్ధిదారుల రుణాలకు వడ్డీ మాఫీ
● జిల్లాలో 113 మందికి లబ్ధి ● జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు డి.వెంకటేశ్వరరావుపార్వతీపురంటౌన్: జిల్లాలో ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ ద్వారా లబ్ధిదారులు పొందిన రుణాలకు వడ్డీని మాఫీ చేస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు డి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ వడ్డీ మాఫీతో జిల్లాలో ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం కింద రుణం పొందిన 47 మందికి రూ.14.23 లక్షల వడ్డీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకం కింద రుణం పొందిన 66 మందికి రూ.19.32 లక్షలు వడ్డీ మాఫీ కానున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం 31.12.25దీన విడుదల చేసిందని తెలిపారు. అయితే ఈ పధకం కింద వడ్డీ మాఫీ పొందేందుకు బకాయి పడిన అసలు మొత్తాన్ని నాలుగు నెలలలోగా పూర్తిగా జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ, విజయనగరం వారికి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆ విధంగా చెల్లించిన వారికి మాత్రమే వడ్డీ మాఫీ వర్తిస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ప్రకటనలో కోరారు. -
విశాఖ బయల్దేరిన కార్మిక బృందాలు
● సీఐటీయూ మహాసభల ముగింపు సమావేశానికి హాజరు విజయనగరం గంటస్తంభం: కార్మిక వర్గ హక్కుల సాధన కోసం 1970 నుంచి నిరంతర పోరాటం సాగిస్తున్న సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు విశాఖపట్నంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభల ముగింపులో భాగంగా జనవరి 4న నిర్వహించనున్న మహాప్రదర్శన, బీచ్లో జరిగే బహిరంగ సభకు విజయనగరం జిల్లా నుంచి వేలాది మంది కార్మికులు విశాఖకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా విజయనగరం నుంచి బయలుదేరిన వాహనాలను సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు రెడ్డి శంకరరావు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్షుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ, రాబోయే కాలంలో కార్మిక వర్గం ఐక్యంగా మోడీ ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఈ మహాసభలు పిలుపునిచ్చాయని తెలిపారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయడం, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయడం కోసం ఉద్యమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ అఖిల భారత మహాసభలు కార్మిక శక్తి ఐక్యతను చాటే వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎల్బీజీ నగర్, గురజాడ నగర్, వినాయక నగర్ ప్రాంతాల నుంచి ఐద్వా కార్యకర్తలు, కార్మికులు టాటా ఏస్ వాహనాల్లో విశాఖకు బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, సీఐటీయూ నగర కార్యదర్శి బి.రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే ఏపీ బెవరేజెస్, సిమెంట్ కలాసీలు, క్రాంతి జట్టు కలాసీలు కోట ప్రాంతం నుంచి తరలివెళ్లారు. కార్యకరమంలో అంగన్వాడీ, ఆటో, కలాసీలు తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఆశతో వేచి చూస్తే.. అవమానించారు...
భోగాపురం: భోగాపురంలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణంలో తమ పంచాయతీ తరఫున అన్ని విధాల సహకరించిన తమకు ఆదివారం నాటి తొలి విమానం ల్యాండ్ అయిన కార్యక్రమంలో పాల్గొన్న తమ నేతలను కలవాలని ప్రయత్నిస్తే కలవకుండా అవమానించారని అధికారి పార్టీ కవులవాడ పంచాయతీ టీడీపీ ఎంపీటీసీ భర్త కోరాడ తాతారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విమానాశ్రయ ట్రైల్ రన్ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులను కలిసేందుకు ఎంతో ఆశతో వేచి చూశానని అయినా కలవనీయలేదని వాపోయారు. విమానాశ్రయ నిర్మాణంలో ప్రభుత్వ ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తూ మొదటి నుంచి తమ పంచాయతీలోని రైతులను ఒప్పించి వారి గృహాలతో పాటు భూములను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఎంతో కృషి చేస్తే ఇంతగా అవమానించారని ఆవేదన చెందారు. విమానాశ్రయ నిర్మాణంలో భాగంగా గతంలో అర్హులైన యువతకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఈ రోజు మాట తప్పారన్నారు. భూములిచ్చిన రైతులకు ఇంకా పూర్తిగా నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. రైతుల సమస్యలను చెప్పుకునేందుకు మంత్రులను కలవాలని వెళ్తే కనీసం లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తనకు జరిగిన అవమానం కాదని, తమ పంచాయతీలోని భూములు కోల్పోయిన రైతులతో పాటు తరతరాల నుంచి గ్రామంలో నివాసముండే గృహాల నిర్వాసితులకు జరిగిన అవమానమని పేర్కొన్నారు. -
యథేచ్ఛగా కలప అక్రమ రవాణా
బొబ్బిలి రూరల్: బొబ్బిలి, మక్కువ మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో విలువైన చెట్లు అక్రమార్కుల వేటుకు గురవుతున్నాయి. నిత్యం జరుగుతున్న ఈ తంతును అడ్డుకునేందుకు స్థానికంగా అటవీ సిబ్బంది లేకపోవడంతో వారి ఆగడాలకు హద్దులేకుండా పోతోంది. ఇక్కడ పనిచేసిన బీట్ ఆఫీసర్ కొన్నాళ్లుగా శిక్షణ కోసం వేరొక ప్రాంతానికి వెళ్లారు. తాత్కాలికంగా వేసిన బీట్ ఆఫీసర్కు షికారుగంజి, బొబ్బిలి బీట్లను అప్పగించడంతో ఎక్కడా పూర్తిస్థాయి విధులను ఆయన నిర్వహించ లేకపోతున్నారు. దీంతో రాత్రిపగలు తేడా లేకుండా యథేచ్ఛగా అటవీ సంపద నరికి సామిల్లులకు తరలించేస్తున్నారు. రెండు రోజులుగా మక్కువ మండలంలోని అటవీ ప్రాంతంలో చెట్లను నరికి దుంగలను ట్రాక్టర్లతో బొబ్బిలి మీదుగా రాజాం ప్రాంతంలోని సామిల్లులకు తరలిస్తున్నారు. దీనిపై ఇన్చార్జ్ బీట్ ఆఫీసర్ గణేష్ను వివరణ కోరగా.. ప్రస్తుతం తాను షికారుగంజి బీట్లో ఉన్నానన్నారు. రెండు బీట్లను చూడడం కష్టతరంగా మారుతోందని వివరించారు. -
వచ్చే బ్యాంక్ ఓటీపీలు నేరుగా వాళ్లకే వెళ్లిపోతాయి
పార్వతీపురం రూరల్: అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు అమాయకుల పాలిట సైబర్ ఉచ్చులా మారుతోంది. సాంకేతికతను సామాన్యుడు సౌకర్యం కోసం వాడుకుంటుంటే, సైబర్ నేరగాళ్లు మాత్రం దానినే వలగా మారుస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్ నిబంధనల పేరుతో భయపెడుతునో, మరోపక్క పండగ వేళ ఆప్యాయంగా శుభాకాంక్షలు చెబుతునో జనాల జేబులకు చిల్లులు పెడుతున్నారు. వాట్సాప్ వేదికగా ‘ఏపీకే ’ ఫైళ్ల రూపంలో వస్తున్న ఈ కొత్త రకం మోసం ఇప్పుడు కలకలం రేపుతోంది. కంగారు పడేలా చేయడమే మొదటి ఎత్తుగడ ‘అయ్యో! నా బండికి చలానా పడిందా? రెడ్ లైట్ క్రాస్ చేశానా?’ అని సామాన్యుడు కంగారు పడేలా చేయడమే ఈ కేటుగాళ్ల మొదటి ఎత్తుగడ. వాహనదారుల ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా అచ్చం పోలీసుల నుంచి వచ్చినట్లుగా ఒక సందేశం వస్తుంది. మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని, అందుకు సంబంధించిన ఫొటోలు, ఆధారాలు చూడాలంటే కింద ఉన్న ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలని ఆ మెసేజ్ సారాంశం. పోలీసులు పంపారేమో అనే భయం, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆత్రుతతో జనం ఆ లింక్ లేదా ఫైల్పై క్లిక్ చేస్తున్నారు. ప్లే స్టోర్లో కాకుండా, ఇలా బయట నుంచి వచ్చే ఈ ఏపీకే ఫైల్ను ఇన్స్టాల్ చేసుకోగానే, ఫోన్లోకి ప్రవేశించే మాల్వేర్ ఫోన్ను పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకుంటుంది. క్షణాల్లో మొబైల్ హ్యాక్ అవుతుంది. ఇదిలా ఉంటే.. సంక్రాంతి, క్రిస్మస్, నూతన సంవత్సర వేళల్లో మన వాళ్లకి శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనవాయితీ. ఇదే అదనుగా సైబర్ మాయగాళ్లు మరో వేషం కడుతున్నారు. 2026 విషెస్ కోసం ఈ యాప్ వేసుకోండి, సంక్రాంతి గ్రీటింగ్స్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..అంటూ ఆకర్షణీయమైన లింకులు పంపిస్తున్నారు. తీపి కబురు అనుకొని ఆశగా క్లిక్ చేస్తే.. అది చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. ప్లే స్టోర్లో లేని ఈ థర్డ్ పార్టీ యాప్లను ఇన్స్టాల్ చేసుకుంటే, నట్టింట్లో దొంగను కూర్చోబెట్టినట్టేనని సైబర్ నిపుణులు నెత్తీ నోరు బాదుకుంటున్నారు. ‘ఏపీకే’ ఫైళ్లను ఓపెన్ చేయకండి.. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త! ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్లో లేని ఏ యాప్నూ పొరపాటున కూడా డౌన్లోడ్ చేయవద్దు. ముఖ్యంగా వాట్సాప్లో వచ్చే ఏపీకే ఫైళ్లను అస్సలు ఓపెన్ చేయకండి. ఒకవేళ నిజంగా చలానా పడిందో లేదో తెలుసుకోవాలంటే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లోనే చెక్ చేసుకోవాలి తప్ప, ఇలాంటి లింకులను నమ్మవద్దు. ఎవరైనా మోసపోతే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్కు కాల్ చేసి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. వాట్సాప్లో ఆర్టీవో చలానా పేరిట వస్తున్న ఏపీకే ఫైల్ ప్రస్తుతం పండగ సమయాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆర్టీఓ చలానా పేరుతోనో, శుభాకాంక్షల యాప్ పేరుతోనో వాట్సాప్ ద్వారా వచ్చే ‘ఏపీకే ’ ఫైళ్లను ఏ మాత్రం నమ్మవద్దు. ప్రభుత్వం తరఫున, పోలీస్ శాఖ తరఫున ఎప్పుడూ ఇలాంటి అజ్ఞాత లింకులు లేదా ఏపీకే ఫైళ్లు పంపడం జరగదు. ఎవరైనా మీకు తెలిసిన వ్యక్తుల్లా మెసేజ్ చేసి ఈ ఫైళ్లు పంపినా, పొరపాటున కూడా వాటిని తెరిచి ఇన్స్టాల్ చేయకూడదు. ఎందుకంటే.. ఈ ఫైళ్లు మీ మొబైల్ ఫోన్ను పూర్తిగా హ్యాక్ చేసి, మీ బ్యాంక్ ఖాతా వివరాలను, ఓటీపీలను దొంగిలించే ప్రమాదం ఉంది. మీ మొబైల్లో ప్లే స్టోర్ నుంచి మాత్రమే అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోండి. అనుమానాస్పద లింకులు, ఆఫర్లకు దూరంగా ఉండండి. ఒకవేళ ఎవరైనా మోసానికి గురైతే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ 1930కి కాల్ చేయండి లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. త్వరితగతిన ఫిర్యాదు చేస్తే, పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. -
ముగిసిన సబ్ జూనియర్స్ ఖోఖో పోటీలు
● బాలుర విభాగంలో కుమిలి, బాలికల విభాగంలో కెల్ల విజయం విజయనగరం: కబడ్డీ, ఖోఖో పితామహుడు, స్వర్గీయ వై.భగవాన్దాస్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని కస్పా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల వేదికగా జరిగిన జిల్లాస్థాయి సబ్జూనియర్ బాలబాలికల ఖోఖో పోటీలు ఆదివారం ముగిశాయి. భగవాన్దాస్ స్పోర్ట్స్ క్లబ్, జిల్లా ఖోఖో అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో బాలుర విభాగంలో కుమిలి జట్టు ప్రథమస్థానంలో నిలవగా.. కంటోన్మెంట్ మున్సిపల్ హై స్కూల్, పూల్బాగ్ జెడ్పీ ఉన్నత పాఠశాల, నేషనల్ స్కూల్ జట్లు తదుపరి స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో కెల్ల జట్టు విజేతగా నిలిచింది. తదుపరి స్థానాల్లో గంట్యాడ, పూసపాటిరేగ, పూల్బాగ్ జెడ్పీ ఉన్నత పాఠశాల జట్లు నిలిచాయి. విజేతలుగా నిలిచిన జట్లకు ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇజ్జపురెడ్డి ప్రసాద్రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భగవాన్దాస్ స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు రంగారావు దొర, ఆవాల కృష్ణారావు, చిన్నంనాయుడు, పీఎస్ఎన్వర్మ, అచ్యుతరావు, జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కమలనాభరావు, వరలక్ష్మి, హరీష్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
చదువుల బడిలో.. మందు బాబుల హల్చల్
పార్వతీపురం రూరల్: పవిత్రమైన విద్యాలయం అసాంఘిక కార్యకలాపాలకు వేదిక కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పార్వతీపురం మండలం నర్సిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల ప్రణాళికలో భాగంగా, ఆదివారం సెలవు రోజైనప్పటికీ పదో తరగతి విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో సిలబస్ రివిజన్ చేస్తూ కార్యసాధనలో నిమగ్నమయ్యారు. అయితే పాఠశాల ఆవరణలో కొందరు స్థానిక యువకులు.. విద్యార్థులు తరగతి గదుల్లో ఉండగానే వరండాలోనూ, ప్రహరీ గోడపైనా కూర్చుని మద్యం సేవించడం గమనార్హం. జ్ఞానార్జన కోసం వచ్చే విద్యార్థుల కళ్లెదుటే ఇలాంటి దృశ్యాలు కనిపించడం విమర్శలకు తావిస్తోంది. సెలవు దినం కదా.. అని పాఠశాల ప్రాంగణాన్ని ఇలా వినియోగించుకోవడం సరికాదని, దీనివల్ల విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా వాతావరణానికి భంగం కలగకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షణ పెంచాలని కోరుతున్నారు. ఓ వైపు పదో తరగతి విద్యార్థుల కార్యసాధన మరోవైపు యువకుల మద్యం తాగుడు నర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో విస్తుగొలిపే దృశ్యం -
వెలవెలబోతున్న గర్భిణుల వసతిగృహం
● నలుగురితో నడుపుతున్న వైనం ● చేరేందుకు ఆసక్తి చూపని గర్భిణులు సీతంపేట: గిరిజన గర్భిణుల కోసం స్థానిక యువ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతిగృహం వెలవెలబోతుంది. రెండు మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ వసతిగృహంలో నలుగురంటే నలుగురే ఉన్నారు. వీరితోనే మమ అనిపిస్తున్నారు. ఏడాదిన్నర కిందట ప్రారంభంలో నెలకు పది నుంచి 16 మంది వరకు గర్భిణులు ఉండే ఈ వసతిగృహం నేడు వెలవెలబోతుంది. కొండకోనల్లో ఆవాసాల్లో ఉన్న గిరిజన గర్భిణులకు సరైన సమయంలో వైద్యం అందక తల్లి, శిశువులకు ముప్పు వాటిల్లుతుందని.. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు దీన్ని ఏడాదిన్నర కిందట ఏర్పాటు చేశారు. గిరిజన హైరిస్క్ గర్భిణులకు ఇక్కడ ఉంచి ప్రత్యేక పౌష్టికాహారం అందించడం ద్వారా రక్తహీనత నివారించడం, నెలలు నిండిన తరువాత ప్రసవం కోసం ఆస్పత్రిలో అంబులెన్స్లో చేర్పించడం వంటివి చేస్తారు. గర్భిణులకు ఎనిమిది నెలలు వచ్చేసరికి ఇక్కడ ప్రవేశం చేయాల్సి ఉంది. వైద్య సేవల కోసం సిబ్బందిని కూడా నియమించారు. 16 మంది వరకు గర్భిణులు ఉండేందుకు వీలుగా రెండు గదులు, బెడ్లు, టీవీ వంటివి ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడకు వచ్చేందుకు గర్భిణులు ఆసక్తి చూపకపోవడం, సరైన అవగాహన లేకపోవడం వంటి కారణాలతో గర్భిణుల వసతిగృహం వెలవెలబోతుంది. సంక్రాంతి పండగ దగ్గర పడుతుండడంతో కొందరు గిరిజన గర్భిణుల వసతిగృహంలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. వైద్య సిబ్బంది గ్రామాల్లో చైతన్యం తీసుకువచ్చి గర్భిణులను చేర్పించేందుకు చర్యలు తీసుకుంటాం. – విజయపార్వతి, డిప్యూటీ డీఎంహెచ్ఓ -
కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సహాయం
విజయనగరం క్రైమ్: ఆర్మ్డ్డ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ కుటుంబాన్ని సహచర సిబ్బంది ఆర్థికంగా ఆదుకున్నారు. విజయనగరం జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ 2000 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ పి.శ్రీనివాసరావు అనారోగ్యానికి గురికావడంతో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బ్యాచ్ మేట్స్ పోగు చేసిన రూ.81వేల నగదును ఎస్పీ ఏఆర్.దామోదర్ తన చాంబర్లో కానిస్టేబుల్ భార్య పి.లక్ష్మికి ఆదివారం అందజేశారు. ఆర్థికంగా ఆదుకునేందుకు బ్యాచ్ మేట్స్ స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనించదగ్గ విషయమని ఎస్పీ ప్రశంసించారు. అనారోగ్య కారణాలతో విధులు నిర్వహించ లేకపోతున్న కానిస్టేబుల్ కుటుంబం కొంతకాలంగా ఆర్థిగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తోటి బ్యాచ్ మేట్స్ శ్రీనివాసరావు పరిస్థితిని గమనించి, ఆర్థికంగా ఆదుకునేందుకు కొంత నగదు సమకూర్చారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు, 2000 ఏఆర్ బ్యాచ్ మేట్స్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ వర్సిటీల యోగా పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థిని
రాజాం సిటీ: రాజాంలోని జీఎంఆర్ ఐటీకి చెందిన విద్యార్థిని ఆర్.భవిత అంతర్ విశ్వవిద్యాలయాల యోగా పోటీలకు ఎంపికై ంది. ఇటీవల అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన పోటీల్లో ఆమె ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు పీడీ బీహెచ్.అరుణ్కుమార్ ఆదివారం తెలిపారు. జనవరి 5 నుంచి 8 వరకు బెంగళూరులోని స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన డీమ్డ్ యూనివర్సిటీలో జరిగే పోటీల్లో ఆమె పాల్గొంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆమెను ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు అభినందించారు. -
సేవలకు సలాం
సాలూరు: వారంతా అమాయక పేద, మధ్య తరగతికి చెందిన ప్రజలు. చాలామంది నిరక్షరాస్యులు, వృద్ధులే. అనారోగ్యాలతో ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారి కుటుంబసభ్యులకు ఆస్పత్రిలో చేరేందుకు ఎక్కడికి వెళ్లాలి? వైద్యపరీక్షల కోసం ఆస్పత్రిలో ఏ విభాగానికి ఏ వైపు గదులకు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితి. ఇలా అవస్థలు పడుతున్న వారి గురించి ఆలోచించి, కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్రెడ్డి శ్రీకారం చుట్టిన మరో నూతన కార్యక్రమమే హెల్పింగ్ హ్యాండ్స్. ఆస్పత్రుల్లో సేవలందించేందుకు విద్యార్థులు, యువత, సేవా సంస్థల సభ్యులు తదితరులు స్వచ్ఛందంగా ముందుకురావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. గతేడాది డిసెంబరు 16న కలెక్టర్ ట్రయల్ రన్ ప్రారంభించిన ఈ కార్యక్రమం సాలూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో విజయవంతంగా నడుస్తోంది. సేవాభావంతో ముందుకు వస్తున్న వలంటీర్లు, స్వచ్ఛంద సేవాసంస్థల సభ్యులు ఆస్పత్రిలో ఇప్పటివరకు 82 మంది నమోదయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో మంగళవారం హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమాన్ని అధికారులు అధికారికంగా ప్రారంభించనున్నారు. కలెక్టర్ ఆదేశాలు అమలుచేస్తున్న అధికారులుకలెక్టర్ ఇచ్చిన హెల్పింగ్హేండ్స్ ట్రయల్ రన్ ఆదేశాలను క్షేత్రస్థాయిలో అధికారులు అమలుచేస్తుండడంతో ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. సేవాభావంతో ముందుకు వస్తున్న వలంటీర్లకు స్థానిక ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.మీనాక్షి తగు రీతిలో మార్గదర్శకం ఇస్తున్నారు.అధిక సంఖ్యలో విద్యార్థులు, సేవాసంస్థల సభ్యులు వచ్చి హెల్పింగ్హ్యాండ్స్లో తమ పేర్లను నమోదుచేసుకుంటున్నారు. వారి సేవలను విడతల వారీగా వినియోగించుకునేందుకు సూపరింటెండెంట్ డా.మీనాక్షి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.ఆ సభ్యులకు చార్ట్ తయారుచేసి,ఏ రోజు ఎవరు సేవలందించాలో సిద్ధం చేసి ముందుగానే తెలియచేస్తున్నారు. దీనివల్ల సభ్యులు కూడా వారికి కేటాయించిన రోజుల్లో వచ్చి రోగులకు సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రిలో ఏ సేవలు ఎక్కడ లభిస్తాయో తెలియక ఇబ్బందులుపడుతున్న వారికి ఓపీ విభాగం, ఏ డాక్టర్ వద్దకు వెళ్లాలి? వైద్యపరీక్షలకు ఎక్కడికి వెళ్లాలి? తదితర అంశాల్లో తమ వంతు సాయం చేస్తున్నారు. రోగి ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకుని మళ్లీ ఇంటికి వెళ్లేంతవరకు హెల్పింగ్హేండ్స్ సభ్యులు రోగికి అండగా నిలుస్తున్నారు. పట్టణ, పరిసర మండలాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల నర్సింగ్, ఒకేషనల్ విద్యార్థులు అధికంగా ఇందులో సభ్యులుగా నమోదవడం వారి సేవాభావానికి అద్దంపడుతోంది. వారి సేవలను గుర్తిస్తూ కలెక్టర్ ఆదేశాల మేరకు సర్టిఫికెట్లు త్వరలో ఇస్తామని సూపరింటెండెంట్ తెలిపారు. కలెక్టర్ మరో నూతన కార్యక్రమం హెల్పింగ్ హ్యాండ్స్ ఆస్పత్రుల్లో రోగులకు సేవలందించే ట్రయల్రన్ విజయవంతం అధికారికంగా కార్యక్రమం ప్రారంభం రేపు -
కూటమి ప్రభుత్వం గాడిదలు కాస్తోందా?
చీపురుపల్లి: రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ) పనులు పూర్తి చేయడంలో పద్దెనిమిది నెలలుగా కూటమి ప్రభుత్వం గాడిదలు కాస్తోందా? తమ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించి 75 శాతం పనులు పూర్తి చేస్తే కేవలం 25 శాతం మిగులు పనులను ఎందుకు చేయించలేకపోయిందో చెప్పాలని మాజీ ఎంపీ, వైఎస్సార్సిపి పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ ప్రశ్నించారు. ఈ మేరకు పట్టణంలోని రాజాం రోడ్డులో గల ఆర్ఓబీని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆదివారం సందర్శించిన ఆయన అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ)పై కొద్ది రోజులుగా కూటమి నేతలు చేస్తున్న ప్రచారం చూస్తుంటే వారికి సిగ్గు వేయడం లేదా అని ఎద్దేవా చేశారు. ఇదే ఆర్ఓబీకి సంబంధించి రిక్షాకాలనీ వాసులకు సర్వీసు రోడ్డు సమస్య తలెత్తితే ఒక్క కూటమి నాయకుడూ పద్దెనిమిది నెలలుగా కనిపించకుండా ముఖం చాటేసి ఇప్పుడు ఆర్ఓబీ ప్రారంభించే సమయానికి అంతా తామే చేశామన్నట్లు ఫొటోలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రైల్వేస్టేషన్ అభివృద్ధిపై కూటమి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే బహిరంగ ప్రజా వేదికకు రావాలని సవాల్ విసిరారు. నా హయాంలో నిధుల మంజూరు రైల్వేస్టేషన్ అభివృద్ధి ఎవరి హయాంలో ఎంతెంత జరిగిందో ప్రజావేదికలోనే తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చీపురుపల్లిలో ఆర్ఓబీ నిర్మాణానికి నిధుల మంజూరు కోసం తాను ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి రైల్వే మంత్రులు పీయూష్ గోయల్, అశ్వనీ వైష్టవ్లు దగ్గరకు పలుమార్లు వెళ్లి 2022 ఆగస్టు 22న రూ.12.99 కోట్లు నిధులు మంజూరు చేయించానని తెలిపారు. బొత్స ఝాన్సీ ఎంపీగా ఉన్నప్పుడు రూ.50 లక్షలతో చీపురుపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, జిల్లా బీసీ విభాగం ఉపాధక్షుడు బెల్లాన త్రినాథరావు, పార్టీ నాయకులు కొసిరెడ్డి రమణ, ఇప్పిలి తిరుమల, గవిడి సురేష్, కరణం ఆది, రేవళ్ల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. క్రెడిట్ చోరీతో 18 నెలలుగా ప్రజలను మభ్యపెడుతున్నారు వైఎస్సార్సీపీ హయాంలోనే ఆర్ఓబీ నిర్మాణానికి నిధులు రైల్వేస్టేషన్ అభివృద్ధిపై టీడీపీ బహిరంగ చర్చకు సిద్ధమా? మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ -
పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు : కలెక్టర్
గరుగుబిల్లి: పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. మండలంలోని తోటపల్లి కుడిమట్టి కట్ట ప్రాంతంలో వున్న ఐటీడీఏ పార్క్ను, బోటు షికారును ఆయన జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్రెడ్డితో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు పరిసరాలు పర్యా టక రంగం అభివృద్ధికి ఎంతో అనుకూలంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి పర్యాటకులను ఆకర్షించేలా చేసేందుకు అవసరమైన ప్రణాళికలు చేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్టు తెలిపారు. ప్రకృతి ఒడిలో మట్టితో సరదాగా గడిపేలా వినూత్నమైన మడ్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేయడం జరుగుతుందన్నారు. కాలువల వెంబడి బోటింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించేలా కల్పించేలా అవసరమైన చర్యలు చేపడతామన్నారు. పర్యాటక ప్రాంతానికి సులభంగా చేరు కొనేందుకు అవసరమైన రవాణా వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ఈ ప్రాంతంలో బస చేసేందుకు వసతిగృహల నిర్మాణం చేపట్టేలా ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా తోటపల్లి ప్రాజెక్టు గర్భంలో కొద్దిసేపు బోటు షికారు చేస్తూ ఆనందంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గడిపారు. ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులున్నారు. -
నేడు పీజీఆర్ఎస్
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాల మీకోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలను సోమవారం ఫిర్యాదుల రూపంలో స్వీకరించనున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ రోజు వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక సెల్లార్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అర్జీదారులు మీకోసం.ఏపి.జిఓవి.ఇన్ వెబ్సైట్లో అర్జీలను నమోదు చేసుకోవచ్చునన్నారు. అర్జీల స్థితిని 1100 టోల్ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని సూచించారు. డీసీసీ అధ్యక్షుడిగా వంగల పార్వతీపురం టౌన్: కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా వంగల దాలినాయుడు నియామకమయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాని కార్యదర్శి వేణుగోపాల్ నియామక జాబితాను విడుదల చేశారు. రాష్ట్రంలోని జిల్లాలో ముఖ్య పట్టణాలను కలిపి 41 మంది అధ్యక్షుల పేర్లను ఏఐసీసీ ప్రకటించింది. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై న వంగల దాలినాయుడు కాంగ్రెస్ పార్టీలో జిల్లా ఓబీసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తానన్నారు. జిల్లాలోని 15 మండలాల్లో ప్రతి పల్లెలో పర్యటించి అక్కడ ప్రజల సమస్యలను పరిష్కారమయ్యేలా పోరాటం చేస్తానన్నారు. జిల్లా ప్రజలను పలు సమస్యలు వేధిస్తున్నాయని వాటి పరిష్కారానికి ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తానన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను నెరవేర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకులను కలిసి, కొత్త వారిని ఆహ్వానించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన వంగల దాలినాయుడును కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు పలువురు అభినందించారు. బాడంగి: మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పదవులకు సోమవారం ఎన్నిక నిర్వహించనున్నట్టు ఎన్నికల అధికారి, మండల ప్రత్యేకాధికారి కిరణ్కుమార్ ఆదివారం తెలిపారు. ఈ పదవులు ఖాళీ కావడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. 14 మంది ఎంపీటీసీ లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎంపీ లు హాజరు కావచ్చని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ ముగిసిన వెంటనే ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తామన్నారు. ఎస్ఐ తారకేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సహాయ ఎన్నికల అధికారిగా ఎంపీడీఓ ఎస్.రామకృష్ణ వ్యవహరించనున్నారు. బొబ్బిలి: గుంటూరులో సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలలో పట్టణానికి చెందిన గుంట్రెడ్డి భాస్కరరావు రచించిన కార్టూన్ల ప్రదర్శన ఆకట్టుకుంది. భాను కలం పేరుతో భాస్కరరావు రచించిన పలు కార్టూన్లను సందర్శకు లు ఆసక్తిగా తిలకించారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన కార్టూన్లలో ఎంపిక చేసిన వా టిలో భాను కార్టూన్లకు కూడా చోటు దక్కడం విశేషం. భానును పలువురు అభినందించారు. రేగిడి: మండలంలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో 52 వేల టన్నుల చెరకు క్రషింగ్ పూర్తయిందని యాజమాన్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. పండగ దగ్గర పడుతున్న దృష్ట్యా అన్ని ప్రాంతాల నుంచి చెరకును కర్మాగారానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది. చెరకును నరికేందుకు రైతులు ఆసక్తి చూపుతుండడంతో క్రషింగ్ త్వరగా జరుగుతుందని తెలిపింది. ఈ ఏడాది 2.50 లక్షల మెట్రిక్ టన్నులు క్రషింగ్ జరపనున్నారు. -
ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్లో భయం..భయం..!
● శిథిలావస్థలో ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్ ● బిక్కుబిక్కు మంటున్న వైద్యసిబ్బంది ● ఆందోళనలో ఆస్పత్రికి వచ్చే కార్మికులు విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని కార్మికులకు చికిత్స అందించడం కోసం ఏర్పాటు చేసిన ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్లో భయానక వాతావరణం నెలకొంది. దీంతో ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే కార్మికులతో పాటు ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డయోగ్నోస్టిక్ సెంటర్ భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో భవనాల నుంచి పెచ్చులు ఊడుతున్నాయి. ఈ క్రమంలో ఎప్పుడు ఏ భవనం కూలుతుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులు కూడా భవనం దుస్థితి చూసి భయపడుతున్నారు. డయోగ్నోస్టిక్ సెంటర్ పరిధిలో 19 వేల మంది కార్మికులు ఉన్నారు. వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే డయోగ్నోస్టిక్ సెంటర్కు వస్తారు. రోజుకి 50 మంది వరకు కార్మికులు చికిత్స కోసం ఇక్కడికి వస్తారు. డయోగ్నోస్టిక్ సెంటర్లో ఆర్థో, జనరల్ మెడిసిన్, గైనిక్, జనరల్ సర్జరీ, పిడియాట్రిక్, డెంటల్, ఈఎన్టీ తదితర విభాగాలు ఉన్నాయి. కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం ఈఎస్ఐ పరిధిలో ఉన్న కార్మికుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం వహిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసతి సమస్యతో ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నప్పటికీ చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డయోగ్నోస్టిక్ సెంటర్ శిథిలావస్థకు చేరి ఉద్యోగులు, కార్మికులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే వాపోతున్నారు. భవనాలు శిథిలావస్థకు చేరడంతో డయోగ్నోస్టిక్ సెంటర్లో సమస్యలను కూడా చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదు. డయోగ్నోస్టిక్ సెంటర్లో ఏడాదిన్నరగా రేడియాగ్రాఫర్ లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. దీంతో ఎక్స్రే అవసరమైన కార్మికులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్స్కు వెళ్లాల్సిన పరిస్థితి. రేడియాగ్రాఫర్ను నియమించాలని డయోగ్నోస్టిక్ సెంటర్ వైద్యాధికారులు పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకపోయింది. సెంటర్ మార్చేందుకు చర్యలు డయోగ్నోస్టిక్ సెంటర్ భవనాలు శిథిలావస్థకు చేరడంతో వేరే చోటకు మార్చడానికి చర్యలు తీసుకుంటున్నాం.రేడియో గ్రాఫర్ను నియమించాలని ఉన్నతాధికారులకు లేకరాశాం. డాక్టర్ చక్రవర్తి, సూపరింటెండెంట్, ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్ -
సబ్ కలెక్టర్ను కలిసిన డిప్యూటీ ఈఓ
సీతంపేట: ీసతంపేట ఐటీడీఏ డిప్యూటీ ఈఓగా పాలక నారాయుడు శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్, ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ అన్నదొరను మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్కను ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వరి పంట సాగుచేయొద్దు ● తోటపల్లి ఆయకట్టు రైతులకు ఏఈ సూచన వీరఘట్టం: ప్రస్తుత రబీలో తోటపల్లి ఆయకట్టు రైతులు వరి పంటను సాగుచేయొద్దని జలవనరుల శాఖ ఏఈ డి.వి.రమణ సూచించారు. వీరఘట్టం జలవనరులశాఖ కార్యాలయంలో విలేకర్లతో శనివారం మాట్లాడారు. ప్రాజెక్టు వద్ద కుడి, ఎడమ కాలువల రెగ్యులేటర్లు మరమ్మతులకు గురికావడంతో నాగావళి నీరు పాత కుడి, ఎడమ కాలువల ద్వారా నిరంతరాయంగా ప్రవహిస్తోందన్నారు. ఈ నీటిని వినియోగించుకుని రైతులు ఆరుతడి పంటలు సాగుచేయాలని కోరారు. వరి పంట వేస్తే కావాల్సినంత నీరు అందదన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తగ్గిందని, రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఉత్సాహంగా ‘వాక్థాన్’ విజయనగరం క్రైమ్: మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా పోలీస్శాఖ విశాఖ రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో చేపట్టిన అభ్యదయ సైకిల్యాత్ర ముగింపును పురస్కరించుకుని విజయనగరం జిల్లాలో శనివారం చేపట్టిన ‘వాక్థాన్’ ఉత్సాహంగా సాగింది. విజయనగరం బాలాజీ కూడలి వద్ద ప్రారంభమైన వాక్థాన్కు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పచ్చజెండా ఊపారు. సింహాచలం మేడ, కోట జంక్షన్ మీదుగా మూడులాంతర్ల కూడలి వరకు సాగింది. గంజాయి, మాదక ద్రవ్యాలవల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి రేంజ్ పరిధిలో ‘అభ్యుదయ సైకిల్ యాత్ర’ను నిర్వహించారన్నారు. ఈ యాత్ర విజయనగరం జిల్లాలోని అన్ని మండలాల్లోనూ సాగిందని, ప్రజలు, యువతకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించినట్టు వెల్లడించారు. ముగింపునకు చిహ్నంగా ‘వాక్ థాన్’ నిర్వహించామన్నారు. గంజాయి అమ్మకాలు, వినియోగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మాధవసేవగా సర్వప్రాణి సేవ జరగాలి
● మన్యంలో ప్రకృతిని కాపాడుకోవాలి ● మనబుద్ధిని పాశ్చాత్య దేశాల వ్యక్తులు పాడుచేశారు ● త్రిదండి చినజియర్ స్వామి సీతంపేట: మానవసేవయే మాధవసేవ కాదని, మాధవసేవగా సర్వప్రాణి సేవ జరగాలని త్రిదండి చినజియర్ స్వామి అన్నారు. సీతంపేట మండలం సీది గ్రామంలో మన్యప్రగతి సంస్థ ఆధ్వర్యంలో శనివారం 3,500ల మందికిపైగా నిరుపేదలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతంకాదు ప్రధానం.. మానవత్వం ప్రధానం.. మానవత్వముంటే మనసు, బుద్ధి వికసిస్తే అప్పుడు మిగతా ప్రాణాలన్నీ మనవని భావించడం జరుగుతుంది. ప్రపంచమంతా నాది, కొండలు, కోనలు నదులు నావి అనే భావాన్ని పెంపొందించుకోవాలి... ఇది మనందరి సూత్రం కావాలి. మన్యం ప్రకృతిని కాపాడుకోవాలి. ఇక్కడ అత్యధికంగా పండించే జీడి, మామిడి, చింతపండు, పసుపు, అనాసపనస, ఇతర అటవీ ఉత్పత్తులు ఎంతో ఖ్యాతిని పొందాయి. మైదాన ప్రాంత వాసులు మీ పంటలపై ఆధారపడుతున్నారు. మీ వల్ల దేశమంతా బతుకుతున్నారు. అందుకే గిరిజనులందరికీ మంచి సౌకర్యాలు రావాలి.. మీ ఆందరి ఆరోగ్యాలు బాగుండాలని ఆకాంక్షించారు. పిల్లలను బాగా చదివించాలని పిలుపునిచ్చారు. మనబుద్ధిని పాశ్చాత్యదేశాలకు చెందిన వ్యక్తులు పాడుచేశారన్నారు. మనందరిలో... అన్ని వస్తువుల్లో దేవుడు ఉన్నారని తెలిపారు. చెట్లు, పక్షులు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడితే వాటికి హానితలపెడుతున్నామన్నారు. సంపదను దుబరా చేస్తున్నారన్నారు. కులం, మతం, జాతి, దైవాలు పేరు చెప్పి ఒకరినిఒకరు ఆక్రమించే ప్రయత్నం ఎన్నో రకాలుగా జరుగుతున్నాయ న్నారు. మనిషి తోటి మనిషికి తోడు పడుతున్నాడా అని ప్రశ్నించారు. దైవం మీద నమ్మకముంటే ఆ దైవాన్ని మనసులో పెట్టుకోవాలన్నారు. దైవం చూపిన మంచి మార్గంలో పది మందికి తోడు పడాలన్నారు. మనిషిని మార్చేసి ప్రలోభ పెట్టడం తగునా అని ప్రశ్నించారు. వికాసతరంగిణి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు... వికాస తరంగణి కేంద్రం ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చినజియరు స్వామి తెలిపారు. మహిళలకు ఆరోగ్యాన్ని అందించేందుకు క్యాన్సర్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నామన్నారు. 40 లక్షలకు పైగా మహిళలకు గర్భకోశ వ్యాధులకు వైద్యపరీక్షలు చేసి మందులు అందజేశామన్నారు. కొన్నిచోట్ల ఇప్పటికీ మంచాలపై మోసుకెళ్లి వైద్యం చేయించుకుంటున్నారన్నారు. ఈ ప్రాంతాల్లో విద్య, వైద్య సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంధులైన పిల్లల కోసం విశాఖపట్టణంలో పాఠశాల నిర్వహిస్తున్నట్టు తెలిపారు. క్రీడలు నేర్పించడంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారన్నారు. కార్యక్రమంలో అహోబిలస్వామి, మన్యప్రగతి నాయకుడు గేదెల రవి, జనార్దన్, తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయం.. సేవలకు రాంరాం
గ్రామ స్వరాజ్య స్థాపన.. ప్రజల ముంగిటకే పరిపాలనను చేరువ చేయాలన్న సదుద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన సచివాలయ వ్యవస్థ.. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో నిర్వీర్యమవుతోంది. సచివాలయాల్లో ప్రజలకు అవసరమైన సుమారు 400 రకాలకుపైగా సేవలను గతంలో అందించేవారు. సుమారు 13 విభాగాల సిబ్బంది అందుబాటులో ఉండేవారు. వేలాదిమందికి ఈ వ్యవస్థ ద్వారా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. ఉన్న ఊర్లోనే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే పరిస్థితి మారిపోయింది. నాడు కళకళలాడిన గ్రామ, వార్డు సచివాలయాలు, నేడు వెలవెలబోతున్నాయి. సిబ్బంది లేక ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. –సాక్షి, పార్వతీపురం మన్యం/కురుపాం/గుమ్మలక్ష్మీపురం/ జియ్యమ్మవలస రూరల్/పార్వతీపురం రూరల్ జియ్యమ్మవలస మండలంలో 25 సచివాలయాలున్నాయి. ఎక్కడ చూసినా, ప్రజలు ఎప్పుడు వెళ్లినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. అసలే సిబ్బంది కొరత వేధిస్తోంది. దీనికితోడు ఉన్న ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. సర్వేలంటూ ఉన్నవారిని రోడ్ల మీదే ఈ ప్రభుత్వం తిప్పుతోందన్న విమర్శలున్నాయి. ‘సాక్షి’ పరిశీలన సమయంలో మండలంలోని తురకనాయుడువలస సచివాలయంలో నలుగురే సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన ఐదుగురు వివిధ పనుల నిమిత్తం క్షేత్రస్థాయిలో ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. కుదమ సచివాలయంలో తొమ్మిది మంది ఉద్యోగులు ‘డ్రైడే– ఫ్రైడే’ అంటూ బయటకు వెళ్లిపోయారు. ఇటిక సచివాలయంలో వ్యవసాయ సహాయకులు, ఇంజినీరింగ్ సహాయకులు, డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన నలుగురు ఉద్యోగులే విధులు నిర్వహిస్తుండగా.. వీరిలో ముగ్గురు సర్వేలంటూ బయటకు వెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయా కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు నిరాశగా వెనుదిరుగుతున్నారు. నాడు మహోన్నతమైన ఆశయంతో ప్రారంభమైన గ్రామ, వార్డు సచివాలయాలు అన్ని రకాల ప్రభుత్వ సేవలూ చెంతనే.. నేడు నిర్వీర్యమవుతున్న వ్యవస్థ సర్వేలకే పరిమితమవుతున్న ఉద్యోగులు ప్రజలు ఎప్పుడు వెళ్లినా.. కనిపించేది ఖాళీ కుర్చీలే -
ఏకగ్రీవంగా జెడ్పీ అంచనా బడ్జెట్కు ఆమోదం
విజయనగరం రూరల్: 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా పరిషత్ అంచనా బడ్జెట్కు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన శనివారం బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెల వరకు జెడ్పీకి వచ్చిన వాస్తవిక ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని 2025–26 సవరణ బడ్జెట్, 2026– 27లో రూ.4.81 కోట్ల ఆదాయం వస్తుందన్న అంచనా బడ్జెట్ను ఆమోదించారు. 2025–26 సవరించిన బడ్జెట్ ప్రకారం ప్రారంభ నిల్వ, రాబడులు రూ.170.68 కోట్లు కాగా, ఖర్చులు రూ.163.78, అంత్య నిల్వ రూ.6.89 కోట్లు అని జెడ్పీ చైర్మన్ తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్లో ప్రారంభ నిల్వ, రాబడులు రూ.164.27 కోట్లు, వ్యయం రూ.161.84 కోట్లు, అంత్యనిల్వ రూ. 2.45 కోట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ ఉపాధ్యక్షుడు మరిశర్ల బాపూజీనాయుడు, సంకిలి శాంతకుమారి, జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, సభ్యులు పాల్గొన్నారు. లివిరిలో ఏనుగుల విధ్వంసం భామిని: మండలంలోని లివిరిలో శుక్రవారం రాత్రి నాలుగు ఏనుగుల గుంపు విధ్వంసం సృష్టించాయి. రైతు సోమరాజు గోపాలరావుకు చెందిన కొబ్బరి చెట్లు, పామాయిల్ చెట్లను విరిచేశాయి. రైతు ఇంటి తలుపులు, అద్దాలు విరగ్గొట్టడంతో భయాందోళన చెందారు. ఏనుగులు ఇళ్లపై దాడిచేస్తున్నా అటవీశాఖ సిబ్బంది జాడలేదంటూ రైతు కుటుంబం వాపోయింది. -
ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు సస్పెన్షన్
● పట్టణంలో విద్యుత్ మీటర్లను తనిఖీ చేస్తున్న అధికారులు విజయనగరం ఫోర్ట్: విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగులు బిల్ స్టాప్ మీటర్లను రూ.10 వేలు నుంచి రూ. 20 వేలుకు విక్రయిస్తున్నారన్న అంశంపై ‘బిల్స్టాప్ మీటర్లతో ఖజానాకు గండి’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి విద్యుత్శాఖ అధికారులు స్పందించారు. ఉద్యోగులు అక్రమాలకు పాల్పడడం నిజమేనని తేలడంతో కె.ఎల్.పురం జూనియర్ లైన్మన్ (జెఎల్ఎం) వి.దినేష్, దాసన్న పేటలైన్మన్ ఓ.రాంబాబును సస్పెండ్ చేస్తూ విద్యుత్శాఖ ఈఈ పి.త్రినాథరావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. పట్టణంలో విద్యుత్శాఖ అధికారులు ఇంటింటికీ వెళ్లి మీటర్లు తనిఖీ చేస్తున్నారు. ఎన్ని బిల్స్టాప్ మీటర్లు మార్చారు అనేదానిపై విద్యుత్శాఖ అధికారులు జల్లెడ పడుతున్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటనతో పార్వతీపురం మన్యం జిల్లా విద్యుత్శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఆ జిల్లాలో కూడా బిల్స్టాప్ మీటర్లు ఎక్కడైనా బిగించారా? అన్నది పరిశీలించాలని ఆ శాఖ సిబ్బందిని అధికారులు ఆదేశించారు. విద్యుత్ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని విద్యుత్శాఖ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు తెలిపారు. -
నోటు పుస్తకాలు అందజేసిన కలెక్టర్
విజయనగరం, అర్బన్: పాఠశాల విద్యార్థులకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి నోట్ పుస్తకాలు అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా పూల బొకేలు బదులుగా నోట్ పుస్తకాలతో తమకు శుభాకాంక్షలు తెలియజేయాలని కలెక్టర్ సూచించిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా అధికారులంతా కలెక్టర్కు విభిన్నంగా నోట్ పుస్తకాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇలా వచ్చిన సుమారు నాలుగు వేల నోటు పుస్తకాలను డీఈఓ మాణిక్యంనాయుడు సమక్షంలో విద్యాశాఖ అధికారులకు శనివారం తమ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ అందజేశారు. విజయనగరం, గంట్యాడ, బొండపల్లి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నాలుగు, ఐదు తరగతి విద్యార్థులకు ఈ నోట్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్, విజయనగరం ఎంఈఓ లలిత కుమారి, ఏసీ సన్యాసిరాజు పాల్గొన్నారు. టెక్నికల్ ఉద్యోగుల నైపుణ్యానికి ప్రభుత్వ సర్టిఫికెట్లువిజయనగరం గంటస్తంభం: జిల్లాలోని వివిధ ప్రైవేట్ కంపెనీల్లో పని చేస్తున్న టెక్నికల్ అభ్యర్థులకు ప్రభుత్వం సర్టిఫికెట్లు జారీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ప్రభుత్వ ఐటీఐ కన్వీనర్, ప్రిన్సిపాల్ టి.వి.గిరి తెలిపారు. అప్రెంటిషిప్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్–1948(ఎంఎస్ఎంఈ) కింద నమోదైన ప్రైవేట్ సంస్థల్లో టెక్నికల్ సంబంధిత ట్రేడ్లో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులన్నారు. దరఖాస్తుదారులు నిర్దేశిత కనీస విద్యార్హతతో పాటు 21 సంవత్సరాల వయసు ఉండాలని, వయసు పరిమితి లేదని తెలిపారు. 2019లో ఎస్సీవీటీ పాసై, అప్రెంటిస్ పోర్టల్లో నమోదై ఉండాలని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సమీప ప్రభుత్వ ఐటీఐల్లో ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందజేస్తామని, ఇవి ఉద్యోగాల్లో పదోన్నతులకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వివరాలకు 9849944654, 9703179119 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. -
కుక్క కరిచి 10 మందికి గాయాలు
రామభద్రపురం: మండల కేంద్రంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. శుక్రవారం ఐదుగురు, శనివారం ఐదుగురు చొప్పున్న కుక్క కాటుకు గురై 10 మంది వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ప్రధమ చికిత్స కోసం స్థానిక పీహెచ్సీకీ క్యూ కట్టగా అక్కడ సిబ్బంది ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి చికిత్ప అందించారు. ఇక్కడే కాదు మండలంలోని గ్రామీణ ప్రాంతాలలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామాలలో ఏ వీధిలో చూసినా గుంపులు, గుంపులుగా సంచరిస్తున్నాయి. వీటిని చూసి ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. వీధుల్లోని పిల్లలు, వృద్ధులు, గొర్రెలు, మేకలు, ఆవుదూడలు, కోళ్లుపై దాడులు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో కుక్కల బెడద ఎక్కువగా ఉన్నా నియంత్రణ ఊసే లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఐటీఐ పాసైన వారికి లేటరల్ ఎంట్రీ అవకాశం విజయనగరం గంటస్తంభం: ఐటీఐ రెండు సంవత్సరాల ట్రేడుల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యుర్థులకు పాలిటెక్నిక్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో చేరేందుకు అవకాశం కల్పించినట్టు జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ టి.వి.గిరి తెలిపారు. ఇందుకు సంబంధించి ఎస్బీటీఈటీ ఆధ్వర్యంలో నిర్వహించే బ్రిడ్జ్ కోర్సు పరీక్ష–2026కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 5లోగా జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐలలో ధరఖాస్తు చేసుకోవాలన్నారు. బ్రిడ్జ్ కోర్సు శిక్షణ జనవరి 5 తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరుగుతుందని, థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 5 తేదీ నుంచి 7 తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. బ్రిడ్జ్ కోర్సులో ఉత్తీర్ణులైన వారు పాలిటెక్నిక్లో రెండో సంవత్సరానికి లేటరల్ ఎంట్రీ ప్రవేశానికి అర్హులని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, రేషన్ కార్డు, ఆధార్, ఐటీఐ సర్టిఫికెట్, పదో తరగతి, కుల ధ్రువీకరణ పత్రాలతో ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ విజయనగరం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. పీడీఎస్ బియ్యం పట్టివేత నెల్లిమర్ల రూరల్: మండలంలోని బొప్పడాం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ గ్రామం నుంచి పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ సిబ్బంది సహకారంతో తనిఖీలు చేపట్టామన్నారు. బొలేరో వాహనంలో తరలిస్తున్న మూడు వేల కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు యజమాని, డ్రైవర్పై కేసు నమోదు చేశామన్నారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం నేరమని, ఇలాంటి చర్యలు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలు మెంటాడ: మండలంలోని పిట్టాడ నుంచి మెంటాడ తహసీల్దార్ కార్యాలయానికి స్కూటీపై వస్తున్న సివిల్ సప్లయిస్ డీటీ సత్యనారాయణ, పిట్టాడ డీలర్ కుబిరెడ్డి శ్రీనివాసరావులను గుర్తు తెలియని వాహనం శనివారం అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీలర్ శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలవ్వగా మెరుగైన వైద్యం కోసం తహసీల్దార్ వాహనంలో విజయనగరం తరలించారు. ట్రిపుల్స్తో వస్తున్న వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లి పోయారని బాధితులు తెలిపారు. వ్యక్తి అదృశ్యంపై కేసు సంతకవిటి: మండలంలోని అక్కరాపల్లి గ్రామానికి చెందిన సోనయిల సన్యాసిరావు(40) గత నెల 22న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో తెలిసిన చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భార్య వెంకటలక్ష్మి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 6309990875 నంబరును సంప్రదించాలని తెలిపారు. -
అంతర్ కళాశాలల అథ్లెటిక్స్లో ‘సీతం’కు పతకాలు
విజయనగరం అర్బన్: జేఎన్టీయూ – గురజాడ విజయనగరం విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన అంతర్ కళాశాల అథ్లెటిక్స్ పోటీలలో గాజులరేగ పరిధిలోని సీతం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి కాంస్య పతకాలు సాధించారు. కళాశాలలో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం ఈసీఈ విభాగానికి చెందిన వి.శివ పురుషులు జావలిన్ త్రో ఈవెంట్లో కాంస్య పతకం గెలుచుకోగా, ద్వితీయ సంవత్సరం ఈసీఈ విభాగానికి చెందిన బి.హరీష్ ట్రిపుల్ జంప్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి.రామమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో శనివారం నిర్వహించిన క్రీడా అభినందన సభలో కళాశాల సంచాలకులు మజ్జి శశిభూషణరావు విజేతలు అభినందించారు. కార్యక్రమంలో ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ టి.డి.వి.ఎ.నాయుడు, మెకానికల్ విభాగాధిపతి సి.హెచ్.వెంకటలక్ష్మి, ఇతర అధ్యాపకులు, సీఎస్ఓ సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు జె.మహేశ్వరరావు, టి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
విజయనగరం లీగల్: 18 సంవత్సరాల్లోపు బాల బాలికలకు వివాహం చేయటం చట్టరీత్యా నేరమని, అందుకు రెండు సంవత్సరాలు జైలుశిక్షతో పాటు జరిమానా ఉంటాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. రాష్ట్ర న్యాయసేవాఽధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ అనేక కారణాలు వల్ల చిన్న వయస్సులోనే వివాహాలు చేయటం సరైనది కాదన్నారు. చిన్న వయస్సులోనే వివాహాలు చేయటం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు శారీరక సమస్యలు ఏర్పడతాయన్నారు. ముఖ్యంగా బాల బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ, ఆశా వర్కర్లు, పారా లీగల్ వాలంటీర్స్ కృషి చేయాలన్నారు. చైల్డ్ లైన్ టోల్ఫ్రీ నంబరు 1098కు లేదా జాతీయ న్యాయసేవా అధికార సంస్థ టోల్ఫ్రీ 15100 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటక్షన్ ఆఫీసర్ బిహెచ్.లక్ష్మి, డిస్ట్రిక్ మిషన్ కో ఆర్డినేటర్ ఎల్ సుజాత, నేచర్ ఎన్జఓ కో ఆర్డినేటర్ దుర్గ, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత -
ముగిసిన స్టెప్కాన్ సదస్సు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న స్టెప్కాన్–2026 జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ముగింపు సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్ మాట్లాడుతూ స్టెప్కాన్ కేవలం సాంకేతిక అంశం మాత్రమే కాదని, దానికి బహుముఖ ప్రాధాన్యత చేకూరిందన్నారు. నూతన సాంకేతిక విప్లవం ద్వారా కొత్త రకాలైన ఉద్యోగ అవకాశాలు సృష్టించుకునేందుకు వీలుంటుందని తెలిపారు. ప్రతి విద్యార్థి జ్ఞానంతో పాటు నైపుణ్యం సాధించేందుకు ప్రయత్నించాలని తెలిపారు. ప్రతి రంగంలో విభిన్నంగా ఆలోచించడం ద్వారా గుర్తింపు పొందడమే కాకుండా సెలబ్రిటీలుగా మారవచ్చునని, విద్యార్థులు ఆ దిశగా ఆలోచనలు చేయాలని అన్నారు. విద్యార్థులందరికీ విశేషమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయనడానికి రెండు రోజులుగా నిర్వహించిన సదస్సులో ప్రదర్శనలే నిదర్శనమని అన్నారు. ఈ మెగా ఈవెంట్లో దేశం నలుమూలల నుంచి మంది విద్యార్థులు పాల్గొని వివిధ అంశాలు ప్రదర్శించారన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించిన స్టెప్కాన్–2026 సదస్సులో 87 మంది సాంకేతిక పత్రాలు సమర్పించగా.. 509 మంది విద్యార్థులు వివిధ వర్క్షాప్లో, 107 మంది ప్రాజెక్టు ఎగ్జిబిషన్ పోటీలోను, 67 మంది స్టార్ట్ ఆఫ్ ఐడియాస్ పోటీలో, 54 మంది జీపీఎల్ వంటి సెంట్రల్ పోటీలతో పాటు వివిద అంశాల్లో, ఏ1 మారథాన్లో 136, వెబ్సాగాలో 179 మంది, బాటిల్ బాట్స్లో 90, డ్రోన్ రైడర్స్ చాంపియన్షిప్లో 58, సీఏడీ కంబాట్లో 54, స్ట్రూక్టో సీ్త్రకేర్లో 108 మంది పాల్గొన్నారని ప్రిన్సిపాల్ తెలిపారు. సదస్సులో విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందించారు. కార్యక్రమంలో జీఎంఆర్ వీఎఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, సదస్సు కన్వీనర్ డాక్టర్ ఎం.సతీష్ , కో కన్వీనర్ బీవీ సురేష్, నందిని తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా స్థాయి నృత్య పోటీలు
పార్వతీపురం: సంక్రాంతిని పురష్కరించుకొని మండల, జిల్లా స్థాయిలో నృత్య పోటీలను నిర్వహించనున్నట్టు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ జిల్లాలోని కళాకారులను ప్రోత్సహించేలా పోటీలను నిర్వహించనున్నట్టు తెలిపారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా జానపద, శాసీ్త్రయ నృత్యాలు, గీతాలకు అనుమతి ఉంటుందన్నారు. 15 ఏళ్లలోపు బాలబాలికలు మొదటి విభాగంలోను, 16ఏళ్లు పైబడిన వారు రెండో విభాగంలో ఉంటారన్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు తమ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలోని పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మండల స్థాయి పోటీలను ఈ నెల 7వ తేదీలోగా పూర్తి చేసి విజేతల వివరాలను జిల్లా కేంద్రానికి పంపాలన్నారు. డీఈఓ పర్యవేక్షణలో మండల స్థాయిలో ప్రతిభ చాటిన విజేతలకు జిల్లా స్థాయి పోటీలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. విజేతలకు సంక్రాంతి సంబరాలలో బహుమతులను అందజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని నృత్యకారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రాజాం సిటీ: పట్టణ పరిధి పాలకొండ రోడ్డులోని జేజే ఇనోటెల్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రేగిడి మండలం ఉణుకూరు గ్రామానికి చెందిన కంటు గణేష్ (36) మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి సీఐ కె.అశోక్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ద్విచక్రవాహనంపై రాజాం వచ్చిన గణేష్ పనులు ముగించుకుని స్వగ్రామమైన ఉణుకూరు వెళ్తున్నాడు. జేజే ఇనోటెల్ ఎదురుగా వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో బాధితుని తలకు తీవ్రగాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మృతుని బావ కొనిస రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. జామి: బైక్పై వస్తున్న సమయంలో చెట్టును ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. అలమండ సంతకు చెందిన దమ్మేటి మణికంఠ (26) అనే యువకుడు బైక్పై కొత్తవలస నుంచి బైక్పై అలమండ సంతకు వస్తున్న సమయంలో శనివారం మధ్యాహ్నం అలమండ పెట్రోల్ బంకు సమీపంలో రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మణికంఠ తల్లి లోవమణి చిన్నతనంలోనే మృతి చెందింది. సంతకవిటి: మండల కేంద్రానికి చెందిన భోగి కనకరాజు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. మండల కేంద్రం కోమటివీధికి చెందిన కనకరాజు కూలి డబ్బులు విషయమై తల్లితో గొడవపడి గడ్డి మందు తాగాడు. శుక్రవారం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందినట్టు తెలిపారు. ఆస్పత్రి వర్గాల సమాచారంతో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. -
స్వశక్తితో రక్షణ పొందాలి : ఎస్పీ
విజయనగరం క్రైమ్ : ప్రతీ మహిళ తమను తాము స్వశక్తితో రక్షించుకొనేందుకు స్వచ్ఛందంగా ఆత్మరక్షణ రక్షణ కోసం మెలకువలను నేర్చుకోవాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తుఫాన్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుట్బాల్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నాంధీ ఫౌండేషన్ ఈ టోర్నమెంట్ను నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. కొన్ని సందర్భాల్లో వివక్షకు గురవుతున్నారన్నారు. వీటిని అధిగమించడానికి మహిళలు మరింత చైతన్యవంతులై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతీ మహిళ విద్యార్థి దశ నుంచే ఆత్మరక్షణ కోసం కొన్ని మెలకువలు నేర్చుకోవాలన్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణకు సంబంధించి మెలకువలను నేర్పించే శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షకురాలిని నియమించామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు, డీఎస్పీ అంబేడ్కర్, డీఎస్డీఓ వీఎస్ రమణ, సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, టి.శ్రీనివాసరావు, సీహెచ్ సూరినాయుడు, బి.లక్ష్మణరావు, ఇ.నర్సింహమూర్తి, ఎస్.శ్రీనివాస్, దుర్గాప్రసాద్, జి.రామకృష్ణ, ఆర్య, ఎన్.గోపాలనాయుడు, నాంధీ ఫౌండేషన్ పీఓ భారతి, సింధియా, నెహా, ప్రతిమ తదితరులు పాల్గొన్నారు. -
మత్తును వీడుదాం.. ముందుకు సాగుదాం..
పార్వతీపురం రూరల్: యువతరం మత్తు కోరల్లో చిక్కుకోకుండా, మహోన్నత లక్ష్యాల వైపు పయనించాలనే సంకల్పంతో శనివారం జిల్లా కేంద్రంలో 3కే రన్ ఉత్సాహంగా సాగింది. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టీ రూపకల్పన చేసిన అభ్యుదయం సైకిల్ యాత్ర ముగింపు వేడుకలను పురస్కరించుకుని, ఎస్పీ మాధవ్రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏఎస్పీ మనీషా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పరుగులో విద్యార్థులు, పోలీసులు కదం తొక్కారు. పట్టణంలోని కొత్తవలస ఎస్వీడీ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా బెలగం జూనియర్ కళాశాల వరకు సాగింది. ఆర్టీసీ కూడలి వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడి, డ్రగ్స్ వద్దు బ్రో అంటూ చేసిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. యువత తమలోని శక్తిని వ్యసనాలకు ధారపోయకుండా, క్రీడల వైపు మళ్లించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా 3కే రన్ ఏఎస్పీ మనీషారెడ్డి -
ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై సమీక్ష
విజయనగరం అర్బన్: విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువల నిర్మాణం, భూసేకరణ తదితర అంశాలపై నీటి పారుదల శాఖ అధికారులతో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా విజయనగరం జిల్లాలో కొత్తగా రానున్న ఆయకట్టు, కాలువల నిర్మాణం కోసం చేపట్టాల్సిన భూసేకరణ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అలైన్మెంట్ను సాంకేతికంగా అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకోవటం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున ఆయకట్టు పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని, అవసరమైన మేరకు విడతల వారీగా భూసేకరణను చేపట్టడం ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ అధికారులు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువల నిర్మాణానికి సంబంధించిన డిజైన్ను మంత్రికి చూపించి, ఈ అంశంపై మరింత లోతైన చర్చను జరిపి తుది రూపు తీసుకొస్తామని వివరించారు. త్వరలో ఈ అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష జరుగుతున్న నేపథ్యంలో అతి త్వరలోనే పూర్తిస్థాయి డిజైన్ను రూపొందిస్తామని, విడతల వారీగా భూసేకరణకు తగిన కార్యాచరణ చేపడతామని మంత్రికి వివరించారు. సమీక్ష సమావేశంలో కార్యనిర్వాహక ఇంజినీర్ ఉమేష్కుమార్, డీఈ లక్ష్మీసుధ, ఏఈలు వివేక్, శారద పాల్గొన్నారు. -
ప్రాణం నిలిపిన జీజీహెచ్ వైద్యులు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) వైద్యులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి ప్రాణాలు నిలిపారు. గుర్ల గ్రామానికి చెందిన వడ్డాది అప్పారావు(75) తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మగత, స్పృహ లేకపోవడం వంటి పరిస్థితిలో సర్వజన ఆస్పత్రిలోని పలమనాలజీ విభాగంలో చూపించగా అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి ధూమపానం అలవాటు ఉండడంతో చికిత్స అందించడం కూడా కష్టంగా మారింది. అతనికి చేసిన వైద్య పరీక్షల్లో లో బీపీ ఉన్నట్టు, గుండె పని చేయకపోవడం, సీఓపీడీ, నిమోనియా ఉన్నట్టు నిర్ధారించారు. ఐసీయూలో వారం రోజుల పాటు ఎన్ఐవీ వెంటిలేటర్ సపోర్ట్తో చికిత్స అందించారు. అతను కోలుకోవడంతో శనివారం డిశ్చార్జ్ చేశారు. అప్పారావుకు మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు నిలిపినందుకుగాను పలమనాలజిస్ట్ డాక్టర్ బొత్స సంతోష్ను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అభినందించారు. -
ఇల్నెస్ కేంద్రం!
సంతకవిటి మండలం కొండగూడేం గ్రామంలోని వెల్నెస్ సెంటర్ నిరుపయోగంగా మారింది. కేంద్రం లోపల మార్బుల్పై చెదలు పట్టాయి. ఇదే క్రమంలో నిరుపయోగంగా ఉన్న ఈ కేంద్రం మందు బాబులకు అడ్డాగా మారింది. గ్రామాల్లో సైతం బెల్ట్ దుకాణాలు విచ్చలవిడిగా ఉండడంతో మందుబాబులు ఈ కేంద్రంలోనే మందు సేవిస్తూ కేంద్రం బయట వాటర్ గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు, ఖాళీ మందు సీసాలు పడేస్తున్నారు. కేంద్రం నిరుపయోగంగా మారడంతో చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయి. గత ప్రభుత్వం ప్రజా ప్రయోజనార్థం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ కేంద్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిరుపయోగంగా మార్చింది. అధికారులు కూడా దీని పర్యవేక్షణను పట్టించుకోకపోవడంతో ఎందుకూ పనికి రాకుండా పోయింది. – సంతకవిటి కొండగూడేంలో తలుపులు తెరిచి ఉంచిన వెల్నెస్ సెంటర్ -
వైభవంగా సహస్ర దీపారాధన
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపారాధన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన పూజలనంతరం యాగశాలలో విశేష హోమాలు నిర్వహించారు. అనంతరం వెండి మంటపం వద్ద సీతారాముల నిత్యకల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామివారి విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మంటపం వద్దకు తీసుకువెళ్లి అక్కడున్న ప్రత్యేక ఊయలలో ఆసీనులను చేశారు. అనంతరం సహస్ర దీపాలను వెలిగించి దీపాల కాంతుల శోభలో స్వామికి ఊంజల్ సేవ జరిపించారు. -
ఖోఖో పోటీల విజేతలకు అభినందన
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన సీనియర్స్ పురుషుల ఖోఖో పోటీల్లో ద్వితీయస్థానం దక్కించుకున్న జిల్లా జట్టును జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. ఈ మేరకు స్థానిక సత్య డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సత్య విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశి భూషణరావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.సాయిదేవమణిలు క్రీడాకారులను అభినందించారు. గతనెల 24 నుంచి 26వ తేదీ వరకు గుడివాడలో జరిగిన పోటీల్లో జిల్లాక్రీడాకారులు కనబరిచిన ప్రతిభ పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భగవాన్దాస్ ట్రస్ట్ కార్యదర్శి ఎ.రంగారావుదొర, చిన్నంనాయుడు, జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏఎన్ఎం కమలనాభరావు, కె.గోపాల్, కోచింగ్ క్యాంప్ ఇన్చార్జి ఎస్హెచ్ ప్రసాద్, రామకృష్ణ, ప్రసన్న, వరలక్ష్మి, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కిడ్నీ రోగులకు రవాణా కష్టాలు..!
● ఆస్పత్రికి వచ్చే రోగులకు 108 సౌకర్యం రద్దు ● అవస్థలు పడుతున్న రోగులు ● వేలాది రుపాయలు ఖర్చు పెట్టి డయాలసిస్ సెంటర్కు వస్తున్న రోగులు ఈ ఫొటోలో కనిపిస్తున్న ఆటోలో కూర్చున్న మహిళ పేరు కొట్యాడ కొండమ్మ. ఆమెది ఎస్.కోట మండలంలోని శివరామరాజుపేట. గడిచిన మూడు నెలలుగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్కు డయాలసిస్ చేయించుకోవడానికి, నెలకు 8సార్లు ఆమె వస్తోంది. ఒకసారి డయాలసిస్ సెంటర్కు వచ్చి ఇంటికి వెళ్లడానికి రూ.1500 చొప్పన ఖర్చు అవుతుంది ఈలెక్కన నెలకు రూ.12 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇవికాక మందులు ఇతర ఖర్చులకు మరో రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చు తప్పదు. విజయనగరం ఫోర్ట్: ఇలా ఈ ఒక్క మహిళా రోగే కాదు. అనేక మంది డయాలసిస్ చేయించుకోవడానికి వచ్చే రోగులు అవస్థలు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి రావడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది రోగులకు నెలకు 8 సార్లు డయాలసిస్ అవసరం పడగా, మరి కొంతమందికి 6 సార్లు అవసరం పడుతుంది. విజయనగరంలో ఉన్న డయాలసిస్ సెంటర్కు రావడానికి రవాణా చార్జీలు, భోజనం, ఇతరఖర్చులకు వారికి తడిసిమోపుడుతోంది. కిడ్నీ వ్యాధితీవ్రమైనవారికి డయాలసిస్ చేస్తారు. అటువంటి వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి కానీ చంద్రబాబు సర్కార్ నిర్దయతో కిడ్నీ రోగుల పట్ల వ్యవహరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో 108 ద్వారా తరలింపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కిడ్నీ రోగులను డయాలసిస్ సెంటర్కు 108 అంబులెన్సుల ద్వారా ఉచితంగా తరలించేవారు. దీంతో వారు ఎంతో సంతోషించేవారు. రవాణా చార్జీలు లేకుండా ఉచితంగా డయాలసిస్ సెంటర్కు తరలించడం వల్ల తమకు సమయం, డబ్బు ఆదా అయిందని భావించేవారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 108 సౌకర్యం రద్దు చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాగానే కిడ్నీ రోగులను 108 అంబులెన్సు ద్వారా డయాలసిస్ సెంటర్కు ఉచితంగా తరలించే సౌకర్యానికి మంగళం పాడేసింది. దీంతో కిడ్నీ రోగులు సొంత డబ్బులు పెట్టుకుని ప్రైవేట్ వాహనాల్లో డయాలసిస్ సెంటర్కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నీ రోగులు వేలల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కిడ్నీ రోగుల సంక్షేమానికి పాటు పడుతున్నామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు సర్కార్ వారికి ఉచితంగా అందే రవాణా సౌకర్యాన్ని రద్దు చేయడం పట్ల కిడ్నీరోగులు ఆవేదన వ్యక్తం అవుతున్నారు. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సింది పోయి ఉన్న సౌకర్యాలు రద్దు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.తరలించే సౌకర్యం రద్దు కిడ్నీ రోగులను డయాలసిస్ సెంటర్కు 108 అంబులెన్సు ద్వారా తరలించే సౌకర్యం లేదు. ఏడాది క్రితమే ప్రభుత్వం ఈ సదుపాయాన్ని రద్దు చేశారు. ఎస్.మన్మథ నాయుడు, 108 జిల్లా మేనేజర్ -
6 నుంచి క్రికెట్ టాలెంట్ హంట్ ఎంపిక పోటీలు
విజయనగరం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో జిల్లా కేంద్రంలోనీ విజ్జి క్రికెట్ మైదానంలో టాలెంట్ హంట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి. సీతారామరాజు శుక్రవారం తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి, టాలెంట్ హంట్ సభ్యుడు ఆర్.విష్ణువర్ధన్ రెడ్డి పర్యవేక్షణలో ఈ నెల 6 నుంచి రెండు రోజులపాటు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అండర్–14 విభాగంలో నిర్వహించే టాలెంట్ హంట్ పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు ఒకరోజు ముందుగా తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. పోటీలకు హాజరయ్యే సమయంలో ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, జనన ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించారు. అలాగే సొంత కిట్టు, తెలుపు రంగు దుస్తులు ధరించి రావాలని స్పష్టం చేశారు. వీడీసీఎ కార్యదర్శి పి. సీతారామరాజు -
హైదరాబాద్ విజయం
● విజ్జి క్రికెట్ మైదానంలో అండర్–15 ఉమెన్స్ ఎలైట్ టోర్నీ ● విదర్భ జట్టుపై ఘనవిజయంవిజయనగరం: స్థానిక విజ్జి క్రికెట్ మైదానంలో బీసీసీఐ ఆధ్వర్యంలో అండర్ –15 ఉమెన్స్ క్రికెట్ వన్డే ట్రోఫీ ఎలైట్ మ్యాచ్లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్, విదర్భ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో విదర్భ జట్టుపై, హైదరాబాద్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జుట్టు 32.4 ఓవర్లలో 111 పరుగులకు ఆలవుట్ అయింది. హైదరాబాద్ బ్యాటర్లలో కెప్టెన్ శాన్వి 15 పరుగులు, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు షేక్ అయేషా 19, అనన్య 20 పరుగులు సాధించారు. విధర్భ బౌలర్లలో ఆర్య నందన్వార్ 6.4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు సాధించింది. అనంతరం 112 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విదర్భ జట్టు హైదరాబాద్ బౌలర్లు ధాటికి 23.3 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటయింది. ఆ జట్టు బ్యాటర్లలో ఓపెనింగ్ బ్యాటర్ ఆర్య అభయ్ పంగ్డే 39 బంతుల్లో 44 పరుగులు చేసినప్పటికీ, ఆమెకు సహకారం అందించేవారు లేకపోవడంతో జట్టు ఓటమి పాలయింది. మిగతా బ్యాటర్ల లో వికెట్ కీపర్ వీర ఓం (10 పరుగులు), కెప్టెన్ వృష్టి దేశ్ పాండే (10) పరుగులతో రెండంకెల స్కోరు సాధించారు. హైదరాబాద్ జట్టు బౌలర్లలో కెప్టెన్ శాన్వి, అనన్యలు రెండేసి వికెట్లు సాధించారు. -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: విజయనగరం జేఎన్టీయూ జీవీలో బీటెక్ సెకెండ్ ఇయర్ చదువుతున్న ఓలిశెట్టి వెంకట ఉదయ్ తేజ(20) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థి రూమ్మేట్స్, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖలోని అక్కయ్యపాలెం రామచంద్రనగర్కు చెందిన తేజ రెండేళ్ల కిందట విజయనగరంలోని జేఎన్టీ యూ జీవీలో బీటెక్లో ట్రిపుల్ఈ విభాగంలో చేరాడు. ఇక్కడి వంశధార హాస్టల్ రూమ్–13లో నలుగురు స్టూడంట్స్తో కలిసి ఉంటున్నాడు. ప్రతిరోజూ కాలేజీ క్యాంపస్లో జరిగే క్లాస్లకు, లేబొరేటరీలకు కలిసి వెళ్తున్న సహచర విద్యార్థులతో అంతగా కలివిడిగా ఉండేవాడు కాదు. ఈ మధ్య కాలేజీ క్యాంపస్లో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారి తీసినట్లు సహచర విద్యార్థులు చెబుతున్నారు. ప్రతి రోజులాగానే తోటి విద్యార్థులు కాలేజీలో జరుగుతున్న క్లాస్లకు వెళ్లినా ఉదయతేజ్ మాత్రం వెళ్లలేదు.సహచర విద్యార్థులు క్లాసులు ముగించుకుని తిరిగి రూమ్కు వచ్చి చూసేసరికి తేజ దుస్తులు ఆరేసుకునే తాడుతో ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించగా వెంటనే హాస్టల్ వార్డెన్కు.. ఆయన పోలీసులకు సమాచారం అందజేశారు. రూరల్ ఎస్సై అశోక్ ఘటనా స్థలికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూమ్లో విద్యార్థి నోట్బుక్లో ఐ లవ్ యూ అని రాసి ఉండడం, ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేసినట్లు ఉన్న స్క్రీన్ షాట్ను పోలీసులు గుర్తించారు. చదువులో దిట్ట ఉదయ్ తేజ జాలరి కులానికి చెందిన విద్యార్థి. తండ్రి శ్రీనివాసరావు కొడుకు అభీష్టం మేరకు తన తాహతుకు మించి ఇంజినీరింగ్లో చేర్పించాడు. కాలేజీలో అడుగుపెట్టిన ఉదయ్ తేజ.. చదువులో మంచి మార్కులు తెచ్చుకుని అందరినీ మెప్పించేవాడు. అనునిత్యం ఫోన్ చేత పట్టుకుని ఉండే ఉదయ్ తేజ.. ఫోన్ స్టేటస్లో ‘ఇన్స్టెంట్ డెత్ ఈజ్ మోర్ మెర్సిఫుల్ దెన్ లైఫ్’ అంటూ ట్యాగ్ పెట్టుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
వికసిత్ భారత్లో శాస్త్రసాంకేతిక రంగాలే కీలకం
● జీఎంఆర్ ఐటీలో ప్రారంభమైన స్టెప్కాన్ సదస్సురాజాం సిటీ: వికసిత్ భారత్ లక్షసాధనలో శాస్త్ర సాంకేతికత, ఆవిష్కరణలే కీలకపాత్ర పోషిస్తాయని ఎఫ్అండ్హెచ్ జీఓస్పెషియల్ ఇన్నోవేషన్ సెల్ సైంటిస్ట్ డాక్టర్ కొంగ గోపీకృష్ణ అన్నారు. టెక్నాలజీ అబివృద్ధిలో యువత ఆలోచనా విధానమే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక జీఎంఆర్ ఐటీలో స్టెప్కాన్–2026 సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కొత్తకొత్త ఆవిష్కరణలు ముఖ్యభూమిక పోషించనున్నాయని అన్నారు. 2047నాటికి వికసిత్ భారత్ సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ బయాలజీ వంటి ప్రభుత్వ విభాగాలు, అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, రీసెర్చ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్, అలాగే బిల్డ్థాన్–2025, నీతి అయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్, స్కిల్ ఇండియా వంటి కేంద్రప్రభుత్వ పథకాలు శాస్త్రసాంకేతిక అభివృద్ధిలో తోడ్పడే విధానాన్ని వివరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ స్టార్టప్ ఐడియాలను తిలకించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, జీఏఆర్వీఎఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్ తదితరులు పాల్గొన్నారు. -
గురజాడ గృహ పరిరక్షణకు రూ.12.05 లక్షలు మంజూరు
● మంత్రి కొండపల్లి శ్రీనివాస్విజయనగరం అర్బన్: తెలుగు జాతికి గర్వకారణమైన ప్రముఖ సంఘసంస్కర్త, సాహిత్య యుగపురుషుడు గురజాడ అప్పారావు చారిత్రక గృహాన్ని సాంస్కృతిక వారసత్వ సంపడగా భావించి దాని పరిరక్షణకు ప్రభుత్వం కుట్టుబడి ఉందని ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్ల శ్రీనివాస్ తెలిపారు. గురజాడ గృహానికి తగిన రక్షణ లేక ఆకతాయిలు లోపలికి ప్రవేశిస్తున్నారనే విషయాన్ని గురజాడ వారసులు వెంకట ప్రసాద్, ఇందిర దంపతులు ఈ నెల 25న తన దృష్టికి తీసుకొచ్చారని మంత్రి పేర్కొన్నారు. దీనిపై తాను వెంటనే స్పందించి కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్యతో చర్చించానని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఇంజినీర్ గురజాడ గృహాన్ని పరిశీలించి అంచనాలు రూపొందించగా వాటిని పరిశీలించిన అనంతరం గృహ పునరుద్ధరణ, భద్రత చర్యల కోసం మొత్తం రూ.12.05 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి కొండపల్లి వెల్లడించారు. ఈ గృహం కలకాలం నిలిచి గురజాడ ఆలోచనలు, ఆదర్శాలు భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. -
ఇదేం పని మాస్టారూ..!
చికెన్● పంచాయతీ కాలువను కప్పేస్తున్న టీడీపీ నేతనెల్లిమర్ల రూరల్: ఆయనొక విశ్రాంత ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు. పైగా టీడీపీ సర్పంచ్కు స్వయంగా బావ. ఉద్యోగ విరమణ అనంతరం ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా..నలుగురికీ ఏది మంచి ఏది చెడో చెప్పాల్సిన ఆయనే తన ఇంటివద్ద పంచాయతీ కాలువను ఎటువంటి అనుమతులు లేకుండా కప్పేస్తున్నాడు. ఈ తతంగాన్ని చూసిన స్థానికులు నివ్వెరపోతున్నారు. నెల్లిమర్ల మండలంలోని వల్లూరు గ్రామంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏళ్ల కాలం నుంచి పెను సమస్యగా ఉన్న సీసీలు, డ్రైన్ల నిర్మాణాన్ని సుమారు రూ.కోటి నిధులతో పూర్తి చేశారు. ప్రధాన వీధిలో సదరు టీడీపీ నేత పంచాది సూర్యనారాయణ ఇంటి ఎదురుగా కూడా విశాలమైన సీసీ రహదారితో పాటు డ్రైన్ నిర్మించారు. తన ఇంటి వాస్తుకు విరుద్ధంగా ఉందనే నెపంతో గడిచిన రెండు రోజుల నుంచి ఆయన పంచాయతీ కాలువను తొలగించి ఇంటి కాంపౌండ్ నిర్మాణాన్ని చేపడుతున్నాడని స్థానికులు వాపోతున్నారు. కాలువను మూసేస్తే మురుగునీరు ఎలా ప్రవహిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై స్థానికులు పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన శుక్రవారం పరిశీలించారు. సదరు కార్యదర్శి వారించినప్పటికీ సర్పంచ్ తన ఇంట్లో మనిషే కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైంది. కాలువను వేరే మార్గంలో ఏర్పాటు చేస్తానని చెప్పి సదరు టీడీపీ నేత తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అందరికీ చెప్పాల్సిన నాయకులే ఈ విధంగా అడ్డదారులు తొక్కడంపై జనం మండి పడుతున్నారు. కాలువను ఆయనొక్కడే ఆక్రమించినట్లు ఉండదని, గ్రామంలోని మిగిలిన వారంతా ఇక అదే పని చేస్తారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కాలువలను ఆక్రమిస్తే మురుగు నీటి పరిస్థితి ఏమిటని, ప్రజారోగ్యం ఏమవాలని ప్రశ్నిస్తున్నారు. -
పరిశ్రమలకు అనుమతుల్లో జాప్యం వద్దు
విజయనగరం అర్బన్: జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుని పరిశ్రమల స్థాపనకు వచ్చే దరఖాస్తులను నిబంధనలకు అనుగుణంగా అతి త్వరలో పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా పరిశ్రమల సమీక్షా సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. పారిశ్రామికవేత్తలు దరఖాస్తు సమర్పించిన తర్వాత చట్టబద్ధమైన గడువు ముగిసేవరకు వేచి చూడకుండా వెంటనే వాటిని పరిశీంచి అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏ శాఖ వద్ద అయినా అనుమతులు పెండింగ్లో ఉంటే పరిశ్రమల శాఖ అధికారులు తక్షణమే స్పందించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని సూచించారు. జిల్లాకు వచ్చే పారిశ్రామికవేత్తలకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్న 8 ప్రధాన పరిశ్రమల పరోగతిపై ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్, స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్, స్టీల్ ఎక్స్చేంజ్ ఎన్ఫ్రా లాజిస్టిక్స్ లిమిటెడ్, అన్సుమి స్పేస్ కార్పొరేషన్, జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రీస్ పార్క్ లిమిటెడ్, వైశాఖి గ్రోత్ కారిడార్, రుషిల్ డెకర్స్, ఎలైట్లాజిక్స్ ఎగ్జిమ్ ఏజెన్సీ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు జిల్లాలో యూనిట్లు స్థాపించేందుకు ముందుకు వచ్చాయని కలెక్టర్ వెల్లడించారు. ఈ పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు లభిస్తాయన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ఇన్చార్జ్ జనరల్ మేనేజర్ ఎంవీ కరుణాకర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎం.మురళీమోహన్రెడ్డి ఇతర జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాంసుందర్రెడ్డి -
చోరీ బాటలో దంపతులు
రాజాం సిటీ: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విలాసాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో దొంగతనానికి పాల్పడి బంగారు ఆభరణాలు చోరీ చేశారు. చోరీ చేసిన బంగారు నగలను తాకట్టుపెట్టి ఆ నగదుతో హైదరాబాద్, గోవా, కర్నాటక, భువనేశ్వర్ ప్రాంతాల్లో విలాసంగా గడిపారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటలాపాలయ్యారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజాం రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ హెచ్.ఉపేంద్ర శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. రేగిడి మండలం బాలకవివలస గ్రామానికి చెందిన డోల గాయత్రి ఇంటర్మీడియట్ చదువుకుని ఓ కంపెనీలో పనిచేసేది. అదే కంపెనీలో పనిచేస్తున్న బాపట్ల జిల్లా చీరాల మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన దుడ్ల బాలాజీతో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. అప్పటి నుంచి వారిద్దరూ బాలకవివలసలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా గత నెల 4న బాలకవివలస గ్రామానికి చెందిన కిల్లారి కమల ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో 13 తులాల బంగారం అపహరణకు గురైందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి సవాల్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి గ్రామానికి చెందిన గాయత్రి, బాలాజీలపై అనుమానంతో ఆరా తీసి నిందితులుగా గుర్తించారు. వారు గ్రామంలో లేకపోవడంతో గాలింపు చేపట్టారు. నిందితులు దొంగిలించిన బంగారాన్ని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో కొన్ని ఆభరణాలు, బాపట్ల జిల్లా చీరాలలో ఓ ప్రైవేట్ కంపెనీలో కొన్ని ఆభరణాలు తాకట్టు పెట్టారు. ఆ సొమ్ముతో హైదరాబాద్, గోవా, భువనేశ్వర్లలో విలాసాలకు ఖర్చుచేశారు. చిన్నారి కోసం వచ్చి..పట్టుబడిన దంపతులుతమ నాలుగు నెలల చిన్నారిని తీసుకుని వెళ్లేందుకు బాలకవివలస వచ్చిన నిందితులను సమాచారం మేరకు పట్టుకున్నామని సీఐ తెలిపారు. వారి నుంచి రూ.ఒక లక్షతో పాటు రెండు చెవిదిద్దులు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. ఇంకా మిగిలిన బంగారం రికవరీ చేయాల్సి ఉందని వెల్లడించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన రేగిడి క్రైం సిబ్బంది ఎస్.శ్రీనివాసరావు, ఎస్.రామకృష్ణ, ఆర్.శివరావు, కె.మోహనరావులను సీఐ అభినందించారు. కార్యక్రమంలో ఎస్సై వి.బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. బాలకవివలసలో నిందితుల అరెస్టు -
అంతర్ వర్సిటీల బ్యాడ్మింటన్ పోటీలకు జీఎంఆర్ విద్యార్థులు
రాజాం సిటీ: ఈ నెల 4 నుంచి 6 వరకు విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల బ్యాడ్మింటన్ పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారని పీడీ బీహెచ్ అరుణ్కుమార్ శుక్రవారం తెలిపారు. ఇటీవల రఘు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జట్టు ఎంపికలో జీఎంఆర్ ఐటీకి చెందిన డి.ప్రవీణ్కుమార్, వై.షణ్ముఖ్లు ఉన్నారన్నారు. వారు జేఎన్టీయూ జీవీ తరఫున ఆడనున్నారని పేర్కొన్నారు. వారి ఎంపికపట్ల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూండెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, అధ్యాపకులు తదితరులు అభినందించారు. చెస్ టోర్నమెంట్లో మాధురి మోక్షితకు అంతర్జాతీయ రేటింగ్విజయనగరం అర్బన్: విశాఖలో ఇటీవల జరిగిన ఆలిండియా అంతర్జాతీయ ఓపెన్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్లో విజయనగరానికి చెందిన నారాయణ స్కూల్ విద్యార్ధిని మాధురి మోక్షిత ప్రతిభ కనపరిచి 1487 అంతర్జాతీయ రేటింగ్ పాయింట్లు సంపాదించింది. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ ప్రభావతి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 20 రాష్ట్రాలు, ఐదు దేశాల నుంచి మొత్తం 582 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో మాధురి మోక్షిత ఆర్వీ 8 రౌండ్లకు గాను నాలుగు రౌండ్లలో విజయం సాధించిందని తెలిపారు. ఈ విజయంలో అంతర్జాతీయ రేటింగ్ 1,487 పాయింట్లు సంపాదించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విజేతను పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు. పోక్సో కేసులో ముద్దాయి 20 ఏళ్ల జైలుశిక్షవిజయనగరం క్రైమ్: జిల్లాలోని బాడంగి పోలీస్స్టేషన్లో 2024లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయికి విజయనగరం పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి కె.నాగమణి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.5000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్పీ దామోదర్ శుక్రవారం తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలం, రాజేరుకు చెందిన బాలిక (14) కనబడడం లేదని బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై బాడంగి ఎస్సై జె.తారకేశ్వరరావు డిసెంబర్ 28, 2024న మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో బాడంగి మండలం వాడాడకు చెందిన నిందితుడు వాడాడ వెంకటరమణ (23) ఆ బాలికను ప్రేమిస్తున్నానని వెంటపడుతూ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి కత్తిపూడి తీసకుని వెళ్లాడు. అక్కడ ఆ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడంతో పోక్సో చట్టం కింద బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యరెడ్డి కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఆపై నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. నిందితుడిపై విచారణలో నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ దామోదర్ తెలిపారు. రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహంవిజయ నగరం క్రైమ్: విజయనగరం, కోరుకొండ రైల్వేస్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహాన్ని జీఆర్పీ సిబ్బంది శుక్రవారం గుర్తించారు. సుమారు 50 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సున్న ఆ వ్యక్తి మృతదేహం పక్కన వాటర్ బాటిల్ ను పోలీసులు కనుగొన్నారు. మృతుడు 5 అడుగుల పొడవు కలిగి, ఎరుపు రంగు శరీర ఛాయ కలిగి, నీలం రంగు ఫుల్ హ్యాండ్స్ షర్ట్, బ్లాక్ కలర్ జీన్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. విజయనగరం గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ హెచ్సీ పి.రవి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఫోన్ 9490617089, 9441962879 నంబర్లకు తెలియ జేయాలని ఆయన కోరారు. -
జగనన్న కల.. ప్రజలకు అందనున్న వేళ..
సాలూరు: పట్టణంలోని గుమడాం సమీపంలో నిర్మించి న ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ అందుబాటులో కి రానుంది. మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొ ర కృషితో భవన నిర్మాణం పూర్తయింది. దీనిని మంత్రి సంధ్యారాణి శనివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్సీపీ ప్రభు త్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగ న్మోహన్ రెడ్డి వైద్యానికి చూపించిన ప్రత్యేక చొరవను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. వైద్యానికి పెద్దపీట.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యవిధానంపై పెద్దపీట వేసింది. మెడికల్ కళాశాలలు, వంద పడకల ఆస్పత్రుల నిర్మాణానికి ముందడుగు వేసింది. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా వైద్యాలయాలను ఆధునీకరించింది. ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజల వద్దకే వైద్యసేవలు తదితర కార్యక్రమాలను విస్త్రతంగా చేపట్టింది. దీనిలో భాగంగా అప్పటి డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పట్టణంలో 100 పడకల ఆస్పత్రితోపాటు, గుమడాం సమీపంలో ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ మంజూరు చేయించారు. ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించి పనులు ప్రారంభించారు. రూ.80 లక్షల అంచనా వ్యయం... ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి సుమారు రూ.80 లక్షలు కేటాయించారు. అనంతరం పనులు పూర్తికి మరో రూ.20 లక్షలు అవసరం అయ్యాయి. ఈ నేపథ్యంలో నిధులు చాల క పనులు నిలిచిపోయాయని తెలుసుకున్న రాజన్నదొర ముందుగా మున్సిపాలిటీ నిధులతో పనులు చేపట్టే కౌన్సిల్ సమావేశంలో చర్యలు తీసుకున్నారు. మరోవైపు డిపార్ట్మెంట్ ద్వారా అదనపు నిధులు మంజూరుకు తోడ్పాటు అందించారు. మున్సిపల్ ఆమోదం, డిపార్ట్మెంట్ ద్వారా కూడా నిధులు రావడంతో పనులకు అడ్డంకి తొలగింది. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నేటికి తుది దశ పనులు పూర్తయ్యాయి. -
డ్రాయింగ్ టీచర్కు అభినందనలు
పార్వతీపురం: బెలగాం గిరిజన సంక్షేమ ఆశ్ర మ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తు న్న రుగడ శ్రీనివాసరావును కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం కలెక్టర్ కార్యాలయ చాంబర్లో అభినందించారు. ముస్తాబు కార్యక్రమంపై వేసిన చిత్రాలు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడంపై సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లోనూ చిత్రలిపిని ప్రోత్సహించాలన్నారు. అనంతరం పెన్సిల్తో వేసిన కలెక్టర్, జేసీల చిత్రాలను డ్రాయింగ్ టీచర్ అందజేశారు. కొమరాడ: ఇటీవల ఒడిశా సరిహద్దులోని నాగవళి నది ఆవలవైపు సంచరించిన గజరాజుల గుంపు శుక్రవారం జంఝావతి గట్టుదాటి లక్ష్మీపేట, కంచరపాడు గ్రామాల సమీపంలోని చీకటిలోవ కొండ వద్దకు చేరుకున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం తలపెడుతాయోనని కంచరపాడు, పాత కంబవలస, లక్ష్మీపేట గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. రాజ్యలక్ష్మీపురం, కుమ్మరిగుంట, స్వామినాయుడువలస, గంగారేగువలస తదితర గ్రామాల్లో కూరగాయలు, జొన్న పంటల సాగులో ఉన్నాయి. పంట ఏపుగా పెరిగే సమయంలో ఏనుగులు సంచరిస్తే నాశనమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాల ని కోరుతున్నారు. విజయనగరం అర్బన్: నైపుణ్యాలతో కూడిన ఉన్నతవిద్య నేటి పోటీ ప్రపంచానికి అవసరమని, ఆ దిశగా విద్యాబోధన సాగాలని సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ప్రశాంతకుమార్ మహంతి అన్నారు. వర్సిటీ ఫోరెన్సిక్ సైన్స్ విభాగం, ఎంఆర్ అటానమస్ కళాశాల జువాలజీ విభాగం సంయుక్తంగా ‘రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్వాంటం సెక్యూరిటీ’ అనే అంశంపై ఎంఆర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ఒక రోజు హ్యాండ్స్ ఆన్ శిక్షణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయని, అవసరమైన ప్రాక్టికల్ అనుభవం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో పొందవచ్చని తెలిపారు. వర్సిటీ ఫోరెన్సిక్ సైన్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ రవికుమార్ మా ట్లాడుతూ భవిష్యత్తులో స్కిల్ ఇండియా రాబోతుందన్నారు. క్వాంటం టెక్నాలజీ, జీనో సీక్వెన్సింగ్ వంటి నూతన టెక్నాలజీలను విద్యార్థు లు అందిపుచ్చుకోవాలని సూచించారు. అనంత రం ముఖ్యఅతిథిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాన్సాస్ కరెస్పాండెంట్ ప్రొఫె సర్ కేవీఎల్రాజు, ఎంఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సాంబశివరావు, జువాలజీ విభాగాధి పతి ఎ.గోపాల్, డాక్టర్ శివగణేష్, డాక్టర్ నాగజగ్గయ్య, ఆదిత్య మహిళా కళాశాల, ఎంఆర్కళాశాల, ఎస్ఎస్ఎస్ఎస్ డిగ్రీ కళాశాల, సెంచూరి యన్ యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరం టౌన్: హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు 81వ వర్ధంతి కార్యక్రమాన్ని దాసు స్వగృహంలో ఆదిభట్ల ఫౌండేషన్ ఆనంద నారాయణ ఆధ్వర్యంలో శుక్రవా రం నిర్వహించారు. దాసు విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలేసి నివాళులర్పించారు. లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ముఖ్య అతిథిగా, స్పార్క్ సొసైటీ వ్యవస్థాపకు లు పి.భవాని పాల్గొన్నారు. హరికథ రంగానికి ఆదిభట్ల ఎనలేని సేవలందించారన్నారు. -
పసుపు ధర ఢమాల్
సీతంపేట: ఏజెన్సీలో పండే పసుపు నాణ్యతతో కూడినది. కేవలం సేంద్రియ ఎరువులతో సాగుచేసిన పంట కావడంతో డిమాండ్ ఎక్కువ. ఇక్కడి పసుపు కొమ్ములు కొనుగోలుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు తరలివస్తారు. సీజన్ ఆరంభమై పక్షం రోజులైంది. ఈ దఫా ఏజెన్సీలో విలువైన పసుపు పంటకు మాత్రం రైతులు ఆశించిన ధరలు మర్కెట్లో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఉడకబెట్టి తెచ్చిన పసుపు కావిడ ధర ప్రస్తుతం రూ.700 నుంచి రూ.800 మధ్య ధర పలుకుతోంది. గతంలో రూ.900 ఉండేదని, పక్షం రోజుల్లో కావిడ వద్ద రూ.200 ధర తగ్గడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అంతర పంటగా... సీతంపేట ఏజెన్సీలో సుమారు 1250 ఎకరాల్లో పసుపు సాగవుతోంది. సుమారు 2 వేల మంది రైతులు కొండపోడులో పంటను సాగుచేస్తున్నారు. జీడీ, మామిడి తోటల్లో అంతరపంటగా సాగుచేస్తున్న పసుపు పంట రైతులకు ప్రధాన ఆదాయ వనరు. గతంలో ఐటీడీఏ ఉద్యానవన సాగులో భాగంగా విత్తనాలు సరఫరా చేసేది. గిట్టుబాటు ధర ఉండడంతో గిరిజన రైతులకు లాభాలు వచ్చేవి. ఈ ఏడాది నాణ్యమైన పసుపు దిగుబడి వచ్చినా ధరలు లేక నష్టాలు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రికి చెందిన వ్యాపారులు వారపు సంతలకు వచ్చి పసుపు కొనుగోలు చేస్తారు. అయితే, దళారీలు సిండికేట్గా పంటను చౌకగా దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు నిల్.... గతంలో వెలుగు ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి పసుపు రైతులు నష్టపోకుండా మహిళా సంఘాలు పంటను కొనుగోలు చేసేవి. అప్పట్లో కూడా దళారీలు ప్రమేయం ఉండడం, అనుకున్న స్థాయిలో పసుపు కొనుగోలు చేయలేక వెలుగు అధికారుల కూడా చేతులెత్తేశారు. వనధన్ కేంద్రాలు రెండు, మూడు చోట్ల నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. మార్కెటింగ్ సదుపాయం లేక ఇవి ఎక్కువ మొత్తంలో పసుపు సేకరించడంలేదని రైతులు చెబుతున్నారు. గిరిజన సహకార సంస్థ ఉన్నా ఫలితం లేదని వాపోతున్నారు. ఈ ఏడాది నష్టాలే చవిచూస్తున్నాం. ఆరుగాలం శ్రమించి పండించిన పసుపు పంటకు కూడా మద్దతు ధర లేదు. ఏం చేయా లో తెలియడంలేదు. మోంథాతుఫాన్ వర్షాలకు పాడైన పంటలకు ఇప్పటివరకు పరిహారం అందలేదు. అన్నదాత సుఖీభవా వంటి వి అందలేదు. ఇప్పుడు పసుపు పంటకు ధర ఉంటే చాలనుకున్నాం. మద్దతు ధర లేకపోవడంతో దిగాలు పడుతున్నాం. – ఎస్.ముఖలింగం, జజ్జువ కావిడ ధర రూ.900 నుంచి రూ.700కు పతనం సీతంపేట ఏజెన్సీలో 1250 ఎకరాల్లో పసుపు సాగు దిగుబడి పెరిగినా ధరలు లేవంటూ గిరిజన రైతుల గగ్గోలు -
● పాస్ పుస్తకాల పంపిణీలో అధికారుల పక్కనే టీడీపీ శ్రేణులు ● ప్రభుత్వ కార్యక్రమాన్ని.. పార్టీ ప్రచారంగా మార్చేసిన వైనం
● అధికారుల సమక్షంలోనే రాజకీయ విమర్శలు కురుపాం మండలం డి.బారామణిలో నిర్వహించిన పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమమిది. ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి, కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు ఐఏఎస్లతోపాటు.. ఒక టీడీపీ నాయకుడు కూడా వేదికను పంచుకున్నారు. ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో టీడీపీ యువజన విభాగానికి చెందిన కోలా రంజిత్కుమార్(ఎమ్మెల్యే జగదీశ్వరికి కుడివైపు ఉన్న వ్యక్తి) పాల్గొనడం.. అందునా ఐఏఎస్ అధికారులతో సమానంగా వేదిక పంచుకోవడం చర్చనీయాంశమైంది. -
సర్వజన ఆస్పత్రిలో నిలిచిన సీబీపీ పరీక్షలు..!
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సీబీపీ పరీక్షలు జరగక రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రికి రోజుకి 40 నుంచి 50 మంది రోగులకు సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) పరీక్షలు చేస్తారు. కొద్ది రోజులుగా ఆస్పత్రిలో సీబీపీ పరీక్షలు జరగడం లేదు. ఆస్పత్రికి వచ్చేరోగులు ప్రైవేటు ల్యాబొరేటరీల్లో పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి. జ్వరంతో బాధపడేవారికి, రక్తహీనత, బ్లడ్ ఇనఫెక్షన్స్, శస్త్రచికిత్స అవసరమైన వారికి సీబీపీ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో రోగి శరీరంలో ఎంత రక్తం ఉంది, ఎర్ర రక్తకణాలు, తెల్లరక్త కణాల సంఖ్య వంటివి నిర్ధారణ అవుతాయి. అయితే, పరీక్షలు చేసేందుకు అవసరమైన రియాజన్స్ అయిపోవడంతో ఆస్పత్రిలో పరీక్షలు నిలిచిపోయినట్టు సమాచారం. వాస్తవంగా రియాజన్స్ ముందుస్తుగానే సరఫరాల చేయాలి. చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో సరఫరా చేయక పోవడం వల్ల రోగులకు అవస్థలు తప్పడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
కిక్ఇచ్చిన మద్యం అమ్మకాలు
విజయనగరం రూరల్: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జిల్లా నుంచి ఆదాయం భారీగా సమకూరింది. నూతన సంవత్సరం వేళ మద్యం అమ్మకాలతో భారీ ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ధ్యేయంతో అర్ధరాత్రి ఒంటి గంట వరకు అమ్మకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. జిల్లాలోని అబ్కారీశాఖ పరిధిలో 169 మద్యం దుకాణాలు, 20 బార్లు ఉన్నాయి. గతనెల 29, 30, 31 తేదీల్లో రూ.21.30 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగాయి. 29న 11,168 ఐఎంఎల్ కేసులు, 3,996 బీరు కేసుల విక్రయాలతో రూ.8.05 కోట్లు, 30న 9,674 మద్యం కేసులు, 3,634 బీరు కేసుల అమ్మకాలతో రూ.6.9 కోట్లు, 31న 8,941 ఐఎంఎల్ కేసులు, 3,464 బీరు కేసుల అమ్మకాలతో రూ.6.35 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. మరోవైపు మద్యం తాగి వాహనాలు నడిపేవారి నుంచి (డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు) అపరాధ రుసుం రూపంలో భారీగా ఆదాయం సమకూరినట్టు సమాచారం. జోరుగా సాగిన మద్యం విక్రయాలు మూడు రోజుల్లో ప్రభుత్వ ఖజానాకు రూ.21.30 కోట్ల ఆదాయం -
కలియ దున్నితే కలదు లాభం
● వరి వ్యర్థాలను ఉపయోగించుకోవాలి ● రబీకి సిద్ధమవుతున్న రైతులకు సూచన భామిని: ఖరీఫ్ పంటకాలం పూర్తయింది. పొలాల నుంచి ధాన్యం కళ్లాలకు, మిల్లులకు చేరుతున్నాయి. కోత నూర్పిడి యంత్రాల సహాయంతో పొలాల్లో వరి చేను గడ్డి కుప్పలు తెప్పలుగా పడింది. పశువుల పెంపకం తగ్గడంతో వరి గడ్డి అవసరాలు గణనీయంగా పడిపోయాయి. పొలాల్లో పంట వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.ఈ తరుణంలో రబీ పంటలకు సిద్ధమవుతున్న రైతాంగం వరిగడ్డిని తగులబెట్టడాన్ని వ్యవసాయ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. పొలంలోని వరి కొయ్యలతో పాటు మిగతా పంటలైన పత్తి, జొన్న, మిరప వ్యర్థాలను కుప్పలు పోసి తగలబెట్టడంతో కలిగే దుష్పరిణామాలు వివరిస్తున్నారు. ఈ పంట వ్యర్థాలు తగలబెట్టడంతో వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని, ఆ వేడితో భూమి సారాన్ని కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు. పంట వ్యర్థాలు తగులబెట్టే సమయంలో విడుదలయ్యే పొగ వల్ల తీవ్ర వాతావరణ కాలుష్యంతో పాటు రైతుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని సూచిస్తున్నారు. రబీ వరి కోసం పొలాలను దున్నే క్రమంలో అగ్నికి ఆహుతి చేసి చెడు ప్రభావాలు తెచ్చుకోవద్దని హితవు పలుకుతున్నారు. వరికోత పొలాల్లో విస్తారంగా పడిన వరిగడ్డి కుప్పలు, ఇతర పంటలు పూర్తయిన తరువాత వచ్చే వ్యర్థాలను తొలగించడానికి ఖర్చులు అవుతాయనే నెపంతో రైతాంగం అగ్నికి ఆహుతి చేయడం తగదని, గడ్డి కుప్పలను తగలబెట్టడంతో భూమి సారం తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు. పంటను కాపాడే కోట్ల సంఖ్యంలో సూక్ష్మజీవులు, బాక్టీరియా, శిలీంధ్రాలు, వానపాములు, నులిపురుగులు నాశనం అవుతాయి. మంటల తాకిడి ఫలితంగా పంటను కాపాడవలసిన భూమి పొరల్లోని సూక్ష్మజీవులు నాశనమై పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలియజేస్తున్నారు.కలియ దున్నడం మంచిదిపంటకాలం పూర్తయ్యాక వ్యర్థాలను నేలలో కలియ దున్నడం వల్ల సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. పంట దిగుబడి పది శాతం పెరగవచ్చు. వ్యర్థాలను దుక్కి దున్నే సమయంలో సూపర్ఫాస్పేట్ చల్లితే గడ్డి అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా మారతాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. పచ్చిరొట్టను కలియదున్నితే తర్వాత వేసే పంటకు ఎరువుగా మారి పంట దిగుబడులు పెరుగుతాయి. కొల్లి తిలక్, వ్యవసాయాదికారి, భామిని -
కొత్త ఏడాది తీరు మారేనా?
● ప్రభుత్వ విద్యపై నిర్లక్ష్యం ● విద్యాసంవత్సరం ముగుస్తున్నా అందని తల్లికి వందనం ● గాలికి వదిలేసిన డిజిటల్ విద్య ● టీచర్లకు ఇచ్చిన హామీల అమలూ అంతే.. ● లోపభూయిష్టంగా వంద రోజుల ప్రణాళిక అమలు విజయనగరం అర్బన్/రామభద్రపురం: విద్యా సంవత్సరం చివరి దశకు వచ్చింది. మరో మూడు నెలల్లో ముగియనుంది. ఇప్పటికీ ప్రభుత్వ బడుల్లో సమస్యలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. విద్యార్థుల ‘సంక్షేమం’ అందని ద్రాక్షగా నే మిగిలింది. ‘తల్లికి వందనం’ అందక విద్యార్థుల తల్లిదండ్రులు వినతులు పట్టుకుని ప్రతి సోమవా రం కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్కు తిరుగుతూనే ఉన్నారు. మరోవైపు డిజిటల్ విద్య అటకెక్కింది. నాణ్యతలేని విద్యాకానుకలతో విద్యార్థులకు తిప్ప లు తప్పడం లేదు. పాఠ్యపుస్తకాలు సైతం పూర్తిస్థాయిలో అందని దుస్థితి. వందరోజుల విద్యాప్రణాళి క అమలులో లోపాలు విద్యార్థులకు శాపంగామారాయి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో జాప్యం ప్రభావం విద్యాబోధనపై చూపుతోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యంచేస్తోందని, పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడులకు ప్రాధాన్యం తగ్గిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ● పనులు పూర్తయ్యేనా? గత ప్రభుత్వం తలపెట్టిన నాడు–నేడు పథకం రెండో విడత నిర్మాణాలకు చంద్రబాబు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. 737 విద్యాసంస్థల్లో 60 శాతం మేర పనులు పూర్తయిన నిర్మాణాలు ఇప్పుడు అసంపూర్తిగా కనిపిస్తున్నాయి. నాడు–నేడు పనుల పేరు ‘మన బడి మన భవిష్యత్తు’గా పేరు మార్చడ మే తప్ప నిధుల విడుదల, పనుల నిర్వహణ వంటివి ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● డిజిటల్ విద్య గాలికి... పాఠ్యాంశాల బోధనకు సాంకేతికత జోడించి మరింత నాణ్యతను పెంచేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ విద్య తొలి ఏడాదిలోనే టీడీపీ ప్రభుత్వం నీరుగార్చింది. ఇందులో భాగంగా గత ప్రభుత్వం వేల కోట్ల నిధులతో ఏర్పా టు చేసిన ప్రాథమిక పాఠశాలల స్మార్ట్ టీవీలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ఐఎఫ్పీ (ఇంట్రేక్టివ్ ఫ్లాట్ పానెల్)లు మరమ్మతులకు గురైతే పట్టించుకోకపోవడం వల్ల అవి మూలకు చేరాయి. డిజిటల్ విద్యకు దోహదం చేసే 8వ తరగతి విద్యార్ధుల ట్యాబ్లు పంపిణీ చేయకుండా వాటి వినియోగాన్ని దూరం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక వ్యవస్థను దూరం చేసి కార్పొరేటు విద్యారంగంపై మమకారం చూపుతోందనే విమర్శలు విద్యావేత్తల నుంచి వినిపిస్తున్నాయి. ● టీడీపీ ప్రభుత్వం తొలిఏడాది తల్లికివందనం పథకాన్ని ఎగ్గొట్టింది. రెండో ఏడాది జిల్లాలో కేవలం 60 శాతం మందికి మాత్రమే పథకం వర్తింప చేసి చేతులు దులుపుకుంది. అర్హులంద -
ఏజెన్సీ ఫలసాయాలకు ఒడిశాలో డిమాండ్
● పెరిగిన పుట్టదబ్బ, నారింజ, పెండలం, గుమ్మడి దిగుబడులు ● గిట్టుబాటు ధరలు పూజ్యం ● దళారులే దిక్కుసీతంపేట: ఏటా ఈ సీజన్లో పండే గిరిజనుల ప్రధాన అటవీఫలసాయాలైన పెండలం, పుట్టదబ్బ, గుమ్మడి వంటి వాటికి ఒడిశాలో మంచి డిమాండ్ ఉంది. అయితే అనుకున్నంత స్థాయిలో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది కంటే ఈ సంవత్సరం దిగుబడులు పెరిగినా మద్దతు ధరలు లేవు. దళారులు గుమ్మడి పండు ఒక్కోటి రూ.20కి ఇక్కడ కొనుగోలు చేస్తారు. మైదాన ప్రాంతంలో రూ.80 వరకు పండును బట్టి కిలోల వంతున విక్రయిస్తారు. పెండలం కూడా ఇక్కడ కట్టలుగా అంచనాగా 30 కిలోల పెండలం కట్టను రూ.300కు కొనుగోలు చేస్తే అది రూ.500వరకు ఒడిశాలో అమ్ముతారు. అలాగే దబ్బ కావిళ్ల లెక్కన రూ.200కు కొనుగోలు చేస్తారు. సరాసరి ఒక్కో పుట్ట దబ్బ పండు రూపాయి ధర పలుకుతుంది. అయితే ఈ దబ్బ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు ఒడిశాలోని బరంపురానికి ఎగుమతి అవుతాయి. అక్కడ రూ.3 వరకు ఒక్కో పుట్ట దబ్బను విక్రయిస్తారు. పచ్చళ్ల కంపెనీలకు ఈ తరహా పుట్టదబ్బను విక్రయిస్తారు. ఇక నారింజపండు ధరలు కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ ఒక పండు రూ.2కి కొనుగోలు చేసిన వ్యాపారులు మైదాన ప్రాంతాల్లో రూ.6 వరకు విక్రయిస్తారు. ఏజెన్సీలో పెండలం వంద హెక్టార్లలో, పుట్టదబ్బ, నారింజ, సాధారణ దబ్బ 500, గుమ్మడి 50 హెక్టార్లలో పండుతుంది. ఈ సీజన్లో ఇదే గిరిజనులకు ఇదే ప్రధాన ఆదాయ వనరు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం దిగుబడులు ఉన్నా ధరలు లేవని గిరిజన రైతులు వాపోతున్నారు. సోమవారం సీతంపేట, బుధవారం మర్రిపాడు, గురువారం దోనుబాయి, శనివారం పొల్ల, కుశిమి వారపు సంతలకు వాటిని గిరిజనులు తీసుకువస్తారు. లారీలు, వ్యాన్లలో వచ్చిన వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకువెళ్తారు. కోల్డ్ స్టోరేజీ లేక అవస్థలు కోల్డ్ స్టోరేజీ సౌకర్యం లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీలో పండే ఉత్పత్తులను నెలలకొద్దీ నిల్వ చేసి ధరలు అత్యదికంగా ఉన్న సమయంలో విక్రయించుకోవడానికి వీలుగా సీతంపేటలో పదేళ్ల క్రితం కోల్డ్ స్టోరేజినీ ఏర్పాటు చేశారు. అయితే దానిపై గిరిజనులకు చైతన్యం లేకపోవడంతో ఎవరూ వినియోగించడం లేదు. దీంతో అది మూలన పడింది. దబ్బ, నారింజ, అరటితో పాటు సీజన్లలో లభ్యమయ్యే పైనాపిల్, చింతపండు వంటివి నిల్వ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అటవీ ఫలసాయాల విక్రయంలో గిరిజనులు నష్టాలు చవిచూస్తున్నారు. మరోవైపు ఈ తరహా ఉత్పత్తులను గిరిజన సహకార సంస్థ కూడా కొనుగోలు చేయని పరిస్థితి ఉందని పలువురు గిరిజన రైతులు వాపోతున్నారు.ఏజెన్సీలో లభించే గుమ్మడివ్యాపారులు కొనుగోలు చేసిన పెండలం గిరిజనులు విక్రయిస్తున్న నారింజ, పుట్టదబ్బనష్టాలు తప్పడం లేదు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుందనుకున్న సమయంలో నష్టాలు వస్తున్నాయి. దీంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు ధరలు లేకపోవడంతో మిగతా పంటలు ఎలా పండించుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఎస్.మల్లయ్య, వజ్జాయిగూడ దళారులదే హవాఅటవీ ఉత్పత్తులు తీసుకువచ్చినా దళారుల హవా సాగుతోంది. కొన్నేళ్లుగా మన్యంలో పండే పంటలు దళారుల పాలవడంతో మాకు రావాల్సిన ఆదాయ వనరులు తగ్గుతున్నాయి. దీంతో నష్టాలు చవిచూస్తున్నాం. ప్రభుత్వ పరంగా గిరిజన రైతులను ఆదుకోవాలి. ఎస్.సన్నాయి, అక్కన్నగూడ -
జేఎన్టీయూ జీవీలో నూతన సంవత్సర వేడుకలు
● హిల్లాక్ వాకింగ్ ట్రాక్ ప్రారంభం ● క్యాలెండర్ను ఆవిష్కరించిన ఉప కులపతి వీవీ సుబ్బారావువిజయనగరం రూరల్: విజయనగరం జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉప కులపతి వీవీ సుబ్బారావు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం ఉత్తరాంధ్ర ప్రాంతానికే తలమానికమన్నారు. కొత్త ఏడాదిలో విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని, ఈ అభివృద్ధిలో అధికారులు, ఆచార్యులు, విద్యార్థులు, సిబ్బంది భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. దీనిలో భాగంగా గతేడాది ప్రారంభించిన ‘ఆరోగ్యం కోసం ఒక గంట–ప్రకృతితో’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రాంగణంలో కొండపై, పచ్చటి చెట్ల మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హిల్లాక్ వాకింగ్ ట్రాక్ను ప్రారంభించారు. అనంతరం విశ్వవిద్యాలయం నూతన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ జి.జయసుమ, అధికారులు, ఆచార్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు నిబంధనలు విధిగా పాటించాలి
విజయనగరం అర్బన్: ప్రతి ప్రయాణికుడు రోడ్డు నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ప్రజలకు సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ఆయన గురువారం అధికారికంగా ప్రారంభించారు. వాల్పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారిపై వాహనాలను జాగ్రత్తగా నడిపితే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 90 శాతం నిబంధనలు పాటించకపోవడం వల్లే సంభవిస్తున్నాయని తెలిపారు. వాహన చోదకులు తమ కుటుంబాలు, పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని బాధ్యతతో వాహనాలను నడపాలని సూచించారు. జాతీయ రహదారి భద్రతా నియమా లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ వర్గాల ప్రజలకు, వాహన చోదకులకు విస్తృత స్థాయిలో అవగా హన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ డి.మణికుమార్, మోటారు వాహన తనిఖీ అధికారులు మురళీకృష్ణ, దుర్గప్రసాద్, శశికుమార్, రవిశంకర్ ప్రసా ద్, వెంకటరావు, శివరామగోపాల్, రమేష్కుమార్, ఉష, శ్రావ్య, ఐశ్వర్యలక్ష్మి, నవీన్, తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతికతతో సేవలందించి లక్ష్యాలను సాధిద్దాం
పార్వతీపురం రూరల్: కొత్త ఆశలు..కోటి ఆశయాల కలయికతో నూతన వసంతంలోకి అడుగుపెట్టిన వేళ, వృత్తిధర్మంలో సాంకేతికతను జోడించి ప్రజలకు ‘రక్షణ కవచం’లా నిలవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్పీ కేక్ కట్ చేసి, పోలీసు సిబ్బందికి, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ, 2026లో పోలీస్ శాఖ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ‘సాంకేతికతతో సేవలు–సమర్థవంతమైన పోలీసింగ్‘ అన్న సూత్రంతో ముందుకు సాగాలని, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణం కల్పించడమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పౌరులుగా జిల్లా అభివృద్ధికి ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఈ వేడుకల్లో అడిషనల్ ఎస్పీ ఎం.వెంకటేశ్వర రావు, ఏఎస్పీ మనీషా రెడ్డి, డీఎస్పీలు రాంబాబు, థామస్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు, పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సంవత్సర సంకల్పాన్ని చాటారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
కలెక్టర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు
పార్వతీపురం: కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డికి జిల్లా అధికారులు గురువారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది అందరికీ మంచి జరగాలని, జిల్లాను అన్ని రంగాల్లో పురోభివృద్ధికి సహకరించాలని కోరుతూ తన చాంబర్లో కలెక్టర్ కేక్ను కట్చేశారు. కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్, డీఆర్వో కె.హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్లు పి.ధర్మచంద్రారెడ్డి, వినోద్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.బాలమాన్ సింగ్, డీఈఓ పి.బ్రహ్మజీరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీఆర్డీఏ పీడీ ఎం.సంధ్యారాణి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, వ్యవసాయాధికారి ఆర్.అన్నపూర్ణ, పశుసంవర్థకశాఖాధికారి ఎస్.మన్మథరావు, మత్స్యశాఖాధికారి సంతోష్, డీపీఓ కొండలరావుతో పాటు వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. కలెక్టర్ కొత్త సంవత్సర వేడుకలు కొమరాడ: గిరిజనులతో కలిసి కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి కొత్తసంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కొమరాడ మండలం అర్తాం పంచాయ తీ గదబవలస గ్రామంలో కేక్ను కట్చేసి గిరిజనులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మహిళలు ప్రదర్శించిన సంప్రదాయ థింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను గిరిజనులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా గ్రామంలో ఉన్న అభివృద్ధి పనులపై ఐటీడీఏ పీఓతో చర్చించి పనులు పూర్తిచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. చిన్నారులకు పుస్తకాలు అందజేశారు. -
అధికారుల నిర్లక్ష్యం.. పేద కుటుంబానికి శాపం!
హిరమండలం: సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం ఆర్భాటం చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలుచేసినట్టు కూటమి ప్రభుత్వం చెప్పింది. కానీ హిరమండలం మండలంలో నిరుపేద కుటుంబంలో ముగ్గురు పిల్లలకు ఈ పథకం వర్తించలేదు. దీంతో ఆ కుటుంబం కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. అయినా కనికరించేవారు కరువయ్యారు. జగన్నాథపురంలో లిమ్మక పెంటయ్య, ఈశ్వరి దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరంతా వంశధార నిర్వాసితులు. నిరుపేదలు కావడంతో పూరిగుడిసెలో నివాసముంటున్నా రు. ముగ్గురు పిల్లలూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కనీసం వీరికి విద్యుత్ మీటరు కూడా లేదు. కానీ ఏకంగా ఏడు మీటర్లు ఉన్నట్టు చూపడంతో తల్లికి వందనం పథకం వర్తించలేదు. విద్యు త్ శాఖ అధికారులు వీరికి ఎటువంటి మీటరు లేదని ధ్రువీకరించినప్పటికీ తల్లికి వందనం పథకం మాత్రం అందలేదు. కార్యాలయాల చుట్టూ తిరగడమే కానీ ఫలితం లేకపోతోంది. కొత్త సంవత్సరంలోనైనా అధికారులు స్పందించి పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
జాతీయ బాక్సింగ్ పోటీలకు విశ్వేశ్వరరావు
శ్రీకాకుళం న్యూకాలనీ : జాతీయ బాక్సింగ్ పోటీల కు జిల్లాకు చెందిన బాక్సర్ పి.విశ్వేశ్వరరావు ఎంపికయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని నోయిడా వేదికగా ఈ నెల 4 నుంచి 10 వరకు తొమ్మిదో ఆలిండియా ఎలైట్మెన్ బాక్సింగ్ చాంపియన్షిప్–2025–26 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల కోసం విశ్వేశ్వరరావు గురువారం ఇక్కడి నుంచి పయనమైవెళ్లాడు. ఇటీవ ల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించడంతో జా తీయ పోటీలకు ఎంపికయ్యాడు. డీఎస్ఏ బాక్సింగ్ కోచ్ ఎం.ఉమామహేశ్వరరావు నేతృత్వంలో కఠోర సాధన చేస్తూ జాతీయస్థాయికి చేరుకోవడం అభినందనీయమని డీఎస్డీఓ ఎ.మహేష్బాబు సంతో షం వ్యక్తం చేశారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ బీఏ లక్ష్మణ్దేవ్, వంగా మహేష్ ప్రోత్సా హం, శిక్షకుల చొరవ ప్రసంశనీయమని సీనియర్ బాక్సర్లు రాజీవ్, అప్పలరాజు, రాము, మనోజ్కుమార్ తదితరులు పేర్కొన్నారు. -
రహదారి నిబంధనలు విధిగా పాటించాలి
పార్వతీపురం: రహదారి నిబంధనలు ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన తన చాంబర్లో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను ప్రారంభించి వాల్పోస్టర్ను, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారి భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 90శాతం రహదారి నిబంధనలు పాటించకపోవడం వల్లే జరుగుతున్నాయన్నారు. వాహన దారులు తమ ప్రాణాలతో పాటు తమపై ఆధారపడిన కుటుంబసభ్యులు, పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని రహదారి నిబంధనలను పాటించాలని హితవు పలికారు. కార్యక్రమంలో జిల్లా రవాణాధికారి దుర్గాప్రసాద్ రెడ్డి, ఆర్టీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి నాల్గవ విడత రీసర్వేపార్వతీపురం: జిల్లాలో నాల్గవ విడత భూ రీసర్వే కార్యక్రమం శుక్రవారం ప్రారంభమవుతుందని కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి గురువారం పేర్కొన్నారు. నాల్గవ విడత రీసర్వేను 120 గ్రామాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ రీ సర్వేను ఆరు నెలల్లో పూర్తి చేసేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. భూ సమస్యల పరిష్కారం, భూములపై స్పష్టమైన హక్కులు, ఆధునిక మ్యాప్ల రూపకల్పన తదితర ప్రయోజనాలు రైతులకు కలుగుతాయన్నారు. రీ సర్వేకు అవసరమైన భూములకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు, పట్టాలు, ఇతర అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ సర్వేలో రెవెన్యూ సిబ్బందికి రైతులు సహకరించాలని కోరారు. విశాఖసిటీ: విశాఖ రేంజ్ డీఐజీగా విధులు నిర్వర్తిస్తున్న గోపీనాథ్ జెట్టి పదోన్నతి పొందారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ)గా గురువారం ఆయన రేంజ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయంలోని ఇతర పోలీస్ అధికారులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేంజ్ పరిధిలోని ఎస్పీలు తుహిన్ సిన్హా (అనకాపల్లి), అమిత్ బర్దర్ (అల్లూరి), కేవీ మహేశ్వర్రెడ్డి (శ్రీకాకుళం), ఎస్.వి.మాధవరెడ్డి (పార్వతీపురం), ఏఆర్.దామోదర్ (విజయనగరం) ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కలను అందించి పదోన్నతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధికారుల సమక్షంలో ఐజీ కేక్ కట్ చేశారు. నూతన సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా ఐజీ ఆకాంక్షించారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. పోలీసు యంత్రాంగం ప్రజలకు ఎల్ల ప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. రేంజ్ పరిధిలోని డీఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు, కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది, క్యాంపు కార్యాలయం సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్యరామభద్రపురం: మండలంలోని కొట్టక్కి గ్రామంలో పక్కింటి వ్యక్తి తిట్టాడని మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తెంటు రమణమ్మ (32)కు చిల్లంగి ఉందని పక్కింటి వ్యక్తి మద్యం తాగి వచ్చి బూతులు తిట్టాడు. దీంతో తననే తిడుతున్నాడని మనస్తాపానికి గురైన ఆమె డిసెంబర్ 31న పురుగు తాగేసింది. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు ప్రథమ చికిత్స నిమిత్తం సాలూరు సీహెచ్సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి భర్త బాలరాజు ఫిర్యాదు మేరకు ఎస్సై వి. ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలి
విజయనగరం క్రైమ్: కొత్త ఏడాదిలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఎస్పీ దామోదర్ ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం ఎస్పీ బంగ్లాలో నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎం.వీరకుమార్, డీటీసీ డీస్పీ పి.నారాయణ రావు, ఎఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఎస్.విద్యాసాగర్, నగర ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఇతర శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ఈ ఏడాదిలో అందరికీ శుభాలు జరగాలని సూచించారు. పోలీస్శాఖ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగా సమర్థవంతంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ప్రజలందరికీ మంచి సేవలందిస్తూ పోలీసుశాఖ ప్రతిష్టను పెంచే విధంగా పనిచేయాలన్నారు. జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా, క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ -
మేం నిద్రపోతాం!
బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మరో యువ ఐఏఎస్ అధికారి, పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ పాలకొండ మండలంలోని అట్టలి గ్రామం వద్ద గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను గుర్తించి, సీజ్ చేశారు. ఆ వాహనాలను పోలీసులకు అప్పగించారు. అనంతరం పాలకొండ మండలంలోని అంపిలి, గొట్టమంగళాపురం, చిన్నమంగళాపురం, గోపాలపురం ఇసుక రీచ్లను పరిశీలించారు. ఇసుక తరలివెళ్తున్న వాహనాలను ఆపి, వివరాలు తెలుసుకున్నారు. -
కొండలను పిండి చేసే ‘కంకరీచులు’
పాలకొండ–పార్వతీపురం ప్రధాన రహదారిలోని అట్టలి సమీపంలో కంకర లభ్యమయ్యే కొండను అక్రమార్కులు తవ్వేశారు. రాత్రివేళల్లో గుట్టుగా యంత్రాలతో తవ్వి, వందలాది ట్రాక్టర్లు, టిప్పర్లతో కంకరను తరలిస్తున్నారు. ప్రతిరోజూ రూ.లక్షల్లో ఇక్కడ అక్రమ వ్యాపారం సాగుతోంది. ట్రాక్టరు లోడు రూ.1,500, టిప్పరు లోడు రూ.7 వేల వరకు విక్రయిస్తున్నారు. సీతానగరం మండలం నిడగల్లు, ఇప్పలవలస, దయానిధిపురం, చినఅంకలాం, వెన్నెల బుచ్చింపేట రెవెన్యూ గ్రామాల పరిధిలో కొండలను తవ్వేస్తూ, కంకర తరలించుకుపోతున్నారు. కురుపాం మండలం మంతినవలస సమీపంలోనూ గుట్టల వద్ద మట్టిని తవ్వేస్తున్నారు. మక్కువ మండలం కాశీపట్నం తదితర ప్రాంతాల్లోనూ కంకర కింకరులు రెచ్చిపోతున్నారు. సాలూరు, భామిని మండలాల్లోనూ గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇలా జిల్లా మొత్తం ఇసుక, గ్రావెల్ తవ్వకాలతో రూ.లక్షలు పోగేస్తున్నారు. పత్రికల్లో వస్తేనే రెవెన్యూ, మైనింగ్ అధికారులు రెండు రోజులు హడావిడి చేస్తున్నారు. తర్వాత షరా‘మూమూలు’గానే వదిలేస్తున్నారు. పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు చూపుతున్న చొరవలో కొంతయినా.. స్థానిక అధికారులు చూపిస్తే, తవ్వకాలకు కాస్తయినా బ్రేక్ పడుతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆశిస్తున్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం : జిల్లాలో ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఎక్కడికక్కడ తవ్వకాలు చేపట్టి.. రాత్రి వేళ తరలిస్తున్నారు. ఇదంతా స్థానిక సచివాలయం, రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలి యకుండా జరుగుతుందా.. అన్నది ప్రశ్నార్థకమే! అక్రమార్కులకు స్థానిక అధికారులు, ఉద్యోగులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ ఇటీవల రాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్రమంగా ఇసుక, గ్రావెల్ను తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నారు. పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ గతంలోనూ అర్ధరాత్రి సమయంలో నాగావళి నుంచి అక్రమంగా తరలిపోతున్న ఇసుక వాహనాలను పట్టుకున్నారు. బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగులుగా విధుల పట్ల ఉండాల్సిన అంకితభావానికి ఈ ఐఏఎస్ దంపతులు ఒక ఉదాహరణ. ఐఏఎస్ అధికారులై అయి ఉండి.. రాత్రి వేళ నిఘా పెట్టి ఆకస్మిక దాడులు చేస్తున్నారు. ఆర్డర్లు వేయాల్సిన వారు.. తనిఖీలతో అక్రమార్కులకు హడలెత్తిస్తున్నారు. వారే అంత చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న రెవెన్యూ, పోలీసు, సచివాలయం, గనుల శాఖ అధికారులు ఇంకెంత చేయాలి? ఎంతో కాలం నుంచి అక్రమంగా ఇసుక, గ్రావెల్ పెద్ద ఎత్తున తరలిపోతున్నా.. ఎందుకు చోద్యం చూస్తున్నారన్న ప్రశ్నలు ప్రజల నుంచి, కొందరు అధికారుల నుంచి వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రధానంగా నాగావళి, వంశధార తీరాలు ఇసుకాసురులకు కాసులు కురిపిస్తున్నాయి. కొమరాడ, పాలకొండ పరిధిలోని నాగావళి నదిని యథేచ్ఛగా దోచేస్తున్నారు. కొమరాడ మండలం కూనేరు రామభద్రపురం వద్ద ఇసుక తవ్వకాల కోసం ఏకంగా రహదారినే నిర్మించుకోవడం గమనార్హం. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో ఇసుక తరలిపోకుండా ట్రెంచ్లు కూడా తవ్వారు. అవేవీ అక్రమార్కులకు అడ్డు కావడం లేదు. కొద్దిరోజుల కిందట అందిన సమాచారం మేరకు ఇక్కడ రాత్రివేళలో మైనింగ్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. అప్పటికే ఇసుకను తవ్వుతున్న పొక్లెయిన్ను, రెండు లారీలను పట్టుకుని సీజ్ చేసి, పోలీసులకు అప్పగించారు. పాలకొండ మండలంలోని గోపాలపురం, మంగళాపురం, అంపిలి, అన్నవరం తదితర ప్రాంతాల్లోనూ జోరుగా ఇసుక తవ్వకాలు సాగుతున -
గోపినాథ్జెట్టికి ఎస్పీ శుభాకాంక్షలు
పార్వతీపురం రూరల్: విశాఖపట్నం రేంజ్ డీఐజీగా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా గురువారం బాధ్యతలు స్వీకరించిన గోపినాథ్ జట్టికి ఎస్పీ ఎస్.వి.మా ధవ్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నం రేంజ్ కార్యాలయంలో ఆయనకు పూలమొక్క ను అందజేసి, పదోన్నతితో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రక్తదానంలో ‘రాముడు’ రాజాం: ఒకసారి రెండు సార్లు కాదు ఏకంగా ఆయన 58 సార్లు రక్తదానం చేశారు. 18వ ఏట ఆరంభించిన రక్తదాన యజ్ఞాన్ని చిత్తశుద్ధితో కొనసాగిస్తూ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. రక్తదాతగా పేరుపొందారు. ఆయనే రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన శనపతి రాము. అత్యవసరంగా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని పిలుపు రావడంతో రాజాంలోని జీఎంఆర్ కేర్ ఆస్పత్రికి గురువారం వెళ్లి రక్తదానం చేసినట్టు రాము తెలిపారు. రక్తదాతను ఆస్పత్రివైద్యులు అభినందించారు. విజయనగరం అర్బన్: గ్రామీణ ప్రాంతాల్లో పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల సమర్ధ నిర్వహణే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథం’ పథకాన్ని ఈ నెల 17వ తేదీన జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి గురువారం తెలిపారు. ఈ పథకం వస్తుమార్పిడి (బార్టర్) విధానంలో కొనసాగుతుందని వివరించారు. ప్రజలు అందజేసే పొడి చెత్తకు బదులుగా నిత్యావసర సరుకులు అందిస్తారని, దీనివల్ల గ్రామాల్లో చెత్త వేరు చేసే అలవాటు పెంపొందుతుందని తెలిపారు. జిల్లాలోని 27 మండలాలకు ఒక్కో స్వచ్ఛ రథానికి నెలవారీ అద్దె విధానంలో ఆపరేటర్లను ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి అద్దె చెల్లిస్తామన్నారు. ఔత్సాహికులు తమ దరఖాస్తులను జిల్లా పంచాయతీ అధికా రి విజయనగరం కార్యాలయానికి ఈ నెల 7వ తేదీలోగా సమర్పించాలని కలెక్టర్ కోరారు. అందిన దరఖాస్తులను జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి అర్హులైన ఆపరేటర్లను ఎంపిక చేస్తుందన్నారు. విజయనగరం టౌన్: అయోధ్య బాలక్ రామమందిర్ నమూనాలో నిర్మితమవుతున్న బాలక్ రామమందిర్కు శ్రీ వాసవీ చారిటీ మిత్రుల గ్రూప్, వాసవీక్లబ్ సంయుక్తంగా రూ.లక్షా11వేల111లు ఆలయ అధ్యక్షుడు కుసుమంచి సుబ్బారావుకు గురువారం విరాళంగా అందజే శారు. కార్యక్రమంలో చారిటీ గ్రూప్ అధ్యక్షుడు ఆలవెల్లి శేఖర్, వాసవీక్లబ్ జిల్లా గవర్నర్ తమ్మ న కల్యాణ్రాజు, ఆలయ కన్వీనర్ పువ్వాడ శ్రీహరి, కార్యదర్శి డిమ్స్ రాజు, కోశాధికారి సముద్రాల నాగరాజు, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కుంకాల పండు పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్–2026 డైరీ, క్యాలెండర్ను కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డైరీలో పొందుపరిచిన రెవెన్యూ విభాగానికి సంబంధించిన కీలకమైన చట్టాలు, సర్కులర్లు, మెమోలు ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. -
మీరే తనిఖీలు చేసుకోండి...
శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2026కొమరాడ మండలం నాగావళి నదీతీరంలో చలిలో వేకువజామునే తనిఖీలు చేస్తున్న యువ ఐఏఎస్ అధికారిణి, సబ్ కలెక్టర్ వైశాలి (ఫైల్) రెండు రోజుల కిందట వేకువజామున.. కమ్మేస్తున్న పొగమంచును లెక్క చేయకుండా, ఎముకులు కొరికే చలిలో ఓ మహిళా యువ ఐఏఎస్, పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆర్. వైశాలి కొమరాడ మండలంలోని నాగావళి నదీ తీరంలో ఇసుక అక్రమ తవ్వకాల వద్దకు వెళ్లారు. కూనేరు రామభద్రపురం, కొమరాడ, కళ్లికోట, గుమడ తదితర ప్రాంతాల్లో ఇసుక రీచ్ల వద్ద పరిశీలించారు. ఇసుక తరలించేందుకు ఉన్న ఓ ట్రాక్టరును ఆపి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
19నెలల పాలనలో.. రూ.2.93 లక్షల కోట్లు అప్పు
● కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు ● లక్షలాది పెన్షన్ల తొలగింపు ● ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్యసేవ)కి తూట్లు ● సీఎం చంద్రబాబు ఘనత ఇదే.. ● మాజీ డిప్యూటీసీఎం పీడిక రాజన్నదొర సాలూరు రూరల్: చంద్రబాబునాయుడు 19 నెలల పాలనలో రూ.2లక్షల 93 వేల కోట్లు అప్పు తప్ప అభివృద్ధి కనిపించడంలేదని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరులో స్థానిక విలేకరులతో ఆయన బుధవారం మాట్లాడారు. మంచి ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం మానుకొని ప్రజలనోట మంచి ప్రభుత్వం అని పలికించుకునేలా పాలన సాగించాలని హితవుపలికారు. అధికారుల లెక్కల ప్రకారం గత ప్రభుత్వం సుమారు 66 లక్షల పెన్షన్లు ఇచ్చిందని, ప్రస్తుతం 62 లక్షల మందికే పెన్షన్లు ఇస్తున్నారన్నారు. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతేనే భార్యకు పింఛన్ ఇస్తున్నారే తప్ప కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం విచారకరమన్నారు. భర్త చనిపోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న వితంతువులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్యానికి లేకపోవడం విచారకరమన్నారు. ఎన్నికల సమయంలో 50 ఏళ్లకు పింఛన్ ఇస్తామని చెప్పి 60 ఏళ్లు పైబడిన వారికి కూడా పింఛన్ మంజూరు చేయకపోవడం సమంజసం కాదన్నారు. 2025 సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని, విద్యుత్ చార్జీలు పెంచడం, రైతుకు యూరియా లభించకపోవడం, ఆరోగ్యశ్రీ సేవలు అందకపోవడంతో పాటు ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి అమలుకునోచుకోలేదని, కనీసం 2026 సంవత్సరంలోనైనా ప్రజలకు సంక్షేమాన్ని అందించాలని సీఎం, డిప్యూటీ సీఎంలను కోరారు. సీతంపేట: ఐటీడీఏ డిప్యూటీ ఈవోగా మల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాల హెచ్ఎం పాలక నారాయుడుకు ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగిస్తూ పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేసిన డిప్యూటీ ఈఓ రామ్మోహన్రావు ఉద్యోగవిరమణ చేయడంతో ఆ స్థానంలో నారాయుడు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. -
ఏఓబీలో విస్తృత దాడులు
● 5400 లీటర్ల పులిసిన బెల్లం, ● 180 లీటర్ల నాటు సారా స్వాధీనంకురుపాం: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనాఽథుడు ఆదేశాల మేరకు ఏఈఎస్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ బి.జీవన్ కిశోర్, విజయనగరం వారి ఆధ్వర్యంలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో సంయుక్త దాడులు నిర్వహించినట్లు కురుపాం ఎకై ్సజ్శాఖ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలైన కెరడ, వలవ గ్రామాల్లో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించగా సారా తయారీకోసం నిల్వ ఉంచిన 5400 లీటర్ల బెల్లం ఊట, తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 180 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో విజయనగరం టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ గంగాధర్, రాజేశ్వరి, కురుపాం ఎకై ్సజ్శాఖ ఎస్సై రాజశేఖర్ , రాజాం, చీపురుపల్లి, పాలకొండ ఎకై ్సజ్శాఖ సిబ్బంది పాల్గోన్నట్లు తెలిపారు. సారాపై సరిహద్దుల్లో నిరంతర నిఘా పెడుతున్నామని ప్రజలు కూడా స్పందించి సారా రవాణా, విక్రయాలు చేసేవారి వివరాలను ఈ క్రింది నంబర్ –6302936599కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అటువంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. -
మాతాశిశు మరణాల కట్టడికి చర్యలు చేపట్టాలి
పార్వతీపురం: జిల్లాలో మాతా శిశుమరణాల కట్టడికి పటిష్టంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో మాతా శిశు మరణాల నివారణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులను సకాలంలో ఆస్పత్రులకు తరలించేలా ‘102’ 108’ వాహనాలను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. తక్కువ బరువుగల శిశువులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన పౌష్టికాహారం, ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. మాతా శిశుమరణాలపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ పి.భాస్కరరావు, డీసీహెచ్ఓ ఎన్.నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు. -
గుట్టుచప్పుడుగా గుట్కా విక్రయాలు
● ఒడిశా నుంచి అక్రమంగా దిగుమతి ● ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమార్కులు పార్వతీపురం: ప్రజల ప్రాణాలకు హాని కలిగించే పొగాకు ఉత్పత్తులను ఆహార భద్రత చట్టం కింద 2006లో అప్పటి ప్రభుత్వం నిషేధించింది. అయినా పట్టణాలనుంచి పల్లెల వరకు నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు వ్యాపారులు నిబంధనలను పక్కన పెట్టి పక్క రాష్ట్రం ఒడిశా నుంచి పట్టణాలకు సరఫరా చేసుకుని అక్కడి నుంచి మండలాలకు, పల్లెలకు పంపిణీ చేస్తున్నారు. ఇలా చేతులు మారేకొద్దీ వాటి ధరలు కూడా అమాంతం పెంచి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పక్కనే ఉన్న ఒడిశా నుంచి పార్వతీపురం మీదుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు అక్రమంగా గుట్కా రవాణా చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే గుట్కాను ప్రభుత్వం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ విక్రయాలు యథాతథంగా సాగుతున్నాయి. పార్వతీపురం పట్టణంతో పాటు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో గుట్కా, పాన్పరాగ్, ఖైనీ ప్యాకెట్లను రహస్యంగా విక్రయిస్తూనే ఉన్నారు. ఒడిశా రాష్ట్రంలోని రాయగడ నుంచి గుట్కా, ఖైనీ ప్యాకెట్లు తెస్తున్న ముఠా.. స్థానికంగా కొంతమంది వ్యాపారుల అండదండలతో యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. గుట్కా ప్యాకెట్లు తరలిస్తూ తరచూ పలువురు పట్టుబడుతున్నా..విక్రయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పార్వతీపురం నేడు గుట్కా వ్యాపారానికి అడ్డాగా మారింది చడీచప్పుడు లేకుండా విక్రయాలు పార్వతీపురం పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో కిరాణా షాపులు, ఫ్యాన్సీ షాపులు, బడ్డీ దుకాణాల్లో గుట్కా ప్యాకెట్లు, ఖైనీ ప్యాకెట్లు చడీచప్పుడు లేకుండా కూరగాయల బుట్టలు, బస్తాలు, చిన్న చిన్న సంచులలో భద్రపరుచుకుని విక్రయిస్తున్నారు. పోలీసులు తనిఖీ చేసే సమయంలో కూడా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ముందుగానే పప్పుధాన్యాల బస్తాల్లో, కూరగాయల బుట్టల్లో భద్రపరుస్తున్నారు. గుట్కాలకు అలవాటుగా మారిన వారు అధిక ధరలు పెట్టి వాటిని కొంటూనే ఉన్నారు. దీంతో ప్రజల ఆరోగ్యాలతో అక్రమార్కులు చెలగాటమాడుతున్నారు. అనారోగ్యం బారిన పడుతున్న జనం పార్వతీపురం పట్టణం, మండలంతో పాటు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో సైతం నిషేధిత పొగాకు ఉత్పత్తులను తిని పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎక్కువగా యువకులు ఖైనీ, గుట్కాలను తిని ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మానిక్చంద్, డీలక్స్, మిరాజ్, పాన్పరాగ్, రాజాఖైనీ, ఖైనీ వంటి బ్రాండ్లకు చెందిన గుట్కాలు జోరుగా విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి అక్రమంగా తరలించే బండిళ్లలో తీసుకువచ్చి ఒక్కో ప్యాకెట్ను రూ.15 నుంచి రూ.25వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రాణాంతకమైన వ్యాధులు గుట్కా తింటే నోటి నుంచి జీర్ణవ్యవస్థ వరకు అన్నింటిపైనా ప్రభావం పడుతుంది. దానివల్ల ప్రాణాంతకమైన జబ్బులబారిన పడే ప్రమాదం ఉంది. కేన్సర్, గుండెజబ్బులు, నోటి కేన్సర్, గొంతు కేన్సర్ వంటి భయంకరమైన రోగాలు వస్తాయి. పళ్లు అరిగిపోయి గారపడతాయి. నాలుక రుచి మొగ్గలు నశిస్తాయి. వాటి వల్ల ప్రాణనష్టం కూడా జరిగే ఆస్కారం ఉంది. – డా.యాళ్ల వివేక్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం -
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
జామి: మండలంలోని కొత్త భీమసింగి గ్రామానికి చెందిన యువకుడు గుర్తు తెలియని వాహనం ఢీకొని బుధవారం మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యులు, స్ధానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్త భీమసింగి గ్రామానికి చెందిన పాండ్రంకి వెంకటేష్(35) మంగళవారం సాయంత్రం అత్తవారికి సంబంధించి విజయనగరంలోని జూట్మిల్లు వద్ద గల పాస్ట్ఫుడ్ సెంటర్కు వెళ్లాడు. అక్కడ వారికి సహాయం చేసి తిరిగి మంగళవారం రాత్రి స్వగ్రామానికి 11.45గంటలకు బైక్పై వస్తున్న సమయంలో చిన్నాపురం జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో స్పృహ కోల్పోయి పక్కకు పడిపోయాడు. ఈ విషయాన్ని స్ధానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది వచ్చి మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పద్మనాభం మండలం పోలీసులు కేసు నమోదుచేశారు. భీమిలి సీహెచ్సీలో పోస్ట్మార్టం అనంతరం మృతదేహన్ని స్వగామం కొత్త భీమసింగికి తరలించారు. పావుగంటముందే భార్యకు పోన్ మృత్యువాత పడడానికి పావుగంట ముందే వెంకటేష్ భార్యకు ఫోన్ చేశాడు. ఇంతలోనే భర్త మృతిచెందాడన్న విషయం తెలియడంతో భార్యతో పాటు కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడు వెంకటేష్కు భార్య సూర్యకళ ఇద్దరు కుమార్తెలు గాయత్రి(11),యోగితాశ్రీ(10), తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నారు. తండ్రి నాగరాజు ఇటీవల పక్షవాతం వచ్చి బాధపడుతున్నాడు. -
హైదరాబాద్ క్రికెట్ జట్టు కెప్టెన్గా శాన్వి
● విజయనగరంలో ఆంధ్ర జట్టుతో తలపడనున్న హైదరాబాద్ జట్టుగుమ్మలక్ష్మీపురం: మండలంలోని రెల్ల గ్రామానికి చెందిన పత్తిక శాన్వి బీసీసీఐ ఉమెన్స్ అండర్–15 వన్ డే ట్రోఫీ 2025–26 హైదరాబాద్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఎంపికై ంది. ఆమె సారథ్యంలో హైదరాబాద్ జట్టు విజయనరంలోని విజ్జీ స్టేడియంలో 2026వ జనవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుతో తలపడనుంది. ఈమేరకు రెల్ల గ్రామానికి చెందిన శాన్వి తండ్రి పత్తిక ప్రవీత్ రంజీ ప్లేయర్ కావడంతో హైదరాబాద్లో ఉంటూ..తన కుమార్తె శాన్వి కూడా క్రికెట్లో ప్రతిభ చూపేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. తండ్రి పోత్సాహాన్ని సద్వినియోగం చేసుకున్న శాన్వి ది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఉప్పల్) వేదికగా కోచ్ సాలాం బయాష్ అలియస్ తిలక్ వర్మ ఆధ్వర్యంలో రెండున్నరేళ్లుగా పలు బాలికల క్రికెట్ పోటీల్లో అండర్–15 విభాగంలో దేశ, విదేశాల్లో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో పాల్గొని పతిభకనబరుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెలోని ప్రతిభను గుర్తించిన బీసీసీఐ ఉమెన్స్ సెలక్షన్ కమిటీ చైర్మన్, సెలక్టర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా ఆమెను ఎంపిక చేశారు. ఆమె కెప్టెన్గా ఎంపిక కావడం పట్ల కుటుంబసభ్యులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పోటీల్లో ఉత్తమంగా రాణించాలని ప్రోత్సహించారు. -
ఆలయంలో చోరీ కేసు ఛేదన
● ఇద్దరు నిందితుల అరెస్ట్ ● రూ.9.40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనంపార్వతీపురం రూరల్: సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం ఆవరణలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన భారీ చోరీ మిస్టరీని సీతానగరం పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ప్రమేయమున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి సుమారు రూ. 9.40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో గల ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. సీతానగరం మండలం జోగింపేటకు చెందిన పోలా భాస్కరరావు, హిరమండలానికి చెందిన సవర సూర్యం వృత్తిరీత్యా దొంగలు. గతంలో వారిద్దరూ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సమయంలో ఒకరికొకరు పరిచయమై, బయటకు వెళ్లాక పెద్ద మొత్తంలో సొత్తును అపహరించాలని పథకం రచించారు. కటకటాల నుంచి విడుదలైన తర్వాత తమ పాత బుద్ధిని పోనిచ్చుకోకుండా, నవంబరు 1వ తేదీ రాత్రి లచ్చయ్యపేట ఆలయంలో చొరబడి నగలను దోచుకెళ్లారు. అయితే, తీగ లాగితే డొంక కదిలినట్లు డిసెంబరు 7న బొబ్బిలి పోలీసులు వేరే కేసులో వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా లచ్చయ్యపేట చోరీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిందితుల అంగీకార నివేదిక ఆధారంగా సీతానగరం పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. జోగింపేట గ్రామ శివారులో నిందితులు దాచి ఉంచిన సుమారు 92 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 కేజీల 400 గ్రాముల వెండి వస్తువులను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.10.75 లక్షల విలువైన సొత్తు అపహరణకు గురవగా, రూ.9.40 లక్షల విలువైన వస్తువులను రికవరీ చేశారు. చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్న పార్వతీపురం రూరల్ సీఐ రంగనాథం, ఎస్సై ఎం.రాజేష్ పోలీసు సిబ్బందిని ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
జిల్లాలో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఏనుగుల బారినపడి 13 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఎకరాల్లో రైతులు పంటలను కోల్పోయారు. కుంకీలు తెస్తామని.. ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపుతామని గత ఏడాదంతా పాలకులు హామీలిస్తూనే గడిపేశారు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో అంటున్నారు. ఈ సారైనా ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం. పార్వతీపురం: పీఆర్టీయూ రాష్ట్ర క్యాలెండర్ ను కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి బుధవారం కలెక్టర్ కార్యాలయ చాంబర్లో ఆవిష్కరించా రు. అనంతరం పీఆర్టీయూ నాయకులు కలె క్టర్కు ముందస్తుగా నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాల సాధనకు ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో కృషిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు వి.తవిటినాయు డు, కె.విజయ్, ఎ.సూర్యనారాయణ, టి.తాతబాబు, జి.శశికుమార్, రామినాయుడు పాల్గొన్నారు. పాలకొండ: మండలంలోని నాగావళి నదితీరంలో నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపులపై బుధవా రం తెల్లారుజామున అధికారులు దాడులు నిర్వహించారు. సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్, డీఎస్పీ ఎం.రాంబాబు తొలుత అంపిలి గ్రా మం వద్ద ఉన్న ఇసుక ర్యాంపును తనిఖీ చేశా రు. నాటుబళ్లతో ఇసుక తరలిస్తున్న వారితో మాట్లాడారు. అనంతరం నదీ తీరంలో తనిఖీలు చేపట్టారు. మండలంలో అట్టలి సమీపంలో అక్రమంగా కంకర తరలిస్తున్న రెండు లారీలను గుర్తించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నదీతీర గ్రామాల్లో ఉన్న ఇసుక ర్యాంపులపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి వేంకటేశ్వర స్వామి హుండీల ఆదాయం రూ. 9,45,439 వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. దీనిలో కోదండ రామాలయం నుంచి రూ.23,229 సమకూరినట్లు వివరించారు. దేవదాయశాఖ పాలకొండ డివిజన్ సీఐ ఎస్.రామారావు పర్యవేక్షణలో బుధవారం హుండీల ఆదాయం లెక్కించామని చెప్పారు. 2025 అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలు లెక్కించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు, అర్చకుడు అప్పలాచార్యులు, టీటీడీఎస్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: కాలగమనం గిర్రున తిరిగింది.. మరో ఏడాదిని తనలో కలిపేసుకొంది. మదిలో జ్ఞాపకాల దొంతరలను పదిలపరుచుకుంటూ 2025 కనుమరుగైంది. క్యాలెండర్లో చివరిపేజీ చిరిగిపోయింది. కొంగొత్త ఆకాంక్షలు.. కోటి ఆశలతో మరో నవ వసంతం మన ముందుకొచ్చింది. అలుపెరగని బా టసారిలా! గతమిచ్చిన విజయాలు సోపానాలుగా .. వైఫల్యాలు గుణపాఠాలుగా స్వీకరిద్దాం.. భవిత కు బంగారు బాటలు పరుస్తూ, లక్ష్యం దిశగా అడుగులు వేద్దాం.. నూతన సంవత్సరం 2026ను సరి కొత్తగా ప్రారంభిద్దాం... ఆనందంగా, సగర్వంగా!! గతమిచ్చిన విజయాలు అక్కడితో ఆగిపోకూడదు. కొత్త సంవత్సరంలోనూ కొనసాగాలి. పదో తరగతి పరీక్షల్లో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ఒక సంచలనం. వరుసగా మూడేళ్లు ప్రథమ స్థానంలో నిలిచింది. మన ప్రభుత్వ బడుల పిల్లలు భళా అనిపించుకున్నారు. అదే ఒరవడి కొనసాగించాలి. అంతకుమించిన ప్రణాళికలతో ముందుకు సాగాలి. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 187 ఉన్నాయి. పదో తరగతి విద్యార్థులు 9,149 మంది పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. 36 ప్రైవేట్పాఠశాలల్లో 1,700 మంది విద్యార్థులున్నారు. మరోసారి వీరంతాజయకేతనం ఎగురవేయాలి. విజయీభవ! కలెక్టర్గా డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి.. జిల్లాలో వినూ త్న ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఆయన చేపట్టిన ‘ముస్తాబు’, ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా వీటిని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కురుపాం పచ్చకామెర్ల ఘటనలో వందలాదిమంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. జిల్లాలోని పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. పిట్టల్లా రాలిపోతున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు, క్రమశిక్షణ అలవాటు చేసేందుకు ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ చెబుతున్నారు. దీన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తూ.. పిల్లలు సంపూర్ణ ఆరోగ్యం సాధించేలా.. జ్వరాలు, మరణా లు తగ్గేలా కార్యాచరణ రూపొందించి అమలు చేయాల్సి ఉంది. పౌష్టికాహార లోపాన్ని నివారించాలి. పాఠశాలలు, వసతిగృహాల్లో మెనూను సక్రమంగా అందించాలి. ఏళ్లు గడుస్తున్నా గిరిజనుల తలరాత మారడం లేదు. డోలీల మోతలు ఆగడం లేదు. అనారోగ్య సమస్య వచ్చినా, అత్యవసర పరిస్థితి ఎదురైనా డోలీల ద్వారానే కొండకోనలు దిగాలి. నదులు, వాగులు దాటాలి. మార్గమధ్యంలోనే ప్రసవాలు.. సకాలంలో వైద్యం అందక ఆగిపోయిన ప్రాణాలెన్నో. జిల్లాలోని 15 మండలాల్లోనూ పీహెచ్సీల్లో వైద్యం పడకేసింది. జ్వరాలు, ఇతర రోగాలతో సర్కారు వైద్యశాలలు కిటకిటలాడుతున్నాయి. సరైన వైద్యసదుపాయాలు పేదలకు అందడం లేదు. జిల్లా ఆస్పత్రి నుంచి రిఫరల్స్ పెరుగుతున్నాయి. మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరం, విశాఖ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పార్వతీపురం, సీతంపేటల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం ప్రారంభమయ్యాయి. దాదాపు 80 శాతానికిపైగా పనులు పూర్తయిన తర్వాత.. ప్రభుత్వం మారడంతో అవి కాస్త పడకేశాయి. ప్రభుత్వ వైద్యకళాశాల పూర్తిగా అటకెక్కింది. పీపీపీ విధానమంటూ చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లింది. దీంతో పేదలకు నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది. కొత్త సంవత్సరంలోనైనా ఈ పరిస్థితి మారాలి. వైద్యం ప్రజల చేరువ కావాలి. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు అనేకం. వాటి బాగోగులను గతేడాదంతా పట్టించుకున్న దాఖ లాలు లేవు. తోటపల్లి.. నిర్వహణ లేక, శివారు భూములకు నీరివ్వలేకపోతోంది. తోటపల్లి ఎడమ ప్రధాన కాలువలకు 2008లో ఏర్పాటు చేసిన షట్టర్ల నిర్వహణను గాలికొదిలేశారు. కాలువ సామర్థ్యం 414 క్యూసెక్కులు. పట్టర్లు పాడవడంతో నీరు వృథాగా పోతోంది. జంఝావతి జంఝాటం అలానే ఉంది. ఒడిశాతో చర్చలు జరిపి, పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల ఇక్కడే ఈతకు దిగి, ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడిగెడ్డ నుంచి వట్టిగెడ్డ అనుసంధానం పనులు ముందుకు కదలలేదు. ఇది పూర్తయితే సుమారు 600 ఎకరాలకు నీరందుతుంది. మిగులు జలాలు వట్టిగెడ్డకు చేరుతాయి. కురుపాం మండలం గుమ్మిడిగెడ్డ జలాశయం ద్వారా 3,100 ఎకరాలకు సాగునీందించాల్సి ఉంది. మరమ్మతులు జరగకపోవడంతో ప్రస్తుతం 1,500 ఎకరాలకే అందుతోంది. వెంగళరాయ సాగర్, వట్టిగెడ్డ, పెద్దగెడ్డ, పెదంకాలం ఆనకట్ట ఆధునికీకరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉన్నచోట వంతెనల నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. వరదల సమయంలో ఆవల ఉన్న గ్రామాలకు బాహ్య ప్రపంచాలతో సంబంధాలు తెగిపోతున్నాయి. సాధారణ రోజుల్లోనూ పడవ ప్రయాణాలే దిక్కవుతున్నాయి. పాచిపెంట, కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం, సీతంపేట, భామిని, సాలూరు, సీతానగరం ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రవాహానికి బలైన ప్రాణాలు అనేకం ఉన్నాయి. పూర్ణపాడు–లాభేసు వంతెనకు చంద్రబాబు ఇచ్చిన హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గుంతలు లేని రహదారులంటూ గతేడాది మొదట్లో హడావిడి చేశారు. కొద్దిరోజులకే అవన్నీ రాళ్లు తేలాయి. జిల్లాలో ఏ మూల చూసినా రహ‘దారిద్య్రం’ కనిపిస్తోంది. ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించాలి. జిల్లాలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కనీస మౌలిక సదుపాయాలు అందడం లేదు. పట్టణాలు, పల్లెలన్న తేడా లేకుండా ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. దాదాపు ఎనిమిది మండలాల్లో ఉన్న గిరిజనుల బాగోగులను పట్టించుకునే వారే కరవయ్యారు. గ్రామాలు అధ్వానంగా కనిపిస్తున్నాయి. తాగునీరు కూడా అందని పరిస్థితి నెలకొంది. గత వైఫల్యాలను మరిచిపోయి.. నూతన వసంతంలోనైనా కొత్తగా మొదలు పెట్టాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అన్నం పెట్టే రైతు బాగుంటేనే మనం బాగుంటాం. జిల్లాలో 3.34 లక్షల ఎకకరాల్లో సాగు భూమి ఉంది. ఇందులో 2.33 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను పండిస్తున్నారు. గత ఏడాదంతా అన్నదాత తీవ్ర క్షోభను ఎదుర్కొన్నాడు. ఖరీఫ్ సీజన్లో సకాలంలో ఎరువులు, విత్తనాలు, యూరియా అందక అవస్థలు పడ్డాడు. మధ్యలో అకాల వర్షాలు, తుపాన్లు ముంచాయి. చివర్లో వచ్చిన మోంథా తుపాను కారణంగా 732 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. పరిహారం ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదు. పంట నష్టంలో నిబంధనలు శరాఘాతంగా మారాయి. అన్నదాత సుఖీభవ నిధులు పూర్తిస్థాయిలో అందలేదు. దీంతో పెట్టుబడికి నానాపాట్లు పడాల్సి వచ్చింది. రెక్కల కష్టంతో సేద్యం చేసినా.. చివరికి వచ్చేసరికి ధాన్యం విక్రయించుకోవడంలోనూ దగా పడుతున్నాడు. మిల్లర్ల దోపిడీకి బలవుతున్నాడు. మద్దతు ధర అందడం లేదు. రబీ సీజన్ మొదలైంది. అన్నదాత కష్టాలు యథావిధిగా కనిపిస్తున్నాయి. 2026లోనైనా రైతు కష్టం పోవాలి. ఆ విధంగా అధికార యంత్రాంగం ఆలోచన చేయాలి. -
గంజాయి సాగు నిర్మూలన, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన
విజయనగరం క్రైమ్: విశాఖ రేంజ్ పరిధిలో ఉన్న ఐదు జిల్లాల్లో గంజాయి సాగును సమూలంగా నిర్మూలించామని ప్రత్యామ్నాయం కోసం ఉపాధి కల్పిస్తున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఏడాదిలో గంజాయి సాగుపై తీసుకున్న చర్యలు, ఉపాధి కల్పనపై డీఐజీ వివరాలు వెల్లడించారు. గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన, డ్రగ్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా చేపట్టిన సమగ్ర చర్యలు 2025 లో గణనీయమైన ఫలితాలను సాధించాయన్నారు.గంజాయి సాగు జరుగుతున్న ప్రాంతాలలో కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తున్నామన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల పంపిణీ కార్యక్రమం కింద 29,979 మంది రైతులను 29,839.5 ఎకరాల్లో సాగుచేయగా, 35,011.5 ఎకరాల్లో 34,012 మంది రైతులు వాస్తవంగా పంటలు సాగు చేశారన్నారు. ఈ ఏడాదిలో 0.10 ఎకరాల గంజాయి పంటను పూర్తిగా నాశనం చేశామని, ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి రవాణా నివారణతో పాటు హార్టికల్చర్, ఆక్వా కల్చర్, పౌల్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో విశాఖపట్నం/అనకాపల్లి జిల్లాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అత్యాధునిక 4 డ్రోన్లతో 327 గ్రామాల్లో 14,870 ఎకరాలను సర్వే చేయగా, 138 గ్రామాల్లో గంజాయి సాగు జరుగుతోందని తెలిసిందన్నారు. 24 సీసీ కెమెరాలతో కూడిన చెక్ పోస్టులు, 362 డైనమిక్ తనిఖీ కేంద్రాల ద్వారా భారీగా గంజాయి, హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని వందలాది కేసుల్లో నిందితులను అరెస్టు చేశామన్నారు. గంజాయి నిల్వలను గుర్తించేందుకు 9 ప్రత్యేక డాగ్ స్క్వాడ్లను మోహరించి ప్రతి జిల్లాలో డి అడిక్షన్ సెంటర్లు పెట్టి డ్రోన్ ఆధారిత ఎన్డీపీఎస్ బీట్లతో హాట్స్పాట్లను గుర్తించి, వినియోగదారులపై కేసులు నమోదు చేయడంతో పాటు 244 మందిని వ్యసన విముక్తి కేంద్రాలకు పంపించామని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో డీడీసీ ద్వారా 67,000 కిలోల గంజాయి, 77.267 కిలోల హషీష్ ఆయిల్ ధ్వంసం చేసి మొత్తం 509 కేసులు నమోదు చేసి 1,390 మందిని అరెస్టు చేశామని, 28,423 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 341 వాహనాలను సీజ్ చేశామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి వివరించారు. విశాఖ రేంజ్ పోలీస్ డీఐజీ గోపీనాథ్ జెట్టి -
చంద్రబాబు పాలన కష్టాలమయం
విజయనగరం: ఎన్నికలకు ముందు అధికారమే ధ్యేయంగా హమీలు గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలన ప్రజలకు కష్టాలమయంగా మారిందని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం రెండేళ్లు పూర్తికాక ముందే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని తెలిపారు. ఇందుకు 2025 సంవత్సరంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రజల పడిన ఇబ్బందులు, వ్యక్తమైన వ్యతిరేకతలే తార్కాణంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధ్యత గల ప్రతిపక్షంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని వివరించారు. సంక్షోభంలో వ్యవసాయ రంగం చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతాంగానికి కష్టలు తప్పవన్న నానుడి మరోసారి నిజమవుతోందని మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రైతాంగానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధరలు దక్కకపోగా.. సాగు కోసం చేస్తామన్న అన్నదాత సుఖీభవ సాయం అందకుండా పోతుందన్నారు. బస్తా యూరియా కోసం రైతులు రోజులు తరబడి నిరీక్షించటంతో పాటు లాఠీ దెబ్బలు తినటం ప్రభుత్వ పాలనకు అద్దం పడుతుందని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీని నిలిపివేసి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేద ప్రజలకు సైతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే సత్సంకల్పంతో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఆ పథకానికి పేర్లు మార్చుకోవటమే కాకుండా చివరికి సేవలు నిలిపివేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని దుమ్మెత్తిపోశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకు వైద్యం, వైద్య విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మిస్తే వాటిని ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. క్షీణించిన శాంతిభద్రతలు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని తెలిపారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛందంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించుకుంటే ఓర్వలేని కూటమి నేతలు వారిపై కక్షపూరితంగా కేసులు పెట్టడం తగదన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సైతం శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయన్నారు. హత్యలు, అరాచకాలు, దాడులు, గంజాయి అక్రమరవాణా రోజురోజుకు పెచ్చుమీరుతుందన్నారు. ఎన్నికలకు ముందు రూ.1 కరెంట్ ఛార్జీ పెంచమని చెప్పి వివిధ రూపాల్లో ప్రజల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. పారిశ్రామిక ప్రగతి జాడ లేదని, ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నా పట్టించుకున్న నాధుడు లేడన్నారు. వైఎస్సార్సీపీలో ప్రారంభమైన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మాణ పనులను అంతా తామే చేస్తున్నామంటూ ఫొటోలకు ఫోజులివ్వటం సిగ్గుచేటన్నారు. సూపర్ సిక్స్ లేదు.. కొత్తగా ఒక్క పింఛను మంజూరు లేదు చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన సూపర్ సిక్స్ హమీలపై మజ్జి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూపర్ సిక్స్ లేదు... రెండేళ్లలో ఒక్క కొత్త పింఛను మంజూరు చేయలేదని చెప్పారు. 2019 సంవత్సరంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల పింఛన్లు ఉంటే 2024 ఎన్నికల సమయానికి 66.34 లక్షల మందికి ఆ సంఖ్య పెరిగిందన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా సుమారు 5 లక్షలకు పైగా పింఛన్లు నిలిపివేశారన్నారు. కొత్తగా 60 సంవత్సరాలు నిండిన వారితో పాటు వితంతువులకు, అనారోగ్యాల బారిన పడిన వారికి దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న హమీని పక్కన పెట్టి, పీ–4 నెల రోజుల పాటు హడావుడి చేసి గుర్తించిన బంగారు కుటుంబాలకు ఏం లబ్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సచివాలయ వ్యవస్థలను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తుండటంతో ప్రజలకు సేవలందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ, రానున్న ఏడాదిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ముందుగా ప్రతీ ఒక్కరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2025వ సంవత్సరంలో వైఎస్సార్సీపీని ముందుకు నడిపించడంలో సహకరించిన పార్టీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు, సోషల్ మీడియా సైనికులకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో జిల్లా పార్టీ కార్యదర్శులు కెవి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, ఇప్పిలి అనంత్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, జిల్లా అధికార ప్రతినిధి కనకల రఘురామారావు తదితరులు పాల్గొన్నారు. రెండేళ్లలో ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం సంక్షోభంలో వ్యవసాయ రంగం ఆరోగ్యశ్రీ నిలిపివేతతో ప్రజారోగ్యానికి భద్రత కరువు శాంతి భద్రతల పరిరక్షణలో వైఫల్యం సూపర్ సిక్స్ హామీల అమల్లో ప్రజలను మోసం చేసిన వైనం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు -
ఐదు రోజుల బ్యాంకింగ్ విధులు అమలు చేయాలి
● ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద యూఎఫ్బీయూ ధర్నావిజయనగరం అర్బన్: బ్యాంకింగ్ రంగంలో ఐదురోజుల విధుల విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ కార్యాయలం ఎదుట బ్యాంకు ఉద్యోగులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో విజయనగరం పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని వివిధ బ్యాంకు శాఖలకు చెందిన ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా బ్యాంకు ఎంప్లాయీస్ కో–ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు బీవీప్రసాద్ మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయడం న్యాయమైన డిమాండ్ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా కో–ఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ మురళీశ్రీనివాస్, స్టేట్ బ్యాంక్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రమేష్, రాజశేఖర్ గుప్తా, కమిటీ సభ్యులు నాగభూషణరావు, రవికుమార్, శ్రావణకుమార్, మురళి, భానోజీరావు, హరీష్, మనోజ్ వర్మ, హర్ష, శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుడి అవతారమెత్తిన ఏపీఓ
సీతంపేట: ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబు మంగళవారం ఉపాధ్యాయుడి అవతారమెత్తారు. మండలంలోని బుడగరాయి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు గణితంలో కొన్ని సమస్యల సాధన చేశారు. ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల మార్కులు ఏ విధంగా ఒక్కో విద్యార్థికి వచ్చాయో పరిశీలించారు. ఇంకా బాగా చదువుకోవాలన్నారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. పాఠశాల వాతావరణం బాగా ఉండేలా చూసుకోవాలన్నారు. డ్రైనేజీ శుభ్రం చేయించాలన్నారు. అనంతరం మెనూ పరిశీలించారు. రుచికరమైన భోజనం విద్యార్థులకు పెట్టాలన్నారు. ఉపాధ్యాయ సిబ్బందితో మాట్లాడారు. అర్ధరాత్రి దాటితే రోడ్లపైకి రావొద్దు ● మత్తులో బండి తీస్తే కటకటాలే : ఎస్పీ పార్వతీపురం రూరల్: నూతన సంవత్సర వేడుకలు నవ్వుల పూలు పూయించాలే తప్ప.. కన్నీటి గాథలకు తావివ్వకూడదని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రమంలో యువత ఉత్సాహం ఉరకలెత్తి ఉన్మాదంగా మారకూడదని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వేడుకలు జరుపుకోవాలని మంగళవారం విడుల చేసిన ఒక ప్రకటనలో ఆయన కోరారు. డిసెంబరు 31 అర్ధరాత్రి తర్వాత రహదారులపై ఎవరూ సంచరించకూడదని, ఈ నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపనుంది. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించామని, మద్యం మత్తులో స్టీరింగ్ పడితే వాహనాలను అక్కడికక్కడే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. మితిమీరిన వేగం, ప్రమాదకరమైన బైక్ రేసులు, ట్రిపుల్ రైడింగ్ వంటి విన్యాసాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. మైనర్ల చేతికి వాహనాలు ఇస్తే వారి కంటే ఎక్కువగా తల్లిదండ్రులనే బాధ్యులను చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్లు కట్ చేయడం, పెద్ద ధ్వనులతో డీజేలు ఏర్పాటు చేయడం, బాణసంచా కాల్చడం వంటి పనులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయని, ఇటువంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ తెలిపారు. మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే అల్లరి మూకల ఆట కట్టించేందుకు ముఖ్య కూడళ్లలో పోలీసు పికెట్లను, నిరంతర పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. నిర్ణీత సమయం మించి మద్యం విక్రయించే దుకాణాలపై కూడా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ తమ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య నూతన వసంతానికి స్వాగతం పలకాలని, పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. -
కోర్టు తీర్పు బేఖాతరు
మెంటాడ: న్యాయస్థానం ఆదేశాలను సైతం లెక్కచేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా మెంటాడ మండలంలోని పిట్టాడ, వాణిజ గ్రామ వీఆర్వో ఆదిరావు భూమిని మ్యూటేషన్ చేసిన ఘటన మండలంలో కలకలం రేపుతోంది. ఈ వ్యవహరం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వాణిజ గ్రామ రెవెన్యూ పరిధిలో 59/2 సర్వే నంబర్లలో సుమారు నాలుగున్నర ఎకరాల మెట్టభూమిలో వ్యవసాయం చేసుకుంటూ బంటుపల్లి సూర్యనారాయణ పెంటమ్మ దంపతులు నివసించేవారు. వారు లక్కోజి సన్యాసమ్మకు 1996లో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. బంటుపల్లి సూర్యనారాయణ కొన్ని సంవత్సరాల క్రితం మరణించగా గత సంవత్సరం డిసెంబర్లో పెంటమ్మ మరణించింది. ఆ దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఇదే అదునుగా అదే గ్రామంలో నివసిస్తున్న బంటుపల్లి సన్యాసిరావు, వీఆర్వో అదిరావులు కలిసి చనిపోయిన దంపతుల భూమిపై కన్నువేశారు. పెంటమ్మ తన సొంత పెద్దమ్మే అని బంటుపల్లి సన్యాసిరావు చేత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్కు వీఆర్వో ఆదిరావు దరఖాస్తు చేయించాడు. అన్నీ తానై సర్టిఫికెట్ చేయించి పెంటమ్మ భూమిని బంటుపల్లి సన్యాసిరావు పేరున మార్చేశాడు. ఈ వ్యవహారంలో వారిద్దరి మధ్య భారీగా లావాదేవీలు జరిగినట్లు సమాచారం. ఈ మేరకు గ్రామంలో సాక్షి విచారణ చేయగా బంటుపల్లి పెంటమ్మకు సన్యాసిరావు ఎలా వారసుడవుతాడంటూ గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు. ఇదిలా ఉంటే భూమికొన్న లక్కోజి సన్యాసమ్మను ఈ భూమిపైకి వస్తే ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు. మరోదారిలేక సన్యాసమ్మ కోర్టును ఆశ్రయించగా భూహక్కుదారులకు అనుకూలంగా తీర్పునిస్తూ, రికార్డుల్లో మార్పులు చేయవద్దని, యథాతథ స్థితిని కొనసాగించాలని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి రికార్డులు మార్చడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఆర్వో పాత్రపై విమర్శలు ఈ మొత్తం వ్యవహారంలో స్థానిక వీఆర్వో అన్నీ తానై వ్యవహరించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఆదేశాల కంటే తమకే అధికారం అన్నట్లు వ్యవహరిస్తూ, అవతలి పక్షం నుంచి లబ్ధి పొంది రికార్డులను ఆన్లైన్లో మ్యుటేషన్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండానే క్షేత్రస్థాయిలో ఈ మాయాజాలం జరిగినట్లు తెలుస్తోంది. న్యాయస్థానం తీర్పు అమలు కాకపోవడమే కాకుండా, అక్రమంగా మ్యుటేషన్ జరగడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంపై లక్కోజు సన్యాసమ్మ మాట్లాడుతూ కోర్టు ఆర్డర్ కాపీలు చూపించినా అధికారులు పట్టించుకోలేదని వాపోయింది. రికార్డులు ఎలా మారుస్తారని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అక్రమ మ్యుటేషన్పై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వీఆర్వో, ఇతర రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుని తన భూమిని తనకు అప్పగించాలని కోరుతోంది. వివాదాస్పదంగా మ్యుటేషన్ అనర్హులకు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్స్ భూహక్కుదారుల ఫిర్యాదుతో వెలుగులోకి నిర్వాకం చక్రం తిప్పిన మెంటాడ మండల వీఆర్వో -
పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ
తెర్లాం: మండలంలోని లోచర్ల రైతు సేవా కేంద్రం వద్ద పోలీసుల సమక్షంలో రైతులకు యూరియా బస్తాలను వ్యవసాయ సిబ్బంది పంపిణీ చేశారు. మంగళవారం లోచర్ల రైతు సేవా కేంద్రం వద్ద యూరియా పంపిణీ చేయడంతో ఒక్కసారిగా రైతులు అధిక సంఖ్యలో వచ్చి యూరియా కోసం ఎగబడ్డారు. వారిని నియంత్రించడం కష్టమవడంతో వ్యవసాయ సిబ్బంది స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందజేశారు. దీంతో ఎస్సై సాగర్బాబు అక్కడికి సిబ్బందితో చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైతులందరికీ యూరియా ఇస్తారని, అందరూ వరుస క్రమంలో నిలబడాలని సూచించారు. రైతులంతా వరుస క్రమంలో ఉండి యూరియా తీసుకున్నారు. ఎరువుల పంపిణీ పూర్తయినంతవరకు ఎస్సై అక్కడే ఉండి పర్యవేక్షించారు. రైతులకు కావాల్సినంత యూరియా రైతు సేవా కేంద్రంలో నిల్వ ఉందని, యూరియా అవసరంలేని రైతులు కూడా వచ్చి తీసుకువెళ్తుండడంతో సమస్య ఏర్పడుతోందని మండల వ్యవసాయ అధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. గ్రామాల్లోని రైతుల ఆధార్కార్డు, వన్బీ తీసుకుని క్షేత్రస్థాయిలో ఆ రైతు ఏ పంట సాగుచేస్తున్నాడో పరిశీలించిన తరువాత యూరియా పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు. -
మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్లో.. అత్యాధునిక టోమోథెరపీ సేవలు
విశాఖపట్నం: కేన్సర్ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, హాస్పిటల్ ఎం.డి డాక్టర్ వున్నా మురళీకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేన్సర్ రోగులకు ఉపశమనం కలిగించే విధంగా మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్ ఏపీలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతికతను అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా మెరుగైన వైద్యసేవలు కేన్సర్ రోగులకు అందించడం సాధ్యమవుతుందన్నారు. హాస్పిటల్ ఎం.డి మురళీకృష్ణ మాట్లాడుతూ రూ.32 కోట్లు విలువైన ఈ యూనిట్ కొనుగోలుతో మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్ దేశంలో లెవెల్ 3 కేటగిరి హాస్పిటల్స్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా కేన్సర్ ట్యూమర్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వైభవంగా ముక్కోటి ఏకాదశి
గరుగుబిల్లి: ముక్కోటి ఏకాదశి సందర్భంగా పవిత్ర నాగావళి నదీ తీరంలో వెలసిన తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి వారిని, కోదండరామ స్వామివారిని దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి ఉదయం సుప్రభాతసేవ, నిత్యారాధన, విశేష హోమములు, పాశుర విన్నపం, మంగళాశాసనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం హన్మత్ వాహనంపై సీతారామ లక్ష్మణస్వామి వారి ఉత్సవమూర్తులకు శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి శ్రీకోదండ రామాలయం వరకు ఉత్తర ద్వారం గుండా తిరువీధి మహోత్సవాన్ని నిర్వహించి, హన్మత్ వాహనంపై వున్న స్వామివారి దర్శనం భక్తులకు కల్పించారు. అనంతరం కోదండరామస్వామి ఆలయంలో ఉత్తరద్వారం గుండా భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. ఆలయ అర్చకులు అప్పలాచార్యులు ఆధ్వర్యంలో స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు, ఈవో శ్రీనివాస్, సిబ్బంది, గ్రామ పెద్దలు, పలువురు భక్తులు, టీటీడీ ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. తిరువీధి కార్యక్రమంలో మహిళా భక్తులు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. వైద్య శిబిరం నిర్వహించారు. ● స్వామివారిని దర్శించుకున్న భక్తులు ● కిటకిటలాడిన దేవాలయ ప్రాంగణం -
సమావేశమైన పోలీస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ
● త్వరలో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి కొత్త భవనం ● సిబ్బంది ఆర్థిక అవసరాలను తీర్చేందుకే సొసైటీవిజయనగరం క్రైమ్: పోలీస్ సిబ్బంది ఆర్థిక అవసరాలను తీర్చేందుకే జిల్లా పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పని చేయాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీసు ఉద్యోగుల కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారి ఆర్థిక అవసరాలను తీర్చేందుకుకే జిల్లా పోలీసు ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ ఏర్పడిందని ఎస్పీ అన్నారు. తక్కువ వడ్డీతో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణాలను పొందే పోలీసు ఉద్యోగులు తమ పిల్లల చదువులు, వివాహాలు, గృహ నిర్మాణాలు, రిపేర్లు, అత్యవసర వైద్య ఖర్చులు ఇతర ఆర్థిక అవసరాలను తీర్చుకోగలుగుతున్నారని చెప్పారు. ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా 202425 ఏడాదిలో వచ్చిన ఆదాయ, వ్యయాలను, పోలీసు సంక్షేమానికి తీసుకున్న చర్యలను సొసైటీ సభ్యులకు వివరించామని తెలిపారు. పోలీసు ఉద్యోగులు తీసుకున్న సభ్యత్వం, సర్వీసు ఆధారంగా ఇప్పటికే రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలను వ్యక్తిగత రుణాలుగా, ఆడపిల్లల పెళ్లి నిమిత్తం రూ.8 లక్షలు అందజేస్తున్నామన్నారు. సొసైటీ సభ్యుల పిల్లలకు పదో తరగతి, ఇంటర్మీడియట్లో 90 % కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి మెరిట్ స్కాలర్షిప్లను కూడా అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మిగతా జిల్లాలకు ఆదర్శంగా ఉందన్నారు. త్వరలో జిల్లా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి కొత్త భవనం నిర్మాణానికి చర్యలు చేపడతామని తెలిపారు. సమావేశంలో సొసైటీని మరింత అభివృద్ధి, ప్రగతి పథం వైపు నడిపించేందుకు సభ్యుల నుంచి సలహాలను, సూచనలను స్వీకరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఎస్.విద్యాసాగర్, ఆర్ఐలు ఎన్.గోపాల నాయుడు, రమేష్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, కోఆపరేటివ్ సెక్రటరీ ఎం.నీలకంఠం నాయుడు, డైరెక్టర్లు, కోఆపరేటివ్ సభ్యులు, పోలీసు కార్యాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. -
సర్వజన ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కె.కిరణ్కుమార్ అనే వ్యక్తి దీర్ఘకాలంగా (క్రానిక్ కాల్సిఫిక్ప్యాంక్రియాటైటిస్) అనే వ్యాధితో బాధపడుతూ తీవ్రమైన పొట్టనొప్పితో కొద్ది రోజుల క్రితం సర్వజన ఆస్పత్రిలో చేరాడు. కిరణ్కుమార్కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ప్యాంక్రియాస్ గ్రంధిలో రాయిలా ఏర్పడిన కణితి ఉన్నట్లు గుర్తించారు. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. శస్త్రచికిత్సలో భాగంగా ప్యాంక్రియాస్ను తెరిచి అందులో ఉన్న సుమారు 6 గీ6 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న రాయిని జనరల్ సర్జరీ, మత్తు విభాగం వైద్యులు సమన్వయంతో విజవంతంగా తొలగించారు. అనంతరం ప్యాంక్రియాస్ను చిన్న పేగుతో అనుసంధానం చేసే (ప్యాంక్రియాటికో–జేజునోస్టమీ) అతి క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స అనంతరం రోగి పూర్తిగా పొట్ట నొప్పి నుంచి ఉపశమనం పొందాడు. కిరణ్కుమార్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. శస్త్రచికిత్సనిర్వహించిన జనరల్ సర్జరీ హెచ్ఓడీ పీఏ.రమణి, డాక్టర్ చైతన్య బాబు, డాక్టర్ వెంకటనాయుడు, డాక్టర్ ఎన్.జగదీష్, డాక్టర్ ధర్మకిశోర్, డాక్టర్ శశిధర్, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ హేమసుందర్, డాక్టర్ రామేశ్వరి ప్రభు డాక్టర్ రాకేష్, డాక్టర్ అరవిందసుప్రజలను సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అభినందించారు. -
పెన్షన్ డబ్బులు మాయంపై ఫిర్యాదు
సంతకవిటి: మండలంలోని మండాకురిటి సచివాలయంలో పెన్షన్ అమౌంట్ నుంచి రూ.50 వేలు మాయం కావడంపై కార్యదర్శి సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం పెన్షన్లు పంచేందుకు సోమవారం సిరిపురం యూనియన్ బ్యాంక్ నుంచి విత్ డ్రా చేసిన రూ.33 లక్షల 45 వేల 500ను విలేజ్ సర్వేయర్ సచివాలయానికి తీసుకువచ్చి కార్యదర్శికి అందించారు. అనంతరం క్లస్టర్ వైజ్ పంచగా అందులో రూ.50 వేలు మాయమైయినట్లు గుర్తించారు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. బెంగళూరులో యువకుడి మృతిగుర్ల: మండలంలోని గొలగాం గ్రామానికి చెందిన కంది సాయిరాం(26) బెంగళూరులో మృతి చెందినట్లు గ్రామస్తులు మంగళవారం తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు సాయిరాం బెంగళూరులోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వస్తుండగా బెంగళూరులో జరిగిన రైల్వే ప్రమాదంలో మృతి చెందినట్లు రైల్వే పోలీసులు సమాచారం అందించారని చెప్పారు. -
రిపబ్లిక్ డే పరేడ్కు 8మంది విద్యార్థుల ఎంపిక
బాడంగి: రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన విజవాడలో జరగనున్న సీఎం పరేడ్కు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి వివిధ అంబేడ్కర్ గురుకుల బాలుర పాఠశాలలకు చెందిన 8 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ కేవీ రమణచెప్పారు. ఈ మేరకు స్థానిక అంబేడ్కర్ బాలుర గురుకులంలో జిల్లాతరఫున విద్యార్థులను మంగళవారం ఎంపికచేశామన్నారు. ఉమ్మడి జిల్లాలోని కొప్పెర్ల, బాడంగి, పార్వతీపురం, సాలూరు, పాలకొండ గురుకుల పాఠశాలలనుంచి 15మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో 8మందిని ఎంపికచేశామని తెలిపారు. ఎంపికచేసిన విద్యార్థులు వచ్చేనెల 3వ తేదీన ఏలూరు జిల్లా పెదవేమలిలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎంపికలో పాల్గొననున్నట్లు చెప్పారు. చెరుకు పంట దగ్ధంబలిజిపేట: మండలంలోని పి.చాకరాపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న చెరుకు పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. మురగడాం గ్రామానికి చెందిన కౌలు రైతు ఎం.వెంకటినాయుడు పంట దగ్ధమైంది. రెవెన్యూ లెక్కల ప్రకారం ఈ ప్రమాదంలో 3.95ఎకరాల విస్తీర్ణంలో పండిన చెరుకుపంట సుమారు 200టన్నులు ఉంటుందని అంచనా. దీనిప్రకారం రైతుకు సుమారు రూ.5లక్షల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. కౌలు రైతు వెంకటినాయుడు పార్వతీపురానికి చెందిన డి.దాలినాయుడు వద్ద భూమి కౌలుకు తీసుకుని పంట పండిస్తున్నాడని కౌలు రైతుకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం కౌలురైతును ఆదుకోవాలని కోరుతున్నారు. రెచ్చిపోతున్న బ్యాటరీ దొంగలురామభద్రపురం: మండలంలో వాహనాల బ్యాటరీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల రోజూ ఏదో గ్రామంలో వాహనాల బ్యాటరీలు చోరీ జరిగిందంటూ సంబంధిత వాహనచోదకులు లబోదిబోమం టున్నారు. రెండు రోజుల క్రితం బూశాయవలసలో ట్రాక్టర్, ఆటోలకు చెందిన బ్యాటరీలు చోరీచేయగా సోమవారం రాత్రి స్థానిక సాయినగర్లోని గుడ్ల కాంట్రాక్టర్ బండారు నాగరాజుకు చెందిన రెండు వ్యాన్లలోని రెండు బ్యాటరీలు దొంగలు చోరీ చేశారు.గతంలో కూడా ఒక వ్యాన్లో ఉన్న గుడ్లు చిదిమేసి, వ్యాన్కు చెందిన బ్యాటరీని దొంగలు ఎత్తికెళ్లిపోయారని గుడ్ల కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. తాను పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు నాగరాజు తెలిపాడు. కొద్ది రోజులుగా వరుస సంఘటనలు జరుగుతున్నాయని, పోలీసులు నైట్ బీట్ సమయంలో నిఘాపెట్టాలని బాధితులు కోరుతున్నారు. సీతానగరం: మండలంలోని గెడ్డలుప్పి పోస్టాఫీస్లో ఆర్డీ రూపంలో డిపాజిట్ చేసిన సొమ్మును చెల్లించి తమకు న్యాయం చేయాలని బాధితులు పోస్టాఫీస్ ఎదుట మంగళవారం ఆదోళన వ్యక్తం చేశారు. తామంతా వ్యవసాయ కూలిపనులు చేసుకుని వచ్చిన ఆదాయంలో కొంత సొమ్మును గెడ్డలుప్పి పోస్టాఫీస్లో ఆర్డీ రూపంలో 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి నెలకు రూ. 500 నుంచి రూ.1000 వరకూ కడుతున్నామన్నారు. దాచుకున్న సొమ్మును సంబంధిత పోస్టుమాస్టరు పోస్టాఫీస్లో కట్టకుండా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఎక్కువమంది ఆర్డీ డిపాజిట్ దారుల సొమ్ము కట్టకుండా దుర్వినియోగం చేశారని గతంలో పోస్టాఫీస్ వద్ద ఆందోళన చేసిన వారికి నగదు వాపసు చేశారని తమకు మాత్రం కట్టిన ఆర్డీ సొమ్ము ఇవ్వక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కొందరికి చెల్లింపులు చేసినా తమకు న్యాయం చేయాలని కొత్తవలస గ్రామానికి చెందిన నారికేళ్ల అప్పలనర్సమ్మ, గేదెల సోములమ్మ, యాండ్రపు చినతల్లి, బర్ల గంగమ్మ, నాగళ్ల లక్ష్మి, ముచ్చిపెదగౌరమ్మ, యాండ్రపు తిరుపతమ్మ కోరుతున్నారు. బాధితురాలు అప్పలనర్సమ్మ మాట్లాడుతూ తమసొమ్ముకు భధ్రత ఉంటుందని గ్రామ పెద్దలు చెప్పడంతో తామంతా వ్యయప్రయాసలకోర్చి అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు కొత్తవలస నుంచి గెడ్డలుప్పి పోస్టాఫీస్కు వెళ్లి కడితే అక్కడ కూడా భద్రత లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని తమకు న్యాయం చేయాలని కోరారు. గెడ్డలుప్పి పోస్టు మాస్టరు వద్ద డిపాజిట్ల విషయమై ప్రస్తావించగా ఆర్డీ కట్టిన ఖాతాదారులు ఽఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకోవాలని కోరామన్నారు. -
ప్రాణాలూ వేలాడాల్సిందేనా..!
● ఆటోల్లో కుక్కి.. బస్సుల్లో తొక్కి.. ● వెక్కిరిస్తున్న నిబంధనలు పార్వతీపురం రూరల్: బడికి వెళ్లే బాట.. మృత్యువుతో ఆటగా మారుతోంది. విద్యార్థుల ప్రయాణం నిత్యం కత్తిమీద సాములా సాగుతోంది. జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన ప్రాంతాల్లో విద్యా సంస్థల వేళల్లో కనిపిస్తున్న దృశ్యాలు వాహనదారులను, బాటసారులను కలచి వేస్తున్నాయి. నిబంధనలు గాలికి.. పసిప్రాణాలు వేలాడుతూ.. ఆటోల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను కుక్కుతున్నారు. వెనుక సీటుపై ప్రమాదకరంగా కూర్చోబెట్టడంతో ప్రమాదవశాత్తు ఆటో వెనుక భాగంలో విద్యార్థులు కూర్చున్న ఆ డోర్కు ఉన్న చైన్ తెగితే అంతే ఒక్కసారిగా చిన్నారులు బలంగా రోడ్డు ఢీకొని వెనుక వస్తున్న వాహనాలకు బలికాక తప్పని దుస్థితి. అలాగే ఆర్టీసీ బస్సుల్లో కొందరు విద్యార్థులు బయటకు వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. కిక్కిరిసిన రద్దీతో ప్రవేశ ద్వారం వద్ద ఫుట్బోర్డుపై నిలబడి, గాలిలో వేలాడుతూ విద్యార్థులు చేసే ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరు? అని తోటి వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలపైనే దృష్టి.. వీటిపై ఏది నిఘా? పోలీసు, రవాణా శాఖాధికారులు కేవలం ద్విచక్ర వాహనాల తనిఖీలపైనే దృష్టి సారిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెల్మెట్లు, ఫైన్ బకాయిలు, పత్రాల వేటలో పడి.. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాల వాహనాలు, ఓవర్ లోడ్ ఆటోలను పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, పసిప్రాణాల ప్రయాణానికి భద్రత కల్పించాలని కోరుతున్నారు. -
మత్య్సకార సొసైటీ ఎన్నికలకు రాజకీయ రంగు
విజయనగరం ఫోర్ట్: చేపల వేట సాగించే మత్య్సకారుల సమస్యలు, హక్కుల కోసం ఏర్పాటైన జిల్లా మత్య్సకార సహకారం సంఘం ఎన్నికలకు కూడా టీడీపీ నేతలు రాజకీయ రంగు పులిమారు. 100 లోపు సభ్యులు ఉన్న సంఘం ఎన్నికకు కోట్లాది రుపాయలు ఖర్చుచేశారు. అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు, నామినేటేడ్ పదవుల్లో ఉన్న నేతలు, టీడీపీ నాయకులు మూడు, నాలుగు రోజుల పాటు క్యాంప్ రాజకీయాలు నడిపారు. సభ్యులను క్యాంపులకు తరలించే బాధ్యతను సైతం టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మత్య్సకార సహకార సంఘం ఎన్నికలు జరగాయని పలువురు మత్య్సకారులు ఆరోపిస్తున్నారు. మత్య్సకార సహకార సంఘం ఎన్నికల్లో ఎప్పుడూ రాజకీయ జోక్యం ఉండేదికాదని చెబుతున్నారు. ఎన్నికల కేంద్రం వద్ద మంత్రి అనుచరులు పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న చేప పిల్లల పెంపకం కేంద్రంలో మంగళవారం జిల్లా మత్య్సకార సహకార సంఘానికి ఎన్నిక నిర్వహించారు. ఈ కేంద్రం వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అనుచరులు అధిక సంఖ్యలో చేరుకుని హడావిడి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే మకాం వేశారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు డైరెక్టర్ల ఎన్నిక, ఆ తర్వాత అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. చివరకు ఎన్నికల్లో మత్స్యకార సొసైటీ అధ్యక్షుడిగా టీడీపీ సానుభూతి పరుడు సింగిడి పాపారావు, ఉపాధ్యక్షుడిగా దాసరి లక్ష్మణలు ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. అధికార దర్పంతో గెలిచారు అధికార దర్పంతో మత్స్యకార సంఘం ఎన్నికల్లో గెలిచారని జిల్లా మత్య్సకార సంఘం మాజీ అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న ఆరోపించారు. చేపపిల్లల పెంపకం కేంద్రం వద్ద మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వృత్తిపరమైన ఎన్నికలకు కూడ టీడీపీ నేతలు రాజకీయ రంగు పులిమారని ధ్వజమెత్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మూడు రోజుల పాటు పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సభ్యులను తరలించి క్యాంప్ రాజకీయాలు నడిపారన్నారు. ఓటమి భయంతో టీడీపీ నేతలు ఇంతలా దిగిజారి పోయారని ఎద్దేవా చేశారు. స్వచ్ఛందంగా సభ్యులు ఓటు వేస్తే గెలవలేమని భావించి సభ్యులను నిర్బంధించారని, ఇదే చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. టీడీపీ నాయకులు వ్యవహరించిన తీరు సిగ్గు చేటు అన్నారు. కార్యక్రమంలో మత్య్సకారులు కె.చిన్నారావు, జి.సింహాచలం, జి. అప్పలరాజు, బి.సుదర్శన్రావు, పి.లక్ష్మణ్, ఎం.గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కేంద్రంవద్ద మంత్రి అనుచరులు, టీడీపీ నేతలు అధికార దర్పంతో గెలుపు 66 మంది సభ్యులున్న ఎన్నికకు క్యాంప్ రాజకీయాలు -
ఉత్తరద్వార దర్శనానికి ఏర్పాట్లు
గరుగుబిల్లి: ఉత్తరాంధ్ర చినతిరుపతిగా పేరుగాంచిన తోటపల్లి శ్రీ కోదండరామస్వామి ఆలయం మంగళవారం చేపట్టే వైకుంఠ ఏకాదశి పూజలకు ముస్తాబైంది. ఉదయం సుప్రభాతసేవ, నిత్యారాధన, పాశుర విన్నపం, శాత్తుమురై, మంగళాశాసనం తదితర కార్యక్రమాల అనంతరం 6.30 గంటల నుంచి ఉత్తరద్వార దర్శనం ప్రారంభమవుతుందని ఈఓ శ్రీనివాస్ తెలిపారు. వేంకటేశ్వరస్వామి ఆల యం నుంచి కోదండరామస్వామి ఆలయం వరకు స్వామివారిని హన్మత్ వాహనంపై తిరువీధి సేవ నిర్వహిస్తామన్నారు. పూజాకార్యక్రమాల్లో భక్తులు అధికంగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఈఓ శ్రీనివాస్ కోరారు. కలెక్టర్ను సత్కరించిన రెవెన్యూ అసోసియేషన్ పార్వతీపురం: రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ క్లినిక్–స్పెషల్ డెస్క్ను కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి జిల్లాలో ప్రారంభించడం సంతోషదాయకమని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ అసోసియేషన్ తరఫున కలెక్టర్ను సోమవారం సత్కరించారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్, డీఆర్ఓ కె.హేమలత, సిబ్బంది పాల్గొన్నారు. హిట్ అండ్ రన్ కేసుల బాధితులకు ఆర్థిక సహాయంపార్వతీపురం: రోడ్డు ప్రమాదాల్లో గుర్తుతెలియని వాహనాలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన(హిట్ అండ్ రన్) బాధితుల కుటుంబాలకు ఆర్థిక పరిహారాన్ని కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అందజేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బాధిత కుటుంబాలతో సమావేశమై వారికి పరిహారానికి సంబంధించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. హిట్అండ్ రన్ కేసులకు సంబంధించి 10మందికి గాను 9మందికి మంజూరైన పరిహారాన్ని వారి వ్యక్తిగత ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా మృతుల కుటుంబానికి రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50వేలు చొప్పున జమ చేసినట్లు తెలిపారు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమయ్యేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, రవాణాశాఖాధికారులు పాల్గొన్నారు. -
జిల్లాలో 16 కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు
● ప్రస్తుతం జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీలు: 451 ● ప్రతిపాదనలను పరిశీలిస్తున్న అధికారులు వీరఘట్టం: కొత్త పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ శాఖ ఇటీవల గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్త పంచాయతీలు కావాలంటూ పలు గ్రామాల ప్రజలు తీర్మానాలు చేశారు. వాటిని ప్రభుత్వ కార్యాలయాల్లో అందజేస్తున్నారు. పంచాయతీ విభజన చట్టం ప్రకారం తమ గ్రామాలను కొత్త పంచాయతీలుగా గుర్తించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా సోమవారం నాటికి 16 కొత్త పంచాయతీల కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 451 పంచాయతీలు ఉన్నాయి. వీటిలోని కొన్ని పంచాయతీల్లో ఉన్న గ్రామాల ప్రజలు కొత్త పంచాయతీలకు దరఖాస్తు చేశారు. వీరఘట్టం మండలం నుంచి 5, గరుగుబిల్లి మండలం నుంచి 3, సాలూరు నుంచి 2, పాచిపెంట నుంచి 3, భామిని నుంచి 2, బలిజిపేట మండలం నుంచి 1 దరఖాస్తు కొత్త పంచాయతీల ఏర్పాటుకోసం అందాయి. సాలూరు మండలంలోని తోనాం పంచాయతీలో ఉన్న చిమిడివలస, కొత్తూరు గ్రామాలను మరుపెంట పంచాయతీలో అనుసంధానం చేయాలని దరఖాస్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా వీరఘట్టం, భామిని, గరుగుబిల్లి, సాలూరు, పాచిపెంట, బలిజిపేట మండలాల నుంచి కొత్త పంచాయతీలు కావాలని 16 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించాం. నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తాం. – కొండలరావు, జిల్లా గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి -
పదవుల వేట!
చేపల వలలో.. సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రజాస్వామ్యయుతమైన అధికారం,కోరంలో బలం లేకపోయినా మున్సిపాలిటీలు, మండల పరిషత్లు.. పంచాయతీలను కేవలం అధికార బలంతో చేజిక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు నేడు మత్స్యకార సహకార సంఘాల ఎన్నికల్లోనూ అదే విధానం అవలంబిస్తోంది. విజయనగరం జిల్లాలోని మత్స్యకార సహకార సంఘానికి సంబంధించి పలు సొసైటీల డైరెక్టర్లు, సంఘాల సభ్యులు ఇప్పటికే వైఎస్సార్సీపీలో కొనసాగుతూ పార్టీ తరఫున పదవుల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ పదవులను లాక్కునేందుకు టీడీపీ.. జనసేన నాయకులు అడ్డదారులు తొక్కు తున్నారు. గత వారం రోజులుగా మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులు, చోటా నేతలు గ్రామాల్లోకి దిగిపోయి సొసైటీ నేతలను ప్రలోభపెడుతున్నారు. అధికారం తమది కాబట్టి తమతో ఉంటే అభివృద్ధి ఉంటుందని నమ్మబలుకుతున్నారు. లొంగనివాళ్లని బెదిరిస్తున్నారు. ప్రత్యేకంగా శిబిరాలుపెట్టి వారిని తమ దారిలోకి తెచ్చేందుకు చేస్తున్న విశ్వప్రయత్నాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. నేడు జిల్లా మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షుడి ఎన్నిక విజయనగరం, పార్వతీపురంమన్యం జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాగానే జిల్లా మత్సకార సహకార సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు మత్సశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేయగా.. ఈ నెల 30న మంగళవారం జిల్లా సంఘం అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా మొత్తం అధికారిక లెక్కల ప్రకారం 66 మంది మత్స్యకార ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులు ఉన్నారు. విజయనగరం జిల్లాలో 44 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 22 మంది అధ్యక్షులుగా ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు తుది ఓటర్ల జాబితాను ప్రచరించేశారు. వీరంతా సోమవారం జరిగే ఎన్నికల్లో 11 మంది డైరెక్టర్లను ముందుగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. డైరెక్టర్లుగా ఎన్నికై న వారంతా వారిలోనే ఒక అధ్యక్షుడిని, ఒక ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్టు మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు. చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నిక... జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుని ఎన్ని క ప్రక్రియ చేతులు ఎత్తే విధానంలో ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. ఇదే సువర్ణావకాశంగా భావించిన అధికార టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు, నాయకులు సంఘం అధ్యక్షుడిగా తమకు అనుకూలంగా ఉండే వారిని ఎన్నుకునేందుకు పావులు కదుపుతున్నారు. గడిచిన పక్షం రోజులుగా పార్టీ జిల్లా నేత గ్రామాల్లో ఉండే నాయకులతో మంతనాలు నిర్వహించి వారి ద్వారా ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులను తమదారిలోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు సైతం సమీక్షలు నిర్వహించి ఎన్నిక ల్లో విజయం కోసం ఆరాటపడుతున్నారు. ప్రాథమి క సహకార సంఘాల అధ్యక్షులు తాము చెప్పినట్లు చేయకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నా రు. ప్రత్యేక క్యాంప్లు పెట్టి మాట వినిని వారిని బుజ్జగిస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న 66 మత్స్యకార ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షుల్లో అధిక శాతం మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులే. గడిచిన రెండు ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన వారు సైతం వైఎస్సార్సీపీలో ఉన్న వారే. సదరు వ్యక్తి పార్టీలో రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుండడంతో మింగుడు పడని టీడీపీ, జనసేన నాయకులు జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకుని, వారి ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షుల్లో చాలా మంది గ్రామాల్లో నెయ్యిల సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, వారి ఆర్ధిక, సామాజిక స్థితి గతులు అంతంతమత్రంగానే ఉండటంతో వారిని అధికార బలంతో బెదిరించి తమవైపు తిప్పుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనిని సంబందిత సంఘ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. -
చదురుగుడికి పెదపోలమాంబ
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి మేనత్త పెదపోలమాంబ సోమవారం చదురుగుడికి చేరుకున్నారు. ముందుగా పెదపోలమాంబ అమ్మవారి ఘటాన్ని జన్నివారి ఇంటి నుంచి ఎస్.పెద్దవలస గ్రామ రహదారి వద్దనున్న అమ్మవారి గద్దె సమీపంలోకి తీసుకువచ్చి పూజలు చేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్ నైదాన తిరుపతిరావు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కరణం కుటుంబీకులు సంప్రదాయ బద్ధంగా అమ్మవారి ఘటానికి పూజలు జరిపారు. అనంతరం మేళ తాళాలు, కోలాట ప్రద్శనలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ పెద పోలమాంబను చదురు గుడికి తీసుకువచ్చారు. అమ్మవారు గ్రామంలోని చదురుగుడిలో వారం రోజులపాటు భక్తులకు దర్శనమిస్తారు. వచ్చే ఏడాది జనవరి 5న పెదపోలమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవం, 6న ప్రధాన ఉత్సవం, 7న అనుపొత్సవం నిర్వహిస్తారు. అదేరోజు శంబరపోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి ఆహ్వానించేందుకు సనప చాటింపు వేస్తారు. జనవరి 12న శంబర పోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి తీసుకువస్తారు. 13 రోజుల పాటు పోలమాంబ అమ్మవారు చదురు గుడిలో భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 26న తొలేళ్లు ఉత్సవం, 27న సిరిమానోత్సవం, 28న అనుపోత్సవం నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బి.శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు తీళ్ల పోలినాయుడు, సర్పంచ్ సింహాచలమమ్మ, ఉప సర్పంచ్ అల్లు వెంకటరమణ, మాజీ ట్రస్టు బోర్డు చైర్మన్లు, గ్రామపెద్దలు, జన్ని, కరణం, కుప్పిలి కుటుంబీకులు పాల్గొన్నారు. మంగళవాయిద్యాలు, కోలాట ప్రదర్శనలతో అమ్మవారికి ఆహ్వానం పలికిన భక్తులు -
ఎస్సీ, ఎస్టీలకు గుండె గుబిల్లు
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఈ చిత్రంలోని వ్యక్తి పేరు కొండగొర్రి లక్ష్మణ్. కొమరాడ మండలం నయ పంచాయతీ గుడ్డాం గిరిజన గ్రామం. దాదాపు ఎనిమిదేళ్లుగా ఎస్సీ, ఎస్టీ రాయితీ కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం పొందుతున్నాడు. ఇటీవల వినియోగ బిల్లు బకాయి అంటూ రూ.6,282 చెల్లించాలని విద్యుత్ శాఖాధికారులు నోటీసు పంపారు. తనకు ఉన్నది ఒక ఫ్యాను, లైటు మాత్రమేనని.. ఎంత వినియోగించినా వంద యూనిట్లు దాటదని.. ఇంత మొత్తం బకాయి ఉంటే తాను ఎలా చెల్లించగలనని లక్ష్మణ్ వాపోతున్నాడు. -
కలిసికట్టుగా ‘జంఝావతి’ని సాధిద్దాం
గరుగుబిల్లి: ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న జంఝావతి ప్రాజెక్టు నిర్మాణసాధనకు రైతులంతా కలిసి రావాలని జంఝావతి సాధనసమితి అధ్యక్ష, కార్యదర్శులు చక్క భాస్కరరావు, మరిశర్ల మాలతీకృష్ణమూర్తి నాయుడు పిలుపునిచ్చారు. గరుగుబిల్లి మండలంలోని ఉల్లిభద్ర, దళాయివలస, ఉద్దవోలు, శివరాంపురం తదితర గ్రామాల్లో పర్యటించి రైతులు, పెద్దలతో కలిసి మాట్లాడారు. సమస్యపై చర్చించి కరపత్రాలు అందజేశారు. జంఝావతి ప్రాజెక్టును పాలకులు ఎన్నికల హామీగానే చూస్తున్నారే తప్ప పూర్తిచేసేందుకు శ్రద్ధ వహించడం లేదన్నారు. సాగునీరు అందక, పంటలు పండక ఈ ప్రాంత రైతులు పేదరికాన్ని అనుభవిస్తున్నారన్నారు. రైతులు ప్రశ్నించడంలేదనే సాకుతో పాలకులు పట్టించుకోవడం లేదని తెలిపారు. రైతులు ప్రశ్నించినప్పుడే ప్రభుత్వాలు దిగివచ్చి రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. జంఝావతి నిర్మాణం పూర్తికోసం బాధిత గ్రామాల రైతులతో సమితులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
నల్లబెల్లం విక్రయిస్తే కఠిన చర్యలు
● ఎకై ్సజ్ సీఐ శ్రీనివాసరావు ● మండల కేంద్రంలో ముమ్మరంగా తనిఖీలుకురుపాం: సారా తయారీకి వినియోగించే నల్లబెల్లం విక్రయాలు చేసినా, సరఫరా చేసినా అటువంటి వ్యాపారుల పైన, వ్యక్తుల పైన చర్యలు తప్పవని కురుపాం ఎకై ్సజ్ శాఖ సీఐ పి.శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు సోమవారం సాక్షి దిన పత్రికలో ‘ధాన్యం ముసుగులో నల్లబెల్లం అక్రమ రవాణా’ శీర్షికన వెలువడిన కథనానికి స్పందించిన సీఐ పి.శ్రీనివాసరావు కురుపాం మండల కేంద్రంలోని రావాడ కూడలి, శివ్వన్నపేట తదితర దుకాణాల్లో సోమవారం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా బెల్లం నిల్వల పై ఆరా తీశారు. ఇకపై బెల్లం దిగుమతి ఏ మేరకు చేపడుతున్నది తమకు 15 రోజులకు ఒకసారి తెలియజేయాలని వ్యాపారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ఇప్పటి వరకు బెల్లం సరఫరా చేస్తున్న ఐదుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేశామని మరో 14 మంది పై బైండవర్ కేసులు నమోదు చేసి వారి నుంచి రూ45 వేల అపరాధ రుసుం వసూలు చేసినట్లు తెలిపారు. సారా నిర్మూలనే లక్ష్యంగా చేపడుతున్న దాడుల్లో పట్టుబడిన వారిని, వారికి బెల్లం సరఫరా చేసేవారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
రామతీర్థంలో నేడు ఉత్తర ద్వార దర్శనం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని సీతారామస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పూజలకు సర్వం సిద్ధంమైంది. స్వామి వారి ఉత్తర ద్వార దర్శనానికి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం వేకువజామున 3గంటలకు స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించనున్నారు. అనంతరం తిరుప్పావై సేవాకాలం, మంగళాశాసనం, తీర్ధ గోష్ఠి కార్యక్రమాలను అర్చకులు జరిపిస్తారు. ఉదయం 5గంటలకు సీతారామచంద్ర స్వామి వారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 7.30 గంటలకు స్వామివారి గ్రామ తిరువీధి ఉత్సవాన్ని జరిపించనున్నారు. అనంతరం బోదికొండ మెట్ల మార్గం వద్ద మెట్లోత్సవం, గోపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలనంతరం గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర భక్తులు గిరి ప్రదక్షిణ చేసి స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. భక్తుల రద్దీ నేపధ్యంలో దేవాదాయ, పోలీస్ శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. పూర్తికాని గిరి ప్రదక్షిణ రహదారి నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం గిరి ప్రదక్షిణ జరగనుంది. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు కాలినడకన చెప్పులు లేకుండా సుమారు ఎనిమిది కిలోమీటర్లు భక్తి శ్రద్ధలతో నడిచి స్వామిని దర్శించుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది. గతంలో అస్తవ్యస్తంగా ఉన్న ఈ రహదారిని ఎనిమిదేళ్ల క్రితమే గ్రావెల్ రహదారిగా మార్చి సిద్ధం చేశారు. గత వైఎస్సార్సీపీ హయాంలో రహదారిలో మట్టిని వేసి రహదారికి మోక్షం కల్పించారు. గత ఏడాది అక్టోబర్ నెలలో గిరి ప్రదక్షిణ రహదారి(తారు రోడ్డు) నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత వచ్చే ముక్కోటి ఏకాదశికే సిద్ధం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు. ఈ ఏడాదైనా సిద్ధమవుతుందేమోనని ఎదురు చూసిన భక్తులకు చివరికి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం సగం వరకు చిప్స్(రాళ్ల పిక్కలు) మాత్రమే వేసి వదిలేయడంతో ఈ ఏడాది కష్టాలు తప్పేలా లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి చేసేశామంటూ సోషల్మీడియాలో ప్రచారం రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసేశామని, ఓ రూపుకు తీసుకువచ్చామని, తామే మార్గం సిద్ధం చేశామని..ఇలా ఎమ్మెల్యే లోకం నాగమాధవి అనుచరులు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారాన్ని చూసి భక్తులు నవ్వుకుంటున్నారు. ఆ రహదారిని కొత్తగా వాళ్లే సృష్టించినట్లు ప్రచారం చేసుకోవడం ఏమిటని మండిపడుతున్నారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు తారు వేస్తేనే కదా పూర్తయినట్లు అన్నది భక్తుల అభిప్రాయం. వాస్తవానికి మంజూరైన రూ.2కోట్ల నిధులు సరిపడకపోవడం వల్లనే రహదారి నిర్మాణం పూర్తి కాలేదని ఆ పార్టీ నాయకులే చెప్పడం గమనార్హం. గిరి ప్రదక్షిణ రహదారిలో వేసిన చిన్న చిన్న చిప్స్ కాళ్లకు గుచ్చుకునే ప్రమాదం ఉందని భక్తుల్లో ఆందోళన నెలకొంది. నడిచేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పలువురు సూచిస్తున్నారు. -
పశుసంవర్థకంతోనే గ్రామీణ ఆర్థికాభివృద్ధి
పార్వతీపురం రూరల్: పశుసంవర్థక రంగం బలోపేతం ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తుందని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ మేరకు పశుసంవర్ధక శాఖపై సోమవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పశుపాలనలో జెమిని, పెరప్లెక్సిటీ వంటి ఏఐ సాంకేతికతను జోడించి రైతులకు వేగంగా సమాచారం అందించాలని, పాఠశాల విద్యార్థులు, యువతకు ఈ రంగంలోని ఉపాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఏడాదికి ప్రతి రైతు 1200 గుడ్ల ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలని, వ్యవసాయ వ్యర్థాల నుంచి సంపద సృష్టించే ప్రాజెక్టులను ప్రోత్సహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. మహిళా డైరీ సంఘాలను బలోపేతం చేస్తూ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేయాలని, ఎగుమతి నాణ్యత కలిగిన మేత ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో అమలు చేసిన గ్రామ ముస్తాబు, గోపాల సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందాయని పశుసంవర్థక శాఖాధికారి మన్మథరావు వివరించారు. సమావేశంలో జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, డ్వామా పీడీ రామచంద్రరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అందించండి
● కలెక్టర్ను కోరిన పారా అంతర్జాతీయ క్రీడాకారుడువిజయనగరం: జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహకారంతో పాటు దివ్యాంగ క్రీడాకారులకు (పారా) ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అందేలా చూడాలని పారా అంతర్జాతీయ క్రీడాకారుడు యాళ్ల సత్తిబాబు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డిని కలిసి కోరారు. ఈ మేరకు సోమవారం పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్తో కలిసి కలెక్టరెట్లో జరిగిన గ్రీవెన్స్ సెల్లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన పారా బాడ్మింటన్ క్రీడాకారుడు యాళ్ల సత్తిబాబు ఇప్పటివరకు జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ సాధించి జిల్లాకు పేరు తీసుకుని వచ్చాడని, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రతిభ కనబరిచాడని కలెక్టర్కు వివరించారు. భవిష్యత్ లో జరగనున్న జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు అవసరమైన ఆర్ధిక సహకారంతో పాటు దివ్యాంగ క్రీడాకారులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అందేలా చూడాలని కోరారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చారు. -
ప్రజలలో సంతృప్తి స్థాయి పెరగాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డిపార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీల పరిష్కారం పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండలస్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 144 వినతులు అందాయి. ఇందులో రెవెన్యూకు సంబంధించి 55 అర్జీలు, 89 అర్జీలు వివిధ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యంగా అర్జీలను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. రీ ఓపెన్ అవుతున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అర్జీలను స్వీకరించిన వారిలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తల్లికి వందనం మంజూరు చేయాలి ● సీతానగరం మండలం సీతానగరం గ్రామానికి చెందిన టి.ఉమ తన కుమారుడికి తల్లికి వందనం పథకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేసింది. ● పార్వతీపురం మండలం హిందూపురం గ్రామానికి బి.వెంకటరమణ తప్పెటగుళ్లు బృందానికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేసి, రిజిస్టర్ చేయాలని, జిల్లాలో నిర్వహించే సంబరాల్లో అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేశారు. ● సీతానగరం మండలం రేపటివలస గ్రామానికి చెందిన పి.సుమలత జీవనోపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేసింది. ● పార్వతీపురం పట్టణానికి చెందిన పి.రజని, భామిని మండలం భామినికి చెందిన టి.సరస్వతి వితంతువు పింఛన్ మంజూరు చేయాలని, సీతానగరం మండలం పాపమ్మవలస గ్రామానికి చెందిన ఎన్.అప్పలనాయుడు దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలని కోరారు. ఫిర్యాదులపై చర్యల నివేదిక పంపాలి పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఈ వారం కార్యక్రమంలో 5 ఫిర్యాదులు అందాయి. బాధితులతో మాట్లాడిన ఎస్పీ, ఫిర్యాదుల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదులపై తక్షణమే విచారణ చేపట్టి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలపై నివేదికను కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ఈ వేదికను వినియోగించుకోవచ్చని ఎస్పీ తెలిపారు. నిర్ణీత గడువులోగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ ఎస్సై రమేష్ నాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 15 వినతులు సీతంపేట: ఐటీడీఏలో ఏపీఓ జి.చిన్నబాబు సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వివిధ సమస్యలపై 15 అర్జీలు వచ్చాయి. తిడ్డిమికి చెందిన నీలారావు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇప్పించాలని కోరారు. పెద్దగుమ్మడ స్కూల్కు ప్రహరీ, మరుగుదొడ్లు నిర్మించాలని బగదల గ్రామస్తురాలు జన్ని వరలక్ష్మి విన్నవించింది. రోలుగుడ్డికి కమ్యూనిటీ భవనం నిర్మించాలని గ్రామానికి చెందిన కె.నరేష్ వినతిపత్రం అందజేశాడు. లోకొండ పంచాయతీని విభజించవద్దని కె.ఎర్రన్నాయుడు కోరాడు. ట్రైకార్ రుణం ఇప్పించాలని మంగయ్య, హౌస్హోల్డ్ మ్యాపింగ్లో పేరు వేరేగ్రామంలో ఉందని తమ గ్రామానికి మార్చాలని కొంటికర్రగూడ గ్రామస్తుడు సవర గోపాల్ విన్నవించారు. కార్యక్రమంలో పీహెచ్వో ఎస్.వి.గణేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ రమాదేవి, డిప్యూటీఈవో రామ్మోహన్రావు, జీసీసీ మేనేజర్ జి.నరసింహులు, పీఆర్ జేఈ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు పోటెత్తిన అర్జీలు
● 232 వినతుల స్వీకరణవిజయనగరం అర్బన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 232 వినతుల స్వీకరించగా వాటిని వారం రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మాట్లాడిన కలెక్టర్ పీజీఆర్ఎస్కు వచ్చిన వినతుల పరిష్కారంలో ఆలస్యం చూపితే సహించేది లేదని హెచ్చరించారు. రెవెన్యూ సమస్యలపై వచ్చిన వినతులను సకాంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రతి వారం పీజీఆర్ఎస్ పై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలపై వెంటనే సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అర్జీదారును తప్పనిసరిగా కలిసి మాట్లాడిన తర్వాతనే ఎండార్స్మెంట్ ఇవ్వాలని మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్ట్లో నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే పీజీఆర్ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 110పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆ నంబర్కు వచ్చిన కాల్స్ను సరైన సమాధానం అందించాలని సూచించారు. స్వీకరించిన వినతులలో అత్యధికంగా రెవెన్యూశాఖకు 136, పంచాయతీ శాఖ 26, పోలీస్ శాఖ 10, పబ్లిక్ హెల్త్ 10, మున్సిపల్ పరిపాలన 9, సర్వేల్యాండ్ రికార్స్5, వ్యవసాయ శాఖ 4, విద్యుత్ శాఖ 4, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ 3, ఎస్సీ కార్పొరేషన్కు రెండు, దేవాదాయ శాఖ 2, మెడికల్ ఎడ్యుకేషన్ 2, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 2, సమగ్రశిక్షక్ష 2, వాటర్రిసోర్సెస్కు 2 వినతులు స్కీకరిచారు. వినతుల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీలా గాంధీ, బి.శాంతి, సర్వేశాఖ ఎ.డి ఎస్వీవిజయకుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవ్ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ప్రారంభం ప్రజా ఫిర్యాదుల శ్రీఘ్ర పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్లో భాగంగా విజయనగరం జిల్లాలో రెవెన్యూ క్లినిక్స్ను సోమవారం ప్రారంభించినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మాట్లాడిన కలెక్టర్, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా రికార్డుల ఆధారంగా సాధ్యమైనంత వరకు ఆన్ది స్పాట్లోనే ఫిర్యాదులకు పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తహసీల్దార్లు, ఆర్డీఓల సమక్షంలో పిటిషనర్లకు నేరుగా పరిష్కారం అందించడం లేదా ఫ్యాక్టువల్ సమాచారం ఇవ్వనున్నట్లు వివరించారు. అన్ని పిటిషన్లను డేటాబేస్లో నమోదు చేసి, వీక్లీ రివ్యూ నిర్వహించి గరిష్ట సంతృప్తిని సాధించేలా కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గత 3–4 నెలల్లో జిల్లాలో పీజీఆర్ఎస్ సంతృప్తికరమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. పిటిషన్ల పరిష్కారానికి సాధారణంగా ఒక వారం టైమ్లైన్ నిర్ణయించామని, కొన్ని ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) కేసులు మిగహా మిగతావాటిని వేగంగా పరిష్కరించి ప్రజల సంతృప్తిని పెంచుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపధ్యంలో అర్హత ఆధారంగా వెరిఫికేషన్ చేసి తగు చర్యలు తసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 19 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ చాంబర్ లోనే సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లిమర్లకు చెందిన ఓ ఫిర్యాదురాలు ఎస్పీ చాంబర్ వద్దే ఆవేదన వెళ్లగక్కింది. తనను చిత్రహింసలు పెడుతున్నారని, బూతులు తిడుతున్నారంటూ తనకు న్యాయం చేయాలని డీపీఓలో ఎస్పీ వాహనం వద్దే ఆందోళనకు దిగింది. అక్కడే ఉన్న వుమెన్ కానిస్టేబుల్ ,ఆ ఫిర్యాదుదారు రాలిని లోపలికి పిలిచి కూర్చోబెట్టి ఎస్పీని కలిపించారు. ఇక ఎస్పీ ఛాంబర్ లోనే ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ దామోదర్ 19 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో భూతగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలకు సంబంధించి 3, నగదు వ్యవహారాలకు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించినవి 7 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమార స్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సైలు రాజేష్, ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
ధాన్యం ముసుగులో నల్లబెల్లం..!
● ఒడిశా నుంచి ఆంధ్రాకు దిగుమతి ● బయట ధాన్యం బస్తాలు..లోపల నల్ల బెల్లం ● సారా తయారీలో నల్లబెల్లం వినియోగం కురుపాం: కొన్ని సినిమాలు ఆదర్శంగా నిలుస్తాయి.. మరికొన్ని సినిమాలు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలను వివరిస్తాయి.. మరి ఏది ఆదర్శంగా తీసుకున్నారో కానీ కొంతమంది వ్యాపారులు సారా తయారీకి అవసరమయ్యే నల్లబెల్లాన్ని ఒడిశా నుంచి అక్రమ మార్గంలో దిగుమతి చేసుకుంటున్నారు. సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం స్థానికంగా పుష్కలంగా లభిస్తుండడం.. అది ఎక్కడ నుంచి తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల వచ్చిన ఓ సినిమాలో హీరో బయటకు సక్రమంగాను.. లోపల అక్రమంగాను సరుకులు తరలిస్తూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తాడు. సరిగ్గా ఇదే పంథాను స్థానిక వ్యాపారులు ఎన్నుకున్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతుండడంతో వ్యాపారులు ధాన్యం మాటన నల్లబెల్లాన్ని ఒడిశా నుంచి తీసుకువస్తున్నారు.ఈ బెల్లాన్ని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ మండలాలకు చెందిన సారా తయారీ దారులు కొనుగోలు చేస్తున్నారు. అక్రమార్కులకు వేగులుగా సిబ్బంది..? ఈ అక్రమ రవాణాకు కొంతమంది ఎకై ్సజ్ సిబ్బంది సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వ్యాపారులకు ఎకై ్సజ్ సిబ్బందే వేగులుగా పనిచేస్తుండడంతో బెల్లం రవాణాను, సారాను అర్టికట్టలేకపోతున్నారు. ఈ విషయంపై స్థానిక ఎకై ్సజ్ శాఖ కురుపాం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా.. ఇకపై తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామన్నారు. -
శతపతి అన్నపూర్ణకు ఎస్డీజీ చాంపియన్ అవార్డు
రామభద్రపురం: స్థానిక కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్ ప్రాజెక్టు డైరెక్టర్ శతపతి అన్నపూర్ణకు నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులో ఆదివారం ఎస్డీజీ చాంపియన్ 2025 అవార్డు ప్రదానం చేశారు. ఖాట్మండులో జరిగిన అంతర్జాతీయ సదస్సులో నేపాల్ దేశ సీ్త్ర శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి భగవతి చౌదరి చేతుల మీదుగా ఈ అవార్డు తాను అందుకున్నట్లు అన్నపూర్ణ సాక్షికి తెలిపారు. సీడీసీ సుస్థిర గ్రామీణాభివృద్ధిపై గ్రామ స్థాయిలో మహిళా సాధికారత, ఆరోగ్య శిబిరాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ తదితర సేవలకు ఈ అవార్డు లభించిదని ఆమె చెప్పారు. ఈ అవార్డు లభించడం ఆనందంగా ఉందన్నారు. ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావుతో పాటు పలువురు గ్రామ పెద్దలు ఆమెను ఈ సందర్భంగా అభినందించారు.ధాన్యం ఎత్తుకెళ్లిపోతున్న దొంగలు ● ఆందోళనలో రైతులు భామిని: మండలంలోని పలు గ్రామాల్లో రైతులు కళ్లాల్లో నిల్వ చేసిన ధాన్యం బస్తాలను దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. దీంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. కొద్ది రోజులుగా వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున వడ్డంగి రోడ్డులో ఉన్న కళ్లంలో 31 బస్తాలను అపహరించుకుపోయారు. దీంతో బాధిత రైతులు ముదుల పోలినాయుడు, కీర్తి మోహనరావు, బోదెపు ప్రదీప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల కిందట నేరడి–బికి చెందిన రైతు వలరౌతు దండాసికి చెందిన 13 బస్తాల దాన్యం దొంగలించుకుపోయారు. అలాగే బత్తిలికి చెందిన అప్పన్న అనే రైతు సింగుబై కళ్లంలో వేసిన ధాన్యం రాశి నుంచి పది బస్తాల వరకు ధాన్యం చోరీ చేశారు. సరిహద్దు ఒడిశా గ్రామాలకు చెందిన దొంగలే ధాన్యం దోచుకుంటున్నారని మండల రైతులు ఆరోపిస్తున్నారు. డెంకాడ: మండలంలోని బొడ్డవలస జంక్షన్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. బొడ్డవలస గ్రామానికి చెందిన అట్టాడ పైడినాయుడు (59) బొడ్డవలస జంక్షన్ వద్ద శనివారం రాత్రి 7.10 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా.. విశాఖ వైపు నుంచి విజయనగరం వైపు వస్తున్న లారీ ఢీ కొట్టడంతో పైడినాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని విజయనరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11.20 గంటలకు మృతి చెందాడు. మృతుడి మనవడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన మహిళ.. భామిని: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. బత్తిలి ఎస్సై జి.అప్పారావు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సతివాడకు చెందిన మండల అప్పలమ్మ (54) ఈ నెల 23న సతివాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడింది. వెంటనే ఆమెను శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం రాగోలు జెమ్స్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. మృతదేహానికి ఆదివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
గిరిజనుల సంస్కృతికి నిలువుటద్దం కందికొత్తలు
● కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ● గుమ్మలక్ష్మీపురంలో గిరిజనులతో కలిసి అడుగువేసిన కలెక్టర్ గుమ్మలక్ష్మీపురం: గిరిజనుల ఆచారం, సంస్కృతికి ‘కంది కొత్తలు’ పండుగ నిలువుటద్దంలా నిలుస్తోందని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి అన్నారు. ఈ మేరకు గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని హెచ్గ్రౌండ్ వద్ద కంది కొత్తల పండగ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ గిరిజనుల ఆచార వ్యవహారాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల జీవన విధానం ప్రకృతితో ఎంతగా ముడిపడి ఉందో ఈ పండగ నిర్వహణను చూస్తే అర్థం అవుతోందన్నారు. తర తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం, ఐక్యతను, ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని నేటి తరానికి తెలియజేసేలా ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమని ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గిరిజనులతో కలిసి నృత్యాల్లో పాల్గొన్నారు. అంతేకాక డప్పు వాయించారు. కలెక్టర్ తమ మధ్యకు వచ్చి సామాన్యుడిలా వేడుకల్లో భాగస్వామ్యం అవడం పట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
గణితంలో శ్రీనివాసరావుకు పీహెచ్డీ
రాజాం సిటీ: స్థానిక జీసీఎస్ఆర్ కళాశాలలో గణిత అధ్యాపకుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరావుకు గణితంలో పీహెచ్డీ పట్టా లభించింది. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇన్విస్టిగేషన్ ఆన్ డెస్క్ ఎనర్జీ కాస్మోలాజికల్ మోడల్ ఇన్ సెర్టిన్ థీరీస్ ఆఫ్ గ్రావిటేషన్ అనే పరిశోధనకు గాను గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా ప్రదానం చేసిందని పేర్కొన్నారు. తన ఈ పరిశోధనకు డాక్టర్ వి.గణేష్, డాక్టర్ కె.దాసునాయుడులు గైడ్స్గా వ్యవహరించారన్నారు. శ్రీనివాసరావుకు పీహెచ్సీడీ రావడం పట్ల ప్రిన్సిపాల్ పురుషోత్తం, అధ్యాపకులు అభినందించారు. -
ఎర్రజెండా ఎప్పటికీ నేలకొరగదు
విజయనగరం గంటస్తంభం: కమ్యూనిజం అంతరించిపోయిందని భావించే వారికి సీపీఐకి ఉన్న వందేళ్ల ఉద్యమ చరిత్రే గట్టి సమాధానమని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. నగరంలోని పడమర బలిజి వీధిలో సీపీఐ 101వ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన..సూర్యచంద్రులున్నంత కాలం కమ్యూనిజం ఉంటుందని, దానికి అంతం లేదని, కమ్యూనిజం గుర్తుగా ఉన్న ఎర్రజెండా ఎప్పటికీ నేలకొరగదన్నారు. అంతకుముందు అమరజీవి, కామ్రేడ్ మొకర అప్పారావు విగ్రహానికి ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం బడుగు, బలహీన వర్గాలు, కార్మిక, కర్షకుల కోసం ఆ పార్టీ చేసిన పోరాటాలు తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రమణమ్మ, పావని, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు యువకుల దుర్మరణం
గజపతినగరం: గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో ఓ మారుతి వ్యాన్ చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు ఆదివారం దుర్మరణం చెందారు. ఈ ప్రమాద సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని కంచరపాలెం ప్రాంతానికి చెందిన పొట్నూరు వినయ్ కు మార్(35), ఎల్లాబిల్లి దినేష్(24)లు శనివారం సాయంత్రం బేకరీ ఐటమ్స్ తీసుకుని విశాఖపట్నం నుంచి ఒడిశాలోని రాయగడ వెళ్లి తిరిగి అదేవ్యాన్లో ఆదివారం విశాఖపట్నం వస్తుండగా గజపతినగరం రైల్వేస్టేషన్ దగ్గర వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. చెట్టును వ్యాన్ బలంగా ఢీకొట్టడంతో మృతదేహాలు వాహనంలో పోలిక లేకుండా పడి ఉన్నా యి. ప్రమాద సమాచారం అందుకున్న గజపతి నగరం ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాలను, వ్యాన్ను పోలీసులు జేసీబీతో బయటకు తీసి శవపంచనామాకు తరలించారు. వినయ్ కుమార్కు భార్య, ఇద్దరు చిన్నపిల్లలు, దినేష్కు భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. మృతుడు దినేష్ తల్లి ఎల్లబిల్లి శంకరమ్మ పిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సై కె.కిరణ్కుమార్ నాయుడు తెలిపారు. -
మీకోసం వెబ్సైట్లో పీజీఆర్ఎస్ అర్జీల నమోదు
పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కారవేదికలో ఇచ్చే అర్జీల వివరాలు మీకోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతిరోజూ వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక సెల్లార్ ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. అర్జీల స్థితిని 1100 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. 31న తోటపల్లి ఆలయ హుండీల ఆదాయం లెక్కింపుగరుగుబిల్లి: తోటపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి ఆలయాల హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమం ఈనెల 31న బుధవారం నిర్వహిస్తున్నట్లు ఈఓ బి.శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. మూడు నెలలకోసారి భక్తులనుంచి వచ్చిన కానుకలు, విరాళాలను దేవాదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం నిర్వహించే ఈలెక్కింపు కార్యక్రమంలో దాతలు, భక్తులు, స్వామివారి సేవకులు పాల్గొనాలని కోరారు. లెక్కింపులో పాల్గొనే భక్తులు, సేవకులు తెల్లని పంచె, తెల్లని బనియన్ మాత్రమే ధరించి రావాలని స్పష్టం చేశారు. నేడు చదురుగుడికి పెదపోలమాంబమక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి మేనత్త, పెదపోలమాంబ అమ్మవారు సోమవారం చదురుగుడికి చేరుకోనున్నారు. శంబర పోలమాంబ అమ్మవారి జాతర వచ్చే ఏడాది జనవరి 26, 27, 28 వ తేదీల్లో జరగనున్న నేపథ్యంలో అమ్మవారి జాతర తొలిఘట్టం పోలమాంబ అమ్మవారి మేనత్త పెద పోలమాంబ అమ్మవారిని చదురుగుడికి తీసుకువస్తారు. పోలమాంబ మేనత్త పెద పోలమాంబ అమ్మవారి ఘటాన్ని జన్ని వారి ఇంటి నుంచి ఎస్.పెద్దవలస గ్రామ రహదారి వద్దనున్న అమ్మవారి గద్దె సమీపంలోకి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. అనంతరం భక్తుల కోలాహం, వాయిద్యాలు, డప్పుల మధ్య పెదపోలమాంబ అమ్మవారిని గ్రామంలోనీ చదురుగుడికి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. పెద పోలమాంబ అమ్మవారిని తీసుకువచ్చేందుకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. విజయనగరం టౌన్: జిల్లాకు చెందిన ధర్మాస్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ డైరెక్టర్ పీఎస్వీ.కామేశ్వరరావుకు ఉత్తమ నాట్యాచార్య పురస్కారం దక్కింది. జాతీయస్థాయి కూచిపూ డి నృత్యోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణాజిల్లా గుడివాడలోని శ్రీ ఉపద్రష్ట ఫంక్షన్ హాల్లో ద్వారకాసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు దక్కినట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నృత్యప్రదర్శన చేసిన చిన్నారులకు ఉత్తమ నా ట్య ప్రతిభా పురస్కారాలు అందజేశారన్నారు. మచిలీపట్నం ఎమ్మార్వో హరినాథ్ చేతుల మీదుగా తాము పురస్కారాలు అందుకున్నామన్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన పలు సంస్థల ప్రతినిధులు, కళాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. విజయనగరం టౌన్: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా విజయనగరంలోని రింగురోడ్డులో గల శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువైన స్వామివారికి శ్రీనివాసా సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పుష్పయాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల పుష్పాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయమంతా సంకీర్తనలు, గోవిందనామ భజనలు, అష్టోత్తర శతనామార్చనలతో భక్తిభావం పెంపొందింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి, తరించారు. -
వ్యాన్ ఢీ కొనడంతో వ్యక్తికి గాయాలు
సీతానగరం: మండలంలోని హైవే రోడ్డుపై లచ్చయ్యపేట – పాత బొబ్బిలి మధ్య ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. బొబ్బిలి మున్సిపాలిటీ గొల్లపల్లికి చెందిన బొబ్బాది వెంకటరమణ ఆదివారం ఉదయం బొబ్బిలి వైపు నుంచి పాత బొబ్బిలి మీదుగా ద్విచక్ర వాహనం వాహనంపై లచ్చయ్యపేట వైపు వస్తుండగా.. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న కోళ్ల వ్యాన్ ఢీ కొనడంతో వెంకటరమణకు గాయాలయ్యాయి. వెంటనే వ్యాన్డ్రైవర్ 108 వాహనానికి ఫోన్ చేయగా.. సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రుడ్ని బొబ్బిలి సామాజిక ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుడ్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుడు తవిటినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోను ఢీకొన్న లారీ.. దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో పెదమానాపురం నుంచి వస్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీ కొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. పెదమానాపురం ఎస్సై ఆర్.జయంతి తెలియజేసిన వివరాల ప్రకారం.. పెదమానాపురం నుంచి గర్భాం వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ మామిడి నాగరాజుకు తీవ్ర గాయాలు కాగా.. ప్రయాణికులు చొక్కపు అప్పలనాయుడు, అల్లు గోరమ్మకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను గజపతినగరం సీహెచ్సీకి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
జానపద కళలకు ఆదరణ
బొబ్బిలి: మనదేశ జానపద కళలకు, సంస్కృతికి ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందని ప్రముఖ సినీ, టీవీ నటుడు షకలక శంకర్ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక కోటలో బొబ్బిలి కళోత్సవ్ పేరిట జానపద కళల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శంకర్ మాట్లాడుతూ.. చరిత్రలో బొబ్బిలికి ప్రత్యేక స్థానముందన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి వీరత్వంపై ఓ పద్యాన్ని ఆలపించారు. అనంతరం రేలారేరేలా గాయకుడు కోరాడ జానకిరామ్ యువతను ఆకట్టుకునే గేయాలు ఆలపించారు. అంతకు ముందు రంగస్థలం ఫేమ్ తప్పెటగుళ్ల కళాకారుడు నీలబోను సత్యం బృంద ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం చెక్కకభజనలు, బుర్రకథ ప్రదర్శనలు, కోలాటం, జాలరిబాగోతం, థింసా నృత్యం, డప్పుల వాయిద్యం, జయదేవుని అష్టపది, బిందెల డాన్స్, సినీ నృత్యాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బేబి నాయన కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర డైరెక్టర్ రౌతు రామమూర్తినాయుడు, కోలాటం డ్యాన్స్ మాస్టర్ జి. కరుణ్కుమార్, శ్రీ కళాభారతి కార్యదర్శి నంబియార్ వేణుగోపాలరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ పువ్వల శ్రీనివాసరావు, స్థానిక కళాకారులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. సినీ నటుడు షకలక శంకర్ -
పందెంరాయుళ్ల అరెస్ట్
బాడంగి: మండలంలోని పాల్తేరు శివారులో గొర్రెప్పందాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి చేసి పందెంరాయుళ్లను అరెస్ట్ చేశారు. ఎస్సై తారకేశ్వరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాల్తేరు సమీపంలోని తోటలో గొర్రెప్పందాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు ఆదివారం దాడి చేశారు. దీంతో ఏడుగురు పందెంరాయుళ్లు పట్టుబడగా.. వారి వద్ద నుంచి 23,160 రూపాయల నగదు, రెండు గొర్రెపోతులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి నేపథ్యంలో ఎవ్వరైనా పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. -
వైఎస్సార్సీపీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా రమాదేవి
జియ్యమ్మవలస: OÐðlGÝëÞ-ÆŠ‡-ïÜï³ ´ëÆý‡Ó-¡ç³#Æý‡… Ð]l$¯]lÅ… hÌêÏ Ð]l$íßæ-âê {糫§é¯]l M>Æý‡Å-¨ÇØV> hĶæ$Å-Ð]l$Ã-Ð]l-ÌSçÜ Ð]l$…yýl-ÌS… ÕQºyìl {V>Ð]l*-°MìS ^ðl…¨¯]l Ķæ${Æý‡ Æý‡Ð]l*-§ólÑ °Ä¶æ$-Ñ$™èl$-ÌS-Ķæ*ÅÆý‡$. ™èl¯]l °Ä¶æ*-Ð]l$-M>°MìS MýS–íÙ ^ólíܯ]l OÐðlGÝëÞ-ÆŠ‡-ïÜï³ hÌêÏ A«§ýlÅ-„ýS$yýl$ Ôèæ{™èl$-^èlÆý‡Ï ç³È„ìS-™Œæ-Æ>k, Ð]l*i yìlç³NÅsîæ ïÜG… ´ëÐ]l¬ÌS ç³#çÙµ-}Ðé×ìæMìS Æý‡$׿ç³yìl E…sê¯]l° BÐðl$ ™ðlÍ´ëÆý‡$. D Ðól$Æý‡MýS$ B¨ÐéÆý‡… BÐðl$ _¯]l-Ðól$-Æý‡…-WÌZ° Ð]l*i yìlç³NÅsîæ ïÜG… ç³#çÙµ-}ిÐé×ìæ M>Å…‹³ M>Æ>Å-ÌS-Ķæ*-°MìS ÐðlãÏ ç³È„ìS-™Œæ-Æ>k, ç³#çÙµ-}Ðé×ìæ §ýl…ç³-™èl$-ÌS¯]l$ MýSÍíÜ «§ýl¯]lÅ-Ðé§éË$ ™ðlÍ´ëÆý‡$. ఈ సందర్భంగా రమాదేవిని శాలువాలతో సన్మానించారు. జిల్లా స్ధాయిలో పదవి అప్పగించడంతో శాయశక్తులా పార్టీ అధికారంలోకి రావడానికి కృషిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కోట రమేష్, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. -
మూగవేదన
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పార్వతీపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పరిధిలో పశుసంపద కళకళలాడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 8,46,060 మూగజీవాలు ఉన్నాయి. వాటిలో ఆవులు, ఎడ్లు 2,28,681 కాగా, గేదెలు 76,017 వరకు ఉన్నాయి. ఇక గొర్రెలు 2,07,451, మేకలు 1,73,110, పందులు 5,089 ఉన్నాయి. లక్షల సంఖ్యలో కుటుంబాలు వాటి పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఇంతటి ఘనమైన పాడి సంపద ఉన్నా..పాలకుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలతో ఆస్పత్రుల్లో కనీసం మందులు దొరకని దుస్థితి దాపురించింది. ప్రైవేట్ షాపులే దిక్కు సర్కారు దవాఖానాలో చికిత్స ఉచితమే అయినా..మందులు మాత్రం బయట కొనాల్సిందేనని వైద్యులు చీటీ రాసిస్తున్నారు. గత్యంతరం లేక రైతులు ప్రైవేట్ మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారు. సాధారణ జబ్బుకే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి రావడంతో పాడి రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. పశువుకు జబ్బు చేస్తే, మాకు జ్వరం వచ్చినట్లే ఉంది. మందులు కొనలేక సతమతమవుతున్నామని పలువురు పాడిరైతులు వాపోతున్నారు. అధికారులు తక్షణం స్పందించి మందుల సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు జిల్లాలోని పశువైద్య కేంద్రాలకు గత ఏప్రిల్లో మందుల పంపిణీ జరిగింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మందుల నిల్వలు రావాల్సి ఉంది. అయితే అత్యవసర చికిత్సకు ఆటంకం కలగకుండా ఇతర కేంద్రాల నుంచి మందులను సర్దుబాటు చేయిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర కార్యాలయానికి అవసరమైన మందుల జాబితా (ఇండెంట్లు) పంపాం. కొద్ది రోజుల్లోనే జిల్లాకు పూర్తిస్థాయిలో మందుల సరఫరా జరిగే అవకాశముంది. డా.మన్మథరావు, జిల్లా పశువైద్యాధికారి, పార్వతీపురం మన్యం సాధారణంగా పశువైద్యశాలలకు ప్రతి మూడు నెలలకోసారి (త్రైమాసికం) మందుల సరఫరా జరగాలి. కానీ, జిల్లాలో గత ఆరు నెలలుగా మందుల ఊసే లేదు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జూన్ లేదా అక్టోబర్ నాటికి రావాల్సిన మందులు ఇంతవరకు రాలేదు. జ్వరం, గాయాలు, ఇతరత్రా వ్యాధులకు వాడే యాంటీ బయాటిక్స్, నీరసిస్తే ఎక్కించే సైలెన్లు, పాల దిగుబడిని పెంచే కాల్షియం మందులు ఏప్రిల్ తర్వాత కేంద్రాలకు సరఫరా కాలేదు. ఉన్న నిల్వలు ఎప్పుడో అయిపోగా, ప్రస్తుతం ఆస్పత్రుల్లో మందుల అరలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో పశువైద్యులు సమీపంలోని ఇతర ఆస్పత్రుల నుంచి మందులు అరువు తెచ్చుకుని నెట్టుకొస్తున్నారు. సంచార పశువైద్య వాహనాల్లోనూ (మొబైల్ వెటర్నరీ క్లినిక్) ఇదే దీనస్థితి నెలకొంది. పశువులకు వైద్యం కరువు ప్రైవేట్ మందులతో పాడి రైతులకు భారం ఆరునెలలుగా నిలిచిపోయిన మందుల సరఫరా జిల్లాలో 8.46 లక్షల పశుసంపద ఉన్నా..సౌకర్యాల లేమి -
వన దేవతలకు ప్రత్యేక పూజలు
జియ్యమ్మవలస: మండలంలోని తూర్పుముఠా ప్రాంతంలో గల టీకే జమ్ము, చినదోడిజ, పెదదోడిజ, కొండచిలకాం, పిటిమండ పంచాయతీ పరిధిలోని గిరిజనులు కందికొత్తల పండగలో భాగంగా వన దేవ తలకు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారోత్సవాల్లో భాగంగా డప్పులు, సాంప్ర దాయ వాయిద్యాల నడుమ గిరిజనులంతా ఒక చోటకు చేరుకుని వనదేవతలైన గొడ్డలమ్మ, సాతారమ్మతల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. పంటలను వనదేవతలకు నైవేద్యంగా పెట్టిన తర్వాత సామూహిక భోజనాలు చేస్తామని గిరిజనులు తెలిపారు. ఇప్పటికే ఆయా గ్రామాలు బంధుమిత్రులతో కళకళలాడుతున్నాయి. -
ధాన్యం తీసుకోం
● తిరిగి పట్టుకుపోండి ● రైతులను తూలనాడిన మిల్లు యజమాని ● ఆందోళనలో అన్నదాతలుబలిజిపేట: బస్తాలకు ధాన్యం ఎత్తి నానా అవస్థలు పడి 21కిలోమీటర్ల దూరం మిల్లు వద్దకు తీసువచ్చారు. వాటిని మేం తీసుకోం..తిరిగి పట్టుకు వెళ్లిపోండని మిల్లు యజమాని తూలనాడడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఏం చేయాలో తోచక కాళ్లూచేతులు ఆడలేదు. అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు. ఇదేం ఖర్మరా బాబూ అనుకున్నారు వంతరాం గ్రామరైతులు. బలిజిపేట మండలంలోని వంతరాం గ్రామ రైతుల ధాన్యాన్ని మిల్లరు కొనుగోలు చేయకపోవడంతో వారు ధాన్యం బస్తాలతో ఇటీవల రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన విషయం విదితమే. అయితే ఈ నేపథ్యంలో మిల్లులకు 1:3నిష్పత్తిలో ధాన్యాల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆ గ్రామ రైతులు సంతృప్తి చెందారు. వంతరాంలో ఉన్న రైతు సేవా కేంద్రం వద్ద రైతులు బి.వెంకటరమణ, ఎ.జనార్దన, ఒమ్మి సత్యనారాయణ, సతీష్, బి.శ్రీరామూర్తి, ఎన్.శ్రీనులకు చెందిన 480ప్యాకెట్లకు నాలుగు ట్రక్షీట్లు కొట్టించగా పి.చాకరాపల్లి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వెన్నెల ఆగ్రో ఇండస్ట్రీస్ పేరున ట్రక్షీట్లు వచ్చాయి. దీంతో రైతులు సంతోషంతో ధాన్యాన్ని 21కిలోమీటర్ల దూరంలో ఉన్న మిల్లుకు ఆపసోపాలు పడి ఉదయం 10గంటలకు ముందే తీసుకువెళ్లారు. అంతలోనే వారి ఆనందం ఆవిరైంది. ట్రక్ షీట్లు రద్దు చేయండి ధాన్యాన్ని తీసుకోనని, తిరిగి పట్టుకువెళ్లిపోండని మిల్లు యజమాని కరాఖండిగా చెప్పడంతో రైతులకు కాళ్లూచేతులు ఆడలేదు. ట్రక్షీట్ ఉంది ఎందుకు తీసుకోరని ప్రశ్నించినా మీ ఇష్టం వచ్చిన పనిచేసుకోండి నేను తీసుకోను అని తేల్చిచెప్పడంతో వారిలో ఆందోళన ప్రారంభమైంది. అధికారులకు ఫోన్లు చేసినా ఎవరూ స్పందించలేదు. అదనంగా ఇంకా ఎన్ని ధాన్యం కావాలో చెప్పండి ఇచ్చేస్తాం, ఏదో విధంగా తీసుకోండని మిల్లు యజమానిని రైతులు ప్రాధేయపడ్డారు. అయినా యజమాని నుంచి స్పందన లేదు. దీంతో రైతులు నానా అవస్థలు పడ్డారు. చివరకు ట్రక్షీట్లు రద్దు చేసేయండని, ధాన్యాన్ని పట్టుకుపోయి ఏదో ఒకటి చేసుకుంటామని, ఇదెక్కడి అన్యాయమని రైతులు లబోదిబోమన్నారు. రైతుసేవా కేంద్రాల వద్ద నుంచి ట్రక్షీట్లు వచ్చిన తరువాత మిల్లర్లు కాదనడం సమంజసంగా లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. -
గిరిజన పిల్లల ఎదురుచూపులు
● పీఎం జన్మన్ హాస్టల్స్కు మోక్షమెప్పుడు? ● మంజూరై రెండేళ్లయినా అతీగతీ లేదు ● మూలుగుతున్న రూ.6 కోట్ల 90 లక్షలు కేంద్రం నిధులు సీతంపేట: గిరిజన ప్రాంతాల్లో పీవీటీజీ (పర్టిక్యులర్లీ వల్నర్బుల్ ట్రైబ్ గ్రూప్) తెగకు చెందిన గిరిజనులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల మంజూరుకు శ్రీకారం చుట్టింది. వాటిలో ప్రధానమైన పీఎం జన్మన్ (ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్) పథకాన్ని 2023 నవంబర్ 15న ప్రారంభించింది. 9 మంత్రిత్వ శాఖల ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించి పక్కా ఇళ్లు వాటికి మరుగుదొడ్లు, పైప్లైన్ ద్వారా తాగునీరు, మొబైల్ మెడికల్ వ్యాన్లు, సేవలు, వంద జనాభా ఉన్న గ్రామాలకు టెలికాం టవర్లు, రోడ్లు, విద్యుత్ రహిత గృహాలకు విద్యుత్ సోలార్ లైటింగ్, జీవనోపాధికి వనధన్ వికాస కేంద్రాలు, విద్యలో భాగంగా హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పథకంలో పీవీటీజీలు లబ్ధిపొందాలనేదే పథకం ఉద్ధేశం. సీతంపేట ఐటీడీఏ పరిధిలో సీతంపేట ఏజెన్సీలో ప్రత్యేక బలహీన గిరిజన సమూహాల సంఖ్య 49,611 మంది ఉన్నారు. మొత్తం 12,488 కుటుంబాలు ఉన్నాయి. ఇదీ పరిస్థితి.. అత్యంత ఎత్తైన కొండపై మారుమూల ఉన్న గిరిజన గ్రామాలను ఎంపిక చేసి మూడు చోట్ల ప్రత్యేక గిరిజన మోడల్ వసతిగృహాలు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. మండలంలోని గుడ్డిమీదగూడ, చదునుగూడ, తలైబుగూడ గ్రామాల్లో వసతిగృహాలను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల పరిసరాల్లో ఉన్న పాఠశాలల్లో చదువుతున్న 50 మంది చొప్పున విద్యార్థులను మొత్తం 150 మందిని ఆ హాస్టల్స్లో చేర్పించేందుకు విద్యాశాఖాధికారుల ప్రతిపాదన సిద్ధమైంది. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం అక్కడ చేసి, మధ్యాహ్న భోజనం మాత్రం ఆయా పాఠశాలల్లో చేసేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించారు. పోషకాహారంతో కూడిన భోజనం ఏర్పాటు చేయడం, టీచర్లతో పాటు ప్రత్యేక ట్యూటర్లను నియమించి విద్యాబోదన చేసేందుకు ప్రతిపాదన చేశారు. ఇందుకు రూ.ఒక్కోవసతి గృహానిర్మాణానికి రూ.2 కోట్ల 30లక్షలు చొప్పున మొత్తం రూ.6 కోట్ల 90లక్షలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రెండేళ్లయినా ఇంతవరకు ఎటువంటి నిర్మాణాలు జరగలేదు. విద్యార్థులను ఎంపిక చేశాం మోడల్ వసతిగృహాలకు సంబంధించి విద్యార్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేశాం. ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో టెండర్లు పూర్తయ్యాయి. స్థల సేకరణ కూడా రెండు వసతిగృహాలకు జరిగింది. పనులు సైతం ప్రారంభమయ్యాయి. ఇంకా తలైబుగూడ వసతిగృహం పనులు ప్రారంభం కావాల్సి ఉంది. -
గిరిజన హక్కులను పాలకులు కాలరాస్తున్నారు..
పార్వతీపురం: గిరిజన హక్కులను పాలకులు కాలరాస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణరావు విమర్శించారు. మండల కేంద్రంలోని ఆలిండియా ఆదివాసీ గిరిజన హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ గిరిజన భవనంలో వివిధ ఆదివాసీ, గిరిజన సంఘాల ప్రతినిధుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆయన గిరిజను ల హక్కులు, వారి కోసం రాజ్యాంగం కల్పించిన చట్టాలపై అవగాహన కల్పించారు. రానురాను గిరి జనులకు భద్రత కరువవుతోందని, ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి కలుగుతోందన్నా రు. గిరిజనులకు రక్షణగా ఉన్న ఎన్నో చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. 1/70 చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టాలను అటు అధికారు లు, ఇటు పాలకులు దుర్వినియోగం చేస్తున్నారు. గిరిజన హక్కుల రక్షణ కోసం అందరం ఐక్యంగా ఉండి, పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఎక్కడైనా గిరిజనులకు అన్యా యం జరిగితే మూకుమ్మడిగా పోరాటం చేయాలని, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి అనునిత్యం పోరాడాలన్నారు. అనంతరం ఆలిండియా ఆదివా సీ గిరిజన హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నారు. -
మా క్లినిక్కు వచ్చేయండి..
విజయనగరం ఫోర్ట్: గంట్యాడ మండలానికి చెందిన ఆర్. దీపక్వర్థన్కు రోడ్డు ప్రమాదంలో చేయి విరగడంతో స్థానిక సర్వజన ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. దీంతో ఎముకల వైద్యులు ఫిజియోథెరపీ చేయించుకోవాలని అతడ్ని ఫిజియోథెరపీ విభాగానికి రిఫర్ చేశారు. అయితే అక్కడ ఉన్న ఫిజియోథెరపిస్ట్ ఆస్పత్రిలో సరైన పరికరాలు లేవని.. అంబటిసత్రం ప్రాంతంలో తనకు సొంత క్లినిక్ ఉందని.. అక్కడకు వస్తే త్వరగా తగ్గిస్తానని చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఆ రోగి ప్రైవేట్ క్లినిక్కు వెళ్లారు. ఆ క్లినిక్లో ఒకసారి ఫిజియోథెరపీ చేసినందుకు రోగి నుంచి రూ. 1500 వసూలు చేసినట్లు సమాచారం. అలాగే ఇదే మండలానికి చెందిన ఆర్. వరలక్ష్మి అనే మహిళ మెడనొప్పితో సర్వజన ఆస్పత్రిలోని న్యూరో సర్జరీ విభాగానికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెను కూడా ఫిజియోథెరపీ విభాగానికి రిఫర్ చేశారు. ఈమెను కూడా సదరు ఫిజియోథెరపిస్ట్ తన సొంత క్లినిక్కు వస్తే త్వరగా తగ్గిస్తానని చెప్పాడు. అయితే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆమె అతని క్లినిక్కు వెళ్లలేదు. ఇలా వీరిద్దరిరే కాదు ఫిజియోథెరపీ విభాగానికి వస్తున్న ప్రతి రోగినీ ఆయన తన ప్రైవేట్ క్లినిక్కు వెళ్లాలని సూచిస్తున్నాడు. దీంతో రోగులు బయటకు చెప్పలేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ క్లినిక్కు వెళ్లి చేతిచమురు వదిలించుకుంటున్నారు. ఇదిలా ఉంటే సదరు ఫిజియోథెరపిస్ట్ ఆస్పత్రిలో అందుబాటులో ఉండడని గతంలో ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఆ సమయంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయినప్పటికీ ఆయనలో ఎటువంటి మార్పు రాకపోవడం విశేషం. రోగుల తరలింపే లక్ష్యం.. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగినీ తన క్లీనిక్కు తరలింపే లక్ష్యంగా సదరు ఫిజియోథెరపిస్ట్ ప్రయత్నిస్తున్నాడు. పక్షవాతం బారిన పడిన వారికి, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఫిజియోథెరపీ తప్పనిసరి. ప్రభుత్వాస్పత్రిలో మంచి సదుపాయాలున్నప్పటికీ, ఫిజియోథెరపిస్ట్ స్వార్థం వల్ల రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఫిజియోథెరపీ కోసం వచ్చిన వారికి ఇక్కడే చేయాలి. ఇతర క్లినిక్లకు తరలించడానికి వీల్లేదు. అలా తరలించిన వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటిండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సర్వజన ఆస్పత్రిలో ఓ ఫిజియోథెరపిస్ట్ నిర్వాకం ఆస్పత్రిలో మంచి పరికరాలు లేవని రోగులను మభ్యపెడుతున్న వైనం గత్యంతరం లేక ప్రైవేట్ క్లినిక్కు వెళ్తున్న రోగులు వారి నుంచి వేల రూపాయలు గుంజుతున్నట్లు ఆరోపణలు -
దాడి చేసిన వారిని శిక్షించాలి
భోగాపురం: మండలంలోని ముంజేరు పంచాయతీ సిద్ధార్థ్నగర్ కాలనీకి చెందిన దళితులపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. కాలనీ మీదుగా నిర్మించిన మురుగునీటి కాలువ సమస్యను పరిష్కరించడంతో పాటు తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సిద్ధార్థ్నగర్కు చెందిన దళితులు 22 రోజులుగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దళితనేత, మాజీ ఎంపీ హర్షకుమార్ దీక్షా శిబిరాన్ని శనివారం సందర్శించి, సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళితులు 22 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నా.. స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గతంలో ముంజేరు గ్రామంలోని వాడుకనీరు వేరే మార్గం వైపు పోయేదని.. అయితే వాడుకనీరు పోయేందుకు వీలుగా సిద్ధార్థ్నగర్ కాలనీ మీదుగా కాలువ నిర్మించి, పనులు మధ్యలో నిలిపివేయడంతో మురుగునీరంతా కాలనీలో నిలిచిపోతోందని చెప్పారు. ఇదేమని అడిగిన వారిప కొంతమంది దాడి చేశారన్నారు. కాలువను నాగులగెడ్డ వద్దకు నిర్మించి మురుగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ దళిత సంఘాలకు చెందిన నాయకులు, దళితులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ -
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు
● ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.విమలవిజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ(జాతీయ మహిళా సమైక్య) రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.విమల ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అమర్భవన్లో ఆ సంఘ జిల్లా అధ్యక్షురాలు బాయి రమణమ్మ, జిల్లా కార్యదర్శి బుగత పావనిల ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఓ చోట బాలికలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంలో విఫలమవుతోందన్నారు. ఇకనుంచి అయి నా మహిళలపై వివక్ష లేకుండా చూడాలని, వారిని అన్నిరంగాల్లో ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు. -
మహాప్రస్థానం వాహన సదుపాయానికి ప్రతిపాదనలు
గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి మహా ప్రస్థానం వాహనం మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్టు డీసీహెచ్ఎస్ జి.నాగభూషణరావు తెలిపారు. భద్రగిరి సీహెచ్సీలో చికిత్స పొందుతూ గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన కడ్రక రాధమ్మ శుక్రవారం మృతిచెందింది. మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ వాహనం లేకపోవడంతో పారిశుద్ధ్య కార్మికుడైన తన తమ్ముడు రోజూ చెత్త తరలించే రిక్షాలో మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ హృదయ విదారకర ఘటనపై ‘అక్కా క్షమించు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు డీసీహెచ్ఎస్ స్పందించారు. భద్రగిరి సీహెచ్సీని శనివారం సందర్శించారు. ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మృతదేహాన్ని తరలించేందుకు భద్రగిరి ఆస్పత్రికి ప్రత్యేకంగా ఎటువంటి వాహనం కేటాయించలేదని, మహా ప్రస్థానం వాహనం మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. అప్పటివరకు ప్రత్యామ్నాయంగా అంబులెన్స్తో పాటు ఆయిల్ సదుపాయం కల్పించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తామన్నారు. ఆయన వెంట సీహెచ్సీ వైద్యుడు సంతోష్ కుమార్ ఉన్నారు. -
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పక్కాగా ‘ముస్తాబు’ పాలకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని పాలకొండ సబ్ కలెక్టర్ పవర్స్వప్నిల్ సూచించారు. పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన శనివారం సందర్శించారు. విద్యార్థులతో కలిసి ఏరోబిక్స్ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. వంటశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు రుచికరంగా భోజనం పెట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు అభినందన సీతంపేట: కొద్దిరోజుల కిందట సీతంపేటలో జరిగిన అన్వేష ఫెస్ట్లో అగ్రిటెక్ ప్రాజెక్టు, స్మార్ట్ఏటీఎం మోడల్స్ను ప్రదర్శించి విజేతగా నిలిచిన సీతంపేట ఏపీఆర్ బాలుర గిరిజన పాఠశాల విద్యార్థులను కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇనచార్జి పీఓ పవార్ స్వప్నిల్లు శనివారం అభినందించారు. సీనియర్స్లో ఎస్.అభినయ, వంశీకృష్ణ, జూనియర్ విభాగంలో లిఖిత్కు పార్వతీపురంలో ఓ కార్యక్రమంలో అభినందించినట్టు ప్రిన్సిపాల్ మధు తెలిపారు. శ్రీనివాసుని కల్యాణానికి తలంబ్రాల సేకరణ రాజాం సిటీ: వచ్చేఏడాది ఏప్రిల్ నెలలో తిరుపతిలో జరగనున్న శ్రీనివాసుని కల్యాణానికి అవసరమైన తలంబ్రాల కోసం భక్తులు శనివారం ధాన్యంసేకరించారు. అగ్రహారంలో శ్రీనివాసుని రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధాన్యం సేకరణ చేపట్టారు. వీటిని గోటితో ఒలిచిన బియ్యాన్ని తలంబ్రాలుగా శ్రీనివాసునికి సమర్పిస్తామని గాయత్రి బ్రాహ్మణ సంఘం సభ్యులు తెలిపారు.పార్వతీపురం రూరల్: జిల్లాలోని రైతులకు రబీలోనూ కష్టాలు తప్పేలా లేవు. విత్తనాలు, ఎరువుల కోసం అగచాట్లు పడుతున్నారు. మొన్నటి ఖరీఫ్ సీజన్లో బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాలకు పరుగు తీశారు. గంటల తరబడి నిరీక్షించారు. ఆ చేదు జ్ఞాపకాలు చెరిగిపోకముందే ‘రబీ’ సీజన్ ముంచుకొచ్చింది. ఇప్పుడు కూడా ఎరువు కష్టాలు వెంటాడుతున్నాయి. కొన్నిచోట్ల మొక్కజొన్న రైతుకు యూరియా అందని పరిస్థితి. జిల్లా వ్యవసాయ శాఖాధికారులు మాత్రం గణాంకాలతో అంతా సిద్ధమని ప్రకటిస్తున్నా.. ఆచరణలో శూన్యంగానే కనిపిస్తోందని రైతులు వాపోతున్నారు. లెక్కల్లో ఆశాజనకం.. క్షేత్రస్థాయిలో..? అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం డిసెంబర్ నెలాఖరు నాటికి జిల్లాకు 6,028 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, ప్రస్తుతం 2,452 టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో ప్రైవేట్ డీలర్ల వద్ద 591 టన్నులు, సొసైటీల వద్ద 126 టన్నులు, రైతు సేవా కేంద్రాల్లో 731 టన్నులు, మార్క్ఫెడ్ వద్ద 961 టన్నుల బఫర్ స్టాక్ ఉన్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. కాగితాల మీద ఈ లెక్కలు బాగానే కనిపిస్తున్నా.. సమయానికి లారీలు రాక, స్టాక్ పాయింట్ల వద్ద నో–స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడంతో రైతుల ఆవేదన చెందుతున్నారు. గతంలోనూ ఇలాగే ‘అంతా ఉంది’ అని చెప్పి, తీరా అవసరమైనప్పుడు చేతులెత్తేశారని చెబుతున్నారు. ప్రస్తుత రబీ (2025–26) సీజన్కు సంబంధించి జిల్లాలో ఎరువులు, విత్తనాల లభ్యతపై రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొన్నటి ఖరీఫ్ సీజన్లో ఎదురైన సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, రబీకి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశాం. జిల్లాలో సాగుకు అవసరమైన అన్ని వనరులను రైతులకు సమకూర్చేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నాం. – అన్నపూర్ణ, జిల్లా వ్వవసాయశాఖ అధికారి, పార్వతీపురం మన్యం ఎరువులకు కటకట అరకొర విత్తనాల పంపిణీ కాగితాలపైనే ఎరువుల నిల్వలు.. క్షేత్రస్థాయిలో అందని పరిస్థితి -
నకిలీ రశీదులతో బురిడీ
వీరఘట్టం: పంచాయతీ సిబ్బంది చేతివాటం చూపారు. నకిలీ ఇంటి బిల్లులతో వీరఘట్టం మేజర్ పంచాయతీ ప్రజల నుంచి రూ.20లక్షల వరకు గోల్మాల్ చేశారు. విషయం తెలియడం, సదరు సిబ్బంది బదిలీపై వెళ్లిపోవడంతో పంచాయతీ ప్రజలు ఆందోళన చెందతున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన బిల్లు కలెక్టర్లు ఇంటి పన్నుల వసూలుకు వెళ్లగా.. తాము ఇప్పటికే ఇంటి పన్నులు కట్టినట్లు రసీదులు చూపిస్తున్నారు. అవి నకిలీ రశీదులని, ఐదారేళ్లుగా ఇంటిపన్ను కట్టలేదని ప్రస్తుత పంచాయతీ బిల్లు కలెక్టర్లు చెబుతుండడంతో మోసపోయామంటూ ఆవేదన చెందుతున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ ఉద్యోగి తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదీ పరిస్థితి.... వీరఘట్టం మేజరు పంచాయతీలో సుమారుగా 4,500 గృహాలు, దుకాణాలు, హోటళ్లు ఉన్నాయి. వీటిలో 3,906 గృహాలు మాత్రమే పంచాయతీ రికార్డుల్లో నమోదయ్యాయి. ఈ గృహాలకు ఈ ఏడాదికి రూ.33 లక్షల వరకు ఇంటి పన్నులు వసూలు చేయాల్సి ఉంది. పాత బకాయిలు (ఎరియర్) గత ఏడేళ్ల నుంచి వసూలు చేయాల్సినది రూ.23 లక్షలు ఉంది. మొత్తం ఇంటి పన్నులు రూ.56 లక్షలకు ఇంత వరకు ఈ ఏడాది రూ.7 లక్షలు వసూలు చేశారు. కొంత మంది ఇప్పటికే ఇంటిపన్ను చెల్లించామంటూ రసీదులు చూపిస్తుండడంతో ప్రస్తుత సిబ్బంది నివ్వెరపోతున్నారు. గతంలో వీరఘట్టం మేజర్ పంచాయతీలో పనిచేసిన కొందరు ఉద్యోగులు ఇంటి పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి జమచేయకుండా కాజేసినట్లు గుర్తించారు. మా నాన్న రామచంద్రరావు పేరున ఉన్న ఇంటి నంబర్ 1705కు గత ఆరేళ్లకు సంబంధించి పాత బకాయిలతో కలిపి రూ.17,606లను రెండేళ్ల కిందట చెల్లించాను. అప్పటి ఉద్యోగి రసీదులు కూడా ఇచ్చారు. ఈ ఏడాది రూ.20,965లు చెల్లించాలని ఇటీవల పంచాయతీ సిబ్బంది అడిగారు. నేను కట్టిన రసీదు చూపించడంతో నా వద్ద ఉన్నవి నకిలీవి అంటున్నారు. గతంలో పనిచేసిన సిబ్బందిపై చర్యలు తీసుకుని నా ఇంటి పన్నును క్లియర్ చేయాలి. – దౌలూరు శ్రీనివాసరావు, వీరఘట్టం వీరఘట్టం మేజరు పంచాయతీలో ప్రజల నుంచి వసూలు చేసిన ఇంటి పన్నును పక్కదోవ పట్టించిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నంబర్ 1795లో ఉంటున్న ఇంటికి గత ఆరేళ్లుగా రూ.15,489లు చెల్లించాను. ప్రస్తుత సిబ్బంది పాత బకాయిలతో కలిపి రూ.19,179లను కట్టమని నోటీసు ఇచ్చారు. నోటీసు ఇవ్వడంతో అసలు విషయం తెలిసింది. – వూణ్న సురేష్, వీరఘట్టం వీరఘట్టంలో చాలా మంది ఇంటి పన్నులు కట్టినట్లు రసీదులు చూపిస్తున్నారు. వారు కట్టినట్లు మా రికార్డుల్లో లేవు. ప్రజలకు నకిలీ ఇంటి పన్ను రసీదులు ఇచ్చి డబ్బులు కాజీసిన ఉదంతంపై విచారణ చేపడతాం. ఇంటి పన్ను దొంగలను పట్టుకుని ప్రజలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం. బాధితులందరూ రశీదులు తీసుకుని సచివాలయాన్ని సంప్రదించాలి. – వై.గిరి, ఈఓ, వీరఘట్టం మేజరు పంచాయతీ ఇంటి పన్ను వసూళ్లలో పంచాయతీ సిబ్బంది చేతివాటం వీరఘట్టం మేజరు పంచాయతీలో రూ.20 లక్షలు గోల్మాల్ ఆవేదనలో పంచాయతీ ప్రజలు -
గంజాయి రవాణాకు అడ్డుకట్ట..
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ దామోదర్ విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవాణకు అడ్డుకట్ట వేశామని ఎస్పీ దామోదర్, కలెక్టర్ ఎం. రామసుందర్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక దండుమారమ్మ టెంపుల్లో జిల్లా స్థాయి పోలీస్ సిబ్బందితో వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంజాయి రవాణా, పోక్సో కేసు నమోదుపై జిల్లా శాఖ దృష్టి సారించిందన్నారు. పోక్సో నిందితులకు వెంటనే శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలోనే కాకుండా సబ్ కోర్టుల్లో కూడా శిక్షలు పడుతున్నాయన్నారు. గతేడాది పోక్సో కేసులు 58 నమోదైతే.. ఈ ఏడాది 57 నమోదయ్యాయని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై 87 కేసులు నమోదు చేసి 270 మందిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి 1,175 కిలోల గంజాయిని సీజ్ చేశామని.. 54,15,860 రూపాయల ఆస్తి రికవరీ చేశామని తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేకంగా శక్తి టీమ్స్ పని చేస్తున్నాయన్నారు. వరకట్న వేధింపులు గతేడాది 241 నమోదైతే ఈ ఏడాది 267 నమోదు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే హత్యకేసులు గతేడాది కంటే పెరగడం బాధాకరమని తెలిపారు. మొత్తానికి గతేడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని 2024లో 7,352 జరిగితే ఈ ఏడాది 4,880 కేసులు నమోదు అయ్యాయన్నారు. రౌడీలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పోలీస్ శాఖాధికారులు పాల్గొన్నారు. -
మానవీయ విలువలు పెంపొందించేలా..
పార్వతీపురం రూరల్: మానవీయ విలువలు పెంపొందించేలా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కార్యకలాపాలు సాగాలని కలెక్టర్ ఎన్. ప్రభాకర్రెడ్డి అన్నారు. స్థానిక ఐటీడీఏ క్వార్టర్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన రెడ్క్రాస్ కార్యలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సేవే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలన్నారు. రక్తదాన శిబిరాలు ముమ్మరంగా నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వైశాలి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్ భాస్కరరావు, జిల్లా మెడికల్ ఆఫీసర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె. సాయికృష్ణ చైతన్య, రెడ్క్రాస్ చైర్మన్ మంచుపల్లి శ్రీరామ్మూర్తి, సెక్రటరీ బీఎన్ రావు, తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం పార్వతీపురం రూరల్: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, పార్వతీపురం మన్యం జిల్లా మొబైల్ మెడికల్ యూనిట్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాలుగు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ మంచుపల్లి శ్రీరాములు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యాధికారి–1, స్టాఫ్నర్స్–1, ఫార్మసిస్ట్ కమ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్–1, డ్రైవర్–1 పోస్టులను మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్లతో కలిపి 2026 జనవరి ఐదో తేదీలోగా జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాల యంలో సమర్పించాలన్నారు. వైద్యాధికారి పో స్టుకు రూ.500 (ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు), మిగిలిన పోస్టులకు రూ.300 చొప్పున డిమాండ్ డ్రాఫ్ట్ను జతచేయాలని తెలిపారు. వంగర: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కింజంగి గ్రామానికి చెందిన చిప్పాడ సింహాచలం (65) ఈ నెల 26న గ్రామాల్లో పప్పు దినుసులు విక్రయించుకుని టీవీఎస్ వాహనంపై ఇంటికి తిరిగి వస్తున్నాడు. సరిగ్గా శ్రీహరిపురం పరిధి బందరు చెరువు సమీపంలోకి వచ్చే సరికి శ్రీహరిపురం నుంచి బాగెంపేట వైపు వస్తున్న గంటాన తరుణ్ ద్విచక్ర వాహనంతో ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సింహాచలానికి తీవ్ర గాయాలు కావడంతో, రాజాంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఏఎస్సై వి. ప్రసాద్ తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పురుగు మందు తాగిన వ్యక్తి.. వంగర: మండల పరిధి శివ్వాం గ్రామానికి చెందిన బలగ సత్యంనాయుడు (67) పురుగు మందు తాగి మృతి చెందాడు. పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్యంనాయుడుకు మద్యం అలవాటు ఉంది. ఈ క్రమంలో శుక్రవారం మద్యం బాటిల్ కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత మద్యం బాటిల్ అనుకుని పొరపాటున ఇంటిలో ఉన్న పురుగు మందు తాగేశాడు. వెంటనే అపస్మారకస్థితికి చేరుకున్న సత్యంనాయుడును కుటుంబ సభ్యులు రాజాం సీహెచ్సీకి తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మృతి చెందాడు. మృతుడి భార్య తవిటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ నీలం శ్రీనివాసరావు తెలిపారు.


