breaking news
Parvathipuram Manyam
-
పార్శిల్ పేలుడు బాధితుడికి ఆర్థిక సాయం
● రూ.50వేలు అందజేసిన మజ్జి సిరిసహస్ర పార్వతీపురం రూరల్: ఇటీవల పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పార్శిల్ కౌంటర్ వద్ద జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన రెడ్డి రమేష్కు చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ అపన్నహస్తం అందించింది. ఆ సంస్థ అధినేత ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడు మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరిసహస్ర జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు రమేష్ను పరామర్శించి రూ.50వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ద్వారా విషయాన్ని తెలుసుకుని తన తండ్రి సూచన మేరకు పరామర్శించినట్లు ఆమె తెలిపారు. చిన్న శ్రీను సోల్జర్స్ తరఫున ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. పరామర్శకు ముందు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావును తన క్యాంపు కార్యాలయంలో కలిసి ముచ్చటించారు. కార్యక్రమంలో ఆమెతోపాటు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మావుడి శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్చైర్పర్సన్ కొండపల్లి రుక్మిణి, పట్టణ పార్టీ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, బీసీ సెల్ అధ్యక్షుడు గొర్లి మాధవరావు, కౌన్సిల్ సభ్యులు సంగం రెడ్డి లక్ష్మీపార్వతి, సువ్వాడ లావణ్య, యడ్ల త్రినాథ, నాయకులు చింతాడ శైలజ, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగిన ఖోఖో పోటీలు
విజయనగరం: జిల్లా వేదికగా రెండవ రోజు రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ఆదివారం కొనసాగాయి. నగర శివారులో గల విజ్జి స్టేడియంలో జరుగుతున్న పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు తలపడ్డారు. సోమవారం ఫైనల్స్ నిర్వహించిన అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. అంతేకాకుండా జాతీయస్థాయి స్కూల్గేమ్స్ పోటీలకు రాష్ట్ర జట్టును ఎంపిక చేయనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర స్థాయి పోటీలకు వివిధ జిల్లాల నుంచి పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు కల్పించిన సౌకర్యాలపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక కస్పా ఉన్నత పాఠశాలలో వసతి కల్పించిన క్రీడాకారులకు స్నానాలు చేసేందుకు అనువైన సదుపాయాలు లేకపోవడంతో పాఠశాల ఆవరణలో ఆరుబయట స్నానాలు చేశారు. దీంతో పాఠశాల ప్రాంగణం బురదమయంగా మారడంతో రోజువారీ శిక్షణకు వచ్చే క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారు. -
కంటితుడుపు వైద్యం
● బాధితుల నరకయాతన ● ఆర్టీసీ పేలుడు బాధితుడు చేతి నుంచి రాయి బయటకు తీసిన ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులుపార్వతీపురం రూరల్: జిల్లాకేంద్రంలో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేస్తూ కుదిపేసిన ఆర్టీసీ పార్శిల్ పేలుడు ఘటనలో క్షతగాత్రులైన బాధితులకు నరకయాతన తప్పడం లేదు. తమకేమీ సంబంధం లేని ఓ ఘటన వారిని ఆస్పత్రి పాలు చేసి వారికి, కుటుంబసభ్యులకు తీవ్రమైన బాధను మిగిల్చింది. అయితే బాధితులకు పెద్ద ఆస్పత్రిలో సైతం భరోసా కరువైంది. బాధితుల్లో ఒకరైన రెడ్డి రమేష్ (కలాసీ) వైద్య సేవల్లో ఎదురైన పరాభవం పభుత్వ వైద్య సేవల తీరుకు అద్దం పడుతోంది. పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన రమేష్ను మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రి నుంచి విశాఖ కేజీహెచ్కు తరలించగా సుమారు వారం రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నప్పటికీ అక్కడి వైద్యుల నుంచి కనీస స్పందన కరువైంది. సరైన చికిత్స అందించకుండానే కంటి తుడుపుగా సేవలందించి తమకేమీ పట్టనట్లు డిశ్చార్జ్ చేశారని రమేష్ చెల్లి వాపోయింది. గత నెల 27న ప్రైవేట్ అంబులెన్స్లో చేసేది ఏమీ లేక అర్ధరాత్రి పార్వతీపురానికి తిరుగు ప్రయాణమయ్యారు. దేవుడిపై భారం వేసి జిల్లా కేంద్రంలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో వెలికితీసిన రాళ్లు సదరు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు రమేష్ రెండు కాళ్లను పరిశీలించి శరీరంలో కాలిన గాయాలకు మెరుగైన చికిత్స అందించి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చారు. అలాగే రెండు కాళ్లకు శస్త్ర చికిత్స చేసి పేలుడు సమయంలో శరీరంలోకి వెళ్లిన రాళ్లను బయటకు తీశారు. దీంతో కేజీహెచ్లో చేసిన కంటి తుడుపు వైద్యం తేటతెల్లమైంది. తాజాగా ఆదివారం రమేష్ చేతికి చేసిన శస్త్రచికిత్సలో అంగుళం పరిమాణంలో ఉన్న మరో రాయిని బయటకు తీయడం గమనార్హం. దీంతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు అందించిన సేవలు చూస్తుంటే ప్రభుత్వ వైద్యసేవలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతున్నాయని, దానికి ఉదాహరణ బాధితుడు రమేష్కు చేసిన శస్త్రచికిత్స అని పలువురు విమర్శిస్తున్నారు. -
ఫెన్సింగ్ పోటీలకు జిల్లా జట్టు సిద్ధం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో రాజమండ్రిలో జరగనున్న సీనియర్స్ సీ్త్ర, పురుషుల ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక ఆదివారం పూర్తయింది. నగర శివారులో గల విజ్జి స్టేడియంలో నిర్వహించిన ఎంపికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 50 మంది క్రీడాకారులు హాజరుకాగా పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది క్రీడాకారులను అభినందించారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడంతో పాటు జాతీయ స్థాయిపోటీలకు అర్హత సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ చీఫ్ కోచ్ డీవీ చారిప్రసాద్, పలువురు శిక్షకులు పాల్గొన్నారు. రాష్ట్ర సాఫ్ట్బాల్ పోటీల్లో జిల్లాకు ద్వితీయ స్థానంసత్తెనపల్లి: 12వ రాష్ట్ర సీనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్బాల్ చాంపియన్ షిప్ 2025 విజేతగా గుంటూరు నిలిచింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లయోలా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో నిర్వహించిన 12వ రాష్ట్ర సీనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్బాల్ చాంపియన్ షిప్ 2025 పోటీలు హోరాహోరీగా జరిగాయి. పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన గుంటూరు టీమ్ చాంపియన్షిప్ కై వసం చేసుకుంది. ద్వితీయ స్థానాన్ని విజయనగరం టీమ్, తృతీయ స్థానం అనంతపురం టీమ్ కై వసం చేసుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.జగ్గారావు హాజరై మాట్లాడారు. క్రీడలతోపాటు విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో 415 పోస్టుల్లో 49 పోస్టులు సాఫ్ట్బాల్ క్రీడాకారులకు దక్కడం అభినందనీయమన్నారు. ట్రాక్టర్ బీభత్సం.. తప్పిన ప్రమాదంరాజాం సిటీ: మండల పరిధి ఒమ్మి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై వై.రవికిరణ్ తెలిపిన వివరాల మేరకు తెర్లాం మండలం నందిగాం గ్రామానికి చెందిన చెరుకూరి గణేష్ ద్విచక్రవాహనం నిలుపుదల చేసి ఒమ్మి గ్రామ సమీపంలో రోడ్డు పక్కన కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో రాజాం నుంచి రామభద్రపురం వైపు వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి మోటార్సైకిల్తో పాటు గణేష్ను, రోడ్డు పక్కన ఉన్న బోనంగి శ్రీహరినాయుడిని ఢీకొని పక్కనున్న బట్టీలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో గణేష్, శ్రీహరినాయుడు, కూరగాయలు విక్రయిస్తున్న పల్లా నర్సమ్మకు గాయాలయ్యాయి. ఇది గమనించిన మరికొంతమంది స్థానికులు పరుగులు తీశారు. వెంటనే స్థానికులు అప్రమత్తమైన బాధితులను 108 సహాయంతో రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. బస్సు, లారీ డీ: ఇద్దరికి స్వల్పగాయాలుదత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి, మరడాం మధ్యలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి బస్సు, లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రామభద్రపురం నుంచి రెండు వాహనాలు గజపతినగరం వెళ్తుండగా కోమటిపల్లి మరడాం మధ్యలో వెనుక నుంచి లారీని బస్సు ఢీకొనడంతో బస్సులో ఉన్న ఇద్దరికి గాయాలు కాగా తోటి ప్రయాణికులు వారిని మరో బస్సు ఎక్కించి పంపించారు. ఈ విషయమై ఎస్ బూర్జవలస ఎస్సై వద్ద ప్రస్తావించగా తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు. -
ఘనంగా ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని దొరజమ్ము గ్రామంలో ఆదివారం ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్(ఏటీఏ) ఆవిర్భావ దినోత్సవంతో పాటు బిర్సా ముండా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తాడంగి సత్యనారాయణ మాట్లాడుతూ బిర్సా ముండా స్ఫూర్తితో తమ సంఘం పోరాటాలు చేస్తుందన్నారు. ఈనెల 15వ తేదీ వరకు అన్ని పాఠశాలల్లో బిర్సా ముండా జయంతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుందని చెప్పారు. రద్దయిన జీవో నంబర్ 3 స్థానంలో ఏజెన్సీలో ఉద్యోగ నియామక చట్టం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడు చక్రపాణి మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో ఉన్న టీచర్స్, సీఆర్టీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా సభ్యురాలు భారతి, గోవింద్, ముత్యాలు, వెంకటేశ్వర్లు, భగవాన్, రవి, యోగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తు వల్లే రోడ్డు ప్రమాదాలు
రామభద్రపురం: మద్యం మత్తు, మితిమీరిన వేగం వల్లే అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఈ మేరకు రామభద్రపురం పోలీస్ స్టేషన్ను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆవరణంతా కలియదిరిగి పరిశీలించారు. అలాగే వివిధ కేసులకు సంబంధించిన రికార్డులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా తక్కువ సిబ్బంది ఉండడంతో పారాది కాజ్వే పాడవడం వల్ల భారీ లారీలు మళ్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని పోలీసులు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ యువత మద్యానికి బానిసవడంతోనే అత్యాచారాలు, తల్లిదండ్రులపై హత్యలకు పాల్పడుతున్నారన్నారు. గ్రామాలలో బెల్ట్ దుకాణాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలీస్స్టేషన్కు పనుల నిమిత్తమో, లేక ఫిర్యాదులు చేయడం కోసమో వచ్చిన వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లల పట్ల పోలీసులు స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. అలాగే రౌడీషీటర్స్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు, సమాజానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారి పట్ల లాఠీ పోలీసింగ్ ఉంటుందని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది కొరత వాస్తవమేనని, కొద్ది రోజుల్లో కొత్త సిబ్బంది వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ భవ్యారెడ్డి, సీఐ కె.నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాసమస్యలపై స్పందించాలి బాడంగి: పోలీస్స్టేషన్లో తమసమస్యల గురించి చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలను మర్యాదపూర్వకంగా కూర్చోబెట్టి సమస్యగురించి సావధానంగా విని పరిష్కారానికి కృషిచేయాలని సిబ్బందిని ఆదేశించినట్టు ఎస్పీ ఏఆర్.దామోదర్ చెప్పారు. ఈ మేరకు బాడంగి పోలీస్స్ట్షేన్ను ఆయన ఆదివారం సందర్శించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సమస్యలలో లీగల్ పొజిషన్ ఉంటే వారికి స్పష్టంగా చెప్పాలన్నారు. రౌడీషీటర్లు, చైన్స్నాచర్స్, దొంగతనాలు జరగకుండా మరింతగా చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ -
జాతీయ స్థాయికి ఎంపికై న చెస్ క్రీడాకారులు
సీతానగరం: మండలంలోని జోగింపేట ఎస్ఓఈ విద్యాలయంలో స్కూల్గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో మూడురోజులు జరిగిన చెస్ పోటీలు ఆదివారం ముగిశాయి. శుక్ర, శని.ఆదివారాల్లో జరిగిన 79వ రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో రాష్ట్రంలోని నలుమూలల నుంచి 398 మంది క్రీడాకారులు 70 మంది అఫీయల్స్ పాల్గొన్నారు. జాతీయ స్థాయికి ఎంపికై న ప్రతిభావంతులు.. అండర్ 17, అండర్ 19 వ్యక్తిగత, టీం విభాగాల్లో విజయం సాధించిన క్రీడాకారులు జాతీయ స్థాయిల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి నేషనల్ టీమ్కు ఎంపికై న క్రీడాకారులు వీరే.. అండర్ 19 బాలికలు ఎస్జీఎఫ్ ఏపీటీం–2025ఆత్మకూరి టింపుల్ ప్రియ–నెల్లూరు. లలిత వై–అనంతపురం. వేముల ప్రద్యుమ్న లక్ష్మి–నెల్లూరు. రెడ్డి నవ్యసాహితి–కృష్ణా. అండర్ 19 బాలురు ఎస్జీఎఫ్ ఏపీటీంమజ్జిరామ్చరణ్తేజ–ఈస్ట్గోదావరి. అల్లుభాస్కరపద్మశార్ముఖ్ రెడ్డి చిత్తూరు. స్వప్న నిహాల్–చిత్తూరు అండర్ 17 బాలికలు ఎస్జీఎఫ్ 2025....సెల్వారావు దేవి దీప్తి యాస్వి–ఈస్ట్ గోదావరి. అస్మితా అనిమి–అనంతపురం లక్ష్మీప్రియా బత్తా–విశాఖపట్నం. జలాది నందిక–కృష్ణా మధుపాడ మనస్వి–విశాఖ పట్నం అండర్ 17 బాలురు ఎస్జీఎఫ్ 2025.. భార్గవ్ సునీత్ సాకేత్ ఎం–ఈస్ట్గోదావరి గండవరపు కార్తీక్– విశాఖపట్నం కర్రి ఓంకార్– వెస్ట్గోదావరి (తానీష్ చొప్ప–విశాఖపట్నం క్రీడాకారులకు అభినందనలురాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో విజయం సాధించి జాతీయస్థాయికి ఎంపికై న క్రీడాకారులందరినీ ఎస్జీఎఫ్ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు అంబినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె ప్రసన్నకుమార్, ఇన్చార్జి ఎంపీడీఓ వెంకటరావు, వ్యాయామ అధ్యాపక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
తాటిపూడి అందాలు అదరహో..!
● పర్యాటకులను ఆకర్షిస్తున్న బుచ్చి అప్పారావుజలాశయం ● ప్రత్యేక ఆకర్షణగా కాటేజీ అందాలు ● కార్తీకమాసంలో పెరుగుతున్న పర్యాటకులు గంట్యాడ: జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో తాటిపూడి ఒకటి. ఇక్కడ ఉన్న ఆహ్లాదకర అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దీంతో జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో పర్యాటకులు వనభోజనాల (పిక్నిక్) కోసం వస్తారు. తాటిపూడిలో ఉన్న గొర్రిపాటి బుచ్చి అప్పారావు జలాశయం అందాలు పర్యాటకుల మనసు దోచేస్తున్నాయి. పచ్చని కొండ కోనల మధ్య జలాశయం నిండుకుండలా ఉంది. జలాశయం అందాలు పాపికొండలను తలపించేలా ఉన్నాయి. బోటుషికారు కూడా ఉండడంతో పర్యాటకులు ఆసక్తిగా వస్తున్నారు. ముచ్చట గొల్పుతున్న కాటేజీ అందాలు బుచ్చి అప్పారావు జలాశయం అవతల పర్యాటకులు విడిది చేసేందుకు కాటేజీ కూడా ఉంది. పర్యాటకులు ఉండేందుకు రూమ్లు కూడా అందంగా తీర్చిదిద్దారు. ఏసీ, నాన్ ఏసీ రూమ్లు ఉన్నాయి. అంతేకాకుండా కాటేజీ ప్రాంతాన్ని అందమైన పెయింటింగ్స్తో తీర్చిదిద్దడంతో ఆహ్లాదకరంగా అప్రాంతం ఉంది. దీంతో పర్యాటకులు కాటేజీని సందర్శించడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ ఉన్న గిరివినాయక విగ్రహం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కాటేజీ ప్రాంతం అరకులో ఉండే అనుభూతిని కల్గిస్తోందని పర్యాటకులు ప్రశంసిస్తున్నారు.అన్ని సౌకర్యాలు ఉన్నాయి కార్తీక మాసంలో పర్యాటకులు ఎక్కువగా వస్తారు. పర్యాటకుల కోసం కాటేజీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాం. ఏసీ, నాన్ ఏసీ రూమ్లు కూడా ఉన్నాయి. పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు వీలుగా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. భోజన వసతి కూడా ఉంది. సీహెచ్.శేషు, కాటేజీ మేనేజర్ -
ఉపాధ్యాయుల హక్కుల కోసం ఏపీటీఎఫ్ ఆందోళన
● విద్యాహక్కు చట్టంలో వెంటనే సవరణలు చేయాలి ● సుప్రీం తీర్పుతో ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన విజయనగరం గంటస్తంభం: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్–1938) విజయనగరం జిల్లా కార్యనిర్వాహక కమిటీ సమావేశం స్థానిక కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎం.బలరాం నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాన్ని ప్రధాన కార్యదర్శి ఎన్వి.పైడిరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.ఈశ్వరరావు మాట్లాడుతూ, 2010వ సంవత్సరం కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టీఈటీ పరీక్ష తప్పనిసరి అని సుప్రీం కోర్టు ఈ ఏడాది సెప్టెంబరు ఒకటో తేదీన ఇచ్చిన తీర్పు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో తీవ్రమైన ఆందోళన సృష్టంచిందని తెలిపారు. ఈ తీర్పుపై పునఃపరిశీలన కోసం..ఉపాధ్యాయుల సమాఖ్య తరఫున ఇప్పటికే తిరిగి విచారణ చేయాలని విజ్ఞప్తి పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తిరిగి విచారించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని, కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టానికి వెంటనే సవరణలు చేయాలని, ఎన్సీఈఆర్టీ నిబంధనల్లో మార్పులు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయుల సమాఖ్య డిమాండ్ చేసింది. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్మి ఎన్వీ.పైడిరాజు మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తగ్గించాలని, పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలు తక్షణం చెల్లించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ ఆర్.కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.వెంకటనాయుడు, జిల్లా సహాధ్యక్షురాలు ఎన్.శ్రీదేవి, అదనపు కార్యదర్మి ఏవీ.శ్రీను, ఉపాధ్యక్షులు మూర్తి, రామారావు, సత్యనారాయణ, విజయనగరం మండలం అధ్యక్షుడు సీహెచ్.పైడితల్లి, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాల ఆహ్వాననాటిక పోటీల విజేతలు వీరే
విజయనగరం టౌన్: గురజాడ కళాభారతిలో మూడురోజుల పాటు నిర్వహించిన నాటికపోటీల విజేతల వివరాలను సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు అభినయ శ్రీనివాస్, గెద్ద వరప్రసాద్లు ఆదివారం వెల్లడించారు. జ్యూరీ బహుమతులు మంజునాథ(గేమ్), కుమారి హర్షిణి (అమ్మ చెక్కిన బొమ్మ), మణికంఠ (కిడ్నాప్), ఉత్తమ లైటింగ్ శ్రీకాంత్, ఉత్తమ ఆహార్యం నాగు, ఉత్తమ సంగీతం నాగరాజు, ఉత్తమ రంగాలంకరణ ఎం.సత్తిబాబు, ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ పి.బాలాజీ నాయక్ (అసత్యం), ఉత్తమ సహాయనటుడు పి.రామారావు (అసత్యం), ఉత్తమ ప్రతినాయకుడు వై.అనిల్ కుమార్ (అసత్యం), ఉత్తమ ద్వితీయ నటి ఎస్.జ్యోతి (స్వప్నం రాల్చిన అమృతం), ఉత్తమ నటి జ్యోతిరాజ్ భీశెట్టి, ఉత్తమ నటుడు భానుప్రకాష్, ఉత్తమ దర్శకత్వం డాక్టర్ వెంకట్ గోవాడ, ఉత్తమ రచన, ఉత్తమ ప్రదర్శన (అమ్మ చెక్కిన బొమ్మ), ఉత్తమ ద్వితీయప్రదర్శన (స్వప్నం రాల్చిన అమృతం)లకు బహుమతులు లభించాయి. పరిషత్ న్యాయనిర్ణేతలుగా పిటి.మాధవ్ (విశాఖ), మానాపురం సత్యనారాయణ (పాలకొల్లు), చిన్నారావు (శ్రీకాకుళం)లు వ్యవహరించారు. అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ లభ్యంగరుగుబిల్లి: గత నెల 27న మండలంలోని సంతోషపురం గ్రామానికి చెందిన నల్ల గంగునాయుడు తన కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి దైవదర్శనం నిమిత్తం వెళ్లగా 28న తిరుమలలోని విష్ణు నివాసం వద్ద తప్పిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేయగా సుంకి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తిరుమలలో పోలీస్శాఖలో పనిచేస్తున్న క్రమంలో వారి కి ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి తప్పిపోయిన గంగునాయుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానిస్టేబుల్స్ రఘు, తిరుమల శేషులను గ్రామస్తులు అభినందించారు. -
జిల్లాస్థాయి బాలల ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం
విజయనగరం: విద్యార్థుల్లో నిబిడీకృతమై ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీసేందుకు, ప్రతిభ పాటవాలను మెరుగుపరిచేందుకు బాలలకు నాటిక పోటీలు దోహదపడతాయని హైకోర్టు న్యాయవాది, అంజని ఫౌండేషన్ వ్యవస్థాపకులు, పువ్వల శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఏర్పాటుచేసిన బాలల ఆహ్వాన నాటిక పోటీల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటిక పోటీలు నైతిక విలువలు పెంపొందించేందుకు సందేశాత్మకంగా రూపొందించినందుకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని గేట్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ గురాన రాధిక అయ్యలు, ఖాదర్ బాబా దర్గా, దర్బార్ నిర్వాహకుడు, ఏటీకే వెలుగు ఓల్డేజ్ హోమ్ ప్రతినిధి మహమ్మద్ అహమ్మద్ బాబు, జనవిజ్ఞాన వేదిక జాతీయ నాయకుడు డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ముళ్లపూడి సుభద్రా దేవి, కుసుమంచి సుబ్బారావులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు వారిలో ఉన్న ప్రజ్ఞాపాటవాలు మిగిలిన వారికి పరిచయం చేసేందుకు, మరిన్ని విషయాలు నేర్చుకునేందుకు పోటీలు దోహదపడతాయన్నారు. నాటిక పోటీలకు సమన్వయకర్తగా ఈపు విజయ్ కుమార్ వ్యవహరించగా, న్యాయ నిర్ణేతలుగా పసుమర్తి సన్యాసిరావు, గెద్ద వరప్రసాద్, ఆదెయ్య మాస్టారు వ్యవహరించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం.స్వరూప, గిరిజా ప్రసన్న, డిమ్స్ రాజు, డీవీ సత్యనారాయణ ,గ్రంధి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు ఉచిత న్యాయ సహాయం
డెంకాడ: పేద ప్రజలు న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం, సలహాలు పొందవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. జిల్లా న్యాయ సేవా దినోత్సవాన్ని పురష్కరించుకుని మండలంలోని డి.కొల్లాం గ్రామంలో న్యాయ అవగాహన సదస్సు ఆదివారం నిర్వహించారు. సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ సమ న్యాయం పొందడం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. రూ.3లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారందరూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి న్యాయ సహాయం పొందవచ్చని చెప్పారు. ఆర్థిక, ఇతర కారణాలు వలన ఏ ఒక్కరూ న్యాయం పొందే అవకాశం కోల్పోకూడదన్న ఉద్దేశంతో 1987 సంవత్సరంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రకారం డీఎల్ఎస్ఏగా ఏర్పాటైందన్నారు. దీని ద్వారా ఉచితంగా న్యాయ సహాయం అందించడమే లక్ష్యమన్నారు. వివక్ష లేకుండా ప్రభుత్వ పథకాలు అందేందుకు కూడా సహాయం చేస్తుందని తెలిపారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నేరుగా గాని, టోల్ఫ్రీ నంబరు 15100కు ఫోన్ చేసి న్యాయ సహాయం పొందవచ్చని వివరించారు. శక్తి యాప్పై విస్తృత ప్రచారం విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు మాట్లాడు తూ బాలికలకు, మహిళలకు రక్షణగా ఉండే శక్తి యాప్ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. సోషల్ మీడియా వలన మంచి, చెడులు కూడా ఉన్నాయని, అందువలన జాగ్రత్తగా వ్యవహరించా లని చెప్పారు. సదస్సులో సర్పంచ్ అట్టాడ కృష్ణ, జిల్లా బార్ అసోషియేషన్ అధ్యక్షుడు కె.రవిబాబు, సీఐ రామకృష్ణ, ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు, న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. -
● నాలుగు గంటల పాటు స్తంభించిన రాకపోకలు ● క్రేన్తో తొలగించిన గోతుల్లో దిగబడ్డ లారీ
బొబ్బిలి: ఈపీఎఫ్ 95 పింఛన్ను రూ.9వేలకు పెంచాలని ఆ సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు పొట్నూరు శంకరరావు, ఉపాధ్యక్షుడు వి.శేషగిరిరావు అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. పరిశ్రమల్లో 30 నుంచి 40 ఏళ్ల పాటు సర్వీసు చేసి లక్షలాది రూపాయల తమ కష్టార్జితాన్ని దాచుకుంటే కేవలం రూ.700 నుంచి 2వేల లోపు మాత్రమే పెన్షన్ ఇవ్వడం దారుణమన్నారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెన్షన్ను పెంచాలని కోరుతున్నామన్నారు. పెన్షన్ అయినా ఇవ్వాలని లేకపోతే చనిపోవడానికి అనుమతులు అయినా ఇవ్వాలని కోరారు. సుమారు 20 కోట్ల మంది ఈపీఎఫ్ – 95 పెన్షన్ దారులున్నారనీ ఈపీఎఫ్ సంస్థ వద్ద రూ.25లక్షల కోట్లున్నాయన్నారు. కానీ అతి తక్కువ పెన్షన్లన్నీ రూ.700 నుంచే ఉన్నాయన్నారు. దీనిని నిరసిస్తూ ఈ నెల 11న ఉదయం 11 గంటలకు తహసీల్దార్ కార్యాలయం వద్ద జరపతలపెట్టిన నిరసన కార్యక్రమానికి కార్మికులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. వారి వెంట రామినాయుడు తదితరులు ఉన్నారు. విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం, కందిపప్పు, నూనె సరుకులు చేరలేదనే అంశంపై సాక్షిలో ఈ నెల 8వ తేదీన అంగన్వాడీల్లో ఆకలి కేకలు అనే శీర్షికన ప్రచురించిన కథనానికి ఐసీడీఎస్ అధికారులు స్పందించారు. మోంథా తుఫాన్ కారణంగా అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా ఆలస్యమైందని ఐసీడీఎస్ పి.డి విమ లరాణి తెలిపారు. ఈ నెల 12వ తేదీ నాటికి సరుకులు కేంద్రాలకు చేరుతాయని తెలిపారు. బొబ్బిలి: పట్టణ పరిధిలోని గొల్లపల్లి నుంచి మండలంలోని అలజంగి – కారాడ గ్రామాల మధ్యలో ఉన్న అతి పెద్ద గోతుల్లో లారీ దిగబడిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆదివారం వేకువ జాము నుంచి ఉదయం 8.30 గంటల వరకూ సుమారు నాలుగు గంటలు పైబడి వందల సంఖ్యలో లారీలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లారీల డ్రైవర్లు, సిబ్బంది ఆహారం కోసం అల్లాడిపోయారు. ఆ సమయంలో అవసరమై న సరుకులు దొరక్క, లారీలు విడిచి వెళ్లలేక అవస్థలు పడ్డారు. మరో పక్క వాహనాలను తప్పించుకుని రావాల్సిన ఆటోలు, మోటారు బైక్లు, ఇతర వాహనాలతో రాలేక ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియాలో ఆయా వాహనాల యజమానులు, డ్రైవర్లు, స్థానికులు రోడ్ల దుస్థితి, తమ ఇబ్బందులపై పోస్టులు పెడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. చివరకు ట్రాఫిక్ ఎస్సై పి.జ్ఞానప్రసాద్ తన సిబ్బందితో వెళ్లి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. బొబ్బిలి: గతంలో మద్యం తాగి వాహనాలు నడిపి తే రూ.10వేల జరిమానా విధించే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు దానితో పాటు వారిని జైలుకు కూడా పంపించి శిక్ష అనుభవించి చేసిన తప్పులు తెలుసుకునేలా చేస్తామని ఎస్పీ దామోదర్ అన్నారు. ఆది వారం రాత్రి పట్టణంలోని పోలీసు సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గంజాయి తరలించినా, సేవించినా కఠినమైన చర్యలుంటాయన్నారు. -
సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్ శ్రీ 2025
విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్ విద్యను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. మరో మూడు నెలల్లో విద్యార్థులు పరీక్షల రాయనుండగా పలు కళాశాలల్లో పూర్తి స్థాయి అధ్యాపకులే లేకుండా కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీతో బోధనలు నెట్టుకొస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పలు కళాశాలల్లో లైబ్రేరియన్లు, కార్యాలయ సిబ్బంది కూడా లేరు. ఇలా ఇంటర్ విద్యలో బేలతనం స్పష్టంగా కనిపిస్తోంది. గాలికొదిలేసిన ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో కొలువుల ఖాళీ జిల్లాలో 14 కళాశాలలు, 27 మంది రెగ్యులర్ అధ్యాపకులు 91 శాతం బోధన భారం కాంట్రాక్ట్, గెస్ట్ అధ్యాపకులపైనే.. కళాశాలల్లో క్రీడలు, విజ్ఞానానికి కరువైన సిబ్బంది చోద్యం చూస్తున్న కూటమి పాలకులు -
టీడీపీలో అసంతృప్తి సెగలు
వీరఘట్టం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ అంధకారంలో ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకులు పరిశీలకుల ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పాలకొండ కూటమిలో నెలకొన్న అంతర్గత విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. స్థానిక శ్రీకోదండరామా కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన పాలకొండ నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల సమీక్ష సమావేశంలో పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ కనుమరుగవుతుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఖండాపు వెంకటరమణ తేల్చి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అహంకార ధోరణితో పార్టీని నమ్ముకున్న టీడీపీ నాయకులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. సొంత పార్టీ కార్యకర్తలపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే తమపై కూడా కేసులు పెడతామని బెదిరిస్తున్నారని పార్టీ పరిశీలకులు ముందు తెలిపారు. సమావేశానికి స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. అనంతరం టీడీపీ అరుకు పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు కిడారి శ్రావణ్కుమార్ మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గం కూటమి నాయకుల్లో అంతర్గత విబేధాలు ఉన్నట్టు స్పష్టమౌతోందన్నారు. ఇక్కడ పార్టీ సీనియర్ నాయకులు చెప్పిన ప్రతీ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పార్టీ పెద్దల సూచనలతో నియోజకవర్గంలో పార్టీ నూతన క్యాడర్ను నియమిద్దామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు శివ్వాల సూర్యనారాయణ, నియోజకవర్గం ఇన్చార్జ్ పడాల భూదేవి, గేదెల గజేంద్ర, కర్నేన అప్పలనాయుడు, బుజ్జి, పప్పల మహేష్, పిన్నింటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అంధకారంలో పాలకొండ టీడీపీ ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ కనుమరుగవుతుంది.. పరిశీలకుల ముందు టీడీపీ సీనియర్ నాయకుల ఆవేదన మరోసారి కూటమిలో బహిర్గతమైన అంతర్గత విబేధాలు -
ప్రణాళిక విభాగంతోనే అభివృద్ధి సాధ్యం
విజయనగరం: నగరాలు, పట్టణాలు అభివృద్ధిలో పట్టణ ప్రణాళిక విభాగం కీలకమని, క్షేత్ర స్థాయి విధుల నిర్వహణలో అనేక ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని ఓ హోటల్లో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడు తూ టౌన్ ప్లానింగ్ విభాగంలో క్షేత్ర స్థాయి సిబ్బంది కొరత ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ కావటం లేదని సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలకు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లుగా వినియోగించుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం స్పందించి పూర్తిగా వారికి బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతలు కల్పించాలన్నా రు. దీనికోసం సచివాలయ ప్లానింగ్ సెక్రటరీల సర్వీస్ రూల్స్ను అమెండమెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ప్లానింగ్ విభాగాన్ని మరింతగా బలోపేతం చేయటం ద్వారా పట్టణాలు, నగరాలు, స్మార్ట్ సిటీలలో అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. నూతనంగా ఏర్పా టు చేస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు వాటికి కనెక్టింగ్ రోడ్లు నిర్మాణానికి ప్రణాళిక విభాగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సభ్యులకు గ్రూప్ ఇన్సూ రెన్స్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన విధి విధానాలను పరిశీలించాలని సూచించారు. అసోసియేషన్ కార్యదర్శి మోహన్బాబు మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఓ మారు సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తున్నామని, సభ్యుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. జోనల్ అధ్యక్షులు వసీంబేగ్ మాట్లాడుతూ నగరాల్లో పట్టణ ప్రణాళిక విభాగంపైనే అధికంగా ఒత్తిడి ఉంటుందని, నగర పౌరులకు ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా ముందుగా ఈ విభాగమే గుర్తుకు వస్తుందన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షు డు అబ్దుల్ సత్తార్, ఆర్డీడీపీ నాయుడు, మొదటి జోన్ అధ్యక్షుడు ఐ.వి.రమణమూర్తి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, జి.కృష్ణ, రతన్ రాజు, టీపీఎస్ సునీత, మతిన్ పాల్గొన్నారు. -
‘కూటమి’ నిర్లక్ష్యం!
ఇంటర్ విద్యపై పార్వతీపురం రూరల్: ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. మరో మూడు నెలల్లో విద్యార్థులు కీలకమైన వార్షిక పరీక్షలకు సిద్ధం కావాల్సిన తరుణమిది. కానీ, జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిస్థితి మాత్రం అంతా గందరగోళం.. అయోమయం అన్నట్టుగా ఉంది. కళాశాలల్లో తిష్ట వేసిన సమస్యలు విద్యార్థుల భవితకు గాలం వేస్తున్నాయి. మౌలిక వసతుల మాట దేవుడెరుగు.. కనీసం పాఠాలు చెప్పేందుకు సరిపడా లెక్చరర్లు, పరిపాలన నడిపేందుకు సిబ్బంది లేక కళాశాలలు కునారిల్లుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా.. ఇంటర్ విద్యపై నిర్లక్ష్యం వీడటం లేదు. దీంతో ఉన్న వారిపై పని భారం, విద్యార్థులకు పాఠాల భారం తప్పడం లేదు. ఆ పోస్టులు అలంకారప్రాయమే..! క్రీడలకు, విజ్ఞానానికి ప్రతీకగా ఉండాల్సిన ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), లైబ్రేరియన్ పోస్టులు చాలా కళాశాలల్లో అలంకారప్రాయంగా మారాయి. పార్వతీపురం, పాలకొండ బాలురు కళాశాలల్లో మాత్రమే పీడీలు పని చేస్తున్నారు. బలిజిపేట, కొమరాడ, పార్వతీపురం, పాలకొండ (బాలురు), సాలూరులోని ఐదు కళాశాలల్లో మాత్రమే రెగ్యులర్ లైబ్రేరియన్లు ఉన్నారు. మిగిలిన తొమ్మిది కళాశాలల్లో ఈ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరో ఒక లెక్చరరే అదనపు బాధ్యతగా వీటిని చూడాల్సి వస్తుండటంతో.. అటు బోధనకు, ఇటు లైబ్రరీ సేవలకు న్యాయం జరగడం లేదు. అక్కడ.. ఆ సబ్జెక్టులు చెప్పేవారేరీ? పరీక్షలు సమీపిస్తున్న వేళ.. పలు కళాశాలల్లో కీలక సబ్జెక్టులకు అధ్యాపకులే లేరు. ప్రధానమైన సబ్జెక్టులకు బోధకులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు ట్యూషన్లపై ఆధారపడలేని పేద విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బోధన సిబ్బంది సంగతి అలా ఉంచితే.. కళాశాల పరిపాలన నడపాల్సిన బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీ ఊసే లేదు. జిల్లాలోని ఏ ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ సూపరింటెండెంట్, క్లాస్–4 ఉద్యోగులు లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్లు ఒక్కో కళాశాలకు ముగ్గురు ఉండాలి, కానీ గుమ్మలక్ష్మీపురంలో ఒక్కరే పని చేస్తున్నారు. అలాగే రికార్డ్ అసిస్టెంట్లు 37 మందికిగాను కేవలం 16 మందే విధుల్లో ఉన్నారు. టైపిస్టులు ఆరు చోట్ల పోస్టులు మంజూరైనా.. పార్వతీపురంలో మాత్రమే ఒకరు పని చేస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్లు 14 కళాశాలలకుగాను ఆరు చోట్లే ఉన్నారు. మిగిలిన ఎనిమిది కళాశాలల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ విద్యకు పునాది వంటిది. అలాంటి కీలకమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ కళాశాలలను గాలికొదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షల షెడ్యూల్ విడుదలైన తరుణంలోనైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి, ఖాళీ పోస్టుల భర్తీపై దృష్టి సారించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటం మానుకోవాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు. జిల్లా పరిధిలో సీతంపేట, గరుగుబిల్లి మినహా 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలన్నీ అరకొర సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాయి. మొత్తం 140 మంది కాంట్రాక్టు ఫ్యాకల్టీ (సీఎఫ్), 12 మంది గెస్ట్ ఫ్యాకల్టీ, ఒక ఎంటీఎస్ లెక్చరర్తో విద్యార్థులకు బోధన సాగుతోంది. రెగ్యులర్ లెక్చరర్లు కేవలం 27 మందే ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. అంటే మొత్తం భారం కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లపైనే పడుతోంది. అయినా ఇంకా 12 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కరువైంది. వారి సేవలను గుర్తిస్తున్న దాఖలాలు కూడా లేవు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. ఈ సమస్య తీవ్రతను రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదించడం జరిగింది. పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తాయని ఆశిస్తున్నాం. ఆదేశాలు అందిన వెంటనే ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. – వై.నాగేశ్వరరావు,జిల్లా కళాశాల విద్యా అధికారి -
జగన్కు పేరొస్తుందనే చంద్రబాబు కుట్రలు
విజయనగరం: అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడితే ప్రజల్లో ఆయనకున్న మంచి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబా బు, కూటమి ప్రభుత్వం భయపడుతోందని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకర ణ చేసే దిశగా కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయా లు చేస్తోందని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుని పేద ప్రజలకు మెరుగైన వైద్యం, వైద్య విద్య ఉచితంగా అందించేందుకు ప్రజా మద్దతో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న బుధవా రం తలపెట్టనున్న ప్రజా ఉద్యమ ర్యాలీలకు సంబందించిన వాల్పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోలగట్ల కూటమి ప్రభుత్వం చేస్తోన్న మోసకారి పాలనపై పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న విజయనగరం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు కోలగట్ల వెల్లడించారు. స్థానిక సీఎంఆర్ జంక్షన్ వద్ద గల దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహం నుంచి స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచి మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ సాగుతుందన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేయటం జరుగుతుందన్నా రు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజా సంఘా లు, కలిసి వచ్చే పార్టీలను భాగస్వాములు చేసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మోసపూరిత హమీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ పబ్బం గడుపుకోవటం విడ్డూరంగా ఉందని కోలగట్ల వాఖ్యానించారు. చేసిందేమీ లేకే.. చెప్పుకునేందుకు చేసిందేమీ లేని కూటమి నాయకు లు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు పేర్లు మార్చి ప్రచారం చేసుకోవటమేనా వారు సాధించిన అభివృద్ధి అంటూ కోలగట్ల ప్రశ్నించారు. అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చినా ఇప్పటికీ ప్రజలంతా అమ్మఒడిగానే పిలుస్తున్నారని చెప్పారు. సచివాలయాలను విజన్ యూనిట్లుగా మార్పు చేసినా ప్రజల గుండెల్లో మాత్రం సచివాలయాలగానే చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఇదే తరహలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన నవరత్నాలు, నాడు–నేడు పథకాలు ప్రజల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నాయన్నాయని వివరించారు. ఈ తరహాలో చంద్రబాబు అమలు చేసిన పథకాల్లో ప్రజలకు టక్కున గుర్తుకు వచ్చే ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఎన్నికలకు ముందు వేదికలపై ఊగిపోతూ ప్రసంగాలు చేసి పదవి వచ్చిన తరువాత యువతను మోసగించటం నిజం కాదా అని ప్రశ్నించారు. సమావేశంలో విజయనగరం కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల పార్టీ అధ్యక్షుడు కెల్ల త్రినాధరావు, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి బోడసింగి ఈశ్వరరావు, కార్పొరేటర్లు జివి.రంగారావు, గాదం మురళి, బండారు ఆనంద్, ఎన్ని లక్ష్మణరావు, పార్టీ నాయకులు అవనాపు లక్ష్మణరావు, రెడ్డి గురుమూర్తి, బొంగ భానుమూర్తి, దుప్పాడ సునీత, తాళ్లపూడి పండు, రౌతు భాస్కరరెడ్డి, సప్పా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మెరకముడిదాం: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 12న తలపెట్టిన ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్, భీమిలి నియోజకవర్గం ఇన్చార్జ్ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మండలంలోని చినబంటుపల్లిలో ప్రజా ఉద్యమానికి సంబంధించి పార్టీ ముఖ్యమైన నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రజా ఉద్యమం వాల్పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ హయాంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు కూటమి నాయకులు చీకటి ఒప్పందం చేసుకున్నారని, దీనిని వ్యతిరేకిస్తూ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీన చేపట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీకి ప్రతీ గ్రామం నుంచి 20 బైక్లకు తక్కువ కాకుండా పాల్గొనే విధంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలన్నారు. బైక్ ర్యాలీ గరివిడి శంకర్ ఫంక్షన్ హాలు నుంచి బయలుదేరి చీపురుపల్లిలోని మూడురోడ్లు కూడలి వరకూ నిర్వహించనున్నామని తెలిపారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు ఎస్.వి.రమణరాజు, తాడ్డి వేణుగోపాల్రావు, కోట్ల విశ్వేశ్వరరావు, కె.ఎస్.ఆర్.కె.ప్రసాద్, బూర్లె నరేష్కుమార్, పప్పల కృష్ణమూర్తి, రేగిడి లక్ష్మణరావు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. -
ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించాలి : యూటీఎఫ్
విజయనగరం అర్బన్: రాష్ట్రంలో ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్ లేకపోవడం వలన అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ప్రభుత్వం తక్షణమే జీవో నంబరు 73, 74 ప్రకారం ఉమ్మడి సర్వీసులు ఏర్పాటు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన జిల్లా కమిటీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వీస్ రూల్స్ లేకపోవడం వలన డీఈవో, డిప్యూటీ డీఈవో వంటి కీలక పదవుల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా ప్రమోషన్ పొందకపోవడం విచాకరమన్నారు. జీవో 243 రద్దు కారణంగా పాఠశాల విద్య నుంచి కళాశాల విద్యను వేరు చేయడం వలన జూనియర్ లెక్చరర్ పోస్టులలో ఉపాధ్యాయులకు ప్రమోషన్ అవకాశం లేకపోవడం అన్యాయమని ఆరోపించారు. నాన్ టీచింగ్ సిబ్బందికి జూనియర్ లెక్చరర్గా ప్రమోషన్ కల్పిస్తూనే అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఆ అవకాశం ఇవ్వకపోవడం అసంబద్దమని ఆయన పేర్కొన్నారు. సర్వీసు రూల్ అమలు చేయకపోవడం వల్ల ప్రస్తుతం 400కు పైగా మండలాల్లో ఎంఈవో–1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇది విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని స్పష్టం చేశారు. టెట్ నుంచి మినహాయించాలి 2001–10 కంటే ముందు నియమించబడి ఐదేళ్లకి పైగా సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులకు టెట్ పాస్ కావాలనే నిబంధన నుంచి మినహాయించాలని కోరారు. డీఎస్సీ రాసి ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులను నేడు టెట్ పాస్ కావాలని చెప్పడం అన్యాయమని పేర్కొన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జేఏవీఆర్కే ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాత కష్టం.. దళారుల పాలు..!
పార్వతీపురం రూరల్: ఆరుగాలం కష్టించి, ఎకరాకు దాదాపుగా రూ.30 వేలు పెట్టుబడిగా పెట్టి, మోంథా తుఫాన్లను సైతం తట్టుకుని అనేక అవస్థలు పడుతూ నిలబడిన అన్నదాతకు.. పంట చేతికందే వేళ కన్నీరే మిగులుతోంది. ఖరీఫ్ వరి కోతలు కోత మిషన్ల సాయంతో జోరందుకున్నాయి. ఎకరాకు రూ.3000 నుంచి రూ.3300 వరకు కోతలకే వెచ్చిస్తున్న రైతుకు, పండించిన పంటను అమ్ముకునేందుకు మాత్రం దారి దొరకడం లేదు. కూటమి ప్రభుత్వం జిల్లాలో 190 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని, 2.52 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని ప్రకటించినా.. ఆచరణలో మాత్రం వాటి జాడ లేదు. దీంతో ఇప్పటికే కోసిన పంటను ఏం చేయాలో తెలియక, నిల్వ ఉంచేందుకు వీలులేక.. రైతులు తమ ఇళ్ల ఎదుట రోడ్లపైన, వ్యవసాయ కళ్లాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టి పడిగాపులు కాస్తున్నారు. అధికారుల జాప్యంతో.. దళారులకే లాభం.. రైతుల ఇబ్బందే అదునుగా దళారులు రంగప్రవేశం చేశారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2,369 ఉండగా, దళారులు మాత్రం రూ.1800 నుంచి రూ.2000 వరకే చెల్లిస్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల వ్యాపారులు 42 కిలోల బస్తాను కేవలం రూ.700కే కొనుగోలు చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నారు. ప్రభుత్వ లెక్క ప్రకారం ఇదే బస్తాకు రూ.946 దక్కాల్సి ఉండగా, బస్తాకు రూ.246 నష్టాన్ని రైతులు భరించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ జాప్యంపై అధికారులను ఆరా తీయగా ఈ నెల 15వ తేదీ తర్వాత కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావచ్చు అని స్పష్టత లేని విధంగా చెప్పడం రైతుల ఆందోళనను మరింత పెంచుతోంది. అప్పటి వరకు వాతావరణ హెచ్చరికల నడుమ పంటను ఎలా కాపాడుకోవాలని, వర్షాలు వస్తే గతేమిటని అన్నదాతలు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో దళారులకే విక్రయించడమే మేలని అమ్మేస్తున్నారు. కళ్లాల్లోనే ధాన్యం.. కానరాని కొనుగోలు కూటమి సర్కార్ తీరుతో రైతుల బేజారు ఎకరాకు పెట్టుబడి రూ.30 వేలు... మిగిలేది కన్నీళ్లే.. తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు అప్పజెబుతున్న ధాన్యం క్వింటాకు రూ.570 నష్టానికే విక్రయాలు ఏర్పాట్లు చేస్తున్నాం.. ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా మిల్లుల నుంచి బ్యాంక్ గ్యారంటీలు స్వీకరించే ప్రక్రియ, అవసరమైన గోనె సంచుల సేకరణ ప్రక్రియ తుది దశలో ఉన్నాయి. సాంకేతికపరమైన అంశాలు, సిబ్బంది కేటాయింపులు కూడా పూర్తి చేస్తున్నాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఏదేమైనా ఈ నెల 15వ తేదీలోపు జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాలను తప్పనిసరిగా ప్రారంభించి, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తాం. – శ్రీనివాస్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ -
తగిన ఫలితం దక్కడం లేదు
ఆరుగాలం శ్రమించి అతి కష్టం మీద విత్తనాలు, యూరియా, ఎరువులు సేకరించి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాం. తుఫాన్ వంటి వాతావరణ ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొని నిలబడ్డాం. తీరా అతి కష్టం మీద పంటను ఇంటికి తీసుకువస్తే.. ఇప్పుడు సరైన కొనుగోలు అవకాశాలు లేక, ధాన్యం నిల్వలను దాచుకొనే పరిస్థితి లేక వాతావరణంలో వస్తున్న మార్పులకు భయపడి తక్కువ ధరకే నష్టాన్ని భరిస్తూ దళారులకు అమ్ముకోవల్సి వస్తుంది. ప్రభుత్వం ముందస్తు ఆలోచనలు, ప్రణాళికలు చేసి ప్రకృతి వైపరీత్యాల సైతం దృష్టిలో పెట్టుకొని కొనుగోలు ప్రారంభించి ఉంటే రైతులకు కొంతమేరకు నష్టం వాటిల్లే పరిస్థితి దాపురించేది కాదు. – ఎస్.శేషగిరిరావు, కౌలు రైతు, వెంకంపేట -
రైతుల అభ్యున్నతికి కృషి చేయాలి
● మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నెల్లిమర్ల రూరల్: రైతుల అభ్యున్నతికి సెంచూరియన్ విశ్వ విద్యాలయం దోహదపడాలని, వారి ఆదాయం రెట్టింపుకు కృషి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. మండలంలోని టెక్కలి సెంచూరియన్ వర్సిటీలో రైతు సమ్మేళనం కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయం లాభసాటిగా మారేందుకు అవసరమైన సూచనలను రైతులకు అందజేయాలన్నారు. వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డీఎన్ రావు మాట్లాడుతూ మట్టి లేకుండా వ్యవసాయం, గాలితో పంటలు పండించడం.. తదితర వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టామన్నారు. విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో గ్రామాలను దత్తత తీసుకుని నూతన పద్ధతులను రైతులకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లోకం మాధవి, పూసపాటి అదితి గజపతిరాజు, తదితరులు పాల్గొన్నారు. నేడు సీనియర్ ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపికలు విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న సీనియర్స్ సీ్త్ర, పురుషుల ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 9న ఆదివారం నిర్వహించనున్నట్టు చీఫ్ కోచ్ డివి.చారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర శివారుల్లో గల విజ్జి స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి ఎంపికలు ప్రారంభమవుతాయని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాజమండ్రిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్టు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
బీసీ, ఓబీసీ ఉద్యోగుల ఐక్యతకు కొత్త కార్యవర్గం
విజయనగరం గంటస్తంభం: ఆంధ్రప్రదేశ్ బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం విజయనగరం జిల్లా యూనిట్ కార్యవర్గ ఎన్నికలు శనివారం స్ధానిక రెవెన్యూ హోమ్లో నిర్వహించారు. ఈ ఎన్నికలను రాష్ట్ర ప్రధాన కార్యదర్మి పక్కి భూషణ్రావు అధ్యక్షతన చేపట్టగా, ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర ఖజానాధికారి వై.శంకరరావు, ఎన్నికల అధికారి, సంఘ లీగల్ అడ్వైజర్ పి.రామచంద్రరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా బీసీ, ఓబీసీకి చెందిన వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై నామినేషన్లు దాఖలు చేశారు. అధ్యక్షుడుగా వివిఆర్.జగన్నాధరావు(రెవెన్యూ), కార్యదర్మిగా ఎం.ఆదినారాయణ(ట్రెజరీ శాఖ), ఖజానాధికారిగా ఎస్.బంగారు రాజు(సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం), అసోసియేట్ అధ్యక్షుడుగా ఎం.బలరాంనాయుడు(సహకార సంస్థలు, హెచ్ఆర్), ఆర్గనైజింగ్ కార్యదర్మిగా బి.శ్రీనివాసరావు(విద్యా శాఖ), ఉపాధ్యక్షులుగా కె.నరేంద్ర(పంచాయతీ రాజ్), కె.పాపారావు(అటవీ శాఖ), డాక్టర్ ప్రవీణ్కుమార్(ఆర్టీసీ వైద్యశాల), ఎం.ఎస్.గౌరీదేవి(పశుసంవర్ధక శాఖ), కేపీ నాయుడు(ఆర్అండ్బీ), పంచాయతీ కార్యదర్ములు విభాగానికి పి.శివరామకృష్ణ, జాయింట్ కార్యదర్శులుగా పతివాడ శ్రీనివాసరావు(పోస్టల్), బి.మోహన్ నాయుడు(బీఎస్ఎన్ఎల్), సీఎన్.శేఖర్(న్యాయ విభాగం), వెంకటరావు(దేవదాయ శాఖ), ఎం.తాతయ్య(ఆర్టీసీ కండక్టర్లు) ఎంపికయ్యారు. ఈ ఎన్నికలకు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.బాలభాస్కర్, శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షుడు డి.చక్రపాణి, శ్రీకాకుళం అధ్యక్ష, కార్యదర్ములు, ఏపీజీఈఏ రాష్ట్ర కార్యదర్మి ఎల్వి.యుగందర్ తదితరులు హాజరయ్యారు. వివిధ శాఖల నుంచి ఏకగ్రీవ ఎంపిక -
జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలి : జేసీ
పార్వతీపురం టౌన్: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి ఉన్నత వేదికలపై అవకాశాలు కల్పించడమే క్రీడల ప్రధాన ఉద్దేశమని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి తెలిపారు. క్రీడలు కేవలం విజయం కోసం మాత్రమే కాదని, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఉపయోగపడతాయని ఉద్ఘాటించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలని ఆకాంక్షించారు. జన్ జాతీయ గౌరవ దివాస్ వేడుకల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఆటలు మరియు క్రీడలు ఐటీడీఏ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి జేసీ ముఖ్య అతిథిగా పాల్గొని ఆటలను, క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఆర్చరీ, జావలిన్ త్రో, వాలీబాల్, కబడ్డీ, వక్తత్వ, వ్యాస రచన పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులను, కోచ్లను, పీఈటీలు, పీడీలను జేసీ అభినందించారు. అనంతరం వాలీబాల్ క్రీడలో పాల్గొని జేసీ కాసేపు క్రీడాకారులతో కలిసి ఆడారు. క్రీడలతో విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం, ఉత్తేజంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని, ప్రతీ విద్యార్థి ఏదో ఒక క్రీడ, ఆటల్లో నైపుణ్యాన్ని పెంపుందించుకోవాలని అన్నారు. జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయిలో కూడా పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే వ్యాసరచన, వక్తృత్వ పోటీలను జేసీ తిలకించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో పి.మురళీధర్, ఆర్.కృష్ణవేణి, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న స్కూల్ గేమ్స్
సీతానగరం: మండలంలోని జోగింపేట ఎస్వోఈ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్ షిప్ (2025 – 26) అండర్ 14, 17, 19 బాల బాలికల పోటీలు శనివారం కూడా జరిగాయి. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన పోటీలు శనివారం కూడా జరగ్గా ఉమ్మడి 13 జిల్లాల నుంచి బాలురు 193 మంది, బాలికలు 186 మంది పాల్గొన్నారు. సెమీఫైనల్స్ ఆదివారం జరగనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో డీఈవో రాజకుమార్, ఎంఈవోలు జి.సూరిదేముడు, ఎం.వెంకటరమణ, పోటీల నిర్వహణ ఇన్చార్జి పీడీ సబ్బాన మురళి, జోగింపేట ఎస్వోఈ విద్యాలయం ప్రిన్సిపాల్ ధర్మరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విద్యాలయ ప్రిన్సిపాల్, 13 జిల్లాల ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు, పీడీలు పాల్గొన్నారు. -
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే...
● అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ ● కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి విజయనగరం గంటస్తంభం: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక కేఎల్ పురం కమ్యూనిటీ హాల్లో ఆ సంఘం ఉమ్మడి జిల్లాల మహాజన సభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు ఉన్న హెచ్ఆర్సీ పాలనీ అన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అమలు చేయాలని కోరారు. పీఆర్సీలో కనీస వేతనాన్ని రూ.26 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలని, ప్రతి ఏటా రూ.వెయ్యి ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న సెలవులు, హెల్త్కార్డు వంటి సదుపాయాలు తమకు కల్పించాలన్నారు. పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, రిటైరయ్యే ఉద్యోగులకు కనీసం రూ.20లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండు లక్షల 60 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్లో చేర్చారని కానీ సమస్యలను పరిష్కరించడంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. థర్డ్ పార్టీ సంస్థలకు పనులు అప్పగించడంతో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. సభలో ఏపీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దూసి భానోజీరావు, జనరల్ సెక్రటరీ పి.గురునాథ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జి.మహేంద్రబాబు, పెద్ద సంఖ్యలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
బాలాలయంలోనే పైడితల్లి దర్శనం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అమ్మవారి మూలవిరాట్కు ఎటువంటి ఆటంకం కలగకుండా బాలాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 10న సోమవారం ఉదయం 9 గంటల నుంచి బాలాలయం వద్ద వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఆలయ ఇన్చార్జ్ ఈవో కె.శిరీష శనివారం తెలిపారు. వైదిక సిబ్బందితో కళాప్రకర్షణ చేపట్టనున్నామన్నారు. దేవాలయ విస్తరణ పనులు పూర్తయినంత వరకూ అమ్మవారిని బాలాలయంలోనే భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతీ నెలలో వచ్చే మూడో మంగళవారం చదురుగుడి వద్ద నిర్వహించే చండీహోమ కార్యక్రమాలను రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి వద్ద నిర్వహిస్తామన్నారు. దేవాలయ పనులు పూర్తయ్యేవరకూ ప్రధాన ఆలయంలో దర్శనాలు ఉండవన్నారు. రెజ్లింగ్లో సత్తా చాటిన విద్యార్థులు చీపురుపల్లి రూరల్ (గరివిడి): గరివిడి శ్రీరామ్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరిగిన రెజ్లింగ్ పోటీల్లో ప్రతిభను చాటారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన కడగల కిషోర్, గురాన దిలీప్, మాడుగుల అఖిల్, ఆరంగి ఉన్ముక్త సత్తా చాటి రజత పతకాలను సాధించారు. రారష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభను కనబరిచి రజత పతకాలను సాధించిన విద్యార్థులను మండల ప్రత్యేకాధికారి పి.రామారావు, హెచ్ఎం నిర్మల, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.ఉదయ్కుమార్, సహోపాధ్యాయ సిబ్బంది అభినందించారు. తూనికల కాటాలకు సీల్స్ తప్పనిసరి ● జిల్లా అధికారి రత్నరాజు వీరఘట్టం: ప్రతీ వ్యాపారస్తుడు తమ షాపుల్లో వినియోగించే కాటాలకు ప్రతీ ఏటా సీల్స్ వేయించాలని జిల్లా తూనికులు, కొలతల అధికారి కె.రత్నరాజు సూచించారు. స్థానిక కోదండరామ కల్యాణ మండపంలో కాటాలకు సీల్స్ వేసే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. దీంతో మండల వ్యాప్తంగా ఉన్న వ్యాపారస్తులు తమ కాటాలకు సీల్స్ వేయించడానికి తీసుకువచ్చారు. ఆ కాటాలకు ప్రైవేటు ఏజెన్సీ సభ్యులు సీల్స్ వేశారు. ప్రతీ కాటాకు రూ.1500 లు సర్వీసు చార్జీలు వసూళ్లు చేస్తుండడంపై వ్యాపారులు మండిపడుతున్నారు. అధికారుల సమక్షంలోనే అందరి వద్ద ఇలా వసూళ్లు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. డిజిటల్ అసిస్టెంట్ సస్పెన్షన్ మెంటాడ: మండలంలోని జయతి సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ నెక్కల శ్రీనును కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్వర్వులు ఇచ్చినట్టు డిప్యూటీ ఎంపీడీవో విమలకుమారి శనివారం తెలిపారు. అక్టోబర్ నెలకు సంబంధించి 15 మంది సామాజిక పింఛన్దారుల పింఛన్ సొమ్ము రూ.70,500 లబ్ధిదారులకు అందజేయకుండా సొంత అవసరాలకు వాడుకొని దుర్వినియోగం చేసినట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలతో శ్రీనును సస్పెండ్ చేసినట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు సీతంపేట: మండలంలోని హడ్డుబంగి మలుపు వద్ద ఆటో, బైక్ ఢీకొన్న సంఘటనలో చింతాడకు చెందిన రామారావుకు గాయాలయ్యాయి. కొత్తూరు నుంచి వస్తున్న ఆటో సీతంపేట నుంచి కొత్తూరు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు ఎదురెదురుగా రావడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయాలైన వ్యక్తి స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అమ్మన్నరావు తెలిపారు. -
నేరాల నియంత్రణకు చర్యలు : ఎస్పీ
వంగర: జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పని చేయాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. అల్లర్లు సృష్టించే రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. శనివరం వంగర పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ, కేసుల నమోదు, పెండింగ్ కేసులు, సిబ్బంది పనితీరు తదితర అంశాలపై పరిశీలన చేశారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడారు. గ్రామాల్లో దొంగతనాలకు ఆస్కారం లేకుండా రాత్రి సమయాల్లో పోలీస్ గస్తీ చేపట్టాలన్నారు. అనుమానిత వ్యక్తులు, అపరిచిత వ్యక్తులు సంచారంపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. వాహనదారులకు హెల్మెట్స్ వాడకం తప్పనిసరి చేయాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వాహనదారులపై కేసులు నమోదు చేయాలన్నారు. పోక్సో చట్టంపై యువతతో పాటు విద్యా సంస్థల్లో అవగాహన కల్పించాలన్నారు. పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా మెలగాలన్నారు. పోలీసులు గ్రామాల్లో ప్రజలతో సోదర భావంగా మెలగాలన్నారు. కార్యక్రమంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్రరావు, ఎస్సై షేక్ శంకర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
కేన్సర్పై ముందుస్తు తనిఖీలు చేసుకోవాలి
విజయనగరం ఫోర్ట్: కేన్సర్ మీద ముందుస్తు తనిఖీలు చేసుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.జీవనరాణి తెలిపారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద శుక్రవారం జాతీయ కేన్సర్ అవగాహన దినం సందర్బంగా నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేన్సర్ లక్షణాలు ఉంటే జీజీహెచ్ కేన్సర్ విభాగంలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. కేన్సర్ వ్యాధి ప్రపంచంలో రెండో స్థానంలో ఉందన్నారు. కేన్సర్ బాధితుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి వ్యాధి ముదిరిన తర్వాత నిర్ధారణ అవుతుందన్నారు. నిరక్షరాస్యత, భయం, వివిధ రకాల అపోహల వల్లే కేన్సర్ నిర్ధారణ ఆలస్యం అవుతుందన్నారు. పొగాకు, ఊబకాయం, ఆహారపు అలవాట్లు, ఇన్పెక్షన్లు ద్వారా కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డీఎల్వో డాక్టర్ కె.రాణి, డీఐవో డాక్టర్ అచ్చుతకుమారి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సూర్యనారాయణ, ఎన్సీడీ పి. ఒ.డాక్టర్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ జీవనరాణి -
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత
విజయనగరం క్రైమ్: పోలీసు కంట్రోల్ రూంలో హెచ్సీగా పని చేసి, ఇటీవల అనారోగ్య కారణంతో మృతి చెందిన ఎస్.సత్యనారాయణ కుటుంబానికి జిల్లా పోలీసు శాఖలో పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది సమకూర్చిన రూ.1,48,000ల చెక్ను ఆయన భార్య ఎస్.త్రివేణికి ఎస్పీ దామోదర్ డీపీవోలో శుక్రవారం అందజేశారు. దీంతో పాటు పోలీసు ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ సభ్యత్వం ఉండడంతో ఫ్యునరల్ ఖర్చుల నిమిత్తం రూ.30వేలు, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో దాచుకున్న రూ.1,05,906ల చెక్కులను ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో చేస్తున్న ఈ సాయం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏవో పి.శ్రీనివాసరావు, కార్యాలయ సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, అడహక్ కమిటీ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, కో ఆపరేటివ్ కార్యదర్శి నాయుడు పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన ఐవోటీ శిక్షణ
విజయనగరం రూరల్: విజయనగరం జేఎన్టీయూ జీవీ, చైన్నె జాతీయ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ, విశాఖపట్నం నైపుణ్యాలు, సామర్థ్యాల మండలి సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) శిక్షణ శుక్రవారం ముగిసింది. జేఎన్టీయూ జీవీలో రెండు వారాల పాటు డిజిటల్ విధానంపై ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ అందించారు. జేఎన్టీయూ జ వీలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఉపకులపతి వి.వి.సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ధ్రువపత్రాల కంటే నైపుణ్యమే ముఖ్యమైందన్నారు. ఉద్యోగ అవకాశాలకు నైపుణ్యాలు అవసరమని తెలిపారు. అనంతరం శిక్షణ పూర్తి చేసిన ఉద్యోగులకు ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి.జయసుమ, ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు, కన్వీనర్ డాక్టర్ టి.ఎస్.ఎన్.మూర్తి, కోఆర్డినేటర్ డబ్ల్యూ.అనిల్, ఎన్ఐఈ ఎల్టీ ప్రతినిధులు ఇశాంత్కుమార్ బజ్పాయి, ప్రశాంత్, సీఎస్సీ ఇండియా ప్రతినిధి రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి ఏపీయూడబ్ల్యూజే కృషి
విజయనగరం అర్బన్: వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి ఏపీయూడబ్ల్యూజే కృషి చేస్తుందని ఆ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పీఎస్ఎస్వీ ప్రసాదరావు వెల్లడించారు. ఎన్నికై బాధ్యతలు తీసుకున్న తరువాత జిల్లాకు వచ్చిన ఆయన శుక్రవారం స్థానిక ప్రైవేటు హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఫిబ్రవరిలో ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) జాతీయ సమావేశాలు విజయవాడలో జరగనున్నాయని తెలిపారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తానని చెప్పారు. విజయనగరంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ కోసం కమిటీ ఏర్పాటు చేసినట్టు ఎవరికై నా ఎలాంటి సహాయం అవసరమైతే కమిటీ సభ్యులు అందిస్తారని తెలిపారు. అక్రిడిటేషన్ కమిటీ, రాష్ట్ర యూనియన్ కమిటీలలో జిల్లాకు ప్రాధాన్యత ఇస్తామని నిబద్దత గల యూనియన్గా రాష్ట్ర సంఘంలో గుర్తింపు ఉందని ఆయన అన్నారు. ఆయనను సంఘం జిల్లా కమిటీ ఘనంగా సత్కరించింది. సమావేశంలో యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంఎస్ఎస్ రాజు, కౌన్సిల్ సభ్యుడు టి.రాధాకృష్ణ, జాతీయ కౌన్సిల్ సభ్యుడు వేదుల సత్యనారాయణ, జిల్లా కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్వర మహాపాత్రో, కార్యదర్శి డేవిడ్ రాజు, జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు పంచాది అప్పారావు, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు కేజేశ ర్మ, విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎల్.నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నాయకుడి దురుసు ప్రవర్తనపై ఆగ్రహం
● సమస్యలపై మాట్లాడితే సంగతి తేలుస్తానంటూ హెచ్చరిక ● టీడీపీ నాయకుడి తీరుపై ప్రజా సంఘాల నేతల ఆగ్రహంపార్వతీపురం రూరల్: టీడీపీ నాయకుడు రాష్ట్ర కొప్పలవెలమ డైరెక్టర్ గొట్టాపు వెంకటనాయుడు వైఖరి ప్రజాస్వామ్య విరుద్ధమని సీపీఎం సీనియర్ నాయకుడు ఎం.కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు. రాజకీయ అండదండలతో గిరిజనులను బెదిరించడం మానుకోవాలని ఆయన తేల్చి చెప్పారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఆయన మాట్లాడుతూ గిరిజన సంఘం నాయకుడు పాలమెట్ట రాముకు గురువారం రాత్రి వెంకటనాయుడు ఫోన్ చేసి జమదాల సచివాలయం వద్ద నిరసన చేయడం పట్ల ప్రశ్నిస్తూ దుర్భాషలాడారని.. ఇకనైనా ఇటువంటి పనులు మానుకోలేకుంటే నీ సంగతి తేలుస్తా.. అని బెదిరించారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం తమ హక్కు అని, జమదాల గ్రామ సచివాలయం వెంకటనాయుడు జాగీరు కాదని సీపీఎం నాయకులు స్పష్టం చేశారు. జమదాల ప్రాంతంలో జరుగుతున్న భూ సర్వేలోని తప్పులను సరి చేయాలని ఫిర్యాదు చేస్తే.. ఈ విధంగా అడ్డుకొనే ప్రయత్నం చేయడం వెనుక అక్రమాలపై వెంకటనాయుడు ప్రమేయం ఉందని వారు ధ్వజమెత్తారు. బెదిరింపులకు భయపడేదే లేదని, ప్రజల పక్షాన నిలబబడతామని పాలమెట్ట రాము తేల్చి చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బంటు దాసు, మరికొందరు గిరిజనులు పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్ క్యాంపు కోర్టులో 256 కేసుల పరిష్కారం
బొబ్బిలి: స్థానిక రైల్వేస్టేషన్లో విశాఖ ఫస్ట్ క్లాస్ అడిషనల్ సివిల్ జడ్జి జి.కార్తీక్ ఆధ్వర్యంలో రైల్వే క్యాంపు కోర్టును నిర్వహించారు. బొబ్బిలి ఆర్పీఎఫ్ పోస్టు పరిధిలోని గరుగుబిల్లి, కూనేరు రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే నిబంధనలను అతిక్రమించిన ప్రయాణికులు, ఇతరులపై వివిధ సెక్షన్ల కింద నమోదయిన 256 పెట్టీ కేసులను క్యాంపు కోర్టులో పరిష్కరించారు. రైల్వే లైను, స్టేషన్ల పరిధిలో జరిగిన నిబంధనల అతిక్రమణలపై ఆయా కక్షిదారులకు జరిమానాలు విధించారు. అలాగే నిబంధనలను పాటించాల్సిన అవసరం అందరికీ ఉందని వారిని చైతన్యపరిచారు. రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పశువైద్యులే లేరు.. ఇక సేవలు ఎలా...!
● సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో వైద్యులు లేకుండా నిర్వాహణ ● జిల్లాలో 13 వాహనాలు ● 6 వాహనాల్లో వైద్యులు లేరు ● పారావెట్లతో వైద్యం కానిచ్చేస్తున్నారు.. ● మూగజీవాలకు అందని నాణ్యమైన వైద్య సేవలువిజయనగరం ఫోర్ట్: మూగజీవాలకు నాణ్యమైన వైద్య సేవలు, గ్రామాలకు వెళ్లి సేవలు అందించాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంచార పశు ఆరోగ్య సేవ (1962) వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్రోల్ఫ్రీ నంబరు 1962కు ఫోన్ చెయ్యగానే సంబంధిత గ్రామానికి చేరుకునేవారు. వాహనంలో ఉండే పశు వైద్యుడు, పారావెట్, డ్రైవర్లు రైతు పశువులశాల వద్దకు వెళ్లి పశువులకు వైద్యం అందించేవారు. శస్త్రచికిత్స అవసరం అనుకుంటే అదే వాహనం విజయనగరం ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స నిర్వహించిన తర్వాత తిరిగి రైతు కళ్లానికి అప్పగించేవారు. రైతు వద్దకే సేవలు అందడంతో అప్పట్లో రైతులు ఎంతో సంతోషించారు. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత సంచార పశు ఆరోగ్యసేవ వాహనాలను నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహనాల్లో పూర్తి స్థాయి సిబ్బంది, మందులు లేకుండానే వాహనాలను నిర్వహిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో 1962 వాహనాలను జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ నిర్వహించేది. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత వాటి నిర్వాహణను భవ్య హెల్త్ సర్వీసెస్ సంస్థకు అప్పగించారు. పశువైద్యులు లేకుండానే వాహనాల నిర్వాహణ..! మూగ జీవాలకు వైద్య సేవలు అందించాలంటే పశు వైద్యుడు ఉండాలి. కాని సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో పశు వైద్యుడు లేకుండానే వైద్య సేవలు అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సగం వాహనాలకు పశు వైద్యులు లేరని తెలుస్తుంది. విజయనగరం మినహా మిగిలిన నియోజకవర్గాలకు రెండు చొప్పన సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను కేటాయించారు. విజయనగరం నియోజకవర్గంలో ఒకటి, గజపతినగరం నియోజకవర్గంలో 2, నెల్లిమర్లలో 2, చీపురుపల్లిలో 2, ఎస్.కోటలో 2, బొబ్బిలిలో 2, రాజాంలో నియోజకవర్గంలో 2 చొప్పున మొత్తం 13 వాహనాలు జిల్లాలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆరు వాహనాల్లో పశు వైద్యులు లేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయనగరం, ఎస్.కోట, నెల్లిమర్ల, గజపతినగరం, రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి, బొబ్బిలి నియోజకవర్గంలోని తెర్లాంలో వాహనాల్లో పశువైద్యులు లేరనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యులు లేకుండానే వాహనాలను నిర్వహిస్తున్నట్టు సమాచారం. వైద్యులు లేని వాహనాల్లో పారావెట్లతో పని కానిచ్చేస్తున్నారు. దీని వల్ల పశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశువైద్యుడు ఉంటే నాణ్యమైన వైద్యం అందుతుందని రైతులు పేర్కొంటున్నారు. వైద్యుల నియామకం చేపట్టని వైనం పశు వైద్యులు ఖాళీ అయినట్టయితే వెంటనే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియామకం చేపట్టేవారు. కూటమి పాలనలో మూడు నెలలుగా పశు వైద్యులను నియమించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పశు వైద్యుడికి రూ.45 వేలు జీతం చెల్లిస్తున్నారు. నియామకం చేపట్టకపోతే ఆ డబ్బు తమకు మిగులుతాయని ఉద్దేశంతో నియామకం చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారం ఇవ్వండి
పార్వతీపురం టౌన్: జిల్లాలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్ధాల అక్రమ రవాణా జరుగుతున్నట్టు తమ దృష్టికి వస్తే 1972 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఈ విషయంలో చురుకుగా పాల్గొని, వివరాలను అందజేయాలని కోరారు. మాదకద్రవ్యాల రవాణా నివారణ, రహదారి భద్రతపై అవగాహన సదస్సు శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపోలో రవాణా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను వాహన డ్రైవర్లు తెలిసి చేసినా, తెలియక చేసినా శిక్షార్హులు అవుతారని స్పష్టం చేశారు. ఈ అక్రమ రవాణాకు చట్టంలో కఠిన శిక్షలు ఉన్నాయని, జీవితాంతం జైలులోనే ఉండాల్సి ఉంటుందని హితవు పలికారు. అందువలన ప్రతీ డ్రైవర్ కూడా తమ వాహనాల్లో తీసుకువెళ్లే బ్యాగులను, సంచులు, ఇతర సామగ్రిపై దృష్టి సారించాలని, అనుమానస్పదంగా ఉంటే తక్షణమే టోల్ ఫ్రీ నంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతీ డ్రైవర్ కచ్చితంగా రహదారి భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ తేల్చి చెప్పారు. ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో విశాలమైన రహదారులు లేకపోవడం, ఉన్న రహదారుల్లో సక్రమంగా రహదారి భద్రత నియమాలు పాటించని కారణంగా ఈ ఏడాదిలో సుమారు 80 మంది వరకు మృతి చెందారని, 150 మంది వరకు క్షతగాత్రులు అయ్యారని వెల్లడించారు. అతి వేగం, మితిమీరిన మనుషులను వాహనాల్లో ఎక్కించుకొని వెళ్ళి ప్రమాదాలు జరిగితే, వారితో పాటు వాహనంలో ఉండే వారి జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు. ప్రతీ వాహన డ్రైవరు క్రమశిక్షణ కలిగి ఉండాలని, జాగ్రత్తలు, నియమాలు తప్పక పాటించాలని సూచించారు. ఆర్టీసి డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ వాహనాలను ఆపకుండా, సేఫ్ ప్రదేశాల్లో నిలపాలని సూచించారు. అనుమానాస్పదంగా ఉండే బ్యాగులు, సామగ్రిపై దృష్టి సారించి 1972కు సమాచారం అందించాలని అన్నారు. ముఖ్యంగా కోరాపుట్, రాయపూర్ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా అవుతుందని, ఈ ప్రాంతాలే కాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచి సమాచారం చేరవేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ వి.మనీషారెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, జిల్లా ప్రజా రవాణా అధికారి పి.వెంకటేశ్వరరావు, జిల్లా రవాణా శాఖాధికారి టి.దురా్గాప్రసాద్ రెడ్డి, ఎకై ్సజ్, పోలీస్ తదితర శాఖల అధికారులు, ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ వాహన డ్రైవర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి -
అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా అండర్–14 జట్టు
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు శుక్రవారం పయనమయ్యారు. ఈ నెల 8, 9 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా పలాసలో అండర్–14 విభాగంలో బాల, బాలికలకు అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే 30 మంది క్రీడాకారుల బృందం విజయనగరం రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లింది. ఈ సందర్భంగా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి క్రీడాకారులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జట్టు కోచ్ అండ్ మేనేజర్లు వి.ఆనందకిషోర్, ఎం.రామకృష్ణ, పి.భారతి పాల్గొన్నారు. విజయవాడలో నెట్బాల్ పోటీలు ఈ నెల 8, 9, 10 తేదీల్లో విజయవాడలో జరగనున్న స్కూల్ గేమ్స్ అండర్–17 బాల, బాలికల నెట్బాల్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు శుక్రవారం పయనమయ్యారు. మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో జిల్లా జట్లు విజేతలుగా తిరిగి రావాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో జట్టు కోచ్ అండ్ మేనేజర్లు మెహర్, శ్రీకాంత్, వాసు పాల్గొన్నారు. -
వల్లంపూడిలో పట్టపగలే దొంగతనం
వేపాడ: మండలంలోని వల్లంపూడి గ్రామంలో శుక్రవారం పట్టపగలే దొంగతనం జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు.. వల్లంపూడి గ్రామానికి చెందిన నమ్మి వెంకటరావు ఉదయం 5.30 గంటలకు ఇంటి నుంచి కల్లానికి వెళ్లగా ఉదయం 11.30 గంటల సమయంలో వెంకటరావు కుమారుడు విష్ణు ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి గుర్తు తెలియని దొంగలు ఇంటిలోకి చొరబడి బీరువా పగులకొట్టి బీరువాలో వున్న బంగారం చైన్, బంగారం చెవి బుట్టలు రెండు సుమారు తులం పావు, ఒక జత పట్టీలు దొంగలించుపోయినట్టు గుర్తించాడు. ఈ విషయాన్ని విష్ణు తన తండ్రి వెంకటరావుకు ఫోన్ చేసి చెప్పగా ఇంటికి చేరుకున్న వెంకటరావు ఇంటిని పరిశీలించిన పిదప తమకు ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ సుదర్శన్ తెలిపారు. కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
159 మంది గ్రేడ్ –3 ఏఎన్ఎంలకు పదోన్నతి
విజయనగరం ఫోర్ట్: వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పని చేస్తున్న ఎంపీహెచ్ఏ( ఫీమేల్), ఏఎన్ఎంలకు ఎంపీహెచ్ఏ(రెగ్యులర్) పదోన్నతి లభించింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కమిటీ సభ్యులు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పదోన్నతులు కల్పించారు. డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.జీవనరాణి, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, జెడ్పీ సీఈవో బి.వి.సత్యనారాయణ, డీపీవో బాలాజీ, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సూర్యనారాయణ కౌన్సెలింగ్ నిర్వహించారు. 159 మందికి పదోన్నతి కల్పించారు. పదోన్నతి ఉత్తర్వులు వారికి మెయిల్ ద్వారా పంపిస్తున్నట్టు డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.జీవనరాణి తెలిపారు. క్రీడా పోటీలకు దరఖాస్తు చేసుకోవాలి పార్వతీపురం: ఏపీ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో గల ప్రభుత్వ సివిల్ సర్వీస్ ఉద్యోగులకు (పురుషులు, మహిళలు) ఈ నెల 12న నిర్వహించే క్రీడా పోటీలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డా.కె.శ్రీధర్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 12న ఉదయం 9 గంటల నుంచి పార్వతీపురంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్టు తెలిపారు. అథ్లెటిక్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, క్యారమ్, చెస్, క్రికెట్, ఫుట్బాల్, ఖోఖో, హాకీ, కబడ్డీ, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, రెజ్లింగ్, స్విమ్మింగ్, యోగ, డ్యాన్స్ తదితర అంశాలలో క్రీడా పోటీలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వారు ఈ నెల 19 నుంచి 22 వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్టు తెలిపారు. సమాచారం కోసం కె.గణేష్ (హేడ్బాల్ శిక్షకులు) మొబైల్ 9866805716 నంబర్ను సంప్రదించాలని కోరారు. యువతకు రుణ అవకాశం పార్వతీపురం: సఫాయి కర్మచారి వృత్తిలో వున్న నిరుద్యోగ యువతకు ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకంలో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను సబ్సిడీపై మంజూరు చేయనున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార సంస్థ, ఇన్చార్జ్ కార్యనిర్వాహక సంచాలకులు ఎం.శ్యామల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకం 2023లో జిల్లాకు మంజూరు చేసిన 3వేల లీటర్ల సామర్థ్యం గల సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ మూడు వాహనాలను షరతులతో తిరిగి మంజూరు చేయడం జరుగుతుందని ఆ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి వున్న వారు డా.మర్రి చెన్నారెడ్డి భవనం, కంటోన్మెంట్, విజయనగరానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9030014742, 9642460838, 9652600967 నంబర్లను సంప్రదించాలన్నారు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు జిల్లా జట్టు బొబ్బిలి: గుంటూరు జిల్లా ధూళిపాళ్లలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు జిల్లా జట్టు బయలుదేరి వెళ్లింది. శుక్రవారం ఇక్కడి రైల్వేస్టేషన్లో సాఫ్ట్బాల్ జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సుంకర సాయి రమేష్, కోశాధికారి, పీడీ ఎన్.వెంకటనాయుడు విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల వారం రోజుల పాటు రాష్ట్ర స్థాయి జట్టును ఎంపిక చేసి కోచింగ్ ఇచ్చామన్నారు. ఇందుకోసం తెర్లాంలో కోచింగ్ క్యాంపును కూడా నిర్వహించినట్టు తెలిపారు. బొత్స కిశోర్, సత్యనారాయణ తదితరులు పాల్గొని జట్టు సభ్యులకు ఆల్ద బెస్ట్ తెలుపుతూ రాష్ట్ర స్థాయి విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. బెల్లం ఊట ధ్వంసం సీతంపేట: మండలంలోని దోనుబాయి పోలీస్స్టేషన్ పరిధిలో 1200 లీటర్ల పులిసిన బెల్లం ఊటలు ధ్వంసం చేసినట్టు ఎస్ఐ షేఖ్ మస్తాన్ తెలిపారు. తాడిపాయి పరిసర కొండ ప్రాంతాల్లో సారా వంటకాలు చేస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించగా డ్రమ్ములతో ఉంచిన బెల్లం ఊటలు దొరకడంతో ద్వంసం చేసినట్టు తెలిపారు. డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు. -
మహోజ్వల మంత్రం ‘వందేమాతరం’
● కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి పార్వతీపురం రూరల్: బ్రిటీష్ పాలనపై పోరాటానికి యావత్భారత జాతిని ఏకతాటిపై నిలిపిన మహోజ్వల మంత్రం వందేమాతరం గేయమని, దాని స్ఫూర్తితో దేశ ఔన్నత్యాన్ని పెంచే దిశగా ప్రతిఒక్కరూ నడుచుకోవాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో ఎన్సీసీ, స్కౌట్ పాఠశాల విద్యార్థుల నడుమ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ బంకిమ్ చంద్ర ఛటర్జీ కలం నుంచి జాలువారిన ఈ గేయం ప్రతిపౌరునిలో ఉద్యమస్ఫూర్తి నింపిందన్నారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సెల్ఫీపాయింట్ వద్ద కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ఫొటోలు దిగారు. కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, విద్యాశాఖాధికారులు రాజ్కుమార్, వై.నాగేశ్వరరావు, రెడ్క్రాస్ చైర్మన్ శ్రీరాములు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఏరియా ఆస్పత్రి ప్రక్షాళనకు చర్యలు
● పాలకొండ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్, డీసీహెచ్ఎస్ ● పనితీరు మెరుగుపర్చుకోవాలని వైద్యులకు హెచ్చరిక పాలకొండ: స్థానిక ఏరియా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో రోగులకు మెరుగైన సేవలందడంలేదన్న అంశంపై ‘నర్సింగ్ విద్యార్థులే దిక్కు’ అనే శీర్షినక ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి స్పందించారు. ఆస్పత్రిలో సేవలపై వైద్యాధికారులను ఆరా తీశారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని సబ్ కలెక్టర్తో పాటు జిల్లా వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్యుల హాజరు పరిశీలించారు. పనితీరు మెరుగుపర్చుకోవాలని ఎముకుల విభాగం వైద్యురాలికి సూచించారు. వైద్యులు ఇంత నిర్లక్ష్యం చేస్తుంటే మీరేం చేస్తున్నారని సూపరింటెండెంట్ డాక్టర్ చిరంజీవిని ప్రశ్నించారు. ముగ్గురు వైద్యులను మౌఖికంగా హెచ్చరించామని, వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సూపరెండెంట్ వివరణ ఇచ్చారు. మద్యం మత్తులో ఉంటూ విధులకు వస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వైద్యులు తన కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. అంతకు ముందు జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారి జి.నాగభూషణరావు ఆస్పత్రిని సందర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులకు షోకాజు నోటీసులు ఇవ్వాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. పలుమార్లు హెచ్చరిస్తున్నా వైద్యుల తీరు మారడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలని, లేదంటే బదిలీపై వెళ్లిపోవాలన్నారు. -
ఇద్దరు అసమర్థుల వల్లే గిరిజన బిడ్డలకు ఈ దుస్థితి!
జిల్లాలో ఉన్న అసమర్థ మంత్రి, విప్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి నాయకుడిని ఒప్పించడంలో విఫలమయ్యారని.. అది వారి చేతకానితనం అని పుష్ప శ్రీవాణి విమర్శించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నా సరే.. గిరిజన పిల్లల కష్టాన్ని తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి వివరించి, కేజీహెచ్కు తీసుకెళ్లామని గుర్తు చేశారు. ఘటనను చూసి చలించిన ఆయన.. గిరిజన కుటుంబాలను ఓదార్చి, భరోసా ఇచ్చారని తెలిపారు. అక్కడే మృతి చెందిన ఇద్దరి పిల్లల కుటుంబాలకు తమ పార్టీ తరపున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారని వివరించారు. ఆ మొత్తం కూడా వెంటనే అందజేశామని తెలిపారు. అది నాయకుడి గొప్పతనమన్నారు. ప్రభుత్వంలో ఉండి, వారు చేసినదేమిటి అని ప్రశ్నించారు. వారు వేస్ట్.. వారికి ఏం చెప్పినా వేస్ట్ అని విమర్శించారు. ‘మంత్రి ఎప్పుడూ ఒక మాట అంటుంటారు. వారు ఏది చెప్పినా, చంద్రబాబునాయుడు సలహాలు అడుగుతారంట. కచ్చితంగా వీరు సలహా ఇచ్చి ఉండరు. లేకపోతే అడిగి ఉండరు. ఎక్స్గ్రేషియా వద్దని వీరే చెప్పేసి ఉంటారేమో!’ అని సందేహం వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణాలపైనా ఆమె పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తమ ప్రాంత గిరిజన బిడ్డలన్న జాలి కూడా వీరికి లేదని అన్నారు. గిరిజనులకు ఏం జరిగినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా ఉండదన్నారు.సాక్షి, పార్వతీపురం మన్యం: ఇద్దరు అసమర్థుల వల్లే జిల్లాలో గిరిజన బిడ్డలకు అన్యాయం జరుగుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ కురుపాం నియోజకవర్గ ఇన్చార్జి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. కురుపాం నియోజకవర్గంలో ప్రభు త్వ నిర్లక్ష్యం కారణంగా అనారోగ్యంతో మృతి చెందిన కల్పన, అంజలి కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను ఇవ్వడంలో నిర్లక్ష్యం, వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు. కొన్ని చోట్ల ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఘటనల్లోనూ స్పందించి, పరిహారం అందజేస్తున్నారని.. అమాయక గిరిజన ప్రజలకు ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు. ‘ఒక అసమర్థ మంత్రి.. ఒక అసమర్థ విప్.. వీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సున్నితమైన అంశాన్ని ముఖ్యమంత్రికి చెప్పి, ఎక్స్గ్రేషియా తెచ్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వీరి చేతకానితనం. మన నాయకుడిని ఒప్పించాలంటే అది సత్తా బట్టి ఉంటుంది. వీరిద్దరికీ అది లేదని అర్థమవుతోంద’ని విమర్శించారు. కురుపాం నియోజకవర్గంలోని పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి కలెక్టరేట్లో కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డిని శుక్రవారం ఆమె కలిశారు. తమ నియోజకవర్గంలో ఇద్దరు విద్యార్థుల మరణాలు, పరిహారం, అసంపూర్తిగా నిలిచిపోయిన గిరిజన ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణం, ధాన్యం కొనుగోలు తదితర సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ వెలుపల మీడియాతో ఆమె మాట్లాడారు. మారుమూల, గిరిజన ప్రాంత అభివృద్ధిని.. చదువును కాంక్షిస్తూ కురుపాంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి 2020 అక్టోబర్లో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల పనులను ప్రారంభించారని పుష్ప శ్రీవాణి తెలిపారు. గత ప్రభుత్వ హయంలోనే 70 శాతం పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. ఎన్నికల తర్వాత మిగులు పనులను పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం అలానే వదిలేసిందన్నారు. ఇక్కడ ఇంజినీరింగ్ కాలేజీ పూర్తయితే 50 శాతం సీట్లు గిరిజన విద్యార్థులకే లభిస్తాయని, ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోదునని చెప్పారు. ఇది కూడా కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. కురుపాం సీహెచ్సీ అదనపు భవనాలను గత ఎన్నికలకు ముందే రూ.3 కోట్ల వ్యయంతో పూర్తి చేశామని.. ఈ 18 నెలల కాలంలో చిన్నపాటి మరమ్మతులు పూర్తిచేసి దానిని అందుబాటులోకి తీసుకు రాలేకపోయారని తెలిపారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందనే.. వీటిని నిర్లక్ష్యంగా వదిలేశారని చెప్పారు. ఇటీవల ఆస్పత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతున్న సమయంలో పడకలు చాలక.. ఇద్దరు, ముగ్గురిని ఒకే బెడ్ మీద ఉంచారని గుర్తు చేశారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నచోట గర్భిణులను, బాలింతలను, చిన్నపిల్లలను, డయేరియా రోగులను కూడా అదే గదిలో పెట్టేశారని చెప్పారు. భవనాన్ని ప్రారంభిస్తే ప్రజలకు ఉపయోగపడదా? అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ కుట్రతో, వైఎస్సార్సీపీకి పేరు వస్తుందన్న అక్కసుతో ప్రారంభించడం లేదని చెప్పారు. తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లన్నట్లు మంత్రి సంధ్యారాణి వాదిస్తున్నారని.. వాస్తవాలను దాచి పై నుంచి వచ్చిన స్క్రిప్ట్ను పదేపదే ఫాలో అవుతున్నారని పుష్పశ్రీవాణి విమర్శించారు. రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్, సంస్థల్లో ప్రమాదాలు జరిగినా, వివిధ చోట్ల ప్రభుత్వానికి సంబంధం లేకపోయిన మరణాలకూ పరిహారం ప్రకటించిన కూటమి ప్రభుత్వం.. గిరిజన విద్యార్థుల మరణాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ‘సీతంపేటలో విద్యార్థి చనిపోతే కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు, గిరిజనుల ఆందోళన నేపథ్యంలో అక్కడి డీడీ రూ.2 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి అవుట్సోర్సింగ్ ఇస్తామని మీడియా ఎదుటే ప్రకటించారు. నిన్న జరిగిన జెడ్పీ సమావేశంలో మా జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు అడిగిన సందర్భంలో తామెక్కడా ప్రకటించలేదని మంత్రి అంటున్నారు. దీన్నిబట్టి గిరిజన పిల్లలు చనిపోతే ప్రభుత్వానికి పట్టదని అర్థమవుతోంద’ని ఆమె తెలిపారు. కురుపాం బాలిక గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు కల్పన, అంజలి మరణాలపై మంత్రి సంధ్యారాణి వాస్తవాలను దాచి అబద్ధాలు చెబుతున్నారని పుష్పశ్రీవాణి ధ్వజమెత్తారు. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు.. మంత్రి పదవిలో ఉన్నా ఆమె తీరు మారలేదని విమర్శించారు. దసరా సెలవులకని పాఠశాల నుంచి వెళ్లిపోయాకే అనారోగ్యం పాలయ్యారని, మరణాలు సంభవించాయని ఆమె చెప్పడం ఎక్స్గ్రేషియా ఎగ్గొట్టే ప్రయత్నంలో, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే అని ఆరోపించారు. కలెక్టర్కు ట్రైబల్ వెల్ఫేర్ డీడీ ఇచ్చిన నివేదికలో ఏముందో తెలియదా? అని ప్రశ్నించారు. ‘కల్పన 30వ తేదీన ఆస్పత్రిలో చేరింది.. ఒకటో తేదీన చనిపోయిందని మంత్రి అంటున్నారు. ఇది ఆమెకున్న అవగాహనా రాహిత్యమా..? కల్పన పది రోజులు ఆస్పత్రిలోనే ఉందన్న విషయం అందరికీ తెలుసు. మరో విద్యార్థిని దుడ్డుఖల్లు పీహెచ్సీకి తీసుకెళ్తే సాధారణ జ్వరమని చెప్పి మందులిచ్చి పంపించేశారు. నాలుగు రోజులు మందులు వాడాక ఆమె చనిపోయింది. జ్వరం వచ్చిన ఐదు రోజులకే ఎవరైనా చనిపోతారా? మనిషిలో ఇమ్యూనిటీ ఉంటుంది. ఎంత తీవ్రత అయితేనే గానీ వెంటనే చనిపోరు. సరైన చికిత్స, సకాలంలో అందకే పిల్లలు చనిపోయారు. ఇది మీ ప్రభుత్వం, యంత్రాంగం నిర్లక్ష్యం కాదా? 22 నుంచి సెలవులు అయితే.. 20, 21వ తేదీల్లో పిల్లలను పంపించేయడం ఏమిటీ? రిపోర్ట్స్ అబద్ధమా.. మంత్రి మాటలు అబద్ధమా.. ఆరోగ్యం బాగోలేని పిల్లలను ఇళ్లకు ఎలా పంపుతారు. పాఠశాలల్లో అనారోగ్యం పాలైన విద్యార్థులకు వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిది కాదా?’ అని పుష్పశ్రీవాణి ప్రశ్నించారుఇద్దరి అసమర్థ పాలకుల మీద నమ్మకం లేకనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కలెక్టర్కు ఈ రోజు వినతి పత్రం అందించామని పుష్పశ్రీవాణి తెలిపారు. ఆయన రియాక్షన్, రెస్పాన్స్ చూస్తే కలెక్టర్ మీద కూడా ఎంత ఒత్తిడి ఉందో అర్థం అవుతుందని చెప్పారు. అధికారులంటే ఎమ్మెల్యేలో, మంత్రులో చెప్పిన పని చేయడం కాదని.. ప్రతిపక్షంగా ప్రజల తరఫున చెప్పే సమస్యలపైనా సానుకూలంగా స్పందించాలన్నారు. జిల్లాలో నేటికీ ధాన్యం కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అవసరమైన గన్నీలూ సమకూర్చలేదని తెలిపారు. తక్షణం గన్నీలు అందించి, ధాన్యం సేకరణ ప్రారంభించాలని కలెక్టర్ను కోరినట్లు ఆమె చెప్పారు. గిరిజన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇచ్చే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. గిరిజనులు, విద్యార్థులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు. -
● ప్రకృతి అందాలకు నెలవు మడ్డువలస పరిసరాలు ● ఆహ్లాదకర వాతావరణం ● కార్తిక వనసమారాధనలకు అనుకూలమైన ప్రదేశం
వంగర: కార్తిక పుణ్యమాసంలో వనసమారాధకులను వంగర మండలం మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు పరిసరాలు రారమ్మంటున్నాయి. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ప్రాజెక్టులో నిండుగా ఉన్న నీరు, నీటిని ఆనుకొని చుట్టూ ఉన్న కొండలు చూపరులకు కనువిందు చేస్తున్నా యి. సాయంకాల సమయంలో వీచే పిల్లగాలు లు సందర్శకులను ఆహ్లాదపరుస్తున్నాయి. సంధ్యా సమయంలో సూర్యాస్తమయం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రాజెక్టు ప్రవేశ ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య ఉన్న రహదారి అందరినీ మైమరిపిస్తుంది. ప్రాజెక్టు పరిసరాల్లోని కొండలపై నిర్మించిన షిర్డి సాయినాథుని ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. తిలకించాల్సిన ప్రదేశాలు.... ప్రాజెక్టు వద్ద బకెట్పోర్షన్, నీటిమట్టాన్ని సూచించే ప్రదేశం, ప్రాజెక్టు ఆవరణలో ఉన్న డైక్, కొండపై నిర్మించిన సాయినాథుని ఆలయం, కొండపై ఉన్న పాండవుల పంచను తిలకించవచ్చు. మడ్డువలసకు ఆనుకొని పచ్చనితోటలు పిక్నిక్లు నిర్వహించేందుకు అనువుగా ఉంటాయి. -
రాష్ట్రస్థాయి చెస్ పోటీలు ప్రారంభం
సీతానగరం: ఏపీ స్టేట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ చెస్ చాంపియన్ షిప్ 2025–26 (అండర్ 14, 17, 19 బాల బాలికలు) పోటీలను సీతానగరం మండలం జోగింపేట ఏపీ గిరిజన సంక్షేమ పాఠశాలలో కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. ఖర్చులేని ఆటల్లో చదరంగం ఒకటని, పాఠశాలల్లోని ప్రతి విద్యార్థి ఆటను నేర్చుకోవాలని ఉద్బోధించారు. రాష్ట్రస్థాయి పోటీలకు పార్వతీపురం మన్యం జిల్లా ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. చెస్తో మెదడు చురుకుదనం పెరుగుతుందన్నారు. క్రీడాకారులు ఆన్లైన్లో పేర్లు నమోదుచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ బి.రాజ్కుమార్, సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త ఆర్.తేజేశ్వరరావు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి వై.నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 10న ‘చలో సాలూరు’ గుమ్మలక్ష్మీపురం: అనారోగ్యంతో మృతిచెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన ‘చలో సాలూరు’ కార్యక్రమం పేరుతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇంటిని ముట్టడిస్తామని గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టంచేశారు. గుమ్మలక్ష్మీపురం గిరిజన సంఘం కార్యా లయం వద్ద శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఏపీ గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మండంగి రమణ, మండల సహాయ కార్యదర్శి ఎం.సన్యాసిరావు, ఎస్ఎఫ్ఐ మండలాధ్యక్షుడు ఎ.గంగారావు, యువజన సంఘం మండలాధ్యక్షుడు కె.గంగారావు మాట్లాడారు. విద్యార్థులను పోగొట్టుకున్న కుటుంబాలకు ప్రభుత్వం కనీస పరిహార చర్యలు అందజేయకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికి, గెలిచాక చేసిన మొదటి సంతకంను నెరవేర్చకుండా మంత్రి గిరిజనులను మోసంచేస్తున్నారన్నారు. విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు వైద్య సేవలు అందించేందుకు తక్షణమే ఏఎన్ఎంలను నియమించాలన్న డిమాండ్తో చలో సాలూరు కార్యక్రమానికి పిలుపునిచ్చామ న్నారు. గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈనెల 9వ తేదీలోగా పై రెండు డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. గిరి జన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేకూర్చేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమానికి గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులు, గిరిజన పెద్దలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆలయాల భద్రతపై ప్రత్యేక దృష్టి పార్వతీపురం రూరల్: కార్తిక మాసంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవాలయాల్లో భక్తులకు భద్రత కల్పించడంతోపాటు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి దేవదాయశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఆలయాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలన్నారు. భద్రతా పరమైన ఏర్పాట్లు మేరకు దాతల సాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గర్భ గుడిలోకి పరిమితంగానే భక్తులను అనుమతించాలన్నారు. సమావేశంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన్యం అందాలకు ట్రెక్కింగ్ హంగులు పార్వతీపురం రూరల్: జిల్లాలోని పర్యాటక అందాలకు ట్రెక్కింగ్ హంగులు కల్పిస్తున్నట్టు కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు. టూరిజం గైడ్లుగా ఎంపికై న గిరిజన యువతకు కలెక్టరేట్లో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 12 ట్రెక్కింగ్ ప్రాంతాల్లో మొదటి దశగా ఆరు ప్రాంతాలను సిద్ధం చేస్తున్నామని, పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని గైడ్లకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్యాటకులకు ఆహారం, రాత్రి బస, క్యాంపు ఫైర్ వంటి వసతులు కల్పించాలని ఆదేశించారు. పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక వెబ్సైట్ రూపొందించి విస్తృత ప్రచారం కల్పించాలని అటవీశాఖను ఆదేశించారు. -
అయ్యా.. కాపాడండయ్యా..!
అయ్యా.. బస్సు ఢీకొంది.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి... కాపాడండయ్యా.. కాసిన్ని నీళ్లు తేండయ్యా.. శ్రీలత.. లే... ఒక్కసారి కళ్లు తెరచి చూడు.. అంటూ ఒడిలో భార్యను ఉంచి భర్త చేసిన ఆర్తనాదాలు అక్కడివారిని కన్నీరుపెట్టించాయి. కళ్లముందే భార్య చనిపోవడంతో భర్త చేసిన రోదనతో ఆ ప్రాంతమంతా విషాదం అలముకుంది. ● దైవదర్శనానికి వెళ్తూ మృత్యు ఒడిలోకి.. ● ఆర్టీసీ బస్సు ఢీకుని మహిళ మృతి ● భర్తకు స్వల్పగాయాలు చీపురుపల్లిరూరల్ (గరివిడి): గరివిడి మండలం గదబవలస పంచాయ తీ పరిధిలోని ఐతాంవలస సమీపంలోని రోడ్డు మలుపు వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొరగంజి శ్రీలత(46) అనే మహిళ దుర్మరణం చెందగా, భర్త సంగంనాయుడికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు... తెర్లాం మండలం పెరుమాళి గ్రామానికి చెందిన సంగంనాయుడు, శ్రీలత దంపతులు చీపురుపల్లి మండలంలో ఉన్న మానసాదేవి నాగశక్తి అమ్మవారిని దర్శించుకునేందుకు స్కూటీపై బయలు దేరారు. పెరుమాళి నుంచి చీపురుపల్లి వైపు వెళ్తుండగా ఐతాంవలస గ్రామానికి సమీపంలో ఉన్న మలుపు వద్దకు వచ్చేసరికి.. చీపురుపల్లి వైపు నుంచి ఎదురుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరి ని ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూటీ వెనుకవైపున కూర్చున్న శ్రీలత వెనుకకు పడిపోగా బస్సు టైరు ఆమె తలమీదుగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలు విడవగా భర్తకు స్వల్పగాయాలయ్యాయి. ఆనందంగా ఉన్నామన్న సమయంలో... వీరిది మధ్యతరగతి కుటుండం. సంగంనాయు డు రాజాం జ్యూట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు ఆడపల్లలు. పెద్దమ్మాయి శ్రావణి శ్రీకాకుళం జిల్లాలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండగా, చిన్నమ్మాయి సంధ్య నూజివీడు ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసి సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తోంది. కష్టపడి చదివించి న ఇద్దరు పిల్లలు ప్రయోజకులయ్యారు.. ఆనందంగా ఉందామన్న సమయంలో విధి కన్నెర్రచేసింది. భర్తకు, పిల్లలకు పెద్దదిక్కును బస్సు ప్రమాదం రూపంలో మృత్యుఒడిలోకి చేర్చింది. శ్రీలత మరణించడంతో గ్రామంలో విషాదం అలముకుంది. పోలీసులు కేసు నమోదుచేశారు. -
స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తినిచ్చిన గేయం..
● ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పార్వతీపురం రూరల్: భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చిన గేయం వందేమాతరం అని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి అన్నారు. గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన చేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఎస్బీ సీఐ రమణమూర్తి, డీసీఆర్బీ సీఐ ఆదాం, సీసీఎస్ సీఐ అప్పారావు, ఏఆర్ఐలు రాంబాబు, నాయుడు, శ్రీనివాసరావు, ఏఆర్ ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
8న సెంచూరియన్లో ‘రైతు సమ్మేళనం’
నెల్లిమర్ల రూరల్: ఈ నెల 8న సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ‘రైతు సమ్మేళనం’ నిర్వహించనున్నట్లు వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డీఎన్ రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ అప్పలనాయుడు, కలెక్టర్ రామ్ సుందర్ రెడ్ది పాల్గొంటున్నారని వివరించారు. ఈ సందర్భంగా రైతులకు సంబంధించి వ్యవసాయ సాంకేతిక ప్రదర్శనలు, శాస్త్రవేత్తలతో పరస్పర చర్చలు, ఉత్పత్తుల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
సీతంపేట: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. ఈ మేరకు జనజాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక ఐటీడీఏ గ్రీన్ఫీల్డ్ క్రీడా మైదానంలో మూడు క్లస్టర్ స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. క్రీడల వల్ల శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. మెదడు మరింత ఉత్తేజంగా ఉంటుందని, క్లస్టర్, ఐటీడీఏ స్థాయిలో గెలుపొంది రాష్ట్రస్థాయిలో ఉన్నతంగా రాణించాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానందం తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో మట్టి మాయం..!
● జేసీబీలతో తవ్వి తరలింపు ● సోమసాగరానికి గర్భశోకం ● చోద్యం చూస్తున్న అధికారులుకురుపాం: వడ్డించే వాడు మనవాడైతే ఏ వరుసలో కూర్చున్నా అందాల్సింది అందక మానదన్న నానుడి కురుపాం తెలుగు తమ్ముళ్లకు వర్తించక మానదు. వివరాల్లోకి వెళ్తే..మండల కేంద్రంలోని శివ్వన్నపేటలో ఉన్న సోమసాగరం చెరువులో గడిచిన మూడు రోజులుగా జేసీబీలతో చెరువు గర్భంలోని మట్టిని తవ్వేస్తున్నారు. ఇప్పటివరకు చెరువులో యంత్రాలతో మట్టి తవ్వి సుమారు 250 ట్రాక్టర్ల లోడులను తరలించారు. ఈ మట్టిని ఎందుకు తవ్వుతున్నారో..? ఎక్కడికి తరలిస్తున్నారో అర్థం కావడం లేదు. పోనీ ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల అనుమతి ఉందా? అంటే అదీ లేదని సంబంధిత అధికారులు చెప్పడం శోచనీయం. ఇంతతంతు మూడు రోజులుగా జరుగుతన్నా కూతవేటు దూరంలో ఉన్న ఇరిగేషన్ అధికారుల స్పందన లేక పోవడంతో వారి తీరును ప్రజలు, రైతులు దుయ్యబడుతున్నారు. గురుకులానికి తరలిస్తున్నట్లు నెపం నెల రోజుల క్రితం గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు పచ్చకామెర్లతో మృతి చెంది, వందల సంఖ్యలో విద్యార్థులు ఆస్పత్రి పాలవగా జిల్లా మంత్రి అచ్చెం నాయుడు పాఠశాలను సందర్శించి పాఠశాలలో మట్టి ఊటకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే తెలుగుదేశం కార్యకర్తలే తమ సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఇదే అదునుగా తీసుకున్న కురుపాం మండల తెలుగుదేశం నాయకుల కళ్లు దగ్గరే ఉన్న సోమసాగరం చెరువుపై పడ్డాయి. ఇక అనుకున్నదే తడవుగా మట్టిని తమ ఇష్టానుసారం తరలించేస్తున్నారు. ఇంత తంతు అనధికారికంగా జరుగుతున్నా అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. దీనికి కారణం అధికార పక్షానికి టార్గెట్ అవుతామని ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు అక్రమ మట్టి తవ్వకాలపై దృష్టి సారించాల్సి ఉందని పలువురు కోరుతున్నారు. -
బస్సుల్లో భద్రత లెస్సు!
● హడలెత్తిస్తున్న వరుస ప్రమాదాలు ● మొన్న పార్వతీపురం, నేడు పాచిపెంట ఘాట్రోడ్డులో ఘటనలుసాక్షి, పార్వతీపురం మన్యం: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది..రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దుర్ఘటనలో 24 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే. తెలుగు రాష్ట్రాల్లో వరుసఘటనలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ గురువారం ఉదయం పాచిపెంట మండలంలోని ఘాట్ రోడ్డు వద్ద ఇదే తరహా ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు రేగాయి. కాసేపటికే వాహనం మొత్తం అగ్నికి ఆహుతైంది. డ్రైవర్ అప్రమత్తత వల్ల పెనుప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీపావళి ముందు రోజు విజయనగరం నుంచి పార్వతీపురం వచ్చిన ఆర్టీసీ బస్సులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను గుట్టుగా రవాణా చేశారు. పార్సిల్ కేంద్రం వద్ద వాటిని దించే క్రమంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రవాణా చేసే సమయంలో బస్సులో ఇదే పేలుడు సంభవించి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేది. ఈ ఘటనలు బస్సుల్లోని భద్రతను ప్రశ్నిస్తున్నాయి. ప్రయాణికులు సురక్షితమేనా? అన్న సందేహాలు లేవనెత్తున్నాయి. – గతంలోనూ పార్వతీపురం మండలం బాలగుడబ వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. డ్రైవర్ మృతిచెందాడు. డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. భద్రత డొల్ల..తనిఖీలు నిల్ ఆర్టీసీ సర్వీసుల్లో అధికశాతం కాలం చెల్లినవే. ప్రభుత్వ సర్వీసులు కావడంతో వాటిపై పెద్దగా దృష్టి సారిస్తున్న దాఖలాలు ఉండడం లేదు. మహిళలకు ఉచిత ప్రయాణం పుణ్యమాని..ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. కొన్ని బస్సుల్లో 70 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. అధిక లోడు..జిల్లాలో చిన్న రహదారులు.. గోతుల మార్గాలే ఎక్కువ కావడం వల్ల బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. ఇవే కాక..ప్రైవేట్ సర్వీసులూ అధికంగానే నడుస్తున్నాయి. రాయగడ, నారాయణపట్నం, బత్తిలి, గుణుపూరు, ఇచ్ఛాపురం వంటి ప్రాంతాలకు ప్రైవేట్ సర్వీసులు రోజూ రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాలకు స్లీపర్ బస్సులు కూడా జిల్లా నుంచి నిత్యం వెళ్తున్నాయి. వాటిలో తనిఖీలు తరచూ జరగడం లేదు. స్కూల్ బస్సులు సైతం ఫిట్నెస్ సరిఫికెట్లు లేకుండానే నడుస్తున్నాయి. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు షరా ‘మామూలుగా’ వదిలేస్తున్నారు. ప్రమాదాలకు ఆస్కారం.. జిల్లాలో ఏ మూలకు వెళ్లినా గుంతల రహదారులే దర్శనమిస్తున్నాయి. ప్రమాదాలకు ఆస్కారమిస్తున్నాయి. రహదారుల నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. గుంతలు లేని రహదారులు అంటూ కొద్ది రోజులు ఆర్భాటం చేసి వదిలేసింది. ఆంధ్రా–ఒడిశా ప్రధాన మార్గమైన బొబ్బిలి–పార్వతీపురం, పార్వతీపురం–కొమరాడ–కూనేరు, ఇటు పార్వతీపురం నుంచి పాలకొండ వెళ్లే మార్గంలో అడుగడుగునా పెద్ద గుంతలు ఎదురవుతున్నాయి. దీనికితోడు ఎక్కువ గ్రామీణ ప్రాంతాల లింకు రోడ్లు కావడం..సాలూరు తర్వాత ఒడిశా వెళ్లే మార్గంలో ఘాట్రోడ్డు కావడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతర్రాష్ట్ర రహదారి కావడంతో వాహనచోదకులు రోజుల తరబడి ప్రయాణం సాగిస్తున్నారు. నిద్ర, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవల పోలీసులు రాత్రివేళల్లో వాహనాలను ఆపి, చోదకులు ముఖం కడుక్కునేందుకు నీళ్లు అందిస్తున్నారు. ప్రమాదాల నివారణకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. మరోవైపు ప్రమాదాలు జరిగినప్పుడే ఆర్టీవో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తర్వాత వదిలేస్తున్నారు. దీనివల్ల నిర్వాహకులకు, చోదకులకు భయం ఉండడం లేదు. బస్సుల్లో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు పాటించేలా పోలీసులు, రవాణా శాఖాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
లాన్టెన్నిస్ పోటీల్లో సత్తా
● రాష్ట్రస్థాయి అండర్–17 విభాగంలో విజేత యశ్వంత్ ● అభినందించిన గ్రామస్తులుతెర్లాం: మండలంలోని కూనాయవలస గ్రామానికి చెందిన బొమ్మి యశ్వంత్ రాష్ట్రస్థాయి లాన్ టెన్నిస్ పోటీల్లో సత్తా చాటాడు. ఇటీవల శ్రీకాళహస్తిలోని విక్రం టెన్నిస్ అకాడమీలో 69వ ఏపీ స్కూల్గేమ్స్ ఫెడరేషన్ లాన్ టెన్నిస్ అండర్–14,17,19 విభాగాల్లో పోటీలు జరిగాయి. అండర్–17 విభాగంలో జరిగిన పోటీల్లో పాల్గొన్న యశ్వంత్ అత్యంత ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచాడు. యశ్వంత్ టెన్నిస్ క్రీడలో గతంలో జరిగిన రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభను కనబరిచి రాణిస్తున్నాడు. ఇటీవల శ్రీకాళహస్తిలో జరిగిన 69వ ఏపీ స్కూల్ గేమ్స్ పోటీల్లో అండర్–17 విభాగంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం, ప్రశంసా పత్రాన్ని సాధించాడు. బొబ్బిలి మాజీ ఏఎంసీ చైర్మన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి బొమ్మి శ్రీనివాసరావు కుమారుడు యశ్వంత్. లాన్టెన్నిస్లో యశ్వంత్ చూపిన ప్రతిభకు కుటుంబసభ్యులు, గ్రామస్తులు, వైఎస్సార్సీపీ మండల నాయకులు, కూనాయవలస సర్పంచ్ బోడెల విజయబాబు అభినందించారు. -
ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధం
● తప్పిన ప్రాణపాయం ● ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మాధవరెడ్డిపాచిపెంట: మండలంలోని పద్మాపురం పంచాయతీ రొడ్డవలస సమీపంలో ఘాట్ రోడ్డుపై గురువారం ఉదయం 7:30 గంటల సమయంలో ఒడిశా ఆర్టీసీ బస్సులో సాంకేతిక లోపం కారణంగా ఇంజిన్ లో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా ఆర్టీసీ బస్సు విజయనగరం నుంచి బయల్దేరి పదిమంది ప్రయాణికులతో ఒడిశాలోని జయపూర్ వెళ్తోంది. అయితే పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీ, రొడ్డవలస సమీపంలో ఘాట్ రోడ్డు ఎక్కుతుండగా బస్సు స్లో అయిపోయింది. బస్సులో ఏదో సాంకేతిక సమస్య ఉన్నట్లు గుర్తించిన డ్రైవర్ బస్సు పక్కకు తీసి కిందికి దిగి ఇంజిన్ చెక్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దించేశాడు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది చేరుకుని మంటలు అదుపు చేశారు.అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. పరిశీలించిన ఎస్పీ బస్సు దగ్ధమైన సంఘటన స్థలాన్ని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి స్థానిక పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను డ్రైవర్ను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక లోపమేనా? ఇంకేమైనా కారణం ఉందా? అన్న విషయంపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపట్టాలని స్థానిక పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ వెంట జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, జిల్లా రవాణా శాఖ అధికారి ఉన్నారు. -
జాతీయస్థాయిలో మోడల్స్కూల్ విద్యార్థి ప్రతిభ
డెంకాడ: మండలంలోని అక్కివరం పంచాయతీ పరిధి గొల్లపేట వద్ద ఉన్న ఏపీ మోడల్ స్కూల్ 10వ తరగతి విద్యార్థి పతివాడ భానుప్రసాద్ జాతీయ స్థాయి సైన్స్ సెమినార్లో ప్రతిభ కనబరిచాడు. జాతీయస్థాయిలో 17వ స్థానంలో నిలినందుకు గాను అవార్డు, ప్రశంసాపత్రంతో పాటు సైన్స్ కిట్ను బహుమతిగా అందుకున్నాడు. ఈనెల 7,8 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న సైన్స్ ఎక్స్పోలో నాసా, రష్యన్ సైన్స్ కేంద్రాలను సందర్శించే అద్భుత అవకాశం పొందాడని కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ సంధ్య తెలిపారు. క్రమశిక్షణ, విద్యలో పతివాడ భానుప్రసాద్ ముందుకు సాగుతూ మోడల్ స్కూల్కు మంచి పేరు తీసుకురావడం హర్షణీయమని ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన భానుప్రసాద్ను జిల్లా అధికారులతో పాటు ప్రిన్సిపాల్ సంధ్య, ఉపాధ్యాయులు గురువారం అభినందించారు. -
క్రీడలతో మానసికోల్లాసం
బొండపల్లి: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన బొండపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి అధెట్లిక్స్ పోటీల ఎంపికను ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 500 మంది క్రీడాకారులు హాజరు కాగా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈనెల 8 నుంచి శ్రీకాకుళంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడల్లో రాణించిన విద్యార్థులకు విద్య, ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే 200 కిలోమీటర్లు దాటి పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంతో పాటు, రోజు దాటితే అలవెన్సు కూడా ఇచ్చే సౌలభ్యం కల్పించినట్లు తెలిపారు. క్రీడల్లో రాణించే విద్యార్థులు చదువులోనూ రాణిస్తారని ఈ విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో డీఈఓ యు.మాణిక్యం నాయుడు, వైస్ ఎంపీపీ జి.ఈశ్వర్రావు, సర్పంచ్ బొండపల్లి ఈశ్వర్రావు, తహసీల్దార్ డోలా రాజేశ్వర్రావు, ఎంపీడీఓ జి.గిరిబాల, స్కూల్గేమ్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్వి రమణ, గోపాలరావు, హెచ్ఎం ఉమామహేశ్వర్రావు, ఎంఈఓ2 ఎ.వెంకటరమణ, రాపాక అచ్చిం నాయుడు, నంబూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ -
8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
రాజాం సిటీ: పట్టణ పరిధిలోని కాలెపు వీధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్, సివిల్ సప్లైస్ అధికారులు గురువారం పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామని విజిలెన్స్ ఎస్సై రామారావు తెలిపారు. ఈ దాడిలో వ్యాపారి అప్పలరాజు ఇంట్లో నిల్వ ఉంచిన 8 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని 6ఎ కేసు నమోదుచేశామన్నారు. రేషన్ బియ్యాన్ని అమ్మడం, కొనడం చేస్తే చట్టరీత్యా నేరమని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్డీటీ అనంత్కుమార్, వీఆర్వో అబ్బాస్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.డ్రోన్ల సహాయంతో సారా బట్టీల ధ్వంసంసాలూరు రూరల్: మండలంలో సారా అక్రమ తయారీ కేంద్రాలపై ఎకై ్సజ్, పోలీసుల జాయింట్ ఆపరేషన్లో భాగంగా గురువారం డ్రోన్ల సహాయంతో సారా బట్టీలను గుర్తించి ధ్వంసం చేసినట్లు రూరల్ ఎస్సై నర్సింహమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు చేసిన దాడుల్లో దొరలతాడివలస, సుల్లరి గ్రామాలలో గుర్తించిన సారా బట్టీల్లో 7,200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామని చెప్పారు. శృంగవరపుకోట: మండల పరిధిలోని మల్లిపూడి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి క్వారీ గోతిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్.కోట పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కిల్లో నర్సమ్మ కొడుకు కిల్లో రాజు(33) గొర్రెలు కాపలా కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి గొర్రెలమంద ఉన్న ప్రాంతానికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో ఉన్న క్వారీ గోతిలో పడి ప్రాణాలు వదిలాడు. గురువారం ఉదయం కొందరు స్థానికులు క్వారీ గోతిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి, సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి విచారణ చేసి మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తల్లి నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.కోట ఎస్సై తెలిపారు. గెడ్డలో పడి వృద్ధురాలు రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి సారథి గ్రామానికి చెందిన యండమూరి గౌరమ్మ (60) గ్రామ సమీపంలోని గెడ్డలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందింది. దీనిపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎప్పటిలాగానే గురువారం గ్రామ సమీపంలోని బుడబుడరాలు గెడ్డకు ఆమె స్నానానికి వెళ్లింది. అక్కడ తనకు బీపీ ఎక్కువ కావండంతో గెడ్డలో పడిపోయి మృతిచెందింది. అటుగా వెళ్లిన స్థానికులు పరిశీలించి కుటుంబసభ్యులకు ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ అశోక్కుమార్ తెలిపారు. -
తోటపల్లిపై తూటా..!
వీరఘట్టం: అధికారంలోకి వస్తే తోటపల్లిని సస్యశ్యామలం చేస్తామని సెల్ఫీ చాలెంజ్లు చేసిన ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు తీరా అధి కారం చేపట్టిన తర్వాత తోటపల్లి పాత ఆయకట్టు కాల్వల ఆధునికీకరణ పనులను ప్రాధాన్యతా ప్రా జెక్టుల నుంచి తప్పించారు. 25 శాతంలోపు ఉన్న ప్రాజెక్టు పనులను రద్దు చేస్తున్నట్లు ప్రకటనలు చేశారు. వారంరోజుల క్రితం తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులను పూర్తిగా రద్దు చేస్తూ గెజిట్ జారీ చేశారు. దీంతో తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేద ని తేలిపోయింది. మళ్లీ రీ–ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చేందుకు జలవనరులశాఖ అధికారులు కార్యాచరణ చేపట్టారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ మరో ఇరవైరోజుల్లో ముగియ నుంది. కావున జనవరి నెల నుంచి కాలువల పనులు చేసేందుకు వాతావరణం అనుకూలంగా ఉండనుండడంతో రూ.292.5 కోట్లతో తోటపల్లి పాత ఆయకట్టు కాలు వల ఆధునికీకరణ పనుల కోసం కొత్త ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ ప్రతి పాదనలను కూటమి ప్రభుత్వం కరుణిస్తేనే తోటపల్లి పనులకు మోక్షం కలుగుతుంది. లేదంటే ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తోటపల్లి కా లువల ఆధునికీకరణ పనులు నిలిచిపోవాల్సిందే. ఇదీ పరిస్థితి.. తోటపల్లి పాత ఆయకట్టులో సాగు విస్తీర్ణం 64 వేల ఎకరాలు. సాగునీరందించే 17.616 కి.మీ పొడవు న్న కుడికాలువలో 9.3 కి.మీ వరకు కాంక్రీట్ పనులు చేపట్టారు. అలాగే 37.536 కి.మీ పొడవున్న ఎడమకాలువలో 17.5 కి.మీ వరకు కాంక్రీట్, లైనింగ్ పనులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి చేశారు. సుమారు రూ.35 కోట్లతో చేపట్టిన ఈ పనులకు కాంట్రాక్టర్కు రూ.34 కోట్ల వరకు బిల్లుల చెల్లింపులు కూడా జరిగాయి. అయితే ఆ పనులు 23.5 శాతం మాత్రమే జరగడంతో వాటిని రద్దు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించి ఈ ప్రాంత రైతులకు వెన్నుపోటు పొడిచింది. కూటమి కరుణిస్తుందా..? ఈ ఏడాది తరచూ కురిసిన వర్షాలతో తోటపల్లి పాత ఆయకట్టు రైతులు ఖరీఫ్కు సాగునీటి కష్టాల నుంచి గట్టక్కారు. ఉభాల సమయంలో శివారు ఆయకట్టుకు నీరందడం లేదని పాలకొండ ప్రాంత రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతలో వర్షాలు కురవడంతో ఖరీఫ్ గట్టెక్కిందని రైతులు ఊరట చెందారు. ఈ పరిస్థితుల్లో రద్దయిన పనులకు కొత్తగా తెచ్చిన రూ.292.5 కోట్ల కొత్త అంచనా వ్యయానికి కూటమి కరుణిస్తుందా అంటూ రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం ఆమోదించి తోటపల్లి ఆధునికీకరణ పనులకు జీవం పోయాలని రైతులు కోరుతున్నారు.రూ.97.5కోట్లు పెరిగిన అంచనా వ్యయం.. గతంలో తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ పనులకు రూ.195 కోట్లు సరిపోతాయని జలవనరులశాఖ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ పనులను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో అధికారులు రీ–ఎస్టిమేషన్ వేస్తున్నారు. పెరిగిన చార్జీలను కలుపుకుని గత ఎస్టిమేషన్కు 50 శాతం పెంచుతూ రూ.292.5 కోట్లతో నూ తన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించేందుకు జలవనరులశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో చేపట్టిన పనులు 25 శాతం లోపు ఉండడంతో ఈ పనులను ప్రభుత్వం రద్దు చేసింది.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెరిగిన ధరల ప్రకారం 50 శాతం అంచనా వ్యయం పెరిగింది. దీంతో రూ.292.5 కోట్లతో కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నాం. కొద్ది రోజుల్లో ప్రభుత్వానికి నివేదిస్తాం. డీవీ రమణ, జలవనరులశాఖ ఏఈ, వీరఘట్టం -
రైతన్నను ఆదుకోండి
మోంథా ముంచేసింది.. విజయనగరం రూరల్: మోంథా తుఫాన్ పంటలను ముంచేసింది... రైతన్నకు అపార నష్టం కలిగించింది.. గత ప్రభుత్వంలో అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకా న్ని ఎత్తేయడంతో ఇప్పుడు రైతన్నకు గడ్డుపరిస్థితి ఏర్పడింది.. ప్రీమియం చెల్లించని రైతులకు బీమా అందే పరిస్థితి లేదు.. తక్షణమే పంట నష్టం అంచ నా వేసి రైతులను ఆదుకోవాలంటూ పలువురు సభ్యులు జెడ్పీ సర్వసభ్యసమావేశంలో ప్రస్తావించారు. రైతులను ఆదుకునే చర్యలను వేగవంతం చేయాలని మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ను కోరారు. విజయనగరం జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన గురువారం జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. తొలుత వ్యవసాయ శాఖపై జరిగిన చర్చ లో రైతుల ఇబ్బందులను, ఆదుకోవాల్సిన ఆవశ్యకతను పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. దీనిపై జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ పంట నష్టంపై అధికారులు రూపొందించిన నివేదిక లోపభూయిష్టంగా ఉందన్నారు.సాగు సమయంలో ఎరువులు సకాలంలో అందక ఇబ్బందులు పడిన రైతులు, మోంథా తుఫాన్ దాటికి పంటలు నష్టపో యి కష్టాల్లో పడ్డారన్నారు. 35 శాతం కన్నా ఎక్కువ పంట నష్టం జరిగితేనే నమోదు చేస్తున్నారని, అంత కన్నా తక్కువ జరిగిన వారి పరిస్థితేంటని ప్రశ్నించా రు. ఇప్పటికీ కొన్నిచోట్ల పంట నీట మునిగి ఉందని, ధాన్యం రంగుమారే అవకాశం ఉందని, వాటిని ఏ విధంగా కోనుగోలు చేస్తారో రైతులకు వివరించా లని మంత్రులను కోరారు. పంటన నష్టం అంచనా గడువు పొడిగించాలని కోరారు. ●ధాన్యం సేకరణపై జరిగిన చర్చలో జేసీ సేతుమాధవన్ మాట్లాడుతూ జిల్లాకు కోటి గోనె సంచు లు అవసరం అవుతాయని, ప్రస్తుతం జిల్లాస్థాయి లో 50 లక్షల వరకు సర్దుబాటు అవుతున్నాయని, మిగిలిన వాటి కోసం ప్రభుత్వంతో చర్చ జరుగుతోందని తెలిపారు. ●రైతులు అవసరానికి మించి ఎక్కువ మోతాదు లో యూరియా వినియోగిస్తున్నారని, దీనివల్ల కాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయని, రైతులకు యూరియా వినియోగంపై అవగాహన కలిగించా లని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు వ్యవసాయ అధికారులకు సూచించారు. ప్రజల ఆరోగ్యం ముఖ్యమని, దీనిని రాజకీయం చేయకూడదని మంత్రి అన్నారు. ●వైద్యారోగ్యశాఖపై జరిగిన చర్చలో గిరిజన ఆశ్ర మ పాఠశాలల విద్యార్థుల మృతి చెందినా ఆదుకునేవారే కరువయ్యారని పార్వతీపురం మన్యం జిల్లా లోని గిరిజన మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు వాపోయారు. గిరిజన విద్యార్థు ల మృతిపై అధికారులు తప్పుడు లెక్కలు ఇవ్వడంపై మండిపడ్డారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు అండగా నిలవాలని, పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ●గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను మంజూ రు చేస్తే ఈ ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నించడం బాధాకరమని, దీనివల్ల పేద ప్రజలకు వైద్యం, విద్యార్థులకు వైద్యవిద్య దూరం అవుతుతాయని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలల్లో గత ప్రభుత్వం అమలు చేసిన పాలసీని కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పందిస్తూ పీపీ అపేదే లేదని, ఈ విధానం ప్రజలకు, పేదలకు ప్రయోజనమని భావించి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విజయనగరంలో మెడికల్ కాలేజీ ప్రారంభమైనా అభివృద్ధి కో సం మరో రూ.600 కోట్లు ఖర్చుచేయాల్సి ఉందని, ఆ లెక్కన అన్ని కాలేజీలకు రూ.వేలకోట్లను ఖర్చు చేయడమంటే ప్రభుత్వానికి భారమవుతుందన్నా రు. ప్రజలకు అందించే సౌకర్యాలలో ఎటువంటి లోపం లేకుండా చూస్తామన్నారు. ఇదే అంశంపై జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ వైద్యకళాశాలలను ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు. అభివృద్ధి పనులనేవి నిరంతర ప్రక్రియ అని, ఏ ప్రభుత్వం ఏర్పడినా వాటిని కొనసాగించాలే తప్ప భారమవుతుందని తప్పించుకునే చర్యలు తగవన్నారు. ●కొత్త పింఛన్లు ఇచ్చేది ఎప్పుడని పలువురు సభ్యులు ప్రశ్నించగా మంత్రి కొండపల్లి స్పందిస్తూ దరఖాస్తులు తీసుకుంటున్నామని, మంజూరుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ●భోగాపురం ఎంపీపీ మాట్లాడుతూ ఎయిర్ పోర్ట్ నీరు రావాడ పంచాయతీలోకి మళ్లించడంతో గ్రా మంలో కాలు పెట్టలేని పరిస్థితి నెలకొందని, దీనికి పరిష్కారం చూపాలని కోరారు. దీనిపై కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పందిస్తూ ఈ సమస్య తన దృష్టికి వచ్చిందని, ఇరిగేషన్, రెవెన్యూ, ఎయిర్ఫోర్ట్ అధికారులతో కలిసి టీం వర్క్ జరగాల్సి ఉందని, త్వరలో సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్ట ర్లు రాంసుందర్ రెడ్డి, డాక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి, జేసీ సేతుమాధవన్, పార్వతీపురం సబ్ కలెక్టర్ డాక్టర్ ఆర్.వైశాలి, ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్బాబు, ఎమ్మెల్యే లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, ఉమ్మడి జిల్లాల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నెల్లిమర్ల మండలంలో ఎన్నో ఏళ్లుగా దేవస్థానం భూములు సాగుచేస్తున్న రైతులకు ఈ క్రాప్ ఎందుకు చేయడం లేదని ఎమ్మెల్సీ సురేష్ బాబు వ్యవసాయ అధికారులను నిలదీశారు. అవి ప్రస్తుతం వివాదాల్లో ఉందని అందుకే ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆయన కోరారు. -
సిరిధాన్యాలపై దృష్టి పెట్టండి
పార్వతీపురం రూరల్: జిల్లాలోని ప్రతిరైతు వ్యాపారవేత్తగా ఎదగాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతను, ఆధునిక యంత్రాలను అందిపుచ్చుకునేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 6వేల ఎకరాల్లోని చిరుధాన్యాల సాగు లక్ష్యం మరింత పెరగాలని, లాభసాటి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యక్తిగత పెట్టుబడి పెట్టలేని రైతులు బృందాలుగా ఏర్పడి సాంకేతికతను వినియోగించుకునేలా శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రస్తు తం ఎనిమిదిగా ఉన్న డ్రోన్ల వినియోగాన్ని గణణీయంగా పెంచాలన్నారు. ఖాళీ ప్రభుత్వ భూముల్లో ఉద్యాన పంటలు వేసి ఆదాయం సృషించాలని చెప్పారు. స్మార్ట్ కార్డుల పంపిణీ పూర్తి కావాలి అలాగే జిల్లాలో 2.73లక్షల స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ ప్రక్రియ నాలుగురోజుల్లో పూర్తి కావా లని డీఎస్ఓను ఆదేశించారు. ముఖ్యంగా వలస వెళ్లిన వారి వివరాలను సేకరించి వారికి కార్డులు అందేలా చూడాలన్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలని అంబులెన్స్లు వెళ్లేలా గుర్తించిన 83 రహదారి పనులకు వెంటనే టెండరు ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభించాలని ఆదేశించా రు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, హెల్త్ రికా ర్డుల నిర్వహణ పక్కాగా జరగాలని, బాల్య వివాహాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకో వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పార్వతీపురం రూరల్: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా పార్వతీ పురం సబ్డివిజన్కు ఏఎస్పీగా(ఎస్బీపీఓ) మనీషా వంగలరెడ్డిని కేటాయించడంతో గురువారం ఆమె పార్వతీపురంలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డిని జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. సబ్డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, నిర్వహించాల్సిన విధులు, బాధ్యతలపట్ల ఎస్పీ ఆమెకు దిశానిర్దేశం చేశారు. -
నర్సింగ్ విద్యార్థులే దిక్కు..!
● ఏరియా ఆస్పత్రిలో అందుబాటులో ఉండని వైద్యులు! ● అవస్థలు పడుతున్న రోగులు ● ప్రజలకు అందని ప్రభుత్వ వైద్యంఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో సేవలు అందించేలా చర్యలు తీసుకుంటాం. ఇటీవలే నేను బాధ్యతలు చేపట్టాను. ఆస్పత్రిలో ఉన్న లోపాలను సరిచేసి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాను. హాజరువేసి బయటకు వెళ్లే వైద్యులపై చర్యలు తీసుకుంటాం. –కె.చిరంజీవి, ఆస్పత్రి సూపరింటెండెంట్పాలకొండ: డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి లో రోగులకు సేవలు అందక అవస్థలు పడుతున్నా రు. వందల సంఖ్యలో ప్రతిరోజూ ఆస్పత్రికి వస్తు న్న రోగులు ఉసూరుమంటూ తిరిగి వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువా త ప్రభుత్వ వైద్యం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇందులో భాగంగా గతంలో జరిగిన బదీలీల్లో ఇక్కడ పనిచేస్తున్న వైద్యులను బదిలీ చేసింది. వారి స్థానంలో వచ్చిన వైద్యులు మొక్కుబడిగా ఇష్టంలేని విధులు నిర్వహిస్తున్నారు. ఒకరిద్దరు వైద్యులు మినహా మిగిలిన వారు ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రి కోసం తమ సమయం కేటాయించడంతో పాటు రోగుల ను విసిగించి ఆక్కడికి వెళ్లిపోయేలా చేస్తున్నారు. ఏరియా ఆస్పత్రిలో సేవలు అందకపోవడంపై ఇప్పటికే పలు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు పలుమార్లు పరిశీలన చేసి మందలించినప్పటికీ ఫలితం మాత్రం రావడంలేదు. ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో శిక్షణ కోసం వస్తున్న నర్సింగ్ విద్యార్థి నులే రోగులకు దిక్కుగా మారారు. వారు రోజుకు సమారు 80 మంది మూడు షిఫ్టుల్లో ఇక్కడ శిక్షణ కోసం వస్తున్నారు. వారితోనే ప్రస్తుతం ఆస్పత్రిలో సేవలు కొనసాగుతున్నాయి. ఒకరిద్దరు మినహా.. ఆస్పత్రిలో వైద్యులు పూర్తిస్థాయిలోఅందుబాటులో ఉండడం లేదు. ఆస్పత్రిలో హాజరు వేసిన వెంటనే బయట ఆస్పత్రిలో సేవలు అందించేందుకు వెళ్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారి కారణంగా పనిచేస్తున్న వైద్యులు వీరి నుంచి మేము కూడా మాట పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎముకల వైద్యురాలి తీరే వేరు.. ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ వైద్యురాలు తీరు వేరని రోగులు వాపోతున్నారు. ఆమె ఎప్పుడు విధులకు వస్తారో తెలియదు. వచ్చినా ఎంతసమయం ఉంటారన్నది స్పష్టత లేదు. ఇప్పటికే ఆమె తీరుపై పలు మార్లు ఫిర్యాదులు రావడంతో ఆమెను డీసీహెచ్ఎస్ మందలించిన సంఘటనలు ఉన్నాయి. ఆమె పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఆర్థోపెడిక్ విభాగంలో సాధారణ వైద్యులే రోగులకు సేవలు అందిస్తుంటారు. పాలకొండ ఏరియా ఆస్పత్రిలో వైద్యుల తీరుపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. మరి కొంతమందిని హెచ్చరించాం. ఇప్పటికీ వారి పనితీరు మారకపోతే చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. మరో మారు ఆస్పత్రిని సందర్శించి తగిన చర్యలు చేపడతాం. –నాగభూషణరావు, డీసీహెచ్ఎస్ -
ఐటీడీఏలో పీజీఆర్ఎస్ మార్పు
సీతంపేట: ఇకపై ఐటీడీఏలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ప్రతి శుక్రవా రం నిర్వహించనున్నట్లు పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్పిల్ జగన్నాఽథ్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని మార్పు చేసి ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. యథావిధిగా అధికారులు శుక్రవారం హాజరు కావాలని స్పష్టం చేశారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చన్నారు. పార్వతీపురంలో.. పార్వతీపురం: గిరిజన సమస్యలను పరిష్కరించేందుకు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ప్రతి శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్డే నిర్వహించున్నా రు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిమిత్ర సమావే శ మందిరంలో శుక్రవారం ఉదయం 10.30 గంటలనుంచి ప్రత్యేక గిరిజన గ్రీవెన్స్డేను నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్రెడ్డి తెలిపారు. గిరిజనులు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్వతీపురం రూరల్: జిల్లా ఉన్నతాధికారుల పేరుతోనే మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్ల తీరు మరోసారి కలకలం రేపింది. పార్వతీపు రం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి పేరుతోనే నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించి, డబ్బులు వసూలు చేయాలని చూసిన ఘట న వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి ఫొటో, పేరుతో ఒక ఫేక్ అకౌంట్ను సృష్టించిన కేటుగాళ్లు, రవి అనే వ్యక్తికి సందేశాలు పంపారు. ‘ఓ ప్రాజెక్టు నిమిత్తం అత్యవసరంగా డబ్బులు కావాలి’ అని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సందేశాల తీరుపై అనుమానం వచ్చిన రవి వెంటనే కలెక్ట ర్ కార్యాలయాన్ని సంప్రదించాడు. దీంతో అసలు విషయం తెలుసుకున్న కార్యాలయం అధి కారులు వెంటనే అప్రమత్తమై చర్యలకు ఉపక్రమించారు. ఈ సైబర్ మోసంపై కలెక్టర్ కార్యాలయం నుంచి అధికారికంగా పార్వతీపురం పట్టణ పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పార్వతీపురం పట్టణ సీఐ కె.మురళీధర్, ఎస్సై గోవింద తెలిపారు. గుమ్మలక్ష్మీపురం: మండలంలోని పి.ఆమిటి, డుమ్మంగి, బొద్దిడి గ్రామాల్లోని ద్రవ్య సహాయ క పాఠశాలలను జోన్ వన్ ఆర్జేడీ విజయ్ భాస్కర్ గురువారం పరిశీలించారు. ఈమేరకు ఆ పాఠశాలలను సంబంధిత యాజమాన్యాలు గతంలో ప్రభుత్వంలో విలీనం చేయకపోవడం వల్ల ఉపాధ్యాయుల పోస్టులు మంజూరు కాక మూతపడ్డాయి. అయితే ఆ గ్రామాల్లోని విద్యార్థుల చదువుకు ఆటంకం కాకుండా ఉండేందుకు గ్రామస్తుల విజ్ఞప్తుల మేరకు ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ పాఠశాలలను పునఃప్రారంభించినప్పటికీ.. అధికారికంగా ప్రభుత్వ పాఠశాలగా మారలేదు. ఈ నేపథ్యంలోనే ఈ పాఠశాలలను సందర్శించిన ఆర్జేడీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలుగా మార్పు చేసేందుకు కావాల్సిన వసతులు ఉన్నాయో లేదో పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ఆర్జేడీని కలిసిన ఆయా గ్రామస్తులు గ్రామాల్లోని బడిఈడు పిల్లలకు అన్యాయం జరగకుండా ఈ పాఠశాలలను ప్రభుత్వ పాఠశాలలుగా మార్పు చేస్తూ కొనసాగించాలని కోరారు. ఆయన వెంట ఎంఈఓ బి.చంద్రశేఖర్ ఉన్నారు. విజయనగరం ఫోర్ట్: మాతాశిశు మరణాల నివారణే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని డీఎంహెచ్ఓ ఎస్. జీవనరాణి సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో సంభవించిన మాతృ, శిశు మరణాలపై సమీక్షించారు. గర్భస్థ దశలో తీసుకోవాల్సిన చర్యలను గర్భిణులకు వివరించాలన్నారు. హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. -
ఏపీలో మరో బస్సు ప్రమాదం.. చెలరేగిన మంటలు
సాక్షి, పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు చెలరేగాయి. OD 10S 6754 బస్సులో మంటలు రావడాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. చెక్పోస్టు వద్ద బస్సును నిలిపివేసి ప్రయాణీకులను అప్రమత్తం చేశారు. దీంతో, ప్రాణాపాయం తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణీకులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది.. చేవెళ్ల దగ్గర మరో ప్రమాదంలో 19 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనల కారణంగా మృతుల కుటుంబాలు ఇంకా శోకసంద్రంలోనే ఉన్నాయి. -
11,12 తేదీల్లో సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా పోటీలు
● జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావువిజయనగరం: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు ఈనెల 11,12 తేదీల్లో జిల్లా స్థాయి సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. 11న నగరంలోని విజ్జి స్టేడియంలో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, ఖోఖో, హాకీ, కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుల ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా కంటోన్మెంట్లో గల ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 12న రాజీవ్ స్టేడియంలో క్యారమ్స్, చెస్, క్రికెట్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, యోగా, డ్యాన్స్/మ్యూజిక్ అంశాల్లో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. విజ్జిస్టేడియంలో టెన్నిస్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహించే పోటీలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని వెల్లడించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేయనున్నామన్నారు. ఆసక్తి గల సివిల్ సర్వీస్ ఉద్యోగులు తమ డిపార్ట్మెంట్ గుర్తింపుకార్డుతో పోటీలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 94917 67327 , 77996 20224 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
ఎంపీడీఓ, సిబ్బందిపై కలెక్టర్ అసహనం
పూసపాటిరేగ: పూసపాటిరేగ ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ ఎస్. రామ్సుందరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన పూసపాటిరేగ మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన కలెక్టర్ పరిశీలించి సిబ్బంది ఒకరు మాత్రమే ఉండడంతో సిబ్బంది ఏరని? అక్కడ ఉన్న జూనియర్ అసిస్టెంట్ను ప్రశ్నించారు. ఎంపీడీఓ, సూపరింటెండెంట్లు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఆన్లైన్ సేవలపై డిప్యూటి తహసీల్దార్ సంజీవ్కుమార్ను అడిగారు. నిర్ణీత సమయంలో సేవలు అందించాలని ఆదేశించారు. దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. నిర్ణీత కాలవ్యవధిలో సమస్యలకు పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్ పోటీలకు జిల్లా జట్ల ఎంపికవిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్గేమ్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు బుధవారం ఉత్సాహ భరిత వాతావరణంలో సాగాయి. జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14,17 వయస్సుల విభాగాల్లో బాలబాలిలకు కబడ్డీ, ఖోఖో క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించగా..అండర్–17 విభాగంలో బాల,బాలికలకు అథ్లెటిక్స్ క్రీడాంశంలో ఎంపికలు నిర్వహించారు. ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి పంపించనున్నట్లు జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మిలు తెలిపారు. ఎంపిక పోటీలను జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.బొబ్బిలిరూరల్: మండలంలోని పిరిడి గ్రామంలో పండాల శ్రీశాంకరిపీఠం, గణేష్ జ్ఞాన మందిరంలో మూడున్నర తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. గుడి నిర్వాహకులు తెలిపిన సమాచారం మేరకు కార్తీకమాస పౌర్ణమి సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక పూజల కోసం బుధవారం గుడిని తెరిచి పూజలు నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తి మధ్యాహ్నం వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో తామంతా గుడి నుంచి బయటకు వచ్చేశామని ఆలయ నిర్వాహకురాలు నీరజ చెప్పారు. ప్రతి ఏడాదీ ఆలయ ధర్మకర్తలు పండాల చినబాబు, బంధువులు కార్తీక పౌర్ణమికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారని ఇంతలో ఈ దొంగతనం జరగిందని నిర్వాహకురాలు నీరజ తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. చీపురుపల్లిరూరల్(గరివిడి): ఈ నెల 17,18,19 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న టేబుల్టెన్నిస్ రాష్ట్రస్థాయి చాంపియన్షిప్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక ఈనెల 9వ తేదీన గరివిడిలో గల శ్రీ చైతన్యస్కూల్లో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా సెక్రటరీ పి.కృష్ణమూర్తి తెలిపారు. అండర్–11,13,15,17,19 సంవత్సరాల బాలబాలికలు, సీనియర్స్ సీ్త్ర పురుషుల ఎంపికలు జరుగుతాయని తెలిపారు. టీమ్ ఈవెంట్ విభాగంలో అండర్–15 బాలబాలికలు, సీనియర్స్ విభాగంలో ఎంపికలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎంపికలకు హాజర య్యే వారు ఉదయం 9గంటలకు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు ఫోన్ 94411 41122 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
ఇద్దరు విద్యార్థులకు ఇస్రో శాస్త్రవేత్తలను కలిసే అవకాశం
విజయనగరం అర్బన్: జిల్లా నుంచి ఎంపికై న ఇద్దరు విద్యార్థులకు నాసా, ఇస్రో శాస్త్రవేత్తలను కలిసే అద్భుత అవకాశం వచ్చిందని, వారికది మరపురాని అనుభూతిని పొందడమేనని డీఈఓ యూ.మాణిక్యంనాయుడు తెలిపారు. సైన్స్ ఈవెంట్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ ప్రత్యేక సైన్స్ టూర్లు అందుబాటులోకి వస్తున్నాయి. విమానంలో వెళ్లి ఢిల్లీ వంటి ప్రదేశాల్లో అధునాతన సైన్స్ సెంటర్లు, ప్లానిటోరియంలు, ఇండో–రష్యన్ సెంటర్లను సందర్శించే అవకాశం జిల్లాలోని డెంకాడ మండలం అక్కివరం విద్యార్థి పతివాడ భానుప్రసాద్, వియ్యంపేట డాక్టర్ బీఆర్అంబేడ్కర్ గురుకులం విద్యార్ధిని తెగ్లంగి సంజనకు లభించిందని డీఈఓ తెలిపారు. ఈ నెల 6 నుంచి 8వ తరగతి వరకు జరిగే ఈ ప్రత్యేక టూర్లో పాల్గొనడానికి బుధవారం వారిద్దరూ ప్రయాణమయ్యారు. -
ఉద్యోగులకు జీతాల్లేవ్!
● ఐదో తేదీ వచ్చినా ఖాతాల్లో జమకాని వైనం ● ఇబ్బందులు పడుతున్న చిరు, మధ్యతరగతి వేతన జీవులు సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు పడడం గగనమైంది. ఈ నెల ఐదో తేదీ వచ్చినా చాలా విభాగాల ఉద్యోగులకు జీతం మొత్తం జమకాలేదు. చేస్తుంది సర్కారు కొలువే గానీ.. నెలయ్యే సరికి ఒక భరోసా లభించడం లేదని పలువురు వాపోతున్నారు. పేరుకు రూ.వేలల్లో జీతం అయినా అధిక శాతం మంది మధ్య తరగతి ఉద్యోగులకు ఒకటో తేదీ వస్తే గుండె దడే. ఇంటి అద్దె, కరెంటు బిల్లు, పాలవాడు, కిరాణా వంటివే కాక.. ఈఎంఐలు, తీసుకున్న రుణాలకు చెల్లింపులు కచ్చితమైన తేదీకి కట్టాల్సిందే. ఈఎంఐలు, రుణాలు మొత్తం చెల్లించకుంటే వారి ఖాతా మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్లిపోతుంది. ఇవన్నీ పోనూ.. చేతిలో మిగిలింది రూపాయలే. ఒకటో తేదీన జీతం కోసం సగటు ప్రభుత్వ ఉద్యోగి ఎదురు చూస్తుంటాడు. ఈ నెల ఇంతవరకూ జమ చేయకపోవడంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలాది మంది ఎదురు చూపు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 12,500 మంది, ఉపాధ్యాయులు 9,700 మంది, పోలీసులు 900 మంది వరకూ ఉన్నారు. వీరు కాక.. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు వందల సంఖ్యలో పని చేస్తున్నారు. ఉపాధ్యాయులు, పోలీసులు, వైద్య శాఖ సిబ్బందికి రెండు రోజుల కిందట జీతం మొత్తం చెల్లింపులు చేశారు. మిగిలిన చాలా వరకూ ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు ఐదో తేదీ వచ్చినా జమ కాలేదు. ఒక్కొక్కరికీ ఒక్కో తేదీన ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది. దీంతో వారంతా ఎప్పటికప్పుడు తమ బ్యాంకు ఖాతా మొత్తాన్ని పరిశీలించుకుంటున్నారు. ఒకటో తేదీ నాటికి జీతాలు జమచేస్తే.. ఉద్యోగులు తమ నెలవారీ అవసరాలను తీర్చుకుంటారు. దీనికితోడు గత నెల వరుస పండగలు రావడంతో ఖర్చులు పెరిగాయని.. అప్పులు చేయాల్సి వచ్చిందని పలువురు చెబుతున్నారు. ఈ నెలలో పిల్లలకు సెకెండ్ టర్మ్ ఫీజులు కూడా చెల్లించాలని అంటున్నారు. ఇప్పటికే డీఏ చెల్లింపుల్లో కోత వేసిన ప్రభుత్వం.. సమయానికి జీతాలు కూడా చెల్లించడం లేదని వాపోతున్నారు. -
తేవడం.. తీసుకెళ్లడం.. అంతా డోలీలోనే...
ఈ చిత్రం చూశారా... డోలీలో ఉన్నది కొమరాడ మండలం కుంతేస్ పంచాయతీ జొప్పంగి గ్రామానికి చెందిన హిమరిక సావిత్రి. ఆమెకు మంగళవారం పురిటినొప్పులు రావడంతో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మసిమండ వరకు రాళ్లదారిలో డోలీలో మోసుకొచ్చారు. అక్కడ నుంచి ఆటోలో కూనేరు రామభద్రపురం పీహెచ్సీకి తీసుకెళ్లారు. ఆమె మగబిడ్డకు జన్మనివ్వడంతో మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు అనంతరం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. తిరిగి మళ్లీ అదే రాళ్లదారిలో డోలీలో బాలింతను స్వగ్రామానికి తరలించారు. ఈ దృశ్యాలు చూసిన వారు అయ్యో... గిరిజన బాలింతలకు ఎన్ని కష్టాలు అంటూ నిట్టూర్చారు. గిరిజనులకు ఈ కష్టాలు వీడేది ఎన్నడంటూ గిరిజన సంఘాల నాయకులు ప్రశ్నించారు. – కొమరాడ -
తమ్ముడి పెత్తనం..!
–8లోఆ పదవి నాకు ఆనదు... అన్న పదవితో.. ఆ నియోజకవర్గంలో అధికారం అన్నది.. కానీ.. పవర్ అంతా తమ్ముడిదే. ఆయన కనుసైగ చేస్తేనే ఫైల్ కదులుతుంది. పని జరుగుతుంది. బదిలీల నుంచి ఇసుక అక్రమ తరలింపు వరకు.. సెటిల్మెంట్ల నుంచి.. భూ దందాల వరకు.. అన్నీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. షాడో ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ.. ఆ నియోజకవర్గ ప్రజలపై ‘జగదీశ్వరుడి’ రూపంలో పెత్తనం సాగిస్తున్నారు. అవినీతి, అక్రమ వ్యవహారాలతో హడలెత్తిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గురువారం శ్రీ 6 శ్రీ నవంబర్ శ్రీ 2025గతంలో పెద్ద పదివి చేశారు. మళ్లీ అదే పదికి కోసం పావులు కదిపినా దక్కలేదు. అప్పట్లో మందీమార్బలంతో ముందుకు సాగి... ఇప్పుడు ఈ చిన్నపదవిని పట్టుకుని ఊళ్లోకి రావడమంటే ఆయన ఇష్టపడడం లేదట. ఈ మాటను పార్టీ క్యాడర్ వద్దే పలు మార్లు ప్రస్తావించారు కూడా. అందుకే.. విశాఖలోనే మకాం వేసి కాలేజీలు.. ఇతరత్రా వ్యాపారాలు చూసుకుంటూ.. నియోజకవర్గాన్ని ‘జగదీశ్వరుడికి’ దత్తత ఇచ్చేశారట. దీంతో తమ్ముడు బాధ్యతలేని అధికారాన్ని చెలాయిస్తూ చెలరేగిపోతున్నారని ఆ పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ్ముడు తరచూ శ్రీకాకుళం నుంచి రాజాం రావడం.. గెస్ట్ హౌస్లో ఉంటూ సమావేశాలు, అధికారిక సమీక్షలు నిర్వహిస్తూ షాడో నేతగా అన్న పదవిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారు. ఇటీవల అమ్మవారి జాతర పేరుతో ఒక్కో వ్యాపారి నుంచి కనీసం రూ.10 వేలు నుంచి అత్యధికంగా రూ.5 లక్షల వరకు అక్రమ వసూళ్లు చేశాసినట్టు తెలిసింది. వ్యాపారులను బెదిరించి వసూళ్లకు దిగడం, సెటిల్మెంట్లు పేరుతో భూములను బినామీల పేరును రాయించడంలో తమ్ముడు పెద్ద ఛాంపియన్ అంటూ పలువురు బహిరంగంగానే విమర్శిస్తుండడం గమనార్హం. విజయనగరం జిల్లాలోనే అతిపెద్ద ఇసుక నిల్వలు నాగావళి పరీవాహక ప్రాంతమైన రేగిడి, సంతకవిటి మండలాల్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్రమంగా రేయింబవళ్లు ఇసుక తవ్వుతూ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఇలా ఎక్కడకు కావాలంటే అక్కడకు సరఫరా చేస్తూ రూ.కోట్లు పోగేస్తున్నారు. తనకు నచ్చిన, తన మనసెరిగిన అధికారులు ఎక్కడున్నాసరే బదిలీద్వారా.. అది కుదరకపోతే డిప్యుటేషన్ ద్వారా తన ఇలాకాలోకి తెప్పించుకుని దందా నడపడం తమ్ముడి స్టైల్. ఇసుక లారీల రాకపోకలతో రోడ్లు పాడవుతున్నాయంటూ పలు గ్రామాల ప్రజలు తరచూ ఆందోళనలు చేస్తున్నారు. యువకులైతే లారీలను అడ్డుకుంటున్నారు. ఆ సమయంలో తమ్ముడే రంగంలోకి దిగడం, యువకులను బెదిరించి లారీలను ముందుకు నడుపుతుండడం పరిపాటిగా మారింది. ఈ ఐదేళ్లు ఎలాగోలా భరించేద్దాం.. ఆయనతో గొడవలకు దిగొద్దంటూ యువకులకు ఆ పల్లె పెద్దలు నచ్చజెబుతున్నారు. ఆయనకు ఎలాంటి పదవి లేకున్నా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రారంభోత్సవాలు చేస్తుండడం అధికారులకు సైతం తలనొప్పిగా మారిందన్నది టాక్. దీనిపై పొరపాటున ప్రశ్నిస్తే ఉద్యోగాలు ఉండవని, ఎక్కడికో బదిలీ అయిపోతామంటూ అధికారులు లోలోన గుబులు చెందుతున్నారు. కొందరు అనుచరులు మాత్రం తమ్ముడితాలూకా అంటూ దందాలు సాగిస్తుండం ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి విజయనగరం: ఆ నియోజకవర్గ ప్రజలు పదివిని ఒకరికి కట్టబెట్టారు. మరొకరి పెత్తనంతో ఇప్పుడు నలిగిపోతున్నారు. ఇదెక్కడి షాడో నేత పాలనరా ‘బాబూ’ అంటూ కుర్రోమొర్రో అంటున్నారు. అప్పుడెప్పుడో ఒకసారి అదృష్టవశాత్తు అన్నకు పెద్ద పదవి దక్కింది. రాజును చూసిన కళ్లతో మొగుణ్ణి చూస్తే మొత్తబుద్ధి అవుతుందట.. ఇప్పుడు ఆ ప్రజాప్రతినిధికి అలాగే అనిపిస్తోంది. ఒకసారి పెద్ద పదవి అనుభవించాక మళ్లీ చిన్న పదవిని చేపట్టడం నామోషీగా అనిపిస్తుందేమో మరి.. కలెక్టర్ ఉద్యోగం చేశాక బిల్లు కలెక్టర్ పోస్టింగ్ అంటే ఇముడ్చుకోవడం కష్టమే కదా.. అందుకే.. బినామీగా తన తమ్ముడిని అక్కడ ప్రతిష్టించి ఆయన వైజాగ్లో ఉంటూ పెద్దపెద్ద డీల్స్ చేస్తూ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం మానేశారట. దీంతో బాధ్యతలేని అధికా రాన్ని ఎంజాయ్ చేస్తున్న తమ్ముడు అదీఇదీ అని లేకుండా చెలరేగిపోతున్నారు. ఎదురు తిరిగే వారిపై ‘కోండ్రు’మంటూ గర్జిస్తున్నారు. నియోజకవర్గంలోని గుమస్తా పోస్టింగ్ దగ్గర్నుంచి ఆఫీసర్ పోస్టులవరకూ అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరగాలని హుకుంజారీ చేశారు. ఎవరికి ఏ చిన్న పని కావాలన్నా ఆయన దగ్గరకు వెళ్లాల్సిందే. ఏ పని అవ్వాలన్నా ఆయన తమ్ముడి తాలూకా కావాల్సిందే. దీంతో అంతిమంగా నియోజకవర్గంలో ఆఫీ సర్లు, కాంట్రాక్టర్లు, కార్యకర్తలు కూడా తమ్ముడి తాలూకా అని చెప్పుకుంటూ గడిపేస్తున్నారు. ఎస్.. సార్.. అనాల్సిందే.. పార్టీ కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒకటేమిటి.. అన్నీ తమ్ముడే చక్కబెడుతూ.. ఏమ్మా.. ఇంతకన్నా ఎవరు సేవ చేస్తారు అంటూ.. క్యాడర్ను చూసి కళ్లెగరేస్తున్నారు. దీంతో ఎందుకొచ్చిన గొడవ అంటూ కార్యకర్తలు, ఆఫీసర్లు కూడా ఎస్..సార్.. అనేస్తున్నారు. లేదంటే ఆయనకు కోపమెక్కువట. ఆగ్రహిస్తే తట్టుకోలేరట. ఎంతో కష్టపడి ఏళ్ల తరబడి చదివి ఉద్యోగాలు సాధించి.. ఇప్పుడు ఏ అధికారం లేకపోయినా హల్చల్ చేస్తున్న వ్యక్తితో మనకెందుకులే అంటూ తలఊపుకుని వెళ్లిపోతున్నారట. ఈ మాటలు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో తరచూ ఉద్యోగుల మధ్య జరుగుతున్నవే కావడం గమనార్హం. ఇసుక మాఫియా వెనుక ‘తమ్ముడు’ పదవి అన్నది.. అధికారం తమ్ముడిది..! కాంట్రాక్టులు, కమీషన్ల వ్యవహారాలన్నీ తమ్ముడి కనుసన్నల్లోనే.. ఏలుకో ‘జగదీశ్వరా’ అంటూ అన్న అభయం! బదిలీల నుంచి ఇసుక అక్రమ సరఫరా వరకు అన్నీ ఆయన ఆధ్వర్యంలోనే.. ఆయనంటే అధికారులకు హడల్.. ఇదెక్కడి పాలన అంటూ విస్తుపోతున్న జనం -
వైద్య సేవలపై కేంద్ర బృందం ఆరా
వీరఘట్టం: కేంద్ర వైద్య బృందం సభ్యులు వీరఘట్టం పీహెచ్సీని బుధవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై వైద్యాధికారి బి.ప్రదీప్ను అడిగి తెలుసుకున్నారు. ఓపీ నమోదు, వైద్యపరీక్షలు, అందజేస్తున్న మందులు, రిఫరల్ కేసులు తదితర అంశాలపై ఆరా తీశారు. వైద్యుల బృందం దీపికాశర్మ, యడ్ల రమణ, నీరజ్, అనీల్ వెంట డీఎంహెచ్ఓ భాస్కరరావు, గొర్లె నాగభూషణరావు తదితరులు ఉన్నారు. వీరఘట్టం పీహెచ్సీని సీహెచ్సీగా అప్గ్రేడ్ చేయాలని స్థానికులు కేంద్ర వైద్య బందానికి విన్నవించారు. నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం విజయనగరం రూరల్: జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈ నెల 6న నిర్వహించనున్నట్టు జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతనెల 29న నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశం మోంథా తుఫాన్ కారణంగా వాయిదా వేశామన్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన గురువారం ఉద యం 11 గంటలకు జరగనున్న సమావేశానికి సభ్యులందరూ హాజరుకావాలని కోరారు. ఇద్దరు విద్యార్థులకు పచ్చకామెర్లు సీతంపేట: స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత ఆశ్రమపాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులకు పచ్చకామెర్ల లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఏడో తరగతి చదువుతున్న కిల్లాడకు చెందిన మండంగి గౌతమ్, దంజుపాయికి చెందిన కూరంగి వరుణ్ నీరసంగా ఉండడంతో సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు రక్తపరీక్షలు చేసి పచ్చకామెర్ల లక్షణాలు ఉన్నట్టు గుర్తించి, శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నట్టు హెచ్ఎం చంద్రరావు తెలిపారు. సీ్త్రనిధి రుణ మంజూరు లక్ష్యం రూ.86 కోట్లు గుమ్మలక్ష్మీపురం: జిల్లాలో సీ్త్ర నిధి రుణాల మంజూరు లక్ష్యం రూ.86 కోట్లని డీఆర్డీఏ హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ ఆఫీసర్ వి.ధర్మారావు, ఏజీఎం పి.కామరాజు అన్నారు. గుమ్మలక్ష్మీపురంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో సీసీలతో బుధవారం సమావేశమయ్యారు. ఎస్హెచ్జీల స్వయం అభివృద్ధికి అందజేస్తున్న రుణాలు, వాటి రికవరీపై సమీక్షించారు. అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 2,575 మంది ఎస్హెచ్జీ సభ్యులకు రూ.41.5 కోట్లను సీ్త్ర నిధి నుంచి రుణాల రూపంలో అందజేశామన్నారు. 93 శాతం రికవరీ జరుగుతోందని తెలిపారు. ఇదివరకు ఒక ఎస్హెచ్జీకి రూ.5 లక్షలు మాత్రమే సీ్త్ర నిధి ద్వారా రుణాలు ఇచ్చేవారమని, ఇకపై ఒక ఎస్హెచ్జీకీ రూ.8లక్షల వరకు సీ్త్ర నిధి రుణాలు ఇస్తామని చెప్పారు. సీ్త్ర నిధితో పాటు ఇతర రుణాలు పొందిన సభ్యులు ప్రతినెలా 10వ తేదీలోగా ఆయా ఖాతాల్లో వాయిదా నగదును జమచేస్తే వడ్డీ పడదన్నారు. భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సీజ్ భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు జరిపారు. డీఎస్పీ ఎన్.రమ్య, ఇద్దరు సీఐలు, సిబ్బంది కలిసి కార్యాలయం తలుపులు మూసేసి ఉదయం 11.30 నుంచి రాత్రి 7 గంటల వరకు రికా ర్డులు తనిఖీ చేశారు. రోజువారీ రిజిష్ట్రేషన్లు, నెలలో జరిగే రిజిస్ట్రేషన్ల సంఖ్య, ప్రభుత్వానికి రోజుకి వస్తున్న ఆదాయం తదితర వివరాలపై ఆరా తీసినట్టు సమాచారం. ఏసీబీ అధికారులు వచ్చే సమయానికి పది నిమిషాల ముందు సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ కార్యా లయం నుంచి బయటకు వెళ్లి పోయారు. సీనియర్ అసిస్టెంట్ అనంతలక్ష్మి ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చినట్టు తెలిసింది. సబ్ రిజిస్ట్రార్ తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఎవరికంట పడకుండా ఆటోలో కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోదాలు చేస్తున్నామని, గురువారం కూడా తనిఖీలు చేస్తామని, అందుకే కార్యాలయాన్ని సీజ్ చేసినట్టు డీఎస్పీ రమ్య మీడియాకు తెలిపారు. -
కన్నపేగులను కాపాడి తల్లి మృతి
● వేగావతినదిలో మునిగి మరణించిన వివాహితబాడంగి: కడుపున పుట్టిన పిల్లలు నదిలో మునిగిపోతుండగా కాపాడిన ఓ తల్లి తాను ప్రవాహంలో కొట్టుకుపోయి బుధవారం మృతిచెందింది. ఈ దురదృష్టకర సంఘటనపై పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలంలోని ఆనవరం గ్రామానికి చెందిన అంపావల్లి సంతు(32) కార్తీకపౌర్ణమి ఉపవాసం ఉండి నోము నోచుకోవాలని పాప కీర్తి, బాబు చరణ్లతో కలిసి వేగావతి నదిలో స్నానం చేయడానికి వెళ్లింది. పిల్ల లు ఆడుకుంటూ నది లోతులోకి వెళ్లిపోతూ ప్రమాదంలో పడ్డారు. వారిని ఆదుకునే క్రమంలో ఆమె గోతిలో దిగి పిల్లలను కాపాడి.. తాను వరదప్రవాహంలో కొట్టుకుపోయింది. కొంత దూరంలో ఉన్న కారాడ పథకం వద్ద తేలగా బంధువులు, గ్రామస్తులు బయటకు తీశారు. వెంటనే ఆమెను చికిత్సకోసం బాడంగి సీహెచ్సీకి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం భద్రపరిచారు. తల్లిచనిపోయిందన్న సమాచారంతో పిల్లలిద్దరూ భోరుమని ఏడుస్తుండగా నాయనమ్మ వారిని సముదాయించేందుకు ఆపసోపాలు పడింది. మృతురాలి భర్త అనంత కుమార్ ఫిర్యాదుమేరకు హెచ్సీ ఉమామహేశ్వరరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కార్మిక, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం
కార్మికులు, ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మన్యం జిల్లా అధ్యక్షుడు సి.హెచ్.సింహాచలం, సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.వెంకటరమణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో ఉన్న కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుంటే పోరాటానికి సిద్ధం అవుతామని స్పష్టం చేశారు. పార్వతీపురం పట్టణంలో మున్సిపల్ కార్మికులతో కలిసి బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాదిమంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గం 12వ పీఆర్సీ కమిటీ కోసం ఎదురుచూస్తోందని చెప్పారు. ప్రభుత్వం అది ఇవ్వనప్పుడు ఐఆర్ ప్రకటించి కార్మికుల వేతనాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పురపాలక సంఘాల్లో మహిళా ఉద్యోగులకు నేటికీ ప్రసూతి సెలవు లేదని.. డ్యూటీలకు హాజరవుతున్న పాయింట్లలో కనీసం ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేలా నీరు, మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. -
టెట్ అభ్యర్థులపై ఫీజు భారం
వీరఘట్టం: టెట్ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) పరీక్ష ఫీజుల పెంపుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఒకే సారి ఫీజును రూ.500 పెంచి రూ. 1000 చేయడంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతంలో వలే రూ.500 ఫీజుగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ వైపు ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే.. పరీక్ష ఫీజు పేరుతో మరింత భారం వేయడం కూటమి ప్రభుత్వానికి తగదంటున్నారు. టెట్ పరీక్ష నిర్వహణకు అక్టోబర్ 24 నోటిఫికేషన్ వచ్చింది. దర ఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 23 చివరి తేదీ కాగా, హాల్ టికెట్లు డిసెంబర్ 3 నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, డిసెంబర్ 10 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే, గతేడాది 2024లో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి 55,500 మంది అభ్యర్థులు టెట్కు దరఖాస్తు చేశారు. ఇప్పుడు ఇన్ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా టెట్ పరీక్ష రాయాల్సిందేనని కేంద్రం తేల్చిచెప్పింది. దీంతో నిరుద్యోగులతో పాటు ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 2 లక్షల మంది ఈ ఏడాది టెట్ పరీక్షక్షకు దరఖాస్తు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కొక్కరికి పరీక్ష ఫీజు రూ.1000 చొప్పున ఉమ్మడి జిల్లాల నుంచి టెట్ ద్వారా ప్రభుత్వానికి రూ.20 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇన్ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు పరీక్ష ఫీజును చెల్లించే అవకాశం ఉన్నా నిరుద్యోగ యువతపై పరీక్ష ఫీజుల రూపంలో భారం మోపడం పద్ధతి కాదని నిరుద్యోగులు అంటున్నారు. ఇప్పటికే ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు టెట్ ఫీజు రూపంలో ఆర్థిక భారం వేయడం తగదు. ఫీజును గతేడాది మాదిరిగానే రూ.500లే తీసుకోవాలి. రూ.1000 ఫీజు చెల్లించడం నిరుద్యోగులకు భారం అవుతుంది. – జె.అమర్నాథ్, పట్టభద్రుడు, వీరఘట్టం టెట్ పరీక్షకు ఎటువంటి ఫీజులు లేకుండా నిర్వహించాలి. గత ఎన్నికల ముందు నిరుద్యోగ యు వతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కూట మి నాయకులు అధికారం వచ్చిన తర్వాత అరకొర టీచరు పోస్టులు తీసి టీచర్ అభ్యర్థులకు కుచ్చుటోపీ పెట్టారు. కనీసం టెట్ పరీక్షకు ఫీజులు మినహాయించి నిరుద్యోగ పట్టభద్రులపై ఆర్థిక భారం లేకుండా చూడాలి. – ఉగిరి శ్రీనివాసరావు, పట్టభద్రుడు గతంలో టెట్ పరీక్ష ఫీజు రూ.500.. నేడు రూ.1000కు పెంపు ఉమ్మడి జిల్లా అభ్యర్థులపై రూ.20కోట్ల భారం ఆవేదనలో అభ్యర్థులు -
ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
విజయనగరం క్రైమ్: పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారు ఏ కారణంతో వచ్చారో తెలుసుకుని, వారి ఫిర్యాదులు, చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలని జిల్లాలోని పోలీస్ సిబ్బంది, అధికారులకు ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. ఈ మేరకు జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల్లో రిసెప్షన్ కానిస్టేబుల్స్గా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్స్, సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ బుధవారం జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో వ్యవహరించాల్సిన తీరు గురించి దిశానిర్ధేశం చేశారు. మీటింగ్లో ఎస్పీ మాట్లాడుతూ సమస్యలను విన్నవించేందుకు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులను ముందుగా కూర్చోబెట్టి, వారికి మంచి నీరు అందించి, వారి ఫిర్యాదులను స్వీకరించాలన్నారు. ఫిర్యాదులను రాయలేని స్థితిలో ఉంటే వారి ఫిర్యాదును పోలీసులే రాసే విధంగా చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులను పదే పదే పోలీస్స్టేషన్కు తిప్పకుండా, వారి సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ చూపాలని సూచించారు. ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదు అంశాల తీవ్రతను అర్ధం చేసుకుని, వెంటనే స్పందించాలని, తదుపరి చర్యలు చేపట్టే విధంగా రిసెప్షన్ కానిస్టేబుల్స్ వ్యవహరించాలన్నారు. ఫిర్యాదు తీసుకున్న తరువాత ఫిర్యాదు అంశాలను రిసెప్షన్ రిజిస్టర్లో నమోదు చేసి, ఫిర్యాదుదారుకు రసీదు ఇవ్వాలన్నారు. అనంతరం, విషయాన్ని స్టేషన్ హౌస్ ఆఫీసరు దృష్టికి తీసుకువెళ్లి, చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. బాధితులకు ఆశ్రయం కల్పించాలి గొడవల కారణంగా బాధితులు ఎవరైనా తిరిగి ఇంటికి వెళ్లళ్ళలేని స్థితిలో ఉంటే వారిని శక్తి సాధన స్వధార హోమ్, వన్స్టాప్ సెంటర్లలో ఆశ్రయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుదారు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్. కాపీని ఫిర్యాదుదారుడికి తప్పకుండా ఇవ్వాలని చెప్పారు. ఇక మహిళలకు రక్షణ పొందేందుకు నిర్దేశించిన ఫోన్ నంబర్లు, స్వధార్ హో, వన్స్టాప్ సెంటర్, న్యాయ సహాయం అందించే న్యాయవాదులు, ఎన్జీఓలు, సైక్రియాటిస్టులు, కౌన్సిలర్స్ వివరాలను ఉమెన్ హెల్ప్డెస్క్లో అందుబాటులో ఉంచాలన్నారు వారి సేవలు అవసరమైన బాధితులకు ఫోన్నంబర్లు ఇచ్చి, సహాయపడాలని అధికారులను, రిసెప్షన్ కానిస్టేబుల్స్ను ఎస్పీ ఎ.అర్.దామోదర్ ఆదేశించారు. కాన్ఫరెన్స్లో ఏఎస్పీ సౌమ్యలత, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ సిబ్బందికి ఎస్పీ ఆదేశాలు -
శిక్షణ నిమిత్తం 37 మంది కొత్త ఆర్ఎస్సైలు
పార్వతీపురం రూరల్: అనంతపురం పోలీస్ శిక్షణ కళాశాలలో గ్రేహౌండ్స్లో శిక్షణను పూర్తి చేసుకున్న 37 మంది నూతన ఏపీఎస్పీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు (ఆర్ఎస్సైలు) ప్రాక్టికల్ శిక్షణ కోసం పార్వతీపురం మన్యం జిల్లాకు బుధవారం వచ్చారు. ఏజెన్సీ ప్రాంతాలలో విధుల అనుభవం కోసం వారిని జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లకు కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డిని వారంతా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో వారితో ఎస్పీ మాట్లాడుతూ ముందుగా నూతన ప్రొబేషనరీ ఆర్ఎసైలకు శుభాకాంక్షలు తెలిపారు. వారిని జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత పోలీస్ స్టేషన్లను కేటాయించారు. విధి నిర్వహణలో నిర్భయంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉండాలని క్రమశిక్షణే మీ బలం కావాలి అని ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా, ఆర్ఎస్సైలు విధిగా ఏజెన్సీ గ్రామాలను సందర్శించాలని, ప్రజలతో మమేకమై వారి ద్వారా సరైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు. కూంబింగ్ ఆపరేషన్లపై దృష్టి పెట్టాలని, చుట్టుపక్కల కదలికలు, వారికి సహకరించే వారిపై నిఘా ఉంచాలని ఆదేశించారు. వారంవారీగా సంతల సందర్శన, అధిక మొత్తంలో సరుకులు కొనుగోలు చేసే వారిపై దృష్టి పెట్టడం, వాహన తనిఖీలు చేయడం తప్పనిసరి అన్నారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. సమాచార సేకరణలో గోప్యత పాటించాలని చెప్పారు. ఏమాత్రం సందేహం వచ్చినా సీనియర్ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
కళాజాతరకు శ్రీకారం
పార్వతీపురం రూరల్: జిల్లాలోని ప్రతిభావంతులైన, ఔత్సాహిక కళాకారులను వెలుగులోకి తెచ్చేందుకు, వారి కళారూపాలకు సముచిత వేదిక కల్పించేందుకు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ‘కళాజాతర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని గాయకులు, నృత్యకారులు, చిత్రకారులు, మిమిక్రీ, ఇంద్రజాలం, శాసీ్త్రయ, జానపద కళారూపాలతో పాటు గిరిజన కళాప్రదర్శనలు, కవులు, నాటిక–నాటక రచయితలు సహా అన్ని కళారూపాలకు ఇది అత్యంత కీలకం కానుంది. ప్రతి 15 రోజులకు సాంస్కృతిక పోటీలు, ప్రదర్శనలు నిర్వహించి, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం కార్యక్రమం ప్రధాన లక్ష్యం. కళాకారులు నమోదు ఫారం ద్వారా తమ వివరాలను 99499 96497 నంబరుకు వాట్సాప్ లేదా మన్యం సంస్కృతి ఎట్ద రేటాఫ్ జీమెయిల్.కామ్ మెయిల్ చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులను 2026 జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవంలో ప్రశంసాపత్రాలతో సత్కరించనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ గొప్ప అవకాశాన్ని జిల్లాలోని కళాకారులు, యువతరం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దివ్యాంగులు సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలిపార్వతీపురం: దివ్యాంగులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని డీఈఓ బి.రాజ్కుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం పార్వతీపురం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాలోని ఎంఈఓలు, రిసోర్స్ పర్సన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహిత విద్యను బలోపేతం చేసేందుకు దివ్యాంగ పిల్లలకు పలు రాయితీలను ప్రకటించినట్లు తెలిపారు. పదవతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో దివ్యాంగ పిల్లలకు ఉన్న అలవెన్సులను, రాయితీలను, ఐఈపీలు అందిస్తున్న సేవలు దివ్యాంగులకు అందేలా చూడాలన్నారు. సమావేశంలో ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు, జిల్లా సహిత విద్యా కోఆర్డినేటర్ భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
తొమ్మిదవ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు
● నేటి నుంచి మూడురోజుల పాటు నిర్వహణ ● ఆహ్వానపత్రికలను ఆవిష్కరించిన సంస్ధ ప్రతినిధులువిజయనగరం టౌన్: అభినయ నాటకశాల, నటరత్న నాటక పరిషత్ సంయక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి, విజయవాడ నిర్వహణలో 9వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను ఈ నెల 6,7,8 తేదీల్లో ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి గురజాడ కళాభారతి ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు సంస్ధ ప్రతినిధులు అభియన శ్రీనివాస్, గెద్ద వర ప్రసాద్లు తెలిపారు. ఈ మేరకు స్థానిక హుకుంపేట బుక్కావీధిలో ఉన్న ఆర్యసోమయాజుల కాశీపతిరావు స్మారక భవనంలో బుధవారం ఆహ్వానపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురువారం సాయంత్రం విశాఖ చైతన్య కళాస్రవంతి సంస్ధ ఆధ్వర్యంలో పి.బాలాజీనాయక్ దర్శకత్వంలో అసత్యం అనే సాంఘిక నాటిక ప్రదర్శిస్తారన్నారు. అనంతరం 8 గంటలకు డాక్టర్ చిలుకూరి నాగేశ్వరరావు రచనలో గెద్ద వరప్రసాద్ దర్శకత్వంలో విజయనగరం నాటకశాల ఆధ్వర్యంలో సూత్రం అనే సాంఘిక నాటిక ఉంటుందన్నారు. 7న శుక్రవారం తెలంగాణ సిరిమువ్వ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ మంజునాథ రచన, దర్శకత్వంలో గేమ్ అనే నాటిక, 8 గంటలకు గుంటూరు జిల్లా కట్రపాటు ఉషోదయ కళానికేతన్ ఆధ్వర్యంలో చెరుకూరి సాంబశివరావు రచన, దర్శకత్వంలో కిడ్నాప్ అనే సాంఘిక నాటిక ప్రదర్శన ఉంటుందన్నారు. అదేవిధంగా 8న శనివారం కరీంనగర్ చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో రమేష్ మంచాల దర్శకత్వంలో సప్నం రాల్చిన అమృతం, రాత్రి 8 గంటలకు గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్ ఆధ్వర్యంలో డాక్టర్ వెంకట్ గోవాడ దర్శకత్వంలో అమ్మ చెక్కిన బొమ్మ అనే సాంఘిక నాటిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన కళాకారులందరికీ పురస్కారాలను అతిథులు అందజేస్తారని తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే నాటిక పోటీలకు కళాకారులు, కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంస్ధ ప్రతినిధులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
అంగరంగ వైభవంగా శ్రీనివాసుని కల్యాణం
● గోవిందనామస్మరణతో మార్మోగిన వేదిక ప్రాంగణంసీతంపేట: వేదపండితుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కల్యాణం అంగరంగ వైభవంగా బుధవారం నిర్వహించారు. గోవిందుని కల్యాణంతో సీతంపేట అధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి కల్యాణ ఘట్టాన్ని కళ్లారా చూసి భక్తులు పారవశ్యం చెందారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. గోవింద నామస్మరణతో వేదిక ప్రాంగంణం మార్మోగింది. తిరుమల శ్రీవారి అర్చక బృందం ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు. స్వామివారికి అర్చన, తోమాల సేవలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేశారు. ఈ సందర్భంగా ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆయన సతీమణితో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు. మారుమూల ప్రాంతాల్లో హైందవ దర్మంపై ప్రచారాన్ని చేయడానికి గోవింద కల్యాణాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సీతంపేటతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. కల్యాణం అనంతరం భక్తులకు ప్రసాదం, కుంకుమ, హ్యాండ్బుక్లు అందజేశారు. అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పాలకొండ సీఐ ప్రసాదరావు, ఎస్సై అమ్మన్నరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీటీడీ అర్చక బృందం సభ్యులు కృష్ణ సాయిస్వామి తదితరులు పాల్గొన్నారు. -
మందులోడా.. ఓరి మాయలోడా..!
● మందుల అమ్మకాల్లో మాయాజాలం ● ధరలు పెంచిన కంపెనీలు ● జీఎస్టీ తగ్గింపు పేరుతో పాతధరలకే విక్రయాలువిజయనగరం ఫోర్ట్: పక్కన ఫొటోలో కనిపిస్తున్న డెక్సారేంజ్ సిరప్ ఽఎంఆర్పీ రూ.192. కేంద్ర ప్రభుత్వం మందులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతం తగ్గించింది. జీఎస్టీ తగ్గించిన ప్రకారం సిరప్ను ఎంఆర్పీపై 7 శాతం తగ్గించి విక్రయించాలి. దీంతో మందుల కంపెనీ ఎంఆర్పీని రూ.211కు పెంచేసింది. జీఎస్టీ తగ్గించినా ధర పెంచడం వల్ల గతంలో ఉన్న ధరే వచ్చేలా మందులు కంపెనీలు ప్లాన్ చేశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే డెక్సరెంజ్ సిరప్ తయారీ కంపెనీయే కాదు. మందులు తయారీ చేసే అనేక కంపెనీలు ఈవిధంగా మందులు ధరలు పెంచేశాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం జీఎస్టీ తగ్గించినప్పటికీ వారి ఆదాయానికి ఎటువంటి ఢోకా ఉండకూడదనే ఉద్దేశంతో మందుల కంపెనీలు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాధిని తగ్గించడంలో మందులే కీలకం మానవుడి జీవనశైలిలో మార్పులు రావడం వల్ల అనేక మంది జబ్బుల బారిన పడుతున్నారు. గంటల తరబడి టీవీలకు అతుక్కుపోవడం, వ్యాయమం లేకపోవడం, జంక్ ఫుడ్స్ అధికంగా తినడం తదితర కారణాల వల్ల అధికశాతం మంది బీపీ, సుగర్, గుండెజబ్బులు, కేన్సర్ తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బీపీ, సుగర్ వంటి వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏజబ్బు తగ్గాలన్నా మాత్రలు గాని, ఇంజక్షన్లు గానీ వాడాల్సిందే. జిల్లాలో వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు లక్షల్లో ఉంటారు. వారంతా నెలకు లక్షల్లో మాత్రలు, సిరప్లు, ఇంజక్షన్లు వినియోగిస్తారు. మందుల వ్యాపారం నెలకు రూ.కోట్లలో జరుగుతుంది. జిల్లాలో ఉన్న 1200 మందుల షాపుల ద్వారా మందుల వ్యాపారం నెలకు రూ. 20 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు జరుగుతోంది. నేరవేరని కేంద్రం లక్ష్యం..! ప్రజలకు మందులను తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో కేంద్రం జీఎస్టీని తగ్గించింది. 12 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది. దీని వల్ల మందుల ధరలు గణనీయంగా తగ్గుతాయని అందరూ భావించారు. కాని మందుల కంపెనీలు ధరలు పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నేరవేరడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. ధరల పెంపకంపై విచారణమందుల కంపెనీలు ధరలు పెంచడంపై విచారణ చేస్తాం. మందుల తయారీ తేదీలను వెరిఫై చేయిస్తాం. రజిత, ఎ.డి, జిల్లా ఔషధ నియంత్రణశాఖ -
రెవెన్యూశాఖపై కలెక్టర్ ఆగ్రహం
● రీ సర్వేలో తప్పులు, వివాదాలకు ఆస్కారం ● రెవెన్యూ అధికారుల సమావేశంలో కలెక్టర్ రామ్సుందర్రెడ్డివిజయనగరం అర్బన్: జిల్లా రెవెన్యూశాఖలో సేవలు అందించడంలో తీవ్ర జాప్యం, నిర్లక్ష్యం కొనసాగుతున్నాయని కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలు, ఓపీసీ సర్టిఫికెట్లు, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, మ్యుటేషన్ వంటి కీలక సేవలకు సంబంధించిన దరఖాస్తులు గడువు దాటి పెండింగ్లో ఉండడం పట్ల అసంతృప్తి వెలిబుచ్చారు. అధికారులు తమ ప్రాథమిక విధులను కూడా సక్రమంగా నిర్వహించడం లేదని, ఇది ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు కారణమవుతోందని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన రెవెన్యూ అధికారుల సమావేశంలో మీసేవ ఆన్లైన్ సర్వీసెస్, రీ సర్వే, ధాన్యం సేకరణ, రెవెన్యూ కలెక్షన్స్, హౌసింగ్, ప్రభుత్వ భూముల ఆసైన్మెంట్ వంటి అంశాల్లో అనేక లోపాలు వెలుగు చూశాయి. మండలస్థాయిలో పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్ ఆరా తీసినప్పుడు అధికారులు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే డివిజన్ స్థాయిలో సమీక్షలు జరిపి, పెండింగ్ దరఖాస్తులకు కారణాలను సవివరంగా నివేదికల రూపంలో సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. గందరగోళంగా రీసర్వే రీ సర్వే పనుల్లో తీవ్రలోపాలు ఉన్నాయని, తహసీల్దార్ల నిర్లక్ష్యం వల్ల వివాదాలకు దారితీసే పరిస్థితి ఉందని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకపోవడంతో సర్వేలో తప్పిదాలు జరుగుతున్నాయ న్నారు. ఇది భవిష్యత్తులో పెద్ద ఎత్తున గొడవలకు కారణమవుతుందని హెచ్చరించారు. ప్రైవేట్ దేవాలయాల్లో సీసీ కెమెరాలు లేవా? ప్రైవేట్ దేవాలయాలకు రోజుకు వెయ్యి మంది భక్తులు వచ్చే చోట సీసీకెమెరాలు ఏర్పాటు చేయడంలో రెవెన్యూ, దేవాదాయ శాఖలు విఫలమయ్యాయని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారులు పర్యవేక్షణ లోపించిందని ఇది భక్తుల భద్రతకు ముప్పుకలిగిస్తుందని హెచ్చరించారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్ మాట్లాడుతూ ధాన్యం సేకరణ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఆర్డీఓలు, తహసీల్దార్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లాస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ మండలస్థాయిలో ఇంకా అమలు కావపోవడం ఆందోళనకరమన్నారు. సమావేశంలో డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, తహసీల్దార్లు, సర్వేయర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
డిసెంబర్ 13న జాతీయ అదాలత్
విజయనగరం: డిసెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఉమ్మడి జిల్లాల న్యాయమూర్తులతో ఆమె మంగళశారం వీడియా కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీ పడదగిన క్రిమినల్ కేసులను, మోటార్ ప్రమాద బీమా కేసులు, బ్యాంకు కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, మనీ కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు, పర్మినెంట్ ఇంజక్షన్ దావాలు మరియు ఎగ్జిక్యూషన్ పిటిషన్, ఎలక్ట్రిసిటీ కేసులు, ఎకై ్సజ్ కేసులు, ల్యాండ్ కేసులు, కుటుంబ తగాదాలు, వాటర్ కేసులు, మున్సిపాలిటీ కేసులు, ప్రి లిటిగేషన్ కేసులు పరిష్కరిస్తామన్నారు. ఇరు పార్టీల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వతంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. కాన్ఫరెన్సులో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మీనాదేవి, మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి కె.విజయ కళ్యాణి, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి బి.అప్పలస్వామి, ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎమ్.పద్మావతి, పోక్సో కోర్ట్ జడ్జి కె.నాగమణి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి.దుర్గయ్య, ఎ.కృష్ణ ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి మరియు కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఉన్న న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
వెండి గంగాలం వితరణ
గరుగుబిల్లి: తోటపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామికి హైదరాబాద్కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసుల రెడ్డి 22 కిలోల వెండి గంగాలంను వితరణ చేశారు. మంగళవారం ఆలయంలో సుమారు రూ.30 లక్షల విలువున్న వెండి గంగాలంను సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆల య అభివృద్ధికి దాతలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని టీటీడీ ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న గాలిగోపురంలో 80 శిల్ప కళాకృతులను నిర్మించనున్నామని, ఒక్కొక్క శిల్ప కళాకృతికి రూ.6వేలు వ్యయం అవుతుందని ఈ మేరకు ఔత్సాహికులు ముందుకు రావాలని టీటీడీ సేవా ట్రస్ట్ సభ్యులు కోరారు. అడ్వంచర్ పార్కులో అద్దెకు ఫుడ్ స్టాల్స్ సీతంపేట: ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అడ్వంచర్ పార్కులో అద్దె ప్రాతిపదికన ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకుని నిర్వహించుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాధ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీడీఏ సూచించిన డిజైన్లో నిర్మాణం చేసుకుని ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఒక ఏడాది కాలనీకి లీజుకు ఇవ్వనున్నట్టు తెలిపారు. రూ.20 వేలు డిపాజిట్, నెలకు రూ.5వేలు అద్దెను ఐటీడీఏకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కావున ఆసక్తి గల వారు 9493469084, 9701107785 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. దరఖాస్తుల ఆహ్వానం సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని పలు పర్యాటక ప్రాంతాలను వీక్షించడానికి పర్యాటకులను తీసుకువెళ్లడానికి ఆసక్తి ఉన్న ఆటో, మ్యాక్సీ క్యాబ్ నిర్వాహకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీడీ ఇన్చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాధ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అడ్వంచర్ పార్కు, మెట్టుగూడ జలపాతం, ఆడలి వ్యూపాయింట్, బెనరాయి జలపాతం, దారిమల్లి జలపాతం, టీటీదీ దేవాలయం వంటి వాటిని చూడడానికి రోజంతా పర్యాటకులను తిప్పవలసి ఉంటుందన్నారు. అందుకుగాను ఐటీడీఏ నిర్దేశిత రుసుం నిర్ణయిస్తుందన్నారు. ఆసక్తి గల వారు వివరాలకు 9493469084, 9701107785 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.నీట్ విద్యార్థులకు ఉచిత శిక్షణ విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత లాంగ్ టర్మ్ కోచింగ్ అందిస్తోంది. ఈ మేరకు జిల్లా సమన్వయ అధికారి ఎం.మాణిక్యం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియన్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లలో 2023–24, 2024–25 విద్యా సంవత్సరాల్లో చదివిన విద్యార్ధులు, నీట్ పరీక్షకు హాజరైన వారు ఈ ఉచిత కోచింగ్ను ఉపయోగించుకోవాలని కోరారు. విజయవాడలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఈ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. పూర్తిగా ఉచిత వసతి, భోజన సదుపాయాలతో కోచింగ్ క్లాసులు ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలిపారు. ఆసక్తి ఉన్న అర్హులైన విద్యార్థులు అంబేద్కర్ స్టడీ సర్కిల్ విజయవాడ 7569226400, 7995562113 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కూలిన పెంకుటిల్లు జామి: మండలంలో కుమరాం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున కనపర్తి అప్పారావు పెంకుటిల్లు కూలిపోయింది. ఆ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. వేకువజాము కావడంతో మెలకువగా ఉండడంతో గమనించిన కుటుంబ సభ్యులు బయటకు వచ్చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల సంభవించిన మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఇల్లు పూర్తిగా దెబ్బతింది. దీంతో పూర్తిగా నేలమట్టమైంది. విషయం తెలుసు కున్న రెవెన్యూ అధికారులు ఇంటిని పరిశీలించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు. -
ఇన్ఫోసిస్కు జేఎన్టీయూ జీవీ విద్యార్థుల ఎంపిక
విజయనగరం రూరల్: ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సంస్థలో ఉద్యోగాలకు విజయనగరం జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయానికి చెందిన 25 మంది విద్యార్థినులు ఎంపికయ్యారని ఆర్.రాజేశ్వరరావు మంగళవారం తెలిపారు. సెప్టెంబర్ 17, 18న ఇన్ఫోసిస్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్లో సీఎస్ఈ విభాగం నుంచి 12 మంది, ఐటీ విభాగం నుండి 8, ఈసీఈ విభాగం నుంచి ముగ్గురు, మెటలర్జీ, సివిల్ విభాగం నుంచి ఒక్కొక్కరు ఎంపికయ్యారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉప కులపతి వి.వి.సుబ్బారావు ఉద్యోగాలకు ఎంపికై న విద్యార్థినులను వారి చూపిన ప్రతిభ, కృషి, శ్రమను కొనియాడుతూ వారి విజయాన్ని అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి.జయసుమ, తదితరులు అభినందించారు. -
తైక్వాండో పోటీల విజేతలకు అభినందన
● స్కూల్ గేమ్స్ పోటీల్లో జిల్లాకు పతకాలువిజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 1, 2 తేదీల్లో ఏలూరులో జరిగిన అండర్–17 స్కూల్ గేమ్స్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు పతకాలు సాధించి విజయనగరం కీర్తి ప్రతిష్టలు చాటి చెప్పారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో నాలుగు బంగారు, రెండు వెండి, మూడు కాంస్య పతకాలు జిల్లా క్రీడాకారులు కై వసం చేసుకోవటం విశేషం. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన జిల్లా క్రీడాకారులను డీఈవో యు.మాణిక్యంనాయుడు మంగళవారం తన కార్యాలయంలో అభినందించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లీ నిరీక్షణ..!
ఆదేశాలు వస్తే అందజేస్తాం.. ప్రస్తుతం జిల్లాలో 1.30 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నాం. వీరికి ప్రతి నెలా సుమారు రూ.60 కోట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలు రాగానే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి వారికి పింఛన్లు అందజేస్తాం. భర్త చనిపోయిన వెంటనే ఆ స్థానంలో భార్యకు పింఛన్ అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప కొత్త పింఛన్లు మంజూరు చేసే వీలుండదు. – ఎం. సుధారాణి, డీఆర్డీఏ పీడీ, పార్వతీపురం మన్యం జిల్లావీరఘట్టం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తవుతున్నా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు ఇలా అర్హులైన లబ్ధిదారులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నిత్యం సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ ఇంకా సైట్ ఓపెన్ కావడం లేదని అధికారులు చెబుతుండడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. గ్రామాల్లో అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతి నెలా పింఛన్లే ప్రధాన ఆధారం. గత ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ సొమ్మును ఠంఛన్గా అందజేసేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త పింఛన్ల మాట దేవుడెరుగు ఉన్న పింఛన్లోనే కోతలు విధిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో... గతంలో వైఎస్సార్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే లబ్ధిదారులను ఎంపిక చేసి కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు అందజేసేవారు. మొదటి మూడేళ్ల పాటు ప్రతి మూడు నెలలకోసారి చొప్పున నూతన పింఛన్లు మంజూరు చేసేవారు. తర్వాత 2023, 2024 సంవత్సరాల్లో ప్రతి ఆరు నెలలకు అర్హులైన వారు నష్టపోకుండా వలంటీర్ల ద్వారా ఎంపిక చేసి పింఛన్లు అందజేశారు. 2024 జనవరిలో చివరిగా నూతన పింఛన్లు మంజూరు చేశారు. తరువాత ఎన్నికల కోడ్ రావడంతో నూతన పింఛన్లకు బ్రేక్ పడింది. ఆ తర్వాత 2024 ఏప్రిల్లో ఆగిపోయిన సైట్ నేటికి ఓపెన్ కావడం లేదు. కొత్త పింఛన్ల కోసం 20 వేల మంది ఎదురుచూపులు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది నవంబర్లో కొత్త జీవో తీసుకొచ్చింది. పింఛన్ అందుకుంటున్న భర్త చనిపోతే మరుసటి నెల నుంచి భార్యకు పింఛన్ అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిగా నూతన పింఛన్లు రాకపోవడంతో జిల్లాలో 60 ఏళ్లు నిండిన సుమారు 20 వేల మంది లబ్ధిదారులు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. 2024 డిసెంబరులో దరఖాస్తులు స్వీకరించి సంక్రాంతికి జన్మభూమి కార్యక్రమం నిర్వహించి నూతన పింఛన్లు అందజేస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రకటనలు చేశారు. దీంతో సంక్రాంతికి కొత్త పింఛన్లు కోసం ఎదురుచూసిన లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగిలాయి. 50 ఏళ్ల్లకే పింఛన్ హామీ అమలుకు నోచుకునేదెప్పుడో ? ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే అధికారంలోకి వచ్చి 17 నెలలు దాటినా ఆ హామీ ఊసెత్తడం లేదు. దీంతో జిల్లాలో 60 వేల మందికి పైగా 50 ఏళ్లు నిండిన వారు ప్రభుత్వ హామీ ఎప్పుడు అమలు చేస్తుందా.. అని ఎదరు చూస్తున్నారు. 17 నెలలుగా ఓపెన్ కాని సైట్ జిల్లాలో కొత్త పింఛన్ల కోసం 20 వేల మంది అర్హులు ఎదురు చూపులు -
వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ ‘సత్య’
విజయనగరం అర్బన్: విశాఖలో ఇటీవల జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ 2025 – 26పోటీల్లో ఓవరాల్ టీమ్ చాంపియన్ను పట్టణానికి చెందిన సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు కై వసం చేసుకున్నారు. కళాశాల వెయిట్ లిఫ్టింగ్ టీమ్ మూడు బంగారు పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి ఓవరాల్ టీమ్ చాంపియన్ షిప్ ట్రోఫిని గెలుచుకుంది. పోటీలోని 79 కేజీల విభాగంలో 105 కేజీల స్నాచ్, 135 కేజీల క్లీన్ అండ్ జర్క్ కేటగిరిలో ఆర్.రాంబాబు బంగారు పతకం, 63 కేజీల విభాగంలో 75 కేజీల స్నాచ్, 95 కేజీల క్లీన్ అండ్ జర్క్ కేటగిరిలో ఎ.యశశ్రీ బంగారు పతకం, 58 కేజీల విభాగంలో 80 కేజీల స్నాచ్, 100 కేజీల క్లీన్ అండ్ ఆర్క్ కేటగిరిలో టి.లావణ్య బంగారు పతకం, 65 కేజీల విభాగంలో 85 కేజీల స్నాచ్, 105 కేజీల క్లీన్ అండ్ జర్క్ కేటగిరిలో ఎ.లిఖిత్ కాంస్య పతకం సాధించారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.సాయిదేవమణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతలతో పాటు కోచ్ చల్లా రామును కళాశాల యాజమాన్యం అభినందించింది. -
ప్రజాభిప్రాయానికే వైఎస్సార్సీపీ మద్దతు
● మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరమెంటాడ: ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే కొనసాగేలా అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, తను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెంటాడ నుంచి పార్వతీపురానికి సుమారు 100కి లోమీటర్లు దూరం ఉంటుందని విజయనగరం 30 కిలోమీటర్లు ఉంటుందన్నారు. ముఖ్యంగా ప్రజలకు విజయనగరంతో ఉన్న అనుబంధం, కలెక్టర్ కార్యాలయ పనులకై నా వెళ్లివచ్చే విధంగా ఉంటుందన్నారు. మండల ప్రజల బాధలను కమిటీకి వివరించి వారిపై ఒత్తిడి చేసి కొనసాగేలా చేస్తే.. ఎల్లో మీడియా వైఎస్సార్సీపీ రాజకీయ లబ్ధి కోసమే మండలాన్ని విజయనగరంలో ఉంచిందని ఎలా రాస్తున్నారో ప్రజలు గమనించాలని సూచించారు. అప్పట్లో టీడీపీ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడారని, నేడు ఆ నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. మెంటాడ మండలం పార్వతీపురంలో కలిస్తే టీడీపీ నాయకులే కారకులవుతారని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, వైస్ ఎంపీపీ ఈశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు రాయిపల్లి రామారావు, రాజప్పలనాయుడు, ఎంపీటీసీ పతివాడ కుమారి, సర్పంచ్ రాంబాబు, సిరిసెట్టి నారాయణరావు మండల నాయకులు పాల్గొన్నారు. ఉచిత బస్సుల పేరిట ఉన్న వాటిని తగ్గించేశారు.. సాలూరు: ఉచిత బస్సుల పేరుతో గ్రామాలకు వెళ్లే ఉన్న బస్సులు తగ్గించేస్తున్నారని దీనివలన ప్రయాణాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. పట్టణంలో తన స్వగృహంలో స్థానిక విలేకర్లతో మంగళవారం మాట్లాడారు. బస్సుల సంఖ్య తగ్గిపోవడం వలన రద్దీ అధికమైపోతుందని తెలిపారు. దీనివలన బస్సుల్లో వాదులాటలు, తోపులాటలు షరామామూలుగా మారిపోతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా బస్సుల్లో ప్రయాణికులు భౌతికంగా, మానసికంగా గాయాల పాలవుతున్నారని అన్నారు. దీనికి ఎవరు భాద్యులవుతారని ప్రశ్నించారు. బస్సుల్లో ఇటీవల పలు సంఘటనలు జరిగాయని అవి వివిధ మాద్యమాలు ద్వారా వచ్చాయని గుర్తు చేశారు. ఉచిత బస్సు వలన డబ్బులిచ్చి టిక్కెట్ తీసుకున్న మగవారికి సీట్లు దొరకని పరిస్థితి నెలకొంటుందన్నారు. సీట్లు లేక బస్సులో నిల్చున్న సమయంలో అదుపు తప్పి బస్సులోనే ఒకరిపై ఒకరు పడిపోయి తోపులాటలు జరుగుతున్నాయని అన్నారు. వీటిని ఎలా అరికడతారని, ప్రయాణికులకు రక్షణ ఎవరు కల్పిస్తారని ప్రశ్నించారు. దేవాలయాల వద్ద భక్తుల మరణాలకు ప్రైవేటుతో ముడిపెడుతున్న కూటమి ప్రభుత్వం తీరు సరికాదని మండిపడ్డారు. -
కంకర తరలిస్తున్న వాహనాల సీజ్
సీతానగరం: మండలంలోని నిడగల్లు కొండ సమీపంలో అక్రమంగా కంకరను తవ్వి తరలిస్తున్న వాహనాలను మైనింగ్ జిల్లా ఏడీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ మేరకు జిల్లా భూగర్భ జలవనరుల శాఖ ఏడీ ఎ.శ్రీనివాసరావు మాట్లాడుతూ నిడగల్లు రెవెన్యూ పరిధిలోని కొండ నుంచి కంకర తరలిస్తున్నారని అందిన సమాచారం మేరకు సోమవారం రాత్రి ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీతో తవ్వకాలు చేసి ఐదు ట్రాక్లర్లకు లోడ్ చేసి తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. కంకర తవ్వకాలు చేస్తున్న ప్రాంతంలోనే జేసీబీ, లోడ్తో ఉన్న ఐదు ట్రాక్టర్లు సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. కంకర తవ్వకాలు గుర్తించి అపరాధ రుసుం విధించినట్టు ఏడీ తెలిపారు. -
రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా క్రీడాకారులు మంగళవారం పయనమయ్యారు. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు తిరుపతిలో అండర్–17 విభాగంలో బాల, బాలికలకు నిర్వహించే పోటీల్లో జిల్లా నుంచి 10మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్తున్న జిల్లా క్రీడాకారులకు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీలు పొట్నూరు శ్రీరాములనాయుడు, కోచ్ కె.తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
పామాయిల్, అరటి తోటలను నరికేసిన‘తమ్ముళ్లు’
● ‘మా పార్టీ అధికారంలో ఉంది.. దిక్కున్న చోట చెప్పుకో’ అంటూ హూంకరింపు ● గగ్గోలు పెడుతున్న బాధిత రైతు కొమరాడ: తెలుగు తమ్ముళ్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. అధికార బలంతో చెలరేగిపోతున్నారు. పచ్చని తోటలను తెగ నరుకుతూ ప్రత్యర్థులకు ఆస్తినష్టం కలిగిస్తున్నారు. దీనికి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కొరిశీల గ్రామంలో జరిగిన ఘటనే నిలువెత్తు సాక్ష్యం. గ్రామానికి చెందిన బడే సుందర పాత్రుడు, బడే సరోజినమ్మకు చెందిన ఎకరం పైబడి విస్తీర్ణంలోని పామాయిల్, అరటి తోటలను అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు బడే విజయ, బడే పకీరుపాత్రుడు, బడే ప్రవీణ, గుణాపు భాస్కరరావు, మరో ముగ్గురు కూలీలతో కలిసి ఈనెల 1న ధ్వంసం చేశారు. ‘పొలం వద్దకు వస్తే మిమ్మల్ని కూడా నరుకుతాం.. మా పార్టీ అధికారంలో ఉంది.. ఏం చేస్తారో చేసుకోండి.. దిక్కున్నచోట చెప్పకోండి’ అంటూ భయాందోళనకు గురిచేశారని బాధిత రైతు వాపోయారు. అదే రోజు గ్రామానికి వెళ్లి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశామని, వారంతా పొలం వద్దకు వచ్చి సర్దిచెప్పినా వినకుండా తోటలను నరికేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతిలేక పోలీసులకు ఈనెల 3న ఫిర్యాదు చేశామన్నారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. -
ఎస్.కోట, జామిలో భూ ప్రకంపనలు
ఎస్.కోట/జామి: ఎస్.కోట నియోజకవర్గంలోని ఎస్.కోట, జామి మండలాల్లో మంగళవారం తెల్లవారు జామున 4.30– 5గంటల ప్రాంతంలో భూమి స్పల్పంగా కంపించింది. ఈ ఘటనలో కొందరు ఉలిక్కిపడ్డారు. కొన్ని సెకెన్లపాటు భూమి కంపించిందని జామి, కుమరాం, గొడికొమ్ము, ఎస్.కోటలోని గాంధీనగర్, శ్రీనివాసకాలనీ, బర్మాకాలనీ వాసులు తెలిపారు. వేకువజామున ఉదయం 4.30 ప్రాంతలో భూమి స్వల్పంగా కంపించింది. ఆ సమయంలో నేను, నా భార్య లేచిఉన్నాం. ఒక్క సారిగా షేక్ అయినట్లు అయింది. తరువాత చాలమంది ఇదే విషయాన్ని చెప్పారు. – కొత్తలి అప్పలనాయుడు, అధ్యాపకుడు, జామి తెల్లవారు జామున శబ్ధం వచ్చినట్లు అనిపించింది. మా అమ్మ, నేను ఇంట్లో ఉన్నాం. భూమి కంపించడంతో ఉలికిపడ్డాం. భయాందోళనకు గురయ్యాం. – మట్ట అప్పలనాయుడు, గొడికొమ్ము గ్రామం -
రూ.55 కోట్లతో 109 చెరువుల అభివృద్ధి
విజయనగరం అర్బన్: నీటిపారుదల శాఖ విజయనగరం డివిజన్ పరిధిలో 109 చెరువులను రూ.55 కోట్లతో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. చిన్నతరహా నీటిపారుదల చెరువుల అభివృద్ధిపై తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ (రిపేర్స్, రెస్టోరేషన్, రెన్నోవేషన్) కింద మొదటి విడత 44, రెండో విడత 49, తాజాగా మూడో విడతలో 16 చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు చేశామన్నారు. మొత్తం ఐదు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లోని చెరువులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ పి.అప్పలనాయుడు, ఈఈ వెంకటరమణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, డ్వామా పీడీ శారదాదేవి, ఇతర ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. -
ఐక్యత మార్చ్ పోస్టర్ల ఆవిష్కరణ
పార్వతీపురం రూరల్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మై భారత్ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించనున్న ‘సర్దార్ ఎట్ద రేటాఫ్ 150 ఐక్యతా మార్చ్’ ప్రచార పోస్టర్లను కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తన చాంబర్లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమగ్రత కోసం చేసిన కృషిని కొనియాడారు. ఉక్కుమనిషిగా పేరుగాంచిన పటేల్ దూరదృష్టి, నాయకత్వ పటిమ వల్లే దేశం ఏకమైందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత పాల్గొన్నారు. పిట్టలమెట్టలో ఏనుగుల గుంపు గరుగుబిల్లి: మండలంలోని నందివానివలస, సంతోషపురం, పిట్టలమెట్ట, తోటపల్లి, నాగూరు గ్రామాల్లో గత నాలుగు రోజుల నుంచి ఏనుగులు సంచరిస్తున్నాయి. మంగళవారం పిట్టల మెట్టకు చేరుకున్నాయి. ప్రస్తుతం వరి, అరటి, పామాయిల్ తదితర పంటలు సాగులో ఉన్నాయి. పంట కోత దశలో ఏనుగులు పొలాల్లో సంచరిస్తుండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ సిబ్బంది స్పందించి ఏనుగుల మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. యువతపైనే భవిత పార్వతీపురం: యువతపైనే దశ భవిత ఆధారపడి ఉందని, నైపుణ్యాలకు పదును పెట్టుకునేందుకు కేంద్రప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా యువజన సర్వీసుల శాఖ, సెట్విజ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవంలో ఆయన మాట్లాడారు. విద్యతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఎమ్మెల్యే బి. విజయచంద్ర, జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్వో కె. హేమలత, ప్రిన్సి పాల్ టీవీ శైలజారాణి, డీవీఈఓ వై.నాగేశ్వరరావు, జిల్లా యువజనోత్సవ అధికారి ప్రేమ్ భరత్, తదితరులు పాల్గొన్నారు. భోగాపురం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను కేంద్ర విమాయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్నాయుడు మంగళవారం పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం 27 శాతం మేర నిర్మాణ పనులు పూర్తి చేసిందన్నారు. ప్రస్తుతం 91.7 శాతం పనులు పూర్తయ్యాయని, జనవరిలో ఇక్కడ నుంచి విమానరాకపోకలను పరీక్షిస్తామన్నారు. వచ్చే ఏడాది జూన్ 20వ తేదీ నాటికి నిర్మాణ పనులను పూర్తిచేయాలని సీఎం సీఎం చంద్రబాబు సూచనలు ఇచ్చారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఐదు స్టార్ హోటల్స్తో పాటు ఇండిగో హబ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. భోగాపురం విమానాశ్రయంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబిస్తున్నామని, ప్రపంచాన్ని జయించే శక్తి ఉంత్తరాంధ్రలో ఉందని తెలిపారు. కార్యక్రమంలోఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, కలెక్టర్ రామ్సుందర్రెడ్డి, ఏస్పీ దామోదర్, ఆర్డీఓ దాట్ల కీర్తి, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2025
మెట్ట్టుగూడజలపాతం చుట్టూ ఎత్తైన కొండలు.. ఒంపులు తిరిగే నదులు.. హొయలొలికించే జలపాతాల సవ్వడులు.. పచ్చని పైర్లు.. దట్టమైన అడవి చెట్ల ముచ్చట్లు.. అచ్చ పల్లె సంప్రదాయాలు.. కల్మషం ఎరుగని గిరి బిడ్డల నవ్వులు. మన మన్యాన్ని చూస్తే.. అందాన్నంతా తన కొప్పులో పూల మాదిరి తురుముకుందా అనిపించక మానదు. పర్యాటకంగా ఎన్నో అవకాశాలు జిల్లాకు సొంతం. పర్యాటక అభివృద్ధికి గత ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. వాటికి మరింత మెరుగులు అద్ది.. ఆధ్యాత్మికత, చరిత్రను జోడిస్తూ.. మన్యం సంస్కృతిని ప్రపంచానికి చాటాలన్న కృత నిశ్చయంతో కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. – సాక్షి, పార్వతీపురం మన్యం -
మురిపిస్తున్న మన్యం అందాలు
● ఆకర్షిస్తున్న ప్రకృతి సోయగాలు ● సవ్వడి చేస్తున్న జలపాతాలు ● కార్తీక మాసంలో సందర్శకుల తాకిడి సీతంపేటలోని అడ్వెంచర్ పార్కు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. హాట్ ఎయిర్ బెలూన్.. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక సౌకర్యం. పర్యాటకులు 300 అడుగుల ఎత్తు నుంచి మన్యం పచ్చని అందాలను తిలకించే అద్భుత అవకాశం ఉంది. ఇది సాహస క్రీడలను కోరుకునేవారికి స్వర్గధామంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అడలి వ్యూ పాయింట్.. సందర్శకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక్కడి నుంచి వంశధార రిజర్వాయర్ విహంగ వీక్షణం అందుబాటులోకి వచ్చింది. మెట్టుగూడ జలపాతం వద్ద పిల్లల కోసం ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి, సరికొత్త ఆకర్షణగా తీర్చిదిద్దారు. తోటపల్లి వద్ద ఐటీడీఏ పార్కు, గుమ్మలక్ష్మీపురంలోని సవరపాడు సాహస ఉద్యాన కేంద్రం.. ఈ కార్తీక మాసంలో మంచి పిక్నిక్ స్పాట్లుగా గుర్తింపు పొందాయి. వీటిని మరింత అభివృద్ధి చేస్తే స్థానికంగానూ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. -
కూటమి కుట్రలు తిప్పికొడదాం
● వైద్యకళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందాం ● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు చీపురుపల్లిరూరల్(గరివిడి): ప్రజారోగ్యం– ప్రజల హక్కు, పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సూపర్స్పెషాలిటీ వైద్యం, వారి పిల్లలకు వైద్యవిద్యను అందించాలనే ఆలోచనతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకురాగా.. కూటమి ప్రభుత్వం వాటిని ప్రవేటీకరణ చేసేలా కుట్ర పన్నుతోందని వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. కూటమి కుట్రను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు నిసనగా గరివిడి మండలంలోని ఏనుగువలస, బాగువలస, కొండదాడి, వెదుళ్లవలస గ్రామాల్లో మంగళవారం కోటిసంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వెదుళ్లవలస గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూట మి ప్రభుత్వంలో విద్య, వైద్యం ప్రజలకు దూరమైందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందన్నారు. తుఫాన్ కారణంగా పంటలను నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పంటలను కొనుగోలుచేసేవారు కరువయ్యారని వాపోయారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, వైస్ ఎంపీపీ జి.శ్రీరాములనాయుడు, ఆయా పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు పాల్గొన్నారు. -
కలెక్టర్కు జిల్లా అధికారుల సత్కారం
విజయనగరం అర్బన్: సమన్వయంతో, సమష్టిగా కృషి చేసినప్పుడే సత్ఫలితాలను సాధించవచ్చని కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి స్పష్టం చేశారు. మోంథా తుఫానును ఎదుర్కొనడంలో జిల్లా యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపించి అన్ని విధాలుగా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టి నష్టాన్ని గణనీయంగా నివారించిన కలెక్టర్ రామ్సుందర్రెడ్డి ముఖ్యమంత్రి నుంచి ప్రత్యేకంగా అభినందనలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ను, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధన్ను సోమవారం గ్రీవెన్స్ సెల్లో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పి.మురళి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాన్ను ఎదుర్కోనడంలో జిల్లా అధికారుల నుంచి సచివాలయ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ సహకరించారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సహకారం, సమన్వయంతో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ను రాష్ట్రస్థాయి మోంథా అవార్డు గ్రహీతలైన ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, వీఆర్వో రాజ్ మోహన్, ఆశ వర్కర్ బంగారమ్మలను ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డీఆర్వో శ్రీనివాసమూర్తి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పోటెత్తిన అర్జీదారులు
● పీజీఆర్ఎస్లో 375 వినతుల నమోదువిజయనగరం అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అర్జీదారులు పోటెత్తారు. వరుసగా గడిచిన రెండు సోమవారాలు సెలపు కావడంతో ఈ సోమవారం పునఃప్రారంభించిన పీజీఆర్ఎస్లో వినతులు ఇచ్చేవారి సంఖ్య పెరిగింది. పీజీఆర్ఎస్కు వచ్చిన వినతుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ కౌంటర్ల ఎదుట క్యూలో ఉన్న ప్రజలు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బారులు తీరారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలు వెల్లువెత్తాయి. వినతుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన 10 కౌంటర్లలో 5 కౌంటర్లు రెవెన్యూకే కేటాయించినా రద్దీ తగ్గలేదు. మరో వైపు ఆన్లైన్ నెట్ సర్వర్ ఇబ్బందులు కూడా ఎదురవడంతో అర్జీదారులు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, జేసీ సేతు మాధవన్, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఎస్డీసీలు మురళి, వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీలగాంధీ, బి.శాంతి, కళావతి, జిల్లా అధికారులు వినతులను స్వీకరించారు. ఈ వారం గతంలో ఎప్పడూ నమోదు కాని సంఖ్యలో 375 వినతులు వచ్చాయి. సకాలంలో ఫిర్యాదులు పరిష్కరించాలి అధికారులందరూ ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆధికారులకు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ప్రజల విజ్జప్తులను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ ప్రతి దరఖాస్తుపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. సమయపాలనతో పారదర్శకంగా ప్రతి ఫిర్యాదును నాణ్యవంతంగా పరిష్కరించాలని సూచించారు. మెంటాడ మండలాన్ని మన్యంలో కలపొద్దు మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లా నుంచి వేరుచేసి పార్వతీపురం మన్యం జిల్లాలో కలిపేందుకు చేస్తున్న ప్రభుత్వం ఆలోచన విరమించుకోవాలని కోరుతూ ఆ మండల వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన సమయంలో ప్రజల అభీష్టంమేరకు అప్పటి సాలూరు ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో ఇచ్చిన వినతిపై స్పందించిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే ఉంచారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మండలాన్ని మన్యం జిల్లాలో కలిపే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోందని ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతున్నామన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో మెంటాడ మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రాయిపిల్లి రామరావు(రవి), ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, జెడ్పీటీసీ లెంక రత్నాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు మయూరి అప్పలనాయుడు, సన్యాసినాయుడు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, విశ్రాంతి ఉద్యోగులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. -
వ్యాసరచన, వక్తృత్వపోటీలకు అనూహ్య స్పందన
విజయనగరం టౌన్: మహాకవి గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లాస్థాయిలో పాఠశాల విద్యార్థులకు గురజాడ కేంద్ర గ్రంథాలయం ఆవరణలో సోమవారం నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలకు అనూహ్య స్పందన లభించిందని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ పేర్కొన్నారు. 500 మందికి పైగా విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు. విజేతలకు నవంబరు 30న గురజాడ వర్ధంతి రోజున నిర్వహించే గురజాడ విశిష్ట పురస్కార ప్రదాన ఉత్సవంలో బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా మానాపురం రాజా చంద్రశేఖర్, డాక్టర్ జక్కు రామకృష్ణ, ఈపు విజయకుమార్, గురజాడ ఇందిర వ్యవహరించారు. మానాప్రగడ సాహితి, ఈశ్వరరావు, డి.రాజేంద్రప్రసాద్ల ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో సంస్థ ప్రతినిధులు డాక్టర్ ఎ.గోపాలరావు, డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం చేయాలి
విజయనగరం క్రైమ్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ కార్యక్రమాన్ని ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం తన చాంబర్లో నిర్వహించి 54 ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలకు సంబంధించి 9, మోసాలకు పాల్పడినట్లు 7, నగదు వ్యవహారాలకు సంబంధించి 2, ఇతర అంశాలకు సంబంధించి 28 ఫిర్యాదులు ఉన్నాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాల్లో వాస్తవాలను గుర్తించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు. -
జేఎస్డబ్ల్యూ మాట తప్పి 18 ఏళ్లు
● ప్రాజెక్ట్ బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలి ● కలెక్టరేట్ ఎదుట నిర్వాసిత కుటుంబాల ధర్నావిజయనగరం గంటస్తంభం: జేఎస్డబ్ల్యూ అల్యూమినియం ప్రాజెక్ట్ కారణంగా భూములు కోల్పోయిన రైతులు, బాధిత కుటుంబాల ప్రతినిధులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తెల్లకాగితాలు పట్టుకుని నిరసన తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతు సోములు కాంతయ్య మాట్లాడుతూ, బొడ్డవర పంచాయతీ, ఎస్.కోట పరిధిలో సర్వే నంబర్ 170 సహా పలుచోట్ల రైతుల భూములను 2007–08లో ప్రభుత్వం జేఎస్డబ్ల్యూ అల్యూమినియం కంపెనీకి అప్పగించిందన్నారు. ఒక్కో ఎకరా విలువకు సమానంగా షేర్లు ఇస్తాం. మూడు సంవత్సరాల్లో కనీసం పది రెట్లు పెరుగుతాయని రాతపూర్వక హామీ ఇచ్చారని పేర్కొన్నారు. షేర్లు వద్దనుకుంటే నగదు కలెక్టర్ ద్వారా ఇస్తామని అప్పట్లో చెప్పారని, కానీ అసలు చెల్లింపులు రాలేదని రైతులు ఆరోపించారు. వాగ్దానం ప్రకారం పెరిగిన మొత్తాన్ని అనుసరించి డబ్బులు ఇప్పుడు లెక్కించి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతులకు ఆప్షన్ ఇచ్చి తరువాత మాట తప్పడం అన్యాయమని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని జేఎస్డబ్ల్యూ కంపెనీపై చర్యలు తీసుకుని నష్టపోయిన భూముల అసలు, పెరిగిన విలువలతో చెల్లింపులు చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళన కొనసాగించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు. -
వసతి గృహాల్లో అధికారులు బస చేయాలి
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డిపార్వతీపురం రూరల్: జిల్లాలోని అధికారులు ఇకపై క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువ కావాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు తప్పనిసరిగా పాఠశాలలు, వసతిగృహాల్లో ఒక రాత్రి బస చేయాలని ఆదేశించారు. సోమవారం ఈ మేరకు కలెక్టరేట్లో జరిగిన వర్క్షాపులో అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. తరచూ పర్యటనలు చేయాలని, బస కార్యక్రమాలకు వెళ్లిన ప్రతిసారీ స్థానికంగా ఉన్న పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేయాలని చెప్పారు. అక్కడే ఏదో ఒక వసతి గృహంలో లేదా రెసిడెన్షియల్ పాఠశాలలో అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేయాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే వాట్సాప్ ద్వారా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. సమయపాలన కచ్చి తంగా పాటించాలని, ఈ మేరకు ఎంపీడీఓలు ఆకస్మిక వేకువజామున తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే పారిశుద్ధ్య పనులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పారిశుద్ధ్యంతో వ్యాధులను నివా రించవచ్చని, చెత్త నివారణకు ప్రతి దుకాణానికి చెత్త బుట్టలుండాలని, 500 మీటర్ల పరిధిలో చెత్త కనిపిస్తే దుకాణ యజమానికి జరిమానా విధించాలన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన ప్రదేశాల్లో అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, సీసీ కెమరాల ఏర్పాటు ఉన్నట్లు ముందుగా ప్రజలకు తెలియజేయాలన్నారు. సచివాలయ ఉద్యోగుల పనితీరుపట్ల ప్రస్తావిస్తూ అధికారులు ప్రత్యేక దృష్టిసారించి సిబ్బందికి ఐడీ కార్డులు మంజూరు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. -
9న జిల్లా స్థాయి బాలల ఆహ్వాన నాటికపోటీలు
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాలల ఆహ్వాన నాటికల పోటీలను ఈ నెల 9న నిర్వహిస్తున్నామని సంఘం అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం గురజాడ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కుసుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కుసుమంచి సుబ్బారావు, వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ముళ్లపూడి సుభద్రాదేవిలతో కలిసి ఆహ్వాన పత్రికలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 9వ తేదీ ఉదయం 9 గంటలకు గురజాడ పబ్లిక్ స్కూల్లో పోటీలు ప్రారంభమవుతాయని, ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విజేతలకు 10వ తేదీ ఉదయం 9 గంటలకు నగదు బహుమతి ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. పోటీలను ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, కుసుమంచి ఫౌండేషన్, వాకర్స్ వనిత క్లబ్(విజయనగరం ఫోర్ట్), గురజాడ విద్యాసంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు. నాటక పోటీలకు సమన్వయకర్తగా నంది పురస్కార గ్రహీత ఈపు విజయ్ కుమార్ వ్యవహరిస్తారని, న్యాయ నిర్ణేతలుగా కందుకూరి పురస్కార గ్రహీత పసుమర్తి సన్యాసిరావు, నంది పురస్కార గ్రహీత గెద్ద వరప్రసాద్ వ్యవహరిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో జనవిజ్ఞాన వేదిక జాతీయ నాయకుడు డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, ఏపీ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, పాఠశాల కరస్పాండెంట్ ఎం స్వరూప, డిమ్స్ రాజు, డీవీ సత్యనారాయణ, గ్రంధి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పోక్సో కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు
విజయనగరం క్రైమ్: జిల్లాలోని జామి పోలీస్స్టేషన్ పరిధిలో 2024 లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలుశిక్ష పడిందని ఎస్పీ దామోదర్ సోమవారం చెప్పారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. జామి మండలంలోని మాధవరాయమెట్టలో నివాసం ఉంటున్న వంతల శివ, (23) గతేడాది జూన్ 6న అదే గ్రామంలో ఉంటున్న ఒక బాలిక (12) రాత్రి సుమారు 10 గంటలకు ఇంటిముందు ఆరు బయట మంచంపై నిద్రిస్తున్న సమయంలో ఎత్తుకుని దగ్గరలో ఉన్న ఒక తోటలోకి తీసుకు వెళ్లి, లైంగికదాడికి పాల్పడబోయాడు. దీంతో ఆ బాలిక కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న జనం వెంటనే తోటలోకి వచ్చేసరికి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయమై బాలిక ఇచ్చిన ఫిర్యాదుపై అప్పటి జామి ఎస్సై జి.వీరబాబు గత ఏడాది జూన్ 7న పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అనంతరం, కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించి, న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారు. నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి 3సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. రూ.4,000 జరిమానా విధించడంతో పాటు, బాధితురాలికి పరిహారంగా రూ.50,000 మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ వివరించారు. ఈ కేసులో పోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.ఖజానారావు వాదనలు వినిపించారన్నారు. -
తండ్రి హత్య కేసులో కొడుకు అరెస్ట్
బాడంగి: మద్యం వ్యసనానికి బానిసైన బాడంగి మండలంలోని గొల్లాది గ్రామానికి చెందిన మామి డిరాము మద్యంకోసం డబ్బులివ్వాలని గొడవపడి విచక్షణారహితంగా కన్నతండ్రి సత్యం తలనరికి హత్యచేసినట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి చెప్పారు. ఈ మేరకు సోమవారం స్థానిక పోలీస్స్టేషన్లో నిందితుడు రామను అరెస్ట్చేసి రిమాండ్ నిమిత్తం కోర్టు కు తరలించేముందు విలేకరులకు వివరాలు తెలి యజేశారు. తరచూ మందు కొనుగోలుకు డబ్బులివ్వాలనిభార్య, తల్లితో గొడవపడి కొట్టేవాడని ఈనెల 1వతేదీన సాయంత్రం 4గంటల సమయంలో కత్తితో ఇంటిలో భార్యను కొడుతుండగా తండ్రి పక్షవాతంతో మంచంమీదనుంచి లేవలేక పారిపోమని సైగలుచేసి బయటకు పంపివేయగా ఆ కసితో మంచంపై ఉన్న తండ్రిని మాంసంకోసే కత్తితో తలనరికి మొండెం నుంచి వేరుచేసి గమేలాలో వేసి పారిపోయాడని చెప్పారు. నిందితుడిని కామన్నవలస జంక్షన్ వద్ద పట్టుకుని అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ కేసులో బొబ్బిలి రూరల్సీఐ నారాయణరావు, ఎస్సై తారకేశ్వరరావు మంచి ప్రతిభను కన బరిచారంటూ వారిని అభినందించారు. -
శ్రీవిశ్వ విద్యార్థులకు కరాటేలో బ్రాంజ్ మెడల్
చీపురుపల్లి: రాష్ట్రస్థాయి కరాటే ఓపెన్ చాంపియన్షిప్ పోటీల్లో చీపురుపల్లిలోని శ్రీ విశ్వ పాఠశాల విద్యార్థులు జి.యశ్వంత్, ఎం.హర్షిత్, ఎస్.చరణ్ తేజ్రామ్, ఎం రాజ్కుమార్లు బ్రాంజ్ మెడల్ సాధించారని ప్రిన్సిపాల్ రాజేష్ తెలిపారు.నవంబర్–2న విశాఖపట్నంలోని గాజువాకలో జరిగిన రాష్ట్రస్థాయి ఓపెన్ చాంపియన్షిప్ పోటీల్లో ఈ మెడల్స్ సాధించారని అన్నారు. మెడల్ సాధించిన విద్యార్ధులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. చికిత్స పొందుతూ మహిళ మృతిరామభద్రపురం: బాడంగి వెళ్లే రహదారిలోని చర్చి సమీపంలో రోడ్డుపై ఉన్న పెద్ద గుంతలో ఆదివారం ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాల పాలైన విషయం తెలింసిందే. వారిలో ఓ మహిళ విశాఖపట్టణంలోని కేజీహెచ్లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. బాడంగి మండలం పూడివలసకు చెందిన బోను గౌరమ్మ మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన కన్నంనాయుడు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కింద పడగా ఇద్దరికీ గాయాలయ్యాయి. గౌరమ్మను మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై అప్పారావు కేసునమోదు చేశారు. -
నాగూరు పరిసరాల్లో ఏనుగుల గుంపు
గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి, సంతోషపురం, నంది వానివలస, పిట్టలమెట్ట, నాగూరు గ్రామ పరిసరాల్లో మూడు రోజుల పాటు ఏనుగుల గుంపు సంచరించి సోమవారం నాగూరు గ్రామంలోని తోటల్లోకి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామంలోని పంటలను నాశనం చేశాయి. ఏనుగులు ప్రధాన రహదారిని ఆనుకుని సంచరిస్తుండడంతో ప్రజలు రాకపోకలు చేసేందుకు భీతిల్లుతున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు అటవీశాఖాధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.హుండీ చోరీ నిందితుల అరెస్టునెల్లిమర్ల: మండలంలోని కొత్తపేట పరిధిలో ఉన్న శ్రీరమా సహిత వీర వెంకటసత్యనారాయణ స్వామి వారి ఆలయంలో హుండీ పగలగొట్టి, నగదు అపహరించిన కేసులో నిందితులను నెల్లిమర్ల పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.ఆలయంలోని హుండీ పగలగొట్టి, నగదు దొంగిలించినట్లు ఇటీవల ఆలయ నిర్వాహకులు నెల్లిమర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భోగాపురం రూరల్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి కొత్తపేట గ్రామంలో ఇటీవల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సహాయంతో నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.9వేలు రికవరీ చేసినట్లు ఎస్సై గణేష్ తెలిపారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కేసులను ఛేదించడంలో తమకు ఎంతగానో ఉపకరిస్తున్నాయని ఆయన చెప్పారు. షార్ట్ సర్క్యూట్తో మంటలురాజాం సిటీ: మండల పరిధి గుయ్యానవలస గ్రామంలో ఆదివారం రాత్రి మచ్చ నాగేష్ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగడంతో కుటుంబసభ్యులంతా బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన చుట్టుపక్కలవారితోపాటు గ్రామస్తులు మంటలు అదుపుచేసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇంట్లో వస్తువులు, దుస్తులు, వంట సామగ్రితోపాటు డబ్బాలో దాచుకున్న రూ. 30వేల నగదు కాలిపోయాయని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. గడువులోగా రీ సర్వే పూర్తి చేయాలి● సర్వే అండ్ భూరికార్డుల ఆర్జేడీ సీహెచ్వీఎస్ఎన్కుమార్ విజయనగరం అర్బన్: జిల్లాలో రీ సర్వే ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సర్వే అండ్ భూరికార్డుల ఆర్జేడీ సీహెచ్వీఎస్ఎన్కుమార్ ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా విజయనగరం వచ్చిన ఆయన సోమవారం కలెక్టరేట్లో అధికార, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలతో పాటు షెడ్యూల్ ప్రకారం సర్వే పూర్తి చేయాలని సూచించారు. భూవిస్తీర్ణంపై రైతుకు పూర్తిగా అవగాహన కలిగించిన తరువాతే రికార్డులను ఖరారు చేయాలని ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా వెబ్ ల్యాండ్ ప్రకారం సర్వేపూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సర్వే అండ్ భూ రికార్డుల ఎ.డి టి.యగ్వేశ్వర రావు, సూపరింటెండెంట్ కె.రాంబాబు డివిజన్ల అధికారులు పాల్గొన్నారు. -
జోగిరమేష్ అరెస్ట్ రాజకీయకక్ష సాధింపే..
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరసాలూరు: మాజీ మంత్రి జోగిరమేష్ అరెస్ట్ పూర్తిగా రాజకీయకక్షసాధింపు చర్య అని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన సాలూరులోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ జోగిరమేష్ అరెస్ట్ను ఖండించారు. లిక్కర్ మాఫియా అంటూ సిట్ దర్యాప్తు పూర్తిగా రాజకీయకక్ష సాధింపుగానే కనిపిస్తోందని, తప్పెవరు చేశారో సిట్ నేటికీ తేల్చలేకపోతోందన్నారు. లిక్కర్స్కాంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారని గుర్తుచేశారు. దారినపోయిన దానయ్య ఇచ్చిన స్టేట్మెంట్ ఽ ఆధారంగా కేసులు నమోదుచేస్తే సమాజంలో ప్రతి ఒక్కరినీ అరెస్ట్చేసే అవకాశం ఉంటుందన్నారు. కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటలో భక్తులు మరణించిన అంశం నుంచి ప్రజలను పక్కదోవ పట్టించే ఉద్దేశంతో జోగి రమేష్ను ఈ ప్రభుత్వం అరెస్ట్చేయించిందన్నారు. నకిలీ మద్యంపై ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులుండగా ప్రభుత్వం ఆదరబాదరాగా కక్షసాధింపు చర్యలకు పాల్పడి టీడీపీ నాయకులను కాపాడే ప్రయత్నం చేయడానికేనని విమర్శించారు. లిక్కర్ విషయంపై హైకోర్టు త్వరగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతున్నామన్నారు. -
అర్జీల తక్షణ పరిష్కారమే ప్రధాన ధ్యేయం
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డిపార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన వినతుల తక్షణ పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, సాధ్యమైనంత వరకు వాటిని అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. పరిష్కారం విషయంలో అర్జీదారులకు సంపూర్ణ సంతృప్తి కలగాలని, ఎలాంటి పరిస్థితుల్లోను అర్జీలు తిరిగి తెరవకూడదని తెలిపారు. సోమవారం పీజీఆర్ఎస్కు అందిన సమస్యల పరిష్కారానికి వచ్చిన వినతుల్లో జంఝావతి రిజర్వ్ ముంపునకు గురైన బంజుగుప్ప గ్రామ నిర్వాసితులకు రీ సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని, అలాగే పార్వతీపురం మండలం పెదమరికి గ్రామానికి చెందిన అక్కమ్మ, గంగాపురానికి చెందిన రాములు నాయుడు తమ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కొమరాడ మండలంలోని సోమినాయుడు వలసకు చెందిన ఉమామహేశ్వరరావు తమ జిరాయితీ భూమిని తమ పేరును నమోదు చేసి రికార్డులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. అలాగే మరికొందరు మరికొన్ని సమస్యలపై వినతులను అందజేశారు. కార్యక్రమంలో మొత్తం 188 వినతులు అందాయి. జిల్లాస్థాయి అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 123 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలో ప్రాజెక్టుఅధికారి పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్ సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు 123 వినతులు వచ్చాయి. ఎక్కువగా వ్యక్తిగత సమస్యలపై వినతులు ఇచ్చారు. కొత్తగూడకు చెందిన రమణమ్మ ఇల్లు నిర్మించడానికి పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించాలని కోరింది. గేదెలగూడ గ్రామానికి చెందిన బిడ్డిక సలోమి పెండింగ్లో ఉన్న రోడ్డు పనులు పూర్తి చేయాలని, అటవీపట్టాలు ఇప్పించాలని నల్లరాయిగూడ గ్రామస్తుడు రవికుమార్ కోరారు. పత్తిపంట వర్షాలకు నష్టపోయిందని పరిహారం ఇప్పించాలని అంబలిగండి గ్రామస్తులు కోరారు. విద్యుత్ స్తంభాలను మార్చాలని గంగమ్మపేట గ్రామస్తుడు ఆనందరావు విజ్ఞప్తి చేశాడు. దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలని ముకుందాపురం గ్రామస్తురాలు లోకేశ్వరి కోరింది. కార్యక్రమంలో ట్రైబుల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ రమాదేవి, డిప్యూటీఈఓ రామ్మోహన్రావు, హెచ్వో జయశ్రీ, సీడీపీవో సిమ్మాలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బస్సెక్కాలంటే భయం..!
కార్తీక మాసం.. ఏకాదశి కావడంతో గత శనివారం గరుగుబిల్లిలోని తోటపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రధానంగా మహిళలతో ఆలయం కిటకిటలాడింది. వారిలో దాదాపు అందరూ ఉచిత బస్సులో ప్రయాణం చేసి వచ్చిన వారే.. ఫలితంగా ఇటు పార్వతీపురంతోపాటు, అటు పాలకొండ మార్గంలోని బస్సుల్లో విపరీతమైన రద్దీ ఏర్పడింది. లోపల అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేనంతగా బస్సులు కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పరిస్థితి. సాక్షి, పార్వతీపురం మన్యం: ఉచిత బస్సులు సాధారణ ప్రయాణికులకు చుక్కలు చూపెడుతున్నాయి. గతంలో దగ్గరలో ఉన్న గ్రామాలకు, ఆలయాలకు వెళ్లాలంటే ద్విచక్ర వాహనాలు, ఆటోలను ఆశ్రయించేవారు. ఇప్పుడు మహిళలంతా పది అడుగుల దూరానికి కూడా బస్సు వెళ్లే మార్గమైతే ఆర్టీసీ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో మహిళా ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగింది. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ ఆర్టీసీ డిపోల పరిధిలో 264 బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో సుమారు 180 బస్సుల వరకు మహిళల ఉచిత ప్రయాణానికి కేటాయించినవే. దూర ప్రాంతాలైన విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లే సూపర్ డీలక్స్ బస్సులు మినహా.. పార్వతీపురం, పాలకొండ, సాలూరు డిపోల్లో అధిక శాతం పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులే. ఇటు పాలకొండ, శ్రీకాకుళం వైపు వెళ్లాలన్నా.. అటు విజయనగరం, విశాఖపట్నం, సాలూరు, బొబ్బిలి తదితర ప్రాంతాలకు వెళ్లాలన్నా.. పల్లెవెలుగుతోపాటు, ఎక్స్ప్రెస్ సౌకర్యం ఉంది. వీటిలో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉండటంతో ఆ మార్గాల్లో నడిచే బస్సులన్నీ నిత్యం రద్దీగా మారుతున్నాయి. మొత్తంగా రోజులో దాదాపు 80 వేల మంది వరకు ప్రయాణం చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. సాధారణ ప్రయాణికులకు అవస్థలు ఉచిత ప్రయాణం గత ఆగస్టులో ప్రారంభమైన తర్వాత ఆర్టీసీ సర్వీసుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ తాకిడికి సరిప డా కొత్త బస్సులను ఆర్టీసీ వేయలేదు. ఉన్నవాటిలో అధిక శాతం కాలం చెల్లినవే. గతం కంటే ఇప్పుడు ప్రయాణించే వారి సంఖ్య పెరగడం.. దాదాపు సీటింగుకు రెట్టింపు సంఖ్య బస్సులో ప్రయాణికు లు ఉండటంతో చాలా వరకు బస్సులు కదలడం లే దు. దీనికితోడు స్టాప్లు ఎక్కువ కావడంతో గంట ప్రయాణం కాస్త రెండు, మూడు గంటలు పడు తోంది. బస్సులు మధ్యలోనే మొరాయిస్తున్నాయి. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో ఆలయాలకు వెళ్తున్న మహిళల సంఖ్య మరింత పెరిగింది. వీరంతా ఆర్టీసీ సర్వీసులనే ఆశ్రయించడంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీనివల్ల రెగ్యులర్గా ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు బస్సులు దొరకడం కష్టమైపోతోంది. సమయానికి వెళ్లలేకపోతున్నట్లు విద్యార్థులు, ఉద్యోగు లు తమ వద్ద మొరపెట్టుకుంటున్నారని కండక్టర్లు చెబుతున్నారు. ఆ విషయంలో తామూ ఏమీ చేయ లేకపోతున్నామని.. ఖాళీ లేకున్నా, మహిళలు చెప్పినచోటల్లా బస్సు ఆపాల్సి వస్తోందని, లేకుంటే ఫిర్యా దులు చేస్తున్నారని వాపోతున్నారు. విజయనగరం వెళ్లే ప్రయాణికుడు ఇటీవల సాయంత్రం 4.30 గంటలకు కాంప్లెక్స్కు వెళ్తే.. రాత్రి 7 గంటల వరకు బస్సు ఎక్కలేకపోయానని ఆందోళన వ్యక్తం చేశా డు. ఏది చూసినా కిక్కిరిసిపోతున్నాయని వాపోయాడు. ఇటీవల పాలకొండ నుంచి చీపురుపల్లి వెళ్లే మార్గంలోని ఒక పాసింజర్ సర్వీసులో 82 మంది ప్రయాణం చేశారు. ఇందులో మగ ప్రయాణికులు ముగ్గురే. మిగిలిన వారంతా మహిళలే. వీరంతా గుంపులుగా వివిధ ప్రాంతాల నుంచి మానసాదేవి ఆలయానికి ప్రయాణమైన వారే. -
పాలకొండ విభజనకు ఏర్పాట్లు..!
● జనరల్ కేటగిరీకి కేటాయిస్తారంటూ ముమ్మర ప్రచారం ● ఇప్పటికే సిద్ధమైన ఓటర్ల జాబితాలువీరఘట్టం: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనలో పాలకొండ నియోజకవర్గంను పార్వతీపురం మన్యం జిల్లాలో చేర్చారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ, సాలూరు, కురుపాం నియోజకవర్గాలు ఎస్టీలకు, పార్వతీపురం ఎస్సీలకు కేటాయించారు. ఇటీవల పాలకొండ డివిజన్ కేంద్రాన్ని జిల్లా చేయాలని, లేదంటే పాత శ్రీకాకుళం జిల్లాలో ఉంచాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. పాలకొండ నియోజకవర్గాన్ని విభజనచేసే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాలుగా చూస్తే నియోజకవర్గంలోని వీరఘట్టం, పాలకొండలో అధిక శాతం మంది బీసీలు ఉన్నారు. వీరిలో చాలా మంది పాలకొండను జనరల్ కేటగిరీకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుచే సమీపంలో ఉన్న వంగర మండలంలో కూడా అధిక శాతం మంది బీసీలు ఉండడంతో వంగర మండలాన్ని పాలకొండ నియోజకవర్గంలో చేర్చాలనే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పాలకొండ నియోజకవర్గంలో ఉన్న సీతంపేట, భామిని మండలాలతో పాటు పక్కనే ఉన్న కొత్తూరు మండలంతో కలిపి సీతంపేటను నియోజకవర్గ కేంద్రంగా మార్చుతారనే ప్రచారం సాగుతోంది. వాస్తవానికి సీతంపేటను నియోజకవర్గ కేంద్రంగా మార్చాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. నియోజవర్గాల పునఃర్విభజన జరిగితే పార్వతీపురం మన్యం జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాంతో పాటు కొత్తగా సీతంపేట నియోజకవర్గం ఏర్పడుతుందని సమాచారం. ప్రస్తుతం జిల్లాలో 7.75 లక్షల మంది ఓటర్లు ఉన్నా రు. వీరితో పాటు పాలకొండ విభజన జరిగితే కొత్తగా ఈ నియోజవర్గంలో చేరే వంగర మండలంలో 43వేల మంది ఓటర్లు, సీతంపేటలో చేరే కొత్తూరు మండలంలో ఓటర్లు 57 వేల మందితో కలపి మరో 1 లక్ష మంది ఓటర్లు జిల్లాలో చేరే అవకాశం ఉంది. పాలకొండ నియోజకవర్గాన్ని విభజన చేస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందా అంటే.. చాలా మంది అవుననే సమాధానం చెబుతున్నారు. జనరల్ కేటగిరీకు ఈ నియోజకవర్గాన్ని కేటాయిస్తే పోటీ కూడా అధికంగా ఉంటుందని, వనరుల సద్వినియోగంపై శ్రద్ధపెరిగి, అభివృద్ధి జరుగుతుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే, పాలకొండ నియోజకవర్గం విభజన జరుగుతుందా?లేదా? పాలకొండను జిల్లా కేంద్రంగా మార్చుతారా? లేదంటే పాత శ్రీకాకుళంలో విలీనం చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే. 2026లో జరగనున్న జనగణన తర్వాత ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లభిస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
భద్రతలేకే భక్తుల మరణం
● చంద్రబాబు పాలనలో భక్తులకు భద్రత కరువు ● కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన విచారకరం ● మరణించిన భక్తుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ సాలూరులో క్యాండిల్ ర్యాలీ ● పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు ● అనారోగ్యాలతో మరణించిన గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ సాలూరు: చంద్రబాబు పాలనలో ప్రజలకు భద్రత కరువైందని, ఆలయాలు, పుష్కరాల్లో సంభవించిన మరణాలే దీనికి నిదర్శనమని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్న దొర అన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ సాలూరు పట్టణంలో సోమవారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ రాజన్నదొర మాట్లాడుతూ.. టీడీపీ పాలనలోనే గోదావరి పుష్కరాలు, తిరుమలతిరుపతి దేవస్థానం, సింహాచలం, నిన్న కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో జరిగిన వివిధ ఘటనల్లో పదుల సంఖ్యలు భక్తులు మరణించారన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఎప్పుడూ సనాతన ధర్మమంటూ మాట్లాడతారని, మరి ఈ సంఘటనలు జరిగినప్పుడు ఆయన ఏం చేస్తున్నార ని ప్రశ్నించారు. హిందువులు జరుపుకునే ప్రతి పండగ సనాతనధర్మంలో భాగమేనని, అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన ఆలయంలో జరిగిన సంఘటనకు ప్రభుత్వానికి సంబంధంలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. వినాయకఉత్సవాలు, గ్రామాల్లో జరుపుకునే అమ్మవారి పండగ లు, నందెన్న ఉత్సవాల్లో భద్రతకు పోలీసులు ఎందుకు వస్తున్నారన్నారు. పండగల నిర్వహణకు పోలీసుల అనుమతి ఉండాలంటూ ముందస్తు హెచ్చరికలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. సినిమా థియేటర్ల వద్ద సైతం పోలీసుల భద్రత ఉంటుందని, ఆలయాల వద్ద లేకపోవడం విచారకరమన్నారు. కాశీబుగ్గ ఘటన విషయంలో పోలీసులది తప్పుకాదని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వారు అక్కడ భద్రత కల్పించి ఉండేవారన్నారు. చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భక్తుల మరణాలను రాజకీయం చేయకూడదని, వారి ఆత్మకు శాంతి కలగాలనే క్యాండిల్ ర్యాలీ నిర్వహించినట్టు చెప్పారు. ఇటీవల కాలంలో మన్యం జిల్లాలో 16 మంది గిరిజన విద్యార్థులు వివిధ అనారోగ్య కారణాలతో మరణిస్తే బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. భాద్యత వహించాల్సిన మంత్రి.. నాకేం సంబంధమంటూ మాట్లాడడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
ఆలయాల వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
పార్వతీపురం రూరల్: మండలంలోని అడ్డాపుశీల వద్ద ఉన్న ప్రసిద్ధ శివాలయం కాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయాన్ని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి సోమవారం సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్తో కలసి పరిశీలించారు. జన సమూహం ఉన్న దేవాలయాలు, మతపరమైన సభలు, సమావేశాలు, ఇతరత్రా కార్యక్రమాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. తోపులాటలు జరగకుండా చూడాలన్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ఆయన వెంట జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, డీఆర్వో కె. హేమల త, సబ్కలెక్టర్ ఆర్.వైశాలి. తహసీల్దార్ సురేష్, ఎస్ఐ బి.సంతోషికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పార్వతీపురం రూరల్: విద్యార్థి సంఘాల పోరాటం ఫలించింది. డోకిశీల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన వాచ్మన్ గౌరీశంకర్ను మామిడి ఆశ్రమ పాఠశాలకు డిప్యుటేషన్ వేస్తూ జేసీ, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. గౌరీ శంకర్ ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం, రాజకీయ అండదండలతో అధికారులనే బ్లాక్మెయిల్ చేయడం, విధులు విస్మరించి ఉపాధ్యాయులపై దురుసుగా ప్రవర్తించడం, పాఠశాల సామగ్రి, కంప్యూటర్లు, ట్యాబ్లను దొంగిలించడం వంటి పనులపై గిరిజన విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాయి. సమాచారం అందుకున్న జేసీ వాచ్మన్ తీరుపై విచారణ జరిపించారు. వాస్తవాలు వెలుగు చూడడంతో డిప్యుటేషన్పై బదిలీ చేసినట్టు సమాచారం. పార్వతీపురం రూరల్: రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులకు స్పష్టత ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. పీజీఆర్ఎస్ అర్జీలను చట్టాలకు లోబడి పరిష్కరించాలని, ప్రతి అర్జీని సింగిల్ పేజీ నోట్ రూపంలో ముగించాలని అధికారులకు సూచించారు. సమస్యను పరిష్కరించాక అర్జీదారుడి సంతృప్తిని రాతపూర్వకంగా తీసుకోవాలన్నారు. జిల్లాలో నీటి వనరులు, చెరువులు ఆక్రమణకు గురైనట్లు తేలితే సంబంధిత శాఖ ఇంజినీరింగ్ అధికారులపై చర్యలకు సిఫార్సు చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్వో హేమలత, సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, ఉప కలెక్టర్లు, డీఆర్డీఏ పీడీ, పలు మండలాల తహసీల్దార్లు, ఇరిగేషన్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. కురుపాం: మండల కేంద్రంలోని గిరిజన సంక్షే మ బాలికల గురుకుల పాఠశాల, ఏకలవ్య పాఠశాలను విజయనగరం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, స్థానిక జ్యుడీషిల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ సౌమ్య జోస్ఫిన్ సోమవారం సందర్శించారు. గిరిజన విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రా ధాన్యమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమామహేశ్వరి, ఎస్ఐ నారాయణ రావు, తదితరులు పాల్గొన్నారు. మడ్డువలసకు తగ్గిన వరద వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయు డు ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి తగ్గింది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో ప్రాజెక్టు వద్ద వరద శాంతించింది. సోమవారం ప్రాజెక్టు వద్ద 64.16 మీటర్ల నీటిమట్టం నమోదైంది. -
ఓ సంతకం
విజయనగరం రూరల్: తేవయ్యా.. సంతకం చేస్తా: మలిచర్లలో సంతకం చేస్తున్న మహిళ బస్సులో వెళ్తూ.. బాధ్యతగా సంతకం చేస్తున్న ప్రయాణికురాలు ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్యస్పందన లభిస్తోంది. ప్రజలకు వైద్యం, పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు వైద్యవిద్యను దూరంచేసే కూటమి ప్రభుత్వ కుతంత్రాలను నిరసిస్తూ.. భావితరాల భవిష్యత్తు కోసం తాము సైతం అంటూ పల్లె, పట్టణ ప్రజలు సంతకాలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను కాపాడాలని కోరుతున్నారు. ఈ పోరాటంలో వైఎస్సార్సీపీకి అండగా ఉంటామని సంతకంతో భరోసా ఇస్తున్నారు. దీనికి పలు పల్లెలు, పట్టణాల్లో సోమవారం కనిపించిన ఈ చిత్రాలే సజీవ సాక్ష్యం. – సాక్షినెట్వర్క్ సీతంపేట: అక్కన్న గూడలో సంతకాలు చేస్తున్న గిరిజనులు -
ప్రభుత్వ భూమి దురాక్రమణ
● తప్పుడు పత్రాలతో విక్రయం ● లోకాయుక్తకు ఫిర్యాదు సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పట్టణంలో దాదాపు రూ.18 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి దురాక్రమణ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ అండదండల తో.. తప్పుడు పత్రాలతో ఈ స్థలాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్ అధికారులకు ఇందులో భారీ ఎత్తున ముడుపులు అందాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పార్వతీపురం పట్టణ నడిబొడ్డున వరహాల గెడ్డ పోరంబోకు ప్రభుత్వ భూమిని కొందరు తప్పుడు సర్వే నంబర్లు నమోదు చేసి ఇటీవల రిజిస్ట్రేషన్ చేయించుకున్న ట్లు తెలుస్తోంది. సర్వే నంబర్ 410లోని వరహాల గెడ్డ పోరంబోకు భూమిని 411 సర్వే నంబర్గా నమోదు చేసి 1,200 గజాల స్థలాన్ని వ్యాపారులకు విక్రయించినట్లు ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో అధికార పార్టీ పెద్దల హస్తం ఉన్నట్లు చెబుతున్నాయి. ఇదే భూమిని గతంలో ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు గుర్తించి హెచ్చరిక బోర్డులు, సరిహద్దు రాళ్లను కూడా ఏర్పాటు చేశా రు. అప్పుడు ప్రభుత్వ భూమిగా గుర్తించి.. ఇప్పు డు ప్రైవేటుగా ఎలా యాజమాన్య హక్కులను బదలాయిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సదరు భూమి యజమానికి సర్వే నంబర్ 411లో కేవలం 400 గజాల స్థలం మాత్రమే ఉన్నప్పటికీ.. 1200 గజాల స్థలాన్ని ఎలా అమ్మగలిగారని అంటున్నా రు. ఇటీవల పార్వతీపురం పట్టణంలో భూ ఆక్రమ ణలు పెరిగాయి. ఎవరైనా దీన్ని ప్రశ్నిస్తే.. బెదిరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడు తున్నారని సమాచారం. నిబంధ నల ప్రకారం గెడ్డ పోరంబోకు, చెరువులలో భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయకూడదు. మున్సిపల్ యంత్రాంగం ఇటువంటి నిర్మాణాలకు యథేచ్ఛగా అనుమతులు జారీ చేస్తోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆక్రమణలకు గురైన స్థలాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయు డు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సోమవారం పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భూముల దురాక్రమణలు పెరిగాయన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే ఈ సమస్యపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఇంత దారుణంగా ప్రభుత్వ స్థలాలు, భూములు, చెరువులు దురాక్రమణ జరుగుతుంటే.. రెవెన్యూ, పోలీస్, రిజిస్ట్రేషన్ శాఖ నిద్రావస్థలో ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. -
వైద్యవిద్య ఫర్ సేల్..!
● పీపీపీ పేరిట 10 కళాశాలలు ప్రైవేట్కు ధారాదత్తం ● సంపదసృష్టి అంటూ ప్రభుత్వ కళాశాలల్ని అమ్మేసే కుట్రవిజయనగరం గంటస్తంభం: ఒంటిపై తెల్లటి ఆప్రాన్..మెడలో స్టెతస్కోప్..డాక్టర్ అనే పిలుపు..ఈ గౌరవం తమ పిల్లలకు దక్కాలని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు కలలు గంటారు. ఇలాంటి ఎందరో తల్లిదండ్రులు, విద్యార్థుల తెల్లకోటు కలలకు చంద్రబాబు సర్కారు ఉరితాడు బిగించింది. తాను సీఎంగా ఉండగా ఎన్నడూ ప్రభుత్వరంగంలో వైద్యకళాశాలల ఏర్పాటుకు కృషిచేయని చంద్రబాబు గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యకళాశాలలపై పెద్ద కుట్రకు తెరతీశారు. పీపీపీ పేరిట ఈ కళాశాలలను కార్పొరేట్ సంస్థలకు పప్పుబెల్లాల్లా కట్టబెట్టడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం బడుగు, బలహీనవర్గాల ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకుండా చేయడంతో పాటు, విద్యార్థుల బంగారు భవిష్యత్ను చిదిమేస్తున్నారని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పది ప్రభుత్వ వైద్యకళాశాలలను పీపీపీలో నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిన క్రమంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీపీపీ మోడల్లో నడిచే కళాశాలలు, ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందకపోవచ్చని వైద్యవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఉచితంగా లభించే శస్త్రచికిత్సలు, మందులు, వైద్యసేవలు ఇకపై చెల్లింపుల ఆధారంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన వర్గాలపై ప్రభావం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ నిర్ణయం తీవ్ర అన్యాయం చేస్తుంది. పేదపిల్లలకు తక్కువ ఖర్చుతో వైద్యవిద్య లభించే అవకాశాలు తగ్గిపోవండంతో పాటు ఉచిత వైద్యసేవలు అందకుండా పేదలు నష్టపోతారు. -
స్కూల్ గేమ్స్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక పూర్తి
● ఈనెల 5 నుంచి 7 వరకు తిరుపతిలో జరగనున్న పోటీలువిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక ఆదివారం పూర్తయింది. జిల్లా స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ ఆధ్వర్యంలో నగర శివారులో గల విజ్జి స్టేడియం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన డివిజన్ స్థాయి ఎంపిక పోటీల్లో ఉత్తమప్రతిభ కనబరిచిన 80 మంది క్రీడాకారులు ఉమ్మడి జిల్లా నుంచి 80 మంది హాజరయ్యారు. వీరికి వ్యాయామ ఉపాధ్యాయులు పి.శ్రీరాములునాయుడు, ఆదిలక్ష్మిల నేతృత్వంలో ఎంపిక నిర్వహించగా.. అండర్–14 విభాగంలో 10 మంది బాల, బాలికలు..అండర్ 17 విభాగంలో 10 మంది బాల, బాలికలు జిల్లాస్థాయి ఎంపికల్లో అర్హత సాధించారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న అంతర్ జిల్లాల స్కూల్గేమ్స్ పోటీల్లో విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి తెలిపారు. -
‘స్వేచ్ఛ..నా సందేశం’ పుస్తకావిష్కరణ
విజయనగరం టౌన్: డాక్టర్ జీవీఎస్ జైపాల్రావు రచించిన కవిత్వం ‘స్వేచ్ఛ నా సందేశం’ పుస్తకావిష్కరణ స్థానిక జెడ్పీ సమావేశమందిరంలో ఆదివారం జిల్లా అభ్యుదయ రచయితల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అరసం జిల్లా అధ్యక్షుడు జీఎస్.చలం సభాధ్యక్ష్యత వహించగా, కార్యదర్శి రత్నాల బాలకృష్ణ ఆహ్వానం పలికారు. సుప్రసిద్ధ కవి, విమర్శకుడు, విమల సాహితీ సంస్థ అధ్యక్షుడు జె.విద్యాధర్ పుస్తకావిష్కరణ చేశారు. స్వేచ్ఛ దేశానికి అవసరమని, అటువంటి స్వేచ్ఛా సందేశాన్ని తన ప్రతి కవితలోనూ రచయిత వినిపించారన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ కవి, విమర్శకుడు, సినీగేయ రచయిత బిక్కి కృష్ణ మాట్లాడుతూ దేశ, ప్రాంత, సామాజిక సమస్యలన్నింటిి మీద తనదైన శైలిలో కవి తన కవితలలో నిశితంగా విమర్శించారన్నారు. గంటేడ గౌరునాయుడు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కందుల సురేఖ ప్రసంగించారు. కవి, విమర్శకుడు సుంకర గోపాలయ్య పుస్తకాన్ని సమీక్ష చేశారు. చీకటి చంద్రిక గీతంతో సభ ప్రారంభమైంది. పాయల మురళీకృష్ణ పుస్తకానికి ఆప్తవాక్యాన్ని అందించారు. సామాజిక స్పృహ, చైతన్యంతో కూడిన ఈ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమంలో సాహిత్య అభిమానులు, కవులు, రచయితలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
కబడ్డీ జట్ల ఎంపికకు స్పందన
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్ జూనియర్స్ బాల, బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపిక పోటీలకు అనూహ్య స్పందన లభించింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 200 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. క్రీడాకారులకు నగరంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఎంపికలు నిర్వహించగా..2009 జనవరి 1వ తేదీ అనంతరం జన్మించిన 60 కేజీల లోపు బరువు కలిగిన బాలుర క్రీడాకారులు, 55 కేజీల లోపు బరువు కలిగిన బాలికలు పాల్గొన్నారు. అద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో జరగబోయే అంతర్ జిల్లా సబ్ జూనియర్స్ కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని అసోసియేషన్ అధ్యక్షుడు రంగారావుదొర వెల్లడించారు. ఎంపిక పోటీలను వ్యాయామ ఉపాధ్యాయులు కె.గోపాల్, మీసాల శ్రీనివాసరావు, మజ్జి తిరుపతిరావు, బంటుపల్లి శివ, సారిపల్లి గౌరీ శంకర్, నడిపేన మురళీధరరావు తదితరులు పర్యవేక్షించారు. 200 మంది క్రీడాకారుల హాజరు -
వైద్యవిద్యను ప్రైవేటు చేతుల్లోకి నెట్టొద్దు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం పేదలపై దాడి చేయడమే, పీపీపీ పేరుతో వైద్య రంగాన్ని ప్రైవేటు చేతుల్లోకి నెట్టివేస్తూ ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకుంటుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్కు అప్పగించడం సరికాదు. దీంతో పేద విద్యార్థులు వైద్యవిద్యకు దూరమై, రిజర్వేషన్లు పోతాయి. వైద్యం ఖరీదవుతుంది. రెడ్డి శంకరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మార్కెట్లో వైద్యవిద్య పీపీపీ పేరిట ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం సమాజానికి పెద్ద నష్టం చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కును కల్పింస్తుంది. దానికి విద్య, వైద్యం, ఆరోగ్యం అంతర్భాగం. జీవో 590 ద్వారా 10 మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలోకి మార్చడం ప్రజల హక్కుల మీద దాడి. పీపీపీ పేరుతో వైద్య విద్యను, ఆరోగ్యాన్ని అంగడి సరుకుగా మార్చే చర్యలను వెంటనే ఉపసంహరించాలి. ప్రభుత్వం నిర్మించిన వాటిని ప్రభుత్వమే నడపాలి. అప్పుడే మాత్రమే ప్రజల ఆరోగ్యం రక్షితమవుతుంది. కె.సురేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, -
సాధారణ రోగుల మధ్యలో డయేరియా రోగులు
బాడంగి: స్థానిక సీహెచ్సీలో సాధారణ రోగులకు కేటాయించిన ఇన్పేషెంట్ వార్డులోనే డయేరియా సోకిన రోగులకు కూడా సమానంగా ఒకేచోట బెడ్లు ఇచ్చి చికిత్స చేయడంపట్ల సాధారణ రోగులు ఆందోళన చెందుతున్నారు. డయేరియా అంటువ్యాధి గనుక సాధారణ రోగులకు సోకే ప్రమాదముందన్న ఆలోచనతో వారు భయపడుతున్నారు. కావున డయేరియా రోగులకు ప్రత్యేక వార్డు కేటాయించి చికిత్స చేస్తే బాగుంటుందని వైద్యులకు సూచిస్తున్నారు. రామభద్రపురం మండలానికి చెందిన పలువురు డయేరియా రోగులతో కలిసి ఒకే దగ్గర చికిత్స పొందడాన్ని వారంతా వ్యతిరేకిస్తున్నారు. దుర్వాసనతో పాటు, దోమలు ఈగల బెడద ఉందని, వైద్యులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 24 గంటల్లో.. ఒకే కుటుంబంలో ఇద్దరి మృతిశృంగవరపుకోట: ముద్దుగా పెంచుకున్న మనుమడు చనిపోయాడని తెలిసి తట్టుకోలేక గుండె ఆగిపోయి నాయనమ్మ తనువు చాలించింది. ఎస్.కోట మండలంలోని మూలబొడ్డవర పంచాయతీ పరిధి లచ్చన్నదొరపాలెం గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గొర్లె కన్నాలమ్మ(65)కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు సంతానం కాగా వారిలో ఇద్దరు కొడుకులు, పెద్ద కుమార్తె గతంలోనే కాలం చేశారు. కాగా కన్నాలమ్మ తన మనుమడు నాగరాజు వద్ద ఉంటోంది. నాగరాజు తన భార్య లక్ష్మి, చెల్లెలు సుహాసిని, నాయనమ్మ కన్నాలమ్మలతో ఉంటున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న నాగరాజు కొద్ది రోజులుగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. శనివారం సాయంత్రం 108 వాహనంలో ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తీసుకు వెళ్తున్న సమయంలో నాగరాజు మృతిచెందాడు. దీంతో హృద్రోగ భాదితురాలైన నాయనమ్మ కన్నాలమ్మకు విషయం తెలియకుండా దాచిపెట్టారు. ఆదివారం కన్నాలమ్మకు ఇరుగుపొరుగు వారి ద్వారా విషయం తెలియగా కూర్చున్న చోటనే కుప్పకూలిపోయింది. దీంతో గ్రామస్తులు కన్నాలమ్మను పరిశీలించి చనిపోయినట్లు గుర్తించారు. 24గంటల్లో ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు చనిపోవడం గ్రామస్తులను విషాదంలో ముంచేసింది. కుటుంబ యజమాని నాగరాజు ఆకస్మిక మృతితో భార్య లక్ష్మి, పిల్లలు దీక్షిత, ఆదర్శ్, చెల్లెలు సుహాసిని, అనాథలుగా మిగిలారు. బస్సుకింద పడి యువకుడి మృతికొత్తవలస: మండల కేంద్రంలో గల మూడు రోడ్ల జంక్షన్లో ఆదివారం జరిగిన ప్రమాదంలో అస్సాం రాష్ట్రానికి చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తవలస నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనక డోర్ నుంచి ఆ యువకుడు బస్సు ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారి బస్సు వెనుక చక్రాల కింద పడడంతో తలపైనుంచి బస్సు వెళ్లిపోగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది ఇలా ఉండగా ఆ యువకుడు కావాలనే ఒక్కసారిగా నడుచుకుంటూ వస్తూ బస్సు వెనుక చక్రాల కింద పడిపోయాడని ఆర్టీసీ బస్సు సిబ్బంది తెలిపారు. మృతుడి జేబులో గల సెల్ఫోన్ ఆధారంగా అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతుడికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ఈ మేరకు శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్సీకి తరలించినట్లు సీఐ షణ్ముఖరావు తెలిపారు. బస్సు కింద పడి వృద్ధుడు.. గంట్యాడ: మండలంలోని కొత్త వెలగాడ గ్రామానికి చెందిన చౌడవాడ దాలినాయుడు (70) ఆదివారం బస్సుకింద పడి ప్రమాదంలో మృతిచెందాడు, ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలో ఉన్న తన కుమారుడి ఇంటికి వెళ్లేందుకు దాలినాయుడు ఆదివారం బయల్దేరాడు. వసాది గ్రామ శివారులో కొత్తవెలగాడ బస్టాప్ వద్ద విజయనగరం నుంచి ఎస్.కోట వెళ్తున్న బస్సును ఆయన కోడలు ఆపి ఎడమవైపు వెళ్లగా, కుడివైపు నుంచి బస్సు ఎక్కేందుకు వృద్ధుడు వస్తున్న విషయం గమనించక డ్రైవర్ బస్సును తీసేయడంతో బస్సు కుడివైపు ఉన్న టైర్ కింద వృద్ధుడు పడిపోయాడు. దీంతో తలనుజ్జునుజ్జవగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.సాయికృష్ణ తెలిపారు. -
విద్యవైద్యపై కూటమి కాసుల కక్కుర్తి
ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత మరిచి కూటమి పాలకులు ప్రజా వైద్యవిద్య, ప్రజావైద్యంపై కాసులేరుకుంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో కార్పొరేట్లకు అప్పగించడం ప్రజా ఆస్తులపై దోపిడీ చర్య. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజారంగంలోనే 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోగా, ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వాటిని కార్పొరేట్లకు కట్టబెడుతోంది. ఎకరా భూమిని రూ.99కు 66 ఏళ్ల లీజుకి ఎలా ఇస్తారు? ప్రజలు మీకు ఐదు సంవత్సరాలకే అధికారం ఇచ్చారు. ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్యవిద్య అందని ద్రాక్షగా మారుతుంది. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి, బుగత అశోక్ -
స్విమ్మింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారుల పయనం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అండర్–17 స్కూల్ గేమ్స్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు ఆదివారం పయనమయ్యారు. ఈనెల 3, 4 తేదీల్లో పల్నాడు జిల్లా నరసారావుపేటలో జరగనున్న పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మిలు పలు సూచనలు చేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా నుంచి పాల్గొనే స్విమ్మర్లు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాలని ప్రోత్సహించారు. తద్వారా ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. -
గంగపుత్రులకు ఆర్థిక కష్టాలు
● వేటకు మోంథా తుఫాన్ దెబ్బ ● ప్రతి కూలవాతావరణంతో కొనసాగని చేపల వేటపూసపాటిరేగ: సముద్రమే సర్వస్వంగా జీవిస్తున్న గంగపుత్రులకు మోంధా తుఫాన్ ప్రభావంతో ఏర్పడిన ప్రతి కూల వాతావరణంతో వేటసాగక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అల్పపీడన ప్రభావం వల్ల వాతావరణ మార్పులతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో చేపల వేట సాగలేదు. గడిచిన నాలుగు రోజులుగా మత్స్యకారులకు చేపల వేట సాగలేదు. జిల్లాలో తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురంలలో 27 కిలో మీటర్ల తీరంలో సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 885 రిజిస్టర్డ్ బోట్లలో సుమారు 5 వేల మంది మత్స్యకారులు నిత్యం వేట సాగిస్తుంటారు. ఈ ఏడాది వేట నిషేధం తరువాత వేట ప్రారంబించినప్పటి నుంచి ఆశించిన స్థాయిలో చేపలు వలకు చిక్కలేదని, అ తరువాత అల్పపీడనం రూపంలో కష్టాలు ప్రారంభమయ్యాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా అలల ఉధృతితో ఇంటికే పరిమితమైనట్లు తెలిపారు. వేట సాగక ఇబ్బందులు పడుతున్న మత్స్యకారుల కుటుంబాలను విపత్తులు, తుఫాన్ హెచ్చరికల సమయంలో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
కుక్కల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు
తెర్లాం: మండలంలోని జగన్నాథవలస గ్రామంలో వీధి కుక్కల దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గ్రామానికి చెందిన బొత్స అరుణ శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఇంటి వద్ద గిన్నెలు శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆమె చేతికి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన అరుణను భర్త, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రాజాంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు వెంటనే అత్యవసర చికిత్స అందించారు. అరుణ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని గ్రామస్తులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం కవిటి: మండలంలోని జగతి హనుమాన్ జంక్షన్ సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గొడివాటి శివాజీ(25) అనే యువకుడు దుర్మరణం చెందాడు. కవిటి ఎస్ఐ వి.రవివర్మ తెలిపిన వివరాల ప్రకారం.. శివాజీ భారత్ గ్యాస్ ఏజెన్సీలో మెకానికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. విధినిర్వహణలో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కవిటి నుంచి సోంపేట రోడ్డులో వెళుతుండగా జగతి గ్రామం మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడిపోవడంతో పడి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వెల్లడయ్యాక పూర్తివివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. శివాజీ స్వగ్రామం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెద్దమానాపురం. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రవివర్మ తెలిపారు. -
మంత్రి ఇలాకాలో ఇన్చార్జిలే దిక్కు
దత్తిరాజేరు: సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం నియోజకవర్గంలోని దత్తిరాజేరు మండలంలో పాలన ఇన్చార్జిలతో నడుస్తోంది. అసలే వర్షాలు పడుతుండడంతో సీజనల్ వ్యాధులు సోకే సమయంలో పంచాయతీ అధికారి, ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఇన్చార్జులే అయినా ఉన్న వారు కూడా పూర్తి స్థాయిలో విధుల్లో లేకపోవడంతో సర్పంచ్లు పారిశుధ్య పనులు చేసినా బిల్లులు అవుతాయో లేదోనన్న సందేహంతో కాలం వెల్లదీస్తున్నారు. అసలే వెనుకబడిన మండలంలో పాడి రైతులు ఎక్కువగా ఉన్న పెదమానాపురం, దత్తిరాజేరు పశు వైద్యకేంద్రాలకు కూడా పశువైద్యులు ఇన్చార్జులు కావడంతో వారు గజపతినగరం నుంచి ఎప్పుడు వస్తారో కూడా తెలియని పరిస్థితి పాడిరైతులకు ఏర్పడింది. అత్యవసర సమయాల్లో పశువులకు వైద్యం చేయించుకోవడానికి చేతిచమురు వదిలించుకోవాల్సి వస్తోందని పాడిరైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యయసాయ భూములు ఎక్కువగా ఉన్న మండలం కావడంతో తహసీల్దార్ కూడా ఇన్చార్జ్ కాగా పనులు జరుగుతాయో లేదోనన్న ఆందోళన రైతుల్లో మొదలైంది. రెవెన్యూ కార్యాలయంలో ఉన్న డీటీ వరప్రసాద్ బాడంగి అదనపు తహసీల్దార్గా వెళ్లి నెలరోజులు గడుస్తున్నా ఇప్పటికీ డీటీ పోస్టు భర్తీ కాక ఆ కుర్చీ ఖాళీగానే ఉంది, విద్యార్థులతో పాటు మండల కార్యాలయాలకు వచ్చే వారికి పత్రికలతో పాటు మంచి పుస్తకాలు అందుబాటులో ఉండి అందరికీ ఉపయోగ పడుతుందని గత ప్రభుత్వంలో నిర్మించి మండల శాఖా గ్రంథాలయంలో అధికారి లేక పోవడంతో ఎప్పుడు తెరిచి ఉంటుందో తెలియని పరిస్థితి. దీంతో పాఠకులు కూడా అటు వైపు వెళ్లడం మానేశారు. సంబంధిత అదికారులు, పాలకులు దష్టిసారించి ఇన్చార్జ్ల స్దానంలో పూర్తిస్థాయిలో అధికారులను నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు, -
ఆలయంలో ఆభరణాల చోరీ
● 5 తులాలు బంగారు, 2 కేజీల వెండి మాయం సీతానగరం: మండలంలోని లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలో ఏకాదశిపూజలు ముగించుకుని అర్చకులు శ్రీనివాసాచార్యులు , వెంకటరమణాచార్యులు ఆలయం తలుపులు వేసుకుని శనివారం రాత్రి ఇళ్లకు వెళ్లారు. ఆదివారం వేకువజామున ఆలయం తలుపులు తీయడానికి వెళ్లగా దేవతామూర్తులుండే గదుల తలుపు తాళాలు విరగ్గొట్టి ఉండడాన్ని గుర్తించి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. సెక్యూరిటీ సిబ్బంది ఎం.మోహనరావు సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇన్చార్జి ఎస్సై సింహాచలం, ఏఎస్సై లక్ష్మణరావు సిబ్బందితో వచ్చి చోరీజరిగిన సంఘటనా స్థలాన్ని పరిశీలించగా ఆలయంలో రాజ్యలక్ష్మమ్మకు అలంకరించిన పుస్తెలు, గోదా దేవి అమ్మవారి పుస్తెలు, రామచంద్రస్వామి వారికి, వెంకటేశ్వరస్వామి వారికి అలంకరించిన 5 తులాలు బంగారు, 2 కేజీల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు అర్చకులు వారికి వివరించారు. సెక్యూరిటీ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై లక్ష్మణరావు తెలియజేశారు. సంఘటనా స్థలంపరిశీలన వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగిన సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పాలకొండ డీఎస్పీ రాంబాబు, పార్వతీపురం రూరల్ సీఐ రంగనాఽథ్, ఇన్చార్జి ఎస్సై సింహాచలం, సీసీఎస్ ఎస్సై అప్పారావు, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ ఎస్.శారద పరిశీలించారు. -
సభలు, సమావేశాలపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్
పార్వతీపురం రూరల్: జిల్లా పరిధిలో ఇకపై జరిగే ఏ కార్యక్రమాలైనా భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అపశ్రుతులకు, జన నష్టానికి తావివ్వకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా సమర్ధవంతమైన ఏర్పాట్లు ఉండాలని తేల్చి చెప్పారు. జన సమూహం అధికంగా ఉన్న చోట సమర్ధవంతమైన క్యూలైన్స్ నిర్వహణ, పటిష్టమైన నియంత్రణకు ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసు బలగాలను తగిన సంఖ్యలో నియమించాలన్నారు. రాకపోకలకు వీలుగా ప్రవేశ, నిష్క్రమన మార్గాలను స్పష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తూ భద్రతా ఏర్పాట్లపై పోలీసు, రెవెన్యూ, దేవదాయ, అగ్నిమాపక, వైద్య, ఆరోగ్య శాఖల నిరంతరం సమన్వయంతో పని చేయాలని, అత్యవసర ప్రతిస్పందనకు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏఎస్పీగా మనీషా వంగలరెడ్డి పార్వతీపురం రూరల్: పార్వతీపురం సబ్ డివిజన్ ఏఎస్పీగా మనీషా వంగలరెడ్డి నియమితులయ్యారు. ఇక్కడ ఏఎస్పీగా పని చేసిన అంకిత సురాన గత నెల 30న సత్యసాయి జిల్లాకు అదనపు ఎస్పీగా పదోన్నతిపై బదిలీ అయిన సంగతి విదితమే. అయితే ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా, ఇప్పటివరకు గ్రేహౌండ్స్లో అసాల్ట్ కమాండర్గా సేవలందించిన, నంద్యాలకు చెందిన మనీషా వంగలరెడ్డిని పార్వతీపురం ఏఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. నేడు పీజీఆర్ఎస్ సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సోమవారం నిర్వహించనున్నారు. పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాధ్ వినతులు స్వీకరించనున్నట్టు ఐటీడీఏ వర్గాలు తెలిపాయి. గిరిజనులు తమ సమస్యలు వినతులు రూపంలో ఇవ్వవచ్చు. నేడు కలెక్టరేట్ వద్ద ధర్నా పార్వతీపురం రూరల్: అన్నదాత సుఖీభవ రూ.20 వేలు వెంటనే కౌలు రైతులకు జమ చేయాలని, కొత్త కౌలు చట్టం తీసుకురావాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించనున్న ధర్నాకు జిల్లా రైతులు, కౌలు రైతులందరూ కదలి రావాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి రమణామూర్తి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం అర్బన్: కార్తీక సోమవారం సందర్భంగా ఈ నెల 3వ తేదీన జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. దేవాలయాల వద్ద తగు భద్రతా, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్య చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, దేవస్థాన నిర్వాహకులకు సూచనలు జారీ చేశారు. భక్తులు క్రమశిక్షణతో, శాంతియుతంగా దర్శనాలు ముగించుకోవాలని కలెక్టర్ కోరారు. -
రామతీర్థంలో వైభవంగా తెప్పోత్సవం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో స్వామివారి తెప్పోత్సవం ఆదివారం కనుల పండువగా జరిగింది. క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తెప్పోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి సన్నిధిలో నిత్య కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తులను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ భాష్కర పుష్కరిణి ప్రధాన ఘాట్ వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంపై ఆశీనులు చేశారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం చేపట్టి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం పూసపాటిరేగ మండలంలో కోనాడ నుంచి తీసుకువచ్చిన పడవలో స్వామిని ఉంచి పు ష్కరిణిలో తెప్పోత్సవాన్ని జరిపించారు. అర్చకుల వేద మంత్రాలతో, భక్తుల జయజయ ధ్వానాల నడుమ రామచంద్రస్వామి పుష్కరిణిలో ఊరేగారు. ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో పో లీసులు బందోబస్తు నిర్వహించారు. -
33శాతం నిబంధనే గుదిబండ
పంట నష్ట పరిహారం చెల్లింపుపై వ్యవసాయ శాఖ నిబంధనలే రైతులకు పెను శాపంగా మారుతున్నాయి. అధికారులు క్షేత్ర స్థాయిలో జాబితాలను సిద్ధం చేస్తున్నప్పటికీ రైతుకు ఉన్న మొత్తం పంటలో 33శాతం దెబ్బతింటేనే పరిహారం అందుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పంట దిగుబడిని అనుసరించి ఈ సాయం లెక్కేస్తామని కూడా చెబుతున్నారు. సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్ నష్టం తెచ్చిపెట్టడంతో రైతులు తీవ్ర నష్టాన్ని భరిస్తూ యంత్రాలతో కోతలు కోసి వ్యాపారులకు విక్రయించుకుంటున్నారు. కాస్తాకూస్తో పరిహారం వస్తుందన్న ఆశతో మిగిలిన రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ 33శాతం నిబంధనల మెలికతో క్షేత్ర స్థాయిలో నష్టం కళ్ల ఎదుటే కనిపిస్తున్నా తమకు పరిహారం వర్తిస్తుందన్న నమ్మకం లేకుండా పోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ కఠిన నిబంధనను పక్కన పెట్టి నష్టపోయిన ప్రతీ ఒక్కరిని పరిహారం చెల్లించే దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీ
● దేవాలయాలలో భక్తులకు రక్షణ కరువైంది ● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పాలకొండ : రాష్ట్రంలో ప్రజలతో పాటు భక్తులకు కూడా భద్రత కరువైందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో ఏకాదశి సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన ఘటనలో మృతి చెందిన భక్తులకు ఆదివారం సాయంత్రం పాలకొండ ప్రధాన రహదారిలో నివాళులు అర్పిస్తూ కొవొత్తులతో శాంతి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాలలో భక్తులకు రక్షణ లేక చనిపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నా.. కూటమి ప్రభుత్వానికి చలనం లేదని విమర్శించారు. దేవాలయాలలో పర్వదినాల సందర్భంగా రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. రానున్న రోజులలో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందోనని పేర్కొన్నారు. కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగిన ఆలయం ప్రైవేటుదని తమకు సంబంధం లేదని ప్రభుత్వం చెబుతున్నదంటే, దీనార్ధం ప్రభుత్వానిదే తప్పని తెలుస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కనపాక సూర్యప్రకాశరావు, వెలమల మన్మధరావు, పాలవలస ధవళేశ్వరరావు, దుప్పాడ పాపినాయుడు, తూముల లక్ష్మణరావు, పల్లా భానుబాబు, దుంపల చిన్ని, కె.విజయకుమార్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల అడ్డంకి!
పంట నష్ట పరిహారానికి పార్వతీపురం రూరల్: జిల్లా రైతాంగాన్ని మోంథా తుఫాన్ కోలుకోలేని దెబ్బతీసింది. చేతికొచ్చిన పంట కళ్లేదుటే నీటిపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పైరు నేలకు ఒరుగుతుంటే రైతుల కళ్లల్లో కన్నీటి సుడులు తిరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 3.10 లక్షల రైతుల ఈ క్రాప్ వివిధ పంటలకు సంబంధించి నమోదు కాగా, జిల్లా వ్యాప్తంగా కేవలం 815.45 ఎకరాలు మాత్రమే నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాధమికంగా లెక్క కట్టినట్టు చెబుతున్నారు. పార్వతీపురం మండలంలో సుమారు 19వేల ఎకరాలకు సంబంధించిన వరి పంటలో 70శాతం వరకు తుఫాన్ కారణంగా దెబ్బతింటే జిల్లా వ్యాప్తంగా అధికారులు చెబుతున్న లెక్కలు ఒకింత రైతులను ఆందోళనకు గురి చేస్తుంది. నిబంధనల పేరిట నష్టాన్ని లెక్కించడంలో అధికారులు అనుసరిస్తున్న వైఖరి పరిహారం దక్కకుండా చేస్తుందేమోనన్న భయాందోళనలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. అంచనాల్లో సెంట్ల మెలిక తుఫాన్ నష్టంపై అధికార యంత్రాంగం నివేదికలను సిద్ధం చేసే పనిలో భాగంగా వ్యవసాయ శాఖ, రెవెన్యూ సిబ్బంది జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాల్సి వుంది. అయితే నష్టాన్ని గుర్తించే ప్రక్రియ రైతులకు శాపంగా మారుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఇన్ని సెంట్లు దాటితేనే, 33శాతం దెబ్బతింటేనే పరిహారానికి అర్హులంటూ అధికారులు పెడుతున్న మెలిక అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తుంది. కళ్ల ఎదుటే పంట మొత్తం తుఫాన్ కారణంగా దెబ్బతిన్నా.. పాక్షికంగా నష్టం జరిగిన ఈ సెంట్ల నిబంధన కారణంగా తాము సాయం కోల్పోతామేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం సదరు నష్టపోయిన పంట నష్టం కిందకు రాదని అధికారులు చెబుతున్న మాటలు రైతులను కలచివేస్తున్నాయి. ప్రభుత్వం తన నిబంధనలను సరళతరం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. నిబంధనల ప్రకారం నష్ట పరిహారం అందించేందుకు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తుఫాన్ వల్ల నష్టపోయిన పంట వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రత్యేక యాప్లో నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రక్రియ పూర్తయిన వెంటనే పరిహారం కోసం అర్హులైన రైతులకు చెల్లించేందుకు నివేదికలను ప్రభుత్వానికి పంపిస్తాం. ప్రభుత్వ నిబంధనల పరిధిలోనే ఈ పరిహారం చెల్లింపులు ఉంటాయి. – రాబర్ట్పాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పత్తి రైతు చిత్తు● మోంథా తుఫాన్తో విలవిల ● అధిక వర్షాలకు దెబ్బతిన్న పత్తి ● అందుబాటులో లేని కొనుగోలు కేంద్రాలు ● గిట్టుబాటు ధర కోసం పాట్లు ● జిల్లాలో 17,202 ఎకరాల్లో సాగు భామిని: జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న పత్తిపై మోంథా తుఫాన్ పంజా విసిరింది. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట చేనులో నీరు నిల్వ ఉండి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే కాయ, పింజైపె వర్షాల ప్రభావం పడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా పత్తి రైతుకు తీరని నష్టం సంభవించింది. ఇదిలా ఉండగా వర్షాలతో తడిచిన పత్తి కొనుగోలుకు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ ఏడాది 17,202 ఎకరాల్లో పత్తి సాగును అధికారులు గుర్తించారు. వరుస కష్టాలు.. ఈ ఏడాది పత్తి రైతులను వరుస కష్టాలు వెంటాడాయి. కాపు దశలో ఉన్న పత్తి పంటపై వరుస వర్షాలు తీవ్ర ప్రభావం చూపి రైతు ఆశలపై నీళ్లు చల్లాయి. ఎకరానికి 3 నుంచి నాలుగు క్వింటాళ్ల దిగుబడి పడిపోయింది. పత్తి మొదటి కాపు వర్షార్పణం అయ్యింది. చేతికి అందాల్సిన విలువైన పత్తి గిడసబారి నల్లబడింది. ఈ సమయంలో రైతులు సేకరించిన పత్తిని ఆరబోయడం, కాయ పత్తి సేకరించి తొక్కలు తొలగించే ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. అధిక నాణ్యత, బరువు రావలసిన మొదటి తీత పత్తి దెబ్బతిని తీవ్రంగా నష్టం కలిగింది. అదనపు కూలీలతో కాయపత్తి తీయించాల్సి ఉంది. ఎకరానికి మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకు నష్టపోతున్నాం. దీంతో ఎకరానికి రూ.20 వేల వరకు నష్టం సంభవించే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక గిట్టుబాటు ధర లేదు. పండించిన రైతుకు మద్దతు లేదు. – కొత్తకోట చంద్రశేఖర్, పత్తి రైతు, సొలికిరి, భామిని మండలం పత్తి పంట నిరంతరం సాగు చేస్తుండడంతో భూ సారం తగ్గుతుంది. పంట దిగుబడి పడిపోతుంది. ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గుతుంది. పంట దిగుబడి తగ్గి ఖర్చులు పెరుగుతున్నాయి. నష్టాల బారిన పడుతున్న తరుణంలో పంట మార్పిడి చేసుకోవాలి. నష్టాల నుంచి బయట పడాలి. – కొల్లి తిలక్, ఎంఏవో, భామిని తుఫాన్ అనంతరం పత్తి రైతుకు సూచనలు అందిస్తున్నాం. శాస్త్రవేత్తలు రైతులతో ఇష్టాగోష్టి జరిపి చైతన్య పరుస్తున్నారు. పంట దిగుబడి తగ్గకుండా చర్యలు వివరిస్తున్నాం. పంటలో నీరు తీసి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముడి పత్తి నాణ్యత తగ్గకుండా ఆరవేత పనులు చేపట్టాలి. – రాబర్ట్పాల్, జిల్లా వ్యవసాయాధికారి జిల్లాలో 3.10 లక్షల మంది రైతుల ఈ క్రాప్ నమోదు మోంథా తుఫాన్కు 330 హెక్టార్లలో పంట నష్టం నివేదికలు సిద్ధం చేస్తున్న యంత్రాంగం నష్టాన్ని గుర్తించడంలో అధికారుల చర్యలపై రైతుల్లో ఆందోళన -
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ల్యాబ్లు..!
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అనధికారికంగా పలు మెడికల్ ల్యాబ్లు దర్జాగా నిర్వహిస్తున్నారు. వీటి సంఖ్య పదుల్లోనే ఉండొచ్చని వైద్య శాఖాధికారులే చర్చించుకోవడం విశేషం. కొన్ని క్లినిక్లకు కూడా ఎటువంటి అనుమతులు లేకున్నా దర్జాగా నిర్వహించేస్తున్నారు. ఇటువంటి ల్యాబ్లు, క్లినిక్లలో రోగులకు సంబంధించిన రిపోర్టుల్లో తేడాలు వస్తే ఎవరిది బాధ్యత అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేగాక తేడాలొచ్చిన రిపోర్టుల మేరకు వైద్యాధికారి సలహాలతో మందులు వాడి ప్రాణాల మీదకు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది. జిల్లాలో రిజిస్టర్ ల్యాబ్లు 72 జిల్లాలో 72 ల్యాబ్లు వైద్య ఆరోగ్య శాఖ వద్ద రిజిస్ట్రర్ అయ్యాయి. అదేవిధంగా 149 ఆస్పత్రులు రిజిస్ట్టర్ చేసుకున్నాయి. క్లినిక్లు 149 ఉన్నాయి. డెంటల్ క్లినిక్లు 68 ఉన్నాయి. ఫిజియోథెరిపి క్లినిక్లు 10 ఉన్నాయి. పుట్టగొడుగుల్లా.. మెడికల్ ల్యాబ్, ఆస్పత్రి, క్లినిక్, ఫిజియోథెరపి క్లినిక్ ఇలా ఏదైనా కానివ్వండి.. నిర్వహించాలంటే వైద్య ఆరోగ్య శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అయితే కొందరు తమ పలుకుబడితో ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండానే వీటిని తమ ఇష్టానుసారం నిర్వహిస్తూ రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇలా రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్న ల్యాబ్లు, క్లినిక్లలో ఏదైనా ప్రమాదం జరిగితే బీమా వర్తించదు. దీని వల్ల రోగులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదే సమయంలో రోగులకు సంక్రమించిన వ్యాధుల రిపోర్టుల్లో తేడాలొస్తే అడిగే నాధుడు ఉండడు. రిజిస్టర్ ల్యాబ్ అయితే ఏది తేడా చేసినా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే వైద్య పరీక్షల పేరిట వీటిలో రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనధికార ల్యాబ్లు, క్లినిక్లపై చర్యలు తీసుకోవడంలో వైద్య శాఖాధికారులు మీనమేషా లు లెక్కిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తు న్నాయి. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సంబంధిత శాఖ అధికారులు ఇలా వ్యవహరించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రజల ప్రాణాలంటే అంత లెక్క లేకుండా పోయిందా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రోగుల ప్రాణాల ను లెక్కలోకి తీసుకుని ఇటువంటి ల్యాబ్లు, క్లినిక్ ల విషయంలో సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. భోగాపురం మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా మెడికల్ ల్యాబ్ నిర్వహిస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం రావడంతో ఆకస్మికంగా తనిఖీ చేసి నోటీస్ జారీ చేశారు. విజయనగరం పట్టణంలో ఓ వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖ వద్ద ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ల్యాబ్ నిర్వహిస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం రావడంతో తనిఖీ చేసి సదరు వ్యక్తికి నోటీస్ జారీ చేశారు. జిల్లాలో ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్న రెండు ల్యాబ్లను గుర్తించాం. సంబంధిత యజమానులకు నోటీసులు కూడా ఇచ్చాం.అనధికారికంగా ల్యాబ్లు, క్లినిక్లు నిర్వహిస్తే తగు చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్వో -
డీఎస్సీ ఎంపికలో అన్యాయం
చీపురుపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ ఎంపికలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని చీపురుపల్లి మండలంలోని వంగపల్లిపేటకు చెందిన బాడీబిల్డర్ రెడ్డి లక్ష్మునాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆదివారం స్థానిక ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో తనకు అన్యాయం జరిగిందని వాపోయాడు, తనకు జాతీయ స్థాయిలో బాడీబిల్డింగ్లో అర్హత ఉందని, అదే అర్హతతో టీజీటీ ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. రాత పరీక్షలో అర్హత సాధించిన తన పేరును 1:5 నిష్పత్తిలో ప్రభుత్వం తయారు చేసిన మెరిట్ జాబితాలో 55వ ర్యాంకర్గా తన పేరు ఉందని, ఈ మేరకు 2025 ఆగస్టు 2న విజయవాడలో తన ధ్రువీకరణ పత్రాల పరిశీలన కూడా పూర్తయ్యిందని తెలిపాడు. ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికై నట్లు భావించిన తాను ఎంతో సంతోషించానని ఇంతలో సెప్టెంబర్ నెలలో విడుదల చేసిన ఫలితాల్లో తన పేరు లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. క్రీడాకారుల కోటాలో 55వ ర్యాంకులో ఉన్న తనకు ఉపాధ్యాయ పోస్టు ఇవ్వకుండా 96వ ర్యాంక్లో ఉన్న వ్యక్తిని ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎలా ఎంపిక చేశారో అర్థం కాలేదన్నారు. అంతేకాకుండా స్థానిక కోటాలో ఉన్న తనను తప్పించి అంతర్ జిల్లాకు చెందిన 96వ ర్యాంకర్ను ఎంపిక చేయడం విడ్డూరంగా ఉందని, అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఇచ్చిన వెబ్సైట్లో తన సమస్య పొందుపరిచినప్పటికీ ఎలాంటి స్పందన లేదన్నాడు. తనకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరాడు. జాతీయ బాడీబిల్డర్ ఆవేదన -
రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి
● దెబ్బతిన్న పంటలు కొనుగోలు చేయాలి ● మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొరసాలూరు రూరల్: మోంథా తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు కనీస బీమా సౌకర్యం కల్పించలేని ప్రభుత్వం అసలు రైతుల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తుందో కూటమి నాయకులు సమాధానం చెప్పాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. మండలంలోని పెదపదం పంచాయతీలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రైతులు నష్టపోయిన పంట పొలాలను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిలో సంపత్, ఆర్జేఎల్, సోనామసూరు, సాంబమసూరు రకాల పంటలు బాగా దెబ్బతిన్నాయన్నారు. తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన నేలకొరిగిన వరి చేలు చూస్తుంటే రైతు కష్టం, కన్నీళ్లు కనిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహరంతో పాటు పంటలను కొనుగోలు చేయాలని డిమండ్ చేశారు. ఉచిత బీమా లేక రైతుల ఆందోళన గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతులకు తమ పంటల బీమాను ప్రభుత్వమే చెల్లించి ఆదుకుందన్నారు. గతంలో తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు బీమా డబ్బులు అందేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. గత సంత్సరం కూడా ఇలాగే పంటలు నష్టపోయిన రైతులకు ఎలాంటి నష్టపరిహరం అందలేదని, ఇప్పుడు కూడా బీమా సొమ్ము ప్రభుత్వం చెల్లించకపోవడంతో రైతులు బీమాకు దూరమయ్యారన్నారు. మండలంలోని రెండు తుఫాన్లకు అరటి, మొక్కజొన్న, వరి, పత్తి పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహరం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
టెట్ అర్హత జీవితకాలం చెల్లుబాటులో ఉండాలి : ఫ్యాప్టో
విజయనగరం అర్బన్: ఆర్టీఈ చట్టం 2010 ప్రకారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సర్టిఫికెట్కు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘జీవితకాల చెల్లుబాటు’ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తిని, డీఈవో యు.మాణిక్యంనాయుడుకు శుక్రవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాల ప్రకారం 2011 నుంచి 2025 మధ్య నిర్వహించిన టెట్ పరీక్షలకు 7 సంవత్సరాల చెల్లుబాటు మాత్రమే ఉన్నట్టు పేర్కొనడం ఉపాధ్యాయులలో ఆందోళనకు దారి తీసిందని అన్నారు. 2011లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, టెట్ సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటుగా ఉండాలని స్పష్టం చేసినందును రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2009 ఆర్టీఈ చట్టం ప్రకారం దేశ వ్యాప్తంగా టెట్ పరీక్ష తప్పనిసరి చేసిన నేపథ్యంలో అర్హత పొందిన అభ్యర్థులు పునరావృత పరీక్షలకు హాజరు కావాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఫ్యాప్టో నాయకులు కోరారు. డీఆర్వోను కలిసిన వారిలో ఫ్యాప్టో చైర్మన్ పి.శ్రీనివాసరావుతో పాటు వివిధ సంఘాల నాయకులు జేఏవీఆర్కే ఈశ్వరరావు, ఎన్వీ పైడిరాజు, ఏలూరి శ్రీనివాసరావు, డి.శ్యాం, జేఆర్సీ పట్నాయక్, సూరిబాబు తదితరులు ఉన్నారు. -
కడపలో సీపీఐ లిబరేషన్ రాష్ట్ర మహాసభలు
విజయనగరం గంటస్తంభం: కడపలో డిసెంబర్ 6, 7 తేదీల్లో జరగనున్న సీపీఐ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. సభలకు సంబంధించిన పోస్టర్లను శనివారం నగరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ లిబరేషన్ జిల్లా కార్యదర్శి బి.శంకరరావు మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న హిందుత్వ, మోదీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం, కార్పొరేట్ వర్గాలను బలోపేతం చేసే విధానాలపై సభల్లో చర్చించి భవిష్యత్ పోరాటాలను రూపొందిస్తామన్నారు. కార్మిక, దళిత, మైనార్టీ, రైతు, పేదల పోరాటాలకు ముందుండే సమయం వచ్చిందన్నారు. మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీలు ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే కుట్రల్లో నిమగ్నమై ఉన్నారని విమర్శించారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ఉద్యమాలను దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో బడ్జెట్ కోతలతో పేద ప్రజలపై భారాలు మోపుతున్నారని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో క్షీణత పెరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బి.గంగాధర్, ఎన్.సూర్యనారాయణ, ఎం.సురేష్, ఏఐసీసీటీయూ నాయకులు పాల్గొన్నారు. -
వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి
భోగాపురం: ఐచర్ వ్యాన్ డీకొట్టడంతో మండలంలోని ముంజేరు పంచాయతీ ధనాలపేట గ్రామానికి చెందిన ధనాల గోవిందు (37) మృతిచెందిన సంఘటన శనివారం ఉదయం మండల కేంద్రంలోని అప్పన్నపేట గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ధనాలపేట గ్రామానికి చెందిన గోవిందు విమానాశ్రయం నిర్మాణ పనులలో కూలీగా పని చేస్తూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. మృతునికి తల్లిదండ్రులతో పాటు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మృతుని తల్లిదండ్రులు డెంకాడ మండలం అక్కివరం సమీపంలో ఉన్న జామి తోటలో ఒక యాజమాని దగ్గర కూలీలుగా పని చేస్తున్నారు. గోవిందు తన తల్లిదండ్రులను కలిసేందుకు ధనాలపేట నుంచి బైక్పై అక్కివరం జామి తోట వద్దకు బయలు దేరాడు. ఈ క్రమంలో అప్పన్నపేట వద్దకు చేరుకునే సరికి భోగాపురం నుంచి ఉప్పు లోడుతో ముక్కాం వెళ్తున్న ఐచర్ వ్యాన్ ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో గోవిందు తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ధనాలపేట గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలుముకొంది. ఇంటికి పెద్దదిక్కు చనిపోవడంతో మృతుని భార్య కొండమ్మ తన ముగ్గురు ఆడ పిల్లలతో రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. డ్రైవర్ గంగాధరయ్య వ్యాన్ను నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట సీహెచ్సీకి తరలించారు. భార్య కొండమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వి.పాపారావు తెలిపారు. బొండపల్లి: మండలంలోని గోట్లాం గ్రామంలో గల కోనేరులో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై యు.మహేష్ తెలిపిన వివరాలు... గ్రామానికి సమీపంలో గల కోనేరులో గుర్తు పట్టడానికి వీలు లేకుండా బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిపారు. ఈ మేరకు ఆ ప్రాంతాన్ని పరిశీలించి మృతుని వద్ద ఆధారాల కోసం పరిశీలించగా ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. ఈ మేరకు మృతదేహాన్ని పంచనామ నిమిత్తం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 9121109462 నంబరుకు సమాచారం అందజేయాలని చెప్పారు. ఒడిశా వాసి అనుమానాస్పద మృతి విజయనగరం క్రైమ్: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో ఒడిశాకు చెందిన కలియాగౌడ్(27) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వన్టౌన్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ పార్కింగ్ వద్ద ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపురానికి చెందిన కలియాగౌడ్ శుక్రవారం రాత్రి కంపెనీ పని నిమిత్తం విజయనగరం వచ్చాడు. ట్రైన్లో దిగి ఇక్కడి నుంచి భీమిలి వెళ్తున్న సమయంలోనే అనుమానాస్పదంగా కింద పడి ఉండటంతో స్థానికులు చూసి అతని వద్ద ఉన్న బ్యాగ్లో ఫోన్ నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న కలియాగౌడ్ బంధువులు బరంపురం నుంచి వచ్చి పరిస్థితి గమనించి మృతి చెందినట్టుగా వన్టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
కాశీబుగ్గలో జిల్లా పోలీసుల సహాయక చర్యలు
విజయనగరం క్రైమ్: పొరుగు జిల్లా శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో కార్తీక శుద్ద ఏకాదశి సందర్భంగా శనివారం జరిగిన తొక్కిసలాటలో జిల్లా పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఎస్పీ దామోదర్ తోటి సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యల్లో భాగస్వామ్యం అయ్యారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ సౌమ్యలత, ఏఆర్ ఎస్పీ నాగేశ్వరరావు, ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం కోసం తమ వంతు సేవలు అందించారు. గాయపడిన క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. -
శరవేగంగా పైడితల్లి అభివృద్ధి పనులు
విజయనగరం టౌన్: సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం విస్తరణ బాలాలయం నిర్మాణ పనులతో ప్రారంభమయ్యాయి. ఆలయం పక్కన ఉన్న ఆధ్యాత్మిక కళావేదిక వద్ద ఉన్న ఖాళీ స్థలంలో అమ్మవారి బాలాలయం పనులను దాతల సహకారంతో అధికారులు ముందుగా నిర్మాణం చేపట్టారు. నవంబరు నెలలో పనులు పూర్తయిన తర్వాత అక్కడ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అక్కడ నుంచి ఆలయ అంతరాలయం, క్యూ వచ్చే ఇరువైపులా గోడలను పూర్తిగా తీసివేసి పొడవు, వెడల్పులను పెంచి నిర్మాణం చేపట్టేందుకు దేవదాయ శాఖ రంగం సిద్ధం చేసింది. సుమారు కోటీ రూ.80 లక్షలతో చేపట్టే ఈ నిర్మాణ పనులను వచ్చే ఏడాది జాతర నాటికి పూర్తి వైభవం సంతరించుకోనుంది. గతంలో అమ్మవారి చదురుగుడికి ఎదురుగా ఉన్న 2618 చదరపు గజాల ఎడ్వర్డ్ ఆసుపత్రి స్థలాన్ని మున్సిపాలిటీ నుంచి కోటీ రూ.19 లక్షలతో దేవదాయ శాఖ కొనుగోలు చేసింది. ఆ ప్రదేశాన్ని పూర్తిగా చదును చేయించి, ఆలయానికి ఇరువైపులా ఉన్న షాపుల యజమానులతో సంప్రదింపులు చేసి వారికి ఆ స్ధలాన్ని అప్పగించిన సంగతి విదితమే. మొత్తం తొమ్మిది షాపుల వరకూ తొలగించి వారి నుంచి 3,130 గజాల స్ధలాన్ని సేకరించారు. సుమారు రూ.5 కోట్ల వరకూ తొమ్మిది మందికి భవన పరిహారం కింద చెల్లించారు. మరో 230 గజాల స్థలం సేకరించేందుకు ప్రపోజల్స్ను ఉన్నతాధికారులకు పంపించారు. అయితే ప్రస్తుత ఆలయం 143.24 గజాలు ఉంది. నూతనంగా విస్తరణ జరిగితే మొత్తం 396.25 చదరపు గజాలు పెరుగుతుంది. ఆలయ గర్భాలయంలో ఎటువంటి మార్పులు, చేర్పులు చేయకుండా కేవలం అంతరాలయం, మండపం విస్తీర్ణం పెంచి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అంతరాలయం పాతది 3.6 అడుగుల పొడవు నుంచి సుమారు తొమ్మిది అడుగుల మేరకు పెరగనుంది. మొత్తంగా 253 గజాల విస్తీర్ణంతో ఆలయం విశాలంగా అభివృద్ధి కానున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. దాతల సహకారం అవసరమే.. అమ్మవారి ఆలయం సంపూర్ణంగా చేయాలంటే దాతల సహకారం ఎంతైనా అవసరమే. వాటితోనే ఆలయ నిర్మాణ పనులు జరగాల్సి ఉంది. ప్రస్తుతానికి కోటీ రూ.80లక్షలతో చేపట్టిన పనులు కేవలం ఆలయ విస్తరణకు మాత్రమే సరిపోతుంది. భవిష్యత్తులో క్యూ కాంప్లెక్స్లు, అన్నదాన సత్రాలు, కార్యాలయం, కల్యాణ మండపం, కేశ ఖండన శాల తదితర వాటిని నిర్మాణానికి సంబంధించి దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పైడితల్లి దర్శనం ఇక సులభం ఆలయం ఇరువైపులా అభివృద్ధి చెందితే అమ్మ దర్శనం ఇక భక్తులకు సులభంగా లభిస్తుంది. కేవలం రెండు క్యూల ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం ఉంది. సాధారణ మంగళవారాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారు. వచ్చే ఏడాది జాతర నాటికి 396 గజాలలో ఆలయం విస్తీర్ణం జరిగితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఆలయం పక్కనే బాలాలయ నిర్మాణ పనుల ప్రారంభం కోటీ రూ.80 లక్షలతో ఆలయ ప్రాంగణం విస్తరణ అమ్మ దర్శనం ఇక సులభం వచ్చే ఏడాది జాతర నాటికి ఆలయం సిద్ధం చేస్తాం.. ఆలయ ఈవో శిరీషనిర్మాణ పనులు ప్రారంభించాం ఆలయ విస్తరణ నిర్మాణ పనులు బాలాలయంతో ప్రారంభించాం. బాలాలయం నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చారు. మరికొద్ది రోజుల్లో ఆ పనులు పూర్తవుతాయి. నవంబరు రెండో వారంలో విస్తరణ పనులను సంప్రదాయబద్దంగా చేపడతాం. బాలాలయంలో అమ్మవారి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తూ ప్రస్తుతం ఉన్న విగ్రహానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా శాస్త్రోక్తంగా పనులు జరిపించే విధంగా కృషి చేస్తున్నాం. వచ్చే ఏడాది జాతర నాటికి సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టాం. అమ్మ ఆలయం అభివృద్ధికి దాతలందరూ సహకరించాలి. –కె.శిరీష, పైడితల్లి దేవస్ధానం ఆలయ ఇన్చార్జ్ ఈవో, విజయనగరం -
జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక
బొబ్బిలి: ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికను శనివారం నిర్వహించారు. డివిజన్లోని 7 మండలాలకు చెందిన 200 మంది క్రీడాకారులు పాల్గొనగా ఆయా క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన వారిని గుర్తించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు. లాంగ్ జంప్, హైజంప్, త్రోబాల్ వంటి పోటీలను నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో గొట్టాపు వాసు, డివిజన్ ఇన్చార్జ్ ఎన్వి నాయుడు, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, ఏడు మండలాల పి.డి.లు పాల్గొన్నారు. ములగ విద్యార్థినికి అరుదైన అవకాశం పార్వతీపురం రూరల్: మండలంలోని ములగ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అరుదైన గౌరవం దక్కింది. భారత రాజ్యాంగ దినోత్సవం పురష్కరించుకొని నిర్వహించిన పోటీల్లో పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని బంకపల్లి భార్గవి ప్రధమ స్థానాన్ని సాధించి తన ప్రతిభను కనబరుస్తూ ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగే రాష్ట్ర స్థాయి ఉత్సవాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఈ మేరకు అదే రోజున నిర్వహించే మాక్ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు, ముఖ్యమంత్రితో పాటు పాల్గొని అవకాశం దక్కడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అరుదైన అవకాశం దక్కించుకున్న భార్గవికి ప్రధానోపాధ్యాయులు పెంట రామకృష్ణ అభినందించారు. ‘ఓపెన్’ ఫీజు గడువు పెంపు : డీఈవో విజయనగరం అర్బన్: ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకొని ఫీజులు చెల్లించని వారి కోసం ఈ నెల 8వ తేదీ వరకు గడువు పెంచినట్టు డీఈవో యు.మాణిక్యంనాయుడు తెలిపారు. రెగ్యులర్ టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎస్సెస్సీ పరీక్షలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు రూ.300 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులు ‘ఏపీఓపెన్స్కూల్.జీఓవి.ఐఎన్’ వెబ్సైట్లో సమర్పించుకోవాలని తెలిపారు. జిల్లా నెట్వర్క్ సెంటర్ల ద్వారా ఫీజు చెల్లింపునకు సదుపాయం ఉందని అర్హత కలిగిన అభ్యర్థులు ఆలస్యం కాకుండా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేదా కన్వర్షన్ చేసిన అభ్యర్థులు కూడా నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లింపును పూర్తి చేయవచ్చని తెలిపారు. బొబ్బిలిలో చోరీ బొబ్బిలి: పట్టణంలోని వెలమవారి వీధిలో ఓ అపార్ట్మెంటులో నివసిస్తున్న ఉపాధ్యాయురాలు బెవర రాధ ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. బీరువాను బద్దలు కొట్టి దాచుకున్న దాదాపు 10 తులాల బంగారు ఆభరణాలను పట్టుకుపోయారు. తన కుమార్తె పుట్టపర్తిలో విద్యనభ్యసిస్తుండగా భర్త రామకృష్ణ కుమార్తె వద్దకు వె వెళ్లారు. శుక్రవారం రాధ తన పుట్టింటికి వెళ్లగా శనివారం మధ్యాహ్నం తిరిగి వచ్చి చూసేసరికి తలుపుల గడులు, బీరువా తెరిచి ఉన్నాయని దీంతో తమకు సమాచారం ఇచ్చినట్టు ఎస్ఐ రమేష్ తెలిపారు. ఇప్పటికే క్లూస్ టీం వచ్చి పరిశీలించిందని దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. ఫిర్యాదు ఇంకా అందలేదని, పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామని తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య గుర్ల: మండలంలోని గుజ్జింగివలసకు చెందినన బద్రి రాంబాబు(30) మనస్తాపానికి గురై శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. బద్రి రాంబాబుకు కుటుంబ సభ్యులు మూడేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఒక్క సంబంధం కూడా నిశ్చయం కాకపోవడంతో పెళ్లి కాదనే నిర్ణయానికి వచ్చి మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్ల హెడ్ కానిస్టేబుల్ త్రినాధ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతునికి తల్లి అప్పయ్యమ్మ ఉన్నారు. -
ఇసుక స్టాక్ పాయింట్ పరిశీలన
● ఇసుక దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు బొబ్బిలి: గ్రోత్ సెంటర్లోని ఇసుక స్టాక్ పాయింట్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న అంశంపై సాక్షి పత్రికలో శనివారం అక్రమ ఇసుక రవాణ అన్న కధనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన ఆర్డీవో జెవివిఎస్.రామ్మోహనరావు, తహసీల్దార్ ఎం.శ్రీను, ఆర్ఐ రామకుమార్, ఎస్ఐ జ్ణానప్రసాద్ ఇసుక స్టాక్ పాయింట్ను పరిశీలించారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఇసుకను అక్కడి నుంచి అక్రమంగా తరలించినట్టు స్థానికులు చెబుతున్నారని, మధ్యాహ్న సమయంలోనే ఇసుక రవాణా జరిగినట్టు సమాచారం అందిందన్నారు. అధికారులంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనల్లో బిజీగా ఉండగా ఇక్కడ ఇసుక స్టాక్ పాయింట్ నుంచి జేసీబీ సహాయంతో 7 ట్రాక్టర్ల ఇసుకను తరలించినట్టు గుర్తించామని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని తహసీల్దార్ ఎం.శ్రీను తెలిపారు. అక్కడ ఉన్న సీసీ కెమెరా వైర్లును కత్తిరించారని దీనివలన ఎవరన్నది గుర్తించలేకపోయామని, త్వరలో పట్టుబడతారని వివరించారు. ప్రభుత్వ ఇసుక స్టాక్ పాయింట్లో ఇసుక అక్రమంగా తరలించిన వారెవరైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తిని దోపిడి చేసినట్లేనని స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని, పోలీసులు కూడా అదే పనిలో ఉన్నారని తహసీల్దార్ తెలిపారు. -
వంశధారలో మహిళ గల్లంతు
● కార్తీక స్నానాలలో దుర్ఘటన భామిని: మండలంలోని కాట్రగడ బీకి చెందిన గౌడో జడ్జి అనే మహిళ వంశధార నదిలో శనివారం గల్లంతైనట్టు స్థానికులు తెలిపారు. కార్తీక ఏకాదశి సందర్భంగా వేకువజామున నదిలో కార్తీక స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో కొట్టుకుపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్రామస్తులు నదిలో వెతికినా జాడ లభించకపోవడంతో అధికారులకు తెలిపారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ శివన్నారాయణ, ఎంపీడీవో వసంతకుమారి, బత్తిలి ఎస్.ఐ అప్పారావు, ఎంఆర్ఐ మణి ప్రభాకర్ ఆధ్వర్యంలో అధికారులు గల్లంతైన మహిళ విషయమై పరిశీలించారు. నదీ తీరం వెంబడి వెతికేందుకు ప్రత్యేక బృందాల రప్పించనున్నట్టు అధికారులు తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకుడు తోట సింహాచలం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
కన్నీటి వరద
● చి’వరి’లో మునిగిన రైతు ● వర్షంతో కోలుకోలేని కష్టం ● పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ● ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోలు పాలకొండ మండలం తంపటాపల్లి గ్రామంలోనే సుమారు 450 ఎకరాల మేర వరి నేలవాలి, ఎందుకూ పనికి రాకుండా పోయింది. ఇప్పటికీ పంట పొలాల్లో నడుం లోతు వరకు నీరు నిలిచే ఉంది. ఎంత కట్టలు కడుతున్నా.. ప్రయోజనం ఉండడం లేదు. నాలుగు రోజులుగా నీటిలోనే ఉండటంతో మొలకలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు అల్లు శ్రీరామ్మూర్తికి 30 ఎకరాల మేర ఉంటే.. అందులో దాదాపు 15 వేల ఎకరాల వరకూ నీట పాలైంది. రూ.వేలల్లో మదుపులు పెట్టి.. చి‘వరి’కి ఇలా నిండా మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకొండ మండలం తుమరాడలో పూలు, కూరగాయల సాగు అధికం. 30 కుటుంబాల వరకు బంతి, చామంతి, వాడంబరాలు.. కూరగాయలు, దొండ, బీర, చిక్కుడు, క్యాబేజీ తదితర పంటలు సాగు చేస్తున్నారు. చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. పూలమొక్కలు వాడిపోతున్నాయి. ఎండ ఎక్కితే కూరగాయల పాదులు కుళ్లిపోయే ప్రమాదం ఉందని మహిళా రైతు పి.పార్వతి చెబుతోంది. సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్/మక్కువ: మోంథా తుపాను.. రైతుకు మోత మోగించింది. మూడు రోజులపాటు ఏకధాటిగా కురిసిన వాన.. గురువారం మధ్యాహ్నం నుంచి తెరిపిచ్చింది. వర్షం వెళ్లినా.. చేలలో నీళ్లు ఇంకా ఇంకలేదు. రూ.వేలల్లో పెట్టుబడి పెట్టిన రైతుల ఆశలు పొలాల్లోనే నేలవాలిపోయాయి. పార్వతీపురం మండలం, సాలూరు రూరల్, పాచిపెంట, మక్కువ, బలిజిపేట, సీతానగరం, పాలకొండ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, భామిని తదితర మండలాల్లో ఖరీఫ్ వరి, పత్తి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 1,105 హెక్టార్లతో వ్యవసాయ పంటలు, 18.72 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పత్తి, మొక్కజొన్న రైతులకూ కష్టం తప్పలేదు. పాచిపెంట, కురుపాం, సాలూరు, కొమరాడ తదితర మండలాల్లో పత్తి పంట తడిచి ముద్దయ్యింది. జిల్లాలో పత్తి సుమారు 17 వేల ఎకరాల్లో సాగవుతుండగా.. దాదాపు 187 ఎకరాల మేర నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా. జిల్లాలోని పలు మండలాల్లో కూరగాయల సాగు కూడా అధికంగా ఉంది. వర్షం వెలిసి.. ఎండ తీవ్రంగా కాయడంతో పంట కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పంటకు దోమపోటు మరోవైపు పంటలకు తెగుళ్ల బెడద వెంటాడుతోంది. నాలుగు రోజులుగా చేలు నీళ్లలో ఉండిపోవడం వల్ల ఓ వైపు మొలకలు వస్తున్నాయి. మరోవైపు సుడిదోమ వ్యాపిస్తోంది. దోమ నివారణకు రైతులు మందు పిచికారీ చేయాల్సి వస్తోంది. ఇది అదనపు వ్యయంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను నాలుగెకరాలు వరి సాగు చేస్తున్నాను. ఇటీవల వచ్చిన మోంథా తుపాను మమ్మల్ని నిలువునా ముంచింది. ముంపు మీద మూడెకరాలు పోయింది. సుడిదోమ పట్టేయడం వల్ల మరో ఎకరా నష్టపోయాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. – అల్లు దుర్గారావు, రైతు, తంపటాపల్లి, పాలకొండ మండలం. -
పింఛన్ల కోసం ఎదురుచూపు!
● 1500 మంది హెచ్ఐవీ బాధితులకు అందని పింఛన్ విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అర్హులైన వృద్ధులు, వితంతువులతో పాటు హెచ్ఐవీ బాధితులకు కూడా కొత్తగా పింఛన్లు మంజూరు కావడం లేదు. పింఛన్ కోసం దరఖాస్తు చేసి నెలలు తరబడుతున్నా మంజూరు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇంతవరకు ఒక్క హెచ్ఐవీ బాధితుడికి కూడా పింఛన్ మంజూరు కాలేదు. వారంతా పింఛన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. హెచ్ఐవీ రోగులకు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల వారు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. హెచ్ఐవీ బారిన పడినవారిలో అధికశాతం మంది పేదవారే. పౌష్టికాహారం కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత వారికి ఉండదు. పింఛన్ వస్తే ఆ డబ్బులతో పౌష్టికాహారం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. హెచ్ఐవీ రోగుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెబుతున్న కూటమి సర్కారు వారికి పింఛన్లు మాత్రం మంజూరు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 6,670 మంది బాధితులు జిల్లాలో 6,670 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. వీరిలో పురుషులు 2,755 మంది కాగా మహిళలు 3,646 మంది, పిల్లలు 269 మంది ఉన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 1500 మందికి కొత్తగా అప్పట్లో పింఛన్లు మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లాలో 1970 మంది హెచ్ఐవీ బాధితులకు పింఛన్లు అందుతున్నాయి. మిగిలిన వారిలో 1500 మంది వరకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. హెచ్ఐవీ బారిన పడి ఏఆర్టీ కేంద్రంలో ఆరు నెలల పాటు మందులు వాడిన వారు పింఛన్ కోసం దరఖాస్తు చేసేందుకు అర్హులు. ‘జామి మండలానికి చెందిన ఓ వ్యక్తికి హెచ్ఐవీ సోకింది. హెచ్ఐవీ బాధితులకు ఇచ్చే రూ.4 వేలు పింఛన్ కోసం ఏడాది కిందట దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు పింఛన్ మంజూరు కాలేదు.’ చీపురుపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి హెచ్ఐవీ బారిన పడ్డాడు. ఏడాదిన్నర కిందట హెచ్ఐవీ బాధితులకు ఇచ్చే రూ.4 వేలు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అతనికి ఇంతవరకు పింఛన్ మంజూరు కాలేదు.’ కొత్తగా మంజూరు కాలేదు హెచ్ఐవీ రోగులు 1970 మందికి ప్రస్తుతం పింఛన్లు అందతున్నాయి. కొత్తగా ఎవరికీ పింఛన్లు మంజూరుకాలేదు. – డాక్టర్ కె.రాణి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి -
ప్రాణాలు తీస్తున్న మద్యం వ్యసనం
బాడంగి: పల్లెలు, పట్టణాల్లో విచ్చలవిడిగా దొరకుతున్న మద్యానికి కొందరు బానిసలుగా మారుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మత్తులోనే జోగుతున్నారు. మద్యం కొనుగోలుకు అవసరమైన రూ.200, 300లకు కన్నవారు, బంధువులు, తోబుట్టువులతో గొడవకు దిగుతున్నారు. డబ్బులు చేతికందేవరకు వాగ్వాదం చేస్తున్నారు. మద్యం వద్దు అని చెప్పిన వారిపై విచక్షణ కోల్పోయి దాడులకు తెగబడుతున్నారు. కన్నవారి ప్రాణాలు తీస్తున్నారు. బాడంగి మండలంలో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు సొంత తండ్రులను హతమార్చిన ఘటనలు వరుసగా జరగడంతో ప్రజలు ఉలికిపాటుకు గురవుతున్నారు. మద్యం మహమ్మారి పేద, మధ్యతరగతి కుటుంబాలను పొట్టనపెట్టుకుంటోందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎక్కడికక్కడే మద్యం దొరకడంతో జీవితాలు నాశనమవుతున్నాయంటూ వాపోతున్నారు. గత నెల 9వ తేదీన మద్యం కొనుగోలుకు డబ్బులివ్వలేదన్న కోపంతో బాడంగి మండల కేంద్రంలోని సినిమా కాలనీకి చెందిన భువనగిరి లక్ష్మణరావు తన తండ్రి రాజేశ్వరరావును చెప్పులకు మేకులు చరిచే గూటంతో తల, చెవిపై మోది హత్య చేశాడు. శనివారం ఈ ఘటన మరువకముందే గొల్లాదిలో మద్యంమత్తులో మామిడి రాము అనే వ్యక్తి పక్షవాతంతో రెండేళ్లుగా మంచంపట్టిన తండ్రి మామిడి సత్యంను శనివారం కత్తితో తలనరికి హత్యచేశాడు. వరుస హత్యలతో మండల ప్రజలు బేంబేలెత్తిపోతున్నారు. కన్నకొడుకులే కసాయివారైతే ఎవరేమి చేస్తారంటూ నిట్టూరుస్తున్నారు. ఈ ఘటనలను చూసిన పోలీసులు సైతం ఏం చేస్తే ఈ హత్యలు ఆగుతాయన్న ఆలోచనలో పడ్డారు. మద్యం డబ్బుల కోసం కన్నవారితో వాగ్వాదం మత్తులో విచక్షణ కోల్పోయి ప్రాణాలు తీస్తున్న వైనం వరుస ఘటనలతో ఉలికిపాటు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలపై ఆందోళన -
తడిసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
● అరకొర బస్సులు... కిక్కిరిసిన ప్రయాణాలు ● ఏపీ రైతు సంఘం డిమాండ్ కార్తీక పుణ్యమాసంలో ఆలయాల సందర్శనకు పెద్ద సంఖ్యలో మహిళలు ప్రయాణమవుతున్నారు. ఉచిత బస్సు సదుపాయం ఉపయోగించుకునేందుకు బస్ కాంప్లెక్స్లకు చేరుతున్నారు. వీరికి సరిపడా బస్సులు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో వచ్చిన అరకొర బస్సుల్లో గమ్యస్థానాలకు చేరుకునేందుకు పోటీపడుతున్నారు. కిక్కిరిసిన ప్రయాణాలు సాగిస్తున్నారు. దీనికి ఈ చిత్రమే సజీవ సాక్ష్యం. గరుగుబిల్లి సమీపంలోని తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లేందుకు పాలకొండలో బస్సు ఎక్కేందుకు పోటీపడుతున్న మహిళలను చిత్రంలో చూడొచ్చు. – పాలకొండ రూరల్ ఆశ వర్కర్ సేవలకు అవార్డు మెంటాడ: మోంథా తుఫాన్ ప్రభావంతో వర్షాలు జోరందుకున్నవేళ.. మెంటాడ మండలం జగన్నాథపురానికి చెందిన మీసాల పార్వతి అనే గర్భిణికి పురిటినొప్పులు ఆరంభమయ్యాయి. విషయం తెలుసుకున్న ఆశ కార్యకర్త వై.బంగారమ్మ వెంటనే గర్భిణి వద్దకు చేరుకుంది. సపర్యలు చేస్తూనే ఆటోలో ఆండ్ర రిజర్వాయర్ కాలువ గట్టు గుండా ఆస్పత్రికి తరలించింది. తల్లీబిడ్డకు అండగా నిలిచింది. ఈ విషయాన్ని స్థానిక వైద్యాధికారులు ఉన్నత వైద్యాధికారులు, ప్రభుత్వానికి నివేదించడంతో సీఎం ప్రశంసించారు. అమరావతిలో శనివారం అవార్డును అందజేశారు. పార్వతీపురం రూరల్: మోంథా తుఫాన్ దెబ్బకు జిల్లాలో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బంటు దాసు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి రమణమూర్తి డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ పరిధిలోని జోగుదారు మెట్టవలస, గెంజిగెడ్డ, ములక్కాయవలస తదితర గిరిజన గ్రామాల్లో వర్షాలకు పాడైన మొక్కజొన్న పంటను శనివారం పరిశీలించారు. రైతుల చేతికొచ్చిన పంటను నాణ్యత దెబ్బతిందన్న షాకుచూపి దళారులు క్వింటాకు రూ.600 తక్కించి కొనుగోలు చేస్తున్నారని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి క్వింటాను రూ.2400కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే గిరిజన రైతులు సుమారు రూ.30 లక్షల వరకు నష్టపోతారన్నారు. పంట నష్టం సరిగా అంచనా వేయకుండా రైతులకు అన్యాయం చేస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బేతా నాగభూషణరావు, తాడంగి లక్ష్మయ్య, రాజేష్, బికూ తదితరులు పాల్గొన్నారు. -
బ్లాక్ రైస్ సాగు సందర్శన
కురుపాం: మండలంలోని ములగ గ్రామానికి చెందిన టి.రామకృష్ణ సాగుచేసిన బీపీటీ–2841 బ్లాక్రైస్ పంటను కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ ధ్రువ, వ్యవసాయ శాస్త్రవేత్తలు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ధ్రువ మాట్లాడుతూ బీపీటీ–2841 రకం బ్లాక్రైస్ను బర్మా రైసుకు దీటుగా సాగు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ రకం 135 రోజుల పంటకాలం. ఎకరాకు 2 నుంచి 2.5 టన్నుల దిగుబడి వస్తుందన్నారు. కేవీకే ద్వారా రైతులకు విత్తనాలు సరఫరా చేసినట్లు తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ స్రవంతి, డాక్టర్ అనంత విహారితో పాటు 60 మంది రైతులు పాల్గొన్నారు. టూరిజం అభివృద్ధికి చర్యలు సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు గిరిజన సంక్షేమశాఖ మంత్రి జి.సంధ్యారాణి అన్నారు. స్థానిక అడ్వంచర్ పార్కులో హాట్బెలూన్ను ఆమె శనివారం ప్రారంభించారు. బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకముందు మెట్టుగూడ జలపాతం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, కలెక్టర్ ప్రభాకరరెడ్డి, జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి, పాలకొండ సబ్కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఏపీఓ ఎస్వీ గణేష్, టీడీపీ ఇన్చార్జి పి.భూదేవి, తదితరులు పాల్గొన్నారు. రామతీర్థానికి పోటెత్తిన భక్తులు నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామివారి దర్శనానికి భక్తులు శనివారం పోటెత్తారు. కార్తీకమాసం తొలి ఏకాదశి కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ముందుగా రామకోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను విడిచిపెట్టారు. అనంతరం సీతారామస్వామికి పూజలు చేశారు. యాగశాలలో అర్చకులు విశేష హోమాలు జరిపించిన అనంతరం వెండి మండపంలో స్వామి నిత్యకల్యాణ వేడుకను కనులపండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రైవేట్ దేవాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని దేవాలయ నిర్వాహకులకు సూచించారు. జిల్లా పరిధిలో ఉన్న అన్ని ప్రైవేట్ దేవస్థానాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పండగలు, జాతర సమయంలో తగిన భద్రతా చర్యలు, బారికేడ్లు, క్యూలైన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఏ చిన్న నిర్లక్ష్యం జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలయాల వద్ద గత ఘటనలను నివేదిక రూపంలో అందజేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. -
తక్కువ ధరకే ధాన్యం విక్రయం
గ్రామాల్లో చేలు నేలవాలిపోవడం.. చాలా వరకు నీటిలో ఉండిపోవడంతో యుద్ధప్రాతిపదికన యంత్రాలు పెట్టి కోతలు పూర్తి చేసి తరలిస్తున్నారు. ధాన్యమింకా పచ్చిగానే ఉంది. దీనివల్ల అనుకున్న ధర రావడం కష్టంగా మారుతోంది. దీనికితోడు యంత్రాలకు రూ.వేలల్లో ఖర్చు చేస్తున్నారు. పాలకొండ మండలంలో ఎకరా విస్తీర్ణంలో కోతకు యంత్రానికి రూ.2,600లు రైతులు చెల్లిస్తున్నారు. ఎకరాలో చేయడానికి గంటకుపైగా సమయం పడుతోంది. ధాన్యాన్ని ట్రాక్టర్లలో పంపించి కొంత మంది ఆరబెట్టే ప్రయత్నం చేయగా.. ఇంకొందరు రైతులు నేరుగా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా దళారులు, వ్యాపారులు అప్పుడే గ్రామాల్లో ట్రాక్టర్లతో సిద్ధంగా వాలిపోతున్నారు. పంట దెబ్బతినడం.. పచ్చిగా ఉండటం వల్ల మద్దతు ధర రాదని.. లేదంటే తక్కువ ధరకు అమ్ముకోవాలని రైతులు కిలాన గోవింద, కిలాన ఈశ్వరరావు, దాసిరెడ్డి రామకృష్ణ తదితరులు వాపోతున్నారు. -
ఇట్లామామిడిపల్లిలో డయేరియా
రామభద్రపురం/బాడంగి: మండలంలోని ఇట్లామామిడిపల్లి గ్రామంలో అతిసార వ్యాధి విజృంభించింది. గ్రామానికి చెందిన రాయిపల్లి అచ్చియ్యమ్మ, లెంక అప్పలనరసమ్మ, గొర్లి మంగ, గంట అప్పలనరసమ్మలకు డయేరియా సోకి వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు బాడంగి సీహెచ్సీకి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న డీఎంహెచ్వో జీవనరాణి, ఆరికతోట పీహెచ్సీ వైద్యాధికారిణి అపర్ణ ఇట్లామామిడిపల్లి గ్రామానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి 108 అంబులెన్స్లో తరలించారు. డీఎంహెచ్వో బాడంగి సీహెచ్సీకి కూడా వెళ్లి నలుగురు డయేరియా బాధితులను పరామర్శించారు. అయితే నిన్న ముచ్చర్లవలసలో 15 మంది డయేరియా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత కోలుకుని శుక్రవారం ఇంటికి చేరుకున్నారు. అది మరువక ముందే ఇట్లామామిడిపల్లిలో పలువురికి డయేరియా సోకడంతో రామభద్రపురం మండలంలోనే ఇలా ఎందుకు జరుగుతోందని మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.ఉపాధి పనుల సామాజిక తనిఖీ సీతానగరం: స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఉపాధిహామీ పనుల నిర్వహణపై మండల స్థాయి సామాజిక తనిఖీ డ్వామా పీడీ కె రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగింది. 2024 మార్చి31వ తేదీనుంచి 2025 ఏప్రిల్1 వరకూ గ్రామాల్లో ఉపాధిహామీ పనులతో జరిగిన రోడ్ల పనులు ఉపాధి హామీ పనులకు సామాజిక తనిఖీ బృందం 2025 సెప్టెంబరులో గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. గ్రామసభల్లో ప్రజలనుంచి వచ్చి అభియోగాల మేరకు ప్రజావేదికలో చదివి వినిపించారు. రూ.31 కోట్లతో 117 పనులకు గాను నిధులు ఖర్చయినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బాబ్జీ, ఎంపీపీ బి రమణమ్మ వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బి.శ్రీరాములునాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు పి సత్యం, పలుగ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పెళ్లి పేరుతో మోసగించిన వ్యక్తిపై ఫిర్యాదుసీతంపేట: వివాహం చేసుకుంటానని చెప్పి మోసగించిన వ్యక్తిపై స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పాలకొండకు చెందిన సచివాలయ ఉద్యోగి సాగర్ తనను మోసం చేశాడని అక్కడే పనిచేస్తున్న కొత్తూరుకు చెందిన సహచర మహిళా ఉద్యోగిని ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. ఈ మేరకు పాలకొండ సీఐ ప్రసాదరావు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సఖి సురక్ష హెల్త్ స్క్రీనింగ్ ప్రారంభంసాలూరు: పట్టణంలోని దాసరివీధిలో గల సీతారామకల్యాణ మంటపంలో శుక్రవారం నిర్వహించిన సఖి సురక్ష హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని సీ్త్రశిశుసంక్షేమ,గిరిజన సంక్షేమశాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యపరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటూ కార్యక్రమం ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. రెండు బైక్లు ఢీ: వ్యక్తికి గాయాలువేపాడ: మండలంలోని వల్లంపూడి గ్రామసమీపంలో శానాపతి వారి కళ్లాల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి గాయాలపాలయ్యాడు,. గ్రామానికి చెందిన శానాపతి రమణ శుక్రవారం కళ్లానికి వెళ్తుండగా సోంపురం వైపు వెళ్తున్న బైక్, వేపాడ వైపు వస్తున్న బైక్ కళ్లాలవద్ద నడుచుకుంటూ వెళ్తున్న శానాపతి రమణను ఢీకొనడంతో తలకు గాయమైంది. దీంతో వెంటనే బాధితుడిని 108లో ఎస్.కోట తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించినట్లు బాధితుడి కుటుంబసభ్యులు తెలిపారు. -
తత్కాల్ ఫీజు రద్దు
● విద్యార్థులపై ఆర్థిక భారం తొలగింపు ● జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వీవీ సుబ్బారావు విజయనగరం రూరల్: జేఎన్టీయూ గురజాడ సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థులు వివిధ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఇప్పటివరకు వసూలు చేస్తున్న తత్కాల్ ఫీజును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని, నవంబర్ 1 నుంచి ఈ ప్రక్రియ అమల్లోకి వస్తుందని జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వీవీ సుబ్బారావు శుక్రవారం తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నుంచి తత్కాల్ రుసుము రద్దు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నేటి సాంకేతిక యుగంలో విశ్వవిద్యాలయ సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు చేరవేయడం తమ ప్రధాన లక్ష్యమని, ఈ దిశగా పలు సాంకేతిక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ‘తత్కాల్ సేవ’ కింద ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు విద్యార్థులు ఇప్పటివరకు రూ.3000 అదనపు ఫీజు చెల్లించాల్సి వచ్చేదని. ఇకపై ఎటువంటి అదనపు రుసుము లేకుండా, విద్యార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు 24 గంటల్లో ఆన్లైన్ ద్వారా పొందవచ్చన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని అనుసరించి, ఈ సేవలను అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సేవలను సమర్థవంతంగా అమలు చేయడానికి పరీక్షల మూల్యాంకన విభాగం ప్రత్యేక కృషి ప్రారంభించిందని, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ జి.జయసుమ, మూల్యాంకన విభాగ సంచాలకులు కె.బాబులు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఆర్.గురునాథ, విశ్వవిద్యాలయ సాంకేతిక కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య ఆర్.రాజేశ్వరరావు, అడిషనల్ కంట్రోలర్ డా.బి.నళిని, డా.నీలిమా దేవి, ఆర్డీడీ శివరాం, డా.ఎ.పాపారావు తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థులకు ఇకనుంచి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, అధిక సౌలభ్యంతో విశ్వవిద్యాలయ ధ్రువీకరణ పత్రాల సేవలను పొందగలరని పేర్కొన్నారు. -
ఆగని ఇసుక అక్రమ రవాణా
● కూటమి ప్రభుత్వంలో రెచ్చిపోతున్న ఇసుక దొంగలు ● గత ప్రభుత్వంలోని ఇసుక డంపింగ్ యార్డు నుంచి చోరీబొబ్బిలి: మోంథా తుఫాన్ కారణంగా ఇసుక దొరకడం లేదు. దీంతో ఇసుకాసురులు కొత్త పంథాను ఎన్నుకున్నారు. ఇసుక అక్రమ రవాణా కాకుండా గత ప్రభుత్వం ఇసుక డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసింది. వర్షాకాలంలో సైతం గృహ నిర్మాణదారులు, ప్రభుత్వ అవసరాలకు తక్కువ ధరకే ఇసుకను అందజేసింది. కూటమిప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుకంటూ ఇసుకాసురులకు గేట్లెత్తేయడంతో డంపింగ్ యార్డుల్లో ఇసుకను ఎందుకు కొనాలంటూ అక్రమార్కులు రెచ్చిపోయారు. నదులు, వాగులు, గెడ్డల్లో ఉన్న ఇసుకను నిబంధనలను పక్కనెట్టి ఇసుక తరలించుకుని కాసులు వెనకేసుకున్నారు. గత నెలలో సాక్షాత్తు ఆర్డీఓ జేవీవీఎస్ రామమోహన రావు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుని పోలీస్స్టేషన్కు తరలించి జరిమానాలు కూడా విధించారు. గ్రోత్సెంటర్ ఇసుక డంపింగ్ యార్డులో వేల టన్నుల ఇసుక ఉంది. నిర్ణీత ధర చెల్లించి పట్టుకెళ్లమని పలుమార్లు అక్రమార్కులకు చెప్పినా వినిపించుకోకుండా వేగావతి నదిలో ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్న అక్రమార్కులకు ఇప్పుడు మరో దారి దొరికినట్లుంది. మోంథా తుఫాన్ రావడంతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఇసుక కొరత ఏర్పడింది. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్న ఇసుక డంపింగ్ యార్డులో సిద్ధంగా ఉన్న వేలాది టన్నులకు పైగానే ఉన్న ఇసుకపై అక్రమార్కుల కళ్లు పడ్డాయి. అంతే ఆ ఇసుకకు ఇప్పుడు కాళ్లొచ్చాయి. ఎంచక్కా సిద్ధం చేసి ఉన్న ఇసుక ఇప్పుడు అక్రమార్కులకు వరమై నిర్ణీత ధర నిబంధనలను పక్కన పెట్టి రాత్రి వేళల్లో తరలించుకుపోతున్నారు. అక్కడున్న కార్యాలయంలో కాగితాలు, ఇతర వస్తువులను చిందర వందర చేసి ఇసుకను తరలిస్తున్నారు. ఈ విషయం తెలిసిన తహసీల్దార్ ఎం.శ్రీను కార్యాలయంలోని ఆర్ఐ రామ్కుమార్ను పరిశీలించి రమ్మని పంపితే పొక్లెయినర్తో తరలిస్తున్నట్లు ఆయన గుర్తించారు. ఇదే విషయమై తహసీల్దార్కు ఆర్ఐ సమాచారమిచ్చారు. నదిలో జల ప్రవాహంతో ప్రజలకు, ప్రభుత్వ అవసరాలకు, వ్యాపారులకు సైతం అందని ఇసుక ఇప్పుడు అక్రమార్కులకు మాత్రం ఉచితంగా అందుతోంది. విచిత్రమేమంటే పేద, మధ్యతరగతి ప్రజల గృహావసరాలకు కాకుండా పట్టణంలో నిర్మిస్తున్న బహుళ అంతస్థుల భవనాలకు, కార్పొరేట్ వాణిజ్య సముదాయాలకు మాత్రం ఇసుకను ఎంచక్కా తరలించుకుపోతున్నారు. మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుచూపుతో ఏర్పాటు చేసిన ఇసుక డంపింగ్ యార్డులను నాడు విమర్శించిన కూటమి నాయకులు ఇప్పుడు వాటిని ఇలా కార్పొరేట్ నిర్మాణాలు, ఇసుక అక్రమార్కులకు దొంగచాటు అనుమతులు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తునాయి. పోలీసులకు ఫిర్యాదు ఇసుకను దొంగతనంగా పట్టుకుపోతున్న విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని ఆర్డీఓ జేవీవీఎస్ రామమోహన రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయనను ఈ విషయమై అడుగ్గా ఎవరు ఇలా తరలించుకుపోతున్నారోనన్న విషయం గుర్తించాలని పోలీసులను కోరుతున్నట్లు చెప్పారు.


