breaking news
Parvathipuram Manyam
-
ఇంత క్రూరత్వమా?.. 82 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం
విజయనగరం టౌన్: ఎనిమిది పదులు దాటిన వయసు.. చూపు అంతంతమాత్రమే.. చెవులు కూడా వినపడే స్ధా యి లేదు.. గట్టిగా అరిచే ఓపిక లేదు.. దీనస్ధితిలో కాలయాపన చేసే ఓ పండుటాకుపై కామాంధు డు పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. దిక్కుతోచని స్థితిలో ఆమె తన ఇంటికి వెళ్లి జరిగిందంతా కుటుంబ సభ్యులతో మొరపెట్టుకోవడం, వెంట నే ఆస్పత్రికి తరలించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘోషా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలిని గురువారం పరామర్శించారు. విషయాన్ని ఎస్పీ ఎఆర్.దామోదర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ నరసింహారావు, సీఐ నరసింహమూర్తి, ఎస్ఐలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధిచి సీఐ, కాలనీవాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగరం పట్టణంలోని ఓ కాలనీలో నివసిస్తున్న 82 ఏళ్ల వృద్ధురాలు బుధవారం మధ్యాహ్నం కంటోన్మెంట్ ప్రాంతం నుంచి ఇంటికి అరుంధతీనగర్ కాలనీ మీదుగా గాజులరేగ నడక మార్గం నుంచి వెళ్తున్న సమయంలో కామాంధుడు ఆమెపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. కొంతసేపటికి తేరుకున్న ఆ వృద్ధురాలు ఇంటికి వెళ్లి జరిగిందంతా కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వెంటనే వారు స్పందించి పోలీసులకు సమాచారమిచ్చారు. వృద్ధురాలిని ఘోషా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రంగంలోకి దిగి తమదైనశైలిలో విచారణ ప్రారంభించారు. మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ స్వయంగా ఘోషా ఆస్పత్రికి సిబ్బందితో కలిసి వెళ్లి వృద్ధురాలు, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్స్కా్వడ్, క్లూస్టీమ్లను రంగంలోకి దించారు. నిందితునికోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు.చదవండి: మూడేళ్ల కొడుకుని వంతెనపై వదిలి.. నదిలో దూకిన దంపతులు! -
పశువుల వ్యాన్ల పట్టివేత
రామభద్రపురం: పశువులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో మండలంలోని కొట్టక్కి పోలీస్ చెక్పోస్టు వద్ద ఎస్ఐ జ్ఞానప్రసాద్ తన సిబ్బందితో గురువారం వాహనాలు తనిఖీ చేశారు. ఈ క్రమంలో సాలూరు నుంచి వరుసగా వచ్చిన మూడు బొలెరో వాహనాలను తనికీ చేయగా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న మూడు వ్యాన్లలో ఏడు ఆవులు, 11 గేదెలు, నాలుగు దున్నలు పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తుండడంతో మూడు వాహనాలతో పశువులను స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పశువులను గోశాలకు తరలించారు. అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత రాజాం సిటీ: అక్రమంగా తరలిస్తున్న పశువులను రాజాం పోలీసులు వేరువేరు చోట్ల జరిపిన తనిఖీల్లో గురువారం పట్టుకున్నారు. మున్సిపాల్టీ పరిధి కొత్తవలస గ్రామ జంక్షన్ వద్ద ఎస్సై మహ్మద్ సల్మాన్బేగ్ వాహన తనిఖీలు చేపడుతుండగా గుర్ల మండలం గుజ్జింగివలస గ్రామానికి చెందిన పిన్నింటి సోమినాయుడు బొలెరో వాహనంతో పశువులను తరలిస్తుండగా పట్టుకున్నారు. వాహనంలో ఆరు ఆవులు, ఒక ఎద్దు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. అలాగే తమకు అందిన సమాచారం మేరకు అక్రమంగా పశువుల తరలిస్తున్న నాలుగు బొలెరో వాహనాలను గార్రాజుచీపురుపల్లి గ్రామ జంక్షన్ వద్ద పట్టుకున్నామని ఏఎస్ఐ కేవీ రమణ తెలిపారు. ఆ వాహనాల్లో 28 ఆవులు, రెండు ఎద్దులు, ఆరు దూడలను తరలిస్తున్నట్టు గుర్తించి వాహనాలతో పాటు పశువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాటిని తరలిస్తున్న గుర్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన బూర శివ, పోలయ్యవలస గ్రామానికి చెందిన సిగుడి భార్గవ్, తెట్టంగి గ్రామానికి చెందిన కరగాన రాంబాబు, గోషాడ గ్రామానికి చెందిన మామిడి నాగరాజులపై కేసు నమోదు చేశామని ఎస్ఐ సల్మాన్ బేగ్ తెలిపారు. -
ఆదివాసీల పొట్టకొట్టొద్దు
కురుపాం: అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ నంబర్ 3ను అమలు చేస్తామని చెప్పారు... రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారంటూ చంద్రబాబు సర్కా రు తీరుపై గిరిజన సంఘాల నాయకులు మండిపడ్డారు. 1/70 రద్దుచేస్తే గిరిజన భూములకు రక్షణ ఉండదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కురుపాంలో గురువారం పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు సర్కారు తీరుకు నిరసనగా నినదించారు. గిరిజన గ్రామాలన్నింటినీ ఐదో షెడ్యూల్లో చేర్చాలని రాజ్యాంగంలో పొందుపరిచినా జాప్యం చేయడం తగదన్నారు. ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మండంగి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆదివాసి గిరిజన సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ జీఓ నంబర్ 3ను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సీఎం నారా చంద్రబాబునాయుడు, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆదివాసీలకు ఇచ్చిన హామీలు అమలుచేయాలని కోరారు. ఎన్నికల్లో మభ్యపెట్టి, ఇప్పుడు జీఓ 3వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయంటూ మంత్రి సంధ్యారాణి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ముందు జీఓ నంబర్ 3 గురించి అవగాహన లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మడంగి రమణ, జిల్లా ఉపాధ్యక్షులు కోరంగి సీతారాం, పువ్వల తిరుపతిరావు, బిడ్డిక ప్రకాశరావు, ఐద్వా నాయకులు బిడ్డిక చామంతి, గిరిజన సమాఖ్య నాయకుడు పువ్వల ప్రసాద్, గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.రంజిత్కుమార్, ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు బిడ్డక శంకరరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.నాయుడు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు కె.గౌరీశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అనీల్, కుమార్, ఆదివాసీ గిరిజన సమాఖ్య నాయకులు కొండవాడ ప్రసాద్, సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
● ఇన్పేషెంట్లను కొత్త భవనంలోకి నేటికీ మార్చని వైనం ● ఒక్క మంచంపైనే ఇద్దరేసి రోగులకు వైద్యం
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని భద్రగిరి సామాజిక ప్రభుత్వాస్పత్రి నూతన భవనం ప్రారభించి 20 రోజులు గడుస్తున్నా రోగులకు అవస్థలు తప్పడం లేదు. పాత భవనంలో చాలీచాలని బెడ్లపై రోగులను ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. పనులు పూర్తికాకుండా ఆదివాసీ దినోత్సవం రోజున గిరిజనులకు కానుక అంటూ.. కురుపాం ఎమ్మెల్యే అధ్యక్షతన జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు భవనాన్ని ప్రారంభించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. పాత ఆస్పత్రిలో రోగులకు అవసరమైన ఫ్యాన్లు లేకపోవడంతో.. ఉక్కబోత, దోమల బెడద నుంచి ఉపశమనం పొందేందుకు ఇన్పేషెంట్లు ఇళ్ల నుంచి ఫ్యాన్లు తెచ్చుకుని వినియోగించుకుంటున్నారు. అధికారులు, పాలకులు స్పందించి రోగులకు సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. -
రాష్ట్రంలో చంద్రబాబు దుష్ట పాలన
రేగిడి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దుష్ట పాలన చేస్తుందని, నిరుద్యోగులను మోసగించి, టీడీపీ కార్యకర్తలకు ఉపాధ్యాయ పోస్టులు కట్టబెడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తలే రాజేష్ అన్నారు. రేగిడిలో ఓ పైవేట్ కార్యక్రమానికి గురువారం వచ్చిన వారు స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ సంక్షేమం అటకెక్కిందని, అధికారంలోకి వచ్చిన కూటమిలో విద్యా శాఖ మంత్రి ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా తప్పుద్రోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మెగా డీఎస్సీలో కొంతమంది అనర్హులకు తప్పుడు మార్గంలో ఉద్యోగాలు ఇచ్చారని, వాటిపై సీబీఐ విచారణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడితే తప్పించుకుతిరుగుతున్నారని ఆరోపించారు. గ్రూపు 1 పరీక్షలకు సీబీఐ ఎంకై ్వరీ వేస్తారా అని నారా లోకేష్ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని, మా పార్టీ పాలనలో జరిగిన అన్ని ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు మేం ఏ ఎంకై ్వరీకై నా సిద్ధమేనని మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి ఇప్పటికే వెల్లడించారని తెలిపారు. డీఎస్సీపై సీబీఐ విచారణకు ఎందుకు లోకేష్ సిద్ధం కావడంలేదని, వెన్నుపోటు పార్టీకి సీబీఐ అనగానే వెన్నులో వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా చేసిన అక్రమాలకు బేషరతుగా సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో భవిష్యత్తులో నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వారి వెంట పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, రేగిడి మండల పార్టీ అధ్యక్షుడు వావిలపల్లి జగన్మోహనరావు తదితరులు ఉన్నారు. ఎమ్మెల్సీ విక్రాంత్ -
న్యాయవాదుల విధులు బహిష్కరణ
విజయనగరం లీగల్: న్యాయవాదుల రక్షణ చట్టం రూపొందించడంలో జాప్యాన్ని నిరసిస్తూ స్థానిక సంఘ సభ్యులు గురువారం తమ విధులను బహిష్కరించారు. కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నళితం రమేష్కుమార్ మాట్లాడుతూ ఈ నిరసన శుక్రవారం కూడా కొనసాగుతుందన్నారు. మన పొరుగు రాష్ట్రాల్లో న్యాయవాదుల రక్షణ చట్టం అమల్లో ఉందన్నారు. మన ప్రభుత్వం చట్టం రూపొందించడంలో తీవ్ర జాప్యం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బెల్లాన రవి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా నిరసన కార్యక్రమం మరింత ఉధృతం చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో న్యా యవాదులపై భౌతిక దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. తక్షణమే ఈ చట్టాన్ని రూపొందించి అమల్లోకి తీసుకు రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. బొమ్మిక సమీపంలో ఏనుగుల గుంపు భామిని: మండలంలోని బొమ్మిక సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తూ స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. పక్కుడుబద్ర మెట్టపై మకాం వేసిన నాలుగు ఏనుగుల గుంపు మెల్లగా తిరుగుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో బొమ్మిక సమీపంలో గురువారం సంచరించడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దోమతెరల పంపిణీతో సరి! శృంగవరపుకోట: బొడ్డపాడు గ్రామంలో బుధవారం నాలుగేళ్ల చిన్నారి జ్వరంతో కన్నుమూసిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా డీఎంహెచ్ఓ జీవనరాణి తమ సిబ్బందితో కలిసి రాయివానిపాలెం, గాదెల్లోవ, బొడ్డపాడు, శెనగపాడు గ్రామాల్లో పర్యటించారు. అక్కడ గ్రామ పెద్దలతో దోమతెరలు పంపిణీ చేయించారు. బొడ్డపాడు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. సంచివైద్యుల వద్దకు వెళ్లొద్దని, సిబ్బంది అందుబాటులో ఉంటారంటూ గిరిజనులకు సూచించారు. మొత్తంగా దోమతెరల పంపిణీతో మమ అనిపించారు. చిల్లంగి నెపంతో మహిళపై దాడి సంతకవిటి: మండలంలోని పుల్లిట గ్రామానికి చెందిన పిన్నింటి లక్ష్మికి చిల్లంగి ఉందని అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దాడి చేసినట్టు ఎస్ఐ ఆర్.గోపాలరావు తెలిపారు. పుల్లిట గ్రామానికి చెందిన కె.వెంకటరత్నం, పి.పావని, పి.భారతి, కె.గోవింద ఈ నెల 5న లక్ష్మి ఇంటికి వచ్చి నీకు చిల్లంగి ఉంది, నువ్వు కలలోకి వచ్చి రాత్రి కనిపిస్తున్నావు అంటూ ఇంటికి వచ్చి గొడవ చేసి తనపై దాడి చేయడంతో గ్రామ పెద్దల దృష్టిలో పెట్టినా న్యాయం జరగలేదని గురువారం లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. బస్సు ఢీకొని మహిళకు గాయాలు రాజాం సిటీ: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళకు గాయాలయ్యాయి. ఎస్ఐ మహ్మద్ సల్మాన్ బేగ్ తెలిపిన వివరాలు.. ఈ నెల 24న విశాఖపట్నంలోని కృష్ణానగర్కు చెందిన గుల్లాల రాజేశ్వరి ఆమె సోదరి బేబీరాణితో కలసి డ్వాక్రా గ్రూపుల పని నిమిత్తం ఆర్టీసీ బస్సులో రాజాం వచ్చారు. సాయంత్రం 5.30గంటల సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బయటకు వస్తున్న సమయంలో పాఠశాల బస్సు ఎక్కుతున్న కొంతమంది విద్యార్థులు ఆమెను తోసేశారు. కిందపడిపోయిన ఆమెను అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ గమనించక ఆమె కాలుపై ఎక్కించడంతో కాలు విరిగింది. వెంటనే స్థానికుల సహాయంతో రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నం తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
అరకొర బెడ్లు.. రోగులకు తప్పని వెతలు
నూతన భవనం ప్రారంభించినా ఇన్పేషెంట్లను అక్కడికి మార్చడం లేదు. పాత భవనంలోని చాలీచాలని బెడ్లపై రోగులను ఉంచి సేవలందిస్తున్నారు. ఫ్యాన్లు సరిపడా లేవు. ఇంటి నుంచి ఫ్యాన్ తెచ్చుకొని ఉపశమనం పొందుతున్నాం. – బిడ్డిక సందీప్, ఏగువాడ, పేషెంట్ సీహెచ్సీలో చిన్నచిన్న పనులు పెండింగ్లో ఉన్నాయి. అందుకే పాత ఆస్పత్రిలోనే రోగులకు సేవలందిస్తున్నాం. ప్లంబింగ్ పనులు పూర్తయితే రెండు, మూడు రోజుల్లో కొత్త భవనాలో రోగులకు సేవలందిస్తాం. – అనిల్కుమార్, భద్రగిరి సీహెచ్సీ వైద్యుడు -
వాలీబాల్ పోటీల్లో మన్యం జట్టు ఘన విజయం
తిరుపతిలో జరుగుతున్న అమరావతి చాంపియన్షిప్ పోటీల్లో మన్యం పురుషుల వాలీబాల్ జట్టు రెండోసారి విజేతగా నిలిచింది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల వాలీబాల్ ఫైనల్ పోరులో విజయనగరం జిల్లా జట్టును 2–1 సెట్ల తేడాతో(25–20, 24–26, 15–11) ఓడించిన పార్వతీపురం మన్యం జిల్లా జట్టు చాంపియన్గా నిలిచింది. రూ.లక్ష నగదు బహుమతిని దక్కించుకుంది. విజేతగా నిలిచిన క్రీడాకారులకు, కోచ్, ఇతర సిబ్బందికి మన్యం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అభినందనలు తెలియజేసింది. –సాక్షి, పార్వతీపురం మన్యం -
భద్రగిరి సీహెచ్సీలో ఇన్వెర్టర్ ఏర్పాటు
గుమ్మలక్ష్మిపురం: మండలంలోని భద్రగిరి సామాజిక ప్రభుత్వాస్పత్రికి విద్యుత్ అంతరా యం సమయంలో సేవలందించేందుకు వైద్యులు ఇబ్బంది పడుతున్నారు. బుధవారం ఓ బాలుడికి సెల్ఫోన్ లైట్ల వెలుగుతో చికిత్స అందించారు. ఇదే విషయంపై ‘సెల్పోన్ వెలుగు లో బాలుడికి వైద్యం’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్ పేజీలో ప్రచురితమైన వార్తకు డీసీహెచ్ఓ జి. నాగభూషణ్ స్పందించారు. తక్షణమే ఇన్వెర్టర్ సదుపాయం కల్పిలంచాలని అధికారులను ఆదేశించారు. పాత ఆస్పత్రిలో ఉన్న జనరేటర్ నుంచి కొత్త భవనానికి కనెక్షన్ ఇచ్చారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందిస్తామని వైద్యుడు అనిల్ తెలిపారు. పాలకొండ రూరల్: పాలకొండ గ్రామదేవత గారమ్మతల్లి విగ్రహాన్ని భానుడి లేలేత కిరణాలు గురువారం స్పర్శించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు తన్మయత్వం చెందారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జియ్యమ్మవలస రూరల్: ఫిన్లాండ్ విద్యావిధానం భేష్గా ఉందని ఎర్ర శంకరరావు తెలిపారు. ప్రభుత్వం ఇటీవల 29 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను ఫిన్లాండ్ ఎక్స్పోజర్ విజిట్కు పంపించింది. ఈ నెల 17 నుంచి 26వ వరకు ఫిన్లాండ్లో ఉన్న తుర్కుయూనివర్సిటీలో వీరంతా శిక్షణ పొందారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ ఫిన్లాండ్లో విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా విద్యార్థి కేంద్రీకృత, ఆట ఆధారిత, పరీక్షలు లేని విద్యా విధానం అమలులో ఉందని, విద్యార్థులు జాయ్ఫుల్ లెర్నింగ్ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. లైఫ్ స్కిల్స్కు, వృత్తి విద్యకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారన్నారు. -
ఏహెచ్ఏల అర్హతపై కూటమి దుష్ట కన్ను!
బొబ్బిలి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హత కలిగిన నిరుద్యోగులకు కల్పించిన ఉద్యోగాలపై కూటమి ప్రభుత్వం కన్ను వేసింది. ఈ ఉద్యోగాల్లో అనర్హులున్నారని వారి ధృవపత్రాల పరిశీలనంటూ పలుమార్లు కార్యాలయాలకు తిప్పుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సచివాలయాల్లో ఏహెచ్ఏలు(యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్లు)గా నియమించిన వారికి సంబంధించి మీ సర్టిఫికెట్లు తీసుకుని సమీప పశుసంవర్ధక కార్యాలయాలకు రావాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఒకట్రెండు సార్లు మీ సర్టిఫికెట్లు డూప్లికేటు అయ్యుండొచ్చనీ, వాటిని మీ అర్హతలను అనుసరించి ఆయా విద్యాలయాలకు పంపించి నకిలీవో లేక నిజమయినవో నిర్ధారిస్తామని చెప్పడంతో బయటకు చెప్పుకోలేక ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ ఎవరికై నా చెబితే లక్ష్యంగా చేసుకుని ఉద్యోగం నుంచి తప్పిస్తారేమోనని ఆందోళన చెందుతూ కూటమి ప్రభుత్వం పిలిచినప్పుడల్లా పశుసంవర్ధక కార్యాలయాలకు వచ్చి వెళుతున్నారు. సర్టిఫికెట్లు అందజేసి స్కాన్ చేయించి పశుసంవర్ధకాధికారులు అడిగిన మేరకు అందజేస్తున్నారు. ఇలా ఒకసారి కాదు పదే పదే రమ్మన్నప్పుడల్లా వెళ్లివస్తూనే ఉన్నారు. ఆ రెండు విద్యా సంస్థలకు సర్టిఫికెట్లు మెయిల్ యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ల సర్టిఫికెట్లను వారి అర్హతననుసరించి తనిఖీలకు పంపిస్తున్నారు. డిప్లొమో చేసిన వారి సర్టిఫికెట్లను శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతికి, వొకేషనల్ శిక్షణ పొందిన వారి సర్టిఫికెట్లను ఇంటర్మీడియెట్ బోర్డుకు పంపించి తనిఖీ చేయించనున్నారు. రాష్ట్రంలో ఓ చోట నకిలీ సర్టిఫికెట్ లభించడంతో ఈ ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలనకు సర్టిఫికెట్ల స్కానింగ్ జరుగుతోందనీ, విజయనగరం జిల్లా మాత్రమే పెండింగ్ ఉండటంతో వాటిని ఇప్పుడు పరిశీలన చేస్తున్నామని పశుసంవర్ధక శాఖాధికారులు చెబుతున్నారు. బొబ్బిలి డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారికి శ్రీకాకుళం జేడీగా నియమించడంతో అక్కడికి వెళ్లిపోయారు. అతని స్థానంలో ఏడీ డాక్టర్ విష్ణుకు ఎఫ్ఏసీ అప్పగించారు. డాక్టర్ విష్ణు కార్యాలయ పని నిమిత్తం బయటకు వెళ్లడంతో తెర్లాం ఏడీ బి.శ్రీనివాసరావు, బొబ్బిలి డీడీ ఆఫీసు సూపరింటెండెంట్ ఎస్.ధర్మాన పడాల్ సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్నారు. వీరిని వివరణ కోరగా గతంలో ఓ ఉద్యోగి సర్టిఫికేట్లు నకిలీవని తేలడంతో అతనిని తొలగించి, జీతం, ఇతర అలెవెన్సులు, శిక్షణ భృతి, ఖర్చులను రికవరీ చేశారనీ, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏహెచ్ఏల సర్టిఫికెట్లను స్కాన్చేసి ఆయా విద్యా సంస్థలకు పంపిస్తున్నట్టు వారు చెప్పారు. అయితే పారదర్శకంగా జరిగిన ఉద్యోగాల భర్తీలో ఇన్నేళ్ల తరువాత పరిశీలనేంటని వారు ఆందోళన చెందున్నారు. ఈ సర్టిఫికెట్ల పరిశీలన వెనుక ఏం కారణం ఉందో స్పష్టతనివ్వాలని ఏహెచ్ఏలు కోరుతున్నారు. దాదాపు ఏడేళ్ల తరువాత ఇప్పుడు పరిశీలనా? నియామకమై సుమారు ఏడేళ్లు ధ్రువపత్రాల పరిశీలనంటూ తిప్పుతున్న ప్రభుత్వం ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్న శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు కూటమి ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా విమర్శలువైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజుల్లోనే సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరిగింది. ఎన్నికల ప్రచారంలో సచివాలయంలో అన్ని శాఖలూ మీకు అందుబాటులో ఉండేలా నియామకాలుంటాయని చెప్పిన ప్రకారం ఎన్నికయిన తరువాత సచివాయాల్లో పశుసంవర్ధక శాఖ సిబ్బంది కూడా ఉండాలని ఏహెచ్ఏలను నియమించారు. యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్లుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 మందిని నియమించారు. వీరికి డిప్లొమో లేదా ఒకేషనల్ డెయిరీ అభ్యర్థులను అర్హులుగా నిర్ణయించి పారదర్శకంగా రాష్ట్ర వ్యాప్తంగా నియమించారు. సచివాలయాల్లో వీరందరినీ 2019–20 ప్రాంతంలో నియమించారు. అంటే దాదాపు ఏడేళ్లవుతోంది. వీరిని ప్రొబేషనరీ పీరియడ్ అయిన తరువాత శాశ్వత ఉద్యోగులుగా గుర్తించింది ప్రభుత్వం. ఇప్పుడు వీరిని పిలిపించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అంటూ తిప్పుతుండటం వారిలో అనుమానాలకు తావిస్తోంది. అంతే కాదు వారి ఉద్యోగభద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది. -
బలవంతపు వసూళ్లకు పాల్పడిన ముగ్గురి అరెస్టు
రాజాం సిటీ: ఇటీవల బెయిల్పై వచ్చిన రౌడీషీటర్ తన పంథాను మార్చుకోకుండా మరో ఇద్దరితో కలసి బలవంతపు వసూళ్లకు పాల్పడి మళ్లీ జైలు పాలయ్యాడు. ఈ ఘటన రాజాం మున్సిపాల్టీ పరిధి గోపాలపురం వెళ్లేదారిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి టౌన్ సర్కిల్ కార్యాలయంలో గురువారం టౌన్ సీఐ డి.నవీన్కుమార్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మున్సిపాల్టీ పరిధి గోపాలపురానికి చెందిన మేకల శేఖర్బాబు వ్యక్తిగత పనిపై ఈ నెల 26న రాజాం వచ్చి తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామం వెళ్తున్నాడు. వర్షం కురుస్తుండడంతో పోలిపల్లి పైడితల్లి ఆలయ వద్ద కొంత సమయం ఆగిన తరువాత 7 గంటలకు ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో మెంతిపేట ఎస్సీ కాలనీకి చెందిన సిరిపురపు దేవరాజు, మరో ఇద్దరు నిందితులు మండల పరిధి పెనుబాక గ్రామానికి చెందిన బోనెల దుర్గాప్రసాద్, బి.దిలీప్కుమార్లతో కలసి ఇంటికి బయలుదేరుతున్న శేఖర్ బాబు వద్దకు వచ్చాడు. తనకు డబ్బులు ఇవ్వాలని, ద్విచక్ర వాహనం కూడా ఇవ్వాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉండడంతో పాటు చంపేస్తామని బెదించారు. ప్రాణహాని ఉందనే భయంతో చేసేదేమీ లేక తన వద్ద ఉన్న రూ.1000లతో పాటు ద్విచక్ర వాహనాన్ని వారికి అప్పగించాడు. ఈ విషయాన్ని ఎవరికై నా చెబితే చంపేస్తానని మరోసారి బెదించడంతో అక్కడ నుంచి స్వగ్రామం వెళ్లిపోయాడు. ఈ విషయంపై బాధితుడు గురువారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ మహ్మద్ సల్మాన్ బేగ్ నిందితులను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపర్చామని సీఐ తెలిపారు. తీరు మారకపోతే పీడీ యాక్ట్ రౌడీషీటర్ల తీరుమారకపోతే పీడీ యాక్ట్ అమలు చేయనున్నామని సీఐ నవీన్కుమార్ హెచ్చరించారు. ఇదే కేసులో ఏ1 నిందితుడు అయిన సిరిపురపు దేవరాజుపై ఇప్పటికే 11 కేసులు ఉన్నాయని తెలిపారు. అలాగే గత నెల 27న ఫైర్స్టేషన్ వెనుక తోటలో మద్యం సేవిస్తున్న ఇద్దరిని బెదించిన కేసులో అరెస్టు అయి 14 రోజుల రిమాండ్ అనుభవించి ఇటీవల బెయిల్పై బయటకు వచ్చాడని చెప్పారు. అయినప్పటికీ అతని తీరులో మార్పు రాకపోగా మళ్లీ గోపాలపురంకు చెందిన శేఖర్బాబును బెదిరించాడని తెలిపారు. నెల రోజుల వ్యవధిలో రెండోసారి జరిగిందని, మరోసారి ఇలాగే జరిగితే పీడీ యాక్ట్ అమలు చేయనున్నామని తెలిపారు. -
రైల్వేస్టేషన్లో డీఆర్ఎం తనిఖీలు
పార్వతీపురం రూరల్: దక్షిణ కోస్తా రైల్వే విశాఖప ట్నం డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) లలిత్ బోహ్రా గురువారం పార్వతీపురం రైల్వే స్టేషన్లో సమగ్ర తనిఖీలు నిర్వహించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద చేపడుతున్న వివిధ మౌలిక వసతుల అభివృద్ధి పనుల పురోగతిని అన్ని శాఖల బ్రాంచ్ అధికారులతో కలిసి ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు, సుఖమయ ప్రయాణ అనుభూతి ని అందించడమే లక్ష్యంగా చేపట్టిన పలు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు, భద్రతా సూత్రాలు పాటిస్తూ, నిర్ణీత కాలవ్యవధిలోనే ప్రాజెక్టులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. స్టేషన్ పరిసరాల ప్రాంగణ వికాసం, ప్రయాణికుల రాకపోకల సులభతర ప్రాప్యత, పరిశుభ్రత నిర్వహణ, భద్రతా వసతులపై అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. ఆధునిక సాంకేతిక సదుపాయాలు, మెరుగైన ప్రయాణ వసతులతో పార్వతీపురం రైల్వే స్టేషన్్ను ఆధునిక ఆదర్శ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు విశాఖ డివిజన్ కట్టుబడి ఉందని డీఆర్ఎం వెల్లడించారు. -
ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన
పాచిపెంట: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోషకాహార రంగంలో సాంకేతిక సహకారం అందిస్తున్న ప్రపంచ బ్యాంకు బృందం గురువారం పాచిపెంట మండలంలో పర్యటించింది. కోస్టువలస, పిండ్రంగివలస అంగన్వాడీ కేంద్రాలు, పాచిపెంట పీహెచ్సీ, కేజీబీవీ పాఠశాలను సందర్శించి క్షేత్ర స్థాయిలో పోషకాహార, ఆరోగ్య, సంక్షేమ సేవల అమలును పరిశీలించింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులతో ఈ బృందం మాట్లాడి వారికి అందుతున్న పోషకాహారం, వైద్య సేవల వివరాలను తెలుసుకుంది. అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, సీడీపీఓ, వైద్యాధికారులతో సమావేశమై సేవల అమలు తీరు, ఎదురవుతున్న సమస్యలు, శాఖల మధ్య సమన్వయంపై చర్చించింది.. అనంతరం కేజీబీవీలో కిశోర బాలికలతో మాట్లాడి వారి ఆరోగ్యం, పోషకాహార పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ బ్యాంకు బందం సభ్యులతో పాటు ఐసీడీఎస్ పీడీ కె.సుబ్రహ్మణ్యం, వైద్య ఆరోగ్య శాఖ సాలూరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి కె.శివకుమార్, సీడీపీఓ బొత్స అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
టెట్ స్పెషల్ నోటిఫికేషన్లో మార్పులు చేయాలి
● కలెక్టరేట్ ఎదుట ఎస్టీయూ నిరసన విజయనగరం అర్బన్ : టెట్ స్పెషల్ నోటిఫికేషన్లో ఉపాధ్యాయుల సమస్యలకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్టీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇన్చార్జ్ డీఆర్ఓ ఎం.అరుణకుమారికి ఉపాధ్యాయులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్పెషల్ టెట్ను ఆన్లైన్కు బదులుగా ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు బోధించే సంబంధిత సబ్జెక్టుకు మాత్రమే సిలబస్ను పరిమితం చేయాలన్నారు. అభ్యర్థులందరికీ సమానమైన అర్హత మార్కులను నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్, అధ్యక్షుడు వై.అప్పారావు, రాష్ట్ర నాయకులు వి.గోవిందరావు, ఆర్థిక కార్యదర్శి ఎస్ఎస్.దొర, పి.రమేష్, సీహెచ్ మురళి, ఇ.సంతోష్ కుమార్, వి.మల్లేశ్వరరావు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఆగస్టు శ్రీ 2026
●సాలూరుకు చెందిన రమాదేవి శ్రావణ మాసం పూజలు నేపథ్యంలో ఏటా ఓ 50 మందికి భోజనాలు పెట్టడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. గత ఏడాది ఖర్చు చేసిన బడ్జెట్తో పోల్చుకుంటే.. ఈ సారి అదనంగా రూ.8 వేల వరకూ అవుతోంది. దీంతో పదార్థాలు తగ్గించుకోవడంతో పాటు.. భోజనాల సంఖ్యను కూడా కుదించుకోవాల్సి వచ్చిందని ఆమె చెబుతున్నారు. ●పార్వతీపురానికి చెందిన ప్రసాద్ ప్రైవేట్ ఉద్యోగి. నలుగురు కుటుంబ సభ్యులున్న ఆయన ఇంటికి.. నిత్యావసర సరకుల కోసం నెలవారీ వ్యయం గతంలో రూ.5,500 నుంచి రూ.6 వేలు అయ్యేది. ఇది కాక, కూరగాయలు వంటివి అదనం. రెండు నెలలుగా కేవలం కిరాణా సామగ్రి కోసమే అదనంగా మరో రూ.2 వేల వరకూ పెరిగింది. కూరగాయలు కలుపుకొని వెళ్తే.. అదనంగా మరో రూ.వెయ్యి పెరిగింది. నెలవారీ నిత్యావసరాల ఖర్చులే రూ.8,500 నుంచి రూ.9 వేలు అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సాక్షి, పార్వతీపురం మన్యం: నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. ఎల్నినోతో వర్షాభావం.. సాకుగా చూపుతూ ధరలను పెంచేస్తున్నారు. దీనివల్ల మధ్య తరగతి ప్రజల వంటింట్లో సెగలు పుడుతున్నాయి. జూన్ నుంచి మొదలైన ధరల మంట.. ఆగస్టు నెలలో మరింత మండుతోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల వివిధ పంటల ఉత్పత్తులు తగ్గిపోయాయి. సరఫరా పడిపోయింది. మరోవైపు ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు అధికమై.. మధ్యతరగతి, పేద కుటుంబాలకు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పాలు పాకెట్ చిన్నది రూ.13 నుంచి రూ.15 అయింది. బియ్యం మీద బస్తాకు రూ.200 పెరిగింది.. ఆయిల్ లీటరుపై రూ.20 వరకూ పెరిగి రూ.180 అయ్యింది. పప్పులపై రూ.250 నుంచి రూ.350 వరకు అదనపు భారం పడుతోంది. పంచదార ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ చక్కెర దాదాపు రూ.65–70కి చేరింది. కిలో ఉల్లి ధర రూ.60–65కు చేరింది. కూరగాయలు, ఇతర నిత్యావసర సరకులన్నీ కలుపుకొంటే నెలవారీ బడ్జెట్ మీద రూ.3 వేల వరకు అదనపు వడ్డన పడుతోందని మధ్య తరగతి గృహిణి మహాలక్ష్మి చెబుతున్నారు. గ్యాస్, పెట్రోలు కలిపి లెక్కిస్తే మరో రూ.వెయ్యి వరకూ అదనంగా బడ్జెట్ లెక్క వేసుకుంటున్నామని అంటున్నారు. ప్రాంతాన్నిబట్టి ఒక్కో నిత్యావసర వస్తువు ధర కేజీకి రూ.10 నుంచి రూ.60 వరకు పెరిగిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. తీవ్రమైన వాతావరణ మార్పులు, వర్షాభావం వల్ల వరి, వ్యవసాయ దిగుబడులు భారీగా పడిపోవడం, ద్రవ్యోల్బణం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాబోయే పండగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని నిల్వ చేయడం, డిమాండ్ కు తగినట్లు సరఫరా లేకపోవడం, రవాణా వ్యయం పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లలో ధరల వ్యత్యాసాలు ప్రధాన కారణం అవుతున్నాయి. విపరీతమైన ధరల పెరుగుదల వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. ధరలను అదుపులోకి తెచ్చి సామాన్యులను ఆదుకోవాలని ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయి. నిత్యావసర సరకుల ధరలను అదుపు చేసేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ధరల నియంత్రణ కమిటీ సమావేశమవ్వాలి. ధరలపై ఎప్పటికప్పుడు సమీక్షించి కృత్రిమ కొరతను నిలువరించాలి. సామాన్యులకు ధరలు అందుబాటులో ఉండేలా చేయాల్సి ఉండగా.. జిల్లాలో ఆ కమిటీ జాడ ఎక్కడా కానరావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం సామాన్యుల కష్టాలను పట్టించుకోవడమే మానేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
యువత ఆదర్శవంతంగా ఉండాలి : ఎస్పీ
డెంకాడ: యువత సమాజానికి ఆదర్శంగా, చైతన్యాన్ని కలిగి ఉండాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. డెంకాడ పోలీస్స్టేషన్ ఆవరణంలో యువత స్ఫూర్తి సమ్మేళనం పేరిట వివిధ అంశాలపై అవగాహన సమావేశాన్ని గురువారం నిర్వహించారు. దీనిలో ఎస్పీ మాట్లాడుతూ యువత మంచిని ప్రజలకు చెప్పి చైతన్యవంతులను చేయాలన్నారు. తమ పిల్లలు ఉన్నతంగా ఉండాలని పిల్లల తల్లిదండ్రులు ఎన్నో కష్టాలకు, ఇబ్బందులకు ఓర్చి చదివిస్తున్న విషయం విద్యార్థులు మరవరాదన్నారు. కొన్ని నేరాల్లో యువకులు ఎక్కువగా ఉండటం చాలా బాధాకరమన్నారు. గంజాయి అమ్మినా, కొన్నా, సేవించినా, రవాణా చేసినా చట్టపరంగా కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొన్ని నేరాల్లో మరణ శిక్ష కూడా పడుతుందన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా హెల్మట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు తప్పదని చెప్పారు. బాలికలపై, మహిళలపై నేరాలకు పాల్పడితే పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నాయని చెప్పారు. బెట్టింగ్లతో కొందరు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని వివరించారు. ఆన్లైన్ కాల్స్ ట్రాప్లో పడవద్దని సూచించారు. విద్యార్థులు నేరాలకు పాల్పడి ఒక్కసారి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా రాకుండా పోతాయన్నారు. యువత సమాజంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. గంజాయికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎస్.రాఘవులు, సీఐ ఎన్.శ్రీనివాసరావు, ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, యువత పాల్గొన్నారు. -
అగ్రిగోల్డ్ డబ్బులు వెంటనే చెల్లించాలి
● కాలయాపన చేస్తే భారీ ఉద్యమం తప్పదు విజయనగరం గంటస్తంభం: అగ్రిగోల్డ్ బాధితుల సహనాన్ని ప్రభుత్వం పరీక్షించొద్దని, డిపాజిటర్ల సొమ్మును పూర్తిగా చెల్లించే వరకు పోరాటం ఆపేది లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. విజయనగరంలోని డీఎన్ఆర్ అమర్ భవన్లో గురువారం జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 ఏళ్లుగా బాధితులు న్యాయం కోసం పోరాడుతున్నా ప్రభుత్వాలు కాలయాపన చేయడం దారుణమన్నారు. ఉద్యమాల ఫలితంగా ఇప్పటివరకు సుమారు రూ.900 కోట్లు బాధితులకు చెల్లించేలా సాధించామని, ఇంకా వేలాది కుటుంబాలకు సొమ్ము అందాల్సి ఉందన్నారు. మాటలు, హామీలతో కాలం గడపకుండా బాధితుల సొమ్మును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే బాధితులు, ఏజెంట్లను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మన డబ్బు..మన హక్కు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
ధరల మంట..!
వంట నిర్వాహకులకు వీరఘట్టం: పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో వంట నిర్వాహకులకు తంటాలు తప్పడం లేదు. ప్రభు త్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం, ఇచ్చిన నిధులు చాలకపోవడంతో విద్యార్థులకు భోజనం వండిపెట్టేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక విద్యార్థికి అన్నం, పప్పు, గుడ్డు, రసంతో భోజనం పెట్టేందుకు వంట నిర్వా హకులకు ప్రభుత్వం బియ్యం, గుడ్లుతో పాటు 1 నుంచి 5వ తరగతి వరకు ఒకరికి రూ.6.19లు, 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదుతున్నవారికి రూ.9.29లను మెస్ చార్జీలుగా ఇస్తోంది. గతేడాది ఫిబ్రవరి నుంచి అవే మెస్ చార్జీలు చెల్లిస్తోంది. అయితే, ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. ఉల్లిపాయలు కిలో రూ.60, నూనెలు, పప్పులు, పోపు సామగ్రి, వంట గ్యాస్ ఇలా అన్నింటి ధరలు గత మూడు నెలల నుంచి మూడు రెట్లు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అరకొరగా ఇస్తున్న మెస్ చార్జీలు చాలక పాఠశాలల్లో మధ్యాహ్నం వంటలు చేయాలంటే తిరిగి చేతిచమురు వదులుతోందని వంట ఏజెన్సీ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి... జిల్లాలో 1604 ప్రభుత్వ పాఠశాలలు, 14 ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఈ ఏడాది సుమారుగా 1.15 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ప్రతిరోజు 1604 మంది వంట ఏజెన్సీ మహిళలు వంటలు చేస్తున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు వంటలు చేసేందుకు నూనె, పప్పులు, ఉప్పు, కారం, మసాలా దినుసులు, వంట గ్యాస్, వంట చెరకు కొనుగోలు చేసేందుకు గ్రూపులో ఉన్న సభ్యులందరూ తలా కొంత వేసుకుంటారు. ప్రస్తుతం ఒక్కసారిగా నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. మెస్ చార్జీలు పెంచకపోతే ప్రస్తుతం ఉన్న ధరలతో మధ్యాహ్న భోజనం వండలేమని చెబుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా భోజనం చార్జీలు పెంచాలని కోరుతున్నారు. రెండు నెలలుగా అందని బిల్లులు... ప్రభుత్వ పాఠశాలల్లో వంటలు చేస్తున్న వంట మహిళలకు ఒక్కొక్కరికీ నెలకు రూ.3000 వేతనం ఇస్తోంది.వీటితో పాటు మెస్ చార్జీలు కూడా ఇస్తోంది.అయితే గత రెండు నెలలుగా వంట బిల్లులు,గౌరవ వేతనాలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వంటలు చేస్తున్న సామాన్య,మద్య తరగతి కుటుంబాలకు చెందిన వంట ఏజెన్సీ మహిళలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గత రెండు నెలలకు సంబందించి ఉన్న బకాయిలు సుమారు రూ.3.08 కోట్లు ఉంటాయని,వాటిని వెంటనే విడుదల చేయాలని వంట ఏజెన్సీ మహిళలు కోరుతున్నారు. బడిలో వంటలు చేసేందుకు కావాల్సిన పప్పులు, నూనె, కట్టెలు కొనుగోలుకు అప్పు చేస్తున్నాం. ఉల్లిపాయలు కిలో రూ.60 లు ఉంది. ఇక నూనె లీటరు రూ.175లు పలుకుతోంది. ఈ ధరలతో సరుకులు కొనుగోలు చేసి వంటలు చేస్తున్నాం. ప్రభుత్వం ఇస్తున్న అరకొర మెస్ చార్జీలు చాలడం లేదు. మెస్ చార్జీలు పెంచాలి. – వై.సావిత్రి,వంట ఏజెన్సీ మహిళ, వీరఘట్టం ఈ సంవత్సరం జూన్ నుంచి బడిలో వంటలు చేస్తు న్నాం. ప్రస్తుతం ఇస్తున్న మెస్ చార్జీలు చాలడం లేదు. గత రెండు నెలలుగా మెస్చార్జీలు ఇంకా ఇవ్వలేదు. చేతిలో చిల్లిగవ్వలేక అప్పుచేసి భోజనం వండుతున్నాం. – దూడి పార్వతి, వంట ఏజెన్సీ మహిళ, వీరఘట్టం -
తోటపల్లి నీటి ప్రవాహం
గరుగుబిల్లి: ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో తోటపల్లి ప్రాజెక్టుకు నీటితాకిడి పెరిగింది. బుధవారం సాయంత్రం బ్యారేజీ వద్ద నీటి మట్టం 105 మీటర్లకు 104.05 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.932 టీఎంసీల నీటినిల్వ ఉంది. బ్యారేజీకి సగటున 8,191 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఈ మేరకు మూడుగేట్లను ఎత్తి సగటున 10,008 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నా రు. పాత కుడికాలువ ద్వారా 106 క్యూసెక్కు లు, పాత ఎడమ కాలువ ద్వారా 414 క్యూసె క్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితిని ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో అంగన్వాడీ పోస్టుల నియామకాలకు మరోసారి బ్రేక్ పడింది. పోస్టులకు ఎంపికై నట్లు పలువురు అభ్యర్థులకు ఐసీడీఎస్ అధికారులు ఫోన్చేసి చెప్పారు. గురువారం నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఈలోగానే పలువురు ఎమ్మెల్యేల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో ఆ ప్రక్రియ వాయిదా పడింది. జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 263 కార్యకర్తలు, సహాయకుల పోస్టుల భర్తీకి గత ఏప్రిల్ 23న ఐసీడీఎస్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. ప్రాజెక్టుల వారీగా మే నెలలో అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. తాము చెప్పిన వారికే పోస్టులు ఇవ్వాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో.. నెలలు గడిచినా నియామకాలు పూర్తి కాలేలేదు. చాలామందికి కనీస అర్హతలు లేకపోవడంతో కలెక్టర్ ప్రభాకరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తాజాగా సహాయకుల పోస్టులకు సంబంధించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, ఈ నెల 27న మంత్రి సంధ్యారాణి చేతుల మీదుగా ఎంపికై న వారికి నియామక పత్రాలు అందజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా అభ్యర్థులకు ప్రాజెక్టుల వారీ ఫోన్ల ద్వారా ఐసీడీఎస్ అధికారులు సమాచారం అందించారు. కొన్నిచోట్ల తాము సూచించిన వారికి పోస్టులు రాకపోవడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయా ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. గరుగుబిల్లి మండలంలో ఇదే తరహాలో వివాదం జరిగినట్లు సమాచారం. తాము సూచించిన అభ్యర్థులకు కాక.. వేరే ఎవరికో పోస్టులు ఎలా ఇస్తారంటూ ఎమ్మెల్యేల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో.. గురువారం జరగాల్సిన నియామక పత్రాల పంపిణీ ప్రక్రియ వాయిదా వేశారు. దీంతో ఎంపికై న అభ్యర్థులు ఉసూరుమన్నారు. -
డోలీ మోతలూ చూసొద్దాం!
మన్యం అందాలే కాదు.. ● రోగికి డోలీ.. మన్యానికి ఇదే దారి ● అత్యవసరమైతే నాలుగు భుజాలే అంబులెన్స్ ● కొండలు, గుట్టలు, రాళ్ల బాటల్లో ప్రాణాలతో పోరాటం సాక్షి, పార్వతీపురం మన్యం: అత్యవసర సమయంలో అంబులెన్స్ రావాలి ... క్షణాల్లో రోగిని ఆస్పత్రికి తరలించాలి. పార్వతీపురం మన్యం జిల్లా మారుమూల గిరిజన గ్రామా ల్లో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. రోడ్డు సౌకర్యం లేని చోట అనారోగ్యం పాలైన వ్యక్తికి అంబులెన్స్ అందని ద్రాక్షగానే మారుతోంది. చివరకు నాలుగు కర్రలు, ఒక మంచం లేదా వస్త్రంతో కట్టిన డోలీయే ప్రాణాలను కాపాడే వాహనంగా మారుతోంది. రోగిని భుజాలపై మోసుకుంటూ కొండలు, గుట్టలు, రాళ్లు రప్పలు దాటి రోడ్డు ఉన్న ప్రాంతానికి తీసుకురావాల్సిన దయనీయ పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. అనారోగ్యం పాలైతే డోలీ... ప్రమాదం జరిగితే డోలీ... ప్రసవ వేదనలు వచ్చినా డోలీ... ఒక్కోసారి మరణించిన వారి మృతదేహాలను కూడా ఇదే డోలీలో మోసుకెళ్లాల్సి వస్తోందన్న వాస్తవం గిరిజన ప్రాంతాల దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది. గిరిజన ప్రాంతాల్లో చాలా గ్రామాలు కొండలు, అడవులు, లోయల మధ్య విస్తరించి ఉన్నాయి. ప్రధాన రహదారికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటి కీ, ఆ గ్రామాలకు చేరేందుకు సరైన రోడ్డు ఉండదు. దీంతో 108 వంటి అత్యవసర వైద్య వాహనాలు గ్రామం వరకు వెళ్లలేని పరిస్థితి. రోగిని ముందుగా డోలీలో రోడ్డు వరకు తీసుకురావాలి. అక్కడి నుంచి అంబులెన్స్ లేదా ఇతర వాహనంలో ఆస్పత్రికి తరలించాలి. ఈలోగా విలువైన సమయం గడిచిపోతోంది. గుండెపోటు, పాము కాటు, ప్రమాదాలు, తీవ్ర జ్వరాలు, ప్రసవ సంబంధ అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆలస్యం ప్రాణాంతకంగా మారే ప్రమా దం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జారుడు బాటలు, రాళ్లు రప్పలు, ఎత్తుపల్లాలు, వర్షాకాలంలో బురద మార్గాలు... ఇలా ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ రోగిని జాగ్రత్తగా తీసుకెళ్లాలి. ఒక్కసారి డోలీ అదుపు తప్పినా పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ప్రకటనలకే పరిమితం అవుతున్న రహదారులు జిల్లాలో గిరిజన జనాభా అధికంగా ఉండే కొమరా డ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట, సాలూరు, సీతంపేట తదితర ప్రాంతాల్లో మారుమూల ఆవాసాలున్నాయి. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు అరికట్టేందుకు 225 రహదారుల నిర్మాణానికి రూ.88 కోట్లు మంజూరు చేసినట్లు చాలా రోజుల కిందట కలెక్టర్ ప్రకటించారు. రానున్న మూడేళ్లలో 320 అనుసంధాన రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయని, ఇందులో భాగంగానే 575 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి 610 కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించామని ఇటీవల మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఇవన్నీ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. కేవలం రహదారులే కాక.. మారుమూల గ్రామాల్లో ప్రాథమిక వైద్య సేవలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైన చోట మొబైల్ మెడికల్ యూనిట్లు, అత్యవసర రవాణా వ్యవస్థ, గ్రామస్థాయి ఆరోగ్య సిబ్బంది అందుబాటు పెంచాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. సాలూరు మండలంలో ప్రయోగాత్మకంగా కంటైనర్ ఆసుపత్రి సేవలు ప్రారంభించినా.. అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో అందాలు, జలపాతాలు అంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వ యంత్రాంగం.. ఇక్కడి డోలీ మోతలను కూడా సందర్శకులకు చూపించాలని గిరిజన సంఘాల నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. -
టీడీపీ నేత భూకబ్జాపై ఎస్సీ కమిషన్ విచారణ
సాక్షి, పార్వతీపురం మన్యం: సాలూరు మండలం దత్తివలసలో టీడీపీ మహిళా నేత భూకబ్జాకు ప్రయ త్నిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు ఎస్సీ కమిషన్ విచారణ చేపట్టింది. దత్తివలస గ్రామంలోని సర్వే నంబర్ 143–4లో మంత్రి ప్రధాన అనుచరులుగా చెప్పుకుంటున్న ఓ టీడీపీ మహిళా నేత కబ్జాకు పాల్పడుతున్నట్లు బాధితులు ఎప్పటి నుంచో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తహసీల్దార్కు, కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో సామలపల్లి మోహన్రావు అనే వ్యక్తి ఎస్సీ కమిషన్ను ఆశ్రయించాడు. బారిక మాన్యం కింద ఆ భూమి తమకు వచ్చిందని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఫిర్యా దు లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జహవర్ ఆదేశాల మేరకు కమిషన్ సభ్యులు రావాడ సీతా రాం బుధవారం సాలూరు మండలం దత్తివలస గ్రామానికి చేరుకున్నారు. వివాద భూమిపై క్షేత్రస్థా యి పరిశీలన చేపట్టారు. సంబంధిత స్థలాన్ని ప్రత్యక్షంగా చూసి, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను పూర్తిగా పరిశీలించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా, వారి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి కృషి చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. -
మహిళ అనుమానాస్పద మృతి
తెర్లాం: అనుమానాస్పద స్థితిలో ఓ అవివాహిత మహిళ మృతి చెందిన సంఘటన తెర్లాం మండలం పెరుమాళి గ్రామంలోని ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్సై బి.సాగర్బాబు బుధవారం తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. పెరుమాళి గ్రామానికి చెందిన బాణాల హేమలత (52) అనుమానాస్పద స్థితిలో ఇంట్లోనే మంచంపై మృతి చెందింది. మృతురాలు హేమలత తన అక్క ఝాన్సీతో కలిసి ఒకే ఇంట్లో నివాసముంటోంది. అక్క ఝాన్సీ మూగ, చెవిటి, మతిస్థిమితం లేని మహిళ. హేమలత ఇంట్లో నుంచి బుధవారం ఉదయం దుర్వాసన రావడంతో ఆమె వదిన ప్రభావతి స్థానికులకు, పోలీసులకు విషయం తెలియజేసింది. దీంతో ఎస్సై సాగర్బాబు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. హేమలత రెండు, మూడు రోజుల కిందటే మృతి చెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో మృతి చెందిందా..? ఆత్మహత్య చేసుకుందా..? లేదా ఇంకేమైనా కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. హేమలత, ఝాన్సీలిద్దరూ అవివాహితులే. పోస్టుమార్టం నివేదిక వస్తే ఆమె ఏవిధంగా మృతి చెందిందో తెలుస్తుందని పో లీసులు చెబుతున్నారు. శవపంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి తరలించారు. మృతురాలి వదిన ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సాగర్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు, మూడు రోజుల కిందటే మృతి చెందినట్లు అనుమానం మతిస్థిమితం లేని అక్కతో కలిసి ఉంటున్న మృతురాలు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల ఫిర్యాదు -
పెళ్లికి వెళ్తుండగా విషాదం
ఆనందపురం/డెంకాడ: సింహాచలంలో జరిగే స్నేహితుడి పెళ్లి వేడుకలో పాల్గొనాలని ఉదయాన్నే సంతోషంగా బయలుదేరారు. పెళ్లి సందడి చూసి, ఆనందంగా తిరిగి రావాలని అనుకున్నారు. కానీ కొన్ని క్షణాల్లోనే ఆ ప్రయాణం విషాదంగా మారింది. కారు లారీని ఢీకొనడంతో సంతోషంగా సాగాల్సిన ప్రయాణం ఓ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం బొడ్డవలస గ్రామానికి చెందిన కోన రవికిశోర్ (37) సీఆర్పీఎఫ్ జవాన్. బంధువులతో కలిసి సింహాచలంలో జరిగే స్నేహితుడు శంకర్ వివాహ వేడుకకు కారులో బయలుదేరారు. గురువారం ఉదయం ఆనందపురం నుంచి పెందుర్తి వైపు వెళ్తుండగా గంభీరం పంచాయతీ పరిధిలోని దుక్కవానిపాలెం టోల్గేట్ సమీపంలో కారు అదుపుతప్పింది. డివైడర్పైకి ఎక్కిన కారు, అవతలి వైపు నుంచి వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవింగ్ చేస్తున్న రవికిశోర్కు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న రౌతు వరహాలమ్మ, కోన వరహాలమ్మ, రౌతు దుర్గ , కురుముంజి వరలక్ష్మి, బంటుపల్లి లక్ష్మి గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రవికిశోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● తల్లి కళ్లెదుటే... జమ్ముకశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న కోన రవికిశోర్ బుధవారం సింహాచలంలో జరిగే స్నేహితుడి పెళ్లికోసం స్వగ్రామమైన బొడ్డవలసకు మంగళవారం వచ్చాడు. బొడ్డవలసకు చెందిన శంకర్ పెళ్లికోసం పేరంటాళ్లను తీసుకుని బుధవారం ఉదయం కారులో బయలుదేరి సింహాచలం వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. కారులో తల్లి కోన వరహాలు కూడా ఉంది. తల్లి కళ్లెదుటే కొడుకు ప్రాణాలు విడవడంతో కన్నీటిపర్యంతమైంది. వరహాలకు కూడా స్పల్పగాయాలయ్యాయి. విశాఖపట్నం జిల్లా దుక్కవానిపాలెంలో అదుపు తప్పి లారీని ఢీకొట్టిన కారు డ్రైవింగ్ చేస్తున్న రవికిశోర్ మృతి.. మరో ఐదుగురికి గాయాలు విషాదంలో బొడ్డవలస గ్రామస్తులు -
జ్వరంతో చిన్నారి మృతి
● గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించిన డీఎంహెచ్ఓ శృంగవరపుకోట: గిరిసీమల్లో మరో చిన్నారి ప్రాణం బలైపోయింది. బొడ్డవర పంచాయతీ బొడ్డపాడు గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి దుంబర అనితారాణి జ్వరంతో బుధవారం కన్నుమూసింది. బాలిక తల్లిదండ్రులు శ్రీను, సన్యాసమ్మలు మాట్లాడుతూ.. నాలుగు రోజుల కిందట జ్వరం వస్తే బొడ్డవరకు చెందిన ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లామన్నారు. ఆయన రక్తపరీక్షలు చేయించమని చెప్పి, కొన్ని మందులు ఇచ్చారని, ఆ మందులు వాడినా ఫలితం లేకపోయిందని కన్నీరుమున్నీరయ్యారు. గ్రామానికి చెందిన గిరిజన యువత, గిరిజన సంఘ ప్రతినిధులు మాత్రం వైద్యారోగ్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో గిరిజన చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యారోగ్యశాఖ నియంత్రణ లేకపోవడం వల్ల సంచి వైద్యులు వచ్చీరాని వైద్యంతో ప్రాణాలు తీస్తున్నారని వాపోయారు. చిన్నారి మృతి విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ జీవనరాణి బొడ్డవర చేరుకుని పీహెచ్సీ వైద్యులు హారిక, సోహైల్తో మాట్లాడి వివరాలు సేకరించారు. గ్రామాల్లో అనుమతుల్లేని రక్తపరీక్ష కేంద్రాలు, అర్హత లేని ఆర్ఎంపీలు పుట్టుకొస్తున్నారని, గిరిజనం వారినే నమ్ముతున్నారని వైద్యులు తెలిపారు. దీంతో డీఎంహెచ్ఓ స్పందిస్తూ అటువంటి కేంద్రాలు, వైద్యుల వివరాలు సేకరించి పంపించాలని ఆదేశించారు. చిన్నారి మృతిపై ఎమ్మెల్సీ రఘురాజు సంతాపం వ్యక్తం చేశారు. ఎంపీపీ సోమేశ్వరరావు, తదితరులు గ్రామానికి చేరుకుని బాధత కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
టెట్ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలి
విజయనగరం అర్బన్: ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ నెల 24న ఇన్ సర్వీస్ టీచర్లకు ఇచ్చిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్ సాధారణ డీఎస్సీ అభ్యర్థుల మాదిరిగానే ఉందని, దీనిపై ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. వెంటనే ఈ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలోనే ఏపీలోనూ ఇన్ సర్వీస్ టీచర్లకు ఇచ్చిన స్పెషల్ టెట్ రద్దు చేస్తూ, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. ఒకవేళ నిర్వహించాల్సి వస్తే ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్ట్పై మాత్రమే టెట్ నిర్వహించాలని స్పష్టం చేశారు. కులాలతో సంబంధం లేకుండా టెట్ పాస్ మార్కులు 40గా నిర్ణయించాలని, అలాగే పరీక్షలను కూడా ఆఫ్లైన్లో చేపట్టాలని కోరారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్వీ పైడిరాజు, ప్రధాన కార్యదర్శి గంట సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎ.సదాశివరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డి.ఈశ్వరరావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆర్. కృష్ణ, పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మజ్జి శేషగిరిరావు, పి.కూర్మినాయుడు, జిల్లా గౌరవ సలహాదారులు ఎం.బలరాంనాయుడు, ఎన్.శ్రీదేవి, రాష్ట్రకార్యవర్గ సభ్యులు డి.వెంకట్నాయుడు, వై.మధుసూదనరావులతో పాటు జిల్లా, మండల స్థాయి నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ నాయకులు -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
● ఆర్థిక లావాదేవీల కారణంగానే రామారావు హత్య ● సీఐ శ్రీనివాసరావు నెల్లిమర్ల: మండలంలోని వల్లూరులో కలకలం రేపిన హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాల కారణంగా జరిగిన ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులను నెల్లిమర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసు వివరాలను భోగాపురం సీఐ ఎన్. శ్రీనివాసరావు నెల్లిమర్ల పోలీస్స్టేషన్లో బుధవారం వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 24వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామానికి చెందిన సిరిగుడి రామారావు తన అన్న సిరిగుడి అప్పలనారాయణను బాకీ ఉన్న ట్రాక్టర్ అద్దె ఆరు వేల రూపాయల విషయమై ప్రశ్నించాడు. ఈక్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఇంతలో అక్కడే ఉన్న అప్పలనారాయణ కుమారుడు శ్రీను కలగజేసుకుని చిన్నాన్న రామారావు తలపై కర్రతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు సిరిగుడి పవన్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేయగా.. భోగాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ నిమ్మకాయల శ్రీనివాసరావు కేసు విచారణ బాధ్యతలను చేపట్టారు. ఇదిలా ఉంటే పెదతరిమి జంక్షన్ వద్ద నిందితులు సిరిగుడి అప్పలనారాయణ, అతని కుమారుడు శ్రీనులను బుధవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 48 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్న సీఐ ఎన్.శ్రీనివాసరావు, ఎస్సై జి. గోపాలరావు, సిబ్బందిని అభినందించారు. -
మృతదేహం లభ్యమైన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, తదితరులు
● జిల్లా వ్యవసాయాధికారి వి. తారక రామారావు విజయనగరం ఫోర్ట్: జిల్లాపై ఎల్నినో ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందని జిల్లా వ్యవసాయాధికారి వి. తారకరామారావు అన్నారు. బుధవారం స్థానిక జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం వల్ల చాలా తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. సాధారణంగా ఆగస్టు నెలఖారు నాటికి వర్షాలు అధికంగా కురిసి చెరువులు పూర్తి స్థాయిలో నిండిపోయేవన్నారు. కాని ఈ ఏడాది వర్షాలు అశించిన స్థాయిలో లేకపోవడంతో చెరువుల్లో నీరు లేని పరిస్థితి నెలకొందన్నారు. జిల్లాలో వరి పంట సాధారణ సాగు విస్తీర్ణం 1.21 లక్షల హెక్టార్లు కాగా.. ఈ ఏడాది ఇంతవరకు కేవలం 45 వేల హెక్టార్లలో మాత్ర మే వరి సాగు చేపట్టారన్నారు. గతే డాది ఇదే సమ యానికి 85 వేల హెక్టార్లలో వరి పంట సాగైందని చెప్పారు. జిల్లాలో 8,026 చెరువులు ఉన్నాయని, వీటిల్లో 18 టీఎంసీల నీరు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 3 టీఎంసీల నీరు మాత్రమే ఉందన్నారు. వీలైనంత వరకు వరికి బదులు ప్రత్యామ్నాయంగా చోడి, పెసర, మినప పంటలు వేసుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులు దృష్ట్యా పంట రుణాలు తీసుకున్న రైతులు పంటల బీమా చేసుకోవాలన్నారు.లక్ష్యంతో కూడిన విద్యనందించాలి సాలూరు: విద్యార్థులు లక్ష్యంతో కూడిన విద్యనభ్యసించాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు. మండలంలోని పీఎన్ బొడ్డవలస సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. సౌకర్యాలు, వసతి, విద్యాబోధనపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ● దుస్తులు, చేతికర్ర ఆధారంగా గుర్తింపు ● కేసు నమోదు చేసిన పోలీసులు మెంటాడ: మండలంలోని ఆగూరు పంచాయతీ పరిధిలోని సారాడవలస గ్రామానికి చెందిన ఎర్రగడ కన్నయ్యదొర (76)అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ నెల 11వ తేదీ నుంచి ఆయన కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆండ్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే కంటుభుక్తవలస గ్రామం వైపు ఉన్న ఒక తోట నుంచి దుర్వాసన రావడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా..ఒక మృతదేహం కనిపించింది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో.. దుస్తులు, పక్కనే ఉన్న చేతికర్ర ఆధారంగా అది కన్నయ్యదొరేనని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎస్సై కె.సీతారాం తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమార్తె రాయవరపు లక్ష్మి ఫిర్యాదు మేరకు.. ప్రమాదవశాత్తూ మృతి చెందాడా లేక ఇంకేమైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. అదృశ్యమైన వృద్ధుడు శవమై తేలడంతో సారాడవలసలో విషాదఛాయలు అలముకున్నాయి. -
సర్వేలో ప్రతికూలం..
విజయనగరం ఫోర్ట్: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరగడం లేదు. పింఛన్లు ఇంటింటికీ కాకుండా లబ్ధిదారులందరినీ ఒకే చోటుకు రప్పించి ఇస్తున్నట్టు పింఛన్ లబ్ధిదారులు గుసగుసలాడుకుంటున్నారు. టీడీపీ సర్కార్ నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో పలువురు లబ్ధిదారులు పింఛన్ పంపిణీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటింటికీ వచ్చి పింఛన్లు పంపీణి చేస్తున్నారా అని అడిగినప్పుడు.. చాలా మంది ఇంటింటికీ వచ్చి పింఛన్లు ఇవ్వడం లేదని చెప్పినట్లు సమాచారం. గతానికి భిన్నంగా.. టీడీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పింఛన్లు పంపిణీ చేసే సమాయాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మార్చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి పింఛన్లు పంపిణీ జరిగేది. ప్రస్తుతం 8, 9 గంటలైనా సిబ్బంది కానరావడం లేదు. పైగా లబ్ధిదారులందరినీ పంచాయతీ కార్యాలయం వద్దకో.. రచ్చబండ వద్దకో పిలిచి ఒకేసారి పింఛన్లు ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ ఉద్దేశం ఇది.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పింఛన్దారులు పంచాయతీ కార్యాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షించేవారు. వృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన వారు పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పింఛన్లు తీసుకోవడానికి ఇబ్బంది పడేవారు. అష్టకష్టాలు పడి వెళ్లినా పంచాయతీ కార్యదర్శి ఒక్కరే పింఛన్లు పంపిణీ చేయడం వల్ల గంటల తరబడి అక్కడే నిరీక్షించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసింది. తెల్లవారుజాము 5 గంటలకే పింఛన్దారుల తలుపు తట్టి నగదు అందించేవారు. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. సర్వత్రా అసంతృప్తి.. జిల్లాలో 25 సచివాలయాల పరిధిలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ పట్ల లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్ల పంపీణిపై 85.64 శాతం మంది సానుకూలంగా స్పందించగా.. 14.26 శాతం మంది ప్రతికూలంగా స్పందించారు. పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది డబ్బులు అడుగుతున్నారా అనే ప్రశ్నకు 86.76 శాతం మంది సానుకూలంగా స్పందించగా.. 13.24 శాతం మంది ప్రతికూలంగా స్పందించారు. నెల్లిమర్ల, మెంటాడ, పూసపాటిరేగ, మెరకముడిదాం, ఎస్.కోట, రామభద్రపురం, విజయనగరం మండలాల్లో ఇంటింటికీ పింఛన్లు పంపిణీ పట్ల ఎక్కువమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 2,68,072 ఫించన్లు.. జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన 2,68,072 మంది పింఛన్దారులున్నారు. వీటిలో వృద్ధాప్య పింఛన్లు 1,28,623 , వితంతు పింఛన్లు 73,727, వికలాంగ ఫించన్లు 35, 538, అభయహస్తం 10,044, ఒంటిరి మహిళా పింఛన్లు 5,117, డప్పు కళాకారులు పింఛన్లు 4,005, చేనేత పింఛన్లు 2,844, గీత కార్మికుల ఫించన్లు 2,876 , మత్య్సకారులు పింఛన్లు 2,129, చర్మకార పింఛన్లు 1548, డీఎంహెచ్ఓ పింఛన్లు 870, డయాలసిస్ పించన్లు 469, కళాకారుల పింఛన్లు 253, టాన్సజెండర్స్ పింఛన్లు 26, సైనిక్ వేల్ఫేర్ పింఛన్లు 3 ఉన్నాయి. ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై అసంతృప్తి వ్యక్తం చేసిన లబ్ధిదారులు గతంలో ఇంటింటికీ వెళ్లి పింఛన్ల అందజేత నేడు అందుకు భిన్నమైన పరిస్థితిఇకపై పక్కాగా... ఇంటింటికీ ఫించన్ల పంపిణీపై చేపట్టిన ఐవీఆర్ఎస్ సర్వేలో 85.64 శాతం మంది సానుకూలంగా స్పందించారు. 25 సచివాలయాల పరిధిలో 14.26 శాతం మంది ప్రతికూలంగా స్పందించారు. ఇకపై శతశాతం సానుకూల స్పందన వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శ్రీనివాసపాణి, పీడీ, డీఆర్డీఏ -
అనాథకు అంత్యక్రియలు..
రాజాం సిటీ: వారికి అతనితో సంబంధం లేదు.. అయినా బాధ్యత మరువలేదు.. అపరిచిత వృద్ధుని చివరి శ్వాస వరకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక శ్రీకాకుళం రోడ్డులో 70 ఏళ్ల వయసున్న సూర్యనారాయణ అనే వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని సామాజిక ఆస్పత్రి పూర్వపు సూపరింటిండెంట్ కరణం హరిబాబు ఇటీవల గమనించి, వెంటనే రెడ్క్రాస్ సభ్యులు కొత్తా సాయిప్రశాంత్కుమార్, పెంకి చైతన్యకుమార్లకు తెలియజేశారు. వారు ఆ సమయంలో హైదరాబాద్లోని రెడ్క్రాస్ శిక్షణలో ఉండడంతో, రాజాంనకు చెందిన ఓ పాత్రికేయునికి విషయం చేరవేశారు. దీంతో ఆయన రెడ్క్రాస్ సభ్యుల సూచనల మేరకు వృద్ధుడ్ని ఈనెల ఒకటో తేదీన సామాజిక ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి నిత్యం పర్యవేక్షిస్తూ వైద్యసేవలు అందేలా చూశారు. అయితే చికిత్సకు శరీరం సహకరించకపోవడంతో వృద్ధుడు బుధవారం ఉదయం మృతి చెందగా.. ఈ విషయాన్ని ఆస్పత్రి సూపరింటిండెంట్ దామోదర్ ప్రధాన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో టౌన్ సీఐ నవీన్కుమార్, రెడ్క్రాస్ సభ్యులు పెంకి చైతన్యకుమార్, కొత్తా సాయిప్రశాంత్కుమార్, కొత్తా అనంతరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సీహెచ్ ప్రసాదరావు, తదితరులు అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి, మానవత్వం చాటుకున్నారు. అత్తకు కోడలు తలకొరివి.. భామిని: అత్త మృతదేహానికి కోడలు తలకొరివి పెట్టి రుణం తీర్చుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొరమకు చెందిన వృద్ధురాలు ముద్దాడ పారమ్మ (70) బుధవారం అనారోగ్యంతో మృతి చెందింది. అయితే పారమ్మ కుమారుడు ముద్దాడ బారికి ఐదేళ్ల కిందట మృతి చెందడంతో.. తలకొరివి పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ సమయంలో కోడలు గంగమ్మ ముందుకు వచ్చి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు పూర్తి చేసింది. పరిమళించిన మానవత్వం -
కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి అందజేత
పార్వతీపురం రూరల్: రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పొందిన వీరఘట్టం కానిస్టేబుల్ పి.రవి (పీసీ–602) కుటుంబానికి పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు శాఖ కొండంత అండగా నిలిచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పోలీసు శాలరీ ప్యాకేజీ కింద మంజూరైన రూ.కోటి చెక్కును రవి సతీమణి లలితకు ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. విధి నిర్వహణలో ఉన్న రవి ఈ ఏడాది జనవరి 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్ను మూశారు. ఆయన కుటుంబానికి భరోసా కల్పించేలా పోలీసు ఉన్నతాధికారులు బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకుని ఈ బీమాను మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లా డుతూ.. సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ వేతన ప్యాకేజీని అమలు చేస్తున్నామని, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.కోటి, సాధారణ మరణానికి రూ.10 లక్షల పరిహారం అందుతుందని వివరించారు. బాధిత కుటుంబాలకు పోలీసుశాఖ ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందని, ఏ సమస్య వచ్చినా నేరుగా కలవవచ్చని ఆయన ధైర్యం చెప్పారు. వచ్చిన సొమ్మును వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐలు నాయుడు, రాంబాబు, ఆదినారాయణ, విజయనగరం కంటోన్మెంట్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. -
లిటిల్ కృష్ణకు విరాళాల సేకరణలో అవకతవకలు
విజయనగరం టౌన్: విజయనగరం పూల్బాగ్కి చెందిన లిటిల్ బేబీ కృష్ణ అనే ఆరు నెలల బాబుకి వచ్చిన ఎస్ఎంఎస్ టైప్ వన్ వ్యాధికి సంబంధించి డబ్బులు సేకరించడంలో అవకతవకలు జరిగాయని అందుకు ప్రధాన కారకులైన వారిపైన లిటిల్ కృష్ణ తండ్రి ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ ఎఆర్.దామోదర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7వ తేదీన ‘ చిన్నారుల ప్రాణాలతో చెలగాటమా?’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఎస్పీ విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బాధిత చిన్నారి తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. సైబర్ సెల్ సీఐ శోభన్బాబు, ఎస్ఐ పాపారావులను విచారణ నిమిత్తం ప్రత్యేకాధికారులుగా నియమించామన్నారు. డబ్బులు సేకరించడంలో అవకతవకలకు ప్రధాన కారణం నవీన్ రామ్సింగ్ అనే ఎస్.కోటకు చెందిన వ్యక్తి అని, అతనితో పాటూ మరికొంతమంది డబ్బులు సేకరణలో అవకతవకలకు పాల్పడ్డారని, అవకతవకలపై ప్రశ్నిస్తే బెదిరించినట్లు చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్పీ కఠిన చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిపైన సోషల్ మీడియాను ప్రభావితం చేసే వ్యక్తులు (ఇన్ఫ్లూయెన్సర్స్)ను, డొనేషన్లు ఇచ్చిన దాతలను ఎంక్వయిరీ చేస్తూ దర్యాప్తు ముమ్మరం చేసినట్లు, అదేవిధంగా తప్పు చేసిన వారిపై కఠినచర్యలు తీసుకునేందుకు పోలీస్ యంత్రాంగం దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. ఇటువంటి వ్యాధిగ్రస్తులకు చేసే సహాయం రాబోయే రోజుల్లో కూడా కచ్చితంగా పారదర్శకతతో అందాలంటే నేరం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలనే ఆలోచనతో పోలీస్ యంత్రాంగం ముందుకు వెళ్తుందన్నారు. నవీన్రామ్సింగ్, మరికొందరిపై లిటిల్ కృష్ణ తండ్రి ఫిర్యాదు విచారణ అధికారులుగా సైబర్ సెల్ సీఐ, ఎస్ఐలు -
ట్రాఫిక్ కానిస్టేబుల్ మూర్తికి ఎస్పీ అభినందన
విజయనగరం టౌన్: జిల్లా పోలీసు శాఖలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా పని చేస్తున్న బిఎస్ఎన్.మూర్తి ఇటీవల తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్లో జరిగిన 11వ ఆల్ ఇండియా పోలీసు జూడో క్లస్టర్ 2026–2027 తైక్వాండో పూమ్సే పోటీల్లో బంగారు పతకం సాధించినట్లు ఎస్పీ ఎఆర్.దామోదర్ మంగళవారం పేర్కొన్నారు. 2027 మార్చిలో ఆస్ట్రేలియాలో జరగనున్న ప్రపంచ పోలీసు అండ్ ఫైర్ గేమ్స్కు ఎంపికయ్యారన్నారు. అనంతరం అతని కోచ్ జి.రాజేష్ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ఎస్.రాము, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చోరీ కేసు ఛేదించిన పోలీసులు
గరుగుబిల్లి: సన్యాసిరాజుపేట గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి శివలింగానికి అలంకరించిన నాగభరణం, వినాయక స్వామి, పార్వతీదేవి అమ్మవారి విగ్రహానికి ఉన్న కిరీటాలు, శతగోపం తదితర వెండి వస్తువులను అపహరించి పరారయ్యారు. చోరీపై కేసు నమోదు చేసి విశాఖపట్నం పీఎం పాలెం పోలీస్స్టేషన్ క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది సహకారంతో గత కొద్ది రోజులుగా గాలింపు చేపట్టి నిందితుల వివరాలను సేకరించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నుంచి ఆలయంలో చోరీకి గురైన వస్తువుల్లో 90శాతం వరకు వెండి వస్తువులను రికవరీ చేసినట్లు సీఐ టీవీ తిరుపతిరావు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని పార్వతీపురం మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం హాజరు పరిచినట్లు ఎస్ఐ షేక్ ఫకృద్దీన్ తెలిపారు. -
గుడ్లు సరఫరాలో మతలబు!
విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న లబ్ధిదారులకు అందించే పౌష్టికాహారం విషయంలో చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా లబ్ధిదారులకు పౌష్టికాహారం పూర్తి స్థాయిలో అందకపోయినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు చిన్న సైజు గుడ్లు సరఫరా అవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిచ్చిక గుడ్లు లాంటి గుడ్లు సరఫరా చేస్తున్నా.. చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు అఽధికారులు పర్యవేక్షణలో జరగాలి. ఎక్కడైనా నాణ్యత లేకపోయినా, పాడైనా, చిన్న సైజు సరఫరా అయినా వాటిని తిప్పి పంపాలి. కానీ ఆ విధంగా చేయడం లేదు. కాంట్రాక్టర్ వేటిని సరఫరా చేస్తే వాటినే తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో 2499 అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలో 2499 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 292 మిని అంగన్వాడీ కేంద్రాలు, 2207 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 71,53 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో బాలింతలు 6769 మంది, గర్భిణులు 7799 మంది, 0 నుంచి 6 నెలలలోపు పిల్లలు 6203 మంది, 6 నెలలు నుంచి మూడేళ్లలోపు పిల్లలు 36,389 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 15,493 మంది ఉన్నారు. ప్రతీ రోజు పిల్లలకు గుడ్డు పెట్టాలి అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న పిల్లలకు సెలవు రోజు మినహా ప్రతీ రోజు గుడ్డు ఇవ్వాలి. గర్భిణులు, బాలింతలకు నెలకు ఒక్కొక్కరికి 25 గుడ్లు చొప్పున అందిస్తారు. గుడ్డు పరిమాణం 50 గ్రాములు ఉండాలి. కానీ అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే గుడ్లు 40 నుంచి 45 గ్రాములు అధిక శాతం గుడ్లు ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులోనూ కొన్ని కుళ్లిన గుడ్లు కూడా ఉంటున్నాయి.చిన్న సైజు గుడ్డు50 గ్రాములు ఉండాలి.. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే ప్రతీ గుడ్డు 50 గ్రాములు ఉండాలి. 30 గుడ్లు 1500 గ్రాములు ఉండాలి. చిన్న సైజు గుడ్లు సరఫరా అయిన కేంద్రాల్లో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. – కేవీ బాలామణి, పీడీ, ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాలకు చిన్న సైజు గుడ్లు చోద్యం చూస్తున్న అధికారులు జిల్లాలో 2499 అంగన్వాడీ కేంద్రాలు -
వేడుకగా సంస్కృత సప్తాహ మహోత్సవం
విజయనగరం టౌన్/క్రైమ్: తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యసోమయాజుల కాశీపతిరావు స్మారక భవనంలో మంగళవారం సాయంత్రం సంస్కృత సప్తాహ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన పిటిజివి.రంగాచార్యులు మాట్లాడుతూ తెలుగు, సంస్కృతం ఆత్మ పరమాత్మ వంటివని, ఒకటి పందిరి అయితే మరొకటి మల్లెతీగని, వాటిని గౌరవించుకోవడం, కాపాడుకోవడం భావితరాలకు ఎంతో ముఖ్యమన్నారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ కె.చంద్రశేఖర్, భాస్కరరావు, సంతోష్ లక్ష్మి, వి.యామిని, సత్యపావని, ధవళ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఎస్ఎల్ఏఎస్ – 2026 అవగాహన సదస్సు
● ఈ నెల 28న 263 స్కూళ్లలో సర్వేవిజయనగరం అర్బన్: పట్టణంలోని పీఎస్ఆర్ పాఠశాలలో స్టేట్ లెర్నింగ్ అచీవ్మెంట్ సర్వే (ఎస్ఎల్ఏఎస్–2026) నిర్వహణపై విద్యాశాఖ అధికారులకు, సిబ్బందికి చేపట్టిన అవగాహన సదస్సు మంగళవారం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘సాల్ట్’(సపోర్టింగ్ ఆంద్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్) ప్రాజెక్ట్లో భాగంగా ఈ నెల 28న జిల్లాలోని 263 పాఠశాలల్లో మూడో దశ ఎస్ఎల్ఏఎస్ సర్వే నిర్వహిస్తున్న తెలిపారు. సదస్సులో ఆర్జేడీ బి.విజయభాస్కర్, జిల్లా విద్యాశాఖాధికారి యూ.మాణిక్యంనాయుడు ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. 5, 7, 9వ తరగతుల విద్యార్థుల తరగతి స్థాయి అభ్యసన సామర్థ్యాలు, లోపాలు, కీలక నైపుణ్యాలను అంచనా వేయడమే ఈ సర్వే ప్రధాన లక్ష్యం. ఇది వ్యక్తిగత పాఠశాలలు లేదా ఉపాధ్యాయుల మూల్యాంకనం కోసం కాకుండా విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పులు తెచ్చేందుకు దోహదపడుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ సర్వేలో గణితం, ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టులపై ద్విభాషా (తెలుగు–ఇంగ్లిష్) విధానంలో ప్రశ్నపత్రాలు ఉంటాయి. ప్రతీ విద్యార్థి నిర్దేశిత కలయిక ప్రకారం ఏవైనా రెండు అంశాలపై పరీక్ష రాయాల్సి ఉంటుంది. మాస్టర్ ట్రైనర్లు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు ఓఎంఆర్ షీట్ల పూరణ, ప్రశ్నపత్రాల భద్రత, విద్యార్థుల ఎంపిక, గోప్యత, ప్యాకింగ్ మరియు హాజరు నమోదు అంశాలపై పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చారు. నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ సర్వేను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఈబీ క్యాదర్శి టి.సన్యాసిరాజు, డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు, మాస్టర్ ట్రైనర్లు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు పాల్గొన్నారు. -
తల్లీకొడుకుల అదృశ్యంపై కేసు
సంతకవిటి: మండలంలోని తల్లీకొడుకులు అదృశ్యంపై కేసు నమోదైనట్టు ఎస్ఐ ఆర్.గో పాలరావు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మిర్తివలస గ్రామానికి రాజాపు రమేష్కు పొందూరు మండలానికి చెందిన దంతేశ్వరితో వివాహం అయ్యింది. వీరికి ఓ కుమారుడు దేవార్ష(3) ఉన్నాడు. సోమవారం ఉదయం రమేష్ గ్రామంలో పని వద్ద ఉండగా తన భార్య కుమారుడుని తీసుకుని వెళ్లడం చూసి ఎక్కడకు అని అడగగా సచివాలయానికి అని తెలిపింది. అనంతరం మధ్యాహ్నం తను ఇంటికి భోజనానికి వచ్చే సరికి తన భార్య, కుమారుడు ఇంటిలో లేకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీనితో తెలిసిన వారి దగ్గర వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో మంగళవారం రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం వీరఘట్టం: మండలంలోని తలవరం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణంలో ఉన్న ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంగళవారం బ్లాస్ట్ అయింది. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఒక్కసారి మంటలు రావడంతో స్థానికులు, హైస్కూల్ విద్యార్థులు భయాందోళన చెందారు. ట్రాన్స్ఫార్మర్లో ఉన్న కరెంటు ఆయిల్కు నిప్పు అంటుకోవడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడ్డాయి. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. అనంతరం పాలకొండ అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పాఠశాల ఆవరణలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను వెంటనే తొలగించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. నీళ్లని భ్రమించి గడ్డిమందు తాగిన వ్యక్తి పార్వతీపురం రూరల్: మద్యం మత్తు ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. కొమరాడ మండలం గుణానపురం గ్రామానికి చెందిన రౌతు శ్రీనివాసరావు మద్యం సేవించి ఉన్నాడు. విపరీతమైన దాహం వేయడంతో, మత్తులో పక్కనే ఉన్న గడ్డి మందును నీళ్లుగా భ్రమించి తాగాడు. అదృష్టవశాత్తూ కొద్ది మోతాదులోనే మింగడంతో పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆయనను పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. సత్వర వైద్యం అందడంతో ప్రస్తుతానికి శ్రీనివాసరావు పరిస్థితి నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య వంగర: మండల పరిధి శివ్వాం గ్రామానికి చెందిన అంబళ్ల వెంకటనాయుడు(38) గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ షేక్ శంకర్ తెలిపారు. ఈ నెల 11వ తేదీన గడ్డిమందు తాగాడని, భార్య నిర్మల సహాయంతో శ్రీకాకుళం రిమ్స్లో చికిత్స అందించారన్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందారన్నారు. మృతుడు భార్య నిర్మల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడుకి ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. వ్యక్తి ఆత్మహత్య శృంగవరపుకోట: మండల పరిధిలో వేములాపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం సాయంత్రం ఉరి వేసుకుని ఉసురు తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వేములాపల్లి గ్రామానికి చెందిన లగుడు సుధాకర్ (35) విశాఖలో నేవీలో ఎం.టి.ఎస్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను భార్య, ఇద్దరు మగ పిల్లలతో విశాఖలోని బాజీ జంక్షన్లో నివాసం ఉంటున్నాడు. సుధాకర్ బంధువుల వివాహానికని ఈ నెల 22న కుటుంబ సభ్యులతో ఇక్కడకు వచ్చాడు. వివాహం అనంతరం ఈ నెల 24న కుటుంబ సభ్యులను కొత్తవలసలో బస్సు ఎక్కించి విశాఖపట్నం పంపించాడు. తరువాత వేములాపల్లికి తిరిగి వచ్చిన సుధాకర్ మంగళవారం సాయంత్రం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా.. గ్రామ సమీపంలోని జంగం గుడి సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నారాయణమూర్తి తెలిపారు. -
28న రామతీర్థంలో ప్రత్యేక పూజలు
● భక్తులు సంప్రదాయ దుస్తుల్లో రావాలి ● దేవస్థాన ఈఓ వై.శ్రీనివాసరావునెల్లిమర్ల రూరల్: శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 28న ప్రత్యేక పూజలు జరగనున్నాయని ఈఓ వై.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 7గంటలకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకాలను అర్చకులు జరిపిస్తారన్నారు. అనంతరం 9.30 గంటలకు శ్రీరామ, శ్రీలక్ష్మి అష్టోత్తర పూజలు, కుంకుమ పూజలు ప్రారంభమవుతాయని తెలిపారు. భక్తులు స్వయంగా అమ్మవారికి కుంకుమార్చన, స్వామివారికి పుష్పార్చన చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. అనంతరం రామకోటి లిఖిత జపం, మంగళశాసనం, తీర్థ ప్రసాదాల పంపిణీ ఉంటుందని, భక్తులు సంప్రదాయ దుస్తుల్లో రావాలని కోరారు. -
లారీని ఢీకొట్టిన ఆటో
● క్షతగాత్రులను కాపాడిన స్థానికులు, ఎస్సైనరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా జమ్ము కూడలి సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఆగి ఉన్న లారీని విజయనగరం జిల్లా జామి నుంచి పలాసవైపు వెళ్తున్న ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న శ్రావణ్కుమార్, వెంకటరమణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో ముందు భాగం పూర్తిగా నుజ్జు కావడంతో డ్రైవర్తో పాటు పక్కనే కూర్చున్న వెంకటరమణ ఇరుక్కున్నారు. వారిని బయటకు తీయడానికి స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సమాచారం తెలుసుకున్న నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో క్షతగాత్రులను బయటకు తీశారు. అనంతరం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ అతి వేగంగా వాహనం నడుపుతుండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు తమ సత్తాను నిరూపించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వేదికగా జరిగిన సబ్ జూనియర్స్, క్యాడెట్, జూనియర్స్, సీనియర్స్ పోటీ ల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన బాల, బాలికలు మొత్తంగా 29 పతకాలు సాధించి క్రీడల ఖిల్లా విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పారు. న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో, తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం జిల్లా నిర్వహణలో జరిగిన ఈ పోటీల్లో జిల్లా నుంచి 50 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీల్లో విజయనగరం జిల్లా క్రీడాకారులు మొత్తం 29 పతకాలు సాధించి సత్తా చాటారు. ఇందులో 17 బంగారు పతకాలు, 6 వెండి పతకాలు, 6 కాంస్య పతకాలు దక్కించుకున్నారు. పూమ్సే విభాగంలో విజయనగరం జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్లో ప్రథమ స్థానం సాధించగా, క్యూరిగి విభాగంలో జూనియర్ కేటగిరీలో ద్వితీయ స్థానం, క్యాడెట్ కేటగిరీలో తృతీయ స్థానం సాధించడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ సెక్రటరీ సిహెచ్.వేణుగోపాల్ రావు, గురాన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గురాన రాధిక, కోచ్లు యశస్విని, అమృత, యశ్మిత, హర్షిణి పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
వల్లూరు హత్య ఘటనపై దర్యాప్తు ముమ్మరం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని వల్లూరు గ్రామంలో సోమవారం జరిగిన సిరుగుడి రామారావు(60) హత్య ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మంగళవారం చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. హత్యకు దారితీసిన కారణాలు, ఘటనకు సంబంధించిన పరిస్థితులపై ఆరా తీశారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. గ్రామంలోని ఎలాంటి గొడవలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. వివాదాలకు కారణమయ్యే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయన వెంట భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, ఎస్ఐ గోపాలరావు ఉన్నారు. -
హోంగార్డులకు హెల్త్ కార్డులు
విజయనగరం టౌన్: జిల్లా పోలీసు శాఖలో క్రియాశీలకంగా పనిచేస్తున్న హోంగార్డులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ వ్యయంతో కార్పోరేట్ వైద్యమందించేందుకు శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి యాజమాన్యంతో సంప్రదింపులు చేసినట్టు ఎస్పీ ఎఆర్.దామోదర్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ ఆర్ధోపెడిక్ డాక్టర్ శ్రీరామమూర్తి పోలీస్ శాఖపై అభిమానంతో హోంగార్డ్లకు హెల్త్ కార్డ్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడినట్లయితే వారికి కేవలం రూ.100ల రిజిస్ట్రేషన్ రుసుంతో స్పెషలిస్ట్ డాక్టర్స్ కన్సల్టేషన్ ఇవ్వనున్నామన్నారు. అత్యవసర వైద్యసేవలను హోంగార్డ్, వారి కుటుంబ సభ్యులకు అన్నివేళల్లో వైద్యం అందిస్తామన్నారు. ఆస్పత్రిలో ఆర్దో, జనరల్, కార్డియాలజీ, న్యూరో, చెవి, ముక్కు, గొంతు, యురాలజీ, కంటి, డెంటల్, ప్లాస్టిక్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపిక్, డయాలసిస్, గైనికాలజీ, లేజర్ సర్జరీ నిపుణులు అందుబాటులో ఉండి, వైద్యసేవలదిస్తారన్నారు. హోంగార్డ్లకు ఎస్పీ హెల్త్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీరామూర్తి, లక్ష్మిశ్రీరామూర్తి, డాక్టర్ మాధురి సుధలను ఎస్పీ అభినందించారు. రిజర్వు ఇన్స్పెక్టర్ రమేష్కుమార్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
చేనేత సొసైటీలో సరుకు మాయం!
రాజాం: రాజాం పట్టణంలోని శ్రీ మల్లిఖార్జున వీవర్సు సొసైటీలో దొంగలు పడ్డారు. రికార్డులు గల్లంతు చేసి రూ.12లక్షల సరుకును మాయం చేశారు. ఇది ఇంటిదొంగల పనేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొసైటీ పరిధిలో చేనేత వస్త్రాల వ్యాపారం ఏటా రూ.లక్షల్లో సాగుతోంది. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందజేసిన ఆర్థిక ఊతంతో సొసైటీలో మగ్గాల సంఖ్య పెరిగింది. ముడిసరుకులు విక్రయాలు జోరుగా సాగడంతో లాభాలు ఆర్జించింది. ప్రస్తుతం పాలకమండలి లేకపోవడంతో సొసైటీలో పనిచేసే సిబ్బంది, అధికారులే సొసైటీ నిర్వహణ బాధ్యత తీసుకున్నారు. ఈ సొసైటీకి రాజాం, తెర్లాం, సంతకవిటి, రేగిడి మండలాల్లోని పలు గ్రామాల్లోని చేనేత కార్మికులు సభ్యులుగా ఉన్నారు. వీరందరూ ఇక్కడి నుంచి ముడిసరుకును తీసుకెళ్లి చీరలు, పంచెలు, తువ్వా ళ్లు, దుప్పట్లు తయారుచేసి సొసైటీకి ఇచ్చేవారు. ఇలా వచ్చిన సరుకు ఇప్పుడు గల్లంతైంది. దీనివిలువ రూ.12 లక్షలు ఉంటుందని చేనేత కార్మికులు చెబుతున్నారు. చేనేత కార్మికుల పేరున ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంకు నుంచి వచ్చిన రుణాలను సైతం కొంతమంది బినామీలు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవి కాకుండా సొసైటీ నిర్వహణ పేరుతో ఆప్కో నిధుల్లో రూ.1.50 లక్షల నిధులు దిర్వినియోగం చేసినట్టు సభ్యులు ఆరోపిస్తున్నారు. వీటి వెనుక సొసైటీలో కొందరు అధికారులతో పాటు అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమాల పర్వంతో సొసైటీ పనితీరు మరుగున పడిందని సభ్యులు వాపోతున్నారు. ఇక్కడ గతంలో డవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి తీరువల్లే సొసైటీలో సరుకు, నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మౌనం ఎందుకో? ఇటీవల ఇక్కడ పనిచేసిన డీఓకు బదిలీ కావడం, కొత్తగా డీఓ ఇక్కడకు రాకపోవడం సొసైటీలో నిధుల దుర్వినియోగం, సరుకు మాయం వివాదం మరింత జఠిలంగా మారింది. 400 మంది సభ్యులు ఉండే సొసైటీ ఇప్పుడు మూలకు చేరడంతో పాటు ఇందులో నిధులు గోల్మాల్ వెనుక ప్రభుత్వ పాలకులు మౌనంగా ఉండడం, ఇంకో వైపు జౌళిశాఖ ఉన్నతాధికారులు సైతం ఏమీ పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తల హస్తం ఉండడంతో సరుకు గల్లంతు విషయాన్ని సద్దుమణిగించే ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి వీవర్స్ సొసైటీలోని అక్రమాలను వెలుగులోకి తీయాలని పలువురు కోరుతున్నారు. ఎక్కడ ఉన్నాయో తెలియదు.. ఈ విషయాన్ని జౌళిశాఖ రాజాం డీఓ ముఖర్జీ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా, ఇటీవల తాను బదిలీ అయ్యానన్నారు. తన సమయంలో రికార్డులు నిర్వహణ చేశామని, ఆ రికార్డులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో తెలియదని సమాధానం ఇచ్చారు. మాయమైన యార్న్ (సరుకు) వివరాలు వెల్లడించేందుకు, రూ.1.50 లక్షల ఖర్చుల వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. మల్లిఖార్జున వీవర్స్ సొసైటీలో రికార్డులు గల్లంతు లెక్కతేలని రూ.12 లక్షల సరుకు పాలకమండలి లేక చక్రం తిప్పిన అధికారులు -
మారారా.. మార్చారా?
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం గ్రేడ్–1 మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఉన్న కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించి ఆర్డీఓ మాధురికి అప్పగించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అకస్మాత్తుగా ఈ మార్పు నిర్ణయం వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్లు, పురాలు, నగర పంచాయతీల్లో పాల కవర్గ పదవీకాలం ముగిసిన తర్వాత, ప్రత్యేక అధికారుల పాలన తెరపైకి వచ్చిన విషయం విదిత మే. ఇందులో భాగంగా పార్వతీపురం గ్రేడ్–1 మున్సిపాలిటీకి తొలుత సంయుక్త కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా నియమించారు. కార్పొరేషన్లు, గ్రేడ్ –1 మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులుగా కలెక్టర్లు ఉండాలన్న నిర్ణయంతో.. అప్పటి జేసీ యశ్వంత్ కుమార్రెడ్డిని సాలూరు మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా.. పార్వతీపురానికి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ని నియమించారు. యశ్వంత్కుమార్రెడ్డికి బదిలీ కాగా.. ప్రస్తుతం ప్రస్తుతం సాలూరుకు ఇన్చార్జి జేసీ వైశాలి ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఉన్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి ఆ బాధ్యతల నుంచి మార్పుచేస్తూ, పార్వతీపురం ఆర్డీఓ మాధురికి అప్పగించడం వెనుక ఉద్దేశం ఏమిటన్న చర్చ పట్టణంలో జోరందుకుంది. కలెక్టర్ ప్రభాకరరెడ్డితో జిల్లాలోని ఒకరిద్దరు ప్రజా ప్రతినిధులకు పొసగని విషయం తెలిసిందే. ప్రధానంగా పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యేతో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నట్లు పలుమార్లు రుజువైంది. కలెక్టర్పై నియోజక వర్గానికి చెందిన ఓ వర్గం టీడీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. అవకాశం దొరికినప్పుడలా ఇరికించేందుకు ప్రయత్ని స్తున్నారు. తమదారిలోకి తెచ్చుకునేందుకు ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు ఆయనను జిల్లా నుంచి బది లీ చేయించాలని తీవ్రంగా ప్రయత్నించారు. ప్రస్తుతానికి వారి ప్రయత్నం ఫలించక పోయినప్పటికీ.. మున్సిపల్ పాలనా వ్యవహారాలు, కొన్ని నిర్ణయా లు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంలో కలెక్టర్/ప్రత్యే కాధికారి వైఖరి పట్ల ఎమ్మెల్యే విజయ్చంద్ర గుర్రు గా ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు ప్రక్రి య సందిగ్ధంలో ఉన్నప్పటికీ.. ఇంకా సమయం ఉండడంతో, ఏ నిర్ణయం అయినా వెలువడచ్చన్న అభిప్రాయంతో పార్టీల నాయకులు ఉన్నారు. ఒకవేళ ఎన్నికలు జరిగితే.. ప్రత్యేక అధికారి నుంచి అధికా ర పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయ్ చంద్రకు ఇబ్బందికర పరిణామాలు ఎదురుకావచ్చన్న అనుమానా లు టీడీపీలో బలంగా ఉన్నాయి. మున్సిపాలిటీలో తాము అనుకున్న విధంగా పనులు జరగకపోతే, రానున్న ఎన్నికల సమయానికి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురు కావచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉన్నత స్థాయిలో ఒత్తిడి తీసుకొ చ్చి ప్రత్యేక అధికారి మార్పును చేశారా? అన్న ప్రశ్న లు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక అధికారి మార్పు తమ విజయంగా నియోజకవర్గానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు చెప్పుకుంటుండడం దీనికి బలం చేకూరుస్తోంది. త్వరలోనే కలెక్టర్ బదిలీ కూడా తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
● అధినేతతో మన నేతలు
వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని అధినేత సూచించినట్టు నాయకులు తెలిపారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, అలజంగి జోగారావు, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలేరాజేష్ ఉన్నారు. – సాక్షి నెట్వర్క్ -
అథ్లెటిక్స్ కోచ్గా శ్రీనివాసరావు
విజయనగరం: విజయనగరం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ పరిధిలో అథ్లెటిక్స్ విభాగంలో శిక్షణ ఇచ్చేందుకు నూతనంగా కోచ్ను నియమిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నెయిగాపుల శ్రీనివాసరావును నియమిస్తున్నట్టు ఉత్వర్వుల్లో పేర్కొంది. ఇప్పటివరకు పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరిలో అథ్లెటిక్స్ కోచ్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు విజయనగరం అథ్లెటిక్స్ కోచ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. శ్రీనివాసరావు స్వస్థలం విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అయ్యన్నపేట ప్రాంతం. అథ్లెటిక్స్ కోచ్గా శ్రీనివాసరావు నియామకం పట్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు -
టెట్ రద్దుకు యూటీఎఫ్ డిమాండ్
పార్వతీపురం రూరల్: దశాబ్దాలుగా విద్యాబోధన చేస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి పూర్తి మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు కదం తొక్కారు. యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భాస్కరరావు మాట్లాడుతూ.. ముప్పై ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలు అందిస్తున్న వారిని ఇప్పుడు టెట్ పాస్ కాకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం శోచనీయమన్నారు. ఇది 2010 నాటి విద్యాహక్కు చట్టాన్ని ముందస్తు సర్వీసులో ఉన్నవారికీ వర్తింపజేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, విద్యాహక్కు చట్ట సవరణకై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ స్పెషల్ టెట్ నిర్వహిస్తే.. అందరికీ 40 శాతం మార్కులనే ఉత్తీర్ణత ప్రాతిపదికగా తీసుకోవాలని, వారు బోధించే సబ్జెక్టుల్లోనే పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే తీవ్ర పోరాటాల కు సిద్ధపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు పి.మధుసూదనరా వు, కోశాధికారి కె.మురళి, కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, పి.వెంకటనాయుడు, తదితర ఉపాధ్యాయు లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
చెదురుతున్న ఆశలు!
ఎండుతున్న నేల..● ఆకాశం వైపు రైతు చూపు.. ● ఖరీఫ్పై చేతులెత్తేసిన అన్నదాతలు సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్: ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతుకు మబ్బులే తప్ప చినుకుజాడ కనిపించడం లేదు. పొలంలో పచ్చదనం కరువైంది. చేసిన కొద్దిపాటి సాగును కాపాడుకోవడానికి నీరు లేదు. పార్వతీపురం మ న్యం జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ కీలక దశలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో సాగుపై రైతులు ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడింది. ఇదీ పరిస్థితి జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 72,829 హెక్టార్లు కాగా.. ప్రస్తుతానికి 50 వేల హెక్టార్లలోనే వరినాట్లు పూర్తయ్యాయి. సాధారణంగా ఈ సమయానికి ఖరీఫ్ సాగు ఊపందుకోవాల్సి ఉండగా.. వర్షాల జాడ లేక పొలాలు బీడుగా దర్శనమిస్తున్నాయి. వానలు పడతాయనే ఆశతో కొందరు రైతులు నారుమడులు వేసి, కొద్దిపాటి సాగు ప్రారంభించారు. ఆ తర్వాత కూడా సరైన వర్షాలు కురవకపోవడంతో నారు ఎండిపోతుండడం రైతులను కలచివేస్తోంది. అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన అన్నదాతలు ఇప్పుడు పెట్టుబడి కూడా తిరిగి వస్తుందా అన్న ఆందోళనలో ఉన్నారు. సాధారణంగా సెప్టెంబర్ మొదటి వారం వరకూ జిల్లాలో నాట్లుకు అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అడపాదడపా వర్షం.. సాగుకు మాత్రం సరిపోని నీరు జిల్లాలో అక్కడక్కడా అడపాదడపా జల్లులు పడినా అవి సాగుకు ఏమాత్రం ఉపయోగపడడం లేదని రైతులు వాపోతున్నారు. భూమిలో తేమ నిలిచేంతగా వర్షపాతం లేకపోవడంతో విత్తనాలు వేయడానికి కూడా రైతులు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికే వేసిన పంటలకు నీరందించే పరిస్థితి లేకపోవడంతో అవి ఎండిపోతున్నాయి. జిల్లాలో సాధారణం కంటే 50 శాతం వరకూ లోటు వర్షపాతం ఉంది. జూన్లో 41 మి.మీ., జూలైలో 55, ఆగస్టులో 41 మి.మీ వరకూ లోటు వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు అంతంతే.. వర్షాలు లేకపోవడంతో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, ఇతర నీటి వనరుల్లోనూ ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవు. జిల్లాలో ప్రధాన జలాశయాలు అయిన వెంగళరాయ, పెదంకలాం, పెద్దగెడ్డ, వట్టిగెడ్డలో నీటి నిల్వలు పడిపోయాయి. మొత్తం ప్రాజె క్టు నీటి సామర్థ్యంలో సగమైనా నిల్వలు లేకపోవ డం గమనార్హం. సాధారణంగా వర్షాకాలంలో నిండాల్సిన జలాశయాలు ఇప్పటికీ నీటికోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. దీంతో సాగునీటిపై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. వర్షం రాకపోతే ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేసి పంటలను కాపాడుకునే అవకాశం కూడా లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ చిత్రంలో ముదురుతున్న వరి నారుమళ్లను చూశారా... ఇవి పాలకొండ మండలం రుద్రిపేట గ్రామ సమీపంలోనివి. వరి సాగుకు అనుకూలమైన ఆశ్లేష కార్తె ముగిసింది. మగకార్తె వచ్చి పదిరోజులు గడిచినా తోటపల్లి నుంచి చుక్కనీరు కూడా పొలాలకు చేరలేదు. వర్షాలు కూడా అనుకూలించడం లేదు. వరినారు ముదిరిపోతుండడం, ఉభాలు జరగకపోవడంతో దిగుబడు లు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగుపై ఆశలు వదులుకుంటున్నారు. -
దివ్యాంగ బాలికపై కీచక పర్వం
పార్వతీపురం రూరల్: అభం శుభం తెలియని ఓ దివ్యాంగ బాలికపై ఓ కామాంధుడు మృగంగా మారాడు. మానవత్వాన్ని మంటగలుపుతూ అమానుషానికి పాల్పడిన ఘటన పార్వతీపురం పట్టణంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని 17 ఏళ్ల దివ్యాంగ బాలిక సోమవారం సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి వెళ్తోంది. ఒంటరిగా ఉన్న ఆ బాలికను చూసిన అజయ్నగర్కు చెందిన వంగపండు నూకరాజు (29) ఆమెను మభ్యపెట్టి జయలక్ష్మి సెల్ పాయింట్ వద్దకు తీసుకెళ్లాడు. చిన్నారి చెవి పోగులు అపహరించడమే కాకుండా, పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు టౌన్ సీఐ బి.వెంకటరావు ఆదేశాలతో ఎస్ఐ సింహాచలం వెంటనే స్పందించి పోక్సో, బీఎన్ఎస్ చట్టాల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తును వేగ వంతం చేసి ముద్దాయిని మంగళవారం ఏజేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో సెప్టెంబర్ 7వ తేదీ వరకు నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. పార్వతీపురం రూరల్: కుటుంబ పోషణ కోసం వయసుతో సంబంధం లేకుండా శ్రమిస్తున్న చిరువ్యాపారిని విషసర్పం బలితీసుకుంది. కొమరాడ మండలం పరశురాంపురానికి చెందిన జమ్మి నారాయణరావు (70) ఇదే మండలంలోని మార్కొండపుట్టి గ్రామంలోని చర్చి సమీపంలో చిన్నపాటి నూడిల్స్ బండిని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే సాయంత్రం 6 గంటల సమయంలో తన వ్యాపారం నిమిత్తం బండి వద్దకు బయలుదేరాడు. మార్గంమధ్యలో చీకట్లో విషసర్పం కాటేసింది. మొదట ఏదో పురుగు కుట్టిందని భావించిన ఆయన.. కాసేపటి తర్వాత పాము కాటుగా గుర్తించాడు. కుటుంబ సభ్యుల సహాయంతో హుటాహుటిన పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి చేరుకున్నాడు. అక్కడి వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ, అప్పటికే విషం శరీరానికి వేగంగా పాకడంతో మృతిచెందాడు. ఇంటి యజమాని మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. సాలూరు: ప్రజలకు మేలు జరగాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్థానిక విలేకరులతో ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందన్నారు. స్థానిక సంస్థల్లో మరోసారి ప్రజలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. వైఎస్సార్సీపీ శ్రేణులు సమష్టిగా పనిచేసి స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలని కోరారు. -
● బీసీలను వంచించిన వెన్నుపోటు పార్టీ
చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అమలు కాని అనేక హామీలు ఇవ్వడంతో పాటు బీసీ సామాజిక వర్గాన్ని కేవలం ఓటు బ్యాంకులా వాడుకుందని బీసీ నేతలు విమర్శించారు. మంగళగిరిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన’ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమ, దౌర్జన్న పాలనను ఎండగట్టారు. కార్యక్రమంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ విక్రాంత్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. – సాక్షినెట్వర్క్ -
విద్యుత్ శాఖాఽధికారుల నిర్లక్ష్యం
● గొర్రెల కాపరి ఎడమ చేయి తొలగింపుపూసపాటిరేగ: విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యంతో ఓ గొర్రెల కాపరి తీవ్ర విద్యుత్ ప్రభావానికి గురై ఎడమ చేయిని కోల్పోయిన సంఘటన భోగాపురం మండలంలో చోటుచేసుకుంది. ఎ.రావివలస పంచాయతీ పరిధిలో చిన్నిపేటకు చెందిన సిమ్మి అప్పలస్వామి సుమారు 15 రోజుల కిందట గొర్రెలు కాసేందుకు పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో వేలాడుతున్న విద్యుత్ తీగ మేకకు తగలడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. మేకను రక్షించేందుకు వెళ్లిన అప్పలస్వామి విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడ్ని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఎడమ చేతికి తీవ్ర గాయం కావడంతో తొలగించారు. ఇప్పటివరకు తమకు పది లక్షల రూపాయల వరకు ఖర్చయిందని.. మరో పది లక్షల రూపాయల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అప్పలస్వామి కొడుకు రామసూరి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి చేయిని తొలగించాల్సి వచ్చిందని, అయితే ఇంతవరకు ఏ ఒక్కరూ కనీసం పరామర్శించలేదని చెప్పారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
● సాగులో ‘రత్నం’
చిత్రంలో పొలం పనిలో నిమగ్నమైన వృద్ధురాలిని చూశారా... ఈమె పేరు ఆరిక రత్నాలమ్మ. వయస్సు 90 సంవత్సరాలు. కురుపాం మండలం జరడ గిరిజన గ్రామం. ఇటీవల కురిసిన వర్షాలకు పొలంలో నీరు చేరడంతో ఉభాలకు దమ్ముచేయించారు. దానిని నాట్లు వేసేందుకు వీలుగా ఓ చేతిలో కర్ర పట్టుకుని కాలితో చదును చేస్తూ...కుటుంబ సభ్యులకు సాగు‘సాయం’ అందించింది. పుడమితల్లి మురిసేలా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైంది. సరిలేరు నాకెవ్వరూ అంటూ రైతుల్లో స్ఫూర్తినింపింది. కష్టపడితే ఆరోగ్యం, ఆనందం సమకూరుతుందని, పంటలు పండితే ఎవరి వద్ద చేయిచాపాల్సిన అవసరం ఉండదని ఆమె సెలవిచ్చింది. – కురుపాం -
అర్జీలను తిరస్కరించొద్దు..
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డివిజయనగరం గంటస్తంభం: తమ శాఖకు సంబంధం లేదని చెబుతూ పీజీఆర్ఎస్ వచ్చే అర్జీలను తిరస్కరించకుండా.. సంబంధిత శాఖకు పంపించి పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్జీదారుడికి సంతృప్తికరమైన పరిష్కారం అందించడమే లక్ష్యంగా, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న అర్జీల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్థికపరమైన అంశాలపై వచ్చిన అర్జీలను కూడా నిబంధనల ప్రకారం పరిష్కరించాలని, ఏ అర్జి కూడా ఎస్ఎల్ఏ గడువు దాటి పెండింగ్లో ఉండకూడదని స్పష్టం చేశారు. ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్పై దృష్టి.. ప్రభుత్వ శాఖల సేవలపై ఐవీఆర్ఎస్ సర్వేలో ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన రాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించడంతో పాటు సేవల నాణ్యతను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, ఇన్చార్జి డీఆర్ఓ ఎం.అరుణ, ఎస్డీసీ ఈ.మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. -
వాలీబాల్ పోటీలకు జిల్లా జట్టు పయనం
కొత్తవలస: తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు జిల్లాకు చెందిన బాలికల జట్టు సోమవారం పయనమైంది. ఈ సందర్భంగా కోచ్, కంటకాపల్లి హైస్కూల్ పీడీ సీహెచ్ అమరావతి మాట్లాడుతూ.. హైస్కూల్ స్థాయికి సంబంధించి అండర్–17, జూనియర్ కళాశాలకు సంబంధించి అండర్–23 జట్లు బయలుదేరాయని చెప్పారు. రాష్ట్రస్థాయిలో రాణించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వాలని ఆమె ఆకాంక్షించారు. వన్నలిలో పట్టపగలే చోరీ● నాలుగు తులాల బంగారం, రూ. 60 వేల నగదు అపహరణరేగిడి: మండలంలోని వన్నలిలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చోరీ జరగడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. గ్రామానికి చెందిన బెవర నర్సింహులు, బెవర లక్ష్మి, బెవర సాయికుమార్ ఇంటకి తాళం వేసి, పక్కనే ఉన్న గజాలకు తాళం చెవి పెట్టి పొలం పనులకు వెళ్లిపోయారు. దీన్ని గమనించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి, బీరువా తెరిచి రూ. 60 వేల నగదు, నాలుగు తులాల బంగారు ఆభరణాలు తీసి, ఎప్పటిలాగే తాళాలు వేసి వెళ్లిపోయారు. సాయంత్రానికి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు కూలీలకు డబ్బులు చెల్లించేందుకు బీరువా తెరవగా.. అందులో డబ్బులు, బంగారు వస్తువులు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. ఇంటికి ఎవరైనా వచ్చారా అంటూ వాకబు చేయగా.. ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీపై వచ్చి ఇంటి వద్ద ఆగారని.. అదే సమయంలో భోజనానికి వచ్చిన కొంతమంది రైతులు తెలిపారు. దీంతో బాధితుడు నర్సింహులు రేగిడి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై పి. బాలకృష్ణ, సిబ్బందితో గ్రామానికి వచ్చి ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
ఘనంగా జాతీయ భూగర్భ శాస్త్రవేత్తల దినోత్సవం
విజయనగరం అర్బన్: జాతీయ భూగర్భ శాస్త్రవేత్తల దినోత్సవాన్ని స్థానిక ఎంఆర్ కశాళాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అస్సాం రాష్ట్ర ఓఎన్జీసీ సూపరింటిండెంట్ జియాలజిస్ట్ సంతోష్ యలమంచి మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో జియాలజిస్టుల ప్రాధాన్యం వెలకట్టలేనిదన్నారు. ముఖ్యంగా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ వంటి సహజ వనరుల అన్వేషణలో వారి పాత్ర ఎంతో ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోస్టర్ ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ముఖ్య అతిథిని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సాంబశివరావు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భూగర్భ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ టేకు శంకరరావు, అధ్యాపకులు డాక్టర్ పి.గణపతి, కె.సత్యనారాయణనాయుడు, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
త్వరితగతిన విచారణ
● ఎస్పీ ఏఆర్ దామోదర్ ● పీజీఆర్ఎస్లో 23 ఫిర్యాదుల స్వీకరణవిజయనగరం టౌన్: హత్య కేసుల్లో త్వరితగతిన విచారణ ప్రారంభించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 23 అర్జీలు స్వీకరించారు. రాజాం పోలీస్స్టేషన్ పరిధిలో 2023లో జరిగిన యాగిరెడ్డి కృష్ణ హత్య కేసుకు సంబంధించి ఇంతవరకు విచారణ చేపట్టలేదని కృష్ణ కుమారుడు యాగిరెడ్డి శ్రావణ్కుమార్ ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన వెంటనే రాజాం సీఐకి ఫోన్ చేసి త్వరితగతిన విచారణ చేపట్టాలని ఆదేశించారు. అనంతరం భూ తగాదాలకు సంబంధించి 12, కుటుంబ తగాదాలకు సంబంధించి రెండు, చీటింగ్ ఆరు, ఇతర అంశాలకు సంబంధించి మూడు ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కుమారస్వామి, ఎస్బీ సీఐ లీలారావు, ఎస్సై ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి
● ఎస్పీ మాధవ్రెడ్డి ● 15 అర్జీల స్వీకరణపార్వతీపురం రూరల్: సామాన్యుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, చట్టపరిధిలో వాటికి సత్వర పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి అన్నారు. స్థానిక పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన 15 వినతులు స్వీకరించారు. అర్జీదారులు వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు, భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, వేధింపులు, మోసాలకు సంబంధించిన సమస్యలను ఈ సందర్భంగా ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే అందిన ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో పోలీస్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సై శిరీష, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన బకాయి గొడవ..
నెల్లిమర్ల రూరల్: ఒకే కడుపున పుట్టిన అన్నదమ్ముల అనుబంధం.. కేవలం రూ.6 వేల బకాయి విషయంలో తలెత్తిన వివాదంతో విషాదంగా ముగిసింది. ట్రాక్టర్ డబ్బుల విషయంలో చిన్నగా మొదలైన గొడవ.. మాటామాటా పెరిగి కోపాన్ని రగిల్చింది. చివరికి ఒక వ్యక్తి మరణానికి కారణమైంది. ఈ సంఘటనపై ఎస్సై గోపాలరావు, స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలంలోని వల్లూరు గ్రామానికి చెందిన సిరుగుడి రామారావు (60), సిరుగుడి అప్పలనారాయణ సొంత అన్నదమ్ములు. తమ్ముడు రామారావుకు చెందిన ట్రాక్టర్ను గతంలో పొలం పనులకు ఉపయోగించుకున్నందుకు గాను అప్పలనారాయణ ఆరు వేల రూపాయలు బకాయి పడ్డాడు. ఇదిలా ఉంటే సోమవారం ఉదయం అప్పలనారాయణ పొలం పనులకు వేరే ట్రాక్టర్ను ఏర్పాటు చేసుకోవడంతో తమ్ముడు రామారావు ప్రశ్నించాడు. బకాయి చెల్లించకుండా వేరే ట్రాక్టర్ ఎందుకు పెట్టుకున్నావని అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి అన్నదమ్ముల మధ్య మాటామాటా పెరిగింది. అదే సమయంలో అప్పలనారాయణ కుమారుడు సిరుగుడి శ్రీను కర్రతో చిన్నాన్న రామారావు తలపై బలంగా కొట్టాడు. విషయం తెలుసుకున్న రామారావు కుమారుడు పవన్ సంఘటనా ప్రాంతానికి వెళ్లి తండ్రిని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. అక్కడకు కొద్దిసేపటికే రామారావు మృతి చెందాడు. దీంతో వల్లూరులో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం తెలుసుకున్న సీఐ దుర్గాప్రసాద్ గ్రామానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూ. ఆరు వేల కోసం అన్నదమ్ముల మధ్య వివాదం చిన్నాన్నపై అన్నయ్య కుమారుడి దాడి కొద్ది సేపటిలోనే ఆయన మృతి -
నేత్రదానం దేవుడిచ్చిన వరం
పార్వతీపురం రూరల్: అంధుల పట్ల కేవలం సానుభూతి చూపడం కన్నా.. వారికి చూపుని చ్చే నేత్రదానం చేయడ మే అత్యుత్తమమని జిల్లా నేత్ర వైద్య అధికారి డాక్టర్ నగేష్రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 కోట్ల మంది కంటి చూపునకు నోచుకోక చీకట్లో మగ్గుతుండగా, ప్రతి ఐదు సెకన్లకూ ఒకరు అంధులవుతున్నారన్నారు. వీరిలో 7.1 శాతం మంది కేవలం కార్నియా (నల్లగుడ్డుపై మచ్చలు) సమస్యలతోనే చూపు కోల్పోతున్నారని, ఆధునిక వైద్య శాస్త్రంలో ’కా ర్నియా గ్రాఫ్టింగ్’ అనేది ఒక అద్భుత వరంగా పేర్కొన్నారు. మనిషి చనిపోయిన ఆరు గంట లలోపు కార్నియాను సేకరించి, 24 గంటలలోగా అంధులకు అమర్చడం వల్ల కంటి చూపు ను ప్రసాదించవచ్చని వివరించారు. నేత్రదానంపై ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు ‘ 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు’ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సంద ర్భంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సు లు, చైతన్య ర్యాలీలు ముమ్మరంగా చేపడుతున్నామని తెలిపారు. 80 శాతం అంధత్వాన్ని నివారించే అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్క రూ మరణానంతరం నేత్రదానం చేసి అంధుల జీవితాల్లో నవ వసంతం నింపాలని నగేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘రికార్డు’ స్థాయిలో జానపద కళాకారుల ప్రదర్శన బొబ్బిలి: పట్టణంలో ఈ నెల 22న 330 మంది జానపద కళాకారులతో నృత్యాలు, ర్యాలీ ప్రదర్శనను జీనియస్ బుక్, గోల్డెన్ బుక్లు గుర్తించాయి. గిన్నిస్ బుక్ ప్రదర్శనకు అర్హత సర్టిఫికెట్లు అందజేశాయి. దీనిపై కళాకారులు కోల బలరాం, మరిపి శంకరరావు, చుక్క కూర నా యుడు, బి.మధుసూదనరావు, గొట్టాపు సన్యాసినాయుడు, తెర్లి పద్మ, పి. సత్యం, ఎం.రమేష్ హర్షం వ్యక్తంచేశారు. సర్టిఫికెట్లను ఎమ్మెల్యే బేబినాయనకు సోమవారం అందజేశారు. నేడు రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుని రాక విజయనగరం టౌన్: రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.త్రివిక్రమరావు ఈ నెల 25న మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారని తెలుగు భాషా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29న గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని 25న తెలుగు సాహిత్య సాంస్కృతిక వైభవం పేరుతో తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సన్ స్కూల్లో నిర్వహిస్తున్న ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి విజయనగరం ఫోర్ట్: డైరెక్టర్ ఆఫ్ మెడికల్హెల్త్ (డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ సెకెండరీ హెల్త్ (డీఎస్హెచ్), డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్)లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఏపీ మెడికల్, హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజకు వినతిపత్రం అందజేశారు. రెగ్యులరైజేషన్ పక్రియ పూర్తయ్యేవరకు కాంట్రాక్టు ఉద్యోగులకు 100 శాతం గ్రాస్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మరణించిన ప్రతి కాంట్రాక్టు ఉద్యోగికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఈపీఎఫ్ సౌకర్యం, అనార్యోగానికి గురైన ఉద్యోగులకు పూర్తిజీతంతో కూడిన సెలవులు ఇవ్వాలని కోరారు. -
● కూలిన పాఠశాల ప్రహరీ
● సెలవు రోజు కావడంతో తప్పిన ముప్పుకూలిన పాఠశాల ప్రహరీమక్కువ: మండలంలోని కోన ఉన్నత పాఠశాల ప్రహరీ కూలిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రహరీ నానిపోవడంతో, మరుగుదొడ్లు పక్కనున్న భాగం పొలం వైపు కూలిపోయింది. ఈ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు సుమారు 280 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల ప్రహరీ కూలి ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన సాలూరులో చోటుచేసుకున్న సంఘటన తెలిసిందే. అయితే కోనలో ఆదివారం నాడు కూలిపోవడంతో ప్రమాదం తప్పిందని విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రహరీ పడిపోయిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు హెచ్ఎం బి. సాయిలక్ష్మి విలేకరులకు తెలిపారు. -
కూటమి అండతోనే జర్నలిస్ట్పై దాడి
విజయనగరం గంటస్తంభం: కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులపై దాడులు ఎక్కువయ్యాయని జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అక్రమాలు వెలికితీస్తున్నాడనే అక్కసుతో పూసపాటిరేగ విశాలాంధ్ర విలేకరి గోవింద్పై కూటమి నాయకులు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, వామపక్ష, విపక్ష నేతలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. దాడి గురించి మాట్లాడేందుకు ఎస్పీని సంప్రదించాలని ప్రయత్నిస్తున్నా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితేమిటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. నిరసనలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పీఎస్ఎస్వీ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు వి.మహాపాత్రో, కమిటీ చైర్మన్ ఎలిశెట్టి సురేష్కుమార్, నాయకులు అల్లు యుగంధర్, కొప్పర గాంధీ, టి.రాధాకృష్ణ, సన్యాసిరావు, శేషగిరిరావు, పంచాది అప్పారావు, నర్సింగరావు, సముద్రాల నాగరాజు, లక్ష్మణరావు, రాము, రమణ, శంకరరావు, జాప్ నాయకులు అవనాపు సత్యనారాయణ, రవి, ఫెడరేషన్ నాయకులు బురాడ శ్రీనివాసరావు, ఎంఎంఎల్ నాయుడు, మహిళా జర్నలిస్ట్ విజయలక్ష్మి, సీపీఐ నేతలు ఒమ్మి రమణ, బుగత అశోక్, రంగరాజు, ఏఐఎస్ఎఫ్ నాయకులు నాగభూషణం, సుమన్, గణేష్, చరణ్, ఏఐవైఎఫ్ నాయకుడు బూర వాసు, కాంగ్రెస్ నేత శ్రీనివాస్, అంబేడ్క రైట్స్ అధ్యక్షుడు పీవీ రమణతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాలాంధ్ర విలేకరి గోవింద్పై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి ప్రభుత్వం తీరును నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు, ప్రజా సంఘాల నిరసన -
సర్కారు ఆటలు!
మంగళవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2026విద్యార్థుల భవితతో.. ●వీరఘట్టం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 324 మంది విద్యార్థులు ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో చాలామంది హైస్కూల్ స్థాయిలో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొన్నవారే. ఇక్కడ వ్యాయామ అధ్యాపకుడు లేరు. ఆటల్లో తర్ఫీదునిచ్చేవారు కరువయ్యారు. ●పాలకొండలోని బాలికల జానియర్ కళాశాల్లో 360 మంది, బాలుర జూనియర్ కళాశాల్లో 524 మంది చదువుతున్నారు. వీరిలో పాఠశాల స్థాయిలో ఎన్నో క్రీడలు ఆడిన వారు ఉన్నారు. అయితే, ఇక్కడ కూడా పీడీ (ఫిజికల్ డైరెక్టర్) పోస్టు ఖాళీగా ఉండడంతో వీరంతా ఆటలకు దూరమయ్యారు. నాకు అథ్లెటిక్స్ అంటే ఎంతో ఇష్టం. టెన్త్ చదువుతున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో 8 కి. మీ, 6 కి.మీ పరుగు పందెంలో పాల్గొని సత్తాచాటాను. ఇంటర్లో చేరిన తర్వాత పూర్తిగా ఆటలకు దూరమయ్యాను. – వి.లీలాప్రసాద్, ఇంటర్ విద్యార్థి, వీరఘట్టం -
జూడాల సమ్మెతో రోగులకు అవస్థలు
● నర్సింగ్ విద్యార్థుల సేవలే దిక్కు ● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం విజయనగరం ఫోర్ట్: జూనియర్ వైద్యుల సమ్మెతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయి. నర్సింగ్ విద్యార్థుల సేవలతోనే రోగులు సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జూనియర్ వైద్యుల సమస్య పరిష్కారానికి చంద్రబాబు సర్కారు పట్టించకోవడం లేదు. స్టైఫండ్ పెంచేవరకు విధుల్లో చేరేది లేదని జూనియర్ వైద్యుల తేల్చిచెబుతున్నారు. ఇరువర్గాలు దిగిరాకపోవడం రోగులకు శాపంగా మారింది. వాస్తవంగా ఆస్పత్రిలో ఎక్కవ సేపు జూనియర్ వైద్యులే సేవలు అందిస్తారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రోగులకు సూచించిన చికిత్సను అమలు పరిచేది జూనియర్ వైద్యులే. రోగులకు రక్తం, ప్లేట్ లెట్స్ ఎక్కించడం, ఇంజిక్షన్లు చేయడం, ముఖ్యంగా రోగులకు డ్రెస్సింగ్ చేయడం తదితర అన్ని సేవలు వీరు అందిస్తారు. ప్రస్తుతం వీరు తమ సమస్యల పరిష్కారం కోసం ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీనివల్ల జూనియర్ వైద్యులు అందించాల్సిన సేవలను నర్సింగ్ విద్యార్థులతో అందిస్తున్నారని, ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్న రోగుల నుంచి వినిపిస్తోంది. -
దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురం: విపత్తు, నిర్వహణ రంగంలో విశేష సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘సుభాష్ చంద్రబోష్ ఆపద ప్రబంధన్ పురస్కార్–2027’ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విపత్తు నివారణ, ముందస్తు సన్నాహాలు, సహాయక చర్యలు, అవగాహన, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలలో ప్రతిభ చూపిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ రంగాల నుంచి కనీసం ఐదు ఉత్తమ నామినేషన్లు సమర్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులు నిర్ణీత పోర్టల్ ద్వారా గడువులోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అధికార లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు గుర్ల: మండలంలోని భూపాలపురం గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ శీర రమణ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనతంరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గ్రామానికి సోమవారం తీసుకురాగా.. ఏఆర్ అడిషనల్ ఎస్పీ కిరణ్కుమార్, డీఎస్పీ రాఘవులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టారు. ఈ సమయంలో పోలీసులు మమూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు, జెడ్పీటీసీ సభ్యుడు శీర అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, తదితరులు కూడా మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోయిన బ్యాగ్ అందజేత రాజాం సిటీ: ఆర్టీసీ బస్సులో పోగొట్టుకున్న హ్యాండ్బ్యాగ్ను రాజాం పోలీసులు సోమవారం బాధిత మహిళకు అందజేశారు. సీఐ నవీన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులో స్వాతి అనే మహిళ ఆదివారం రాజాం వచ్చారు. ఈక్రమంలో తులంన్నర బంగారం, రూ. 8 వేలు ఉన్న హ్యాండ్ బ్యాగ్ను బస్సులో మర్చిపోయి దిగిపోయింది. కొద్దిసేపటికే బ్యాగ్ మరిచిపోయిన విషయం తెలుసుకుని బస్సుకోసం వెతకగా.. అప్పటికే ఆ బస్సు వెళ్లిపోయింది. దీంతో ఆమె స్థానిక పోలీసులను ఆశ్రయించగా.. సీసీ కెమెరాల ద్వారా బస్సును గుర్తించిన పోలీసులు సంబంధిత డ్రైవర్ను సంప్రదించారు. సీట్ల మధ్యలో బ్యాగ్ ఉందని గుర్తించిన డ్రైవర్ దాన్ని పోలీసులకు అప్పగించగా.. వారు బాధిత మహిళకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. లైసెన్స్ తుపాకులు డిపాజిట్ చేయాలి ● ఎస్పీ ఏఆర్ దామోదర్ విజయనగరం టౌన్: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు. లైసెన్స్ తుపాకులు కలిగిన వ్యక్తులు తమ ఆయుధాలను సంబంధిత పోలీస్స్టేషన్లో డిపాజిట్ చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి, ప్రజలతో మమేకం కావాలని సూచించారు. డిపాజిట్ చేసిన ఆయుధాలను నిబంధనల ప్రకారం జిల్లా కేంద్రంలోని ఆయుధగారానికి తరలించి, సురక్షిత కస్టడీలో ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
విజయనగరం టౌన్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన వన్టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి సోమవారం స్థానిక వన్టౌన్ పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ధర్మపురి గ్రామానికి చెందిన కొయ్యాన దిలీప్ (19) ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో బైక్పై ఇంటికి వెళ్తుండగా.. పట్టణంలోని పీజీ స్టార్ హాస్పిటల్ వద్ద బైక్ అదుపు తప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై మృతి చెందాడు. మృతుని సోదరుడు కొయ్యాన జానకీరామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్సీ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సంగమేశ్వరుని సన్నిధిలో నాగుపాము కలకలం
వంగర మండలం సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నాగుపాము కలకలం సృష్టించింది. ఆలయం గర్భగుడిలో ప్రధాన అర్చకుడు సిద్ధాంత గణపతి పూజలు చేస్తున్న సమయంలో నాగుపాము దర్శనమిచ్చింది. వీటిని చూసిన భక్తులు బయటకు పరుగులు తీశారు. శివ సన్నిధిలో నాగుపాము దర్శనమివ్వడం, భక్తులు ఒకింత అదృష్టంగా భావించినప్పటికీ, భారీ నాగుపాము కావడంతో భక్తులు భయాందోళన చెందారు. అర్చకులు నాగుపామును సమీప తోటల్లోకి మళ్లించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. – వంగర -
పోలీసుల పల్లె నిద్ర
పార్వతీపురం రూరల్: క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం ‘పల్లె నిద్ర’కు శ్రీకారం చుట్టింది. ‘మన్యంతో మమేకం– మీతో మేము.. మీరే మేము’ అన్న స్ఫూర్తిదాయక నినాదంతో నర్సిపురం ఎంపీపీ పాఠశాలలో సోమవారం రాత్రి ఈ కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రక్షకభటులపై ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పుతూ, గ్రామాల్లో తలెత్తే చిరువివాదాలు శాంతిభద్రతలకు విఘాతంగా మారకముందే పరిష్కరించుకునేందుకు ఈ కార్యక్రమం ఓ వారధిలా నిలుస్తుందని ఎస్పీ స్పష్టం చేశారు. యువత పెడదారిన పడొద్దని, మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యకలాపాలకు ఆమడదూరంలో ఉంటూ సముజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని హితవు పలికారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళా భద్రత, సైబర్ నేరాలు, అత్యవసర టోల్ ఫ్రీ నంబర్లపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ‘ఇంటింటికీ.. మన్యం పోలీస్’ పేరిట గడపగడపకూ వెళ్లి కరపత్రాలు పంచి, ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు. ఈ మేరకు స్థానిక సచివాలయంలో ఎస్పీ రాత్రి బస చేశారు. ఎస్పీ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా అధికారులు పల్లెబాట పట్టి, గ్రామాల్లోనే రాత్రి బస చేస్తూ ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తున్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ పి.రంగనాథం, ఎస్సై రాజేష్, సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
పైడితల్లి పండగ తేదీలు ఖరారు
విజయనగరం టౌన్: సిరులతల్లి పైడితల్లి పండగ వస్తుందంటే అందరికీ ఆనందమే. ఆ తల్లి కరుణా, కటాక్ష వీక్షణాల కోసం ఎందరో భక్తులు వేచిచూస్తుంటారు. సిరిమానును చూసి ఆ తల్లి ఆశీర్వాదం పొందుతారు. జీవితంలో ఒక్కసారైనా అమ్మజాతరను చూడాలని పరితపిస్తుంటారు. అంతటి ప్రాశస్త్య్రం కలిగిన పైడితల్లి నెలరోజుల పండగ తేదీలు ఖరారయ్యాయి. రాష్ట్రపండగకు అధికారయంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. పైడితల్లి అమ్మవారి కార్యాలయం ఆవరణలో ఈ ఏడాది పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకు సంబంధించిన వివరాలను దేవదాయశాఖ సహాయ కమిషనర్, ఆలయ ఈఓ కె.శిరీష సోమవారం వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు జాతర అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 11 వరకూ నెలరోజుల పండగ సాగనుంది. అక్టోబర్ 1న గురువారం ఉదయం 8 గంటలకు చదురుగుడి వద్ద మండల దీక్షలు ప్రారంభమవుతాయి. అనంతరం అదేరోజు చదురుగుడి ఆవరణలో 9.30 గంటలకు, వనంగుడి ఆవరణలో ఉదయం 11 గంటలకు పందిరిరాట వేసి ఉత్సవాలు ప్రారంభిస్తారు. అక్టోబర్ 22న గురువారం అర్ధమండల దీక్షలు నిర్వహిస్తారు. అక్టోబర్ 26న సోమవారం తొలేళ్ల ఉత్సవం, 27న మంగళవారం సిరిమానోత్సవం నిర్వహణకు తేదీలు ఖరారు చేశారు. నవంబర్ 3న మంగళవా రం పెద్దచెరువులో అమ్మవారి తెప్పోత్సవం, 7న శనివారం సాయంత్రం 5.30 గంటలకు రైల్వేస్టేషన్ వద్ద వనంగుడి నుంచి అమ్మవారి కలశ జ్యోతుల ఊరేగింపు, 10న మంగళవారం చదురుగుడి వద్ద ఉయ్యాల కంబాల మహోత్సవం, 11న బుధవారం వనంగుడి ఆవరణలో చండీహోమం, పూర్ణాహుతి, దీక్షావిరమణలు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయని ఈఓ తెలిపారు. పండగ షెడ్యూల్ ప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ట్రస్టు బోర్డు సభ్యులు కె.ఠామేశ్వరరావు, డి.కృష్ణమూర్తి, కె.గోపాలరెడ్డి, పి.రామయ్య పంతులు, ఎల్.స్వాతి కుమారి, ఎల్.కుమారి, వి.వెంకటలక్ష్మి, కె. తులసి, డి.పద్మావతి, తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 1 నుంచి మండల దీక్షలు, పందిరిరాటతో ప్రారంభం అక్టోబర్ 26న తొలేళ్ల ఉత్సవం, 27న సిరిమానోత్సవం ఉత్సవ వివరాలు వెల్లడించిన ఆలయ ఈఓ కె.శిరీష -
పీజీఆర్ఎస్కు పోటెత్తిన అర్జీదారులు
● వివిధ సమస్యలపై 211 వినతుల స్వీకరణ ● సమస్యలు పరిష్కరించండి :కలెక్టర్ విజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లో వచ్చిన ప్రతి వినతినీ క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాలని సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్–రెవెన్యూ క్లినిక్లో మొత్తం 211 వినతులు స్వీకరించగా..అందులో 106 రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ, సర్వే సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ, భూ సర్వే, తదితర సమస్యలకు సంబంధించిన వినతులు అధికంగా వస్తున్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమస్య పరిష్కరించిన తర్వాత అర్జీదారుడితో నేరుగా మాట్లాడి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. వారితో మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికలో తప్పనిసరిగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. 1100 ఫిర్యాదులపైనా దృష్టి.. టోల్ఫ్రీ నంబర్ 1100 ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. అర్జీదారుడితో మాట్లాడి సమస్యను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నివేదిక ఇవ్వాలని సూచించారు. అలాగే 1100 సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా వచ్చిన వినతులు.. రెవెన్యూ శాఖకు 106, పంచాయతీరాజ్–31, డీఆర్డీఏ–14, విద్యశాఖ–05, మున్సిపల్–19, గ్రామ సచివాలయం–09, ఇతర శాఖలు–21, విద్యుత్–04, గృహనిర్మాణం–01, వైద్యారోగ్యశాఖకు ఒక వినతి వచ్చింది. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఇ.మురళి, జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎస్.వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు అరుణకుమారి, సూర్యకళ, సీపీఓ బాలాజీ, జిల్లా సర్వే ఎ.డి ఆర్.విజయకుమార్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి, హౌసింగ్ పీడీ మురళీమోహన్, డీపీఓ మల్లికార్జునరావు, డీఎంహెచ్ఓ జీవనరాణి, కలెక్టరేట్ ఏవో దేవీప్రసాద్, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నిర్ణీత గడువులోగా.. పార్వతీపురం: ప్రజలు తెలియజేసే సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాల నుంచి వచ్చిన 106 వినతులను జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి, తదితరులతో కలిసి స్వీకరించారు. వీటిలో 33 అర్జీలు రెవెన్యూకు సంబంధించినవి కాగా 73 ఇతర దరఖాస్తులు ఉన్నాయి. గ్రామీణ రహదారులకు మరమ్మతులు, దివ్యాంగుల పింఛన్లు, భూ ఆక్రమణలు, వెబ్ల్యాండ్లో భూమి వివరాల నమోదు, తదితర అంశాలపై అర్జీలు అందాయి. ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
న్యాయం చేయండి..
మా పూర్వీకులకు బతుకుదెరువు కోసం ప్రభుత్వం ఇచ్చిన సీలింగ్ భూమిని టీడీపీ నేతలు దౌర్జన్యంగా లాక్కున్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా, ఆర్డీఓ కోర్టులో కేసు నడుస్తున్నా ఖాతరు చేయకుండా రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపడుతున్నారు. ఫిర్యాదులు చేసినా అధికారులు అధికార పార్టీ నేతలకే కొమ్ముకాస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేసి, మా భూములు మాకు అప్పగించి న్యాయం చేయాలి. – బెల్లాన మధుసూదనరావు, బాధితుడు, గాజులరేగ -
విజయనగరం అమ్మాయినే.. ఆశీర్వదించండి
● హీరోయిన్ శ్వేతాలక్ష్మణ్ విజయనగరం టౌన్: విద్యలనగరమైన విజయనగరంలో పుట్టి, పెరిగి చిత్రసీమలో తనదైన శైలిలో రాణిస్తున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ లక్ష్మణ్ కుమార్తె శ్వేతాలక్ష్మణ్ హీరోయిన్గా నటించిన ‘ సహ ’ చిత్రం మెగా ఈవెంట్ గురజాడ కళాభారతిలో ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సహ (లైఫ్ ఆఫ్ సంజు) చిత్రంతో ప్రజల ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ చిత్రం సెప్టెంబర్ 4న విడుదలవుతుందన్నారు. పెద్ది మూవీలో హీరోయిన్ జాన్వీకపూర్ ఫ్రెండ్గా నటించానని తెలిపారు. దర్శకుడు నిషాంత్, నిర్మాత తేజ, హీరో శివకుమార్, గాయని శ్రీవల్లి, తదితరులు పాల్గొన్నారు. -
పచ్చ రాబందుల పంజా..
దళితుల భూములపై..విజయనగరం గంటస్తంభం: నిరుపేద దళితులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం కేటాయించిన భూములపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ సీలింగ్ (ఎల్సీసీ) భూమిని అడ్డగోలుగా ఆక్రమించి, నిబంధనలను కాలరాస్తూ దర్జాగా నిర్మాణాలు సాగిస్తున్న తీరు విజయనగనరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్డీఓ కోర్టు వివాదంలో ఉన్న భూమి అని తెలిసినా, సాక్షాత్తూ అధికార పార్టీ రాష్ట్ర స్థాయి నేత అండదండలు ఉండడంతో అధికారులు కిక్కురుమనకుండా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పచ్చ నేతల రియల్ దందా.. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని గాజులరేగలో (బీటీఆర్ కాలనీ సమీపంలో) గల సర్వే నంబర్లు 82–3 (0.90 ఎకరాలు), 82–4 (0.85 ఎకరాలు), 82–5 (0.65 ఎకరాలు)లలో మొత్తం 2.40 ఎకరాల భూమిని 1982లో అప్పటి ప్రభుత్వం నిరుపేద దళితులకు వ్యవసాయం చేసుకునేందుకు ల్యాండ్ సీలింగ్ (ఎల్సీసీ) కింద కేటాయించింది. ప్రభుత్వ రికార్డుల్లోనూ ఈ భూములు సీలింగ్ భూములు–ప్రభుత్వ భూమిగానే నమోదై ఉన్నాయి. అయితే కాలక్రమేణా ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటడంతో స్థానిక టీడీపీ పెత్తందారులు, నాయకుల కన్ను ఈ స్థలంపై పడింది. దళిత లబ్ధిదారులను బెదిరించి, మోసగించి ఆ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని గాజులరేగలో యథేచ్ఛగా భూ ఆక్రమణలు 82లో 3, 4, 5 సర్వే నంబర్లలోని 2.40 ఎకరాల ఎల్సీసీ భూమి స్వాహా గతంలో పీఓటీ నోటీసులు ఇచ్చినా ఆగని కబ్జాల పర్వం అక్రమార్కులకు అండగా అధికార పార్టీ రాష్ట్ర స్థాయి నేత చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ, మున్సిపల్ యంత్రాంగం -
ఇదేం తీరు..!
సోమవారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2026పాలకులూ.. ● విద్యాహక్కు చట్ట సవరణకు యూటీఎఫ్ డిమాండ్ ● 26 నుంచి బైక్ యాత్రలు.. 31న చలో విజయవాడ ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించి గిరిజన సమస్యలపై చర్చించడానికి ప్రజాప్రతినిధులకు తీరిక లేకపోవడం విడ్డూరంగా ఉంది. పలు సమస్యలతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలి. సమస్యలతో సతమతమౌతున్న గిరిజనులను ఆదుకోవాల్సిన అవసరం పాలకులపై ఉంది. – విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ నేడు పీజీఆర్ఎస్ పార్వతీపురం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్టు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ రోజు ప్రజల నుండి వినతులను స్వీకరించేందుకు సెల్లార్లో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అర్జీలను మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అర్జీల నమోదు, అర్జీల స్థితి దానికి సంబంధించి సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100కు నేరుగా కాల్ చేయవచ్చునన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పీజీఆర్ఎస్ కేంద్రాలలో క్యూఆర్ కోడ్ పీజీఆర్ఎస్ కేంద్రాల్లో ప్రజల ఫీడ్బ్యాక్ సేకరణ కోసం క్యూఆర్ కోడ్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల స్థాయి పీజీఆర్ఎస్ కేంద్రాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల వద్ద స్పష్టంగా కనిపించేలా క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు మొబైల్ ద్వారా స్కాన్ చేసి సేవలపై అభిప్రాయాలు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయనగరం గంటస్తంభం: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ – 2026లో భాగంగా జిల్లాలో చేపడుతున్న ఓటర్ల జాబితా పరిశీలన, సవరణ ప్రక్రియపై ఈ నెల 28న సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు రోణంకి గోపాలకృష్ణ రాజకీ య పార్టీల ప్రతినిధులతో సమావేశమవుతార ని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు, సవరణలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్టు తెలిపా రు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతిని ధులు సమావేశానికి హాజరై తమ సూచనలు, అభ్యంతరాలను పరిశీలకుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు. రామభద్రపురం: గిరిజన విద్యార్థులపై కూట మి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో గిరిజన విద్యార్థులకు అష్టకష్టాలు తప్పడం లేదు. తాజాగా మండలంలోని జన్నివలస పంచాయతీ పరిధి నేరళ్లవలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో గత ఏడాది వరకు ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వర కు తరగతులు నిర్వహించేవారు. ఈ విద్యా సంవత్సరం ఏమైందో తెలియదుగాని 8వ తరగతి ఎత్తేశారు. అక్కడ 8వ తరగతికి వచ్చిన పిల్లల ను మన్యం జిల్లాలోని పలు గిరిజన పాఠశాలలకు పంపించేశారు. దీంతో ఈ ప్రాంత చిన్నారులకు కష్టాలు తప్పడం లేదు. సీతంపేట: గిరిజనాభివృద్ధిలో ఐటీడీఏ వ్యవస్థ కీలకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతి ఏటా ఐటీడీఏకు కోట్లాది రూపాయిలు నిధులు మంజూరవుతాయి. క్షేత్ర స్థాయిలో పథకాల అమలు, తీరుతెన్నులు, ప్రతీ పథకం ఫలాలు గిరిజనులకు అందుతున్నాయా? సమస్యలు ఏమైనా ఉన్నాయా.. అని ప్రతీ మూడు నెలలకొకమారు ఐటీడీఏలో పాలకవర్గ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. దీనికి కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరై వివిధ సమస్యలను ప్రస్తావించి, పరిష్కార దిశగా కృషి చేయాల్సి ఉంది. జిల్లాలో రెండు ఐటీడీఏలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ రెండింటిలోనూ ఇంతవరకు ఎటువంటి గవర్నింగ్ బాడీ సమావేశాలు రెండేళ్లయినా నిర్వహించకపోవడం గమనార్హం. ప్రతీ మూడు నెలలకొకసారి తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉందనే నిబంధనలు ఉన్నాయి. సీతంపేట ఐటీడీఏ విషయానికి వస్తే ఇటు శ్రీకాకుళం పరిధిలో 16 మండలాలు, పార్వతీపురం మన్యం పరిధిలో 4 మండలాలు ఉన్నాయి. రెండు జిల్లాల్లోనూ ముగ్గురు మంత్రులున్నా ఈ పాలకవర్గ సమావేశాలు జరిపించకపోవడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చేసిన పనులపై సమీక్షించేందుకు ఐటీడీఏ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, ఎంపీపీలు జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్, జేసీ, జెడ్పీ చైర్మన్, ఐటీడీఏ పీఓతో పాటు జిల్లా అధికారులందరితో గిరిజన సంక్షేమ శాఖా మంత్రి ఆధ్వర్యంలో ఇంత కీలకమైన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జరగాలి. ఈ సమావేశాల నిర్వహణపై చంద్రన్న ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తుందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. వెంటాడుతున్న సమస్యలు స్థానిక ఐటీడీఏ పరిధిలో 1240కు పైగా గిరిజన గ్రామాలున్నాయి. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేటర్గా విశేష అధికారాలు ఉన్నాయి. గిరిజనులకు సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఐటీడీఏ ద్వారానే జరుగుతాయి. రూ.కోట్ల నిధులు గిరిజన సంక్షేమం కోసం ఖర్చు చేస్తారు. విశేషమేమిటంటే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు శాశ్వత పీవోను నియమించిన దాఖలాలు లేవు. సబ్ కలెక్టర్లతోనే ఐటీడీఏ పీఓలుగా ఇన్చార్జ్లుగా నియమిస్తున్నారు. పోనీ పాలకవర్గాలు నిర్వహించిన సరైన నిర్ణయాలు తీసుకుంటారా అంటే అదీలేదు. చాలా గ్రామాల్లో వివిధ రకాల సమస్యలు వెంటాడుతున్నాయి. రహదారులు, విద్య, వైద్యపరంగా అనేక సమస్యలున్నాయి. వీటిన్నింటిని పరిష్కరించాల్సి ఉంది. ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్లు లేక విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయి. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ద్వారా చేపడుతున్న నిర్మాణాలు సైతం నాణ్యత లోపాలతో పాటు మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యాలు లేక గిరిజనులు అల్లాడుతున్నారు. మలేరియా వంటి జ్వరాలు విజృంభిస్తున్నాయి. దోమతెరల పంపిణీ పూర్తి స్థాయిలో లేదు. మూడు లక్షల స్థానంలో కేవలం లక్ష లోపే పంపిణీ జరుగుతుంది. గిరిజన సహకార సంస్థ ద్వారా గిరిజనోత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేవు. కొండచీపుర్లుతో పాటు ఇతర ఉత్పత్తులు దళారీలకే విక్రయించాల్సిన పరిస్థితి ఉంది. సాగునీటి కోసం చెరువులు, చెక్డ్యాంలు వంటి నిర్మాణాలు లేవు. వెలుగు కార్యక్రమాలు చీకటి మయంగా మారాయి. ఇక్కడ ఉన్న టీపీఎంయూ (ట్రైబుల్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్)ను గతేడాది ఎత్తేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు గిరిజనులను వెంటాడుతున్నాయి. సంతకవిటి మండలం ప్రధాన నీటి వనరుల్లో రంగారాయపురం వద్దనున్న నారాయణపురం ఆనకట్ట ఒకటి. ఇందులో నీరు నిలవాలన్నా.. కాలువల్లోకి సాగునీరు తరలలన్నా.. షట్టర్లదే ప్రధాన భూమిక. ఈ ఆనకట్టలో మొత్తం 118 షట్టర్లు ఉన్నాయి. ఇవి నిలబడితేనే ఆనకట్టలో నీరు నిలుస్తుంది. నదిలో నీటిమ ట్టం పెరిగితే షట్టర్లు కిందపడిపోతాయి. ప్రస్తుత ఖరీఫ్లో ఎలినినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఆనకట్టలోకి వచ్చిన నీటిపై ఒత్తిడి పెరిగి నేరుగా కుడి కాలువలోకి ప్రవహించేలా స్లూయిస్ల నుంచి సాగునీరు కాలువల్లోకి మళ్లించే ప్రదేశం ముందున్న ప్రధాన షట్టర్లు పడిపోకుండా లష్కర్లు షట్టర్ల కు కర్రలు దన్నుగా నిలిపారు. దీంతో ఆనకట్ట దిగువ భూములతో పాటు కుడి ప్రధాన కాలువలోకి సాగునీరు పుష్కలంగా ప్రవహిస్తుంది. – సంతకవిటి టంగుటూరి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న జేసీ వైశాలి తదితరులుపార్వతీపురం: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలు చిరస్మరణీయమని జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో టంగుటూరి జయంతి వేడుకలలో భాగంగా ఆదివారం టంగుటూరి చిత్రపటానికి ఆమె పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకాశం పంతులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి గుళ్లకు ఎదురొడ్డి ఆంధ్రకేసరి అని పేరు పొందారని కొనియాడారు. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు ఎన్నికయ్యారని, ఆయన పాలనా కాలంలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేశారన్నారు. ఆయన సేవలకు గుర్తుగా 1972లో ఒంగోలు జిల్లాకు ‘ప్రకాశం జిల్లా’గా నామకరణం చేశారన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని, వారి చరిత్ర నేటి విద్యార్థులకు భోదించవలసిన అవసరం ఉందని తెలిపారు. జాతీయోద్యమంలో ఆయన పోషించిన పాత్ర, ప్రజా సేవలను స్మరించుకొన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె.హేమలత, సూపరింటెండెంట్లు శ్రీరామమూర్తి, వై.జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పైడిమారమ్మకు శ్రావణ సారె జరగని ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు రెండేళ్లయినా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం సమావేశాలను మరిచిన మంత్రులు మూడు నెలలకు ఓసారి నిర్వహించే నిబంధనలు ఏమయ్యాయి? గిరిజనాభివృద్ధి హుళక్కే..! -
టంగుటూరికి ఘన నివాళులు
పార్వతీపురం రూరల్: ‘ఆంధ్ర కేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, న్యాయ కోవిదుడిగా, రాజకీయవేత్తగా, పదునైన రచయితగా, సంపాదకుడిగా ఆయన అందించిన బహుముఖ సేవలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. త్యాగనిరతి, అకుంఠిత దీక్షతో జాతీయ స్థాయిలో తెలుగు నేల ఖ్యాతిని నలుదిశలా చాటిచెప్పిన రాజనీతిజ్ఞుడని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మృదంగంలో చిన్నారి ప్రతిభ విజయనగరం టౌన్: విజయనగరం రోటరీ దశిగి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ విద్యార్థి మరువాడ శ్రీధామ మృదంగంలో ప్రతిభ కనబరుస్తున్నాడు. కాకినాడ జేఎన్టీయూలో అఖిలం అనే సంస్థ ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బాలల ప్రతిభా ఉత్సవంలో జూనియర్ విభాగంలో ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాడు. ఈ మేరకు అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మండపాక రవి, అకాడమీ సభ్యులు, రొటేరియన్లు, అధ్యాపకులు చిన్నారిని అభినందించారు. చరిత్ర తిరగరాసేది మహిళలే..విజయనగరం టౌన్: ఆధునిక మహిళలు భారతదేశ చరిత్రను తిరగరాస్తారని, భగవంతుని దృష్టిలో ఉత్కృష్టమైన వస్తువు సీ్త్ర రత్నమేనని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆంధ్రోపన్యాసకులు డాక్టర్ ఎం.రమాగీతాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని గురజాడ గ్రంథాలయంలో విజయభావన సాహితీ మిత్ర సమాఖ్య ఆధ్వర్యంలో ఆధునిక సాహిత్యం–మహిళాభ్యుదయం అనే అంశంపై ఆదివారం సదస్సు నిర్వహించారు. ఆధునిక సాహిత్యం అంతా కందుకూరి, గురజాడ వంటి వారి బాటలో గొప్పగా నడిచిందన్నారు. చాలావరకు పితృస్వామ్య కరుణతో సీ్త్రలను రక్షించాలన్న భావన ప్రధానంగా ఉందని, అది దాటి తన సమస్యకు తానే సమాధానం చెప్పగలిగే స్థితికి మహిళ రావడానికి శతాబ్దం పట్టిందన్నారు. నేటి సమాజంలో ప్రముఖ స్థానాల్లో సీ్త్రలు ఉన్నప్పటికీ రెట్టింపు శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. ఇంటి బయట ఉద్యోగం, ఇంటి లోపల పితృస్వామ్య బాధ్యతను ప్రస్తుతం సీ్త్రలు మోస్తున్నారన్నారు. మహిళ అభ్యుదయంలో బహుళ కోణాలున్నాయని, విమలగారి వంటిల్లు కవిత, అబ్బూరి చాయాదేవి బోన్సాయి కథనంలో బలంగా చూపించారు. అనంతరం రమాగీతాదేవిని సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ జక్కు రామకృష్ణ, మహారాజ ప్రభుత్వ సంస్కృత కళాశాల అధ్యక్షుడు డాక్టర్ జి.జనార్దననాయుడు, ఇబ్రహీంఖాన్, ఎ.గోపాలరావు, సూర్యలక్ష్మి, ఇందిర, హరిప్రియ, అనూరాధ, శంకరం, నీలాద్రి, ప్రసాద్, సోమేశ్వరరావు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వరద పోటెత్తింది.. రోడ్డుకు గండిపడింది సీతంపేట: మండలంలోని పొల్ల గ్రామం సమీపంలో రోడ్డు కోతకు గురైంది. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు పొంగాయి. వరద ఉధృతికి రోడ్డుకు గండి పడింది. దీంతో గుమ్మలక్ష్మీపురం–పొల్ల మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నారు. -
వారు చెబితే ఒకే..!
ఏజెంట్లకు నో ఎంట్రెన్స్.. రవాణాశాఖలో అన్ని సేవలు ఆన్లైన్ చేయడం జరిగింది. ఏజెంట్లను కార్యాలయంలోకి రానివ్వడం లేదు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – మణికుమార్, డిప్యూటీ ట్రాన్సఫోర్ట్ కమిషనర్ విజయనగరం ఫోర్ట్: విజయనగరం మండలానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి రవాణా శాఖలో లైసెన్స్ కోసం నేరుగా వెళితే టెస్ట్ ఫెయిల్ అయ్యాడు. వారం రోజుల తర్వాత ఏజెంట్ ద్వారా వెళితే డ్రైవింగ్ టెస్ట్ పాసయ్యాడు. ఇందుకు గాను సదరు ఏజెంట్కు రూ.5 వేలు ఇచ్చినట్లు తెలిసింది. అలాగే గంట్యాడ మండలానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఎల్ఎల్ఆర్ కోసం రవాణశాఖకు నేరుగా వెళ్లాడు. దీంతో అతను కూడా టెస్ట్ ఫెయిలయ్యాడు. వారం రోజుల తర్వాత ఓ ఏజెంట్ ద్వారా వెళితే ఎల్ఎల్ఆర్ టెస్ట్ పాసయ్యాడు. ఇందుకు గాను ఏజెంట్కు రూ.1000 ఇచ్చినట్లు సమాచారం. రవాణశాఖలో నిత్యం ఇదే తంతు జరుగుతుందని వాహనదారులు చర్చించుకుంటున్నారు. ఇక్కడ ఏ పని కావాలన్నా ఏజెంట్ల ద్వారా వస్తేనే జరుగుతుంది. లేదంటే సిబ్బందికి కొంత ముట్టజెప్పాల్సి ఉంటుంది. రవాణశాఖలో అన్ని సేవలు అన్లైన్ చేసేశామని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. ఆన్లైన్ అనేది పేరుకే తప్ప పైసలు ఇవ్వనిదే ఇక్కడ ఏ పనీ జరగదనేది బహిరంగ సత్యం. నేరుగా వెళితే కష్టమే..! రవాణాశాఖ కార్యాలయంలో ఏ పని కోసం నేరుగా వెళ్లినా జరగడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఏజెంట్ ద్వారా వెళితే మాత్రం చాలా సులువుగా పని పూర్తవుతుంది. ఇక్కడి కార్యాలయంలో ఎల్ఎల్ఆర్లు, డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్లు , రిలీవింగ్ ఆర్డర్స్ జారీ, తదితర సేవలు అందుతున్నాయి. అధిక మొత్తంలో ఫీజులు వసూలు.. ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటికి వాహనదారుల నుంచి ఏజెంట్లు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్టు ఆరోపణులు వినిపిస్తున్నాయి. వాహనదారులు నుంచి వసూళ్లు చేసిన దాంట్లో కొంత మొత్తాన్ని ప్రతిరోజూ ఏజెంట్లు అధికారులకు ఇస్తుంటారు. ఎల్ఎల్ఆర్కు నిబంధనల ప్రకారం టూ వీలర్కు అయితే రూ. 300 , ఫోర్ వీలర్కు రూ. 360 వాహనదారుడు చెల్లించాలి. అయితే ఏజెంట్లు టూ వీలర్ ఎల్ఎల్ఆర్కు రూ. 800 నుంచి రూ. 1000 , ఫోర్ వీలర్కు అయితే రూ. 1000 నుంచి 1200 రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా టూవీలర్ డ్రైవింగ్ లైసెన్స్కు ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజు రూ. 900, ఫోర్ వీలర్కు రూ.1260 చెల్లించాలి. కాని టూవీలర్కు రూ. 4 వేలు, ఫోర్ వీలర్ అయితే రూ. 5 వేలు వరకు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రోడ్డు ప్రమాదాలకు గురైన వాహనాలకు రీలివింగ్ ఆర్డర్స్ ఇవ్వడానికి కూడ రూ.2 వేల నుంచి 4 వేల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణులు వినిపిస్తున్నాయి. ఏజెంట్ల ద్వారా వెళ్లే ఫైళ్లపై ప్రత్యేక కోడ్ రాస్తారు. ఈ కోడ్ ఉంటే రవాణా శాఖాధికారులు త్వరగా పని చేస్తారు. లేదంటే లేనిపోని కొర్రీలు వేసి ఫెయిల్ చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఏజెంట్ల బెడద నుంచి తమను కాపాడాలని పలువురు కోరుతున్నారు. రవాణశాఖలో ఏజెంట్లదే రాజ్యం ఎల్ఎల్ఆర్, లైసెన్స్లకు భారీగా వసూళ్లు ఎల్ఎల్ఆర్కు రూ. 1000, లైసెన్స్కు రూ. 4 వేల వరకు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణులు వెహికల్ రిలీవింగ్ ఆర్డర్స్కు కూడా డబ్బులు వసూలు వేస్తున్న వైనం -
● అడుగుకో గొయ్యి..!
గర్భాం – గరివిడి ప్రధాన రహదారి దుస్థితిమెరకముడిదాం: ఆ రహదారిలో ప్రయాణించాలంటే సర్కస్ ఫీట్లు చేయడమైనా రావాలి.. లేదా బైక్ జంపింగ్లు చేయడమైనా రావాలి అన్నట్టుగా తయారైంది గర్భాం – గరివిడి ప్రధాన రహదారి. ఈ రహదారిలో ప్రయాణించాలంటేనే వాహనచోదకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అడుగుకో గొయ్యి ఏర్పడడంతో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రహదారి మరీ అధ్వానంగా తయారైనా ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని పట్టించుకోక పోవడం బాధాకరం. ఇదిలా ఉంటే రహదారి మరమ్మతులకు రూ. 40 లక్షలు మంజూరైనట్లు తెలిసింది. అయితే ఇంతవరకు ఎందుకు పనులు చేపట్టడం లేదో పాలకులకే తెలియాలి. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్గా గర్భాం – గరివిడి రోడ్డు -
డోలపేట యువకుడి ప్రతిభ
రాజాం సిటీ: తాను తయారుచేసిన చిత్రాలయ యాప్కు గూగుల్ ప్లే స్టోర్లో చోటు లభించిందని పట్టణ పరిధి డోలపేటకు చెందిన చేబోలు సాయినిరంజన్ తెలిపారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. చిత్రాలయ యాప్ ప్రత్యేకతను వివరించారు. భువనేశ్వర్లో బీటెక్ చదువుకున్న తాను ఏదైనా కొత్తగా యాప్ను తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో యాప్ రూపొందించినట్లు చెప్పారు. ఎన్నో సందర్భాల్లో ఫొటోలు తీసుకున్నా అవి గెస్ట్లకు గాని, ఫొటోలు దిగిన వారికి గాని చేరవని తెలిపారు. అటువంటి ఇబ్బందుల్లేకుండా యాప్ను రూపొందించాలనే ఉద్దేశంతో రెండేళ్లు కష్టపడి చిత్రాలయ యాప్ను సొంతంగా రూపొందించానని తెలిపారు. ఏదైనా ఫంక్షన్ వద్ద ఈ యాప్కు సంబంధించిన క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తే.. మన సెల్ఫోన్తో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆ ఫంక్షన్కు సంబంధించిన అన్ని ఫొటోలు మన సెల్ఫోన్కు చేరడం ఈ యాప్ ప్రత్యేకత. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ
● ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలుపూసపాటిరేగ: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులో పనిచేసి ఇంటికి వెళ్తున్న ఇద్దరు కార్మికులు శనివారం రాత్రి స్థానిక జాతీయ రహదారి 16పై రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విమానాశ్రయం నిర్మాణంలో ఎల్అండ్టీ కంపెనీలో పనిచేస్తున్న తమ్మిన జయంతి కుమార్, పాలపర్తి రవీంద్ర పని ముగించుకుని రాత్రి 8.30 గంటల సమయంలో తమ ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. పూసపాటిరేగ మండల పరిధిలోని పోలిపల్లి గ్రామం వద్ద వారు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ను శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న లారీ (ఏపీ 31 టీహెచ్ 6669) వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవీంద్ర తలకు తీవ్ర గాయం కాగా జయంతికుమార్ కాలు విరిగిపోయింది. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను అనిల్ నీరుకొండ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం రవీంద్ర పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మెడికవర్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. సీఐ దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దడ పుట్టిస్తున్న ధరలు!
విజయనగరం ఫోర్ట్: మార్కెట్లో నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుత పాలకులు గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఏదైనా చార్జీలు స్వల్పంగా పెరిగినా.. బాదుడే బాదుడు.. అంటూ నానా యాగీ చేసేవారు. ప్రస్తుతం వారే అధికారంలో ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి సామాన్యు డి ధరా భారం కనీసం పట్టడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడికి అందనంత ౖపైపెకి ధరలు ఎగిసిపడుతున్నాయి. ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు... నాగులో నాగన్న..’ అని ఓ సినీ కవి రచించిన పాట మాదిరి తయారైంది ప్రస్తు త ధరల పరిస్థితి. సామాన్య, మధ్య తరగతి ప్రజ లు ఏం కొనాలన్నా తీవ్ర ఆందోళనకు గురవుతున్నా రు. అంతగా ఉల్లిపాయల నుంచి బియ్యం, బెల్లం, పంచదార, నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ధరల నియంత్రణలో విఫలం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు వాటి ని రాయితీపై తక్కువ ధరకు ప్రజలకు ప్రభుత్వం అందించాలి. దీని వల్ల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏవైనా ధరలు పెరిగితే రాయితీపై ప్రజలకు అందించేవారు. కానీ టీడీపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకి పెరుగుతున్నా.. పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నా రు. ధరలను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ధరలు పెరుగుతూ పోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర ధరలు పెరగడం గమనార్హం. బెల్లం ధర కేజీ రూ.55కు మించింది లేదు. ప్రస్తుతం బెల్లం కేజీ ధర రూ.70 అయింది. పంచదార రూ.48కు మించింది లేదు. ఇప్పుడు రూ. 75 అయింది. బియ్యం ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గతంలో సాంబమసూరి ఽకేజీ రూ.45 నుంచి రూ.50 ఉండేది. ఇప్పుడు రూ.60 నుంచి రూ.62 ఉంది. ఉల్లిపాయలు కేజీ రూ.20 ఉండేది. ప్రస్తుతం రూ. 55 అయింది. నూనె ధరలు కూడా పెరిగాయి. పామాయిల్ లీటర్ ధర రూ.115 ఉండేది. ఇప్పుడు రూ.135 అయింది. రిఫైండ్ ఆయిల్ ధర రూ.160 నుంచి రూ.190 అయింది. ఇలా మార్కెట్లో దేనికదే ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధరలు ఇలాగే కొనసాగితే తమ జీవనం మాటేంటని పాలకులను ప్రశ్నిస్తున్నారు. ఒకేసారి ఇంతగా ధరాభారం గతంలో ఎన్నడూ చూడలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం ధరలు పెరగడంతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ద్వారా బియ్యం అందిస్తున్నాం. పంచదార, బెల్లం, ఉల్లిపాయలు ఉత్పత్తి తక్కువ కావడంతో ధరలు పెరిగాయి. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ధరలు తగ్గే అవకాశం ఉంది. – బి.రవికిరణ్, ఏడీ, మార్కెటింగ్ శాఖ పంచదార, బెల్లం, బియ్యం, ఉల్లిపాయులు, నూనె ధర లు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఏది ముట్టుకున్నా షాక్ కొట్టే విధంగా ధరలు ఉన్నాయి. పెరిగిన నిత్యావసర వస్తువు లు అన్నీ ప్రతీ రోజు వినియోగించేవే. దీంతో ధరాభారం భరించలేకపోతున్నాం. – పి.గోవింద, పెదవేమలి గ్రామం, గంట్యాడ మండలం -
ఉద్యోగం పేరుతో మోసం
భామిని: మండల కేంద్రానికి చెందిన గిరిజన నిరుద్యోగి బిడ్డిక శివాజీని ఉద్యోగం పేరుతో మోసగించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు ఓ కూటమి నాయకుడు, మరో ఉపాధ్యాయుడు కారణమని తెలిసింది. వివరాల్లోకి వెళితే.. శివాజీ బీఎస్సీ, అగ్రికల్చర్ డిప్లమో చేశాడు. బాధితుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలుసుకున్న సాలూరు మండలం దత్తివలసకు చెందిన కూటమి నాయకుడు మజ్జి నారాయణరావు, రేగిడి మండలం కాగితాపల్లి ఎంపీపీ స్కూల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుడు పాలకొండ ప్రభాకర్ అతడ్ని కలిసి ఎఫ్సీఐలో ఉద్యోగం ఇస్తామని నమ్మబలికారు. ఈ క్రమంలో బాధితుడి నుంచి నాలుగున్నర లక్షల రూపాయలు తీసుకుని కొన్నాళ్లకు నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ నకిలీదని తెలుసుకున్న శివాజీ ఈ నెల 14న బత్తిలి ఎస్సై కె. రవీంద్రకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన ఎస్సై నిందితులను సంప్రదించగా.. తామే స్వయంగా వచ్చి ఫిర్యాదుదారుడితో మాట్లాడతామని చెబుతూ తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎఫ్సీఐ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ రాకుండా అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారని బాధితుడు, తదితరులు నిందితులను గట్టిగా నిలదీస్తే ఉపాధ్యాయుడు ప్రభాకర్ తాము తీసుకున్న డబ్బులకు గాను రెండు చెక్కులు ఇచ్చాడు. అయితే ఈ చెక్కులు బౌన్స్ అవ్వడం విశేషం. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై రవీంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గిరిజన నిరుద్యోగి నుంచి రూ. నాలుగున్నర లక్షలు వసూలు నమ్మించి మోసం చేసిన కూటమి నాయకుడు, ఉపాధ్యాయుడు -
మృత్యుమలుపు
విజయనగరం టౌన్: ప్రమాదకరమైన మలుపు.. మృత్యువై ఒకరిని మింగేసింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డా రు. దీంతో పోలీసు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకొంది. ఓ కేసు విచారణ నిమిత్తం విజయనగరం రూరల్ పోలీసులు ఆదివారం కొండకరకం గ్రామానికి వెళ్లారు. తిరిగి జేఎన్టీయూ మీదుగా వచ్చే క్రమంలో మెడికల్ కాలేజీ సమీపంలో ప్రమా దకరమైన మలుపు వద్ద బొలెరో వాహ నం బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి సుమా రు 20 అడుగులకు పైగా ఉన్న లోయలో పడిపోయింది. దీంతో అటుగా వెళ్లిన కొందరు ఫోన్ ద్వారా అందించిన సమాచారంతో విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగా త్రులను స్థానిక తిరుమల మెడికవర్ ఆస్పత్రికి అంబులెన్స్లో తరలించారు.ఎస్పీ ఎఆర్.దామోదర్ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సంప్రదించారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సీర వెంకటరమణ కు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ కానిస్టే బుల్ సీర వెంకటరమణ (49) మృతి చెందాడు. విజయనగరం రూరల్ ఎస్ఐ వి.అశోక్కుమార్కు ఎడమకాలు విరిగి, రిబ్స్, పెదవి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. హెడ్ కానిస్టేబుల్ జి.నాగేంద్ర ప్రసాద్కు ఎడమ చేతి మణికట్టు వద్ద ఎముక విరిగిపోయింది. రిబ్స్కి గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం విశాఖ అపోలో ఆస్పత్రికి తరలించా రు. బొలెరో వాహన డ్రైవర్, ఏఆర్ కానిస్టేబుల్ కె. రాజుకు నడుము భాగంలో ఎముక తప్పిపోవడంతో అత్యవసర శస్త్ర చికిత్స చేశారు. బాధితులను ఓదార్చిన మంత్రి ప్రమాద సంఘటన తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపడతామని, గాయపడిన పోలీస్ కుటుంబాలకు, మృతి చెందిన కానిస్టేబుల్ వెంకటరమణ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. సంఘటనా స్ధలాన్ని సందర్శించిన ఎస్పీ ప్రమాదం జరిగిన సంఘటనా స్థలాన్ని ఎస్పీ ఎఆర్.దామోదర్ ఆదివారం పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుతెన్నులను చూసి, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రమాదం జరిగిన మలుపు వద్ద సుమారు 20 అడుగుల లోతైన గోతిలో వాహనం పడిపోయినట్లు ఎస్పీ గుర్తించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జెడ్పీ చైర్మన్ స్థానిక గాజులరేగ మెడికల్ కళాశాల సమీపంలో ఆదివారం రూరల్ పోలీసుల వాహనం ప్రమాదానికి గురైన సంఘటనపై జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో రూరల్ ఎస్ఐ అశోక్తో పాటూ పలువురు సిబ్బంది గాయపడడం, కానిస్టేబుల్ రమణ మృతి చెందడం పట్ల ఆవేదన వెలిబుచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. దుర్ఘటనలో కానిస్టేబుల్ మృతి అత్యంత విషాదకరమన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. గాయపడ్డ ఎస్ఐ అశోక్, సిబ్బంది త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఎస్పీ ఎఆర్.దామోదర్ మీడియాతో మాట్లాడుతూనే కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో పక్కనే ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆయన్ను ఓదార్చారు. తమతో పాటూ విధులు నిర్వహిస్తూ, తమ పోలీసు కుటుంబంలోని ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని భావోద్వేగానికి గురయ్యారు. మృతి చెందిన వెంకటరమణ భార్య కుమారి, అతని తల్లిదండ్రులను ఓదార్చారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పోస్ట్మార్టం త్వరగా జరిపించే విధంగా చర్యలు చేపట్టాలని డీఎస్పీ ఎస్.రాఘవులను ఆదేశించారు. -
నేడు ప్రకాశం పంతులు జయంతి
పార్వతీపురం: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఆదివారం జిల్లా వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కలెక్టర్ సమావేశ మందిరంలో టంగుటూరి జయంతి కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా, మండల, గ్రామస్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో జస్టిస్ దుర్గాప్రసాదరావు పర్యటన ● మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన అధికారులు ● అనంతరం ఆస్పత్రుల పరిశీలన పార్వతీపురం రూరల్ : ఆంధ్రప్రదేశ్ హైపవర్ కమిటీ చైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాదరావు శనివారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. వైద్య విద్యా సంచాలకుల కార్యాలయ ప్రతినిధిగా విచ్చేసిన ఆయనకు.. ముందుగా జిల్లా సరిహద్దు బొబ్బిలి వద్ద వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన పర్యటనలో భాగంగా జిల్లాలోని సీతంపేట ఏరియా ఆస్పత్రితో పాటు శ్రీకాకుళం మెడికల్ కాలేజీకి వెళ్లారు. ఆయా ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతుల తీరుతెన్నులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.విజయలక్ష్మి, జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అధికారి (డీపీఎంవో) డాక్టర్ ఎన్.ఆర్.కె.రెడ్డి, సీనియర్ న్యాయవాది పి.రమణయ్య తదితరులు పాల్గొన్నారు. సుగర్ ఫ్యాక్టరీ విక్రయిస్తే ఊరుకోం ● భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ కొనసాగించాల్సిందే... ● ప్రభుత్వం తీరుపై గళమెత్తిన నాయకులు గజపతినగరం రూరల్ (జామి): భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని రక్షించే బాధ్యత ప్రభుత్వానికి లేకపోవడం విచారకరమని, ఫ్యాక్టరీని విక్రయిస్తే ఊరుకునేది లేదని వివిధ పార్టీల నాయకులు, ప్రజా, రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇది రైతుల సహకారంతో ఏర్పడిన ఫ్యాక్టరీ అని స్పష్టంచేశారు. జామి మండలం భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ వద్ద శనివారం వివిధ పార్టీలు, రైతు సంఘాలతో కూడిన పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పార్టీ మండలాధ్యక్షుడు గొర్లె రవికుమార్ మాట్లాడుతూ... ప్రస్తుత ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఫ్యాక్టరీలకు చేయూతనివ్యాల్సిన ప్రభుత్వం తప్పించుకునే ధోరణి ప్రదర్శించడం దారణమన్నారు. భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలని కోరారు. 2004 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఫ్యాక్టరీకి జీవం పోశారని... రూ.18 కోట్లు గ్రాంట్ ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు. వలంటీరుగా రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగుల కోసం రూ.4కోట్లు మంజూరు చేసిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కూడా భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని, రైతులను, ఉద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు, ఉపాధ్యక్షుడు పాండ్రంకి సంజీవరావు, మాజీ ఎంపీపీ కె.సూరిబాబురాజు, వైస్సార్సీపీ ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు అప్పాన సుబ్రహ్మణ్యం, చెరకు రైతు గుల్లిపల్లి జయపాల్, వైఎస్సార్సీపీ నాయకులు చలుమూరి సత్యారావు, నెక్కాలి సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు. -
మహిళ రెండుసార్లు ఆత్మహత్యా యత్నం
● పిల్లలు లేరన్న అవహేళనతో మనోవేదన ● కేజీహెచ్లో పర్యవేక్షణ వైఫల్యం ● క్షణాల్లో స్పందించి మహిళను కాపాడిన బ్లూకోట్ పోలీస్అల్లిపురం(విశాఖ): పిల్లలు లేరన్న కారణంతో కొందరు అవమానకరంగా మాట్లాడటంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ మహిళ వరుసగా రెండు రోజుల పాటు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది. మొదటిసారి కేజీహెచ్లో చికిత్స పొందుతూ, సరైన పర్యవేక్షణ లేని కారణంగా అక్కడి నుంచి బయటకు వచ్చి రెండోసారి కూడా అదే యత్నానికి పాల్పడటం అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపడింది. అయితే సకాలంలో స్పందించిన మహారాణిపేట బ్లూకోట్ పోలీస్ కానిస్టేబుల్ ఆమెను సురక్షితంగా రక్షించారు. అవహేళనతో మొదలైన మనోవేదన పార్వతీపురం నాయుడు వీధికి చెందిన మహాలక్ష్మి పిల్లలు లేరన్న కారణంగా కొందరు చేసిన అవమానకర వ్యాఖ్యలతో తీవ్ర మానసిక క్షోభకు గురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె ఆర్కే బీచ్, నొవాటెల్ హోటల్ ఎదురుగా తొలిసారి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. మహారాణిపేట పోలీసులు ఆమెను వెంటనే కేజీహెచ్కు తరలించి చికిత్స కోసం చేర్పించారు. కేజీహెచ్లో పర్యవేక్షణ కరవు.. మళ్లీ యత్నం అయితే కేజీహెచ్లో ఆమైపె సరైన నిఘా లేకపోవడంతో అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయిన మహాలక్ష్మి, శనివారం కూడా మద్యం సేవించి సముద్రంలోకి వెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. మానసిక క్షోభలో ఉన్న రోగిని చికిత్స అనంతరం సరిగ్గా పర్యవేక్షించక పోవడం ఆస్పత్రి యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. క్షణాల్లో స్పందించిన బ్లూకోట్ పోలీస్ సముద్రంలోకి వెళ్తున్న మహిళను గమనించిన మహారాణిపేట బ్లూకోట్ కానిస్టేబుల్ వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. ఆమెతో ఆప్యాయంగా మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్న అనంతరం, విషయాన్ని మమతా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మమతకు తెలియజేశారు. ఆమె వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన సహాయం అందించారు. చినవాల్తేరు మానసిక వైద్యశాలకు తరలింపు మహాలక్ష్మి మానసిక స్థితి బాగాలేదని గుర్తించిన పోలీసులు, మమతా ట్రస్ట్ సహకారంతో ఆమెను చినవాల్తేరులోని ప్రభుత్వ మానసిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి తగిన చికిత్స, పునరావాసం అందేలా చర్యలు తీసుకున్నారు. సమయస్ఫూర్తికి అభినందనలు పోలీసు కానిస్టేబుల్ చూపిన సమయస్ఫూర్తికి, మమతా ట్రస్ట్ మానవీయ స్పందనకు స్థానికులు అభినందనలు తెలిపారు. అయితే మానసిక క్షోభలో ఉన్న రోగులను కేజీహెచ్ వంటి ప్రధాన ఆస్పత్రుల్లో సరిగ్గా పర్యవేక్షించకపోవడం వల్లే ఈ ఘటన పునరావృతమైందని, ఇలాంటి కేసుల్లో ఆస్పత్రుల భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ముగిసిన సైనిక పాఠశాలల గ్రూప్ – ఎఫ్ క్రీడా పోటీలు
● ఓవరాల్ చాంపియన్గా అంబికాపూర్ సైనిక పాఠశాల ● విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందించిన సైనిక పాఠశాల ప్రిన్సిపాల్, కల్నల్ శాస్త్రి విజయనగరం రూరల్: ఆల్ ఇండియా సైనిక పాఠశాలల జాతీయ క్రీడా పోటీలు – 2026లో భాగంగా కోరుకొండ సైనిక పాఠశాలలో ఈ నెల 19 నుంచి జరుగుతున్న ఇంట్రా గ్రూప్ కాంపిటేషన్ – గ్రూప్ – ఎఫ్ పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ పోటీల్లో కోరుకొండ సైనిక పాఠశాలతో పాటు భువనేశ్వర్, అంబికాపూర్, సంబల్పూర్ సైనిక పాఠశాలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో గ్రూప్ – ఎఫ్ చాంపియన్గా అంబికాపూర్ సైనిక పాఠశాల విజేతగా నిలిచింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్.ఎస్.శాస్త్రి విజేతలకు ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో క్రమశిక్షణతో, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. పతకం అనేది ఫలితాన్ని మాత్రమే సూచిస్తుందని, ప్రవర్తనే మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని గుర్తు చేశారు. ఈ పోటీలు జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేయడానికి ఒక వేదికగా నిలిచిందని, వివిధ సైనిక పాఠశాలల మధ్య సత్సంబంధాలను, ఐక్యతను మరింత పెంపొందించాయని అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, వింగ్ కమాండర్ కిరణ్ పాల్గొన్నారు. -
వినతులు అందజేయొద్దు..
● ప్రశ్నించొద్దు.. విజయనగరం అర్బన్: విజయనగరంలో శనివారం రాష్ట్ర విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ పర్యటన అడుగడుగునా ఆంక్షల నడుమ సాగింది. వినతులు అందజేసేందుకు, గోడు వినిపించేందుకు వచ్చిన నిరుద్యోగులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, చిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. వినతులు అందజేసేందుకు అవకాశం కల్పించలేదు. లోకేశ్ వెళ్లే మార్గంలో వినతులు పట్టుకుని కొందరు, ప్లకార్డులు పట్టుకుని మరికొందరు తమ సమస్యలు తెలియజేసే ప్రయత్నం చేసినా... ఆయన వారివైపు కన్నెత్తి చూడలేదు. దాసన్నపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు జరిగిన ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశంలో ఆద్యంతం తన ‘సొంత ప్రచారం’ చేసుకోవడానికే లోకేశ్ ప్రాధాన్యం ఇవ్వడంపై ఉపాధ్యాయ వర్గాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. పొగడ్తలకే పరిమితమైన సమీక్ష పాఠశాలలోని లైబ్రరీ, సైన్స్ ల్యాబ్లను లోకేశ్ సందర్శించారు. అనంతరం సబ్జెక్ట్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను పరిశీలించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ ప్రోగ్రామ్ గది నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,500 క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల టీచర్లతో ముఖాముఖి నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన జెడ్పీ ఉన్నతపాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ టీచర్లు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్ కలిపి మొత్తం 9 మంది నుంచి అభిప్రాయాలను మంత్రి విన్నారు. అయితే పాఠశాలల అభివృద్ధికి గానీ, బోధనా వ్యవస్థ మెరుగుదలకు గానీ ఉపయోగిపడే ఒక్క సూచన కూడా వాళ్ల నుంచి రాలేదు. కేవలం మంత్రిని, శాఖ నిర్వహణను ఆకాశానికెత్తుతూ పొగడడానికే సమయం కేటాయించారు. అసలు విద్యాశాఖ పనితీరును సమీక్షించడానికి వచ్చారా లేదా తనను తాను పొగిడించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారా అన్న చందంగా క్లస్టర్ సమావేశం సాగింది. విద్యాశాఖ ఫలితాలపై సీఎం సంతృప్తిగా లేరు విజయనగరం రూరల్: రాష్ట్రంలో విద్యాశాఖ సాధించిన ఫలితాలపై ముఖ్యమంత్రి సంతృప్తిగా లేరని, నూరుశాతం ఫలితాలపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సూచించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని దాసన్నపేట జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి లోకేశ్ శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలు పూర్తయ్యాయని, ఇకపై పూర్తిగా అభ్యసనా ఫలితాలపైనే ఉపాధ్యాయులంతా దృష్టి సారించాలన్నారు. విశాఖలో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయిని చిన్నారిపై చేయి చేసుకోవడంతో చిన్నారి చనిపోయిన బాధాకరమైన ఘటన తనను కలచివేచిందని, పిల్లలను కంటిరెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కాలం మారిందని, విద్యార్థులు ప్రశ్నించే రోజులు వచ్చాయన్నారు. నైతిక విలువల పెంపు, తల్లిదండ్రులను, మహిళలను గౌరవించడంపై విద్యార్థులకు చిన్నతనం నుంచే శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ ఏడాది మరో మూడు వేల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. మంత్రి జిల్లా పర్యటనలో జూనియర్ డాక్టర్లు తమ సమస్యలపై వినతిపత్రాన్ని అందించారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. టీటీపీ కార్యకర్తల హడావిడి మంత్రి లోకేశ్కు ముందుగా మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, ఇన్చార్జి మంత్రి అనిత, ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, ఎంపీ అప్పలనాయుడు స్వాగతం పలికారు. సాయంత్రం చెల్లూరు వద్ద నిర్వహించిన విజయనగరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో లోకేశ్ పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. అడుగడుగునా ఆంక్షల నడుమ నారాలోకేశ్ పర్యటన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకున్న పోలీసులు వినతులు అందజేసేందుకు ససేమిరా నిరుద్యోగులు, విద్యార్థుల వైపు కన్నెత్తి చూడని లోకేశ్ ప్లకార్డులు ప్రదర్శించినా కనికరించని వైనం -
ముక్క లేనిదే.. ముద్ద దిగడం లేదు..!
వీరఘట్టం: ముక్క లేనిదే.. ముద్ద దిగని పరిస్థితి కొందరిది. అయితే మాంసాహారంలో పోషకాలు అధికంగా ఉంటాయన్నది ఎంత నిజమో అంతకు మించి క్యాలరీలు, కొవ్వు పదార్ధాలు కూడా ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాంసాహారం అధికంగా తింటే స్ధూలకాయంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులనూ తెచ్చి పెడుతున్నాయంటున్నారు. జిల్లాలో మాంసాహార ప్రియుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ వైరస్ విజృంభణ అనంతరం ఇది మరింత పెరిగింది. కోవిడ్ సమయంలో ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ప్రచారం సాగడంతో చాలామంది అతిగా నాన్వెజ్ను తిన్నారు. ఆ అలవాటు ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలో కొన్ని వర్గాల వారు వివాహాలలో శాఖాహారం మాత్రమే వడ్డించేవారు. నేడు చాలా మంది వివాహాల్లో కూడా మాంసాహారాన్ని ఏర్పాటు చేసే సంస్కతి ప్రారంభమైంది. ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మాంసాహారాన్ని విక్రయించే హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు సైడు వ్యాపారాలు చేసే వారి సంఖ్య 10 వేలకు పైగానే ఉంటుందని అంచనా. ఆయా కేంద్రాల్లో ప్రతీ రోజు రూ.4 కోట్లు వరకు వ్యాపారం జరుగుతోందని సమాచారం. ముఖ్యంగా పార్వతీపురం, వీరఘట్టం, పాలకొండ, సాలూరు, కురుపాం, గరుగుబిల్లి, బొబ్బిలి, రామభద్రపురం, విజయగనగరం, రాజాం, చీపురుపల్లి, ఎస్.కోట, నెల్లిమర్ల, భోగాపురం, పూసపాటిరేగ తదితర అనేక ప్రాంతాల్లో నాన్వెజ్ హోటళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రోడ్డు పక్కన కేవలం చిరుతిండ్లు, బజ్జీ కొట్లు మాత్రమే కనిపించేవి. ఇప్పుడు నాన్వెజ్ ఆహార పదార్ధాలు విక్రయించే కేంద్రాలు ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేకంగా లెక్కలేనన్ని వెలుస్తున్నాయి. నాన్వెజ్ పడనివారు తినకూడదు కొందరికి నాన్వెజ్ అంటే పడదు. అలాంటి వారు ఈ పదార్ధానికి దూరంగా ఉంటేనే మేలు. ఫ్యామిలీ హిస్టరీలో గుండె జబ్బులున్న వారు జాగ్రత్తగా ఉండాలి. కోలన్ క్యాన్సర్ ఉన్నవారు బీఫ్ తినకూడదు. నాన్వెజ్ వల్ల ఇబ్బందులు ఎదురయ్యే జనటిక్ డిసీజ్ ఉన్నవారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. నాన్వెజ్ తినడం వల్ల జబ్బులు రావు. కానీ అందులో వాడే పదార్ధాలు నాణ్యమైనవి కాకపోతే వస్తాయి. – డాక్టర్ జె.రవీంద్రకుమార్, ప్రముఖ వైద్యులు, పార్వతీపురం నాణ్యత పాటించాలి హోటళ్లు, రెస్టారెంట్లలో తయారుచేసే మాంసాహారానికి వాడే పదార్ధాలు నాణ్యతగా ఉండాలి. నిల్వ ఉన్న మాంసంతో వండి పెట్టకూడదు. ఇలాంటి పదార్ధాన్ని తిన్న వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. దీనికి ఆహార పదార్ధాల్లో నిషేధిత రంగులు కలపడం కూడా నేరం. ప్రజలు సైతం రంగు, వాసన చూసి మోసపోయి ఆనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దు. – ఎం.వినోద్కుమార్, జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి, పార్వతీపురం మన్యం జిల్లా -
రోగులకు మెరుగైన సేవలే లక్ష్యం : కలెక్టర్
పార్వతీపురం: ప్రభుత్వాస్పత్రులకు వచ్చే పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఆస్పత్రుల రూపురేఖలు మార్చాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వైద్యాధికారులు, ఏపీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ను శనివారం నిర్వహించారు. ఆస్పత్రులో పరిశుభ్రత, ఆహ్లదకర వాతావరణం కల్పించాలని, రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. మౌలిక వసతుల సమస్యలను ఇ–ఆఫీస్ ద్వారా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. పెండింగ్లో వున్న ఆస్పత్రి నిర్మాణ పనులను ఈ నెలఖారులోగా పూర్తి చేయాలని, పనుల పురోగతిని సూపరింటెండెంట్లు పర్యవేక్షించాలని తెలిపారు. సోమవారం ఆస్పత్రిని స్వయంగా పరిశీలించడంతో పాటు వర్చువల్ ఇన్స్ఫెక్షన్లు నిర్వహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ జి.నాగభూషణరావు తదితరులున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారుల సంసిద్ధత స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో అధికారులు పూర్తి సంసిద్ధతతో ఉండాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లుపై అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన ఆయన ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లును సమీక్షించారు. సమీక్షలో డీఆర్ఓ కె.హేమలత, డీపీఓ ఎస్.రవీంద్ర, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల జెడ్పీ సీఈఓలు ఆర్.వెంకట్రామన్, లోవరాజు తదితరులున్నారు. వసతిగృహల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం సంక్షేమ వసతిగృహలు, గురుకుల విద్యాలయాల్లో పారిశుధ్యం, విద్యార్థుల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వసతిగృహలలో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతోపాటు కిచెన్, వంట పాత్రలు, మరుగుదొడ్లును నిరంతరం శుభ్రంగా ఉంచాలని సూచించారు. వర్చువల్ తనిఖీలలో పరిశుభ్రతను పర్యవేక్షించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీఓ మురళీధర్, తదితరులున్నారు. నెలాఖరులోగా తాగునీరు, మరుగుదొడ్ల వసతులు పూర్తి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతిగృహలు, గురుకులాలు, ప్రభుత్వ కార్యాలయాలలో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలను ఈ నెలఖారులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 229 అంగన్వాడీ కేంద్రాల్లో 89 కేంద్రాలకు తాగునీటి సౌకర్యం లేదని గుర్తించినట్లు తెలిపారు. ఆయా కేంద్రాలలో నీటి వసతులను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. సమీక్షలో ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, డీఈఓ పి.బ్రహ్మజీరావు తదితరులున్నారు. -
జానపదం ఝల్లుమన్నది
● ఘనంగా ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం బొబ్బిలి: పట్టణంలో జానపద కళాకారులు పదం పాడుతూ కదం తొక్కారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కళాకారులంతా శ్రీ కళాభారతి, వేణుగోపాలస్వామి ఆలయ మండపం వేదికలుగా శనివారం పలు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. మహిళలు, పురుషులు, చిన్నారులనే తేడా లేకుండా వేదికలను పంచుకుని కళలంటే ఏమిటో చవిచూపారు. ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా పట్టణంలో వందలాది మంది కళాకారులు ర్యాలీ నిర్వహించారు. శ్రీ కళాభారతి మున్సిపల్ ఆడిటోరియం కార్యవర్గం, రవిశంకర్ ఫైనార్ట్స్, బొబ్బిలి మల్టీ టాలెంట్ గ్రూప్, వేణుగోపాల నాట్యకళా మండలి, నట సమాఖ్య ఘంటశాల స్వరాంజలి ఆర్కెస్ట్రా తదితర కళాకారుల సంఘాల సభ్యులు ప్రదర్శనలు ఇచ్చారు. పలు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ యావత్తూ కోలాటం కళాకారులతో నిండిపోయింది. వారిచేతిలోని కర్రలు లయబద్ధంగా శబ్దం చేస్తుండగా అదే లయలో కళాకారులు నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు. పట్టణ ప్రజలు కళారూపాలను తిలకించి తన్మయత్వం చెందారు. శ్రీ కళాభారతి మున్సిపల్ ఆడిటోరియంలో సీనియర్ కళాకారులకు గౌరవ సత్కారం చేశారు. -
రైలు ప్రయాణంలో అస్వస్థతకు గురై మహిళ మృతి
సికింద్రాబాద్: వివాహవేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో అస్వస్థతకు గురైన ఒక మహిళ శనివారం రైలులోనే మృతి చెందింది. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ కె.కోటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు... ఘట్కేసర్ బాలాజీనగర్కు చెందిన గృహిణి శివం జానకి (42) కుటుంబ సభ్యులతో కలిసి పార్వతీపురంలోని బంధువుల వివాహవేడుకకు హాజరైంది. శుక్రవారం నాగావళి ఎక్స్ప్రెస్ రైలులో తిరిగి బయలుదేరింది. రైలు చర్లపల్లికి చేరుకోగానే తీవ్ర అస్వస్థతకు గురైన జానకి ఎస్–1 కోచ్లోనే మృతి చెందింది. భర్త నర్సింగరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
సెప్టెంబర్ 1 నుంచి నవతరోత్సవాలు
విజయనగరం: విద్యార్థులు, యువతలో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటి నుంచి 17వ తేదీ వరకు నవతరోత్సవాలు నిర్వహించనున్నట్టు క్లబ్ అధ్యక్షుడు జి.జగదీష్ వెల్లడించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఉత్సవాలకు సంబంధించిన వాల్పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే రోటరీ సెంట్రల్ క్లబ్ ఆధ్వర్యంలో నవతరోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సంగీతం, సాహిత్యం, చిత్ర లేఖనం, క్రీడలు, యోగ తదితర అన్ని రంగాల్లో విద్యార్థుల్లో దాగి ఉన్న టాలెంట్ను గుర్తించి విజేతలకు బహుమతులను అందజేయనున్నట్టు తెలిపారు. అక్టోబర్ ఆరో తేదీన ముగింపు కార్యక్రమం నిర్వహించి అదే రోజున విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేస్తామన్నారు. పోటీలలో పట్టణంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, కళాశాల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో క్లబ్ సెక్రటరీ బత్తుల చందు, ఉత్సవాల చైర్మన్లు ముఖేష్, మారుతి రాజ్, డైరెక్టర్ కృష్ణ తేజతో పాటు రోటరీ సెంట్రల్ క్లబ్ ప్రతినిధులు ఆర్.శంకర్ రెడ్డి, పి.జై కృష్ణ , ఉదయ్, మనోజ్, కాపుగంటి ప్రకాష్ , ఫాస్ట్ గవర్నర్ ఎం.రామారావు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ కృష్ణపై రెండు కేసులు నమోదు విజయనగరం టౌన్: పూసపాటిరేగ పోలీసుస్టేషన్ పరిధిలో సిహెచ్.అగ్రహారంలో చోటుచేసుకున్న భూ వ్యవహార సంఘటనపై ఓ పత్రికా రిపోర్టర్, రెవెన్యూ అధికారులపై గుడివాడ కృష్ణ దాడులకు, బెదిరింపులకు పాల్పడినట్లు, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించినట్లుగా ఫిర్యాదుదారులు ఇచ్చిన రిపోర్టుల మేరకు పూసపాటిరేగ పోలీసులు రెండు క్రిమినల్ కేసులను వేర్వేరుగా నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ ఎఆర్.దామోదర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూసపాటిరేగ పోలీసుస్టేషన్ పరిధిలోని సిహెచ్.అగ్రహారం గ్రామంలోని ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమణలకు పాల్పడినట్లుగా వచ్చిన సమాచారంపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టగా, అదే గ్రామానికి చెందిన గుడివాడ కృష్ణ రెవెన్యూ అధికారుల విధులకు భంగం కలిగించడంతో పాటూ, బెదిరింపులకు పాల్పడ్డారని, మండల తహశీల్దార్ పూసపాటిరేగ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. అదేవిధంగా ఈ ఘటనపై పత్రికలో వార్త ప్రచురించిన వ్యక్తిపైన గుడివాడ కృష్ణ భౌతిక దాడికి పాల్పడినట్లు బాధితుడు పిర్యాదుతో మరో క్రిమినల్ కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. రెండు కేసుల్లో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. నిందితునిపై చట్టపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. సాలూరు రూరల్: ఐదేళ్ల తరువాత గంజాయి నిందితుడిని పట్టుకున్నట్టు ఏఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. రూరల్ పోలీస్స్టేషన్లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. 2021లో అప్పటి ఎస్ఐ ఫక్రుద్దీన్ మండలంలోని జీగిరాం గ్రామం వద్ద నిలిపి ఉన్న టాటా ఇండిగో కారును గుర్తించి తనఖీ చేయగా 38 ప్యాకెట్లలో 155 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లా చిత్రకోట పంచాయతీకి చెందిన సంజిత్ఖార్ అనే వ్యక్తి తన కారు మరమ్మతులకు గురవడంతో జీగిరాం గ్రామం వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కారును పరిశీలించిన పోలీసులకు అప్పట్లో గంజాయి దొరకడంతో అప్పటి నుంచి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పలుమార్లు ఒడిశాలో నిందితుడు స్వగ్రామం వెళ్లినప్పటికీ పట్టుబడలేదు. ఎట్టకేలకు రూ.21లక్షల విలువ చేసే కారు, మోటారుబైక్, గంజాయితో పాటు నిందితుడిని శనివారం జీగిరాం సమీపంలో పట్టుకున్నామని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఇతనితో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా ఉన్నట్టు తెలిసిందని వారిని కూడా పట్టుకుంటామన్నారు. కేసు ఛేదించడంలో చొరవ చూపిన సీఐ, ఎస్ఐతో పాటు సిబ్బందిని ఎస్పీ మాధవరెడ్డి అభినందించారు. -
35 మంది పేకాటరాయుళ్ల అరెస్టు
● రూ.1.68 లక్షలు నగదు స్వాధీనం సాలూరు రూరల్: కరాసువలస గ్రామ సమీపంలో వినియోగంలో లేని కోళ్లఫారం షెడ్లలో పేకాట ఆడుతున్న 35 మందిని సీఐ రామకృష్ణ, ఎస్ఐ రవీంద్రరాజు ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నట్టు ఏఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. రూరల్ పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. సాలూరు పరిసర ప్రాంతాల్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఇటీవల సీఐతో చర్చించామని, కొద్ది రోజులకే భారీ పేకాట స్థావరాన్నిపట్టుకున్నామని తెలిపారు. పేకాట స్థావరంలో 35 మందితో పాటు రూ.1.68 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రూ.1.17 లక్షల ఖరీదు చేసే 23 కాయిన్స్ పట్టుబడ్డాయన్నారు. విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ను ఆంధ్రప్రదేశ్ భట్రాజు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్మి సీహెచ్ సతీష్ రాజు విజయనగరంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. భట్రాజు కార్పొరేషన్లో డైరెక్టర్ల నియామకం, శ్రీశైలం దేవస్థానంలో భట్రాజు సంక్షేమ సంఘం నిత్య అన్నదాన సత్రానికి స్థలం కేటాయించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. -
స్థానిక కుర్చీలకు కత్తెర!
సాక్షి, పార్వతీపురం మన్యం: స్థానిక ఎన్నికలకు కసరత్తు శరవేగంగా సాగుతోంది. పట్టణ, పంచాయతీల్లో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటి వరకూ ఉమ్మడి విజయనగరం జిల్లాతో ముడిపడి ఉన్న మన్యం.. ఇకపై పూర్తి స్థాయిలో విడిపోక తప్పదు. 15 మండలాలతో కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పడనుంది. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి, ఉపాధ్యక్ష పదవి మన్యానికి దక్కనున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు నిర్ణయం వల్ల పదవులకు కోత పడనుంది. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పురపాలికలు, నగర పంచాయతీల్లో చైర్మన్తో పాటు.. ఇద్దరేసి చొప్పున వైస్ చైర్మన్లను నియమించిన విషయం విదితమే. దీనివల్ల ఇప్పటి వరకూ జిల్లాలోని పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలతో పాటు.. పాలకొండ నగర పంచాయతీలో చైర్మన్, ఇద్దరు చొప్పున వైస్ చైర్లన్లు ఉండేవారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం వల్ల ఇక మీద వైస్ చైర్మన్ పదవి ఒక్కరికే దక్కుతుంది. మండల పరిషత్లోనూ ఉపాధ్యక్ష పదవి ఒకరికే దక్కనుంది. దీనివల్ల సామాజిక వర్గాల పరంగా పదవులు ఆశించే వారికి కాస్త నిరాశ కలగకమానదు. జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ, 451 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్లను కూడా నేరుగా ఓటర్లే ఎన్నుకునేలా, ప్రత్యక్ష విధానంలోనే ఎన్నిక పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. రెండేళ్ల పాలనలోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఉద్యోగ, వ్యాపార, మహిళలు, రైతులు.. ఇలా అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అవినీతి, కబ్జాలలో ప్రజా ప్రతినిధులు ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు. పథకాలు సక్రమంగా అందని పరిస్థితి. రైతులకు ఎరువులు కూడా ఇవ్వలేకపోతున్నారు. వార్డు కౌన్సిలర్, పంచాయతీ ప్రెసిడెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్ సభ్యులను గెలిపించుకోవడమే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సవాల్గా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో అడ్డదారినైనా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను పొందాలని చూస్తున్న నాయకులకు ఎన్నికల సమయంలో అసలు సిసలు పరీక్ష ఎదురు కానుంది. ‘డబుల్’కు కోత పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఇకపై ‘వైస్’ ఒక్కరే.. ప్రత్యక్షంతో ఎమ్మెల్యేలకు పరీక్షే.. మారనున్న స్థానిక లెక్కలు -
మద్యం మత్తులో ఆస్పత్రి పైనుంచి దూకేసిన రోగి
పార్వతీపురం రూరల్ : ప్రాణాలు నిలబెట్టే వైద్యశాల ప్రాంగణంలో ఓ రోగి తన ప్రాణాల మీదకు తెచ్చుకునేలా చేసిన అనాలోచిత యత్నం తీవ్ర కలకలం రేపింది. వ్యసనం కాటుకు మానసిక స్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తి ఏకంగా ఆస్పత్రి భవనం పైనుంచి కిందకు దూకిన హఠాత్పరిణామం అక్కడి వారిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మద్యానికి బానిసై, మతిస్థిమితం దెబ్బతిన్న కొమరాడ మండలం అర్తాం గ్రామానికి చెందిన బాధితుడు మీనక శంకరరావు(33)ను కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం శుక్రవారం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. శుక్రవారం రాత్రి సమయంలో అతడు తీవ్ర అశాంతికి లోనయ్యాడు. పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు అతనికి ఎంతగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా అతడిలో మార్పు రాలేదు. వారి వారింపులను ఏమాత్రం లెక్కచేయని ఆ బాధితుడు.. ఎవరూ ఊహించని రీతిలో క్షణికావేశంలో హఠాత్తుగా ఆసర్పత్రి భవనం పైకి ఎక్కి అమాంతం కిందకు దూకేశాడు. భవనం పైనుంచి దూకడంతో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కళ్లెదుటే జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, తోటి రోగులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి వర్గాలు, బాధితుడిని హుటాహుటిన అత్యవసర విభాగానికి తరలించి ముమ్మరంగా ప్రాథమిక చికిత్స అందించారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో పరిస్థితిని అంచనా వేసిన వైద్యులు, మెరుగైన వైద్య సహాయం కోసం 108 (బేసిక్ లైఫ్ సపోర్ట్) అంబులెన్స్ వాహనంలో రాత్రికి రాత్రే విజయనగరం తరలించగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి -
మహిళా రిజర్వేషన్పై జాప్యం వద్దు!
● 33 శాతం రిజర్వేషన్ను షరతుల్లేకుండా అమలు చేయాలి విజయనగరం గంటస్తంభం: చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్కు జనగణన, డీలిమిటేషన్ వంటి షరతులు లేకుండా తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యా(ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిలి విమల డిమాండ్ చేశారు. మహిళల హక్కులు, భద్రత, సమానత్వం కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని కోరారు. మహిళా సాధికారతకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్మి, విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్మి బుగత పావని ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మయూరి జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విమల మాట్లాడుతూ, మహిళలు, బాలికలపై జరుగుతున్న హింస, అత్యాచారాలను అరికట్టి రక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని అన్నారు. మహిళలు, కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న మద్యాన్ని పూర్తిగా నిషేధించి బెల్డ్షాపుల సంస్కృతిని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆడ పిల్లలకు డిగ్రీ నుంచి పీజీ వరకు ఉచిత, నాణ్యమైన విద్య, మహిళలకు ఉచిత వైద్యం, పోషకారం, సంపూర్ణ ఆరోగ్య భద్రత కల్పించాలని అన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేసి మహిళా కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో లక్ష్మమ్మ, రమణమ్మ, వెంకటలక్ష్మి, లక్ష్మితో పాటు మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
మత్తులో హల్చల్
పాలకొండ రూరల్: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏరియా ఆస్పత్రిలో శనివారం రాత్రి హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన అవనాపు కిశోర్ అలియాస్ రమణ పాలకొండలోని పెద్దకాపు వీధిలో తన బంధువుల ఇంటికి వచ్చాడు. తన వ్యక్తిగత సమస్యల కారణంగా చేతిపై కోసుకున్నాడు. ఇంటి వద్ద అతి చేయడంతో కుటుంబీకులు వందకు సమాచారం ఇచ్చారు. దీంతో 108 సాయంతో తొలిత పాలకొండ ఏరియా ఆస్రపత్రికి కిశోర్ను తరలించారు. ఆస్పత్రిలో కిశోర్ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించడంతో పాటు వైద్యం అందించే క్రమంలో వైద్యులను దుర్భాషలాడాడు. సమీపంలో ఉన్న ఆస్పత్రి అద్దాలను విరగ్గొట్టాడు. సిబ్బంది, వైద్యులపై తిరిగబడి హల్చల్ చేయడంతో అక్కడి వారు హడలిపోయారు. దీంతో సూపరింటెండెంట్ కె.చిరంజీవి, ఆస్పత్రి వర్గాలు అందించిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ డోల వెంకన్న తెలిపారు. నిందితుడు మద్యం లేక గంజాయి మత్తులో ఉండొచ్చని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఏరియా ఆస్పత్రిలో వీరంగం -
అమరావతి చాంపియన్షిప్ బ్యాడ్మింటన్ కోచ్గా శ్రీరాములు
శృంగవరపుకోట : అమరావతి చాంపియన్షిప్ – 2026 రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తిరుపతిలో జరుగనున్నాయి. పోటీలకు విజయనగరం జిల్లా బ్యాడ్మింటన్ టీం కోచ్గా శృంగవరపుకోట నియోజకవర్గ క్రీడా కోఆర్డినేటర్ డాక్టర్ పొట్నూరు శ్రీరాములు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి అమరావతి చాంపియన్ షిప్–2026లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే 26 జిల్లాల నుంచి 12 అంశాలలో క్రీడాకారులు పాల్గొంటారని, అందులో అండర్ 17, 23 విభాగాలలో పురుషులు, సీ్త్రలు పాల్గొంటారని, ఈ క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. క్రీడలకు మొత్తం 99 లక్షల రూపాయలు బహుమతిగా అందిస్తుందన్నారు. ఈ క్రీడలు ఆగస్టు 29న హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జరగనున్నట్టు ఆయన తెలిపారు. -
అనాథ చిన్నారులకు అందని ‘తల్లికి వందనం’
జియ్యమ్మవలసరూరల్: ఆ చిన్నారుల ఆవేదన ఎవరికి పడుతుంది. వారి మొర ఎవరు ఆలకిస్తారు. ఏ అధికారి వారిని పట్టించుకుంటాడు. తల్లిదండ్రులను కోల్పోయిన తరువాత అనాథలుగా మిగిలిన ముగ్గురు ఆడపిల్లలకు అందాల్సిన తల్లికి వందనం పథకం వారికి నేటికీ అందలేదు. ఈ కథనం వివరాలిలా ఉన్నాయి. జియ్యమ్మవలస మండలంలోని అర్నాడ పంచాయతీ వనజ గ్రామానికి చెందిన మీనక మధుసూదనరావు, సత్యవతి దంపతులతో పాటు వారి కుమారుడు ఈ ఏడాది జనవరి 23న ఇంటిలో కుంపటి పొగతో ఊపిరాడక మృతిచెందారు. దీంతో ఆ దంపతుల మరో ముగ్గురు కుమార్తెలు మాధురి, మోక్ష, ఐసులు అనాథలుగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వారిని ఆదుకోలేదు సరికదా కనీసం తల్లికి వందనం కూడా ఆ ముగ్గురికీ రాలేదని వారి నాయనమ్మ మీనక సోములమ్మ వాపోతోంది. రూ.13వేలు చొప్పున ముగ్గురు పిల్లలకు మొత్తం రూ. 45వేలు రావాల్సి ఉండగా ఏ ఒక్కరికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా జమకాలేదు. పిల్లల తల్లిదండ్రులకు ఏయే బ్యాంకు ఖాతాలు ఉన్నాయో వాటన్నింటినీ తనిఖీ చేశారు. అయినప్పటికీ ఏ ఒక్క ఖాతాలోనూ అమౌంట్ పడలేదు. దీంతో సచివాలయం, మండల కేంద్రంలో సంబంధిత అధికారులకు మొరపెట్టుకుంటున్నా మృతిచెందిన తల్లి, తండ్రి బ్యాంకు ఖాతాల్లో పడి ఉంటాయేమో చూడండని చెబుతున్నారే తప్పితే సరైన పరిష్కారం చూపడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన ఈ చిన్నారులను స్థానిక ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోవాలని వృద్ధురాలైన వారి నాయనమ్మ వేడుకుంటోంది. -
25న తెలుగు సాహిత్య సాంస్కృతిక వైభవం
విజయనగరం టౌన్: గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 25న తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య సాంస్కృతిక వైభవం పేరుతో రాష్ట్రస్ధాయి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్ధాపకుడు, శ్రీశ్రీ కళావేదిక జిల్లా కన్వీనర్ సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ప్రైవేట్ హోటల్లో శుక్రవారం ఉత్సవ నిర్వహణ చైర్పర్సన్ గురాన రాధికతో కలిసి ఆహ్వానప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25న ఉదయం 9 గంటలకు సన్స్కూల్లో జరిగే ఈ ఉత్సవానికి రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడితో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారన్నారు. కార్యక్రమంలో పి.కన్నయ్య, గొర్లె వెంకట సీతారామమూర్తి, లింగాల నరసింగరావు, డిమ్స్ రాజు, సుభద్రాదేవి, ఈపు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ప్రశ్నలకు ప్రభుత్వం వివరణ
● జర్నలిస్టుల సమస్యలపై మండలిలో ఎమ్మెల్సీ ప్రస్తావన నెల్లిమర్ల రూరల్: గతంలో జరిగిన ఏపీ శాసన మండలి సమావేశాల్లో రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణరాజు ప్రస్తావించారు. ఆయన ప్రశ్నలకు ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు, ఆరోగ్య భద్రత, ఇళ్ల స్థలాల సమస్యలను గతంలో జరిగిన సమావేశాల్లో ఆయన ప్రస్తావించారు. అర్హత గల జర్నలిస్టులకు 2026–27 సంవత్సరానికి అక్రిడిటేషన్ కార్డుల జారీకి నూతన నిబంధనలు రూపొందించామని, రాష్ట్రస్థాయిలో 2,797, జిల్లా స్థాయిలో 14,681 కలిపి మొత్తం 17,480 కార్డులు ఇప్పటివరకు జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య పథకాన్ని కొనసాగిస్తున్నామని, ఏడాదికి రూ.2500 ప్రీమియంలో ప్రభుత్వం సగం చెల్లిస్తోందని..జర్నలిస్టుతో పాటు జీవిత భాగస్వామి, పిల్ల లు, ఆధారపడ్డ తల్లిదండ్రులకు ఈ పథకం వర్తిస్తుందని, రూ.2లక్షల వరకు వైద్య రక్షణ ఉంటుందని వివరించింది. ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం చేపట్టే అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని స్పష్టం చేసింది. -
చెరకు రైతులకు చేదు కబురు..!
రేగిడి: ఇటు విజయనగరంతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఆధారమైన సంకిలిలోని ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం మూతపడుతోంది. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ చెరకు ఫ్యాక్టరీలో క్రషింగ్ నిలుపుదలచేస్తున్నామంటూ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు చావు కబురు చల్లగా చెప్పింది. ఈ మేరకు ఒక నోట్ విడుదలచేసి అందరినీ అయోమయానికి గురిచేపసింది. ఈ ఫ్యాక్టరీ మూతపడేదిశగా ఆలోచన చేస్తోందని ఓ వైపు రైతులు, మరో వైపు మీడియా, ఇంకో వైపు వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు గగ్గోలు పెట్టి కూటమి దృష్టికి తీసుకవెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరించింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడం, క్రషింగ్కు సరిపడా చెరకు లేదనే నెపంతో 2027–28 ఆర్థిక సంవత్సరంలో(2027 ఏడాది డిసెంబర్ నుంచి మార్చి 2028 వరకూ) చెరకు క్రషింగ్ ఆపేస్తున్నామని, ఫ్యాక్టరీకి చెరకును పంపించే రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఫ్యాక్టరీ ప్రకటించింది. ఈ ప్రకటనలో ఎల్నినో ప్రభావం కూడా ఉందని పేర్కొంది. అంటే 2027 నుంచి ఫ్యాక్టరీ మూసేస్తున్నట్లు స్పష్టంగా ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్పకనే చెప్పింది. ఒక్క ఆధారం కూడా.. భీమసింగి, సీతానగరం చెరకు ఫ్యాక్టరీలు మూతపడిన తరువాత ఈ ఫ్యాక్టరీయే రైతులకు ఆధారంగా ఉండేది. వ్యవసాయ పెట్టుబడులు పెరగడం, చెరకు రవాణా ఖర్చులు అధికం కావడంతో పాటు గతంలో జామి, బొబ్బిలి, సీతానగరం వంటి ప్రాంతాల నుంచి అధికంగా వచ్చే చెరకు ఇప్పుడు తగ్గిపోయింది. 1997లో రోజుకు కేవలం 2500 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఇక్కడ సుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. అప్పట్లో ఈఐడీ పార్టనర్తో రాజాంకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జునరావు ఈ ఫ్యాక్టరీని ప్రారంభించారు. 2002 నాటికి క్రషింగ్ రోజుకు 3వేల టన్నులకు చేరింది. 2006లో 5 టన్నులకు చేరుకుంది. ఆరంభంలో 2 లక్షల టన్నులు చెరకును క్రషింగ్ చేసే ఈ ఫ్యాక్టరీ 2014– 15 ఏడాదిలో సీజన్లో 4.5 లక్షల టన్నుల క్రషింగ్కు చేరుకుని చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం మళ్లీ 2 లక్షల టన్నుల క్రషింగ్కు దిగిపోయింది. 35 వేల ఎకరాల్లోని చెరకు పంటను క్రషింగ్ చేయడమే కాకుండా 12వేల మంది రైతులకు ఆర్థికంగా నిలబెట్టింది. 3 వేల మంది కార్మికులకు, ఉద్యోగులకు భవిష్యత్తును ఇచ్చింది. 30 ఏళ్ల ప్రయాణం అనంతరం ఫ్యాక్టరీ అలిసిపోయింది.రోడ్డున పడుతున్న 3 వేల కుటుంబాలు ఫ్యాక్టరీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను, చిరు ఉద్యోగులును గతేడాది నుంచి ఫ్యాక్టరీ తొలగిస్తోంది. కొంతమంది కార్మికులను, షిప్ట్ ఉద్యోగులను, ఏరియా సూపర్ వైజర్లను తొలగించారు. కొంతమందిని పొమ్మనలేక పొగబెట్టేవిధంగా జీతాలు నిలుపుదలచేయడం, కట్ చేయడం పాటిస్తోంది. ఈ ఫ్యాక్టరీ మూతపడితే 3 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధిపొందుతున్న మరో పదివేల రైతువారీ, చిరువ్యాపారుల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. ముందే చెప్పిన సాక్షి..ఒకప్పుడు మూడు సీజన్లు, ఆరు క్రషింగ్లుగా ఉండే సంకిలి సుగర్ ఫ్యాకర్టీ ఇప్పుడు నష్టాలు ఊబిలో చిక్కుకుందని, ఈ ఫ్యాక్టరీకి ఇప్పుడు ఆర్థిక చేయూతనిచ్చే పాలకులు కరువయ్యారని సాక్షి దినపత్రిక ముందే చెప్పింది. ఈ ఏడాది జూన్ 19న ఉన్న ఒక్కటీ మూసేద్దాం అనే శీర్షికతో కథనం ప్రచురించింది. కథనం వచ్చిన తరువాత కూడా అటు అధికారులు, ఇటు పాలకుల్లో చలనం కనిపించలేదు. పలుమార్లు స్థానిక ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తలే రాజేష్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు మీడియా సమావేశాలు, మండలి సమావేశాలల్లో ఈ విషయాన్ని బయటకు చెప్పడంతో పాటు ఫ్యాక్టరీ మూతపడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. అయినప్పటికీ ఏ ఒక్కరూ పట్టించుకుని ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడలేదు. ఫలితంగా నష్టాలతో ఫ్యాక్టరీని నడపలేమని చెప్పి, మూసివేతకు యాజమాన్యం ముహూర్తం పెట్టేసింది. సుగర్ ఫ్యాక్టరీ మూసివేతకు ముహూర్తం క్రషింగ్ ఆపేస్తున్నామంటూ ఈఐడీ ప్యారీ యాజమాన్యం నోట్ విడుదల ముందే చెప్పిన సాక్షి వైఎస్ఆర్సీపీ గొంతువిప్పినా పట్టించుకోని కూటమి లబోదిబోమంటున్న చెరకు రైతులు రోడ్డున పడనున్న 3 వేలమంది ఉద్యోగులు -
ఆక్సిజన్ లీకై ఇద్దరికి గాయాలు
● గ్రోత్ సెంటర్లో మరో ప్రమాదం ● బెర్రీ ఫెర్రో ఎల్లాయీస్లో ఘటన బొబ్బిలి: పట్టణ సమీపంలోని గ్రోత్సెంటర్లో గల కంపెనీల్లో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల ఓ కంపెనీలో గడ్డర్ మీద పడి వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం బెర్రీ ఫెర్రో ఎల్లాయీస్ కంపెనీలో ఆక్సిజన్ను సిలిండర్లలోకి నింపుతుండగా గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. అలజంగికి చెందిన యందవ సీతయ్యతో పాటు యూపీకి చెందిన సరాజ్పాల్లు సాయంత్రం కంపెనీలో ఆక్సిజన్ను సిలిండర్లలోకి ఎక్కిస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఆక్సిజన్ లీకవగా సీతయ్యకు స్వల్పగాయాలు, సరాజ్పాల్కు తీవ్ర గాయాలయ్యాయి. సీతయ్యకు ప్రాథమిక చికిత్స చేశారు. సరాజ్పాల్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. స్థానిక అభయ ఆస్పత్రిలో వారిని చేర్పించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా కంపెనీల యాజమాన్యాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
నిరంతర కృషి, పట్టుదలే పారిశ్రామికవేత్త లక్షణం
రాజాం సిటీ: అవకాశం కనిపించని చోట కూడా దానిని ఊహించగలగడమే నిజమైన పారిశ్రామిక వేత్త లక్షణమని జీఎంఆర్ ఐటీ డీయూ వీసీ డాక్టర్ జె.గిరీష్ అన్నారు. మంచి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలంటే నిరంతర కృషి, పట్టుదల అవసరమని తెలిపారు. విద్యార్థుల్లో ఔత్సాహిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందించే దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంగా శుక్రవారం జీఎంఆర్ ఐటీ డీయూలో ప్రపంచ పారిశ్రామిక వేత్తల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్య సాధనకు బలమైన కోరిక, నిరంతర ప్రయత్నం, పట్టుదల అవసరమని, దీర్ఘకాలిక విజయవానికి నైతిక విలువలు, నిజాయితీ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ డీన్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్ మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తగా ఎదగడం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదని, సమాజ అవసరాలకు కొత్త పరిష్కారాలను అందించే ఆలోచానా విధానమని అన్నారు. విద్యార్థులు సాంకేతికతను సృష్టించే డెవలపర్లుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన కళాశాల పూర్వవిద్యార్థులైన పారిశ్రామిక వేత్తలు వారి అనుభవాలను పంచుకున్నారు. వ్యాపారం ప్రారంభించే ముందు కొన్నేళ్లు పరిశ్రమ అనుభవం అవసరమన్నారు. మంచి ఆలోచనను విజయవంతం చేసేది క్రమశిక్షణతో కూడిన అమలేనని తెలిపారు. ఏ రంగంలో అయినా నిరంతర సాధన, కష్టపడి పనిచేయడమే విజయానికి మార్గమని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నైతిక విలువలతో కృషిచేయడం ద్వారా విద్యార్థులు విజయవంతమైన పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్టార్టప్ ఐడియా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులైన వ్యాపారవేత్తలు మెట్ట మురళి, గంటా అనిల్ నాయుడు, పైడి నటరాజు, చెరుకూరి సందీప్ కొత్తా శ్రావణి, బి.మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు మెగా జాబ్మేళా
రాజాం సిటీ: స్థానిక శ్రీకాకుళం రోడ్డులోని ఎస్ఎల్టీఎన్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 22న శనివారం మెగా జాబ్మేళా నిర్వహించనున్నామని కళాశాల చైర్మన్ టి.తవిటినాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెక్ మహీంద్ర, అపోలో టైర్స్, కియా, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి పది కంపెనీల్లో ఉద్యోగాలకు సంబంధించి ఈ మేళా జరుగుతుందని అన్నారు. ఉదయం 10గంటల నుంచి జరగనున్న ఈ కార్యక్రమాన్ని ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గృహ హింస కేసు నమోదుసంతకవిటి: మండలంలోని మోదుగుల పేట గ్రామానికి చెందిన గార అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గృహ హింస కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అనసూయకు మండలంలోని కాకరాపల్లి గ్రామానికి చెందిన గార రాంబాబుతో 2015లో వివాహం అయింది. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం అత్తింటివారు ఆమెను హింసిస్తున్నారని శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. రాములోరికి వైభవంగా సహస్రదీపాలంకరణనెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ సేవను ఆలయ అర్చకులు శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిపించారు. శ్రీసీతారాముల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో దీపారాధన మంటపంలో ఉన్న ప్రత్యేక ఊయలలో వేంచేపుజేశారు. ఈ సందర్భంగా సహస్ర దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించి దీపాల కాంతుల శోభలో స్వామికి విశేష అర్చనలు, ఊంజల్ సేవ జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
జానపదం..జనపథం...
● మళ్లీ పుంజుకుంటున్న జానపద కళా రూపాలు ● నేడు ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం బొబ్బిలి: గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధమయిన మాధ్యమాలు, కళలు లేని కాలంలో పల్లె ప్రజలకు అండగా ఆనందాన్ని నింపే సంప్రదాయ కళే జానపదం. మొదట బుర్రకథలు అనంతరం నాటికలు, ఆ తరువాత టీవీ ఇక సినిమా సంగతి చెప్పనక్కరనే లేదు. ఈ క్రమంలో కనుమరుగయిపోయిన జానపద కళారూపాలయిన తప్పెటగుళ్లు, కోలాటాలు, డప్పు వాయిద్యాలు, జముకు కథలు, ఊకొట్టు పాటలు, ఇంకా పురాతనమయిన తుర్పు బాఘవతాలకు మళ్లీ జీవం పోస్తున్నారు బొబ్బిలి ప్రాంత కళాకారులు. అందులో ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ముఖ్యంగా జానపదాల్లో కోలాటం, డప్పు కళాకారులు ప్రస్తుతం మళ్లీ తెరపైకి తీసుకువచ్చిన వారిలో గేదెల కరుణ్కుమార్ ఒకరు. ఇతను బొబ్బిలిలో మల్టీ టాలెంట్ డాన్స్ అకాడెమీని స్థాపించారు. ఈ అకాడెమీలు చిన్న పెద్ద అన్న తారతమ్యం లేకుండా అందరూ పాల్గొని నృత్య శిక్షణ తీసుకుంటున్నారు. అనేక కోలాటం నృత్య ప్రదర్శనలకు వెళ్లి ఆకట్టుకుంటున్నారు. గతంలో కేవలం గ్రామ దేవత పండగలు, ఇతర పర్వదినాలకు మాత్రమే ఇటువంటి ప్రదర్శనల బృందాలు హాజరయ్యేవి. ఇప్పుడు వివాహ, జన్మదిన కార్యక్రమాలకు కూడా ఈ కోలాటం, తప్పెటగుళ్ల బృందాలను బుక్ చేసుకుని ఆహూతులను అలరించేందుకు సంసిద్ధమవుతున్నారు. కరుణ్కుమార్ 1999 నుంచి నృత్యప్రదర్శనలు ఇస్తున్నారు. చిన్నప్పుడు బాలనాగమ్మ బుర్రకథలో బాలరాజుగా నటించి ఆ తరువాత కళా ప్రదర్శనల వైపు ఆకర్షితులయ్యారు. ఇప్పటివరకూ వివిధ రాష్ట్రాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. కేవలం కోలాటం కాకుండా తప్పెటగుళ్లు, బిందెల డాన్స్తో పాటు డప్పు వాయిద్య ప్రదర్శన వంటి కళలపై ఔత్సాహికులకు శిక్షణ ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. జానపద కళారూపాలకు కరుణ్కుమార్ ప్రదర్శనలు ఇస్తూ, జానపద కళలు, సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించే కార్యక్రమాలను కూడా వివిధ వేదికలలో నిర్వహించారు. తాను వివిధ నటులు, నర్తకులు, సంప్రదాయం, కళలను చూసి నేర్చుకున్నదేనని, అందుకే అందరికీ వీటిని నేర్పించి ఆయా కళలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాననీ సాక్షికి తెలిపారు. తూర్పుభాగవతాన్ని కాపాడుతూ.. వారసత్వ కళను కొనసాగిస్తూ.. తూర్పు భాగవతం అంటే దశాబ్దాల నాటి ఓ అద్భుతమయిన కళ. ఆ కళను తాత తండ్రుల నుంచి వచ్చిందే కదానని వదిలేయకుండా నేటి కాలంలోనూ ఆ కళను కొనసాగిస్తున్న బొంతలకోటి శంకర రావు వివిధ రాష్ట్రాల్లో సైతం ఇప్పుడు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకప్పడు పండగల్లో తప్పనిసరి ప్రదర్శనగా తూర్పు భాగవతం ఉండేది. రాను రాను సంప్రదాయ కళలు అంతరించిపోతున్నట్టే నేడు తూర్పుభాగవతం కూడా అంతరించిపోయే దశలో ఉందని చెప్పవచ్చు. సరిగ్గా అప్పుడే ఆ కళను నిలబెట్టే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు బొబ్బిలి మండలం కోమటిపల్లికి చెందిన బొంతలకోటి శంకర రావు. ఆ కళను జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు వేదికల్లో ప్రదర్శనలిస్తూ బొబ్బిలికి పేరు తీసుకువస్తున్నారు. ఇప్పటికే తూర్పుభాగవతంపై పరిశోధన చేసి ఐటీలో డాక్టరేట్ అందుకున్నారు. గిడుగు రామ్మూర్తి పురస్కారం కూడా అందుకున్నారు. హైద్రాబాద్ శిల్పారామంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో లోక్మంతన్ కార్యక్రమంలో ప్రదర్శన. ఈసస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రదర్శన ఇచ్చి కేంద్ర మంత్రి చేతుల మీదుగా గౌరవ పురస్కారం అందుకున్నారు. ఏలూరులో ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారం, మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రదర్శనతో ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం మొత్తంగా 3వేల ప్రదర్శనలు ఇచ్చిన ఘనత శంకరరావు స్వంతమయింది. ఈ కళను అందించిన తండ్రి బొంతలకోటి సాంబమూర్తి పేరున పాఠశాల ఏర్పాటు చేసి జానపద కళలపై ఉచిత శిక్షణ, అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. పురాతన కళపై ఇంకా ఆసక్తి ఉన్న ప్రేక్షకులు ఉన్నారని, ఆ కళను తరచూ ప్రదర్శిస్తే దానికి అలవాటు పడి ఇతర ఆధునిక కళలకన్నా మంది ఆదరణ ఉంటుందని శంకరరావు సాక్షికి చెప్పారు. -
రెందు బైక్లు ఢీకొని ఇద్దరి మృతి
గజపతినగరం రూరల్ (జామి): జామి మండలంలోని జాగారం గ్రామం వద్ద శుక్రవారం రాత్రి ఒక బైక్ను వెనుక నుంచి మరో బైక్ ఢీకొనడంతోజరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రావాడ వెంకట్రావు (60) అనే వ్యక్తి తన బైక్లో ఆయిల్ అయిపోవడంతో ద్విచక్ర వాహనాన్ని నడిపించుకుంటూ వస్తుండగా.. వెనకనుంచి గొర్లె పవన్(25) అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంతో పస్తూ బలంగా ఢీకొన్నాడు. దీంతో వెంకట్రావు అక్కడికక్కడే మృతి చెందగా, పవన్ కుమార్ కూడా తన ద్విచక్ర వాహనం నుంచి దూరంగా రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకట్రావు జామి పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.యువకుడి ఆత్మహత్యబొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామానికి చెందిన పున్నాన చంద్రశేఖర్(22) అనే యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చిన్నమ్మలు, బోడయ్యలకు ఇద్దరు పిల్లలు కాగా కుమార్తెకు వివాహం చేశారు. కుమారుడు చంద్రశేఖర్ విశాఖలో ఓ ఫర్నిచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు చైన్నె పట్టణానికి కూలి పనుల కోసం వెళ్లిపోయారు. ఇంట్లో ఎవరూ లేకపోగా ఈనెల 12న చంద్రశేఖర్ స్వగ్రామం పారాది చేరుకుని ఒక్కడే నివసిస్తుండగా గురువారం అర్ధరాత్రి దాటాక ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి చుట్టుపక్కల వారి ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం సంఘటనా స్థలంలో దర్యాప్తు ప్రారంభించారు.యువకుడి మొబైల్ లోని కాల్స్, వాట్సప్ చాటింగ్ పరిశీలించిన అనంతరం చంద్రశేఖర్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చని సీఐ నారాయణరావు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి సీహెచ్సీకి తరలించినట్లు తెలియజేశారు. అపరిచితులకు సమాచారం చెప్పొద్దుసాలూరు రూరల్: అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు అన్నారు. దీనివల్ల సైబర్ మోసాల బారిన పడతారని హెచ్చరించారు. నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం బొడ్డవలస గ్రామంలో ఇంటిఇంటి మన్యం పోలీస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. వాల్పోస్టర్ ఆవిష్కరణవిజయనగరం టౌన్: విశాఖ దాబా గార్డెన్స్లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో అక్టోబరు 10, 11వ తేదీల్లో నిర్వహిస్తున్న సాహిత్య సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్ను స్థానిక మహాకవి గురజాడ స్వగృహంలో శుక్రవారం ఆవిష్కరించారు. సాహితీ స్రవంతి, అల్లూరి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కథ, కవిత్వం, విమర్శ తదితర అంశాలపై ప్రముఖుల ప్రసంగాలు, అనంతరం వర్ధమాన సాహితీవేత్తలతో ఇష్టాగోష్టి ఉంటాయని సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్ తెలిపారు. సమ్మేళనంలో పాల్గొనాలనుకునే వారు ఫోన్ నంబర్లు 9441176882, 9490098794, 9490098811లను సంప్రదించాలని కోరారు. రెండు రోజుల పాటు సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తుండడం హర్షణీయమని మాజీ ఎంపీ, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ డీవీజీ శంకరరావు అన్నారు. యువ సాహిత్యవేత్తలు కూడా సమ్మేళనానికి వచ్చి తమ ఆలోచనలను పంచుకోవాలన్నారు. -
ప్రభుత్వానిది మొండివైఖరి
కూటమి ప్రభుత్వానిది మొండివైఖరి. ప్రజా సమస్యలు పట్టవు. నిరంకుశత్వంతోనే ఉంటుంది. రైతులు అంటే అసలు గిట్టదు.ఉత్తరాంధ్రలో ప్రసిద్దిచెందిన ఒకే ఒక్క చెరకు ఫ్యాక్టరీ సంకలి వద్ద ఉన్న ఈఐడీ ఫ్యారీ చక్కెర ఫ్యాక్టరీ. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎలాగోలా నెట్టుకొచ్చాం. ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి రైతులకు మద్దతుధర, ఎరువులు పంపిణీ చేయించాం. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఫ్యాక్టరీకి ప్రభుత్వ ప్రోత్సాహం లేదు. తగినంత ముడిసరుకు రాకపోవడం, యంత్రాలు పాతవి కావడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం క్రషింగ్ తగ్గించుకుంది. ఈవిషయాన్ని మండలిలో చెప్పాను. మీడియా ద్వారా ప్రభుత్వానికి సూచించాం. కానీ ఏమీ పట్టనట్లు వ్యవహరించడంతో చివరకు ఫ్యాక్టరీ మూతవేసే పరిస్థితి వచ్చింది. పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ, పాలకొండ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది ఈ ఏడాది సుగర్ ఫ్యాక్టరీ ద్వారా క్రషింగ్ ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఉండదు. తగినంత ముడిసరుకు రావడంలేదు. ఫ్యాక్టరీ మెయింటనెన్స్కు అవసరమైన క్రషింగ్ జరగడంలేదు. ఫ్యాక్టరీ నష్టాలో నడుస్తోంది. యాజమాన్యం నిర్ణయం పాటించాల్సిందే. జయవెంకట సూర్య.టి. సీనియర్ జనరల్ మేనేజర్, ఈఐడీ ప్యారీ సుగర్స్, సంకిలి, రేగిడి మండలం -
కుంకీలు వచ్చినా..
సాక్షి, పార్వతీపురం మన్యం: ఒకవైపు నెలల తరబడి కష్టపడి సాగు చేస్తే.. మరోవైపు తెల్లవారుజామునే ఏనుగుల గుంపు చొరబడి చేతికందిన పంటలను క్షణాల్లో నేలమట్టం చేస్తున్నాయి. ఏం చేయాలో తెలియక రైతులు లబో దిబోమంటున్నారు. వరుసగా మండలాలు మారు తూ పంటలపై విరుచుకుపడుతున్న ఏనుగుల గుంపు..జిల్లా రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో కొమరాడ మండలంలో ఎనిమిది ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పలువురు రైతులు సాగు చేస్తున్న పామాయిల్, పత్తి, బీర, వరి పంటలను ధ్వంసం చేశాయి. పంటలతో పాటు వరి సాగుకు ఉపయోగి స్తున్న విద్యుత్ పంప్మోటార్ సెట్ను కూడా ధ్వంసం చేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంకీ ఏనుగులు ఎక్కడ? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాకు తీసుకొచ్చిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయంటూ ప్రజా, గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సీతానగరం మండలానికి చేరి నెల రోజు లు గడుస్తున్నా, అడవి ఏనుగుల నియంత్రణకు వాటిని ఎందుకు రంగంలోకి దించడం లేదని సీపీఎం నాయకుడు సాంబమూర్తి ప్రశ్నిస్తున్నారు. కుంకీ ఏనుగులకు శిక్షణ ఇస్తున్నారా? లేక వాటిని ఇతర అవసరాల కోసం సిద్ధం చేస్తున్నారా? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏనుగుల సమస్యకు తక్షణ, శాశ్వత పరిష్కారం చూపకపోతే రైతులందరితో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నిత్యం ఏదో చోట.. ఏనుగుల గుంపు వరుసగా మండలాలు మారుతూ పంటలపై దాడులు చేస్తుండడం రైతులను మరింత కలవరపెడుతోంది. మొన్న జియ్యమ్మవలస మండలంలో పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు .. నిన్న గరుగుబిల్లి మండలంలో బీభత్సం సృష్టించినట్లు రైతులు చెబుతున్నారు. తాజాగా కొమరాడ మండలానికి చేరుకుని మరోసారి పంటలను నాశ నం చేశాయి. చేతికందే దశలో ఉన్న పంటలు ధ్వంసం కావడంతో కొమరాడ మండల కేంద్రానికి చెందిన రైతులు సింహాచలం, బి.తవిటి నాయుడు, మడక గౌరునాయుడు, మడక పకీరు, పోలినాయు డు తదితరులు ఆందోళన చెందుతున్నారు. ఏళ్లుగా ఇదే తంతు.. ఏనుగులు పంటలను ధ్వంసం చేసిన ప్రతిసారీ అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి నష్టాన్ని పరిశీలించడం, ఆ తర్వాత నష్టపరిహారం ప్రక్రియ చేపట్టడం తప్ప సమస్యకు శాశ్వత పరి ష్కారం చూపలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ, ఏనుగుల దాడులను సమర్థవంతంగా అరి కట్టేందుకు పటిష్టమైన చర్యలు కనిపించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గజరాజుల వల్ల పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. -
షావుకారు జానకి ఇక లేరు
విజయనగరం టౌన్: తెలుగు సినీ చిత్రసీమలో అలనాటి అందాల నటి షావుకారు జానకి ఇకలేరన్న విషయం తెలుసుకున్న విజయనగర వాసులు ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. విజయనగరంతో ఆమెకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ వంటి 400కి పైగా సినిమాల్లో నటించి అందరితోనూ శభాష్ అనిపించుకున్న నటి షావుకారు జానకి (94) మృతిచెందడం పట్ల జిల్లా సాహితీవేత్తలు, సినీ, సంగీతాభిమానులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 2006లో మహాకవి గురజాడ విశిష్ట పురస్కారం మహాకవి గురజాడ విశిష్ట పురస్కారాన్ని 2006లో ఆమె విజయనగరంలో అందుకున్నారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఆమెకు పురస్కారంతో పాటు స్వర్ణ అంగుళీకాన్ని బహూకరించారు. అయితే, తాను ఏదీ స్వీకరించడానికి ఇష్టపడనని, దానికి ప్రతిఫలంగా వెంటనే జీయర్ అంధుల పాఠశాలకు సభలోనే 25వేల రూపాయలు చెక్కును విరాళంగా అందజేసిన మానవతా మూర్తి షావుకారు జానకి అంటూ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధులు కాపుగంటి ప్రకాష్, డాక్టర్ ఎ.గోపాలరావు తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రెండురోజుల పాటు విజయనగరంలో ఉన్న ఆమె తమ కుటుంబ సభ్యులతో పాటు డ్రైవర్ ఇలా అందరికీ బహుమతులుగా వెండి వస్తువులు, చీరలు, నగదు అందజేసి వెళ్లడం ఆమె సహృదయానికి నిదర్శనమన్నారు. ఇటీవల చంద్రబోస్కు గురజాడ విశిష్ట పురస్కారం అందజేసే సమయంలో ఆ సభ ఆహ్వానపత్రం చూసిన ఆమె చంద్రబోస్కి అభినందనలు తెలియజేయమని 90 ఏళ్ల వయసులో తెలియజేసినట్టు సమాఖ్య ప్రతినిధి కాపుగంటి ప్రకాష్ గుర్తుచేసుకున్నారు. షావుకారు జానకి -
ఆడి వచ్చేయండి.. తర్వాత చూద్దాం!
సాక్షి, పార్వతీపురం మన్యం: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ‘అమరావతి చాంపియన్షిప్ 2.0’ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు తిరుపతి వేదికగా జరగనున్నాయి. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు ఈ పోటీలు జరగగా.. అండర్–17, అండర్–23 బాలబాలి కల కేటగిరీలలో క్రీడాకారులు పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ప్రతిభ చాటిన యువ క్రీడాకారులు ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ ధ్యాన్ చాంద్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులకు అధికార యంత్రాంగం నుంచి సహకారం కొరవడుతోంది. మొత్తం 12 క్రీడాంశాల్లో జరిగే ఈ పోటీల్లో ఒక్కో జిల్లా నుంచి 350 మంది క్రీడాకారులు, పీఈటీలు, పీడీలు హాజరవుతున్నారు. ప్రయాణ ఖర్చుల కోసం ఒక వైపు ఒకరికి రూ.500, మార్గమధ్యంలో భోజనం కోసం రూ.300 చొప్పున చెల్లిస్తారు. ఈ లెక్కన జిల్లాకు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. మన్యం జిల్లా లో క్రీడాకారులను తరలించేందుకు అధికార యంత్రాంగం ఇప్పటి వరకూ పైసా కూడా ఇవ్వలేదు. వెళ్లి వచ్చాక ఇస్తాంలే అని చెబుతున్నట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో దీనికి సంబంధించి ఇప్పటికే రూ.6 లక్షల వర కూ డ్రా చేసుకున్నట్లు సమాచారం. అక్కడ లేని ది ఇక్కడే ఎందుకు ఇబ్బంది వస్తోందని పలువురు పీఈటీలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా స్థాయి పోటీల సమయంలో జరిగిన ఖర్చుల డబ్బులు కూడా ఇప్పటి వరకూ ఇవ్వలేదని, చేతి సొమ్ము పెట్టుకున్నామని వాపోతున్నారు. పోటీలు దగ్గరకు వస్తున్నా..క్రీడాకారుల తరలింపునకు బస్సులు కూడా పెట్టనట్లు తెలుస్తోంది. సాలూరు: రాష్ట్ర సీ్త్రశిశుసంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి మాజీ పీఎస్ బందాపు సతీష్పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్దేవ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు శుక్రవారం విచారణ జరిపారు. అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు, పట్టణ సీఐ అప్పలనాయు డు భంజ్దేవ్ ఇంటికి వెళ్లి ఆయన వాంగ్మూలా న్ని రికార్డు చేశారు. సతీష్ ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడడానికి భంజ్దేవ్తో పాటు పలువురు కారణమంటూ సోషల్ మీడియాలో మెసెజ్లు పెట్టిన క్రమంలో ఇది రాజకీయ దుమారాన్ని రేపింది. తనపై రాజకీయంగా కుట్రపన్ని, ఇలా సోషల్ మీడియాలో మెసేజ్ లు పెట్టారంటూ ఈనెల 13న ఎస్పీకి భంజ్దేవ్ ఫిర్యాదు చేశారు. పార్వతీపురం: మానవ మేధస్సుతో పోటీ పడు తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవ సాయ రంగంలోనూ తనదైన శైలిలో రైతులకు సలహాలు, సూచనలు ఇస్తోంది. యాంత్రీకరణ గా మారిన వ్యవసాయ రంగాన్ని మరింతగా ఆధునిక పుంతలు తొక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్ విస్తార్’ పేరుతో ఓ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాప్ ద్వారా కేవలం సలహాలు, సూచనలు మాత్ర మే కాకుండా విత్తనాలు, సాగు పద్ధతులు, చీడపీడల నివారణ, యాజమాన్య పద్ధతులు, మద్దతు ధర, మార్కెట్ సౌకర్యాలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తోంది. ప్రాంతీయ భాషలో అర్దమయ్యే రీతిలో ఏఐ సలహాలు, సూచనలు అందిస్తుండడం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ యాప్లో చీడపీడలు, తెగుళ్లు ఆశిస్తే ఒక్క ఫొటో తీసిపంపిస్తే దానికి ఆశించిన తెగులు ఏమిటి, ఏ మందులు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి తదితర సమాచారాన్ని అందిస్తుంది. పంట సాగు పద్ధతులే కాకుండా వాతావరణ సమాచారం కూడా అందజేస్తుంది. -
దారి చూపని నేతలు..!
కొమరాడ: పాలకుల మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ ఏజెన్సీలో గిరిజనుల బతుకులు మాత్రం గుంతలు దాటడం లేదు. కూటమి ప్రభుత్వం పాలనలో ప్రచార ఆర్భాటాలు మిన్నంటుతున్నాయి. క్షేత్ర స్థాయిలో గిరిజన పల్లెల కష్టాలు ఎక్కడ వేసిన గొంగిళి అక్కడే అన్న చందంగా ఉన్నా యి. ఈ నేపథ్యంలో కొమరాడ మండలం పాలెం పంచాయతీ కూస్తురు గ్రామంలో శుక్రవారం సంభవించిన ఓ హృదయ విచారక దృశ్యమే ఇందుకు సజీవ సాక్ష్యం. గ్రామానికి చెందిన తాడంగి సురేషన్ కడుపునొప్పితో పాటు కడుపు పొంగిపోవడంతో ఆనారోగ్యానికి గురయ్యాడు వెంటనే కుటుంబసభ్యులు సుమారు నాలుగు కిలోమీటర్లు డోలీ కట్టి రాళ్లరహదారిపై నడుచుకుంటూ వచ్చి కొంత దూరంలో ఆటో ఎక్కి రాయిపురం గ్రామానికి వచ్చి అక్కడినుంచి నెల్లిమర్లలోని మిమ్స్ అస్పత్రికి వెళ్లడానికి రూ.ఐదు వేలకు బొలెరో వాహనం మాట్లాడుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అటవీ శాఖ అనుమతులు రాక వందలాది గిరిజన గ్రామాలు నేటికి కనీస రవాణా సౌకర్యానికి నోచుకోవడం లేదు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులులు కోరుకుంటన్నారు. -
వామ్మో..పంచదార..!
సీతంపేట/బలిజిపేట: నిన్నటివరకు తీపి అందించిన పంచదార ఇప్పుడు సామాన్యుడికి చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. పక్షం రోజుల కిందట వరకు కిలో రూ. 45 పలికిన పంచదార ధర తాజాగా కిలో రూ.75కి పెరిగింది. కిలోకు ఒక్కసారిగా రూ.30 పెరగడంతో వ్యాపారవర్గాలే విస్తుపోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా అమాంతం పంచదార ధరలు ఒక్కసారిగా ఇలా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇంటింటా నిత్యావసరంగా వినియోగించే పంచదార ధరలు సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. వినాయకచవితి, దసరా, దీపావళి వంటి పండగలు సమీస్తున్న నేపథ్యంలో పంచదారకు డిమాండ్ పెరుగుతుంది. కిలో రూ.వంద వరకు వెళ్లినా అశ్చర్య పడాల్సిన అవసరం లేదని వ్యాపారులు చెబుతున్నారు. స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు, పానీయాల తయారీలో పంచదార వినియోగం అధికంగా ఉండడంతో వ్యాపారులు ముందుగానే నిల్వ చేసుకుంటున్నారు. చక్కెర ఉత్పత్తి, నిల్వలపై నెలకొన్న ఆందోళన కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. చెరకు లభ్యత, దిగుబడులపై ప్రభావం, ఇథనాల్ ఉత్పత్తికి చెరుకును మళ్లించడం వంటి అంశాలతో దేశీయంగా చక్కెర లభ్యతతపై ఒత్తిడి ఏర్పడింది. దీంతో మిల్లుల వద్ద ధరలు ఒక్కసారిగా పెంచేశారని వ్యాపారులు చెబుతున్నారు. కేంద్రం కీలక నిర్ణయం.. దేశీయంగా పంచదార లభ్యత తగ్గడంతో పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 10లక్షల మెట్రిక్ టన్నుల ముడి పంచదారను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ నెలాఖరు వరకు ఈ దిగుమతులకు అవకాశం ఉంటుంది. దాదాపు పదేళ్ల తర్వాత భారత్ పంచదార దిగుమతులు వైపు మళ్లడం గమనార్హమని వ్యాపార వేత్తలుచెబుతున్నారు. బ్రెజిల్ నుంచి పంచదార దిగుమతి చేసుకోనున్నారు. కేంద్ర తీసుకున్న నిర్ణయంతో దేశీయ మార్కెట్లో పంచదార లభ్యత పెరిగే అవకాశం ఉంది. దిగుమతి చేసిన ముడి పంచదారను శుద్ధి చేసి మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా సరఫరా పెరిగితే ధరల పెరుగుదలకు కొంతమేర అడ్డుకట్ట పడే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు తెలియజేస్తున్నారు. -
న్యాయం జరిగేవరకు అండగా ఉంటా
● సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రాధానాయుడు సాలూరు రూరల్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రహరీ కూలి మృతిచెందిన తుపాకుల అరుణ్ తేజ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతానని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రాధానాయుడు అన్నారు. ఈ మేరకు గురువారం ఆమె పెద్దవీధిలో నివాసం ముంటున్న విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి నిండు ప్రాణం పోవడానికి కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. విద్యార్థులకు కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కల్పించలేని ప్రభుత్వం విద్యావ్యవస్థపై నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ఆదర్శ పాఠశాలల్లో అతిథి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ● గంటకు రూ.250 పారితోషికం పార్వతీపురం రూరల్: విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు, పార్వతీపురం మన్యం జిల్లాలోని నాలుగు ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి. బ్రహ్మాజీ రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రాతిపదికన పీజీటీ, టీజీటీ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నామని, అర్హత గల వారు నేరుగా ఆయా సంబంధిత పాఠశాలల్లోనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎంపికై న వారికి బోధించిన ప్రతి గంటకు రూ.250 చొప్పున, నెలకు 48 గంటలు మించకుండా గరిష్టంగా రూ.12,000 వరకు పారితోషికం చెల్లిస్తారు. సాలూరు మోడల్ స్కూల్లో పీజీటీ(ఎకనామిక్స్), టీజీటీ(సివిక్స్), అలాగే కురుపాం, భామిని స్కూళ్లలో పీజీటీ సివిక్స్, ఇంగ్లీష్, ఎకనామిక్స్ సబ్జెక్టులలో ఖాళీలు ఉన్నట్లు వెల్ల డించారు. కాగా, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియపై పూర్తి అధికారం జిల్లా విద్యా శాఖాధికారికే ఉంటుందని ఆ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలురాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి హరిజనవీధికి చెందిన ఉత్తరావెల్లి గణపతి బుధవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చీపురుపల్లి నుంచి రాజాం ద్విచక్రవాహనంపై గణపతి వస్తుండగా కొత్తవలస జంక్షన్కు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. వెంటనే స్థానికులు 108 సహాయంతో రాజాం సామాజిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ మేరకు బాధితుడి భార్య శ్యామల ఫిర్యాదుపై గురువారం కేసు నమోదుచేశామని ఎస్సై సల్మాన్బేగ్ తెలిపారు. వీరఘట్టం: డ్వాక్రా మహిళలకు పారదర్శకంగా రుణాలు మంజూరు చేయడంతో పాటు రికవరీ చేపట్టాలని డీఆర్డీఏ పీడీ సీహెచ్ ప్రభావతి అన్నారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో వీఓఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం చలివేంద్రి గ్రామంలో మహిళా రైతులు సాగుచేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించారు. ఆమెతో పాటు ఎంఎంఎస్ అధ్యక్షురాలు కె.లలితకుమారి, డీపీఎం బి.ధర్మారావు, సీ్త్రనిధి ఏజీఎం పి.కామరాజు, ఏపీఎం రాము, తదితరులు పాల్గొన్నారు. మహిళ ఆత్మహత్యవిజయనగరం టౌన్: స్థానిక ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న పాలకొండ మండలంలోని అన్నవరానికి చెందిన కొండేటి జయ (36) బుధవారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్ కొక్కానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త రామకృష్ణ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ దంపతులకు పెళ్లయి ఏడాదిన్నర అయింది. సంతానం లేదు. మృతురాలి సోదరుడు కొండేటి వెంకట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీలావతి తెలిపారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదు. -
మామిడిపల్లి, కురుకుట్టి గ్రామాలలో విచారణ
సాలూరు: మండలంలోని మామిడిపల్లి,కురుకుట్టి గ్రామాలకు సంబంధించి పోలింగ్స్టేషన్లు 24,6 పరిధిలోని ఎస్ఆఐర్ నో మ్యాపింగ్, లాజికల్ డిస్క్రెపెన్సీ కేసులపై ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ విచారణను తహసీల్దార్ సురేష్ గురువారం నిర్వహించారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్ల వివరాలు, నమోదైన అ భ్యంతరాలు, నో మ్యాపింగ్,లాజికల్ డిస్క్రెపెన్సీకి సంబంధించిన అంశాలను పరిశీలించారు. ధ్రువీకరణ పత్రాలను స్వీకరించి నిబంధనల మేరకు పరిశీలించారు. అర్హులైన ఓటర్ల హక్కులను పరిరక్షించే విధంగా విచారణ ప్రక్రియ నిబంధనల మేరకు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.కార్యక్రమంలో బీఎల్ఒలు, ఓటర్లు , ప్రజలు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులకు నైపుణ్య తరగతులు
పార్వతీపురం రూరల్: బోధనా సామర్థ్యాలకు మెరుగులు దిద్దుకునే దిశగా, ఉపాధ్యాయుల వృత్తిపరమైన నైపుణ్యాల అభివృద్ధికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలను శనివారం నుంచి నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు గురువారం తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు 22వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా, ప్రతి ఉపాధ్యాయుడు ఏటా 50 గంటల నిరంతర వృత్తిపరమైన అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న లక్ష్యంతో నెలకు రెండు శనివారాలు ఈ పూర్తిస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. సబ్జెక్టు పరిజ్ఞానం, పాఠ్య ప్రణాళికలు, మూల్యాంకన విధానాలు, బోధనా పరికరాల తయారీపై ఇందులో మేధోమథనం జరగనుంది. ఆగస్టు నెలకు సంబంధించి 22న జరిగే సమావేశాలకు 50 శాతం ఎస్జీటీలు, నాన్–లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్లు హాజరుకావాలి. క్లస్టర్ సమావేశాల రోజున పాఠశాలలు మూసివేయకూడదని, విద్యావిషయకం అంశాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. సన్మానాలు, వ్యక్తిగత వేడుకలకు ఏమాత్రం తావులేదని, బోధనా మెరుగుదలే ధ్యేయంగా తరగతులు జరగాలని, నిబంధనల ఉల్లంఘనపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిగిలిన 50 శాతం ఉపాధ్యాయులు, లాంగ్వేజ్ సబ్జెక్టుల వారు 29న హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రేపటి నుంచే క్లస్టర్ సమావేశాలు -
వారపు సంతలకు చెల్లుచీటీ
రాజాం: వారపు సంత అంటే పండగలా ఉండేది. వారం వచ్చిందంటే చాలు ఆరోజు సంతలో అన్ని రకాల కూరగాయలు, ఇంటి సామగ్రి, తినుబండారాలు, అలంకార వస్తువులు కనిపించేవి. వాటి ధరలు కూడా కారుచౌకగా ఉండేవి. వాటిని అమ్మే విక్రయదారులకు గౌరవ మర్యాదలు కనిపించేవి. వారం మొత్తానికి సరిపడా వస్తువులు ఆ సంతలో కొనుగోలు చేయగా, తక్కువ బడ్జెట్లో ఇంటిల్లిపాది జీవనం సాగిపోయేది. అంత ప్రాముఖ్యత ఉండే సంతలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. వారపు సంతలను ప్రజలు మరిచిపోయారు. పట్టణాల్లో సూపర్ మార్కెట్లు, మార్నింగ్ మార్కెట్లు వచ్చేశాయి. గ్రామాల్లో వాడవాడలా వ్యాపారాలు పెరిగాయి. బళ్లు, ఆటోలతో గ్రామాల్లో వ్యాపారాలు వచ్చేశాయి. ఏ రోజు సరుకు ఆరోజే, తాజా ధరలకు విక్రయాలు చేస్తున్నారు. చిల్లర పనిలేకుండా ఫోన్ పేల వినియోగం పెరిగింది. ఫలితంగా వారపు సంతలు అటకెక్కాయి. తక్కువ బడ్జెట్లో పోయే జీవితాలు కాస్ట్లీ అయ్యాయి. ఏరోజు కూర, నార, అలంకరణ వస్తుసామగ్రి ఆరోజు వినియోగంతో సరిపోతుంది. గత సంతల్లో లభించే వస్తువులకు వినియోగపు గడువు ఉండేది కాదు. ఇప్పుడు లభించే ప్రతి వస్తువుపై నిర్ణీత వినియోగపు గడువు ఉండడంతో పాటు ధరలు ఫిక్స్డ్ కావడంతో కొసరు వ్యాపారాలు కనుమరుగయ్యాయి. కారుచౌకగా వస్తుసామగ్రి సంతలో వస్తుసామగ్రి అప్పటికీ ఇప్పటికీ బయట మార్కెట్ కంటే చౌకగానే లభిస్తాయని చెప్పాలి. ఇక్కడకు తీసుకొచ్చే సరుకు వెనక్కి తీసుకెళ్లకుండా మొత్తం అమ్మేపనిలో భాగంగా వ్యాపారులు ధరను డిమాండ్ ఆధారంగా తగ్గిస్తూ విక్రయాలు చేస్తారు. ఫలితంగా కూరగాయలు, కిరాణా సామగ్రిలో భాగమైన పప్పులు, ఉప్పుల ధరలు, నిత్యావసర సరుకులైన చింతపండు, ఉల్లి, పోపుల సామాన్ల ధరలు తక్కువగా ఉంటాయి. వాటితో పాటు ఇంటికి, పొలంపనులకు అవసరమయ్యే వస్తుసామగ్రి ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండేవి.రాజాం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో జరిగే సంతలు ఎంతో ఫేమస్గా ఉండేవి. రాజాంలో ప్రతి గురువారం సంత జరుగుతుంది. ఇప్పటికీ ఈ సంత నిర్వహణ ఉన్నప్పటికీ గతంలో కంటే డిమాండ్ తగ్గింది. గడిచిన పదేళ్ల క్రితం వరకూ రాజాంలో పశు వ్యాపారం అంతర్జిల్లాలు దాటేది. మేలు జాతి దేశీయ ఆవులు ఇక్కడ అమ్మకాలు చేసేవారు. వాటిని కొనుగోలు చేసేందుకు ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ల యజమానులు, భూ స్వాములు వచ్చేవారు. ఇప్పుడు ఆ దేశీయ జాతులు ఆవుల విక్రయాలు, ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ సంతలో విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి కూరగాయలు, ఇతర కిరాణా, నిత్యవసర సరుకులు తీసుకొచ్చి లక్షల్లో వ్యాపారాలు చేసేవారు. ఇవన్నీ చెల్లుచీటీగా మారాయి. అప్పటికీ..ఇప్పటికీ చాలా తేడాగతంలో సంతలు అంటే ఓ పెద్ద వ్యాపార మార్కెట్గా ఉండేది. విక్రయదారులతో పాటు కొనుగోలుదారుల్లో స్వచ్ఛత ఉండేది. తూకాల్లో లోపాలు ఉండేవి కాదు. సరుకులో కూడా అంతే నాణ్యత ఉండేది. రాజాంలో పాడి పశువులు, కోళ్లు, గొర్రెలు, పందుల క్రయవిక్రయాలతో పాటు ఇంటి సరుకులు, వంటసరుకులు అధికంగా అమ్ముడయ్యేవి. చాలా తక్కువ బడ్జెట్లో సరుకులు లభించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ధరలు మండుతున్నా యి. వ్యాపారాలు అలానే అతలాకుతలంగా ఉంటున్నాయి. సంతలు కాలగర్భంలో కలసిపోతున్నాయి. గార రంగనాథం, రాజాం చరిత్ర పుస్తక రచయిత, రాజాం. ఒక్క రాజాంలో మాత్రం ప్రతి గురువారం నిర్వహణ మిగిలినచోట ఆగిపోయిన సంతమార్కెట్లు ఒకప్పుడు జనాలతో కళకళలాడిన సంతలు విలేజ్ వ్యాపారాలు పెరగడంతో తగ్గిన సంత వ్యాపారాలుబంగారం వ్యాపారపు సంతనియోజకవర్గంలో రేగిడి మండలంలోని ఉంగరాడ గ్రామంలో ప్రతి ఆదివారం వారపు సంత జరిగేది. ఇక్కడ ఎక్కువగా చిరుధాన్యాల వ్యాపారం నిర్వహించేవారు. ఈ సంతలో బంగారం వస్తువుల విక్రయాలు చేసేవారని, వాటిని కొనుగోలుచేసేందుకు వందలాది గ్రామాల ప్రజలు వచ్చేవారని వినికిడి ఉంది. ఈ సంతలో ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎంఆర్ తండ్రి చినసన్యాశిరాజు బంగారం వ్యాపారంలో పాల్గొనేవారని ఇక్కడివారు చెబుతున్నారు. జ్యూయలరీ షాపులు, గ్రామాల్లో బంగారువర్తకులు వచ్చిన తరువాత సంతలో బంగారు వ్యాపారం పడిపోవడంతో పాటు సంత కూడా కనుమరుగైంది. సంతకవిటి మండలం మందరాడలో ప్రతి శుక్రవారం పెద్ద ఎత్తున సంత జరిగేది. ఇక్కడి సంతలో కూరగాయలు, కిరాణా వ్యాపారంతో పాటు నాటుకోళ్ల విక్రయాలు ఎక్కువగా జరిగేవి. మామిడి సీజన్లో వందలాది గ్రామాల మామిడి వ్యాపారులు ఇక్కడ నుంచే ఇతర ప్రాంతాలకు మామిడిసరుకును ఎగుమతిచేసేవారు. మట్టి పాత్రల సంత ఇక్కడే జరిగేది. ఇప్పుడు ఈ సంత పూర్తిగా ఆగిపోయింది. ఆయా సంతలు భలే ఫేమస్ గురూ.. -
బుసకొడుతున్న విషసర్పాలు
● ఏడు నెలల్లో పాముకాటుకు గురైన వేలాది మంది ● సకాలంలో బాధితులను ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాపాయం దూరం● గుర్ల మండలానికి చెందిన ఓ విద్యార్ధిని ఇంటి ముందు కుర్చీలో చదువుకుంటుంగా పాము కాటు వేసింది. ఈ విద్యార్ధిని కూడా ఆస్పత్రిలో చేర్పించేలోగానే మృతి చెందింది. విజయనగరం ఫోర్ట్: జామి మండలానికి చెందిన జి.ఎర్నాయుడు పొలంలో పనిచేస్తుండగా పాముకాటుకు గురవడంతో కుటుంబసభ్యులు ఎస్. కోట ఏరియా ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఇటీవల కాలంలో పాముకాటుకు గురైన వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుత వర్షాకాలంలో పాముకాటుకు ఎక్కువగా గురవుతారు. రాత్రి వేళ నీరు కట్టేందుకు వెళ్లే రైతులు, కళ్లానికి వెళ్లే రైతులు, కూరగాయల తోటల్లో ఎక్కువుగా రైతులు పాముకాటుకు గురవుతున్నారు. పొలం పనుల్లో బీజీగా ఉన్న సమయంలో రైతులు విషసర్పాల సంచారాన్ని పెద్దగా పట్టించుకోరు. కొంతమంది అయితే పాములపై కాలు వేయడం, తెలియకుండా చేత్తో పట్టేయడం వల్ల కూడా పాముకాటుకు గురవుతుంటారు. అయితే పాముకాటుకు గురైన వారిని సకాలంలో (గోల్డెన్ హవర్) ఆస్పత్రికి తరలించినట్లయితే ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఏమాత్రం అలసత్వం వహించినా, పసర మందులు లాంటివి వేసి ఆలస్యం చేసినా ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అత్యంత అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుత సీజన్లో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆగస్టు నెల నుంచి నవంబర్ నెలాఖరు వరకు జాగ్రత్త వహించాలి. రాత్రి వేళ మరింత జాగ్రత్త అవసరం. రాత్రి వేళ పొలానికి వెళ్లేటప్పుడు టార్చ్ లైట్, చేతి కర్ర పట్టుకుని వెళ్లాలి. రబ్బురు షూ ధరిస్తే మరింత మంచిది . రాత్రి వేళ పొలంలోకి వెళ్లేటప్పుడు కర్రతో చప్పుడు చేసుకుని వెళ్లాలి. ఏడు నెలల్లో పాము కాటు బారిన వేలాది మంది ఏడు నెలల వ్యఽవధిలో వేలాది మంది పాముకాటుకు గురయ్యారు. జిల్లాలో 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎస్.కోట, గజపతినగరం, చీపురపల్లి, రాజాంలలో ఏరియా ఆస్పత్రులు బాడంగి, భోగాపురం, నెల్లిమర్ల, బొబ్బిలిలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్సీలు) ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఉంది. పాముకాటుకు గురైన వారు ఆయా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటారు. ఈ ఆస్పత్రుల్లో జనవరి నుంచి జూలై నెలాఖరు నాటికి సుమారు 1215 మంది పాముకాటుకు గురైన వారు చికిత్స పొందారు. అలాగే సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో 709 మంది, 232 మంది పీహెచ్సీల్లో, సర్వజన ఆస్పత్రిలో 274 మంది చికిత్స తీసుకున్నారు. అందుబాటులో యాంటీ స్నేక్ వీనమ్ అన్ని ఆస్పత్రుల్లో యాంటీ స్నేక్ వీనమ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. పాముకాటుకు గురైన వ్యక్తిని సకాలంలో ఆస్పత్రికి తీసుకొస్తే త్వరగా చికిత్స అందించి ప్రాణా పాయం నుంచి తప్పించవచ్చు. డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ -
ఇండియన్ పోలీస్ మెడల్ గ్రహీతకు ఎస్పీ అభినందన
విజయనగరం టౌన్: ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ను తీసుకున్న స్పెషల్ బ్రాంచ్ రిటైర్డ్ హెడ్కానిస్టేబుల్ మండ రామచంద్ర శేఖరరావును ఎస్పీ ఏఆర్.దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం అభినందించారు. జిల్లా పోలీస్శాఖలో 39 ఏళ్లపాటు వివిధ హోదాల్లో అత్యున్నత క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసిన రామచంద్ర సేవలను కేంద్రప్రభుత్వం గుర్తించి 2024లో ఇండియన్ పోలీసు మెడల్ ప్రకటించిందన్నారు. 2026 మార్చిలో ఆయన ఉద్యోగవిరమణ చేశారని, 80వస్వాతంత్య్ర దినోత్సవంలో పురస్కారాన్ని స్వీకరించారని చెప్పారు. పోలీస్శాఖకు చంద్రశేఖర్ నిబద్ధతతో చేసిన సేవలను ఎస్పీ ఈ సందర్భంగా ప్రశంసించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏవీ లీలారావు, పోలీస్ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
విలేకరిపై దాడిని ఖండించిన పాత్రికేయులు
పాచిపెంట: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన విశాలాంధ్ర విలేకరి గోవిందపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక పాత్రికేయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పాచిపెంట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి డిప్యూటీ తహసీల్దార్ వి.రంగారావుకు వినతిపత్రం అందజేశారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా సంయుక్త కార్యదర్శి పి.ఉమామహేశ్వరరావు, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వై.గౌరీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఓఈ స్కూల్ విద్యార్థులకు దోమతెరల పంపిణీ
సీతానగరం: మండలంలోని జోగింపేట స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్(ఎస్ఓఈ) విద్యాలయంలో విద్యార్థులకు వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రొగ్రాం అధికారి డాక్టర్ ఎంఎం రవికుమార్రెడ్డి పీహెచ్సీ డాక్టర్ పి.పావని ఆధ్వర్యంలో గురువారం దోమతెరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్రెడ్డి మాట్లాడుతూ విద్యపట్ల దీక్షతో ఉన్న సమయంలో దోమలు కుట్టే అవకాశం ఉందని జ్వరాల బారినపడతారని తద్వారా దోమల బారినుంచి రక్షించుకునేందుకు దోమతెరలు దోహద పడతాయని అందుకు 177 మంది విద్యార్ధులకు దోమతెరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఆరోగ్యపరమైన విషయాలపై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత, చేతులు శుభ్రపర్చుకోవడం, కాలానుగుణంగా వచ్చే వ్యాధులపట్ల తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్ఓఈ ప్రిన్సిపాల్ ధర్మరాజు, హెల్త్ సూపర్వైజర్ గోపాల నాయుడు, ఉప ఎంఎల్హెచ్పీలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించండి
పార్వతీపురం: జిల్లాలో రైల్వే ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాసింజర్స్ వెవెల్ఫేర్, కన్జూమర్స్ అవేర్నెస్ సొసైటీ సభ్యులు దక్షిణ కోస్తా రైల్వే ఉన్నతాధికారులకు గురువారం వినతిపత్రాన్ని అందజేశారు. పార్వతీపురం రైల్వే స్టేషన్లో దివ్యాంగులు, వృద్ధులు, మహిళలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, కోచ్ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. విజయనగరం– రాయగడ మధ్య మెము సర్వీస్, పార్వతీపురం నుంచి సికింద్రాబాద్, బెంగుళూర్, తిరుపతికి నేరుగా ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని విజ్ఞప్తి చేశారు. 18301/18302 సంబల్పూర్ ఇంటర్ సిటీని విజయనగరం వరకు పొడిగించడం, రాయగడ– విజయనగరం మార్గంలోని అన్ని రైళ్లకు పార్వతీపురంలో స్టాపేజ్ కల్పించడం, ఆర్వీ/ 283 వద్ద ఆర్ఓబీ లేదా అండర్పాస్ నిర్మించడం, పండగల సమయంలో ప్రత్యేక రైళ్లు నడపాలని కోరారు. 18523/ 18524 రీల్ను వారానికి ఐదురోజులు నడపాలని, చీపురుపల్లిలో 19021/19022 రైళ్లకు హాల్ట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో వి. శ్రీహరితోపాటు వి. సందీప్, ఎం. కృష్ణమూర్తినాయుడు, ఎం. వెంకటరమణ, ఎం. రామచంద్రరావు తదితరులున్నారు. -
టెట్ సాధించలేదని యువతి ఆత్మహత్య
దత్తిరాజేరు: మండలంలోని చినరాజేరు గ్రామానికి చెందిన మహదేవ్ తనూజ(25)కొద్ది నెలల క్రితం నిర్వహించిన టెట్లో అర్హత సాధించలేకపోయానని మనస్తాపం చెంది గురువారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పెదమానాపురం ఎస్సై కళాధర్ తెలిపారు. కొద్ది నెలల క్రితం వివాహమై రెండు రోజుల క్రితం అత్త వారింటికి వచ్చిన తనూజ అందరితో ముభావంగా ఉండేది. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి స్వగ్రామం మొరక ముడిదాం మండలం గర్భాం. తండ్రి చంద్రశేఖర్ పోలీస్ ఉద్యోగం చేస్తుండడంతో విజయనగరంలో నివాసం ఉంటున్నారు. మృతురాలి భర్త ప్రసన్నకుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. మృతురాలి తండ్రి చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం గజపతినగరం సీహెచ్సీకి మృతదేహాన్ని తరలించినట్లు ఎస్సై చెప్పారు. -
చెరువుల పరిరక్షణలో నిర్లక్ష్యం వద్దు
పార్వతీపురం: జిల్లాలో చెరువుల సరిహద్దుల గుర్తింపు, ఆక్రమణల తొలగింపు, ట్రెంచ్ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను హెచ్చరించారు. అధికారులో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాలో చెరువుల పరిరక్షణ పురోగతిపై సమీక్షించారు. చెరువులను ఆక్రమించిన వారిపై ఆర్ఆర్ఆర్ చట్టం కింద కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలతో పాటు భారీ జరీమానాలు విధిస్తామని తెలిపారు. చెరువు గట్ల వెంట ట్రెంచ్ పనులు పూర్తి చేసి, గట్లు స్థిరత్వానికి మొక్కలు నాటాలని ఆదేశించారు. సర్వే, పనుల ప్రగతి, కూలీల సంఖ్య, మస్తర్ రోల్స్ వివరాలను గూగుల్ షీట్లో నమోదు చేయాలని సూచించారు. చెరువుల ఆక్రమణలు పూర్తిగా తొలగించేవరకు అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఆర్.వైశాలి, ఆర్డీఓ కె.మాధురి, డ్వామా పీడీ కె. రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ ల్యాడ్స్ పనులు గడువులోగా పూర్తి చేయాలి ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. భామిని, సీతంపేట, పాలకొండ, వీరఘట్టం మండలాల్లో సోలార్ స్ట్రీట్లైట్లు, ఆర్వో ప్లాంట్లు, బస్సెల్టర్లు, సీసీ డ్రైన్లు, ట్రాన్స్ఫార్మర్ల పనులను వేగవంతం చేయాలని సూచించారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ కొత్తవలస: సౌత్ ఏసియా ఎల్పీజీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో మంగళపాలెం గ్రామ సమీపంలోని గురుదేవా చారిటిబుల్ ట్రస్టు గురువారం 350 మంది దివ్యాంగులకు కృత్రిమ ఆవయవాలు, ఉపకరణాలను తహసీల్దార్ ఎస్.రామలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ట్రైసైకిల్స్, పోలియో కాలిపవర్స్, చెవిటి మిషన్లు, వీల్చైర్స్, వాకర్స్ స్టిక్స్ను అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ దివ్యాంగుల సేవలో ట్రస్టు పరితపించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు, సభ్యులు పాల్గొన్నారు. రెల్లి భూ ఆక్రమణలపై చర్యలకు ఉపక్రమణ ● వీఆర్వోకు ఉద్వాసన కొత్తవలస: మండలంలోని రెల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూముల దురాక్రమణపై అధికార యంత్రాంగం స్పందించింది. చర్యలకు ఉపక్రమించింది. కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్న తీరుపై ‘పెచ్చు‘రెల్లి’తున్న ఆక్రమణలు’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన వార్తకు మండల రెవెన్యూ అధికారులు స్పందించారు. ముందుగా గ్రామంలో జరిగిన భూ ఆక్రమణలను గుర్తించి నివారించడంలో గ్రామ రెవిన్యూ అధికారి ఎస్.సుదీర్ విఫలమయ్యారన్న కారణంతో విధుల నుంచి తప్పించినట్టు తహసీల్దార్ ఎస్.రామలక్ష్మి తెలిపారు. ఆయన స్థానంలో దెందేరు వీఆర్వోగా పనిచేస్తున్న జి.గోవింద్కు అదనపు బాధ్యతలు అప్పగించామన్నారు. సర్వే నంబర్ 146–1లో ఐదు ఎకరాల 16 సెంట్ల ఆక్రమిత భూమికి వెళ్లేందుకు అక్రమంగా నిర్మించిన కల్వర్టుకు అడ్డంగా ఆర్ఐ షణ్ముఖరావు, మండల సర్వేయర్ గంగాధర్ల సమక్షంలో జేసీబీతో పెద్ద కందకాన్ని తవ్వించారు. సంబంధిత భూమిలోకి ఎవరూ వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. సర్వే నంబర్ 21లో 11, 13, 15 సబ్ డివిజన్లలోని భూమి చుట్టుపక్కల జిరాయితీ భూములు ఉన్నాయని, మధ్యలో ప్రభుత్వ భూమి ఉన్నట్టు తహసీల్దార్ తెలిపారు. ఆక్రమణలను ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. విలేకరిపై దాడిని ఖండించిన జెడ్పీ చైర్మన్ వియనగరం రూరల్: పూసపాటిరేగ మండలానికి చెందిన ఓ దినపత్రిక విలేకరి గోవింద్పై జరిగిన దాడిని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఖండించారు. జిల్లాలో ఇటువంటి విషసంస్కృతి హేయమైన చర్యగా అభివర్ణించారు. -
బేబీకిట్టు..
–8లో● ఆచరణలోకి రాని ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’ పంపిణీ ● వేలాది మంది తల్లుల ఎదురుచూపులు శుక్రవారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2026● గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి ప్రభుత్వాస్పత్రిలో నెలకు సగటున 17 నుంచి 26 వరకూ ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ప్రస్తుత తేదీ వరకూ 179 ప్రసవాలు జరిగాయి. ఇందులో ఏ ఒక్కరికీ ప్రభుత్వం అందిస్తాం అన్న ఎన్టీఆర్ బేబీ కిట్టు అందలేదు. ఇక్కడి ఆస్పత్రిలో నాలుగు రోజుల కిందట ప్రసవం అయిన ఒక మహిళకు ఎటువంటి కిట్టు కూడా ఇవ్వలేదని ఆమె బంధువులు చెబుతున్నారు. ........................................................ ● ఆర్.ఆముదాలవలస మండలానికి చెందిన మహిళ కొద్ది రోజుల కిందట పాలకొండ ప్రభుత్వాస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది. డెలివరీ అయి, వెళ్లడం తప్ప.. ఆస్పత్రి సిబ్బంది ఎటువంటి కిట్లు కూడా ఇవ్వలేదని ఆమె చెబుతున్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్/ గుమ్మలక్ష్మీపురం: ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించే తల్లుల, పిల్లల సంరక్షణ కోసం ‘ఎన్టీఆర్ బేబీ కిట్’ అందించనున్నట్లు ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. రాష్ట్రంలో ఏటా సుమారు 3.50 లక్షల మందికి కిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. టెండర్లు కూడా పూర్తి చేసుకున్నా.. నేటికీ ఏ ఒక్కరికీ ఈ కిట్లు అందించిన దాఖలాలు లేవు. ప్రచార ఆర్భాటంగానే ఈ పథకం మిగిలిపోయింది. రాజకీయంగా ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినట్టే... ఆయన పేరు పెట్టిన పథకాన్ని చంద్రబాబు నీరుగారుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 13 రకాల వస్తువులు ఇస్తామని చెప్పి.. శిశు మరణాలను తగ్గించి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ‘ఎన్టీఆర్ బేబీ కిట్టు’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తల్లికి, బిడ్డకు అవసరమైన మొత్తం 13 రకాల వస్తువులు అందజేస్తామని వెల్లడించింది. బ్యాగు, దోమతెరతో కూడిన పరుపు, ఫోల్డబుల్ బెడ్, వాటర్ ప్రూఫ్ షీట్, రెండు జతల దుస్తులు, రెండు టవల్స్, ఆరు నాప్కిన్లు, రెండు సబ్బులు, సబ్బుపెట్టె, పౌడర్, ఆయిల్, షాంపూ, బొమ్మ వంటివి ఉంటాయి. ప్రభుత్వాస్పత్రి నుంచి బాలింత డిశ్చార్జి అయ్యే సమయంలో ఈ కిట్టు అందజేయాల్సి ఉంది. రెండేళ్ల పాటు కిట్లు సరఫరా చేయడానికి వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా టెండర్లు కూడా పిలిచింది. ఒక్కో కిట్ కోసం ఓ సంస్థ రూ.1,989.27 ధరను కోట్ చేసింది. అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఈ పథకం పట్టాలు ఎక్కలేదు. తల్లులకు ఎదురుచూపులే... జిల్లాలోని ఏడు ప్రాంతీయ ఆస్పత్రుల్లో రోజుకు సుమారు 30 ప్రసవాలు అవుతాయి. ఒక్క జిల్లా ఆస్పత్రిలోనే 10 వరకూ జరుగుతాయి. ఈ లెక్కన ఏడాదిలో వేలాది మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం కోసం వచ్చే వారు పేద, గిరిజన మహిళలే. సుమారు రూ.2 వేల విలువైన బేబీ కిట్టు అందితే ఎంతో ప్రయోజనకరంగా ఉండేదని ప్రసవం కోసం వచ్చిన తల్లులు అంటున్నారు. ఇదే విషయంపై జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి నాగభూషణం వద్ద ప్రస్తావించగా.. పథకానికి సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలూ తమకు రాలేదని చెప్పారు. -
విలేకరిపై దాడి అమానుషం
● జేసీ వైశాలి, ఎస్పీ మాధవ్రెడ్డిలకు వినతిపత్రాలు అందజేసిన జర్నలిస్టులు పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యలు, ప్రభుత్వ భూ కబ్జాలపై కలం ఎత్తినందుకు భోగాపురంలో విశాలాంధ్ర విలేకరి పందిరపల్లి గోవింద్పై జనసేన ఎమ్మెల్యే అనుచరులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడాన్ని పార్వతీపురం మన్యం జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. అక్షర సత్యాలపై ఆక్రోశంతో భౌతిక దాడులకు దిగడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనన్నారు. వార్తల్లో వ్యతిరేకతలు ఉంటే చట్టబద్ధమైన వివరణ ఇవ్వాలే తప్ప, ఇలా దౌర్జన్యాలకు పాల్పడడం సరికాదన్నారు. ఈ దాడికి నిరసనగా కలెక్టరేట్ ఆవరణలో జర్నలిస్టుల సంఘ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం జేసీ డాక్టర్ ఆర్.వైశాలి, ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డిలకు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. కలం గొంతు నొక్కేలా వ్యవహరించిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. -
కలిసిరాని సీతాఫలాల సీజన్
● వర్షాభావంతో తగ్గిన దిగుబడి ● అడవికి వెళ్లి సీతాఫలాలు దొరకక ఖాళీ బుట్టలతో వెనుదిరుగుతున్న గిరిజనులు ● కుటుంబ పోషణపై గిరిజనుల ఆందోళన పాచిపెంట: గిరిజనులకు అడవే జీవనాధారం. అడవిలో దొరికిన ఫలాలే ఆదాయ వనరులు. ఆర్థిక భరోసా. సీతాఫలాల సీజన్ వచ్చిందంటే తెల్లవారకముందే బుట్టలు, సంచులు పట్టుకుని అడవిబాట పట్టి.. రోజంతా సీతాఫలాలు సేకరించి సంతల్లో విక్రయించేవారు. సీజన్లో వచ్చే ఆదాయంతో ఇంటి సరుకులు, పిల్లల చదువులు, ఇతర అవసరాలు తీర్చుకునేవారు. ఈ ఏడాది పరిస్థితి తలకిందులైంది. వర్షాభావంతో సీతాఫలాల దిగుబడి తగ్గింది. ఆగస్టు చివరి వారం సమీపిస్తున్నా అడవుల్లో సీతాఫలాలు లభించక పోవడంతో గిరిజన కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. అడవికి వెళ్తే.. ఖాళీ బుట్టలే.. మండలంలోని శతాభి, మూటకూడు, గరిసిగుడ్డి తంగ్లం, పులిగుంటవలస, చిల్లమామిడి తదితర గిరిశిఖర ప్రాంతాల్లో ఏటా జూలై మొదటి వారం నుంచే సీతాఫలాల సందడి మొదలయ్యేది. చెట్లకు విరివిగా కాయలు కాయడంతో గిరిజనులు వాటిని సేకరించి సమీప సంతలకు తీసుకొచ్చేవారు. వ్యాపారులు సైతం గ్రామాలకే వచ్చి కాయలను కొనుగోలు చేసేవారు. ఈసారి వర్షాభావ పరిస్థితుల ప్రభావం సీతాఫలాల దిగుబడిపై పడినట్లు గిరిజనులు చెబుతున్నారు. చెట్లకు కాయలు లేకపోవడంతో అడవికి వెళ్లినా బుట్టలు నిండడం లేదు. రోజంతా అడవిలో తిరిగినా ఆశించిన మేరకు కాయలు దొరకకపోవడంతో నిరాశగా ఇళ్లకు తిరిగి వస్తున్నారు. సంతల్లో కనిపించని సీతాఫలాల గుట్టలు... సాధారణంగా ఈ సమయానికి సంతల్లో ఎక్కడ చూసినా సీతాఫలాల గుట్టలే కనిపించేవి. గిరిజనులు తెచ్చిన కాయలను వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేసేవారు. దీంతో ఒక్కో కుటుంబానికి సీజన్లో వచ్చిన ఆదాయం కొంతకాలం ఆర్థికంగా అండగా నిలిచేది. ఈసారి మాత్రం సంతల్లో సీతాఫలాల సందడి లేకపోవడంతో ఆదాయంపై గిరిజన కుటుంబాలు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏటా సీతాఫలాల సీజన్ కోసం ఎదురుచూస్తాం. తెల్లవారుజామున అడవికి వెళ్లి రోజంతా కాయలు ఏరుకుని సంతలో అమ్మితే వచ్చే డబ్బుతో ఇంటి సరుకులు, పిల్లల అవసరాలు చూసుకునేవాళ్లం. ఈ సారి చెట్లకు కాయలు లేకపోవడంతో రోజంతా తిరిగినా ఖాళీ బుట్టలతోనే వస్తున్నాం. ఆదాయం లేకపోవడంతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా మారుతోంది. – దుమ్మరి నూకరాజు, పులిగుంటవలస -
ఉద్యమం ఆగదు..
సమస్యలు పరిష్కరించేవరకు ఉద్యమిస్తామని జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు రేవంత్ స్పష్టంచేశారు. జూనియర్ వైద్యుల నాలుగోరోజు సమ్మెలో భాగంగా గురువారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నుంచి ఆర్అండ్బీ అతిథిగృహం, మయూరి కూడలి మీదుగా ఆర్టీసీ కాంప్లెక్సు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యుల కష్టాన్ని భారంగా చూడొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. మేము చేస్తున్న సేవకు గౌరవ వేతనం ఇప్పించాలని కోరారు. న్యాయమైన సమస్యను వెంటనే పరిష్కరించేవరకు పోరాటం ఆగదన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు జి.జశ్వంత్, పాత్రుడు, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం ఫోర్ట్ -
దారి మారదు..!
తారు రాదు..సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో పూర్తి చేయాల్సిన రహదారులకు గ్రహణం పట్టింది. ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధ ప్రభుత్వం వల్ల తారు దొరకడం కష్టమైంది. తారు కొరత కారణంగా ధర కూడా పెరగడంతో అప్పటి అంచనాల ప్రకారం కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. పలు పనులకు సంబంధించి టెండర్లు పిలిచినప్పు డు టన్ను తారు రూ.40 వేలకు లభించేది. ఇప్పుడు రూ.90 వేలు అయ్యింది. ఈ ప్రభావం వల్ల చాలా వరకూ రహదారులు పెండింగ్లో ఉండిపోయా యి. గోతులను తాత్కాలిక చర్యగా కప్పి సరిపెడుతున్నారు. 32 పనులు మంజూరు.. సగం కూడా కాలే.. జిల్లాలో రహదారులు, భవనాల శాఖ పరిధిలో మొ త్తం 1,030 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నా యి. ఇందులో రాష్ట్రీ య రహదారులు 465 కి.మీ. కాగా.. మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు 565 కి. మీ. వరకూ ఉన్నాయి. ప్రస్తుతం చాలా చోట్ల రోడ్లపై గుంతలు పడ్డా యి. రాయగడ వైపు వెళ్లే కూనేరు రహదారిలో భారీస్థాయిలో గోతులు పడ్డాయి. రూ.4 కోట్లతో పనులు మంజూరైనా కాంట్రా క్టర్ ముందుకు రావ డం లేదు. ఇటీవల వాహనదారుల ఆందోళన నేపథ్యంలో తాత్కాలికంగా గోతులు పూడ్చారు. జిల్లాలో 2025–26లో రూ.42.2 కోట్ల వ్యయంతో 32 పనులు మంజూరయ్యాయి. ఇందులో పార్వతీపు రం, కురుపాం, పాలకొండ పరిధిలోని 10 వర్కులు పూర్తి కాగా..మూడు పురోగతిలో ఉన్నాయి. పార్వతీ పురంలో 20.8 కి.మీ. మేర నాలుగు వర్కులు, కురుపాంలో 5 కి.మీ.తో ఒకటి, పాలకొండలో 11 కి.మీ. మేర మూడు స్టేట్ హైవే పనులు చేయాల్సి ఉంది. ఎండీఆర్(మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్)కు సంబంధించి పార్వతీపురంలో మూడు కి.మీ. మేర రెండు పనులు, కురుపాంలో 32 కి.మీ.(ఆరు వర్కులు), పాలకొండలో 12 కి.మీ(రెండు వర్కులు), సాలూరులో 4.5 కి.మీ. మేర ఒక వర్కు చేపట్టాలి. వీటికి సంబంధించిన టెండర్లు కూడా పూర్తయ్యాయి. పశ్చిమాసి యా యుద్ధ ప్రభావం, తారు కొరత, ధర పెరుగుద ల వల్ల రహదారులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పర్యవేక్షించే జేఈలు ఏరీ? మరోవైపు శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధి స్తోంది. మొత్తం 15 మంది జేఈలు అవసరం కాగా..కురుపాం, బలిజిపేటలో మాత్రమే ఉన్నారు. ఇంకొకరు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. మొత్తం పనులను ఇద్దరు జేఈలే పర్యవేక్షించాల్సి వస్తోంది. దీనివల్ల పనిభారం పెరగడమే కాక.. రహదారి పనుల పర్యవేక్షణ కూడా దెబ్బ తింటోంది. పనుల్లో నాణ్యతకు కూడా కాంట్రాక్టర్లు తిలోదకాలిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. -
మార్పుకోసం విద్యార్థుల పోరాటం
విద్యారంగం అస్తవ్యస్తంగా మారింది. ప్రశ్నపత్రాల లీకేజీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వం జాప్యం విద్యార్థులకు శాపంగా మారింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో వైద్యవిద్య పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారుతోంది. వసతిగృహ విద్యార్థుల సమస్యలను కనీసం పట్టించుకోవడంలేదంటూ విద్యార్థులు నిరసన గళం వినిపించారు. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఐస్ఫ్యాక్టరీ కూడలి నుంచి బాలాజీ కూడలి వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి ఎన్.నాగభూషణం మాట్లాడుతూ, ఎన్టీఏను రద్దు చేసి పారదర్మక పరీక్షా విధానం తీసుకురావాలని, రాష్ట్ర విభజన హామీల మేరకు 11 కేంద్ర విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. – విజయనగరం గంటస్తంభం -
ట్రాన్స్ఫార్మర్ల దొంగల ఆరెస్ట్
గుర్ల: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, సోలార్ పేట్లు దొంగిలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ఎస్.రాఘవులు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్స్టేషన్లో ఆయన బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి అరెస్ట్ చేసిన వారి వివరాలను తెలియజేశారు. గరికివలసకు చెందిన ఆవాల రాజేష్, కెల్లకు చెందిన కెల్ల అనిల్ కుమార్, వేమలవాసు, నెల్లిమర్లకు చెందిన టి.పృథ్వీరాజ్లను అరెస్ట్ చేసి వారి నుంచి 40 కేజీల రాగి వైర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ రాగి వైర్లు కొనుగోలు చేస్తున్న పైడిభీమవరానికి చెందిన గణేష్ను అరెస్ట్ చేశామని చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలి పారు. అరెస్ట్ చేసిన నలుగురిపై గుర్ల పోలీస్ స్టేషన్లో ఏడు కేసులు, నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో రెండు కేసులు ఉన్నాయన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగలను పట్టుకున్న ఎస్సై పి.నారాయణరావును, గుర్ల పోలీస్ స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ, సీఐ అభినందించారు. రెండో విడతలో 71 మందికి అక్రిడిటేషన్లువిజయనగరం గంటస్తంభం: ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాచారాన్ని చేరవేయడంలో, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ రెండో విడత సమావేశం బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రెండో విడతగా 71 మంది మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్లు మంజూరు చేసేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. ఇందులో 68 కొత్త అక్రిడిటేషన్లు, ఇద్దరి పేర్ల మార్పు, ఒక దరఖాస్తును వెరిఫికేషన్కు ఆమోదించారు. దినపత్రికలు, పీరియాడికల్స్, ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ నెట్వర్క్ తదితర విభాగాల నుంచి ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను నిబంధనల మేరకు పరిశీలించారు. పెద్ద, మధ్య తరహా దినపత్రికల నుంచి 26, చిన్న దినపత్రికల నుంచి 13, పీరియాడికల్స్ నుంచి 3, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి 19, కేబుల్ నెట్వర్క్ నుంచి 2, అధికారిక మీడియా విభాగం నుంచి ఇద్దరికి అక్రిడిటేషన్లకు ఆమోదం లభించింది. సమావేశంలో కమిటీ కన్వీనర్ పి.గోవిందరాజులు, సభ్యులు బాలాజీ, మురళీమోహన్, జి.ఎల్లాజిరావు, డా.కె.రాణి, బి.శ్రీనివాసరావు, పి.ఎస్.ఎస్.వి ప్రసాదరావు, వై.శ్రీరాములునాయుడు, బి. నాగేంద్ర ప్రసాద్, ఎం.పి.వెంకటేశ్వరపాత్రో, బి.జి.ఆర్.పాత్రో, ఎం.శివకుమార్, పి.అప్పారా వు, పి.ఆర్.ఓ.మజ్జి వాసుదేవరావు, ఏపీఆర్ఓ సిహెచ్.ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. కాలువలో పడి వ్యక్తి మృతిరేగిడి: మండలంలోని పెదకోడిశ గ్రామానికి చెందిన పనస వెంకునాయు డు (75) మడ్డువలస ప్ర ధాన కుడికాలువలో ప్ర మాదవశాత్తు జారిపడి బు ధవారం మృతిచెందారు. ఈ ఘటనపై స్థానికులు తె లిపిన వివరాల ప్రకారం పంటపొలానికి నీటిని పెట్టేందుకు వెంకునాయుడు కాలువలో దిగాడు. ఆ సమయంలో జారి పడడంతో పక్కనే ఉన్న రాయికి తల తగలగా బలమైన గాయమై నీటిలోనే పడి మృతిచెందాడు. సమీపంలోని రైతులు పడిపోయిన వ్యక్తిని గమనించి కాలువ నుంచి బయటకు తీశారు. అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించారు. మృతుడికి భార్య అప్పలనర్సమ్మ, కుమారుడు సత్యంనాయుడు ఉన్నారు. వెంకునాయుడు నీటిపారుదల శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ విషయంపై ఎస్సై బాలకృష్ణ వద్ద ప్రస్తావించగా తమకు ఎటువంటి సమాచారం అందలేదన్నారు. -
ఘాట్ రోడ్డులో తప్పిన పెనుప్రమాదం
● లారీ బ్రేక్ ఫెయిల్ ● అప్రమత్తమైన డ్రైవర్ ● కొండను ఢీకొట్టి ప్రాణాలు వదిలిన డ్రైవర్ ● లేకుంటే భారీ ప్రమాదం సంభవించేదని ప్రత్యక్షసాక్షుల వెల్లడికొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి నుంచి నర్సీపట్నం ఎరువుల లోడుతో వస్తున్న లారీ చింతాలమ్మ ఘాట్ రోడ్డులో బ్రేకులు ఫెయిలై అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో లారీ పక్కనే ఉన్న కొండను బలంగా ఢీకొట్టింది. బుధవారం జరిగిన ఈ ప్రమాద ఘటనలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన డ్రైవర్ నలపు కృష్ణ (51) తీవ్రంగా గాయపడి, కొద్దిసేపటికి మృతిచెందాడు. చింతాలమ్మ ఘాట్ ఎక్కిన తర్వాత డౌన్లో లారీకి బ్రేకులు పనిచేయలేదు. అయినప్పటికీ డ్రైవర్ కొంత దూరం వరకు లారీని ఎంతో ధైర్యంగా కంట్రోల్ చేసి ఉంచాడు. చివరకు నాలుగో మలుపు వద్ద లారీని కొండ వైపు మళ్లించి బలంగా ఢీకొట్టాడు. ఒకవేళ డ్రైవర్ ఆ సమయంలో కొండను ఢీకొట్టకపోతే, ఎదురుగా వస్తున్న కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు, ఎంపీపీ బడుగు రమేష్ వాహనాలను ఢీకొని ఉండేదని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. రక్షించండి అంటూ ఆర్తనాదాలు.. కొండను లారీ ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ కృష్ణ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. లారీ కొండలో కూరుకుపోవడంతో నన్ను రక్షించండి, ప్రాణాలు కాపాడండి.. అంటూ ఆయన ఆర్తనాదాలు చేశాడు. పక్కనే ఉన్న సీఐ వెంటనే స్పందించి డ్రైవర్కు ధైర్యం చెప్పారు. ఏం కాదంటూ చాలాసేపు ఆయనతో మాట్లాడారు. వెంటనే జేసీబీని రప్పించి క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీశారు. రాజేంద్రపాలెం నుంచి వైద్యుడు జగదీష్నాయక్ వచ్చేసరికి డ్రైవర్ కృష్ణ మృతి చెందాడు. కాగా, విజయనగరం జిల్లా రాజాం ప్రాంతంలోని వస్త్రపురి కాలనీ కొట్టువలసకు చెందిన క్లీనర్ షేక్ అసీర్ను వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
జీవి చిన్నదే.. ప్రమాదం పెద్దది
● రోజురోజుకూ పెరుగుతున్న దోమలు ● నివారించకపోతే నష్టమే ● మన్యాన్ని వీడని మలేరియా ● నేడు ప్రపంచ దోమల నివారణ దినోత్సవంసీతంపేట/విజయనగరం ఫోర్ట్: మలేరియా, డెంగీ, చికున్ గున్యా పేర్లు వినని వారు ఉండరు. దోమవల్ల వ్యాపించే ప్రాణాంతకమైన జ్వరాల పేర్లు ఇవి. చిన్నదోమ ఎంత పెద ప్రమాదాన్ని తీసుకువస్తుందో చెప్పడానికి ఈ జ్వరాలే ఉదాహరణ. పట్టణాలతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంది. ఇటీవల రోజురోజుకు మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రభుత్వ పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల్లో ఎక్కువ మంది ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్న వారి సంఖ్యకూడా ఎక్కువగానే ఉంది. దోమల నివారణ దినం ఎందుకంటే.. ప్రపంచానికి కామన్ శత్రువుగా మారిన దోమల ఆట కట్టించడానికి సర్ రోనాల్డ్ రాస్ శతాబ్దం క్రితమే రంగంలోకి దిగారు. 1897లో ఆయన దోమల ద్వారానే మలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతు న్నాయని నిర్ధారించారు. ఈ పరిశోధనకు గాను ఆయనకు నోబెల్ బహుమతి కూడా వచ్చింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజెనిక్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆగస్టు 20న అంతర్జాతీయ దోమల నివారణ దినంగా ప్రకటించింది.దోమలపై దాడికి లక్షల్లో ఖర్చు దోమలు ప్రజారోగ్యాన్ని కాటేస్తున్నాయి. చిన్నా,పెద్దా తేడా లేకుండా దోమలు రక్తాన్ని పీల్చేస్తున్నాయి. దోమల దాడిని తట్టుకునేందుకు ప్రతి నెలా పచారి సామగ్రి మాదిరిగానే లిక్విడ్స్, మస్కిటో రీఫిల్స్, కాయిల్స్, మస్కిటో ధూప్ స్టిక్స్ వంటి వాటికి నెలకు రూ.100 నుంచి రూ.500 వరకు ఒక్కో కుటుంబం ఖర్చు చేస్తుంది. ఇవి కాకుండా దోమల బ్యాట్స్, దోమతెరలు, యాంటీ మస్కిటోమెష్ వంటి వాటికోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించక తప్పడం లేదు. దోమ కాటు వల్ల వచ్చే వ్యాధుల నివారణకు ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిందే. అరికట్టేదెలా.. దోమలు నీటిలో లార్వా, ప్యూపా దశలో పెరుగుతున్నప్పుడు నాశనం చేయడం చాలా సులువైన పని. ఇవి ఇంటిలో నీటిని నిల్వ చేసే కుండీల్లో చిన్నచిన్న పురుగుల్లా కనిపిస్తుంటాయి. వాటిని చాలా మంది నీటి పురుగులు, జలగలు అని పిలుస్తుంటారు. ఇలా దోమ పిల్లలు (లార్వా) నిల్వ నీటిలో ఉన్నట్లయితే ఆ నీటిని మట్టి లేదా ఇసుకలో పారబోయాలి. ఇలా చేయడం వల్ల లార్వా, ప్యూపా దశల్లో ఉన్న వాటిని వందల సంఖ్యలో నాశనం చేయవచ్చు.అప్రమత్తంగా ఉండాలిదోమల నుంచి వచ్చే వ్యాధు ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మలేరియా ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. పీహెచ్సీ, సీహెచ్సీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులను అప్రమత్తం చేశాం. విజయపార్వతి, డీఎంహెచ్వో, పార్వతీపురం మన్యం అనర్థాలివే.. ఆడ ఎనాఫిలస్ దోమ కుట్టడం వల్ల మలేరియా, డెంగీ, చికెన్గున్యా జ్వరాలు, ఈడిస్, క్యూలెక్స్ దోమలవల్ల బోదకాలు వస్తాయి. నిల్వ ఉన్న మంచినీరు, వర్షపునీరు, మురుగు నీటిలో దోమలు గుడ్లు పెట్టడం ద్వారా వృద్ధి చెందుతాయి. వర్షాల కారణంగా రోడ్లపైన కొబ్బరిబొండాలు, పాతటైర్లు, రుబ్బురోళ్లలో నిల్వ ఉన్న నీరు వాటి ఆవాస కేంద్రాలు. అవసరాల కోసం నీటిని కుండీలు, ఓవర్హెడ్ ట్యాంకుల్లో నిల్వ చేయడం వల్ల దోమలు వృద్ధి చెంది వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. -
పాల రైతుల ధర్నా
● హౌస్ కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాలి ● ఏపీ పాలరైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబువిజయనగరం ఫోర్ట్: విశాఖ డెయిరీలో అవినీతి, అక్రమాలపై హౌస్ కమిటీ ఇచ్చిన రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని ఏపీ పాలరైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుద్ధరాజు రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ డెయిరీలో అవినీతి అక్రమాలపై పాల రైతుల సంఘం 20 అంశాలపై అధారాలతో హౌస్ కమిటీకి, ప్రభుత్వానికి, రాష్ట్ర కంపెనీల రిజిస్ట్రార్కు ఫిర్యాదులు చేసినా ఇంతవరకు ఏ చర్యలూ లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హౌస్ కమిటీ ఇచ్చిన రిపోర్టును బహిర్గతం చేయకుండా తాత్సారం చేస్తోందని ఆరోపించారు. డెయిరీ యాజమాన్యం లాభాలు కాజేస్తూ నష్టాలు చూపిస్తోందని మండిపడ్డారు. పాడి రైతులు ధర రాక తీవ్ర నష్టాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మర్రాపు సూర్యనారాయణ, గొంప కృష్ణమూర్తి, లోకవరపు ఆదినారాయణ మూర్తి, రాములు, సత్యం పైడినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
మా కొడుకును ఆదుకోండి ప్లీజ్..
వంగర: రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు ఆ కుటుంబానివి. బతుకుతెరువు కోసం విశాఖపట్టణానికి వవెళ్లి నాలుగు రూపాయలు వెనుకేసుకుని జీవనోపాధి సాగించాలన్న ఆ కుటుంబంపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదం ఆ కుటుంబ వారసుడిని విగతజీవిగా మార్చింది. ఆస్పత్రిలో లక్షల ఖర్చు అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఉన్న డబ్బులను కుమారుడిని రక్షించుకునేందుకు వైద్యఖర్చులకు తల్లిదండ్రులు జమచేశారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇంకా మెరుగైన వైద్యం కావాల్సి ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించదని వైద్యులు తెగేసి చెప్పారు. ప్రస్తుతం ఆర్థికంగా తమ వద్ద ఏమీ లేకపోవడంతో ఆపన్న హస్తాల కోసం ఆ నిరుపేద తల్లిదండ్రులు దీనంగా ఎదురు చూస్తున్నారు. ఇదీ పరిస్థితి.. వంగర మండలంలోని నీలయ్యవలస గ్రామానికి చెందిన టొంపల చిరంజీవి తల్లిదండ్రులు టొంపల శ్రీను, జయమ్మలతో కలిసి విశాఖపట్నంలోని డెయిరీఫాం వద్ద ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. తండ్రి తాపీమేస్త్రి, తల్లి ఇంటి వద్ద ఉంటుంది. చిరంజీవి రోజువారీ పనిచేస్తుండగా కుటుంబం జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో రోజువారీ పని పూర్తిచేసుకుని విశాఖపట్నంలోని డెయిరీఫాం వద్ద తన నివాసానికి చిరంజీవి బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డుపై పడిపోగా రెండు కళ్లు దెబ్బతిన్నాయి. ముఖం, తల భాగంపై తీవ్ర గాయాలయ్యాయి. కుడి కాలు విరిగిపోయింది. ఈ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కుమారుడిని హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు కనీస ఖర్చులకు అవస్థలు పడుతున్న తల్లిదండ్రులు సాయం చేయాలంటే దాతలకు విజ్ఞప్తిఆదుకోని ఎన్టీఆర్ వైద్యసేవ.. ఎన్టీఆర్ వైద్య సేవ తమను ఆదుకోలేదని క్షతగాత్రుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆస్పత్రిలో డబ్బులు చెల్లించి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన చెందుతున్నారు. తమ వద్ద ఉన్న రూ.2 లక్షలు ముఖ భాగం సర్జరీకి ఖర్చుకు ఆస్పత్రిలో జమ చేశారు. మరో సర్జరీ అవసరమని, సుమారు రూ.7లక్షల నుంచి రూ.9 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. వారి వద్ద చిల్లిగవ్వ లేదు. ఉన్న ఒక్కగానొక్క కొడుకును రక్షించుకునేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు ఇన్నీ..అన్నీ కావు. మనసున్న వారంతా ఆర్ధికంగా చేయూతనిచ్చి తన కుమారుడిని రక్షించాలని దాతలను వేడుకుంటున్నారు. ఆర్థిక సహాయం చేయదలచిన వారు ఫోన్ 7093645664 నంబర్ను సంప్రదించాలని కోరుతున్నారు. -
కన్నేసి..కాజేశాడు
పార్వతీపురం రూరల్: బ్యాంకు నుంచి బయలుదేరిన క్షణం నుంచే ఆ దంపతులపై కన్నేసిన ఓ దుండగుడు..అదును చూసి వారి డబ్బు బ్యాగును కాజేశాడు. కను రెప్పపాటులో రెండున్నర లక్షల రూపాయలతో ఉడాయించాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మండలం లక్ష్మీపురానికి చెందిన దంపతులు మంగళవారం జిల్లా కేంద్రంలో గల ఓ బ్యాంకులో రూ.3.10 లక్షలు రుణం తీసుకున్నారు. అక్కడే వేరొకరికి ఉన్న రూ.60 వేల పాత అప్పును చెల్లించారు. మిగిలిన రూ.2.50 లక్షలను ఓ చిన్న బ్యాగులో భద్రపరుచుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి పయనమయ్యారు. మార్గమధ్యంలో పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఓ చిన్న పని నిమిత్తం ఆగారు. బ్యాంకు నుంచి వారిని గమనిస్తూ వెంబడించిన దుండగుడు.. వారు ఏమరుపాటుగా ఉన్న సమయాన్ని పసిగట్టాడు. ద్విచక్ర వాహనంపై హఠాత్తుగా దూసుకొచ్చి ఆ నగదు బ్యాగును లాక్కుని పరారయ్యాడు. పదిలమనుకున్న డబ్బులు కళ్లెదుటే మాయమవడంతో కంగుతిన్న బాధిత దంపతులు లబోదిబోమంటూ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరాల్లో అనుమానితుడి దృశ్యాలు సేకరించారు.● రూ.2.50 లక్షలు అపహరించిన దుండగుడు ● ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద దంపతుల ఏమరుపాటు -
300 ట్రాన్స్ప్లాంట్లతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రికార్డు
బీచ్రోడ్డు: విశాఖపట్నంలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 300 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లు పూర్తి చేసుకుంది. ఈ ఘనత సాధించిన ఆంధ్రప్రదేశ్లోని తొలి ఆసుపత్రిగా నిలిచిందని ఆసుపత్రి ఎండీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. బుధవారం ఓ హోటల్లో మీడియాతో ఆయన మాట్లాడారు. రక్త క్యాన్సర్లు, ఇతర సంక్లిష్ట రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పెద్దలు, చిన్నారులకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సేవలు అందించడంలో ఈ మైలురాయి ఆస్పత్రి నైపుణ్యానికి నిదర్శనమన్నారు. 300 ట్రాన్స్ప్లాంట్ల వెనుక వైద్య బృందం నైపుణ్యం, సమన్వయం, అంకితభావం ఉన్నాయని చెప్పారు. లుకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా, తలసేమియా, అప్లాస్టిక్ అనీమియా తదితర వ్యాధులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటో–ఆంకాలజిస్ట్ డాక్టర్ బాలస్టాలిన్ చౌదరి మాట్లాడుతూ.. 300 ట్రాన్స్ప్లాంట్ల అనుభవంతో సంక్లిష్ట రక్త సంబంధిత వ్యాధులకు సమగ్ర చికిత్స అందించే సామర్థ్యం మరింత బలోపేతమైందన్నారు. సీనియర్ క్లినికల్ హెమటాలజిస్ట్, హెమటో–ఆంకాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ బెండి మాట్లాడుతూ.. ట్రాన్స్ప్లాంట్కు ముందు పరీక్షల నుంచి అనంతర సంరక్షణ వరకు సమగ్ర సేవలు అందిస్తున్నామని తెలిపారు. సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటో–ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ వూన్నా, మెడికల్ ఆంకాలజిస్ట్, పీడియాట్రిక్ హెమటో–ఆంకాలజిస్ట్ డాక్టర్ రజనీ ప్రియ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న డాక్టర్ మురళీకృష్ణ -
భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని కొనసాగించాలి
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు డిమాండ్ గజపతినగరం రూరల్ (జామి): భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం కొనసాగించాలని, లిక్విడేషన్ చేయడం సరైన విధానం కాదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన జామి మండల కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ అంశాన్ని ప్రస్తావించారు. కో ఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీలను జనరల్ బాడీ ఆమోదం లేకుండా లిక్విడేషన్ చేయడం చట్ట విరుద్ధమన్నారు. 1960లో రైతుల భాగస్వామ్యంతో నిర్మించిన భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ స్థలంలో మళ్లీ వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టును మాత్రమే నెలకొల్పాలని డిమాండ్ చేశారు. 75 ఎకరాల విస్తీర్ణం గల ఈ స్థలాన్ని అమ్మాలని నిర్ణయించడం సరైన విధానం కాదని తప్పుబట్టారు. ప్రభుత్వం ఎన్నో రకాలైన ఖర్చులు చేస్తుందని, ఆ ఖర్చుల్లో భాగంగానే ఈ అప్పులను ప్రభుత్వమే చెల్లించి సుగర్ ఫ్యాక్టరీలను రక్షించాలన్నారు. రాష్ట్రంలోని మూడు సుగర్ ఫ్యాక్టరీలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జిల్లా పార్టీ పెద్ద, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ద్వారా తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్హన్ రెడ్డి దష్టికి తీసుకు వెళ్తామన్నారు. తద్వారా రైతాంగానికి అండగా నిలిచి రైతులకు మేలు జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గొర్లె సరయు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గొర్లె రవికుమార్, ఎంపీపీ సబ్బవరపు అరుణ, సంజీవరావు పాల్గొన్నారు. -
సీటీయూలో జాతీయ అప్రెంటిస్ షిప్
విజయనగరం రూరల్: స్థానిక కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో చైన్నెకి చెందిన బోర్డ్ ఆఫ్ అంప్రెటిస్షిప్ ట్రైనింగ్ (సదరన్ రీజియన్) సహకారంతో జాతీయ అప్రెంటిస్షిప్ పథకంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అఫిషియేటింగ్ వైస్ చాన్స్లనర్ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా మాట్లాడుతూ విద్యార్థులు తరగతి గది జ్ఞానంతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. అప్రెంటిస్షిప్ ఆధారిత డిగ్రీ కార్యక్రమం ద్వారా ప్రత్యక్ష పని అనుభవం లభించి, విద్యార్థుల నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, ఉపాధి సామర్థ్యం పెరుగుతాయన్నారు. బోర్డ్ ఆఫ్ అంప్రెటిస్షిప్ ట్రైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజమణి రాజు అప్రెంటిస్షిప్ శిక్షణ లక్ష్యాలు, శిక్షణ విధానం, పరిశ్రమ అనుభవం, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు సాంకేతిక, వృత్తిపరమైన, సంభాషణ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అప్రెంటిస్ షిప్తో విద్యార్థులు తమ విద్యా జ్ఞానాన్ని, ఆచరణలో ఉపయోగించుకోవడంతో పాటు పరిశ్రమ అవసరాలను అర్థం చేసుకుని భవిష్యత్తు ఉపాధికి సిద్ధం కావడంపై ప్రత్యేకంగా వివరించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ శంకర్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నైపుణ్య ఆధారిత శిక్షణ ఎంతో అవసరమన్నారు. విద్యార్హతలతో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలు, పని అనుభవం, వృత్తిపరమైన దృక్పథం విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంచుతాయన్నారు. ఈ కార్యక్రమాన్ని జర్నలిజం విభాగపతి డాక్టర్ ఇపిల్లి తారకేశ్వరరావు సమన్వయం చేయగా డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆగిపోయిన తండ్రి గుండె
కన్న కొడుకు మృతితో..సింహాచలం (ఫైల్) రమణ (ఫైల్) పాలకొండ రూరల్: కన్నకొడుకును చేయిపట్టి నడిపించాడు. పెంచి పెద్దవాడిని చేశాడు. ఓ ఇంటి వాడిని చేసిన కొడుకు పున్నామ నరకం తప్పిస్తాడనుకుంటే..విధి వక్రించడంతో తన కళ్లతో కొడుకు మృతదేహాన్ని చూసిన ఓ కన్న తండ్రి గుండె ఆగిపోయింది. బుధవారం జరిగిన ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎల్.ఎల్.పురం గ్రామస్తులను తీవ్ర విషాదంలో ముంచేసింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ముంజి రమణ (35) భవన నిర్మాణ కార్మికుడిగా పనులు చేస్తూ భార్య రామలక్ష్మి, కుమార్తెతో కలిసి విశాఖలో నివసిస్తున్నాడు. రమణ ఆరోగ్యం కొన్నిరోజులుగా క్షీణించింది. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబంతో కలిసి బుధవారం బస్సులో స్వగ్రామం బయల్దేరాడు. గోపాలపురం సమీపానికి చేరుకుంటున్న సమయంలో బస్సులోనే రమణ మరణించాడు. ఆ విషయం తెలుసుకున్న ఆర్టీసీ సిబ్బంది మానవతా దృక్పథంతో ఆ కుటుంబాన్ని పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్కు చేర్చారు. అప్పటికే షాక్లో ఉన్న మృతుడి భార్య రామలక్ష్మి తన అత్తవారికి ఫోన్లో సమాచారం చేరవేసింది. కుమారుడి మరణ వార్త విన్న తండ్రి సింహాచలం(72) దుఃఖాన్ని దిగమింగి ఆటోతో కాంప్లెక్స్కు చేరుకున్నారు. కుమారుడి మృతదేహం ఆటోలో ఎక్కించి స్వగ్రామం వెళ్తేందుకు సిద్ధం కాగా ఆటో మండల పరిధిలోని వీపీ రాజుపేటకు చేరుకునే సమయంలో అదే ఆటోలో తండ్రి సింహాచలం గుండె ఆగిపోయింది. తండ్రీకొడుకుల మృతితో సింహాచలం భార్య, రమణ తల్లి సీతమ్మతోపాటు కోడలు రామలక్ష్మి, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. సింహాచలానికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమారుడి మరణం తట్టుకోలేక తండ్రి కూడా తనువు చాలించడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. -
కుదిరితే ఒడిశాకు.. లేదంటే దోపిడీ!
● ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు ● అధికారిక తవ్వకాలు పేరిట అడ్డంగా దోచేస్తున్న వైనం ● నాగావళి నుంచి ఒడిశాకు తరలిపోతున్న ఇసుక ఇసుక తరలిస్తున్న వాహనాలు సాక్షి, పార్వతీపురం మన్యం: ఇటీవల జిల్లా సరిహద్దుల నుంచి రాయగడ వైపు ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను ఒడిశాలోని శేషికాల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక రవాణాకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, వే బిల్లులు లేకపోవడం గుర్తించిన పోలీసులు లారీలను సీజ్ చేశారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మరో లారీ రోడ్డుపైనే ఇసుకను డంప్ చేసి అక్కడ నుంచి పరారైనట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న రెండు వాహనాలు కాసీపూర్ సమితి పరిధిలోని టికిరి పారిశ్రామిక ప్రాంతం వైపు వెళుతున్నట్లు వెల్లడైంది. ఒడిశా పరిధిలోని నాగావళి నది నుంచి ఇసుక తవ్వకాలకు అక్కడి యంత్రాంగం ఆంక్షలు విధించడంతో కొన్ని పారిశ్రామిక సంస్థలు పార్వతీపురం మన్యం జిల్లా పరిధి కొమరాడ ప్రాంతంలోని రీచ్ల నుంచి ఇసుక కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలోని కొమరాడ మండలం పరిధి నాగావళి నదిలో ఇసుక సేకరణ అనుమతులు పేరుతో అంత లేని అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. నిబంధనలను పక్కన పెట్టి.. దోపిడీ యథేచ్ఛగా సాగు తోంది. కొమరాడ మండలం చోళ్లపదం వద్ద నాగావళిలో 5.52 ఎకరాల్లో 18,900 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకానికి అధికారులు అనుమతించారు. ఇక్కడ స్టాక్ పాయింట్ నుంచి ఇసుక బయటకు వెళ్తే గనులశాఖ సూచించిన ఆన్లైన్ బిల్లు ఆధారంగానే రవాణా అవ్వాలి. ఇందుకు భిన్నంగా సాగుతోంది. కార్తికేయ రీచ్ పేరు మీద ముద్రించి ఉన్న రసీదులు ఇచ్చి, చేతులు దులుపుకొంటున్నారు. కొన్ని సార్లు కనీసం సంతకం కూడా ఉండదు. ఒక్క ట్రాక్టర్ నంబరు మాత్రమే రాస్తున్నారు. చేతితో రాసిన రసీదు లు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదనే నిబంధన ఇక్కడ బేఖాతరు అవుతోంది. చేతి రాతలతోనే ట్రాక్టర్లు, లారీలకు రసీదులు ఇచ్చేస్తున్నారు. దొరికినంత తవ్వుకో... స్థానిక అవసరాలకు మాత్రమే ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక ఉచితమని ప్రభుత్వం చెబుతోంది. ఒడిశా రాష్ట్రానికి ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక వెళ్లడానికి వీలు లేదని ఇటీవల జరిగి న జిల్లా సమీక్ష సమావేశంలో ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో అవేవీ అమలు కావడం లేదు. అర్ధరాత్రి వేళల్లో లారీల ద్వారా ఒడిశా రాష్ట్రానికి పెద్ద ఎత్తున తరలిస్తున్నా రు. ఇక్కడ పోలీసులు, అధికారుల కళ్లు గప్పిన కొ న్ని లారీలు ఒడిశా రాష్ట్రం పోలీసులకు దొరకడం గమనార్హం. దీన్ని బట్టి మన దగ్గర నిఘా వ్యవస్థ నుంచి ఎంత సహకా రం ఉందో అర్థం అవుతోంది. ●ఎంత లోతు, ఎంత పరిమాణంలో సేకరించాలి? అన్న నిబంధనలను రీచ్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. పరిమితికి మించి తవ్వేస్తున్నా రు. దీనికి ఎక్కడా లెక్కలు ఉండటం లేదు. ఆన్లైన్ బిల్లుల ఇవ్వడం లేదు. గనులశాఖ అధికారుల పర్యవేక్షణ అసలు ఉండటం లేదు. ●రేవును గుర్తించే మార్కులు, జెండాలు గానీ.. సీసీ కెమెరాల పర్యవేక్షణ గానీ ఉండడం లేదు. వివరా లు ఎప్పటికప్పుడు గనులశాఖకు అప్లోడ్ చేయడం లేదు. ●నిర్వాహకులకు అధికార పార్టీ సహకారం, కీలక అధికారి అండదండలు దండిగా ఉండడంతోనే నిర్వాహకులు ఇష్టారీతిన తవ్వకాలు, అమ్మకాలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇసుక ఉచితం కదా అనే ఉద్దేశంతో ఈ చిత్రంలోని ప్రసాద్ అనే వ్యక్తి ట్రాక్టర్తో కొమరాడ మండలం గుమడ నుంచి ఇసుక తరలిస్తున్నాడు. మార్గమధ్యంలో శివిని, విక్రమపురం గ్రామల మధ్య కారులో వచ్చిన వ్యక్తులు అడ్డగించారు. ఇసుక తరలిస్తున్న ప్రసాద్ను బెదిరించి, రూ.40 వేలు కట్టాలని డిమాండ్ చేశారు. తాను డబ్బులు ఎందుకు ఇవ్వాలని ఆ వ్యక్తి ప్రశ్నిస్తే.. కారులో ఉన్న వారు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. సెకన్ల వ్యవధిలోనే ఓ కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నాడు. అక్కడ కూడా డబ్బులు కట్టాలని డిమాండ్. కుదరకపోవడంతో పోలీస్ స్టేషన్ పేరిట డంగభద్ర ప్రాంతానికి తరలించారు. చివరికి బేరసారాల తర్వాత రూ.10 వేలు కట్టేందుకు ఒప్పందం కుదిరింది. అందుకు సద రు వ్యక్తులు, పోలీసులు శ్రీనివాసరావు పేరుతో ఓ స్కానర్ ఇచ్చి ఆ మొత్తం పంపించుకుని కార్తికేయ శాండ్ రీచ్ పేరిట ఆన్లైన్ బిల్లు కాకుండా, ఒక రసీదు ఇచ్చేశారు. -
సర్ నోటీసులతో ఓటర్ల అవస్థలు
సాలూరు: ఓటు హక్కును కాపాడుకునేందుకు గిరిజనులు కోటి కష్టాలు పడుతున్నారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు తమ అర్హతను నిరూపించుకునేందుకు సంబంధిత ధ్రువీ కరణ పత్రాలు సమర్పించాల్సి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాలూరు మండలంలోని గిరిశిఖర పంచాయతీ కొదమలో 12 గ్రామాలకు సంబంధించి పోలింగ్ బూ త్లు 96,97లలో మొత్తం 2,146 మంది ఓటర్ల కు గాను 1,519 మందికి నోటిసులు జారీ అయ్యాయంటే గిరిజన ప్రాంతాల్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇందులో బూత్ నంబర్ 96లో 1102 ఓట్లకు గాను 1052 మందికి, 97వ బూత్లో 1044 మంది ఓటర్లకు గాను 467 మందికి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. వారు తమ వద్ద ఉన్న ధ్రువీకరణ పత్రాలను తీసుకు ని ఈ గిరిశిఖర పంచాయతీకి సంబంధించి కొండ కిందన ఉన్న తుండ సచివాలయానికి కొండలు, కోనలు దాటి చేరుకుంటూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. పోడు వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న ఈ సమయంలో, చిన్నపిల్లలను ఎత్తుకుని,రాళ్లురప్పలు దాటుకుంటూ సచివాలయానికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ గిరిజనుల కష్టానికి ఎవరు కారణమో ఉన్నతాధికారులే ఆలోచించుకోవాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
బరితెగించిన రియల్టర్..!
● చెరువుగర్భాల్లో అక్రమ మట్టి తవ్వకాలు ● రియల్ వెంచర్కు తరలింపు ● రోడ్లను సైతం వెంచర్లో కలిపేసిన వైనం ● అధికారుల హెచ్చరికలూ భేఖాతర్.. ● రియల్టర్ ఆగడాలపై జనం మండిపాటు ఈ చిత్రం చూశారా... పాచిపెంట మండలం కర్రివలస రెవెన్యూ పరిధిలోని చెరువులో పొక్లెయిన్తో అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నది ఓ రియల్టర్. పోతులగెడ్డ సమీపంలో వేసిన రియల్ వెంచర్ కోసం అవసరమైన మట్టిని ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా చెరువు గర్భాన్ని ఇష్టారాజ్యంగా తవ్వేసి తరలిస్తున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు అధికారులు ఓ సారి హెచ్చరికలు చేశారు. వాటిని పట్టించుకోకుండా బుధవారం ఇదిగో ఇలా మట్టితవ్వకాలు ఆరంభించారు. పాచిపెంట: ప్రభుత్వ భూములు, చెరువులు, రహదారుల పరిరక్షణకు అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం వాటి అమలు ప్రశ్నార్థకంగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాచిపెంట మండలంలోని పోతులగెడ్డ సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమన్న వ్యాఖ్యలు విపినిస్తున్నాయి. సుమారు పది ఎకరాల వ్యవసాయ భూముల్లో లేఅవుట్ వేస్తున్న రియల్టర్... దానికి అవసరమైన మట్టిని పాచిపెంట ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న కర్రివలస రెవెన్యూ పరిధిలోని చెరువు గర్భాన్ని పొక్లెయిన్తో తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్నారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ తవ్వకా లు మాత్రం ఆపకపోవడం గమనార్హం. చెరువు నుంచి యథావిధిగా మట్టి తరలిస్తూ లేఅవుట్లో వినియోగిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలూ బేఖాతరేనా? రియల్టర్ బరితెగించిన తీరుపై అధికారుల సమాచారంతో కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి స్పందించారు. రోడ్డు ఆక్రమణలు, చెరువులో మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని జేసీ, ఆర్డీఓల కు స్పష్టమైన ఆదేశా లు జారీ చేసినట్టు స మాచారం. అయితే, రియల్టర్ ఆగడాల ముందు కలెక్టర్ ఆదేశాలు పనిచేయడంలేదన్న వాదన వినిపిస్తోంది. మట్టి అక్రమ తవ్వకాలు ఆపకపోవడం, రోడ్డు ఆక్రమణలు తొలగించకపోవడం, అధికారుల హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా యథేచ్ఛగా పనులు కొనసాగిస్తుండడంతో.. సంబంధిత అధికారులు చేతకానివారనే ధీమాతోనే వ్యాపారి వ్యవహరిస్తున్నారా? లేక తన అక్రమాలను అడ్డుకునే శక్తి అధికారులకు లేదని భావిస్తున్నారా? అనే చర్చ స్థానికంగా సాగుతోంది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన అధికారులు హెచ్చరికలకే పరిమితమవుతారా? నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో కనిపిస్తున్న రోడ్డు చూశారా... ఇది లేఅవుట్ ఎదురుగా పిండ్రింగివలస గ్రామానికి వెళ్లే ప్రభుత్వ రహదారి. పాత ప్రభుత్వ రహదారిని లేఅవుట్లో కలిపేసిన రియల్టర్... గ్రామస్తుల రాకపోకల కోసం ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ స్థలంలో మరో రహదారిని ఏర్పాటుచేయడం గమనార్హం. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్, ఆర్ఐలు స్వయంగా వెళ్లి పరిస్థితిని పరిశీలించి పాత రహదారిని యథావిధిగా కొనసాగించాలని, ఆక్రమణలు తొలగించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ ఆక్రమణను తొలగించకపోగా.. ఆక్రమణకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని మరోచోటకు తరలించే ప్రయత్నాలు చేయడం గమనార్హం. -
సరిహద్దుల్లో సారా స్థావరాలపై దాడులు
● 8,200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసంపార్వతీపురం రూరల్: జిల్లా సరిహద్దులో గల సారా బట్టీలపై అబ్కారీ శాఖ కొరడా ఝుళిపించింది. ’నవోదయం 2.0’లో భాగంగా ఏపీ, ఒడిశా ఎకై ్సజ్ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా మంగళవారం అంతర్రాష్ట్ర దాడులు నిర్వహించారు. ఒడిశాలోని రాయగడ జిల్లా మొరం గ్రామ సమీపంలో సాగుతున్న సారా తయారీ కేంద్రాలను కనుగొని దాడి చేసి 8,200 లీటర్ల బెల్లం ఊటను, 200 లీటర్ల సారాను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. పార్వతీపురం అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎ.సంతోష్ ఆధ్వర్యంలో ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో కురుపాం ఎకై ్సజ్, పాలకొండ బీఎంపీపీ, పార్వతీపురం ఈఎస్టీఎఫ్, విజయనగరం ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో పాటు రాయగడ పోలీసులు పాల్గొన్నారు. సరిహద్దుల చాటున గుట్టుగా సాగుతున్న అక్రమ సారా ముడిసరుకును పక్కా సమాచారంతో నిర్వీర్యం చేశారు. సరిహద్దుల మాటున అక్రమంగా సారా తయారీకి, రవాణాకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎకై ్సజ్ ఏఈఎస్ సంతోష్ ఈ సందర్భంగా హెచ్చరించారు. -
మహాకవి కుటుంబానికి ఆసరా
● జీవితకాల జీవనభృతినిస్తూ ప్రభుత్వ జీఓ జారీవిజయనగరం టౌన్: మహాకవి గురజాడ అప్పారావు స్వగృహాన్ని పరిరక్షించడంలో, వారి వారసత్వాన్ని కొనసాగించడంలో గతేడాదిగా గురజాడ వారసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి విదితమే. అవుట్సోర్సింగ్లో ఇచ్చిన ఉద్యోగాన్ని కూడా చెప్పాపెట్టకుండా తొలగించిన కూటమి ప్రభుత్వానికి సాహితీవేత్తలు ఉత్తరప్రత్యుత్తరాలు చేస్తూ పలుమార్లు నివేదన చేశారు. ఈ నేపథ్యంలో జూలై 20న సాక్షిలో ‘ఆయన కడుపు కొట్టారు’ శీర్షికతో కథనం వెలువడింది. దీనిపై ప్రభుత్వం స్పందించి కేవలం నెలరోజుల వ్యవధిలోనే పూర్తిస్ధాయిలో న్యాయం చేకూరేలా జీవితకాల జీవనభృతిని నెలకు రూ.30వేలు కేటాయిస్తూ జీఓ జారీచేసింది. ఈ మేరకు మహాకవి స్వగృహంలో గురజాడ మునిమనుమడు గురజాడ వెంకటేశ్వరప్రసాద్, ఇందిర దంపతులు మంగళవారం మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి సరైన నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహనీయుల జ్ఞాపకాలను కాపాడుకుంటూ వస్తున్న వారికి, వారి కుటుంబీకులకు జీవితకాల భృతినివ్వడం విషయంలో ఆలస్యంగానైనా స్పందించి ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
రుణం కావాలా నాయనా..!
దోపిడీయే దోపిడీ ప్రభుత్వ బ్యాంకుల మాదిరిగానే పైవేట్ బ్యాంకుల్లో రుణాలు పొందాలంటే ఆస్తుల మార్ట్గేజ్ పత్రాలు ఉండాలి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు తాము ఉంటున్న ఇల్లు, ఇంటి స్థలాలే ఆస్తులు. వాటినే లక్ష్యంగా చేసుకుని పైవేట్ ఫైనాన్స్ కంపెనీలు రుణాలు ఇస్తున్నాయి. ఈ మార్ట్గేజ్ పత్రాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి పొందాలి. వాటికోసం ఆయా పైవేట్ పైనాన్స్ కంపెనీల ఏజెంట్లే కంకణం కట్టుకుంటున్నారు. వారే స్వయంగా తహసీల్దార్, వీఆర్ఓల అవతారం ఎత్తుతున్నారు. ఫేక్ ఽపొజిషన్, స్థల హక్కుల పత్రాలు సృష్టిస్తున్నారు. రాజాంతో పాటు ఇతర ప్రాంతాల్లోని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల్లో వాటికి మార్ట్గేజ్ సర్టిఫికెట్లు పొందుతున్నారు. ఒక్కో సర్టిఫికెట్కు ఒక్కో ధర కడుతూ చకచకా ధ్రువీకరణ పత్రాలు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తయారైపోతున్నాయి. వాటిని హోమ్ ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టి, రుణాలు ఇస్తున్నారు. వాటి కోసం తీసుకున్న రుణంలో కొంత మొత్తాన్ని ఏజెంట్కు లబ్ధిదారు అందించాల్సి ఉంది.రాజాం: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో సామాన్యులు, పేద ప్రజలకు ఠంచన్గా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేసి ఆర్థికంగా అండగా నిలిచింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం హయాంలో సంక్షేమ పథకాలు అటకెక్కాయి. సామాన్య, పేద తరగతి ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు, చిరువ్యాపారులు, కార్మికులకు ఆర్థిక సమస్యలు అధికమయ్యాయి. ప్రభుత్వ బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. కార్పొరేషన్ రుణాలు, రాయితీ అప్పులు అటకెక్కాయి. ఫలితంగా పేద, మద్య తరగతి కుటుంబాలు అత్యవసర ఖర్చులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిక వడ్డీలు ఇస్తామన్నా వడ్డీవ్యాపారులు ముఖం చాటేస్తుండడంతో వారి ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుంటున్న హోమ్ ఫైనాన్స్ కంపెనీలు పైవేట్ రుణాల పేరుతో దోపిడీ ప్రారంభించాయి. ఈ రెండేళ్లలో ఏకంగా 18కిపైగా ప్రైవేట్ హోమ్ ఫైనాన్స్ కంపెనీలు రాజాంలో వెలిశాయి. బుట్టలో పడుతున్న ప్రజలు రాజాంలో హోమ్ ఫైనాన్స్ కంపెనీలకు తగ్గట్లు అందులో పనిచేసే చిరుద్యోగుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో కూటమి ఉద్యోగాలు భర్తీచేయకపోవడంతో నిరుద్యోగులు అధికమయ్యారు. చాలా మంది యువకులు ఈ హోమ్ ఫైనాన్స్ కంపెనీలను పైవేట్ బ్యాంకులుగా చెప్పుకుంటూ అందులో చేరుతున్నారు. టార్గెట్ రీచ్ అయ్యేందుకు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వల వేస్తున్నారు. వడ్డీరేట్లు తక్కువని, ఇన్సూరెన్స్ ఉంటుందని చెప్పి రుణాలకు సిఫార్సు చేస్తున్నారు. రుణాలు ఇచ్చిన తరువాత తప్పుకుని, ఏజెంట్లతో వడ్డీ వసూళ్లకు ముక్కుపిండుతున్నారు. సంక్షేమ పథకాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో ప్రజలు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ఫైనాన్స్లవైపు చూపు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న హోమ్ ఫైనాన్స్ కంపెనీలు కోట్లలో లావాదేవీలు -
కాలువలో పడి వ్యక్తిమృతి
బొబ్బిలి: పట్టణంలోని రైల్వేస్టేషన్ జంక్షన్లో ఉన్న టింబర్ డిపోవద్ద గల మురుగుకాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని తారకరామా కాలనీకి చెందిన సంకిలి లక్ష్మణరావు(38) కాలువ దాటుతుండగా అందులో పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని బయటికి తీసి లక్ష్మణరావుగా గుర్తించారు. మృతుడికి భార్య శ్రీదేవి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నారాయణ రావు తెలిపారు. -
తూకాల్లో తేడాలు
● 17 మందిపై కేసుల నమోదు రాజాం/రాజాం సిటీ: రాజాం పట్టణంలో లీగల్ మెట్రాలజీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. బొబ్బిలి లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ రామారావుతో పాటు మరికొంతమంది సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చికెన్, మటన్, చేపల దుకాణాలతో పాటు పండ్ల దుకాణాల్లోని తూనిక యంత్రాలను తనిఖీచేశారు. తూకాల్లో భారీగా తేడాలున్నట్లు గుర్తించారు. 17 మంది వ్యాపారులపై కేసులు నమోదుచేయడంతో పాటు తప్పుడు తూనిక యంత్రాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ప్రతి షాపు వద్ద తూనిక యంత్రాలపై ఆరాతీయాలన్నారు. తప్పుడు తూకాలు వేస్తే తమకు ఫిర్యాదుచేయాలని సూచించారు. ప్రతి తూనిక యంత్రంపై తమ శాఖ వేసిన సీల్ ఉండాలని స్పష్టం చేశారు. మూగ జీవాలను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు రామభద్రపురం: నోరు లేని మూగజీవాలను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై జ్ఞానప్రసాద్ హెచ్చరించారు. ఈ మేరకు మండల కేంద్రంలో తన సిబ్బందితో కలిసి మంగళవారం ఆయన వాహనాలు తనిఖీ చేశారు. ఈ క్రమంలో పార్వతీపురంలో కొనుగోలు చేసిన పశువులను ఎటువంటి అనుమతులు లేకుండా బొలెరో వ్యాన్లో అక్రమంగా తరలిస్తుండగా కొండకెంగువ గ్రామం జంక్షన్ వద్ద వ్యాన్ను పట్టుకుని 6 పశువులను స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్ మార్పిన లక్ష్మణను అదుపులోకి తీసుకుని కేసునమోదు చేశారు.పశువుల రక్షణార్థం వాటిని గోశాలకు తరలించారు. ఆటో ఢీకొని వ్యక్తి మృతిబలిజిపేట: మండలంలోని శివరాంపురం గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బి.అనిల్కుమార్(28) అనే వ్యక్తి విజయనగరంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ప్రమాదం గురించి ఎస్సై రాజేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చినంకలాం నుంచి బలిజిపేటకు ద్విచక్రవాహనంపై వస్తున్న బి.అనిల్కుమార్ను బలిజిపేట నుంచి పణుకువలస వెళ్తున్న ఆటో శివరాంపురం గ్రామ సమీపంలో ఢీకొట్టడంతో అనిల్కుమార్ తలకు గాయమైంది. వెంటనే బొబ్బిలి సీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం విజయనగరంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి వైద్యం చేయిస్తుండగా సోమవారం రాత్రి మృతిచెందాడు. ఆటోలో ఉన్న రామారావు అనే వ్యక్తికి గాయాలు కాగా చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యార్థి ఆత్మహత్యాయత్నంజియ్యమ్మవలస రూరల్: పాఠశాలకు వెళ్లి చదువుకోమని మందలించినందుకు ఓ గిరిజన విద్యార్థి మనస్తాపం చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. మండలంలోని చినతోలుమండ గూడ గ్రామానికి చెందిన బిడ్డకి దినకర్ రావాడరామభద్రపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. దినకర్ పాఠశాలకు సరిగ్గా వెళ్లడం లేదని తల్లిదండ్రులు మంద లించడంతో మంగళవారం ఉదయం ఇంటి వద్ద గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండడంతో తల్లిదండ్రులు చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా వైద్యులు వాసుదేవరావు, రాఘవేంద్రరావు చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి 108 ద్వారా తరలించారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు చెప్పారు. -
మమ్మల్నే కొనసాగించండి..
వచ్చే నెలాఖరు వరకు కాలపరిమితి ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల కాల పరిమితి వచ్చే నెలాఖరుతో ముగియనుంది. కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. మరి కొద్ది రోజుల్లో ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది.పాత షాపులను రెన్యువల్ చేయవచ్చు లేదంటే కొత్త షాపుల ఏర్పాటుకు దరఖాస్తులైనా కోరవచ్చును.ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.– కె.సహదేవ, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం: నీరు లేని ఊరుందేమో గాని మద్యం దొరకని ఊరు మాత్రం లేదనేది ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యనిషేధం వైపు అడుగులు వేస్తూ 2019–24 మధ్య ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను తగ్గిస్తూ వచ్చింది. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఊరూరా మద్యం షాపులు ఏర్పాటు చేస్తూ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేపడుతోంది. రెండేళ్ల క్రితం అక్టోబర్లో కొత్త మద్యం పాలసీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది.ఈ మేరకు ప్రతి షాపునకు రూ.2 లక్షలు ఫీజు నిర్ణయిస్తూ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇలా దరఖాస్తుల రూపంలోనే రూ.కోట్లు వచ్చి ప్రభుత్వ ఖజానాలో చేరడంతో తర్వాత దరఖాస్తుదారులకు లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తూ మద్యం వ్యాపారానికి అడ్డూఅదుపు లేకుండా గేట్లు తెరిచింది. ప్రస్తుతం పాత మద్యం దుకాణాల కాలపరిమితి సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుంది. దీంతో సిండికేట్లుగా ఏర్పడిన వారందరూ పాత మద్యం పాలసీనే కొనసాగించాలని కోరుతూ ఇటీవల ప్రభుత్వానికి రాయబారం పంపించినట్లు సమాచారం. ఇందుకు గాను ప్రతి షాపు రెన్యువల్ ఫీజు రూ.20 లక్షలు చెల్లించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నట్లు మధ్యవర్తులతో రాయబారం చేస్తున్నట్లు అంతా చెప్పుకుంటున్నారు.అయితే చంద్రబాబు ప్రభుత్వం పాత షాపులను రెన్యువల్ చేస్తుందా? లేకా కొత్త మద్యం పాలసీని తీసుకువస్తుందా? అనే విషయం మరి కొద్ది రోజుల్లో తేలనుంది. పాత షాపులు యథావిధిగా కొనసాగించాలని..కోరుతున్న మద్యం దుకాణాల సిండికేట్లు మద్యం దుకాణాల కాలపరిమితి వచ్చే నెలాఖరుతో సరి ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వని ప్రభుత్వంజిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 56 మద్యం దుకాణాల ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం 2024 అక్టోబర్లో చర్యలు చేపట్టింది. వాటిలో గీత కార్మికులకు 4 షాపులు, ఇతరులకు 52 షాపులు కేటాయించారు. ఇందుకు గాను ప్రతి షాపునకు రూ.2 లక్షల ఫీజు నిర్ణయిస్తూ దరఖాస్తులు కోరగా జిల్లా వ్యాప్తంగా ఈ 56 మద్యం షాపుల కోసం 1393 దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి రూ.27.86 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే పాత షాపులను రెన్యువల్ చేయాలంటూ ఇటీవల మద్యం సిండికేట్లు ప్రభుత్వంతో రాయబారాలు చేస్తున్నట్లు సమాచారం.ఇందుకు గాను ప్రతి షాపునకు రూ.20 లక్షలు చొప్పున రూ.11.20 కోట్లు రెన్యువల్ ఫీజు చెల్లించేందుకు మంతనాలు చేస్తున్నట్లు సిండికేట్ సభ్యులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ప్రభుత్వానికి జిల్లా నుంచి రూ.16.66 కోట్లు తక్కువ సొమ్ము ఆదాయం వస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రభుత్వం టేబుల్పై ఉన్నట్లు చర్చించుకుంటున్నారు.ఏది ఏమైనప్పటికీ మరో వారం రోజుల్లో కొత్త మద్యం పాలసీపై ఏం జరుగుతుందనే విషయం తెలియనుంది. -
● శిథిల భవనాల్లోనే చదువులు
పాలకొండ మండలం టీడీ పారాపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇది. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట నిర్మితమైంది. ప్రస్తుతం ఇక్కడ 25 మంది వరకూ విద్యార్థులు చదువుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. కాలం చెల్లిన భవనాలు కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. తరగతి గదుల పై కప్పు నుంచి ఎప్పటికప్పుడు పెచ్చులు కింద పడుతున్నాయి. ఇప్పటికే ఉన్న గదుల్లో ఒకదానిని పూర్తిగా వినియోగానికి దూరం ఉంచారు. పాలకొండ నియోజకవర్గంలో 356 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు కింద రూ.కోట్లాది నిధులు వెచ్చించి దాదాపు 205 పాఠశాలలు అభివృద్ధి చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నాడు–నేడు మనబడి కార్యక్రమం కనుమరుగయ్యింది. అప్పట్లో మంజూరైన తరగతి గదులు, అదనపు భవనాల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం విద్యారంగాన్ని గాలికి వదిలేసింది. ఈ ప్రభావంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. గత జగన్ మోహన్ రెడ్డి పాలనలో పిల్లలకు చదువులే ఆస్తిగా భావించారు. నియోజకవర్గంలో రెండు వందలకు పైబడి ప్రభుత్వ బడులను అభివృద్ధి చేసి చూపించారు. నేడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారు. బడిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడేలా సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలి. మౌలిక వసతులు కల్పించాలి. – విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ. -
అక్కడే వసతిగృహం.. చెంతనే మరుగు ట్యాంకు!
పాలకొండలోని ఎస్సీ ప్రభుత్వ బాలుర వసతిగృహం ఇది.. చెంతనే అగ్నిమాపక శాఖ కార్యాలయం నూతన భవనాన్ని ఇటీవల నిర్మించారు. దాదాపు వసతిగృహానికి ఆనుకునే అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సంబంధించి సెప్టిక్ ట్యాంకు నిర్మాణం చేపడుతున్నారు. వసతిగృహం ఎదురుగానే పైపులు కూడా వేస్తున్నారు. దీనిపై హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ట్యాంకు ఇక్కడే ఉండడం వల్ల దోమల బెడదతోపాటు, దుర్వాసన వెదజల్లే అవకాశం ఉందని.. భవిష్యత్తులో పైపులు లీకై తే, ఆ నీరంతా ఇక్కడే ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 40 మంది వరకు విద్యార్థులున్నారు. పక్కనే బీసీ వసతిగృహం కూడా ఉండేది. ఇటీవలే ఖాళీ చేసి వెళ్లిపోయారు. ట్యాంకు నిర్మాణం చేపడితే తమ పరిస్థితీ అదే అవుతుందని ఎస్సీ వసతిగృహ విద్యార్థులు, సిబ్బంది అంటున్నారు. – సాక్షి, పార్వతీపురం మన్యం/ పాలకొండ రూరల్ -
ప్రభుత్వ కార్యాలయాలు.. రైళ్లలో తనిఖీలు
● డాగ్ స్క్వాడ్తో సోదాలు పార్వతీపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా పలు కీలక ప్రాంతాల్లో పోలీసులు మంగళవారం డాగ్ స్క్వాడ్తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు స్థానిక రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్ పరిసర ప్రాంగణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సీసీఎస్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొమరాడ ఎస్సై జగదీష్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగల్ టీమ్, సీసీఎస్ సిబ్బంది డాగ్ స్క్వాడ్ సాయంతో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. పార్వతీపురం రైల్వే స్టేషన్ నుంచి విజయనగరం వరకు ప్రయాణించే గుంటూరు–రాయగడ ఎక్స్ప్రెస్ రైలులో పోలీసులు అణువణువూ శోధించారు. ప్రధానంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు సారా సరఫరాను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ తనిఖీలు సాగాయి. రైలు బోగీలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల బ్యాగులను, వారి వద్ద ఉన్న సామగ్రిని డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావులేకుండా ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచినట్లు అధికారులు తెలిపారు. హాస్టల్ను తనిఖీచేసిన కలెక్టర్సీతానగరం: మండలంలోని మరిపివలసలో గల ఎస్సీబాలికల వసతిగృహాన్ని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వసతిగృహంలో కల్పిస్తున్న సౌకర్యాలు, వాతావరణం, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో నేరుగా ముచ్చటించారు. పాఠశాల వసతిగృహ నిర్వహణ సమర్థవంతంగా సాగేందుకు విద్యార్థుల్లో బాధ్యతాయుత ప్రవర్తన, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ప్రతి తరగతితో పాటు పాఠశాల స్థాయిలో ప్రత్యేకంగా టీం లీడర్లును నియమించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని, వంటగదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భోజనం నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన వారాంతపు మెనూ ప్రకారం ప్రతిరోజూ పౌష్టికాహారం అందించాలని వంటల తయారీలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే శాసీ్త్రయ ఆధారంలేని నాటువైద్యం వలన కలిగే ప్రమాదాలు,నష్టాలు గురించి విద్యార్థులకు వివరించి సరైన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మాధురి, తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్,ఎంపీడీఓ ఎంఎల్ఎన్ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీఓ వర్మ, వసతిగృహ సంక్షేమాధికారిణి జీవీఎస్ గౌరీశ్వరి, సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయుడు రాయుడి శంకరరావు పాల్గొన్నారు. మళ్లీ వచ్చిన ఏనుగులు● ఆందోళనలో కొమరాడ రైతులు కొమరాడ: ఇటీవల జియ్యమ్మవలస మండలంలోని పలు గ్రామాల్లో సంచరించిన ఏనుగుల గుంపు మంగళవారం కొమరాడ మండలం పాత దుగ్గి, కళ్లికోట, గారవలస గ్రామ సమీపంలో ఉన్న పంట పొలాల్లో మళ్లీ సంచరిస్తున్నాయి. ఇన్నాళ్లూ గజరాజులు లేవని ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులను మళ్లీ గజరాజులు వచ్చి దడ పుట్టించాయి. వర్షాలు లేక చాలీచాలని నీటితో మోటార్ మీద పంటలు పండిస్తున్న తమకు మూలిగే నక్కపై తాటి పండు పడిన ట్లు ఏనుగులు వచ్చాయని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో గజరాజుల గుంపు ఎక్కడ నాశనం చేస్తాయోనని రైతులు భీతిల్లుతున్నారు. భామినిలో.. భామిని: మండలానికి సరిహద్దుగా ఉన్న ఒడిశా గ్రామాల వైపు నడిచిన నాలుగు ఏనుగుల గుంపు తిరుగుముఖం పట్టింది. ఈ మేరకు మంగళవారం భామిని మండలం మనుమకొండ సమీపంలోకి చేరాయి. మనుమకొండ తోటల్లో తిష్ట వేసి పంటలు నాశనం చేస్తున్నాయని గిరిజన రైతులు వాపోతున్నారు.


