● ఎస్పీ మాధవరెడ్డి
పార్వతీపురం రూరల్: అర్జీదారులు తెలియజేసిన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురి నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ ఎస్సై సురేష్, తదితరులు పాల్గొన్నారు.


