breaking news
Parvathipuram manyam District News
-
ఎస్సీ కమిషన్కు వినతుల వెల్లువ
● దళితుల సమస్యలను యంత్రాంగం పట్టించుకోవడంలేదంటూ నిట్టూర్పు విజయనగరం అర్బన్: జిల్లాలో దళితుల సమస్యల పేరుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పలువురు దళితులు ఎస్సీ కమిషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం శనివారం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పరిషత్ అతిథి గృహంలో వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దళిత నాయకులు భూ సమస్యలు, పట్టాల మంజూరులో జాప్యం, భూముల ఆక్రమణ, రిక్షా కార్మికులకు రుణాల మంజూరు లోపాలు, సంక్షేమ పథకాల అమలు కాగితాలకే పరిమితవుతున్నాయని కమిషన్ సభ్యునికి వినతులు సమర్పించారు. కొన్నేళ్లుగా ఫిర్యాదులు ఇస్తున్నా అధికారులు స్పందించడం లేదని తెలిపారు. అందిన వినతులపై సంబంధిత అధికారులతో చర్చించి, బాధితులకు న్యాయం జరిగేలా కమిషన్ స్థాయిలో జోక్యం చేసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయనకు తొలుత డీఆర్వో ఎం.నూకరాజు, ఆర్డీఓ దాట్ల కీర్తి, డీడీ అన్నపూర్ణమ్మ, ఈడీ వెంకటేశ్వరరావు, పలువురు దళిత నాయకులు ఘన స్వాగతం పలికారు. -
లాభసాటి పంటల సాగు శ్రేయస్కరం
● కలెక్టర్ ప్రభాకరరెడ్డి కురుపాం: రైతులు లాభసాటి పంటలు సాగుచేసి ఆర్థికంగా బలోపేతం కావాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. కిసాన్మేళా వంటి కార్యక్రమాలతో రైతులు తమ గ్రామ పరిధిని దాటి వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. స్థానిక రస్తా కుంటుబాయి వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రం ప్రాంగణంలో శనివారం కిసాన్మేళా నిర్వహించారు. ‘సుస్థిర సేంద్రియ వ్యవసాయం–రైతాంగం ప్రగతికి సోపానం’ అనే అంశంపై చర్చించారు. కార్యక్రమం ప్రారంభంలో వ్యవసాయ పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు కలిసి రైతాంగానికి అందిస్తున్న పరిశోధనా సేవలను సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎ.అప్పలస్వామి వివరించారు. విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.శివనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని 16 కృషి విజ్ఞాన కేంద్రాలు, 16 ఏరువాక కేంద్రాలు రైతులకు అవసరమైన సాగుసేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ శారదా జయలక్ష్మీదేవి మాట్లాడుతూ అతితక్కువ రసాయనాలతో సాగుచేసే దేశవాళీ వంగడాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సుస్థిర సాగుకు కావలసిన పరిశోధనలు చేస్తామన్నారు. ఏఎంసీ చైర్మన్ కె.కళావతి మాట్లాడుతూ కేవీకే చేపట్టిన వివిధ శిక్షణ కార్యక్రమాలు, ప్రదర్శన క్షేత్రాలు, విజ్ఞాన యాత్రలు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. ఎమ్మెల్యే తోక జగదీశ్వరి మాట్లాడుతూ ఆరోగ్యకర పంటల సాగును ప్రోత్సహించాలని కోరారు. కిసాన్ మేళాలో పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ జగన్నాథ్, సర్పంచ్ అడ్డాకుల నరేష్, వివిధ గ్రామాలకు చెందిన 900 రైతులు, ఎఫ్పీఓ సభ్యులు, రైతు సాధికారిక సంస్థ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆదుకుంటాం.. ఆందోళన వద్దు
జియ్యమ్మవలస రూరల్: తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు బాలికలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని శిశు సంక్షేమశాఖ మిషన్ వాత్సల్య విభాగం పేర్కొంది. ఇటీవల మండలంలోని వనజ గ్రామంలో తల్లి, తండ్రి, ఓ బాలుడు కుంపటి పొగతో విగత జీవులైన విషయం తెలిసిందే.. దీంతో ఆ కుటుంబంలో మరో ముగ్గురు బాలికలు అనాథలుగా మారారు. దీనిపై సాక్షిలో ‘పాపం పసివాళ్లు’ శీర్షికన శనివారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి టి.కనకదుర్గ, సీడీపీఓ రజనీ దుర్గ ఆదేశాలు మేరకు శిశు సంక్షేమశాఖ మిషన్ వాత్సల్య విభాగం.. శనివారం వనజ గ్రామాన్ని సందర్శించింది. మీనక మాధురి, మోక్షి, ఆయుష్లను ఐసీడీఎస్ సంస్థ ద్వారా బాలసదన్లో జాయిన్ చేసి చదువుతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొంది. పిల్లలు ముగ్గురూ ఒకే దగ్గర ఉండి చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తాత మీనక గౌరు కోరగా.. ఉన్నతాధికారులకు నివేదిస్తామని హామీ ఇచ్చారు. మిషన్ వాత్సల్య సభ్యులు జి.తవిటినాయుడు, టి.పైడిపునాయుడు, అంగన్వాడీ సూపర్వైజర్ జి.శ్రావణి, మహిళా కానిస్టేబుల్ చంద్రకళ ఉన్నారు. -
కొనుగోళ్లు గోరంత !
సీతంపేట: గిరిజనానికి అండగా ఉండాల్సిన గిరిజన సహకార సంస్థ రానురాను ప్రాభవం కోల్పోతుంది. గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఫలసాయాలను కొనుగోలు చేసి వారికి అండదండగా నిలబడాల్సిన జీసీసీ గిరిజనులు పండిస్తున్న ఉత్పత్తులు చాలా వరకు వ్యవసాయోత్పత్తులంటూ తప్పించుకుంటోంది. చేసేది లేక దళారీలకే గిరిజనులు తమ ఉత్పత్తులను విక్రయించాల్సిన పరిస్థితి. మరోవైపు సేల్స్మన్ నుంచి జీసీసీ డివిజనల్ మేనేజర్ వరకు 70 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. జీసీసీ పయనమెటు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ● గిరిజనులకు నిత్యావసర సరుకులను సరఫరా చేయడం, సేకరించిన వస్తువులను ప్రాసెసింగ్ చేయడం, వాటికి మార్కెట్ ధర కల్పించేందుకు జీసీసీ చర్యలు తీసుకోవాలి. 32 రకాల అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి గిరిజనులను ఆదుకోవాల్సిన బాధ్యత ఆ సంస్థపై ఉంది. అయితే, సంస్థను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● పూర్తిస్థాయిలో అటవీఫలసాయాలు కొనుగోలు చేయకుండా కేవలం నిత్యావసర సరుకుల దుకాణాలను నడపడం, గిరిజన సంక్షేమ వసతిగృహాలకు నిత్యావసర సరుకులను సరఫరా చేయడం వంటి పనులు తప్ప గిరిజనులకు జీసీసీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాల భర్తీ లేక.. విశాఖ జిల్లాలోని పాడేరు, పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సీతంపేట, తూర్పుగోదావరిలో రంపచోడవరం తదితర చోట్ల జీసీసీ ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. ప్రస్తుతం వివిధ కేడర్లలో దాదాపు 300లకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి గత కొన్నేళ్లుగా నోటిఫికేషన్ లేదు. గోదాంలు నిర్వహించేందుకు సూపరింటెండెంట్లు, జీసీసీ నిర్వహణకు డివిజనల్ మేనేజర్, మేనేజర్ స్థాయి నుంచి సేల్స్మెన్ స్థాయి వరకు పోస్టులు ఖాళీ కావడంతో భవిష్యత్లో జీసీసీ మనుగడ ప్రశ్నార్థకం కానుందని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. సీతంపేట డివిజన్ కార్యాలయంలో డివిజనల్ మేనేజర్ పోస్టు ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అకౌంటెంట్, సీనియర్ మేనేజర్, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీతంపేట, పాతపట్నం బ్రాంచ్ల పరిధిలో శాండీ ఇన్స్పెక్టర్లు 15, సేల్స్మెన్లు–12 పోస్టులు ఇన్చార్జిలతోనే కొనసాగుతున్నాయి. కార్యాలయంలో గోదాం ఇన్చార్జిలు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యమే గిరిజన సహకార సంస్థకు శాపమైంది. కారుణ్య నియామకాలు లేవు. కొత్త పోస్టుల భర్తీలేదు. అటవీఉత్పత్తుల కొనుగోలు నామమాత్రమే. సరైన మద్దతు ధరలు లేవు. ఈ ప్రాంతంలో పండే అటవీఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లేక గిరిజనులు అల్లాడుతున్నారు. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నాం. ఇటీవలే తమ సంస్థ ఽమద్దతు ధరలు ప్రకటించింది. కొండచీపుర్లు, కరక్కాయలు, నల్లజీడి వంటివి కొనుగోలు చేస్తున్నాం. ఖాళీ పోస్టుల్లో ఉన్న వారిని సర్దుబాటు చేసి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాం. – దాసరి కృష్ణ, జీసీసీ మేనేజర్, సీతంపేట కొండచీపుర్లు, చింతపండు, ముసిడికి పిక్కలు, నల్లజీడి, కరక్కాయలు, నరమామిడిచెక్క, తిప్పతీగ, రెల్లబార్క్, ఉసిరికి పప్పు, నేలవేము, పాతాల గిరిడి, తేనె, మైనం, నరమామిడి చెక్క వంటివి కొనుగోలు చేయాల్సి ఉంది. ఇక్కడ ఎక్కువగా ఉత్పత్తయ్యే కొండచీపుర్లు, చింతపండు వంటివి మాత్రమే కొనుగోలు చేస్తున్నప్పటకీ వీటికి సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వకపోవడంతో గిరిజనులు దళారీలనే ఆశ్రయిస్తున్నారు. అటవీ ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటించామని ఉన్నతాధికారులు ప్రకటించినప్పటకీ ఫ్లెక్సీలే తప్ప కొనుగోలు మాత్రం అంతంతమాత్రమేనని గిరిజనులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఏజెన్సీలో విస్తృతంగా ఉసిరి, పైనాపిల్, పుసుపు, జీడీ, కందులు వంటి ఉత్పత్తులు ఎక్కువగా గిరిజనులు అంతరపంటలుగా పండిస్తుంటారు. ఇటువంటి వాటిని జీసీసీ కొనుగోలు చేస్తే రైతులకు కొంతమేర మేలు జరిగేది. ఎప్పటి నుంచో వీటిని కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. దళారీలు అడిగిన ధరకే విక్రయించి రైతులు నష్టపోతున్నారు. ప్రాభవం కోల్పోతున్న జీసీసీ రెండు, మూడు అటవీ ఫలసాయాలే కొనుగోలు ప్రధాన పంటలన్నీ వ్యవసాయోత్పత్తులంటూ కొనుగోలు చేయని వైనం సిబ్బంది కొరతతో జీసీసీ సతమతం -
98వేలు
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి, పార్వతీపురం మన్యం: విద్యార్థులు లేరన్న నెపంతో గత విద్యాసంవత్సరం ఆరంభంలోనే చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు పలు పాఠశాలల విలీన ప్రక్రియను జిల్లా విద్యాశాఖ చేపట్టింది. దీనిపై ఆయా పాఠశాలల తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వ విద్యాలయాల్లో సంస్కరణల పేరుతో బేసిక్, ఫౌండేషన్, మోడల్ ప్రైమరీ విభాగాలుగా విభజించారు. ఫౌండేషన్లో ఒకటి, రెండు తరగతులే ఉంటాయి. ఇక్కడ మూడో తరగతి చదవాల్సిన విద్యార్థులు మరో పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. మోడల్ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు వల్ల సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లోని మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులను అక్కడికి తరలించారు. ప్రస్తుతం ఐదులోపు విద్యార్థులున్న ఫౌండేషన్ పాఠశాలలనూ.. 1–5 తరగతులుండే బేసిక్ స్కూళ్లలో పది లోపు విద్యార్థులుంటే మూసివేతకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిరసనలు వ్యక్తమవుతాయన్న భయంతో.. మూసివేతని కాకుండా, ట్యాగ్ చేయాలని పై నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో 1,447 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 98 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న నెపంతో సుమారు 49 బేసిక్, ఫౌండేషన్ పాఠశాలలను మూసివేయాలని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కో మండలంలో ఆరు నుంచి ఏడు వరకూ ప్రభావం కానున్నాయి. వీటిని ట్యాగ్ చేసి ఉంచాలని.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అమలు చేసేయాలని విద్యాశాఖ అధికారులు సూచించినట్లు తెలిసింది. విద్యార్థులు చదువుకు.. కార్మికులు ఉపాధికి దూరం ప్రభుత్వ నిర్ణయం వల్ల దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలు ఉంచడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పిల్లల సంఖ్యను బట్టి రేషనలైజేషన్ అనడం తగదని.. ప్రతి ఊరిలోనూ బడి కచ్చితంగా ఉండాలని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు తరలిపోయే ప్రమాదం ఉంది. బడులతో పాటు.. ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గిపోనుంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే వంట కార్మికులకు, ఆయాలకు ఉపాధి పోతుంది. ఒక్కో బడిలో ఇద్దరేసి చొప్పున వంట కార్మికులు, ఒక్కొకరు చొప్పున ఆయాలు ప్రభావితం కానున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న కారణంతో బడులను మూసివేయాలనుకోవడం దారుణం. దీన్ని ఉపాధ్యాయ సంఘాల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏటా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ఓ వైపు ప్రభుత్వం చెబుతోంది. ఏ బడినీ మూసివేసేది లేదని హామీ ఇచ్చింది. ఇప్పుడు అందుకు భిన్నంగా బడులను తగ్గించడం వల్ల ఉపాధ్యాయులు తగ్గిపోతారు. పిల్లలు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోతారు. మూడు కిలోమీటర్లు దాటి యూపీ, హైస్కూల్ ఉంటే పిల్లలకు రవాణా చార్జీలు ఇస్తామని చెప్పారు. అది కూడా అమలు చేయలేదు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటాం. తల్లిదండ్రులు, ఎస్ఎంసీ కమిటీలతో కలిసి ఆందోళనకు సిద్ధం అవుతాం. – ఎస్. మురళీ మోహనరావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భూములు లాక్కుంటే ఊరుకునేది లేదు ఉత్పత్తులు కొండంత.. ఫౌండేషన్, బేసిక్ ప్రభుత్వ స్కూళ్లపై వేలాడుతున్న కత్తి ఐదుగురు కంటే తక్కువ విద్యార్థులున్నారన్న నెపంతో విలీనం రేషనలైజేషన్, ఉపాధ్యాయుల బదిలీల సమయానికి కసరత్తు పూర్తి ప్రభుత్వ పాఠశాలల మెడపై మూసివేత కత్తి వేలాడుతోంది. ఓవైపు ఏటా డీఎస్సీతో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతూనే.. మరోవైపు విద్యార్థులు లేరన్న నెపంతో సర్కారు బడుల మూసివేతకు రంగం సిద్ధం చేస్తోంది. తద్వారా ఉపాధ్యాయ పోస్టులకూ ఎగనామం పెడుతోంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే మే, జూన్ నెలల్లో రేషనలైజేషన్, ఉపాధ్యాయుల బదిలీ సమయానికి పాఠశాలల మూసివేతపై అధికారిక ఉత్తర్వులు విడుదల చేసేలా అడుగులు వేస్తుండడం అటు ఉపాధ్యాయ, ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. 49 -
వృద్ధాప్య భద్రత కార్మికుడి చేతుల్లోనే..
కార్మికుడు తన వృద్ధాప్యాన్ని తానే భద్రపరుచుకునే అవకాశం ఇది. నెలకు కొద్ది మొత్తం చందాతో జీవితాంతం పెన్షన్ భరోసా లభించే ఈ పథకాలను నిర్లక్ష్యం చేయకూడదు. అసంఘటిత రంగ కార్మికులు, చిన్న వ్యాపారస్తులు అర్హత ఉన్నప్పుడు చేరితేనే రేపటి భద్రత సాధ్యమవుతుంది. జిల్లాలో ఇప్పటికే వేల మంది ముందడుగు వేశారు. ఇంకా మిగిలిన ప్రతి అర్హుడు తప్పకుండా ఈ పథకాలలో చేరాలి. & G‹ÜyîlÒ {ç³Ýë§ýl-Æ>Ð]l#, hÌêÏ M>ÇÃMýS Ô>Q ˘ ఉప కమిషనర్, విజయనగరం -
పారా జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న పారా అథ్లెటిక్స్ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారులు అర్హత సాధించారు. ఇటీవల నెల్లూరులో జరిగిన పారా (దివ్యాంగుల) రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభతో పతకాలు సాధించిన ముగ్గురు క్రీడాకారులు త్వరలో ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్టు జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ శనివారం తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన వారిలో కిల్లక లలిత 100, 400, 1500 మీటర్ల పరుగు పోటీల్లో, కొత్తింటి పైడిరాము డిస్కస్ త్రోలో, కరణం గౌతమ్ లాంగ్ జంప్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచటంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులను అభినందించారు. జాతీయ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పాలని ఆకాంక్షించారు. -
డిజిటల్ మార్కెటింగ్ పై అవగాహన తప్పనిసరి
పార్వతీపురం టౌన్: డిజిటల్ మార్కెటింగ్పై అవగాహన తప్పనిసరని డీఆర్డీఏ పీడీ సుధారాణి తెలిపారు. శనివారం స్థానిక వెలుగు కార్యాలయంలో డిజిటల్ మార్కెటింగ్ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిజిటల్ మార్కెటింగ్కు రిజిష్టర్ అయిన లబ్ధిదారులు, కొత్తగా రిజిస్టర్ చేసుకున్న సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడారన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కార్మికా.. రేపటి భద్రత మర్చిపోవద్దు..!
● 18–45 ఏళ్లలో పథకంలో చేరితే.. 60 ఏళ్ల తర్వాత రూ.3వేలు ● జిల్లాలో 10,234 మంది కార్మికుల నమోదువిజయనగరం గంటస్తంభం: రోజూ కష్టపడి పని చేసే అసంఘటిత రంగ కార్మికుడికి వృద్ధాప్యంలో ఆర్ధిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం శ్రమ యోగి మాన్ ధన్, లఘువ్యాపారి మాన్ ధన్ పెన్షన్ పథకాలను అమలు చేస్తోంది. 18 నుంచి 40 ఏళ్లలోపు అర్హులైన వారు ఈ పథకాల్లో చేరితే 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల రూ.3 వేల పెన్షన్ నేరుగా బ్యాంకు ఖాతాలో జమవుతుంది. తక్కువ చందాతో జీవిత భరోసా.. నెలకు కేవలం రూ.55 నుంచే చందా చెల్లించి భవిష్యత్తుకు భద్రత పొందవచ్చు. లబ్ధిదారుడు చెల్లించే మొత్తానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. జిల్లాలో ఇప్పటివరకు 10,234 మంది కార్మికులు ఈ పథకాలలో నమోదు అయ్యారు. అర్హులు ఎవరంటే... శ్రమ యోగి మాన్ ధన్ పథకానికి వీధి వ్యాపారులు, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, గృహ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు అర్హులు. నెలసరి ఆదాయం రూ.15వేల లోపు ఉండి, ఈఎస్ఐ, ఈసీఎఫ్ లేని వారు ఈ పథకంలో చేరవచ్చు. లఘువ్యాపారి మాన్ ధన్ పథకానికి చిన్న దుకాణ యజమానులు, స్వయం ఉపాధిదారులు, రిటైల్ వ్యాపారులు, హోటల్ యజమానులు అర్హులు. కుటుంబానికీ రక్షణ ఈ పథకంలో చేరిన వారికి 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3వేలు పెన్షన్ లభిస్తుంది. పెన్షనుదారు మృతి చెందితే జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్ జీవితకాలం అందుతుంది. నమోదు విధానం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (మీ–సేవ) ద్వారా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, నామినీ ఆధార్తో నమోదు చేసుకోవచ్చు. -
ప్రమాదాలకు కారణాలను అన్వేషించాలి
● ప్రమాదాల బ్లాక్ స్పాట్స్ను గుర్తించి నియంత్రణ చర్యలు చేపట్టండి ● ఎస్పీ ఎ.ఆర్.దామోదర్డెంకాడ: రహదారి భద్రతలో భాగంగా జాతీయ రహదారి 16పై బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలను పరిశీలించి ప్రమాద కారణాలను గుర్తించాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. డెంకాడ పోలీస్స్టేషన్ పరిధిలో బ్లాక్ స్పాట్స్ను ఆయన శనివారం పరిశీలించారు. ప్రమాదాల నియంత్రణకు సెంట్రల్ రెయిలింగు, సైన్ బోర్డులు, లైటింగ్, జిగ్ జాగ్ స్టాపర్లు, సర్వీసు రోడ్లపై స్పీడు బ్రేకర్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. బ్లాక్ స్పాట్స్ వద్ద డ్రోన్ సహాయంతో ఇంజినీరింగ్ లోపాలను గుర్తించి, నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న గ్రామాల వద్ద పాదచారులు రహదారి దాటే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారని, ఆయా ప్రాంతాల్లో సెంటర్ డివైడర్పై రైలింగ్ వేయాలన్నారు. ప్రమాదాలు జరిగేందుకు కొన్ని ప్రాంతాల్లో లైటింగ్ సరిగ్గా లేకపోవడం గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా, జాతీయ రహదారి, సర్వీసు రోడ్లు కనెక్ట్ అయ్యే ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు జిగ్ జాగ్ స్టాపర్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాల నంబర్లను గుర్తించే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని టోల్ ప్లాజా అధికారులకు తెలియజేయాలన్నారు. ఆయన వెంట డెంకాడ ఎస్ఐ ఎ.సన్యాసి నాయుడు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొనారు. -
గోల్డ్ మెడల్ విజేతలకు ఎస్పీ అభినందన
విజయనగరం క్రైమ్ : అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించిన విజయనగరం వన్ టౌన్ లేఎస్ఐ ఆల్తి త్రినాధరావు, రిటైర్డ్ ఏఆర్ హెచ్సీ మజ్జి శంకరరావును ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శనివారం తన చాంబర్లో అభినందించారు. ఇటీవల నేపాల్లోని పోకరాలో జరిగిన అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్లో వీరు రాణించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి యువతకు, ఔత్సాహిక క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ పోటీల్లో 60+ విభాగంలో వన్ టౌన్ ఏఎస్ఐ ఆల్తి త్రినాధరావు పాల్గొనగా, 70+ విభాగంలో రిటైర్డ్ ఏఆర్ హెచ్సీ మజ్జి శంకరరావు పాల్గొన్నారన్నారు. ఐదు దేశాలకు చెందిన క్రీడాకారులతో పోటీపడి, అన్ని విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించారన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం వన్ టౌన్ సీఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఇటలీలో ఉద్యోగ అవకాశాలు
● జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రశాంత్కుమార్ రామభద్రపురం: ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇటలీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని.. అర్హత ఉన్న యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రశాంత్కుమార్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంక్రీట్ పంపు డ్రైవర్, కన్స్ట్రక్సన్ కార్పెంటర్, కన్స్ట్రక్సన్ ఫోర్మెన్, ఐరన్ వర్కర్, ట్రక్ డ్రైవర్ తదితర ఉద్యోగాలకు అవకాశం ఉందన్నారు. ఆయా ఉద్యోగాలకు ఇంటర్, ఐటీఐ, డిప్లమా విద్యార్హతతో పాటు మూడేళ్ల పాటు ఆయా వృత్తులలో పూర్తి అనుభవం ఉండాలన్నారు. నెలకు జీతం రూ.2.30 లక్షలు ఇస్తారన్నారు. ఇటలీ వెళ్లడానికి ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉండాలన్నారు. అలాగే వెళ్లే అభ్యర్థులు రూ.1 లక్ష సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1లక్ష, రిజిస్ట్రేషన్, సర్వీస్ చార్జీలు కింద రూ.35 వేలు చెల్లించాలన్నారు. ఈ డబ్బులు ఇటలీలో సెలక్ట్ అయి ఆరు నెలలు పని చేసిన తర్వాత మొత్తం రూ.1.35 లక్షలు తిరిగి ఇచ్చేస్తారని చెప్పారు. ఎంపికై న అభ్యర్టులకు న్యూఢిల్లీలోని ఇటాలియన్ ఎంబసీలో శిక్షణ ఇస్తారన్నారు. ఎంపికై న అభ్యర్ఠులకు సెక్యూరిటీ అంతా ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. ఇంట్రస్ట్ ఉన్న అభ్యర్థులు నైపుణ్య.ఏపీ.గోవ్,ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో డీటీ గిరిధర్ పాల్గొన్నారు. -
కేంద్ర సాయుధ దళాల్లో ఎంపికై న ఎన్సీసీ క్యాడెట్లు
విజయనగరం అర్బన్: సత్య డిగ్రీ కళాశాలకు చెందిన ఎనిమిది మంది ఎన్సీసీ క్యాడెట్లు కేంద్ర సాయుధ దళాలైన సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్లలో ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ సాయిదేవమణి తెలిపారు. సీఐఎస్ఎఫ్లో బి.పూర్ణిమ, స్వాతి, మోహన్, శ్రీను, ఎం.శ్రీను, పి.సాయికుమార్, సీఆర్పీఎఫ్లో వెంకటేష్, బీఎస్ఎఫ్లో శ్రవణకుమార్ ఉద్యోగాలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు. -
అగ్ని ప్రమాదం
సంతకవిటి: మండలంలోని గోవిందపురం గ్రామంలో కరెంట్ వైర్లు తెగి పడిన కారణంగా శనివారం రాగోలు గణనాధకు చెందిన 10 ధాన్యం బస్తాలు, 2 ఎకరాలు మినప చేను, 3 ఎకరాలు గడ్డి వాములు దగ్ధమైనట్టు రాజాం ఫైర్ సిబ్బంది తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.60 వేలు ఉంటుందని తెలిపారు. రాజాం ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేయడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. గరికిపాడులో.. మండలంలోని గరికిపాడు గ్రామానికి చెందిన వావిలపల్లి రమణకు చెందిన ఎకరం చెరకు తోట అగ్నికి ఆహుతైంది. ఫైర్ సిబ్బంది గ్రామానికి చేరుకున్నప్పటికీ చెరకు తోట దగ్గరకు వెళ్లే మార్గం లేక పోవడంతో వెనుదిరిగింది. గ్రామస్తులు స్పందించి మంటలను అదుపుచేశారు. లేదంటే చుట్టూ ఉన్న దాదాపు నాలుగు ఎకరాల చెరకు తోట దగ్ధమయ్యేదని గ్రామస్తులు తెలిపారు. -
పేదలకు పట్టాలిచ్చే వరకు పోరాడుతాం
విజయనగరం టౌన్: పేదలకు పట్టాలిచ్చే వరకు పోరాడుతామని పట్టణ బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు, అధ్యక్షుడు నీలాపు అప్పలరాజు రెడ్డి, రెడ్డి నారాయణరావులు అన్నారు. ఇదే విషయమై ధర్మపురిలో శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. గత కొన్నాళ్లుగా పేదలకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం తరఫున మరుగున పడిన ప్రభుత్వ భూమిని గుర్తించి వెలికితీశామని, గ్రామంలోని నిరుపేదలకు ఎక్కడో ఇళ్లస్థలాల పట్టాలు ఇవ్వడం కన్నా గ్రామంలోనే ఇచ్చేలా కృషి చేయాలని కోరారు. ఫిబ్రవరి 3వ తేదీన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు వచ్చి ఆ స్థలాన్ని చూసి వెళ్లారన్నారు. గతంలో ఆమెకు కూడా వినతిపత్రం ఇచ్చామని, అందుకే వచ్చి చూశారేమోనని సంతోష పడ్డామన్నారు. నాలుగో తేదీన టీడీపీ జిల్లా అధ్యక్షుడు వచ్చి మళ్లీ ఆ స్థలం చూశారని, అక్కడ టీడీపీ జిల్లా కార్యాలయం కడతారని తమకు తెలిసిందన్నారు. అది వాస్తవమో అవాస్తమో తెలియదు గానీ ఎమ్మార్వోను అడిగితే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయో చూపించమన్నారని, అందుకే ఆ స్థలాన్ని చూపించామన్నారన్నారు. -
హ్యాకథాన్లో జీఎంఆర్ ఐటీ విద్యార్థుల ప్రతిభ
రాజాం సిటీ: విజయవాడలో నిర్వహించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ ఫైనల్స్లో జీఎంఆర్ ఐటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్ శనివారం తెలిపారు. జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా మండలి పది ప్రొబ్లమ్ స్టేట్మెంట్ల్పై నిర్వహించిన ఈ పోటీల్లో దేశం నలుమూలల నుంచి 800 మంది విద్యార్థులు పాల్గొన్నారని పేర్కొన్నారు. ఒక్కొక్క ప్రొబ్లం నుంచి 12 టీంలను ఫైనల్స్కు ఎంపిక చేశారని, అందులో తమ విద్యార్థులు రూపొందించిన క్వాంటమ్ స్టేట్ విజువలైజర్ అనే ప్రాజెక్టుకు ప్రథమ బహుమతి లభించిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా క్విబిట్స్, సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్ వంటి క్వాంటమ్ కంప్యూటింగ్ మౌలిక భావాలను సులభంగా, దృశ్య రూపంలో అర్ధం చేసుకోవచ్చని తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి రూ.50 వేలు చెక్కుతో పాటు విజేతలకు జ్ఞాపికలు అందజేశారని తెలిపారు. విద్యార్థుల ప్రతిభ పట్ల జీఎంఆర్ వీఎఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, సీఈసీ విభాగం నుంచి డాక్టర్ ఏవీ రమణ తదితరులు అభినందించారు. -
డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాలుడి మృతి
బొబ్బిలి: చిన్న పిల్లాడిని కుక్క కరిచింది చూడండి బాబూ అంటే వాక్సిన్లు వేసిన వైద్యులు తిరగబెట్టిందని మళ్లీ వస్తే కేజీహెచ్కు తీసుకెళ్లమన్నారు. ఇక్కడే చికిత్స చేయడమో లేక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుపొమ్మనో చెబితే మా కుమారుడు బతికేవాడని దిబ్బగుడ్డివలస గ్రామానికి చెందిన మృతుడు రామవరపు రమణ (9) తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కకాటుతో గత నెల 8వ తేదీన స్థానిక సీహెచ్సీలో తల్లిదండ్రులు రమణను వైద్యానికి చేర్చారు. వైద్యులు వ్యాక్సిన్ వేసి ఆస్పత్రిలో ఉంచారు.అంతా నయమైపోయిందని 13వ తేదీన ఇంటికి వెళ్లిపోవచ్చని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు కృష్ణవేణి, సంగమేశ్వర్రావులు కుమారుడిని తీసుకుని ఇంటికి చేరుకున్నారు. ఇంతలో తెల్లవారుజామున జ్వరం రావడంతో తల్లిదండ్రులు బాలుడు రమణను మళ్లీ సీహెచ్సీకి తరలించారు. దీంతో వైద్యులు పరీక్షించి ఇక్కడ నయం కాదని విజయనగరం జీజీహెచ్కు రిఫర్ చేశారు.అక్కడి డాక్టర్లు బాలుడి పరిస్థితి గమనించి కేజీహెచ్కు తీసుకువెళ్లాలని రిఫర్ చేశారు. కేజీహెచ్కు తరలిస్తుండగా బాలుడు మృత్యువాత పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదంతా స్థానిక సీహెచ్సీ డాక్టర్ల నిర్లక్ష్యం, రిఫర్ కారణంగా జరిగిందని వాపోతున్నారు. రోగులను పట్టించుకోవడం లేదని, అందరినీ వేరే ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని, మాలాంటి పేదోళ్లకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించే స్థోమత లేదని ప్రభుత్వాస్పత్రిలో వైద్యాన్ని నమ్ముకుంటే తమ పిల్లాడు బలైపోయాడని అల్లాడిపోయారు. ఎమ్మెల్యేకు చెప్పి ఆవేదన: గ్రామంలో మరో నలుగురికి కుక్క కరిస్తే వారు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం తీసుకోవడంతో బతికిబట్టకట్టారని, మాలాంటి పేదోళ్లం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లలేక కొడుకును బలిచ్చామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో జరుగుతున్న నిర్లక్ష్యం, చికిత్సను అందించక ప్రైవే టు ఆస్పత్రులకు వెళ్లాలని రిఫర్ చేస్తున్నారని బాలుడి తల్లిక్రి కృష్ణవేణి ఆస్పత్రి కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే బేబినాయన ముందు వాపోయింది. మావైద్యం మేం చేశాంబాలుడి మృతిపై సీహెచ్సీ సూపరింటెండెంట్ శశిభూషణరావు వివరణ కోరగా బాలుడికి అవసరమైన చికిత్సనంతా అందించామన్నారు. బాలుడి పరిస్థితి విషమించడంతోనే జీజీహెచ్, కేజీహెచ్లకు రిఫర్ చేశామని చెప్పారు. -
తీరప్రాంత భద్రత దేశ రక్షణకు కీలకం
భోగాపురం: దేశరక్షణలో తీరప్రాంత భద్రత అత్యంత కీలకమని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. ఈ మేరకు భోగాపురం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా సైకిల్ ర్యాలీని శుక్రవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తీరప్రాంత భద్రతపై ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కోస్టల్ సెక్యూరిటీ, నేషనల్ యూనిటీ (జాతీయ సమైక్యత) నేషనల్ ప్రైడ్ గురించి స్కూళ్లు, కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం సీఐఎస్ఎఫ్ సిబ్బంది రెండు బృందాలుగా విడిపోయి కోల్కతా, గుజరాత్ల నుంచి ప్రారంభించిన మెగా సైకిల్ ర్యాలీని కేరళ వరకు కొనసాగించనున్నట్లు చెప్పారు. సుమారు 100 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఒక టీమ్గా ఏర్పడి ఈ యాత్రను చేపట్టారన్నారు. ఈ క్రమంలో భోగాపురం చేరుకున్న ర్యాలీ బృందంతో కలిసి భాగస్వాములు కావడం, వారికి భద్రత ఏర్పాట్లను కల్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వారి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐ కె.దుర్గాప్రసాద్, ఎస్సై వి.పాపారావు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ -
మన్యంలో సికిల్ సెల్ సెగ..!
పార్వతీపురం రూరల్: గిరిజన హృదయాల్లో ప్రాణాంతక సికిల్సెల్ ఎనీమియా నిశ్శబ్దంగా మృత్యుఘంటికలు మోగిస్తోంది. మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తూ, గిరిపుత్రుల ప్రాణాలను హరిస్తోంది. జన్యుపరంగా సంక్రమించే ఈ మహమ్మారి బారిన పడి పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు విలవిలలాడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. గతంలో బాధితులకు కొండంత అండగా నిలిచిన ప్రత్యేక వైద్యసేవలు నేడు ’బాబు ’ పాలనలో అటకెక్కాయి. ఐటీడీఏ నిధుల విడుదలలో చూపుతున్న జాప్యం, పాలకుల అలసత్వం వెరసి..గిరిజనుల రక్తం తెల్లబారుతోంది. పంజా విసురుతున్న సికిల్సెల్ జిల్లాలోని ఎనిమిది మండలాల్లో నాలుగు పూర్తిగా నాలుగు పాక్షికంగా ఏజెన్సీ పరిధిలో ఉండగా, ఇక్కడ సికిల్సెల్ రక్కసి పంజా విసురుతోంది. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా 304 మందికి వ్యాధి నిర్ధారణ కాగా, మరో 4,808 మందిని ఈ వ్యాధి వాహకులుగా గుర్తించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వారికి ప్రతి నెలా రక్తమార్పిడి, నిరంతర వైద్య పర్యవేక్షణ ప్రాణావసరం. కానీ, దురదృష్టవశాత్తు జిల్లాలో ఉన్న ఏకై క ప్రత్యేక ’డే కేర్ సెంటర్’ నిధులు లేక రెండేళ్లుగా మూతపడి ఉండడం గమనార్హం. గతంలో ప్రత్యేక వైద్యులు, సిబ్బందితో సేవలు అందించేందుకు ఉన్న కేంద్రం, నేడు పాలకుల నిర్లక్ష్యం వల్ల వెలవెలబోతోంది. జనరల్ వార్డుల్లో పడి ఉండాల్సిన దుస్థితి ఒకప్పుడు బాధితులకు నేరుగా రక్తమార్పిడి, ఉచిత మందులు, సలహాలు అందించే ఈ వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. ఇప్పుడు బాధితులు సాధారణ రోగుల మాదిరిగా జనరల్ వార్డుల్లో పడి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ప్రత్యేక విభాగం లేకపోవడంతో గర్భిణులు, కౌమార బాలికల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడింది. నెలకు కేవలం రూ. 30 లక్షల నిధులు కేటాయించలేక, గిరిజనుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు సర్కారు, ఏజెన్సీలో కొడిగడుతున్న ప్రాణాలను కాపాడడంలో ఎందుకు విఫలమవుతోందని గిరిజన సంఘాలు నిలదీస్తున్నాయి. తక్షణమే ఐటీడీఏ నిధులు విడుదల చేసి, ప్రత్యేక చికిత్స కేంద్రాన్ని పునఃప్రారంభించాలని కోరుతున్నాయి. కేంద్రాస్పత్రిలో అవసరమైన సేవలు జిల్లా కేంద్రాస్పత్రిలో సికిల్సెల్ బాధితులకు అవసరమైన అన్ని వైద్య సేవలు నిరంతరం అందుతున్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షల అనంతరం రక్తమార్పిడి అవసరమైన వారికి కేంద్రాస్పత్రిలో సేవలు అందుతున్నాయి. డే కేర్ సెంటర్కు ప్రతిపాదనలు పంపించాం. చికిత్స అందించడంలో ఎలాంటి జాప్యం చేయడం లేదు. వ్యాధిగ్రస్తులకు క్షేత్రస్థాయిలోనే పరీక్షలు నిర్వహించి, సకాలంలో వైద్యం అందేలా పర్యవేక్షణ చేస్తున్నాం. డా.ఎం.వినోద్ కుమార్ ప్రత్యేకాధికారి గిరిజనుల ప్రాణం..గాలిలో దీపం మూతపడిన ఏకై క భరోసా కేంద్రం.. పట్టించుకోని చంద్రబాబు సర్కారు నిధులు నిలిపివేత..వైద్యం అందక గిరిపుత్రుల విలవిల జిల్లాలో 304 మంది వ్యాధిగ్రస్తులు.. మరో 4,808 మంది వాహకులు రక్తమార్పిడి లేక..మందులు దొరక్క నరకయాతన -
అక్రమ వడ్డీలపై పోలీసుల నిఘా
● నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు ● వడ్డీ వ్యాపారులతో పట్టణ సీఐ సమావేశంపార్వతీపురం రూరల్: అనుమతి లేకుండా వడ్డీ వ్యాపారం సాగించినా, పరిమితికి మించి వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను వేధించినా చట్టపరమైన చర్యలు తప్పవని పార్వతీపురం పట్టణ సీఐ వెంకట్రావు హెచ్చరించారు. ఈ నెల 5న సాక్షి దినపత్రికలో వెలువడిన అప్పుల ఊబిలో చిరు వ్యాపారులు శీర్షికపై ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో వడ్డీ వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయడం నేరమని, అప్పుల పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేయకూడదని స్పష్టం చేశారు. నిబంధనల పరిధిలోనే వ్యాపారాలు నిర్వహించాలని, వేధింపులపై ఫిర్యాదులు అందితే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. అధిక వడ్డీల కోరల్లో చిక్కిన బాధితులు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని కోరారు. సమావేశంలో పట్టణ ఎస్సైలు ప్రయోగమూర్తి, గోవింద్, సిబ్బంది పాల్గొన్నారు. -
దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
సీతానగరం: జాతీయస్థాయిలో కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాల సబ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించనందుకు నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో అందరూ భాగస్వాములు కావాలని సీఐటీయూ రాష్ట్రకమిటీ సభ్యురాలు కె.సుబ్బరావమ్మ కోరారు. ఈ మేరకు పార్వతీపురం, సీతానగరం మండలాల్లోని పలుగ్రామాల్లో సీఐటీయూ, వ్యవసాయ కార్మికసంఘాల నాయకులతో కలిసి సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా సీతానగరం మండలంలోని మరిపివలస, చిన్నారాయుడుపేట, సీతానగరం గ్రామాల్లో ప్రచారం చేశారు. బైక్ అదుపుతప్పి తీవ్ర గాయాలుపార్వతీపురం రూరల్: ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి వస్తుండగా అదుపు తప్పడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుచ్చిమి గ్రామానికి చెందిన గుత్తవల్లి మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయమైంది. గమనించిన స్థానికులు మహేష్ బంధువులకు సమాచారం ఇచ్చి 108 వాహనంలో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. -
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు
పూసపాటిరేగ: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్స్టేషన్ పరిసరాలను ఆహ్లాదకరంగా ఉంచాలని, అలాగే పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, వారి చెప్పే సమస్యలను శ్రద్ధగా విని పరిష్కరించాలన్నారు. స్టేషన్ పరిధిలో ఎక్కువగా సీసీ కెమెరాలు అమర్చాలని, గస్తీ, జాతీయ రహదారిపై పెట్రోలింగ్ వంటి చర్యలను కట్టుదిట్టం చేయాలన్నారు. అనంతరం పోలీస్స్టేషన్ రికార్డులు, సీడీ ఫైల్స్, హిస్టరీ సీట్లు, నాన్బెయిలబుల్ వారెంట్లపై సమీక్షించారు. మహిళలు, బాలలు, సైబర్ నేరాలు, రహదారి భద్రత పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు. డయల్ యువర్ 100, 112 ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, సంఘటన స్థలానికి వెంటనే చేరుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అలాగే పూసపాటిరేగ మండలంలోని కొండగుడ్డిలో జరిగిన హత్య వివరాలను రూరల్ సీఐ రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఆ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సాక్ష్యాలను సేకరించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని తెలిపారు. ఆయన వెంట ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, పూసపాటిరేగ ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు. -
బ్యాంకర్లు ఆర్థిక వృద్ధికి తోడ్పడాలి
పార్వతీపురం: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రుణాల మంజూరు ప్రక్రియలో బ్యాంకర్లు ఉత్సాహంగా పాల్గొని జిల్లా ఆర్థిక వృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని బ్యాంకర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా యంత్రాంగంతో బ్యాంకర్లు నిరంతరం సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ప్రజల్లో ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక అక్షరాస్యతపై బ్యాంకర్లు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందన్నారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్.సోమశేఖర్, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, డీటీఓ బి.ప్రసాదరావుతో పాటు వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి -
పూరిల్లు దగ్ధం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని ఒమ్మి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ పూరిల్లు దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన లెంక కసవయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి భారీగా మంటలు వ్యాపించి పూరిల్లు కాలిబూడిదైంది. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. బీరువాలో ఉన్న సుమారు రూ.30వేల నగదు, తులం బంగారం, దుస్తులు అగ్నికి ఆహుతై బాధిత కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆకట్టుకున్న అశ్వాల దౌడులక్కవరపుకోట: మండలంలోని జమ్మాదేవిపేట గ్రామంలో శ్రీనందీశ్వరస్వామి తీర్ధం మహోత్సవం సందర్భంగా గుర్రాల పరుగు పందెం పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీల్లో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనరగం జిల్లాల నుంచి 13 గుర్రాలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో అలమండ శ్రీనురాజుకు చెందిన గుర్రం మొదటి స్థానం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన అశ్వాల యజమానులకు నిర్వాహకులు నగదు బహుమతులను అందజేశారు. బొబ్బిలి: స్థానిక రైల్వే స్టేషన్ను అనుసరించి ఉన్న రైలుపట్టాలపై అనుమానాస్పదంగా సంచరిస్తూ ఆత్మహత్య కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తిని పట్టుకుని కౌన్సెలింగ్ చేసి బంధువులకు అప్పగించిన ఆర్పీఎఫ్ సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పొదిలాపు రాంబాబు(32) అనే వ్యక్తి బొబ్బిలి శివారులో సీతానగరం స్టేషన్ మధ్యలో ప్లాట్ఫాం నంబర్ 1 లైన్లో ఉన్న పట్టాలపై అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడు. ఆ వ్యక్తిని గమనించిన రైల్వే ఏఎస్సై హెచ్కే పాణిగ్రహి, హెచ్సీ బి.ఈశ్వర రావు, సిబ్బంది వెంటనే వెళ్లి పట్టుకుని రైల్వేపోస్టుకు తీసుకువచ్చారు. అతనిని విచారణ చేయగా కుటుంబ, వైవాహిక పరయిన సమస్యలతో తాను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పడంతో కుటుంబసభ్యులు, బంధువుల నంబర్లకు సమాచారమందించి రప్పించి ఆ వ్యక్తిని అప్పగించారు. -
రైలు ప్రయాణికులకు మెరుగైన వసతి లక్ష్యం
విజయనగరం టౌన్: రైలు ప్రయాణికులకు మెరుగైన వసతి, సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈస్ట్కోస్ట్ రైల్వే పనిచేస్తోందని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా పేర్కొన్నారు. ఈ మేరకు విజయనగరం రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ఫ్లాట్ఫామ్లో ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఏసీ డార్మిటరీ, రిటైరింగ్ రూమ్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం వీఐపీ లాంజ్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పీఎన్ఆర్ కలిగి ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలను అతి తక్కువ ఖర్చుకే అందజేస్తున్నామన్నారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించామని తెలిపారు. పారదర్శకత, యాక్సెస్, డిజిటల్ సౌలభ్యం ఉందన్నారు. రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు దీర్ఘకాలం వేచి ఉండేవారికి, సీనియర్ సిటిజన్లకు, పిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు ఐఆర్సీటీసీ ద్వారా క్యాటరింగ్, హాస్పిటాలిటీ సేవలను లైసెన్స్డ్ మెస్సర్స్ గుడ్పుడ్ క్యాటరింగ్ సర్వీసులను అందజేస్తుందని చెప్పారు. అనంతరం నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్, ఐఆర్సీటీసీ రీజనల్ మేనేజర్ అనూజ్ దత్తా తదితరులు పాల్గొన్నారు. డీఆర్ఎం లలిత్ బోహ్రా -
ఈ ఏడాదైనా పాట పాడతారా?
●జిల్లాలోని వీరఘట్టం మండలం వండవ కొండపై ఉన్న 150 ఎకరాల్లో ఉన్న 1302 జీడి మొక్కలకు ఫిబ్రవరి 10న పార్వతీపురం మన్యం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వేలం పాట నిర్వహిస్తారు. ఈ వేలం పాటలో తోటలు లీజుకు వెళ్లకపోతే మళ్లీ ఫిబ్రవరి 20న వేలం పాట నిర్వహిస్తారు. ●వేలం పాటలో పాల్గొనే వా రు ముందుగా వారు పాడబో యే తోటలను చూసుకోవాలి. ●ప్రతి పాటదారు ధరావత్తు సొమ్ము రూ.5000తో పాటు రూ.25వేలు నగదు చెల్లించి వేలంపాటలో పాల్గొనాలి. ●పాట ముగిసిన వెంటనే నగదు సాల్వెన్సీ కాకుండా ధరావత్తు సొమ్ముతో కలిపి 1/3 వంతు అదే రోజు విధిగా చెల్లించాలి. ●పాట ఖరారైన వ్యక్తికి పాన్కార్డు, ఆధార్కార్డు తప్పకుండా కలిగి ఉండాలి. వండువ పంచాయతీలోని జీడి తోటల నుంచి గత కొనేళ్లుగా ఫలసాయం అందుతోంది. ఏటా పూత సమయంలో అటవీ శాఖాధికారులు వేలం నిర్వహిస్తున్నారు.అలా వచ్చిన మొత్తంలో 60 శాతం పంచాయతీకి, 40 శాతం అటవీ శాఖకు చెందుతుంది. అయితే మూడేళ్లుగా వేలంపాట జరగకపోవడంతో పంచాయతీ ఆదాయానికి గండి పడుతోంది. రెండేళ్ల క్రితం ఫలసాయం రూ.1.26 లక్షలు రావడంతో ఇందులో 60 శాతం వాటా కింద రూ.75 వేలను వండవ పంచాయతీకి అటవీశాఖ అధికారులు జమచేశారు. గతేడాది వేలం పాటకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అటవీశాఖ అధికా రులే పర్యవేక్షణ చేశారు. 510 కిలోల జీడి పిక్కలు దిగుబడి వచ్చింది. అంటే గతేడాది ధర ప్రకారం కేవలం రూ.59 వేలు మాత్రమే ఆదా యం వచ్చింది. ఈ ఏడాది ఎలాగైనా వేలం పాట నిర్వహించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి. వీరఘట్టం: మార్కెట్లో జీడి పిక్కల ధర ప్రస్తుతం కిలో రూ.140 నుంచి రూ.150 ధర పలుకుతోంది. గతేడాది సీజన్లో రూ.160 వరకు ధర పలికింది. అదే జీడి పప్పు ప్రస్తుతం నాణ్యతను బట్టి కిలో రూ.820 నుంచి రూ.870 ధర పలుకుతోంది. ఈ తరుణంలో ఎకరా జీడితోటలో పంట బాగా పండితే ఆ రైతుకు కనకవర్షం కురుస్తుంది. అయితే వీరఘట్టం మండలంలోని వండువ కొండపై 150 ఎకరాల జీడి తోటలు ఉన్నా జిల్లా అటవీశాఖకు మాత్రం గడిచిన మూడేళ్లుగా అరకొర ఆదాయం మాత్రమే వస్తోంది. గతంలో ప్రతి ఏటా జీడితోటలకు వేలం జరిగే సమయంలో దళారులు రంగప్రవేశం చేసి ధర తగ్గించేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేవారు. గడిచిన మూడేళ్లుగా ఎవరూ వేలం పాటకు ముందుకు రాకపోవడంతో అటవీశాఖ అధికారులే సాగు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్లీ సీజన్ మొదలు కావడంతో ఈనెల 10న పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో జీడితోటలు వేలం వేసేందుకు జిల్లా అటవీశాఖాధికారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరఘట్టం మండలంలోని వండువ కొండల్లో 1980లో 62.5 ఎకరాల్లో జీడితోటలు వేశారు. మళ్లీ 1982లో 87.5 ఎకరా ల్లో జీడితోటలు వేశా రు. మొత్తం 150 ఎకరా ల్లో సుమారు 3750 జీడిమొక్కలను వేసి ఈ కొండలో సాగుచేశా రు. మొక్కలు వేసిన ఐదేళ్ల తర్వాత ఫలసాయం బాగా రావడంతో అటవీశాఖకు, గ్రా మ పంచాయతీకి బాగానే ఆదాయం వచ్చేది. కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాలు, తుపాన్లు, ఈదురుగాలుల ధాటికి వాటిలో రెండు వంతుల మొక్కలు నేలమట్ట మయ్యాయి. ప్రస్తుతం 1302 జీడి మొక్కలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.ఈ మొక్కలకు మాత్రమే వేలం పాట నిర్వహించనున్నారు. క్రమేపీ వండువ కొండల్లో ఉన్న జీడి మొక్కల సంఖ్య తగ్గుతోంది. 1980–82 మధ్య కాలంలో సుమా రు 3750 మొక్కలు వేస్తే ప్రస్తుతం 1302 మొక్కలే ఉన్నాయి. ప్రతి ఏటా సీజన్లో ఉపాధిహామీ పథ కం ద్వారా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అలాగే కొత్త మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి. అప్పు డు పాత మొక్కలు నేలమట్టమైనా కొత్త మొక్కలతో ఫలసాయం పెరుగుతుంది. నాణ్యమైన పంట దిగుబడి వస్తుంది. అయితే ఈ కొండల్లో జీడి తోటలపై సస్యరక్షణ చర్యలు చేపట్టక, నిర్వహణ లేక ఏటా ఫలసాయం తగ్గుతోంది. ఇలాగే వదిలేస్తే మరో మూడేళ్లలో ఉన్న మొక్కలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి, పంచాయతీకీ ఆదాయం రావాలంటే అధికారులు సమన్వయంతో ఇక్కడ జీడితోటల పెంపకంపై దృష్టి సారించాల్సి ఉంది.జీడి తోటల వేలానికి గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా వేలం పాటను పక్కాగా నిర్వహిస్తాం. వేలం పాటను సిండికేట్ చేస్తే రద్దు చేస్తాం. ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలా ఎవరైనా లోపాయికారీగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. –టీవీ రమణమూర్తి, డిప్యూటీ రేంజర్, వీరఘట్టం -
సహకారం!
యంత్రాంగం సాక్షి, పార్వతీపురం మన్యం: తిరుమల లడ్డూ విషయంలో ఒక ఉద్దేశ పూర్వకం, పథకం ప్రకారం విష ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్సార్ సీపీ లక్ష్యంగా టీడీపీ అసత్య దాడులకు తెగబడుతోంది. ప్రజలను భయాందోళనకు గురి చేసేలా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా హిందూ భక్తులను రెచ్చగొట్టేలా విద్వేషాలు రెచ్చగొడుతోంది. ఈ సంస్కృతి పార్వతీపురం వంటి జిల్లాకూ పాకిన విషయం తెలిసిందే. పార్వతీపురం పట్టణంతో పాటు.. పలు మండల కేంద్రాల్లో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందంటూ హోర్డింగుల ద్వారా తప్పుడు ఆరోపణలకు దిగారు. జిల్లా కేంద్రంలోని రద్దీ కూడళ్లలో ఊరూపేరూ లేకుండా, కేవలం వైఎస్సార్ సీపీ నేతలు లక్ష్యంగా ప్రజలను రెచ్చగొట్టేలా వీటిని ఏర్పాటు చేయడం గమనార్హం. దీనిపై మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటిని తొలగించాలని కోరారు. ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ లేవు. ఆ హోర్డింగులు అలానే దర్శనం ఇస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వాటి కారణంగా ఉత్పన్నమవుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు చేయకూడదు. సోషల్ మీడియా ద్వారా అసత్య సమాచారం, ద్వేషపూరిత సందేశాలు ప్రచారం చేసిన వారి మీద కూడా చర్యలు ఉంటాయి. ఎస్పీ ప్రకటన చేసిన తర్వాతే హోర్డింగులు ఏర్పాటు చేయడం.. ఫిర్యాదులు వెళ్లిన తర్వాత కూడా వాటిని తొలగించక పోవడం విమర్శలకు తావిస్తోంది. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే రహదారి పక్కనే పెద్ద ఎత్తున హోర్డింగు దర్శనం ఇస్తున్నా.. ఏ ఒక్కరూ పట్టించుకోక పోవడం గమనార్హం. మున్సిపల్ అనుమతులు లేకుండా ఇలాంటి హోర్డింగులు పెట్టడానికి వీలు పడదు. అనుమతులు తీసుకున్నా.. అలాంటి వివాదస్పద బోర్డు పెట్టుకునేందుకు ఎలా అంగీకరించారని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ఆదేశాలతోనే వాటిని తొలగించడం లేదని అంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది. ప్రజలను ఉద్రేకపరిచే వాఖ్యలు చేసినా.. అలజడులు సృష్టించినా.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఇటీవల హెచ్చరిక ప్రకటన కూడా జారీ చేశారు. -
శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
బొండపల్లి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా విద్యాప్రణాళిక అమలుచేస్తున్నామని ఆర్జేడీ విజయ్ భాస్కర్ తెలిపారు. బొండపల్లి ఎంఈఓ కార్యాలయాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రిజియన్ పరిధిలోని ఆరుజిల్లాల్లోని విద్యార్థులకు గతేడాది డిసెంబర్ 6 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పదోతరగతి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది విజయనగరం జిల్లా నుంచి 14,744 మంది, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 5,117 మంది, శ్రీకాకుళం జిల్లా నుంచి 19,370 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. ● ఆర్జేడీ విజయ్భాస్కర్ -
చదువుల తల్లి భువనేశ్వరికి అండగా నిలవలేమా?
సాక్షి, పార్వతీపురం మన్యం: పేద విద్యార్థుల విదేశీ విద్యకలను సాకారం చేసేలా రాష్ట్రంలో అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం అమలవుతుందా అని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ప్రశ్నించారు. తమ అందరికీ గర్వకారణంగా.. జిల్లాలోని కురుపాం మండలం సప్పగొత్తిలి గిరిజన గ్రామానికి చెందిన గేదెల భువనేశ్వరి వ్యవసాయ ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసి, ఉన్నత విద్య చదవాలనే కోరికతో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ (ఇంగ్లీషు ఎపిసన్స్) ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్, మాస్టర్ ఆఫ్ సైన్స్ లో ప్రవేశానికి అర్హత సాధించిందని చెప్పారు. ఆ కోర్సు పూర్తి చేయడానికి సుమారు రూ.70 లక్షల వరకూ ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ నెల 23వ తేదీలోపు యూనివర్సిటీలో చేరాల్సి ఉందని తెలిపారు. లేకుంటే ఆమె కలలు మధ్యలోనే ఆగిపోతాయని ఆందోళన చెందారు. ఈ మేరకు ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు ఆయన లేఖ రాశారు. తన ప్రతిభను ప్రభుత్వం గుర్తించి, ఈ ఆణిముత్యం, చదువుల సరస్వతికి అండగా నిలవాలని కోరారు. సాయమన్నా చేయండి.. రుణమైనా ఇవ్వండి... ఆమె తండ్రి గేదెల సత్యభగవాన్ ఉపాధ్యాయుడు అయినప్పటికీ చదువు కోసం ఆస్ట్రేలియా పంపించేంత స్థోమత లేదని రాజన్నదొర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ అధికారులకు ఆర్థిక సహాయం కోసం ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. విద్యాశాఖ మంత్రి పేషీలో కూడా వినతిపత్రం అందజేసినట్లు తెలిసిందన్నారు. విద్యా రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తే.. వారు అనేక కొర్రీలు పెడుతున్నారని వివరించారు. ఏజెన్సీ/షెడ్యూల్డ్ ఏరియా భూములు తనఖా పెట్టి విదేశీ విద్యకు బ్యాంకు రుణం ఇవ్వలేమంటున్నాయని తెలిపారు. దళిత, గిరిజన, పేద విద్యార్థులకు అంబేడ్కర్ విదేశీ పథకం కింద విదేశాలలో చదువుకునేందుకు సహాయం చేస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వం.. మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన గేదెల భువనేశ్వరి మొర ఆలకించకపోవడం విచారకరమన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ విదేశీ విద్యా పథకం కింద గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. అర్హత సాధించిన పేద విద్యార్థులకు విదేశీ చదువులకు ఆర్థిక సహాయంతో పంపించేవారన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు చదువుకునే కోర్సు, యూనివర్సిటీని బట్టి సుమారు కోటి రూపాయల వరకు ఆర్థిక సహాయం మంజూరు చేసేవారని గుర్తు చేశారు. సహకరించాల్సిన బాధ్యత వారిదే.. తన నియోజకవర్గంలోని ఒక పేద మహిళా గిరిజన విద్యార్థి ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులకు అర్హత పొందినందుకు కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగదీశ్వరి.. జిల్లాకు చెందిన గిరిజన, ఒక మహిళా మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి గర్వపడాలని రాజన్నదొర అన్నారు. విషయం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం, అండదండలు ఉండే విధంగా కృషి చేయవలసిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. వీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియడం లేదన్నారు. ఈ విషయమై మంచి మనసుతో ఆలోచించి పేద గిరిజన విద్యార్థికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐటీడీఏ పీవో, కలెక్టర్ కూడా స్పందించి గిరిజన విద్యార్థి భువనేశ్వరికి, తమ పరిధిలో ఆర్థిక సహాయం చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి, అమ్మాయి చదువుకు ఆటంకాలు తొలగించాలని కోరారు. లేకుంటే జిల్లా అధికారులు బ్యాంకులకు హామీ ఇచ్చి గిరిజన శ్రేయస్సు కోసం అండగా నిలవాలని సూచించారు. విదేశీ చదువుకు బ్యాంకులు రుణాలు సహజంగానే మంజూరు చేస్తాయని.. గిరిజన విద్యార్థి గేదెల భువనేశ్వరికి బ్యాంకు రుణం మంజూరులో నిబంధనలు అడ్డు వస్తున్నట్లు తెలుస్తోందన్నారు. వాస్తవాలు పరిగణనలోకి తీసుకొని, గిరిజన విద్యార్థినికి ప్రభుత్వం ఆర్థిక సహాయం మంజూరు చేయాలని, లేకుంటే.. రూ.70 లక్షల విద్యా రుణం అయినా వచ్చేలా చూడాలని గిరిజన సంఘాల తరపున విజ్ఞప్తి చేశారు. గిరిజన బిడ్డకు ఆస్ట్రేలియాలో చదివే అవకాశం ప్రభుత్వ తోడ్పాటు, రుణం కోసం ఎదురుచూపు రాష్ట్రంలో అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం అమలవుతుందా..? గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, విప్ స్పందించాలి ప్రభుత్వానికి లేఖ రాసిన మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర -
ఫీజుల భారం మోయలేం
విజయనగరం గంటస్తంభం: ప్రైవేట్, కార్పొరేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో విద్యార్థులను ఆర్థికంగా దోచుకుంటున్నారు.. అక్రమ ఫీజులు వసూలు చేస్తున్నారు... ఈ ఫీజుల భారం మోయలేమంటూ విద్యార్థులు కదం తొక్కారు. విద్యాహక్కును వ్యాపారంగా మార్చుతున్న విధానాలపై నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మయూరి కూడలి నుంచి విజయనగరం కాంప్లెక్స్ వరకు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంప్లెక్స్ వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్మి డి.రాము, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి నాగఝభూషణ్ మాట్లాడుతూ... విద్యార్ధుల భవిష్యత్తును తాకట్టుపెట్టేలా జరుగుతున్న అక్రమ ఫీజుల వసూళ్లను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విద్య అనేది హక్కు తప్ప లాభసాటిగా మార్చే వస్తువు కాదని, పేద–మధ్యతరగతి విద్యార్థులు చదువు కొనసాగించలేని స్థితికి నెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపులో జాప్యం తగదన్నారు. విద్యార్థుల కన్నీళ్లు, తల్లిదండ్రుల కష్టాన్ని పట్టించుకోని పాలక విధానాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మోహన్బాబు యూనివర్సిటీకి ఇచ్చిన అనుమతులను రద్దు చేసి, యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఎస్ఎఫ్ఐ నాయకుల కిడ్నాప్ ఘటనలో బాధ్యులైన నటుడు మోహన్బాబు, విష్ణు, పీఆర్ఓ సతీష్లను వెంటనే అరెస్టు చేయాలని, విద్యార్ధుల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బును పూర్తిగా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శిరీష, భారతి, జయ, వంశీ, సూరిబాబు, ఏఐఎస్ఎఫ్ నాయకులు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. రోడ్డెక్కిన విద్యార్థులు విజయనగరంలో ఆందోళన మోహన్బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ డిమాండ్ -
నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు
వీరఘట్టం: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిఘా నీడలో నిర్వహిస్తామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి వై.నాగేశ్వరరావు తెలిపారు. వీరఘట్టం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఫస్టియర్ విద్యార్థులకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు, సెకెండియర్ విద్యార్థులకు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. దీని కోసం 33 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 17,530 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. వీరిలో ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 5,938 మంది, ఫస్టియర్ ఒకేషన్ విద్యార్థులు 2849 మంది, సెకెండియర్లో జనరల్ విద్యార్థులు 6,127 మంది, సెకెండియర్లో ఒకేషనల్ విద్యార్థులు 2616 మంది ఉన్నట్లు వివరించారు. గతేడాది 78 శాతం ఉత్తీర్ణత సాధించామన్నారు. ఈసారి ఆ శాతం పెంచేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 44 కేంద్రాల్లో ప్రాక్టికల్స్.. ఇంటర్ ప్రాక్టికల్స్ను ఈ ఏడాది 44 కేంద్రాల్లో నిర్వహిస్తున్నాం. జనవరి 27 నుంచి 31 వరకు మొదటి విడత, ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు రెండు విడతలో ప్రయోగ పరీక్షలు జరిగాయి. ప్రస్తుతం మూడో విడతలో ఈ నెల 6 నుంచి 10 వరకు జరుగుతున్నాయి. బోటనీ, జువాలజీ ప్రాక్టికల్స్లో 1916 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రాక్టికల్స్లో 4,580 మంది విద్యార్థులు హాజరు కానున్నారని డీఐఈఓ నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 23 నుంచి 33 కేంద్రాల్లో నిర్వహణ హాజరు కానున్న 17,530 మంది విద్యార్థులు -
గిరిజన యువకుడి అవయవాలు దానం
పాచిపెంట: బొలెరో వాహనం బోల్తాపడిన ఘటనలో బ్రెయిన్ డెడ్ అయిన గిరిజన యువకుడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పాచిపెంట మండలం గరేళ్లవలస గ్రామానికి చెందిన మంచాల గణేష్ (22) ఈ నెల 4వ తేదీన శివలింగాపురం సమీపంలో బొలెరో వ్యాన్ బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. అత్యవసర వైద్యం నిమిత్తం శ్రీకాకుళం జెమ్స్లో చేర్పించారు. అతని బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రి వైద్యులు సూచన మేరకు గణేష్ అవయవాలు దానం చేయడానికి కుటుంబ సభ్యులు, బంధువులు ముందుకు వచ్చారు. మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్లు, కాలేయం తదితర అవయవాలను పలు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు దానం చేశారు. అవయవ దానానికి అంగీకరించిన గణేష్ కుటుంబ సభ్యులను ఆస్పత్రి వైద్యులతో పాటు పలువురు అభినందించారు. -
ఉగాదిలోపు గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి
పార్వతీపురం: గృహనిర్మాణ పథకాల కింద మంజూరైన ఇళ్లను ఉగాది పండగలోపు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ మండలాల్లో పెండింగ్లో ఉన్న 1,500 ఇళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు, ఆన్లైన్లో అప్లోడ్ చేసిన డేటాకు మధ్య భారీ వ్యత్యాసం ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల నమోదులో నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా తదితర విభాగాల్లో పెండింగ్లో ఉన్న అన్ని పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, పీఆర్, గిరిజన సంక్షేమ శాఖల ఈఈలు నగేష్, మణిరాజ్, తదితరులు పాల్గొన్నారు. నేడు కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా కురుపాం: రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం ‘సుస్థిర సేంద్రియ వ్యవసాయం–రైతాంగ ప్రగతికి సోపానం’ అనే అంశంపై కిసాన్ మేళా నిర్వహించనున్నారు. సుమారు 500 నుంచి 550 మంది రైతులు పాల్గొననున్నారు. మేళాకు ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయ అధికారులు, కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు హాజరుకానున్నట్టు కేంద్ర సిబ్బంది తెలిపారు. పోలమాంబ హుండీల ఆదాయం రూ.25.47 లక్షలు మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని దేవదాయశాఖ ఆధ్వర్యంలో చదురుగుడిలో శుక్రవారం లెక్కించారు. చదురుగుడిలోని ఆరు హుండీల నుంచి రూ.18,47,354లు, వనంగుడిలోని ఆరు హుండీల నుంచి రూ.7,00,065లు కలిపి రూ.25,47,419లు ఆదాయం వచ్చినట్టు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. 27 గ్రాముల 520 మిల్లీ గ్రాముల బంగారం, 243 గ్రాముల వెండి లభించిందన్నారు. హుండీల ఆదాయం లెక్కింపులో పార్వతీపురం మన్యం జిల్లా దేవదాయశాఖ అధికారి ఎస్.రాజారావు, ఆలయ చైర్మన్ నైదాన చిన్నతిరుపతి, సర్పంచ్ వి.సింహాచలమమ్మ, ఎంపీటీసీ సభ్యుడు టి.పోలినాయుడు, ఉప సర్పంచ్ అల్లు వెంకటరమణ, సేవకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎంఈఓపై విచారణ సీతంపేట: సీతంపేట ఎంఈఓ ఎం.ఆనందరావుపై వచ్చిన ఫిర్యాదులపై జిల్లా విద్యాశాఖ ఏడీ గౌరీశంకర్ శుక్రవారం ఎన్ఆర్సీ కేంద్రంలో విచారణ జరిపారు. ఉపాధ్యాయుల సరెండర్ లీవులు డ్రా చేసినప్పటికీ సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయడం లేదని, కొంతమంది ఇంటి వద్దనే ఎఫ్ఆర్ఎస్ వేసి.. స్కూల్కు హాజరవుతున్నట్టు మేనేజ్ చేస్తున్నారని, క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఉపాధ్యాయులకు అవార్డుల కోసం సిఫార్సు చేశారని, పాఠ్య, నోటు పుస్తకాలు, ఇతర కిట్లు పాఠశాలలకు పంపించకుండా ఎన్ఆర్సీ నుంచి పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ.. స్థానికుడు ఎన్.సాయి డీఈఓ, ప్రిన్సిపాల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు రెండు విడతల కరువు భత్యం ట్రెజరీకి సబ్మిట్ చేయలేదని మండల ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాంగోపాల్ కలెక్టర్, డీఈఓలకు ఫిర్యాదు చేశారు. ఈ విచారణకు హెచ్ఎం రాంప్రసాద్ హాజరు కాగా.. సాయి అనే ఫిర్యాదీ గైర్హాజరయ్యారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని ఏడీ గౌరీ శంకర్ తెలిపారు. -
పాపం... పసివాళ్లు..!
–8లోబ్యాంకర్లు ఆర్థిక వృద్ధికి తోడ్పడాలి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రుణాల మంజూరు ప్రక్రియలో బ్యాంకర్లు ఉత్సాహంగా పాల్గొని జిల్లా ఆర్థిక వృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు.జియ్యమ్మవలస రూరల్: ఇంటిలో రాజుకున్న కుంపటి పొగ.... ఆ చిన్నారులకు తల్లిదండ్రులను, తమ్ముడిని దూరం చేసింది. అనాథలను చేసింది. భవిష్యత్తుపై బెంగను పెంచింది. పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనంతోనే కడుపునింపుకోవాల్సిన పరిస్థితి. సెలవులిస్తే.. వారి పోషణ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న.. వృద్ధులైన నాన్నమ్మ, తాతయ్యను ఆవేదనకు గురిచేస్తోంది. జియ్యమ్మవలస మండలం వనిజ గ్రామంలో గత నెల 23న ఇంటిలో నిప్పుల కుంపటి పొగకు ఊపిరాడక మీనక మధుసూదనరావు, సత్యవతి దంపతులు, వారి కుమారుడు మోసు చనిపోయిన సంగతి తెలిసిందే. మధుసూదనరావు, సత్యవతి దంపతులకు నలుగురు సంతానం. వీరిలో ముగ్గురు ఆడపిల్లలు కాగా, ఒక బాబు. తాపీమేస్త్రి అయిన తండ్రి, వ్యవసాయ కూలీ అయిన తల్లి నిరంతరం కష్టపడుతూ పిల్లలకు ఏ లోటూలేకుండా సాకుతూవచ్చారు. అనుకోని ప్రమాదంలో కుమారుడితో పాటు వారు కూడా తనువు చాలించారు. ఆ ప్రమాదంలో గాయపడిన మరో చిన్నారి ఆయుష్ కేజీహెచ్లో చికిత్స పొందుతూ కోలుకుంది. ఇప్పుడు ఈ ముగ్గరి చిన్నారుల భవిష్యత్తుపై చీకట్లు అలముకున్నాయి. ప్రస్తుతానికి వృద్ధులైన నాన్నమ్మ మీనక సోములమ్మ, తాతయ్య గౌరు సాకుతున్నారు. పెద్దపాప మాధురి చినమేరంగిలోని కేజీబీవీలో ఏడోతరగతి చదువుతుండగా, మరో బాలిక మోక్ష బొమ్మికలో నాలుగో తరగతి చదువుతోంది. ఆయుష్ ప్రస్తుతం తాత, నాన్నమ్మ సంరక్షణలో ఉంది. వీరిది కూలిచేస్తే గాని కుండాడని కుటుంబం. తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను సాకేవారు. ప్రస్తుతం ఆ భరోసా కరువైంది. పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనంతోనే కాలంగడపాల్సిన పరిస్థితి. పాఠశాలలకు సెలవులిస్తే.. ముగ్గురు పిల్లలను సాకగలమా? లేదా? అంటూ ఇప్పటి నుంచే నాన్నమ్మ, తాతయ్యలు మనోవేదన చెందుతున్నారు. తాము మరణిస్తే ఆడపిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని కన్నీరుపెడుతున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డల భవితకు చక్కని దారిచూపాలని అధికారులు, పాలకులను వేడుకుంటున్నారు. ఆపన్నహస్తం అందించాలని దయార్థహృదయులను చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. కుంపటి పొగకు ఊపిరాడక తల్లిదండ్రులు, తమ్ముడు మృతి అనాథలుగా మారిన ముగ్గురు గిరిజన బాలికలు తాముచనిపోతే వారికి దిక్కెవరంటూ తాత, నాన్నమ్మ ఆవేదన -
ఎమ్మెల్యే దౌర్జన్యకాండ
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పట్టణంలో వివాదంలో ఉన్న ఓ జిరాయితీ స్థలం విషయంలో నియోజకవర్గం ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర అత్యుత్సాహం ప్రదర్శించారు. తాను ఎమ్మెల్యేనన్న హోదాను మరిచి.. స్వయంగా రంగంలోకి దిగి, ఆ స్థలంలో యజమానులుగా చెప్పుకునే వ్యక్తులు నిర్మిస్తున్న కట్టడాలను కాలితో తన్ని మరీ కూల్చివేశారు. ఈ విషయంలో స్థానికులను సైతం ఆయన రెచ్చగొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని వెంకంపేట పంచాయతీ అఫీషియల్ కాలనీ సర్వే నంబర్ 127/1లో 13 సెంట్ల స్థలాన్ని గ్రంధి వాసు కొనుగోలు చేశారు. తర్వాత ఆ స్థలాన్ని ఆయన మామయ్య మామిడిపాక నారాయణమూర్తికి విక్రయించారు. ఇది జిరాయితీ స్థలమన్న డాక్యుమెంట్లన్నీ వారి వద్ద ఉన్నాయి. ల్యాండ్ కన్వర్షన్ కూడా జరిగింది. ఈ స్థలంలో గతంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి, హద్దులు కూడా నిర్ణయించి ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం స్థలం యజమాని నారాయణ మూర్తి కుటుంబసభ్యులు అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించగా..స్థానిక ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాలువ, చప్టాను కూడా ఆక్రమించుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై బాధితులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ..న్యాయం జరగలేదు. దీంతో వారు అన్ని ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ స్థలంలో కట్టడాలను ఎవరు అడ్డుకున్నా శిక్షార్హులు అంటూ బోర్డు సైతం అక్కడ పాతారు. కోర్టు ఆర్డర్తో వారి స్థలంలో నిర్మాణాలను ప్రారంభించారు. దీంతో గురువారం ఉదయం స్వయంగా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర, తన అనుచరులు, స్థానికులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ నిర్మాణాలకు ఎవరు అనుమతిచ్చారంటూ ఆగ్రహంతో ఊగిపోతూ, స్వయంగా ఆయనే కాలితో తంతూ, కట్టడాన్ని కూల్చివేశారు. తన అనుచరులను కూడా రెచ్చగొట్టి, నిర్మాణాలను అడ్డుకున్నారని బాధితులు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలో అనధికార కట్టడాలు, ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. కొద్దిరోజులుగా పట్టణ నడిబొడ్డున వరహాలగెడ్డ స్థలాన్ని ఆక్రమించుకుని, తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చర్యలు లేవు. వామపక్ష, ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టినా..ఎమ్మెల్యే విజయ్చంద్ర అటువైపు చూసి న దాఖలాలు లేవు. జిల్లా కేంద్రంలోనే పలు చెరువుల వద్ద స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. వాటి విషయంలో పట్టించుకోని ఎమ్మెల్యే..ఒక జిరాయితీ స్థలం విషయంలో స్వయంగా తానే రంగంలోకి దిగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ నిర్మాణాలను అడ్డుకోవాలని పలుమార్లు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి కూడా చేసినట్లు తెలుస్తోంది. అన్ని ఆధారాలూ, పత్రాలు వారి వద్ద ఉండడంతో రెవెన్యూ సిబ్బంది కూడా తామేమీ చేయలేమని చే తులెత్తేసినట్లు సమాచారం. దీంతో సహనంనశించి, ఇలా ప్రవర్తించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
బార్లకు లైసెన్సుల కేటాయింపు
పార్వతీపురం రూరల్: జిల్లాలోని నాలుగు బార్లకు లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ గురువారం కలెక్టరేట్లో పూర్తయింది. జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత ఆధ్వర్యంలో పారదర్శకంగా లాటరీ నిర్వహించారు. పార్వతీపురం పట్టణంలో మూడు, సాలూరులో ఒక బారు కోసం మొత్తం 20 మంది పోటీపడగా..దరఖాస్తుదారుల సమక్షంలోనే డ్రా తీసి లైసెన్సులు ఖరారు చేశారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఏఎస్పీ ఎ.సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు. 7న జాబ్మేళా విజయనగరం అర్బన్: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల7న పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో జాబ్మేళా నిర్వహిస్తామని జిల్లా ఉపాధిఅధికారి ఆర్.వహీదా తెలిపారు. ఫెనెస్ట్రీ విండోస్ అండ్ డోర్స్, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్, ఫ్లిప్కార్ట్, యాజాకి ఇండియూ ప్రైవేట్ లిమిటెడ్, ద్వారకా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జెఫ్టో తదితర ప్రైవేటు సంస్థలు పాల్గొని వివిధ విభాగాల్లో ఉద్యోగనియామకాలు చేపడతాయన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా ‘ఎంప్లాయిమెంట్.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్సైట్లో జాబ్ సీకర్ లాగిన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. డెంకాడ: మండలంలోని జొన్నాడ పైడితల్లి అమ్మవారి హుండీల ఆదాయాన్ని దేవదాయ శాఖ అధికారులు గురువారం లెక్కించారు. ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు జరిగిన జాతరలో భక్తులు సమర్పించిన కానుకల రూపంలో రూ.7లక్షల 8వేల 473లు వచ్చినట్టు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. -
మైనింగ్ భూముల సర్వే
మెరకముడిదాం: మండలంలోని కొత్తకర్ర, బుదరాయవలస, చినరవ్యాం, చినబంటుపల్లి గ్రామాల రెవెన్యూ పరిధిలో ఐరన్ఓర్ మైనింగ్ తవ్వకాలకు సంబంధించిన భూములను ఆర్ఐ డి.రామ్కుమార్, సర్వేయర్ రామకృష్ణలు గురువారం సర్వే చేశారు. అయితే ఆయా గ్రామాల్లో మైనింగ్ తవ్వకాలను జరుపుకునేందుకు గతంలో తమ సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తూ అనుమతులను ఇచ్చిందని, అందులో కొంత భూమిలో మాత్రమే మైనింగ్ తవ్వకాలు జరిపామని, అప్పట్లో తవ్వకుండా వదిలేసిన మిగులు భూముల్లో ఇప్పుడు తవ్వకాలకు అనుమతులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని సంబంధిత యాజమాన్యాలు కోరాయి. దీంతో ఈ భూములను పూర్తిస్థాయిలో సర్వే చేసి తనకు నివేదికను అందజేయాలని కలెక్టర్ రామసుందరరెడ్డి స్థానిక తహసీల్దార్ సులోచనారాణిని అదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు ఆర్ఐ డి.రామ్కుమార్, సర్వేయరు రామకృష్ణలు గురువారం ఆయా గ్రామాల రెవెన్యూపరిధిలో గతంలో మైనింగ్తవ్వకాలకు అనమతులు ఇచ్చిన భూములను సర్వే చేశారు. దీనిపై పూర్తిస్థాయి నివేదికను త్వరలో జిల్లా అదికారులకు అందజేయనున్నట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. -
వ్యాన్ బోల్తా పడి ఒకరి మృతి
పాచిపెంట: ఐసీడీఎస్ పాల ప్యాకెట్లతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడి మండలంలోని గరేళ్ల వలస గ్రామానికి చెందిన గిరిజన యువకుడు మంచాల గణేష్(22) గురువారం మృతిచెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం ఐసీడీఎస్ పాల ప్యాకెట్లతో వచ్చిన వ్యాన్ కేరంగి పంచాయతీ నందేడు వలస అంగన్వాడీ సెంటర్లో పాల ప్యాకెట్లు అన్లోడ్ చేసి శివలింగాపురం అంగన్వాడీ సెంటర్కు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కేసలి గ్రామానికి చెందిన కొనిసి వసంతరావు, గరేళ్లవలస గ్రామానికి చెందిన మంచాల గణేష్, కొనిసి జమరాజులకు తీవ్ర గాయాలయ్యాయి, వెంటనే వారిని సాలూరు సీహెచ్సీకి అక్కడి నుంచి విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంచాల గణేష్ పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళంలోని కిమ్స్ తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు, ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లలాం అర్జున్ తెలిపారు. -
ఏకలవ్యలో ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు
సీతంపేట: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆరోతరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఐటీడీఏ పరిధిలోని భామిని, మెళియాపుట్టి మండలాల్లో ఉన్న ఈఎంఆర్ఎస్లలో ప్రవేశాలు ఉంటాయన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుందని, బాలికలకు 60, బాలురుకు 60 మొత్తం 120 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈనెల 28వ తేదీలో గా దరఖాస్తు చేసుకోవాలని వచ్చేనెల 10వ తేదీ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చ ని, ఏప్రిల్ 4న ప్రవేశపరీక్ష ఉంటుందని వివరించారు. సీతంపేట బాలికల గురుకుల పాఠశా ల, పెద్దమడి బాలుర పాఠశాలల్లో ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందన్నారు. మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ జాతర మహోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది తొలి, మారు జాతరలలో భక్తులు అమ్మవారి చదురుగుడి, వనంగుడిల వద్ద ఏర్పాటు చేసి న హుండీలలో సమర్పించిన కానుకులను శుక్రవారం లెక్కించనున్నట్లు ఈవో బి శ్రీనివా స్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాదా య శాఖ అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీల ఆదాయం లెక్కింపు చేపట్టనున్న ట్లు ఆలయ ఈవో తెలిపారు. ఆదాయం లెక్కింపు కార్యక్రమంలో ఆసక్తిగల భక్తులు, సేవకులు శుక్రవారం ఉదయం 9 గంటలకు పాల్గొనాలని కోరారు. మక్కువ: చదువుకు వయసుతో సంబంధం లేదని, ప్రతి ఒక్కరూ చదువుపై మక్కువ చూపించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్ది కోరారు. ఈ మేరకు మక్కువ మండలంలోని పాపయ్యవలస గ్రామంలో అక్షరాస్యత కేంద్రాన్ని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో నిర్వహిస్తున్న తరగతులను, అభ్యాసకుల హాజరు, బోధనా పద్ధతులను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ అభ్యాసకులతో నేరుగా మాట్లాడి, వారు నేర్చుకుంటున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. కొందరు అభ్యాసకులతో బోర్డుపై అక్షరాలు, అంకెలు రాయించి వారి ప్రగతిని పరీక్షించారు. ప్రతి ఒక్కరూ కనీస అక్షరాస్యత సాధించేలా కృషి చేయాలని సూచించారు. అక్షరాస్యతకేంద్రంలో విద్యుత్ దీపాలు, తాగునీరు, కూర్చునేందుకు అవసరమైన వసతుల ఏర్పాటుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సంబంధిత అధికారులు, వలంటీర్లకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. గ్రామంలోని నిరక్షరాస్యులందరినీ గుర్తించి, వారంతా కేంద్రానికి వచ్చేలా ప్రోత్సహించాలని కోరారు. కేవలం అక్షరాలే కాకుండా, సెల్ఫోన్ వాడకం, బ్యాంకు లావాదేవీల వంటి అంశాలపై కూడా ప్రాథమిక అవగాహన కల్పించాలన్నారు. అంకితభావంతో పనిచేస్తున్న వలంటీర్లను అభినందిస్తూ, గైర్హాజరయ్యే అభ్యాసకులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో జా యింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామసర్పంచ్ పాల్గొన్నారు. లంక దినకర్ జిల్లాకు రాక రేపు విజయనగరం అర్బన్: 20 సూత్రాల ప్రణాళిక చైర్మన్ లంక దినకర్ శనివారం ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందింరలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల అమలు తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు కలెక్టరేట్లో పత్రికా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కూటమి నాయకులతో సమావేశమై తిరిగి విశాఖపట్నం బయలుదేరి వెళ్తారని అధికారులు తెలిపారు. -
మార్చి నెలాఖరులోగా ఉపాధి పనులు పూర్తిచేయాలి
● పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ కృష్ణతేజ పార్వతీపురం: జిల్లాలో ఉపాధిహామీ పథకంలో నిర్వహిస్తున్న రహదారులు, అభివృద్ధి పనులను మార్చి 31లోగా పూర్తిచేయాలని పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ ఎం.కృష్ణ తేజ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉపాధిహామీ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 15వరకు పూర్తయిన అన్ని పనులకు మార్చి 31లోగా బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి బిల్లులను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మార్చి 15 తరువాత సమర్పించే బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధిహామీ, గ్రామీణాభివృద్ధి పనుల కోసం సుమారు రూ.30వేల కోట్లు కేటాయించినట్లు తెలి పారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో అలసత్వం వహించకూడదని, క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించి సకాలంలో నివేదికలు అందజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మార్చి నెలాఖరులోగా ఎలాంటి పనులు పెండింగ్ లేకుండా చూడాలని సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. 15లోగా శతశాతం పన్నులు వసూలు చేయాలి జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఫిబ్రవరి 15వ తేదీలోగా శతశాతం పన్నులు వసూలు కావాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.కృష్ణతేజ పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం పట్టణంలోని రాయల్ కన్వెన్షన్ హాల్లో డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ పన్నుల వసూలులో డిప్యూటీ ఎంపీడీఓలు బాధ్యత వహించాలని, లేకుంటే అధికారులను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. పంచాయతీల్లో తాగునీరు, పారిశుద్ధ్యం నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. చెత్త సేకరణ, స్వచ్ఛభారత్ మిషన్, స్వచ్చరథం కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరిచిన ఎంపీడీఓలకు, శతశాతం పన్నుల వసూలులో లక్ష్యాలను సాధించిన పంచాయతీ కార్యదర్శులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ టి.కొండలరావు, డ్వామా పీడీ కె. రామచంద్రరావు, విజయనగరం జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, డీఎల్డీఓ రమేష్ రామన్తో పాటు పలువురు పాల్గొన్నారు. -
అద్భుతం చూడాలంటే.. సాహసం చేయాల్సిందే..!
సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు రూరల్: చుట్టూ పచ్చని, ఎత్తైన కొండలు.. అక్కడక్కడ విసిరేసినట్లు గిరిజనుల ఆవాసాలు..కనుచూపు మేర కుంచె పట్టి, గీసినట్లు ప్రకృతి రమణీయత..కట్టిపడేసే అందాలు.. మధ్యలో ఆకాశ గంగే నేలపైకి దుమికి వస్తుందా అన్నట్లు జలపాత హొయలు.. మాటల్లో వర్ణించలేని అద్భుత దృశ్యాలు కళ్ల ముందే సాక్షాత్కరిస్తాయి. ఇవన్నీ దాటుకుని వెళ్లాలంటే సాహసమే. గమ్యం చేరుకోవాలంటే పెద్ద కష్టమే. బాహుబలి జలపాతంగా అభివర్ణించే సాలూరు నియోజకవర్గం కొదమ పంచాయతీ నంద సమీపంలోని సుమారు వంద అడుగుల మేర మహాలొద్ద జలపాత వీక్షణం పర్యాటకులకు గొప్ప అనుభూతిని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి వరకూ స్థానికులకే తెలిసిన ఈ జలపాతాన్ని, బాహ్య ప్రపంచానికి పరిచయం చేసి.. దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. సాహసాలు చేయాలనుకునే వారికి, ట్రెక్కింగ్ను ఇష్టపడే సాహసికులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. జలపాతాన్ని ప్రారంభించిన మంత్రి, కలెక్టర్ సహజ సిద్ధమైన సౌందర్యాలకు చిరునామా మన్యం ప్రాంతమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. జలాపాతాల ఖిల్లా మన్యం జిల్లా అని తెలిపారు. సాలూరు మండలం కొదమ గిరిజన పంచాయతీ పరిధిలోని ప్రకృతి రమణీయమైన మహాలొద్ద జలపాతాన్ని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డితో కలిసి మంత్రి సంధ్యారాణి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లొద్ద జలపాతానికి చేరుకునేందుకు వీలుగా 6 కిలోమీటర్ల మేర రహదారిని రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అనేక జలపాతాలు మరుగున పడి ఉన్నాయని, వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే గత మూడు నెలల్లో ఏడు జలపాతాలను ప్రారంభించామని వివరించారు. మహాలొద్ద జలపాతం గొప్ప అనుభూతిని ఇస్తుందనడంలో ఎవరికీ సందేహం లేదు. కాకుంటే..ఇక్కడికి చేరుకోవడమే పెద్ద సవాల్. సాలూ రు నుంచి మావుడి, లొద్ద వరకు ప్రయాణం సాఫీగా సాగినా.. అక్కడినుంచి కొండల అంచు న.. రహదారి సౌకర్యం లేని మార్గంలో జీపులు, ద్విచక్ర వాహనాలపైనే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మహాలొద్ద ప్రవేశ ద్వారం నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు కొండలపైనే కాలి నడకన ప్రయాణించాలి. రూ.6 కోట్ల వ్యయంతో ఆరు కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపడతామని, అతిథి గృహాలు కూడా నిర్మిస్తామని మంత్రి, కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసి, త్వరగా పనులు పూర్తి చేయగలిగితేనే సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. దీనికితోడు ఎటువంటి సౌకర్యాలూ లేకపోవడం వల్ల సందర్శకుల భద్రత కూడా ప్రశ్నార్థకమే. ఇవన్నీ పూర్తి చేయగలిగితే.. రాష్ట్రస్థాయిలోనే ఈ ‘బాహుబలి జలపాతానికి’ మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. కలెక్టర్ ప్రభాకరరెడ్డి, సంయుక్త కలెక్టర్ యశ్వంత్కుమార్రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్స్వప్నిల్ జగన్నాథ్, జిల్లా అటవీ శాఖాధికారి ప్రసూన తదితరులు కొంత దూరం వాహనాల్లోనూ, ద్విచక్ర వాహనాలపైనా ప్రయాణం చేశారు. తొలుత కలెక్టర్ స్వయంగా బైక్ నడుపుతూ ద్విచక్ర వాహనాల ర్యాలీగానూ వచ్చారు. అనంతరం సుమారు మూడు కిలోమీటర్లు కాలినడక న, రాళ్లూరప్పల మధ్యే పడుతూ, లేస్తూ, ఆగు తూ ప్రయాణం సాగించారు. జిల్లా అధికారులు సైతం మధ్యలో జారిపడిపోయిన సంఘటనలు ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు కూడా దొర్లిపోయిన ఘటనలు సంభవించాయి. ఇదే మార్గంలో నిత్యం గిరిజనులు రాకపోకలు సాగిస్తుంటారు. రాళ్ల మార్గంలోనే డోలీలు కట్టి తీసుకెళ్తారు. వారి ప్రయాణం ఎంత కష్టమో జిల్లా అధికారులకు సైతం ఈ పర్యటనలో తెలిసొచ్చింది. -
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
పార్వతిపురం రూరల్: పట్టణంలోని 29వ వార్డు రామాపురం కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ ఇల్లు గురువారం అగ్నికి ఆహుతైంది. స్థానిక నివాసి చింతల రమణమ్మ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫ్రిడ్జ్, బీరువా, దుస్తులతో పాటు రూ.10 వేల నగదు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు వేడుకుంటోంది. గుండెపోటుతో హెడ్కానిస్టేబుల్ మృతివంగర: స్థానిక పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న నడిపిల్లి సత్యనారాయణ(55) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ఎని మిది నెలలుగా ఆయన వంగర పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం గుండె సంబంధిత సమస్య రావడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. గురువారం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతిచెందారు. విజయనగరానికి చెందిన ఆయనకు భార్య క్రాంతిసౌజన్య ఉన్నారు. ఆయన మృతి పట్ల సీఐ హెచ్ ఉపేంద్రరావు, ఎస్సై షేక్ శంకర్, పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. పొట్టేళ్ల పందాలపై పోలీసుల దాడులువీరఘట్టం: మండలంలోని కడకెల్ల గ్రామ శివారులో జరుగుతున్న పొట్టేళ్ల పందాలపై ఎస్సై ఎస్.షణ్ముఖరావు తన సిబ్బందితో గురువారం దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1500 స్వాధీనం చేసుకున్నారు. అలాగే పందెంలో ఉపయోగించిన రెండు పొట్టేళ్లను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యంవిజయనగరం క్రైమ్ : విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలోని పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని వన్టౌన్ పోలీసులు గురువారం కనుగొన్నారు. మృతుడి వయస్సు 55 ఉంటుందని చామన ఛాయ రంగుతో నీలం రంగు షార్ట్, వైట్ కలర్ ఫుల్హ్యాండ్స్ బనియన్ వేసుకున్నాడని ఏఎస్సై, రైటర్ జగన్మోహన్ తెలిపారు. హెచ్సీ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఇద్దరికి గాయాలుగజపతినగరం: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలపాలయ్యారు. దత్తిరాజేరు మండలం రాజుల రామచంద్రపురం గ్రామానికి చెందిన వెంకటరమణ జాతీయ రహదారి దాటుతుండగా కొరాపుట్కు చెందిన సిద్దూరాత్ తన ద్విచక్రవాహనంతో ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈఘటనలో గాయపడిన ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకటరమణ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చేపల చెరువు వ్యాపారి ఆత్మహత్యబలిజిపేట: చేపల చెరువు వ్యాపారంలో నష్టం రావడంతో మండలంలోని గౌరీపురం గ్రామానికి చెందిన ఎస్.సత్యనారాయణ(48) తట్టుకోలేక గుళికలు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సింహాచలం తెలిపారు. గ్రామానికి చెందిన సత్యనారాయణ వృత్తిరీత్యా చేపల చెరువు లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నాడు. దీనిలో రూ.5లక్షలు నష్టం రావడంతో భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుమేర కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
జూలై 15 కి ఆస్పత్రుల భవన నిర్మాణాలు పూర్తి చేయాలి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో వేర్వేరు ఇంజినీరింగ్ ఏజెన్సీల ద్వారా నిర్మాణంలో ఉన్న ఆస్పత్రుల భవనాలన్నీ జూలై 15లోగా పూర్తి చేసి అప్పగించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. హెల్త్ క్లినిక్ భవనాలు, పీఎం హెల్త్ మిషన్ కింద మంజూరైన భవనాలు, 15వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన 24 హెల్త్ క్లినిక్ భవనాలు, ఇప్పటికే పూరైన వాటిని డీఎంహెచ్ఓకు అప్పగించాలని స్పష్టం చేశారు. ఇంకా శ్లాబ్ లెవెల్లో ఉన్న వాటిని పూర్తి చేయాలని, ప్రారంభం కాని వాటికి వెంటనే టెండర్లు పిలవాలని తెలిపారు. స్థలం లేని వాటి వివరాలు ఇస్తే స్థలం కేటాయించనున్నామన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీ రాణి, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ భారతి, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
గుమ్మిడిగెడ్డపై గుడ్డి నమ్మకం..!
కురుపాం: కురుపాం నియోజకవర్గ కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గుమ్మిడిగెడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మాణంలో రైతులకు కలగానే మిగిలిపోతోంది. గతంలో రైతులకు రెండు పంటలు సాగు చేసేందుకు గుమ్మిడిగెడ్డ ఉపయోగకరంగా ఉండేది. ఈ గుమ్మిడిగెడ్డ అక్విడెక్టు పైనే సుమారు 20 గ్రామాల రైతులకు చెందిన 5 వేల ఎకరాలకు కుడి, ఎడమ కాలువల గుండా సరఫరా అయ్యే సాగునీటితో భూములు సస్యశ్యామలంగా ఉండేవి. అయితే రానురాను పర్యవేక్షణ లోపం శాపంగా మారడంతో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధిత రైతులంతా గుమ్మిడిగెడ్డ అక్విడెక్టుపై మినీ రిజర్వాయర్ నిర్మాణం చేయాలని మొరపెట్టుకోగా అప్పట్లో హా మీ ఇచ్చినా నెరవేరలేదు. తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా మినీ రిజర్వాయర్ నిర్మాణానికి రైతులకు హామీ ఇచ్చింది. అది కూడా బుట్టదాఖలైంది. అదే టీడీపీ ప్రభుత్వం మళ్లీ ప్రస్తుతం అధి కారంలోకి వచ్చే ముందు కూడా గుమ్మిడి గెడ్డపై మినీ రిజర్వాయర్ కట్టి తీరుతామని హామీ ఇచ్చింది. ఈ దఫా అయినా గుమ్మిడిగెడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుందా..? లేదా ఎన్నికల అస్త్రంలో భాగంగానే మిగిలి పోతుందా..? అని గుమ్మిడిగెడ్డ అక్విడెక్టు పరిధిలో ఉన్న రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మూడు మండలాలకు మేలు గుమ్మిడిగెడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మాణం జరిగితే కురుపాం నియోజకవర్గంలోని కురుపాం, కొమరా డ, జియ్యమ్మవలస మండలాల పరిధిలో ఉన్న శివ్వన్నపేట, గోళ్లవలస, గుజ్జుపాడు, కర్గగండ, పూతికవలస, సీతంపేట, ఈదలవలస, పాలెం, వన్నాం, పులిగుమ్మి, పెద్దవలస, పాతకురుపాం, కిచ్చాడ, కన్నపుదొరవలస తదితర గ్రామాల పరిధిలో ఉన్న ఐదువేల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా నేటికీ గుమ్మిడిగెడ్డపై మినీరిజర్వాయర్ నిర్మాణానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ ధపా కూడా ఎన్నికల అస్త్రంగానే గుమ్మిడిగెడ్డను వినియోగించుకున్నారని, గుడ్డినమ్మకంతో రాజకీయ పార్టీల హామీలు నమ్ముతున్నామంటూ రైతులు అసంతృప్తిలో ఉన్నారు. -
సినీ ఆర్టిస్ట్ జయవాహిని మృతి
● పుట్టి పెరిగింది విజయనగరంలోనే ● కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి ● సంతాపం వ్యక్తం చేసిన సినీ, టీవీ ఆర్టిస్టులువిజయనగరం టౌన్: విజయనగరంలోని పూల్బాగ్ కాలనీలో జన్మించి, మహారాజా కళాశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసుకుని, సినీ ఇండస్ట్రీపై మక్కువతో మద్రాస్ వెళ్లి అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న నటి పద్మక్కగా పిలుచుకునే జయవాహిని కొంతకాలంగా ప్రాణాంతక కేన్సర్ వ్యాధితో బాధపడుతూ బుధవారం రాత్రి విజయనగరంలోనే తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిచెందారన్న వార్త విన్న సినీ, టీవీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆమె సన్నిహితురాలు విజయనగరం వాసి, మూవీ, టీవీ ఆర్టిస్ట్ కరాటే కల్యాణి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరంలో పద్మక్కగా పిలుచుకునే వాళ్లమని, కరాటే విద్య నేర్చుకున్నారని, అప్పట్లో పద్మక్కను రాంబో అని అందరూ పిలుచుకునేవాళ్లమన్నారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో సహాయనటిగా, టెలివిజన్, సినీరంగాల్లో చిన్న పాత్రలతో తన నట ప్రస్ధానాన్ని ప్రారంభించి ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారన్నారు. రఘుపతి వెంకయ్యనాయుడు చిత్రంలో కథానాయికగా నటించి ప్రశంసలు పొందారన్నారు. చివరిగా బహిర్భూమి, పోలీస్ వారి హెచ్చరిక సినిమాల్లో నటించారని తెలిపారు. టీవీ సీరియల్స్లో నిన్నే పెళ్లాడతా, నాగమ్మ, జయం, అభిమానం వంటి వాటిలో తనదైన శైలిలో ప్రతిభ చూపి అందరి మన్ననలు పొందారన్నారు. విజయనగరంలోని దాసన్నపేట సింగపూర్ సిటీలో డాల్పిన్ హైట్స్లో ఉన్న ఆమె స్వగృహం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. రోటరీ స్వర్గధామంలో ఆమె అంత్యక్రియలను కుటుంబసభ్యులు పూర్తిచేశారు. టీవీ,సినీ ఆర్టిస్ట్లు, కుటుంబ సభ్యులు, అభిమానులు తమ సంతాపం వ్యక్తం చేశారు. -
12న జాబ్ మేళా
● జేఎన్టీయూ జీవీ వీసీ వీవీ సుబ్బారావు విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో ఈ నెల 12న జాబ్ ఫెయిర్–2026 నిర్వహించనున్నట్లు ఉపకులపతి వీవీ సుబ్బారావు తెలిపారు. జాబ్ ఫెయిర్ను పురస్కరించుకుని వాల్పోస్టర్ను విశ్వవిద్యాలయం డైరెక్టర్లతో కలిసి గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జేఎన్టీయూ జీవీ, నిర్మాణ్ ఆర్గనైజేషన్–ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12న ఉదయం 9 గంటలకు ఈ జాబ్ ఫెయిర్ను నిర్వహించనున్నామన్నారు. బీటెక్, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ చదివిన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ ఫెయిర్లో మేధా సర్వో, రాయల్ ఎన్ఫీల్డ్, టాటా ఎలక్ట్రానిక్స్, వోల్టాస్, కియా మోటార్స్, హ్యుండయ్, యోకోహామా వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు పాల్గొని ట్రైనీ, అసెంబ్లీ ఆపరేటర్, ఆపరేటర్, ఎన్ఏపీఎస్ ట్రైనీ ఉద్యోగాలు అందిస్తున్నాయన్నారు. ఉద్యోగ స్థానాలు ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉంటాయని పేర్కొన్నారు. జీతభత్యాలు నెలకు రూ.11 వేల నుంచి రూ. 21 వేలు ఉంటాయని తెలిపారు. జేఎన్టీయూలో ఓరియంటేషన్ అభ్యర్థులను ఇంటర్యూలు, ఎంపిక ప్రక్రియలకు సిద్ధం చేయడానికి ఈ నెల 9 నుంచి 11 వరకు జేఎన్టీయూలో ఓరియంటేషన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు రూ.100 రిజిస్ట్రేషన్ రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు వారి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు బయోడెటాతో జతచేసి అందించాలని, విజయనగరం, సమీప జిల్లాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలరని కోరారు. -
సివిల్ సర్వీసెస్ కబడ్డీ పోటీలకు భాను
డెంకాడ: ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకూ చండీగఢ్లో జరగనున్న ఆలిండియా సివిల్ సర్వీసెస్ కబడ్డీ నేషనల్ పోటీలకు రఘుమండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయిని కుర్మాన భాను ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా జట్టు తరఫున ఆమె కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు. జాతీయ పోటీలకు ఎంపికై న ఆమెను పాఠశాల హెచ్ఎం బమ్మిడి ఇందిరాదేవి, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు కోరాడ ప్రభావతి, దొర, ఐవీపీ రాజు, ఉపాధ్యాయులు అభినందించారు. సచివాలయం ఉద్యోగి శంకర్రావు నెల్లిమర్ల: ఆలిండియా సివిల్ సర్వీస్ ఉద్యోగుల కబడ్డీ పోటీలకు సచివాలయం ఉద్యోగి కాళ్ల శంకర రావు ఎంపికయ్యారు. మొయిద సచివాలయంలో సంక్షేమ, విద్యా సహాయకుడిగా పని చేస్తున్న కాళ్ల శంకర రావు ఈ నెల 9 నుంచి 14వరకు పంజాబ్ రాజధాని చండీగఢ్లో జరగబోయే జాతీయస్థాయి సివిల్ సర్వీస్ ఉద్యోగుల కబడ్డీ చాంపియ్ షిప్లో ఆంధ్ర సివిల్ సర్వీస్ ఉద్యోగుల జట్టు తరఫున ఎంపికయ్యారు. అలాగే జరజాపుపేటకు చెందిన కాళ్ల శంకర రావు జాతీయ పోటీలకు 4వ సారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శంకర రావు జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికవడం పట్ల ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, ఎంపీడీఓ కె. రామకృష్ణ రాజు, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారులు, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ బొమ్మన రామారావు, జరజాపుపేట, మొయిద గ్రామ పెద్దలు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ పెద్దలు అభినందించారు. -
58వ సారి రక్తదానం
విజయనగరం ఫోర్ట్: నగరానికి చెందిన భవిరెడ్డి సుభాష్..గురువారం 58వ సారి రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. ఎం.ఆర్.టెక్నీషియన్గా పనిచేస్తున్న ఆయన ఏటా తన తండ్రి వర్ధంతి రోజున ఇలా రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా ఇన్నిసార్లు రక్తదానం చేయడమనేది స్ఫూర్తిదాయకమని పలువురు అంటున్నారు. ఒలింపియాడ్లో శ్రీజన్ విద్యార్థుల ప్రతిభపార్వతీపురం రూరల్: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 33వ సర్ సీవీ రామన్ యంగ్ జీనియస్ ఒలింపియాడ్ (2025–26)లో పార్వతీపురంలోని శ్రీజన్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గురువారం జరిగిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో నాలుగో తరగతి విద్యార్థిని పి.చందనశ్రీ రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించింది. జిల్లా స్థాయిలో ఎం.లాలిత్య (3వ తరగతి), పి.మోక్షితాప్రియ (4వ తరగతి), కె.పార్థసారథి (5వతరగతి) ప్రథమ బహుమతులు, డి.రుత్ (4వ తరగతి), వి.ఉమామహేశ్ (7వ తరగతి) ద్వితీయ బహుమతులు అందుకున్నారు. -
డిఫెన్స్ అకాడమీలో విద్యార్థి అత్మహత్య
కొత్తవలస: మండలంలోని విజయనగరం రోడ్డులో గల ఒక డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ముడికి వికాస్(16) తీవ్రమైన తలనొప్పితో బాధ భరించలేక బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సీఐ సీహెచ్.షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన వికాస్ స్థాని డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో చేరాడు. కాగా కొద్ది నెలలుగా వికాస్ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు తండ్రి సుబ్రహ్మణ్యంతో పాటూ తోటి విద్యార్థులు తెలిపారు.ఈ క్రమంలో బుధవారం మరోమారు తీవ్రమైన తలనొప్పి రావడంతో కళాశాల సిబ్బంది వికాస్ తండ్రికి ఫోన్లో సమాచారం అందించారు. ఇంటికి పంపించేస్తామని చెప్పగా ఇప్పడు బయల్దేరితే ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుందని, మరుసటిరోజు పంపించాలని కళాశాల సిబ్బందిని మృతుడి తండ్రిని కోరాడు. కాగా తోటి విద్యార్థులు డ్రిల్ కోసం మైదానంలోకి వెళ్లగా హాస్టల్ రూమ్లో ఎవరూ లేని సమయంలో బెడ్షీట్తో ఫ్యాన్కు ఊరివేసుకున్నాడు. తోటి విద్యార్థులు రూమ్కు వచ్చి చూసేసరికి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే కళాశాల సిబ్బంది సహాయంతో కిందికి దించి స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా ఒక్కగానొక్క కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడంతో తండ్రి లబోదిబోమంటూ రోదించాడు. -
సచివాలయంలో పాఠశాల
● శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనాలు ● ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు చీపురుపల్లిరూరల్(గరివిడి): ఆ పాఠశాలలో 11 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ విద్యార్థులకు సరైన తరగతి భవనాలు, కనీసం మరుగుదొడ్ల సదుపాయం లేదు. ఎన్నో ఏళ్లుగా తరగతి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా సరే నాడు–నేడులో ఎలాంటి నిర్మాణాలు చేయలేదు. అయినా సరే ఆ శిథిల భవనాల్లోనే ఉపాధ్యాయులు బోధన చేసేవారు. చివరికి ఐదు నెలల క్రితం వచ్చిన మోంథా తుఫాన్ ప్రభావానికి శిథిలావస్థలో ఉన్నా భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షం వల్ల శ్లాబ్ నుంచి లీకై న నీరు తరగతి భవనాల్లోకి ప్రవేశించి విద్యార్థలు కూర్చునే గచ్చులు బురదమయంగా తయారయ్యాయి. ఆ భవనాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో గత్యంతరం లేక ప్రత్నామ్నాయంగా విద్యార్థులకు బోధన చేసేందుకు స్థానికంగా ఉన్న సచివాలయాన్ని కేటాయించారు. గరివిడి మండలంలోని ఏనుగువలస ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతం స్థానిక సచివాలయమే పాఠశాలగా మారింది. స్థానికంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పాఠశాల లేకపోవడంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన ఐదు నెలలుగా సచివాలయంలో బోధన చేస్తున్నప్పటికీ పాఠశాల వాతావరణం ఏమాత్రం కనిపించదు. విద్యార్థులు ఆడుకునేందుకు ఆటస్థలం లేదు. పాఠశాల ఉన్నట్లయితే సరిపడా తరగతి భవనాలతో పాటు విద్యార్థులు ఆడుకునేందుకు ఆటస్థలం ఉంటుంది. పాఠశాలకు వెళ్లాలనే ఆసక్తి విద్యార్థుల్లో పెరుగుతుంది. పాఠశాలలో ఉండే సౌకర్యాలు, సదుపాయాలు, ఆటస్థలం లాంటివి సచివాలయంలో లేనందున పిల్లల్లో పాఠశాలకు వెళ్లాలని, పంపించాలని తల్లిదండ్రుల్లో నిరాసక్తి కలుగుతోంది. ప్రస్తుతం గ్రామంలో విద్యార్థులు చదువుకునేందుకు సరైన తరగతి భవనాలు లేకపోయిన కారణంగా పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం లేదన్న విమర్శలు గ్రామస్తుల నుంచి వస్తున్నాయి. ఈ కారణంగా పిల్లలు తక్కువగా ఉన్నారని, తరగతి భవనాలు నిర్మించి ఉంటే పిల్లల అడ్మిషన్లు పెరుగుతాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పాఠశాల అభివృద్ధికి నోచుకోలేదని వాపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కార్యక్రమం పేరుతో ఎన్నో పాఠశాలలు రూపుదిద్దుకున్నాయి. ఆ పాఠశాలల మాదిరిగా ఈ పాఠశాల తరగతి భవనాలను అభివృద్ధి చేయాల్సి ఉండగా నిర్లక్ష్యంతో వదిలేశారని ఆరోపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు సచివాలయానికి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికై నా విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా పాఠశాల తరగతి భవనాలను నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ల్యాబ్లను తగ్గించాలని ఆదేశాలొచ్చాయి...
జిల్లాలో ఆరు నియోజకవర్గ స్థాయి, ఒకటి జిల్లా స్థాయి అగ్రిటెస్టింగ్ ల్యాబ్లు ఉన్నాయి. నెలివాడ వద్ద ఉన్న జిల్లా స్థాయి ల్యాబ్ ఇంకా ప్రారంభించలేదు. ఈ ఖరీఫ్ సీజన్కు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. కొన్ని నియోజకవర్గ స్థాయి ల్యాబ్లను తగ్గించాలని ఆదేశాలు వచ్చాయి. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి అగ్రి టెస్టింగ్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన విత్తన పరీక్ష పరికరాలు ల్యాబ్లను కుదించే యత్నం.. జిల్లాలో ఉన్న అగ్రి టెస్టింగ్ ల్యాబ్లను చంద్రబాబు ప్రభుత్వం కుదించే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయనగరం నియోజకవర్గం పరిధిలోని సారిక గ్రామంలో ఉన్న నియోజకవర్గ స్థాయి అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను, చీపురుపల్లిలో ఉన్న అగ్రి టెస్టింగ్ ల్యాబ్లలో సేవలు నిలిచిపోయినట్టు సమాచారం. విత్తనాలు, ఎరువులకు సంబంధించిన పరీక్షలు కూడా నిలిపివేయడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. నెలివాడ వద్ద నిర్మించిన జిల్లాస్థాయి ల్యాబ్ను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని రైతులు ప్రశ్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. రైతులకు ఉపయోగపడే ల్యాబ్ల నిర్వహణపై ప్రభుత్వం కినుక నిర్వీర్యంచేసే ఎత్తుగడ జిల్లాలో ఏడు అగ్రి ల్యాబ్లు ఇప్పటికీ అందుబాటులోకి రాని జిల్లాస్థాయి ల్యాబ్ గత ప్రభుత్వ హయాంలో ఒక్కోల్యాబ్ రూ.62 లక్షలతో నిర్మాణం పరికరాలకు మరో రూ.60 లక్షల వరకు ఖర్చు సాగుకు భరోసాగా ల్యాబ్ల ఏర్పాటు -
నేడు పంచాయతీరాజ్ కమిషనర్ రాక
పార్వతీపురం: రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీ ణాభివృద్ధిశాఖ కమిషనర్ ఎం.కృష్ణతేజ గురువారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నట్లు కార్యాలయం వర్గాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 9 గంటలకు పార్వతీపురం కలెక్టరేట్కు చేరుకుని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం పట్టణంలోని సౌంద ర్య థియేటర్ రహదారి పరిధిలో ఉన్న రాయల్ కన్వెన్షన్ హాల్లో పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పర్యటన ముగిసిన తరువాత విశాఖపట్నం బయలు దేరుతారని వివరించారు. భామిని: మండలంలో విస్తరించిన వంశధార నదీ తీరం వెంబడి నాలుగు ఏనుగుల గుంపు షికారు కొడుతోంది. బుధవారం భామిని మండలం పసుకుడి తీరానికి ఏనుగుల గుంపు చేరింది. నేరడి–బిల్లుమడ మధ్య తచ్చాడిన ఏనుగులు వంశధార నది ఆవల గల ఒడిశా గ్రామాలైన వన్న–గౌరి గ్రామాల మధ్యకు చేరా యి. అక్కడ సరైన ఆహారం లేక తిరిగి నది దాటి భామిని మండలంలోకి ప్రవేశించాయి. ఏనుగులు తినే పంటలు లేక పచ్చని పంటల ను పాడు చేస్తూ తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. జియ్యమ్మవలస రూరల్: మండలంలోని రావా డ వట్టిగెడ్డ జలాశయం ఎడమ కాలువకు నీలకంఠాపురం సమీపాన గండిపడింది. వందల ఎకరాలకు సాగునీరందించే కాలువ ప్రతి సంవత్సరం మరమ్మతులకు గురికావడం, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో సొంత నిధులతో మరమ్మతులు చేపడుతున్నామని కాలువ దిగువ రైతులు వాపోతున్నారు. రెండురోజుల క్రితం గండి పడడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు దత్తి కోటేశ్వరరావు, దాసరి శ్రీను, బి.చిన్న, భాస్కరరావు తదితరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ చైర్మన్, ఇరిగేషన్ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం అర్బన్: ఉద్యోగులు, ఉపాధ్యా యులు, పెన్షనర్ల బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీ ఈఏ) డిమాండ్ చేసింది. ఇప్పటికే మంజూరైన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు దాదాపు రూ.35 వేల కోట్లకు చేరినప్పటికీ, ఇంకా మంజూరు కావాల్సిన బకాయిలు ఉన్నాయని, వాటిని రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపు చేయాలని కోరింది. తమ తరఫున ప్రభుత్వానికి విన్నవించాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణకు బుధవారం వినతిపత్రాన్ని అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలను అందజేసే కార్యక్రమాన్ని ఆ సంఘ సభ్యులు చేపట్టారు. ఇందులో భాగంగా బకాయిలను, ఇతర ఆర్థిక అంశాలకు సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయాలని కోరారు. ఈ అంశాన్ని శాసనసభ, శాసన మండలిలో బలంగా ప్రస్తావించి ప్రభు త్వం సానుకూలంగా స్పందించేలా చూడాలని విజ్జప్తి చేశారు. దీనిపై స్పందించిన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల బకాయిలకు సంబంధించి పద్దులవారీగా పూర్తి వివరా లు సేకరించిన అనంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఫైనాన్స్బిల్లు వచ్చిన సమయంలో అవసరమైన సందర్భాల్లో ఈ అంశాన్ని సభలో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు పువ్వల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి లెంక సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలి : జేసీ
పార్వతీపురం: పీజీఆర్ఎస్లో వచ్చిన వినతులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశమందిరంలో జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్ధార్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదన్నారు. పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. అన్నిశాఖల సమన్వయంతో సమస్యలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని సూచించారు. నోడల్ అధికారులు శాఖల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీ ఎస్.దిలీప్ చక్రవర్తితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. వీరఘట్టం: కాయగూరల పంటలకు వీరఘట్టం పట్టణం ఎంతో ప్రసిద్ధి. నిన్నటివరకు ఆకాశాన్నంటిన టమాటో ధర అమాంతం నేడు పతనమైంది. పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ కొనేవారు కరువవడంతో వీరఘట్టంలో పంట పొలాల వద్ద రైతులు టమాటోలను పారబోస్తున్నారు. వీరఘట్టం మార్కెట్లో కిలో టమాటో రూ.20 పలుకుతున్నా..పంట పొలాల వద్ద హోల్సేల్గా కిలో రూ.5కు కూడా కొనేవారు లేరని రైతులు వాపోతున్నారు. మరో వారం రోజుల తర్వాత పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండడంతో టమాటోకు గిరాకీ ఉండవచ్చని రైతులు ఆశిస్తున్నారు. -
మన్యంలో ప్రకృతి అందాలు
–8లో● పర్యాటకాభివృద్ధికి అపార అవకాశాలు ● రాష్ట్రంలోనే మహాలొద్ద జలపాతానికి గుర్తింపు ● కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి గోల్డెన్ అవర్లో ధైర్యమే ప్రాణదాత ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ప్రాణాన్ని నిలబెట్టేది..ఆస్తి నష్టాన్ని నివారించేది కేవలం అవగాహన మాత్రమేనని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అన్నారు. మీటర్ రీడర్స్కు ‘స్మార్ట్’ గుబులు..! కూటమి ప్రభుత్వం తీరు మీటర్ రీడర్స్ను ఆందోళనకు గురిచేస్తోంది. స్మార్ట్మీటర్ల ఏర్పాటుతో ఉపాధికి గండిపడుతోందని ఆందోళన చెందుతున్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రకృతిని ఆస్వాదించే వారికి మన్యం స్వర్గధామమని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. జిల్లాలో పర్యాటకాభివృద్ధికి అపార వనరులను ఉన్నాయని చెప్పిన ఆయన.. వచ్చే ఐదేళ్లలో సమూల మార్పులు కనిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అరకు మాదిరి మనవద్దకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన తన చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేసీ యశ్వంత్కుమార్రెడ్డితో కలిసి మాట్లాడారు. అడలి వ్యూపాయింట్ వద్ద బాంబో హౌస్ ఏర్పాటు చేశామని, మూడు అతిథి గృహాలు కూడా ప్రారంభం కానున్నాయని తెలిపారు. జగతి దగ్గర కూడా మరో వ్యూపాయింట్ను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు నుంచి జనవరి వరకు పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయన్నారు. జిల్లా ఆర్థిక వ్యవస్థకు జలపాతాలే ఊపిరి పార్వతీపురం మన్యం జిల్లా అంటే ఒకప్పుడు కేవలం కొండలు, కోనలు మాత్రమేనని కలెక్టర్ తెలిపారు. నేడు ఆ కొండల మధ్య నుంచి జాలువారే జలపాతాలు జిల్లా ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తున్నాయని చెప్పారు. మరుగునపడిన ప్రకృతి అందాలను వెలుగులోకి తెస్తున్నామని చెప్పారు. స్వల్పకాలంలోనే జిల్లాలోని తాటికొండ, నల్లరాయిగూడ, నీలంవలస, దళాయివలస, అడపరాయి, శిఖపరువు, మెట్టుగూడ, కుశ జలపాతాలను అభివృద్ధి చేసి.. పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. మూడు నెలల కాలంలోనే మూడు లక్షల మంది పర్యాటకులను ఆకర్షించి, జిల్లాను ప్రముఖ పర్యాటక హబ్గా తీర్చిదిద్దినట్లు వివరించారు. ఈ జలపాతాల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం, భద్రతా ఏర్పాట్లు చేయడం, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించడంతో పర్యాటకుల తాకిడి ఊహించని విధంగా పెరిగిందని వివరించారు. స్థానిక గిరిజనులతోనే అభివృద్ధి జిల్లాలో సహజసిద్ధంగా ఉన్న జలపాతాల అభివృద్ధికి నిధుల కోసం చూడట్లేదని కలెక్టర్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని స్థానికులే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని, వారే అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. అందువల్లే వారినే గైడ్లుగా, చిరువ్యాపారులుగా చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. వారి శ్రమ వల్లే మారుమూల ప్రాంతాలకు రోడ్లు, రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయన్నారు. మంత్రముగ్ధులను చేసే లొద్ద జలపాతం.. ప్రకృతి రమణీయతకు నెలవైన మహాలొద్ద జలపాతం రాష్ట్ర పర్యాటకరంగానికే తలమానికంగా నిలవనుందని కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సాలూరు మండలంలోని కొదమ పంచాయతీలో ఈ జలపాతాన్ని గురువారం ప్రారంభిస్తున్నామని చెప్పారు. చుట్టూ కొండలు, సహజ సౌందర్యంతో సుమారు 100 అడుగుల పై నుంచి నీరు పడుతూ, చూపరులను మంత్రముగ్ధులను చేస్తుందని చెప్పారు. జలపాతం వద్ద రెండు కిలోమీటర్ల దూరం వరకు రహదారిని అభివృద్ధి చేశామని, నేరుగా వాహనాల్లో చేరుకోవచ్చని, అక్కడ నుంచి కాలినడకన వెళ్లాలని తెలిపారు. సాహసాలను ఇష్టపడే వారికి ట్రెక్కింగ్కు కూడా అనుకూలమైన ప్రాంతమని వివరించారు. పర్యాటకుల కోసం ఇక్కడ అతిథిగృహం కూడా నిర్మించనున్నామని చెప్పారు. -
అణువణువూ గాలింపు
● అద్దె ఇల్లు, లాడ్జిల్లో ఆరా.. ● జీఎంఆర్ఐటీ పరిసర ప్రాంతాల్లో కార్మికుల వివరాలు సేకరణ రాజాం: జీఎంఆర్ఐటీ క్వార్టర్స్లో జరిగిన భారీచోరీ పోలీసులకు సవాల్గా మారింది. ఓ డాక్టర్, మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇళ్లలో నాలుగురోజుల కిందట దొంగలు చొరబడి సుమారు కేజీన్నర బంగారం, కిలో వెండిని దోచుకుపోయిన ఘటన తెలిసిందే. క్వార్టర్స్లోని ఓ సీసీ కెమెరాలో కనిపించిన ఆనవాళ్లు మినహా ఎక్కడా ఎటువంటి జాడ లేకుండా దొంగలు జాగ్రత్తపడ్డారు. ఈ దొంగతనాన్ని ఛేదించే పనిలో జిల్లా పోలీస్ యంత్రాంగం నిమగ్నమైంది. సంఘటనా స్థలంలో లభించిన చిన్నచిన్న ఆధారాలతో పాటు అనుమానిత వ్యక్తులు, గతంలో ఇటువంటి చోరీలు జరిగిన ప్రదేశాల్లో పట్టుబడిన దొంగలు, రాజాం పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు సంబంధించిన నేరస్తుల వివరాలపై పోలీసులు దృష్టిసారించారు. బృందాలుగా ఏర్పడి అనుమానిత వ్యక్తులు, ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జీఎంఆర్ఐటీ క్వార్టర్స్లో పనిచేసే కార్మికుల వివరాలు, వారి బంధువుల వివరాలతో పాటు క్వార్టర్స్లో నివాసముంటున్న ఉద్యోగుల వివరాలు మొత్తం పోలీసులు తీసుకున్నారు. ఐటీ క్వార్టర్స్లోకి ఇతర వ్యక్తుల రాకపోకలను అక్కడి సెక్యూరిటీ నిషేధించింది. ఆయా క్వార్టర్స్లోకి ఉదయం వచ్చి వెళ్లే వారి వివరాలతో పాటు ఐటీలో భవనాలు మరమ్మతులు, నిర్మాణాల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలు నమోదుచేస్తున్నారు. మరోవైపు చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులతో పాటు రాజాం రూరల్ సీఐ ఉపేంద్రలు సంఘటనకు సంబంధించి బాధితులు నుంచి మరిన్ని వివరాలు సేకరించడంతో పాటు మరోమారు ఆయా ప్రాంతాలను పరిశీలించారు. చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకుని బాధితులకు న్యాయం చేసేదిశగా ముమ్మర చర్యలు చేపట్టినట్టు డీఎస్పీ వెల్లడించారు. రాజాంతో పాటు పరిసర గ్రామాల్లో రెంటెడ్ హౌస్ల వివరాలను పోలీసులు బుధవారం సేకరించారు. ఇప్పటివరకూ అద్దెకు ఉండి ఆకస్మికంగా ఖాళీ చేసినవారి వివరాలు, దూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వివిధ పనుల నిమిత్తం వచ్చి అద్దెకు ఉంటున్నవారి వివరాలు సేకరిస్తున్నారు. రాజాం పట్టణంలోని పలు లాడ్జిల్లో గత కొద్ది రోజులుగా మకాంవేసి, ఖాళీ చేసిన వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో వాహన తనిఖీలు, వాహనచోదకుల వివరాలపై ఆరాతీస్తున్నారు. అద్దె ఇల్లు, లాడ్జిల్లో వివరాల పరిశీలన -
కేన్సర్పై అవగాహనతోనే విజయం
పార్వతీపురం రూరల్: ముందస్తు పరీక్షే ప్రాణరక్ష అని, అవగాహనతోనే కేన్సర్ మహమ్మారికి కళ్లెం వేయవచ్చని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు పిలుపునిచ్చారు. ప్రపంచ కేన్సర్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా ఆరోగ్య కార్యాలయం నుంచి పట్టణ వీధుల్లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నేటి కాలంలో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే అనర్థాలకు హేతువులని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వ్యాయామం నిత్యకృత్యం కావాలని ఆకాంక్షించారు. ‘మత్తుకు దూరం–బతుకుకు మార్గం’ అనే సూత్రాన్ని పాటించాలని, ప్లాస్టిక్ రహిత జీవనం, సమతుల ఆహారం ద్వారా వ్యాధులను నివారించవచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎనన్సీడీ అధికారి డాక్టర్ జగన్ మోహనరావు, ఇతర వైద్యాధికారులు విజయమోహన్, సూర్యకౌశిక్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో అధ్వానంగా పారిశుధ్యం
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పారిశుధ్యం ఆధ్వానంగా తయారైంది. వివిధ విభాగాల నుంచి దుర్వాసన వస్తోందని రోగులు, వారి బంధువులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో ఈవిషయాన్ని రోగులు వెల్లడించారు. మిగతా సేవల కంటే పారిశుధ్యం బాగోలేదని ఎక్కువ శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. పారిశుధ్యం నిర్వహణ కోసం అధిక మొత్తంలో వెచ్చిస్తున్నప్పటికీ పారిశుధ్యం ఆధ్వానంగా ఉండడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఐవీఆర్ఎస్ సర్వేలో పారిశుధ్యం బాగోలేదని రోగులు అధిక సంఖ్యలో చెప్పినప్పటికీ అధికారులు మాత్రం 100కి 96 శాతం పారిశుధ్యం బాగున్నట్లు స్కోర్ ఇవ్వడం గమనార్హం. పారిశుధ్యంతో పాటు మిగతా సేవల పట్ల కూడా పలువురు రోగులు పెదవివిరిచారు. 37.05 శాతం మంది పారిశుధ్యం బాగోలేదని వెల్లడి 2025 డిసెంబర్ నెలలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వివిధ సేవలపై 2882 మందిని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సర్వే చేశారు. ఇందులో 37.05 శాతం మంది పారిశుధ్యం బాగోలేదని తెలిపారు. డ్రైనేజేల వద్ద మురుగు నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వస్తుంది. అదేవిధంగా చెత్తాచెదారం సేకరణ కూడా సక్రమంగా జరగడం లేదని రోగులు గుసగుసలు ఆడుకుంటున్నారు. సర్వజన ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణకు నెలకు రూ. 19.96 లక్షలు చెల్లిస్తారు. అయినప్పటికీ పారిశుధ్యం మెరుగుపడకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. మిగతా సేవల పట్ల కూడా అసహనం పారిశుధ్యం నిర్వహణతో పాటు మిగతా సేవల పట్ల కూడా ఐవీఆర్ఎస్ కాల్స్లో రోగులు పెదవివిరిచారు. వైద్యులు ఓపీల్లో అందుబాటులో ఉంటున్నారా? అన్ని అడగ్గా 22.83 శాతం మంది వైద్యులు అందుబాటులో ఉండడం లేదని తెలిపారు. వైద్యులు రాసిచ్చిన మందులు ఉచితంగా అందుతున్నాయా? అన్న దానిపై 24.68 శాతం మంది మందులు ఉచితంగా అందడం లేదని, ప్రైవేట్ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. వైద్య సేవలు పొందడానికి ఎవరైనా డబ్బులు అడుగున్నారా? అన్న దానిపై 23.54 శాతం మంది అడుతున్నారని వెల్లడించారు. అన్ని విభాగాల సేవలకు సంబంధించి 27 శాతం మంది సేవలు బాగా అందడం లేదని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. సర్వజన ఆస్పత్రిలో కొంతమంది వైద్యులు ఆస్పత్రికి వచ్చినప్పటికీ టీ, కాఫీ పేరుతో మధ్యలో క్లినిక్లకు వెళ్లివస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నం 3 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీల్లో వైద్యులు అందుబాటులో ఉండాలి. అయితే కొంతమంది వైద్యులు మధ్యాహ్నం 12, 12:30 గంటలకు వెళ్లిపోయి సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి బయోమెట్రిక్ వేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కొంతమంది వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగులను వారి క్లినిక్లకు తరలించి అక్కడ చికిత్స అందించి ఫీజులు తీసుకున్నట్లు కూడా ఆరోపణులు వినిపిస్తున్నాయి. డ్రెస్సింగ్ చేయడానికి, ఆపరేషన్ థియేటర్స్ల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశుధ్యం మెరుగుపడేలా చర్యలు పారిశుధ్యం మినహా మిగతా సేవల్లో బాగున్నట్లు ఐవీఆర్ఎస్ సర్వేలో రోగులు వెల్లడించారు. పారిశుధ్యం కూడా మెరుగుపడేవిధంగా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పారిశుధ్యం బాగోలేదని ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడి మిగతా సేవల పట్ల కూడ పెదవి విరుపు అయినప్పటికీ పారిశుధ్యానికి 96 శాతం స్కోర్ ఇచ్చేసిన అధికారులు నెలకు పారిశుధ్య నిర్వహణకు లక్షల్లో చెల్లింపు -
పట్టుబట్టి పతకం పట్టాడు
శృంగవరపుకోట: స్వయంకృషి, పట్టుదలతో సాధన చేశాడు. ఫలితంగా పసిడి పతకం సాధించాడు. ఎస్.కోట పట్టణానికి చెందిన కోన రమణ జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో పసిడి పతకం సాధించాడు. ఛత్తీస్గఢ్లోని దల్లీరాజ్హరా జిల్లాలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 2వరకూ జరిగిన సీఎం ట్రోఫీ, ఓపెన్ నేషనల్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ పోటీల్లో 75కిలోల విబాగంలో రమణ 3వ స్థానం సాధించి పసిడి పతకాన్ని, ప్రశంసా పత్రాన్ని, జ్ఞాపికను కై వసం చేసుకున్నారు. 13రాష్ట్రాలకు చెందిన సుమారు 350మంది పోటీదారులు పాల్గొన్న జాతీయస్థాయి పోటీల్లో తొలిసారి పసిడి పతకం సాధించడం ఆనందంగా ఉందని బాడీబిల్డర్ కోన రమణ చెప్పాడు. అలాగే మార్చి నెలలో ఉత్తరప్రదేశ్లో జరగనున్న జాతీయ స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొంటున్నట్టు తెలిపాడు. విజయనగరం క్రైమ్: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు అత్యంత కీలమని ఎస్పీ దామోదర్ అన్నారు. ప్రజల భద్రతలో అవి ముఖ్య భూమిక అని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ పబ్లిక్, ప్రైవేట్ స్థలాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో చోరీలు, చైన్ స్నాచింగ్స్ వంటి ఘటనలు జరగకుండా నియంత్రించవచ్చునన్నారు. ఒకవేళ నేరం జరిగితే ఆ తీరును సీసీ ఫుటేజ్ ద్వారా కేసుల దర్యాప్తు చేపట్టడం సులభతరమ వుతుందన్నారు. కొన్ని సందర్భాల్లో సీసీ ఫుటేజ్ లే సాక్ష్యాల సేకరణకు, ఉపయక్తంగా ఉంటున్నాయన్నారు. పాఠశాలలు, ఆసుపత్రుల్లోను, ముఖ్య కూడళ్లు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల భద్రతకు భరోసా లభిస్తుందని అభిప్రాయ పడ్డారు. స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిదరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులును ఎస్పీ ఆదేశించారు. -
కేన్సర్ పట్ల అవగాహన అవసరం
విజయనగరం ఫోర్ట్: కేన్సర్ పట్ల అవగాహన అవసరమని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. ఈ మేరకు వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా బుధవారం స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం వద్ద నిర్వహించ తలపెట్టిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేన్సర్ను త్వరగా గుర్తించగలిగితే నయం చేయవచ్చని తెలిపారు. 40 ఏళ్లు దాటిన మహిళలు ఏడాదికి ఒకసారి వైద్యపరీక్షలు చేసుకోవాలని సూచించారు. పురుషులు గొంతుకేన్సర్, నోటి కేన్సర్ రాకుండా ఖైనీ, గుట్కా వంటి వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. మహిళలు గర్భాశయ, రొమ్ముకేన్సర్ రాకుండా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎన్సీడీ పీఓ డాక్టర్ బి.సుబ్రహ్మణ్యం, డీఐఓ డాక్టర్ అచ్యుతకుమారి తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి -
ముగిసిన దివ్యాంగ విద్యార్థుల కళా సాంస్కృతిక పోటీలు
విజయనగరం అర్బన్: స్థానిక యూత్ హాస్టల్లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రెండురోజుల పాటు దివ్యాంగ విద్యార్థులకు నిర్వహించిన కళలు–సాంస్కృతిక పోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దివ్యాంగ విద్యార్థుల దేశభక్తి, జానపద, భక్తిగీతాలకు నృత్యప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. లఘునాటికలు, ఏకపాత్రాభినయాలతో అలరించారు. పలువురు విద్యార్థులు గీతాలాపన చేయగా కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా సాగి ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది. రెండోరోజున జిల్లా సమగ్ర శిక్ష ఏపీపీ డాక్టర్ ఎ.రామారావు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. జిల్లా సహిత విద్య సమన్వయకర్త ఎస్.సూర్యారావు, సహ సమన్వయకర్త ఎం.భారతి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సహిత విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మీటర్ రీడర్స్కు స్మార్ట్ గుబులు..!
● ఉపాధికి గండి పడుతుందని ఆందోళన ● కొద్ది రోజులుగా సమ్మెబాట ● జిల్లాలో ఏడు లక్షలపైగా విద్యుత్ కనెక్షన్లు మీటర్ రీడర్స్ డిమాండ్స్ విద్యుత్సంస్థలోకి విద్యార్హతను బట్టి ఔట్సో ర్సింగ్ ఉద్యోగులుగా తీసుకోవాలి ● ఉద్యోగ భద్రత కల్పించాలి ● ఖాళీ సమయాల్లో పని కల్పించాలివిజయనగరం ఫోర్ట్: ఏరు దాటిందాకా ఏటి మల్ల న్న..ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా తయారైంది కూటమి ప్రభుత్వం పరిస్థితి. ఎన్నికల ముందు తమ్ముళ్లూ స్మార్ట్మీటర్లు బిగిస్తే బద్దలుగొట్టండి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు విద్యుత్ వినియోగదారులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నోటితో స్మార్ట్ మీటర్లు బిగించుకోండని చెబుతున్నారు. దీంతో విద్యుత్ వినియోగదారులు విస్తుపోతున్నారు. టీడీపీ నేతల రెండు నాలుకల ధోరణి పట్ల మండిపడుతున్నారు. జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు బిగిస్తున్న స్మార్ట్ మీటర్లు మీటర్ రీడర్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. స్మార్ట్ మీటర్లు పూర్తి స్థాయిలో బిగించినట్లయితే తమకు ఉద్యోగ భద్రత ఉండదని మీటర్ రీడర్స్ మధనపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో వేలాది స్మార్ట్ మీటర్లు బిగించేశారు. దీంతో తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని ఉద్యోగ భద్రత కల్పించాలని గడిచిన ఏడు రోజులుగా మీటర్ రీటర్స్ సమ్మె చేస్తున్నారు. రీడర్ తీసే రీడింగ్ 3,500 నుంచి 4 వేలు జిల్లాలో 170 మంది మీటర్ రీడర్స్ ఉన్నారు. ప్రతినెల ఒకటో తేదీ నుంచి 10 వతేదీ లోగా ఇంటింటికీ వెళ్లి వారు మీటర్ రీడింగ్ తీస్తారు. సర్వీసులు ఎక్కువ ఉన్నచోట 12 వతేదీ వరకు కూడా పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో మీటర్కు రూ.3.25, పట్టణ ప్రాంతాల్లో రూ.3 చొప్పున చెల్లిస్తారు. 91,224 స్మార్ట్ మీటర్ల లక్ష్యం జిల్లాలో 91,224స్మార్ట్ మీటర్లు బిగించాలని విద్యుత్శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటివరకు 40 వేల స్మార్ట్ మీటర్లు బిగించేశారు. స్మార్ట్ మీటర్ల వల్ల మీటర్ రీడర్స్కు పని ఉండదు స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల సంబంధిత వినియోగదారుడి సెల్కు విద్యుత్ బిల్లు ఎంత అనేది మేసేజ్ వచ్చేస్తుంది. ప్రత్యేకించి రీడింగ్ తీయాల్సిన పని ఉండదు. దీనివల్ల మీటర్ రీడర్స్ అవసరం ఉండదు. దీంతో తమకు ఉద్యోగం ఉండదనే ఆందోళన వారిలో నెలకొంది. టీడీపీ సర్కార్ తీరు పట్ల మీటర్ రీడర్స్ పెదవి విరుస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా , అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. నారాలోకేష్ యువగళం పాదయాత్రలో మీటర్ రీడర్స్ కలిసినప్పుడు అధికారంలోకి వస్తే ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాట ఇచ్చారు. అయితే స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం తమ పొట్ట కొడుతోందని మీటర్ రీడర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీటర్ రీడర్స్కు కనీస వేతనాలు అమలు కావడం లేదు. ఉద్యోగ భద్రత కూడా లేదు. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల డిగ్రీచదివిన వారు సైతం కొందరు మీటర్ రీడర్స్గా చేస్తున్నారు. 10, 15 ఏళ్లుగా మీటర్ రీడర్స్గా పనిచేస్తున్నారు. ఆందోళనలో వినియోగదారులు: ప్రతి నెలా 10 వతేదీ లోగా మీటర్ రీడర్స్ రీడింగ్ తీస్తారు. ఒక్కరోజు ఆలస్యం అయినా వినియోదారులపై భారం పడుతుంది. మరింతజాప్యం జరిగితే మీటర్రీడింగ్ మారిపోయి చెల్లించాల్సిన టారిఫ్ భారీగా పెరిగిపోతుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గృహ వినియోగదారులకు ఫర్వాలేదుకాని వాణిజ్య వినియోగదారులకు మరింతగా భారం పడే అవకాశం ఉంది. జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల వివరాలుకేటగిరి విద్యుత్ కనెక్షన్ల సంఖ్య కేటగిరి–1 5,99,932 కేటగిరి–2 65,383 కేటగిరి–3 2513 కేటగిరి–4 14,356 కేటగిరి–5 41,007 హెచ్టీ –సర్వీస్ 434మీటర్ రీడింగ్కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మీటర్ రీడర్స్ గత నెల 29వతేదీ నుంచి సమ్మె చేస్తున్నారు.మీటర్ రీడింగ్ తీసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. 91 వేల స్మార్ట్ మీటర్లు బిగించాలన్నది లక్ష్యం కాగా ఇంతవరకు 40 వేలు బిగించాం. మువ్వల లక్ష్మణరావు, ఎస్.ఈ, ఏపీఈపీడీసీఎల్ -
‘ఉపాధి’ పథకానికి గాంధీ పేరు మార్చకూడదు
విజయనగరం ఫోర్ట్: ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు మార్చకూడదని డీసీసీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ అన్నారు. ఈ మేరకు ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు మార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదలకు ఎంతో ఆసరాగా ఉంటూ ఎన్నో కుటుంబాలకు మేలు చేసిందన్నారు. అలాంటి పథకాన్ని ప్రస్తుత కేంద్రప్రభుత్వం ఖూనీ చేస్తోందని విమర్శించారు. ఈ పథకాన్ని నిలిపివేయాలని కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి నెలనెలా అప్పులు చేస్తోందని, మరి ఏ విధంగా 40 శాతం నిధులు రాష్ట్రప్రభుత్వం భరించగలదని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంలో గ్రామసభల ద్వారా గ్రామాలకు ఏం కావాలనే నిర్ణయం తీసుకునేవారని, కొత్త చట్టంలో గ్రామాల్లో చేపట్టే పనులు ఢిల్లీలో నిర్ణయిస్తారట అని ఎద్దేవా చేశారు. జిల్లా నుంచి వలసలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్, ఐశ్వర్య, రామచంద్రరాజు, తిరుపతి, దుర్గాప్రసాద్, కరీం, రామారావు, శ్రీనివాస్మోహన్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు విద్యాసాగర్ -
కనకమహాలక్ష్మి హుండీల ఆదాయం రూ.2,42,060
చీపురుపల్లి: భక్తుల కొంగుబంగారం, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో హుండీల ద్వారా రూ.2,42,060 ఆదాయం లభించినట్లు దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ జి.శ్యామ్ప్రసాద్ చెప్పారు. ఈ మేరకు పట్టణంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో బుధవారం హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 2025 డిసెంబర్ 10 నుంచి 2026 ఫిబ్రవరి 4 వరకు ఆదాయం లెక్కింపు జరగ్గా భక్తులు మొక్కుబడులు, కానుకల ద్వారా హుండీల నుంచి రూ.2,42,060 లభించింది. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ ఎస్.నానాజీబాబు, ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, సభ్యులు ఇప్పిలి పార్వతి, లెంక చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు ‘సేఫ్టీ డ్రైవింగ్’పై అవగాహనపార్వతీపురం రూరల్: సేఫ్టీ డ్రైవింగ్పై జిల్లా పోలీసు సిబ్బందికి బుధవారం అవగాహన తరగతులు నిర్వహించారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయనగరం ఆర్టీసీ రీజినల్ సేఫ్టీ డ్రైవింగ్ ఇన్న్స్పెక్టర్ సీహెచ్ వేణు శిక్షణ ఇచ్చారు. విధి నిర్వహణలో భాగంగా వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్రేకులు, లైట్లు, టైర్ల పనితీరును తనిఖీ చేసుకోవడంపై సిబ్బందికి వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్, సీటుబెల్ట్ ధరించడం ద్వారా ప్రమాదాలను ఎలా నివారించవచ్చో తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐ నాయుడు, ఆర్ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రేబిస్తో బాలుడి మృతిబొబ్బిలిరూరల్: మండలంలోని దిబ్బగుడ్డివలస గ్రామానికి చెందిన రామవరపు రమణ(9) కుక్కకాటు వచ్చిన రేబిస్తో మృతి చెందాడు. సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామంలోని పిచ్చికుక్క రమణ ముఖంపై కాటువేసింది. అప్పట్లో బొబ్బిలి సీహెచ్సీకి తరలించి వ్యాక్సిన్ వేయించి చికిత్స అందించారు. మంగళవారం మళ్లీ జ్వరం రావడంతో స్థానిక వైద్యులు పరిశీలించి మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా రమణ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందినట్లు తల్లిదండ్రులు వెంకటరత్నం,తండ్రి సంగమేశ్వర్రావులు తెలిపారు.కుక్క కాటు కారణంగా రేబిస్ వ్యాధి సోకడంతోనే విద్యార్థి రమణ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు చెప్పారు. రమణ స్థానిక ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలో మూడోతరగతి చదువుతున్నాడు. విజయనగరం లీగల్: జిల్లా న్యాయసేవా అధికార సంస్థలో ఖాళీగా ఉన్న రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ఈ నెల 9వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షురాలు ఎం.బబిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు విజయనగరం కోటలోని మోతీమహల్, ఎంఆర్ కాలేజీ (అటానమస్) వేదికగా జరుగుతాయని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం.. రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు ఉదయం 10గంటల నుంచి 11:30 గంటల వరకు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు మధ్యాహ్నం 1గంట నుంచి 2 గంటల వరకు, ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్ పోస్టుకు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నామని, దరఖాస్తుతో పాటు స్టాంపులు అంటించిన కవర్లు పంపిన అభ్యర్థులకు హాల్ టిక్కెట్లను రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇప్పటికే పంపించినట్లు తెలిపారు. అభ్యర్థులు జిల్లా కోర్టు అధికారిక వెబ్సైట్ (httpr://vizianagaram. dcourts.gov.in) నుంచి హాల్టెకెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. హాల్ టికెట్లపై ఫొటో అటెస్టేషన్ లేని వారు వెంటనే గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ చేయించుకోవాలని, అభ్యర్థులు పరీక్షా సమయానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. -
భూముల హక్కుదారులకే పాస్పుస్తకాలు ఇవ్వాలి
● ఫిబ్రవరి, మార్చిలో పంపిణీ వేగవంతం చేయాలి ● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డివిజయనగరం అర్బన్: ఆయా భూముల హక్కుదారులకే పట్టాదారు పాస్పుస్తకాలను అందజేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లా రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ, రెవెన్యూ క్లినిక్, రీసర్వే, ఐవీఆర్ఎస్ సర్వే, జాయింట్ ఎల్పీఎంఎస్, స్వమిత్వ, రైస్ మిల్లుల తనిఖీలు తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేసేటప్పుడు వీలైనంతవరకు వాటిని అసలు హక్కుదారుకే అందజేయాలని స్పష్టం చేశారు. ప్రతినెలా 9వ తేదీలోపు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. 10 నుంచి 14వ తేదీ వరకు మ్యుటేషన్ (ఫారం–8) ప్రక్రియను చేపట్టాలని సూచించారు. అలాగే 15 నుంచి 17వ తేదీ వరకు సుమోటో కరెక్షన్లు పూర్తి చేయాలన్నారు. మ్యుటేషన్ ప్రక్రియలో ట్రాన్జాక్షన్, కరెక్షన్, డెడ్ కరెక్షన్స్గా విభజించి పనులు చేయాలని, ప్రతి నెలా 30వ తేదీలోపు అన్ని దిద్దుబాట్లను పూర్తి చేసి, ఈ–కేవైసీ అనంతరం తప్పులు లేని పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేయాలని వివరించారు. మ్యుటేషన్ దరఖాస్తులు పునఃసమీక్షించాలి జిల్లాలో పెండింగ్లో ఉన్న రెవెన్యూ అంశాలు, భూసర్వేలు, ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలుపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి 12 గ్రామాల్లో, మార్చి నెలకు సంబంధించి 61 గ్రామాల్లో పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తిరస్కరించిన మ్యుటేషన్ దరఖాస్తులను పునఃసమీక్షించాలని, పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను సమర్పించాలని సూచించారు. రీ–సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, జాయింట్ ఎల్పీఎంల విభజన, ఆన్లైన్ సేవలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కాన్ఫరెన్స్లో జిల్లా కేంద్రం నుంచి డీఆర్ఓ ఈ.మురళి, సర్వేశాఖ ఎ.డి విజయకుమార్తో పాటు ఆర్డీఓలు, డీఎల్డీఓలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
గోల్డెన్ అవర్లో ధైర్యమే ప్రాణదాత
పార్వతీపురం రూరల్: ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ప్రాణాన్ని నిలబెట్టేది..ఆస్తి నష్టాన్ని నివారించేది కేవలం అవగాహన మాత్రమేనని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అన్నారు. విపత్తు సమయాల్లో భయం వీడి, బాధితులకు అభయమివ్వాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన పార్వతీపురం మండలంలోని ఎమ్మార్నగరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ, రెడ్ క్రాస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్’ విన్యాసాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రమాదం జరిగిన మొదటి కొన్ని నిమిషాలు (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమని, ఆ సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ప్రాణాపాయం నుంచి గట్టెక్కవచ్చని పేర్కొన్నారు. మంటలు ఎగిసిపడినప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి అగ్నిమాపక సిబ్బంది చేసే సాహసాలను ప్రత్యక్షంగా తిలకించిన విద్యార్థులు అబ్బురపడ్డారు. గ్యాస్ సిలిండర్ల మంటలను అదుపు చేయడం, ఎత్తైన భవనాల్లో చిక్కుకున్న వారిని తాడు సాయంతో సురక్షితంగా వెలికితీయడం వంటి విన్యాసాలు నేత్రపర్వంగా సాగాయి. ఆధునిక రెస్క్యూ పరికరాల పనితీరుపై విద్యార్థులకు సిబ్బంది అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి పి.సింహాచలం, ప్రిన్సిపాల్ ఉదయ్కుమార్, నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రభాకర రెడ్డి -
ఐసీడీఎస్ పీడీకి బదిలీ
● శ్రీకాకుళం వికలాంగుల శాఖ ఎ.డిగా నియామకంవిజయనగరం ఫోర్ట్: ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.విమలారాణికి వికలాంగులు, వయోద్ధులు, ట్రాన్స్జెండర్స్శాఖ (శ్రీకాకుళం)కు అసిస్టెంట్ డైరెక్టర్ (ఎ.డి)గా బదిలీ అయినట్లు సమాచారం. అయితే బదిలీ ఉత్తర్వులు వచ్చి నెలరోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఆమె బదిలీ అయిన శాఖలో చేరలేదు. ఐసీడీఎస్ పీడీగానే కొనసాగుతున్నారు. వికలాంగులశాఖకు ఫారిన్ సర్వీస్ కింద డిప్యుటేషన్పై బదిలీ చేయాలని ఆమె గతంలో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో అశాఖ ఉన్నతాధికారులు ఆమె అభ్యర్ధనను అమోదిస్తూ వికలాంగుల శాఖకు ఎ.డిగా బదిలీ చేశారు. ఫారిన్ సర్వీస్ కింద బదిలీ కావాలని కోరిన ఆమె ఉత్వర్వులు వచ్చిన తర్వాత వెళ్లక పోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేవిషయాన్ని ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి వద్ద సాక్షి ప్రస్తావించగా పీడీగా బాధ్యత చేపట్టిన తొలినాళ్లలో ఫారిన్ సర్వీసెస్ కోసం దరఖాస్తు చేసిన మాట వాస్తవమేనన్నారు. అయితే పీడీగా ఇక్కడే కొనసాగాలని ఉన్నతాధికారులు చెప్పినందున కొనసాగుతున్నట్లు తెలిపారు. -
బొద్దాం చోరీ కేసుపై డీఎస్పీ విచారణ
వేపాడ: మండలంలోని బొద్దాం గ్రామంలో సోమవారం పట్టపగలు జనపరెడ్డి వెంకటరమణ ఇంటిలో జరిగిన దొంగతనం కేసుపై ఇన్చార్జి డీఎస్పీ ఆర్.గోవిందరావు గ్రామంలో విచారణ చేశారు. చోరీ విషయంపై పలువురు స్థానికులను ఆరా తీశారు. డీఎస్పీతో పాటు ఎస్.కోట రూరల్ సీఐ ఎల్.అప్పలనాయుడు, ఎస్.కోట ఎస్సై నారాయణ మూర్తి బొద్దాంలో చోరీకి గురైన గృహాన్ని, పరిసరాలు పరిశీలించి దర్యాప్తు నిర్వహించారు. 20 లీటర్ల సారాతో నిందితుడి అరెస్టుకురుపాం: మండలంలోని పూతికవలస గ్రామ పరిసరాల్లో ద్విచక్రవాహనంపై 20 లీటర్ల సారా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ కన్నపుదొరవలస గ్రామానికి చెందిన బొత్స ప్రవీణ్ ద్విచక్రవాహనంపై సారా తరలిస్తుండగా పూతికవలస వద్ద దాడులు నిర్వహించి సారాను సీజ్చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా మద్యం, సారా తరలించినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. 838 లీటర్ల సారా ధ్వంసంజియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో 21 కేసుల్లో పట్టుబడిన 838 లీటర్ల సారాను ధ్వంసం చేశామని చినమేరంగి ఎస్సై పి.అనీష్ తెలిపారు. అలాగే నాలుగు కేసుల్లో పట్టుబడిన 85 మద్యం సీసాలను కూడా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సమక్షంలో దాడులు నిర్వహించామన్నారు. 4.45క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్బొబ్బిలి రూరల్: మండలంలోని పారాదిలో పసుమర్తి నాగరాజు అనే వ్యక్తి ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పౌరసరఫరాల ఉప తహసీల్దార్ రెడ్డి సాయికృష్ణ తెలిపారు. మంగళవారం ఉదయం అక్రమ బియ్యం వ్యవహారానికి సంబంధించిన సీఎస్డీటీకి సమాచారం రాగానే సిబ్బందితో కలిసి వెళ్లి ఇంట్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సీజ్ చేసిన బియ్యాన్ని మరో డీలర్కు అప్పగించి కేసు నమోదు చేసినట్లు సీఎస్డీటీ చెప్పారు. కోడి పందాలపై పోలీసుల దాడిలక్కవరపుకోట: మండలంలోని దాసుళ్లపాలెం గ్రామం సమీప తోటల్లో రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందాలపై ఎస్సై నవీన్పడాల్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పందాలు ఆడుతున్న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.12,600 నగదు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవం● చైర్మన్గా తాడ్డి గోవింద్ విజయనగరం అర్బన్: ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీ 2026–29 పదవీకాలానికి సంబంధించిన ఎన్నికలు మంగళవారం స్థానిక రెవెన్యూ హోమ్లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా చైర్మన్గా తాడ్డి గోవింద, అసోసియేట్ చైర్మన్గా ఎస్.రామకృష్ణ, వైస్చైర్మన్–1గా బాల మహేశ్, వైస్ చైర్మన్–2గా ఎ.అప్పలనాయుడు, వైస్చైర్మన్–3గా పి.చంద్రశేఖర్రాజు, వైస్చైర్మన్ 4 గా డాక్టర్ డి.సురేష్, ప్రధాన కార్యదర్శిగా పి.భానుమూర్తి, సెక్రటరీ–1గా కె.సురేష్, సెక్రటరీ–2గా వి.సత్యనారాయణ, సెక్రటరీ–3గా వై.గోవిందరావు, సెక్రటరీ–4గా ఎం.నాగేశ్ కుమార్, కోశాధికారిగా సీహెచ్వీ అప్పారావు ఎంపికయ్యారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నారు. -
తూనికల్లో వర్తకుల మోసం
● జీసీసీ మేనేజర్ రాములుసాలూరు రూరల్: గిరిజనుల ఉత్పత్తుల కొనుగోలులో వర్తకులు తూనికల్లో మోసం చేస్తారని జీసీసీ మేనేజర్ సిహ్.ఆములు అన్నారు. ఈ మేరకు సాలూరు మండలంలోని నేరెళ్ల వలస వారపు సంతలో మంగళవారం ఆయన గిరిజనులకు జీసీసీ కొనుగోళ్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చింతపండును కిలో రూ.36కు జీసీసీ కొనుగోలు చేస్తుందన్నారు. వర్తకులు ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆశ చూపుతారని గిరిజనులు వర్తకులకు చింతపండు అమ్మకాలు చేసి మోసపోవద్దని సూచించారు. అలాగే ఎవరైనా గిరిజనులను మోసం చేసి చింతపండు కొనుగోలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్దతు ధర రూ.50 చేస్తే మంచిది చింతపండు మద్దతు ధర రూ.50 జీసీసీ చెల్లిస్తే బాగుంటుందని నేరెళ్ల వలసకు చెందిన వంతల గోపాల్తో పాటు ఎగువ సెంబి, దిగువసెంబి, కుంబిమడకు చెందిన గిరిజనులు కోరారు. వర్తకులు కిలోకి రూ.50 చెల్లిస్తున్నారని ప్రభుత్వం గమనించి చింతపండు మద్దతు ధర పెంచాలన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక కొనుగోలు కేంద్రం ఇన్చార్జి రమేష్కుమార్ జీసీసీ సిబ్బంది పాల్గొన్నారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. చదురుగుడి వద్దనున్న బాలాలయంలోనూ, రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో అమ్మవారిని పుష్పాలతో లంకరించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు. ఇంటి వివాదంలో ఒకరిపై దాడి పార్వతీపురం రూరల్: ఇంటి కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన వివాదం దాడికి దారితీసింది. పార్వతీపురం మండలం పెదబొండపల్లిలో మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అరసాడ ఆనందరావు మూడేళ్ల క్రితం సవర కుమార్ వద్ద ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ ఇంటి ముందున్న దుకాణాన్ని తొలగించే విషయంలో గతంలో పెద్దల సమక్షంలో పంచాయితీ జరగ్గా, సంక్రాంతి తర్వాత ఖాళీ చేస్తానని కుమార్ అంగీకరించాడు. అయితే గడువు ముగిసినా దుకాణం తొలగించకపోవడంతో మంగళవారం ఉదయం ఇంటిలో సామాన్లు సర్దుతున్న ఆనందరావు, కుమార్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కుమార్, అతని భార్య లక్ష్మమ్మ కలిసి కర్రతో దాడి చేయడంతో ఆనందరావు తల, దవడ భాగాల్లో గాయాలయ్యాయి. బాధితుడు ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
● బంగారు కొండలు
● రాష్ట్రస్థాయి పోటీల్లో 15మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్ ● అభినందించిన హెచ్ఎం, సిబ్బందిచీపురుపల్లి: రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్ పోటీల్లో మండలంలోని మెట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో మెట్టపల్లి విద్యార్థులు 15 మంది బంగారు పతకాలు సాధించారు. దీంతో మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్ఎం విజ య్కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో మదర్ థెరీసా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పోటీలకు మెట్టపల్లి జెడ్పీ పాఠశాల విద్యార్థులు వెళ్లినట్లు చెప్పారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది విద్యార్థులు చిత్రలేఖనం పోటీల్లో బంగారు పతకాలు సాధించగా ఒక విద్యార్థి క్రాఫ్ట్ విభాగంలో బంగారు పతకం సాధించినట్లు చెప్పారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను మిగిలిన వారు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్ట్ టీచర్ ఎ.కుమార్, క్రాఫ్ట్ టీచర్ పి.వేదలక్ష్మిలను అభినందించారు. -
పోలీసు బలగాలకు ‘పునశ్చరణ’
● ఆయుధాల వినియోగం, ● సైబర్ నేరాలపై అవగాహనపార్వతీపురం రూరల్: జిల్లా పోలీసు సాయుధ బలగాలకు 15 రోజుల పునశ్చరణ (మొబిలైజేషన్) తరగతులు మంగళవారం కొనసాగాయి. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు సిబ్బందికి శారీరక దారుఢ్యం, ఆయుధాల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నారు. ఉదయం వేళ వ్యాయామాలు, రన్నింగ్, ఫిట్నెస్ డ్రిల్స్తో పాటు 9ఎంఎం పిస్టల్ వంటి ఆయుధాలను క్లిష్ట సమయాల్లో వేగంగా, సురక్షితంగా ఉపయోగించే విధానంపై మెలకువలు నేర్పిస్తున్నారు. అనంతరం సైబర్ సెల్ ఎస్సై రవీంద్ర రాజు డిజిటల్ నేరాలపై అవగాహన కల్పించారు. ఆనన్లైన్ మోసాలు, ఫిషింగ్, సోషల్ మీడియా నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్ పోర్టల్ను ఎలా వినియోగించాలో వివరించారు. ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి మాట్లాడుతూ..సిబ్బంది నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ నాయుడు, ఆర్ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ సతీమణికి కారుణ్య నియామకం
పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసు శాఖలో ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్గా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జి.పోలిరాజు సతీమణి స్వాతికి మంగళవారం కారుణ్య నియామక ఉత్తర్వులను ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి అందజేశారు. ప్రభుత్వం ఆమెను పాలకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (టైపిస్ట్)గా నియమించింది. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ..మృతి చెందిన సిబ్బంది కుటుంబానికి రావాల్సిన శాఖాపరమైన ప్రయోజనాలు త్వరగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐ నాయుడు పాల్గొన్నారు. -
జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు షణ్ముఖ రావు
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల అథ్లెటిక్స్ పోటీలకు విజయనగరానికి చెందిన ఎం.షణ్ముఖరావు ఎంపికయ్యాడు. జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 800 మీటర్ల పరుగుపందెంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించాడు. ప్రస్తుతం డిప్లమో విద్యనభ్యసిస్తున్న షణ్ముఖ్ మార్చి నెలలో కేరళలో జరగనున్న ఆలిండియా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్ధుల పోటీలకు అర్హత సాధించాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనరబచడంతో పాటు జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారుడితో పాటు విజ్జి స్టేడియంలో శిక్షణ ఇచ్చిన కోచ్ ఎ.నర్సింగరావును జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లీలాకృష్ణ, కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి ఆనంద్ కిషోర్లు అభినందించారు. -
దాగుడుమూతలు..!
సాక్షి, పార్వతీపురం మన్యం: దాగుడుమూతా దండాకోర్ ఆటలా ఉంది జిల్లా కేంద్రంలోని అధికార యంత్రాంగం, ఆక్రమణ దారుల తీరు. చేసిందే కోట్ల రూపాయల విలువైన వరహాల గెడ్డ ఆక్రమణ..చేయించుకున్నదే తప్పుడు రిజిస్ట్రేషన్..ఆపై దర్జాగా విశాఖకు చెందిన వ్యాపారికి విక్రయం..ఇది చాలదన్నట్లు భయం, బెరుకు లేకుండా హెచ్చరిక బోర్డుల తొలగింపు. కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లు బోర్డులు పాతుతున్న అధికారులు..ఆక్రమణదారులను సుతిమెత్తగా మందలిస్తున్నారు. ‘అబ్బో..ఆపాటి గౌరవం మేమెందుకెవ్వం?’ అంటూ నాలుగు రోజులు ఆగి, వేసిన బోర్డును పీకేస్తున్నారు ఆక్రమణ దారులు. వరహాలగెడ్డ విషయంలో అధికారులు, ఆక్రమణదారుల తీరు హెచ్చరిక బోర్డు’ పెట్టి సుతిమెత్తగా మందలిస్తున్న అధికారులు నాలుగు రోజులు ఊరుకుని.. పీకి పడేస్తున్న ఆక్రమణదారులు -
పోలీసులపై డీఆర్ఓకు ఫిర్యాదు
విజయనగరం క్రైమ్: నా భర్తపై అక్రమంగా గంజాయి కేసు నమోదు చేసి పోలీసులు ఇబ్బందులకు పెట్టారంటూ విజయనగరంలోని పూల్బాగ్కు చెందిన సన్యాసిరావు భార్య మంగళవారం వాపోయింది. ఈ మేరకు బంధువులతో కలిసి కలెక్టరేట్ ముందు మంగళవారం ఆందోళన చేసిన ఆమె ఫిర్యాదు చేసేందుకు డీఆర్ఓను కలవగా కోర్టు పరిధిలో ఉన్నందున తామేమీ చేయలేమని ఆయన చెప్పడంతో నిశ్చేష్టురాలైంది. అన్యాయంగా తన భర్త సన్యాసిరావుపై కేజీన్నర గంజాయి తరలిస్తున్నాడంటూ తప్పుడు కేసు పెట్టి ఇంట్లో ఉన్న ఆయనను రూరల్ పోలీసులు బలవంతంగా తీసుకెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొంది.నాలుగు రోజుల పాటు తన భర్త సన్యాసిరావు కోసం స్టేషన్ చుట్టూ తిరిగానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు పిల్లలతో ఉన్న తమ కుటుంబంపై అన్యాయంగా పోలీసులు ముద్ర వేశారని పేర్కొంది. బంధువులు, స్నేహితుల సాయంతో తన భర్త బెయిల్పై వచ్చాడని తనకు న్యాయం కావాలని డిమాండ్ చేసింది. -
విద్యార్థి నేతల కిడ్నాప్ దారుణం
● మోహన్బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి ● విద్యార్థి సంఘాల డిమాండ్విజయనగరం గంటస్తంభం: విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేయించిన ఘటనలో సినీనటుడు మోహన్ బాబుపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, మోహన్బాబు యూనివర్సిటీ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట నిర్వహించిన నిరసనలో మోహన్బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలోని మోహన్బాబు యూనివర్సిటీలో అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేసినందుకు గతంలో రూ.26 కోట్లను తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాలని, రూ.16 లక్షల జరిమానా విధించినా యాజమాన్యం దోపిడీ కొనసాగిస్తోందని ఆరోపించారు. ఫీజుల దోపిడీకీ వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి నేతలను బౌన్సర్లతో కిడ్నాప్ చేయించడం సిగ్గుచేటని పేర్కొంటూ, తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
దివ్యాంగ విద్యార్థులకు జిల్లాస్థాయి కళాపోటీలు ప్రారంభం
విజయనగరం అర్బన్: స్థానిక యూత్ హాస్టల్లో మంగళవారం విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్ధులకు జిల్లా స్థాయి కళలు, సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు ప్రారంభమ య్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీలకు ముఖ్యఅఽతిధిగా హాజరైన సమగ్రశిక్ష ఏపీపీ డాక్టర్ ఎ.రామారావు మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పోటీతత్వం పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో పరస్పరం పోటీ పడి, మంచి ఇతివృత్తంతో కూడిన చిత్రాలను రూపొందించడం అభినందనీయమన్నారు. తొలిరోజు పోటీ ప్రదర్శనలో కళాంశాలు పలువురిని ఆకట్టుకున్నాయి. జిల్లా సహిత విద్య సమన్వయకర్త ఎస్.సూర్యారావు, సహ సమన్వయకర్త ఎం.భారతి పర్యవేక్షణలో జరిగిన సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులు, సిబ్బంది, 70 మంది దివ్యాంగ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, సహిత విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రాజాంలో చోరీపై ముమ్మర దర్యాప్తు
రాజాం: రాజాంలోని జీఎంఆర్ ఐటీ క్వార్టర్స్లో ఆదివారం రాత్రి జరిగిన కిలోన్నర బంగారం, కిలో వెండి చోరీ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. జీఎంఆర్ఐటీ సమీపంలోని గ్రామాల్లో మంగళవారం ఆరాతీశారు. ఐటీ సమీపంలో బుచ్చింపేట రోడ్డులో ఓ వ్యక్తికి చెందిన పల్సర్ బైక్ చోరీ జరిగిన రాత్రి అపహరణకు గురికావడంపై కేసు నమోదుచేశారు. ఆ బైక్ దొంగతనానికి, ఈ చోరీకి మద్య ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు పది బృందాలు గాలిస్తున్నట్టు రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర తెలిపారు. చోరీకి గురైన బైక్ను గుర్తించినవారికి పారితోషకం ఇస్తామని ప్రకటించారు. భద్రతలో వైఫల్యమా... పెద్దపెద్ద సెమినార్లు, కాన్వొకేషన్లు జరిగినప్పుడు కూడా బయట వ్యక్తులకు లోపలకు రానివ్వని జీఎంఆర్ఐటీ ప్రాంగణంలో ఇంత పెద్ద దొంగతనం ఎలా జరిగిందని ప్రస్తుతం మిస్టరీగా మారింది. సీసీ కెమెరాల నిఘా ఏమైంది.. సెక్యూరిటీ సిబ్బంది నిద్రపోతున్నారా అన్న చర్చ జోరందుకుంది. జీఎంఆర్ ఐటీ ప్రాంగణం 30 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. అక్కడే జీఎంఆర్ కేర్ డాక్టర్లకు, ఇటు జీఎంఆర్ ఐటీ ప్రొఫెసర్లకు క్వార్టర్స్ ఇచ్చారు. ఈ క్వార్టర్స్, కాలేజీలోకి వెళ్లాలంటే అడుగడుగునా జీఎంఆర్ ప్రైవేట్ సెక్యూరిటీ నిఘా ఉంటుంది. అయితే, తక్కువ ఎత్తులో ఉన్న ప్రహరీని దూకి క్వార్టర్స్లోకి దొంగలు ప్రవేశించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాలేవీ? జీఎంఆర్ కేర్ ఆస్పత్రితో పాటు ఐటీ కాలేజీలు వద్ద సీసీ కెమెరాలు నిఘా ఉంది. ఈ క్వార్టర్స్ వద్ద ఈ సీసీ కెమెరాలు లేవు. రెండు ప్లాట్లులో చోరీ జరగగా ఒక ప్లాట్ వద్ద మాత్రమే సీసీ కెమెరా ఉంది. అందులో ముసుగుతో ఉన్నట్లు దొంగలు కనిపించారు. భారీగా బంగారం చోరీ జరిగిన రస క్వార్టర్స్ వద్ద మాత్రం ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. ఆ క్వార్టర్సే కాకుండా చుట్టు పక్కల కూడా సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం. సెక్యూరిటీ ఏమైంది? జీఎంఆర్ ఐటీ మెయిన్ గేట్, కాలేజీ బ్లాకులు, హా స్టల్స్, డీఏవీ స్కూల్స్ వద్ద జీఎంఆర్ రక్షా సెక్యూరిటీ ఉంటుంది. ఈ క్వార్టర్స్ వద్ద ఆ సెక్యూరిటీ గార్డులు ఉన్నారా? లేదా? అన్నది బయటకు రానివ్వలేదు. సెక్యూరిటీ గార్డులు అక్కడ ఉండి ఉంటే ఇంతటి చోరీ జరిగేదికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో క్వార్టర్లో 20 వరకూ గదులు ఉన్నా యి. ఈ గదులు అన్నీ ఒకదానికి ఒకటి ఆనుకుని ఉంటాయి. వీటిలో మనుషులు లేని ఇండ్లను దొంగలు ఎలా గుర్తించారు... అక్కడే ఎలా దొంగతనానికి దిగారు... గుప్చప్గా ఎలా మాయమయ్యారన్నది పోలీసులకు సైతం అంతుచిక్కడంలేదు. ఇక్కడే గంజాయి విక్రయాలు.. జీఎంఆర్ ఐటీ సమీపంలోని బుచ్చింపేట రోడ్డులో గంజాయి విక్రయాలు జోరుగా జరిగేవి. ప్రధాన రహదారులపై గంజాయి బ్యాచ్లు గొడవలు వంటివి చోటుచేసుకున్నాయి. ఈ సమీపంలోనే ఇప్పుడు పెద్దచోరీ జరుగడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో చిన్నచిన్న దొంగతనాలకే భయబ్రాంతులకు గురయ్యే పట్టణవాసులు ఇప్పుడు ఈ భారీ చోరీని తలుచుకుని ఆందోళనచెందుతున్నారు. -
ప్రాజెక్టుల భూసేకరణను వేగంగా పూర్తి చేయాలి
● రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశంవిజయనగరం అర్బన్: జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రాజెక్టుల భూసేకరణపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తారకరామ తీర్థసాగర్, తోటపల్లి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, మూడో రైల్వేలైన్, కొత్తవలస–విజయనగరం నాలుగో రైల్వే లైన్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర కీలం ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఆయా ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుని, ప్రతి ప్రాజెక్టుకు భూసేకరణ దశలను పూర్తి చేయడానికి నిర్ణీత గడువు విధించారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్టుల రహదారి, ఎస్టీపీల నిర్మాణం, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, మామహామాయ పరిశ్రమ విస్తరణ తదితర అంశాలపై కూడా చర్చించారు. ఈ అన్ని పనులకు సంబంధించిన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత శాఖల అధికారులకు అప్పగించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డీఆర్ఓ ఈ.మురళి, ఆర్డీఓలు డి.కీర్తి, రామ్మోహన్, ఎస్డీసీలు కళావతి, ప్రమీలాగాంధీ, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, పరిశ్రమల శాఖ జీఎం కరుణాకర్తో పాటు ఇరిగేషన్, జాతీయ రహదారులు, రైల్వే ఖాఖ అధికారులు, తహసీల్దార్లు, మున్సిల్ కమిషనర్లు, ఎల్ఏ యూనిట్ల డీటీలు పాల్గొన్నారు. -
చెత్తరువు..!
–8లోదాగుడుమూతలు..! దాగుడుమూతా దండాకోర్ ఆటలా ఉంది పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని అధికార యంత్రాంగం, ఆక్రమణ దారుల తీరు.బుధవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026జాక్టో నాయకుల ఢిల్లీ పయనం● ఈనెల 5న పార్లమెంట్ మార్చ్ వీరఘట్టం: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్(జాక్టో) పిలుపునిచ్చింది. ఈమేరకు ఈనెల 5న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించి పలు డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన 40 మంది జాక్టో నాయకులు మంగళవారం ఢిల్లీ బయల్దేరారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే జాక్టో లక్ష్యమని,తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి వినిపించేందుకు తామంతా హస్తినకు పయనమయ్యామని జాక్టో నాయకులు తెలిపారు. కళ్లజోళ్ల పంపిణీ ప్రారంభంపార్వతీపురం రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంటి చూపు సమస్యలను దూరం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ కళ్లజోళ్ల పంపిణీ చేపట్టింది. గతంలో నిర్వహించిన పరీక్షల్లో దృష్టి లోపం ఉన్నట్లు తేలిన 2,134 మంది విద్యార్థులకు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఉచితంగా కళ్లజోళ్లను అందజేస్తున్నారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ భాస్కరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ద్వారా విద్యార్థులందరికీ కళ్లజోళ్లు పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు వాటిని వినియోగించుకుని కంటిచూపును కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డా.సూర్య కౌశిక్, వైద్య సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. 32 మంది సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులుసీతంపేట: బయోమెట్రిక్ హాజరు వేయని 32 మంది గ్రామ సచివాలయం సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు మండల ప్రత్యేకాధికారి జి.చిన్నబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బయోమెట్రిక్ హాజరు వేయని వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాకేంద్రంలోని డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర పదేపదే చెబుతూ వచ్చారు. చెత్తశుద్ధి నిర్వహణ అంటూ కొన్నాళ్లు హడావిడి చేసినా..‘చెత్త’ కథ మళ్లీ మొదటికే వస్తోంది. అసంపూర్తి నిర్ణయాల వల్ల ఈ దుస్థితి దాపురించింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు 25 టన్నుల చెత్త సేకరణ జిల్లా కేంద్రం పార్వతీపురంలో 30 వార్డులున్నాయి. సుమారు 62 వేల మంది జనాభా నివసిస్తున్నారు. దాదాపు 13 వేల నివాస గృహాలుండగా.. ఆవాసాలు, వ్యాపార సంస్థల నుంచి రోజుకు 25 టన్నుల వరకు చెత్త ఉత్పత్తి అవుతోంది. పట్టణ శివారులో ఉన్న డంపింగ్ యార్డులోనే దీన్ని పారబోస్తున్నారు. డంపింగ్యార్డు 1.5 ఎకరాల్లోనే ఉంది. చెత్తను యార్డుకు తరలించాలని పట్టణ ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే విజయ్చంద్ర దాన్ని నెరవేర్చలేకపోయారు. గతంలో పార్వతీపురం పట్టణంలోని చెత్తశుద్ధి నిర్వహణకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సంస్థ తరుణి ఏజెన్సీకి పనులు అప్పగించింది. ఆ మేరకు కొన్నాళ్ల క్రితం డంపింగ్ యార్డు సమీపంలోనే పనులు ప్రారంభించారు. ఇక్కడ చెత్తను నాలుగు భాగాలు విభజిస్తారు. ప్లాస్టిక్, మట్టిరాళ్లు, రబ్బరు, గాజు వ్యర్థాలను వేర్వేరు యంత్రాలతో విభజించాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ను విక్రయానికి తరలించి, మిగిలిన పనికిరాని వ్యర్థాలను తిరిగి భూమిలో కలిపేస్తారు. ఇలా పట్టణంలో 12 వేల టన్నుల వరకు వ్యర్థాలను విభజించాలి. ప్రస్తుతం సేకరిస్తున్న చెత్తలో 20 శాతమే(ప్లాస్టిక్ వంటివి) తిరిగి ఉపయోగానికి పనికి వస్తున్నాయి. మిగిలిన 80 శాతం మళ్లీ భూమిలో కలిపేయాల్సి వస్తోంది. మిగిలిన వ్యర్థాలన్నీ మళ్లీ అక్కడే.. ఇప్పటికే డంపింగ్యార్డు సమస్య చాలా కాలంగా ఉంది. పట్టణ శివారు రాయగడ రోడ్డు పక్కనే గుట్టల మాదిరి చెత్త పోగవుతోంది. రహదారిపైకే వస్తోంది. డంపింగ్ యార్డు సమీప స్థలంలోనే చెత్తశుద్ధి నిర్వహణ యంత్రాలున్నాయి. శుద్ధి చేయగా మిగిలిన 80 శాతం వ్యర్థాలను రహదారికి మరోవైపునే కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు పడేస్తున్నారు. దీంతో అదో పెద్ద కొండ మాదిరి తయారై..అటుగా ప్రధాన రహదారిపైకి వస్తోంది. రెండు వ్యర్థాలూ కలిసి అటుగా ప్రయాణించే వారికి నరకం చూపుతున్నాయి. ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇది చాలదన్నట్లు.. చెత్తశుద్ధి నిర్వహణ తర్వాత మిగిలిన వ్యర్థాలను పట్టణంలోని నెల్లి చెరువులో కలిపేయడానికి నిశ్చయించుకున్నారు. ఇప్పటికే నెల్లి చెరువు దురాక్రమణలో ఉంది. జిల్లా కేంద్రం నడిబొడ్డున 11.54 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ చెరువు ఆక్రమణల తర్వాత బక్కచిక్కి ఐదెకరాలకే పరిమితమైంది. ఇప్పటికీ ఆక్రమణలు ఆగడం లేదు. ఇప్పుడు చెత్తశుద్ధి వ్యర్థాలన్నింటినీ నెల్లి చెరువులో కలిపేయాలని కాంట్రాక్ట్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. దీనివల్ల చెరువు పూర్తిగా చదును అయిపోతుందని, నామరూపాలు లేకుండా పోతుందని.. ఆక్రమణలు మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకేంద్రంలో కానరాని చెత్తశుద్ధి రహదారిపైనే వ్యర్థాల ‘డంపింగ్ పార్వతీపురం–రాయగడ రోడ్డులో పేరుకుపోతున్న గుట్టలు జిల్లా కేంద్రంలోని నెల్లి చెరువులోనూ పారబోసేందుకు ప్రయత్నాలు అడ్డుకున్న స్థానికులు బెదిరింపులకు దిగిన అధికారులు -
రెండు రోజుల్లో స్థలం మొత్తం కొలతలు వేస్తాం
వీరఘట్టం పట్టణంలోని గాసీవీధికి మేధరివీధి మధ్యలో ఉన్న స్థలం వద్ద గత కొద్ది రోజులుగా తగాదాలు జరుగుతున్నట్టు సమాచారం వచ్చింది. తమ సిబ్బందిని పంపించి స్థలాన్ని పరిశీలించాం. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 304లో 2.06 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అది గతంలో శ్మశానవాటిక స్థలం. ప్రస్తుతం ఇక్కడ వెల్నెస్ సెంటర్ కడుతున్నారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో కొలతలు వేసి ప్రభుత్వ భూమి ఎంత ఉందో గుర్తిస్తాం. ఆక్రమణలు ఉంటే తొలగిస్తాం. ఇక్కడ ప్రవేటు వ్యక్తులు ఎవరికీ సెంటు భూమి కూడా ఇవ్వలేదు. ఇక్కడ స్థలాన్ని ఎవరైనా అమ్మాలని చూసినా, కొనాలని చూసినా శిక్షార్హులు అవుతారు. దళారుల మాయమాటలు నమ్మవద్దు. – ఏ.ఎస్.కామేశ్వరరావు, తహసీల్దార్, వీరఘట్టం ● -
రోగులకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
సీతంపేట: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి సూచించారు. సీతంపేట ఏరియా ఆస్పత్రిని ఆయన సందర్శించారు. అక్కడికి వచ్చిన రోగులతో మాట్లాడి.. వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రోగులు క్యూలో నిల్చోకుండా బెంచీలు ఏర్పాటు చేయాలని వైద్యసిబ్బందికి సూచించారు. నడవలేని స్థితిలో ఉన్న వారికి వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలన్నారు. వారికి సాయం అందించడానికి హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవకుల సంఖ్య పెంచాలన్నారు. కార్యక్రమంలో జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్, ఏపీఓ చిన్నబాబు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, తహసీల్దార్ డి.శ్రీకన్య, సూపరిండెంటెంట్ బి.శ్రీనివాసరావు, ఆర్ఎంఓ డి.వి.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మురిపించిన మారుజాతర
● పోలమాంబ దర్శనానికి బారులు మక్కువ: జై..పోలమాంబ..జైజై పోలమాంబ అంటూ భక్తులు చేసిన నినాదాలతో శంబర పులకించింది. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి మారుజాతర మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజామునుంచి ఇతర జిల్లాలు, మండలాల నుంచి వేలాదిమంది భక్తులు శంబర గ్రామానికి చేరుకోగా దారులన్నీ రద్దీగా మారాయి. చదురుగుడిలో కొలువైన శంబర పోలమాంబ అమ్మవారిని, వనంగుడిలో కొలువైన పెదపోలమాంబ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయం వెనుకున ఉన్న వేపచెట్టు వద్ద భక్తులు దీప,ధూప నైవేద్యాలు సమర్పించారు. మొక్కుబడులు చెల్లించిన భక్తులు చదురుగుడి, వనంగుడి, గోముఖి నది ఒడ్డున భక్తులు అమ్మవారికి కోళ్లు, మేకలు, చీరలు మొక్కుబడులు చెల్లించుకున్నారు. చిన్నారులు తలనీలాలు సమర్పించుకున్నారు. పలువురు భక్తులు చీపుళ్లతో రహదారులను శుభ్రపరుస్తూ మొక్కుబడులు చెల్లించుకోగా, మరికొంతమంది భక్తులు ఘటాలను అమ్మవారికి సమర్పించుకున్నారు. ఎండలో అమ్మదర్శనానికి వేచి ఉన్న భక్తులు పోలమాంబ అమ్మవారి దర్శనానికి వేలాదిమంది భక్తులు ఉదయం 10గంటల తరువాత ఒక్కసారిగా చేరుకోవడంతో, క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆరుబయట ఎండలో భక్తులు వేచిచూశారు. రద్దీ ఎక్కువగా ఉన్న కారణంతో, భక్తులు అత్యధికంగా రూ.100 దర్శనం టిక్కెట్ క్యూ వద్దకు చేరుకోవడంతో, స్వల్ప తోపులాటల మధ్య భక్తులు అమ్మదర్శనానికి చేరుకున్నారు. సాలూరు సీఐ రామకృష్ణ వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులను దర్శనానికి పంపించారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అమ్మవారి దర్శనానికి రావడంతో, సుమారు అరగంటపాటు భక్తులు ఇబ్బందులు పడ్డారు. గ్రామంలోని ప్రధానరహదారి వద్దనున్న సిరిమాను కర్రకు భక్తులు పూజలు చేశారు. శ్రీకాకుళం జిల్లా మురపాక గ్రామానికి చెందిన భజనబృందం సభ్యులు చదురుగుడి క్యూ వద్ద భజనకీర్తనలు ఆలపించారు. అమ్మ సేవకులు క్యూల వద్ద భక్తులుకు మంచినీటిని సరఫరా చేశారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చిన్నారులకు పాలు, ఉచిత ప్రసాదం పంపిణీ చేశారు. జాతరకొచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీఐ రామకృష్ణ, ఈవో బి.శ్రీనివాస్, ట్రస్ట్బోర్డు చైర్మన్ నైధాన చినతిరుపతి, కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు. -
ఉన్నది 50 సెంట్లు
రికార్డుల్లో 2.06 ఎకరాలు..● వీరఘట్టంలో ప్రభుత్వ భూమి కబ్జా ● ఆక్రమణలు తొలగించేందుకు యంత్రాంగం సన్నద్ధం ఈ చిత్రంలో కనిపిస్తున్నది వీరఘట్టం మేజర్ పంచాయతీలోని గాసీవీధికి–మేదరి వీధికి మధ్యలో సర్వే నంబర్ 304లో ఉన్న ప్రభుత్వ స్థలం. పూర్వకాలంలో ఇది శ్మశాన వాటిక. 2.06 ఎకరాల్లో ఈ భూమి ఉన్నట్టు రెవెన్యూ రికార్డులో నమోదై ఉంది. ప్రస్తుతం ఇక్కడ అంత భూమి లేదు. 50 సెంట్లు మాత్రమే ఉంటుంది. ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వీరఘట్టం: వీరఘట్టం మేజర్ పంచాయతీలోని సర్వే నంబర్ 304లో ఉన్న స్థలంలో పలు ప్రభుత్వ భవనాలను నిర్మించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్థలాలను కేటాయించారు. వెల్నెస్ సెంటర్కు మంజూరైన రూ.36లక్షలతో భవన నిర్మాణాన్ని ఇటీవల చేపట్టారు. ఇదే అదునుగా ఆ స్థలం తమదంటే తమదంటూ కొందరు చదును చేయడం ప్రారంభించారు. రూ.కోట్లు విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది దళారులు పావులు కదుపుతున్నారు. గతంలో ఈ స్థలాన్ని తమకు ఇచ్చేశారంటూ పలు సామాజిక వర్గాల వారు తగాదాలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని మంగళవారం పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సర్వే నంబర్ 304లో 2.06 ఎకరాల్లో శ్మశానవాటిక ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. క్షేత్రస్థాయిలో మాత్రం కేవలం 50 సెంట్లు భూమి మాత్రమే ఉంది. మిగిలిన భూమిని కొత్తగా వేసిన రియల్ ఎస్టేట్లో కలిపేశారా... లేదంటే స్థలం పక్క ఉన్నవారు కలిపేశారా అన్న కోణంలో రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేస్తు న్నారు. ఆక్రమణలు తొలగిస్తామని స్పష్టంచేశారు. -
ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమా?
● ప్రభుత్వతీరుపై సచివాలయ ఉద్యోగుల ఆందోళన విజయనగరం గంటస్తంభం: చంద్రబాబు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. పరిమితిలేని పని గంటలు అప్పగిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతోందని పలువురు ఉద్యోగులు వాపోయారు. సచివాలయాల్లో పనిఒత్తిడిని తట్టుకోలేక, ఇతర కారణాలతో బలవంతపు మరణాలకు గురైన ఉద్యోగులను స్మరిస్తూ ఏపీఎన్జీఓ హోమ్లో సోమవారం కొవ్వొ త్తులు వెలిగించి నివాళులర్పించారు. మృతికి కారణమైన ప్రభుత్వ విధానాలపై డీయూ సేవ (డిస్ట్రిక్ అర్బన్ సచివాలయం ఎంప్లాయీస్ విజయనగరం అసోసియేషన్) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు పలువురు మాట్లాడుతూ సర్వేలు, ప్రత్యేక డ్యూటీలు, సంబంధం లేని శాఖల పనులు, మొబైల్ యాప్స్ భారం వల్ల సచివాలయ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారన్నారు. ఉద్యోగుల సమ యం పూర్తయిన తరువాత కూడా పనిచేయాల్సి రావడం వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొందని, ఈ ఒత్తిడి కారణంగా హార్ట్ స్ట్రోక్లు, మానసిక రుగ్మతలకు ఉద్యోగులు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పని ఒత్తిడితో మరణించిన సచివాలయ ఉద్యోగులకు కనీస బెనిఫిట్స్ లేకపోవడం అత్యంత అమానుషమన్నారు. జీవించే హక్కు మాకు ఉందని, ఛిదిమేసే హక్కు మీకు ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. ఉద్యోగులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బలవంతపు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. -
భారీగా బంగారం చోరీ
రాజాం: రాజాంలోని జీఎంఆర్ఐటీ క్వార్టర్స్లో ఆదివారం రాత్రి భారీగా బంగారం చోరీ జరిగింది. ప్రొఫెషనల్ దొంగలు ఈ చోరీకి పాల్పడి రెండిళ్లలోని బంగారం, వెండి పట్టుకుపోయారు. ఎటువంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తలు పడడంతో ఈ దొంగతనం ప్రొఫెషనల్ దొంగల ముఠాదిగా పోలీసులు భావిస్తున్నారు. ఒకచోట 1250 గ్రాములు, మరో చోట 291 గ్రాముల బంగారంతో పాటు కిలో వెండిని అపహరించుకుపోయారు. ఈ చోరీలపై పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఇంట్లో.. రాజాం జీఎంఆర్కేర్ ఆస్పత్రిలో చిల్ట్రన్ స్పెషలిస్ట్గా వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్ వీడీ నగేష్ జీఎంఆర్ఐటీ కాలేజీలోని రస బ్లాక్లోని క్వార్టర్స్లో ఉంటున్నారు. ఆయన ఆదివారం విశాఖపట్నం వెళ్లి సోమవారం ఉదయం తిరిగి వచ్చారు. ఇంటి తలుపులు తెరుస్తుండగా అప్పటికే తలుపు తెరిచి ఉండడంతో అనుమానంతో వెంటనే బెడ్రూమ్లోని బీరువాను చూడగా, బీరువా తెరిచి ఉండడంతో పాటు పలురకాల వస్తుసామగ్రి చెల్లాచెదురుగా పడిఉండడంతో ఇంట్లో దొంగలుపడినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర, సంతకవిటి ఎస్సై గోపాలరావులు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆరాతీశారు. తన బీరువాలో భద్రపరిచిన 1250 గ్రాముల బంగారం(106 తులాలు)తో పాటు కిలో వెండి దొంగతనానికి గురైనట్లు డాక్టర్ వీడీ నగేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయనగరం నుంచి డాగ్ స్క్వాడ్తో పాటు ఫింగర్ ఫ్రింట్ సీఐ మురళీమోన్, క్లూస్ టీం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్స్ నమోదుచేయడంతో పాటు క్వార్టర్స్లో పనిచేస్తున్న సిబ్బందిని, చుట్టుపక్కల వారిని వివరాలు అడిగితెలుసుకున్నారు. డాక్టర్ నగేష్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఆ ఇంట్లో రూ. 2 కోట్లు విలువచేసే 1250 గ్రాముల బంగారంతో పాటు రూ. 50 లక్షలు విలువచేసే కిలో వెండి పోయినట్లు గుర్తించి కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో మరో చోరీ ఫిర్యాదు.. డాక్టర్ నగేష్ ఇంటి వద్ద దొంగతనానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించకముందే పక్కనే ఉన్న లయ బ్లాక్లో కూడా చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదువచ్చింది. ఆ బ్లాక్లో నివాసముంటున్న జీఎంఆర్ఐటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జి.మాధవకృష్ణారెడ్డి తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందించారు. తాను ఆదివారం పాలకొండ వెళ్లానని, పక్క బ్లాక్లో దొంగతనం జరిగిందని తెలిసి హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా తన ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్లు గుర్తించానని వెల్లడించారు. తన బీరువాలో భద్రపరిచిన 291 గ్రాముల బంగారాన్ని(25 తులాలు) దొంగలు పట్టుకుపోయినట్లు బాధితుడు ఫిర్యాదుచేశాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ ఈ విషయం ఎస్పీ ఏఆర్ దామోదర్కు తెలియడంతో ఆయన హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. ప్రొఫెసర్ ఇంటి బ్లాక్ వద్ద సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆ కెమెరాల్లో ముగ్గురు దొంగలు చోరీకి వచ్చినట్లు గుర్తించారు. ఈ బ్లాక్ల పక్కనే ఉన్న ప్రహరీ నుంచి వారు లోపలకు చొరబడి చోరీకి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ప్రొఫెషనల్స్గా అనుమానిస్తున్నాం.. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ విలేకరులతో మాట్లాడుతూ జీఎంఆర్ఐటీ క్వార్టర్స్లో జరిగిన చోరీకి సంబంధించి దొంగలు ఎటువంటి ఆనవాళ్లు లేకుండా జాగ్రత్తపడ్డారన్నారు. చేతులకు గ్లౌజులు పెట్టి చోరీకి పాల్పడ్డారని, ఆధారాలు లేకుండా జాగ్రత్తలు పాటించారని వెల్లడించారు. గతంలో దొంగతనాలకు పాల్పడి తెలివిగా తప్పించుకునే దొంగలముఠాకు చెందినవారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారన్నారు. వారు ఎక్కడ ఉన్నా పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. జీఎంఆర్ఐటీ క్వార్టర్స్లోని రెండిళ్లలో బంగారం అపహరణ ఒకచోట 1,250 గ్రాములు, మరో చోట 291 గ్రాముల బంగారం, కిలో వెండి కూడా మాయం సీసీఫుటేజీల్లో దొంగల జాడ రూ.3 కోట్ల మేర నష్టం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ దామోదర్ -
పీజీఆర్ఎస్కు పోటెత్తిన అర్జీదారులు
● 380 వినతుల స్వీకరణ ● వినతులు సకాలంలో పరిష్కరించాలి ● జేసీ సేతు మాధవన్విజయనగరం అర్బన్: ప్రజల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’(పీజీఆర్ఎస్), ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలకు భారీ స్పందన లభించినప్పటికీ, రెవెన్యూ శాఖ వైఫల్యాలు మరింత స్పష్టంగా బయటపడ్డాయి. సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ ఫిర్యాదులు, వినతులు సమర్పించారు. కలెక్టరేట్ ప్రాంగణం అంతా అర్జీదారులతో కిటకిటలాడింది. ఇది ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి, సమస్యల పరిష్కారంలో జాప్యం ఎంత తీవ్రంగా ఉన్నాయో సూచిస్తోంది. మొత్తం 380 వినతులు అందగా వాటిలో అత్యధికంగా దాదాపు 50 శాతం 188 వినతులు రెవెన్యూశాఖకు సంబంధించినవే ఉన్నాయి. భూముల మ్యుటేషన్లు, అడంగల్, వన్–బీ సర్టిఫికెట్లు, పట్టాదార్ పాస్బుక్లు, భూమి రికార్డుల సరిదిద్దులు వంటి సాధారణ రెవెన్యూ సమస్యలే ఈ వినతుల్లో ఎక్కువ భాగం ఆక్రమించాయి. మరో వైపు వాటిలో రీఓపెన్ వినతులు కూడా అధికంగానే ఉన్నాయి. అదేవిధంగా ఐటీ పార్కులు, పరిశ్రమలు అంటూ ఇష్టాను సారం భారీ విస్తీర్ణంలో భూముల సేకరణను వ్యతిరేకిస్తున్న రైతుల నుంచి వినతులున్నాయి. ఈ పరిస్థితి రెవెన్యూ విభాగంలోని పనితీరు, సమస్యల పరిష్కార వేగంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని స్పష్టం చేస్తోంది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించాలని ఆలస్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అన్ని శాఖలు ఈపీటీఎస్ పద్ధతిలో తమ రికార్డులు, ప్రొసీడింగ్స్, సర్క్యులర్లు, కోర్టు తీర్పులు, నోటీఫికేషన్లు, ప్రగతి సమాచారం వంటివి ప్రతిరోజూ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని శాఖలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖల వినతులు కూడా గణనీయంగా ఉన్నాయని, గ్రామ సచివాలయ శాఖకు 53, డీఆర్డీఏకు 48, పంచాయితీరాజ్కు 25 వినతులు అందాయి. 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వచ్చిన కాల్స్పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అర్జీదారులతో నేరుగా మాట్లాడిన తర్వాతే ఎండార్స్మెంట్ ఇవ్వాలని మాట్లాడిన తేదీ, సమయం రిపోర్టులో నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వినతులు స్వీకరణ ప్రక్రియలో డీఆర్ఓ ఈ.మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, శాంతి, ఆర్డీఓలు దాట్ల కీర్తి, సత్యవాణి, రామ్మోహనరావు, సీసీఓ పీ.బాలాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు. -
దేవుడా.. నీతోనే ఆటలా!
సాక్షి, పార్వతీపురం మన్యం: కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవం.. కలియుగ శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై చేస్తున్న దుష్ప్రచారం పరాకాష్టకు చేరింది. కూటమి నాయకులు ఆరోపించినట్లుగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఆనవాళ్లు లేవని సిట్ నిర్ధారించినప్పటికీ.. విష ప్రచారం ఆగడం లేదు. పార్వతీపురం జిల్లాకూ ఈ సంస్కృతి పాకింది. ఇన్నాళ్లూ నోటిమాట ద్వారానే తిరుమల లడ్డూకు అపఖ్యాతి ని తెచ్చారు. ఇప్పుడు మరో ముందుడుగు వేసి పార్వతీపురం పట్టణంలోని పలు రద్దీ కూడళ్లలో, భామిని వంటి మండల కేంద్రాల్లో సైతం పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, మత విద్వేషాలను రెచ్చ గొట్టేలా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వీటిని ఏర్పాటు చేయడం గమనార్హం. శ్రీనివాసుని లడ్డూ ప్రసాదంపై ఉన్న కళంకాన్ని పోగొట్టేలా ఇటీవల వైఎస్సార్సీపీ నాయకులు ‘పాప పరిహార పూజలు’ పేరిట వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం విదితమే. ఆ రెండు రోజులకే దీనికి కౌంటర్గా అన్నట్లు పార్వతీపురం పట్టణంలో హోర్డింగులు వెలిశాయి. ‘మహా పాపం నిజం.. అది నెయ్యే కాదు.. పామాయిల్, కెమికల్ కలిపిన ద్రవం’ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిల ఫొటోలను ముద్రించి తప్పుడు ప్రచారంతో ఈ హోర్డింగులు వెలిశాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే తరహా హోర్డింగులు వెలియడం వెనుక.. పెద్ద ఎత్తున దురుద్దేశం ఉన్నట్లు కనిపిస్తోంది. హిందువుల ఇష్టదైవం శ్రీనివాసుడు. స్వామి వారి లడ్డూ ప్రసాదం ఒక్కటి దొరికినా చాలు.. జన్మ ధన్యమని, మహా పుణ్యమని చాలా మంది భావిస్తారు. ఈ ప్రసాదం విషయంలో కల్తీ నెయ్యి కలిసిందంటూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విషప్రచారం చేస్తున్న విషయం విదితమే. అదే నిజమని భ్రమించేలా ఇప్పుడు ఏకంగా పెద్ద ఎత్తున హోర్డింగులు పెట్టడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. అల్లర్లు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ హోర్డింగులను కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పనిగట్టుకుని వ్యాపింపజేస్తుండడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అతి పవిత్రమైన తిరుమల లడ్డూ నెయ్యి అంశం పట్ల వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు ప్రచారాలు, అపవాదులతో కూడిన ఫ్లెక్సీల ప్రచారాన్ని పోలీసు అధికారులు అడ్డుకోవాలని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు కోరారు. పట్టణంలో వెలసిన హోర్డింగులపై తక్షణం తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ.. పార్వతీపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో పార్టీ నాయకులతో కలిసి ఆయన సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ నెయ్యి కల్తీ అంశంపై సిట్ ఛార్జిషీట్కు వ్యతిరేకంగా.. జగన్మోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి ఫొటోలతో తప్పుడు పోస్టర్లను ఏర్పాటు చేశారని వివరించారు. ప్రజలను రెచ్చగొడుతూ, శాంతిభద్రతలకు భంగం కలిగేలా వాటిని సామాజిక మాధ్యమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 18 నెలలుగా వంద కోట్ల మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే కాక, ఈ విషయంలో వైఎస్సార్సీపీ నాయకులను నిందితులుగా చిత్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ, సిట్ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ను పరిశీలిస్తే.. పేర్కొన్న వ్యక్తులపై ఎలాంటి నేరారోపణలు, పాత్ర నిర్ధారణ, బాధ్యత విధింపు లేనట్లు స్పష్టమవుతోందని చెప్పారు. సిట్ దర్యాప్తు పూర్తిగా ల్యాబ్ నివేదికలు, డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలు, పత్రాలు, చట్టబద్ధమైన సాక్ష్యాలపైనే సాగిందని తెలిపారు. రాజకీయ పార్టీలు, వ్యక్తుల ప్రమేయం ఉందని ఎక్కడా నిర్ధారించలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నాయకులు భారత న్యాయ సమితి చట్టాలకు విరుద్ధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని పోలీసుశాఖ అడ్డుకోవాలని కోరారు. ఫ్లెక్సీలను తొలగించి, కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతోపాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
వృద్ధుడి ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: స్థానిక ఇందిరా నగర్ లో ఏడు పదుల వయస్సున్న ఓ వృద్ధుడు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై విజయనగరం వన్ టౌన్ పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఇందిరానగర్ లో ఆర్కే సదన్ అపార్టెమెంట్ వాచ్మన్గా పనిచేస్తున్న అల్లు త్రినాథ్ (70) భార్య భవానీతో ఉంటున్నాడు. కొడుకు, కూతుళ్లకు పెళ్లిళ్లు చేసిన త్రినాథ్ ఆదివారం రాత్రి యాసిడ్ తాగేశాడు. గమనించిన భార్య హుటాహుటిన హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.లైంగిక దాడి కేసులో ముద్దాయికి 14 ఏళ్ల జైలు శిక్షవిజయనగరం క్రైమ్: 2021వ సంవత్సరంలో రామభద్రపురం పీఎస్ లో లైంగికదాడికి పాల్పడినట్లు నమోదైన కేసులో పాతరేగకు చెందిన ముద్దాయి గునపు సింహాద్రికి విజయనగరం మహిళా కోర్టు, 5వ ఏడీజే కోర్టు జడ్జి ఎన్.పద్మావతి 14 ఏళ్ల కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ ఏఆర్.దామోదర్ సోమవారం తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే పాతరేగకు చెందిన గునపు సింహాద్రి అదే గ్రామానికి చెందిన ఒక మహిళపై బలవంతంగా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రామభద్రపురం పోలీస్స్టేషన్ లో 2021లో అప్పటి ఎస్సై ఎస్.కృష్ణమూర్తి కేసు నమోదు చేశారు. అప్పటి సాలూరు రూరల్ సీఐ ఎల్.అప్పల నాయుడు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించి, నిందితుడిపై న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారు. కోర్టులో నిందితుడు గునపు సింహాద్రి నేరానికి పాల్పడినట్లు సాక్ష్యాలు నిరూపితం కావడంతో విజయనగరం మహిళా కోర్టు పై విధంగా తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. ఇద్దరికి గాయాలుపార్వతీపురం రూరల్: గరుగుబిల్లి మండలంలోని నందివానివలస సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు గాయపడ్డారు. గ్రామం నుంచి తమ టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై రైతులు పొలం పనులకు వెళ్తుండగా, వెనుక నుంచి వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. 2,407 లీటర్ల సారా ధ్వంసంపార్వతీపురం రూరల్: వివిధ కేసుల్లో పట్టుబడిన సుమారు 2,407.95 లీటర్ల సారాను స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో సోమవారం అధికారులు ధ్వంసం చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో, మధ్యవర్తుల సమక్షంలో ఈ సారాను పారబోసి నిర్వీర్యం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎ.సంతోష్ కుమార్, ఎకై ్సజ్ సీఐ ఎస్.శిరీష, తదితర సిబ్బంది పాల్గొన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీ విజయనగరం గంటస్తంభం: నగరంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ వారు సోమవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పీ4 కార్యక్రమంలో భాగంగా ఆ కుటుంబాన్ని ఫౌండేషన్ దత్తత తీసుకుని, వారి బాగోగులు చూసుకుంటుండడం గమనార్హం. ప్రతినెలా ఇలాగే ఆ కుటుంబానికి అవసరమైన బియ్యం, నూనె, పప్పుదినుసులు, కూరగాయలు వంటి నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు సాయికుమార్ తెలిపారు. ప్రత్యేక ఆధార్ కేంద్రాల ఏర్పాటు విజయనగరం టౌన్: ప్రజల సౌకర్యార్థం ఎంపిక చేసిన పలు ప్రదేశాల్లో ప్రత్యేక ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలందించడం జరుగుతోందని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో సోమవారం కోరారు. ఈ నెల 4వ తేదీ వరకు కంటోన్మెంట్ పరిధిలోని గీతాంజలి పాఠశాల, సిక్కుల గుడి వద్ద, 5 నుంచి 7వ తేదీ వరకు మయూరి జంక్షన్, ఆర్కే జూనియర్ కళాశాలల వద్ద, 9 నుంచి 11వ తేదీ వరకు కామాక్షి నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్ వద్ద ఆధార్ శిబిరాలు అందుబాటులో ఉంటాయన్నారు. కొత్త ఆధార్ కార్డులు కావాలన్నా, పాత ఆధార్ కార్డుల్లో తప్పులు సవరణ చేయాలన్నా ఆయా శిబిరాలను సంప్రదించాలన్నారు. -
వేంకటేశ్వర ఆలయ శతాబ్ది ఉత్సవాలకు సన్నాహాలు
పార్వతీపురం: బెలగాంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ శతాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్న ట్టు ఆలయ కమిటీ సభ్యులు యిండుపూరు గున్నేశ్వరరావు, పి.అప్పారావు తెలిపారు. ఆలయ ప్రాంగ ణంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేవస్థానం స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 22 నుంచి మే 1 వరకు వేదపండితుల ఆధ్వ ర్యంలో ఉత్సవాలు జరుపుతామన్నారు. ఇందులో భాగంగా 23, 24 తేదీల్లో చినజీయర్ స్వామి, 29న చాగంటి కోటేశ్వరరావు, 30న గరికిపాటి నర్సింహరావు, మే 1న పరిపూర్ణానంద స్వామి విచ్చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యు లు జగన్నాథం, కేవీఆర్ కృష్ణారావు, సీహెచ్ బాల గంగాదర్ తిలక్ రాయ్ పాల్గొన్నారు. -
81.90 కేజీల గంజాయి స్వాధీనం
చికెన్పూసపాటిరేగ: మండలంలోని గోవిందపురం విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో 81.90 కేజీలు గంజాయి, మూడు కార్లు, ఒక కంటైనర్ను సీజ్ చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు భోగాపురం రూరల్ సీఐ జి. రామకృష్ణ ఆదివారం తెలిపారు. ఈ ఘటనపై ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలోని సిమిలిగూడ నుంచి ఏడు బస్తాల్లో 81.90 కిలోలు గంజాయిని కంటైనర్లో తరలిస్తుండగా పోలీసులు వెంబడిస్తున్నారనే సమాచారంతో గోవిందపురం విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో కంటైనర్ నుంచి కారులోకి గంజాయిని ఎక్కిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామిలి జిల్లాకు చెందిన అక్రమ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లాకు చెందిన రాహుల్కుమార్, విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన మేడబోయిన తులసీదాస్లను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.4.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కార్యక్రమంలో ఎస్సై ఐ.దుర్గాప్రసాద్, ఏఎస్సై సురేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు. మూడు కార్లు, ఒక లారీ సీజ్ పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు కంటైనర్ నుంచి కారులోకి గంజాయి బస్తాలు మారుస్తుండగా పట్టివేత -
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యం
విజయనగరం క్రైమ్: శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యం కావాలని, యూనిఫాం ధరించిన తరువాత ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణకే పునరంకితం కావాలని ఏఆర్ పోలీస్ సిబ్బందికి ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. ఏఆర్ సిబ్బంది బలమైన శక్తిగా, మాతృశాఖకు వెన్నెముకగా నిలుస్తున్నారన్నారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం ప్రారంభించిన పోలీస్ పునశ్చరణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహించే తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. విధులను నిష్పక్షపాతంగా, అంకిత భావంతో నిర్వర్తించాలన్నారు. శారీరక దారుఢ్యం పెంచేందుకు, వివిధ ఆయుధాల ఉపయోగాలను, ముఖ్యమైన బందోబస్తులలో విధులను ఏవిధంగా నిర్వహించాలో శిక్షణ ఇస్తామన్నారు. ఫైరింగ్ ప్రాక్టీస్, బాంబు స్క్వాడ్, మస్కట్రీ శిక్షణ, అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్పై ప్రత్యేకంగా శిక్షణ అందించనున్నట్టు ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత పాల్గొన్నారు. -
కాళ్ల మీద నిలబడలేరు.. ఆదుకుంటే బతుకుతారు!
ఈ వ్యక్తి పేరు చప్ప గంగరాజు. బలిజిపేట మండ లం అజ్జాడ గ్రామం. ఏడాదిన్నర కింద ట అనారోగ్య సమ స్య కారణంగా కుడి కాలు తొలగించాల్సి వచ్చింది. అప్పటి నుంచి పనులకు వెళ్లడం కష్టంగా మారింది. భార్య కూలి పని చేస్తూ, కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తనకు పింఛన్ ఇస్తే ఆ మొత్తం కుటుంబానికి ఆసరాగా ఉంటుందని అధికారులకు అభ్యర్థించాడు. సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: ఎటువంటి ఆధారమూ లేక.. బతుకు సాగక.. ప్రభుత్వ సాయం కోసం పలువురు విధివంచితులు కలెక్టరేట్కు క్యూ కడుతున్నారు. పీజీఆర్ఎస్లో అధికారులను కలిస్తే న్యాయం జరుగుతుందని ఆశిస్తూ, వినతిపత్రాలు అందిస్తున్నారు. ప్రధానంగా పింఛన్ కోసమే ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. పార్వతీపురం కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన కొంతమంది బాధితుల ఆవేదన ఇదీ.. కొమరాడ మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన పాత గౌరీశంకరరావు సికిల్సెల్ ఎనీమియాతో బాధ పడుతున్నాడు. ఆయన పెద్ద కుమార్తె జశ్విత(7) కూడా పక్షవాతం, సికిల్సెల్, మాటలు రాకపోవడం వంటి సమస్యలతోనూ.. రెండో కుమార్తె రుచిత సికిల్సెల్ ట్రయిట్ అనే వ్యాధితోనూ బాధ పడుతోంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఈయనకు ఎటువంటి ఆధార మూ లేదు. వైద్యం కోసం చాలా ఖర్చు చేయా ల్సి వస్తోంది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. కనీసం రుణం ఇప్పించి, స్వయం ఉపాధి కి మార్గం చూపాలని పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందించాడు. ఈమె పేరు గౌరమ్మ. జియ్యమ్మవ లస మండలం పిప్పలభద్ర గ్రామం. భర్త ఆదినాయుడు 2024 సంవత్సరంలో మృతి చెందారు. అప్పటి నుంచి జీవనాధారం లేని ఆమె.. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉంది. నేటికీ మంజూరు కాకపోవడంతో.. జీవనం దుర్భరంగా ఉందని, అధికారులు దయ తలచాలని వేడుకుంటోంది. జియ్యమ్మవలస గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి అప్పలనాయుడు పదేళ్లుగా కేన్సర్తో పోరాడుతున్నాడు. చికిత్స నిమి త్తం చాలా వరకు ఖర్చయింది. తనకు పెన్షన్ ఇస్తే.. కాస్తయినా చేదోడుగా ఉంటుందని ఆశిస్తున్నాడు. అధికారులు కనికరం చూపి, పింఛన్ వచ్చే మార్గం చూడాలని వేడుకుంటున్నాడు. ఈ చిత్రంలోని అక్కాతమ్ముళ పేర్లు భోగి వెంకటరత్నం, శ్రీకాంత్. ఇద్దరూ దివ్యాంగులే. 90 శాతం వరకు వికలాంగత్వం ఉంది. స్వతహా గా ఏ పనులూ చేసుకోలేరు. మరొకరి తోడు ఉంటే గానీ బయటకు రాలేరు. తమ్ముడు భోగి శ్రీకాంత్.. అధిక బరువు కారణంగా నలుగురు పట్టుకుని ఎత్తితే గానీ అవ్వదు. వీరికి రూ.6 వేల పింఛన్ వస్తోంది. వైద్యశాఖ అందించే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. విశాఖ కేజీహెచ్కు వెళ్లి సర్టిఫికెట్ తీసుకురావాలని చెబుతున్నారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని, మొత్తం పెంచా లని వేడుకుంటున్నారు. -
మహిళలు, చిన్నారుల సంరక్షణకు చర్యలు
పార్వతీపురం: బాల్యవివాహాల రహిత జిల్లాగా మార్చేందుకు మహిళా సంరక్షణ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లో జిల్ల్లాలోని అన్ని సచివాలయాల మహిళా పోలీసులకు సోమవారం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలోని మహిళలు, చిన్నారుల భద్రతను పర్యవేక్షించాలన్నారు. మహిళలపై వేధింపులు, గృహహింస వంటి కేసుల్లో బాధితులకు అండగా ఉండాలన్నారు. సైబర్ నేరాలు, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బాలికల సంరక్షణ విషయంలో రాజీపడకుండా మహిళా పోలీసులు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, ఏఎస్పీ వి.మనీషారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
● కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డిపార్వతీపురం రూరల్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్జీదారులు సంతృప్తి చెందేలా శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులు పెండింగ్లో ఉండకూడదని, గడువు ముగియక ముందే సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఒకవేళ వినతులను తిరస్కరించాల్సి వస్తే, అందుకు గల సరైన కారణాలను బాధితులకు లిఖితపూర్వక సమాచారం ద్వారా తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా మొత్తం 143 దరఖాస్తులు అందగా, అందులో 91 రెవెన్యూ విభాగానికి చెందినవి కాగా, 52 సాధారణ దరఖాస్తులు ఉన్నాయి. వీరఘట్టం మండలం కూరాకుల వీధి అంగనన్వాడీ కేంద్రంలో విధులకు ఆటంకం, మెనూ అమలులో వైఫల్యంపై బాలింతలు ఫిర్యాదు చేయగా..కురుపాం గ్రీన్ అంబాసిడర్లు తమ 11 నెలల బకాయి వేతనాల కోసం విన్నవించుకున్నారు. ఉపాధి అవకాశాలు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు, లోన్ల మంజూరుతో పాటు తోటపల్లి బ్యారేజీ నిర్వాసితుల నష్టపరిహారం, భూ ఆక్రమణలు, రీ–సర్వేలో తప్పుల సవరణపై పలువురు కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. బాధితులకు భరోసా..సమస్యలకు పరిష్కారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ బాధితులకు కొండంత అండగా నిలిచింది. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి స్వయంగా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ఫిర్యాదుదారులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, వేధింపులు, అలాగే ఆన్లైన్ మోసాలకు సంబంధించి మొత్తం 16 ఫిర్యాదులు అందాయి. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ..అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదుల పూర్వాపరాలను ఆరా తీసి, బాధితులకు చట్ట పరిధిలో తక్షణమే న్యాయం చేయాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, తీసుకున్న చర్యలపై నివేదికను సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ గోడును నేరుగా పోలీసు ఉన్నతాధికారులకు వివరించేందుకు ఈ వేదిక ఒక చక్కని అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ డీఎస్పీ రాంబాబు, డీసీఆర్బీ సీఐ ఆదాం, సిబ్బంది పాల్గొన్నారు. -
శివరాత్రి ఉత్సవాలకు క్యూలు పటిష్టంగా ఉండాలి
● దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శోభారాణి నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 15 నుంచి జరగనున్న శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) కె.శోభారాణి ఆదేశించారు. రామతీర్థంలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ ఉత్సవాల్లో ఎటువంటి తోపులాటలకు ఆస్కారం ఉండకూడదన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని క్యూలను పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు దర్శనానికి వెళ్లే మార్గంతో పాటు దర్శనం అనంతరం వచ్చే మార్గం వేర్వేరుగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆలయ ప్రాంగణంలో ఎటువంటి తాత్కాలిక షాపులు లేకుండా చూసుకోవాలని, అడ్డుగా ఉండే వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. దేవస్థానం పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉండాలని కోరారు. భక్తుల రద్దీ ఒకే చోట ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసి రన్నింగ్ వాటర్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఈఓలు వై.శ్రీనివాసరావు, ప్రసాదరావు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. -
సీతం కళాశాలకు ఐఎస్ఓ సర్టిఫికేషన్
విజయనగరం అర్బన్: పట్టణంలోని సీతం కళాశాలకు ఐఎస్ఓ సర్టిఫికేషన్ లభించింది. ఈ గౌరవప్రదమైన సర్టిఫికెట్ను సోమవారం జేఎన్టీయూ జీవీ ప్రొఫెసర్ వీవీసుబ్బారావు చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి, వైస్ప్రిన్సిపాల్ సీహెచ్వెంకటలక్ష్మి అందుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సీతం కళాశాల మరిన్న విజయాలను సాధించి, మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఐఎస్ఓ ప్రమాణాలకు అనుగుణంగా కళాశాల పనిచేస్తున్నట్లు ఇది సానుకూల సూచన అని డేటా సమగ్రత, నిజాయితీ, నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండడం కళాశాల బలమని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ విజయాన్ని సాధించిన కళాశాల బృందాన్ని డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు అభినందించారు. -
పోలమాంబ మారుజాతరకు పూర్తికావచ్చిన ఏర్పాట్లు
● 15వేలు లడ్డూ ప్రసాదం తయారీ ● 30మంది దేవాదాయసిబ్బంది ● 170మందితో పోలీస్ బందోబస్తుమక్కువ: ఉత్తరాంఽధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి మారుజాతర నేడు జరగనుంది. జాతరకొచ్చే భక్తుల సౌకర్యార్థం ఈవో బి.శ్రీనివాస్, ట్రస్ట్బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. జాతరలో భక్తుల అవసరార్థం 15వేల లడ్డూప్రసాదాన్ని దేవాదాయశాఖ తయారుచేయించింది. అవసరమైన మేరకు పులిహోర భక్తులకు అందించనున్నట్లు ఈవో తెలిపారు. జాతరకొచ్చే భక్తులకు సేవలందించేందుకు 30మంది దేవాదాయశాఖ సిబ్బంది శంబర గ్రామానికి చేరుకున్నారు. హెల్మెట్ ధరించి జాతరకు రావాలి ద్విచక్రవాహనాలపై జాతరకు చేరుకునే భక్తులు తప్పక హెల్మెట్ ధరించాలని సీఐ రామకృష్ణ భక్తులకు విజ్ఞప్తి చేశారు. జాతరలో 170మంది పోలీస్బందోబస్తు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్యంతాగి ఆలయానికి రావద్దన్నారు. ఎటువంటి గొడవలకు తావివ్వకుండా, ఆధ్యాత్మిక భావనతో భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని దర్శించుకోవాలని సూచించారు. -
కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ లక్ష్యం
● వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శృంగవరపుకోట: రాష్ట్రంలో మూత్రపిండ వ్యాధి గ్రస్థులకు ఉచిత డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎస్.కోటలో 100పడకల ప్రభుత్వాస్పత్రి అదనపు భవనాలను, డయాలసిస్ కేంద్రాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే లలితకుమారిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డయాలసిస్ రోగులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందివ్వడం కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సీహెచ్సీలో పూర్తిస్థాయి వైద్యం అందివ్వాలని ఆరు నెలల్లో పెండింగ్ పనులు పూర్తి చేసి మంచి వైద్యం అందించేందుకు ప్రభుత్వం పనిచేసిందన్నారు. మెరుగైన ఆరోగ్యసేవలు ఇవ్వాలని ఎన్సీడీ హెల్త్ కాంపులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ తన అభ్యర్థనను మన్నించిన ఆరోగ్యశాఖ మంత్రి ఆస్పత్రి పూర్తికావడానికి సహకారం అందించారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, ఆర్డీవో కీర్తి, దాసరి కార్పొరేషన్ చైర్మన్ పీవీ రత్నాజీ, జనసేన ఇన్చార్జ్ ఒబ్బిన సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ సీహెచ్.మల్లునాయుడు, బీజేపీ నేత రాకేష్ వర్మ, రెడ్డి పావని, డోకుల అచ్చింనాయుడు, కె.ఈశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్, పీఏసీఎస్ చైర్మన్ జీఎస్.నాయుడు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం.శ్రీలక్ష్మి, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్లు ఎన్.రమణాజీ, జి.బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఎవరిదీ పాపం..?
పార్వతీపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, మున్సిపల్ కార్యాలయ ఏరియాల్లోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో పెద్ద స్థాయిలో ఈ హోర్డింగులను ఏర్పాటు చేశారు. దీనిపై పేరు, ఊరు ముద్రించనప్పటికీ.. కూటమి పార్టీలు, ముఖ్యంగా టీడీపీ నాయకుల పనేనని ప్రజలంతా అనుమానిస్తున్నారు. జన సంచారం అధికంగా ఉన్న రద్దీ కూడళ్లలో.. మున్సిపల్ అధికారులకు తెలియకుండా, ప్రజలను రెచ్చగొట్టేలా భారీ స్థాయిలో హోర్డింగులు ఏర్పాటు చేసే ధైర్యం ఎవరికి ఉంటుందని.. అధికార పార్టీ అండతోనే ఇవి వెలిశాయని అంటున్నారు. కోట్లాది మంది మహా ప్రసాదంగా భావించే తిరుమల లడ్డూ విషయంలో విష ప్రచారం చేస్తూ.. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వెలిసిన ఈ హోర్డింగులపై మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లు వదిలేయడం గమనార్హం. -
ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభం
సీతంపేట: సీతంపేట ఏరియా ఆస్పత్రిలో సోమవారం నుంచి కిడ్నీ రోగులకు డయాలసి స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వర్చువల్ పద్ధతిలో ప్రారంభమైన ఈ సేవలను డీసీహెచ్ఎస్ నాగభూషణ్, డీఎంహెచ్ఓ భాస్కరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఇది మూడో డయాలిసిస్ కేంద్రం అన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రం పార్వతీపురం, పాలకొండ ఏరియా ఆస్పత్రిలో ఈ సేవలు రోగులకు అందుతున్నాయన్నారు. ఇక్కడకు ఇప్పటి వరకు ఆరుగురు పేషెంట్లు పేర్లు నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతానికి ఐదుబెడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయ పార్వతి, సూపరిండెంటెంట్ బి.శ్రీనివాసరావు, ఆర్ఎంఓ డీవీ శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పార్వతీపురం: జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కీలకమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్జర్వేటివ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లా డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి సకాలంలో రుణాలు అందించాలన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే ముద్రా రుణ దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ సోమశేఖర్ మాట్లాడుతూ.. జిల్లాలోని బ్యాంకుల సీడీ రేషి యో సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రాధాన్య త రంగాలకు రుణాలు అందించడంలో బ్యాంకులు ముందంజలో ఉన్నాయని వివరించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు ఈ నెల 15వ తేదీలోగా క్లియర్ చేస్తామన్నారు. పార్వతీపురం: జంతువుల సంరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జంతు హింస నివారణ సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పశువులను నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో కిక్కిరిసి తరలించడం చట్టరీత్యా నేరమన్నారు. అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెంచాలన్నారు. జంతుహింస నివారణ చట్టం–1960పై ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో అనాథగా తిరుగుతున్న, గాయపడిన జంతువుల సంరక్షణ కోసం ప్రత్యేక షెల్టర్ హోమ్లను ఏర్పాటు చేయాలని పశుసంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పశు సంవర్థకశాఖ అధికారి మన్మథరావు, తదితరులు పాల్గొన్నారు. నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో స్వామి వారి తిరుక్కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి సోమవారం పుష్పార్చన సేవను వైభవంగా నిర్వహించారు. శ్రీరామచంద్రస్వామిని వివిధ రకాల పుష్ఫాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక మండపంలో ఉత్సవ విగ్రహాలను ఆసీనులుచేసి పుష్పాలతో అర్చనలు చేశారు. ద్వాదశ ఆరాధన, సప్తావరణ సేవ జరిపించారు. -
● నిరాశ మిగిల్చిన నిర్మలమ్మ పద్దు
● మన్యంలో రైల్వే సమస్యలకు పరిష్కారం చూపుతారని ఆశించిన ప్రజలకు మరోసారి ఉత్తిచేయి చూపారు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, మౌలిక వసతులు, ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు ఊసు లేకపోయింది. బడ్జెట్లో కేటాయించిన నిధులతో కొత్త లైన్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందో, లేదో చూడాలి. గుణుపూర్ నుంచి సాలూరు మీదుగా నర్సీపట్నం రైల్వే లైన్ ఏర్పాటుకు ఈసారీ ఎర్రజెండానే పడింది. గుణుపూర్ నుంచి జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పార్వతీపురం, సాలూరు, పాచిపెంట మీదుగా అరకు వెళ్లే రైలు రోడ్డు వేయాలని ఎప్పటినుంచో కోరుతున్నా ప్రయోజనం లేకపోయింది. సాలూరు–విశాఖ ప్రత్యేక రైలు ఆశలు కూడా నీరుగారిపోయాయి. పార్వతీపురం పట్టణ రైల్వేస్టేషన్(కొత్తవలస) ఆధునికీకరణకు హామీ లభించలేదు. బెలగాం, కొమరాడ ప్రాంతాల్లోని రైల్వే గేటుల వద్ద నిత్యం ట్రాఫిక్తో ఇబ్బంది ఎదురవుతోంది. ఇక్కడ ఆర్ఓబీలు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. వారి డిమాండ్ ఈసారి నెరవేరేలా లేదు.● జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం కరువైంది. గతంలో ఏఐబీపీ స్కీమ్ కింద తోటపల్లి ప్రాజెక్టుకు సుమారు రూ.100 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఆ తరహా గ్రాంట్ను పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల తోటపల్లి, జంఝావతి వంటి ప్రాజెక్టులకు కేంద్రం తరఫున ఒక్క రూపాయి కూడా అందని పరిస్థితి. ఇటు కేంద్రం పట్టించుకోకపోవడం.. అటు రాష్ట్రంలోనూ చంద్రబాబు ప్రభుత్వం కూడా దృష్టి సారించకపోవడంతో జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయి. ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన స్పెషల్ ప్యాకేజీ ఊసు లేదు. దీనివల్ల వెనుకబడిన గిరిజన ప్రాంతమైన మన్యం జిల్లాకు రిక్తహస్తమే మిగులుతోంది. జిల్లాలో జాతీయ రహదారి పరిధి తక్కువ. కేవలం రాజాపులోవ నుంచి విజయనగరం, రామభద్రపురం, సాలూరు మీదుగా జైపూర్ వెళ్లే జాతీయ రహదారిని పూర్తి చేయగలిగారు. అంతర్రాష్ట్ర రహదారి అయినప్పటికీ.. పార్వతీపురం, పాలకొండవైపు జాతీయ రహదారి ప్రకటన లేకపోవడం జిల్లావాసులను నిరాశకు గురి చేసింది. శ్రీకాకుళంలోని చిలకపాలెం జాతీయ రహదారి నుంచి రాజాం, రామభద్రపురం మీదుగా బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లినా బుట్టదాఖలే అయ్యాయి. -
ఘనంగా కనికరమాత యాత్ర
● వేలాదిగా తరలివచ్చిన భక్తులు ● ముగిసిన నవీనా ప్రార్థనలు కొత్తవలస: మండలంలోని కొండడాబాల వద్ద ఉన్న వ్యాకులమాత యాత్ర మహోత్సవం ఆదివారం భక్తుల కోలాహలం మధ్య ఘనంగా నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆలయానికి 133 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏటా ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం నిర్వహించే ఈ యాత్రకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలనుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ చర్చిలో 1914వ సంవత్సరంలో ఫారిస్ నుంచి తీసుకొచ్చి ప్రతిష్టించిన వ్యాకులమాత ప్రతిమను కుల మతాలకు అతీతంగా ఆరాధించడం ఇక్కడ ప్రత్యేకత. ముగిసిన ప్రార్థనలు ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సోయగాల నడుమ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న కొండపై గడిచిన తొమ్మిది రోజులుగా ఫాదర్ గొంగాడ రాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రార్థనలు శనివారం రాత్రి ముగిశాయి. కనికరమాతను ప్రత్యేక పల్లకిలో ఉంచి క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. విశాఖపట్నంలోని జ్ఞానాపురం అతిమేత్రాణులు డాక్టర్ మల్లవరపు ప్రకాష్ ఆధ్వర్యంలో పలువురు విచారణ కర్తలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పటిష్టమైన బందోబస్తు యాత్రకు వేలాది మంది తరలి రావడంతో ఎటువంటి లవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలో సీఐ సీహెచ్.షణ్ముఖరావు పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. అలాగే భక్తుల రాకపోకలకు సింహాచలం, మద్దిలపాలెం ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యే సర్వీసులు నడిపారు. -
తపాలా ఉద్యోగుల సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తాం
విజయనగరం టౌన్: తపాలా ఉద్యోగుల సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తామని ఆ శాఖ ఆలిండియా జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి శివాజీ అన్నారు. నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్, ఎంటీఎస్, గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ల ఆధ్వర్యంలో స్థానిక జగన్నాథం కన్వెన్షన్ హాల్లో 31వ ద్వైవార్షిక మహాసభ ఆదివారం నిర్వహించారు. ప్రస్తుత తరుణంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో చోటుచేసుకున్న మార్పులు, ఉనికి, ఉద్యోగుల సమస్యలు రానున్న రోజుల్లో డిపార్ట్మెంట్లో ఉద్యోగుల స్థితిగతులు, ఎదుర్కోవాల్సిన సవాళ్లు, జీడీఎస్ వేతన సంఘం, ప్రమోషన్లు, 8వ వేతన సంఘానికి సమర్పించిన ప్రతిపాదనలపై పోరాటం చేస్తామన్నారు. అందుకు ఉద్యోగులు చేయాల్సిన విధివిధానాలను వివరించారు. కార్యక్రమంలో సర్కిల్ సెక్రటరీ సీహెచ్ లక్ష్మీనారాయణ, యూనియన్ల డివిజనల్ అధ్యక్షులు వి.కిరణ్కుమార్, ఎస్.రమేష్, పి.ఆర్.నాయుడు, కార్యదర్శులు ఎస్.సంతోష్కుమార్, పి.సూరిబాబు, ఎన్.పైడినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయానికి నిధులు
వ్యవసాయరంగానికి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. అన్నదాత–సుఖీభవ పథకం ద్వారా కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సాయం అంతంత మాత్రంగానే ఉంటోంది. కేంద్రం ఇచ్చిన పెట్టుబడి సాయం నిధులే రైతుకు దిక్కవుతున్నాయి. బడ్జెట్లో నిధులు కేటాయింపు ఉండడం వల్ల మరోసారి కేంద్ర సాయమే రైతును ఆదుకోనుంది. మరోవైపు రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి రూ.155.32 కోట్లు కేటాయించారు. జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం వంటి ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. నిధులు విడుదలైతే మరింత సాగుకు ఊతమిచ్చినట్లవుతుంది. జీడిపప్పు ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. జిల్లాలోని సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో జీడి చెట్ల పెంపకంపైనే గిరిజన రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. సరైన ప్రోత్సాహకం, మద్దతు లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. జీడి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కలగానే మిగులుతోంది. -
15 నుంచి గ్రామీణ యూత్ ఫెస్టివల్
సీతంపేట: ఈనెల 15 నుంచి 19 వరకు సీతంపేట మండలంలోని సీదిగ్రామంలో మీటదుర్గ సహిత మల్లికార్జున స్వామి దేవాలయం ప్రాంగణంలో గ్రామీణ యూత్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు మన్యం ప్రగతి సంస్థ చైర్మన్ గేదెల రవి తెలిపారు. ఈ మేరకు పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. యూత్ ఫెస్టివల్లో వాలీబాల్, షటిల్, చెస్, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయన్నారు. పోటీల్లో విజేతలకు ఆకర్షణీయమైన నగదు పురస్కారాలు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9866181612, 7075689035, 7093440359 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో మన్యం ప్రగతి సంస్థ కార్యదర్శి గేదెల జనార్దనరావు, మీనక ఉమామహేశ్వరరావు, గేదెల వినయ్, మూటక శశికర్, నిమ్మక సాయి, ఆరిక కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మీ కోసం వెబ్ సైట్లో అర్జీల నమోదు పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు మీ కోసం వెబ్ సైట్లో నమోదు చేయవచ్చని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించనున్నామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు సెల్లార్లో ప్రత్యేకంగా సెల్ను ఏర్పాటు చేశామని చెప్పారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. విజయనగరం అర్బన్: ఉపాధ్యాయులను విద్యేతర పనుల నుంచి పూర్తిగా తప్పించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పుల భానుమూర్తి డిమాండ్ చేశారు. స్థానిక ఏపీ ఎన్జీఓ భవనంలో ఆదివారం జరిగిన జిల్లా శాఖ విస్తృత కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులపై అనవసర భారం మోపడం వల్ల విద్యాబోధన దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి దవళి సరస్వతి మాట్లాడుతూ ఉపాధ్యాయులపై ఉన్న ఒత్తిడిని తగ్గించి విద్యాబోధనకు తగిన సమయం కల్పించాలని ఉపా ధ్యాయులకు రావలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జరిగిన జిల్లా కమిటీ ఎన్నికల్లో జి ల్లా అధ్యక్షులుగా మజ్జి మదన్మోహన్, ప్రధా న కార్యదర్శిగా పాల్తేరు శ్రీనివాస్ ఎన్నికై నట్టు ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా లంక రామకృష్ణ, వై.సీతంనాయుడు, కేవీఏ సత్యనారాయణ, ఎన్.శ్రీనివాసరాజు, బొత్స పద్మావతి ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా మర్రాపు శ్రీనివాసరావు, వై.భాస్కరరావు, దాసరి మహేష్, శెట్టి శివరావు, బి.త్రినాధ్, కె.నాగమణి, కె.సింహాచ లం ఎన్నికై నట్టు తెలిపారు. రాష్ట్ర కౌన్సిలర్లుగా షేక్ బుఖారిబాబు, కర్రి రవి, ఏబీ శ్రీధర్నాయుడు, బి.రాజేశ్వరి ఎన్నికయ్యారు. అనంత రం నూతన కమిటీ సభ్యులు ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకున్నారు. నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాలను పురష్కరించుకుని చక్రస్నానం కార్యక్రమాన్ని అర్చకులు ఆదివారం వైభవంగా జరిపించారు. వేకువజామున ప్రాతః కాలార్చన పూజలనంతరం ఐదు రోజుల నుంచి జరుగుతున్న హవనాలకు యాగశాలలో పూర్ణాహుతిని కనులపండువగా నిర్వహించారు. అనంతరం శ్రీ సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఊరేగింపుగా భాస్కర పుష్కరిణి వద్దకు తీసుకువెళ్లి శ్రీ చక్ర పెరుమాళ్లకు చక్రస్నానం జరిపించారు. అనంతరం స్వామివారికి బాలభోగం, గ్రామ బలిహరణ నిర్వహించారు. సాయంత్రం ధ్వజా అవరోహణం చేప ట్టి తిరుక్కల్యాణ ఉత్సవాలకు ముగింపు పలికారు. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు, దేవస్థాన అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
36 తులాల బంగారం చోరీ
వేపాడ: మండలంలోని బొద్దాం గ్రామంలో ఆదివారం పట్టపగలే బంగారం అపహరించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జనపరెడ్డి వెంకటరమణ, ముత్యాలమ్మలు ఉదయం పొలంలో పెసర మొక్కలు తీయడానికి వెళ్లారు. 11గంటల సమయంలో వెంకటరమణ కళ్లంలో అవును శాలలో కట్టడానికి వచ్చి కళ్లం పక్కనే ఉన్న తన ఇంటికి దాహం తీర్చుకోవడానికి వెళ్లేసరికి ఇంటి తలుపులు తీసి ఉండడంతో అవాకై ్క ఇంట్లోకి వెళ్లి చూడగా తన గోడబీరువా (కప్బోర్డు) పగులగొట్టి అందులో ఉన్న బంగారం దోచుకున్నట్లు గుర్తించి. భార్యకు కబురుపెట్టగా ముత్యాలమ్మ ఇంటికి వచ్చి లబోదిబోమంది. బీరువాలో పెట్టిన నెక్లెస్, చైన్లు, ఉంగరాలు, బ్రాస్లెట్, చెవులరింగులు, ఎత్తుగొలుసు, నల్లపూసలు, హారంతోపాటు బంగారం కడ్డీ (సుమారు 3 తులాలు) కాసులు 1 తులంతోపాటు మొత్తం 36 తులాలు దుండగులు దోచుకున్నారు. బాధితులు ఈ విషయమై వల్లంపూడి ఎస్సై ఎస్.సుదర్శన్కు సమాచారం ఇవ్వడంతో సిబ్బందితో ఆయన సంఘటానాస్థలానికి చేరుకుని బాధితులనుంచి వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్కు సమాచారం అందించగా వారు వచ్చి ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై సుదర్శన్ తెలిపారు. -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసులో ఆరుగురు అరెస్టు
టెక్కలి రూరల్: ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లు చోరీకి పాల్పడిన ఆరుగురిని కోటబొమ్మాళి పోలీసులు అరెస్టు చేసినట్లు టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపారు. ఆదివారం కోటబొమ్మాళి పోలీస్స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎం.రాము, మారేడుపాలెం గ్రామానికి చెందిన ఎం.నాగరాజు, పూసపాటిరేగ మండలం కోనాడకు చెందిన ఎన్.మోహన్రావు, పి.శ్రీను, ఎం.శ్రీనివాస్, ఎన్.రఘుబాబులు స్నేహితులు. వీరంతా మద్యానికి బానిసయ్యారు. ఎం.రాము తనకు ఎలక్ట్రికల్ వర్క్ తెలుసని, ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్లు చోరీ చేసి అమ్మితే బాగా డబ్బులు సంపాదించవచ్చని చెప్పడంతో అందరూ కలిసి చోరీ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో 2023 నుంచి లావేరు, జలుమూరు, టెక్కలి, నందిగాం, ఎచ్చెర్ల, కవిటి, జె.ఆర్.పురం, మందస, పాతపట్నం, కోటబొమ్మాళి మండలాల్లోని పలు గ్రామాల్లో శివారున ఉన్న ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యం చేసుకున్నారు. పక్కా ప్లాన్తో రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడే వారు. దీనిలో భాగంగా ఆదివారం సైతం ట్రాన్స్ఫార్మర్ల కోసం రెక్కీ చేసేందుకు రాగా వారిపై అనుమానంతో కోటబొమ్మాళి పోలీసులు జర్జంగి జంక్షన్ వద్ద పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.8లక్షల15వేల100 విలువైన 607 కేజీల కాపర్ వైర్, 20 కేజీల అల్యూమినియం వైర్లు, ఆటో, బైక్, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
దౌర్జన్య పాలనకు స్వస్తి పలకాలి..
జియ్యమ్మవలస రూరల్: తిరుపతి శ్రీనివాసునితో ఆడుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు పార్టీ కార్యాలయం విధ్వంసాలకు పాల్పడ్డ చర్యలకు నిరసనగా ఆదివారం చినమేరంగి పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలతో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించేందుకు ప్రయత్నించగా చినమేరంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ తిరుపతిరావు ఆధ్వర్యంలో జియ్యమ్మవలస, చినమేరంగి ఎస్సై, పోలీసు సిబ్బందితో ముట్టడించి నిరసన కార్యక్రమాన్ని కనీసం గ్రామంలోకి రాకుండా నిర్బంధించారు. ఈ సందర్భంగా పరీక్షిత్ రాజు మాట్లాడుతూ..తిరుపతి లడ్డూ అంశంపై కోర్టు తీర్పు ఇచ్చినా ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయకుండా వైఎస్సార్సీపీపై ఈ పాపాన్ని అపాదించే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండగా అంబటి రాంబాబు దీన్ని వ్యతిరేకించినందుకు ఆయనపై టీడీపీ మహిళా కార్యకర్తలతో దుర్భాషలాడించి పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేసి రాక్షస పాలన చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నాయకులను అక్రమ అరెస్టులు చేసి ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని ఆరోపించారు. అనంతరం కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసనలు తెలిపి చంద్రబాబు డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. -
సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
కేంద్ర బడ్జెట్ 2026–27 అంకెల గారడీతో వేతన జీవుల ఆశలపై నీళ్లు చల్లింది. ఆకాశాన్ని తాకుతున్న ధరల వేళ.. ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పు లేకపోవడం కొండంత ఆశకు గోరంత ఊరట లభించిన చందంగా ఉంది. ఎనిమిదివ వేతన సంఘం ఊసే లేకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. మన్యం వంటి వెనుకబడిన ప్రాంతాల్లోని గిరిజన పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు లేకపోవడం అక్షరానికి అన్యాయం చేయడమే. – బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి బడ్జెట్లో సామాన్యులకు సంతోషం కనిపించడం లేదు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఆదాయ పన్ను శ్లాబ్లో మార్పు లేకపోవడం వల్ల తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రత్యేక కేటగిరీ రాష్ట్రమైన ఏపీకి.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఇచ్చే ప్రాధాన్యం కూడా లేదు. జిల్లాకు పూర్తిగా కేటాయింపులు లేకపోవడం బాధాకరం. – వంగల దాలినాయుడు, డీసీసీ అధ్యక్షుడు సాక్షి, పార్వతీపురం మన్యం: వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో జిల్లాకు పెద్దగా ఒనగూరింది ఏమీ లేదు. ప్రత్యేకించి కేటాయింపులు లేకపోవడం అన్ని వర్గాల వారికి నిరాశ కలిగించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకొచ్చిన బడ్జెట్లో కీలకమైన రైల్వే ప్రాజెక్టులు, పారిశ్రామికాభివృద్ధి, గిరిజన విద్యాసంస్థల ప్రకటన లేకపోవడం జిల్లావాసులను నిరుత్సాహానికి గురిచేసింది. – పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు విద్యాపరంగా కీలకమైన గిరిజన యూనివర్సిటీకి గతంలో కూడా నిధులు కేటాయించారు. ఈ సారి ప్రస్తావన లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన విశ్వవిద్యాలయం పనులు జోరందుకున్నాయి. మెంటాడ–దత్తిరాజేరు మండలాల పరిధిలో సుమారు 550 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ భవనం పనులు ప్రారంభమైనప్పటికీ.. నిధుల లేమి కారణంగా నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 228 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. విజయనగరం సమీపంలోని తాత్కాలిక భవనంలోనే వారికి తరగతులు కొనసాగుతున్నాయి. ఈ బడ్జెట్లోనూ నిధులు లేకపోవడం నిర్మాణ పురోగతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. వెనుకబడిన పార్వతీపురం మన్యం జిల్లాకు, ఇక్కడి గిరిజనుల కోసం ప్రత్యేకంగా విద్యాసంస్థల ప్రకటన ఏమీ లేకపోవడం నిరాశ కలిగించేదే. ప్రతి జిల్లాలో బాలికల వసతిగృహం ఏర్పాటు చేస్తామనడం విద్యార్థినులకు కాస్త ఊరటనిచ్చిన అంశం. -
ప్రభుత్వ బడులను కాపాడుకుందాం
● ఉత్తరాంధ్ర వర్క్షాప్లో యూటీఎఫ్ పిలుపు విజయనగరం అర్బన్: ప్రభుత్వ బడులను కాపాడుకుందామని యూటీఎఫ్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల నాయకత్వంతో స్థానిక ఏపీఎన్జీఓ కార్యాలయంలోలో ‘ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం’ అనే అంశంపై ఆదివారం నిర్వహించిన వర్క్షాప్లో పలువురు పేర్కొన్నారు. వర్క్షాప్ను ప్రారంభించిన యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమసమాజ నిర్మాణం కోసం ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించి ఊరిబడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రభుత్వ బడులను రక్షించుకోవడం కోసం ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు, ప్రజల సహకారం తప్పనిసరి అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించేందుకు ముందుకు రావాలని ఆ దిశగా యూటీఎఫ్ ఉద్యమం చేయల్సిన అవసరం ఉందన్నారు. విద్య లక్ష్యం సమాజంలోని వనరులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు సుభవంతమైన జీవితం అందించడమేనన్నారు. సమాజంలో ఇంకా ఉన్న అంటరానితనం, అసమానతలను తొలగించి సమానత్వ భావనను పెంపొందించడమే విద్య ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రశ్నలు లేని, పరిశోధనలేని విద్యా విధానం అమలవుతుండడం ఆందోళనకరమని, దీనికి ప్రత్యామ్నాయంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే విద్యా విధానం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయులపై బాధ్యత ప్రభుత్వ వ్యయంతో విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయులుగా మారిన మనం అదే సమాజం కోసం పనిచేయాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. పిల్లలు లేకుండా ఉపాధ్యాయ వృత్తి ఉండదని విద్యార్థులే కేంద్రంగా అన్ని కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఈ వర్క్షాప్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలపై ఆరు జిల్లాల నాయకత్వం చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళికను ఆమోదించింది. అనంతరం ప్రచార పోస్టర్ను విడుదల చేశారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్కుమార్, రాష్ట్ర కార్యదర్శులు ఎస్.కిషోర్కుమార్, ఎస్.మురళీమోహన్, వి.శ్రీలక్ష్మి, సీనియర్ నాయకులు డి.రాము, నాగమణి, చౌదరి రవీంద్రతో పాటు ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల యూటీఎఫ్ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఉద్యోగం ఆశచూపి ఉచ్చులోకి లాగి..!
● నిరుద్యోగులే లక్ష్యంగా సైబర్ మోసగాళ్ల వల ● ఉమ్మడి జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్న నకిలీ నియామకాల మాయాజాలం ● గతేడాది 15 కేసులు నమోదు పార్వతీపురం రూరల్: నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను ఎరగా వేసి సైబర్ నేరగాళ్లు సరికొత్త మాయాజాలానికి తెరలేపారు. రెక్కాడితే గాని డొక్కాడని సామాన్యుడి నుంచి, ఉన్నత చదువులు చదివి కొలువు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న యువత వరకు అందరినీ ఈ ’డిజిటల్ దగా’ నిలువునా ముంచేస్తోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రస్తుతం ఈ సైబర్ మోసాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, అడ్డదారుల్లో సొమ్ము చేసుకునే ముఠాలు సోషల్ మీడియా వేదికగా మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. కలల కొలువు..కన్నీళ్ల బతుకు కురుపాం మండలానికి చెందిన ఓ యువకుడి కథ వింటే సైబర్ నేరగాళ్ల బరితెగింపు అర్థమవుతుంది. సూపర్వైజర్ ఉద్యోగమంటూ నమ్మబలికిన ఓ మోసగాడు, ఏకంగా లక్ష రూపాయలతో పాటు పదో తరగతి, ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్లను గుంజేసుకున్నాడు. తీరా ఉద్యోగం ఏదని నిలదీస్తే..ఎదురు తిరిగి పోలీసు కేసు పెడతానంటూ బెదిరింపులకు దిగడం గమనార్హం. ఇది ఒక్క కురుపాం బాధితుడి వ్యధే కాదు, విజయనగరం జిల్లాకు చెందిన మరో ముగ్గురు యువకుల పరిస్థితి మరీ దారుణం. ఇన్స్ట్రాగామ్ ప్రకటన చూసి మురిసిపోయిన వారిని మయన్మార్ దాటించి, అక్కడ బందీలుగా మార్చి, చిత్రహింసలు పెట్టి బలవంతంగా సైబర్ నేరాలు చేయించడం సభ్యసమాజాన్ని విస్తుపోయేలా చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం చొరవతో వారు ఎలాగోలా స్వదేశం చేరడంతో ఆ ముఠా క్రూరత్వం వెలుగులోకి వచ్చింది. వర్క్ ఫ్రం హోమంటూ వంచన ‘ఇంటి నుంచే పని..హోటళ్లకు రేటింగ్ ఇస్తే చాలు కమీషన్ల వర్షం‘ అంటూ వచ్చే ప్రకటనలు నిరుద్యోగులను ఉచ్చులోకి లాగుతున్నాయి. విజయనగరం గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి తొలుత రూ.5 వేలు ఇచ్చి ఎర వేసిన నేరగాళ్లు, క్రమక్రమంగా అతడి నుంచి రూ.1.82 లక్షలు కాజేయడం గమనార్హం. లాభాలు ఆశ చూపడం, ఆపై భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టించి చేతులు ఎత్తేయడం వారి నైజం. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ ద్వారా సంప్రదించి, నకిలీ యాప్ లింకులు పంపి సెల్ ఫోన్లలోని రహస్య సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. రాష్ట్రాలు దాటిస్తున్న రాక్షస వ్యూహం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి యువతను జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్ వంటి రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ రహస్య స్థావరాల్లో వారిని ఉంచి, స్థానిక భాషలు తెలిసిన వారితోనే ఇతరులకు ఫోన్ చేయించి బురిడీ కొట్టిస్తున్నారు. యూపీఐ ఖాతాల ద్వారా నగదు మళ్లింపులు, ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట మహిళలను మోసగించడం ఇప్పుడు నిత్యకృత్యమైంది. కేవలం ఉద్యోగాలే కాకుండా, ఆస్తి పత్రాలు తాకట్టు పెడితే రుణాలు ఇస్తామని, పార్సిల్ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలంటూ ఓటీపీలు అడిగి ఖాతాలు ఖాళీ చేసే ’కొరియర్ మోసాలు’ కూడా పెచ్చుమీరుతున్నాయి. గతేడాది ఉమ్మడి జిల్లాలోనే ఉద్యోగాల పేరిట 15 ప్రధాన కేసులు నమోదయ్యాయి. ఇది కేవలం బయటపడిన గణాంకాలు మాత్రమే. పరువు పోతుందనో, భయపడో ఫిర్యాదు చేయని బాధితులు వందల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల ఆవేదనను నగదుగా మార్చుకుంటున్న ఈ సైబర్ రాబందుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు సర్టిఫికెట్లు, నగదు, ఓటీపీలు ఇచ్చి ’బలి’ కావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.Fake JOB Offersనకిలీ యాప్లు, మాయా లింకులతో మీ బ్యాంకు ఖాతాలనే కాకుండా, మీ వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరిస్తున్న సైబర్ నయవంచకుల పట్ల అవగాహనపరమైన జాగ్రత్తలతో ఉండాలి. తెలియని వ్యక్తులకు ఓటీపీలు వంటివి చెప్పకూడదు . ఏదైనా అనుమానం వస్తే వెనుకాడకుండా వెంటనే 1930కు సమాచారం అందించండి. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి, పార్వతీపురం మన్యంజాగ్రత్తగా ఉండాలి -
గిరిజనం చీకూచింత
ఆరంభమైన చింతపండు సీజన్ ● కాపుకొచ్చిన చెట్లు ● పెరగని దిగుబడులు ● జీసీసీ మద్దతు ధర రూ.36కాపు కాయక, దిగుబడి రాక, మద్దతు ధర లేక, దళారులకు అమ్ముకోలేక గిరిజనం తీరని వేదన అనుభవిస్తున్నారు. ఏటా ప్రకృతి ఫలసాయాలను సేకరించి మార్కెట్కు తీసుకువచ్చి విక్రయించి జీవనం సాగించే గిరిజనులను వారి ఫలసాయాలకు వచ్చే దిగుబడులు ఉసూరుమనిపిస్తున్నాయి. ఈ ఏడాది చింతపండు సీజన్ ఆరంభమైంది. దిగుబడి తక్కువగా ఉంది. ఈ క్రమంలో ఏజెన్సీ గిరిజనం ఆందోళన చెందుతున్నారు.సీతంపేట: మన్యం జిల్లా చింతపండు మార్కెట్లోకి త్వరలో రానుంది. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం చింతకాయలు అరకొరగా పక్వానికి వచ్చాయని గిరిజనులు తెలిపారు. ధరలు పెరిగినా చింతపండు దిగుబడి లేకపోవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి నుంచి చింతపండు దిగుబడి అవుతుంది. గిరిజనులు కొండకోనల్లో ఉన్న చెట్లు ఎక్కి చింతపండు బొట్లను సేకరించి కిందికి దించి వలిచి వాటిని సంతలకు కావిళ్లలో తీసుకువచ్చి విక్రయిస్తారు. గడిచిన మూడేళ్లుగా చింత చెట్ల కాపు పెద్దగా లేకపోవడం, చింతపంట ధరలు పడి పోవడంతో సరైన ఆదాయమార్గాలు గిరిజనులకు లేవు. గతేడాది కొన్ని చోట్ల పండిన చింతపండును కావిళ్ల వంతున రూ.1800 వరకు విక్రయించారు. కావిడలో దాదాపు 25 నుంచి 30 కిలోల చింత పండు ఉంటుంది. అంటే కిలో సరాసరి రూ.80 వరకు ధర పలికింది. ఏజెన్సీలో సుమారు 30 వేల వరకు చింత చెట్లు ఉంటాయి. వావీటిలో సగానికి పైగా చెట్లు కాయని పరిస్థితి ఉంది. ప్రతి ఏటా 50 టన్నుల వరకు ఉత్పత్తి అయ్యేది. గడిచిన రెండేళ్లుగా పదిటన్నుల లోపే దిగుబడి వస్తోంది. ఈ ఏడాది కూడా అలాగే ఉంటుందని అంచనా. ప్రస్తుతం కావిడ రూ.1500 వరకు విక్రయిస్తున్నారు. జీసీసీ కిలో రూ.36 మద్దతు ధర.. గిరిజన సహకార సంస్థ ప్రతి ఏటా ఈ సీజన్లో మద్దతు ధరలు ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం కిలో చింతపండు రూ.36గా ప్రకటించింది. గతసంవత్సరం రూ.34.20 పైసలు ఉండగా ఈసంవత్సరం రెండు రూపాయలు పెంచి కొనుగోలుకు సన్నద్ధమవుతోంది. మన్యంలో దొరికే చింతపండును సేకరించి గ్రేడింగ్ చేసి ప్యాకెట్ల రూపంలో తయారు చేసి కిలోల వంతున మార్కెట్లో జీసీసీ విక్రయిస్తుంది. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, వసతి గృహాలకు ఈ చింతపండును సరఫరా చేస్తుంది. కాగా జీసీసీ మద్దతు ధరలు తక్కువగా ఉన్నాయంటూ మైదాన ప్రాంతాల వ్యాపారులకు గిరిజనులు చింతపండు విక్రయిస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు వచ్చి చింతపండు కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది గ్రామాల్లో అడ్వాన్సులు ఇచ్చి మరీ కొనుగోలు చేసిన పరిస్థితులున్నాయి. ఈ ఏడాది కూడా దిగుబడి తగ్గినప్పటికీ అరకొరగా చింతపండును మైదాన వ్యాపారులు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. మార్కెట్లోకి మంచి నాణ్యత గల చింతపండు తీసుకువస్తే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంతల్లో కాటాలు ప్రతివారం వేస్తాం. మహాశివరాత్రి తరువాత మార్కెట్కు చింతపండు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమ సంస్థకూడా ఈ ఏడాది మద్దతు ధరలు పెంచింది. ఆ ప్రకారం కొనుగోలు చేయనున్నాం. –దాసరి కృష్ణ, జీసీసీ మేనేజర్, సీతంపేట చింతపండు దిగుబడి తగ్గింది. ధరలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. గతంలో ఎక్కువగా చింతపండును మార్కెట్లో విక్రయించే వాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. చింతచెట్లు ముదిరిపోయి పాడయ్యాయి. ఎక్కడో ఉంటే మాకు ఏడాది పొడవునా సొంతానికి వాడుకోవడానికి సరిపోతాయి. ఒక వేళ మిగిలితే విక్రయిస్తాం. –ఎస్.షోడంగ, చింతాడ -
రూ.450 కోట్లతో 15 రైల్వేస్టేషన్ల అభివృద్ధి
● పర్లాకిమిడి రైల్వేస్టేషన్ త్వరలో ప్రారంభం ● వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం లలిత్బోహ్రాకొత్తవలస: అమృత్భారత్ పథకంలో భాగంగా వాల్తేరు డివిజన్లో రూ.450 కోట్లతో 15 రైల్వేస్టేషన్లను ఆధునికీకరించనున్నట్లు డీఆర్ఎం లలిత్బోహ్రా తెలిపారు. ఈ మేరకు కొత్తవలస రైల్వేస్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న అమృత్భారత్ పనులు, రైల్వేట్రాక్ వెల్డింగ్ పనులను ఆయన రైల్వే అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల నిర్వహణపై అధికారులకు తగు చూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమృత్భారత్ పథకంలో పూర్తిస్థాయిలో ఆధునికీకరణ చేసిన పర్లాకిమిడి రైల్వేస్టేషన్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే మార్చి నెలాఖరుకు మరో నాలుగు స్టేషన్లు, జూన్ చివరి నాటికి కొత్తవలస రైల్వేస్టేషన్లో పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే 2047 నాటికి దేశంలోనే పూర్తిస్థాయిలో వందేభారత్ రైళ్లు నడిపేందుకు ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు. -
ఘనంగా శ్రీ చక్రతీర్థ స్నానం
గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీపద్మావతి, భూదేవి సహిత స్వామివారికి శ్రీచక్రతీర్థస్నానం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఉదయం సుప్రభాతసేవ, మంగళాశాసనం, విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కలశారాధన, చూర్ణోక్రతం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి నాగావళి నదీ తీరం వరకు స్వామివారి ఉత్సవ మూర్తులకు తిరువీధి నిర్వహించారు. పిమ్మట నాగావళినదీ తీరంలో చూర్ణంతో అమ్మవారికి, స్వామివారికి సంప్రోక్షణ తదితర పూజలను నిర్వహించారు. అలాగే పవిత్ర నాగావళినదిలో స్వామివారికి భక్తులు పంచామృతాభిషేకం, గంధాభిషేకం, సుగంధద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామికి విశేషపూజలు చేసిన అనంతరం భక్తులు నాగావళినదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు వీవీ అప్పలాచార్యులు మాట్లాడుతూ లోక శాంతికోసం నదుల్లో, పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించాలన్నారు. స్వామివారికి కల్యాణం, అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులు నదుల్లో స్నానమాచరిస్తే వెయ్యి నదుల్లో స్నానం చేసిన పుణ్యం సిద్ధిస్తుందన్నారు. భక్తులకు ఉచితంగా ప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు, టీటీడీఎస్ సభ్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో జంగిల్ రాజా పరిపాలన
● మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొరసాలూరు రూరల్: రాష్ట్రంలో జంగిల్ రాజా పరిపాలన సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన అనివార్యమయ్యే పరిస్థితి అవసరం ఉంది. రాష్ట్రంలోని పరిస్థితులపై రాష్ట్రపతికి గవర్నర్ తెలియజేయాలని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆయన కుటుంబంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడి హత్యాయత్నానికి పాల్పడే విధంగా ఉందని దీనిపై పోలీసులు స్పందించిన తీరు దారుణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్లు చెబితే పోలీసులు కేసులు కట్టేస్తారా అని ప్రశ్నించారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన వీడియోలు స్పష్టంగా ఉన్నప్పటికీ నిందితులపై పోలీసులు కనీసం ఒక్క కేసుకూడా నమోదు చేయలేదన్నారు. స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఆవేశంలో కొన్ని మాటలు దొర్లుతాయని అలాంటి సందర్భాల్లో సరిచేసుకున్నప్పుడు ఆ మాటలను వివాదాస్పదంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. అలా అయితే గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి ని అన్న మాటలకు ఎన్ని కేసులు పెట్టాలని ప్రశ్నించారు. రాష్టంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులు లోకేష్ రాజ్యాంగం నడిపిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్ గిరిరఘు, మాజీ కౌన్సిలర్ పిరిడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రీ సర్వే సవరణలో తప్పని తిప్పలు
విజయనగరం అర్బన్: కూటమి ప్రభుత్వం ‘రీసర్వే 2.0’ కార్యక్రమంగా గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ జిల్లాలో ఆ ప్రక్రియ వైఫల్యం చెందింది. సర్వే పూర్తయిన గ్రామాల్లో పంపిణీ అవుతున్న పట్టాదారు పాస్పుస్తకాల్లోని తప్పులను సవరణ చేయించుకోవడంలో తిప్పలు తప్పడం లేదు. రైతుల పేర్లు, తండ్రుల పేర్లు, సర్వే నంబర్లు, భూవిస్తీర్ణం, ఎల్పీఎంలు ఇలా అన్నీ తప్పులతో కూడిన పాస్పుస్తకాలు 50 శాతానికి పైగా ఉన్నాయి. నిజానికి ఈ తప్పులు కేవలం క్షేత్రస్థాయి అజాగ్రత్తతో వచ్చినవి కావని ప్రభుత్వ రెవెన్యూ యంత్రాంగం క్రమబద్ధమైన నిర్లక్ష్యం, అసమర్థత, బాధ్యతారాహిత్యం వల్ల జరిగినట్లు తెలుస్తోంది. వాటిలో 50 శాతానికి పైగా వ్యక్తిగత వివరాల్లో అధిక తప్పులున్నాయని అధికారులే ఒప్పుకున్నారు. దీంతో వాటి సవరణ కోసం రైతులు సచివాలయాలు, మీసేవ కేంద్రాల ముందు గంటల తరబడి నిలబడి, డాక్యుమెంట్లతో తిరుగుతున్నారు. ఇది రీ సర్వే సవరణ కాడు రైతుల జీవితాలపై జరిగిన క్రమబద్ధమైన ద్రోహమని వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలో రీసర్వే పూర్తయిన 2,26,009 మంది రైతులకు పాస్పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 423 గ్రామాల్లో 1,89,343 మందికి మాత్రమే అందజేశారు. ఇంకా 37 వేలు పంపిణీకి పెండింగ్లోనే ఉన్నాయి. సొంతంగా తీసుకున్నవి కేవలం 85,102 మాత్రమే. మిగిలినవి కుటుంబ సభ్యుల ద్వారా అంటే చాలామంది రైతులు ఇంకా తమ పాస్పుస్తకాలు చూడలేదు. చూసినవారు పుస్తకాల్లో ఉన్న తప్పులు గుర్తించి షాక్కు గురవుతున్నారు. తప్పుల సవరణకు జేసీ అనుమతి తప్పులు సరిచేయడానికి ఆరు కేటగిరీలు పెట్టి, తహసీల్దార్ లాగిన్, ఆర్డీవో అనుమతి, జేసీ అప్రూవల్, సచివాలయంలో అర్జీలు, డాక్యుమెంట్ల పరిశీలన ఇలా ప్రతి చోటా బ్యూరోక్రాటిక్ జల్లెడ పెట్టే పరిస్థితులు ఉంటాయి. పాత సర్వే నంబర్లకు కొత్త ఎల్పీఎం కొర్లేషన్ సరిగా జరగలేదు. భూములు అమ్ముకున్నా వారసులు మారినా ఇప్పటికీ ముత్తాతల పేర్లే ఉన్నాయి. ప్రభుత్వ భూముల కేటగిరీలో తప్పలు సరిచేయడానికి జేసీ అనుమతి అవసరమని చెప్పడం ఇది ఎంత పెద్ద అసంబద్ధత? అదే విధంగా మ్యుటేషన్లకు సచివాలయాల్లో అర్జీలు, కరెక్షన్స్కు తహసీల్దార్కు దరఖాస్తు, ఆ తర్వాత ఆర్డీవో దగ్గరకు నెలల తరబడి తిరగాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రతి నెలా 2 నుంచి 9వ తేదీ వరకు పంపిణీ చేస్తామని గ్రామసభల్లో ఈ కేవైసీ తీసుకుని ఇస్తామని చెప్పడం హాస్యాస్పదం. ఎంపిక చేసిన 12 గ్రామాల్లో తప్పులు సరిచేసి ఫిబ్రవరిలో పంపిణీ చేస్తామని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కేవలం 3,896 పాస్పుస్తకాలు మాత్రమే సరిచేశారు. మొత్తం 2.26 లక్షల్లో ఇది ఏమాత్రం కాదు. జిల్లా రెవెన్యూ అధికారి ఈ.మురళి చెప్పిన వివరాలు ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేస్తోందో బట్టబయలు చేస్తున్నాయి. ఈ రీసర్వే వైఫల్యం వల్ల రైతులు బ్యాంకు రుణాలు పొందలేక, రాయితీలు రాకుండా భూములు అమ్మలేక, కోర్టు కేసుల్లో చిక్కుకుంటున్నారు. భూమి వివాదాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇది అభివృద్ధి కాదు రైతుల జీవితాలను నాశనం చేసే క్రమబద్దమైన దుర్మార్గం. ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు బాధ్యత తీసుకోకపోతే విజయనగరం జిల్లా రైతులు మరింత దారిద్య్రంలోకి జారిపోతారు. ఇవి కేవలం తప్పులుకాదు తమ పట్ల జరిగిన ద్రోహంగా రైతులు భావిస్తున్నారు. -
నేరడిలోకి ఏనుగులు
భామిని: మండలంలో ఏనుగులు సంచరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం రాత్రి భామిని మండలం నేరడి–బి లోకి ఏనుగులు ప్రవేశించి అల్లకల్లోలం నృష్టించాయి. ఏనుగుల తాకిడితో పాడి పశువులు పరుగులు తీశాయి. కళ్లాల్లోని కోత యంత్రాలు, ట్రాక్టర్లపై ఏనుగులు దాడి చేస్తాయని భయపడి రాత్రికి రాత్రి బయటకు తీసుకువచ్చారు. ఆదివారం పగలంతా బిల్లుమడ–నేరడి గ్రామాల మధ్య పొలాల్లో ఏనుగులు తచ్చాడాయి. కానీ అటవిశాఖాధికారుల జాడ లేకుండా పోయింది. అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేయొద్దు పార్వతీపురం రూరల్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ముందస్తు అనుమతులు లేకుండా ర్యాలీలు, ధర్నాలు, ముట్టడి వంటి కార్యక్రమాలు చేయకూడదని స్పష్టం చేశారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినా, శాంతికి విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు, ద్వేషపూరిత సందేశాలపై ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచామన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఆందోళనల్లో పాల్గొన్నా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలంతా పోలీస్ శాఖకు సహకరించి, జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. -
కురుపాంలో దొంగల హల్చల్
● ఒకే రాత్రి రెండిళ్లలో చోరీ ● మరో ఇంట్లో చోరీకి ప్రయత్నం ● ఉలిక్కిపడిన కురుపాంకురుపాం: కురుపాంలో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగలు చెలరేగిపోయారు. శుక్రవారం రాత్రి మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కురుపాం పోలీస్స్టేషన్ ముందు, భారతీయ స్టేట్ బ్యాంకు ఎదురుగా ఉన్న రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ కొత్తకోట మల్లికార్జునరావు ఇంటి ముందు గేటు తీసి ఇంటి సేఫ్టీ గేటు తాళం బద్దలుకొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన దొంగలు చెక్క తలుపులు తాళం తీయలేకపోయారు. తరువాత మెయిన్ రోడ్డులో నివాసం ఉంటున్న జామి దేవీప్రసాద్ ఇంటి తాళం తీసి లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువా పగలగొట్టి అందులో నగదు, నగలు దోచుకున్నారు. అలాగే ప్యాలెస్రోడ్డులో ఉన్న కందుల శ్రీనివాసరావు ఇంటి తాళం బద్దలు కొట్టి బీరువాలో నగలన్నీ దోచుకోపోయారు. బాధితులు కురుపాంలో అందుబాటులో లేకపోవడంతో ఎంత విలువైన బంగారు నగలు, వెండి, నగదు దోచుకుపోయిందీ తెలియరాలేదు. కురుపాం ఎస్ఐ పి.నారాయణరావు, ఎల్విన్పేట సీఐ హరి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారంతో కురుపాం చేరుకున్న క్లూస్ టీం వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. ఆధారాలు సేకరిస్తున్నామని సమగ్ర దర్యాప్తు చేస్తామని సీఐ హరి తెలిపారు. -
కన్నీటి వేళ.. కారుణ్య హస్తం
పార్వతీపురం రూరల్ : విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు అసువులు బాసిన పోలీసు కుటుంబాలకు ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి భరోసానిచ్చారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ఆర్థిక సాయం అందజేశారు. అనారోగ్యంతో మృతి చెందిన సాలూరు హెడ్ కానిస్టేబుల్ డి.ఆనందరావు, రోడ్డు ప్రమాదంలో మరణించిన వీరఘట్టం కానిస్టేబుల్ పి.రవి కుటుంబాలకు విడో ఫండ్, ఫ్లాగ్ ఫండ్ కింద మంజూరైన రూ.75,000 (ఒక్కొక్కరికి) చొప్పున చెక్కులను మృతుల భార్యలు అనిత, లలితలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కష్టకాలంలో పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని, అధైర్యపడకుండా సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. మృతుల కుటుంబాలకు అందాల్సిన ఇతర ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐలు నాయుడు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రయోగ పరీక్షలకు వేళాయె..
రాజాం సిటీ: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులతో పాటు ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థుల ప్రయోగ పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని కేంద్రాల్లో అధికారులు ప్రయోగ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రాక్టికల్స్కు హాజరయ్యే విద్యార్థులకు ఆయా కేంద్రాల్లో ప్రిన్సిపాల్స్, సైన్స్ అధ్యాపకులను సన్నద్ధం చేశారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు జనరల్ సైన్స్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి కేంద్రాన్ని ఆర్ఐఓ నేతృత్వంలో డెక్ మెంబర్లు పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఆన్లైన్లో మార్కులు పోస్టింగ్ గత విధానంలో లోపాలను సవరించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని విద్యార్థులు రాసే పరీక్షలకు సంబంధించి మార్కులను ఆన్లైన్లో పోస్టింగ్ చేసేలా చర్యలు చేపట్టారు. మార్కులను పరీక్ష అయిన వెంటనే కంప్యూటరీకరించేలా సూచనలు చేశారు. నేటి నుంచి జనరల్ విద్యార్థులకు పరీక్షలు సీసీ కెమెరా నిఘాలో ప్రాక్టికల్ పరీక్షలు జిల్లాలో హాజరుకానున్న 19697 మంది విద్యార్థులు 98 కేంద్రాల్లో జనరల్ ప్రయోగ పరీక్షలు -
మత సామరస్యానికి ప్రతీక ఉరుసు మహోత్సవం
విజయనగరం టౌన్: స్థానిక బాబామెట్టలో ఉన్న హజరత్ ఖాదర్వలీబాబా 67వ సుగంధ మహోత్సవాలు మూడో రోజు శనివారం అంగరంగ వైభవంగా ముగిశాయి. కార్యక్రమంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొన్నారు. దర్గా, దర్బార్ ముతవల్లి డాక్టర్ ఖలీలుల్లా షరీప్ దర్బార్ సంప్రదాయం ప్రకారం ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఉరుసు సందర్భంగా బాబా సన్నిధిలో ఏర్పాటు చేసిన పరమ పవిత్ర అన్న సమారాధనను జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. భక్తులకు స్వయంగా వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాబా సన్నిధిలో నిత్య అన్న సమారాధన నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆకలితో వచ్చే వారికి ఇక్కడ నిరంతరం భోజనం లభించడం గొప్ప సేవా కార్యక్రమమని అన్నారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఇటువంటి ఉత్సవాలు సమాజంలో సోదర భావాన్ని పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో దర్గా ముతవల్లి డాక్టర్ ఖలీల్బాబు, గుర్ల మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సన్యాసినాయుడు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జైహింద్కుమార్, దర్గా కమిటీ సభ్యులు, వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
విజయనగరం అర్బన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ మరియు థియరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారం నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు డీవీఈఓ ఎస్.తవిటినాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలకు జిల్లాలో మొత్తం 15,370 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు తెలిపారు. జిల్లాలో 98 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరిండెంట్తో పాటు సంబంధిత ప్రాక్టీకల్ ఎగ్జామినర్లను నియమించామని వెల్లడించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా నియమించినట్టు తెలిపారు. ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 18వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ పరీక్షలకు జిల్లాలో మొత్తం 39,037 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు వెల్లడించారు. మొదటి సంవత్సరం మొత్తం 19,759 మందిలో జనరల్ 17,421 మంది, ఒకేషనల్ 2,334 మంది ఉన్నారు. రెండవ సంవత్సరం మొత్తం 19,278 మందిలో జనరల్ 16,811 మంది, ఓకేషనల్ 2,467 మంది ఉన్నారు. ఇందుకోసం జిల్లాలో 66 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల్లో అవకతవకలకు తావులేకుండా ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి నిఘాలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి కమిషనర్గా వ్యవహరించనున్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఏటా 960 మంది మృతి
● బాధిత కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నం : కలెక్టర్ విజయనగరం అర్బన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా సగటున 960 మంది ప్రాణాలు కోల్పోతున్నారని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే అతని జీవితం అక్కడితో ముగిసిపోతుందని కానీ ఆ కుటుంబం ఎదుర్కొనే ఆవేదనను జీవితాంతం భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, భార్యా పిల్లలు పడే బాధ మాటల్లో చెప్పలేనిదన్నారు. కలెక్టరేట్లో రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ఆస్పత్రి పాలైనప్పుడు అయ్యే వైద్య ఖర్చులు ఆయా కుటుంబాలపై తీరని ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని తెలిపారు. ఈ కారణంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతుండగా ప్రమాదాల్లో మరణించిన వారి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతోందని ఉద్దాటించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి తన కుటుంబాన్నే ప్రమాదంలోకి నెట్టే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ రహదారి భద్రతా అవగాహన కార్యక్రమాలు ఒక వారం లేదా ఒక నెలతో ముగిసేవి కాదని, ఇది నిరంతర ప్రక్రియ కావాలన్నారు. జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు రవాణా, పోలీస్, వైద్య, రెవెన్యూ శాఖలు సమన్వయంతో కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని గోల్టెన్ అవర్లో ఆస్పత్రికి చేర్చిన వారికి రూ.5 వేలు నగదు పారితోషికం అందిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా రహదారి భద్రతా మాసోత్సవాల్లో విశిష్ట సేవలు అందించిన రోడ్ సేఫ్టీ ఎన్డీఓ అధ్యక్షులు మజ్జి అప్పారావు, డాక్టర్ సాయికుమార్లకు కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందించారు. వివిధ పాఠశాలల్లో రోడ్డు భద్రతపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలు పద్మిక, మురళీచరణ్, హేమతేజ, సాయి, హర్హవర్ధన్లకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ వాహనాలను సక్రమంగా నడుపుతున్న కలెక్టర్ డ్రైవర్ కృష్ణ, ఎస్పీ డ్రైవర్ ఆనందరావు, వివిధ శాఖల జిల్లా అధికారుల డ్రైవర్లు ప్రతాప్ వర్మ, సాయి, నరేంద్ర ఆలీలను అభినందించారు. కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ మణికుమార్, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, రహదారుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కాంతిమణి, అధిక సంఖ్యలో ఎన్సీసీ క్యాడెట్లు, కళాశాలల విద్యార్ధులు పాల్గొన్నారు. -
డైరీల ఆవిష్కరణ
విజయనగరం ఫోర్ట్: కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం 2026 డైరీని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. వ్యవసాయ అధికారులకు తమ విధి నిర్వహణలో ఈ డైరీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు కె.ప్రకాష్, సెక్రటరీ మజ్జి శ్యాంసుందర్, సంఘం కోశాధికారి బి.శ్యామ్కుమార్, వ్యవసాయ అధికారులు సుధ, మాధవి పాల్గొన్నారు. డైరీని ఆవిష్కరించిన కమాండెంట్ రవిశంకర్రెడ్డి డెంకాడ: రాష్ట్ర పోలీస్ అసోషియేషన్ డైరీని చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్రెడ్డి ఆవిష్కరించారు. బెటాలియన్లోని కమాండెంట్ కార్యాయలంలో శనివారం జరిగిన కార్యక్రమంలో డైరీని ఆయన ఆవిస్కరించారు. కార్యక్రమంలో అడిషినల్ కమాండెంట్ సి.రాజారెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్లు ప్రభాకర్, లక్ష్మీనారాయణ, బాపూజీ, గోపాలకృష్ణ, ఆర్ఐలు రవీంద్ర, గణేష్, రామజోగినాయుడు, శ్రీను, చంద్రశేఖర్, సమర్పణరావు, సుధాకర్బాబు, బెటాలియన్ అసోషియేషన్ అధ్యక్షుడు మిత్తిరెడ్డి అప్పలనాయుడు, ట్రెజరర్ పీవీఆర్ మూర్తి, జాయింట్ సెక్రెటరీ సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శులు రాంబాబు, రవి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా కొండడాబాల యాత్ర
● జ్ఞానాపురం నుంచి వేలాది మంది భక్తుల పాదయాత్ర ● ముగిసిన నవదిన పూజలుకొత్తవలస: మండలంలోని కొండడాబాల వ్యాకులమాత యాత్ర శనివారం వైభవంగా ప్రారభమైంది. విశాఖపట్నం జిల్లా జ్ఞానాపురం నుంచి వేలాది మంది భక్తులు పాదయాత్రగా కొండడాబాలకు చేరుకున్నారు. కనికరమాతను ప్రత్యేక వాహనంపై అలకంరించి తోడ్కుని వచ్చారు. ఎంతో చరిత్ర గల ఈ యాత్రకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటూ ఒడిశా, చత్తీస్ఘడ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారు. ఆదివారం ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి యాత్ర ముగుస్తుందని కొండడాబాల విచారణ కర్త గొంగాడ రాజు తెలిపారు. ముగిసిన నవదిన ప్రార్ధనలు వ్యాకులమాత పుణ్యక్షేత్రంలో గడిచిన తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న నవదిన ప్రార్ధనలు శనివారం రాత్రితో ముగిశాయి. యాత్ర ప్రారంభం కావడంతో కొండడాబాల ప్రాంతం అంతా పోలీస్ల ఆధీనంలోకి తీసుకున్నారు. 147 మంది సిబ్బంది, ఆరుగురు ఎస్ఐలు, ఇద్దరు సీఐలతో స్థానిక సీఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్కు ఎక్కడా అంతరాయం లేకుండా తగ జాగ్రత్తలను తీసుకున్నారు. వాహనాల పార్కింగ్ ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. -
మహిళా స్వయం సహాయ సంఘాల అభ్యున్నతికి కృషి
విజయనగరం టౌన్: దీనదయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లోని ఉప పథకం కింద అజీవిక గ్రామీణ ఎక్స్ప్రెస్ యోజన పథకం అమలవుతుందని, గ్రామీణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి కల్పించడం జరుగుతుందని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి పేర్కొన్నారు. స్థానిక టీటీడీసీలో ఉన్న కార్యాలయం ఆవరణలో లబ్దిదారులకు, సంఘ ప్రతినిధులకు దీనిపై శనివారం అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాలలో రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడం, ఎస్హెచ్జీ సభ్యులు తమ ఉత్పత్తులను పట్టణ మార్కెట్లకు తరలించడానికి సహాయపడటం పాఠశాలలు, ఆస్పత్రులు, ఇతర ప్రజా సేవలను మారుమూల గ్రామాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. సెర్ప్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాసరెడ్డి, భాస్కరరావు, జిల్లా సమైఖ్య అధ్యక్షురాలు మాధవి, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన డీపీఎంలు, ఏపీఎంలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ‘ఏకలవ్య’లో విద్యార్థుల మధ్య ఘర్షణ గుమ్మలక్ష్మీపురం: స్థానిక ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఓ విద్యార్థి తలకు తీవ్రమైన గాయమైంది. పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ధనుష్ కార్తీక్ను అదే తరగతికి చెందిన మరో విద్యార్థి మణికంఠ గాయపరిచాడు. పాఠశాల ఉపాధ్యాయులు, ఎల్విన్పేట పోలీసులు తెలిపిన వివరాలు.. శనివారం ఉదయం ముందస్తుగానే తరగతి గదిలోకి వెళ్లిన వీరిద్దరు క్రికెట్ బంతి కోసం వాదులాడుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు పుస్తకాలు విసురుకున్నారు. ఆగ్రహించిన మణికంఠ తన దగ్గరున్న అట్టను విసిరేయడంతో ధనుష్కార్తీక్ తలకు గాయమైంది. సమాచారం తెలుసుకున్న ఉపాధ్యాయులు భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి కార్తీక్ను తీసుకువెళ్లారు. ఇదిలా ఉండగా వారం కిందట ఇదే పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి కూర్చునే చోట మరో విద్యార్థి పెన్ను పెట్టడంతో ప్రైవేటు భాగంలో గుచ్చుకొని ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన సంఘటన కూడా చోటు చేసుకుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
9న కలెక్టరేట్ వద్ద ధర్నా
● సాగునీటి సాధనకు.. రైతన్న సమరం పార్వతీపురం రూరల్ : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు సాధించడమే లక్ష్యంగా ఫిబ్రవరి 9న పార్వతీపురం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకటించింది. శనివారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్లను సంఘం నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బంటు దాసు మాట్లాడుతూ.. జంఝావతి, తోటపల్లి, పెద్దగెడ్డ, ఒట్టిగెడ్డ సహా జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించాలని కోరారు. ‘ప్రాజెక్టుల సాధన–రైతన్నల వేదన’ ముగియాలంటే పోరాటమే మార్గమని పేర్కొన్న ఆయన ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగే ధర్నాలో రైతులు, కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి రమణమూర్తి, నాయకులు బి.అప్పారావు, ఇ.గౌరమ్మ, కరణం రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. కుశ జలపాతానికి ప్రత్యేక బస్సు సర్వీసు గుమ్మలక్ష్మీపురం: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కుశ గ్రామ పరిసరాల్లో రూపుదిద్దుకున్న జలపాతాన్ని పర్యాటకులు సందర్శించేందుకు వీలుగా ప్రత్యేక బస్సుసర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద శనివారం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరితో కలిసి బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. ప్రతీ శని, ఆదివారం కుశలోయ జలపాతానికి బస్సును నడుపుతున్నట్లు వెల్లడించారు. విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు పార్వతీపురం రూరల్ : జిల్లా కేంద్రంలో విజిలెన్స్ అధికారులు శనివారం మెరుపు దాడులు చేశారు. దాడుల్లో రికార్డుల్లేని భారీ గుట్కా, ఖైనీ నిల్వలు వెలుగు చూశాయి. పట్టణంలోని షిర్డీ ఎంటర్ప్రైజెస్లో రూ.15లక్షల విలువైన ఆరు రకాల ఉత్పత్తులను తనిఖీ చేయగా.. కేవలం రెండింటికే బిల్లులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పట్టణ శివారులోని వ్యాపారి దుంప శ్రీనివాసరావు వద్ద లభించిన పది రకాల నిల్వలకు అసలు బిల్లులే లేకపోవడం గమనార్హం. నిబంధనలు గాలికొదిలేసిన ఈ అక్రమ నిల్వలపై పంచనామా నిర్వహించి, జీఎస్టీ అధికారులకు నివేదిస్తా మని విజిలెన్స్ సీఐ సింహాచలం తెలిపారు. దాడుల్లో జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ ప్రసన్నాంబిక, అసిస్టెంట్ కమిషనర్ మహేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
రథంపై ఊరేగిన రాములోరు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శనివారం శ్రీరామనామస్మరణతో మార్మోగింది. సీతాసమేత శ్రీరామచంద్రస్వామి వారి రథయాత్ర మహోత్సవం కనులపండువగా సాగింది. ఏటా స్వామివారి తిరుక్కల్యాణం అనంతరం మూడోరోజు నిర్వహిస్తున్న రథయాత్రను కనులారా తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ బలిహరణం చేపట్టి శ్రీరాముడి సన్నిధిలో శ్రీమద్రామాయణ పారాయణ, వేద పఠనం, వైదిక సదస్యం, తదితర కార్యక్రమాలను జరిపించారు. వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో శ్రీరామచంద్రమూర్తిని సుందరంగా అలంకరించారు. సాయంత్రం 6 గంటలకు వేద పండితులంతా పండిత పరిషత్ నిర్వహించి నాలుగు వేదాలను భక్తి శ్రద్ధలతో పఠించారు. అనంతరం పండిత పరిషత్ ఎంతో వైభవంగా జరిగింది. ఈ పరిషత్లో సీతారాముల గుణగణాలను వివరించేందుకు వేద పండితుల పోటీపడిన సన్నివేశం భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం వేద పండితులను దేవస్థాన అధికారులు ఘనంగా సన్మానించారు. రథంపై తిరువీధుల్లో ఊరేగిన రాములోరు... స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలనంతరం మంగల వాయిద్యాల నడుమ సీతారామచంద్రస్వామి వారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఆలయం చుట్టూ ప్రదక్షణ చేశారు. అనంతరం స్వామివారిని రథంపై ఆసీనులను చేసి విశేష అర్చనలు జరిపారు. రాత్రి 10 గంటలకు వేద పండితుల వేద మంత్రోచ్ఛారణ, భక్తుల జయజయ ధ్వానాల మధ్య సీతారామ లక్ష్మణులు రామతీర్థం పురవీధుల్లో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. సుమారు రెండు గంటల పాటు సాగిన రథయాత్రతో రామతీర్థం పులకించింది. ఆలయ ప్రతిష్ట జరిగిన నాటి నుంచి ఆనవాయతీగా వస్తోన్న సీతారామునిపేట, జగ్గరాజుపేట, గొర్లిపేట గ్రామస్తులు రథాన్ని లాగి కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. ఆలయం సమీపంలోని ప్రధాన రహదారి వద్ద ప్రారంభమైన రథయాత్ర కుమ్మరిఖానా, బ్రాహ్మణ వీఽధి మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. అనంతరం ఉత్సవ విగ్రహాలను ఆలయంలోకి తీసుకువెళ్లి వెండి మండపంలో ఆసీనులు చేశారు. రథయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు. రామతీర్థంలో ఘనంగా శ్రీరామచంద్రమూర్తి రథయాత్ర స్వామివారి సన్నిధిలో వైభవంగా పండిత పరిషత్తు కనులారా తిలకించి భక్తజనం -
చెరకు రైతుకు ప్రోత్సాహకాలు అందించాలి
● చెరకు రైతులు, కర్మాగార ప్రతినిధుల సమావేశంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం అర్బన్: రైతులు చెరకు సాగుపై మక్కువ చూపేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేయాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. చెరకు రైతుకు అన్ని రాష్ట్రాల్లోనూ రవాణా చార్జీల రూపంలో ప్రోత్సాహక నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తున్నట్టు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో టన్నుకు రూ.450 వరకు ఇస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఆ దిశగా ప్రోత్సాహక ప్రతిపాదనలు అమలు చేస్తున్నారని తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘చెరకు సాగు, రైతుల పరిస్థితుల’పై సంకిలి చెక్కర కర్మాగారం ప్రతినిధులు, చెరకు సాగుచేసే ప్రాంతాల ప్రజాప్రతినిధులు, రైతులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ చెరకు రైతుకు, కర్మాగారానికి రెండింటికీ లబ్ధి చేకూరేలా ప్రభుత్వ ప్రణాళికలు ఉండాలని తెలిపారు. పంటల మార్పిడి దిశగా రైతులను ప్రోత్సహిస్తూ అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం మూడు జిల్లాల్లో సుమారు 4 వేల హెక్టార్లలో చెరకు సాగు జరుగుతుండగా దాన్ని కనీసం 10 వేల హెక్టార్లకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి కొండపల్లి మాట్లాడుతూ గతంలో జిల్లాలో చెరకు విరివిగా పండేదని, చెక్కర కర్మాగారాలు పనిచేసిన కాలంలో రైతులు ఆ పంటవైపు మొగ్గు చూపేవారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ స్థితిని తిరిగి తీసుకురావాలని, రైతులకు చెరకు సాగు లాభాదాయకమనే భరోసా కల్పిస్తే వారు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. సంకిలి చక్కెర కార్మగారం ఈ ఏడాది మూసివేస్తారనే వదంతులు వ్యాప్తి చెందాయని, అది ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టమని విమర్శించారు. ఈ ఏడాది కర్మాగారానికి కనీసం 4 లక్షల టన్నుల చెరకు సరఫరా అయ్యేలా రైతులకు అవగాహన కల్పిస్తామని కర్మాగారం నుంచి అవసరమైన ఇన్పుట్స్ అందించే విషయంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. సంకిలి కర్మాగారం ప్రతినిధులు మాట్లాడుతూ విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో చెరకు సాగు క్రమంగా తగ్గిపోతోందని వివరించారు. చెరకు నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండడం, చెల్లింపులు ఆలస్యంగా జరగడం వల్ల రైతులు మొక్కజొన్న, ఆయిల్పామ్ వంటి ఇతర పంటల వైపు మళ్లుతున్నారని తెలిపారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ రైతు, కర్మాగారం ఇద్దరికీ లాభం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, పంటల మార్పిడిని పోత్రహిస్తూనే చెరకు సాగును పెంచాలని సూచించారు. ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి (నరసన్నపేట), కోండ్రు మురళీమోహన్ (రాజాం), బేబీ నాయన (బొబ్బలి) మాట్లాడుతూ రైతులకు భరోసా కల్పించాలని, సకాలంలో కటింగ్, మంచి సీడ్, ఆర్థిక సహాయం అందించాలని కర్మాగార ప్రతినిధులను కోరారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్, శ్రీకాకుళం, మన్యం జేసీలు వర్చువల్గా పాల్గొన్నారు. మూడు జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలు రామారావు, అన్నపూర్ణ, త్రినాథస్వామి, కేన్ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
ఆశా వర్కర్లు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు
● కలెక్టర్ హెచ్చరిక పార్వతీపురం: ఆశా వర్కర్లు విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరింలో వైద్యాధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఒక్క జ్వరం కేసు నమోదైనా ఆశాలపై చర్యలు తప్పవన్నారు. దోమల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, మందులు కూడా అందుబాటులో ఉన్నాయని, దోమల ద్వారా మలేరియా, టైఫాయిడ్, డెంగీ తదితర వ్యాధులు నమోదైతే సహించేది లేదన్నారు. జ్వరాల నివారణకు అవసరమైన శిక్షణను ఆశా వర్కర్లకు ఇవ్వాలన్నారు. దోమల వ్యాప్తి ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించి, వాటిని నివారించే వరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డా.ఎస్.భాస్కరరావు, జిల్లా మలేరియా అధికారి వై.మణి, జిల్లా ప్రొగ్రాం మేనేజర్లు డా.ఎం.వినోద్కుమార్, డా.టి.జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
హెల్త్ వర్కర్ల నిరసన
● బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ పార్వతీపురం రూరల్ : గతేడాది సెప్టెంబర్ నుంచి నిలిచిపోయిన తమ బకాయి వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కలెక్టరేట్ వద్ద శనివారం నిరసన చేపట్టారు. అందని వేతనం.. ఆగని ఆవేదన అన్న చందంగా తమ పరిస్థితి మారిందని, నెలల తరబడి వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆశ యూనియన్ నేతలు ఇందిర, గౌరీశ్వరి, శివాని పేర్కొన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్ఓ, డిప్యూటీ డీఎంహెచ్ఓలకు అందజేశారు. బకాయిలు చెల్లించడంతో పాటు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశలుగా గుర్తించి, వారికి యూనిఫాం, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని యూనియన్ ప్రతినిధులు బృందావతి, రజిని, మహాలక్ష్మి కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ కోశాధికారి జి.వెంకటరమణ, ప్రతినిధులు సూరిబాబు, గంగ శైలజ, వెంకటలక్ష్మి, లక్ష్మి, హేమలత తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తతే భద్రతకు శ్రీరామరక్ష
పార్వతీపురం రూరల్: డ్రైవర్ల అప్రమత్తతతోనే రహదారి ప్రమాదాల నివారణ సాధ్యమని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక ఆర్టీసీ డిపోలో పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రయాణంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని డ్రైవర్లు తమ బాధ్యతాయుత డ్రైవింగ్తో నిలబెట్టుకోవాలని సూచించారు. జిల్లాలో రహదారి ప్రమాదాల మృతుల సంఖ్య 2024లో 65 ఉండగా, 2025లో 105కు పెరగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రాణనష్టం జరుగుతోందన్నారు. విమానాల్లో మాదిరిగా బస్సుల్లోనూ అత్యవసర ద్వారాల (ఎమర్జెన్సీ ఎగ్జిట్) వినియోగంపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రమాదాల దర్యాప్తులో నిర్లక్ష్యాన్ని బట్టే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ప్రమాదరహితంగా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ మనీషా రెడ్డి, జిల్లా రవాణాధికారి టి.దుర్గాప్రసాద్, సీఐ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
నిరక్షరాస్యులను అఽక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి..: కలెక్టర్
గుమ్మలక్ష్మీపురం: గ్రామాల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో అక్షరాస్యత కేంద్రాలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మండ గ్రామంలో నిర్వహిస్తున్న అక్షరాస్యత కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వయోజనులకు చదువు ప్రాముఖ్యతను, కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. ప్రతీ ఒక్కరూ అక్షరాస్యులుగా మారాలని, చదువు ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందన్నారు. ప్రతీ ఒక్కరు చదువుకోవాలని, చదువుతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై కూడా ప్రత్యేక శ్రధ్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో మండ సర్పంచ్ హైమావతి, మండల మహిళా సమాఖ్య ఏపీఎం సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు. సేవ గుణం పెంపొందించుకోవాలి విద్యార్థి దశ నుంచే సేవ గుణాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద శనివారం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ.. సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ, లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా మానవతా ధృక్పధంతో సేవలందిస్తున్న రెడ్ క్రాస్ సంస్థలో ప్రతీ ఒక్కరూ సభ్యులుగా చేరాలని కోరారు. అనంతరం రెడ్క్రాస్ సొసైటీ సమకూర్చిన దుప్పట్లను పలువురు నిరుపేదలకు, అవసరార్థులకు కలెక్టర్ పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ ఎం.శ్రీరామమూర్తి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, ప్రిన్సిపాల్ టి.శ్రీవరం, వైస్ ప్రిన్సిపాల్ డి.రామయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు. -
–8లో
ఆదివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026బాబామెట్టలో ఉన్న హజరత్ ఖాదర్వలీబాబా 67వ సుగంధ మహోత్సవాలు మూడో రోజు శనివారం అంగరంగ వైభవంగా ముగిశాయి.కురుపాంలో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగలు చెలరేగిపోయారు. శుక్రవారం రాత్రి మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. సాక్షి, పార్వతీపురం మన్యం: ‘తిరుమల లడ్డూ ప్రసాదానికి చంద్రబాబు చేసింది ఘోర అపచారం. ముఖ్యమంత్రి పదవిలో చంద్రబాబు తప్పులు చేశారు.. పవిత్ర తిరుమల ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకున్నారు. చంద్రబాబు కుట్రల కారణంగా కలిగిన అపచారాల వల్ల రాష్ట్ర ప్రజలకు కష్టం, నష్టం రాకూడదు. అందుకే పాప పరిహార పూజలు చేస్తున్నాం’ అని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. 2024 సెప్టెంబర్ 18న కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో.. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన ప్రకటన ఒక మహాపాతకం. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ ఆధారాలు లేకుండా మాట్లాడటమే ఈ కుట్రకు పునాదిరాయి. అదే రోజు రాష్ట్రంలో ఈ విష రాజకీయం ఆరంభమైంది. ఇప్పుడు దీనిపై సిట్ స్పష్టత ఇచ్చిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశంలోనే ప్రముఖమైన ల్యాబ్లలో చేసిన పరీక్షల్లో చంద్రబాబు ఆరోపించినట్టుగా ఎలాంటి జంతువుల కొవ్వు కూడా ప్రసాదంలో వాడే నెయ్యిలో లేదని తేలిపోవడం అందరికీ చాలా సంతోషాన్ని, ఊరటనిచ్చిందని తెలిపారు. తిరుమల లడ్డూ విషయంలో జరిగిన అపచారంపై వైఎస్సార్సీపీ జాతీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాప పరిహార పూజలు చేశారు. పాలకొండలో కార్గిల్ జంక్షన్ సమీపంలో ఉన్న శ్రీ వేకటేశ్వర స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆధ్వర్యంలో పూజలు జరిపారు. సాలూరులో పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలోను, కురుపాంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేపట్టారు. పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పార్టీ శ్రేణులతో కలిసి శాంతియుత ర్యాలీ చేపట్టగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పార్టీ శ్రేణులతో రోడ్డుపైనే జోగారావు బైఠాయించారు. పోలీసులకు, పార్టీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆంక్షల నడుమ బెలగాం వేంకటేశ్వర స్వామి ఆలయంలో జోగారావు ప్రత్యేక పూజలు జరిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని.. వేంకటేశ్వర స్వామి ఈ కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్ సీపీ నాయకులు కోరారు. ప్లకార్డు ప్రదర్శన హిందువుల మనోభావాలతో ఆటలా? చంద్రబాబు, పవన్ కల్యాణ్ బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి తిరుమల లడ్డూ వివాదంపై సిట్ స్పష్టతనిచ్చింది స్వామి వారి ప్రసాదానికి చంద్రబాబు చేసింది ఘోర అపచారం రాష్ట్ర ప్రజలకు కష్టం, నష్టం రాకూడదనే పాప పరిహార పూజలు జిల్లాలో వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు పార్వతీపురంలో శాంతియుత ర్యాలీని అడ్డుకున్న పోలీసులు -
ఉత్తరాంధ్ర నృత్య పోటీలకు ఆహ్వానం
రాజాం సిటీ: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ జాతరను పురష్కరించుకుని సలాది వెంకటరమణ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర స్థాయి సాంప్రదాయ నృత్య పోటీలు నిర్వహించనున్నామని కళాపరిషత్ అధ్యక్షులు సలాది తులసీదాస్ తెలిపారు. శుక్రవారం ఆలయ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 22 నుంచి జరగనున్న జాతరను పురష్కరించుకుని 22 సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పోటీలు నిర్వహించనున్నామ న్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ పోటీలకు సంబంధించి ఫిబ్రవరి 10లోగా ఎంట్రీలు పంపించాలని అన్నారు. ఆర్నెపల్లి వెంకటనాయుడు, కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి, అమ్మవారికాలనీ, రాజాం పేరిట ఎంట్రీలు పంపించాలని కోరారు. పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందించనున్నామని తెలిపారు. వివరాలకు 6303215996 నంబరును సంప్రదించాలని సూచించారు. సమావేశంలో మక్క అప్పలనాయుడు, బీవీ అచ్యుత్కుమార్, గట్టి పాపారావు, పెంకి గౌరీశ్వరరావు, ఎం.జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
సుజుకీ ఈ యాక్సిస్ స్కూటీ ఆవిష్కరణ
విజయనగరం: ద్విచక్ర వాహన రంగంలో వినియోగదారుల అవసరాలగా అనుగుణంగా ముందడుగు వేసే సుజుకీ మోటారు సైకిల్ సరికొత్త ఎలక్రిక్ట్ స్కూటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. సుజుకీ ఈ యాక్సిస్ పేరిట మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటీ వినియోగదారులకు అందించేందుకు సిద్ధమైంది. విజయనగరంలోని జిల్లా కోర్టు ఎదురుగా గల సుజుకీ షోరూంలో నూతన సుజుకీ యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ సురేష్బాబు, చీఫ్ మేనేజర్ ప్రధాన్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహన రంగంలో సుజుకీ సంస్థ నూతన సంస్కరణలు వినియోగదారుల మన్ననలు పొందుతాయని ఆకాంక్షించారు. సుజుకీ కంపెనీ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ సురేంద్ర మాట్లాడుతూ సుజుకీ ఈ యాక్సిస్ స్కూటీ వైట్, బ్లూ, గ్రీన్, బ్లాక్ కలర్స్లో అందుబాటులో ఉంటాయన్నారు. వాహనాన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, వాహనం కొనుగోలు చేసిన 3 సంవత్సరాల్లో తిరిగి విక్రయించే వారికి బై బ్యాక్ ఆఫర్లో 60 శాతం మొత్తం చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా గుంటూరులో ఈ నూతన స్కూటీ అందుబాటులోకి రాగా... విజయనగరంలో మాత్రమే విక్రయాలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సుజుకీ షోరూం ఎండీ అభిరామ్, జనరల్ మేనేజర్ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గోవులను తరలిస్తున్న వాహనం సీజ్
సాలూరు: గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టణ పరిధిలో శుక్రవారం సీజ్ చేసినట్టు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు పట్టణ శివారులో వాహన తనిఖీలు చేపట్టగా గోవులను తరలిస్తున్న లారీని పట్టుకున్నామని చెప్పారు. 27 గోవులను ఒక లారీలో తరలిస్తుండగా చట్టబద్దమైన పత్రాలు లేకపోవడంతో సంబంధిత వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. గోవులను సురక్షిత సంరక్షణ కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు. ముగ్గురు గంజాయి స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు పార్వతీపురం రూరల్ : గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన ముగ్గురు నిందితులకు విజయనగరం ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50 వేల చొప్పున జరిమానా విధించింది. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 2024 ఆగస్టు 23న పాచిపెంట మండలం రోడ్డవలస జంక్షన్ వద్ద 10.2 కిలోల గంజాయిని తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ప్రవీణ్కుమార్, శక్తి మురగన్ పననివేల్, నెల్లూరు జిల్లాకు చెందిన ఎల్లంగారి సురేష్లను పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదైన ఐదు నెలల్లోనే దర్యాప్తు పూర్తి చేసి పక్కా ఆధారాలు సమర్పించడంతో న్యాయమూర్తి ఎం.మీనాదేవి శుక్రవారం ఈ తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. గంజాయి సాగు, విక్రయం లేదా రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. గర్భిణులకు ‘అభా’ నమోదు తప్పనిసరి పార్వతీపురం రూరల్ : మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా జిల్లాలో వైద్య సేవలు అందాలని జిల్లా ఏసీడీ అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు. ఆరోగ్య కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఆశా నోడల్ సిబ్బంది సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతీ గర్భిణీకి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అభా) నమోదు తప్పనిసరని స్పష్టం చేశారు. ఇ–ఆశా యాప్ ద్వారా సేవల నమోదును పర్యవేక్షించాలని, గడువులోగా టీకాలు వేయాలని ఆదేశించారు. ఆర్బీఎస్కే ద్వారా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, కేన్సర్, కుష్టు వ్యాధి లక్షణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు ‘స్పర్శ’ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో పలువురు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు పాచిపెంట: మండలంలోని తంగలాం గ్రామానికి చెందిన గెమ్మెల సురేష్ ఇంటికి విద్యుత్ పనుల నిమిత్తం అరకు వ్యాలీ కందులగుడా గ్రామానికి చెందిన వంతల రాజారావు ఈ నెల 28న వెళ్లాడు. ఈ నెల 29న సురేష్ ఇంటి ముందే రాజారావు మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు సురేష్ సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న రాజారావు కుటుంబ సభ్యులు ఆయన మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ అర్జున్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు హెచ్సీ కృపారావు తెలిపారు. జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ నెల్లిమర్ల రూరల్: చండీఘర్లో జరుగుతున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో మండలంలోని గరికిపేట గ్రామానికి చెందిన సీనియర్ వెయిట్లిఫ్టర్ బెల్లాన నాని సత్తా చాటింది. 77 కేజీల విభాగంలో శుక్రవారం పోటీల్లో పాల్గొన్న ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు. -
రామఫలాల సీజన్ ప్రారంభం
● దిగుబడులు అంతంతమాత్రమే ● ఒక్కోగుత్తి రూ.70 నుంచి రూ.80కి విక్రయం ● వచ్చేనెల వరకు సీజన్ సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో రామఫలాల సీజన్ ఆరంభమైంది. గుత్తుల లెక్కన రామఫలాలను గిరిజనులు విక్రయిస్తున్నారు. ఒక్కోగుత్తిలో 20 నుంచి 40 వరకు రామఫలాలుండగా రూ.70 నుంచి రూ.80 వరకు గిరిజనులు అమ్మకాలు జరుపుతున్నారు. ఒక్కోపండు సరాసరి రూ.3 వరకు గిరిజనులు విక్రయిస్తున్నారు. వచ్చేనెల వరకు ఈ ఫలాల సీజన్ ఉంటుంది. రామానగరం, దేవనాపురం గూడలు, అక్కన్నగూడ, రాజన్నగూడ, మొగదార, కారెం కొత్తగూడ తదితర ప్రాంతాల రైతులు సోమవారం జరిగే సీతంపేట సంతలోను, కుశిమి, కోడిశ, శంభాం ప్రాంత వాసులు శనివారం జరిగే కుశిమిసంతలోను, మర్రిపాడు, పూతికవలస, చిన్నబగ్గ, కీసరజోడు పంచాయతీ వాసులు మర్రిపాడులో బుధవారం జరిగే సంతలోను, పొల్ల, టిటుకుపాయి రైతులు దోనుబాయిలో గురువారం జరిగే సంతలో రామఫలాలు విక్రయిస్తున్నారు. మైదాన ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ గుత్తులు లెక్కన కొనుగోలుచేసి పట్టణ ప్రాంతాల్లో కిలోల లెక్కన రూ.100 నుంచి 150 వరకు విక్రయిస్తామని వ్యాపారులు చెబుతున్నారు. అంతగా పెట్టుబడులు లేకుండా కొండపోడు వ్యవసాయంలో ప్రధానంగా పండే ఈ పంట ఏజెన్సీలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. సేకరణ కష్టమే అయినా ఆదాయం వస్తుందని గిరిజనులు చెబుతున్నారు. అయితే, ఈ ఏడాది దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయని చెబుతున్నారు. కొండపోడు వ్యవసాయంలో పండే రామఫలాల సేకరణ కష్టమే. ఎంతకాలం నిల్వ ఉండవు. మైదాన వ్యాపారులు అడిగిన ధరకే పంటను విక్రయిస్తున్నాం. – చిన్నకడాయి, బొండిగూడ గత రెండేళ్లుగా అన్ని పంటల్లో నష్టపోతున్నాం. లాభాలు వస్తాయనుకుంటే అవీ రాలేదు. కొండలపైన సేకరించిన అటవీ ఫలసాయాలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. – ఎస్.జగ్గారావు, పొంజాడ వారపు సంతకు రామఫలాలు తీసుకు వస్తున్న యువతి -
సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: ప్రజలు సంతృప్తి చెందే విధంగా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం పీహెచ్సీ వైద్యాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల పట్ల వైద్యులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. ఆస్పత్రుల్లో మందులు కొరత లేకుండా చూడాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. రోగులు సంతృప్తి చెందే విధంగా సేవలు మెరుగు పడాలని తెలిపారు. మాతృ, శిశు మరణాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, గర్భిణులకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిపించాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పారిశుధ్యంపై నిఘా ఉంచాలని తెలిపారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల కొంగు బంగారం వ్యాకులమాత
● కొండడాబాల వ్యాకులమాత యాత్ర రేపు ● భారీ బందోబస్తు ● దేశంలోనే ఎత్తైన గొర్రెల కాపరి క్రీస్తు స్వరూపంకొత్తవలస : మండలంలోని కొండడాబాల వ్యాకులమాత పుణ్యక్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. దక్షిణ భారతదేశంలోనే అతి పురాతన పుణ్యక్షేత్రం ఇది. దీన్ని 1817 సంవత్సరంలో ఏర్పాటు చేసినట్టు చరిత్ర చెబుతోంది. ఇక్కడ రోమన్ కేథలిక్ మిషనరీ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఏటా ఫిబ్రవరి నెలలో వచ్చే మొదటి ఆదివారం మహా యాత్రను నిర్వహిస్తుంటారు. పుణ్యక్షేత్రం చరిత్ర ఈస్టిండియా కంపెనీ పాలనలో 1876లో సంభవించిన భారీ తుఫాన్ వల్ల విశాఖపట్నం జిల్లా జ్ఞానాపురం దగ్గర గల చర్చిలు దెబ్బతిన్నాయి. అక్కడి క్రైస్తవ భక్తులు తమ సొంత గ్రామమైన లక్కవరపుకోట మండలం గనివాడ, నిడిగట్టు గ్రామాలకు చేరుకున్నారు. 1877లో ఫాదర్ అలిక్స్రీకాగా సాయంతో కొత్తవలస మండలం గొల్లలపాలెం సమీపంలో గల కొండపై పెద్ద కమ్మలశాలను ఏర్పాటు చేసి అప్పట్లో చర్చి నిర్వహించారు.1890లో కొండను చదును చేసి బిషప్ జేఎం టిస్సో చేతుల మీదుగా గ్రీకు ప్రాంకోశైలిలో చర్చి నిర్మాణ పనులు ప్రారంభించి వ్యాకులమాతగా నామకరణం చేశారు. కొండపై పెద్ద డాబాలను నిర్మించారు. నాటి నుంచి కొత్తవలసను కొండడాబాలుగా పిలుస్తున్నారు. ఫ్రాన్స్ నుంచి తెచ్చిన మేరీమాత విగ్రహం ప్రతిష్ట 1914వ సంవత్సరంలో ఫాదర రోస్పియోన్ సుమారు రూ.6వేలు వెచ్చించి ఫ్రాన్స్ దేశం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన మేరీమాత విగ్రహాన్ని ప్రతి ష్ఠించారు. తల్లి ఒడిలో బిడ్డ పార్ధీవదేహాన్ని పెట్టుకొని మనోవేదనను తన గుండెల్లో దాచుకున్న వ్యాకులమాత(కనికరమాత)గా ఇక్కడి స్వరూపం ప్రత్యేకత. కొండడాబాల వ్యాకులమాత చర్చిని అన్ని వసతులతో పూర్తి స్థాయిలో నిర్మించి 2020 నాటికి 130 సంవత్సరాలైంది. ఇందుకు గుర్తుగా భారతదేశంలోనే అత్యంత ఎత్తైన భారీ గొర్రెలకాపరి క్రీస్తు స్వరూపం ఏర్పాటు చేశారు. క్రీస్తు జీవించిన కాలం ఆధారంగా 331/2 అడుగుల ఎత్తులో భారీ విగ్రహాన్ని నిర్మించారు. ఇది ఈ క్షేత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం యాత్ర ఇక్కడ ఏటా ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం యాత్రను నిర్వహించడం ఆనవాయితీ. తొమ్మిది రోజుల ముందు నుంచి నవదిన పూజా ప్రార్ధనలు నిర్వహిస్తారు. ఒడిశా, తెలంగాణ, చత్తీస్ఘడ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఆంధ్రాలోనే అతిపెద్ద బోర్డింగ్ పాఠశాల రోమన్ కేథలిక్ మిషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి 1913వ సంవత్సరంలో తొలిసారిగా బోర్డింగ్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఫాదర్స్ శిక్షణ విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పూర్తి కొండడాబాలు వ్యాకులమాత యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నాలుగు రాష్ట్రాల నుంచి లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. యాత్రికులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలు చేపట్టాం. – డాక్టర్ గొండాడ రాజు, కొండడాబాల విచారణకర్త భారీ బందోబస్తు వ్యాకులమాత యాత్ర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. డీఎస్పీ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 16 మంది ఎస్ఐలు, 220 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నాం. ఇక్కడకు వచ్చే వాహనాలు కొత్తవలస జంక్షన్ నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి కింద నుంచి రాజపాత్రునిపాలెం మీదుగా వెళ్లి తిరుగు ప్రయాణం కొత్తగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ హైవే మీదుగా నరపాం, తుమ్మికాపల్లి మీదుగా వెళ్లాలి. – సీహెచ్ షణ్ముఖరావు, సీఐ, కొత్తవలస -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
తెర్లాం: యూరియా కోసం తెర్లాం మండలంలోని విజయరాంపురం గ్రామ రైతులు రోడ్డెక్కారు. ఖరీఫ్ సీజన్ నుంచి ఇంతవరకు రైతుకు కేవలం ఒకబస్తా యూరియా మాత్రమే వ్యవసాయ అధికారులు పంపిణీ చేయడంపై మండిపడ్డారు. పంటల సాగుకు కావాల్సిన యూరియా సరఫరా చేయలేని చంద్రబాబు ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోశారు. తెర్లాం వ్యవసాయ కార్యాలయం వద్ద ప్లకార్డులతో శుక్రవారం నిరసన తెలిపారు. గ్రామ సర్పంచ్ బూరి మధుసూదనరావు, రైతులు మాట్లాడుతూ విజయరాంపురం గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని నెమలాం ఆర్ఎస్కేలో ప్రభుత్వం విలీనం చేసిందన్నారు. విజయరాంపురం గ్రామానికి చెందిన భూములు సుందరాడ, నెమలాం ఆర్ఎస్కేల పరిధిలో ఉన్నాయని తెలిపారు. అక్కడకు యూరి యా వచ్చినా విజయరాంపురం రైతులకు అందజేయడం లేదని, అక్కడి టీడీపీ నేతలు తమ అనుచరులకు పంపిణీ చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఏఓని కలిసి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, మండల సర్వసభ్య సమావేశంలో మండలాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వాపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు దుకాణాల వద్ద అధిక ధరకు యూరియా కొనుగోలు చేయాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. యూరియా అందజేయాలంటూ తహసీల్దార్ జి.హేమంత్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఏడాదిగా రైతుకు ఒక బస్తా యూరియా సరఫరాపై మండిపాటు తెర్లాంలో విజయరాంపురం రైతుల ధర్నా ప్రభుత్వం తీరును దుమ్మెత్తిపోసిన రైతులు -
సంపూర్ణ అభియాన్ 2.0 ప్రారంభోత్సవం
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని కుశ గ్రామంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో చేపట్టిన సంపూర్ణ అభియాన్ 2.0 కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోనే ఎంతో అందమైన కుశ ప్రాంతంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఈ సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో సంపూర్ణ అభియాన్ పథకం కింద మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ రెడ్డి, ఐటీడీఏ పీఓ జగన్నాథ్, ఐసీడీఎస్ పి.డి కనకదుర్గ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాలో మీడియా అక్రిడిటేషన్ కార్డులకు ఆమోదం
విజయనగరం అర్బన్: జిల్లాలోని పెద్ద, చిన్న, దిన, మాస పత్రికలు, శాటిలైట్ టీవీ ఛానళ్లు, కేబుల్, ఫైబర్ నెట్, ప్రభుత్వ మీడియాకు చెందిన మొత్తం 407 మందికి మీడియా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ నిర్ణయించింది. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి కన్వీనర్గా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి పి.గోవిందరాజులు వ్యవహరించారు. కమిటీ సభ్యులు సమావేశంలో అక్రిడిటేషన్ కార్డుల మంజూరుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఎక్స్ ఆఫీసియో సభ్యులు, సీపీఓ పి.బాలాజీ, కమిటీ సభ్యులు పి.శ్రీనివాసరావు, పీఎస్ఎస్ఎస్వీ ప్రసాదరావు, టి.రాధాకృష్ణ, కె.రమేష్నాయుడు, మహాపాత్రో వెంకటేశ్వర, బీజీఆర్ పాత్రో, ఎం.శివకుమార్, పంచాది అప్పారావు, బూరాడ శ్రీనివాసరావు, బి.నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా లెప్రసీ అండ్ టీబీ కంట్రోల్ అధికారిణి డాక్టర్ కె.రాణి, హౌసింగ్ పీడీ మురళీమోహన్, డీపీఈఓ జె.శ్రీనివాసరావు, కార్మిక శాఖ ఏసీ జి.ఎల్లాజీరావు, డివిజనల్ పౌర సంబంధాల అధికారి ఎస్.జానకమ్మ, సహాయ కార్య నిర్వహక సమాచార ఇంజినీర్ పి.మల్లేశ్వరరావు, ఏపీఆర్ఓ సీహెచ్ ప్రభుదాస్ తదితర అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ను జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు సత్కరించారు. -
శనివారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2026
వీరఘట్టం: శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు.. క్రైస్తవుల సహాయమాత మేరీమాత మహోత్సవం శుక్రవారం కనులపండువగా జరిగింది. వీరఘట్టం మండలం యు.వెంకమ్మపేట వద్ద ఉన్న మరియగిరి కొండపై వెలసిన మరియమ్మ దర్శనానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. టెంకాయలు కొట్టి, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. శ్రీకాకుళం మేత్రాసనం పీఠాధిపతి రాయరాల విజయకుమార్ ఆధ్వర్యంలో సాగిన ప్రత్యేక దివ్యపూజల్లో పాల్గొన్నారు. మేరిమాతకు వందనం.. అభివందనం.. మానవాళికి నీవే తల్లివంటూ కీర్తించారు. ఏసు శాంతి సందేశాలను వినిపించారు. మరియగిరి వద్ద నూతనంగా నిర్మించిన సింహద్వారాన్ని, మేరిమాత విగ్రహాన్ని విజయ్కుమార్తో కలిసి విశాఖపట్నం బిషప్ ఉడుమల బాల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు బిషప్లను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చిన సుమారు 50 వేలమంది భక్తులు దివ్యపూజలో పాల్గొన్నారు. మరియగిరి యాత్ర సందర్భంగా వీరఘట్టం, చిట్టపుడివలస, సివిని, పార్వతీపురం, బెలగాం, గరుగుబిల్లి, తూడి, పాలకొండ, వంగర, తలవరం, సంకిలి, నవగాం, పాలవలస తదితర గురుమండలాల్లో ఇటీవల నిర్వహించిన బైబిల్, ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి శ్రీకాకుళం, విశాఖపట్నం బిషప్లు బహుమతులు ప్రదానం చేశారు. యాత్రకు ఎలాంటి అంతరాయం కలగకుండా పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు ఆధ్వర్యంలో పాలకొండ సీఐ ఎ.ప్రసాదరావు, వీరఘట్టం ఎస్ఐ ఎస్.షణ్ముఖరావు, సీతంపేట, దోనుబాయి, చినమేరంగి ఎస్ఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రయాణికుల సౌకర్యార్ధం పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం డిపోల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలి మరియగిరి కొండపై వెలసిన మేరీమాతను పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి దర్శించుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజలందరినీ చల్లగా చూడు తల్లీ అంటూ ప్రార్థన చేశారు. కొవ్వొత్తులు వెలిగించి, టెంకాయ కొట్టి మొక్క తీర్చుకున్నారు. ఆమెతో పాటు జెడ్పీటీసీ సభ్యురాలు జంపు కన్నతల్లి, వండువ సర్పంచ్ మిడితాన కళ్యాణి మేరిమాతను దర్శించుకున్నారు. కనుల పండువగా మరియగిరి యాత్ర మేరీమాత దర్శనానికి తరలివచ్చిన భక్తులు దివ్యపూజల్లో పాల్గొన్న భక్తలోకం -
ఆస్పత్రికి వెళ్తుండగా ఆటో బోల్తా
● గర్భిణితో పాటు ఏడుగురికి గాయాలు ● పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి కురుపాం: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడింది. గర్భిణితో పాటు మరో ఏడుగురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మలక్ష్మీపురం మండలం పెదరావికోన గ్రామానికి చెందిన గర్భిణి తోయక లక్ష్మికి గురువారం అర్ధరాత్రి నొప్పులు వచ్చాయి. ఆమెను కుటుంబ సభ్యులు ఆటోలో రేగిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తుండగా రేగిడి సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గర్భిణి లక్ష్మి, అమరావతి అనే యువతికి చేతులు విరిగిపోయాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పీహెచ్సీకి తరలించారు. గర్భిణి పరిస్థితి విషమించడంతో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వెంటనే అక్కడి వైద్యులు చికిత్స అందించగా... ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
పోలీసులకు ‘పునశ్చరణ’
● 15 రోజుల పాటు సాయుధ దళాలకు ప్రత్యేక శిక్షణ ● ప్రారంభించిన ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డిపార్వతీపురం రూరల్ : జిల్లా పోలీసు వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఆర్మడ్ రిజర్వు (ఏఆర్) పోలీసుల వృత్తి నైపుణ్యానికి పదును పెట్టేందుకు మొబిలైజేషన్ (పునశ్చరణ) తరగతులు ప్రారంభమయ్యాయి. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఈ శిక్షణా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు 15 రోజుల పాటు సాగే ఈ శిబిరంలో సిబ్బందికి సర్వతోముఖాభివృద్ధిపై తర్ఫీదు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. క్రమశిక్షణకు డ్రిల్ ప్రాణవాయువు వంటిది అని పేర్కొంటూ, విధుల్లో చురుకుదనం, శారీరక దారుఢ్యం పెంపొందించుకోవడమే ఈ మొబిలైజేషన్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. వివిధ రకాల ఆయుధాల వినియోగం, ఫైరింగ్ ప్రాక్టీస్, బాంబు స్క్వాడ్ పనితీరు మరియు బందోబస్తు విధుల్లో మెలకువలపై ఈ సందర్భంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. కేవలం వృత్తిపరమైన అంశాలే కాకుండా, పోలీసుల వ్యక్తిగత సంక్షేమంపై కూడా ఈసారి దృష్టి సారించారు. విధుల్లో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించనున్నారు. ఆర్థిక క్రమశిక్షణ, సర్వీసు నిబంధనల పట్ల సిబ్బందికి దిశానిర్దేశం చేయనున్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరావు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్.ఐలు నాయుడు, రాంబాబు, శ్రీనివాసరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి దాష్టీకం
● వడ్డీ కోసం విచక్షణారహితంగా దాడి ● సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు అనిల్ అఘాయిత్వం ● ఆస్పత్రి పాలైన బాధితురాలు సుజాత పార్వతీపురం రూరల్: అధికార బలంతో పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అనుచరుడు అనిల్ ఒంటరి మహిళపై రెచ్చిపోయాడు. రాయలేని పదాలతో దూషించాడు. విచక్షణారహితంగా దాడిచేశాడు. సభ్యసమాజం తలదించుకునేలా జుత్తుపట్టుకుని రోడ్డంతా ఈడ్చేశాడు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శగురువారం జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆయన రౌడీయిజం అంతా సీసీ కెమెరాల్లో రికార్డు కావడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో టీడీపీ కార్యకర్త ఆరాచకంపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం... పార్వతీపురం ఇందిరా కాలనీ (12వ వార్డు)కి చెందిన ఒంటిరి మహిళ సారిక సుజాత కుటుంబ పోషణ కోసం స్థానికంగా చిన్న టిఫిన్ కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తోంది. కుమార్తె వివాహం నిమిత్తం అదే కాలనీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే విజయచంద్ర అనుచరుడు పాలకొండ అనిల్ వద్ద మూడేళ్ల కిందట రూ.50 వేలు అప్పు తీసుకుంది. తన తల్లికి వచ్చే పింఛన్ డబ్బులను తాకట్టుగా పెట్టి నెలకు రూ.3వేలు చొప్పున వడ్డీ చెల్లిస్తోంది. గత నెల వడ్డీ ఇవ్వలేదు. గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో అనిల్ బాధితురాలు సుజాత ఇంటికి వెళ్లి వడ్డీ డబ్బులు డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేదని, ఫిబ్రవరిలో రెండు నెలల వడ్డీ చెల్లిస్తానని సుజాత బతిమిలాడింది. వినిపించుకోకుండా ఆమైపె కిరాతకంగా ప్రవర్తించాడు. ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ గుండైపె, ఎడమ చెంపపై పిడిగుద్దులు కురిపించి రాక్షసంగా ప్రవర్తించాడు. స్థానికులు అనీల్ను అడ్డుకుని గాయపడిన సుజాతను ఆటోలో పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. ‘నాకు దిక్కు ఎవరూ లేరని తెలిసి, ఎమ్మెల్యే మనిషినన్న అహంకారంతో నన్ను చావబాదాడు‘అంటూ సుజాత పార్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించింది. -
బాలల సంరక్షణ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
పార్వతీపురం: బాలల సంరక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్న సంస్థలు.. జువైనల్ జస్టిస్ 2016 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాలల సంరక్షణ కోసం ఏదైనా చట్టం కింద లైసెన్సు తీసుకున్నప్పటికీ జువైనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ చట్టం–2015) ప్రకారం.. సెక్షన్–41 కింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. నిర్దేశించిన ప్రొ ఫార్మాలో ఫిబ్రవరి 13లోగా డైరెక్టర్ బాలల సంక్షేమం, సంస్కరణలో సేవలు అండ్ వీధి బాలల సంక్షేమశాఖ, రోటరీనగర్, విద్యాధరపురం, విజయవాడ 520012 కార్యాలయానికి దరఖాస్తు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 94403 32581 నంబర్ను సంప్రదించాలన్నారు. ముగిసిన భద్రతా మాసోత్సవాలు ● ప్రమాద రహిత డ్రైవర్లకు సత్కారం విజయనగరం అర్బన్: ఆర్టీసీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహించిన ‘రోడ్డు భద్రతా మాసోత్సవాలు–2026’ శుక్రవారంతో ముగిశాయి. డీపో ప్రాంగణంలో జరిగిన ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్పీ ఏఆర్దామోదర్ మాట్లాడుతూ రవాణా నియమాలు పాటించడమే ప్రమాదాల నివారణకు మార్గ మని అన్నారు. ప్రమాద రహితంగా విధులు నర్వహించిన విజయనగరం, ఎస్.కోట డిపో డ్రైవర్లను ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ హెచ్.దివ్య, డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ డైరీనే కీలకం విజయనగరం క్రైమ్: విజయనగరం గోకపేటలో నివసిస్తున్న హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు ఇంట్లో రెండో రోజు శుక్రవారం ఏసీబీ డీఎస్పీ రమ్య అధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన డాక్యుమెంట్లు, భూ పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో తనవల్ల లబ్ధిపొందిన అధికారుల ఫోన్నంబర్లు, లబ్ధి వివరాలు ఉన్నట్టు సమాచారం. ఎక్కువగా రిజిస్ట్రార్ల పేర్లు, ఫోన్ నంబర్లు ఉన్నట్టు తెలిసింది. రాములోరి రథయాత్ర నేడు నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామచంద్రస్వామి రథయాత్ర మహోత్సవం శనివారం కనులపండువగా జరగనుంది. దీనికోసం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏటా కల్యాణోత్సవం అనంతరం రామతీర్థంలో రథయాత్ర ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. శనివారం వేకువజామున ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో విశేష హోమాలు జరిపిస్తారు. ఉదయం 8 గంటలకు శ్రీ మద్రామాయణ పారాయణం, వైదిక సదస్యం, తదితర కార్యక్రమాలను జరిపిస్తారు. సాయంత్రం 6 గంటలకు పండిత సదస్సు నిర్వహించి పలువురు వేద పండితులకు సన్మాన మహోత్సవం జరిపిస్తారు. అనంతరం సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించి మంగల వాయిద్యాల నడుమ సీతారామచంద్రమూర్తిని ఊరేగింపుగా ఉత్తర రాజగోపురం సమీపంలో ఏర్పాటు చేసిన రథంపై ఆసీనులు చేస్తారు. రథంపై విశేష పూజలు నిర్వహించిన తరువాత రాత్రి 10 గంటలకు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆలయం నుంచి కుమ్మరి ఖానా మీదుగా తిరిగి దేవస్థానం తూర్పు రాజగోపురం వద్దకు స్వామివారి రథాన్ని తీసుకువస్తారు. సమీప గ్రామాలైన జగ్గరాజుపేట, సీతారామునిపేట, గొర్లిపేట గ్రామాలకు చెందిన భక్తులు ఎప్పటిలాగే రథాన్ని ముందుకు నడిపిస్తారు. రథయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సుమారు 40 మంది పోలీసులతో ఆ శాఖ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఉత్సవ విజయవంతానికి భక్తులు సహకరించాలని ఈఓ శ్రీనివాసరావు కోరారు. -
అక్రమ సస్పెన్షన్పై ఎస్డబ్ల్యూఎఫ్ ఆందోళన
విజయనగరం అర్బన్/గంటస్తంభం: ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిపై విధించిన అక్రమ సస్పెన్షన్ను తక్షణమే రద్దు చేయాలని ఆ సంఘం జిల్లా రాష్ట్ర కార్యదర్శి వి.రాములు డిమాండ్ చేశారు. స్థానిక ఎల్పీజీ భవనంలో శుక్రవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. అక్రమ సస్పెన్ష్న్కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఈ నెల 17న విజయవాడలో మాస్ ధర్నా నిర్వహిస్తామని ప్రకటించింది. ధర్నాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను సంఘం పిలుపునిచ్చింది. ఎలాంటి విధులు కేటాయించనప్పటికీ పెట్రోల్ బంకుకు సంబంధించిన అవకతవకల కేసులో అసలు బాధ్యులను వదిలేసి కక్ష సాధింపు ధోరణితో అక్రమంగా సస్పెండ్ చేశారని సంఘం ఆరోపించింది. ఆయన పని చేసే స్థలం వేరైనా డిపోలో విధులు నిర్వహిస్తున్నట్టు కాపీ పేస్టు విధానంలో సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేయడం న్యాయ ప్రమాణాలకు విరుద్ధమని పేర్కొంది. అక్రమ, చట్ట విరుద్ధమైన రాజ్యాంగ విరుద్ధమైన ఈ సస్పెన్షన్ను బేషరతుగా రద్దు చేసే వరకు దశలవారీ ఉద్యమాలు కొనసాగిస్తామని జిల్లా కమిటీ ప్రకటిందించి. కార్యక్రమంలో వివిధ ప్రజా, కార్మిక సంఘాల ప్రతినిధులు బి.లక్ష్మి, పి.భూషణరావు, ఎ.జగన్మోహన్, వి.రాము, సీహెచ్.వెంకటరావు, ఎస్కె.రోటి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 17న విజయవాడలో మాస్ ధర్నా


