breaking news
Parvathipuram manyam District News
-
ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములనాయుడు ప్రాజెక్ట్ ప్రధాన గేట్లు దిగువ భాగంలో విద్యుత్ శాఖ ఉద్యోగి కోమటిపల్లి సూర్యనారాయణ(60) ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు హెడ్ కానిస్టేబుల్ నీలం శ్రీనివాసరావు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. రేగిడి మండల విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా సూర్యనారాయణ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 25న విధులు ముగించుకుని ఆయన ఇంటికి రాలేదు. ప్రధాన గేట్లు దిగువ భాగంలో మృతదేహం ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించి శుక్రవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నీటిలో ఉన్న మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చిన అనంతరం వివరాలు సేకరించారు. రాజాంలోని అమ్మవారి కాలనీలో నివాసముంటున్న సూర్యనారాయణగా గుర్తించారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి మడ్డువలస వైపు రాగా ప్రాజెక్ట్ దిగువ భాగం లోతుగా ఉండడంతో కాలు జారి నీటిలో పడిపోయి ఉంటాడని, ఈ క్రమంలో ప్రమాదవశాత్తు పడిపోయి ఉంటాడని ఆయన భార్య స్వర్ణలత ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మృతదేహాన్ని రాజాం సీహెచ్సీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్సీ తెలిపారు. చెరువులో దూకి వ్యక్తి.. విజయనగరం క్రైమ్ : నగరంలోని పెద్ద చెరువులో లంకేన సత్యనారాయణ(36) దూకి మృతి చెందినట్టు వన్ టౌన్ ఎస్ఐ రవి శుక్రవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కొత్తవలసకు చెందిన లంకేన లక్ష్మి తన భర్త సత్యనారాయణను విశాఖలోని మానసిక ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి చికిత్స కోసం తీసుకువెళ్తుంది. ప్రయాణంలో భాగంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కు బస్సు రాగానే మతి స్థిమితం లేని సత్యనారాయణ బస్సు దిగి కనిపించకుండా పోయాడు. దీంతో స్థానిక పోలీస్స్టేషన్లో లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో స్థానికుల సమాచారంతో ఓ వ్యక్తి పెద్ద చెరువులో పడి ఉన్నట్టు గుర్తించారు. విషయం తెలుసుకొని లక్ష్మి అక్కడకు వెళ్లగా అక్కడ తన భర్త చెప్పులు, తువ్వాలును గుర్తించినట్టు ఎస్ఐ తెలిపారు. భర్తకు ఉన్న మానసిక అనారోగ్యం వల్ల పెద్ద చెరువులో దూకి చనిపోయి ఉంటాడని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
ఎత్తుకు పై ఎత్తులు
● అండర్–19 చెస్ పోటీలకు స్పందన విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న అండర్ – 19 బాల, బాలికల చెస్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపికలు శుక్రవారం ముగిసాయి. చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం, ఫైర్ చెస్ స్కూల్ సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపిక పోటీలో ఓపెన్ విభాగంలో ఎం.కృష్ణసాయి సూరజ్, ఎం.అరవన్, రొంగలి ప్రేమ్కుమార్, కె.హిమాంస్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న వారిలో ఉన్నారు. బాలికల విభాగంలో ఆర్వి.మాధురి మోక్షిత, కొండేటి నితీషా, ఇజ్జరోతు భావన, బైరెడ్డి షణ్ముక ప్రియ జిల్లా జట్టులో స్థానం దక్కించుకున్న వారిలో ఉన్నారు. ఎంపికైన క్రీడాకారులు జూలై నెలలో అనకాపల్లిలో జరగనున్న అండర్–19 చెస్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్టు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా ప్రతినిధి కెవి.జ్వాలాముఖి తెలిపారు. పోటీలకు న్యాయ నిర్ణేతులుగా ఎ.హేమబిందు, ఉషారాణి వ్యవహరించారు. విజయనగరం అర్బన్: రాష్ట్రంలో టెట్ పరీక్షను పూర్తిగా ఆఫ్లైన్ విధానంలోనే నిర్వహించాలని, ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) డిమాండ్ చేసింది. స్థానిక అమర్ భవనంలో శుక్రవారం నిర్వహించిన సంఘం జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నూత న పీఆర్సీ కమిషన్ను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల టెట్ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. ఉపాధ్యాయులకు సుదీర్ఘకాలంగా రావాల్సి ఉన్న పెండింగ్ బకాయిలన్నింటినీ సకాలంలో పూర్తి స్థాయిలో విడుదల చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా అధ్యక్షుడు వై.అప్పారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకుడు కేవీ శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
కనీస వేతనం పెంపునకు డిమాండ్
● ఉద్యోగ భద్రత కల్పించాలి ● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ పార్వతీపురం రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్డ్ రంగాల్లోని పరిశ్రమలు, సంస్థల్లో పని చేస్తున్న 50 లక్షల మంది కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని, నాన్ పర్మినెంట్ కార్మికులను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవనంలో ‘కనీస వేతనాల సాధన’ సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా నిత్యావసరాలు, విద్యా, వైద్య ఖర్చులు పెరుగుతున్నా కార్మికుల వేతనాలు మాత్రం పెరగలేదన్నారు. ప్రతి ఆరు నెలలకోసారి వేతనాలు సవరించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు లేకపోవడంతో ప్రైవేటు సంస్థల్లో పని చేసే వారికి నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. తక్షణమే కనీస వేతనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జూలై నెలంతా కార్మికుల్లో విస్తృత ప్రచారం నిర్వహించి.. జూలై 30, 31 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేపడతామని తెలిపారు. సదస్సులో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డి.రమణారావు, కార్యదర్శి వై.మన్మధరావు, ఉపాధ్యక్షులు వి.ఇందిర, జి.జ్యోతి, ఎం.శివాని, వై.శాంతి కుమారి, ఇతర కార్యదర్శులు బి.వి.రమణ, ఎన్.వై.నాయుడు, ఆర్.రాము, కోశాధికారి గొర్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
రంగం సిద్ధం
–8లోకంచర గెడ్డ కబ్జా! బొబ్బిలి మండలంలోని కాశిందొరవలస వద్ద నిర్మించిన కంచరగెడ్డ జలాశయం ఆక్రమణకు గురైంది. పార్వతీపురం మన్యం జిల్లా 2022 ఏప్రిల్ 4న ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు మండలాలు, విజయనగరం జిల్లాలోని 11 మండలాలతో కలిపి 15 మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేశారు. అయితే, ఉపాధ్యాయుల బదిలీల్లో మాత్రం పాత జిల్లాల ప్రాప్తికే బదిలీల ప్రక్రియ చేపడుతున్నారు. ప్రస్తుతం జరగనున్న ఉపాధ్యాయుల సర్దుబాటు కూడా పాత జిల్లాల ప్రాప్తికే చేపడుతున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. -
పోయిన మొబైల్ ఫోన్ల అప్పగింత
రాజాం సిటీ: గతంలో పోగొట్టుకున్న ఆరు మొబైల్ ఫోన్లను బాధితులకు పోలీసులు శుక్రవారం అందజేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన శెట్టి సురేష్, ధీరజ్కుమార్, పేర్ల పవన్కుమార్, కలిగి ఝాన్సీ, ఎర్ర శంకరరావు, బల్ల మహేష్ గతంలో ఫోన్లు పోగొట్టుకుని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారని సీఐ కె. అశోక్కుమార్ తెలిపారు. వాటిని సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైన సెల్ ఫోన్ పోగొట్టుకుంటే సంబంధిత ఫోన్ కొనుగోలు చేసిన బిల్లు, ఆధార్ కార్డుతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. -
29న నైరెడ్లో ఉచిత శిక్షణకు ఇంటర్వ్యూలు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ నైరెడ్లో ఈ నెల 29న ఉచిత శిక్షణకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్ రాజేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 19 నుంచి 50 సంవత్సరాలలోపు సీ్త్ర, పురుషులు అర్హులని పేర్కొన్నారు. సీ్త్రలకు హోమ్ నర్సింగ్ (30 రోజులు), ఫొటో అండ్ వీడియో గ్రఫీ (31 రోజులు)లలో శిక్షణ ఉంటుందని అన్నారు. పురుషులకు సెల్ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్ (30 రోజులు), ఫొటోగ్రఫీ అండ్ వీడియో గ్రఫీ (31 రోజులు), ఏసీ, రిఫ్రిజిరేషన్ (75 రోజులు), సీసీ టీవి ఇన్స్టాలేషన్ (13 రోజులు)లలో శిక్షణ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. శిక్షణా కాలంలో వసతి, భోజన సదుపాయం కల్పించనున్నామని, వివరాలకు 9491741129, 9866913371 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఓటు చాలా విలువైనది చీపురుపల్లి: రాజ్యాంగంలో ఓటు చాలా విలువైందని వైస్సార్సీపీ జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనువాసుల నాయుడు అన్నారు. పట్టణంలోని 146వ పోలింగ్ బూత్ పరిధిలో నిర్వహించిన సర్ ప్రోగ్రాంను ఆయన పరిశీలించారు. ఈ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఓలు, బీఎల్ఏలు కో–ఆర్డినేషన్ చేసుకోవాలన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు తొలగించకుండా చూడాలన్నారు. ఓటర్లు కూడా ప్రతి బూత్లో మీ ఇంటికి వచ్చిన బీఎల్ఓ, బీఎల్ఏలకు సహకరించాలని కోరారు. తమ ఓట్లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలని గుర్తు చేశారు. బీఎల్ఓ గోవింద్, బీఎల్ఏ రాజు, వైఎస్సార్సీపీ నాయకులు రేవల్ల సత్తిబాబు, కర్రోతు ప్రసాద్, పైడిరాజు, కల్కీజీవన్, రామగురువులు పాల్గొన్నారు. -
రైతన్నకు సాగు అడ్డంకులు!
● ఎరువుల పంపిణీలో సర్కారు ‘కృత్రిమ’ వ్యూహం ● జిల్లాలో 2.21 లక్షల ఎకరాల్లో పంటల సాగుపై నీలినీడలు ● అంతర్జాతీయ సాకుతో ఎరువులపై అదనపు బాదుడు జిల్లాలో ఖరీఫ్ సాగు ప్రారంభమైనా చంద్రబాబు సర్కారు నుంచి రైతులకు మొండిచేయే కనిపిస్తోంది. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, కాలువల మరమ్మతులను గాలికి వదిలేసింది. సక్రమంగా సాగునీరు అందే పరిస్థితి లేదు. రేపు పంట పండిస్తే మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుందనే నెపంతోనే, ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సాగును నిరుత్సాహపరుస్తోంది. ఒకవైపు డీజిల్ ధరలతో ట్రాక్టర్ అద్దెలు భారమై అన్నదాతలు అల్లాడుతున్నారు. – బి.వి రమణ, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు /పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం రూరల్: గడిచిన రేండు ఏళ్లుగా ఆశించిన స్థాయిలో పంటలు కలిసిరాలేదు. అప్పుల ఊబిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. వారిని ఆదుకోవాల్సిన సర్కారు ఈ సారి సరికొత్త వ్యూ హంతో సాగుకు దూరం చేసేందుకు ప్రయత్నిస్తోందన్న అంశం రైతులను కలవరపెడుతోంది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత నుంచి తప్పుకునేందుకే ప్రభుత్వం ఎరువుల సరఫరాలో జాప్యం చేస్తూ, క్షేత్రస్థాయిలో అవస్థలు సృష్టిస్తోందన్న చర్చ గ్రామీణ ప్రాంతాల్లో సాగుతోంది. మరోవైపు తెలుపు అన్నం ఎవరూ తినడంలేదని, ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఆసక్తి చూపడంలేదన్న వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్న వ్యాఖ్యలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాగుపై ఆసక్తి సన్నగిల్లేలా చేస్తున్నాయి. సాగు అంచనాలు తలకిందులు వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఖరీఫ్ సీజన్లో జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2.21 లక్షల ఎకరాలు కాగా, వాతావరణ అనుకూలతను బట్టి ఇది 2.41 లక్షల ఎకరాల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. జిల్లాలో ప్రధాన పంట అయిన వరి ఏకంగా 2,16,655 ఎకరాల్లో (97,500 హెక్టార్లు) సాగువుతుందని అంచనా. మొక్కజొన్న 10,791 హెక్టార్లు, పత్తి 2,200 హెక్టార్లు, వివిధ రకాల కూరగాయల సాగు 2,200 ఎకరాల్లో అవుతోంది. పార్వతీపురం, కొమరాడ, సాలూరు, పాచిపెంట, మక్కువ, జియ్యమ్మవలస, సీతానగరం మండలాల్లో దాదాపు 20 వేల ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ విస్తరించి ఉంది. పెరిగిన పెట్టుబడులు, ఎల్నినో ప్రభావం, డీజిల్ ధరలు, ప్రభుత్వ చర్యలు సాగుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
మూటల్లోనే... మట్టి నమూనాలు
● భూసార పరీక్షలపై నిర్లక్ష్యం! ● నిధులు విదల్చని టీడీపీ ప్రభుత్వం ● పరీక్షలకు నోచుకోని మట్టి నమూనాలు విజయనగరం ఫోర్ట్: వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చంద్రబాబు సర్కారు గొప్పలు చెబుతుంది. వాస్తవ పరిస్థితి క్షేత్ర స్థాయిలో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ప్రతీ రైతు భూసార పరీక్షల ఆధారంగా పంటలు సాగు చేయాలని ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. కానీ భూసార పరీక్షలు చేసేందుకు అవసరమైన నిధులు మాత్రం విదల్చకుండా చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీంతో పరీక్షల కోసం సేకరించిన మట్టి నమూనాలు మూటల్లోనే వ్యవసాయ పరిశోధన కార్యాలయాల్లో మూలుగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేలాది మట్టి నమూనాలు ఏడాది కాలంగా మూటల్లో ఉన్నాయి. భూసార పరీక్షల కోసం నిధులు విడుదల చేయకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని సర్వత్రా విమర్శలు రేగుతున్నాయి. అయినా ప్రభుత్వానికి పట్టడం లేదు. నిధుల్లేకే.. 2025 –26 సంవత్సరానికి సంబంధించి ప్రకృతి వ్యవసాయం(ఎన్ఎంఎన్ఎఫ్) కింద 33,104 మట్టి నమూనాలు సేకరించాలన్నది లక్ష్యం. ఇందుకుగాను వ్యవసాయ సిబ్బంది 32,046 మట్టి నమూనాలు సేకరించి విజయనగరంలోని భూసార పరీక్ష కేంద్రానికి పంపించారు. ఒక్కో మట్టి నమూనా పరీక్షించి కార్డు ఇచ్చేందుకు రూ.180లు ఖర్చవుతుంది. ఈ లెక్కన 33,104 మట్టి నమూనాల పరీక్షలకు రూ.59.58 లక్షలు అవసరం. 2026 ఖరీఫ్ సీజన్ వచ్చేసినా ఇంత వరకు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పైసా కూడా విదల్చలేదు. దీంతో మట్టి నమూనాలు మూటల్లోనే మూలిగే పరిస్థితి దాపురించింది. వాస్తవంగా మట్టి నమూనాలను ఏ సీజన్లో సేకరిస్తారో ఆ సీజన్ ఆరంభం నాటికి రైతులకు అందజేస్తే ప్రయోజనం ఉంటుంది. భూసార పరీక్షల ఆధారంగా పంటలు సాగు చేస్తే రైతులకు అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదు. దీంతో రైతులు నష్టపోతున్నారు. ప్రోత్సాహం ఇలాగేనా.. రసాయనిక ఎరువుల వాడకానికి స్వస్తి పలికి ప్రతీ రైతు ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతిలో సాగు చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వం చెబుతుంది. ఇందుకోసమే వ్యవసాయ అధికారులు భూసార పరీక్షలు చేయిస్తున్నారు. వాటి ఫలితాలు ఆధారంగా పంటలు ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతిలో సాగు చేస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం భూసార పరీక్షలకు నిధులు ఇవ్వకపోవడంతో మట్టి పరీక్షల ఫలితాలు లేకుండానే సాగు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ నమూనాకు 13 రకాల పరీక్షలు సేకరించిన ప్రతి మట్టి నమూనాకు 13 రకాల పరీక్షలు చేస్తారు. నేల స్వభావం, ఉదజని సూచిక(పీహెచ్), లవణ సూచిక(ఈసీ), సేంద్రియ కర్బనం (ఓసీ) లభ్య నత్రజని(ఎన్), లభ్య భాస్వరం, లభ్య పోటాష్, లభ్య గంధకం తదితర పరీక్షలు చేస్తారు. ఈ ఫలితాల సూచికగానే ప్రకృతి వ్యవసాయ సాగును ప్రోత్సహిస్తారు. కానీ ఈ పరీక్షలు జరపనపుడు ఏం ప్రయోజనం. చంద్రబాబు సర్కారు చెప్పిందొకటి.. చేసేదొకటి.. అన్న చందంగా వ్యవసాయంలో తన తీరును కనబరుస్తుంది. దీంతో సాగులో రైతులకు అవస్థలు తప్పడం లేదు. నిధులు ఇంకా రాలేదు.. 2025 – 26 సంవత్సరానికి సంబంధించి 33,104 భూసార పరీక్షలు చేయాలన్నది లక్ష్యం. భూసార పరీక్షల చేయడానికి అవసరమైన రూ.59.58 లక్షల నిధులు ఇంతవరకు రాలేదు. – ఎ.నిర్మలజ్యోతి , సహాయ సంచాలకులు, భూసార పరీక్ష కేంద్రం -
తక్షణమే అమలు చేయాలి..
అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని చెప్పి, తీరా ప్రభుత్వం ఏర్పాటయ్యాక హామీల అమలు ఊసెత్తకపోవడం ప్రజలను నమ్మించి మోసం చేయడమే ఇది ఎంతమాత్రం తగదు. ఆడబిడ్డ నిధి కింద నెలకు ఇస్తామన్న రూ.1500లు ఇవ్వాల్సిందే. – కడుబండి సుధారాణి ఎంపీటీసీ, గుచ్చిమి బకాయిలతో కలిపి ఇవ్వాలి.. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయకుండా 24 నెలల కాలం దాటేశారు. ఆ నెలల బకాయిలన్నీ పథకం అమలు చేసి లబ్ధిదారులకు చెల్లించాలి. అర్హులైన మహిళలంతా పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. – రౌతు రాజేశ్వరి, జెడ్పీటీసీ, దత్తిరాజేరు -
చట్టబద్ధ్ద పశు రవాణాకు రక్షణ కల్పించాలి
● లీగల్ లైవ్స్టాక్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్ విజయనగరం ఫోర్ట్: చట్టబద్ద పశు రవాణకు రక్షణ కల్పించాలని లీగల్ లైవ్స్టాక్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి ప్రతి రోజూ పశువుల ను రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చట్టబద్దంగా రవా ణ చేస్తున్నామని తెలిపారు. ఈ రవాణా కోసం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేకంగా రుపొందించిన లైవ్ స్టాక్ వాహనాలను వినియోగిస్తున్నామని తెలిపారు. వాహనాల్లో వెంటేషన్, డ్రైనే జీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యం, జంతువుల సంక్షేమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారుల ద్వారా జారీ చేయబడిన డిజిటల్ రూల్ 96 వెట ర్నరీ హెల్త్ సర్టిఫికెట్స్ సంబంధిత అధికారుల అనుమతులు, రవాణ శాఖ ధృవీకరణలు, రాష్ట్ర స్థాయి అధికారుల అనుమతులతోనే పశువుల రవాణ నిర్వహిస్తున్నామన్నారు. అయినప్పటకీ మా వాహనాలను కొంతమంది అడ్డుకుంటున్నారని తెలిపారు. అక్రమ వసూళ్లుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు రాఘవ, నవీన్ గణేష్, నానాజీ, నాయుడు పాల్గొన్నారు. -
● తవ్వుకో.. దోచుకో..
బొబ్బిలిలో ఇసుక అక్రమ వ్యాపారం జోరందుకుంది. పారాది, అలజంగి, భోజరాజపురం తదితర గ్రామాల తీరంలో వేగావతి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు రాత్రీ పగలు తేడాలేకుండా సాగుతున్నాయి. ఇసుకాసురులు నదిని గుల్లచేస్తున్నారు. గోతులమయంగా మార్చుతున్నారు. ఇసుక తవ్వకాల విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. మరో విశేషమేమిటంటే దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు గ్రోత్సెంటర్లోని కంపెనీలకు అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు ఒక్కోగ్రామ టీడీపీ నాయకుడు ఒక్కో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. నదిలో ఇసుకను తవ్వుతూ గ్రోత్సెంటర్లోని కంపెనీలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఉదయానికే గ్రోత్ సెంటర్కు ఇసుక ట్రాక్టర్లు క్యూ కడుతున్నా అటువైపు చూసేవారు లేకపోవడం గమనార్హం. రాజులపాలనలో ఇసుక అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందని, నేతలందరికీ వాటాలు అందుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమతవ్వకాల అంశాన్ని బొబ్బిలి తహసీల్దార్ ఎం.శ్రీను వద్ద ప్రస్తావించగా ఇసుకతో వ్యాపారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇటీవల మూడు ట్రాక్టర్లను పట్టుకుని జరిమానా విధించామని చెప్పారు. – బొబ్బిలి -
అప్పయ్యపేట తోటలో గజరాజుల గుంపు
సీతానగరం: మండలంలోని పెదబోగిలి పంచా యతీ అప్పయ్యపేట తోటలో రెండు రోజులు గా గజరాజులు సంచరిస్తున్నాయి. పగలంతా మామిడి తోటల్లో ఉంటూ సాయంకాలం వేళల్లో చెరకు, పామాయిల్ తోటల్లో తిరుగుతున్నాయి. అటవీశాఖ సిబ్బంది గజరాజుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించి పరిసర గ్రామాల ప్రజల రాకపోకలపై అప్రమత్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రికి ఆహ్వానం విజయనగరం రూరల్: ఈ నెల 30 నిర్వహించనున్న కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీయూ) ప్రథమ స్నాతకోత్సవానికి కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఆహ్వానిస్తూ ఢిల్లీలో శుక్రవారం ఆహ్వానపత్రికను అందజేసినట్టు సీటీయూ ఉపకులపతి టి.శ్రీనివాసన్ ఫోన్లో తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు సమ్మతి తెలిపారన్నారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విద్యా, అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించినట్టు పేర్కొన్నారు. -
త్యాగం, ధర్మం, మానవతా విలువలకు ప్రతీక మొహరం
పార్వతీపురం: మొహరం పర్వదినం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు శుక్రవారం తెలిపారు. మొహరం త్యాగం, ధర్మం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే పవిత్ర పర్వదినమని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావం మరింత బలోపేతం కావడానికి ఇటువంటి పండుగలు దోహదపడతాయని అన్నారు. ప్రజందరూ మోహరం పర్వదినాన్ని ప్రశాంత వాతావరణంలో పరస్పర గౌరవంతో జరుపుకోవాలని కోరారు. ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ మొహరం శుభాకాంక్షలను తెలిపారు. స్పెషల్ క్యాంపెయిన్ డేస్గా నేడు, రేపు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్–2026) కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27, 28 తేదీలను ‘స్పెషల్ క్యాంపెయిన్ డేస్’గా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు నమోదు ప్రక్రియలో సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగవంతం చేసేందుకు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ లెవెల్ అధికారులు ఈ రెండు రోజులు ప్రత్యేకంగా అందుబాటులో వుండి కార్యక్రమం చేపడతారని చెప్పారు. -
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పార్టీ కార్యాలయ నిర్మాణం
విజయనగరం రూరల్: జిల్లా కేంద్రం, మహారాణిపేట సర్వే నంబర్ (టీఎస్) 569లో అన్ని అనుమతులు, ప్రభుత్వ నిబంధనల మేరకే వైఎస్సార్ సీపీ కార్యాలయం నిర్మిస్తున్నట్టు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టంచేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను తప్పదోవ పట్టించేవిధంగా ఇటీవల కొన్ని మీడియా ఛానళ్లు, పత్రికల్లో వైఎస్సార్ సీపీ కార్యాలయ నిర్మాణంపై తప్పుడు కథనాలు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం ఉండాలనే ఆలోచనతో, పార్టీ ఆదేశాల మేరకు 2021లో అధికారులకు దరఖాస్తు చేశామన్నారు. నాటి అధికారులు ఎకరా స్థలాన్ని గుర్తించి, ప్రభుత్వానికి నివేదిక పంపించారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2022 జనవరి 12న కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ 340 జీఓను జారీ చేసిందన్నారు. ఈ జీఓను అనుసరించి స్థలం కేటాయింపునకు నాటి తహసీల్దార్ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు కోరుతూ లేఖ రాయగా, మున్సిపల్ కార్పొరేషన్ ఆమోదముద్ర ఇచ్చిందన్నారు. అదే ఏడాది మే 18న కలెక్టర్ స్థలం కేటాయింపునకు ఉత్తర్వులు జారీ చేసినట్టు వెల్లడించారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు తహసీల్దార్ 2022 జూన్ 6న ప్రభుత్వ నిబంధనల మేరకు పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు చేశారని స్పష్టంచేశారు. అన్ని నిబంధనలు అనుసరించి టీఎస్ నంబర్ 569లో 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన ఎకరా స్థలం కేటాయించారన్నారు. అన్ని అనుమతులు లభించిన మీదట 2023 జనవరి 28న పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు వెల్లడించారు. నాడు కార్యాలయ నిర్మాణానికి సంబంధించి సంబంధిత శాఖల అనుమతులు కోరుతూ దరఖాస్తు చేశామన్నారు. రెండేళ్ల నుంచి సాగుతున్న నిర్మాణ పనులు చివర దశకు చేరుకున్నాయని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక... చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక అక్కసుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయాలకు నోటీసులు అందించే కార్య క్రమం చేపట్టిందన్నారు. దీనిలో భాగంగా తాడేపల్లిగూడెంలో ఉన్న కార్యాలయానికి అనుమతులు లేవన్న నెపంతో కూలగొట్టిందని, దీనిపై పార్టీ హైకోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణానికి ప్రాథమిక అనుమతులు ఉన్నా, ఒకటి రెండు శాఖల అనుమతులు, వీఎంఆర్డీఏ అనుమతి లేదని నోటీసులు అందించారని తెలిపారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా, పూర్తి స్థాయి అనుమతులు ఉంటే భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోర్టు చెప్పిందని తెలిపారు. అయితే 2026లో అగ్నిమాపక శాఖ అనుమతి లేదని మున్సిపల్ కమిషనర్ తెలపగా, నిబంధనల ప్రకారం ఎన్ఓసీ అవసరం లేదని తెలిపారన్నారు. వీఎంఆర్డీఏ నిబంధనల ప్రకారం ఓపెన్ స్థలం 14 శాతం ఉండాలన్నారని, అయితే ఆ నిబంధన కార్యాలయ నిర్మాణానికి వర్తించదని నోటీసులకు జవాబు ఇచ్చినట్టు స్పష్టంచేశారు. కొద్ది రోజుల కిందట అశోక్గజపతిరాజు కుటుంబం నుంచి స్థలం విషయంలో సమస్య లేవనెత్తి ఫిర్యాదు చేశారని, దీనిని తహసీల్దార్కు పంపించారన్నారు. ఆయన వివరణ రాగానే అప్పగిస్తామని నగరపాలక సంస్థ నుంచి నోటీసు పంపించారని వివరించారు. ఇప్పటికే కార్యాలయంలో కార్యకలాపాలు జరుగుతున్నాయని, గత నాలుగేళ్లుగా నిర్మాణం జరుగుతున్నా ఎప్పుడు లేవనెత్తని అభ్యంతరాలు ఇటీవల మీడియాలోనే చూడడం జరిగిందన్నారు. మీడియాలో వచ్చిన కథనాలు పూర్తి నిరాధారమైనవని, కనీస వివరణ తీసుకోకుండా అసత్య కథనాలు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. రాజకీయ పార్టీలకు పార్టీ కార్యాలయ నిర్మాణాలకు ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకుంటే నిబంధనలు అనుసరించి కేటాయించడం జరుగుతుందని, ఇటీవల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి 66 ఏళ్ల లీజుతో రెండెకరాలు ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో, నిబంధనలకు లోబడి, ప్రభుత్వ జీఓ అనుసరించి, అధికారుల అన్ని అనుమతులతోనే పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నెక్కల నాయుడుబాబు, పీరుబండి జైహింద్కుమార్, గొర్లె రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. తప్పుదోవ పట్టించే కథనాలు ప్రచురితం చేయడం దురదృష్టకరం నిబంధనలు, ప్రభుత్వ జీఓ ప్రకారమే ఎకరా స్థలం కేటాయింపు మీడియా సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
బెడ్కు ఇద్దరు రోగులు
పార్వతీపురం మన్యం జిల్లాలో జ్వరాలు ముసురుకుంటున్నాయి. చిన్నారులు, పెద్దలు తేడా లేకుండా జ్వరాలతో మంచంపడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జ్వరపీడితుల తాకిడి పెరగడంతో ఆస్పత్రుల్లో బెడ్లు చాలడం లేదు. సీతంపేట ఏరియా ఆస్పత్రిలో ఒక్కో బెడ్పై ఇద్దరు, ముగ్గురుకి వైద్యసేవలు అందిస్తున్నారు. వైరల్ జ్వరాలతో పాటు మలేరి యా పాజిటివ్ కేసులు నమోదు కావడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. – సీతంపేట ఈ చిత్రంలో బెడ్పై కూర్చుని పండ్లు తింటున్న ఇద్దరు బాలుర పేర్లు మదన్, మనోహర్. సీతంపేట హైస్కూల్లో ఏడు, ఎనిమిది తరగతులు చదువుతున్న విద్యార్థులది నౌగూడ గ్రా మం. వీరికి జ్వరం తీవ్రంగా రావడంతో సీతంపేట ఏరియా ఆస్పత్రిలో చేరారు. ఇద్దరికీ మలేరియా పాజిటివ్ వచ్చింది. బెడ్లు లేక గత కొద్ది రోజులుగా ఒకే బెడ్పై చికిత్స పొందుతున్నారు. సీతంపేట మండలం మీనకోటకు చెందిన నీలవేణి, దీప్తిలు జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం సీతంపేట ఏరియా ఆస్పత్రిని ఆశ్రయించారు. అప్పటికే బెడ్లు లేకపోవడంతో ఇద్దరికీ ఒకే బెడ్పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బెడ్లు సర్దుబాటు చేసేందుకు వైద్యులు, సిబ్బంది నానా పాట్లు పడుతున్నారు. -
జీసీసీ సేల్స్మెన్లకు పనిభారం
సీతంపేట: గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యావసర వస్తు విక్రయశాలల్లో పనిచేసే సేల్స్మెన్లు పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. మొత్తం 23 రేషన్డిపోలు ఉండగా కేవలం పదిమంది సేల్స్మెన్లు మాత్రమే పనిచేస్తున్నారు. మొత్తం 14 మందికి గాను ఇటీవల నలుగురుకు పదోన్నతులు రావడంతో వెళ్లిపోయారు. ఇప్పటికే ఇన్చార్జిలతో రేషన్ దుకాణాలు నడుస్తున్నప్పటకీ కొత్తవారిని నియమించడంలేదు. నిబంధనల ప్రకారం ప్రతీనెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు పూర్తిస్థాయిలో రేషన్ దుకాణాలు తెరచి ఉంచాలి. తెలుపు రేషన్కార్డు దారులకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను అందజేయాలి. సిగ్నల్ లేకపోవడంతో లబ్ధిదారుల వేలిముద్రలు వేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోజంతా 20 మందికి మించి సరుకులు ఇవ్వలేని పరిస్థితి. ఒక్కో డిపో పరిధిలో వెయ్యి వరకు రేషన్ కార్డులు ఉంటాయి. సాంకేతిక అవరోధాల నడుమ రెండుమూడు డిపోల బాధ్యతలు ఎలా చూడగలమంటూ సేల్స్మెన్లు ఆవేదన చెందుతున్నారు. సీతంపేట ఏజెన్సీలో 16 వేలకు పైగా రేషన్కార్డులు ఉన్నాయని, వీరందరికీ సకాలంలో రేషన్ సరఫరా చేయాలంటే తమవల్ల కాదంటే చేతులెత్తేస్తున్నారు. సేల్స్మెన్లకు కొత్తగా కేటాయించిన డిపోలు ఇలా... ఎన్.చిన్నబాబు (మానాపురం, గంగంపేట, దోనుబాయి), ఎస్.రామారావు (పూతికవలస, కె.గుమ్మడ, కుశిమి), ఎన్.రంగారావు (పెదరామ, సామరెల్లి, చిన్నకంబ), కె.విశ్వనాథం (భామిని, మనుమకొండ), బి.శోభన్బాబు (సొలికిరి, కడగండి), హెచ్.బాలకృష్ణ (వలగెడ్డ, శంబాం), ఎన్.నాగరాజు (అడ్డాకులగూడ, కోడిశ), ఎస్.సురేష్ (సోమగండి, కిల్లాడ), ఎ.సునీత (గొట్టిపల్లి, లబ్బ), ఎన్.సుందరరావు (హడ్డుబంగి, సీతంపేట) లు కేటాయించారు. సీతంపేట, భామిని మండలాలతో పాటు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల పరిధిలో కూడా జీసీసీ నిత్యావసర దుకాణాలు ఉన్నాయి. సేల్స్మెన్లు తక్కువగా ఉన్నారని, సరుకుల సరఫరాలో జాప్యం జరుగుతోందని ఎం.డి దృష్టికి తెలియజేశాం. త్వరలోనే రేషన్డీలర్ పోస్టులు భర్తీచేస్తామని, సమస్య పరిష్కారమవుతుందని ఉన్నతాధికారులు తెలియజేశారు. ఇప్పటికీ ఖాళీల వివరాలను నివేదించాం. – దాసరి కృష్ణ, జీసీసీ డివిజనల్ మేనేజర్ -
మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యం
పార్వతీపురం రూరల్: అంతర్జాతీయ మాదకద్రవ్యా ల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురంలో ‘నిషాముక్త్ భారత్ సప్తాహ్’ కార్యక్రమా న్ని గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి, ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి జెండా ఊపి మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లా ను మత్తురహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. గతంలో 50 శాతంగా ఉన్న జిల్లా అక్షరాస్యత ప్రస్తుతం 86 శాతానికి చేరిందని, విద్యాపరంగా జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోందని వివరించారు. ఈ క్రమంలో యువత గంజాయి తదితర మత్తుపదార్థాల బారిన పడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. మాదకద్రవ్యా ల అక్రమరవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. మత్తు పదార్థాలకు సంబంధించి అనుమానాస్పద కార్యకలాపాలు ఎక్కడ కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించా రు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో అధికారులు, పోలీసులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని.. డ్రగ్స్కు బానిస కాబోమంటూ సామూహిక ప్రతిజ్ఞ చేశారు. -
ఎల్నినోపై అవగాహన అవసరం
పార్వతీపురం: ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి, నేలలో తేమ తగ్గే అవకాశం ఉందని, రైతు లు ముందస్తు ప్రణాళికలతో పంటలు సాగుచేయా లని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి సూచించారు. కలె క్టరేట్లో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబురావునాయుడుతో కలిసి ఎల్నినో అవగాహన కరపత్రాలను గురువారం విడుదల చేశారు. ఎల్నినో ప్రభావంతో వరి, మొక్కజొన్న, పత్తి, పప్పుధాన్యాల దిగుబడులు తగ్గే అవకాశం ఉందని, పశుగ్రాసం కొరత ఏర్పడవచ్చన్నారు. ప్రకృతి వ్యవ సాయ పద్ధతులు, దేశీ విత్తనాలతో బహుళ పంటల సాగు, తక్కువ నీటితో పంటల సాగు, పశుగ్రాస ఉత్పత్తి వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు అవగాహన కరపత్రాల్లోని సూచనలు పాటించి నష్టాలను నివారించుకోవాలన్నారు. ‘మార్ట్’తో మార్పు.. గిరిజన రైతాంగాన్ని సుసంపన్నం చేయడమే లక్ష్యంగా 2026–31 కాలానికి మన్యం అగ్రి రూరల్ ట్రాన్స్ఫర్మేషన్(మార్ట్) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో మార్ట్ ప్లాగ్షిప్ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ థాయ్లాండ్ తరహా ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో, మిరియాలు వంటి అంతర పంటల సాగు, వర్షపు నీటి సంరక్షణ, గట్టు మీద చెట్టు వంటి వినూత్న కార్యక్రమాలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని అధికారులకు సూచించారు. కౌలు కార్డుల పునరుద్ధరణ, కౌలుదారులకు పంట రుణాల మంజూరు కోసం పది రోజు ల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. సిబ్బంది క్షేత్రస్థాయి పనితీరును ప్రతిరోజూ పర్యవేక్షిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 2,800 చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించి మత్స్య ఉత్పత్తిని పెంచాలని సూచించారు. -
నేడు పీజీఆర్ఎస్ రద్దు
సీతంపేట: మొహర్రం సందర్భంగా సీతంపేట ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ను రద్దు చేసినట్టు పాలకొండ సబ్ కలెక్ట ర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయం గమనించాలని కోరారు. పాలకొండ రూరల్: రిజిస్ట్రేషన్ ప్రక్రియలో దళారీ వ్యవస్థ నిర్మూలించేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియను అమలు చేస్తున్నట్టు జిల్లా రిజిస్ట్రార్ ఎం.పార్వతి అన్నారు. పాలకొండ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆమె గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించా రు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఏపీ ఐజీఆర్ఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేరుగా చేసుకోవచ్చన్నారు. సంబంధిత డాక్యుమెంట్లను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. వ్యక్తులు రిజిస్ట్రేషన్కు సంబంధించి ముందుగా స్లాట్ బుక్ చేసుకొని అనంతరం ఈ ప్రక్రియను కొనసాగించాలన్నా రు. ఈ నూతన విధానం ద్వారా ఆస్తి లావాదేవీల రిజిస్ట్రేషన్కు సంబంధించి ప్రజలకు నగదుతో పాటు సమయం కూడా వృథా కాదని స్పష్టం చేశారు. సాలూరు రూరల్: మండలంలో ఇటీవల చేపట్టిన బీటీ రోడ్లు పనుల్లో నాణ్యత లోపించింది. చిన్నపాటి వర్షానికే రోడ్లు కోతకు గురవుతున్నా యి. బీటలు వారుతున్నాయి. కూర్మరాజు పేట గ్రామం మీదుగా పునికినవలసకు నిర్మించిన రోడ్డు మూన్నాళ్లముచ్చటగా మారింది. మామిడిపల్లి రోడ్డు నుంచి ప్రారంభమైన పనుల్లో నాణ్యత లోపించింది. కూర్మరాజుపేట దాటిన తరువాత మెట్ట వద్ద రోడ్డు మధ్యలో బీటలు వారాయి. ఇదేం రోడ్డు నిర్మాణమంటూ అధికా ర పార్టీకి చెందిన నాయకుడిని గ్రామస్తులు, యువకులు నిలదీస్తున్నారు. నాసిరకం రోడ్లతో ప్రజాధనం లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏసీబీ వలలో ఎం.కొత్తవలస వీఆర్వో జామి/విజయనగరం క్రైమ్: జామి మండలం ఎం.కొత్తవలస వీఆర్వో కొత్తలి వీరన్న ఏసీబీ వలకు గురువారం చిక్కారు. భూమి మ్యుటేషన్ కోసం సునీత అనే మహిళా రైతు నుంచి రూ.14వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమో దు చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఎం.కొత్తవలస గ్రామానికి చెందిన జంకల సూర్యనారాయణ, సునీత దంపతులకు 21 సెంట్లు భూమి వారసత్వంగా వచ్చింది. రీ సర్వేలో 22 సెంట్ల 30 లింకులు నమోదైంది. సెంటు 30 లింకులను ఆన్లైన్లో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసేందుకు వీఆర్వో రూ.25వేలు లంచం డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేమని రైతు దంపతు లు ప్రాథేయపడడంతో రూ.18000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్గా రూ.4వేలు తీసుకున్నారు. మిగిలిన సొమ్ము ఇచ్చుకోలేని రైతు కుంటుంబం ఏసీబీని ఆశ్రయించింది. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని మహిళా రైతు సునీత నుంచి వీఆర్వో వీరన్న డబ్బులు తీసుకుని లెక్కపెడుతుండగా పట్టుకున్నారు. -
శోభాయమానంగా.. శిఖర ప్రతిష్ఠ
విజయనగరం టౌన్: సిరుల తల్లి సాక్షాత్కరించింది. అమ్మవారిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. జై పైడిమాంబ నినాదాలతో చదురుగుడి ప్రాంతమంతా భక్తిభావం నెలకొంది. శిఖరప్రతి ష్ఠ మహోత్సవంలో ఆలయ అనువంశిక ధర్మక ర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబసభ్యులతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాచల దేవస్ధానం ఆగమ పాఠశాల శైవాగమ పండితులు కాళ్లకూరి సుబ్ర హ్మణ్యశర్మ నేతృత్వంలో వేదపండితులు వేదమంత్రోచ్చారణలతో సంప్రదాయరీతిలో క్రతు వు పూర్తిచేశారు. అనంతరం సాధారణ భక్తులకు మధ్యాహ్నం నుంచి అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా గోవా గవర్నర్ అశోక్గజపతిరాజు మాట్లాడుతూ అమ్మవారి ఆశీ స్సులు ప్రజలందరిపైనా ఉండాలని ఆకాంక్షించా రు. విస్తరణ పనులు విజయవంతంగా పూర్తిచేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కేవలం ఆరు నెల ల వ్యవధిలోనే ఆలయ విస్తరణ పనులు పూర్తి చేయడం అభినందనీయమన్నారు. పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ అమ్మవారి ఆలయ పునఃప్రారంభ మహోత్సవాల్లో పాల్గొనడం తన పూర్వజన్మసుకృతమన్నారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మీగజపతిరాజు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల ఇన్నాళ్లకు నెరవేరిందన్నారు. ఆలయం వద్దనున్న ఖాళీస్థలంలో భక్తులకు అవసరమైన వసతులను కల్పించనున్నామని చెప్పారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ కె.శిరీష, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కనుల పండువగా మహోత్సవం అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ట మహోత్సవం కనులపండుగగా జరిగింది. కలశాలకు పూసపాటి వంశీయులు పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో పైడితల్లి ఆలయ పునఃప్రారంభం తొలిపూజలు నిర్వహించి, దర్శనం చేసుకున్న పూసపాటి వంశీయులు మధ్యాహ్నం నుంచి సాధారణ భక్తులకు దర్శనభాగ్యం -
బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్లో దొంగల హల్చల్
బొబ్బిలి: బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్లో గురువారం దొంగలు హల్చల్ చేశారు. బస్సెక్కుతున్న మహిళ మెడలోని మూడు తులాల పుస్తెలతాడుతో పాటు మరో ప్రయాణికుడి జేబులోని రూ.7వేలను కాజేశారు. బొబ్బిలి స్వామివారి వీధికి చెందిన బోరసింగి అచ్చియ్యమ్మ తల్లి, చెల్లితో కలిసి విజయనగరంలో జరుగుతున్న బంధువుల శుభకార్యానికి బయలుదేరింది. ఆర్టీసీ కాంప్లెక్స్కు వచ్చి పార్వతీపురం నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సెక్కుతున్నారు. అప్పటికే అక్కడ నక్కిఉన్న దొంగ అచ్చియ్యమ్మ మెడలోని పుస్తెల తాడును తెంపుకు పోయాడు. ఆమె గగ్గోలు పెట్టినా ఫలితం లేకపోయింది. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే బస్సులో ప్రయాణించేందుకు బస్సెక్కుతున్న బలిజిపేటకు చెందిన గోపాలం అనే ప్రయాణికుడి జేబులోంచి రూ.7వేలను కొట్టేశారు. ఆ సమయంలో బస్సును నిలుపుదల చేసి తనిఖీలు చేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న సీఐ కె.నారాయణరావు ఆర్టీసీ కాంప్లెక్స్ సీసీ ఫుటేజీలు పరిశీలించారు. ప్లాట్ఫాం పక్కనే బస్సును నిలపకుండా కొంచెం దూరంగా పెట్టడం, ఆ సమయంలోనే మరోబస్సు అటుగా వచ్చినిలపడంతో సీసీ ఫుటేజీల్లో స్పష్టత కానరావడం లేదన్నారు. పాత నేరస్తులను పట్టుకుని విచారిస్తామన్నారు. ● బస్సెక్కుతుండగా మహిళ పుస్తెలతాడు చోరీ -
సంక్షేమానికి.. సాంకేతిక సంక్షోభం..!
● సంక్షేమ పథకాలకు ఈకేవైసీతో ముడి ● మన్యంలో ఆన్లైన్ సమస్యలు... సాంకేతిక ఇబ్బందులు ● ఈకేవైసీకి సచివాలయాలు, ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్న జనం ● ఆన్లైన్ బూచితో సంక్షేమానికి సర్కారు ఎగనామం పాలకొండ రూరల్: ప్రభుత్వం అమలు చేస్తున్న అరకొర సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందడం గగనంగా మా రింది. జిల్లాలో సాంకేతిక సమస్యలు లబ్ధిదారులకు శాపంగా మారాయి. సిగ్నల్స్ లేకపోవడం, ఈకేవైసీ అవరోధాలు సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చుతున్నాయి. గతంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించేవారు. లబ్ధిదారులకు పథకం లబ్ధి ఠంచన్గా చేకూర్చేవారు. రెండేళ్లుగా ఆ పరిస్థితి లేదు. ఎంతమంది లబ్ధిదారులు తగ్గుతారా అన్న ధోరణి లో సర్కారు వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపి స్తున్నాయి. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధా నం కాకపోవడం, ఈకేవైసీ కాకపోవడంతో రేషన్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు అర్హులు దూరమవుతున్నారు. దీంతో ఈకేవైసీ కోసం సచివాలయాలు, ఆధార్ సెంటర్ల వద్ద మన్యం ప్రజలు బారులు తీరుతున్నారు. జిల్లాలో 2.73 లక్షల మంది రేషన్ లబ్ధిదారు ఉండగా వీరిలో 14 వేల పైచికులు మంది ఈకేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం వీరికి సరుకులు అందడం లేదు. గ్యాస్ సరఫరాలో కూడా వినియోగదారుడు సిలిండర్ బుక్చేసిన వెంటనే వారి సెల్కు ఓటీపీ వస్తుంది. వినియోగదారులు తప్పనిసరిగా తమ వివరాలు రిజిస్టర్ చేయించుకోవాలని సదరు ఏజెన్సీలు సెల్ నంబర్కు సందేశాల ను పంపుతున్నారు. లేదంటే సిలిండర్ పొందేందు కు ఇబ్బందులు తప్పడం లేదు. ●అన్నదాత సుఖీభవ పథకాలతో పాటు రైతులు ఎరువులు పొందాలన్నా ఈకేవైసీ కావాల్సిందేనన్న ప్రభుత్వ ఆదేశాలతో సచివాలయాలు, బ్యాంకుల కు పరుగులు తీస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్ని ల్స్, నెట్వర్క్ సమస్యతో ఈకేవైసీకి గంటల సమ యం పడుతోంది. విసిగిపోయి ఈకేవైసీ చేసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాకు జమకావడంలేదంటూ పలువురు రైతులు వాపోతున్నారు. ●జిల్లాలోని 1584 పాఠశాలల్లో చదువుతున్న లక్షా 18 వేల మంది పిల్లలు తల్లికి వందనం పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరి సమగ్ర సమాచారం యూడైస్లో పొందుపర్చారు. గతేడాది జిల్లా పరిధి లో లక్షా 8,951 మంది అర్హులని చెప్పిన యంత్రాంగం శతశాతం తల్లుల ఖాతాలకు లబ్ధి జమ చేయలేదు. అప్పట్లో అనేక కారణాలు చూపి అర్హత ఉన్న మెండిచేయి చూపారు. ఇందులో ఈకేవైసీ కూడా ఓ కారణంగా చెప్పారు. మరోవైపు జిల్లాలోని చాలా మంది పిల్లల తల్లి పేరు ‘కిల్లో స్వప్న’ అని నమోదైంది. ఆమె ఐటీ రిటర్స్ చెల్లించినట్టు ఆన్లైన్లో చూపించడంతో పథకానికి అనర్హురాలిగా ప్రకటించారు. ఆమె పేరు తల్లిగా నమోదైన పేదపిల్లలకు కూడా పథకానికి దూరమయ్యారు. పేరు సరిచేసి పథకం లబ్ధి అందించాలని ఏడాదిపాటు విద్యార్థు ల తల్లులు సచివాలయాలు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఆ భయంతో ఇప్పుడు పిల్లల తల్లులు బ్యాంకుల వద్ద తమ వివరాలను ఈకేవైసీ చేయిస్తున్నారు. పొరపాటున ఒక్క సారి పథకం లబ్ధి ఆగిపోతే సరిచేసే పరిస్థితి ప్రస్తుత సర్కారులో ఉండదని బెంగపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకం పొందడం ఓ ప్రహసనంగా మారింది. అర్హత ఉన్నా లబ్ధి సమకూరడం లేదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలు తీరు అంతంతమాత్రమే. సూపర్ సిక్స్లో అమలయ్యే కొద్దోగొప్పో పథకాల్లో నేటికీ స్పష్టత లేదు. ప్రతి విషయంలో నిబంధనలతో పాటు సాంకేతిక మెలిక ఉండడంతో అర్హులు అవస్థలు పడుతున్నారు. అర్హత ఉన్నా లబ్ధి సమకూరపోతే ఎలా అనే అంశంలో సర్కారు నుంచి జవాబుదారీతనం లేదు. గత వైఎస్సార్సీపీ హయాంలో అర్హతే ప్రామాణికం. వలంటీర్ల వ్యవస్థ, సచివాలయ యంత్రాంగం పూర్తి సమన్వయంతో అర్హుల ఇళ్లకే సంక్షేం అందించేది. మధ్యవర్తులు లేకుండా డీబీటీ విధానంలో వ్యక్తిగత ఖాతాలకు నగదు జమయ్యేదన్నది ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. – విశ్వాసరాయి కళావతి, మాజీ శాసన సభ్యురాలు, పాలకొండ నియోజకవర్గం -
మత్తు పదార్థాలతో అనర్థంపై అవగాహన కల్పించుకోవాలి
సీతానగరం: మత్తు పదార్థాలు వినియోగించడంతో వచ్చే అనర్థాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి విద్యార్థులు సిద్ధం కావాలని ఎస్సై హేమలత అన్నారు. ఈ మేరకు మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై హేమలత మాట్లాడుతూ మత్తు పదార్థాలు వినియోగించడం వల్ల వచ్చే అనర్థాలపై విద్యార్థులు అవగాహన కల్పించుకుని గ్రామాల్లో విరామసమయంలో ప్రజలకు వివరించాలని కోరారు. సమాజాన్ని మత్తునుంచి కాపాడే బాధ్యత విద్యార్థులపై ఉందని అందుకు అనుగుణంగా చైతన్యవంతులు కావాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎస్సై లక్ష్మణరావు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దేదీప్యమానం..పైడితల్లి గ్రామోత్సవం
● యాగశాలలో విశిష్ట యాగ ప్రక్రియ ● ఆకట్టుకున్న విచిత్ర వేషధారణలువిజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం పునః ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న నూతన శిఖర ప్రతిష్ట, మహా కుంభాభిషేక మహోత్సవాల్లో బుధవారం వేకువజామునుంచే అమ్మవారి యాగశాలలో విశిష్ట పూజలు నిర్వహించారు. సింహాచల క్షేత్రం నుంచి వచ్చిన వేదపండితులు అమ్మవారికి విఘ్నేశ్వరపూజ, పంచగవ్య పూజాదికాలు, సోమ కుంభత్యాది ఆవాహనలు, ప్రాతరౌపాసనలు, దిగ్దేవతా బలిహరణలు, పునః పూజలు, వాస్తుహోమం, వాస్తు బలిహరణ, పర్యగ్నికరణము, జలాదివాసం, తదితర పూజాకార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్, ఆలయ ఈఓ కె.శిరీష స్వీయ పర్యవేక్షణ చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి ధాన్యాదివాసం, బింబశుద్ధి మంటపార్చన, పంచ శయ్యాదివాసం, మూర్తన్యాసం, వివిధ రకాల హోమాలు, అనంతరం స్వస్తివాచకములు నిర్వహించారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆకట్టుకున్న పైడితల్లి గ్రామ ప్రదక్షిణ పైడితల్లి అమ్మవారి చదురుగుడి ఆలయ పునఃప్రారంభ మహోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన గ్రామ ప్రదక్షిణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి ఉత్సవ విగ్రహంతో పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పువాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు, పులివేషాలు, బిందె డ్యాన్సులు, వేదపండితుల మంత్రోచ్చారణలతో ఆధ్యాత్మిక వాతావనరణం నెలకొంది. నేడు ఆలయ శిఖర ప్రతిష్ట పైడితల్లి అమ్మవారి ఆలయ నూతన శిఖర ప్రతిష్ట మహోత్సవం గురువారం ఉదయం సుమూర్తం ప్రకారం ఉదయం 10.47 గంటలకు సింహల్నగమందు యంత్ర, శిఖర ప్రతిష్టాపన ఉంటుంది. పూర్ణాహుతి, ప్రాణ ప్రతిష్ట, జీవ కళాన్యాసములు, కుంభ దర్శనము, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ శిరీష తెలిపారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించి, తరించాలని కోరారు. -
మంచం పట్టిన మన్యం
హెల్త్ అసిస్టెంట్లకు డిప్యుటేషన్ మలేరియా కేసులను అదుపుచేయడానికి హెల్త్ అసిస్టెంట్లను డిప్యూటేషన్పై నియమిస్తున్నట్టు డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు తెలిపారు. ఆయన మండలంలోని కుశిమి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. మలేరియా లేని ప్రాంతాల్లోని హెల్త్ అసిస్టెంట్లను హైరిస్క్ మలేరియా ఉన్న పీహెచ్సీలకు పంపిస్తున్నట్టు తెలిపారు. హెల్త్అసిస్టెంట్లు ఇకపై కచ్చితంగా వీక్లీ సర్వలైన్స్ చేయాలన్నారు. ఇప్పటివరకు నెలకు రెండు సార్లు గ్రామాలను సందర్శించిన సిబ్బంది, ఇకపై నాలుగు సార్లు తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశించారు. సీతంపేట మండలంలోని నౌగూడ గ్రామానికి చెందిన పూర్ణచంద్ర, జొనగకు చెందిన సవర దివాకర్ మరణాలపై విచారణ సాగుతోందన్నారు. స్క్రీనింగ్ టెస్టులో మలేరియా నెగిటివ్ రిపోర్టులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయపార్వతి, డీఎంఓ సత్యనారాయణ, కన్సల్టెంట్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.సీతంపేట: మన్యం ప్రజలను జ్వరాలు వణికిస్తున్నాయి. కొద్దిరోజులుగా పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులకు రోగుల తాకిడి అమాంతం పెరిగింది. వైద్యపరీక్షల్లో మలేరియా పాజిటివ్ కేసులు నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఎపిడమిక్ సీజన్లో జ్వరాల వ్యాప్తి అధికంగా ఉంటుంది. వర్షాలకు తాగునీటి వనరులు కలుషితం కావడం, ఆ నీటిని గిరిజనులు తాగడమే అనారోగ్యానికి ప్రధాన కారణం. అయితే, ఇటీవల మలేరియా కేసులు అధికంగా నమోదవుతుండడం, మరణాలు సంభవించడం ప్రజలను కలవరపెడుతోంది. ఇదీ పరిస్థితి... జిల్లాలో గత ఏడాది జనవరి నుంచి జూన్ 21 వరకు 1,37,334 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా 1224 మలేరియా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 1,98,782 మందికి రక్తపరీక్షలు చేయగా 302 మందికి మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు సమాచారం. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 10 పీహెచ్సీల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 63,914 మంది జ్వరపీడితులకు రక్త పరీక్షలు చేయగా 40 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మలేరియా బారిన పడి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారు ఈ సంఖ్యకు రెట్టింపు ఉంటారని అంచనా. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలోని పీహెచ్సీల్లో రోజుకు 50 నుంచి వంద వరకు ఓపీ నమోదవుతుండగా, ఏరియా ఆస్పత్రుల్లో 300 నుంచి 400 వరకు రోజువారీ ఓపీ నమోదవుతోంది. వీరిలో వైరల్, టైఫాయిడ్, మలే రియా జ్వరపీడితులే అధికంగా ఉంటున్నారు. ఇక ఆశ్రమపాఠశాలలు, గురుకుల పాఠశాలలు ప్రారంభం కావడంతో ఈ విద్యాసంస్థల్లో కూడా విద్యార్థులకు ఎక్కువగా జ్వరాలు సోకుతున్నాయి. జ్వరం వచ్చిందంటే అది 90 శాతం మలేరియా పాజిటివ్గా రక్తపరీక్షల్లో నిర్ణారణ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దోమతెరల పంపిణీ ఎక్కడ? ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో దోమ తెరలు పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. జిల్లాలో 3 లక్షలకు పైగా దోమతెరలు అవసరం కాగా కేవలం 25వేలు మాత్రమే రావడంతో వాటిని మలేరియా పాజిటివ్ కేసులు అధికంగా వచ్చిన గ్రామాల్లోని రోగులకు మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన గ్రామాల ప్రజలకు దోమకాట్లు తప్పడంలేదు. గత రెండేళ్లుగా దోమతెరల కోసం ఎదురు చూపులే తప్ప ఫలితం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు.ఆర్డీటీ కిట్ టెస్టులు నిర్వహిస్తున్నాం అందరికీ ఆర్డీటీ కిట్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ఈ నెల 19 నుంచి ప్రక్రియ ప్రారంభమైంది. ఎక్కడైనా పారాసైట్ బయటపడితే వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభిస్తాం. పీహెచ్సీల వారీగా టెస్టులు జరుగుతున్నాయి. మొదటి దశ దోమల నివారణ మందు పిచికారీ పూర్తయింది. రెండో విడత జూలై 15 నుంచి ప్రారంభమౌతుంది. దోమ తెరలు పూర్తిస్థాయిలో రావాల్సి ఉంది. – ఎం.వి.సత్యనారాయణ, డీఎంఓ, ఐటీడీఏ, సీతంపేట పెరుగుతున్న మలేరియా పాజిటివ్ కేసులు పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులకు రోగుల తాకిడి ఆందోళనలో గిరిజన గ్రామాల ప్రజలు అరకొరగా దోమతెరల పంపిణీ ప్రచారానికే పరిమితమవుతున్న అవగాహన సదస్సులు -
సర్కారు సదరంగం
విజయనగరం ఫోర్ట్: ఏరు దాటినంత వరకు ఓడ మల్లన్న..ఏరు దాటాక బోడిమల్లన్న చందాన ఉంది సర్కారు తీరు. పనిచేయించు కోవడం, ఆ తర్వాత విస్మరించడం టీడీపీ సర్కార్కు పరిపాటిగా మారిపోయింది. సదరం సర్టిఫికెట్స్ రీవెరిఫికేషన్ చేసిన వైద్యుల పరిస్థితే ఇందుకు నిదర్శనం. రీవెరిఫికేషన్ పూర్తయి ఏడాదిన్నర అవుతున్నా వైద్యులకు టీఏ, డీఏల రూపంలో ఇవ్వాల్సిన డబ్బులు ఇంతవరకు ఇవ్వకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు డబ్బులు కోసం గళమెత్తితే ప్రభుత్వ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనని లోలోన మధనపడుతున్నారు. తమకు అప్పగించిన పనిని పూర్తి స్థాయిలో చేసినప్పటికీ వారికి ఇవ్వాల్సిన టీఏ, డీఏలు ఇవ్వకుండా జాప్యం ఎందుకని వైద్యులు వాపోతున్నారు. దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత దివ్యాంగులకు పింఛన్ వెరిఫికేషన్ పేరిట సదరం క్యాంపులు నిర్వహించింది. అయితే ఈ క్యాంపులకు సర్టిఫికెట్ ఇచ్చిన వైద్యులను కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర ఆస్పత్రులనుంచి వైద్యులను నియమించి సదరం సర్టిఫికెట్లు రీవెరిఫికేషన్ చేయించింది. ఇందుకోసం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో పాటు రాజాం, పార్వతీపురం గజపతినగరం, చీపురుపల్లి ఆస్పత్రులకు చెందిన వైద్యులు సదరం క్యాంపులకు తమ సొంత డబ్బులు పెట్టుకుని హాజరయ్యారు. సదరం క్యాంపులకు రీవెరిఫికేషన్ నిమిత్తం వచ్చిన దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేశారు. 2025 జనవరిలో పరీక్షలు ప్రారంభం 2025 జనవరి నెలలో సదరం రీఅసెస్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం పూర్తి కూడా అయిపోయింది. వారంలో మూడు రోజుల పాటు దివ్యాంగులకు రీ అసెస్మెంట్ చేసేవారు. బుధ, గురు, శుక్రవారరాల్లో ఆయా ఆస్పత్రుల్లో వైద్యులు రీ అసెస్మెంట్ నిర్వహించారు. 30 మంది వైద్యులు రీ అసెస్ మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 30, 867 మందికి దివ్యాంగులకు పరీక్షలు జిల్లాలో వేలాది మంది దివ్యాంగులకు వైద్యులు రీఅసెస్మెంట్ చేశారు. దివ్యాంగులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి రీ అసెస్ మెంట్ సర్టిఫికెట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఎముకలు, ఈఎన్టీ, మానసిక, న్యూరో విభాగాలకు సంబంధించి 35,867మంది దివ్యాంగులకు వైద్యులు రీ అసెస్మెంట్ నిర్వహించారు. రీఅసెస్మెంట్ చేసినందుకు గాను వైద్యులకు సుమారు రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంది. వైద్యులకు దివ్యాంగుల రీవెరిఫికేషన్ డబ్బులు ఇవ్వరా? నెలలు గడుస్తున్నా ఇవ్వకుండా జాప్యం రీవెరిఫికేషన్లో పాల్గొన్న వైద్యులు 30 మంది వారికి రావాల్సిన బకాయి సుమారు రూ.15 లక్షలు 35,867మంది దివ్యాంగులకు పరీక్షల నిర్వహణబిల్లులు పంపించాం దివ్యాంగులకు రీ అసెస్మెంట్ నిర్వహించడానికి వచ్చిన వైద్యులకు సంబంధించిన టీఏ, డీఏ బిల్లులు ప్రభుత్వానికి పంపించాం. ఫైనాన్స్లో బిల్లు ప్రాసెస్లో ఉందని తెలిపారు. వైద్యుల ఖాతాలకే నేరుగా డబ్బులు జమ అవుతాయి. శ్రీనివాసపాణి, పీడీ, డీఆర్డీఏ -
శరవేగంగా పారాది బ్రిడ్జి పనులు
● మరో నెలరోజుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి.. ● వైఎస్సార్సీపీ ప్రభుత్వం చొరవతో పూర్తికావచ్చిన వంతెన నిర్మాణంబొబ్బిలి రూరల్: బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిపై గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో తలపెట్టిన నూతన వంతెన నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. మరో నెలరోజుల్లో వంతెన నిర్మాణం పూర్తి కానుంది. వాహనచోదకులకు అందుబాటులోకి రానుంది. గత ప్రభు త్వం వంతెన నిర్మాణానికి పరిపాలనా అనుమతులతో పాటు రూ.10 కోట్లను మంజూరు చేసింది. అప్పటి ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చొరవతో పారాది వద్ద వేగావతి నదిపై పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. 2023లోనే బ్రిడ్జి నిర్మాణ పనులకు జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో జీఎస్టీ నిధులు మరో రూ.3.5 కోట్లను కలిపి కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. 7 పిల్లర్లు, 8 స్లాబ్ల నిర్మాణంతో దాదాపు బిడ్జి, అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తికావచ్చాయి. దశాబ్దాలుగా వంతెనపై ఎదుర్కొంటున్న రాకపోకల కష్టాలు తొలగనున్నాయి. -
జాతీయ పోటీలకు జీఎంఆర్ ఐటీడీయూ విద్యార్థులు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థులు జాతీయ స్థాయి పవర్లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారని పీడీ బి.అరుణ్కుమార్ బుధవారం తెలిపారు. ఇటీవల జగ్గయ్యపేటలో నిర్వహించిన పోటీలో ఆంధ్రప్రదేశ్ తరఫున కళాశాలకు చెందిన ఎస్.అశ్రిత (69 కేజీల విభాగం), ఎం.సాయిహర్షిణి (52 కేజీల విభాగం), ఎస్.జీవన్ (83 కేజీల విభాగంలో)లు ఎంపికయ్యారన్నారు. ఈ పోటీలు ఈ నెల 25 నుంచి 30 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయన్నారు. విద్యార్థుల ఎంపికపట్ల జీఎంఆర్ ఐటీ డీయూ వీసీ డాక్టర్ జె.గిరీష్, ఎగ్జిక్యూటివ్ డీన్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ శశికుమార్, విద్యార్థులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.శృంగవరపుకోట: మండలంలోని ధారపర్తి పంచాయతీ పరిధిలో మరో గిరిజన యువకుడిని మృత్యువు కాటేసింది. పంచాయతీ పరిధి గూనపాడు గ్రామానికి చెందిన దూసరి సోమయ్య(40) సకాలంలో వైద్యం అందక బుధవారం మృత్యువు పాలయ్యాడు. కొన్నిరోజులుగా మలేరియాతో గ్రామంలో గిరిజనం అవస్థల పాలవుతున్నారు. జ్వరంతో అవస్థ పడుతున్న సోమయ్యను ఆస్పత్రికి తరలించేందుకు గ్రామస్తులు అవస్థలు పడ్డారు. గ్రామం నుంచి డోలీ కట్టి, కిందికి మోసుకొచ్చి అక్కడి నుంచి ఆటోలో ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే సోమయ్య మృతి చెందాడని, ఆస్పత్రికి రావడం ఆలస్యమైందని వైద్యులు తేల్చిచెప్పారు. సోమయ్య మృతితో భార్య, ముగ్గురు పిల్లలు దిక్కులేక రోడ్డున పడ్డారు. దారపర్తి పంచాయతీ పరిధిలో గిరిశిఖర గ్రామాలకు గత ప్రభుత్వం హయాంలో రోడ్డు మంజూరు చేసి, నిధులు కేటాయించారు. కాగా కూటమి సర్కారు రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదల చేయక గిరిజనం ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గుమ్మలక్ష్మీపురం: ప్రేమ వివాహానికి ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదని మనస్తాపం చెందిన ఓ గిరిజన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుమ్మలక్ష్మీపురం మండలంలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దుడ్డుఖల్లు పంచాయతీ కొత్తవలస గ్రామానికి చెందిన కొండగొర్రి శివ(24) ఓ యువతిని కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి కుటుంబసభ్యులు నిరాకరిచండంతో మంగళవారం రాత్రి కుటుంబసభ్యులతో వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన శివ గ్రామ సమీపంలోని జీడిమామిడి తోటకు వెళ్లి ఉరివేసుకున్నాడు. కొంతసేపటికి శివ ఆచూకీ కోసం గాలించిన కుటుంబసభ్యులు జీడితోటలో ఉరివేసుకుని ఉన్న శివను గుర్తించి హుటాహుటిన కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బుధవారం జిల్లా ఆస్పత్రికి తరలించి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎల్విన్పేట పోలీసులు తెలిపారు. -
పొలంబడి పరిమితం..!
రామభద్రపురం: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఖరీఫ్ సాగుకు సిద్ధమైన కర్షకులను టీడీపీ కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు మరింత కలవర పెట్టేలా ఉన్నాయి. ఇప్పటికే ఉచిత పంటల బీమా, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవకు మంగళం పాడిన ప్రభుత్వం ఇప్పడు రైతులకు ఏటా ఆర్బీకేల వారీగా వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచే పొలంబడి కార్యక్రమాలను నామమత్రం చేసింది. ప్రకృతి వైపరీత్యాలు, పెరుగుతున్న సాగు ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు వివిధ రకాల ఎరువుల ధరలను పెంచి ప్రభుత్వం షాక్ మీద షాక్లు ఇచ్చింది. ఇప్పుడేమో పొలంబడులు పరిమితం చేసి రైతులకు వ్యవసాయం సేద్యంపై అవగాహన పెంచే కార్యక్రమాలు లేవని తెలియడంతో మరింత షాక్ తగిలినట్లయింది. జిల్లాలో 13మండలాల్లో మాత్రమే పొలంబడి.. జిల్లాలోని 14 మండలాల్లో పొలంబడి కార్యక్రమాల నిర్వహణకు మంగళం పాడినట్లు తెలిసింది. వ్యవసాయ డివిజన్కు రెండు , చొప్పున మండలానికి ఒక్కొక్కటి చప్పున 13 మండలాలను పొలంబడి నిర్వహణకు ఎంపికచేశారు.అందులో బొబ్బిలి డివిజన్లో రామభద్రపురం, తెర్లాం చీపురుపల్లి డివిజన్లో చీపురుపల్లి ,మెరకముడిదాం, గజపతినగరం డివిజన్లో గజపతినగరం, మెంటాడ, విజయనగరం డివిజన్లో డెంకాడ, గంట్యాడ, కొత్తవలస డివిజన్లో నాలుగు పొలంబడి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఇందులో కొత్తవలస,ఎల్కోట, ఎస్కోట, వేపాడ మండలాలు ఉన్నాయి. అలాగే రాజాం డివిజన్లో రేగిడి అమదాలవలస మండలంలో మాత్రమే ఒకటి నిర్వహించనున్నారు. అయితే జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, కంది, కూరగాయల పంటలు సాగు చేయనున్నారు.ఈ పంటలకు రసాయన ఎరువులు పురుగు మందుల వినియోగం, పంటల దిగుబడి, ఏ పొంలంలో ఏఏ పంటలు సాగుచేయాలి, ఆయా పంటల సస్యరక్షణ చర్యలపై విజ్ఞానాన్ని పెంపొందించేందుకు నిర్వహించే పొలంబడి కార్యక్రమాలను అంతంతమాత్రమే చేయడం పంటలు సేద్యం చేసే అన్నదాతను చంద్రబాబు ప్రభుత్వం మరింత ఆందోళనకు గరిచేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. పంటల సాగు పడిపోయే ప్రమాదం ఇప్పటికే వరుస పంటనష్టాలు, వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా ఈ ఏడాది ఖరీఫ్లో పంటల సాగు విస్తీర్ణం పడిపోయే ప్రమాదం లేకపోలేదని అన్నదాతలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు గడిచిన రెండేళ్లు ఖరీఫ్ సీజన్లో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, రైతులకు కాలం కలిసి రాక పంటల పెట్టుబడులు దక్కకపోవడం, ప్రభుత్వం నుంచి కనీస సహకారం లేకపోవడంమేనని రైతులు విమర్శిస్తున్నారు.ఈ ఏడాది ఎల్నినో ప్రమాదం పొంచి ఉండడం రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వర్షాలు పడతాయో లేదోనని, పడినా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశంతో విత్తుకు రైతులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. వర్షాధార పంటలకే కాకుండా నీటి ఆధారిత పంటల సాగుకూ గడ్డుకాలం తప్పని పరిస్థితి.ఈ నేపథ్యంలో తక్కువ తేమతో సాగుకు అవకాశం ఉన్న స్వల్పకాలిక పంటలు సాగు,పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగు చేసుకోవాలనే సూచనలు సలహాలకు పొలంబండులు కార్యక్రమాలు ఉపయోగపడతాయని, ఈ కార్యక్రమాలను నామమాత్రం చేసి రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని మండిపడుతున్నారు.అలాగే గతేడాది ఖరీఫ్లో ఒక్క బస్తా యూరియా కోసం అన్నదాతలు గంటల తరబడి క్యూలో ఉండి నానా అవస్థలు పడ్డారు.చాలా చోట్ల రైతులకు అందాల్సిన యూరియా టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తరలించుకుపోయారు.ఈ ఏడాది ఎరువుల ధరలు అధికంగా పెరగడంతో పాటు ఎరువులు యాప్ ద్వారా పంపిణీ అంటూ పరిమితులు అమలు చేయడం వల్ల ఖరీఫ్ పంటలు సాగు చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారుతోంది. 14 మండలాల్లో కార్యక్రమం నిర్వహణకు మంగళం కూటమి నిర్ణయంతో కర్షకుడిలో కలవరం రైతులకు ఏటా వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచే కార్యక్రమాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం పంటల సాగు పడిపోయే ప్రమాదంవైఎస్ఆర్సీపీ హయాంలో ఇలా.. వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించేందుకు, పంటల సాగు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించి నాణ్యమైన పంటలను పండించేందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు ఏటా ప్రతి ఆర్బీకే వారీగా వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచే పొలంబడి కార్యక్రమాలను నిర్వహించింది.ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ, ఉద్యానశాఖాధికారులతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులు పండించే పొలంలోకి నేరుగా వెళ్లి అక్కడ రైతులతో సమావేశం ఏర్పాటు చేసి పంటల సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించేవారు. రైతులు పండించిన పంటలు అధిక దిగుబడులు సాధించేలా సూచనలు సలహాలు ఇచ్చేవారు, దీంతో రైతులు తాము పండించిన పంటలు మార్కెట్ ధరకంటే అధిక ధరకు అమ్ముకుని లబ్ధిపొందేవారు.పొలంబడి తగ్గింపుతో రైతులకు ఇబ్బందిలేదు పొలంబడులు తగ్గించినా రైతులకు వ్యవసాయ సాగులో ఏ ఇబ్బంది ఉండదు. గ్రా మ, మండల వ్యవసాయ, ఉద్యాన అధికారులతో పాటు ఏడీఏ,డీడీలు కూడా నిత్యం రైతులకు పంటల సాగు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తారు.పొలంబడులతో సంబంధం లేకుండా రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచేందుకు చ ర్యలు తీసుకుంటాం.వీటీ రామారావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి, విజయనగరం -
గురువారం శ్రీ 25 శ్రీ జూన్ శ్రీ 2026
ఈ చిత్రంలో బెంచీపై పడుకుని కనిపిస్తున్న చిన్నారి పేరు సవర నిఖిల్. దమరానుగూడ గ్రామం. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. వైద్యం కోసం సీతంపేట ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. బాబు ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని తల్లిదండ్రులు తెలిపారు. ● మా ఊరికి మలేరియా వచ్చింది. నాటువైద్యానికో దండం. లార్వావేట అంటూ వైద్యశాఖ, మలేరియా నివారణశాఖ చేపడుతున్న కార్యక్రమాలు కేవలం అవగాహనకే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో మలేరియా నిర్మూలన చర్యలు కనిపించడం లేదు. ప్రభుత్వం దోమతెరలను అందజేయలేదు. ఏ ఇంట చూసినా జ్వరపీడితులే దర్శనమిస్తున్నాయి. మలేరియా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. – సీతంపేట మండలం నౌగూడ గ్రామానికి చెందిన గిరిజనుడి ఆవేదన ఇది -
బీఎల్ఏలతో ప్రత్యేక సమావేశం రేపు
సాలూరు: నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ బీఎల్ఏల(బూత్ లెవెల్ ఏజెంట్లు)కు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మాజి డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తెలిపారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ఎంపీపీలు, వైస్ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులంతా తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. పట్టణంలోని తన ఇంటి వద్ద గల వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించే సమావేశంలో బీఎల్ఏలకు ఐడీ కార్డులు అందించనున్నట్లు తెలిపారు. -
హోరాహోరీ.. విజయమే గురి
● ఉత్కంఠ భరితంగా సాగిన విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలువిజయనగరం: విజయనగరం వేదికగా నిర్వహిస్తున్న విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్ క్రీడామైదానం ప్రాంగణంలో మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన పోటీలు రెండవ రోజు మంగళవారం ఉత్కంఠ భరితంగా సాగాయి. వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడాంశాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బుధవారం స్థానిక దాసన్నపేట విద్యుత్ భవనంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం చేయనున్నట్లు ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు తెలిపారు. ఇదిలా ఉండగా రెండోరోజు మంగళవారం వాలీబాల్ క్రీడాంశంలో జరిగిన పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్ పోటీలకు విజయనగరం, నెల్లూరు, విశాఖ, విజయవాడ జట్లు చేరుకున్నాయి. పోటీలను ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి పి.హరి, కార్యదర్శి మోహన్, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కౌన్సిల్సభ్యులు వడివేలు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. అథ్లెటిక్స్ పోటీల్లో విజేతలు.. షాట్పుట్ విభాగంలో కె.శ్రీనివాస్ (ఎన్టీటీపీఎస్), ఎస్.పోతులయ్య (అనంతపురం), కె.స్వామి మణికంఠ (రాజమండ్రి)లు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. జావెలిన్ త్రోలో ఏఎస్. రామకృష్ణ (అనంతపురం), కె.శ్రీనివాస్ (ఎన్టీటీపీఎస్), సీహెచ్బీవీవీ పుల్లారావు (ఏలూరు) విజేతలుగా నిలిచారు. డిస్క్త్రోలో ఆంజనేయులు (విజయనగరం), పి.కుమార్ (తిరుపతి), కె.శ్రీనివాస్ (ఎన్టీటీపీఎస్) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. లాంగ్జంప్లో ఆర్.బాలాజీ (తిరుపతి), కె.మణిబాబు (విజయనగరం), కె.భాస్కరరావు (శ్రీకాకుళం)లు సత్తా చాటగా..హైజంప్లో ఆర్.బాలాజీ (తిరుపతి), బీఎస్ ఇంతియాజ్ (అన్నమయ్య), కె.స్వామిమణికంఠ (రాజమండ్రి) ట్రిపుల్ జంప్లో ఆర్.బాలాజీ (తిరుపతి), కె.భాస్కరరావు (శ్రీకాకుళం), ఎన్.సాయికుమార్ (విజయనగరం) మొదటి మూడు స్థానాలు కై వసం చేసుకున్నారు. 5000 మీటర్ల పరుగు పోటీలో కేవీ నాగులు (విజయవాడ), ఎం.లక్ష్మణ్నాయక్ (అనంతపురం), ఎన్.వినీల్ (విజయవాడ)..10000 మీటర్ల పరుగు పోటీలో కేవీ నాగులు (విజయవాడ), ఎస్.జయరాజ్ (విజయనగరం), ఎన్.వినీల్ (విజయవాడ)లు..100 మీటర్ల పరుగు పోటీలో ఆర్.బాలాజీ (తిరుపతి), కేవీ నాగులు (విజయవాడ), ఎ.దివాకర్ (అనంతపురం) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. 200 మీటర్ల పరుగు పోటీలో ఆర్.బాలాజీ (తిరుపతి), పి.అనిల్కుమార్ (విజయనగరం), కేవీ నాగులు (విజయవాడ), 400 మీటర్ల పరుగు పోటీలో కేవీ నాగులు (విజయవాడ), ఎం.లక్ష్మణ్ నాయక్ (అనంతపురం) కె.లివిబాబు (విజయవాడ), 800 మీటర్ల పరుగు పోటీలో కేవీ నాగులు (విజయవాడ), ఎస్.జయరాజ్ (విజయనగరం), ఎం.లక్ష్మణ్ నాయక్ (అనంతపురం)లు విజేతలుగా నిలిచారు. -
పనులు జానెడు!
లక్ష్యం మూరడు.. బలిజిపేట: బలిజిపేట మండలం పెదపెంకిలో బుధవారం నిర్వహించాల్సిన డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటన వాయిదా పడింది. దీనికి లక్ష్యం మేరకు పనులు పూర్తికాకపోవడమే కారణంగా తెలుస్తోంది. పెదపెంకిలో సుమారు రూ.5.80కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనుల్లో కమీషన్ల కోసం రాజకీయ ప్రమేయం అధికం కావడంతో జాప్యం జరుగుతోందన్న విమ ర్శలు ఉన్నాయి. పనుల లక్ష్యం బారెడు కాగా జరిగినవి జానెడుగా కనిపించడంతో డిప్యూటీ సీఎం పర్యటిస్తే ఏమవుతుందోనని అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. అయితే పనులు అతి తక్కువగా జరిగాయనే విషయం డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్లడంతో పర్యటన వాయిదా వేసుకున్నారని సమాచారం. మమ అనిపించేద్దామనుకున్నా... గ్రామంలో చేసిన కాసింత పనులు చూపించి పంపించే ప్రయత్నంలో రూట్మ్యాప్ను అధికారులు సిద్ధం చేశారు. కంపు కొడుతున్న కాలువలపై బ్లీచింగ్ల జల్లి మసిబూసి మారెడుకాయ చేసేందుకు సిద్ధమయ్యా రు. దుర్గంధభరితంగా ఉండే కొన్ని ప్రాంతాల్లో పారిశుధ్య సమస్య తొలగించారు. గ్రామం ప్రారంభంలో మంచి ముస్తాబు పనులు చేపట్టారు. అంతా ఆర్భాటం చేసి ఏదోవిధంగా డిప్యూటీ సీఎం పర్యటన మమ అనిపించేద్దామనుకున్న అధికారులకు నోట్లో వెలక్కాయ పడినట్టు పర్యటన వాయిదా పడిందనే విషయం తెలిసి మింగుడుపడడం లేదు. పనుల్లో నాణ్యతా లోపాలు? బయటకు కాస్త ఊపిరి పీల్చుకున్నా ఎప్పుడు ఉరుము ఉరుముతుందా అని భీతిల్లుతున్నారు. లక్ష్యం ప్రకారం వెచ్చించిన నిధులతో చేయాల్సిన పనులు ఇబ్బడిముబ్బడిగా చేయడంలో నాణ్యతా లోపాలను గుర్తించిన దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫైలేరియా రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామానికి ఉపాధిహామీ పథకంలో రూ.80లక్షల నిధులతో వీధికాలువల నిర్మాణాలు చేపట్టేందుకు, ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రోడ్లు, కాలువల నిర్మాణాలకు రూ.5కోట్లు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం రూ.5.80 కోట్లతో పీఆర్ ఆధ్వర్యంలో 49సీసీ రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో 18 వీధికాలువల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. పనుల వివరాలు ఇలా రూ.5.80కోట్లతో గ్రామం లోపల భాగంలో వివిధ వీధుల్లో 4కిలోమీటర్ల పొడవున 49సీసీ రోడ్ల నిర్మాణం, 2,400మీటర్ల పొడవున 18చోట్ల వీధికాలువల నిర్మాణం జరిపేందుకు ప్రణాళిక తయారుచేశారు. వాటిలో వివిధ వీధుల్లో 1.7కిలోమీటర్ల మేర 14సీసీ రోడ్ల నిర్మాణాలు మాత్రమే జరిగాయి. మిగిలిన రోడ్ల నిర్మాణాలు జరగాల్సి ఉంది. వీధికాలువలకు సంబంధించి 1800మీటర్లమేర 14పనులు పూర్తిచేశారు. వాటిలో 190మీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ ఉన్నాయి. గ్రామంలో ఉండే వీధికాలువల పొడవు 12.8 కిలోమీటర్లు. వాటిలో ఉండే పాతకాలువలు, పాడైన వాటి సంగతి ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో రోడ్లు, కాలువల నిర్మాణాలకు ఆక్రమణలు అడ్డు ఉన్నాయని భావించిన అధికారులు 33 వీధుల్లో ఆక్రమణలను తొలగించారు. తొలగించిన వాటిలో 10వీధుల్లో మాత్రమే పనులు నిర్వహించారని మిగిలిన వాటి సంగతి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పనులు పూర్తికాకపోవడంతోనే డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటన రద్దయిందని, అధికారులు గ్రామంలో పనులు ఎప్పుడు పూర్తిచేస్తారో వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు. నిధులు మంజూరైనా పనులు పూర్తికాకపోవడంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
సర్దుపోటు
బుధవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2026సచివాలయ ఉద్యోగులకు ● పెదపెంకిలో డిప్యూటీ సీఎం పర్యటన రద్దు ● లక్ష్యం ప్రకారం పూర్తికాని పనులుజాతీయ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి ● జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి మాధురి పార్వతీపురం: వచ్చేనెల 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి ఎం.మాధురి సూచించారు. జిల్లా పోలీస్ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీచేయదగిన క్రిమినల్, చెక్ బౌన్స్ కేసులను గుర్తించి లోక్ అదాలత్లో పరిష్కరించాలని సూచించారు. రాజీ వల్ల కక్షిదారులకు సమయం, ధనం ఆదా అవుతాయని పేర్కొన్నారు. వారెంట్ పెండింగ్ కేసులు, గంజాయి, పోక్సో చట్టాలకు సంబంధించిన కేసుల్లో ముద్దాయిలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అడిషనల్ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కె.సౌమ్య జోస్పిన్, పోలీస్, ఎకై ్సజ్, రెవెన్యూశాఖల అధికారులు పాల్గొన్నారు. విజయనగరం రూరల్: ఈ నెల 30 నిర్వహించనున్న కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీయూ) ప్రథమ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్కు సీటీయూ ఉపకులపతి టి.శ్రీనివాసన్ ఆహ్వానించారు. విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ను మంగళవారం కలిసి ఆహ్వాపత్రికను అందజేశారు. వర్సిటీలో జరుగుతున్న విద్యా, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు గవర్నర్ సుముఖత తెలిపినట్టు వీసీ ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ చెస్ పోటీల్లో జ్వాలాముఖి ప్రతిభవిజయనగరం: అంతర్జాతీయ స్థాయిలో జరిగిన చెస్ పోటీల్లో విజయనగరానికి చెందిన కేవీ.జ్వాలాముఖి తన ప్రతిభతో సత్తా చాటాడు. హైదరాబాద్లోని సరోవర్ ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించిన డేనిస్ ఇంటర్నేషనల్ ఫీడ్ రేటెడ్ చెస్ టోర్నమెంట్లో పీహెచ్సీ విభాగంలో ప్రాతినిధ్యం వహించిన జ్వాలాముఖి ద్వితీయ బహుమతి సాధించి రూ.6000 నగదుతో పాటు ట్రోఫీని కూడా గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్లో అమెరికా, స్వీడన్, జపాన్న్, భారతదేశం నుంచి 680 మంది క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్జాతీయ చెస్ పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానం దక్కించుకున్న జ్వాలాముఖిని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేకే.జగన్నాధ, కార్యదర్శి ప్రసాద్తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు, సీనియర్ చెస్ క్రీడాకారులు అభినందించారు.పార్వతీపురం రూరల్: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఓ వైపు యాప్ల భారం.. మరోవైపు సర్వేలతో సతమతం అవుతుండగా, ఇంకోవైపు ఉద్యోగేతర విధులు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, తాజాగా చేపట్టిన ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ ఆందోళనకు గురిచేస్తోంది. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీలు చదివి పోటీపరీక్షలో ఉద్యోగాలు సాధించినా ప్రస్తుత ప్రభుత్వం తీరుతో విలువలేకుండా పోతోందని మనోవేదనచెందుతున్నారు. సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పనిభారం, వేధింపులు తట్టుకోలేక ఇప్పటికే చాలామంది ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా పాలకుల్లో కదలిక లేకపోవడం ఉద్యోగులను ఆవేదనకు గురిచేస్తోంది. పైగా, మిగులు సిబ్బంది కుదింపు పేరిట చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ఏకపక్ష నిర్ణయాలు, బలవంతపు పోస్టింగులు సచివాలయ ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి. నిబంధనలను పూర్తిగా గాలికొదిలేసి, ఉద్యోగుల ఇష్టాయిష్టాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా సాగిస్తున్న ఈ ప్రహసనంపై ఉద్యోగవర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దాదాపు ఐదు శాఖలకు బదిలీలు సచివాలయాల్లో సిబ్బందిని తగ్గించి, ఇతర శాఖలకు సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. చైల్డ్ వెల్ఫేర్, మెప్మా, హోంశాఖ, బీసీ వెల్ఫేర్, సెర్ప్ తదితర దాదాపు ఐదు శాఖలను ఎంపిక చేసి రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది సచివాలయ ఉద్యోగులను ఆయా విభాగాలకు పంపేందుకు రంగం సిద్ధం చేసింది. వాస్తవానికి ఒక ప్రభుత్వ ఉద్యోగిని వేరే శాఖకు పంపేటప్పుడు ఆయా శాఖల ’జాబ్ చార్ట్’ ముందుగా ఇచ్చి, వారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వం కనీస నిబంధనలు పాటించడం లేదు. అసలు ఎవరు ఏ శాఖకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారో అడగకుండా, కేవలం రెండు వేల లోపు జనాభా ఉన్న గ్రామాలను లక్ష్యంగా చేసుకుని, అక్కడున్న వీఆర్వోలు, డిజిటల్ అసిస్టెంట్లు, మహిళా సంరక్షణ పోలీసులను ఇతర శాఖల్లోకి నెట్టేస్తోంది. సర్దుబాటు పేరిట చేసిన మార్పుల వల్ల ఉద్యోగులు ఒకచోట విధులు నిర్వహిస్తుంటే, వారి జీతాల డ్రాయింగ్స్ మాత్రం మరో విభాగం, ప్రాంతం నుంచి జరుగుతుండడం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. రిలీవ్ కావాల్సిందే... ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 104 మంది సచివాలయ మహిళా సంరక్షణ పోలీసులను ఇతర విభాగాల్లోకి వేసేందుకు రంగం సిద్ధమైంది. విజయనగరంలో 62 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 42 మందిని ఈ నెల 25న రిలీవ్ చేయాలని, అదే రోజు ఎస్పీ ఆఫీస్లో రిపోర్టు చేయాలన్న మౌఖిక ఆదేశాలు అందాయి. వీరికి ఎక్కడ పోస్టింగ్ ఇస్తారన్నది స్పష్టత లేదు. దీంతో మహిళా సంరక్షణ పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ప్రహసనంగా సెలవు మంజూరు ప్రక్రియ సచివాలయ ఉద్యోగుల సెలవుల మంజూరు ప్రక్రియ ప్రహసనంగా మారింది. అత్యవసరంగా ఒక రోజు సెలవు కావాలన్నా ముగ్గురు నుంచి నలుగురు అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి దాపురించింది. సచివాలయ సిబ్బంది తమ విభాగాల పరంగా ముందుగా పంచాయతీ కార్యదర్శిని, ఆపై ఎంపీడీఓను, చివరకు సర్కిల్ సీఐ వంటి ఉన్నతాధికారులను సంప్రదించాల్సి వస్తోంది. ఇంతమంది చుట్టూ తిరిగి అనుమతులు కోరినా చివరకు సెలవు మంజూరు అవుతుందో లేదో తెలియని దయనీయ స్థితి. ఈ నిబంధనల వలయం ఉద్యోగులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. బలవంతపు సర్దుబాట్లు కేవలం సచివాలయ ఉద్యోగులనే కాకుండా, వారు బదిలీ అయి వెళ్తున్న చైల్డ్ వెల్ఫేర్, మెప్మా, హోం శాఖల వంటి ఐదు విభాగాల్లోని పాత ఉద్యోగులను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం కనీస మార్గదర్శకాలు, స్పష్టమైన ’జాబ్ చార్ట్’ లేకుండా సచివాలయ సిబ్బందిని ఇతర శాఖల్లోకి బలవంతంగా సర్దుబాటు చేయడం మాలో తీవ్ర అభద్రతా భావాన్ని నింపుతోంది. మా ఇష్టాయిష్టాలతో (ఆప్షన్లు) ఏమాత్రం సంబంధం లేకుండా చేస్తున్న ఈ బదిలీల వల్ల పనిభారం పెరిగి సిబ్బంది మానసిక క్షోభకు, ఆత్మహత్యలకు బలవుతున్నారు. అటు సెలవులు దొరక్క, ఇటు సర్వీస్ రూల్స్పై స్పష్టత లేక బిక్కుబిక్కుమంటూ పనిచేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి ఈ ఏకపక్ష నిర్ణయాలను ఆపాలి. సిబ్బందికి పూర్తి ఉద్యోగ భద్రత కల్పిస్తూ, కేవలం వారి విల్లింగ్ ఆధారంగానే పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించాలి. – మహేష్ నాయుడు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కార్యదర్శి ఇష్టారాజ్యంగా సర్దుబాటు ప్రక్రియ.. ఆప్షన్లు లేవు, విల్లింగ్తో పనేలేదు! మహిళా సిబ్బంది నెత్తిన బలవంతంగా హోంశాఖ భారం దిక్కుతోచని స్థితిలో సిబ్బంది జిల్లా వ్యాప్తంగా 350 సచివాలయాల్లో 2,976 మంది ఉద్యోగులు -
మలేరియాతో గిరిజన యువకుడి మృతి
సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని నౌగూడ గ్రామానికి చెందిన సవర పూర్ణచంద్ర అనే గిరిజన యువకుడు మలేరియా, పచ్చకామెర్ల లక్షణాలతో బాధపడుతూ మృతిచెందినట్టు తల్లిదండ్రులు సవర గంగమ్మి, రాజేష్ తెలిపారు. తీవ్రమైన చలి, జ్వరంతో బాధపడుతుండడంతో ఈ నెల 17న సీతంపేట ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యసేవల కోసం శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పదోతరగతి వరకు చదివిన పూర్ణచంద్ర కొండపోడు పనుల్లో చేదోడువాదోడుగా ఉండేవాడు. అకస్మాతుగా మృతిచెండంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గిరిజన విద్యార్థి మృతి సీతంపేట మండలంలోని జొనగ బుడ్డడుగూడ గ్రామానికి చెందిన సవర దివాకర్ (9) అనే గిరిజన విద్యార్థి మలేరియాతో బాధపడుతూ శ్రీకాకుళం రిమ్స్లో మంగళవారం మృతిచెందాడు. సరిహద్దుగూడ గ్రామానికి చెందిన సవర లాజర్, మేరీల చిన్నకుమారుడు దివాకర్కు ఈనెల 16న జ్వరం రావడంతో పాలకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. జ్వరం తగ్గకపోవడంతో ఈనెల 18న పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో రిమ్స్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు మల్లి ఏపీఆర్ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల ప్రిన్సిపాల్ వాసుదేవరావుతో పాటు సిబ్బంది మృతుని ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. దహన సంస్కారాల ఖర్చుల కింద రూ.15 వేలు అందజేశారు. -
ఉద్యోగాల కోసంగర్జించిన గిరిజనం
● గిరిజన ప్రాంత ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని నిరసన పార్వతీపురం రూరల్: షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలను నూరు శాతం స్థానిక గిరిజనులకే కేటాయించాలని గిరిజనులు గర్జించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ను మంగళవారం ముట్టడించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమానికి యుటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సీఐటీయూ, ఐద్వా తదితర సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.లోకనాథం, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.తిరుపతిరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలను స్థానికులతో భర్తీ చేసే జీవో నంబర్ 3ను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో, దానికి చట్టబద్ధత కల్పిస్తామని గత ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలి గిరిజన జనాభా అధికంగా ఉన్న నాన్ షెడ్యూల్డ్ గ్రామాలను వెంటనే షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. సవర భాషా వలంటీర్లను రెన్యువల్ చేసి, కనీస వేతనాలు చెల్లించాలని, అలాగే నూతనంగా జాతాపు భాషా వలంటీర్లను నియమించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెల నుంచి ఆందోళన ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) కె.హేమలత నిరసనకారుల వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే సోమవారం కలెక్టర్తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమంలో గిరిజన, ప్రజా సంఘాల నాయకులు కె.రామస్వామి, లక్ష్మణరావు, మండంగి రమణ, ఎం.శ్రీనివాసరావు, బిడ్డిక ప్రకాష్, అడ్డమేశ్వరరావు, కె.సీతారాం, యూటీఎఫ్ నాయకులు ఎస్.మురళీమోహన్, కె.విజయ గౌరి, టి.రమేష్, కె.భాస్కరరావు, ఎస్ ఎఫ్ఐ నాయకులు సింహాచలం, అనిల్, గంగారామ్, సీఐటీయూ నాయకులు వై.మన్మథరావు, ఎన్.వై.నాయుడు, బీవీ.రమణ, జీవీ రమణ, బి.సూరిబాబు, ఆర్.వేణు, ఐద్వా నాయకులు బి.లక్ష్మి, ఆర్.శ్రీదేవి, వి.ఇందిర, కె.సాంబమూర్తి, రెడ్డి ఈశ్వరరావు, కె.ఈశ్వరరావు, మర్రి శ్రీనివాసరావు, పి.రాము తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీపై స్పష్టత ఇవ్వండి
పార్వతీపురం రూరల్: డీఎస్సీ–2025కు సంబంధించి మెరిట్ జాబితా, కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు విడుదల చేయాలని కోరు తూ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. గతంలో నిర్వహించిన డీఎస్సీల తరహాలోనే ప్రస్తుత నియామక ప్రక్రియలో కూడా మెరిట్, కటాఫ్ వివరాలను బహిర్గతం చేసి అభ్యర్థులకు స్పష్టతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిని రాష్ట్ర ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను కోరారు. గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం వైటీసీ కేంద్రంలో సోమవారం హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ప్రసవానికి వచ్చిన ఇద్దరు గర్భిణులను ఇక్కడి వసతి గృహంలో చేర్చుకోమంటూ సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న వారు.. ఎందుకు చేర్చుకోరని ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని బీరుపాడు పంచాయతీ పరిధి వాడజంగి గ్రామానికి చెందిన పువ్వల గంగోత్రి, కిల్లక మహంతిలు ఎనిమిది నెలల గర్భి ణులు. వారిని పరీక్షించిన దుడ్డుఖల్లు పీహెచ్సీ వైద్యులు.. మెరుగైన వైద్యం, పౌష్టికాహారం కోసం గుమ్మలక్ష్మీపురం వైటీసీలో చేరాలని సూచించారు. సోమవారం ఇక్కడికి వచ్చిన వారిని ఉన్నతాధికారుల సూచనల మేరకు వస తి గృహం సిబ్బంది చేర్చుకునేందుకు ససేమి రా అన్నారు. వారితో వాగ్వాదానికి దిగిన గర్భిణులు... తమ ఊరు గిరిశిఖరాన ఉందని, తిరి గి వెళ్లేందుకు రోడ్డు సదుపాయం లేదని, ఇళ్లకు చేరేలోపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. గతంలో వసతి గృహంలో చేరాలంటూ ఊరూరా వచ్చి అవగాహన కల్పించేవారని, ఇప్పుడు చేర్చుకునేది లేదంటూ చెప్పడంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఇదెక్కడి అన్యాయమంటూ వాపోయారు. వైటీసీలో చేర్చుకోవాలని గట్టిగా నిలదీయడంతో సిబ్బంది వారిని చేర్చుకున్నారు. -
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలి
పార్వతీపురం: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని జాయింట్ కలెక్టర్(ఎఫ్ఏసీ), డీఆర్ఓ కె.హేమలత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జేసీతోపాటు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీఓ కె.మాధురితో కలిసి వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఆమె 103 అర్జీలను స్వీకరించారు. వాటిలో సాధారణ అర్జీలు 67 కాగా రెవెన్యూ అర్జీలు 26 ఉన్నాయి. గృహనిర్మాణ గ్రాంట్లు, ఆరోగ్య కార్యకర్త పోస్టు భర్తీ, భూసమస్యలు, 1బి పాస్బుక్, పీఎం కిసాన్ పథకం, ఇంటి స్థల పట్టాల మంజూరువంటి అంశాలపై అర్జీలు అందగా, వాటికి నాణ్యమైన పరిష్కారంతో త్వరగా పూర్తిచేయాలని అధికారులకు జేసీ సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. గడువులోగా ఫిర్యాదులు పరిష్కరించాలి పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్పీ ఎస్.వి.మాధవ రెడ్డి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ–సమస్యల విచారణ క్రమంలో భాగంగా ఆయన ప్రతి పిటిషనర్తో ముఖాముఖి మాట్లాడి, వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ వేదికలో కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ వంచనలు, ప్రేమ పేరిట మోసాలకు సంబంధించిన మొత్తం 8 ఫిర్యాదులు నమోదయ్యాయి. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ, తక్షణమే ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. ఆయా ఫిర్యాదుల పూర్వాపరాలను నిశితంగా పరిశీలించి, అవి వాస్తవాలని తేలితే చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నిర్దిష్ట గడువు లోగా సమస్యలను పరిష్కరించి, తీసుకున్న చర్యల నివేదికను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై అశోక్ చక్రవర్తి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కాపుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు
రేగిడి: రాష్ట్రంలో కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ధ్వజమెత్తారు. కాపు కార్పొరేషన్కు చంద్రబాబు బకాయిపెట్టిన రూ.9వేల కోట్లు నిధులు విడుదలచేయాలని డిమాండ్ చేశారు. సోమవారం రేగిడి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో కాపునేస్తం సహా ఎన్నో పథకాలను కాపులకు అందించారని గుర్తు చేశారు. ఇళ్ల స్థలాలు, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, కాపునేస్తం వంటి పథకాలు కాపు మహిళలు, విద్యార్థులకు అందజేశారన్నారు. చంద్రబాబుకు ఎన్నికలప్పుడే కాపులు గుర్తుకు వస్తారని, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత కాపులను విస్మరించడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. కాపు కులంలో ఉన్నవారంతా రౌడీలా!, అధికార పార్టీనేతల అరాచకాలు చంద్రబాబు కళ్లకు కనిపించడంలేదన్నారు. తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, కింజరాపు సురేష్, కరణం శ్రీనివాసరావు, కెంబూరు వెంకటేశ్వరరావు, ఎర్నేన అప్పలనాయుడు, బాలి తవిటినాయుడు, బెవర అనంతనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
● కార్మికుల ఆందోళన పథం
మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, పార్కుల నిర్వహణ తదితర 14 మున్సిపల్ సేవలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం జారీచేసిన 975, 673 జీఓలకు వ్యతిరేకంగా పార్వతీపురంలో మున్సిపల్ కార్మికులు సోమవారం ఆందోళన చేశారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అక్కడి నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సింహాచలం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.వి.రమణ, కోశాధికారి గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ.. సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించి ప్రజల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో తీసుకువచ్చిన 279 జీఓను రద్దు చేసినట్లుగానే, ప్రస్తుత జీఓలను సైతం రద్దు చేసి ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ, సీఐటీయూ నాయకులు పి.రాజశేఖర్, బి.సూరిబాబు, ఎన్.శంకరరావు, బి.రవి, ఎం.శివ, పి.గాంధీ, తిరుపతిరావు, మాధవ, తదితరులు పాల్గొన్నారు. – పార్వతీపురం రూరల్ -
భగ్గుమన్న గురువులు
అడ్డగోలు కౌన్సెలింగ్పై.. విజయనగరం అర్బన్: విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ఎంటీఎస్ టీచర్ల బదిలీ కౌన్సెలింగ్ తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది. అధికారుల ఏకపక్ష నిర్ణయాలు, ఖాళీల ప్రదర్శనలో సాగిన మాయాజాలంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఉపాధ్యా యులకు అనుకూలంగా తీసుకొచ్చిన జీఓ 27ను ప్రస్తుత ప్రభుత్వం తుంగలోకి తొక్కడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వందలాది మంది ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ కేంద్రం వద్దే బైఠాయించి ఆందోళనకు దిగారు. దాదాపు మూడు గంటలపాటు కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిగా స్తంభించి పోయింది. రాత్రికి రాత్రే ఖాళీలు మాయం! విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని 431 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయుల కోసం అధికారులు తొలుత (కౌన్సెలింగ్కు ముందు రోజు) 520 ఖాళీ పోస్టులను వెల్లడించారు. తీరా సోమవారం కౌన్సెలింగ్ ప్రారంభించే సమయానికి సీన్ రివర్స్ అయింది. 1:1 నిష్పత్తిలో కేవలం 431 ప్లేసులను మాత్రమే స్క్రీన్పై ప్రదర్శించారు. అందులోనూ ఉపాధ్యాయులకు అనూకూలంగా ఉండే కేటగిరీ–1, 2 ప్రాంతాల స్కూళ్లలోని ఖాళీలను పూర్తిగా తొక్కిపెట్టి, కేవలం మారుమూల ప్రాంతాలను మాత్రమే చూపించడంతో ఉపాధ్యాయులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. జెడ్పీ చైర్మన్కు గోడు వినిపించిన ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ను బహిష్కరించిన ఉపాధ్యాయ ప్రతినిధులు నేరుగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును ఆయన చాంబర్లో కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ వైఎస్సార్సీపీ హయాంలో ఉపాధ్యాయులకు సమీప మండలాలు కేటాయించేలా తెచ్చిన జీఓ 27ను ఇప్పుడెందుకు అమలు చేయడం లేదని విద్యాశాఖ అధికారులను చైర్మన్ ప్రశ్నించారు. డీఈఓ యు.మాణిక్యంనాయుడు స్పందిస్తూ రాష్ట్ర స్థాయి నిబంధనల మేరకు కౌన్సెలింగ్ జరుగుతోందని, జిల్లాస్థాయిలో తాము ఎలాంటి మార్పులు చేయలేమని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 431 మంది ఎంటీఎస్లకు కౌన్సెలింగ్ చేపట్టాలని, వారికి సరిపడే ఖాళీలను చూపించామన్నా రు. ఖాళీ పోస్టులలో 57 మాత్రమే క్లియర్ వేకెన్సీ ఉన్నాయని, మిగిలినవి క్లస్టర్ పరిధిలో క్లస్టర్ టీచర్ గా పనిచేస్తారన్నారు. 431 మందిలో 2008 డీఎస్సీ టీచర్లు 97 మందికాగా, మిగిలిన వారు 1998 డీఎస్సీకి చెందిన వారు. గురువుల గోడు వినిపించుకోకుండానే... ఉపాధ్యాయులు సుమారు మూడు గంటల పాటు కౌన్సెలింగ్ హాల్ను దిగ్భందించి నిరసన తెలిపిన ప్పటికీ అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పట్టించు కోకుండా అదే మొండి వైఖరితో యథాతథంగా కౌన్సెలింగ్ ప్రక్రియను ముగించడంతో ఉపాధ్యా య లోకం తీవ్ర నిరాశతో వెనుతిరిగింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంటీఎస్ ఉపాధ్యాయుల ఇబ్బందులను గుర్తించి, వారి నివాస ప్రాంతాలకు సమీపంలోని మండలాల్లోనే పోస్టింగ్ లు ఇచ్చేలా జీఓ నంబర్27ను అమలు చేశారు. దీనివల్ల ఎంతో మంది మహిళా సీనియర్ ఉపాధ్యాయులకు ప్రయాణ కష్టాలు తొలగాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముందురోజు చూపించిన 520 ఖాళీలు రాత్రికి రాత్రే ఎలా మాయమయ్యాయి? సమీప మండలాల్లో స్పష్టమైన ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని ఎవరి కోసం దాచారు? గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ 27ను అమలు చేయడానికి ఈ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి? కేవలం 1:1 నిష్పత్తిలోనే పోస్టులు చూపిస్తే మాకు నచ్చిన స్థానాన్ని ఎంచుకునే ‘కౌన్సెలింగ్ హక్కు’ ఎక్కడుంది? అంటూ కొందరు ఉపాధ్యాయులు అధికారులను ప్రశ్నించారు. దూర ప్రాంతాలకు వేయడంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ ప్రతినిధులు ఉమ్మ డి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. సోమవారం ఆయన చాంబర్లో కలిసి ఉపాధ్యాయులు తమ ఆదేదనను వ్యక్తపరిచారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో కేటగిరీ–1 ఓపెన్ వేకెన్సీలను విడుదల చేయకపోవడం వల్ల అనేక మంది ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో సరైన స్పష్టత లేకపోవడం వల్ల అర్హత కలిగిన టీచర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత విద్యాశాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిస్కరించేలా చొరవచూపాలని వారు కోరారు. దీనిపై జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పూర్తి న్యాయబద్ధమైన రీతిలో కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగేలా కృషిచేస్తానని తెలిపారు. -
● కదం తొక్కిన విద్యార్థులు
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తో ముడిపడిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సాలూరులో సోమవారం ఆందోళన చేశారు. మానవహారం నిర్వహించి ప్రభుత్వం అలసత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ రూ.6,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, రూ.2,200 కోట్ల స్కాలర్షిప్ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. రూ.10,700 కోట్లకు 2026–27 బడ్జెట్లో కేవలం రూ. 2,766 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. గతంలో వసతిదీవెన పథకం కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ విద్యార్థులకు రూ.20వేలు చొప్పున అందేవన్నారు. బడ్జెట్లో అరకొర కేటాయింపులు, సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పేదకుటుంబాల విద్యార్థుల చదువులు ముందుకు సాగడంలేదని వాపోయారు. – సాలూరు -
గిరిజన వర్సిటీ పనులు
తుది దశలోగిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన అనంతరం మరడాం సభకు వస్తున్న అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి (ఫైల్)దత్తిరాజేరు: కేంద్రియ గిరిజన విశ్వ విద్యాలయానికి 2023 ఆగస్టు 25వ తేదీన అప్పటి, ఇప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసిన చోట శాశ్వత క్యాంపస్ పనులు రోజురోజుకు శరవేగంగా జరుగుతుండడంతో ఈప్రాంత ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గిరిజనుల జీవితాల్లో కాంతులు నింపాలంటే ఈ విద్యాదీపం నిబంధనల ప్రకారం వారి చెంతనే ఉంచాలన్న కృతనిశ్చయంతో మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కలిసి మంజూరు చేయించారు. ప్రస్తుతం విజయనగరం శివారు గాజులరేగ వద్ద ఏయూ స్టడీ సెంటర్లో తాత్కాలికంగా యూనివర్సిటీ కొనసాగుతోంది. ఈ ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థను ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సాలూరు పరిధిలోని మెంటాడ మండలం చినమేడపల్లి గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం మర్రివలస రెవెన్యూలలో 561.88 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన ప్రకృతి రమణీయతతో చక్కని ప్రాంతంలో విద్యా సౌరభాలు విర బూయనున్నాయని ఈ ప్రాంతప్రజలు విద్యావేత్తలు, మేధావులు ఆనందోత్సాహాలతో ఉన్నారు. 120 అడుగుల వెడల్పు రోడ్ల పనులతో పాటు తరగతి భవనాలు(అకడమిక్ బ్లాక్)పరిపాలన భవనం(అడ్మిన్ బిల్డింగ్)బాలికలు, బాలుర వసతి గృహాలు రానున్న 2027 విద్యా సంవత్సరానికి పూర్తి చేయడానికి జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తుండడంతో పనులు చక,చకా జరుగుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఎక్కడ చూసినా నాయకుల కృషి పైనే చర్చ ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కు అయిన మాజీ మంత్రి, ప్రస్తుత రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, అప్పటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర కలిసి వెనుకబడిన ప్రాంతంలో గిరిజన నియోజకవర్గానికి గిరిజన వర్సిటీ రావాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఒప్పించడంతో నేడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో యూనివర్సిటీ నిర్మాణం జరగడం శుభ పరిణామమని పలువురు ప్రశంసిస్తున్నారు. గిరిజన యూనివర్సీటికి వైజాగ్, భోగాపురం ఎయిర్ పోర్ట్లు దగ్గరగా ఉండడం, విజయనగరం, కోమటిపల్లి, బొబ్బిలి రైల్వే స్టేషన్లు దగ్గరగా ఉండడంతో పాటు జల రవాణాకు కూడా వైజాగ్ దగ్గరవడంతో రవాణా కూడా సులభతరంగా ఉండడంతో దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి రావడం సులభంగా ఉంటుంది. -
హమాలీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలోని పౌరసరఫరాల సంస్థ (సివిల్ సప్లై) గోదాముల్లో పనిచేస్తున్న హమాలీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్, ఉపాధ్యక్షుడు రాగోలు దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. హమాలీలతో కలిసి పట్టణంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రతినెలా 10వ తేదీలోపు చెల్లించాల్సిన బిల్లులు (వేతనాలు) నెలలు గడుస్తున్నా రాకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో కార్మికుల బ్యాంకు ఖాతాల్లో ఒకే బిల్లు జమయ్యేదని, ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పేరుతో రెండు వేర్వేరు బిల్లులు పడుతున్నాయని చెప్పారు. కేంద్రం ఇచ్చే బిల్లులకు పీఎఫ్ జమకావడం లేదని, కార్మికులకు మునుపటిలాగే ప్రతినెలా 10లోపు ఒకే బిల్లును చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లుగా పదవీ విరమణ పొందిన, మృతిచెందిన కార్మి కులకు ఇంతవరకు పీఎఫ్ సొమ్ము అందలేదని, వెంటనే ఆ మొత్తాన్ని మంజూరు చేయాలని కోరారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డిపోలకు గతంలో మాదిరిగానే సరకులు సరఫరా చేయాలని, డిపోల సంఖ్యను కుదించరాదని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే ఆందోళ న ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. హమాలీలు రాగోలు ఫకీరు, రామారావు, జగదీ ష్తో పాటు గుమ్మలక్ష్మీపురం, పాలకొండ, సీతంపేట, సాలూ రు, మక్కువ, పాచిపెంట, వీరఘట్టం తదితర ప్రాంతాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు. -
చీపురుపల్లిలో పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ ప్రారంభం
చీపురుపల్లిరూరల్: పట్టణంలోని ఎస్వీఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో విజయనగరం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెపెక్స్ట్రిమ్ జిమ్ నిర్వహణలో రెండు జిల్లాల స్థాయి క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్–2026 పోటీలు ఘనంగా సోమవారం ప్రారంభమయ్యాయి. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మాస్టర్స్ విభాగాల్లో పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనువాసులు నాయుడు మాట్లాడుతూ చీపురుపల్లిలో ఇలాంటి క్రీడాపోటీలు నిర్వహించడం అభినందనీయమ న్నారు. ఈ ప్రాంత యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని జిల్లా,రాష్ట్రస్థాయి,జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిమ్ నిర్వాహకుడు ప్రసాద్, అసోషియేషన్సభ్యులు, క్రీడాకారులు, నాయకులు మీసాల బాలు,గవిడి సురేష్,కర్రోతు ప్రసాద్,సాయి తదితరులు పాల్గొన్నారు.40 లీటర్ల సారా స్వాధీనం● ముగ్గురిపై కేసు నమోదు కురుపాం: కురుపాం పోలీస్స్టేషన్ పరిధిలో అక్రమంగా సారా తరలిస్తున్నట్లు అందిన ముందస్తు సమాచారం మేరకు ఆదివారం నిఘా పెట్టి మీసాల శ్రీకాంత్ అనే నిందితుడిని మూలిగూడ జంక్షన్ వద్ద 40 లీటర్ల సారా, ఒక ద్విచక్రవాహనంతో పట్టుకుని అరెస్టు చేసినట్లు కురుపాం ఎస్సై పి.నారాయణరావు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ దర్యాప్తులో భాగంగా అక్రమంగా సారా తరలింపులో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు నిందితులు వెలగాడ చిన్నరాయుడు, మీసాల దిలీప్లను గుర్తించి అరెస్టు చేసి ముగ్గురు నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరు పరచగా న్యాయస్థానం రిమాండ్ విధించిందన్నారు. మద్యం అక్రమ తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు కొనసాగిస్తుందని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. ఈ దాడుల్లో ఏఎస్సై రమణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మృతదేహంసీతానగరం/బొబ్బిలి: సీతానగరం–బొబ్బిలి రైల్వే లైన్లో సోమవారం సాయంత్రం గుర్తు తెలి యని వ్యక్తి(40) మృతదేహం లభ్యమైందని జీ ఆర్పీ ఎస్సై వి.బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలియజేశారు. మృతుడి శరీరంపై ఎరుపురంగు చారలు కలిగిన షర్టు, కాఫీరంగు ఫ్యాంట్, సిమెంట్ రంగు నిక్కరు, నలుపురంగు బూట్లు ఏదైనా కంపెనీలో చేసేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎవరైనా గుర్తుపట్టినట్లయితే రైల్వే ఎస్సై వి.బాలాజీ రావు, వియనగరం ఫోన్ 9247585742నంబర్ లేదా జీఆర్పీ హెచ్సీ సెల్ 8309901038 నంబర్కు తెలియజేయాలని కోరారు. 6.5కేజీల గంజాయి పట్టివేతవిజయనగరం క్రైమ్: స్థానిక రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంలపై జీఆర్పీ, ఆర్పీఎఫ్లు సోమవారం తనిఖీ నిర్వహిస్తుండగా సుమారు రూ.3లక్షల 25వేల విలువ గల 6.5కేజీల గంజాయి పట్టుబడింది. ఈ తనిఖీలో తమిళనాడు రాష్ట్రం టెంకశి జిల్లాకు చెందిన శంకలి పండా అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రం బ్రహ్మపుర నుంచి సొంత గ్రామానికి గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డాడని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు అనంతరం అరెస్ట్ చేసి విశాఖ రైల్వే కోర్టు కు తరలించామని ఎస్సై బాలాజీ రావు తెలిపారు. -
రెవెన్యూ రికార్డుల తప్పులపై రైతుల ఆగ్రహం
విజయనగరం అర్బన్: జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం నత్తనడకన సాగుతుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వ విభాగాల చుట్టూ తిరిగినా పనులు కాకపోవడంతో కలెక్టరేట్ అర్జీలతో పోటెత్తింది. ఈ రోజు ఒక్కరోజే మొత్తం 252 వినతులు రావడం జిల్లాలో పెండింగ్ సమస్యల తీవ్రతకు అద్దం అడుతోంది. ఇందులో కేవలం రెవెన్యూశాఖకు సంబంధించే అత్యధికంగా 123 ఫిర్యాదులు రావాడం గమనార్హం. రీ–సర్వే అభాసుపాలు..రైతుల ప్రదక్షిణలు జిల్లాలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హుక్కు–భూ రక్ష (రీ–సర్వే) కార్యక్రమం క్షేత్రస్థాయిలో అభాసుపాలవుతోందనడానికి కలెక్టరేట్కు వస్తున్న ఫిర్యాదులే నిదర్శనం. రీ–సర్వే పూర్తయిన గ్రమాల్లో సరిహద్దు వివాదాలు తీవ్రమవడం, రికార్డుల్లో భారీగా తప్పులు దొర్లడం, వెబ్ల్యాండ్లో విస్తీర్ణ వ్యత్యాసాలు తలెత్తడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ల పరిధిలో మ్యుటేషన్లు, భూ వివాదాలు, రీ–సర్వే సమస్యలు భారీగా పెండింగ్లో ఉండడంపై కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించిన ఆయన, ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో వివాదాస్పద భూములను స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు. 1100 టోల్ ఫ్రీ దరఖాస్తులపై తప్పుడు నివేదికలు? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలోనూ అధికారులు చేతులెత్తేస్తున్నట్లు తెలుస్తోంది. అర్జీదారులతో మాట్లాడకుండానే క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే నివేదికలు సమర్పిస్తున్నట్లు ఆరోపణలు వస్తునాయి. దీనిపై మాట్లాడిన తేదీ, సమయాన్ని రికార్డు చేయాలని కలెక్టర్ అధికారులను గట్టిగా హెచ్చరించారు. అర్జీల వెల్లువ – శాఖల వారీగా వివరాలు స్వీకరించిన 252 వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖ (భూసమస్యలు)కు 123, పంచాయతీరాజ్కు 24, డీఆర్డీఏకు 22, విద్యాశాఖకు 20, విద్యుత్ శాఖకు 5, గ్రామ సచివాలయాలకు 4, వైద్యారోగ్యశాఖకు ఒకటి ఇతర విభాగాలకు 41 అర్జీలు అందాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో జవాబుదారీతనం లోపించిందని, పెండింగ్లో ఉన్న అర్జీలను ఇప్పటికై నా కాలపరిమితిలో పూర్తి చేసి ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్ అధికారులను మందలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ పీజీఆర్ఎస్ కు 29 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 29 ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను ఎస్పీ దామోదర్ పరిశీలించి సంబంధిత ఎస్హెచ్ఓలతో మాట్లాడి, సమస్యలను వివరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డ డీసీఆర్మీ సీఐ కె.కుమార స్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సైలు ప్రభావతి, పద్మావతి సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టరేట్లో పెండింగ్ దరఖాస్తుల గుట్టలు అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి -
ప్రభుత్వ కళాశాల విద్యార్థినికి వీఐటీలో ఉచిత సీటు
నెల్లిమర్ల: స్థానిక సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళా శాల విద్యార్థిని షేక్ షేరున్నిసా ప్రతిష్టాత్మక అమరావతి వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 100% ఉచిత ఇంజినీరింగ్ సీటు సాధించి రికార్డు సృష్టించింది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె 1000 మార్కులకు గాను 984 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. దీంతో వీఐటీ సంస్థ గ్రామీణ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ’స్టార్స్’ పథకం కింద ఆమెకు ఈ ఉచిత సీటును కేటాయించారు. ఈ పథకం ద్వారా నాలుగేళ్ల ఇంజినీరింగ్ ట్యూషన్ ఫీజుతో పాటు హాస్టల్, భోజన వసతి ఖర్చులను కూడా వీఐటీ సంస్థే పూర్తిగా భరించనుంది. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఉచిత సీటు సాధించిన షేరున్నిసాను, ఆమె తల్లిదండ్రులను కళాశా ల ప్రిన్సిపాల్ మజ్జి సత్యనారాయణ, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. పేకాట శిబిరంపై దాడి: ఆరుగురి అరెస్ట్పార్వతీపురం రూరల్: పట్టణంలోని కోడిగుడ్ల వీధిలో సాగుతున్న పేకాట శిబిరంపై పోలీసులు సోమవారం ఆకస్మిక దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.23,900 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్సై కె.రాజేష్ తెలిపారు. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు ప్రత్యేక నిఘా ఉంచామని, సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల క్రీడా సందడి
● ప్రారంభమైన ఇంటర్ సర్కిల్ వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలువిజయనగరం: ప్రజలకు అవసరమైన అత్యవసరమైన సేవల్లో ఒక్కటైన విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మానసిక ఆరోగ్యం ముఖ్యమని, అది క్రీడల ద్వారానే సాధించగలమని ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్స్ అండ్ హెచ్ఆర్ డైరెక్టర్ టి.వనజ ఉద్ఘాటించారు. ఈ మేరకు ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ స్పోర్ట్స్ కౌన్సిల్ నేతృత్వంలో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన ఇంటర్ సర్కిల్ పురుషుల వాలీబాల్, అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలను సోమవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడామైదానంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆమె వివిధ ఆపరేషన్ సర్కిల్స్ నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వాలీబాల్ పోటీలను తొలి సర్వ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనే ఉద్యోగులంతా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి విజయవంతం చేయాలని కోరారు. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు మాట్లాడుతూ వివిధ సర్కిల్స్ నుంచి పోటీల్లో పాల్గొనేందుకు విచ్చేసిన క్రీడాకారులకు అవసరమైన భోజన, వసతి సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. 23 జట్లు... 350 మంది క్రీడాకారులు.. ఇదిలా ఉండగా మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన విద్యుత్ ఉద్యోగుల ఇంటర్ సర్కిల్ వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సర్కిల్స్ నుంచి 23 జట్లకు చెందిన 350 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. మొత్తం రెండు క్రీడాంశాల్లో నిర్వహించే పోటీల్లో వాలీబాల్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఫ్లడ్ లైట్ల వెలుగులో పోటీలు నిర్వహించనున్నారు. అదేవిధంగా అథ్లెటిక్స్ క్రీడాంశంలో పాల్గొనే క్రీడాకారులకు రన్స్, త్రోస్, జంప్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు 24వ తేదీన బహుమతులు ప్రదానం చేయనున్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరా వు, విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఈఈ పి.హరి, ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యుడు వడివేలు తదితరులు పాల్గొన్నారు. -
టి.సీతారాంపురం తోటలో 8 గజరాజులు
సీతానగరం: మండలంలోని సూరంపేట కేంద్రంగా మామిడి తో టల్లో 8 ఏనుగులు సంచరిస్తున్నాయి. పగటి పూటంతా మామిడి తోటల్లో స్థావరం ఉంటూ సాయంత్రం తాన్న సీతారాంపుం గ్రామ శివారులో ఉన్న చెరువులో నీరుతాగి బీటీరోడ్డు మీదుగా ఏర్పర్చుకున్న స్థావరానికి తరలిపోతున్నాయి. జీడిమామిడి తోటల్లో కొమ్మలు విరగ్గొట్టడం, మామిడి కాయలు రాల్చడంతో రైతులు, తోటకాపరులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 8 గజరాజులను చూసేందుకు ప్రజలు తరలివస్తున్న సమయంలో అటవీశాఖ అధికారులు, సిబ్బందితో వచ్చి వాటి దగ్గరకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు. ఐదురోజులుగా స్థానికంగా ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం జరకుండా అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలతో జాగ్రత్తలు చెబుతున్నారు. గుచ్చిమి, సీతారాంపురం,చిన్నారాయుడుపేట, రేపటివలస గ్రామాల ప్రజలు రాకపోకల సమయంలో జాగ్రత్తలు పాటించాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు. -
ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలు తగ్గకూడదు
● జిల్లా వృత్తి విద్య అధికారి ఎస్.తవిటి నాయుడుగజపతినగరం: ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలని జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి, రీజనల్ ఇన్స్పెక్షన్ అధికారి ఎస్.తవిటి నాయుడు అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రానురాను గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యూ అడ్మిషన్ల సంఖ్య ఎందుకు తగ్గుతూ వస్తోందని అలా తగ్గడానికి గల కారణాలు ఏమిటని స్థానిక ఉపాధ్యాయ సిబ్బందిని ఆరా తీశారు. గజపతినగరంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల హవా ఎక్కువగా ఉందని, దీంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ కళాశాలలో చేర్పించేందుకు ముందుకు రావడం లేదని, విద్యార్థులు కూడా ప్రైవేట్ కళాశాలల వైపే మొగ్గు చూపుతున్నారని సిబ్బంది చెప్పారు. అందువల్ల ప్రభుత్వ కళాశాలలు మరుగున పడాల్సి వస్తోందని చెప్పడంతో దీనికి ఆయన స్పందించి ఇక నుంచి అలా జరగకుండా ప్రిన్సిపాల్తో పాటు ఉపాధ్యాయ సిబ్బంది గడపగడపకు వెళ్లి విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి అడ్మిషన్ల సంఖ్య పెరిగేలా చూసుకోవాలని ఆదేశించారు.అలాగే న్యూ అడ్మిషన్లను ఎలా చేయాలి? విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఎలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి? ఎలా మోటివేట్ చేయాలన్న అంశాలపై ఉపాధ్యాయ సిబ్బందికి తవిటి నాయుడు వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రకాశ రావు పట్నాయక్తో పాటు పలువురు ఉపాద్యాయ సిబ్బంది పాల్గొన్నారు. -
నీట్గా పరీక్ష
విజయనగరం అర్బన్: జిల్లాలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశ పరీక్ష నీట్–యూజీ 2026 ఆదివారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. పట్టణంలో ఏర్పాటు చేసిన 6 పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,901 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,867 మంది హాజరై పరీక్ష రాశారు. 34 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష నిర్వహణను పర్యవేక్షించేందుకు నియమితులైన జాయింట్ కలెక్టర్ (నోడల్ అధికారి) సేతుమాధవన్ పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్, విద్యా శాఖ సహా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేసినట్లు అధికారులు తెలిపారు. పటిష్ట పోలీసు భద్రత నడుమ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్టు ఎస్పీ దామోదర్ వెల్లడించారు. నగరంలో ఏపీ మోడల్ స్కూల్, పాలిటెక్నిక్ కళాశాల, కస్పా హైస్కూల్, కేంద్రీయ విద్యాలయం, జేఎన్టీయూ కేంద్రాల్లో జరిగిన పరీక్షలను ఎస్పీ సందర్శించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. -
ప్రజా పోరాటాలకు అండగా ఓపీడీఆర్
విజయనగరం అర్బన్: స్థానిక ఎన్జీవో హోమ్లో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీఆర్) ఏపీ 15వ మహాసభలు ఆదివారం నిర్వహించారు. కామ్రేడ్ పెద్దింటి సూర్యానారాయణ ప్రాంగణం నామకరణంతో జరిగిన ఈ సభ ప్రాంగణాన్ని బీవీఎస్ పట్నాయక్ ప్రారంభించారు. ఆనాటి చారిత్రాత్మక శ్రీకాకుళం గిరిజన ఉద్యమ కాలం నుంచి నేటి వరకు వివిధ వర్గాల ప్రజాపోరాటాలకు, హక్కుల పరిరక్షణకు ఓపీడీఆర్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వస్తోందని వక్తలు తెలిపారు. అనంతరం ఓపీడీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బారెడ్డి నివేదికను సభలో ప్రవేశపెట్టారు. సమాజంలోని పలు కీలక సమస్యలపై ఈ సభలో చర్చించి, చేసిన తీర్మానాలను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. గిరిజన, గ్రామీణ, పట్టణ పేద ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, రాష్ట్రంలో కొనసాగుతున్న భూస్వామ్య దందాలు అరికట్టాలని, పేదలందరికీ ఉచిత, నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని, రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఓపీడీఆర్ అధ్యక్షుడు డాక్టర్ జితిన్ తదితరులు పాల్గొన్నారు. -
నేలబావిలో యువకుడి మృతదేహం
రేగిడి: మండల పరిధిలోని మజ్జిరాముడుపేట గ్రామసమీపంలోని పంటపొలాల్లో ఉన్న బావిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. . ఆదివారం అటుగా వరి విత్తనాలు పోసేందుకు వెళ్తున్న రైతులు మృతదేహాన్ని చూసి వీఆర్వో దుర్గారావుకు సమాచారం అందించారు. దీంతో వీఆర్వో ఆ సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. ఈ మేరకు ఎస్సై వి.బాలకృష్ణ, ఏఎస్సై గౌరినాయుడులు సంఘటనా స్థలం వద్దకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ నెల 17న తప్పిపోయిన అక్కన్న అగ్రహారం గ్రామానికి చెందిన అల్లెన అశోక్ (22)గా గుర్తించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించి మృతదేహం తమ కుమారుడిదేనంటూ భోరున విలపించారు. ఈ నెల 16న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని, అప్పటి నుంచి కనిపించకపోవడంతో పోలీసులకు ఈ నెల 17న ఫిర్యాదు చేశామని మృతుడి గవరయ్య విలేకరులకు తెలిపారు. శోకసంద్రంలో కుటుంబంఅల్లెన అశోక్ డిగ్రీ చదువుకున్నాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబానికి సహాయపడుతుండేవాడని తల్లిదండ్రులు గవరయ్య చిన్నమ్మలు భోరున విలపిస్తున్నారు. మృతుడికి తమ్ముడు ఉన్నాడు. మృతదేహం ఉబ్బిపోవడంతో సంఘటనా స్థలం వద్ద వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బాలకృష్ణ తెలిపారు. -
పాపం పండింది..!
రామభద్రపురం: మండలంలో 2015–16లో జరిగిన నీరు–చెట్టు అక్రమాల పాపం పండింది. అక్రమాలు చేసేసి..అంతలోనే గట్టెక్కిపోయాం అనుకున్న అప్పటి అధికారపార్టీ నాయకుల గుండెల్లో మళ్లీ రైళ్లు పరుగెడుతున్నాయి. రామభద్రపురం మండలంలో ఉపాధిహామీ, జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రూ.5.7కోట్లతో 102 పనులు చేపట్టారు. అయితే అప్పట్లో అధికారం అండతో పాటు జలవనరుల శాఖ అధికారుల సహకారంతో పనులు చేయకుండానే ఫోర్జరీ సంతకాలు చేసి బిల్లులు చేసుకోవడం..తక్కువ పనిచేసి ఎక్కువగా నమోదుచేయడం..తూతూ మంత్రంగా పనులు చక్కబెట్టేసి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించి మొత్తం 102 పనులు పూర్తి స్థాయిలో జరగలేదని, కొన్ని పనులు పూర్తిగా చేయకుండానే చేసినట్లు, మరికొన్ని పనులు నాణ్యతలేకుండా చేయడం, చెక్డ్యాంలు,మదుములు, చప్టాలకు టెక్నికల్ మంజూరు లేకుండా పనులు జరిపినట్లు, నాశిరకంగా నిర్మించడంతో పాటు ఉపయోగంలేని పనులు చేయడం, పోర్జరీ సంతకాలు చేసినట్లు గుర్తించారు.అలాగే మొత్తం నిధులలో సుమారు రూ.2.40 కోట్ల వరకు అవకతవకలు జరిగి నిధులు స్వాహా అయినట్లు నిర్ధారించారు, అప్పట్లో మండలంలో మొత్తం 22 పంచాయతీల చెక్ పవర్ల రద్దు, ఇరిగేషన్ అధికారులతో పాటు మరికొంత మంది మండల అధికారులు 24 మందిపై సస్పెన్సన్ వంటి అక్రమాలతో రామభద్రపురం మండలం రాష్ట్రంలోనే చర్చనీయాంశమవడం తెలిసిందే. ఏసీబీ అధికారుల నోటీసులు అప్పట్లో విజిలెన్స్ అధికారులు అక్రమాలకు పాల్పడిన వారిని విచారణ కూడా చేశారు. అధికారం అండదండలు ఉండడంతో పూర్తిగా విచారణ జరగలేదు. దీంతో విజిలెన్స్ అధికారులు ఈ కేసును ఏసీబీకి అప్పగించారు.సుమారు 8 ఏళ్లు అవడంతో అప్పటి అక్రమాలపై మరేమీ ఉండదు..గట్టెక్కిపోయాం అనుకున్నారు. కానీ వదల బొమ్మాళీ..నిన్నొదలా అన్నట్లు అక్రమాలకు పాల్పడినట్లు అభియోగం ఉన్న అప్పటి జలవనరుల శాఖ అధికారులతో పాటు నాయకులకు కూడా నాలుగు రోజుల క్రితం ఏసీబీ అధికారుల నుంచి నోటీసులు వచ్చినట్లు తెలిసింది. అప్పట్లో ఎందుకు అక్రమాలకు పాల్పడాల్సి వచ్చింది? స్వాహా చేసినట్లు విజిలెన్స్ బృందం నిర్ధారించిన సొమ్ము తిరిగి చెల్లించాలని, ఎప్పటికి చెల్లిస్తారో చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే ఇరిగేషన్ ఈఈ, డీఈ, ఏఈలతో పాటు నాయుడువలస, తారాపురం, కోటశిర్లాం, మామిడివలస గ్రామాల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై పోలీసు కేసులు నమోదైనట్లు సమాచారం. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు 2015–16లో నీరు చెట్టు పనుల్లో అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ నాయకులు రూ.2.40 కోట్లు అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారుల నిర్ధారణ కేసు ఏసీబీకి అప్పగింత అప్పట్లో అక్రమాలకు పాల్పడిన వారందరికీ ఇప్పుడు ఏసీబీ నోటీసులు -
పాఠశాలల్లో సూర్య నమస్కారాలు
● కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి పార్వతీపురం రూరల్: జిల్లాలోని ప్రతి పాఠశాల విద్యార్థికి సూర్య నమస్కారాలను తప్పనిసరి చేసిన తొలి జిల్లాగా పార్వతీపురం మన్యం రికార్డు సృష్టించిందని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఆయుష్ శాఖ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో కోటి మందితో నిర్వహించిన యోగా ప్రపంచ రికార్డులో జిల్లా ప్రజలు భాగస్వాములయ్యారని చెప్పారు. నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవడం ద్వారా ఒత్తిడి లేని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చని సూచించారు. అనంతరం ‘యోగాంధ్ర’ పోటీల్లో రాష్ట్రస్థాయిలో 12 పతకాలు సాధించిన విజేతలకు, జిల్లాస్థాయి ప్రతిభావంతులకు కలెక్టర్, ఎస్పీ జ్ఞాపికలు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.హేమలత, ఆర్డీఓ కె.మాధురి, మున్సిపల్ కమిషనర్ డి.పావని, ఆయుష్ వైద్యాధికారి టి.హేమాక్షి, నోడల్ అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు. మీకోసం వెబ్ సైట్లో పీజీఆర్ఎస్ అర్జీలుపార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారవేదికలో(పీజీఆర్ఎస్) అందజేసే అర్జీల వివరాలు మీకోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల అభ్యర్థన మేరకు ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. అర్జీలను మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని, వాటి స్థితిని 1100 టోల్ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. పైనాపిల్ @ 9సీతంపేట: సీతంపేట మార్కెట్లో పైనాపిల్ ధర ఆదివారం అమాంతం పతనమైంది. ఒక్కో పండును రూ.9కి గిరిజనులు విక్రయించారు. గత వారం రూ.18 కి ఒక్కో పండు అమ్మకాలు జరపగా ఈ వారం సగానికి ధరలు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా పైనాపిల్ మార్కెట్కు రావడం, దీనికి తోడు భోరున వర్షం కురవడంతో ధర పడిపోయినట్లు గిరిజనులు తెలిపారు. శృంగవరపుకోట: ‘అడవి బిడ్డలమైన మాకు అక్షర జ్ఞానం కల్పించండి’ అంటూ మండలంలోని దారపర్తి పంచాయతీ కురిడి గ్రామానికి చెందిన విద్యార్థులు కలెక్టర్ను వేడుకున్నారు. గిరిశిఖర గ్రామమైన కురిడిలో 100 కుటుంబాలు ఉండగా 30 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వీరంతా గ్రామంలో పాఠశాల లేకపోవడంతో నిత్యం ఆరు కిలోమీటర్లు కొండలు, గుట్టలు, వాగులు దాటి గూనపాడు గ్రామంలోని పాఠశాలకు వెళ్తున్నారు. నిత్యం అంత దూరం నడవలేక వారంలో రెండు మూడు రోజులు మాత్రమే వెళ్లగలుగుతున్నారు. మా పిల్లల విద్యాభ్యాసానికి వీలుగా గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయండి లేదా మాస్టర్ను పంపి తమ బిడ్డలకు అక్షరాలైనా నేర్పించండి అంటూ గ్రామస్తులు కోరుతున్నారు. విద్యా ర్థుల వెతలను గుర్తించిన గిరిజన సంఘం నేత జె.గౌరీష్ దీన్ని వీడియో చేసి కలెక్టర్ను వేడుకుంటున్న దృశ్యాలను కలెక్టర్కు, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జిల్లా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గిరిజన సంఘం ప్రతినిధులతో పాటు గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆస్తులున్నా పస్తులే..!
వీరఘట్టం: మండలంలోని చిదిమి రోడ్డులో ఉన్న ప్రైవేట్ భూములను ఏడాదికి ఒక ఎకరా భూమిని రూ.35 వేల నుంచి రూ.40 వేలుకు కొందరు కౌలుదారులు లీజుకు తీసుకుని కాయగూరల వ్యవసాయం చేస్తున్నారు. ఇదే రోడ్డులో కొంత దూరంలో ఉన్న వీరఘట్టం శ్రీ జగన్నాథస్వామి ఆలయ భూములు సుమారు 24.5 ఎకరాలు ఉన్నాయి. వాటిి ని అధికారులు ఎకరా భూమికి రూ.10 వేల నుంచి రూ.12 వేలకు లీజుకు ఇచ్చారు. ఈ గుడికి వీరఘట్టం, పాలకొండ, వంగర మండలాల్లో సుమారు 49 ఎకరాలకు పైబడి భూములున్నాయి. ఈ భూములన్నింటికీ వాస్తవంగా అయితే లీజులు ఏడాదికి రూ.15 లక్షల వరకు రావాలి.అయితే ఈ లీజులు కనీసం రూ.5 లక్షలు కూడా రావడం లేదు. ఈ ఆలయ భూములపై వస్తున్న అరకొర రాబడి కూడా సక్రమంగా దేవుడికి చేరడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే దేవుడి ఆస్తులనే ఆక్రమణ చేస్తుంటే పాపం ఏమీ చేయలేని దుస్థితిలో దేవుడు చిక్కుకున్నాడు. తనకు ప్రతినిధులుగా ఉన్న దేవాదాయశాఖ అధికారులు కళ్లకు గంతలు కట్టి ఆక్రమణదారులకు అండగా నిలుస్తుంటే ఇక చెప్పుకోలేక తిప్పలు పడే స్థితి దేవుడికి ఏర్పడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏళ్ల తరబడి తనభూములకు సక్రమంగా కౌలు రాక, తాను నిత్యం ధూపదీప నైవేద్యాలకు నోచుకోక దేవుడు బిక్కమొహం వేస్తున్నాడు. వీరఘట్టం జగన్నాథ స్వామి ఆలయానికి ఉన్న సుమారు 49 ఎకరాల దేవదాయ భూములు కొన్ని ఆక్రమణల్లో ఉండగా, మిగిలిన వాటికి నామమాత్రపు లీజులు చెల్లిస్తున్నారు.ఫలితంగా ఆస్తులు ఉన్నా ఆదాయం లేక జగన్నాథుని ఆలయాల నిర్వహణ దయనీయంగా మారింది. ఇదీ దేవుడి దుస్థితి వీరఘట్టం జగన్నాథుని స్తిరాస్తులు 49 ఎకరాలు ఆ భూములు ఎక్కడ ఉన్నయో తెలియని పరిస్థితి నామమాత్రపు లీజులతో అరకొర ఆదాయం ఇటీవల గుట్టుగా జరిగిన లీజు ఒప్పందాలు కేవలం 38.75 ఎకరాలకు మాత్రమే లీజు ఒప్పందం మిగిలిన 10.25 ఎకరాలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఇదీ వీరఘట్టంలో ఉన్న జగన్నాథస్వామి ఆలయ భూముల పరిస్థితి -
పంచాయతీలకు కార్యదర్శుల కొరత
● ఒకొకక్కరికి రెండేసి పంచాయతీల విధులు ● ఒత్తిడి గురవుతున్న కార్యదర్శులుడెంకాడ: గ్రామస్థాయిలో ప్రజలకు సేవలందించే పంచాయతీలను కార్యదర్శుల కొరత వేధిస్తోంది. ప్రతి కార్యదర్శి రెండేసి పంచాయతీల్లో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్యలో ఏవరైనా సెలవు పెడితే ఎవరో ఒకరికి ఆ పంచాయతీ బాధ్యతులు అప్పగిస్తే మూడు పంచాయతీల్లో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్పంచ్లకు పదవీ కాలం పూర్తి కాగా ఎన్నికలు జరగకపోవడంతో పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో సాగుతున్నాయి. ఉదయం ఆరున్నర, ఏడు గంటల నుంచి ఆయాగ్రామ పంచాయతీలకు కార్యదర్శులు చేరుకుని సేవలందించాల్సిన పరిస్థితి ఉండడంతో అదనపు పంచాయతీ బాధ్యతలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు. వీటికి తోడు రాజకీయ ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. నిత్యం రాజకీయ చట్రంలో పని చేయాల్సిన పంచాయతీ కార్యదర్శులు ఎంత ఒత్తిడి ఉన్నా నేరుగా బయటకు తమ బాధను చెప్పులేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇన్చార్జ్ల పాలనలో.. డెంకాడ మండలంలో 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 17 గ్రామ సచివాలయ కేంద్రాలు. మండల కేంద్రమైన డెంకాడ గ్రామ సచివాయం కూడా ఇన్చార్జ్ కార్యదర్శితోనే కాలం వెళ్లదీస్తున్నారు. మోదవలస, చింతలవలస–2, రఘుమండ, గుణుపూరుపేట,సింగవరం గ్రామ సచివాలయాలు ఇన్చార్జ్ పాలనలోనే నడుస్తున్నాయి. డి.తాళ్లవలస, ఆకులపేట, డి.కొల్లాం, పంచాతీయలకు కూడా కార్యదర్శులు లేరు. గుణుపూరు కార్యదర్శి సెలవుపై వెళ్లడంతో అది కూడా ఇన్చార్జ్ పాలనలోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోదవలస సచివాలయంలో విధులు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఆ పంచాయతీ బాధ్యతలు మాకు వద్దని మండల అధికారులను కార్యదర్శులు వేడుకుంటున్నారు. ఉదయం ఆరున్నర నుంచే గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనుల్లో భాగంగా రిక్షాబళ్లపై చెత్తను సేకరిస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి వారిని పర్యవేక్షించాలి. అక్కడ వారితో తెల్లవారుజామున ఆరున్నర,ఏడు గంటలకు ఫొటో తీసి పైవారికి పెట్టాలి. ఇక్కడి నుంచి పంచాయతీ కార్యదర్శి విధులు ప్రారంభమవుతున్నాయని వారు చెబుతున్నారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీరు సరఫరా, వీధి దీపాల పనితీరు తదతర వాటిపై నిత్యం ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ప్రజలకు వస్తాయి. వాటిలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయాలి. లేకపోతే పంచాయతీ కార్యదర్శి పని తీరు సక్రమంగా లేదని పైవారు భావిస్తారట. దీంతో వాటి కోసం నిరంతరం పని చేయాల్సి ఉంది. కొందరు కార్యదర్శులను బీఎల్ఓలుగా కూడా నియమించారు. వీరు ఓటర్ల సవరణ ప్రక్రియను పరిశీలించాలి. వాటికి తోడు సెన్సెస్ ప్రక్రియ వేరే చెప్పనక్కర్లేదు. గ్రామ సచివాలయంలో ప్రజలకు నిరంతరం అందించాల్సిన సేవలు అందించాల్సిన బాధ్యతల్లో పంచాయతీ కార్యదర్శి పాత్ర చాలా కీలకమని వారు చెబుతున్నారు. ఇన్ని పనులు ఒక పంచాయతీలో నిర్వహించిన కార్యదర్శులకు మరిన్ని పంచాయతీల బాధ్యత అంటే చాలా ఒత్తిడి గురిచేయడమే అని ఆవేదన చెందుతున్నారు.అధికారులు అన్ని పంచాయతీలకు కార్యదర్శులను నియమించి మాపై పని ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శులు లేరుమండలంలో పది గ్రామ సచివాలయాలు, పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు లేరు. దీంతో ఉన్నవారికే పది పంచాయతీలకు ఇన్చార్జ్లుగా నియమిస్తున్నాం. మోదవలస పంచాయతీలో విధులు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.ఇదో సమస్యగా మారింది. ఉన్నత వారితో పంచాయతీల్లో ఇబ్బందులు లేకుండా పని చేయిస్తున్నాం. దేవానంద్, ఇన్చార్జ్ ఎంపీడీఓ, డెంకాడ -
సూరంపేటలో ఏనుగుల సంచారం
సీతానగరం: మండలంలోని సూరంపేట మామిడి తోటలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. గత నాలు గు రోజులుగా ఇదే పరిసర ప్రాంతాల్లో గజరాజులు తిరుగుతుండడం స్థానికులు బెంబేలెత్తుతున్నారు. పార్వతీపురం మండలంలోని పులిగుమ్మి ప్రాంతం నుంచి సూరంపేటకు చేరుకున్న ఏనుగులు..సీతారాంపురం, గుచ్చిమి, మరిపివలస ప్రాంతాల పొలాల్లో తిరుగుతున్నాయి. ఆదివారం ఉదయం సూరంపేట కాలువ గట్టు ఆనుకుని ఉన్న ఓ మామి డి తోటలో ఏనుగుల గుంపు తిరుగుతూ కనిపించ గా అవి ఎక్కడ మామిడి కాయలు తినేస్తాయోనని తోటల యజమానులు, కాపలాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి నష్టం జరగకముందే వాటిని ఇక్కడి నుంచి తరిమేయాలని కోరుతున్నారు. ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. -
అనారోగ్యంతో కేజీబీవీ విద్యార్థిని మృతి
● కడుపునొప్పి, పిట్స్ రావడంతోనే... ● ఆస్పత్రికి తరలించినా.. ఫలితం దక్కలేదు.. ● కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు ● బక్కునాయుడుపేట కస్తూర్బాలో కలకలం వేపాడ: మండలంలోని బక్కునాయుడుపేట కస్తూర్బా బాలికల విద్యాలయంలో తొమ్మిది తరగతి చదువుతు న్న వారాది బిందు కడుపునొప్పి, పిట్స్ రావడంతో మృతి చెందిన సంఘట న కలకలం రేపింది. బిందు మృతికి సంబంధించి ఉపాధ్యాయులు, పీహెచ్సీ వైద్యులు అందించిన వివరాలు.. మండలంలోని జాకేరు గ్రామాని కి చెందిన వారాది గణపతి, మంగ దంపతుల కుమార్తె బిందు. బక్కునాయుడుపేట కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో బిందు కడుపునొప్పిగా ఉందని తోటి విద్యార్థులకు చెప్పగానే నైట్ డ్యూటీలో ఉన్న మేడమ్ రోహిణీకి సమాచారం ఇచ్చారు. మేడమ్ వెళ్లిచూడగా కడుపునొప్పితో పాటు నోటి నుంచి కొంచెం సొంగలు రావడంతో ఎంపీహెచ్డబ్ల్యూ బి.అరుణ వచ్చి చూశారు. పిట్స్లా ఉందని వెంటనే వేపాడ పీహెచ్సీకి ఆటోలో తరలించారు. బిందు తల్లిదండ్రులకు, ప్రిన్సిపాల్కు ఉపాధ్యాయులు సమాచారం ఇచ్చారు. వేపాడ ఆస్పత్రికి రాగానే స్టాఫ్నర్సు తనిఖీ చేసి సీరియస్గా ఉందని ఎస్.కోట తరలించేందుకు అంబులెన్స్లో ఎక్కించి ప్రధమ చికిత్స అందించే సమయానికి బిందు మరణించినట్టు గుర్తించారు. దీంతో ఆస్పత్రికి చేరుకున్న బిందు తల్లిదండ్రులు తమ గ్రామం జాకేరుకు మృతదేహాన్ని తీసుకువెళ్లారు. సమాచారం తెలుసుకున్న ప్రిన్సిపాల్ కిరణ్మయి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో డీఈఓ మాణిక్యంనాయుడు, జీసీడీఓ మాలతి, జీసీడీఓ చైర్మన్ సన్యాసిరాజు జాకేరు వచ్చి తమ సంతాపం తెలిపారు. తల్లిదండ్రులను ఓదార్చారు. బిందుకు తల్లిదండ్రులతో పాటు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. 15 రోజులు క్రితమే... మృతి చెందిన బిందు 15 రోజుల కిందటే రజస్వల కావడంతో ఈ నెల 7వ తేదీన జాకేరులో వాణి ఫంక్షన్ చేశారు. ఇంతలోనే బిందు మృతి చెందడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. బిందు తండ్రి గణపతి కేజీబీవీ పాఠశాల ఎస్ఎంసీలో ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. బిందు మృతిపై వేపాడ పీహెచ్సీ వైద్యాధికారిణి డా.ప్రేరణ వద్ద ప్రస్తావించగా తాను యోగా వద్ద ఉన్నానని, విధుల్లో ఉన్న స్టాఫ్నర్సు తనిఖీ చేయగా అప్పటికే పల్స్ పడిపోయినట్టు గుర్తించి ఎస్.కోట తరలించేందుకు అంబులెన్స్ సిద్ధం చేశారని, ప్రధమ చికిత్సకు సిద్ధం చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. కేజీబీవీ సిబ్బంది బిందు దహన ఖర్చులకుగాను కుటుంబీకులకు రూ.10వేలు అందజేశారు. బిందు మృతితో కేజీబీవీలోని తోటి విద్యార్థినులు కలత చెందారు. కన్నీరుమున్నీరై విలపించారు. -
ప్లాిస్టిక్ దుకాణం దగ్ధం
కురుపాం: మండల కేంద్రంలోని రావాడ కూడలిలో ఉన్న ఒక ప్లాస్టిక్ దుకాణంలో ఆదివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో దుకాణంలో ఉన్న ప్లాస్టిక్ సామగ్రి, వ్యవసాయ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమయానికి అగ్నిమాపక వాహనం రాక పోవడంతో పక్కనున్న షాపులకు సైతం మంటలు వ్యాపించే క్రమంలో ఎస్సై పి.నారాయణరావు చొరవతో స్థానికులు వాటర్ ప్యాకెట్స్ విసిరి మంటలను అదుపులోకి తేవడంతో ఇతర షాపులకు మంటలు వ్యాపించలేదు. కానీ ప్లాస్టిక్ దుకాణం యజమాని కందుల విశేశ్వరరావుకు ఈ ప్రమాదంలో దుకాణం పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు రూ.ఐదు లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. సుమారు రూ.ఐదు లక్షల నష్టం -
జల రక్షణ.. గ్రామ స్వచ్ఛతే లక్ష్యం
● పరిశుభ్రతతోనే స్వర్ణాంధ్ర సాధ్యం ● కృష్ణపల్లిలో కార్యక్రమాలను ప్రారంభించిన కలెక్టర్ పార్వతీపురం రూరల్ : జిల్లాలో ఆక్రమణల బారిన పడుతున్న చెరువులను కాపాడటంతో పాటు, పరిసరాల పరిశుభ్రతను పెంపొందించడమే లక్ష్యంగా యంత్రాంగం ముందడుగు వేస్తోందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. మండలం కృష్ణపల్లిలో ‘జల రక్షణ’, ’స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాలను ఆయన శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్రమణల వల్ల విస్తీర్ణం తగ్గిన 2,816 చిన్న నీటి పారుదల చెరువులను జిల్లా వ్యాప్తంగా గుర్తించామన్నారు. వీటికి రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పక్కాగా హద్దులు నిర్ధారించి, ఉపాధి హామీ పథకం ద్వారా కందకాలు తవ్వడంతో పాటు పెగ్మార్కింగ్ చేయనున్నట్టు చెప్పారు. దీనివల్ల భవిష్యత్తులో ఆక్రమణలకు అడ్డుకట్ట పడటమే కాకుండా, నీటి నిల్వ సామర్థ్యం పెరిగి రైతులకు సాగునీరు పుష్కలంగా అందుతుందన్నారు. ఈ పనులను రెవెన్యూ, నీటి పారుదల, పంచాయతీ, ఉపాధి హామీ శాఖల సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతలో భాగస్వాములు కావాలి అనంతరం కృష్ణపల్లిలో పరిసరాలను శుభ్రపరిచిన కలెక్టర్.. స్వచ్ఛతతోనే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు పరిసరాల పరిశుభ్రతను తమ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ‘స్వచ్ఛ పార్వతీపురం’ సాధనకు ప్రజ లు, విద్యార్థులు, యువత, మహిళా సంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన కల్పించేలా అధికారులు విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. అనంతరం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రపై అధికారులు, సిబ్బందితో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమాల్లో ఆర్డీఓ కె.మాధురి, డీపీఓ ఎస్.రవీంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈవీఎం గోడౌన్లో పటిష్ట భద్రత పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోడౌన్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌనన్ను తనిఖీ చేశారు. గదులకు వేసిన సీళ్లు, సీసీ కెమెరాల పనితీరు, లాగ్బుక్ల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా చర్యల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. తనిఖీల్లో జాయింట్ కలెక్టర్ (ఎఫ్ఏసీ) కె.హేమలత, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
మొండిచేయి..!
● పెట్టుబడి సాయం నిల్ ● జిల్లాలో 70 శాతం కౌలు రైతులే.. ● రెండేళ్లుగా సాయం కోసం ఎదురు చూపులు ● పట్టించుకోని చంద్రబాబు సర్కార్ కౌలు రైతుకు పాలకొండ రూరల్: రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతులను రెండేళ్లుగా విస్మరిస్తోంది. వ్యవసాయమే జీవనాధారమై భూ యజమానుల నుంచి కౌలుకు తీసుకున్న భూమిలో రెక్కల కష్టాన్ని నమ్మి సేద్యం చేసే కౌలు రైతులకు ప్రభు త్వం మొండిచేయి చూపుతోంది. అన్నదాత సుఖీభవ లబ్ధి చేకూరకుండా చేస్తోంది. రెండేళ్లుగా పెట్టుబడి సాయం అందుతుందని ఆశగా చూస్తున్న వీరికి ఈ ఏడాదీ అన్యాయమే చేసింది. తాము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించడంతో పాటు వ్యవసాయ సంబంధిత సంక్షేమ లబ్ధిని అందిస్తామని, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పెట్టుబడి సాయం రూ.20వేలు అందిస్తామని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారు. అధికారం చేపట్టి రెండేళ్లు కావచ్చింది. తాజాగా ఈ ఏడాది కూడా ఖరీఫ్కు సంబంధించి పెట్టుబడి సాయం విడుదల చేసింది. అందులో కౌలు రైతులకు మాత్రం రిక్తహస్తమే చూపింది. వాస్తవానికి.. సాగు విషయానికి వస్తే జిల్లాలో భూ యజమానుల కంటే కౌలు రైతులు కీలకంగా ఉన్నారు. 15 మండలాల్లో దాదాపు రెండు లక్షలకు పైబడి రైతులు సాగుపై ఆధారపడుతున్నారు. వీరిలో పీఎం కిసాన్ పొందుతున్న వారు దాదాపు లక్షకు పైగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వానికి అందించిన రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన 80 శాతం వరకూ కౌలు రైతులు ఉన్నట్లు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, వ్యవసాయ రుణాలు అందిస్తామని చెప్పిన యంత్రాంగం శతశాతం సఫలీకృతం కాలేదని సదరు రైతులు వాపోతున్నారు. వాస్తవానికి వ్యవసాయంపై ఆధారపడే వీరికి ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయా సంఘాలు, కౌలు రైతులు ధీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగానే 2011లో కౌలు రైతుల చట్టం వచ్చింది. 2019లో ఆ చట్టాన్ని సవరిస్తూ భూ యజమానుల అంగీకారంతోనే కౌలు కార్డులు ఇవ్వాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కౌలు రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులందరికి సంక్షేమ పథకాలు అందేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. అధికారంలోకి వస్తే నూతన చట్టం తెచ్చి కౌలు రైతులను అన్నివిధాల ఆదుకుంటామని కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక దానికి భిన్నంగా వ్యవహరిస్తూ కౌలు రైతుల సంక్షేమాన్ని పక్కకు నెట్టింది. అన్నదాత సుఖీభవ లబ్ధి కౌలు రైతుకు ఇచ్చే ఉద్దేశం కూటమికి లేదని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది అన్నదాత సుఖీభవ లబ్ధిని జిల్లా వ్యాప్తంగా 1,22,260 మందికి అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సదరు రైతుల ఖాతాలకు పీఎం కిసాన్ ద్వారా కేంద్రం నుంచి రూ.21.9 కోట్లు, అన్నదాత సుఖీభవ ద్వారా రాష్ట్రం నుంచి రూ.61.13 కోట్లు వంతున మొత్తంగా రూ.83.03 కోట్లు జమ చేయనున్నారు. వీరిలో ఒక్క కౌలు రైతు లేడు. జిల్లా వ్యవసాయ యంత్రాంగం లెక్కల మేరకు కేవలం 9600 మంది మాత్రమే కౌలు రైతులు ఉంటారని, వీరిలో దాదాపు 2వేల మంది పూర్తిగా భూమి లేని రైతులని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌలు రైతుల విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదు. వారికి అందిస్తామన్న పెట్టుబడి సాయం గత రెండేళ్లగా అందించటం లేదు. గుర్తింపు కార్డులు, బ్యాంకు రుణాల ఊసే లేదు. ఏటా కౌలు రైతులు తమ చేతి సొమ్ములు, అప్పులు చేసి సాగు చేస్తున్నారు. నష్టం వస్తే వారే మళ్లీ అప్పులు చేసి భరిస్తున్నారు. వీరి విషయంలో ప్రభుత్వం కంటితుడుపు మాటలతో సరిపెడుతుంది. కూటమి పేరిట కలసి ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు కేవలం భూ యజమానులకు తప్పితే వాస్తవ సాగుదారులైన కౌలు రైతులను చిన్నచూపు చూస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కౌలు రైతుకు పెట్టుబడి సాయం అందించారు. కూటమి సర్కారుకు కౌలు రైతులు, వారిపై ఆధారపడ్డ వారి కుటుంబ సభ్యుల ఆవేదనను గుర్తించాల్సి ఉంది. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. – కిమిడి రామ్మూర్తినాయుడు, కౌలు రైతుల సంఘం నాయకుడు -
పాఠశాలగా వైటీసీ..!
సాలూరు: నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ తరగతుల నిర్వహణకు, గిరిశిఖర గర్భిణులకు వసతిగృహ కేంద్రంగా ఉపయోగించే యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ) కనుమరుగు కానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైటీసీ నిర్వహణపై కూటమి ప్రభుత్వంలో నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక్కడి సిబ్బందికి జీతాలు చెల్లించలేక, గిరిజన గర్భిణుల వసతి భారం భరించలేక మూసివేసేందుకు సిద్ధమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాచిపెంట మండలం కేంద్రంలోని పద్మాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరడంతో... సాలూరు వైటీసీకి మార్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఐటీడీఏ అధికారులు వైటీసీని పరిశీలించారు. సోమవారం నుంచి ఏ రోజైనా వైటీసీకి పద్మాపురం పాఠశాలను తరలించవచ్చని అధికారులు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. పద్మాపురం సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 240 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా ఇక వైటీసీ భవనాల్లో విద్యాభ్యసన చేయనున్నారు. ఆందోళనలో సిబ్బంది గిరిశిఖర గర్భిణులు వసతిగృహంలో ఏళ్లతరబడి సేవలందిస్తున్న సిబ్బంది తమ భవిష్యత్ ఏమిటని ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జీతాల సమస్యలు ఎదురైనా నాటి ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ప్రత్యేక చొరవతో జెడ్పీ నుంచి నిధులు తీసుకొచ్చి వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నారని గుర్తు చేసుకుంటున్నారు. నేడు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సంధ్యారాణి గిరిశిఖర గర్భిణుల వసతిగృహానికి నూతన జవసత్వాలు తీసుకొస్తారని భావిస్తే నిర్వీర్యం దిశగా అడుగులు వేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు సాలూరు ఏరియా ఆస్పత్రిలో గిరిశిఖర గర్భిణులను చేర్పించాలని అధికారులు సూచిస్తున్నా, అక్కడికి వెళ్లేందుకు గర్భిణులు నిరాసక్తి చూపుతున్నారు. పాచిపెంట మండలంలో పద్మాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఈ విషయాన్ని ఐటీడీఏ ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాం. వారి ఆదేశాల మేరకు సాలూరు పట్టణంలో వైటీసీకి ఆశ్రమ పాఠశాలను సోమవారం నుంచి ఏ రోజైనా మార్పుచేసే అవకాశం ఉంది. – విజయశాంతి, ఐటీడీఏ డీడీ, పార్వతీపురం విద్యాలయంగా మారబోతున్న ఉపాధి, వసతి కేంద్రం పద్మాపురం సంక్షేమ పాఠశాల సాలూరు వైటీసీకి తరలింపునకు సన్నాహాలు వైటీసీ భవితవ్వంపై నీలినీడలు -
పింఛన్ రాదు.. టెన్షన్ తీరదు..!
వీరఘట్టం: వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులు... రెండేళ్లుగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మంజూరవుతుందా.. బతుకుకు భరోసా దొరుకుతుందా అని ఆశపడుతున్నారు. దరఖాస్తులు పట్టుకుని సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం శూన్యమే. దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఎన్నికల సమయంలో 50 ఏళ్లు నిండిన బడుగువర్గాలందరికీ పింఛన్ ఇస్తామని చెప్పారని, ఇప్పుడు కనీసం వితంతువులు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు కూడా కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ప్రతీ ఆరునెలలకు ఒకసారి అర్హులకు పింఛన్లు మంజూరు చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వాపోతున్నారు. నేడు పింఛన్ ఠంచన్గా రాదన్న పరిస్థితి నెలకొందన్నారు. దరఖాస్తులు స్వీకరించకుండానే వితంతువు పింఛన్ కేటగిరీలో రాష్ట్రంలో 2.20 లక్షల మంది ఉన్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదీ పరిస్థితి... పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా సుమారు 3 వేలకు పైబడి వితంతువులు, 60 ఏళ్లు నిండిన వారు సుమారు 40 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరితో పాటు 50 ఏళ్లు నిండిన వారు 1,32,512 మంది ఉన్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 1.75 లక్షలకు పైగా లబ్ధిదారులు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. రెండేళ్లుగా పింఛన్ కోసం ఎదురుచూపు కొత్తగా ఒక్కరికీ మంజూరు కాని పింఛన్ వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులకు తప్పని ఆర్థిక కష్టాలు జిల్లాలో పింఛన్ కోసం ఎదురుచూస్తున్నవారు 1.75 లక్షల మంది కొత్త పింఛన్లకు ఈ నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామంటూ కూటమి నాయకులు ప్రకటనలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఊదరగొట్టారు. తీరా దరఖాస్తులు పట్టుకుని సచివాలయాలకు వెళ్లిన లబ్ధిదారులను వెనుకకు పంపించారు. ఉసూరుమనిపించారు. కూటమి నేతలు ఇంకా ఎంతకాలం మోసగిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారటీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని చేసిన హామీ అమలుపై ప్రజలకు సమాధానం చెప్పండి. – విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే -
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
పార్వతీపురం: అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవాన్ని ఆదివారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు జరిగే వేడుకకు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన జీవనం సొంతమవుతుందని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల నిరసన పాలకొండ రూరల్: సీ్త్ర శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ సేవలు అందించేందుకు అవసరమైన బస్సులు లేవు... కాలం చెల్లిన టిమ్ పరికరాలతో నరకం చూస్తున్నాం అంటూ ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు పాలకొండ డిపో వద్ద శనివారం ఆందోళన చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నూతన టిమ్ యంత్రాలు మంజూరు చేయాలని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని నినదించారు. కార్యక్రమంలో ఎన్ఎంయూ నాయకులు వి.కె.రావు, పి.ఎల్.రావు, ఎస్టీ రావు, బీఎస్ రావు, డీజీ రావు, ఎం.ఆర్.మూర్తి, తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు స్టవ్ల పంపిణీ పార్వతీపురం: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణలో భాగంగా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గతో కలిసి అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేశారు. పిల్లలు, గర్భిణులకు సురక్షితంగా, త్వరితగతిన పౌష్టికాహరం తయారు చేయడానికి ఈ స్టవ్లు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. స్టవ్ల పంపిణీపై కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ తొలి విడత నిధులను కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి విడుదల చేశారు. జిల్లాలో 1,22,260 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.61.13 కోట్లు, 1,09,511మంది రైతులకు పీఎం కిసాన్ కింద రూ.21.90కోట్లు రైతుల ఖాతాలలో జమ కానున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. -
వృద్ధులకు ‘థీమాటిక్ యోగా’
పార్వతీపురం రూరల్ : వయోభారంతో వచ్చే కీళ్ల నొప్పులు, మధుమేహం, బీపీ, శ్వాసకోశ, మానసిక ఒత్తిడి తదితర సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు యోగా, ప్రాణాయామం ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వృద్ధులకు ప్రత్యేకంగా ‘థీమాటిక్ యోగా’ నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై వారితో కలిసి ఆసనాలు వేశారు. సీనియర్ సిటిజన్లు సులభంగా వేయగలిగే ఆసనాలపై ఈ సందర్భంగా నిపుణులతో అవగాహన కల్పించారు. నిత్య జీవితంలో ఆసనాలను భాగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆదివారం ఉదయం ఇదే మైదానంలో జరిగే ప్రధాన యోగా దినోత్సవ వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీవో కె.మాధురి, మున్సిపల్ కమిషనర్ పావని, ఆయుష్, వైద్య శాఖల అధికారులు డా.జగన్మోహనరావు, డా.భాస్కరరావు, డా.నాగభూషణరావు, యోగా శిక్షకులు, సీనియర్ సిటిజన్లు తదితరులు పాల్గొన్నారు. -
శరత్బాబు కుటుంబానికి ఆర్థిక అండ
కొమరాడ: ఇటీవల గుండెపోటుతో వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నంగిరెడ్డి శరత్బాబు అకాల మరణం పార్టీతో పాటు వ్యక్తిగతంగా తమకు తీరని లోటని పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. రాజ్యలక్ష్మీపురం గ్రామానికి చెందిన శరత్బాబు కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఫోన్లో పరామర్శించారు. అనంతరం అండగా ఉంటామని ప్రకటించారు. ఈ మేరకు రూ. 3లక్షల చెక్కును పరీక్షిత్రాజు, పుష్పశ్రీవాణి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులకు జగన్మోహన్రెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ద్వారపురెడ్డి జనార్దనరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కళింగ మల్లేశ్వరరావు, మరడాన సూరపు నాయుడు, మరడాన సింహాచలంనాయడు, మాజీ సర్పంచ్ కెంగువ పోలినాయుడు, ఏగిరెడ్డి సింహాచలం, కొల్లి సింహాచలం, పలువురు వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. శరత్బాబు మరణం తీరని లోటు కుటుంబానికి అండగా జగనన్న ఆర్థిక సాయం రూ.3 లక్షలు అందజేసిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి -
యోగాంధ్ర పోటీల్లో మన్యం ఫస్ట్
వీరఘట్టం: యోగాంధ్ర పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం లభించింది. జిల్లా నుంచి ప్రజెంట్ చేసిన యోగాంధ్ర స్మార్ట్ ఫిల్మ్ అందరినీ ఆలోచింపజేసిందని జిల్లా యోగాంధ్ర అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ కె.జనార్దనరావు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు వ్యసనాలకు బానిసలై జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో తెలియజేస్తూ.. వారి జీవితాలను యోగా ఏవిధంగా ప్రభావితం చేసిందన్న విషయంపై జల్లు విశ్వేశ్వరరావు రూపొందించిన షార్ట్ ఫిల్మ్ జిల్లా నుంచి ప్రదర్శించినట్లు వివరించారు. ఇది న్యాయనిర్ణేతలను ఆకట్టుకుందన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా అవార్డు అందజేశారని తెలిపారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా ప్రాజెక్టు
వంగర: మండల పరిధి ఎం.సీతారాంపురం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన శివ్వాల నిఖిల అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా ప్రదర్శించిన ‘ఆటోమేటిక్ వ్యవసాయ క్షేత్ర పర్యవేక్షణ వ్యవస్థ’ అనే ప్రాజెక్టును జిల్లా స్థాయిలో ప్రదర్శించి ప్రతిభ కనబరచడంతో ఈ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి ఎంపికై ంది. ఇన్స్పైర్ మనక్ పోటీలకు జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల హెచ్ఎం కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు నిఖిలను అభినందించారు. అందుబాటులోకి కల్చర్ పరీక్షలు విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో యూరిన్ కల్చర్, బ్లడ్ కల్చర్ పరీక్షలు నిలిచిపోవడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్న అంశంపై సాక్షిలో ఈ నెల 13న ‘సర్వజన ఆస్పత్రిలో నిలిచిన కల్చర్ పరీక్షలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం నుంచి కల్చర్ పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు. గంజాయితో ఇద్దరి అరెస్టు విజయనగరం క్రైమ్: రూరల్ పోలీస్స్టేషన్ పరి ధి కోరాడపేట వద్ద గంజాయి రవాణ చేస్తున్న ఇద్దరిని శనివారం అరెస్టు చేశామని విజయనగరం రూరల్ పోలీస్స్టేషన్ ఎస్ఐ అశోక్ తెలిపారు. అరకుకు చెందిన పాంగి పీతూరు, కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన కర్నేటి విజయ 11 కేజీల గంజాయితో కోరాడపేట వద్ద ఉన్నట్టు అందిన సమాచారంతో తనిఖీలు చేసినట్టు చెప్పారు. వీరి నుంచి సుమారు 22 వేల రూపాయల విలువ గల 11 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వీరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించగా రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. మద్యం సీసాలు తరలిస్తున్న వ్యక్తి అరెస్టు బొబ్బిలి: మద్యం సీసాలు తరలిస్తున్న రామభ్రపురం మండలం అప్పలరాజుపేట గ్రామానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం తరలించినట్టు ఎకై ్సజ్ శాఖ బొబ్బిలి సీఐ పి.చిన్నంనాయుడు తెలిపారు. బొబ్బిలి పట్టణంలోని మద్యం షాపుల నుంచి ఏడు మద్యం సీసాలతో తమ గ్రామానికి వెళ్తుండగా పారాది గ్రామం వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. అనధికారికంగా మద్యం సీసాలను తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
నటుడు, దర్శకుడు గెద్ద వరప్రసాద్ ఇకలేరు..
విజయనగరం టౌన్: విజయనగరం కళాకారుడు, నటుడు, దర్శకుడు, నటరత్న నాటక పరిషత్ కార్యదర్శి గెద్ద వరప్రసాద్ గుండెపోటుతో శనివారం కన్నుమూశారు. ఆయన ఇకలేరనే విషయాన్ని తెలుసుకున్న సినీ, సాహిత్య, అభిమానలోకం విస్తుపోయింది. ఆదివారం శివాలయం వీధిలో ఉన్న ఆయన స్వగృహం వద్ద పార్ధివదేహాన్ని ఉంచుతామని, మధ్యాహ్నం 12గంటలలోపు అంత్యక్రియలు పూర్తి చేస్తామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నాటకమే నవనాడుల్లో నింపిన వరప్రసాద్ ఇక లేరంటే ఊహించడం అత్యంత బాధాకరమని డాక్టర్ మీగడ రామలింగస్వామి పేర్కొన్నారు. మంచి వ్యక్తిని కోల్పోయామని సినీనటి పడాల కళ్యాణి సామాజిక మాధ్యమాల ద్వారా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వారిలో పెద్దింటి అప్పారావు, తరిణి మహేశ్వరరావు, నటి రాజేశ్వరి, హైదారాబాద్ నుంచి డాక్టర్ పివి.రామకుమార్, కళారాధన సాంస్కృతిక సంస్ధ (నంద్యాల) కార్యదర్శి ఎస్ఆర్ఎస్.ప్రసాద్, ఆర్.సూర్యపాత్రో, సీనియర్ జర్నలిస్ట్ దిమిలి అచ్యుతరావు, ఆరిపాక బ్రహ్మానందం నాటక పరిషత్, జరజాపుపేటకు చెందిన ఆరిపాక శ్రీనివాసరావుతో పాటూ వందలాది మంది కళాకారులు, అభిమానులు ఆయన ఆత్మకు సద్గతులు సంప్రాప్తించాలని, వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేశారు. -
అధికారుల ఆదేశాలు బేఖాతరు...!
● నిలిచిన అన్నదాన కార్యక్రమం ● తోటపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో వివాదాస్పద నిర్ణయాలుగరుగుబిల్లి: తోటపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ట్రస్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని దేవదాయ శాఖ అధికారులు ఈ నెల 4న జారీ చేసిన ఆదేశాలు పట్టించుకోకుండా దేవస్థానం పరిధిలో కార్యక్రమాలను కొనసాగించడం వివాదస్పదంగా మారింది. తోటపల్లి గ్రామంలో ముగ్గురు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు బయటకు చెబుతున్నా.. ట్రస్టు సభ్యుల కనుసన్నల్లోనే అన్నదానం జరుగుతుందని పలువురు చెబుతున్నారు. దీని నిర్వహణపై ఆలయాన్ని శనివారం ఫుడ్ ఇన్స్పెక్టర్లు సందర్శించి పరిశీలించారు. ఆహార పదార్ధాల తయారీ, పంపిణీ, పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం, అనుమతి లేకుండా ఇతరులు వంట గదుల్లోకి ప్రవేశించడం తదితర అంశాలను గుర్తించారు. ఆహార భద్రతకు సంబంధించి ప్రాధమిక నిబంధనలు సైతం పాటించకపోవడంతో అధికారులు విస్మయానికి గురయ్యారు. అన్నదాన నిర్వహణపై అధికారులు నిర్వాహకులను ప్రశ్నించడంతో ట్రస్టు సభ్యులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన పత్రాలను సభ్యులు చించేసి అధికారులను అవమానకరంగా దూషించారు. అన్నదాన కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై ఆలయ ఈఓను ప్రశ్నించారు. దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించకుండా.. దాతల సహకారంతో నిర్వహిస్తే ఒప్పుకోకుండా ఏంటీ పరిస్థితి అని నిలదీశారు. భక్తులు ఆకలితో ఉండాలా? అని పలువురు భక్తులు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశాలను పక్కనపెట్టి ట్రస్టు కార్యకలాపాలను కొనసాగించడం, అన్నదాన కార్యక్రమాల్లో ఆహార భద్రత ప్రమాణాలను విస్మరించడం, విధి నిర్వహణలో ఉన్న అధికారులతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం అన్నదాన కార్యక్రమాల్లేవు.. ఆలయంలో ప్రస్తుతం ఎటువంటి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. దీనికి దేవదాయ శాఖ ఉన్నతాధికారుల అనుమతులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్’ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతుల్లేవు. భక్తులు, యాత్రికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలి. ఫుడ్ సేఫ్టీ అధికారులపై అనుచితంగా ప్రవర్తించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. – వీవీ సూర్యనారాయణ, ఇన్చార్జ్ ఈఓ, తోటపల్లి దేవస్థానం -
‘నారాయణ’లో పుస్తక విక్రయాలు
● అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ ● విద్య కాదు..వ్యాపారం!విజయగనరం గంటస్తంభం: కార్పొరేట్ విద్యా సంస్థల్లో పుస్తక విక్రయాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా దోచుకుంటున్నారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు నారాయణ విద్యా సంస్థ ఎదుట శనివారం నిరసన తెలిపారు. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని నారాయణ పాఠశాలలో పుస్తకాల విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఎస్ఎఫ్ఐ నాయకులు అక్కడకు చేరుకుని విక్రయాలను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు జి.సూరిబాబు, కార్యదర్శి ఇ.వంశీ మాట్లాడుతూ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాని విమర్శించారు. అధిక ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాంలు తప్పనిసరి చేస్తూ తల్లిదండ్రులై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చి విద్యార్థుల కుటుంబాలను నిలువునా దోచుకుంటున్న విద్యా సంస్థలపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా గర్ల్స్’ కో – కన్వీనర్ భారతి, పట్టణ కమిటీ సభ్యులు మురళి, సతీష్, కృష్ణ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తథ్యం
● ఆర్టీసీ ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి రాఫెల్ హెచ్చరికవిజయనగరం అర్బన్: ఆర్టీసీ జోన్ పరిధిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి పీజీ రాఫెల్ హెచ్చరించారు. స్థానిక డిపో ఎదుట శనివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆర్టీసీలో ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించారు. జోనల్ మేనేజర్కు పలుమార్లు మెమోరాండంలు ఇచ్చినప్పటికీ కేంద్ర కార్యాలయం సర్క్యులర్లను పాటించకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లతో కూడిన 18 అంశాల మెమోరాండంను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు అందజేసినట్లు తెలిపారు. డిమాండ్లలో ‘సీ్త్ర శక్తి’ పథకం అమలు ద్వారా ఎదురైన సమస్యలు, సిక్ లీవ్స్ జీతాల చెల్లింపులు, సర్క్యులర్ల అమలు, డ్రైవర్ల వేధింపుల నిలిపివేత, ఏకపక్ష చర్యల నిరసన, కొత్త టిమ్స్, ఖాళీల భర్తీ అండ్ ప్రమోషన్ల భర్తీ వంటివి ఉన్నాయి. జోనల్ కమిటీ సభ్యులు బి.రామారావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో డిపో నాయకులు యు.సంజీవరావు, కె.బంగార్రాజు, వి.అప్పలరాజు, శకుంతల, భారతి, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
జేఎన్టీయూలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ జీవీలో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో జేఎన్టీయూ – జీవీ ఉప కులపతి (వీసీ) వి.వి.సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ ప్రాంగణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ, చెత్త తొలగింపు కార్యక్రమం చేపట్టారు. అనంతరం వీసీ సుబ్బారావు మాట్లాడుతూ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణ నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో సమాజాభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. రిజిస్ట్రార్ డి.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పరిశుభ్రత నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలని అన్నారు. విశ్వవిద్యాలయాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఆచార్యులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
యోగా ఆరోగ్య ఔషధం
● కలెక్టర్ రాంసుందర్రెడ్డి ● చింతపల్లి బీచ్లో యోగాంధ్రపూసపాటిరేగ: మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి యోగా దివ్య ఔషధమని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని కలెక్టర్ రాంసుందర్రెడ్డి అన్నారు. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన చింతపల్లి బీచ్ వేదికగా యోగాంధ్ర కార్యక్రమాన్ని శనివారం ఉత్సాహంగా నిర్వహించారు. కలెక్టర్ రాంసుందర్రెడ్డి, జాయంట్ కలెక్టర్ సేతుమాధవన్ స్వయంగా యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు. సముద్రపు గాలి, అలలు హోరు మధ్య చింతపల్లి బీచ్ ప్రాంగణం సుమారు రెండు వేల మంది యోగా సాధకుల యోగాసనాలతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చునన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యోగా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరు దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ కోసం రోజుకు కనీసం 30 నిమిషాలు పాటు యోగా కోసం కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డ్వామా పీడీ శారద, జిల్లా పర్యాటక శాఖ అధికారి పిఎన్వి.లక్ష్మీనారాయణ, యోగాంధ్ర నోడల్ అధికారి వరప్రసాద్, తహసీల్దార్ ఎన్వి.రమణ, ఎంపీడీఓ ఎం.రాధిక, డెప్యూటీ తహసీల్దార్ సంజీవ్కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధురితో పాటు ఉద్యోగులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఎరువుల దుకాణంపై విజిలెన్స్ దాడులు
మెరకముడిదాం: మండలంలోని చినబంటుపల్లి పంచాయతీ మధుర గ్రామమైన సింగవరం గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అనధికారికంగా విత్తనాలు, ఎరువులు విక్రయాలు జరుపుతున్న తాల్లపూరి అప్పలనాయుడుకు చెందిన దుకాణంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు ఎస్ఐ రామారావు, ఏఓ ఎం.అనురాధతో కలిసి శనివారం దాడులు నిర్వహించారు. దాడుల్లో రూ.3 లక్షల విలువ చేసే ఎంటీయూ 1121 విత్తనాలు 35 బ్యాగులు, మొక్కజొన్న విత్తనాలు 96 ప్యాకెట్లు, సుమారు రూ.70 వేల విలువ చేసే 20 – 20 – 0 – 13 కోరమండల్ ఎరువుల బస్తాలు 48 స్టాకు ఉన్నట్టు గుర్తించారు. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు షాపు నిర్వాహకుడిపై చట్టపరమైన చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు. దాడుల్లో వ్యవసాయ విస్తరణ అధికారి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. సుమారు రూ.3లక్షల విలువైన విత్తనాలు, రూ.72 వేల విలువైన ఎరువులు సీజ్ విత్తనాలు, ఎరువులను స్వాధీనం చేసుకున్న అధికారులు -
నింపిన విషాదం
ఈత సరదా.. గంట్యాడ: ఈత సరదా ఓ కుటుంబంలో విషాదం నింపింది. సరదగా డ్యాంలో ఈతకు దిగిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. అంతలోనే శవమై తేలాడు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతుంది. వివరాల్లోకి వెళ్తే.. సీతారాంపురం గ్రామానికి చెందిన కొల్లి దశరధరామునాయుడు(30) తన మామయ్యతో కలిసి తాటిపూడి డ్యాం సందర్శనకు శుక్రవారం వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం అనంతరం మామయ్య విశ్రాంతి తీసుకుంటుండగా.. దశరధరామునాయుడు డ్యాం కింద నీటిలో సరదాగా ఈతకు దిగాడు. కొంతసేపటి తరువాత మామయ్య మేల్కొని చూడగా నాయుడు కనిపించలేదు. అక్కడే చెప్పులు, సెల్ఫోన్ ఉండడంతో స్థానికంగా గాలించారు. ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మళ్లీ వెతకగా డ్యాం గేటు కింద గోస్తనీ నదికి వెళ్లే కాలువలో మృతదేహం తేలింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
రైళ్లలో ఆకస్మిక తనిఖీలు
పార్వతీపురం రూరల్: మత్తు పదార్థాల అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రైల్వే మార్గాల ద్వారా సాగుతున్న మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపేలా ఈగల్ సెల్ రంగంలోకి దిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో శనివారం ఈగల్ సెల్, రైల్వే, స్థానిక పోలీసు బలగాలు సంయుక్తంగా రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఐజీపీ (ఈగల్) ఏకే రవికృష్ణ, జిల్లా ఎస్పీ ఎన్.మాధవ్రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ చేపట్టారు. భవానీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్లే ప్యాసింజర్ రైలు (నెం. 58503) ఎక్కిన బృందాలు.. పార్వతీపురం నుంచి విజయనగరం వరకు ప్రయాణిస్తూ అణువణువూ జల్లెడ పట్టాయి. ఈగల్ సెల్ ఎస్ఐ, కొమరాడ పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్తో పాటు డాగ్ స్క్వాడ్, డ్రోన్ బృందాలు రైలు బోగీలను, ప్రయాణికుల సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించాయి. ఈ తనిఖీల్లో ఎక్కడా ఎలాంటి మత్తు పదార్థాలు లభించలేదని అధికారులు వెల్లడించారు. మత్తు పదార్థాల రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా.. జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థలైన రైళ్లు, బస్సుల్లో ఇకపై నిరంతరంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ఈగల్ సెల్ అధికారులు స్పష్టం చేశారు. -
సమావేశాలకు అధికారులు హాజరు తప్పనిసరి : కలెక్టర్
విజయనగరం అర్బన్: మండల స్థాయిలో జరుగుతున్న బ్యాంకర్ల సమావేశాలకు క్షేత్ర స్థాయి అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పశు సంవర్ధక శాఖల ప్రగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. బ్యాంకుల అధికారులు, ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ లబ్ధిదారులకు మేలు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. జిల్లాలో ఈ ఏడాదికి కనీసం 4 వేల పశుకిసాన్ క్రెడిట్ ఖాతాలను ఓపెన్ చేయించాలని పశుసంవర్ధక శాఖ జేడీని ఆదేశించారు. ‘ఎల్నినో’ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పశు సంపదను పెంచుకోవాల్సిన అసరం ఎంతైనా ఉందన్నారు. రైతులకు ఉపకరించేలా విరివిగా పశువుల రుణాలను అందజేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు. రైతులందరూ ‘కృషికా’ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, తమ ఆధార్ నంబర్తో లింక్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా పంట రుణాల ప్రక్రియ ఆన్లైన్లో చాలా సులువుగా జరుగుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి వేలుగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు తమ వార్షిక లక్ష్యాలు, ప్రణాళికలు, వ్యూహాల వివరాలను వెంటనే నాబార్డుకు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ వివరాల ఆధారంగా ఆయా శాఖలకు ఎంత మేరకు రుణ ప్రణాళిక అవసరమవుతోందో అంచనా వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వీవీ రమణమూర్తి, నాబార్డ్ డీడీ ఎం.నాగార్జున, మెప్మా, డీఆర్డీఏ పీడీ, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల జాయింట్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా రెవెన్యూ దినోత్సవం విజయనగరం అర్బన్: ప్రజల నిత్య జీవితంలో రెవెన్యూ శాఖ ఒక కీలక భాగమని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన రెవెన్యూ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం సిబ్బంది, అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్ అయిన ఉద్యోగుల అనుభవాలను తెలుసుకొని సమర్ధతను పెంచుకోవాలని తెలిపారు. ప్రజాసేవే పరమావధిగా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడంలో రెవెన్యూ శాఖ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. రెవెన్యూ శాఖలో రిటైర్ అయిన అటెండర్ నుంచి డిప్యూటీ కలెక్టర్ల వరకు పలువురిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డీఆర్ఓ సీహెచ్ సత్తిబాబు, ఏపీజేఏసీ ప్రెసిడెంట్ పి.ఆదిలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్ బంగార్రాజు, ఏపీఆర్ఎస్ఏ ట్రెజరర్ కె.జోగినాయుడు, జిల్లాలోని తహసీల్దార్లు, కలెక్టర్ సూపరింటెండెంట్లు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేడు వృద్ధులతో యోగా
పార్వతీపురం: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జిల్లాలో వృద్ధ పౌరుల కో సం ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో థీమాటిక్ యోగా విత్ సీనియర్ సిటిజన్స్ కార్యక్రమం జరగనుందన్నారు. వయస్సు పైబడిన వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుందని, శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈనెల 21న (ఆదివారం) ఉదయం 6 నుంచి 8 గంటల వరకు పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చని పేర్కొన్నారు. ఆయుష్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల నిజాయితీ పాలకొండ రూరల్: విజయవాడ నుంచి పాలకొండ వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్లు నిజాయితీ చాటుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న ఉట్టిగుట్ట నాగేశ్వరరావు తన బ్యాగ్ను మరిచిపోయి విశాఖపట్నంలో దిగిపోయాడు. బ్యాగ్ గమనించిన డ్రైవర్లు పాలకొండ డిపోలో అందించారు. బ్యాగ్లో లక్ష రూపాయల నగదుతోపాటు వ్యక్తిగత వస్తువులు ఉన్నట్లు డిపో యాజమాన్యం గుర్తించింది. వెంటనే సెల్ ఫోన్లో బాధితులకు డిపో మేనేజర్ బీఎస్ఎన్మూర్తి సమాచారం అందించారు. నాగేశ్వరరావు కుమార్తె జ్యోతి శుక్రవారం పాలకొండ డిపోకు చేరుకోవడంతో ఆర్టీసీ యాజమాన్యం బ్యాగ్తోపాటు మిగిలిన వస్తువులను అందజేసింది. విధి నిర్వహణలో నిజాయితీ చాటుకున్న డ్రైవర్లు బంగారునాయుడు, రమేష్లను యాజమాన్యం అభినందించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులతో పాటు వస్తువులకు భద్రత ఉంటుందని పేర్కొన్నారు. -
పాఠశాల బస్సుల ముమ్మర తనిఖీ
పార్వతీపురం రూరల్: విద్యార్థుల ప్రయాణ భద్రత దృష్ట్యా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆదేశాలతో పార్వతీపురం పట్టణంలో శుక్రవారం పోలీస్, రవాణా శాఖాధికారులు సంయుక్తంగా స్కూల్ బస్సులపై తనిఖీలు చేపట్టారు. ఏఎస్పీ మనీషా రెడ్డి ఉత్తర్వుల మేరకు నిర్వహించిన ఈ తనిఖీల్లో బస్సుల ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెనన్స్ పత్రాలతో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తూ మొబైల్ మాట్లాడరాదని, మద్యం తాగి వాహనం నడిపితే కఠిన శిక్షలు ఉంటాయన్నారు. ప్రతిరోజూ వాహనం కండిషనన్ సరిచూసుకుని, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ తనిఖీల్లో పట్టణ ఎస్సై గోవింద్, ఎంవీఐలు కె.సుమన్, కాశి రామ్, ట్రాఫిక్ ఎస్సై పాపారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
మమ్మలను.. టార్గెట్ చేశారు!
ఈ చిత్రంలో ఉన్న వారంతా పార్వతీపురం అర్బన్ పరిధిలోని వార్డు (స్వర్ణ) సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు. సర్ కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓల బాధ్యతలు కూడా వీరికి అప్పగించారు. ఎటువంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా అత్యంత ప్రాధాన్యంతో ఈ బాధ్యతలు నిర్వర్తించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఒక వైపు ఈ పనులు చేస్తూనే.. యోగాంధ్ర, స్వచ్ఛ సర్వేక్షణ్, ఆస్తి పన్ను వసూలు, పిల్లల డ్రాప్ అవుట్లను గుర్తించడం, యూఎఫ్ఎస్ ధ్రువీకరణ, తల్లికి వందనం లబ్ధిదారుల గుర్తింపు, పలు సర్వేలు చేస్తున్నారు. దీనివల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తమకు అదనపు పని భారాన్ని తగ్గించాలని, లేకుంటే సర్ కార్యక్రమం నుంచి మినహాయింపైనా ఇవ్వాలని శుక్రవారం ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ హేమలతను కలిసి వినతిపత్రం అందించారు. సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి ముంగిటకు చేరవేస్తున్న సచివాలయ (స్వర్ణ గ్రామ/వార్డు) ఉద్యోగుల సేవల వెనుక కనిపించని కష్టాలు, త్యాగాలు, ఆందోళనలు దాగి ఉన్నాయి. ఎండలు, వానలు లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న వీరు.. ప్రతి రోజూ ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో ఉదయం విధులకు వెళ్లిన ఉద్యోగి.. సాయంత్రం క్షేమంగా ఇంటికి చేరుతాడో లేదో తెలియని పరిస్థితి అనేక కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. గ్రామాలు, వార్డులు, వీధులు తిరుగుతూ ఇంటింటి సర్వేలు, లబ్ధిదారుల వివరాల సేకరణ, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి బాధ్యతలను వారు నిర్వర్తిస్తున్నారు. లక్ష్యాలు, గడువులు, నివేదికల ఒత్తిళ్ల మధ్య నిరంతరం ప్రజల మధ్యే పనిచేస్తున్నారు. బాధ్యతలకు అంతం లేదా? ప్రజలకు ప్రభుత్వ సేవలను గడప గడపకు చేర్చే సచివాలయ ఉద్యోగులపై రోజురోజుకూ పని భారం పెరుగుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సర్వేలు, క్షేత్రస్థాయి తనిఖీలు, సంక్షేమ పథకాల అమలు, యాప్ల్లో సమాచారం నమోదు, నివేదికల సమర్పణ, ప్రత్యేక విధులు.. ఇలా అనేక బాధ్యతల మధ్య ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఆదివారం కూడా వారికి సెలవులు ఉండడం లేదు. ఇటీవల యోగాంధ్ర రిజిస్ట్రేషన్ల టార్గెట్లు ఇచ్చారు. ఈ నెల 21న జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయాలంటూ ఉద్యోగులకు లక్ష్యం విధించారు. కొన్ని సందర్భాల్లో ఒత్తిడి తీవ్ర పరిణామాలకు దారితీస్తోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉదయం మొదలైన విధులు రాత్రి వరకు కొనసాగడం, సెలవు దినాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలకు హాజరు కావాల్సి రావడం, తరచూ మారుతున్న ఆదేశాలు ఉద్యోగులపై అదనపు భారం మోపుతున్నాయని వాపోతున్నారు. విధులకు సంబంధించిన లక్ష్యాలు, గడువులు, ఉన్నతాధికారుల సమీక్షల మధ్య మానసిక ప్రశాంతత కోల్పోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళనలు ఎదుర్కొంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో పని ఒత్తిడిని తట్టుకోలేక సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. ద్విచక్ర వాహనాలపై గ్రామాలు, వార్డులు తిరుగుతూ ప్రమాదాలకు గురయ్యే ఘటనలు పెరుగుతున్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. పని భారం, ప్రయాణ ఇబ్బందులు, ఆరోగ్య సమస్యల మధ్య సచివాలయ సిబ్బంది జీవితం సవాళ్లతో సాగుతోందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పని ఒత్తిడి తగ్గించడంతో పాటు, వారి ఆరోగ్యం, భద్రత, సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలోని 350 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వివిధ విభాగాల్లో 3,200 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ధ్రువీకరణ పత్రం అందించడం నుంచి పింఛన్ మంజూరు వరకు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడంలో సచివాలయ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. విధి నిర్వహణలో ప్రమాదం సంభవిస్తే ఆస్పత్రి ఖర్చులు, కుటుంబ పోషణ, పిల్లల భవిష్యత్తు వంటి సమస్యలు వారి కుటుంబాలను వెంటాడుతున్నాయి. ‘ప్రజలకు సేవ చేయడం మా బాధ్యతే. కానీ మా భద్రత, మా కుటుంబాలకు భరోసా కూడా అంతే ముఖ్యం’ అని ఉద్యోగులు చెబుతున్నారు. సచివాలయ ఉద్యోగుల్లో ‘కనిపించని కన్నీళ్లు’! ఇంటింటికీ సేవ.. గుండెల్లో గుబులు! లక్ష్యాలు, ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ -
ఆటోసర్వీస్ నగదు లావాదేవీల్లో వ్యక్తి హత్య
మక్కువ: ఆటో భాగస్వామ్యం సర్వీస్ నగదు లావాదేవీలపై జరిగిన గొడవ కారణంగా ఓ యువకుడు హత్య కు గురయ్యాడు. పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం కొండబుచ్చమ్మపేట గ్రామంలో జరిగిన ఈ హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొండబుచ్చమ్మపేట గ్రామానికి చెందిన మరడ శ్రీనివాసరావు(27) ఆటోను, అదే గ్రామంలో నివాసముంటున్న దత్తి అచ్యుతరావు ఆదాయ భాగస్వామ్యం పద్ధతిలో నడుపుతున్నాడు. ఆటో సర్వీస్ ద్వారా వచ్చిన నగదు లావాదేవీల పై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 12వ తేదీన ఆటో ఓనర్ శ్రీనివాసరావు, తన భాగస్వామ్యుడైన అచ్యుతరావును ఇంటికి రమ్మనగా, ఇద్దరూ ఇంటి మేడపైకి వెళ్లి మాట్లాడుకుంటుండగా, గొడవ తలెత్తింది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావును, అచ్యుతరావు ప్రహరీకి వాటర్ ట్యాంకుకు గుద్దించి, రెండు చేతులతో గొంతు నొక్కి శ్రీనివాసరావును హత్య చేశాడు. 13వ తేదీన తెల్లవారు జామున మేడపై శ్రీనివాసరావు విగతజీవిలా పడి ఉండడాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. శ్రీనివాసరావు గుండెపోటు, మద్యం అధికంగా తాగడం వల్ల మృతి చెందినట్లు కుటుంబ సభ్యులను, గ్రామస్తులను నిందితుడు అచ్యుతురావు నమ్మించాడు. అంతేకాకుండా శ్రీనివాసరావు అంత్యక్రియల్లో కూడా చురుగ్గా పాల్గొన్నాడు. శ్రీనివాసరావు ముఖంపై గాయాలు గుర్తించిన కుటుంబసభ్యులు గ్రామస్తులు, అచ్యుతరావును నిలదీయగా గ్రామం నుంచి పరారయ్యాడు. మృతుడు శ్రీనివాసరావు అన్నయ్య మరడ వెంకటేష్ ఈనెల 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తుండగా, అదే గ్రామానికి చెందిన గ్రామ పెద్ద ధనంజయరావు ద్వారా, నిందితుడు అచ్యుతరావు నేరం అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు అచ్యుతరావు వాంగ్మూలాన్ని రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసులు సేకరించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకటరమణ శుక్రవారం తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు -
సభ్యసమాజం తలదించుకునేలా...
బలిజిపేట మండలంలో ఉపాధిహామీ పనుల పరిశీలన నిమిత్తం ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన పీడీ రామచంద్రరావు.. వర్క్ ఆర్డర్ పూర్తి కాలేదనే నెపంతో అక్కడే ఉన్న ఏపీఓ కేశవరావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతటితో ఆగక సభ్యసమాజం తలదించుకునేలా అత్యంత అసభ్య పదజాలంతో దూషిస్తూ రుద్రరూపం దాల్చారు. చేతిలో ఉన్న వాటర్ బాటిల్ను విసిరికొట్టి, సమీపంలోని కుర్చీని కాలితో తన్నుతూ, టేబుల్ను ఏపీఓ పైకి నెట్టేందుకు ప్రయత్నించడంతో ఏపీఓతో పాటు అక్కడి ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. ఉన్నతాధికారి చేసిన ఈ వీరంగాన్ని చూసి షాక్కు గురైన అక్కడి పంచాయతీ, సచివాలయ సిబ్బంది.. పీడీ ప్రవర్తనకు నిరసనగా, ఏపీఓకు మద్దతుగా లేఖ రూపంలో అధికారులకు అందజేశారు. -
పచ్చదనంపై గొడ్డలి పోటు..!
● ఇళ్ల ప్లాట్ల కోసం ప్రకృతి విధ్వంసం.. ● ప్లాస్టిక్ వాడకంతో శ్మశానంగా మారుతున్న భూమాతచెట్లను నరకడం వల్లే పిడుగుల తీవ్రత గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పొడవాటి తాటి, రావి చెట్లు సహజసిద్ధమైన లైట్నింగ్ అరస్టర్లుగా పనిచేస్తాయి. లేఅవుట్లు, భవనాల కోసం వాటిని విచక్షణారహితంగా నరికేయడం వల్లే పిడుగులు నేరుగా మనుషులపై పడుతున్నాయి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. చెట్లను అక్రమంగా నరికితే కఠిన చర్యలు తీసుకుంటాం. – బి.రామ్ నరేష్, జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి, విజయనగరం పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మనుగడ కష్టం ప్లాస్టిక్ వ్యర్థాలు, వాహన కాలుష్యం వల్ల గాలిలో విషవాయువులు విపరీతంగా పెరిగిపోయి హరితగృహ ప్రభావం ఏర్పడుతోంది. దీనివల్లే అసాధారణ ఎండలు, అకాల వర్షాలు, పిడుగుపాట్లు సంభవిస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించకపోతే మానవ మనుగడకే వాటిల్లుతుంది. – పి.వీ.ఎస్.రామకృష్ణ, పర్యావరణ నిపుణుడు విజయనగరం గంటస్తంభం: ప్రకృతి ఒడిలో బతికినంత కాలం మనిషికి ఎలాంటి లోటూ లేదు. కానీ, ఎప్పుడైతే మనిషికి స్వార్థం ముదిరి తనను సాకుతున్న ప్రకృతి గుండెలపైనే గొడ్డలితో వేటు వేయడం మొదలుపెట్టాడు. అభివృద్ధి, ఆధునికత, లేఅవుట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల పేరిట..ప్రాణవాయువునిచ్చే పచ్చటి మహావృక్షాలను నిలువునా నరికేస్తున్నాడు. భూమిని కాంక్రీట్ అడవిగా మారుస్తూ మనిషి చేస్తున్న ఈ దారుణ ద్రోహానికి..ప్రకృతి ఇప్పుడు ఎదురుదాడి చేస్తోంది. ఆ ఆక్రోశమే..నేడు అకాల వర్షాలు, భానుడి అసాధారణ భగభగలు, ఆకాశం నుంచి పడుతున్న నిప్పుల పిడుగులు, ఇటీవల మే, జూన్ నెలల్లో విజయనగరం జిల్లా పరిధిలో సంభవించిన ప్రాణ నష్టాలే ఇందుకు సజీవ సాక్ష్యాలు. నాడు చెట్లు పిడుగులను మోశాయి.. నేడు నేరుగా మనుషుల మీదే పాత రోజుల్లో ఎంత పెద్ద వాన పడినా, ఉరుములు ఉరిమినా మనుషులపై నేరుగా పిడుగులు పడి చనిపోయిన సంఘటనలు చాలా అరుదుగా ఉండేవి. దానికి కారణం నాటి కాలంలో ప్రతి ఊరి పొలిమేరల్లో, చెరువు గట్లపై, పొలాల గట్లపై ఆకాశాన్ని తాకేలా పెద్ద పెద్ద తాటి చెట్లు, రావి చెట్లు, వేప చెట్లు, మర్రి చెట్లు ఉండేవి. ఆకాశంలో మేఘాల ఘర్షణ వల్ల పుట్టే ఘోరమైన విద్యుదాఘాతాన్ని(పిడుగును) ఆ ఎత్తైన వృక్షాలు తమ గుండెలపైకి లాక్కునేవి అలా లాక్కుని, ఒక ఎర్త్లా పనిచేసి ఆ ప్రమాదకర విద్యుత్ను భూమిలోకి పంపేసేవి. తమ ప్రాణాలను పణంగా పెట్టి మనుఘలను, పశువులను కాపాడేవి. కానీ ఈ రోజు? భూముల వ్యాపారం కోసం, కోట్ల రూపాయల లాభాల కోసం ఆ ఎత్తైన చెట్లన్నింటినీ నరికేశారు. రోడ్ల విస్తరణ కోసం, లేఅవుట్ల కోసం వందల ఏళ్ల నాటి వృక్షాలను నేలకూల్చారు. ఇప్పుడు ఆకాశానికి, భూమికి మధ్య రక్షణగా నిలిచే అడ్డుగోడలే లేవు. ఫలితంగా, ఆకాశం నుంచి పడే పిడుగులు అడ్డులేకుండా..పొలాల్లో కష్టపడే అమాయక రైతులపై, రెక్కాడితే గానీ డొక్కాడని పేద కూలీలపై, మైదానాల్లో ఆడుకునే పసిపిల్లలపై నేరుగా పడి క్షణాల వ్యవధిలో వారి ప్రాణాలను బూడిద చేస్తున్నాయి. నోరులేని పశువులు, గొర్రెలు, మేకలు కూడా ఈ పిడుగుల ధాటికి మాడిపోతున్నాయి.ఇప్పటికై నా మేల్కొని చెట్లను నాటుదాంఒకప్పుడు ప్లాస్టిక్ వాడకం తక్కువగా ఉండడం వల్ల భూమి పచ్చగా, స్వచ్ఛంగా ఉండేది. కానీ నేడు ఏ వస్తువు కొన్నా ప్లాస్టిక్కే. భూమిలో కలవడం అసాధ్యమైన ఈ ప్లాస్టిక్ వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదు. మరోవైపు అడ్డగోలుగా పెరుగుతున్న వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి కార్బన్మోనాకై ్సడ్, కార్బన్డయాకై ్సడ్ వంటి వ్యర్థ వాయువులు విపరీతంగా రిలీజ్ అవుతున్నాయి. చెట్లే ఉంటే ఆ పొల్యుషన్ను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ను విడిచిపెట్టేవి. కానీ చెట్లను నరికేయడం వల్ల గాలి మొత్తం విషపూరితమైపోయింది. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మనిషి వీపున ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని తిరిగే దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. అభివృద్ధి చెందినప్పుడు ప్రకృతిని ఎంత విధ్వంసం చేస్తున్నామో, అంత ప్రకృతిని తిరిగి సృష్టించగలిగితేనే పర్యావరణాన్ని సమతుల్యం చేయగలం. -
ఎంపీడీఓపైనా పీడీ చిందులు
పీడీ ఆగ్రహానికి కేవలం కిందిస్థాయి సిబ్బందే కాకుండా, మండలాధికారిణి అయిన ఎంపీడీఓ ఆర్.వాణిశ్రీ సైతం బలయ్యారు. ఆమె తప్పులేకపోయినా, ఏపీఓ పక్కనే ఉన్న ఆమెను కూడా పీడీ ఇష్టానుసారంగా దుర్భాషలాడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె కార్యాలయంలోనే కన్నీరు మున్నీరయ్యారు. ఇటువంటి అవమానకర వాతావరణంలో తాము విధులు నిర్వహించలేమంటూ తన ఆవేదనను వెళ్లగక్కారు. పీడీ వేధింపుల కారణంగా జిల్లాలో ఎంతోమంది ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురై ఆస్పత్రుల పాలయ్యారని ఉద్యోగులు మీడియాకు వివరించారు. ఈ మేరకు టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఓలు, ఈసీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, జేఈలు అందరూ కలిసి కలెక్టర్కు వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు. -
చిన్నారుల కోసం గణిత యంత్రం
రాజాం: సంతకవిటి మండలం శంకరునిఅగ్రహారం(శంకరపేట) గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు యడ్ల జనార్దననాయుడు తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. గత 18 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన ప్రస్తుతం శ్రీకాళహస్తిలో విధులు నిర్వహిస్తున్నారు. ఏడాదికాలంగా ఎంతో శ్రమించి మేథమెటిక్ మిషన్ను కనిపెట్టారు. ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు సులభంగా గణిత పాఠాలు బోధించేందుకు ఈ మిషన్ ఉపయోగపడుతోంది. ఎటువంటి క్లిష్ట సమస్యనైనా సులువుగా ఈ మిషన్ ద్వారా పరిష్కరించవచ్చు. విద్యార్థులకు నేరుగా ప్రత్యక్ష పద్ధతిలో లెక్కలు బోధించేందుకు ఉపయోగపడే ఈ మిషన్ ప్రపంచంలోనే తొలి మిషన్గా ఆ ఉపాధ్యాయుడు వివరాలు వెల్లడించారు. తాను తయారుచేసిన ఈ మిషన్కు గణితంలో 108 కాన్సెప్ట్లు బోధించవచ్చని వివరించారు. విద్యార్థులకు కాన్సెప్ట్లెర్నింగ్, సెల్ఫ్ లెర్నింగ్, ఎక్సర్సైజ్ అండ్ ఎవల్యూషన్కు ఈ మిషన్ ఉపయోగపడుతోందన్నారు. ఈ మిషన్కోసం కష్టపడి పేటెంట్ హక్కులు తీసుకున్న ఆయన ప్రపంచంలోనే తొలి గణిత రీసెర్చ్ మిషన్ అని వివరించారు. విజయనగరం టు అమరావతి జనార్దనరావు మాష్టరు గత విద్యాసంవత్సరంలో వ్యక్తిగత కారణాలతో అంతర్ జిల్లాల బదిలీలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో వరదయ్యపాలెం మండలం నాగనందాపురం ప్రభుత్వ పాఠశాలకు బదిలీపై వెళ్లారు. అంతకుముందు సంతకవిటి మండలంలో చిత్తారిపురం, ఇజ్జిపేట, సంతకవిటి, బూరాడపేట పాఠశాలల్లోనూ, వంగర మండలం కొప్పరకొత్తవలస పాఠశాలల్లో పనిచేశారు. ఆయన తయారీచేసిన మిషన్ తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారులు తెలుసుకుని ఏపీ విద్యాశాఖ సెంట్రల్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. దీంతో విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా జనార్దనరావును అమరావతి పిలిపించి శుక్రవారం అక్కడి విద్యాభవన్లో మిషన్ వినియోగంపై ఆరాతీశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో పాటు ప్రాక్టికల్గా తరగతి గదిలో ఎలా పాఠాలు బోధించవచ్చో, గణిత లెక్కలు, క్లిష్ట సమస్యల పరిష్కారాన్ని చిన్నారులకు అర్థమయ్యే రీతిలో టీఎల్ఎం మాదిరి ఎలా బోధించవచ్చో వివరించారు. ఈ మిషన్ పనితీరు అద్భుతమని కమిషనర్ కితాబిచ్చినట్లు జనార్దననాయుడు మాస్టారు తెలిపారు. ఈ మిషన్పై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి, అన్ని పాఠశాలలకు ఈ మిషన్ వినియోగంపై చర్చిస్తామని, భవిష్యత్తులో ఇదొక కంప్యూటర్ పరికరం మాదిరిగా ప్రతి పాఠశాలలో ఉపయోగపడుతుందని వెల్లడించినట్లు జనార్దనరావు అన్నారు. ఈ సందర్భంగా జనార్దనరావును పలువురు అభినందించారు. మేథ్మెటిక్ మిషన్ కనిపెట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏపీ విద్యాభవన్లో ప్రెజెంటేషన్ మిషన్ వినియోగంలోకి తెచ్చేయోచనలో విద్యాశాఖ -
పీఎం వీబీఆర్వైతో ఉపాధి, సామాజిక భద్రత
విజయనగరం అర్బన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన్ (పీఎం–వీబీఆర్వై)తో యువతకు ఉపాధి అవకాశాలు, సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యమని ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కమిషనర్ కణితి అవినాష్కుమార్ అన్నారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రూ.2,400 కోట్ల ప్రోత్సాహకాలను డీబీటీ విధానంలో విడుదల చేసిన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం రీజియన్లో పీఎం–వీబీఆర్వై కింద 705 రిజస్ట్రేషన్లు నమోదయ్యాయన్నారు. తొలుతగా 2,073 మంది ఉద్యోగార్థులు, 474 మంది మహిళలకు పార్ట్–ఏ కింద రూ.61.12 లక్షలు, పార్ట్–బి కింద రూ.10.66 కోట్ల ప్రోత్సాహకాలు మంజూరైనట్లు వెల్లడించారు. సంఘటిత రంగంలో తొలిసారి ఉద్యోగాల్లో చేరి నెలకు రూ.1 లక్షలోపు వేతనం పొందే యువతకు గరిష్టంగా రూ.15 వేల వరకు ఆర్థిక ప్రోత్సాహకం అందజేస్తామన్నారు. కొత్త ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రతి ఉద్యోగిపై నెలకు రూ.3 వేల వరకు ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమ శాఖ జనరల్ మేనేజర్ ఎం.వి.కరుణాకర్, జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎస్.డి.వి.ప్రసాదరావు, సహాయ కమిషనర్లు జి.ఎల్లాజీరావు, ఇన్సెపెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సుధాకర్, లేబర్ ఎన్ఫోర్సుమెంట్ ఆఫీసర్ రుబల్ సింగ్, ఈఎస్ఐసీ జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ సోమేంధ్రకుమార్ సాహూ పాల్గొన్నారు. -
ఆయనతో వేగలేం..
గత 20 ఏళ్లుగా ఉపాధి హామీలో కష్ట నష్టాలకు ఓర్చి పనిచేస్తున్నాం. ఇన్నేళ్లలో మాకు ఎలాంటి ఎదుగుదలా లేదు. నాలుగేళ్లుగా కనీసం సెలవులు లేకుండా, బంధువుల చావులకు కూడా వెళ్లనివ్వకుండా మానసికంగా హింసిస్తున్నారు. వ్యవస్థలో తప్పులు చేసేవారిని వెనకేసుకొస్తూ.. నిజాయితీగా పనిచేసే మమ్మల్ని వేధిస్తున్నారు. పని ఎంతైనా చేస్తాం కానీ, అధికారులం కదా అని కిందిస్థాయి సిబ్బందిని అందరి ముందు బూతులు తిడితే మాత్రం భరించేది లేదు. జిల్లా పరువు పోకూడదని ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాం. ఏపీఓ, ఎంపీడీఓలను అసభ్య పదజాలంతో దూషించాక భరించే హద్దులు దాటిపోయాయి. ఇక ఈ బెదిరింపుల పాలనను ఎంతమాత్రం సహించబోం. – శ్రీనివాసరావు, ఏపీఓ ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో పెదపెంకి గ్రామ అభివృద్ధి కోసం గత మూడు నెలలుగా రేయింబవళ్లు కష్టపడుతున్నాం. అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్ కావడంతో, ఆ బాధ్యతలు కూడా నేనే తీసుకుని 3 వేల మంది కూలీలతో పనులు చేయిస్తున్నాను. రాత్రికి రాత్రే 50 మ్యాజిక్ డ్రైన్లు వేయించడంతో పాటు, జేజేఎం పనులు కూడా వేగంగా చేస్తున్నాం. అంత కష్టపడుతున్నా.. కేవలం ఐదు నిమిషాలు సప్లై ఆర్డర్/మస్టర్ ఇవ్వడం ఆలస్యమైందని నన్ను ఏకంగా సస్పెండ్ చేస్తూ ఆర్డర్ ఇచ్చారు. కారణం చెబుదామంటే వినిపించుకోకుండా ’నువ్వు పనికిరావు, మిమ్మల్ని టెర్మినేట్ చేయాలి.. వెధవ నా కొడుకులు..’ అంటూ అత్యంత అసభ్య పదజాలంతో దూషించి బయటకు తరిమేశారు. ఈ పనుల ఒత్తిడిలో ఇన్నాళ్లూ ఆ మాటలు భరిస్తూ పనిచేశాం.. కానీ నిన్నటి అవమానంతో మా ఓపిక నశించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి, కమిషనర్, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. – తిరుపతిరావు, టెక్నికల్ అసిస్టెంట్ పార్వతీపురం రూరల్: డ్వామా పీడీ వేధింపులతో ఉపాధి హామీ పథకం ఉద్యోగులు, ఎంపీడీఓ కన్నీరుపెట్టారు. ఆయన ఉంటే ఉద్యోగాలు చేయలేమంటూ ఆందోళనకు దిగారు. ఆయన అవినీతి కాంక్షను తీర్చడం మా వల్ల కాదంటూ తేల్చిచెప్పారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తోటి ఉద్యోగులను సముదాయించాల్సిన ఉన్నతాధికారి.. నిలువెల్లా ‘అధికార’ దర్పంతో, బూతుల పురాణంతో వీరంగం సృష్టించడం, బూతు పురాణం వినిపించడంపై ఆవేదన వ్యక్తంచేశారు. బలిజపేట మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం డ్వామా పీడీ (ప్రాజెక్టు డైరెక్టర్) రామచంద్రరావు ప్రవర్తించిన తీరు, వాడిన పదజాలంతో మానసిక క్షోభకు లోనయ్యారు. ఆయన ప్రవర్తనకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ ఉద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చి కలెక్టరేట్ వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పీడీకి వ్యతిరేకంగా నినదించారు. ఆయనను తక్షణమే బాధ్యతల నుంచి తొలగించకుంటే ఉద్యోగాలు చేసేది లేదంటూ తెగేసి చెప్పారు. జాబ్కార్డుల చాటున.. ‘కోట్ల’ దందా! జిల్లా వ్యాప్తంగా దాదాపు 3.34 లక్షల ఉపాధి హామీ జాబ్కార్డులు ఉన్నాయి. ఉపాధిహామీ ఉద్యోగులు కొందరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఉపాధిహామీ పనుల్లో చిలక్కొట్టుడుకు పాల్పడుతున్నారు. వేతనదారుల నుంచి వారంవారం అక్రమ వసూళ్లు చేస్తున్నారు. వాటిని ఉన్నతాధికారికి చేరవేస్తున్నట్టు సమాచారం. డబ్బులు చేతికి అందని చోట.. ఆ ఉన్నతాధికారి ఉద్యోగులపై విరుచుకుపడుతున్నట్టు సమాచారం. ఉపాధి హామీ వేతనదారుల రెక్కల కష్టాన్ని పిండుకుంటూ సాగుతున్న ‘కోట్ల’ దందా వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో సమగ్ర విచారణ జరపాలన్న డిమాండ్ జనం నుంచి వినిపిస్తోంది. డ్వామా పీడీ తీరుపై ఉపాధి హామీ సిబ్బంది తిరుగుబాటు కార్యాలయంలోనే ఏపీఓ, ఎంపీడీఓలపై పీడీ దుర్భాషలు.. కుర్చీలు తంతూ వీరంగం.. కన్నీరు పెట్టిన ఎంపీడీఓ కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల భారీ నిరసన.. వినతిపత్రం సమర్పణ ఆయన అవినీతి కాంక్షను తీర్చలేమంటూ ఆవేదన -
పశువుల లారీ సీజ్
దత్తిరాజేరు: ఎలాంటి నుమతులు లేకుండా 40 పశువులను కుక్కి తరలిస్తున్న లారీని శుక్రవారం పట్టుకున్నట్లు పెదమానాపురం ఎస్సై కళాధర్ తెలిపారు.పశువులు అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి స్టేషన్ సమీపంలో లారీ నిలిపి పరిశీలించగా అందులో కొన ప్రాణంతో ఉన్న 40 పశువులను గుర్తించి పట్టుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు పశువుల యజమానిపై కేసు నమోదు చేసి లారీని సీజ్ చేశామన్నారు. వ్యక్తి ఆత్మహత్యగజపతినగరం రూరల్ : మండలంలోని మధుపాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఒంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అవివాహితుడు కలిగిట్ల సురేంద్ర తల్లిదండ్రులు కొద్దికాలం క్రితం మరణించగా, అక్కాచెల్లెళ్లు ఇద్దరు వివాహాలు చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోవడంతో సురేంద్ర గ్రామంలోని తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఒంటరితనాన్ని భరించలేక శుక్రవారం తెల్లవారుజామున తన ఇంటిలోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం సురేంద్ర ఎంతకీ తలుపులు తీయకపోవడంతో పక్కింట్లో ఉంటున్న బంధువు శ్రీనివాస్కు అనుమానం వచ్చి చూడగా బెడ్ షీట్ తో ఉరివేసుకుని ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే సురేంద్రను కిందకు దించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. వెంటనే విశాఖపట్నంలో ఉంటున్న అక్క రజినికి సమాచారం చేరవేశారు. అక్క రజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గజపతినగరం ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల విడుదలవిజయనగరం అర్బన్: జిల్లాలో నిర్వహించిన 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం 10వ తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు డీఈఓ యూ.మాణిక్యం నాయుడు ఫలితాలను ప్రకటించారు. జిల్లాకు సంబంఽధించిన ఫలితాల వివరాలు, రీ–కౌంటింగ్, రీ–వెరిఫికేషన్ మార్గదర్శకాలను డీఈఓ తెలియజేశారు. పరీక్షకు హాజరైన 2,113 మందిలో 86.80 శాతంతో 1,834 మంది ఉత్తీర్ణులు కాగా వారిలో హాజరైన 1,209 మంది బాలురలో 84.95 శాతంతో 1,027 మంది, 904 మంది బాలికల్లో 89.27 శాతంతో 807 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. రీ–కౌంటింగ్, రీ–వెరిఫికేషన్ వివరాలు: ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ‘బీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ ద్వారా ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు స్వీకరిస్తారు. రీ–కౌంటింగ్ ఫీజు సబ్జెక్టుకు రూ.500, రీ–వెరిఫికేషన్ ఫీజు సబ్జెక్టుకు రూ.వెయ్యిగా ప్రకటించారు. సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ఫలితాలు ఆంధ్రప్రదేశ్ స్వారత్రిక విద్యాపీఠం మే–2026 నిర్వహించిన సప్లిమెంటరీ ఫలితాలలో జిల్లా విద్యార్ధులు మంచి ప్రతిభ కనపరిచారు. ఓపెన్ టెన్త్ ఫలితాలలో జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలవగా ఓపెన్ ఇంటర్ ఫలితాలలో 18వ స్థానంలో నిలిచింది. ఓపెన్ టెన్త్ పరీక్షకు హాజరైన 370 మందిలో 90 శాతంతో 333 మంది ఉత్తీర్ణులయ్యారు. ఓపెన్ ఇంటర్ పరీక్షకు హాజరైన 620 మందిలో 410 మంది పాసయ్యారు. ఫలితాలను వెంటనే విద్యార్థులకు తెలియజేయాలని ప్రధానోపాధ్యాయులను, ఓపెన్ స్కూల్ ఏఐ కోఆర్డినేటర్లను డీఈఓ ఆదేశించారు. మార్కుల జాబితాలను మరో నాలుగు రోజుల్లో వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. -
నోటీసులకు నోట్ల కట్టలు..!
ఆక్రమణలంటూ గగ్గోలు పెడతారు... అధికారులు నోటీసులిచ్చేలా ఒత్తిడి చేస్తారు. నోటీలందుకున్నవారిని నుంచి నోట్లకట్టలు దండుకున్నాక... అవి ఆక్రమణలు కాదు.. సక్రమమే అంటూ సర్దిచెప్తారు. పార్వతీపురంలో ‘అధికారం’ అండతో సాగుతున్న నయాదందాను చూసి పేదలు బెంబేలెత్తిపోతున్నారు. పట్టాదారుల నుంచి డబ్బులు దండుకున్న తీరును చూసి నివ్వెరపోతున్నారు. మరో మూడేళ్లు ఎలా గడుస్తాయా అని బిత్తరచూపులు చూస్తున్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో చెరువులు, కాలువల స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని.. ఆక్రమణల బారి నుంచి వాటిని రక్షించాలని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర పదేపదే గగ్గోలు పెడుతున్నారు. ఇదే సమయంలో ఆక్రమణలపై దృష్టి సారించిన అధికారులు.. వారికి నోటీసులు జారీ చేస్తుంటే, అధికార పార్టీకి చెందిన వారే అడ్డుకుంటున్నారు. ఉసుగొల్పుతున్నది వారే.. అడ్డుకుంటున్నదీ వారే.. ఇలా అయితే ఎలా ముందుకు వెళ్లగలమని మున్సిపల్, రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పెద్దవారిని వదిలి.. చిన్న వారిపై పంతమా? చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై కదిలిన అధికార యంత్రాంగం.. వందల సంఖ్యలో ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసింది. పార్వతీపురం పట్టణంలోని వరహాల గెడ్డలో సర్వే నంబర్ 351, నెల్లి చెరువులో సర్వే నంబర్ 401, సర్వే నంబర్ 343లో దేవుని బంద చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు జరిపారని దశలవారీగా పలువురికి నోటీసులు అందిస్తున్నారు. నోటీసు అందుకున్న మూడు రోజుల్లోగా వీటిని స్వచ్ఛందంగా తొలగించాలని, లేకుంటే తామే చర్యలు చేపడతామని మున్సిపల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒక్క దేవునిబంద వద్దే 24 మంది నిర్మాణదారులను గుర్తించి నోటీసులు అందజేశారు. వారు స్పందించకపోవడంతో శుక్రవారం జేసీబీ సాయంతో తొలగించేందుకు వెళ్లారు. దీంతో స్థానికులు అడ్డుకున్నారు. వాస్తవానికి ఇక్కడ నివసిస్తున్న వారిలో అధిక శాతం మంది పేదలే. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే వీరికి పట్టాలు అందజేశారు. అధికారులే ఇళ్లు నిర్మించి, రోడ్లు వేసి.. తాగునీరు, ఇతర వసతులు కల్పించారు. ఇప్పుడు అవే స్థలంలో ఆక్రమణలు అంటూ మున్సిపల్, రెవెన్యూ అధికారులు హడావిడి చేయడంపై పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో పేరు మోసిన వ్యక్తులు, బడాబాబులు రూ.కోట్ల విలువైన స్థలాలను కబ్జా చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోకుండా, తమపైనే ఎందుకని వాపోతున్నారు. నోటీసులిస్తే.. బేరం కుదిరినట్లే! లక్షలాది రూపాయలు వెచ్చించి పేదలు, మధ్య తరగతి ప్రజలు పలు ప్రభుత్వ స్థలాల్లో తెలిసో, తెలియకో ఇళ్లను కొనుగోలు చేసుకున్నారు. కొందరు స్థలాలను తీసుకొని నిర్మించుకున్నారు. కొన్నేళ్లుగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని జీవిస్తున్నారు. ఇప్పుడు ఆక్రమణల పేరిట అధికార పార్టీ నాయకులు హడావిడి చేయడం.. అధికారులు నోటీసులు ఇవ్వడం నియోజకవర్గంలో పరిపాటిగా మారింది. నోటీసులు అందుకున్న పేదలు.. తమ నివాస స్థలాలు పోతాయేమో అన్న భయంతో అధికార పార్టీకి చెందిన నాయకులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా వారు ఒక్కొక్కరి వద్ద రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పట్టణంలోని వరహాల గెడ్డ సర్వే నంబర్ 351లో 24 మంది నిర్మాణదారులకు ఆక్రమణల పేరిట నోటీసులు జారీ చేశారు. స్థానిక నాయకులు బేరం కుదుర్చుకొని.. వారి వద్ద రూ.లక్షలు కాజేసి, తర్వాత విషయాన్ని మరుగున పరిచారు. ఇప్పుడు దేవుని బంద వద్ద కూడా అధికార పార్టీ నాయకులు అదే డ్రామాను అవలంబిస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు వారి ఎమ్మెల్యే.. ఆక్రమణలు తొలగించాలని చెబుతుంటే, అదే పార్టీకి చెందినవారు దేవునిబంద వద్దకు వచ్చి, పేదల పక్షాన ఉన్నట్లుగా హడావిడి చేయడం గమనార్హం. ఆక్రమణల విషయంలో పేదలు ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని.. అదే సమయంలో ప్రభుత్వ స్థలాలు, బందలను ఎవరు ఆక్రమించినా రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. ఇప్పుడు ఈ స్థలాల విషయంలో అధికారులు, అధికార పార్టీ నాయకులు ఏం చేస్తారో చూడాలి. -
లారీ ఢీ కొని కూరగాయల వ్యాపారి మృతి
రామభద్రపురం: మండలకేంద్రంలోని బైపాస్ రోడ్డులో శుక్రవారం రాత్రి 8.20 సమయంలో లారీ ఢీ కొని కూరగాయల వ్యాపారి మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన చలమల చిన్న (63) రామభద్రపురం అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్లో దాదాపు మూడు దశాబ్దాలుగా కూరగాయల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు.అయితే రోజూ మాదిరిగానే శుక్రవారం మార్కెట్ నుంచి ఇంటికి సైకిల్మీద వెళ్తుండగా జాతీయ రహదారి నుంచి కృష్ణాఫార్మసీ పక్కనుంచి కాలనీ లింక్ రోడ్డుకు సైకిల్ తిప్పుతున్న సమయంలో విజయనగరం నుంచి ఎదురుగా వస్తున్న లారీ వెనుకభాగాన ఢీ కొట్టింది. అలాగే మృతదేహాన్ని కృష్ణాఫార్మసీ నుంచి స్టార్ అన్నపూర్ణ రెస్టారెంట్ వరకు సుమారు 100 అడుగులు పైబడి లారీ ఈడ్చుకెళ్లింది. రోడ్డు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సీఐ శ్రీనివాసరావు, ఎస్సై జ్ఞానప్రసాద్లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్స్పైర్ మనక్కు 9 ప్రాజెక్టుల ఎంపిక
● విద్యార్దులను అభినందించిన డీఈఓ బ్రహ్మాజీరావు వీరఘట్టం/పార్వతీపురం రూరల్: వినూత్న ఆలోచనలతో విద్యార్థులు ఆవిష్కరించిన సైన్స్ ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనక్ ప్రాజెక్ట్ కాంపిటిషన్కు జిల్లా నుంచి 2023–24 విద్యా సంవత్సరాల్లో 49 ప్రాజెక్ట్లు, 2024–25 విద్యా సంవత్సరంలో 48 ప్రాజెక్టులను ఆన్లైన్లో అన్ని మండలాల నుంచి నమోదు చేశారు. వాటిలో 2023–24 ఏడాదికి గాను 4 ప్రాజెక్ట్లను, 2024–25 ఏడాదికి గాను 5 ప్రాజెక్ట్లను నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) జిల్లా నుంచి మొత్తం 9 ప్రాజెక్టులను ఎంపిక చేసినట్లు డీఈఓ పి.బ్రహ్మాజీరావు, జిల్లా సైన్స్ అధికారి జి.లక్ష్మణరావు గురువారం తెలిపారు.రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులను రూపొందించిన విద్యార్థులు, గైడ్ టీచర్లను జిల్లా విద్యాశాఖ అధికారులు అభినందించారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టులకు ఎంపికై న విద్యార్దులు ఆయా పాఠశాలల నుంచి పదో తరగతి పూర్తి చేసి రిలీవ్ అయినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
విజయనగరం అర్బన్: స్థానిక దాసన్నపేటలోని ఓ ప్రైవేట్ మీటింగ్ హాల్లో ఆర్థిక అక్షరాస్యతపై గురువారం అవగాహన కల్పించారు. సూక్ష్మ రుణ వినియోగదారుల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించేందుకు, బాధ్యతాయుత రుణ వినియోగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ నెట్వర్క్ (ఎంఎఫ్ఐఎన్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాబార్జ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ టి.నాగార్జున పాల్గొని, కేవైసీ పత్రాల భద్రత, వ్యక్తిగత ఆర్థిక సమాచార గోప్యతపై అవగాహన కల్పించారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వీవీ రమణమూర్తి మాట్లాడుతూ అనధికారిక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించవద్దని, రుణమాఫీపై వచ్చే తప్పుడు ప్రచారాలను కూడా నమ్మవద్దని చెప్పారు. ఎంఎఫ్ఐఎన్ వైస్ ప్రెసిడెంట్ పీఎం కమలేష్ మాట్లాడుతూ రుణ గ్రహీతలు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని, ఆర్బీఐ నియంత్రణ ఆర్థిక సంస్థల నుంచే రుణాలు పొందాలన్నారు. నకిలీ కేవైసీ కాల్స్, యూపీఐ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన ఎస్.శోభన్బాబు సూచించారు. సైబర్ మోసాల బారినపడితే వెంటనే హెల్ప్ లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. ఎంఎఫ్ఐఎన్ టోల్ఫ్రీ హెల్ప్లైన్ 1800–102–1080 సేవలను కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ప్రచార పత్రాలు విడుదల చేశారు. -
కలెక్టర్, ఐటీడీఏ పీఓలను కలిసిన ఆర్డీఓ
పార్వతీపురం: ఇటీవల ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన కె.మాధురి కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డివిజన్లో ప్రభుత్వ పథకాల సమర్థ అమలు, గిరిజన ప్రాంతాల అబివృద్ధిపై దృష్టిసారించాలని అధికారులు సూచించగా, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్డీఓ తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల కొనసాగింపునకు డిమాండ్● విధులకు దూరమైన 273 మంది గురుకుల టీచర్లు పార్వతీపురం రూరల్: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 15 నుంచి 20 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొనసాగించేలా ఉత్తర్వులు జారీచేయాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం తప్పదని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో గిరిజన గురుకుల పాఠశాలల్లోని టీజీటీ, పీజీటీ పోస్టులను చేర్చడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. దీనివల్ల వివిధ ఐటీడీఏల పరిధిలో గత విద్యాసంవత్సరం వరకు పనిచేసిన మొత్తం 273 మంది అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉపాధి కోల్పోయే స్థితికి చేరుకున్నారు. బాధితుల్లో పాడేరు ఐటీడీఏ పరిధిలో 120 మంది, రంపచోడవరం పరిధిలో 80 మంది, పార్వతీపురం పరిధిలో 47 మంది, సీతంపేట ఐటీడీఏ పరిధిలో 26 మంది చొప్పున ఉన్నారన్నారు. ● రైతుల ఖాతాల్లో రూ.83 కోట్లు విడుదల సాక్షి, పార్వతీపురం మన్యం: అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ (2026–27) మొదటి విడత నిధులు ఈ నెల 20వ తేదీన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ, రైతు సేవా కేంద్ర స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి.భవానీశంకరరావు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన భూయజమాని రైతు కుటుంబాలు, అటవీ హక్కుల భూములను సాగు చేస్తున్న కుటుంబాలకు(ప్రస్తుత ఏడాదిలో) మొదటి విడతగా రూ.5 వేలు, పీఎం కిసాన్ 23వ విడతగా రూ.2 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు చొప్పున అందనున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 1,22,260 మంది రైతు కుటుంబాలకు రూ.83 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని వివరించారు. పట్టాదారు పాస్ పుస్త కాన్ని తమ ఆధార్, బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకున్న రైతులు అందరికీ లబ్ధి కలుగుతుందని తెలిపారు. నియోజకవర్గాల వారీగా పార్వతీపురం రూ.17.16 కోట్లు, పాలకొండ రూ.22.65 కోట్లు, కురుపాం రూ.26.82 కోట్లు, సాలూరు రూ.16.40 కోట్లు విడుదలైనట్టు పేర్కొన్నారు. గత ఏడాది మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కలిపి రూ.237.55 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. ముచ్చటగా మూడోస్థానం● ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లా ఘనత పార్వతీపురం రూరల్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఉమ్మడి ఫలితాల్లో జిల్లా ఈ ప్రతిభ కనబరిచినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(డీఐఈఓ) వై. నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి ప్రణాళికలు, పర్యవేక్షణతోనే ఈ మెరుగైన ఉత్తీర్ణత సాధించామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసేలా తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. ఈ విజయానికి మార్గదర్శనం చేసిన కలెక్టర్కు విద్యాశాఖాధికారులు, అధ్యాపకులు, సిబ్బంది తరఫున డీఐఈఓ కృతజ్ఞతలు తెలియజేశారు. -
మిల్లర్లకు మరో గడువు..!
వీరఘట్టం: గతేడాది ఖరీఫ్లో జిల్లా రైతుల నుంచి ప్రభుత్వం 2,72,119 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఈ ధాన్యాన్ని బ్యాంకు గ్యారంటీలు ఇచ్చిన జిల్లాలోని 113 మిల్లులకు ఇచ్చింది. ఈ ధాన్యం మరపట్టి అందులో 67 శాతం బియ్యం మిల్లరు ప్రభుత్వానికి అప్పగించాలి.ఈ లెక్కన మిల్లర్లు 1,82,319 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలి. ఈ బియ్యం గతనెల 31 నాటికి ఇవ్వాలని గడువు విధించారు. అయితే గడువు ముగిసినా కొంత మంది మిల్లర్లు లక్ష్యం చేరుకోలేకపోవడంతో జూన్ 15 వరకు సమయం ఇచ్చారు. అయినా ఇంకా 30 మంది మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సుమారు 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వలేకపోవడంతో ఈనెల 30 వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. తొలుత ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా మిల్లర్లు ఎందుకు బియ్యం ఇవ్వలేకపోయారో తెలుపుతూ గత నెల 31న సాక్షిలో ప్రచురితమైన ‘మిల్లర్లకు గడువు గండం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి. మిల్లర్ల వద్ద సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయా?లేదా? అని తెలుసుకునేందుకు ఇటీవల పౌర సరఫరాల శాఖ అధికారులు జంబ్లింగ్ విధానంలో బకాయిలు ఉన్న అన్ని మిల్లుల్లో తనిఖీలు చేశారు. అంతా సక్రమంగానే ఉందని వారు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. రేషన్ బియ్యంతో సరిపెడుతున్నారా? ఈ ఏడాది మిల్లింగ్లో జాప్యం జరగడం, ఎండల తీవ్రత పెరగడంతో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం పూర్తిగా డ్రై కావడంతో ప్రతి క్వింటాకు పది కిలోల ధాన్యం తరుగు వచ్చినట్లు మిల్లర్లు చెబుతున్నారు. అలాగే చాలా రోజులు ధాన్యం నిల్వ ఉండడంతో ఎలుకలు కొరికేసి పాడయ్యాయని కొందరు మిల్లర్లు అంటున్నారు. అయితే ప్రభుత్వానికి సీఎంఆర్ పేరిట ఇవ్వాల్సిన 67 శాతం బియ్యం సేకరించేందుకు అడ్డదారులు తొక్కుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. వారి దగ్గర ధాన్యం లేకపోవడంతో కొంత మంది మిల్లర్లు రేషన్ బియ్యం కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా అవే బియ్యం మళ్లీ ప్రభుత్వానికి సీఎంఆర్ కింద ఇస్తునట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటీవల మిల్లుల తనిఖీకి వచ్చిన అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే ఇందులో జరిగిన అక్రమాలు వెలుగు చూస్తాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్లో కొనుగోలు చేసిన 2,72,119 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లుకు ఇచ్చింది. ఈ ఏడాది కొన్ని కారణాల వల్ల బియ్యం సేకరణలో జాప్యం జరిగింది.ఇంకా 30 మంది మిల్లర్లు 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది.ఈనెలాఖరు వరకు గడువు ఇచ్చాం. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ కోసం రేషన్ బియ్యం ఇస్తున్నట్లు రుజువైతే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. శ్రీనివాసరావు, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్, పార్వతీపురం మన్యం ధాన్యం మరపట్టి ఇచ్చేందుకు ఈనెల 30 వరకు అవకాశం జిల్లా వ్యాప్తంగా బియ్యం ఇవ్వాల్సిన మిల్లులు:30 ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం 2 వేల మెట్రిక్ టన్నులు బియ్యం ఇచ్చేందుకు సరిపడా ధాన్యం నిల్వలు కరువు -
ఇప్పుడే దందా చేద్దాం!
● పార్వతీపురాన్ని దున్నేద్దాం బాస్ ● అధికారులపై రుబాబు.. ● ప్రైవేటు ఆస్తులపై నియోజకవర్గ నేతకన్ను! ● లిటిగేషన్ సృష్టించి డబ్బుల డిమాండ్ ● దారికి రాకుంటే బెదిరింపు సాక్షిప్రతినిధి, విజయనగరం: మళ్లీ పుడతామా ఏంటి.. ఏటి చేసిన ఇప్పుడే చేసియ్యాల అంటాడు పెద్దిగాడు... ఇప్పుడు పార్వతీపురం నియోజకవర్గ అధికార పార్టీ నేత కూడా.. గెలిచీగెలవగానే ఆబగా వ్యవస్థల మీద దాడి చేస్తున్నారు. తాను చెప్పింది చెప్పినట్లు చేయాలని.. చెప్పకపోతే జిల్లాలో ఉంచేది లేదు.. జిల్లా మొత్తానికి తానే సర్వంతర్యామిని అన్నట్లుగా ‘విజయ’ట్టహాసం చేస్తూ.. రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, ఉపాధి హామీ.. ఇలా అన్ని రంగాల ఉద్యోగులను బెదిరిస్తున్నారు. ఆఖరికి ప్రైవేట్ ఆస్తులపై కూడా కన్నేసి తన దారికి రాకపోతే వాటిని లిటిగేషన్లో పెట్టేసి వివాదాల్లోకి నెట్టేసి అందినంత దండుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీనికోసం జిల్లాస్థాయి రెవెన్యూ అధికారులను సైతం బెదిరిస్తున్నారు. తొలిసారి గెలవగానే ఓ అర్ధరాత్రి మహిళా ఎమ్మార్వోకు ఫోన్చేసి తను చెప్పినట్లుగా చేయాలని ఆదేశించే స్థాయికి ఆయన ఎదిగిపోయారు అంటే ఆయన రూపాలు ఎలా ఉందో ఇప్పటికే అర్థం అవుతుంది. ఇప్పుడు కూడా అదే జోరులో ఏకంగా వెంకంపేటలోని ఓ ప్రైవేటు ల్యాండ్ మీదకు ఎగబడిపోయి.. అన్ని పత్రాలు ఉన్నా ఆ ల్యాండ్ యజమానిని బెదిరించి.. కొంత ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించి.. ఆఖరికి భంగపడడం చూసి పార్వతీపురం ప్రజలు నివ్వెరపోతున్నారు. ఒక్కసారి గెలిస్తేనే ఇలా ఉంది.. రెండోసారి గెలిపిస్తే ఇంకేముంది అనే భీతి జనంలో మొదలైంది. మరిపివలస క్వారీ.. మామూళ్లతో సరి సీతానగరం మండలం మరిపివలసలో కంకర క్వారీ వద్దకు వెళ్లి ఫొటోలు దిగి హడావుడి చేశారు.. ఏంటి సంగతి. ప్రజా ఆస్తులు.. వనరుల విధ్వంసం.. పర్యావరణం అంటూ పెద్దపెద్ద డైలాగులు మాట్లాడారు. వారం తరువాత నెలవారీ మామూళ్లకు బేరం సెట్ అయిపోవడంతో ఇక అవన్నీ మాఫీ అయిపోయాయి. మున్సిపాలిటీపై పెత్తనం కుదరడం లేదే.. పట్టణాల్లో ప్రజాపాలన ముగిసిపోయి స్పెషల్ అధికారుల పాలన వచ్చింది. దీంతో పార్వతీపురానికి కలెక్టర్ ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. దీంతో అక్కడ పట్టణంలో నియోజకవర్గ నేత పెత్తనం కుదరడంలేదు. కమీషన్ల కోసం ఇష్టానుసారం పనులు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్కు పంపించి పనులు మంజూరు చేయించడానికి రంగం సిద్ధం చేశారు. అయితే, దీనికి కలెక్టర్ నిబంధనలు.. సామాజిక అవసరాలు.. ప్రాధాన్యాలు.. బడ్జెట్ వెసులుబాటు ఇవన్నీ చూసుకుని వాటిని వ్యతిరేకిస్తున్నారు. దీంతో తన ఆదాయానికి గండిపడిందన్న దుగ్ధతో అధికారయంత్రాంగంపై చిరాకుపడుతూ అధికారులు గాడిదలు కాస్తున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆయనకు అభివృద్ధిమీద అంత ప్రేమ.. మోజు.. శ్రద్ధ ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకుని భారీగా నిధులు తెచ్చుకోవాలి కానీ ఇక్కడ వీధుల్లో వీరంగం చేస్తే మేమేం చేయాలి అని అధికారులు లోలోన మదనపడుతున్నారు. గతంలో మున్సిపాలిటీలో కాలువలలో చెత్త తొలగింపు పేరిట అడ్డగోలు బిల్లులతో లక్షలు కొట్టేసిన అనుభవాన్ని ఇప్పుడు గుర్తుతెచ్చుకుంటున్నారు. మాటికి అలాగే చేద్దాం అంటే ఎలా అనే అనుమానాలు వస్తున్నాయి. మూసేసిన క్వారీలనూ వదల్లేదు.. తినమరిగిన బేపి.. తలుపు మూసేసినా వంటిల్లు చుట్టూ తిరిగినట్లు.. నెలవారీ ఆదాయానికి అల వాటు పడిన సదరు నేత నిడగల్లు.. మరిపోవలసల్లోని స్టోన్ క్రషర్ల వద్దకు వెళ్లి ఫొటోలతో హడావుడి చేసి మరి నాకేం లేదా అన్నారట.. ఆల్రెడీ క్వారీలు మూసేసి ఉన్నవి కనిపిస్తున్నాయి కదా.. ఇంకేం ఇస్తాం వెళ్లండి అన్నారు వాళ్లు.. సర్లే వచ్చినందుకు దారిఖర్చులు అయినా సర్దండి అని బెదిరించి కొంత దండుకుని నియోజకవర్గంలో సీసీ రోడ్ల పనులన్నీ వాళ్లకే ఇస్తున్నారు. మొత్తానికి వెనుకబడిన నియోజకవర్గాన్ని పరుగులుపెట్టిస్తున్నారో.. డబ్బుల కోసం ఈయనే గుమ్మాల వెంట తిరుగుతున్నారో కానీ ఈయనను మాత్రం జనం అసహ్యించుకుంటున్నారు. మళ్లీ గెలిపిస్తే కష్టమే అంటూ కామెంట్లు చేస్తున్నారు. జిల్లాలో ఇసుక ట్రాక్టర్లు.. మైనింగ్.. గ్రావెల్ ఎక్కడ ఉన్నా మన ఎమ్మెల్యే తాలూకా సీసర బుడ్డి అక్కడికి వాలిపోవడమే.. ఒక్కో వాయికి ఇంత అని స్పాట్ కలెక్షన్తో వెళ్లిపోవడమే. ఇసుక ట్రాక్టర్ను ఎవరైనా ఎస్సై పట్టుకుంటే వెంటనే అది మనోళ్లదే.. ఒగ్గేయాలి అంటూ ఫోన్లు.. ప్రతి ఫోన్ కాల్కు ఒక రేటు.. ఇదే ఆయన రూటు.. నియోజకవర్గంలో మొన్నటివరకు నియోజకవర్గంలో కంకర.. గ్రావెల్ ధరలు ఒక లెక్కలో ఉండేవి.. ఇప్పుడు ఆ రేటు పెరిగింది.. ఇదేంటి అంటే ఒక్కో ట్రాక్టరుకు రూ.300 చొప్పున ఆయనకు ఇవ్వాలి కాబట్టి ఆ రేటు కూడా ఇందులోనే అంటున్నారు వ్యాపారులు. -
బంగారం దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు
● ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్టు ● రూ.90 వేల నగదు స్వాధీనంపార్వతీపురం రూరల్: ఈ నెల 7న అడ్డూరివలస వద్ద జరిగిన చౌక బంగారం దోపిడీ కేసును పార్వతీపురం రూరల్ పోలీసులు ఛేదించారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మించి బాధితుడిపై దాడి చేసి నగదు అపహరించిన అంతర్రాష్ట్రట్ర ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ మనీషా రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విజయవాడకు చెందిన శ్రీనివాసరావుకు తక్కువ ధరకు బంగారు కడ్డీలు ఇప్పిస్తామని నమ్మించిన ఒడిశాకు చెందిన రాజు, అతని అనుచరులు ఈ నెల 7న అడ్డూరివలస వద్ద అతనిపై కర్రలతో దాడి చేసి రూ.2 లక్షల నగదును దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పార్వతీపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఒడిశా సరిహద్దుల్లో నిందితుల కోసం గాలించాయి. బుధవారం సాయంత్రం కొత్తవలస వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా దొరికిన ఒడిశాలోని కొరాపుట్ జిల్లాకు చెందిన మీనక నారాయణరావు అలియాస్ రాజు, హోబిక సన్నులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తాజా దోపిడీతో పాటు జనవరిలో జరిగిన మహిమగల నాణెం మోసం, గత నెలలో బట్టల వ్యాపారిపై జరిగిన దోపిడీ కేసుల్లోనూ తామే పాల్గొన్నట్లు అంగీకరించారు. నిందితుల నుంచి తాజా కేసుకు సంబంధించిన రూ.60 వేలు, పాత కేసులకు సంబంధించిన రూ.30 వేలు కలిపి మొత్తం రూ.90 వేల నగదుతో పాటు నేరానికి ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న మరో ముగ్గురు ఒడిశా నిందితులు మీనక మహేష్, తడాంగి కాసు, తడాంగి టాస్కు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. -
టెట్ మినహాయింపుపై చట్ట సవరణ చేయాలి
● ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి ఆపస్ వినతిపత్రంవిజయనగరం అర్బన్: 2010 టెట్ నోటిఫికేషన్కు ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులను టెట్ తప్పనిసరి ఉత్తీర్ణత నిబంధన నుంచి మినహాయించేలా ఆర్టీఈ చట్టంలో సవరణలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) జిల్లా శాఖ వినతి పత్రం సమర్పించింది. జిల్లా రెవెన్యూ అఽధికారి సీహెచ్.సత్తిబాబు ద్వారా ప్రధాన మంత్రి, కేంద్ర మానవవనరుల అభివృద్ది శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వినతిపత్రాలను పంపినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు 2010 టెట్ నోటిఫికేషన్కు ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత (టెట్)లో ఉత్తీర్ణత సాధించాలని లేనిపక్షంలో ఉద్యోగ భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ తీర్పు వల్ల వేలాది మంది ఉపాధ్యాయుల ఉద్యోగ, భద్రత, పదోన్నతులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టెట్ తప్పనిసరి అర్హత నిబంధనను 2010లో టెట్ నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి మాత్రమే అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని కోరారు. డీఆర్ఓను కలిసిన వారిలో ఆపస్ జిల్లా అధ్యక్షుడు కొవ్వాడ శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి ఇజ్జిరోతు రామునాయుడు, వీవీజే సుబ్రహ్మణ్యం, ఏజీ తాతారావు, ఎం.వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభకు పట్టం కట్టిన ఉద్యోగాలు
చీపురుపల్లిరూరల్(గరివిడి): నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంతో కష్టంగా మారిన తరుణంలో గరివిడి మండలంలోని అర్తమూరు గ్రామానికి చెందిన యువ ఇంజినీర్ సుంకరి నరసింహనా యుడు ఏకంగా మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. 2000వ సంవత్సరంలో బీటెక్ పూ ర్తిచేసిన నరసింహనాయుడు ప్రభుత్వ ఉద్యోగ సాధన కోసం ఐదేళ్లు ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా ఇంటి నుంచే పోటీ పరీక్షలకు సిద్ధమై వరుస విజయాలు సాధించాడు. ఉద్యోగాలు పొందింది ఇలా.. .2025 జూన్లో రైల్వే రిక్రూట్మెంట్లో జూనియర్ ఇంజినీర్(జేఈ) ఉద్యోగం సాధించాడు. సుమారు ఏడాది తరువాత మూడు నెలల క్రితం ఉద్యోగంలో చేరాడు. చైన్నెలో ఉద్యోగంలో శిక్షణ పొందుతున్న నరసింహనాయుడికి తాజాగా (నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్) నాల్కో ప్రభుత్వ రంగ సంస్థలో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.ఈ ఉద్యోగానికి కూడా 2025 ఫిబ్రవరిలో గేట్ ఎగ్జామ్ రాసి 100కి 76 మార్కులు సాధించాడు.ఈ ఉద్యోగానికి సంబంధించి ఏడాది కాలం తరువాత 2026 మార్చిలో నిర్వహించిన ఇంటర్వ్యూలో ప్రతిభ చూపడంతో ఈ సంస్థలో ఉద్యోగం సాధించాడు. ఈ ఉద్యోగం కోసం ఒడిశా రాష్ట్రంలోని దమన్జోడి ప్రాంతంలో రెండు రోజుల్లో ఉద్యోగంలో చేరనున్నాడు. ఈ ఉద్యోగంలో చేరేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) కేంద్ర ప్రభుత్వ సంస్థలో నిర్వహించిన ఉద్యోగానికి గేట్ ఎంట్రన్స్ ద్వారా ఎంపికై ఉన్న ఆయనకు 2026 మే నెలలో అపాయింట్మెంట్ ఆఫర్ వచ్చింది. ఇలా ఆయన మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు సాధించాడు. నరసింహనాయుడి ప్రతిభ పట్ల గ్రామస్తులు అభినందనలు తెలియజేస్తున్నారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
● 23 తులాల బంగారం, 73తులాల వెండి స్వాధీనం విజయనగరం క్రైమ్: గత నెల 30వ తేదీన విజయనగరం టూటౌన్ పరిధి వైఎస్ఆర్ నగర్లోని శ్రీసత్య నగర్లో జరిగిన దొంగతనం కేసులో విశాఖ జిల్లా మధురవాడకు చెందిన షేక్ అజీజ్ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ కేసు అంశాలను ఎస్పీ దామోదర్ వెల్లడించారు. మధుర వాడకు చెందిన షేక్ అజీజ్ ఇప్పటివరకు పలు జిల్లాల్లో 50 దొంగతనాలు చేశాడు. ఈ క్రమంలో గత నెల 30న పొట్టా వీర వెంకట స్వామి తన భార్యతో అన్నవరం దర్శనం చేసుకుని మర్నాడు 31 వ తేదీన సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తాళం తెరిచి ఉంది. ఇంటి లోపల అన్ని తలుపుల గడియలు తీసి ఉండడం ఆపై బెడ్ రూమ్ లో బీరువా లాకర్ తెరిచి ఉండటం మంచంపై బీరువాలో సామగ్రి పడి ఉండడం లా కర్లో 23న్నర తులాల బంగారం, 73 తులాల వెండి వస్తువులు కనిపించకపోవడంతో లబో దిబో మంటూ ఆ రోజు రాత్రి టూటౌన్ పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జరిగిన దొంగతనాన్ని సీరియస్ గా తీసుకున్న ఎస్పీ దామోదర్ పది క్రైమ్ బృందాలను రంగంలోకి దించారు. పోలీసులకు అందిన సమాచారంతో నిందితుడు షేక్ ఆజీజ్ కాకినాడలో ఉండడంతో వారంట్ తీసుకు ని అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా టూటౌన్ సీఐ శ్రీనివాస్ నిందితుడు షేక్ ఆజీజ్ ను తమదైన శైలిలో విచా రణ చేసి చోరీ కేసులో పోయిన ఆభరణాలను,నగదును రికవరీ చేశారని ఎస్పీ వివరించారు. దాడిలో వ్యక్తికి గాయాలుబాడంగి: మండలంలోని గజరాయునివలసకు చెందిన రెడ్డిగణేశ్ను అదే గ్రామానికి చెందిన మేనమామ నల్లతిరుపతినాయుడు, బావవరసైన భరత్రాజులు కర్రతో తలపై కొట్టి గురువారం రాత్రి గాయపరిచారు. భూతగాదాలో సొంత మేనల్లుడిపైనే దాడిచేసి కర్రతో కొట్టి తలపై గాయ పరిచారు. గణేష్కు తలపైగాయాలవగా రక్తస్రావంతో స్థానిక సీహెచ్సీలో చేరి ప్రథమ చికిత్సపొందాడు. బాధితుడు గణేశ్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఎస్సై పి.సూర్యకుమారి కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. -
కక్షిదారులకు న్యాయం చేయాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత విజయనగరంలీగల్: వచ్చే నెల 11వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో మోటార్ ప్రమాద బీమా కేసులును ఎక్కువ సంఖ్యలో పరిష్కరించి, కక్షిదారులకు న్యాయం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత అన్నారు. ఈ మేరకు కక్షిదారులను ఉద్దేశించి గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 11వతేదీన జరగబోయే ఆదాలత్లో మోటార్ ప్రమాదంలో గాయపడిన వ్యకులకు, మరణించిన వ్యక్తి కుటుంబసభ్యులకు ఆసరాగా నిలిచే ఇన్సూరెన్స్ మొత్తాలాకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ ఆర్.కృష్ణ ప్రసాద్ ,ఇన్సూరెన్స్ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో కార్మికుడి మృతిరామభద్రపురం: మండలంలోని రొంపల్లి పంచాయతీ పరిధి వంగపండువలసలో గురువారం విద్యుత్ షాక్ తగిలి విద్యుత్ ఓ కార్మికుడు మృతి చెందాడు, ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పాశల సత్యనారాయణ(42) విద్యుత్ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.గురువారం ఆదే గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇంటి మోటార్ పనిచేయడం లేదని మరమ్మతు చేయాలని కోరింది. దీంతో సత్యనారాయణ మోటార్ మరమ్మతు చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు.మృతుడికి ఇద్దరు భార్యలు పద్మావతి, విజయలక్ష్మి ఉండగా ఇద్దరు ఆడపిల్లలు,ఒక అబ్బాయి ఉన్నారు.మొదటి భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు ఏఎస్సై ఆర్.అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలరించిన సినీ సంగీత విభావరి విజయనగరం టౌన్: స్థానిక ఎస్వీఎన్లో ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిర్వహించిన సినీ సంగీత విభావరి అలరించింది. ఘంటసాల, ఎస్పీ బాలు పాడిన పాటలను గాయనీ, గాయకులు ఆలపించి, శ్రోతలకు వీనులవిందు చేశారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్.భీష్మారావు, ఎస్.జోగారావు, అధ్యక్షుడు దుర్వాసుల రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పక్కాగా ఘనవ్యర్థాల నిర్వహణ విజయనగరం అర్బన్: జిల్లాలో ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని మున్సిపల్, పంచాయతీల అధికారులను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా ప్రత్యేక ఘనవ్యర్థాల నిర్వహణ సెల్ సమావేశం గురువారం నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూలై 1వ తేదీ నుంచి ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనలు అమల్లోకి వస్తాయని, ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రతి ఇల్లు, వాణిజ్య సంస్థ నుంచి తడి, పొడి, శానిటరీ, ఇతర వ్యర్థాలను వేర్వేరుగా సేకరించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన భారీ వ్యర్థ ఉత్పత్తిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా హోటళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, కల్యాణ మండపాలు, మార్కెట్లు సొంతంగా వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరిశుభ్రమైన పర్యావరణం రాజ్యాంగంలోని ఆర్టికల్–21 కింద ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్డు పేర్కొందన్నారు. సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ బీబీ సరిత, జిల్లా పంచాయతీ అధికారి డీబీ మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు పీఎంవీబీఆర్వై జిల్లా స్థాయి కార్యక్రమం
చికెన్● కొత్త ఉద్యోగులకు నియమామక పత్రాల పంపిణీవిజయనగరం అర్బన్/విజయనగరం టౌన్: ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన జిల్లాస్థాయి కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహిస్తామని ప్రాంతీయ ఈపీఎఫ్కమిషనర్ కణిత అవినాష్కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఈపీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఉపాధి అవకాశాలను పెంచడం, యువతను వ్యవస్థీకృత ఉద్యోగ రంగంలోకి తీసుకురావడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో దేశవ్యాప్తంగా సుమారు 200 కేంద్రాల్లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పథకం కింద కొత్తగా ఉద్యోగాల్లో చేరిన తొలితరం ఉద్యోగులకు ఒక నెల జీతానికి సమానంగా గరిష్టంగా రూ.15 వేల వరకు ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. అదనపు ఉద్యోగావకాశాలు కల్పించే యజమానులకు కూడా ఆర్ధిక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఈపీఎఫ్, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అధికారులు, యాజమానులు, ఉద్యోగులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలిపారు. -
తుప్పు పట్టిన షట్టర్లు..!
ఎడమకాలువ ద్వారా వృథాగా పోతున్న నీరువీరఘట్టం: తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో ఉన్న పాత ఆయకట్టుకు సాగునీరు పంపిణీ చేసే కుడి,ఎడమకాలువల రెగ్యులేటర్లు దయనీయ స్థితికి చేరుకున్నాయి.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన కాలువల ఆధునికీకరణ పనులు 25 శాతం లోపు జరిగాయనే సాకు చూపించి చంద్రబాబు ప్రభుత్వం ఆధునికీకరణ పనులను రద్దు చేసింది. అయితే గత రెండేళ్లుగా కుడి,ఎడమ కాలువల రెగ్యులేటర్లు మరమ్మతుల బారిన పడడంతో షట్టర్లు తుప్పుపట్టి పనిచేయడం లేదు. దీంతో గతేడాది నవంబర్లో ఖరీఫ్ సీజన్ ముగిసినా సాగునీరు వృథాగా పోతోంది. ఈ షట్టర్లు బాగుచేసేందుకు సుమారు రూ.46 లక్షలు ఖర్చు అవుతుందని జలవనరులశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి ఏడాది క్రితం ప్రభుత్వానికి నివేదించారు.అయితే ప్రభుత్వం కనీసం చిల్లిగవ్వ కూడా షట్టర్లు బాగు చేసేందుకు నిధులు విదల్చలేదు. ఫలితంగా నిధుల లేమితో షట్టర్లు బాగుచేయించలేక జలవనరులశాఖ అధికారులు బేలచూపులు చూస్తున్నారు.మరో వైపు ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోంది. సాగునీటి పంపిణీ ఎలా చేయాలిరా దేవుడా అంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలు గుర్తించిన ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతిలు రైతులతో కలిసి గతంలో తోటపల్లి పాత రెగ్యులేటర్లు పరిశీలించారు. సాగునీటి పంపిణీలో తలెత్తిన ఇబ్బందులు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. టెండర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు.. ప్రస్తుతం తోటపల్లి జలాశయం పరిధిలోని పాత కుడి,ఎడమకాలువల రెగ్యులేటర్లు మొరాయిస్తుండడంతో నీటి సరఫరాను కంట్రోల్ చేయలేకపోతున్నామని అధికారులు అంటున్నారు.వాస్తవానికి ఈ షట్టర్ల మరమ్మతులకు రూ.18 లక్షలతో గతేడాది అక్టోబర్లో అధికారులు టెండర్లు పిలిచారు.అయితే ఈ ఎవరూ టెండర్లకు ముందుకు రాలేదు.దీంతో షట్టర్లు బాగవకపోవడంతో లక్షల కూసెక్కుల నీరు వృథాగా పోతోంది.రైతులకు అవసరం వచ్చినప్పుడు నీరందించలేకపోతున్న జలవనరులశాఖ అధికారులు, రైతులకు నీటి అవసరం లేకపోయినప్పటికీ పంట పొలాల్లోకి నీరు వస్తుండడండపై రైతులు మండిపడుతున్నారు. ఇటీవల ఇదే విషయంపై ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి అచ్చెంనాయుడిని కలిసి ఈ ప్రాంత రైతుల సమస్యలను వివరించారు.ఆధునీకీకరణ పనులను రద్దు చేయడం చాలా అన్యాయమని,కనీసం పాత కాలువ రెగ్యులేటర్లు అయినా బాగు చేయించాలని మంత్రిని కోరారు. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాంవృథాగా సాగునీరు..గత ఆరు నెలలుగా తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని ఎడమకాలువ ద్వారా 3.06 టీఎంసీల నీరు వృథాగా ప్రవహిస్తోందని గణాంకాలు చెబుతున్నాయి.పాత ఆయకట్టులోని ఎడమ కాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు.ఈ లెక్కన నెల రోజులకు 0.51టీఎంసీల నీరు ఆరు నెలలకు గాను 3.06 టీఎంసీల నీరు వృథాగా పోతోంది.తోటపల్లి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.5 టీఎంసీలు కాగా గురువారం నాటికి నీటి నిల్వ 1.723 టీఎంసీలు ఉంది. తోటపల్లి ప్రాజెక్టు వద్ద పాత రెగ్యులేటర్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో నీటి నిలుపుదలచేయడం సాధ్యం కావడం లేదు.షట్టర్లు తుప్పుపట్టాయి.ఈ షట్టర్లు బాగు చేసేందుకు రూ.46 లక్షల నిధులు అవసరం ఉంది.పూర్తి వివరాలతో ఓ నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాం.నిధులు మంజూరైతే షట్టర్లు బాగు చేయిస్తాం. డీవీ రమణ, కుడి, ఎడమకాలువల కార్యనిర్వహణ ఇంజినీర్ -
● ఆహ్వానం
రాజాం మండలంలోని బొద్దాం జెడ్పీ హైస్కూల్లో కొత్తగా చేరిన విద్యార్థులకు అక్కడి పాఠశాల హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది వినూత్నంగా ఆహ్వానం పలికారు. పాఠశాలలో 85 మంది విద్యార్థులు కొత్తగా చేరగా, వీరంతా బుధవారం తరగతులకు హాజరయ్యారు. పాఠశాల మెయిన్ గేటు వద్ద ఉపాధ్యాయులు ఇరువైపులా నిల్చొని విద్యార్థులపై పూలు జల్లి, డప్పువాయిద్యాలతో ఆహ్వానం పలికారు. వివిధ కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు నుంచి పాఠశాలలో చేరినట్టు ఉపాధ్యాయులు తెలిపారు. అందరికీ ప్రమాణాలతో కూడిన విద్యను బోధిస్తామని చెప్పారు. – రాజాం -
క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం
● ఎస్పీ ఏఆర్ దామోదర్విజయనగరం క్రైమ్: క్రీడలు జీవితంలో ఆనందం కలిగించి, ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని నింపుతాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఈ మేరకు స్థానిక విజ్జి స్టేడియంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ బుధవారం వైద్యులకు క్రికెట్ పోటీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ పోటీలను ఎస్పీ దామోదర్ ప్రారంభించి మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగం, ఇతర దైనందిన జీవితంలో కలిగిన మానసిక ఒత్తిడిని దూరం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోయి, వృత్తిలో మరింత ఏకాగ్రత పెరగడంతో పాటు, వృత్తి నైపుణ్యం కూడా మెరుగవుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ కూడా క్రికెట్ ఆడి క్రీడాభిమానులను అలరించారు.పిడుగుపాటుతో దుక్కిపశువుల మృతివేపాడ: మండలంలోని కరకవలస గ్రామపంచాయతీ శివారు మారిక గిరిజన గ్రామంలో పిడుగుపాటుకు గురై రెండు దుక్కి పశువులు మృతిచెందాయి. బుధవారం మధ్యాహ్నం ఈదురుగాలులు, వర్షంతో పాటు ఉరుములు, పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో పడిన పిడుగుకు గ్రామానికి చెందిన పాతబోయిన పైడితల్లికి చెందిన రెండు పశువులు మృతి చెందాయి. వాటి విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని స్థానికులు తెలిపారు.పిడుగుపాటుతో ఏడు ఆవులు..శృంగవరపుకోట: మండలంలోని ధారపర్తి పంచాయతీ పరిఽధి పల్లపుదుంగాడ గ్రామంలో బుధవారం మద్యాహ్నం వర్షం కురుస్తున్న సమయంలో గిరిజన రైతులు జరత లచ్చన్న, కినబెరి రామన్న, పోరి అప్పన్న, జన్ని భీమన్నలకు చెందిన ఏడు ఆవులు పిడుగుపాటుకు చనిపోయాయి. దీంతో సుమారు మూడు లక్షల రూపాయల మేర ఆస్తినష్టం సంభవించిందని, గిరిజన రైతులు వాపోయారు. బాధిత గిరిజన రైతుల్ని ఆదుకోవాలని గిరిజన సంఘం నేతలు కోరారు. -
ఆర్డీవో బాధ్యతల స్వీకరణ
పార్వతీపురం రూరల్: పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)గా కె.మాధురి బుధవా రం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆమెను కార్యాల యం సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమెకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నేపథ్యం లేనప్పటికీ, తొలి ప్రయత్నంలోనే ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షలో డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. మొదటి పోస్టింగ్లో ఎన్టీఆర్ జిల్లా తి రువూరు ఆర్డీవోగా విధులు నిర్వహించిన ఆమె పార్వతీపురం ఆర్డీవోగా బదిలీ అయ్యారు. పార్వతీపురం రూరల్: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులతో పాటు పకడ్బందీ భద్రత కల్పించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం స్థానిక ’గిరిమిత్ర’ భవనంలో హెచ్ఎంలు, వార్డెన్లతో 2026–27 విద్యా సంవత్సర నిర్వహణపై ఆయన సమీక్షించారు. విద్యార్థుల నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, కిట్లను సకాలంలో అందించాలని పీవో స్పష్టం చేశా రు. అకడమిక్ క్యాలెండర్ను తు.చ తప్పకుండా అమలు చేయాలని, సులభమైన అభ్యాస పద్ధతులను ప్రవేశపెట్టాలని సూచించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. సురక్షిత తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లను నిరంతరం పర్యవేక్షించాలని, కిచెన్ గార్డెన్స్ పెంచి తాజా కూరగాయలను భోజనంలో వినియోగించాలని చెప్పారు. బాలికల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని, ’మంచి స్పర్శ–చెడు స్పర్శ’పై వారికి ప్రత్యేక అవగాహన కల్పించా లని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రగతిని వివరించేందుకు ప్రతి నెలా విధిగా తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ డీడీ ఎ.విజయశాంతి, డిప్యూటీ డీఈవో క్షేమాభాయ్, ఐటీడీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సీఏఎస్ పోస్టులకు ఇంటర్వ్యూలు విజయనగరం ఫోర్ట్: డైరెక్టర్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలో నిర్వహించే ఏరియా ఆస్పత్రులు, సీహెచ్ల్లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్, స్పెషలిస్టు) సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టులకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లోని సమావేశ మందిరంలో బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి (డీసీహెచ్ఎస్) డాక్టర్ పద్మశ్రీరాణి అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేశారు. జనరల్ సర్జరీ ఒక పోస్టుకు ఆరుగురు, సీఎస్ జనరల్ నాలుగు పోస్టులకు 29 మంది అభ్యర్థు లు హాజరయ్యారు. పెథాలజీ–1పోస్టు, ఈఎన్టీ–1, రేడియాలజీ–3, ఆప్తమాలజీ–1 పోస్టుకు అభ్యర్థులు ఎవరూ హాజరుకాలేదు. ● ఆవిష్కరణచిత్రంలో కూలింగ్ క్యాప్ను చూపిస్తున్నది గరివిడి కేజీబీవీ బాలికలు. 2024 సంవత్సరం నుంచి పాఠశాలలో చెప్పిన ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) తరగతుల్లో నేర్చుకున్న అంశాలతో కూలింగ్ క్యాప్ల తయారీ ప్రాజెక్టును రూపొందించారు. రెండు బ్యాటరీలను క్యాప్ లో అమర్చారు. ఒకసారి చార్జ్ చేస్తే 8 గంటలు పనిచేస్తాయి. ఈ క్యాప్లు తలకు పెట్టుకుంటే శరీర ఉష్ణోగ్రతలను తగ్గించి, ఎండల నుంచి ఉపశమనం లభిస్తుందని బాలికలు చెబుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు ఇవి ఎంతగానో ఉపయోగపతాయన్నారు. ప్రాజెక్టును గత నెల 24, 25, 26 తేదీల్లో గీతం యూనివర్సిటీలో జరిగిన ప్రదర్శనల్లో ప్రదర్శించారు. ఇది న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి బడుకొండపేటకు చెందిన సత్యం(65) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి భార్య తవుడమ్మ ఫిర్యాదు చేసినట్లు ఎస్సై అశోక్ బుధవారం తెలిపారు. ఉదయాన్నే రోడ్డుపై వెళ్తున్న సత్యాన్ని లారీ ఢీ కొట్టడంతో పడిపోయాడని చికిత్స కోసం హాస్పిటల్ తరలించే లోగానే మృతిచెందాడని ఆయన భార్య ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిరుపేద విద్యార్థికి చేయూత నెల్లిమర్ల రూరల్: మండలంలోని అప్పయ్యపేట గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి సతీష్కుమార్కు తమన్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాలు, యూనిఫాంతో పాటు ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొడ్డేపల్లి రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి విద్యాభ్యాసానికి దీర్ఘకాలికంగా అండగా నిలుస్తామన్నారు. విద్యార్థికి అవసరమైన పుస్తకాలు, పెన్నులు, యూనిఫాంతో పాటు విద్యా సంవత్సరానికి అవసరమైన ఇతర విద్యా సామిగ్రిని అందజేసినట్లు చెప్పారు. -
గిరిజనం కన్నీటి కష్టాలు
గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026● సుదూర ప్రాంతాల నుంచి బిందెలతో నీళ్లమోత●మంత్రి ఇలాకాలో తాగునీటి ఇబ్బందులు సాలూరు రూరల్: మన్యం ప్రజలను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. బిందెడు నీటికోసం సుదూర ప్రాంతాలకు పయనిస్తున్నారు. చలమ లు, చేతిపంపుల నీటితో దాహం తీర్చుకుంటున్నారు. ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడు తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో ప్రభు త్వం నిర్లక్ష్యం గిరిజన గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. ప్రస్తుతం చాలా గిరిజన గ్రామాల్లో తాగునీటి పరిస్థితి అధ్వానంగా ఉంది. బోరుబావులు మరమ్మతులకు గురై నెలలు గడుస్తున్నా బాగుచేసేవారు లేరు. మరమ్మతులు చేసేందుకు నిధులు లేవని పంచాయతీ కార్యదర్శులు చేతులెతేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నియోజకవర్గంలో గిరిజనులు తాగునీటికి కటకటలాడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జల్జీవన్ మిషన్ పథకం ఉన్నప్పటికీ నిర్వహణ లోపంతో సాలూరు మండలంలోని పలు గ్రామాల ప్రజలు తాగునీటికి అవస్థలు పడక తప్పడం లేదు. డెన్సరాయి గ్రామంలో రెండు నెలలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ కార్యదర్శికి ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో పక్క గ్రామమైన రేవడి వలసకు వెళ్లి గ్రామంలో చిన్నాపెద్ద తేడా లేకుండా బిందెలతో నీళ్లు మోసుకుని అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ●కొట్టుపరువు పంచాయతీ బూర్జివలస గ్రామంలో నెలరోజులుగా తాగునీటి బోరు మరమ్మతులకు గురైనా ఇప్పటివరకు బాగుచేయలేదు. గ్రామస్తులు గ్రామంలో ఉన్న చేతి బోరు వద్ద నీళ్లు తోడుకుంటూ అవసరాలు తీర్చుకుంటున్నారు. వ్యవసాయ పనులు చేసుకునే సమయంలోనూ తాగునీరు కోసం సమయం కేటాయించాల్సి వస్తోందని గిరిజనులు వాపోతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలి మండలంలోని పలు గ్రామాల్లో గిరిజనులు తాగునీటికి అవస్థలు పడుతున్నారని అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సీపీఎం నాయకుడు మర్రి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. డెన్సరాయి, బూర్జివలస గ్రామాల్లో వెంటనే తాగునీటి సమస్య పరిష్కరించాలని దీనిపై కలెక్టర్ చర్యలు చేపట్టాలని కోరారు. -
బంగారం చోరీ కేసులో నిందితురాలి అరెస్టు
చికెన్బొబ్బిలి: బాడంగి మండలం వీరసాగరంలో మంగళవారం జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దీనిపై బుధవారం రూరల్ సీఐ ఎస్ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వీరసాగరం గ్రామానికి చెందిన జాగరాన శంకర రావు, సుజాతలు మంగళవారం మధ్యాహ్నం పొలం పనికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో సుజాత ఆడపడుచు దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన మరడ వసంత మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో శంకరావు, సుజాతల ఇంటిలో చొరబడి బీరువా తాళాలు పగులగొట్టి 8 తులాల బంగారు వస్తువులను చోరీ చేసి వెళ్లిపోయింది. శంకర రావు, సుజాతలు ఇంటికి వచ్చి బట్టలు చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి బంగారు వస్తువులను వెతికి చూడగా లేకపోవడంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదుచేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఎవరెవరు ఆ సమయంలో వారి ఇంటిపరిసరాల్లో సంచరించారన్న విషయం తెలుసుకున్న తరువాత మరడ వసంతపై అనుమానం వచ్చి ఆ గ్రామంలోకి వెళ్లి విచారణ చేయడానికి ముందు అక్కడి జంక్షన్లో ఆమెను పట్టుకుని తనిఖీ చేయగా ఆమె వద్ద ఫిర్యాదు దారు వివరాల ప్రకారం అన్ని బంగారు వస్తువులూ దొరకడంతో అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. సమావేశంలో బాడంగి ఎస్సై సూర్యకుమారి ఉన్నారు. -
కుక్కేసి.. నోరు నొక్కేసి!
● ఆగని పశువుల అక్రమ రవాణా ● ఉమ్మడి జిల్లా మీదుగా వేల సంఖ్యలో తరలింపు ● ఇతర రాష్ట్రాల్లోని వధశాలలకు మూగజీవాలు ●ఇటీవల రాత్రి సమయంలో పార్వతీపురం మీదుగా పశువులను వాహనాల్లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ వాహనాలు ఒక ప్రజా ప్రతినిధికి చెందినవిగా తెలిసింది. వాటిని విడిచిపెట్టాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. ●గతంలో ఒడిశా రాష్ట్రం సిమిలిగుడ నుంచి భారీ వాహనాల ద్వారా సాలూరు మీదుగా 86 పశువులను తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. వాహనాన్ని సీజ్ చేశారు. సాక్షి, పార్వతీపురం మన్యం: ఉమ్మడి జిల్లా మీదుగా పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. విజయనగరం జిల్లాలో పెదమానాపురం సంత ఉత్తరాంధ్రలో పశువుల వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ నుంచే ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతున్నాయి. ఇందులో అధికశాతం వధశాలలకే కావడం గమనార్హం. ఉత్తరాంధ్రలోని ఓ జిల్లా స్థాయి పశుసంవర్థక శాఖ అధికారి ఈ అక్రమ దందాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు విజిలెన్స్కు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువ భాగం కేరళలోని గోవధ శాలలకు తరలిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉమ్మడి జిల్లా మీదుగా వేలాది పశువులు కబేళాలకు అక్రమంగా తరలిపోతున్నాయి. కనికరం, జాలి మరిచి.. అతి కర్కశంగా పశువులను లారీల్లో కుక్కి బలవంతంగా ఎగుమతి చేస్తున్నారు. దీని వెనుక బలమైన రాజకీయ మాఫి యా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దందాలో లక్షలాది రూపాయ లు చేతులు మారుతున్నాయి. అధికారులు, నాయకులకు ముడుపులు అందుతున్నాయ నే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని పార్వతీపురం, నవగాం, సీతంపేట, అడ్డాపుశీల, పరశురాంపురం, గుమడ, పెదమానాపురం, సాలూరు, పాచిపెంట, అలమండ, రాజాం, కందివలస ప్రాంతాల నుంచి పొరుగు రాష్ట్రాలకు నిత్యం పశువుల తరలింపు అవుతోంది. సంతల్లో వ్యాపారులు రైతుల నుంచి పశువులను కొనుగోలు చేస్తున్నారు. వాటిని జాతీయ రహదారి సమీపంలో ఖాళీ ప్రదేశాల్లో ఒక దగ్గరకు చేర్చి రాత్రిపూట లారీ లు, ఇతర వాహనాల్లో తరలిస్తున్నారు. కంటైనర్లలోనూ రహస్యంగా కబేళాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లోనే ఒడిశా నుంచి వందల కిలోమీటర్ల మేర పశువుల ను నడిపించి సంతలకు తరలి స్తున్నారు. ఈ తరలించే క్రమంలో వాహనాల్లో పశువులను పరిమితికి మించి ఎక్కిస్తుండటం వల్ల కొన్ని గోవులు మృత్యువాత పడుతున్నాయి. అలసిపోయి కదల్లేని స్థితిలో వాటిని హింసిస్తూ అత్యంత క్రూరంగా తరలిస్తున్నారు. పశువు ఆరోగ్యంగా ఉంటే రూ.20 వేలు, బక్క చిక్కితే రూ.10 వేలలోపు రైతులకు చెల్లిస్తున్నారు. పశువుల తరలింపు, రవాణాకు అనుమతి పత్రాలు తప్పనిసరి. సుదూర ప్రాంతాలకు వ్యవసాయ పను ల నిమిత్తం, పాడి అవసరాలకు తరలిస్తున్నామని ధ్రువీకరిస్తూ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నుంచి అనుమతి తీసుకోవాలి. వాహనాల విషయంలో సైతం నిబంధనలు పాటించాలి. జిల్లాలో ఇవేవీ పాటించిన దాఖాలాలు లేవు. పశువుల అక్రమ రవాణాపై దాడులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. పార్వతీపురం జిల్లా కేంద్రం, విజయనగరంలోని పెద మానాపురంలో నిర్వహించే సంతల్లో దళారులు అధిక సంఖ్యలో పశువులను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారుల ఏజెంట్లకు విక్రయిస్తుంటారు. సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఒడిశా రాయగడ సమీపంలో పశువులను కొనుగోలు చేసి కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల మీదుగా ఆంధ్ర ప్రాంతానికి తీసుకువచ్చి ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికార పార్టీలకు చెందిన కీలక నాయకుల అండదండలు పశువుల ఎగుమతి వ్యాపారం చేసే వారికి ఉండటంతో యథేచ్ఛగా ఈ దందా సాగుతోంది. అధికార పార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో పాటు జిల్లా అధికారులకు ప్రతి వారం రూ.లక్షల్లో ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి గురువారం పార్వతీపురంలో నిర్వహించే సంత, శనివారం మానాపురంలో సంతలకు పెద్ద ఎత్తున పశువుల రవాణా సాగుతోంది. ఒడిశాలోని నారాయణపట్నం, అలమండ, కొరాపుట్, పొట్టంగి, సిమిలిగుడ, నవ రంగ్ పూర్, జయపూర్, గుణుపూర్ నుంచి ఈ వారపు సంతలకు పశువులను తరలిస్తున్నారు. ఒడిశాలోని పొట్టంగి, సిమిలిగుడ, కొరాపుట్ ప్రాంతాల నుంచి వందలాది పశువులను కాలినడకన మానాపురం సంతకు తరలిస్తున్నారు. రవాణా చేస్తున్న వాహనాల కాంట్రాక్టు వెనుక అధికారపార్టీకి చెందిన ఓ ఉత్తరాంధ్ర మంత్రి సమీప బంధువు హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పోలీసు, రవాణా, పశుసంవర్ధక శాఖ అధికారులు నోరు మెదపడం లేదనే ప్రచారం జరుగుతోంది. -
‘ఈ డార్’ నిర్వహణలో గుర్ల టాప్..
గుర్ల: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు పరిహారం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ డార్ (ఎలక్ట్రానిక్ డీటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్) పోర్టల్ నిర్వహణలో గుర్ల పోలీస్స్టేషన్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రోడ్డు ప్రమాద బాధితుల వివరాలను ఈ పోర్టల్లో సక్రమంగా నమోదు చేస్తే ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం త్వరగా అందుతుంది. ఈ విషయంలో కానిస్టేబుల్ మురళి చురుగ్గా వ్యవహరిస్తూ, పోర్టల్ నిర్వహణను సక్రమంగా చేపట్టడంతో గుర్ల పోలీస్స్టేషన్కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దీంతో ఎస్పీ ఏఆర్ దామోదర్ కానిస్టేబుల్ మురళిని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ రాఘవులు, సీఐ శంకరరావు, ఎస్సై నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు. విజయనగరం లీగల్: వచ్చేనెల 11న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత పిలుపునిచ్చారు. పూల్బాగ్కాలనీలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీస్, ఎకై ్సజ్ అధికారులతో బుధవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న రాజీ పడదగ్గ క్రిమినల్, ఎకై ్సజ్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎ.కృష్ణప్రసాద్, విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ రాఘవులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
అవమాన భారం తట్టుకోలేక మహిళ ఆత్మహత్య
సంతకవిటి: తమ కుటుంబంపై దొంగ ముద్ర పడడంతో అవమాన భారం తట్టుకోలేక ఓ తల్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. సంతకవిటి మండలంలో జరిగిన ఈ సంఘటనపై రాజాం రూరల్ సీఐ హెచ్ ఉపేంద్రరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రామారాయపురం గ్రామంలో గత నెల 25న ఓ ఇంటిలో నాలుగు తులాల బంగారం, పదివేల రూపాయలు చోరీ జరిగింది. ఈ చోరీ విషయంలో గ్రామానికి చెందిన వై.కళావతి(55), కుమారుడు చిరంజీవిలపై చోరీ జరిగిన ఇంటి బాధితులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రామంలో ఇరు కుటుంబాలు గొడవపడ్డాయి. మంగళవారం ఉదయం చోరీ జరిగిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణలో భాగంగా కళావతితో పాటు కుమారుడిని ఎస్సై స్టేషన్కు రమ్మన్నారు. వారు వచ్చిన సమయానికి స్టేషన్లో ఎస్సై లేకపోవడంతో తల్లీకొడుకులను వెళ్లిపోమని సిబ్బంది చెప్పడంతో వారు తిరిగి వెళ్లిపోయారు. గ్రామస్తులు, బంధువులకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటిముఖం పట్టిన తల్లీకొడుకులు గ్రామస్తులకు ఫోన్ చేసి తమపై దొంగ ముద్ర పడిందని, తమను పోలీసులు స్టేషన్కు పిలుస్తున్నారని తాము గడ్డి మందుతాగి చనిపోతామని బంధువులు, స్నేహితులు, గ్రామపెద్దలకు సమాచారం ఇచ్చి, ఫోన్ స్విచాఫ్ చేశారు. అనంతరం గ్రామస్తులు వెతుకుతున్న క్రమంలో తన తల్లి ట్రైన్ కింద పడి మృతిచెందిందని ఆమె కుమారుడు చిరంజీవి గ్రామస్తులకు సమాచారం అందించాడు. అవమానం భారం తట్టుకోలేకనే.. తమపై దొంగ ముద్ర పడడంతో పాటు, పోలీసులు పిలవడంతో అవమాన భారం తట్టుకోలేక మనస్తాపంతో తన తల్లి రైలు కింద పడి మరణించినట్లు కుమారుడు చిరంజీవి వెల్లడించినట్లు సీఐ తెలిపారు. తామిద్దరం పొందూరు మండలం పెనుబర్తి గ్రామం వద్ద ఈనెల 16న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలనుకుని ట్రైన్కు ఎదురుగా నిల్చున్నామని, ఇంతలో తన తల్లి తనను పట్టాలపైనుంచి పక్కకు తోసేసి, తాను ఆత్మహత్య చేసుకుందని కుమారుడు తెలిపినట్లు సీఐ వివరించారు. ఇదిలా ఉండగా కళావతి ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ప్రాణం తీసిన బతుకు వేట
● మడ్డువలస ప్రాజెక్టులో మత్స్యకారుడి మృతి వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు పడి వంగర గ్రామానికి చెందిన మత్స్యకారుడు కంబాల గణేష్(40) బుధవారం మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. వేకువ జామున 5గంటల సమయంలో తన కుమారుడు ధనుంజయతో కలిసి పడవల సహాయంతో గణేష్ వెళ్లాడు. మొక్కతోట సమీపంలో ఉన్న ప్రాజెక్టు భాగంలో చేపల కోసం వేసే వలలను తీసే ప్రయత్నంలో పడవ నుంచి నీటిలోకి గణేష్ జారిపోయాడు. ఆ ప్రాంతంలో ఉన్న సహచర మత్స్యకారుడు యువరాజు చూసి కేకలు వేశాడు. లోతు ప్రాంతం కావడంతో అప్పటికే గణేష్ నీటిలో మునిగిపోయాడు. కొన్ని గంటల తరువాత ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు పెనుబోతు దుర్గారావు ఆధ్వర్యంలో ఇనుప గేలాలు, ఇసురు వలలతో పలువురు మత్స్యకారులను ప్రాజెక్టులోకి తీసుకువెళ్లి గాలింపు చేపట్టగా కాసేపటికి ఇనుప గేలాలకు తగిలి గణేష్ మృతదేహం లభ్యమైంది. దీంతో మృతుడి కుటుంబసభ్యులు, సహచర మత్స్యకారులు అక్కడికి చేరుకుని భోరున విలపించారు. మృతదేహాన్ని రాజాం సీహెచ్సీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ కె.రామ్మోహనరావు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, భార్య జ్యోతి ఉన్నారు. -
మోటార్ వైర్లు దొంగలిస్తున్న నిందితుడికి రిమాండ్
గుర్ల: మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వినియోగిస్తున్న విద్యుత్ మోటార్లు, సోలార్ మోటార్లకు సంబంధించిన వైర్లు ఎప్పటికప్పుడు దొంగిలిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యక్తిని గుర్ల పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మోటార్ వైర్లు దొంగిలిస్తున్న మండలంలోని పల్లిగండ్రేడుకు చెందిన గొల్లపల్లి గోవింద్ను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు సీఐ జి.శంకరరావు, ఎస్సై పి.నారాయణ రావు బుధవారం తెలిపారు. కోటగండ్రేడు సమీపంలోని రైతులు మోటారు వైర్లు దొంగిలిస్తుండగా నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు గోవింద్ను విచారణ చేయగా గతంలో చేసిన మోటార్ వైర్ల దొంగతనం గురించి చెప్పినట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని చీపురుపల్లి కోర్టులో హజరుపరచగా నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు. హాస్టల్స్ సమస్యలు పరిష్కరించాలి ● కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆందోళనపార్వతీపురం రూరల్: ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గురుకుల, కేజీబీవీ వసతి గృహాల్లోని విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవికుమార్ మాట్లాడారు. పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. జైళ్లలో ఖైదీల ఆహారానికి రోజుకు రూ.100కు పైగా ఖర్చు చేస్తుండగా, విద్యార్థులకు రోజుకు కేవలం రూ.53 మాత్రమే కేటాయిస్తున్నారన్నారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు నెలకు రూ.1200, ఇంటర్ విద్యార్థులకు రూ.1600 మాత్రమే ఇవ్వడం సరిపోదన్నారు. సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాల్లో కనీస సౌకర్యాలైన తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. పాత భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించాలని కోరారు. పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మెస్ చార్జీలను రూ.2500 నుంచి రూ.3000కు పెంచాలని డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, అటెండర్, కమాటి, ట్యూటర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
రాష్ట్రస్థాయి ‘యోగాంధ్ర’ పోటీలకు పయనం
పార్వతీపురం రూరల్: విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి ’యోగాంధ్ర’ పోటీలకు పార్వతీపురం మన్యం జిల్లా బృందం బుధవారం పయనమైంది. ఈ మేరకు కలెక్టరేట్ ఆవరణలో డీఆర్వో, జాయింట్ కలెక్టర్ (ఎఫ్ఏసీ) కె.హేమలత క్రీడాకారుల బృందం వెళ్లే ప్రత్యేక వాహనాన్ని జెండా ఊపి సాగనంపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా నుంచి జూనియర్, యంగ్, సీనియర్ కేటగిరీల్లో మొత్తం 35 మంది అభ్యర్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గడిచిన మూడు రోజులుగా జిల్లాస్థాయిలో నిర్వహించిన సోలో, గ్రూప్ యోగా, ప్రాణాయామం, క్విజ్, స్లోగన్, వ్యాసరచన, పాటలు, షార్ట్ ఫిల్మ్ తదితర విభాగాల్లో ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసినట్లు నోడల్ అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు తెలిపారు. ప్రయాణంలో క్రీడాకారుల సౌకర్యార్థం బస్సులో వైద్య సిబ్బందిని, ప్రథమ చికిత్స కిట్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందానికి గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయశాంతి నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో ఆయుష్ జిల్లా ఇన్న్చార్జి అధికారి డాక్టర్ టి.హేమాక్షి, వైద్యాధికారులు వర్మ, మహేష్, యోగా గురువులు మోహన్ గంతాయత్, జనార్దనరావు, పీడీ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు అభాసుపాలు
● సక్రమంగా అందని పౌష్టికాహారం ● పాలకోసం అంగన్వాడీ లబ్ధిదారుల ఎదురుచూపులు ● అంగన్వాడీలకు చేరని ఇతర సరుకులు పార్వతీపురం రూరల్/ రామభద్రపురం: చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలే పునాది. వయసుకు తగ్గ బరువు, ఎత్తు ఉంటేనే వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా నిలబడతారు. మాతాశిశువులు పోషకాహార లోపం, రక్తహీనత బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాయి. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ పంపిణీ ప్రక్రియ గాడితప్పడంతో అసలు లక్ష్యం అందని ద్రాక్షలా మారుతోంది. మాతాశిశువులకు తప్పని నిరీక్షణ జిల్లా వ్యాప్తంగా 1,425 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. వాటి పరిధిలో 4,226 మంది గర్భిణులు, నెలల వయసు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 39,647 మంది ఉన్నారు. ఇంత భారీ స్థాయిలో లబ్ధిదారులు పౌష్టికాహారం కోసం ఎదురుచూస్తుంటే.. అధికారులు మాత్రం సరుకులు జిల్లాకు చేరుకున్నాయని, నేడో రేపో పంపిణీ చేస్తామంటూ దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సకాలంలో పంపిణీ జరగకపోవడంతో మాతాశిశువులకు నిరీక్షణ తప్పడం లేదు. విజయనగరం జిల్లాలో.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులలో 2499 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో గర్భిణులు 7388 మంది, బాలింతలు 7492 మంది ఉన్నారు.అలాగే 3 నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులు 20,127 మంది, 7 నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 35,482 మంది, 6 నెలల లోపు చిన్నారులు 6913 మంది ఉన్నారు.అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం వారిలో చినారులకు అంగన్వాడీ కేంద్రాలలో వండి పెడుతున్న మధ్యాహ్న భోజనంతో పాటు ఒక్కొక్కరికీ నెలకు 2.50 లీటర్లు పాలు ఇవ్వాలి. అలాగే బాలింతలు,గర్భిణులకు ఒక్కొక్కరికీ నెలకు 5 లీటర్లు చొప్పున పాలు అందజేయాల్సి ఉంది.ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 2,15,768 లీటర్ల పాలు అవసరమని అంగన్వాడీ కేంద్రాల టీచర్ల నుంచి నివేదికలు తీసుకుని ఆయా శాఖాధికారులు ఇండెంట్ పెట్టినట్లు సమాచారం.అయితే ఆ పాలు ఈ నెల 5వ తేదీ లోపు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా కావాల్సి ఉన్నా ఇప్పటికీ కేంద్రాలకు సరఫరా కాని పరిస్థితి ఉంది. దీంతో గర్భిణులు, బాలింతలు ప్రశ్నిస్తుంటే ఏం చెప్పాలో తెలియక అంగన్వాడీ కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు,బాలింతలకు రక్తహీనతకు గురికాకుండా నాణ్యమైన పౌష్టికాహారం అందజేయడమంటే ఇదేనా అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. -
ఎరువు ధర బరువైనా కరువే..!
సాలూరు రూరల్: ఎరువుల ధరలు గత ఏడాది కంటే ఈ ఏడాది పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎరువు కావాలంటే ఆన్లైన్లో ఆధార్కార్డు నమోదు చేసుకుని తీసుకునే పద్ధతితో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో పనులు చేసుకోవాల్సిన సమయంలో ఎరువులకోసం పడిగాపులు కాయాల్సి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బుధవారం సాలూరు మండల రైతులు ఎరువు కోసం ఉదయం 6 గంటలనుంచి గ్రోమోర్ సెంటర్ వద్ద పడిగాపులు పడ్డారు. అయితే షాపు 8 గంటలకు తెరవడం, అలాగే కొంత సమయం ఆన్లైన్ పనిచేయకపోవడంతో రైతులు విసిగిపోయారు. ఎట్టకేలకు పరిమితంగా యూరియా, డీఏపీ ఇవ్వడంతో రైతులు నిరుత్సాహంగా వెనుదిరిగారు. ఇలా చాలీ చాలని ఎరువులతో పంటలు ఎలా పండించగలమని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక ధరలతో భారం గతంలో ఉన్న ధరలకంటే ఈ ఏడాది ఎరువుల ధరలు దాదాపు సగానికి పైగా పెరిగిపోయాయి. అమోనియా గత ఏడాది రూ.700 నుంచి రూ.800 ఉంటే ఈ ఏడాది రూ.1200 నుంచి రూ.1400 వరకు అమ్ముతున్నారు. అలాగే రెడ్ పొటాష్ గత ఏడాది రూ.1400 ఉండగా ప్రస్తుతం రూ.2,200కు అమ్ముతున్నారు. అయినా కూడా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా రైతులను ఈ ప్రభుత్వం ఉసూరుమనిపిస్తోందని వాపోతున్నారు. రైతులపై ప్రభుత్వం చిన్నచూపు -
గురువుల భవితవ్యంపై అనిశ్చితి
గుమ్మలక్ష్మీపురం: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు రెన్యువల్ ఉత్తర్వులు జారీ కాకపోవడంతో ఆందోళన నెలకొంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై, తరగతులు కొనసాగుతున్నప్పటికీ.. ఉద్యోగ కొనసాగింపుపై స్పష్టత లేకపోవ డం వల్ల వందలాది మంది ఉపాధ్యాయులు అనిశ్చితిలో ఉన్నారు. వెంటనే రెన్యువల్ ఉత్తర్వులు జారీ చేసి, తమ సేవలకు భరోసా కల్పించాలని వారంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉద్యోగం ఉంటుందో..లేదో తెలియక మనోవేదనకు గురవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా సేవలు... రాష్ట్రవ్యాప్తంగా గిరిజన గురుకుల పాఠశాలల్లో సుమారు 15 నుంచి 20 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ విధానంలో 1,659 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరి సర్వీసును, సేవను గుర్తించని చంద్రబాబు ప్రభుత్వం.. 2025 మెగా డీఎస్సీలో నిబంధనలకు విరుద్ధంగా 1,143 గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల పోస్టులను కలిపి భర్తీ చేసింది. ఆ నియామకం వల్ల గిరిజన గురుకుల పాఠశాలల్లో అవుట్సోర్సింగ్ విధానంలో పని చేసిన వారి స్థానంలో డీఎస్సీలో ఎంపికై న రెగ్యులర్ ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. తమను యథావిధిగా విధుల్లో కొనసాగించాలన్న డిమాండ్తో అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులంతా సుమారు 45 రోజుల పాటు సమ్మె చేశారు. అప్పట్లో స్పందించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. 2025 డీఎస్సీ వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని చెప్పారు. ‘డీఎస్సీలో గురుకుల పాఠశాలల్లో ఉద్యోగం పొందిన వారితోపాటు ప్రస్తుతం అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా విధుల్లోనే ఉంటారు.. ఎవర్నీ తీయబోమ’ని హామీనిచ్చి, సమ్మెను విరమింపజేయించారు. దీంతో డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులతోపాటు అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు కూడా ఆయా పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో విధులు నిర్వహించారు. నేటికీ రాని ఉత్తర్వులు 2026–27 విద్యాసంవత్సరం ఈ నెల 12తో ప్రారంభమైంది. అవుట్ సోర్సింగ్ ఉపాధ్యా యులు ఆయా పాఠశాలలకు విధుల నిమిత్తం వెళ్లగా.. అక్కడి ప్రిన్సిపాళ్లు ‘ఉన్నతాధికారుల నుంచి రెన్యువల్ ఉత్తర్వులు రాలేదు. మీకు పోస్టులు లేవు. విధుల్లోకి తీసుకోలేమ’ని చెప్పే యడంతో వీరంతా కంగుతిన్నారు. చాలీచాలని వేతనాలతో.. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా రాత్రనక, పగలనక విధులు నిర్వహిస్తున్నారు. గిరిజన విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన తమ పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారిందని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా తమ ఉద్యోగం రెన్యువల్ ఉత్తర్వుల కోసం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. సరైన స్పష్టత లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సుమారు రెండు దశాబ్దాల నుంచి పని చేస్తున్న తాము.. ఒక్కసారిగా కుటుంబంతో పాటు రోడ్డున పడతామని వాపోతున్నారు. -
గడువులోగా లక్ష్యాలు పూర్తిచేయాలి
పార్వతీపురం: జిల్లాలోని పురపాలక సంఘాలకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠి న చర్యలు తీసుకుంటా మని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి హెచ్చరించా రు. ఈ మేరకు బుధవా రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్వచ్ఛత కార్యక్రమాలు, పారిశుధ్య నిర్వహణ, బల్క్ వేస్ట్ జనరేటర్ల రిజిస్ట్రేషన్ పురోగతిని సమీక్షించారు. పబ్లిక్, కమ్యూనిటీ మరుగుదొడ్ల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టిసారించి, నాలుగు వారాల సమగ్ర నివేదికను శుక్రవారం సాయంత్రంలోగా సమర్పించాలని ఆదేశించారు. బల్క్వేస్ట్ జనరేటర్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించి లక్ష్యాలను పూర్తిచేయాలని సూచించా రు. విధుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో మూడు మున్సిపాల్టీల కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలి జిల్లాలో వరి పంటకు బదులుగా రాగి, జొన్నలు, మొక్కజొన్న, కంది, పత్తి వంటి అధిక ఆదాయం ఇచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాదితో పోలిస్తే వరి సాగు విస్తీర్ణం 50శాతం మేర తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించా రు. అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథ కం లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నా రు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీశంకరరావు, జిల్లా ఉద్యానవన శాఖాధికారి జి. సత్యనారాయణరెడ్డి, జిల్లా పశుసంవర్థక శాఖాధికా రి సీహెచ్.దీనమయ్య తదితరులు పాల్గొన్నారు. జలవనరుల పునరుద్ధరణకు ప్రాధాన్యం జిల్లాలో ప్రతి నీటి చుక్కను సంరక్షించాల్సిన అవస రం ఉందని, జలవనరుల పునరుద్ధరణే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి సూచించారు. జలధార–జలహారతి పనుల్లో జిల్లా 94 శాతం ప్రగతితో ముందజలో ఉందని, మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 9,374 పనుల్లో 8,687 పనులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని, 3,268 పనులు పూర్తయ్యాయన్నారు. కురుపాం, భామిని, సాలూరు మండలాలు శతశా తం గ్రౌండింగ్ పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాయని పేర్కొన్నారు. ఇంకా ప్రారంభించాల్సిన 547 పనులను త్వరితగతిన చేపట్టాలని, ముఖ్యంగా సీతంపే ట, వీరఘట్టం మండలాల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తోటపల్లి దుస్థితి చూడండి : ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్
తోటపల్లి పాత రెగ్యులేటర్ దుస్థితి, ఆధునికీకరణ పనులు నిలిచిపోవడంపై ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు సమయానుకూలంగా సాగునీరు పొందడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. తోటపల్లి పాత రెగ్యులేటర్ కాలువ వ్యవస్థలోని ఎడమ, కుడి ప్రధాన కాలువల హెడ్ స్లూయిస్ షట్టర్లు రెండేళ్లుగా సరిగా పనిచేయడం లేదన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, కనీస మరమ్మతులు కూడా చేపట్టలేదని వివరించారు. ఫలితంగా నీటి నియంత్రణ లోపిస్తోందని, కాలువ వ్యవస్థ దెబ్బతింటోందని చెప్పారు. ఎల్ఎంసీ హెడ్ స్లూయిస్కు దిగువ భాగంలో ఉన్న రక్షణ గోడలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ కీలక అడ్డంకులను, ముఖ్యంగా ప్రధాన హెడ్ స్లూయిస్ షట్టర్లు పునరిద్ధరించి పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవస్థ కింద ఉన్న ఆయకట్టుదారుల్లో ఎక్కువమంది చిన్న, సన్నకారు రైతులే అని.. సమస్యలను తొందరగా పరిష్కరించకపోతే పంట ఉత్పత్తి, రైతుల ఆర్థిక స్థితి తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని వివరించారు. సమీక్ష సమావేశంలో శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, శాసనమండలి సభ్యులు గాదె శ్రీనివాసులు నాయుడు, పాలవలస విక్రాంత్, శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జాబ్మేళాకు విశేష స్పందన
రాజాం సిటీ: స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. 213 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 90 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఐటీఐ ప్రిన్సిపాల్ బి.భాస్కరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకుంటే జీవితంలో వేగంగా స్థిరపడగలరన్నారు. బైక్ ఢీ కొని వ్యక్తి మృతివిజయనగరం క్రైమ్: స్థానిక వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి కామాక్షినగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్సై లక్ష్మీ ప్రసన్న కుమార్ వెల్లడించారు. కణపాక ప్రాంతానికి చెందిన కోరాడ శంకరరావు అనే వ్యక్తి ముస్లింల శ్మశాన వాటికకు వెళ్లి తిరిగి వస్తుండగా కామాక్షినగర్ వద్దకు చేరుకునే సరికి ఓ మోటార్ సైకిల్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకర్రావుకు తీవ్ర గాయాలు కావడంతో తక్షణమే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. బైక్ నడిపిన వ్యక్తిని ‘ఢిల్లీ డేవిడ్’గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతుని బంధువు, కోరాడ అరవింద్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు బైక్ నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2026
వీరఘట్టం: ● ఈ ఏడాది ఏప్రిల్ 5న పిడుగుపాటుకు వీర ఘట్టం మండలం తెట్టంగి గ్రామంలో వ్యవసాయ పనులు ముగించుకుని వస్తున్న పైల అనసూయమ్మ అనే వ్యవసాయ కూలి బలైంది. వంగర మండలం ఎం.సీతారాంపురంలో పిడుగుపాటుకు ఓ ఇంటిలో వారంతా అపస్మారకస్థితికి చేరుకున్నారు. ● ఏప్రిల్ 6న పిడుగుపాటుకు బలిజిపేట మండలం శ్రీరంగపురం గ్రామానికి చెందిన మహిళా రైతు డి.సింహాచలం, వంగర గ్రామానికి చెందిన ఇనముల నరసమ్మ, వంతరాం గ్రామానికి చెందిన పార్వతి అనే మహిళా రైతు మృతి చెందారు. తెర్లాం మండలం విజయరాంపురంలో ఓ ఎద్దు కూడా మృతి చెందింది. ● ఈ నెల 9న కొత్తవలస మండలం చీపురవలసలో పశువుల శాలపై పిడుగుపడడంతో పాడి గేదె చనిపోగా, పశువుల పాక దగ్గమైంది. ● ఈనెల 12ను వీరఘట్టం మండలం నీలంపేట వద్ద పిడుగుపాటుకు 31 గొర్రెలు, మేకలు చనిపోయాయి. ● ఈనెల 13న రేగిడి మండలం కొండవలసలో క్రికెట్ ఆడుతున్న ఆమిటి పవన్ అనే విద్యార్థి పిడుగుపాటుకు గురై చనిపోయాడు. అదే రోజు బాడంగి మండలం భీమవరం గ్రామంలో పొలానికి వెళుతున్న భవానీ అనే మహిళ పిడుడుపడి అక్కడికక్కడే చనిపోయింది. ● భామిని మండలం సొలికిరి గ్రామ సమీపంలో క్రికెట్ ఆడుకుని ఇంటికి వస్తుండగా పిడుగుపడి రాజశేఖర్ అనే యువకుడు సోమవారం దుర్మరణం చెందాడు. అదే రోజు మొరకముడిదాంలో సాతంవలసలో పూరింటిపై పిడుగుపడి ఇంటిలో ఉన్న గౌరమ్మ అనే మహిళ మృతి చెందింది. మేఘావృతమై గర్జిస్తే చాలు జనం గుండెల్లో దడ పెరుగుతోంది. ఏ వైపు నుంచి పిడుగు పడుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఇటీవల కాలంలో మనుషులు, పశువులను పిడుగులు తాకుతుండడం భయాందోళనకు గురిచేస్తోంది. గతేడాది ఉమ్మడి విజయనగరం జిల్లాలో 20 మంది పిడుగుపాటుకు మృతిచెందగా, ఈ ఏడాది ఇంత వరకు 8 మంది చనిపోయారు. ఆటలాడుకునే విద్యార్థులు, పొలం పనులు చేసే కర్షకులు, పశువులు, జీవాల పెంపకందారులు అధికమంది పిడుగుపాటుకు గురవుతున్నారు. వాతావరణశాఖ పిడుగులు పడే ప్రాంతాల సమాచారాన్ని ముందస్తుగానే తెలియజేస్తున్నా.. నిరక్షరాస్యులైన కర్షకులు, పశువుల కాపర్లకు చేరక మృత్యు ఒడికి చేరుకుంటున్నారు. పిడుగు పాటు నుంచి తప్పించుకొనేందుకు ఎత్తైన ప్రదేశం నుంచి నేరుగా భూమిలో నేరుగా లైట్నింగ్ కండక్టర్ ఏర్పాటు చేయాలి. దీనివల్ల పిడుగులో ఉన్న విద్యుదావేశాన్ని భూమి తనలోకి ఆక్షరించుకుంటుంది. ఎత్తైన టవర్లు ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల పిడుగుపాటు నుంచి తప్పించుకుంటాం. – డాక్టర్ బి.కూర్మనాథ్, రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్, వీరఘట్టం పిడుగుపాటుకు గురైన వ్యక్తిని వెంటనే పొడి ప్రదేశంలో తిన్నగా పడుకోబెట్టాలి. తడి బట్టలు తీసివేయాలి. తలను ఒక పక్కకు తిప్పాలి. రెండు కాళ్లు ఒక అడుగు పైకి ఎత్తాలి. గాలి తగిలే ప్రదేశంలోఉంచి, అవసరమైతే నోటి ద్వారా గాలి ఊది ప్రథమచికిత్స చేయాలి. వెంటనే దగ్గరలో ఉన్న పీహెచ్సీకి తరలించి వైద్య సేవలు అందజేయాలి. – డాక్టర్ జె.రవీంద్రకుమార్, వైద్యులు, జిల్లా సర్వజన ఆస్పత్రి, పార్వతీపురం మెరుపు నుంచి ఏర్పడే అత్యధిక విద్యుత్ ప్రవాహమే పిడుగు. ఒక్కోసారి విద్యుదావేశం పేరుకుపోయిన మేఘాలకు సమీపంలో వ్యతిరేక విద్యుదావేశం మేఘాలు ఉన్నప్పుడు స్థిరంగా విద్యుత్ భూమి వైపు ప్రవహిస్తుంది. ఒక మిల్లీ సెకను కాలంలో మెరుపులతో కూడిన పిడుగు 20 వేల ఆంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని విడుదల చేస్తుంది. అప్పుడు ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత మీటరుకు 2 లక్షల ఓల్టులతో సమానం. మెరుపులు భూమి మీద పడినప్పుడు వస్తువులను బట్టి నష్ట తీవ్రత ఉంటుంది. పిడుగులు ఎక్కువగా క్యుములో నింబస్ మేఘాల వల్ల ఏర్పడతాయి. మేఘాల్లో మంచు, నీరు ఏర్పడినప్పుడు స్ట్రాటోస్పియర్లో చల్లని వాతావరణంలో విరుద్ధ విద్యుదావేశాలు ఏర్పడి స్ధిర విద్యుత్ ప్రవాహంగా మారతాయి. ఆ సమయంలో పిడుగులు ఏర్పడతాయి. – డాక్టర్ బి.ప్రదీప్, మెడికల్ ఆఫీసర్, వీరఘట్టం ప్రాణాలు తీస్తున్న పిడుగులు ‘మెరుపు’ వేగంతో గాలిలో కలుస్తున్న ప్రాణాలు కర్షకులు, విద్యార్థులకు చేరని పిడుగుల సమాచారం గతేడాది పిడుగుపాటుకు ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో 20 మంది మృత్యువాత ఈ ఏడాది ఇంత వరకు 8 మంది మృతి -
కేరళ రాష్ట్ర పంచాయతీల పాలనపై అధ్యయనం
విజయనగరం: సుపరిపాలనకు నిదర్శనంగా నిలిచే గ్రామ పంచాయతీల అభివృద్ధే దేశాభివృద్ధి అని ఉమ్మడి విజయనగరం జిల్లాపరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) పేర్కొన్నారు. అటువంటి గ్రామ పంచాయతీలను మరింత ప్రగతి పథంలోకి నడిపిస్తూ, గ్రామీణ ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం జిల్లా పరిషత్ నిరంతరం ఎన్నో సమీక్షలు, సమావేశాలు నిర్వహించిందని తెలిపారు. తద్వారా ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజలకు మంచి సుపరిపాలన అందించామన్నారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రజలకు ఇంకా మెరుగైన సుపరిపాలన అందించే లక్ష్యంతో, అందుకు అవసరమైన మరిన్ని ప్రణాళికలు రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో, గ్రామ పంచాయతీ ద్వారా ఉత్తమమైన సుపరిపాలనను అందిస్తున్న కేరళ రాష్ట్రంలోని అలుప్పుజా జిల్లాలో గల కంజికుజి గ్రామ పంచాయతీ గురించి తెలుసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రాదేశిక సభ్యులతో కలిసి మంగళవారం కంజికుజి గ్రామ పంచాయతీని సందర్శించినట్టు తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు నేతృత్వంలో జెడ్పీటీసీ సభ్యుల బృందానికి అలుప్పుజా జిల్లాలోని కంజికుజి గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షులు, వార్డు సభ్యులు, డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అశ్విన్, పంచాయతీ కార్యదర్శి డీఎఫ్ సుభాష్, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. పంచాయతీ ప్రజలతో జెడ్పీటీసీల ఆరా జెడ్పీటీసీ సభ్యుల బృందం తొలుత గ్రామ సందర్శన చేసి, కంజికుజి గ్రామంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించింది. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పౌర సేవలు, సంక్షేమ పథకాల గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంజికుజి గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి అక్కడి పంచాయతీ అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై గ్రామ పంచాయతీల బలోపేతం గురించి పలు అంశాలను వారి నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల బలోపేతంగ్రామ పంచాయతీల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును జెడ్పీటీసీల బృందం అధ్యయనం చేసింది. స్థానిక సంస్థల బలోపేతానికి కృషి ఈ పర్యటన ద్వారా అనేక అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం తమకు లభించిందని జెడ్పీటీసీ సభ్యులు తెలిపారు. కేరళలో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి తమ ప్రాంతాల్లో కూడా స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. నిత్యం ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించేలా తమకు మరింత అవగాహన పెంపొందించుకునేందుకు తన సొంత ఖర్చులతో కేరళ టూర్ ప్రోగ్రాం నిర్వహించిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు జెడ్పీటీసీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలుప్పుజా జిల్లా కంజికుజి గ్రామాన్ని సందర్శించిన జెడ్పీటీసీలు మరింత మెరుగైన సుపరిపాలన అందించే లక్ష్యంతో పర్యటన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
వేతనదారులకు ఉద్వాసన...!
● గణనీయంగా తగ్గిన ఉపాధి వేతనదారులు ● గత ఏడాది కంటే 61 వేల మంది తొలగింపు ● తగ్గిన 19 వేల జాబ్ కార్డులువిజయనగరం ఫోర్ట్: అడిగిన వారికి ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ జాబ్ కార్డు ఇస్తున్నాం. అడిగిన వెంటనే పని కల్పిస్తున్నామంటూ టీడీపీ సర్కార్ గొప్పలు చెప్పుకుంటుంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అడిగిన ప్రతి ఒక్కరికీ జాబ్కార్డు ఇచ్చి పని కల్పించినట్లయితే జాబ్ కార్డుల సంఖ్య ఏటా పెరగాల్సి ఉంది. తద్వారా వేతనదారుల సంఖ్య కూడా పెరగాలి. పెరగ డం మాట దేవుడెరుగు చంద్రబాబు ప్రభుత్వంలో జాబ్ కార్డులు, వేతనదారులు గణనీయంగా తగ్గిపోయారు. జాబ్కార్డులు, వేతనదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 61 వేల మంది తగ్గిన వేతనదారులు జాతీయగ్రామీణ ఉపాధి పథకంలో పనిచేసే వేలాది మంది వేతనదారులను టీడీపీ సర్కార్ తొలగించేసింది. 2025–26లో జిల్లాలో 3.53 లక్షలు జాబ్ కార్డులు ఉండేవి. 2026–27 నాటికి అందులో 19 వేల జాబ్ కార్డులను తొలిగించేశారు. దీంతో జాబ్ కార్డుల సంఖ్య 3.34 లక్షలకు చేరింది. 2025 –26 లో వేతనదారులు 5.95 లక్షలు ఉండేవారు. 2026–27 నాటికి 61 వేల మంది వేతనదారులను తొలిగించేశారు. దీంతో వేతనదారుల సంఖ్య 5. 34 లక్షలకు చేరింది. వలసలు వెళ్లారని వేతనదారుల తొలగింపు బతుకు తెరువు కోసం తాత్కాలికంగా వలస వెళ్లిన వారిని శాశ్వతంగా వెళ్లినట్లు నిర్ధారించి వేతనదారులను, జాబ్ కార్డులను తొలగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాది కాలంలో వేల సంఖ్యలో తొలగించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. వేతనదారుల సంఖ్యను తగ్గించడం ద్వారా వారికి పని కల్పించడం ద్వారా వెచ్చించే వ్యయం తగ్గుతుందనే వేతనదారులను తొలగించేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ సర్కార్ హయాంలో ఇబ్బందులే టీడీపీ సర్కార్ హాయంలో అనేక ఇబ్బందులు ఎదురువుతున్నట్లు వేతనదారులు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో టీడీపీ నేతలు చెప్పిన వారికే పని కల్పించడం. టీడీపీ నేతలు చెబితే పని ఆపివేయడం వంటివి చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకంలో పనిచేసిన మేట్లను పూర్తి స్థాయిలో మార్చేసినట్లు తెలుస్తోంది. నిబంధనలను పక్కన బెట్టి టీడీపీ నేతలు సూచించిన వారిని మేట్లుగా నియమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.డబుల్ ఎంట్రీలు తొలిగించాం శాశ్వతంగా వలస వెళ్లిన వారిని, మృతి చెందిన వారు, డబుల్ ఎంట్రీ ఉన్న వారి జాబ్ కార్డులు, వేతనదారులను తొలగించాం. – ఎస్. శారదాదేవి, డ్వామా పీడీ -
రిజిస్ట్రేషన్లో చేతివాటం.. నివేదికలో క్లీన్చిట్!
సాక్షి, పార్వతీపురం మన్యం: సాలూరులోని డగ్లస్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందనే ఆరోపణలు, మ్యుటేషన్ ప్రక్రియలో చోటు చేసుకున్న పరిణామాలు, శాఖాపరమైన విచారణలో ఫిర్యాదుదారుడు రేగు మహేష్ లేవనెత్తిన కీలక అంశాలకు సమాధానం లేకపోవడం వంటివి ఈ వ్యవహారంపై మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. సొంత శాఖ అధికారుల విచారణతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయా? లేక వివాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమే జరిగిందా? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఫిర్యాదుదారుడు లేవనెత్తిన కీలక అంశాలకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ నిబంధనల ప్రకారమే జరిగిందని అధికారులు క్లీన్ చిట్ ఇవ్వడం విమర్శలకు దారితీస్తోంది. అంతా సవ్యమైతే.. ఇన్ని రోజులు దాగుడు మూతలు ఎందుకు? గత నెల 16న సాలూరు ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్ రమణమూర్తి ఆధ్వర్యంలో పట్టణంలోని సర్వే నంబర్ 175/1లో 1.40 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. సాలూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ భూమిని వాణిజ్య భూమిగా కాక.. వ్యవసాయ భూమిగా పరిగణించి రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.5 కోట్ల మేర ఆదాయ నష్టం కలిగిందన్న ఆరోపణలున్నాయి. భూమి మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ విషయంలోనే అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ అంశాన్ని రెగ్యులర్ సబ్రిజిస్ట్రార్ నాగరాజు విచారణ సందర్భంగా జిల్లా రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయినప్పటికీ జిల్లా రిజిస్ట్రార్ పార్వతి.. తన నివేదికలో రిజిస్ట్రేషన్ నిబంధనల మేరకే చేశారని చెప్పుకోవడం వివాదాస్పదంగా మారింది. 1978లో ఏర్పాటైన డగ్లస్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్కు సంబంధించిన చైర్మన్ శామ్యూల్ గోడే వారసుడిగా, ఆయన కుమారుడు జోసెఫ్ డేనియల్ గోడేను రెవెన్యూ అధికారులు ధ్రువీకరించిన రికార్డులు లేవు. ఈ పరిస్థితుల్లో 2025లో కొత్తగా ఏర్పాటైన మరో సొసైటీ పేరుతో భూమి మ్యుటేషన్ జరగడం వెనుక కూడా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. గత నెల 16న మ్యుటేషన్ ప్రక్రియ పూర్తికావడం, అదే రోజు రెగ్యులర్ సబ్రిజిస్ట్రార్ నాగరాజు సెలవులో ఉండడం, ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ పూర్తి కావడం యాధృచ్ఛికమా లేక ప్రణాళికాబద్ధమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల పాత్రపై అనుమానాలు ఈ మొత్తం వ్యవహారంలో రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి ఆదేశాలు, ఒత్తిళ్లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మ్యుటేషన్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు జరిగిన చర్యలన్నీ ఉన్నతస్థాయి పర్యవేక్షణలోనే అయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం చేకూరిందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్పై ఎలాంటి శాఖాపరమైన చర్యలనూ జిల్లా రిజిస్ట్రార్ సిఫార్సు చేయకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలు, శాఖ ఉన్నతాధికారుల ప్రోత్సాహం వల్లే ఈ రిజిస్ట్రేషన్ జరిగిందని ఫిర్యాదుదరారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సర్వే నంబర్ 175/1లోని మొత్తం 3.14 ఎకరాల్లో 1.40 ఎకరాల రిజిస్ట్రేషన్ మాత్రమే అయ్యింది. ఇప్పుడు మిగిలిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. ఈ నేపథ్యంలో మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని, లేకుంటే న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని ఫిర్యాదుదారులు చెబుతున్నారు. సాలూరు ‘డగ్లస్’సొసైటీ స్థల వ్యవహారంలో నిజాలు దాచిన నివేదిక సొంత శాఖ అధికారులతో విచారణపై అనుమానాలు మ్యుటేషన్ మిస్టరీ... రిజిస్ట్రేషన్ రహస్యం -
ఐఐబీఎంిపీలో ప్రవేశాలకు నోటిఫికేషన్
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ–గురజాడలో అంతర్జాతీయ సమగ్ర బ్యాచిలర్ – మాస్టర్స్ ప్రోగ్రామ్ (ఐఐబీఎంపీ) 2026 ప్రవేశాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. జేఎన్టీయూ జీవీ జర్మనీలోని నాలెడ్జ్ ఫౌండేషన్–ర్యూట్లింగెన్ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐఐబీఎంపీతో విద్యార్థులు జేఎన్టీయూ–జీవీ నుంచి బీటెక్ డిగ్రీతో పాటు జర్మనీ ర్యూట్లింగెన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందే అరుదైన అవకాశాన్ని పొందనున్నారు. ఈ అంతర్జాతీయ విద్యా కార్యక్రమం విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య, విదేశీ విద్యా అనుభవం, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూపొందించిందని జేఎన్టీయూ జీవీ అధికారులు తెలిపారు. జర్మనీ విద్యావిధానం, పరిశోధన, పరిశ్రమలతో అనుసంధానమైన అభ్యాసంతో విద్యార్థుల భవిష్యత్తుకు మరింత బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు. అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లు బీటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – ఎంఎస్సి (ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్) బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్) – ఎంఎస్సి (డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్) కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు జేఎన్న్టీయూ–గురజాడ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో ర్యూట్లింగెన్ యూనివర్సిటీ, జర్మనీ నుంచి మాస్టర్స్ డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఫోన్ 78915 88999, 78914 88999 నంబర్లను, విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. -
ఆయిల్ మిల్లులో అగ్నిప్రమాదం
● తప్పిన పెనుప్రమాదంరాజాం సిటీ: మండల పరిధి సోపేరు రోడ్డులోని ఎస్ఆర్ ఆయిల్ ఫ్యాక్టరీలో మంగళవారం వేకువజామున 3 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు రావడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సిబ్బంది అంతా అప్రమత్తమై ఒక్కసారిగా పరుగులు తీశారు. వెంటనే రాజాం ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఈ ఘటనలో ఒక ట్రాన్స్ఫార్మర్తోపాటు ప్రయోగశాల పరికరాలు, ఎలక్ట్రికల్ ఫ్యానళ్లు, ఇండోర్ వీసీబీ, విద్యుత్ వైరింగ్ కాలిపోగా శ్లాబ్ కొంతభాగం పాడైంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫ్యాక్టరీ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ ఎస్సై అశోక్ తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2 కోట్లు మేర ఆస్తినష్టం సంభవించిందని అంచనా వేశామన్నారు. -
శరవేగంగా పైడితల్లి చదురుగుడి ప్రారంభ ఏర్పాట్లు
విజయనగరం టౌన్: స్థానిక మూడులాంతర్లు వద్దనున్న పైడితల్లి చదురుగుడి ఆలయ ప్రారంభ ఏర్పాట్లను దేవాదాయశాఖ సహాయ కమిషనర్, ఆలయ ఈఓ కె.శిరీష మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఈ నెల 23, 24, 25 తేదీల్లో అమ్మవారి చదురుగుడి ప్రారంభోత్సవం కనులపండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. 25న శిఖర ప్రతిష్ట మహోత్సవం తర్వాత నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులందరూ మూడురోజుల పాటు నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొని, తరించాలని కోరారు. -
రోడ్డుపై కూటమి కార్యక్రమం.. ట్రాఫిక్కు అంతరాయం!
విజయనగరం జిల్లా కేంద్రంలో మంగళవారం ట్రాఫిక్కు అంతరాయం నెలకొంది. బాలాజీ జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కు వెళ్లే దారిలో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి పేరిట కార్యక్రమం నిర్వహించడంతో ఆ దిశగా వాహనాల రాకపోకలు ఎక్కువయ్యాయి. రోడ్డుపైనే టెంటు వేసి, సభ పెట్టడంతో ఆ వైపుగా వెళ్లే వాహనదారులు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. ఎండలో చాలాసేపు వేచి ఉండాల్సి రావడంతో అధికార పార్టీది ఇదేం తీరు అని, రోడ్లపై ప్రజలను ఇబ్బంది పెట్టేలా సభలా అని అసహనం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ జామ్ కారణంగా రోడ్డుపై నిలిచిన వాహనాలు, వాహనదారులను ఈ చిత్రాల్లో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం -
అంతర్జాతీయ సదస్సులో పరిశోధన పత్రం ప్రదర్శన
విజయనగరం అర్బన్: స్థానిక గాజులరేగలోని సీతం ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్, డీన్ (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) డాక్టర్ వీజీ ప్రసూన అంతర్జాతీయ స్థాయి సదస్సులో తన పరిశోధన పత్రాన్ని సమర్పించి విశేష గుర్తింపు పొందారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ విశ్వవిద్యాలయం సహకారంతో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో నిర్వహించిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ‘డీప్ టెక్ స్టార్టప్ల కోసం ఆవిష్కరణ, వ్యవస్థాపకత: వ్యవస్థాపక విశ్వవిద్యాలయాల పాత్ర’ అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో డాక్టర్ ప్రసూన ‘ఫాగ్–ఎడ్జ్ డీప్–టెక్ ఎకోసిస్టమ్స్ కోసం ఏఐ–ఆధారిత స్వీయ–స్వస్థత సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్’ అనే శీర్షికతో పరిశోధన ప్రత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసూనను సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి అభినందించారు. -
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువు
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సాలూరు: మహిళలను ఎవరు దూషించినా, అసభ్యకరంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, మంత్రిలోకేష్లు రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న దాడులు, అకృత్యాలపై ఎందుకు స్పందించడం లేదని, ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. మహిళల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా అంతుచూస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు నేడు కనీసం స్పందించక పోవడం శోచనీయమన్నారు. పాలకొండ మండలం తుమరాడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ బిడ్డిక ఉషారాణిని దారుణంగా హత్య చేశారని, దీనిపై పార్వతీపురం మన్యంజిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజనులు పోరాటాలు చేస్తున్నారన్నారు. ఈ పోరాటాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, హోం శాఖమంత్రి అనిత, గిరిజనసంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణిలకు కనిపించకపోవడం, వినిపించకపోవడం శోచనీయమన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణం రెండు జిల్లాల గిరిజనులు ధర్నాలు, ఆందోళనలు చేసి ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ర్యాలీ లు, ధర్నాలు చేస్తూ గగ్గోలు పెడుతున్నా ఈ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. కనీసం నేటి వరకు ఆ కుటుంబాన్ని మంత్రులు సంధ్యారాణి,అనితలైనా పరామర్శించకపోవడం దారుణమని పేర్కొన్నారు. హత్యకు గురైన ఉషారాణి కుటుంబానికి రూ.5 కోట్లు ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని గిరిజన సంఘాలు పోరాటాలు చేస్తున్నాయని, వారి డిమాండ్లను ఈ ప్రభుత్వం పట్టించుకోదా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి వేతనదారుకు పాముకాటు
వంగర: మండల పరిధి ఓనె అగ్రహారం గ్రామంలో ఉపాధిహామీ పనులు చేస్తుండగా గ్రామానికి చెందిన పెడన ఈశ్వరమ్మ పాముకాటుకు గురైంది. ఈ మేరకు మంగళవారం స్థానిక బందకాలువ గట్టుపై పనులు చేస్తుండగా రక్తపింజర ఆమెను కాటు వేయడంతో వేతనదారులు పామును హతమర్చారు. బాధితురాలిని వంగర పీహెచ్సీకి తీసుకువెళ్లగా వైద్యాధికారిణి సుస్మిత దయానా ప్రాథమిక చికిత్స అనంతరం రాజాం సీహెచ్సీకి 108 వాహనంలో తరలించారు. సెల్ఫోన్ల రికవరీశృంగవరపుకోట: చోరీకి గురైన సెల్ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడంలో ఎస్.కోట పోలీసులు చురుగ్గా ఉన్నారు. ఇటీవల చోరీకి గురైన సెల్ఫోన్లను ట్రేస్ చేసి రూ.60వేల ఐక్యూ00, రూ.25వేల మోటోరోలా, రూ.16వేల వివో, రూ.20వేల రెడ్మీ, రూ.20వేల ఒప్పో, రూ.15వేల వివో, రూ.19వేల రియల్మీ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని ఎస్.కోట సీఐ నారాయణమూర్తి స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం ఫిర్యాదుదారులకు అందజేశారు. ఫోన్ల వాడకంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, తెతిసీతెలియక చేసే తప్పిదాలతో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని సూచించారు. సెప్టిక్ ట్యాంకర్ ఢీకొని ముగ్గురికి గాయాలుసీతంపేట: సెప్టిక్ ట్యాంకర్ ఢీ కొన్న సంఘటనలో ముగ్గురు గాయాలపాలయ్యారు. సీతంపేటలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. నాయుడు మల్లి గ్రామం నుంచి సీతంపేటకు విద్యుత్ లైన్మన్ పాలక నాగేశ్వరరావు ఆయన కుమారుడు రోహిత్ ద్విచక్రవాహనంపై వస్తున్నారు. కొత్తూరు నుంచి పాలకొండవైపు ఎదురుగా వస్తున్న సెప్టిక్ ట్యాంకర్ కొండపల్లి గ్రామం వద్దకు వచ్చేసరికి వారి బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఇదే క్రమంలో సైకిల్ తొక్కుకుని పక్క నుంచి కె.శివశంకర్ అనే విద్యార్థి వస్తుండగా ట్యాంకర్ తగిలి కిందపడడంతో స్వల్పగాయాలైనట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎస్బీఐ ఆధ్వర్యంలో ఉచిత ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ శిక్షణ విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన నిరుద్యోగ గ్రామీణ యువతీ యువకులకు ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఎస్బీఐఆర్సెటీ) సువర్ణావకాశం కల్పిస్తోంది. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోర్సుల్లో శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డి.భాస్కరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. మొత్తం 31 రోజుల పాటు సాగే ఈ ఉచిత శిక్షణలో ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ రంగాల్లో స్వయం ఉపాధి సాధించడానికి అవసరమైన పూర్తి స్థాయి నైపుణ్యాలను, మెలకువలను నిపుణులు నేర్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పదోతరగతి ఉత్తీర్ణులు లేదా ఫెయిల్ అయిన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి, గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో ఈనెల 17వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఫోన్ 9959521662, 9985787820 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
చెరువుల ఆక్రమణలపై కఠిన చర్యలు
● నిబంధనల ప్రకారం ముందుకెళ్లండి.. ● జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు సాక్షి, పార్వతీపురం మన్యం: చెరువుల ఆక్రమణల విషయంలో తరతమ భేదాలు వద్దని.. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన శాఖలతో పాటు నీటిపారుదల తదితర శాఖల ద్వారా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను, ప్రగతిని మంత్రికి వివరించారు. మంత్రి మాట్లాడుతూ.. రాజకీయాలతో సంబంధం లేకుండా చెరువుల ఆక్రమణపై దృష్టి సారించాలని హితవు పలికారు. కలెక్టర్ ప్రభాకరరెడ్డి తొలుత మాట్లాడుతూ.. చెరువుల ఆక్రమణలపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని, పార్వతీపురం ఎమ్మెల్యే కూడా ఇదే విషయం చెప్పారని తెలిపారు. జలధార–జల హారతి కార్యక్రమంలో భాగంగా.. చెరువుల హద్దులను గుర్తించి, ఆక్రమణలను తొలగిస్తామని కలెక్టర్ తెలిపారు. పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ.. నియోజక వర్గ కేంద్రంలో దేవుని బంద, బిళ్ల బంద చెరువుల ఆక్రమణల విషయంలో అధికారులు నోటీసులిచ్చి సరిపెట్టారని, తదుపరి చర్యలు తీసుకోలేదని వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. పట్టణంలో పలుచోట్ల కాలువలు, చెరువుల మీద అక్రమ కట్టడాలు ఉన్నాయని.. న్యాయంగా ముందుకు వెళ్లాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. ఇసుక తరలింపును అడ్డుకోవద్దు : ఎమ్మెల్యే ట్రాక్టర్లు, ఎడ్ల బళ్ల ద్వారా ఇసుకను తరలించుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్నారని.. పార్వతీపురంలోనే ఎందుకు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర లేవనెత్తారు. సీతానగరం మండలంలోని సువర్ణముఖి నది నుంచి ఇసుకను తరలిస్తే అధికారులు ట్రాక్టర్లను పట్టుకొని వారంరోజులపాటు ఉంచేస్తున్నారని.. ఇది సమంజసం కాదని చెప్పారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. నిబంధనల ప్రకారం వెళ్లాలని, అడ్డగోలుగా వ్యాపారం కోసం తరలిస్తుంటే చూస్తూ ఊరుకోవద్దని స్పష్టం చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉద్యోగి కుటుంబ సభ్యులకు టెండర్లు ఎలా కట్టబెడతారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రశ్నించారు. దీనిపై మంత్రి జోక్యం చేసుకుంటూ.. ఘటనపై ఆరా తీశారు. శాఖలోని ఉద్యోగులకే టెండర్లు ఇస్తే ఈ విధంగానే మాట పడాల్సి వస్తుందని అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పైనాపిల్, అరటి ఎగుమతులకు చర్యలు సీతంపేట గిరిజన ప్రాంతంలో పైనాపిల్ (అనాస) సాగు సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని, దానిపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పైనాపిల్, అరటి ఎగుమతులకు చర్యలు తీసుకోవాలన్నారు. జలధార – జలహారతి కార్యక్రమం శరవేగంగా సాగాలని తెలిపారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
శ్రీరస్తు.. శుభమస్తు
విజయనగరం: శుభముహూర్తాల సందడి ప్రారంభమైంది. వరుస మహూర్తాలు వస్తుండడంతో జిల్లాలో పెళ్లి సందడి ప్రారంభమైంది. అధిక జ్యేష్ఠ మాసంతో ఆగిన శుభ ముహూర్తాలు..మళ్లీ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. నిజ జ్యేష్ఠ శుద్ధ పాఢ్యమి నుంచి బహుళ త్రయోదశి జులై 12 వరకు సుముహూర్తాలు ఉన్నాయని వేద పండితుడు కామేశ్వర శర్మ పేర్కొన్నారు. శుభకార్యాలతో జిల్లా అంతటా సందడి మొదలు కానుంది. నిశ్చితార్థాలు, వివాహాలతో పాటు..నూతన గృహ ప్రవేశాలు, దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు చేపట్టనున్నారు. పలు పనుల శంకుస్థాపనకు ఇదే మంచి సమయం. జూన్ నెలలో 16,17, 19,20,21, 22, 24,25, 26,27, 28 తేదీల్లో జులై నెలలో 1,6,7,9,10, 12 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రెండు, మూడు నెలల ముందే వివాహ సంబంధాలు కుదుర్చుకున్న వారు ప్రస్తుతం కల్యాణ మంటపాలను మాట్లాడుకోవడంలో నిమగ్నమయ్యారు. బంగారు ఆభరణాలు, కొత్త దుస్తులు ఇతర సామగ్రి కొనుగోలు చేసే వారు వస్తుండడంతో జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల్లో వ్యాపారాలు జోరందుకోనున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి గిరాకీ పెరిగింది.మంచి ముహూర్తాలు ఉన్నాయి ఈనెల 16 నుంచి మంచి ముహూరాలు ప్రారంభమవుతున్నాయి. జులై 14 వరకు జిల్లా వ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లతో పాటు వివిధ శుభ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటికే చాలా మంది వివాహ ముహూర్తాలను నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జులై 14 నుంచి మూఢం ప్రారంభం అవుతుండగా..మళ్లీ శ్రావణం వరకు మంచి రోజులు లేవు. –పి.కామేశ్వర శర్మ, వేదపండితుడు ప్రారంభమైన శుభముహూర్తాల సందడి జులై 12 వరకు అన్నీ మంచి రోజులే -
సయోధ్య కుదిరినట్లేనా?
సాక్షి, పార్వతీపురం మన్యం: కొన్నాళ్లుగా పార్వతీపురం నియోజకవర్గంలో అధికారులు, ఎమ్మెల్యేకు మధ్య ఉన్న విభేదాలకు తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడినట్లు తెలుస్తోంది. జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ జోనల్ కో ఆర్డినేటర్ ఎ.రాధాకృష్ణల సమక్షంలో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చినట్లు సమాచారం. జిల్లా పర్యటనకు మంగళవారం మంత్రి అచ్చెన్నాయుడు, జోనల్ కో–ఆర్డినేటర్ ఎ.రాధాకృష్ణ వచ్చారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి విచ్చేశారు. సమావేశం ముందు, తర్వాత ప్రత్యేకంగా కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ ప్రభాకరరెడ్డి, టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలు.. ఎమ్మెల్యే విజయ్ చంద్ర – కలెక్టర్ ప్రభాకరరెడ్డి మధ్య ఉన్న విభేదాలు.. ఎమ్మెల్యే విజయ్ చంద్ర – టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి నడుమ వివాదాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. విభేదాలకు దూరంగా ఉండాలని హితవు పలికినట్లు సమాచారం. పార్వతీపురం పట్టణంలో స్థల రిజిస్ట్రేషన్లపై కలెక్టర్కు ఎమ్మెల్యే బహిరంగ సవాల్ విసిరారు. వాస్తవానికి డీఆర్సీ సమావేశంలో అధికారులపై ఎమ్మెల్యే విజయ్ చంద్ర బహిరంగంగానే విరుచుకుపడతారని అంతా భావించారు. రాజీ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలించడంతో సమావేశంలో చర్చ పెట్టి.. ఎమ్మెల్యే చెప్పిన మాట అధికారులంతా వినాల్సిందేనన్న భావనతో ముగించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్న మంత్రి మాట అధికారులకు ఉపశమనం కల్పించింది. డోలీలోనే మృత్యు ఒడికి కొమరాడ: డోలీలోనే ఓ గిరిజనుడు ప్రాణాలు విడిచిన విషాదకర ఘటన కొమరాడ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. నయా పంచాయతీ వాటాకోస్ గ్రామానికి చెందిన మెల్లిక వెంకటరావు(60) నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను కుటుంబ సభ్యులు గ్రామం నుంచి డోలీలో వనకబడికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి 108లో పార్వతీపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి మంగళవారం డోలీలో తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. దీంతో ఆయన భార్య పారమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ● హాజరుకానున్న 1801 మంది అభ్యర్థులు విజయనగరం అర్బన్: జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న రీ–నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 1,801 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్షను అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే 08922–236947 నంబర్ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. నీట్ అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం నీట్ రీ–ఎగ్జామ్కు హాజరయ్యే అభ్యర్థులకు ఆర్టీసీ ప్రత్యేక ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయనగరం నుంచి శ్రీకాకుళం, పార్వతీపురం, రాజాం, విశాఖపట్నం, గాజు వాక, కూర్మన్నపాలెం, ఎస్.కోట, ఆండ్ర, జక్కువ, సింహాచలం, అనకాపల్లి ప్రాంతాలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. వసంత, షికారుగంజి, బొప్పడాం, గరికివలస, కొండగండ్రేడు, కందివలస, చింతపల్లి, తిప్పలవలస తదితర గ్రామాల అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సు నడపనున్నట్లు వెల్లడించారు. -
మృత్యు పిడుగు
● పిడుగుపాటుకు ఇద్దరు బలి ● విషాదంలో కుటుంబ సభ్యులు భామిని/మెరకముడిదాం: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు చోట్ల సోమవారం సాయంత్రం పిడుగుల వాన కురిసింది. ఇద్దరి ప్రాణాలు తీసింది. శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేటకు చెందిన పెనుగుదురు రాజశేఖర్(20) భామిని మండల సొలికిరి గ్రామంలోని తాతగారి ఇంటికి వేసవిసెలవుల కోసం వచ్చాడు. సొలికిరి గ్రామ యువకులతో కలిసి వంశధార తీరంలో సాయంత్రం క్రికెట్ ఆడుతుండగా మేఘావృతమై వర్షం ప్రారంభమైంది. ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో రాజశేఖర్ పిడుగుపాటుకు గురయ్యాడు. వెంటనే మిగిలిన జట్టు సభ్యులు బాలేరు పీహెచ్సీకి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. యువకుడి మృతితో తోటి స్నేహితులు, తాత, అమ్మమ్మలు పూడి సింహాచలం, సరస్వతి బోరున విలపించారు. మెరకముడిదాం మండలంలోని సాతాంవలస గ్రామంలో సోమవారం సాయంత్రం పల్లికల గౌరమ్మ (53) పూరింటిపై పిడుగు పడింది. దీంతో పూరిగుడిసెలో ఉన్న గౌరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. గౌరమ్మ భర్త ఇదివరకే మృతి చెందగా, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బుదరాయవలస ఎస్ఐ జె.లోకేష్కుమార్ కేసునమోదు చేశారు. గిరిజన బిడ్డలకు హేతుబద్ధీకరణ కష్టాలు ● చదువుకు దూరమవుతున్న గిరిజన విద్యార్థులు సాక్షి, పార్వతీపురం మన్యం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హేతుబద్ధీకరణతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. హేతుబద్ధీకరణలో అశాసీ్త్రయత వల్ల గిరిజన పిల్లలు తీవ్రంగా నష్టపోనున్నారు. గతేడాది వరకు 3 నుంచి పదో తరగతి వరకు ఆశ్రమోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేవారు. హేతుబద్ధీకరణ కారణంగా ఈ ఏడాది అయిదు నుంచి పదో తరగతి వరకు కొన్ని, 3 నుంచి 7వ తరగతి వరకు ఇంకొన్ని ప్రత్యేకంగా పాఠశాలలు నడవనున్నాయి. ఒక్క పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోనే పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల్లోని 3 నుంచి 7వ తరగతి వరకు నిర్వహణకు గుర్తించిన పాఠశాలలు బీరుపాడు, గొరడ, కెమిశీల, కోసంగిభద్ర, ఎండభద్ర, పీటీమండ, రావికోన, నేరెళ్లవలస ఉన్నాయి. ఇవన్నీ మారుమూల కొండకోన ప్రాంతాల్లో ఉండటం వల్ల ఇష్టమైన పాఠశాలలో చదువుకునే అవకాశం పిల్లలకు ఉండదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో తమ బిడ్డలను ఎక్కడ చేర్చాలో తెలియక అయోమయానికి లోనవుతున్నారు. వీరిని చేర్చుకోవడంపై ఉపాధ్యాయులు కూడా సందిగ్ధంలో ఉన్నారు. హేతుబద్ధీకరణ వల్ల జియ్యమ్మవలస, కురుపాం మండలం టొంపలపాడు పాఠశాలలు పూర్తిగా మూసివేతకు గురవుతున్నాయి. ఐదో తరగతి వరకు కొనసాగించాలి.. హేతుబద్ధీకరణ వల్ల గిరిజన విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉందని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పాలక రంజిత్కుమార్, తాడంగి సాయిబాబు, బొండపల్లి జనార్దన ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లోని జీపీఎస్ పాఠశాలల్లో ఐదో తరగతి వరకు కొనసాగించి, అదనంగా మరో ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రతి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 6 నుంచి పదో తరగతి వరకు కొనసాగించాలని, కొన్నింటిని ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయాలని కోరారు. నేడు తల్లికి వందనంపై సమీక్ష పార్వతీపురం: పార్వతీపురంలోని జూనియర్ కళాశాల మైదానంలో తల్లికి వందనం పేరిట మంగళవారం ఉదయం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్లో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించనున్నట్టు తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా మంత్రి జి.సంధ్యారాణి, ప్రభుత్వ విప్ టి.జగదీశ్వరీ, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు పాల్గొంటారన్నారు. -
మన్యంపై జ్వరాల పంజా
పాచిపెంట: సీజన్ మారింది.. వానలు కురుస్తున్నాయి. గిరిజన గూడల్లోని తాగునీటి వనరులు కలుషితమవుతున్నాయి. కలుషిత నీటిని తాగిన ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ఏ గ్రామం చూసినా జ్వరపీడితులే దర్శనమిస్తున్నారు. విష జ్వరాలు విజంభిస్తుండడంతో అల్లాడిపోతున్నారు. ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. పాచిపెంట మండలంలోని గరిసిగుడ్డి పంచాయతీ పరిధి తాడివలస, జిలుకువలస గ్రామాలకు చెందిన సుమారు 25 మంది గిరిజన ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఇటీవల గురువునాయుడుపేట పీహెచ్కి గరిసిగుడ్డి పంచాయతీ నుంచి అధిక సంఖ్యలో జ్వర పీడితులు రావడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆయా గ్రామాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ జ్వరాలు అదుపులోకి రాకపోవడంతో, వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 15 మందికి మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సాలూరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కలుషిత నీరే దిక్కు... గ్రామాల్లో మంచినీటి పథకం బోర్లు ఉన్నప్పటికీ సక్రమంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో మంచినీటి పథకం బోర్లు పనిచేయడం లేదు. దీంతో సమీప వాగుల నుంచి తీసుకువచ్చిన కలుషిత నీరు తాగి విషజ్వరాల బారిన పడుతున్నాం. అధికారులు స్పందించి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని గరిసిగుడ్డి పంచాయతీ, జిలికవలస గ్రామ ప్రజలు కోరుతున్నారు. జ్వరపీడిత గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నాం. మలేరియాతో బాధ పడుతూ సాలూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గరిసిగుడ్డి పంచాయతీకి చెందిన గిరిజనుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. మరో రెండు రోజుల్లో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తాం. – శివకుమార్, నియోజకవర్గ హెల్త్ ప్రొగ్రాం ఆఫీసర్ ఒకే రోజు 495 ఓపీ నమోదు 132 మంది జ్వర పీడితులు 13 మందికి మలేరియా పాజిటివ్ సీతంపేట: స్థానిక ఏరియా ఆస్పత్రికి సోమవారం రోగుల తాకిడి ఎక్కువైంది. ఒకే రోజు 495 ఓపీ నమోదైంది. వీరిలో 132 మంది జ్వరంతో బాధపడుతుండగా, వైద్య పరీక్షల్లో 13 మందికి మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రోగులకు అవసరమైన వైద్యసేవలు అందించి మందులు పంపిణీ చేసినట్టు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు తెలిపారు. అవసరమైన వారిని ఇన్పేషెంట్లుగా ఉంచి సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఆస్పత్రులకు పెరుగుతున్న రోగులు వైద్యపరీక్షల్లో మలేరియా కేసుల నిర్ధారణ కలుషిత నీరే కారణ మంటున్న వైద్యులు -
హద్దులు గీద్దాం.. ఆక్రమణలను అడ్డుకుందాం
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోని చిన్న నీటిపారుదల చెరువుల పరిరక్షణ, నీటి నిల్వ సామర్థ్య పెంపు, ఆక్రమణల నివారణ లక్ష్యంగా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లాలో మొత్తం 2,816కు పైగా చెరువులున్నాయి. పార్వతీపురం, పాలకొండ, సాలూరు వంటి పట్టణాలతోపాటు, గ్రామాల్లోనూ అనేక చెరువులు ఆక్రమణలతో కుచించుకుపోతున్నాయి. దీనివల్ల వీటి పూర్తి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. ఫలితంగా వర్షాకాలంలో నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. రైతులు సాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చెరువుల అసలు హద్దులను గుర్తించేందుకు రెవెన్యూ శాఖ ద్వారా పెగ్ మార్కింగ్ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం చేపట్టింది. అనంతరం ఉపాధి హామీ పథకం వేతనదారులతో చెరువు హద్దుల వెంట సరిహద్దు కందకాలు తవ్విస్తున్నారు. ప్రస్తుతం 116 చెరువులకు సంబంధించి పెగ్ మార్కింగ్ పూర్తయ్యింది. 61 చెరువుల్లో సరిహద్దు కందకాల తవ్వకం ప్రారంభించారు. రెవెన్యూ, నీటిపారుదల, గ్రామ పంచాయతీ, ఉపాధిహామీ విభాగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాయి. చెరువుల రక్షణ, నీటి సంరక్షణ, రైతు సంక్షేమం లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీని ద్వారా చెరువుల హద్దులు స్పష్టంగా గుర్తించవచ్చు. భవిష్యత్తులో ఆక్రమణలను అరికట్టడంతో పాటు చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెరిగి రైతులకు మరింత సాగునీరు అందుబాటులోకి రానుంది. మిగిలిన అన్ని చెరువుల్లోనూ త్వరితగతిన పెగ్ మార్కింగ్, సరిహద్దు కందకాల పనులు పూర్తి చేయనున్నాం. – ఎన్.ప్రభాకరరెడ్డి, కలెక్టర్ -
న్యాయం కోసం పోరాటం
సీతంపేట: గిరిజన యువతి బిడ్డిక ఉషారాణిని అత్యంత దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సీతంపేటలో సోమవారం న్యాయపోరాట ర్యాలీ నిర్వహించారు. సంతమార్కెట్ నుంచి ఐటీడీఏ వరకు 2 కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. అనంతరం ఐటీడీఏ ముఖద్వారం వద్ద బైఠాయించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను బహిరంగంగా ఉరితీయాలని నినదించారు. బాధిత కుటుంబానికి రూ.5 కోట్లు ఎక్స్గ్రేషియో ప్రకటించి, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభు త్వ ఉద్యోగం ఇవ్వాలని జేఏసీ అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నిందితుల ఆస్తులను జప్తుచేసి ఉషారాణి కుటుంబానికి అప్పగించాలన్నారు. నిరసన ప్రదేశానికి కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్ చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని స్పష్టంచేశారు. అంతకముందు కలెక్టర్కు ఆదివాసీ నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ నాయకులు కె.ధర్మారావు, బి.ఉమామహేశ్వరరావు, ఎ.సుందరరావు, వాబయోగి, యూకే రవికుమార్, బి.రామ్మోహన్రావు, పి.పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల అవసరాలపై మౌనం.. ప్రైవేటు స్థలాలపై గళం!
● పార్వతీపురంలో ఏం జరుగుతోంది? ● ప్రజా సమస్యలు పక్కన.. భూములపై రాజకీయం ● ప్రశ్నిస్తున్న నియోజకవర్గ ప్రజలు సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం నియోజకవర్గంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా.. వాటిపై ప్రజా ప్రతినిధుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాగునీటి సమస్యలు, అస్తవ్యస్త రహదారులు, పారిశుద్ధ్య లోపాలు, డ్రైనేజీ వ్యవస్థ సమస్యలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వంటి అంశాల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిని పక్కనపెట్టి.. ప్రైవేటు స్థలాల రిజిస్ట్రేషన్ల అంశంపై రాజకీయ దుమారం రేపడం ఎంతవరకు సమంజసమనే చర్చ ప్రజల్లో సాగుతోంది. ప్రజల అవసరాలపై ఎందుకు మౌనం? గత 2024 ఎన్నికల సమయంలో అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని చెప్పిన ప్రస్తుత ఎమ్మెల్యే విజయచంద్ర.. అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సమస్యలపై పెద్దగా స్పందించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్వతీపురం మున్సిపల్ పాలక వర్గాన్ని రాజకీయ కక్షతో డమ్మీగా చేసి.. పట్టణంలో అభివృద్ధి పనులకు విఘాతం కలిగించారు. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కొరతపై ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ కనిపించడం లేదు. అభివృద్ధి కంటే వివాదాలకే ప్రాధాన్యమా? నియోజకవర్గంలో నిరుద్యోగం, తాగునీటి సమస్యలు, రోడ్ల దుస్థితి, పారిశుద్ధ్య సమస్యలు, ప్రభుత్వ సేవలలో జాప్యం వంటి అనేక అంశాలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిపై చర్చ జరగాల్సిన సమయంలో ప్రైవేట్ భూముల వ్యవహారాలే ప్రధాన రాజకీయ అజెండాగా మారడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ● నియోజకవర్గంలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. బలిజిపేట, సీతానగరం మండలాల్లోని నదుల నుంచి ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇది అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు నష్టం కలిగించేదే. దీనిపై ఏనాడూ ఎమ్మెల్యే నోరు మెదపలేదు. ● పార్వతీపురం పట్టణ నడిబొడ్డున మున్సిపల్ స్థలం మూడెకరాలు కబ్జాకు గురైంది. దీనిపై అధికార పార్టీ నేత హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి. రూ.కోట్ల విలువ చేసే వరహాలగెడ్డపై గెద్దలు వాలాయి. వీటిపై అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నా, నెల్లి చెరువును కప్పేస్తున్నా.. పెద్ద మనసుతో స్థానిక ఎమ్మెల్యే ప్రశ్నించిన దాఖలాలు లేవు. ● శివారు కాలనీలు, పట్టణంలోని పలు వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కాలనీల్లోని వీధుల్లో వర్షపు నీరు నిల్వ ఉండిపోతోంది. మురుగు కాలువల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో దుర్ఘంధంతోపాటు, దోమల బెడద వేధిస్తోంది. దీని గురించి అధికార పార్టీ నాయకులు పట్టించుకునే పరిస్థితి లేదు. ● వారానికి ఒకరోజు మున్సిపల్ కుళాయిల్లో తాగునీరు వస్తోంది. అది కూడా బురదనీరే దిక్కవుతోంది. గత పాలకవర్గ సమయంలోనే తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.2.41 కోట్లు మంజూరయ్యాయి. ప్రతిపాదిత పనులు చేయడానికి కౌన్సిల్ కూడా తీర్మానం తెలిపింది. రాజకీయ గ్రహణంతో గత పాలకవర్గం ఆమోదం తెలిపిన పనులకు అడ్డుకట్ట వేశారు. దీంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ప్రజల గొంతు తడిపేందుకు ఎమ్మెల్యే గానీ, ఇతర టీడీపీ నాయకులు గానీ ప్రయత్నించిన పరిస్థితులు కానరావడం లేదు. ● ప్రజాస్వామ్యంలో పాలకుల ప్రధాన బాధ్యత ప్రజాసమస్యలకు పరిష్కారం చూపడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం. ప్రైవేట్ భూముల రిజిస్ట్రేషన్లపై చట్టపరమైన సందేహాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం సహజమే. నియోజకవర్గంలో అందుకు భిన్నంగా సాగుతోంది. ప్రజల నిత్యజీవితాన్ని ప్రభావితం చేస్తున్న సమస్యలను పక్కనపెట్టి.. కేవలం స్థల వివాదాలనే ప్రధాన రాజకీయ అంశంగా మార్చడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న పార్వతీపురం నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది. ప్రైవేట్ లావాదేవీలపై రాజకీయ రగడ ఇటీవల ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన స్థలాల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో అధికార పార్టీకి చెందిన నాయకులు రాద్ధాంతం చేయడం చర్చనీయాంశంగా మారింది. అక్రమాలు జరుగుతున్నాయంటూ ఎమ్మెల్యే విజయచంద్ర తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఇతర సమస్యలను వదిలి.. భూముల చుట్టూనే తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోకస్ ఉంటుందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా, టీడీపీ జిల్లా కార్యాలయం స్థలంపై రగడ, అడ్డాపుశీల ఆక్రమణలంటూ వివాదం, వెంకంపేటలోని స్థలం రిజిస్ట్రేషన్.. ఇలా అన్ని విషయాల్లోనూ అధికార పార్టీకి ఎమ్మెల్యే వెనుకున్నారన్న విమర్శలున్నాయి. నియోజకవర్గ కేంద్రంతోపాటు.. సీతానగరం వంటి ప్రాంతాల్లో టీడీపీ వారికి కప్పం కట్టలేదని రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు నిలిచిపోతున్న ఉదాహరణలు కోకొల్లలు. తాజాగా ఓ స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో ఎమ్మెల్యే రూ.లక్షల్లో లంచం అడిగారని ఓ మహిళ సెల్ఫీ వీడియోను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. చట్టబద్ధంగా జరిగే ప్రైవేట్ ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు సంబంధిత శాఖల పరిధిలోని అంశాలని, వాటిలో ఏదైనా అక్రమం జరిగితే దానిని చట్టపరంగా ప్రశ్నించాల్సిందే తప్ప రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని పలువురు పేర్కొంటున్నారు. -
ఎనిమిదో తరగతి విద్యార్థి ఎస్సై అయ్యాడా?
● అధికారుల ’మ్యాపింగ్’ మాయాజాలం.. ● కళ్లెదుట తప్పు కనిపిస్తున్నా సరిదిద్దలేని దుస్థితిలో ప్రభుత్వ యంత్రాంగంపార్వతీపురం రూరల్: క్షేత్రస్థాయిలో వాస్తవాలు పట్టవు.. ఆన్లైన్లో రికార్డులు తప్పుల తడకలైనా సరిదిద్దే నాథుడు ఉండడు. చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగం పనితీరుకు, పాలకుల నిర్లక్ష్యానికి వీరఘట్టం మండలం తుడి గ్రామంలో జరిగిన ఈ ఘటనే సజీవ సాక్ష్యం. ఒకే గ్రామంలో ’అన్ను ప్రసాదరావు’ అనే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉండడమే ఈ అనర్థానికి మూలం. ఒక ప్రసాదరావు కుమారుడు సాత్విక్ ఎనిమిదో తరగతి చదువుతుండగా, మరో ప్రసాదరావు కుమారుడు పోలీసు శాఖలో ఎస్సైగా ఉన్నారు. కానీ, ప్రభుత్వ అధికారుల ’హౌస్ మ్యాపింగ్’ నిర్వాకం పుణ్యమా అని ఎనిమిదో తరగతి పిల్లాడు కాస్తా రికార్డుల్లో ’ఎస్సై’గా మారిపోయాడు. ఫలితంగా ఆ పేద విద్యార్థి సాత్విక్కు రావాల్సిన ‘తల్లికి వందనం’ సాయాన్ని గడిచిన రెండేళ్లుగా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నిలిపివేసింది. సాంకేతిక లోపంతో జరిగిన ఈ చిన్న తప్పును సరిదిద్దలేని చేతకానితనంలో పాలకుల వ్యవస్థ ఉందా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘తప్పు మీరే చేసి, శిక్ష పేద విద్యార్థికి వేస్తారా?‘ అంటూ బాధితుడు అధికారుల చుట్టూ రెండేళ్లుగా కాళ్లు అరిగేలా తిరుగుతున్నా కనీస స్పందన కరవైంది. ప్రభుత్వ పెద్దల మాటలు కోటలు దాటుతున్నా.. కింది స్థాయిలో కనీస సమస్యలు పరిష్కారం కావడం లేదు. విసిగిపోయిన ఇద్దరు ప్రసాదరావులు సోమవారం నేరుగా కలెక్టరేట్ మెట్లెక్కారు. మనుషులు ఎదురుగా కనిపిస్తున్నా.. సాక్ష్యాలు ఇంత స్పష్టంగా ఉన్నా.. ఓ చిన్న ఆన్లైన్ తప్పును సరిదిద్ది పేద విద్యార్థికి న్యాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం పాలకుల పనితీరుకు అద్దం పడుతోంది. -
బడుగులపై పిడుగు
● ఏడుగురు మహిళలకు అస్వస్థతవీరఘట్టం/పాలకొండ: ఉపాధి పనులకు వెళ్తున్న మహిళా వేతనదారులపై పిడుగుపడింది. ఈ ప్రమాదవార్త గ్రామంలో తెలియడంతో ఊరంతా ఒక్కసారిగా ఘొల్లుమంది. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్య చికిత్స సకాలంలో అందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ఊరంతా ఊపిరిపీల్చుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వీరఘట్టం మండలం అడారు పంచాయతీ పరిధి చేబియ్యంవలస గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఉపాధి పనులకు వెళ్తున్న ఏడుగురు మహిళలు పిడుగు పాటు బారిన పడి అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన గుడుపూరు జ్యోతి, చిన్ని సంగమ్మ, నాగళ్ల యశోదమ్మ, ముద్దాడ గంగమ్మ, నాగళ్ల లక్ష్మి, చిన్న గౌరమ్మ, నాగళ్ల సిమ్మమ్మలు గ్రామ సమీపంలో ఉన్న చెరువు వద్ద ఉపాధి పనులు చేసేందుకు వెళ్తున్న క్రమంలో వారికి సుమారు 50 మీటర్ల దూరంలో ఓ చెట్టుపై పెద్ద శబ్దంతో పిడుగు పడింది. దీంతో వారంతా ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే స్థానికులు వారిని బిటివాడ పీహెచ్సీకి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం 108 వాహనంలో పాలకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే క్షతగాత్రులకు చికిత్స అందజేశారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బంది ధనుంజయ, శంకరరావు, రేరాజు, రాములను క్షతగాత్రుల బంధువులు, వైద్యాధికారులు అభినందించారు. -
రక్తదానం ప్రాణదానం
● రెడ్ క్రాస్ చైర్మన్ వెంకటరమణ విజయనగరం ఫోర్ట్: రక్తదానం ప్రాణదానమని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కె. వెంకటరమణ అన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో సాధన యువజన సంఘం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అత్యధికసార్లు రక్తదానం చేసిన వ్యక్తులను సన్మానించారు. మనిషి మాత్రమే ఆపదలో ఉన్న సాటిమనషికి రక్తం దానం చేసి ప్రాణాలు కాపాడగలడన్నారు. రక్తాన్ని తయారు చేయలేం కాబట్టి రక్తదానం ద్వారానే రక్తం కొరతను తీర్చవచ్చునన్నారు. రక్తదానంపై అపొహలు విడనాడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ రావు, అకోక్, మణికంఠ, స్వామి, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. అదుపులో ఇద్దరు అనుమానితులు● స్వర్ణకారుడిపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం పార్వతీపురం రూరల్: చౌకగా బంగారం ఇప్పిస్తానని నమ్మించి..విజయవాడకు చెందిన స్వర్ణకారుడిపై ఇటీవల ఆంధ్ర–ఒడిశా సరిహద్దు బట్టివలస వద్ద దుండగులు దాడి చేసి రూ.2 లక్షలు దోచుకెళ్లిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒడిశాలోని అలమండ బ్లాక్ పిప్పల భద్ర గ్రామానికి చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నేరానికి ఉపయోగించిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీ వెనుక సుమారు పది మంది హస్తం ఉన్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. బాధితుడికి ’డమ్మీ రాజు’ పేరుతో వలవేసిన ఈ ముఠాకు గతంలో సదరు వ్యాపారితో ఏవైనా లావాదేవీలు ఉన్నాయా? లేక ఇతర చీకటి వ్యాపారాల నేపథ్యం ఉందా? అన్న కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. కేవలం ఈ ఘటనే కాకుండా, ఇటీవల సరిహద్దుల్లో జరిగిన పలు ఇతర నేరాలతో వారికి ఉన్న సంబంధాలపై కూడా విచారణ చేస్తున్నారు. ఒడిశా వైపు వెళ్లే మార్గాల్లోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తూ, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మిగిలిన నిందితులను పట్టుకునేందుకు చర్యలు వేగవంతం చేశారు. -
ఆశలన్నీ.. వరుణుడిపైనే...
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో నీటి నిల్వలు ఆశాజనకంగా లే వు. వర్షాలుపైనే నీటి నిల్వ ఆధారపడి ఉంది. ఈ నెల ఆరంభంలో స్వల్పంగా వర్షపాతం నమోదు కావడంతో ప్రాజెక్టులో అనుకున్న స్థాయిలో నీటి నిల్వలు లేవు. ప్రాజెక్టులో నీటి నిల్వలు ఇలా.. మడ్డువలస ప్రాజెక్టులో 65 మీటర్లు లెవెల్ కెపాసిటీ నీటి మట్టం ఉండాల్సి ఉంది. ప్రస్తుతం 62.19 మీటర్లు లెవెల్ నీటిమట్టం ఉంది. ఈ లెక్కన 1.22 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులో ఉంది. ప్రాజెక్టు పరిధిలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని తొమ్మిది మండలాల్లో 31వేల ఎకరాల ఆయకట్టు భూములున్నాయి. వీటన్నింటికీ సాగు నీరందించాలంటే సుమారు రెండు టీఎంసీల నీరు తక్షణ అవసరం. ప్రస్తుతం నీటినిల్వ తక్కువగా ఉండడంతో మరో 15 రోజులు నీటి సరఫరాలో ఆలస్యం ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.సాక్షి, పార్వతీపురం సెల్ : 90102 04441 -
అధికారులు ఎమ్మెల్యే
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రంలో పాలన ఏ స్థాయిలో అపహాస్యం పాలవుతోందో చెప్పడానికి పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలే సజీవ సాక్ష్యం. ఏకంగా అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడే, తన సొంత ప్రభుత్వ అధికారులపై బహిరంగ సవాళ్లకు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారులు ఒక మాట, ఎమ్మెల్యే ఇంకో మాట చెబుతూ.. ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నారు. వెంకంపేట స్థల వివాదంలో చట్టప్రకారమే నడుచుకుంటున్నామని అధికారులు పదేపదే స్పష్టం చేస్తున్నప్పటికీ, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అధికారులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలేం జరిగిందంటే..? పార్వతీపురం పరిధిలోని వెంకంపేటలో ఇరిగేషన్ శాఖకు చెందిన ప్రభుత్వ స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని, ఆ నిర్మాణాల వల్ల ఎగువన ఉన్న 500 ఇళ్లు నీట మునిగే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే రెండుసార్లు ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేశారు. అయితే, ఈ వివాదంపై జాయింట్ కలెక్టర్, ఎమ్మార్వో, రిజిస్ట్రార్ ఇప్పటికే పూర్తి క్లారిటీ ఇచ్చారు. సదరు స్థల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగానే జరిగిందని, అందులో ఎలాంటి అక్రమాలు లేవని అధికారికంగా ప్రకటించారు. వర్సెస్తన ప్రభుత్వమే నియమించిన కలెక్టర్, అధికారుల పనితీరుపై అధికార పార్టీ ఎమ్మెల్యేకే నమ్మకం లేకపోతే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ప్రభుత్వ యంత్రాంగం స్పష్టమైన ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా, అధికార పార్టీ ఎమ్మెల్యే తీరు మారలేదు. అధికారుల వివరణను బేఖాతరు చేస్తూ..నేరుగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎమ్మార్వో తదితరులకు ఎమ్మెల్యే ఆదివారం సామాజిక మాధ్యమాల్లో బహిరంగ సవాల్ విసిరారు. టెక్నికల్గా నిరూపిస్తే.. బహిరంగంగా నా చెంపలు వేసుకోవడానికి సిద్ధం‘ అంటూ సవాళ్లు విసరడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ఏది ఏమైనా.. అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం ప్రభుత్వ ప్రతిష్టను బజారున పడేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కలెక్టర్కు అధికార పార్టీ ఎమ్మెల్యే సవాల్ ముక్కున వేలేసుకుంటున్న స్థానిక ప్రజానీకం సొంత అధికారుల పైనే ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కన్నెర్ర తేల్చుకుందామంటూ సవాల్ -
ఎత్తిపోతల ఎత్తేశారా..?
● రెండేళ్లుగా జంఝావతి సాగునీరందక రైతుల ఆందోళనకొమరాడ: మండలంలోని రాజ్యలక్ష్మీపురం గ్రామం వద్ద జంఝావతి నదిపై 1976లో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టగా ఒడిశాతో ఏర్పడిన చిక్కుముడితో ఆ నిర్మాణం కాస్తా అసంపూర్ణంగా అగిపోయింది. ఎన్నో ప్రభుత్వాలు మారినా కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ నేపథ్యంలో దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని 2006లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో జంఝావతిపై రబ్బర్ డ్యాం ఏర్పాటు చేసి లోలెవెల్ కెనాల్ ద్వారా 12 వేల ఎకరాలకు సాగు నీరు అందించారు అప్పట్లో కుడికాలువకు ఎత్తి పోతల పథకం ఏర్పాటు చేసి దాని ద్వారా రాజ్యలక్ష్మీపురం, కుమ్మరిగుంట, కందివలస, కంబవలస, కోనవలస తదితర గ్రామాల రైతులకు సుమారు 800 ఎకరాలకు సాగునీరు కోసం మోటార్లు అమర్చి సాగు నీరు అందించే వారు అయితే గడిచిన రెండేళ్లుగా ఎత్తి పోతల పథకం ద్వారా సాగునీరు అందక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఎండలు త్రీవంగా ఉండడంతో ఎత్తిపోతల పథకం ద్వారా నీరు రాకపోతే సుమారు 800 ఎకరాల్లో పంటనష్ట పోయే ఆస్కారం ఉంది. ఇప్పటికే అధికారులకు ఎంతలా మొరపెట్టుకున్నప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదని ఈ ప్రాంత రైతులు వాపోతున్నారు. జంఝావతి రిజ్వయర్పై ఉన్న ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న తమకు గడిచిన రెండేళ్లుగా నిరాశే ఎదురవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జంఝావతి ఎత్తిపోతల పథకం త్రీవ నిర్లక్ష్యానికి గురైందని ప్రతి ఏడాది సాగు సీజన్ ప్రారంభమైనప్పడల్లా సాగునీరు కోసం ఎదురుచూడవలసిన పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. ఆ పథకం నిర్వహణ, మరమ్మతులు, విద్యుత్ సరఫరా వంటి ఆంశాల్లో అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల సాగునీరు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా జంఝావతి అధికారులు నిర్లక్ష్యం వీడి రైతులకు సాగునీరు అందివ్వాలని కోరుతున్నారు. గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ నాయకులు ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరందించేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. జంఝావతి నదిపై నిర్మాణం చేసిన రిజర్వాయర్ను ఎన్నో ప్రభుత్వాలు గాలికి వదిలేస్తే మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి పుణ్యామా అని రబ్బర్ డ్యాం నిర్మాణం చేసి ఈ ప్రాంత రైతులకు మేలు చేశారు. ప్రతి ఏడాదీ సాగునీరు పుష్కలంగా అందించేవారు. జంఝావతి అధికారుల నిర్లక్ష్యంతో గత రెండేళ్లుగా ఎత్తిపోతల పథకం నిర్వహణ గాలికి వదలేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే సాగునీరు అందించకపోతున్నారు. దీని వల్ల మా ప్రాంత రైతులు సాగునీరు అందక త్రీవంగా నష్టపోతున్నాం. –వంగల ఈశ్వర్ రావు, రైతు -
చాకుతో బెదిరించి బంగారం, డబ్బు దోపిడీ
కొత్తవలస: తన ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నిల్చున్న ఒక వ్యక్తి వద్దకు ఇద్దరు యువకులు స్కూటీపై వచ్చి చాకు, బీరు బాటిల్ చూపించి భయపెట్టి ఆ వ్యక్తి జేబులో గల రూ.800 నగదు, చేతికి ఉన్న పావుతులం బంగారు ఉంగరం, సెల్ఫోన్ దోచుకుని పారిపోతూ పోలీసులు వెంబడిస్తున్నారన్న ఆందోళనలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ప్రధాన నిందితుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు గాయాల పాలయ్యాడు. కొత్తవలస పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై ఎస్సై జోగారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరానికి చెందిన అముజురు శంకర్సాయి అనే యువకుడు ఆఫ్టింగ్ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.ఈ క్రమంలో శనివారం రాత్రి వేరొకరికి చెందిన కారులో ప్రయాణికులను అనకాపల్లిలో దింపి అక్కడే కారును వదిలేసి వేరే వ్యాన్లో కొత్తవలస వరకు వచ్చాడు. అప్పటికే తెల్లవారుజాము సుమారు 3 గంటలైంది. అక్కడి నుంచి వేరే వాహనం దొరికితే విజయనగరం వెళ్లిపోదామనే ఉద్దేశంతో కొత్తవలస జంక్షన్లో వేచి ఉండగా ఇద్దరు యువకులు స్కూటీపై వచ్చి శంకర్సాయిని బెదిరించి దోచుకున్నారు. ఇంతలో అటుగా వస్తున్న పోలీసులను చూసి తమను వెంబడిస్తున్నారని భావించి ఆందోళన చెంది ఎస్.కోట రూట్లో జోరుగా వెళ్తుండగా ఫైర్స్టేషన్ వద్దకు వెళ్లే సరికి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. దీంతో స్కూటీ నడుపుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె.రోహిత్(19) అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చున్న విశాఖపట్నం జిల్లాకు చెందిన గొంప కుమార్స్వామి(22) తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు గుర్తించారు.అలాగే ఆటో డ్రైవర్ బి.కొండలరావు, అందులో ప్రయాణిస్తున్న ఆయన భార్య చిన్నతల్లికి గాయాలు కావడంతో విశాఖపట్నం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన నిందితుడు రోహిత్పై విశాఖపట్నం, విజయనగరం,అనకాపల్లి జిల్లాల్లో గల పలు పోలీస్స్టేషన్లో 8 కేసులు నమోదైనట్లు ఎస్సై తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆటో ఢీకిని ఒక నిందితుడి మృతి -
పేదల బియ్యం పందికొక్కుల్లా..!
విజయనగరం ఫోర్ట్: ఈనెల 6వతేదీన గంట్యాడ మండలం రామభద్రపురంలో పీడీఎస్ బియాన్ని ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా సీఎస్డీటీ పట్టుకున్నారు. ఆటోలో ఉన్న 731 కేజీల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసిన ముమ్మిడి శెట్టి నూకరాజుపై 6ఎ కేసు నమోదు చేశారు. ● రాజాం నుంచి పొందూరు వైపు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అందులో ఉన్న 1040 కేజీల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. పీడీఎస్ బియ్యం విక్రయించిన వెంకటరావు, సురేష్, కృష్ణారావులపై కేసులు నమోదు చేశారు. ● గత ఏడాది బొండపల్లి మండలం కొండకిండాం, కిండాం ఆగ్రహారంలో 149 క్వి్ంటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. అయితే మొత్తం బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేసిన నార సంచులతోనే అక్రమంగా తరలించడం అప్పట్లో సంచలనమైంది. అయినప్పటికీ నార సంచులతో నేరుగా తరలించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇవి అధికారులు అడపాదడపా చేసిన తనిఖీల్లో పట్టుబడినవి. గుట్టుగా జిల్లాలో పీడీఎస్ బియ్యం రాకెట్ పెద్ద ఎత్తున జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీడీఎస్ బియ్యం వ్యాపారులకు పచ్చ నేతల అండదండలు ఉన్నాయని సమాచారం. అందుచేతనే జిల్లాలో పీడీఎస్ బియ్యం తరలించే వ్యాపారులు జంకూబొంకు లేకుండా ఇష్టారాజ్యం అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలకు అనుకూలంగా ఉన్నవారు పట్టుబడినా వారిని గుట్టుగా విడిపించేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తూతూమంత్రంగా తనిఖీలు పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపును అరికట్టాల్సి న పౌరసరఫరాల శాఖ అధికారులకు ప్రతినెలా వ్యాపారులు వాటాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే తనిఖీలు కూడా తూతుమంత్రంగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల కళ్ల ముందే పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం తరలిపోతున్నా పట్టించుకోవడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పీడీఎస్ బియ్యం తరలించే వ్యాపారుల వివరాలు కూడా పౌరసరఫరాల అధికారుల వద్ద ఉన్నప్పటికీ అక్రమ తరలింపు ఆగడం లేదంటే ఏమనుకోవాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు కన్నెర్ర చేస్తే కచ్చితంగా పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపునకు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయ పడుతున్నారు. రీసైక్లింగ్ చేసి తరలింపు పీడీఎస్ బియ్యాన్ని బియ్యం వ్యాపారులు కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ బియ్యాన్ని వారు రీ సైక్లింగ్ చేసి ప్రభుత్వానికే మళ్లీ విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం చాలా మంది అధికారులకు కూడా తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో రైస్ కార్డులు 5,77,487 జిల్లాలో 1249 రేషన్ షాపులు ఉన్నాయి. వాటి పరిధిలో 5,77,487 రైస్ కార్డులు ఉన్నాయి. లబ్ధిదారులకు నెలకు సుమారు 8,222 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతాయి. అందులో నెలకు సుమారు 4 వేల మెట్రిక్ టన్నుల వరకు పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నేతల కనుసన్నల్లో పీడీఎస్ బియ్యం దందా ప్రభుత్వం సరఫరా చేసిన సంచులతోనే పక్కదారి పట్టుబడిన వారిపై చర్యలు శూన్యం రెచ్చిపోతున్న బియ్యం వ్యాపారులుప్రతినెలా ఆకస్మిక తనిఖీలు ప్రతినెలా సీఎస్డీటీలు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. పీడీఎస్ బియ్యంతో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. పీడీఎస్ బియ్యం తరలించడం నేరం. జి.మురళీ నాథ్, జిల్లా పౌరసరఫరా అధికారి, విజయనగరంజిల్లాలోనే అత్యధికంగా బియ్యం దందా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కంటే విజయనగరం జిల్లాలోనే రేషన్ బియ్యం అక్రమ తరలింపు దందా ఎక్కువగా జరుగుతోందని సమాచారం. పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసిన వ్యాపారులు జిల్లా నుంచి విశాఖపట్నం, తూర్పు గోదావరి, ఒడిశాలోని జిల్లాలకు బియ్యం తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పొరుగున ఉన్న విశాఖపట్నం జిల్లాలోని రైస్ మిల్లులకు అత్యధికంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది.


