breaking news
Parvathipuram manyam District News
-
చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి
విజయనగరం: విధి నిర్వహణలో చిత్తశుద్ధితో వ్యవహరించి పని చేసేచోట గుర్తింపు పొందాలని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హితవు పలికారు. ఈ మేరకు జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్లో పలువురికి కారుణ్య, పదోన్నతుల నియామక పత్రాలను శుక్రవారం అందజేశారు. ఇందులో భాగంగా వేపాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సేవలందిస్తూ మరణించిన బయాలజీ ఉపాధ్యాయుడు డి.కన్నయ్య కుమారుడు సింహాచలానికి వియ్యంపేట జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో సహయకుడిగా కారుణ్య నియామకపత్రాన్ని అందజేశారు. అదేవిధంగా మెరకముడిదాం మండల పరిషత్ కార్యాలయంలో సహాయకుడిగా పని చేస్తున్న టి.రాములుకు మెరకముడిదాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ల్యాబ్ అసిస్టెంట్గా, బలిజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వీపర్గా పని చేస్తున్న జి.ప్రమీలకు పాల్తేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రికార్డ్ అసిస్టెంట్గా పదోన్నతి కల్పిస్తూ నియామకపత్రాలు అందజేశారు. విజయనగరం మండల పరిషత్ కార్యాలయంలో సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న కె.శ్రీనివాసరావుకు పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రికార్డ్ అసిస్టెంట్గా నియామకం పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ బీవీవీ.సత్యనారాయణ పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఇటీవల విశాఖలోని రైల్వే స్టేడియంలో జరిగిన 6వ అంతర్ జిల్లాల సబ్ జూనియర్స్ బాల, బాలికల పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు 8 పతకాలు కై వసం చేసుకున్నారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం దక్కించుకున్న బి. సచిన్ వచ్చేనెల 7 నుంచి 14వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని నొయిడాలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. అదేవిధంగా పోటీల్లో ఎన్.దేవకి, వి.జాహ్నవిలు వెండి పతకాలు దక్కించుకోగా..పి.లోకేష్, పి.దుర్గాప్రసాద్, వర్ధన్, ఆర్.యశ్వంత్, బి.గౌతమ్ గణేష్లు కాంస్య పతకాలు సాధించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించడంతో పాటు జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, కార్యదర్శి ఇందుకూరి అశోక్రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్ఈ.రాజు, శాప్ కోచ్ బి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయపోటీలకు ఎంపికై న సచిన్ -
నేడు బేరం పెట్టారు?
మొన్న తీసేశారు.. ● కేజీబీవీలో పోస్టు రూ.లక్ష అంట! సాక్షి, పార్వతీపురం మన్యం: సాలూరు మండలం కరాసువలస కేజీబీవీలో రాజకీయ కారణాలతో ఎస్ఓ, నలుగురు కుక్లను తొలగించిన విషయం విదితమే. ఎస్ఓ తొలగింపు అన్యాయమని గిరిజన, ఉపాధ్యాయ సంఘాలు ఘోషిస్తున్నప్పటికీ.. వెనుకడుగు వేయలేదు. పోస్టు లు తొలగించి ఎన్ని రోజులూ కాలేదు. అప్పుడే వాటికి ‘తమ్ముళ్లు’ బేరం పెట్టేశారు. కుక్ పోస్టుకు సైతం రూ.లక్ష చొప్పున రేటు కట్టారన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. అన్యాయంగా మరొకరి పొట్ట కొట్టడమే కాక.. తమ కడుపు నింపుకొనేందుకు చిన్న పోస్టులను సైతం అమ్మకాలకు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టలేని కూటమి నేతలు.. ఉద్యోగులపై పడుతున్నారు. ప్రధానంగా చిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఏళ్ల తరబడి కాంట్రాక్టు, అవు ట్ సోర్సింగ్ ఉద్యోగాలను నమ్ముకుని కుటుంబాల ను పోషించుకుంటున్న వారిపై కక్ష గడుతున్నారు. వారిని నిర్ధాక్షిణ్యంగా తొలగించి, ఆ స్థానాల్లో తమ వారిని నియమించుకుంటున్నారు. ఉపాధి హామీ, వెలుగు, కేజీబీవీలు, కంప్యూటర్ ఆపరేటర్లు.. ఇలా ఏ విభాగాన్నీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా వెనక్కి తగ్గడం లేదు. అధికారులు సైతం ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కరాసువలస కేజీబీవీని సందర్శించారు. భోజనం నాణ్యత బాగోలేదన్న కారణాన్ని చూపి, ఎస్ఓతో పాటు.. సిబ్బందిని సస్పెండ్ చేయాలని అప్పటి నుంచి మంత్రి పట్టుపట్టారు. చివరికి పంతం నెగ్గించుకున్నారు. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆదివాసీ ఉద్యోగులపై కక్ష సాధింపు కరాసువలస కేజీబీవీ ఎస్ఓ ప్రశాంతి సస్పెన్షన్ను తక్షణమే ఎత్తివేయాలని ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ నాయకులు మువ్వల అమర్నాథ్, గిరిజన సంక్షేమ సంఘ నాయకులు పాలక రంజిత్కుమార్, తాడంగి సాయిబాబు, గిరిజన విద్యార్థి సంఘ నాయకులు పల్ల సురేష్, గిరిజన అభ్యుదయ సంఘ నాయకులు ఆరిక చంద్రశేఖర్, ఐక్యవేదిక నాయకులు ఆరిక విప్లవకుమార్, ఏఐఎస్ఎఫ్, టీఆర్ఎఫ్ నాయకులు బి.రవికుమార్, ఇంటికుప్పల రామకృష్ణ, సింహాచలం, గిరిధర్ తదితరులు డిమాండ్ చేశారు. ఎస్ఓ తప్పు లేదని అధికారులు నివేదిక ఇచ్చినప్పటికీ.. ఎందుకు సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. ఆదివాసీ విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి, ఉపాధ్యాయ శిక్షణలు పూర్తి చేసి, ఉద్యోగం సంపాదించి, నిజాయితీగా పని చేస్తున్నారని.. చిన్న కారణాలతో వారిని సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే మెమో జారీచేసి వివరణ కోరాలని.. అప్పటికీ సంతృప్తి చెందకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇటువంటివేవీ లేకుండా, ఏకంగా సస్పెండ్ చేయడం వెనుక ఇతర కారణాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఆదివాసీ ఉద్యోగుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించకుండా వెంటనే సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. -
పశువుల వాహనం సీజ్
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని వెంకంపేట జంక్షన్ వద్ద అక్రమంగా పశువులు తరలిస్తున్న వాహనాన్ని పశు సంవర్థక శాఖ అధికారు లు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. బొబ్బిలి నుంచి కాకినాడ జిల్లాలోని ఓ ప్రాంతానికి అనుమతి తీసుకుని పార్వతీపురం మీదుగా పశువుల తరలించడా న్ని ప్రశ్నించారు. వాహనాన్ని పార్వతీపురం పట్టణ పోలీసులకు అప్పగించారు. పట్టణ ఎస్సై గోవింద వాహనాన్ని అదుపులోకి తీసుకు ని అందులో ఉన్న 32 గేదెలను పట్టణ శివారు లో ఉన్న మార్కెట్ యార్డుకు తరలించారు. వివరాలు సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. -
లైసెన్స్ రద్దు చేస్తాం
దుకాణాల్లో నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే దుకాణం లైసెన్స్ రద్దు చేస్తాం. మందులు కొనుగోలు చేసిన రైతులకు దుకాణం పేరుతో పాటు యజమాని సంతకంతో కూడిన బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలి. పురుగు మందులు తీసుకునేటప్పుడు డబ్బాపై ఉన్న వివరాలను పూర్తిగా పరిశీలించాలి. చదువు రాని వారు తెలిసిన వారికి చూపించి అది ఏ కంపెనీదో నిర్ధారించిన తర్వాతనే కొనుగోలు చేయాలి. వ్యవసాయాధికారుల సూచన ప్రకారమే మందు పిచికారీ చేయాలి. లేకుంటే పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. శ్యామ్ప్రసాద్, ఏడీఏ, బొబ్బిలి -
ప్లాస్టిక్ సంచుల గొడౌన్లో అగ్నిప్రమాదం
● అదుపులోకి రాని మంటలు ● ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బందివీరఘట్టం: వీరఘట్టం యూనియన్ బ్యాంకు పక్కనే ఉన్న ప్లాస్టిక్ సంచుల గొడౌన్లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. గొడౌన్లో విలువైన ప్లాస్టిక్ పైపులతో పాటు పాలిథిన్ సంచులకు నిప్పు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.ఈ మంటలను అదుపు చేసేందుకు పాలకొండ ఫైర్ ఆఫీసర్ జామి సర్వేశ్వరరావు తన సిబ్బందితో వచ్చి అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే మంటలు అదుపు కాకపోవడంతో పాటు రెట్టింపు మంటలు చెలరేగడంతో సమీప ఇళ్ల వారు భయాందోళన చెందుతున్నారు. అయితే అగ్నిప్రమాదం ఏవిధంగా జరిగిందో తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదాన్ని చూసేందుకు స్ధానికులు సంఘటనా స్ధలానికి రావడంతో ఫైర్ అధికారులకు కొంత ఆటంకం కలిగింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.18 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు గొడౌన్ యజమాని వాపోతున్నాడు. -
అక్షరాంధ్రతో శతశాతం అక్షరాస్యత
విజయనగరం అర్బన్: అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో శతశాతం అక్షరాస్యతను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అక్షరాంధ్ర ప్రత్యేక కార్యక్రమం ద్వారా దశలవారీగా జిల్లా ప్రజలందరినీ అక్షరాస్యులను చేయాలని సూచించారు. దీనిలో భాగంగా మొదటి విడత సుమారు లక్షన్నర మందిని అక్షరాస్యులను చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. ఈ మేరకు అక్షరాంధ్ర కార్యక్రమంపై కలెక్టర్ తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమం అమలుకు చేస్తున్న ఏర్పాట్లపై చర్చించారు. ఉపాధిహామీ వేతనదారులు, వెలుగు, మెప్మా, మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీ ఆయాలు, ఆ శాఖ ద్వారా లబ్ధి పొందుతున్న గర్భిణులు, బాలింతల్లో నిరక్షరాస్యులను గుర్తించి, వారిని అక్షరాస్యులను చేయాలని సూచించారు. ఈ నెల 26లోగా నిరక్షరాస్యుల జాబితాను రూపొందించాలన్నారు. అక్షరాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఏపీఓ, సీడీపీఓ, ఎంఈఓలు సభ్యులుగా మండల కమిటీలను ఈ నెల 26లోగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వలంటీర్ల ఎంపికను త్వరగా పూర్తి చేసి, వారికి శిక్షణ నిర్వహించాలని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలను సైతం వలంటీర్లుగా నియమించే అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో వయోజన విద్య ఇన్చార్జ్ డీడీ ఎస్.సుబ్రహ్మణ్య వర్మ, జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, డీఆర్డీఏ ఇచ్చార్జ్ పీడీ సావిత్రి, డీఈఓ యు.మాణిక్యంనాయుడు, ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి, డ్వామా పీడీ శారదాదేవి, జీఎస్డబ్ల్యూఓ జిల్లా కోఆర్డినేటర్ రోజారాణి తదితరులు పాల్గొన్నారు. వాయు కాలుష్యం లేని నగరంగా విజయనగరం విజయనగరం పట్టణాన్ని వాయు కాలుష్యంలేని నగరంగా తీర్చి దిద్దడానికి కృషి చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ఆదేశించారు. నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సీఏపీ) కింద కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం జిల్లా కమిటీ సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. ఎన్సీఏపీ కింద పార్కులు, రహదారుల అభివృద్ధి కోసం జిల్లాలో 14 పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు పంపగా రూ.2.84 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని అందులో నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరానికి 12 పనులకు రూ.71 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో విజయనగరం కార్పొరేషన్ పరిధిలో 4 పార్కులను అభివృద్ధి చేసేందుకు అలాగే బీటీరోడ్లు, ఉద్యానవనాల పెంపకం, డ్రైనేజీలు, ఫుట్పాత్స్ అభివృద్ధికి ప్రతిపాదనలు చేసి ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు చెప్పారు. సమావేశంలో కాలుష్య నియంత్రణమండలి ఈఈ సరిత, కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య, పరిశ్రమల శాఖ జీఎం కరుణాకర్, విద్యుత్ శాఖ ఎస్ఈ లక్ష్మణరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి మధుసూదనరావు, జిల్లా వ్యవసాయ అధికారి తారకరామారావు, ఉద్యాన శాఖ డీడీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ -
యాౖభై ఏళ్ల వ్యక్తి అదృశ్యం
విజయనగరం క్రైమ్: భార్య అన్నం సరిగా వండలేదని అలిగిన ఓ భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన శుక్రవారం విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.ఇందుకు సంబంధించి ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం మండలం కొండకరకాం గ్రామానికి చెందిన యజ్జపురపు గౌరినాయుడి(50)కు భార్య సత్యవతితో ఒక పాప ఉంది. ఇన్నాళ్లూ అన్యోన్యంగా సాగిన భార్యాభర్తల కాపురంలో ‘అన్నం’ చిచ్చుపెట్టింది. తనకు సరిగా అన్నం వండి పెట్టలేదన్న కోపంతో భర్త గౌరినాయుడు అలిగాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గలాటా జరిగింది. దీంతో ఈ నెల 12న ఇంటి నుంచి వెళ్లిపోయి నేటివరకు ఇంటికి చేరకపోవడంతో భార్య సత్యవతి రూరల్ పోలీస్ స్టేషన్లో లేదని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఎస్సై అశోక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
● మాజీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నాం ● మాజీ ఎమ్మెల్యే కళావతి
ఏపీలో మహిళలకు రక్షణ కరువు వీరఘట్టం: కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ కరువైందని మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నా రు. వీరఘట్టం మండలం వండువ గ్రామంలో ఆమె మీడియాతో శుక్రవారం మాట్లాడారు. మాజీ మంత్రి ఆర్కే రోజాపై నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. వెంటనే ఎమ్మెల్యే భానుప్రకాష్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మొన్నటికి మొన్న కృష్ణా జిల్లా జెట్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను అసభ్యకరంగా దూషిస్తూ సభ్యసమాజం తలదించుకునేలా కూటమి నాయకులు వ్యవహరించారన్నారు. నేడు మాజీ మంత్రి రోజాపై నిసిగ్గుగా నోరుపారేసుకుంటున్న పచ్చ మూకలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నాయ కులను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి దారుణమైన పాలన ఏనాడూ చూడలేదని, కక్ష సాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో ఏడాది పాలన గడిపేశారన్నారు. కూటమి నాయకుల అరాచకాలు, అక్రమాలకు బలైపోతున్న వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్నికల హామీలు నేరవేర్చాంటూ ఇంటింటికీ వచ్చి చెబుతున్న కూటమి నాయకులను ప్రజలు నిలదీయాలని కోరారు. మర్యాదపూర్వక కలయిక సాలూరు: వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరను సాలూరులోని ఆయన నివాసంలో సినీ నటు డు, దర్శకుడు, నిర్మాత, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి శుక్రవారం కలిశారు. ఆయన ను రాజన్నదొర సాదరంగా ఆహ్వానించారు. పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో సాలూరు వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, కురుకుటి ఎంపీటీసీ సభ్యుడు గెమ్మెల సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. సాహస బాలుడికి అభినందనలు పాలకొండ రూరల్: పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి పొగిరి నాని సమయస్ఫూర్తి, సాహసం ఎంతో గొప్పవ ని హెచ్ఎం దాసరి నాగభూషణరావు అన్నా రు. నాని స్వగ్రామం అంపిలి. గ్రామానికి ఆను కుని నాగావళి నది ప్రవహిస్తుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నదిలో నీటి ఉద్ధృతి పెరిగింది. ఇది గమనించక ఎన్.కె.రాజపురానికి చెందిన ముగ్గురు పిల్లలు నదిలో సరదాగా ఈతకు దిగారు. నీటి ఉద్ధృతికి కొట్టుకుపోతుండడాన్ని గమనించిన నాని.. క్షణం ఆలస్యం చేయకుండా ధైర్యంతో నదిలో దూకి ముగ్గురు పిల్లలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు హెచ్ఎం తెలిపారు. తండ్రి తవిటినాయుడు ప్రోత్సాహంతో నదిలో ఈతలో మెలకువలు నేర్చుకున్న నాని చేసిన సాహసాన్ని సహవిద్యార్థుల ముందు శుక్రవారం కొనియాడారు. జ్ఞాపికను, సాహస స్ఫూర్తి గాదలతో కూడిన పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో సహ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నీ వెంటే నేను..!
● మరణంలోనూ వీడని దంపతుల బంధం ● భర్త మృతిచెందిన కొద్ది సమయానికే భార్య మృతికొమరాడ/పార్వతీపురం రూరల్: నాతిచరామి..అన్న పెళ్లినాటి ప్రమాణానికి కట్టుబడి ఉన్నారా దంపతులు. వివాహం అయినప్పటి నుంచి ఒకరికొకరు తోడుగా అన్యోన్యంగా ఉంటూ జీవనం సాగించారు. వృద్ధాప్యం వచ్చినప్పటికీ వారిలో అన్యోన్యత ఏ మాత్రం తగ్గలేదు. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ కలిసి జీవనం సాగిస్తున్న ఆ దంపతులు మరణంలోనూ వారి బంధాన్ని వీడలేదు. భర్త మరణ వార్త విన్న భార్య భావోద్వేగానికి లోనై కొద్ది క్షణాల్లోనే మరణించింది. ఈ ఘటన కొమరాడ మండలంలోని కళ్లికోట గ్రామంలో జరిగింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సీర పకీరునాయుడు (80), సీర పోలమ్మ (75) దంపతులు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల పకీరునాయుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడక గురువారం మధ్యాహ్నం మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య భావోద్వేగానికి గురై సాయంత్రం మృతిచెందింది. భార్యాభర్తలు ఒకే రోజు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. -
కక్షసాధింపు చర్యలు మంత్రికి తగవు
● సంధ్యారాణికి ఉద్యోగాలు తొలగించే మూడోశాఖ ఇవ్వండి ● మీడియా సాక్షిగా చంద్రబాబు, లోకేశ్కు సూచించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సాలూరు రూరల్: వైఎస్సార్సీపీ సానుభూతి పరులుగా ముద్రవేసి ఉన్నతాధికారులపై ఒత్తిడితెచ్చి మరీ దళిత, గిరిజన ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న మంత్రి సంధ్యారాణి తీరు మంచిదికాదని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. సంధ్యారాణికి ఉద్యోగాలు తొలగించే మూడో శాఖ ఇవ్వాలంటూ మీడియా సాక్షిగా చంద్రబాబు, లోకేశ్కు సూచించారు. సాలూరులోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు పొరపాటు చేస్తే మందలించాలే తప్ప వారి పొట్టపై కొట్టకూడదన్నారు. అవినీతి ఆరోపణలు ఉంటే తొలగించడంలో తప్పులేదన్నారు. కేజీబీవీలో వంటపనివారు తప్పుచేస్తే ప్రత్యేక అధికారి అయిన ప్రశాంతిని సస్పెండ్ చేయడం అడ్డగోలు చర్యలేనన్నారు. ఆమె పీటీజీ గదబ కులానికి చెందిన మహిళ. ఆమె కడుపు కొట్టడానికి మీకు మనసు ఎలావచ్చిందని మంత్రిని ప్రశ్నించారు. ఆమె కుంటుంబం వెంకళరాయి సాగర్లో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తుంటారు. ఒక్కసారి వారి ఇంటికి వెళ్లి చూడండి. పీటీజీ మహిళ అయిన మన రాష్ట్రపతి ద్రౌపదిముర్మును గౌరవంగా చూస్తున్న మనం ఇక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన మహిళపై ఇంత అన్యాయంగా వ్యవహరిస్తారా? అంటూ మంత్రి చర్యలను దుయ్యబట్టారు. ఉపాధిహామీ పథకంలో రూ.23 లక్షలు అక్రమాలు జరిగాయన్న అంశంపై చిరుద్యోగులపై కాకుండా ఉపాధిహామీ పీడీపై ఎందుకు కలెక్టర్ చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అధికారుల తీరు మారకుంటే చిరుద్యోగుల తరఫున న్యాయపోరాటం చేస్తామన్నారు. గిరిజన, శిశు సంక్షేమ శాఖల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పీడీలను ఎందుకు సస్సెండ్ చేయడంలేదన్నారు. ఉద్యోగులపై చర్యలు తీసుకోమనడం తన అభిమతం కాదన్నారు. పొరపాట్లు చేస్తే వారిని మందలించాలే తప్ప ఉద్యోగాల నుంచి తొలగించి వారి కడుపుకొట్టడం మంచిది కాదన్నారు. ఐసీడీఎస్లో డబ్బులే మాట్లాడతాయి అంటూ పత్రికల్లో వచ్చిన వార్తలపై మంత్రి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. ఏ రోజూ ఉద్యోగులను బాధించలేదు.. తను నాగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రి గా పనిచేసినా ఏ రోజు కూడా ఏ ఒక్క ఉద్యోగిని బాధించలేదని రాజన్నదొర తన పాలనాతీరును వెల్లడించారు. ఒకవేళ పొరపాటున నోరు జారితే క్షమించమని అడుగుతానే తప్ప ఉద్యోగుల పొట్టకొట్టే ప్రయంత్నం తాను ఎన్న డూ చేయలేదన్నారు. మంత్రి సంధ్యారాణి నడిమంత్రపు సిరితో గెలిచి గెంతులు వేస్తున్నా రని, ఇలాగే కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, గొర్లె జగన్ మోహనరావు, కౌన్సిలర్ సింగారపు ఈశ్వరరావు, గిరి రఘు పాల్గొన్నారు. -
నకిలీ ఎరువుతో జాగ్రత్త!
● ప్రారంభమైన ఖరీఫ్ సీజన్ ● మొదలైన పురుగు మందులు, ఎరువుల విక్రయాలు ● కొనుగోలు విషయంలో అవగాహన తప్పనిసరి ● రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి ● జిల్లాలో సుమారు 328 దుకాణాలురామభద్రపురం: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ప్రస్తుతం కొద్దో గొప్పో కురుస్తున్న వర్షాలకు రైతులు పంటల సాగు చేపట్టారు. ఇప్పటికే జిల్లాలో వరి 6510 హెక్టార్లు, పత్తి 1490 హెక్టార్లు, మొక్కజొన్న 6678 హెక్టార్లు, వేరుశనగ 46 హెక్టార్లు, చెరకు 1489 హెక్టార్లు, కూరగాయలు 1000 హెక్టార్లలో సాగులో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.అలాగే ప్రభుత్వం అనుమతి పొందిన సుమారు 328 పురుగుమందులు, ఎరువుల దుకాణాలు జిల్లాలో ఉన్నాయి. అయితే పంటల సాగులో అధిక దిగుబడులు సాధించాలని రైతులు ఎరువులు, పురుగు మందులు అధికంగా వినియోగిస్తున్నారు. అన్నదాతల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు నకిలీ ఉత్పత్తులను అంటగట్టే అవకాశముందని, అప్రమత్తంగా వ్యవహరించకుంటే మోసపోయే ప్రమాదముందని ప్రస్తుతం అకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్ అధికారులు, వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు. దళారుల వద్ద కొనుగోలు చేయొద్దు నిషేధిత మందులు కొనుగోలు చేస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. కొందరు ఎరువులు, పురుగు మందుల వ్యాపారులు దిగుబడి ఎక్కువగా వస్తుందని నమ్మించి అనుమతి లేని వివిధ కంపెనీల కల్తీ ఎరువులు, పురుగు మందులు అంటగట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా అనుమతులు లేని దుకాణాలు, దళారుల వద్ద కొనుగోలు చేయరాదు. తక్కువ ధరకే ఇస్తున్నారని కొని వాడితే పంట దిగుబడి తగ్గడంతో పాటు భూసారం దెబ్బతింటుంది. కొనుగోలు చేసేటప్పుడు మందుల లేబుల్స్ పరిశీలించి, అవి కంపెనీ ఉత్పత్తులా? లేక స్థానికంగా తయారు చేసి విక్రయిస్తున్నారా? అనే విషయాలను తెలుసుకోవాలి.కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా దుకాణ యజమాని సంతకంతో కూడిన రసీదు తీసుకోవాలి. ముఖ్యంగా విత్తనాలకు సంబంధించిన సంచుల సీల్ తొలగించినట్లు గుర్తిస్తే వాటిని కొనుగోలు చేయకుండా నకిలీలపై ఫిర్యాదు చేయాలి.అధికారుల పరిశీలనలో అది వాస్తవమని తేలితే సంబంధిత డీలర్పై కేసు నమోదు చేసి రైతులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. -
అనాథ వృద్ధురాలికి సేవలు
విజయనగరం అర్బన్: ఈ నెల 12వ తేదీన సాక్షి దినపత్రికలో ‘అమ్మ రోడ్డున పడింది’ శీర్షికన వచ్చిన వార్త మరికొంత మందిని కదిలించింది. తొలి రోజున కొందరు స్పందించి శుభ్రమైన నీటితో ఆమెకు స్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింప చేసి షెల్టర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఆ వృద్ధురాలికి ప్రతి రోజూ కొందరు దయార్ద్ర హృదయులు మానవత్వంతో సేవలు అందిస్తున్నారు. సమీపంలోని ఆర్డబ్ల్యూఎస్, ఆర్టీసీ తదితర శాఖల ఉద్యోగులు అబ్రహం పీటర్ పాల్, వెంకాయమ్మ, రాగిణి, గీతి తదితరులు మేము సైతం అంటూ చేయి చేయి కలిపి సేవలు చేస్తున్నారు. వృద్ధురాలి కాలు, శరీరంపై పుండ్లను శుభ్రం చేయడం, స్నానం చేయించడం, కొత్త వస్త్రాలు ధరించేలా చేయడం, ఆహారం, మందులు అందించడం వంటి పనులు చేస్తున్నారు. ఈ నిస్వార్థ సేవలు నిజమైన సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సాక్షి కథనానికి స్పందించిన దయార్ద్ర హృదయులు -
రైతును మోసగిస్తే చట్టపరమైన చర్యలు
గ్రామాల్లో ఎవరైనా లైసెన్స్ లేకుండా విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే వ్యవసాయ,విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. మందుల లాట్ నంబర్ను బట్టి తయారు చేసిన తేదీని గుర్తించి ఏ కంపెనీ, ఏ రకం వంటి విషయాలను కొనుగోలుదారులు పరిశీలించాలి. రైతులు పురుగు మందు, ఎరువుల కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారులు నకీలి పురుగు మందులు, ఎరువులు విక్రయించి రైతులను మోసగిస్తే సంబంధిత డీలర్పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. టి.అప్పలనాయుడు, విజిలెన్స్ సీఐ -
పిచ్చికుక్కల దాడిలో పలువురికి గాయాలు
గరుగుబిల్లి: పిచ్చికుక్కలు స్వైరవిహారం చేసి పలువురిని గాయపరచడంతో ప్రజలు రాకపోకలు చేసేందుకు భీతిల్లుతున్నారు. గురుగుబిల్లి మండలంలోని రావుపల్లిలో గ్రామంలో పలువీధుల్లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేసి గ్రామానికి చెందిన గుల్ల సుహంత్, కుమ్మరి సూరయ్య తదితరులను శుక్రవారం గాయాల పాలుచేశాయి. కుక్కల బెడద కారణంగా ఒంటరిగా వీధుల్లో తిరిగేందుకు, ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అలాగే సాయంత్రం వ్యక్తిగత పనుల నిమిత్తం అన్ని వర్గాలవారు రాకపోకలు చేసేందుకు భయాందోళన చెందుతున్నారు. గాయాలపాలైన వారు గరుగుబిల్లి పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. కుక్కలను నియంత్రించాలని అధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. యువకుడి అదృశ్యంపార్వతీపురం రూరల్: పట్టణంలోని బంగారమ్మ కాలనీకి చెందిన బుగత శ్రీనివాసరావు కుమారుడు అజయ్ కుమార్ అదృశ్యమయ్యాడు. బుధవారం ఉదయం 7గంటల సమయంలో ఢిల్లీ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిపోయాడు. మరుసటి రోజు కుమరుడి రూమ్ సర్దుతున్న సందర్భంలో అజయ్ కుమార్ ఫోన్, పర్సు ఇంట్లోనే విడిచిపెట్టి నా గురించి వెతకకండి, నన్ను క్షమించండి అని రాసి ఉన్న పేపర్ను తల్లిదండ్రులు గమనించారు. దీంతో భయాందోళన చెంది పట్టణ పోలీస్స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవింద తెలిపారు. ఫొటోలో ఉన్న వ్యక్తి ఆచూకీ తెలిస్తే పట్టణ పోలీస్స్టేషన్కు ఫోన్ 9121109467, 8341517437 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇంటి నుంచి వెళ్లిన అజయ్ కుమార్ నీలం రంగు ఫ్యాంట్, క్రీమ్ కలర్ టీషర్టును ధరించినట్లు తల్లిదండ్రులు చెప్పినట్లు తెలిపారు. పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యదత్తిరాజేరు: మండలంలోని ముద్దానపేట గ్రామానికి చెందిన రైతు ముద్దాన అప్పన్న(38) అప్పుల బాధలు తాళలేక పురుగు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు, పెదమానాపురం ఎస్సై ఆర్.జయంతి శుక్రవారం తెలిపారు. మృతుడి భార్య దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అప్పన్నకు వ్యవసాయంలో నష్టం రావడంతో మనస్తాపం చెంది ఈనెల 14న రాత్రి పురుగు మందు తాగడంతో వెంటనే కుటుంబసభ్యులు గజపతినగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి విజయనగరంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత విషమించడంతో వైజాగ్ కేజీహెచ్కు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య దేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నేలబావిలో పడి వ్యక్తి మృతిరాజాం సిటీ: పట్టణ పరిధిలోని హరిజనవీధికి చెందిన రేజేటి సోమయ్య (54) నేలబావిలో పడి ప్రమాదవశాత్తు మృతిచెందాడని సీఐ కె.అశోక్కుమార్ శుక్రవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమయ్య ఈ నెల 17న మధ్యాహ్నం 1.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి శుక్రవారం ఉదయం వరకు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. మృతుడి సోదరుడు భాస్కరరావు తన అన్నయ్యను వెతుకుతూ కొండంపేట సమీపంలోని తన పొలం వద్దకు వెళ్లి చూశాడు. అక్కడ నేలబావిలో తేలియాడుతున్న మృతదేహాన్ని చూసి సోదరుడు సోమయ్యగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. ఈ విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మృతుని భార్య సరోజిని ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
కలెక్టరేట్నా.. సచివాలయమా!
ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వెళ్లడానికై నా ఇన్ని ఆంక్షలు ఉంటాయో, ఉండవో గానీ... పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్కు మాత్రం అడుగడుగునా ఆంక్షలే. కలెక్టరేట్లోపలికి ఇతరులెవరూ ప్రవేశించకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. వివిధ సమస్యలపై వచ్చే నిరసనకారులను గేటు వద్దే పోలీసులతో అడ్డుకుంటున్న విషయం విదితమే. వినతులిచ్చేందుకు వచ్చే ప్రజలను సైతం గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారు. కలెక్టరేట్ ఆవరణలో ‘చేయి ఎత్తొద్దు.. గొంతు విప్పొద్దు’ నిబంధనలను కఠినంగా అమలు చేయిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రధాన గేటు దాటి.. లోపలికి వచ్చే మార్గంలో బారికేడ్లు పెట్టేశారు. అధికారుల వాహనాలను మినహాయించి, ఇతరుల వాహనాలేవీ రాకుండా అడ్డుకుంటున్నారు. దీని కోసం ఒక ఉద్యోగిని కాపలాగా ఉంచారు. ప్రజా విజ్ఞప్తులను గాలికొదిలేసి, ఇటువంటి పనులపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించడాన్ని ప్రజాసంఘాల నాయకులు తప్పుపడుతున్నారు. – సాక్షి, పార్వతీపురం మన్యం -
కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్దాం
● ఇంటింటికీ క్యూఆర్ కోడ్తో వివరిద్దాం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు పార్వతీపురంటౌన్: సీఎం చంద్రబాబు నాయుడు ఏడాది కాలంగా చేసిన మెసాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం పార్వతీపురం పట్టణంలోని లయన్స్క్లబ్ ఫంక్షన్ హాల్ ఆవరణలో బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీపై పురపాలక, మండల స్ధాయి వైఎస్సార్సీపీ నాయకులతో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారాణి, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ‘రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో’ పోస్టర్ను వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో విడుదల చేశారు. అనంతరం శత్రుచర్ల పరీక్షిత్ రాజు మాట్లాడుతూ హామీలు విస్మరించిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకుంటున్నా రన్నారు. సూపర్సిక్స్ పథకాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిన తీరును ఇంటింటికీ వైఎస్సార్సీపీ క్యాడర్ వెళ్లి వివరించాలని కోరారు. యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అన్ని వర్గాలవారిని మోసం చేసిన ఘనత చంద్రబాబుదని వివరించారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎవరూ భయపడరని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, పార్టీ మండల అధ్యక్షులు బొమ్మి రమేష్, మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, వైస్ చైర్మన్లు కొండపల్లి రుక్ష్మిణి, యిండుపూరు గున్నేశ్వర రావు, జెడ్పీటీసీ బలగరేవతమ్మ, ఎంపీపీ మజ్జి శోభారాణి, వైస్ ఎంపీపీలు సిద్దా జగన్నాథం, బంకురు రవికుమార్, రాష్ట్ర ఆర్టీఐ విభాగం కార్మదర్శి దేవుపల్లి నాగరాజు, రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి బి.వాసుదేవరావు, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పోల సత్యనారాయణ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు, బీసీ సెల్ అధ్యక్షులు గొర్లి మాధవరావు, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షురాలు సుధ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పార్టీ ప్రతినిధులు, పార్టీ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, వార్డు ఇన్చార్జిలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాలను బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ నినాదంతో ప్రజల్లోకి తీసుకువెళ్దాం. కూటమి ప్రభుత్వ పాలన, చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ప్రజల గొంతుకగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు ముందుకు సాగుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం. సీఎం చంద్రబాబు హామీలన్నీ అమలు చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేవలం కూటమి నేతలు సంపద సృష్టించుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. గ్రామ, మండల స్థాయిలో చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త భాధ్యతగా తీసుకోవాలి. –అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే పార్వతీపురం కూటమి నేతల పనితీరు శూన్యం ఎన్నికల ముందు కూటమి నేతలు సూపర్ సిక్స్ హామీలతో అధికారం చేపట్టారు. తీరా అధికారం చేపట్టిన తరువాత వారి పనితీరు శూన్యంగా ఉంది. అధికారం చేపట్టి 14 నెలలు గడుస్తున్నా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమానికి వెళ్తున్న కూటమి నాయకులను ప్రజలు చీదరించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మహిళలు, యువత, రైతులు, విద్యార్ధులు, నిరుగ్యోగులు అన్నివర్గాలవారిని మోసం చేస్తూ పస్తోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రతి కార్యకర్త, నాయకులు వివరించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గుమ్మ తనూజారాణి, ఎంపీ అరకు మోసపూరిత హామీలను వివరిద్దాం చంద్రబాబు ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన వాటిని విస్మరించారు. ఆ మోసపూరిత హామీలను ఎండగడదాం. హామీలు అమలు చేసేంత వరకు వైఎస్సార్సీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తారు. రైతులకు సాయం ఇప్పటి వరకు లేదు. నిరుద్యోగ యువతీ, యువకులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి స్తామన్నారు. ఇప్పటివరకు ఎక్కడా ఇవ్వడం లేదు. బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని 5 వారాలు నిర్వహించి ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తాం. – మామిడి శ్రీకాంత్, తూర్పుకావు కార్పొరేషన్ మాజీ చైర్మన్ -
వాలీబాల్ విజేత ఏపీఈపీడీసీఎల్ జట్టు
విజయనగరం ఫోర్ట్: ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఇంటర్ సర్కిల్ వాలీబాల్ టోర్నమెంట్లో విజయనగరం ఏపీఈపీడీసీఎల్ జట్టు విజేతగా నిలిచింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఈనెల 15 నుంచి17 వతేదీ వరకు ఇంటర్ సర్కిల్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో విజయనగరం జట్టు ప్రథమ స్థానంలో నిలవగా రాజమండి సర్కిల్ జట్టు ద్వితీయ స్థానం, తృతీయ స్థానంలో నెల్లూరు జట్టు నిలిచాయి. తపాలా రాష్ట్రఆర్గనైజింగ్ కార్యదర్శిగా హేమలతబాడంగి: తపాలాశాఖ రాష్ట్ర ఉద్యోగుల ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆర్.హేమలత (పాల్తేరు పోస్టుమాస్టర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల నంద్యాలలో జరిగిన ఏఐజీజీడీఎస్యూ 14వ వార్షిక ఎన్నికల్లో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆమె గురువారం చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర యూనియన్ మహిళా కమిటీ మెంబర్గా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఆమె గతంలో తపాలా ఉద్యోగుల సంఘం బొబ్బిలి బ్రాంచికార్యదర్శిగా, రాష్ట్ర యూనియన్ ఉపాధ్యక్షురాలిగా, కేంద్ర ప్రత్యేక ఆహ్వానితురాలిగా కూడా సేవలందించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్రయూనియన్ నాయకులు, జీడీఎస్ సభ్యులందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. పట్టుబడిన మద్యం ధ్వంసంరాజాం సిటీ: స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యం బాటిల్స్ను గురువారం ధ్వంసం చేశారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ దొర సమక్షంలో ఐదు కేసుల్లో పట్టుబడిన రూ.5,500లు విలువైన మద్యాన్ని పోలీసులు పారబోశారు. ఈ సందర్భంగా దొర మాట్లాడుతూ అక్రమంగా మద్యం విక్రయించినా, బెల్టుషాపులు నిర్వహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సారా తయారుచేసినా, విక్రయించినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో టౌన్ సీఐ కె.అశోక్కుమార్, ఎస్సై రవికిరణ్, రెవెన్యూ సిబ్బంది అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.దొంగతనం కేసులో 21 నెలల జైలుడెంకాడ: మండలంలోని అక్కివరం గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో విశాఖకు చెందిన మల్లి సూరిబాబుకు 21 నెలల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా చెల్లించాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీనివాసరావు తీర్పు చెప్పినట్లు ఎస్సై ఎ.సన్యాసినాయుడు గురువారం తెలిపారు. 2021వ సంవత్సరం నవంబర్ 27వ తేదీన అక్కివరం గ్రామంలోని నడిపల్లి రాజినాయుడు ఇంటిలోని బీరువాలో రూ.లక్షా 3వేల నగదు, ఏడు తులాల బంగారు ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. అప్పట్లో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై పద్మావతి కేసు దర్యాప్తు చేసి చార్జిషీల్ ఫైల్ చేశారు. మల్లి సూరిబాబు అనే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించి పై విధంగా శిక్ష విధించిందని ఎస్సై వివరించారు. విద్యార్థులతో పీపుల్స్ స్టార్ సమావేశంపార్వతీపురం టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో పీపుల్స్ స్టార్, సినీనటుడు ఆర్.నారాయణ మూర్తి గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ స్నేహ చిత్ర బ్యానర్ మీద యూనివర్సిటీ..పేపర్ లీక్ అనే చిత్రాన్ని తెరకెక్కించానని సేవా రంగంగా ఉండాల్సిన విద్యారంగం భారతదేశంలో వ్యాపార రంగంగా మారిందన్నారు. వ్యాపార రంగం కావడంతో చాలా ప్రైవేట్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని, ఈ క్రమంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మసకబారుతోందన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కావాలి గానీ, మసకబార కూడదని, అందుకని సేవా రంగంలో ఉన్న విద్యను, వైద్యాన్ని జాతీయం చేయాలనే విషయాన్నే ఈ చిత్రంలో బలంగా చెప్పానన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతి రావు పాల్గొన్నారు. -
వైద్యసౌకర్యం అందక మరణాలు
● ఆర్టీసీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు పార్వతీపురం టౌన్: పీటీడీ(ఆర్టీసీ) ఉద్యోగులకు ఈహెచ్ఎస్ ద్వారా వైద్యసౌకర్యాలు అందక ఏడాదికి 350 మంది చనిపోతున్నారని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నిర్మాణసభను స్థానిక ఎన్జీవో హోంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అనంతరం ఉత్పన్నమవుతున్న ప్రధానమైన సమస్యలలో ప్రధానంగా గతంలో ఆర్టీసీ ఉద్యోగులు ఒక్కరూపాయి కూడా చెల్లించకుండానే మెరుగైన వైద్యం రిఫరల్ ఆస్పత్రుల ద్వారా అందించేవారన్నారు. అయితే ప్రస్తుతం ఈహెచ్ఎస్ ద్వారా సరైన వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకునే విధంగా విలీనానికి ముందున్న పాత పద్ధతుల్లోనే రిఫరల్ ఆస్పత్రుల ద్వారా వైద్యసౌకర్యాలు అందించాలని, అలాగే మెడికిల్ అన్ఫిట్ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. విలీనానికి ముందు పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు కల్పించి బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలి ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు గత ఆరేళ్లుగా పెండింగ్లో ఉన్న పదోన్నతులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన 24 నెలలు 11వ పీఆర్సీ ఎరియర్స్, డీఏ బకాయిలు పెండింగ్ ఉన్న నాలుగు డీఏలు చెల్లించాలన్నారు. ప్రస్తుతం ప్రవేశ పెట్టబోతున్న విద్యుత్ బస్సులన్నీ ఆర్టీసీ ద్వారా నిర్వహించి ఆర్టీసీ సిబ్బందితో ఆబస్సులు నడపాలని, ప్రస్తుతం ఉన్న 10 వేల పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి సిబ్బంది రిక్రూట్మెంట్ చేయాలని కోరారు. మహిళలకు ఆగస్టు నుంచి ఫ్రీ బస్ స్కీమ్ పెట్టక ముందే 3000 కొత్తబస్సులు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఈయూ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పి.భానుమూర్తి, జిల్లా అధ్యక్షుడు మరిపి శ్రీనివాసరావు అధ్యక్షతన, జిల్లాకార్యదర్శి పైల సుందరరావు విజయనగరం జోన్ జోనల్ కార్యదర్శి బాసూరి కష్టమూర్తి, విజయనగరం జిల్లా ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి గొల్లపల్లి రవికాంత్తో తాటు జిల్లాలో ఉన్న పాలకొండ సాలూరు, పార్వతీపురం డిపోల అధ్యక్ష, కార్యదర్శులు అధిక సంఖ్యలో ఉద్యోగులు, మహిళా కార్యకర్తలు పాల్గోన్నారు. సమావేశానికి ముందు డిపోనుంచి ఎన్జీఓ హోమ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. -
విపత్తుల నివారణకు స్కౌట్స్ అండ్గైడ్స్ సేవలు అందించాలి
సీతానగరం: స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ పొందిన విద్యార్ధులు విపత్తుల సమయంలో ప్రజల రక్షణకు ఆత్మ విశ్వాసంతో సేవలందించాలని పార్వతీపురం మన్యం జిల్లా డీఈఓ రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సీతానగరం మండలంలోని జోగింపేట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో పీఎం స్కూల్స్లో విద్యార్ధులకు కోర్సు డైరెక్టర్ నారాయణమూర్తి స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డీఈఓ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో విపత్తులను ఎదుర్కొనేందుకు అవసరమైన స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ పొందాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో అగ్నిప్రమాదాలు, వంటగ్యాస్ ప్రమాదాలు, పరిశ్రమల్లో ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు వంటి విపత్కర పరిస్థితుల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు ఉపయోగ పడతాయన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఓలు చిన్నం నాయుడు, విజయ్కుమార్, రజియా బేగం, నరసింహస్వామి, పాల్గొన్నారు. డీఈఓ రాజశేఖర్ -
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ సబ్కంట్రోల్
విజయనగరం క్రైమ్: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ సబ్ కంట్రోల్ రూమ్ను ఎస్పీ వకుల్ జిందల్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందన్నారు. స్కూల్స్, కాలేజీలు, ఆస్పత్రులు, సినిమా హాల్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లోనే ఉండడం వల్ల ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ రద్దీ తరచూ ఏర్పడుతుందన్నారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ రెగ్యులేషన్ చేపట్టడం కష్టంగా ఉంటుందని, దీనిని అధిగమించడానికే ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ సబ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలని సంకల్పించామని ఇందులో భాగంగా ట్రాఫిక్ సబ్ కంట్రోల్ ను ఏర్పాటు చేసి, ప్రారంభించామన్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే సిబ్బంది తీవ్రమైన వేసవి, వర్షా కాలంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించడానికి ఇబ్బంది లేకుండా ఈ సబ్ కంట్రోల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అదే విధంగా చిన్న చిన్న దొంగతనాలు, ఈవ్ టీజింగ్ వంటివి నియంత్రించ వచ్చునన్నారు. ఈ సబ్కంట్రోల్ రూమ్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ఏర్పాటు చేశామని, లౌడ్ స్పీకర్లను ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్ గేటు, ఔటు గేటు, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సబ్ కంట్రోల్లో ఒక ఎస్సై, ఒక ఏఎస్సై, ఇద్దరు హెచ్సీలు, ముగ్గురు కానిస్టేబుల్స్ ఉంటారని, వారు ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా విధులు నిర్వహిస్తారని ఎస్పీ తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఎస్పీ వకు ల్ జిందల్ పోలీసు అధికారులను ఆదేశించారు. కా ర్యక్రమంలో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివానరావు, ట్రాఫిక్ సీఐ సూరి నాయుడు, టూ టౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, రూరల్ సీఐ బి.లక్ష్మణరావు, ట్రాఫిక్ ఎస్సైలు భాస్కరరావు, రవి, నూకరాజు , పీసీలు భాస్కర్, రమణలు పాల్గొన్నారు. -
కారు ఢీకొని వైఎస్సార్సీపీ నాయకుడి మృతి
సీతంపేట: రాంగ్రూట్లో వ చ్చిన ఒక కారు వైఎస్సార్సీపీ నాయకుడు సవర తవిటిరా జు (48) ప్రాణాలు బలిగొంది. సీతంపేట మండలంలోని చీడి మానుగూడకు చెందిన హడ్డుబంగి ఎంపీటీసీ ఎస్.సరోజిని భర్త తవిటిరాజు తన ద్విచక్రవాహనంపై సీతంపేట వస్తుండగా ఎదురుగా పాలకొండ నుంచి కొత్తూరు వైపు వెళ్తున్న కారు కంబగూడ గ్రామ మలుపువద్ద రాంగ్రూట్లో వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో తవిటిరాజు కాలువిరిగి, తలకు బలమైన గాయం తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మృతుడికి భార్య సరోజిని, ఇద్దరు కుమార్తెలు సావిత్రి, తిరుమల, కు మారుడు సంతోష్ ఉన్నారు. సీతంపేటకు పనిమీద వెళ్లిన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడన్న విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులంతా ఏరియా ఆస్పత్రికి చేరుకుని గుండెలవిసే లా రోదించారు. స్థానిక ఎస్సై వై.అమ్మన్నరావు ఘ టనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కన్నీటి పర్యంతమైన మాజీ ఎమ్మెల్యే కళావతి ఎంపీటీసీ సరోజిని భర్త తవిటినాయుడు మరణవార్త విన్న మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి హుటాహుటిన సీతంపేట ప్రాంతీయ ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టారు. మంచికి మారుపేరు అయిన తవిటిరాజును మరువలేమన్నారు. రోదిస్తున్న ఎంపీటీసీ సరోజినిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. తాను మీకుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎంపీపీ బి.ఆదినారాయణ, ఎస్టీసెల్ నియోజకవర్గ కన్వీనర్ నిమ్మక కాంతారావు, జెడ్పీ కోఆప్షన్ సభ్యురాలు ఎస్.లక్ష్మి, సర్పంచ్లు బి.తిరుపతిరావు, ఎస్.సుశీల, ఎంపీటీసీలు ఎస్.చంద్రశేఖర్, ఎస్.మంగయ్య, పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. లారీ కింద పడి వ్యక్తి దుర్మరణంబొబ్బిలి: పట్టణసమీపంలోని గ్రోత్ సెంటర్ వద్ద ప్రమాదవశాత్తు లారీకింద పడి బలిజిపేట మండలం అరసాడ గ్రామానికి చెందిన వంగపండు సత్యనారాయణ(35) గురువారం దుర్మరణం చెందాడు. జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యనారాయణ బుధవారం రాత్రి విధులు ముగించుకుని మోటార్ సైకిల్పై బొబ్బిలి వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో వెనుక టైరుకింద పడగా కుడికాలి సగానికి తెగిపడింది. స్థానికులు 108 వాహనంలో స్థానిక సీహెచ్సీకి తరలించి ప్రాథమిక చికిత్సను అందించి మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్సీకి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సత్యనారాయణ భార్య గతేడాదే అకాలమరణం చెందగా ప్రస్తుతం పదేళ్ల వయస్సున్న వారి పాప అనాథగా మిగిలింది. -
భవానీకి కలెక్టర్ అభినందనలు
విజయనగరం: ఇటీవల కజకిస్థాన్లో జరిగిన జూనియర్ ఆసియన్ చాంపియన్ షిప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో వరుసగా 3 బంగారు పతకాలను సాధించి, జిల్లా కీర్తి పతాకాన్ని ఎగురవేసిన కొండకరకాం గ్రామానికి చెందిన క్రీడాకారిణి రెడ్డి భవానీని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అభినందించారు. ఈ మేరకు గురువారం తన క్యాంపు కార్యాలయంలో దుశ్శాలువ, జ్ఞాపికతో భవానీని సత్కరించారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ తరఫున రూ.25వేల నగదు ప్రోత్సాహకాన్ని చెక్కు రూపంలో అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలంటూ ప్రోత్సహించారు. రెడ్డి భవాని నేపథ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని కలెక్టర్ తెలుసుకుని అప్పటికప్పుడు తహసీల్దార్ కూర్మనాథరావును రప్పించి వెంటనే ఆమెకు ఇంటి పట్టా ఇవ్వాలని ఆదేశించారు. అలాగే హౌసింగ్ పీడీ మురళీమోహన్ను పిలిచి ఇల్లు మంజూరు చేయడమే కాకుండా, నిర్మాణ బాధ్యతను కూడా చూడాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులతో పాటు, జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వరరావు, కోచ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. వెయిట్లిఫ్టర్ భవానీకి హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ సత్కారం కొండకరకాం క్రీడాకారిణి రెడ్డి భవాని భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందించాలని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు. ఈ మేరకు గురువారం హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ అధ్యక్షుడు దవడ కొండబాబు, దవడ మీనా అధ్యక్షతన భవానీకి జరిగిన సత్కార సభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, ఎంపీ కలిశెట్టి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఆమె పరిస్థితిని తీసుకువెళ్లాలని భీశెట్టి కోరారు, సత్కార సభలో కొత్తా సునీల్, ముంతాజమ్మ, స్రవంతి, కొండబాబు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజు, నాగభూషణం, రమేష్, రాంమోహన్, శ్రీను, రామచంద్ర రాజు తదితరులు భవానీకి ఆర్థిక సహాయం చేశారు. తక్షణమే ఇల్లు మంజూరుకు ఆదేశాలు -
ఆటోలో 46కిలోల గంజాయి పట్టివేత
విజయనగరం క్రైమ్: విజయనగరంలో వన్టౌన్ పోలీసులు, క్రైమ్ పార్టీ నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద ఎల్ఐసీ బిల్డింగ్ దగ్గర 46 కేజీల గంజాయిని గురువారం పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం వన్ టౌన్ పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో ఆటోలో ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలించేదుకు తరలిస్తున్న 46కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా ఆటోలో పోలీసులు తనిఖీ చేయగా బ్యాగుల్లో 46 కేజీలు గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి దాన్ని తరలిస్తున్న ఏడుగురు నిందితులైన చందక శ్రీను (28) చొంపి దివాకర్ (22) చొంపి కళ్యాణ్, (24) తంగుళ కిరణ్ కుమార్ (21), చొంపి సన్యాసిరావు (20) పిల్లా శివ (24) పిల్లా కమాలాకర్ (22) అనే ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.అలాగే ఆటో తో పాటు 46కిలోల గంజాయి, ఒక పల్సర్ బైక్, 5 సెల్ఫోన్లు, రూ.8 వేలు సీజ్ చేశారు. పట్టుబడిన నిందితులను విచారణ చేయగా పెదబయలుకు చెందిన చందక శ్రీను గంజాయిని ఆటోలో విజయనగరం తీసుకువచ్చి ఇక్కడి నుంచి కాకినాడకు చెందిన మరో ఇద్దరి ద్వారా హైదరాబాద్ కు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని ఎస్పీ వకుల్ జిందల్ చెప్పారు. పరారైన ప్రధాన నిందితుడు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలుకు చెందిన రాంబాబును అరెస్టు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, వన్ టౌన్ సీఐ ఆర్.వి.ఆర్.కె చౌదరి, ఎస్ఐలు బి.సురేంద్ర నాయుడు, డి.రామ్ గణేష్ ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఏడుగురు నిందితుల అరెస్ట్ ఒడిశా నుంచి ఢిల్లీకి తరలింపు -
3
బస్తా యూరియా కోసం..గంటలు క్యూలో.. వీరఘట్టం: జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల నుంచి సాగునీరు విడుదల చేయడంతో అక్కడక్కడ వరి ఉభాలు సాగుతున్నాయి. మరోవైపు మెట్టభూముల్లో పత్తి, మొక్క జొన్న, వివిధ రకాల కూరగాయల పంటలు మొక్కదశలో ఉన్నాయి. వీటికి ఎరువు వేసే సమయం ఆసన్నమైంది. ప్రసుత్త ప్రభుత్వం రైతులకు అవసరమైన యూరియా సరఫరాలో విఫలమైంది. జిల్లాలో యూరియా కొరత వెంటాడుతోంది. రైతు సేవాకేంద్రాలకు వచ్చిన అరకొర యూరియా కోసం రైతులు పనులు మానుకుని పరుగులు తీయాల్సిన పరిస్థితి. వీరఘట్టం మేజర్ పంచాయతీలో గురువారం రైతుకు ఒక యూరియా బస్తా అందజేశారు. వాటి కోసం 3 గంటల పాటు నిరీక్షించారు. కూటమి ప్రభుత్వం రైతన్నకు సాగుసాయం అందజేయడంలోనే కాదు ఎరువు కొరత తీర్చడంలోనూ విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులు సరఫరా చేస్తే... ప్రస్తుత ప్రభుత్వం విత్తనాలు, ఎరువులను అందజేయకుండా రైతన్నను ఇబ్బందులకు గురిచేస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. గత ఐదేళ్లులో ఖరీఫ్లో ఏనాడూ ఎరువు, విత్తనాల కోసం ఎక్కడా క్యూకట్టలేదని, కూటమి ప్రభుత్వంలో మళ్లీ రైతన్నకు కష్టాలు మొదలయ్యాయంటూ నిట్టూర్చారు. 400 బస్తాల పంపిణీ.. వీరఘట్టం మేజరు పంచాయతీలోని ఆర్ఎస్కేకు 440 బస్తాల యూరియా వచ్చింది. వీటిని ఉదయం పంపిణీ చేస్తారన్న సమాచారంతో రైతులు పెద్ద ఎత్తున మార్కెట్యార్డులో ఉన్న ఆర్ఎస్కే వద్ద బారులు తీరారు. రైతులు ఎక్కువ మంది క్యూలో నిల్చోవడం, యూరియా తక్కువ కావడంతో ఒక రైతుకు ఒక బస్తా చొప్పున మండల వ్యవసాయశాఖ అధికారి జె.సౌజన్య ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. యూరియా పంపిణీ సజావుగా సాగేందుకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్ఐ కృష్ణమనాయుడు, కానిస్టేబుల్ వచ్చి బందోబస్తు విధులు నిర్వహించారు. రైతులకు అవసరమైన యూరియాను తెప్పిస్తామని, ఆందోళన చెందవద్దని ఏఓ తెలిపారు. ఈ చిత్రం చూశారా... వీరంతా యూరియా కోసం వీరఘట్టం మేజర్ పంచాయతీలోని రైతుసేవా కేంద్రం వద్ద గురువారం ఉదయం 8 నుంచి క్యూ కట్టిన రైతులు. ఒక యూరియా బస్తా కోసం 3 గంటల పాటు నిరీక్షించారు. ఖరీఫ్ సీజన్లో పంటలకు వేసేందుకు యూరియా అవసరం కావడం, ప్రభుత్వం అవసరం మేర సరఫరా చేయకపోవడంతో.. మగ, ఆడ తేడా లేకుండా రైతులందరూ పనులు మానుకుని యూరియా కోసం పరుగులు తీశారు. ఎరువు కొరతకు ఈ చిత్రమే సజీవసాక్ష్యం. రైతన్నకు తప్పని ఎరువు కష్టాలు పనులు మానుకొని ఎరువుకోసం నిరీక్షణ కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం -
వైఎస్సార్సీపీలో నియామకాలు
పాలకొండ రూరల్/గుమ్మలక్ష్మీపురం: వైఎస్సార్సీపీ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగ అధ్యక్షుడిగా దుప్పాడ పాపినాయుడు నియమితులయ్యారు. వైఎస్సార్టీయూసీ విభాగ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కురుపాం నియోజకవర్గానికి చెందిన వడ్డి మహేశ్వరరావును నియమించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు చేపట్టినట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. శంబర పోలమాంబ ఆలయ ఈఓగా శ్రీనివాసరావు మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఆలయ ఈఓగా బి.శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఈఓగా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై శంబర పోలమాంబ అమ్మవారి ఆలయ గ్రేడ్–1 ఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు పోలమాంబ అమ్మవారి ఆలయ ఈఓగా పనిచేసిన వి.వి.సూర్యనారాయణ పాలకొండ కోటదుర్గ అమ్మవారి ఆలయం, తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం, పార్వతీపురంలోని గ్రూపు దేవాలయాల అధికారిగా బదిలీ అయ్యారు. ఏజెన్సీలో సీఆర్పీఎఫ్ బలగాల కూంబింగ్ మక్కువ: ఏజెన్సీ గ్రామాల్లో సీఆర్పీఎఫ్ 198 బెటాలియాన్ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్కుమార్ నేతృత్వంలో గురువారం సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. మార్కొండపుట్టి, బొడ్డు సామంతవలస, ఎర్ర సామంతవలస, పనసబద్ర, దుగ్గేరు, మూలవలస తదితర గ్రామాల్లో అనుమానిత ప్రదేశాలను నిశితంగా పరిశీలించాయి. కల్వర్టుల వద్ద మెటల్డిటెక్టర్తో తనిఖీలు జరిపాయి. మక్కువ మండలం ఆంధ్రా–ఒడిశా బోర్డర్లో ఉండడంతో మావోయిస్టు కదలికలపై ఆరా తీశాయి. పోలవరం ఎత్తు తగ్గితే ఉత్తరాంధ్రలో కరువు ఖాయం బొబ్బిలి రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గితే ఉత్తరాంధ్రలో కరువు ఖాయమని, కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తుతగ్గించేలా చేపట్టే నిర్మాణాలవల్ల తీరని నష్టం కలుగుతుందని ఉత్తరాంధ్ర సాధన సమితి కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మునాయుడు అన్నారు. తన కార్యాలయంలో స్థానిక విలేకరులతో గురువారం మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ముందు చూపుతో పోలవరం నుంచి సుజలస్రవంతి ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకు సాగు, తాగునీరిందేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, నేటి ప్రభుత్వం ఉత్తరాంధ్రకు అన్యాయం చేసేందుకు యత్నిస్తోందని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తు వరకు నీటిని నింపి ఉత్తరాంధ్ర ప్రజల అవసరాలను తీర్చేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మాణాత్మకంగా చర్యలు చేపట్టిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కేంద్రం ఒత్తిడికి తలొగ్గి 41.15 మీటర్లకు కుదించేలా ఒప్పందం చేసుకుందని, దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రజల తాగు, సాగునీటి అవసరాలు పోలవరం ప్రాజెక్టుతో నెరవేరవన్నారు. కూటమి తీరును ఉత్తరాంధ్ర ప్రజలు క్షమించరన్న విషయాన్ని గుర్తించాలన్నారు. సమావేశంలో సమితి సభ్యులు ఆర్.శంకరరావు, కృష్ణ పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం
పార్వతీపురం: పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అభిప్రాయపడ్డారు. పారిశుద్ధ్య పక్షోత్సవాల్లో భాగంగా గరుగుబిల్లి మండలంలోని సుంకి, సంతోషపురం గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను గురువారం తనిఖీ చేశారు. సుంకి గ్రామంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో వర్మీ కంపోస్టు ఎరువు తయారీని పరిశీలించారు. అన్నిచోట్ల ఎరువు తయారీకి ప్రాధాన్యమివ్వాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై పల్లె ప్రజలకు అవగాహన కల్పించాలని, తడి, పొడిచెత్తనే వేర్వేరుగా సేకరించాలన్నారు. కాలువలు, వీధుల పరిశుభ్రతతోపాటు స్వచ్ఛమైన తాగునీటి సరఫరాపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, ఎంపీడీఓ జి.పైడితల్లి, డిప్యూటీ ఎంపీడీఓ ఎల్.గోపాలరావు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికార ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి తమ సమస్యలను పరిష్కరించాలని తోటపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామమైన సుంకి గ్రామ నిర్వాసితులు సర్పంచ్ కె.రవీంద్రతో కలిసి కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. నిర్వాసితులకు తక్షణమే పునరావసం కల్పించాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. సుంకిలో వర్మీకంపోస్టు ఎరువు తయారీని పరిశీలిస్తున్న కలెక్టర్ శ్యామ్ప్రసాద్ -
లయాపనా!
లక్షేపమా..గిరిజనుల నుంచి అభిప్రాయ సేకరణ అని చెప్పి.. సమావేశానికి గిరిజనేతరులనూ ఆహ్వానించడంపై తొలుత విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయమై గిరిజన సంఘాల నాయకులు అధికారులను నిలదీశారు. జీవోను నీరుగార్చే ఉద్దేశంతోనే అందరినీ పిలిచారంటూ పలువురు విమర్శించారు. దీంతో సమావేశ మందిరంలో కాసేపు గందరగోళం ఏర్పడింది. అనంతరం కొంతమంది అభిప్రాయాలను మాత్రమే సేకరించారు. సీతంపేట తదితర ప్రాంతాల నుంచి సంఘాల నాయకులు మాట్లాడేందుకు వచ్చినా వారికి అవకాశం ఇవ్వలేదు. చాలామందికి వినతిపత్రం అందిస్తే పరిశీలిస్తామని చెప్పి, సరిపెట్టేశారు. ● చట్ట పరిధిలో గిరిజనులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని మాజీ శాసనసభ్యులు నిమ్మక జయరాజు తెలిపారు. సుప్రీం కోర్టు ద్వారా రద్దు చేసిన జీవోలోని అంశాలు అనుకూలంగా ఉండాలంటే రాజ్యాంగ సవరణ ఒక్కటే మార్గమన్నారు. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ మేరకు మాత్రమే ఇది సాధ్యపడుతుందన్నారు. ● చట్టాలు అమలు కాని పరిస్థితి ఉందని మాజీ శాసనసభ్యులు కోలక లక్ష్మణమూర్తి అన్నారు. గిరిజన ప్రాంతాల్లో వంద మంది ఉద్యోగాలు చేస్తే.. అందులో 96 మంది గిరిజనేతరులే ఉంటున్నారని తెలిపారు. ఇంకా సమానత్వం ఎక్కడుందని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల్లో చదువుకునే వారి సంఖ్య నానాటికీ తగ్గిపోతోందని తెలిపారు. సమ సమాజంలో గిరిజనులకు సమానత్వం కల్పించాలని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఆచరణ కావడం లేదన్నారు. ● ఐదవ షెడ్యూల్లో ఉన్న తమను ఆరో షెడ్యూల్కు పంపేలా కేంద్రానికి ప్రభుత్వం సిఫారసు చేయాలని, అప్పుడే గిరిజనులకు తగిన న్యాయం జరుగుతుందని కురుపాం మండలం లంకజోడి గ్రామ సర్పంచ్ ఆరిక విప్లవ కుమార్ కోరారు. ● గిరిజన ప్రాంతాల్లో జిల్లా యూనిట్గా తీసుకొని వంద శాతం గిరిజనులకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని.. గిరిజన భాషను నేర్చుకున్న వారినే ఉపాధ్యాయులుగా నియామకం చేపట్టాలని గిరిజన ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు గేదెల రామకృష్ణారావు కోరారు. ● రద్దు చేసిన జీవో పక్కాగా అమలు కావాలంటే సవరణ ఒక్కటే మార్గమని గుమ్మలక్ష్మీపురం మండలం చింతలగూడ సర్పంచ్ నిమ్మక సింహాచలం తెలిపారు. ● జీవో 3 పునరుద్ధరణ జరగదని, ప్రత్యామ్నాయం కావాలని మొత్తంగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా జీవోలను మార్చేస్తున్నారని చెప్పారు. జీవోలు వద్దు.. చట్టం కావాలని స్పష్టం చేశారు. అప్పుడే మార్చడానికి వీలుండదన్నారు. గిరిజనుల పక్షాన ప్రభుత్వాలు, ఐటీడీఏ అధికారులు పోరాడాలని కోరారు. ● రాజ్యాంగ సవరణ చేసైనా షెడ్యూల్డ్ ఏరియా ఉద్యోగాలన్నీ గిరిజనులకు ఇవ్వాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాడంగి సాయిబాబు, పాలక రంజిత్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ భార్గవికి వినతిపత్రం అందజేశారు. ఇప్పటి వరకు జీవో నంబర్–3 సక్రమంగా అమలు కాలేదన్నారు. జీవోలు కాకుండా చట్టం తేవాలని కోరారు. అభిప్రాయ సేకరణ కాలక్షేపం, కాలయాపన చేస్తే పోరాటం తప్పదని స్పష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్కు ముందే గిరిజన సంఘాల అభిప్రాయం తీసుకుని ఉంటే బాగుండేదన్నారు. ● షెడ్యూల్డ్ ఏరియాలో జీవో 3 స్థానంలో వంద శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక రిజర్వేషన్ చట్టం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం, ప్రజాసంఘాలు కోరాయి. మెగా డీఎస్సీ నుంచి ఏజెన్సీ పోస్టులను మినహాయించాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఐటీడీఏ వద్ద ఆయా సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.గిరిజనేతరులకు ఏం పని? సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: జీవో నంబర్–3ను పునరుద్ధరిస్తామని గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కూటమి నాయకులు.. గెలిచాక మాట దాటేశారు. ఏడాదికిపైగా కాలక్షేపం చేసి.. ఇప్పుడు తీరిగ్గా కాలయాపనకు సిద్ధమయ్యారు. జీవో అమల్లో ఇబ్బందులంటూ చెప్పుకొస్తూ.. ప్రత్యామ్నాయ జీవో అంటూ గిరిజనులను ఒప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. జీవో నంబర్– 3, గిరిజన చట్టాలపై అభిప్రాయా లు, సూచనలు, సలహాల కోసమని గురువారం పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో వర్క్ షాప్ నిర్వహించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు ఎస్.భార్గవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిజన సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ న్యాయ సలహాదారు డాక్టర్ పల్లా త్రినాథరావు జీవో నంబర్– 3ను సుప్రీంకోర్టులో ఎందుకు కొట్టి వేశారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వాస్తవానికి ఇదంతా గడిచిన అధ్యాయం. అందులో ఇబ్బందులు, గత ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ను న్యాయస్థానం డిస్మిస్ చేయడం.. ఇవన్నీ కూటమి ప్రభుత్వానికి ఎరుకే. తెలిసీ ఎన్నికల ముందు సంబంధిత జీవోను పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలోనూ ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో చేసిన ప్రచారంలోనూ ప్రకటనలు చేశారు. ఇప్పుడు మాట మార్చి, అమలు చేయకుండా ఆలస్యం చేయడం.. అభిప్రాయ సేకరణ అంటూ దాటవేయడం కాలయాపన చేయడానికే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి నివేదిస్తాం... జీవో నంబర్–3పై గిరిజనుల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు ఎస్.భార్గవి తెలిపారు. గిరిజన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, న్యాయవాదుల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన జీవో నంబర్–3ను సుప్రీంకోర్టులో రద్దు చేసిన నేపథ్యంలో వివిధ సంఘాలు, న్యాయవాదులు చేసిన ఉద్యమాల ద్వారా తిరిగి పునరుద్ధరణ చేయాలని దరఖాస్తులు వచ్చాయని, దీనికి స్పందించి గిరిజన ప్రాంతంలో ఉన్న ఐటీడీఏల పరిధిలో వర్క్షాప్ ఏర్పాటు చేసి అభిప్రాయాలను స్వీకరించే విధంగా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందరితో చర్చించాక మరింత మెరుగ్గా జీఓను అమలు చేసే వీలుంటుందన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడారు. జీవో నంబర్ 3పై అభిప్రాయ సేకరణ తూతూమంత్రంగా నిర్వహణ గిరిజనేతరులూ సమావేశంలోకి.. జీవో కాదు.. చట్టం చేయాల్సిందే అని స్పష్టం చేసిన గిరిజన సంఘాలు మీడియా అవసరం లేదా.. సమాచార శాఖ అత్యుత్సాహం జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వపరంగా నిర్వహించాల్సిన ఏ కార్యక్రమాలకూ మీడియాతో పని లేదన్నట్లే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాచార శాఖ నుంచి వారు పంపించింది రాసుకోవడమే తప్ప.. అన్ని కార్యక్రమాలనూ గోప్యంగానే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఓ వర్గం మీడియా తప్ప, ఇంకేమీ అవసరం లేదన్నట్లు జిల్లా అధికారుల వైఖరి ఉంది. అందరికీ తెలిసి జరగాల్సిన జీవో నంబరు 3 అభిప్రాయ సేకరణ కార్యక్రమంలోనూ సమాచార శాఖ అదే వైఖరి అవలంబించింది. ముఖ్యంగా ‘సాక్షి’ మీడియా పట్ల దురుసుగా వ్యహరించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే సాక్షి మీడియాపై అక్కసు వెళ్లగక్కారా, లేకుంటే స్వతహాగా నిర్ణయం తీసుకున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. సమావేశంలో వారికి నచ్చిన మీడియానే ఉంచి, మిగిలిన వారిని బయటకు పంపించేశారు. ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం విషయంలోనూ మీడియా ప్రతినిధుల పట్ల అధికారులు ఇదే మాదిరి నిర్లక్ష్యం చూపారు. ఈ అంశాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. -
దళిత మహిళ నిర్బంధం అమానుషం
జియ్యమ్మవలస రూరల్: రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తే భయపడేది లేదు.. ఎంతమందిపై కేసులు పెడతారో మేమూ చూస్తాం.. సాక్షాత్తు ఎమ్మెల్యే అవినీతి బాగోతాన్ని, వర్కులపై తీసుకున్న కమీషన్లు, ఉద్యోగాల పేరిట వసూలు చేసిన దందాల వివరాలను బయటపెడతామని మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి స్పష్టంచేశారు. చినమేరంగి క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తురకనాయుడువలస గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త, సోషల్ మీడియా ఐటీ విభాగం అధ్యక్షురాలు ఎత్తిలు మణిని మంగళవారం జియ్యమ్మవలస పోలీసులు 13 గంటల పాటు నిర్బంధంలోకి తీసుకోవడం తగదన్నారు. సోషల్ మీడియాలో ఓ పోస్టును కాపీ చేసి తన ఫేస్బుక్లో పెట్టినందున కూటమి పార్టీ నాయకుల మనోభావాలు దెబ్బతీశాయంటూ ఆమైపె కేసు పెట్టడాన్ని తప్పుబట్టారు. కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఒత్తిడితో కూటమి నాయకులు 20 మంది వరకు జియ్యమ్మవలస పోలీసు స్టేషన్కు వచ్చి పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం, దళిత మహిళని చూడకుండా 13గంటల పాటు నిర్బంధంలోకి తీసుకోవడం దుర్మార్గమన్నారు. ఇలాంటి సంప్రదాయం కురుపాం నియోజకవర్గంలో మునుపెన్నడూ చూడలేదన్నారు. తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, వారి భావస్వేచ్ఛకు ఏనాడూ అడ్డుపడలేదని, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు, అవమానాలు భరించాలన్నారు. నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ చేసిన అభివృద్ధి కనిపించడం లేదంటే ఇంతకంటే అబద్ధం, అసత్యం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి కార్యకర్తలకు ఇళ్లు, గోశాలలు, నీటి తొట్టెల కే పరిమితమైందన్నారు. గోశాలలు నిర్మించిన చాలా మందికి బిల్లులు రాక ఆవేదన చెందుతు న్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించాలన్నారు. నియోజకవర్గంలో ప్రస్తుత, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ సారి వైఎస్సార్సీపీ కార్యకర్తల సూచన మేరకు రెడ్బుక్ రాజ్యాంగానికి బదులిస్తామని, దానికోసం మా దగ్గర బ్లూబుక్ ఉందని, అందులో ఎవరెవరి పేర్లు రాయాలో ఇప్పటికే రాశామన్నారు. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం చూపి పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని పోగొ ట్టుకోవద్దని అభ్యర్థించారు. కార్యక్రమంలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాల పార్టీ కన్వీనర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు. రెడ్బుక్ రాజ్యాంగానికి స్వస్తి పలకాలి లేదంటే పదింతలు బ్లూ బుక్ రాజ్యాంగం అమలు చేయాల్సి ఉంటుంది మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి హెచ్చరిక -
ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి
పార్వతీపురం టౌన్: జిల్లాలో ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారాణి కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ను కోరారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం కలెక్టర్ను కలిసి సమస్యను వివరించి వినతిపత్రం అందజేశారు. ఏనుగులతో కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం, జియమ్మవలస, భామిని, సీతంపేట మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏనుగుల వల్ల ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో సుమారు రూ.1.50 కోట్ల ఎంపీ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో బెలగాం రైల్వేగేట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి పరిసర గ్రామస్తుల ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. కలెక్టర్ను కోరిన ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారాణి -
సూపర్ సిక్స్లో కూటమి డకౌట్
బలిజిపేట: ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలులో కూటమి నేతలు డకౌట్ అయ్యారని అరకు ఎంపీ తనూజారాణి అన్నారు. బలిజిపేటలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ మండల విస్తృతస్థాయి సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్నా సుపరిపాలన లేదు సరికదా అక్రమాలు, అన్యాయాలు, కేసులు, గొడవలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారిందన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలను చెప్పినట్టుగా అమలుచేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుపరచకుండా మహిళలు, నిరుద్యోగులు, యువత, రైతులు, విద్యార్థులు ఇలా అన్నివర్గాల ప్రజలను మోసం చేస్తోందని, దీనిని గడపగడపకు వెళ్లి వివరించాలన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. దీనిని వైఎస్సార్సీపీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులకు యూరియా దొరకడం లేదని, రైతుకు ఇస్తామన్న ఆర్థిక సాయం కూడా ఇవ్వలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఎండమావిగా మారిందన్నారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ అర్హులందరికీ కాకుండా కొందరికే వర్తింపజేశారన్నారు. హామీల అమలుపై కూటమి నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పి.మురళీకృష్ణ, తూర్పుకాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మామిడి శ్రీకాంత్, ఎంపీపీ నాగమణి, జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్, మండల ఉపాధ్యక్షుడు వి.సాయిరాం, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలోకి శ్రీరంగరాజపురం వాసులు బలిజిపేట: మండలంలోని నారన్నాయుడువలస పంచాయతీ శ్రీరంగరాజపురం నుంచి 70 కుటుంబాల వారు బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, తూర్పుకాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మామిడి శ్రీకాంత్ల ఆధ్వర్యంలో అరకు ఎంపీ తనూజారాణి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోసపూరిత పాలన నచ్చక వైఎస్సార్ సీపీలో చేరుతున్నారన్నారు. అధికారం చేపట్టిన ఏడాదికే టీడీపీని వీడుతున్నారంటే వారి సుపరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎన్.చిన్నారావు, కె.అప్పలనాయుడు, వెంకటరమణ, పి.త్రినాథరావు, కె.గురుమూర్తి, పి.గణపతి, తిరుపతిరావు, కె.శ్రీనివాసరావు, పి.సూర్యనారాయణ, రమేష్, సత్యం, లక్ష్మణరావు, ఎ.రమేష్, కె.శంకరరావు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల శాఖ అధ్యక్షుడు పి.మురళీకృష్ణ, ఎంపీపీ నాగమణి, జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్, మండల ఉపాద్యక్షుడు వి.సాయిరాం, నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అరకు ఎంపీ తనూజారాణి -
ఊరిస్తోంది ఇంకా!
అదిగో చినుకు.. సాక్షి, పార్వతీపురం మన్యం: ఖరీఫ్ పనులకు కొద్దిరోజుల ముందు వర్షాలు వారం రోజులపాటు కురిస్తే రైతులు మురిసిపోయారు. వ్యవసాయ పనులు మొదలు పెట్టేశారు. తీరా.. ఇప్పుడు వానలు ముఖం చాటేశాయి. వేసవిని తలపిస్తూ ఎండలు మండుతున్నాయి. ఉదయం ఎండ వేడిమి.. సాయంత్రం నాలుగు చినుకులు.. రాత్రయితే ఉక్కపోత.. ఇదీ జిల్లాలో పరిస్థితి. కొద్దిరోజులుగా వేసవిని తలపిస్తున్న ఎండలతో నారుమడులు ఎండుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చి రైతులు వరి నారుమడులు తడుపుతున్నారు. జిల్లాలో ఈ నెల 16న 19.1 మి.మీ. సగటు వర్షం కురిసింది. ఇందులో మక్కువ, సీతానగరం, పాలకొండ, కొమరాడ, బలిజిపేట ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కాగా.. కురుపాం, జియ్యమ్మవలస, పార్వతీపురం, పాచిపెంట తదితర మండలాల్లో చినుకు జాడలేదు. జిల్లాలో ఈ ఏడాది జూన్ నుంచి జులై 16వ తేదీ వరకు 247.6 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 201 మి.మీ. కురిసింది. గతేడాది ఇదే సమయంలో 264 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. రుతు పవనాలు తొందరగానే ప్రవేశించాయని.. ఇంక వానలే వానలని అనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. ఖరీఫ్పై ప్రభావం జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఖరీఫ్ సీజన్లో 2.20 లక్షల ఎకరాల్లో వరితోపాటు, ఇతర ప్రధాన పంటలు సాగవుతాయి. ప్రస్తుతం పంటలకు నీరు అవసరం. కొన్ని మండలాల్లో అడపాదడపా వర్షం కురుస్తున్నా.. మరికొన్ని మండలాల్లో పూర్తిగా ఎండకాస్తోంది. నీటి వనరులున్నా.. ప్రభుత్వ వైఫల్యం కారణంగా సాగుకు ఇవ్వలేని పరిస్థితి. ప్రస్తుతం ఖరీఫ్కు సంబంధించి నీరు రాకపోతే నారుమడులు వేసిన రైతులు నష్టపోతారు. నీటి వనరులున్న చోటు ఉడుపులు అవుతున్నాయి. వర్షాలు ఆలస్యమై పైరు దెబ్బతింటుంది. దీనివల్ల వెదలు జల్లడం లేదు. సాధారణంగా ఈ సమయంలో ఉభాలకు పూర్తిస్థాయిలో సిద్ధమవ్వాలి. దమ్ములు కూడా మొదలవ్వాలి. మరోవైపు యూరియా కొరత వేధిస్తోంది. ఈ సమయంలో యూరియా అందకపోతే మొక్క ఎదుగుదల మీద ప్రభావం పడుతుంది. ఓ వైపు వర్ష ప్రభావం, ఇంకోవైపు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది జూన్, జులై నెలల్లో నమోదైన సగటు వర్షపాతం వివరాలు జూలై సగం గడిచినా ఇంకా లోటు వర్షపాతమే.. ఖరీఫ్ పనులకు వెనకడుగు వేస్తున్న రైతులు ఎండిపోతున్న ఆశలు వర్షపాతం ఇలా... గత ఏడాది జూన్, జూలై నెలల్లో (ఇదే సమయానికి) 247.6 మి.మీ సాధారణ వర్షపాతానికి గాను 264 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అంతకు ముందు 2023లో ఇదే సమయానికి 307.01 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. కురిసింది(మి.మీ) -
వ్యవసాయంలో మక్కువకు గుర్తింపు
మక్కువ: వ్యవసాయ పరిశోధనల్లో ‘మక్కువ’కు గుర్తింపు లభించింది. మండలంలోని చప్పబుచ్చమ్మపేటకు చెందిన వైకుంఠపు పాపారావు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (ఐసీఏఆర్)లో వ్యవసాయశాస్త్రవేత్తగా ఉద్యోగం చేస్తూ చేసిన పరిశోధనలు జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చాయి. రాష్ట్రీయకృషి విజ్ఞాన్ పురస్కార్–2025 వరించింది. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ చేతులమీ దుగా పాపారావు బుధవారం అవార్డు అందుకున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ (ఐసీఏఆర్) స్థాపన దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలకు అవార్డులను ప్రదానం చేశారు. ●ఆనందంగా ఉంది మాది వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు వైకుంఠపు అప్పలనాయుడు, పార్వతి వ్యవసాయదారులు. చిన్న ప్పటి నుంచి వ్యవసాయం అంటే మక్కువ. వ్యవసాయశాస్త్రవేత్తగా 2020 సంవత్సరంలో ఉద్యోగం సాధించా ను. ప్రస్తుతం హైదరాబాద్లో ఐసీఏఆర్లో శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తున్నాను. వ్యవసాయ పరిశోధనలకు రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ పురస్కారం వరించడం గౌరవంగా భావిస్తున్నా. – డాక్టర్ వైకుంఠపు పాపారావు అవార్డుతో వ్యవసాయ శాస్త్రవేత పాపారావు -
తెల్ల కాగితం చూపించేసి.. అభిప్రాయాలు చెప్పేయమంటారా?
● జీఓ 3కి ప్రత్యామ్నాయం అంటే ఏమిటి? ● గిరిజనులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదా? ● మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర సాక్షి, పార్వతీపురం మన్యం: జీవో నంబర్ 3పై స్పష్టత ఇచ్చాకే గిరిజనుల, గిరిజన సంఘాల అభిప్రాయాలను తీసుకోవాలని మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు ఎస్.భార్గవి జీవో నంబరు 3, గిరిజన చట్టాలపై గురువారం పార్వతీపురం ఐటీడీఏ వద్ద వివిధ సంఘాలతో సమావేశం కానున్నారని.. ఇక్కడైనా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు, తర్వాత జీవో నంబరు 3ను పునరుద్ధరిస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, మంత్రి సంధ్యారాణి పదేపదే చెప్పడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ విషయాన్ని పొందరుపరిచారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ జీవో అని చెబుతూ.. దానికి సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఇవ్వాలంటున్నారని తెలిపారు. అసలు ప్రత్యామ్నాయ జీవోలో ఏముందో, ఎలా ఉంటుందో చెప్పకుండానే గిరిజనులు, గిరిజన సంఘాలు ఏం అభిప్రాయం చెబుతారని ప్రశ్నించారు. ‘గిరిజనులంతా అమాయకులు కదా.. అందుకే మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు. వారికి ఏం చెప్పినా చెల్లిపోతుంద’న్న ఆలోచనలో కూటమి నాయకులు ఉన్నట్లు ఉన్నారని ఆరోపించారు. న్యాయస్థానంలో డిస్మిస్ అయిందని తెలిసి హామీ ఇవ్వలేదా? గిరిజనులకు రిజర్వేషన్లలో న్యాయం చేద్దామనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భావించారని రాజన్నదొర తెలిపారు. జీవో 3కి వ్యతిరేకంగా న్యాయస్థానంలో తీర్పు వస్తే రివ్యూ పిటిషన్ వేశామని గుర్తు చేశారు. ఏప్రిల్, 2022లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా తయారు చేశామని.. నాటి అడ్వకేట్ జనరల్ సలహాలు కూడా తీసుకున్నామని చెప్పారు. రివ్యూ పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు వేస్తే కోర్టు ధిక్కారం అవుతుందని ఏజీ సలహా ఇవ్వడంతో ఆ ప్రక్రియ అక్కడ ఆగిందని గుర్తు చేశారు. గత ఎన్నికలకు ముందే 2024 ఏప్రిల్లో రివ్యూ పిటిషన్పై న్యాయస్థానంలో తీర్పు వ్యతిరేకంగా వచ్చిందన్నారు. డిస్మిస్ అయిందని తెలిసి కూడా జీవో నంబరు 3ను పునరుద్ధరిస్తామని కూటమి నాయకులు ఎలా హామీ ఇచ్చారని ప్రశ్నించారు. నూటికి నూరు శాతం గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామని ఒప్పుకున్నట్లే కదా? అని అన్నారు. మరి కేంద్రానికి ఎందుకు పంపలేదని, దాగుడు మూతలు ఆడుతున్నారా? అని సందేహం వ్యక్తం చేశారు. గిరిజనులతో ఆటలాడుకుంటున్నారా? ప్రత్యామ్నాయ జీవోలో ఏ విషయమూ స్పష్టంగా చెప్పకుండా సలహాలు అడిగితే ఎలా ఇవ్వగలరని రాజన్నదొర అన్నారు. గిరిజనులతో ఆటలాడుకుంటున్నారా? అని ప్రభుత్వాన్ని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని ప్రశ్నించారు. గిరిజన సంఘాల నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు. ముందుగా స్పష్టత తీసుకున్న తర్వాతే అభిప్రాయాలను వ్యక్తపరచాలని తెలిపారు. తెల్ల కాగితం చూపించి, దాన్ని చూసే అభిప్రాయాలు చెప్పాలన్న తీరులో ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. తనను కలిసిన గిరిజన సంఘాలతో ఇదే విషయం స్పష్టం చేశానని రాజన్నదొర అన్నారు. -
టిడ్కో ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయండి
● టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ నెల్లిమర్ల: టిడ్కో ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాలని టిడ్కో రాష్ట్ర చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని టిడ్కో కాలనీ సముదాయాన్ని ఎమ్మెల్యే లోకం నాగ మాధవితో కలిసి బుధవారం సందర్శించారు. నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లను పరిశీలించారు. మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులను ఆరాతీశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల నిర్మాణం కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదని, పట్టణాల్లో సొంతిల్లు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న బృహత్తర పథకమన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు సరోజిని, నాయకులు జనా ప్రసాద్, అప్పికొండ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. అరకొర నీటితోనే దమ్ము -
పోలీస్ సిబ్బందికి వైద్యపరీక్షలు
విజయనగరం క్రైమ్: రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వైద్యశిబిరాన్ని, సేవల తీరును ఆయన పరిశీలించారు. ఉద్యోగుల ఆరోగ్యమే లక్ష్యంగా అధికారి నుంచి హోంగార్డు వరకు అందరికీ వైద్యపరీక్షలు చేయిస్తామన్నారు. సుగర్, రక్తం, లిపిడ్ ప్రొఫైల్ (కొలిస్ట్రాల్), సీరం క్రియేట్ (కిడ్నీ), ఈసీజీ వంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన మందులతో పాటు వైద్యచికిత్స అందిస్తామని చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా వైద్యులను ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న మొత్తం 2000 మందికి ఈ నెలాఖరులోగా వైద్య పరీక్షలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని, ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ ఉద్యోగుల సౌలభ్యం కోసం జిల్లా కేంద్రంలోని మెడికవర్, స్కాన్యూ టేజ్లోను, బొబ్బిలిలోని క్వీన్ ఎన్ఆర్ఐ, రాజాంలోని జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆస్పత్రుల్లో వైద్యపరీక్షలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, అదనపు ఎస్పీ (ఏఆర్) జి.నాగేశ్వరరావు, వైద్యులు మల్లికార్జున రెడ్డి, అఖిల్, రాజేష్, వి.గోవర్ధన్, సిరి కృష్ణ, ఏఆర్ డీఎస్పీ వై.రవీంద్ర రెడ్డి, ఎస్బీ సీఐలు పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
పాలకొండ: సమస్యలు పరిష్కరించాలంటూ నగర పంచాయతీ పరిధిలోని మన్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు తలపెట్టిన సమ్మెలో భాగంగా బుధవారం అర్ధనగ్నప్రదర్శన చేపట్టారు. కనీసవేతనం చెల్లించాలని, సంక్షమే పథకాలు వర్తింపజేయాలని, గతంలో సమ్మె చేపట్టిన సందర్భలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హమీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తా పార్వతీపురం టౌన్: ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని అరకు ఎంపీ తనూజారాణి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుతో కలిసి వైఎస్సార్సీపీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. పల్లెలు, పట్టణాల్లోని సమస్యలను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. బెలగాం రైల్వే గేటు సమస్యను పరిష్కరించాలని డీఆర్ఎంకు ఫోన్చేసి తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు బొమ్మి రమేష్, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, ఎంపీపీ మజ్జి శోభారాణి, వైస్ ఎంపీపీ బి. రవికుమార్, సిద్ధా జగన్నాథం, వైస్ చైర్మన్ కొండపల్లి రుక్మిణి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. కనకమహాలక్ష్మి హుండీల ఆదాయం రూ.2,47,455లు చీపురుపల్లి: పట్టణంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ ఏడాది ఏప్రిల్ 28 నుంచి జూలై 16 వరకు భక్తులు హుండీలలో వేసిన కానుకలను బుధవారం లెక్కించారు. మొత్తం రూ.2,47,455ల ఆదాయం వచ్చినట్టు ఈఓ బి.శ్రీనివాస్ తెలిపారు. దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ జి.శ్యామ్ప్రసాద్ నేతృత్వంలో సాగిన హుండీల లెక్కింపు కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు గవిడి నాగరాజు, లెంక చిన్నారావు, తదితరులు పాల్గొన్నారు. మార్గదర్శుల వివరాల రిజిస్ట్రేషన్కు ఆదేశం విజయనగరం అర్బన్: పీ–4 కింద పేదలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చిన మార్గదర్శుల వివరాలను వెంటనే రిజిస్ట్రేషన్ చేయించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. వెబెక్స్లో పీ–4, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర, ఎరువుల సరఫరా, సీజనల్ వ్యాధుల వ్యాప్తి తదితర అంశాలపై జిల్లా స్థాయి, మండల అధికారులతో కలెక్టర్ బుధవారం మాట్లాడారు. పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య పనులు, ఎరువుల సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. 700 క్యూసెక్కుల నీరు విడుదల వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు ఏఈ నితిన్ తెలిపారు. ఇప్పటివరకు 600 క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు సరఫరా చేయగా, కాలువ సామర్థ్యమేరకు తాజాగా మరో వంద క్యూసెక్కుల నీటిని పెంచామన్నారు. -
విజయనగరం ఆర్టీసీ డిపో సందర్శన
విజయనగరం అర్బన్: ఆర్టీసీ ఎం,డి ద్వారకా తిరుమలరావు బుధవారం విజయనగరం ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన ఆర్టీసీ డిస్పెన్సరీని మార్చడానికి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి, దాని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేశారు. లాజిస్టిక్ కౌంటర్లను సందర్శించి బస్స్టేషన్కు వెళ్లి విద్యార్ధులతో బస్సుల సమయపాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన డిపో సిబ్బందితో సమావేశమై వారి పనితీరును మెచ్చుకున్నారు. అంతేకాక విజయనగరం డిపో పరిధిలో ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఉత్తమ సేవలందించిన సిబ్బందిని ప్రోత్సహించడం ద్వారా వారి కృషిని గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే నెల 15 నుంచి మహిళలకు కల్పించే ఉచిత బస్సు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు, ప్రస్తుతం నడుపుతున్న బస్సులను కూడా ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రయాణికుల సౌకర్యార్థం పల్లెవెలుగు బస్సులను పెంచుతామన్నారు. మహిళా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.బ్రహ్మానందరెడ్డి, విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు, డిప్యూటీ సీటీఎం జి.సత్యనారాయణ, డిప్యూటీ సీఎంఈ కొటాన శ్రీనివాసరావు, విజయనగరం జిల్లా ప్రజా రవాణా అధికారిణి జి.వరలక్ష్మి, ఈఈ అరుణకుమార్, డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు, సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ దుర్గాప్రసాద్, కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. -
గంజాయి నిందితుల ఆస్తులపై విచారణ
● ఎస్పీ వకుల్ జిందల్ ● చింతలవలస వద్ద 37.550 కేజీల గంజాయి పట్టివేతడెంకాడ: గంజాయి నిందితుల ఆర్థిక మూలాలపై విచారణ జరిపి ఆస్తులను ఫ్రీజ్ చేస్తామని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఈ మేరకు డెంకాడ మండలంలోని పినతాడివాడ వద్ద ఉన్న భోగాపురం సీఐ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడారు. మండలంలోని చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ మెయిన్గేట్ సమీపంలో 26వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం కారులో తరలిస్తున్న 37 కేజీల 550 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు చెప్పారు. కచ్చితమైన సమాచారంతో డెంకాడ పోలీసులు, ఈగల్ పోలీసులు సంయుక్తంగా ఏపీఎస్పీ బెటాలియన్ మెయిన్గేట్ సమీపంలో జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేస్తుండగా విజయనగరం నుంచి విశాఖ వెళ్తున్న కారులో 37.550 కేజీల గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఒడిశాలో కారులో గంజాయిని లోడ్ చేసి విశాఖకు తరలిస్తుండగా పట్టుబడ్డారని తెలియజేశారు. కారులో గంజాయి తీసుకువెళ్తున్న ఒడిశాకు రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లాకు చెందిన బసుదేవ్ సిపా అలియాస్ భాస్కర్ గొల్లారి, అజయ్ గంటలను పట్టుకున్నామని తెలిపారు. వారిద్దరినీ అదే రాష్ట్రానికి చెందిన రాజేష్ అలియాస్ గణేష్ అనే వ్యక్తి రూ.5వేలకు ఎంగేజ్ చేసుకున్నాడని చెప్పారు. రాజేష్ను కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. ఒడిశా నుంచి వివిధ మార్గాల్లో గంజాయిని హైదరాబాద్, బెంగళూరు, చైన్నె తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలిపారు. ఒడిశా నుంచి గంజాయిని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకునేందుకు పోలీస్ చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. అయితే నిందితులు చెక్పోస్టులున్నందున లూప్ లైన్లలో రవాణా చేస్తున్నారన్నారు. వాటిపై కూడా ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. ఈ మధ్య కాలంలో గ్రీన్ఫీల్డ్ హైవే మీదుగా రవాణా చేస్తున్నట్లు గుర్తించామని, దీంతో ఈ ప్రాంతాల్లో కూడా పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. గంజాయి రవాణా చేసినా, నిల్వ ఉంచినా, అమ్మినా చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. పట్టుబడిన నిందితులపై గంజాయి కేసుతోపాటు వారి ఆర్థిక మూలలపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విజయనగరం పట్టణంలో గంజాయి నివారణకు పూర్తిగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీనిలో భాగంగా పలువురిని పట్టుకుని కేసులు పెట్టి అరెస్టు చేయడంతో పాటు కఠిన చర్యలు కూడా తీసుకున్నామన్నారు. కేసులో క్రియాశీలకంగా పని చేసిన భోగాపురం సీఐ జి.రామకృష్ణ, ఎస్సై ఎ.సన్యాసినాయుడు, సిబ్బంది, ఈగల్ టీం సిబ్బందిని ఎస్పీ అభినందించారు. రికార్డుల పరిశీలన డెంకాడ పోలీస్టేషన్ను ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించిన సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. బ్లాక్స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసులు త్వరితగతిన ఛేదించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పారు. పోలీస్టేషన్లో వివిధ రికార్డులను, సీడీ ఫైల్స్, జనరల్ డైరీ, బెయిల్ బుక్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమాల్లో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, భోగాపురం సీఐ జి.రామకృష్ణ, ఎస్సై ఎ.సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ స్టేవైరు తగిలి గేదె మృతి
సీతానగరం: మండలంలోని తామరఖండి గ్రామంలో ఇళ్ల సర్వీసుల నిమిత్తం విద్యుత్ స్తంభానికి సపోర్టుగా వేసిన విద్యుత్ స్టే వైరు తగిలి రూ.80వేల ఖరీదైన గేదె మృతిచెందింది. ఈ ఘటనపై స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పాడి రైతు గుంట్రెడ్డి అప్పలనాయుడికి చెందిన గేదెను మేతకు తోలి ఇంటికి తీసుకువచ్చి ఇంటి ముందున్న తాడుకు కట్టాడు. వర్షం కురుస్తున్న సందర్భంగా నేల నాని పోవడంతో పక్కేనే ఉన్న విద్యుత్ స్తంభానికి బిగించిన స్టేవైరుకు పింగాణీ లేక పోవడంతో స్టే వైరుకు ప్రవహించిన విద్యుత్ గేదె మెడ, కొమ్ముకు తగలడంతో మృతిచెందినట్లు తెలియ జేశారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యంబాడంగి: మండలంలోని ముగడ పంచాయతీ పరిధి విమానాశ్రయం రన్వే గచ్చు తుప్పల్లో కుళ్లిపోయిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు బుధవారం కనుగొన్నారు. ఈ విషయాన్ని వీఆర్ఓ ద్వారా పోలీసులకు సమాచార మివ్వగా ఎస్సై తారకేశ్వరరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశిలించి మృతదేహం గుర్తు పట్టలేని విధంగా కుళ్లిపోయి కపాలం, ఎముకలు బయటకు కనిపించడంతో ఆ వ్యక్తి సుమారు 15రోజులక్రితమే చనిపోయి ఉంటాడని, ఆయన వయస్సు సుమారు 50–55మధ్య ఉంటుందని అంచనాకు వచ్చారు. తొలుత ఆనుమానాస్పద మృతిగా భావించి విజయనగరం నుంచి క్లూస్టీమ్ను రప్పించి పరిశీలించగా మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో వారు కూడా చేసేది లేక తిరుగుముఖంపట్టారు. మృతదేహాన్ని ఆస్పత్రికి కూడా తీసుకువెళ్లలేని పరిస్థితుల్లో ఆక్కడికే స్థానిక సీహెచ్సీ వైద్యాధికారి నాగేశ్వరావును రప్పించి పోస్టుమార్టం చేయించి సమీపంలోనే జేసీబీతో గొయ్యితీసి పూడ్చిపెట్టారు. అయితే కొద్దరోజులక్రితం మతిస్థిమితం లేని బిచ్చగాడు ఇటువైపు తిరుగుతుండేవాడని పలువురు చెప్పగా అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 14మంది జూదరుల అరెస్టు బొండపల్లి: మండలంలోని వెదురువాడ గ్రామం వద్ద జూదం ఆడుతుండగా 14మందిని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్సై యు.మహేష్ తెలిపారు. వారి నుంచి రూ.లక్షా 1170 నగదు, 9సెల్ఫోన్లు, 14మోటార్ సైకిల్స్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. పట్టుకున్న వారి పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. -
జనసేన నాయకుడి దౌర్జన్యం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని మొయిద నారాయణపట్నం గ్రామంలో జనసేన మండల అధ్యక్షుడు పతివాడ అచ్చిం నాయుడు ఓ రైతు కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు, ఎస్సై గణేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అచ్చింనాయుడు, సామంతుల రమణల మధ్య కొంతకాలంగా పొలం గట్టు విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నేత అచ్చింనాయుడు మంగళవారం ఉదయం రమణ పొలాన్ని ఆక్రమించి గట్టు వేశాడు. ఇదే విషయమై రమణ ప్రశ్నించగా విచక్షణా రహితంగా దాడి చేయడంతో సామంతుల రమణతో పాటు చనమల్లు అరుణ్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం వారిద్దరూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. తమ వారిని గాయపరచడంతో అదే రోజు సాయంత్రం గ్రామంలో ఇరువర్గాల మధ్య మళ్లీ ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో అచ్చింనాయుడితో పాటు అవతలి వర్గంలోని పలువురికి గాయాలయ్యాయి. తనపైనే దాడి అంటూ జనసేన నేత ప్రచారం తొలుత రైతు కుటుంబాన్ని గాయపరిచిన జనసేన నేత అచ్చింనాయుడు అదేమీ లేదంటూ తనపైనే దాడి చేశారని రాజకీయ కోణంలో సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేశాడు. పోలీసులు వాస్తవాలను తెలుసుకోవడంతో సైలెంట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి గ్రామాన్ని సందర్శించి తగాదాపై ఆరా తీశారు. ఇది కేవలం పొలంలో తలెత్తిన గొడవేనని..రాజకీయానికి సంబంధం లేదని ఆమె గుర్తించారు. తమపై దాడి జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు బాధిత వర్గం ఎమ్మెల్యేకు వివరించింది. దాడి జరిగినప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని, అన్యాయం జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉందని బాధిత వర్గాన్ని ఎమ్మెల్యే మందలించారు. పరస్పర ఫిర్యాదుల మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గణేష్ తెలిపారు. పొలం గట్టును కలిపేసి ఆపై రైతుపై దాడి ప్రతిఘటించిన బాధిత రైతు కుటుంబం ఇరు వర్గాలకు గాయాలు, ఆస్పత్రిలో చికిత్స ఆరాతీసిన ఎమ్మెల్యే లోకం నాగమాధవి’ -
దివ్యాంగులతో సదరంగం..!
విజయనగరంఫోర్ట్: మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన పాలవలస స్వామినాయుడు అనే ఎముకల సంబంధిత దివ్యాంగుడు సదరం సర్టిఫికెట్ కోసం సచివాలయంలో స్లాట్ బుక్ చేసుకున్నారు. స్వామినాయుడికి 2024 డిసెంబర్ 10వతేదీన ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో సదరం సర్టిఫికెట్ కోసం అటెండ్ (హాజరు) అవ్వాలని వచ్చింది. దీంతో ఆ రోజున ఎస్. కోట ఏరియా ఆస్పత్రిలో అటెండ్ అయ్యాడు. ఆస్పత్రికి హాజరై 7 నెలలైంది. ఇంతవరకు ఆయనకు సదరం సర్టిఫికెట్ జారీ కాలేదు. ఆస్పత్రిలో అడిగితే స్పష్టమైన సమాధానం ఇవ్వడంలేదని వాపోతున్నాడు. ఈ ఒక్క దివ్యాంగుడే కాదు. అనేక మంది ఈ విధంగా సదరం సర్టిఫికెట్స్ జారీలో తీవ్ర జాప్యం జరుగుతోందని వాపోతున్నారు. అయితే చాలా మంది దివ్యాంగులు ఆస్పత్రికి వెళ్లాం కదా.. సదరం సర్టిఫికెట్ వస్తుందని ఎదురుచూస్తున్నారు. మరి కొంతమంది సదరం సర్టిఫికెట్స్ రాకపోతే ఎవరిని అడగాలో తెలియక మిన్నుకుండిపోతున్నారు. సదరం సర్టిఫికెట్ కోసం ఆస్పత్రికి హాజరైన వారికి వారం, 10 రోజుల్లో జారీ కావాల్సి ఉంది. కానీ నెలలు గడుస్తున్నా సర్టిఫికెట్స్ అందడంలేదని తెలుస్తోంది. సదరం సర్టిఫికెట్ ఈ విధంగా జారీ.. కంటి, ఎముకలు, న్యూరో, ఈఎన్టీ, మానసిక విభాగాలకు చెందిన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ జారీ చేస్తారు. సంబంధిత విభాగాలకు చెందిన దివ్యాంగులు అధార్ కార్డుతో లింక్ అయిన ఫోన్ నంబర్తో సంబంధిత సచివాలయాలనికి స్లాట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పడు సచివాలయానికి వెళ్తే అక్కడ ఆయా విభాగాలకు ఏ ఆస్పత్రికి వెళ్లాలో స్లాట్స్ బుక్ చేస్తారు. ఆ తేదీన ఆస్పత్రికి వెళ్తే ఆయా విభాగానికి చెందిన వైద్యుడు దివ్యాంగుడిని పరీక్షించి వైకల్యం ఎంత ఉందో రాసి సదరం సర్టిఫికెట్ జారీ చేస్తారు. సదరం సర్టిఫికెట్ (పర్మినెంట్) శాశ్వతంగా ఉంటేనే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తాత్కాలిక సర్టిఫికెట్ అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండదు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సదరం సర్టిఫికెట్స్ జారీలో జాప్యం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రుల్లో సర్టిఫికెట్ జారీ చేయడంలో వైద్యులు అలసత్వం వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 36 వేల మందికి దివ్యాంగుల పింఛన్ జిల్లాలో 36 వేల మందికి పైగా దివ్యాంగులు పింఛన్ పొందుతున్నారు. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత దివ్యాంగ పింఛన్లు పొందే వారికి పింఛన్ రీ వెరిఫికేషన్ చేయిస్తోంది. దీంతో దివ్యాంగులంతా ఆయా ఆస్పత్రులకు రీ వెరిఫికేషన్కు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క దివ్యాంగ పింఛన్ కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవు. సర్టిఫికెట్స్ జారీలో అలసత్వం ఆస్పత్రిలో అటెండ్ అయి నెలలు గడుస్తునా కానరాని ఫలితం ఆందోళన చెందుతున్న దివ్యాంగులు స్పష్టమైన సమాధానం చెప్పని వైద్యాధికారులువిచారణ చేసి చర్యలుసదరం సర్టిఫికెట్కు దివ్యాంగుడు ఆస్పత్రికి హాజరైన 10, 15 రోజుల్లో జారీ చేయాలి ఎందుకు జాప్యం జరుగుతోందో విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. డాక్టర్ ఎన్.పి. పద్మశ్రీ రాణి, డీసీహెచ్ఎస్ -
బైక్స్ చోరీకి పాల్పడిన నిందితుల అరెస్టు
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లను అపహరించిన ఇద్దరు నిందితులను వన్టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వన్టౌన్లో ఎస్పీ వకుల్ జిందల్ విలేకరుల ముందు ఇద్దరు నిందితులను ప్రవేశ పెట్టారు.ఈ కేసుకు సంబంధించి ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ విజయనగరంలోని వీటీ అగ్రహారం బీసీ కాలనీకి చెందిన ఉప్పడాల రాము అలియాస్ డీజే, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం ముద్దాడపేటకు చెందిన ముద్దాడ నవీన్ అలియాస్ టైసన్ (19)తో కలిసి 11రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్, 2 యమహా మోటార్ సైకిళ్లను మారుతాళాలతో దొంగిలించారన్నారు. తరచూ విజయనగరం వన్ టౌన్, టూటౌన్ పోలీస్స్టేషన్ల పరిధిలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ చోరీకి గురవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని వాటికి కారకులైన నిందితులను అరెస్టు చేసేందుకు వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు బైక్ దొంగతనాలపై తన సిబ్బందితో నిఘా పెట్టారన్నారు. ఈ క్రమంలోనే వీటీ అగ్రహారం బీసీ కాలనీలో నివాసం ఉంటున్న (ఎ1) ఉప్పడాల రాము అలియాస్ డీజేను అరెస్టు చేశామని తెలిపారు. గతంలో కూడా ఉప్పడాల రాము అలియాస్ డీజేపై బైక్ చోరీలకు పాల్పడినట్లు పలు కేసులున్నాయన్నారు. నిందితుడు రాము ఇటీవల జైలు నుంచి విడుదలైన తరువాత మళ్లీ బైక్ చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు. ఎ1 ఉప్పడాల రాము నుంచి 7 మోటార్ సైకిల్స్ను, ఎ2 ముద్దాడ నవీన్ నుంచి 6 మోటార్ సైకిళ్లు రికవరీ చేశామని చెప్పారు. రికవరీ చేసిన బైక్లను కోర్టు ఆదేశాలతో బాధితులకు తిరిగి అందించేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ ఈ సందర్భగా స్పష్టం చేశారు. ఈ కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, సీఐ ఆర్వీఆర్కే చౌదరి ఆధ్వర్యంలో పని చేసిన వన్ టౌన్ క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు, హెచ్సీ ఎ.రమణారావు, కానిస్టేబుల్స్ ఎన్.గౌరీశంకర్, పి.శివశంకర్, టి.శ్రీనివాస్, పి.మంజులను ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. -
గ్రోమోర్ సెంటర్లో విజిలెన్స్ తనిఖీలు
గంట్యాడ: మండలంలోని కొఠారుబిల్లి జంక్షన్లో ఉన్న గ్రోమోర్ సెంటర్ను విజిలెన్స్, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా బుధవారం తనిఖీ చేశారు. స్టాక్కు, ఈపాస్లో ఉన్న వివరాలు సమానంగా ఉన్నాయా? లేదా? కాలపరిమితి దాటిన ఎరువులు ఉన్నాయా? అని తనిఖీ చేశారు. మొక్కల ఎదుగుదలకు సంబంధించి వినియోగించే ఉత్ప్రేరకాలు కాలపరిమితి దాటడంతో రూ.7.50 లక్షలు విలువ చేసే స్టాక్కు స్టాప్ సేల్స్ ఆర్డర్స్ ఇచ్చారు. నెల రోజులలోగా స్టాక్కు సంబంధించి లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోతే 6ఎ కేసు నమోదు చేయాలని ఏఓ శ్యామ్కుమార్కు విజిలెన్స్ అధికారులు సూచించారు. ఈ తనిఖీల్లో పలాస ఏడీఏ రామారావు, విజిలెన్స్ ఎస్సై అప్పలనాయుడు పాల్గొన్నారు. రూ.7.50 లక్షల విలువైన స్టాక్కు స్టాప్సేల్స్ ఆదేశాలు -
విద్యను జాతీయం చేయాలి
పార్వతీపురం రూరల్: ఆటంబాంబులు, సునామీల కంటే పేపర్ లీక్ సమాజానికి, వ్యవస్థకు ఎంతో హానికరం అని పీపుల్స్స్టార్ ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఈ మేరకు బుధవారం పార్వతీపురం వచ్చిన ఆయన ఆగస్టు 22న విడుదల కానున్న తన ‘యూనివర్సిటీ పేపర్ లీకేజ్’ చిత్రం ప్రమోషన్ మేరకు జిల్లా కేంద్రంలోని పలువురు రాజకీయ నాయకులను పట్టణ ప్రముఖులను కలిశారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా విద్యారంగంలో జరుగుతున్న పేపర్లీక్ వల్ల జరిగే నష్టాలను చర్చిస్తూ తాను యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. గ్రూప్ 1, 2 పరీక్షల్లో అలాగే పలు ప్రధాన పరీక్షల్లో ప్రశ్నపత్రాల్ని లీక్ చేయడం చూస్తుంటే విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలు ఏమైపోతాయో అనే భయం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాపీయింగ్ చేసి మార్కులు తెచ్చుకున్న వారు డాక్టర్లు అయితే రోగుల ప్రాణాలకు భరోసా ఉండదని, అలాంటి వాళ్లు ఇంజనీర్లు అయితే బ్రిడ్జిలు ఎలా నిలబడతాయని ఆర్.నారాయణమూర్తి ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలు జరగకూడదంటే పేపర్ల లీక్లను అరికట్టాలని, విద్యను జాతీయం చేసి ప్రైవేట్ మాఫియా నుంచి విముక్తి చేయాలని ఆయన కోరారు. పీపుల్స్స్టార్ ఆర్.నారాయణమూర్తి -
పాములకు ప్రాణసంకటం
అవగాహన లోపం..● అంతరించి పోతున్న సర్పజాతులు ● రైతు మిత్రులకు రక్షణ కరువు ● నేడు వరల్డ్ స్నేక్ డేపాము కనిపిస్తే సమాచారం ఇవ్వండి.. పాములు కనిపిస్తే సమాచారం ఇవ్వండి. సర్ప జాతుల సంరక్షణకు స్నేక్ రెస్క్యూ టీమ్ తరలి వస్తుంది. ప్రాణాపాయం లేకుండా పట్టుకుని అడవుల్లో విడిచి పెడతాం. అటవీశాఖాధికారుల సహకారంతో గ్రీన్ మెర్సీ సంస్థ ఉచితంగా సేవలు అందిస్తుంది. సర్పజాతులను చంపవద్దు. ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది. పాములుంటే వ్యవసాయానికి మేలు. ఎలుకలు, పందికొక్కులు లేకుండా చేస్తాయి.పాము కనిపిస్తే హెల్ప్లైన్ నంబర్–9848414658కు తెలియ పరచండి. – కేవీ రమణమూర్తి, సీఈఓ, గ్రీన్మెర్సీభామిని: వ్యవసాయ రంగంలో కీలకమైన రైతు మిత్రులలో సరీసృపాలుగా పిలిచే పాకెడి జీవులున్నాయి.ఈ కోవలో ఒకటైన సర్ప జాతి జీవులపై అవగాహన లోపంతో అంతరించి పోయే దుస్థితి ఏర్పడింది. హైందవ సంప్రదాయంలో పవిత్ర స్థానం గల సర్పాలకు పూజలు, నోములు చేపట్టిన చోటే అవగాహన లోపంతో అంతం చేసే సంస్కృతి సాగుతోంది. దెబ్బ తగిలిన పాము పగ పడుతుందనే కల్పన, పాము కాటు వేస్తే విష ప్రభావంతో మరణిస్తామనే భయంతో వాటిని హతం చేస్తున్నారు. దీంతో జన బాహుళ్యంలో పాముల మనుగడ కష్టమైంది. రైతు పండించే పంటలో నలభై శాతం స్వాహా చేస్తున్న ఎలుకలు, పందికొక్కుల నివారణలో కీలక పాత్రధారిగా పిలిచే సర్పాలకు నిలువ నీడ లేకుండా పోతోంది. పర్యావరణ పరిరక్షణలో కీలకంగాను, భూ సారాన్ని కాపాడే ముఖ్యమైన పాకెడి జీవిగా గుర్తింపు పొందినా తగిన రక్షణ కరువవుతోందని పర్యావరణ హితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక వ్యవసాయంతో కష్టాలు ప్రధానంగా వ్యవసాయ రంగంలో క్రిమి సంహారక మందుల ప్రవేశంతో పాకెడి జీవుల అంతరించిపోతున్నాయి. విష తుల్యమైన జీవులను వేటాడి భుజించి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆధునిక యంత్రాల వాడకంలో పుట్టలు, తుప్పలు, దిబ్బలు లేకుండా, భూమిలో బొరియలు కూడా కరువై పాముల జీవనం కష్టమైందని చెప్పవచ్చు. విష సర్పాలు తక్కువ.. మన చుట్టూ తిరుగుతున్న పాములలో 80 శాతం సాధారణ విషంలేని సర్పాలే ఉన్నాయి. విషపూరిత మైనవి, ప్రాణాంతకమైనవి కొద్దిగానే ఉన్నాయి. మన ప్రాంతంలో వీటిలో నాలుగు రకాలైన తాచుపాము(నాగుపాము), రక్తపింజర, కట్లపాము, పొడపాములుగా గుర్తించారు. పాము కాటుకు గురైన వ్యక్తుల్లో అత్యధికంగా భయంతోనే ఎక్కువ మంది ప్రాణాలు పోగోట్టుకుంటున్నారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పాములపై అవగాహన.. విద్యార్థి స్థాయి నుంచి పాములపై అవగాహన కల్పించాలి. అన్ని పాములు ప్రమాదకారి కావని తెలియజేయాలి. పాము పగబడుతుందనే మూఢ నమ్మకాలు విడిచి పెట్టేలా అవగాహన కల్పించాలి. స్నేక్స్ ప్రేండ్లీ సొసైటీలు ఏర్పాటు కావాలి. అన్ని పాములను సంహరించడం తగదు.కొట్టి చంపకుండా, పట్టి దూరంగా విడిచి పెట్టాలి. జాతులు అంతరించ పోకుండా చూడాలి.పాములన్నీ విష సర్పాలు కావు.. పాములన్నీ విష సర్పాలు కావు.అన్ని పాములకు వి షం ఉండదు. పాము కాటు వేస్తే చనిపోవడం ఖాయమనే భయాన్ని వీడాలి. ప్ర మాదవశాత్తు పాముకాటు కు గురైనా భయపడవద్దు. అందుబాటులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకురండి. విషాన్ని నివా రించే ఏంటీస్నేక్ వీనమ్(ఏఎస్వీ) మందులు అందుబాటులో ఉన్నాయి. పాముకాటు పడిన తరువాత గాయాన్ని కడగవద్దు. పాము వేసిన గాట్లు గుర్తించి విషప్రభావం లెక్కించి ఏఎస్ వీలు వేస్తాం. – డాక్టర్ కె.విజయ పార్వతి, డిప్యూటీ డీఎంహెచ్ఓ, సీతంపేట -
అదానీ బృందాన్ని అడ్డుకున్న గిరిజనులు
వేపాడ: ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఊరు విడిచివెళ్లమంటూ మారిక గిరిజనులు సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. అదానీ బృందం సభ్యులు, అధికారులు మారిక వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ సీపీఎం నాయకుడు చలు మూరి శ్యామ్తో పాటు జాలారి వీర్రాజు, గమ్మెల బాబురావు, సోమేష్, అప్పలనాయుడు, పలువురు మహిళలు అదానీ బృందం, అధికారులు కొండక్కెకుండా రోడ్డుకు అడ్డుగా కంచెవేసి బ్యానర్ పెట్టి మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. అదానీ గ్రూప్ గో బ్యాక్.. అధికారులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. -
క్రీడాకారిణి భవానీకి జేసీ అభినందనలు
విజయనగరం: కజకిస్థాన్లో జరిగిన జూనియర్ ఆసియన్ చాంపియన్ షిప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో వరుసగా 3 బంగారు పతకాలను సాధించిన జిల్లాలోని కొండకరకాం గ్రామానికి చెందిన క్రీడాకారిణి రెడ్డి భవానిని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అభినందించారు. ఈ మేరకు తన చాంబర్లో మంగళవారం ఆమెను దుశ్శాలువతో సత్కరించారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ తరఫున రూ.25వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. వచ్చే ఒలింపిక్స్ పోటీల్లో పతకాన్ని సాధించి, దేశానికి, జిల్లాకు మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వరరావు, కోచ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. భవానీకి పౌరవేదిక సత్కారం విజయనగరం మండల పరిధిలోని కొండకరకాం గ్రామంలో అతి సామాన్య కుటుంబంలో జన్మించిన రెడ్డి భవాని ఇటీవల కజికిస్థాన్లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మూడు బంగారు పతకాలను సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ప్రతిష్టను పెంచిందని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పౌర వేదిక ఆధ్వర్యంలో బంగారు పతకాల విజేత ఏషియన్ వెయిట్ లిఫ్టర్ రెడ్డి భవానీని ఘనంగా సన్మానించారు. భవాని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి తగిన ఆర్థిక సహాయం చేయాలని ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు లకు పౌరవేదిక తరఫున వినతిపత్రాలు పంపిస్తామన్నారు. ఈ సత్కారసభలో భవానీ కోచ్ ఆనంద్, పౌర వేదిక ప్రతినిధులు జలంత్రి రామచంద్ర రాజు, తుమ్మగంటి రాంమోహన్, ధవళ కొండబాబు, అల్లంశెట్టి నాగభూషణం, పోలుపర్తి అప్పారావు, థాట్రాజు రాజారావు, జాగరపు ఈశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఐద్వా 9వ మహాసభలు విజయవంతం చేయాలి
● వాల్పోస్టర్ విడుదలవిజయనగరం గంటస్తంభం: ఆగస్టు 19న విజయనగరంలో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా 9వ మహాసభలను విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు, కార్యదర్శి కె.పుణ్యవతి, పి.రమణమ్మలు కోరారు. ఈ మేరకు మంగళవారం స్ధానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముందుగా సంఘం ఉపాధ్యక్షురాలు ఆర్.కృష్ణవేణి, సహాయ కార్యదర్మి వి.లక్ష్మి మహాసభ వాల్పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహిళాహక్కులు, మహిళలకు 33శాతం రిజర్వేషన్, అధిక ధరలకు వ్యతిరేకంగా, ప్రజాసమస్యల పరిష్కారం కోసం మహిళలపై జరిగే దాడులు, హత్యలు, ఆత్యాధారాలు, లైంగిక, వరకట్న వేధింపులు, సీ్త్రవివక్ష, డ్వాక్రామహిళల సమస్యలు, మైక్రోఫైనాన్స్, మద్యం, గంజాయి, డ్రగ్స్, అశ్లీలత మొదలైన సమస్యలపై జిల్లావ్యాప్తంగా ఉద్యమాలు, పోరాటాలు ఐద్వా నిర్వహించిందని వివరించారు. -
కరాటే చాంపియన్షిప్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: ఇంటర్ స్టేట్ ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈనెల 12, 13 తేదీల్లో అనకాపల్లి జిల్లా సబ్బవరంలో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు పతకాలు సాధించి విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పారు. కాటా, కుమిటీ విభాగాల్లో జరిగిన పోటీల్లో పి.హేమంత్ రెండు బంగారు పతకాలు, కె.శివగణేష్ బంగారు, సిల్వర్ పతకాలు, ఎల్.జశ్వంత్ బంగారు, సిల్వర్ పతకాలు కై వసం చేసుకున్నారు. అదేవిధంగా పి.వెంకటరమణ కె. మోహన్రావు, కె.పరమేష్, ఎన్.జనని, కె.స్నేహ, వి.ఇంద్రాణి, ఎం.సాత్విక్, బి.లెనిన్, జి.వివేక్ వర్మలు పతకాలు సాధించిన వారిలో ఉన్నారు. పోటీల్లో పతకాలు దక్కించుకున్న క్రీడాకారులను కరాటే అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సంతోష్ కుమార్ అభినందించారు. -
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు డీఏవీ విద్యార్థులు
రాజాం సిటీ: త్వరలో నెల్లూరు, ఒంగోలులో జరగనున్న రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు రాజాంలోని డీఏవీ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ విజయ్కుమార్ మంగళవారం తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 12, 13 తేదీల్లో శ్రీకాకుళం మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో జరిగాయన్నారు. ఈ పోటీల్లో అండర్ లెవెన్ సింగిల్స్లో బి.పుష్కర్ ప్రథమ బహుమతి సాధించగా, రన్నరప్గా యు.కౌశిక్నాయుడు నిలిచాడని చెప్పారు. అండర్ లెవెన్ డబుల్స్ విన్నర్గా బి.పుష్కర్, యు.కౌశిక్నాయుడులు నిలిచారు. అండర్–13 బాలికల విభాగంలో పి.నిషిక, పి.లాస్యప్రియ, బాలుర విభాగంలో పి.గోవర్ధన్, అన్షుమాన్లు ద్వితీయ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. వారి ఎంపికపట్ల జీఎంఆర్ వీఎఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, పీఈటీ అప్పలనాయుడు, కోచ్ పప్పల తిరుపతిరావు తదితరులు హర్హం వ్యక్తం చేశారు. -
రెజ్లింగ్ పోటీల్లో విజేతలుగా గుంపాం విద్యార్థులు
పూసపాటిరేగ: మండలంలోని గుంపాం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి గ్రాప్లింగ్ రెజ్లింగ్ కుస్తీ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 13న తిరుపతిలో జరిగిన గ్రాప్లింగ్ రెజ్లింగ్ కుస్తీ క్రీడా పోటీల్లో గుంపాం గ్రామానికి చెందిన కె.హర్షవర్ధన్, ఎ. గౌతమ్, పి.గిరీష్, టి.హేమని, పి.రవిజిత్ కుమార్, కె. సంజయ్లు పాల్గొని పతకాలు సాధించారు. ఈనెల 26న జాతీయస్థాయిలో ఛతీ్త్స్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్లో జరగనున్న పోటీల్లో ఈ విద్యార్థులు పాల్గొననున్నారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు విజేతలుగా నిలవడంతో హెచ్ఎం సూర్యకుమారి, పీఈటీ ఆదిలక్ష్మి, ఉపాధ్యాయిలు షేక్మస్తాన్, ఉమ తదితరులు అభినందించారు. -
నాలుగు నెలలుగా రేషన్ బకాయి..!
గుమ్మలక్ష్మీపురం: నాలుగు నెలలుగా రేషన్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు డిపో తాళాన్ని విరగ్గొట్టి ఏకంగా 230 బియ్యం బస్తాలను తీసుకెళ్లారు. ఈ ఘటన గుమ్మలక్ష్మీపురం మండలంలో జరిగింది. మండలంలోని గొయిపాక గ్రామంలో రేషన్ సబ్డిపో ఉంది. ఇక్కడ డీలర్గా పనిచేస్తున్న కిల్లక జయమ్మ రేషన్ బియ్యం సక్రమంగా ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిపో పరిధిలోని కిత్తలాంబ, రసాబడి తదితర గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024 ఆగస్టులో డీలర్ జయమ్మను అధికార పార్టీ ప్రోద్బలంతో అధికారులు సస్పెండ్ చేశారు. తదనంతరం డిపో నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘానికి చెందిన కిల్లక రజని అనే అధికార పార్టీకి చెందిన మరో మహిళకు అప్పగించారు. తన సస్పెన్షన్ను సవాల్ చేస్తూ డీలర్ జయమ్మ కోర్టులో కేసు వేశారు. న్యాయస్థానం స్టే విధించింది. దీంతో జయమ్మ మళ్లీ గొయిపాక డిపో డీలర్గా ఈ ఏడాది మేలో విధుల్లో చేరారు. మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను డిపో పరిధిలోని కార్డుదారులందరికీ సరఫరా చేశామని ఆమె చెబుతున్నారు. ఈ క్రమంలో గత ఏడాది తమకు బకాయి ఉన్న బియ్యాన్ని ఇవ్వాలని ఈ నెల 11, 12వ తేదీల్లో డిపో వద్ద కిత్తలాంబ, రసాబడి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కొన్ని కారణాల రీత్యా బియ్యం ఇవ్వలేకపోయామని, దఫదఫాలుగా సరఫరా చేస్తానని సదరు డీలర్ వారికి నచ్చజెప్పారు. అనంతరం ఆమె డిపోకు తాళం వేసి ఇంటికి వెళ్లిపోయారు. శాంతించని కిత్తలాంబ గ్రామస్తులు డిపోకు వేసిన తాళాన్ని విరగ్గొట్టి, లోపలున్న 230 బియ్యం బస్తాలను లగేజ్ వ్యాన్లో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. దీంతో డీలర్.. ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఎల్విన్పేట పోలీస్ స్టేషన్కు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో వివాదాన్ని సర్దుమణిగించేందుకు కొంతమంది పెద్దలు ప్రయత్నాలు సాగించినట్లు సమాచారం. నెలాఖరులోగా బకాయి బియ్యం సరఫరా మంగళవారం గొయిపాక డిపో వద్ద గ్రామస్తులు, డీలర్తోపాటు, సేల్స్మెన్ కమిటీ, పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు కలిసి చర్చలు జరిపారు. లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా రెండు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఇచ్చేందుకు డీలర్ అంగీకరించారు. దీంతో డిపో నుంచి తీసుకెళ్లిన రేషన్ బస్తాలను తిరిగి ఇచ్చేందుకు గ్రామస్తులు అంగీకరించినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎప్పుడో బకాయిలకు సంబంధించి ఇప్పుడు నిరసన వ్యక్తం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో కొంతమంది ప్రమేయం ఉన్నట్లు వినిపిస్తోంది. డిపో తాళాలు విరగ్గొట్టిన గ్రామస్తులు 230 బస్తాలు తీసుకెళ్లిన ప్రజలు పెద్ద మనుషుల సమక్షంలో రాజీ -
రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో పతకాలు
విజయనగరం అర్బన్: విశాఖ జిల్లా సబ్బవరంలో జరిగిన అంతర్ రాష్ట్ర కరాటే చాంపియన్ షిప్–2025 పోటీల్లో పట్టణానికి చెందిన సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులకు పతకాలు లభించాయి. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయిదేవమణి ఒకప్రకటలో తెలిపారు. కరాటేలోని కాటా, కుమిటీ కేటగిరిలో పి.హేమంత్ రెండు బంగారు పతకాలు, ఎల్.జశ్వంత్, కె.శివగణేష్, పి.వెంకటరమణ, కె.ప్రేమేష్, ఎస్.జనని, జి.వివేక్ వర్మ ఒక్కో బంగారు పతకం సాధించారని పేర్కొన్నారు. కోచ్ సంతోష్, విజేతలను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు. -
పెద్దగెడ్డలో పూడిక తీత పనులు
సాలూరు: ‘పెద్దగెడ్డ.. పూడికలకు అడ్డా’ శీర్షికన సాక్షిలో ఈ నెల 13న ప్రచురితమైన కథనంపై పెద్దగెడ్డ అధికారులు స్పందించారు.ఈ మేరకు పెద్దగెడ్డ కాలువ పూడిక తీత పనులు ప్రారంభించారు.ముందుగా కాలువల్లో తుప్పల తొలగింపు చేపట్టారు. జేసీబీతో తుప్పలను తొలగిస్తున్నారు.ఈ నెలాఖరులోగా పనులు పూర్తిచేయించి ,పెద్దగెడ్డ నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు జేఈ మోహనరావు తెలిపారు.డీఐఓగా అదనపు బాధ్యతలుపార్వతీపురంటౌన్: జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా డాక్టర్ జగన్మోహన్రావు అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు మంగళవారం ఆయనకు ఉత్తర్వులు అందజేశారు. ప్రస్తుతం డాక్టర్ జగన్మోహన్రావు ఆర్బీఎస్కే, ఎన్సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారిగా కొనసాగుతున్నారు. గత నెల డీఐఓ ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఆ పోస్టు ఖాళీగా ఉన్నందున గతంలో డీఐఓ ఇన్చార్జిగా జగన్మోహ రావుకు జిల్లాలో టీకా కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించిన అనుభవం ఉన్నందున ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ముద్దాయికి ఏడాది జైలుశిక్ష● ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డిపార్వతీపురం రూరల్: ఓ యువతిని మోసగించి అత్యాచారానికి పాల్పడిన కేసులో ముద్దాయికి ఏడాది కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10వేలు జరిమానాను న్యాయస్థానం విధించినట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు వివరాలు ఆయన వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట పోలీస్ స్టేషన్లో 2021వ సంవత్సరంలో నమోదైన కేసులో ముద్దాయి మజ్జి రామరాజుకు విజయనగరం మహిళ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎన్.పద్మావతి పై విధంగా మంగళవారం తీర్పు వెలువరించారన్నారు. ముద్దాయి అదే గ్రామానికి చెందిన యువతికి మాయమాటలు చెప్పి లోబరుచుకుని గర్భం దాల్చిన అనంతరం పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్టు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో తగిన సాక్ష్యాధారాలతో అభియోగ పత్రం దాఖలు చేశారని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ పూర్తయ్యి నేరారోపణలు రుజువు కావడంతో శిక్ష ఖరారైనట్లు చెప్పారు. 1100 కేజీల చేపల మృతి● చెరువులో విషం కలిపిన దుండగులు దత్తిరాజేరు: మండలంలోని దత్తి గ్రామ సమీపంలో ఉన్న పాచిబంద చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో రూ.లక్షా 50వేల విలువ చేసే 1100 కేజీల చేపలు మృతి చెందినట్లు యజమాని పొట్నూరి ఈశ్వరరావు మంగళవారం తెలిపారు. జీవనాధారం కోసం అప్పులు చేసి దత్తి గ్రామంలో చెరువు వేలంపాట పాడి చెరువులో వేసిన చేపలను వేయగా గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో అవి మృతి చెందాయని, తాను చేసిన అప్పులు ఎలా తీర్చేదని ఆవేదన చెందుతున్నాడు. గ్రామపెద్దలు, పెదమానాపురం పోలీసులకు ఈ సమాచారం అందజేసినట్లు తెలిపాడు. పౌష్టికాహార కిట్లు పంపిణీ విజయనగరం: నగరంలోని బొగ్గులదిబ్బ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో గర్భిణులకు పౌష్టికాహార కిట్లు మంగళవారం పంపిణీ చేశారు. సామాజిక ఆరోగ్య పరిరక్షణలో భాగంగా క్లబ్ తరఫున విటమిన్ మాత్రలు, డ్రై ఫ్రూట్స్, పౌష్టికాహార విలువలు కలిగిన పౌడర్ను 67 మందికి అందజేశామని క్లబ్ అధ్యక్షుడు విజయ్కుమార్ అగర్వాల్ తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ ఉదయ్, కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ సుధాకుమారి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పారిశుద్ధ్య పక్షోత్సవాలు
పార్వతీపురంటౌన్: జిల్లాలో బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు పారిశుద్ధ్య పక్షోత్సవాలను చిత్తశుద్ధితో నిర్వహించాలని, అలక్ష్యంచేసే సిబ్బందిపై చర్యలు తప్పవని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ హెచ్చరించారు. పారిశుద్ధ్య పక్షోత్సవాలు, వెక్టర్ హైజీన్ యాప్, పీ–4 సర్వేపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మంగళవారం సమీక్షించారు. మలేరియా, ఇతర జ్వరాలు వ్యాప్తి చెందే ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. ప్రజా ప్రతినిధులతో కార్యక్రమ పోస్టర్ను విడుదల చేయించాలని, వీలైతే వారిని భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు. ప్రతీ మండలంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమమైన మూడు పంచాయతీలను ఎంపిక చేసి ఆగస్టు 15న అవార్డులను ప్రకటిస్తామని తెలిపారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలన్నింటిని వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. వర్మీకంపోస్ట్ తయారీకి ప్రాధాన్యమివ్వాలన్నారు. జిల్లాలో పీఎం జన్మాన్ కింద చేపడుతున్న గృహాలు మరింత త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహనరావు, డ్వామా పథక సంచాలకులు కె.రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ పంచాయతీలకు అవార్డుల ప్రధానం పారిశుద్ధ్యం నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
మంత్రి ఇలాకాలో ఆగని డోలీమోతలు
సాలూరు: రాష్ట్ర గిరిజన, సీ్త్ర శిశు సంక్షేమ శాఖమంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రాతినిథ్యం వహిస్తున్న సాలూరు నియోజకవర్గంలో డోలీమోతలు నిత్యకృత్యంగా మారాయి. గిరిజనులకు నరకయాతన తప్పడంలేదు. సాలూరు మండలం కొదమ పంచాయతీ కంజుపాకకు చెందిన కొండతామర సుందరి నిండు గర్భిణి. రెండవ కాన్పులో మంగళవారం పురిటినొప్పులు రావడంతో రాళ్లదారిలో డోలీలో కుటుంబీకులు, బంధువులు ఆలుగురు ప్రాంతానికి తీసుకువచ్చారు. అక్కడ నుంచి ఆటోలో శంబర పీహెచ్సీకి తీసుకెళ్లారు. ప్రాథమిక వైద్యసేవల అనంతరం 108లో సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఏరియా ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందించగా, పుట్టిన బిడ్డ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విజయనగరం ఘోష ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కురుకుట్టి పంచాయతీ ఎగువకాశాయవలసకు చెందిన ఆశ కార్యకర్త కూనేటి శ్యామల అనారోగ్యానికి గురికావడంతో డోలీలో ఆస్పత్రికి చేర్చిన విషయం తెలిసిందే. తరచూ గిరిజనులను డోలీ కష్టాలు వెంటాడుతున్నా మంత్రి స్పందించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పురిటినొప్పులతో డోలీలో గిరిజన గర్భిణి నరకయాతన మార్గంమధ్యలో 108లో ప్రసవం బిడ్డ పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ఘోషా ఆస్పత్రికి తరలింపు -
ఎరువుల పంపిణీ
సీతానగరం: మండలంలోని కాశీపేటలో ఎరువుల పంపిణీని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. అనంతరం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. యూరియాను అధిక మోతాదులో వినియోగించవద్దని రైతులకు సూచించారు. ఎరువులు పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని చెప్పారు. జిల్లాలో 11వేల సీసీఆర్సీ కార్డులు జారీచేయాలన్నది లక్ష్యంకాగా 5,985 కార్డులు జారీచేసినట్టు వెల్లడించారు. జూలై చివరి నాటికి జిల్లాలో దాదాపు 11,327 టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేయగా, ఇప్పటివరకు 10,084 టన్నులు వచ్చినట్టు తెలిపారు. రైతులకు సమస్యలు ఎదురైతే జల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నంబర్: 79894 34766కు కాల్చేయాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు డాక్టర్ రాబర్ట్, ఎస్.అవినాష్, తహసీల్దార్ ప్రసన్నకుమార్, ఎంపీడీఓ ఎంఎల్ఎన్ ప్రసాద్, సర్పంచ్ తేలు ధనంజయమ్మ, తేలు చంద్రశేఖర్, ఆర్ఐ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఖరీఫ్ గట్టెక్కేదెలా?
సాగునీటి పంపిణీ సక్రమంగా జరిగేలా చూస్తాం ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో పాలకొండ డివిజిన్ పరిదిలోని ఏఈలు బదిలీపై వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఏఈ ఒక్కరే ఉన్నారు. పాత ఆయకట్టులోని కుడి, ఎడమ కాలువల్లో లష్కర్ల కొరత ఉంది. సాగునీటి పంపిణీ సక్రమంగా చేపట్టేందుకు లష్కర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించాలని ఉన్నతాధికారులకు నివేదించాం. ఈ ఏడాది సాగునీటి పంపిణీ సక్రమంగా జరిగేలా పటిష్ట చర్యలు చేపడతాం. – వై.గన్నిరాజు, డీఈ, పాలకొండ వీరఘట్టం: అధికారంలోకి వస్తే తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ పనులు వేగవంతంగా పూర్తిచేసి సాగునీటి కష్టాలు తీర్చుతామని చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... అధికారంలోకి వచ్చిన వెంటనే కాలువల ఆధునికీకరణ పనులు రద్దు చేసి రైతులకు వెన్నుపోటు పొడిచారు. ఓ వైపు పూడికలు, జంగిల్తో ఆధ్వానంగా ఉన్న కాలువలు, మరోవైపు జలవనరులశాఖలో సిబ్బంది కొరత సాగునీటి నిర్వహణకు శాపంగా మారాయి. పాత ఆయకట్టు శివారు భూములకు సాగునీరందే పరిస్థితి కనిపించడంలేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బుధవారం పాత ఆయకట్టు కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేసేందుకు జలవనరులశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంజినీరింగ్ అధికారుల కొరత... పాలకొండ జలవనరుల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం పరిధిలోని పాలకొండ, వీరఘట్టం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, శ్రీకాకుళం జిల్లా బూర్జ, విజయనగరం జిల్లా వంగర మండలాలు ఉన్నాయి. పాలకొండ సెక్షన్–1, సెక్షన్–2లో పనిచేస్తున్న ఏఈలు ఇటీవల బదిలీపై వెళ్లారు. ఆ స్థానాల్లో ఎవరినీ నియమించకపోవడంతో ఈ ఖాళీల్లో వీరఘట్టం ఏఈ డి.వి.రమణ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇతర మండలాలకు కూడా ఆయనే దిక్కు. ప్రస్తుతం ఖరీఫ్ ఆరంభం కావడంతో ఆరు మండలాలను ఒక్కరే చూడడం సాధ్యం కాని పరిస్థిఇ. ఏటా నీటి విడుదల సమయంలో ఎడమ కాలువలో 1వ బ్రాంచ్ ఎగువన పూనులు వేసి నీటిని మళ్లిస్తున్నారు. దీనివల్ల పాలకొండ శివారు భూములకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ ఏడాది కూడా సాగునీరు శివారు భూములకు వస్తుందా...రాదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. లష్కర్ల కొరత.... తోటపల్లి పాత ఆయకట్టులోని కుడి, ఎడమ కాలువల నుంచి 64 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కాలువల నిర్వహణ, నీటి పంపిణీని 36 మంది లష్కర్లు పర్యవేక్షించాల్సి ఉండగా ఇక్కడ కేవలం ఏడుగురు లష్కర్లు మాత్రమే ఉన్నారు. కాలువల్లోని ఎగువ ప్రాంతాల్లో అడ్డుకట్టలు, బ్రాంచ్ కాలువలకు నీటి మళ్లింపుపై చర్యలు చేపట్టాల్సి ఉండగా లష్కర్ల కొరతతో ఆ పనులు జరగడం లేదు. శివారు ఆయకట్టు భూములకు సాగునీరు అందడం లేదు. శివారు ఆయకుట్టుకు నీరందెనా? తోటపల్లి పాత ఆయకట్టులో విపత్కర పరిస్థితి సాగునీటి పంపిణీకి పర్యవేక్షణ కరువు ఆరు మండలాలకు ఒక్కరే ఏఈ లష్కర్ల కొరత నేడు తోటపల్లి పాత ఆయకట్టుకు సాగునీరు విడుదల -
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
పాలకొండ: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి సూచించారు. పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన సంకల్పం కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ నివారణ, మహిళల భద్రతపై యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ప్రతిఒక్కరూ మంచి నడవడికను అలవాటు చేసుకోవాలన్నారు. సైబర్ నేరాలు, ఫోక్సో యాక్ట్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎం.రాంబాబు, సీఐ ఎం.చంద్రమౌళి, ఎస్ఐ ప్రయోగమూర్తి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జయమణి, తదితరులు పాల్గొన్నారు. ఏసీబీవలలో నెల్లిమర్ల కమిషనర్ ● ఇంటిప్లాన్ అప్రూవల్కు రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్ ఎ.తారక్నాథ్ రూ.15వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రమ్య అందించిన వివరాల ప్రకారం.. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని పద్మశాలి వీధిలో నివసిస్తున్న బురిడి మహేష్ అదే వీధిలో ఇంటి నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్ కోసం ఇటీవల దరఖాస్తు చేశారు. దీనికోసం కమిషనర్ రూ.20 వేలు డిమాండ్ చేశారు. రూ.15వేలు నగదు రూపంలో, మిగిలిన రూ.5వేలు దివాన్కాట్ బెడ్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్లాన్ అప్రూవల్ కోసం అవసరమైన ఫీజు చెల్లించానని, లంచం ఇవ్వలేనని ప్రాథేయపడినా కమిషనర్ చలించలేదు. లంచం ఇచ్చుకోలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో నగర పంచాయతీ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్కు మహేష్ వెళ్లి రూ.15వేలు అందజేశారు. అప్పటికే కాపుకాసి ఉన్న ఏసీబీ డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా కమిషనర్ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి బుధవారం కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వెల్లడించారు. రిమాండ్ ఖైదీల వివరాల సేకరణ విజయనగరం లీగల్: జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో త్రైమాసిక అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ మీటింగ్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ జిల్లా కోర్టులో మంగళవారం నిర్వహించారు. బెయిల్ లభించినా పూచీకత్తుదారులు లేని కారణంగా జైల్లోనే ఉంటున్న 27 మంది రిమాండ్ ఖైదీల వివరాలు సేకరించారు. సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.శోభిక, ఏఎస్పీ అంకిత సురానా, విజయనగరం జిల్లా సబ్ జైల్ అధికారి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శైలజ పాల్గొన్నారు. -
అంబులెన్స్, ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు నిధులు కేటాయిస్తా
సీతంపేట: గిరిజనులకు సత్వర వైద్యసేవలకోసం అవసరమైన అంబులెన్స్, కిడ్నీ వ్యాధి ప్రభావిత గ్రామాలైన సీతంపేట మండలం జగ్గడగూడ, పాలకొండ మండలం చిలకలవలసకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వీలుగా ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు ఎంపీ ల్యాడ్ నిధులు కేటాయిస్తానని అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి తెలిపారు. సీతంపేట ఏరియా ఆస్పత్రిని ఆమె మంగళవారం సందర్శించారు. వార్డులను సందర్శించారు. ఎన్ఆర్సీ కేంద్రం, బాలింతల వార్డులో వైద్యసేవలు పొందుతున్నవారితో మాట్లాడారు. వైద్యసేవల తీరును అడిగి తెలుసుకున్నారు. రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు. ఆపరేషన్ థియేటర్, ఓపీ విభాగాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీతంపేట ఏరియా ఆస్పత్రిలో అదనపు భవన నిర్మాణానికి రూ.22 కోట్లు కేటాయించిందన్నారు. ఈ నిర్మాణాలు త్వరితగతిన పూర్తయితే రోగులకు మరిన్ని వైద్యసేవలు అందుతాయన్నారు. రోజుకు 400లకు పైగా ఓపీ నమోదవుతోందని, వైద్యులు మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్టు రోగులు చెబుతున్నారన్నారు. సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి పనులు వేగంగా పూర్తిచేయాలని ఐటీడీఏ పీఓకు సూచించినట్టు తెలిపారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆస్పత్రిలో ఎంఆర్ఐ, సిటీస్కాన్ వంటి సదుపాయాల కల్పనకు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు, ఆర్ఎంఓ డి.వి.శ్రీనివాస్, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఎంపీపీ బి.ఆదినారాయణ, వైస్ ఎంపీపీ కుండంగి సరస్వతి, సర్పంచ్లు ఆరిక కళావతి, ఎం.తిరుపతిరావు, విజయకుమారి, బి.తిరుపతిరావు, ఎంపీటీసీ చంద్రశేఖర్, ఎస్టీసెల్ జిల్లా కన్వినర్ హెచ్.మోహనరావు, నియోజకవర్గ ఎస్టీసెల్ కన్వీనర్ నిమ్మక కాంతారావు, పార్టీ నాయకులు ఎస్.రాము, వెంకి, ఎన్.కృష్ణ, ప్రకాశరావు, తదితరులు పాల్గొన్నారు. అరకు ఎంపీ తనూజారాణి ఏరియా ఆస్పత్రిలో ఇన్పేషెంట్లను పరామర్శించి రొట్టెల పంపిణీ సూపర్ స్పెషాలిటీ, ఏరియా ఆస్పత్రి పనుల పరిశీలన -
సరిహద్దులు దాటించేసి!
● ఆగని గంజాయి అక్రమ రవాణా ● పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసినా వెరవని వైనం ● వ్యసనం బారిన యువత ● ఆవేదనలో తల్లిదండ్రులు సాక్షి, పార్వతీపురం మన్యం: ● విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మానాపురం రైల్వే గేటు వద్ద పోలీసులు, ఈగల్ బృందం ఈ నెల 13న వాహన తనిఖీలు చేపడతుండగా.. రెండు కార్లలో 230 కిలోల గంజాయి లభ్యమైంది. ఒడిశా రాష్ట్రం పొట్టంగి నుంచి పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల మీదుగా విశాఖపట్నం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా.. మరో ముగ్గురు పరారయ్యారు. ● కొద్దిరోజుల క్రితం విజయనగరం పట్టణ పరిధిలోని అయ్యన్నపేట వద్ద మూడు కిలోల గంజాయితో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా రాష్ట్రం రాయగడ వద్ద మరో వ్యక్తి నుంచి అతను గంజాయి కొనుగోలు చేసి, సేవించడంతోపాటు.. విజయనగరంలో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ● గత మే నెలలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని దుగ్ధసాగరం వద్ద 184 కిలోల గంజాయిని కారులో తరలిస్తుండగా రూరల్ పోలీసులు పట్టుకున్నారు. కారుతోపాటు గంజాయిని సీజ్ చేశారు. ● గత ఏప్రిల్ నెలలో ఒడిశా రాష్ట్రం రాయగడ నుంచి తమిళనాడు రాష్ట్రానికి సుమారు 44 కిలోల గంజాయిని కారులో రవాణా చేస్తుండగా.. పార్వతీపురం పట్టణం వద్ద పోలీసులు పట్టుకున్నారు. ● కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒడిశా నుంచి గంజాయి తరలిస్తుండగా.. పాచిపెంట మండలం పి.కోనవలస చెక్పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రం సిమిలిగూడకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి వీరు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. సులువుగా రవాణా పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ఎటుచూసినా ఒడిశా సరిహద్దులే ఉండటం.. చుట్టూ ప్రాంతమంతా కొండ కోనలే కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి సరిహద్దు వెంబడి గంజాయి సులువుగా ప్రవేశిస్తోంది. అక్రమార్కులు వివిధ మార్గాలను అన్వేషించడంతోపాటు.. స్థానిక గిరిజన యువతకూ డబ్బులు, విలువైన వస్తువులు ఆశ చూపించి గంజాయిని ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సరిహద్దులు దాటించేస్తున్నారు. జిల్లా మీదుగానే ఒడిశా, బెంగాల్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గంజాయిని ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఒడిశాను ఆనుకుని పి.కోనవలస, కూనేరు, బత్తిలి, గుణుపూర్ వద్ద అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం ఉండటం లేదు. సాలూరు మండలంలో పెద్దగా తనిఖీలు ఉండటం లేదు. పాచిపెంట మండలం సుంకి వద్ద నుంచి ఎక్కువగా ద్విచక్ర, ఇతర వాహనాలు మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఒక వాహనాన్ని.. ఆర్మీకి చెందిన వాహనంలా తయారు చేసి మరీ గంజాయి తరలించడం గమనార్హం. ఇటీవల సరిహద్దును దాటుకొని ద్విచక్ర వాహనంపై వస్తున్న భార్యాభర్తలను తనిఖీ చేయగా.. వారి బ్యాగులో గంజాయి లభ్యమైంది. ఇవి కొన్ని ఘటనలు మాత్రమే. తరచూ దొరుకుతున్నా.. పార్వతీపురం మన్యం జిల్లాలో 25 గంజాయి అనుమానిత ప్రదేశాలను పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 11 కేసులు నమోదు కాగా.. 1,87.225 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 12 వాహనాలు సీజ్ చేశారు. 21 మందిని అరెస్టు చేశారు. ఉమ్మడి జిల్లాలో గత ఏడాది 70 కేసులు నమోదు కాగా.. 240 మందిని అరెస్టు చేశారు. 1,750 కిలోల వరకు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 40 వరకు కేసులు నమోదయ్యాయి. తరచూ కేసులు నమోదవుతున్నా.. వినియోగం, రవాణా మాత్రం తగ్గడం లేదు. అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నా.. కళ్లుగప్పి, కనికట్టు చేస్తున్నారు. గంజాయి కేసులో ఆరుగురు యువకులను కొద్దిరోజుల క్రితం విజయనగరం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన యువకులు ఒక ప్రాంతంలో చదువుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడి.. వారి అవసరాల కోసం ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి.. చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో గంజాయి వినియోగం, రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో ఈ ఘటన ఒక ఉదాహరణ. చెంతనే ఒడిశా రాష్ట్రం కావడం.. రవాణా మార్గాలు అధికంగా ఉండటం వల్ల అక్కడ నుంచి గంజాయి సులువుగా జిల్లాలోకి ప్రవేశిస్తోంది. అధిక శాతం మంది యువత ఈ వ్యసనం బారిన పడగా.. వీలైనంత డబ్బుల సంపాదనకు కూడా ఇది అనువుగా భావిస్తున్నారు. ఒడిశా నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో మన్యం, విజయగరం జిల్లాల మీదుగా విశాఖ, ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలిపోతోంది. -
చిన్నారి విషాదం..!
● విద్యార్థుల మధ్య ముష్టియుద్ధం ● దెబ్బలు తాళలేక తొమ్మిదో తరగతి విద్యార్థి మృతిబొబ్బిలి: పట్టణంలోని అభ్యుదయ హైస్కూల్కు చెందిన విద్యార్థుల మధ్య గొడవ ఓ విద్యార్థి మృతికి దారితీసింది. మనస్పర్థలకు ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. నిరుపేద క్షురక కుటుంబానికి చెందిన ఒక్కగానొక్క కుమారుడు ఈ కొట్లాటలో చనిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. బొబ్బిలిలో సోమవారం జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కాలేజీ రోడ్డులో బార్బర్ షాపు పెట్టుకుని జీవనం వెళ్లదీస్తున్న సుందరాడ సత్యనారాయణ(సంతోష్), విజయ దంపతులకు కార్తీక్(14), కీర్తన ఉన్నారు. కార్తీక్ను పట్టణంలోని అభ్యుదయ స్కూల్లో చదివిస్తున్నారు. సీసీటీవీలో కనిపించిన దృశ్యాల ప్రకారం రోజూలాగే విద్యార్థి కార్తీక్ స్కూల్ విడిచిపెట్టాక సహ విద్యార్థులతో కలిసి కోట గుమ్మంలోంచి పట్టణంలోని సున్నపు వీధిలోని తన ఇంటికి వస్తున్నాడు. వారితో పాటు వస్తున్న పదో తరగతి చదువుతున్న మండలంలోని గున్నతోటవలసకు చెందిన విద్యార్థి కోటలో గంట కొట్టే ప్రాంతం వద్ద వెనక్కు నడిచి వస్తున్న కార్తీక్ ఒక్కసారిగా పిడిగుద్దులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే కొద్ది సేపే కొట్లాడుకున్నప్పటికీ దెబ్బలకు తాళలేని కార్తీక్ ఐదారు అడుగులు వేశాక ఒక్కసారిగా నడక బాట పక్కగా ఒరిగిపోయి కుప్పకూలాడు. వెంటనే స్థానికులు కార్తీక్ను సీహెచ్సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని వెనక్కి తెచ్చిన బంధువులు విద్యార్థి మృతదేహాన్ని వైద్యసిబ్బంది గొడవవుతుందని ఆలోచించి పోస్ట్మార్టం రూమ్లోకి తీసుకువెళ్లిపోయారు. ఏం జరిగిందో తెలియకుండా పోస్ట్మార్టం చేయడానికి వీల్లేదని బంధువులు విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్మార్టం రూమ్ నుంచి మళ్లీ ఆస్పత్రిలోకి తీసుకువచ్చారు. ఈ లోగా పోలీసులకు, పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆస్పత్రికి చేరుకున్నారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రి ప్రాంగణమంతా జనాలతో నిండిపోయింది. సీఐ కె.సతీష్ కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలానికి, ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కుటుంబ సభ్యులు, యాజమాన్యం, తల్లిదండ్రులతో రాత్రి పది గంటల వరకూ చర్చిస్తూనే ఉన్నారు. పోలీసులు వివరాలు వెల్లడించే వరకూ విద్యార్థులు ఎందుకు కొట్లాడుకున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే క్రికెట్ లేదా బాలిక విషయమై ఇద్దరి మధ్య కొద్ది రోజులుగా మాటల్లేవని, ఈ నేపథ్యంలోనే స్కూల్ నుంచి నడిచి వస్తుండగా భావోద్వేగానికి గురైన వారిద్దరూ ఒక్కసారిగా తీవ్రంగా కొట్లాడుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై సీఐ కె.సతీష్ కుమార్ మాట్లాడుతూ సంఘటనపై కేసు నమోదు చేశామని, విద్యార్థుల కేసు జువైనల్ కిందికి వస్తుందని పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
ప్రోటోకాల్ ఉల్లంఘన సరికాదు
సీతంపేట: క్షేత్రస్థాయిలో పథకాల అమలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు పలు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు తెలియజేయకుండా అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇది సరైన పద్ధతి కాదని అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ మేరకు సోమవారం సీతంపేట ఐటీడీఏలో జరిగిన గ్రీవెన్స్సెల్లో ఆమె పాల్గొన్నారు. పలు అంశాలపై ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్రెడ్డి, ఇతర అధికారులతో మాట్లాడారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు రాజ్యాంగబద్ధంగా ప్రజలచేత ఎన్నికై న వారని, వారిని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. వారికి తగిన గౌరవం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదే అంశమై మరోసారి ఫిర్యాదు వస్తే ఏ స్థాయి వరకు తీసుకువెళ్తే ఈ సమస్య పరిష్కారమవుతుందో అక్కడి వరకు తీసుకువెళ్లడానికి వెనుకాడబోనన్నారు. గిరిజన ప్రాంతాల్లో అధికారులు పనిచేయడం ఒక అదృష్టంగా భావించాలని హితవు పలికారు. పాలకవర్గ సమావేశం ఎందుకు నిర్వహించలేదు? ఐటీడీఏలో ఇంతవరకు పాలకవర్గ సమావేశం జరగకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. ఈ అంశం పరిశీలనలో ఉందని పీఓ సమాధానమిచ్చారు. బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్లో అదనపు సీట్లు పెంచాలని సూచించారు. కొండచీపుళ్లు, ఇతర అటవీఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని పరిష్కరించాలని సూచించారు. ఏఏ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం అవసరమో సర్వే చేయిస్తానని ఈ సందర్భంగా పీఓ ఆమెకు తెలిపారు. ప్రారంభం కాని రహదారుల పనులు రహదారులకు గత ప్రభుత్వ హయాంలో రూ.13 కోట్ల నిధులు మంజూరు కాగా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదని, హౌసింగ్ సమస్యలు పరిష్కరించాలని, గ్రామాల్లో టీటీడీ ద్వారా నిర్మాణాలు జరిగే గుడులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. ఇంకా మరికొన్ని సమస్యలపై ఆమె చర్చించారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.ఆదినారాయణ, జెడ్పీ కోఆప్షన్ సభ్యురాలు ఎస్.లక్ష్మి, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు అరకు ఎంపీ తనూజారాణి గ్రీవెన్స్లో పలు అంశాలపై ఐటీడీఏ పీఓ, అధికారులతో చర్చ -
వినతుల పరిష్కారం
అర్జీదారు సంతృప్తి చెందేలా.. ● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్పార్వతీపురం టౌన్: జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులపై అర్జీదారు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించి ప్రజల నుంచి 160 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అందిన వినతులను ఆయాశాఖాధికారులకు సూచిస్తూ, వాటిపై సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్ఓ కె.హేమలత, కేఆర్ఆర్సీ ఎస్డీసీ డా.పి.ధర్మచంద్రారెడ్డి డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, వివిధ శాఖల అధికారులు, అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ దివ్యాంగులకు ఉపకరణాలను జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పంపిణీ చేశారు. పాలకొండ మండలం కొండవీధికి చెందిన జమ్మాన తేజశ్రీ, సీతానగరం మండలం వెంకటాపురానికి చెందిన కట్టమూరి కార్తీక్ తమకు ల్యాప్ టాప్లు మంజూరు చేయాలని కోరగా, జేసీ వాటిని పంపిణీ చేశారు. అలాగే కొమరాడ మండలం ఆర్తాం గ్రామానికి చెందిన వడ్లమాని ప్రసాదరావుకు చెవిటి మిషనును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు ఎం.సుధారాణి, విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికార ప్రతినిధి రమణ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదులు వాస్తవాలైతే చట్టపరిధిలో చర్యలు పార్వతీపురం రూరల్: ప్రతి వారం నిర్వహించే పీజీఆర్ఎస్లో వచ్చే ఫిర్యాదులు వాస్తవాలైతే తక్షణ చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందిని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని, వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించు కోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ స్వయంగా ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, వాస్తవాలైనట్లయితే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మొత్తం 13 ఫిర్యాదులు రాగా డీసీఆర్బీ, మహిళా పీఎస్ హెడ్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. -
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ90 శ్రీ150 శ్రీ160విజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులను సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో అర్జీల పరిష్కారంపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులను సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. అధికారులు ప్రతిరోజూ పీజీఆర్ఎస్ పోర్టల్లో లాగిన్ అయి వారి శాఖలకు సంబంధించిన వినతులను చూడాలని, అలాగే రీ ఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముంగించాలని సూచించారు. కొన్ని శాఖలకు సంబంధించిన వినతులను చూడాలని, అలాగే రీ ఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని చెప్పారు. కొన్ని శాఖలకు సంబంధించిన అర్జీలు సకాలంలో పరిష్కరించకపోవడం, గడువు దాటి ఉండడం, నాణ్యమైన పరిష్కారం చూపకపోవంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకు గల కారణాలపై ఆరా తీశారు. అధికారులు అర్జీదారులతో మర్యాదగా మాట్లాడాలని, సవివరంగా ఎండార్స్మెంట్ ఇవ్వాలని గడువు లోగానే వినతులకు నాణ్యమైన సమాధానాలు పంపాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 225 వినతులు అందాయి. సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్తోపాటు డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు మురళీ, ప్రమీలా గాంధీ, ఎం.వెంకటేశ్వరరావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇందిరమ్మ కాలనీకి రోడ్డు, కాలువలు కావాలి గరివిడి మండలం కొండపాలెం పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో మౌలిక సదుపాయాల కొరత పట్టిపీడిస్తోందని కాలనీ మహిళలు సామూహికంగా పీజీఆర్ఎస్కు వచ్చి జేసీ సేతుమాధవన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. దాదాపు 500 ఇళ్లు ఉన్న ఈ కాలనీలో పక్కారోడ్డుగానీ, డ్రైనేజ్ వ్యస్థగానీ లేకపోవడం వల్ల నివాసం దుర్భరంగా మారిందని అర్జీద్వారా మొరపెట్టుకున్నారు. ఎస్పీ పీజీఆర్ఎస్కు 38 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: పోలీస్ స్టేషన్కు చ్చిన సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలని ఎస్పీ వకుల్ జిందల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందల్, ఏఎస్పీ సౌమ్యలతలు పాల్గొని ఫిర్యాదుదారుల సమస్యలను ఆలకించారు. కార్యక్రమంలో మొత్తం 38 మంది ఫిర్యాదులు అందుకున్నారు. వచ్చిన ఫిర్యాదు దారుల ముందే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఎస్పీ, ఏఎస్పీలు నేరుగా మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఆర్వీఆర్కే చౌదరి, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ పీజీఆర్ఎస్కు 225 వినతులు -
తోటపల్లి పాత ఆయకుట్టుకు నీరు విడుదల రేపు
వీరఘట్టం: తోటపల్లి జలాశయం పరిధిలో ఉన్న పాత ఆయకట్టుకు ఈ ఏడాది ఖరీఫ్కు పూర్తిస్థాయిలో నీరందించి పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఈనెల 16న బుధవారం తోటపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు జలవనరులశాఖ ఏఈ డీవీ రమణ సోమవారం తెలిపారు. ఈ జలాశయం పరిధిలో ఉన్న చెరువులను తొలుత నింపేందుకు లక్ష్యంగా చేసుకున్నామన్నారు. అనంతరం ప్రణాళికా బద్ధంగా ప్రాజెక్టు పరిధిలో పాత ఆయకట్టు కుడి, ఎడమకాలువ పరిధిలో ఉన్న 64 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి పంపిణీ చేస్తామని చెప్పారు. రోగులతో ఏరియా ఆసుపత్రి కిటకిటసీతంపేట: స్థానిక ఏరియా ఆస్పత్రి సోమవారం రోగులతో కిటకిటలాడింది. ఒక్కరోజే సోమవారం 442 ఓపీ వచ్చింది. వారిలో 94 మంది జ్వరాలతో బాధపడుతూ రాగా వైద్యులు రక్తపరీక్షలు నిర్వహించారు. మలేరియా ఆర్డీటీ కిట్లో 18 మందికి పాజిటివ్ రాగా, స్లైడ్ మలేరియా పోజిటివ్ ఒక కేసు వచ్చింది. 49 మందిని ఇన్పేషెంట్లుగా జాయిన్ చేసుకుని వారికి వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరెంటెండెంట్ బి.శ్రీనివాసరావు తెలిపారు. మిగతా వారికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి మందులు పంపిణీ చేశామన్నారు. 23 నుంచి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్శృంగవరపుకోట: జిల్లా కేంద్రం విజయనగరంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఈనెల 23, 24, 25 తేదీల్లో జిల్లాస్థాయి చాంపియన్ షిప్, సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ ఇందుకూరి రఘురాజు సోమవారం తెలిపారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోషియేషన్ సీఈఓ శ్రీరాములు మాట్లాడుతూ 23న పోటీలు ఉదయం 8గంటలకు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ పోటీల్లో పాల్గొనదలచిన వారు ఈనెల 20తేదీ లోగా ప్రవేశ రుసుము జి.తేజేశ్వరరావు(9440505275)పార్వతీపురం, కె.అపర్ణబాబా(7981111705)బొబ్బిలి, ఎం.డి.అబ్దుల్(9515729785)సాలూరు, పి.శ్రీరాములు(7989199534)ఎస్కోట, కొత్తవలస(9030185690)వై.గణేష్, జి.శ్రీనివాసరావు(9133773485)–విజయనగరం, కె.వేణుగోపాల్(9866933193) చీపురుపల్లిలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఏ కేటగిరిలో అయినా ఆరు టీముల కన్నా తక్కువ టీములు హాజరైతే ఆ కేటగిరిలో చాంపియన్షిప్ నిర్వహించబోమని విజేతలకు అదే రోజు బహుమతి ప్రదానం చేస్తారని స్పష్టం చేశారు. జేఎన్టీయూ జీవీలో ఎమర్జింగ్ టెక్నాలజీపై సర్టిఫికేషన్ కోర్సు విజయనగరం అర్బన్: జేన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ)లో ‘ఎమర్జింగ్ టెక్నాలజీ’ కోర్సుకు సంబంధించి వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి సోమవారం ఆన్లైన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి కోర్సుల ద్వారా సంబంధిత నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చన్నారు. జేఎన్టీయూ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించే ఇలాంటి కోర్సులను భవిష్యత్తులో మరిన్ని యూనివర్సిటీ అందిస్తుందన్నారు. కోటదుర్గ ఆలయంలో హుండీ చోరీసాలూరు: పట్టణంలోని కోటదుర్గ అమ్మవారి ఆలయంలో హుండీ చోరీకి గురైంది. ఆదివారం రాత్రి అమ్మవారి ఆలయంలో దొంగలు పడి హుండీని పగలగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అర్చకుడు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
పోలీసు ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు
పార్వతీపురం రూరల్: రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి జిల్లాలో పనిచేస్తున్న పోలీసుశాఖ ఉన్నతాధికా రులు, అలాగే సిబ్బందికి ఉచిత ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని (మాస్టర్ హెల్త్చెకప్) సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్వతీపురం, పాలకొండ సబ్డివిజన్ల పరిధిలో ఉన్న స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది, ఏఆర్, మినీస్టీరియల్ సిబ్బంది, హోం గార్డులకు ఈ కార్యక్రమం ద్వారా పలు ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ పరీక్షలు విజయనగరంలో ఉన్న మెడికవర్, శ్రీకాకుళంలో మెడికవర్ ఆస్పత్రుల్లో నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. -
ఖాకీల వేధింపుల నుంచి రక్షణ కావాలి
● ఏఎస్పీ సౌమ్యలతకు బాధితుడి మొరవిజయనగరం క్రైమ్: బొబ్బిలి పోలీసుల నుంచి తనను కాపాడాలంటూ విజయనగరం డీపీఓలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఓ ఫిర్యాదుదారు మొర పెట్టుకున్నాడు. నా భార్య ప్రవర్తన బాగోలేదు..నాకు నా కొడుకు భవిష్యత్తే ముఖ్యం..భార్య వద్దు కొడుకును పంపను. కోర్టులో కేసు నడుస్తున్నా..బొబ్బిలి పోలీసులు తనను పిలిచి వేధిస్తున్నారంటూ ఏఎస్పీ సౌమ్యలతకు ఫిర్యాదు చేసి ఓ బాధితుడు వాపోయాడు. ౖపైళ్లె ఏడేళ్లు అవుతున్నప్పటికీ తన భార్య ప్రవర్తన బాగోలేక ఏడేళ్ల కొడుకు భవిష్యత్తు కోసం విడాకులు కోరుకున్నానని బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి సమక్షంలో కోర్టులో కేసు నడుస్తోందని ఫిర్యాదు దారు ఓరుగంటి కమల్ బాబు డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో తన బాధ, వెళ్లగక్కాడు. తాను బొబ్బిలిలో ఉంటూ ఏసీ రిపేర్ పనులు చేసుకుంటూ కొడుకును చూసుకుంటున్నానని, కానీ విడాకుల కేసు కోర్టులో ఉండగానే తిరిగి తన భార్య వేధిస్తోందని బొబ్బిలి స్టేషన్లో కేసు కూడా నడుస్తోందని తనకు న్యాయం చేయాలని ఏఎస్పీకి ఫిర్యాదు చేశాడు. తక్షణమే బొబ్బిలి ఎస్సై రమేష్పై చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని వేడుకున్నాడు. ఈ మేరకు ఫిర్యాదు దారు సమస్య విన్న ఏఎస్పీ సౌమ్యలత వెంటనే బొబ్బిలి పోలీసులతో మాట్లాడి కేసు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
సాలూరు: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు, మాజీ జెడ్పీటీసీ రెడ్డి పద్మావతి విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆమె పట్టణంలో మాట్లాడుతూ, కృష్ణా జిల్లా చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడిని ఆమె ఖండించారు. జిల్లాకు ప్రథమ పౌరురాలైన ఓ మహిళ పరిస్థితి ఇలా ఉందంటే ,రాష్ట్రంలో మిగిలిన మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వాపోయారు. వైఎస్సార్సీపీ నేతలపై కక్షపూరితంగా ఈ ప్రభుత్వం దాడులు, దౌర్జన్యాలు, వేధింపులకు పాల్పడుతూ ఏడాదిపాలనను పూర్తిచేసిందని విమర్శించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి -
రెన్యువల్ లేదు!
రెగ్యులర్ కాదు.. ● సీఆర్టీల ఎదురుచూపు సాక్షి, పార్వతీపురం మన్యం: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న సీఆర్టీలను ప్రభుత్వం నేటికీ రెగ్యులర్ చేయలేదు. మరోవైపు వారికి ఇంకా రెన్యువల్ ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. తమను రెగ్యులర్ చేయాలని ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయస్వామికి సీఆర్టీలు వినతిపత్రం కూడా అందజేశారు. 2007లో ఉమ్మడి ఏపీలో 1,243 మంది సీఆర్టీలను జీఓ నంబర్ 59 ప్రకారం రెగ్యులర్ చేశారు. 18 ఏళ్లుగా సుమారు 729 మంది పని చేస్తున్నారు. మినిమం టైం స్కేల్ నిబంధనలు కూడా గురుకుల సొసైటీ అమలు చేయడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెన్యువల్ చేయడంలో తాత్సారం మరోవైపు గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీలకు రెన్యువల్ ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. రాష్ట్ర అధికారుల నుంచి 20 రోజుల కిందటే ఉత్తర్వులు వచ్చినప్పటికీ.. జిల్లా అధికారులు తాత్సారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐటీడీఏల పరిధిలో వీరంతా పని చేస్తున్నారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 55, సీతంపేట పరిధిలో 40 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 330 మందికిపైగా పని చేస్తున్నారు. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే వీరికి రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. విద్యాసంవత్సరం ప్రారంభమైనా నేటికీ ఇవ్వకపోవడంతో వారంతా ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ● వెంటనే రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాలి గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పని చేస్తున్న సీఆర్ టీలకు రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వడంలో తాత్సా రం తగదు. రెండు నెలల నుంచి జీతాలూ లేక, వారంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే కౌన్సెలింగ్ తేదీని ప్రకటించి, న్యాయం చేయాలి. లేకుంటే ఆందోళన చేపడతాం. – మురళీమోహన్, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు -
95:5 నిష్పత్తిలో బియ్యం సరఫరా
రామభద్రపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 95:5 శాతం నిష్పత్తిలో జిల్లాలో ఉన్న 5,71,288 రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం సరఫరా చేస్తు న్నట్టు డీఎస్ఓ మధుసూదనరావు తెలిపారు. మండలంలోని పలు రేషన్ దుకాణాలను సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కొత్తకార్డుల కోసం 53,500 దరఖాస్తులు రాగా 37,351 దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించామని, వారికి త్వరలో స్మార్ట్ కార్డులు మంజూరుచేసే అవకాశం ఉందన్నారు. పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలు విజయనగరం అర్బన్: జిల్లాలో ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న లెక్చరల్ పోస్టుల పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జేసీ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో పలు సూచనలు చేశారు. రాజాంలోని జీఎంఆర్, జొన్నాడ లెండీ, గాజులరేగ వద్ద ఉన్న ఐయాన్ డిజిటల్ జోన్, చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కాలేజీల్లో పరీక్షల ఏర్పాట్లపై ఆరా తీశారు. సమావేశంలో ఏపీపీఎస్సీ, పోలీస్, రెవెన్యూ, ప్రజా రవాణా, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖ అఽధికారులు పాల్గొన్నారు. -
ఇంకెన్నాళ్లీ రెడ్బుక్ రాజ్యాంగ పాలన?
వీరఘట్టం: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగ పాలనతో కూటమి ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి ధ్వజమెత్తారు. వీరఘట్టం మండలం వండువ గ్రా మంలో మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతితో కలిసి సోమవారం మీడియాతో మాట్లాడారు. నేడు రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు పేట్రేగిపోతున్నాయన్నారు. మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెన్నాళ్లు రెడ్బుక్ రాజ్యాంగంతో భయపెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతన్నల కోసం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేయడంతో ఇప్పుడు ప్రీమియం భారం రైతులపై పడిందన్నారు. విత్తనాలు, ఎరువులు దొరకక రైతన్నలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం విచారకరమన్నారు. వ్యవస్థలను నాశనం చేస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. నాడు–నేడుతో సర్కారు బడు లకు కార్పొరేట్ హంగులు కల్పించి పేద, మధ్య తరగతి విద్యార్థులకు జగనన్న బైజూస్ పాఠాలు అందుబాటులోకి తెస్తే.. కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థ సర్వనాశనం చేసి పేదలకు ప్రభుత్వ విద్య ను దూరం చేస్తోందని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులువె మన్మథరావు, ఉమామహేశ్వరరావు, ఎం.లక్ష్మి, బుజ్జి పాల్గొన్నారు. ● కూటమి ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తిన అరకు ఎంపీ తనూజారాణి -
230 కిలోల గంజాయి సీజ్
విజయనగరం క్రైమ్: ఒడిశా రాష్ట్రం పొట్టంగి నుంచి విశాఖకు రెండు కార్లలో తరలిస్తున్న 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నా మని ఎస్పీ వకుల్ జిందల్ చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. పెదమానాపురం పోలీ సులు, ఈగల్ బృందానికి వచ్చిన కచ్చితమైన సమాచారంతో జిల్లాలోని దత్తిరాజేరు మండ లం మానాపురం రైల్వే గేట్ సమీపంలో ఈ నెల 13న వాహన తనిఖీలు చేపట్టారు. రెండు కార్లలో 230 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులను చూసి కార్లు విడిచిపెట్టి ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. మిగిలిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి మండలం పదం పంచాయతీ జంగరాదకి చెందిన ఘాసిరాం హంతల్ (24), కొరాపుట్ జిల్లా సిమిలిగూడ మండలం దబాయిగూడ పంచా యతీ ఝలియగూడకి చెందిన కరన్ ఖిలో (24)లు పట్టుబడ్డారు. సురేష్, అదకాబీయా ఖనిలతి, జున్నేష్ పరారయ్యారు. నిందితుల నుంచి 44 ప్యాకెట్లులో ఉన్న గంజాయితీతో పాటు రూ.700ల నగదు, మూడు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. పరారైన మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యారెడ్డి, గజపతినగరం సీఐ జీఏవీ రమణ, మానాపురం ఎస్సై ఆర్.జయంతి, ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు. కానిస్టేబుల్స్ కె.అప్పన్న, కె.శంకర్, హెచ్సీ కె.అప్పలస్వామిలను ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలను అందజేశారు. పార్కింగ్ ఫీజు పెంపుపై ఆందోళన విజయనగరం టౌన్: విజయనగరం రైల్వేస్టేషన్లో వాహనాలు పార్కింగ్ చేసేవారినుంచి ప్రైవేటు పార్కింగ్ వ్యవస్థ నిలువు దోపిడీకి రంగం సిద్ధం చేసింది. ఒకేసారి నెలకు రూ.300 ఉన్న పార్కింగ్ ఫీజును మూడురెట్లు పెంచి రూ.900 చేయడంతో చిరుద్యోగులు, దినసరి కూలీలు భగ్గుమన్నారు. పార్కింగ్ ఫీజుల దోపిడీపై సోమవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. విజయనగరం నుంచి విశాఖ పట్టణం వెళ్లేందుకు రైల్వే మంత్లీ సీజన్ టికెట్ (ఎంఎస్టీ) రూ.250 ఉంటే, వాహనం పార్కింగ్ ఫీజు రూ.900లకు పెంచడమేమిటంటూ పార్కింగ్ సిబ్బందిని నిలదీశారు. రోజుకు బైక్కు రూ.10లు ఉన్న ఫీజును రూ.40కి ఎలా పెంచుతారని నిలదీశారు. దీనిపై డీఆర్ఎంకు వినతిపత్రం అందజేశారు. ఫీజులు తగ్గించుకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ● ఇద్దరు నిందితుల అరెస్టు ● పరారీలో మరోముగ్గురు .. ● ఒడిశా నుంచి విశాఖకు రెండు కార్లలో గంజాయి అక్రమ రవాణా ● వివరాలు వెల్లడించిన ఎస్పీ వకుల్జిందల్ -
రూ.1.60 లక్షల కోట్లు ఏమయ్యాయి?
● ఏడాది కాలంగా తెచ్చిన అప్పులు ఎటు మళ్లుతున్నాయి? ● భావితరాల భవిష్యత్ను తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారు? ● దానికోసం మాట్లాడితే రాజద్రోహం కేసులా.. ● నేను మాట్లాడుతున్నా నాపైనా పెట్టండి ● శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ చీపురుపల్లి: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే తెచ్చిన రూ.1.60 లక్షల కోట్ల అప్పు డబ్బులు ఎక్కడకి వెళ్లాయి? సంక్షేమం, అభివృద్ధి పేరుతో తీసుకొస్తున్న వేలకోట్ల రూపాయలు ఎవరి జేబుల్లో కి వెళ్తున్నాయి?.. ఏడాదిలోనే లక్షా అరవై వేల కో ట్లు అప్పులు చేసి భావితరాల భవిష్యత్ను తాకట్టు పెట్టే హక్కు చంద్రబాబుకు ఎవరు ఇచ్చారు?.. ఆ డబ్బుతో ఏ సంక్షేమ, అభివృద్ధి పనులు చేపట్టారో చెప్పండి?.. దీనిపై ప్రశ్నించినా, మాట్లాడినా రాజ ద్రోహం కింద కేసులు పెడతారంట.. నేను మాట్లాడుతున్నాను.. నాపై కూడా కేసులు పెట్టండి అంటూ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారా యణ కూటమి ప్రభుత్వం, నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గరివిడిలోని ఓ కన్వెన్షన్ ఆవరణలో సోమవారం జరిగిన చీపురుపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు సంపద సృష్టించడం తనకు తెలుసని చెప్పిన చంద్రబాబు ఏడాదిలోనే రూ.1.60 లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తెచ్చిన అప్పుల కోసం మాట్లాడితే రాజద్రోహం కేసులు పెడతారని చెబుతున్న ప్రభుత్వం, భావితరాల భవిష్యత్ను తాకట్టుపెట్టడం దేశ ద్రోహంకాదా అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన క్యాబినేట్ సమావేశంలో మంత్రులు అవినీతిపై చంద్రబాబు ఫైర్ అయినట్లు కొన్ని పత్రికల్లో చూశానని, ‘యథా రాజా తథా ప్రజా’ అనే సామెత గుర్తుకొచ్చిందన్నారు. దోపిడీలో సాక్షాత్తూ చంద్రబాబే నంబర్వన్గా ఉన్నప్పుడు మంత్రులు మాత్రం ఏం చేస్తారని ఎద్దేవాచేశారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పిన మాటలు, అధికారంలోకి వచ్చాక చేస్తున్న పరిపాలన చూస్తుంటే చంద్రబాబు అంత అబద్ధాలకోరు రాజకీయ నాయకుడిని దేశంలోనే చూడలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ, పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం పార్లమెంట్ పరిశీలకుడు కిల్లి వెంకటసత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
భగ్గుమన్న విద్యార్థి లోకం
కూటమి ప్రభుత్వ తీరుపై...●విద్యార్థులకు తీవ్ర అన్యాయం కూటమి ప్రభుత్వం అధికా రం చేపట్టకముందు ఎనలే ని హామీలిచ్చి అధికారం చేపట్టిన తరువాత వాటిని మరచి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు పీజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయకుండా కాలక్షే పం చేస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉన్న జిల్లాలో వసతిగృహాల్లో ఏఎన్ఎంలు లేకపోవడం సిగ్గుచేటు. సమస్యలు పరిష్కరించక పోతే రానున్న రోజుల్లో భారీ ఉద్యమం చేపడతాం. – పి.రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ, రాష్ట్ర అధ్యక్షుడు ●విద్యారంగ సమస్యలపై దృష్టి సారించాలి ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై దృష్టి సారించాలి. చాలీచాలని మెస్చార్జీలతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లాలో కొన్ని కళాశాలలకు సొంత భవ నాలు లేవు. ఉదయం సమయాల్లో ఇంటర్, మధ్యాహ్న వేళల్లో డిగ్రీ కోర్సులు బోధిస్తున్నా రు. సంక్షేమ వసతిగృహాల్లో ఏఎన్ఎంలు లేక అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సపొంది ప్రాణాలపై తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణమే విద్యార్థులు సమస్యలు గుర్తించి పరిష్కరించాలి. – కె.రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, పార్వతీపురం ●కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలి ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలి. రుచికరమైన భోజ నం వడ్డించేలా చర్యలు తీసుకోవాలి. అర్హత కలిగి న ప్రతి ఒక్కరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేయాలి. – అంజలి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, పార్వతీపురం ● విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి ● పాఠశాలల విలీనం ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ ● జిల్లాలో మూడు పీజీ సెంటర్లు ఏర్పాటు చేయాలి ● ఇంజినీరింగ్ కళాశాల పనులు పూర్తి చేయాలి ● ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద విద్యార్థుల ఆందోళన పార్వతీపురం టౌన్: కూటమి ప్రభుత్వం చేపట్టిన విద్యార్థి వ్యతిరేక విధానాలపై విద్యార్థులు భగ్గుమన్నారు. కలెక్టరేట్ ను సోమవారం ముట్టడించారు. నిరసన గళం వినిపించారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పార్వతీపురం ఆర్టీసీ కాంపెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు నిసరన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలో బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందంటూ మండిపడ్డారు. ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, మెస్ చార్జీలు పెంచాలని, వసతిగృహాల్లో సదుపాయాలు కల్పించాలని, డిగ్రీ ప్రవేశాలను తక్షణమే ప్రారంభించాలని, పాఠశాలల విలీనం ప్రక్రియను రద్దుచేయాలని, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆశ్రమపాఠశాలాల్లో ఏఎన్ఎంలను నియమిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చి ఏడాది గడిచినా నెరవేర్చకపోవడంపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల వారికి అన్యాయం చేస్తోందన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జేసీ ఎస్.ఎస్.శోభికకు అందజేశారు. పీజీ సెంటర్లు ఏర్పాటు చేయాలి గిరిజన ప్రాంతమైన పార్వతీపురం మన్యం జిల్లాలో పీజీ సెంటర్ లేకపోవడం వల్ల ఉన్నత చదువులకు విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో పీజీ సెంటర్లు ఏర్పాటు చేసి విద్యార్థులను పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా శిక్షణ ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. కురుపాం నియోజకవర్గంలో గత ప్రభుత్వ తలపెట్టిన ఇంజినీరింగ్ కళాశాల పనులు పూర్తిచేసి ఇంజినీరింగ్ విద్యను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. జిల్లా లో మెడికల్ కళాశాల, యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన ప్రాంత విద్యార్థుల రాకపోకలకు అనువుగా బస్సు సదుపాయం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టి.అఖిల్, జిల్లా కార్యదర్శి రాజు, ఉపాధ్యక్షుడు కె.డేవిడ్, నాయకులు రాజశేఖర్, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
హామీలిస్తే సరి.. తోడ్పాటు ఎప్పుడో మరి!
● అధికారుల చుట్టూ తిరుగుతున్న ఆదర్శ రైతు బాబూరావు ● తక్కువ మదుపుతోనే వినూత్న యంత్రాలు తయారీ ● జిల్లా యంత్రాంగం నుంచి కొరవడుతున్న సహకారం సాక్షి, పార్వతీపురం మన్యం: మెకానిక్గా పని చేస్తూ, వ్యవసాయం చేసుకుంటూ, రైతులకు తక్కువ పెట్టుబడితో యంత్ర పరికరాలను తయారు చేస్తున్న దమరశింగి బాబూరావు కు జిల్లా యంత్రాంగం నుంచి సహకారం కొరవడుతోంది. బహుళ పంటలను ఒకేసారి విత్తుకునేందు కు అన్ని విధాలుగా రైతుకు ఉపయోగకరమైన వినూత్న డ్రమ్సీడర్ను బాబూరావు రూపొందించా రు. దీనికి భారత ప్రభుత్వం పేటెంట్ కూడా మంజూరు చేసింది. కొన్నాళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మేళన్లోనూ ఆయన యంత్ర పరికరాలను ప్రదర్శించి, అందరి మన్ననలూ పొందారు. పతకాలు కూడా పొందాడు. ఈయన చదివింది పదో తరగతే అయినా.. ప్రతిభను గుర్తించి, కేంద్ర ప్రభుత్వం గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అందజేసింది. దీంతో పాటు.. మరిన్ని పరికరాలను తయారు చేయించాలనే ఉద్దేశంతో గత కలెక్టర్ హయాంలో బాబూరావు పేరిట ఇన్కార్పొరేషన్ కంపెనీ డీబీఆర్ అగ్రిమార్ట్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను రిజిస్ట్రేషన్ చేయించారు. కంపెనీ నెలకొల్పేందుకు గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర వద్ద ఎకరా స్థ లం కూడా మంజూరు చేశారు. దానికి సంబంధించి ఇంకా ఉత్తర్వులు రాలేదు. అప్పటి నుంచి అధికారు ల చుట్టూ బాబూరావు తిరుగుతూనే ఉన్నాడు. సోమవారం పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశా డు. కంపెనీ పెట్టి, నూతన వ్యవసాయ పరికరాల తో రైతులకు సహకారం అందిస్తానని, మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెబుతున్నా.. అధికారులు తనను ఎందుకు ప్రోత్సహించ డం లేదో అర్థం కావడం లేదని బాబూరావు వాపోతున్నాడు. -
రైలు కింద పడి ఒకరి మృతి
దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మరడాం వద్ద రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వృద్ధుడు దాసరి తవిటయ్య(70) మృతి చెందినట్లు బొబ్బిలి రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల కేంద్రానికి చెందిన తవిటయ్య ఎందుకు ఇక్కడికి వచ్చాడో ఎక్కడికి వెళ్లడానికి పట్టాలు దాటుతున్నాడో తెలియాల్సి ఉందన్నారు. ఈ సంఘటనపై పాచిపెంట గ్రామస్తులకు సమాచారం అందించి మృతదేహన్ని విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..సాలూరు రూరల్: మండలంలోని ె లిపర్తి సమీపంలో బైపాస్ రోడ్డు పై ద్విచక్రవాహనంపై వెళ్తున్న సాలూరు పట్టణంలోని గొర్లెవీధికి చెందిన గొర్లె ధర్మారావు(38)ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆదివారం ఉదయం అక్కడికక్కడే మృతిచెందాడు. పొలం పనులకోసం కుమారుడితో కలిసి స్కూటీపై వెళ్తున్న ఆయన ప్రమాదంలో మృతిచెందగా కుమారుడికి స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. వృద్ధుడి మృతదేహం లభ్యంవిజయనగరం క్రైమ్: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెహ్రూ పార్క్ వద్ద 70 ఏళ్ల వృద్ధుడి మృతదేహాన్ని టూటౌన్ పోలీసులు ఆదివారం గుర్తించారు. తెల్లటి చొకా, తెల్లని గెడ్డం, దుప్పటి, స్టీల్ ప్లేట్ మృతదేహం వద్ద ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భిక్షాటన చేసుకునే వ్యక్తిలా ఉన్నాడని, మృతదేహాన్ని గుర్తించిన వారు ఫోన్ 9154874474, టూటౌన్ సీఐ 9121109420 నంబర్లకు ఫోన్ చేయాలని సీఐ శ్రీనివాస్ తెలిపారు. కంటకాపల్లి రైల్వేస్టేషన్ వద్ద మహిళ మృతదేహం విజయనగరం క్రైమ్/జామి: జిల్లాలోని కంటకాపల్లి రైల్వేస్టేషన్వద్ద ఓ మహిళ మృతదేహాన్ని జీఆర్పీ సిబ్బంది ఆదివారం కనుగొన్నారు. కంటకాపల్లి–అలమండ రైల్వేస్టేషన్ల మధ్య మెయిన్ డౌన్లైన్ ట్రాక్ మధ్య పడి ఉన్న మహిళ వయస్సు 35 నుంచి 40 ఏళ్ల లోపు ఉంటుందని ఐదడుగుల ఐదంగుళాల పొడవు, ఎరుపు రంగు ఛాయతో, పసుపు, గ్రీన్, గోధుం రంగు గల నైటీ ధరించి ఉందని ఎవరైనా గుర్తిస్తే ఫోన్ 919490617089, 919182073593, 08912883218 నంబర్లకు సమాచారం ఇవ్వాలని జీఆర్పీ హెచ్సీ రవికుమార్ కోరారు. -
జిల్లాలో ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’
● 512 కేసులు నమోదు ● రూ.1,13,900 జరిమానావిజయనగరం క్రైమ్: విద్యాసంస్థల పరిధిలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్‘ పేరిట చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు. విద్యాసంస్థలకు 100మీటర్ల పరిధిలో సిగరెట్లు, ఖైనీలు వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ మేరకు ఆదివారం పలు కాలేజీ యాజమాన్యాలను హెచ్చరించారు. గడిచిన ఐదు రోజుల్లో 512 కేసులు నమోదు చేసి, రూ.1,13,900/ జరిమానాను కోప్టా చట్టం కింద విధించామని ఎస్పీ వకుల్ జిందల్ చెప్పారు. గడిచిన ఐదు రోజులుగా జిల్లావ్యాప్తంగా విద్యా సంస్థలకు సమీపంలోని పాన్షాపులు, కిరాణా షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా విద్యాసంస్థలకు 100మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులను విక్రయించిన 512మంది వ్యాపారులపై కోప్టాచట్టం (ది సిగరెట్స్ అండ్ అదర్ పొగాకు ప్రొడక్ట్స్ 2003 చట్టం) ప్రకారం కేసులు నమోదు చేసి, వారిపై రూ.1,13,900/ లను జరిమానా విధించామన్నారు. విద్యాలయాలకు దగ్గరలో ఉన్న పాన్ షాపుల్లోను, కిరాణా షాపుల్లో పొగాకు ఉత్పత్తులను విక్రయించడం వల్ల విద్యార్థులు వాటిని వినియోగించేందుకు అలవాటుపడి, వక్రమార్గంలో ప్రయాణించే అవకాశం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొగాకు ఉత్పత్తులను విక్రయించకుండా చర్యలు చేపట్టేందుకు వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు స్వస్తి పలకాలని ఎస్పీ కోరారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో సంబంధిత సీఐలు, ఎస్ఐలు పాల్గొనగా, డీఎస్పీలు పర్యవేక్షించారు. -
ఆరోగ్య సిరి
● అన్ని చోట్ల చిరుధాన్యాలకే ప్రాధాన్యం ● కొండల్లో విస్తరిస్తున్న మిల్లెట్స్ సాగు ● పట్టణాల్లో పెరుగుతున్న వినియోగంభామిని: అంతరించి పోతున్న చిరుధాన్యాలను రక్షిస్తూ నేటి తరాలకు పరిచయం చేసేందుకు చిరుధ్యానాల విత్తన సంరక్షణతో పాటు, పంటల సాగు పెరుగుతోంది. సంప్రదాయ పంటలుగా పురాతన కొండ పంటలుగా పిలిచే మిల్లెట్స్ ప్రాముఖ్యతను వివరిస్తూ సాగు విస్తరణ పెంచుతున్నారు. ఐటీడీఏల పరిధిలో మిల్లెట్స్ సాగు విస్తరణ ప్రణాళిక అమలవుతోంది. ఏపీపీఐ సంస్థ ఆర్థిక సహకారంతో గిరిజనులకు చిరుధాన్యాల విత్తనాలు సేకరించి ఉచితంగా అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ పర్యవేక్షణలో కొండ పంటలు సాగు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి సాగు, మిశ్రమ సాగు విధానంలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచుతున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మిల్లెట్స్పై అవగాహన పెంచుతున్నారు.దీంతో చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, గంటెలు, రాగులు, జొన్నలు, ఊదలు, అరిరెకల సాగు పెరుగుతోంది.. ఔషధ గుణాల సమ్మిళితం తృణధాన్యాలు ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఔషధ గుణాల సమ్మిళితమైన తిండి గింజలు. ఆరోగ్య గుళికలుగా వీటిని వర్ణిస్తారు.ఇవి తింటూ ఆరు నెలల నుంచి రెండేళ్ల లోపు వ్యాధులను నిర్మూలించుకోవచ్చు.రోగ కారణాలను శరీరం నుంచి తొలగించి దేహాన్ని శుద్ధి చేస్తాయి. తృణధాన్యాలలోని పీచు పదార్థం రక్షణగా నిలుస్తుందని న్యూట్రిస్టులు చెబుతున్నారు. రోజుకు మనిషికి 38 గ్రాముల పీచు పదార్థం అవసరం. చిరుధాన్యాల్లో 25 నుంచి 30 గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. కూరగాయలు, ఆకు కూరల్లో పీచు పదార్థం పొందవచ్చు. కొండపోడు భూముల్లో చేపట్టే చిరుధాన్యాల సాగు పల్లపు ప్రాంతాల భూముల్లోనూ విస్తరిస్తున్నారు. ఆధునిక వ్యవసాయ విధానంలో నాట్లు వేయడం, కలుపు నివారణ, చీడపీడల నివారణకు కషాయాల వైద్యంతో సాగు చేస్తున్నారు. చిరుధాన్యాల పంటలకు తోడు పప్పుధాన్యాలు, కూరగాయల పంటలను మిశ్రమ పంటలుగా పండిస్తున్నారు.స్వచ్ఛంద సంస్థల సహకారంతోసంప్రదాయ పంటల సాగును పునరుద్ధరిస్తున్నాం. ఖరీఫ్లో చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యం పెంచాం. పండించిన చిరుధాన్యాలు మిగులు పంటకు మార్కెట్లో విలువ వచ్చేలా చర్యలు చేపట్టాం. పట్టణాల్లో పెరుగుతున్న వాడకానికి తగ్గట్లు పండించడానికి గిరిజన ప్రాంతాల్లో సమాయిత్తం చేస్తున్నాం. కె.రాబర్ట్పాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, పార్వతీపురం మన్యం జిల్లా -
పెట్టిందే తిను
● గిరిజన హాస్టల్స్లో అమలు కాని మెను ● భోజనంలో నాణ్యత అంతంతే ● ఆశ్రమ పాఠశాలలపై అంతులేని నిర్లక్ష్యం రామభద్రపురం: ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన మెనూ అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పాలకులతో పాటు ప్రభుత్వ అధికారులు ప్రచార ఆర్భాటం చేస్తున్నారు. కానీ వసతి గృహాల్లో మెనూ ప్రకారం మూడు పూటలా నాణ్యమైన ఆహారం అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.పేద కుటుంబాలకు చెందిన గిరిజన విద్యార్థులే కదా ఫర్వాలేదు. ఏది వండేసి పెట్టిన తినేస్తారులో అని పాలకులతో పాటు అధికారులూ భావిస్తున్నారు. వసతిగృహాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులంటే నిర్లక్ష్యం చూపుతున్నారు. అందుకు నిదర్శనం రామభద్రపురం మండలంలోని నేరెళ్లవలస ప్రభుత్వం గిరిజన సంక్షేమ వసతి గృహంలో ప్రభుత్వం అందించిన మెనూ చార్ట్ ప్రకారం విద్యార్థులకు మూడు పూటలా నాణ్యమైన ఆహారం అందడం లేదు.అధికారుల పర్యవేక్షణ లేక ఆహారంలో నాణ్యత కరువవుతోందని తల్లిందడ్రులు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన ఆశ్రమ పాఠశాలల అండ్ ప్రీ మెట్రిక్ హాస్టల్ వారి ఆహార పట్టిక ప్రకారం ఆదివారం ఉదయం గోధుమపూరీ, బంగాళాదుంప బఠాణీకుర్మా, ఉడకబెట్టిన గుడ్డు పెట్టాలి. అలాగే ఉదయం అల్పాహారంగా వేరుశనగ చిక్కి ఇవ్వాల్సి ఉంది.మధ్యాహ్నం నాణ్యమైన చికెన్ బిర్యానీ,పెరుగు చెట్నీ, గోంగూర చెట్నీతో భోజనం వడ్డించాలి. అక్కడి నిర్వాహకులు ఇవేవీ పెట్టకుండా మెనూ చార్ట్ను పక్కన పడేసి వాటికి బదులుగా ఉదయం గంజి అన్నం, మధ్యాహ్నం తెల్ల అన్నం, రసం, వండిన గుడ్డు పెట్టేసి సరిపెట్టారు. నాణ్యత అంతంతే.. వసతి గృహంలో విద్యార్థులకు పెట్టిన భోజనంలో నాణ్యత అంతంత మాత్రంగానే ఉంది. మెత్తగా ముద్ద అన్నం, పలుచటి చారుతో వడ్డిస్తూ ఆదా చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి భోజనంతో పాటు పండ్లు ఇవ్వాలి కానీ పం -
హ స్తకళల ఉత్పత్తులకు విశేషస్పందన
విజయనగరం అర్బన్: చేనేత వస్త్రాలు, హస్తకళల ఉత్పత్తిదారుల నుంచి నేరుగా వినియోగదారులకు సరసమైన ధరలకు అందించేందుకు స్థానిక లయన్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ప్రదర్శనల(ఎగ్జిబిషన్)కు విశేష స్పందన లభించింది. వివిధ రాష్ట్రాల నుంచి నేరుగా చేనేత వస్త్రాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 20వ తేదీ పరకు ప్రదర్శన కొనసాగుతుంది. ప్రతిరోజూ ఉదయం 10గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని, భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన హస్తకళలను ప్రోత్సహించాలని కోరారు. ఎగ్జిబిషన్లో పలు రాష్ట్రాల ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాల తయారీదారులు తమ ఉత్పత్తులను నేరుగా ప్రదర్శనలో విక్రయిస్తున్నారు. స్వయం ఉపాధి కార్మికులు స్వయంగా తయారు చేసిన హస్తకళలను ప్రోత్సహించాలని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయనగరం చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు వచ్చి కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. కొనుగోలుకు జనం ఆసక్తి విజయనగరంలో 20వ తేదీ వరకు హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ -
ఘనంగా ముగిసిన ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ
● విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యం ● సీహెచ్ పావని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలువిజయనగరం గంటస్తంభం: రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలో జరిగిన ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు ఘనంగా ముగిశాయి. రెండవ రోజు సమావేశాలకు ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్ పావని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిందని కానీ ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయని విమర్శించారు. సంవత్సర కాలం పాటు సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వానికి గడువు ఇచ్చామని ఆ సమస్యలు తీరకపోవడంతో ఈ ప్లీనరీ సమావేశాల స్ఫూర్తితో ఉద్యమాలు రూపొందిస్తామని హెచ్చరించారు. రాబోయే కాలం పోరాటాల కాలమని ఎస్ఎఫ్ఐ నాయకత్వాన విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగించాలని కోరారు. డిగ్రీలో ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి ఆఫ్లైన్లోనే అడ్మిషన్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాజాం, గజపతినరగం, విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని, జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని కోరారు. 107,108 జీవోలను రద్దు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ల అమ్మకాన్ని ఆపాలన్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాము, సీహెచ్ వెంకటేష్లు మాట్లాడుతూ జిల్లాలో పేరుకుపోయిన విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్లీనరీ సమావేశాల స్ఫూర్తితో పోరాటం సాగిస్తామని ప్రభుత్వం చొరవ చూపించి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వి.చిన్నబాబు, ఒ.రవికుమార్, ఎస్.సమీర, ఎం.వెంకీ, పి.రమేష్, కె రమేష్ జిల్లా సహాయ కార్యదర్శులు ఆర్.శిరీష, సోమేష్, ఈ వంశీ, కె.రాజు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు
వీరఘట్టం: కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గుండాల దాడిని ఆమె ఖండించారు. మండలంలోని వండువ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతితో కలిసి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఒక బీసీ మహిళ, జిల్లా ప్రథమ పౌరురాలైన హారిక గుండాల దాడిలో భయంతో వణికిపోయారని ఇంతకంటే దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నాయకులను లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. కక్షసాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో ఏడాది పాలన గడిపేశారన్నారు. కూటమి నేతల అరాచకాలకు బలవుతున్న వారికి వైఎసా్స్ర్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తల్లికి వందనం పేరిట తల్లిదండ్రులను మోసం చేసిందని ఆరోపించారు. ఉప్పాల హారికపై టీడీపీ, జనసేనల దాడి దారుణం కూటమి ప్రభుత్వ తీరుపై ఎంపీ తనూజారాణి ధ్వజం -
పంటల బీమాతో ప్రయోజనం
● జూలై 15లోగా పత్తి, అరటి పంటలకు బీమా ప్రీమియం చెల్లించాలి ● ఈ నెల 31లోగా మొక్కజొన్న ప్రీమియం, ఆగస్టు 15లోగా వరి పంట ప్రీమియం చెల్లించాలి ● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పార్వతీపురం టౌన్: రైతులు పంటలకు బీమా చేయించుకుంటే ఎంతో ప్రయోజనమని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులకు పంట బీమా పథకాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ఆదివారం నిర్వహించారు. బీమాపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులకు తక్కువ ప్రీమియం చెల్లింపుతో బీమా పథకం అమలు జరుగుతుందని ఆయన చెప్పారు. ఫసల్ బీమా యోజనను ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆధ్వర్యంలో జరుగుతోందన్నారు. ఎంపిక చేసిన పంటలకు బీమా చేసిన మొత్తానికి రెండు శాతం, వాణిజ్య – ఉద్యాన పంటలకు 5 శాతం చెల్లించాలని చెప్పారు. వాస్తవ ప్రీమియంలో రైతు చెల్లించగా మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయని ఆయన తెలిపారు. రైతులు వరి పంటకు ఆగస్టు 15వ తేదీ లోగా, మొక్కజొన్న పంటకు జూలై 31వ తేదీలోగా ప్రీమియం చెల్లించాలని చెప్పారు. పత్తి, అరటి పంటల బీమా జూలై 15వ తేదీలోగా చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో వరి పంటకు ఎకరాకు రూ.40 వేలు పార్వతీపురం మన్యం జిల్లాలో వరి పంటకు ఎకరాకు రూ.40 వేలు ప్రీమియం చెల్లించాలని, అయితే రైతులు తమ వాటాగా రూ.8 వందలు చెల్లిస్తే సరిపోతుందని, మిగిలిన మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించారు. మొక్కజొ న్న పంటకు ఎకరాకు రైతు వాటా రూ.330 అన్నారు. పత్తి పంటకు ఎకరాకు రూ.1923 ప్రీమియం కాగా రైతు వాటా కింద రూ.98 చెల్లించాలని, అరటి పంటకు రూ.3036 కాగా రైతు వాటా కింద రూ.152 చెల్లించాలని ఆయన చెప్పారు. రైతులు ప్రీమియంను తమ సమీపం లోని కామన్ సర్వీస్ సెంటర్, సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్, పీఏసీఎస్, పోస్టాఫీసుల ద్వారా రైతుల ఆధార్, భూమి, కౌలు కార్డు, పంట వేసిన ధ్రువ పత్రాన్ని, బ్యాంకు వివరాలకు సంబంధించిన పత్రాలను సమర్పించి ఆన్ లైన్ ద్వారా ప్రీమియం చెల్లించి రసీదు పొందవచ్చన్నారు. రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు రైతులు ఎటువంటి దళారులని, మధ్యవర్తులని నమ్మి మోసపోవద్దని కలెక్టర్ సూచించారు. పంట వేసిన ధ్రువపత్రం జారీ నిమిత్తం కూడా ఎటువంటి మొత్తాన్ని రైతు సేవ కేంద్రంలోని సిబ్బందికి చెల్లించనవసరం లేదని ఆయన చెప్పారు. గడువు తేదీ ముందుగానే తమ ప్రీమియం చెల్లింపు చేసి తగు రసీదు పొందాలని సూచించారు. బీమా వేసిన పంట వివరాలు ఇ – పంట లో సక్రమంగా నమోదు అయ్యాయో లేదో సరిచూసుకోవాలని ఆయన సూచించారు. తద్వారా దరఖాస్తుల పూర్తి ఆమోదం సులభంగా జరుగుతుందన్నారు. -
పాఠశాల బాగుకు ఒక్కటయ్యారు...
కొమరాడ: తమ గ్రామ పాఠశాల బాగుకు ఆ గ్రామస్తులంతా ఒక్కటిగా ముందుకు కదిలారు. అధికారులు, పాలకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. అయినా ఫలితం లేకపోయింది. ఇక మన పాఠశాలను మనమే బాగు చేసుకుందామని అంతా ఒక్కటిగా ముందుకు సాగారు. ఒక్కో కుటుంబం నుంచి రూ.400లు సేకరించారు. ఆ గ్రామస్తులే.. గాజులగూడ గిరిజనులు. వివరాల్లోకి వెళ్తే.. కొమరాడ మండలం కెమిశీల పంచాయతీ గాజులగూడ గ్రామంలో 110 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 55 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉపాధ్యాయులు ఐదుగురున్నారు. ఈ ఏడాది ఈ పాఠశాల మోడల్ ప్రైమరీ పాఠశాలగా అప్గ్రేడ్ అయింది. ఒకే తరగతి గది ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తమ పిల్లల భవిష్యత్ కోసం రెండు దశాబ్దాల కిందట మంజూరైన అదనపు గది అసంపూర్ణంగా ఉండడంతో ఆ గదినే రేకుల షెడ్తో నిర్మించుకుంటున్నారు. ఇందుకు గ్రామస్తులు పోగు చేసిన రూ.50వేలు ఖర్చు పెడుతున్నారు. అదే సమయంలో ఈ పనుల్లో గ్రామస్తులే కూలీలుగా మారి అధికారులు, పాలకులకు కనువిప్పు కలిగేలా పని చేస్తూ పాఠశాల బాగుకు నడుం బిగించారు. అధికారుల చుట్టూ తిరిగాం.. మా పాఠశాలలో 55 మంది విద్యార్థులున్నారు. ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నా రు. పాఠశాల గదుల నిర్మాణం కోసం అధికారులు, పాలకుల చుట్టూ తిరిగాం. అయినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తామే ఒక్కటిగా నిలిచి విరాళాలు పోగు చేసి పాఠశాలలో అదనపు తరగతి గదిని నిర్మించుకుంటున్నాం. – కుడ్రక మల్లేశ్వరరావు, గాజులగూడ నిధులు పోగు చేశారు.. తరగతి గదిని నిర్మించుకుంటున్నారు.. -
పడిపోయిన నిమ్మ ధర
సీతంపేట: సీతంపేట మార్కెట్కు భారీగా నిమ్మకాయలు ఆదివారం వచ్చాయి. అనుకున్న ధర లేకపోవడంతో గిరిజనులు ఆందోళన చెందారు. గతంలో 50 కిలోల వరకు ఉన్న నిమ్మ బస్తా రూ.5 వేలు పైబడి పలుకగా ఇప్పుడు బస్తా రూ.500లకు పడిపోయిందని నిమ్మ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం, ఒడిశా, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్లారు. కొండపోడు వ్యవసాయంలో భారీగా ఈ ఏడాది మంచి దిగుబడులు వచ్చాయి. దిగుబడులు వచ్చిన వాటిని సీతంపేట, కుశిమి, మర్రిపాడు వారపు సంతల్లో విక్రయిస్తారు. ఇప్పుడు ధరలు పూర్తిగా పడిపోయాయని గిరిజనులు వాపోతున్నారు. సీతంపేట మార్కెట్కు భారీగా నిమ్మకాయలు బస్తా నిమ్మ ధర రూ.500లు గతంలో ఇదే సీజన్లో బస్తా రూ.5వేలు -
ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలి
● ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ డిమాండ్ విజయనగరం అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన డీఏ, సరండర్ లీవ్ క్యాష్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ డిమాండ్ చేశారు. స్థానిక ఆపస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల దాటినా పీఆర్సీ కమిషన్ నియమించలేదని ఆరోపించారు. వెంటనే కమిషన్ వేసి కనీసం 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఇ.రామునాయుడు, అదనపు ప్రధాన కార్యదర్శి చిన్ని శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి సంతోషలక్ష్మి, గౌరవాధ్యక్షులు వీవీ శ్రీహరి, కోశాధికారి ఏజీ తాతారావు, జిల్లా మహిళా ప్రతినిధి పద్మలత, విశాఖ జిల్లా అధ్యక్షుడు అరుణ్కుమార్, వెంకటనాయుడు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
పురుగుల బియ్యం సరఫరాపై దర్యాప్తు
–8లోగుంటూరు, రాయగడ ఎక్స్ప్రెస్లో తనిఖీలు గుంటూరు, రాయగడ ఎక్స్ప్రెస్లలో ఈగల్ టీమ్ తనిఖీలు చేపట్టింది. వీరఘట్టం: పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం కోసం పురుగుల బియ్యం సరఫరాపై పేరెంట్ టీచర్స్ మీటింగ్కు హాజరైన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ‘పండగ పూట పురుగుల బియ్యమేనా’ అనే శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన వార్తకు జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ కె.శ్రీనివాసరావు స్పందించారు. వీరఘట్టం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించారు. వంట ఏజెన్సీ నిర్వాహకురాలితో మాట్లాడారు. బియ్యంలో సుంకి, తెల్ల పురుగు లు ఉన్నాయని, ప్రతిరోజు ఆ బియ్యంను శుభ్రం చేసి వేడి నీటితో కడిగి వంటచేస్తున్నామని వంట ఏజెన్సీ నిర్వాహకురాలు డీఎమ్కు తెలిపారు. ఈ సందర్భంగా డీఎమ్ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరంలో పాఠశాలకు ఇచ్చిన రేషన్ బియ్యం ( 50 కిలోల బస్తాలు) ప్రతీ పాఠశాలలో 1 నుంచి 2 టన్నుల వరకు ఉన్నాయన్నారు. పాత బియ్యంకు ఇప్పటికే పరుగులు పట్టి ఉన్నాయని, పాత బియ్యం ఉన్న గదిలోనే కొత్తగా ఇచ్చిన సన్నబియ్యం వేయడంతో ఆ పరుగులు వీటికి పడుతున్నాయన్నారు. కొత్తగా పాఠశాలలకు వచ్చే బియ్యంను వేరే గదిలో భద్రపరచాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల ల్లో ఉన్న పాత స్టాకును త్వరలో గోదాములకు తరలిస్తామన్నారు. -
అన్నీ రిఫరల్ కేసులేనా..!
● రోగుల రిఫర్పై వైద్యులు, అధికారుల వాదన ● సీరియస్ లేకున్నా జిల్లా కేంద్రానికి రిఫర్ చేస్తున్నారు ● 108 జిల్లా మేనేజర్ ● రోగికి బాగుందా లేదా అన్నది మేం డిసైడ్ చేస్తాం ● సీహెచ్సీ సూపరింటెండెంట్బొబ్బిలి: మూడు జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా బొబ్బిలి సీహెచ్సీ నుంచే జిల్లాకేంద్రానికి రోగులను రిఫర్ చేస్తున్నారని, ఇక్కడి వైద్యులకు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నందున సీహెచ్సీకి వచ్చిన రోగులను ఐపీలో ఉంచేందుకు ఇష్టపడక చిన్న రోగానికి కూడా రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో వాటికి మరింత బలం చేకూర్చే విధంగా శుక్రవారం ఓ సంఘటన జరిగింది. ఏకంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ జి శశిభూషణ రావు, వైద్యులు 108 మూడు జిల్లాల మేనేజర్ల మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. ప్రతి చిన్న విషయానికి 108కి ఫోన్ చేసి రమ్మంటున్నారని, రోగులు నడిచి వెళ్లగలిగే పరిస్థితుల్లోనూ 108 వాహనాన్ని పిలిచి రోగులను తరలించడం వల్ల వివిధ రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాలకు 108 వాహనాలను పంపించలేకపోతున్నామని 108 మేనేజర్ మన్మథరావు అన్నారు. దీనికి ఆస్పత్రి సూపరింటెండెంట్ జి శశిభూషణ రావు మాట్లాడుతూ రోగులను 108లో పంపించాలా? మామూలుగా ఇక్కడే వైద్యం చేయించాలా అన్న విషయాన్ని నిర్ణయించేది మేము. మీరెలా చెప్పగలరు? అని ఎదురు ప్రశ్నించారు. రోగి స్థితి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందని, నిలకడగా ఉండదని అలాంటప్పుడు మేం ఎలా రిఫర్చేయకుండా ఉంచుతామన్నారు. మీరు ఒక వేళ 108 పంపించలేమని అనుకుంటే మాకు రాసిచ్చేయండి. మేం ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. పోర్టికో వద్ద జరుగుతున్న ఈ వాదనను రోగులు, ఇతర వైద్యసిబ్బంది వచ్చి చూస్తూ ఉండి పోయారు. మరో వైద్యురాలు మాట్లాడుతూ మీరు వాహనాలు పంపించేందుకు ఇష్టపడకపోతే ఎలా మేం రిఫర్ రాస్తాం. అలాంటప్పుడు రోగికి ఏదైనా జరిగితే మీదే బాధ్యత అని అన్నారు. ఒక్కో అంబులెన్స్ డ్రైవర్ చాలా రెక్లెస్గా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. కంప్లైంట్ ఇవ్వండి ఇక్కడ ఆస్పత్రిలో వైద్యులు రోగులను ఉంచడం లేదు. అందర్నీ రిఫర్ చేస్తున్నారని మీరు కంప్లైంట్ ఇవ్వండి మా కంప్లైంట్ మేం ఇచ్చుకుంటామని సూపరింటెండెంట్ శశిభూషణ రావు అన్నారు. చాలా కేసులకు విజయనగరం వెళ్లి వస్తున్నామని, జిల్లా కేంద్రానికి వెళ్లి వచ్చేసరికి దాదాపు 6 గంటలు పడుతోందని ఈ లోగా ఏమైనా ఏక్సిడెంట్లు జరిగితే అందుబాటులో ఉండలేకపోతున్నామని 108 మేనేజర్ మన్మథ రావు అన్నారు. రోగుల వైద్యం కోసం ఇలా వాదులాడుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
ఎరువులేవీ..?
కొమరాడ: ఎరువులు సరిగా అందడం లేదు. సాగునీటి ప్రాజెక్టుల కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదంటూ పలువురు సభ్యులు అధికారులను ప్రశ్నించారు. కొమరాడ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శెట్టి శ్యామల, ఎంపీడీఓ ఎస్.రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొడుము సర్పంచ్ యేగిరెడ్డి సింహాచలం మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ రైతులకు ఎరువుకష్టాలు తీర్చాలని కోరారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సమస్య ఉండేదికాదన్నారు. వైస్ ఎంపీపీ నంగిరెడ్డి శరత్బాబు మాట్లాడుతూ జంఝావతి ఎత్తి పోతల పథకం తరచూ మరమ్మతులకు గురవుతున్నా పట్టించుకోకపోవడంతో ఆయకట్టుకు సకాలంలో సాగునీరు అందడంలేదన్నారు. సీపీఎం నాయకుడు కొల్లు సాంభమూర్తి మాట్లాడుతూ పార్వతీపురం నుంచి కొమరాడకు వెళ్లేందుకు బస్సు సదుపాయం కల్పించాలన్నారు. పూర్ణపాడు – లాబేస్ వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్డార్ సీహెచ్.సత్యానారాయణ, వ్యవసాయ శాఖ అధి కారి ప్రసాదరావు, జెడ్పీటీసీ సభ్యురాలు ద్వారపురెడ్డి లక్ష్మి, తహసీల్డార్ సీహెచ్ సత్యనారాయణ, ఎంపీడీఓ రమేష్, వైస్ ఎంపీపీ నంగిరెడ్డి శరత్బాబు, తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికే పోలీసు వెల్ఫేర్డే
పార్వతీపురం రూరల్: శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ పోలీస్ వెల్ఫేర్డే(గ్రీవెన్స్ డే) నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సిబ్బంది నుంచి విజ్ఞాపనలు స్వీకరించి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కార చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి అలాగే వృత్తి పరమైన, ఆరోగ్యపరమైన, వ్యక్తిగతమైన సమస్యలను పరిష్కరిం చడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా శాఖాపరమైన సిబ్బంది సమస్యలను తెలుసుకు ని పరిశీలించి సత్వర పరిష్కారానికి అవకాశం ఉన్న అంశాలపై ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, డీసీఆర్బీ సీఐ ఆదాం, సీసీ సంతోష్ కుమార్, ఆర్ఐ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
కారులో 300 లీటర్ల సారా స్వాధీనం
గుమ్మలక్ష్మీపురం(కురుపాం)/జియ్యమ్మవలస: కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని జియ్యమ్మవలస మండలం దాసరిపేట గ్రామ సమీపంలో సారా రవాణాపై రూట్ వాచ్ చేస్తుండగా ఓ కారులో తరలిస్తున్న 300 లీటర్ల సారాను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈమేరకు తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒడిశాలోని సందుబడి గ్రామంలో తయారైన సారాను 15 క్యాన్లతో (300 లీటర్లు) టాటా ఇండికా కారులో పాలకొండ మండలం చినమంగళాపురం గ్రామానికి చెందిన వడ్డాది సురేష్, జియ్యమ్మవలస మండలం చినమేరంగికి చెందిన బొత్స అనిల్లు తరలిస్తుండగా పట్టుబడ్డారని చెప్పారు. సారాతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకుని పట్టుబడిన ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సమావేశంలో ఆయన వెంట సబ్ ఇన్స్పెక్టర్ జె.రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు. -
తోటపల్లి వెంకన్న హుండీల ఆదాయం రూ.5.17లక్షలు
గరుగుబిల్లి: తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలోని హుండీల ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. ఈ ఏడాది మార్చి 28 నుంచి ఈ నెల 11వ తేదీ వరకు భక్తులు హుండీలలో వేసి న కానుకల రూపంలో రూ.5,17,488లు నగ దు వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.వి.సూర్యనారాయణ తెలిపారు. కోదండరామాలయంలోని హుండీల నుంచి రూ.7,277 లు వచ్చిందన్నారు. హుండీల లెక్కింపు సాలూ రు గ్రూపు ఆలయాల ఈఓ టి.రమేష్ సమక్షంలో సాగిందన్నారు. లెక్కింపు ప్రక్రియలో ఆల య అర్చకులు వి.వి.అప్పలాచార్యులుతో పాటు సిబ్బంది ఎం.మురళీమోహన్, ఎం.బలరాంనాయుడు, శ్రీధర్, గ్రామపెద్దలు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. నందివానివలస పరిసరాల్లో ఏనుగులు గరుగుబిల్లి: గజరాజుల గుంపు బలిజిపేట మండలం పెద్దింపేట నుంచి గురువారం రాత్రి గరుగుబిల్లి మండలంలోని శివ్వాం, సీమలవానివలస, సంతోషపురం, తోటపల్లి మీదుగా నందివానివలస చేరుకొన్నాయి. గత ఇరవై రోజులుగా సీతానగరం, బలిజిపేట మండలా ల్లో సంచరించిన ఏనుగులు మళ్లీ గరుగుబిల్లి మండలం చేరుకోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏనుగుల తరలింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పారిశుద్ధ్య పక్షోత్సవాలపై అవగాహన పార్వతీపురం టౌన్: జిల్లాలో ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు చేపట్టనున్న ప్రత్యేక పారిశుద్ధ్య పక్షోత్సవాలపై ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వచ్ఛమైన తాగునీరు, అనీమియా కమిటీల నిర్వహణ చేపట్టాలని సూచించారు. పారిశుద్ధ్య పక్షోత్సవాలు, పీఎం సూర్యఘర్, వెక్టర్ హైజీన్యాప్ తదితర అంశాలపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని 3వ శనివారం నిర్వహించాలని ఆదేశించారు. మలేరియా దోమల నివారణ మందును పిచికారీ చేయాలన్నారు. జిల్లాలో వెయ్యి పీఎం సూర్యఘర్ యూనిట్లు ఏర్పాటుకావాల్సి ఉందన్నారు. సమావేశంలో డీపీఓ టి.కొండలరావు, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక ఇంజినీరు ఒ.ప్రభాకరరావు, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ కె.మల్లికార్జున, డీఎల్డీఓ రమేష్ రామన్, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యలను విస్మరించిన కూటమి
● ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ పార్వతీపురం: ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం, సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఐక్య పోరాటాలకు సిద్ధంకావాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ పిలుపునిచ్చారు. ఉద్యోగులు, పింఛన్దారుల సమస్యల పరిష్కారాని కి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పార్వతీ పురం మన్యం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా అధ్యక్షుడు జీవీ కిషోర్ అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వేతన సవరణ కమిషన్ను నియమించకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడమేనన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.27,500 కోట్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ విధులను సక్రమంగా నిర్వహిస్తున్న ఉద్యోగులకు వేతన సవరణ కమిషన్ను నియమించి మెరుగైన మధ్యంతర భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల భవిష్యనిధి, ప్రభుత్వ బీమా వంటి పథకాల్లో దాచుకున్న నిధులను ఉద్యోగులకు చెల్లించకపోవడం పట్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రివర్స్ పీఆర్సీని అమలు చేయడం విచారకమన్నారు. సంఘంలో ఉన్న ఉద్యోగుల తరఫున నిరంతర పోరాటం చేస్తామన్నారు. ఏన్జీఓ సంఘంలో ఉన్న సభ్యులలో కనీసం 30శాతం మంది నాయకత్వ బాధ్యతలను కలిగి ఉండాలన్నారు. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో ఏపీ ఎన్జీఓల ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాల్సి ఉందని అభిప్రాయ పడ్డారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జీవీ రమణ, ఉత్తరాంధ్ర జిల్లాల ఏపీ ఎన్జీఓల నాయుకులు, పింఛన్దారుల సంఘం నాయకులు, ఉపాధ్యాయ సంఘనాయుకులు బాలకృష్ణ, ఎస్.మురళి, జి.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. -
● ఇదిగో.. అదిగో అంటూనే కాలయాపన ● కౌన్సెలింగ్ పూర్తయినా నేటికీ సచివాలయ ఏఎన్ఎంలకు అందని ఉత్తర్వులు ● కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఉద్యోగులు ● జీతాల కోసం ఎదురుచూస్తున్న ఎంటీఎస్ ఉపాధ్యాయులు
సాక్షి, పార్వతీపురం మన్యం: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇటీవల చేపట్టిన బది లీలు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. అస్తవ్యస్త విధా నాలు, సిఫారసు లేఖలు, డబ్బు ప్రభావంతో ఈ ప్రక్రియ వివాదంగా మారిన విషయం విదితమే. కొన్ని శాఖల్లో ఉద్యోగులు నేటికీ గాలిలో ఉండిపో యి, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఏఎన్ఎంలపై ఎందుకంత నిర్లక్ష్యం? పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేస్తున్న సచివా లయ ఏఎన్ఎంల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన వీరికి బదిలీ ల కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 778 సచివాలయాలు ఉండగా.. గత నెల 30వ తేదీ నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టా రు. స్థాన చలనం కలిగిన వారికి తొలుత ఈ నెల ఐదో తేదీన ఉత్తర్వులు ఇస్తామన్నారు. అదే రోజున డీఎంహెచ్వో కార్యాలయంలో అడిగితే.. ఐదో తేదీ నుంచి పదో తేదీలోపు ఎప్పుడైనా కొత్త స్థానంలో చేరవచ్చని ఉత్తర్వులు ఇవ్వకుండానే తిప్పి పంపా రు. విజయనగరం వెళ్లి తీసుకోవాలని మరోసారి చెప్పి పంపారు. అక్కడికి వెళ్లి.. అడిగితే, ‘అందరిదీ పార్వతీపురం మన్యం జిల్లా కదా.. అక్కడికే వెళ్లండం’టూ వెనక్కి పంపేశారు. మరలా పదో తేదీన ఇక్కడి కార్యాలయంలో అడిగితే.. మెగా పేరెంట్స్ డే ఉందని చెప్పి 11వ తేదీన రమ్మన్నారు. చేసేదిలేక సచివాలయ ఏఎన్ఎంలు శుక్రవారం డీఎంహెచ్వో కార్యాలయానికి వెళ్లారు. ఈసారి కూడా సోమ, మంగళవారాల్లో ఏదో ఒక రోజు అంటూ దాట వేశా రు. గట్టిగా అడిగితే.. అధికారులు సైతం అదే స్థా యిలో బదులిచ్చారు. ఇన్నిరోజులు గాలిలో ఉండిపోయామని.. ఇప్పటికీ ఫలానా తేదీ అంటూ కచ్చితంగా చెప్పడం లేదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం జిల్లాలో బదిలీ అయిన ఏఎన్ఎంలంతా తొమ్మిదో తేదీనే విధుల్లో చేరిపోయారని చెబుతున్నారు. సేవాదృక్పథంతో విధులు నిర్వర్తిస్తున్న తమపై ఎందుకంత చులకన ని వాపోతున్నారు. ‘ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు అడిగినా మూవ్మెంట్ ఇవ్వడం లేదు. విజయనగరం వెళ్లి అడగాలన్నారు. అక్కడికి వెళ్తే మన్యం అంటున్నారు. మా బాధను అర్థం చేసుకోవాలి. కౌన్సెలింగ్ అయినప్పుడు ఏ స్థానంలో నియమించారో తక్షణమే అక్కడికే పంపిస్తూ ఉత్త ర్వులు జారీ చేయాల’ని వారంతా కోరుతున్నారు. బదిలీ శాపం.. ఎంటీఎస్లకు అందని జీతం 1998 డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయులు మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మినిమం టైం స్కేల్ ఉపాధ్యా యులకు ఇటీవల నిర్వహించిన బదిలీల్లో ‘సర్దుబాటు’ చేసిన విషయం విదితమే. ఉమ్మడి జిల్లా లో మొత్తం 475 మందిని సర్దుబాటు చేశారు. ఇందులో 2008 డీఎస్సీ బ్యాచ్ వారు 99 మంది, మిగిలిన 376 మంది 1998 డీఎస్సీకి చెందిన ఎంటీఎస్లు ఉన్నారు. ఉపాధ్యాయుల బదిలీల తర్వాత మిగిలిన ఖాళీలు, జెడ్పీ యాజమాన్యంలో క్లస్టర్ పాఠశాలలకు వీరిని సర్దుబాటు చేశారు. వయస్సు, ఆరోగ్య సమస్యల రీత్యా 1998 డీఎస్సీ ఎంటీఎస్లు దీనిపై పెదవి విరిచినా.. విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. ఏ రోజు ఎక్కడ పనిచేయాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. మరో దారిలేక.. విధుల్లో చేరినా.. బదిలీల్లో అస్తవ్యస్త విధానాల వల్ల వీరికి జీతాలు అందని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. వీరికి సంబంధించి క్లస్టర్ హెచ్ఎంలకు డ్రాయింగ్ అధికారులు ఇచ్చా రు. ఇదే సమయంలో ఎంటీఎస్లకు జీతాలు ఎలా పెట్టాలో స్పష్టమైన సూచనలు ఇవ్వలేదు. దీంతో వారెవరికీ జూన్నెల జీతాలు పడలేదు. జులై నెలకు సంబంధించి బిల్లు పెట్టే సమయం సమీపిస్తున్నా.. ఇప్పటికీ ఎటువంటి ఆదేశాలూ రాలేదు. దీంతో ఈ నెల కూడా జీతాలు అందుతాయా, లేదా అన్న సందిగ్ధంలో ఉపాధ్యాయులు ఉన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి దుర్మరణం
● మరో యువకుడికి తీవ్రగాయాలుకొత్తవలస: అరకు–విశాఖపట్నం జాతీయ రహదారిలో శుక్రవారం రాత్రి స్కూటీపై వెళ్తున్న యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో లక్కవరపుకోట మండలం భూమిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మాదాబత్తుల శ్రీను(23) అక్కడికక్కడే మృతి చెందగా అదే గ్రామానికి చెందిన ధనాలకోటి అప్పలనాయుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, ఎస్సై హేమంత్కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీను తన స్వంత గ్రామం భూమిరెడ్డిపాలెం నుంచి స్నేహితుడు అప్పలనాయుడితో కలిసి స్కూటీపై పెందుర్తి మండలంలో గల తన అక్క ఇంటికి బయల్దేరాడు. అరకు–విశాఖ రోడ్డు మంగళపాలెం జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా మితిమీరిన వేగంతో గుర్తు తెలియిన వాహనం వచ్చి ఢీకొట్టింది. దీంతో శ్రీను రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అధికంగా రక్తస్రావం జరగ్గా అక్కడిక్కడే మృతిచెందాడు. స్కూటీ వెనుక కూర్చున్న అప్పలనాయుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సహాయంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. కాగా మృతుడు శ్రీను విశాఖపట్నం జిల్లా ఎన్ఏడీ జంక్షన్ సమీపంలో బాజీజంక్షన్ వద్ద గల బ్యాంక్ ఆఫ్ బరోడాలో సహాయకుడిగా పని చేస్తున్నాడు. అప్పలనాయుడు చిన్న చిన్న ఎలక్ట్రకల్ పనులను చేస్తు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని ఎస్సై మేమంత్కుమార్ సిబ్బందితో కలిసి పరిశీలించి శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్సీకి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పాలిటెక్నిక్ కళాశాల మూసివేత ప్రతిపాదనను రద్దు చేయాలి
విజయనగరం అర్బన్: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మూసివేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలను ఉపసంహరించుకునేలా చూడాలని చింతపల్లి స్థానికులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావును కోరారు. ఈ మేరకు కళాశాల యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ అయినట్లు వారు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. 2011లో స్థానిక విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని భావించి చింతపల్లిలో సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేశారని, ఇప్పటివరకు ఎంతో మంది విద్యార్ధులు విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని స్థానికులు తెలిపారు. అయితే బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం వల్ల ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన చైర్మన్ డాక్టర్ శంకరరావు, ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉండాల్సిన అవసరం ఉందని ఈ విషయంలో ఎస్టీ కమిషన్ తన సిఫార్సులను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. చింతపల్లి ప్రాంతంలో వ్యవసాయ కళాశాల అవసరాన్ని గుర్తించి అప్పట్లో ఈ కళాశాల ఏర్పాటైందని, స్థానికులు లేవనెత్తిన అంశాలను పరిశీలించి కళాశాల కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్కు వినతి ఇచ్చిన చింతపల్లి స్థానికులు -
వైభవంగా సహస్ర దీపాలంకరణ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం కనుల పండువగా జరిపించారు. వెండి మంటపంలో ఉన్న శ్రీ సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి, దీపారాధన మంట పంలో ఉన్న ప్రత్యేక ఊయలలో వేంచేపుజేశా రు. అనంతరం దీపాలను వెలిగించి, స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహస్ర దీప కాంతుల శోభలో సీతారామస్వామికి ఊంజల్ సేవ జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.డీపీఓలో పోలీస్ వెల్ఫేర్ డేవిజయనగరం క్రైమ్: జిల్లా పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి విజ్ఞాపనలు స్వీకరించి, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అనంతరం ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేసి వారి సంక్షేమానికి ప్రాధాన్యం కల్పిస్తానన్నారు. పోలీసు వెల్ఫేర్ డేలో భాగంగా సిబ్బంది ఒక్కొక్కరిని తన చాంబర్లోకి పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకుని వారి నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. సిబ్బంది విజ్ఞాపనలు పరిశీలించిన ఎస్పీ, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. బాక్సింగ్ పోటీల్లో విజేతలుగా నిలవాలివిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్ జూనియర్స్ బాల బాలికల బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులు విజయం సాధించాలని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు. అవనాపు భార్గవి ఆకాంక్షించారు. ఈనెల 12, 13వ తేదీల్లో విశాఖపట్నం రైల్వే స్టేడియంలో జరిగే 6 వ రాష్ట్ర సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులు శుక్రవారం పయనమయ్యారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నలుగురు ఉపాధ్యాయులకు మెమో
మక్కువ: మండలంలోని మార్కొండపుట్టి మోడల్ ప్రైమరీ పాఠశాలకు చెందిన నలుగురు ఉపాధ్యాయులుకు మెమో జారీచేసినట్లు ఎంఈవో శ్యామ్సుందర్ శుక్రవారం తెలిపారు. సాక్షిలో శుక్రవారం ‘పాపం చిన్నారులు..!’ అనే కథనం ప్రచురితమైంది. పేరెంట్స్, టీచర్స్ సమావేశం మాత్రమే నిర్వహించాలి తప్ప, ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టరాదని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, అందుకు విరుద్ధంగా ఉపాధ్యాయులు పాఠశాల ఎదుట నడిరోడ్డుపై సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటానికి క్షీరాభీషేకం నిర్వహించడంతోపాటు, రోడ్డుపై చిన్నారులను, తల్లిదండ్రులును కూర్చోబెట్టి పాదపూజ నిర్వహించడం సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొట్టడంతో పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దీంతో డీఈవో రాజ్కుమార్ స్పందించి, నలుగురు ఉపాధ్యాయులకు మెమో ఇవ్వాలని ఎంఈవో శ్యామ్సుందర్కు ఆదేశాలు ఇవ్వడంతో, శుక్రవారం ఆ ఉపాధ్యాయులుకు మెమో ఇచ్చామని, ఉపాధ్యాయుల నుంచి వివరణ రావాల్సి ఉందని ఎంఈవో శ్యామ్సుందర్ తెలిపారు. కానిస్టేబుల్ అభ్యర్థి అదృశ్యంవిజయనగరం క్రైమ్: పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలో ఫెయిల్ అయ్యానని మనస్తాపం చెందిన ఓ అభ్యర్థి అదృశ్యమయ్యాడు. నగరానికి చెందిన పల్లి పైడి నాయుడు(25) ఇటీవల పలు పోటీ పరీక్షలకు సమాయత్తం అయ్యాడు. అలాగే పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు కూడా హాజరై రాత పరీక్ష రాశాడు. అయితే రెండు రోజుల క్రితం వచ్చిన కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల్లో పైడినాయుడు ఫెయిలయ్యాడు. దీంతో మనస్తాపం చెంది కన్నవారికి తాను ఇక భారం అనుకుని ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు పైడినాయుడి మామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాస్ చెప్పారు. -
20న పారా జూనియర్స్, సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలు
విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న పారా జూనియర్, సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు రాజీవ్ క్రీడా మైదానంలో జరుగనున్నాయని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్స్ను జిల్లా క్రీడాధికారి ఎల్. వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్లతో కలిసి స్థానిక అశోక్బంగ్లాలో ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆగస్టులో 14వ జాతీయస్థాయి జూనియర్, సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ –2025 పోటీలు జరుగనున్నాయని, ఈ పోటీలకు అర్హత సాధించేందుకు ముందుగా జిల్లా స్థాయిలో ఎంపిక కావాల్సి ఉందన్నారు. 13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు దివ్యాంగ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు ఆగస్టు 9న విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ప్రధానంగా రన్నింగ్, షాట్పుట్, లాంగ్ జంప్, హై జంప్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో పోటీలు నిర్వహించనున్నారని, ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న దివ్యాంగ (పారా) క్రీడాకారులంతా ఈ పోటిల్లో పాల్గొని ప్రతిభ చాటాలని కోరారు. క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకునేందుకు ఫోన్ 9849377577 నంబర్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సారథి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు ప్రదీప్, పారా క్రీడాకారులు పాల్గొన్నారు. -
గృహిణి ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: విజయనగరం టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ గృహిణి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలంలోని టొంపలపేటకు చెందిన బుసకల మణి(24) కి పూససాటిరేగ మండలం ఎరుకొండకు చెందిన సురేష్తో పైళ్లెంది. వారికి ఒక బిడ్డ ఉన్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో భర్త సురేష్కు చెప్పాపెట్టకుండా విజయనగరంలోని రాజీవ్ నగర్ కాలనీలో ఉంటున్న తన పెద్దమ్మ దగ్గరకు మూడురోజుల క్రితం మణి వచ్చేసింది. ఆ సమయంలోనే విజయనగరం టూటౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సీఐ శ్రీనివాస్ ఇరువర్గాల వారిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పుడే మణి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని రెండురోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా విజయవాడకు వెళ్లిపోయింది. దీనిపై ఆమె పెద్దమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెల్ ఫోన్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేసి విజయవాడలో ఆమెను పట్టుకుని శుక్రవారం విజయనగరం తీసుకువచ్చారు. అయితే అంతలోనే ఏం జరిగిందో ఏమో గానీ పెద్దమ్మ ఇంట్లో ఉంటున్న మణి బాత్రూమ్కు అని చెప్పి వెళ్లి ఇంట్లోనే ఉరేసుకుంది. ఇంట్లో ఉంటున్న పెద్దమ్మకు అనుమానం రావడంతో చూసి మణి కొనఊపిరితో ఉండడంతో చుట్టుపక్కల వారి సాయంతో హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మణి ఆత్మహత్య చేసుకుందన్న విషయం ఆమె కన్నవారికి ఎస్సై కృష్ణమూర్తి తెలియజేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గుంటూరు, రాయగడ ఎక్స్ప్రెస్లో తనిఖీలు
పార్వతీపురం రూరల్: గుంటూరు, రాయగడ ఎక్స్ప్రెస్ ట్రైన్లో గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా నిర్మూలన కోసం ఈగల్ టీమ్ ఐజీ ఆకె రవికృష్ణ, ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం పేరిట శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈగల్ టీం, జిల్లా పోలీస్శాఖ, డాగ్స్క్వాడ్, ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించాయి. ఒడిశా నుంచి ఆంధ్రాకు గంజాయి అక్రమ రవాణాను అరికట్టే ఉద్దేశంతో ఒడిశా ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లలో జనరల్ బోగీల నుంచి ఏసీ బోగీల వరకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా నిర్మూలన కోసం టోల్ఫ్రీ నంబర్ 1972 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నంబర్కు సమాచారం ఇస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. -
టోల్గేట్ వేయింగ్ మిషన్ వద్ద అక్రమ వసూళ్లు
● నిర్వాహకులను నిలదీసిన లారీ యజమానులు, సిబ్బందిడెంకాడ: మండలంలోని నాతవలస టోల్గేట్ వద్ద ఉన్న వేయింగ్ మిషన్ పని చేయకపోయినా ఇష్టం వచ్చినట్లు వాహనాల వద్ద అధిక బరువు పేరుతో డబ్బులు అక్రమంగా వసూలు చేస్తున్నారని లారీ యజమానులు, సిబ్బంది వేయింగ్ మిషన్ నిర్వాహకులను నిలదీశారు. అధిక బరువుతో వెళ్తున్న వాహనాలు ఎంత మేరకు అధిక బరువుతో ఉన్నది వేయింగ్ మిషన్ ద్వారా వాహన యజమానులకు తెలుస్తుంది. అయితే వేయింగ్ మిషన్ పని చేయకపోయినా వారికి నచ్చినంత అధిక బరువు పేరుతో నిర్వాహకులు డబ్బులు తీసుకుంటున్నారని లారీ యజమానులు, సిబ్బంది చెప్పారు. వేయింగ్ మిషన్ పని చేయకపోయినా ఎలా అధిక బరువు ఎలా వసూలు చేస్తారని నిలదీశారు. కొంతకాలంగా ఇది జరుగుతోందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. నిర్వాహకులు, లారీ యజమానుల మధ్య వివాదం చివరకు పోలీసుల వద్దకు చేరింది. ఈ మేరకు భోగాపురం సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో వివాదంపై చర్చలు జరిగాయి. లారీ యజమానుల తరఫున లారీ ఓనర్ల అసోషియేషన్ రాష్ట అధ్యక్షుడు మహారథి,సెక్రటరీ శేషగిరి, ట్రెజరర్ వీవీ రాజు తదితరులు హాజరవగా, నిర్వాహకులు తరఫున కొందరు హాజరయ్యారు. వేయింగ్ మిషన్ బాగు చేసే వరకూ అధిక లోడ్ చార్జీలు వసూలు చేయరాదని నిర్వాహకులను అధికారులు ఆదేశించారు. తూనికలు, కొలతల శాఖ నుంచి అధికారులు పనిచేయని వేయింగ్ మిషన్ను పరిశీలించారు. -
నగర శివార్లలో డ్రోన్లతో నిఘా
విజయనగరం క్రైమ్: నేరాల నియంత్రణలో భాగంగా నగర శివారుల్లో డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. ఇటీవల జరిగిన నేర సమీక్షలో ఎస్పీ ఆదేశాల మేరకు విజయనగరం రూరల్ పోలీసులు ఈ చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ మేరకు సున్నితమైన, మారుమూల ప్రదేశాలైన జమ్ము, నారాయణపురం, పడాలపేట, వైఎస్సార్ నగర్, ఫోర్ట్ సిటీ స్కూల్ వెనక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘాకు చర్యలు తీసుకున్నామని రూరల్ సీఐ లక్ష్మణరావు తెలిపారు. ప్రతిరోజూ ఈ డ్రోన్ల ద్వారా నిఘా ఉంటుందని, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని, తద్వారా నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. -
సాలూరులో అగ్నిప్రమాదం
సాలూరు: పట్టణంలోని పెదహరిజనపేటలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. దీనిపై ఫైర్ అధికారి రాజారావు తెలిపిన వివరాల ప్రకారం, పెదహరిజనపేటలో నివాసముంటున్న బి.సురేష్ ఇంట్లోని మూడవ అంతస్తులో గురువారం సాయంత్రం గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ ఉన్న సామగ్రి, విలువైన సర్టిఫికెట్లు తదితర వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపుచేశారు. సుమారు రూ.2లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా. యువకుడి దుర్మరణం●● గిరిప్రదక్షిణ నుంచి వస్తుండగా ప్రమాదం భోగాపురం: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరగ్గా ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. సింహాచలంలో గిరిప్రదక్షిణకు హాజరూ ద్విచక్రవాహనంపై మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన యువకుడు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న విద్యుత్ పోల్ను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని మారికవలస గ్రామానికి చెందిన రావాడ ఉదయ్(28) అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్పై వెనుక కూర్చున్న స్నేహితుడు చిన్నారావు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం తగరపువలస ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సుందరపేట సీహెచ్సీకి తరలించారు. వసతిగృహం ఆకస్మిక తనిఖీగంట్యాడ: మండల కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహాన్ని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ అన్నపూర్ణ గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మమేకమై పలువిషయాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని మంచి భవిష్యత్తు సాధించాలని సూచించారు. అ తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో వసతిగృహ సంక్షేమ అధికారి గొర్లె గోవింద సన్యాసిరావు పాల్గొన్నారు. ఎస్సైకు ఎస్పీ అభినందనలు డెంకాడ: ఎస్సై ఎ.సన్యాసినాయుడును ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు. ఇటీవల నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో అధిక కేసుల పరిష్కారానికి కృషి చేసినందుకు గాను, అలాగే నేరాల నియంత్రణకు దోహదపడే సీసీ కెమెరాలను డెంకాడ మండలంలో ఎక్కువగా ఏర్పాటు చేయడంలో చేసిన కృషికి గాను ఆయనను ఎస్పీ కార్యాలయానికి పిలిపించుకుని మరీ ఆయనకు ప్రశంసాపత్రం, అవార్డు అందజేసి, సత్కరించారు. ఇదే స్ఫూర్తితో మరింత బాగా పనిచేస్తానని ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. -
కలెక్టర్ను కలిసిన ఎస్ఈ
పార్వతీపురంటౌన్: ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన కె.మల్లిఖార్జున రెడ్డి గురువారం కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేయాలని ఈ సందర్భంగా ఎస్ఈకి కలెక్టర్ సూచించారు. 12న రాష్ట్ర స్థాయి సమావేశం పాలకొండ రూరల్: ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఉపాధ్యాయుల వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో గుంటూరు తాడేపల్లి పరిధి సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఈ నెల 12 రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుందని, ఉద్యోగులందరూ హాజరుకావాలని అసోసియేషన్ పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు బోసు మన్మథరావు మాదిగ గురువారం ఒక ప్రకటనలో కోరారు. వర్గీకరణ అనంతరం తొలి సమావేశం కావడంతో జిల్లా నుంచి పెద్ద ఎత్తున తాడేపల్లికి ఉద్యోగులు తరలి రావాలన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ నేతృత్వంలో సమస్యలపై భవిష్యుత్తు కార్యాచరణపై చర్చ ఉంటుందన్నారు. కార్యక్రమం ద్వారా ఐక్యత చాటాలని మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర నాయకులు అలజంగి చిన్నారావు, యామల సతీష్కుమార్ పిలుపునిచ్చారు. ఎగువ సంకిలికి ఏనుగులు సీతంపేట: మండలంలోని ఎగువ సంకిలి పరిసర ప్రాంతాల్లో గురువారం ఏనుగులు సంచరిస్తున్నట్టు గిరిజనులు తెలిపారు. గత వారం రోజులుగా చిన్నబగ్గ–గోరపాడు జీడితోటల్లో ఉన్న నాలుగు ఏనుగులు ఇప్పుడు ఎగువ సంకిలి పరిసరాల్లోకి చేరడంతో గిరిజనులు భయాందోళనలు చెందుతున్నారు. పైనాపిల్, అరటి, కొండచీపుర్ల పంటలు నాశనం చేస్తున్నాయంటూ రైతులు లబోదిబోమంటున్నారు. ఏనుగుల గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టు ఎఫ్బీఓ కె.దాలినాయుడు తెలిపారు. ఏనుగులు సంచరించే వైపు ఎవ్వరూ వెళ్లవద్దని సూచనలిస్తున్నామన్నారు. మధ్యవర్తిత్వం ప్రజలకు చేరువకావాలి విజయనగరం లీగల్: మధ్యవర్తిత్వం ప్రజలకు మరింత చేరువకావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు ఎం.బబిత అన్నారు. మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందిన న్యాయవాదులకు గురువారం ఒక రోజు వర్క్షాప్, ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం చాలా సులువైనది, ఖర్చులేనిదన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం దేశవ్యాప్తంగా 90 రోజులు పాటు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. శిక్షణలో భాగంగా కేరళ రాష్ట్రం నుంచి ఇద్దరు మాస్టర్ ట్రైనీ మీడియేటర్స్ వచ్చి న్యాయవాదులందరికీ శిక్షణ అందిస్తున్నారన్నారు. ఈ స్టాల్ జిల్లా కోర్టు ఆవరణలో ఈ రోజు నుంచి పదిరోజుల పాటు ప్యానల్ లాయర్స్, పారాలీగల్ వలంటీర్స్ నిర్వహిస్తున్నారని, వారు ప్రజలకు మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిశెట్టి రవిబాబు, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంది ● పీటీఎంలో చైర్మన్ ఆవేదన చీపురుపల్లి: మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంది. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తరచూ విద్యార్థులు తల్లిదండ్రులే స్వయంగా వచ్చి చెబుతున్నారు. ఇదేదో తాను వ్యక్తిగతంగా చెబుతున్నది కాదు. తల్లిదండ్రులు అంతా చెబుతుండడంతోనే అందరి ఎదుట చెప్పాల్సి వస్తోంది. దయచేసి మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక శ్రద్ధతీసుకునేలా చర్యలు చేపట్టండి. అలాగే కొంతమంది విద్యార్థులకు బ్యాగులు కూడా ఇవ్వలేదు. పాఠశాలలో మరుగుదొడ్లు లేవు. ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎమ్మెల్యే శ్రద్ధ చూపాలి. విద్యార్థులకు కష్టాలు దూరంచేసేలా చర్యలు తీసుకోవాలంటూ స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్స్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ఎదుట సాక్షాత్తూ అదే పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ గవిడి సురేష్ ఏకరువు పెట్టారు. పాఠశాలలో సమస్యలు పరిష్కారమవుతాయనే ఎమ్మెల్యే ముందు చెప్పాల్సి వస్తోందని ఆయన చెబుతున్నప్పటికీ పాఠశాల హెచ్ఎంతో సహా కొంతమంది ఉపాధ్యాయులు ప్రసంగం ఆపేయమని పక్క నుంచి షర్టు లాగడం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. -
విద్యార్థుల నిరీక్షణ
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ95 శ్రీ160 శ్రీ170షెడ్యూల్ ప్రకటించాలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులు చేరేందుకు ప్రభుత్వం తక్షణమే షెడ్యూల్ విడుదల చేయాలి. ప్రభుత్వ కళాశాలల్లో షెడ్యూల్ విడుదల చేయకపోవడంవల్ల ప్రైవేట్ కళాశాలలు దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రభుత్వ కళాశాలలకు తీవ్రనష్టం జరుగుతుంది. ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. – సింహాద్రి కిరణ్కుమార్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పార్వతీపురం టౌన్: డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెలువడి రెండు నెలలు గుడుస్తున్నా డిగ్రీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక విద్యార్థులు తమ సమీపంలో గల కళాశాలల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరికకు కౌన్సెలింగ్ మొదలైతే ఆ ప్రభావం సాధారణ డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలపై పడుతుందని కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు ప్రభుత్వ, 8 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ప్రవేశానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యార్థుల భవితను ఆలోచించి 2020–21 విద్యాసంవత్సరం నుంచి ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఫలితంగా విద్యార్థుల ప్రవేశాలకు మార్గం సుగమం చేసింది. గతంలో ప్రభుత్వ కళాశాలల్లో సీట్ల కోసం విద్యార్థులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఆన్లైన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. డిగ్రీలో ఆన్లైన్ ప్రవేశాల కారణంగా విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రవేశాలు పొందేవారు. విద్యార్థికి దగ్గరలో, ఇష్టమైన కళాశాల ఎంపిక సులభతరంగా ఉండేది. సబ్జెక్టులపై తర్జన, భర్జన డిగ్రీలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ సబ్జెక్టు విధానాన్ని డబుల్ సబ్జెక్టుకు మార్చాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తర్జన, భబర్జనలు కొనసాగుతున్నాయి. డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో దేన్ని అనుసరించాలనే అంశంపై ఉన్నత విద్యాశాఖాధికారులు సరైన నిర్ణయానికి రాలేదు. జిల్లాలో 12680 మంది ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో కొంతమంది డిగ్రీ ప్రవేశాలపై మొగ్గు చూపుతున్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షల్లో ఆశించిన ర్యాంకులు రాని విద్యార్థులు సాధారణ డిగ్రీ కోర్సుల వైపు మొగ్గుచూపుతుంటారు. జూలై మొదటి, రెండవ వారంలో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల కాకపోతే విద్యార్థుల్లో పలువురు ఇంజినీరింగ్ లేదా ఫార్మా కోర్సుల్లో చేరే అవకాశాలున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తే కళాశాలల్లో ఎక్కువ భర్తీ అయ్యే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. డిగ్రీ ప్రవేశాలపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం రెండు నెలలుగా ఎదురుచూపులు నోటిఫికేషన్ జారీ చేయని ఉన్నత విద్యాశాఖ ఆన్లైన్, ఆఫ్లైన్పై లేని స్పష్టత -
గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
డెంకాడ: మండలంలోని విశాఖ–శ్రీకాకుళం జాతీయ రహదారిపై నాతవలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న మోటార్ సైకిల్ ముందుగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో మోటార్ సైకిల్పై వెళ్తున్న కుప్పిలి కృష్ణ, సవర ముఖలింగం తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలో ఉన్నారని ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపారు. విజయనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. గాయపడిన ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితిలో ఉండడం వల్ల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు. స్కూటీ ఢీకొట్టి విద్యార్థినికి.. వీరఘట్టం: స్థానిక బాలికోన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ డేకు వెళ్తున్న 8వ తరగతి విద్యార్థిని కరజాడ లక్ష్మికి రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి.హైస్కూల్ ఎదురుగా ఉన్న పాన్ షాపు వద్దకు చాకెట్లు కొనుగోలు చేసేందుకు రోడ్డు దాటి వెళ్తున్న విద్యార్థిని లక్ష్మిని ఎదురుగా స్కూటీతో వచ్చిన ఓ వ్యక్తి ఢీ కొట్టాడు. దీంతో జరిగిన ఈ ప్రమాదంలో లక్ష్మి కుడి కాలు విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. గాయపడిన లక్ష్మిని 108 వాహనంలో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే తహసీల్దార్ ఏఎస్ కామేశ్వరరావు బాలికోన్నత పాఠశాలకు వెళ్లి గాయపడిన బాలిక, తల్లిదండ్రుల వివరాలను హెచ్ఎం కేపీ నాగమణిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. -
చోరీకేసులో నిందితుల అరెస్ట్
గజపతినగరం రూరల్: ఈనెల1వ తేదీన రైల్వేకాలనీలోని పాండ్రంకి గణేష్ ఇంట్లో జరిగిన చోరీకేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు గజపతినగరం సీఐ రమణ తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం రైల్వేస్టేషన్ ఏరియాలో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు తిరుగుతున్నారని వచ్చిన సమాచారం మేరకు వారిని పట్టుకుని విచారణ చేయగా కాలనీలో జరిగిన దొంగతనం తామే చేశామని ఒప్పుకున్నారని తెలిపారు. అలాగే అదేరోజు సాలూరులో కూడా ఓ ఇంటిలో దొంగతనం చేశామని అంగీకరించినట్లు చెప్పారు. దీంతో వారి నుంచి 200 గ్రాముల వెండి, రూ.1150 నగదు రికవరీ చేశామన్నారు. చోరీకి పాల్పడిన వారిలో గుంటూరు జిల్లాకు చెందిన చిల్లా సురేష్పై ఇప్పటికే 50కేసులు నమోదయ్యాయన్నారు. అలాగే విజయవాడకు చెందిన నాగవీరభాస్కరరావు, జల్లేపల్లి వెంకటేశ్వరరావు, దాసరి సుభాష్లపై కూడా కేసులు ఉన్నాయని, వారు నలుగురు ఒక కారులో మక్కువలోని శంబర గ్రామం వెళ్లారన్నారు. ఆ తరువాత అదే రోజు ఈ రెండు దొంగతనాలు చేసి గుంటూరు వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ కేసును ఛేదించిన ఎస్సై కిరణ్కుమార్తో పాటు సిబ్బందికి ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేసినట్లు సీఐ తెలిపారు. -
పండగపూట పురుగుల బియ్యమేనా?
వీరఘట్టం: ప్రతీ పాఠశాలలో మెగా పేరెంట్–టీచర్స్డేను పండగలా నిర్వహించాలని సూచించిన ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కోసం ఇచ్చే బియ్యం నాసిరకంగా ఉండడంపై తల్లిదండ్రులు మండిపడ్డారు. పురుగుల బియ్యం ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వీరఘట్టం బాలుర, బాలికోన్నత పాఠశాలలో పురుగుల ఉన్న బియ్యంనే వంట ఏజెన్సీ మహిళలకు ఇవ్వడంతో ఆ బియ్యంను చేటతో చెరిగి, నీటిలో శుభ్రంచేసి వంటచేశారు. వారం రోజుల కిందట బియ్యంలో పురుగులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఇంత వరకు ఆ బియ్యంను మార్చకపోవడం దారుణమని తల్లిదండ్రులు పేర్కొన్నారు. మీ పిల్లలకై తే ఇటువంటి పురుగుల బియ్యమే వండుతారా అంటూ ప్రభుత్వ పెద్దలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ఇసుక అక్రమంగా తరలిస్తే ఊరుకోం
ఇసుక అక్రమ తరలింపును రేగిడి మండలంలోని కొమెర గ్రామస్తులు గురువారం అడ్డుకున్నారు. లారీలకు అడ్డంగా నిలబడి ఆందోళన చేశారు. గదబపేట వద్ద నాగావళి నదిలో ఇసుకను అక్రమంగా తవ్వేసి ఒక్కోలారీలో 50 టన్నులు తరలించడంతో బ్రిడ్జిలు కూలిపోతున్నాయని, రోడ్లు పాడవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల ఖండ్యా బ్రిడ్జి కూలిపోయిందని, కొమెర నుంచి లక్ష్మీపురం, అప్పాపురం, మజ్జిరాయుడుపేట వరకు ఉన్న మరో ఐదు బ్రిడ్జిలు కూడా కూలిపోయే దశలో ఉన్నాయన్నారు. ఇసుకను గ్రామాల మీదుగా తరలిస్తే ఊరుకునేది లేదన్నారు. సమస్యను కలెక్టర్ అంబేడ్కర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. – రేగిడి -
సీజీఆర్ఎఫ్కు 43 వినతులు
వీరఘట్టం: విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానం చైర్మన్ డాక్టర్ బి.సత్యనారాయణ సూచించారు. ఈ మేరకు గురువారం వీరఘట్టం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కారించాలంటూ వినియోగదారులు 43 వినతులు అందజేశారు. ● హుస్సేనుపురం, మొట్టవెంకటా పురం, కిమ్మి గ్రామాల్లో లోఓల్టేజీ సమస్య వేధిస్తోందని పలువురు ఫిర్యాదు చేశారు. ● చిదిమిలో పాత విద్యుత్ స్తంభాలను మార్చాలని, ఇదే ఫీడర్లో ఏబీ స్విచ్లు లేక విద్యుత్ అంతరాయం ఎక్కువ అవుతోందని, వైర్లు పాతబడిపోవడంతో తరుచూ తెగిపోతున్నాయని ఎంపీపీ దమలపాటి వెంకటరమణనాయుడు ఫిర్యాదు చేశారు. 60 రోజుల్లో పరిష్కారం.. విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులను 60 రోజుల్లో పరిష్కరిస్తామని చైర్మన్ బి.సత్యనారాయణ స్పష్టం చేశారు. కార్యక్రమంలో పరిష్కార వేదిక ఆర్థిక వ్యవహారాల సభ్యుడు ఎస్.సుబ్బారావు, సాంకేతిక నిపుణులు ఎస్.రాజబాబు, ఎన్.మురళీకృష్ణతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా ట్రాన్స్కో ఎస్ఈ కె.మల్లికార్జునరావు, ఈఈ టెక్నికల్ డి.పురుషోత్తం, పాలకొండ డీఈ కె.విష్ణుమూర్తి, ఎ.డి మోహనచక్రవర్తి, వీరఘట్టం ఏఈ కె.అనిల్కుమార్తో పాటు సర్కిల్ పరిధిలో ఉన్న ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వినతులకు 60 రోజుల్లో పరిష్కారం సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్ చైర్మన్ డాక్టర్ బి.సత్యనారాయణ -
285 బస్తాల నకిలీ ఎరువులు సీజ్
మక్కువ: ఎరువుల కొరతను సొమ్ముచేసుకునేందుకు కొంతమంది అక్రమార్కులు రంగంలోకి దిగారు. అదునుచూసి రైతులకు నకిలీ ఎరువులను అంటగట్టి నిలువునా ముంచేస్తున్నారు. వందల కొద్దీ నకిలీ ఎరువుల బస్తాలు తీసుకొచ్చి విక్రయిస్తున్న విషయం వ్యవసాయాధికారుల దాడితో వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మక్కువ మండలం సన్యాసిరాజపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న పంచాయతీ భవనంలో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ ఎరువులు నిల్వచేశారు. బుధవారం సాయంత్రం మార్క్ఫెడ్ డీఎం విమల సన్యాసిరాజపురం గ్రామం మీదుగా వెళ్తున్నారు. భవనం వద్ద ఆటోలో ఎరువులు ఎక్కిస్తున్న విషయాన్ని గుర్తించి వెంటనే మక్కువ మండలం పనసభద్ర పంచాయతీలో ఎరువుల దుకానాన్ని పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్కు ఆమె సమాచారం అందించారు. వెంటనే ఆయన భవనందగ్గరకు చేరుకున్నారు. విషయాన్ని గుర్తించిన అక్రమార్కులు భవనానికి తాళంవేసి పరారయ్యారు. మండల రెవెన్యూ, పంచాయతీ, పోలీస్ సిబ్బంది సమక్షంలో తాళం పగలగొట్టి చూడగా, ఎటువంటి స్టిక్కర్లులేని 285 తెల్లని బస్తాలలో ఎరువులు ఉన్నట్లు గుర్తించారు. భవనాన్ని, ఎరువులను సీజ్చేశారు. ఎరువులను శాంపిల్స్కు పంపించారు. -
లెక్కల్లోనే పింఛన్..!
మంజూరైన స్పౌజ్ పింఛన్లు 1,634 అందజేసిన నగదు 0● చేతికి అందని పింఛన్ డబ్బులు ● ప్రతినెలా ‘స్పౌజ్’ లబ్ధిదారులకు నిరాశే.. ● నెలలు గడుస్తున్నా అందని నగదు పార్వతీపురం మండలం బుచ్చింపేటకు చెందిన ఈ మహిళ పేరు దొడ్డి నారాయణమ్మ. స్పౌజ్ కింద రెండు నెలలుగా పింఛన్ మంజూరైందని అధికారులు చెబుతున్నారు. ఒకటో తేదీకి ఇస్తామని చెబుతున్నారు గానీ.. తీరా, తేదీ వచ్చేసరికి డబ్బులు మాత్రం రాలేదని అంటున్నారు. ఇంకే ఆధారమూ లేక, ప్రతి నెలా పింఛన్ మొత్తం కోసం ఆమె ఆశగా ఎదురు చూస్తోంది. ––––––––––––––––––––––––––– పార్వతీపురం మండలం డోకిశీల సచివాలయం పరిధిలోని ఈ వృద్ధురాలి పేరు పెద్దపల్లి గౌరమ్మ. ఈవిడ భర్త పెద్దపల్లి వెంకటి సుమారు 13 నెలల కిందట మృతి చెందారు. ఏ ఆధారమూ లేని ఆమె పింఛన్ మంజూరు చేయాలని సంబంధిత అధికారుల వద్ద పలుమార్లు మొర పెట్టుకుంది. ప్రతినెలా పింఛన్ ఇచ్చేందుకు వచ్చిన అధికారులు.. ఆమె పేరు లబ్ధిదారు జాబితాలో ఉందనీ చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని, అందుకే ఇవ్వలేకపోతున్నామని చెప్పడంతో ఆమె నిరాశకు గురవుతోంది. కూటమి నేతల ప్రకటనలకు... ఆచరణకు పొంతనలేకపోతోంది. కేబినెట్ సమావేశాల్లో ఆమోదించిన పనులు, పథకాలు కూడా అమలుకాని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసినట్టు ప్రకటించారు. పింఛన్ జాబితాల్లో వారి పేర్లు కూడా చేరాయి. కానీ పింఛన్ డబ్బులు మాత్రం చేతికి అందడం లేదు. ఎప్పుడిస్తారన్న లబ్ధిదారుల ప్రశ్నకు సమాధానం కరువవుతోంది. భర్తను కోల్పోయిన వితంతువులు ప్రతినెలా పింఛన్ ఇస్తారని ఆశగా చూడడం, ఉసూరుమనడం వారి వంతువుతోంది. -
అక్కరకు రాని జీసీపీఎస్..!
● బాలికలకు 20 ఏళ్లు నిండినా అందని డబ్బులు ● వేలాది మంది ఎదురుచూపులు ● ఇద్దరు ఆడపిల్లలు అయితే రూ.60వేలు ఇవ్వాలి ● ఒక ఆడపిల్ల అయితే రూ.లక్ష అందాలి ● గడువు దాటినా డబ్బులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్న లబ్ధిదారులువిజయనగరం ఫోర్ట్: ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలిక పేరు జాగరపు వైదేహి. 2002లో జన్మించింది. ఈమెది విజయనగరంలోని బొబ్బాది పేట ప్రాంతం. ఆదిలక్ష్మి, స్వామినాయుడుల ఏకై క సంతానం. ఒక ఆడపిల్లతో వీరు కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స చేసుకున్నారు. బాలికా సంరక్షణ పథకం (జీసీపీఎస్) పథకం కోసం దరఖాస్తు చేయగా వారికి పథకానికి సంబంఽధించిన బాండు కూడా ఇచ్చారు. 20 ఏళ్లు నిండిన తర్వాత ఈమెకు రూ.లక్ష అందాలి. ప్రస్తుతం ఈమెకు 23 ఏళ్లు వచ్చాయి. అయినా డబ్బులు అందలేదు. ఐసీడీఎస్ అధికారులను అడిగినా స్పష్టమైన సమాధానం చెప్పడం లేదని వైదేహి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈమె ఒక్కరే కాదు. అనేక మంది జీసీపీఎస్ ద్వారా ఇచ్చే ప్రోత్సాహకం కోసం జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఎదురుచూస్తున్నారు. కొంతమందికి వివాహాలు కూడా జరిగిపోయాయి. ఇంకొంతమంది ఆ డబ్బులు వస్తే వివాహం చేయాలని చూస్తున్నారు. ఈ పథకం కోసం పేదవర్గాలకు చెందిన వారే అధికశాతం మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పడు వారంతా పథకం లబ్ధికోసం నిరీక్షిస్తున్నారు. ఆడపిల్లలను కన్నవారిని ప్రోత్సహించడం కోసం బాలికా సంరక్షణ పథకాన్ని అప్పట్లో ప్రవేశ పెట్టారు. ఒక ఆడపిల్ల అయితే రూ.లక్ష, ఇద్దరు ఆడపిల్లలైతే రూ.60 వేలు (ఒక్కో ఆడపిల్లకు రూ.30 వేలు చొప్పన) బాలికకు 20 ఏళ్లు నిండిన తర్వాత అందివ్వాలన్నది పథకం ఉద్దేశ్యం. వేలాది మంది ఎదురుచూపులు: బాలికా సంరక్షణ పథకం నిబంధనల ప్రకారం జిల్లాలో చాలా మంది బాలికలకు 20 ఏళ్లు నిండాయి. వారందరికీ ప్రభుత్వం డబ్బులు అందజేయాలి. 20 ఏళ్లు నిండిన అమ్మాయిల తల్లిదండ్రులు సీడీపీఓ, పీడీ కార్యాలయాల్లో డబ్బుల గురించి అడిగినా అక్కడి అధికారులు స్పష్టత ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 42,980 మంది జీసీపీఎస్ పథకానికి అర్హులున్నారు. వారిలో చాలా మందికి 20 ఏళ్లు నిండాయి. ఒక ఆడపిల్లకు రూ.లక్ష వస్తుందని తల్లిదండ్రులు గంపెడాశలు పెట్టుకున్నారు. పేదవారైతే వివాహ ఖర్చులకు సరిపోతాయిని అశించారు. ప్రభుత్వం నోటీసులో ఉంది బాలికా సంరక్షణ పథకానికి సంబంధించి 20 ఏళ్లు దాటిన వారికి డబ్బుల చెల్లింపు విషయం ప్రభుత్వం నోటీసులో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఈ పథకం అమలైంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై చర్చిస్తున్నాయి. డబ్బుల చెల్లింపునకు సంబంధించి కొంత సమయం లబ్ధిదారులు వేచి ఉండాలి. తవిటినాయుడు, ఇన్చార్జి, పీడీ, ఐసీడీఎస్ పథకానికి అర్హతలు: జీసీపీఎస్ (బాలికా సంరక్షణ పథకం) ఒకరు, లేదా ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వారు అర్హులు. కుటుంబం మొత్తం వార్షిక ఆదాయం రూ.90 వేల లోపు ఉన్నవారు ఒక ఆడపిల్ల అయితే రూ.లక్ష అందజేస్తారు. ఇద్దరు ఆడపిల్లలైతే రూ. 60 వేలు ఇస్తారు. -
రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్ జూనియర్స్ బాల బాలికల బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపిక పూర్తయింది. ఈ నెల 12, 13వ తేదీల్లో విశాఖపట్నంలోని రైల్వే స్టేడియంలో జరిగే 6వ రాష్ట్ర సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల వివరాలు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం వెల్లడించారు. బాలుర విభాగంలో ఎ.మనీష్, ఎస్.విశాల్, పి. దుర్గాప్రసాద్, కె.హేమేష్ వర్ధన్, కె.కత్యేష్ వర్ధన్, ఎ.యశ్వంత్, వై.రేవంత్, కె.గౌతమ్ గణేష్, బి.సచిన్లు ఉన్నారు. అదేవిధంగా బాలికల విభాగంలో బి.మైథిలి, ఎం.ఝాన్సీ, ఎన్.దేవిక, కె.వేణుమాధవి, వి.జాహ్నవి లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా జట్లకు అర్హత సాధించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవడంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డోల మన్మథ కుమార్ ప్రోత్సహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి ఇందుకూరి అశోక్రాజు, శాప్ బాక్సింగ్ కోచ్ బి.ఈశ్వరరావులు క్రీడాకారులను అభినందించారు. ఈనెల 12 నుంచి విశాఖలో పోటీలు -
అర్ధరాత్రి ఒడ్డుకు చేరిన మత్స్యకారులు
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో చేపలవేటకు వెళ్లి గుర్రపుడెక్కలో చిక్కుకున్న తండ్రీ కొడుకులు దాసరి రాములు, ఆదినారాయణ బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత సురక్షితంగా ఒడ్డుకు చేరారు. గుర్రపుడెక్క తిప్పు కోవడంతో సుమారు 10 గంటల పాటు ప్రాజెక్టులోనే రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. వంగర పోలీసులు రంగప్రవేశం చేయడంతో సహచర మత్స్యకారులు పడవల్లో ప్రాజెక్టు లోపలికి వెళ్లి గాలింపు చేపట్టారు. చివరకు బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అతికష్టంమీద తండ్రీకొడుకులను ఒడ్డుకు చేర్చారు. దీంతో వారి కుటుంబ సభ్యులు, మత్య్సకారులు, అధికార యంత్రాంగం అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
వైఎస్సార్సీపీ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం
సాలూరు రూరల్: వైఎస్సార్సీపీ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమ పాలన ప్రజలకు అందిందని, కూటమి ప్రభుత్వం అబద్ధాలతో కాలం గడుపుతోందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరు మండలం మావుడి గ్రామంలో గురువారం నిర్వహించిన బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ మోసపూరిత పాలనను వివరించారు. టీడీపీ ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడం వల్ల ఎంత నష్టపోయారన్నది తెలియజేశారు. ఉచిత బస్సు సదుపాయాన్ని ఎప్పుడు కల్పిస్తారో స్పష్టతలేదన్నారు. తొలుత రాష్ట్రం అంతటా అనిచెప్పి ఇప్పుడు జిల్లాకే పరిమితం అంటున్నారంటూ విమర్శించారు. సాలూరు నియోజకవర్గ ప్రజలు కనీసం 10 కిలోమీటర్లు కూడా ఉచిత ప్రయాణం సాగించలేరని, ఎందుకంటే సాలూరు పట్టణం దాటిన వెంటనే విజయనగరం జిల్లా ఉంటుందని, అక్కడ టిక్కెట్ తీయాల్సి వస్తుందన్నారు. సాలూరు నియోజకవర్గంలో టీడీపీ హయాంలో వేసిన ఒక రోడ్డు, నిర్మించిన ఒక బ్రిడ్జిపేరును మంత్రి సంధ్యారాణి చెప్పాలన్నారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబునాయుడు బాటలోనే మంత్రి నడుస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో గిరిజనులకు పూర్తిగా ఉచిత విద్యుత్ అందిస్తే కూటమి ప్రభు త్వంలో విద్యుత్ చార్జీలు పెంచి పేదల డబ్బుతో సంపద సృష్టిస్తున్న ఘనత చంద్రబాబునాయుడికే దక్కుతుందన్నారు. మహిళలకు గ్యాస్ ఉచితంగా ఇస్తామని చెప్పిన చంద్రబాబు మాటలు అంతా గ్యాస్ అని తేలిపోయిందన్న విషయం ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయిందన్నారు. పొదుపు సంఘాల మహిళల రుణాలను మాఫీ చేసిన ఘనత జగన్మోహన్రెడ్డిదేనన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు భరత్శ్రీనివాస్, జిల్లా నాయకులు దండి శ్రీనివాసరావు, మావుడి సర్పంచ్ సుధ, తోణాం సర్పంచ్ మువ్వల ఆదియ్య, శివరాంపురం ఎంపీటీసీ సభ్యుడు కళ్లేపల్లి త్రినాథ, వైఎస్సార్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలే.. బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం విచారకరం
విజయనగరం టౌన్: కేంద్ర కేబినెట్, రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపి ఆరేళ్లు అయినా ఇంతవరకు విశాఖ కేంద్రంగా సౌత్కోస్ట్ రైల్వే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం విచారకరమని సౌత్కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ చోడవరపు శంకరరావు ఓ ప్రకటనలో అన్నారు. నోటిఫికేషన్ విడుదలైతే రైల్వేజోన్ తన కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉంటుందని, ఇప్పటికీ రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదన్నారు. దీంతో విజయవాడ, గుంతకల్, గుంటూరు డివిజన్లపై పర్యవేక్షించే అధికారం లేకపోయిందన్నారు. ప్రధాని మోదీ చొరవ తీసుకుని, రైల్వేజోన్కు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఉత్తర్వులు వెలువడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కనీసం ఆగస్టు 15 నాటికి అయినా కొత్త సౌత్కోస్ట్ రైల్వే జోన్ తన పరిపాలన ప్రారంభించేలా స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రాణం తీసిన స్నేహితుడి మోసం
సాలూరు: స్నేహం ముసుగులో మోసానికి సాలూరు పట్టణానికి చెందిన ఓ చిరువ్యాపారి బలయ్యా డు. ఆర్థిక వేధింపులకు తట్టుకోలేక బుధవారం ఉదయం 4.30 సమయంలో తన ఎలక్ట్రిక్ షాపులోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్నేహితుడే తనను నట్టేట ముంచేశా డంటూ ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన ఆడియోను మిత్రులకు పంపించాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు, మృతిడి ఆడియో రికార్డులో తెలిపిన వివరాల ప్రకారం.. పాచిపెంట మండలం గురివినాయుడుపేట గ్రామానికి చెందిన నాగభూషణరావు(63) సుమారు 32 సంవత్సరాల కిందట సాలూరు పట్టణానికి వలస వచ్చాడు. ఇక్కడి తెలగావీధిలో కుటుంబంతో నివసిస్తూ మామిడిపల్లి కూడలిలో ఎక్ట్రిక్ షాపు నిర్వహిస్తున్నాడు. వ్యాపార అవసరాల్లో భాగంగా పట్టణంలోని డబ్బివీధికి చెందిన వడ్డీ వ్యాపారి డబ్బి కృష్ణారావు వద్ద రూ.40 లక్షలు అప్పుచేశాడు. ఆ డబ్బు ఎప్పటికీ తిరిగి ఇవ్వడం లేదని రూ.కోటి విలువైన షాపును రూ.75 లక్షలకే కృష్ణారావు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. నాగభూషణరావు తీసుకున్న రూ.40 లక్షలు అప్పు మినహాయిస్తే మిగిలిన రూ.35 లక్షలు ఇవ్వలేదు. రూ.10 లక్షలు అప్పుగా తిరిగిచ్చాడు. నాగభూషణరావు నుంచి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న షాపును తిరిగి ఆయనకే నెలకు రూ. 20వేలు అద్దె ప్రాతిపదికన తనఖా ఇచ్చాడు. పది లక్షలకు వడ్డీ రూ.పదివేలు చొప్పున నెలకు ప్రతినెలా రూ.30 వేలు వడ్డీ వ్యాపారి వసూలు చేస్తున్నాడు. తన డబ్బునే ఉంచుకుని, తనకు అప్పుకింద ఇచ్చి వడ్డీ వసూలు చేస్తూ కృష్ణారావు తనను ఆర్థిక కష్టాల్లోకి నెట్టేశాడని, ఎదిరించే ధైర్యంలేక, మోసాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆడియోలో పేర్కొన్నారు. మృతునికి భార్య పద్మావతి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నా రు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాలూరు టౌన్ ఎస్ఐ అనిల్కుమార్ కేసు నమోదు చేశా రు. ఆత్మహత్యకు పాల్పడిన నాగభూషణరావు జేబులో రాతపూర్వక లేఖ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఆలేఖను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబాన్ని ఆదుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చనిపోయేముందుకు తన బాధను మంత్రి సంధ్యారాణికి తెలిసేలా అడియోరూపంలో రికార్డు చేసి మిత్రలకు పంపించాడు. తనకు జరిగిన మోసం, అన్యాయాలను మంత్రికి తెలపాలనుకున్నా బిజీగా ఉంటారని, స్నేహితుడిపై ఏం చెప్తానని వెనుకకు తగ్గాను. నా కష్టాలు చూసి వాడి మనసు మారుతుందని ఆశించాను. స్నేహితుడైన కృష్ణారావు చేసిన అన్యాయాన్ని, మోసాన్ని భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ నాగభూషణరావు ఆడియోలో పేర్కొన్నారు. తనకు కృష్ణారావు ఇవ్వాల్సిన రూ.15 లక్షలు, తను నెలానెలా చెల్లించిన రూ.12 లక్షలు మొత్తం రూ.27 లక్షలు తన కుటుంబానికి ఇప్పించాలని మంత్రికి విజ్ఞప్తిచేశాడు. టీడీపీ మాజీ కౌన్సిలర్ కృష్ణారావు కొంతకాలంలో వడ్డీవ్యాపారం చేస్తున్నాడు. మంత్రి సంధ్యారాణికి సన్నిహితుడు. వ్యాపారి మృతితో వడ్డీవ్యాపారుల ఆరాచకాలపై పట్టణంలో చర్చజోరందుకుంది. రాజీయత్నాలు చిరువ్యాపారి మృతిచెందుతూ ఆడియో రూపంలో తెలిపిన ఆవేదన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మాజీ కౌన్సిలర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టీడీపీ నాయకులు నిందితుడిని కాపాడేందుకు రంగంలో దిగారు. మృతుడు నాగభూషణరావు కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపారు. కొంత మొత్తానికి రాజీ కుదిర్చినట్టు సమాచారం. ఈ సంఘటనపై మృతుడు భార్య పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ అనిల్కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి అనుచరుడైన వడ్డీవ్యాపారి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన చిరువ్యాపారి తన ఆవేదనను ముందుగా రికార్డుచేసి మిత్రులకు పంపించిన మృతుడు కుటుంబాన్ని మంత్రి సంధ్యారాణి ఆదుకోవాలంటూ వేడుకోలు కన్నీటిపర్యంతమైన కుటుంబ సభ్యులు -
చదువు కోసం కొండెక్కాల్సిందే..
సాలూరు మండలంలో చాలా గ్రామాల గిరిజన విద్యార్థులు చదువుకోసం కొండలు ఎక్కుతున్నారు. ఒకరికిఒకరు తోడుగా చదువుకోసం ముందుకు సాగుతున్నారు. క్రమశిక్షణతో చదువులు సాగిస్తున్నారు. ఉపాధ్యాయులు సమయానికి రాకున్నా ప్రార్థన చేస్తూ బుద్ధిగా కూర్చుంటున్నారు. దీనికి కురుకూటి పంచాయతీ ఎగువ కాషాయివలస, కరడవలస గ్రామాల చిన్నారులే నిలువెత్తు సాక్ష్యం. ఎగువకాషాయివలస గ్రామానికి చెందిన 9 మంది చిన్నారులు ప్రతిరోజూ రాళ్లదారిలో కిలోమీటరు దూరంలో ఉన్న కరడవలస ప్రాథమిక పాఠశాలకు చదువుకోసం రాకపోకలు సాగిస్తున్నారు. సరైన దారిలేకపోవడంతో నిత్యం కష్టాలు పడుతున్నారు. ఇటీవల ఇదే గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు డోలీలో ఆస్పత్రి తరలించిన విషయం తెలిసిందే. గిరిజన సంక్షేమ శాఖమంత్రి సంధ్యారాణి స్పందించి చిన్నారులు పాఠశాలకు చేరుకునేందుకు అనువుగా రోడ్డు సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. – సాలూరు రూరల్ -
3250 రేజీల రేషన్ బియ్యం పట్టివేత
సాలూరు: పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టణ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ మేరకు సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పెదబజార్లో గల బుద్దెపు సురేష్ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 75 బియ్యం బస్తాల్లో సుమారు 3,250 కేజీల రేషన్ బియ్యం పట్టుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి తక్కువ ధరకు ఈ బియ్యం కొని, బయట ఎక్కువ ధరకు అమ్ముతానని నిందితుడు తెలిపినట్లు సీఐ పేర్కొన్నారు. పట్టుకున్న బియ్యాన్ని పట్టణ సివిల్సప్లయిస్ అధికారులకు తదుపరిచర్యల నిమిత్తం అప్పగించామని తెలిపారు. -
ఈపీడీసీఎల్ ఎస్ఈ బాధ్యతల స్వీకరణ
సాక్షి, పార్వతీపురం మన్యం: ఏపీ ఈపీడీసీఎల్ పార్వతీపురం మన్యం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్గా కె.మల్లికార్జునరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 1993లో సంస్థలో విధుల్లో చేరిన ఆయన.. గతంలో పాడేరు ఆపరేషన్ ఈఈ గానూ, శ్రీకాకుళం జిల్లాలో ఈఈ/డీపీఈ గానూ పని చేశారు. ప్రస్తుతం ఉద్యోగోన్నతిపై సర్కిల్ రెండో ఎస్ఈగా ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. మన్యం సర్కిల్ తొలి ఎస్ఈగా వచ్చిన చలపతిరావు ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. సిబ్బంది సహకారంతో జిల్లాలో మెరుగైన విద్యుత్తు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటానని మల్లికార్జునరావు తెలిపారు. సురక్షిత ప్రసవమే లక్ష్యం ● జిల్లా ఎన్సీడీ ప్రొగ్రాం అధికారి జగన్మోహన్రావు కొమరాడ: సురక్షిత ప్రసవమే లక్ష్యంగా గర్భిణులకు వైద్యసేవలు అందించాలని జిల్లా ఎన్సిడీ ప్రొగాం అధికారి డాక్టర్ టి.జగన్మోహన్రావు వైద్యులకు సూచించారు. కె.ఆర్.బి.పురం, కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పీహెచ్సీల్లో అందుతున్న వైద్యసేవలను గర్భిణులను అడిగి తెలుసుకున్నారు. గిరిశిఖర గ్రామాలకు చెందిన గర్భిణులను ప్రసవ సమయానికి ముందుగానే వైటీసీలో చేర్చాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యులు అరుణ్కుమా ర్, గణేష్ పట్నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. 11న ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల రాక విజయనగరం అర్బన్: ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడిగా, జేఏసీ చైర్మన్గా ఎన్నికై న విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా ఎన్నికై న డీవీరమణ ఈ నెల 11న తొలిసారి జిల్లాకు రానున్నారని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.శ్రీధర్బాబు, సురేష్, సహ అధ్యక్షులు జీవీఆర్ఎస్ కిశోర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారికి వై జంక్షన్లో ఘన స్వాగతం పలుకుతామన్నారు. అక్కడి నుంచి జెడ్పీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీతో స్వాగతిస్తామని చెప్పారు. మధ్యాహ్నం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా, తాలూకా యూనిట్ కార్యవర్గం, జేఏసీ మిత్ర సంఘాల కార్యవర్గంతో సమావేశం నిర్వహించి అనంతరం ఘనంగా సత్కరిస్తామని తెలిపారు. కార్యక్రమానికి జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, యూనిట్ కార్యవర్గ సభ్యులు హాజరుకావాలని కోరారు. -
వ్యవసాయశాఖ మంత్రి ఉన్నా ప్రయోజనం శూన్యమే..
రాజాం: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు కొనసాగుతున్నా ఉత్తరాంధ్ర రైతులకు విత్తన, ఎరువు, సాగునీటి కష్టాలు తప్పడంలేదని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. రాజాంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయకుండా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తోందని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం రైతులు సుభిక్షంగా ఉన్నారని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గిట్టుబాటు ధర లేక మామిడిపండ్లను రైతులు రోడ్లమీద పడేస్తే ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, పక్కనే ఉన్న కర్ణాటక ప్రభుత్వం మాత్రం రాయితీ ఇచ్చి రైతులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. జిల్లాలో చెరకు ఫ్యాక్టరీ ఎత్తివేసే పరిస్థితి వస్తే డీఆర్సీ సమావేశంలో నిలదీయడంతో ఆ పరిస్థితి నుంచి తప్పుకుని పత్రికా ప్రకటన చేశారని, కనీసం రైతులును పట్టించుకోని మంత్రి వ్యవసాయశాఖ మంత్రిగా ఉండడం మన దురదృష్టకరమని విమర్శించారు. రెండేళ్లుగా రైతు భరోసా వేయలేని మంత్రి ఏమని ప్రెస్మీట్లు పెడుతున్నారో అర్థంకావడంలేదన్నారు. -
కేజీబీవీలో అగ్నిప్రమాదంపై ఫైర్ ఆడిట్
● విద్యార్థులు ఆందోళన చెందొద్దు ● సోమవారానికి పూర్తిస్థాయిలో తరగతుల ప్రారంభం ● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ● కేజీబీవీని సందర్శించి దుర్ఘటనపై ఆరాకొత్తవలస: మండలంలోని అడ్డూరువానిపాలెం గ్రామం సమీపంలో గల కస్తూర్బా గాంధీ పాఠశాలలో మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై వెంటనే ఫైర్ ఆడిట్ నిర్వహించి, సాయంత్రం లోగా నివేదికను అందజేయాలని కలెక్టర్ డాక్డర్ బీఆర్ అంబేడ్కర్ విద్యుత్, సమగ్రశిక్ష ఇంజినీర్ అదికారులు, జిల్లా ఫైర్ అధికారులను ఆదేశించారు. కేజీబీవీలోని తరగతి గదుల్లో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాఠశాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కాలిపోయిన తరగతి గదులను, సామగ్రి, చుట్టుపక్కల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో మాట్లాడి జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఉన్న విద్యార్థులకే వసతి సౌకర్యం లేక, తరగతి గదుల్లోనే భోజనం, పడుకోవడం వంటివి చేస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్ తరగతులకు అనుమతులు ఎలా ఇచ్చారని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడిని ప్రశ్నించారు. జిల్లాలోని అన్ని కేజీబీవీలకు ప్లస్ టూ అనుమతులు ఇచ్చామని ఆయన బదులిఇచ్చారు. దీంతో కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. యథావిధిగా మెగా పేరెంట్స్, టీచర్ సమావేశంఅనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలనుంచి వెళ్లిపోయిన విద్యార్థులను వెంటనే రప్పించి తరగతులను యథావిధిగా ప్రారంభించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పాఠశాలలో పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయని విద్యార్థులందరూ పాఠశాలకు తిరిగి రావాలని కోరారు. గురువారం జరిగే మెగా పేరెంట్, టీచర్స్ సమావేశాన్ని యథావిధిగా నిర్వహిస్తామని ప్రకటించారు.సోమవారం నాటికి పూర్తిస్థాయిలో విద్యార్థులను పాఠశాలకు రప్పించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలోని ప్రస్తుతం పనులను సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ రామారావు దగ్గరుండి నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ డి.కీర్తి, విద్యుత్శాఖ ఎస్ఈ లక్ష్మణరావు, డీఎంహెచ్ఓ జీవనరాణి, జిల్లా ఫైర్ అధికారి రామ్కుమార్, ఎస్ఎస్ఏ ఈఈ హరిప్రసాద్, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ స్వప్ప, తహసీల్దార్ అప్పలరాజు, ఎంపీడీఓ రమణయ్య, ఎంఈఓలు శ్రీదేవి, బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి, పోక్సో కేసులపై దృష్టి పెట్టండి
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ఆదేశాలువిజయనగరం క్రైమ్: పెరుగుతున్న గంజాయి కేసుల నివారణపై దృష్టి పెట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని అన్ని స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు, మూడు డివిజన్ల అధికారులతో ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్గ్రేవ్, ఎన్డీపీఎన్, పోక్సో, అట్రాసిటి, మిస్సింగ్, రోడ్డు ప్రమాదాల కేసులను, లాంగ్ పెండింగ్ కేసులను ఈ సందర్భంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ ప్రజలకు శక్తి యాప్ గురించి అవగాహన కల్పించాలని ఇందుకు శక్తి టీమ్స్ మరింత విస్తృతంగా పని చేయాలని ఆదేశించారు. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్సు టెక్నిక్స్ నేర్పించేందుకు శక్తి వారియర్స్ టీమ్స్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఫిర్యాదు దారులతో మర్యాదగా ప్రవర్తించాలి మహిళలపై జరిగే అఘాయిత్యాలపై పోలీస్స్టేషనుకు వచ్చే ఫిర్యాదులపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, స్టేషన్లో ఫిర్యాదుదారులు వేచి ఉండకుండా చూడాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణ నియంత్రణపై దృష్టి పెట్టాలని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నాలుగు చెక్ పోస్టుల వద్ద నిరంతరం వాహన తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. అనంతరం పలు కేసుల్లో శాఖాపరంగా ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, మహిళా పిఎస్ డీఎస్పీ ఆర్.గోవిందరావు, డీటీసీ డీఎస్పీ ఎం.వీరకుమార్ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.3 లక్షల విలువైన వెండి ఆభరణాలు స్వాధీనం
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ95 శ్రీ160 శ్రీ170విజయనగరం క్రైమ్: స్థానిక రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్ 3పై ఓ వ్యక్తి నుంచి వెండి ఆభరణాలను జీఆర్పీ సిబ్బంది బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా సోం పేటకు చెందిన ప్రవీణ్ సింగ్ ఒక బ్యాగ్లో సుమారు రూ.3 లక్షలు విలువ చేసే పది కేజీల వెండి ఆభరణాలను పట్టుకెళ్తున్నట్లు సమాచారం అందగా శ్రీకాకుళం నుంచి విజయనగరం వచ్చే రైలులో దిగిన ప్రవీణ్ను పట్టుకుని విచారణ చేయగా పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో తమదైన శైలిలో విచారణ చేసి రవాణా చేస్తున్న ఆభరణాలకు ఎలాంటి రుసుము, ఆధారాలు లేకపోవడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నామని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సోంపేటకు చెందిన వ్యక్తి అరెస్ట్ -
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
● మరొకరికి గాయాలు భామిని: మండలంలోని డోకుల గూడకు చెందిన గిరిజనుడు కొండగొర్రి నాగేష్(49)బుధవారం బైక్ అదుపుతప్పడంతో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. భామిని నుంచి డోకులగూడవైపు వెళ్తుండగా ఏబీ రోడ్డుపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోగా సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడని బత్తిలి పోలీసులు తెలిపారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని నేలమానుగూడలో అత్తవారింటికి వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇదే ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న మరో యువకుడు బిడ్డిక సంజీవ్ తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. భామిని పీహెచ్సీలో ప్రాథమిక వైద్య సేవలు అందించి 108 అంబులెన్స్పై పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు బత్తిలి ఏఎస్సై కొండగొర్రి కాంతారావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్యజియ్యమ్మవలస రూరల్: మండలంలోని కుందరతిరువాడ గ్రామానికి చెందిన గుగ్గిలాపు శంకరరావు(26) బుధవారం ఉదయం సుమారు 3 గంటల సమయంలో విశాఖపట్నంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలం క్రితం శంకరరావు తన భార్య హేమతో కలిసి విశాఖపట్నానికి బతుకు తెరువు కోసం వెళ్లి అక్కడే ఉంటున్నాడు. అయితే శంకరరావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. మృతుడికి ఇద్దరు పిల్లలు, తండ్రి రామిశెట్టి, తల్లి సావిత్రమ్మ, అక్క, అన్నయ్య ఉన్నారు. ఉరివేసుకుని మరో వ్యక్తి.. భోగాపురం: మండలంలోని దల్లిపేట గ్రామంలో మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దల్లి అప్పలరెడ్డి(38)కి వివాహమై సుమారు 15 ఏళ్లు అవుతోంది. భార్య ఎర్రమ్మ, ఒక పాప ఉన్నారు. మద్యానికి బానిసైన అప్పలరెడ్డి నిత్యం మద్యం తాగుతూ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో భార్య ఎర్రమ్మ మందలించడంతో మనస్తాపం చెంది సమీపంలోని ఓ లే అవుట్లో బుధవారం చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో భోగాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోరపాడు సమీపంలోనే ఏనుగులుసీతంపేట: గడిచిన వారం రోజులుగా నాలుగు ఏనుగుల గుంపు గోరపాడు సమీపంలో తిష్టవేసింది. దీంతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. కొండపోడు వ్యవసాయంలో పండిస్తున్న పైనాపిల్ పండ్లను ఏనుగులు తినేస్తున్నాయని వాపోతున్నారు. పోడు పనులకు సైతం అటువైపు వెళ్లడం లేదని గిరిజనులు తెలిపారు. అటవీశాఖ సిబ్బంది ఏనుగుల గమనాన్ని పరిశీలిస్తున్నారు. ఏనుగులు తిరిగే వైపు వెళ్లవద్దని గిరిజన రైతులకు సూచిస్తున్నారు. యువకుడిపై పోక్సో కేసు నమోదునెల్లిమర్ల రూరల్: మండలంలోని జరజాపుపేట గ్రామానికి చెందిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గణేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని మరో గ్రామానికి చెందిన బాలికను ఇంటర్ చదివే సమయంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించి మోసం చేశాడని బాధిత బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు. -
వరకట్న వేధింపుల కేసులో ముగ్గురికి జైలుశిక్ష
విజయనగరం క్రైమ్: నాలుగేళ్ల క్రితం విజయనగరంలోని దిశ పోలీస్ స్టేషన్లో నమోదైన వరకట్నవేధింపుల కేసులో ముగ్గురు ముద్దాయిలకు విజయనగరం స్పెషల్ మొబైల్ కోర్ట్ బుధవారం జైలు శిక్ష విధించినట్లు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ గోవిందరావు తెలిపారు. 2021లో విజయనగరం మహిళా పోలీస్స్టేషన్లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో ముద్దాయిలు ముగ్గురికి ఒక ఏడాది సాధారణ జైలు, రూ.51వేల జరిమానా విధిస్తూ విజయనగరం జేఎఫ్సీఎం (స్పెషల్ మొబైల్ కోర్టు) న్యాయమూర్తి కుమారి పి.బుజ్జి తీర్పు వెల్లడించినట్లు డీఎస్పీ ఆర్.గోవింద రావు చెప్పారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని నెల్లిమర్ల మండలం చినబూరాడపేటకు చెందిన యడ్ల మహాలక్ష్మికి గజపతినగరానికి చెందిన ఎన్ని రామకృష్ణతో 2019లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.8 లక్షల కట్నం, 4 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల సారె సామాన్లు కానుకగా కన్నవారు ఇచ్చారు. వివాహం అనంతరం భర్త ఎన్ని రామకృష్ణ, అతని తల్లిదండ్రులు చిన్నయ్య, సత్యవతిలు అదనంగా మరో రూ.2 లక్షలు కట్నంగా తీసుకురావాలని మహాలక్ష్మిని శారీరకంగా, మానసికంగా వేధించడంతో బాధితురాలు మహిళా పోలీస్స్టేషన్లో 2021లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు అప్పటి మహిళా పీఎస్ ఎస్సై బి.గణేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి, నిందితులను అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కోర్టు విచారణలో భర్త ఎన్ని రామకృష్ణ (ఎ1), అత్త ఎన్ని సత్యవతి (ఎ2), మామ ఎన్ని చిన్నయ్య (ఎ3) వరకట్న వేధింపులకు పాల్పడినట్లు రుజువు కావడంతో ముద్దాయిలకు పై విధంగా శిక్ష విధిస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి.బుజ్జి తీర్పు వెల్లడించారని డీఎస్పీ వివరించారు. -
చంద్రబాబు మోసాలపై రాజన్న చైతన్యం
సాలూరు రూరల్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర సాలూరు పట్టణం 23వ వార్డు రామాకాలనీ ప్రజలకు బుధవారం వివరించారు. కాలనీలో ఇంటింటికీ వెళ్లి సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడం వల్ల ఏడాదిలో ఒక్కో కుటుంబం ఎంత నష్టపోయారన్నది తెలియజేశారు. దీనిపై కూటమి నేతలను నిలదీయాలని సూచించారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ శతశాతం అమలుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అంటూ ప్రజలకు మోసం ఫిక్స్ చేసిన తీరును వివరించారు. గత ప్రభుత్వం కంటే రెట్టింపు పథకాలు ఇస్తామంటే నమ్మిఓట్లు వేసి మోసపోయామని, ఉచిత బస్సు, గ్యాస్సిలిండర్లు, నిరుద్యోగ భృతి, రైతుభరోసా ఇలా.. ఏ పథకమూ అందడంలేదంటూ పలువురు మహిళలు రాజన్నదొర వద్ద వాపోయారు. దీనిపై రాజన్నదొర స్పందిస్తూ అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని, ఆయన మాటల గారడీతో ఎవరినైనా మోసంచేస్తారంటూ విమర్శించారు. సంపద సృష్టిస్తానని చెప్పి విద్యుత్ చార్జీలు, ఇంటిపన్నుల భారం వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్లు గొర్లె జగన్మోహన్, గిరి రఘ, మాజీ కౌన్సిలర్ పిరిడి రామకృష్ణ, వైఎస్సార్ సీపీ నాయకులు తాడ్డి రమణ, కర్రి మహేష్, జాగారపు రమేష్, రామాకాలనీ నాయకులు పాల్గొన్నారు. -
మత్స్యకారుల హాహాకారాలు
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో చేపలవేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారులు గుర్రపుడెక్క మధ్యలో బుధవారం చిక్కుకున్నారు. వారిని బయటకు తెచ్చేందుకు పోలీసులు, మత్స్యకారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మెట్టమగ్గూరు గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు దాసరి రాములు, దాసరి ఆదినారాయణ బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చేపలు వేటకు వెళ్లారు. ప్రాజెక్టులో దట్టంగా ఉన్న గుర్రపుడెక్క వీరిని చుట్టుముట్టడంతో పడవ ముందుకు సాగని పరిస్థితి. తండ్రీ కొడుకులు అందులో చిక్కుకోవడంతో తమను రక్షించాలంటూ ప్రాజెక్టు లోపలి భాగం నుంచి కేకలు వేస్తూ ఆర్తనాదాలు చేశారు. విషయం తెలుసుకున్న వంగర పోలీసులు హుటాహుటిన ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఎగువ ప్రాంతాల్లో ఉన్న పట్టువర్థనం గ్రామం నుంచి కొంతమంది మత్స్యకారులు, మగ్గూరు గ్రామం నుంచి కొంతమంది మత్స్యకారులను ఆరు పడవలతో ప్రాజెక్టు లోపలకు పంపించారు. కటిక చీకటి కావడంతో గుర్రపుడెక్కను తొలగించుకుంటూ వారి వద్దకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నంలో అష్టకష్టాలు పడ్డారు. బాధితుల కేకలు వినిపిస్తున్నప్పటికీ దట్టంగా అల్లుకున్న గుర్రుపుడెక్క కారణంగా వారి వద్దకు చేరుకునే పరిస్థితి కానరావడం లేదు. రాత్రి వరకు శ్రమించినప్పటికీ కటిక చీకటి కావడంతో పాజెక్టులో చిక్కుకున్నవారిని చేరుకునేందుకు తోటి మత్స్యకారులకు వీలు పడలేదు. అర్ధరాత్రి అయ్యేసరికి వారిని బయటకు తీసుకువస్తామంటూ బాధిత కుటుంబీకులకు పోలీసులు భరోసా ఇస్తున్నారు. మత్స్యకారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించి క్షేమంగా ఒడ్డుకు చేరుకోవాలని రాములు కుటుంబ సభ్యులు గంగమ్మతల్లిని ప్రార్థిస్తున్నారు. మడ్డువలస ప్రాజెక్టులో చేపలవేటకు వెళ్లి గుర్రపుడెక్కలో చిక్కుకున్న మత్స్యకారులు కాపాడేందుకు రంగంలోకి దిగిన పోలీసులు, మత్స్యకారులు ప్రాజెక్టులో గాలింపు చర్యలు -
●రేగాలమ్మా.. కాపాడమ్మా..
గరుగుబిల్లి మండలం నాగూరు గ్రామంలో రేగాలమ్మ తల్లి వారాల పండగను బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఏటా వరి ఉభాలు ప్రారంభించే ముందు మంగళ, బుధవారాల్లో అమ్మవారికి మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సర్పంచ్ కేతిరెడ్డి శిరీష, గ్రామపెద్దలతో కలిసి గ్రామస్తులు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మొక్కుబడులు చెల్లించారు. – గరుగుబిల్లి పల్లపరిశి నాయుడు వేసిన రేగాలమ్మ వర్ణచిత్రం -
15 నుంచి పారిశుధ్య పక్షోత్సవాలు
పార్వతీపురంటౌన్: పారిశుధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతను ప్రోత్సహించడానికి ఈ నెల 15 నుంచి ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని పార్వతీపురం మన్యం జిల్లావ్యాప్తంగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జూలై 15 నుంచి 30వ తేదీ వరకు పారిశుధ్య పక్షోత్సవాలు జరుగుతాయని, ప్రజలను కూడా ఇందులో భాగస్వాములను చేయాలని కలెక్టర్ సూచించారు. వ్యర్థాలను పారవేయడం, నిర్వహణ, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, అవగాహన ప్రచారాలు, శుభ్రపరిచే డ్రైవ్లు, పారిశుధ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, వ్యక్తిగత మరుగుదొడ్లను వినియోగించుకునేలా చేయడం వంటి వివిధ అంశాలపై ప్రత్యేక దష్టి సారించాలని చెప్పారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పారిశుధ్య పక్షోత్సవాలు, స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 15 నుంచి 30వరకు పారిశుధ్య కార్యక్రమాలు జరుగుతాయని, ఇందుకు సంబంధించిన ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని పంచాయతీ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పెద్దఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు జరగనున్నందున అందుకు తగిన విధంగా పారిశుధ్య కార్మికులను, బ్లీచింగ్, చెత్తను తరలించేందుకు అవసరమైన వాహనాలు, ఇతర సామగ్రిని పంచాయతీ తీర్మానంతో ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ డ్రైవ్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, ఇందుకు ఉపాధిహామీ ద్వారా చదును చేసుకునే అవకాశం ఉందని సూచించారు. అవసరమైన ప్రదేశాల్లో జేసీబీలను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని కమిషనర్లను ఆదేశించారు. ఈ పక్షోత్సవాల్లో మురుగు కాలువలను శుభ్రం చేయడం, బ్లీచింగ్ చల్లడం, దోమలు వ్యాప్తి చెందకుండా స్ప్రేయింగ్ చేయించడం వంటివి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ పారిశుధ్య కమిటీ సమావేశాలను నిర్వహించి, గ్రామంలో చేపట్టవలసిన పనులపై తీర్మానం చేసుకోవాలని, అందుకు తగిన విధంగా పనులు నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. వినియోగంలోకి చెత్త సంపద కేంద్రాలు గ్రామాల్లో ఉండే రక్షిత మంచినీటి పథకాలను శుభ్రపరచడం, వాటికి మంచి రంగులు వేయించి, సాక్షి సంతకం తీసుకోవాలని తెలిపారు. నీటి పరీక్షలు నిర్వహించి, స్వచ్ఛమైన రక్షిత మంచినీటిని ప్రజలకు సరఫరా చేయాలన్నారు. గ్రామాల్లో ఉండే చెత్త నుంచి సంపద సేకరణ కేంద్రాలను పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేసేందుకు కృషిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, మున్సిపల్ కమిషనర్లు సీహెచ్. వెంకటేశ్వర్లు, ఎస్జేవీ రతన్ రాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్.భాస్కర రావు, ప్రోగ్రాం అధికారి డా. టి.జగన్మోహన్ రావు, డీఎల్డీఓ రమేష్ రామన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలంతా భాగస్వాములు కావాలిగ్రామాల్లో అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని, పారిశుధ్య లోపం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించి, కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా మంత్రితో పారిశుధ్య కార్యక్రమాల పోస్టర్లను విడుదల చేయించాలని, పారిశుధ్య కార్మికులందరూ యాప్రాన్, మాస్క్, చేతికి గ్లౌజులు విధిగా వేసుకోవాలని చెప్పారు. జిల్లాలో మిషన్ కల్పవృక్ష కార్యక్రమం జరుగుతుందని, ఈ డ్రైవ్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టవచ్చని కలెక్టర్ హితవు పలికారు. గ్రామాల్లో నిర్మాణం పూర్తిచేసుకున్న సామాజిక మరుగుదొడ్లను ప్రారంభించుకోవాలని, వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగాన్ని ప్రజలకు వివరిస్తూ బహిరంగ మలవిసర్జనను విడనాడేలా ప్రతిజ్ఞ చేయించాలని పేర్కొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
ఉత్తరాంధ్ర కీర్తిని నిలిపిన నేత
● జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన ‘బొత్స’ ● ఘనంగా బొత్స జన్మదిన వేడుకలుచీపురుపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర కీర్తిని ఇనుమడింపజేసిన ఘనత శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు దక్కిందని, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు ఉత్తరాంధ్ర పేరు చెబితే బొత్స గుర్తుకొచ్చే విధంగా పరిపాలన సాగించారని జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ, పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని బుధవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ కల్యాణ మంటపంలో వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్ను ప్రారంభించిన అనంతరం కేక్ కట్ చేశారు. అనంతరం హ్యాపీ బర్త్డే బొత్స అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాను ఎంతో అభివృద్ధి పథంలో నడిపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తిరుగులేని నాయకుడిగా ఎదిగిన బొత్స నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వపడాలన్నారు. మెడికల్ క్యాంప్లో 350 మందికి వైద్య పరీక్షలు ఇదిలా ఉండగా ‘బొత్స’ జన్మదినం సందర్భంగా నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్ విజయవంతమైంది. శ్రీకాకుళానికి చెందిన జెమ్స్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది హాజరై వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 350 మంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీతో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి వెళ్లి పూజలు నిర్వహించారు. బాపూజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు పెట్టించి, ప్రభుత్వ రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంటరీ పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్లు ఎస్వీ.రమణరాజు, కేవీ.సూర్యనారాయణరాజు, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల పార్టీ అధ్యక్షులు మీసాల వరహాలనాయుడు, మీసాల విశ్వేశ్వరరావు, కోట్ల వెంకటరావు, రాష్ట్ర రైతు విభాగం కాార్యదర్శి దన్నాన జనార్దనరావు, నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, వలంటీర్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లాన త్రినాథరావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. -
మీ
యూరియా.. దొరికితే అదృష్టం! ● పీఏసీఎస్ల్లో కానరాని ఎరువు నిల్వలు ● ప్రైవేట్ వర్తకుల వద్ద అధిక ధరలు ● అదనంగా ఇంకేదైనా తీసుకోవాలని మెలిక ● ఆవేదనలో రైతన్న ● కొమరాడ మండలంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. నిల్వలు వస్తున్నా.. కూటమి నాయకులే ‘సర్దుకుంటున్నారు’. మండలంలో కొమరాడ, శివిని పీఏసీఎస్లు ఉండగా.. ఇటీవల 180 చొప్పున బస్తాలు వచ్చాయి. అవి కూటమి నాయకులు, కార్యకర్తలకే సరిపోయాయి. రైతు సేవా కేంద్రాలకు ఇండెంట్ పెట్టామనే ఇంకా అధికారులు చెబుతున్నారు. రూ.267 ఉన్న యూరియా బస్తా పార్వతీపురంలోని ప్రైవేట్ వర్తకులు రూ.350 చొప్పున విక్రయిస్తున్నారు. మండలానికి తీసుకొచ్చి విక్రయించేసరికి ధర రూ.450 అవుతోంది. డీఏపీ కూడా నిల్వలు లేవు. వరికి డీఏపీ, యూరియా లేకపోతే దిగుబడి మీద ప్రభావం చూపే అవకాశం ఉందని ఇక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ● సాలూరు మండలంలోని మామిడిపల్లి, సాలూరు, శివరాంపురం తదితర పీఏసీఎస్ల్లో ఎక్కడా డీఏపీ, యూరియా నిల్వలు లభించడం లేదు. ఇటీవల శివరాంపురం పీఏసీఎస్లో 16 గ్రామాల రైతులు ఉదయం నుంచి ఎరువు కోసం బారులు తీరారు. అందులో 20 శాతం మందికి కూడా ఎరువు దొరకలేదు. బయట ఎక్కడైనా లభించినా.. రూ.50 అదనంగా తీసుకోవడమే కాక, దాంతోపాటు రూ.300కు తగ్గని పురుగు మందు ఏదైనా తీసుకోవాలని కొర్రీ పెడుతున్నారు. ● సీతానగరం మండలంలో యూరియా నిల్వలు వస్తే.. రైతుల కంటే ముందు టీడీపీ కార్యకర్తలకే సమాచారం వెళ్తోంది. దీంతో వారు రాత్రికి రాత్రే స్లిప్పుల రాసి తమ కార్యకర్తలకు ఇచ్చేస్తున్నారు. స్లిప్పులు ఉన్న వారికే బస్తాలు ఇస్తున్నారు. బూర్జ, లక్ష్మీపురం గ్రామాల్లోని రామమందిరాల వద్ద మంగళవారం యూరియా పంపిణీ చేయగా.. అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. ● మక్కువ మండలంలోనూ పూర్తిస్థాయిలో నిల్వలు దొరకడం లేదు. ఇక్కడ ఎరువుల ధరల్లో వ్యత్యాసాలు ఉండడంతో కొద్దిరోజుల కిందట అధికారులు దుకాణాలపై ఆకస్మిక దాడులు చేశారు. శంబరలోని ఓ దుకాణంలో వ్యత్యాసాన్ని గుర్తించారు. 2,399 బస్తాల్లోని 119.925 టన్నుల ఎరువు సీజ్ చేశారు. ● పాలకొండ మండలంలోనూ డీఏపీ, యూరియా లభించడం లేదు. స్థానికంగా లభ్యమవుతుందని ఇన్నాళ్లూ చూసిన రైతులు.. అదును దాటిపోవడంతో బయట మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేసుకుంటున్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో మెట్ట పంటల సాగుతో పాటు వరి నాట్లు ఆరంభమయ్యాయి. వరి వెదలు, నారుమడులు, మొక్కజొన్న, పత్తి తదితర పంటలకు యూరియా, కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సిన సమయం ఇది. లేదంటే దిగుబడిపై ప్రభావం పడుతుంది. ఎరువుల కోసం పీఏసీఎస్లకు రైతులు పరుగులు తీస్తున్నా ప్రయోజనం లేకపోతోంది. ఎక్కడా ఎరువుల కొరత లేదని అధికారులు చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన ఉండడం లేదు. పీఏసీఎస్లు, ప్రైవేట్ వర్తకుల వద్ద గంటలకొద్దీ బారులు తీరుతున్నా ఎరువు దొరుకుతుందన్న నమ్మకం లేదు. ఉసూరుమంటూ వెనుదిరగాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో వచ్చిన కొద్దిపాటి నిల్వలనూ కూటమి నాయకులు తన్నుకుపోతుండడం గమనార్హం. అదనపు వసూళ్లు.. యూరియా, డీఏపీ నిల్వలు లేవంటూ వ్యాపారులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. బస్తా వద్ద కనీసం రూ.50కి తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారు. దీంతోపాటు.. యూరియా కావాలంటే డీఏపీ తీసుకోవాల్సిందేనని, లేకుంటే ఇంకేదైనా పురుగు మందులు కొనాల్సిందేనని పట్టుపడుతున్నారు. కొన్నిచోట్ల సరైన రసీదులు కూడా ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. మరికొందరుల నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. దీనిపై ఏటా ఆరోపణలు వస్తున్నా.. అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యం. జిల్లాలోని ఖరీఫ్ సీజన్లో అన్ని రకాల పంటలూ కలిపి సుమారు 2.20 లక్షల ఎకరాల్లో సాగవుతాయి. వరి ఒక్కటే 1.70 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. ఈ సీజన్లో ఖరీఫ్కు అవసరమైన సుమారు 45,277 మెట్రిక్ టన్నులను అధికారులు సిద్ధం చేశారు. రైతు సేవా కేంద్రాలతోపాటు.. మార్క్ఫెడ్, ప్రైవేట్ వర్తకులు, పీఏసీఎస్ల్లో నిల్వలను అందుబాటులో ఉంచారు. క్షేత్రస్థాయికి వచ్చేసరికి రైతులకు ఎరువుల కోసం ఇబ్బందులు తప్పడం లేదు. కొరత లేదంటున్న అధికారులు జిల్లాలో ఒకవైపు రైతులు ఎరువుల కోసం అవస్థలు పడుతుంటే.. అధికారులు మాత్రం ఎక్కడా కొరత లేదని అంటున్నారు. జూలై చివరి నాటికి జిల్లాలో దాదాపు 21,542 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 19,357 మెట్రిక్ టన్నులు వచ్చాయని.. వాటిని పంపిణీ చేశామని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం ప్రారంభ నిల్వతో సహా 8,920 మెట్రిక్ టన్నుల లభ్యత ఉందని చెబుతున్నారు. 3,563 మెట్రిక్ టన్నుల యూరియా, 2,293 ఎంటీల డీఏపీ, 1,501 ఎంటీల కాంప్లెక్స్, 570 మెట్రిక్ టన్నుల పొటాష్, 990 మెట్రిక్ టన్నుల సూపర్ ఫాస్పెట్ ఉన్నాయని అంటున్నారు. కొద్ది రోజుల్లో 5 వేల టన్నుల యూరియా, మూడు వేల టన్నుల డీఏపీ వస్తుందని కలెక్టర్ తెలిపారు. కొరత లేదని.. అంతా సవ్యంగా ఉందని చెబుతున్న అధికారులకు గ్రామాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు కనిపించకపోవడం శోచనీయమన్న వాదన వినిపిస్తోంది. -
కూటమి పాలనపై ఏడాదికే వ్యతిరేకత
సాలూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజావ్యతిరేకత మొదలైందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరులో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రైతులు, మహిళలు, యువత తదితర వర్గాలు బహిరంగంగా కూటమి పాలనను వ్యతిరేకిస్తున్నాయన్నారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు, లేదంటే అప్పటివరకు నెలకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని, నేటికి ఒక్కరికీ కూడా భృతి అందజేయలేదన్నారు. రాష్ట్రంలో కోటీ 56 లక్షల మంది నిరుద్యోగులుంటే 20 లక్షల మంది ఉన్నట్టు లెక్కలు వేయడం చంద్రబాబు మోసపూరిత పాలనకు నిదర్శనమన్నారు. ఆడబిడ్డ నిధి అమలెప్పుడు? గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున అందజేశారని, కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధికింద ఇస్తామన్న నెలకు రూ.1500 ఎప్పుడిస్తారని రాజన్నదొర ప్రశ్నించారు. కోటీ 60 లక్షల మంది మహిళలు పథకం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమ్మఒడి పథకం లబ్ధిని సుమారు 80 లక్షల మంది పిల్లల తల్లుల ఖాతాలకు జమచేస్తే నేడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికే అని చెప్పి కేవలం 64లక్షల మందికే ఇచ్చారని, మిగిలిన 16 లక్షల మంది చదువులు మానేశారా అని ప్రశ్నించారు. చాలా మంది ఎస్సీ విద్యార్థులకు రూ.8వేలు, రూ.10 వేలు మాత్రమే జమచేయడం విచారకరమన్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఊరించి ఉసూరు మనిపిస్తున్నారన్నారు. లోకేశ్ను సైకో అని ఎందుకు అనకూడదు? గత ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద ఇచ్చే రూ.15వేలలో పాఠశాలల నిర్వహణ కోసం తొలుత రూ.వెయ్యి, తర్వాత రూ.2వేలు కేటాయిస్తే జగన్ సైకో అంటూ విమర్శలు చేసిన ప్రస్తుత విద్యాశాఖమంత్రి లోకేశ్ను ఇప్పుడు పెద్దసైకో అని ఎందుక అనకూడదని రాజన్నదొర ప్రశ్నించారు. మహిళల ఆత్మగౌరవం కాపాడతానని, పది రోజుల్లో రూ.20లక్షల ఖర్చుతో పట్టణంలోని మరుగుదొడ్లకు మరమ్మతులు చేయిస్తామని మంత్రి సంధ్యారాణి చెప్పారని, నేటికీ పనులు చేయకపోవడం విచారకరమన్నారు. మక్కువ రోడ్డు మూడు నెలల్లో పూర్తిచేస్తామని చెప్పిన మంత్రి ఆ విషయాన్ని మర్చిపోయారన్నారు. గత ప్రభుత్వ హయాంలో తహసీల్దార్ కార్యాలయం నిర్మాణం, ట్రజరీ కార్యాలయం ఆధునికీరణ, ఎంపీడీఓ కార్యాలయం, బైపాస్రోడ్డు, విత్తనశుద్ధి కేంద్రం తదితర భవనాల నిర్మాణాలు పూర్తిచేసినట్టు వెల్లడించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 70 శాతం మేర వందపడకల ఆస్పత్రి పనులు పూర్తిచేశామని, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో మిగిలిన 30 శాతం పనులు పూర్తిచేయలేదని విమర్శించారు. మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర -
అన్నీ అడ్డంకులే..
ఈ ఏడాది వ్యవసాయానికి అన్నీ అడ్డంకులే. ఓ వైపు వాతావరణం సహకరించడం లేదు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సాయమూ దక్కలేదు. నాకున్న భూమితో పాటు, మరికొంత కౌలుకు తీసుకుని సేద్యానికి సిద్ధమయ్యాను. నారుమడి సిద్ధంచేసి ఉడుపులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నా. ఎరువులు లేవు. ప్రస్తుతం రైతులకు అవసరమైన యూరియా కూడా దొరకడం లేదు. దీంతో సమీప జిల్లాకు, మండలాలకు వెళ్లి బస్తాపై రూ.100 మేర అదనంగా చెల్లించి తీసుకుంటున్నాం. ఇతర ప్రాంతాల నుంచి రావాలంటే రవాణా ఖర్చులు మరింత అవుతున్నాయి. – కరణం భాస్కరరావు, రైతు, లుంబూరు గ్రామం, పాలకొండ మండలం● -
యూరియా కోసం నిరసన
బలిజిపేట: మండలంలోని చిలకలపల్లి గ్రామంలో అవసరమైన రైతులకు యూరియా అందడం లేదని, నాయకులకు, కార్యకర్తలకు అందిస్తున్నారని రైతులు కృపారావు, ఉమామహేశ్వరరావు, వెంకటి, మురళి తదితరులు రైతు సేవా కేంద్రం వద్ద మంగళవారం ఆందోళన చేశారు. గ్రామంలో రైతులు, కౌలు రైతులకు యూరియా దొరకకపోవడంతో అవస్థలు పడుతున్నామని వాపోయారు. వచ్చిన యూరియాను నాయకులు, కార్యకర్తలు సర్దుకుంటున్నారని ఆరోపించారు. ప్రైవేట్ మార్కెట్లో సక్రమంగా అందుబాటులోకి రావడం లేదని, వచ్చినా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. నారుకు ప్రస్తుతం యూరి యా ఎంతో అవసరమని తక్షణమే రైతులకు అవసరమైన యూరియాను సరఫరాచేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కష్టాలు మొదలయ్యాయంటూ వాపోయారు. -
ఓటర్ల జాబితా పక్కాగా ఉండాలి
పార్వతీపురంటౌన్: ఓటర్ల జాబితా తయారీలో నిర్దిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, అన్నారు. ఓటర్ల జాబితా పునఃశ్చరణపై బూత్ స్థాయి అధికారులకు మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శిక్షణ జరిగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా తయారీలో ఎన్నికల సంఘం నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఓటరు కొత్తగా చేరడం, ఓటరు జాబితా నుంచి తొలగించడం, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారేటప్పుడు సవరణ చేయడం వంటి ప్రక్రియ ఓటర్ జాబితా సవరణలో ప్రధానమైన అంశాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేస్తేనే పనులు
కూటమి ప్రభుత్వంలో సరిపడా నిధులు వస్తేనే 2026 చివరికై నా తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు పనులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురాగలం. ఈ ప్రాజెక్టు ద్వారానే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి నీరందించాల్సి ఉంది. ప్రాజెక్టు వ్యయం రూ.804 కోట్లకు పెరగడంతో ఇప్పుడు ఈ ప్రభుత్వం విడుదల చేసే నిధులు ఏ కోశానా సరిపడవు. పై మొత్తం నిధులు విడుదలైతేనే 2026 డిసెంబర్ నాటికి విజయనగరం పట్టణానికి, భోగాపురం విమానాశ్రయానికే కాకుండా సుమారు 20 వేల ఎకరాలకు కూడా నీరందించగలం. – అప్పలనాయుడు, తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు ఈఈవిజయనగరం గంటస్తంభం: రెండు దశాబ్దాలుగా సాగుతున్న ప్రాజెక్టు తారకరామ తీర్థసాగర్. 2005 ఫిబ్రవరి 19న ప్రారంభించిన ప్రాజెక్టు అంచెలంచెలుగా అంచనా వ్యయం పెరుగుతోందే తప్ప పనులు మాత్రం పూర్తి కావడం లేదు. రాష్ట్రంలో 15 ఏళ్ల పాటు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన చంద్రబాబునాయుడు ఏనాడూ ప్రాజెక్టు పూర్తికి చిత్తశుద్ధితో చర్యలు తీసుకోలేదు. ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన ప్రాజెక్టును పూర్తి చేయడానికి గత వైఎస్ జగమోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన కుమిలి రిజర్వాయర్లో మిగిలిన పనులను రూ.150.24 కోట్లతో పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లో గల 49 గ్రామాల్లోని 24,710 ఎకరాలకు సాగు నీరందుతుంది. భూసేకరణే అసలు సమస్య.. తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టుకు అవసరమైన 3497.58 ఎకరాల భూమికిగాను 3278.32 ఎకరాలను సేకరించారు. మిగతా 219.26 ఎకరాల సేకరణపై అధికారులు దృష్టిపెట్టారు. కుమిలి రిజర్వాయర్ ప్రాజెక్టులో కోరాడపేట, ఏటీ అగ్రహారం, పడాలపేట ముంపునకు గురవుతాయి. ఈ గ్రామాల్లోని 2,219 కుటుంబాలకు పునరావాసానికే రూ.209.88 కోట్లు అవసరం. అయితే ప్రభుత్వం తాజాగా కేవలం రూ.5కోట్లు మాత్రమే కేటాయించింది. తాడిపల్లి, కుదిపి, నీలంరాజు పేట గ్రామాల నిర్వాసితులకు పరిహారానికి రూ.75.69 కోట్లు ఖర్చవుతుంది. ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సి ఉంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించాక చంపావతి నుంచి నీటిని మళ్లించి, ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు విజయనగరం కార్పొరేషన్కు తాగునీరు సరఫరా అవకాశం కుదురుతుంది. తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు ప్రాజెక్టు కీలకం విజయనగరం పట్టణానికి తాగునీరు, భోగాపురం విమానాశ్రయానికి నీటి అవసరాలను తీర్చడమే కాకుండా సుమారు 20వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించే తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఎంతో అవసరం. ప్రాజెక్టుకు అరకొరగా నిధులు కేటాయించడంతో ఈ ఏడాది పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. మరి 2026 నాటికల్లా నీరు రాకుండా ఉంటే తాగునీరు సమస్య, అటు పారిశ్రామిక, విమానాశ్రయానికి నీరు లేక వెలవెలబోతుంది. ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే ఎయిర్పోర్టు అవసరాలకు తాగునీరు, వాడుక నీరు ప్రధానం కావున ఇందుకోసం తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మాణం ఇలా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలయజ్ఞంలో భాగంగా తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడు వద్ద చంపావతి నదిపై 184 మీటర్ల పొడవున బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి 13.428 కిలోమీటర్ల కాలువ ద్వారా కుమిలిలో నిర్మించే రిజర్వాయర్కు 27 టీఎంసీల నీటిని మళ్లిస్తారు. ఇక్కడి నుంచి కుమిలి చానల్ సిస్టం పరిధిలోని 8,172 ఎకరాలను స్ధిరీకరించడంతో పాటు కొత్తగా 16,538 ఎకరాలకు సాగునీందించాలి. వైఎస్సార్ మరణానంతరం అధికారంలోకి వచ్చిన పాలకులు ప్రాజెక్టు పనులు పట్టించుకోలేదు. 2014 నుంచి 2019 మధ్య పాలన సాగించిన చంద్రబాబునాయుడు ప్రాజెక్టు పనుల ఊసెత్తలేదు. అనంతరం అధికారం చేపట్టిన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్యారేజీ నిర్మాణాన్ని దాదాపు పూర్తిచేశారు. మళ్లింపు కాలువ, కుమిలి రిజర్వాయర్ పనులు పెడింగ్లో ఉన్నాయి. కుమిలి రిజర్వాయర్ డైక్–2, డైక్–3లలో 2.2 కిలోమీటర్ల మట్టికట్ట పనుల్లో రూ.150.24 కోట్ల పనులు మిగిలాయి. వాటిని చేపట్టిన కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. దీంతో 60–సీ నిబంధన కింద కాంట్రాక్టర్ను తొలగించి, పనులను మరో కాంట్రాక్టర్కు అప్పగించడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆ మేరకు ప్రతిపాదనలను జ్యూడిషియల్ ప్రివ్యూకు పంపారు. -
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు వేగవంతం చేయాలి
పార్వతీపురంటౌన్: జిల్లా ప్రధాన కేంద్రంలో నిర్మితమవుతున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనం పనులు వేగవంతం కావాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఆకస్మిక పర్యటనలో భాగంగా నిర్మాణ దశలో ఉన్న ఆస్పత్రిని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన ఇంజినీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ ఆస్పత్రి అదుబాటులోకి వస్తే స్థానికంగా ఉన్న వారితో పాటు చుట్టుపక్కల మండలాలకు చెందిన రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ పర్యటనలో ఆస్పత్రి వైద్యులు, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
నగలు, నగదు చోరీపై ఫిర్యాదు
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో చెరువు గట్టు వీధిలో నివాసం ఉంటున్న పిల్లి రాము ఇంట్లో చోరీ జరిగిన ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పార్వతీపురం పట్టణ పోలీసులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తన భార్య బంధువుల ఇంటికి వెళ్లడంతో ఇంటికి తాళం వేసి తన రోజువారీ పనుల నిమిత్తం చంటి బయటకు వెళ్లగా తిరిగి వచ్చి చూసేసరికి వేసిన తాళం వేసినట్లు ఉండి ఇంట్లో ఉన్న బీరువా తెరిచి బట్టలు చెల్లాచెదురుగా పడి ఉండడంతో దొంగతనం జరిగినట్లు పిల్లి రాము గుర్తించారు. ఈ చోరీలో ఐదు తులాల బంగారు ఆభరణాలతో పాటు, రూ.12 వేల నగదు అపహరించినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
శతశాతం రాయితీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు
పార్వతీపురం టౌన్: ఎస్సీ, ఎస్టీ రైతులు, ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రూ.2.18 లక్షల విలువైన డ్రిప్ పరికరాలను 100 శాతం రాయితీతో అందిస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ స్పష్టంచేశారు. 5 నుంచి 10 ఎకరాలు భూమి కలిగిన రైతులకు గరిష్టంగా రూ.3.18లక్షల విలువైన డ్రిప్ పరికరాలను 90 శాతం రాయితీతో అందజేస్తామని చెప్పారు. కలెక్టరేట్లో వ్యవసాయాధికారుల సమీక్షలో ఆయన మంగళవారం మాట్లాడారు. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి 2090 హెక్టర్లలో బిందు, తుంపర సేద్యం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. మిషన్ కల్పవృక్షతో అద్భుత ఫలితాలు జిల్లాలో తలపెట్టిన మిషన్ కల్పవృక్ష కార్యక్రమంతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జిల్లావ్యాప్తంగా 5 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగుచేయాలన్నది లక్ష్యంగా నిర్దేశించామన్నారు. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పరిధిలో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. గొర్రెలు, మేకల పెంపకాన్ని, పశుపోషణను ప్రోత్సహించాలని, వీడీవీకేలను బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పలువురు పాల్గొన్నారు. -
నరక దారులు
పార్వతీపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా ఉన్న రహదారులతో పాటు ఆంధ్రా–ఒడిశా ప్రాంతాలకు రాకపోకలకు సాగించేందుకు ప్రధానంగా ఉన్న అంతర్రాష్ట్ర రహదారి సైతం పూర్తిగా ధ్వంసమై భారీ గుంతలతో చెరువులను తలపిస్తున్నాయి. ప్రజా సంఘాలు, స్థానికులు, వాహన దారులు ఎప్పటికప్పుడు వినూత్నంగా రహదారి అధ్వాన స్థితిపై నిరసనలను తెలియజేస్తున్నప్పటికీ పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేస్తామని చేసిన వాగ్దానం ఎక్కడా నెరవేర్చినట్లు కానరావడం లేదని ప్రజా సంఘాల నాయకులు రోడ్ల దుస్థితిపై దుమ్మెత్తి పోస్తున్నారు. వాహనాలు గుంతల్లో తిరగబడి ప్రమాదాలకు గురవుతున్నా పాలకులకు, సంబంధిత అధికారులకు ఎందుకు పట్టడం లేదో అని ఆందోళన చెందుతున్నారు. కూటమి పెద్దల మాటలు ఏమయ్యాయి? కూటమి పాలనలో రోడ్లు మరీ అధ్వానంగా మారాయి. అందుకు ప్రధాన సాక్ష్యం పార్వతీపురం నుంచి కూనేరు వరకు ఉన్న రహదారే. అధికారంలోకి వస్తే అద్దంలా రోడ్లను మారుస్తామని చెప్పిన కూటమి పెద్దలు ఏడాది పాలన పూర్తయినప్పటికీ రోడ్ల మరమ్మతుల విషయంలో ఎలాంటి పురోగతి చూపడం లేదు. జిలా కేంద్రం సమీపంలోని పార్వతీపురం నుంచి చినబొండపల్లి మధ్య, గరుగుబిల్లి–బురదవెంకటాపురం రోడ్లు మరీ అధ్వానంగా మారాయి. వర్షాలు పడుతున్న నేపథ్యంలో తక్షణమే రోడ్ల మరమ్మతులకు చర్యలు చేపట్టాలి. బీవీ రమణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, -
యుద్ధప్రాతిపదికన సీసీఆర్సీ పంపిణీ జరగాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్పార్వతీపురంటౌన్: జిల్లాలో యుద్ధప్రాతిపదికన సీసీఆర్ కార్డుల పంపిణీ జరగాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. సొంత భూమిలేని కాలు రైతులందరికీ కౌలు గుర్తింపు కార్డులు అందించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయం, అనుబంధ రంగాల శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే రెవెన్యూ శాఖ జారీచేసే కౌలు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని, ఈ కార్డులు కలిగిన వారు మాత్రమే పంట నమోదు చేసుకునే అవకాశం ఉందని, పంట నమోదు ఆధారంగా పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, ఇతర వ్యవసాయ పథకాలు అమలవుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. కావున ఇన్ని ప్రయోజనాలు ఉన్న సీసీఆర్ కార్డుల పంపిణీ త్వరగా పూర్తిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా త్రైమాసికానికి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. నిర్దేశించుకున్న లక్ష్యాలు, సాధించిన ప్రగతి వివరాలను ఎప్పటికపుడు తన కు నివేదిక రూపంలో అందించాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా గ్రామ వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా పశు సంవర్థక శాఖాధికారి డా.ఎస్.మన్మథరావు, జిల్లా పట్టు పరిశ్రమ అధికారి ఏవీ సాల్మన్ రాజు, మత్స్య అభివృద్ధి అధికారి యు.చాందిని, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పట్టాలిచ్చి గిరిజనులపై కేసులు పెడతారా?
పార్వతీపురం రూరల్: గిరిజనుల జీవనోపాధికోసం అప్పటి ప్రభుత్వ అధికారులు గిరిజనులు సాగు చేసిన పోడు భూములకు జీఓ ప్రకారం అటవీశాఖ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో సంగంవలస పంచాయతీ సీతంపేట గ్రామంలో నివసిస్తున్న గిరిజనులకు పట్టాలు పంపిణీ చేశారని సీపీఎం మండల అధ్యక్షుడు పి.రాము అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మండలంలోని సీతంపేటను సందర్శించిన అక్కడి గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో అన్నిశాఖల సమన్వయంతో ఇచ్చిన పట్టా భూముల్లో జీవనోపాధి కోసం గిరిజనులు సాగు చేస్తున్న భూముల్లోకి అటవీశాఖాధికారులు వెళ్లి సీతంపేట గిరిజనులను ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. భూములపైకి వెళ్లి వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ధ్వజమెత్తారు. పట్టాలిచ్చి అమాయకులైన గిరిజనులపై ఏ విధంగా కేసులు పెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అటవీశాఖ అధికారులు ఎందుకు భూములపైకి గిరిజనులను రానివ్వకుండా నిలువరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించి పరిష్కారం చూపాలని కోరారు. సీపీఎం నాయకుడు పి రాము -
‘హిట్ అండ్ రన్’ వాహనాలను వెంటనే గుర్తించాలి
● ఎస్పీ ఆదేశాలువిజయనగరం క్రైమ్: హిట్ అండ్ రన్ కేసుల్లో వాహనాలను వెంటనే గుర్తించాలని నమోదైన కేసుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని పోలీస్ సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం అదేశించారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో నమోదై, దర్యాప్తులో ఉన్న ’హిట్ అండ్ రన్, గుర్తు తెలియని మృతదేహాల కేసులను ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షించారు. ‘హిట్ అండ్ రన్’ కేసుల్లో నేరానికి పాల్పడిన వాహనాన్ని సాధ్యమైనంత వేగంగా గుర్తించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. నేర స్ధలం నుంచి వాహనం వెళ్లే మార్గంలోగల అన్ని సీసీ కెమెరాలను, ఫుటేజులను, టోల్ గేట్స్ రికార్డులను పరిశీలించాలని సూచించారు. కేసుల్లో దర్యాప్తు అంశాలను ఎప్పటికప్పుడు కేసు డైరీల్లో పొందుపర్చాలని స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, ఎస్.శ్రీనివాస్, ఎల్.అప్పలనాయుడు, బి.సుధాకర్, వివిధ పోలీసు స్టేషన్ల చెందిన పలువురు ఎస్సైలు పాల్గొన్నారు. -
ఇదేం కొలువు.. గురూ!
–8లో● గురువులకు అదనపు ‘తరగతులు’ ● పాఠాలు కంటే ఇతర పనులే అధికం ● ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేలా కూటమి చర్యలు మీరొస్తేనే.. పూడికలు తీస్తారా? ఆరోగ్య, అభివృద్ధి ప్రదాతసానుకూలంగా స్పందించండి అర్జీదారులు తెలియజేసిన సమస్యలపై సానుకూలంగా స్పందించాలని ఎస్పీ మాధవ్రెడ్డి అన్నారు. –8లోఅర్జీలను పరిష్కరించాలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని కలెక్టర్ ఎ. శ్యామ్ప్రసాద్ అధికారులకు హితవు పలికారు. జిందాల్ భూములు రైతులవే.. జిందాల్ కంపెనీ కోసం సేకరించిన భూములపై పూర్తి హక్కులు రైతులకే ఉన్నాయని మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. –8లోమంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025డీఈవో కార్యాలయం వద్ద నిరసన తల్లిదండ్రుల సమావేశం కోసం ప్రతి పాఠశాల కూ ఒక ‘సాక్ష్యం’ అధికారిని నియమించడాన్ని పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, హెచ్ఎంఏ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సోమవారం జిల్లా విద్యాశాఖాధికా రి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుల కంటే తక్కువ స్థాయి వారిని విట్నెస్ అధికారిగా నియమించడం ఏమిటని ప్రశ్నించారు. హంగామా వద్దు.. బోధన ముద్దు అంటూ నినాదాలు చేశారు. తక్షణమే విట్నెస్ అధికారి నియామకం రద్దు చేసి, ఉపాధ్యాయుల గౌరవం పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కాగాన విజయ్, భాస్కరరావు, బాలకృష్ణ, పీహెచ్ శ్రీను, రవిప్రసాద్, నారాయణరావు, రామారావు, లక్ష్మునాయుడు, రవి, రామినాయుడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: మొన్నటి వరకూ యోగాంధ్ర.. ఇప్పుడు పేరెంట్స్ మీట్... గురువులకు పాఠాలు కంటే అదనపు ‘తరగతులే’ అధికమవుతున్నాయి. ఈ నెల 10న మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహించాలంటూ ప్రభుత్వం ఆదేశించిన విషయం విదితమే. దీనికి పెద్త ఎత్తున హంగామానే చేస్తున్నారు. కార్యక్రమ నిర్వహణ ఒక ఎత్తయితే.. మరోవైపు హెచ్ఎంలను కాదని, ఇతర శాఖల ఉద్యోగులను ‘సాక్ష్యం’ కింద నియమించడంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నిర్వహించిన పేరెంట్స్ మీట్లోనే ప్రజాప్రతినిధులు.. తల్లిదండ్రులకు రాజకీయ పాఠాలు బోధించారు. ఈసారి కార్యక్రమాన్ని ఇంకే విధంగా ఉపయోగించుకుంటురోనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహణ ఈ నెల పదో తేదీన జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు తదితర అన్ని మేనేజ్మెంట్ విద్యాసంస్థల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నా రు. పార్వతీపురం మన్యం జిల్లాలో 1,787 విద్యాసంస్థల్లో 1,29,730 మంది విద్యార్థులు ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులను పిలిచి విద్యార్థులను ప్రగతిని వివరించడం.. వారికి అక్క డే మధ్యాహ్న భోజనం, క్రీడల నిర్వహణ, సమావేశం, అతిథుల ప్రసంగాలు.. ఇలా ఉదయం 9 గంటల నుంచే వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఇందుకోసం పాఠశాలల్లో 16 రకాల కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్వాన పత్రికలు, వేదికల ఏర్పాట్లు, బహుమతుల ప్రదానం, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించడం.. ఇలా వివిధ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు రావడంతో ఆ బాధ్యతంతా ఉపాధ్యాయులపైనే పడుతోంది. దీనికితోడు కొద్దిరోజులుగా నిత్యం వీసీలు, సమావేశాలంటూ హెచ్ఎంలను, ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు యోగాంధ్ర పేరిట నెల రోజులపాటు హడావిడి చేశారు. విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇందు లో భాగస్వామ్యం చేయడంతో చదువులు అటకెక్కా యి. మధ్యలో ఆదర్శ పాఠశాలల్లో విలీనం.. వ్యతిరే కిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళన.. బడులకు పిల్లలెవరూ రాకపోవడంతో సక్రమంగా పాఠా లు సాగే పరిస్థితి కనిపించలేదు. దీనికితోడు గ్రామాలకు వెళ్లి, తల్లిదండ్రులను నచ్చజెప్పే బాధ్యతను గురువులపైనే మోపారు. అక్కడ గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకతనూ ఉపాధ్యాయులే ఎదుర్కొన్నారు. ఇప్పుడు కొద్దిరోజులుగా తల్లిదండ్రుల సమావేశానికంటూ హంగామా చేస్తున్నారు. ఈ ఏర్పాట్లలో పడి, అసలే విద్యాబోధననే సాగడం లేదని గురువులు ఆందోళన చెందుతున్నారు. యోగాంధ్ర మాదిరి ఈ కార్యక్రమాన్నీ రికార్డు స్థాయిలో గిన్నిస్ బుక్లో నమోదయ్యేలా నిర్వహించాలని ఒత్తిడి చేయడంతో తలలు పట్టుకుంటున్నారు. ‘యాప్’రే... తల్లిదండ్రుల సమావేశం సందర్భంగా విద్యార్థులతో మొక్కలు నాటించడం.. దాన్ని లీఫ్ యాప్లో నమోదు చేయించడం, ప్రతి మూడు నెలలకు ఆ మొక్క ఫొటోలను అప్లోడు చేయించడం, సమావేశం జరిగిన వెంటనే 30 సెకన్ల వీడి యో, మూడు ఫొటోలను యాప్లో తప్పనిసరిగా నమోదు చేయడం.. ఇదంతా ఉపాధ్యాయుల పనే. ప్రభుత్వ పాఠశాలలను బలపర్చే దిశగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు లేవని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నాణ్యమైన విద్యను అందించడం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడం వంటి చర్యలు కాకుండా... యోగాడే, మెగా పేరెంట్స్ మీట్ వంటివేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా పాఠశాల సమయాన్ని మొత్తం బోధనకు కాక, బోధనేతర పనులకే ఉపాధ్యాయులు కేటాయించాల్సి వస్తోంది. దీనికితోడు మిగులు ఉపాధ్యాయులను క్లస్టర్ పాఠశాలలకు కేటాయించకుండా, తిరిగే విధంగా నియమించడం మరింత ప్రభావం చూపుతోంది. ఇతర శాఖల వారు ‘సాక్ష్యమా?’ తల్లిదండ్రుల సమావేశాల పర్యవేక్షణకు ఒక్కో పాఠశాలకూ ఒక ఉద్యోగిని ఇతర శాఖల నుంచి కేటాయించారు. వీరు సాక్షిగా ఉంటారని విద్యాశాఖ ఉత్తర్వు లు జారీ చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఫొటోలు, సమాచారమంతా ప్రధానోపాధ్యాయుడు ఉపయోగిస్తున్న యాప్లో అదే రోజున అప్లోడు చేయాలని విద్యాశాఖ పేర్కొంది. బాహ్య పరిశీలకులు పేరిట ఇతర శాఖ ల ఉద్యోగులను నియమించడం పాఠశాల నిర్వహ ణ వ్యవస్థ, ఉపాధ్యాయుల పనితీరును కించపరచ డమేనని యూటీఎఫ్, పీఆర్టీయూ, ఏపీటీఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ● సొంత పార్టీ కార్యకర్తలకు ఏం చేశారు.. ● ఎమ్మెల్యేను నిలదీసిన 28వ వార్డు టీడీపీ యువత, మహిళలు న్యూస్రీల్ -
మడ్డువలస నీరు విడుదల
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ ద్వారా ఖరీఫ్ పంటల సేద్యానికి రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సోమవారం సాగునీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఆవరణలో ఉన్న కుడి ప్రధాన కాలువ హెడ్ స్లూయీస్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్విచ్ ఆన్ చేసి సాగునీటిని విడిచిపెట్టారు. తొలి రోజు 100 క్యూసెక్కుల నీటిని వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయకట్టు పరిధిలో ప్రతి ఎకరాకూ సాగునీటిని అందేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బొత్స వాసుదేవరావునాయుడు, పిన్నింటి మోహనరావు, పైల వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.