breaking news
Parvathipuram manyam District News
-
అంగన్వాడీ చిన్నారులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
సీతంపేట: మండలంలోని మారుమూల ఉన్న బర్న గ్రామంలో అంగన్వాడీ భవనం శ్లాబ్ పెచ్చులు బుధవారం రాత్రి కూలాయి. చిన్నారులకు ప్రమాదం త్రుటిలో తప్పింది. ఇక్కడ 10 మంది ప్రీస్కూల్ పిల్లలు చదువుతున్నారు. రాత్రి సమయం కావడంతో ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. అంగన్వాడీ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో గోడలు కూడా బీటలు వారాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నానిపోయి పెచ్చులు ఒక్కొక్కటిగా పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన భవనం మంజూరు చేయాలని, లేదంటే పాత భవనానికి అయినా మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. -
ష్..సైలెన్స్ ప్లీజ్..!
● లైబ్రరీలకు బకాయిల భారం ● సమస్యల్లో శాఖా గ్రంథాలయాలు ● జిల్లాలో రూ.4 కోట్ల సెస్ బకాయి ● పట్టించుకోని పంచాయతీ, పురపాలకులు రామభద్రపురం: కూటమి పాలనలో గ్రంథాలయాలు అలంకార ప్రాయంగా మారాయి. ప్రభుత్వం పట్టించుకోకుండా వాటి బలోపేతంపై నిర్లక్ష్యం వహించడంతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 41 గ్రంథాలయాలు ఉండగా వాటిలో 26 శాఖా గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉన్నాయి. 7 గ్రంథాలయాలు అద్దెభవనాల్లో నడుస్తుంగా 8 ఉచిత అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అయితే వాటిలో పలు గ్రంథాలయాల్లో మరుగుదొడ్లు, పాఠకులు చదువుకునేందుకు ఫర్నిచర్ వంటి కనీస మౌలికవసతులు లేవు. అలాగే ప్రధానంగా పోటీ పరీక్షల కోసం చదవడానికి అవసరమైన పుస్తకాలు లేవు. శాఖా గ్రంథాయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించక 010 ప్రకారం జీతాలు రాక వారు ఇబ్బందులు పడుతున్నట్లు ఈ నెల 22వ తేదీన జిల్లాలో పర్యటించిన ఏపీ గ్రంథాలయ పరిషత్ మెంబర్ రౌతు రామ్మూర్తినాయుడు గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని పలు శాఖా గ్రంథాలయాలను సందర్శించి సమస్యలను గుర్తించారు. పేదవిద్యార్థులకు శాపం జిల్లాలో 41 గ్రంథాలయాలు ఉండగా వాటిలో నిత్యం వందల మంది పాఠకులు సేవలు పొందుతున్నారు స్థానిక సంస్థల నుంచి సెస్ సకాలంలో వసూలు కాకపోవడంతో గ్రంథాలయాల్లో అరకొరగా వసతులు ఉన్నాయి. ముఖ్యంగా పుస్తకాలు సైతం తగినస్థాయిలో లేవని పాఠకులు అంటున్నారు. వివిధ పోటీ పరీక్షలకు నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. వారిలో అత్యధిక శాతం మంది సామాన్య,పేద తరగతి అభ్యర్థులే ఉంటారు. వారికి పోటీ పరీక్షల పుస్తకాలు, పేపర్లు కొనే ఆర్థిక స్థోమత లేక సమీపంలోని గ్రంథాలయాలకు వెళ్లి చదువుకుంటారు. కానీ అక్కడ అరకొరగా పుస్తకాలు ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రూ.4 కోట్ల బకాయి విజ్ఞాన భాండాగారాలుగా పేరొందిన గ్రంథాయాలు ఆర్థిక సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. స్థానిక సంస్థల నుంచి రూపాయిలో ఎనిమిదిపైసలు చొప్పున గ్రంథాలయాలకు రావాల్సిన సెస్ పూర్తి స్థాయిలో వసూలు కాకపోవడంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. ఫలితంగా గ్రంఽథాలయాల ఉనికి ప్రమాదంలో పడింది. జిల్లాలో దాదాపు రూ.4 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏటా ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నాయి.ఆ పన్నుల నుంచి లైబ్రరీలకు చెల్లించాల్సిన సెస్ వాటాను మాత్రం సక్రమంగా జమచేయడం లేదు. నింబధనల ప్రకారం ప్థానిక సంస్థలు వసూలు చేసిన పన్నుల్లో నుంచి 8 శాతం గ్రంఽథాలయాకు సెస్గా చెల్లించాలి. ఈ నింబధన అమలుకు నోచుకోకపోవడంతో గ్రంథాలయాలు ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నాయి. ఈ సెస్ ద్వారా వచ్చిన సొమ్ముతోనే గ్రంథాలయాల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు పుస్తకాలు, మ్యాగజైన్లు, దిన,వార,మాస పత్రికలను పాఠకులకు అందుబాటులో ఉంచే వీలుంటుంది. అయితే ఇటు సెస్ వసూలు కాకపోవడం, అటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గ్రంథాలయాల సేవలు మొక్కుబడిగా మారాయని విమర్శలు వినిపిస్తున్నాయి. -
జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ముఖేష్మణికంఠ
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న స్కూల్గేమ్స్ తైక్వాండో పోటీలకు జిల్లాకు చెందిన ముఖేష్మణికంఠ ఎంపికయ్యాడు. నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ముఖేష్ ఈనెల 11,12 తేదీల్లో జరిగిన స్కూల్గేమ్స్ అండర్ 14 విభాగంలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. అంతేకాకుండా నాగాలాండ్లో ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న అండర్ 14 జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు విజయనగరం నుంచి ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంతో పాటు జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారుడిని రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి వేణుగోపాలరావు, జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, స్కూల్ గేమ్స్ సెక్రటరీ గోపాల్, విజయ, కోచ్ యశస్విని అభినందిస్తూ విజయంతో తిరిగి రావాలంటూ ప్రోత్సహించారు. -
మహిళ ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి గొల్లపేట సమీప కొత్తకాపు పేటకు చెందిన గురమ్మ (58) గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్తకాపుపేటకు చెందిన బాడితమాను గురమ్మ భర్త, ఇద్దరు పిల్లలతో కుటుంబం నెట్టుకొస్తోంది. మూడు నెలల క్రితం పొత్తి కడుపులో తీవ్రంగా నొప్పి వచ్చింది. డాక్టర్కు చూపించగా అపెండిసైటిస్ అని ఆపరేషన్ చేస్తే నయమవుతుందని చెప్పారు. కూలి పని చేసుకుని జీవనం సాగించే గురమ్మ ఆర్థిక స్థోమత లేక చికిత్స చేయించుకోలేదు. తరచూ పొత్తి కడుపులో నొప్పి రావడంతో భరించలేక, నయం చేయించేందుకు ఆర్థికభారం మోయలేక..భర్త తెచ్చిన కూలి డబ్బులతో ఇంట్లో సర్దలేక మనస్తాపం చెందిన ఆమె ఊరి చివరన పూరిపాకలో చీరతో ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. భర్త రామునాయుడు ఇచ్చిన ఫిర్యాదుతో రూరల్ ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోతకు గురైన ప్రధాన రహదారి
పార్వతీపురం: పార్వతీపురం–శ్రీకాకుళం ప్రధాన రహదారిలో పార్వతీపురం మండలంలోని అడ్డాపుశీల జంక్షన్ వద్ద రహదారి కోతకు గురై ప్రమాదభరితంగా ఉంది. నెలరోజుల క్రితం కురిసిన భారీవర్షానికి రహదారి పరిధిలో రెండు అడుగుల లోతులో కోతకు గురైంది. ఈ రహదారి పరిధిలో ఆదమరిచి ప్రయాణిస్తే పెనుప్రమాదం సంభవించే ఆస్కారం ఉంది. ఈ రహదారిగుండా నిత్యం వందలాది భారీ వాహనాలు రాకపోకలు చేయడంతో పాటు వేలాదిగా ద్విచక్రవాహనాలు తిరుగుతుంటాయి. కార్తీకమాసంలో అడ్డాపుశీలలో ఉన్న శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తారు. దీంతో రహదారి మరింత రద్దీగా మారే అవకాశం ఉంటుంది. రహదారి కోతకు గురై నెలలు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ప్రధాన రహదారినుంచి అడ్డాపుశీల గ్రామానికి వెళ్లే రహదారి మరింత కోతకు గురికావడంతో స్థానికులు రాకపోకలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ రహదారి పరిధిలో అడ్డాపుశీల జంక్షన్ నుంచి పార్వతీపురం ఆర్టీసీ బస్టాండ్వరకు పలుచోట్ల రహదారి మరమ్మతులకు గురికావడంతో నిత్యం రాకపోకలు చేసేందుకు అవస్థలు పడుతున్నారు. ప్రమాదాలు జరిగితే గానీ అధికారులు స్పంధించరని పలువురు అంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రమాదాలు సంభవించకముందే రహదారికి మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. పట్టించుకోని అధికారులు -
గంజాయి కేసులో ఇద్దరు ముద్దాయిలకు మూడేళ్ల జైలు
విజయనగరం క్రైమ్: జిల్లాలోని ఎన్.కోట పోలీసుస్టేషన్లో 2018లో నమోదైన గంజాయి కేసులో ఇద్దరు ముద్దాయిలకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ ఏఆర్.దామోదర్ గురువారం తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..ఏఎస్ఆర్ జిల్లాకు చెందిన నిందితుడు (ఎ1) కిముడు జయరాం (22), అనకాపల్లి జిల్లా సబ్బవరానికి చెందిన నిందితుడు (ఎ2) దత్తి ప్రవీణ్ (22)లు ఎస్.కోట పోలీస్స్టేషన్ పరిధిలో ఆకుల డిపో వద్ద 2018 డిసెంబర్ 20న బైక్పై అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసి 3.750 కిలోల గంజాయిని అక్రమంగా రవాణ చేస్తున్నట్లు గుర్తించారు. అప్పటి ఎస్సై ఎస్.అమ్మి నాయుడు కేసు నమోదు చేయగా సీఐ డా.బి.వెంకటరావు దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్టు చేశారు. తదుపరి ఎస్.కోట సీఐగా బాధ్యతలు చేపట్టిన బి.శ్రీనివాసరావు కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కోర్టు విచారణలో నిందితులపై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.20,000 జరిమానా విధించారని ఎస్పీ తెలిపారు. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్యబొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామానికి సమీపంలో రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గజపతినగరం మండలంలోని తుమ్మకాపల్లి గ్రామానికి చెందిన నడిపిల్లి వెంకటేష్(23) స్నేహితుడు లోగిశ గ్రామానికి చెందిన శనపతి సురేష్ ద్విచక్ర వాహనాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చి వేకువ జామున గుర్తు తెలియని రైలు కింద పడడంతో శరీరం ముక్కలుముక్కలై చెల్లాచెదురైంది. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో పాటు, ద్విచక్ర వాహనం వద్ద లభించిన ఆధారాలతో మృతుడిని గుర్తించినట్లు రైల్వే హెచ్సీ తెలిపారు. మృతుడి తండ్రి పైడిరాజు ఇటీవల మృతి చెందడంతో అప్పటి నుంచి తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. గజపతినగరం స్టేషన్మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి మృతదేహాన్ని జిల్లా కేంద్ర సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. పాముకాటుతో మహిళ మృతిగజపతినగరం: మండలంలోని కొనిశ గ్రామానికి చెందిన సూరెడ్డి అన్నపూర్ణ (47)పాము కాటుతో మృతిచెందింది. గురువారం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం భర్త బుచ్చిబాబుతో కలిసి గ్రామం సమీపంలో ఉన్న గొడ్డు పొలంలో పత్తి ఏరేందుకు అన్నపూర్ణ వెళ్లింది. పత్తి ఏరుతుండగా ఆమెను పాము కరవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయింది. వెంటనే భర్త బుచ్చిబాబు, మేకలు మేపుతున్న మరో వ్యక్తి సహాయంతో గజపతినగరం ఏరియా ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు. వైద్యులు పరిక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్ట్మార్టం కోసం విజయనగరం సర్వజన ఆస్పత్రికి మృతదేహాన్ని పోలీసులు తరలించారు. 108లో ప్రసవంసీతంపేట: మండంలోని గూడగుడ్డి గ్రామానికి చెందిన గర్భిణి ఎం.ఎనిబిత 108లో గురువారం ప్రసవించింది. పురిటి నొప్పులు ఆమెకు రావడంతో గ్రామస్తులు 108కు ఫోన్ చేశారు. భామిని 108 ఈఎంటీ రాములు, పైలెట్ శ్రీనివాసరావులు గ్రామానికి వెళ్లి వాహనంలో ఎక్కించి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో డెలివరీ కండక్ట్ చేశారు. మూడో కాన్పులో ఆడశిశువుకు ఆమె జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. సులువుగా ప్రసవ చేసిన 108 సిబ్బందిని గ్రామస్తులు, గర్భిణి కుటుంబసభ్యులు అభినందించారు. -
ప్రతిష్టాత్మకంగా చెస్పోటీలు నిర్వహించాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలో నవంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి చెస్పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సంబంధిత అధికారులతో సమీక్షించిన ఆయన పోటీలను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. టోర్నీకి హాజరయ్యే 486మంది రాష్ట్రస్థాయి క్రీడాకారులను గౌరవంగా చూసుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అథ్లెటిక్స్ క్రీడాకారులను కలెక్టర్ అభినందించారు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి -
పుస్తెల తాడు లాక్కెళ్లిన చైన్స్నాచర్లు
రాజాంసిటీ: రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన గంగు భాగ్యలక్ష్మి భర్త సురేష్తో కలిసి గురువారం కిరాణా సామగ్రి కొనుగోలు నిమిత్తం రాజాం వస్తుండగా గాయత్రి కాలనీ సమీపంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆమె మెడలోని రెండు తులాల పుస్తెలతాడును తెంచి పారిపోయారు. దీంతో భాగ్యలక్ష్మి బండిపై నుంచి కింద పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షాక్కు గురై వ్యక్తికి గాయాలు పార్వతీపురం రూరల్: పట్టణంలో భవన నిర్మాణ కార్మికుడు సెంట్రింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై గాయాల పాలయ్యాడు. అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాలు.. బెలగాం చెరువు వీధిలో ఓ ఇంటి నిర్మాణానికి సంబంధించి పై కప్పు సెంట్రింగ్ పనులు చేస్తున్న బి.మణికంఠ అనే భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా తీగలను తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అతడిని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు వివరాలు సేకరించినట్టు అవుట్పోస్ట్ పోలీసులు తెలిపారు. -
గ్రంఽథాలయాల్లో సౌకర్యాలు లేకపోవడం వాస్తవమే
జిల్లాలోని పలు శాఖా గ్రంథాలయాల్లో పాఠకులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడం వాస్తవమే. పలు లైబ్రరీలకు సొంత భవనాలు లేకపోవడం, మరుగుదొడ్లు, పాఠకులకు సరైన మౌలికవసతులు, కాంపిటేటివ్ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు లేని పరిస్థితిని ఇటీవల జిల్లాలోని గ్రంఽథాలయాల సందర్శనలో గుర్తించాను. అయితే జిల్లాలో గ్రంథాలయ శాఖకు స్థానిక సంస్థలు చెల్లించాల్సిన దాదాపు రూ.4 కోట్ల బకాయిలు ఉన్నాయి. శాఖా గ్రంథాలయాలలో గుర్తించిన సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. రౌతు రామ్మూర్తినాయుడు, ఏపీ గ్రంథాలయ పరిషత్ మెంబర్ -
నేటి నుంచి రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు
విజయనగరం: రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు విజయనగరం అతిథ్యమివ్వనుంది. ఈనెల 24,25 తేదీల్లో నగరంలోని రాజీవ్ స్టేడియంలో 42వ రాష్ట్రస్థాయి జూనియర్స్, 8వ క్యాడెట్ తైక్వాండో చాంపియన్షిప్ నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా టోర్నీ నిర్వాహకులు డీవీ చారిప్రసాద్, సుంకరి సతీష్, కలగర్ల రాంబాబు, బుగత శ్రీనివాసరావులు పోటీలకు సంబంధించిన వాల్పోస్టర్ను గురువారం స్టేడియం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా తైక్వాండో అసోసియేన్ అధ్యక్షుడు డీవీ చారిప్రసాద్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహించే పోటీలను 24వ తేదీ సాయంత్రం ప్రారంభించనున్నామన్నారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 250 మంది క్రీడాకారులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పోటీలకు హజరయ్యే క్రీడాకారులకు అవసరమైన భోజన, వసతి సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు 25వ తేదీ సాయంత్రం బహుమతులు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా టోర్నీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులు, క్రీడాభిమానులు పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హాజరుకానున్న 250 మందిక్రీడాకారులు -
తారకరామపై ఎమ్మెల్సీ ప్రశ్నలు
● సమాధానమిచ్చిన మంత్రి రామానాయుడు ● పునరావాస ప్యాకేజీ రూ.172.87 కోట్లు చెల్లించాలినెల్లిమర్ల రూరల్: తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టుపై ఇటీవల శాసన మండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణ రాజు(సురేష్ బాబు) ప్రశ్నల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. నిర్వాసితుల సమస్యలను ఎమ్మెల్సీ మండలిలో లేవనెత్తారు. దీంతో తాజాగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు లేఖ ద్వారా ఎమ్మెల్సీకి సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన బాధితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇస్తామని చెప్పడం వాస్తవం కాదా? అని ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకు.. వాస్తవమేనని, ఏటీ అగ్రహరం, పడాలపేట, కోరాడపేట గ్రామాలకు ప్యాకేజీ కింద రూ.172.87 కోట్లు చెల్లించాల్సి ఉందని మంత్రి లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టులో భాగంగా సారిపల్లి నుంచి మండల కేంద్రానికి వెళ్లే రహదారి మునిగిపోవడం వాస్తవమేనా? అని ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాస్తవమేనని..రెండు చోట్ల రోడ్డు మునిగిపోతుందని..దాని కోసం రోడ్డు అలైన్మెంట్ మార్చినట్లు మంత్రి పేర్కొన్నారు. దీని కోసం 9.2 ఎకరాల భూసేకరణ చేపడుతున్నామని, ఆర్అండ్బీ, పంచాయతీ శాఖలు ఆమోదం తెలిపాయని బదులిచ్చారు. మంత్రి సమాధానాలకు ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు స్పందించారు. నిర్వాసితులకు రావాల్సిన పునరావాస ప్యాకేజీ, అవసరమైన నిధులు ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని కోరారు. భోగాపురం విమానాశ్రయానికి తారకరామ నీటిని మళ్లిస్తామని చెబుతున్నారని, ప్రాజెక్టు పనులు నత్తనడకన కొనసాగితే లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందని ప్రశ్నించారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతం చేయాలని కోరారు. -
అంతర్రాష్ట్ర రహదారికి మోక్షమెప్పుడో..?
ఆర్తాం డౌన్లో గోతుల మయం అవుతున్న అంతర్రాష్ట్ర రహదారికొమరాడ: పార్వతీపురం నుంచి కూనేరు వరకు గల అంతర్రాష్ట్ర రహదారి గోతుల మయం కావడంతో వాహనదారులు త్రీవ ఇబ్బందులు పడుతున్నారు. అయితే తూతూమంత్రంగా మరమ్మతులు చేపట్టారే తప్ప పూర్తిస్థాయి రహదారి పనులు చేపట్టాలని వాహన చోదకులు కోరుతున్నారు. చినుకు పడితే రహదారి చిత్తడి అవుతోంది. ఈ రహదారిపై భారీ వాహనాల రాకపోకలు కొనసాగడంతో ఈ రహదారి మరింత శిథిలమవుతోంది. ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేసి వెంటనే రహదారి పనులు ప్రారంభించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
అసత్యాలు చెప్పేందుకు సిగ్గుపడాలి
జియ్యమ్మవలస రూరల్: అసత్యాలు మాట్లాడేందుకు సిగ్గుపడాలి.. గిరిజన విద్యార్థులు జ్వరాలతో బాధపడుతుంటే సంబంధం లేదా..? వాటికి కారణాలు తెలుసుకుని సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిది?... గిరిజనుల ఓట్లతో గెలిచి కేవలం మంత్రి పదవిని మాత్రమే అనుభవిస్తారా?.. గిరిజన బిడ్డల జ్వరాలపై వ్యంగ్య వ్యాఖ్యలకు తక్షణమే గిరిజనులు, గిరిజన సంఘాలకు క్షమాపణ చెప్పాలని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు. చినమేరంగిలోకి వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల విజయనగరం జిల్లాలో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గిరిజన విద్యార్థులు జ్వరాలతో ఆస్పత్రుల పాలవుతుంటే నివారణ చర్యలు చేపట్టకుండా బాధ్యతలేదంటూ తప్పించుకోవడం తగదన్నారు. గిరిజన, సీ్త్ర శిశుసంక్షేమ శాఖలో మంత్రిగా కొనసాగుతున్నానన్న అధికార అహంకారాన్ని వీడి ఓ గిరిజన మహిళగా ఆలోచించాలని హితవు పలికారు. ఇటీవల కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థులు పచ్చకామెర్ల వ్యాధి బారినపడి ఇద్దరు పిల్లలు మరణిస్తే కనీసం ఆదుకునే చర్యలు చేపట్టకపోవడాన్ని ప్రశ్నించారు. సుమారు 200 మంది బాలికలు పచ్చకామెర్లతో ఆస్పత్రుల పాలయ్యారని, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారన్నారు. స్వపక్షంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా పేదలకు కష్టమొస్తే ఆదుకునే మనిషి జగనన్న అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 750 ఆశ్రమ పాఠశాలల్లో 199 మంది ఏఎన్ఎంల నియామకం జరిగిందని మంత్రి సంధ్యారాణి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, వాస్తవానికి రాష్ట్రంలో 370 ఆశ్రమ పాఠశాలలున్నాయని, 15 జూలై 2023న 199 ఏఎన్ఎం నియామకాలు జరగాయన్నారు. ప్రతి ఆశ్రమ పాఠశాలకు ఒక ఏఎన్ఎంను వేస్తానని మంత్రిగా తొలి సంతకం చేసి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. గిరిజన విద్యార్థులకు అవసరమైన 40 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 30 లక్షల నిధులు ఖర్చు చేశారని, వాస్తవానికి అవి ఇంకుడు గుంతలే తప్ప సెప్టిక్ ట్యాంక్లు నిర్మించలేదని, పైగా 611 మంది విద్యార్థులకు అవి సరిపడవన్నారు. ఓడీఎఫ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి మంజూరైన సంగతి అందరికీ తెలుసన్నారు. అబద్ధాలు చెప్పడంలో ఒకరు జ్ఞాని, ఇంకొకరు విజ్ఞానిగా పేరొందరంటూ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణిలను విమర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు ఎం.శశికళ, పద్మావతి, మండల కన్వీనర్ రమేష్ నాయుడు, వైస్ ఎంపీపీ సంపత్ కుమార్, నారాయణరావు, బలగ వెంకటరమణ, ఈశ్వరరావు, రవణమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. గిరిజన బిడ్డల ఆరోగ్యాన్ని పట్టించుకోరా? జ్వరాలతో బాధపడుతుంటే సంబంధం లేదా? గిరిజనుల ఓట్లతో గెలిచి కేవలం మంత్రి పదవిని మాత్రమే అనుభవిస్తారా? మంత్రి, ప్రభుత్వ విప్ తీరును దుయ్యబట్టిన మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి -
రక్షించండి
రక్త పిశాచాల నుంచి..పార్వతీపురం రూరల్: జిల్లాలో విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలు జ్వరాల బారిన పడి విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. మలేరియా, విషజ్వరాల కేసులు భయపెడుతుండగా, మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర(పీహెచ్సీ) వైద్యుల సమ్మె కారణంగా సరైన వైద్యం అందక గిరిజనులు అల్లాడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో, రక్తపిశాచాలైన దోమల నుంచి తమను, పిల్లలను కాపాడుకోవడానికి దోమతెరలైనా ఇవ్వండని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న తీరు పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వ్యాధుల కట్టడిలో, ప్రజారోగ్య పరిరక్షణలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనడానికి ఈ దుస్థితే నిలువెత్తు నిదర్శనం. నిధుల మంజూరులో నిర్లక్ష్యం ఏజెన్సీలో దోమల విజృంభణను అరికట్టేందుకు 4 లక్షల ‘లాంగ్ లాస్టింగ్ ఇన్సెక్టిసైడల్’ దోమతెరలు కావాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏడాదిన్నర కిందటే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి వాటిని రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. ఆ ప్రతిపాదనలు నేటికీ కాగితాలకే పరిమితం కావడం, ప్రజల ఆరోగ్యంపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తేటతెల్లం చేస్తోంది. అధికారులు ఫైళ్లను ముందుకు కదపకపోవడం, పాలకులు ఒత్తిడి తేలేకపోవడంతో గిరిజనులు దోమలకు బలైపోతున్నారు. కాలం చెల్లిన తెరలతో కరువైన రక్షణ గతంలో ఎప్పుడో పంపిణీ చేసిన దోమతెరల కాలపరిమితి (4–5 ఏళ్లు) ఎప్పుడో తీరిపోయింది. అవి చిరిగిపోయి, వాటి ప్రభావం కోల్పోయి నిరుపయోగంగా మారాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా..ఒక్క దోమతెరనైనా పంపిణీ చేసిన పాపాన పోలేదు. దీంతో చిరిగిన తెరలతోనే కాలం వెళ్లదీస్తూ, మృత్యువుతో నిత్యం సహజీవనం చేయాల్సిన దయనీయ స్థితిలో గిరిజన ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు జిల్లాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అధికారిక లెక్కలే తెలియజేస్తున్నాయి. ఏకంగా 698 గ్రామాలు మలేరియా ప్రభావిత ప్రాంతాలుగా, అందులో 245గ్రామాలు (హైరిస్క్) జాబితాలో ఉన్నట్లు అధికారులే గుర్తించారు. 2024లో 4,08,725 రక్త నమూనాల్లో 2653 మలేరియా కేసులు, 88 హైరిస్క్ గ్రామాలు. కాగా ఈ ఏడాది 2025లో (ఇప్పటివరకు) 4,41,596 నమూనాల్లో 1916కేసులు నమోదు కాగా, గతేడాదికంటే హై రిస్క్ గ్రామాల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. వ్యాధి తీవ్రత పెరుగుతున్నా పాలకుల్లో చలనం లేకపోవడం గిరిజనుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికై నా ప్రభుత్వం కుంభకర్ణుడి నిద్ర వీడి, తక్షణమే 4 లక్షల దోమతెరలను యుద్ధప్రాతిపదికన మంజూరు చేయించి, వాటి వినియోగంపై అవగాహన కల్పించి తమ ప్రాణాలను కాపాడాలని గిరిజన ప్రజానీకం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది.ప్రతిపాదనలు పంపించాం జిల్లాకు కావాల్సిన 4.42 లక్షల దోమ తెరలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. డిసెంబర్ నాటికి వచ్చే అవకాశాలున్నాయి. వచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం. – వై.మణి. జిల్లా మలేరియా అధికారి దోమ తెరలు ఇవ్వండి ప్లీజ్ గిరిజనుల వేడుకోలు ప్రతిపాదనలకే పరిమితమవుతున్న దోమతెరల పంపిణీ జిల్లాలో 698 మలేరియా ప్రభావిత గ్రామాలు ఈ ఏడాదిలో 1916 మలేరియా కేసులు, 245 హైరిస్క్ గ్రామాల గుర్తింపు -
పాలకొండను జిల్లాగా ప్రకటించండి
● కలెక్టర్కు వినతిపత్రం అందజేత పార్వతీపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండను జిల్లాగా ప్రకటించాలని లేకుంటే శ్రీకాకుళం జిల్లాలోనైనా కలపాలని పాలకొండ జిల్లా సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సమితి అధ్యక్షుడు కనపాక చౌదరినాయుడు, జిల్లా కోశాధికారి నానాజీ, మరికొందరు నాయకులు గురువారం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాకు కావాల్సిన అన్ని వసతులు, నైసర్గిక, భౌగోళిక పరిస్థితులు పాలకొండకు ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని పాలకొండను జిల్లాగా ప్రకటించాలని ఈ మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. పంచారామాలకు ప్రత్యేక బస్సులుపాలకొండ: కార్తీకమాసంలో పంచారామాల దర్శనానికి పాలకొండ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేరోజు పంచారామాలను దర్శనం చేసుకునేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తున్నామని తెలియజేశారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఈ దర్శనం కలిగేలా బస్సులు నడుపుతామని వివరించారు. రూ.2,500తో ఈ సౌకర్యం పొందవచ్చునని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఆర్టీసీ డిపోలో సంప్రదించాలని సూచించారు. అంకుళ్లవలసలో ఏనుగుల గుంపుకొమరాడ: మండలంలోని కుమ్మరిగుంట పంచాయతీ అంకుళ్లవలస గ్రామ సమీపంలో గజ రాజుల గుంపు సంచరిస్తోంది. దీంతో కుమ్మరి గుంట, కందివలస, రాజ్యలక్ష్మీపురం తదితర గ్రామాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట ఎవరిపై దాడి చేస్తాయోనని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలను నాశనం చేయడంతో పాటు ప్రాణనష్టం జరుగుతుండడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడినుంచి గజరాజు ల గుంపును తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆశ్రమ పాఠశాల విద్యార్థికి పచ్చకామెర్లు
● ఆస్పత్రిలో చికిత్ససాలూరు రూరల్ /పాచిపెంట: మండలంలోని పీఎన్ బొడ్డవలస డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి దాడి క్రిస్టోఫర్ వాంతులు విరోచనాలతో పాటు పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ గురువారం సాలూరు ఏరియా ఆస్పత్రిలో చేరాడు. పాచిపెంట మండలం తాడూరు గ్రామానికి చెందిన విద్యార్థి తల్లి లక్ష్మి చెప్పిన వివరాల ప్రకారం దసరా సెలవులకు ఇంటికి వచ్చిన పిల్లాడికి పచ్చకామెర్లు సోకడంతో మందులు వాడుతున్నామని అయితే గురువారం వాంతులు, విరోచనాలతో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పాచిపెంట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా అక్కడినుంచి సాలూరు ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేయడంతో తీసుకువచ్చామని తెలిపింది. ప్రస్తుతం ఆ విద్యార్థి వైద్యసేవలు పొందుతున్నాడు. జ్వరంతో చిన్నారుల చేరిక పాచిపెంట మండలంలోని పూడి గ్రామానికి చెందిన గెమ్మెల రేణుక, గెమ్మెల దివ్య ఒకరు ప్రీ స్కూల్, మరొకరు అదే గ్రామంలో 1వ తరగతి చదువుతున్నారు. ఇద్దరికీ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండడంతో గురువారం వారి తల్లి సాలూరు ఏరియా ఆస్పత్రిలో చేర్పించింది. ఆస్పత్రిలో ఇద్దరూ ఒకే మంచంపై వైద్యసేవలు అందుకుంటున్నారు. -
మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు
● అధికారులతో కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డిపార్వతీపురం రూరల్: జ్వరాల సీజన్ దృష్ట్యా జిల్లాలోని మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని మలేరియా నివారణకు నవంబర్ నుంచి జనవరి వరకు ప్రైడే–డ్రైడే కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి ఎంపీడీఓలను ఆదేశించారు. జిల్లాలో డోలీమోతలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే తక్షణ కర్తవ్యమని, ప్రతిరోడ్డులో అంబులెన్స్ వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు రోడ్లు, సర్వే, అనుమతులు నెలరోజుల్లోగా పూర్తి కావాలని, ఆ పనుల బాధ్యత ఎంపీడీఓలదేనని స్పష్టం చేశారు. గురువారం ఆయన అన్ని శాఖల అధికారులతో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మండలాల్లోని పర్యాటక ప్రాంతాలను గుర్తించి స్థానిక గిరిజనులతో కలిసి అభివృద్ధి చేసి వారికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ భూమి, శ్మశాన వాటికల చుట్టూ చింత, నేరేడు వంటి ఆదాయాన్ని ఇచ్చే పండ్ల మొక్కలను పెంచడం ద్వారా పంచాయతీలకు అదనపు ఆదాయాలు సమకూరుతాయన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో సర్పంచ్లను బాధ్యులను చేసి ప్రతినెల సమావేశాలు నిర్వహించాలని, అలాగే ఈ–పంట నమోదు ప్రక్రియ ఈనెల 25 నాటికి 100శాతం పూర్తి కావాలని, ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా దృష్టిసారించాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎం. సుధారాణి, డీఎంహెచ్ఓ డా.ఎస్.భాస్కరరావుతో పాటు జిల్లా అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
గిరిజన బిడ్డల బాగోగులు పట్టించుకోరా?
● మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలను ఖండించిన మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర మెంటాడ: విద్యార్థుల తల్లిదండ్రులు ఓట్లు మంత్రి సంధ్యారాణికి అవసరం... వారి పిల్లల బాగోగు లు, ఆరోగ్య పరిస్థితులు మాత్రం అవసరం ఉండదు... ఇదీ ఆమె తీరు అంటూ మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఎద్దేవా చేశారు. మండలంలోని కొండలింగాలవలసలో బీటీ రోడ్డు శంకుస్థాపనకు హాజరైన మంత్రి ‘విద్యార్థులకు జ్వరమొస్తే నాకేంటి సంబంధం.. అది నా బాధ్యతా’.. అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. గిరిజనుల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పదవి చేపట్టారని, సమస్య లపై ప్రశ్నించిన వారికి సావధానంగా సమాధానం చెప్పాలే తప్ప బాధ్యత లేదని తప్పించుకోవడం సరికాదన్నారు. గిరిజన, విద్యార్థి సంఘాల డిమాండ్ మేరకు మృతుల కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని కోరారు. ప్రతిపక్షనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు అందజేశారని, ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున పైసా కూడా ఇవ్వకపోవడం విచారకరమన్నారు. కేవలం పదవిని మాత్రమే అనుభవించాలని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారా అంటూ మంత్రి సంధ్యారాణిని ప్రశ్నించారు. హాస్టల్స్లో ఉన్న గిరిజన విద్యార్థులు మరణిస్తే ఆ బాధ్యత మీది, మీ ప్రభుత్వానిది కాదా అంటూ నిలదీశారు. గతంలో నూటికో కోటికో ఒకరు చనిపోయినప్పుడు ప్రభు త్వ హత్యలు అని గగ్గోలు పెట్టారు... ఇప్పుడు ఏడాదిన్నరలో ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే 15 మంది విద్యార్థులు చనిపోయారని, ఇవి ప్రభుత్వ హత్యలు కాదా అని ప్రశ్నించారు. ప్రతీ ఆశ్రమ పాఠశాలలకు ఏఎన్ఎంను నియమిస్తామన్న మొదటి సంతకం ఏమైందని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విశాఖ వచ్చి కేజీహెచ్కు వెళ్లి పరామర్శించేందుకు సమయం లేదుగానీ, క్రికెట్ మ్యాచ్ చూడడానికి మాత్రం సమయం ఉందా అని కూటమి ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. -
గురువారం శ్రీ 23 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
విజయనగరం ఫోర్ట్: ఓ వైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ) వైద్యుల సమ్మె... మరోవైపు ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు సేవల నిలిపివేతతో రోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందక అవస్థలు పడుతున్నారు. కొందరు ప్రాణాలు విడుస్తున్నారు. పీహెచ్సీ వైద్యుల సమ్మెతో పల్లె ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నా ఫలితం ఉండడంలేదు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఆవేదన చెందుతున్నారు. ప్రతినెలా అందే 104 వాహన సేవలు కొన్నిచోట్ల నిలిచిపోవడం, మందులు అందకపోవడంతో అస్వస్థతకు గురవుతున్నారు. పీహెచ్సీల్లో ఇన్చార్జి వైద్యులను నియమించినా సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయంటూ రోగు లు, వారిబంధువులు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల ఫార్మసిస్టులు, నర్సులు వైద్యం చేస్తున్నారు. పీహెచ్సీ వైద్యుల సమ్మెతో ఫ్యామిలీ డాక్టర్ సేవలు నిలిచిపోయాయి. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతిరోజు ఒక గ్రామంలో నిర్వహించాలి. ఉదయం వైద్యశిబిరం ఏర్పాటు చేసి అక్కడకు వచ్చే రోగుల కు వైద్య పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన మందులు అందజేయాలి. మధ్యాహ్నం పాఠశాల లు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడ పిల్లలకు పరీక్షించాలి. ఆ తర్వాత పక్షవాతం, ఇతర అనారోగ్యం కారాణాలతో మంచాన పడినవారి ఇంటికి వెళ్లి చికిత్స అందించాలి. వైద్యులు సమ్మెతో ఈ సేవలన్నింటిని ఏఎన్ఎం, స్టాఫ్ నర్సు, పారా మెడికల్ సిబ్బందితో కానిచ్చేస్తున్నారు. దీనిపై పల్లెప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అందని వైద్యం... ఆవేదనలో జనం
బొబ్బిలిరూరల్: వైద్యుల సమ్మెతో గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు వైద్య సేవలు అందడం లేదు. పిరిడి పీహెచ్సీలో బాడంగి ఆయుర్వేద వైద్యురాలిని, విజయనగరం జీజీహెచ్లో ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ చేస్తోన్న మరో విద్యార్థినిని నియమించారు. అయితే, మెరుగైన వైద్యసేవలు అందడంలేదని రోగులు వాపోతున్నారు. ● పక్కి పీహెచ్సీలో బొబ్బిలి ప్రభుత్వాస్పత్రికి చెందిన ఆయుష్ వైద్యులను నియమించారు. వైద్యసేవలు అందకపోవడంతో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య అమాంతం పడిపోయింది. గతంలో ప్రతిరోజు 80 ఓపీ నమోదుకాగా, ఇప్పుడు 20 ఓపీ నమోదవుతోంది. అత్యవసర వేళ ఆస్పత్రికి వచ్చేవారిని కూడా విజయనగరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేస్తున్నారంటూ రోగుల బంధువులు వాపోతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 87 పీహెచ్సీలు ఉన్నాయి. వాస్తవంగా పీహెచ్సీకి ఇద్దరు వైద్యులు ఉండాలి. విజయనగరంలో 50 పీహెచ్సీలకు 100 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా 94 మంది ఉన్నా రు. వీరిలో 71 మంది వైద్యులు సమ్మెలో ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 37 పీహెచ్సీలు ఉండగా వీటిలో సుమా రు 67 మంది వైద్యులు పని చేస్తున్నారు. పీజీ సీట్లలో రిజర్వేషన్, వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ గత నెల 26 నుంచి వైద్యులు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో గత నెలాఖరు నుంచి ఓపీ, అత్యవసర సేవలను సైతం నిలిపివేసి.. సమ్మెలోకి వెళ్లిపోయారు. పీహెచ్సీల్లో సేవలు నిలిచిపోకుండా వైద్యశాఖాధికారులు విజయనగరం, పార్వతీ పురం జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాల, మిమ్స్, ఆయుష్, ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్పై పంపించినా వీరిలో చాలామంది వేర్వేరు స్పెషలి స్టులు కావడంతో మొక్కుబడిగా ఇలా వచ్చి, అలా చూసి వెళ్లిపోతున్నారు. ఫలితంగా రోగులకు సరైన చికిత్స అందడం లేదు. సమ్మె కారణంగా రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏపీవీపీ ఆస్పత్రుల నుంచి 20 మంది వైద్యులను, ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి 15 మంది వైద్యులను నియమించాం. వారు ఆస్పత్రు లకు వెళ్లడం లేదని తెలిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతీ పీహెచ్సీ పరిధిలో ఉన్న ఆయుష్ వైద్యులు సైతం సేవలందిస్తున్నారు. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ -
వైభవంగా పైడితల్లి రథయాత్ర
● జై పైడిమాంబ నినాదాలతో మార్మోగిన పట్టణం ● పైడితల్లి ఇరుముడులతో రథయాత్రలో పాల్గొన్న దీక్షధారులు విజయనగరం టౌన్: మంగళ వాయిద్యాలు, దీక్షధారుల జైపైడిమాంబ.. జైజై పైడిమాంబ జయజయధ్వానాలు, భజనల నడుమ సిరులతల్లి రథయాత్ర బుధవారం వైభవంగా సాగింది. ముందుగా చదురుగుడిలోని ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఆశీనులు చేసి అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజాధికాలు చేశారు. వేకువజామున ఆరు గంటలకు పైడితల్లి ఉత్సవ రథంతో పైడితల్లి దీక్షధారులు యాత్రను ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలస సూపరింటెండెంట్ వై.వి.రమణ ప్రారంభించారు. పులివేషధారుల ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలు, భాజాభజంత్రీల నడుమ కోట, రంజనీ థియేటర్, తోమాల మందిరం, గంటస్తంభం, కన్యకపరమేశ్వరీ ఆలయం, ఎన్సీఎస్ రోడ్డు, గాడీఖానా మీదుగా రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడికి రథయాత్ర చేరుకుంది. రథయాత్రను రోడ్డుకిరువైపులా భక్తులు నిలబడి తిలకించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతర మహోత్సవాల్లో చివరిఘట్టమైన చండీహోమం, పూర్ణాహుతి, దీక్షధారుల దీక్షల విరమణ, తదితర కార్యక్రమాలను వనంగుడిలో వేదపండితులు శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. వనంగుడిలో ఆధ్యాత్మిక శోభ సిరుల తల్లి వనంగుడికి చేరుకునే వేళ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేదపండితులు కొందరు చండీయాగం నిర్వహిస్తుంటే, మరికొంతమంది సూర్యనమస్కారాలు, శక్తి పూజలు, అమ్మవారి ఉత్స విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు చండీయాగంలో పాల్గొని పూర్ణాహుతిని అమ్మవారికి సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు దీక్షధారుల ఇరుముడులను పైడిమాంబ ఆదిపీఠం వ్యవస్థాపకుడు ఆర్.సూర్యపాత్రో నేత్రత్వంలో గురుస్వాములు ఎస్.అచ్చిరెడ్డి, రంజిత్, తదితరులు ఇరుముడి విప్పి దీక్ష విర మింపజేశారు. ఈ సందర్భంగా ఈఓ శిరీష మాట్లాడుతూ ఆరు నెలల పాటు అమ్మవారు వనంగుడిలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్స్కు ఉత్తమ శిక్షణ అందించాలి
విజయనగరం క్రైమ్: కానిస్టేబుల్స్కు ఉత్తమ శిక్షణ ఇవ్వాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన నగర శివారు సారిపల్లి జిల్లా పోలీస్ శిక్షణ కళాశాలను తనిఖీ చేశారు. ట్రెనీ కానిస్టేబుల్స్ శిక్షణకు రానున్న నేపథ్యంలో వసతులను ఎస్పీ పరిశీలించారు. శిక్షణార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ స్పష్టం చేశారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలోని తరగతి గదులను, కార్యాలయం, వంట గది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, వాష్ రూమ్, స్నానపు గదులు, మినరల్ వాటర్ ప్లాంట్, లైబ్రరీ, పరేడ్ గ్రౌండ్, కంప్యూటర్ ల్యాబ్, ఫైరింగ్ రేంజ్ను ఎస్పీ స్వయంగా పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీపీటీసీ డీఎస్పీ ఎం.వీరకుమార్, సీఐలు బి.లలిత, చంద్రశేఖర్, శ్రీనివాసరెడ్డి, జి.గోపాల నాయుడు, ఎస్సైలు రామ్ గణేష్, మురళి, డీపీటీసీ సిబ్బంది పాల్గొన్నారు. సారిపల్లి డీటీపీసీని సందర్శించిన ఎస్పీ -
నిలకడగా ‘తోటపల్లి’
గరుగుబిల్లి: తోటపల్లి ప్రాజెక్టు వద్ద నాగావళి నీటి ప్రవాహం బుధవారం నాటికి నిలకడగా ఉంది. ప్రాజెక్టులోకి 4,685 క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా 5,576 క్యూసెక్కుల నీటిని తిరిగి నదిలోకి విడిచి పెడుతున్నట్టు అధికారు లు తెలిపారు. వరదనీటి ప్రవాహంపై ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామన్నారు. తుఫాన్ నేపథ్యంలో నదీతీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పి.బాల కోరారు. వరి కోతలను తాత్కాలికంగా వాయిదా వేయాలని రైతులకు వ్యవసాయాధికారి జ్యోత్స్న సూచించారు. పార్వతీపురం రూరల్: ఆర్టీసీ కాంప్లెక్స్లో గోడబాంబుల పేలుడు ఘటనలో వాటి తయారీ, రవాణాకు పాల్పడిన నలుగురు నిందితులను కోర్టు ఆదేశాల మేరకు బుధవారం రిమాండ్కు తరలించినట్టు పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గోవింద తెలిపారు. వీరిలో మెంటాడ మండలం ఇద్దనవలసకు చెందిన దాసరి పెంటయ్య (తయారీదారు), ముప్పిడి కాశీరా జు, అల్లాడ రవీంద్ర (రవాణాదారు), కొత్త కోట కిశోర్ (కొనుగోలుదారు) ఉన్నారన్నారు. పార్వతీపురం రూరల్: పరిశ్రమల స్థాపనతోనే నిరుద్యో గ యువతకు ఉపాధి కలుగుతుందని, పరిశ్రమల ఏర్పాటుపై కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో 5 నుంచి 10 యూనిట్లు (పరిశ్రమలు) నెలకొల్పేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభు త్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేక ‘డ్రైవ్’ నిర్వహించాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల కేంద్రం బుధవారం నిర్వహించిన వ్యవస్థాపకత (ఎంటర్ప్రెన్యూర్షిప్) వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఐడీపీని (ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ) మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. పరిశ్రమల స్థాపనతో ఉపాధి అవకాశాలు పెరిగి, యువత నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రతి శాఖకు నోడల్ అధికారిని నియమించడం జరుగుతుందని, మహిళా సంఘాలు, యువతకు అవగాహన కల్పించాలన్నారు. ‘పీఎంఈజీపీ’ (ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం) ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉద్యోగాలు సృష్టించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి కోసం మైక్రో–ఎంటర్ప్రైజెస్లకు ఈ పథకం ఆర్థిక సహాయం అందిస్తుందని వివరించారు. మండల స్థాయి సమావేశాలకు బ్యాంకర్లు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని ఎల్డీఎంను ఆదేశించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ ఎం.వి.కరుణాకర్ మాట్లాడుతూ 18 ఏళ్లు దాటిన విద్యార్హత గలవారు, స్వయం సహాయక సంఘాలవారు కూడా ఈ పథకాలకు అర్హులని తెలిపారు. పరిశ్రమల అనుమతి, దరఖాస్తు వివరాలను వివరించారు. లబ్ధిదారులు తప్పనిసరిగా మూడేళ్లు యూనిట్ను నిర్వహించాలని, ఆ తర్వాతే రాయితీ సొమ్ము వ్యక్తిగత ఖాతాకు జమ అవుతుందని స్పష్టం చేశారు. కొత్త పరిశ్రమలను ‘ఉద్యమ్’లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కౌశల్–2025 జిల్లా కో ఆర్డినేటర్గా బంగారయ్య నెల్లిమర్ల: సైన్స్ ప్రతిభ పరీక్ష కౌశల్–2025 జిల్లా కోఆర్డినేటర్గా శివుకు బంగారయ్య నియ మితులయ్యారు. ఆయన జరజాపుపేట ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. నవంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు పాఠశాల స్థాయి పోటీలు, 27, 28 తేదీల్లో జిల్లాస్థాయి పోటీలు జరుగుతాయని బంగారయ్య తెలిపారు. -
తండ్రికి ఐదేళ్ల జైలు
విజయనగరం క్రైమ్: గతేడాది జిల్లాలోని బొబ్బిలి పోలీస్స్టేషన్ పరిధిలో కన్నకూతురిపై లైంగిక దాడికి యత్నించిన కేసులో ముద్దాయి అయిన తండ్రికి ఐదేళ్ల జైలు శిక్ష పడినట్లు ఎస్పీ దామోదర్ బుధవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలిలోని ఇందిరమ్మ కాలనీలో ఉంటున్న కాసా నరసింగరావు (42) 2024 జులై 19 వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రలో ఉన్న తన 11 ఏళ్ల కూతురిపై లైంగిక దాడికి యత్నించినట్లు బాలిక అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి సీఐ ఎం.నాగేశ్వరరావు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. అనంతరం ఆ కేసును ప్రస్తుత బొబ్బిలి సీఐ కె.సతీష్ కుమార్ కేసు దర్యాప్తు చేపట్టి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి ముద్దాయికి 5 ఏళ్ల కారాగార శిక్ష రూ.2,00 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి పరిహారంగా రూ.50 వేలు మంజూరు చేస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారన్నారు. -
ఆడబిడ్డ నిధి అందదా?
వీరఘట్టం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 18 నుంచి 59 ఏళ్ల లోపు వయస్సు మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసి ప్రతి మహిళకు నెలకు రూ.1500 నేరుగా ఖాతాలో జమ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రతి బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఆ మాటలు నమ్మి చాలా మంది అక్కచెల్లెమ్మలు ఓటేశారు. అయితే ఏం లాభం? కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు కావొస్తున్నా..ఆడబిడ్డ నిధి పథకం అమలుపై మంత్రి వర్గ భేటీలో ఇంతవరకు ఒక్కసారి కూడా చర్చకు రాలేదు. అంటే ఈ పథకం కూడా గాలిలో కలిపేసినట్లేనా అని మహిహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హామీలు విస్మరించడం వెన్నతో పెట్టిన విద్య ఎప్పడు అధికారంలోకి వచ్చినా ఎన్నికల హామీలను తుంగలో తొక్కడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాకుండా సంక్షేమ పథకాల అమలులో కూడా తూతూమంత్రంగా అమలు చేసి అనుకూల మీడియాలో ఆహా ఓహో బ్రహ్మండంగా రాయించుకోవడంలో ఆయనకు మించిన సిద్ధ హస్తుడు మరెవరూ ఉండరు. ప్రభుత్వం తీరు చూస్తే ఆడబిడ్డ నిధిని గంగలో కలిపేసినట్లేనని జిల్లా మహిళలు అభిప్రాయపడుతున్నారు. గతంలో మహిళల జీవనోపాధికి అండ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళల జీవనోపాధికి పెద్దపీట వేశారు. అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, కాపునేస్తం, సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూత లాంటి పథకాలన్నింటినీ నేరుగా మహిళల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసి వారి ఆర్ధికాభివృద్ధికి అండగా నిలిచారు. మహిళల చేతికి చేరిన నగదు వృథా కాకుండా ఇంటి అవసరాలకే ఉపయోగపడుతుందని భావించి అనేక పథకాల డబ్బును మహిళల ఖాతాల్లోనే జమ చేశారు.రూ.573 కోట్లు బకాయి.. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 3,09,425 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 60 ఏళ్లు పైబడిన వారిని మినహాయిస్తే 2024 అక్టోబర్ నాటి లెక్కల ప్రకారం 59 ఏళ్ల లోపు వారు 2.25 లక్షల మంది ఉన్నారు. వారికి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1500 చొప్పున చెల్లిస్తే నెలకు రూ.33.75 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.ఈ లెక్కన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలలకు రూ.573.75 కోట్లు చెల్లించాల్సి ఉంది.ఈ నగదు ఎప్పుడు చెల్లిస్తారని మహిళలు ప్రశ్నిస్తున్నారు.ఈ మెత్తాన్ని ఒకే విడతలో చెల్లించడంతో పాటు రాబోయే రోజుల్లో ప్రతినెలా రూ.1500 చెల్లించాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. 17 నెలలు గడుస్తున్నా అమలుకు నోచుకోని పథకం ప్రతినెలా రూ.1500 చొప్పున అందిస్తామని మోసం గత ఎన్నికల్లో ఓటు వేసిన జిల్లాలో మహిళలు 3,09,425 మంది వారిలో 59 ఏళ్లలోపు మహిళలు 2.25 లక్షల మంది మహిళలకు చెల్లించాల్సిన బకాయి రూ:573.75 కోట్లు -
రోడ్డు ప్రమాదంలో జూనియర్ అసిస్టెంట్ మృతి
● అటెండర్కు గాయాలు ● రెండు బైక్లు ఢీకొనడంతో ప్రమాదం తెర్లాం: మండలంలోని చుక్కవలస గ్రామం వద్ద బుధవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో నెమలాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కె.శ్రావణ్కుమార్(33)మృతి చెందారు. ఈ ప్రమాదంలో అదే పాఠశాలలో అటెండర్గా పనిచేస్తున్న రమణమ్మకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించి తెర్లాం ఎస్సై సాగర్బాబు తెలిపిన ప్రకారం వివరాలి లా ఉన్నాయి. రాజాం నుంచి నెమలాం వైపు, బూరిపేట నుంచి రాజాం వైపు వస్తున్న రెండు మోటారు సైకిళ్లు చుక్కవలస మలుపు వద్ద బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రావణ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, మోటార్ సైకిల్ వెనుక కూర్చున్న మహిళ గాయపడింది. గాయపడిన మహిళను రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రాణం ఉందేమో అన్న అనుమానంతో శ్రావణ్కుమార్ను పెరుమాళి పీహెచ్సీకి తీసుకువచ్చారు. అక్కడి సిబ్బంది చూసిన వెంటనే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎస్ఐ సాగర్బాబు సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. భోరున విలపించిన భార్య, కుటుంబసభ్యులు పాఠశాలకు వెళ్లి వస్తానని చెప్పి మోటార్ సైకిల్పై వెళ్లిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడన్న విషయం తెలిసిన వెంటనే శ్రావణ్కుమార్ భార్య నారాయణమ్మ పెరుమాళి పీహెచ్సీ వద్దకు వచ్చి భర్త మృతదేహాన్ని చూసి భోరున విలపించింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి ఎనిమిదేళ్ల కుమారుడు సాయి శ్రావణ్ ఉన్నాడు. ఆస్పత్రికి చేరుకున్న ఎంఈఓ, ఉపాధ్యాయులు నెమలాం హైస్కూల్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రావణ్కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న ఎంఈఓ త్రినాథరావు, నెమలాం హైస్కూల్ హెచ్ఎం సంగమేశ్వరరావు, యూటీఎఫ్ అధ్యక్షుడు మునిస్వామి, పలువురు ఉపాధ్యాయులు పెరుమాళి పీహెచ్సీకి వచ్చి శ్రావణ్కుమార్ భార్య, కుమారుడిని, కుటుంబ సభ్యులను ఓద్చారు. ఈ సంఘటనకు సంబంధించి మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై సాగర్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి తరలించారు. -
పంటలు ధ్వంసమవుతున్నా పట్టించుకోరా?
● ఏనుగుల బాధిత రైతుల ఆవేదన కొమరాడ: ఏనుగుల గుంపు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లడం లేదు, పంటలు పోతున్నా కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి వేలాది రూపాయలు పెట్టబడి పెట్టి చెమటోడ్చి పండించిన పంట చేతికి వచ్చిన సమయంలో కళ్ల ముందే పాడవుతోందంటూ అన్నదాత అవేదన వ్యక్తం చేస్తున్నాడు. 2018లో వచ్చిన ఏనుగుల గుంపు ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో పంటనష్టం చేసినా కనీసం రూపాయి నష్టపరిహారం అందడం లేదని రైతులు వాపోతున్నారు, మంగళవారం రాత్రి కొమరాడ మండలంలోని కుమ్మరిగుంట పంచాయతీ రావికర్రవలస పరిధిలో షణ్ముఖ్ రెడ్డికి సంబంధించిన జామతోటలో ఉన్న మోటారుతో పాటు పైపులను ఏనుగులు ధ్వంసం చేశాయి. అలాగే వరి పంటను తొక్కి నాశనం చేయడంతో ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికై నా అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులు గుంపును ఈ ప్రాంతం నుంచి తరలించి రైతులకు నష్టపరిహారం అందజేయాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. -
జాతీయస్థాయిలో విజయనగరం కళాకారుల కీర్తి
విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలోని తెనాలిలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు వీణ అవార్డుల ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పౌరాణిక పంచమ పద్య నాటక పోటీల్లో విజయనగరం కళాకారులు అద్భుత విజయం సాధించారు. విజయనగరం అక్కినేని సాంస్కతిక సమాజం తరఫున దర్శకుడు గవర సత్తిబాబు బృందం ప్రదర్శించిన మోహినీ భస్మాసుర నాటకం నాలుగు విభాగాలలో బహుమతులు గెలుచుకుని, ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా నిలిచి ప్రేక్షకులను, న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ, మన జిల్లాకు చెందిన కళాకారులు జాతీయస్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమన్నారు. అదేవిధంగా శ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘‘ఆదికవి నన్నయ్య భట్టు’’ నాటకం ఉత్తమ ప్రదర్శన అవార్డు సాధించడం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్ల గోపాలరావు మాట్లాడుతూ, విజయనగరం కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారని ప్రశంసించారు. తెనాలిలో పాల్గొన్న ఇతర కళాకారులూ వారిని ప్రశంసించారు. ప్రథమ, ద్వితీయ శ్రేణి బహుమతులు రెండూ మన జిల్లాకు రావడం గర్వకారణమన్నారు. ఈ విజయోత్సవ సభలో బహుమతులు పొందిన కళాకారులు గవర సత్తిబాబు, దాసరి తిరుపతి నాయుడు, కంది త్రినాథ్, కేవీ పద్మలను అతిథులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ కళాకారులు చల్లా రాంబాబు, ధవళ సర్వేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, పెద్దింటి అప్పారావు, రౌతు వాసుదేవరావు, అబ్బులు తదితరులు పాల్గొన్నారు. -
జ్వరాలపై అప్రమత్తం
● వైద్యాధికారులకు మంత్రి సంధ్యారాణి ఆదేశాలుపార్వతీపురం రూరల్: జిల్లాలో జ్వరాలు ప్రబలకుండా వైద్యులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వైద్యాధికారులను ఆదేశించారు. వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ పిల్లలు ఆస్పత్రికి వెళ్లే ముందే తగిన చర్యలు చేపట్టాలన్నారు. అలాగే వసతి గృహ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు వారానికి ఒకసారి కాకుండా రెండుసార్లు చేయాలని, 199 గురుకులాలు, 750 ఆశ్రమ పాఠశాలలకు ఏఎన్ఎంలు వెళ్లి పరీక్షించాలని, పీహెచ్సీ వైద్యులు తప్పకుండా ప్రతి వసతిగృహాన్ని సందర్శించి, మందులు అందుబాటులో ఉంచాలని, వసతి గృహాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని, మౌలిక వసతులు, తాగునీరు (ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులు) పక్కాగా ఉండాలని మంత్రి ఆదేశించారు. జేసీకి మంత్రి సత్కారంఅనంతరం రాష్ట్రంలో ఉత్తమ ఐటీడీఏగా ఎంపికై న పార్వతీపురం తరఫున జేసీ, ఇన్చార్జి పీఓ యశ్వంత్ కుమార్ రెడ్డిని మంత్రి ఈ సందర్భంగా సత్కరించారు. అభివృద్ధి కార్యక్రమాలు, ఆదికర్మయోగి అమలు తీరును కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్ది మంత్రికి వివరించారు. సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
శ్మశానాల రోడ్ల కోసం ఉపాధి నిధులతో ప్రతిపాదన
● విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశంలో కలెక్టర్ విజయనగరం అర్బన్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కాలనీలకు, శ్మశానాలకు రహదారుల సౌకర్యం కల్పించేందుకు ఉపాధి హామీ నిధులతో ప్రతిపాదనలు రూపొందించి ప్రణాళికలో పెట్టాలని డ్వామా అధికారులకు కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి సూచించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హౌస్ హోల్డ్ సర్వేలో ఎస్సీ కులాల వారిని బీసీకులాల వారిగా నమోదు చేయడంతో వారికి అందవలసిన లబ్ధి అందకుండా పోతోందని సభ్యుడు బసవ సూర్యనారాయణ కలెక్టర్కు విన్నవించుగా ఎడిట్ ఆప్షన్ కోసం ప్రభుత్వానికి లేఖ రాస్తామని, ఆప్షన్ మార్చడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ వసతిగృహాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం, రక్షిత తాగునీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని డైలీ పర్యవేక్షణ ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో నమోదైన 35 అట్రాసిటి కేసులకు గాను రూ.42 లక్షల 79 వేలు పరిహారంగా చెల్లించినట్లు కలెక్టర్ తెలపగా పరిహారం త్వరగా అందించినందుకు సభ్యులు జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ప్రతినెలా పౌర హక్కుల దినం గ్రామాల మధ్యలో జరగాలని, ఇందులో పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొని ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై అవగాహన కలిగించాలని కలెక్టర్ సూచించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో 20 కేసులు నమోదైనట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ రఘురాజు, డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, సోషల్ వెల్ఫేర్ డీడీ వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు, డీఎస్పీలు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడాపోటీలకు మిశ్రమ స్పందన
● ఎమ్మెల్యే రాక ఆలస్యంతో క్రీడాకారులకు తప్పని ఇక్కట్లు భోగాపురం: మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడా పోటీలకు మిశ్రమ స్పందన లభించింది. పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం నుంచి క్రీడాకారులు ఉదయం తొమ్మిది గంటలకే వచ్చి మైదానంలో కూర్చుని ఎమ్మెల్యే లోకం నాగమాధవి రాక కోసం వేచి చూశారు. అయితే ఎంతసేపటికీ ఎమ్మెల్యే రాకపోవడంతో క్రీడాకారులు మైదానాన్ని వీడి బయటకు వెళ్లిపోతుండడంతో వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులను బుజ్జగించి మైదానంలో కూర్చోబెట్టారు. ఎమ్మెల్యే పదకొండున్నర గంటలకు (రెండున్నర గంటల ఆలస్యంగా) వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో అండర్–17 స్కూల్ గేమ్స్ వాలీబాల్ క్రీడా పోటీలు పన్నెండు గంటలకు ప్రారంభమై హోరాహోరీగా కొనసాగాయి. ఈ పోటీల్లో 150 మంది బాలురు, 100 మంది బాలికలు పాల్గొని సత్తా చాటారు. వారిలో విశేష ప్రతిభ కనబరిచిన 12 మంది బాలురు, 12 మంది బాలికలను రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్కు ఎంపిక చేసినట్లు జిల్లా స్కూల్గేమ్స్ సెక్రటరీలు గోపాల్, విజయలక్ష్మి తెలిపారు. వారు ఈ నెల 27, 28, 29 తేదీలలో ఈస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరులో జరగబోయే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు రాజు (చిన్నారి), సింగిడి నాగన్న, తహసీల్దార్ రమణమ్మ, ఎంపీడీఓ స్వరూపరాణి, ఎంఈఓ రమణమూర్తి, గ్రామ పెద్దలు, మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కార్తీకమాస పూజలకు వేళాయె..
నెల్లిమర్ల రూరల్: భక్తులు పరమపవిత్రంగా భావించే కార్తీకమాసం రానే వచ్చేసింది. బుధవారం నుంచి నెల రోజుల పాటు అంతటా ఆధ్యాత్మిక శోభ సాక్షాత్కరించనుంది. దీంతో మండల వ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలు పూజలకు సిద్ధమయ్యాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీసీతారామస్వామి దేవస్థానంలో ప్రత్యేక క్యూలైన్లను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ క్షేత్ర పాలకుడిగా విరాజిల్లుతున్న ఉమాసదాశివ ఆలయం కార్తీకమాస పూజలకు ముస్తాబైంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన పారసాం శివాలయం, వెయ్యేళ్ల నాటి సారిపల్లి దిబ్బేశ్వరస్వామి ఆలయం, జోగిరాజుపేట శివాలయం సహా బూరాడపేట, సతివాడ, ఒమ్మి, సారిపల్లి తదితర గ్రామాల్లోని శివ మందిరాలను కార్తీకమాస పూజలకు అందంగా ముస్తాబు చేశారు. భక్తుల దైవదర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బందోబస్తు, పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఐ గణేష్ తెలిపారు. -
ఎవరిదీ నిర్లక్ష్యం?
పార్వతీపురం రూరల్: పొట్టకూటి కోసం కాంప్లెక్స్కు వచ్చిన వారు ఒకరు.. డ్యూటీలో భాగంగా బస్సు నడిపిన వారు మరొకరు.. రిక్షా సవారీ కోసం ఇంకొకరు.. వేరే పనిమీద మరొకరు... పార్వతీపురం కాంప్లెక్స్లో ఆదివారం మందుగుండు సామగ్రి పేలుడు ఘటనలో గాయపడ్డారు. ఆ ప్రమాదంతో వీరికి ఎలాంటి సంబంధం లేదు. కానీ గాయాలపాలై ఆస్పత్రుల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. విజయనగరంలో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా, వ్యవస్థను మోసం చేస్తూ పేలుడు పదార్థాలను ఫ్యాన్సీ ఐటెమ్స్పేరుతో పార్సిల్ చేయడం, వాటిని పరిశీలించే నిఘా వ్యవస్థ ఆర్టీసీలో లేకపోవడమే దీనికి ప్రధాన కారణమన్నది బాధితులు, ప్రయాణికుల ప్రధాన ఆరోపణ. ఆదాయం వస్తుందనే ఆశే తప్ప ఆర్టీసీలో భద్రతాపరమైన అంశాలపై దృష్టిసారించేవారే లేరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విజయనగరంలో ట్రాన్స్పోర్టు సర్వీసు నిర్వహిస్తున్న రవీంద్ర అనే వ్యక్తి పంపిన పార్సిల్ నలుగురిని తీవ్రంగా గాయపరించింది. వారి కుటుంబాల్లో కల్లోలం నింపింది. నిర్లక్ష్యం కాదా? ఆర్టీసీ కార్గో వ్యవస్థలోని నిలువెత్తు నిర్లక్ష్యం, డబ్బుకోసం మానవ ప్రాణాలను గడ్డిపోచకంటే హీనంగా చూసిన నేర పూరిత అలసత్వం ఈ నలుగురికి అమాయకులను రక్తపు మడుగులో పడేసిందన్న విమర్శలు ప్రస్తుతం వెల్లువెత్తుతున్నాయి. ఇది ప్రమాదం కాదు. వ్యవస్థ చేసిన హత్యాయత్నమని పలువురు పేర్కొంటున్నారు. ప్రయాణికుల బస్సు ల్లో ప్రమాదకర పేలుడు పదార్ధాలు తరలించరాదన్నది కఠిన నిబంధన. కానీ ఆర్టీసీ కార్గో సిబ్బందికి ఆ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. కాసుల మీద ఉన్న యావ ప్రయాణీకుల ప్రాణాలపై లేకపోయింది. విజయనగరంలో రవీంద్ర అనే వ్యక్తి రోజూ 20 పార్సిల్ వరకు పంపుతాడని, తమకు తెలిసిన వ్యక్తే అని సిబ్బంది చెప్పడమే వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఫ్యాన్సీ సామగ్రి అంటే చెబితే చాలు, అందులో ప్రాణాలు తీసే బాంబులున్నాయా, మరేదైనా ఉందా అని చూసే తీరిక, బాద్యత వారికి లేకపోయింది. 25 కిలోల బరువున్న పేలుడు పదార్థాలను నిఘా వ్యవస్థ ఎలా గాలికొదిలేసింది? ప్రయాణికుల ప్రాణాలంటే ఇంత చులకనా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. క్షణం తేడా జరిగితే ఊహకే అందని ప్రమాదం ప్రమాదం జరిగిన రోజు ఆదివారం మధ్యాహ్నం 12.55 గంటల సమయంలో కాంప్లెక్స్ రద్దీగా ఉంది. ఆ పార్సిల్ను బస్సు దిగిన క్షణాల్లోనే కిందను పెట్టే క్రమంలో పేలింది. విజయనగరం నుంచి పార్వతీపురం వరకు పలువురు ప్రయాణికులతో ఆ బస్సు దాదాపు రెండు గంటలకు పైగా ప్రయాణించింది. దారిలో ఎన్నో కుదుపులు. ఆ కుదుపులకు ఈ పార్సిల్ అటూ, ఇటూ కదిలి బస్సులోనే పేలి ఉంటే ఆ మృత్యుఘోష ఊహించడానికే గుండె తరుక్కుపోతుంది. కేవలం అదృష్టం మాత్రమే ఆ పెను విపత్తును ఆపింది. కానీ ఆ అదృష్టం శ్రామికులను కనికరించలేదు. కార్గో అధికారుల నిర్లక్ష్యం.. రవీంద్ర ఈ సారి కూడా ఫ్యాన్సీ సామగ్రి పేరుతో పార్సిల్ బుక్చేశాడని, అందుకే అనుమానం కలగలేదని కార్గో అధికారి డీఎస్ఎస్ ఎన్.రాజు చెప్పారు. అయితే ఫ్యాన్సీ సామగ్రి పేరిట పేలుడు పదార్థాలను అనుమతించడం ఆర్టీసీ వ్యవస్థలోని లోపాలను, సిబ్బంది నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపింది. పేలుడు పదార్థాలు విజయనగరంలో తయారు చేసినవిగా పోలీసులు భావిస్తున్నారు. పేలుడు స్థలం వద్ద లభించిన రాళ్లు దీపావళి గోడ టపాసులకు భిన్నంగా, పరిమాణంలో పెద్దవిగా ఉన్నాయి. ఇవి నాటు బాంబుల తయారీకి వాడే రాళ్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నాటు బాంబుల తయారీదారు స్థావ రం విజయనగరం సమీపంలోని కొండకరకాం అని తేలింది. నిత్యం సరుకు పంపిణీ చేసే బుకింగ్దారుడు రవీంద్ర ఈ ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా గతంలోనూ పలు ప్రాంతాలకు పేలుడు పదార్థాలను సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు సమాచారం. ఈ క్రమంలో పార్వతీపురంలో పేలుడు జరిగిన వెంటనే చీపురుపల్లి సమీపంలో పోలీసులు మరో అనుమానాస్పద పార్సిల్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదుకోవాలి పేలుడు ఘటనకు ఆర్టీసీ కార్గో అధికారుల నిర్లక్ష్యమే కారణమని, బాధితులను కార్గో సర్వీసు యాజమాన్యం ఆదుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పార్వతీపురం కలెక్టరేట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ హమాలీలతో కలిసి మంగళవారం ఆందోళన చేశారు. అనంతరం కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. వ్యవస్థాగత లోపంతో నిద్రపోతున్న నిఘా బస్సులో పేలివుంటే ఊహకే అందని ఘోరం దర్యాప్తులో నాటుబాంబుల కోణం! ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్సపొందుతున్న రెడ్డి రమేష్(హమాలీ) పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు దాటికి ఆయన అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రెండు కళ్లు, ఎడమ కాలు జీవితాంతం నష్టపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారంటూ కుటుంబ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. కొన్నేళ్ల కిందట భార్యను కోల్పోయిన రమేష్ తన చెల్లి సాయంతో హమాలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కింతలి రమేష్(వ్యాన్ డ్రైవర్)కు పలు శస్త్రచికిత్సలు చేసి శరీరం నుంచి పేలుడు సమయంలో లోపలకు చొచ్చుకెళ్లిన రాళ్లను బయటకు తీశారు. పలు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉందని, దాదాపు రూ.12 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో ఇద్దరు ఆడపిల్లలు తండ్రి అయిన ఆయనతో పాటు భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయన ప్రస్తుతం విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్గా కుటుంబాన్ని పోషిస్తున్న తెర్లి రవి కోలుకోవడానికి నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబం తల్లడిల్లుతోంది. జీవనానికి పెద్ద దిక్కు అయిన రవి పేలుడు ఘటనలో ప్రమాదానికి గురవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాలిన గాయాలతో కుడి కాలుకు తీవ్రగాయాలైన బోనెల సుందరరావు (రిక్షా కార్మికుడు) ప్రస్తుతం పార్వతీపుంర జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రిక్షా తొక్కుతూ జీవనాన్ని సాగిస్తున్న ఈయనకు ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
కూటమి పాలనా వైఫల్యాలపై గళమెత్తాలి
● నవంబర్ 20లోగా మండల, గ్రామ, వార్డు స్థాయి కమిటీలు పూర్తి చేయాలి ● వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర యువజన విభాగం సమీక్షలో నేతల పిలుపు సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వపాలనా వైఫల్యాలపై గళమెత్తాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా యువజన విభాగం పోరాడాలని, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఎండాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అదీప్రాజ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉత్తరాంధ్ర యువజన విభాగం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి యువజన విభాగం ఉత్తరాంధ్ర జోనల్ ఇన్చార్జి అంబటి శైలేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, ఉత్తరాంధ్ర జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు హాజరయ్యారు. తొలుత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదీప్రాజ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. రానున్న రోజుల్లో గ్రామ, మండల యువజన విభాగం కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి, పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని కోరారు. మీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని.. వారి సూచనలు, సలహాల మేరకు యువజన విభాగ కమిటీలను వేగంగా పూర్తిచేయాలని సూచించారు. అంబటి శైలేష్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మండల, గ్రామ, వార్డు స్థాయిలో యువజన విభాగ కమిటీలను నవంబర్ 20 లోపు పూర్తి చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలే లక్ష్యంగా మీ పరిధిలో సమస్యలు, ప్రజా సమస్యలపై పోరాడి.. వాటిని ప్రభుత్వం పరిష్కరించే వరకూ శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగించాలని తెలిపారు. రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని, ప్రధానంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, యువతకు ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేసిందని ఆరోపించారు. వీటిపై పోరాటం చేయడంలో యువజన విభాగం ఎప్పుడూ ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అల్లు అవినాష్(విజయనగరం), పుల్లేటి వెంకటేష్(అనకాపల్లి), శరత్బాబు(పార్వతీపురం), పృథ్వీరాజ్(శ్రీకాకుళం), గాబడి శేఖర్(అల్లూరి), తదితరులు పాల్గొన్నారు. -
ఉయ్యాలో.. ఉయ్యాలా..
● నేత్రపర్వంగా పైడితల్లి ఉయ్యాల కంబాల మహోత్సవం ● అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు విజయనగరం టౌన్: భక్త కోటికి సిరులిచ్చే చిన్నారి పైడిమాంబ ఉయ్యాల కంబాల ఉత్సవం మంగళవారం రాత్రి వైభవంగా సాగింది. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. చదురుగుడి ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన ఉయ్యాల చుట్టూ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మూడుసార్లు ప్రదక్షణ చేశారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ఉత్సవ విగ్రహాన్ని పట్టుకుని ఊయలలో ఆశీనులై అమ్మవారి ఉయ్యాలకంబాల ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం సిరిమానుతో పాటు తెచ్చిన రాటకు మూడుసార్లు గొడ్డలి ఆనించి ఊయలను తీసివేశారు. దీంతో అమ్మవారి జాతరకు ముగింపు పలికినట్లేనని, వనంగుడి వద్ద బుధవారం నిర్వహించే చండీహోమం పూర్ణాహుతితో జాతర ముగుస్తుందని అర్చకులు తెలిపారు. ఉత్సవం పూర్తయిన తర్వాత అమ్మవారిని మేళతాళాలతో వనంగుడికి తీసుకువెళ్లనున్నారు. అమ్మవారు వనంగుడిలోనే ఆరు నెలల పాటు భక్తులకు దర్శనమిస్తారు. కార్యక్రమానికి ముందు ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష మాట్లాడుతూ సెప్టెంబర్ 9న పందిరిరాటతో ప్రారంభమైన నెలరోజుల జాతర మహోత్సవాలు ఈ నెల 22న వనంగుడిలో నిర్వహించే దీక్షా విరమణలతో పూర్తవుతాయని వివరించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వై.వి.రమణి, సూపర్వైజర్లు రామారావు, పెనుమత్స శ్రీనివాసరాజు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
చెరువును కాపాడుకుందాం
పార్వతీపురం రూరల్: మండలంలోని బాలగుడబ గ్రామంలో ఉన్న తూర్పుకోనేరు చెరువులో వ్యర్థాలను గ్రామ యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బయటకు తీసి చెరువును శుద్ధి చేశారు. స్థానిక సర్పంచ్ ప్రతినిధి, వైఎస్సార్సీపీ నాయకుడు బి.పండు ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యావరణ పరిశుభ్రత కార్యక్రమంలో స్థానిక యువత పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా పండు మాట్లాడుతూ అప్పట్లో గ్రామంలోని గ్రామస్తులంతా తూర్పుకోనేటిలో నీటినే తాగేవారని బాద్యతగా ప్రతి ఒక్కరూ గ్రామానికి నీటి వనరైన చెరువులను కాపాడుకోవాలని ఈ మేరకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరిస్తూ వ్యర్థాలు వంటివి చెరువులో వేయకుండా ఉండాలని పిలుపునిచ్చారు. ఘనంగా దీపావళి సంబరాలుబలిజిపేట: మండలంలోని గ్రామాల్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నివాసగృహాల్లో మహిళలు లక్ష్మీదేవి పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమరించారు. సాయంత్రం సమయంలో ఇంటింటా దీపాలు వెలిగించి మందుగుండు సామగ్రిని కాల్చి సంబరాలు జరుపుకున్నారు. చిన్నారులు కాకరపువ్తొత్తులు, మతాబాలు, తెల్లని కాంతులు విరజిమ్మే చిచ్చుబుడ్లు వెలిగించారు. -
మరువలేనివి
అమరుల త్యాగాలు..పార్వతీపురం రూరల్: అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్మృతి స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. సాయుధ బలగాల సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ. ధర్మాన్ని కాపాడే క్రమంలో పోలీసులు ప్రాణాలు పణంగా పెడుతున్నారని కొనియాడారు. ఏఎస్పీ అంకిత సురానా విధి నిర్వహణలో అసువులు బాసిన 191 మంది అమరవీరుల పేర్లను చదివి వినిపించారు. అనంతరం అమరవీరుల కుటుంబసభ్యులను అధికారులు పరామర్శించి, పండ్లు, నగదు అందజేసి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర డీఎస్పీలు, సీఐలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం విజయనగరం క్రైమ్: పోలీస్ అమరవీరుల త్యాగా లు అజరామరం. వారి జీవితం స్ఫూర్తిదాయకమని ఎస్పీ దామోదర్ కొనియాడరు. ఈ మేరకు స్థానిక పోలీస్ బ్యారెక్స్ లోని ‘స్మృతి వనం‘లో మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ దేశంలో మావోయిజం తీవ్రంగా ఉన్న సమయంలో దేశ అంతర్గత భద్రత కోసం, తీవ్రవాద కార్యక్రమాలను అరికట్టేందుకు ఎంతోమంది పోలీ సు అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించారని కొనియాడారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న పోలీసులు, పారా మిలటరీ దళాలు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మా వోయిస్టులు, తీవ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులతో వీరోచిత పోరాటం చేసిన కారణంగా తీవ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టి, నేడు మనమందరం స్వేచ్ఛగా, శాంతియుతంగా జీవించే అవకాశం కలిగిందన్నారు. ఈ పోరాటంలో ప్రాణాలను కోల్పోయిన పోలీసు కుటుంబాలకు తమప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని, వారి కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎంతో ధైర్య, సాహసాలతో విధులు నిర్వహించి మావోయిస్టుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయి అమరులైన ముద్దాడ గాంధీ, చిట్టిపంతులు చిరంజీవి, షేక్ ఇస్మాయిల్, బి.శ్రీరాములు, ఎస్.సూర్యనారాయణల త్యాగాల ను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నామని ఎస్పీ దామోదర్ అన్నారు.అంతకుముందు అమరులైన 191 మంది పోలీసుల వివరాలతో కూడిన పుస్తకాన్ని ఎస్పీ ఆవిష్కరించారు. విధులు నిర్వహిస్తూ, తీవ్రవాదుల దాడుల్లో మృతి చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన కలెక్టర్ రామ్సుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఎం.బబిత, జిల్లా అదనపు న్యాయమూర్తి మీనాదేవి, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి, కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కెప్టెన్ ఎస్.ఎస్.శర్మ, స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, రాష్ట్ర తూర్పు కాపు చైర్మన్ పాలవలస యశస్వి, అదనపు ఎస్పీ సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి. నాగేశ్వరరావులు పోలీసు అమర వీరుల స్థూపం వద్ద పుష్పాలను సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు పరేడ్ నిర్వహించగా, పోలీసులు తుపాకుల గాలిలో పేల్చి అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని, విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరిస్తూ, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చెళ్లపిళ్ల సుజాత వ్యవహరించారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు, చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, డీటీసీ డీఎస్పీ ఎం.వీరకుమార్, ఏఆర్ డీఎస్పీ ఈ.కోటి రెడ్డి, ఏఓ శ్రీనివాసరావు, పలువురు సీఐలు, ఆర్ఐలు, డీపీఓ పర్యవేక్షకులు టి.రామకృష్ణ, వెంకటలక్ష్మి, పోలీసు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు సీఐలు ఆర్వీఆర్కే.చౌదరి, శ్రీనివాస్, లక్ష్మణ రావు, ఎస్బీ సీఐలు లీలారావు,అంబేడ్కర్, ఎస్సైలు దుర్గాప్రసాద్, మురళి ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. -
ఊరు పేరు మాదే.. జిల్లా పేరు అడగొద్దు!
● రేషన్ ‘స్మార్ట్’ కార్డుల్లో తప్పులతడకలు ● భార్య స్థానంలో కుమార్తె పేరు ● చిరునామాలో జిల్లాల మార్పు ఈ చిత్రం చూశారా... ఇది వీరఘట్టం మండలం దయానిధిపురం గ్రామానికి చెందిన చొంగల రామచంద్రరావుకు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డు. పేరు, ఊరుపేరు, మండలం పేరు సరిగా ఉన్నా జిల్లా పేరు పార్వతీపురం మన్యం స్థానంలో విజయనగరం అని ముద్రించారు. వివిధ ధ్రువపత్రాల కోసం స్మార్ట్కార్డు జెరాక్స్ను దరఖాస్తుకు జతచేసిన సమయంలో జిల్లా పేరు తప్పుగా నమోదుకావడంతో అభ్యంతరం తెలుపుతున్నారు. దీనిని సరిచేసేందుకు ఆయన కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ చిత్రంలోని స్మార్ట్ కార్డును చూశారా.. ఇది పాలకొండ మండలం సింగన్నవలసకు చెందిన కేసిరెడ్డి గంగరాజుకు ఇటీవల కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్కార్డు. ఆయన గ్రామం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండగా, శ్రీకాకుళం అని ముద్రించారు. ఈయనకూ తిప్పలు తప్పడం లేదు. జిల్లా పేరు ఏది అని అధికారులు ప్రశ్నించగానే కార్డులో తప్పుగా ముద్రించారని, తమ ప్రమేయం లేదంటూ బదులివ్వాల్సిన పరిస్థితి. సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గత ప్రభుత్వం మంజూరు చేసిన బియ్యం కార్డులను(రేషన్) మార్పు చేసిన విషయం విదితమే. వాటి స్థానంలో క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తోంది. ముద్రణలోపంతో అవి కాస్త తప్పులతడకగా మారాయి. జిల్లాలో 2,73,000 మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ కొత్తగా కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. కొద్దిరోజులుగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక కూటమి నాయకుల ఆధ్వర్యంలో వీటిని అట్టహాసంగా పంపిణీ చేస్తున్నారు. రేషన్లో అక్రమాలను అరికట్టేందుకు ఈ కార్డులు ఉపయోగపడతాయని గొప్పగా చెప్పుకొంటున్నారు. వీటితో రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ పొందవచ్చని ఆర్భాటంగా ఊదరగొడుతున్నారు. కార్డులు పొందిన లబ్ధిదారుల పరిస్థితి మరోలా ఉంది. అక్రమాల మాట దేవుడెరుగు.. ఇందులో ఉన్న తప్పులను ఎవరు సరిదిద్దుతారంటూ లబోదిబోమంటున్నారు. ముద్రణ అస్తవ్యస్తం కార్డుల ముద్రణలో విపరీతమైన తప్పులు దొర్లాయి. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 1.22 లక్షల కార్డుల పంపిణీ పూర్తయింది. ఇందులో చాలా వరకు తప్పులు కనిపిస్తున్నాయి. ఇంటి యజమాని పేరిట కార్డు రాగా... అందులో భార్య స్థానంలో కుమార్తె పేరు ఉంటోంది. మరోచోట తండ్రి స్థానంలో తల్లిపేరు ముద్రించారు. మండలం, చిరునామా సక్రమంగా ఉన్నా.. చివరన జిల్లాల పేర్లలో తప్పులు దొర్లాయి. కొమరాడ మండలానికి చెందిన ఓ కార్డుదారుడి వివరాల్లో జిల్లాను విజయనగరంగా చూపారు. వీరఘట్టం తహసీల్దారు కార్యాలయం పరిధిలోని ఓ కార్డుదారుడి చిరునామా వద్ద విజయనగరం జిల్లాగా నమోదైంది. పాలకొండ తహసీల్దార్ కార్యాలయం పరిధిలోని మరో కార్డులో శ్రీకాకుళం జిల్లాగా ముద్రించారు. ఇలా దాదాపు అన్ని కార్డుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఏ సంక్షేమ పథకం అందుకోవాలన్నా.. పిల్లల విద్యాపరంగా ఎటువంటి ధ్రువపత్రం, లబ్ధి పొందాలన్నా.. ఆధార్కార్డుతో రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో చిరునామాలు, ఇతర వివరాలు తప్పుగా ఉండడం వల్ల ఇబ్బందులు వస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలే మార్చేయడం వల్ల భవిష్యత్తులో పథకాలు, ఇతర రాయితీలకు దూరమవుతామేమోనని అంటున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వమే రేషన్ పోర్టుబిలిటీని తీసుకొచ్చింది. ఎక్కడైనా రేషన్ పొందే సౌలభ్యం కల్పించింది. దీంతోపాటు ఎండీయూ వాహన వ్యవస్థతో నేరుగా ఇంటి వద్దకే సరకులను అందించేవారు. గిరిజన జనాభా అధికంగా ఉండే మన్యం జిల్లాలో ఈ విధానం ఎంతగానో ఉపయోగపడేది. రేషన్ సరకుల కోసం ఎక్కడో సుదూరాన ఉన్న చౌకధరల దుకాణాలకు వెళ్లే బాధ లబ్ధిదారులకు తప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ విధానానికి మంగళం పాడింది. లబ్ధిదారులకు మళ్లీ పాత కష్టాలను పునరావృతం చేసింది. ప్రధానంగా గిరిజనులు కొండలు దిగి, రేషన్ తీసుకెళ్తున్న పరిస్థితులు వస్తున్నాయి. ఇవేవీ చాలవన్నట్లు గత ప్రభుత్వంలో ఇచ్చిన బియ్యం కార్డులను రద్దు చేసి, వాటి స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తోంది. ఆ పనీ సక్రమంగా చేయక, తప్పులతో ముద్రణ చేసి లబ్ధిదారులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నిర్వాకాన్ని చూసి ‘ఇదేనా కూటమి ప్రభుత్వం స్మార్ట్.. ఇదేనా సాంకేతికతా?’ అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. -
‘ఆశ్రమ’ విద్యార్థుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి సారించాలి
మక్కువ: ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల నోడల్ అధికారి కేసీఆర్.రెడ్డి అన్నారు. ఈ మేరకు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణమే వైద్య సిబ్బందికి సమాచారం అందించాలని చెప్పారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేపట్టాలని సూచించారు. పిల్లల హాజరు, పారిశుధ్యం, భోజనం సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పాఠశాలలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ ఎన్. సూర్యనారాయణ, మండల విద్యాశాఖ అధికారి శ్యాంసుందర్, ఆశ్రమ పాఠశాలల హెచ్ ఎంలు పాల్గొన్నారు. -
బాలల హక్కుల కోసం సంక్షేమ కమిటీలు
● కలెక్టర్ రామ్సుందర్ రెడ్డివిజయనగరం ఫోర్ట్: బాలల హక్కుల కోసం పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.రామ్సుందర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రో చైల్డ్ గ్రూప్ జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం రుపొందించినవాల్ పోస్టర్ను మంగళవారం ఆయన తన చాంబర్లో ఆవిష్కరించారు. ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి మాట్లాడుతూ బాలల సంక్షేమం కోసం మిషన్ వాత్సల్య ద్వారా అమలు జరుగుతున్న పథకాల అమలును పర్యవేక్షించడం, పిల్లల సంరక్షణ, పునరావాసం, శిశు హక్కులను పరిరక్షించడంలో బాలల పరిక్షణ కమిటీలు పనిచేస్తాయన్నారు. బాల్య వివాహాల నివారణకు నిర్దిష్టమైన కార్యక్రమాలను చేపట్టి బాలల హక్కుల పరిరక్షణకు కమిటీలు కృషి చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో చైల్డ్రైట్స్ ఫోరం కన్వీనర్ పి.చిట్టిబాబు, పోగ్రాం ఆఫీసర్ నాగరాజు, కౌన్సిలర్ సంధ్య, లీగల్ కో ఆర్డినేటర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఘాట్ రోడ్లో గ్యాస్ లారీ బోల్తా
పాచిపెంట: మండలంలోని పి.కోనవలస జాతీయ రహదారి ఘాట్ రోడ్డుపై మంగళవారం మధ్యాహ్నం అదుపుతప్పిన గ్యాస్ లారీ బోల్తా పడింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం నుంచి రాయగడ మీదుగా జార్ఖండ్ వెళ్లవలసిన గ్యాస్ లారీ, దారి తప్పి రామభద్రపురం నుంచి సాలూరు మీదుగా ఒడిశా రాష్ట్రం సుంకి వైపు వెళ్తుండగా, డ్రైవర్కు అనుమానం వచ్చి రూట్ కోసం పలువురు లారీ డ్రైవర్లను అడగడంతో వేరే రూట్ లో వెళ్లాలని తెలియజేశారు. దీంతో పద్మాపురం పంచాయతీ రొడ్డవలస సమీపంలో యూటర్న్ తీసుకుని సాలూరు వైపు వస్తుండగా లారీ అదుపుతప్పి సుమారు 100 అడుగుల లోయలో పడింది. విషయం తెలుసుకున్న ఫైర్ అధికారులు స్థానిక పోలీసుల పర్యవేక్షణలో ఆరు క్రేన్లతో లారీని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. -
స్కూల్ గేమ్స్ హాకీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్గేమ్స్ హాకీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపిక పోటీలు మంగళవారం పూర్తయ్యాయి. నగరంలోని రాజీవ్ స్టేడియంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపికలకు సుమారు 150 మంది క్రీడాకారులు హాజరుకాగా.. అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 72 మంది క్రీడాకారులను అండర్–14,17 విభాగాల్లో ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరగనున్న అంతర్ జిల్లాల బాల,బాలికల స్కూల్గేమ్స్ ఫోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఎంపిక పోటీలను జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి, హాకీ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. -
ఎన్నాళ్లీ డోలీమోతలు?
కురుపాం: కురుపాం మండలంలోని నీలకంఠాపురం పంచాయతీ మహేంద్రపురం గ్రామానికి చెందిన కొండ గొర్రె తుని అనే వృద్ధురాలు సోమవారం జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు గ్రామానికి వాహనాలు వచ్చే మార్గం లేకపోవడంతో కుటుంబ సభ్యులు డోలీలో సుమారు కిలోమీటరు దూరంలోని ధర్మలక్ష్మీపురం వరకు మోసుకొచ్చారు. మధ్యలో గెడ్డను డోలీలో తరలించేందుకు అష్టకష్టాలు పడ్డారు. అనంతరం సీతంపేటలోని ఓ ప్రైవేటు క్లినిక్కు ప్రైవేటు వాహనంలో తరలించారు. ఈ దృశ్యాలను చూసిన ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యుడు కొండగొర్రె భాస్కరరావు మాట్లాడుతూ ఎన్నాళ్లీ డోలీకష్టాలని ప్రశ్నించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ చంద్ర మండలానికి రాకెట్లు పంపిస్తున్న యుగంలో గిరిజనులకు మాత్రం సొంత గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం, వంతెనలు లేకపోవడం బాధాకరమన్నారు. జిల్లాకు చెందిన వ్యక్తి గిరిజన మంత్రిగా కొనసాగుతున్నా గిరిజనుల సమస్యలు మాత్రం తీరడం లేదని వాపోయారు. గిరిజనుల ప్రాణాలకు రక్షణ లేదా..? నేతలు మారినా తమ తలరాతలు మారలేదంటున్న గిరిజనం అనారోగ్యానికి గురైన వ్యక్తిని డోలీలో తరలింపు -
తైక్వాండో పోటీల విజేతలకు డీఈఓ అభినందన
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన స్కూల్ గేమ్స్ తైక్వాండో పోటీల్లో విజేతలుగా నిలిచిన జిల్లా క్రీడాకారుల బృందానికి జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు అభినందనలు తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్ల రేపల్లెలో జరిగిన అండర్–14 బాల, బాలికల తైక్వాండో పోటీలలో జిల్లా క్రీడాకారులు ఒక బంగారు, నాలుగు రజత పతకాలు, నాలుగు కాంస్య పతకాలను సాధించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను అభినందించడంతో పాటు భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
రైలుపట్టాల పక్కన గుర్తు తెలియని మృతదేహం
బాడంగి: మండలంలోని డొంకినవలస రైల్వేస్టేషన్ పిండ్రంగివలస మధ్య ఎల్సీగేట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వేపోలీసులు సోమవారం కనుగొన్నారు. దీనికి సంబంధించి రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సుమారు 50–55 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తిని రైలు ఢీకొట్టిందో లేదా రైలు నుంచి జారిపోయి తగిలిన గాయాలతో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి శరీరంపై తెల్లని టీషర్ట్, దానిపై సర్దార్వల్లభ్ భాయ్ ఫొటో, ఏక్తాదివస్, కొండా పండా బీజేపీ ఆని ఒరియాభాషలో రాసి ఉన్న కాషాయ రంగు టవల్, పసుపు ఎరుపు రంగుదుప్పటి, గులాబీరంగులుంగీ, చేతిసంచీ అందులో చిల్లరపైసలు, బియ్యం ఉన్నాయన్నారు. ఆచూకీతెలిసిన వారు విజయనగరం జీఆర్పీఎస్ ఎస్సై బాలాజీరావు ఫోన్ 9490617089కు గానీ, బొబ్బిలి హెసీ ఫోన్ 9491813163నంబర్కు కానీ సమాచారం తెలియజేయాలని కోరారు. మృతదేహాన్ని విజయనగరం ఆస్పత్రికి తరలించి బొబ్బిలి హెచ్సీ ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిగుర్ల: మండలంలోని కొండగండ్రేడు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రేజేటి పాపినాయుడు (38) చికిత్స పొందు తూ సోమవారం మృతి చెందాడు. కోండగండ్రేడుకు చెందిన పాపినాయుడు శనివారం దిచక్రవాహనంపై అచ్యుతాపురం వస్తుండగా కొండగండ్రేడు దాటిన తర్వాత ద్విచక్ర వాహ నం అదుపు తప్పి రోడ్డు ప్ర మాదం జరిగింది. ఈ విష యం తెలుసుకున్న కుటుంబసభ్యులు విజయనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుర్ల ఎస్సై నారాయణ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలువీరఘట్టం: మండలంలోని సీఎస్పీ రోడ్డు బొడ్లపాడు జంక్షన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెవ్వాకుల కృష్ణ అనే చిరు వ్యాపారి తలకు తీవ్రగాయాలైనట్లు ఎస్సై జి.కళాధర్ తెలిపారు. బొడ్లపాడు గ్రామానికి వెళ్లి తన మోపెడ్పై సీఎస్పీ రోడ్డుకు వస్తుండగా, బొబ్బిలి నుంచి కోటబొమ్మాళి బైక్పై వెళ్తున్న పక్కి అనిల్కుమార్ అనే వ్యక్తి ఈ జంక్షన్న్లో కృష్ణ మోపెడ్ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కృష్ణ తలకు తీవ్రగాయమై రక్తస్రావం కావడంతో పాలకొండ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్కు తరలించినట్లు చెప్పారు. అనిల్కుమార్కు కూడా గాయాలైనట్లు తెలిపారు. బొండపల్లి: OÆð‡Ë$ C…h¯ŒS-ÌZ Ýë…MóS-†MýS ÌZç³… ™èlÌñæ-™èl¢-yýl…-™ø MöÆ>ç³#sŒæ ¯]l$…_ ÑÔ>-Qç³-r²… Ððlâ¶æ$¢¯]l² ´ëíÜ…fÆŠ‡ OÆð‡Ë$ VýSÆý‡$-yýl$-¼ÍÏ OÆð‡ÌôæÓ-õÜt-çÙ¯ŒS-ÌZ Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… ÝëĶæ$…-{™èl… Æð‡…yýl$-¯]l²Æý‡ VýS…rË$ ´ër$ °Í_´ù-Ƈ$$…¨. ÑÔ>-Qç³-r²… Ððlâ¶æ$¢…yýl-V> OÆð‡Ë$ õÜtçÙ¯ŒS-ÌZ BW †ÇW ºÄ¶æ$-Ë$ §ólÆý‡-yé-°MìS ÝëĶæ$…-{™èl… ¯éË$VýS$-¯]l²Æý‡ VýS…rÌSMýS$ {OyðlÐ]lÆŠ‡ {ç³Ä¶æ$-†²…^èl-V> C…h¯ŒS-ÌZ Ýë…MóS †MýS çÜÐ]l$çÜÅ Æ>Ð]l-yýl…-™ø çÜ$Ð]l*Æý‡$ Æð‡…yýl$-¯]l²Æý‡ VýS…rÌS ´ër$ õÜtçÙ¯ŒS-ÌZ¯ól OÆð‡Ë$ °Í_´ù-ÐéÍÞ Ð]l_a…¨. ©…™ø OÆð‡ÌôæÓ A«¨M>Æý‡$-Ë$ ÑÔ>-Qç³-r²… ¯]l$…_ ÐólÆó‡ C…h¯ŒS¯]l$ ™ðlí³µ…_ OÆð‡Ë$¯]l$ Ð]l¬…§ýl$MýS$ MýS¨Í…^éÆý‡$. Æð‡…yýl$-¯]l²Æý‡ VýS…rÌS ´ër$ {ç³Ä¶æ*-×ìæ-MýS$-Ë$ õÜtçÙ¯ŒS-ÌZ¯ól ç³yìl-V>ç³#-Ë$ M>Ķæ*-ÍÞ¯]l ç³Çíܪ† ¯ðlÌS-Mö…¨. _¯]l² í³ÌS-ÏË$ Ð]l–§ýl$®-Ë$ õÜtçÙ¯ŒS-ÌZ ¯é¯é AÐ]l-çܦ-Ë$ ç³yézÆý‡$.˘ బొబ్బిలి: మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో స్థానిక గొల్లపల్లి ఆటో స్టాండ్ వద్ద ఓ మహిళ రోడ్డుపై పడిపోగా తలకు దెబ్బతగిలి రక్తం ధారగా కారుతోంది. నోట్లోంచి కూడా రక్తం వస్తోంది. అంతలో అటుగా వెళ్తున్న ఎస్సై ఆర్.రమేష్ కుమార్ ఆ మహిళ స్థితి చూసి పరిశీలించి వెంటనే 108కి సమాచారమందించారు. కానీ సమయానికి 108 రాలేదు. దీంతో తానే ఓ ఆటో మాట్లాడి స్థానిక సీహెచ్సీకి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యసిబ్బంది అప్పటికే మృతి చెందిందని చెప్పగా అయ్యో అంటూ నిరుత్సాహం చెందారు. చివరకు ఆమె గురించి ఆరా తీయగా యాదవ వీధికి చెందిన బొట్ట ఆదెమ్మ(70)అని తేలింది. గొల్లపల్లిలోని యూహెచ్సీకి ఆరోగ్య చికిత్స కోసం వచ్చిందని, అట్నుంచి వస్తుండగా బీపీ పెరిగి పడిపోయి ఉండొచ్చని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకువెళ్లారు. -
మెగా వెంచర్లో హెచ్చరిక బోర్డులు
● ఇంటిప్లాన్, కరెంట్, తాగునీటి సరఫరాకు అనుమతులు ఇవ్వం ● చిననడిపల్లి మెగా వెంచర్లో హెచ్చరిక బోర్డులుచీపురుపల్లి: ఎలాంటి అనుమతులు లేని మెగా వెంచర్లో జరుగుతున్న ప్లాట్ల విక్రయాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎట్టకేలకు పంచాయతీరాజ్ అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. భవిష్యత్లో మరెంతో మంది కొనుగోలుదారులు మోసపోకుండా ఉండేందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. చీపురుపల్లి మండలంలోని చిననడిపల్లి పంచాయతీ పరిధిలో కనీస నిబంధనలు పాటించకుండా 69 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ మెగా వెంచర్ ఏర్పాటు చేయడంపై ‘సాక్షి’ పత్రికలో ‘రియల్గా మోసం’ శీర్షికన ఈ నెల 19న కథనం వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై అదే రోజు స్పందించిన ఎంపీడీఓ ఐ.సురేష్ ఆధ్వర్యంలో సిబ్బంది చిననడిపల్లి పంచాయతీ పరిధిలో అనుమతులు లేని లేఅవుట్ను సందర్శించి నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా మంగళవారం అదే మెగా వెంచర్లో ఎలాంటి అనుమతులు లేవంటూ హెచ్చరిక బోర్డులను డిప్యూటీ ఎంపీడీఓ అప్పలనాయుడు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఏర్పాటు చేశారు. చిననడిపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 73, 92, 93, 94లో అభివృద్ధి చేస్తున్న ఈ లేఅవుట్ను అనధికార లేఅవుట్గా గుర్తిస్తూ, ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిని ఇంటి ప్లాన్లు పంచాయతీ నుంచి ఇవ్వబోమని, విద్యుత్, తాగునీటి సరఫరాకు కూడా ఎలాంటి పంచాయతీ అనుమతులు ఉండవని హెచ్చరిక బోర్డుల్లో స్పష్టం చేశారు. -
దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి
విజయనగరం రూరల్: దీపావళి పండగ ప్రజలందరి జీవితాల్లో వెలుగు లు నింపాలని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షు లు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు ఆదివారం ఒక ప్రకటన ద్వారా దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అమావాస్య నాటి కారు చీకటిని తొలగించడానికి, దీపాలతో వెలుగును నింపడం ఈ పండగ సంప్రదాయమని, మనలోని అంథకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులు వెలిగించాలన్నది దీని వెనుక ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖః సంతోషాలు వెల్లివిరియాలని, ఆ లక్ష్మీదేవి చల్లని చూపుతో అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. దీపావళి చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి విజయం సాధించిన పండగని పేర్కొన్నారు. ఈ పవిత్ర పండగ సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. -
తప్పని డోలీ మోత
కొమరాడ: మండలంలోని గిరిశిఖర గ్రామాల్లో డోలీ మోతలు తప్పడం లేదు. తాజాగా పూడేస్ పంచాయతీ గుమ్మడింగి గ్రామానికి చెందిన ఆరిక దండు అనారోగ్యానికి గురవడంతో శనివారం లేవలేని స్థితిలోకి వెళ్లాడు. గ్రామానికి రహదారి లేకపోవడంతో... 108 వాహనం వెళ్లే మార్గం లేకపోవడంతో కుటుంబ సభ్యులు సుమారు నాలుగు కిలోమీటర్లు డోలీలో తీసుకువెళ్లారు. అక్కడ నుంచి ఒడిశా సరిహద్దు కొరాపుట్ జిల్లా బంధుగాం బ్లాక్ అలమండ గ్రామం మీదుగా ప్రైవేటు వాహనంలో పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు జ్వరాలు పాచిపెంట: మండలంలోని వేటగానివలస గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు జ్వరాలతో బాధపడుతూ.. గురువునాయుడుపేట పీహెచ్సీలో శనివారం చేరారు. వైద్య పరీక్షల అనంతరం వైరల్ ఫీవర్గా గుర్తించిన వైద్యులు అవసరమైన మందులు ఇచ్చిన పాఠశాలకు పంపారు. వీరిలో గిన్నిపల్లి ప్రవీణ్ అనే విద్యార్థికి జ్వరం తగ్గకపోవడంతో సాలూరు సీహెచ్సీకి ఆదివారం తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షల్లో విద్యార్థికి నెగిటివ్ రావడంతో ప్రవీణ్ను సోమవారం డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపినట్టు హాస్టల్ వార్డెన్ భాస్కరరావు తెలిపారు. -
ఉలికిపాటు..!
సోమవారం శ్రీ 20 శ్రీ అక్టోబర్ శ్రీ 2025 ● ఆర్టీసీలో వచ్చిన పార్శిల్ పేలి నలుగురికి తీవ్ర గాయాలు ● ఆర్టీసీ కార్గోలో ఘటన ● ఫ్యాన్సీ వస్తువుల పేరిట పార్శిల్ పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆదివారం మధ్యాహ్నం భారీ పేలుడు శబ్దంతో పరిసర ప్రాంతమంతా ఉలిక్కిపడింది. మధ్యాహ్నం 12.55 గంటల సమయంలో విజయనగరం నుంచి వచ్చిన పల్లెవెలుగు బస్సులో 25 కిలోల బరువున్న ఓ పార్శిల్ను ఆర్టీసీ కార్గో వద్ద దించేందుకు డ్రైవర్ తెర్లి రవి కాంప్లెక్స్లోని హమాలీ రెడ్డి రమేష్ను పిలిచి అందించాడు. పార్శిల్ను హమాలీ ఆర్టీసీ కార్గో కార్యాలయం ఎదుట దించుతున్న సమయంలో భారీ శబ్ధంతో పేలడంతో హమాలీతో పాటు డ్రైవర్, కార్యాలయానికి సమీపంలో ఉన్న కింతలి రమేష్, రిక్షా కార్మికుడు బోనెల సుందరరావు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆటో, 108 సాయంతో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో రెడ్డి రమేష్, టి.రవిని మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. కింతలి రమేష్ను విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి, ఏఎస్పీ అంకితా సురానా ఘటనా స్థలానికి చేరుకొని పేలుడు సంభవించిన తీరు ను పరిశీలీంచారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. పార్శిల్ విజయనగరంలోని సాంబయ్య అనే వ్యక్తి కొమరాడ మండలం నిమ్మలపా డు గ్రామానికి చెందిన కొత్తకోట కిశోర్ కు పంపినట్టు ప్రాథమికంగా తేలింది. కిశోర్ను పోలీసులు అదుపులోకి తీసు కుని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ కార్గో నిబంధనలకు విరుద్ధంగా మందుగుండు సామగ్రిని బుక్ చేసిన వారిని తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. పేలుడు ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి పరామర్శ ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రయాణికుల బస్సుల్లో ప్రమాదకర, పేలుడు పదార్ధాలు, సామగ్రి తరలించకూడదన్న నిబంధనలు ఉన్నా ఇటువంటి పేలుడు పదార్ధాలు పార్శిల్లో వేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పేలుడు పదార్ధాలను ఎలా ప్రయాణికుల బస్సులో అనుమ తించారన్న ప్రశ్న లేవనెత్తింది. ప్రయాణికుల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు బాణసంచా పేలుడు సామగ్రిని ఎలా రవాణాకు అధికారులు అనుమతించారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా? అని నిలదీస్తున్నారు. ఆర్టీసీలో నిఘా నిద్దరోతుందా... అని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
అధికారులకు దీపావళి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : అదేమిటో.. జిల్లా అధికారులకు అదృష్టం ముసురు పట్టినట్టు పట్టింది. వద్దంటున్నా కనక వర్షం కురిసేస్తుంది. మొన్న మొన్నటి వరకు పైడితల్లి అమ్మవారి పండగ పేరు చెప్పి కలెక్షన్ చేసిన రెవెన్యూ.. పోలీస్.. మున్సిపల్ అధికారులకు... ఇంకా ఆ డబ్బులు ఖర్చుపెట్టక ముందే వారికి ఇంకో పండగ వచ్చి పడింది. ఈసారి దీపావళి ధమాకా... బాణసంచా షాపులు పెట్టాలంటే భారీ స్థాయిలో అనధికారిక ఫీజులు చెల్లించాల్సిందే.. లేకుంటే మతాబులు అమ్మేందుకు లైసెన్సు ఇచ్చేది లేదని అధికారులు తెగేసి చెప్పడంతో ఈ దీపావళి వ్యాపారం చేసే వ్యాపారులు అడిగిన కాడికి ముడుపులు ఇచ్చుకోక తప్పలేదు. విజయనగరంలోని ఆర్టీవో ఆఫీస్ వద్ద కె.ఎల్.పురంలో ఎప్పట్లానే ఈసారి కూడా మతాబులు షాపులకు తాత్కాలిక లైసెన్సులు ఇచ్చారు. ఇక్కడ దాదాపు 32 షాపులు ఏర్పాటు చేయగా ఫైర్, మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీసులు ఇలా వేర్వేరు శాఖలకు ముడుపులు ఇచ్చుకొని షాపులు ఏర్పాటు చేశారు. అయితే ఒక్కో శాఖకు వేర్వేరుగా ఇవ్వడం అదంతా ఇబ్బందికరమైన వ్యవహారం కావడంతో గంపగుత్తగా ఒక్కో షాపు నుంచి రూ.50వేలు వసూలు చేసి అన్ని శాఖలతో కలిపి పంచుకున్నట్టు తెలుస్తోంది. అంటే కెఎల్.పురంలోని షాపుల నుంచే రూ.16లక్షలు వసూలైందన్న మాట. ఇది కాకుండా లోయర్ ట్యాంక్ బండ్ వద్ద తాత్కాలికంగా 18 షాపులు ఏర్పాటు చేయగా అది మాన్సాస్ స్థలం కాబట్టి ఒక్కో షాపు రూ.20 వేల చొప్పున రౌడీ మామూలు చెల్లించాల్సిందే.. ఓ ముఖ్య ప్రజాప్రతినిధి తాలూకా అనుచరుడు దందా చేసినట్టు తెలుస్తోంది. పెద్దమ్మికే పెద్దరికం పట్టణంలోని మతాబుల షాపుల నుంచి మామూలు వసూలు చేసే బాధ్యత రెవెన్యూ శాఖకు చెందిన పెద్దమ్మికి ఆయా శాఖలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. అమ్మవారి పండగలో కూడా పెద్దమ్మి చెయ్యి బాగా తిరిగిందని... ఆమె చేత్తో బోణి బాగుంటుందని నమ్మకంతో ఫైర్, పోలీస్, మున్సిపల్ అధికారులు సైతం ఆమెకే కలెక్షన్ బాధ్యత అప్పగించి వసూలు చేయాలని కోరినట్టు తెలుస్తోంది. దీంతో ఒక్కో షాపు నుంచి రూ.50వేలు చొప్పన బాణసంచా వ్యాపారుల సంఘం వసూలు చేసి రెవెన్యూ పెద్దమ్మికి ముట్ట చెప్పగా ఆమె తన వాటా మినహాయించుకుని మిగతా వాళ్లకు కొంత పంపిణీ చేసినట్టుగా చెబుతున్నారు. వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వ్యాపారాల మీద నమ్మకం లేదని... ఆదివారం సాయంత్రం కూడా నగరంలో భారీగా వాన కురవడంతో ప్రజలు టపాసులు కొనేందుకు వీధుల్లోకి రావడం లేదని, ఇలాంటి గడ్డు కాలంలో రూ.వేలకు వేలు ముడుపులు ఇచ్చుకొని చేసేంత వ్యాపారం ఏమీ లేదని... తెచ్చిన సరుకు తడిసిపోయి... తమకు నష్టాల భయం పట్టుకుందని చిరు వ్యాపారులు వాపోతున్నారు. మీ నష్టాలతో మాకేం సంబంధం.. మీకు లాభం వస్తే మాకు వాటా ఇస్తారా..? ఇవ్వరు కదా... కాబట్టి జస్ట్ మామూళ్లు ఇచ్చి బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోండి అంటూ అధికారుల సిండికేట్ అల్టిమేటం జారీ చేయడంతో అడిగినంత ఇచ్చుకోక వ్యాపారులకు తప్పలేదు. -
మార్కెట్లో పెండలం
● ఆరంభమైన సీజన్ ● పెరిగిన దిగుబడులు ● ఏజెన్సీలో వంద ఎకరాలకు పైగా సాగుసీతంపేట: సీతంపేట ఏజెన్సీలో విస్తృతంగా పండే పెండలం సీజన్ ఈ ఏడాది ఆరంభమైంది. దిగుబడులు బాగా పెరిగినట్లు గిరిజనులు చెబుతున్నారు. మైదాన ప్రాంత వ్యాపారులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. అంతగా పెట్టుబడులు అక్కర్లేక పోయినప్పటికి ఈ పంట వేసుకుంటే మంచి ఆదాయవనరులు వస్తాయని గిరిజనులు తెలియజేస్తున్నారు. సీతంపేట, బామిని ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు వంద ఎకరాలకు పైగా కొండ పోడు వ్యవసాయంలో భాగంగా పెండలం పండిస్తారు. కావిళ్లలో కట్టలు కట్టి తీసుకువచ్చి గిరిజనులు విక్రయిస్తారు. ఒక్కో కట్ట రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నామని గిరిజనులు తెలిపారు. గతేడాది ఇదేసీజన్లో ఒక్కో కావిడి రూ.300ల వరకు విక్రయించేవారమని అంటున్నారు. ఇలా కొనుగోలు చేసిన వ్యాపారులు పట్టణాల్లోని మార్కెట్లో కిలోల వంతున కిలో రూ.90 వరకు విక్రయిస్తారు. ఒక్కో పెండలం కట్టకు రూ.200 వరకు ఆదాయం వస్తుందని గిరిజన రైతులు చెబుతున్నారు. అలాగే కందను కూడా బుట్టల లెక్కన ఒక్కో బుట్ట వంద వరకు కొనుగోలు చేస్తారు. మైదాన ప్రాంతాల్లో రూ.300ల వరకు అమ్మకాలు జరుపుతారు. మైదాన వ్యాపారులదే హవావిశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి పెండలం కొనుగోలు చేస్తారు.గతంలో సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, గురువారం దోనుబాయిలో కుశిమి, పొల్ల గ్రామాల్లో శనివారం వారపు సంతలు జరుగుతాయి. ఈ సంతలకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసేవారు. అయితే కోవిడ్–19 కారణంగా వారపు సంతలు తగ్గాయి. నామమాత్రంగా అక్కడక్కడా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చి గిరిజన రైతులు చెప్పిన ధరలు కాకుండా వ్యాపారులు సిండికేట్గా మారి కొన్ని సందర్భాల్లో ధర నిర్ణయిస్తారు. దీంతో వారు చెప్పిన ధరలకు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని గ్రామాల్లో గిరిజనులు ముందుగా దళారుల నుంచి అడ్వాన్స్లు తీసుకుంటారు. పంట పక్వానికి వచ్చే సమయంలో ఆ పంటను వ్యాపారులకు ఇస్తారు. పాండ్ర, కొండాడ, చింతాడ, జగతపల్లి, అక్కన్నగూడ, బెన్నరాయి, గాటిగుమ్మడ, సీదిగూడ తదితర గ్రామాల్లో ఈ పంట ఎక్కువగా పండుతుంది. గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుంటుంది కావిళ్లు మోసుకుని తీసుకువస్తాం. గిట్టుబాటు ధర లేకపోవడంతో తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తోంది. ప్రత్యేక మద్దతు ధరలు లేవు. దీంతో వ్యాపారులు నిర్ణయించిన ధరలకు అమ్మకాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. ఎస్.తోటయ్య, మూలగూడ తవ్వితీయడం చాలా కష్టం కొండపోడు వ్యవసాయంలో పెండలాన్ని పండిస్తాం. ఎంతో శ్రమకోర్చి పెండలాన్ని తవ్వి తీస్తాం. వ్యాపారులు నిర్ణయించిన ధరలకు విక్రయించాల్సి వస్తోంది. ధరలు పడిపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఎస్.సుక్కయ్య, ఈతమానుగూడ -
రియల్ మోసంపై..స్పందించిన అధికారులు..
చీపురుపల్లి: మండలంలోని చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో అనుమతులు లేకుండా వెలసిన మెగా వెంచర్ మోసంపై అధికారులు స్పందించారు. చిననడిపల్లి రెవెన్యూ పరిధిలోని మెగా వెంచర్కు ఎలాంటి అనుమతులు లేవని ఆదివారం ‘సాక్షి’ పత్రికలో ‘రియల్గా మోసం’ అనే శీర్షికన కథనం వెలువడింది. దీనికి ఎంపీడీఓ ఐ.సురేష్ ఆధ్వర్యంలో సిబ్బంది స్పందించారు. ఆదివారం చిననడిపల్లి పరిధిలోని అనుమతులు లేని మెగా వెంచర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సురేష్ మాట్లాడుతూ అనుమతి లేని లేఅవుట్కు సంబంధించిన యజమాని అందుబాటులో లేరని చెప్పారు. అయితే ఎలాంటి అనుమతులు లేని ఈ వెంచర్లో ఎవ్వరూ ప్లాట్లు కొనుగోలు చేయకుండా బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శిని అదేశించినట్లు చెప్పారు. అంతేకాకుండా అనుమతులు లేని ఇక్కడి లే అవుట్కు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని వీఎంఆర్డీఏకు సూచనలు తెలియజేస్తూ నివేదిక పంపుతున్నట్లు తెలిపారు. అలాగే సదరు వెంచర్ అభివృద్ధిని తక్షణమే నిలుపుదల చేయాలని సంబంధిత వెంచర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు. -
జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక
గుమ్మలక్ష్మీపురం: జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు గుమ్మలక్ష్మీపురం మండలం జొల్లగూడ గ్రామానికి చెందిన నిమ్మల జితేంద్ర, బిడ్డిక హర్షవర్ధన్ ఎంపికై నట్లు కొత్తగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల పీడి నిమ్మక మాధవరావు, ఎన్ఐఎస్ ఫెన్సింగ్ కోచ్ బాలరాజు ఆదివారం విలేకరులకు తెలిపారు. ఈమేరకు ఈనెల 17వ తేదీన విజయనగరంలోని విజ్జి స్టేడియంలో జరిగిన సబ్ జూనియర్ బాల బాలికల ఫెన్సింగ్ ఎంపిక పోటీల్లో వీరిద్దరూ ఉత్తమ ప్రతిభ కనపరి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని, ఈనెల 18వ తేదీన కాకినాడలోని లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా నిర్వహించిన 12వ సబ్ జూనియర్ అంతర జిల్లా బాల బాలికల ఫెన్సింగ్ పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చారని, వ్యక్తిగత విభాగంలో చూపిన ప్రతిభకు జితేంద్ర, హర్షవర్థన్ కాంస్య పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లో కూడా ఉత్తమంగా రాణించాలని పిలుపునిచ్చారు. -
లొద్ద జలపాతం అభివృద్ధి చేస్తా
సాలూరు: కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్రెడ్డి ఆదివారం సాలూరు మండలంలోని లొద్ద ప్రాంత గిరిజనుల గూడాల్లో గిరిజనులతో మమేకమయ్యారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఆరా తీశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గృహాలు లేని వారందరికీ గృహాలను మంజూరుచేస్తానని తెలిపారు. స్వచ్ఛమైన ప్రేమాభిమానాలకు గిరిజనులు మారుపేరని కితాబిచ్చారు. అనంతరం అతికష్టంమీద కొంతదూరం అటవీమార్గంగుండా కాలినడకన లొద్ద జలపాతానికి వెళ్లిన కలెక్టర్ ఆ జలపాతాన్ని చూసి మంత్రముగ్ధుడయ్యారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఇటువంటి సుందరమైన ప్రాంతం పర్యాటకుల తాకిడితో సందడిగా మారాలని ఆకాంక్షించారు. లొద్ద జలపాతానికి పర్యాటకులు వచ్చేలా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ ప్రసూన, పలువురు అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రభాకర్రెడ్డి -
చేతకాని మంత్రికి రెండు పదవులు అవసరమా?
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ● నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సవాల్ సాలూరు: గిరిజనులకు అండగా నిలవలేని, ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎమ్ల నియామకంపై తొలిసంతకం చేసి నేటికీ అమలుచేయలేని మంత్రి సంధ్యారాణికి రెండు పదవులు అవసరమా? మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ప్రశ్నించారు. గిరిజన విద్యార్థుల మరణాలపై పభుత్వం చోద్యం చూస్తుండగా, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబాలకు పదిలక్షల రుపాయలు చొప్పున నష్టపరిహారం ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నార న్నారు. కాగా జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలపై మంత్రి సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతలు రాజకీయం చేస్తున్నారంటూ విమర్శలు చేస్తారా? అంటూ మంత్రి సంధ్యారాణిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీ్త్రశిశుసంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేస్తున్న ఆమె తన శాఖలకు న్యాయం చేయలేక అసమర్థ మంత్రిగా నిలిచారని, పదవులకు న్యాయంచేయలేని మీకు రెండు పదవులు అవసరమా? అంటూ మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గురుకులాల్లో తాము ఏఎన్ఎమ్ల నియామకం చేపట్టామని, ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎమ్ల నియామకంపై తాను ఫైల్ పెట్టానని, సీఎం వద్ద ఫైలు ఉండగా ఎన్నికలు వచ్చాయని కావాలంటే వారు ఆఫైల్ను తెప్పించుకోవచ్చ న్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తాము మంజూరుచేసిన రోడ్ల పనులు, ఆ బిల్లులు జరగాలన్నా ఆ ప్రాంతాల గిరిజన నాయకులు తమ పార్టీలోకి వస్తేనే బిల్లులు అవుతాయంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసునని, అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు తానెప్పుడూ సిద్ధమని, మీరెక్కడికి రమ్మంటే అక్కడికి తాను చర్చకు వస్తానని సవాల్ విసిరారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడేవన్నీ అబద్ధాలేనని, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో కూటమి ప్రభుత్వంలో 14 మంది గిరిజన విద్యార్థులు మరణించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ఇకనైనా మంత్రి సంధ్యారాణి విమర్శలు మానుకుని హుందాగా రాజకీయాలు చేయాలని హితవుపలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
జిల్లా రెవెన్యూ సర్వీసెస్ నూతన కమిటీ ఏకగ్రీవం
పార్వతీపురం రూరల్: ఆంఽధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసి యేషన్(ఏపీఆర్ఎస్ఏ) పార్వతీపురం మన్యం జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. జిల్లా యూనిట్ పదవీ కాలం ముగియడంతో రాష్ట్ర కమిటీ సూచనల మేరకు ఆదివారం పార్వతీపురంలో ఈ ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆదేశాలతో, ఎన్నికల అధికారిగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీరాములు, సహాయ ఎన్నికల అధికారిగా బీవీవీ ఎన్.రాజు, పరిశీలకుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ బంగార్రాజు వ్యవహరించారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా కలెక్టరేట్ ఈఎఫ్జీ సెక్షన్ పర్యవేక్షకుడు గొట్టాపు శ్రీరామ్మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వీరఘట్టం తహసీల్దార్ ఎ.సాయి కామేశ్వరరావు, కోశాధికారిగా కలెక్టరేట్ సి.సెక్షన్ పర్యవేక్షకురాలు పి.సత్యలక్ష్మి కుమార్ ఎంపికయ్యారు. నూతన కార్యవర్గంలో ముఖ్యలు వీరే.. సహాధ్యక్షులుగా పాలకొండ తహసీల్దార్ సీహెచ్ రాధాకృష్ణమూర్తి, ఉపాధ్యక్షులుగా ఎన్.శివన్నారాయణ(తహసీల్దార్, భామిని), పి. చిట్టెమ్మ(రీ–సర్వే ఉప తహసీల్దార్, సీతానగరం), ఎన్.శ్రీనుబాబు(ఆర్ఐ, సీతానగరం) ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె. శ్రీనివాసరావు (ఉపతహసీల్దార్, బలిజిపేట), క్రీడలు– సాంస్కృతిక కార్యదర్శిగా బి.శివరామకృష్ణ(ఆర్ఐ, గుమ్మలక్ష్మీపురం) బాధ్యతలు చేపట్టనున్నారు. వారితో పాటు పలువురు సంయుక్త కార్యదర్శులు, ఈసీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. -
పరమ పవిత్రం కార్తీకం
● కార్తీక దీక్ష శ్రేష్టం ● ఓ వైపు ముక్తి..మరో వైపు ఆరోగ్యం.. ● నెలరోజుల దీక్షతో ఎన్నో ఫలితాలు..రాజాం: కార్తీకమాసం పవిత్రమైన మాసం. ఈనెల 22 నుంచి కార్తీక దీక్షలు, పూజలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని గ్రామాల్లో శివాలయాలు ఈ పూజలకు సిద్ధమయ్యాయి. కార్తీకమాసంలో చేపట్టే నెలరోజుల దీక్ష ఓ వైపు ముక్తిని, మరో వైపు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కార్తీక దీపం ఎంతో పవిత్రమైనది. ఈ నెలరోజులు దీపం వెలిగించినా, ఆలయాల వద్ద, ఇండ్ల వద్ద వెలిగించిన దీపాన్ని దర్శించినా ఎంతో పుణ్యం కలుగుతుంది. ఈ కార్తీకంలో వేకువజామున చేసే స్నానాలు శరీరానికి శక్తిని ఇస్తాయి. ఆయుష్షును పెంచుతాయి. దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తాయి. దీపారాధనతో ఆధ్యాత్మిక భావనలో ఉన్నవారికి శాంతిభావం పెంపొందుతుంది. వనసమారాధనలు, సామూహిక భోజనాలు ఐక్యతను చాటుతాయి. శివ, కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం. కార్తీక దీపం అంటే.. కార్తీకమాసంలో ప్రతిరోజూ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి స్నానమాచరించాలి. అప్పుడే అది కార్తీక స్నానమవుతుంది. నిత్యం దీపాన్ని వెలిగించినా, ఆరాధించినా, దీపం కార్తీకమాసంలో వెలిగించడం, నది, ప్రవహిస్తున్న సెలయేరుల్లో విడిచిపెట్టడం, ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలు పాటించాలి. కార్తీకమాసమంతా ఇంటి ముందు గుమ్మానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించాలి. అలాగే సాయంత్రం శివాలయాల్లో, వైష్ణవాలయాల్లో గోపుర ద్వారం వద్ద దేవుని సన్నిధానం, ప్రాంగణంలో దీపాలు వెలిగించిన వారికి సర్వపాపాలు హరిస్తాయని, వైకుంఠప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం చెబుతోంది. దీపారాధనకు ప్రాముఖ్యం ఈ నెలలో ఆలయాల వద్ద ఇతరులు వెలిగించిన దీపాలు ఆరిపోకుండా చూసినా పుణ్యప్రదమే. కార్తీక సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి తదితర దినాల్లో సాయం సమయాల్లో శివాలయాల్లో ఉసిరికాయపైన వత్తులు వేసి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, అవిశనూనె, విప్ప నూనె, ఆముదంతోనైనా దీపాలు వెలిగించాలి. నెలరోజుల దీక్ష..కార్తీక స్నానాన్ని ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి రోజు నుంచి ప్రారంభించచాలి. నెలంతా కార్తీకస్నానం చేయడం మంచిది. వీలుకాని వారు సోమవారాల్లోనూ, శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లోనైనా తప్పక ఆచరించాలి. శుద్ధ ద్వాదశినాడు తులసి పూజచేయాలి. ఈ నెలంతా శ్రీ హావిష్ణువును తులసీదళాలు, జాజిపూలతో పూజించాలి. ఈ నెలంతా శివుడిని మారేడు దళాలు, జిల్లేడు పూలతో పూజించాలి. ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది. కార్తీకంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. -
కార్పొరేట్ మతతత్వ శక్తులపై పోరాడదాం
● కడపలో మహాసభలను విజయవంతం చేయాలి ● సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పిలుపువిజయనగరం గంటస్తంభం: కార్పొరేట్ మతతత్వ మనువాద శక్తులను ప్రతిఘటించి, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం వర్ధిల్లే ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దామనే పిలుపుతో, డిసెంబర్ 6,7 తేదీల్లో కడపలో జరగనున్న సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తొమ్మిదవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం విజయనగరంలోని ఊటగెడ్డ వద్ద పార్టీ జెండాను జిల్లా కమిటీ విడుదల చేసిన కరపత్రాన్ని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు ఎం.అప్పలరాజు, బి.గిరిప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పడం లేదని మిమర్మించారు. జీఎస్టీ శ్లాబ్ రేటు తగ్గించడం ద్వారా ధరలు తగ్గిపోయాయని, ఆదాయాలు పెరిగాయని పాలకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, వాస్తవానికి 18శాతం జీఎస్టీ శ్లాబ్ ఇప్పటికీ కొనసాగుతున్నప్పుడు ప్రజలపై మరింత భారం పడుతోందని తెలిపారు. ఎనిమిది సంవత్సరాలుగా లక్షల కోట్ల రూపాయల జీఎస్టీని వసూలు చేసి కార్బొరేట్లకు లాభాలు చేకూర్చారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో విప్లవ వామపక్ష ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కడపలో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని, అందుకు ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, యువత అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.గౌతమి, పార్టీ నాయకులు జి.సత్యారావు, ఎం.పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. -
సత్య డిగ్రీ కళాశాల విద్యార్థులకు యూనివర్సిటీ జట్టులో స్థానం
విజయనగరం అర్బన్: ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్ కళాశాల కబడ్డీ టోర్నమెంట్ – 2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు నలుగురు యూనివర్సిటీ కబడ్డీ జట్టుకు ఎంపికయ్యారు. వీరు రాబోయే దక్షణ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్లో ఆంధ్ర విశ్వవిద్యాలయ తరఫున పోటీపడనున్నారు. ఎంపికై న విద్యార్థులలో శ్రీవల్లి, రమ్య, నీలిమ, వరలక్ష్మి ఉన్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయి దేవ మణి తెలిపారు. అలాగే జూడే విభాగంలో జరిగిన అంతర్ కళాశాల పోటీల్లో ప్రధమ స్థానం సాధించిన డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థి హేమంత్ సౌత్ జోన్ జూడో చాంపియన్షిప్కు ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికై న విద్యార్థులను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శిశభూషణరావు, ఫిజికల్ డైరెక్టర్ ఎస్హెచ్ ప్రసాద్ అభినందించారు. -
‘రియల్’గా మోసం..!
చీపురుపల్లి: వడ్డించే వాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా.. అనే సామెతలా ఏం చేసినా చర్యలు తీసుకోని అధికార యంత్రాంగం ఉండగా మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ రియల్టర్లు రెచ్చిపోతున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా పెద్ద పెద్ద వెంచర్లు వేసి దూర ప్రాంతాల్లో ఉండే కొనుగోలుదారులను మోసం చేసి యథేచ్ఛగా అమ్మకాలు జరిపేస్తున్నారు. ఇదంతా రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్టే వదిలేస్తున్నారు. దీని వెనుక రియల్టర్లతో అధికార యంత్రాంగానికి ఉన్న సన్నిహిత సంబంధాలే కారణమనే చర్చ జరుగుతోంది. దీనికి మండలంలోని చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో వెలిసిన 69 ఎకరాల మెగా వెంచర్ చక్కని అద్దం పడుతోంది. ఈ మెగా వెంచర్కు ఎలాంటి అనుమతులు లేకుండానే రియల్గా కొనుగోలుదారులను మోసం చేసి అమ్మకాలు జరుపుతున్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎలాంటి అనుమతులు లేని ఈ వెంచర్లో ప్లాట్ నంబర్లు వేసి మరీ దర్జాగా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. చిననడిపల్లి రెవెన్యూలో 69 ఎకరాల మెగా వెంచర్ మండలంలోని శివారు పంచాయతీ చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో మండల సర్వేయర్ తెలిపిన సర్వే నంబర్లు ప్రకారం సర్వే నంబర్ 73, 94, 93, 92ల్లో దాదాపు 69 ఎకరాల వ్యవసాయ భూమిని చదును చేసి మెగా రియల్ వెంచర్ను సిద్ధం చేశారు. అందు లో స్థలాలను ప్లాట్లుగా విభజించి రోడ్లు వేసి సిద్ధం చేశారు. ప్రస్తుతం సర్వే నంబర్ 73కు చెందిన ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. చిననడిపల్లి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని కమ్మసిగడాం వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఈ మెగా వెంచర్లో ఇప్పటికే ప్లాట్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పంచాయతీ, ఉడా అనుమతులు లేకుండానే.. సాధారణంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చినప్పుడు ల్యాండ్ కన్వర్షన్ ఫీజు రెవెన్యూ శాఖ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ల్యాండ్ కన్వర్షన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదట. అంతేకాకుండా కనీసం పంచాయతీ తీర్మానం ద్వారా అనుమతులు, ఉడా అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ నిర్వాహకులు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. మోసపోతున్న కొనుగోలుదారులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడి మెగా వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న ఎంతో మంది కొనుగోలుదారులు మోసపోతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. పంచాయతీ, ఉడా అనుమతులు లేని ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకోవాలన్నా బ్యాంకు రుణాలు కూడా రావు. అంతేకాకుండా పంచాయతీ ఇంటి నిర్మాణ ప్లాన్ అనుమతులు కూడా ఇవ్వదు. ఇవన్నీ తెలియకుండానే కొనుగోలుదారుకు ఏవో మాయ మాటలు చెప్పి రియల్ ఎస్టేట్ యజమానులు ప్లాట్లు అంటగడుతున్నట్టు చర్చ జరుగుతోంది. మండలంలోని పత్తికాయవలస సమీపంలో గతంలో ఇలాంటి రియల్ ఎస్టేట్ వెంచర్ను ఏర్పాటు చేసి ప్లాట్లు అమ్మకాలు జరిపారు. ఇప్పుడు ఆ వెంచర్లో రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నారని తెలుస్తోంది. 69 ఎకరాల్లో అనధికారికంగా వెంచర్ పంచాయతీ, ఉడా అనుమతులు లేకుండానే.. ప్లాట్ నంబర్లతో దర్జాగా రిజిస్ట్రేషన్లు చూసీ చూడనట్టు వదిలేస్తున్న అధికారులు అనుమతులు లేకపోయినా రిజిస్ట్రేషన్ చేయొచ్చు.. రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించి పంచాయతీ, ఉడా అనుమతులు లేకపోయినప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయొచ్చు. చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 73లో మెగా వెంచర్లో ప్లాట్ నంబర్లతో సహా రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. – లక్ష్మణరావు, సబ్ రిజిస్టార్, చీపురుపల్లి చర్యలు తీసుకుంటాం.. చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో సిద్ధమైన మెగా వెంచర్ తమ దృష్టికి ఇంతవరకు రాలేదు. ఇంతవరకు ఎలాంటి వెంచర్లకు అనుమతులు ఇవ్వలేదు. తక్షణమే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తున్నాం. – ఐ.సురేష్, ఎంపీడీఓ, చీపురుపల్లి -
ఎస్ఐ న్యాయం చేయడం లేదు...
చీపురుపల్లి: తమ కుమారుడిని యజమానే హత్య చేశాడని, ఆయనకు గతంలోనూ నేర చరిత్ర ఉందని పోలీస్స్టేషన్లో ఎస్ఐకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదని మండలంలోని పత్తికాయవలసకు చెందిన మృతుడు యలకల రాము తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్కు వచ్చిన మృతుని తల్లిదండ్రులు యలకల రమేష్, సింహాచలం, చెల్లి రమ, మేనమామలు ముగిది పైడితల్లి, ముగిది గొల్ల, మేనత్తలు ముగిది సత్యవతి, రాధ మాట్లాడారు. కొడుకును పోగొట్టుకుని ఉన్న తమకు న్యాయం జరగడం లేదన్నారు. తమ కుమారుడు రామును సంబంధిత యజమాని వండాన సన్యాసి హత్య చేశాడని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఎస్ఐ పట్టించుకోవడం లేదన్నారు. ఎస్ఐకు జేసీబీ యజమాని వండాన సన్యాసికి బంధుత్వం ఉండడంతోనే హత్య కేసును నీరుగార్చే కుట్ర పన్నుతున్నారనే భయం కలుగుతోందన్నారు. అందుకనే తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీ దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఐదారు రోజులు క్రితమే తమ కుమారుడును జేసీబీ యజమాని వండాన సన్యాసి హత్య చేశాడని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే.. ఇంతవరకు కనీసం గ్రామానికి వచ్చి విచారణ నిర్వహించలేదని పేర్కొన్నారు. అందుకే తమకు న్యాయం జరగదని భయం పెరిగిందన్నారు. కూలి పనులు చేసుకునే తమకు ఎలాంటి అండదండలు లేవని పోలీసులు కూడా న్యాయం చేయకపోతే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. జేసీబీ యజమాని సన్యాసి మొబైల్లో అక్టోబర్ 7 నుంచి 12 వరకు కాల్ లిస్ట్ వెల్లడించాలని పోలీసులను కోరామన్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. హత్య చేశాడని ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టలేదు.. జేసీబీ యజమానికి ఎస్ఐకు బంధుత్వం ఉండడమే కారణం మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆవేదన -
విద్యార్థులను పరామర్శించిన డీడీ
సాలూరు: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశ్రమ, గురుకుల పాఠశాలల విద్యార్థులను ఐటీడీఏ డీడీ విజయశాంతి, ఏటీడబ్ల్యూవో కృష్ణవేణి వేర్వేరుగా పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మాట్లాడుతూ, సాలూరు మండలం మామిడిపల్లి, మక్కువ మండలం ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులపై మరణాలకు సంబంధించి ఆ పాఠశాలల హెచ్ఎమ్ సీతారాం, పుష్పనాధం, మామిడిపల్లి వార్డెన్ విజయలను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. పాఠశాలల్లో సీనియర్ ఉపాధ్యాయులకు ఆ బాధ్యతలను అప్పగించినట్టు తెలిపారు. అనంతరం ఐటీడీఏ డీడీ విజయశాంతి పట్టణంలో బంగారమ్మ కాలనీలో ఉన్న బాలికల వసతిగృహాన్ని పరిశీలించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : జేసీ పార్వతీపురం రూరల్: స్వచ్ఛ పార్వతీపురం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రతతో పాటు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఈ నెల స్వచ్ఛమైన గాలి నినాదంలో భాగంగా జాయింట్ కలెక్టర్తో పాటు డీఆర్వో కె.హేమలత, రెవెన్యూ సిబ్బందితో కలిసి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి మొక్కల వల్లే సాధ్యం, ప్రతి ఒక్కరూ తమకు అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలని కోరారు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజా రవాణా వినియోగించాలని, సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచాలని సూచించారు. నిత్యం కొంత సమయం పరిశుభ్రతకు కేటాయించి, దానిని అలవాటుగా మార్చుకున్నప్పుడే స్వచ్ఛ పార్వతీపురం రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం అధికారులతో స్వచ్ఛతపై జేసీ ప్రతిజ్ఞ చేయించారు. నేడు జూనియర్స్ తైక్వాండో క్రీడాకారుల ఎంపికలు విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న జూనియర్స్, క్యాడెట్ తైక్వాండో పోటీల్లో పాల్గొనబోయే జిల్లా బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 19న ఆదివారం నిర్వహించనున్నట్టు జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు డివి.చారిప్రసాద్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 24, 25 తేదీల్లో విజయనగరం వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో పాల్గొనబోయే క్రీడాకారులు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, గ్రేడింగ్ సర్టిఫికెట్లు వెంట తీసుకురావాలని సూచించారు. వివరాలకు 7793950599 నంబరును సంప్రదించాలని కోరారు. నేడు పైడితల్లి అమ్మవారి కలశజ్యోతుల ఊరేగింపు విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి కలశజ్యోతుల ఊరేగింపు ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లును పూర్తి చేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష శనివారం తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో పైడితల్లి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి స్తపన కార్యక్రమాన్ని నిర్వహించి, వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలతో విశిష్ట పూజలు నిర్వహిస్తారన్నారు. అనంతరం పైడితల్లి అమ్మవారి దీక్షాపరులతో కలశ జ్యోతులు పట్టుకుని ఉత్సవ విగ్రహంతో భారీ ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు వనంగుడి నుంచి బయలుదేరుతుందని, దీక్షాపరులు కలశజ్యోతులు చేతపట్టుకుని జై పైడిమాంబ నినాదాలతో గాడీఖానా, వైఎస్ఆర్ సర్కిల్, ఎన్సీఎస్ థియేటర్ రోడ్డు, కన్యకపరమేశ్వరీ ఆలయం, గంటస్తంభం మీదుగా చదురుగుడికి చేరుకుని అక్కడ అమ్మవారికి జ్యోతులు సమర్పిస్తారని తెలిపారు. అనంతరం చదురుగుడి వద్ద భారీ ఎత్తున మెట్ల పూజను దీక్షాపరుల ఆదిపీఠం ఆధ్వర్యంలో నిర్వహించన్నుట్టు పేర్కొన్నారు. భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి, తరించాలని కోరారు. -
న్యాయం కోసం.. ఆత్మహత్యా యత్నం..
● తాకట్టు బంగారం కోసం జ్యువెలరీ షాపు వద్ద కుటుంబం నిరసన ● పెట్రోల్ డబ్బాతో బాధితుడి హల్చల్ పార్వతీపురం రూరల్: తాకట్టు పెట్టిన బంగారం తిరిగివ్వాలని కోరుతూ ఓ కుటుంబం బంగారం దుకాణం వద్ద ఆందోళనకు దిగిన ఘటన పట్టణంలో శనివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. న్యాయం కోసం ఏళ్ల తరబడి తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో, బాధితుడు ఏకంగా పురుగుల మందు తాగి, పెట్రోల్తో అఘాయిత్యానికి యత్నించడం కలకలం రేపింది. బాధితుడు కోట విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రామాపురం కాలనీకి చెందిన ఆయన, 2019లో తన అవసరాల నిమిత్తం శ్రీస్వామి జ్యువెలరీ యజమాని గెంబలి శంకరరావు వద్ద 30 తులాల బంగారం తాకట్టు పెట్టారు. కొన్నాళ్లకు శంకర్రావు కరోనాతో మరణించగా, ఆయన కుమారులు పృథ్వీ, విజయ్ కుమార్లను సంప్రదించినట్టు బాధితుడు విజయ్ తెలిపారు. అప్పటి నుంచి రెండేళ్లుగా ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటూ వారు కాలయాపన చేస్తున్నారని బాధితుడు వాపోయాడు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినా, 15 తులాలకు లెక్క తేల్చాలని చూశారని, ఆ మాట కూడా నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎక్కడా న్యాయం జరగకపోవడంతో విసిగిపోయిన విజయ్, చివరకు పట్టణ పోలీస్స్టేషన్న్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే, కేసు నమోదు చేసిన పోలీసులు సైతం చేతులు దులుపుకొన్నారని, తమకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని బాధితుడు ఆరోపించాడు. పోలీసుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో శనివారం నేరుగా జ్యువెలర్ షాపు వద్దకు చేరుకున్నాడు. షాపులోకి వెళ్లి పురుగుల మందు తాగేందుకు, పెట్రోల్తో ఆత్మహత్యకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు శ్రీదేవి, సాయిరూప అడ్డుకున్నారు. అనంతరం షాపు గేట్లు మూసివేసి నడిరోడ్డుపై బైఠాయించడంతో తీవ్ర ఆందోళనకర వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఎస్ఐ జగదీష్నాయుడు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా బాధితులు వెనక్కి తగ్గలేదు. అనంతరం సీఐ మురళీధర్ సైతం అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన విషయాన్ని ఆయన ధ్రువీకరించినప్పటికీ, బాధితుల ఆందోళన మాత్రం చల్లారలేదు. పోలీసుల జోక్యం చేసుకున్నప్పటికీ ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. శనివారం సాయంత్రం పట్టణానికి చెందిన ఓ తెలుగుదేశం నాయకుడి ఆధ్వర్యంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగినట్టు బాధితులు వాపోయారు. సోమవారం నాటికి చెల్లింపులు జరిపేలా సయోధ్య కుదిరిందని బాధితులు తెలపడంతో ఆందోళన విరమించారు. చట్టపరంగా, పోలీస్స్టేషన్ ద్వారా తేలాల్సిన వివాదం, చివరకు రాజకీయ నాయకుడి పంచాయతీతో తాత్కాలికంగా రాజీ అయినట్టు బాధితుల తెలిపిన వివరాల మేరకు స్పష్టమైంది -
దివ్యాంగులకు మళ్లీ వైద్య పరీక్షలు!
విజయనగరం ఫోర్ట్: ఏళ్ల తరబడి పింఛన్ పొందుతున్న దివ్యాంగులకు కూటమి సర్కార్ అఽధికారంలోకి రాగానే పెద్ద షాక్ ఇచ్చింది. దివ్యాంగ పింఛన్ పొందుతున్న ప్రతీ దివ్యాంగుడు రీ అసెస్మెంట్ చేయించుకోవాలని కూటమి సర్కార్ నోటీసులు అందించింది. సచివాలయాల పరిధిలో వెల్ఫేర్ అసిస్టెంట్ల ద్వారా వారికి ఏ ఆస్పత్రికి ఏ సమయానికి వెళ్లాలి అనే దానిపై నోటీసులు ఇచ్చింది. 2025 జనవరి నెలలో రీ అసెస్మెంట్ కార్యక్రమం వైద్య విధాన్ పరిషత్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో ఆగస్టు నెల వరకు నిర్వహించారు. పింఛన్ పునః పరిశీలన మాత్రమే, ఏ ఒక్క దివ్యాంగుడి పింఛన్ తొలగించబోమని అప్పట్లో కూటమి ప్రజాప్రతినిధులు తెలిపారు. ఆగస్టు నెలలో పింఛన్లు తొలగిస్తామని నోటీసులు ఆగస్టు నెలలో రీ అసెస్మెంట్ 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉందని చెప్పి జిల్లాలో వేలాది మంది దివ్యాంగులకు నోటీసులు ఇచ్చారు. దీంతో తమకు అర్హత ఉందని చెిప్పి జిల్లాలో 5,159 మంది దివ్యాంగులు మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. మళ్లీ పరీక్షలు.. దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు మళ్లీ వైద్యులు పరీక్షలు చేయనున్నారు. నాలుగు వైద్య విధాన్ పరిషత్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో ఈ పరీక్షలు చేయనున్నారు. ఈ మేరకు దివ్యాంగులకు సచివాలయం ఉద్యోగులు నోటీసులు కూడా అందించారు. ఎస్.కోట ఏరియా ఆస్పత్రి, గజపతినగరం ఏరియా ఆస్పత్రి, చీపురుపల్లి ఏరియా ఆస్పత్రి, రాజాం ఏరియా ఆస్పత్రి, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆర్థో విభాగానికి చెందిన దివ్యాంగులు 3600 మందికి, కంటికి సంబంధించి దివ్యాంగులు 1038మందికి, చెవుడు, మూగకు సంబంధించిన దివ్యాంగులు 465మందికి, మెంటల్ డిజార్డర్కు సంబంధించి దివ్యాంగులు 42 మందికి, మెంటల్ ఇల్నెస్కు సంబంధించిన దివ్యాంగులు 14 మందికి పరీక్షలు చేయనున్నారు. పింఛన్లు తొలగించేందుకే.. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతున్నట్టు కూటమి సర్కార్ గొప్పలు చెప్పింది. ఈ చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి ఆ చేత్తో లాగేసికొన్నట్టు కూటమి సర్కార్ దివ్యాంగులకు పింఛన్ పెంచి ఆ భారాన్ని తగ్గించుకునే కుట్ర చేస్తుందని దివ్యాంగులు ఆరోపిస్తున్నారు. పింఛన్ పెంచడం వల్ల కోట్లాది రుపాయిల భారం పడుతుందనే దురుద్దేశంతో కూటమి సర్కార్ పింఛన్ తొలగించడానికే దివ్యాంగులకు రీ అసెస్మెంట్ పేరుతో పరీక్షలు చేయిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆందోళనకు గురవుతున్న దివ్యాంగులు 5,159 మందికి వైకల్య పరీక్షలకు మళ్లీ రావాలని నోటీసులు ఏపీవీపీ, జీజీహెచ్లో పరీక్షలు చేయనున్న వైద్యులు ఫించను తొలగిస్తామని ఆగస్టులో నోటీసులు ఇచ్చిన కూటమి సర్కార్ మాకు అర్హత ఉందని దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులువైకల్య పరీక్షలు దివ్యాంగ పింఛన్కు తమకు అర్హత ఉందని జిల్లాలో 5,159 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి సచివాలయాల ద్వారా ఏ ఆస్పత్రికి, ఏ సమయానికి వెళ్లాలో నోటీసులు వెళ్లాయి. ఆయా ఆస్పత్రుల్లో వైద్యులు దివ్యాంగులకు పరీ క్షలు చేసి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయనున్నారు. –డాక్టర్ ఎన్.పద్మశ్రీరాణి, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి -
రోగులకు మెరుగైన సేవలందించాలి : డీఎంఈ
విజయనగరం ఫోర్ట్: రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంఈ (వైద్య విద్యా సంచాలకులు) డాక్టర్ జి.రఘునందన్ అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఓపీ విభాగాన్ని, క్యాజువాలటీ, ల్యాబొరేటరీ, ఫిమేల్ శస్త్రచికిత్సల వార్డు, పురుషల మెడికల్ వార్డును, ఎక్సరే, స్కానింగ్లను పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. రోగులకు అవసరమైన చికిత్స, మందులు అందజేయాలన్నారు. శస్త్రచికిత్సల కోసం ఆస్పత్రిలో చేరిన వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేసి శస్త్రచికిత్స సకాలంలో చేయాలన్నారు. రోగులతో ప్రేమగా మాట్లాడి వారికి అవసరమైన వైద్యాన్ని అందించాలని సూచించారు. అనంతరం ఎండోస్కోప్ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంఈని వైద్యులు సన్మానించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పీఏ రమణి, డాక్టర్ శివశ్రీధర్, ఎముకలు, మత్తు, న్యూరోసర్జరీ, డెర్మాటాలజీ హెచ్వోడీలు డాక్టర్ లోక్నాధ్, డాక్టర్ జయధీర్బాబు, డాక్టర్ ప్రహ్లాదరెడ్డి, డాక్టర్ వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. -
23న పీడీఎస్వో జిల్లా మహాసభలు
పార్వతీపురం: పీడీఎస్వో జిల్లా మహసభలు ఈ నెల 23న పార్వతీపురంలో నిర్వహించనున్నట్టు జిల్లా అధ్యక్షులు కె.సోమేష్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మహాసభలకు సంబంధించి పోస్టర్ను సోమేష్తో కలిసి సంఘ సభ్యులు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా రంగంలో వున్న సమస్యలను పరిష్కరించాలని, గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలలో విద్యార్థుల మరణాలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తున్నామన్నారు. సభలలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బాలకృష్ణ, ప్రముఖ కవి సిరికి స్వామినాయుడు, పీడీఎస్వో రాష్ట్ర అధ్యక్షులు ఎన్.భాస్కరరావు, ఎన్వైఎస్ జిల్లా నాయకులు పీడిక అసిరి తదితరులు పాల్గొంటారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
మన్యంపై జ్వరాల పంజా
మన్యంపై సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. జ్వరాలు, కామెర్ల బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మలేరియాతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. సీహెచ్సీలు, జిల్లా ఆస్పత్రికి రిఫరల్స్ అధికమవుతున్నాయి. ప్రధానంగా జిల్లా ఆస్పత్రిలో వార్డులు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. వీరిలో వివిధ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల నుంచి వస్తున్న పిల్లలే ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రధానంగా అన్నిచోట్లా దసరా సెలవుల అనంతరం ఇళ్లకు వెళ్లి వచ్చిన విద్యార్థులు జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నీరు మారడం ఇందుకు కారణమని ఉపాధ్యాయులు అంటున్నారు. సాలూరు సీహెచ్సీలో 21 మందికిపైగా విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. వీరిలో పచ్చకామెర్లు, మలేరియా, ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్న వారు ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ఎర్రసామంతవలస, మామిడిపల్లి విద్యార్థులు అనారోగ్యంతో మృతి చెందిన విషయం విదితమే. సాలూరు మండలంలోని బొడ్డవలస బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు పచ్చకామెర్లతో విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో కురుపాం ఆశ్రమ, ఏకలవ్య పాఠశాలతో పాటు.. కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, ఇతర ప్రాంతాల గిరిజన సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల నుంచి విద్యార్థులు ప్రతి రోజూ చేరుతూనే ఉన్నారు. ఇందులో కురుపాం విద్యార్థులే 24 మంది వరకు ఉన్నారు. ఓవైపు డిశ్చార్జిలు అవుతున్నా.. మరోవైపు ఆస్పత్రుల్లో చేరుతున్న వారూ అధికంగా ఉంటున్నారు. – సాక్షి, పార్వతీపురం మన్యం రోజురోజుకూ పెరుగుతున్న జ్వర పీడితులు మలేరియా, కామెర్ల బారిన చిన్నారులు కిటకిటలాడుతున్న ఆస్పత్రులు -
‘ఆది కర్మయోగి’ పురస్కారం
పార్వతీపురం రూరల్: ‘ఆది కర్మయోగి’ కార్యక్రమంలో జిల్లాలో వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టడం, ప్రత్యేక చొరవకు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. గిరిజన సంక్షేమం, సాధికారత, సమ్మిళిత అభివృద్ధిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు జిల్లా ‘ఉత్తమ ప్రదర్శన అవార్డు’కు ఎంపికై ంది. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో పాలన, విద్యా, ఆరోగ్య రంగాల బలోపేతం, పర్యావరణ పరిరక్షణ, పౌర సౌకర్యాల అభివృద్ధి వంటి రంగాల్లో జిల్లా యంత్రాంగం కనబరిచిన ఆదర్శప్రాయమైన పనితీరును కేంద్ర ప్రభు త్వం గుర్తించి ఈ పురస్కారాన్ని అందించింది. ఫైర్ సిబ్బందిపై ఎస్పీ ఫైర్ ● బాణ సంచా క్రయవిక్రయాలను తనిఖీ చేసిన ఎస్పీ విజయనగరం క్రైమ్: బాణసంచా విక్రయాలు జరుగుతున్న ప్రదేశంలో ఫైర్ ఇంజిన్లు లేకపోవడంపై ఎస్పీ దామోదర్ అగ్నిమాపక శాఖ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. నగరంలోని కె.ఎల్.పురం వద్ద తాత్కాలికంగా ఏర్పాటుచేసిన బాణసంచా దుకాణాలను ఎస్పీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ అగ్నిమాపక వాహనాలు లేకపోవడం చూసి అసహనం వ్యక్తంచేశారు. వన్టౌన్ సీఐకు చెప్పి అగ్నిమాపక శాఖ అధికారులతో రెండు ఫైరింజన్లను ఏర్పాటుచేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాణసంచా విక్రయాలు జరిపేందుకు తాత్కాలిక అనుమతులు పొందిన వ్యాపారులు గడువు కాలం ముగిసిన వెంటనే క్రయవిక్రయాలు నిలిపివేయాలన్నారు. మిగిలి పోయిన బాణసంచా నిల్వలను సురక్షితమైన గొడౌన్లలో భద్రపరుచుకోవాలన్నారు. షాపుల మధ్య విధిగా 15 మీటర్ల దూరం ఉండాలన్నారు. ఒకవేళ అగ్నిప్రమాదం సంభవిస్తే తక్షణ నివారణ చర్యల్లో భాగంగా షాపులవద్ద ఇసుక బస్తాలు, నీటి టబ్లు, ఫైర్ నియంత్రీకరణను అందుబాటులో ఉంచాలన్నారు. ఆయా ప్రదేశాల్లో ట్రాఫిక్జామ్ కాకుండా వెహికల్స్ను సుదూర ప్రాంతంలో పార్కింగ్ చేసేలా పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రతా ప్రమాణాలు పాటించని పక్షంలో దుకాణదారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఎస్పీ సౌమ్యలత, ఇన్చార్జి డీఎస్పీ గోవిందరావు, ఎస్బీ సీఐ లీలారావు, వన్టౌన్ సీఐ ఆర్వీకే చౌదరి, టుటౌన్ సీఐ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ సూరినా యుడు ఉన్నారు. బాడంగి: స్థానిక హైస్కూల్ ఆవరణలోని కేజీబీవీ–4 టైప్ బాలికల వసతిగృహానికి అవసరమైన సిబ్బందిని త్వరలో నియమించి అందుబాటులోకి తెస్తామని ఈడీఓ మాణిక్యాలనాయుడు సమాచారం ఇచ్చారని హెచ్ఎం డి.సత్యనారాయణ చెప్పారు. ఈ నెల 16వ తేదీన ‘ఆ హాస్టల్ ప్రారంభానికే పరిమితం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు డీఈఓ స్పందించారన్నారు. హాస్టల్లో చేరిన బాలికలతో త్వరలోనే వసతి కల్పిస్తామని చెప్పారన్నారు. దీపావళిది ప్రత్యేక స్థానం విజయనగరం అర్బన్: దీపావళికి.. వెలుగుల పండగగా చెడుపై మేలును ప్రతిబింబించే మహోత్సవంగా దేశ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందని కలెక్టర్ రాంసుందర్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ కలెక్టర్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండగ సందర్భంగా జిల్లాలోని ప్రతి ఇంటిలో ఆనందం, సౌభాగ్యం, సుఖశాంతులు నిండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. టపాసులు కాల్చే సందర్భంలో పిల్లలు, పెద్దలు జాగ్రత్తలు పాటించాలని, పర్యావరణ హితంగా పండగ జరుపుకోవాలని కోరారు. ఈ దీపావళి ప్రతి కుటుంబానికి కొత్త ఆశలు, వెలుగులు, విజయాలు తెచ్చిపెట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రేపటి పీజీఆర్ఎస్ రద్దు దీపావళి పండగ సందర్భంగా ఈ నెల 20న సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ను రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. తదుపరి వారం నుంచి పీజీఆర్ఎస్ యథావిధిగా జరుగుతుందని తెలిపారు. ఈ వారం పీజీఆర్ఎస్ రద్దు విషయాన్ని ఫిర్యాదుదారులు గమనించి వ్యయప్రయాసలకు ఓర్చి కలెక్టరేట్కు రావద్దని సూచించారు. -
● పక్కపక్కనే...
చిత్రంలో కనిపిస్తున్నవి ఆంధ్రా–ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిపై బొబ్బిలి ఫ్లై ఓవర్కు వందమీటర్ల లోపల ఏర్పాటుచేసిన బాణ సంచా విక్రయ దుకాణాలు. వీటికి సమీపంలో ఆస్పత్రులు, ఆలయాలు, పాఠశాలలు ఉన్నాయి. ఇంకా అధికారులు అనుమతులు ఇవ్వకుండా... దుకాణాల మధ్య కనీస దూరం (20 అడుగులు) పాటించకుండా.. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దంటూ హెచ్చరిస్తున్నారు. అధికారుల నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. – బొబ్బిలి -
ప్రజాస్వామ్యం.. అపహాస్యం
–IIలో● అక్షరంపై ఆంక్షలు.. సిగ్గు సిగ్గు! ● ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిపై పోలీసుల వేధింపులు ఆపాలి పార్వతీపురం రూరల్: ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి, పలువురు జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మేధావులు, ప్రజా, గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులు తప్పుబట్టారు. ప్రజల గొంతుకను వినిపిస్తున్న పత్రికల గొంతునొక్కే నిరంకుశ చర్యలపై మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, నకిలీ మద్యం కుంభకోణాన్ని ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చినందుకే ‘సాక్షి’పై కక్ష కట్టారని, ఇది భావప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభిప్రాయపడ్డారు. అక్షరానికి సంకెళ్లు వేసే దుశ్చర్యలను తక్షణమే విరమించుకోవాలని, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న కుంభకోణాలను, అక్రమాలను ఆధారాలతో సహా ప్రచురిస్తున్న పత్రికలపై ప్రభుత్వమే కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటు. ఇది వాస్తవాలను సమాధి చేయాలనే దుష్ట పన్నాగం. వాస్తవాలను నిర్భయంగా రాస్తున్న సంపాదకులపై, పాత్రికేయులపై వేధింపులకు పాల్పడడం అంటే... భావప్రకటనా స్వేచ్ఛను బందీ చేయడమే. ప్రశ్నించే తత్వాన్ని, నిజాలను నిగ్గుతేల్చే మేధో స్వేచ్ఛను అణచివేయాలని చూడడం ద్వారా ప్రభుత్వం విద్యార్థి లోకానికి ఏం సందేశం ఇస్తోంది? రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ, నిజాన్ని నిర్బంధించాలనుకోవడం పాలకుల ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనం. – బి.రవికుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా అవినీతి, కుంభకోణాలను, అక్రమాలను వెలుగులోకి తెస్తున్న పత్రికల గొంతు నొక్కాలని అధికారంలో ఉన్న ప్రభుత్వం చూడడం అత్యంత హేయమైన చర్య. ప్రభుత్వ నిర్వాకంతో అవస్థలు పడుతున్న ప్రజల గొంతుకగా నిలుస్తున్న పత్రికలపైనే ప్రభుత్వం కత్తిగట్టడం దారుణం. ఇది కేవలం పత్రికా స్వేచ్ఛపై దాడి కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడే గొంతుకపై జరిగిన దాడి. అధికార పాలకుల నిరంకుశ ధోరణికి అద్దం పడుతోంది. ఏదైనా వార్తా కథనం వచ్చేటప్పుడు వాటికి వివరణ అయినా ఇవ్వాలి. లేదా ఖండిస్తున్నాం అని తెలియజేయాలి, అంతేకానీ పత్రిక గొంతు నొక్కేలా కేసులు బనాయించడం సమంజసం కాదు. – పాలక రంజిత్ కుమార్, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ విధానాల్లోని లోపాలను, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న పత్రికలపై కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణం. ఇది కేవలం పత్రికా స్వేచ్ఛపై దాడిగా భావించరాదు. ఇది సమస్యలపై ఎత్తిచూపే గొంతు నొక్కే కుట్ర. అక్షరానికి సంకెళ్లు వేయడం, రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛను కాలరాయడం కూటమి ప్రభుత్వ నిరంకుశ పోకడలకు పరాకాష్ట. ప్రశ్నించే గొంతుకలను నిర్బంధించే ఈ చర్యలను కార్మిక లోకం తీవ్రంగా గర్హిస్తోంది. ‘సాక్షి’ ఎడిటర్, జర్నలిస్టులపై అక్రమంగా బనాయించిన కేసులను తక్షణమే రద్దు చేయాలి. – ఆర్వీఎస్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛను హరించడం, వార్తలు రాసినందుకే సంపాదకులపై కేసులు బనాయించడం అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోంది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పత్రికా రంగంపై ప్రభుత్వమే ఉక్కుపాదం మోపడం దారుణం. ఇది కేవలం ఒక పత్రికపై జరిగిన దాడి కాదు. ఇది యావత్ జర్నలిస్టు లోకాన్ని భయభ్రాంతులకు గురిచేసే కుట్ర. వాస్తవాలను వెలికితీసే ప్రతి కలాన్నీ విచ్ఛిన్నం చేసే దురాలోచన ఇది. భావప్రకటనా స్వేచ్ఛ అనే రాజ్యాంగ ప్రాథమిక హక్కును ఇంత నిర్లక్ష్యంగా కాలరాయడాన్ని సహించలేము. ఈ కక్ష సాధింపు చర్యలు ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం. – అల్లువాడ కిషోర్, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ● -
గంజాయి కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ పోలీస్స్టేషన్లో 2022 లో నమోదైన గంజాయి కేసులో అస్సాం రాష్ట్రానికి చెందిన ముద్దాయి (ఎ1) ఆకాష్ ఖూడా (22)కు మూడేళ్లు కఠిన కారాగార శిక్ష రూ.10వేల జరిమానా విధిస్తూ విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శుక్రవారం తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో 2022 సెప్టెంబర్ 19 వ తేదీన ఒక లాడ్జిలో ముగ్గురు వ్యక్తులు మూడు బ్యాగులతో అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 4.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రాలను దాఖలు చేశారు. మూడేళ్ల తర్వాత కోర్టు విచారణలో నిందితుడు ఆకాష్ ఖూడా (22)పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష రూ.లక్ష జరిమానా విధించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులపై నాన్ బెయిలబుల్ వారంట్లు పెండింగ్ లో ఉన్నాయని ఎస్పీ తెలియజేశారు. -
ఖైదీలపట్ల వివక్ష కూడదు
● జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్విజయనగరం ఫోర్ట్: ఖైదీల పట్ల సిబ్బందిగాని, తోటి ఖైదీలు గాని వివక్ష చూపకూడదని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్ అన్నారు. స్థానిక సబ్జైలును శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఖైదీల పట్ల వివక్ష చూపిన ఎడల కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ నేర ప్రవృత్తిని విడనాడాలని కోరారు. జైల్లో ఉన్న ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కర్తవ్యమని తెలిపారు. జైల్లో ఉన్న సౌకర్యాల గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత జైల్లో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్ను తనిఖీ చేశారు. అనంతరం జువైనల్ జస్టిస్ హోమ్ను సందర్శించి అక్కడ ఉన్న ప్యానల్ న్యాయవాదులతో బాల నేరస్తుల పట్ల నమోదు చేస్తున్న కేసులను వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆ తర్వాత వన్స్టాప్ సెంటర్ను పరిశీలించి సెంటర్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలు, బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వన్స్టాప్ సెంటర్ పోలీస్ అధికారి శోభారాణి తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగ ఉద్యోగిని చూసి చలించిన కలెక్టర్
విజయనగరం అర్బన్: కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఎంప్లాయీస్ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో ఒక దివ్యాంగ యువతిని చూసి ఆత్మీయంగా పలకరించి, ఆమె సమస్యను తెలుసుకున్నారు. ఎస్.కోట మండలానికి చెందిన తానవరపు రూపశ్రీ దివ్యాంగురాలు. సెకండరీ గ్రేడ్ టీచర్గా ఎంపిక కాగా కురుపాం మండలానికి పోస్టు కేటాయించారు. దూరప్రాంతం కావడంతో తన శారీరక పరిస్థితుల దృష్ట్యా అక్కడ విధులు నిర్వర్తించడం సాధ్యం కాదని ఆమె కలెక్టర్కు వివరించింది. ఆమె బాధ విన్న కలెక్టర్ రామ్సుందర్రెడ్డి మానవత్వంతో స్పందించి మాట్లాడుతూ నీ సమస్యను ప్రభుత్వానికి పంపించి మేలు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మొత్తం 27 ఫిర్యాదులు అందగా గత నెలలో వచ్చిన 40 ఫిర్యాదులలో ఎక్కువ శాతం పరిష్కారమయ్యాయని కలెక్టర్ తెలిపారు. ట్రెజరీ, డ్వామా, ఈపీడీసీఎల్, మెడికల్ వంటి విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ ఎస్శ్రీనివాసమూర్తి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సానుభూతితో సమస్య పరిష్కారానికి హామీ -
డివైడర్ను ఢీకొని విద్యార్థి మృతి
విశాఖపట్నం: స్థానిక బీఆర్టీఎస్ రోడ్డు మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని విజయనగరానికి చెందిన చిలకలపల్లి విశాల్ (21)గా గుర్తించారు. విశాల్ గీతం విశ్వవిద్యాలయంలో నాలుగో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతూ పెందుర్తి ప్రాంతంలోని పురుషోత్తమపురంలో తన మామయ్య ఇంట్లో ఉంటూ కళాశాలకు వెళ్తున్నాడు. గురువారం సాయంత్రం విశాల్ తన స్నేహితుడు సూర్యతో కలిసి కళాశాల నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి హనుమంతవాక మీదుగా బీఆర్టీఎస్ రోడ్డులో వెళ్తున్న క్రమంలో.. శ్రీకృష్ణాపురం సమీపంలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిన విశాల్ గుండెకు తీవ్ర గాయం తగిలి అంతర్గత రక్తస్రావం జరిగింది. సూర్యకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన విశాల్ను స్థానికులు.. ఆరిలోవ పోలీసుల సహాయంతో విమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. శుక్రవారం మృతదేహానికి శవపంచనామా నిర్వహించి, అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ మద్యంపై విస్తృత తనిఖీలు
● అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ చౌదరివిజయనగరం రూరల్: ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో 225 దుకాణాలు, 26 బార్ అండ్ రెస్టారెంట్లలో కల్తీ మద్యం విక్రయాలు జరగకుండా విస్తృత తనిఖీలు నిర్వహించామని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వై. శ్రీనివాస చౌదరి శుక్రవారం తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఎక్కడ నకిలీ మద్యం దాఖలాలు కనిపించ లేదన్నారు. లైసెన్న్స్ పొందిన రిటైల్ మద్యం దుకాణాలు, బార్లు, ఇన్ హౌస్ సంస్థల కార్యకలాపాలను, అలాగే నాణ్యమైన, సురక్షితమైన మద్యం మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో నిర్ధారణకాని, అక్రమంగా తయారైన మద్యం చలామణి జరుగుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం ఆదేశాల మేరకు నకిలీ మద్యంపై విస్తృత తనిఖీలు చేపట్టి మద్యం దుకాణాల్లో సహకరించిన నమూనాలను ల్యాబ్ లకు పంపించి నిర్ధారణ చేసుకోనున్నామన్నారు. సమావేశంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి. శ్రీనాథుడు, తదితరులు పాల్గొన్నారు. -
ఫెన్సింగ్ పోటీలకు జిల్లా జట్లు సిద్ధం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్ జూనియర్స్ బాల, బాలికల ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని విజ్జి స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన పోటీల్లో 14 సంవత్సరాలలోపు వయస్సు గల బాల, బాలికలకు అవకాశం కల్పించగా.. జిల్లా నలుమూలల నుంచి 40 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వారికి పోటీలు నిర్వహించగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పడగల కనిష్(ఫైల్), ఎం.డి షేక్ అహ్మద్ (ఫైల్), జె.శ్యాం శశాంక్ (ఫైల్), ఎన్ఎం జితేంద్ర (ఫైల్), బి .హర్షవర్ధన్ (ఇప్పి), బి.ఆదిత్య వర్ధన్ (సేబర్), పి.శారద (ఫైల్), బి.హన్సి శ్రీవల్లి (సేబర్) విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 18న కాకినాడలో జరగనున్న పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు చీఫ్ కోచ్ డీవీ చారి తెలిపారు. ఈ ఎంపికపోటీలను అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సుంకర సతీష్కుమార్, వ్యాయామ అధ్యాపకురాలు సౌదామిని ,ఎన్ఐఎస్ కోచ్ అప్పలరాజులు పర్యవేక్షించారు. -
వైభవంగా సహస్ర దీపారాధన
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపారాధన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన పూజలనంతరం యాగశాలలో విశేష హోమాలు నిర్వహించారు. అనంతరం వెండి మంటపం వద్ద సీతారాముల నిత్యకల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామివారి విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మంటపం వద్దకు తీసుకువెళ్లి అక్కడున్న ప్రత్యేక ఊయలలో ఆసీనులను చేశారు. అనంతరం సహస్ర దీపాలను వెలిగించి దీపాల కాంతుల శోభలో స్వామికి ఊంజల్ సేవ జరిపించారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, రామగోపాలాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యాయత్నంపార్వతీపురం రూరల్: మండలంలోని సంగంవలస గ్రామానికి చెందిన వివాహిత వర్రి జానకి శుక్రవారం ఉదయం 9:30 గంటల సమయంలో తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్న క్రమంలో నొప్పిని తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొంతుతున్నట్లు కేంద్రాస్పత్రి అవుట్ పోస్ట్ పోలీస్ అధికారి ఎన్. భాస్కరరావు తెలిపారు. -
కూటమి నాయకుల కబ్జా
● కో–అపరేటివ్ బ్యాంకు స్థలం అక్రమణ ● ఫిర్యాదు చేసిన ఎంపీపీ, సర్పంచ్ కొమరాడ: మండలంలోని మాదలింగి పంచాయతీ అధీనంలో ఉన్న స్థలంపై కూటమి నాయకుల కన్ను పడింది. అదును చూసి చదును చేసి తమ అనచరులకు పప్పు బెల్లంలా పంచి పెట్టేశారు. అధికార బలంతో కూటమి నాయకులు చేస్తున్న అక్రమణలపై ఎంపీపీ శెట్టి. శ్యామల, సర్పంచ్ తుమరాడ కళావతి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. 40 ఏళ్ల క్రితం ప్రాథమిక సహకర కో–అపరేటివ్ భవనం నిర్మాణం చేసి ఆ ప్రాంత రైతులకు బ్యాంకు సేవలు అందించేవారు. కొన్నాళ్ల క్రితం ఆ సొసైటీ బ్యాంకును కొమరాడ పీఏసీఎస్లో విలీనం చేయడంతో ఆ భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో పాడైన భవనాన్ని కూలగొట్టి చదును చేశారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి ఆక్రమణదారులను తొలగించి ప్రభుత్వ స్థలం కబ్జాకు గురి కాకుండా కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
బాధిత కుటుంబాలకు.. వైఎస్సార్సీపీ భరోసా
సాక్షి, పార్వతీపురం మన్యం/కురుపాం/గుమ్మలక్ష్మీపురం: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పచ్చకామెర్లతో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు గిరిజన బాలికలకు వైఎస్సార్ సీపీ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. కురుపాం మండలం దండుసూర గ్రామానికి వెళ్లి వారి కుటుంబాలను శుక్రవారం ఓదార్చి, ధైర్యం చెప్పారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల ప్రకారం.. పార్టీ తరఫున తోయక కల్పన, అంజలి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున శాసనమండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అందజేశారు. అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కురుపాం ఆశ్రమ పాఠశాల, ఏకలవ్య పాఠశాల విద్యార్థులను మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్నదొర, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగా రావు, విశ్వాసరాయి కళావతి, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు తదితరులతో కలిసి బొత్స పరామర్శించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యంపై తల్లిదండ్రులను ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని, పూర్తిగా నయమైన తర్వాతనే డిశ్చార్జి చేయాలని వైద్యులకు సూచించారు. వార్డులో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరి వద్దకూ వెళ్లిన నాయకులు.. త్వరగా తగ్గిపోతుందని ధైర్యం చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శకు వస్తు న్నారన్న సమాచారంతో.. ఎవరి ఆదేశాల ప్రకా రమో గానీ, ఆస్పత్రి వైద్యులు గురువారం రాత్రి, శుక్రవారం పలువురు పిల్లలను డిశ్చార్జి చేశారు. ముందు రోజు రాత్రి వరకు ఒక గదిలో ఉంచి, చికిత్స అందించిన పిల్లలందరినీ.. అక్క డ నుంచి హడావిడిగా ఖాళీ చేయించి, ఆస్పత్రిలోని వివిధ వార్డులకు సర్దేశారు. దీంతో పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. -
తప్పుడు ప్రచారం చేశారు
పచ్చకమెర్లతో విద్యార్థిను లు మృతిచెందితే సరైన వైద్యం చేయించుకోలేదని, నాటువైద్యం చేయించుకోవ డం వల్ల మృతిచెందారంటూ అధికారులతో తప్పుడు ప్రచారం చేయించడం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల పాలనా కాలంలో 15 మంది విద్యార్థులు మృతిచెందారు. అందులో నెలరోజుల వ్యవధిలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సొంత మండలంలో ముగ్గురు విద్యార్థులు, సొంత నియోజకవర్గానికి చెందిన మరో ఇరువురు విద్యార్థులు కలి పి ఐదుగురు మృతిచెందారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కళ్లు తెరవాలి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలి. –పీడిక రాజన్నదొర, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి -
పార్వతీపురం మన్యం
శనివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్ శ్రీ 20259పాలకొండ/పాలకొండరూరల్/కురుపాం/విజయనగరం అర్బన్: ప్రజాపక్షంగా వార్తలు ప్రచురిస్తున్న ‘సాక్షి’పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనా యించడంపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది భావప్రకటన, పత్రికా స్వేచ్ఛను నెరిపే ప్రయత్నమని పేర్కొన్నారు. నకిలీ మద్యం తయారీ అంశాన్ని వెలుగులోకి తెచ్చిన సాక్షి మీడియాపై అక్కసు ఎందుకు ‘బాబూ’ అంటూ ప్రశ్నించారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డికి పదేపదే నోటీసులు ఇవ్వడాన్ని ఆక్షేపిస్తూ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజాపక్షంగా నిలిచే పత్రికల గొంతు నొక్కేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. వార్త లు సహేతుకంగా లేవని భావిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రజాస్వామ్య పద్ధతి అని, ప్రభు త్వం ఆ మార్గాన్ని పక్కన పెట్టి అక్రమ కేసులు పెట్టి మీడియాపై దాడులు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తే రానున్న రోజుల్లో జర్నలిస్టులమంతా సంఘటితమై అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తేయాలని కోరుతూ విజయనగరంలోని జర్నలిస్టులు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ మద్దతు తెలిపింది. సాక్షి బ్యూరో చీఫ్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నా యకులు పీవీ శివప్రసాద్, జిల్లా అధ్యక్షుడు మహాపాత్రో, సీనియర్ జర్నలిస్టులు పలువురు పాల్గొన్నారు. ●కూటమి ప్రభుత్వం ప్రజాసామ్యంపై దాడిచేస్తోందని పత్రిక, ప్రజాసంఘాల నాయకులు విమర్శించారు. నకిలీ మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని, వాస్తవాలు వెలుగులోకి తెచ్చిన సాక్షి పత్రిక ఎడిటర్, రిపోర్టర్లపై కేసు లు బనాయించడంపై నిరసన తెలిపారు. పాలకొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ధ ధర్నాచేశారు. జర్నలిస్టులకు నోటీసులు జారీ చేయడాన్ని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, ప్రెస్ క్లబ్ సభ్యుడు బత్తుల వెంకటరమణ, జొన్నగడ్డల కామేశ్వరావు, ఆటో యూనియ న్ నాయకుల కాద రాములు తప్పుబట్టారు. అనంతరం తహసీల్దార్ రాధాకృష్ణమూర్తికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సోషల్ మీడియా ప్రతినిధి తిర్లంగి ఉపేంద్రకుమార్, ప్రెస్క్లబ్ నాయ కులు శివకుమార్, కె.వి.రమణ, కల్యాణ్కుమార్, ఈశ్వరరావు, రవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ●పత్రికా స్వేచ్ఛను కాపాడాలంటూ తహసీల్దార్ జయకు కురుపాం నియోజకవర్గానికి చెందిన పాత్రికేయులు కె.చంద్రమౌళి, ఢిల్లేశ్వరరావు, జి.పెంటయ్య, ఫృధ్వి, లక్ష్మణరావు, రంగనాథం తదితరులు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రభుత్వానికి తగదన్నారు. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై అక్రమ కేసులను వెనుకకు తీసుకోవాలని, లేదంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ‘సాక్షి’పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నిరసిస్తూ జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టర్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కురుపాంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేస్తున్న జర్నలిస్టులు -
విద్యార్థుల ఆరోగ్య బాధ్యత గురువులదే
పార్వతీపురం రూరల్: వసతిగృహాల్లోని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ బాధ్యత పూర్తిగా ఉపాధ్యాయులదేనని, అనారోగ్యంతో వసతిగృహాల నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో అడుగుపెట్టేంతవరకు అన్నీతామై వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వసతిగృహ వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులు, ఇంజినీరింగ్ అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షించారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. బాలికల్లో హిమోగ్లోబిన్ 10 శాతం కంటే తగ్గకుండా చూడాలన్నారు. మరుగుదొడ్లు లేని వసతిగృహాల వివరాలు అందిస్తే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధుల నుంచి మంజూరు చేయిస్తామని చెప్పారు. ఈఎంఆర్ఎస్, గురుకులాల్లో తాగునీరు, ప్రహరీల, కిటికీలకు మెస్లు వంటి పనులకు వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి ఎ.విజయశాంతి, ఉప వైద్యాధికారి కె.ఎస్.పద్మావతి పాల్గొన్నారు. ● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: రుణాల మంజూరుతోపాటు రికవరీపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణాల రికవరీ సక్రమంగా ఉంటేనే మరిన్ని రుణాలు మంజూరుకు బ్యాంకులకు అవకాశముంటుందని చెప్పారు. పీఎంఈజీపీ, పీఎంవిశ్వకర్మ, ముద్ర, నాబార్డు రుణాల మంజూరుపై సమీక్షించారు. -
●తప్పుడు కేసులు సరికాదు
ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు. పత్రికా ప్రతినిధులపై దాడులు, అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డికి నోటీసులు ఇవ్వడమంటే పత్రికా స్వేచ్ఛపై దాడిగానే పరిగణించి, కూటమి ప్రభుత్వ తీరును వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది. – బి.వి.రమణ, పాలకొండ ప్రెస్క్లబ్ సభ్యుడు కూటమి ప్రభుత్వం పోలీసుల అండతో పత్రి కా స్వేచ్ఛను హరిస్తోంది. అజమాయిషీ చెలాయిస్తోంది. వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పే పత్రికలపై కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. ఇది అమానుషం. – జె కామేశ్వరరావు, పాలకొండ ప్రెస్క్లబ్ గౌరవాధ్యక్షుడు కూటమి ప్రభుత్వం పత్రికల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం పోలీసులను పావులుగా వాడుతోంది. ప్రజాస్వామ్యంలో అక్రమాలను వెలికితీసే బాధ్యత, హక్కు పత్రికలకు ఉంది. ‘సాక్షి’పై జరుగుతున్న దాడుల ను వెంటనే నిలిపివేయాలి. –డి.రమణారావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ప్రజల ప్రాణాలను హరిస్తున్న నకిలీ మద్యం వ్యవహారాన్ని వెలికితీయడం తప్పా?. వాస్తవాలు రాస్తే భయమెందుకు?. పత్రికలపై దాడిచేయడం తగదు. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. – కె.సూర్యప్రకాష్రావు, న్యాయవాది -
పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు
పాచిపెంట: మండలంలోని పలు పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. అ భివృద్ధి చేస్తే ‘అరుకుకు దీటుగా అందాలు‘ శీర్షికన గత నెల 29వ తేదీన సాక్షిలో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు. మండలంలోని పర్యాటక ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టాలని వెలుగు డీపీఎం శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పజెప్పారు. అందులో భాగంగా ధారగెడ్డకు వెళ్లే దారిలో ఉన్న తుప్పలు డొంకలు గురువారం తొలగించారు. ఈ పనులు పర్యవేక్షిస్తున్న వెలుగు ఏపీఎం శ్రీరాములు ‘సాక్షి‘ తో మాట్లాడుతూ త్వరలో రహదారి నిర్మాణం చేపట్టనున్నామని, వాటితోపాటు ప్రత్యక్షంగా పర్యాటకులతో మాట్లాడి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. అలాగే వెలుగు మహిళా సంఘాల సభ్యులకు లోన్ రూపంలో డబ్బులు మంజూరు చేసి పర్యాటక ప్రదేశాల్లో షాపులు ఏర్పాటు చేయించి పర్యాటకులకు అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. -
జీఎస్టీ తగ్గింపు వల్ల అన్ని వర్గాలకు ప్రయోజనం
విజయనగరం టౌన్: జీఎస్టీ శ్లాబ్ను రెండుకు తగ్గించడం వల్ల అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ ఎస్.రామ్సుందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాంతీయ రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ వాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద గురువారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ఆర్అండ్బీ జంక్షన్, సంతకాల వంతెన, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జేసీ సేతు మాధవన్, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఉప రవాణాధికారి డి.మణికుమార్, ఆర్టీఓ విమల, సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు దుర్గాప్రసాద్, రవిశంకర్ ప్రసాద్, శివరాంగోపాల్, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మండపాక నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన శాఖ మంత్రి బాధ్యత వహించాలి
సాలూరు: మంచి చదువులు చదివి జీవితంలో గొప్పస్థాయికి ఎదిగి తమ కష్టాలను శాశ్వతంగా దూరం చేస్తారని కోటి ఆశలతో బిడ్డలను పాఠశాలలకు పంపగా అక్కడ సరైన సదుపాయాలు లేక అనారోగ్యాలకు గురై అమాయక గిరిజన బిడ్డలు మరణస్తున్నారు. ఆ బిడ్డల తల్లిదండ్రులకు సంబంధిత శాఖ మంత్రి, ప్రభుత్వం ఏం సమాధానం చెబుతారని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో పట్టణంలో వైఎస్సార్సీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనారోగ్యానికి గురై మరణించిన విద్యార్థులు, దివంగత మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ పువ్వలనాగేశ్వరరావులకు నివాళులు అర్పించి కొన్ని నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రాజన్నదొర మాట్లాడుతూ, గిరిజన విద్యార్థుల ప్రాణాలు రక్షించడంలో గిరిజనసంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని, ఫలితంగా గిరిజన విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని గిరిజన విద్యార్థులు మరణిస్తుంటే గిరిజనశాఖ మంత్రికి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 13 మంది విద్యార్థులు మృతిచెందారని, సాలూరు నియోజకవర్గంలో ఇద్దరు మృతిచెందారన్నారు. కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 175 మంది పచ్చకామెర్లతో బాధపడుతూ కురుపాం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా సంబంధిత గిరిజన సంక్షేమశాఖమంత్రికి, ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయమన్నారు. జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేశాంవిద్యార్థులు పచ్చకామెర్లతో చరిపోతున్నా,సెరిబ్రల్ మలేరియా, జ్వరంతో చనిపోతున్నట్లు చూపిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల మరణాలపై జాతీయమానవహక్కుల సంఘానికి, జాతీయ ఎస్టీ కమిషన్కు ఢిల్లీలో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఇంతమంది విద్యార్థులు మృతిచెందడం వల్ల జిల్లా మంత్రిగా ఆమె విఫలమయ్యారని, ఈ శాఖలో మరణాలపై సదరు మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
ఆనందం వెంబడి అంధకారం
● బాణసంచా పేల్చడంలో జాగ్రత్తలు పాటించాలి ● పెద్దలు వెంట ఉంటే ఆనందం మీ వెంటేరామభద్రపురం: జాతి, కుల, మత,వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ దివ్య దీపావళి. చీకటిని పారదోలి వెలుగులు నింపే పండగగా, విజయానికి ప్రతీకగా దీపావళిని ఏటా ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున జరుపుకోవడం ఆనవాయతీ. అయితే దీపావళిని వేడుకగా జరుపుకునే క్రమంలో చాలా ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగి పలువురు గాయపడుతున్నారు. టపాసులు పేల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బాణసంచాలోని రసాయనాలతో కళ్లు దెబ్బతింటాయి. సల్ఫర్, గన్పౌడర్ లాంటి రసాయనాల ప్రభావం వల్ల కళ్ల నుంచి నీరు కారడం, కళ్ల మంటలు, దురద వంటి ప్రభావాలు ఉంటాయి. ఒక్కోసారి కళ్లు పూర్తిగా కనబడకుండా పోతాయి. నిఘాతోనే అక్రమానికి అడ్డు కట్ట రూ.లక్షల విలువైన సరుకును ఎలాంటి అనుమతులు లేకుండా దిగుమతి చేసుకుని నిల్వ ఉంచుతున్నారు.పండగ రోజు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కొదరైతే ఏకంగా నివాస ప్రాంతాల మధ్య నిబంధనలు పాటించకుండా నిల్వ చేస్తున్నారు. అలాగే తాత్కాలికంగా అనుమతులు తీసుకున్న దుకాణాల వ్యాపారులు మిగిలిన సరుకును కొన్న చోటకే తిరిగి పంపాల్సి ఉంటుంది. కానీ కొందరు అలా చేయడం లేదు.పలు చోట్ల గుట్టుగా నిల్వ చేసి ఇతర సమయాల్లోనూ అమ్మేస్తున్నారు.కొందరైతే ఎలాంటి అనుమతులు లేకపోయినా పొరుగు ప్రాంతాల నుంచి పేలుడు పదార్థాలు తెప్పించి ఇళ్లలోనే టపాసులు తయారు చేస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించి తనిఖీలు చేయకపోతే అనుమతి లేని వారు విక్రయాలతో పాటు చేసే నిల్వలతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు.సొంత వైద్యం వద్దు టపాసులు కాల్చేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే కొందరు సొంత వైద్యం చేస్తుంటారు. ఇది మంచిది కాదు. వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదించాలి. ప్రథమ చికిత్స చేసే ముందు కాలిన గాయంపై చల్లని నీరు పోయాలి. అంతేగానీ ఐస్ముక్కలతో రుద్దకూడదు. వెన్న గ్రీజ్, ఇతర పౌడర్లు వంటివి రాయకూడదు. వాటివల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. దిలీప్కుమార్, వైద్యాధికారి, పీహెచ్సీ, రామభద్రపురం కాల్చే ముందు అప్రమత్తం పెద్దవాళ్ల పర్యవేక్షణలోనే చిన్నారులు బాణసంచా కాల్చడం ఉత్తమం. టపాసులు కాల్చేటప్పుడు నీళ్లు దగ్గర పెట్టుకోవాలి.ఇంటి కిటికీలు, తలుపులు మూసివేయాలి. ఉదయం 6 నుంచి 8 వరకు,రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలి.దీపావళి పండుగ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలాగే ఏ విధమైన అనుమతులు లేకుండా బాణ సంచా విక్రయిస్తే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. వి.ప్రసాదరావు, ఎస్సై, రామభద్రపురంప్రమాద నివారణ, జాగ్రత్తలు ఇలా.. టపాసులు వెలిగించిన వెంటనే దూరంగా జరగాలి పేలని టపాసులపై వంగి చూడడం మంచిది కాదు కంటికి రక్షణగా ప్లెయిన్ అద్దాలు వాడడం మంచిది పేరున్న సంస్థలు తయారు చేసిన టపాసులనే ఎంపిక చేసుకోవాలి పిల్లలు, యువకులు, మహిళలు ఇలా ఎవరు ఏ రకం టపాసులు కాల్చాలో ముందే నిర్ణయించుకుని ప్రణాళిక మేరకే కొనాలి ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వైద్యాధికారిని సంప్రదించాలి బాణసంచాను కిచెన్, పొయ్యి ఉన్న ప్రాంతాల్లో ఉంచకూడదు బాణసంచా కాల్చేటప్పుడు వదులుగా ఉన్న దుస్తులు ధరిస్తే అవి వేలాడుతూ అంటుకునే ప్రమాదం ఉంది. కొద్దిగా బిగుతైన కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి చిన్న పిల్లలను ఎత్తుకుని బాణసంచా కాల్చకూడదు.పెద్ద వారి సహాయం లేకుండా పిల్లలు వారంతట వారే బాణసంచా కాల్చరాదు అప్పుడే పుట్టిన చిన్నారులు, గర్భిణులు, వృద్ధులపై బాణసంచా శబ్దాలు ఎక్కువ ప్రమాదం చూపుతాయి. ప్రధానంగా చెవులు దెబ్బతింటాయి. చెవులను రక్షించుకోవడానికి ఇయర్ ప్లగ్స్ కొంత మేరకు ఉపయోగపడతాయి. పెద్ద శబ్దాలతో పేలే టపాసులు కాకుండా చాలా తక్కువ శబ్ధంతో పూలలాంటి వెలుగులు కురిపించే చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు, పెన్సిళ్లు, భూచక్రాలు వంటివి కాల్చడం మంచిది.భూ చక్రాలు, ఔట్లు కూడా ఒక్కోసారి పేలే ప్రమాదం ఉంది. వాటిని అగ్గిపుల్లలతో కాకుండా కాకర పువ్తొత్తులతో కాల్చడం మంచిది. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
నెల్లిమర్ల: స్థానిక చంపావతినదిలో బుధవారం గల్లంతైన కనకల అప్పారావు(46) మృతదేహం లభ్యమైంది. జరజాపుపేటకు చెందిన కనకల అప్పారావు థామస్పేట వద్ద చంపావతినదిలో స్నానానికి దిగి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మునిగిపోయి గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపకసిబ్బంది గాలింపు చేపట్టగా కొండపేట వెళ్లే రహదారిలో జూట్మిల్లు వద్ద మృతదేహం గురువారం లభ్యమైంది. మృతదేహానికి పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం పోలీసులు తరలించారు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి–చీపురుపల్లి రైల్వేస్టేషన్ల మధ్య రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని శ్రీకాకుళం జీఆర్పీ హెచ్సీ ఎస్.మధుసూదనరావు తెలిపారు. పాండిచ్చేరి నుంచి హౌరా వెళ్లే రైలు ఢీకొట్టగా మృతి చెందాడన్నారు. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని, చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో మృతదేహం ఉంటుందని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పోన్ 9110305494 నంబర్ను సంప్రదించాలని కోరారు. బైక్ అదుపుతప్పి వ్యక్తి.. గుర్ల: మండలంలోని తెట్టంగి శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుబర్తికి చెందిన తాడేల అచ్యుతరావు (35) మృతి చెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..దీపావళి సందర్భంగా బాణ సంచా కొనుగోలు చేయడానికి పెనుబర్తి నుంచి గవిడి పేట వెళ్తుండగా తెట్టంగి దాటిన తర్వాత బైక్ ఆదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో జరిగిన ప్రమాదంలో అచ్యుతరావు అక్కడికక్కడే మృతిచెందాడు. అదే బైక్పై వెళ్తున్న గుషిడి నారాయణ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వ్యక్తిని చీపురుపల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. మృతుడికి భార్య పార్వతి, ఇద్దరు కుమారులు వసంత్ కుమార్, తరుణ్ ఉన్నారు. -
గిరిజనం గుండెఘోష పట్టదా..?
● ప్రజాసంఘాల నాయకులు ● కలెక్టరేట్ ఎదుట నిరసన పార్వతీపురం రూరల్: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల వరుస మరణాలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. గిరిజన విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదా? ఇంకెంతమంది విద్యార్థులను నిర్లక్ష్యంతో బలిచేస్తారంటూ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్లు మాట్లాడుతూ గిరిజన విద్యాసంస్థలు విద్యార్థుల పాలిట నిర్లక్ష్యంతో వారి ప్రాణాలను బలిగొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పసిమొగ్గలు పిట్టల్లా రాలిపోతున్నాయని ఈ మరణాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను పత్రికాముఖంగా ప్రభుత్వానికి తెలియజేశారు. విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించాలి. వసతిగృహాల్లో మెరుగైన సదుపాయాలు, వైద్యసేవలు అందించాలి. మృతిచెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాలకు రూ. 25లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అలాగే విద్యార్థుల మరణాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకుని సురక్షితమైన తాగునీటిని విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఇటీవల మృతిచెందిన విద్యార్థుల ఫొటోలు చూపిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు వికాస్, బుచ్చి, కార్తీక్, చరణ్, గణేష్, మల్లేష్, చందు, గౌరీశ్వరి, చిన్నారావు, కొందరు తల్లిదండ్రులు, పలు పార్టీల నాయకులు శివప్రసాద్, గౌరీశంకరరావు, ఈవీనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పూరిల్లు దగ్ధం
సంతకవిటి: మండలంలోని మండాకురిటి గ్రామానికి చెందిన బొమ్మరిల్లు రాజారావు పూరిల్లు గురువారం అగ్నికి ఆహుతైంది. సమాచారం మేరకు పొందూరు అగ్నిమాపక శాఖ సిబ్బంది గ్రామానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.1.5 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాక సిబ్బంది తెలిపారు. ప్రమాదానికి కారణం తెలియరాలేదన్నారు. ఇల్లు కాలిపోవడంతో కుటుంబం వీధిన పడిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని రాజారావు కోరుతున్నాడు. హెచ్ఐవీ రొగులకు శస్త్ర చికిత్సలు● స్పందించిన సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు విజయనగరంఫోర్ట్: హెచ్ఐవీ రోగులకు శస్త్రచికిత్సలు చేయడం లేదనే అంశంపై సాక్షిలో ఈనెల 14వతేదీన హెచ్ఐవీ రోగుల పట్ల వివక్ష శీర్షికన ప్రచురించిన కథనానికి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు స్పందించారు. ఆస్పత్రిలో హెచ్ఐవీ, హెచ్బీఎస్ఏజీ రోగులకు శస్త్రచికిత్సలు చేస్తున్నామని తెలిపారు. ఒక వేళ ఎవరైనా శస్త్రచికిత్సలు చేయడానికి నిరాకరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ తెలిపారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి...
దత్తిరాజేరు: మండల కేంద్రమైన దత్తిరాజేరులో గురువారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పువ్వల శ్రీనివాసరావుతో పాటు పది కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు మహదేవ్ ఫణీంద్రుడు, మజ్జి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్బాబు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. గతంలో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేవని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజల సంక్షేమం కుంటుపడిందని ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
పర్యాటక ప్రాంతాలుగా సహజ సిద్ధ జలపాతాలు
● కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డిగుమ్మలక్ష్మీపురం: జిల్లాలో ఉన్న సహజ సిద్ధ జలపాతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దనున్నట్లు కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గుమ్మలక్ష్మీపురం మండలంలోని తాడికొండ గ్రామ సమీపంలో గల మొగనాళి జలపాతాన్ని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిలతో కలిసి పర్యాటకుల సందర్శనార్థం కలెక్టర్ గురువారం ప్రారంభించారు. అంతేకాకుండా పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన టీ/ కాఫీ స్టాట్, ఫాస్ట్ఫుడ్ స్టాల్ను ప్రారంభించారు. జలపాతానికి పూజలు చేసి హారతి ఇచ్చారు. అలాగే జలపాతం సందర్శనకు కేటాయించిన తొలి టికెట్ను కలెక్టర్ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఈ జలపాతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, అందులో భాగంగా త్వరలో అడ్వెంచర్ స్పోర్ట్స్, క్లైంబింగ్ రాక్ను ఏర్పాటు చేస్తామని, ఈత కొట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. జిల్లాలో ఇలాంటి జలపాతాలు అనేకం ఉన్నాయని, వాటనన్నింటినీ అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. తద్వారా స్థానిక యువత, ఎస్హెచ్జీ మెంబర్లకు ఉపాధి అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాడికొండ గ్రామానికి వచ్చి మొగనాళి గెడ్డ జలపాతానికి వెళ్లాలనుకునే వారిని అక్కడికి చేర్చేందుకు మళ్లీ తీసుకువచ్చేందుకు సాధారణ ఖర్చులతో బైకర్స్ను కూడా గుర్తించామని, జిల్లా వెబ్సైట్లో ఈ బైకర్స్ వివరాలన్నీ ఉంటాయన్నారు. ఎవరికీ ఇబ్బంది వచ్చినా కాల్ చేసేందుకు వీలుగా ఒక టూరిజం కంట్రోల్ పాయింట్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ సుధారాణి, తహసీల్దార్ ఎన్.శేఖర్, ఎంఈఓ బి.చంద్రశేఖర్, వెలుగు ఏపీఎం సతీష్, ఏఎంసీ చైర్మన్ కె.కళావతి, తాడికొండ సర్పంచ్ ఎం.జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. -
2.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
వీరఘట్టం: ఈ ఏడాది ఖరీఫ్లో 2.58 లక్షల మెట్రి క్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా చేసుకున్నామని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ఎం.బాలసరస్వతి తెలిపారు. ఈ మేరకు గురువారం వీరఘ ట్టం వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 356 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయని, వాటి పరిధిలో 180 ధాన్యం కొనుగోలు కేంద్రాలను గుర్తించామన్నారు. ఇప్పటికే 104 మంది మిల్లర్లు ధాన్యం మర పట్టించేందుకు సముఖత చూపారని తెలిపారు. ధాన్యం కొనుగోలు పారదర్శకంగా చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కొద్ది రో జుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏర్పాటు చేయాలి పార్వతీపురం రూరల్: ఖరీఫ్ సీజన్లో 2.5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ రవాణా, గోనెసంచులు వంటివి సిద్ధం చేసుకోవాలని సూచిస్తూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, సమస్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రభుత్వం సాధారణ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2,369, గ్రేడ్ ఎ రకానికి రూ. 2,389 మద్దతు ధర ప్రకటించిందని, 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. -
టిడ్కో గృహాల పరిశీలన
సాలూరు: పట్టణంలోని టిడ్కో గృహాలను హౌసింగ్ పీడీ డా.ధర్మచంద్రారెడ్డి గురువారం పరిశీలించారు. టిడ్కో గృహాల నిర్మాణాల ప్రగ తి, అక్కడ వసతులు, సదుపాయాల కల్పన తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సాలూరు రూరల్: మండలంలోని బొడ్డవలస డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశ్రమపాఠశాల విద్యార్థులు నాలుగురోజుల క్రితం పచ్చకామెర్లతో విశాఖలోని కేజీహెచ్లో చేరారు. ఈ మేర కు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపిన వివరా ల ప్రకారం దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన వై.ఆకాష్ (9వతరగతి) కె.భార్గవ రావు(8వ తరగతి), జె.పార్థసారథి(8వ తరగతి) కె.సాత్విక్ (6వ తరగతి) సెలవులు ముగిసినా హాస్టల్కు రాకపోవడంతో పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులను సంప్రదించారు. దీంతో వారు సమాధానమిస్తూ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు చెప్పడంతో పాఠశాల ఉపాధ్యాయుడు యూసఫ్ పిల్లల ఆరోగ్య పరి స్థితిని తెలుసుకునేందుకు కేజీహెచ్కు వెళ్లారు. ప్రస్తుతం విధ్యార్థుల ఆరోగ్య పరిస్దితి నిలకడగా ఉందని పాఠవాల ప్రిన్సిపాల్ పి.మూర్తి తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు విశాఖపట్నంలో పనులు చేసుకుంటుండడంతో సెలవులకు వెళ్లిన విద్యార్థులు కేజీహెచ్లో చేరినట్లు తెలిపారు. పాచిపెంట: రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులను, పురిటి నొప్పులు వచ్చిన గర్భిణులను, అస్వస్థతకు గురైన బాలింతలను, ఇలా ఏ రోగం వచ్చినా ఆస్పత్రి కి తరలించాలంటే డోలీ కట్టాల్సిందే. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు మాత్రం రహదారి కష్టాలు తీరడంలేదని గిరిజనులు వాపోతున్నారు. పాచిపెంట మండలంలోని కేరంగి పంచాయతీ కోదులమడ గ్రామానికి చెందిన చోడిపల్లి పూలో అనే గిరిజన వద్ధుడు అనారో గ్యంతో గురువారం త్రీవ్ర అస్వస్థతకు గురయ్యాడు గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో కుటుంబసభ్యులు డోలీలో సుమారు 5 కిలోమీటర్ల దూరం నందేడవలస వరకు మోసుకువెళ్లి అక్కడినుంచి ఫీడర్ అంబులెన్స్లో గురువునాయుడుపేట పీహెచ్సీకి తరలించారు. సకాలంలో వైద్యులు చికిత్స అందించడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. అత్యవసర పరిస్థితుల్లో తమకు డోలీలే శరణ్యమవుతున్నాయని, ప్రభుత్వ పెద్దలు స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలని స్థానిక సర్పంచ్ సోములు లచ్చయ్య కోరారు. బొబ్బిలి: దైవానుగ్రహంతోనే లోక కల్యాణం సాధ్యమని త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జియర్, బృందావన రామానుజ జియర్లు అన్నారు. బొబ్బిలి కంచర వీధిలోని కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ప్రవచనాలు, మంగళా శాసనాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక పురోహితులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారి వనంగుడి హుండీల ఆదాయాన్ని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అమ్మవారి ఆలయ ఆవరణలో గురువారం లెక్కించారు. 42 రోజులకు రూ.12లక్షల 52వేల 606 నగదు లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష తెలిపారు. రామతీర్థం ఈఓ వై.శ్రీనివాసరావు పర్యవేక్షణలో సాగిన ఆదాయం లెక్కింపులో ధర్మకర్తల మండలి సభ్యులు పద్మావతి, కుమారి, తామేశ్వరరావు పాల్గొన్నారు. -
గిరిజన సంక్షేమశాఖ మంత్రి రాజీనామా చేయాలి
పార్వతీపురం: వరుసగా అనారోగ్యంతో విద్యార్థులు మరణిస్తున్నా పట్టించుకోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తక్షణమే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి బి.రవికుమార్ డిమాండ్ చేశారు. స్థానిక విలేకరులతో ఆయన బుధవారం మాట్లాడారు. మక్కువ మండలం ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న తాడంగి చిన్నారిని బతికించుకునేందుకు తల్లిదండ్రులు ఈనెల 13న సాలూరు ఏరియా ఆస్పత్రికి, అక్కడ నుంచి విజయనగరం, విశాఖ కేజిహెచ్కు తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. అలాగే, సాలూరు మండల మామిడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహం 7వ తరగతి చదువుతున్న తాడంగి పల్లవి ఈనెల 11న విశాఖపట్నం తరలించినప్పటికీ సెలిబ్రల్ మలేరియాతో మృతి చెందిందన్నారు. కురుపాంలో కలుషిత నీరు కారణంగా సుమారు 224 మంది విద్యార్థులు ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతుండగా ఇద్దరు మృతి చెందారన్నారు. గిరిజనుల ఓట్లతో గెలిచి వారికి కష్టమొస్తే పట్టించుకోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తక్షణమే విద్యార్థుల మృతికి బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల పరిహారం
● ఈ నెల 17న ఆర్థిక సాయం అందజేస్తాం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజుజియ్యమ్మవలస: కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో పచ్చకామెర్ల వ్యాధితో ఇద్దరు బాలికలు మృతిచెందారని, వారి కుటుంబాలకు ఈ నెల 17వ తేదీన వైఎస్సార్సీపీ తరఫున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని పార్టీ పార్వీతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన బుధవారం మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ఆర్థిక సాయాన్ని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు చేతుల మీదుగా అందజేస్తామని చెప్పారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం పార్వతీపురం ఆస్పత్రిలో హెపటైటిస్–ఏతో బాధపడుతున్న గిరిజన విద్యార్థులను పరామర్శిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యేలు కళావతి, అలజంగి జోగారావు పాల్గొంటారని తెలిపారు. -
ఆ హాస్టల్ ప్రారంభానికే పరిమితం..!
● ఇదెక్కడి తీరు ‘నాయనా’..! ● విద్యార్థులకు అక్కరకు రాని హాస్టల్ భవనం ● ఇంటివద్ద నుంచే రాకపోకలు బాడంగి: విద్యార్థుల వసతి కోసం హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. దానిని ఇప్పటిరకు అందుబాటులోకి తేలేదు. విద్యార్థులకు వసతి కల్పించలేదు. ఫలితం.. భవనం ప్రారంభించినా ఫలితం లేకపోతోంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదెక్క తీరు ‘నాయనా’ అని ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... బాడంగి హైస్కూల్కు అనుబంధంగా కేజీబీ టైప్–4 హాస్టల్ నూతన భవనాన్ని హడావిడిగా సెప్టెంబర్ 9న ఎమ్మెల్యే బేబీ నాయన చేతులమీదుగా ప్రారంభించారు. ఇప్పటివరకు ఆ భవనం నిర్వహణకు నోచుకోలేదు. వసతి సదుపాయం ఉంటుందన్న ఆశతో సాలూరు, పాచిపెంట తదితర దూరప్రాంతాలనుంచి హైస్కుల్లో చేరిన బాలికల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. ఇక్కడకు వచ్చి ఉండేందుకు వసతిలేక ఇంటివద్దనే ఉండిపోతున్నారు. చదువుకు దూరమవుతున్నారు. ఇదే విషయంపై బాడంగి హైస్కూల్ హెచ్ఎం సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా వార్డెన్, ట్యూటర్ను ఇచ్చారని, ఇంకా వంటమనిషి, వాచ్మన్, శానిటేషన్ వర్కర్లు, స్వీపర్లను నియమించాల్సి ఉందన్నారు. సిబ్బంది నియామకం అయితే వసతిగృహం అందుబాటులోకి వస్తుందన్నారు. హాస్టల్ సౌకర్యం ఉంటుందని మా పిల్లల్ని జె డ్పీ హైస్కూల్లో చేర్పించాం. జూన్ నెల నుంచి నాలుగునెలుగా చదువుకు దూరంగా గడుపుతున్నారు. ఇలా అయితే పదోతరగతిలో ఉత్తీర్ణులు ఎలా అవుతారు. త్వరితగతిన వసతిగృహాన్ని ప్రారంభించాలి. – గొర్కాకుమారి, దళాయి సత్యవతి, బాలికల తల్లులు, సాలూరు -
ధాన్యం రైతుకు ‘మద్దతు’ కరువు..!
రైతు కంటే వ్యాపారులకే లాభం ఏటా వ్యవసాయం చేసే రైతు కంటే పంటను కొనుగోలు చేసే వ్యాపారులే లాభం పొందుతున్నారు. సాగులో ఎదురయ్యే కష్టనష్టాలతో పాటు మార్కెట్లో ఏర్పడే ఒడుదుడుకులన్నింటినీ భరించేది అన్నదాతలే. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో దళారులకే తక్కువ ధరకు పంటను విక్రయించాల్సి వస్తోంది. – వావిలపల్లి హరిబాబు, రైతు, దశుమంతపురం, వీరఘట్టం మండలంఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్ వరి సాగు 1.75 లక్షల ఎకరాలు దిగుబడి అంచనా 3.58 లక్షల మెట్రిక్ టన్నులువీరఘట్టం: ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నంపెట్టే రైతన్నను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం కినుక వహిస్తోంది. పంట చేతికందే సమయంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తోంది. మద్దతు ధర అందకుండా చేస్తోంది. పరోక్షంగా వ్యాపారులకు పంటను దోచిపెట్టేలా వ్యవహరిస్తూ రైతన్నకు నష్టాన్ని మిగుల్చుతోంది. ధాన్యం సీజన్ ఆరంభమైనా... జిల్లాలోని ప్రధాన సాగునీటి వనరులైన తోటపల్లి జలాశయంతో పాటు, వెంగళరాయసాగర్, వట్టి గెడ్డ, పెద్దగెడ్డ, జంఝావతి, పెదంకలాం ప్రాజెక్టుల ఆయకట్టుతో పాటు వర్షాధార భూములు 1,75,065 ఎకరాల్లో రైతులు ఈ ఏడాది ఖరీఫ్లో వరిపంటను సాగుచేశారు. 3.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. అధికశాతం మంది రైతులు తక్కువ కాలవ్యవధిలో దిగుబడి వచ్చే సన్నరకాలు సాగుచేశారు. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. యంత్రాలతో కోతలు, నూర్పిళ్లు జోరుగా సాగుతున్నాయి. ఎకరాకు 28 నుంచి 30 బస్తాల (80 కిలోల బస్తాలు) వరకు దిగుబడి వస్తోంది. అయితే, ధాన్యం విక్రయిద్దామంటే జిల్లాలో ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు తక్కువ ధరకు దళారులకు పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకుంది. గతేడాది 80 కిలోల ధాన్యంను రూ.1550 నుంచి రూ.1600కు కొనుగోలు చేసిన వ్యాపారులు ఇప్పుడు రూ.1390కు కొనుగోలు చేస్తున్నారు. తూకంలో కూడా ఐదు కిలోల వరకు అదనంగా తీసుకుంటున్నారు. దీనిపై రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల వరి కోతలు ప్రారంభం ఎకరాకు 28–30 బస్తాల దిగుబడి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించని ప్రభుత్వం ఇదే అదునుగా ధర తగ్గించేసిన వ్యాపారులు గతేడాది ఖరీఫ్లో బస్తాకు రూ.1550 పలికిన ధర నేడు రూ.1390లు మాత్రమే చెల్లింపు -
ఈ చావుల పాపం
సాలూరు: గిరిజన విద్యార్థులకు ఆరోగ్య భద్రత కల్పించడంలోను, ప్రాణాలు రక్షించడంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. మక్కువ మండలం ఎర్రసామంతవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న తాడంగి చిన్నారి బుధవారం మృతిచెందిన విషయం తెలుసుకుని దిగ్బ్రాంతికి లోనయ్యారు. సాలూరు పట్టణంలోని తన స్వగృహం వద్ద వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి విద్యార్థి మృతికి ఐదు నిమిషాల పాటు మౌనంపాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు మరణిస్తుంటే గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. జిల్లాలో ఇప్పటివరకు 15 మంది విద్యార్థులు వివిధ అనారోగ్య కారణాలతో మరణించినా మంత్రికి పట్టకపోవడం విచారకరమన్నారు. కురుపాం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 175 మంది పచ్చకామెర్లతో బాధపడుతూ కురుపాం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా సంబంధిత గిరిజన సంక్షేమశాఖ మంత్రికి, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయమన్నారు. విద్యార్థులు పచ్చకామెర్లతో చరిపోతున్నా, సెరిబ్రల్ మలేరియాతో చనిపోతున్నారని చూపిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల మరణాలపై జాతీయమానవహక్కుల సంఘానికి, జాతీయ ఎస్టీ కమిషన్కు ఢిల్లీలో ఫిర్యాదుచేశామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సాలూరు మండలం కరాసవలసలో సుమారు పదిమంది చనిపోతే నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏమిచేయలేని పరిస్థితిలో నేను నా ఎమ్మెల్యే పదవికి రాజినామా చేస్తానని ప్రకటించానని గుర్తుచేశారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎం పోస్టుల భర్తీచేస్తామని తొలి సంతకం పెట్టారని ఇచ్చిన హామీ ఎంతవరకు అమలుచేయలేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. మంత్రిగా తొలిసంతకమే అమలుచేయలేని వ్యక్తి, మంత్రి పదవికి అర్హురాలా అని ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిధులు పాఠశాలల్లో వసతులు, బోధన ప్రమాణాలు, విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిని తెలుసుకోవాలని, సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. పత్తిక దినేష్ (ఫైల్) నిమ్మక నితిన్ (ఫైల్) -
మత్తు వైద్యులకు గుర్తింపు వచ్చింది:
గతంలో మత్తు వైద్యులకు అంత ప్రాధాన్యం ఉండేది కాదు. తెరవెనుకనే వారి పాత్ర ఉండేది. కోవిడ్ రోగులకు సేవలు అందించిన తర్వాత మత్తు వైద్యులకు ప్రాధాన్యం, గుర్తింపు వచ్చింది. గతంలో మత్తు వైద్యులుగా చేయడానికి చాలా మంది వెనుకాడేవారు. రోగికి ఏదైనా అయితే నిందిస్తారేమోనని ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఇప్పడు మంచి పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల మత్తు వైద్యుల పని సులభతరమైంది. మత్తు ఇవ్వడం కష్టతరమైన పని అయినప్పటికీ రోగుల ప్రాణాలు కాపాడామనే సంతృప్తి ఉంటుంది. డాక్టర్ డి.జయధీర్బాబు, ప్రొఫెసర్, మత్తు విభాగం అధిపతి , ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
గెడ్డలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం
గంట్యాడ: మండలంలోని చంద్రంపేట, వసంత గ్రామాల మధ్య ఉన్న గెడ్డలో కొట్టుకుపోయిన ఆర్.వసంత గ్రామానికి చెందిన విజ్జపు సోమరాజు(54) మృతదేహం బుధవారం లభ్యమైంది. విజయనగరంలోని పీడబ్ల్యూ మార్కెట్లో కిరాణా హోల్సేల్ దుకాణంలో విధులు ముగించుకుని సోమవారం రాత్రి టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వసంత గ్రామానికి సోమరాజు వెళ్తుండగా చంద్రంపేట దాటిన తర్వాత గెడ్డ దాటుతూ కొట్టుకుపోయాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి మంగళవారం గాలింపు చేపట్టారు. రాత్రి వరకు గాలించినా అచూకీ లభ్యం కాలేదు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో గెడ్డలో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వసర్వజన ఆస్పత్రికి పోలీసులు తరలించారు. -
రహదారులపై చెత్త కనిపించరాదు
● కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి పార్వతీపురం రూరల్: పార్వతీపురం, సాలూరు పట్టణంలోని రహదారులు శుభ్రంగా ఉండాలని, ఎక్కడా చెత్త కనిపించరాదని కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ప్రతి వార్డులో పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సూచించారు. నిరంతరాయంగా తాగునీటి సరఫరా చేయాలని, పరిపాలనలో పూర్తిస్థాయి ‘ఈ–ఆఫీసు’ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ ఆదా కోసం సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని, రోడ్లపై నిరుపయోగంగా ఉన్న వాహనాలను తొలగించాలని ఆదేశించారు. ● జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ విజయనగరం ఫోర్ట్: అత్యవసర సమయాల్లో ప్రాణాలను రక్షించే సీపీఆర్ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అన్నారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బుధవారం సీపీఆర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ కారణాల రీత్యా ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం, శ్వాస ఆగిపోయినప్పడు అతని ప్రాణాలు రక్షించడానికి సీపీఆర్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మత్తు విభాగం అధిపతి డాక్టర్ జయధీర్బాబు, అత్యవసర విభాగం హెచ్వోడీ డాక్టర్ శివప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శివ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యంమత్తులో పోలీస్ స్టేషన్పై దాడి
● 17 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో శాంతిభద్రతలకు పూర్తిగా విఘాతం కలిగించేలా కొందరు ఆకతాయిలు మద్యం మత్తులో విధ్వంసం సృష్టించారు. ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీస్స్టేషన్పైనే ఆకతాయిలు మద్యం మత్తులో దాడికి తెగబడడం, విధుల్లో ఉన్న సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడం, పోలీస్ సిబ్బంది కాలర్ పట్టుకుని, కత్తులతో బెదిరించే స్థాయికి చిల్లర మూకలు చెలరేగిపోయాయి. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఘర్షణతో మొదలై..ఫిర్యాదుకు వచ్చి..విధ్వంసం.. పార్వతీపురం పట్టణంలో మంగళవారం రాత్రి దేశాలమ్మ తల్లి వారాల పండగ అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఇందిరా కాలనీ, లింగం వీధికి చెందిన యువకుల మధ్య ఘర్షణ, కొట్లాట తలెత్తాయి. ఈ గొడవపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు లింగం వీధి వాసులు ప్రయత్నించారు. అయితే, అత్యవసర సేవలకు కేటాయించిన ‘డయల్ 100’కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లైన్ కలవకపోవడంతో మద్యం మత్తులో ఉన్న కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల నుంచి స్పందన లేదని ఆరోపిస్తూ, అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగం వీధికి చెందిన కొందరు స్థానికులు, యువకులు మద్యం మత్తులో పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారు, ఆవేశంతో ఊగిపోతూ స్టేషన్ గేట్లను బలంగా తన్నారు. విధుల్లో ఉన్న సెంట్రీ సిబ్బందిని దుర్భాషలాడుతూ, వారిపైకి దూసుకెళ్లారు. స్టేషనన్లోని కంప్యూటర్ టేబుల్పై ఉన్న అద్దాన్ని ముక్కలు చేసి విధ్వంసం సృష్టించారు. అంతటితో ఆగకుండా, విధి నిర్వహణలో ఉన్న ఒక సిబ్బంది కాలర్ పట్టుకుని లాగి, రైటర్ కుర్చీలో కూర్చుని వీరంగం సృష్టించారు. వారిలో ఒక యువకుడు ఏకంగా కత్తిని చేతబట్టి స్టేషన్లోని సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పట్టణ పోలీసులు, దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని, 17 మందిపై కేసు నమోదు చేశారు. ’డయల్ 100’ సేవలు అందుబాటులో లేకపోవడం వ్యవస్థ వైఫల్యమే అయినప్పటికీ, దానిని సాకుగా చూపి ఏకంగా పోలీస్ స్టేషనన్పైనే దాడి చేయడం సమంజసం కాదని, లా అండ్ ఆర్డర్ను పటిష్టంగా అమలు చేసి, శాంతిభద్రతలను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
వైద్యవిద్య వ్యాపారం కాదు!
విజయనగరం గంటస్తంభం: ప్రజారోగ్య వ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వ బాధ్యతలు వదిలేసి వైద్యవిద్యా వ్యవస్థను వ్యాపారుల చేతుల్లోకి నెట్టొద్దని పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు బుధవారం జెడ్పీ మినిస్టీరియల్ భవనంలో జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు యూ.ఎస్. రవికుమార్ అధ్యక్షతన ప్రజా సంఘాల ప్రతినిధులు, వైద్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైద్య రంగాన్ని పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులతో స్థాపించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం పేద విద్యార్థులకు, ప్రజారోగ్యానికి భారీ దెబ్బ పడుతుందని పేర్కొన్నారు. వైద్యవిద్య ఫీజులు ఆకాశాన్నంటుతాయని, పేద విద్యార్థులకు డాక్టర్ కావాలనే కల దూరమవుతుందని, రిజర్వేషన్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వల్ల పేదలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని విమర్మించారు. గ్రామీణ పీహెచ్సీ వైద్యులు సమ్మెలో ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కార్యక్రమంలో రెడ్డి శంకరరావు, నాగమనోహర్, ఫైజల్, సురేష్ బాబు, రాజగోపాల్, వెంకటరావు, దివాకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
మత్తులో ఉంచి వైద్యం
● వైద్యరంగంలో అధిక ప్రాధాన్యం ● ఏడాదిలో లక్ష మంది వరకు రోగులకు ఎనస్థీషియా ● నేడు ప్రపంచ మత్తు వైద్యుల దినోత్సవం విజయనగరం ఫోర్ట్: వైద్యరంగంలో కొన్నేళ్ల క్రితం వరకు మత్తు వైద్యుల గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. కోవిడ్ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోవిడ్ రోగులకు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడడంతో మత్తు వైద్యులకు గుర్తింపు వచ్చింది. సమాజంలో మత్తు వైద్యులు అంటూ ఉన్నారన్న విషయం అందరికీ తెలిసింది. గురువారం ప్రపంచ మత్తు వైద్య దినోత్సవం (వరల్డ్ ఎనస్థీషియా డే) సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. పూర్వ కాలంలో తలమీద, ముక్క దగ్గర మూలికలు పెట్టి మత్తు వచ్చేలా చేసి చికిత్స అందించేవారు. గతంలో మత్తు వైద్యవిద్యను అభ్యసించడానికి పెద్దగా అసక్తి చూపేవారు కాదు. మత్తు వైద్యులు కూడా చాలా తక్కువగా ఉండేవారు. మత్తు విభాగంలో ఆధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో ఇటీవల మత్తు వైద్యవిద్యను అభ్యసించే వారి సంఖ్య పెరుగుతోంది. మత్తు వైద్యులకు ప్రాధాన్యం పెరిగింది. ఆపదలో ఉన్న రోగుల ప్రాణాలు నిలబెట్టడంలో మత్తు వైద్యులు కీలక పాత్ర పోషిస్తారు. శస్త్రచికిత్సలో కీలక పాత్ర ఏదైనా వ్యాధికి శస్త్రచికిత్స చేయాలంటే మత్తు వైద్యులదే కీలక పాత్ర. సంబంధిత వ్యాధికి ఎంత మోతాదులో మత్తు ఇవ్వాలో అంతే మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. మోతాదుకు మించి మత్తు ఇచ్చినట్లయితే రోగి ప్రాణాల మీదకు వస్తుంది. ఎముకల సంబంధిత, ఈఎన్టీ, గైనిక్, డెంటల్ శస్త్రచికిత్సలకు, కడుపునొప్పి, అపెండిసైటిస్, పేగుఒరుపు, హెర్నియా, హైడ్రాసిల్, పైల్స్, కేన్సర్, న్యూరోసర్జరీ, గుండె సంబంధిత శస్త్రచికిత్సలకు మత్తు ఇస్తారు. ముఖ్యంగా గుండె మార్పిడి, కాలేయం మార్పిడి, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో మత్తు వైద్యుల పాత్ర అత్యంత కీలకం. ఈ శస్త్రచికిత్సలు చేసేటప్పుడు ప్రతి సెకెను గుండె ప్రతి స్పందనను గమనిస్తూ మత్తు వైద్యులు ఉండాలి. అదేవిధంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారికి, పురుగు మందు తాగి క్లిష్టపరిస్థితుల్లో ఉన్న వారికి కూడా మత్తు వైద్యులు మత్తు ఇచ్చి చికిత్స అందిస్తారు. వెంటిలేటర్పై ఉన్న రోగులకు, ఐసీయూ నిర్వహణ కూడా మత్తు వైద్యులే చూస్తారు. జిల్లాలో విధుల్లో 100 మంది వైద్యులు గతంలో మత్తు వైద్యులు తక్కువగా ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య పెరిగింది. జిల్లాలో 100 మంది వరకు మత్తు వైద్యులు ఉన్నారు. వారిలో 70 నుంచి 80 మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. సర్వజన ఆస్పత్రిలోనే ఏడాదికి 12 వేల మంది వరకు రోగులకు మత్తు ఇస్తారు. జిల్లావ్యాప్తంగా ఏడాదికి లక్ష మంది వరకు రోగులకు మత్తు ఇస్తారు. -
బుల్లెట్ బైకులే టార్గెట్
● ముగ్గురు బైక్ దొంగల అరెస్టు ● రూ.14 లక్షలు విలువ చేసే ఏడు బుల్లెట్ బైక్లు చోరీ ● వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పీ శ్రీనివాసరావు శ్రీకాకుళం రూరల్: జల్సాలకు అలవాటు పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలని మార్గాలు వెతికారు. బైక్ హ్యాండిల్ లాక్లను అన్లాక్ చేయడం నేర్చుకున్నారు. బైక్లను దొంగిలించి తక్కువ ధరకు అమ్మడం అలవాటు చేసుకున్నారు. ఆఖరకు పోలీసుల చేతికి చిక్కారు. బుధవారం రూరల్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ ( క్రైం) శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం రూరల్ పరిసర ప్రాంతంలో 5 బుల్లెట్ బైక్లు, ఆమదాలవలస ప్రాంతంలో 2 బుల్లెట్ బైక్లు పోయినట్లు రూరల్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు. రెండు రోజుల కిందట రాగోలు దూసి ప్రాంతంలో రూరల్ ఎస్ఐ రాము వాహనాలు తనిఖీలు చేస్తుండుగా రెండు బుల్లెట్లపై వస్తున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో ఆరా తీశామని, అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఖరీదైన వాహనాలే ఆదాయ వనరులు.. బుల్లెట్ దొంగతనాలకు పాల్పడిన ఎ–1 దండు రిషివర్ధన్ స్వస్థలం విశాఖపట్నం. విశాఖ కమిషనరేట్లో పీఎం పాలెం పోలీస్స్టేషన్లో ఓ వివాహిత హత్య కేసులో ప్రధాన నిందితుడు. పార్వతీపురం రూరల్ పోలీస్టేషన్లో ఒక చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఎ–2 రాయిపల్లి వినోద్ స్వస్థలం సాలూరు కాగా.. అక్కడి పోలీస్స్టేషన్లో ఐదు సారా కేసులు, సాలూరు ఎకై ్సజ్ పోలీస్స్టేషన్తో పాటు గంట్యాడ పోలీస్స్టేషన్లో ఒక డెకాయిటీ కేసు, అలాగే పార్వతీపురం రూరల్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసులతో పాటు ఏడు కేసులు నమోదై ఉన్నాయి. ఇతనిపై పార్వతీపురం జిల్లా కలెక్టర్ పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేశారు. జైలులో పరిచయం.. దండు రిషివర్దన్, రాయిపల్లి వినోద్లు ఇద్దరూ జైలులో ఒకరికి ఒకరు పరిచయమయ్యారు. విలువైన బైక్లు దొంగతనం చేసి నంబర్ మారిస్తే ఎవరూ పట్టుకోలేరని ప్లాన్లు గీశారు. గడిచిన మూడు నెలలుగా ఏడు బైక్లు దొంగిలించారు. దొంగిలించిన బైక్లను మూడో నిందితుడు, బైక్ మెకానిక్ కొత్తూరుకు చెందిన చిట్టి సంతోష్ సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్ నిర్వాహకుడి సాయంతో విక్రయించారు. వీరి వద్ద నుంచి ఏడు బైక్లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. కేసులో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లు బాబురావు, నారాయణరావు, సురేష్, కృష్ణ కానిస్టేబుల్స్కు ఎస్పీ మహేశ్వరరెడ్డి చేతులమీదుగా ప్రశంసాపత్రాలను అందించారు. సమావేశంలో డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ పైడపు నాయుడు, ఎస్ఐ రాము పాల్గొన్నారు. -
గృహప్రవేశాలకు సిద్ధంగా ఉండాలి
విజయనగరం అర్బన్: పీఎంఏవై పథకం కింద మంజూరైన గృహాలను త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో హౌసింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పీఎంఏవై కింద జిల్లాలో 8,259 గృహాలు లక్ష్యం కాగా 6,873 గృహాలు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలిన 1,386 గృహాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ముందుగా అర్బన్లో సొంత స్థలాలు ఉన్న వారి గృహాలను పూర్తి చేయాలన్నారు. రూఫ్ లెవెల్లో ఆర్సీ స్థాయిలో ఉన్నవి పూర్తి కావాలని ఇకపై ప్రతి వారం సమీక్షించనున్నట్లు తెలిపారు. కాలనీలలో నిర్మాణాలకు అనువుగా ఉన్న వాటిని గుర్తించి అందుకు ఎంతమేరకు భూమి అవసరం అవుతుందో ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ మురళీ ప్రసాద్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
‘శౌర్యం స్మృతి’ బ్రోచర్ల ఆవిష్కరణ
విజయనగరం క్రైమ్: పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవం సందర్భంగా, విజయనగరం జిల్లా పోలీసు డివిజన్ పరిధిలో పోలీస్ శాఖ చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘శౌర్యం‘ (తెలుగు) ‘స్మృతి‘ (ఆంగ్లం) పేరుతో రూపొందించిన అమరవీరుల స్మారక బ్రోచర్లను ఎస్పీ ఏఆర్ దామోదర్ బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ‘అమరవీరుల సేవా తపస్సుకు ఈ సాహిత్య నివాళి ప్రతి పోలీసు సిబ్బందిలో ధైర్యస్ఫూర్తిని నూరిపోస్తుందన్నారు. అమరవీరుల కుటుంబాలకు గౌరవాన్ని చాటుతుందని చెప్పారు. ఈ ప్రయత్నం రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాస్థాయి పోలీసు విభాగం ఆధ్వర్యంలో అధికారికంగా ప్రారంభం కావడం విశేషమన్నారు.. భవిష్యత్లో ఇది తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రేరణారూపంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, ప్రముఖ యాంకర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఈడీ దృష్టికి ఉద్యోగుల సమస్యలు
విజయనగరం అర్బన్: ఆర్టీసీ విజయనగరం జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి దృష్టికి విజయనగరం జోన్ పరిధిలో ఉన్న ఉద్యోగుల సమస్యలను ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కమిటీ తీసుకెళ్లింది. ఈ మేరకు బుధవారం సంఘం ప్రతినిధులు స్థానిక జోనల్ ట్రైనింగ్ కాలేజీ సమావేశ మందిరంలో ఆయనను కలిసి తమ సమస్యల పత్రాన్ని అందజేశారు. జోన్ పరిధిలోని 6 జిల్లాలు, 19 డిపోలు, జోనల్ వర్క్షాప్లకు సంబంధించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీ్త్రశక్తి బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. జోన్లో ప్రమోషన్లు ఇవ్వాలని, గ్యారేజీ ఉద్యోగులపై అధిక పనిభారం తగ్గించాలని, రన్నింగ్ టైమ్ తగినవిధంగా లేవని, రికవరీలు, రెస్ట్ రూమ్లు, డ్యూటీ చార్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాడేరు డిపోలో నివాస గృహాల అద్దె సమస్య, టీమ్ రికవరీలు, రెస్ట్ రూమ్లు, డ్యూటీ చార్డులు వంటి పలు సమస్యలు ఉన్నాయిని వినతిపత్రంలో తెలియజేశారు. కొన్ని జిల్లాల్లో అక్రమంగా ఇస్తున్న ఓడీలు, ఉద్యోగుల సీనియార్టీలో తేడాలు, రూట్ సర్వేలు, మంచినీటి సదుపాయాలు, ఇంక్రిమెంట్లు లభించకపోవడం వంటి 30కు పైగా సమస్యలను వినతిపత్రంలో వివరించారు. ఈడీని కలిసిన వారిలో సంఘం రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి.భానుమూర్తి, రాష్ట్ర కార్యదర్శి వెంకటరావు, జోనల్ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, జోనల్ కార్యదర్శి బీకేమూర్తి, జోనల్ కోశాధికారి కేఎస్ఎస్మూర్తి, జిల్లా కార్యదర్శి రవికాంత్ ఉన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
సంతకవిటి: మండలంలోని సిరిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 9 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడలకు ఎంపికై నట్లు హెచ్ఎం వి.వెంకటరావు తెలిపారు. ఈ నెల 6 నుంచి 8 వరకు శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగిన క్రీడల్లో పరుగుపందెలో అండర్ 19 విభాగంలో కె.దిలీప్కుమార్, జి.సంతోష్, ఎం.అరుణ్కుమార్, జి.జ్యోత్స్న, పి.కుసుమ, ఎస్.కల్పన, ఎ.జాన్సీలు, ఖో–ఖో క్రీడలో పి.లిఖిత్, అండర్ 17 బేస్బాల్ విభాగంలో కె.రాజేంద్ర మంచి ప్రతిభ చూపించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వారిని మంగళవారం పాఠశాలలో హెచ్ ఆధ్వర్యంలో మంగళవారం అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల పీడీ కె.సూర్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఏనుగుల బీభత్సం
● ధ్వంసమైన పంటలు ● వాపోతున్న రైతులుపార్వతీపురం రూరల్: Ð]l$…yýl-ÌS…ÌZ Mö°² ÆøkË$V> ç³Ë$ {´ë…™éÌZÏ H¯]l$-VýS$ÌS VýS$…ç³# OòÜÓÆý‡-ÑàÆý‡… ^ólçÜ*¢ OÆð‡™èl$ÌS iÑ™éÌS-™ø ^ðlÌS-V>rÐ]l*-yýl$-™èl$-¯é²Æ‡$$. MýS…sìæMìS Æð‡ç³µ-Ìê M>´ë-yýl$-MýS$…r$¯]l² ç³…rÌS¯]l$ VýSfÆ>kË$ ¯éÔèæ¯]l… ^ólçÜ$¢…sôæ, AÇMýS-rtyýl…-ÌZ MýS*rÑ$ {糿¶æ$-™èlÓ… òœ*Æý‡…-V> ÑçœÌS-OÐðl$…-§ýl° OÆð‡™èl$-Ë$, Ý린MýS$-Ë$ ¡{Ð]l B{VýS-çßæ… Ð]lÅMýS¢… ^ólçÜ$¢-¯é²Æý‡$. ™égêV> Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… ÐólMýS$-Ð]l-gêÐ]l¬ ¯]l$…_ ´ëÆý‡Ó-¡ç³#Æý‡… Ð]l$…yýl-ÌS…ÌZ° Æ>ÑMø¯]l ç³…^éĶæ$¡ AyŠæ-{yýl*-ిÐ]l-ÌSçÜ, íßæ…§ýl*-ç³#Æý‡… {V>Ð]l*-ÌS-ÌZ H¯]l$-VýS$ÌS VýS$…ç³# ç³…rÌS¯]l$ «§ýlÓ…çÜ… ^ólçÜ*¢ ½¿ýæ-™èlÞ… çÜ–íÙt…^鯇$$. రెండు గ్రామాల్లో అపార నష్టం అడ్డూరివలస గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే రైతు కష్టమంతా ఏనుగుల పాలైంది. ఏపుగా పెరిగి పూత దశకు కొద్ది రోజుల్లో వచ్చే దాదాపు 200 కొబ్బరి మొక్కలను గజరాజుల గుంపు నేలమట్టం చేసింది. కాయకొచ్చిన కోకో తోటలను సైతం వదలకుండా నాశనం చేశాయి. సేకరించి ఉంచిన కోకో కాయలను ధ్వంసం చేసి తినేశాయి. అంతటితో ఆగకుండా, పొలంలోని మోటార్ను ధ్వంసం చేశాయి. అలాగే, మండలంలోని హిందూపురం గ్రామంలో గుణ అనే రైతుకు చెందిన కొబ్బరి మొక్కలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏనుగుల గుంపు సంచరిస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిద్ర వీడాలి ఏనుగుల బెడద నుంచి తమను కాపాడాలని రైతులు, స్థానికులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి, ఏనుగుల దాడులను అరికట్టేందుకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు కేవలం హెచ్చరికలు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారని, క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిష్కార చర్యలూ తీసుకోవడం లేదని ఆరో పిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతులను ఈ విధంగా నష్టపెట్టకుండా, తమ పంటలను ప్రాణాలను గజరాజుల బారి నుంచి రక్షించాలని కోరుతున్నారు. లోవగూడలో ఏనుగులు భామిని: మండలంలోని లోవగూడ సమీపంలోకి మంగళవారం ఏనుగుల గుంపు చేరుకుంది. మొక్కజొన్న, వరి పంటలను తినివేస్తూ పాడు చేస్తున్నాయని గిరిజన రైతులు వాపోతున్నారు. ఏనుగులు సమీపంలోని మెట్టపై మకాం వేసినట్లు ఫారెస్ట్ అదికారులు తెలిపారు. -
గెడ్డలో కొట్టుకుపోయిన వ్యక్తి
● గాలింపు చేపట్టిన ఎస్డీఆర్ఎఫ్గంట్యాడ: మండలంలోని చంద్రంపేట గెడ్డలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఆర్.వసంత గ్రామానికి చెందిన విజ్జపు సోమరాజు విజయనగరం పీడబ్ల్యూ మార్కెట్లోని ఓ కిరాణా హోల్సేల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై గ్రామానికి వెళ్తుండగా చంద్రంపేట దాటిన తర్వాత వసంత గ్రామానికి ముందు ఉన్న గెడ్డలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. రాత్రి 12 గంటలైనా సోమరాజు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గ్రామ స్తులతో కలిసి వెతకసాగారు. తెల్లవార్లూ వెతికినా అచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సాయికృష్ణ, తహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి గాలింపు చేపట్టారు. గల్లంతైన సోమరాజుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గెడ్డపై ఇప్పటికై నా పాలకులు వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ గెడ్డపై వంతెన నిర్మించాలని రెండు గ్రామాలకు చెందిన ప్రజలు మంగళవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. -
మన ఆరోగ్యం మన చేతుల్లోనే
● చేతుల శుభ్రతతో రోగాలు దూరం ● నేడు ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవంప్రతి ఒక్కరికీ అవసరమే చేతుల శుభ్రత ప్రతి ఒక్కరికీ అవసరమే. ముఖ్యంగా భోజనం చేసే ముందు కచ్చితంగా చేతులు కడుక్కోవాలి. చిన్నపిల్లల తల్లిదండ్రులు గమనించి ఏదైనా తినే వస్తువులు ఇచ్చే ముందు చేతులను పరిశీలించి శుభ్రం చేసి ఇవ్వాలి. లేదంటే అనేక రోగాల బారిన పడాల్సి వస్తుంది. వాటర్ బోర్న్ డిసీజెస్ రాకుండా ఉండాలంటే చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. – విజయపార్వతి, డిప్యూటీ డీఎంహెచ్వో, ఐటీడీఏ, సీతంపేట సీతంపేట: ఆరోగ్యమంతా చేతుల పరిశుభ్రతతోనే ఉంటుంది. చేతులు శుభ్రంగా ఉంటే మూడొంతులు వ్యాధులు దరిచేరవు. ఈ నేపథ్యంలో 2008 నుంచి ఏటా అక్టోబర్ 15న ప్రపంచ చేతుల పరిశుభ్రత దినం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో స్వచ్ఛత పేరిట వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. చేతుల శుభ్రతతో సూక్ష్మజీవులు దూరం.. చేతుల ద్వారానే వ్యాధి కారక సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా జలుబు, శ్వాసకోస, జీర్ణసమస్యలు, జ్వరం, అతిసార వ్యాధులు చేతుల పరిశుభ్రత లేకపోవడం వల్లే వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మల, మూత్ర విసర్జన తర్వాత ఆహారం తినే ముందు పిల్లలకు ఆహారం తినిపించే ముందు, అనారోగ్యంతో ఉన్న వారికి భోజనం పెట్టే ముందు, మందులను ఇచ్చే ముందు గాయాలైన చర్మాన్ని తాకినప్పుడు, దగ్గు, తుమ్ములు, ముక్కు చీదినప్పుడు, పెపుడు జంతువులు, పచ్చిమాంసాన్ని తాకినప్పుడు పిల్లలు మట్టిలో ఆడినప్పుడు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. గోళ్ల కిందిభాగంలో మట్టి చేరి క్రిములు పుట్టుకొస్తాయి. అందుకే గోళ్లను కత్తిరించుకోవాలి. ఏమేం వాడాలి.. నీళ్లు, సబ్బు, శానిటైజర్లు వాడాలి. శానిటైజర్ల వాడకంతో బ్యాక్టీరియా, క్రిములను 60 శాతం వరకు తొలగించే అవకాశం ఉంది. ఒకటి రెండు శానిటైజర్ చుక్కలను చేతులపై వేసుకుని వేళ్లసందున మధ్యలో అంటుకునేలా చూడాలి. కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. రసాయనాలు లేని సబ్బులు వినియోగించడం మేలు, సున్నిపిండి, పుసుపు, నిమ్మకాయ రసం మిశ్రమంతో కలబంద, తేయాకు, పొద్దుతిరుగుడు నూనెలతో తయారైన శానిటైజర్లు ఎంతో మేలు కలిగిస్తాయి. చేతులు ఇలా శుభ్రం చేసుకోవాలి నీటిని చేతులతో తడపాలి చేతులకు సబ్బు లేదా లిక్విడ్ను రుద్దకోవాలి రెండు చేతుల మధ్య గట్టిగా రుద్దుతూ శుభ్ర పరుచుకోవాలి చేతుల వెనుక బాగాలు, చేతి వేళ్ల మధ్యలో, గోళ్ల సందుల మధ్య ప్రతి వేలును శుభ్రం చేయాలి. అరచేతులను వేళ్లతో రుద్దుతూ మణికట్టు భాగం నుంచి సబ్బుపోయేంత వరకు నీటిని పోస్తూ శుభ్రం చేయాలి. 20 సెకెన్లపాటు అయిదు పర్యాయాలు శుభ్రం చేసుకోవాలి. తరువాత మెత్తటి ఉతికిన వస్త్రంతో తుడుచుకోవాలి. లేదా చేతులను విదిలించాలి. పిల్లలకు అలవాటుగా మారుస్తున్నాం ప్రతిరోసూ చేతులు శుభ్రపరుచుకోవాలనేది విద్యార్థులకు వివరిస్తున్నాం. దీన్ని ఒక అలవాటుగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నాం. నిత్యం ఈ పద్ధతిని పాటిస్తే రోగాలు దరిచేరవు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. – బి.ఉమావాణి, హెచ్ఎం, హడ్డుబంగి ఆశ్రమపాఠశాల -
పోటెత్తిన భక్తులు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, భక్తుల పాలిట కల్పవల్లిగా పేరొందిన శ్రీపైడితల్లి దర్శనానికి భక్తులు మంగళవారం పోటెత్తారు. జిల్లా కేంద్రంలోని అమ్మవారి ఆలయానికి పెద్దసంఖ్యలో విచ్చేసిన భక్తజనం క్యూలైన్లలో ఎండను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి వేచి ఉండి దైవదర్శనం చేసుకున్నారు. అయితే భక్తులు వేచి ఉన్న చోట ఎండ తగలకుండా టెంట్లు ఏర్పాటు చేయకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. టికెట్ కౌంటర్ వద్ద కూడా తమ ఫోన్పేలకు డబ్బు లు పంపించుకుని టికెట్లు ఇవ్వకుండా దర్శనానికి పంపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టిసారించాలని కోరుతున్నారు. -
ఇంటి ముందు పుర్రె
డెంకాడ: మండలంలోని పెదతాడివాడ పంచాయతీ పరిధి ఊడికిలపేట గ్రామంలోని పి.పైడమ్మ ఇంటి ముందు కుంకుమ, పసుపు రాసిన పుర్రెను గుర్తు తెలియని దుండగులు పెట్టారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబధించిన వివరాలిలా ఉన్నాయి. ఎప్పటిలాగానే ఆదివారం రాత్రి పి.పైడమ్మ, కుటుంబసభ్యులు ఇంటిలో నిద్రించారు. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిలో నుంచి బయటకు వస్తుండగా ఇంటి ముందు మనిషి పుర్రె పెట్టి, దాని చుట్టూ కుంకుమ,పసుపు చల్లి ఉండడాన్ని గమనించిన వారు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపారు. -
నరక యాతన పడి వ్యాన్ డ్రైవర్ మృతి
● మృతుడు తాడేపల్లి గూడెం వాసి వీరఘట్టం: ఐషర్ వ్యాన్లో ఉన్న గోనె సంచులను అన్లోడ్ చేసేందుకు వ్యాన్కు ఉన్న తాళ్లను విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్యలో పడిపోయిన డ్రైవర్ రాజు (35) వీరఘట్టం మెయిన్ రోడ్డులో మంగళవారం మృతి చెందాడు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్తో పాటు స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక గోనె సంచుల వ్యాపారికి విజయవాడ నుంచి ఐషర్ వ్యాన్తో తాడేపల్లి గూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్ గోనె సంచులను తీసుకువచ్చాడు. వ్యాన్లో ఉన్న గోనె సంచులను అన్లోడ్ చేసేందుకు గాను కలాసీలు రావడంతో వ్యాన్కు ఉన్న కట్లు విప్పేందుకు డ్రైవర్ రాజు వ్యాన్ పైకి ఎక్కాడు.ఆ తాళ్లు విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్యలో ఉన్న సందులో పడిపోయాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు తలకిందులుగా వ్యాన్ బాడీకి రేడియేటర్కు మధ్యలో ఉండిపోయి నరకయాతన అనుభవించాడు. ఈ ప్రమాదాన్ని చూసిన కలాసీలు, స్థానికులు వెంటనే అతన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న కొందరు మోటార్ వర్కర్లు కూడా వచ్చి వ్యాన్కు ఉన్న కొన్ని పరికరాలను కోసేసి డ్రైవర్ రాజును బయటకు తీయగా కొన్ని గాయాలతో బయట పడ్డాడు. మెల్లగా బయటకు వచ్చి కూర్చున్న డ్రైవర్కు కొద్ది క్షణాల్లోనే ఫిట్స్ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు సపర్యలు చేసి పీహెచ్సీకి తీసుకువెళ్లగా వైద్యసిబ్బంది తనిఖీ చేసి చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్ కేసు నమోదు చేశారు. వీరఘట్టం పీహెచ్సీలో ఉన్న డ్రైవర్ మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం తెలియజేశామని, వారు వచ్చిన తర్వాత స్టేట్మెంట్లు రికార్డు చేసి పోస్ట్మార్టం అనంతరం బాడీని అప్పగిస్తామని ఎస్సై తెలిపారు. గిలగిలాకొట్టుకోవడంతో కంట తడి చుట్టూ వందలాది జనం..రోడ్డు పక్కనే ఉన్న వ్యాన్ వద్ద గిలగిలా కొట్టుకుంటూ డ్రైవర్ రాజు చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్య సుమారు 40 నిమిషాల పాటు ఇరుక్కపోయిన డ్రైవర్ రాజు మృత్యువుతో పోరాడి బయటపడ్డాడని అందరూ అనుకున్నారు. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.అయితే బయటకు వచ్చిన క్షణాల్లోనే డ్రైవర్ చనిపోయాడని తెలియడంతో అక్కడ ఉన్నవారంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. వెంటనే ఈ ప్రమాద విషయాన్ని వ్యాన్ యజమానికి ఫోన్లో తెలియజేశారు. తాడేపల్లిగూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్ విజయవాడ నుంచి ఈ వ్యాన్ ఇక్కడికి తీసుకువచ్చినట్లు వ్యాన్ యజమాని పోలీసులకు తెలిపారు.ఈ విషయాన్ని డ్రైవర్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. -
వైభవంగా పునర్వసు పట్టాభిషేకం
● సీతారామస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలునెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పునర్వసు పట్టాభిషేక మహోత్సవాన్ని ఆలయ అర్చకులు మంగళవారం వైభవంగా జరిపించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవన హోమం జరిపించారు. అనంతరం స్వామి వెండి మంటపంలో సీతారామస్వామి కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి..ఉత్సవమూర్తులకు రామాయణంలో పట్టాభిషేకం సర్గ విన్నవించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి వివిధ రకాల ఫల రసాలతో అభిషేకం, పునర్వసు పట్టాభిషేకాన్ని జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, వర ప్రసాద్, రామ గోపాల్, తదితరులు పాల్గొన్నారు. -
సుజుకి నూతన షోరూం ప్రారంభం
విజయనగరం గంటస్తంభం: విజయనగరం పట్టణంలోని రింగ్ రోడ్డులో వేణుగోపాల్ సుజుకి సంస్థ తమ రెండవ షోరూమ్ను ప్రారంభించింది. మంగళవారం ఈ కొత్త శాఖను సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నేషనల్ హెడ్ అభిషేక్ ఠాకూర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుజుకి సంస్థ దేశవ్యాప్తంగా వినియోగదారుల విశ్వాసాన్ని పొందిందని, ఉత్తమమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. వేణుగోపాల్ సుజుకి సంస్థ విజయనగరంలో ఇప్పటికే ఒక శాఖను విజయవంతంగా నిర్వహిస్తోందని, వినియోగదారుల మద్దతుతో రెండో షోరూం ప్రారంభించడం ఆనందకరమ న్నారు. కార్యక్రమంలో బెస్ట్ వాల్యూ ఎస్ఎంఐపీఎల్ ఆపరేషన్స్ హెడ్ వీఎస్.యాస్ పాల్, వేణుగోపాల్ సుజుకి ఎండి జి.అభిరామ్, జీఎం సీహెచ్.ప్రవీణ్ కుమార్, సర్వీస్ మేనేజర్ సంతోష్ వర్మ, ఏరియా సేల్స్ మేనేజర్ ఎన్.సురేంద్ర, ఏరియా సర్వీస్ మేనేజర్ వి.సాయి కౌటిన్య తదితరులు పాల్గొన్నారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి అమ్మవారు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు పూజాదికాలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు. 19న జిల్లా స్థాయి యోగాసనాల పోటీలునెల్లిమర్ల: స్థానిక మిమ్స్ సమీపంలోని శ్రీరామకృష్ణ ధ్యాన మందిరంలో ఈ నెల 19వ తేదీన జిల్లా స్థాయి యోగసనాల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగా క్రీడా సంఘం ప్రతినిధులు ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. మొత్తం ఏడు విభాగాల్లో పోటీలు ఉంటాయని, విజేతలను 25, 26వ తేదీల్లో విశాఖపట్టణంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే వారు తమ పేర్లను 17వ తేదీలోగా ఫోన్ నంబర్లు 8374904262, 8465954998 సంప్రదించి నమోదు చేసుకోవాలన్నారు. -
ఎక్కడ?
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షి, పార్వతీపురం మన్యం: కొద్ది రోజుల కిందట తమ బడిని మరోచోటకు తరలించవద్దని.. తల్లిదండ్రులతో కలసి కొంతమంది పిల్లలు పార్వతీపురం మన్యం కలెక్టరేట్కు వచ్చారు. అక్కడ ధర్నా నిర్వహించి, అధికారులకు మొర పెట్టుకుని, ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. దురదృష్టవశాత్తు నర్సిపురం వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. దీన్ని రాజకీయం చేస్తూ, వైఎస్సార్సీపీకి అంటగడుతూ ఓ టీడీపీ కార్యకర్త.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను ట్యాగ్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. దీంతో వెంటనే ఆయన.. సదరు వ్యక్తి ఆరోపణలను సమర్దిస్తూ, పిల్లలతో రాజకీయం చేయడమేమిటని.. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ట్వీట్ చేశారు. విద్యార్థుల పట్ల విద్యాశాఖ మంత్రిగా ఆ సమయంలో లోకేశ్ స్పందించవచ్చు. ఇప్పుడు కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు పచ్చకామెర్లతో మృతి చెందారు. 180 మందికిపైగా వ్యాధి బారిన పడి, జిల్లా ఆస్పత్రిలోనూ, విశాఖ కేజీహెచ్లోనూ చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి నుంచి ఒక ప్రకటన లేదు. విశాఖ వచ్చినా.. కేజీహెచ్కు వెళ్లి, వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన దాఖలాలు లేవు. విద్యార్థులు అనారోగ్యం పాలైన పది రోజుల తర్వాత గానీ.. స్వయాన జిల్లాకు చెందిన గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి గానీ.. ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడుగానీ పిల్లలను పర్యామర్శించిన పరిస్థితి లేదు. విద్యార్థులను పరామర్శించడానికి వస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జాడ.. ఇప్పటి వరకూ కానరాలేదు. ఇదీ.. కూటమి ప్రభుత్వానికి గిరిజన విద్యార్థుల పట్ల ఉన్న చిత్తశుద్ధి అని ప్రజా, విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు గిరిజన విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రజా, గిరిజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గిరిజన విద్యార్థుల ప్రాణాలకు పాలకులు, అధికారులు విలువ ఇవ్వాలని... విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గిరిజనులకు కష్టమొస్తే.. గిరిజన ఆడబిడ్డగా మంత్రి సంధ్యారాణి స్పందించడం ఇలానేనా? అని ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రెండో రోజు రిలే నిరాహారదీక్షలల్లో గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్, ద పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వారణాశి శ్రీహరి, చుక్క చంద్రరావు, ఏపీ రైతు సంఘం జిల్లా సహయ కార్యదర్శి ఇ.వి.నాయిడు, కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం మండలాధ్యక్షుడు టి.గౌరీశంకర్ రావు, ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.రమణ, గిరిజన సంక్షేమ నిరుద్యోగ సంక్షేమ సంఘం నాయకులు అల్లు చందు, గౌరీశ్వరీ, రజిని, అమల, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మరో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి చెందింది. అనారోగ్యంతో సాలూరు మండలంలోని మామిడిపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని తాడంగి పల్లవి(12) మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో మొత్తం 14 మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో మరణించారు. ఇందులో గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి సొంత నియోజకవర్గంలోనే మరణించిన విద్యార్థుల సంఖ్య మూడుకు చేరడం గమనార్హం. ఇప్పటికే నియోజకవర్గంలో మక్కువ మండలం నంద గ్రామానికి చెందిన కేజీబీవీ విద్యార్థిని బిడ్డిక కీర్తన (17), పాచిపెంట మండలంలో మూడో తరగతి విద్యార్థిని శాంత ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే కాదు.. ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంల్లోనూ గిరిజన విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నా.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతున్నా.. కూటమి ప్రభుత్వం మానవతాదృక్పథంతోనైనా స్పందించిన దాఖలాలు లేవు. కురుపాం ఘటనలో ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటననూ చిన్నదిగా చూపించేందుకు మంత్రులు ప్రయత్నించారు. విద్యార్థులు ఇళ్ల వద్దే మరణించారని.. ప్రభుత్వానికి ఏం సంబంధమని స్వయంగా ఆ శాఖ మంత్రి సంధ్యారాణి చెప్పడం గమనార్హం. పరిహారం సంగతి తర్వాత చూస్తామని.. మట్టి ఖర్చులే ఇవ్వగలమని చెప్పడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ.. ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి గానీ ఇప్పటి వరకూ దీనిపై సమీక్ష కూడా చేయకపోవడం గమనార్హం. విద్యార్థులు వ్యాధి బారిన పడటానికి గల కారణాలు సైతం ఇప్పటి వరకూ బయట పెట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు గిరిజన విద్యార్థులు మరణించినా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు.. కనీసం వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించలేదు. మానవతాదృక్పథంతోనైనా స్పందించని కూటమి ప్రభుత్వం నాడు విద్యార్థులకు ఆటో ప్రమాదం జరిగితే రాజకీయంగా ట్వీట్ చేసిన మంత్రి లోకేశ్ నేడు ఇద్దరు పిల్లలు మృతి చెంది, వందలమంది ఆస్పత్రి పాలైనా కనీస ప్రకటన శూన్యం గిరిజన బాలల మృతిపై పోరాడుతున్న వైఎస్సార్సీపీ విద్యార్థుల మృతిని వైఎస్సార్సీపీ తీవ్రంగా పరిగణించింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తక్షణం స్పందిస్తూ.. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మరోవైపు గిరిజన విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి ఆ పార్టీ నాయకులు తీసుకెళ్లారు. కురుపాం గురుకుల పాఠశాలే కాకుండా పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాల విద్యార్థులకు కూడా ఇన్ఫెక్షన్ సోకినా ప్రభుత్వంలో చలనం లేదు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఆర్టికల్ 21(మానవ హక్కుల ఉల్లంఘన) కింద ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం దిల్లీలో కమిషన్ చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ వి.రామసుబ్రహ్మణియన్ను కలిసి కురుపాం బాలికల పాఠశాలలో కలుషిత నీటి ఘటనను వివరించారు. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్యకూ ఈ ఘటనను వివరించారు. గిరిజన బాలలకు న్యాయం జరిగేలా అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, మాజీ ఎంపీ జి.మాధవి, జీసీసీ మాజీ చైర్పర్సన్ స్వాతిరాణి, పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు దిల్లీకి వెళ్లి ప్రయత్నాలు సాగిస్తున్నారు. కురుపాం ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య సైతం చలించిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బృందాన్ని పంపిస్తామని హామీ ఇచ్చారు. -
మామిడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి
సాలూరు రూరల్: మండలంలోని మామిడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బొబ్బిలి మండలం కృపావలస గ్రామానికి చెందిన చెందిన విద్యార్థిని తాడంగి పల్లవి (12) మృతిచెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్లివి దసరా సెలవుల కోసం స్వగ్రామానికి వెళ్లింది. అనారోగ్యంతో బొబ్బిలి ఆస్పత్రిలో ఈ నెల 6వ తేదీన చేరగా అక్కడ నుంచి 8వ తేదీన విజయనగరం ఘోషా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో 11వ తేదీన విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లగా ఈ నెల 12వ తేదీన మృతిచెందింది. మెదడు వాపు వ్యాధితో మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించినట్టు గిరిజన సంక్షేమ సహాయ అధికారి కృష్ణవేణి తెలిపారు. -
హంసవాహనంపై సిరుల తల్లి
విజయనగరం టౌన్: మంగళవాయిద్యాలు... బాణసంచా వెలుగులు.. భక్తుల జై పైడిమాంబ.. జైజై పైడిమాంబ జయజయధ్వానాలు.. వేదపండితుల మంత్రోచ్ఛరణాల నడుమ హంస వాహనంపై పసిడి కాంతుల పైడితల్లి విజయనగరం పెద్ద చెరువులో మంగళవారం సాయంత్రం జలవిహారం చేశారు. భక్తులకు చల్లని ఆశీస్సులు అందించారు. అమ్మవారి జలవిహారాన్ని చూసేందుకు సున్నంబట్టీ వీధి సమీపంలోని చెరువు గట్టు వద్దకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అమ్మవారు సాక్షాత్కరించిన చెరువులో మూడుసార్లు జలవిహారం చేస్తుంటే.. గట్టుపై ఉండి కళ్లార్పకుండా తిలకించారు. పైడితల్లమ్మా.. చల్లంగా చూడమ్మా అంటూ స్మరించారు. చల్లని తల్లి కరుణాకటాక్షాలను అందుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు సాగిన తెప్పోత్సవానికి జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయగా, ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు. ● వనంగుడిలో వేదస్వస్తి వనంగుడిలో ముందుగా వేదపండితులు వేదస్వస్తి నిర్వహించారు. రాజాం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి, అధికార భాషా సంఘం పూర్వపు సభ్యులు డాక్టర్ ఎ.గోపాలరావు వ్యాఖ్యానం చేశారు. వేదస్వస్తి చెప్పిన బ్రాహ్మణులకు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష దుశ్సాలువ, నగదు బహుమతితో సత్కరించారు. అనంతరం అమ్మవారికి పారాయణం, ఆధ్యాత్మిక అంశాలను, పైడితల్లి అమ్మవారి భజనలను వినిపించారు. ● పైడితల్లికి స్నపనం తెప్పోత్సవానికి ముందు పైడితల్లి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి వనంగుడిలో ఆలయ అధికారులు, పైడితల్లి దీక్షాపరులు స్నపన కార్యక్రమం నిర్వహించారు. వేదమంత్రాల సాక్షిగా పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారిని అలంకరించి ఆలయం చుట్టూ మూడుమూర్లు ప్రదిక్షణ జరిపారు. అనంతరం పల్లకిలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి, భాజాభజంత్రీలు, మేళతాళాలతో భారీ ఊరేగింపుగా సున్నంబట్టివీధి మీదుగా పెద్దచెరువు వద్దకు తెప్పోత్సవానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న హంసవాహనంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి జలవిహారం జరిపించారు. ఉత్సవంలో ఆలయ సిరిమాను అర్చకులు బంటుపల్లి వెంకటరావు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఉత్సవ ప్రత్యేకాధికారి మూర్తి, దీక్షాపరులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. కనులపండువగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం అమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు వనంగుడిలో పైడితల్లికి స్నపనం పెద్దచెరువులో మూడుసార్లు జలవిహారం కనిపించని ప్రజాప్రతినిధులు పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవానికి జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు హాజరుకాకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. కేవలం ఈఓ, సిరిమాను పూజారికే ఈ ఏడాది ఉత్సవం మిగిలింది. ఏటా కనీసం ఐదారుగురైనా అధికారులు ఉత్సవంలో పాల్గొని, అమ్మ ఆశీస్సులందుకుంటుంటారు. ఈ ఏడాది అన్నింటికీ మించి తెప్పోత్సవం ఎవరికీ పట్టకుండా పోయింది. అయినప్పటికీ పైడితల్లి అమ్మవారికి శాస్త్రోక్తంగా చేయాల్సిన కార్యక్రమాలన్నింటిని భక్తిశ్రద్ధలతో ఆలయ అధికారులు నిర్వహించడం విశేషం. -
చంద్రబాబు చేసింది శూన్యం
చీపురుపల్లి(గరివిడి): రాష్ట్ర భవిష్యత్, ప్రజల ప్రయోజనాల కోసం సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబునాయుడు చేసింది శూన్యమని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆలోచన చేసినది దివంగత మహానేత వైఎస్సార్ తరువాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి మాత్రమేనని అన్నారు. గరివిడిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ చీపురుపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మించాలని, పేదలకు మెరుగైన వైద్యం, పేదలకు వైద్యవిద్య అందుబాటులోకి రావాలని 2017లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే అప్పటికే ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు కనీసం పట్టించుకోలేదన్నారు. 2019లో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి సవాల్ విసిరిందన్నారు. అయినప్పటికీ కరోనా బారి నుంచి ప్రజలను రక్షించి, మరణాలు రేటు తగ్గించడంలో జగన్మోహన్రెడ్డి పరిపాలన దోహదపడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలల మంజూరుకు కృషిచేశారన్నారు. కేవలం మూడేళ్లలోనే 5 కళాశాలల నిర్మాణాలు పూర్తిచేశారన్నారు. వీటి కోసం రూ.8 వేల కోట్లు అవసరం కాగా రూ.2,200 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. కేవలం మూడేళ్ల కాలంలో 17 వైద్య కళాశాలలు మంజూరు చేయడం సాధ్యమైతే 2014లో విభజన సమయంలో రాష్ట్రానికి మంజూరైన ఎయిమ్స్ కళాశాల ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. 2014లో రూ.1.19 వేల కోట్లతో డిజైన్ చేసిన అమరావతి 2019 వరకు ఎంత మేర పనులు జరిగాయని ప్రశ్నించారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూట మి ప్రభుత్వం 19 నెలలు కాలంలో రూ.2 లక్షలు కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పా లని డిమాండ్ చేశారు. వైద్యకళాశాల ప్రైవేటీ కరణకు నిరసనగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేద్దామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. రూ.1.19 వేల కోట్లతో డిజైన్చేసిన అమరావతి ఎక్కడుంది? 2014లో మంజూరైన ఎయిమ్స్ కళాశాల పరిస్థితి ఏంటి? వైద్యకళాశాలల ప్రైవేటీకరణ దారుణం కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేద్దాం శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ -
విద్యార్థులే దేశానికి బలమైన పునాది
● కలెక్టర్ డా.ఎన్ ప్రభాకరరెడ్డి పార్వతీపురం రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను విద్యావంతులుగానే కాకుండా, దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ డా. ఎన్ ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం విద్య, ఐసీడీఎస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడాతూ విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు మంచి చెడుల విచక్షణ, నైతిక విలువలు నేర్పించడం ద్వారా బలమైన తరాన్ని నిర్మించవచ్చన్నారు. విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చూడాలని సూచించారు. ముఖ్యంగా, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ముస్తాబు కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా పిల్లల కోసం అద్దం, దువ్వెన, సబ్బు, టవల్ వంటివి ఏర్పాటు చేసి వారిని నిత్యం శుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఈఓ రాజ్ కుమార్ , ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఎక్కడ ‘బాబూ’? విజయనగరం గంటస్తంభం: నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం మళ్లీ మోసం చేసిందని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్మి పరుచూరి రాజేంద్రబాబు అన్నారు. విజయనగరంలోని డీఎన్ఆర్ అమర్ భవన్లో మంగళవారం నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 నెలలు కూటమి పాలనలో నిరుద్యోగ భృతి గల్లంతయ్యిందన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వలంటీర్లు, రేషన్ సిబ్బందిని తొలగించారని విమర్శించారు. రాష్ట్రంలో 1.56 కోట్ల మంది నిరుద్యోగులు ఉండగా, విజయనగరం జిల్లాలోనే 4.68 లక్షల మంది ఉన్నారన్నారు. నారా లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించకుండా కార్పొరేట్లకు సీఈఓలా ఉన్నారని విమర్శించారు. వైద్య కళాశాలలు, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నించడం అన్యాయమన్నారు. నవంబర్ చివరి వారం నుంచి హిందూపురం–ఇచ్ఛా పురం వరకు నిరుద్యోగుల ఆవేదన యాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి కోన శ్రీనివాసరావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి నాగభూషణం, జిల్లా నాయకులు వాసు, అప్పన్న, కిరణ్, గోపినాయుడు, రాజేష్, తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విజయనగరం: విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల హక్కు అని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు ఉద్యమం ప్రారంభమై 59 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంబేడ్కర్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను విజయనగరంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, దళిత సామాజికవర్గానికి చెందిన తాడికొండ మాజీ ఎమ్మెల్యే తమనంపల్లి అమృతరావు స్ఫూర్తిని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కొనసాగిస్తూ ప్రైవేటీకరణను విరమించుకోవాలని హితవుపలికారు. 2025 ఆగస్టు 16న విశాఖ స్టీల్ప్లాంట్లోని 32 విభాగాలను ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడం, అదే రోజున ప్యాకేజీ ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 32 మంది ప్రాణత్యాగంతో సాకారమై, నేడు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బి.భానుమూర్తి, ప్రతినిధులు పిడకల ప్రభాకరరావు, ధారాన వెంకటేష్, డోల కోటేశ్వరరావు, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో పారదర్శకత
● కలెక్టర్ ఎస్. రామసుందర్రెడ్డివిజయనగరం అర్బన్: సమస్యల పరిష్కారంలో అధికారులు పారదర్శకత పాటించాలని కలెక్టర్ ఎస్. రామసుందర్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా అధికారులతో పాటు మండల, మున్సిపల్ స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లేదా జూమ్ లింక్ ద్వారా తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఫిర్యాదుల రీ ఓపెనింగ్ ఎక్కువగా ఉంటున్నాయని, రెండు వారాల్లో వాటిని తగ్గించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుదారుడికీ సక్రమమైన ఎండార్స్మెంట్ ఇవ్వడం, అందులో సంబంధిత రూల్ పొజిషన్ స్పష్టంగా పేర్కొనడం తప్పనిసరన్నారు. ఎండార్స్మెంట్లు నిర్లక్ష్యంగా ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిరోజూ కనీసం 60 కాల్స్ చేసి ఫిర్యాదుదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నారు. ఫిర్యాదుల స్వీకరణలో కొత్త విధానం.. పీజీఆర్ఎస్ వినతుల స్వీకరణలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఫిర్యాదులు అధికంగా వస్తున్న విద్యాశాఖ, డీఆర్డీఏ, వైద్యారోగ్య శాఖకు చెందిన బాధ్యతలను కలెక్టర్, జేసీ, డీఆర్ఓలతో పాటు ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లు తీసుకున్నారు. ప్రవేశ ద్వారంలోనే వినతులకు సంబంఽధించిన ప్రభుత్వ శాఖను తెలుసుకుని.. ఆ ఆధికారి వద్దకు నేరుగా అర్జీదారులను పంపే విధానాన్ని సోమవారం నుంచి అమలులోకి తెచ్చారు. పీజీఆర్ఎస్కు 184 వినతులు.. పీజీఆర్ఎస్కు జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారుల నుంచి 184 ఫిర్యాదులు స్వీరించారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన వినతులు 69 వచ్చాయి. డీఆర్డీఏకి చెందినవి 28, డీపీఓకు సంబంధించినవి 13, మున్సిపాలిటీలకు సంబంధించి మరో 13, జీఎస్డీడబ్ల్యూస్కు 21, ఇతర శాఖలతో కలిపి 184 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు మురళీ, వెంకటేశ్వరరావు, నూకరాజు, ప్రమీలాగాంధీ, రాజేశ్వరి, కళావతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.40 ఫిర్యాదుల స్వీకరణ.. విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు 40 వినతులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ఎస్పీ ఏఆర్ దామోదర్ శ్రద్ధగా విని, వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ తగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలవి 5, మోసాలవి 4, నగదు వ్యవహారాలకు సంబంధించినవి ఒకటి, ఇతర అంశాలకు సంబంధించినవి 22 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. -
సత్వరమే పరిష్కరించాలి..
● కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన సమస్యలను సత్వరమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి జిల్లా అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీదారులు తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో తిరిగి వెళ్లాలన్నారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో 112 మంది అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌరసరఫరాల సేవలు, గృహాల మంజూరు, పింఛన్లు, సర్వే, ఉపాధి, తదితర సమస్యలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వచ్చాయి. కార్యక్రమంలో సబ్ కలెక్టర్లు ఆర్. వైశాలి, పవర్ స్విప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ హేమలత, ఉప కలెక్టర్లు ధర్మచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సత్తా చాటిన జిల్లా స్విమ్మర్స్
విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏలూరు వేదికగా నిర్వహించిన 7వ రాష్ట్ర పారా స్విమ్మింగ్ చాంపియన్షిప్ – 2025 పోటీల్లో జిల్లాకు చెందిన పారా స్విమ్మర్స్ ప్రతిభ కనబరిచారని అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె. దయానంద్ తెలిపారు. ఏలూరులోని బిశ్వనాథ్ ఈత కొలనులో నిర్వహించిన ఈ పోటీల్లో సీనియర్ మెన్ కేటగిరీలో జాగరణ సత్యనారాయణ 50 మీటర్ల బెస్ట్ స్ట్రోక్ పోటీల్లో సిల్వర్ మెడల్.. 50 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడని తెలిపారు. సబ్ జూనియర్ ఉమెన్ విభాగంలో ప్రియాంకదాస్ బెస్ట్ స్ట్రోక్లో.. మౌనిక 50 మీటర్ల ఫ్రీ స్టైల్ పోటీల్లో సిల్వర్ మెడల్స్ సాధించారన్నారు. ఈ మేరకు విజేతలను ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి. రామస్వామిలతో కలిసి సోమవారం ఆయన ప్రత్యేకంగా అభినందించారు. -
యజమానే మా కొడుకును చంపేశాడు..
● మృతుడు యలకల రాము తల్లిదండ్రులుచీపురుపల్లి: తండ్రిలా చూసుకోవాల్సిన యజమానే తమ కొడుకును కిరాతకంగా హత్య చేసాడని మండలంలోని పత్తికాయవలస గ్రామానికి చెందిన ఇటీవల మృతి చెందిన యలకల రాము తల్లిదండ్రులు సింహాచలం, రమేష్ ఆరోపించారు. తమ కుమారుడిని యజమానే హత్య చేసాడని ఆలస్యంగా తెలుసుకున్న వారు సోమవారం ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఈ సందర్భంగా మృతుని తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్స్టేషన్ వద్ద స్థానిక విలేకరులతో మాట్లాడారు. తమ కుమారుడు నాలుగు సంవత్సరాలుగా తమ గ్రామానికి చెందిన వండాన సన్యాసి వద్ద జేసీబీ డ్రైవర్గా పని చేస్తున్నాడని చెప్పారు. అయితే సకాలంలో జీతాలు కూడా ఇచ్చేవాడు కాదని.. అయినప్పటికీ ఒకే ఊరు కావడంతో ఆయన వద్దనే పని చేస్తుండేవాడని తెలిపారు. ఈ నెల 8న ఇంటి నుంచి విధులకు వెళ్లిన తమ కొడుకు రాము తిరిగి ఇంటికి చేరుకోలేదన్నారు. ఫోన్ చేసినా అవ్వకపోవడంతో యజమాని సన్యాసికి ఫోన్ చేసి చెప్పగా.. అప్పటికే విధులు ముగించుకుని వెళ్లిపోయాడని తెలిపాడని చెప్పారు. మరుచటి రోజు యజమాని సన్యాసి గ్రామంలో వేరేవారికి ఫోన్ చేసి రాము అలిగి వెళ్లిపోయాడని.. పదో తేదీన మరి కొంతమందితో భోగాపురం విమానాశ్రయం పనికి వెళ్లిపోయాడని పొంతన లేని సమాధానాలు చెప్పాడన్నారు. ఇంతలో 11వ తేదీన పుర్రేయవలస ఇటుక బట్టీల వద్ద ఉన్న బావిలో తమ కుమారుడు శవమై కనిపించాడని కన్నీరుమున్నీరయ్యారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతోనే సన్యాసి తమ కుమారుడ్ని హత్య చేశాడని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని శిక్షించాలని కోరారు. -
ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కు అవార్డు
● గుజరాత్లో మంత్రి చేతుల మీదుగా అందుకున్న సుమతివంగర: మండల పరిధి తలగాం గ్రామానికి చెందిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కిమిడి సుమతికి ధైర్య సాహస అవార్డు దక్కింది. ఐదేళ్ల కిందట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో కానిస్టేబుల్గా వెస్ట్ బెంగాల్లోని మెచేడా రైల్వేస్టేషన్లో విధులు నిర్వహించే సమయంలో.. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడుతుండగా ఆ వ్యక్తిని రక్షించింది. అలాగే రైల్వే ఆస్తులు, ప్రయాణికుల భద్రత పట్ల ఆమె చూపించిన ధైర్యసాహసాలను సంబంధిత శాఖ గుర్తించింది. ఈ మేరకు గుజరాత్లోని వలా్స్ద్ ఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతులమీదుగా సుమతి సోమవారం అవార్డు అందుకుంది. ఈ మేరకు సుమతిని పలువురు అభినందించారు. -
నేషనల్ యూనివర్సిటీ గేమ్స్కు లావణ్య
చీపురుపల్లి: సౌత్ జోన్ నేషనల్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం (బీకాం) చదువుతున్న డి.లావణ్య ఎంపికై ంది. ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన ఏయూ ఇంటర్ కాలేజ్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీల్లో స్థానిక ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల జట్టు ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే ఈ పోటీల్లో అద్భుతంగా రాణించిన లావణ్యను సౌత్ జోన్ నేషనల్ యూనివర్సిటీ గేమ్స్కు ఎంపిక చేశారు. దీంతో లావణ్యను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ కృష్ణాజీ, వైస్ ప్రిన్సిపాల్ ఎం.రమేష్కుమార్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కె.జ్వాలాముఖి, సిబ్బంది అభినందించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఇంటర్వ్యూలు విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో డేటా ఏంట్రీ ఆపరేటర్ పోస్టులకు సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. పది పోస్టులకు గాను 250 మంది హాజరుకాగా..ఆస్పత్రి ఆఫీస్ సూపరింటిండెంట్ నారాయణరావు, ఇతర సిబ్బంది ఇంటర్వ్యూలు చేపట్టారు. -
జిల్లాలో అభివృద్ధి శూన్యం..
● పూర్తికాని ప్రాజెక్ట్లు ● కానరాని అభివృద్ధి పనులు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వంవిజయనగరం గంటస్తంభం: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జిల్లాలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఎన్నో హామీలిచ్చినా నేటికీ ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. సాగునీటి ప్రాజెక్ట్ల ఊసే ఎత్తకపోవడంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు రెండుసార్లు వచ్చినా హామీలు ఇవ్వడమే తప్ప ఆచరణలో చేసి చూపించలేకపోయారు. జెకా నిధులపై నిర్లక్ష్యం... 2014 సంవత్సరం నుంచి జైకా నిధులపైనా నిర్లక్ష్యం కొనసాగుతోంది. వట్టిగెడ్డకు రూ.38 కోట్ల జైకా నిధులు విడుదలయ్యాయి. కానీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. దీంతో కోట్ల రూపాయల విలువైన పనులు చేసిన తర్వాత కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. వెంగళరాయ సాగర్కు రూ.64 కోట్లతో టెండర్లు ఆమోదించారు. ఈ పనులు కూడా మధ్యలో నిలిచిపోయాయి. అలాగే పెదంకలాం, ఆండ్ర ప్రాజెక్ట్ పనులు కూడా పూర్తయ్యే దాఖలాలు కనిపించడం లేదు. శిథిలావస్థలో నారాయణపురం ఆనకట్ట .. సంతకవిటి మండలం రంగారాయపురం, శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నారాయణపురం సమీపంలో నాగావళి నదిపై 1959 – 63 మధ్య నారాయణపురం ఆనకట్టను నిర్మించారు. సంతకవిటితో పాటు శ్రీకాకుళం జిల్లాలోని సుమారు 38 వేల ఎకరాలకు ఈ ఆనకట్ట సాగునీరు అందిస్తూ వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి నిర్లక్ష్యం కనబరచడంతో షట్టర్లు, రెగ్యులేటర్లు, స్పిల్వే వ్యవస్థలతో పాటు కాలువలు, గట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి .. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటినా జిల్లాలో అభివృద్ధి రూపురేఖలు కనిపించడం లేదు. గిరిజన విశ్వవిద్యాలయం, భోగాపురం విమానాశ్రయం వంటి ప్రధాన ప్రాజెక్ట్లు నిలిచిపోయాయి. పతంజలి వంటి సంస్థల పరిశ్రమలు కూడా ఊసులకే పరిమితమయ్యాయి. అంతేకాదు, పదిహేను సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికులను తొలగించడం, మౌలిక సదుపాయాల కేటాయింపులో జాప్యం వంటి చర్యలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మూతబడిన ఎన్సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ.. చెరకు రైతులకు అండగా నిలబడడంతో పాటు వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించిన ఎన్సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ మూతబడింది. ముడి సరుకు కొరత, విద్యుత్ చార్జీల పెరుగుదల, ప్రభుత్వ రాయితీలు కల్పించకపోవడం వంటి కారణాలతో ఫ్యాక్టరీని మూసి వేయాల్సి వచ్చింది. -
● జీతాలందక అవస్థలు
● కలెక్టర్ రామసుందర్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఆరోగ్యమిత్రలువిజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకంలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలకు ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి జీతాలు ఇప్పించాలని పలువురు కోరారు. ఈ మేరకు కలెక్టర్ రామసుందర్ రెడ్డిని సోమవారం గ్రీవెన్స్ సెల్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య మిత్రల సంఘ జిల్లా అధ్యక్షుడు జెర్రిపోతుల ప్రదీప్ మాట్లాడుతూ.. రెండు నెలలుగా జీతాలు అందక పోవడంతో సిబ్బంది కుటుంబాలను నెట్టుకురాలేకపోతున్నారన్నారు. వెంటనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పైడపునాయుడు, మహేష్, బంగారునాయు డు, జగదీష్, రాజప్పడు, తదితరులు పాల్గొన్నారు. -
తెర్లాం ఉపాధ్యాయుడికి గుర్తింపు
● వరించిన అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతెర్లాం: అంతర్జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పత్తికాయల సునీల్ ఎంపికయ్యారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ (సోలిట్) ఆధ్వర్యంలో ఆదివారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఇండియా – అమెరికా సంయుక్త రాష్ట్రాలు విద్యా, సాంకేతికతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను గుర్తించి వారికి అంతర్జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటిస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాదికి సంబంధించి తెర్లాం హైస్కూల్లో ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు బోధిస్తున్న సునీల్కు అవార్డు వరించింది.ఈ నేపథ్యంలో ఏపీ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. విజయభాస్కరరావు, అనువాద ఏఐ సీఈఓ డాక్టర్ బి.చంద్రశేఖర్, ప్రముఖ అంతర్జాతీయ క్యాన్సర్ రీసెర్చ్ నిపుణుడు డాక్టర్ జి.పూర్ణచంద్ర నాగరాజు, యూనివర్సిటీ ఆఫ్ అలబామా ఎట్ బర్మింగ్హామ్ (అమెరికా) చేతుల మీదుగా సునీల్ అవార్డు అందుకున్నారు. దేశ వ్యాప్తంగా 80కి అవార్డులు రాగా.. అందులో ఒకరు జిల్లా వాసి కావడం గర్వకారణమని ఎంఈఓ త్రినాథరావు, తెర్లాం హైస్కూల్ హెచ్ఎం రమేష్, తదితరులు ప్రశంసించారు. -
గడువులోగా రీ సర్వే పూర్తి చేస్తాం..
● జిల్లా సర్వే అండ్ సెటిల్మెంట్ రికార్డ్స్ ఎ.డి లక్ష్మణరావు సీతానగరం: జిల్లాలో జరుగుతున్న థర్డ్ ఫేజ్ రీ సర్వే పనులు 30 రోజుల్లో పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నామని సర్వే అండ్ సెటిల్మెంట్ రికార్డ్స్ ఏడీ పి. లక్ష్మణరావు అన్నారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సర్వే అండ్ సెటిల్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం డీడీ, మూడు జిల్లాల ప్రత్యేక అధికారి కె. సూర్యనారాయణతో సమావేశమై రీ సర్వేపై చర్చించారు. ఈ సందర్భంగా ఎ.డి లక్ష్మణరావు మాట్లాడుతూ.. థర్డ్ ఫేజ్ కింద 43 గ్రామాలకు గాను 27,380 ఎకరాల్లో రీ సర్వే చేయాలని నిర్ధారించామని, అందులో ప్రైవేట్ భూమి 18,788 ఎకరాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. విప్యూటీ డైరెక్టర్ కె. సూర్యనారాయణ మాట్లాడుతూ.. రీ సర్వే ప్రక్రియ నిర్దేశిత సమయానికి పూర్తి చేసేలా అధికారులకు అవగాహన కల్పించామన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో సర్వే పనులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని, ఇందులో భాగంగానే ఇప్పలవలసలో చేపడుతున్న సర్వేను పరిశీలించామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐ నాగిరెడ్డి శ్రీనివాసరావు, మండల సర్వేయర్ చంద్రశేఖర్, స్థానిక సర్వేయర్లు, వీఆర్ఓలు పాల్గొన్నారు. -
హెచ్ఐవీ రోగులపై వివక్ష..!
‘విజయనగరం పట్టణానికి చెందిన ఓ హెచ్ఐవీ బాధితురాలికి గైనిక్ సమస్య రావడంతో ఆమె ప్రభుత్వాస్పత్రిని ఆశ్రయించింది. ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు గుర్తించారు. హెచ్ఐవీ ఉండడంతో శస్త్రచికిత్స చేయలేమని చెప్పేశారు. చేసేదిలేక విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రూ. 60 వేలు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకుంది.’ ‘చీపురపల్లి ప్రాంతానికి చెందిన ఓ హెచ్ఐవీ రోగికి కడుపునొప్పి రావడంతో విజయనగరంలో ఉన్న ప్రభుతాస్పత్రిలోని వైద్యు డిని ఆశ్రయించారు. వైద్య పరీక్షల్లో హెచ్ఐవీ ఉందని తేలడంతో వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేయలేదు. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రూ.50 వేలు ఖర్చుచేసి శస్త్రచికిత్స చేసుకున్నారు.’ విజయనగరం ఫోర్ట్: వీరిద్దరికే కాదు అనేక మంది హెచ్ఐవీ రోగులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో హెచ్ఐవీ బాధితులకు వైద్యసేవలు అందడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెచ్ఐవీ రోగుల పట్ల వివక్ష చూపరాదని, ఆప్యాయత చూపాలంటూ ప్రజాప్రతినిధులు దగ్గర నుంచి అధికారుల వరకు ఉపన్యాసాలు చెబుతున్నా.. వైద్యులే సేవలందించేందుకు ససేమిరా అంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏదైనా అనారోగ్యంతో చికిత్స కోసం ఆస్పత్రిని ఆశ్రయిస్తే వైద్యసేవలు ఆందించేందుకు వైద్యులు, సిబ్బంది ఇష్టపడడం లేదని హెచ్ఐవీ బాధితులే వాపోతున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి, గైనిక్ సమస్య ఉన్న మహిళలకు, కడుపునొప్పి, పేగు వరపు, హెర్నియా, హైడ్రోసిల్, ఈఎన్టీ సర్జరీ, ఎముకలు, నరాల సంబంధిత శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ప్రభుత్వాస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఎస్.కోట, రాజాం, గజపతినగరం, చీపురుపల్లి ఏరియా ఆస్పత్రులు, బాడంగి, బొబ్బిలి, నెల్లిమర్ల, భోగాపురం సీహెచ్సీలు, ఘోషా ఆస్పత్రిలో హెచ్ఐవీ బాధితులకు అవసరమైన శస్త్రచికిత్సలు, చికిత్స అందించడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రులే దిక్కు... జిల్లాలో 6,670 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నట్టు ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి. వీరిలో పురుషులు 2,755 మంది, మహిళలు 3,646 మంది, పిల్లలు 269 మంది వరకు ఉన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సేవలందక పలువురు హెచ్ఐవీ బాధితులు ఆపదవేళ శస్త్రచికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హైడ్రోసిల్, ఫైల్స్ శస్త్రచికిత్సకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు, గైనిక్ సర్జరీలకు రూ.60 వేల నుంచి రూ. 70 వేలు వరకు వసూలు చేస్తున్నారు. హెర్నియా, కడుపు నొప్పి వంటి శస్త్రచికిత్సలకు రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆదేశాలిచ్చాం.. హెచ్ఐవీ రోగులకు ప్రభుత్వాస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. శస్త్రచికిత్సలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కె.రాణి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి ప్రభుత్వాస్పత్రుల్లో హెచ్ఐవీ రోగులకు జరగని శస్త్రచికిత్సలు ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలాది రూపాయలు వెచ్చించి వైద్యం పొందుతున్న హెచ్ఐవీ రోగులు జిల్లాలో 6,610 మంది హెచ్ఐవీ బాధితులు వీరిలో మహిళలే 3,646 మంది -
పంపమంటూనే.. పొగ పెట్టేసింది!
గత పదేళ్లుగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు బోధన పరమై న సేవలందించాం. నోటిఫికేషన్ ద్వారా మెరిట్ ఆధారంగానే సీఆర్టీ ఉద్యోగాలకు ఎంపికయ్యాం. ఈ ఉద్యోగమే ఆధారంగా మా జీవితాలను నెట్టుకొస్తున్నాం. అయితే, మా పోస్టులను డీఎస్సీలో కలుపుతున్నారని సమాచారం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులకు, పాలకులకు విన్న వించాం. భయపడాల్సిన అవసరం లేదని, కేవ లం అదనంగా ఉన్న పోస్టులను మాత్రమే భర్తీ చేస్తారని మా ఉద్యోగాలకు డోకా ఏమీ లేదని అభయ హస్తం ఇచ్చారు. చివరకు రోడ్డున పడేశారు. – మూడడ్ల స్వాతి, జియ్యమ్మవలస గిరిజన ఆశ్రమ పాఠశాల సీఆర్టీ తమ పోస్టులను డీఎస్సీలో చేర్చవద్దంటూ విన్నవించి నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డీఎస్సీలో చేర్చి ఇప్పుడు నియామకాల పేరుతో సీఆర్టీల ను తొలగించడం అన్యాయం. ఇది వారి జీవితా లతో చెలగాటం అడడమే. న్యాయస్థానంలో స్పష్టమైన హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాటతప్పడం దారుణం. కొత్త నియామకాలతో సీఆర్టీలను తొలగించే ప్రక్రియను వెంటనే ఆపి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. లేకుంటే సీఆర్టీల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన పోరాటాలు, ఉద్యమాలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. – భాస్కరరావు, యూటీఎఫ్, జిల్లా జనరల్ సెక్రటరీ సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు కోల్పోయి.. రోడ్డున పడిన వారి జాబితాలో ఇప్పుడు సీఆర్టీలు చేరారు. ఐటీడీఏ పరిధిలో ని ఆశ్రమ, జీపీఎస్ పాఠశాలలలో దాదాపు పదేళ్లకు పైగా పొరుగు సేవలు, కాంట్రాక్టు ఉపాధ్యాయులు గా పనిచేస్తున్న వారికి చంద్రబాబు ప్రభుత్వం మొండిచేయి చూపింది. రెగ్యులర్ ఉపాధ్యాయుల తో సమానంగా పనిచేస్తూ.. చాలీచాలని వేతనాల తో ఇన్నాళ్లూ నెట్టుకొచ్చారు. ఏనాటికై నా తమకు రెగ్యులర్ అవుతుందన్న ఆశతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీలో వీరి పోస్టులను కూడా కలిపేయడంతో ఆందోళన చెంది పలుమార్లు ఉద్యో గ భద్రత కోసం నిరసనలు కూడా చేశారు. గతంలో ఇదే విషయమై దాదాపు 40 రోజులపాటు పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల వద్ద రిలే దీక్షలు చేపట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఏ ఒక్కరికీ అన్యాయం చేయబోమని జిల్లాకు చెందిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కూడా హామీ ఇచ్చా రు. వారి పోరాటం వృథా అయ్యింది.. ప్రజా ప్రతి నిధులు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పటి వరకూ వీరు పనిచేస్తున్న పోస్టుల్లో సోమవా రం డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు విధుల్లో చేరిపోయారు. దీంతో వీరంతా రోడ్డున పడ్డారు. ఏళ్లుగా ఈ వృత్తినే నమ్ముకుని.. ఉమ్మడి జిల్లా పరిధిలో 280 మంది సీఆర్టీలు పని చేసేవారు. ఒక్క పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 55 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీరిలో చాలామంది సుమారు తొమ్మిదేళ్లుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల్లో అందరూ క్వాలిఫైడ్ లే. పీజీ, బీఈడీ, ఎంఫిల్ వంటి ఉన్నత విద్య పూర్తి చేసిన వారున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభు త్వం వీరి పొట్ట కొట్టింది. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 204 మంది పని చేస్తుండగా.. 137 మందిని డీఎస్సీ ద్వారా భర్తీ చేశారు. ఇందులో పాఠశాల సహాయకులు(ఎస్ఏ) 77 మంది, ఎస్జీటీలు 60 మంది ఉన్నారు. వీరంతా సోమవారం విధుల్లో చేరారు. దీంతో రెండు ఐటీడీఏల పరిధిలో 200 మందికిపైగా తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఏళ్లుగా పనిచేస్తున్న తమ పోస్టులను డీఎస్సీ నుంచి మినహాయింపు ఇవ్వాలని వారంతా ప్రాథేయపడినా కూటమి ప్రభుత్వం కనికరం చూపలేదు. నిర్దాక్షిణ్యంగా ఆ కుటుంబాలను రోడ్డున పడేసింది. కూటమి ప్రభుత్వం తీరును యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ భాస్కరరావు, గిరిజన విద్యా సంఘం, సీఅర్టీల సంఘం నాయకులు పల్లా సురేష్, ఆరిక వెంకటరావు, ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ, జీపీఎస్ కాంట్రాక్టు ఉపాధ్యాయుల సంఘం అధ్య క్షుడు కె.చంద్రశేఖర్ తదితరులు తీవ్రంగా ఖండించారు. సీఅర్టీలకు అన్యాయం చేస్తే సహించబోమని.. వారికి ఉద్యోగ భద్రత కల్పించే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అధికారంలో ఉన్న మంత్రుల సైతం మా ఉద్యోగాలకు ఇబ్బంది ఏమీ లేదంటూ స్పష్టమైన హామీ ఇచ్చా రు. అన్యాయంగా మా పో స్టులను డీఎస్సీలో చేర్చారు. ఇప్పుడు ఉన్నట్లుండి డీఎస్సీ ద్వారా ఎంపికై న కొత్తవారిని మా స్థానాల్లో నియమించారు. మా పరిస్థితి ఏంటో అర్ధంకాని దుస్థితిలో ఉన్నాం. మా కుటుంబాలతో మేము ఏం కావాలో అర్ధం కావడం లేదు. దశాబ్ధకాలం ప్రభుత్వ పాఠశాలకే అంకితమైన మా జీవితాలను అంధకారంలోకి నెట్టవద్దని ప్రాథేయపడుతున్నాం. – లక్ష్మి, టి.కె.జమ్ము, గిరిజన ఆశ్రమ పాఠశాల, సీఆర్టీ -
కాస్త పెరిగిన తోటపల్లి నీటి ప్రవాహం
గరుగుబిల్లి: నాగావళి నదిలో తోటపల్లి ప్రాజె క్టు వద్ద నీటి ప్రవాహం కాస్త పెరిగింది. సోమ వారం సాయంత్రానికి 105 మీటర్లకు 104.2 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో 6,953 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, రెండు గేట్లను ఎత్తివేసి 4,939 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడుతున్నట్టు అధికారులు తెలిపా రు. కాలువలకు 1300 క్యూసెక్కులు నీటిని విడిచిపెడుతున్నామన్నారు. పార్వతీపురం రూరల్: జిల్లాను ఓ వైపు జలపా తాల ఖిల్లాగా పర్యాటకంగా అభివృద్ధి చేస్తూనే, మరోవైపు గిరిజన గ్రామాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న డోలీ మోతలకు శాశ్వతంగా చరమ గీతం పాడాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రతీ జలపాతాన్ని గుర్తించి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలన్నా రు. అదే సమయంలో ప్రతీ మారుమూల గ్రామానికి అంబులెన్స్ వెళ్లేలా రోడ్ల నిర్మాణం జరగాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్వో కె. హేమలత, ఇతర అధికారులు పాల్గొన్నారు. జేఎన్టీయూ జీవీ వీసీ బాధ్యతల స్వీకరణ ● విద్యాప్రమాణాల మెరుగుకు కృషిచేస్తా: వీసీ వి.వి.సుబ్బారావు విజయనగరం రూరల్: జేఎన్టీయూ–గురజాడ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా (వీసీ) వి.వెంకట సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జేఎన్టీయూ కాకినాడ రెక్టార్గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఉద్యోగోన్నతిపై వీసీగా నియమిస్తూ ఈ నెల 8న ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన వర్సిటీ అధికారులు, ఆచార్యుల సమక్షంలో తాజాగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపునకు చర్యలు తీసుకుంటానన్నారు. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడేలా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాల పెంపు, బోధన సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, అధికారుల సహకారంతో వర్సిటీ పురోగతికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మహారాణిపేట (విశాఖ): కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 21 మంది పచ్చ కామెర్ల బాధితులను సోమవారం కేజీహెచ్ నుంచి పార్వతీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విద్యార్థులకు వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందని, వైద్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే తరలించినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. డాక్టర్ గిరినాథ్ (గ్యాస్ట్రో ఎంటాలజీ), డాక్టర్ శివకళ్యాణి (మైక్రోబయాలజీ), డాక్టర్ కృష్ణవేణి (కమ్యూనిటీ మెడిసిన్), డాక్టర్ వాసవి లత (జనరల్ మెడిసిన్), డాక్టర్ చక్రవర్తి (పిల్లల వైద్యుడు) సహా ఐదుగురు వైద్యుల బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా విద్యార్థుల తరలింపు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు పలు విడతల్లో మొత్తం 44 మంది విద్యార్థులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు సూపరింటెండెంట్ వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 50 మంది విద్యార్థినులు పచ్చ కామెర్ల బారిన పడ్డారు. వీరిలో తొమ్మిదో తరగతి చదువుతున్న తోయక కల్పన, పదో తరగతి చదువుతున్న పువ్వల అంజలి మృత్యువాత పడటం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై వైద్యులు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించారు. -
‘బుచ్చి అప్పారావు’ విగ్రహం ఏర్పాటులో రాజకీయం..!
విజయనగరం అర్బన్: స్వాతంత్య్ర సమరయోధుడు గొర్రిపాటి బుచ్చి అప్పారావు పేరుతో గంట్యాడ మండలంలోని తాడిపూడి రిజర్వాయర్ ప్రాంతంలో సోమవారం జరుగనున్న విగ్రహ ఆవిష్కరణ రాజకీయ రంగుదాల్చింది. తూర్పు కాపు–కొప్పుల వెలమ సంఘాల మధ్య విభేదాలు, పాత ప్రభుత్వాల నిర్ణయాలపై కొత్త పాలకుల వైఖరి, చందాల వసూళ్ల వివాదం ఈ కార్యక్రమాన్ని చర్చనీయాంశంగా మర్చాయి. స్వాతంత్య్ర సమరయోధుడి స్ఫూర్తి చుట్టూ రాజకీయ లెక్కలు, సంఘాల విఽభేదాలు, చందాల వసూళ్లు వెరసి ఈ కార్యక్రమాన్ని వివాదాస్పదం చేశాయి.వైఎస్సార్సీపీ పాలనలో మొదలైన ప్రణాళికవైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో తాడిపూడి రిజర్వాయర్కు గొర్రిపాటి బుబ్బి అప్పారావు పేరు పెట్టాలన్న ప్రతిపాదన కొప్పుల వెలమ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ తరఫున జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు సమర్పించగా ఆ వినతిని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆమోదించి ప్రత్యేక జీఓ జారీ చేసింది. సంఘం జిల్లా కమిటీ కోరిన మేరకు మాజీ ఎమ్మెల్సీ బొత్స అప్పలనరసయ్య ఆర్థిక సహకారంతో దాదాపు రూ.10 లక్షల వ్యయంతో బుచ్చి అప్పారావు విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహానికి స్థలాన్ని కూడా గత ప్రభుత్వం ఎంపిక చేసి ఇచ్చింది. ఆ స్థలంలో సంఘం ప్రతినిధులు శంకుస్థాపన పూర్తి చేశారు. ఎన్నికల అనంతరం పాలకపక్షం మారింది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వ కాపు నేతలు విగ్రహస్థాపన ప్రయత్నాన్ని జరగనీయలేదు సరికదా ఆ జీఓను రద్దు చేయించారు. కొప్పుల వెలమ సంఘం గత నలభై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ పాలనలో పలుమార్లు వినతులు సమర్పించినా ఏనాడూ స్పందన రాలేదు. అదే కులానికి చెందిన అయ్యన్న పాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈ డిమాండ్ పట్టించుకోలేదని సంఘం నాయకులు చెబుతున్నారు. ఇలాంటి నేపధ్యంలో జిల్లా ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను ఎదుర్కోలేక చివరికి కూటమి ప్రభుత్వానికి మళ్లీ కొత్త జీఓ జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.ఇప్పుడు మరో విగ్రహం–మరో కథకూటమి ప్రభుత్వం వచ్చాక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ వ్యవహారంలో కలుగచేసుకుని కొత్త విగ్రహం తయారు చేయించే ప్రతిపాదన తెచ్చారు. అయితే తొలి నుంచి తమ కులానికి చెందిన సమరయోధుడిగా ఆరాధిస్తూ తాడిపూడి రిజర్యాయర్కు ఆయన పేరు పెట్టాలని పట్టుపడుతూ ఆయన విగ్రహాన్ని పెట్టాలని కృషి చేసిన కొప్పుల వెలమ సంక్షేమ సంఘాన్ని పక్కను పెట్టి తెలుగుదేశం పార్టీలో స్థానిక మరో కులం తూర్పుకాపు నాయకుల కార్యక్రమంగా తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కొత్త విగ్రహం పేరుతో చందాల వసూలుకొప్పుల వెలమ సంఘం రూ.10 లక్షల వ్యయంతో సిద్ధం చేసిన విగ్రహాన్ని కాదని కొత్త విగ్రహం ఆవిష్కరణ పేరుతో ప్రజల నుంచి వసూళ్ల దందాకు తెరలేపారు. తాడిపూడి రిజర్వాయర్ పరిధిలోని గంట్యాడ, జామి మండలాల గ్రామ ప్రజలు, ఉద్యోగుల నుంచి భారీగా చందాలను బహిరంగంగానే వసూలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామాల వారీగా రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలు టార్గెట్ ఇచ్చి వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పలు గ్రామాల్లో ఈ వసూళ్లపై ప్రజల నుంచి ఆగ్రహం ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. -
దయనీయంగా ఆశ్రమ పాఠశాలలు
● గిరిజన విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి కరువు పార్వతీపురం రూరల్: భవిష్యత్ భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన బడులు, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులకు నరక కూపాలుగా మారుతున్నాయి. గిరిజన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాలలు, నేడు కనీస సౌకర్యాలకు నోచుకోక వారి పాలిట శాపాలుగా పరిణమించాయి. పార్వతీపురం మండలంలోని రావికోన గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో నెలకొన్న దయనీయ పరిస్థితులే ఇందుకు నిలువుటద్దం. సుమారు 150 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో, చదువుకోవాలన్నా, పడుకోవాలన్నా, భోజనం చేయాలన్నా అన్నీ ఒకే చోట కావడం వారి దుస్థితికి అద్దం పడుతోంది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా గదులు లేకపోవడం పెను సమస్యగా మారింది. ఉన్న కొద్దిపాటి గదులనే తరగతులకు, భోజనశాలకు, శయన మందిరానికి వినియోగిస్తున్నారు. పగలు ఎక్కడైతే అక్షరాలు దిద్దుతారో, రాత్రి అక్కడే పక్కలు వేసుకుని నిద్రించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ గదులు కూడా విద్యార్థులందరికీ సరిపోకపోవడంతో, అనేకమంది చలికి, దోమల బెడదకు ఓర్చుకుంటూ వరండాలలోనే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. తమ బట్టలు, పుస్తకాలు దాచుకునే పెట్టెలను మెట్ల కింద పెట్టుకుని, అక్కడే ఒరిగిపోతున్న చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. మంచి నీటికి మంగళం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, రావికోన పాఠశాలలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ తాగే నీటికి, ఇతర అవసరాలకు ఒకే ట్యాంక్ నీటిని వినియోగించాల్సి వస్తుండడం విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడటమేనని తల్లిదండ్రులు, గిరిజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశుభ్రమైన తాగునీరు అందించడంలో అధికారులు చూపుతున్న నిర్లక్ష్యం గిరిజన విద్యార్థుల పట్ల వారికున్న చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం, సంబంధిత శాఖ పరమైన అధికారులు తక్షణమే స్పందించి రావికోన ఆశ్రమ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని, సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని, విద్యార్థులకు కనీస మౌలిక వసతులు అందించి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని గిరిజన సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
బంగారం చోరీ
గంట్యాడ: మండలంలోని కరకవలస పరిధి జగదాంబ నగర్లో తులం ముప్పావు బంగారం చోరికి గురైంది. జగదాంబనగర్లో నివాసముంటున్న కుప్పిలి శ్రీరామమూర్తి ఇంట్లో శనివారం రాత్రి ఎవరూ లేని సమయంలో ఇంటి తాళం విరగ్గొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువాలో ఉన్న ఒక్కటిన్నర తులాల గొలుసు, పావు తులం ఉంగరం ఎత్తుకెళ్లారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి. సాయి కృష్ణ తెలిపారు. ఇద్దరు యువతుల అదృశ్యంవిజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు అమ్మాయిలు ఆదివారం అదృశ్యమయ్యారు. ఇందుకు సంబంధించి ఏఎస్సై రామలక్ష్మి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని అయ్యన్నపేటకు చెందిన అన్నదమ్ముల పిల్లలు ఇద్దరు (23) శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. డిగ్రీ చదివిన ఇద్దరూ స్నేహితుల వద్దకు వెళ్లిఉంటారని వారి తల్లిదండ్రులు ఆదివారం మధ్యాహ్నం వరకు వేచి చూశారు. అమ్మాయిలిద్దరూ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అన్నదమ్ములిద్దరూ వన్టౌన్ పోలీస్ స్టేషన్ వకు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ ఆర్వీఆర్కే.చౌదరి ఆదేశాలతో ఏఎస్సై రామలక్ష్మి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుత్షాక్తో విద్యార్థినికి గాయాలుపాలకొండ రూరల్: స్థానిక ఎన్కే.రాజపురం ప్రాంతానికి చెందిన టి.యామిని అనే విద్యార్థిని పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. పాఠశాలలో ప్రత్యేక తరగతులకు హాజరైన ఆ విద్యార్థిని తిరిగి ఇంటికి వె వెళ్తున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురై గాయాలపాలైంది. ఈ ఘటనపై బాధిత విద్యార్థిని తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం ప్రత్యేక తరగతులకు హాజరయ్యేందుకు పాఠశాలకు ఆమె చేరుకోగా ఆ సమయంలో సహ విద్యార్థులు రాకపోవడంతో తిరిగి ఇంటికి బయల్దేరింది. ఆ సమయంలో పాఠశాల రహదారిలో ఎదురుగా వస్తున్న వాహనం నుంచి తప్పుకోబోతున్న క్రమంలో అక్కడి ప్రహరీ వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగలడంతో షాక్కు గురైంది. ఈ క్రమంలో స్థానికులు గమనించి విద్యార్థినిని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. షాక్ కారణంగా గాయాలు కావడంతో వైద్యు ప్రథమ చికిత్స అందించటంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యార్ధిని అందించిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్యలక్కవరపుకోట: ఆర్ధిక ఇబ్బందులు తాళలేక కుటుంబ పోషణ భారం కావడంతో మండలంలోని చందులూరు గ్రామానికి చెందిన కొటాన సంతోష్(26) మనస్తాపం చెందిన గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై ఎస్సై నవీన్పడాల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంతోష్ విశాఖపట్నంలోని ఒక సంస్థలో ఆవుట్సోర్సింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. తనకు వచ్చిన జీతం సరిపోక కుటుంబాన్ని పోషించుకోవడం భారమవడంతో శనివారం సాయంత్రం తన ఇంటి వద్ద గడ్డిమందు తాగేశాడు. దీంతో అపస్మారక స్థితిలో పడి ఉన్న సంతోష్ను కుటుంబసభ్యులు గుర్తించి ఎస్.కోట సీహెచ్సీకి, అక్కడి నుంచి విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విశాఖలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.ఈ మేరకు మృతుడు తండి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
ప్రమాదానికి నిలయంగా ఆర్వోబీ
సీతానగరం: మండలంలోని వాహన చోదకులు రోడ్డెక్కితే ఏం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. జాతీయ రహదారిపై నిరంతరం పార్వతీపురం, బొబ్బిలి మీదుగా రోజూ వందలాది వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. మార్గమధ్యంలో రోడ్డు, వంతెనపై భారీ స్థాయిలో గోతులు ఏర్పడడంతో నెల రోజులుగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గోతుల్లో వాహనాలతో జరుగుతున్న ప్రమాదాల్లో నిండు ప్రాణాలు పోతున్నా ఇంతవరకూ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. రోడ్డు ప్రమాదాలను చూస్తున్న పోలీసులు కొంతమేర గోతులు పూడ్చుతున్నా వర్షాలు, భారీ వాహనాలు వందల సంఖ్యలో మరమ్మతుల సమయంలో తిరుగాడడం వల్ల ఫలితం లేక పోతోంది. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఉపాధిహామీ పనుల్లో అవకతవకల గుర్తింపు
సీతానగరం: మండలంలోని గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులు, బిల్లుల చెల్లింపు, మస్తరు వేయడంలో అవకతవకలు జరుగుతున్నాయా? లేదా? అనే అంశంపై సామాజిక తనిఖీ సిబ్బంది గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చినంకలాంలో రామమందిరం వద్ద సర్పంచ్ పి.తిరుపతిరావు, గ్రామపెద్దల ఆధ్వర్యంలో ఆదివారం గ్రామసభ జరిగింది. మధ్యాహ్నం గ్రామసభ ప్రశాంతంగా ప్రారంభించినప్పటికీ క్షేత్ర సహాయకుడు బి. సత్యనారాయణ సమక్షంలో జాబ్ కార్డులు, ఉపాధి పనులుకల్పిం చడం, బిల్లుల చెల్లింపులపై వేతనదారులను సామాజిక తనిఖీ బృందం అడిగి తెలుసుకున్న సమయంలో వివిధ రకాల అభియోగాలు బయటపడ్డాయి. దీర్ఘ కాలంగా గ్రామాంతరం వెళ్లిన వారికి పనుల్లో పాల్గొనక పోయినా మస్తరు వేశారని, గర్భిణులు ప్రసవ సమయంలో పనుల్లో పాల్గొనక పోయినా, ప్రభుత్వం వద్ద గౌరవ వేతనం తీసుకుంటున్న వారికి, అనారోగ్యానికి గురైన వృద్ధులు ఏళ్ల తరబడి మంచాన పట్టిన వారికి, ఒకే ఇంట్లో ఉన్న భార్యాభర్తలు వేర్వేరు జాబ్కార్డులు పొంది వేతనాలు పొందినట్లు సామాజిక తనిఖీ సిబ్బంది గుర్తించారు. సామాజిక తనిఖీ సిబ్బంది గ్రామసభ నిర్వహించే సమయంలో గ్రామస్తులు ఒకరిపై ఒకరు అభియోగాలు చేసుకోవడం గొడవలకు దారితీసింది. దీంతో గ్రామంలోని రెండు వర్గాలు తోపులాటకు దిగాయి. ఈ విషయమై డీఆర్పీ గుంపస్వామి వద్ద ప్రస్తావించగా విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి తదితర దూర ప్రాంతాల్లో ఉన్నవారికి, వృద్ధులకు, గర్భిణులకు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనాలు పొందుతున్న వారికి ఉపాధిహామీ బిల్లులు చెల్లించినట్లు గ్రామసభలో గుర్తించామన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా తెలియజేయనున్నట్లు చెప్పారు. -
ఉపాధిహామీలో ఇంజినీర్ల పాత్ర కీలకం
● పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శివిజయనగరం రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పంచాయతీరాజ్ ఇంజినీర్ల పాత్ర కీలకమని పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీహెచ్ మహంతి అన్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీహెచ్ మహంతి మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్లో ఇంజినీరింగ్ విభాగం పాత్రను మరింత బలోపేతం చేయడం, విజిలెన్స్ ఆండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఎదురవుతున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సిబ్బంది సర్వీస్ రూల్స్ రూపకల్పన, సవరణలకు సంబంధించిన సూచనలు, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల సమస్యలను పరిష్కరించడమే అసోసియేషన్ లక్ష్యమన్నారు. గౌరవాధ్యక్షుడు షేక్ రియాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడంలో ఇంజినీర్ల పాత్ర కీలకమని, ప్రతి సభ్యుడు సమాజ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి జి.వెంకటరెడ్డి, విజయనగరం జిల్లా అధ్యక్షుడు యు.సోములు, కార్యదర్శి కె.ప్రసాద్, కోశాధికారి వి.నీరజ, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ఇంత నిర్లక్ష్యమా!
కురుపాం: గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదని మాజీ ఉప ముఖ్యమంత్రి పాము పుష్పశ్రీవాణి అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని, ఏకలవ్య పాఠశాలను ఆమె ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సకాలంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు స్పందించకపోవడం వలనే తోయక కల్ప, అంజలి గురుకుల విద్యార్థినులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే పాఠశాలలో 170 మంది విద్యార్థులు పచ్చకామెర్ల బారిన పడడం ఘోరమని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలో తాగునీటి కలుషితం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఒకే తాగునీటి బోరు ద్వారా గురుకుల పాఠశాల, ఏకలవ్య పాఠశాలకు నీటి సరఫరా అవుతుందని అప్రమత్తంగా ఉండాలని తెలిపినా పట్టించుకోలేదన్నారు. ఒకటో తేదీనే ఏకలవ్య పాఠశాలకు చెందిన విద్యార్థులకు కామెర్లు సోకినట్టు గుర్తించినా ఆరో తేదీ వరకు కూడా విద్యార్థులకు స్క్రీనింగ్ చేయలేదన్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. ఇంతటి తీవ్రమైన సమస్య వెలుగులోకి తీసుకొచ్చినా స్పందించకపోవడం దారుణమన్నారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఆదివారం వెళ్లగా జనరల్ ఫిజీషియన్ లేరని, ఆర్థోపెడిక్ వైద్యులు ఉన్నారని ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. హెపటైటిస్ ఏ ఎంతో ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారని అయినా పాలకులకు ఇంత నిర్లక్ష్యం ఏంటో అర్ధం కావడం లేదన్నారు. మలం కలిసిన నీటి కలుషితం కావడం వల్లే హెపటైటిస్ ఏ వ్యాప్తి చెందిందని నివేదికలు చెబుతున్నాయని, అయినా స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారులు పర్యవేక్షణ లోపంపై హ్యూమన్ రైట్స్కు, జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ఆమె వెంట ఎంపీపీ పద్మావతి, జెడ్పీటీసీ గొర్లి సుజాత, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు. సరైన వైద్యం అందకే ఇద్దరు విద్యార్థినుల మృతి ఒకే స్కూల్లో 170 మంది పచ్చకామెర్ల బారిన పడడం ఘోరం పెరుగుతున్న హెపటైటిస్ ఏ కేసులు చోద్యం చూస్తున్న ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హ్యూమన్ రైట్స్, జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం.. మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి -
ముగిసిన జేవీవీ కళాజాతా శిక్షణ
విజయనగరం అర్బన్: జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయిలో స్థానిక గురజాడ స్కూల్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కళాజాతా శిక్షణ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సభలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.విశ్వనాధ్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ నెలలో కర్నూలులో, అక్టోబర్ నెలలో విజయనగరంలో నిర్వహించిన శిక్షణ తరగతులు లక్ష్యాన్ని నెరవేర్చాయన్నారు. గుంటూరులో నవంబర్లో నిర్వహించనున్న శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని కోరారు. ప్రధానంగా పాటల శిక్షణ, డప్పు శిక్షణ, మ్యూజిక్పై శిక్షణ పొందిన వారు, తర్వాత రోజులలో పాఠశాలలు, కాలేజీలలో చదువుతున్న విద్యార్థులతో సమావేశాలు జరపాలన్నారు. జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎ.ఫృధ్వీ, సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ గండ్రేటి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు గండ్రేటి లక్షణరావు, గండ్రేటి అప్పలనాయుడు, డాక్టర్ ఏవీ రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హెచ్.కృష్ణారావు, కోశాధికారి ఎస్.శివాజీ, విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి, పార్వతీపుం మన్యం, శ్రీకాకుళం జిల్లాల నుంచి జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు పాల్గొన్నారు. -
నేడు పీజీఆర్ఎస్
సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాధ్ నిర్వహించనున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు ఇవ్వవచ్చని అధికారులు తెలిపారు. పింఛన్దారుల సమావేశం నేడుపార్వతీపురం: పట్టణంలోని రైతు బజారు పక్కన వున్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో సోమవారం పింఛన్దారులతో సమావేశం నిర్వహించనున్నట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గంట జగన్నాధంనాయుడు, కార్యదర్శి గణపతిరావు ఆదివారం తెలిపారు. సమావేశంలో మండల యూనిట్లు నిర్వాహణ, భవిష్యత్ ప్రణాళికపై చర్చించనున్నట్టు పేర్కొన్నారు. పింఛన్దారులు హాజరు కావాలని కోరారు. విజయనగరం టౌన్: హంస వాహనంపై పైడితల్లి అమ్మవారు విహరించేందుకు తెప్పోత్సవ ఏర్పాట్లను ఆలయ అధికారులు స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం పెద్ద చెరువులో తెప్పోత్సవం ట్రయల్ రన్ నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష తెలిపారు. 30 మంది గజ ఈతగాళ్లతో, హంస వా హనం, రెండు పక్క బోట్లుతో పాటూ అగ్నిమాపక అధికారుల బోట్లు ఉంటాయన్నారు. హంస వాహనిపై విహరించే పైడితల్లి తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు తరలివచ్చే అశేష భక్త జనావళికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామ న్నారు. ఆర్అండ్బీ అధికారుల సాయంతో వేసిన గ్రిల్స్ వరకూ వచ్చి తెప్పోత్సవాన్ని చూసే అవకాశం కల్పించామన్నారు. పెద్దచెరు వు అవతలి గట్టు నుంచి కోటశక్తి ఆలయం వర కూ తెప్పోత్సవాన్ని వీక్షించే అవకాశం ఉందన్నారు. మూడుసార్లు అమ్మవారు పెద్ద చెరువు లో హంస వాహనంపై విహరిస్తూ భక్తులను ఆశీర్వదిస్తారని తెలిపారు. ట్రయల్ రన్ సుమా రు 50 మందితో నిర్విహిస్తామని, కానీ ఉత్సవానికి మాత్రం 20 మంది వరకే అనుమతి ఉందన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంట ల నుంచి నిర్వహించనున్న తెప్పోత్సవాన్ని భక్తులందరూ వీక్షించి తరించాలని కోరారు. వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద 4 వేల క్యూసెక్కుల అవుట్ఫ్లో ఆదివారం నమోదైంది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 4వేల క్యూ సెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరడంతో ప్రాజెక్టు వద్ద 64.12 మీటర్లు లెవెల్ నీటిమట్టం నమోదైంది. వచ్చిన నీటిని రెండు గేట్ల ద్వారా దిగువకు విడిచిపెడుతున్నామని ఏఈ నితిన్ తెలిపారు. విజయనగరం ఫోర్ట్: సమాజంలో ఎప్పటికప్ప డు వచ్చే అధునాతన వైద్య పరిజ్ఞానాన్ని వైద్యు లు తెలుసుకోవాలని ఐఎంఏ సీజీపీ డీన్ డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ అన్నారు. ముంబాయిలోని ఐటీసీ హోటల్లో నిర్వహించిన వెస్ట్ జోన్ జాతీయ వైద్యుల సమ్మేళనంలో విజయనగరానికి చెందిన ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. సేవాదృక్పథంతో రోగులకు వైద్య సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ జాతీ య అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ భానుపాళి, ఉపా ధ్యక్షుడు కపాడియా, కోశాధికారి పీయూష్ జైన్ తదితరులు పాల్గొన్నారు. -
పోరుబాట
సోమవారం శ్రీ 13 శ్రీ అక్టోబర్ శ్రీ 2025కూటమి అరాచక పాలనపై విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై, దురాగతాలపై పోరాటం చేయనున్నట్టు విజయగనరం జిల్లా పరిషత్ ౖచైర్మన్, వైఎస్సా ర్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీ య అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చేపడుతున్న పోరాటాల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మజ్జి శ్రీనివాసరావు పోరాట కార్యాచరణ ప్రకటించారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్య అందించాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటాన్ని ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ తీవ్ర ంగా వ్యతిరేకిస్తోందని శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో భాగంగా పార్టీ అధినేత ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో ప్రజల నుంచి కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేయటం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించిన అనంతరం, 12న జిల్లా కేంద్రంలో ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. అంబేడ్కర్ ఆశయాలను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ప్రభుత్వాలే విద్య, వైద్యం అందించాలని ఆకాంక్షిస్తే ప్రస్తుత కూటమి సర్కారు ప్రైవేటీకరణ చేయటం తగదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలను నిర్మించాలని జగన్మోహన్రెడ్డి సంకల్పించగా, అందులో 7 కాలేజీలను పూర్తి చేయ గా... 5 కాలేజీల్లో తరగతులు జరుగుతున్నాయన్నా రు. మిగిలిన కాలేజీల నిర్మాణానికి రూ.5000 కోట్లు కేటాయిస్తే పనులు పూర్తవుతాయని చెప్పారు. 16 నెలల కాలంలో రూ.2లక్షల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు లేవని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేకపోవటంతోనే కురుపాంలో పచ్చకామెర్ల బారిన పడిన విద్యార్థులను 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖలో ని కేజీహెచ్కు తరలించి చికిత్స అందించాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. విజయనగరంలో ప్రైవేటుగా నిర్వహిస్తున్న మిమ్స్ ఆసుపత్రికి ఎందుకు తీసుకువెళ్లలేదని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకునేంత వరకు ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ చేసే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఏ అధికారంతో చందాలు వసూలు చేశారు..? విజయనగరం ఉత్సవాల పేరిట జిల్లా అధికార యంత్రాంగం ఏ అధికారంతో చందాలు వసూలు చేశారో చెప్పాలని మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించా రు. విజయనగరం ఉత్సవం అనేది ప్రభుత్వంతో సంబంధం లేదని, అటువంటి కార్యక్రమానికి ప్రత్యేకంగా అకౌంట్లు పెట్టి బలవంతపు వసూళ్లు చేయటాన్ని తప్పుపడుతున్నామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు నిధులు సేకరించి ఉత్సవాలు నిర్వహించే వారని ఈ ఏడాది అందుకు భిన్నంగా అధికార యంత్రాంగంతో చందాలు వసూలు చేయించటం దారుణమన్నారు. ఉత్సవాల పేరిట ఎంత మొత్తంలో చందాలు వసూలు చేశారు..? ఎంత ఖర్చు చేశారన్న లెక్కలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్రి నర్సింహమూర్తి, రాష్ట్ర కార్యదర్శులు కెవి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబా బు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రంలో టీడీపీ నేతల కనుసన్నల్లోనే కల్తీ మద్యం తయారు చేసి నేరుగా షాపుల్లో విక్రయించటం దారుణమని మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీ మద్యం మాఫియాకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 13న సోమవారం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు పార్టీ సమన్వయకర్తలు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం కల్తీ మద్యం తయారీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఎకై ్సజ్ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. కల్తీ మద్యం తయారీని ఓ కుటీర పరిశ్రమలా ఏర్పాటు చేసినట్టు వెలుగులోకి రావటం, వాటిని టీడీపీ నేతల అనుచరులే నిర్వహిస్తున్నట్టు తేటతెల్లమైందన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఇటువంటి ఘటనలు ఎక్కడా చోటు చేసుకోలేదని ప్రభుత్వ ఆధ్వర్యంలో పారదర్శకంగా విక్రయాలు జరిగాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రైవేటు వ్యాపారులకు అప్పగించి కల్తీ మద్యం మాఫియాను ప్రోత్సహించిందని ఆరోపించారు. ఇప్పటి వరకు కల్తీ మద్యం తాగి రాష్ట్రంలో 35 మంది చనిపోయినట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. కృష్ణ, ఏలూరు, పరవాడ తదితర ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారీ చేసి విక్రయించడంపై ప్రభుత్వం, ఎౖక్సైజ్ అధికారులు నిర్లక్ష్యం నటిస్తున్నారని మండిపడ్డారు. ఫలితంగా ఆడబిడ్డల తాళిబొట్లు తెంచిన పాపానికి ఒడిగడుతున్నారని దుయ్యబట్టారు. అంతేకాకుండా వేలాది మంది కిడ్నీ, లివర్లు పాడై అనారోగ్యాల బారిన పడుతున్నారని.. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తక్షణమే కల్తీ మద్యం తయారీని పూర్తి స్థాయిలో కట్టడి చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
కూటమి కపట నాటకం!
కౌలు రైతులపై...పార్వతీపురం రూరల్: ఎన్నికల ముందు ఓట్ల కోసం కల్లబొల్లి కబుర్లు చెప్పడం.. గద్దెనెక్కిన తర్వాత హామీలను గాలికొదిలేయడం కూటమి పాలకులకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. అందరికీ అన్నం పెట్టే రైతన్న కడుపు మాడుతున్నా... ఈ సర్కార్కు చీమ కుట్టినట్టయినా లేదు. ముఖ్యంగా సాగు భూమిలో సింహభాగం వాటా కలిగిన కౌలు రైతుల కష్టాలు అరణ్యరోదనగా మారుతున్నాయి. ఖరీఫ్ పంట చేతికొచ్చే దశకు చేరుకుంటున్నా, వారికి ఇస్తామన్న అన్నదాత సుఖీభవ సాయం అందకపోవడం కూటమి సర్కార్ నిర్లక్ష్యానికి, రైతులపై చూపిస్తున్న వివక్షకు నిలువుటద్దం పడుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో కౌలు రైతుల కన్నీటి గాథలే ఇందుకు సజీవ సాక్ష్యం. కార్డుల జారీలో కపట నాటకం! జిల్లాలో 30 వేలకు పైగా కౌలు రైతులు వ్యవసాయం చేస్తుంటే, ప్రభుత్వ లెక్కలు మాత్రం వారిని వెక్కిరిస్తున్నాయి. కేవలం 11 వేల మందికి మాత్రమే కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్సీ) ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోవడం వెనుక ఉన్న కుట్ర ఏమిటో అర్థం కావడం లేదని రైతులోకం ప్రశ్నిస్తోంది. క్షేత్ర స్థాయి వాస్తవాలను గాలికి వదిలేసి, ఏసీ గదుల్లో కాగితాలపై లక్ష్యాలు నిర్దేశించి చేతులు దులుపుకునే ధోరణిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు కేవలం 9,345 మందికే కార్డులు జారీ చేశామని అధికారులు గొప్పగా చెబుతున్నప్పటికీ, ఆ ప్రక్రియలో జరుగుతున్న భాగోతం అంతా ఇంతా కాదు. అధికార పార్టీ నేతల అండదండలు ఉన్న వారికే కార్డుల పందేరం జరుగుతోందని, అసలైన కష్టజీవులకు అన్యాయం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. పైగా, జారీ చేసిన కార్డులలో సైతం అక్షర దోషాలు, తప్పుడు వివరాలతో అవి పనికిరాని కాగితపు ముక్కలుగా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ నెలాఖరుకు ప్రక్రియ పూర్తి చేస్తామని చెబుతున్న మాటలు నీటి మీద రాతలనే తలపిస్తున్నాయి. పంట చేతికొచ్చాక పెట్టుబడా..? రైతన్నను దగా చేసేందుకే ఈ ఎత్తుగడ...! సాగుకు అత్యంత కీలకమైన పెట్టుబడి కోసం రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న సమయంలో ఆదుకోవాల్సింది పోయి, పంట కోతకు వచ్చాక సాయం అందిస్తామనడం కౌలు రైతులను దగా చేయడానికేనని రైతు సంఘాలు భగ్గుమంటున్నాయి. కౌలు కార్డుల జారీ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ, దానిని సాకుగా చూపి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టేందుకే కూటమి ప్రభుత్వం ఈ పన్నాగం పన్నిందని స్పష్టమవుతోంది. నవంబర్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని చెబుతున్నా, అప్పటికై నా ఈ అన్నదాతల ఆకలి కేకలు ప్రభుత్వ చెవికి ఎక్కుతాయో లేదో వేచి చూడాలి. తక్షణమే ప్రభుత్వం కళ్లు తెరిచి, అర్హులైన ప్రతి కౌలు రైతుకూ గుర్తింపు కార్డులు అందించి, అన్నదాత సుఖీభవ సాయాన్ని తక్షణమే విడుదల చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో, రైతుల ఆగ్రహ జ్వాలలకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాయి. కౌలు రైతులకు ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తుంది. కౌలు రైతుకు సీఆర్సీ కార్డులు చట్ట ప్రకారం ఇవ్వాల్సి ఉన్నా ఇంతవరకు మూడో వంతు కూడా ఇవ్వలేదు. గుర్తింపు కార్డు లేనిదే కౌలుదారుకు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ పథకం అమలు కాలేదు. గుర్తింపు కార్డు లేక కౌలుదారుకు సబ్సిడీ ఎరువులు కూడా ఇవ్వలేదు. మొన్న వర్షానికి, గాలికి పంట నష్టపోయినా కౌలుదారికి నష్టపరిహారం ఇవ్వడం లేదు. ప్రభుత్వం సేకరించే పంటలకు ఈ క్రాప్ చేయాలి. గుర్తింపు కార్డు లేనందున కౌలుదారు పేరున ఈ క్రాప్ చేయడం లేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం కౌలుదారులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి, ఈ క్రాప్ చేసి పంట రుణాలు, నష్టపరిహారం ఇవ్వాలి. – ఎం.కృష్ణమూర్తి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లాలో 30 వేల మంది కౌలు రైతులు 11 వేల మందికే గుర్తింపు కార్డులు 70 శాతం సాగు వారిదే అయినా.. సాయంలో సున్నా.. చెమటోడ్చే కౌలు రైతుకు కూటమి సర్కార్ మొండి చేయి పెట్టుబడి సాయం ఎగ్గొట్టేందుకే కౌలు కార్డుల జారీలో జాప్యం -
పువ్వల నాగేశ్వరరావు మృతి
● దిగ్బ్రాంతి వ్యక్తంచేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ● నివాళులర్పించిన ఎమ్మెల్సీ బొత్స, జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావుసాలూరు: వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, సాలూరు పట్టణ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్, మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ పువ్వలనాగేశ్వరరావు మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నాగేశ్వరరావు మరణ వార్త తెలుసుకున్న వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం ఉదయం లక్ష్మి థియేటర్ వద్ద ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. నాగేశ్వరరావు మరణ వార్త తెలుసుకున్న ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తదితర ప్రముఖులు సాలూరు వచ్చి నాగేశ్వరరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నాగేశ్వరరావు సేవలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. నాగేశ్వరరావు సతీమణి ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, కుమారుడు శ్రీనువాసరావు, కుమార్తె, కుటుంబీకులు, బంధువులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల విషన్నవదనాల మధ్య నాగేశ్వరరావు అంత్యక్రియలు శనివారం పూర్తయ్యాయి. -
చీపురుపల్లిలో భారీ చోరీ
చికెన్● 10 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.2.5 లక్షలు నగదు అపహరణ ● బాధితుడి ఫిర్యాదుపై పోలీసుల దర్యాప్తు చీపురుపల్లి: పట్టణంలో జరుగుతున్న వరుస దొంగతనాలు అలజడి సృష్టిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మెయిన్రోడ్లో ఇద్దరు వృద్ధులను గాయపరిచి భారీ మొత్తంలో బంగారం దోచుకెళ్లిన ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే పట్టణంలోని ఆంజనేయపురంలోని విజయకృష్ణ అపార్ట్మెంట్ రోడ్లో నివాసం ఉంటున్న ఒమ్మి సురేష్ అనే ఉపాధ్యాయుడి ఇంటిలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరగడం స్థానికంగా ఉలిక్కపడేలా చేసింది. ఈ ఘటనలో 10 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.2.5 లక్షలు నగదు పోయినట్లు ఉపాధ్యాయుడు సురేష్ తెలిపారు. దొంగలు ఇంటిలోని రెండు బెడ్ రూమ్లలో ఉన్న బీరువాలు, కప్బోర్డులు మొత్తం వెతికి, సామగ్రి చిందర వందరగా పడేశారు. బీరువాల్లో చీరలు, బట్టలు ఉన్నప్పటికీ వాటిని ముట్టుకోకుండా బంగారం, వెండి, నగదుపైనే దుండగులు దృష్టి సారించారు. ఇదే ఇంటికి పక్కనే ఉన్న విజయకృష్ణ అపార్ట్మెంట్లో రెండేళ్ల క్రితం గంగాధర్ నివాసంలో పడిన దొంగలు 25 తులాల బంగారం అపహరించుకుపోయారు. మళ్లీ అక్కడే పక్క ఇంటిలో చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కిటికీ గ్రిల్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించి కిటికి గ్రిల్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు పొడవాటి స్క్రూడ్రైవర్, మూడు అడుగుల రాడ్డుతో ఇంట్లో ఉన్న బీరువాలను తెరిచారు. బీరువాల్లో లాకర్లు తెరిచి 10 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.2.5 లక్షలు నగదు దోచుకెళ్లారు. అయితే చోరీకి తీసుకొచ్చిన స్క్రూ డ్రైవర్, రాడ్డు బెడ్ రూమ్లోని మంచంపైనే వదిలి పెట్టి వెళ్లిపోయారు. పెళ్లికి వెళ్లి వచ్చిన బాధితులు ఉపాధ్యాయుడు సురేష్ భార్యతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం రాజాం పట్టణానికి ఓ వివాహ వేడుకకు వెళ్లారు. వేడుక ముగించుకుని తిరిగి రాత్రి 1.30గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. ఇంటి ముఖద్వారం తాళం తెరిచి లోపలికి వెళ్లి ప్రధాన హాలు తలుపు తీసేందుకు ప్రయత్నించగా రావడం లేదు. లోపల గడియ పెట్టి ఉండడాన్ని గమనించి ఇంట్లో దొంగలు పడినట్లు గుర్తించారు. తెలిసిన వారికి ఫోన్లు చేసి రప్పించి పోలీసులకు సమాచారం ఇస్తున్న సమయంలో ఇంటి లోపల ఉన్న దొంగలు వెనుక డోర్ నుంచి పారిపోయారు. ఆధారాల సేకరణ విషయం తెలుసుకున్న క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. చోరీకి వినియోగించిన పరికరాలు, కిటికీ గ్రిల్పై వేలిముద్రలు సేకరించారు. బాధితుడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


