Parvathipuram manyam District News
-
హనుమాన్ శోభాయాత్ర
భక్తిశ్రద్ధలతో..విజయనగరంలో కనులపండువగా సాగుతున్న హనుమాన్ శోభాయాత్ర హనుమజ్జయంతిని పురస్కరించుకుని హిందూ ధర్మ రక్షాసమితి జిల్లాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. భాజాభజంత్రీలు, కోలాట ప్రదర్శనలు, డప్పువాయిద్యాల నడుమ జై హనుమాన్ నామస్మరణతో విజయనగరం కోట కూడలి నుంచి గంటస్తంభం మీదుగా హనుమాన్ కూడలి వరకు శోభాయాత్ర సాగింది. పాత మహారాజా ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి చేసిన ఆధ్యాత్మిక ప్రసంగం భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో హిందూ ధర్మరక్షా సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్ష్యుడు ఆబోతుల శ్యామ్ సుందర్, జిల్లా ఇన్చార్జి రామ్ తరుణ్, సహాయ కార్యదర్శి రామ్రాజేష్, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం టౌన్ -
పార్వతీపురం ఎమ్మెల్యే వ్యాఖ్యలపై నిరసన
పార్వతీపురం రూరల్: రెవెన్యూ అధికారులపై పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర చేసిన అనుచిత వ్యాఖ్యలను జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఖండించింది. ఈ నెల 9న పార్వతీపురం మండలం అడ్డపుశీల గ్రామ పరిధిలోని సర్వే నెం.70/2లో గల గెడ్డ పోరంబోకు భూమి ఆక్రమణల విషయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెవెన్యూ సిబ్బందిపై పరుష పదజాలం వాడటంపై సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం బాధాకరమని సంఘ అధ్యక్ష, కోశాధికారులు జి.శ్రీరామమూర్తి, పి.సత్యలక్ష్మీ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవస్థలో ఎవరైనా తప్పుచేస్తే వారిపై చర్యలు తీసుకోవడానికి అభ్యంతరం లేదని, విధుల్లో ఉన్న ఉద్యోగులందరినీ కలిపి నిందించడం తగదన్నారు. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దళితుల హక్కులను కాపాడండి ● రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం విజయనగరం: దళిత వర్గాల హక్కులను కాపాడి, వారి ఆర్థికాభివృద్ధికి సహకారం అందివ్వాలని అధికార వర్గాలకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం సూచించారు. విజయనగరంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న దళిత ఉద్యోగుల వినతులను స్వీకరించారు. ఆ తర్వాత దళిత సంఘాల నేతలు, దళితుల నుంచి వచ్చిన వినతి పత్రాలను అందుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపి పరిష్కరించారు. మధ్యాహ్నం పలువురి నుంచి వచ్చిన వినతులపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం సీతారాం మాట్లాడుతూ దళితుల హక్కులను పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు విస్తృత పర్యటనలు చేపడుతున్నామన్నారు. ప్రతి దళిత కుటుంబంలోని ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వం ధ్యేయమని పునరుద్ఘాటించారు. వివిధ శాఖలలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఎస్సీ సొసైటీకి 22 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలన్నారు. దళితులు, దళిత సంఘాలు, దళిత ఉద్యోగుల నుంచి వచ్చిన వినతులను 15 రోజుల్లోగా పరిష్కరించి తనకు నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాలస్వామి, సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, డీసీహెచ్ఎస్ పద్మశ్రీ రాణి, విద్యుత్ శాఖ ఎస్ఈ యం.లక్ష్మణరావు, ప్రభుత్వ వైద్య కళాశాల ఏడీ, తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్లో 48 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు ● వ్యవసాయ శాఖ జేడీ తారకరామారావు కొత్తవలస: రానున్న ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని రైతులకు రాయితీపై అందజేసేందుకు 48వేల క్వింటాళ్లు వరి విత్తనాలను సిద్ధం చేశామని, అందులో 35 వేల క్వింటాళ్లు 1121 రకం విత్తనాలేనని వ్యవసాయ శాఖ జేడీ వి.తారకరామారావు తెలిపారు. కొత్తవలస ఏడీఏ కార్యాలయాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి సాధారణ విస్తీర్ణం లక్షా15వేల ఎకరాలుగా పేర్కొన్నారు. 38 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచుతామన్నారు. ఎకరానికి 75 కేజీల యూరియా మాత్రమే అందజేస్తామన్నారు. వ్యవసాయ పరికరాలు కావాల్సిన రైతులు రైతు సేవాకేంద్రాల్లో ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఏడీఏ భానులత ఉన్నారు. -
నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ సమరభేరి
● నేరగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ విజయనగరం గంటస్తంభం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంపై విద్యార్థి లోకం భగ్గుమంది. భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో మంగళవారం విజయనగరం పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్య అమ్మకానికి కాదు–మా హక్కు, నీట్ మాఫియాను అంతం చేయాలంటూ విద్యార్థులు నినదించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహనరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యా వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్నారని విమర్మించారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివే పేద, మధ్యతరగతి విద్యార్థుల కలలను ఈ విద్యా మాఫియా చిదిమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఏ వైఫల్యం.. 2015 నుంచి నేటి వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన పరీక్షల్లో నాలుగు సార్లు నీట్ పేపర్ లీక్ అవ్వడం, యూజీసీ నెట్ రద్దు కావడం చూస్తుంటే వ్యవస్థ ఎంతలా దిగజారిందో అర్ధమవుతోందని రామ్మోహనరావు అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నీట్ వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందని, అందుకే తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర నాయకులు కేంద్రానికి వత్తాసు పలకడం మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్మి డి.రాము, గర్ల్స్ కన్వీనర్ శిరీష్, జిల్లా నాయకులు సోమేష్, జగదీష్,నాని, డీవైఎఫ్ఐ నాయకులు హరీష్, రవి, పెద్ద సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు. విద్యావ్యవస్థలో అవనితీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న విద్యార్థులు -
బాలభవన్ను సందర్శించిన జీతెలుగు డైరెక్టర్
రాజాం: పట్టణంలోని మెంతిపేటలో గల ప్రభుత్వ జవహర్ బాలభవన్ వేసవి శిక్షణ తరగతులను జీ తెలుగు టీవీ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్స్ డైరెక్టర్ శేఖర్ మంగళవారం సందర్శించారు. జీ తెలుగులో పలు కార్యక్రమాలకు దర్శకత్వం వహిస్తున్న ఆయన బాలభవన్లో వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా నేర్పిస్తున్న పలు కార్యక్రమాలపై ఆరాతీయడంతో పాటు వాటిని పరిశీలించి, చిన్నారులతో ముచ్చటించారు. విద్యార్థులు చదువుతో పాటు పలు రంగాల్లో రాణించాలని, ఇవి ఉపాధినే కాకుండా మానసిక, శారీరక వికాసానికి తోడ్పడతాయని వెల్లడించారు. సంగీతం, నృత్యం వంటి కళల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనభరిచి రాష్ట్రస్థాయిలో రాణించాలని కోరారు. కళాకారులుగా గుర్తింపు పొంది, జిల్లాకు, రాష్ట్రానికి పేరుతేవాలన్నారు. ఈ సమయంలో నేర్చుకున్న కళలు జీవితంలో ఏదోఒక సమయంలో ఉపయోగపడ్తాయని గుర్తుచేశారు. మంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వేసవి చిన్నారులకు మంచి మానసిక ఆటవిడుపుగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో బాలభవన్ డైరెక్టర్ డాక్టర్ సుంకరి రమేష్, డ్యాన్స్ మాస్టర్ తారకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రామతీర్థంలో వైభవంగా హనుమాన్ జయంతి
● కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండనెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. వేకువజామున ప్రాతః కాలార్చన, బాలభోగం అనంతరం ఆంజనేయస్వామి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. స్వామికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామిని తమలపాకులు, సిందూరం, పుష్పాలతో సుందరంగా అలంకరించి అర్చనలు జరిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆంజనేయస్వామి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, కిరణ్కుమార్, పవన్, రామగోపాల్, తదితరులు పాల్గొన్నారు. వాడవాడలా భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కొత్తపేట, ఒమ్మి, సతివాడ, గొర్లిపేట, తదితర గ్రామాల్లో ఆంజనేయస్వామి ఆలయాల్లో భక్తులు పూజలు జరిపారు. విగ్రహాలకు భారీ పూలదండలు వేసి భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. -
జరిగేవరకూ ఉద్యమిస్తాం
దళిత క్రైస్తవులకు న్యాయం● కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలంవిజయనగరం టౌన్: దళిత క్రైస్తవులకు న్యాయం చేకూరేవరకూ ఉద్యమిస్తామని కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక సిమ్స్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో రాజ్యాంగం, మతస్వేచ్ఛ, దళిత క్రైస్తవుల తక్షణ కర్తవ్యం అనే అంశంపై మంగళవారం జరిగిన దళిత క్రైస్తవ మహాసభలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము అండగా ఉన్నామని భరోసా కల్పించారు. క్రిస్టియన్, మైనారిటీ వర్గాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేయాలన్న రాష్ట్రాల తీర్మానాన్ని ఆమోదించి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా రిజర్వేషన్ హక్కులు కల్పించాలని కోరారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.విజయకుమార్ (ఐఏఎస్) మాట్లాడుతూ ప్రస్తుతం వివక్ష కొనసాగుతోందన్నారు. మానవ మనుగడకు ఆటంకం ఏర్పడిందని సమానత్వం హక్కు ఎస్సీ క్రిస్టియన్స్కు, ముస్లింలకు మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మతప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామనడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. అంబేడ్కర్ ఇండియా మిషన్ అధ్యక్షుడు పీవీ.సునీల్ కుమార్ (ఐపీఎస్) మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయసాధనలో దళితులకు సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించి రిజర్వేషన్ల విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అధ్యక్షుడు రంజిత్ ఒఫిర్, వైఎంసీఏ అధ్యక్షుడు రోలెండ్ విలియమ్స్లు ప్రసంగించారు. సంఘమిత్ర ఆర్ఎస్.జాన్ అధ్యక్ష్యతన నిర్వహించిన దళిత మహాసభలో సిమ్స్ చర్చి అధ్యక్షుడు తాలాడ ఆనంద్, పాస్టర్ వై.ప్రభాకర్ ఆంద్రప్రదేశ్ దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆదాడ మోహనరావు, జమాతే ఇస్లాం కమిటీ ప్రతినిధి హబీబ్, రిటైర్ట్ పీటీసీ ప్రిన్సిపల్ డాక్టర్ కె.రాజశిఖామణి, ఉత్తరాంధ్ర జిల్లాల సంఘ ప్రతినిధులు, అధిక సంఖ్యలో దళిత సంఘాల నాయకులు, పాల్గొన్నారు. -
విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు
విజయనగరం అర్బన్: పదోతరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల కీర్తిని దశదిశలా చాటిన విద్యార్థులను కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అభినందించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిపాలన, విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సమర్ధమైన మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల కఠిన శ్రమఫలితంగానే ఈ అద్భుత విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఆసక్తులకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఏకాగ్రతతో ఉన్నత చదువుల్లో రాణించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని హితవు పలికారు. అనంతరం ఉత్తమమార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, ఆయా పాఠశాలల హెచ్ఎంలను దుశ్శాలువలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులతో కలిసి ఆత్మీయ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, డిప్యూటీ ఈఓ కె.వి.రమణ, సహాయ సంచాలకులు అరుణజ్యోతి, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ సన్యాసిరాజు, డీఈఓ కార్యాలయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
మున్సిపల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
● పద్ధతి మార్చుకోకుంటే వేటు తప్పదని హెచ్చరిక ● సొంత ప్రభుత్వంపైనే ‘టీడీపీ’ నేతల నిలదీతపార్వతీపురం రూరల్: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలోకి వచ్చిన కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, పాలకుల వైఫల్యాలు ముఖాముఖి దర్శనమిచ్చాయి. ఈ మేరకు మంగళవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన ‘ముఖాముఖి’ కార్యక్రమంలో అధికారులపై కలెక్టర్ నిప్పులు చెరిగారు. ఒకవైపు అధికారులు బాధ్యతలను గాలికొదిలేయడం, మరోవైపు గత రెండేళ్లుగా అధికారంలో ఉండి ఏమీ చేయని కూటమి నేతలు.. ఇప్పుడు తమ ప్రభుత్వంపైనే నిరసన తెలపడం పట్టణంలో విడ్డూరంగా మారింది. నిర్లక్ష్యం నీడన నగరపాలన కార్యక్రమంలో భాగంగా వివిధ వార్డుల నుంచి వచ్చిన ప్రజలు తమ గోడును కలెక్టర్ ముందు వెళ్లబోసుకున్నారు. జగన్నాథపురంలో చెరువు ఆక్రమణలు, నాయుడు వీధిలో మంచినీటి ఎద్దడి, నిర్మల కాలనీలో ప్రభుత్వ స్థలాల కబ్జాపై వినతులు వెల్లువెత్తాయి. మున్సిపల్ పరిధిలో గ్రామాచావిడి, బందెలదొడ్డి వంటి స్థలాలు అక్రమార్కుల పరమవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడంపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీసం మురుగు కాలువలు శుభ్రం చేయలేని స్థితిలో యంత్రాంగం ఉందంటే పాలన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శలు వినిపించాయి. సొంత సర్కారుపైనే టీడీపీ నేతల నిరసన ఈ కార్యక్రమంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గత రెండేళ్లుగా పదవుల్లో ఉండి పట్టణ సమస్యలను పట్టించుకోని కూటమి వార్డు కౌన్సిలర్లు, ఇప్పుడు ముందస్తు పథకం ప్రకారం కలెక్టర్ వద్దకు వచ్చి తమ ప్రభుత్వంపైనే ఫిర్యాదులు చేయడం. అధికారంలో ఉన్నప్పుడే సమస్యలు పరిష్కరించని వారు, ఇప్పుడు ప్రత్యేక అధికారి పాలనలో పనులు జరగడం లేదంటూ ప్రజల ముందు హడావుడి చేయడం విస్మయానికి గురిచేసింది. కూటమి ప్రభుత్వ శ్రేణులే తమ హయాంలో పనులు కావడం లేదని నిలదీయడం చూస్తుంటే, ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. తమాషాలు చేస్తున్నారా? కలెక్టర్ వార్నింగ్ అధికారుల అసమర్థతను గమనించిన కలెక్టర్ ప్రభాకర రెడ్డి మున్సిపల్ సిబ్బందిపై కన్నెర్ర చేశారు. మీ పని మీరు చేయడానికి కలెక్టర్ ఎందుకు? కమిషనర్ ఎందుకు? కనీసం చిన్న ప్రతిపాదనలు చేయడం కూడా చేతకాదా?‘ అంటూ సూటిగా ప్రశ్నించారు. కలెక్టర్ పేరు వాడుకుని ‘ఎక్స్ట్రాలు’ చేస్తే సహించేది లేదని, అధికారుల వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారో తనకు అన్నీ తెలుసని గుట్టు విప్పారు. చట్టం ముందు ఎవరూ సమానులు కాదని, వినయ విధేయతలు లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. ముఖ్యంగా వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో పారిశుధ్యం విషయంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, తక్షణమే పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తున్నా, స్థానిక రాజకీయ వర్గాల అండతో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పట్టణ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కమిషనర్ పావని తదితరులు పాల్గొన్నారు. -
నమ్మించి మోసం చేశాడు
● ‘పచ్చ’ పత్రిక విలేకరి చేతిలో మోసపోయానని మహిళానేత ఆవేదన ● పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం ● సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సూసైడ్ నోట్ ● కేజీహెచ్లో బాధితురాలి పరిస్థితి విషమం మెంటాడ: ‘శివ అంకుల్ నా చావుకు కారణం.. నన్ను ఒక ఏటీఎంలా వాడుకున్నాడు.. తీయని మాటలతో నమ్మించి, హోటళ్లకు తీసుకెళ్లి సర్వస్వం దోచుకున్నాడు.. 2019 నుంచి తన బాధ్యత, పిల్లల బాధ్యత చూస్తానని నమ్మించి భర్తలా కాపురం చేశాడు... ఆయన స్వార్థానికి నన్ను బలిచేశాడు.. ఆర్థికంగానూ దోచుకున్నాడు. నేను ఏ తప్పూచేయలేదు. నన్ను నీవు నమ్మితే చాలు అంటూ తన కుమారుడికి మెంటాడ మండలానికి చెందిన ఓ మహిళా నాయకు రాలు రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చివరి కోరికగా తన భర్తగా చలామణి అయిన శివకేశవనాయుడే తనకు తల కొరివి పెట్టాలని ఆ నోట్లో పేర్కొంది. విశాఖప ట్నంలో మంగళవారం వేకువజామున పురుగులు మందు సేవించిన బాధితురాలు ప్రస్తుతం విశాఖపట్నం కేజీహెచ్లో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మెంటాడకు చెందిన ‘పచ్చ’ పత్రిక విలేకరి శివకేశవనా యుడు తనను దోచుకున్న తీరు, మోసం చేసిన తీరును బాధితురాలు తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. అయితే, దీనిపై ఇప్పటివరకు స్థానికంగా ఎలాంటి కేసు నమోదుకాకపోవడం గమనార్హం. ఆ విలేకరి ఓ మంత్రికి అత్యంత ఆప్తుడు కావడమే దీనికి కారణమని స్థానికంగా చర్చ నడుస్తోంది. కేసు నమో దు విషయాన్ని మెంటాడ ఎస్ఐ కె.సీతారాము వద్ద ప్రస్తావించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. విశాఖలో జరిగిన ఘటనగా పేర్కొన్నారు. -
బిల్లులు చెల్లించినా..!
బొబ్బిలి: సాగునీరు సకాలంతో అందితేనే పంటలు పండుతాయి. రైతులు లాభపడతారు. అదే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి కృషిచేసింది. జపాన్ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ (జైకా) నిధులతో పనులు చేపట్టింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. బిల్లులు చెల్లించినా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి. పూడుకుపోయిన కాలువలు, పాడైన మదుములు, అభివృద్ధికి నోచుకోని ప్రాజెక్టులను చూసి రైతులు కన్నీరుపెడుతున్నారు. వేసవి కాలంలో పనులు జరగకపోవడంతో ఈ ఏడాది కూడా సాగునీటి తిప్పలు తప్పవంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ● ఇదీ పరిస్థితి... ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఒట్టిగెడ్డ, పెదంకలాం, వెంగళరాయసాగర్, పెద్దగెడ్డ ప్రాజెక్టుల పరిధిలో 71,063 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కాలువలు లైనింగ్ సరిగా లేక, మదుములు మరమ్మతులు, ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు జరగక దాదాపు 40 శాతం భూములకు సాగునీరు అందడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.165 కోట్ల జైకా నిధులతో పనులకు పరిపాలనామోదం వచ్చింది. పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టులకు లైనింగ్తో పాటు ప్రధాన ప్రాజెక్టు, స్పిల్వే వద్ద ఆధునీకరణ పనులు చేపట్టారు. దశలవారీగా బిల్లులు కూడా అందాయి. ముందుగా గట్ల పటిష్టతను చేశారు. అలాగే, బుష్ క్లియరెన్స్ చేసి ప్రాజెక్టుల గట్లను పటిష్టం చేశారు. ఇలా వరుసగా ఒక్కో ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తున్న సమయంలో ప్రభుత్వం మారింది. అంతే, పనులపై శ్రద్ధచూపేవారే కరువయ్యారు. వైఎస్సార్సీపీ హయాంలో బొబ్బిలి–మక్కువ మండలాల మధ్య వీఆర్ఎస్ కాలువ ఇలా (ఫైల్)24,500 ఎకరాల ఆయకట్టు ఉన్న వీఆర్ఎస్ ప్రాజెక్టుకు లైనింగ్ చేపట్టారు. రూ.8.2 కోట్ల బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించినా మిగులు పనులు పూర్తిచేయలేదు. పెదంకలాం ప్రాజెక్టు పనులకు రూ.36 లక్షల బిల్లులు చెల్లించినా కాంట్రాక్టరు పనులు చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. పెద్దగెడ్డ, ఒట్టిగెడ్డకు లక్ష్యం ప్రకారం పనులు చేయలేదని బిల్లులు కూడా చెల్లించలేదు. ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు వేసవిలో ప్రారంభిస్తేనే జూన్లో ఖరీఫ్ నాటికి చివరి ఆయకట్టుకు సాగునీరందించేందుకు వీలుంటుంది. అధికారులు మాత్రం ప్రతిసారీ పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు చెప్పడం, వారు తలూపడం వదిలేయడం మామూలైపోయింది. ఇప్పటికి రెండు సార్లు నోటీసులు ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు మరోమారు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. -
అన్నదాతతో ఆటలు..!
విజయనగరం ఫోర్ట్: అందరికీ అన్నం పెట్టే అన్నదాతలతో టీడీపీ సర్కార్ ఆటలాడుతోంది. అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమానికి పాటు పడతామని గొప్పలు చెప్పిన టీడీపీ సర్కార్ ఆ తర్వాత రైతులను గాలికి వదిలేసింది. గడిచిన రెండేళ్లుగా ఎటువంటి యంత్ర పరికరాలు టీడీపీ ప్రభుత్వం అందించలేదు. తాజాగా మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకం ద్వారా రైతులకు రాయితీపై ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు వంటి యంత్ర పరికరాలు అందిస్తామని టీడీపీ సర్కార్ ప్రకటించింది. అయితే గతంలో మాదిరి కాకుండా లాటరీ ద్వారా యంత్ర పరికరాలు కేటాయిస్తామని మెలిక పెట్టింది. లాటరీ పద్ధతిపై యంత్ర పరికరాలు కేటాయించడం అంటే రైతులను ఇబ్బంది పెట్టడమేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాటరీ వరించినా కష్టమే లాటరీలో యంత్ర పరికరం వచ్చినప్పటికీ అది అన్నదాతకు అందుతుందనే గ్యారంటీ లేదు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెత చందాన లాటరీలో వరించినప్పటికీ జిల్లా ఇన్చార్జి మంత్రి అమోదంతోనే యంత్ర పరికరాలను రైతులకు అందజేస్తారు. లాటరీ వరించిన రైతు అధికార పార్టీకి చెందిన వారు కాకపోతో పక్కన పెట్టేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ యంత్ర పరికరాల కోసం లాటరీ టీడీపీ సర్కార్ వింత ధోరణి రైతులు ఈనెల 19 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన లాటరీ వరించినా ఇన్చార్జి మంత్రి అమోదం తప్పనిసరి జిల్లాకు యంత్ర పరికరాల కోసం రూ.4.22 కోట్లు కేటాయింపు -
ప్రభుత్వం మారింది... ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు గ్రహణం పట్టింది. కాలువల లైనింగ్ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వచ్చే ఖరీఫ్లోనూ రైతులకు సాగునీటి కష్టాలు తప్పేలా లేవు. వేసవిలో పనులు చేసేందుకు అవకాశం ఉన్నా కాంట్రాక్టర్లు ముందుక
వెంకట్రాయుడిపేట వద్ద ప్రస్తుతం వీఆర్ఎస్ కాలువ దుస్థితి నోటీసులిస్తాం... జైకా నిధులతో పనులు చేయాలని కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చినా ముందుకు రావడం లేదు. మరోమారు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాం. – ఆర్.అప్పారావు, సూపరింటెండెంట్ ఇంజినీరు, ఇరిగేషన్ సర్కిల్, బొబ్బిలి సాగునీటి ప్రాజెక్టులకు ‘చంద్ర’గ్రహణం వేసవిలో పూర్తికాని కాలువల లైనింగ్ పనులు ఈ ఏడాది ఖరీఫ్లోనూ సాగునీటికి కటకటే.. ఆవేదనలో రైతాంగం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన జైకా పనులు ప్రభుత్వం మారడంతో పనులపై నిర్లక్ష్యం -
సాంకేతికతతో సమర్థంగా సేవలందించాలి
● పీటీసీలో ట్రైనీ ఎస్సైలకు ఎస్పీ సూచనవిజయనగరం క్రైమ్: సాంకేతికతను అందిపుచ్చుకుని సమర్థవంతమైన సేవలందించాలని ఎస్పీ దామోదర్ మంగళవారం అన్నారు. ఈ మేరకు స్థానిక పీటీసీలో ప్రీ ప్రమోషనల్ ఎస్సై ట్రైనింగ్ పొందుతున్న 49 మంది ఏఎస్సైల నుద్దేశించి ఎస్పీ మాట్లాడారు. పోలీసు శాఖలో ఎస్సైలుగా ఉద్యోగోన్నతి పొందేందుకు ఆరు వారాల శిక్షణ నిమిత్తం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి పోలీసు శిక్షణ కళాశాలకు విచ్చేసిన 49 మంది ఎస్సై శిక్షణార్థులతో ఎస్పీ ఏఆర్.దామోదర్ మమేకమై, భవిష్యత్తులో ఎస్సైలుగా నిర్వహించాల్సిన విధులపట్ల దిశానిర్దేశం చేశారు. పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ పి.వి.అప్పారావు ఎస్పీకి పూల మొక్కను అందజేసి, స్వాగతం పలకగా, పోలీసుల నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసుశాఖలో సుమారు 35 సం.లు పైబడి సర్వీసు పూర్తి చేసుకుని, నేడు ఎస్సైలుగా ఉద్యోగోన్నతి పొందేందుకు శిక్షణకు వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ పి.వి.అప్పారావు, డీఎస్సీ వాసుదేవ్, పలువురు సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సై, ట్రైనీ ఏఎస్సైలు పాల్గొన్నారు. -
620 మార్కులు వస్తాయని ఆశపడ్డాం
నీట్ పరీక్షలో బాగా రాశా. కీలో చూస్తే 620 మార్కులు వచ్చాయి. ఈ మార్కులు తగ్గవనుకున్నా. మా తల్లిదండ్రులు, బంధువులు ఎంతో సంతోషించారు. ఇంతలో పరీక్షను రద్దుచేశారు. హతాశయులయ్యాం. మళ్లీ ఇంత ప్రిపరేషన్ సాధ్యమా? విద్యార్థుల భవిష్యత్తుపై పిడుగు వేశారు. – బొట్ట హేమంత్, ఇందిరమ్మ కాలనీ, బొబ్బిలి ఇది సరికాదు మా కుమార్తె మాధురి తొలిసారి నీట్ పరీక్ష రాసింది. బాగానే రాయడం వల్ల కీలో కూడా మంచి మార్కులు వచ్చాయి. పరీక్ష రద్దుచేశారని తెలియగానే కుమార్తెతో పాటు తామంతా నైరాశ్యంలోకి వెళ్లిపోయాం. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని చర్యలు తీసుకోవాలి. ప్రభావం ఉన్నచోట మాత్రమే పరీక్ష రద్దు చేయాలి. – లచ్చుపతుల శ్రీనివాసరావు, విద్యార్థిని తండ్రి -
గంజాయి కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
● ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డిపార్వతీపురం రూరల్: జిల్లాలో నమోదైన గంజాయి (ఎన్డీపీఎస్) కేసుల దర్యాప్తు పురోగతిపై ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి దర్యాప్తు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన..పెండింగ్లో ఉన్న కేసులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి ఆచూకీ కనిపెట్టాలని ఎస్పీ సూచించారు. గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి జప్తు చేయాలని, పదేపదే నేరాలకు పాల్పడే వారిపై ’పిట్ ఎన్డీపీఎస్’ చట్టం కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సీజ్ చేసిన గంజాయి, వాహనాలకు సంబంధించి న్యాయస్థానాల సమక్షంలో త్వరితగతిన ఇన్వెంటరీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలు త్వరగా తెప్పించుకుని, నిర్ణీత గడువులోగా కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ’సంకల్పం 2.0, చైతన్యం 2.0, అభ్యుదయం 2.0’ పేరిట రూపొందించిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. గంజాయి వినియోగదారులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా సరఫరా మూలాలను ఛేదించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ మనీషా రెడ్డి, పాలకొండ డీఎస్పీ రాంబాబు, సీఐలు పాల్గొన్నారు. -
రక్తదానం చేసిన మహిళ
విజయనగరం ఫోర్ట్: ఆపదలో ఉన్న ఓ మహిళకు మరో మహిళ రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచింది. జామి మండలం జాగారం గ్రామానికి చెందిన అల్లు వెంకటలక్ష్మి శస్త్రచికిత్స నిమత్తం ఘోషాఆస్పత్రిలో చేరింది. ఆమెకు శస్త్రచికిత్స నిమిత్తం ‘ఒ పాజిటివ్’ రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించడంతో వారి బంధువులు ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు బి. రామకృష్ణారావును ఆశ్రయించారు. ఆయన సూచన మేరకు క్లబ్ సభ్యురాలు సాయి ఝాన్సీ మంగళవారం ప్రభుత్వ రక్తనిధి కేంద్రానికి వచ్చి రక్తదానం చేశారు. సకాలంలో స్పందించి రక్తదానం చేసినందుకు గాను ఝాన్సీని రామకృష్ణారావు, రోగి బంధువు చిన్ననాయుడు సత్కరించారు. సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్, క్యారెక్టరైజేషన్పై శిక్షణసీతంపేట: గిరిజన విద్యార్థులు సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్, క్యారెక్టరైజేషన్పై శిక్షణలో చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందన్నారు. నాల్గవ సంవత్సరం చదువుతున్న బీఎస్సీ విద్యార్థులు, ఎంఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న వారు అర్హులన్నారు. వివరాలకు వెబ్సైట్ చూడాలని సూచించారు. ప్రెజర్ కుక్కర్ పేలి మహిళకు తీవ్రగాయాలుగజపతినగరం: మండల కేంద్రంలోని కుమ్మర వీధిలో వంట చేస్తుండగా లక్ష్మి అనే మహిళ తీవ్రగాయాల పాలైంది. మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మి అనే మహిళ తన ఇంటి వద్ద గ్యాస్ పై ప్రెజర్ కుక్కర్లో వంట చేస్తుండగా ఒక్క సారిగా ప్రెజర్ కుక్కర్ పేలడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. తక్షణమే ఆమెను బంధువులు గజపతినగరం ప్రాంతీయ ఆస్పత్రికి ఆటోలో తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. మాజీ సైనికుడికి 10రోజులు జైలుశిక్ష● రూ.10,000 జరిమానా విజయనగరం క్రైమ్/లక్కవరపుకోట: ఒక మాజీ సైనికుడు మందు తాగి డ్రంకెన్ డ్రైవ్లో చిక్కినందుకుగాను కొత్తవలస జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ విజయచందర్ పది రోజులు జైలు శిక్ష, రూ.పదివేలు జరీమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. ఎల్.కోట ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మే 11న ఎల్.కోట పోలీస్ స్టేసన్ పరిధిలో గోల్డ్ స్టార్ జంక్షన్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా జమ్మాదేవి పేట గ్రామానికి చెందిన మాజీ సైనికుడు కూరిమిని శ్రీనివాసరావు మద్యం తాగి మోటారు సైకిల్ నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో మాజీ సైనికుడిపై పోలీసులు కేసు నమోదు చేసి మే 12న కొత్తవలస జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరచగా జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యంవిజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీసులు మంగళవారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లే దారిలో సీతం కాలేజీవద్ద 55 ఏళ్ల వయస్సు కలిగిన మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లు ఏఎస్సై జగన్మోహన్ రావు తెలిపారు. మృతురాలిని గుర్తించగలిగిన వారు వన్ టౌన్ స్టేషన్ లేదా కంట్రోల్ రూమ్ కు సమాచారం తెలపాలని కోరారు. -
అధికారులపై ఎమ్మెల్యే చిందులు
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ్ చంద్ర మరోసారి అధికారులపై అక్కసు వెళ్లగక్కారు. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రెండు రోజుల కిందట ‘గాడిదలు కాస్తున్నారా?’ అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించిన ఆయన.. సోమవారం కామన్ సెన్స్ లేదా? అంటూ వ్యాఖ్యలు చేయడం మరింత వివాదం అయ్యింది. అధికారులతో జిల్లాలో ఎవరికీ లేని సమస్య ఆయనకే ఎందుకు వస్తుంది? కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం మీద వరుసగా మాటల దాడి వెనుక మర్మమేమిటి? ఇప్పుడు ఇవే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. వాస్తవాలను దాచేసి.. వాస్తవానికి జిల్లా టీడీపీ కార్యాలయం స్థల వివా దం మొత్తం ఎమ్మెల్యేకు తెలుసు. అన్నీ తెలిసి కూడా కేబినెట్ భేటీలో అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేయలేదన్నది ప్రశ్న. 2002 నాటి వివాదాన్ని ఇప్పుడు తెర మీదకు తేవడం వెనుక బలమైన కారణం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొద్ది రోజులుగా ఈ అంశం నలుగుతున్నా బాధితుల తరఫున ఎవరూ సబ్ కలెక్టర్ వద్ద అప్పీలు చేయలేదు. ఈ స్థలం విషయంలో అధికారిక ఉత్తర్వులు కూడా ఎక్కడా ఇవ్వలేదు. ముందుగా ఆపే ప్రయత్నం చేయకుండా.. చివరి నిమిషంలో అధికారుల మీద నెపం నెట్టడం వెనుక మరో కారణం ఉండొచ్చని అధికారులు అంటున్నారు. తమ అక్రమాలకు అధికారులు సాయపడటం లేదన్న అక్కసుతో ఇలా నిప్పులు చెరుగుతున్నారన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొన్ని భూములకు సంబంధించి అధికారుల మీద ఆయన ఒత్తిడి చేసినట్టు సమాచారం. మున్సిపాలిటీలో రూ.80 లక్షల బిల్లుకు సంబంధించి ప్రత్యేకాధికారిగా కలెక్టర్ సంతకం కోసం డిమాండ్ చేసినట్లు ప్రచారం ఉంది. చిరుద్యోగుల తొలగింపు, మహిళా తహసీ ల్దార్పై వేధింపులకు పాల్పడడం, వాటిని కప్పిపు చ్చుకునేందుకు తిరిగి పార్టీ కార్యకర్తలతో ధర్నా చే యించడం, అక్రమాలకు సహకరించని అధికారుల పై పనిచేయడంలేదన్న ముద్రవేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బొనేల విజయ చంద్ర అధికారుల పట్ల అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు విమర్శించారు. పార్వతీపురం పట్టణంలోని సుందరయ్య భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు నిబంధనలకు లోబడి పనిచేస్తుంటే, వారిపై ఒత్తిడి తెచ్చి వ్యక్తిగత విమర్శలకు దిగడం అధికారులను బ్లాక్మెయిల్ చేయడమేనని ఆరోపించారు. పార్టీ కార్యాలయానికి భూమి కేటాయించలేదనే సాకుతో వివాదాస్పద స్థలాల వద్దకు వెళ్లి బౌండరీ రాళ్లు తొలగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం ప్రజాప్రతినిధికి తగదని హితవు పలికారు. గతంలో ప్రభుత్వ భూములను పార్టీ కార్యాలయాలకు వాడుకోవడాన్ని విమర్శించిన వారు, ఇప్పుడు అదే బాటలో నడవడం సరికాదన్నారు. పార్టీ కార్యాలయం కోసం ప్రైవేటు స్థలాలు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కా ర్యవర్గ సభ్యులు కె.రామస్వామి పాల్గొన్నారు. -
ఇచ్ఛాపురం టు హిందూపురం రథయాత్ర
● కోటి సంతకాల సేకరణ ● అక్రమ గోరవాణా అరికట్టాలి ● కలెక్టరేట్లో వినతిపత్రం అందజేతపార్వతీపురం రూరల్: జాతీయ ప్రాణిగా గోవును ప్రకటించాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ లక్ష్యంతో ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు ఆరు నెలల పాటు ’గోరక్షా రథయాత్ర’ నిర్వహిస్తున్నట్లు ధర్మో రక్షతి రక్షితః ఫౌండేషన్, దళిత సేన ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు తెలిపారు. అలాగే జిల్లాలో అక్రమ గోరవాణా, గోవధను అరికట్టేందుకు జంతు హింస నివారణ సంఘం (ఎస్పీసీఏ) ద్వారా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్పీసీఏ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి అధికారులను అప్రమత్తం చేయాలని విన్నవించారు. కమిటీలోని సభ్యుల వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించడంతో పాటు, అక్రమ గో వధశాలలపై ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియమించాలని కోరారు. పశువుల సంతల వద్ద గోవధ నిరోధక చట్టాలపై అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని విన్నవించారు. రసాయన ఉత్పత్తుల వాడకంతో ప్రజారోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బూసిం వై.వి.సత్యనారాయణ, మట్టికొయ్య పోతురాజు తదితరులు పాల్గొన్నారు. -
శ్రమ ఒకరిది..సొమ్ము మరొకరిదా?
పార్వతీపురం రూరల్: రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదల కష్టాన్ని కొందరు అక్రమార్కులు అధికారుల అండతో కాజేశారని, విచారణలో వాస్తవాలు తేలినా తమకు న్యాయం జరగలేదని బలిజిపేట మండలం పెదపెంకి గ్రామ దళిత లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ ఫిర్యాదు చేసిన అనంతరం బాధితులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు, గ్రామపెద్దలు శ్రీనివాసరావు, నగిరి పాపారావు మాట్లాడుతూ.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో జగనన్న ఇళ్లు నిర్మించుకున్న సుమారు 40 మంది దళిత కుటుంబాలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన రూ. 24.80 లక్షల ఎర్త్ వర్క్ నిధులు ఇప్పటికీ చెల్లించలేదన్నారు. అధికా రులను ప్రలోభపెట్టిన కొందరు వ్యక్తులు, లబ్ధిదారుల ప్రమేయం లేకుండానే ఆ నిధులను తమ సొంత ఖాతాలకు మళ్లించి డ్రా చేసుకున్నారని ఆరోపించారు. గతంలోనే దీనిపై ఫిర్యాదు చేయగా, విచారణ జరిపిన ఉన్నతాధికారులు బాధ్యులైన టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. అక్రమం జరిగిందని తేలి, అధికారులపై చర్యలు తీసుకున్నప్పటికీ, బాధితుల కు అందాల్సిన సొమ్ముపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే నిధులు విడుదల చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాధిత కుటుంబసభ్యులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
గడువులోగా అర్జీలు పరిష్కరించండి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశాలువిజయనగరం ఫోర్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు అందజేసిన వినతులకు గడువు లోగా పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్తో కలిసి కలెక్టర్ వినతులు స్వీకరించారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదులు రీఓపెన్ కావడానికి వీల్లేదని, ఒకవేళ అలా జరిగితే సంబంధిత అధికారి తప్పకుండా క్షేత స్థాయి పర్యటన చేసి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్కు 172 వినతులు రాగా వాటిలో రెవెన్యూశాఖకు 85, మున్సిపాల్టీ 9, జిల్లా పంచాయతీకి 17, డీఆర్డీఏ 15, విద్యుత్శాఖకు 2, గ్రామ/వార్డు సచివాలయాలకు 5, విద్యాశాఖ 6, వైద్యశాఖ 2, గృహనిర్మాణశాఖ 1, ఇతర శాఖలకు 30 వచ్చాయి. ఎస్పీ పీజీఆర్ఎస్కు 33 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యకామాన్ని ఎస్పీ తన చాంబర్లో సోమవారం నిర్వహించి మొత్తం 33 ఫిర్యాదులు స్వీకరించారు. అందులో భూతగాదాలకు సంబంధించి 7, కుటుంబ కలహాలకు సంబంధించి 6, చీటింగ్కు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించి 19 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ దామోదర్ తెలిపారు. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించి వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాల్లో వాస్తవాలను గుర్తించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సైలు రాజేష్, ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం పార్వతీపురం: ప్రజల నుంచి వచ్చిన సమస్యలను నిర్ణేత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ కె. హేమలత, ఎస్డీసీ దిలీప్ చక్రవర్తితో కలిసి కలెక్టర్ 74 వినతులు స్వీకరించారు. అర్జీల్లో రెవెన్యూకు సంబంధించి 14, 60 సాధారణ వినతులు ఉన్నాయన్నారు. ప్రతి అర్జీని సానుభూతితో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. -
జనగణనలో అగ్రస్థానం
పార్వతీపురం: జనగణనలో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. సోమవారం జనాభా గణన అవగాహన ప్రచార రథాన్ని కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ 15శాతం పూర్తయి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందన్నా రు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రజలు నాటు వైద్యానికి దూరంగా ఉండి ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, వివిధ శాఖల అధికా రులు పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ పురోగతి గర్వకారణం శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన విజ యాలు ఎంతో గర్వకారణమని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1998 మే 11న జరిగిన పో ఖ్రాన్–2 అణుపరీక్షల విజయాన్ని స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంచుకుని నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి, డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీ దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీచేయాలి
విజయనగరం టౌన్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీచేయాలని, పరిశ్రమలు స్థాపించాలని, భోగాపురం ఎయిర్ పోర్ట్లో 90శాతం ఉద్యోగాలు స్థానిక యువతకు కేటాయించాలని కలెక్టర్ను కోరుతూ సోమవారం గ్రీవెన్స్సెల్లో జిల్లా బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ, ఇప్పిలి రామారావు, బూర ఐశ్వర్యలు మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామికీకరణ చేయడానికి ఎమ్ఎస్ఎమ్ఈ పథకాన్ని తీసుకువచ్చి భూసమీకరణ చేశారని, ఆ భూములను అభివృద్ధి చేసి పారిశ్రామికీకరణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయాధారిత పరిశ్రమలైన జీడి, మామిడి, కొబ్బరి, మత్స్య, కల్లు పరిశ్రమలను అభివృద్ధి చేయాలని కోరారు. గుర్ల మండలంలోని కెల్ల గ్రామంలో 1085 ఎకరాలలో రూ.8570 కోట్లతో భారీ స్టీల్ ఫ్యాక్టరీని పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, వెంటనే స్టీల్ ప్యాక్టరీ నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు దిమిలి పైడిరాజు, లాయర్ షాజహాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక్కడే.. డబుల్ గేమ్ మొదలు
అప్పటికే ఆ స్థలంపై కన్నేసిన నియోజకవర్గ ముఖ్య నేత డబుల్ గేమ్ మొదలు పెట్టారు. కార్యాలయ నిర్మాణం కోసమని ఓ వైపు హడావుడి చేస్తూనే.. తెర వెనుక వెన్నుపోటు సిద్ధం చేశారు. కొంతమందిని రెచ్చగొట్టి, కథ నడిపించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు తేజోవతిని కార్నర్ చేశారు. ఇందుకోసం ఆమె అంటే పొసగని మరో ముఖ్య నేత సహకారం తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాల్లోనే చర్చసాగుతోంది. ఈ నెల ఏడో తేదీన స్థానికులు న్యాయస్థానం నుంచి స్టేటస్ కో ఉత్తర్వులు తెప్పించుకున్నారు. 1.61 సెంట్లు భూమిని దాదాపు 70 సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్నామని తాడ్డి మహాలక్ష్మి, రెడ్డి సీత చెబుతున్నారు. ఆ స్థలంలో హెచ్చరిక బోర్డు పాతారు. దీని అంతటి వెనుక ఆ ముఖ్యనేత ఉన్నారని తేజోవతి వర్గం బహి రంగంగానే చెబుతుండడం గమనార్హం. ఇదే విషయా న్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీని ఇరకాటంలోకి లాగడం ఎంతవరకు సమంజసమని వాదిస్తున్నారు. డబుల్ గేమ్ ఆడుతున్న ముఖ్యనే త.. తప్పంతా అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. -
రూ.10 పెంపుతో మందుబాబులపై నెలకు పడే భారం రూ.50 లక్షలు
గజపతినగరం సర్కిల్ పరిధిలోని నెలకు జరిగే మద్యం వ్యాపారం సుమారు రూ.9 కోట్ల నుంచి రూ.10కోట్లు సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లాలోని గజపతినగ రం నియోజకవర్గంలో లిక్కర్ దందా సాగుతోంది. అక్రమ వ్యాపారానికి ప్రత్యేక కౌంటర్ తెరిచారు. ఇన్నాళ్లూ నకిలీ మద్యం మాత్రమే ఉందని మందుబాబులు భావించేవారు. ఇప్పుడు గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) ఉల్లంఘనకు తెరతీయడంతో ఆందోళ న చెందుతున్నారు. లిక్కర్ షాపులను ప్రధాన వనరుగా మార్చుకున్న ‘పెద్దలు’ ఒక్కో క్వార్టర్ మీద రూ.10, బీరుపై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రీమియం క్వాలిటీ బ్రాండెడ్ మద్యం ఫుల్బాటిల్ మీద రూ.50 వరకు అదనపు భారం వేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఎండకాలం చల్లగా బీర్లు ఉండాలంటే రూ.10 ఇవ్వాలి బ్రదర్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. మంత్రి ఇలాకాలో అంతేమరి... గజపతినగరం నియోజకవర్గంలోని దత్తిరాజేరు, బొండపల్లి, గంట్యాడ, గజపతినగరం మండలాల్లో మొత్తం 17 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇవి లాటరీలో ఎవరికీ దక్కినప్పటికీ వాటిని సిండికేట్ రూపంలోకి మార్చి ఆ సిండికేటును టీడీపీ నాయకు లే నడిపిస్తున్నారు. ఎమ్మార్పీ ధరలకు అమ్ముతుంటే తమకు అనుకున్న లాభాలు రావడం లేదని... ఇలాగైతే మద్యం షాపు దక్కించుకుని ప్రయోజనం ఏముందని భావించిన వాళ్లంతా మంత్రి వద్ద తమగోడు వెళ్లబోసుకోగా... ఎమ్మార్పీ ధరలకు మించి అమ్ముకునేందుకు మంత్రితోపాటు, మాజీ ఎంపీపీ కొండబాబు కూడామద్దతు ఇచ్చినట్టు సమాచారం. దీంతో ప్రతిసీసా మీద ఎమ్మార్పీ కంటే రూ.10 అదనంగా వేసి అమ్మకాలు సాగిస్తున్నారు. దీనిపై కొందరు మందుబాబులు వాగ్వాదం చేస్తున్నా... అదనపు వడ్డన మానడం లేదు. అంతా ఓ మాజీ జెడ్పీటీసీ కనుసన్నల్లోనే... ఈ మద్యం సిండికేటు ఏర్పాటు... వారి మధ్య ఏర్పడే చిక్కులు... వాటాల పంపకం.. తదితర బాధ్యతలన్నీ ఓ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చూస్తున్నారు. పోనీ ఇంత పెద్దరికం చేస్తున్నందుకు మీ గురువుకు ఏమైనా కాణి పరకా మిగులుతుందా అంటే అబ్బే అదేం లేదు. మావాడిది అంతా పైసారాని దండాసి చాకిరీ అని ఆయన అనుచరులు సైటెర్లు వేసుకుంటున్నారు. ధరల పెంపు ద్వారా సమకూరుతున్న అదనపు ఆదాయంలో సగం నాయకుడికి... మిగతా సగం వ్యాపారులు... ఎకై ్సజ్ వాళ్లకు సర్దుబాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. మామ్మూళ్ల ‘మత్తు’... వాస్తవానికి అక్రమాలు ఎక్కడ జరిగితే అక్కడే అధికారులకు పని ఉంటుంది. అక్కడే వాళ్ల పవర్ చూపుతారు. ఇప్పుడు లిక్కర్ షాపుల వాళ్లు రేట్లు పెంచి అమ్ముతుండడంతో ఎకై ్సజ్ అధికారులు కొందరు మా సంగతి ఏమిటి? రైడ్స్ చేయాలా ఏంది అంటూ కన్నుగీటుతున్నారు. వచ్చిన పది రూపాయల్లో మంత్రి ఖాతాలోకి కొంత... సిండికేట్కు కొంత.. పోలీసులు.. ఎకై ్సజ్ వాళ్లకు కొంత ఇచ్చుకుంటూ వస్తున్నామని మద్యం వ్యాపారులే బహిరంగంగా చెబుతున్నారు. ప్రతినెలా గజపతినగరం నియోజకవర్గంలో సుమారు రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ధరలు పెంచడంతో నెలకు రూ.50లక్షల వరకు మందు బాబులపై పడుతోంది. అ‘ధన’పు వసూళ్లు అన్నీ వాటాలుగా పంచుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా అధి క ధరలకు మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – బి.శ్రీనాథుడు, అబ్కారీ శాఖ సూపరింటెండెంట్ క్వార్టర్, బీర్పై రూ.10 పెంపు గజపతినగరంలో ఎమ్మార్పీ ధరకు పాతర జిల్లాలో ఎక్కడాలేని విధంగా అదనపు వసూళ్లు పేషీకి నెలకు రూ.లక్షల్లో మామూళ్లు మందుబాబుల గగ్గోలు -
నిర్లక్ష్యపు నీడలో గ్రంథాలయాలు
● సమ్మర్ క్యాంప్ల చెల్లింపుల్లేవు ● 5నెలలుగా అందని వేతనాలు, ● చెల్లించని బిల్లులు శృంగవరపుకోట: సమాజానికి విజ్ఞానాన్ని పంచి, జ్ఞానాన్ని, సంస్కారాన్ని అందించే భాండాగారాలు గ్రంథాలయాలు. అటువంటి గ్రంథాలయాలు నేడు వేతనాలు రాక, పేపర్ బిల్లులు అందక, కరెంటు బిల్స్ కట్టలేక, అద్దెలు చెల్లించక, స్వీపర్లకు చెల్లింపులు చేయక, వాటర్బిల్లులు ఇచ్చే నాథులు లేక అవస్థలతో అల్లాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న లైబ్రరీలు, బుక్డిపోలు నిర్లక్ష్యపు నీడన కొట్టుమిట్టాడుతున్నాయి. వేతనాల్లేక లైబ్రేరియన్లు అవస్థలు పడుతున్న తరుణంలో కంటింజెన్స్ బిల్లులు రాక నిర్వహణ కోసం నీళ్లు నములుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక గ్రేడ్–1 లైబ్రరీ, 4 గ్రేడ్–2 లైబ్రరీలు, 38గ్రేడ్–3 లైబ్రరీలు, 3గ్రామ గ్రంథాలయాలు ఉన్నాయి. వాటితో పాటు 80 బీడీసీ (బుక్డిపో సెంటర్లు)లు సేవలందిస్తున్నాయి. ప్రస్తుతం ఐదు నెలలుగా ప్రభుత్వం నుంచి బిల్లులు అందక గ్రంథాలయాలు నిర్లక్ష్యపు నీడన కొట్టుమిట్టాడుతున్నాయి. ఐదు నెలలుగా అవస్థలు ప్రభుత్వం గత ఐదు నెలలుగా గ్రంథాలయాల ఊసెత్తలేదు. గత ఏడాది నిర్వహించిన సమ్మర్క్యాంప్కు చెల్లించాల్సిన రూ.15వేలు ఇంత వరకూ చెల్లించలేదు. ఈ ఏడాది సమ్మర్క్యాంప్లకు ఇంకా ఒక్క పైసా విదల్చకుండానే నిర్వహణ భారాన్ని లైబ్రేరియన్ల నెత్తిన మోపారు. ఐదు నెలలుగా ల్రైబేరియన్లకు వేతనాలు లేవు. పేపర్ బిల్లులు, విద్యుత్ బిల్లులు, అద్దెలు, స్వీపర్ల వేతనాలు, వాటర్ బిల్లులు ఏమీ చెల్లించలేదు. దీంతో వేతనాలు లేక, బిల్లులు రాక లైబ్రరీల నిర్వహణ కోసం లైబ్రేరియన్లు అవస్థలు పడుతున్నారు. అధ్వాన స్థితిలో బీడీసీలు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో సుమారు 80 బుక్ డిపో సెంటర్లు నడుస్తున్నాయి. బీడీసీల నిర్వాహకులకు నెలకు రూ.3000 చొప్పున గౌరవవేతనం, పత్రికల కోసం రూ.500లు ప్రభుత్వం చెల్లిస్తుండగా, గత ఐదు నెలలుగా బీడీసీల ఊసెత్తలేదు. దీంతో గ్రామాల్లో బీడీసీల నిర్వాహకులు దిక్కుతోచని ిస్థితిలో ఉన్నారు.ప్రయత్నం చేస్తున్నాం గత ఐదు నెలలుగా వేతనాలు, బిల్లులు చెల్లించాల్సి ఉంది. బీడీసీలకు చెల్లింపులు చేయాలి. పంచాయతీలు వసూలు చేస్తున్న లైబ్రరీ సెస్సు అందక ఇబ్బందులు ఉన్నాయి. పంచాయతీల నుంచి సెస్సు వసూలు కోసం మున్సిపాలిటీ, పంచాయతీ కార్యాలయాలకు వెళ్తున్నాం. కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళ్లాం. వీలైనంత త్వరగా చెల్లింపులు చేసే ప్రయత్నం చేస్తున్నాం. – బి.లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి -
‘పచ్చ’దళంలో.. కార్యాలయం రచ్చ!
సాక్షి, పార్వతీపురం మన్యం: తెలుగుదేశం పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా కార్యాలయం స్థలం చుట్టూ వివాదం రేగుతోంది. పార్టీలో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు మరో స్థాయికి చేరాయి. ఈ వివాదాలతోనే భవన నిర్మా ణం కోసం సోమవారం జరగాల్సిన భూమిపూజ కూడా నిలిచిపోవడం గమనార్హం. జిల్లా యంత్రాంగాన్ని ఇందులో ఇరికించే ప్రయత్నం చేయడం కొసమెరుపు. పార్వతీపురం పరిధి సుందర నారాయణపురం రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 619–1లో సుమారు 2.23 ఎకరాల విస్తీర్ణం స్థలం ఉంది. దీనిపై అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ ముఖ్యనేత కన్ను పడింది. రూ.కోట్ల విలువచేసే ఈ స్థలాన్ని తన అనుచరుల పేరిట పట్టాలు చేయించి, స్వాధీనం చేసుకోవాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి ఈ స్థలం వివాదంలో ఉంది. చాలా కాలంగా తాము సాగు చేసుకుంటున్నామని కొంత మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెవెన్యూ రికార్డుల్లో అది ప్రభుత్వ భూమిగానే ఉంది. వివాదంలో ఉన్నప్పటికీ.. సదరు నేత అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో రెవెన్యూ యంత్రాంగం నుంచి సహకారం కరువైంది. దీంతో గత పార్వతీపురం తహసీల్దార్ను ఇక్కడ నుంచి బదిలీ చేసేయాలని జిల్లా యంత్రాంగం మెడపై సదరు ముఖ్యనేత కత్తి పెట్టారు. అందులో భాగంగానే అప్పటి తహసీల్దార్ సురేష్ను సాలూరు బదిలీ చేశారు. ఇప్పటికీ ఆ స్థలం కోసం ఆయన పట్టు వీడలేదు. ప్రయత్నం ఆపలేదు. ఈ వివాదం నడుస్తుండగానే.. మరో టీడీపీ నేత కూడా అదే స్థలంపై కన్నేశారు. ఆ స్థలంలో ఉన్నవారికి కొంత మొత్తం ఇచ్చి, స్వాధీనానికి ప్రయత్నం చేశారు. అప్పటికే నియోజకవర్గ కీలక నేత స్కెచ్ ఉండడంతో సఫలీకృతం కాలేదని సమాచారం. ఇదే సమయంలో టీడీపీ అరకు పార్లమెంటు అధ్యక్షురా లు తేజోవతి.. పార్టీ జిల్లా కార్యాలయం కోసం స్థ లం ఇప్పించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు మూడు, నాలుగు చోట్ల అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను చూపించారు. అందులో సర్వే నంబర్ 619–1 స్థలం కూడా ఒకటి. ఇదే స్థలాన్ని తేజోవతి కోరుకున్నారు. వివాదాలు ఉంటే పరిష్కారం అవుతాయని ఆశించారు. కేబినె ట్ భేటీలో కూడా అంగీకారం తీసుకున్నారు. దీనిపై అధికారికంగా ఎటువంటి జీవో కూడా రాలేదు. అయినప్పటికీ, కార్యాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేసేసుకున్నారు. సోమవారం శంకుస్థాపన పెట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వివాదంలో ఉండటమే కారణమని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. -
16 కేజీల గంజాయి పట్టివేత
● జీఆర్పీ అదుపులో ఇద్దరు నిందితులువిజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వే స్టేషన్లోని నాలుగో నంబర్ ఫ్లాట్ఫామ్పై 16 కేజీల గంజాయిని జీఆర్పీ సిబ్బంది సోమవారం పట్టుకున్నారు. ఈ మేరకు కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాకు చెందిన సంజయ్ కించప్ప, చంద్రప్పలను అరెస్ట్ చేశామని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. ఆర్పీఎఫ్ ఎస్సై శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది రైల్వేస్టేషన్లో ఆకస్మికంగా తనిఖీ చేస్తుండగా ఈ ఇద్దరూ కనిపించడంతో ప్రశ్నించగా తడబడుతూ సమాధానం చెప్పారని దీంతో వారి వద్ద ఉన్న బ్యాగ్ లను తనిఖీ చేస్తే గుట్టు రట్టయిందన్నారు. ఒడిశాలోని టికిరి నుంచి శివమొగ్గకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి విశాఖ రైల్వే కోర్టుకు తరలించామన్నారు. -
తాటిచెట్టు మీద నుంచి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు
రామభద్రపురం: మండలంలోని బూసాయవలసలో సోమవారం తాటిచెట్టు మీద నుంచి పడిపోయిన ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై క్షతగాత్రుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జాగరణ వెంకటేష్ పూసపాటిరేగలోని దివిస్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు.సెలవులకు గ్రామానికి వచ్చి స్నేహితులతో కలిసి తాటికాయలు కొట్టడానికి వెళ్లి తాటిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు అక్కడి నుంచి జారిపడ్డాడు. దీంతో వెంకటేష్కు కాలు, చేయి విరిగిపోవడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. వెంటనే కుటుంబసభ్యులు ప్రథమ చికిత్స నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తీసుకువెళ్లి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ ఢీకొని తీవ్రగాయాలు తెర్లాం: మోటార్ సైకిల్ను లారీ ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తెర్లాం మండలంలోని కూనాయవలస వద్ద సోమవారం రామభద్రపురం నుంచి రాజాం వైపు వస్తున్న లారీ ఓ మోటార్ సైకిల్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ నడుపుతున్న బాడంగి మండలం వాడాడ గ్రామానికి చెందిన గొట్టాపు శ్రీనివాసరావుకు తలపై, కాలిపైన తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు తెర్లాం 108కు సమాచారం ఇవ్వడంతో వెంటనే వాహనం వచ్చి గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స చేసి బాడంగి సీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేసి మెరుగైన వైద్య సేవల కోసం విజయనగరం సర్వజన ఆస్పత్రికి రిఫర్ చేశారు. గాయపడిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై సాగర్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్సాహంగా అండర్–15 చదరంగం పోటీలు
చీపురుపల్లి: జిల్లాస్థాయి అండర్ 15 చదరంగం పోటీలు ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగాయి. చీపురుపల్లి పట్టణంలోని శ్రీనివాస జూనియర్ కళాశాలలో సోమవారం అండర్ 15 జిల్లాస్థాయి చదరంగం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి బాలబాలికలు హాజరై పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో బాలుర విభాగం నుంచి నలుగురు, బాలికల విభాగం నుంచి నలుగురు చొప్పున రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు నిర్వాహకులు ఏపీవీఎన్ఎస్. మూర్తి తెలిపారు. ఈ పోటీలకు చీఫ్ ఆర్బిటర్గా ఏడీఎన్ఎస్వీ ప్రసాద్ వ్యవహరించారు. పోటీల్లో పాల్గొన్న బాలబాలికలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది వీరే జిల్లా స్థాయిలో జరిగిన అండర్ 15 చదరంగం పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర పోటీలకు ఎనిమిది మంది ఎంపికయ్యారు. బాలుర విభాగంలో.. ఎస్వీజీ.కృష్ణ మనోహర్ (విజయనగరం) ఆర్.ప్రేమ్ కుమార్ (నెల్లిమర్ల) ఎం. ఓంకార్ (సారిక) అనురాగ్ విశ్వాస్(విజయనగరం) బాలికల విభాగంలో.. కె. నితీష (విజయనగరం) ఆర్.వెంకట మాధవి మోక్షిత (విజయనగరం) ఎ. శ్రీనిధి (చింతపల్లి పేట) కె. కోమల దీప్తి (చీపురుపల్లి) ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై న వారికి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.శంకరరావు, ఎస్సై దామోదర్ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. -
ఢిల్లీకి బత్తిలి ఒడియా విద్యార్థిని
భామిని: మండలంలోని బత్తిలి జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న గౌడో అనూష సోమవారం ఢిల్లీ పయనమైంది. రాష్ట్ర విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలో గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలు దేరారు. ఈ నెల 14న ఢిల్లీలో కేంద్ర మానవ వనరులశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే భారతీయ భాష శిబిరంలో ఒడియా భాష ప్రాముఖ్యతను వివరించనున్నట్టు హెచ్ఎం సన్యాసిరావు తెలిపారు. మన రాష్ట్రం నుంచి వివిధ భాషలకు చెందిన ఆరుగురు విద్యార్థుల్లో గౌడో అనూష ఒకరని పేర్కొన్నారు. ఆదివాసీ భాషలకు గుర్తింపు ఇచ్చే క్రమంలో కేంద్రం కోయ, కువి, కొండ, ఆదివాసీ ఒడియా, సవర, సుగాలి భాషల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న భారతీయ భాషా క్యాంపులో బాలిక మాట్లాతుందన్నారు. సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో మలేరియా, టైఫా యిడ్, వైరల్ జ్వరాలు చాపకిందనీరులా వ్యాప్తి చెందుతున్నాయి. సోమవారం మొత్తం ఓపీ 360 రాగా వారిలో 11 మలేరియా ఆర్డీ టీ కిట్లో పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. ఈ నెలలో చూస్తే ఇప్పటి వరకు 60 మలేరియా పాజిటివ్ కేసులు ఒక్క సీతంపేట ఏరియా ఆస్పత్రిలోనే నమోదు కావడం గమనార్హం. చిన్నారుల్లో కూడా మలేరియా పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఒక్క ఏరి యా ఆస్పత్రిలోనే ఇన్ని కేసులు నమోదైతే కుశి మి, దోనుబాయి, మర్రిపాడు పీహెచ్సీలతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లలో ఇంతకంటే రెండింతలు ఎక్కువగా మలేరియా పాజి టివ్ కేసులు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. లంబగూడకు చెందిన తల్లీకొడుకులు సవర సులోమి, జాను, జొనగకు చెందిన హారి ణి, హారిక, వంబరెల్లికి చెందిన సుచిత్రలతో పాటు పలువురు మలేరియా జ్వరాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఇటీవల అక్కడక్కడ చిరుజల్లులు కురవడం, దోమల సంతతి పెరగడం వంటి కారణాలతో మలేరి యా వ్యాపిస్తోంది. అలాగే మండే ఎండలకు వైరల్, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ విషయమై స్థానిక ఏరియా ఆస్పత్రి ఆర్ఎంవో డీవీ శ్రీనివాస్ వద్ద ప్రస్తావించగా జ్వరాలు వచ్చిన వారికి రక్త పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ అనంతరం వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుని పర్యటన రేపు విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ఈ నెల 12న విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటించనున్నారు. ఆ మేరకు వారి పర్యటన వివరాలను జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఇన్చార్జి డీడీ శ్రీనివాసాచారి వెల్లడించారు. -
జీడికి దక్కని మద్దతు ధర..!
గుమ్మలక్ష్మీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన రైతులు పెద్ద సంఖ్యలో జీడిమామిడి తోటలు సాగు చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 64,935 ఎకరాల్లో జీడిమామిడి సాగవుతుంది. ఒక్క కురుపాం నియోజకవర్గంలోనే 42,500 ఎకరాల్లో జీడిమామిడి సాగవుతోంది. వీటి దిగుబడులైన జీడిపిక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, సమీపంలో మార్కెట్ సదుపాయం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులను రైతులు ఆశ్రయిస్తూ మోసపోతున్నారు. మోసపోతున్నామని తెలిసినా విక్రయించక తప్పని పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు వాతావరణ పరిస్థితులు కూడా కలసిరాకపోవడంతో అనుకున్న స్థాయిలో దిగుబడులు రాకపోవడం, వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో గిరిజన రైతులు ప్రతి ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వీటి ధరను ప్రైవేటు వ్యాపారులే సిండికేట్ అయి నిర్ణయిస్తున్నారు. గిరిజన రైతులను మోసపుచ్చుతున్నారు. గడిచిన మార్చి, ఏప్రిల్ నెలలో కిలో జీడిపిక్కలు రూ.160లుగా నిర్ణయించి, ప్రస్తుతం ధర పడిపోయిందంటూ కిలో రూ.140లుగా నిర్ణయించి దోచుకుంటున్నారు. గిరిజన రైతులను దళారులు, ప్రైవేటు వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి నిలువునా దోచుకుంటున్నా... పాలకులుగాని, అధికారులుగాని పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరుగా జీడిమామిడి ఉంది. వాణిజ్య పంట అయిన జీడిమామిడికి గిట్టుబాటు ధర చెల్లించకపోవడం, గిరిజనుల పేరిట పుట్టుకొచ్చిన ఐటీడీఏ, జీసీసీలు దృష్టి పెట్టకపోవడంపై వారు ఆవేదన చెందుతున్నారు. మన్యంలో గిరిజన శాసనసభ్యులున్నా తమకు ప్రయోజనం లేకపోతుందని రైతులు వాపోతున్నారు. రూ.200 చెల్లించాలి పార్వతీపురం మన్యం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతంపేట తదితర మండలాల్లో గిరిజన రైతులు విస్తారంగా జీడిమామిడి తోటలు సాగు చేస్తున్నారు. జీడిపిక్కలకు మద్దతు ధర ప్రకటించకపోవడం, ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో నష్టపోతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మన్యంలోని గిరిజన శాసనసభ్యులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లాలని కోరుతున్నారు. జీడిమామిడి పిక్కలకు కిలో కనీస మద్దతు ధర రూ.200లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జీడి రైతులు కోరుతున్నారు. మన్యం జిల్లాలో గిరిజన రైతులు వేలకొద్ది ఎకరాల్లో ప్రధాన ఆదాయ వనరుగా జీడిమామిడి పండిస్తున్నారు. వాణిజ్య పంట అయినప్పటికీ మద్దతు ధర కల్పించడంలో.. కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఇది సాగు రైతులను తీవ్రంగా నష్టం చేస్తుంది. ప్రైవేటు వ్యాపారులకు జీడిపిక్కలను విక్రయించాల్సిన పరిస్థితులను ప్రభుత్వమే పరోక్షంగా కల్పిస్తోంది. ఇది ఎంతమాత్రం సరికాదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీడి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలి. – అడ్డాకుల చిన్నారావు, కురుపాం జీడి పిక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది. వ్యాపారులు రోజు రోజుకు ధరను తగ్గిస్తూ కొనుగోలు చేస్తున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నాం. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో వారికే అమ్ముకుంటున్నాం. – మూటక మిన్నారావు, రైతు,మూలజమ్ము గ్రామం -
పైళ్లెంది.. విషాదం మిగిలింది..
వారిద్దరూ ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్నారు. ఒకరు శనివారం విజయనగరంలో జరిగిన స్నేహితుడి పెళ్లికి వెళ్లాడు. పెళ్లి అనంతరం మళ్లీ తమ రూమ్కు వచ్చేందుకు అట్నుంచి మరో స్నేహితుడితో కలిసి బైక్పై ఇద్దరూ వస్తున్నారు. ఇంతలోనే దారి కాచిన మృత్యువు వారిని అయినాడ జంక్షన్ వద్ద కాటేసింది. స్నేహితులతో సందడిగా.. సంతోషంగా అప్పటి వరకు గడిపిన వారిద్దరూ ఇంతలోనే మృత్యువు పాలవడంతో ఇటు కుటుంబాల్లోనూ... అటు స్నేహితుల్లోనూ తీవ్ర విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళ్తే... డెంకాడ/మక్కువ/సీతానగరం: డెంకాడ మండలంలోని అయినాడ జంక్షన్ వద్ద శనివారం అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మణం చెందారు. ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ వైపు నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్ అయినాడ జంక్షన్ వద్ద చింతలవలస గ్రామం వైపు వచ్చేందుకు కుడివైపు తిరుగుతున్న క్రమంలో డీసీఎం వాహనాన్ని విజయనగరం నుంచి వస్తున్న మోటారుసైకిల్ ఢీకొంది. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న తన్నా హర్షచైతన్య(19), రెడ్డి ఉదయ్కుమార్(20) తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయారు. రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న రెడ్డి ఉదయ్కుమార్ను విజయనగరం వైపు నుంచి విశాఖ వైపు అతివేగంతో వచ్చిన కారు ముందు భాగంతో కొంత దూరం ఈడ్చుకుపోయింది. దీంతో ఉదయ్కుమార్ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన హర్షచైతన్యను చికిత్స నిమిత్తం విజయనగరం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా.. తన్నా హర్షచైతన్య చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. దీంతో చింతలవలసలోనే ఒక రూమ్ తీసుకుని ఉంటున్నాడు. శనివారం విజయనగరంలో ఓ పెళ్లికి వెళ్లిన హర్షచైతన్య తిరుగు ప్రయాణంలో స్నేహితుడు రెడ్డి ఉదయ్కుమార్తో మోటారు సైకిల్పై విజయనగరం నుంచి విశాఖ వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో అయినాడ జంక్షన్ వద్ద చింతలవలసకు వెళ్లేందుకు తిరగాలి. ఈ సమయంలో నిర్లక్ష్యంగా వస్తున్న డీసీఎం వాహనాన్ని మోటారుసైకిల్ ఢీకొంది. రెండు నిమిషాల్లో రూమ్కు చేరుకోవాల్సిన వీరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. మరణించిన హర్ణచైతన్యది మక్కువ మండలంలోని ఎ.వెంకంపేట గ్రామం. ఇదే ప్రమాదంలో మరణించిన రెడ్డి ఉదయ్కిరణ్ పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలంలోని కొత్తవలస గ్రామం. సీఆర్ రెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హనుమాన్ జయంత్యుత్సవం రేపు
విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం రామనారాయణంలో ఈ నెల 12న హనుమాన్ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు ఎన్సీఎస్ ట్రస్టీ నారాయణం శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా రామనారాయణ ప్రాంగణంలో హనుమాన్ జయంత్యుత్సవాల ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం 6 గంటలకు పంచామృత అభిషేకం, స్నపనం నిర్వహించనున్నట్టు తెలిపారు. 8 గంటలకు లక్ష తమలపాకులు, సింధూరంతో సహస్ర నామార్చనలు, హనుమాన్ చాలీసా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటలకు 60 అడుగుల అభయాంజనేయ స్వామికి మహా హారతి, లేజర్ షో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
సాగర తీరాన..సందడి..!
● ఆలివ్ రిడ్లేలకు అభయంగా విజయనగరం తీరం ● తీరం చేరిన అరుదైన తాబేళ్లు ● వందల కిలోమీటర్లు దాటి వచ్చి గూళ్లు కడుతున్న పర్యావరణ మిత్రులు ● 10 హేచరీస్ల ద్వారా 52 వేల గుడ్ల సంరక్షణ ● సముద్రంలోకి 41 వేల తాబేళ్ల పిల్లల విడుదల ● మత్స్యకారుల తోడ్పాటు.. అటవీ శాఖ అప్రమత్తత ● సంరక్షణకు అటవీ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు ● మత్స్యకారుల్లో అటవీ శాఖ అవగాహన కార్యక్రమాలు విజయనగరం గంటస్తంభం: అవి పర్యావరణ రాయబారులు.. సముద్రపు ఆరోగ్యాన్ని చాటిచెప్పే సంకేతాలు. ప్రకృతి సమతుల్యానికి ప్రతీకలైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణలో విజయనగరం జిల్లా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. సముద్ర తీరాన్ని ఆశ్రయించి సంతానోత్పత్తి కోసం వచ్చే ఈ అరుదైన తాబేళ్లను రక్షించేందుకు అటవీ శాఖ విస్తృత చర్యలు చేపట్టింది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో తీర ప్రాంతాల్లో హేచరీలు ఏర్పాటు చేసి గుడ్లను భద్రపరుస్తూ, పిల్లలుగా పొదిగిన అనంతరం తిరిగి సముద్రంలోకి విడిచిపెడుతోంది. 2025–26 సీజన్లో ఇప్పటివరకు జిల్లాలో 52 వేల తాబేళ్ల గుడ్లను సేకరించగా, వాటిలో 41 వేల పిల్లలను విజయవంతంగా సముద్రంలోకి విడుదల చేశారు. మిగిలిన గుడ్లును కూడా ప్రత్యేక సంరక్షణలో ఉంచి పిల్లలుగా మారిన వెంటనే సముద్రంలో విడిచిపెట్టేందుకు అధికారులుచర్యలు చేపడుతున్నారు. పర్యావరణ హితులైన ఆలివ్ రిడ్లేలు ఆలివ్ రిడ్లే తాబేళ్లు సముద్ర జీవ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి కనిపించే ప్రాంతాలు కాలుష్యం తక్కువగా ఉండే పర్యావరణ హిత ప్రాంతాలుగా గుర్తింపు పొందుతాయి. గుజరాత్ నుంచి ఒడిశా వరకు భారత తీర ప్రాంతాల్లో ఇవి సంచరిస్తూ సంతతి వృద్ధి కోసం ప్రశాంతమైన తీరాలను ఎంపిక చేసుకుంటాయి. అలల తీవ్రత తక్కువగా ఉండే, మానవ కదలికలు తగ్గిన ప్రాంతాల్లో గూళ్లు కట్టి ఒక్కో తల్లి తాబేలు 100 నుంచి 130 వరకు గుడ్లు పెడుతుంది. పది హేచరీస్లతో సంరక్షణ కవచం జిల్లాలోని బొడ్డుగుయ్యపేట, తిప్పలవలసల్లో రెండేసి చొప్పున, చేపలకంచేరు, ముక్కాం, చోడిపల్లిపేట, పులిగెడ్డపాలెం, బర్రిపేట, చింతపల్లి ప్రాంతాల్లో ఒక్కో హేచరీస్ ఏర్పాటు చేశారు. మొత్తం పది హేచరీల్లో ప్రస్తుతం 246 గూళ్లను భద్రపరిచి సంరక్షిస్తున్నారు. హేచరీస్ల వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి గుడ్ల సంరక్షణతో పాటు పిల్లలు బయటకు వచ్చిన వెంటనే సముద్రంలోకి విడిచిపెట్టే ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం 25 మంది సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారుల్లో అవగాహన ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణలో మత్స్యకారుల పాత్ర కీలకమని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన వేట వలలు, గ్రిల్నెట్స్, టేకు వలలు వల్ల తాబేళ్లు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో తీర గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాబేళ్లు చిక్కుకున్నప్పుడు వెంటనే సముద్రంలో వదిలేయాలని సూచిస్తున్నారు. వలల మృత్యుపాశం.. టెడ్ వాడకం అనివార్యం సముద్రంలో చేపల వేట కోసం వాడే యాంత్రిక బోట్ల వలల్లో చిక్కుకుని ఏటా వందలాది తాబేళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయి. శ్వాస తీసుకోవడానికి ఇవి పైకి రావాల్సి ఉంటుంది. కానీ వలల్లో చిక్కుకుపోవడం వల్ల ఊపిరాడక మృత్యువాత పడుతున్నాయి. దీనిని అరికట్టేందుకు టెడ్ పరికరాలను వలలకు అమర్చుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. -
మీ కోసం వెబ్సైట్లో అర్జీల నమోదు
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో(పీజీఆర్ఎస్) అర్జీల వివరాలు మీకోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ రోజు వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక సెల్లార్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అర్జీదారులు మీకోసం ఏపి.జిఓవి.ఇన్ వెబ్సైట్లో అర్జీలను నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. అర్జీల స్థితిని 1100 టోల్ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో నీటిమట్టం గణనీ యంగా తగ్గింది. వేసవి కారణంగా వర్షపాతం తక్కువగా ఉండడంతో వేగావతి, సువర్ణముఖి నదుల్లో ఇన్ఫ్లోస్ భారీగా పడిపోయాయి. దీంతో ఆదివారం ప్రాజెక్టు వద్ద 62.47 మీటర్లు లెవెల్ నమోదైంది. వాస్తవంగా ప్రాజెక్టు అసలు నీటిమట్టం 65 మీటర్లు లెవెల్ ఉండగా దాదా పు 2.47 మీటర్లు మేర నీటి నిల్వ తగ్గింది. దీంతో ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 3.37 టీఎంసీల కెసాసిటీ కలిగిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 1.33 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే నమోదైంది. ప్రాజెక్టు అధికారులు ప్రణాళిక ప్రకారం జూన్ మొదటి వారంలో ఖరీఫ్ పంటల సాగుకు నీరు విడుదల చేయాల్సి ఉంది. అలా జరగాలంటే వరుణుడు కరుణించాల్సిందేనని రైతులు చెబుతున్నారు. నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న రామారావుకు పదోన్నతి లభించింది. ఆయనను గ్రేడ్–2 ఈఓగా నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మాన్సాస్ సంస్థతో పాటు విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంలో సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించారు. రామతీర్థం దేవాలయంలో మూడేళ్ల నుంచి సీనియర్ అసిస్టెంట్ హోదాలో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఈఓగా పదోన్నతి లభించడంతో దేవస్థాన ఈఓ వై.శ్రీనివాసరావు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం ఫోర్ట్ : అంగన్వాడీ హెల్పర్లకు తీవ్రంగా నష్టం చేసే జీఓ నంబరు 5ను వెంటనే రద్దు చేయాలని వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ఆదివారం ధర్నా చేశారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబరు 5 హెల్పర్ల పదోన్నతికి నష్టం చేసే విధంగా ఉందన్నారు. జీఓ నంబరు 2 ప్రకారం జిల్లాలో అంగన్వాడీ హెల్పర్లకు వెంటనే పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా కోశాధికారి జగన్మోహనరావు, జిల్లా కార్యదర్శి వెంకటేష్, యూనియన్ నాయకులు భారతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న బోడికొండపై అభయాంజనేయస్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాష్ట్ర సాధు పరిషత్ ఆధ్వర్యంలో కొండకు దిగువ భాగంలో ఏర్పాటు చేసిన పిల్లర్పై క్రేన్ సహకారంతో ఆదివారం విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సుమారు పదమూడున్నర అడుగుల ఎత్తు, రెండు టన్నుల బరువుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. వచ్చే నెలలో విగ్రహానికి ప్రాణ ప్ర తిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తామని నిర్వాహకు లు తెలిపారు. -
పాదర్శకత ఉండాలి
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వానికి పాదర్శకత అవసరం. జిల్లాలో అనేక మంది తల్లికి వందనం పథకం లబ్ధి కోల్పోయారు. గత వైఎస్.జగన్ హయాంలో లబ్ధి పొందినవారు గత ఏడాది అర్హత పొందలేకపోయారు. యూడైస్లో తప్పుడు సమాచారం ఆన్లైన్ ద్వారా నమోదైనట్లు చెప్పిన యంత్రాగం వాటిని సరిచేసుకున్నా నగదు జమ చేయలేదు. గతంలో ముఖ్యంగా పాలకొండ పట్టణంతోపాటు నియోజకవర్గంలో అనేకులు అర్హత కోల్పోయారు. పాదర్శకంగా వివరాలు నమోదు చేయడంతో పాటు గతంలో ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉన్నవారికి ఈ ఏడాది రూ.30వేలు జమ చేయాలి. విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ -
శ్మశాన వాటిక పరిశీలన
● పరిష్కారం కాని దళితుల శ్మశాన, అసైన్డ్ భూవివాదం ● రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్న రెవెన్యూ అధికారులు ● సివిల్, క్రిమినల్ కేసులు పెడతామంటున్న రిటైర్డ్ జడ్జిజియ్యమ్మవలస రూరల్: కొన్నేళ్లుగా మండలంలోని చింతలబెలగాం గ్రామ దళితులకు సంబంధించిన శ్మశాన వాటిక, అసైనన్డ్ భూములపై వివాదం కొనసాగుతోంది. దళితుల అసైన్డ్ భూముల రెవెన్యూ ట్యాంపరింగ్, ఆన్లైన్ మార్పులు, ఆక్రమణలు శ్మశాన వాటిక ఆక్రమణ ఇలాంటి ఎన్నో విషయాలపై సామాజిక కార్యకర్త బెలగాం ప్రవీణ్ కుమార్ అనేకమార్లు ఆర్డీవో, సబ్ కలెక్టర్, కలెక్టర్లకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలూ చేపట్టని పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా విశ్రాంత న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ ఎస్ శ్యాం సుందర్ జయరాజు గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. దళితులకు జరిగిన అన్యాయంపై ఆయన విచారణ చేసి ఇదే గ్రామంలో దళిత మహిళ మృతదేహాన్ని శ్మశాన వాటికలో ఖననం చేస్తే స్థానికులు ఆ భూమిని ఆక్రమించి పాతిపెట్టిన మృతదేహాన్ని తిరిగి బయిటకు తీయించి వేరే చోటకు మార్పించిన ఘటన పోలీసులు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జరగడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వం దళితులకు కేటాయించిన అసైన్డ్ భూమిని స్థానిక రిటైర్డ్ వీఆర్ఓ తన కుమార్తె పేరున పాస్బుక్ ఎలా చేయించుకున్నారో చెప్పాలని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అందుకు సహకరించిన రెవెన్యూ అధికారులను సైతం వదిలిపెట్టేది లేదని తక్షణమే అసైన్డ్ భూమిని దళితులకు విడిచిపెట్టకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ హైకోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. మానవ హక్కుల ఉల్లంఘన కింద కేసు దళితులకు శ్మశాన వాటికకు అవసరమైన స్థలాన్ని కలెక్టర్, సబ్ కలెక్టర్ పరిశీలించి అప్పగించాలని కోరారు. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో నిజానిజాలు పరిశీలించి వారికి తగు న్యాయం చేయాలని కోరారు. కాదని స్థానిక నాయకులు అడ్డుకుంటే మానవ హక్కుల ఉల్లంఘన కింద కేసు వేస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై దళితులకు న్యాయం జరిగేందుకు పోరాడుతున్న ప్రవీణ్ను బెదిరింపు చర్యలకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముందుగా చింతల బెలగాంలో దళితుల శ్మశాన వాటికను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా దళితులు అణిచివేతకు గురవుతున్నారని, ప్రశ్నించే వారి గొంతునొక్కేస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో వారంతా ఐక్యమత్యంతో పోరాటాలు చేస్తే కానీ న్యాయం జరిగిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాను దళితుల వైపు బడుగు బలహీన వర్గాల వైపు పని చేస్తూ వారికి అన్నివేళలా తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని తెలిపారు. -
ఆ గ్రామానికి సర్టిఫికెట్ల సమస్య
రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి పొనుగుటివలస గ్రామాన్ని సర్టిఫికెట్ల సమస్య వేధిస్తోంది. విద్యాసంవత్సరం ముగిసింది. తమ పిల్లలు మరో మెట్టుపైకి వస్తున్నారని తల్లిదండ్రులు మురిసిపోతూ సచివాలయానికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకోసం వెళ్లుంటే అక్కడ చేదు అనుభవం ఎదురవుతోంది. సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న తరువాత సంతకవిటి వెళ్లాలని అక్కడ తహసీల్దార్ సంతకం చేసుకుని రాజాం తహసీల్దార్ వద్దకు వెళ్తే సర్టిఫికెట్ వస్తుందని చెబుతుండడంతో అవాక్కవుతున్నారు. గతంలో ఈ సమస్య ఎప్పుడూ రాలేదని వారితే చెప్పినా తమకు ఫలితంలేకుండా పోతోందని గ్రామస్తులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో సచివాలయంలోనే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సేవలు ప్రజల ముంగిటకే అందేవి. విద్యార్థులకు కావాల్సిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు గ్రామ/వార్డు సచివాలయాల్లోనే వెంటవెంటనే అందడం వంటి సేవలను ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సర్టిఫికెట్లు కావాలన్నా ఇబ్బందులు పడక తప్పడంలేదని ప్రజలు, విద్యార్థులు వాపోతున్నారు. కూతవేటు దూరంలో ఉన్న రాజాంలో కాకుండా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతకవిటి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోందని, అక్కడినుంచి మళ్లీ సర్టిఫికెట్లు పొందేందుకు రాజాం తహసీల్దార్ కార్యాలయానికి రాక తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సచివాలయంలోనే అందించాలని కోరుతున్నారు. ఇదీ అసలు సమస్య.. 2005 వరకు సంతకవిటి మండలంలో కొనసాగిన పొనుగుటివలస గ్రామం ప్రస్తుతం రాజాం మున్సిపాల్టీలో కొనసాగుతోంది. 2005లో రాజాం మండలంలోని రాజాం, సారథి మేజర్ పంచాయతీలతోపాటు కొత్తవలస, కొండంపేట, సంతకవిటి మండలం పొనుగుటివలస గ్రామాలను కలుపుతూ నగరపంచాయతీగా ఏర్పాటుచేశారు. అప్పటికే ఈ పంచాయతీలకు సర్పంచ్లుగా ఉన్నవారి పదవీకాలం ముగియకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో నగరపంచాయతీ (2020లో థర్డ్గ్రేడ్ మున్సిపాల్టీగా రాజాం అప్గ్రేడ్) ఏర్పడినప్పటికీ మిగతా పనులు ఎక్కడివక్కడే మిగిలిపోయాయి. దీంతో సంతకవిటి మండలంలో భాగమైన పొనుగుటివలస రెవెన్యూ, పంచాయతీ రికార్డులు నగరపంచాయతీకి అప్పగించకుండా సంతకవిటి మండలంలోనే ఉండిపోయాయి. అప్పటి నుంచి ప్రతి పనికి మున్సిపాల్టీకి వెలితే సంతకవిటి మండలానికి వెళ్లాలని, సంతకవిటి వెళ్తే నగరపంచాయతీకే వెళ్లాలని అధికారులు చెబుతుండడంతో చేసేదిలేక అటూ ఇటూ తిరుగుతూ ఏదో విధంగా గ్రామస్తులు తమ పనులను మమ అనిపిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు శాఖల విషయంలో ప్రజలకు ఎక్కువ సమస్యలు తలెత్తుతున్నాయి. రెండు మండలాల నడుమ నలుగుతున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నామంటున్న గ్రామస్తులు వైఎస్సార్సీపీ హయాంలో సచివాలయంలోనే సర్టిఫికెట్ల అందజేత సమస్య పరిష్కరించాలని గ్రామస్తుల వేడుకోలు -
రైతుసంక్షేమంలో ప్రభుత్వం విఫలం
రేగిడి: రైతులకు సంక్షేమపథకాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన రేగిడి మండలంలోని బూరాడ గ్రామం వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందకపోవడంతో రైతులు తీవ్రనష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఆరుగాలం కష్టించి పండించుకున్న మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయకపోవడంతో దళారులకు విక్రయించి రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటా ధర రూ. 2500లు మొక్కజొన్నకు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించేదని, ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు క్వింటా మొక్కజొన్నను రూ.1700లుకు విక్రయించడంతో ఎకరాకు వేలాది రూపాయలు నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న సాగునీటి వనరులను సైతం ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. మడ్డువలస ప్రధాన కుడికాలువకు అనుసంధానంగా ఉన్న పిల్లకాలువలు పూర్తిగా పాడవడంతోపా టు షట్టర్లు, తలుపులు లేకపోవడంతో పంటపొలాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఇటు రైతు, అటు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి కూట మి ప్రభుత్వం హాయిహాయి గారడీగా ప్రభుత్వాన్ని నడుపుతోందని ధ్వజమెత్తారు. ఈ ఏడాది ఖరీఫ్కు అవసరమైన వరి విత్తనాలు, ఎరువులు రైతు సేవా కేంద్రాలకు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరీఫ్కు ముందుగానే రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచేవారని గుర్తు చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
ఆలయ నిర్మాణాలపై వీహెచ్పీ ఆరా
గరుగుబిల్లి: తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాలపై విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఆరా తీశారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న నిర్మాణాలను, విగ్రహల ఏర్పాటును వీహెచ్పీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఫల్గుణరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, వీహెచ్పీ ఇతర సభ్యులు అనంత్, జిల్లా అధ్యక్షుడు చింతా భాస్కరరావు, సీతానగరం మండల అధ్యక్షుడు జి.బాలకృష్ణ తదితరులు పరిశీలించారు. తోటపల్లి ఆలయంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు స్పందించి బీజేపీ, వీహెచ్పీ చేసిన ఆందోళనల నేపథ్యంలో వారు స్పందించి ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. ఏదైతే తోటపల్లిలో స్వయం భుగా వెలసిన విగ్రహం 52 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న స్వామి వారి విగ్రహాన్ని ఆర్అండ్బీ రోడ్ స్థలంలో రేకుల షెడ్లో బంధించి ఉన్న విధానం చూసి ఆశ్చర్యపోయారు. ఆలయంలో విగ్రహాలు, నూతనంగా చేపడుతున్న నిర్మాణాలు, ఇతర వివరాలపై సిబ్బంది, అర్చకులతో మాట్లాడి ఆరా తీశారు. పుట్టు దేవుని విగ్రహాలను బయట ఉంచడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఉచిత దర్శనం లేకపోవడంతో విస్మయం వ్యక్తం చేశారు. తోటపల్లిలో జరుగుతున్న ప్రతి అంశాన్ని పరిశీలించి నోట్ చేసుకుని తగు చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు నివేదించి, ఆగమ శాస్త్రం ప్రకారం ఎండోమెంట్ వారితో స్వామివారి విగ్రహాన్ని పునఃప్రతిష్ట చేసేలా తమ వంతు కృషిచేస్తామని పేర్కొన్నారు. విగ్రహ పునఃప్రతిష్టకు చర్యలు -
కిల్లో స్వప్న పేరు వచ్చింది
నా కుమార్తె కార్తిక ప్రస్తుతం 7వ తరగతి చదువుతుంది. నా బిడ్డ తల్లి పేరు కిల్లో స్వప్న అని ఆన్లైన్లో నమోదు కావడంతో గత ఏడాది లబ్ధి కోల్పోయాం. మధ్యతరగతి కుటుంబం మాది. ఈ పథకం వర్తిస్తే పిల్ల చదువులకు ఉపయోగపడతాయి. గతంలో వచ్చిన సాంకేతిక సమస్య పరిష్కారం కోరి సచివాలయంలో అర్జీచేశాం. అటుపై ఎలిజిబుల్ లిస్టులో పేరు వచ్చిందన్నారు. త్వరలో నగదు జమ అవుతుందని చెప్పారు. ఫలితం లేకపోయింది. ఈ ఏడాదైనా పథకం వర్తింపజేయాలి. అల్లెన భావన, లబ్ధికోల్పోయిన విద్యార్థిని తల్లి, పాలకొండ -
ఎడారిలా నాగావళి
రేగిడి: మండలంలోని సంకిలి వద్ద ఉన్న నాగావళి నది నీరులేక ఎడారిని తలపిస్తోంది. వేసవి ఎండల ప్రభావంతో నదిలో గతంలో వచ్చిన కొద్దిపాటి నీరు కూడా పూర్తిగారాని పరిస్థితి ఏర్పడింది. దీంతో నదీపరీవాహక గ్రామాలైన సంకిలి, బొడ్డవలస, పుర్లి, కొమెర, వెంకటాపురం, ఖండ్యాం తదితర గ్రామాల్లో భూగర్బజలాలు అడుగంటాయి. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు తప్పవేమోనని ఆందోళన చెందుతున్నారు. బాలేరులో ఏనుగుల విధ్వంసంభామిని: మండలంలోని బాలేరులో నాలుగు ఏనుగుల గుంపు ఆదివారం విధ్వంసం సృష్టించింది. కోత దశలో ఉన్న వరిచేను పొలాల్లో తిరుగాడుతూ పంటను నాశనం వేశాయి. రైతుల పొలాల్లోని బోర్వెల్స్ పైపులను విరగ్గొట్టి వాటిలోని నీటిని తాగాయి. బాలేరుకు చెందిన ఎర్నాగుల అప్పారావు 5 హెచ్పీ బోరును పాడు చేశాయి. పొలాల్లో తిరుగాడుతూ వరి పంటను ధ్వంసం చేశాయి. ఏనుగుల ప్రయాణం మారడంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాలను లెక్కించాలని కోరుతున్నారు. న్యాయమూర్తుల గృహ సముదాయనికి భూమి పూజవిజయనగరం లీగల్: జిల్లా కేంద్ర న్యాయమూర్తుల గృహ సముదాయనికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖర్ రావు ఆదివారం భూమి పూజ నిర్వహించారు. స్థానిక వీటీ అగ్రహారంలో ఉన్న పాత జిల్లా కోర్టు ప్రాంగణంలో శిథిలావస్థలో వున్న భవన సముదాయాన్ని తొలగించి వాటి స్థానంలో కొత్త సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్లతో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత, స్థానిక న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నళితం రమేష్ కుమార్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు బెల్లాన రవి ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్లో 80 వాహనాలు సీజ్ విజయనగరం క్రైమ్: స్థానిక డబుల్ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా డ్రగ్స్ నిర్మూలన, నేరాల నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో 100 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి కాలనీలోని 120 ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. అపరిచిత, అనుమానాస్పద వ్యక్తులు, సారా, అక్రమ మద్యం నిల్వలు, మాదకద్రవ్యాలు, నాటు తుపాకులు, అక్రమ వాహనాలు ఉన్నవీ లేనివీ క్షుణ్నంగా తనిఖీ చేశారు. కొత్త వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వేలిముద్రలను ఎంఎస్సీడీ పరికరంతో తనిఖీ చేశారు. ఈ సోదాల్లో వాహన ధ్రువపత్రాలు సక్రమంగా లేని 80 వాహనాలను సీజ్ చేసి, స్టేషన్కు తరలించినట్లు విజయనగరం రెండో పట్టణ సీఐ టి.శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ రామారావు, కృష్ణమూర్తి, కనకరాజు, కానిస్టేబుళ్లు నాగమణి, సంధ్య, రజియా తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక విజయనగరం టౌన్: స్థానిక కేఎల్ పురం గురుద్వార వద్ద జై జులేలాల్ సింద్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది. అధ్యక్షుడిగా లక్ష్మీచంద్ లాల్వానీ, ఉపాధ్యక్షుడిగా శశి కుక్రేజా, కార్యదర్శిగా హరేష్ లాల్వానీ, సహాయ కార్యదర్శిగా రామ్లాల్ లాల్వానీ, కోశాధికారిగా కె.రాజేంద్ర ఎన్నికయ్యారు. -
తల్లికి వందనం ఎందరికో?
పాలకొండ రూరల్: ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఊదరగొట్టారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక తొలి ఏడాది తల్లికి వందనం పథకం అమలు ఎగ్గొట్టారు. గతేడాది జిల్లాలో వేల మంది విద్యార్థులకు ఈ పథకానికి సంబంధించి అర్హత ఉన్నా నేటికి పలురువురు తల్లుల ఖాతాల్లో లబ్ధి జమ చేయకుండా ఎగనామం పెట్టారు. ఈ నేపథ్యంలో తల్లికి వందనం డబ్బులు ఈ ఏడాది తల్లుల ఖాతాల్లో జమ కావడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్పష్టత లేదు.. కూటమి సర్కారు తల్లికి వందనం పథకం ప్రకటించిన తొలి ఏడాది 2024లో అమలుకు నోచుకోలేదు. అర్హత ఉన్నప్పటికీ గతేడాది అనేక కారణాలు చూపుతూ జిల్లాలో వందల మందికి కోత పెట్టింది. దీంతో అప్పట్లో తల్లులంతా స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అధిక విద్యుత్ బిల్లులు, నాలుగు చక్రాల వాహనాలు, లెక్కకు మించి భూములు ఉన్నాయని కారణాలు చూపించారు. అర్హత ఉన్నా లబ్ధి కోల్పోయిన వారిలో పిల్లల తల్లి స్థానంలో ‘కిల్లో స్వప్న’ అనే మహిళ పేరు అనేక మంది పిల్లలకు నమోదైంది. ఆమె పేరిట ఉన్న ఆస్తులను చూపించి పలువురికి తల్లికి వందనం నిలిపివేశారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, నమస్యలు పరిష్కరించుకోవాలని, అర్హత ఉండి లబ్ధి కోల్పోయినట్లు ఏ ఒక్కరు చూపించినా లబ్ధి చేకూరుస్తామని సంబంధిత మంత్రి చెప్పినా అంతా బూటకంగానే సాగింది. తొలివిడత జాబితాలో సొమ్ములు జమకాని విద్యార్థులకు సంబంధించి పలు సమస్యలు చెప్పారు. ఆయా సమస్యలపై సంబంధిత శాఖల నుంచి పరిష్కార పత్రాలు తీసుకుని గ్రామ, వార్డు సచివాలయ అధికారులకు తల్లులంతా అందించారు. ఈ క్రమంలో వారికి ఎలిజిబల్ లిస్టుల్లో పేర్లు వచ్చాయి అన్నారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈ ఏడాది ఇంకెన్ని కొర్రీలు పెడతారోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. సరైన వ్యవస్థ లేదు.. ప్రస్తుత సర్కారు జిల్లాలో1,584 పాఠశాలల్లో ద్వారా బోధన పొందుతున్న ప్రతి విద్యార్ధికి రూ.15వేలు అందిస్తామని నమ్మబలికింది. ఈ క్రమంలో 2025 జూన్లో 69,600 మంది తల్లులకు సంబంఽధించి లక్షా 8,951 మంది పిల్లలను అర్హులుగా ప్రకటించారు. వారిలో ఒకరికి మించి బిడ్డలున్న తల్లులు 39వేలుగా పేర్కొన్నారు. అయితే పూర్తి స్థాయిలో వారికి లబ్ధి చేకూర్చలేకపోయారు. పథకం వర్తింపులో వస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు సరైన వ్యవస్థ లేకుండా పోయింది. పాఠశాలల యాజమాన్యాలు, సచివాలయ సిబ్బంది ఆన్లైన్లో పిల్లల వివరాలు నమోదు చేయటం వరకే తమ పని అని, సమస్య పరిష్కారం కావడం తమ చేతుల్లో లేదంటూ చేతులెత్తేస్తున్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి హయాంలో ఇంట్లో ఒకరికి ఈ పథకం వర్తింప చేసినప్పుడు జిల్లాలో దాదాపు 85 వేల మందికి లబ్ధి అందించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అప్పట్లో పథకం అందలేదన్న సమస్య తలెత్తకపోవడం పారదర్శకతకు నిదర్శనం. తాజా ఏడాది 2026కి సంబంధించి 15 మండలాల పరిధిలో లక్షా 18వేల పై చిలుకు విద్యార్థులు బోధన పొందుతున్నట్లు విద్యా శాఖ పేర్కొంటోంది. వారి పూర్తి వివరాలను ఈ నెల 15 నాటికి యూడైస్లో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించడంతో పాఠశాలల యాజమాన్యాలు ఆ పనిలో నిమగ్నమయ్యాయి. లెక్క ప్రకారం ఈ ఏడాది జూన్లో అందించనున్న లబ్ధితో పాటు గతంలో అర్హత కోల్పోయి, శాంక్షన్ లిస్టులో తమ పేర్లు ఉన్నందున బకాయి మొత్తం కలిపి నగదు జమ చేయాలంటూ పలువురు తల్లులు కోరుతున్నారు. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ అందుతుందా..? లేక గతంలో మాదిరి కొర్రీలు పెడతారా అన్న అనుమానాలు నెలకొన్నాయి. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో అనే చర్చ జరుగుతోంది. గతంలో ఏర్పడ్డ లోపాలు, సాంకేతిక సమస్యలు అధిగమించి అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ లబ్ధి అందించాలని పిల్లల తల్లులు కోరుతున్నారు. గత ఏడాది వేలమందికి ఎగనామం నేటికీ కొంతమంది తల్లులకు జమకాని లబ్ధి నాడు పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం శూన్యం వచ్చే నెలలో మలివిడత తల్లికి వందన కార్యక్రమం శతశాతం అర్హులకు నిధుల జమపై తొలగని సందేహాలు ఈనెల 15 నాటికి పిల్లల వివరాల నమోదుకు ఆదేశాలు -
పెళ్లింట విషాదం
● లారీ, ఆటో ఢీకొని ఇద్దరి మృతి ● ముగ్గురికి తీవ్ర గాయాలు ● ఒకరి పరిస్ధితి విషమంజామి: పెళ్లింట బంధువులు, మిత్రులు అంతా సరదాగా గడిపారు. పెళ్లి కూడా సందడిగా జరిగిపోయింది. బంధువులు ఎవరింటికి వారు తిరిగి ప్రయాణమయ్యారు. ఇంతలోనే విషాదవార్త వినవలసి వచ్చింది. మరో పదినిమిషాల్లో స్వగ్రామం చేరుకుంటారనగా లారీ రూపంలో వారిని మృత్యువు కాటేసింది. దీంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పాచిపెంట మండలంలోని తోటవలస గ్రామంలో ఆడపిల్ల ఇంటివద్ద వివాహం జరిగింది. వివాహమైన తరువాత ఆదివారం పెండ్లి కుమారుడి తండ్రి మట్టా సన్యాసిరావు, తల్లి కనకమ్మ, వరుసకు పెళ్లి కుమార్తె చిన్నాన్న విజయనగరం మండలం చాకలిసేటకు లావేటి పైడిరాజు, పిన్ని గౌరమ్మ, బంధువులు ఆటోలో తిరిగి పెండ్లికుమారుడి స్వగ్రామం జామి మండలంలోని అన్నంరాజు పేట గ్రామానికి ఆటోలో తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో జామి మండలంలోని జన్నివలస వద్ద విశాఖ గ్రీన్ఫీల్డ్ హైవేపై పాచిపెంటనుంచి వస్తున్న ఆటోను జామి నుంచి విజయనగరం వెళ్తున్న లారీకి టైర్ పంక్చరై అదుపు తప్పి ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న పెళ్లికొడుకు తండ్రి మట్టా సన్యాసిరావు(62), అక్కడికక్కడే మృతిచెందాడు. పెళ్లికుమార్తెకు వరుసకు చిన్నాన్న లావేటి పైడిరాజు(52), పెండ్లి కుమారుడి తల్లి కనకమ్మ, బంధువులు ఒకే కుటుంబానికి చెందిన మడ్డు రాఘువ, వట్టి సాయి కుమార్ తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని 108 వాహనంలో విజయనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ లావేటి పైడిరాజు మృతిచెందాడు. కనకమ్మ పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జామి ఎస్సై వీర జనార్దన్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి జరిగిన ఘటనపై తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
50 పాఠశాలల బస్సుల తనిఖీ పూర్తి
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలోని 95 పాఠశాలల బస్సుల్లో ఫిట్నెస్, బస్సుల రికార్డులను ఇప్పటివరకు 50 బస్సులకు జిల్లా రవాణాధికారి దుర్గాప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఆదివారం తనిఖీ చేశారు. బస్సుల పనితీరు, సాంకేతిక పరిస్థితులు పరిశీలించి, మిగిలిన 45 బస్సులను కూడా త్వరలో తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బస్సులు సురక్షితంగా నడవడం లక్ష్యమని డీటీఓ తెలిపారు. బస్సులను తనిఖీ చేయించుకోకపోతే శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నట్లు పాఠశాలల యాజమాన్యాలను హెచ్చరించారు. -
హెల్మెట్ ధరించకుంటే రూ.5 వేలు జరిమానా
విజయనగరం క్రైమ్: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి, ప్రాణాలు కాపాడుకోవాలని విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు సూచించారు. నగరంలోని న్యూపూర్ణ జంక్షన్ వద్ద హెల్మెట్ వాడకంపై శనివారం అవగాహన కల్పించారు. బైక్లతో రోడ్లపైకి వచ్చేటప్పుడు హెల్మెట్, లైసెన్స్లతో పాటు వాహన ధ్రువపత్రాలు కూడా వెంట తెచ్చుకోవాలని తెలిపారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించి, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. చాలామంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరిస్తే మన ప్రాణానికే రక్ష అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. హెల్మెట్ లేకుండా తొలిసారి పట్టుబడితే వదిలేస్తామని, మరోసారి పట్టుబడితే రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఐ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో సైక్లిస్ట్..జామి: మండల కేంద్రమైన జామిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక సైక్లిస్ట్ దుర్మరణం పాలైన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. జామి గ్రామానికి చెందిన బీల అచ్చన్న(54) పొలం పని చేసుకుని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో స్థానిక వినాయక గుడి వద్ద ఎస్.కోట నుంచి విజయనగరం వైపు వస్తున్న లారీ సైక్లిస్ట్ను ఢీకొనడంతో లారీ వెనుక భాగాన టైర్లు కింద పడి దుర్మరణం పాలయ్యాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వీర జనార్ధన్ ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య కనకమ్మ, ఒక కుమార్తె ఉన్నారు. పాలకొండ రూరల్: సీతంపేట రహదారిలో పట్టణ శివారున ప్రధాన రహదారికి పక్కన ఓ వ్యక్తి మృతదేహాన్ని అక్కడి స్థానికులు గుర్తించారు. ఒంటిపై పూర్తి స్థాయి బట్టలు లేకుండా ఉండటంతో తొలిత పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంతలో అతను పట్టణంలో గల ఎన్ఎస్ఎన్ కాలనీకి చెందిన బుడ్డి(55)గా గుర్తించారు. ఈయన గత కొద్ది రోజులుగా మానసికంగా ఇబ్బందులు పడుతూ, మద్యానికి బానిసై తిరుగుతున్నట్టు తేలింది. ఈ కోవలో మరణించి ఉంటారని భావించి స్థానికులు వారి బంధువులకు సమాచారం అందించారు. వారి బంధువులు వచ్చి మృతదేహాన్ని తరలించారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. భామిని: మండలంలోని బత్తిలికి చెందిన యువకుడు కోట చంటి (29) శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. బత్తిలికి చెందిన మీసాల సమీర్తో కలిసి బుల్లెట్ బైక్పై కోట చంటి కొత్తూరు వైపు వెళ్తుండగా ఘనసర వద్ద ఏబీ రోడ్డుపై ప్రమాదానికి గురై మృతి చెందాడని బత్తిలి ఎస్ఐ కె.రవీంద్ర తెలిపారు. బైక్ డ్రైవ్ చేస్తున్న సమీర్ ఈ ప్రమాదంలో చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. బైక్పై వెళ్తున్న వీరికి ఘనసర వద్ద ఎదురుగా వ్యాన్ వచ్చింది. వ్యాన్కు దారిచ్చేందుకు బైక్ను సడన్ బ్రేక్ వేయగా చంటి తుళ్లి కిందకు పడిపోయాడు. ఈ ప్రమాదంలో చంటి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో ప్రమాద స్థలంలోనే చంటి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. బత్తిలి ఎస్ఐ రవీంద్ర కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీతానగరం: మండలంలోని కృష్ణారాయపురం గ్రామానికి చెందిన గుణుపూరు అచ్చుతరావు(26) సత్తెనపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... అచ్చుతరావు డిప్లమా ఇంజినీరింగ్ చదివి ఉద్యోగం నిమిత్తం ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో ఉపాధి చూసుకున్నాడు. హైదరాబాద్లోని బొల్లారంలో నివాసం ఉంటూ శుక్రవారం హైదరాబాద్ నుంచి మోటారుసైకిల్పై కాకినాడ వస్తుండగా సత్తెనపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన అచ్చుతరావును సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వద్ద ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు శనివారం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చేతికందొచ్చిన కొడుకు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు గంగమ్మ, భాస్కరరావు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రజిత పతకం సాధించిన రష్మిత
గరుగుబిల్లి: మండలంలోని సంతోషపురం గ్రామానికి చెందిన తిమిటి రష్మిత జాతీయ స్థాయిలో ప్రతిభ చాటింది. ఈమె ముంబయిలోని మార్వే బీచ్లో ఈ నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగిన వైఏఐ యూత్ అండ్ జూనియర్ నేషనల్ చాంపియన్షిప్ – 2026లో అండర్ – 17 విండ్ సర్ఫింగ్ విభాగంలో రజిత పతకం కై వసం చేసుకొంది. పోటీలలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటు అద్భుతమైన నౌక నైపుణ్యం, పట్టుదల, సమర్ధవంతమైన రేసింగ్ వ్యూహలను ప్రదర్శించి రష్మిత విజయం సాధించింది. రష్మిత తండ్రి శ్రీకాంత్ చతుర్వేది వృత్తి రీత్యా ఆర్మీలో ఉద్యోగం చేయడంతో ముంబయిలోనే స్థిరపడ్డారు. రష్మిత ప్రస్తుతం 9వ తరగతి చదువుతుంది. ఈమె ప్రతిభపై తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రష్మిత సాధించిన పతకం జిల్లాకే గర్వకారణమని పలువురు క్రీడాభిమానులు పేర్కొన్నారు. -
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది...
● విడుదలైన నోటిఫికేషన్ ● ఈ నెల 30 వరకు గడువుపాలకొండ రూరల్: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించేందుకు ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రవేశ ప్రకటన కొద్ది రోజుల కిందట వెలువడింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ట్రిపుల్ ఐటీలో టెన్త్ మార్కులు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఇక్కడ సీటు లభిస్తే ఇంటర్ రెండేళ్లతో పాటు సమీకృత కోర్సుగా ఇంజినీరింగ్ విద్య కూడా అందుతుంది. ఇది మరో నాలుగేళ్లు అభ్యసించాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా ఆరేళ్లు ఇక్కడే చదువుకోవచ్చు. దీంతో పలువురు ఉపాధ్యాయులు క్షేత్ర స్థాయిలో విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పలువురు ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించారు. రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా ఫలితాల్లోనే కాకుండా మార్కుల సాధనలో కూడా ముందంజలో ఉంది. ఈ క్రమంలో తమ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ట్రిపుల్ ఐటీ ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు సదరు కళాశాలలు అండగా ఉంటాయని సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ బ్రాంచ్ల్లో అవకాశం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం నేతృత్వంలో మన రాష్ట్రంలో నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్ ఐటీ కళాశాలలు ఉన్నాయి. అర్హత మేరకు విద్యార్థులు ఈ కళాశాలల్లో సీటు పొందవచ్చు. ఏటా ఒక్కో కళాశాలలో వెయ్యి మంది వంతున 4 వేల మంది విద్యార్థులకు ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థులకు తొలి రెండేళ్లు ఇంటర్తో పాటు ఇంజినీరింగ్ తరగతులు ఉచితంగా కొనసాగిస్తారు. సివిల్, సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ కోర్సుల్లో తర్ఫీదు అందిస్తారు. ఇడుపులపాయ, న్యూజివీడు క్యాంపస్ల్లో మెటీరియల్ కోర్సులతో పాటు మెటలర్జికల్, కెమికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టులు అదనంగా నిర్వహిస్తారు. చదువుల కాలంలో విద్యార్థులకు ఉచితంగా వసతి, భోజన సౌకర్యం లభిస్తుంది. అప్లోడ్ చేద్దామిలా... అర్హులైన విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్జీయుకెటి.ఇన్ (www.rjukt.in) వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉటుంది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు విద్యార్థి ఆధార్, ఫోన్ నంబర్, పదవ తరగతి మార్కుల ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 4 శాతం మార్కులు అదనంగా కలిపి అర్హుల జాబితాల్లో చేరుస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250, ఓబీసీ విద్యార్థులు రూ.400 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. జూన్ నెల 12న ఎంపికై న విద్యార్థుల జాబితా విడుదల చేయనున్నారు. అవకాశం లభించిన విద్యార్థులు జూలై 1న నిర్దేశిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. విద్యార్థులకు అవగాహన ఈ ఏడాది అధిక శాతం మంది ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించే అవకాశం జిల్లా నుంచి లభించనుంది. 15 మండలాల్లో అనేక ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు రాబెట్టారు. ఈ క్రమంలో వారు ట్రిపుల్ ఐటీలో చేరే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మా పరిధిలో ఉపాధ్యాయులు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని గ్రామాల్లో ప్రచారం చేయటంతో పాటు అర్హత గల విద్యార్థులకు ట్రిపుల్ ఐటీకి దరఖాస్తులు చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. – పర్రి కృష్ణమూర్తి, డిప్యూటీ ఈఓ, పాలకొండ -
రెండు చోట్లా ఒక్కరే...
సాక్షి ప్రతినిధి విజయనగరం: రెవెన్యూ శాఖలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. విజయనగరం నియోజకవర్గ జనాభా పెరగడంతో రెవెన్యూ సేవలు సకాలంలో అందడంలేదన్న ఉద్దేశంతో విజయనగరం రెవెన్యూ కార్యాలయాన్ని అర్బన్, మండల తహసీల్దార్ కార్యాలయాలుగా ఇటీవల విభజించారు. దీంతో ప్రజలు కూడా సంతోషించారు. ఇద్దరు అధికారులు ఉంటారని, చకచకా పనులు జరుగుతాయని, నాణ్యమైన రెవెన్యూ సేవలు అందుతాయని ఆశపడ్డారు. తీరా రెండు కార్యాలయాలకు ఒకే తహసీల్దార్ను నియమించడంతో ఉసూరుమంటున్నారు. విభజించడం వల్ల ప్రయోజనం ఏముందని నిట్టూర్చుతున్నారు. చెప్పుకునేందుకే రూరల్, అర్బన్ అంటూ రెండు తహసీల్దార్ కార్యాలయాలని, ఇద్దరు తహసీల్దార్లను నియమించాల్సిన చోట ఒక్కరినే నియమించడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ మీద గతంలో ఆరోపణలు.. ఫిర్యాదులు వెల్లువెత్తగా కొన్నాళ్లు సెలవుపై పంపేశారని, అంతా సద్దుమణిగాక మళ్లీ ఆయనను రెండు కార్యాలయాల బాధ్యతలు అప్పగించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనివెనుక అవినీతి కథ నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుడిచేత్తో అర్బన్ ఫైళ్ళు, ఎడమచేత్తో రూరల్ ఫైళ్ళు క్లియర్ చేస్తూ రెండు చేతులా ప్రజలకు సేవలు అందిస్తారంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు. -
నాటుబాంబు కలకలం
కొత్తవలస: మండలంలోఓని కంటకాపల్లి పంచాయతీ పరిధి భామసాగర్ చెరువు వద్ద శనివారం నాటుబాంబు కలకలం రేపింది. ఈ ప్రాంతంలో అడవి పందులను వేటాడేందుకు వేటగాళ్లు నాటుబాంబులను ఉపయోగిస్తుంటారు. రాత్రి సమయల్లో అడవి పందులు తిరిగే దారుల్లో వేటగాళ్లు నాటుబాంబులను అమర్చి తెల్లవారుజామున తీసేసి భద్రపరుచుకుంటారు. ఈ క్రమంలో వేటగాళ్లు నిర్లక్ష్యంగా వదిలేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే చెరువులో గత నెల ఏప్రిల్ 20వ తేదీన ఉపాధి పనులు నిర్వహిస్తుండగా నాటుబాంబు పేలి గ్రామానికి చెందిన కక్కల అప్పారావు తీవ్రంగా గాయపడగా.. మరో ఇద్దరు కూలీలు స్వల్పంగా గాయపడిన విషయం విదితమే. ఇంతలోనే మళ్లీ నాటుబాంబు కలకలం రేగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు వన్యప్రాణులను వేటాడే వేటగాళ్లపై నిఘా ఏర్పాటు చేసి జరగబోయే ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు. -
బఫర్ జోన్లోని అక్రమ కట్టడాలు కూల్చివేయండి
బొబ్బిలి: స్థానిక పట్టణంలోని బఫర్ జోన్(కోటి చెరువు, భైరిసాగరం తదితర సాగునీటి వనరుల ప్రాంతం)లో ఉన్న అకమ్ర కట్టడాలను తక్షణమే కూల్చివేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట అప్పన్న, పట్టణ అధ్యక్షుడు మునకాల శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. ఇదే విషయమై వారు మండల కేంద్రంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. బొబ్బిలి పట్టణ నలుమూలల ఉన్న ఖాళీస్థలాలు, చెరువు గర్భాలను పలువురు అక్రమార్కులు ఆక్రమించుకుంటుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కొంతమంది మున్సిపల్, రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే ప్రభుత్వ స్థలాల కబ్జా, తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు వంటివి జరుగుతున్నాయని ఆరోపించారు. ఒకప్పుడు మల్లంపేట, గొల్లపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు–55లో 80 ఎకరాలు, భైరిసాగరం మరో 80 ఎకరాలు ఉండేవన్నారు. ఇప్పుడు వాటిలో సగానికి పైగా స్థలం కబ్జాదారుల చేతిలోకి వెళ్లిపోయిందన్నారు. కబ్జారాయుళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ప్రభుత్వ స్థలాల కబ్జాను ఆపాలని కోరారు. -
ఐఏఎస్లపై ఆగ్రహం
సాక్షి, పార్వతీపురం మన్యం: రెవెన్యూ యంత్రాంగం తీరుపై అధికార పార్టీ నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. ఆక్రమణలు అడ్డుకోవడం లేదని చెబుతూనే.. ఆక్రమణదారులకు సహకరిస్తున్నారా? అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కలెక్టర్, జేసీ, సబ్ కలెక్టర్ వంటి ఐఏఎస్ అధికారులనే లక్ష్యంగా చేసుకొని మాటల దాడికి దిగడం, ఆరోపణలు గుప్పించడం ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇదే సందర్భంలో మొత్తం రెవెన్యూ వ్యవస్థనే తూలనాడటం పట్ల ఆ శాఖ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కలెక్టర్ ప్రభాకరరెడ్డికి వ్యతిరేకంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఏకమైన విషయం విదితమే. ఆయనను జిల్లా నుంచి పంపించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న ప్రచారం సాగింది. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే బాహాటంగానే కలెక్టర్, జేసీ వంటి అధికారుల పట్ల విమర్శలు చేయడం.. ఈ అనుమానాలకు మరింత బలమిచ్చినట్లు అయ్యింది. కళ్లు మూసుకున్నారా.. అంటూ ఆగ్రహం! పార్వతీపురం మండలం అడ్డాపుశీల రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 70/2 లో గల సుమారు మూడున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని బంటువానివలస గ్రామానికి చెందిన బంటు దాసు అనే వ్యక్తి ఆక్రమించి, ప్రైవేటు వ్యక్తులకు ఇటుకల తయారీకి లీజుకు ఇచ్చారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. దీనిపై రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అడ్డాపుశీల గ్రామ సమీపంలో బంటు దాసు ఆక్రమించిన స్థలంగా చెబుతున్న ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పరిశీలించారు. ఇటుకల తయారు చేసే ప్రదేశంతోపాటు.. సమీపంలో వెల్డింగ్ షాప్, ఇతర దుకాణాల వద్దకు వెళ్లి, అక్కడున్న నిర్వాహకులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 5 సంవత్సరాల నుంచి బంటు దాసు అనే వ్యక్తి ఈ స్థలాన్ని ఇటుకల తయారీకి లీజుకు ఇచ్చారని చెప్పారు. ప్రతినెలా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లీజు సొమ్మును వసూలు చేస్తున్నారన్నారు. ఒక ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తి ఆక్రమించి ఎలా లీజుకు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై సాక్షాత్తు ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్లకు తన లెటర్పై లిఖితపూర్వక ఫిర్యాదు చేశానని చెప్పారు. ఇటీవల తాను, కలెక్టర్ ఇటువైపు వచ్చిన సమయంలో ఇక్కడ ఆగి ఈ స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. దీనికి ఏమైనా అనుమతులు ఇచ్చారా? అని కలెక్టర్ను ప్రశ్నించినట్లు చెప్పారు. ఈ విషయం కలెక్టర్కు చెప్పి మూడు నెలలు అవుతుందని.. రెవెన్యూ ప్రిన్సిపల్ కార్యదర్శి జయలక్ష్మికి కూడా ఫిర్యాదు చేశానన్నారు. అసెంబ్లీ సాక్షిగా తాను చెరువుల కబ్జాపైన, ప్రభుత్వ స్థలాల ఆక్రమణపైన ప్రస్తావించానన్నారు. ప్రభుత్వ స్థలాల్లో లే అవుట్లు కూడా వేశారని.. దీనిపై ఎటువంటి చర్యలూ లేవన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ జరగని రెవెన్యూ స్థలాల ఆక్రమణలు, కబ్జాలు ఇక్కడే ఉన్నాయని, ఇది దురదృష్టకరమని అన్నారు. బంటు దాసు ఆక్రమించిన ప్రభుత్వ స్థలం విషయంపై అనేకసార్లు రెవెన్యూ అధికారులకు తెలియజేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రెవెన్యూ యంత్రాంగం వరకు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా ప్రతిరోజూ ఒక రెవెన్యూ సమస్యపై రెవెన్యూ యంత్రాంగానికి తెలియజేస్తూనే ఉన్నానని, ఆక్రమణ గురైన స్థలం రెవెన్యూ రికార్డులో ఉందని చెప్పినా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. బంటు దాసు అనే వ్యక్తి సీపీఎం ముసుగులో ఉన్నారని విమర్శించారు. కలెక్టర్, జేసీ, సబ్ కలెక్టర్లు దాసును చూసి భయపడ్డారా? లేక గత వైఎస్సార్సీపీని చూసి భయపడుతున్నారా? అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల సమయం.. అల్టిమేటం రెండు రోజులు సమయం ఇస్తున్నామని.. జిల్లా అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ అధికారులు దీన్ని ప్రభుత్వ స్థలంగా పరిగణనలోకి తీసుకోవాలని, లేకుంటే తానే స్వయంగా బోర్డు వేయించాల్సి వస్తుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రతినెలా ప్రభుత్వ స్థలంపై ఒక ప్రైవేటు వ్యక్తి రూ.వేలకు వేలు లీజు వసూలు చేస్తుంటే రెవెన్యూ యంత్రాంగం కళ్లు మూసుకొని వ్యవహరించడం సరైన పద్ధతి కాదని, దీనిపై రెవెన్యూ జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూస్తానని అన్నారు. ఇదే బంటు దాసుకు చెందిన స్థలంలో రెవెన్యూ, పోలీసు అధికారులను తీసుకుని వెళ్లి, ఆక్రమణ స్థలం అంటూ ఎమ్మెల్యే స్వయంగా అక్కడున్న ప్రహరీని కూల్చివేయడం గమనార్హం. జిల్లా కలెక్టర్ ప్రభాకరరెడ్డి పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెచ్చుకుంటున్నారు. ముస్తాబు, రెవెన్యూ క్లినిక్ వంటి వాటిని ప్రశంసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించారు. ముస్తాబు కార్యక్రమానికి మెంటార్గా జిల్లా కలెక్టర్ను నియమించారు. స్వయంగా కలెక్టర్ల సదస్సులోనే ప్రభాకరరెడ్డి పనితీరు పట్ల సీఎం ప్రశంసిస్తుంటే... జిల్లాలో అందుకు విరుద్ధంగా నిందలు వేయడంపై ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
స్కూల్ మైదానం ఆక్రమణపై నిరసన
రాజాం: మున్సిపాల్టీ పరిధి వస్త్రపురి కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థలాన్ని రాజాం మండలం నర్సింహపురం గ్రామానికి చెందిన పి.వెంటరమణ అనే వ్యక్తి ఆక్రమిస్తున్నాడంటూ స్థానికులు శనివారం పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. అనంతరం ప్రధాన రహదారిపై ర్యాలీ చేపట్టారు. సర్వే నంబరు 59లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 196 అడుగుల వెడల్పు, 216అడుగుల పొడవుల విస్తీర్ణంపై మైదానం ఉందని తెలిపారు. ఈ మైదానాన్ని ఎటువంటి హక్కులు లేకుండా వెంకటరమణ ఆక్రమణ చేస్తూ, ప్రహరీ నిర్మించాడని గ్రామస్తులు ఆరోపించారు. కమలనాయుడు ఆధ్వర్యంలో వంద మందికి పైగా కాలనీ వాసులు ఆక్రమణలపై మండిపడ్డారు. తహసీల్దార్, ఎంఈఓకు ఫిర్యాదు చేశామని, సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేయనున్నామని వెల్లడించారు. ఆక్రమణలు తొలగించడంతో పాటు ఆక్రమణదారుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఈఓ దర్యాప్తు వస్త్రపురి కాలనీలో ప్రభుత్వ పాఠశాల ఆక్రమణలపై ఎంఈఓ యాగాటి దుర్గారావు దర్యాప్తు ప్రారంభించారు. ఉన్నతాధికారులు నుంచి వచ్చిన ఆదేశాలతో పాఠశాల మైదానాన్ని పరిశీలించారు. 5 నుంచి ఆరు అడుగుల వెడల్పు మేర పాఠశాల మైదానంలోకి ఆక్రమణదారుడు వచ్చినట్టుగా గుర్తించారు. పాఠశాల హెచ్ఎం రాజుతో పాటు తహసీల్దార్కు ఆక్రమణలు తొలగించాలని ఫిర్యాదు చేశారు. కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్టు ఎంఈఓ తెలిపారు. -
కుక్కల దాడిలో గొర్రె, మేక పిల్లల మృతి
సంతకవిటి: మండలంలోని కృష్ణంవలస గ్రామంలో వంకల పాపయ్యకు చెందిన నాలుగు గొర్రె పిల్లలు, రెండు మేక పిల్లలు కుక్కల దాడిలో శనివారం మృతి చెందాయి. పాపయ్య మధ్యాహ్న సమయంలో గొర్రె, మేక పిల్లలను పాకలో పెట్టి, ఇంటికి భోజనానికి రాగా ఇంతలో కుక్కలు చొరబడి వాటిపై దాడి చేసి చంపేశాయి. దీనితో పాపయ్య బోరున విలపించారు. వీటి విలువ దాదాపు రూ.30 వేలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, కుక్కలను గ్రామం నుంచి బయటకు పంపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కుక్కల బెడదతో చిన్నారులను ఇంటి నుంచి బయటకు పంపించాలంటే భయంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. సహస్ర నామార్చనలు బొబ్బిలి: స్థానిక పట్టణంలోని కంచర వీధిలో కొలువైన కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సహస్రనామార్చనలు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
డీఎఫ్ఓగా సోమసుందరం
విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా అటవీశాఖ అధికారిగా (డీఎఫ్ఓ) ఎం.సోమసుందరం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు డీఎఫ్ఓగా పనిచేసిన రెడ్డి కొండలరావుకు ఐఎఫ్ఎస్ అధికారిగా ఉద్యోగోన్నతి లభించడంతో రాజమండ్రికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సోమసుందరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అటవీ సంరక్షణలో సమర్ధవంతంగా సేవలందిస్తానని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి చీపురుపల్లిరూరల్(గరివిడి): రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని వైఎస్సార్సీపీ నాయకులకు శాసనమండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ సూచించారు. గరివిడిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో శనివారం మాట్లాడారు. గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుపై ఆరా తీశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేద్దామన్నారు. కార్యక్రమంలో ఆయన కుమార్తె బొత్స అనూష, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, పార్టీ గరివిడి మండలాధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు ఎలకల అప్పలనాయుడు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ● ఎండి‘నది’ వేగావతి నదిలో చుక్కనీరు లేదు. వేసవి ఎండలకు నది పూర్తిగా ఎండిపోయింది. అక్కడక్కడ చిన్నచిన్న నీటిపాయలు, ఊటలే కనిపిస్తున్నాయి. వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున నదిలో నీరు ప్రవహించే పరిస్థితి లేదు..పశుపక్ష్యాదులు సైతం దాహార్తి తీర్చుకునేందుకు అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే నది బొబ్బిలి, బాడంగి, తెర్లాం మండలాల మీదుగా ప్రవహిస్తుండగా ఇప్పుడు నదిలో నీరు లేకపోవడంతో సాగునీటి కొరత కూడా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి మండలంలోని కునుకువానివలస వద్ద పూర్తిగా ఎండిపోయిన నదిని చిత్రంలో చూడొచ్చు. – బొబ్బిలి -
సూత్రధారులకు లైన్ క్లియర్?
నిడగల్లు సా మిల్లు వద్ద అడారు ఎంపీపీ పాఠశాలలో నరికిన టేకుచెట్లు (ఫైల్) సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మండలం అడారు ఎంపీపీ పాఠశాలలో రూ.లక్షల విలువైన టేకు చెట్లను ‘తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు’ అక్రమంగా తరలించుకుపోయిన విషయం విదితమే. అధికార పార్టీ కీలక నేతల ప్రమేయం ఉండడంతో వాస్తవానికి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నమే జరిగింది. దీనిపై పత్రికల్లో కథనాలు రావడం.. అటవీ శాఖ, విద్యాశాఖ తప్పిదాలు ఉండడంతో ఉప ముఖ్యమంత్రి పేషీ నుంచి ఆరా తీసినట్లు తెలిసింది. ఆ క్రమంలోనే జిల్లా అటవీ శాఖ అధికారులు ఆలస్యంగా స్పందించారు. సీతానగరం మండలం నిడగల్లు వద్ద సా మిల్లులో ఉన్న టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నా రు. మిల్లు సీజ్తో సరిపెట్టుకున్నారు. మరోవైపు కలప అక్రమ తరలింపులో అసలు నిందితులను ఇప్పటి వరకూ గుర్తించలేదు. పాఠశాల హెచ్ఎం స్వ యంగా ఫిర్యాదు చేసి నా పోలీసుల నుంచి కూడా స్పందన లే దు. కేసును నీరుగార్చే క్రమంలో ఆ దుంగ లు.. పాఠశాలలో తొలగించిన చెట్లు ఒక్కటి కాదనే విషయాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నార ని తెలుస్తోంది. ఇదే సమయంలో ‘అన్న’కు తెలియకుండానే ‘తమ్ముళ్లు’ అత్యుత్సాహంతో తెలియక తప్పు చేశారన్న కొత్త వాదనను వినిపిస్తున్నారు. ఏళ్ల కిందటనాటి చెట్లు కావడంతో నామమాత్రపు రుసుంతో ఎంఈవోకు దరఖాస్తు చేసుకుంటే.. అక్కడ పరిస్థితిని బట్టి అట వీ శాఖ అనుమతితో వారే తొలగింపునకు అనుమ తి ఇచ్చేవారని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. తమను ఎవరు ఆపేదన్న అతితో ‘తమ్ముళ్లు’ దర్జాగా చెట్లను నరికి తీసుకుపోయారు. చివరికి అది వివాదం కావడంతో బురద అంటకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని కడుగుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సూత్రధారులను పక్కన పెట్టి.. సంబంధం లేని పాత్రధారులను బలి పశువులు చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
గజపతినగరం రూరల్: మండలంలోని గుడివాడ గ్రామ సమీపంలో రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు శుక్రవారం అందించిన వివరాలు... పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన పల్ల అప్పలనాయుడు(25) ఈ నెల ఆరో తేదీ రాత్రి 8.40 గంటల సమయంలో రైల్వే టికెట్ తీసుకొని భవానిపట్నం పాసింజర్లో సింహాచలం నుంచి పార్వతీపురం ప్రయాణం చేస్తుండగా గజపతినగరం – కోమటిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మండలంలోని గుడివాడ గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. దీంతో అప్పలనాయుడు తీవ్రంగా గాయపడి అక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బొబ్బిలి జీఆర్పీ హెచ్సీ బండారు ఈశ్వరరావు తెలిపారు. -
గిరిజన సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత
పార్వతీపురం: గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఐటీడీఏ పీఓ ఆర్.వైశాలి అన్నారు. శుక్రవారం ఐటీడీఏలోని గిరిమిత్ర హాల్లో నిర్వహించిన గిరిజన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 19 వినతులను స్వీకరించి, సంబంధిత శాఖాధికారులతో వెంటనే పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ వినతిని బాధ్యతాయుతంగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సేవలు సమయానికి అందేలా చర్యలు కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఓ పి.మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలపై ఓ కన్నేయండి..!
పిల్లలతో స్నేహితుల్లా ఉండాలి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు...? ఎవరితో తిరుగుతున్నారు..? ఏమి చూసున్నారు..? అన్నది తల్లిదండ్రులు గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. భయపెట్టకుండా ప్రేమగా మాట్లాడితే పిల్లలు తమ విషయాలు చెప్పుకుంటారని చెబుతున్నారు. సెలవుల సమయంలో పిల్లల కోసం తల్లిదండ్రులు సమయం కేటాయించాలి. స్నేహితుల్లా మాట్లాడితేనే వారు సరైన మార్గంలో నడుస్తారు. పిల్లలను ఒంటరిగా వదిలేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. – వై.సతీష్కుమార్, కెమిస్ట్రీ లెక్చరర్, మానసిక వికాస నిపుణులు, విజయనగరం విజయనగరం గంటస్తంభం: వేసవి సెలవులొచ్చాయంటే పిల్లలకి పండగే. పుస్తకాల భారముండదు.. ఉదయం లేచిందే మొదలు ఆటలు.. మధ్యాహ్నం మొబైల్.. సాయంత్రం స్నేహితుల వెంట ఊరు చుట్టేయడం. కానీ అదే ఆనందం కొన్ని కుటుంబాల్లో కన్నీళ్లు మిగులుస్తోందని పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సెలవులు మొదలైనప్పటి నుంచి పిల్లలపై ప్రత్యేక నిఘా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ మోజు... మెల్లగా మింగేస్తోంది డిజిటల్ కాలంలో చిన్నారులు మొబైల్ ఫోన్లకే పరిమితమవుతున్నారు. ఉదయం లేవగానే ఫోన్.. రాత్రి పడుకునే వరకు గేమ్స్, రీల్స్, సోషల్ మీడియాతో గడుపుతున్నారు. బయట ఆటలు తగ్గిపోవడంతో పాటు చదువుపై ఆసక్తి కూడా తగ్గుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొంత మంది పిల్లలు అనవసర యాప్లు, చెడు స్నేహాల ప్రభావానికి లోనవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. చెడు సావాసాలు జీవితాలను నాశనం చేసేస్తున్నాయి.. సెలవుల సమయంలో పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు మైనర్లు గంజాయి, సిగరెట్, ఇతర మత్తు పదార్ధాల వైపు ఆకర్షితులవుతున్నారని సమాచారం. సరదాగా మొదలైన అలవాటు తర్వాత కుటుంబాలకు తీరని బాధను మిగులుస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులూ.. బిడ్డలూ పదిలం.. సుమీ! మృత్యువుతో చెలగాటమొద్దు ఆటల మాటున ఆపదలు ఆన్లైన్లో మునిగితే భవిష్యత్తుకే ముప్పు చెరువులు, రోడ్లు, మొబైళ్లతో పెరుగుతున్న ప్రమాదాలు సరదా.. వ్యవనం కాకముందే మేల్కొనండి మత్తు పదార్ధాలు, డిజటల్ బానిసత్వంపై నిఘా ఉంచండి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక -
బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి
విజయనగరం క్రైమ్: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో శుక్రవారం బస్సు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. వన్టౌన్ ఎస్ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం మండలం రాకోడుకు చెందిన బోదంకి నారాయణమ్మ(76) బస్సు కోసం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కు వచ్చింది. ఆ సమయంలో బస్టాండ్లో డ్రైవర్ లక్ష్మునాయుడు బస్సు తీసే క్రమంలో వెనుకాలే ఉన్న నారాయణమ్మను ఢీకొట్టింది. దీంతో ఆమె పడిపోయింది. ఆమె పైనుంచి బస్సు వెళ్లిపోయింది. దీంతో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. సమీపంలో ట్రాఫిక్ అవుట్పోస్టులో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హెచ్.పాల్ ప్రమాద సమాచారాన్ని మ్యాన్ ప్యాక్ ద్వారా వన్టౌన్ పోలీసులకు ఇచ్చాడు. వన్ టౌన్ ఎస్ఐ రవి ప్రమాద స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి మనవడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం ఐటీడీఏలో గిరిజన సంక్షేమ శాఖ డీడీగా పనిచేస్తున్న విజయశాంతి ఇక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. సెలవుపై వెళ్తు న్న ఆమె.. తిరిగి వచ్చేందుకు ఇష్టం చూపడం లేదని తెలుస్తోంది. తన డిప్యుటేషన్ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు కోరనున్నట్లు సమాచారం. ఐటీడీఏలో కొన్నాళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధం నేపథ్యంలో ఇక్కడ ఇమడలేక, ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఐటీడీఏలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులుగా విజయశాంతి కొన్నాళ్ల కిందట డిప్యుటేషన్పై పూర్తి అదనపు బాధ్యతలతో ఇక్కడకు వచ్చిన విషయం విదితమే. కొద్దిరోజుల పాటు అంతా సజావుగా సాగినా.. ఆమెను ఇక్కడ కొనసాగించడం ఇష్టం లేక, కొంతమంది తెర వెనుక పావులు కదుపుతూ వస్తున్నారు. తమకున్న రాజకీయ పలుకుబడితో ఆ స్థానంలోకి వచ్చేందుకు కొందరు ఏటీడబ్ల్యూవోలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పాలనాపరంగా డీడీకి సహకారం కూడా అందించడం లేదని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. శాఖలో ఓ వార్డెన్తో డీడీకి వ్యతిరేకంగా అప్పటి ఇన్చార్జి పీఓ యశ్వంత్కుమార్రెడ్డికి ఫిర్యాదు చేయించారు. పీఓ పేరు చెప్పి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ అప్పట్లో యశ్వంత్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ఆయనను కూడా ఐటీడీఏలోని కొంతమంది తప్పుదోవ పట్టించారని గిరిజన సంఘాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో వార్డెన్ ఏ అంశం మీద ఫిర్యాదు ఇచ్చారన్నది ఏ ఒక్కరూ బయట పెట్టలేదు. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగులతో సమావేశమైన అప్పటి పీఓ.. శాఖలో ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ విభాగాల్లో పలువురు ఉద్యోగుల స్థానాలను మార్పు చేశారు. కొత్తగా విభాగానికి సంబంధం లేని ఉద్యోగులను తమకు అప్పగించడం వల్ల పరిపాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన డీడీ.. ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు విముఖత చూపారు. దీంతో ఆమెకు అప్పటి పీఓ షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతరం పీఓగా ఆర్.వైశాలి బాధ్యతలు స్వీకరించడంతో ఉద్యోగుల స్థానచలనం వివాదం సద్దుమణిగిందనే అంతా భావించారు. అనూహ్యంగా ఈ విషయాన్ని పీఓ వైశాలి మళ్లీ తెరపైకి తెచ్చారు. -
అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని దొరజమ్ము ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎన్.ఆశ్రయ్య (14) విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పాములగీసాడ గ్రామానికి చెందిన ఆశ్రయ్యకు గురువారం కడుపునొప్పి వచ్చింది. తల్లిదండ్రులు వెంటనే రేగిడి పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ తగ్గక పోవడంతో కురుపాం సీహెచ్సీకి, అక్కడి నుంచి పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి, మరింత మెరుగైన వైద్యంకోసం విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించినా ఫలితం లేకపోయింది. విద్యార్థి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కావడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారని ఏటీడబ్ల్యూఓ ఎల్.రజని తెలిపారు. అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుపెడుతున్నారు. జియ్యమ్మవలస రూరల్: ఇప్పటికే గాలివానల కు సుమారు 165 ఎకరాలకు పైబడి అరటి పంట నష్టం వాటిల్లిన కుదమ రైతులకు ఏనుగులు గుంపురాకతో బెంగపట్టుకుంది. ఉన్నకాస్త అర టి పంటను నష్ట పరుస్తాయని ఆందోళన చెందుతున్నారు. గజరాజులను శాశ్వతంగా తరలింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలి ● రెడ్క్రాస్ చైర్మన్ ప్రసాదరావు విజయనగరం ఫోర్ట్: ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రసాదరావు కోరారు. రెడ్క్రాస్ సొసైటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీతం ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో రెడ్క్రాస్ సొసైటీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదాతలను అభినందించారు. కార్యక్రమంలో సీతం కళాశాల డైరెక్టర్ మజ్జి శశిభూషణరావు, ఎన్సీపీ కెప్టెన్ సత్యవేణి, ఎన్సీసీ లెఫ్ట్నెంట్ ఉదయ్కిరణ్, డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. విజయనగరం: విజయనగరం జిల్లా స్థాయి అండర్–13 చెస్ పోటీల్లో చిన్నారులు తమ మేధస్సుకు పదునుపెట్టారు. ఎత్తుకు పై ఎత్తులు వేసి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. విజయనగరం చెస్ అకాడమీలో శుక్రవారం జరిగిన ఎంపిక పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓపెన్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన శ్రీమన్, నారాయణ సాహూ, అమండు, జిగ్నేష్, బాలికల విభాగంలో ఎజ్జురోతు పరిణిత, భావన రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఎంపిక ప్రక్రియకు కె.వి.జ్వాలాముఖి, ఎ.హేమబిందు, ఆసిఫ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. -
వైభవంగా సహస్ర దీపాలంకరణ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం రాత్రి కనులపండువగా జరిపించారు. వెండి మంటపంలో ఉన్న సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను మంగళవాయిధ్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి, దీపారాధన మంటపంలో ఉన్న ప్రత్యేక ఊయలలో ఉంచారు. అనంతరం దీపాలను వెలిగించి, స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు, దేవస్థాన సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నీలో.. సత్తా చాటిన విజయనగరం విజయనగరం గంటస్తంభం: అనంతపురంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్ధాయి శాప్ కప్ అండర్–25 పుట్బాల్ టోర్నమెంట్లో విజయనగరం జిల్లా జట్టు ఘన విజయం సాధించింది. ఫైనల్లో విశాఖపట్నం జిల్లా జట్టుపై 4–1 గోల్స్ తేడాతో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా జిల్లా ఫుట్బాల్ జట్టును మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.రజనీకుమార్, కార్యదర్మి వి.మహాలక్ష్మిరావు, తదితరులు పాల్గొన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
● కొమరాడలో కనురెప్పపాటులో ఘోర రోడ్డు ప్రమాదం ● అదుపు తప్పి కూరగాయల దుకాణంలోని దూసుకెళ్లిన బొలేరో ● ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు కొమరాడ: రోడ్డు పక్కన ఉన్న టీ దుకాణంలో టీ తాగుతూ ముచ్చట్లు చెబుతున్న ఓ వృద్ధుడిపై మృత్యువు దూసుకొచ్చింది. బొలేరో వాహనం రూపంలో కనురెప్పవేసిన పాటులో ప్రాణాలను హరించింది. వ్యవసాయ పనులపై వెళ్తూ ఆగిన మరో ఇద్దరు.. కూరగాయలు విక్రయిస్తున్న మరో మహిళను క్షతగాత్రులుగా మార్చింది. దుకాణాలపైకి దూసుకొచ్చిన బొలేరోవాహనాన్ని చూసిన స్థానికులు భీతిల్లిపోయారు. భయంతో పరుగులు తీశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పార్వతీపురం నుంచి రాయగడ వైపు అతివేగంగా వెళ్తున్న బొలేరో వాహనం శుక్రవారం మధ్యాహ్నం అదుపుతప్పి కొమరాడ మండల కేంద్రంలోని రోడ్డుపక్కన ఉన్న దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో టీ తాగేందుకు వచ్చిన కొమరాడ గ్రామానికి చెందిన మరడాన చిన్నంనాయుడు(75) దుర్మరణం చెందారు. పొరుగు జిల్లా నుంచి వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగిస్తున్న ముద్దురు గోపాల్కృష్ణ, కూనేరు రామభభద్రపురం గ్రామానికి చెందిన మోయి జాషువ, అక్కడే కూరగాయల దుకాణం నిర్వహిస్తున్న బొత్స మహలక్ష్మి గాయపడ్డారు. వీరిని వైద్యం కోసం కొమరాడ పీహెచ్సీకి తరలించారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కొమరాడ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
ఇదే మంచి తరుణం
ధ్రువపత్రాలు పొందేందుకు..రామభద్రపురం: ఇటీవల పదో తరగతి, ఇంటర్ తదితర తరగతుల పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ట్రిపుల్ ఐటీ, ఇంజినీరింగ్, వైద్య తదితర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు విద్యార్హత పత్రాలతో పాటు ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో ధ్రువపత్రాలు పొందేందుకు ఇదే మంచి తరుణం. వేల సంఖ్యల్లో ఉన్న విద్యార్థులకు ఒకేసారి ధ్రువపత్రాలు జారీ చేయడం అధికారులకు కష్టతరమవుతోంది. ముందుగా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు పరిశీలించి జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. నమోదు చేసుకోవడం ఇలా.. కులం, ఆదాయ, నివాస ద్రువీకరణ పత్రాల కోసం స్వర్ణ, గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థితో పాటు తల్లిదండ్రుల ఆధార్, కుటుంబ సభ్యులున్న రేషన్ కార్డు ఇతర పత్రాలతో దరఖాస్తు జత చేయాలి. స్వర్ణ, గ్రామ సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు ఇంటర్నెట్లో నమోదు చేసి సంబంధిత వీఆర్ఓలు పరిశీలించి దరఖాస్తుకు సంబంధించి రిపోర్ట్ రాసి ఆర్ఐకు పంపుతారు. ఆర్ఐ పరిశీలించి తహసీల్దార్కు పంపగా అన్ని పత్రాలు పరిశీలించి సక్రమంగా ఉంటే డిజిటల్ సంతకం మండల తహసీల్దార్ చేస్తారు. సంబంధిత విద్యార్థి సెల్ఫోన్కు మెసేజ్ వస్తుంది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న కేంద్రాలకు వెళ్లి ఆయా ధ్రువపత్రాలు తీసుకోవచ్చు. సర్వేల్లో సచివాలయ సిబ్బంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలలోని సిబ్బందిపై పనిభారం పెరిగింది. వలంటీర్లు లేకపోవడంతో పింఛన్ల పంపిణీతో పాటు రకరకాల సర్వేలు వారితో చేయిస్తోంది. జాబ్ చార్ట్కు విరుద్ధంగా వారికి సంబంధించిన శాఖ పనులే కాకుండా ఇతర శాఖలకు చెందిన పనులు కూడా అప్పగించడంతో క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పనులు చేయడం వల్ల వారు బిజీ అయ్యారు. ప్రస్తుతం గ్రామాలలో జనగణన సర్వే ఇంటింటికీ వెళ్లి చేస్తున్నారు. పనుల కోసం సచివాలయాలకు వెళ్లిన వారికి అందుబాటులో లేక సకాలంలో సేవలు అందించలేని పరిస్థితి ఉంది. గ్రామ స్థాయిలో ప్రజలకు రోజు రోజుకు సేవలు సన్నగిల్లుతున్నాయి. జనగణన సర్వేలో డిజిటల్ అసిస్టెంట్లు కూడా ఉండడంతో ధ్రువపత్రాల కోసం చేసిన దరఖాస్తులు అప్లోడ్ చేసేందుకు ఆలస్యం అవుతోంది. సర్వే చేసిన తర్వాతగాని సచివాలయాలకు చేరకపోవడంతో ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లిన విద్యార్థులకు సకాలంలో సేవలు అందిచలేని పరిస్థితి ఉంది. దాంతో వారు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం కాకుండా జారీ చేస్తాం.. ధ్రువపత్రాల కోసం ముందుగా దరఖాస్తు చేసుకుంటే త్వరితగతిన పత్రాలు జారీ అవుతాయి. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి వివరాలు సక్రమంగా ఉంటే మంజూరు చేస్తాం. ఎక్కడా ఆలస్యం కాకుండా త్వరితగతిన జారీ చేయాలని ఇప్పటికే మండల స్థాయి అధికారులతో చర్చించాం. ఎవరూ ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకున్నాం. – జేవీఎస్ఎస్ రామమోహనరావు, ఆర్డీఓ, బొబ్బిలి దరఖాస్తు చేసుకొండి.. ధ్రువపత్రం పొందండి విద్యార్థులకు రెవెన్యూ అధికారుల సూచన -
మూగబోయిన జానపద స్వరం
విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా కణపాకలో ఓ చిన్న ఇల్లు..ఆ ఇంటి నుంచి ఒకప్పుడు వినిపించిన గాత్రం ఉత్తరాంధ్ర పల్లెల్ని ఉర్రూతలూగించింది. ఆ గాత్రం దంపుడు లక్ష్మిది. బుర్రకథ అంటే ఏమిటో..జానపద కళలో భావోద్వేగం ఎలా ఉంటుందో? ఒక మహిళ వేదికపై నిలబడి వేల మందిని ఎలా కట్టిపడేస్తుందో తన జీవితంతో చూపించిన కళాకారిణి ఆమె. కానీ జనాలను నవ్వించిన ఆ కళాకారిణి జీవితం మాత్రం నిశ్శబ్దంగా కన్నీళ్ల మధ్య ముగిసింది. ˘õ³§ýl-ÇMýS… Ð]l$«§ýlÅ ç³#sìæt¯]l MýSâê{ç³-Ý릯]l… చిన్నప్పటి నుంచే లక్ష్మికి కళలంటే ప్రాణం. అప్పట్లో గ్రామాల్లో విద్యుత్ లేదు..టీవీలు లేవు..వినోదానికి జాతరలు, బుర్రకథలే ప్రధాన ఆధారం. గ్రామంలో ఎక్కడ బుర్రకథ వినిపించినా చిన్నారి లక్ష్మి అక్కడికెళ్లి గంటల తరబడి చూసేది. కథ చెబుతున్న వాళ్ల హావభావాలు, పాటలు, సంభాషణలు ఆమెను ఆకట్టుకునేవి. ఆ ఆసక్తే తర్వాత ఆమె జీవితాన్ని బుర్రకథ వైపు నడిపించింది. ఆ రోజుల్లో మహిళలు వేదికపైకి రావడం చాలా అరుదు. అయినా భయపడకుండా బుర్రకథ రంగంలోకి అడుగుపెట్టిన లక్ష్మి, తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ˘§ýl…ç³#yýl$ ÌS„ìSà Ð]lçÜ$¢…-§ýl…sôæ FÆý‡…™é ^ólÆó‡¨ ఒకప్పుడు ఉత్తరాంధ్ర గ్రామాల్లో జాతరలో బుర్రకథ తప్పనిసరి. సాయంత్రం కాగానే గ్రామం మధ్యలో చిన్న వేదిక ఏర్పాటు చేసేవారు. నేలమీదే పిల్లలు, పెద్దలు కూర్చుని కథ మొదలయ్యే వరకు ఎదురు చూసేవారు. అప్పుడు దంపుడు లక్ష్మి బుర్రకథ మొదలైతే చాలు..జనాలు మైమరచిపోయేవారు. బాలనాగమ్మ, సీతారామ కల్యాణం, నలదమయంతి, మహాభారతం, రామాయణం..ఏ కథ చెప్పినా తన గాత్రంతో ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించగలిగేది. హాస్యం చెప్పి నవ్వించేది.. విషాదం చెప్పి ఏడిపించేది. అంతటి మంత్రముగ్థత ఆమె కళలో ఉండేది. ˘MýSâýæ™ø ´ër$ {ç³fÌZÏ O^ðl™èl-¯]lÅ….. దంపుడు లక్ష్మి కేవలం వినోదం కోసం మాత్రమే కథలు చెప్పలేదు. బాల్య విహహాలు, అక్షరాస్యత, మహిళా హక్కులు, ఎయిడ్స్ నియంత్రణ, పొదుపు సంఘాలు, పనికి ఆహార పథకం వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై కూడా ఊరూరా తిరిగి బుర్రకథల రూపంలో ప్రజల్లో అవగాహన కల్పించింది. ఆ రోజుల్లో ప్రభుత్వ అధికారులు కూడా దంపుడు లక్ష్మి బృందం వస్తే ప్రజలకు విషయం త్వరగా చేరుతుందని ప్రత్యేకంగా ప్రోగ్రాములు పెట్టేవారు. విజయనగరం మాత్రమే కాదు..ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా ఆమె ప్రదర్శనలు ఇచ్చింది. ˘f¯éÌS ^èlç³µsôæÏ M>± yýlº$¾ Æ>Ìôæ§ýl$ వేదికలపై చప్పట్లు కొట్టిన జనాలు వేలమంది. కానీ ఆ చప్పట్లు ఆమె జీవితాన్ని నిలబెట్టలేకపోయాయి. కళను నమ్ముకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చిన లక్ష్మి ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరి పోరాటం..అన్నింటినీ భరించింది. ఒక కుమారుడిని కష్టపడి పెంచి పెద్ద చేసింది. అయితే కళాకారిణిగా ఆమెకు పేరు వచ్చినా..జీవితంలో మాత్రం స్థిరత్వం రాలేదు. ˘yìlhrÌŒæ Ķæ¬VýS….. MýS¯]l$-Ð]l$-Æý‡$-OVðS¯]l º${Æý‡MýS£ýl కాలం మారింది. టెలివిజన్ వచ్చింది. తర్వాత సినిమాలు, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వచ్చాయి. గ్రామాల్లో జాతరల వేదికలపై బుర్రకథల స్ధానంలో రికార్డింగ్ డ్యాన్సులు వచ్చాయి. ఒకప్పుడు రాత్రంతా కూర్చుని బుర్రకథలు విన్న ప్రజలు.. ఇప్పుడు మొబైల్ స్క్రీన్స్పై వినోదం వెతుక్కుంటున్నారు. కొత్త తరం జానపద కళల వైపు చూడకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వల్ల బుర్రకథలు క్రమంగా కనుమరుగయ్యాయి. ఆ కళను నమ్ముకున్న కళాకారులు బతుకు కోసం ఇతర పనులు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ˘_Ð]l-ÇMìS MýS*Æý‡V>-Ķæ$ÌS §ýl$M>-׿Ðól$ B«§éÆý‡… ఒకప్పుడు వేదికలపై వేలాది మందిని అలరించిన దంపుడు లక్ష్మి... చివరికి కలెక్టర్ కార్యాలయం పక్కన చిన్న కూరగాయల దుకాణం పెట్టుకుని జీవనం సాగించింది. అది ఆమె జీవితంలో అత్యంత బాధాకరమైన మలుపు. కళతో గౌరవం వచ్చింది. కానీ బతుకు రాలేదు. అనారోగ్యం వెంటాడినా.. మందులకు డబ్బు లేకపోయినా..అప్పుడప్పుడు చిన్న ప్రోగ్రాములు చేస్తూనే ఉండేది. కళను వదిలేస్తే నేను బతకలేను అని చెప్పేదామె. ˘MóS¯]lÞ-ÆŠ‡™ø ´ùÆ>-yìl¯]l MýSâê-iÑ™èl… కేన్సర్ బారిన పడిన తర్వాత ఆమె పరిస్థితి మరింత దయనీయమైంది. వైద్యానికి డబ్బులు సరిపోలేదు. ప్రభుత్వ సహాయం అందలేదు. కళాకారుల పెన్షన్ కూడా ఆమెకు దక్కలేదు. జీవితాంతం ప్రజలకు సందేశాలు చెప్పిన కళాకారిణి.. చివరికి తన బాధను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో మిగిలిపోయింది. ఈ నెల 5 మంగళవారం ఆకస్మాత్తుగా ఆయాసానికి గురై ఆమె తుదిశ్వాస విడిచింది. బుర్రకథ కళాకారిణి దంపుడు లక్ష్మి మృతి ప్రభుత్వ పథకాల ప్రచారంలో ముందున్న కళాకారిణి బాల్య వివాహాలపై బుర్రకథలతో పోరాడిన మహిళ కళను నమ్ముకున్న జీవితం..ఆదుకోని సమాజం డిజిటల్ యుగం దెబ్బకు కనుమరుగైన జీవితం -
● కొత్త భవనం.. ప్రారంభానికి దూరం..
చిత్రంలో కనిపిస్తున్నది రేగిడి తహసీల్దార్ కార్యాలయ నూతన భవనం. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.90లక్షల ఆర్ అండ్ బీ నిధులతో నిర్మాణం చేపట్టింది. అన్ని హంగులతో భవనం సిద్ధంగా ఉన్నా ప్రస్తుత ప్రభుత్వం ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. శిథిల భవనాల్లో విధుల నిర్వహణకు అధికారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా రెవెన్యూ అధికారులు స్పందించి నూతన భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని రెవెన్యూ సిబ్బందితో పాటు ప్రజలు కోరుతున్నారు. – రేగిడి -
పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యాటక, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. అమరావతి నుంచి వీడియోకాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు గురువారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో జిల్లా లో తీసుకుంటున్న చర్యలను వివరించామన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగంలో 7.42 శాతం వృద్ధిరే టు సాధించామని, ఏడు కొత్త జలపాతాలను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలియజేశామన్నారు. పది సూత్రాల అజెండాను అమలు చేయాలని, పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తిచేయాలని సీఎం సూచించారన్నారు. రాయితీపై వ్యవసాయ పరికరాలు జిల్లాకు 2025–26 సంవత్సరానికి వ్యవసాయ యాంత్రీకరణ పథకం (ఎస్ఎంఏమ్) కింద రూ. 2.58 కోట్ల నిధులు కేటాయించినట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. ట్రాక్టర్లు, పవర్టిల్ల ర్లు, రోటా వీటర్లు, స్ప్రేయర్లు, రీపర్లు, వీడర్లు, పంటకోత అనంతర ప్రొసెసింగ్ యంత్రాలు, విత్తనా లు చల్లే, నాటే యంత్రాలు తదితర పరికరాలు 40 శాతం నుండి 50 శాతం వరకు సబ్సిడీపై మంజూ రు చేస్తామన్నారు. భూమి కలిగిన రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ రైతులు, గత మూడేళ్లలో కనీసం మూడు పంట సీజన్లలో ఈ–పంటలో నమోదు చేసుకున్న సీసీఆర్సీ రైతులు అర్హులన్నారు. 2024–25లో సబ్సిడీ పొందిన వారు ఈ సారి అర్హులు కారని తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 19వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. ఎంపికై న రైతులు 15 రోజుల్లో తమ వాటాను యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ విధానంలో చెల్లించాలన్నారు. -
బాల్యవివాహాలు నిర్మూలిద్దాం
పాలకొండ: బాల్యవివాహాలు జరకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ సూచించా రు. సబ్కలెక్టర్ కార్యాలయంలో బాల్యవివాహ ల నిరోధక చట్టం–2026 కమిటీతో గురువా రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యవివాహలు పూర్తిగా నిర్మూలించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బాల్యవివాహలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ చట్టం అమలుకు శిశుసంక్షేమ, రెవెన్యూ, పోలీస్ శాఖ లు సమష్టి బాధ్యతీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎం.రాంబాబు, డివిజన్ పరిధి లోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సీడీపీఓలు, ఎస్ఐలు పాల్గొన్నారు. పార్వతీపురం: ప్రజల భూసమస్యలను త్వరితగతిన పరిష్కరించి, రెవెన్యూ సేవల్లో పారదర్శకత పంచడమే లక్ష్యమని జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్రెడ్డి తెలిపారు. మండలంలో ని గోపాలపురంలో ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు కార్యక్రమంపై గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. వెబ్ల్యాండ్ తప్పుల సవరణ, సర్వేనంబర్ సమస్యలు, మ్యుటేషన్, సాదా బైనామాక్లైమ్ లు, భూ వివాదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులో పరిష్కరించి ప్రజలకు పారదర్శక సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం క్రైమ్: రాష్ట్ర వ్యాప్తంగా 265 మంది ఎస్ఐలకు ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్కు గురువారం రాష్ట్ర పోలీస్శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న నాలుగు పోలీస్ శిక్షణ కళాశాలలైన విజయనగరానికి 51 మంది, ఒంగోలుకు–38, తిరుపతికి 50, అనంతపురానికి 126 మందిని శిక్షణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శిక్షణ ఈ నెల పది నుంచి జూన్ 20వరకు కొనసాగనుంది. విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాలకు 51 మంది మెన్ ఎస్ఐలు శిక్షణకు రానున్నారు. ఒంగోలు కు 38మహిళ ఎస్ఐలు శిక్షణకు వెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వంగర: ధాన్యం లోడుతో వీరఘట్టం నుంచి వంగర వైపు గురువారం వస్తున్న లారీ వంగర మండలం రుషింగి–కొప్పరవలస గ్రామాల మధ్య పంటపొలాల్లో బోల్తా కొట్టింది. ఇరుకు గా ఉన్న రోడ్డును దాటుతుండగా దిగబడి పంట పొలాల్లోకి బోల్తాపడింది. గంటల తరబడి వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే కోండ్రు ముర ళీమోహన్ ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ప్రారంభించలేదు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆపత్కాలంలో అండగా.. విజయనగరం: రాజకీయాల్లో నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మానవత్వాన్ని చాటుకున్నారు. విధులు ముగించుకుని బుధవారం రాత్రి బొబ్బిలి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న శంబంగి శంకరరావుకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో దగ్గరుండి చికిత్స చేయించారు. -
చిరస్మరణీయుడు ‘అల్లూరి’
పార్వతీపురం: విప్లవ జ్యోతి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి కొనియాడారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం అల్లూరి సీతారామరాజు వర్ధంతిని గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో అల్లూరి పోరాటపటిమ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. భరతమాతను బ్రిటిష్ దాస్యశృంఖలాల నుంచి విముక్తి చేసేందుకు ఉద్యమబాట పట్టి, బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన ధైర్యం అల్లూరి సొంతమన్నారు. గిరిజనుల అణచివేతను వ్యతిరేకించిన అల్లూరి, విప్లవ జ్వాలను రగిలించిన మహా పోరాటయోధుడని కొనియాడారు. అల్లూరి చేసిన త్యాగం వెలకట్టలేనిదని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎ.విజయశాంతి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, పశుసంవర్థక శాఖాధికారి డా.ఎస్.మన్మథరావు పాల్గొన్నారు. -
ప్రభుత్వాల తీరు దారుణం
బొబ్బిలి: విశాఖపట్నం రైల్వేజోన్ ప్రకటించి ఏళ్లు గడుస్తుండగా.. ఇప్పుడు కొత్తగా కిరండోల్ రైల్వేలైన్ తప్పించి విశాఖ రైల్వే జోన్ ప్రకటించడం దారుణమని ఉత్తరాంధ్ర సాధన సమితి వ్యవస్థాపక కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మునాయుడు అన్నారు. బొబ్బిలిలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఉన్న వాల్తేరు డివిజన్నే విశాఖ డివిజన్ అనిపేరు పెట్టారు తప్ప అధికాదాయం ఉన్నప్రాంతాలను మాత్రం ఎక్కడో దూరాన ఉన్న రాయగడ డివిజన్లో కలపడం అన్యాయమన్నారు. కొత్తవలస–కిరండోల్ రైల్వేలైన్ వల్ల ఏటా రూ.3వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. రాష్ట్ర విభజన తరువాత అటువంటి ఆదాయ వనరును ఏపీకి అన్వయించాలే తప్ప వేరే రాష్ట్రానికి బదలాయించి ఏపీకి తీరని నష్టాన్ని మిగిల్చారన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం దీనిపై నోరు విప్పకవడం విచారకరమన్నారు. ఇది రాష్ట్రప్రజలను మోసం చేయడమేనన్నారు. విశాఖ రైల్వే జోన్ మంజూరు జరిగిన నాటి నుంచి రైల్వే ఉద్యోగులు, ప్రజానీకం కేకే లైన్ను విశాఖ జోన్లోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేకే లైన్ ను తప్పించి విశాఖనుజోన్గా ప్రకటించడం ఏపీపై కేంద్రానికి ఉన్న ఆలోచన ఎలాంటిదో తెలుస్తోందన్నారు. కార్యక్రమంలో వజ్జి రవికుమార్, తమ్మిరెడ్డి కృష్ణ, చుక్క కూర్మినాయుడు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2026
సీతానగరం: ఒడిశా సరిహద్దులోని పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలను ఏనుగుల భయం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట పంటలకు, రైతుల ఆస్తులకు ఏనుగులు నష్టం కలిగిస్తున్నాయి. పంట పొలాలు, రోడ్లపై సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎదురుగా వచ్చేవారి ప్రాణాలు తీస్తున్నాయి. ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదాన్ని తలపెడుతాయోనన్న భయంతో పల్లె ప్రజలు బతుకుతున్నారు. కుంకీ ఏనుగులను తీసుకొచ్చి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామంటూ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ప్రకటనలు ఆచరణ శూన్యంగానే కనిపిస్తున్నాయి. అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు. ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ ఈ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏనుగుల సమస్యపై ప్రతివారం కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్లో వినతులు అందజేస్తున్నారు. ఆరుగా లం శ్రమించి సాగుచేసిన పంటలను ఏనుగులు నష్టపరుస్తున్నాయని, పెట్టుబడి కూడా రావడం లేదని, ఆదుకోవాలంటూ విన్నవిస్తున్నారు. దీనిపై స్పందించిన జిల్లా యంత్రాంగం గుచ్చిమి బీట్లోని కంపార్ట్మెంట్ నంబర్ 195, 196 పరిధిలో సుమా రు 50 హెక్టార్ల విస్తీర్ణంలో తాత్కాలిక ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో సుమారు రూ.3 కోట్ల ఖర్చుతో పనులు జరుగుతున్నాయి. అయితే, ప్రభుత్వం స్పందించి చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో ఉన్న కుంకీ ఏనుగులను రప్పిస్తే తప్ప ఈ ప్రాంతంలోని ఏనుగులను సంరక్షణ కేంద్రానికి తరలించడం సాధ్యం కాదన్న వాదన అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. వివిధ ప్రమాదాల్లో ఓ వైపు 9 ఏనుగులు మరణించాయి. మరోవైపు 14 మందిని ఏనుగులు పొట్టనపెట్టుకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలి యని భయం. అటవీశాఖ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తున్నా అమాయకులైన గిరిజనులు ఏనుగులకు తారసపడి బలవుతున్నారు. ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రజలను ఓదార్చుతున్న ప్రభుత్వాలు తర్వాత మిన్నకుంటున్నాయి. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలేదన్న విమర్శ లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నిక ల సమయంలో హామీ ఇచ్చినా, డిప్యూటీ సీఎం స్వయంగా సమస్యపై పలు సార్లు ప్రస్తావించినా చర్యలు మాత్రం శూన్యంగా కనిపించడం గిరిజనులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. గుచ్చిమి వద్ద చేపట్టిన తాత్కాలిక ఏనుగుల సంరక్షణ కేంద్రంలో ఏనుగులను బంధించేందుకు వీలు గా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నా యి. కందకాలు, సోలార్ హ్యాంగింగ్ ఫెన్సింగ్, పట్టుబడిన ఏనుగులకోసం ప్రత్యేకంగా ఎలిఫెంట్ షెడ్లు, వాటర్టబ్లు, స్నానపుకొలనులు నిర్మిస్తున్నారు. కుంకీ ఏనుగులకు శిక్షణ ఇచ్చే మావటీల కోసం ప్రత్యేక క్వార్టర్లు, కిచెన్ షెడ్, ఏనుగుల ఆరోగ్య సంరక్షణ కోసం అత్యాధునిక వెటర్నరీ కేర్ సెంటర్(వైద్య కేంద్రం), నీటి తొట్టెలు, అటవీ ప్రాంతం లోపలికి సులభంగా చేరుకోవడానికి రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ కేంద్రం ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు సమస్యకు పరిష్కారం లభిస్తుందని గిరిజనులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికైనా ఏనుగుల తరలింపు ప్రక్రియను పూర్తిచేయాలని కోరుతున్నారు. -
15న మహా పాదయాత్ర
● ప్రకాశం బ్యారేజీ నుంచి విద్యాశాఖా మంత్రి నారాలోకేశ్ ఇంటివరకు పాదయాత్ర విజయనగరం గంటస్తంభం: సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 15న మహా పాదయాత్రను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సమాచార పత్రాన్ని ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (జేఏసీ) నాయకులు డీఈఓ యు.మాణిక్యంనాయుడుకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల ముందు సమగ్రశిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల రెగ్యులరైజేషన్, హెచ్ఆర్ పాలసీ అమలు, సమాన పనికి సమాన వేతనం, మినిమం టైమ్స్కేల్, ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, మెడికల్ లీవులు, మహిళలకు చైల్డ్కేర్ లీవులు, తదితర సమస్యలను తక్షణమే పరిష్కరిచాలని కోరారు. ఈ నెల 15న ప్రకాశం బ్యారేజ్ నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నివాసం వరకు కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు, నాని, జిల్లా చైర్మన్ ఆర్.శ్రీనివాసరావు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ కృష్ణంనాయుడు, మండల అకౌంటెంట్ రామకృష్ణ, సీఆర్ఎంటీ నాయకులు ఎం.అప్పలనాయుడు, అప్పలనాయు డు, పైడిరాజు, వేణుగోపాల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
భోజనానికి టెండర్..!
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు భోజనం సరఫరా చేసేందు కు రెండు నెలలు కిందట నోటిఫికేషన్ ఇచ్చినా కొన్ని ఆస్పత్రులకు ఇప్పటివరకు టెండర్లు ఖరారు కాని పరిస్థితి. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని, టీడీపీ సర్కారు హయాంలో టెండర్ల ఖారా రులో జాప్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినవారికి కట్టబెట్టి, భోజనంలో ‘టెండర్’పెట్టేందుకే జాప్యం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకంగా నిర్వహించాల్సిన టెండర్ల పక్రియ గందరగోళానికి దారితీయడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదీ పరిస్థితి... ఈ ఏడాది మార్చి నెలలో జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, వైద్యవిధాన్ పరిషత్లోని ఎస్.కోట, గజపతినగరం, రాజాం ఏరియా ఆస్పత్రులు, నెల్లిమర్ల సీహెచ్సీ, బొబ్బిలి, బాడంగి, భోగాపురం, చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రుల్లో డైట్ (భోజనం) అందించేందుకు టెండర్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చా రు. పలువురు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. గత నెల 13వ తేదీన జేసీ సమక్షంలో టెండర్లు తెరిచా రు. బాడంగి, బొబ్బిలి, నెల్లిమర్ల, చీపురుపల్లి ఆస్పత్రులకు టెండర్లు ఖరారయ్యాయి. నెల్లిమర్ల సీహెచ్సీకి ఒక్కరు కూడా టెండర్ వేయలేదు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులై న ఎస్.కోట, గజపతినగరం, రాజాం ఏరియా ఆస్ప త్రుల్లో రోగులకు భోజనం సరఫరా చేసేందుకు తక్కువ ధరకు కోడ్ చేసిన వ్యక్తులకు అధికారులు డైట్ కాంట్రాక్ట్ను కేటాయించారు. దీనిపై టెండర్ లో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు అభ్యంతరం తెలిపారు. రోగులకు డైట్ సరఫరాలో అనుభవం ఉన్నట్టు టెండర్ ఖరారు అయిన వ్యక్తులు సమర్పించినవి తప్పుడు ధ్రువపత్రాలని ఆరోపించారు. వాస్తవికతను నిర్ధారించాలని కోరారు. దీంతో టెండ ర్ ఖరారైన వారు సమర్పించిన ధ్రువపత్రాల వాస్త వికత నిర్ధారణ కోసం ఏ ఆస్పత్రిలో అయితే వారు డైట్ సరఫరా చేసినట్టు తెలిపారో ఆ ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. ఇప్పటికీ ఇది కొలిక్కిరాకపోవడంతో టెంటర్ ప్రక్రియ అసంపూర్తిగా మారింది. ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందే రోగులకు భోజనం వడ్డింపుకోసం నిర్వహించిన టెండర్ ప్రక్రియ గందరగోళంగా మారింది. గడువు ముగిసి నెలలు గడుస్తున్నా టెండర్లు ఖరారు కాలేదు. తప్పుడు ధ్రువపత్రాలతో భోజనానికి ‘టెండర్’పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న ఫిర్యాదుపై నిజనిర్ధారణ ప్రక్రియ ఇంకా కొలిక్కిరాకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. వాస్తవికత నిర్ధారణలో జాప్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజనిర్ధారణ జరుగుతోంది.. సర్వజన ఆస్పత్రి, గజపతినగరం, ఎస్.కోట, రాజాం ఏరియా ఆస్పత్రులకు సంబంధించి డైట్ టెండర్లు తక్కువ ధరకు టెండర్ వేసిన వ్యక్తులపై ఫిర్యాదులు వచ్చాయి. తప్పుడు ధ్రువపత్రాలతో వారు టెండర్ వేశారని ఫిర్యా దులు అందాయి. నిజనిర్ధారణ కోసం సంబంధిత ఆస్పత్రులకు పంపించాం. అక్కడ నుంచి క్లారిటీ వచ్చిన వెంటనే టెండర్లు ఖరారు చేస్తాం. అప్పటివరకు పాతకాంట్రాక్టరే భోజనం సరఫరా చేస్తారు. – డాక్టర్ పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి – డాక్టర్ పద్మశ్రీ రాణి, డీసీహెచ్ఎస్ పెద్దాస్పత్రులే టార్గెట్... టెండర్లు ఖరారు కాని నాలుగు ఆస్పత్రులు కూడ పెద్దాస్పత్రులే. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సగటున రోజుకి 400 నుంచి 500 మంది వరకు రోగులు చికిత్స పొందుతారు. ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో 100 మంది, గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో 90 నుంచి 100 మంది, రాజాం ఏరి యా ఆస్పత్రిలో 100 మంది వరకు రోగులు ఇన్పేషేంట్లుగా చికిత్స పొందుతారు. డైట్ కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి ప్రతిరోజు మూడు పూటలా రోగులకు భోజనం అందించాలి. పెద్దాస్పత్రుల్లో భోజనం సరఫరా టెండర్ ప్రక్రియ గందరగోళంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. భోజనం సరఫరా చేయాలంటే... ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకు భోజనం సరఫరా చేసేందుకు టెండర్ వేసేవారు ఇదివరకే ఏదైనా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రికి డైట్ సరఫరా చేసి ఉండాలి. ఆదాయపన్ను వివరాలు సమర్పించాలి. ఏ ఆస్పత్రిలో అయితే వారు డైట్ సమర్పించారో సంబంధిత ఆస్పత్రి వారి నుంచి అనుభవ ధ్రువపత్రం సమర్పించాలి. టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి రెండు నెలలైనా ఖరారుకాని టెండర్లు టెండర్లు దక్కించుకున్న వారు తప్పుడు ధ్రువపత్రాలు పెట్టారని ఫిర్యాదు పూర్తికాని నిజనిర్ధారణ పాతకాంట్రాక్టర్తోనే భోజనం వడ్డింపు -
గంజాయి ముఠా గుట్టురట్టు
నెల్లిమర్ల: పట్టణంలోని గంజాయి ముఠా గుట్టు రట్టు చేసినట్లు ఎస్సై బి. గణేష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డైట్ కాలనీకి చెందిన మనోహర్ అనే వ్యక్తి రాయగడ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి నెల్లిమర్లలోని యువకులకు అమ్ముతున్నాడన్నారు. గంజాయి సమాచారం రావడంతో చంపావతి నదీతీరంలో గ్యాస్ గొడౌన్ వెనక భాగంలో గల తుప్పల్లో సిబ్బందితో కలిసి దాడి చేసి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. డైట్ కాలనీకి చెందిన మనోహర్ అనే వ్యక్తి దగ్గర నెల్లిమర్ల పట్టణానికి చెందిన ప్రవీణ్, సత్య దివాకర్, నవీన్, లోకేష్ అనే నలుగురు వ్యక్తులు 100 గ్రాములు గంజాయి కొనుగోలు చేసి కాల్చడానికి వెళ్తుండగా ఈ దాడిలో పోలీసులకు పట్టుబడ్డారని, గంజాయిని అమ్మడానికి వచ్చిన మనోహర్ దగ్గర 1.2 కిలోలు గంజాయిని సీజ్ చేశామన్నారు. నెల్లిమర్ల పట్టణం, పరిసర ప్రాంతాల్లో గంజాయిపై గట్టిగా నిఘా ఏర్పాటు చేశామని ఎవరైనా గంజాయి పీల్చినా, అమ్మినా, కొనుగోలు చేసినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గంజాయి గురించి సమాచారాన్ని ఫోన్ 9121109444 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్సై గణేష్ కోరారు. -
నాకు చావే శరణ్యం..!
● మెడికల్ విద్యార్థి ఆవేదన ● కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులువిజయనగరం క్రైమ్: నర్సింగ్ చదువుతున్న ఓ విద్యార్థి క్యాష్కో యాప్కు దాసోహమై అప్పుల పాలై చివరకు ఆత్మ హత్యే శరణ్యమనుకున్నాడు. కానీ కన్నవారి ఆశయాలు ఆ విద్యార్థిని అల్లంత వరకు లాక్కెళ్లి వెనక్కు రప్పించాయి. తనకున్న ఆగమ్య గోచర పరిస్థితికి పోలీసులు సమాధానం చెబుతారేమోనని సరాసరి విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన ఆడారి చాతుర్య విజయనగరం మిమ్స్లో మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఫోన్లో క్యాష్యో బెట్టింగ్ యాప్లో పూర్తిగా మునిగిన చాతుర్య దాదాపు రూ. 6లక్షల వరకు అప్పులు చేశాడు. చాతుర్య తండ్రి ఒక సాదాసీదా లైన్మన్. కొడుకు చదువుకోసం ప్రతినెలా దాదాపు రూ. 20వేల వరకు డబ్బులు పంపుతూనే ఉన్నారు. ఎక్కడో దూరంలో ఉన్న కొడుకు చదివి వృద్ధిలోకి వచ్చి తమను చరమాంకంలో ఆదుకుంటాడనే నమ్మకంతో తల్లిదండ్రులు ఉన్నారు. కానీ చదువు కోసం దూరాభారం వచ్చి విజయనగరంలోని పూల్బాగ్లో రూమ్ తీసుకుని మిమ్స్లో చదువుతున్న చాతుర్య క్యాష్యో యాప్కు బానిసై దాదాపు రూ.6లక్షల వరకు అప్పులు చేశాడు. చివరకు యాప్ ద్వారా రాబడి రాకపోవడంతో చావే శరణ్యమనుకుని నెల్లిమర్ల రైల్వేస్టేషన్ వరకు వెళ్లాడు. అక్కడ ఎందుకో ఓ క్షణం ఆగి మనస్సు చంపుకుని పోలీసులను ఆశ్రయిస్తే తన సమస్యకు పరిష్కారం చెబుతారని అనుకుని పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. చాతుర్య పరిస్థితిని గుర్తించిన సీఐ శ్రీనివాస్ రెండు రోజుల పాటు తనతో పాటు ఉంచి విద్యార్థి బాగోగులు చూసి కేసుల విషయంలో, పనివిషయంలో తమ సిబ్బంది చేస్తున్న, పడుతున్న కష్టాన్ని దగ్గరుండి చూసేలా చేశారు. చివరకు తాను చదువుకుంటానని, పరీక్షలో ఉత్తీర్ణుడినై కన్నవారి ఆశలను నెరవేరుస్తానని ఆ విద్యార్థి చెప్పడం విశేషం.మిమ్స్ స్టూడెంట్కు కౌన్సెలింగ్ ఇచ్చాం ఆన్లైన్ యాప్లకు ఏ ఒక్కరూ బలికావద్దని విజయనగరం టూటౌన్ సీఐ శ్రీనివాస్ స్పష్టం చేశారు. మిమ్స్ విద్యార్థి చాతుర్య క్యాష్యో యాప్ ద్వారా డబ్బులు కట్టి ఆపై అప్పులు చేసి రాబడి రాకపోవడంతో చావే శరణ్యమనుకుని పరిష్కారం చూపాలంటూ తన వద్దకు వచ్చాడన్నారు. రెండు రోజులపాటు తన సిబ్బందితోనే ఉంచి కౌన్సెలింగ్ ఇచ్చామని, ప్రస్తుతం పరీక్షలు రాసేందుకు సన్నద్ధంగా ఉన్నాడని సీఐ శ్రీనివాస్ చెప్పారు. -
టాప్ ‘టెన్’ విద్యార్థులకు నగదు ప్రోత్సాహం
● డీఈఓ మాణిక్యం నాయుడు చేతుల మీదుగా చెక్కుల పంపిణీవిజయనగరం గంటస్తంభం: ప్రభ్వుత పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా టాప్ టెన్ విద్యార్థులకు వీకే(వసుధైక కుటుంబం) ఫ్యామిలీ ఫౌండేషన్, క్రెడిట్ బీ సంయుక్త ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహక చెక్కులు పంపిణీ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో డీఈఓ యు.మాణిక్యం నాయుడు విద్యార్ధులకు చెక్కులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాణిక్యంనాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్యార్థులకు సైకిళ్లు, స్కాలర్షిప్లు అందించడంతో పాటు టాప్ టెన్ విద్యార్థులకు నగదు బహుమతులు ఇవ్వడం మంచి కార్యక్రమమన్నారు. 594 మార్కులతో ప్రథమ స్థానం సాధించిన ఇ.ఉమాపార్వతి, జి.సాద్వికలకు రూ.14 వేలు చొప్పున, 593 మార్కులతో ద్వితీయ స్ధానం పొందిన ఎస్.గుణశేఖర్, జె.పవన్కుమార్లకు రూ.10 వేలు చొప్పున, 591 మార్కులతో తృతీయ స్థానం సాధించిన కె.కీర్తనకు రూ.7వేలు నగదు బహుమతులు అందజేశారు. అలాగే 590 మార్కులు సాధించిన మరో ఏడుగురు విద్యార్థులకు రూ.3 వేలు చొప్పున చెక్కులు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ మోహనరావు, వెంకటరమణ, డీసీఈబీ కార్యదర్శి టి.సన్యాసిరాజు, ట్రస్ట్ ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
హనుమాన్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
విజయనగరం టౌన్: స్థానిక పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 12న మంగళవారం నిర్వహించనున్న హనుమాన్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మడిపల్లి వెంకటాచలం పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ఆలయం ఆవరణలో గురువారం నిర్వహించిన సమావేశంలో కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయం నిర్మించి 18 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ వేడుకలు ఉంటాయన్నారు. ప్రాజెక్ట్ చైర్మన్ గ్రంధి గుప్తా మాట్లాడుతూ 12వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, 108సార్లు మన్యసూక్తం పారాయణం, లక్ష తమలపాకులతో అభిషేకాలు చేస్తామన్నారు. గోకవరపు ఉదయ్ మాట్లాడుతూ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు చిన్నారులతో సిందూరార్చన, 27 రకాల పిండివంటల నివేదన, అనంతరం ప్రసాద వితరణ ఉంటుందన్నారు. దేవాలయం కన్వీనర్ పెంటపాటి కామరాజు మాట్లాడుతూ దేవాలయం గౌరవాధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి సలహా, సూచనలతో ఆ రోజు మధాహ్నం ఐదువేల మందికి మహాఅన్నప్రసాద వితరణ చేపడతామన్నారు. కార్యక్రమంలో పెంటపాటి ముత్యాలు, బాబ్జీ, బ్రహ్మనాథం తదితరులు పాల్గొన్నారు. -
విజయ ధరహాసం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో అతిథ్య విజయనగరం జట్టు ఓవరాల్ చాంపియన్ షిప్ దక్కించుకుంది. గడిచిన మూడు రోజులుగా జరిగిన పోటీల్లో 394 పాయింట్లు దక్కించుకున్న విజయనగరం క్రీడాకారులు ఈ ఘనత సాధించారు. 350 పాయింట్లు సాధించిన విశాఖ జట్టు రెండవ స్థానంలో నిలవగా..మూడవ స్థానాన్ని 259 పాయింట్లతో తూర్పుగోదావరి జట్టు దక్కించుకుంది. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు తైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులు బహుమతులు ప్రదానం చేశారు. దీంతో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ నేతృత్వంలో జరిగిన 5వ ఏపీ కప్ స్టేట్ తైక్వాండో చాంపియన్షిప్–2026 పోటీలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు. ముగింపు కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాలరావు మాట్లాడుతూ యువ క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చిం నాయుడు, కోశాధికారి నాయబ్ రసూల్, వివిధ జిల్లాల కార్యదర్శులు, కోచ్లు, క్రీడాకారుల తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు రాష్ట్రస్థాయిలో జరిగిన సీనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈనెల 5, 6 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ఉత్తమ క్రీడా ప్రతిభతో విద్యల నగరం విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పారు. పోటీల్లో 9 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 7గురు క్రీడాకారులు పతకాలు కై వసం చేసుకోవడం విశేషం. షాట్పుట్లో జి.వెంకటనాయుడు, 400 మీటర్ల పరుగు పోటీలో పి.ప్రవీణ్కుమార్ బంగారు పతకాలు కై వసం చేసుకున్నారు. అంతేకాకుండా లాంగ్జంప్లో జి.లక్ష్మి స్విలర్, డెకాతలీన్లో కె.సాయితేజ సిల్వర్, పోల్వాల్ట్ విభాగంలో కె.సాయితేజ సిల్వర్ మెడల్స్ చేజిక్కించుకున్నారు. అలాగే జావెలిన్త్రోలో డి.ఉదయ్, 100 మీటర్ల పరుగు పోటీలో ఎ.దివ్యవాణిలు బ్రాంజ్ మెడల్స్ దక్కించుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.లీలాకృష్ణ, ఎ.శ్రీకాంత్, ట్రెజరర్ వి.ఆనంద్ కిషోర్లు అభినందించారు. తైక్వాండో ఓవరాల్ చాంపియన్ విజయనగరం రెండవ స్థానంలో నిలిచిన విశాఖ క్రీడాకారులు మూడవ స్థానాన్ని దక్కించుకున్న తూ.గో జట్టు ముగిసిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు -
స్వచ్ఛ సర్వేక్షణ్పై సమీక్ష
పార్వతీపురం: జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం అమలుపై జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి గురువారం తన చాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో ఇంటింటి చెత్త సేకరణ, తడి–పొడి చెత్త వేరుచేయడం, ప్లాస్టిక్ నియంత్రణ, డ్రైనేజీల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, బస్టాండ్లు తదితర రద్దీ ప్రదేశాల్లో ప్రతిరోజూ శుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో మెరుగైన స్థానం సాధించేందుకు ప్రతి మున్సిపాల్టీ కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో పార్వతీపురం, సాలూరు, పాలకొండ, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు. 40 లీటర్ల సారా పట్టివేతసీతంపేట: మండలంలోని మండ గ్రామంలో 40 లీటర్ల సారా పట్టుకున్నట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. సారాతో పాటు సవర జగ్గయ్య అనే పేర్లు గల ఇద్దరు నిందితులను అరెస్టు చేశామన్నారు. సారా వండినా, విక్రయించినా, అక్రమరవాణా చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిగజపతినగరం/దత్తిరాజేరు: పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన దత్తిరాజేరు మండలం ఎం.లింగాలవలస గ్రామానికి చెందిన మజ్జి ఈశ్వరరావు వైద్యసేవలు పొందుతూ మృతి చెందాడని గజపతినగరం ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. ఈశ్వర రావు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అప్పులు చేసి నష్టాల బాట పట్టడంతో అప్పుల బాధ భరించలేక మనస్తాపానికి గురై ఈనెల 5వ తేదీన సాయంత్రం గజపతినగరం మండలం దావాలపేట రోడ్డు మహంకాళి అమ్మవారి గుడి సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో పురుగు మందు తాగాడన్నారు. అనంతరం తన స్నేహితుడు రామకృష్ణ గజపతినగరం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించి వైద్యసేవలు అందించాడని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. రైలు నుంచి జారిపడి యువకుడి మృతిగరుగుబిల్లి: మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన పల్ల అప్పలనాయుడు(25) రైలు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. బతుకు తెరువు నిమిత్తం విశాఖపట్నంలో వెల్డర్గా పనిచేస్తున్న అప్పలనాయుడు బుధవారం విశాఖపట్నం నుంచి భవానీపట్నం వెళ్తున్న రైలులో అమ్మను చూసేందుకు వస్తున్న తరుణంలో మానాపురం–గజపతినగరం మధ్య ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. అప్పలనాయుడు మృతితో రావుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొన్నేళ్ల క్రితం తండ్రి పరిసనాయుడు అనారోగ్యంతో మృతిచెందగా, ప్రస్తుతం తల్లి సావిత్రమ్మకు ఆయనే పెద్ద దిక్కుగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడి మృతివార్త తెలుసుకున్న తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుడికి విజయనగరంలోని జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి రావుపల్లిలో అంత్యక్రియలను గురువారం నిర్వహించారు. -
తాగుబోతుల నిర్వాకం..!
● అంగన్వాడీ కేంద్రం వద్ద తాగి విడిచిపెట్టిన అవశేషాలుగంట్యాడ: మాంసం తిన్నానని అందరికీ తెలియాలని వెనకటికొకడు బొమికెలు మెడలో వేసుకుని తిరిగాడన్నట్లుంది కొందరు తాగుబోతుల నిర్వాకం. మండలంలోని నరవ గ్రామంలో అంగన్వాడీ–2 కేంద్రం వద్ద తాగుబోతుల చేసిన నిర్వాకం చిన్నారులు, అంగన్వాడీ సిబ్బందిలో ఆందోళన కలిగిస్తోంది. బుధవారం రాత్రి సమయంలో కొంతమంది అసాంఘిక వ్యక్తులు అంగన్వాడీ కేంద్రం వద్ద మద్యం తాగి, ఖాళీ సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు అక్కడే పడేయడంతో గురువారం ఉదయం స్కూల్కు వచ్చిన చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నపిల్లలు చదువుకునే ప్రదేశమని తెలిసినా నిర్లక్ష్యంగా మద్యం తాగడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పరిసరాల్లో పగిలిన సీసాలు, మద్యం అవశేషాలు ఉండడంతో పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా స్థానిక పోలీసులు, సంబంధిత అధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రం వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
రెండు బైక్లు ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు
గజపతినగరం: స్థానిక పైడితల్లమ్మ వారి గుడి సమీపంలో రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. గజపతినగరం మండలం మధుపాడ గ్రామానికి చెందిన బూడి చందు గురువారం ఉదయం గ్రామంలో తన తాతయ్యను బైక్ ఎక్కించుకుని లింగాలవలస గ్రామంలో దించి తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో బొండపల్లి మండలం బొండపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు బి.సింహాద్రి, ఈశ్వరమ్మలు ఓ తోటలో సపోటా పళ్లు ఏరేందుకు గజపతినగరం నుంచి బైపాస్ రోడ్డు గుండా బైక్పై వెళ్తున్నారు. ఆ సమయంలో గుడి సమీపంలో ఆ రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో మధుపాడ గ్రామానికి చెందిన బూడి చందు కుడిచేయి ఫ్రాక్చర్ అయింది. బి.సింహాద్రికి ఎడమ చేయి ఫ్రాక్చర్ కావడంతో పాటు తలకు కుట్లు పడ్డాయి. అలాగే సింహాద్రి భార్య ఈశ్వరమ్మకు స్పల్ప గాయమైంది. వారిని బంధువులు గజపతినగరం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. మెరుగైన వైద్యం కోసం చందును గజపతినగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, సింహాద్రిని విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.పోలీసులు క్షతగాత్రుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడికి తీవ్రగాయాలుబొబ్బిలి: పట్టణంలోని ఫ్లైఓవర్ డౌన్లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని పక్కి గ్రామానికి చెందిన శంబంగి శంకర రావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఐ కె.నారాయణరావు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం తాహసీల్దార్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న శంకర్ విధులు ముగించుకుని రాత్రి 10 గంటల సమయంలో బైక్పై తిరిగి వస్తుండగా ఫ్లైఓవర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీని ప్రమాదవశాత్తు ఢీకొన్నాడు. ఈ సంఽఘటనలో శంకర్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడ్ని స్థానిక ిసీహెచ్సీలో చేర్పించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బంధువులు విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని, కోమాలో ఉన్నట్లు బంధువులు తెలిపారు.సీతంపేట: మండలంలోని పుట్టిగాంలో వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా సవరపాడు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బెన్నరాయి వాసులు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 18 మంది గాయపడగా వారిలో మెరుగైన వైద్యం కోసం పదిమందిని శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. మిగతా 8 మందికి ఆర్ఎంవో డీవీ శ్రీనివాస్ పర్యవేక్షణలో వైద్యసేవలు అందుతున్నాయి. మరో మహిళకు స్వల్ప గాయం -
ఆకట్టుకున్న కవిగాయక సమ్మేళనం
విజయనగరం టౌన్: మేడే వారోత్సవాల్లో భాగంగా సాహితీ స్రవంతి, సీఐటీయూ జిల్లాశాఖల ఆధ్వర్యంలో కొత్తూరి శ్రీనివాస్ అధ్యక్ష్యతన స్థానిక గురజాడ స్వగృహంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన కవి,గాయక సమ్మేళనం ఆకట్టుకుంది. ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సుమారు 80 ఏళ్ల తర్వాత మళ్లీ ఎనిమిది గంటల పనిదినాల కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మనిషి ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయగలుగుతాడని, అదనపు పనిగంటలు వేతనం లేకుండా చేయిస్తున్నారన్నారు. ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. పాయల మురళీకృష్ణ, జమ్ము బంగారం నిర్వహించిన కవిగాయక సమ్మేళనంలో మానాపురం రాజా చంద్రశేఖర్, బాలకృష్ణ, చంద్రమౌళి, జయపాలరావు, రెడ్డి శంకరరావు, తదితరులు కవితాగానంతో అలరించారు. డప్పు శ్రీను, చీకటి చంద్రికారాణి, రాములు గానంతో సభికులను ఆకట్టుకున్నారు. -
ప్లైవుడ్, ఆక్వా కంపెనీల్లో ’టాస్క్ ఫోర్స్’ తనిఖీలు
● సబ్సిడీ యూరియా పక్కదారి పడితే చర్యలు ● జిల్లా యంత్రాంగం హెచ్చరికపూసపాటిరేగ: సబ్సిడీ యూరియా పారిశ్రామిక అవసరాలకు అక్రమంగా మళ్లింపు అవుతుందన్న అనుమానంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని పలు పరిశ్రమల్లో టాస్క్ఫోర్స్ బృందం బుధవారం విస్తృత తనిఖీలు చేపట్టింది. జిల్లా వ్యవసాయ అధికారి వి.టి. రామారావు నేతృత్వంలోని ఈ బృందం వివిధ ప్లాంట్లలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. తనిఖీల్లో భాగంగా సవరవిల్లిలోని కృష్ణ ప్లైవుడ్, కొవ్వాడ అగ్రహారంలోని సిఫా ప్లైవుడ్, గైతుల చోడవరంలోని ిసీపీఎఫ్ ఆక్వా కంపెనీలను అధికారులు సందర్శించారు. సీపీఎఫ్ ఆక్వా కంపెనీలో రొయ్యల మేత తయారీలో యూరియా వినియోగం అవసరం లేదని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్లాంట్లోని ముడి పదార్థాలు, ఫార్ములా రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. సిఫా ప్లైవుడ్ కర్మాగారంలో ప్లైవుడ్ తయారీకి అవసరమైన ’మెలనిన్ రీజనింగ్’ కోసం టెక్నికల్ గ్రేడ్ యూరియా వాడుతున్నట్లు గుర్తించారు. గత ఏడాది ఆ కంపెనీ ఉత్పత్తి రికార్డులు, దానికి సరిపడా కొనుగోలు చేసిన టెక్నికల్ గ్రేడ్ యూరియా ఇన్వాయిస్లను అధికారులు సరిపోల్చారు. ప్రస్తుతం ఉన్న స్టాక్ రిపోర్టులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో జిల్లా వ్యవసాయ అధికారి వి.టి. రామారావుతో పాటు, డిప్యూటీ కలెక్టర్ (విజిలెన్స్–సివిల్ సప్లైస్) ఎం. అరుణ కుమారి, విజయనగరం డీఎస్పీ ఎం.వీర కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జి.ఎల్లాజీ, ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ ఎం.వి. కరుణాకర్ పాల్గొన్నారు. అలాగే విజయనగరం సబ్ డివిజన్ ఇన్చార్జి ఏడీఏ సంగీత, పూసపాటిరేగ మండలం ఇన్చార్జి వ్యవసాయ అధికారి ఎ.శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్తమ మార్కుల సాధనకు..
విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగింది. అందుకు అనుగుణంగా ఉత్తమ మార్కులు సాధించేందుకు కష్టపడుతున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మా విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబర్చారు. మరింత మెరుగైన మార్కుల సాధనకు అవకాశం లభించడంతో సప్లిమెంటరీపై కసరత్తు చేపడుతున్నారు. ఈ ఏడాది ద్వితీయ ఇంటర్ విద్యార్థులకు అవకాశం లభించడంతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల్లో వారి సంఖ్య అధికంగా ఉంది. సమయం వృథా కాకుండా మా అధ్యాపకులు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. క్రమం తప్పకుండా పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. జూన్ ఒకటవ తేదీ నుంచి యథావిధిగా ఇంటర్ తరగతులు ప్రారంభించనున్నాం. – వేమూరి హరగోపాల్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, పాలకొండ. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
పార్వతీపురం: జిల్లాలో మే 21నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని సమావేశమందిరంలో ఆమె అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 16 పరీక్షా కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు, 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు. ప్రశ్నపత్రాలను 13 పోలీస్ స్టేషన్లలో భద్రపరిచి, సమాధాన పత్రాలను స్పీడ్ పోస్ట్ద్వారా తరలించాలన్నారు. విద్యార్థుల రాకపోకలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, విద్యుత్ సరఫరా, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. జిల్లాలో 4,731 మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారని, పరీక్షలు జూన్ 4వరకు జరుగుతాయని తెలిపారు. సమీక్షలో డీఐఈఓ నాగేశ్వరరావు, డీఈఓ పి.బ్రహ్మజీరావు, డీపీఓ ఎస్.రవీంద్ర తదితరులు ఉన్నారు. -
మామిడి పండు చూడు మేలిమై ఉండు..!
● రసాయనాలతో మగ్గిస్తున్న పండ్లు ● విచ్చలవిడిగా విక్రయాలు ● నిరుపయోగంగా మ్యాంగో రైపినింగ్ సెంటర్రాజాం: పట్టణంలో మామిడిపండ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రమాదకర కార్బన్ రసాయనాలు వినియోగించి మామిడిపండ్లను మగ్గపెడుతున్నారు. పక్వానికి రాకముందే మామిడికాయలు కొనుగోలుచేసి, వాటిని నిబంధనలు అతిక్రమించి మగ్గబెట్టడంతో మామిడికాయలు రంగుమారి పక్వానికి వస్తున్నాయి. వాటిని రాజాంలో తోపుడు బండ్లపై కిలో రూ. 50 నుంచి రూ. 80లు చొప్పున విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలుచేసి తింటున్న ప్రజలు వ్యాధులుబారిన పడుతున్నారు. రైపినింగ్ సదుపాయం ఉన్నా.. రాజాం వ్యవసాయ మార్కెట్ యార్డులో మామిడి రైతులకోసం ఏర్పాటుచేసిన మ్యాంగో రైపినింగ్ సెంటర్ నిరుపయోగంగా మారింది. రసాయనాలతో మామిడిపండ్లను మగ్గపెట్టకుండా, రైపినింగ్ సెంటర్ ద్వారా మామిడిపండ్లు మగ్గపెట్టి, రైతులు మార్కెట్లో విక్రయించుకునేందుకు వీలుగా 2013లో ఇక్కడ మిషన్తో పాటు కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఈ కేంద్రంపై రైతులకు అవగాహన కల్పించడంలో మార్కెట్ యార్డు అధికారులు విఫలంకావడంతో ఈ కేంద్రం నిరుపయోగంగా దర్శనమిస్తోంది. ఈ కేంద్రంలో మామిడిని మగ్గబెడితే అద్దె చెల్లించడంతో పాటు మూడురోజుల కనీస వ్యవధి పడుతోంది. ఈ కాలయాపన, అద్దెలతో పనిలేకుండా ఒక్కరోజులో మగ్గే విధంగా కొంతమంది వ్యాపారులు రాజాంలో మామిడిపండ్ల వ్యాపారాలు చేస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టిసారించి, రసాయనాల వినియోగాన్ని నియంత్రించాల్సి ఉంది. -
భక్తిశ్రద్ధలతో పైడితల్లి చండీయాగం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, శ్రీ పైడితల్లి అమ్మవారు జన్మనక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్థానిక రైల్వేస్టేషన్ వద్ద నున్న వనంగుడిలో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బుధవారం చండీయాగం నిర్వహించారు. వేదపండితులు సాయికిరణ్ శర్మ, వెలువలపల్లి నరసింహమూర్తిలు శాస్త్రోక్తంగా యాగప్రక్రియ చేశారు. యాగ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం యాగంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్రాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు నేతేటి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. ఉచిత కంప్యూటర్ శిక్షణవిజయనగరం రూరల్: బీటెక్, డిగ్రీ పూర్తి చేసిన, చదువుతున్న నిరుద్యోగ యువతీయువకులకు కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఎన్ఆర్ఐ కుమార్ తెలిపారు. నగర పరిధిలోని రాజారావు మేడ సమీప కంచర్ల టవర్స్లోని కార్యాలయంలో జావా, నెట్, అడ్వాన్స్డ్, పైథాన్, ఏఐ బేసిక్స్, సీ ప్లస్, ప్లస్ కోర్సులపై శిక్షణ అందించనున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు ఫోన్ 7187578586, 6281974895, 6303756314 నంబర్లను సంప్రదించాలని సూచించారు. రెండవ రోజు కొనసాగిన తైక్వాండో పోటీలువిజయనగరం: జిల్లా వేదికగా జరుగుతున్న రాష్ట్రస్థాయి తైక్వాండో చాంపియన్షిప్ పోటీలు రెండువ రోజు బుధవారం కొనసాగాయి. జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ ఏపీ కప్ పోటీల్లో భాగంగా 26 జిల్లాలకు చెందిన 800మందికి పైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. వారికి నగరంలోని రాజీ వ్ ఇండోర్ స్టేడియంలో నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తుండగా..క్రీడాకారులు పోటాపోటీగా తలపడుతున్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు గురువారం బహుమతి ప్రదానోత్సవం చేయనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గురాన అయ్యలు, సీహెచ్ వేణుగోపాలరావులు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్యవిజయనగరం క్రైమ్: స్థానిక ప్రదీప్ నగర్కు చెందిన ప్రతాప్ బాల సిద్ధార్థ(39) తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు వన్ టౌన్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు అందింది. దీంతో సీఐ ఆర్వీఆర్కే చౌదరి ఆదేశాలతో హెచ్సీ అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య, పిల్లలు ఉన్న సిద్ధార్థ్కు విడాకులై ఒంటరిగానే ఉంటున్నాడని దర్యాప్తు అధికారి హెచ్సీ అప్పలనాయుడు తెలిపారు. 16 కేజీల గంజాయితో ఇద్దరి అరెస్ట్ విజయనగరం క్రైమ్: సుమారు రూ.8 లక్షలు విలువ చేసే 16 కేజీల గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను జీఆర్పీ సిబ్బంది బుధవారం అరెస్ట్ చేశారు. విజయనరంలోని రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్లపై జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గకు చెందిన మహమ్మద్ ఇబ్రహీం ఖలీల్, మహంత్ డీఎన్ఎస్లు అనుమానాస్పదంగా తిరుగుతుండడాన్ని గుర్తించారు. వారిని విచారణ చేయగా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు తేలడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి ఇద్దరి వద్ద ఉన్న 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించినట్లు జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు. కొనసాగుతున్న దర్యాప్తురాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధిలో జరిగిన వివాహిత హత్యకేసుకు సంబంధించి ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఇన్చార్జి టౌన్ సీఐ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలతో శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో మృతురాలి కుమారుడు శశాంక్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అన్ని కోణాల్లో డోలపేటలోని అతని స్నేహితుల వద్ద వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీ కొని వృద్ధుడి మృతి
రామభద్రపురం: మండల పరిధిలోని ఆరికతోట ఆంజనేయస్వామి ఆలయం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్పు ఢీకొని ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆరికతోట గ్రామానికి చెందిన పూసర్ల శ్రీరామమూర్తి అలియాస్ పుల్లయ్య (70) తన వ్యక్తిగత నిమిత్తం ఆ జంక్షన్కు వచ్చాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్లిపోయేందుకు జాతీయ రహదారి దాటుతుండగా అదే సమయంలో విజయనగరం నుంచి సాలూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో శ్రీరామమూర్తి అక్కడక్కడే మృతి చెందాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎస్సై జ్ఞానప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి తరలించారు. -
చిన్నపత్రిక ఎడిటర్పై దాడి
● తెగబడిన జనసేన నాయకులు ● దెబ్బలు తిన్న ఎడిటర్పైనే కేసు నమోదుసాక్షి ప్రతినిధి, విజయనగరం: నిష్పక్షపాతంగా వార్తలు రాసినందుకు గాను చిన్నపత్రిక ఎడిటర్ కాళ్ల శ్రీనివాసరావుపై జనసేన నాయకులు దాడికి తెగబడ్డారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో అధికారపార్టీ అగడాలపై కేవలం వార్తలు రాశారనే అక్కసుతోనే ఎడిటర్పై దాడికి పాల్పడ్డారు. ప్రజాస్వామ్యంలో మీడియా గొంతు నొక్కాలని చూడడం హేయమని పలువురు సామాజిక వేత్తలు మండిపడుతున్నారు. జరజాపుపేట గ్రామంలో తన ఇంటికి వెళ్తున్న ఎడిటర్ శ్రీనివాసరావుపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయడంతో జర్నలిజానికి చీకటి రోజులు వచ్చినట్లు పలువురు అభివర్ణించారు. శ్రీనివాసరావుపై దాడి చేయడం ప్రజాస్వామ్యంలో ఫోర్త్ఎస్టేట్పై దాడి చేయడమేనన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం కీలకనేత తప్పిదాలపై పత్రికలో వరుస కథనాలు రాయడంతోనే జనసేన నాయకులు దాడికి తెగబడినట్లు పలువురు తెలియజేశారు. ఎడిటర్పై దాడికి పాల్పడిన అధికార పార్టీ నాయకులపై కేసులు నమోదు చేయాలని పలువురు మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే అరెస్టు చేయాలి జర్నలిస్టు శ్రీనివాసరావుపై దాడికి తెగబడిన అధికారపార్టీ నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. శ్రీనివాసరావుపై దాడి జరగడం ముమ్మాటికీ పత్రికలపై దాడి జరిగినట్లే అని నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ నెల్లిమర్ల తహసీల్దార్ శ్రీకాంత్కు, నెల్లిమర్ల పోలీస్స్టేషన్లోను జర్నలిస్టు యూనియన్ ప్రతిధులు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ ప్రతినిధులు ఆరిపాక శ్రీనివాసరావు, పతివాడ రమణ, మద్దిల శ్రీనివాస రావు, పి.సురేష్, శనపతి శ్రీనువాసరావు తదితరులు ఉన్నారు. దాడి దుర్మార్గం.. జర్నలిస్టు శ్రీనివాసరావుపై జనసేన నాయకులు దాడిచేయడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ నగర పంచాయతీ అధ్యక్షుడు చిక్కాల సాంబశివరావు అన్నారు. -
తమ్ముడు తమ్ముడే.. బేరం బేరమే..!
● ఆ నేత రూటే సెప‘రేటు’ ● పార్టీ కార్యకర్తలకే ఝలక్ ● ఎక్కువ డబ్బులు ఇచ్చినవారికే పోస్టులు సాక్షి, పార్వతీపురం మన్యం: అందివచ్చిన అవకాశాన్ని టీడీపీ నాయకులు రెండు చేతులా వినియోగించుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. మరోసారి పదవి ఉంటుందో ఉండదో అన్నట్లుగా ప్రతీ పనికి రేటు కట్టి అందిన కాడికి దోచుకుంటున్నారని అధికార పార్టీ కార్యకర్తలే బహిరంగంగా చెబుతుండడం, పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు చేస్తుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధుల పాలనను ఎత్తిచూపుతోంది. ప్రభుత్వ భూములు, చెరువులు, కలప, ఇసుక, మైనింగ్, ఉద్యోగాలు.. ఇలా అన్నిట్లోనూ నేతలు తల దూర్చుతున్నారు. ఈ విషయంలో తరతమభేదాలు ఉండడం లేదు. తమ సొంత పార్టీ కార్యకర్తలైనా.. తమ విజయం కోసం అహర్నిశలూ శ్రమించిన వారైనా సరే.. క్షమించడం లేదు. సాధారణంగా తమ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఏదైనా పనులు చేయించుకోవచ్చని చోటా నాయకులు, కార్యకర్తలు ఆశ పడటం సహజం. వారి ఆశలకు కూడా విలువ కట్టేస్తున్నారు నేతలు!! దీంతో తమ్ముళ్లు లబోదిబో అంటున్నారు. ఇలాంటి వారి కోసమా చెమటలు చిందించాం అని వాపోతున్నారు. ఆ నేత ఒక ఆకు ఎక్కువే.. రాకరాక వచ్చిన అవకాశం కావడంతో ఓ నియోజక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధి చెలరేగిపోతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ అపరేటర్లు.. ఇలా పోస్టుకు ఒక రేటు కట్టేశారు. సొంత పార్టీ కార్యకర్తల సమక్షంలోనే ‘విజయ’వంతంగా వేలంపాట పెట్టేస్తున్నారు. ముందు ఒక రేటు ఖరారు అయినా ఆ పోస్టు తమకే దక్కుతుందన్న నమ్మకం కార్యకర్తలకు ఉండడం లేదు. అంతకంటే ఎక్కువ ధర ఎంకెవరైనా ఇస్తే ఇచ్చిన హామీ కాస్త అటకెక్కుతోంది. -
కళ్లాల్లోనే పంట.. రైతన్న ఇంట కన్నీటి మంట
సీతానగరం: రైతన్నపై చంద్రబాబు ప్రభుత్వం కినుక వహిస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. రైతన్నను ఆవేదనకు గురిచేస్తోంది. కర్షకులను ఆదుకుంటామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రస్తుత సీఎం చంద్రబాబు.. నిలువునా ముంచేస్తున్నారంటూ సీతానగరం మండలంలోని లక్ష్మీపురం, బుడ్డిపేట, చెల్లన్నాయుడువలస, వెంకటాపురం పంచాయతీల రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. రబీ వరి పంట నూర్పిడిచేసి 15 రోజులుగా కళ్లాల్లోనే ధాన్యం ఉన్నా కొనుగోలు చేసేవారే లేరన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో క్వింటా పచ్చి ధాన్యం రూ.1270లకు, తేమలేకుండా ఆరబెట్టిన ధాన్యం రూ.1750కి మించి వ్యాపారులు కొనుగోలు చేయడంలేదన్నారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బలిజిపేట, సాలూరు ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర చెల్లించి పంట కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, రైతులు నష్టపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సీహెచ్ అప్పలనాయుడు, జి.సత్యనారాయణ, ధనంజయ్ తదితరులు వాపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రబీ ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. -
సమన్వయంతో లక్ష్యాలు సాధించాలి
● ఐటీడీఏ పీఓ వైశాలి పార్వతీపురం: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సకాలంలో సాధించాలని ఐటీడీఏ పీఓ ఆర్.వైశాలి సూచించారు. తన చాంబర్లో అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గిరిజన రైతులకు విత్తనాలు, ఎరువులు, పరికరాలు ఆలస్యం లేకుండా అందించాలన్నారు. యూనిట్ల గ్రౌండింగ్ వేగవంతం చేసి లబ్ధిదారులకు అవసరమైన సహయం త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నందివానివలసలో ఏనుగుల గుంపు గరుగుబిల్లి: మండలంలోని నందివానివలస గ్రామ పరిసరాల్లో ఏనుగుల గుంపు బుధవారం సంచరించింది. రెండువారాల నుంచి గిజబ, తోటపల్లి, నాగూరు, మరుపెంట, సుంకి, నందివానివలస తదితర గ్రామాల పరిధిలో ఏనుగులు సంచరిస్తున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. ప్రధాన రహదారికి ఆనుకొని సంచరిస్తుండడంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు భయపడుతున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం పార్వతీపురం: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నట్టు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు జూనియర్ కళాశాలల్లో ప్రత్యే రెమిడియల్ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో జరుగుతున్న ఎన్యూమరేషన్ పనులను ఈ నెల 20లోగా పూర్తిచేయాలని అధికారులకు టెలికాన్ఫరెన్సులో కలెక్టర్ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంఆర్ఐ స్కాన్ సాయంత్రం 6 గంటలకే క్లోజ్..! విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఎంఆర్ఐస్కాన్ సాయంత్రం 6 గంటలకే క్లోజ్ చేస్తున్నారని, 6 గంటల తర్వాత ఎంఆర్ఐ స్కాన్ అవసరమైన వారు మరుసటి రోజు వరకు వేచిఉండాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విషయం అధికారులకు తెలిసినినా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా స్కానింగ్ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉండాలి. ఎంఆర్ఐ స్కాన్ నిర్వహణ బాధ్యతలను ఎన్ఆర్ఐ సంస్థ సరిగా నిర్వహించడంలేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ వద్ద ప్రస్తావించగా ఎంఆర్ఐ స్కాన్ 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని, ఆ మేరకు ఎన్ఆర్ఐ సంస్థతో ఎంఓయూ కుదిరిందన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత స్కాన్ తీయని విషయం నా దృష్టికి రాలేదని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026
● కొద్ది రోజుల కిందట.. ఆ గ్రామంలో అంగన్డీ కార్యకర్త పోస్టు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టిన కార్యకర్త.. తన భార్యకు ఆ పోస్టు ఇప్పించాలని, తన నియోజకవర్గ ప్రజా ప్రతినిధిని కలిశాడు. సదరు నేత.. అసలు మొహమాట పడకుండా ఆ పోస్టుకు బేరం పెట్టారు. రూ.3 లక్షలకు రేటు కుదిరింది. అడిగిన మొత్తం ఆ కార్యకర్త ఇచ్చుకున్నాడు. తీరా పోస్టు వారికి రాలేదు. ఆ పక్క ఇంట్లోనే ఉంటున్న మరో మహిళకు వచ్చింది. వాస్తవానికి ఆమె కంటే అన్ని అర్హతలూ తన భార్యకే ఉన్నాయని భావించిన ఆ వ్యక్తి.. ఆరా తీస్తే, ఉద్యోగం పొందిన వారు.. అదే ప్రజాప్రతినిధికి రూ.5 లక్షలు ఇచ్చారని తెలుసుకున్నాడు. ఆగ్రహంతో సదరు నేతను నిలదీశాడు. స్పందన లేదు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగాడు.. ఫలితం లేదు. దీంతో ఎన్నో రోజులు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ చుట్టూ తిరిగాడు. ● బలిజిపేట మండలం పనుకువలస గ్రామానికి చెందిన మర్రాపు సూర్యనారాయణ 1987 నుంచి టీడీపీలో ఉంటున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, కో ఆపరేటివ్ వంటి పదవులు చేశారు. పార్టీకి వీరాభిమాని. కొద్ది రోజుల కిందట తన కుమారుడు కరిష్మానాయుడుకు ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు కోసం ప్రయత్నం చేశారు. ఇక్కడా.. తమ్ముడు తమ్ముడే! పేకాట పేకాటే!! రూ.4 లక్షలకు బేరం తెగింది. ఆ యువకుడు పోస్టులో కూడా చేరిపోయాడు. ఆరు నెలలు అయ్యింది. చేసిన పనికి జీతం రావడం లేదు. సరికదా.. ఎలాగైనా అతని మీద అభియోగాలు మోపి, ఉద్యోగంలో నుంచి తీసేయాలని అధికారుల మీద పార్టీ నియోజకవర్గ నేత నుంచి ఒత్తిడి పెరిగింది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇదే పోస్టుకు రూ.8 లక్షల ఆఫర్ వచ్చిందట. దీంతో జాబ్ కార్డు కారణం చూపిస్తూ.. కరిష్మా నాయుడును తొలగించారు. ఇన్నాళ్లూ పార్టీని నమ్ముకుని ఉన్న ‘తమ్ముడికి’ ఇదా బహుమానం అంటూ మర్రాపు సూర్యనారాయణ సదరు నేతను నిలదీశాడు. దీంతో రూ.3 లక్షలు తిరిగి ఇచ్చారు. ఇంకా రూ.లక్ష ఇవ్వకపోవడంతో బాధితుడు పీజీఆర్ఎస్ను ఆశ్రయించాడు. -
తహసీల్దార్ అవుతామంటారా..?
సాక్షిప్రతినిధి, విజయనగరం: చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తమ భవిష్యత్ అగమ్యగోచరమవుతోందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రమోటీ డిప్యూటీ తహసీల్దార్లు (క్లరికల్ క్యాడర్ నుంచి డీటీలుగా ఎదిగినవారు) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్గా పదోన్నతి పొందకుండానే రిటైరయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని వివిధ కార్యాలయాల్లో మొత్తం ప్రమోటీ, ప్రొబేషనరీ డీటీ ( గ్రూప్ 2 ద్వారా వచ్చినవారు) సంఖ్య 1,513 మంది ఉన్నారు. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఎలక్షన్ డీటీలు (ఎన్నికల సంబంధిత కార్యకలాపాలు పర్యవేక్షించేవారు) 175 మంది పనిచేస్తున్నారు. అయితే పదోన్నతులకు సంబంధించి ఈ 175 మందిని మొత్తం క్యాడర్ సంఖ్య నుంచి ప్రభుత్వం మినహాయిస్తుండడంతో వీరు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమకు వ్యతిరేకంగా హైకోర్టులో వచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. పదేళ్లకు మించి కొనసాగుతున్న ఎన్నికల డీటీ పోస్టులను శాశ్వత సిబ్బందిగానే పరిగణించాలి తప్ప వాటిని మినహాయించి లెక్కేయడం తగదన్నది వారి వాదన. తమ సమస్యను సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. ఇక మొత్తం సంఖ్య 1,513 మంది నుంచి పదోన్నతులకు సంబంధించి ఈ 175 మందిని మినహాయిస్తుండడంతో మిగిలిన మొత్తం ప్రమోటీ డిప్యూటీ తహసీల్దార్ల సంఖ్య 1,338కి తగ్గిపోతోంది. అయితే పదోన్నతులకు సంబంధించి 175 మంది ఎలక్షన్ డీటీలను మినహాయిస్తున్న క్రమంలో వరుస సంఖ్యలు, రోస్టర్లు, సీనియారిటీలు మారిపోయి.. సదరు 1,338 జాబితాలో ఉన్న వారు కూడా ‘పదవీ విరమణ చేసేలోపు’ తమకు పదోన్నతులు రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్నారు. డీటీల పదోన్నతులు జోనన్ల వారీగా కేటాయించనుండగా, సీనియారిటీ జాబితాలో తాము బాగా వెనకబడిపోతామని ప్రమోటీ డీటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమోటీ డిప్యూటీ తహసీల్దార్ల ఆవేదన పదోన్నతి పొందకుండానే రిటైర్ అవుతామన్న ఆందోళన -
ఘాట్రోడ్లో హాహాకారాలు
సీతంపేట: పెళ్లి భోజనానికి ఆనందంగా వెళ్లారు. అక్కడ బంధువులను కలిశారు. వధూవరులను ఆశీర్వదించారు. మధ్యాహ్న భోజనం చేశాక తిరిగి వ్యాన్లో బయలుదేరారు. పెళ్లి ముచ్చట్లు చెప్పుకుంటూ ఘాట్ రోడ్లో ముందుకు సాగుతున్నారు. అంతే... ఒకేఒక్క కుదుపు.. కళ్లుమూసి తెరిచేలోగా వారు ప్రయాణించిన వ్యాన్ లోయలోకి బోల్తాకొట్టింది. ఆ ప్రాంతమంతా హాహాకారాలతో నిండిపోయింది. అంతలోనే వ్యాన్ ఓ చెట్టుకు తగలి నిలవడంతో ఊపిరితీసుకున్నారు. ఒక్కొక్కరుగా వ్యాన్ నుంచి బయటపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. సీతంపేట ఏజెన్సీలోని ఘాట్ రోడ్లో బుధవారం జరిగిన ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం... సీతంపేట మండలం పూతికవలస పంచాయతీ పరిధిలో బెన్నడుగూడ గ్రామానికి చెందిన గిరిజనులు 42 మంది పుట్టిగాం గ్రామంలో జరిగిన వివాహానికి బొలెరో మినీ పికప్ వ్యాన్పై వెళ్లారు. మధ్యాహ్నం భోజనం అనంతరం తిరుగు ప్రయాణంలో వస్తుండగా సలబం పాడు గ్రామ సమీపంలో అదుపుతప్పి పల్టీ కొట్టింది. వ్యాన్లో ఉన్నవారు చెల్లాచెదురుగా పడిపోయారు. వ్యాన్ను చెట్టు అడ్డుకోవడంతో అందులో ఉన్న మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. చెట్టు అడ్డుకోకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. కూరంగి మంపి, సవర సురభి, బిడ్డిక ప్రకాష్, సవర శ్రావణ్కుమార్, బి.కీర్తి, కె.సంజన, ఎస్.సింగన్న, నందిని, సవర నరేష్, సవర గుడిమి, సవర గంగమ్మ, సవర బూగమ్మ, సవర తోటయ్య, సవర నీలమ్మ, గుడమి, ఎస్.పూలమై, ధమయంతి, సుభద్రలతో పాటు చిన్నచిన్న గాయాలపాలైన వారిని 108 అంబులెన్స్లో సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆర్ఎంవో డి.వి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది సేవలు అందజేశారు. మెరుగైన వైద్యసేవలు అవసరమైన 8 మందిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. పాలకొండ సీఐ ప్రసాదరావు, ఎస్ఐ వై.అమ్మన్నరావు ఘటనా స్థలాన్ని సందర్శించారు. వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి భోజనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం అదుపుతప్పి లోయలోకి బోల్తాకొట్టిన వ్యాన్ చెట్టు అడ్డకోవడంతో తప్పిన ప్రాణముప్పు 18 మందికి గాయాలు మెరుగైన వైద్యం కోసం 8 మందిని శ్రీకాకుళం రిమ్స్కు తరలింపు -
మెరుగైన వైద్య సేవలు అందించండి
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి వైద్యులకు సూచించారు. సీతంపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆమె బుధవారం రాత్రి పరామర్శించారు. అప్పటికే ఆస్పత్రిలో దగ్గరుండి వైద్యసేవలు పర్యవేక్షిస్తున్న పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవర్స్వప్నిల్తో మాట్లాడారు. వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని కోరారు. అనంతరం అక్కడ చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరిని పేరుపేరునా పరామర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ కన్వీనర్ నిమ్మక కాంతారావు పాల్గొన్నారు. -
నిడగల్లు సా మిల్లు సీజ్
సాక్షి, పార్వతీపురం మన్యం: సీతానగరం మండలం నిడగల్లులో ఉన్న చిన్ని సామిల్లును అధికారులు బుధవారం సీజ్ చేశారు. పార్వతీపురం మండలం అడారు ఎంపీపీ పాఠశాల ఆవరణలో ఉన్న టేకు చెట్లను టీడీపీ నాయకులు అక్రమంగా నరికేసి, రాత్రికి రాత్రి తరలించిన విషయం విదితమే. దీని మీద పోలీస్ కేసు కూడా నమోదైంది. ఈ టేకు దుంగలు సీతానగరం మండలం నిడగల్లు వద్ద ఉన్న సామిల్లులో ప్రత్యక్షమయ్యాయి. దీనిపై ఈ నెల 5న ‘కలపకూ కాళ్లున్నాయ్.. ఆడారు నడిచెళ్లాయ్’ అనే శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అటవీ శాఖాధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కోత పూర్తయిన కొన్ని దుంగలను గుర్తించి సీజ్ చేశారు. అక్రమాలకు సహకరించిన మిల్లును కూడా సీజ్ చేసినట్లు జిల్లా అటవీ శాఖాధికారిణి ప్రసూన తెలిపారు. -
ఘాట్రోడ్లలో ప్రయాణం.. తప్పదు భారీమూల్యం
● రోజుల వ్యవధిలో వరుస ప్రమాదాలు ●పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు ● క్షతగాత్రులుగా మారుతున్న మరికొంత మంది ●జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఘాట్ రోడ్లు.. ● బ్లాక్స్పాట్లుగా గుర్తించకుంటే కష్టంపాలకొండ రూరల్/ సీతంపేట: ఏజెన్సీ అందాలు కలబోసి ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలో రహదారి ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. రోజు ఏదో ఒక చోట రహదారి ప్రమాదాల బారిన పడి మృతి చెందడం..లేకుంటే తీవ్ర గాయాలపాలై క్షతగాత్రులుగా మారడం పారిపాటి. దీంతో అనేక కుటుంబాల్లో చీకట్లు అలుముకుంటున్న విషయం విదితమే. జిల్లాలోని 15 మండలాల పరిధిలో విస్తరించి ఉన్న ఏజెన్సీలో ఘాట్ రోడ్లు, ప్రమాదకర మలుపులు అనేకం. ముఖ్యంగా సీతంపేట, భామిని మండలాలకు వెళ్లాలంటే అనేక మలుపులు, ఛిద్రమైన రహదారులు దాటాల్సి ఉంది. ఈ మండలాలతో పాటు కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ, పాచిపెంట, మ క్కువ, గుమ్మలక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో అంతర్గత గ్రామాలకు వెళ్లాల న్నా అనేక సమస్యలు అధిగమించాల్సి ఉంది. ముఖ్యంగా జెడ్, ఎస్, హెయిర్ పిన్ మలు పులతో పాటు ఘాట్ రోడ్లు విస్తరించి ఉన్నాయి. దీనికితోడు గిరిజన ఆవాసాలు,గూడలు అధికంగా కొండలపై ఉండడం, అక్కడికి రవాణా సౌకర్యం అంతంత మాత్రంగా ఉండడంతో వారు ద్విచక్రవాహనాలు ఆటోలు, వ్యాన్లు, మినీ జీపులు, మ్యా క్సీ క్యాబ్లపై ఆధారపడుతన్నారు. ఈ క్రమంలో ఏ చిన్న ప్రమాదం సంభవించినా పదుల సంఖ్య లో ప్రయాణికులు ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. ఇటీవల కాలంలో.. ఇటీవల నాలుగు రోజుల క్రితం పాలకొండ మండలం జంపరకోటకు చెందిన 11 మంది ఓ ఆటోలో సీతంపేట మండలంలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తూ ఇదే మండలం మేడకోట ఘాట్ రోడ్డు మలుపు వద్ద ఆటో అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడగా మిగిలినవారు తీవ్రగాయాల పాలయ్యారు. ఇదే మండలం వాబ గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో దంపతులు రెండు రోజుల వ్యవధిలో మరణించారు. సీతంపేట పరిధిలో ఆడలి వ్యూ పాయింట్ వద్దకు వెళ్లి వచ్చే క్రమంలో ఘాట్ రోడ్ల మలుపుల వద్ద తరచూ ఆటోలు, ద్విచక్రవాహనాలు, ఇతర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ఘటనల్లో దాదాపు ఆరుగురు మరణించగా మరి కొందరు ఆస్పత్రుల పాలయ్యారు. పాలకొండ మండలం సిరికొండ, మంగళాపురం, తంపటాపల్లి, అట్టలి, వీరఘట్టం మండలం తూడి, ఎం.రాజపురం, కెల్ల తదితర గ్రామాల మలుపుల వద్ద అనే క రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. గుమ్మలక్షీపురం మండలం కల్లిగట్టు కూడలి, గోరటి ఘాట్రోడ్డు, మండ రోడ్డులో మలుపు, సాలూరు మండలం రొడ్డవలస, కరడవలస, ఒకటవ మైలు రాయి ఘాట్ రోడ్డు మలుపులు, జీగ్రామ్ సాలూరు బైపాస్ రోడ్డు, కొమరాడ మండలం బంగారంపేట సమీపంలో మలుపు, మక్కువ మీదుగా దుగ్గేరు, పార్వతీపురం మండలంలో చినమరికి, పెద మరి కి మీదుగా ఒడిశా రహదారి, నర్సిపురం రోడ్డు, పాచిపెంట మండలంలో పి.కోనవలస(సుంకి) ఘాట్ రోడ్డు, గరుగుబిల్లి మండలంలో తోటపల్లి కుడికాలువ రోడ్డు, నందివానివలస, అడ్డాపుశిల రోడ్డులో ప్రమాదాలు పరిపాటిగా జరుగుతున్నట్లు ఆయా ప్రాంతవాసులు చెబుతున్నారు. బ్లాక్ స్పాట్లుగా గుర్తించాలి నిత్య ప్రమాదాలకు నెలవుగా మారుతున్న రహదారులు, ఘాట్ రోడ్లు, మలుపులను బ్లాక్ స్పాట్లుగా గుర్తించాలి. సంబంధిత అధికారుల సమన్వయంతో అవసరమైన చోట వేగనిరోధకాలు, హెచ్చరిక బోర్డులు, ఘాట్ రోడ్లలో రక్షణ గోడలు, రెయిలింగ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలో ఏటా దాదాపు మూడు వందల వరకూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ ప్రమాదాలు ఎక్కువగా ఏజెన్సీలోనే జరుగుతున్నాయి. -
కదలని ఏనుగులు
గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో ప్రజలు భీతిల్లుతున్నారు. మండలంలోని నందివానివలసలో తామరచెరువు, పంటపొలాల్లో సంచరించిన ఏనుగులు సోమవారం సుంకి గ్రామ పరిసరాల్లోని నాగావళినది ప్రాంతంలో గల పంప్హౌస్ పరిసరాల్లో సంచరిస్తున్నాయి. కొద్ది రోజులనుంచి ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తుండడంతో ఎప్పుడు ఏ గ్రామంలో చొరబడి ఎవరికి హాని కలగజేస్తాయోనని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వేసవి పంటలు ఉండడంతో రైతులు పొలం పనులు చేపట్టేటప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భీతిల్లుతున్నారు. ఏనుగులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
మెట్లపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
సీతంపేట: మండలంలోని జి.గుమ్మడ గ్రామానికి చెందిన ఆరిక సోమయ్య (63) అనే వృద్ధు డు మెట్లపై నుంచి జారిపడి శ్రీకాకుళం రిమ్స్లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు దోనుబాయి ఏఎస్సై త్రినాథరావు తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం వర్షం కురుస్తున్న సమయంలో ఇంటి మెట్లు ఎక్కుతుండగా జారి పడడంతో సోమ య్య తలకు బలమైన గాయమైందన్నారు. దీంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించి ప్రథ మ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు చెప్పారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. సీతంపేట: స్థానికంగా నిర్వహిస్తున్న ఐటీడీఏ పెట్రోల్ బంకులో సోమవారం పెట్రోల్ కొరత ఏర్పడింది. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం వారపు సంత కావడంతో ఎక్కువ మంది వాహనదారులు సీతంపేటకు రావడం, పెట్రోల్ బంకులో పెట్రోల్ లేకపోవడంతో బయట మార్కెట్లో కొనుగో లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు తెలియజేశారు. పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి, సోమవారం ప్రారంభించారు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ హాల్లో ఈ శిబిరం నిర్వహిస్తారని, ఒక వారం ఆయుర్వేదం, మరో వారం హోమియోపతి సేవలు అందిస్తారని తెలిపారు. ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెంపు లక్ష్యమని పేర్కొన్నా రు. డీఎంహెచ్ఓ భాస్కరరావు, జిల్లా ఎన్సీడీ అధికారి డా.జగన్మోహన్రావు పాల్గొన్నారు. సీతంపేట: సీతంపేట ఏరియా ఆస్పత్రి రోగులతో సోమవారం కిటకిటలాడింది. మొత్తం 293 మంది ఓపీ కోసం రాగా వారిలో 46 మంది వరకు వైరల్ జ్వరాలతో బాధపడుతున్నా రు. అత్యవసరమైన వారిని ఇన్పేషెంట్లుగా ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్లు సంబంధిత వైద్యాధికారులు తెలిపారు. -
●ప్రమాదాలు అధిగమించేలా..
రోడ్డు ప్రమాదాలు అధిగ మించేందుకు ఉన్నతాధికారుల సూచనలతో ప్రత్యే క చర్యలు చేపడుతున్నాం. ప్రమాదాలు జరిగే ప్రాంతా ల వద్ద హెచ్చరిక బోర్డులు, సూచనలు ఏర్పాటు చేస్తున్నాం. నిత్యం వాహ న తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపడుతున్నాం. ప్రజల్లో అవగాహన కల్పించే చైతన్య క్యార్యమ్రాలు నిర్వహిస్తున్నాం. నిత్యప్రమాదా లు జరిగే ప్రాంతాలను గుర్తించాం. అక్కడి ప్రజలు, అధికారుల సమన్వయంతో ప్రమాద నివారణ చర్యలు చేపడతాం. ముఖ్యంగా ఏజెన్సీపై దృష్టి పెడుతున్నాం. –ఎం.రాంబాబు, డీఎస్పీ, పాలకొండ -
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
పార్వతీపురం: పీజీఆర్ఎస్కు వచ్చే ఫిర్యాదుల పరి ష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి, ఐటీడీ ఏ పీఓఆర్.వైశాలి, డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీ దిలీప్కళ్యాణ్ చక్రవర్తితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 72 వినతులను కలెక్టర్ స్వీకరించారు. ఇందులో పీజీఆర్ఎస్కు 50, రెవెన్యూ క్లినిక్కు 20 అర్జీలు వచ్చాయి. పెండింగ్ సమస్యలను శాఖల వారీగా సమీక్షించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను కోరారు. ఫీల్డ్ పర్యటనల ద్వారా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని సూచించారు. అర్జీదారులతో సానుభూతితో వ్యవహరించాలని చెప్పారు. అర్జీలు పెండింగ్లో లేకుండా, రీ ఓపెన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎస్ఎల్ ఏ గడువులు దాటకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని ఇలా... ●జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మాణం చేస్తున్న లబ్ధి దారులకు బిల్లులు చెల్లించాలని కోరుతూ గిరిజన సంక్షేమ సంఘ ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్కుమార్ అర్జీ అందజేశారు. అలాగే పార్వతీపురం మండలంలోని అడారు గ్రామ పాఠశాలలోని టేకు చెట్లను అక్రమంగా నరికి తరలించి న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరో అర్జీని రంజిత్ కుమార్ అందజేశారు. ●వీరఘట్టం మండలం నీలానగరం గ్రామానికి చెందిన బి.ఈశ్వరరావు తన తండ్రి వీఆర్ఓగా విధులు నిర్వహించి మృతి చెందారని తన తండ్రి ఉద్యో గం వారసుడైన తనకు ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశాడు. గడువులోగా సమస్యలను పరిష్కరించాలి పార్వతీపురం రూరల్: నిర్దిష్ట గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి జిల్లా పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం. వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన పది ఫిర్యాదులను స్వీకరించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, వేధింపులు, అత్తారింటి సమస్యలు, నకిలీ పత్రాలు, ఆన్లైన్ మోసాలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులు వాస్తవాలుగా తేలితే చట్టపరమైన చర్యలు తీసుకున్న నివేదికను ఎస్పీ కార్యాలయానికి పంపించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై శిరీష తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 7 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 7 వినతులు వచ్చాయి. ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో అనసధద్ర ఈఎంఆర్ఎస్ నుంచి మెళియాపుట్టి ఈఎంఆర్ఎస్కు చదువుకునేందుకు అవకాశం కల్పించాలని నేతల గ్రామానికి చెందిన చరిష్మా కోరింది. కోదుల వీరఘట్టం గ్రామానికి కాలువలు నిర్మించాలని గేదెల నరేష్ కోరారు. ఆయిల్ ఇంజిన్ స్ప్రేయర్లు ఇప్పించాలని పెద్దూరుకు చెందిన నిమ్మక నగేష్ వినతి ఇచ్చారు. గజపతినగరానికి చెందిన కమల రేషన్ కార్డు ఇప్పించాలని కోరింది. అంన్వాడీ ఆయా పోస్టుల భర్తీలో ఎస్టీకి బదులుగా ఎస్సీ రిజర్వేషన్ వచ్చిందని, మార్పు చేయాలని దశమంతుపురానికి చెందిన నగేష్ కోరారు. కార్యక్రమంలో పీహెచ్వో ఎస్.వి గణేష్, డిప్యూటీఈఓ నారాయుడు, వ్యవసాయాధికారి వాహిని తదితరులు పాల్గొన్నారు. -
నిడగల్లు నడిచెళ్లాయ్!
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మండలంలోని అడారు ఎంపీపీ పాఠశాల ఆవరణలో మాయమైన టేకు చెట్లు.. దుంగల రూపంలో సీతానగరం మండలం నిడగల్లు వద్ద ఓ సామిల్లులో ప్రత్యక్షమయ్యాయి. ఓ వైపు దీనిమీద ఒక కేసు గాని కేసు నడుస్తున్నా.. నియోజకవర్గ పెద్దలు మాత్రం దర్జాగా దానిని కోత కోసం మిల్లుకు తరలించడం గమనార్హం. ఎక్కడ అడారు.. ఎక్కడ నిడగల్లు! దగ్గరలో ఉన్న మిల్లులో అయితే ఎవరికై నా అనుమానం వస్తుందని కాబోలు... కిలోమీటర్ల దూరం ప్రయాణించి, సీతానగరం మండ లం నిడగల్లు ఊరి చివరన చిన్ని సామిల్లుకు తరలించారు.ఆ కలపే నడిచి వెళ్లిందో.. లేదా కర్రి మహేష్ కు చెందిన ట్రాక్టర్లో రాత్రికి రాత్రి తరలించారో మరి! ఈ విషయం ఊరంతా కోడై కూస్తున్నా అధికారులకు తెలియకపోవడం విడ్డూరం.. వింత!! నియోజక వర్గానికి చెందిన ముఖ్యనేత అడిగీ అడగడంతోనే పార్వతీపురం, సీతానగరం మండలాల ‘తెలుగు తమ్ముళ్లు’ దగ్గరుండి పాఠశాలలకు సెలవు ఇచ్చిన మరుసటి రోజే ఏళ్ల కిందటినాటి టేకు చెట్లను కొట్టించి తీసుకువెళ్లిపోయారు. ఇంటి నిర్మా ణం కోసం.. ప్రభుత్వ స్థలంలో, పాఠశాల ఆవరణలో.. అటవీ శాఖ అనుమతి కూడా లేకుండా రాత్రికి రాత్రే చెట్లు నరికి తరలించుకోవడం గమనార్హం. ఫిర్యాదుకు వెనకడుగు.. పార్వతీపురం మండలంలోని అడారు ఎంపీపీ పాఠశాల ఆవరణలో ఉన్న టేకు చెట్లను గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు నరికేసి తరలించారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.గోపమ్మ రూరల్ పోలీస్ స్టేషన్లో గత శుక్రవారం ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ఈ నెల 26వ తేదీన చెట్లు కొట్టివేశారని.. పాఠశాలలో పనిచేస్తున్న ఆయా తులసమ్మ భర్త ఇచ్చిన సమాచారం మేరకు తాను సహచర ఉపాధ్యాయులతో కలిసి పరిశీలించానని ఆమె చెప్పారు. 12 టేకు చెట్లను నరికించి తరలించుకుపోయారని ఫిర్యాదులో పేర్కొనగా.. రెండు రోజుల కిందట ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేపట్టిన తహసీల్దార్ సీహెచ్ సత్యనారాయణ 14 చెట్లు అని చెప్పడం గమనార్హం. మండలానికి చెందిన టీడీపీ నాయకులే దగ్గరుండి చేయించారని.. వారి పేర్లు సైతం పాఠశాల యాజమాన్య కమిటీకి తెలుసని గ్రామస్తులు చెబుతున్నారు. విద్యాశాఖ అధికారులకు తెలిసే ఇదంతా జరిగిందని అంటున్నారు. అంతా గ్రామ దేవత పండగ హడావిడిలో ఉండగా.. గుట్టుచప్పుడు కాకుండా తరలించుకుపోయారని తెలుస్తోంది. పత్రికల్లో కథనాలు వచ్చినంత వరకూ అధికారులు పరిశీలనకు రాకపోవడం సందేహాలకు తావిస్తోంది. ఏళ్ల నాటి, రూ.లక్షల విలువ చేసే టేకును తరలించినా.. అటవీ శాఖ స్పందన లేదు. కేసు నమోదైనా పోలీసుల నుంచి పురోగతి లేదు. అటవీశాఖ అధికారులు పాఠశాలకు చేరుకుని పరిశీలించినా.. అక్క డ నుంచి ముందుకు వెళ్లకపోవడం.. అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. విష యం బహిర్గతం అయినా.. కేసు నమోదైనా సరే... టేకు దుంగలను దర్జాగా సీతానగరం మండలం నిడగల్లు ఊరి చివరన ఉన్న సామిల్లుకు ట్రాక్టర్లో తరలించారు. వాటికి కోత పూర్తి చేశాక.. నామరూపాలు పోయాక.. తీరిగ్గా విచారణ ముందుకు తీసుకువెళ్తారేమో అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇంటి నిర్మాణం కోసం కనీసం కలప కూడా కొనుగోలు చేసుకోలేని పేదరికంలో టీడీపీ పెద్దలు ఉన్నారని విమర్శిస్తున్నారు.టేకు చెట్ల దొంగల వెనుకున్న వారిని పట్టుకొని శిక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు లు రామస్వామి డిమాండ్ చేశారు. అడారు ఎంపీ పీ స్కూల్ ఆవరణలో దొంగతనంగా నరికిన 14 టేకు చెట్లను సోమవారం పరిశీలించారు. దీని వెనుక చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారని అను మానం వ్యక్తం చేశారు. వెంటనే వారిని శిక్షించాల ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నా యకులు పాలమెట్ట రాము, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి.వరాలు పాల్గొన్నారు. అడారు గ్రామ పాఠశాల ఆవరణలో ఏళ్లుగా పెంచుతున్న టేకు చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పీజీఆర్ఎస్లో వినతి పత్రం అందజేశారు. -
ఆండ్ర భూముల ఆక్రమణ
● పట్టించుకోని యంత్రాంగం ● ఆవేదనలో నిర్వాసిత గిరిజనులు రిజర్వాయర్ భూమిని జేసీబీతో చదును చేస్తున్న దృశ్యం మెంటాడ: మండలంలోని ఆండ్ర రిజర్వాయర్ ముంపు భూములు దురాక్రమణకు గురవుతున్నాయి. జేసీబీతో చదును చేస్తున్నా రెవెన్యూ అధికారులు కనీసం కన్నెత్తి చూడడంలేదు. భూముల ఆక్రమణల వెనుక అధికారపార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెంటాడ మండలంలోని లోతుగెడ్డ, నిక్కలవలస, ఆండ్ర గ్రామాల రెవెన్యూ పరిధిలో సుమారు వెయ్యిఎకరాల విస్తీర్ణంతో ఆండ్ర రిజర్వాయర్ను నిర్మించారు. అవసరమైన భూములను రైతు ల నుంచి సేకరించారు. అయితే, రిజర్వాయర్ వల్ల పూర్తిగా భూములు కోల్పోయిన గిరిజనులు రిజర్వాయర్లో ముంపు కాకుండా ఖాళీగా ఉన్న భూముల్లో వ్యవసా యం చేయడానికి సిద్ధపడితే అప్పటి రెవెన్యూ ఇరిగేష న్ అధికారులు అడ్డుకున్నారు. నిక్కలవలస రెవెన్యూ లో అధికంగా భూములున్న వ్యక్తి చుట్టుపక్కల ఉన్న వాగులు, గెడ్డపోరంబోకు ప్రభుత్వ భూములన్నింటి నీ చదునుచేసి కలిపేసుకున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు రిజర్వాయర్ భూములపై అతని కన్ను పడింది. కిందటి వేసవిలో రిజర్వాయర్లో నీరు తగ్గగానే భూములను చదును చేయడానికి ప్రయత్నిస్తే గిరిజన నిర్వాసితులు అడ్డుకున్నారు. మళ్లీ రెండు రోజుల నుంచి జేసీబీతోల చదును చేస్తున్నారు. నిర్వాసిత గిరిజనులు వెళ్లి అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కిమ్మనకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదెక్కడి అన్యాయం నా భూమి 5 ఎకరాలు రిజర్వాయర్లో కలిసిపోయింది. సెంటు భూమి కూడా మిగల్లేదు. రిజర్వాయర్ ఒడ్డున ఎప్పుడూ నీటి ముంపునకు గురికాని భూములను వ్యవసాయం చేద్దామంటే అధికారులు కుదరదని వెళ్లగొట్టారు. బయటి నుంచి వచ్చి ఈ ప్రాంతంలో భూములను కొనుగోలుచేసి చుట్టు పక్కల ప్రభుత్వ భూములను, రిజర్వాయర్ భూములను ఆక్రమించేస్తున్నా అతడిని మాత్రం రెవెన్యూ అధికారులు ఏమీ అనడంలేదు. – ఇంటి నరసింహులు, నిక్కలవలస, ఆండ్ర రిజర్వాయర్ నిర్వాసిత రైతు చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ భూములు, వాగులు, గెడ్డపోరంబోకు భూములు, రిజర్వాయర్ భూములు ఆక్రమించడం చట్టరీత్యా నేరం. ఆక్రమిస్తే క్షేత్ర పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం. – విజయభాస్కర్, తహసీల్దార్, మెంటాడ -
మూగరోదన..!
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని రైతులు వ్యవసాయంతో పాటు పాడి పోషణకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారు. వ్యవసాయం కలిసి రాకపోయినా పాడిపశువుల ద్వారా పాల విక్రయంతో వచ్చే ఆదాయంతో జీవించవచ్చనేది రైతుల భావన. వ్యవసాయం చేసే ప్రతి రైతు రెండు, మూడు పాడిపశువులను మేపుతుంటాడు. అదేవిధంగా పౌల్ట్రీఫారాలు కూడా జిల్లాలో అధికంగానే ఉన్నాయి. గొర్రెలు, మేకల పెంపకం దారులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఈ మూగ జీవాలకు ఏదైనా జబ్బు చేస్తే వైద్యసేవలు అందించే వారే కరువయ్యారు. జిల్లాలోని అనేక పశువైద్య శాలల్లో పశు వైద్యులు లేరు. దీంతో పశుసంవర్థకశాఖ సహాయకులే దిక్కుగా నిలుస్తున్నారు. దీని వల్ల పశువైద్యులు అందించాల్సిన సేవలు మూగజీవాలకు అందని పరిస్థితి. పశు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటకీ టీడీపీ సర్కార్ భర్తీ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని పశు వైద్యశాలలు జిల్లాలో ప్రాంతీయ పశు వైద్య ఆస్పత్రులు 13 ఉన్నాయి. లైవ్స్టాఫ్ అధికారులున్న గ్రామీణ పశువైద్యశాలలు 40 ఉన్నాయి. జిల్లా ఆస్పత్రి ఒకటి ఉంది. వైద్యులున్న పశు వైద్యశాలలు 64 ఉన్నాయి. అదేవిధంగా సంచార పశు వైద్య శాలలు 13 ఉన్నాయి. పశువుల వివరాలు జిల్లాలో ఆవులు 3,77, 960 ఉన్నాయి. గేదెలు 97, 845 ఉన్నాయి. గొర్రెలు 4,48, 154, మేకలు 1, 56, 511, పందులు 2585, కోళ్లు 51, 26, 764 ఉన్నాయి. 150 రకాల మందులు అందుబాటులో ఉండాలి ఖాళీగా 14 పశువైద్యుల పోస్టులు జిల్లాలో 14 పశువైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఒక ఎ.డి పోస్టు, ఒక వెటర్నరీ లైవ్స్టాఫ్ అధికారి పోస్టు ఖాళీగా ఉన్నాయి. గంట్యాడ మండలం బోనంగి, మెరకముడిదాం, గర్భం, గరివిడి మండలంలోని జి.బొండపల్లి, ఎస్.కోట మండలం బొడ్డవర, దత్తిరాజేరు, దత్తిరాజేరు మండలం మానాపురం, వంగర, వంగర మండలం రాజుల గుమడ, చీపురుపల్లి, మెంటాడ, రామభద్రపురంలో మండలం కొట్టక్కి, రాజాం మండలంలో పొగిరి, సంకలిలో పశువైద్యుల కొరత ఉంది. అదేవిధంగా రాజం ఎ.డి (సహాయ సంచాలకుడు), గంట్యాడ మండలం పెదవేమలిలో వెటర్నీరీ లైవ్స్టాఫ్ అధికారి పోస్టు ఖాళీగా ఉన్నాయి. అందని నాణ్యమైన పశువైద్యం పశువైద్యుల కొరత వల్ల మూగజీవాలకు నాణ్యమైన వైద్యం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ పశు సంవర్థక శాఖ సహాయకులు వారి పరిజ్ఞానం మేరకు చికిత్స అందిస్తున్నారు. పశు వైద్యశాలల్లో వైద్యుల కొరత 14 పశు వైద్యశాలల్లో వైద్యులు లేరు రాజం ఎ.డి పోస్టు కూడా ఖాళీ పశు సంవర్థక శాఖ సహాయకులే దిక్కు జిల్లాలో పశు వైద్య శాలలు 118 జిల్లాలో 3,77,960 అవులు గేదెలు 97,845ఖాళీగా పశువైద్యాధికారి పోస్టులు జిల్లాలో కొన్ని చోట్ల పశు వైద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిక్రూట్ మెంట్ అయితే వైద్యులు వస్తారు. డాక్టర్ ఎన్. దామోదర్రావు, జిల్లా పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ -
ఆపై అవస్థలు
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026● ప్రధాన ఆస్పత్రుల్లో కానరాని సౌకర్యాలు ● సిబ్బంది కొరత తీవ్రం ● రోగులకు అందని సేవలు సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్/కురుపాం/పాలకొండ/పాలకొండ రూరల్/సాలూరు: వాతావరణంలో మార్పులు..తీవ్రమైన వడగాడ్పులు, భరించలేని ఎండ..గ్రామాలు, పట్టణాల్లో వరుస పండగలు..పారిశుద్ధ్య లోపం.. రోగాలు, జ్వరాలు దాడులు చేయడానికి ఇలా అన్నీ కలిసి వస్తున్నాయి. ప్రస్తుతం జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. వైరల్ ఫీవర్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. అక్కడేమో సౌకర్యాలు, వైద్యసేవలు అందక రోగులకు అవస్థలు మిగులుతున్నాయి. జిల్లా ఆస్పత్రి..సామర్థ్యానికి మించి జిల్లా కేంద్రాస్పత్రిపై రోగుల భారం పరిమితికి మించి పెరుగుతోంది. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న పడకల కంటే చికిత్స పొందుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. మొత్తం 172 పడకల (150 సాధారణ, 10 ఎన్.ఆర్.సి, 12 ఎస్.ఎన్.సి.యు) సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో, ప్రస్తుతం వివిధ విభాగాల్లో కలిపి 237 మంది ఇన్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఇది నిర్ణీత సామర్థ్యం కంటే సుమారు 37 శాతం అదనపు భారం కావడం గమనార్హం. ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లోనూ రోగుల తాకిడి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ‘సాక్షి‘ పరిశీలన సమయానికి మాతా శిశు సంరక్షణ (ఓబీజీ) విభాగంలో అత్యధికంగా 89 మంది రోగులు ఉన్నారు. జనరల్ మెడిసిన్ విభాగంలో 47 మంది, సర్జరీలో 29 మంది, పిడియాట్రిక్ విభాగంలో 28 మంది చికిత్స పొందుతున్నారు. శిశు మరణాల నివారణ కేంద్రం (ఎస్ఎన్సీయూ) లో 17 మంది, పోషకాహార పునరావాస కేంద్రం(ఎన్ఆర్సీ)లో 9 మంది చిన్నారులు ఉన్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది లభ్యత లేకపోవడంతో, ఆస్పత్రిలో నర్సింగ్ విద్యార్థుల సేవలు కీలకంగా మారాయి. సాధారణ సిబ్బంది కంటే శిక్షణలో ఉన్న విద్యార్థులే వార్డుల్లో అధికంగా కనిపిస్తున్నారు. మందుల సరఫరా, రోగులకు ఇంజక్షన్లు ఇవ్వడం, ఓపీ స్లిప్పుల నమోదు వంటి కీలకమైన పనుల్లో వారే కనిపిస్తున్నారు. రేడియాలజీ, మైక్రోబయాలజీ వంటి కొన్ని ప్రధాన విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న వనరులు, విద్యార్థుల సహాయంతోనే ప్రస్తుత వైద్య సేవలు కొనసాగుతున్నాయి.. సాలూరులో ఇటీవల నూతనంగా ఏరియా ఆస్పత్రి ప్రారంభించినప్పటికీ..మౌలిక వసతుల లేమి కనిపిస్తోంది. ఇటీవల ఓ క్షతగాత్రుడికి అత్యవసర వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడగా.. ఆస్పత్రిలో సీటీ స్కాన్ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో విజయనగరానికి రిఫర్ చేశారు. పూర్తిగా పనులు జరగకుండానే ఆస్పత్రి ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఇప్పటివరకు వినియోగంలోకి రాలేదు. అధికార పార్టీ గొప్పల కోసం పనులు పూర్తి కాకముందే ఆస్పత్రిని ప్రారంభించారన్న విమర్శలు ఉన్నాయి. కురుపాం నియోజక కేంద్రంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం కొమరాడ మండలాల నుంచి అధిక సంఖ్యలో రోగులు వివిధ సమస్యలతో ఆశ్రయిస్తుంటారు. రోగులకు సరిపడా పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఇక్కడ లేవు. ఒకే పడకపై ఇద్దరు రోగులు చొప్పున చికిత్స పొందడం పరిపాటిగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అదనపు భవనాల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం నేటికీ వాటిని అందుబాటులోకి తీసుకురాకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు -
అనారోగ్యంతో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి
వేపాడ: మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గల్లా షణ్ముఖరావు (29) అనారోగ్యంతో అస్పత్రి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. ఇందుకు సంబంధించి స్థానికులు కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గల్లా షణ్ముఖరావు 2021 సీఆర్పీఎఫ్ జీడీ కానిస్టేబుల్గా విశాఖపట్నం 198 బెటాలియన్లో పనిచేస్తున్నారు. అనారోగ్యంగా ఉండడంతో మిలట్రీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. దీంతో సీఆర్పీఎఫ్ సీఐ డి.కృష్ణారావు ఆధ్వర్యంలో సైనికలాంఛనాలతో బొద్దాం శ్మశాన వాటికలో ఆదివారం సాయంత్రం గౌరవవందనం చేస్తూ గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు నిర్వహించి అంత్యక్రియలు చేపట్టారు. అనంతరం జాతీయ జెండాను షణ్ముఖరావు తల్లిదండ్రులు వెంకటరమణ ముత్యాలమ్మకు అందజేశారు. సీతంపేట: మండలంలోని వాబ జంక్షన్ వద్ద గురువారం ద్విచక్రవాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో గాయపడిన పాలకొండ మండలం జంపరకోటకు చెందిన వరలక్ష్మి (55) శ్రీకాకుళం రిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమె భర్త జీలకర్ర మోహన్రావు సంఘటన స్థలంలోనే మృతిచెందిన విషయం విదితమే. గాయపడిన వరలక్ష్మి మృతిచెండంతో జంపరకోటలో మరోమారు విషాదఛాయలు అలముకున్నాయి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు -
పాలకొండ ఆస్పత్రికి వెళ్తే.. వేచి ఉండాల్సిందే
డివిజన్ కేంద్రం పాలకొండ ఏరియా ఆస్పత్రిలో ఫిజీషియన్ కొరత రోగులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇక్కడ ఉండాల్సిన వైద్యుడు ఇన్చార్జిగా వేరే చోట పని చేస్తుండడంతో ఆ విభాగానికి సంబంధించి ఆస్పత్రికి వస్తున్న రోగులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అభివృద్ధి పనుల పేరిట జరుగుతున్న అంతర్గత నిర్మాణాలతో రోగులకు దుమ్ము, ధూళి తప్పడం లేదు. అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో 25 మంది వైద్యులు సేవలు కొనసాగిస్తున్నారు. రోగులకు ఇబ్బంది లేకుండా సేవలు కొనసాగిస్తున్నాం. మందులు కూడా పూర్తిస్థాయిలో ఉన్నాయి. – డాక్టర్ కె.చిరంజీవి, సూపరింటెండెంట్, పాలకొండ ఆస్పత్రి కురుపాం సామాజిక ఆరోగ్యకేంద్రం -
మీకోసం వెబ్సైట్లో పీజీఆర్ఎస్ అర్జీల నమోదు
పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కారవేదికలో(పీజీఆర్ఎస్) అర్జీల వివరాల మీకోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని కార్యాలయల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతిరోజూ వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక సెల్లార్ను ఏర్పాటుచేశామన్నారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నదు చేసుకోవచ్చునన్నారు. అర్జీల స్థితిని 1100 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని తెలిపారు. పారిశుధ్య కార్మికులకు నేడు మెగా మెడికల్ క్యాంప్ పార్వతీపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల కోసం మే 4న సోమవారం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్రెడ్డి ఆదివారం తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో మెగా వైద్యశిబిరం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందన్నారు. శిబిరంలో నిపుణులైన వైద్యులతో పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేయనున్నారన్నారు. పారిశుధ్య కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కదలని ఏనుగులుగరుగుబిల్లి: గడిచిన పదిరోజుల నుంచి ఏనుగులు ఈ ప్రాంతంనుంచి కదలకపోవడంతో ప్రజలు భీతిల్లుతున్నారు. గరుగుబిల్లి మండలంలోని నందివానివలస, తోటపల్లి, ఖడ్గవలస, నాగూరు తదితర గ్రామాల్లో ఏనుగులు సంచరించి పలు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. అయితే మండలంనుంచి ఏనుగులు వెళ్లకపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులనుంచి తోటపల్లి, నందివానివలస, గిజబ గ్రామాలలో సంచరిస్తున్న ఏనుగులు తాజాగా ఆదివారం నందివానివలసలోని పంట పొలాల్లో దర్శనమిచ్చాయి. ప్రస్తుతం పొలంలో అరటి, పామాయిల్, మొక్కజొన్న, వేరుశనగ తదితర పంటలు ఉండడంతో ఎప్పుడు ఏ పంటలకు నష్టం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. తెర్లాం: మూడుముళ్ల బంధం... ఏడడుగుల అనుబంధం... జన్మజన్మలకు తీరని రుణానుబంధం...అదే దాంపత్య బంధం. పెద్దలు చెప్పినట్టుగానే ఆ దంపతులు మరణంలోనూ బంధాన్ని వీడలేదు. అనారోగ్యంతో ఒక్కటిగా చనిపోయారు. అదీ ఆదివారం గంటల వ్యవధిలోనే... ఈ ఘటన తెర్లాం మండలం గొలుగువలసలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే...గొలుగువలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు సాకేటి రామకృష్ణ(65), సింహచలం(60) ఆదివారం కొన్ని గంటల వ్యవధిలోనే మరణించారు. వీరిరువురు 40 సంవత్సరాలుగా దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో ఒకరికొకరు తోడునీడగా ఉన్నారు. కొద్ది రోజులు కిందట వీరిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం వారం రోజుల కిందట శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి బంధువులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామకృష్ణ భార్య సింహాచలం మృతి చెందింది. ఈ క్రమంలో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామకృష్ణ ఆరోగ్యం కొద్దిగా మెరుగు పడడంతో ఆయనను సొంత గ్రామమైన గొలుగువలసకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి రామకృష్ణను ఆటోలో తీసుకువస్తుండగా భార్య సింహాచలం మరణించిందని తెలియడంతో మార్గమధ్యలోనే ఆయన కూడా మరణించాడు. భార్యాభర్తలిద్దరూ నాలుగు గంటల వ్యవధిలోనే మృతి చెందారన్న విషయం గ్రామస్తులకు తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నలభై ఏళ్లుగా ఒక్కటిగా కలసిమెలసి దాంపత్య జీవనం సాగించిన ఇద్దరూ మరణంలోనూ ఆ బంధాన్ని వీడలేదని బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
అదనపు సాయం ప్రకటించి.. లక్షణంగా పక్కన పెట్టి..!
నిజంగా నిద్రపోయే వారిని నిద్ర నుంచి ఎవరైనా లేపగలరు. దొంగ నిద్ర నటించే వారిని నిద్ర లేపడం ఎవరి తరమూ కాదన్నట్లుంది ప్రభుత్వం తీరు. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలకు సొంతగూడు కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం నిధులు సమకూర్చినప్పటికీ అదనపు సాయం చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడంలో గిరిజనులకు మొండిచేయి చూపుతోంది.సీతంపేట: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి పక్కా గృహాలు లేని పీవీటీజీ (పర్టికులర్లీ వలనర్బుల్ ట్రైబ్గ్రూప్)లకు ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం చర్యలు తీసుకుంది. పీఎం జన్మాన్ పథకం పేరిట కేంద్ర ప్రభుత్వం ఒక్కో గృహానికి రూ.2.39 లక్షలు అందిస్తుంది. మూడు విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమచేస్తుంది. చంద్రబాబు సర్కార్ కూడా దానికి అదనంగా రూ.లక్ష అదనపు సాయం మంజూరు చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి 2024 డిసెంబర్ 10వ తేదీన జీవో కూడా జారీ చేశారు. గిరిజనులు ఎంతో ఆశతో ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని ఆశించారు. వారి ఆశలు ఎదురు చూపులు గానే మిగిలాయి. ఏడాదిన్నర గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఒక్కపైసా కూడా అదనపు నిధులు విడుదల చేయలేదు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 1748 ఇళ్లు మంజూరయ్యాయి. కేవలం 233 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులు పూర్తి చేశారు. 336 మంది పునాదులు నిర్మించారు. రూఫ్ లెవెల్ 450 మంది లబ్ధిదారులు నిర్మించారు. శ్లాబ్ స్థాయి 361 మంది ఉన్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభించిన వారు 368 మంది ఉన్నారు. ఒక్కో ఇంటికి పునాదులు వరకు నిర్మిస్తే రూ.70 వేలు, రూఫ్ స్థాయిలో రూ.90 వేలు, శ్లాబ్ నిర్మిస్తే రూ.40 వేలు, ఎన్ఆర్ఈజీఎస్ రూ.27 వేలు, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు చెల్తించాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఆదివాసీలు.. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష సాయం అందిస్తామని జీవో జారీ చేయడంతో పీఎం జన్మాన్ పథకంలో గృహ లబ్ధిదారులైన ఆదివాసీలు ఎంతో ఆనందించారు. ఇంటి నిర్మాణం ఉత్సాహంగా ప్రారంభించారు. ఇప్పుడు ఆ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కానీ కూటమి సర్కారు మాట నిలుపుకోకపోవడంతో గిరిజనులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. యుద్ధ ప్రభావంతో నిర్మాణ సామగ్రి అయిన ఇసుక, సిమ్మెంట్, ఇటుక, చిప్స్, ఇనుము ధరలు ఆకాశన్నంటుతున్నాయి. అలాగే కూలీల ఖర్చులు పెరగడంతో కేంద్రం ఇచ్చే ప్రోత్సాహక నిధులు ఎటూ సరిపోక పోవడంతో ఇంటినిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి ఉందని గిరిజనులు చెబుతున్నారు. ఆదివాసీలు నిర్మించుకునే ఇళ్లకు ప్రస్తుతం ఇస్తున్న నిధులు ఎటూ సరిపోవడం లేదు. అదనపు సాయం చేస్తామని జీవో జారీ చేసి ఇంతవరకు ఆ విషయం పట్టించుకోకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. వెంటనే ఆదనపు ఆర్థికసాయం అందించాలి. కొన్ని చోట్ల లబ్ధిదారులకు సాధారణ బిల్లులు కూడా ఇళ్లు నిర్మించిన వాటికి చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటికై నా పూర్తిస్థాయిలో గిరిజనులకు ఆర్థికసాయం అందేలా చూడాలి. విశ్వాసరాయి కళావతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే హౌసింగ్ లబ్ధిదారులకు ప్రోత్సాహం ప్రకటించి విడుదల చేయని ప్రభుత్వం జీవో జారీ చేసి ఏడాదిన్నరైనా విడుదల కాని నిధులు గిరిజనులకు మిగులుతున్న ఎదురుచూపులు ముందుకు సాగని ఇళ్లనిర్మాణం అదనపు సాయం నిధులు ఇంకా రావాల్సి ఉంది. మంజూరైన వెంటనే బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు గిరిజనులు వివిధ దశల్లో నిర్మించిన ఇళ్లకు బిల్లులు చెల్లిస్తున్నాం. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. సీహెచ్.వెంకటేష్, హౌసింగ్ ఏఈ, సీతంపేట -
పోలీస్ సిబ్బంది కావలెను..!
బొబ్బిలి: సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయం బొబ్బిలి పరిధిలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇరుకు రోడ్లున్న బొబ్బిలిలో ట్రాఫిక్తో పాటు శాంతి భద్రతల పర్యవేక్షణ వంటి అంశాల్లో పర్యవేక్షణకు ఉన్న కొద్దిపాటి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పూర్తిస్థాయిలో ఉన్న పోలీస్ యంత్రాంగం దాదాపు సగానికి తగ్గినట్లనిపిస్తోంది. విచిత్రమేమిటంటే మండల కేంద్రాల్లో ఉండాల్సిన ఎస్సైల పోస్టులకు కూడా అధికారులను నియమించడం లేదు. పక్క స్టేషన్ల ఎస్సైలకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగిస్తున్నారు. సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే యువత, ఇతర బాధ్యతారాహిత్య వ్యక్తుల వల్ల రోడ్డు ప్రమాదాలు, క్షణికావేశంలో పరస్పరం దాడులు సంభవించే పరిస్థితులు ఇప్పుడు సాధారణమైపోయాయి. ఇటువంటి సమయంలో పూర్తిస్థాయి సిబ్బంది ఉంటే పర్యవేక్షణ సులువవుతుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత శాంతి భద్రతల పర్యవేక్షణకు ఉండాల్సిన సిబ్బంది నియామకంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరు ఎస్సై పోస్టులు ఖాళీ బొబ్బిలి సబ్ డివిజన్లో 9 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్లలో సిబ్బంది కొరత ఉండడం సాధారణమే. కానీ ఏకంగా ఆరు ఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బొబ్బిలి ఎస్సై ఆర్ రమేష్ కుమార్ వీఆర్కు పంపించారు. అలాగే మరో ఎస్సై ఉండాలి కానీ నేటికీ నియామకం కాలేదు. ఇక వుమెన్ ఎస్సైగా రెండేళ్ల కిందట ఒకామె విధులు నిర్వహిస్తుండగా ఆమెను దిశ పోలీస్స్టేషన్కు బదిలీ చేసి నేటికీ ఎవరినీ నియమించలేదు. ఇక్కడే ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వహించిన జ్ఙాన ప్రసాద్ను రామభద్రపురం బదిలీ చేశారు. అలాగే బాడంగి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న తారకేశ్వర రావును సీసీఎస్కు బదిలీ చేశారు. తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్ను అరెస్టుచేసే క్రమంలో జరిగిన రాజకీయ బదిలీగా దీనిని చెప్పుకుంటున్నారు. అలాగే మానాపురం ఎస్సై జయంతిని క్రైమ్ పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు. వారితో పాటు దత్తిరాజేరు మండలం బూర్జి వలస ఎస్సై రాజేష్ను కూడా సీసీఎస్కు పంపించారు. దీంతో సబ్ డివిజన్ మొత్తంలో ఉన్న 9 పోలీస్స్టేషన్లలో 6గురు ఎస్సైలు లేనట్లు లెక్క. శాంతిభద్రతల విషయంలో నిత్యం ఉండాల్సిన పోలీసుశాఖలో సిబ్బందిని ఎందుకనో నియమించడం లేదు. దీనిపై ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదని ప్రజానీకం విమర్శిస్తోంది. ఇలా వచ్చి అలా సెలవుపై వెళ్లిపోయి.. బొబ్బిలి ట్రాఫిక్ ఎస్సై జ్ఞానప్రసాద్ను రామభద్రపురం బదిలీ చేశారు. ఎందుకంటే అక్కడ అప్పటికే ఉన్న వెలమల ప్రసాదరావు స్థానిక నాయకులకు నచ్చలేదన్న కారణంతో కూటమి ప్రభుత్వం వీఆర్కు పంపించేలా చర్యలు తీసుకుందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో బొబ్బిలికి తీవ్రమైన ట్రాఫిక్ కారణంగా ఎల్.కోట ఎస్సైగా పనిచేసిన సీహెచ్ నవీన్ పడాల్ను ఇక్కడ ట్రాఫిక్ ఎస్సైగా నియమించారు. సరిగ్గా దాడితల్లి అమ్మవారి పండగ ముందు రోజు విధుల్లో చేరిన ఆయన పండగ ముగిసిన వెంటనే మరో చోట పోస్టింగ్ ప్రయత్నాలకోసం సెలవుపై వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు బొబ్బిలి సర్కిల్ కార్యాలయంలో ఇద్దరు ఎస్సైలు, ఒక వుమెన్, ఒక ట్రాఫిక్ ఎస్సై లేరు. ఏఎస్సైలు, కానిస్టేబుళ్లతోనే సీఐ నారాయణ రావు నెట్టుకొస్తున్నారు. మరో విషయం ఏంటంటే బొబ్బిలి సర్కిల్ కార్యాలయానికి 72 మంది సిబ్బంది (పేట్రన్ ) ఉండాలి. ఆ మేరకు పోస్టులు మంజూరై ఉన్నాయి. కానీ ఇప్పుడు అందులో సగం మంది కూడా లేరు. మొత్తంగా చూస్తే బొబ్బిలి డివిజన్కు 30 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. మే నెలలో అమ్మవార్ల పండగలున్నాయి. సోమవారం నుంచి మండలంలోని మెట్టవలసలలో పండగ ఉంది. మొన్న దాడితల్లి అమ్మవారి పండగ లాగానే ఇక్కడ కూడా ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని తీసుకు రావాల్సి వస్తోంది. బొబ్బిలి డివిజన్లో ఆరు ఎస్సై పోస్టులు ఖాళీ విధుల్లో చేరిన వెంటనే సెలవులో ట్రాఫిక్ ఎస్సై జాడే లేని వుమెన్ ఎస్సై అదే కోవలో బాడంగి, బూర్జివలస, మానాపురం స్టేషన్లు నియామకానికి ప్రాధాన్యమివ్వని కూటమి సర్కార్ -
పదో తరగతి టాపర్లకు ఘనంగా సత్కారం
విజయనగరం అర్బన్: పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో అధికమార్కులు తెచ్చుకున్న పలువురు విద్యార్ధులకు కలెక్టరేట్లోని సమావేశ మందింరంలో ఆదివారం ఘనంగా సత్కారం జరిగింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల నుంచి ప్రతిభ కనపరిచిన 68 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి వంతున నగదు ప్రోత్సాహకం, మెరిట్ సర్టిఫికెట్ అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులను కూడా ప్రత్యేకంగా గౌరవించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను అభినందించారు. ముఖ్య అతిథులుగా విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు విజయభాస్కర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు డాక్టర్ గాదె శ్రీనివాసులునాయుడు, వేపాడ చిరంజీవిరావు, డీఈఓలు, విద్యావేత్తలు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన ‘నీట్’
విజయనగరం అర్బన్: జిల్లాలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశ పరీక్ష నీట్–యూజీ 2026 ఆదివారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,824 మంది అభ్యర్థులు నమోదు చసుకోగా 1,790 మంది హాజరై పరీక్ష రాశారు. 34 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. పరీక్ష నిర్వహణను పర్యవేక్షించేందుకు నియమితులైన జిల్లా జాయింట్ కలెక్టర్ (నోడల్ అధికారి) సేతు మాధవన్ పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్, విద్యాశాఖ సహా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసినట్లు అధికారులు తెలిపారు. గోడకూలి ఇద్దరికి గాయాలుసీతానగరం: మండలంలోని తామరఖండి గ్రామంలో ఇంటిపని చేస్తుండగా ఆదివారం గోడకూలి ఇద్దరు మేసీ్త్రలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తామరఖండిలో బొంగు తవిటినాయుడు ఇంటిపనికి బొబ్బిలికి చెందిన కర్రి సింహాచలం, కర్రి లక్ష్మణ వచ్చారు. ఆదివారం ఉదయం పని ప్రారంభించి పాత ఇంటి గోడల మధ్య కాలమ్స్ కడుతుండగా ఆదేఇంటికి సంబంధించిన పాతగోడ కూలి పోయి ఇటుక బెడ్డలు ఆ ఇద్దరిపై పడడం వల్ల గాయాలయ్యాయి. క్షతగాత్రులు సింహాచలం, లక్ష్మణలను 108 వాహనంలో చికిత్సనిమిత్తం పార్వతీపురం జిల్లాకేంద్రాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సింహాచలం పరిస్థితి విషమించడంతో విజయనగరం మహరాజా ఆస్పత్రికి తరలించగా లక్ష్మ ణ పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కీసరలో ఏనుగుల విధ్వంసంభామిని: మండలంలోని కీసరలో నాలుగు ఏనుగులు ఆదివారం పంటలు ధ్వంసం చేసి నష్టంకలిగించాయని రైతులు వాపోతున్నారు. ఏనుగులు గతంలో మొక్కజొన్న పంటనే తినివేసేవి. ప్రస్తుతం రైతులు ఆలుగాలం శ్రమించి పండించి ఆరబెట్టిన మొక్కజొన్న గింజలపై ప్రతాపం చూపాయి. గ్రామం చుట్టూ ఆరబెట్టిన మొక్కజొన్న కళ్లాల్లో విచ్చల విడిగా తిరుగాడుతూ ఆరబెట్టిన గింజలను ధ్వంసం చేసి బస్తాల్లో కుట్టిన మొక్కజొన్న గింజలను పాడు చేశాయి. జొన్న గింజల బస్తాలను నాలుగు పక్కలను విసిరివేస్తూ పాడు చేశాయి. పంటలు ఇంటికి చేరే సమయంలో ఏనుగులు విధ్వంసం చేయడాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్యవిజయనగరం క్రైమ్: స్థానిక తోటపాలెం నివాసి బూర రాము (44) తన కంపెనీలో ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి రూరల్ ఎస్సై అశోక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వీటీ అగ్రహారంలో సిల్వర్ గిన్నెల కంపెనీ నడుపుతున్న రాము మొదటి భార్య మృతి చెందగా, రెండో భార్య సంధ్య, ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడు. కంపెనీ కోసమని రూ.యాభై లక్షల వరకు అప్పు చేశాడు. అయితే కంపెనీ టర్నోవర్లో తీవ్ర నష్టం రావడం, తీసుకున్న అప్పులు సకాలంలో కట్టలేకపోవడంతో మనస్తాపం చెంది కంపెనీలోనే రాడ్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అశోక్ తెలిపారు. -
మూడోరోజూ.. ముచ్చెమటలు..!
పాలకొండ: పాలకొండ సబ్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో గ్రామీణ ప్రాంత ప్రజలకు విద్యుత్ కష్టాలు తీరలేదు. శుక్రవారం మధ్యాహ్నం వీచిన గాలివాన కారణంగా నిలిచిన విద్యుత్ సరఫరా ఆదివారం నాటికి పునరుద్ధరణ జరగలేదు. శనివారం రాత్రికి నగర పంచాయతీలో పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేసిన అధికారులు గ్రామీణ ప్రాంతాలకు మాత్రం ఆదివారం రాత్రి వరకు విద్యుత్ అందించలేదు. ప్రధానంగా సీతంపేట ఫీడర్ పరిధిలోని సింగన్నవలస, పరశురాంపురం, వెలగవాడ, సిరికొండ, రుద్రిపేట తదితర గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. మూడు రోజులపాటు కరెంటు సరఫరా లేకపోవడంపై గ్రామీణ ప్రాంతాల ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు కనీసం ఫిర్యాదులకు కూడా అందుబాటులో లేరని ఆరోపిస్తున్నారు. రాత్రి సమయాల్లో విద్యుత్ లేని కారణంగా జాగారం చేస్తున్నామని వాపోతున్నారు. ఈ విషయమై విద్యుత్ శాఖ ఏఈ యోగి వద్ద ప్రస్తావించగా మరమ్మతు పనులు జరుగుతున్నాయని తెలిపారు. మరో రోజులో గ్రామీణ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. -
రహదారి భద్రతపై ప్రతిజ్ఞ
సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీతంపేట మండలంలోని కుశిమి కూడలి వద్ద రహదారి భద్రతపై ఆదివారం పాలకొండ సీఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించినట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు డ్రైవింగ్కు ఇవ్వవద్దని సీఐ సూచించారు. రోడ్డు నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఓవర్ స్పీడ్ వెళ్లవద్దని, ఘాట్రోడ్లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని హితవు పలికారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
విదేశీ అతిథులు వచ్చేశాయ్..
బొండపల్లి: ఎక్కడో వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశం కాని దేశం నుంచి పక్షులు మండలానికి వచ్చేశాయి. కొన్నేళ్లుగా సైబీరియా దేశం నుంచి పక్షులు మే నెల ప్రారంభంలోనే వచ్చి సందడి చేస్తుంటాయి. మండల కేంద్రంలోని రాజు చెరువులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహర వేటలో ఉండే ఈ పక్షులు రాత్రి కాగానే గజపతినగరం మండలం లోగిశ గ్రామంలోని చింతచెట్ల పైకి చేరుకుని సేద తీరుతాయి. ఈ పక్షులు రావడాన్ని ఇటు బొండపల్లి, అటు లోగిశ ప్రజలు శుభసూచికంగా భావిస్తారు. ఇక్కడకు వచ్చిన పక్షులు గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను చేసిన తర్వాత అక్టోబర్ సమయంలో తిరిగి స్వదేశానికి వెళ్లిపోతాయి. ఇక్కడి ప్రజలు పక్షులకు ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా నడుచుకోవడం విశేషం. చేయనున్న సైబీరియా పక్షులు -
ఎస్టీ కమిషన్ ముందుకు జిందాల్ విచారణ
శృంగవరపుకోట: జిందాల్ భూముల సేకరణ వ్యవహారంలో జరుగుతున్న అవకతవకలపై విచారణకు హాజరు కావాలని ఎస్టీ కమిషన్ నుంచి జిల్లా అధికారులకు సమన్లు అందినట్లు ఎమ్మెల్సీ రఘురాజు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన బొడ్డవరలోని తన నివాసంలో మాట్లాడుతూ హైదరాబాద్లోని దిల్కుషా గెస్ట్హౌస్లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ నేతృత్వంలో జరగనున్న విచారణకు తాను హాజరవుతున్నట్లు చెప్పారు. గతంలో నాలుగు దఫాలు విచారణకు షెడ్యూల్ జారీ చేసినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు గైర్హాజరు కావడం వల్ల విచారణ జరగలేదన్నారు. జిల్లా అధికారుల గైర్హాజరును తీవ్రంగా పరిగణించిన కమిషన్ ఈ దఫా కచ్చితంగా హాజరు కావాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ దఫా విచారణలో వాస్తవాలు వెలుగు చూసి నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్వాసితుల పోరాటానికి స్థానిక ప్రజాప్రతినిధులు సంపూర్ణ మద్దతు ప్రకటించారని, మార్చి 30న వాయిదా పడిన ఎస్టీ కమిషన్ పర్యటనను త్వరలోనే పునరుద్ధరించాలని, కమిషన్ స్వయంగా బాధిత ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయి వాస్తవాలను వెల్లడించాలని ఆయన కోరారు. అధికారులు కమిషన్ ఎదుట వాస్తవాలు మాట్లాడితే నినర్వాసితులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఉద్యమ నేతకు ఘనంగా నివాళి
విజయనగరం గంటస్తంభం: గిరిజనులు, వ్యవసాయ కార్మికులు, షాపు ఉద్యోగుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన సీపీఎం నేత రెడ్డి శ్రీరామమూర్తి ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. రెడ్డి శ్రీరామమూర్తి 5వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎల్బీజీ భవనంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని శ్రీరామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆయన మరణం ఉమ్మడి జిల్లా ఉద్యమాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ గిరిజనులు, కార్మికులు, షాపు ఎంప్లాయీస్ హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని కొనియాడారు. కురుపాం నియోజకవర్గంలో సీపీఎం విజయంలో ఆయన పాత్ర విశేషమని గుర్తచేశారు. వ్యవసాయ కార్మిక, గిరిజన, కార్మిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి చివరి రక్తబొట్టు వరకు ప్రజల కోసం అంకితభావంతో పని చేశారన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.జగన్మోహనరావు, రాము, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
పారని పథకం
● తాగునీటికి ఆదివాసీల విలవిలభామిని: వేసవి తాపంతో అల్లాడుతున్న తరుణంలో తాగునీటి కోసం భామిని మండలంలోని కోటకొండ, కోసింగూడ ఆదివాసీ గ్రామాల గిరిజనులు అల్లాడుతున్నారు. తివ్వాకొండల పైకి నీరు అందించే మినీరక్షిత నీటి పథకాలు మరుగున పడడంతో తాగునీరు లేక ఆదివాసీలు నానా అవస్థలు పడుతున్నారు. రోజువారీ అవసరాలకు, తాగడానికి సుమారు మూడు కిలోమీటర్లు కొండ దిగి నూతి నుంచి నీరు తెచ్చుకుంటున్నామని గిరిజనులు వాపోతున్నారు. నూతిలో ఊట కోసం పడిగాపులు పడుతున్నట్లు విలపిస్తున్నారు. తాము తాగునీటి కోసం పడుతున్న శ్రమను అధికారులు గుర్తించి తాగునీటి సమస్యను వెంటనే తీర్చాలని అధికారులను వేడుకుంటున్నారు. గర్భిణులు, వృద్ధులు నీరు తెచ్చుకోలేక నానా అవస్థలు పడుతున్నాయని వాపోతున్నారు. గొంతు తడుపుకోవడానికి మూడు కిలోమీటర్లు కొండ దిగి నూతి నీరు తెచ్చుకోవలసి వస్తోంది. వృద్ధులు.గర్భిణులు నానా అవస్థలు పడుతున్నారు. నూతి దగ్గర గంటల కొద్దీ పడిగాపులు పడుతూ నీరు తోడుతున్నాం. మాకు నీటి బాధలు తప్పించాలి. –ఆరికి రాణి, ఆదివాసీ గిరిజన యువతి, కోటకొండ -
పరిహారం.. పరిహాసం..!
● రైతన్నకు అందని పంట నష్టపరిహారం ● విపత్తుల వేళ పంటలు కోల్పోయినా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ● ఎందుకీ ‘పచ్చ’పాతం అంటూ ఆవేదన వీరఘట్టం: ● గతేడాది ఖరీఫ్లో సంభవించిన మోంథా తుఫాన్ రైతన్నను నిలువునా ముంచేసింది. అపార పంట నష్టం కలిగించింది. ప్రభుత్వం నుంచి పైసా పరిహారం అందలేదు. ● ఇటీవల ఈదురుగాలులతో కూడిన వానలు ఉద్యానవన పంటలు సాగుచేసిన రైతుల నడ్డి విరిచాయి. మొక్కజొన్నతో పాటు అరటి, బొప్పాయి, జీడిమామిడి, మామిడి పంటలకు నష్టం చేకూర్చాయి. రైతన్న ఆవేదన చెందుతున్నా పరిహారం అందుతుందన్న ధీమా లేదు. ఆదుకుంటారన్న నమ్మకం కలగడంలేదు. రైతు సంక్షేమమే లక్ష్యమంటూ ఎన్నికల్లో గొప్పలు చెప్పిన కూటమినేతలు ఓట్లు దండుకున్నాక మొఖం చాటేశారు. రైతన్న సాగు కష్టాలు ఎదుర్కొంటున్నా కనికరం చూపడం లేదు. గిట్టుబాటు ధరతో పాటు విపత్తుల వేళ ఆదుకునేదిశగా కనీస చర్యలు తీసుకోవడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసి బీమా ధీమా లేకుండా చేశారు. కొందరు రైతులు ప్రీమియం చెల్లించినా బీమా అందని పరిస్థితిని తీసుకొచ్చారు. చంద్రబాబు నోటివెంట తరచూ వచ్చే సాగుదండగన్న మాటను నిజంచేస్తున్నారని రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. పంటలు పాడైనా... గతేడాది అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులకు జిల్లా వ్యాప్తంగా సుమారు 6,250 ఎకరాల్లో అరటి పంటకు నష్టం జరిగినట్లు ఉద్యానవన శాఖ అధికారులు గుర్తించారు. అలాగే, గతేడాది అక్టోబర్ నెలాఖరులో సంభవించిన మోంథా తుఫాన్ జిల్లా రైతాంగానికి వణుకు పుట్టించింది. తుఫాన్ ప్రభావంతో వీచిన ఈదురు గాలులకు వేల ఎకరాల్లో పంటల నష్టం జరిగింది. అయితే అధికార యంత్రాంగం మాత్రం కేవలం 815 ఎకరాల్లో మాత్రమే అరటి, వరి, తదితర పంటకు నష్టం జరిగినట్లు పంటల నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. అయినా ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ కూడా పంట పరిహారం అందలేదు. అయితే, తుఫాన్కు వాతావరణశాఖ నామకరణం చేయలేదన్న సాకును చూపి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయకపోవడం గమనార్హం. ● శుక్రవారం ఈదురుగాలులు భయానకంగా వీచాయి. గాలుల ధాటికి మామిడి, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. వీరఘట్టం, పాలకొండ, సీతంపేట, భామిని, కురుపాం, మక్కువ, సాలూరు మండలాల్లో 10 వేల ఎకరాల్లో మామిడి పంట నేలమట్టమైందని రైతులు చెబుతున్నారు. జియ్యమ్మవలస, కురుపాం, గరుగుబిల్లి, వీరఘట్టం మండలాల్లో 1000 ఎకరాల్లో అరటి, 50 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఇంత జరిగినా ఆదుకునే చర్యలు కానరాకపోవడం రైతుల ను ఆవేదనకు గురిచేస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతును రాజుగా చూసేదని, సాగుకు అండగా నిలిచేదని గుర్తుచేసుకుంటున్నారు. వీరఘట్టం మండలం అచ్చెపువలస సమీపంలో 1.5 ఎకరాల్లో మామిడి తోట ఉంది. మరో వారం రోజుల్లో కోత కోద్దామని అనుకున్నాను. ఇంతలో శుక్రవారం పెను ఈదురుగాలు వీయడంతో కాయలు మొత్తం రాలిపోయాయి. సుమారు రూ.80 వేలు ఆదాయం వస్తుందనుకున్నాను. కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – ఆరిక కామేశ్వరావు, రైతు, అచ్చెపువలస, వీరఘట్టం మండలం50 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వీరఘట్టం, పాలకొండ మండలాల్లో 50 ఎకరాల మామిడి తోటలను రైతుల వద్ద కౌలుకు తీసుకున్నాను. శుక్రవారం వీచిన గాలులకు కాయలు మొత్తం రాలిపోయాయి. సుమారు రూ.3 లక్షల వరకు నష్టం వస్తుంది. అధికారులు పరిశీలించి ఆదుకోవాలి. – సొండి అనీల్, మామిడి రైతు, వీరఘట్టం పంటల నష్టం జరిగినప్పుడు బాధిత రైతులు సమీపంలో ఉన్న సచివాలయంలో తెలియజేయాలి. అప్పుడు అధికారులు వచ్చి జరిగిన పంటల నష్టాన్ని పరిశీలిస్తారు. తద్వారా పంటల నష్టం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం. – సత్యన్నారాయణ రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖాధికారి, పార్వతీపురం మన్యం గతేడాది వచ్చిన మోంథా తుఫాన్కు 3 ఎకరాల్లో క్యాబేజీ, 2 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. పంట నష్టం వివరాలను అధికారులకు తెలియజేశారు. వివరాలు అన్నీ రాసుకున్నారు. ఈ రోజు వరకు నాకు పంట నష్టం చిల్లిగవ్వ కూడా అందలేదు. – కర్రి సింహాచలం, రైతు, వీరఘట్టం -
రైల్వేగేటు సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
సీతానగరం: మండలంలోని విశాఖ – రాయగడ రైల్వేలైన్లో జగ్గునాయుడుపేట(ఆర్.వెంకంపేట) గేటు సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్టు స్థానికులు శనివారం గుర్తించారు. రైల్వే పోలీసులు అందించిన వివరాలు.. జగ్గునాయుడుపేట ఎల్సీ గేటు సమీపంలో గుర్తు తెలియని 45 ఏళ్లు పైబడిన పురుషుడు గుర్తు తెలియని రైలు బండి నుంచి జారిపడి లేదా రైలు ఢీకొని మృతి చెంది ఉంటాడని తెలిపారు. మృతుడు వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొన్నారు. తెలుగు రంగు ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నలుపు రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. అతని వద్ద రైల్వే టికెట్ లభించిందని అది బ్రహ్మపూర్ నుంచి సూరత్ టిక్కెట్ అని తెలిపారు. వివరాలు తెలిసిన వారు 92475 85742, 94918 13163, 83099 01038 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
చల్లగా హాని.. గడువు ముగిసినా పోనీ!
గుమ్మలక్ష్మీపురం: ఎండగా ఉందని.. చల్లని శీతల పానీయం కోసం ఆశ పడతాం.. కాస్త నీరసంగా ఉందని మార్కెట్లో దొరికే ఎనర్జీ డ్రింకు వైపు చూస్తాం.. ఆకలిగా ఉందని, బాగా మసాలా దట్టించి.. ఘుమఘుమలాడే నాన్వెజ్ వంటకాన్ని ఆవురావురని తింటాం. ఇక్కడే ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నాం. ఏజెన్సీ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని వ్యాపారులు రెండు చేతులా వినియోగించుకుంటున్నారు. కాలం చెల్లిన కూల్ డ్రింకులను విక్రయించి, ఆరోగ్యంపై నిశ్శబ్దంగా దాడి చేస్తున్నారు. హోటళ్లలో రంగు కలిపిన ఆహార పదార్థాలను తినిపిస్తున్నారు. శనివారం గుమ్మలక్ష్మీపురం పరిధిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (డివిజన్ –1) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు దుకాణాల్లో గడువు ముగిసిన ఆహార పదార్ధాలు, కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించి, సంబంధిత వ్యాపారులపై అడ్యుడికేషన్ కేసు లు దాఖలు చేశారు. తనిఖీ బృందం గుమ్మలక్ష్మీపురంలోని ఏడు ప్రధాన వ్యాపార సంస్థలను పరిశీలించగా నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్యాంపా కోలా, పెప్సీ, థమ్సప్, 7 అప్ వంటి బ్రాండెడ్ కూల్ డ్రింక్స్తో పాటు ఎనర్జీ డ్రింక్స్ వందల సంఖ్యలో గడువు ముగిసినా విక్రయానికి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. బిర్యానీ పౌడర్, సాంబార్ పౌడర్, సోన్ పాపిడి వంటి ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు కూడా గడువు తేదీ దాటినట్లు నిర్ధారించారు. బుడంకాయల మదన్ కుమార్, పొట్నూరు సుందరరావు, బి.నాగరాజు, అందవరపు శ్రీనివాసరావు, డోకి శ్రీధర్, వెంకటకృష్ణ, చప్పా మాధవ నాయుడు అనే వ్యాపారుల షాపుల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. నిల్వలను సీజ్ చేసి, బాధ్యులపై కేసులు నమోదు చేశారు. ప్రజారోగ్యంతో చెలగాటం కాలం చెల్లిన శీతల పానీయాల విక్రయం రంగు కలిపిన, నిల్వ ఉంచిన మాంసాహార పదార్థాలు ఆహార భద్రతా విభాగం అధికారుల తనిఖీల్లో బట్టబయలు -
టేకు చెట్ల మాయం.. ఎవరి హస్తం?
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మండలంలోని అడారి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో టేకు చెట్ల మాయంపై ఎట్టకేలకు స్కూల్ హెచ్ఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 26న చెట్లు నరికివేసినట్లు.. ఫిర్యాదులో పేర్కొన్నారు. 12 చెట్లను ఐదుగురు వ్యక్తులు తొలగించినట్లు వారు చెబుతుండగా.. అంతకు మించి ఉంటాయని స్థానికులు అంటున్నారు. దీనిపై ఇటీవల ‘సాక్షి’లో ‘పాఠశాలలలో టేకు చెట్లు మాయం’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పార్వతీపురం ఇన్చార్జి తహసీల్దార్ సత్యనారాయణ పాఠశాలలో విచారణ చేపట్టారు. 14 చెట్లు కోతకు గురైనట్లు ఆయన చెబుతున్నారు. ఇందులో ఏది నిజం.. ఏది అబద్ధం అన్నది ప్రశ్నగా మారింది. అధికార పార్టీ నాయకుల ప్రమేయంతోనే చెట్లు నరికి వేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్న విషయం విదితమే. ఈ పరిస్థితుల్లో కేసు ఎంత వరకూ ముందుకు వెళ్తుందన్నది చూడాలి. ఆస్పత్రి పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్ పార్వతీపురం: జిల్లాలో ఏపీ ఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆస్పత్రి సివిల్ పనులను గడువులోగా పూర్తి చేయా లని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం తన కార్యాల యం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పనుల పురోగతిని సమీక్షిస్తూ, సమగ్ర ప్రెజింటేషన్ ఇవ్వాలని సూచించారు. విద్యుత్ సౌకర్యం, జనరేటర్లు, ప్రహరీల పనులపై దృష్టి సారించి, నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ పెంచాలని, సమన్వయం మెరుగుపరచాలని ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంగణాల పరిశుభ్రత, సుందరీకరణపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో పార్వతీపురం, పాలకొండ, ఐటీడీఏ పీఓలు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్, డీసీహెచ్ఎస్ జి.నాగభూషణరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. జనగణనకు సహకరించాలి జిల్లాలో మే 1 నుంచి ప్రారంభమైన ఇంటింటికి జనగణన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ మే 30 వరకు ఎన్యూమరేటర్లు ప్రతీ ఇంటిని సందర్శించి గృహాల స్థితిగతులు, వసతులు, కుటుంబ వివరాలను సేకరిస్తారని పేర్కొన్నారు. ఇచ్చే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని, సంక్షేమ పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా నిజమైన వివరాలు అందించి గణన విజయవంతం చేయాలని కోరారు. -
ఐటీడీఏ.. గాడిన పడేనా?
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలకు దాదాపు రెండేళ్లుగా రెగ్యులర్ పీఓలు లేరు. ఇన్చార్జిలతోనే నెట్టుకొస్తున్నాయి. దీంతో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. కొంతకాలంగా ఐటీడీఏ పాలకవర్గ సమావేశం సైతం నిర్వహించిన దాఖలాలు లేవు. గిరిజన సంక్షేమం, సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. అధికారుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గిరిజన సంక్షేమం కోసం వినియోగించాల్సిన ఐటీడీఏ నిధులు.. కోట్లాది రూపాయలు పక్కదారి పట్టినా పట్టించుకునే నాథుడే లేడు. గిరి వెలుగులో లక్షలాది రూపాయలు దుర్వినియోగం జరిగినా సంబంధిత అధికారులపై చర్యలు శూన్యం. ఐటీడీఏ పరిధిలో విద్యార్థుల మరణాలు, డోలీ మోతలు, తాగునీటి సమస్యలు, మెనూ పాటించకపోవడం వంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ రెండేళ్లలో కొంతమంది పాలకులు, అధికారులు ఐటీడీఏను ఆదాయ వనరుగా వినియోగించుకుంటున్నారే తప్ప.. గిరిజన సంక్షేమం కోసం దృష్టి సారించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మూడు నెలలకు ఒక సారి జరగాల్సిన పాలక వర్గ సమావేశం పత్తాలేకుండా పోయింది. పాలకవర్గ సమావేశం నిర్వహిస్తే నిలదీతలు తప్పవేమో అన్న భయం ప్రజాప్రతినిధులను వెంటాడుతోందని గిరిజన సంఘాల నాయకులు అంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో, గ్రామాల్లో పర్యటన, పరిశీలన చేసి సమస్యలు పరిష్కరించాల్సి ఉన్నా.. ఆ దిశగా ఎవరూ ముందుకు రావడం లేదు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు నివారణ కోసం ఏఎన్ఎం నియామకాల ఊసు లేదు. సబ్లెక్టర్ ఆర్.వైశాలిని పార్వతీపురం ఐటీడీఏ రెగ్యులర్ పీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమె శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పార్వతీపురం సబ్ కలెక్టర్గా ఆమె పనితీరు పట్ల సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఆమె కఠినంగా వ్యవహరించారు. అర్ధరాత్రి వేళ తనిఖీలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. పీఓ పోస్టుకు వైశాలి న్యాయం చేస్తారన్న నమ్మకంతో గిరిజన సంఘాలు ఉన్నాయి. అందుకనుగుణంగానే విధుల్లో చేరిన వెంటనే తన మార్కు చూపించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న భాషా పండితులు, పీఈటీలకు ‘అప్గ్రేడ్’ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న సమస్యను మొదటి గ్రీవెన్స్లోనే పరిష్కారం చూపారు. మిగిలిన అంశాలపైనా ఆమె దృష్టి సారించి ఐటీడీఏను గాడిలో పెట్టాలని గిరిజనులు కోరుతున్నారు. కొద్ది నెలల్లో పీఓ వైశాలి వ్యక్తిగత కారణాల రీత్యా దీర్ఘకాలిక సెలవు పెట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో మళ్లీ ఇన్చార్జి పాలన తప్పకపోవచ్చు. మరోవైపు.. సీతంపేట ఐటీడీఏకు రెగ్యులర్ పీఓను నియమించాల్సిన అవసరం ఉంది. దాదాపు రెండేళ్ల తర్వాత పార్వతీపురం ఐటీడీఏకు రెగ్యులర్ పీఓ కొత్త పీఓ ‘వైశాలి మార్కు’ చూపిస్తారని ఆశాభావం సీతంపేట.. ఇంకా ఇన్చార్జి అధికారి పాలనలోనే.. -
స్వామికి అపచారం.. ఎందుకంత నిర్లక్ష్యం?
● ఆలయ అసలు విగ్రహాలను అలా పడేస్తారా..? ● తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద స్వామి సేవకుల నిరసన సాక్షి, పార్వతీపురం మన్యం/గరుగుబిల్లి: తోటపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అపచారం జరిగినా దేవదాయశాఖ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్వామివారి సేవకులు ప్రశ్నించారు. ఆలయంలో కొద్ది రోజులుగా చేపడుతున్న నిర్మాణ పనులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. స్వామి వారి విగ్రహాన్ని తొలగించి, నిర్లక్ష్యంగా రహదారి పక్కన రేకుల షెడ్డులో వదిలేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక బీజేపీ నేతలు ద్వారపురెడ్డి శ్రీనివాసరావుతో కలిసి శనివారం ఆలయం వద్ద నిరసన తెలిపారు. రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఆలయ చైర్మన్, ఈవోకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా.. వారు అందుబాటులోకి రాలేదు. దీంతో చాలాసేపు అక్కడే ధర్నా చేయడంతో అక్కడున్న ప్రైవేట్ ట్రస్టు సభ్యులు స్వామి సేవకులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ద్వారపురెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని చెప్పారు. కేంద్రం అందించే ఉపాధి నిధులతో కూడా ఇక్కడ పలు పనులు చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. స్వామి వారికి అపచారం చేయవద్దని తాము కోరుతున్నామన్నారు. అన్నవరం సత్యదేవుని ఆలయంలో మాదిరి.. ఇక్కడ కూడా కొత్త ప్రతిమలతో పాటు, పూర్వ విగ్రహాలను ముందు ప్రతిష్ఠించి నిత్య పూజలు అందేలా చేస్తామని అప్పట్లో చెప్పారని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా చేశారన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా దేవదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని.. ట్రస్టు కార్యకలాపాలపై పర్యవేక్షణ చేయాలని కోరారు. కార్యక్రమంలో హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
గిరిజన గురుకులాల్లో ప్రవేశాలకు పిలుపు
సీతంపేట: గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రవేశాలు పొందిన వారికి ఉచిత భోజన వసతితో కూడిన విద్య అందిస్తారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని శ్రీకాకుళం జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాల్లో 8 కళాశాలలు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీలతో పాటు ఒకేషనల్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, సీజీఏ గ్రూపులు ఉన్నాయి. వీటిలో 1030 సీట్లు భర్తీ చేస్తారు. మెరిట్ ఆధారంగానే... పదో తరగతిలో వచ్చే మెరిట్ మార్కులు ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. ప్రతి గ్రూపుకు 40 సీట్లు కేటాయించారు. దీనిలో ఎస్టీ 36 సీట్లు, ఎస్సీ, బీసీ, ఓసీ, ఏఈక్యూ ఒక్కో సీటు మొత్తం నాలుగు సీట్లు భర్తీచేస్తారు. ఒకేషనల్ ఎఅండ్టీ 20, సీజీఏ గ్రూపులో 30 సీట్లు పూర్తిస్థాయిలో ఎస్టీలకు కేటాయించారు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి... విద్యార్థులు ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీటీడబ్ల్యూఆర్.గవ్.ఇన్లో ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్జాబితాను ఈ నెల 22న ప్రకటిస్తారు. 26న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సీతంపేట బాలికల జూనియర్ కళాశాల పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం ఐటీడీఏల పరిధిలో 1030 సీట్లు ఈ నెల 20వరకు దరఖాస్తు గడువు -
తారకరామ తీర్ధసాగర్పై కలెక్టర్ సమీక్ష
విజయనగరం అర్బన్: తారకరామ తీర్ధసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రాజెక్టు పురోగతిపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులపై అధికారులతో సమీక్షిస్తూ మొత్తం రూ.110 కోట్ల పరిపాలన అనుమతుల కోసం తక్షణమే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించి త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల ప్రజలతో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని, సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, ఆర్డీఓ సుధాసాగర్, ఇరిగేషన్ జాఖ అధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల స్థాపన వేగవంతం చేయాలి జిల్లాకు మంజూరైన పరిశ్రమలు, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆమోదం పొందిన పరిశ్రమలు వేగంగా అమలు కావాలని ముఖ్యంగా ఎంఎస్ఎంఈ యూనిట్లు, ఫుడ్ పార్క్లు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన ఎంఓయూలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పరిశ్రమలకు అవసరమైన లాజిస్టిక్స్ సదుపాయాలను కూడా సమర్ధవంతంగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు సుధాసాగర్, సుధారాణి, రామ్మోహన్రావు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
చివరి ప్రయాణం
పాలకొండ రూరల్: ఒకే గ్రామానికి చెందిన నలుగురి ఆఖరి ప్రయాణం గ్రామస్తులను విషాదంలో ముంచేసింది. ఆ నలుగురి మృతదేహాలకు ఒకే చోట దహన సంస్కారాలు జరుగుతుంటే గ్రామస్తుల కన్నీరు ఆగలేదు. పాలకొండ మండలానికి చెందిన పలువురు గిరిజనులు గురువారం సీతంపేట మండలం పుబ్బాడలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా మీనకోట మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జంపరకోటకు చెందిన ఆరిక లక్ష్మి (55), కొండగొర్రి శ్రావణి (25), ఉర్లక శాంతి (30)తో పాటు ఆటో డ్రైవర్ అక్కుపల్లి రమణ (36) మృతి చెందిన విషయం విదితమే. ఈ క్రమంలో వారి మృతదేహాలకు శుక్రవారం పాలకొండ ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ కె.చిరంజీవి పర్యవేక్షణలో పోస్టుమార్టం చేపట్టారు. అప్పటికే మృతుల బంధువులు, వారి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసుల పంచనామా అనంతరం అధికారిక చర్యలు పూరికావడంతో మధ్యాహ్నం 12 గంటలకు మృతదేహాలను మహిళల స్వగ్రామం జంపరకోటకు, ఆటో డ్రైవర్ మృతదేహం ఆయన గ్రామమైన డోలమడకు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. మృతదేహాలు గ్రామాలకు చేరడంతో ఒక్కసారిగా ఆయా పల్లెల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, గ్రామస్తులు, సన్నిహితుల రోదనలు మిన్నంటాయి. డోలమడలో ఆటో డ్రైవర్కు అంత్యక్రియలు నిర్వహించారు. జంపరకోటలలో మృతిచెందిన ముగ్గురు మహిళలతో పాటు అదే గ్రామానికి చెందిన జీలకర్ర మోహనరావు(60) శుక్రవారం సీతంపేట మండలం వాబ వద్ద బైక్పై భార్యతో వస్తుండగా బస్సు ఢీకొనడంతో ఘటనా స్థలంలో మరణించాడు. మోహనరావు మృతదేహానికి సీతంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం పోస్టుమార్టం పూర్తి చేశాక మృతదేహం అదే సమయానికి గ్రామానికి చేరింది. దీంతో నలుగురి మృతదేహాలకు ఒకే చోట దహనసంస్కారాలు చేపట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు రోడ్డు ప్రమాద ఘటనల్లో ఒకే గ్రామానికి చెందిన నలుగురు మరణించటంతో వారి కుటుంబసభ్యుల రోదనలను అదుపుచేయడం ఎవరి తరమూ కాలేదు. ప్రయాణం మిగిల్చిన విషాదాన్ని తలుచుకుంటూ గిరిజనులు తల్లడిల్లిపోయారు. కోలుకుంటున్న క్షతగాత్రులు ఇదిలా ఉండగా ఆటో ప్రమాదంలో గాయాలపాలై శ్రీకాకుళంలో వైద్య సేవలు పొందుతున్న కొండగొర్రి మౌనిక, ఎనిమిదేళ్ల నిమ్మక చాందినితోపాటు మృతురాలు శ్రావణి పిల్లలు హేమ, రిషికుమార్తోపాటు గాయపడిన కె.మల్లమ్మ, కె.పద్మలత తదితరులు కోలుకుంటున్నారు. జంపరకోటకు చేరిన మృతదేహాలు ఒకే చోట నలుగురి దహన సంస్కారాలు డోలమడలో ఆటో డ్రైవర్ రమణ అంత్యక్రియలు కన్నీటి పర్యంతమైన రెండు గ్రామాల ప్రజలు -
పడవ బోల్తా: ఒకరి మృతి
పూసపాటిరేగ: మండలంలోని తమ్మయ్యపాలెం సముద్రపు రేవులో పడవ బోల్తాపడి ఒకరు మృతి చెందగా, ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. వివరాల్లోకి వెళ్తే.. పతివాడ పేటకుచెందిన వాసుపల్లి ఎల్లయ్య (50) తన సహచరులతో కలిసి శుక్రవారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో సముద్రంలో చేపలవేటకు బయలు దేరాడు. కొద్ది క్షణాల్లోనే కెరటాల ఉధృతికి పడవ బోల్తా పడడంతో ఎల్లయ్య గల్లంతయ్యాడు. అదే పడవలో ఉన్న ముగ్గురు మత్స్యకారులు అతి కష్టం మీద సురక్షితంగా ఒడ్డుకు చేరారు. గల్లంతైన ఎల్ల య్య కోసం పలువురు మత్స్యకారులు గాలించగా సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో చింతపల్లి రేవులో శవమై ఒడ్డుకు చేరాడు. సమాచారం మేరకు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు సురక్షితం -
ఏనుగులతో భీతిల్లుతున్న ప్రజలు
గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో ప్రజలు భీతిల్లుతున్నారు. గరుగుబిల్లి మండలంలోని సుంకి, సంతోషపురం గ్రామాల మీదుగా నందివానివలస గ్రామానికి ఏనుగులు శుక్రవారం చేరుకున్నాయి. వారం రోజులనుంచి మండలంలోని పలుగ్రామాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు నందివానివలస, తోటపల్లి, ఖడ్గవలస, నాగూరు తదితర గ్రామాల్లో సంచరించి పలు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ప్రస్తుతం పొలంలో అరటి, పామాయిల్, వేరుశనగ తదితర పంటలు ఉండడంతో ఎప్పుడు ఏ పంటలకు నష్టం జరుగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పంధించి ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
కార్మిక వర్గాన్ని దోపిడీ చేసేందుకే చట్టాల్లో మార్పు
● రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఝాన్సీ ● వేడుకగా మే డే వేడుకలువిజయనగరం టౌన్: అంతర్జాతీయ శ్రామిక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక న్యూపూర్ణ జంక్షన్ వద్ద శ్రీ విజయదుర్గా ఆటోవర్కర్స్ యూనియన్, ఏఐఎఫ్టీయూ (న్యూ) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఝాన్సీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే దళారీ బూర్జువా వర్గంగా వ్యవహరిస్తున్న పాలకులు దోపిడీ విధానాలకు వంతపాడుతూ దేశంలోనే రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని దోపిడీ చేయడానికి తగినట్లుగా చట్టాలను మారుస్తున్నారన్నారు. దేశంలో ఉన్న కుల,మత, వర్గ వ్యత్యాసాలను ఉపయోగించుకుని ప్రజలను విభజించేందుకు, ప్రధాన సమస్యలను ఆలోచించకుండా ఉండేందుకు టెర్రరిజం, మైనారిటీ, రిజర్వేషన్ల పేరుతో అల్లర్లను రెచ్చగొడుతున్నారన్నారు. ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పండా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను కంపెనీ యాజమాన్యాలకు అణిగిమణిగి ఉండేలా, వారి హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. ఈ లేబర్ కోడ్లు ముఖ్యంగా యూనియన్లను లేకుండా చేసేందుకు, నాయకుల ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ఉద్దేశించినవన్నారు. శ్రీ విజయదుర్గా ఆటోవర్కర్స్ యూనియన్ నాయకుడు అప్పలరాజు రెడ్డి మాట్లాడుతూ రారేడో, ఊబర్ వంటి యాప్స్ వచ్చి ఆటో కార్మికుల పొట్టకొడుతున్నాయని, ఉచిత బస్సు పథకం ఏకంగా కార్మికులను రోడ్డున పడేసిందని వాపోయారు. యూనియన్ కార్యదర్శి రెడ్డి నారాయణరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పీడీఎస్ఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.విశ్వనాథ్, రజక సంఘం నాయకులు కె.సతీష్, చిన్న, అప్పలరాజు, ఎన్వైఎస్ జిల్లా కన్వీనర్ సీహెచ్. ధర్మ, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. -
మా దేవుడు మీరే మాస్టారు
● రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి ● గ్రామస్తుల కంటకన్నీరురామభద్రపురం: గ్రామంలోని పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తూ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్న సమాచారం తెలిసిన వెంటనే గ్రామస్తులంతా విషాదంలో మునిగిపోయారు. మంచి మాస్టారును కోల్పోయామని, హఠాత్తుగా విషాద వార్త వినాల్సి వస్తుందను కోలేదని గ్రామంలోని ప్రజలు, చిన్నారులు, తల్లిదండ్రులు వాపోయారు. రామభద్రపురం మండలంలోని నాయుడువలస గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో మూడేళ్లుగా ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న రెడ్డి వేణు మాస్టారు గురువారం పార్వతీపురం మండలంలోని బంధువుల ఇంట పెళ్లికి ద్విచక్రవాహనంపై వెళ్తూ వెంకంపేట పంచాయతీ వైకేఎంనగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మూడేళ్ల పాటు టీచర్గా పనిచేసిన ఆయన గ్రామంలోని అందరిలో కుటుంబసభ్యుడిగా కలిసిపోయారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ మంచి మాస్టారుగా పేరు పొందారు.హెచ్ఎం అకాల మరణం అందరినీ కలిచివేసింది. శుక్రవారం వైఎస్సార్సీపీ నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షుడు నడిమింటి సత్యం, గ్రామ తాజా మాజీ సర్పంచ్ లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామప్రజలు, తల్లిదండ్రులు,విద్యార్థులు మాస్టారు మృతిపట్ల రెండు నిమిషాలు మౌనం పాటించడంతో పాటు సంతాపం తెలుపుతూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఎంఈవో తిరుమలప్రసాద్, పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం జేసీ రాజులు వేణు మాస్టారి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. -
అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం
పార్వతీపురం రూరల్: మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలు, రిటైర్డ్ సిబ్బందికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది కుటుంబాల సమస్యలు, పెండింగ్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ ప్రయోజనాలపై వివరాలు తెలుసుకుని, అవి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని డీపీఓ అధికారులను ఆదేశించారు. మరణించిన సిబ్బంది కుటుంబాలకు ఎల్ల ప్పుడు అండగా ఉంటామని, రిటైర్డ్ సిబ్బంది సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్ఐ నాయుడు, డీపీఓ ముంతాజ్ బేగం, ఏఏఓ శంకరరావు పాల్గొన్నారు. -
ఆయిల్ ట్యాంకర్, బస్సు, కారు ఢీ
● నుజ్జునుజ్జయిన కారుసాలూరు: పట్టణ సమీపంలో జాతీయరహదారిపై శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. కాసేపటికి ప్రమాదానికి గురైన బస్సును వెనుకనుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనపై ఎస్సై అనిల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సాలూరు నుంచి రామభద్రపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రామభద్రపురం నుంచి సాలూరు వస్తున్న జియో ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది.ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైన బస్సును వెనుకనుంచి వచ్చి ఓ కారు ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్, లారీ క్లీనర్కు గాయాలవగా, స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లియర్ చేశారు.దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఉపాధి వేతనదారులకు గుర్తింపు కష్టాలు
రామభద్రపురం: ఉపాధిహామీ పథకంలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్) యాప్ ఫేస్ అంథెంటికేషన్ నిబంధన కూలీలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. నెట్వర్క్ సమస్యలు, సాంకేతిక లోపాలు, ఈ–కేవైసీ పెండింగ్ వంటి కారణాలతో కూలీలకు హాజరు పడడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధిహామీ పథకంలో నిబంధనలు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం వేసవి సీజన్లో ప్రతి గ్రామంలో ఉపాధిహామీ పనులు జరుగుతున్నాయి. జిల్లాలో 3.45 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వాటిలో సుమారు 6,26,094 మంది వేతనదారులు ఉండగా రోజుకు సుమారు 1.70 లక్షల మంది ఉపాధి పనులకు హాజరవుతున్నారు. వారికి ఫేస్ ఆథెంటికేషన్ యాప్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు కూలీల వివరాలను నమోదు చేస్తున్నారు. అయితే ఆ సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా కూలీల ముఖ గుర్తింపు సరిగ్గా నమోదు కాకకపోవడం, సర్వర్ సమస్యల కారణంగా పడిగాపులు కాయాల్సి వస్తోందని కూలీలు వాపోతున్నారు.కొన్ని గ్రామాల్లో పనులు చేయక ముందే ఫేస్ ఆథెంటికేషన్ యాప్ ద్వారా ముఖ గుర్తింపు నమోదు చేస్తుండగా వారి వివరాలతో పాటు ముఖ గుర్తింపు నమోదైన వారు పనులు చేస్తున్నారు.నమోదు కాని వారు మొర్రో అంటూ కిలోమీటర్లు నడిచి తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు. అలాగే మరి కొన్ని గ్రామాలలో పనులు పూర్తయ్యాక ఇంటికి వెళ్లిపోయే ముందు ఆయా ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు ముఖ గుర్తింపు, వివరాలు నమోదు చేస్తున్నారు. ఆ సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా కూలీల ముఖ గుర్తింపు సరిగ్గా నమోదు కాని కూలీలు ఆ రోజు వేతనం నష్టపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ ఆథెంటికేషన్ సమస్యతో కళ్లు,వేలి ముద్రలు, ఆధార్ మిస్మ్యాచ్ సమస్యతో యాప్ గుర్తించకపోవడం, ఫేస్ మ్యాచ్ కాకపోవడంతో హాజరు పడడం లేదని కూలీలు చెబుతున్నారు. పని ప్రదేశంలో ఇంటర్నెట్ సరిగ్గా పని చేయకపోవడంతో ఫొటోలు తీయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని క్షేత్ర స్థాయి సిబ్బంది అంటున్నారు. వేతనదారుల ఆకలికేకలు.. ఉపాధి హామీ శ్రామికులు ఉపాధి పనులు చేయగా వచ్చే వేతనాలతోనే బతుకు బండిని నెట్టాలి.అయితే వారి పొట్టకొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.మండుటెండలో కష్టపడి పనిచేసిన కూలీలకు ఏకంగా నాలుగు నెలలుగా కూలి డబ్బులు చెల్లించకుండా పస్తులు పెడుతోంది. వారు చేసిన పనులకు గానూ జిల్లాలో దాదాపు రూ.24 కోట్ల మేర చెల్లించాల్సి ఉన్నా..ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఉపాధి వేతనాలు అందక వేతనదారులు నానా అగచాట్లు పడుతున్నారు.నాలుగు నెలలకు సంబధించిన ఉపాధి కూలి ఖాతాల్లో జమకాకపోవడంతో కూలీనాలీ చేసుకుని జీవనం సాగించే కుటుంబాలు తల్లడితున్నాయి. ఫేస్ ఆథెంటికేషన్కు సాంకేతిక సమస్య పడిగాపులు కాస్తున్న కూలీలు కానరాని వేసవి భత్యం నాలుగు నెలలుగా అందని వేతనాలు వేతనదారుల వేదన ఆగిన వేసవి భత్యం.. వేసవిలో మండుటెండలను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో శ్రామికులు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు.ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వేసవిలో భత్యం అందిస్తూ వస్తున్నాయి.ఉపాధిహామీ పథకంలో ఏటా వేసవి భత్యాన్ని ఫిబ్రవరి నుంచి జూన్ నెల వరకు నెల వారీగా పెంచి అందించే వారు. చేసిన పనికి తగ్గట్లు 15 నుంచి 30 శాతం వరకు అదనపు భత్యం లభించేది. వేతనదారులకు ఒక్కొక్కరికి రోజువారీ రూ.200 వస్తే వేసవి భత్యం 30 శాతం కలిపి రూ.260 వారి ఖాతాలకు వారి ఖాతాలకు జమచేసేవారు. అయిటే కూటమి ప్రభుత్వం వచ్చాక వేసవి భత్యం అందించకపోవడంతో శ్రామికులు ఆర్థికంగా నష్టపోతున్నారు.అలాగే వారి జీవనంపై అదనపు భారం పడుతోంది. ఇప్పటి నుంచైనా వేసవి భత్యం ఇవ్వాలని వేతనదారులు కోరుతున్నారు. వయసు పైబడిన వారితో ఇబ్బంది సాంకేతిక సమస్య కారణంగా వయసు పైబడిన కూలీలకు కొంత ఇబ్బంది కలుగుతోంది. కళ్లు, వేలిముద్రలు గుర్తించకపోవడం,ఫేస్ మ్యాచ్ కాకపోవడం జరుగుతోంది. అలాంటి వారికి కొంత ఇబ్బందైనా నష్టం కలగకుండా ఒకటికి రెండు సార్లు ప్రయత్నించి హాజరు పడేలా చూస్తున్నాం. వేతనదారులు నష్టపోకుండా కూలి డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటాం. ఎస్ శారదా దేవి,ఉపాధిహామీ పీడీ -
● ఆశించిన మార్కులకు ‘సాక్షి’సహాయం
పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 595 మార్కుల సాధనకు ‘సాక్షి స్టడీ’ మెటీరియల్ సహాయపడింది. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో సందేహాల నివృత్తికి మెటీరియల్ దోహదపడింది. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో 100కి 100 మార్కులు సాధించగలిగాను. – ఆర్.నిత్యకనక వర్షిణి, సీతానగరం సాక్షి యాజమాన్యం గణితం, సైన్స్ సబ్జెక్టుల స్టడీమెటీరియల్ను చదివాను. పదోతరగతిలో 585 మార్కులు సాధించాను. అధిక మార్కుల సాధనకు ఉపా ధ్యాయుల బోధనతో పాటు మెటీరియల్ దోహదపడింది. – బి.సాయికృష్ణ, రాచకిండాం హైస్కూల్ పబ్లిక్ పరీక్షల ముందు సాక్షి యాజమాన్యం స్టడీ మెటీరియల్ అందించింది. ఈ పుస్తకాల్లో కంటెంట్ కనిపించింది. ప్రాక్టీస్ చేశాను. పదో తరగతి ఫలితాల్లో 594 మార్కులు సాధించి టాపర్గా నిలిచాను. – గొర్లె సాద్విక, చిన్నయ్యపేట, మందరాడ జెడ్పీ హైస్కూల్, సంతకవిటి మండలం -
జిల్లా అక్షరాస్యతా శాతం 83.87
పార్వతీపురం: జిల్లాలో ఉల్లాస్–అక్షర ఆంధ్రా కార్యక్రమం విజయవంతంగా అమలు కావడంతో అక్షరాస్యత శాతం ఘననీయంగా పెరిగిందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నా రు. తన చాంబర్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2011లో 50.38శాతంగా ఉన్న అక్షరాస్యత, 2025 నాటికి 75.74 శాతానికి, 2026 నాటికి 83.87శాతానికి పెరిగిందన్నారు. జీఎస్డబ్ల్యూఎస్ సర్వేలో గుర్తించి న నిరక్ష్యరాస్యుల్లో లక్ష్యానికి మించి 67,686 మందిని నమోదు చేసి, శతశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషమన్నారు. కార్యక్రమంలో వేలాది వలంటీరు టీచర్లు పాల్గొని విద్యాబోధ న అందించారన్నారు. అక్షరాస్యతలో పార్వతీ పురం మన్యం జిల్లాను అగ్రస్థానంలో నిలిపిన అధికారులను, వలంటీర్లను కలెక్టర్ అభినందించారు. నేడు బీసీ డెడికేటెడ్ కమిషన్ అధ్యక్షుడు రాక బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ అధ్యక్షుడు రాజీవ్ రంజ న్ మిశ్రా శనివారం విజయనగరం రానున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టర్ కార్యాలయంలో బీసీ, కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కురుపాం: ‘జలధార–జలహారతి’ కార్యక్రమం అమలులో రాష్ట్రంలో జిల్లాను ముందంజలో నిలపాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ పనులు బాధ్యతగా చేపట్టాలన్నారు. కురుపాం ఎంపీడీ ఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఉపాధిహామీ పనుల్లో వేతనదారుల భాగస్వామ్యాన్ని పెంచాలని, 100 శాతం లేబర్ రిపోర్టింగ్ సాధించాల ని సూచించారు. అసంఘటిత రంగ కార్మికులందరూ ఈ–శ్రమ పోర్టల్లో నమోదు కావాలని, ఇది పూర్తిగా ఉచితమని, బీమా రక్షణతో పాటు కేంద్ర పథకాల ప్రయోజనాలు పొందేందుకు అవసరమని తెలిపారు. టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు కలిసి 100 శాతం నమోదు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్మిశ్రా జిల్లాలో శనివారం పర్యటించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై కుల సంఘాలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. -
మార్కులే సాక్షి
పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చూపారు. అధికమంది ఉత్తమ మార్కులు సాధించారు. దీనికి ‘సాక్షి’ యాజమాన్యం అందించిన పదోతరగతి మెటీరియల్ దోహదపడిందని విద్యార్థులు చెబుతున్నారు. సరళంగా, వివరణాత్మకంగా, సులభంగా అర్థంచేసుకునేందుకు వీలుగా విద్యానిపుణులతో తయారుచేసిన మెటీరియల్ ఉత్తమ మార్కుల సాధనకు ఉపయోగపడిందని పేర్కొన్నారు. మంచి మెటీరియల్ అందించి విజయంలో భాగస్వామ్యమైన ‘సాక్షి’కి కృతజ్ఞతలు చెబుతున్నారు. – జియ్యమ్మవలస రూరల్/సీతానగరం -
గాలివాన బీభత్సం
● నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు ● మామిడి, బొప్పాయి, అరటి పంట్లకు తీవ్ర నష్టం ● విద్యుత్ అంతరాయంతో ఇక్కట్లు జియ్యమ్మవలస రూరల్: పెదకుదమలో నేలవాలిన అరటి తోటలో రైతు నవీన్ కుమార్ పాలకొండరూరల్/వీరఘట్టం/గరుగుబిల్లి/కొమరాడ/జియ్యమ్మవలస రూరల్: పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టం, పాలకొండ, కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస, తదితర మండలాల్లో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. మామిడి, బొప్పాయి, అరటి పంటలకు తీవ్ర నష్టంవాటిల్లింది. మొక్కజొన్న నేలమట్టమైంది. 60–80 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు జనం భయపడ్డారు. ఇళ్లలోకి పరుగులు తీశారు. ఈదురుగాలులతో కూడిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ●వీరఘట్టం మండలంలో సుమారు 2వేల ఎకరా ల్లో కోతదశలో ఉన్న మామిడి పంట నేలమట్టమయ్యింది. 10 ఎకరాల్లో బొప్పాయి, అరటి తోట లు నేలమట్టమయ్యాయని రైతులు చెబుతున్నారు. ●గరుగుబిల్లి మండలంలోని గిజబ, తోటపల్లి పంచాయతీ పరిధిలోని నందివానివలస గ్రామాల రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. ●కొమరాడ మండలంలో పార్వతీపురం నుంచి రాయగడ వెళ్లే అంతర రాష్ట్ర రహదారిపై కూనేరు రామభద్రపురం సమీపంలో భారీ వృక్షం నెలకొరింది. చెట్టును యుద్ధ ప్రాతిపదికన తొలగించి రాకపోకలను పోలీసుల క్రమబద్ధీకరించారు. ●జియ్యమ్మవలస మండలంలోని కుదమ, గౌరీపురం, పరజపాడు, పెద్దకుదమ, సింగనాపురం, గంగరాజుపురం, తదితర గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో చేతికందిన అరటి పంట నేలమట్టమైంది. లక్షల రూపాయలు పెట్టుబడి నేలపాలైందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ●పాలకొండ మండలంలో ఎం.సింగుపురం సీహెచ్సీ ఎదరుగా 9 విద్యుత్ స్తంభాలు, అన్నవరం, బెజ్జి, పొట్లి, సింగన్నవలస తదితర గ్రామాల్లో 4, పట్టణంలో మున్సిపాల్ కార్యాలయం, యాలం కూడలి, విద్యుత్ సబ్ స్టేషన్ వతదితర ప్రాంతాల్లో 5 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాన్స్కో డీఈ కె.విష్ణుమూర్తి, ఏఈ యోగి నేతృత్వంలో సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. -
మలేరియా నియంత్రణకు చర్యలు
కొమరాడ: జిల్లాలో మలేరియా నియంత్రణే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి ఎస్.భాస్కరరావు తెలిపారు. గిరిశిఖర గ్రామాలైన బిన్నిడి, డి. గుణదలో మలేరియా నివారణ మందును శుక్రవారం పిచికారీ చేయించారు. ఎన్సీడీ పీఓ డాక్టర్ టి.జగన్మోహనరావుతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఐఆర్ఎస్ నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. అన్నిగదుల్లో స్ప్రేయింగ్ తప్పనిసరిగా చేయాలని సిబ్బందికి సూచించారు. దోమతెరల వినియోగంపై అవగాహన కల్పించారు. అక్కడ విద్యార్థులు, పిల్లలకు వేసవి ఆరోగ్య జాగ్రత్తలపై సూచనలు చేశారు. జిల్లాలో 1032 మలేరియా ప్రభావిత గ్రామాల్లో ఐఆర్ఎస్ మొదటి విడత పిచికారీ జూన్ 15 వరకు వరకు కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో డీఎంఓ సూర్యనారాయణ, మాదలింగి పీహెచ్సీ వైద్యాదికారి ఎస్.తనూజ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
శుభకార్యానికి వెళ్లి వస్తూ... అనంత లోకాలకు..
శుభ కార్యానికి వెళ్లిన వారు మృత్యుఒడికి చేరారు. బంధువుల శుభకార్యంలో సంతోషంగా గడిపి... తిరుగు ప్రయాణంలో వస్తున్న వారిని మృత్యువు దారి కాచి వెంటాడింది. నలుగురి ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. అంతవరకు ఆటోలో సరదగా కబుర్లు చెబుతూ వస్తున్న వారు ఒక్కసారిగా హహకారాలు చేశారు. ఇంతలోనే నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... పాలకొండ/పాలకొండ రూరల్: పాలకొండ మండలం బడ్డుమహసింగి గ్రామానికి చెందిన గిరిజనులు సీతంపేట మండలం పుబ్బాడ గ్రామంలో గురువారం జరిగిన బంధువుల శుభకార్యానికి వెళ్లేందుకు డోలమడ గ్రామానికి చెందిన ఆటోను కుదుర్చుకుని బయలుదేరారు. ఆటోలో 12 మంది వరకు వెళ్లారు. జంపరకోట మీదుగా సీతంపేట వెళ్లేందుకు ఉన్న ఘాట్ రోడ్డులో వెళ్లిన వీరు శుభకార్యంలో భోజనాలు చేసిన అనంతరం అదే రోడ్డులో ఆటోలో సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ రహదారిలో మార్గమద్యంలోకి చేరుకునే సరికి సీతంపేట మండలం మీనకోట వద్ద ఆటో ఘాటీ డౌన్లో అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కొండగొర్రి శ్రావణి(30), ఆటో డ్రైవర్ అక్కుపల్లి రమణ(33), ఉర్లక శాంతి(35) సంఘటన స్థలంలోనే మరణించారు. ఆరిక లక్ష్మి(55) తీవ్రంగా గాయపడగా ఈమెను ఏరియా ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమద్యంలో మృతి చెందింది. ఆస్పత్రుల్లో క్షతగాత్రులు.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొండగొర్రి మౌనిక, ఎనిమిదేళ్ల నిమ్మక చాందినిలను శ్రీకాకుళం ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఆస్పత్రిలో కొండగొర్రి మౌనిక కుమారుడు రుషికుమార్, కొండగొర్రి హేమ, కొండగొర్రి మల్లమ్మ, కొండగొర్రి పద్మలత చికిత్స పొందుతున్నారు. ఎస్పీ మాధవరెడ్డి, సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్, డీఎస్పీ రాంబాబు ఆస్పత్రిలో క్షతగాత్రులకు అందుతున్న సేవలను పర్యవేక్షించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా రాత్రి సమయం వరకు మృతదేహాల ఆస్పత్రికి తరలించలేదు. ఘాటీ రోడ్డు కావడంతో మృతదేహాలను తీసుకురావడం కష్టంగా మారింది. ఆనందం ఆవిరి ఈ ఘటనలో మరణించిన ఆటో డ్రైవర్ అక్కుపల్లి రమణకు ఆటోనే జీవనం. అదే ఆటో ఆయనకు మృత్యుశకటంగా మారింది. రమణకు భార్య నాగమణితో పాటు వినీత, చందు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె వినీత గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 563 మార్కులు సాధించింది. కుమార్తెను అభినందించి సాయంత్రం అన్నీ కొనిపెడతానని చెప్పి బయలుదేరిన తండ్రి ఇంతలోనే ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుమార్తె విజయం ఆనందించేలోపే తండ్రి ఇలా దుర్మరణం చెందడంతో ఆయన కుటుంబంతో పాటు గ్రామస్తుల్లో తీవ్ర విషాదం నెలకొంది. మిన్నంటిన రోదనలు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా ఒకే గ్రామస్తులు కావడంతో బడ్డుమహసింగిలో రోదనలు మిన్నంటాయి. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. శుభకార్యంలో ఆనందంగా గడిపి ఇళ్లకు వస్తున్న వారిలో నలుగురు మృత్యువాత పడడం, మిగిలిన వారంతా క్షతగాత్రులుగా మారడంతో గ్రామంలో అంతులేని విషాదం అలుముకొంది. మీనకోట వద్ద ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా తిరుగు ప్రయాణంలో నలుగురు దుర్మరణం ఆరుగురికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం ఆస్పత్రిని సందర్శించిన ఎస్పీ, సబ్ కలెక్టర్ -
కిశోరి వికాసం కార్యక్రమానికి శ్రీకారం
పార్వతీపురం: బాలికల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా జిల్లాలో కిశోరి వికాసం కార్యక్రమానికి కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మే 1 నుంచి జూన్ 11 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వేసవి శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరాల్లో బాలికలకు విద్య, ప్రాముఖ్యత, ఆరోగ్యం – పోషకాహారం, రుతు పరిశుభ్రత, లైంగిక – పునరుత్పత్తి, ఆరోగ్యం, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధం, మత్తు పదార్ధాల నివారణ, కెరీర్ మార్గదర్శకత్వం, సైబర్ భధ్రత, ఆర్థిక నిర్వహణ, తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. బాలికల్లో ఆత్మ విశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించే కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కిశోరి వికాసం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ తదితరులు ఉన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి సీతంపేట: మండలంలోని వాబ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం పాలకొండ మండలం జంపరకోటకు చెందిన జీలకర్ర మోహన్రావు (60) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంపై ఎస్సై వై.అమ్మన్నరావు అందించిన వివరాల ప్రకారం రాయికురిడి గ్రామంలో జరిగే గ్రామపండగకు వెళ్లి భార్య వరలక్ష్మితో కలిసి ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణంలో వస్తున్నాడు. వాబ జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా ఆర్టీసీ బస్సు వస్తోంది. ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొట్టడంతో కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య వరలక్ష్మికి తీవ్రగాయలయ్యాయి. వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరళించారు. ఆమె పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరళించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నేటి నుంచి జనగణన ● ఇంటింటి గణనకు ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగంసాక్షి, పార్వతీపురం మన్యం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి జనగణన ప్రక్రియను జిల్లాలో మే 1వ తేదీ నుంచి 30 రోజుల పాటు చేపట్టనున్నారు. ఇది వరకే ప్రారంభించిన స్వీయ గణన(సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియలో 15 శాతం పూర్తి చేసి, రాష్ట్రంలో మన్యం జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్ 16 నుంచి 30 మధ్య స్వీయగణన చేపట్టారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటింటి జనగణనను 20వ తేదీలోగా పూర్తి చేసేలా క్షేత్ర స్థాయి సిబ్బంది పని చేయాలని అధికారులు స్పష్టం చేశారు. జనగణన కోసం ప్రత్యేకంగా ఫీల్డ్ అధికారులను, ఎన్యూమరేటర్లను నియమించారు. సగటున 800 జనాభాను ఒక యూనిట్గా పరిగణిస్తున్నారు. లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఏ ఒక్కరికీ సెలవులు ఇవ్వరాదని నిర్ణయించారు. తప్పులు చేసే ఉద్యోగులపై జనగణన చట్టం 11 ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలోని 15 మండలాలు, మూడు మున్సిపాలిటీల్లో 1,744 ఎన్యూమరేటర్లు, 302 మంది సూపర్వైజర్లతో ఇంటింటి జనగణన ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వచ్చి వివరాలు సేకరిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాబా 9.25 లక్షలు. చాలా ఏళ్ల తర్వాత గణన చేపడుతున్నారు. ప్రజలు కచ్చితమైన సమాచారం ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పథకాల రూపకల్పనకు సహకరించాలని అధికారులు కోరారు. ఫిర్యాదులకు కంట్రోల్ రూం ఏర్పాటు.. ప్రజల సౌకర్యార్థం, ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా, డివిజన్, చార్జి అధికారి స్థాయిల్లో కంట్రోల్రూంలను, రాష్ట్ర స్థాయిలో టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు. జిల్లా కంట్రోల్ రూం 08963–796085 నంబరుకు ఎవరైనా సంప్రదించవచ్చు. పింఛన్ల పంపిణీ ఎలా? జనాభా లెక్కల కోసం నియమించిన ఎన్యుమరేటర్లలో దాదాపు 80 శాతం మంది వరకు సచివాలయ సిబ్బందే ఉన్నారు. ప్రస్తుతం మే నెలకు సంబంధించి ఒకటో తేదీ నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టాల్సి ఉంటుంది. శుక్ర, శనివారాల్లో పింఛన్లు అందజేయాల్సి ఉండగా.. ఇదే సమయంలో గణన విధులకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రభావం దేనిపైన పడుతుందోనని సచివాలయ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. -
జలధార పనుల్లో వెనుకబాటు వద్దు : కలెక్టర్
పార్వతీపురం: జిల్లాలో జరుగుతున్న జలధార – జలహారతి పనుల్లో ఎలాంటి వెనుకబాటు ఉండకూడదని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని ఆయన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని, సోక్పిట్స్ నిర్మాణం, చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చెరువులు, కాలువల ఆక్రమణలను వెంటనే తొలగించి హద్దులను నిర్ధారించాలన్నారు. ప్రతీ గ్రామంలో పనుల పురోగతిపై చెక్లిస్టు సిద్ధం చేసి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ పెంచాలని, నాణ్యతలో రాజీ పడకుండా పనులు పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మే 10వ తేదీలోగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమీక్షలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
పదిలంగా నిలిచారు!
● 20 గిరిజన విద్యా సంస్థల్లో శతశాతం విద్యార్థుల పాస్ ● 94 శాతం ఉత్తీర్ణత ీసతంపేట: సీతంపేట ఐటీడీఏ పరిధిలో వివిధ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో పదో తరగతి ఫలితాల్లో గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు అదరగొట్టారు. మొత్తం 49 విద్యా సంస్థలకుగాను 20 పాఠశాలల్లో శతశాతం ఫలితాలు సాధించారు. 1785 మంది విద్యార్థులకుగాను 1692 మంది పాసయ్యారు. దీనిలో ఆశ్రమ పాఠశాలల నుంచి 1476 మంది హాజరు కాగా 1390 మంది ఉత్తీర్ణత సాధించారు. గిరిజన గురుకులాల నుంచి 309 మంది హాజరు కాగా 302 మంది పాసయ్యారు. మొత్తం 94.79 శాతం ఉత్తీర్ణత సాధించారు. చిన్నకోస్తాకు చెందిన బి.జాస్మిన్ 590 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. పూతికవలస గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన వూయక సుస్మిత 583 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచింది. సామరెల్లి బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన బిడ్డిక జయశ్రీ 581 మార్కులు సాధించింది. బాలికల పాఠశాలల్లో బుడంబో, బరణికోట, బొమ్మిక, సవర బొంతు, బడ్డుమాసింగి, సామరెల్లి, సీతంపేట, ముత్యాలు, హడ్డుబంగి, పూతికవలస, సీతంపేట ఏపీఆర్ గర్ల్స్, పాఠశాలలు శతశాతం ఫలితాలు సాధించాయి. బాలుర ఆశ్రమ పాఠశాలల్లో ఎస్ఎస్ మణుగు, చిన్నబగ్గ, దోనుబాయి, మల్లి, పెద్దపొల్ల, శంబాం, గంగంపేట, మల్లి పీటీజీ గురుకుల బాలుర పాఠశాల, సీతంపేట గురుకుల బాలుర పాఠశాలలు శతశాతం ఫలితాలు సాధించారు. బి.జయశ్రీ(581) సామరెల్లి ఆశ్రమ పాఠశాల బి.జాస్మిన్ (590), చిన్నకోస్తా, ఆశ్రమ పాఠశాల వి.సుశ్మిత (583), పూతికవలస ఆశ్రమ పాఠశాల -
పాఠశాలలో టేకు చెట్లు మాయం
● ముఖ్య నాయకుడి ఇంటి నిర్మాణం కోసం అక్రమంగా తరలింపుసాక్షి, పార్వతీపురం మన్యం : పార్వతీపురం మండలం అడారు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో సుమారు 20 టేకు చెట్లు మాయమయ్యాయి. రాత్రికి రాత్రే వీటిని కొట్టి, తరలించినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఓ ముఖ్య నాయకుడి ఇంటి నిర్మాణం కోసం అధికార పార్టీకి చెందిన మండల స్థాయి నాయకులు దగ్గరుండి, గుట్టుగా వీటిని తొలగించి, తరలించుకుపోయినట్టు సమాచారం. ఏళ్ల క్రితం నాటి ఈ చెట్ల కలప విలువ రూ.లక్షల్లో ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎటువంటి అనుమతులూ లేకుండానే, విశాలమైన చెట్లను తొలగించి తీసుకెళ్లడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
శ్రద్ధగా రాశారు..
శుక్రవారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2026● పదో తరగతి ఫలితాల్లో మన్యం విజయదుందుభి ● వరుసగా నాలుగోసారి రాష్ట్రంలో ‘టాప్’ ● 96.07 శాతం ఉత్తీర్ణత నమోదు ● బాలికలదే పైచేయి.. సాక్షి, పార్వతీపురం మన్యం పదో తరగతి ఫలితాల్లో మన్యం బిడ్డలు మరోసారి అదరగొట్టారు. జైత్రయాత్రను కొనసాగించారు. తమకు ఎదురే లేదని నిరూపించారు. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. తమ ర్యాంకును మెరుగుపరుచుకుంటూ.. ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా నాలుగోసారి సింహాసనం మీద సగర్వంగా కూర్చొన్నారు. ఏపీ పదో తరగతి ఫలితాలు గురువారం ఉదయం విడుదల కాగా.. 96.07 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే జిల్లా అగ్రగామిగా నిలిచింది. గిరిజన ప్రాంతమైనప్పటికీ.. విద్యా రంగంలో మన్యం స్థిరమైన ప్రతిభ చూపుతుండటం విశేషం. మరోసారి సత్తా చాటిన బాలికలు ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు రాబట్టారు. 590కి పైగా పలువురు మార్కులు సాధించడం విశేషం. పదో తరగతిలో 10,506 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో బాలురు 5,109 మంది కాగా.. బాలికలు 5,397 మంది ఉన్నారు. మొత్తంగా 10,092 మంది ఉత్తీర్ణత సాధించారు. 96.54 శాతంతో జిల్లాలో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. ● ఫలితాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విద్యార్థులు ప్రతిభ చూపారు. జిల్లాలో ఉన్న మొత్తం తొమ్మిది ప్రీ మెట్రిక్ వసతిగృహాల్లో 82 మంది పరీక్షలు రాశారు. ఇందులో 79 మంది ఉత్తీర్ణత సాధించారు. 75 మంది ప్రథమ శ్రేణి, నలుగురు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఏడు వసతిగృహాల్లో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. 500 మార్కులు కంటే ఎక్కువ వచ్చిన వారు 33 మంది ఉన్నారని జిల్లా వెనుకబడిన సంక్షేమ, సాధికారక అధికారి ఇ.అప్పన్న తెలిపారు. సారిపల్లి నవనీత్కుమార్ 578/600(బూర్జ), దాసరి దీనిష్కుమార్ 578(గరుగుబిల్లి), రెడ్డి స్వాతి 576(పార్వతీపురం),అలుగూలు మధు 568 (జియ్యమ్మవలస) మార్కులు సాధించారు. ● పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని 40 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 98.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 1,810 మంది పరీక్షలు రాయగా.. 1,788 మంది ఉత్తీర్ణత సాధించారు. భద్రగిరి పాఠశాలకు చెందిన ఆకుల వసంత 581 మార్కులతో టాపర్గా నిలిచింది. ఆరు గురుకులాల్లో 99.03 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 414 మంది పరీక్షకు హాజరు కాగా.. 404 మంది ఉత్తీర్ణులయ్యారు. బిడ్డిక భవానీ 588 మార్కులతో టాపర్గా నిలిచినట్లు డీడీ విజయశాంతి తెలిపారు. అభినందనల వెల్లువ పదో తరగతి ఫలితాల్లో వరుసగా నాలుగోసారి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించడం పట్ల విద్యార్థులకు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో తొలి స్థానంలో నిలవడం ఆనందంగా, గర్వకారణంగా ఉందన్నారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, అధికారుల సమన్వయంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని చెప్పారు. మంచి మార్కులకు ‘సాక్షి’ దోహదం నేను పదో తరగతి ఫలితాల్లో 591 మార్కులు సాధించడానికి సాక్షి స్టడీ మెటీరియల్ ఎంతో దోహదపడింది. సాక్షి అందజేసిన మ్యాథ్స్, ఫిజిక్స్ స్టడీ మెటీరియల్ బాగా ఉపయోగపడ్డాయి. ఈ మెటీరియల్లో ఉన్న ముఖ్యమైన విషయాలను ఉపాధ్యాయులు తరచూ బోధించడంతో గణితంలో 100, సైన్స్లో 98 మార్కులు సాధించగలిగాను. సాక్షి మీడియాకు ధన్యవాదాలు. – బౌరోతు తరణి, తలవరం హైస్కూల్, వీరఘట్టం -
అమ్మ ఎక్కడ...
ఈ ప్రమాదంలో గాయపడిన ఎనిమిదేళ్ల రుషికుమార్, ఆరేళ్ల హేమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి తల్లి కొండగొర్రి శ్రావణి సంఘటన స్థలంలోనే మరణించింది. తల్లి మృతి చెందిందన్న విషయం తెలియని ఆ చిన్నారులిద్దరూ అమ్మ ఎక్కడంటూ రోదిస్తుంటే అక్కడి వారి హృదయాలు చలించిపోయాయి. బంధువులు సమాధానం చెప్పలేక... చిన్నారులను సముదాయించలేక కన్నీరుమున్నీరవుతున్నారు. మా అమ్మ ఎక్కడంటూ అభంశుభం తెలియని ఆ చిన్నారుల రోదనలు అరణ్యరోదనలే అవుతున్నాయి. తల్లిని కోల్పోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు హేమ, రుషికుమార్ -
విలేకర్లపై దాడి చేసిన నిందితుల అరెస్టు
సాలూరు: పట్టణంలో సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ నల్లి శ్రీనివాసరావు, సీవీఆర్ టి.వి రిపోర్టర్ చింతాడ సుబ్రహ్మణ్యంపై దాడి చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. పట్టణంలో పెద్దవీధికి చెందిన నిందితులైన కోనమజ్జి అజయ్, గండి అభి, సొండి శ్రీను బుధవారం మండల పరిషత్ కార్యాలయ సమీపంలో మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసి సేవించారు. అనంతరం వారు ద్విచక్ర వాహనంపై బయలుదేరి అతి వేగంగా నిర్లక్ష్యంగా నడుపుతూ శ్రీనివాసరావు, సుబ్రహ్మణం నడుపుతున్న దిచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగ్గా, నిందితులు అసభ్య పదజాలాలను ఉపయోగిస్తూ ఫిర్యాదుదారులను కొట్టి తీవ్రంగా గాయపరిచారు. నిందితులని అరెస్టు చేశామని, కోర్టులో హాజరపరచనున్నట్టు సీఐ తెలిపారు. తొలగని అనుమానాలు? సాక్షి విలేకరిపై జరిగిన దాడి కేసుకు సంబంధించి స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడని మరో ఫిర్యాదుదారుడైన సీవీఆర్ టీవీ రిపోర్టర్ సుబ్రహ్మణ్యం చెబుతుండగా ఆ నాలుగో వ్యక్తిని పట్టుకోకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. నిందితుల యొక్క ఫోన్ పేలు, కాల్ డేటాను పరిశీలిస్తే దీని వెనుక ఉన్న ఆ నాలుగో వ్యక్తి ఎవరన్నది వెలుగులోకి వస్తుందని చర్చించుకుంటున్నారు. ఈ దాడి వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు.


