Parvathipuram manyam District News
-
కలెక్టరేట్కు పోటెత్తిన అర్జీదారులు
● కబ్జాల నుంచి కష్టాల వరకు ఫిర్యాదులుపార్వతీపురం రూరల్: జిల్లా కలెక్టరేట్ సోమవారం అర్జీదారులతో కిటకిటలాడింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు, సంఘాల ప్రతినిధులు వివిధ సమస్యలపై అధికారులకు వినతులు సమర్పించారు. కేబుల్ ప్రసారాల అంతరాయం నుంచి చెరువుల కబ్జాల వరకు, గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల లేమి నుంచి వన్యప్రాణుల సంరక్షణ వరకు అనేక సమస్యలకు పరిష్కారం కోసం వినతులు అందజేశారు. గంటకోసారి ‘ఫైబర్’ కట్.. ఆపరేటర్ల ఆవేదన ఏపీఎస్ఎఫ్ఎల్ (ఫైబర్ నెట్) నెట్వర్క్ తరచూ నిలిచిపోవడంతో వినియోగదారులు ఇతర సంస్థల వైపు మళ్లుతున్నారని కేబుల్ ఆపరేటర్లు సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్కు విన్నవించారు. ఓఎల్టీలకు యూపీఎస్ సౌకర్యం లేకపోవడమే ప్రధాన సమస్యని, వెంటనే ఇన్వర్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఆపరేటర్ల ఆదాయం నుంచి బాక్స్ రెంట్ పేరిట రూ. 59 అదనంగా మినహాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం వినియోగదారుల నుంచి పాత బాక్సులను రికవరీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చెరువు కబ్జాలపై విచారణ చేపట్టాలి పార్వతీపురం పట్టణంలోని నెల్లి చెరువు స్థలంలో వెలసిన అక్రమ కట్టడాలపై విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు డిమాండ్ చేశారు. చెరువు శిఖం భూమిలో సుమారు 20 పక్కా భవనాలు నిర్మించారని, వీటికి అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఆర్ఓ కె. హేమలతకు వినతిపత్రం ఇచ్చారు. పురిపాకలోనే పాఠశాల.. వసతులు కరువు పార్వతీపురం మండలం కొత్తవూరు గిరిజన గ్రామంలో మౌలిక వసతుల లేమిపై గిరిజనులు ఫిర్యాదు చేశారు. గ్రామంలో పాఠశాల భవనం పూర్తికాకపోవడంతో విద్యార్థులు పురిపాకలో చదువుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడం, ఇంటింటికీ కుళాయిలు, మురుగు కాలువలు, శ్మశానానికి రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. వాణిజ్య గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలి గత మార్చి నుంచి వాణిజ్య అవసరాల గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో హోటళ్ల నిర్వహణ కష్టతరంగా మారిందని జిల్లా హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. గ్యాస్ కొరత వల్ల తమపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, తక్షణమే సరఫరా పునరుద్ధరించాలని కోరారు. -
జాప్యం వద్దు
వినతుల పరిష్కారంలోవిజయనగరం గంటస్తంభం: ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కరించే విషయంలో ఎటువంటి జాప్యం తగదని కలెక్టర్ ఎస్. రాంసుందర్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూక్లినిక్ కార్యక్రమాలకు విశేష స్పందన వచ్చింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను వినతుల రూపంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, వినతుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం సహించబోమని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న అన్ని వినతులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సత్తిబాబు, జిల్లా స్పెషల్ డిప్యూటి కలెక్టర్ ఈ.మురళి, కళావతి, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. రెవెన్యూ వినతులే అధికం.. మొత్తం అందిన 202 వినతుల్లో 93 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. రెవెన్యూ సమస్యలు, ముఖ్యంగా భూ సంబంధిత, సర్వే సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు.. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో తెలియజేసే సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. ప్రతి వినతిని ఆన్లైన్లో పర్యవేక్షిస్తూ వేగవంతమైన పరిష్కారం చూపించాలని తెలిపారు. శాఖల వారీగా వినతులు.. రెవెన్యూశాఖకు 93 వినతులు రాగా.. డీఆర్డీఏ–17, పంచాయతీరాజ్–19, మున్సిపల్–23, విద్యుత్–3, హౌసింగ్–3, డీసీహెచ్ఎస్–2, వైద్య ఆరోగ్యశాఖ–5, గ్రామ సచివాలయం–4, విద్యాశాఖ–3, ఇతర శాఖలకు 30 వినతులు అందాయి. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్కు భారీ స్పందన 202 వినతులను స్వీకరించిన అధికారులు ఇందులో 93 రెవెన్యూ సమస్యలే పెండింగ్ వినతులపై కలెక్టర్ సీరియస్ -
అంతర్జాతీయ సైన్స్ఫెయిర్కు పూజిత
లక్కవరపుకోట: మండలంలోని జమ్మాదేవిపేటలో గల జ్యోతిబాపూలే బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన గేదెల పూజిత అంతర్జాతీయ సైన్స్ఫెయిర్కు ఎంపికై ందని ప్రిన్సిపాల్ యు.విజయ్కుమార్ పాత్రో సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 28 నుంచి జూలై 4 వరకు జపాన్ దేశంలో సైన్స్ ఫెయిర్ జరుగుతుందని పేర్కొన్నారు. అరటి పంటలో వృథాగా వదిలేసిన దవ్వతో బయో సంచులు తయారీపై పూజిత చేసిన ప్రాజెక్ట్ అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని పూజిత, ప్రాజెక్ట్ గైడ్ జి.ఇంద్రజను అభినందించారు. -
25లోగా ఎం.బుక్ రికార్డులు పూర్తి చేయాలి
పార్వతీపురం: జిల్లాలో ఉపాధిహామీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా జరుగుతున్న రహదారి, అభివృద్ధి పనులకు సంబంధించి ఈనెల 25వ తేదీలోగా ఎంబుక్ రికార్డులు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎం. ప్రభాకరరెడ్డి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం వాల్యూయేషన్ సర్టిఫికెట్తో బిల్లులు వస్తాయని భావించడం సరికాదని, ఆన్లైన్లో ఉన్న ఎంబుక్ రికార్డుల ప్రకారం బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందనానరు. ఇంతవరకు జరిగిన ప్రతి పనికీ ఎంబుక్ రికార్డు చేసి, పాస్ ఆర్డర్ వేసి ఎంసీసీకి అందజేయాలన్నారు. సమావేశంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డ్వామా పీడీ కె. రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నిజాయితీకి చిరు సత్కారంవిజయనగరం క్రైమ్: నిజాయితీతో వ్యవహరించిన వ్యక్తిని పోలీసులు సత్కరించిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని విజయనగరం డిఫెన్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న సీతారామ్ అనే వ్యక్తికి స్థానిక గుమ్చీ వద్ద రెండు తులాల బంగారు బ్రేస్లెట్ ఆదివారం దొరికింది. దీంతో ఈ విషయాన్ని అకాడమీ డైరెక్టర్ డి. అనిల్కుమార్కు తెలియజేయగా.. ఆభరణాన్ని పోలీసులకు అందజేయాలని చెప్పడంతో వెంటనే సీతారామ్ ఆ బ్రేస్లెట్ను టూటౌన్ పోలీస్స్టేషన్లో అందజేశాడు. దీంతో సీఐ టి. శ్రీనివాసరావు విచారణ చేపట్టి బాధితుడు మస్తాన్కు బ్రేస్లెట్ అందజేశారు. అలాగే నిజాయితీగా వ్యవహరించిన సీతారామ్తో పాటు అనిల్కుమార్ను సత్కరించారు. కార్యక్రమంలో ఎస్సైలు ప్రమీల, కనకరాజు, క్రైమ్ పార్టీ సిబ్బంది వాసు, షఫీ, గణేష్ పాల్గొన్నారు. ఘనంగా దొమ్మేటి జయంతివిజయనగరం: ప్రముఖ సామాజిక సంస్కర్త, శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సోమవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం, సామాజిక సమానత్వం కోసం వెంకటరెడ్డి చేసిన అలుపెరగని పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, ప్రతిఒక్కరూ వెనుకబడినవర్గాల అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శెట్టిబలిజ సంఘ జిల్లా అధ్యక్షుడు చోడి ఆదినారాయణ మాట్లాడుతూ.. సమాజ సేవనే పరమావధిగా జీవించిన వెంకటరెడ్డి జీవన ప్రస్థానం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి జె. జ్యోతిశ్రీ, నాయీ బ్రాహ్మణ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీవీ దుర్గారావు, తూర్పుకాపు సంఘ నాయకుడు గండ్రేటి శ్రీను, వివిధ సంఘాల ప్రతినిధులు, జిల్లా అధికారులు, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. డిగ్రీ విద్యార్థినికి గాయాలు చీపురుపల్లి: పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలకు చెందిన బొత్స యశోద అనే విద్యార్థినికి ప్రమాదవశాత్తు గాయాలయ్యాయి. మెరకముడిదాం మండలంలోని శ్యామాయవలస గ్రామానికి చెందిన యశోద చీపురుపల్లి ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం డిగ్రీ చదువుతోంది. ప్రతి రోజు మాదిరిగానే బస్సులో వెళ్లి కళాశాల వద్ద దిగుతున్నప్పుడు పడిపోయింది. దీంతో తలకు గాయమవ్వడంతో చీపురుపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. పార్వతీపురం రూరల్: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కురుపాం మండలంలోని దుర్బిలి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పువ్వల తవిటమ్మ భర్త కొండ నిత్యం మద్యం సేవిస్తూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈక్రమంలో సోమవారం కూడా మద్యం మత్తులో భార్యతో వాగ్వాదానికి దిగాడు. దీంతో మనస్తాపానికి గురైన తవిటమ్మ చేతి గాజులను పౌడర్గా నూరి నీటిలో కలిపి తాగేసింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆమెను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. -
మనస్తాపంతో కానిస్టేబుల్ ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని పోలీస్ కానిస్టేబుల్ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని దాసన్నపేటలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణమూర్తి తెలియజేసిన వివరాల మేరకు.. ఏపీఎస్పీ చింతలవలస బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న గెడ్డం నారాయణమూర్తి తల్లి, భార్యా పిల్లలు, ఇద్దరు తమ్ముళ్లతో కలిసి దాసన్నపేటలో నివాసముంటున్నారు. అయితే ఇటీవల అతని తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని నారాయణమూర్తి అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నారు. ఈక్రమంలో ఆదివారం రాత్రి భోజనం కూడా చేయకుండా తన రూమ్లో పడుకున్నాడు. సోమవారం ఉదయం తలుపు తట్టినా ఎటువంటి స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు విరగ్గొట్టి చూడగా.. నారాయణమూర్తి ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. మృతుడి భార్య సౌందర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హత్యాయత్నానికి పాల్పడిన నిందితుల అరెస్ట్
కొత్తవలస: మండల కేంద్రంలోని కొత్తవలస గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు మేలాస్త్రి చల్లంనాయుడు, అప్పలలక్ష్మిలపై ఈ నెల 19న వారి ఇంటిలో హత్యాయత్నానికి పాల్పడిన ఆరుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసినట్లు సీఐ సీహెచ్ షణ్ముకరావు తెలిపారు. ఈమేరకు సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చల్లంనాయుడు దంపతులకు పిల్లలు లేకపోవడంతో కొద్ది సంవత్సరాల కిందట వేపాడ మండలం బానాది గ్రామానికి చెందిన డేగల సన్యాసినాయుడు ఉరఫ్ గణేష్ను దత్తత తీసుకున్నారు. కొద్ది సంవత్సరాల తర్వాత చెల్లంనాయుడు దంపతులకు కుమారుడు కలిగాడు. ఈక్రమంలో తనపై ప్రేమ తగ్గిందనే ఉద్దేశంతో గణేష్ పది సంవత్సరాల కిందట తన సొంత తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పోయాడు. అయితే పెంపుడు తండ్రి తనకు ఆస్తి ఇవ్వలేదనే కక్షతో ఎలాగైన అతడ్ని హతమార్చేందుకు పథకం రచించాడు. దీంతో విశాఖపట్నం జిల్లా నాయుడుతోట, వేపగుంట ప్రాంతాలకు చెందిన శ్రీలం మనోహర్, మెండి బ్రహ్మయ్య, శ్రీలం రాజేష్, చింతల రాంబాబు, రవి అజయకాంత్లతో మాట్లాడి రూ. 5 లక్షలకు సుపారీ కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 19న వృద్ధ దంపతులపై వారి ఇంటిలోనే మారణాయుధాలతో దాడి చేశారు. అయితే వారు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పోగయ్యారు. దీంతో నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు. ఈ మేరకు చెల్లంనాయుడు దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పెందుర్తి జంక్షన్ వద్ద నిందితులను సోమవారం అరెస్ట్ చేశారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి టెన్నిస్ టోర్నమెంట్
విజయనగరం: నగర శివారులోని విజ్జీ స్టేడియంలో రెండు రోజలుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సారథ్యంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న టెన్నిస్ టోర్నమెంట్ సోమవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 40 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. తుది పోరులో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు కలెక్టర్ రాంసుందర్రెడ్డి , జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. విజయనగరంనకు చెందిన బి.మహేశ్వరరావు టెన్నిస్ సింగల్స్ విజేతగా నిలిచారు. అలాగే విజయనగరంనకు చెందిన టి.రామారావు, ఎ.సుదర్శనరాజు డబుల్స్ విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందన్నారు. విజేతలు వీరే.. టెన్నిస్ సింగల్స్ రన్నర్గా జి.ప్రభజనరెడ్డి (నంద్యాల), మూడవ ప్లేస్లో పి.రామకృష్ణారావు (కాకినాడ) నిలిచారు. అలాగే డబుల్స్ రన్నర్స్గా ఎంవీఎల్ఎన్ రాజు, కె.రమేష్ (విశాఖపట్నం), మూడో స్థానంలో ఎన్.రాము, ఆర్.రవికుమార్ (మన్యం పార్వతీపురం) నిలిచారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గోన్నారు. -
పీజీఆర్ఎస్కు 37 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: నగరంలోని కంటోన్మెంట్లో గల పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో జరిగిన పీజీఆర్ఎస్కు 37 వినతులు అందాయి. ఇందులో భూ తగాదాలకు సంబంధించి 11, కుటుంబ కలహాలకు సంబంధించి 6, మోసాలకు సంబంధించి 7, ఇతర అంశాలపై 13 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఏఎస్పీ సౌమ్యలత మాట్లాడుతూ.. ఫిర్యాదులను పరిశీలించి చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తీసుకున్న చర్యలను డీపీఓకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలకు సత్వర పరిష్కారం
● ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డిపార్వతీపురం రూరల్: ప్రజలు తెలియజేసిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపించాలని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవ్రెడ్డి బాధితుల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, ఆన్లైన్ వేధింపులు, ఇతర సమస్యలపై పది ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఎస్పీ ఫోన్లో మాట్లాడుతూ.. ఫిర్యాదులపై చట్ట పరిధిలో తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. సద్వినియోగం చేసుకోవాలి ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే పీజీఆర్ఎస్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మాధవ్రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రానికి రాలేని వారు తమ పరిధిలోని సబ్ డివిజన్ కార్యాలయాలు లేదా పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదు చేసుకోవచ్చాన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ ఎస్సై సురేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం..
పార్వతీపురం: పీజీఆర్ఎస్లో అందిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి, డీఆర్ఓ కె. హేమలత, సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్లతో కలిసి పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 70 వినతులు స్వీకరించగా.. ఇందులో రెవెన్యూ సమస్యలు 18 కాగా.. మిగిలిన 52 ఇతర శాఖలకు చెందినవి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలన్నారు. పరిష్కరించిన అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు
● బుక్ చేసిన 20 రోజులకు గానీ రాని గ్యాస్ సిలిండర్ ● తీవ్ర ఇబ్బందులు పడుతున్న వినియోగదారులుపూసపాటిరేగ: మండలంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. అమెరికా–ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడిందన్నది విస్తృత ప్రచారంలో ఉండగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అసలు గ్యాస్ కొరతే లేదని చెబుతుండడం విడ్డూరంగా ఉందని జనం అంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పినంత సులభంగా గ్యాస్ దొరకడం లేదని, ఒక్క గ్యాస్ సిలిండర్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ బుక్ చేసి 20 రోజులైతే గానీ గ్యాస్ ఇంటికి రావడం లేదని, మరోవైపు ఒక గ్యాస్ బుకింగ్కు మరో గ్యాస్ బుకింగ్కు 40 రోజుల సమయాన్ని పరిమితిగా విధించడం, సరిపడ గ్యాస్ సరఫరా లేకపోవడం చూస్తే ఇప్పట్లో గ్యాస్ కష్టాలు తీరేలా లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా పూసపాటిరేగ మండలంలోని చింతపల్లికి సకాలంలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయకపోవడంపై మత్స్యకార నాయకుడు బర్రి చిన్నఅప్పన్న సోమవారం మండల కేంద్రంలోని గాయిత్రి గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి, గ్యాస్ పంపిణీలో జాప్యంపై సిబ్బందిని ప్రశ్నించారు. కనీసం గ్యాస్ బుక్ చేసుకున్న వారికై నా సమయానికి గ్యాస్ పంపించాలని కోరారు. -
అబద్ధాల రాణి...
సాలూరు: అబద్ధాలు చెప్పడంలో మంత్రి సంధ్యారాణి ఆరితేరిపోయారంటూ ప్రజలు చర్చించుకుంటున్నారని, సాలూరులో వందపడక ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఆమె చెప్పిన అవాస్తవాలే దీనికి నిదర్శనమని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల ఆత్మగౌరవమని తెలిపిన మంత్రి.. పట్టణంలో సుమారు 20 లక్షల వ్యయంతో సామాజిక మరుగుదొడ్లు కట్టలేకపోయారన్నారు. ఇప్పుడు రూ.17 కోట్లు వెచ్చించి ఆస్పత్రి నిర్మించామని సభ సాక్షిగా అబద్ధాలు చెప్పడం చూసి సాలూరు ప్రజలు ముక్కునవేలేసుకుంటున్నారన్నారు. వందపడకల ఆస్పత్రి ప్రారంభోత్సవంలో మంత్రి చెప్పిన అవాస్తవాలను ఖండించారు. గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం దాదాపు 70 శాతానికి పైబడి ఆస్పత్రి పనులు పూర్తిచేయగా, పునాదుల్లోనే ఆస్పత్రిని వదిలేశారని మంత్రి మాట్లాడడం దారుణమన్నారు. గత ప్రభు త్వంలో జరిగిన ఆస్పత్రి భవన నిర్మాణం, నాడు ఆయన పరిశీలించిన ఫొటోలను తేదీలతో సహా చూపించారు. ఆస్పత్రి నిర్మాణం ఎవరి హయాంలో జరిగిందే ప్రజలందరికీ తెలుసన్నారు. గత ప్రభుత్వంలో కొంత పనులు జరిగాయని, మిగిలిన పను లు మేము పూర్తిచేశామని మంత్రి చెబితే ప్రజలు హర్షించేవారన్నారు. మున్సిపాలిటీ పాలకవర్గం ఉన్నప్పుడు ఆస్పత్రిని ప్రారంభిస్తే వైఎస్సార్సీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్, తదితరుల పేర్లు శిలాఫలకంలో పెట్టాలనే దురుద్దేశంతో పాలకవర్గం ముగిసిన తరువాత ప్రారంభోత్సవం చేశారని ఎద్దేవా చేశారు. ఆస్పత్రికి ప్రహరీ, ఆక్సిజన్ ప్లాంట్, ఫైర్ సేఫ్టీ వంటి పనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు. ఆ పనులు ఎందుకు చేపట్టలేదు..? ● సాలూరు పట్టణంలో బోసుబొమ్మ కూడలి నుంచి వేదసమాజం వరకు రోడ్డు నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టిన మంత్రి ఆ పనులు నేటివరకు ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు. రెండేళ్లు అవుతున్నా అన్నా క్యాంటిన్ నిర్మాణం చేయలేకపోయారన్నారు. ● ఆస్పత్రి ప్రారంభోత్వవ సమయంలో ఎవరినీ విజయనగరం రిఫర్ చేయరాదని మంత్రి తెలిపిన నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రి నుంచి ఓ కేసును అంబులెన్స్లో విజయనగరం తీసుకెళ్లారని, ఇది మంత్రి మాటలు, వాటి అమలు తీరుకు అద్దంపడుతోందన్నారు. ● అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జీగిరాం జూట్ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్ల పాలనలో అటువైపు మంత్రి చూసిన దాఖలాలు లేవన్నారు. గతంలో కందులపదం బ్రిడ్జికు, మోసూరు బ్రిడ్జికు కొబ్బరికాయలు కొట్టి టీడీపీ నేతలు విడిచిపెట్టగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మాణం పూర్తిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రొటోకాల్ పాటించకపోవడం తగదు సాధారణంగా పార్లమెంట్, శాసనసభ సమావేశాలు అయ్యేటప్పుడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాలు చేపట్టరని, మరీ అత్యవసరమైతే సెలవు రోజుల్లో వాటని చేపడతారని పీడిక రాజన్నదొర అన్నారు. వందపడకల ఆస్పత్రి ప్రారంభోత్సవ సమయంలో గిరిజనురాలైన ఎంపీ తనూజారాణికు ముందురోజు సమాచారం ఇవ్వడం సరైనది కాదన్నారు. ఈ విషయంపై ఆమె పార్లమెంట్ స్పీకర్కు ఫిర్యాదుచేయనున్నారని, సంబంధిత అధికారులు దీనిపై తప్పకుండా విచారణ ఎదుర్కోకతప్పదన్నారు. శిలాఫలకంలో ఉన్న పేర్లు ప్రొటోకాల్కు అర్హులవేనా అని ప్రశ్నించారు. గిరిజన వ్యతిరేకి సంధ్యారాణి గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ, జగ్గుదొరవలసలో జరుగుతున్న ఏజెన్సీ గ్రామాల సమస్య, జీఓ 3 పునరుద్ధరణ, ఏఎన్ఎంల నియామకంపై తొలిసంతకం చేసిన మంత్రి హామీలు నేటికి అమలుకాకపోవడం విచారకరమని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర పేర్కొన్నారు. దీనిపై గిరిజన సంఘాల నాయకులు నిలదీయాలని పిలుపునిచ్చారు. గతంలో మాజీ ఉద్యోగిగా ఉద్యోగుల పక్షాన నిలిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. గిరిజనులకు ఇచ్చిన హామీల అమలులో మంత్రి విఫలం రూ.20 లక్షల వ్యయంతో సామాజిక మరుగుదొడ్లు మరమ్మతులు చేయని వైనం రూ.17కోట్లు వెచ్చించి ఆస్పత్రినిర్మించామంటూ అబద్ధాలు ప్రొటోకాల్ ఉల్లంఘనపై త్వరలో పార్లమెంట్లో ఫిర్యాదు చేస్తాం మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
జనగణన పారదర్శకంగా చేపట్టాలి
పార్వతీపురం: జనగణన–2027 పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జనగణన 2027 సన్నాహకాల్లో భాగంగా ఫీల్డ్ట్రైనర్ల శిక్షణను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జనగణన దేశ భవిష్యత్ ప్రణాళికలకు అత్యంత కీలకమైన ప్రక్రియగా పేర్కొన్నారు. శిక్షణ పొందుతున్న ఫీల్డ్ ట్రైనర్లు క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నా రు. నిర్దేశించిన సమయంలోగా ఎన్యుమరేటర్లు తమ విధులను పూర్తిచేసేలా ఫీల్డ్ ట్రైనర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనీలు ఫీల్డ్ ట్రైనర్లకు జనగణనపై పలు సూచనలు, జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్ కుమార్రెడ్డి, డీఆర్ఓ కె. హేమలత, తదితరులు ఉన్నారు. 11ఏళ్ల ఆస్తి వివాదానికి పరిష్కారం గత 11 ఏళ్లుగా కుటుంబ సభ్యుల ఆస్తుల పంపకం పరిష్కారంకాక కోర్టులు, పోలీసుల చుట్టూ తిరుగుతున్న కేసును లీగల్ ఎయిడ్ క్లినిక్లో పరిష్కారం చూపినట్టు కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. 2015లో హౌసింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన కె.ఎల్లప్పదొర మరణించిన తరువాత ఆయన ఇద్దరు భార్యలు, పిల్లలు ఆస్తుల పంపకంలో కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ మానసికంగా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, లీగల్ ఎయిడ్ క్లినిక్ను ఆశ్రయించడంతో న్యాయవాదులు, అధికారులు సమస్య తీవ్రతను గుర్తించి ఇరువర్గాల వారికి నచ్చజెప్పి న్యాయపరంగా వాటాలను దఖలు పరిచేలా చేశారన్నారు.. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయం కావాలి ప్రజారోగ్యాన్ని పరిరక్షణలో అధికారులు రాజీపడకూడదని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించాలన్నారు. ఒక్క టైఫాయిడ్ కేసు కూడా నమోదు కాకుండా వైద్యారోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఫ్యామిలీ ముస్తాబు కార్యక్రమాలను పర్యవేక్షించాలని సూచించారు. -
వెలుగులో.. అవినీతి చీకట్లు..!
● గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో నిధుల దుర్వినియోగం ● యంత్రాల కొనుగోలులో అక్రమాలు మండల సమాఖ్యల నుంచి సేకరించిన అదనపు నిధులతో అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి 11 వీడీవీకేలకు రూ.19 లక్షలు అడ్వాన్సుల రూపంలో విడుదల చేశారు. కొనుగోలు చేసిన పరికరాలు, నిధుల వినియోగం, పర్యవేక్షణపై పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. వీడీవీకేలకు నిధులు ఇప్పటికే ఉన్నప్పటికీ.. అడ్వాన్సు విడుదల చేయడంతో పాటు.. మండల సమాఖ్యల నుంచి అదనపు, అనధికారిక అడ్వాన్సులు స్వీకరించినట్లు తేలింది. గిరిజన అటవీ ఉత్పత్తుల సేకరణకు, గిరిజన వర్గాల జీవనోపాధి, ఆర్థిక అభ్యున్నతిని లక్ష్యంగా మంజూరు చేసిన ప్రభుత్వ నిధులను దారి మళ్లించి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించినట్లు గుర్తించారు. నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించి వీడీవీకేల కోసం ఎఫ్పీవో నిధుల నుంచి రూ.224 లక్షలు అడ్వాన్సులు తీసుకున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం(సెర్ప్) దృష్టికి వచ్చిన తర్వాత కొంత మొత్తాన్ని చెల్లించారు. పార్వతీపురంలోని లక్ష్మీబాయి వీడీవీకే నుంచి రూ.21,31,700 మొత్తం వసూలు చేయలేదు. జిల్లాలోని సాలూరు, మక్కువ, కురుపాం ప్రాంతాలలో స్థానికంగా పండిస్తున్నప్పటికీ.. మినముల పప్పును స్థానిక వనరుల నుంచి కాక.. సీతానగరం బుడ్డిపేట మిల్లు నుంచి సేకరించారు. పసుపును పాడేరు నుంచి పెద్ద మొత్తంలో రవాణా చేశారని ఆరోపణ. మండల సమాఖ్యలు, గిరిజన మహిళా సమాఖ్యల నుంచి తీసుకున్న అడ్వాన్సులకు సరిగా లెక్కలు చూపలేదు. అంతేకాక, ఈ కొనుగోళ్ల ద్వారా వచ్చిన లాభాలను ఆయా మండల సమాఖ్యలకు తిరిగి జమ చేయలేదు. సాక్షి, పార్వతీపురం మన్యం: వివిధ యూనిట్లకు అక్రమంగా నిధులు కేటాయించడం.. యంత్రాలు నిరుపయోగంగా ఉన్నా రూ.లక్షలు వెచ్చించడం.. ధాన్యం కొనుగోలు కమీషన్ నిధులు స్వాహాచేయడం.. అగరబత్తీ పరిశ్రమ ఏర్పాటుతో గిరిజనులకు ఎలాంటి ఉపాధి కల్పించకుండానే నిధులు ఖర్చుచేయడం వంటి అవినీతి పనులు ‘వెలుగు’లోకి రావడం ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) మాజీ ఏపీడీ, గతంలో ఇన్చార్జి పీడీగా పనిచేసిన వై.సత్యంనాయుడు మీద వచ్చిన అవినీతి, అక్రమ ఆరోపణలపై నిర్వహించిన సమగ్ర విచారణలో అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో నిధుల దుర్వినియోగం, యంత్రాల కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు విచారణ అధికారిగా వ్యవహరించిన గత ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.సుధారాణి సమర్పించిన నివేదికలో స్పష్టమైంది. ఇప్పటికే పూర్వ ఏపీడీ సావిత్రి మీద అనేక ఆరోపణలు ఉన్న విషయం విదితమే. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన యంత్రాలు సరైన విధంగా ఉపయోగించకపోవడంతో ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు విచారణలో వెల్లడైంది. దీనికితోడు.. పెద్ద ఎత్తున కమీషన్లతో నిధులు పక్కదారి పట్టించారని తెలుస్తోంది. యంత్రాలు ఏర్పాటు చేయకున్నా.. నిధుల చెల్లింపు చింతపండు కేక్ తయారీ కోసం మొత్తం ఎనిమిది యంత్రాలు కొనుగోలు చేశారు. ఒక్కో యంత్రం ధర సుమారు రూ.21.43 లక్షలు. మొత్తం వ్యయం సుమారు రూ.1.71 కోట్లు. ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది మండలాలకు ఒక్కో యంత్రం కేటాయించారు. ఎనిమిది యంత్రాల్లో నాలుగే పని చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. జియ్యమ్మవలస, పాచిపెంట మండలాల్లో యంత్రాలు పూర్తిగా వినియోగంలో లేవు. మిగతా యంత్రాల పనితీరు కూడా అంతంతే. చింతపండు ప్రాసెసింగ్, విక్రయాల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. యంత్రాల వినియోగం సరిగా లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో భారీ నష్టాలు నమోదయ్యాయి. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, మక్కువల్లో లాభాలు చాలా తక్కువగా, స్థిరంగా లేకుండా ఉన్నట్లు విచారణలో తేలింది. ప్రాజెక్టు అమలులో లోపాలు, పర్యవేక్షణలో నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. రూ. 29.23 లక్షలతో కొన్న పప్పు ధాన్యాలు, పసుపు ప్రాసెసింగ్ యూనిట్లు మూడేళ్లుగా మూలన పడి ఉండడంతో ప్రభుత్వ ధనం వృథా అయినట్లు గుర్తించారు. 2022 జూలై 26న యంత్రాలను వ్యవస్థాపించకుండా గిరిజన మహిళా సమాఖ్య వద్ద పడేశారు. ఏడాది తర్వాత పప్పుధాన్యాల శుద్ధి యంత్రాన్ని కురుపాం మండలానికి కేటాయించారు. అది కూడా నిరుపయోగంగానే ఉందని గుర్తించారు. మంజూరైన గ్రామాలకు కాకుండా ఇతర ప్రదేశాలలో, అనుమతి లేకుండా యంత్రాలను ఏర్పాటు చేశారు. గిరిజన మహిళా సమాఖ్యలో ఒక పప్పు యూనిట్ మూడు సంవత్సరాలకు పైగా నిరుపయోగంగా ఉంది. యంత్రాలను ఏర్పాటు చేయనప్పటికీ 83 శాతం నిధులు చెల్లించారు. ఒకే ఒక్క పసుపు యూనిట్ (మక్కువ) మాత్రమే పనిచేస్తోంది. ఈ యంత్రాలపై మూడు సంవత్సరాలలో వచ్చిన మొత్తం లాభం కేవలం రూ.15,180 మాత్రమే. దీనికి సంబంధించిన రికార్డులు ఎక్కడా లభ్యం కాకపోవడం గమనార్హం. వీటి కొనుగోలులో ఒక నిర్ధిష్ట ప్రణాళికంటూ ఏదీ లేదు. రూ.1,84,600 వ్యయం చేసి ఎనిమిది చీపురు గడ్డి కోసే యంత్రాలు కొనుగోలు చేశారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలకు యంత్రాలు సరఫరా చేయలేదు. జియ్యమ్మవలస మండల యంత్రం ఆచూకీ లేకపోయింది. పాచిపెంట, మక్కువ మండలాలు మాత్రమే లాభాలను ఆర్జించాయి. సాలూరు, పార్వతీపురం మండలాల్లోని యంత్రాలు పని చేయడంలేదు. ఎనిమిది చీపురు కోసే యంత్రాలను సేకరించినప్పటికీ.. పంపిణీ, పర్యవేక్షణ సరిగా లేవని గుర్తించారు. ధాన్యం కొనుగోలు కమీషన్ కింద వచ్చిన సుమారు రూ.94.13లక్షల నిధుల్లో రూ.58.96 లక్షలను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించినట్లు గుర్తించారు. దసరా ఉత్సవాలు, వాహన అద్దెలు, భవన మరమ్మతులకు వీటిని వినియోగించినట్లు తెలిసింది. దీనికి ఎలాంటి ముందస్తు అనుమతులూ లేవని విచారణలో తేలింది. సేవా కేంద్రాల కోసం పంపిణీ చేసిన 40 ల్యాప్టాప్లలో 27 పని చేయడం లేదు. వెనక్కి తీసుకున్నట్లు రికార్డుల్లో ఉన్నా.. నాలుగు ల్యాప్టాప్లు ప్రస్తుతం కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంపై విచారణాధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఉన్నతి పథకం కింద ఇచ్చిన రుణాల వసూళ్లలో తీవ్ర జాప్యం జరిగింది. లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన నగదును సంబంధిత ఖాతాల్లో జమ చేయకుండా ఇతర అవసరాలకు వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. గిరిజనులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాల్సిన అగరబత్తీ తయారీ పనిని ప్రైవేట్ పరిశ్రమకు అప్పగించారు. దీనివల్ల గిరిజనులకు ఎలాంటి ఉపాధి లభించలేదు. నాలుగు వీడీవీకేలకు అగరబత్తిల తయారీలో శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. హిరమండలంలోని సత్య అగరబత్తి పరిశ్రమకు రూ.24 లక్షలు చెల్లించారు. సదరు పరిశ్రమలో అగరబత్తిలు తయారు చేసి, వీడీవీకేల పేరిట వ్యాపారం నిర్వహించలేనట్లు తేలింది. గిరిజన లబ్ధిదారులకు ఎలాంటి ఉపాధి కూడా కల్పించలేదు. -
గింజ మొలవదు.. ధర రాదు!
–8లో● మొక్కజొన్నను ముంచేసిన ‘కావేరి’ ● దిగుబడి లేక నష్టపోతున్న రైతాంగం ● పంటను నమ్ముకున్న రైతులపై ముప్పేట దాడి మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026సాక్షి, పార్వతీపురం మన్యం: రైతులు రూ.వేలు పెట్టుబడి పెట్టి.. పంటకు ఉపక్రమించారు. ‘మా సీడ్స్ వేసుకుంటే.. ఎకరాకు మూడున్నర టన్నుల దిగుబడి వస్తుంద’ని ఓ విత్తన సంస్థ మాటలను నమ్మి సాగుచేశారు. పైగా.. ఏడాదికి ఎరువులు, పురుగు మందు ఖర్చూ తామే భరిస్తామంటే ఆశ పడ్డారు. పంట చేతికొచ్చాక గానీ.. బోధపడలేదు. తామెంత మోసపోయామో అని! జిల్లాలో ఈ సీజన్లో మొక్కజొన్న పండించిన రైతులు నిలువునా దగా పడ్డారు. ఇటు ప్రభుత్వపరంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక యంత్రాంగం బొమ్మ చూపించగా.. అటు విత్తన సరఫరా సంస్థ నకిలీ విత్తనాలతో దిమ్మ తిరిగేలా చేసింది. మరోవైపు అనుకోని అతిథిలా కొద్దిరోజులుగా వస్తున్న గాలివాన.. చేతికొచ్చిన కొద్ది పంటపైనా దెబ్బ కొడుతోంది. కండెలు సిద్ధం.. గింజలే లేవు... జిల్లాలో మొక్కజొన్న పండిస్తున్న రైతులు తీవ్ర నష్టానికి, కష్టానికి గురవుతున్నారు. రబీ సీజన్లో సుమారు 31 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగచేయగా, అధిక శాతం మంది రైతులు కావేరి సీడ్స్ సరఫరా చేసిన విత్తనాలనే వినియోగించారు. సీజన్కు ముందు సంస్థ ప్రతినిధులు.. వీటిని వినియోగిస్తే, ఎకరాకు మూడు నుంచి మూడున్నర టన్నుల వరకు జొన్న పంట దిగుబడి వస్తుదందని చెప్పారు. సంవత్సరానికి ఎరువులు, పురుగు మందులకు సరిపడా మొత్తం రూ.35 వేలు తామే ఇస్తామని రైతులను నమ్మించారు. పంట కూడా కొనుగోలు చేసి తీసుకెళ్తామని ఒప్పందం చేసుకున్నారు. తీరా.. పంట చేతికి వచ్చిన తర్వాత పుష్కలంగా కండైలెతే వచ్చాయి గానీ, ఎక్కడా గింజలు లేవు. అప్పటికి గానీ.. నకిలీ విత్తనాలతో నష్టపోయామని రైతులు గ్రహించలేకపోయారు. ఎరువు లు, మందులకు అవసరమైన డబ్బులు కూడా ఇవ్వలేదని పలువురు రైతులు చెబుతున్నారు. మక్కువ మండలం సరాయివలస, కొమరాడ మండలం కల్లికోట, గుణానపురం, గంగరేగువలస, దుగ్గి కంభవలస, సోమినాయుడువలస, పాలకొండ తదితర ప్రాంతాల్లో ఇదే రకం సీడ్స్తో పంట వేశారు. ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానరాని కొనుగోలు కేంద్రాలు మరోవైపు ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటాకు రూ.2,400గా ప్రకటించింది. పంట చేతికి అందొస్తున్నా.. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఊసులేదు. మరోవైపు గాలి, వర్షాలు పంటపై ప్రభావం చూపుతున్నాయి. దళారులు సిండికేట్గా మారి రూ.1,600 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లోనూ వర్షాల వల్ల పంట నష్టం జరిగిందనే సాకు పెట్టి, క్వింటా రూ.800 నుంచి రూ.1,400లోపే రైతుల వద్ద దళారులు కొనుగోలు చేశారు. మరలా ఆ పరిస్థితి పునరావృతం కానీయకుండా చూడాలని రైతు సంఘం నాయకులు కోరుతున్నారు.కావేరి సీడ్స్తో జొన్న పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. గింజలు రావడం లేదు. జిల్లాలో సుమారు 20 వేల ఎకరాలకుపైగా ఈ సీడ్స్తోనే పంట ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు సర్వే చేయాలి. జొన్న పంటకు ఎకరాకు రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలి. కావేరి సీడ్స్పై చర్యలు తీసుకోవాలి. సీడ్స్ ప్రతినిధులు రైతులను బెదిరిస్తున్నారని తెలుస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు. – బంటు దాసు, జిల్లా కార్యదర్శి, రైతు సంఘం జిల్లాలోని అన్ని మండలాల్లోనూ రైతులు మొక్కజొన్న విరివిగా సాగు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు సిండికేట్గా మారి, రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర రూ.2,400 ఉంటే.. రూ.1,600కే విక్రయించాల్సి వస్తోంది. తక్షణమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరవాలి. – బుడితి అప్పలనాయుడు, జిల్లా సమితి కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం -
రబీలో రాగిదే పెత్తనం..
గోమాతకు సీమంతం..చికెన్● నియోజకవర్గంలో 659 హెక్టార్లలో సాగు ● ఒక్క రాజాం మండలంలో 520 హెక్టార్లలో సాగవుతున్న చోడి ● క్వింటా ధర రూ. 3500 ● ఆశాజనకంగా సాగుభీమసింగి వేణుగోపాలస్వామి ఆలయలో గోమాతకు ఆదివారం సీమంతం ఘనంగా నిర్వహించారు. భక్తులు గోవుపై వస్త్రాలు ఉంచి పసుపు, కుంకుమలు రాసి శాస్త్రోక్తంగా వేడుకను జరిపారు. – జామిరాజాం: నియోజకవర్గ వ్యాప్తంగా గత రబీ సీజన్లో మొక్కజొన్న పంట సాగు అధికంగా కనిపించేది. ఒకానొక సమయంలో రబీ సాగు అంటేనే మొక్కజొన్నగా ఉండేది. చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం రబీలో సాగుచేసిన మొక్కజొన్న పంటకు దళారీలే దిక్కుగా మారారు. గతంలో క్వింటా మొక్కజొన్న ధర రూ. 2400 ఉండగా, ఇప్పుడు 1800 రూపాయలకు పడిపోయింది. దీంతో చాలామంది రైతులు మొక్కజొన్న సాగుకు స్వస్తి పలికి, రాగి సాగుపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆరోగ్య అవసరాల రిత్యా రాగి పిండి వినియోగం పెరిగింది. మార్కెట్లో పిండి ధర అధికంగా ఉంది. రైతు పండించే పంటకు మంచి ధర వస్తుండడంతో రాగిపంట సాగు మండలంలో అధికమైంది. నియోజకవర్గంలో 659 హెక్టార్లలో.. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది నియోజకవర్గంలో రాగి పంట సాగు కనిపిస్తోంది. మొత్తం 659 హెక్టార్లలో ఈ పంట సాగుచేయగా, అత్యధికంగా రాజాం మండలంలో 520 హెక్టార్లలో సాగవుతోంది. రాగి పంట కాలం 75 రోజులు కాగా, పెట్టుబడి చాలా తక్కువుగా ఉంటుంది. ఎకరా సాగుకు 200 రూపాయల విత్తనాలు, ఒక యూరియా బస్తా సరిపోతుంది. ఇతర ఎరువులు, పురుగు మందుల అవసరం ఉండదు. పంట ప్రారంభ దశలో మినహా ఈ పంటకు సాగునీరు అవసరం లేదు. నియోజకవర్గ పరిధిలో చాలా చోట్ల ఇప్పటికే రాగుల పంట కోతలు కూడా పూర్తయ్యాయి. ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా రూ. 3100 నుంచి 3500 రూపాయల మధ్య కొనుగోలు చేస్తున్నారు. పెద్దగా పెట్టుబడి అవసరం లేని రాగి పంట రబీలో రైతుకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. నువ్వు పంటదీ అదే రూటు.. నియోజకవర్గ పరిధిలో రబీ సీజన్లో రాగి పంటతో పాటు పలుచోట్ల నువ్వు పంట వేశారు. రాజాం, సంతకవిటి మండలాల్లో ఈ పంట అధికంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో 72 హెక్టార్లలో ఈ పంట సాగులో ఉంది. నువ్వుల పెట్టుబడి నామమాత్రం కాగా, ఎకరా సాగులో నువ్వు పంట ద్వారా రైతుకు రూ. 15 వేల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. -
విశ్వగురు స్థానంలో భారత్ ..
బాడంగి: భారతదేశాన్ని 2047 నాటికి విశ్వగురు స్థానంలో నిలపడమే తమ ధ్యేయమని.. అందుకోసం అహర్నిశలు శ్రమిస్తామని ఆర్ఎస్ఎస్ కండ కార్యవాహక కార్యదర్శి ఎం.గణపతి అన్నారు. తొలుత స్థానిక మెయిన్రోడ్డుపై పద సంచలనం పేరుతో భారతమాత జెండాలు పట్టుకుని ఆదివారం ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక స్వామి కల్యాణ మంటపంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ను రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ దేశం, ధర్మం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు బేతనపల్లి శంకరరావు, అంబటి గణపతి, లగుడు పరశునాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
బొత్స త్వరగా కోలుకోవాలి..
● ఎమ్మెల్సీల ఆకాంక్ష ● బొత్స సత్యనారాయణను పరామర్శించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల బృందం విజయనగరం: శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆదివారం పరామర్శించారు. నగరంలోని బొత్స నివాసంలో ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా కలిసిన వారు ఆయన క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ తలశిల రఘురాం మాట్లాడుతూ ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాల్లో అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని తామంతా ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. విజయనగరం ప్రజల ఇలవేల్పు పైడితల్లమ్మ ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉన్నారని.. సంతోషంగా ఉందన్నారు. గతంలో మాదిరి మరింత ఆరోగ్యంగా ఉంటూ తమకు మార్గదర్శిగా నిలవాలని ఆకాంక్షించారు. అంతకు ముందు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బొత్స సత్యనారాయణను పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, వరుదు కళ్యాణి, కల్పలతా రెడ్డి, డాక్టర్ పెనుమత్స సురేష్బాబు, పాలవలస విక్రాంత్, కుంభా రవిబాబు, టి.మాధవరావు, కెఆర్జె.భరత్, రమేష్ యాదవ్, బొమ్మి ఇస్రాయిల్, రూహుతలా, సిపాయి సుబ్రహ్మణ్యం, పి.చంద్రశేఖర్ రెడ్డి, నర్తు రామారావు, టి.మాధవరావు, ఇందుకూరి రఘురాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కెకె.రాజు, పార్టీ నాయకులు కాయల వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. -
నిర్లక్ష్యపు అంచున చంపావతి ప్రాజెక్ట్
● మసకబారుతున్న నిర్వహణ ● కొన్ని రోజులుగా సరఫా కాని నీరు ● ఇబ్బంది పడుతున్న ప్రజలుపూసపాటిరేగ: చంపావతి ప్రాజెక్ట్ నిర్వహణ మసకబారుతోంది. ప్రాజెక్ట్ పాడై వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు పనులు చేపట్టకపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండడంతో చంపావతి నదిపై ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్పైనే ఎక్కువ మంది ప్రజలు ఆధారపడుతున్నారు. ఒక్క పూసపాటిరేగ మండలంలోనే 20 గ్రామాల ప్రజలకు చంపావతి ప్రాజెక్ట్ ద్వారా నీరు అందించడానికి పైప్లైన్లు వేశారు. పదేళ్ల కిందట ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినప్పటినుంచి తాగునీటి సరఫరా సక్రమంగానే సాగింది. అయితే కొద్ది నెలలుగా ప్రాజెక్ట్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పూసపాటిరేగ మండల పరిధిలోని 20 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామంలో కూడా పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరా జరగడం లేదు. ప్రాజెక్ట్ నిర్వహణ కాంట్రాక్ట్ను అధికారంలో ఉన్న కీలకనేత అనుచరుడు దక్కించుకోవడం వల్లే ఎవ్వరూ ప్రశ్నించలేని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్ట్కు వెంటనే మరమ్మతులు చేపట్టడంతో పాటు నిర్వహణ సక్రమంగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రశ్నించలేకపోతున్నారు. ఇదిలా ఉంటే తాగునీటి ఇబ్బందిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నాతవలస వద్ద చంపావతి నది నుంచి పూసపాటిరేగ ఏతపేట సమీపంలో స్టోరేజీ ట్యాంక్కు పైపులైన్ల ద్వారా నీరు సరఫరా చేసి, అక్కడ నుంచి మండలంలోని వివిధ గ్రామాలకు నీరు సరఫరా చేయాలి. అయితే సంబంధిత అధికారుల నిర్లక్ష్యం, ఉదాశీనత కారణంగా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.తరుచూ మరమ్మతులే.. చంపావతి ప్రాజెక్ట్ తరచూ పాడవుతోంది. నెలలో కనీసం సగం రోజులు కూడా ప్రాజెక్ట్ నుంచి నీరు సరఫరా కావడం లేదు. కొన్ని రోజులుగా సుదూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి. –ఎస్. గౌరి, గృహణి, పూసపాటిరేగ తాగునీరు అందించాలి.. ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండడంతో గ్రామంలోని బోర్ల నీటిని వినియోగించలేకపోతున్నాం. ఏళ్ల తరబడి చంపావతి ప్రాజెక్ట్ నీటినే వినియోగిస్తున్నాం. కొద్ది రోజులుగా నీరు సరఫరా కాక ఇబ్బంది పడుతున్నాం. అధికారులు స్పందించి తాగునీరు అందించాలి. – సీహెచ్ చిన్న, గ్రామస్తుడు, పూసపాటిరేగ -
సౌత్జోన్ ఖోఖో పోటీలకు గర్భాం యువకుడు
మెరకముడిదాం: మండలంలోని గర్భాం గ్రామానికి చెందిన రెడ్డి సాయికిరణ్ సౌత్జోన్ జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. జేఎన్టీయూ (కె) యూనివర్సిటీ, విజయనగరం జిల్లా తరఫున సాయికిరణ్ ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గోనున్నాడు. జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు సాయికిరణ్ ఎంపిక కావడంపై గర్భాం గ్రామస్తులతో పాటు జేఎన్టీయూ సిబ్బంది అభినందించారు. ఆరుగురు జూదరుల అరెస్ట్ ● రూ.42,420 నగదు సీజ్ తెర్లాం: పేకాటాడుతున్న ఆరుగురు వ్యక్తులను ఎస్సై సాగర్బాబు ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వి.చిన్నయ్యపేట గ్రామానికి సమీపంలోని మామిడితోటలో ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే దాడి చేసి నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుంచి రూ. 42,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై సాగర్బాబు మాట్లాడుతూ.. పేకాట శిబిరాలు నిర్వహించినా, ఆడినా చర్యలు తప్పవన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ● అతడి భార్యకు, పాపకు తీవ్రగాయాలు రణస్థలం: లావేరు మండలంలోని బుడుమూరు జాతీయ రహదారిపై ఆదివారం బైక్ను కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. స్కూటీపై కె.రమేష్(32) తన భార్య సుజాత, రెండేళ్ల కుమార్తె ధాతిశ్రీతో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో బుడుమూరు దగ్గరకు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో గాయపడిన రమేష్ను స్థానికులు హుటాహుటిన 108 వాహనంపై శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయారు. భార్య సుజాత, పాప ధాతిశ్రీకి బలమైన గాయాలు కావడంతో శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రమేష్ స్వగ్రామం విజయనగరం జిల్లాలోని దాకమర్రి. గార మండలం నిజామాబాద్లో ఉన్న అత్తవారింటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం గ్రామానికి చెందిన మర్రాపు ప్రసాదరావు(60) ఆదివారం ఉదయం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలియజేసిన వివరాల ప్రకారం.. అరటి గెలలు లోడ్ చేయడానికి కూలీలతో కలసి వెళ్లగా తెగిన విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చినమేరంగి ఎస్సై అనీష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడు పెదదోడిజలోని జీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మృతుడికు భార్యతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం జరగ్గా.. కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఉపాధ్యాయుడి మృతిపై ఎంఈఓలు గౌరునాయుడు, శ్రీనివాసరావు, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. మూడు మేకలు మృతి జామి: మండలంలోని రామయ్యపాలెం గ్రామానికి చెందిన గురపంల్లి పోలయ్య, నిమ్మకాయల అప్పారావుకు చెందిన మూడు మేకలు విద్యుదాఘాతంతో మృతి చెందాయి. ఎస్సీ కాలనీకి చెందిన వీరు గ్రామ సమీపంలో మేకలను మేపుతుండగా.. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో మేకలు సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దవకు వెళ్లగా, షాక్కు గురై మృతి చెందాయి. దీంతో బాధితులు లబోదిబోమంటూ రోదిస్తున్నారు. -
గంజాయి నిందితులపై హిస్టరీ షీట్లు
గంజాయి కేసులో నిందితుడికి రిమాండ్ విజయనగరం క్రైమ్: గంజాయి రవాణా కేసులో అల్లంగి భగవాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏఓబీ పరిధిలోని ముంచంగిపుట్టు మండలం బుంగపుట్టుకి చెందిన అల్లంగి భగవాన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారన్నారు. కొద్ది రోజుల కిందట భగవాన్ మరో ఐదుగురితో కలిసి విజయనగరానికి ఆటోల గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. అయితే ఆ సమయంలో భగవాన్ తప్పించుకోగా.. గంట్యాడ మండలం కొటారుబిల్లి జంక్షన్ వద్ద ఆదివారం అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరపరిచామని చెప్పారు. మిగిలిన నలుగురు నిందితులను అప్పుడే అరెస్ట్ చేశామని తెలిపారు.కొత్తవలస: గంజాయి కేసుల్లో పట్టుబడిన నిందుతులపై హిస్టరీ షీట్లు తెరవడంతో పాటు అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ సమయాల్లో పట్టుబడిన గంజాయి కేసులపై సమీక్షించారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసి సకాలంలో కోర్టులో అభియోగ పత్రాలను దాఖలు చేయాలని సూచించారు. వివిధ కేసుల్లో, రోడ్డు ప్రమాదాల్లో పట్టుబడిన వాహనాలను నిబంధనల మేరకు విడుదల చేయాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్.కోట మండల సమీపంలోని బొడ్డవర చెక్పోస్టును మరింత పటిష్టంగా నిర్వహిస్తామన్నారు. కొత్తవలస పోలీస్స్టేషన్ పరిధిలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐలు సీహెచ్.షణ్ముకరావు, ఎల్.అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ -
పారా అథ్లెటిక్స్లో క్రీడాకారుల సత్తా..
● సత్తా చాటిన కిల్లక లలిత, కరణం గౌతమ్ విజయనగరం: ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ కళింగ స్టేడియం వేదికగా మార్చి 18 నుంచి 21 వరకు నిర్వహించిన 24వ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన పారా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి పతకాలు సాధించారు. దీంతో క్రీడాకారులను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె. దయానంద్ అభినందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గుమ్మలక్ష్మీపురం మండలం గుల్లలంక గ్రామానికి చెందిన పరుగుల రాణి కిల్లక లలిత (టి –11 కేటగిరి) 400 మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్, 1500 మీటర్ల పరుగులో బ్రాంజ్ మెడల్ సాధించిందన్నారు. అలాగే బొబ్బిలి మండలం ఎం.వలసకు చెందిన క్రీడాకారుడు కరణం గౌతమ్ (టి –12 కేటగిరి) లాంగ్జంప్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుని జాతీయ స్థాయిలో జిల్లా పేరు మారుమోగేలా చేశాడని కొనియాడారు. బలమైన సంకల్పం, నిరంతర సాధన ఉంటే అనుకున్నది సాధించేందుకు వైకల్యం ఏమాత్రం అడ్డుకాదని జిల్లాకు చెందిన పారా క్రీడాకారులు నిరూపిస్తున్నారన్నారు. విజేతలకు కలెక్టర్ రాంసుందరరెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు అభినందనలు తెలియజేశారు. -
సుప్రీం ఆదేశాలను పాటించండి
శృంగవరపుకోట: కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తులు పని చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి చీకటి మానవేంద్రనాథ్రాయ్ అన్నారు. ఎస్.కోటలో రూ.8.5 కోట్లతో నిర్మించనున్న సింగిల్ కోర్టు కాంప్లెక్స్ భవన శంకుస్థాపన కార్యక్రమానికి హైకోర్టు మరో న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి తర్లాడ రాజశేఖరరావుతో కలిసి ఆదివారం హాజరయ్యారు. ముందుగా పాత కోర్టు భవన ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన న్యాయమూర్తులను జిల్లా అధికారులు, పలువురు న్యాయమూర్తులు ఆహ్వానించగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. రుత్వికులు మంత్రోచ్ఛారణతో పూర్ణకలశంతో స్వాగతించిన అనంతరం న్యాయమూర్తులు భవన నిర్మాణానికి భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు. తరువాత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఎస్.కోట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోగాడ సూరిదేముడు నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ మాట్లాడుతూ ఎస్.కోటలో కోర్టు భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. 1978లో ఆరంభమైన ప్రస్తుత కోర్టు భవనం సుమారు అర్ధ శతాబ్దం పాటు సేవలందించిందన్నారు. దేశ వ్యాప్తంగా నేటికీ బ్రిటీష్ కాలం నాటి భవనాల్లో కోర్టులు నడుస్తున్నాయన్నారు. ఏడేళ్ల కిందట అవసరమైన చోట ఆధునిక వసతులు, సౌకర్యాలతో కోర్టు భవనాలు నిర్మించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వంతో చర్చించిదని, నాటి ప్రతిపాదనలు నేడు కార్యరూపం దాల్చాయని చెప్పారు. విజయనగరం, బొబ్బిలి, ఎస్.కోట కోర్టులకు బిల్లులు సమస్య రాకుండా చూస్తామన్నారు. తాము కోర్టులకు అవసరమైన సహకారం అందిస్తున్నామని చెప్పారు. కోర్టులు, సిబ్బంది, ఉద్యోగులు ఉన్నా ఎందుకు సకాలంలో తీర్పులు రావడం లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు మీడియేషన్పై దృష్టి పెట్టిందని, ట్రైన్డ్ మీడియేటర్ల ద్వారా కేసులు రాజీ చేసేందుకు అంతే వేగంగా ప్రయత్నాలు చేస్తున్నామని, మనకు అన్నీ ఇస్తున్న కోర్టుకు మనం ఏమిస్తున్నామో న్యాయవాదులు ఆలోచించాలన్నారు. తాను ఇక్కడి వాడినని.. అందుకే ఉత్తరాంధ్రపై మక్కువ అని, విజయనగరంపై మరింత అభిమానం సహజంగానే ఉంటుందన్నారు. 60 సెంట్లు స్థలంలో రూ.850 లక్షలతో ఎస్.కోట కోర్టు తయారవుతుందని, బార్ హాల్ కొలతలు పెంచాలని ఆదేశించామని చెప్పారు. హైకోర్టు మరో న్యాయమూర్తి టి.రాజశేఖరరావు మాట్లాడుతూ కేసులు క్లియర్ చేయాలన్న హడావుడిలో సరైన నిర్ణయాలు తీసుకోకుంటే మళ్లీ కేసులు కోర్టుల్లో పడే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా న్యాయమూర్తి బి.బబిత మాట్లాడుతూ ఎస్.కోటలో 15 నెలల్లో మూడంతస్తుల కోర్టు భవనం అన్ని హంగులతో సిద్ధమవుతుందని, న్యాయవాదులు ఆశించిన ఫలితాలు సాధించాలని అన్నారు. గుంటూరు జిల్లా న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ఉన్నత స్థాయికి ఎదిగినా కొందరు వ్యక్తులే తాను పుట్టిన ఊరు, ప్రాంతం కోసం పని చేస్తారని, అటువంటి వారిలో మానవేంద్రనాథ్ రాయ్ ఒకరని కొనియాడారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.సూరిదేముడు, కలెక్టర్ రాంసుందర్రెడ్డి, జిల్లా న్యాయమూర్తి ఎం.బబిత, ఎస్పీ ఏఆర్ దామోదర్, మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడి తదితరులు పాల్గొన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించండి హైకోర్టు న్యాయమూర్తి మానవేంద్రనాథ్రాయ్ తీర్పులు న్యాయాన్ని ప్రతిబింబింపజేయాలి హైకోర్టు న్యాయమూర్తి రాజశేఖరరావు -
నేడు పీజీఆర్ఎస్
● కలెక్టర్ రాంసుందర్రెడ్డి విజయనగరం: జిల్లా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అధికారులందరూ కార్యక్రమంలో పాల్గొని నేరుగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. గతంలో ఫిర్యాదు చేసిన వారైతే, దానికి సంబంధించిన పాత అర్జీ రశీదును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. కలెక్టరేట్కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, అలాగే సమీపంలోని మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు అందజేయవచ్చని సూచించారు. భూ సమస్యల కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ప్రభుత్వ ఆదేశాల మేరకు భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ముగ్గురు ఆర్డీవోలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్వోలు తమ వద్ద ఉన్న రికార్డులతో ఈ క్లినిక్కు హాజరవుతారని రైతులు తమ భూ వివాదాలు, మ్యుటేషన్లు లేదా ఇతర రెవెన్యూ సమస్యల కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భద్రతపై ముందస్తు జాగ్రత్తలు : కలెక్టర్ విజయనగరం: జిల్లాలో 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయని, ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. పరీక్షల సమయంలో, పరీక్షలు పూర్తయిన తరువాత ఖాళీ సమయాల్లో కొంతమంది విద్యార్థులు చెరువులు, కాల్వలు, ఇతర జల వనరుల వద్దకు వెళ్లి ఈత కొట్టే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ముందుగానే హెచ్చరించి జాగ్రత్తలు పాటించేలా చూడాలని కోరారు. తెలియని నీటి వనరుల్లో ఈత కొట్టడం ప్రమాదకరమని విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లాలోని డీపీఎంలు ముందడుగు వేసి తల్లిదండ్రులు, విద్యార్థులకు మునిగిపోవడం వంటి ప్రమాదాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా పరిపాలన, విద్యాశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, మీడియా సంస్థలు సమన్వయంతో విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. పోలీసు, అగ్నిమాపక, ఇతర శాఖల సహకారంతో ప్రమాదకర జలవనరుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై రాష్ట్ర హోం శాఖా మంత్రి రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులతో జరిగిన గత సమావేశంలో కూడా చర్చించామని గుర్తు చేశారు. ఒక అడుగు ముందుకు వేస్తే – ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు అనే సందేశంతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి విద్యార్థుల ప్రాణ భద్రతకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు సర్కార్ కొమరాడ: ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ పేరిట చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందని వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా యూత్ అధ్యక్షుడు నంగిరెడ్డి శరత్బాబు ధ్వజమెత్తారు. మండలంలోని రాజ్యలక్ష్మీపురంలో ఆయన విలేకరులతో ఆదివారం మాట్లాడారు. ఉద్యోగాలు ఇవ్వకుండానే ఇచ్చేశామని ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పేరుతో మళ్లీ నిరుద్యోగులను మోసపుచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కూటమి నేతలు గడిచిన రెండేళ్లుగా ఇచ్చిన ఉద్యోగాల లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. కొత్త ఉద్యోగాలు వేయలేదు.. సరికదా.. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిందన్నారు. వలంటీర్లను తొలగించి వారిని రోడ్డు పాల్జేసిందన్నారు. ఎన్నికల సమయంలో రూ.పది వేలు నెలకు ఇస్తామని చెప్పి వలంటీర్లను పూర్తిగా తొలగించిందని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆరు లక్షల 31 వేల 310 ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. లక్షల మందికి వలంటీర్లుగా నియమించి ఉపాధి ఇచ్చారన్నారు. -
ఎంత కష్టం..!
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రేషన్ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. నేరుగా ఇంటింటికీ వెళ్లి ఇవ్వడం జరిగేది. ఇంజిన్ సామర్థ్యం ఎక్కువ కలిగిన ఎండీయూ వాహనాలను కొండల పై గ్రామాలకు వెళ్లే విధంగా ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరికీ రేషన్ అందజేసే వాళ్లం. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. – విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ కొండలపై గ్రామాల్లో గిరిజనులు ప్రతి నెలా సరుకులు తీసుకెళ్లడానికి కింద ఉన్న గ్రామాలకు రావాల్సి ఉంటుంది. మా ప్రాంతంలో చీపురుగూడ, సరిహద్దుగూడ, ఎగువబుడగరాయి, దొండమానుగూడ తదితర గ్రామాలు రేషన్ తీసుకోవడానికి దిగువ బుడగరాయి వంటి ప్రాంతాలకు కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. – ఎస్.సాయికుమార్, మాజీ సర్పంచ్, మండ సీతంపేట: చంద్రబాబు జమానాలో కొత్త రేషన్ డిపోలను కొండలపై ఏర్పాటు చేసే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. దీంతో గిరిజనులకు రేషన్ కష్టాలు తప్పడం లేదు. మళ్లీ కొండలపై నుంచి రేషన్ సరుకులు మోసుకెళ్లాల్సి వస్తుంది. పురుషులు ఎక్కువగా కొండపోడు పనుల్లో నిమగ్నం అవుతుండటంతో.. మహిళలే ఎక్కువగా మైదాన ప్రాంతాల్లోని డిపోలకు కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. ఆయా గ్రామాల నుంచి వేకువజామున సబ్సిడీ సరుకులు కొనుగోలు చేసుకోవడానికి ఇంటి నుంచి బయలుదేరాల్సి వస్తోంది. తిరిగి నానాపాట్లు పడి ఆయా సరుకులతో స్వగ్రామాలకు కొండలెక్కుతూ సాయంత్రానికి చేరుకునే దుస్థితి ఎదురవుతోంది. గతంలో ఎండీయూ వాహనాలతో.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ వెళ్లి రేషన్ సరుకులు ఇచ్చేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను రద్దు చేయడంతో గిరిజనులకు కాలినడక కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. బరువైన సరుకులు మోసుకుంటూ కొండలపైకి తీసుకెళ్లడం గిరిజన మహిళలకు పరిపాటిగా మారింది. నెల ప్రారంభమైందంటే ఒకటో తేదీ నుంచి 15 వరకు రేషన్ దుకాణాలకు వచ్చి బియ్యంతో పాటు ఇంటికి సరిపడా ఇతర సరుకులను కొనుగోలు చేసుకుని తీసుకువెళ్తారు. గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో.. గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న డీఆర్ డిపో (నిత్యావసర సరుకుల దుకాణాలు)లు చాలకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. సీతంపేట జీసీసీ బ్రాంచ్ పరిధిలో సీతంపేట, పాతపట్నం పరిధిలో 57 వరకు డీఆర్ డిపోలు ఉన్నాయి. ఈ రెండింటిలో 650కి పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయి. వీటిలో కొండలపై సుమారు 250 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు సరిపడా రేషన్ డిపోలు కొండలపై లేవు. 10 శాతం గ్రామాలకు మాత్రమే డీఆర్ డిపోలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వారు మైదాన ప్రాంతాలకు వచ్చి రేషన్ తీసుకోవాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు. ఉన్న రేషన్ డిపోలకు సైతం పూర్తి స్థాయిలో సేల్స్మెన్లు లేరు. రెండేసి డిపోలకు ఒకరు ఇన్చార్జ్గా వ్యవహరించడంతో 15 రోజుల్లో కొన్ని రోజులు మాత్రమే తెరుస్తారు. దీనివల్ల కూడా గిరిజనాలకు మరిన్ని సమస్యలు ఎదురౌతున్నాయి. రేషన్ కోసం గిరిజనం కష్టాలు కొండలు దిగి మైదాన ప్రాంతాలకు రావాల్సిందే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాలతో పంపిణీ చంద్రబాబు ప్రభుత్వంలో కాలినడకన కొండలు దిగాల్సిందే... నెత్తిన సరుకులు పెట్టుకొని కొండలు ఎక్కాల్సిందే.. చాలా వరకు కొండ దిగువనే గ్రామాలకు డీఆర్ డిపోలు ఉన్నాయి. కొండలపై ఉన్న గ్రామాలకు డీఆర్ డిపోలు లేకపోవడంతో కొండలపై నివసిస్తున్న మహిళలంతా కొండ దిగువ గ్రామాలకు వచ్చి నిత్యావసర సరకులు కొనుగోలు చేసుకుని తీసుకువెళ్తుంటారు. ఉదయం కొండ పైనుంచి దిగితే మళ్లీ ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం 3 గంటలు దాటుతుంది. కొన్ని గ్రామాలకు రోడ్లు వేసినా బస్సులు, ఇతర వ్యాన్లు వంటివి తిరగకపోవడంతో మహిళల కష్టాలు అంతా ఇంతా కావు. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో ప్రతీ మూడు కిలోమీటర్ల దూరంలో ఒక డీఆర్ డిపో పెట్టాలనే ప్రణాళిక ఉన్నతాధికారులు రూపొందించినప్పటకీ ఈ పథకం కార్యరూపం దాల్చకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని మహిళలు వాపోతున్నారు. -
సోమవారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2026
● నిర్లక్ష్యం..! జిల్లా కేంద్రానికే తలమానికం.. వేలాది మంది క్రీడాకారుల కలల వేదిక.. రాజకీయ, ప్రభుత్వ సభలకు కేరాఫ్ అడ్రస్. కానీ, నేడు ఆ ప్రాంగణం అస్తవ్యస్తంగా మారి మైదానానికి వచ్చేపోయే వారిని వెక్కిరిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం కొద్దిపాటి వర్షానికే చిన్నపాటి చెరువును తలపిస్తోంది. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మైదానంలో సుమారు 25 శాతం మేర నీరు నిలిచిపోవడంతో క్రీడాకారులు, వాకర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మైదానంలోని ఒక పక్క భాగం పూర్తిగా జలమయమైంది. ముఖ్యంగా ఖోఖో క్రీడకు కేటాయించిన ప్రాంగణం నీట మునిగింది. వ్యాయామం చేసే స్తంభాలు ఉన్న ప్రాంతం కూడా బురదమయంగా మారింది. నిలిచిన నీరు బయటకు పోయే దారి లేక దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో మైదానానికి వచ్చే క్రీడాకారులు, విశ్రాంతి కోసం వచ్చే పలువురు ఆ వాసన భరించలేక ముక్కున వేలేసుకుంటున్నారు. అక్కడ నిలువలేక వెనుదిరుగుతున్నారు. – పార్వతీపురం రూరల్ చెరువును తలపిస్తున్న మైదానం మైదానంలో ఓ మూలన అధ్వానంగా ఉన్న గుంత -
గ్యాస్ ఏజెన్సీ, హోటళ్లపై విజిలెన్స్ దాడులు
బొబ్బిలి: పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీలు, హోటళ్లపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పౌర సరఫరాల శాఖ అధికారులు ఏకకాలంలో శ శనివారం దాడులు నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీలో రికార్డులు పరిశీలించారు. నిర్వాహకులు జలగం ప్రసాదరావును గ్యాస్ విడుదలైన తరువాత కొత్త గ్యాస్ బండ రావడానికి మధ్య ఎన్ని రోజులు పడుతుందని ప్రశ్నించారు. వస్తున్న సిలిండర్లెన్ని, ఎన్ని రోజులకు ఓసారి వస్తున్నాయనే వివరాలు నమోదు చేసుకున్నారు. అక్కడి గ్యాస్ సిలిండర్ల గోదామును తనిఖీ చేసి నిల్వలను లెక్కించారు. మరో పక్క పట్టణంలోని విజయలక్ష్మి మెస్–3, గణేష్ రెస్టారెంట్–2, సాయిరాం దాబా–2, విజయలక్ష్మి రెస్టారెంట్–3, రాజు స్వీట్స్ బేకరీ–3 తదితర హోటళ్లలో డొమెస్టిక్ గ్యాస్ వినియోగిస్తున్నట్టు గుర్తించి 13 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారానికి గృహావసరాల సిలిండర్లు వినియోగిస్తే కేసులు అనంతరం సీఐలు బి.సింహాచలం, డీవీవీ సతీష్కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ హోటళ్లు, బేకరీలు, ఇతర అవసరాలకు వాణిజ్య సిలిండర్లే వినియోగించాలని, గృహ వినియోగ సిలిండర్లు వినియోగిస్తే కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. గ్రోత్ సెంటర్లోని పలు కంపెనీలకు కూడా వాణిజ్య అవసరాల గ్యాస్ బండలు సరఫరా అవుతున్నాయన్నారు. వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ పరిధిలో ఉన్న 51వేల గ్యాస్ కనెక్షన్లకు నిత్యం వెయ్యికి తక్కువ కాకుండా గ్యాస్ బండలు వస్తున్నాయనీ, ముందుగా బుక్ చేసుకోవడం వలన పలువురికి బుక్ కావడం లేదన్నారు. ఎస్సై వి.రామారావు, పౌర సరఫరాల ఉప తహసీల్దార్ రెడ్డి సాయికృష్ణ, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. 13 సిలిండర్లు స్వాధీనం -
విద్యుత్ ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలు
వీరఘట్టం: మండలంలోని తూడి గ్రామం వద్ద శనివారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఝర్కాండ్కు చెందిన మనోజ్సింగ్ అనే యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామం వద్ద ఆర్.డి.ఎస్.ఎస్ పనుల్లో భాగంగా కొత్త విద్యుత్ లైన్లు వేస్తున్నారు. విద్యుత్ ఎక్కి పైభాగంలో పని చేస్తుండగా మనోజ్సింగ్ స్తంభం పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో అతని తలకు తీవ్ర గాయమైంది. వెంటనే సమీపంలో ఉన్న అతని సహచరులు వీరఘట్టం పీహెచ్సీకి తీసుకువచ్చారు. ఇక్కడ వైద్య సిబ్బంది క్షతగాత్రునికి ప్రధమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.అక్కడి నుంచి అతని సహచరులు అతన్ని విజయనగరం తరలించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా విద్యుత్ పనులు నిర్వహిస్తున్న ప్రదేశంలో సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. -
ఏపీ న్యాయ శాఖ రిటైర్డ్ సిబ్బంది సంఘం జిల్లా అధ్యక్షుడిగా తాడ్డి
విజయనగరం టౌన్: ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ న్యాయ శాఖ సిబ్బంది సంఘం జిల్లా అధ్యక్షుడిగా తాడ్డి ప్రసాదరావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. స్థానిక మదర్ థెరిసా క్లబ్ పార్క్ ఆవరణలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఏపీజీఆర్ రిౖటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రరావు, రాష్ట్ర న్యాయ శాఖ మాజీ ప్రధాన కార్యదర్శి బొత్స రమేష్, ఎం.అచ్చిబాబు సమావేశానికి హాజరై అజెండాను ఏకగ్రీవంగా ఆమోదించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా భగవాన్, కోశాధికారిగా కొల్లి పైడిరాజు ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీపాద కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులుగా పిబి.కృష్ణంరాజు, వి.నారాయణమూర్తి, ఎన్.చంద్రశేఖర్, సహాయ కార్యదర్శులుగా డివిఎస్ఎన్.పట్నాయక్, టి.మన్మధరావు, చిన్నికృష్ణ ఎంపికయ్యారు. మూడేళ్ల పాటూ కార్యవర్గం కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు. పదవీ విరమణ చెందిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు జీపీఎఫ్, లీవ్ ఎన్క్యాష్మెంట్, గ్రాట్యుటీ, డీఏ, పీఆర్సీ తదితర వాటిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. -
నేటి నుంచి శాప్ టెన్నీస్ లీగ్ పోటీలు
● జిల్లా వేదికగా రెండు రోజులు రాష్ట్ర స్థాయి పోటీలువిజయనగరం: క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన టెన్నీస్ లీగ్ పోటీలకు విజయనగరం వేదిక కానుంది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో విజ్జి స్టేడియంలో టెన్నీస్ క్రీడాంశంలో రెండు రోజుల పాటు జరిగే పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు. మాస్టర్స్ విభాగంలో నిర్వహించే పోటీలను ఆదివారం ఉదయం విజయనగరం ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, కలెక్టర్ ఎం.రామసుందర్రెడ్డి ప్రారంభించనున్నారు. 45 ప్లస్ విభాగంలో నిర్వహించే పోటీల్లో 60 మంది క్రీడాకారులు సింగిల్స్, డబుల్స్ విభాగా ల్లో తలపడనున్నారు. పోటీలకు హాజరైన క్రీడాకారులు భోజన, వసతి సదుపాయాలు కల్పించనున్నట్టు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సోమవారం బహుమతులు ప్రదానం చేయనున్నట్టు పేర్కొన్నారు. -
దయనీయం..!
విజయనగరం ఫోర్ట్: క్షయ రోగులకు సేవలు అందించే జిల్లా క్షయ నివారణ కేంద్రం దయనీయ స్థితికి చేరింది. అయినా పట్టించుకునే వారు కరువయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవనం పరిస్థితి చూస్తే ఎవరికై నా అయ్యో అనిపిస్తుంది. జిల్లా క్షయ నివారణ కేంద్రం పరిస్థితిని నిత్యం అధికారులు చూస్తున్నా.. ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని, అందుకోసం కోట్లాది రుపాయిలు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు సర్కార్ గొప్పలు చెబుతుంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. భయానకం.. క్షయ నివారణ కేంద్రం భయానక స్థితిలో ఉంటూ రోగులు, ఉద్యోగులను భయపెడుతుంది. భవనం శిథిలావస్థకు చేరుకొని ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అంతా భయపడుతున్నారు. అయినా ఉన్నతాధికారులు దీనిపై స్పందించడం లేదు. కృంగిన గచ్చు క్షయ నివారణ కేంద్రంలో ఐదు గదులు ఉన్నాయి. ఐదు గదుల్లో ఉన్న గచ్చులు కిందకు కృంగిపోయాయి. నడుస్తుంటే గచ్చు కిందకు కృంగిపోవడం వల్ల తూలిపోయి కింద పడిపోయే పరిస్థితి ఉంది. దీంతో క్షయ నివారణ కేంద్రానికి వచ్చే రోగులతో పాటు, ఉద్యోగులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. విద్యుత్ మీటరు వద్ద వైర్లు అస్తవ్యస్తంగా వేలాడుతున్నాయి. వైర్లు ప్రమాదకర స్థితిలో ఉన్న ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ఆందోళన నెలకొంది. రోజుకు 60 నుంచి 70 మంది వరకు రోగులు జిల్లా క్షయ నివారణ కేంద్రానికి చికిత్స కోసం 60 నుంచి 70 మంది వరకు రోగులు రోజూ వస్తారు. కఫం పరీక్ష నిర్ధారణ అయిన వారికి వైద్యులు చికిత్స అందిస్తారు. హెచ్ఐవీ బారిన పడిన వారికి కూడా ఇక్కడ క్షయ నివారణ పరీక్షలు చేస్తారు. పేరుకు పోయిన చెత్తాచెదారం క్షయ నివారణ కేంద్రం చుట్టూ చెత్తాచెదారం పేరుకు పోయింది. పిచ్చి మొక్కలు, చెత్త పేరుకు పోవడం వల్ల పారిశుధ్యం ఆధ్వానంగా తయారైంది. దీనికి తోడు విష సర్పాలు ప్రవేశిస్తున్నాయి. కొద్ది రోజులు క్రితం విష సర్పం క్షయ నివారణ కేంద్రంలోకి రావడంతో సిబ్బంది పామును కొట్టి బయట పడేశారు. క్షయ వ్యాధి పరీక్ష చేసుకోవడానికి వచ్చే వారికి అక్కడ అపారిశుధ్యం వల్ల వ్యాధి మరింత ఎక్కువ అయ్యే పరిస్థితి ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుప్పు పడుతున్న వాహనాలు క్షయ నివారణ కేంద్రం ఆవరణంలో వాహనాలు తుప్పు పడుతున్నాయి. క్షయ నివారణ కేంద్రం ఉద్యోగులు క్షేత్ర స్థాయి పర్యటనకు గతంలో వాహనాలు ఇచ్చారు. ఆ వాహనాల కాల పరిమిత దాటడంతో వాటిని అలానే వదిలేశారు. టూవీలర్స్తో పాటు , జీపులు కూడా అలానే వదిలేశారు. దీంతో ఆ వాహనాలు తుప్పు పట్టి పాడవుతున్నాయి. ఏళ్ల తరబడి తుప్పు పట్టి పాడువుతున్నా వాటిని పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవమే.. క్షయ నివారణ కేంద్రం శిథిలావస్థకు చేరింది. గచ్చులకు కృంగిపోతున్నాయి. భవనం శిథిల స్థితికి చేరింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. – డాక్టర్ కె.రాణి, జిల్లా క్షయ నివారణ అధికారి -
పిచ్చికుక్క స్వైర విహారం
రేగిడి: మండల పరిధిలోని ఉణుకూరు గ్రామంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసి పలువురిని గాయపర్చింది. శనివారం గ్రామవీధుల్లో పెద్దలు, పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కాటు వేసింది. పిచ్చికుక్క దాడిలో గ్రామానికి చెందిన మీసాల వంశీకృష్ణ, కంటు తవిటినాయుడు, దొంతల రాములు, తెంటు సీతాలక్ష్మి, గేదెల ఉమామహేశ్వరరావు, కడగల పెంటమ్మ తదితరులు గాయపడ్డారు. దీంతో బాధితులు ఆస్పత్రులకు పరుగులు తీశారు. పిచ్చికుక్క దాడితో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వృద్ధుడి ఆత్మహత్య విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధి పోలయ్యపేటలో గంధవరపు కృష్ణ(81) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు వన్టౌన్ హెచ్సీ రామారావు శనివారం తెలిపారు. కొడుకు పెళ్లి విషయంలో భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ నెల 19వ తేదీన పెళ్లి విషయమై భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తండ్రి ఆ చూకీ కోసం వెతకగా ఉడా కాలనీ వైన్ షాపు వద్ద పడి ఉండటాన్ని చూసి స్థానికులు చూసి కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశారు. ఇంట్లోంచి వెళ్లిపోయిన తండ్రి రెండు రోజులైనా కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్న కు టుంబ సభ్యులకు స్థానికులు చెప్పిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లి చూడగా నురగలు కక్కుకొని పడి ఉండటాన్ని చూసిన కుమారుడు కన్నంనాయుడు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తమకందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెచ్సీ రామారావు తెలిపారు. స్కూటీ అదుపు తప్పి.. యువతికి గాయాలు వీరఘట్టం: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి స్కూటీపై వెళ్తున్న యువతి గాయపడిన ఘటన శనివారం వీరఘట్టం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. తెట్టంగి గ్రామానికి చెందిన యువతి ఆమె బంధువుతో కలిసి స్కూటీపై రేగులపాడు – యు.వెంకమ్మపేట రహదారిలో పార్వతీపురం వెళ్తోంది. ఈ క్రమంలో రేగులపాడు దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి స్కూటీ అదుపు తప్పింది. దీంతో వెనుక కూర్చున్న యువతి రోడ్డుపై పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు వెంటనే బాధితురాలిని వీరఘట్టంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
ఉద్యోగాల పేరిట వంచనపై ఫిర్యాదు
పార్వతీపురం రూరల్: పారిశుధ్య పనుల నియామకాల పేరిట మోసపోయిన బాధితులు శనివారం పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డిని ఉత్తరాంధ్ర గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు పి.రంజిత్కుమార్ నేతృత్వంలో ఆశ్రయించారు. తమను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. శ్రీ శబరి నిరుద్యోగ పారిశుధ్య వర్కర్స్ సంఘం ప్రతినిధులు గతేడాది జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఇచ్చిన ఒక అవగాహన సర్క్యులర్ను అడ్డం పెట్టుకుని గిరిజన యువతకు వల వేశారు. కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో సుమారు 75 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.1.70 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారు. వీరికి నకిలీ నియామక పత్రాలిచ్చి నాలుగు నెలలుగా పనులు చేయించుకున్నారు. జీతాల విషయమై డీపీవోను సంప్రదించగా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి నియామకాలు జరగలేదని తేలడంతో బాధితులు విస్తుపోయారు. సుమారు అరకోటి రూపాయలకు పైగా వసూలు చేసి తమను నట్టేట ముంచారని బాధితులు ఏఎస్పీ ఎదుట వాపోయారు. బీవీవీఎస్ సత్యనారాయణమూర్తి, మజ్జి నారాయణరావు, కొండగొర్రి కృష్ణారావు ఈ వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఏఎస్పీ.. తక్షణమే విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. విచారణకు బాధితులు సహకరించాలని ఆమె సూచించారు. -
ఎస్పీకి అభినందనలు
విజయనగరం క్రైమ్ : ఎస్పీ దామోదర్ను ఆయన బంగ్లాలోనే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం కలిసి అభినందనలు తెలిపారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, కేసుల దర్యాప్తు, ఇంటెలిజెన్స్ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్పీకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్కృష్ట సేవ పథకం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని బాలాజీనగర్లో క్యాంపు కార్యాలయంలో ఎస్పీని కలిసిన ఎంపీ కలిశెట్టి దుశ్శాలువతో సత్కరించారు. జిల్లాకు, రాష్ట్రానికి ఎస్పీ చేస్తున్న సేవలను ఎంపీ కొనియాడారు. రాజ్యలక్ష్మీకి ఉత్తమ వైద్యాధికారిణి అవార్డు చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణిగా విధులు నిర్వహిస్తున్న కె.రాజ్యలక్ష్మీ జిల్లా స్థాయి ఉత్తమ వైద్యాధికారిణి అవార్డుకు ఎంపికయ్యారు. మార్చి 24న ప్రపంచ టీబీ దినోత్సవం పురష్కరించుకుని విజయవాడలో శనివారం నిర్వహించిన నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో టీబీ అసోసియేషన్ ప్రతినిధులు చేతులు మీదుగా ఈ అవార్డును రాజ్యలక్ష్మీ అందుకున్నారు. టీబీకి సంబంధించిన వంద రోజుల కార్యక్రమాన్ని అన్ని విభాగాల్లో ఉత్తమంగా నిర్వహించారు. రాష్ట్ర, సెంట్రల్ టీంలు గరివిడి పీహెచ్సీని సందర్శించినప్పుడు వైద్యాధికారితో పాటుగా వైద్య సిబ్బంది ఈ టీబీ కార్యక్రమంపై మంచి అవగాహన కల్గి ఉండటంతో జిల్లా ఉత్తమ వైద్యాధికారిణిగా ఎంపిక చేశారు. ఈ మేరకు రారష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఎలిమినేషన్ కార్యక్రమంలో అవార్డును అందించారు. విద్యుత్ షాక్తో మేకల మృతి శృంగవరపుకోట : మండలంలోని కిల్తంపాలెం నవోదయ స్కూల్ పరిసరాల్లో శనివారం ఉదయం విద్యుత్ షాక్కు గురై రెండు మేకలు మృతి చెందాయి. ఈ ఘటనకు సంబఽంధించి వివరాలిలా ఉన్నాయి. ముషిడిపల్లి పంచాయతీ బందవలస గ్రామానికి చెందిన దూరి దేముడు మేకలు మేపుతున్న సమయంలో రెండు మేకలు వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలి విరుచుకు పడిపోయాయి. వాటికి సమీపంలో ఉన్న దేముడు వెనక్కి దూకి ప్రాణాలు దక్కించుకుని గ్రామంలోకి పరుగు తీసి విషయం చెప్పాడు. గ్రామస్తులు విద్యుత్ సిబ్బందికి ఫోన్ చేయటంతో వారు విద్యుత్ సరఫరా నిలిపారు. ఘటనా స్థలం గంట్యాడ పరిధిలో ఉండటంతో విద్యుత్ శాఖ ఏఈ ఎం.శ్రీనివాసరావు వచ్చి పరిశీలించారు. చనిపోయిన మేకలకు నష్ట పరిహారం కోసం సిఫార్సు చేస్తామని తెలిపారు. ఆవు మృతి బలిజిపేట: అంపావల్లి గ్రామానికి చెందిన సురేష్ ఆవు మృతి చెందింది. గత నెలలో పంపుహౌస్ వద్ద క్లోరిన్ గ్యాస్ లీకయిన విషయం విదితమే. ఆ సమయంలో సమీపంలో ఉండే పశువులు, మనుషులకు ప్రమాదం ఎదురైంది. అప్పట్లో చూడుకట్టి ఉండే ఆవు చూడు పోయి, శక్తిహీనమై శనివారం మృతి చెందినట్టు తెలిపారు. ఆవు విలువ రూ.50వేలు ఉంటుందని తెలిపారు. అప్పట్లో వైద్యులు పరీక్షలు నిర్వహించి పశువులకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని తెలిపారని గ్రామస్తులు తెలిపారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు. ఇదిలా ఉండగా ఈ సమస్యపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమని సీపీఎం నాయకుడు మన్మధరావు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
సమష్టిగా నవమి వేడుకలను విజయవంతం చేద్దాం..
● రామతీర్థం శ్రీరామనవమి ఉత్సవాలపై అధికారుల సమీక్షనెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 27న ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలపై అధికారులు శనివారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు. కల్యాణ వేదిక, ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని, మూడు రోజుల ముందుగానే పారిశుద్య సిబ్బందిని ఏర్పాటు చేసి చెత్త సేకరణ పనులు చేపట్టాలన్నారు. విద్యుత్, ఫైర్, ఎకై ్సజ్, వైద్యారోగ్య, దేవదాయ శాఖ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈఓ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాలకు సంబంధించి సుమారు 10వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, కల్యాణం అనంతరం ప్రత్యేక కౌంటర్ల ద్వారా తలంబ్రాలను పంపిణీ చేస్తామన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వివిధ శాఖల అధికారులు సహకరించాలని కోరారు. కల్యాణోత్సవంలో పాల్గొనే దంపతులు రూ.1500 చెల్లించి టిక్కెట్లు కొనుగోలు చేయాలని వారికి శేష వస్త్రాలు, తలంబ్రాలు, స్వామి ప్రసాదాన్ని అందిస్తామని చెప్పారు. ఉచిత దర్శనంతో పాటు, టిక్కెట్టుతో ప్రత్యేక దర్శనం ఉంటుందన్నారు. సీఐ రామకృష్ణ మాట్లాడుతూ గత ఏడాది శ్రీరామనవమికి కల్యాణం అనంతరం వేదికపైకి భక్తులు గుంపులుగా వెళ్లి అసౌకర్యం కల్పించారని, అదుపు చేయలేని పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ సారి అలా జరగకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి, నాయకులు సువ్వాడ రవిశేఖర్, చనమళ్లు వెంకటరమణ, గేదెల రాజారావు, కంచరాపు రాము, తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్సై గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఊరి బడిలో భవిత బంగారం
కురుపాం: ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లలను ఊరిబడిలో చేర్పించి వారి భవితను బంగారుమయం చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యావేత్తలు, ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్.శ్రీరాములు ఆధ్వర్యంలో కురుపాం రావాడ కూడలిలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేజీబీవీ పాఠశాలల గౌరవ అధ్యక్షురాలు కె.విజయగౌరి మాట్లాడుతూ ప్రభుత్వ బడులు కేవలం విద్యను బోధించే స్థలాలు మాత్రమే కాకుండా, పిల్లల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యత, సమానత్వ భావనలను పెంపొందించే కేంద్రాలని పేర్కొన్నారు. గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్, అబ్దుల్ కలాం వంటి మహానుభావులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ బడుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో బోధన, ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, బూట్లు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. చిన్ననాటి నుంచే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ఉపాధ్యాయులు పాఠ్యాంశబోధన చేస్తున్నారని, ఆహ్లాదకర వాతావరణంలో చదువులు సాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల వ్యక్తిగత అభివృద్ధితోపాటు సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారన్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరించారు. -
బస్సుకు నిప్పు.. తప్పిన పెనుముప్పు
రామభద్రపురం: ఆ ప్రయాణికుల పాలిట డ్రైవరే దేవుడు... ఆయన ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా... బస్సులో రేగిన అగ్నికీలలు గమనించకపోయినా ప్రమాదం ఊహకు అందేదికాదు. ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి. డ్రైవర్ అప్రమత్తతతో బస్సులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే తో పాటు 32 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్కు చెందిన ఆరెంజ్ (నీలకంఠేశ్వర) ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సు రామభద్రపురం, సాలూరు మీదుగా 32 మంది ప్రయాణికులతో మల్కన్గిరి వెళ్తోంది. ప్రయాణికుల్లో అధికమంది ఒడిశా రాష్ట్రానికి చెందిన వారే. మల్కన్గిరి, చెములగుడ, దామన్జోడి, జయపూర్ తదితర ప్రాంతాల్లోని బంధువుల ఇంటికి, స్వగ్రామాలకు వెళ్తున్నారు. 26వ జాతీయ రహదారిపై వెళ్తుండగా రామభద్రపురం మండలం తారాపురం సమీపంలోని పూడివారి కళ్లాల వద్దకు వచ్చేసరికి శనివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో బస్సు టైరు పేలినట్లు డ్రైవర్కు అనిపించింది. డ్రైవర్ సఖదేవ్ బరక్ వెంటనే బస్సును పక్కకు నిలిపి కిందకు దిగి చూశాడు. అప్పటికే బస్సు వెనుక మంటలు చెలరేగాయి. వెంటనే ఆయన అప్రమత్తమై ప్రయాణికులను అప్ర మత్తం చేశాడు. కిందకు దిగిపోవాలంటూ గట్టిగా కేకలు వేశాడు. అప్పటికి ఒక గంట ముందు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బస్సును రామభద్రపుం ముందు నిలపడంతో ప్రయాణికులు మేల్కొని ఉన్నారు. డ్రైవర్ కేకలకు వెంటనే బస్సు దిగిపోయారు. బస్సుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే, బస్సు ఎయిర్ బెలూన్లు పేలిపోవడంతో క్షణాల్లో మంటలు బస్సంతా వ్యాపించాయి. ప్రయాణికులతో పాటు డ్రైవర్, క్లీనర్ భయంతో వణికిపోయారు. వీరి హాహాకారాలకు ఘటనా స్థలానికి సమీపంలోని తారాపురం గ్రామస్తులు పలువురు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వి.ప్రసాదరావు బాడంగి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. వారు వచ్చి మంటలను అదుపుచేశారు. సాలూరు ఫైర్ స్టేషన్కు ఫోన్చేసినా స్పందించలేదని స్థానికులు వాపోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ ప్రమాద స్థలాన్ని బొబ్బిలి డివిజన్ ఆర్డీఓ రామ్మోహనరావు పరిశీలించారు. ప్రమాద ఘటనతో పాటు ప్రయాణికుల వివరాలు, అందరూ సురక్షితంగా బయటపడిన అంశాలను సీఐ, ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు. క్లూస్టీం పరిశీలన.. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సు టైరు పేలి ప్రమాదం జరిగిందా? లేదంటే ఏమైనా షార్ట్సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విజయనగరం నుంచి వచ్చిన క్లూస్టీం ఆధారాలు సేకరించింది. బస్సులోని పలు వస్తువులతో పాటు విద్యుత్ వైర్లు కొన్ని పట్టుకెళ్లారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం తెల్లవారు జామున 3 నుంచి 3.30 గంటల సమయంలో రామభద్రపురం గ్రామం ముందు ప్రయాణికులు టాయిలెట్స్ కోసం బస్సుఆపారు. వారంతా టాయిలెట్స్కు వెళ్లి మరలా బస్సు ఎక్కారు. రామభద్రపురం గ్రామం దాటాక బస్సు ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు అనిపించింది. కాలిన వాసన రావడంతో వెంటనే బస్సును పక్కకు నిలిపి దిగి చూడగా మంటలు కనిపించాయి. వెంటనే బస్సులోని ప్రయాణికులందరినీ అప్రమత్రం చేశాను. ప్రయాణికులందరూ బస్సు దిగిపోయారు. కాసేపటికే బస్సులో ఉన్న ఎయిర్ బెలూన్స్ పేలిపోవడంతో వచ్చిన గాలికి బస్సంతా మంటలు చెలరేగాయి. భయపడిపోయాను. అందరూ మేల్కొని ఉండడంతో ప్రమాదం తప్పింది. – సుఖదేవ్ బరిక్, ట్రావెల్ బస్సు డ్రైవర్ రామభద్రపురం వద్ద దగ్ధమైన ఒడిశా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బస్సులో ప్రయాణిస్తున్న ఒడిశా ఎమ్మెల్యేతో పాటు 32 మంది ప్రయాణికులు సురక్షితం డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆధారాలు సేకరించిన క్లూస్టీం కళ్లముందే తాము ప్రయాణిస్తున్న బస్సు కాలిపోవడాన్ని చూసి ప్రయాణికులు హాహాకారాలు చేశారు. తమ సామగ్రి కాలిపోతోందంటూ ఘొల్లుమన్నారు. రూ.10లక్షల విలువైన బంగారు హారం, చేతిగాజులు, ఉంగరాలు, రూ.7వేలతో కూడిన బ్యాగు కాలిపోతోందంటూ శాంతిలత అనే ప్రయాణికురాలు కన్నీరుపెట్టింది. అయితే... మంటలు పూర్తిగా ఆర్పాక బూడిదలో చెవిదిద్ది మినహా మిగిలిన బంగారు ఆభరణాలు లభించడంతో సంతోషం వ్యక్తంచేసింది. ఆభరణాలు అప్పగించిన సీఐ, ఎస్ఐకు కృతజ్ఞతలు తెలిపి బంధువుల సాయంతో సెములగూడకు పయనమైంది. చాలామంది ప్రయాణికుల విలువైన సామగ్రి కాలిపోవడంతో కట్టుబట్టలతో మిగిలారు. అదే బస్సులో మల్కన్గిరి వెళ్తున్న ఒడిశా రాష్ట్రం చిత్రకొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్(ఐ) ఎమ్మెల్యే మంగం ఖిల్లా ప్రమాదం నుంచి బయటపడి, వేరే ట్రావెల్ బస్సులో మల్కన్గిరి చేరుకున్నారు. -
● లక్ష తులసీదళార్చన
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వసంతోత్సవాల్లో భాగంగా శనివారం లక్ష తులసీదళార్చనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేకువజామున ప్రాతఃకాలార్చన పూజలనంతరం వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 40 మంది వేద పండితులు శ్రీమద్రామాయణ పారాయణాలు, సుందరాకాండ పారాయణం, దివ్య ప్రబంధ సేవా కాలములు జరిపించారు. అనంతరం స్వామి సన్నిధిలో లక్ష తులసీదళార్చన, లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ నెల 27 వరకు లక్ష తులసీ, కుంకుమార్చనలు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, కిరణ్, తదితరులు పాల్గొన్నారు. – నెల్లిమర్ల రూరల్ -
25న జాబ్ మేళా
పార్వతీపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యువతకు ఉపాధిని కల్పించేందుకు ఈ నెల 25న పార్వతీపురంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో జాబ్మేళాను నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయి కృష్ణచైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో 10 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ చదువుకుని, 18 నుంచి 28 ఏళ్లు వయస్సు ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాకు హాజరు కావచ్చునన్నారు. ఆసక్తి గల వారు హెచ్టీటీపీఎస్://నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్లో వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. రిఫరెన్స్ నంబరుతో పాటు బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, పాసుపోర్టు సైజు ఫొటోతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు. వివరాల కోసం 9177297528 నంబరును సంప్రదించాలని సూచించారు. గ్యాస్ సరఫరాపై ఆందోళన అక్కర్లేదు..: కలెక్టర్ పార్వతీపురం: జిల్లాలో గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేదని, డిమాండ్కు సరిపడా సరఫరా జరుగుతుందని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి శనివారం తెలిపారు. గ్యాస్ను పొదుపుగా వాడుకోవాలని, అవసరం మేరకు మాత్రమే గ్యాస్ కొనుగోలు చేయాలని, ఆందోళన చెంది అనవసరంగా బుకింగ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. డిమాండ్, సప్లైలో అంతరాన్ని తగ్గించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సివిల్ సప్లై అధికారులకు ఆదేశించారు. విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి సీతానగరం: విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలకు శ్రద్ధచూపాలని జిల్లా సైన్స్ ఆఫీసర్ గిరడ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. మండలంలోని జోగింపేట కేజీబీవీ విద్యాలయంలో ప్రిన్సిపాల్ జె.సంధ్య అధ్యక్షతన శనివారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష వారి సౌజన్యంతో డీఈఓ పి.బ్రహ్మాజీరావు ఆదేశాల మేరకు జిల్లాలోని 25 ఏటీఎల్ స్కూల్స్లో మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. ఏటీఎల్ అవగాహన పెంపొందించడం, విద్యార్థినులకు హాండ్స్ అన్ ఎక్సీపీరియన్స్ కింద నూతన ఆవిష్కరణలపై శిక్షణ ఇచ్చారు. ఆటోమేటిక్ వాట్సాప్ సెన్సార్తో పనిచేసే విధానం, బోట్ తయారీ, కిచైన్ మోల్డింగ్, మాగ్నిటిక్ రీడ్ సెన్సార్ విధానం, వాటర్ దియా తయారీపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎల్టీఏ ఇన్చార్జి శైలజ పాల్గొన్నారు. మాతా, శిశు సంరక్షణపై శిక్షణ పార్వతీపురం రూరల్: జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల స్టాఫ్నర్సులకు మాతా, శిశు ఆరోగ్య సేవలపై నిర్వహించిన వివిధ శిక్షణ కార్యక్రమాలు శనివారంతో ముగిశాయి. శిక్షణ పొందిన వారికి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసవ సమయంలో తలెత్తే సమస్యల నివారణ, బాలింతలు, నవజాతి శిశువుల సంరక్షణ, హైరిస్క్ కేసుల గుర్తింపుపై నర్సులకు అవగాహన కల్పించామన్నారు. ఎస్బీఏ (21 రోజులు), దక్షత (6రోజులు), ఎన్ఎస్ఎస్కే (3 రోజులు) విభాగాల్లో శిక్షణ ఇచ్చామన్నారు. మాతా, శిశు మరణాల నివారణే లక్ష్యంగా మెరుగైన సేవలందించాలని సిబ్బందికి సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగ శివజ్యోతి పర్యవేక్షణలో గైనకాలజిస్టులు, పిడియాట్రీషియన్లు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో వైద్యాధికారులు విజయ్మోహన్, జగన్మోహనరావు, వినోద్కుమార్, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
దొంగతనానికి వెళ్లి జారిపడి మృతి చెందిన వ్యక్తి
విజయనగరం క్రైమ్ : విజయనగరం టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో దొంగతనం చేసేందుకు బహుళ అంతస్తుల భవనం ఎక్కి అక్కడ నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన దాసన్నపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాలు.. దాసన్నపేట ఫుడ్ కార్పొరేషన్ గోదాం సమీపంలో దాట్ల ఆస్పత్రి వెనుక ఓ ఇంట్లో దొంగతనం చేసేందుకు 55 సంవత్సరాల వ్యక్తి టెర్రస్ మీదకు వెళ్లాడు. అక్కడ చిన్న స్లోప్ ఉండడంతో రాత్రి కావడంతో చీకట్లో అది కనిపించకపోవడం జారిపడి కింద పడిపోయాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న టూ టౌన ఎస్ఐ కృష్ణమూర్తి ఘటనా స్థలికి వెళ్లారు. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్టు గుర్తించారు. అక్కడ క్లోజడ్ సర్క్యూట్ కెమెరాను పరిశీలించారు. దొంగతనం చేసేందుకు వచ్చినట్టు గుర్తించారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 9121109438, 9121109420 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. గోడ కూలి బాలుడు మృతి కొమరాడ: మండలంలోని ఆర్తాం గ్రామంలో ఓ ఇంటి గోడ కూలి తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఆర్తాం గ్రామంలో ఒడిశా నుంచి వచ్చి కూలి పనులు చేసుకుంటూ బిడ్డక కొండ, జ్యోతి దంపతులు నాలుగేళ్లుగా నివసిస్తున్నారు. వీరికి తొమ్మిదేళ్ల బాలుడు బిడ్డిక హేమంత్ ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వీరు అద్దెకుంటున్న ఇంటి బాత్రూమ్ గోడ కూలిపోయింది. ఆ సమయంలో సమీపంలో ఆడుతున్న హేమంత్ (9)పై గోడ కూలిపోయింది. దీంతో బాలుడి తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొమరాడ ఎస్ఐ జగదీష్నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు విజయనగరం క్రైమ్: విజయనగరం పరిధిలోని రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికా బద్దమైన చర్యలు చేపడుతున్నట్టు ఎస్పీ దామోదర్ శుక్రవారం తెలిపారు. విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ గోవిందరావుతో కలిసి చెల్లూరు, వై జంక్షన్, మోదవలస, గంట్యాడ చెక్పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లతో పాటు స్టాపర్లు పెట్టాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ప్రమాద నియంత్రణకు స్పీడ్ బ్రేకర్లతో పాటు జీబ్రా లైన్లు వేయాలని సూచించారు. ప్రమాదాలు జరిగే దాదాపు 20 బ్లాక్ స్పాట్లను ఎస్పీ గుర్తించారు. చెల్లూరుతో పాటు బైపాస్రోడ్డు జంక్షన్, అయినాడలలో ఈ స్పాట్లను గుర్తించారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు కనీస జాగ్రత్తలు పాటించాలన్నారు. మద్యం సేవించి పట్టుబడితే రూ.10వేల జరిమానాతో పాటు జైలు శిక్ష ఖాయమని హెచ్చరించారు. ఎస్పీతో పాటు ఎస్బీ సీఐ లీలారావు, భోగాపురం సీఐ రామకృష్ణ, విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు, ఎస్ఐలు అశోక్, సన్యాసినాయుడు పాల్గొన్నారు. వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీసీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి కల్యాణ వసంతోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించినానంతరం వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 40 మంది వేద పండితులచే శ్రీమద్రామాయణ పారాయణాలు, సుందరాకాండ పారాయాణం, దివ్య ప్రబంధ సేవా కాలములు, తులసీదళార్చన, కుంకుమార్చనలు జరిపించారు. యాగశాలలో గాయత్రీ రామాయణం, సంక్షేప రామాయణం, సుందరకాండ హవనం తదితర కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
గేట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
రేగిడి: మండల పరిధి కొ మెర గ్రామానికి చెందిన బొత్స మనోహర్నాయు డు ఈ నెల 19న విడుద లైన గేట్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 59వ ర్యాంకు సాధించి చక్కని ప్రతిభ కనబరిచాడు. ఈ యన తల్లి గృహిణి కాగా తండ్రి బొత్స వెంకటరమ ణ ప్రధానోపాధ్యాయులు గా విధులు నిర్వహిస్తున్నారు. మనోహర్నాయుడును ఎంఈఓ ఎంవీ ప్ర సాదరావు, ఉపాధ్యాయ సంఘాలు, గ్రామస్తులు అభినందించారు. శివ్వాం యువకుడు ప్రతిభ వంగర: మండల పరిధి శివ్వాం గ్రామానికి చెందిన కోడూరు సత్యనారాయణ నాయుడు గేట్ ఫలితాల్లో సత్తా చాటాడు. జియాలజీ అండ్ జియో ఫిజిక్స్ విభాగంలో పరీక్ష రాయగా ఆల్ ఇండియా స్థాయిలో 722 ర్యాంకుతో 329 స్కోర్ పాయింట్లు సాధించాడు. సత్యనారాయణ ప్రస్తుతం విజయనగరం ఎం.ఆర్ కాలేజీలో జియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప నిచేస్తున్నాడు. గేట్లో సత్తా చాటడడంతో పలువురు అభినందించారు. -
రంజాన్కు సర్వం సిద్ధం
విజయనగరం టౌన్: పవిత్ర రంజాన్ మాసం శుక్రవారం షవ్వాల్ మాసం చంద్ర దర్శనంతో ముగిసింది. భారతదేశంలో యావత్ ప్రపంచ ముస్లింలు శనివారం ఈదుల్ ఫితర్ నిర్వహించుకోనున్నారు. నెల రోజుల పాటూ కఠోర ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి, అత్యంత భక్తిభావంతో మెలిగిన ప్రతీ ముస్లిం సోదరుడు పవిత్రమైన రంజాన్ పండగ కోసం వేచి చూస్తాడు. ఎందరో నిరుపేదలకు దానధర్మాలు చేసి, ప్రత్యేక ప్రార్ధనలు చేసి, ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఆనంద పరవశులవుతారు. భారతదేశ సౌభ్రాత్వత్వానికి ప్రతీకగా అంతా మంచి జరగాలని ప్రార్ధనలు నిర్వహిస్తారు. నెల రోజుల పాటూ చేసే ఉపవాస దీక్షలు, దానధర్మాలు ఏడాది పాటూ చేసేందుకు నెలరోజుల దీక్ష ఎంతగానో ఉపయోగపడతాయని విశ్వసిస్తారు. పవిత్ర రంజాన్ పండగను శనివారం నిర్వహించేందుకు ముస్లిం పెద్దలు నిర్ణయించుకున్నారు. జిల్లాలోని అన్ని మసీదుల్లోనూ, ఈద్గాల్లోనూ ప్రత్యేక ప్రార్ధనలకు సిద్ధం చేశారు. మసీదులన్నీ విద్యుత్ కాంతులతో శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ముస్లిం సోదరులందరూ రంజాన్ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈద్గాలో.. జిల్లా కేంద్రమైన విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న ఈద్గాలో ముస్లిం సోదరులందరూ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తుంటారు. కణపాక ఈద్గా, చోటీ మసీదు, జామియా మసీదు, మెహమాన్ మసీదు, డకినివీధి మసీదు తదితర ప్రాంతాల్లో వైభవంగా రంజాన్ వేడుకలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయం 7.30 గంటల నుంచే... ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఈద్గాలో ఉదయం 7.30 గంటలకు, జామియా మసీదులో 8 గంటలకు ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్నారు. పూర్తయిన ఏర్పాట్లు ముస్తాబయిన మసీదులు ఈద్గాలో ప్రత్యేక ప్రార్ధనలు మసీదు, ఈద్గాల్లో నేటి ఉదయం 7.30 నుంచే నమాజ్లు నేడు పవిత్ర రంజాన్ పర్వదినంబోధనలకనుగుణంగా జీవితాన్ని గడపాలి ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో ఖురాన్ బోధనలను విన్నారు. ఖురాన్ బోధనలకు అనుగుణంగా తమ జీవితాన్ని గడపాలి. అదే రంజాన్ ప్రత్యేక సందేశం. మానవులంతా సమానమేనని, ఈదుల్ ఫిత్ర్ పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ దాన ధర్మాలు చేయాలని పండగ సూచిస్తుంది. సమత, మమతలకు అద్దం పడుతుంది. దేవున్ని స్మరి ప్రతీ ముస్లిం సోదరుడు ఆనందంతో నిర్వహించుకునే పండగ. – మహమ్మద్ హబీబ్, జమాతే ఇస్లామీ హింద్ సంస్థ ప్రతినిధి, విజయనగరం -
జాబ్ క్యాలెండర్ పేరిట మోసం
విజయనగరం గంటస్తంభం: ఉగాది సందర్భంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై ఏఐవైఎఫ్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు.., డూప్ క్యాలండర్ అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. నగరంలోని సీపీఐ అమర భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూర వాసు, ఉపాధ్యక్షుడు వెలగాడ రాజేష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. నిరుద్యోగులు అడుగుతున్నవి పెద్ద కోరికలు కావని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారని తెలిపారు. రెండు సంవత్సరాలు గడిచినా కేవలం 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం నిరుద్యోగ యువతను నిరాశకు గురి చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న గంజాయి సమస్యను నిర్మూలిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను గాలికి వదిలేసినట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మెడికల్ మాఫియాపై కూడా వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా నడుస్తున్న ఆస్పత్రులు, మెడికల్ షాపులు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని చెప్పారు. కాలం చెల్లిన మందులను విక్రయించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరచి యువతకు ఇచ్చిన హామీలను అమలు చేసి న్యాయం చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏఐవైఎఫ్ సహాయక కార్యదర్మి గంగరాజు, రవి, వినోద్, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు. ఉగాది గిఫ్ట్ కాదు..యువతను మోసం చేసే డూప్ క్యాలెండర్ డ్రగ్స్ నిర్మూలనలో వైఫల్యం.. మెడికల్ మాఫియా విజృంభణ ఎన్నికల హామీలు మరిచిన ప్రభుత్వం ఏఐవైఎఫ్ ఆగ్రహం -
మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
● డీఎంహెచ్ఓ భాస్కరరావు పార్వతీపురం రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్సీ) ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ఎస్.భాస్కరరావు పేర్కొన్నారు. పెదబొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఓపీ, ల్యాబ్, ఫార్మసీ విభాగాలను పరిశీలించి, రోగుల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలను సుందరంగా ముస్తాబుచేసి, రోగులకు మానసిక ప్రశాంతత చేకూర్చేలా వాతావరణాన్ని సిద్ధం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం గర్భిణుల సంరక్షణ, బాలికలకు అందిస్తున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ పురోగతిపై వైద్యాధికారులతో సమీక్షించారు. గ్రామంలో ’ఫ్రైడే–డ్రైడే’ నిర్వహణను పర్యవేక్షించి, దోమల లార్వా నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని, వివరాలను వీసీహెచ్ యాప్లో నమోదుచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ టి.జగన్ మోహనరావు, వైద్యాధికారి డాక్టర్ జి.ధరణి, ఆరోగ్య పర్యవేక్షకులు వెంకటనాయుడు, జయలక్ష్మి పాల్గొన్నారు. -
మాస్టారూ.. మీకిది తగునా..!
వాటర్ట్యాంకు ప్రారంభోత్సవానికి నేతలు రాకముందే పిల్లలను తరగతిగదిలో వదిలేసి ప్రారంభోత్స ఏర్పాట్లలో నిమగ్నమైన వంగపండువలస స్కూల్ టీచర్ (వృత్తంలో ఉన్న వ్యక్తి) బడిలో ఉండాల్సిన ఉపాధ్యాయులు విధులను విస్మరించి గ్రామంలోని తాగునీటి ట్యాంకు, వివిధ కార్యాలయాల ప్రారంభోత్సవంలో నిమగ్నమయ్యారు. అంతే... పిల్లలకు పాఠాలు చెప్పేవారే కరువయ్యారు. తరగతి గదిలోనే పిల్లలు ఆడుకున్నారు. అనంతరం పిల్లలు కూడా ప్రారంభోత్సవం వద్దకు చేరుకుని ఉపాధ్యాయులు పాఠశాలకు ఎప్పుడు వస్తారా? అని ఎదురు చూశారు. తీరా ఎప్పటికీ రాకపోయేసరికి తరగతిలోని ఓ విద్యార్థినే ఉపాధ్యాయురాలిగా మారి బోర్డుపై రాసిన అంకెలను తోటి విద్యార్థులతో చదివించింది. ఈ దృశ్యాలు రామభద్రపురం మండలం రొంపల్లి, వంగపండువలస ప్రాథమిక పాఠశాలల్లో శుక్రవారం చోటుచేసుకున్నాయి. మాస్టార్ల తీరును ఆయా గ్రామాల ప్రజలు తప్పుబట్టారు. విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయులు.. పాలకులు వస్తున్నారన్న అత్యుత్సాహంతో పాఠశాలలను వదిలేసి ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం.. నేతలు వెళ్లిపోయే వరకు అక్కడే ఉంటూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు పాకులాడడాన్ని తప్పుబట్టారు. ఇదే విషయాన్ని ఎంఈఓ–1 తిరుమలప్రసాద్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా వంగపండువలస ప్రాథమిక పాఠశాలకు వెళ్లి అక్కడి టీచర్ను విచారించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. పాఠశాల సమయంలో ఏ టీచర్ అయినా పిల్లలను తరగతి గదిలో విడిచిపెట్టి బయటకు వెళ్లకూడదన్నారు. రొంపల్లిలో ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవంలో తను పాల్గొన్నానని, అక్కడి రెగ్యులర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంను తనే స్వయంగా పిలిచినట్టు సెలవిచ్చారు. – రామభద్రపురం -
విద్యుత్ స్తంభాన్ని బొలెరో ఢీకొని వ్యక్తి మృతి
బొండపల్లి: అతి వేగంగా వస్తూ వాహనాన్ని అదుపు చేయకపోవడంతో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బొలెరో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్ఐ యు.మహేష్ తెలిపిన వివరాలు.. పూసపాటిరేగ మండలం కోళ్లాయివలస గ్రామానికి చెందిన బొలెరో వాహనంలో అదే గ్రామానికి చెందిన ఐదుగురు గజపతినగరంలో గల కాంక్రీట్ మిక్సర్ యంత్రాన్ని వాహనంలో ఎక్కించి బయలుదేరారు. అతివేగంగా నడుపుతున్న బొలెరో జాతీయ రహదారి 26పై రోళ్లవాక జంక్షన్ వద్దకు వచ్చేసరికి అదుపు తప్పించి రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన నీలాపు రామసూరి(40) అక్కడికక్కడే మృతి చెందాడు. కాకి అసిరప్పడు, లావేటి అసిరినాయుడు, కంప పైడిరాజుతో పాటు వ్యాన్ డ్రైవర్ సాడి రాజేంద్ర తీవ్రంగా గాయపడినట్టు ఎస్ఐ తెలిపారు. క్షతగాత్రులను 108 వాహనంలో జిల్లా కేంద్రంలో కేంద్ర సర్వజన ఆస్పత్రికి తరలించారు. రామసూరి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. నలుగురికి తీవ్ర గాయాలు -
పోలీసు సమస్యల పరిష్కారానికి ‘వెల్ఫేర్ డే’
పార్వతీపురం రూరల్ : జిల్లా పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న శాఖాపరమైన, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమిస్తామని ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన పోలీసు వెల్ఫేర్ డే (గ్రీవెన్స్ డే) నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బంది తమ విన్నపాలను ఎస్పీకి నేరుగా అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది నుంచి అందిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా బదిలీలు, ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విన్నపాలు అధికంగా వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయ సీసీ సంతోష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
పక్కన పెట్టేయ్..!
సాక్షి, పార్వతీపురం మన్యం: ‘ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా!’ అన్న చందాన ఉంది జిల్లాలోని అధికార యంత్రాంగం తీరు. చంద్రబాబు పాలనలో జిల్లాలోని పాలకులకు.. తోటి ప్రజాప్రతినిధులంటే లెక్క లేదు. మహిళలన్న గౌరవమూ ఉండదు. ఎన్నికల వరకే రాజకీయాలు చూడాలన్న విషయాన్నీ మర్చిపోతున్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులకు కనీస విలువ ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. వారు తానా అంటే.. జిల్లా యంత్రాంగం తందానా అంటోంది. ఎమ్మెల్యేలు డైరెక్షన్ చెబితేనే.. అధికారులు యాక్షన్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువ ఎంపీకి ఇచ్చిన గౌరవం ఇదేనా? ఉన్నత విద్యావంతురాలు.. డాక్టర్ వృత్తిని వదిలి, రాజకీయాలంటే ఆసక్తితో అరకు పార్లమెంట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గుమ్మా తనూజారాణి పోటీ చేశారు. ఎమ్మెల్యే స్థానాలన్నింటినీ కూటమి పార్టీలు కై వసం చేసుకున్నప్పటికీ.. ఎంపీగా ప్రజా మద్దతు తనూజారాణికే లభించింది. మొదటిసారిగా ఎన్నికైనా ఆమె ఎప్పుడూ హూందా రాజకీయాలనే చేసుకుంటూ వస్తున్నారు. ప్రత్యర్థులను విమర్శించడం అరుదు. ప్రజా సమస్యలపైన, పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపైనే ఆమె గళం వినిపిస్తున్నారు తప్ప.. ప్రత్యేకించి ఏ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా విరుచుకుపడడం కనిపించదు. చిన్న వయసులోనే ఎంపీగా రాణిస్తున్న సాటి గిరిజన మహి ళను.. జిల్లాలోని తోటి ప్రజాప్రతినిధులే అవమానిస్తుండడం.. అందుకు అధికార యంత్రాంగం సహకరిస్తుండడం గమనార్హం. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అధికారిక కార్యక్రమాలకు, ప్రారంభోత్సవాలకు ప్రొటోకాల్ పరంగానైనా ఆమెను ఆహ్వానించకపోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రొటోకాల్ అన్నది ఒక్క ఎంపీ విషయంతోనే ఆగిపోవడం లేదు. పార్వతీపురం పట్టణానికి మొన్నటి వరకు ప్రథమ పౌరురాలుగా ఉన్న బీసీ మహిళ బోను గౌరీశ్వరి విషయంలోనూ స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు ఇదే మాదిరి వ్యవహరించారు. మున్సిపల్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు చైర్పర్సన్ను ఆహ్వానించలేదు. చివరికి ఆగస్టు 15 వేడుకలకు సైతం ఆమెను దూరం పెట్టారు. చంద్రబాబు పాలనలో వెనుకబడిన వర్గాల మహిళలకు జరుగుతున్న అన్యాయానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. జిల్లాలోని పలువురు సర్పంచ్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకూ ఇదే పరాభవం ఎదురవుతోంది. అరకు పార్లమెంట్ పరిధిలోని సాలూరులో 30 పడకల ఆస్పత్రిని.. వంద పడకలకు అప్గ్రేడ్ చేస్తూ, నిర్మించిన నూతన భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యురాలు, రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆస్పత్రిని ప్రారంభించగా, అధికారులు కనీస ప్రొటోకాల్ను పాటించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నా యి. ఏదో పిలిచామన్నట్లుగా ముందు రోజు సాయంత్రం ఎంపీ తనూజారాణిని సంప్రదించి, ఆస్పత్రి ప్రారంభ విషయం తెలియజేశారు. ఎంపీగా దిల్లీ, అరకు పార్లమెంట్ పరిధిలో ఆమె ఎక్కువగా ప్రయాణించాల్సి ఉంటుంది. ముందుగా తెలియజేస్తే.. అందుకు తగ్గ విధంగా షెడ్యూల్ నిర్ణయించుకుంటారు. అందుకు భిన్నంగా ముందు రోజు వరకూ పిలవకపోవడంపై అధికారుల మీద ఎవరి ఒత్తిడైనా ఉందా? లేక వీరే విస్మరించారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎంపీ తనూజారాణి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎంపీ పట్ల ఇలా వ్యవహరించడం తగదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ తనూజారాణి పట్ల చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ చిన్నచూపు చూస్తోంది. అరకు ఎంపీగా 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆమె ఘన విజయం సాధించారు. పార్లమెంట్లో భాగమైన జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలకూ ఆమెనే ఎంపీ. జిల్లాలో అందరూ కూటమి ఎమ్మెల్యేలే కావడంతో అధికారిక కార్యక్రమాలకు ఆమెను భాగస్వామ్యం చేయడం లేదు. గతంలో సీతంపేట ఐటీడీఏలో జరిగిన సమావేశంలోనూ అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో ఎంపీ అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశాన్నీ మొక్కబడిగా నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు అడిగిన సమాచారం ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులను పక్కన పెట్టేస్తున్న అధికారులు ప్రజల ఓట్లతో ఎన్నికై న ఎంపీని అవమానిస్తున్న వైనం రాజ్యాంగానికి అపహాస్యం ఎమ్మెల్యేల డైరెక్షన్.. అధికారుల యాక్షన్ -
ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి
విజయనగరం క్రైమ్: ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగ జరుపుకోవాలని వన్టౌన్ సీఐ ఆర్వీకే చౌదరి సూచించారు. శనివారం రంజాన్ పురస్కరించుకుని, ముస్లిం మతపెద్దలు, ముస్లిం సోదరులతో జిల్లా కేంద్రంలో శుక్రవారం సమావేశమై పలు సూచనలు చేశారు. మత సామరస్యానికి ప్రతీక అయిన రంజాన్ వేడుకలు అంతటా అందరూ కలసిమెలసి సంతోషంగా చేసుకోవాలని తెలిపారు. ఎటువంటి తగాదాలు జరగకుండా చూసుకోవాలని, ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే మత పెద్దలు, శాంతి కమిటీల సభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వన్టౌన్ ఎస్ఐలు రవి, కమల్ భార్గవ్, లీలావతి, లక్ష్మీప్రసన్నకుమార్, సురేంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఎండు ఉసిరి కిలో రూ.90
● కిలోకు రూ.30 ధర పెంచిన జీసీసీ ● ఎండు ఉసిరి తయారీలో గిరిజనుల నిమగ్నం ● పంట దిగుబడి లేదంటున్న ఉసిరి రైతులు సీతంపేట: ఎండు ఉసిరి ధరను గిరిజన సహకార సంస్థ పెంచింది. గత సీజన్లో కిలో ఎండు ఉసిరిని రూ.60కు కొనుగోలు చేసిన జీసీసీ ఏకంగా రూ.30 పెంచి రూ.90కి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. జీసీసీ ధరలు పెంచడంతో మైదాన ప్రాంతాల వ్యాపారులు సైతం ఇదే అదునుగా కిలోకు రూ.2 నుంచి రూ.5 వరకు అదనంగా మద్దతు ధర పెంచి కొనుగోలు చేస్తున్నారు. అయితే, తూకంలో మోసాల వల్ల నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొండపోడులో సాగైన ఉసిరికి కాయలు పచ్చివి ప్రస్తుతం కావిడ రూ.400ల నుంచి రూ.500లకు విక్రయిస్తున్నామని, గతేడాది ఒక్కో కావిడ ధర రూ.700 పలికేదని రైతులు చెబుతున్నారు. ఎండు ఉసిరి తయారీ కష్టమే... ఎండు ఉసిరి తయారీ కష్టమే. పచ్చి ఉసిరి విక్రయించగా మిగిలిన ఉసిరిని చిదకగొట్టిన తర్వాత ఎండలో పక్షం రోజుల పాటు ఆరవేసిన తర్వాత ఎండుఉసిరిగా మారుతుంది. దీనిని మార్కెట్కు తరలించి అమ్మకాలు చేస్తాం. గిట్టుబాటు ధర ఉంటే జీసీసీకే విక్రయిస్తామని, లేని పక్షంలో వ్యాపారులకు అమ్మకాలు జరుపుతామని గిరిజనులు తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడకు వచ్చి పంటను కొనుగోలు చేస్తారు. ఉసిరి పంట అంతగా లేదు. ఎండు ఉసిరి తయారీ కష్టంగా ఉంది. గతంలో పండేదంటే జీసీసీ ఎటువంటి ధరలు పెంచలేదు. ఇప్పుడు పెంచినప్పటికీ అంత దిగుబడులు లేకపోవడంతో ఏటా గిరిజన రైతులకు నష్టాలు తప్పడం లేదు. పచ్చి ఉసిరిని ఎండు ఉసిరిగా తయారు చేయడం కష్టసాధ్యమైన పని. – జోషి, అడ్డంగి ఎండు ఉసిరి కొనుగోలుకు చర్యలు తీసుకుంటాం. గతంలో వలే ఇప్పుడు మార్కెట్కు ఉత్పత్తి రావడం లేదు. గిరిజనులు తీసుకువస్తే తప్పనిసరిగా కొనుగోలు చేస్తాం. తమశాఖ ఉన్నతాధికారులు ఎండుఉసిరి ధరలు పెంచారు. ఎంతమేర ఉత్పత్తి చేసినా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. – డి.కృష్ణ, జీసీసీ డీఎం -
బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన ఆటో
వీరఘట్టం: రాంగ్ రూట్లో వచ్చిన ఓ ఆటో ఎదురుగా వస్తున్న బొలెరా వాహనాన్ని ఢీ కొట్టిన ప్రమాదంలో ఐదుగురు గాయపడినట్టు ఎస్.ఐ ఎస్.షణ్ముఖరావు తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు... మండలంలోని కడకెల్ల సమీపంలో సీఎస్పీ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతా వీర్రాజు, వరలక్ష్మి, ఇసుకపల్లి మంగమ్మ, చింతా జీవన్కుమార్, మన్య హర్షవర్ధన్కు గాయాలయ్యాయి. పాలకొండ మండలం బడ్డుమాసింగికి చెందిన వీరంతా ఉదయం రాయగఢ మజ్జి గౌరమ్మను దర్శించుకునేందుకు ఆటోలో వెళ్లి తిరిగి వస్తుండగా కడకెల్ల–రావివలస మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్.ఐ తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ తెలిపారు. క్షతగాత్రుల్లో చింతా వీర్రాజు, వరలక్ష్మిలకు తీవ్ర గాయాలవ్వడంతో పాలకొండ తరలించారు. ఇసుకపల్లి మంగమ్మకు కాలు విరిగిపోగా చేతికి గాయాలయ్యాయి. చింతా జీవన్కుమార్, మన్య హర్షవర్ధన్లకు తలపై గాయాలయ్యాయి. వీరిని కూడా పాలకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందు 108 సిబ్బంది జగదీష్, తిరుపతిరావులు క్షతగాత్రులకు ప్రధమ చికిత్స అందజేశారు. ఆటోలో ఉన్న ఐదుగురికి గాయాలు -
ఏప్రిల్ 2న పదోతరగతి ఇంగ్లిష్ పరీక్ష
పార్వతీపురం రూరల్: రంజాన్ పండగ సందర్భంగా శనివారం ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించిన నేపథ్యంలో... ఆ రోజు జరగాల్సిన పదోతరగతి ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా పడినట్టు డీఈఓ పి.బ్రహ్మాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష సమయం యథాతథంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని కోరారు. 30కి ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్ష వాయిదా పార్వతీపురం రూరల్: రంజాన్ సందర్భంగా ఈ నెల 21న ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఆ రోజు జరగాల్సిన ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలను వాయిదా వేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి పి. బ్రహ్మాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 21న జరగాల్సిన 211 గణితం, 223–భారతీయ సంస్కృతి, వారసత్వము పరీక్షలను ఈనెల 30వ తేదీ (సోమవారం) ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆయా కేంద్రాల్లోనే ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షల వాయిదా సమాచారాన్ని ప్రతివిద్యార్థికి చేరవేయాలని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులను డీఈఓ ఆదేశించారు. ఈనెల 21న విధులకు కేటాయించిన ఇన్విజిలేటర్లు సిబ్బంది అందరూ యథావిధిగా 30వ తేదీన తమ విధులకు హాజరు కావాలని, పరీక్ష కేంద్రాల్లో అవసరమైన లాజిస్టిక్ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. అల్లాహ్ విశ్వాసకులకు రంజాన్ శుభాకాంక్షలు ● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: ఆధ్యాత్మిక చింతన, త్యాగం మానవత్వానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పండగ ప్రజలందరిలోనూ వెలుగులు నింపాలని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆకాంక్షించారు. శనివారం పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణ, దానగుణం, సోదరభావానికి రంజాన్ పండగ ప్రతీక అని కొనియాడారు. పేదలకు చేసే సహాయమే ఈ పండుగలోని అసలైన పరమార్థమని, మానవత్వమే మతమని చాటిచెప్పే గొప్ప పండగ రంజాన్ అని ఆయన పేర్కొన్నారు. అల్లాహ్(భగవంతుని) దయ అందరిపైనా ఉండాలని, జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని, ప్రజల్లో మత సామరస్యత పెంపొందాలన్నారు. ఈవీఎం గోదాముల తనిఖీ నెల్లిమర్ల: ఈవీఎం గోదాములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. మూడు నెలలకోసారి గోదాముల తనిఖీలో భాగంగా గోదాము షట్టర్లకు అమర్చిన సీల్స్, తాళాలను తెరిపించి లోపలి గదులను, ఈవీఎం యంత్రాల నిల్వను సమగ్రంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు. గోదాం పరిసర ప్రాంతాలను సీసీ కెమెరాల ద్వారా పరిశీలించి, అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు, పోలీస్ సిబ్బందికి సూచించారు. -
డిమాండ్కు తగ్గట్టుగా గ్యాస్ సరఫరా
● అవసరం మేరకు మాత్రమే బుకింగ్ చేసుకోవాలి ● గ్యాస్ పొదుపుగా వాడుకోవాలి ● కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయనగరం: జిల్లాలో గృహవినియోగ గ్యాస్కు కొరత లేదని, డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా జరుగుతుందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. గ్యాస్ కోసం ప్రజలు ఆందోళన చెందవద్దని, డిమాండ్కు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్యాస్ పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రజల అవసరం మేరకు మాత్రమే గ్యాస్ కొనుగోలు చేయాలని, ఆందోళన చెంది అనవసరంగా బుకింగ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. డిమాండ్, సప్లయిలో అంతరాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సివిల్ సప్లయి అధికారులను అదేశించారు. సమావేశంలో సీపీఓ, డీఎస్ఓ పాల్గొన్నారు. -
ఏనుగుల తరలింపు ఎప్పుడు?
జియ్యమ్మవలస రూరల్: చేతికొచ్చిన పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. జియ్యమ్మవలస మండలంలోని నిమ్మలపాడు, బిత్రపాడు, బాసంగి గ్రామాల్లో రెండు రోజులుగా సంచరిస్తూ అరటి, చెరకు, జొన్న, పామాయిల్ పంటలను నాశనంచేస్తున్నాయి. రాత్రి వేళల్లో గ్రామ పరిసరాల్లో సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. కుంకీ ఏనుగులను తీసుకొచ్చి ఏనుగులను తరలిస్తామంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఓట్లకోసం ఉచిత హామీలు ఇవ్వడం సరికాదని, ఏనుగుల తరలింపుపై దృష్టిసారించి రైతులకు మేలుచేయాలని డిమాండ్ చేశారు. బిత్రపాడు, నిమ్మలపాడు గ్రామాల ప్రధాన రోడ్డుకు దగ్గరలో ఏనుగులు సంచరించడంతో అటువైపుగా ప్రయాణించిన వాహన చోదకులు, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రాత్రివేళల్లో నిద్ర లేకుండా చేస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
గెలుపు గేట్ తెరిచారు..
ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు గురువారం విడుదలైన గేట్ ఫలితాల్లో సత్తా చూపారు. ఉత్తమ ర్యాంకులు సాధించారు. జిల్లాకు, ఊరికి పేరుతెచ్చారు. ఉన్నత విద్యాభ్యాసానికి అర్హత సాధించారు. వీరఘట్టం: మండలంలోని మొట్ట వెంకటాపురం గ్రామానికి చెందిన కుర్రోడు కందల రాజశేఖర్ గేట్ ఫలితాల్లో సత్తాచాటాడు. రెండు పేపర్లలో పరీక్షలు రాయగా ఆలిండియా స్థాయిలో ఈసీఈలో 735 స్కోర్ పాయింట్లతో 423వ ర్యాంకు, ఇనిస్ట్రిమెంటేషన్లో 275 స్కోర్ పాయింట్లతో 273వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు రాములమ్మ, రామారావు, సోదరుడు తిరుపతిరావు వ్యవసాయం చేస్తూ రాజశేఖర్ను చదివించారు. గేట్లో మంచి ర్యాంకు సాధించడంతో మురిసిపోతున్నారు. గేట్లో మెరిసిన ఎం.వి.పురం కుర్రోడు -
బాధ్యతల స్వీకరణ
విజయనగరం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఉత్తర్వుల మేరకు విజయనగరం నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ ఎం.రాంసుందర్రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యమిస్తానన్నారు. నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు, కనీస అవసరాలను సంపూర్ణగా కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల సంరక్షణ వంటి అత్యవసర సేవలు నిరంతరాయంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని, వాటిని మరింత మెరగుపరిచే దిశగా కార్యాచరణ చేపడతాన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరిం మెరుగైన సేవలందించేలా కృషి చేయాలని సూచించారు. ● పూల సోయగం -
మీకో మోసం..!
రైతన్నా.. సాక్షి, పార్వతీపురం మన్యం: ‘రైతన్నా.. మీకోసం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రజాప్రతినిధులను, అధికారులను గ్రామాలకు పంపిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ.. ఆచరణలో అది ఒట్టిదేనని నిరూపితమవుతూనే ఉంది. పంటలకు మద్దతు ధర దక్కక రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నా పట్టించుకునేవారే లేరు. పంటను అమ్ముకునే అవకాశం లేక రైతన్నలు నష్టపోతున్నారు. ప్రభుత్వం తీరుతో మోసపోతున్నారు. ఆశల పంట.. నష్టాల బాట జిల్లాలో వరి తర్వాత అధిక శాతం మంది మొక్కజొన్ననే సాగు చేస్తుంటారు. వరి, పత్తితో పోల్చుకుంటే.. ఈ పంటలో కాస్త లాభాలు చూడవచ్చని ఆశ పడతారు. పార్వతీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, పాలకొండ, సీతంపేట, సాలూరు, పాచిపెంట, మక్కువ, తదితర ప్రాంతాల్లో ఎక్కువ సాగులో ఉంది. ఈ ఏడాది ప్రస్తుత సీజన్లో 31వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంట వేశారు. తొమ్మిది లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పంట చేతికొస్తున్నా.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులు మధ్యవర్తులు, వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. ఏటా ప్రభుత్వం పేరుకే మద్దతు ధర ప్రకటిస్తున్నా.. మార్క్ఫెడ్ ద్వారా ఎక్కడా కొనుగోలు కేంద్రాలు మాత్రం కానరావడం లేదు. నాసిరకం విత్తనాలతో దగా.. ఓ వైపు కొనుగోలు కేంద్రాలు లేక రైతులు దిగాలు చెందుతుంటే.. మరోవైపు నాసిరకం మొక్కజొన్న సీడ్ సరఫరాతో కొన్ని మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొమరాడ మండలంలోని గుణానపురం, గంగరేగువలస, దుగ్గికంభవలస, కల్లికోట, సోమినాయుడువలస తదితర గ్రామాల్లో నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి తగ్గిపోయింది. ఈ విత్తనాల వల్ల పొత్తుపై గింజలు పది లోపే ఉంటున్నాయి. దీనివల్ల ఎకరాకు రూ.లక్ష వరకు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 2 వేల ఎకరాలకుపైగా ఈ పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందట సీపీ ఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బరావమ్మ, ఇతర నాయకులు కొమరాడ మండలంలోని సోమినా యుడువలస సమీపంలోని ఉన్న నాగభూషణం అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. నాసిరకం విత్తనాల వల్ల పంట దిగుబడి తగ్గిపోయిందని వారి ఎదుట రైతు వాపోయాడు. రైతులను మోసం చేసి, కావేరి సీడ్ యాజమాన్యం నాసి రకం విత్తనాలు సరఫరా చేసిందని సీపీఎం నాయకులు ఆరోపిస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.1.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొక్కజొన్న క్వింటాకు ప్రభుత్వం రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులకే విక్రయించుకోవాల్సి వస్తోంది. రూ.1,600 నుంచి రూ.1,700కి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో క్వింటా వద్ద రూ.800 వరకు రైతు నష్టపోతున్నాడు. అనేక కష్టనష్టాలకు ఓర్చి, బోరుబావుల వద్ద పంటను పండిస్తున్నారు. ఆశించిన స్థాయిలో పంట ఉంటే... ఎకరా విస్తీర్ణంలో 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ఎకరా వద్ద రైతు దాదాపు రూ.25 వేల వరకు నష్టపోతున్నాడు. దళారులు, వ్యాపారులు తూకంలోనూ మోసాలకు పాల్పడుతున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న ఎన్నికల అధికారి
సీతంపేట: సీతంపేటలో టీటీడీ నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గురువారం ఉగాది పర్వదినాన దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్తో కాసేపు ముచ్చటించారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు ● కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి పార్వతీపురం: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, ముస్లింలకు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ, దానగుణం, భక్తికి రంజాన్ పండగ ప్రతీక అని పేర్కొన్నారు. నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి, క్రమశిక్షణతో కూడిన జీవనం సాగించడం అభినందనీయమన్నారు. జిల్లాలోని ప్రజలందరూ కులమతాలకు అతీతంగా, సోదరభావంతో పండగను జరుపుకోవాలని, జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, సంతోషాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. పక్కుడుభద్ర వైపు ఏనుగులు భామిని: తివ్వకొండలకు సమీపంలోని పక్కుడుభద్ర పరిసరాల్లోకి ఏనుగులు గురువారం చేరుకున్నాయి. నేరడి బ్యారేజ్ సమీపంలో సంచరిస్తూ తివ్వకొండల వద్దకు చేరుకోవడంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. పచ్చని పంట పొలాల్లో సంచరిస్తూ నాశనం చేస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు. ఏనుగుల మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మన్యంలో భారీ వర్షం గుమ్మలక్ష్మీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీవర్షం కురిసింది. సుమారు గంట సమయం పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్పేట, జె.కె.పాడు, ఎస్.కె.పాడు, తాడికొండ, తోలుఖర్జ, ఇరిడి తదితర గ్రామాల పరిధిలో గాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. వాతావరణం చల్ల బడడంతో ప్రజలంతా ఉపశమనం పొందారు. -
ఉత్సాహంగా ఉగాది వేడుకలు
పార్వతీపురం రూరల్: పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని మన్యం కళావేదికలో గురువారం పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఉత్సాహంగా సాగాయి. కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా పండితుడు దార్లపూడి లక్ష్మీనరసింహారావు నూతన సంవత్సర రాశిఫలాలు, వర్షపాతం, వ్యవసాయ పరిస్థితులపై పంచాంగ పఠనం చేశారు. అనంతరం కురుకుట్టి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. కవి సమ్మేళనంలో కవులు సిరికి స్వామినాయుడు, బౌరోతు శంకరరావు, కిలపర్తి దాలినాయిడు తమకవితలను వినిపించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల ప్రాముఖ్యతను వివరించి, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పండితులను, కవులను దుశ్శాలువలతో సత్కరించారు. జాయింట్ కలెక్టర్ సి.యస్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ వైశాలి, జిల్లా రెవెన్యూ అధికారి హేమలత, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. -
రామతీర్థానికి శ్రీరామనవమి శోభ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామ స్వామి వారి దేవస్థానానికి శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గురువారం నుంచి కల్యాణ వసంతోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. వేకువజామున స్వామికి సుప్రభాత సేవ, బాలభోగం తదితర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలోని స్వామివారిని ఆశీనులను చేసి విశ్వక్సేరాధన, అంకురారోపణ, రుత్విగ్వరణం, తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. రాత్రి 7 గంటలకు స్వామివారిని రామతీర్థం తిరువీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉగాది పర్వదినం మొదలుకొని శ్రీరామ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 40 మంది వేదపండితులతో శతసహస్ర నామ తులసీ దళార్చన, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 27న శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో వేడుకగా జరిపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, కిరణ్, పవన్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైభవంగా ప్రారంభమైన కల్యాణ వసంతోత్సవాలు వేద పండితులతో శాస్త్రోక్తంగా పారాయణాలు ఈ నెల 27న ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల కల్యాణం -
మనోహరమైన విజయం
పాలకొండ: గేట్–2026 ఫలితాల్లో పాలకొండకు చెందిన బొత్స మనోహరనాయుడు ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా స్థాయిలో 50వ ర్యాంకు సాధించాడు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 872 స్కోర్ 69.33 మార్కులతో ఆల్ ఇండియా స్థాయిలో 50వ ర్యాంకు, ఇన్స్ట్రుమెంట్ ఇంజినీరింగ్లో 705 స్కోర్ 65.67 మార్కులతో ఆల్ ఇండియా స్థాయిలో 122వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తండ్రి బొత్స వెంకటరమణ పాలకొండ పట్టణంలోని వెంకమ్మపేట ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తుండగా, తల్లి ప్రభావతి గృహిణి. ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థిని పాలకొండ వాసులు అభినందించారు. -
సాయితేజకు 423వ ర్యాంక్
గజపతినగరం రూరల్: గేట్ (గ్రాడ్యూయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)లో గజపతినగరం మండలం లోగిస గ్రామానికి చెందిన సామంతల జీవన్సాయితేజ ఆలిండియా స్థాయిలో 423 ర్యాంకు సాధించాడు. 100 మార్కులకు 58 మార్కులు స్కోర్ లభించడంతో సాయితేజకు ఈ ర్యాంక్ వచ్చింది. సాయితేజ ప్రస్తుతం హైదరాబాద్లో డీఆర్డీఓలో ట్రైయినీ రీచర్చ్ ఫెలోగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు సామంతుల సోంబాబు, తల్లి పైడిరాజు వ్యవసాయదారులు. మరోవైపు సాయితేజ కోల్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజ్మెంట్ ట్రెయినీ, ఎయిర్ఫోర్ట్ ఆఽథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. కుమారుడు అటు చదువు, ఇటు ఉద్యోగ పరీక్షల్లో విజేతగా నిలవడంతో తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. -
టేకు తోటలో మంటలు
బలిజిపేట: మండలంలోని వెంగాపురం అగ్రహారం వీధి వెనుకున్న టేకుతోటల్లో గురువారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇదే సమయంలో ఈదురుగాలులు వీయడంతో మంటలు ఎగసిపడ్డాయి. కొద్ది సేపటి తర్వాత వర్షం పడడంతో మంటలు చల్లారాయి. చుట్టో, సిగరెట్టో కాల్చి పారేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పామాయిల్ తోటలో.. గజపతినగరం రూరల్: మండలంలోని బంగారమ్మపేటలో పల్లా చంద్రరావుకు చెందిన 30 ఎకరాల పామాయిల్ తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తోటలో గల డ్రిప్ ఇరిగేషన్ పైపులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు రూ.లక్ష వరకు నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారి ప్రసాద్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్, బీడీ కాల్చి పడేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. చెరకు తోటలో.. బాడంగి: మండలంలోని భీమవరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో విశ్వనాథం వెంకట సుబ్రహ్మణ్యంనకు చెందిన సుమారు నాలుగు ఎకరాల్లోని చెరకు పంట అగ్నికి ఆహుతైంది. ఇదే సమయంలో గాలి వీయడంతో పక్కనే ఉన్న రెండు గడ్డి కుప్పలు కూడా బూడిదయ్యాయి. డొంకినవలస నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. -
అలరించిన భరతనాట్య ప్రదర్శన
చికెన్● ఉగాది వేడుకల్లో భాగంగా విద్యార్థినులకు ప్రశంసాపత్రాల అందజేత విజయనగరం టౌన్: ఉగాది సందర్భంగా నగరంలోని రామనారాయణం వేదికగా జరిగిన భరతనాట్య ప్రదర్శన భక్తులు, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో వరలక్ష్మి నాట్యాలయం విద్యార్థినులు తమ అద్భుత కళా ప్రదర్శనతో అలరించారు. నాట్యాలయం గురువు పేరి వరలక్ష్మి పర్యవేక్షణలో విద్యార్థినులు ప్రదర్శించిన భరతనాట్య భంగిమలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రదర్శన అనంతరం ఆలయ నిర్వాహకులు కళాకారులను అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. భారతీయ సంస్కతి, కళలను భావితరాలకు అందించడంలో ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయని నిర్వాహకులు కొనియాడారు. ప్రత్యేక ఆకర్షణగా లేజర్ షో.. నాట్య ప్రదర్శన అనంతరం ఆలయ ప్రాంగణంలోని భారీ ఆంజనేయ స్వామి విగ్రహంపై ఏర్పాటు చేసిన లేజర్ షో భక్తులను మంత్రముగ్ధులను చేసింది. కాంతి పుంజాల మధ్య స్వామివారి రూపం విద్యుత్ దీపాల వెలుగులో కాంతులీనుతూ భక్తి పారవశ్యాన్ని నింపింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, విద్యార్థినుల తల్లిదండ్రులు, భక్తులు పాల్గొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
లక్కవరపుకోట: చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురై ఒడిశాకు చెందిన గజేంద్ర బెహరా (31) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని సీతారాంపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గజేంద్ర బెహరా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన దేవిని పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి మండల పరిధిలోని పలు కంపెనీల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది నెలల కిందట సోంపురం జంక్షన్ సమీపంలో గల అట్టల కంపెనీలో పనికి కుదిరి.. సీతారాంపురం గ్రామంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో జీవనోపాధి నిమిత్తం అప్పులు చేశాడు. ఇతని భార్య దేవి కొద్దిరోజుల కిందట పుట్టింటికి వెళ్లగా.. గజేంద్ర ఒక్కడే ఉంటున్నాడు. అయితే అప్పులు ఎక్కువ కావడంతో గజేంద్ర బెహరా ఇంటిలో ఉన్న ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా.. హెడ్కానిస్టేబుల్ పాపారావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం.. కొత్తవలస మండలంలోని 202 కాలనీ సమీపంలో గల లెజెండ్ లే అవుట్లో గల తుప్పల్లో గుర్తు తెలియని పురుషుడు మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, ఐదారు రోజుల కిందట మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడా..? లేదా ఎవరైనా చంపి ఇక్కడికి తీసుకొచ్చి పడేసారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆత్మహత్యాయత్నం పార్వతీపురం రూరల్: తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని మార్కొండపుట్టి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన విద్యార్థిని ఎ.సౌజన్య ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఇంట్లోనే ఉంటోంది. గురువారం ఉగాది పండుగ సందర్భంగా తన తండ్రిని విధులు ముగించుకుని ఇంటికి త్వరగా రావాలని ఆమె కోరింది. ఈ క్రమంలో నువ్వు నాకు చెప్పవద్దు అని సౌజన్యను తండ్రి మందలించడంతో తీవ్ర ఆవేదనకు గురైన సౌజన్య ఇంట్లో ఉన్న చీమల మందును నీటిలో కలిపి తాగేసింది. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. భవనంపై నుంచి జారిపడి కార్మికుడి మృతి లక్కవరపుకోట: భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి కార్మికుడు మృతి చెందిన సంఘటన మండలంలోని సీతాగొర్లెవానిపాలెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కొత్తవలస మండలం మింది రామచంద్రపురం గ్రామానికి చెందిన దాడి చిన్నప్పారావు (35) ఈ ప్రమాదంలో మృతి చెందాడు. ఏఎస్సై శ్రీనివాసరావు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నప్పారావు మండలంలోని సీతాగొర్లెవానిపాలెంలో ఓ భవనానికి డెకింగ్ పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సహచర కూలీలు ఆయన్ను సమీపంలో గల ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంచానికి పరిమితమైనా.. కనికరం లేదా..?
చీపురుపల్లి: పై చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి చీపురుపల్లి పట్టణంలోని అన్నపూర్ణకాలనీకు చెందిన దువ్వూరి సాయికృష్ణ. ఈయన 2023 ఏడాది చివరిలో అనారోగ్యం బారిన పడడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా బైలేటరల్ లోవర్ లింబ్, ఇంపైర్డ్ రీచ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో విశాఖపట్టణం, హైదరాబాద్లో చికిత్స తీసుకున్నాడు. ఇందుకోసం అతను సంపాదించిన సొమ్మంతా ఖర్చు కాగా ఇంకా అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇంటివద్దే ఉంటూ వైద్యం చేయించుకుంటున్నారు. ఇతనికి ఛాతి నుంచి కింద భాగం అచేతనంగా మారిపోయింది. దీంతో అన్నీ మంచంపైనే జరుగుతుండడంతో ఆయన భార్య సేవలు అందిస్తోంది. వీరికి పిల్లలు కూడా లేరు. అయితే ప్రస్తుతం వీరు డైపర్లు, యూరిన్ బ్యాగులు కొనుక్కునే పరిస్థితుల్లో కూడా లేరు. అనాథలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ కోసం పీజీఆర్ఎస్లో పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. కనీసం పింఛన్ మంజూరైనా గంజినీళ్లు తాగి బతుకుతామని భార్యాభర్తలు అంటున్నారు. ఇలాంటి వారెందరో.. ఇది సాయికృష్ణ లాంటి ఎంతో మంది ఆదరణ లేని వారి ఆవేదన. టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ఒక్క కొత్త ఫించన్ కూడా ఇవ్వకపోవడంతో ఇలాంటి ఎంతో మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. పాత పింఛన్ల పంపిణీ కోసం ప్రతినెలా ఒకటో తేదీన ఎమ్మెల్యేల నుంచి సీఎం వరకు కోట్లాది రూపాయలతో ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ఇలాంటి ఎంతోమంది అర్హులకు న్యాయం చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 90 శాతం వికలాంగత్వం ఉన్నా పింఛన్ మంజూరు చేయని అధికారులు, ప్రజాప్రతినిధులు అరుదైన వ్యాధితో బాధపడుతున్న సాయికృష్ణ కనీసం డైపర్లు, యూరిన్ బ్యాగ్లు కొనుగోలు చేయలేని పరిస్థితి దుర్భర జీవితం అనుభవిస్తున్న భార్యాభర్తలు -
ఎన్ఎంఎంఎస్ ఫలితాల విడుదలెప్పుడో..?
రామభద్రపురం: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) ప్రతిభా పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో గతేడాది డిసెంబర్ 7న నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ ప్రతిభా పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 4009 మంది హాజరుకాగా.. ఇందులో రామభద్రపురం మండలానికి చెందిన వారు 55 మంది ఉన్నారు. అయితే పరీక్షలు నిర్వహించి మూడు నెలలు దాటినా ప్రభుత్వం ఫలితాలు విడుదల చేయకపోవడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తదితర జిల్లాల్లో ఇప్పటికే ఎన్ఎంఎంఎస్ ప్రతిభా పరీక్షల ఫలితాలు విడుదల చేశారన్న సమాచారం ఉందని.. మన జిల్లాలో ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ఫలితాలు త్వరితగతిన విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ పరీక్షలో ప్రతిభ చాటిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏటా రూ.12 వేలు చొప్పున్న నాలుగేళ్లు ఉపకార వేతనం అందించనున్నారు. ఆకట్టుకున్న ఎడ్లబళ్ల పందాలు వేపాడ: మండలంలోని వావిలపాడులో నూకాలమ్మ పండగ సందర్భంగా గురువారం నిర్వహించిన ఎడ్లబళ్ల పందాలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో 15 ఎడ్ల బళ్లు పాల్గొనగా.. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. అంతకుముందు నూకాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్
పార్వతీపురం రూరల్: మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, పట్టణ అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని.. చెత్త సేకరణ, కాలువల్లో పూడికతీత పనుల్లో ఎటువంటి జాప్యం జరగకూడదని ఆదేశించారు. వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ సిబ్బందికి సూచించారు. పట్టణంలో కొనసాగుతున్న రోడ్లు, భవనాల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీకి వచ్చే అర్జీలను తక్షణమే పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
కారుణ్య నియామకం
విజయనగరం క్రైమ్: గజపతినగరంలోని పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టి.తిరుపతిరావు భార్య దమయంతికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించారు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆమెకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ టి.తిరుపతిరావు కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం రెండు నెలల్లో ఆయన భార్య దమయంతికి పోలీసుశాఖలో టైపిస్ట్గా ఉద్యోగం కల్పించామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, డీపీఓ ఏఓ పి. శ్రీనివాసరావు, జూనియర్ సహాయకురాలు చాముండేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. -
రౌడీషీటర్ ఘాతుకం.. యువకుడి హత్య
● కత్తిపోట్లకు 19 ఏళ్ల యువకుడు బలి ● మరొకరి పరిస్థితి విషమం ● ఇసుకతోటలో దారుణం ఎంవీపీకాలనీ: నగరంలోని ఇసుకతోట రామాలయం సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాతకక్షల నేపథ్యంలో బొచ్చు వెంకటేష్(19) అనే యువకుడు రౌడీషీటర్ చేతిలో దారుణ హత్యకు గురవగా, బాకీ సంతోష్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో రౌడీషీటర్ పల్లా అనీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడికావడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. నిత్యం రౌడీషీటర్లను పర్యవేక్షిస్తున్నా, తరచూ కౌన్సిలింగ్లు ఇస్తున్నా.. ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. రణస్థలం, పూసపాటిరేగ ప్రాంతాలకు చెందిన బొచ్చు వెంకటేష్, బాకీ సంతోష్ వరుసకు అన్నదమ్ములు. ఉపాధి నిమిత్తం వీరిద్దరూ విశాఖలో ఉంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పల్లా అనీల్పై ఎంవీపీకాలనీ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. గతంలో ఇతని ఆగడాలు మితిమీరడంతో పోలీసులు నగర బహిష్కరణ కూడా చేశారు. కొంతకాలం రణస్థలంలో ఉన్న అనిల్, ఇటీవల మళ్లీ నగరానికి చేరుకున్నాడు. రణస్థలంలోనే అనీల్కు, వెంకటేష్కు పరిచయాలు ఉన్నాయి. కాగా.. వెంకటేష్ భార్య విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా తగాదాలు నడుస్తున్నాయి. దీనిపై గతంలోనే వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మూడు నెలల కిందట పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అయినా వీరి మధ్య వివాదం సద్దుమణగలేదు. ఇటీవల మరోసారి గొడవ జరగడంతో ‘చూసుకుందాం రా’ అంటూ వెంకటేష్ సవాల్ విసిరినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం రాత్రి అర్ధరాత్రి సమయంలో ఇసుకతోట రామాలయం వద్ద వెంకటేష్, అనీల్ తరఫు వాళ్లు తలపడ్డారు. ముందస్తు పథకం ప్రకారం కత్తితో సిద్ధంగా వచ్చిన అనీల్, ఒక్కసారిగా వెంకటేష్, సంతోష్లపై దాడి చేశాడు. బలమైన కత్తిపోట్లు తగలడంతో వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సంతోష్ తీవ్ర గాయాలపాలవగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నైట్ బీట్ పోలీసులు అక్కడికి చేరుకుని సంతోష్ను వెంటనే కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనలో సుమారు 12 మంది యువకులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ నరసింహమూర్తి గురువారం తెలిపారు. -
రెవెన్యూ అంశాల పరిష్కారంలో జాప్యం వద్దు : జేసీ
విజయనగరం: జిల్లాలోని వివిధ రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ బుధవారం ఆన్లైన్ ద్వారా తమ చాంబర్ నుంచి మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే రెవెన్యూ దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా మీసేవ ద్వారా అందిన 22ఎ నిషేధిత జాబితా సవరణ దరఖాస్తులను 22ఎ–(1)(ఎ), 22ఎ–(1)(బి) విభాగాల వారీగా సమీక్షించారు. జేసీ, ఆర్డీఓ, ఎమ్మార్వో కార్యాలయాల స్థాయిలో ఏ దశలోనైనా దరఖాస్తులు నిలిచిపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వెనుకబడ్డ తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రీ సర్వే ప్రక్రియలో భాగంగా వెబ్ల్యాండ్ పోర్టింగ్ను వేగవంతం చేయాలని, ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు తక్షణమే పంపిణీ చేయాలని సూచించారు. ఏప్రిల్ నెలలో చేపట్టాల్సిన పంపిణీపై సమీక్షించారు. వీటితో పాటు మ్యుటేషన్లు, జీరో ఖాతాల సవరణ, ఫిలైన్ మరియు సబ్ డివిజన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వచ్చే వినతులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని, రెవెన్యూ క్లినిక్ల సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలకు సంబంధించి సివిల్ సప్లైస్ విభాగంలో కొత్త రైస్ కార్డుల దరఖాస్తుల స్థితిగతులను, ఇ–ఆఫీస్ ఫైళ్ల కదలికను పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, సీపీఓ పి.బాలాజీ, డీఎస్ఓ మురళీనాథ్, డీఎం బి.శాంతి, ఆర్డీఓ వెంకటేశ్వరరావు, సర్వే ఏడీ విజయకుమార్, జిల్లాలోని ఆయా విభాగాల అధికారులు, తహసీల్దార్లు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
కాసులతోనే... కు.ని. ఆపరేషన్..!
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అనేక మంది మహిళలు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం రూ.వేలల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ సర్కార్ హయాంలో ఈ ఆపరేషన్లకు సొంత డబ్బులు పెట్టుకోవాల్సి రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనాభా నియంత్రణలో ప్రధానమైన కుటుంబ నియంత్రణ పట్ల టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అనేక ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నా.. ప్రైవేటులో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడం పట్ల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 48 పీహెచ్సీలు జిల్లాలో 48 పీహెచ్సీలు ఉన్నాయి. బాడంగి, బొబ్బిలి, భోగాపురం, నెల్లిమర్ల సీహెచ్సీలు ఉన్నాయి. ఎస్.కోట, చీపురుపల్లి, రాజాం, గజపతినగరం ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఘోషాస్పత్రి, పట్టణంలో కుటుంబ సంక్షేమ కేంద్రం, బొబ్బిలిలో కుటుంబ సంక్షేమ కేంద్రం ఉన్నాయి. వీటిల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేస్తారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయడానికి పీహెచ్సీ వైద్యులకు శిక్షణ కూడా ఇచ్చారు. అయినప్పటకీ వీటిల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకోవడానికి వెళ్లిన వారికి ఏదో ఒక కుంటి సాకులు చెప్పి చేయకుండా పంపించేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.20 వేల వరకు వసూలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయకపోవడం వల్ల మహిళలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ మహిళలు నుంచి రూ.10 వేల నుంచి రూ.20 వేలు వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగోలేని మహిళలు ఒకరు, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. కొంతమంది ఒక పిల్లతో శస్త్రచికిత్స చేయించుకోగా, మరికొందరు ఇద్దరు పిల్లలతో చేయించుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేయని వైనం! ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న మహిళలు ఉచితంగా జరగాల్సిన వాటికి డబ్బులు చెల్లింపు మెంటాడ మండలానికి చెందిన కె.కొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించింది. అక్కడ ఆమెకు ఈ శస్త్రచికిత్స చేసేందుకు సదరు ఆస్పత్రి వారు రూ.10వేలు తీసుకున్నారు. ఉచితంగా చేయాలి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు ఉచితంగా చేయాలి. ఎక్కడైనా చేయకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ, విజయనగరం -
మారథాన్ పరుగులో రాణిస్తున్న ‘బుగత’
● అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న శ్రీను ● ఆర్మీలో ఉద్యోగం చేస్తూ.. దేశం తరఫున ప్రాతినిధ్యం గజపతినగరం రూరల్: మండలంలోని బంగారమ్మపేట గ్రామానికి చెందిన బుగత శ్రీను అంతర్జాతీయ స్థాయి మారథాన్ పరుగులో రాణిస్తూ అందరి మన్నలు పొందుతున్నాడు. ఓ వైపు దేశ సేవలో తరిస్తూ అథ్లెటిక్స్లో రాణిస్తున్నారు. 2010లో ఆర్మీలో జనరల్ డ్యూటీలో సిపాయిగా చేరిన శ్రీను ప్రస్తుతం మహారాష్ట్రలోని పుణేలో సుబేధార్గా పని చేస్తున్నాడు. ఇదే సమయంలో అథ్లెటిక్స్పై ఉన్న ఆసక్తితో జాతీయ, అంతర్జాతీయ పరుగు పందెంలో దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పటి వరకు సుమారు వంద పతకాలు సాధించాడు. ఈ క్రమంలోనే ఈ నెల 14న న్యూఢిల్లీలో జరిగిన ఐఏయూ 50 కిలోమీటర్ల ప్రపంచ చాంపియన్షిప్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి రజిత పతకం సాధించాడు. వివిధ దేశాల నుంచి 42 మంది పాల్గొనగా శ్రీను 14వ స్థానంలో నిలిచాడు. 50 కిలోమీటర్ల పరుగును రెండు గంటల 57 నిమిషాల 49 సెకన్ల వ్యవధిలో ఛేదించి ఈ మైలురాయిని అందుకున్నాడు. అథ్లెటిక్స్పై ఆసక్తి బుగత శ్రీనును సాక్షి బుధవారం కలవగా తనకు చిన్నప్పటి నుంచి పరుగు పందెం అంటే ఇష్టమని చెప్పాడు. చదువుకున్న రోజుల నుంచే పరుగు పందెంలో పాల్గొనేవాడినని, దీని వల్లే తనకు ఆర్మీలో ఉద్యోగం లభించిందని చెప్పుకొచ్చాడు. ఆర్మీలో శిక్షకుల వద్ద తర్ఫీదు పొందానని చెప్పాడు. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వంద పతకాలు సాధించినట్టు తెలిపాడు. యువత తమ లక్ష్యాలను నిర్దేశించుకుని క్రీడల వైపు పయనించాలని సూచించాడు. -
కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత
విజయనగరం క్రైమ్ : కానిస్టేబుల్ టి.తిరుపతిరావు కుటుంబానికి తోటి సిబ్బంది, బ్యాచ్మేట్స్ తమ వంతు ఆర్థిక సాయం చేశారు. గజపతినగరం పోలీసు సర్కిల్, జుడిషియల్ సిబ్బంది రూ.4.30 లక్షల నగదును ఎస్పీ ఏఆర్ దామోదర్ చేతుల మీదుగా డీపీఓలో ఈ మేరకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సహోద్యోగి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. 2012 బ్యాచ్కు చెందిన గజపతినగరం కానిస్టేబుల్ టి.తిరుపతిరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. తిరుపతిరావు కుటుంబ పరిస్థితిని గుర్తించిన సహచర సిబ్బంది, అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు నగదు సేకరించి కుటుంబ సభ్యులకు అందజేశారు. తిరుపతిరావు కుటుంబానికి జిల్లా పోలీసు శాఖ అండగా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, గజపతినగరం సీఐ జీఏవీ రమణ, ఎస్ఐ కె.కిరణ్కుమార్నాయుడు తదితరులు ఉన్నారు. -
పది పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
జియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ప్రభాకర రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, వసతులను పరిశీలించి తాగునీరు, వెలుతురు, ఫ్యాన్ల పనితీరుపై ఆరా తీశారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ కఠినంగా అమలు చేసి మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా చూడాలని ఆదేశించారు. ఎండ తీవ్రత దృష్ట్యా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సంబంధిత ఉద్యోగులకు సూచించారు. మామిడి పంటకు ఆశించే తెగుళ్లపై అవగాహన విజయనగరం ఫోర్ట్: జిల్లాలో సుమారు 21,060 హెక్టార్లలో మామిడి పంట సాగులో ఉందని, ఇందులో 28,500 హెక్టార్లలో కాపు దశలో ఉన్నాయని జిల్లా ఉద్యాన శాఖాధికారి పి.చిట్టిబాబు బుధవారం తెలిపారు. డిసెంబర్ నెలలో కురిసిన అకాల వర్షాలు, ప్రస్తుతం పగలు అధిక ఉష్ణోగ్రతలు, రాత్రిపూట పొగ మంచు వంటి ప్రతికూల వాతావరణం వల్ల మొదటి దఫా పూతకు కొంత నష్టం వాటిల్లిందన్నారు. దీని వల్ల తామర పురుగులు, తేనే మంచు పురుగులు, బూడిద తెగులు ఉధృతి పెరిగిందన్నారు. 21 నుంచి గజపతినగరంలో ఇంటర్మీడియట్ మూల్యాంకనం విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిశాయని, జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఈ నెల 21 నుంచి గజపతినగరంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ప్రారంభిస్తామని ఆర్ఐఓ ఎస్.తవిటినాయుడు తెలిపారు. జిల్లాకు వచ్చిన రెండు లక్షల 30 వేల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను రెండు విడతలుగా చేపడతామని తెలియజేశారు. జిల్లాకు వచ్చిన వాటిలో ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మాథ్స్, హిస్టరీ, సంస్కృతం సబ్జెక్టు పేపర్లతో పాటు 85 వేల వరకు ఒకేషనల్ జవాబు పత్రాలు ఉన్నట్టు వెల్లడించారు. రెండో విడత మూల్యాంకన ప్రక్రియను ఈ నెల 25 నుంచి చేపడతామని స్పష్టంచేశారు. బేకరీలపై విజిలెన్స్ దాడులు రాజాం సిటీ: పట్టణంలోని పలు బేకరీలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. బుధవారం చేపట్టిన ఈ దాడుల్లో అక్రమంగా వినియోగిస్తున్న గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కమర్షియల్ సిలిండర్లకు బదులుగా డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించడంతో తొమ్మిది సిలింబర్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేశారు. -
జీఓ 5ను ఉపసంహరించుకోవాలి
పార్వతీపురం రూరల్ : దుకాణాలు, వాణిజ్య సంస్థలను 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబరు 5ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం పార్వతీపురంలోని సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్ వరకు ఆ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయం కార్మిక చట్టాల మౌలిక లక్ష్యాలకు విరుద్ధంగా ఉందన్నారు. అహోరాత్రులు సంస్థలు తెరిచి ఉంచడం వల్ల అసంఘటిత రంగంలోని చిన్న దుకాణాలు, హోటళ్లు, మాల్స్ కార్మికులపై పని భారం పెరిగి శ్రమదోపిడీకి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే లేబర్ కోడ్ల వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని, తాజా జీఓ కార్మికులకు మరింత నష్టం చేస్తుందని పేర్కొన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కార్మిక సంఘాలను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నేతలు డి.రమణారావు, వై.మన్మధరావు, ఎన్.వై.నాయుడు, వి.ఇందిర, రెడ్డి వేణు, జి.జ్యోతి పాల్గొన్నారు. -
భామిని తహసీల్దార్పై వీఆర్ఏల ఫిర్యాదు
భామిని: భామిని తహసీల్దార్ శివన్నారాయణపై భామిని మండల గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)లు బుధవారం సబ్కలెక్టర్ స్వప్నిల్ జగన్నాథ్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వీఆర్ఏలతో తహసీల్దార్ వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, సమయపాలన లేకుండా అర్ధరాత్రి వరకు విధుల పేరున వేధిస్తున్నారని ఆరోపించారు. తహసీల్దార్ తాత్కాలికంగా ఉంటున్న బత్తిలి ఇంటిలోనూ, సీతా నగరం మండలం మరిపువలస గ్రామంలోని సొంత ఇంటి వద్ద వీఆర్ఏలతో వెట్టిచాకిరీ పనులు చేయిస్తున్నారని వాపోయారు. కులంపేరుతో దూషిస్తూ, తహసీల్దార్ కార్యాలయం వద్ద సిమెంట్ కట్టు పను లు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంత రం పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు కూడా ఫిర్యాదు చేసినట్టు వీఆర్ఏల సంఘం జిల్లా కార్యదర్శి బుడుమూరు మిన్నారావు, మండలాధ్య క్షుడు నిమ్మల కర్ణ తెలిపారు. కార్యక్రమంలో 16 మంది వీఆర్ఏలు పాల్గొన్నారు. -
బాసంగి సమీపంలో ఏనుగులు
జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం – సుభద్రమ్మవలస పంట పొలాల్లో బుధవారం ఉదయం ఏనుగులు సంచరిస్తూ కనిపించాయి. దీంతో పార్వతీపురం నుంచి గుమ్మలక్ష్మీపురం ప్రాంతాల ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ మార్గంలో రోజూ వేల సంఖ్యలో ద్విచక్ర వాహనదారులతో పాటు బస్సులు ఇతరత్రా ప్రయాణ వాహనాల ద్వారా తమ గమ్యానికి ప్రజలు చేరుకుంటారు. ప్రస్తుతం ఈ మార్గంలో ఏనుగులు సంచరిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మంగళవారం ఉదయం జొన్న, పామాయిల్ తోటల నుంచి బాసంగి ముంపుడు గుండా వెళ్లడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎక్కడికక్కడ నిలిచిపోయారు. మధ్యాహ్నం బాసంగి ముంపుడులో తిష్ట వేశాయి. బుధవారం కూడా ఈ ప్రాంతంలోనే ఉండడంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. -
వ్యక్తి అరెస్ట్
వంగర: మండల పరిధి అరసాడలో గత నెల ఫిబ్రవరి 13న దొంతల దుర్గారావు స్క్రాప్ షాపులో జరిగిన దొంగతనం కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై షేక్ శంకర్ బుధవారం తెలిపారు. 96 కేజీల ఇత్తడి సామగ్రి, 100 ఫ్యాన్ కోన్స్, ఒక ఎలక్ట్రిక్ కాటా, రూ.4600 నగదు చోరీ జరిగినట్టు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేశామన్నారు. ఈ కేసులో విశాఖపట్నం పరిధి పాతగాజువాకకు చెందిన ఆసనాలు కృష్ణ గుర్తించామన్నారు. అరసాడలో మిగిలిన స్క్రాప్ షాపుల్లో దొంగతనం చేసేందుకు ఈ ప్రాంతంలో సంచరించడంతో నిందితుడు పట్టుబడ్డాడని, అరెస్ట్ చేసి పాలకొండ జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని ఎస్సై తెలిపారు. మత సామరస్యం పాటించాలి : ఎస్పీ విజయనగరం క్రైమ్ : ఉగాది, రంజాన్ పర్వదినాల సందర్భంగా మత సామరస్యం పాటించాలని ఎస్పీ దామోదర్ ఒక ప్రకటనలో కోరారు. ఈ రెండు పండగలు సాంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. పండగల సందర్భంగా మత సామరస్యం పాటించాలని, శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలని కోరారు. సోషల్ మీడియా వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే సమయంలో పోలీసుల సూచలను తప్పకుండా పాటించాలని కోరారు. మసీదులు, దేవాలయాల వద్ద పటిష్ట ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. మోటారుసైకిలు ఢీకొని వ్యక్తి మృతి సీతానగరం: మండలంలోని విశాఖ– రాయగడ రహదారిపై మరిపివలస వద్ద మంగళవారం మోటారు సైకిలు ఢీకొట్టిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. స్థానిక పోలీసులు అందించిన వివరాలు.. మంగళవారం సాయంత్రం మరిపివలస గ్రామానికి చెందిన గెంబలి మోహనరావు (66) తన ఇంటి నుంచి సరుకులు కొనుగోలు నిమిత్తం రోడ్డు దాటుతుండగా పార్వతీపురం నుంచి సీతానగరం వైపు వస్తున్న మోటారుసైకిలు ఢీ కొట్టడంతో గాయాల పాలయ్యాడు. పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందినప్పటికీ పరిస్థితి విషమించడంతో కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్టు తెలిపారు. స్థానికుడు బి.చిట్టిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహానికి పంచనామా చేసిన అనంతరం హెచ్సీ సోమరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 23న మెగా జాబ్ మేళా విజయనగరం అర్బన్: స్థానిక టీఏటీ ఐటీఐ కాలేజీ ప్రాంగణంలో ఈ నెల 23న మేగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు కాలేజీ డైరెక్టర్ కొయిలాడ వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలోని బొడ్దువారి జంక్షన్ వద్ద ఉన్న కాలేజీలో ఈ కార్యక్రమం జరగనుంది. హెచ్ఎస్ఎన్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేళాలో డిక్సన్, ప్రీమియర్, రేడియంట్, స్కైక్వాడ్ ఎలక్ట్రానిక్స్, టీసీఎల్ వంటి సంస్థలు పొల్గొననున్నాయి. ఎంఎఫ్జీ ఆపరేటర్, ఎస్ఎంఏటీ ఆపరేటర్, టెక్సీషియన్, ప్రొడక్షన్, అసెంబ్లీ ఆపరేటర్ వంటి పోస్టులకు నియామకాలు చేపడతారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హత కలిగిన పురుషులు, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలని, ఎంపికై న వారికి రూ.13 వేల నుంచి 25 వేల వరకు నెలసరి వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు. వెయ్యికి పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉండగా స్పాట్ ఆఫర్లు కూడా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 9866902665, 9908472726 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. సారా ధ్వంసం పాలకొండ రూరల్: పాలకొండ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 172 లీటర్ల నాటుసారా, 10 లీటర్ల మద్యం సీసాలను బుధవారం ధ్వంసం చేసినట్టు ఆ శాఖ సీఐ కిమిడి సూర్యకుమారి తెలిపారు. సంబంధిత శాఖ కమిషనర్, జిల్లా సూపరింటెండెంట్ ఎ.సంతోష్కుమార్ సూచనలతో అక్రమ మద్యం, సారా తరలింపులో పట్టుబడిన మూడు వాహనాలకు బహిరంగ వేలం ద్వారా ఔత్సాహికులకు అందించినట్టు తెలిపారు. -
పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి : ఎస్పీ
● నేర సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశం ● హెల్మెట్పై అవగాహన లఘుచిత్రం ఆవిష్కరణపార్వతీపురం రూరల్ : జిల్లాలో పెండింగ్లో ఉన్న గ్రేవ్, పోక్సో, ఎన్డీపీఎస్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మాసాంతపు నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కేసులో దర్యాప్తు పూర్తి చేసి, సకాలంలో చార్జ్షీట్లు దాఖలు చేయాలని, కోర్టులతో సమన్వయం చేసుకొని సీసీ, ఎస్సీ నంబర్లు పొందాలని సూచించారు. పోలీసింగ్లో సాంకేతికత నేర నియంత్రణలో కృత్రిమ మేధ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోందని ఎస్పీ తెలిపారు. ఏఐ4 ఏపీ పోలీస్ లోని సోషియంట్, 360న్యూస్ సేవలను అధికారులు వినియోగించుకోవాలన్నారు. గంజాయి రవాణా అడ్డుకట్టకు డ్రోన్ల ద్వారా నిఘా పెట్టాలని, హాట్ స్పాట్లను గుర్తించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశువుల అక్రమ రవాణాపై దృష్టి సారించాలన్నారు. రహదారి భద్రతపై పార్వతీపురం పట్టణ సీఐ వెంకట్రావు రూపొందించిన హెల్మెట్ అవగాహన లఘుచిత్రాన్ని ఎస్పీ ఆవిష్కరించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై ఈ–చలాన్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. రాబోయే ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా ప్రార్థనా మందిరాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత పెంచాలని సూచించారు. విధి నిర్వహణలో, వార్షిక ఫైరింగ్ ప్రాక్టీసులో ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు. అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎస్పీలు రాంబాబు, థామస్ రెడ్డి, వివిధ విభాగాల సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
పరాభవనామ సంవత్సరాదికి స్వాగతం
గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026పొట్టకూటి కోసం వెళ్లిన శ్రమజీవులు... కష్టాన్ని ‘మూట’గట్టుకుని తిరుగుపయనమయ్యారు. గరుగుబిల్లి మండలం సింగ నాపురం గ్రామానికి చెందిన సుమారు 25 మంది కూలీలు 12 రోజుల కిందట మచిలీ పట్నం వెళ్లారు. అక్కడ మినప చేలల్లో కూలిపనులు ముగించుకుని వచ్చిన డబ్బు లతో ఉగాది వేళ ఊరికి చేరుకున్నారు. పార్వతీపురం బస్టేషన్కు చేరుకుని అక్కడి నుంచి తమ గ్రామానికి వెళ్తున్న కూలీలను చిత్రంలో చూడొచ్చు. – పార్వతీపురం రూరల్ చైత్రమాసం.. వసంత రుతువు.. శిశిరంలో మోడైపోయిన చెట్లన్నీ చిగుళ్లు తొడిగే ఆహ్లాదకర వాతావరణంలో వచ్చే పరాభవనామ తెలుగు సంవత్సరాదికి విజయనగరం బాబామెట్టలోని వరలక్ష్మి నాట్యాలయం విద్యార్థినులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. షడ్రుచుల సమ్మేళనమే జీవితమని చెబుతూ ఉగాది పచ్చడిని బుధవారం పంచిపెట్టారు. తెలుగు సంవత్సరాది జిల్లా ప్రజలందరికీ శుభాలివ్వాలని ఆకాంక్షించారు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
● ఉద్యోగాల ఎర.. ● నిరుద్యోగ యువతే లక్ష్యం ● రూ.లక్షల్లో దోచేస్తున్న ప్రబుద్ధులు
సాక్షి, పార్వతీపురం మన్యం: ఉద్యోగాలు.. ఉపాధి పేరిట నిరుద్యోగులను కొంతమంది బురిడీ కొట్టిస్తున్నారు. అమాయకులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు.. వివిధ యూనిట్లు ఇప్పిస్తామని మరికొందరు ఎరవేసి రూ.లక్షలు కాజేస్తున్నారు. జిల్లాలో ఈ ఘటనలు పెరిగిపోతున్నా యి. వెలుగులోకి వచ్చిన ఘటనలు కొన్ని అయితే.. మోసపోయామని గ్రహించి, పోలీసులకు ఫిర్యాదుచేస్తే ఆ డబ్బులు కూడా వస్తాయో, రావో అని భయంతో ఇంకొందరు బాధితులు లబోదిబోమంటున్నారు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో అప్పులు చేసి అడిగినంత కడుతున్నారు. అవి తీర్చలేక అవస్థ లు పడుతున్నారు. ఇటువంటి ఘటనలపై పోలీసులకు పరిమిత సంఖ్యలోనే ఫిర్యాదులు వెళ్తున్నాయి. కొన్నిచోట్ల ఏజెన్సీలు, థర్డ్ పార్టీ సంస్థల పేరిట టోకరా వేస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలూ తక్కువ తినడం లేదు. ఇటీవల అంగన్వాడీ ఉద్యోగాలు, కేజీబీవీల్లో పోస్టులపేరిట భారీగా నొక్కేశా రు. ఉద్యోగాలు రాని బాధితులు అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈ తరహా ఘటనలు కొద్ది రోజులుగా కురుపాం, పార్వతీపురం, సాలూరు వంటి చోట్ల వెలుగులోకి వచ్చాయి. పార్వతీపురంలో ఉద్యోగాల వ్యవహారమై టీడీపీకి చెందిన వ్యక్తుల మధ్య ఆడియో సంభాషణ బయట పడిన విషయం విదితమే. వారి మాటల్లో రూ.కోట్లు చర్చకు రావడం గమనార్హం. తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని నిరుద్యోగులకు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎర వేస్తున్నారు. ●ఇటీవల కురుపాం నియోజకవర్గానికి చెందిన సుమారు 75 మంది గిరిజన యువత కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు వచ్చారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర లో ఉద్యోగాలు అంటూ తమ వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వరకూ కాజేశారని వాపోయారు. వీరికి ఇచ్చిన నియామక పత్రాలతో నాలుగైదు నెలలు తమకు అప్పగించిన పంచాయతీల్లో విధులు కూడా చేపట్టారు. ఎంతకీ జీతాలు రాకపోవడంతో ఆరా తీయగా.. అప్పటికి గానీ, తెలియలేదు.. వారంతా మోసపోయారని. ●బలిజిపేట మండలం గళావల్లి గ్రామానికి చెంది న టొంపల పరశురామ్కు పీఎంఈజీపీ పథకం కింద రూ.10 లక్షల రుణాన్ని ఇప్పిస్తామని పలగర -
నమ్మితే.. నట్టేట ముంచేస్తారు!
గ్రామానికి చెందిన వి.రామకృష్ణ నమ్మించాడు. రూ.35 వేలు నగదు తీసుకొని మోసగించారని బాధితుడు బలిజిపేట పోలీసులకు రెండు రోజుల కిందట ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన మరికొంతమంది వద్ద కూడా మొత్తం రూ. 1,56,000 వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. తిరిగి డబ్బులు ఇవ్వాలని కోరితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ●వీరఘట్టం మండలానికి చెందిన ఓ వ్యక్తి నకిలీ ఆర్డర్ కాపీ, ఫేక్ ఐడీ కార్డు చూపించి, విశాఖకు చెందిన మరొకరితో కలిసి రైల్వేలో ఉద్యోగాలపేరిట మోసాలకు పాల్పడ్డాడు. రూ.లక్షల్లో దోచేశారు. బాధితులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ●సీతంపేట మండలం బెనరాయికి చెందిన ముగ్గు రు గిరిజన యువకులకు ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి వారి నుంచి రూ.2.50 లక్షల చొప్పున అదే మండలానికి చెందిన దంపతులు దోచేశారు. -
అన్ని రంగాల్లోనూ ప్రభుత్వ వైఫల్యం
● రైతాంగం నడ్డివిరిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం ● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదిమందికి పట్టెడన్నం పెట్టే రైతాంగాన్ని ప్రభుత్వం ఇబ్బందులు పాలుజేస్తోందన్నారు. ఎన్నికలకు ముందు అన్నదాత సుఖీభవ పేరిట రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.20వేలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు... గడిచిన రెండేళ్లలో రూ.40వేలు జమ చేయాల్సి ఉండగా... ఇప్పటి వరకు కేవలం రూ.14వేలు మాత్రమే జమ చేశారన్నారు. కౌలురైతులకు పథకం అందని ద్రాక్షగా మార్చారని విమర్శించారు. పంట పండించేందుకు అవసరమైన యూరియా కావాలంటే రైతన్నలు లాఠీదెబ్బలు తినాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సహకార సంఘాల ద్వారా రుణాలు అందక రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయన్నారు. వివిధ రకాల పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలేక ఉగాదివేళ రైతన్నలు ఘోషిస్తున్నా ఎమ్మె ల్యేలు, మంత్రులు, అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడం అన్యాయమన్నారు. ● జిల్లాలో వరి తరువాత అత్యధికంగా సాగుచేసే మొక్కజొన్న పంటకోత ప్రారంభమైందని, తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి క్వింటా రూ.2,400 చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ● పాలన ముగిసిన స్థానిక సంస్థల పాలకవర్గాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఐదేళ్ల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఉమ్మడి విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థలైన విజయనగరం కార్పొరేషన్, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీల పాలకవర్గాలను అభినందించారు. -
‘ఉపాధి’ని నిర్వీర్యం చేస్తున్న పాలకులు
జామి: ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జామిలో ఎస్.కోట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గేదెల తిరుపతి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా మంగళవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పేరు మార్చిందన్నారు. వేతనదారులకు అన్యాయం చేసిందన్నారు. ఎక్కడ కూడా వంద రోజుల పనిదినాలు కల్పించడం లేదని, చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. ఉపాధి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరించాలని బీజేపీ ప్రభుత్వం చెప్పడం కేవలం పథకాన్ని నీరుగార్చడమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫ్రీ బస్సుల పుణ్యమా అని విద్యార్థులకు బస్సులు ఆపడం లేదన్నారు. పలువురు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటు విడుదల చేయడం లేదని దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తాండ్రంగి, విజినిగిరి తదితర గ్రామాలకు బస్సులు లేవని కళాశాలలకు వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నామని విద్యార్థులు చెప్పడంతో బస్సులు లేకుండా ఫ్రీ బస్సు పథకం ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు కూటమిలోని నేతలు ఇచ్చిన హామీలు మరచిపోయారన్నారు. ఎస్.కోట మండలంలో జిందాల్ కంపెనీ బాధిత రైతులను మోసం చేసిందన్నారు. జామిలో ఇనాం భూముల సమస్య తీవ్రంగా ఉందని, రైతులు ఇబ్బందులు పడుతున్నామని షర్మిలకు తెలిపారు. కలెక్టర్తో ప్రత్యేకంగా మాట్లాడతానని, కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎంకు లేఖ రాస్తానని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎం.విద్యాసాగర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సుంకరి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల -
నిబంధనల మేరకే క్వారీ నిర్వహణ జరగాలి : జేసీ
సీతానగరం: మండలంలోని నిడగల్లు గ్రామ పరిధిలో రెండు ప్రతిపాదిత క్వారీల నిర్వహణపై మంగళవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఆయన స్వయంగా స్వీకరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్వారీ నిర్వహణలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. క్వారీ వల్ల చుట్టుపక్కల పొలాలకు, గాలికి ఎటువంటి నష్టం కలగకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు. గ్రామస్తులు లేవనెత్తిన అంశాలను రికార్డు చేశామని, వాటిని నివేదిక రూపంలో ప్రభుత్వానికి, పర్యావరణ కమిటీకి పంపిస్తామని జేసీ తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
టిప్పర్ పట్టివేత
బొబ్బిలి రూరల్: మండలంలోని ఎం బూర్జివలస వద్ద ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీతో చెరువులో మట్టిని తవ్వి తరలిస్తున్న టిప్పర్ను రెవెన్యూ అధికారులు సోమవారం రాత్రి దాడి చేసి పట్టుకున్నారు. జేసీబీ డ్రైవర్ తప్పించుకుని అక్కడ నుంచి పారిపోగా.. మట్టితో నిండిన టిప్పర్ను స్వాధీనం చేసుకున్నామని ఆర్ఐ రామ్కుమార్ తెలిపారు. ఈ మేరకు మైనింగ్ శాఖ సూచనలతో మట్టితో దొరికిన టిప్పర్కు 16,200 రూపాయిలు జరిమానా విధించిందని తహసీల్దార్ ఎం.శ్రీను తెలిపారు. ఇక మీదట మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు, తరలింపులకు పాల్పడితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
రామతీర్థంలో వైభవంగా మాసశివరాత్రి పూజలు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థాన క్షేత్ర పాలకులగా విరాజిల్లుతున్న ఉమాసదాశివస్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు మంగళవారం వైభవం జరిగాయి. ఆలయ అర్చకులు రేజేటి మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో ముందుగా గణపతి పూజ, ప్రత్యేక హోమం అనంతరం శివుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో విశేష అభిషేకాలు జరిపించారు. అనంతరం కామాక్షి అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలు చేపట్టి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కా ర్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా బెల్లాన
విజయనగరం లీగల్: రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా బెల్లాన రవి ఘన విజయం సాధించారు. ఈ మేరకు రాష్ట్ర బార్ కౌన్సిల్ మంగళవారం ప్రకటించింది. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. బెల్లాన రవి విజయనగరం న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా, జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షునిగా పని చేశారు. ఈయన చీపురుపల్లికి చెందిన ప్రముఖ న్యాయవాది, దివంగత బెల్లాన సింహాచలం రెండవ కుమారుడు. చీపురుపల్లిపల్లికి చెందిన బెల్లాన రవి విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్కి స్వయానా సోదరుడు. ఈయన ఎంపిక పట్ల బార్ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్ కోలగట్ల తమ్మన్న శెట్టి, జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఏఎన్వీకే అంజనీకుమార్ హర్షం వ్యక్తం చేశారు. విజయనగరం న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కలిశెట్టి రవిబాబు, కార్యదర్శి నళితం సురేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. బాక్సింగ్లో మోడల్ స్కూల్ విద్యార్థుల సత్తా భామిని: స్థానిక ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు బాక్సింగ్లో సత్తా చాటారు. ఈ నెల 16న విశాఖపట్నంలో జరిగిన జూనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఎస్.శ్రావ్య, పి.ప్రసన్న, సీహెచ్ వాహిని, సీహెచ మనీషా, డి.చందు, ఎ.అమృతవల్లి పలు స్థానాల్లో నిలిచారు. వీరిని ప్రిన్సిపాల్ బాబూరావు, పీజీటీ శివరాంప్రసాద్, కోచ్ కె.సోమేష్తో పాటు సిబ్బంది తదితరులు సన్మానించారు. దుర్గాదేవి ఆలయంలో చోరీ గుర్ల: మండలంలోని పున్నపురెడ్డిపేట దుర్గాదేవి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. సుమారు అర తులం బంగారు, 240 గ్రాముల వెండి అభరణాలు అపహరణకు గురయ్యాయని ఆలయ ధర్మకర్త పి.రామరావు గుర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ పి.నారాయణరావు సంఘటన స్థలానికి చేరుకొని దుర్గాదేవి ఆలయాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి డాగ్, క్లూస్ టీంలు రంగంలోకి దిగి ఆలయ ప్రాంగణాన్ని క్షుణంగా పరిశీలించి క్లూస్ సేకరించారు. వారం రోజులు కిందట కూడా పున్నపురెడ్డిపేటలో ఒక ఇంట్లో సుమారుగా ఆరు తులాలు బంగారు అభరణాలు దొంగతనానికి గురయ్యాయి. వరుసగా జరుగుతున్న దొంగతనాలతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దుర్గాదేవి ఆలయంలో బంగారు అభరణాలు దొంగతనంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని ఎస్ఐ నారాయణరావు తెలిపారు. ఎస్పీ ఇఫ్తార్ విందు విజయనగరం క్రైమ్ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎస్పీ ఏఆర్ దామోదర్ ముస్లిం పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సహనం, సేవాభావానికి ప్రతీకని పేర్కొన్నారు. మనందరం భారతీయులమని అన్నారు. మన మధ్య కుల, మత బేధాలు లేవని, సోదర భావం మాత్రమే ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ముస్లిం పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీని వారి మత సాంప్రదాయం ప్రకారం సత్కరించారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎస్పీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బైక్ అదుపు తప్పి ఇద్దరికి తీవ్ర గాయాలు పార్వతీపురం రూరల్ : కొమరాడ మండలంలోని చంద్రంపేట గ్రామానికి చెందిన మోజేషు, గణేష్ మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమ గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై తోటపల్లి వైపు వెళ్తుండగా, దేవస్థానం సమీపంలో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మోజేషుతో పాటు వెనుక కూర్చున్న గణేష్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, వారిని చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు అక్కడ చికిత్స పొందుతున్నారు. -
నిరసన తెలిపితే నిర్బంధమా?
సీతంపేట: టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు వెంటనే తన పదవి నుంచి వైదొలగాలంటూ మహిళలు తిరుపతిలో ఆయన బస చేసిన హోటల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తే టీడీపీ గుండాలతో దాడి చేయించడం ఎంతవరకు సమంజసమని పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులతో కలసి అంబేడ్కర్ చిత్ర పటం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కళంకితుడిగా తేలినా ప్రశ్నిస్తే దాడిచేయడం, విజిలెన్స్ వారితో బెదిరించడం, ఇంకా కేసులు పెట్టడం, పదవి పట్టుకుని వ్రేలాడడం, జాతీయ మీడియా ఏకి పారేస్తున్నా చంద్రబాబులో మాత్రం ఎటువంటి చలనం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన సమయం ఇదేనని వెంటనే బీఆర్ నాయుడుని టీడీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలన్నారు. అడ్డంగా వీడియో, ఫొటోలతో దొరికిపోయినా నిస్సిగ్గుగా మళ్లీ తిరుమలకు వచ్చి వెంకటేశ్వరస్వామి క్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నాడన్నారు. చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. తనను లైంగికంగా వేధిస్తున్నారని ఇలాంటి వ్యక్తికి ఎటువంటి బాధ్యతలు ఇవ్వొద్దని, ఒక మహిళ స్వయంగా గతంలో పూర్తి వివరాలతో లేఖ రాసినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రతిభ కనబరిస్తే ప్రోత్సాహకం : ఎస్పీ
విజయనగరం క్రైమ్ : విధి నిర్వహణలో ప్రతిభ కనబరిస్తే ప్రోత్సాహకాలు అందిస్తామని ఎస్పీ దామోదర్ అన్నారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడడంతో, చోరీలు, హిట్ అండ్ రన్ కేసులను ఛేదించడం తదితర అంశాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు, సిబ్బందిని డీపీలో మంగళవారం ఎస్పీ అభినందించారు. ప్రోత్సాహక నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బందిని ప్రోత్సహిస్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయన్నారు. క్షేత్ర స్థాయిలో క్రియాశీలకంగా పని చేసే వారిని గుర్తించి ప్రోత్సహిస్తే మిగతా వారు స్ఫూర్తిగా తీసుకుంటారన్నారు. ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో సీఐలు టి.శ్రీనివాసరావు, ఎల్.అప్పలనాయుడు, హెచ్ ఉపేంద్ర, ఎస్ఐలు డి.సాయికృష్ణ, వై.వీరజనార్దన్, యు.మహేష్, ఎస్.సుదర్శన్, చంద్రశేఖర్, ఆర్.గోపాలరావు, కె.లక్ష్మణరావు, హెచ్సీలు ఎండీ ఇమ్రాన్ఖాన్, డి.శంకరరావు, పీసీలు ఎరుబోతు సురేష్కుమార్, ఎం.వాసు, కేవీ గణేష్, షేక్ షపీ, ఆర్.శివరావు, బి.నర్సింగరావు, సీహెచ్ జగ్గునాయుడు, పి.శివ, ఎ.సంతోష్, వై.సురేష్కుమార్, ఎం.రమేష్, జి.సింహాచలం, ఎన్.కృష్ణకిశోర్, టి.సురేష్, కె.అప్పారావు, సీహెచ్ పవన్కుమార్, జె.చంద్రరావు, పి.పాపినాయుడు, ఎం.వెంకటరమణ, బొంతు రాంబాబు తదితరులు ఉన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సైలెన్స్ర్లు ధ్వంసం భారీ శబ్దాలు, దట్టమైన పొగలతో సైలెన్స్ర్లు వాడితే సంబంధిత బైక్స్ను సీజ్ చేస్తామని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్లకు అమర్చిన 550 సెలెన్స్ర్లను సీజ్ చేశారు. అనంతరం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఎస్పీ సమక్షంలోనే నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద రోడ్డు రోలరుతో వాటిని ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్స్ర్లు అమర్చిన వారికి ఒక్కొక్కరికీ రూ.1500 జరిమానా విధించారు. ఇన్చార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు, ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, టుటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, వన్టౌన్ ఎస్ఐ శంభాన రవి, ట్రాఫిక్ ఎస్ఐలు ఎస్.భాస్కరరావు, నూకరాజు, చిన్నారావు, హెచ్సీ సింహాచలం, భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. -
పనుల్లేక..
నా చిన్నతనం నుంచి టైలరింగ్ చేస్తున్నా.. గతంలో ఎంతో వైభవంగా ఉండే ఈ వృత్తి ప్రస్తుతం రడీమేడ్ రాకతో కుదేలైంది. ప్రస్తుతం పనుల్లేక ఖాళీగా ఉంటున్నాం. పండగల సమయంలో కూడా పనులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇంతకు ముందు పండగల సమయంలో రాత్రి పగలు పనిచేసేవాళ్లం. –డి.సూర్యగణపతి, టైలర్, రాజాం ప్రభుత్వం ఆదుకోవాలి.. టైలరింగ్ పనిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. పనుల్లేక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా మంది రడీమేడ్ దుస్తులు వాడడంతో కుట్టించుకునే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఇతర వృత్తి చేసుకోలేక జీవనాన్ని నెట్టుకొస్తున్నాం. రోజు కూలి గిట్టుబాటు అయితే చాలు అన్న చందంగా టైలర్ల పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి. – కె.సత్యం, టైలర్, వస్త్రపురి కాలనీ, రాజాం -
కుప్పిలి పద్మకు పతంజలి పురస్కారం
విజయనగరం టౌన్: కెఎన్వై.పతంజలి సాహితీ పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ సీ్త్రవాద రచయిత్రి కుప్పిలి పద్మని ఎంపిక చేసినట్టు పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి పేర్కొన్నారు. ఈ మేరకు గురజాడ స్వగృహంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న గురజాడ కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించే పతంజలి జయంతి కార్యక్రమంలో పురస్కారాన్ని ఆమెకు ప్రదానం చేస్తామన్నారు. ఇప్పటివరకూ మోహన్, దేవీప్రియ, సతీష్ చందర్, జిఆర్.మహర్షి, గంటేడ గౌరునాయుడు, అట్టాడ అప్పలనాయుడు, చింతకింది శ్రీనివాసరావు, రౌతు బంగారునాయుడు, అరుణ పప్పు, తాడి ప్రకాష్లకు అందజేశామన్నారు. ఈ ఏడాది కుప్పిలి పద్మను కమిటీ ఎంపిక చేసిందన్నారు. ఆమె వార్తలో మైదానం శీర్షికన సమకాలీన అంశాలపై స్పందించిన తీరు తెలుగు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారన్నారు. సుమారు 159 కథలు రాశారన్నారు. వాటిలో ఆరు నవలలు ఉన్నాయని, ప్రధానంగా కరోనా సమయంలో మళ్లీ తేయాకు తోటలోకి పేరిట కార్మికుల జీవితాల్లోని ఒడిదుడుకులను చాలా హృద్యంగా రచించారన్నారు. ఆమె ప్రతిభా పాటవాలకు గుర్తుగా ఎన్నో అవార్డులు ఆమెను వరించాయన్నారు. పద్మ మన ఉత్తరాంధ్రాకు చెందిన ప్రముఖ మహిళా రచయిత్రి కావడం మరింత గర్వకారణమన్నారు. సమావేశంలో వేదిక కార్యదర్శి ఎన్కె.బాబు, ప్రతినిధులు విఎమ్కె.లక్ష్మణరావు, బి.నాగేంద్రప్రసాద్, పి.ప్రభాకరరావు, జలంత్రి రామచంద్ర, తాడేపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అవగాహన ఒప్పందం
విజయనగరం రూరల్: విజయనగరం జేఎన్టీయూ–జీవీ, హైదరాబాద్కు చెందిన మెటా–గేట్ కోచింగ్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. స్థానిక జేఎన్టీయూ జీవీలో మంగళవారం జరిగిన ఎంఓయూలో ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ జీవీ ప్రిన్సిపాల్ కేసీబీ రావు మాట్లాడుతూ మెటా–గేట్ కోచింగ్ విద్యా సంస్థ మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగంలో దేశంలోనే చురుగ్గా పని చేస్తున్న సంస్థని తెలిపారు. ఇంజినీర్ల కోసం గేట్ ప్రవేశ పరీక్షకు సిద్ధం చేయడంలో సహాయపడుతుందని తెలిపారు. ఆనన్లైన్ శిక్షణ, స్టడీ మెటీరియల్స్, కెరీర్ గైడెన్స్ అందిస్తారని పేర్కొన్నారు. గతంలో ఉత్తీర్ణులైన కొందరు విద్యార్థులు వారి శిక్షణ ద్వారా ప్రయోజనం పొందుతున్నారని తెలియజేశారు. మెటలర్జికల్ ఇంజినీరింగ్లో బీటెక్/ఎం.టెక్ చదువుతున్న, ప్రతిభావంతులైన, ఆర్థికంగా వెనుకబడిన జేఎన్టీయూ–జీవీ విద్యార్థులకు సహాయం చేయడానికి, గేట్ పరీక్షకు నాణ్యమైన శిక్షణను అందించడానికి మెటా–గేట్ కోచింగ్ ముందుకు వచ్చిందన్నారు. విశ్వవిద్యాలయం విద్యార్థులకు గేట్ ఆన్లైన్ వీడియో లెక్చర్లను చూసేందుకు యాక్సెస్ అందించడం, ఆన్లైన్ టెస్ట్ సిరీస్లను రాసేందుకు యాక్సెస్ అందించడం, ప్రత్యేక సందేహల నివృత్తి సందేహాలను నిర్వహించడం, బార్క్ పరీక్షకు ప్రిపరేషన్, ఇంటర్వ్యూలపై మార్గదర్శకత్వం అందిస్తుందన్నారు. పీఎస్యూ, ప్రభుత్వ పరీక్షల (మెటలర్జికల్ – మెటీరియల్స్ ఇంజినీరింగ్కు సంబంధించినవి) ప్రిపరేషన్ ఇంటర్వ్యూల కోసం మార్గదర్శకత్వం వంటి సేవలను అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మెటలర్జీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కె.శ్రీనివాస ప్రసాద్, మెటా–గేట్ కోచింగ్ సంస్థ ప్రతినిధి సుభ్రదీప్ పాల్ తదితరులు పాల్గొన్నారు. -
మహనీయుడు పొట్టి శ్రీరాములు : డీఈఓ
విజయనగరం టౌన్: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేష కృషి చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములని డీఈఓ మాణిక్యం నాయుడు అన్నారు. మహారాజా ప్రభుత్వ సంస్కృత ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 58 పాఠశాలల్లో అమరజీవి విగ్రహం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఎంఈఓ ఆనందమూర్తి మాట్లాడుతూ తెలుగువారికి ఆంధ్రరాష్ట్రం ప్రత్యేకంగా ఉండాలని ఆమరణ దీక్ష చేసిన మహనీయుడన్నారు. ఎంఈఓ 2వ అధికారిణి సత్యవతి పొట్టి శ్రీరాములు త్యాగ నిరతని వివరించారు. హెచ్ఎం లలిత విగ్రహ ఏర్పాటు చేసిన సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సమితి వ్యవస్ధాపక అధ్యక్షుడు చెరుకూరి నాగరాజు, ముఖ్య సలహాదారు రవ్వా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బత్తుల కామేష్, కోశాధికారి ఆరిశెట్టి సందీప్, ఉపాధ్యక్షుడు డిమ్స్ రాజు, కోచైర్మన్ సముద్రాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
పురం.. ఇక ప్రత్యేకమే!
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పురాలపై వివక్ష ప్రారంభం అయ్యింది. అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేలు మోకాలడ్డారు. ఫలితంగా పురపాలక సంఘాల్లో సమస్యలు పేరుకుపోయాయి. తాగునీటికీ ఇబ్బందులు పడే పరిస్థితి. అభివృద్ధికి సహకారం అందించాల్సింది పోయి.. పాలక వర్గాలను పడగొట్టేందుకే ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. పార్వతీపురంలో పలువురు సభ్యులను తమవైపు తిప్పుకుని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తగిన బలం లేక, భంగపాటుకు గురయ్యారు. సాలూరులో సైతం కొంతమందిని జనసేనలోకి లాక్కొని పాలకవర్గాన్ని ఇబ్బందులకు గురిచేశారు. పాలకొండలో కూడా చైర్ పర్సన్ రాధా కుమారి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక నిర్వహించగా.. ఆ సీటు కోసం పెద్ద డ్రామానే నడిచింది. అడ్డదారిలో కుర్చీని స్వాధీనం చేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పురాల అభివృద్ధి కంటే అవరోధాలకే శాసన సభ్యులు ప్రాధాన్యమిచ్చారు. సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోని పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పాలక వర్గాల పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. జిల్లాలో పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు కాగా.. పాలకొండ నగర పంచాయతీగా ఉంది. 2021 మార్చిలో నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లతో పాలకవర్గాలు అప్పట్లో కొలువుదీరాయి. రిజర్వేషన్ ప్రకారం పాలకవర్గ సభ్యులు వారిలో ఒకరిని చైర్మన్గా ఎన్నుకున్నారు. ఇద్దరు చొప్పున వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. ఐదేళ్ల పదవీ కాలం మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే ప్రత్యేక అధికారులను నియమించింది. పార్వతీపురం పురపాలక సంఘానికి సంయుక్త కలెక్టర్.. సాలూరు, పాలకొండలకు సబ్ కలెక్టర్లు ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారు. మారిన పట్టణ రూపు రేఖలు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పురాలు... వైఎస్సార్ సీపీ పాలక వర్గాల హయాంలో అభివృద్ధి బాట పట్టాయి. 2019 నుంచి 2024 వరకూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పూర్తి స్థాయిలో నిధులు మంజూరయ్యాయి. పనులు వేగవంతం కావడంతో పట్టణాల రూపు రేఖలు మారాయి. ● పార్వతీపురం మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో దాదాపు రూ.కోట్ల వ్యయంతో రహదారులు నిర్మించారు. తాగునీటి కోసం రూ.55 కోట్లు మంజూరు చేసి రూ.3 కోట్లతో పైపులైను కొనుగోలు చేశారు. దాదాపు 3 వేల మందికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేశారు. ఎన్నో ఏళ్లుగా సొంతిల్లు లేక అవస్థలు పడుతున్న నెల్లిచెరువు గట్టు నివాసులు 63 మందికి పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. గతంలో టీడీపీ హయాంలో అధ్వానంగా విడిచిపెట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. గడపగడపకు కార్యక్రమం ద్వారా 30 వార్డుల్లో 12 కోట్ల రూపాయల నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించారు. రూ కోటీ 80 లక్షలతో అర్బన్ హెల్త్ సెంటర్ మంజూరు చేసి, నిర్మాణం పూర్తి చేశారు. కొత్తవలస చెరువును రూ.కోటి వ్యయంతో అభివృద్ధి చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.2.30 కోట్ల వ్యయంతో ఆధునికీకరణ చేపట్టారు. జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం దాదాపు 70 శాతం పూర్తయ్యింది. ● సాలూరు మున్సిపాలిటీలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఏఐఐబీ కింద రూ.63 కోట్లతో ఇంటింటికీ కుళాయి ప్రాజెక్టును తీసుకొచ్చారు. అప్పట్లోనే టెండర్లు కూడా పిలిచారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన టిడ్కో గృహాలను పూర్తిచేసి, వందలాది మందికి సొంతింటి కలను నిజం చేశారు. ఈ పాలకవర్గ హయాంలోనే వంద పడకల ఆస్పత్రి 90 శాతం పూర్తయింది. 15వ ఆర్థిక సంఘం నిధులతో పెద్ద ఎత్తున రహదారులు, డ్రైన్లు నిర్మించారు. మున్సిపాలిటీలో చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రపతి అవార్డు, రాష్ట్ర స్థాయిలో అవార్డులు కూడా వరించాయి. మాజీ మంత్రి రాజన్నదొర సహకారంతో సాలూరు పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పుర అధ్యక్షురాలు పువ్వుల ఈశ్వరమ్మ తెలిపారు. – గత ఐదేళ్ల కాలంలో పాలకొండ నగర పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. పోతుల గెడ్డ ఖానా మీదుగా రూ.70 లక్షలతో వంతెన నిర్మాణం చేపట్టారు. ఏరియా ఆసుపత్రి మార్గంలో రూ.42 లక్షలతో సీసీ రహదారి పూర్తి చేశారు. ప్రధానంగా ఐదు వార్డులకు ఉపయోగపడేలా కనెక్టివిటీ రోడ్లు నిర్మించారు. రూ.50 లక్షల వ్యయంతో అర్బన్ హెల్త్సెంటర్ పూర్తి చేశారు. 20 వార్డుల్లో సుమారు 180 వీధులు ఉన్నాయి. 60 శాతం వీధుల్లో సీసీ రోడ్లు, కాలువలు నిర్మించారు. రూ.70 లక్షలతో డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం చూపగా.. టీడీపీ వారు అడ్డుకున్నారు. పురపాలక సంఘాల్లో ముగిసిన పాలక వర్గాల పదవీ కాలం అభివృద్ధి కార్యక్రమాలతో మారిన పట్టణ రూపురేఖలు కొవిడ్లో రెండేళ్లు గడ్డు కాలం చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గత 20 నెలల్లో పాలక వర్గాలకు సహకారం కరువు -
3 కిలోల క్యాబేజీ బుట్ట రూ.5
ఏరువాకకు సన్నద్ధం తెలుగు సంవత్సరాది ఉగాదికి ఏరువాకకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 19వ తేదీన ఏరువాకకు వీలుగా కొత్తనాగళ్లను తయారుచేయిస్తున్నారు. గరుగుబిల్లి, చినగుడబ, వల్లరగుడబ, పెద్దూరు, లఖనాపురం, కొత్తపల్లి, తదితర గ్రామాల్లో కొత్తనాగళ్ల తయారీలో వడ్రంగులు బిజీ అయ్యారు. గతంలో రూ.800 ఉన్న నాగళి ఈ ఏడాది రూ.1000 నుంచి రూ.1200 పలుకుతున్నట్టు రైతులు చెబుతున్నారు. – గరుగుబిల్లి క్యాబేజీ బుట్ట ధర అమాంతం పడిపోయింది. నెల రోజుల కిందట మార్కెట్లో మూడుకిలోల బరువుతూగే బుట్ట ధర రూ.100 పలికేది. ఇప్పుడు రూ.5కు విక్రయించినా కొనుగోలుచేసేవారు కరువయ్యారంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట చేతికొచ్చినా కోత, రవాణా ఖర్చులు రాకపోవడంతో పొలంలోనే విడిచిపెడుతున్నారు. కళ్లముందే ఎండిపోతున్న పంటను చూసి కన్నీరుపెడుతున్నారు. రైతు కష్టాలను పట్టించుకోని ప్రభుత్వతీరుపై నిట్టూర్చుతున్నారు. – వీరఘట్టం -
అనైతిక పాలనపై జనాగ్రహం
–8లోకుదేలు...! ఫ్యాషన్ ప్రపంచంలో దర్జీల జీవనం దయనీయంగా మారింది. అటు ప్రభుత్వం నుంచి సాయం అందక, ఇటు చేతికి పనిలేక ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026 బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి తిరుమల పవిత్రత దెబ్బతింటోంది. ఆయన వ్యక్తిగత ప్రవర్తన, గత చరిత్ర హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయి. తిరుమల ప్రతిష్టను కాపాడటానికి ఆయన వెంటనే రాజీనామా చేయాలి. నిరసన తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళలపై గూండాలతో దాడి చేయించడం, వారిపై అక్రమంగా పి.డి.యాక్ట్ కేసులు పెట్టడం ప్రజా స్వామ్య విరుద్ధం. ఆ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. రెండేళ్ల పాలనలో కూటమి ప్రభు త్వం చేసిందేమీ లేదు. పవన్ కల్యాణ్ ఫొటో షూట్లకు పరిమితమయ్యారు. గత ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలు, రోడ్లు వారికి కనిపించడం లేదా? చంద్రబాబు అభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ హైటెక్ సిటీ చూపిస్తారు తప్ప, ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు. ఇప్పుడు అమరావతి, లడ్డు వివాదాలతో కాలక్షేపం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా పద్ధతి మార్చుకోకపోతే, గతంలో వలే మళ్లీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమయ్యేలా ప్రజలు బుద్ధిచెబుతారు. – శత్రుచర్ల పరీక్షిత్రాజు, వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పార్వతీపురం రూరల్: కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రతను కాపాడాలని, అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని వైఎసా్స్ర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నేతృత్వంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజుతో కలిసి మంగళవారం నిరసన గళం వినిపించారు. చంద్రబాబు అరాచక పాలనపై అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. తిరుమల క్షేత్ర పవిత్రను కాపాడాలని తిరుపతిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ మహిళా నేతలు, కార్యకర్తలపై టీడీపీ గూండాల దాడులు, పోలీసుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా గొంతు వినిపిస్తున్న వారిపై పి.డి.యాక్టులు నమోదు చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమంటూ నినదించారు. టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు అశ్లీల లీలలను సీఎం చంద్రబాబు పట్టించుకోకుండా పదవి కట్టబెట్టడం భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడమేనని విమర్శించారు. రాజ్యాంగపరమైన పాలన అందించేలా చూడాలంటూ అంబేడ్కర్ విగ్రహానికి వినతులు అందజేశారు. నిరసన కార్యక్రమంలో కురుపాం, పార్వతీపురం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్, వైఎస్ చైర్మన్లు, వైఎస్ ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.ప్లకార్డుతో నిరసన వీడియో సాక్ష్యాలతో దొరికినా బీఆర్ నాయుడు సిగ్గులేకుండా సమర్థించుకుంటున్నారని, ప్రశ్నించిన మహిళలపై గూండాలతో దాడులు చేయించడం ఆయన అహంకారానికి నిదర్శనంగా ఉంది. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు కళ్లు, చెవులు మూసుకుని బీఆర్ నాయుడిని వెనకేసుకు రావడం దౌర్భాగ్యం. డ్రగ్స్ కేసులో దొరికిన ఎంపీకి స్టేషన్ బెయిల్ ఇప్పించి కాపాడినట్లే, ఇక్కడ కూడా తన పార్టీ వారి తప్పులను చంద్రబాబు సమర్థిస్తున్నారు. తక్షణమే బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలి. అక్రమంగా అరెస్టు చేసిన వైఎస్సార్సీపీ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. – అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలి పార్వతీపురం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబు ఆరాచక పాలనపై ఆగ్రహం -
వడగాడ్పులపై అప్రమత్తతే ప్రధానం
పార్వతీపురం: వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు ఆదేశించారు.‘వడగాల్పుల నివారణ కార్యాచరణ ప్రణాళిక–2026’పై జిల్లా అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వడగాల్పులు కారణంగా ఒక్క ప్రాణం కూడా నష్టం జరగరాదని, అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. వడదెబ్బకు గురైన వారికి తక్షణమే అందించాల్సిన ప్రాథమిక చికిత్సపై గ్రామస్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు. వడగాల్పులు, పిడుగుల బారినుంచి రక్షణ పొందేలా కరపత్రాలను, ఐఈసీ మెటీరియల్తో ప్రజలను చైతన్య పరచాలన్నారు. మండలాల వారీగా ఉష్ణోగ్రత సూచీ, గరిష్ఠ ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారాన్ని చేరవేయాలన్నారు. సమావేశంలో జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి, డీఆర్వో కె.హేమలత, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఎస్డీసీ ఎస్.దిలీప్చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు. పాసుపుస్తకాల పంపిణీ వేగంగా పూర్తికావాలి ● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం: జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టాదారు పాసుపుస్తకాలు, రీసర్వే, 22 ఏ భూములు, తదితర రెవెన్యూ అంశాలపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని పరిస్థితులను సీఎస్కు కలెక్టర్ వివరించారు. ఈ వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతినెలా 9వ తేదీలోగా నిర్దేశించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని పూర్తిచేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మ్యుటేషన్లను వీలైనంత వేగంగా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఆర్డీఓలు వెంకటేశ్వరరావు, సుధారాణి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ● ముగిసిన కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో బుధవారం నుంచి ప్రత్యేక అధికారి పాలన ప్రారంభం కానుంది. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. బుధవారం నుంచి కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ రామ సుందర్ రెడ్డి వ్యవహరించనున్నారు. కార్పొరేషన్ ఎన్నికలు జరిగేంత వరకు ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో పాలన సాగనుంది. విజయనగరం ఆర్డీఓగా సుధాసాగర్ విజయనగరం: విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారిగా సనపల సుధాసాగర్ నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయనను ఆర్డీఓగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆర్డీఓ గా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు బాధ్యతలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా విజయనగరం ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ఎం.నూకరాజును అల్లూరి సీతారామరాజు జిల్లా రెవెన్యూ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూకరాజు నెల రోజుల వ్యవధిలో ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఫైర్ ఆఫీసర్కు ఉగాది పురస్కారం విజయనగరం క్రైమ్: విశిష్టసేవలందించే వారికి రాష్ట్ర ప్రభు త్వం ఏటా ఉగాది పురస్కారాలను ప్రదానం చేస్తుంది. ఈ ఏడాది ఉమ్మడి విజయనగరం జిల్లా అగ్నిమాపక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమేష్ ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన పార్వతీపురం అగ్నిమాపక కేంద్రం అధికారిగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో అంకిత భావం, సేవను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ఇచ్చే పురస్కారానికి రమేష్ ఎంపిక కావడంపై ఆ శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారు. -
న్యూరోసర్జరీ పరికరంపై పరిశోధనకు గుర్తింపు
విజయనగరం ఫోర్ట్: అధునాతన న్యూరోసర్జరీ పరికరంపై పరిశోధనకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి న్యూరోసర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రెడ్డి శంకరరావు, వైద్య కళాశాల ఎంబీబీఎస్ విద్యార్థి వి. డానీకి గుర్తింపు లభించింది. ఈ నెల 16న విశాఖపట్నంలోని గీతం మెడికల్ కాలేజీలో జరిగిన సమ్మిట్లో సమర్పించిన ‘ సర్టన్ లెడ్ నోవెల్ క్రానియోటోట్ అడాప్టర్ టు కన్వర్ట్ సర్టిఫైడ్ ఇంటి/డెంటల్ డ్రిల్ సిస్టమ్ ఆన్ ఎ న్యూరోసర్జరీ డ్రిల్ సిస్టం’ అనే విన్నూత పరిశోధన పత్రానికి ద్వితీయస్థానం లభించింది. రూ.34 వేలు నగదు లభించింది. పరిశోధకులను స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ బి.దేవీమాధవి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లోక్నాఽథ్, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అభినందించారు. -
గ్యాస్ బండ రూ.2000..!
● బ్లాక్మార్కెట్లో విక్రయం ● తప్పనిసరి పరిస్థితిలో హోటల్ వ్యాపారుల కొనుగోలు కురుపాం: ఇరాన్– ఇజ్రాయిల్ మధ్య సాగుతున్న యుద్ధంతో వంటగ్యాస్ కొరత అక్రమ వ్యాపారులకు కాసుల వర్షం కురుపిస్తోంది. ఇదే అదునుగా తీసుకున్న గ్యాస్ అక్రమ నిల్వదారులు తమవద్ద ఉన్న సిలిండర్లను స్థానిక హోటల్స్కు, టిఫిన్ సెంటర్లకు గుప్ చుప్గా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కో సిలిండర్ను రూ.2000కు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఒక గ్యాస్ సిలిండర్ ధర రూ.980కు గ్యాస్ ఏజన్సీ నుంచి వినియోగదారునికి సరఫరా అయ్యేది . ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా వ్యాపారులు అవసరాన్ని బట్టి అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. మూత పడుతున్న చిరువ్యాపార సముదాయాలు గ్యాస్ కొరత కారణంగా బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరను పెట్టి కొనుగోలు చేయలేని ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టీ పాయింట్స్, టిఫిన్ సెంటర్లు మూతపడగా మరికొంత మంది మాత్రం అధిక ధరకు గ్యాస్ దిమ్మలను కొనుగోలు చేసి తమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. టిఫిన్ ధరలను కూడా పెంచేశారు. సివిల్ సప్లై అధికారులు దృష్టి సారించి అక్రమ అమ్మకాలకు అడ్డుకట్టవేయాలని, సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని వ్యాపారులతో పాటు స్థానికులు కోరుతున్నారు. -
నిఘా నీడన పదో తరగతి పరీక్షలు
● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి ● తొలిరోజు 10,530 మంది రెగ్యులర్ విద్యార్థుల హాజరు పార్వతీపురం రూరల్: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం పకడ్బందీగా ప్రారంభమయ్యాయి. పార్వతీపురంలోని డీవీఎం హైస్కూల్ పరీక్షా కేంద్రాన్ని జేసీ సి.యశ్వంత్ కుమార్రెడ్డి పరీక్షించారు. తెలుగు పరీక్ష నిర్వహణ తీరు, సౌకర్యాలపై ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా 68 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 10,561 మంది రెగ్యులర్ విద్యార్థులకు 10,530 మంది హాజరయ్యారు. 31 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 14 మందికి 7గురు హాజరయ్యారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రారంభం జిల్లాలో ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలు కూడా సోమవారం ప్రారంభమయ్యాయి. తెలు గు (205), ఒరియా (233) సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 7 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. వీటికి మొత్తం 522 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 483 మంది హాజరయ్యారని, 39 మంది గైర్హాజరైనట్లు డీఈఓ పి.బ్రహ్మాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం కలెక్టరేట్: రీఫ్ 2025–26 సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో ఈ నెల 28 వరకు రైతుసేవా కేంద్రాల నుంచి కొనుగోలు చేస్తామని జేసీ ఎస్.సేతుమాధవన్ తెలిపారు. జిల్లాలోని 367 ఆర్ఎస్కేల నుంచి 4.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొను గోలు చేసినట్లు వెల్లడించారు. రైతులకు రూ.974 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్టు తెలిపారు. జిల్లాలో 88,877 మంది రైతులు లబ్ధి పొందారని జేసీ వివరించారు. -
ఐక్యత, సోదర భావానికి ప్రతీక రంజాన్ వేడుక
కురుపాం: ఐక్యత, సోదర భావానికి ప్రతీక రంజాన్ పండగ అని వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. మండల కేంద్రంలోని శివ్వన్నపేటలో ముస్లిం సోద రులు సోమవారం ఇచ్చిన విఫ్తార్ విందులో వారు పాల్గొని విందును స్వీకరించారు. అనంతరం నిరుపేదలకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంజాన్ మాసం క్రమశిక్షణ, పేదల పట్ల కరుణను అలవర్చుకోవాల ని గుర్తు చేస్తుందన్నారు. నెలరోజులపాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠిన ఉపవాసం పాటిస్తూ ఇఫ్తార్ విందులను పంచుకుంటూ ఐక్యత సోదరభావాన్ని ఈ పండగ చాటి చెబుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కో ఆప్షన్ సభ్యుడు షేక్ నిషార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు షేక్ నూరెళ్ల, షేక్ ఆదిల్, మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ జిలాని, కురుపాం ఎంపీపీ శెట్టి పద్మావతి, జెడ్పీటీసీ గొర్లి సుజాత, వైస్ ఎంపీపీలు బిడ్డిక అన్నాజీరావు, రంగారావు, మాజీ ఎంపీపీ ఆనిమి ఇందిరాకుమారి, వివిధ పంచాయతీలకు చెందిన సర్పంచ్లు, వైఎస్సార్ సీపీ నాయకులు శెట్టి నాగేశ్వరరావు, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. -
వాట్సాప్ గవర్నెన్స్ స్టాండింగ్ బోర్డులు ప్రారంభం
పార్వతీపురం: ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా వాట్సాప్ గవర్నెన్స్ను స్టాండింగ్ బోర్డులను సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ప్రారంభించారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా జిల్లాకు 81 స్టాండింగ్ బోర్డు మంజూరైనట్లు డీపీఆర్ఓ కె. బాల్మన్సింగ్ తెలిపారు. బోర్డులో ఉన్న క్యూ ఆర్ కోడ్తో 300లకు పైగా ప్రభుత్వ సేవలను ఇంటివద్దనే పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జేసి సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ అధికారులు ఎం. గజపతిరావు, జీవీ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం రూరల్: తమ గ్రామానికి పర్యాటక గుర్తింపు తెచ్చినందుకు కృతజ్ఞతగా కుశ గ్రామస్తులు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డికి ‘తొలి పంట’ను కానుకగా అందజేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో ఆయనను సోమవారం కలిసి తమ పొలాల్లో పండిన పంటలో మొదటి భాగాన్ని మర్యాదపూర్వకంగా అందజేశారు. గిరి శిఖర గ్రామమైన కుశ సమీపంలోని సహజసిద్ధ జలపాతాలను గుర్తించి, వాటిని వెలుగులోకి తేవడంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారు. ఫలితంగా ఈ గ్రామం రాష్ట్రస్థాయి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ అభివృద్ధికి గుర్తింపుగా సర్పంచ్ కుశమ్మ ఆధ్వర్యంలో గ్రామస్తులు కలెక్టరేట్కు చేరుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. అధికారుల సహకారంతో గ్రామాభివృద్ధి సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. గరుగుబిల్లి: డా.వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్న గూడెంలో నిర్వహించిన 12వ అంతర కళాశాల క్రీడా పోటీల్లో డా.వైఎస్సార్ ఉద్యాన కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కళాశాల అసోసియేట్ డీన్ డా.డి.రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. అథ్లెటిక్స్ విభాగంలో షాట్పుట్లో పృద్వీరాజ్ బంగారు, జావిలిన్త్రోలో నాని శ్రీ హర్ష, మౌనిక బంగారు, షార్ట్పుట్లో మౌనిక రజతం, జావిలిన్ త్రో, హైజంప్లో లక్ష్మి రజతాలు, డిస్కస్త్రో ట్రిపుల్ జంప్లో పూజిత రజతం సాధించినట్లు వివరించారు. అలాగే వాలీబాల్, కోకో, కబడ్డీలో విద్యార్థినులు ప్రతిభను కనబరిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను సోమవారం అసోసియేట్ డీన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పీడీ జి.లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. -
ఉద్యోగాల పేరుతో యువతకు మస్కా
వారంతా అమాయక గిరిజనులు. ఏదో ఒక పనిచేసి బతుకుదామని ఆశపడ్డారు. ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’లో భాగంగా తడిపొడిచెత్తపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్యోగాలని చెబితే చేరేందుకు ఆసక్తిచూపారు. దీనిని శ్రీ శబరి నిరుద్యోగ పారిశుద్ధ్య వర్కర్స్ యూనియన్కు చెందిన ఓ ముగ్గురు సభ్యులు సొమ్ము చేసుకునేందుకు పక్కాస్కెచ్ వేశారు. ఉద్యోగాలంటూ ఊరించి పోస్టును బట్టి సొమ్ముదండేశారు. ఐదారునెలలుగా గిరిజన నిరుద్యోగులు విధులు నిర్వహిస్తున్నా జీతాలు ఇవ్వకపోవడంతో... మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు. తమకు ఇచ్చిన నియామకపత్రాలను చూపిస్తూ కన్నీరుపెడుతున్నారు. ఇలాంటి మోసం ఎన్నడూ చూడలేదు బాబూ అంటూ అధికారుల వద్ద గోడు వెళ్లబోస్తున్నారు. కువలు, బిన్ బ్యాగ్ పద్ధతిలో చెత్త సేకరణపై అవగాహన కల్పించే బాధ్యతను శ్రీ శబరి నిరుద్యోగ పారిశుద్ధ్య వర్కర్స్ సంఘానికి అప్పగించారు. ఇదే విషయమై గతేడాది అక్టోబర్ నెలలో డీపీవో నుంచి వచ్చిన సర్క్యులర్ను చూపిస్తూ.. కేవలం గిరిజన యువతకే ఈ అవకాశమంటూ మస్కా కొట్టారు. శానిటేషన్ వర్కర్స్ యూనియన్ పేరిట నియామక పత్రాలిచ్చారు. బీవీవీఎస్ సత్యనారాయణమూర్తి, మజ్జి నారాయణరావు, కొండగొర్రి కృష్ణారావు ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు బాధితుల ఆరోపణ. ఒక్కొక్కరి వద్ద పోస్టును బట్టి రూ.1.70 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారు. సూపర్వైజర్, మండల సమన్వయకర్త, జిల్లా సమన్వయకర్త, ఫీల్డ్ మేనేజర్ అంటూ కొన్ని పోస్టులిచ్చారు. ఇలా ఒక్క కురుపాం నియోజకవర్గంలోనే 75 మంది వరకు డబ్బులు కట్టారు. ఇలా నియామక పత్రాలతో ఆయా మండలాల్లో అధికారుల వద్దకు వెళ్తే.. అప్పటికే డీపీవో నుంచి ఆదేశాలు రావడంతో విధుల్లో చేర్చుకున్నారు. నాలుగు నెలలైతేనే గానీ తామంతా మోసపోయినట్లు బాధితులు గుర్తించలేకపోయారు. నాలుగు మండలాల్లోనే రూ.అర కోటికిపైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. సాక్షి, పార్వతీపురం మన్యం: ‘తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించేందుకు శ్రీ శబరి నిరుద్యోగ పారిశుద్ధ్య వర్కర్స్ సంఘం (అనపర్తి మండలం, తూర్పుగోదావరి) జిల్లా వారు విచ్చేసిన సమయంలో సదరు గ్రామ పంచాయతీల్లోని దుకాణ యజమానులు– సర్పంచ్లతో సమావేశం ఏర్పాటు చేయడం గురించి..’ అంటూ గతేడాది అక్టోబర్ నెలలో జిల్లా పంచాయ తీ అధికారి నుంచి కురుపాం, వీరఘట్టం, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, మక్కువ, జియ్య మ్మవలస ఉప మండల పరిషత్తు అభివృద్ధి అధికారులకు ఓ సర్క్యులర్ వెళ్లింది. ఆయా మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ఐఈసీ బృంద సభ్యుల సందర్శన సమయంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని అందులో డీపీవో పేర్కొన్నారు. ఇదే లేఖను చూపిస్తూ.. కొంతమంది ప్రబుద్ధులు ఉద్యోగాలు సృష్టించారు. గిరిజన యువతే ప్రధాన లక్ష్యంగా రూ.లక్షలు వసూలు చేశారు. ఎంత జీతం ఇవ్వనున్నామో వివరిస్తూ, అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. వారితో రూ.లక్షకు ఈ స్టాంప్తో అఫిడవిట్ కూడా చేయించారు. గిరిజన నిరుద్యోగులు ఈ ఉత్తర్వులు చూపిస్తూ.. పంచాయతీల్లో ‘విధులకు’ వెళ్లిపోయారు. నాలుగైదు నెలలుగా పని చేస్తున్నారు. జీతం గురించి అడిగితే.. ఎవరికీ తెలియదంటున్నారు. చివరికి డీపీవోను వచ్చి కలిస్తే.. ‘ప్రభుత్వం నుంచి ఎలా వస్తుంది? మిమ్మల్ని ఎవరు నియమించారో వారిని అడగండి’ అంటూ సమాధానం రావడంతో వారంతా అవాక్కయ్యారు. సంస్థ ప్రతినిధులను అడిగితే పొంతన లేని జవాబు లు చెబుతున్నారు. దీంతో బాధితులంతా లబోది బోమంటున్నారు. ఒకరిద్దరు కాదు.. కురుపాం, సూపర్వైజర్ ఉద్యోగం.. రూ.17 వేల జీతమంటే ఆశపడ్డాం. ఎల్విన్పేట పంచా యతీలో పనిచేస్తున్నా. ఉద్యో గం ఆశ చూపి నా దగ్గర రూ. 2.55 లక్షల వరకు వసూలు చేశారు. మూడు నెలలుగా పనిచేస్తున్నా జీతం లేదు.. మోసపోయామని గ్రహించాం. అధికారులే మా డబ్బులిప్పించాలి. – కిల్లక కమలప్రియ, గుమ్మలక్ష్మీపురం మండలం జియ్యమ్మవలస, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోనే 75 మంది వరకు ఉన్నారు. వీరితో నాలుగైదు నెలలుగా పనులు చేయించుకున్నారు. మిగిలిన మండలాల్లోనూ తమలాంటి బాధితులున్నారని వారంతా చెబుతున్నారు. రూ.లక్షల్లో వసూలు స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తడి చెత్త–పొడి చెత్త సేకరణ, తీసుకోవాల్సిన మెలఉద్యోగమంటే ఆశ పడ్డాం. ఆరు నెలలుగా జిల్లా కోఆర్డినేటర్ హోదాలో పని చేస్తున్నా. మోసపోయామని గ్రహించాం. కలెక్టర్ వద్దకు వచ్చి కలిశాం. ఎస్పీ కార్యాలయానికి వెళ్లమన్నారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాం. – రామకృష్ణ, చిలకలవానివలస, జియ్యమ్మవలస మండలం అదనపు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అంటూ నియామక పత్రం ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ మని ఆశపడి, అడిగినంత డబ్బులు కట్టాం. ముగ్గురు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారు. నేను రూ.1.70 లక్షలిచ్చా. నా లుగు నెలల నుంచి పని చేస్తున్నా. జీతాలు లేవు. అడిగితే ఎవరికీ సంబంధం లేదంటున్నారు. – రాఘవేంద్రరావు, దిగువమండ, గుమ్మలక్ష్మీపురం మండలం -
విచారణ చీకట్లోకి!
నిబంధనల ప్రకారం ప్రతి ఎకరాకు 70 మొక్కలు, మరణించిన మొక్కల స్థానంలో మరో 14 మొక్కలు ఇవ్వాలి. ప్రతి మొక్కకూ రూ.28 ధర నిర్ణయించగా.. ఎరువుల కోసం ఒక్కో మొక్కకు రూ.25 చెల్లించాల్సి ఉంది. 2017–18లో చెల్లించాల్సిన రూ.25ల్లో కేవలం రూ.12 మాత్రమే చెల్లించి, మిగిలిన నిధులు పక్కదారి పట్టించారన్నది ప్రధాన ఆరోపణ. ●2018–19లో ఎరువుల కోసం చెల్లించాల్సిన మొత్తం కూడా రైతులకు ఇవ్వలేదు. ఆ లెక్కన రూ.1.33 కోట్లకుపైగా నిధులు గల్లంతయ్యాయన్నది ఆరోపణ. మొక్కల కొనుగోలులోనూ అవినీతి చోటుచేసుకుంది. ప్రభుత్వం రూ.28 చొప్పున మంజూరు చేస్తే.. రూ.15– రూ.16కే కొనుగోలు చేసి మిగలిన మొత్తం స్వాహా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. మూడు సంవత్సరాలపాటు ఇవ్వాల్సిన నిర్వహణ ఖర్చులను సైతం.. ఏడాదికే చెల్లించి, మిగిలిన మొత్తం దోచేశారన్నది ప్రధానంగా వినిపించింది. విచారణ అధికారి సుధారాణి.. పలు అంశాల్లో అవినీతి జరిగినట్లు గుర్తించారు. కొన్ని ఆరోపణలను ఖండించేలా ఎటువంటి ఆధారాలూ సమర్పించలేదని సమాచారం. ఇదే విషయమై తన నివేదికలో ఆమె స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. ●2017–18 సంవత్సరంలో 2,098 ఎకరాల విస్తీర్ణంలో తోటల పెంపకం చేపట్టారు. సమ్మతి ఇచ్చిన కొంతమంది రైతులు గుంతలు వేయడానికి ముందుకు రాలేదు. 2,098 ఎకరాల విస్తీర్ణంలో గుంతల చెల్లింపులు జరిగాయని పత్రాలను సమర్పించలేకపోయారు. విచారణ అధికారికి ఆర్థిక లావాదేవీలను ధ్రువీకరించేలా ఎటువంటి ఆధారాలూ చూపలేదు. విచారణ సమయంలో ఎటువంటి రికార్డులూ అందంచలేదని తెలిసింది. ●ఎరువుల సరఫరా సంస్థకు చేసిన చెల్లింపు, తోటల పరిస్థితి సరిపోలలేదు. 2018–19 సంవత్సరానికి కిలోకు రూ.12 చొప్పున 108.941 మెట్రక్ టన్నుల ఎరువును సరఫరా చేయడానికి ఇండెంట్ పెట్టినట్లు తెలిసింది. 2017–18లో ఎరువుకు కిలోకు రూ.6 ధర నిర్ణయించగా.. దీనికి విరుద్ధంగా 2018–19 సంవత్సరానికి కిలోకు రూ.12 చొప్పున కొటేషన్లు పొందారు. రెట్టింపు మొత్తం అయినప్పటికీ ప్రాజెక్టు అధికారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లలేనట్లు తెలిసింది. ●చాలా వరకు పనులకు, ఇతర కార్యకలాపాలకు రికార్డులు, ఫైళ్లు, నగదు బుక్ వంటివి నిర్వహించలేదని తెలిసింది. సామాజిక ఆడిట్లో ప్రతిపాదించిన మొత్తాన్ని కూడా రికవరీ చేయలేదు. 2019లో నిర్వహించిన 12వ సామాజిక తనిఖీలో రూ. 23,30,243 మొత్తాన్ని దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దీనిపైనా ఎటువంటి వివరణా ఇవ్వలేదు. రూ.75,75,993 మొత్తా నికి సోషల్ ఆడిట్ బృందానికీ రికార్డులు సమర్పించలేదు. నేమ్ బోర్డుల ఏర్పాటు విషయంలోనూ ఎటువంటి ఆధారాలూ చూపలేదని తెలుస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
● ఇద్దరు చిన్నారులు మృతి ● తల్లిదండ్రులకు కడుపుకోత ● గ్రామంలో అలముకున్న విషాదం గుమ్మలక్ష్మీపురం: పాఠశాలలకు ఒంటిపూట బడులు ఆరంభమయ్యాయి. పాఠశాల నుంచి ఇంటికి వచ్చి శుభకార్యంలో సంతోషంగా గడిపారు. పిల్లలతో కలిసి ఆడుకున్నారు. అనంతరం స్నేహితుడితో కలిసి సరదాగా స్నానం కోసం చెరువుకు వెళ్లారు. అంతే.. ఈత సరదా ఇద్దరు చిన్నారులను ముంచేసింది. కుటుంబ సభ్యులకు కన్నీరుమిగిల్చింది. గ్రామస్తుల్లో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే... గుమ్మలక్ష్మీపురం మండలం లక్కగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గౌడు శిభో(9), గౌడు హర్ష(9) నాలుగో తరగతి చదువుతున్నారు. సోమవారం నుంచి పాఠశాలకు ఒంటిపూట బడు లు ప్రారంభమయ్యాయి. పాఠశాల విడిచిపెట్ట డంతో ఇళ్లకు వెళ్లిన చిన్నారులు కుటుంబీకులతో కలిసి గ్రామంలోని బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్నారు. భోజనాలు చేసిన అనంతరం ఇంటికొచ్చారు. మరో స్నేహితుడితో కలిసి చెరువులో స్నానం చేసేందుకు, ఈత కొట్టేందుకు సరదాగా వెళ్లారు. వరుసకు బావమరుదులైన వీరిరువురు ముందుగా చెరువులో దిగి ఈతకొట్టేందుకు లోపలికి వెళ్లగా మునిగిపోయారు. దీనిని గమనించిన మరో చిన్నారి గ్రామంలోకి వచ్చి విషయం చెప్పడంతో పరుగున వెళ్లారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు నీటిపై తేలియాడుతూ కనిపించారు. శిభో మృతదేహాన్ని తల్లిదండ్రులు గౌడు సులోచన, రమో, బంధువులు ఇంటి కి తీసుకెళ్లగా.. కొన ఊపిరి ఉందన్న అనుమానంతో హర్షను తల్లిదండ్రులు గౌడు షర్మిల, లిట్టి, బంధువులు భద్రగిరి సీహెచ్సీకి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు హర్ష మృతి చెందినట్లు నిర్థారించారు. ఇరువురు చిన్నారులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుపెట్టారు. ఎల్విన్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. చదువులో హర్ష టాపర్ ఎంతో చలాకీగా ఉన్న హర్ష గ్రామంలోని ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. చదువులో ఎప్పుడూ టాపర్గానే ఉండేవాడని ఉపాధ్యాయుడు శ్యాంసుందర్తో పాటు తల్లిదండ్రులు చెబుతున్నారు. శిభో మీదే తల్లిదండ్రుల ఆశలు నలుగురు పిల్లలు చనిపోయక రాఘవ, శిభోలు పుట్టినప్పటికీ, రాఘవ కంటే శిభో ఎంతో ఉత్సహంగా ఉండేవాడని, ఆశలన్నీ వాడిమీదే పెట్టుకు న్నామంటూ గౌడు సులోచన, రమో కన్నీరుపెడుతున్నారు. -
వ్యవస్థ మెరుగుపడేలా కథనాలు..
● కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డిపార్వతీపురం: వ్యవస్థను మెరుగుపరిచేలా, ప్రజలకు ఉపయోగపడేలా వార్త కథనాలు ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా మీడియా అక్రిడేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు 196 కార్డులు అందజేసినట్లు చెప్పారు. జర్నలిజం సూత్రాలపై రిపోర్టర్లకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయాలని పలువురు జర్నలిస్టులు కోరారు. కార్యక్రమంలో జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్. వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీపీఆర్ఓ కె. బాల్మాన్సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
అలసత్వం వహిస్తే సహించేది లేదు..
● కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి ● పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు పోటెత్తిన అర్జీదారులువిజయనగరం కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లో అర్జీదారులు తెలియజేసిన సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు రాగా.. అధికారులు 233 వినతులు స్వీకరించారు. ఇందులో 130 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవి కావడం విశేషం. ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందరరెడ్డి మాట్లాడుతూ.. అర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి 130 వినతులు రాగా..డీఆర్డీఏ –13, పంచాయతీరాజ్ – 20, మున్సిపల్–9, విద్యుత్ శాఖ–7, హౌసింగ్–3, డీసీహెచ్ఎస్–1, గ్రామ సచివాలయ శాఖ–6, విద్య శాఖ–2, ఇతర శాఖలకు సంబంధించి 42 వినతులు వచ్చాయన్నారు. డిజిటల్ పర్యవేక్షణ.. పీజీఆర్ఎస్ కార్యక్రమంపై డిజిటల్ పర్యవేక్షణ చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి అన్నారు. 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందిన కాల్స్ పట్ల బాధ్యతగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అర్జీదారునితో మాట్లాడిన తేది, సమయం కూడా వారికిచ్చే రిపోర్ట్లో నమోదు చేయాలన్నారు. పీజీఆర్ఎస్ టోల్ఫ్రీ నంబర్ 1100పై ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు, జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కళావతి, సీపీఓ బాలాజీ, విజయనగరం, చీపురుపలి, బొబ్బిలి ఆర్డీఓలు, జిల్లా సర్వే శాఖ ఎ.డి. ఆర్.విజయకుమార్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి, హౌసింగ్ పీడీ మురళీధర్, మైక్రో ఇరిగేషన్ పీడీ లక్ష్మీనారాయణ, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, మార్క్ఫెడ్ మేనేజర్ డి.వెంకటేశ్వరరావు, డీఎంహెచ్ఓ జీవనరాణి, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవీప్రసాద్, జిల్లా పరిషత్ సీఈఓ బీవీ సత్యనారాయణ, జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. 48 ఫిర్యాదుల స్వీకరణ.. విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యాక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు 48 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో భూతగాదాలు, కుటుంబ కలహాలు, చీటింగ్, నగదు వ్యవహారాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. -
క్రికెట్ టోర్నీ పోస్టర్ల ఆవిష్కరణ
పార్వతీపురం: జియ్యమ్మవలస మండలం ఆర్ఆర్బీ పురం జీటీడబ్ల్యూఏహెచ్ఎస్లో ఈనెల 19 నుంచి 21 వరకు నిర్వహించనున్న మన్యం లీగ్ – 2026 జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించిన వాల్పోస్టర్లను కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో దాగి ఉన్న క్రీడలను వెలికితీసేందుకు ఈ టోర్న్మెంట్ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఎస్డీఓ కె. శ్రీధరరావు, తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయండి.. విజయనగరం క్రైమ్: ఓ ఆకతాయి నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని నిండు గర్భిణి వేడుకుంది. ఈ మేరకు సోమవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. డెంకాడ మండలం చింతలవలస ఏపీఎస్పీ బెటాలియన్ దగ్గర్లో ఉన్న కృష్ణాపురంలో అనురాధ, కల్యాణ్ దంపతులు నివసిస్తున్నారు. వీరి ఇంటిలో ఉన్న మామిడిచెట్టు కాయలు ఎదురుగా ఉన్న పృథ్వి ఇంటి ఆవరణలో పడడంతో వాటిని తీసుకునేందుకు ఇటీవల అనురాధ వెళ్లింది. దీంతో నా అనుమతి లేకుండా ఇంటిలోకి ఎందుకువచ్చావంటూ అనురాధతో పృథ్వి గొడవపడ్డాడు. తర్వాత అనురాధ ఇంటి నుంచి ఆమె కుమార్తె, అత్త, మరిది ఇలా ఎవరు ఇంటి బయటకు వచ్చినా బూతులు తిట్టడంతో పాటు దుస్తులు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. దీంతో బాధిత కుటుంబం ఈ నెల 11న స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. ఆకతాయి నుంచి తమకు రక్షణ కల్పించాలని వేడుకుంది. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ● తెగిపడిన విద్యుత్ తీగలు పార్వతీపురం రూరల్: పట్టణంలో సోమవారం సాయంత్రం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుని ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగిపడ్డాయి. రోడ్డుపక్కనే ఉన్న ద్విచక్ర వాహనాలు, ఓ కూరగాయల దుకాణంపై తీగలు పడ్డాయి. అయితే ఈ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. వెంటనే స్థానికుల సమాచారంతో విద్యుత్ శాఖాధికారులు స్పందించి సరఫరాను నిలిపివేశారు. దీంతో వాహనదారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్ పార్వతీపురం రూరల్: మండల పరిధిలోని వైకేఎం కాలనీ, చర్చి వీధిలో జరిగిన వరుస దొంగతనాలకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 8వ తేదీ రాత్రి జరిగిన ఈ చోరీలపై బాధితురాలు మత్స తవిటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్పీ మనీషా రెడ్డి సారథ్యంలో రూరల్ సీఐ పి. రంగనాథం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్కు చెందిన షేక్ అస్రాఫుల్, షేక్ బాబు, ఒడిశాకు చెందిన రూపేష్ నాగ్లను సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 18 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని, నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై ఎం. రాజేష్ తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఫిర్యాదులపై చర్యలు చేపట్టాలి
● ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డిపార్వతీపురం రూరల్: అర్జీదారులు తెలియజేసిన సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఏడుగురు అర్జీదారులు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, ఆన్లైన్ దగా, వేధింపులు, అధిక వడ్డీలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. అధికారులకు ఆదేశం.. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్పీ.. అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదులపై క్షుణ్ణంగా విచారణ జరిపి, వాస్తవాల ఆధారంగా చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై నివేదికను జిల్లా కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ ప్రారంభం
చికెన్విజయనగరం అర్బన్: మాజీ సైనికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన అడుగు వేసింది. మాజీ సైనికుల కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్) పరిధిలో విజయనగరంలో కొత్త పాలిక్లినిక్ను ఏర్పాటు చేశారు. ఈ వైద్య కేంద్రాన్ని ఈస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్) రియర్ అడ్మిరల్ ఎం.మురళీమోహన్ రాజు సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కమాండ్ మెడికల్ ఆఫీసర్ సర్జన్ రియర్ అడ్మిరల్ దిలీప్ రాఘవన్, మాజీ సైనికుల ప్రతినిధులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా పరిధిలో నివసిస్తున్న సుమారు 15 వేల మంది ఈసీహెచ్ఎస్ లబ్ధిదారులకు ఈ పాలీక్లినిక్ ద్వారా వైద్య సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎం. మురళీ మోహన్రాజు మాట్లాడుతూ.. దేశానికి సేవలందించిన మాజీ సైనికులకు సమయానుకూలంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో రీజినల్ సెంటర్ ఈసీహెచ్ఎస్ సెల్ అధికారి కెప్టెన్ ఎంవీఎస్ కుమార్, మాజీ సైననికులు పాల్గొన్నారు. -
బాధను దిగమింగి..
● తల్లి మరణించిన మరుచటి రోజే పరీక్షకు హాజరురామభద్రపురం: తండ్రి ఎలా ఉంటాడో తెలియదు.. అన్నీ తానై పెంచిన తల్లి అనారోగ్యంతో మృతి చెందింది.. తల్లి కళ్లెదుటే విగతజీవిగా పడి ఉంటే కుమిలి కుమిలి ఏడ్చిన కుమారుడు అంతటి బాధను కూడా దిగమింగుకుని మరుచటి రోజు పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొట్టక్కి గ్రామానికి చెందిన ముల్లు రామలక్ష్మి (33) గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె భర్త విడిచిపెట్టి మరో మహిళతో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి రామలక్ష్మి ఇళ్లల్లో పనులు చేసుకుంటూ బిడ్డను (కోటేశ్వరావు) సాకుతూ వచ్చింది. కుమారుడిని గారాబంగా పెంచుకుంటూ పదో తరగతి వరకు చదివించింది. ఇక పై చదువులు చదివి తనను ఆదుకుంటాడనుకున్న సమయంలో విధి వక్రించింది. అనారోగ్యంతో రామలక్ష్మి ఆదివారం కన్నుమూసింది. దీంతో గుండెలవిసేలా ఏడ్చిన కోటేశ్వరరావు.. ఇంతటి బాధలోనూ సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. -
25న న్యాయవాదుల సంఘం ఎన్నికలు
విజయనగరం లీగల్: ప్రతిష్టాత్మకమైన జిల్లా కేంద్ర న్యాయవాదుల సంఘ ఎన్నికలు ఈనెల 25 న జరుగనున్నాయి. సంఘంలో సుమారు 600 మంది సభ్యులున్నారు. అధ్యక్ష పదవికి నళితం రమేష్కుమార్, గువ్వల తిరుపతిరావు పోటీపడుతున్నారు. వీరిద్దరూ తమ మద్దతుదారులతో సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 25న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తామని ముఖ్య ఎన్నికల అధికారి కంటుభుక్త శ్రీనివాస్ తెలిపారు. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆదేశాలు, సూచనల మేరకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అధ్యక్ష పదవితో పాటు కార్యదర్శి, ఉపాధ్యక్ష, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, గ్రంథాలయ కార్యదర్శి, స్పోర్ట్స్ సెక్రటరీ, సీనియర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుల పదవికి ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎన్నికల అధికారులు వై. హరికృష్ణ, దాసరి పద్మ పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధి..
● కలెక్టర్ ప్రభాకరరెడ్డిపార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కారవేదిక (పీజీఆర్ఎస్)లో ఆయన పాల్గొని అర్జీదారుల నుంచి 110 వినతులు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ విభాగానికి 40, ఇతర శాఖలకు 70 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన తప్పనిసరని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చిన వినతుల్లో కొన్ని.. ● పార్వతీపురం బైపాస్ రోడ్డు ధూళి సమస్యను పరిష్కరించి, మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరారు. ● కురుపాం మండలం దొమ్మిడిని కొత్త పంచాయతీగా ప్రకటించాలని సర్పంచ్ ఎం. గౌరి, తదితరులు అర్జీ సమర్పించారు. ● గరుగుబిల్లి మండలంలో చెరువుల ఆక్రమణలను తొలగించాలని.. కొమరాడ, ఉక్కాడవలస ప్రాంతాల్లో భూములను ఆన్లైన్ చేయాలని అర్జీలు సమర్పించారు. ● బీఈడీ పూర్తి చేసిన తమకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, వ్యవసాయానికి బోర్ మంజూరు చేయాలని గిరిజన యువకులు కోరారు. ● నాగావళి నదిపై 20 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న పూర్ణపాడు – లాభేసు వంతెన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు డిమాండ్ చేస్తూ జేసీ యశ్వంత్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ● గిరిజన వేతనదారుల నుంచి సొమ్ము వసూలు చేస్తున్న డ్వామా పీడీని సస్పెండ్ చేయాలని.. డీఈఓ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డిప్యుటేషన్లను రద్దు చేయాలని గిరిజన సంక్షేమ సంఘం నేత పాలక రంజిత్కుమార్ కోరుతూ వినతిపత్రం అందజేశారు. -
చేతివృత్తులకు కష్టకాలం..
మంగలి, చాకలి వృత్తులు కూడా అంతంతమాత్రమే..పూర్వం గ్రామాల్లో మంగలి, కలి వృత్తులకు ప్రత్యేక గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు ఆధునిక సెలూన్లు, వాషింగ్ మెషీన్లు, లాండ్రీలు పెరగడంతో ఈ వృత్తుల ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇతర కులస్తులు పట్టణాల్లో ఆధునిక సెలూన్లు, లాండ్రీ షాపులు నిర్వహిస్తుంటే.. అసలైన కులవృత్తిదారులు వారితో పోటీ పడలేక వృత్తినే వదిలేస్తున్నారున.విజయనగరం గంటస్తంభం: ఒకప్పుడు గ్రామాలు అన్నిరకాల వృత్తిదారులతో సందడిగా ఉండేవి. సూర్యోదయం నుంచే చేతివృత్తిదారులు తమ పనుల్లో బిజీగా కనిపించేవారు. ప్రతి రోజూ కుమ్మరి ఇంట్లో మట్టిచక్రం తిరిగేది. చేనేత కార్మికుడి ఇంట్లో మగ్గం సవ్వడి చేసేది. కంసాలి పనిముట్ల శబ్దం ఊరంతా వినిపించేది. మంగలి కత్తెర చప్పుడు.. చాకలి ఇస్సు ఇస్సు శబ్దాలతో గ్రామాలన్నీ కళకళలాడేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. గ్రామం అంటే కేవలం ఇళ్లు, పొలాలకే పరిమితమైపోయింది. ఆధునిక జీవన విధానం పెరిగింది. యంత్రాలు, ఫ్యాక్టరీలు, ప్లాస్టిక్ వస్తువులు మార్కెట్ను ఆక్రమించాయి. ఫలితంగా శతాబ్దాలుగా కొనసాగిన సంప్రదాయ కులవృత్తులు నిశ్శబ్దంగా కనుమరుగవుతున్నాయి. ఈ వృత్తులు కేవలం జీవనోపాధి మాత్రమే కాదు..మన సంస్కృతీ, సంప్రదాయాలకు పునాది. కానీ నేడు ఆ వృత్తులపై ఆధారపడి జీవించే కుటుంబాలు తీవ్ర కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కంసాలి వృత్తికి కాలం పరీక్ష.. వ్యవసాయ పనులకు కావాల్సిన పరికరాలు గొడ్డళ్లు, కొడవళ్లు, కత్తులను గతంలో గ్రామాల్లో ఉండే కంసాలులే తయారు చేసేవారు. ఇప్పుడు ఫ్యాక్టరీల్లో తయారయ్యే వస్తువులు మార్కెట్ను ఆక్రమించడంతో కంసాలి వృత్తి కూడా క్షీణిస్తోంది. ఇనుప మోగులు మసకబారుతున్నాయి. ఆ వృత్తిపై ఆధారపడి జీవించిన కుటుంబాలు ఆర్థికంగా బలహీనపడుతున్నాయి. తండ్రి వృత్తి కొనసాగించని కొత్త తరం.. పూర్వం తండ్రి చేసే వృత్తినే కొడుకు కొనసాగించడం సంప్రదాయంగా వచ్చేది. కానీ నేటి పరిస్థితుల్లో యు వత ఆ వృత్తులపై ఆసక్తి చూపడం లేదు. తక్కువ ఆ దాయం, కష్టమైన పని, భవిష్యత్పై భయం కారణంగా యువత పట్టణాలకు వెళ్లి ఇతర ఉద్యోగాలు వెతు క్కుంటోంది. దీంతో పూర్వీకుల వృత్తుల కొత్త తరానికి చేరకుండా నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి. గ్రామ సంస్కృతికి ముప్పు.. కులవృత్తులు కేవలం పనులు కాదు. అవి గ్రామ జీవన విధానానికి ప్రతిబింబం. ఆ వృత్తులు మాయమ్తెతే గ్రామ సంస్కృతీ, సంప్రదాయాలు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు అవి గతకాల జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. ప్రభుత్వం – సమాజం కలిసి రక్షించాలి.. ఈ సంప్రదాయ వృత్తులను కాపాడాలంటే ప్రభుత్వంతో పాటు సమాజం కూడా ముందుకు రావాలి. సంప్రదాయ వృత్తులకు ప్రోత్సాహక పథకాలు, మార్కెట్ అవకాశాలు కల్పించడం, హస్తకళల పదర్శనలు నిర్వహించడం, యువతకు శిక్షణ ఇవ్వడం. వంటి చర్యలు తీసుకుంటేనే ఈ వృత్తులు తిరిగి బతికే అవకాశం ఉంటుంది. చేతిలో పని లేక ఇబ్బంది పడుతున్న వృత్తిదారులు పాత వృత్తులను దెబ్బతీస్తున్న ఆధునికత కనమరుగవుతున్న గ్రామ సంస్కృతి -
పాలనపై పట్టులేని చంద్రబాబు
● ఇచ్చిన హామీలు గాలికొదిలేశారు.. ● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ రేగిడి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 40 సంవత్సరాల అనుభవమని డప్పు కొట్టుకోవడమే తప్ప పాలనపై పట్టులేదని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. మండలంలోని అక్కన్నఅగ్రహా రం గ్రామానికి ఆదివారం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి కాకుండా కేవలం అబద్దపు ప్రచారాలకే పరిమితమైందని అన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో చేసి న అప్పు కంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కాకముందే రూ.3.35 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలకున్న అభిమానాన్ని చూసి ఓర్వలేకే పార్టీపై బురదజల్లే కార్యక్రమం చేపడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికొదిలేసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని డబ్బా కొట్టుకోవడమేనని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంత వరకు బడుగు బలహీన వర్గాల వారికి ఇళ్లు, అర్హులైన వారికి పింఛన్లు అందజేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసిందని మండిపడ్డారు. గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులకే ఏటా రూ.13వేలు పెట్టుబడి సాయం అందించి ఆదుకుందని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చి మొండి చేయి చూపించారని విమర్శించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు టి.అచ్చెన్నాయుడు, మండల పార్టీ కన్వీనర్ వి.జగన్మోహనరావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు కె.వెంకటేశ్వరరావు, బీసీ సెల్ అధ్యక్షులు కరణం శ్రీనివాసరావు, సర్పంచ్లు కె.గోవిందరావు, గార రమణ, ఉప సర్పంచ్ బాలి తవిటినాయుడు, పి.ధవళేశ్వరరావు ఉన్నారు. -
దుర్గాదేవి నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు
వీరఘట్టం: స్థానిక శ్రీకోటదుర్గ తల్లి ఆలయ తృతీయ వార్షికోత్సవం ఆదివారం కనులపండువగా నిర్వహించారు. యజ్ఞకర్త ఎస్.వి.ఎల్.ఎన్ శర్మయాజీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పరిషత్ కృఛ్చత్రయం, పంచగవ్వ ఆరాధన, అఖండ దీపారాధన, ఋత్విక్ వరుణ ప్రధానం, యాగశాల ప్రవేశ ద్వారపూజ, ధ్వజ పతాకావిష్కరణ, మండల మండపారాధనతో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు అమ్మవారి నిజరూప దర్శనాన్ని భక్తులు తిలకించారు. నిజరూపంలో ఉన్న దుర్గాదేవికి భక్తులు మట్టి కుండలతో తెచ్చిన పాలతో అర్చకులు దుర్గాదేవిరి క్షీరాభిషేకాలు చేశారు. సాయంత్రం దుర్గాదేవి భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున దుర్గాదేవిని దర్శించుకుని పూజలు చేశారు. విజయనగరం అర్బన్: వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉల్లాస్ ఎఫ్ఎల్ఎన్ఏటీ పరీక్ష ఆదివారం నిర్వహించారు. జిల్లాలోని 27 మండలాలు, 4 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 1,11,369 మంది అభ్యాసకులు 1,356 పరీక్ష కేంద్రాలలో పరీక్ష రాశారని వయోజన విద్య నోడల్ అధికారి ఎ.వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి స్థానిక ధర్మపురిలోని ఎల్డీజీ జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన వయోజన విద్యా విభాగానికి చెందిన ప్రదీప్ బి.హెదాపూ జిల్లాలో పర్యటించారు. అదే విధంగా జిల్లా సమన్వయ కమిటీతో పాటు మండల స్థాయి లో ఎంపీడీఓలు, ఏపీఎంలు, సీడీపీఓలు, మున్సిపల్ స్థాయిలో సీఎంఎంలు, వయోజన విద్యా శాఖ పర్యవేక్షకులు పరీక్షల నిర్వహణను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. గజపతినగరం రూరల్: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు పదో తరగతి పరీక్ష కేంద్రం కేటాయించకపోవడం వెనుక దాగి ఉన్న వాస్తవాలేంటని స్థానికులు చర్చించుకుంటున్నారు. 1959లో ఏర్పాటైన ఈ పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రం కేటాయించకపోవడం ఇదే తొలిసారి కావడం స్థానికులను, పూర్వ విద్యార్థులను విస్మయానికి గురి చేసింది. ప్రతీసారి ఏదో ఒక పరీక్షకు కేంద్రంగా నిలిచే ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఈ ఏడాది పది పరీక్షలకు కేంద్రం కేటాయించకపోవడం వెనుక గల కారణమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం కేటాయించలేదని ఆల స్యంగా తెలుసుకున్న స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు మండలంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, శ్రీకృష్ణ విద్యాపీఠ్, ఆర్సీఎం హైస్కూల్, మోడల్ హైస్కూల్ కేంద్రాలను ఎంపిక చేశారు. వీటిలో రెండు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఆర్సీఎం హైస్కూల్ గజపతినగరానికి చాలా దూరంగా ఉండడంతో విద్యార్థులకు కొంత ఇబ్బందులు తప్పవు. నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ బాలుర పాఠశాలను కాదని దూరంగా ఉన్న పాఠశాలను ఎంపిక చేయడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. దశాబ్దాల తరబడి ఈ ప్రాంత టెన్త్ విద్యార్థులకు పరీక్ష కేంద్రంగా ఉండే ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఈసారి ఎందుకు ఇలా జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు వద్ద సాక్షి ఆదివారం ప్రస్తావించగా.. కేంద్రం ఎంపిక విషయం తన పరిధిలోనిది కాదని, కారణం తనకు తెలియదని చెప్పారు. -
షర్మిల రచ్చబండలో ‘జగనన్న’ నామస్మరణ!
● గత వైఎస్సార్సీపీ పాలనపై గిరిజనుల ప్రశంసలు ● అవాకై ్కన పీసీసీ చీఫ్ షర్మిల పార్వతీపురం రూరల్/కొమరాడ : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ‘ఉపాధి హామీ బచావో సంగ్రామ్’ యాత్రలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ వేదికపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి గిరిజన మహిళలు ఎలుగెత్తి చాటడంతో అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. తన పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం కొమరాడ మండలం డంగభద్ర గ్రామంలో ఏర్పా టు చేసిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటుండగా, పార్వతీపురం మండలం కొత్త ఊరు గిరిజన గ్రామానికి చెందిన గిరిజన మహిళ హిమరిక నూకమ్మ గళమెత్తి వినిపించిన వాస్తవాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో... నూకమ్మ మాట్లాడుతూ.. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో తమ గ్రామానికి మహర్దశ పట్టిందని కొనియాడారు. అప్పటి ఎమ్మెల్యే అలజంగి జోగారావు కృషితో తమ గ్రామానికి రోడ్లు, ఇంటింటికీ మంచినీటి కుళాయిలు అందాయని, ‘గడప గడపకు’ పాలనలో తమ సమస్యలు తక్షణమే పరిష్కారమయ్యేవని గుర్తు చేసుకున్నారు. అయితే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో పరిస్థితి తలకిందులైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ కాలం నుంచి ఉపాధి హామీ కూలి డబ్బులు అందక, తాగడానికి గుక్కెడు మంచి నీరు లేక అవస్థలు పడుతున్నామని సభలో ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై అసహనం స్థానిక సచివాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు, ఐటీడీఏ పీఓ కార్యాలయం గడప తొక్కినా తమ గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారని నూకమ్మ కుండబద్దలు కొట్టారు. ప్రజా క్షేత్రంలో విమర్శలే ఆయుధంగా యాత్ర చేస్తున్న షర్మిలకు, జగన్మోహన్రెడ్డి హయాంలో జరిగిన మేలును సాక్షాత్తూ ఒక గిరిజన మహిళ ప్రశంసించడం ఆమెకు విస్మయం కలిగించింది. గత ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను ప్రజలు ఇంకా నెమరువేసుకుంటున్న తీరు చూసి షర్మిలారెడ్డి సైతం కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. -
వైభవంగా శ్రీవారి తెప్పోత్సవం
హంస వాహనంపై శ్రీదేవి, భూదేవితో విహరిస్తున్న శ్రీనివాసుడు డెంకాడ: చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ వద్ద ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి తెప్పోత్సవం ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం సుప్రభాతసేవ, వేదపండితులు పూజలు ప్రారంభించారు. అర్చన, మంత్రపుష్పం, నైవేద్యం, సేవాకాలం, భక్తుల దర్శనాలు, తులసి అర్చన పూజలు చేశారు. యాగశాల పూజలు, విశేష హోమాలు, నీరాజనం, మంత్రపుష్పం పూజలు నిర్వహించారు. లక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన పూజ చేశారు. అనంతరం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో పూలు, రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ చేసి హంస వాహనంపై స్వామివారు శ్రీదేవి, భూదేవి సమే తంగా విహరించారు. చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్రెడ్డి తదితరులు తెప్పోత్సవంలో భాగంగా పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
నేటి నుంచే పది పరీక్షల సమరం
సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026పది పరీక్షలకు పోలీస్ పహారా పార్వతీపురం/పార్వతీపురం రూరల్ : వరుస విజయాల వెలుగులో, హ్యాట్రిక్ ఘనతను సొంతం చేసుకున్న పార్వతీపురం మన్యం జిల్లా మరో కీలక విద్యా పరీక్షకు సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ పరీక్షలను అత్యంత ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి చిన్న పొరపాటుకు తావులేకుండా నిర్వహించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన వివిధ శాఖల సమన్వయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి, పరీక్షల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. నిబంధనలు కఠినం.. నిఘా నిరంతరం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే, విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రవేశంపై కఠిన నిషేధం విధించారు. పరీక్ష సమయాల్లో కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు. ప్రశ్నపత్రాల భద్రత విషయంలో రాజీ పడకూడదని, స్ట్రాంగ్ రూముల నుంచి కేంద్రాల వరకు పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ జరగాలని సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు మండు వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద తాగునీరు, ఫ్యాన్లు, వెలుతురు వంటి కనీస వసతులతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స పరికరాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ బస్సులలో సైతం విద్యార్థుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉంచనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు నిరంతరం అందుబాటులో ఉంటారు. పరీక్షలు ముగిసిన వెంటనే సమాధాన పత్రాలను సురక్షితంగా పోస్ట్ ఆఫీసులకు చేరవేయాలని కలెక్టర్ సూచించారు. మరోసారి అగ్రస్థానమే లక్ష్యం జిల్లా ఏర్పడిన నాటి నుంచి విద్యా రంగంలో పార్వతీపురం మన్యం జిల్లా తనదైన ముద్ర వేస్తోంది. 2023లో 87.47 శాతం, 2024లో 96.37 శాతం, గత ఏడాది 2025లో 93.90 శాతం ఉత్తీర్ణతతో వరుసగా మూడుసార్లు రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుని హ్యాట్రిక్ సాధించింది. గిరిజన ప్రాంతాలు అధికంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు ధీటుగా రాణిస్తుండటం గమనార్హం. ఈ ఏడాది కూడా అదే విజయపరంపరను కొనసాగించి, రాష్ట్ర స్థాయిలో జిల్లా కీర్తి పతాకాన్ని ఎగురవేయాలన్న సంకల్పంతో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు కఠినంగా శ్రమించారు. సమీక్ష సమావేశంలో ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాధమిక అక్షరాస్యత పరీక్ష సక్సెస్ వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రాధమిక అక్షరాస్యత పరీక్ష(ఎఫ్ఎల్ఎన్ఏటీ) విజయవంతమైందని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. జిల్లాలో 1415 కేంద్రాల్లో 67,686మంది అభ్యాసకులు పరీక్షలు రాయాల్సి ఉండగా 66,467మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి 222 కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు : ఎస్పీ హ్యాట్రిక్ ఉత్సాహంతో సిద్ధమైన మన్యం జిల్లా పొరపాటుకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుపార్వతీపురం రూరల్: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 222 పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర నిఘా ఉంచనున్నట్టు ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ముగిసే వరకు కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, డ్రోన్ కెమెరాలు, మొబైల్ పెట్రోలింగ్ బృందాలతో నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని, ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తామని స్పష్టం చేశారు. పరీక్షలు జరిగే సమయంలో పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసి వేయాలని ఆదేశించారు. ప్రశ్న పత్రాలు, సమాధాన పత్రాల తరలింపునకు పటిష్ట ఎస్కార్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు పాల్పడినా.. సహకరించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
ఏరియా ఆస్పత్రిని సందర్శించిన వైద్య బృందం
సీతంపేట: స్థానిక ఏరియా ఆస్పత్రిని రాష్ట్ర కాయకల్ప వైద్య బృందం ఆదివారం సందర్శించింది. ఆస్పత్రి సర్టిఫికేషన్కు అర్హత ఉందా.. లేదా.. అనేది పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలు, పారిశుధ్యం, బయో వేస్ట్ మేనేజ్మెంట్ ఇతర అంశాలను క్షుణ్నంగా తనిఖీ చేశారు. బెడ్ల సౌకర్యాలు, రోగుల వివరాలు తెలుసుకున్నారు. రక్త పరీక్షల రికార్డులు, కిట్లు చూశారు. రోగులతో ఆస్పత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో టీం లీడర్ ప్రవీణ్, బయో మెడికల్ ఇంజినీర్ సంతోష్, ఎన్క్వాస్ నోడల్ ఆఫీసర్ మణికంఠ, ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.3.20 కోట్ల గంజాయి పట్టివేత
బొండపల్లి: ఒడిశా కేంద్రంగా విశాఖపట్నంకు భారీగా తరలిస్తున్న గంజాయిని విశాఖకు చెందిన నార్కోటిక్ సెంట్రల్ బ్యూరో(ఎన్సీబీ) పోలీసులు ఆదివారం వేకువజామున పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు.. ఒడిశాలోని సిమిలిగూడ ప్రాంతానికి చెందిన అజయ్రాయ్ తన బొలెరో వ్యాన్లో వేకువజామున వ్యాన్లో కింద గంజాయి ప్యాకెట్లు పేర్చి పైన క్యాబేజీలను వేసి రవాణా చేస్తుండగా ఎన్సీబీ పోలీసులకు అందిన సమాచా రం మేరకు బొండపల్లి పోలీస్స్టేషన్ మీదుగా వెళ్తు న్న బొలెరో వాహనాన్ని పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. 647 కేజీల గంజాయి స్వాధీనం విశాఖపట్నం ఎన్సీబీకి అందిన సమాచారం మేర కు ఒడిశాలోని సిమిలిగూడ నుంచి విశాఖపట్నం తరలిస్తున్న 647కేజీల గంజాయిని పట్టుకోవడంతో పాటు వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. దాడుల్లో ఎన్సీబీ పోలీసులు, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలతో పాటు సిబ్బంది పాల్గొని బొలెరో వ్యాన్ను పట్టుకున్నారు. ఆరా తీ యగా కాయగూరలు రవాణా మాటున గంజాయి తరలింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గంజాయి విలువ రూ.3.20 కోట్లు పోలీసులకు పట్టుబడిన గంజాయి విలువ సుమా రు రూ.3.20 కోట్లు ఉంటుందని పోలీసులు గుర్తించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడంతో పాటు అందుకు సహకరించిన వారిపై ఆరా తీసే పనిలో ఎన్సీబీ పోలీసులు నిమగ్నమయ్యారు. -
స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకం
● జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణగుర్ల: మండలంలోని కెల్ల, బెల్లానపేట, దమరసింగి, వల్లాపురం, మన్యపురిపేట గ్రామాలలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయునున్న ఇంటిగ్రేటేడ్ స్టీల్ ప్లాంట్కు జనసేన వ్యతిరేకమని జనసేన రాష్ట్ర నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. మండలంలోని బెల్లానపేటలో ఐదు గ్రామాల రైతులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టీల్ప్లాంట్కు వ్యతిరేకంగా, రైతుల పక్షాన పోరాటం చేస్తామని హమీ ఇచ్చారు. పరిశ్రమలు మొట్ట ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, మూడు పంటలు పండే పల్లం ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల రెతులుకు అన్యాయం జరుగుతుందన్నారు. సాగు భూములను పరిశ్రమలకు కట్టబెట్టడాన్ని తప్పుబట్టారు. పంచాయతీల తీర్మానం లేకుండా ప్లాంట్లు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈ సమస్యను జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో జనసేన చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు, జనసేన నేత రమేష్ రాజు ఉన్నారు. -
పీడీఓ జిల్లా కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం
విజయనగరం రూరల్: పంచాయతీ అభివృద్ధి అధికారుల (పీడీఓ) జిల్లా సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది. పట్టణంలోని ఏపీ ఎన్జీఓ భవనంలో పంచాయతీ అభివృద్ధి అధికారుల జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మంత్రి రమణ, కార్యదర్శిగా కె. శ్రీకాంత్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా తాడి వెంకటరావు.. ఉపాధ్యక్షులుగా ఎం.జగదీష్, సీహెచ్ ప్రసాద్, ఎ. ప్రవీణ్కుమార్, ఎస్.సురేష్, బి.భవానీ.. సంయుక్త కార్యదర్శులుగా ఎస్.హేమాంజలి, పి. రాంబాబు, కె. వెంకటరావు, ఎ. ముజీబ్, టి. రజని.. కోశాధికారిగా వి. శ్రీనివాస్.. కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.స్వామినాయుడు.. గౌరవ అధ్యక్షుడిగా యర్ర రమణలతో పాటు 8 మంది సభ్యులు ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన సలహాదారుగా అచ్యుతరావు, న్యాయ సలహాదారునిగా పప్పు త్రినాథ్ ఎన్నికై నట్లు ఏపీ ఎన్జీఓ జిల్లా ఉపాధ్యక్షుడు కె. శ్రీనివాసరావు తెలిపారు. సహాయ ఎన్నికల అధికారిగా ఎం. శ్రీనివాసరావు, ఎన్నికల పరిశీలకుడిగా కె. చంద్రశేఖర్ వ్యవహరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఎ. సురేష్ మాట్లాడుతూ.. పీడీఓల సమస్యలపై పోరాటం చేయడానికి ఏపీ ఎన్జీఓ అండగా ఉంటుందన్నారు. వన్ పీడీఓ – వన్ యూనియన్ నినాదంతో సభ్యులందరూ ఏకమై సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని తీర్మానించారు. కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 300 పైగా పీడీఓలు హాజరయ్యారు. -
ఉపాధ్యాయులపై పనిభారం తగ్గించాలి..
● పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్యగజపతినగరం రూరల్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులపై తీవ్రమైన పని ఒత్తిడి ఉందని.. వెంటనే ప్రభుత్వం స్పందించి పనిభారం తగ్గించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. మండలంలోని మరుపల్లిలో గల బాలాజీ పాలిటెక్నిక్ కళాశాలలో పీఆర్టీయూ ఐదో జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్టీయమూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు అవసరమైన సభ్యత్వ నమోదు మరింత ఎక్కువ స్థాయిలో చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఎం గిరిప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉపాధ్యాయలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాలు చేయక తప్పదన్నారు. అనంతరం జనరల్ సెక్రెటరీ డి. శ్రీనివాస్ సంఘ వార్షిక నివేదికను సభకు సమర్పించారు. ఈ సందర్భంగా మూడోసారి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తమ సంఘం తరఫున ఎన్నికై న గాదె శ్రీనివాసులునాయుడును రాష్ట్ర నాయకులు ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి రవీంద్రనాయుడు, జిల్లా జనరల్ సెక్రెటరీ డి.శ్రీనివాస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రావాడ రాంబాబు, బైరి అప్పారావు, పప్పల రాజశేఖర్, ఆల్తి రాంబాబు, డెక్క వెంకటరావు, బండారు రవికుమార్, బూడి వెంకటరావు, పీఆర్టీయూ మండల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఘనంగా ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ సక్సెస్ మీట్
విజయనగరం అర్బన్: నగరంలోని ఓ ప్రైవేట్ సమావేశ మందిరంలో ఆర్ఎస్ రెడ్డి ఇన్న్స్టిట్యూట్ సక్సెస్ మీట్ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆఫ్లైన్ కోచింగ్తో పాటు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ ద్వారా ఆన్లైన్ శిక్షణ అందించడం గొప్ప విషయమన్నారు. గ్రూప్ వన్లో ఒకరు, గ్రూప్–2లో 66 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడం విజయనగరం జిల్లాకే గర్వకారణమన్నారు. అనంతరం గ్రూప్స్ విజేతలను సన్మానించారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, మాజీ ఎమ్మెల్సీ రఘువర్మ, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డి. రామకృష్ణ, ఎయిమ్స్ గ్రూప్స్ ప్రతినిధి కడగల ఆనంద్, ఏఎంసీ ప్రతినిధి గేదెల రాజారావు, సువ్వాడ రవిశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
కాపాడాల్సిన మీరే ఆక్రమిస్తే ఎలా..?
● బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనకు ఫోన్ చేసి ప్రశ్నించిన పీసీసీ చీఫ్ షర్మిలబొబ్బిలి: ప్రజల ఆస్తులను కాపాడాల్సిన మీరే సమస్యగా మారితే ఎలా అని.. బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనను పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. మండలంలోని పారాదిలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర – రచ్చబండ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సమయంలో బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట గ్రామానికి చెందిన ఏడుగురు పేదలు ఆమెను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. 1991లో ప్రభుత్వం తమకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూములను పంపిణీ చేయగా..సాగు చేసుకుంటున్నట్లు బాధితులు పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఇటీవల బేబినాయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ భూమిని రియల్టర్లకు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దగ్గర భూమికి సంబంధించి ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు, బ్యాంకుల్లో చెల్లిస్తున్న క్రాప్లోన్లు, రైతుభరోసా వచ్చిన వివరాలు వైఎస్ షర్మిలకు చూపిస్తూ న్యాయం చేయాలని కోరారు. దీంతో ఆమె వెంటనే ఎమ్మెల్యే బేబి నాయనకు ఫోన్ చేయగా.. ఆ భూముల విషయం తర్వాత వివరిస్తానని బదులిచ్చారు. నాకు చెప్పవద్దు.. బాధితులకు వివరించాల్సిన బాధ్యత మీపై ఉంది కాబట్టి వెంటనే సమాధానం చెప్పాలని పీసీసీ చీఫ్ పట్టుబట్టగా, ఎమ్మెల్యే స్పందిస్తూ వారి ఆరోపణల్లో నిజం లేదు.. వారు చెప్పిన సర్వే నంబర్ వేరు.. ఈ సర్వే నంబర్ వేరు.. నేను ఇప్పుడు రాజాంలో ఉన్నాను. తర్వాత చెప్తాను అంటూ ఫోన్ కట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బాధితుల వినతి మేరకు ఆమె అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విద్యాసాగర్, ఇన్చార్జ్ మువ్వల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాలకు ఆహ్వానం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 27న ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలకు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు ఆలయ అధికారులు శనివారం ఆహ్వానం పలికారు. విజయనగరంలోని ఆయన నివాసంలో ఈఓ వై.శ్రీనివాసరావు, అర్చకులు, మర్యాదపూర్వకంగా కలిసి శ్రీరామనవమి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా రామతీర్థంలో జరుగుతున్న నవమి ఏర్పాట్లపై జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వారిని అడిగి తెలుసుకున్నారు. శ్రీరామచంద్రస్వామి కల్యాణోత్సవంలో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఈఓకు సూచించారు. డెంకాడ మండలం మోపాడలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడును కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది సాయిరామాచార్యులు, రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక ఏర్పాట్లు
రామభద్రపురం: పదో తరగతి విద్యార్థుల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు పబ్లిక్ పరీక్షలలో వెసులుబాటు కల్పించారు. వీరికున్న శారీరక వైకల్యాన్ని బట్టి అర్హులైన వారికి సహాయకులను నియమించుకునేందుకు అవకాశం కల్పించారు. 9వ తరగతి చదివే బాల బాలికలను సహాయకునిగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. చూపు సరిగా లేని విద్యార్థులు ఏదైనా ఒక భాష (లాంగ్వేజ్ సబ్జెక్టు) పరీక్ష రాయకుండా మినహాయింపు ఉంది. మిగిలిన పరీక్షల్లో 20 మార్కులు పొందితే ఉత్తీర్ణులవుతారు. వినికిడి లోపం ఉన్నవారు రెండు భాషలు రాయనవసరం లేదు. మిగిలిన పరీక్షల్లో సబ్జెక్టుకు 20 మార్కులు చొప్పున్న పొందాల్సి ఉంటుంది. మాట లోపం గల విద్యార్థులు ఒక్కో సబ్జెక్టులో 20 మార్కులు సాధించాలి. పరీక్ష సమయం అదనంగా అరగంట కేటాయిస్తారు. -
19 నుంచి వసంత నవరాత్రి మహోత్సవాలు
గరుగుబిల్లి: తోటపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి ఆలయాల్లో ఈ నెల 19 నుంచి 27 వరకు శ్రీరామ వసంత నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీమద్రామాయణ పారాయణం, శ్రీరామలక్ష్మీ జపంతో పాటు అష్టోత్తర, సహస్ర నామార్చనలు నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఉదయం శ్రీ సీతారామస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం శ్రీ స్వామివారి పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. కల్యాణంలో పాల్గొనే దంపతులు తమ గోత్రనామాలతో రూ.500లు చెల్లించి పాల్గొనాలని ఆలయ కార్యనిర్వహణాధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. కల్యాణంలో పాల్గొనే దంపతులకు ప్రసాదం, శేష వస్త్రాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ నెల ఉదయం 19న తోటపల్లి దేవాలయ ప్రాంగణంలో తెలుగు పండితులు పొందూరు సుధాకుమార్ శర్మచే ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తోటపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోని స్వామివారిని, పద్మావతి అమ్మవార్లను శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తల నీలాలను సమర్పించుకున్నారు మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదానంలో పాల్గొన్నారు. -
యంత్రాలున్నాయ్.. మూలన భద్రంగా!
గిరి వెలుగు ప్రాజెక్టు అధికారులు ఒక లక్ష్యం లేకుండా, కేవలం కమీషన్లకు ఆశపడి.. పలు రకాల యంత్రాలను కొనుగోలు చేసి, వాటిని వినియోగంలోకి తీసుకురాకుండా వృథాగా పడేశారు. 2022లో కురుపాం, మక్కువ, పార్వతీపురం పరిధిలోని నాలుగు వీడీవీకే కేంద్రాలకు రూ.29.43 లక్షలతో పసుపు, పప్పు ధాన్యాల ప్రాసెసింగ్ యంత్రాలను కొనుగోలు చేశారు. మక్కువ మండలంలో 3–ఫేజ్ విద్యుత్తు సౌకర్యం ఉన్నందున అక్కడ యంత్రాలతో పనులు చేస్తున్నారు. మిగిలిన మూడు చోట్ల కరెంటు సమస్య అంటూ అటకెక్కించేశారు. రూ.లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన పప్పులు, చిరు ధాన్యాల యూనిట్లు ప్రస్తుతం పార్వతీపురంలోని వైకేఎం కాలనీలో ఉన్న జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయంలో నిరుపయోగంగా పడి ఉన్నాయి. -
వడగాడ్పులపై తస్మాత్... : కలెక్టర్
విజయనగరం కలెక్టరేట్: రాబోయే ఎండా కాలంలో ఎండ తీవ్రత, వడగాడ్పుల ప్రభావం పెరిగే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. ప్రజలు పలుచటి కాటన్ దుస్తులు ధరించడం, తలపై టోపీ లేదా రుమాలు ధరించడం, తరచుగా మంచినీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలో ఎక్కువసేపు పని చేయకూడదని తెలిపారు. వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడ ఉన్న చల్లటి ప్రదేశానికి తరలించి తడి గుడ్డతో శరీరాన్ని చల్లబరచాలని, అవసరమైతే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతున్నందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. -
‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
● జిల్లాలో 68 కేంద్రాల ఏర్పాటు ● హాజరుకానున్న 10,646 మంది విద్యార్థులు పార్వతీపురం రూరల్: జిల్లాలో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) బ్రహ్మాజీరావు శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 222 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన మొత్తం 10,646 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం జిల్లాలో 68 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్టు ఆయన వివరించారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 68 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 68 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 612 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. నిరంతర తనిఖీల కోసం మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఐదు సిట్టింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించినట్టు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్న్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ వసతులతో పాటు ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థులు హాల్టికెట్ చూపిస్తే ఏపీఎస్సార్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే హాల్ టికెట్లతో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ సూచించారు. -
లక్ష్యం అడగకు..!
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026● వన్ధన్ కేంద్రాలు.. అధికారులకే వం‘ధనం’ ● నిరుపయోగంగా పప్పులు, చిరుధాన్యాల యూనిట్లు ● గిరి ‘వెలుగంతా’ అవినీతి చీకటే.. లక్షల ఖర్చు.. సాక్షి, పార్వతీపురం మన్యం : గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో ఏర్పడిన వన్ధన్ వికాస కేంద్రాలు(వీడీవీకే).. అధికారులకే వం‘ధనం’ అయ్యాయి. గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం ఏర్పడిన ఐటీడీఏలో ఉన్న గిరి వెలుగంతా అవినీతిమయమైంది. శిక్షణలు, అడ్వాన్సులు, కొనుగోలు, విక్రయాలు, ఇతర కార్యకలాపాల్లో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయి. వీడీవీకేలకు ఇచ్చిన నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగమైనట్టు ఆరోపణలున్నాయి. వీటిపై న్యాయబద్ధంగా జరగాల్సిన విచారణ సైతం.. వాస్తవాలను మరుగనపర్చింది. నివేదికలను తుంగలో తొక్కి, ‘మమ’ అనిపించేశారు. లక్ష్యం లేకుండా నిధులను వినియోగించినట్టు తేల్చినా.. అప్పటి ఏపీడీపై చర్యలు లేవు. ఫలితంగా గిరిజనుల ఆర్థికాభివృద్ధికి వెచ్చించాల్సిన రూ.లక్షల నిధులు దుర్వినియోగమైన పరిస్థితి ఏర్పడింది. ఆ మాత్రం తెలీదనుకోవాలా? యంత్రాలనైతే హడావిడిగా కొనుగోలు చేశారుగానీ.. వీటి ఏర్పాటు కోసం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కనీసం షెడ్లు ఏర్పాటు చేయలేదు. యంత్రాలు పని చేయాలంటే.. త్రీ ఫేజ్ కరెంటు ఉండాలి. ఇప్పుడు కరెంటు సమస్య వల్ల వినియోగించలేదని చెప్పుకొస్తున్నారు. త్రీ ఫేజ్ కరెంటు ఉండాలన్న ఆలోచన కూడా లేకుండా యంత్రాలు కొనుగోలు చేసేశారా? పోనీ, తర్వాతైనే ఏర్పాటు చేయడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి నిరుపయోగంగా వదిలేసిన అధికారులు.. ఇప్పుడేమో వాటిని ఆసక్తి గల వ్యక్తులొస్తే వారికి కేటాయించి, పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని చెప్పడం కొసమెరుపు. చింతపండు కేకులన్నారు.. శిక్షణలన్నారు! కొండ చీపుర్లు, చింతపండు కేకుల తయారీ యూనిట్లదీ అదే పరిస్థితి. ఎనిమిది మండలాలకు యంత్రాలు సరఫరా చేయగా.. చాలా చోట్ల వినియోగించడం లేదు. చింతపండును వీడీవీకేలతో కొనుగోలు చేయించి, పిక్క తీసి, కేకుల్లా మార్చి విక్రయించేందుకు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది మండలాలకు రూ.11.43 లక్షలతో ఎనిమిది యంత్రాలను అప్పట్లో కొనుగోలు చేశారు. జియ్యమ్మవలస, పాచిపెంట మండలాల్లో యంత్రాలు నిరుపయోగంగా మిగిలిపోయాయి. మిగిలిన చోట్ల మార్కెటింగ్ చేయలేక నష్టాలు చవిచూశాయి. కొండచీపుర్లు, కటింగ్ మిషన్ల సంగతి ఏమిటో తెలియని పరిస్థితి. ఎన్ని చీపుర్లు తయారు చేశారో.. ఎంతకు అమ్మారో.. లాభనష్టాలేమిటో కూడా బయటకు రావు. ఆయా యంత్రాలను కమీషన్ల కోసమే కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పుట్టగొడుగులు, ఊదొత్తుల తయారీ శిక్షణ వల్ల ఒనగూరే ప్రయోజనం శూన్యం. అగరబత్తుల తయారీ ద్వారా రూ.50,830 లాభం వచ్చినట్లు చెబుతున్న అధికారులు.. బకాయిలున్న రూ.1,03,875 వసూలుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అప్పటి సిబ్బంది ప్రమేయంతో ఆ నిధులు సైతం దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలున్నాయి. నిధుల దుర్వినియోగం వెనుక అప్పటి గిరి వెలుగు ఏపీడీపైనే విమర్శలొచ్చాయి. సదరు అధికారి మీద చర్యలు తీసుకోకపోగా.. మరింత ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం ఇంకాస్త విమర్శలకు తావిచ్చింది. -
బస్సులో ప్రయాణం.. నరకప్రాయం
● యూఎన్ఓకు విద్యార్థిని ఫిర్యాదు భామిని: పాఠశాలలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న బాలికలు శారీరక హింస, అసభ్యకరమైన మాటలు, దూషణలకు గురవుతున్నట్టు హోలీక్రాస్ గ్రో క్లబ్ సభ్యురాలు చాందిని ఐక్యరాజ్యసమితికి శనివారం ఫిర్యాదు చేశారు. జనాలతో నిండిన బస్సుల్లో ప్రయాణంతో విద్యార్థులు నిత్యం నరకం అనుభవిస్తున్నట్టు వివరించారు. ఐక్యరాజ్యసమితి నిర్వహించే మహిళల స్థితిగతుల కమిషన్ సమావేశం (సీఎస్డబ్ల్యూ – 70) సందర్భంగా జరిగిన అంతర్జాతీయ వర్చువల్ కార్యక్రమంలో గర్ల్స్ రోడ్ మ్యాప్ టు జస్టీస్లో యువ ప్యానల్ స్పీకర్గా చాందిని తన అభిప్రాయాలు వెల్లడించారు. బాలికలు హింసకు గురైనప్పుడు వారి తల్లిదండ్రులు నిర్భయంగా పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగలిగే స్నేహపూర్వక పోలీస్ వ్యవస్థ ఉండాలన్నారు. పిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచాలని కోరారు. హోలీక్రాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్లో క్లబ్లు బాలికల అవసరాలను గుర్తించి చైతన్యపరుస్తున్నట్టు డైరెక్టర్ ప్రభుదాస్ తెలిపారు. -
గూడ్స్ రైలులో మంటలు
● అర్ధ గంట పాటు కనిమెరక గేటు సమీపంలో నిలిచిపోయిన రైలు ● మంటలు ఆర్పిన తర్వాత బయలుదేరిన రైలు బొండపల్లి: మండలంలోని కనిమెరక – దావాలపేట రెల్వేగేట్లకు సమీపంలో విశాఖపట్టణం నుంచి గజపతినగరం వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో బొగ్గు వ్యాగిన్లో శనివారం మంటలు రావడంతో అర్ధ గంట పాటు నిలిపేశారు. బొగ్గు వ్యాగన్లో మంటలు రావడాన్ని గ్యాంగ్మన్లు పైడి సీతారాం, బి.సూర్యనారాయణ గమనించి అప్రమత్తమై రైలుకు ఎర్ర జెండా ఊపి నిలిపేశారు. దీంతో గూడ్స్ డ్రైవర్ల వద్ద ఉన్న మంటలను ఆర్పే యంత్రాలతో వాటిని అదుపు చేశారు. తరువాత రైలును యధావిధిగా పంపించారు. దీంతో ఆ మార్గంలో కాసేపు రైళ్ల రాకపోకలను నిలిపేశారు. అదే మార్గంలో వస్తున్న వందేభారత్ రైతులను వేరే మార్గం ద్వారా పంపించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. -
కనులపండువగా సాంస్కృతికోత్సవం
విజయనగరం: ఉగాది సంబరాలు పేరిట విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి, ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య, చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ సంయుక్తంగా శనివారం నిర్వహించిన సాంస్కృతికోత్సవంలో పదనిసలు పల్లవించాయి. ప్రదర్శనలు పరవళ్లు తొక్కాయి. చిన్నారుల నృత్య ప్రదర్శనలు కనువిందు చేశాయి. కళాకారుల గీతాలు వీనుల విందుగావించాయి. మొత్తంగా సాంస్కృతికోత్సవం పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించింది. సమాఖ్య వ్యవస్థాపకులు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవ చైతన్యానికీ విశ్వసౌందర్యానికీ ప్రతీక ఉగాది పర్వదినమని పేర్కొన్నారు. కొత్త ఆశల చిగుళ్లను ఆవిష్కరించే ఉగాది తెలుగువారి తొలి పండుగగా చెప్పారు. వసుధ మీదకు వసంతం వస్తోందని త్వరలో రానున్న ఉగాది విజయనగరం ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ కాలం మార్పుల ప్రవాహమని, సుఖ దుఃఖాలు, శుభాశుభాల నిరంతర పరంపరగా వాఖ్యానించారు. 2026 ఉగాదిని పురస్కరించుకుని నృత్య రంగంలో వరలక్ష్మీత్యాగరాజ కళాశాలకు చెందిన గాయత్రి, అమృతవర్షిణి డ్యాన్స్ స్కూల్కు చెందిన తెలికిచెర్ల సౌమ్య, లయ లాస్య డ్యాన్స్ స్కూల్కు చెందిన బెల్లాన రాజు, విశ్వకర్మ డ్యాన్స్ అకాడమీకి చెందిన ప్రవీణ్కుమార్ ఆచార్య, కుమారి హర్షితలకు, సేవారంగం నుంచి ముళ్లపూడి సుభద్రాదేవి, డివి.సత్యనారాయణ, డిమ్స్ రాజు, తాడేపల్లి నాగేశ్వరరావులకు, పాత్రికేయ రంగం నుండి కె.జె.శర్మ, మజ్జి శివకుమార్లకు, వెంట్రిలాక్విజమ్ నుంచి శ్రీనివాస పండిట్, ఫొటోగ్రఫీ రంగం నుంచి బుర్రా శ్రీనివాసరావులకు, కళారంగం నుంచి గంటాలక్ష్మీలకు ఉగాది పురస్కారాలను సమాఖ్య అధ్యక్షులు గురుప్రసాద్తో కలసి చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముందుగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యప్రదర్శనలు అందరినీ అలరించాయి. చిన్నారులను వరలక్ష్మీ త్యాగరాజ నృత్య కళాశాల వ్యవస్థాపకురాలు లక్ష్మిరామదాసు ఆశీర్వదించారు. -
లోక్ అదాలత్లతో వేగవంతమైన పరిష్కారం
పార్వతీపురం: లోక్ అదాలత్లతో సమస్యలు పరిష్కారం వేగవంతంగా జరుగుతుందని పార్వతీపురం రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్, చెక్బౌన్స్ తదితర కేసులను రాజీ చేశారు. ఇందులో మోటార్ ఏక్సిడెంట్ కేసులు 8, సివిల్ దావాలు 29, క్రిమినల్ కేసులు 855 ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్లతో విలువైన సమయం, వ్యయం ఆదా అవుతుందన్నారు. లోక్ అదాలత్లో పరిష్కారం అయిన కేసులకు సంబంధించి కక్షిదారులు గతంలో చెల్లించిన కోర్టు ఫీజును తిరిగి పొందవచ్చునని న్యాయ సేవాధికార సంస్థ పేర్కొందన్నారు. సదస్సులో అడిషనల్ జుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ జె.సౌమ్య జోస్పిన్, లోక్ అదాలత్ సభ్యులు ఎన్.శ్రీనివాసరావు, వెంకటరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 108లో ప్రసవం సీతంపేట: మండలంలోని వెదుల్లవలస గ్రామానికి చెందిన గర్భిణి శనివారం 108లో ప్రసవమైంది. సవర సుమిత్ర అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. వెంటనే ఈఎంటీ రవిబాబు, పైలేట్ రమణ గ్రామానికి చేరుకొని గర్భిణీని తీసుకువస్తుండగా దిబ్బగూడ గ్రామం వద్దకు వచ్చేసరికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో వాహనాన్ని పక్కకు ఆపి సిబ్బంది సుమిత్రకు ప్రసవం చేయించారు. సుమిత్ర మూడో కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలను స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. వీరు చేసిన సేవలకు గ్రామస్తులు కుటుంబ సభ్యులు అభినందించారు. కాట్రగడ వైపు ఏనుగుల పయనం భామిని: మండలంలోని కాట్రగడ వైపు ఏనుగులు శనివారం పయనమయ్యాయి. గ్రామ సమీపంలోని మొక్కజొన్న పంటలను ఆహారంగా తీసుకుంటుండడంతో పంట మొత్తం నాశనం అవుతున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి నేరడి బ్యారేజి వద్ద వరద కాలువలో దిగి ఆవలకు దాటినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం నేరడి, కాట్రగడ, బొమ్మిక ప్రాంత పంట పొలాలను తీవ్ర నష్టం కలిగిస్తున్నట్టు రైతులు వాపోతున్నారు. ముగిసిన ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు పార్వతీపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా సాగిన ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు శనివారం ముగిశాయి. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నేత్ర వైద్య అధికారి జీరు నగేష్రెడ్డి పర్యవేక్షణలో ఆఫ్తాల్మిక్ అధికారులు, నేత్ర వైద్య సహాయకులు కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు, స్క్రీనింగ్ పరీక్షలు, ర్యాలీలు చేపట్టి నీటి కాసుల వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కంటి చూపు సంరక్షణపై సూచనలు చేశారు. ముందస్తు గుర్తింపుతోనే నివారణ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో రోగులకు నేత్ర పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ మేనేజర్ డాక్టర్ సూరయ కౌశిక్ మాట్లాడుతూ గ్లకోమా బాధితులను గుర్తించి ప్రాధమిక దశలో ఉన్న వారికి చికిత్స అందించి మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని మెరుగైన చికిత్స, శస్త్రచికిత్సల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆఫ్తాల్మిక్ ఆఫీసర్ కృష్ణారావు, ఆప్టో మెట్రిస్ట్ స్వాతి, శిక్షణ పొందుతున్న నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
కనులపండువగా శ్రీనివాసుని కల్యాణం
డెంకాడ: చింతలవలస ఐదో ఏపీఎస్పీ బెటాలియన్లో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి కల్యాణం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజాము నుంచే సుప్రభాత సేవ, అర్చనలు, ప్రత్యేక హోమాలు చేపట్టారు. సాయంత్రం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య స్వామి కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్, ఉమాదేవి దంపతులు శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసునికి కల్యాణంలో పాల్గొన్నారు. వందలాది మంది భక్తులు, బెటాలియన్ అధికారులు, సిబ్బంది కల్యాణాన్ని తిలకించారు. -
సమాజాన్ని చైతన్యపరచాలి
● యూటీఎఫ్ మహిళా సదస్సులో సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు పి.మణివిజయనగరం అర్బన్: మహిళలపై జరుగుతున్న అణచివేత, లింగవివక్ష, భౌతిక దాడులలను ఎదుర్కొనేందుకు ఉపాధ్యాయులు సమాజంలో చైతన్యం తీసుకురావాలని సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు పి.మణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా పరిషత్ మినిస్ట్రీరియల్ హాల్లో ‘సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆమె ముఖ్యవక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల మూసివేత కారణంగా బాలికలు విద్యకు దూరమవుతున్నారని, ఇది సమాజాభివృద్ధికి ప్రతికూలమన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు మాట్లాడుతూ.. మహిళా ఉపాధ్యాయుల కోసం పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకు యూటీఎఫ్ పోరాటం చేస్తోందన్నారు. మహిళా కమిటీ కన్వీనర్ జి.సుశీల, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కె.కస్తూరి, రాష్ట్ర కౌన్సిలర్ బీబీఎల్ మాధవీలత, తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ భాస్కరరావు, కోశాధికారి సీహెచ్ తిరుపతినాయుడు, జిల్లా కార్యదర్శులు కె.ప్రసాద్, ఎ.శంకరరావు, జి.రాజారావు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు జేఆర్సీ పట్నాయక్, రాష్ట్ర కుటుంబ సంక్షేమ డైరెక్టర్ జేఏవీఆర్కే ఈశ్వరరావు, సీనియర్ నాయకుడు డి.రాము, తదితరులు పాల్గొన్నారు. -
వాహనాల్లో కుక్కేసి ప్రమాదాల్లోకి నెట్టేసి..
ఒక్క నిమిషం ఆలోచిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చు.. ఆలస్యమైనా సురక్షితంగా ఇంటికి వెళ్లాలన్నా ఆలోచనా ఉన్నా ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఓవర్ లోడ్ వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అటు ఆటో డ్రైవర్లలో గాని ఇటు ప్రయాణికుల్లో గాని మార్పు రావడం లేదు. ముగ్గురు, నలుగురు ఎక్కాల్సిన ఆటోలో పదుల సంఖ్యలో ప్రయాణికులను కుక్కేస్తున్నారు.. దీంతో ఏమాత్రం అదుపు తప్పినా విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోక తప్పదు. అలాగే ద్విచక్ర వాహనదారులు కూడా ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు.. జిల్లా కేంద్రంలో శనివారం సాక్షి కంట పడిన ప్రమాదకర ప్రయాణాలు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం లగేజ్ వాహనంలో ప్రయాణికులుఆటోల్లో కిక్కిరిసిన ప్రయాణికులు -
ఎక్స్పోలో సీతం విద్యార్థుల ప్రతిభ
విజయనగరం అర్బన్: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన ఎలెక్సెంట్రా – 2026లో భాగంగా నిర్వహించిన ప్రాజెక్ట్ ఎక్స్పోలో పట్టణానికి చెందిన సీతం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో సీతం కళాశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్కు ద్వితీయ బహుమతి అభించింది. కళాశాల ఈసీఈ విభాగానికి చెందిన బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థులు ఎం.హైమ, ఎస్.తేజశ్రీవల్లి, పి.అఖిల్, కె.శ్రీనివాసరావు బృందం ‘ఓపెన్ సివిని ఉపయోగించి వర్చువల్ డాష్బోర్డ్’ అనే వినూత్న ప్రాజెక్ట్ రూపొందించారు. కంప్యూటర్ వెబ్కెమెరా ద్వారా చేతి కదలికలను గుర్తించి సంబంధిత లోడ్లను పనిచేయించే విధంగా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ఈ సాంకేతికతను ముఖ్యంగా ఏటీఎంలు, పరిశ్రమలలో వినియోగించవచ్చని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, ఈసీఈ విభాగాధిపతి టి.దామోదరనాయుడు విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేసి అభినందించారు. ముగిసిన ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్ శిక్షణ సీతం ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) విభాగం ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రికల్ వెహికల్ డిజైన్’ అంశంపై వారం రోజుల పాటు నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతితిగా హాజరైన ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతినిధి ఎస్.విష్ణువర్థన్ ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్, సిమ్యులేషన్ ప్రాజెక్ట్ల రూపకల్పనపై అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల డైరెక్టర్ డాక్టర్ శశిభూషణరావు ఆయన్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ వై.నరేంద్రకుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన అజాగ్రత్త..
● లారీ టైర్ కింద పడి డ్రైవర్ మృతి కొత్తవలస: మండలంలోని కంటకాపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఒక డ్రైవర్ అజాగ్రత్త వల్ల మరో డ్రైవర్ ప్రాణం పోయింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మొయ్యి శ్రీను (53) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామానికి చెందిన మొయ్యి శ్రీను లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తవలస మండలం కంటకాపల్లి గ్రామ సమీపంలో గల రైల్వేస్టేషన్ బొగ్గు యార్డు నుంచి లారీలో బొగ్గు లోడ్ చేసుకుని సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఆపాడు. లారీ నుంచి బొగ్గు ధూళి పైకి ఎగరకుండా ఉండేందుకు టార్పాలిన్ కప్పుతున్నాడు. ఈ క్రమంలో లారీ కింద పడుకుని తాడు కడుతుండగా.. అదే సమయంలో అక్కడే ఉన్న మరో లారీ రివర్స్గా వస్తూ శ్రీను తలపైనుంచి వెళ్లిపోయింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. లారీని రివర్స్ చేస్తున్న డ్రైవర్ అజాగ్రత్త వల్ల మరో లారీ డ్రైవర్ మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నేడు ఉల్లాస్ ఎఫ్ఎల్ఎన్ఏటీ పరీక్ష విజయనగరం అర్బన్: వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉల్లాస్ ఎఫ్ఎల్ఎన్ఏటీ పరీక్ష ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు వయోజన విద్య నోడల్ అధికారి ఎ.వేణుగోపాలకృష్ణ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 27 మండలాలు, 4 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 1,11,369 మంది అభ్యాసకులు పరీక్షకు హాజరుకానుండగా ఇందుకు 1,356 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు ఎస్జీటీలు, అంగన్వాడీ ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించినట్లు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం వయోజన విద్యా విభాగానికి చెందిన ప్రదీప్ బి.హెదాపూను జిల్లా పరిశీలకుడిగా నియమించిందని తెలిపారు. అదేవిధంగా జిల్లా సమన్వయ కమిటీతో పాటు మండల స్థాయిలో ఎంపీడీఓలు, ఏపీఎంలు సీడీపీఓలు, మున్సిపల్ స్థాయిలో సీఎంఎంలు, వయోజన విద్యాశాఖ పర్యవేక్షకులు పరీక్షల నిర్వహణను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారన్నారు. మృతిపై అనుమానాల్లేవు.. విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ పీఎస్ పరిధిలోని తోటపాలెం రామ మందిరం సమీపంలో నివసిస్తున్న మోహన్ అనే వ్యక్తి శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈయన రక్తపు మడుగులో పడి ఉండడంపై మొదట్లో అనుమానాలు వ్యక్తం చేసినా ప్రస్తుతం ఎటువంటి అనుమానాలు లేవని సీఐ చౌదరి తెలిపారు. ఈ మేరకు మృతుని భార్య పద్మావతి కుమార్తెతో కలిసి శనివారం స్టేషన్కు వచ్చి తన భర్త మృతిపై ఎటువంటి అనుమానాల్లేవని చెప్పిందన్నారు. మద్యం మత్తులో మంచంపై పడిపోవడం వల్ల తలకు గాయమై రక్తం కారినట్లు క్లూస్ టీమ్ సభ్యులు కూడా తేల్చారన్నారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన రామనారాయణంలో శనివారం నిర్వహించిన బాలల నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. బొబ్బిలి గ్రామానికి చెందిన పవిత్ర నృత్యాలయం బృందంచే ప్రదర్శించిన వివిధ నృత్య రూపకాలు అలరించాయి. అనంతరం బాలలకు ఆలయ మేనేజర్ ఏవీ రమణ ప్రశంసాపత్రాలు అందించారు. ఉచిత నేత్ర వైద్యశిబిరానికి స్పందన విజయనగరం టౌన్: నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో స్వామి కంటి ఆస్పత్రి సౌజన్యంతో శనివారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. బీఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ దోసూరి దాలినాయుడు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మురళీధర్, శ్రీధర్, అశోక్, సాయి ప్రసాద్, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఆలుగు వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఎంపికలో ప్రాధాన్యం..
యువికా ఎంపిక ప్రక్రియంలో మార్కులకు ఉండే ప్రాధాన్యతను విద్యార్థులు గుర్తించాలి. ముఖ్యంగా 8వ తరగతిలో వచ్చే మార్కులకు 50 శాతం, రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శనలు, ప్రతిభా పరీక్షల్లో తొలి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులకు 10 శాతం, స్కౌట్, ఎన్సీసీ విభాగాలకు చెందిన విద్యార్థులకు 5 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. ఎంపికై న విద్యార్థుల ఖర్చులు ఇస్రో భరిస్తుంది. దేశంలో ఉన్న ఏడు ఇస్రో కేంద్రాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ప్రాంత పరిధిలో ఉండే శ్రీహరికోట, హైదరాబాద్ కేంద్రాల్లో శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. – గిరడ లక్ష్మణరావు, జిల్లా సైన్స్ అధికారి, పార్వతీపురం మన్యం -
హెచ్పీవీ టీకాతో క్యాన్సర్కు చెక్..
సీతానగరం: మహిళలకు ఆశించే ప్రమాదకర గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నుంచి రక్షణకు హెచ్పీవీ టీకా ఉపయోగపడుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్. భాస్కరరావు తెలిపారు. స్థానిక పీహెచ్సీలో చేపడుతున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా ఎన్సీడీ అధికారి టి. జగన్మోహన్రావుతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ భాస్కరరావు మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు నిండి పదిహేనేళ్ల లోపున్న బాలికలకు ఈ టీకా వేస్తున్నట్లు చెప్పారు. ఏ ఒక్క బాలిక సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం టీకా ఉచితంగా వేస్తోందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు పది వేల బాలికలకు టీకాలు వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్కు ముందు ఆభా ఐడీతో యువిన్లో రిజిస్ట్రేషన్ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారి పి. ఉషారాణి, యుడీసీ మురళి, సూపర్వైజర్ వెంకటరమణ, ఆ రోగ్య పర్యవేక్షకులు భవానీ, రవణమ్మ, గోపాల్నాయుడు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు -
పరిశ్రమల్లో మెటలర్జీ విభాగానికి అధిక ప్రాధాన్యం
విజయనగరం రూరల్: మెటలర్జీ విభాగం విద్యార్థులకు పరిశ్రమల్లో అధిక ప్రాధాన్యం ఉంటుందని మెటలర్జీ విభాగం పరిశోధకుడు డాక్టర్ బి.శివకుమార్ అన్నారు. విజయనగరం జేఎన్టీయూ జీవీ లో మెటలర్జికల్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో శుక్రవా రం నిర్వహించిన ‘ఈఐఎన్ఈఎన్– 2026’ 11వ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఆధునిక పరిశ్రమల్లో మెటలర్జీ ప్రాముఖ్యత, మెటీరియల్ సైన్స్ అభివృద్ధిపై అవగాహన కల్పించారు. డాక్టర్ జి.వేణుగోపాల్నాయుడు బియాండ్ ది డిగ్రీ అంశంపై ప్రేరణాత్మకంగా వివరించారు. డిగ్రీకి మించి నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై మార్గదర్శనం చేశారు. అనంతరం అతిథులుగా హాజరైన వారిని ఘనంగా సత్కరించారు. సదస్సు చైర్మన్ కె.శ్రీనివాస ప్రసాద్, వర్సిటీ ప్రిన్సిపాల్ డాక్టర్ కెసీబీ రావు, వివిధ కళాశాల ఆచార్యు లు, వివిధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఒకే ఒక్కడు!
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లా సంయుక్త కలెక్టర్ సి. యశ్వంత్కుమార్రెడ్డిపై అదనపు భారం పడుతోంది. రోజురోజుకూ ఆయన విధులు, చూడాల్సిన బాధ్య తలు ఎక్కువవుతున్నాయి. జిల్లా పరిపాలనలో కలెక్టర్ తర్వాత, సంయుక్త కలెక్టర్ కీలకం. రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయం, సర్వే వంటి కీలక విభాగాల పర్యవేక్షణ ఆయనదే. ప్రస్తుతం కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి కలెక్టర్ల సమావేశంలో పాల్గొనేందుకు అమరావతి వెళ్లారు. రెండు రోజులపాటు ఆయన సమావేశాల్లో ఉంటారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న జేసీనే కలెక్టర్ బాధ్యతలనూ చూడాల్సి వ స్తోంది. ఇదే సమయంలో ఐటీడీఏ ఇన్చార్జి పీఓగా యశ్వంత్కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. సబ్ కలెక్టర్ డిపార్ట్మెంట్ పరీక్షల నిమిత్తం వెళ్లడంతో ఆ బాధ్యతలవైపూ దృష్టి పెట్టాల్సి వస్తోంది. మరోవైపు ప్రత్యేకాధికారుల పాలనలో భాగంగా పార్వతీపు రం మున్సిపాలిటీ బాధ్యతలనూ జేసీకే అప్పగించా రు. ఇటు సమీక్షలు, అటు తనిఖీలంటూ ఆయనకు క్షణం కూడా తీరిక దొరకడం లేదు. ప్రస్తుతం జిల్లాకు సంబంధించి పెద్ద దిక్కుగా ఆయనే అన్ని పనులనూ పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
బీజేపీకి నిమ్మక జయరాజు రాజీనామా
కురుపాం: బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు శాసన సభ మాజీ సభ్యుడు నిమ్మక జయరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ పరిస్థితు లు, వ్వక్తిగత కారణా ల దృష్ణ్యా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవడంతో సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యాలయానికి రాజీనామా లేఖను పంపించామన్నారు. విజయనగరం: వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును ఆ పార్టీ నియోజకవర్గ పరిశీలకులుగా నూతనంగా నియామకమైనవారు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో గజపతినగరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకులుగా నియమితులైన జెడ్పీ మాజీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా పరిశీలకురాలు శోభా హైమావతి పూలమొక్క ను అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరికీ మజ్జి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి అందరం కలిసికట్టు గా కృషి చేయాలని ఆకాంక్షించారు. భామిని: మండలంలో నేరడి–బి నుంచి నాలుగు ఏనుగుల గుంపు నేరడి–బ్యారేజ్ వైపు శుక్రవారం వెళ్లాయి. కాట్రగడ, నేరడి రైతులు సాగుచేసిన మొక్కజొన్న, అరటి పంటలకు నష్టం కలిగిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల మళ్లింపులనకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గుర్ల: మండలంలోని జమ్ముపేటకు చెందిన రైతు కురుమునెల్లి దాలినాయుడు (33) పురుగులు మందు తాగి శుక్రవారం మృతి చెందాడు. వివరాల్లోకి వేళ్తే... దాలినాయుడు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు . ఇటీవల కాలంలో పంటలకు పెట్టిన పెట్టుబడి రాకపోవడం, తెచ్చిన అప్పులు తీరకపోవడంతో మనోవేదనకు గురై గురువారం రాత్రి పురుగుల మందు తాగినట్లు స్థానికులు చెబుతున్నారు. గమనించి కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స జరుగుతుండ గా శుక్రవారం మృతి చెందాడు. గుర్ల పోలీసు లు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య నీలవేణి, కుమార్తెలు ఉష, ఝాన్సీ ఉన్నారు. రాజాం: కొత్తవలస గ్రామంలో రేషన్ డిపో డీలర్పై చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడుతున్న డీలర్ను తొలగించాలంటూ గ్రామానికి చెందిన 200 మంది రేషన్ లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా చేశారు. డీలర్ ఆగడాలను తహసీల్దార్ ఎం.రాజశేఖరానికి వివరించారు. -
తప్పులు దిద్దలే.. కోతలు తప్పలే!
ఎకరాన్నరపైగా భూమిని కౌలు కు తీసుకుని సాగు చేస్తున్నాను. సేద్యంపై పెట్టుబడి డబ్బులు కూడా రావడం లేదు. ప్రభుత్వ సాయం లేదు. గత ప్రభుత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతుల భరోసా వచ్చేది. ప్రస్తుతం రావడం లేదు. పలుమార్లు అధి కారులను కలసి విజ్ఞప్తులు ఇచ్చినా ఫలితం లేకపోతోంది. నాలాంటి రైతులు చాలా మంది ఉన్నారు. – కె.గురుమూర్తి, కౌలురైతు, లంబూరు గ్రామం, పాలకొండ నాకున్న 84 సెంట్లతోపాటు, రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నా. ఇదే మా కుటుంబ పోషణకు ఆధారం. గత ప్రభుత్వంలో రైతు భరోసా అందేది. ప్రస్తుతం ఎటువంటి ఆర్థిక సాయ మూ లభించడం లేదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయాం. మదుపులు, కౌలు చెల్లించేందుకు చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. అప్పులపాలయ్యాను. – తిర్లంగి సింహాచలం, రైతు, గరుగుబిల్లి గ్రామం, పాలకొండ సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్: పీఎం కిసాన్తోపాటు, అన్నదాత సుఖీభవ నిధులను శుక్రవారం రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. అధిక శాతం మందికి రాత్రయినా.. ఆ మొత్తం జమ కాలేదు. మరోవైపు రెండో విడత జమ చేసిన రైతులకే.. మూడో విడత కూడా లబ్ధి చేకూర్చారు. వివిధ సాంకేతిక సమస్యలు, ఇతర తప్పిదాల కారణంగా వేలాది మంది పథకానికి దూరమయ్యారు. వారంతా అప్పట్లోనే అధికారులను కలసి వినతిపత్రాలు అందజేశారు. పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పిన యంత్రాంగం.. ఏ ఒక్కరి విజ్ఞప్తినీ పరిగణనలోకి తీసుకోలేదని తాజా గణాంకాలే చెబుతున్నాయి. ఈసారి కూడా కౌలు రైతులకు ఉత్తచేయినే చూపారు. రైతాంగానికి పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం ఈ మొత్తం ఎంతగానో ఉపయోగపడుతుంది. పథకంలో కోత.. వారికి శాపంగా మారుతోంది. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు అందిస్తామన్న కూటమి ప్రభుత్వం... వివిధ కారణాలు చూపుతూ లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. అధికారంలోకి వచ్చిన మొద టి ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను పూర్తిగా ఎగ్గొట్టింది. కేంద్రం అందించే పీఎం కిసాన్ నిధులు రూ.6 వేలే రైతుల కు అందా యి. రెండో ఏడాదిలో మొదటి విడత గత ఆగస్టులోనూ, రెండో విడత నవంబరులోనూ జమ చేశారు. ప్రస్తుతం కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం రూ.4 వేలు కలిపి మొత్తం రూ.6 వేలు జమ కావాల్సి ఉంది. జిల్లాలో ఈ–పంటను ప్రామాణికంగా తీసుకుని అన్నదాత సుఖీభవ పథకానికి గత ఆగస్టులో 1,22,260 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించి, అభ్యంతరాలు కూడా స్వీకరించారు. ప్రస్తుతం కూడా మూడో విడత కింద 1,22,268 మంది రైతుల ఖాతాల్లో రూ.71.03 కోట్ల సాయాన్ని జమ చేస్తున్నట్లు ప్రకటించారు. వీరిలో పీఎం కిసాన్తోపాటు, అన్నదాత సుఖీభవ తీసుకుంటున్న వారు 1,10,650 మంది. ఒకటి, రెండో విడతల తర్వాత అర్హత కోల్పోయిన వందలాది మంది ఇచ్చిన విజ్ఞప్తులు బుట్టదాఖలే అయ్యాయి. ఒకట్రెండు విడతల్లో కొంతమందికి పీఎం కిసాన్ వాటా రూ.2 వేలే బ్యాంకు ఖాతాకు జమైంది. రాష్ట్ర వాటా అందలేదు. ఇదే విషయమై సచివాలయాల్లోనూ, కలెక్టరేట్ పీజీఆర్ఎస్లోనూ పలు మండలాల రైతులు వినతిపత్రాలు అందించారు. వారిలో ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదు. పీఎం కిసాన్కు అర్హులైన తాము.. అన్నదాత సుఖీభవకు ఎందుకు అనర్హులవుతామంటూ అధికారులను ప్రశ్నించారు. ఆధార్ నమోదు సక్రమంగా లేకపోవడం, భూమికి వేరే ఆధార్తో లింకు కావడం, పాస్ పుస్తకంలో పేరు మారకపోవడం, మ్యుటేషన్, వెబ్ల్యాండ్లో సమస్యలతో కొంతమంది పథకానికి దూరమయ్యారు. వారి సమస్యలు నేటికీ అలానే ఉండిపోయాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని సంవ త్సరాలూ రైతుభరోసా నిధులు కర్షకులకు సకాలంలో అందేవి. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పథకం కింద ఏడాదికి 1.45 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. చంద్ర బాబు ప్రభుత్వం వివిధ కారణాలు చూపుతూ 23 వేల మందికిపైగా కుదించింది. జిల్లాలో 10 వేల మందికిపైగా కౌలురైతులు ఉన్నారు. పథకంలో నిబంధనల కారణంగా వీరెవరికీ నిధులు అందడం లేదు. ‘కౌలుకు తీసుకున్నా.. ఖర్చులన్నీ పెట్టుకునేది మేమే. నష్టం వస్తే భరించేది మేమే.. అన్నదాత సుఖీభవ నిధులు గానీ, నష్ట పరిహారం గానీ మాకు ఎందుకు ఇవ్వడం లేద’ని వారంతా ప్రశ్నిస్తున్నారు.


