Parvathipuram manyam District News
-
ప్రజాగ్రహానికి రాజకీయ రంగు!
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ125 శ్రీ220 శ్రీ230సాలూరు: సాలూరులో శ్యామలాంబ పండగ అంగరంగ వైభవంగా చేసేందుకు పట్టణ ప్రజలతో పాటు లక్షలాది మంది భక్తులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు స్నేహితులు, బంధువులను పిలిచి మూడు రోజుల పాటు పండగ వైభవంగా చేసేందుకు సిద్ధమయ్యారు. అనుకున్నట్టు అంతా జరిగింది..వైఫల్యమంతా విద్యుత్ అంతరాయంలోనే కనిపించింది. మరోవైపు అంజలి రథ చక్రం విరిగడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. పట్టణ వాసులతో పాటు వచ్చిన భక్తులకు విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం చుక్కలు చూపించింది. మూడు రోజుల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయంతోనే సరిపోయింది. ఒకనొక సమయంలో స్థానికులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. పండగ పూర్తయిన తరువాత కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో పాలకులు, అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. దీంతో రోడ్లపైనే ప్రజలు విద్యుత్ సమస్యపై అర్ధరాత్రి వరకు బైఠాయించారు. అయినా అధికార పార్టీ నేతలు, అధికారుల్లో వీసమంతా చలనం లేకపోయింది. తీరా చూస్తే ఇప్పుడు దీనికి కూడా టీడీపీ శ్రేణులు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తోంది. అక్కడితో ఆగకుండా అధికారులపై అధికార పార్టీ నేతలు ఆగ్రహిస్తున్నారు. ప్రజా సమస్యలకు రాజకీయ రంగు పట్టణ ప్రజలు నాలుగు రోజుల పాటు కరెంట్ లేక ఇబ్బందులు పడి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపడితే దీన్ని ఓ పార్టీకి ఆపాదించే కుట్రలు పన్నుతున్నారు అధికార పార్టీ నేతలు. పండగ నేపథ్యంలో ప్రజలు రూ.కోట్లు ఖర్చు చేసి పండగను చేసుకున్నారు. కానీ విద్యుత్ సరఫరాలో తలెత్తిన సమస్యలతో ప్రజలు తీవ్ర అగచాట్లు పడ్డారు. సమస్య ఆందోళనకు దారితీసే పరిస్థితులు వచ్చిన ఇటు పాలకులు కనీసం దాన్ని సరిచేసే ప్రయత్నం చేయలేదు సరికదా.. ఇదంతా రాజకీయమంటూ చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ట్రాన్స్ఫార్మర్ల నాణ్యతపై అనుమానాలు పండగ కోసం సుమారు కోటి 24 లక్షల రూపాయిలతో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అధికారుల మాటలను నమ్మి ఓ అడుగు ముందుకు వేసిన మంత్రి సంధ్యారాణి ఈ విషయమై ఉత్సాహంతో పండగ ఏర్పాట్లు చేసుకోండని పిలుపునిచ్చారు. తీరా చూస్తే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికక్కడ కాలిపోయాయి. దీంతో ట్రాన్స్ఫార్మర్ల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ సరఫరా అయిన ప్రాంతాల్లో లో, హై ఓల్టేజీలు తరచూ రావడంతో ఇళ్లల్లో గృహోపకరణాలు పాడయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పండగ నేపథ్యంలో విద్యుద్దీకరణ పనుల్లో కొందరికి ముడుపులు అందాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే పండగ సమయంలో ఇంతగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పండగ సమయంలో మూడు రోజుల పాటు తలెత్తిన విద్యుత్ సమస్య నేటికీ చర్చనీయాంశంగానే ఉంది. పండగ ఏర్పాట్లలో వైఫల్యం రాజకీయాలు చేస్తున్న టీడీపీ శ్రేణులు -
కళల పరిరక్షణ అందరి బాధ్యత
● మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ అనురాధ ● ముగిసిన వాగ్దేవీ బాల సంస్కార శిక్షణ తరగతులువిజయనగరం టౌన్: కళలను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ బురిడి అనురాధ పరశురామ్ పేర్కొన్నారు. స్థానిక గురజాడ స్వగృహంలో వాగ్దేవీ సమారాధనం సంస్థ, తెలుగు భాషా పరిరక్షణ సమితితో కలిసి పది రోజుల పాటూ నిర్వహించిన వాగ్దేవీ బాల సంస్కార శిక్షణా శిబిరాల ముగింపు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాన్ని పరిచయం చేసేందుకు, వాటిని పరిరక్షించాలనే లక్ష్యంతో వాగ్దేవీ సమారాధనం సంస్థ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి మాట్లాడుతూ విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడంతో పాటూ భగవద్గీత సారాంశాన్ని పది రోజుల పాటూ వివరించామన్నారు. శతక పద్యాలపై అవగాహన పెంపొందించగలిగామన్నారు. ఈ సందర్భంగా పది రోజుల పాటూ ఉచిత రీతిన విద్యార్థులను సుశిక్షితులను చేసిన గురువులను సత్కరించి, ప్రశంసపత్రం, జ్ఞాపికలను అందజేశారు. విద్యార్థులకు బహుమతులు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు డాక్టర్ జి.ఎరుకునాయుడు, డాక్టర్ జక్కు రామకృష్ణ, అమ్మాజమ్మ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమబిందు, గురజాడ ఇందిర, మానాప్రగడ సాహితీ, కొంకెపూడి అనూరాధ, చెళ్లపిళ్ల శ్యామల, గిరిజా ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
బాలల ప్రతిభకు వేదిక బాలభవన్
● వేసవిలో ఉచిత శిక్షణకు అనూహ్య స్పందన ● పలు కళల్లో తర్ఫీదు పొందుతున్న 550 మందికి పైగా చిన్నారులు ● 32 సంవత్సరాలుగా సేవలు ● వేసవి శిక్షణకూ ఇతర జిల్లాల విద్యార్థుల హాజరురాజాం : రాజాంలోని మెంతిపేటలో ఉన్న బాలభవన్ బాలల ప్రతిభను వెలికితీసే వేదికగా మారింది. పలు కళా రంగాల్లో మక్కువ ఉన్న చిన్నారులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా పేరు తెచ్చుకుంటుంది. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ జవహర్ బాలభవన్ను ఇక్కడ 1993 జూన్ 4న ప్రారంభించారు. అప్పట్లో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించిన ఈ కేంద్రం ఇప్పుడు సొంత భవనాలతో పాటు ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందింది. మ్యూజిక్, డ్యాన్స్ రంగాల్లో కేంద్రం ప్రారంభంలో ఇక్కడ శిక్షణ ఉండేది. ఇప్పుడు 16కి పైగా కళా రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులతో పాటు వేసవిలో రాజాం వచ్చే ఇతర ప్రాంతాల విద్యార్థులకు మంచి వేదికగా ఇక్కడ బాలభవన్ వేసవి శిక్షణా తరగతులు నిలుస్తున్నాయి. ఏమి నేర్పుతున్నారంటే.. గత నెల 24న బాలభవన్లో వేసవి శిక్షణా శిబిరాన్ని రాజాంకు చెందిన పలువురు ప్రముఖుల చేతులు మీదుగా డైరెక్టర్ సుంకరి రమేష్ ప్రారంభించారు. ఈ వేసవిలో ఉచితంగా చిన్నారులకు మ్యూజిక్, డ్యాన్స్, తబలా, నాట్యం, సంగీతం, ఆర్ట్స్, టైలరింగ్ వంటి విద్యలలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. శిక్షణ నిమిత్తం 550 మంది విద్యార్థులు ఈ ఏడాది ఇక్కడ చేరారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు నృత్యం, సంగీతం శిక్షణలో ఉన్నారు. ఇక్కడి విద్యార్థులు ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో జాతీయ స్థాయి ప్రదర్శనలు ఇచ్చి అవార్డులు పొందుతున్న సందర్భాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 200లకు పైగా బాలభవన్లు, 47 బాల కేంద్రాలు పని చేస్తుండగా, రాజాం బాలభవన్కు ప్రత్యేకత ఉంటుంది. మొత్తం 16 మంది ఉపాధ్యాయులు ఈ వేసవిలో ఇక్కడ చిన్నారులకు తర్పీదునిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది.. రాజాంతో పాటు చీపురుపల్లిలో జవహర్ బాలభవన్ కేంద్రాలు ఉన్నాయి. ఎంతో కష్టపడి ఈ కేంద్రాలను నిలబెట్టాం. రాజాం బాలభవన్కు మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇక్కడ శిక్షణ పొందిన చిన్నారులు టీవీ షోల్లో సంగీతం, నృత్యం వంటి రంగాల్లో పాల్గొనే అవకాశం పొందారు. కొంతమంది ప్రైవేట్ ఈవెంట్లు చేస్తూ రాణిస్తున్నారు. వేసవిలో చిన్నారులు సమయాన్ని వృథా చేసుకోకుండా కాలాన్ని ఆహ్లాదకరంగా సద్వినియోగం చేసుకునేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. – డాక్టర్ సుంకరి రమేష్, డైరెక్టర్, బాలభవన్ 550 మందికి పైగా విద్యార్థులు రాజాం బాలభవన్ వేసవి శిక్షణలో అనూహ్య స్పందన కనిపిస్తుంది. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు రకాల వినోద ప్రదర్శనల్లో తన సత్తాను చాటుతున్నారు. బాలభవన్ జాతీయ వేడుకల్లో ఇక్కడ బాలభవన్ గత 2018 నుంచి మూడు పర్యాయాలు ప్రథమ స్ధానాన్ని సాంస్కృతిక కళా రంగాల ప్రదర్శనలో నిలిచింది. దీంతో వేసవి శిక్షణ కార్యక్రమాల్లో ఇక్కడకు ఎక్కువగా విద్యార్థులు వస్తుంటారు. రాజాంలో ఉన్నవారే కాకుండా శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉంటున్న చిన్నారులు సెలవులు కారణంగా రాజాం రావడంతో వారంతా ఈ శిక్షణలో పాల్గొని పలు కళారంగాల్లో తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నారు. -
ప్రణాళిక ప్రకారం వచ్చి.. వివాదం చేసి!
ఉదయం 11 గంటల సమయంలో మున్సిపల్ సమావేశం ప్రారంభమైంది. అప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక, అక్కడ సిబ్బంది సైతం నిర్ఘాంతపోయారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన కౌన్సిలర్ మంత్రి రవి మైకు తీసుకున్నారు. రౌడీ షీటర్లు ఇక్కడ ఉండొచ్చా.. వారికి ఇక్కడ కూర్చొనే అర్హత ఉందా? అంటూ వివాదం రాజేశారు. దీనికి స్పందించిన 25వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఎన్.సుధీర్.. దళితుడినైన తనపై అన్యాయంగా కూటమి ప్రభుత్వం వారే కేసు పెట్టించారని తెలిపారు. ప్రభుత్వ సంస్కృత పాఠశాలలో వాచ్మన్గా పని చేసిన వ్యక్తి కౌన్సిల్ సభ్యుడిగా ఉండవచ్చా? దీనికి ఏమైనా నిబంధనలు ఉన్నాయా? అని మంత్రి రవిని ఉద్దేశిస్తూ, అధికారులను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహంగా ఊగిపోయిన కౌన్సిలర్ రవి.. వివాదానికి దిగా రు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదన పెరిగింది. తోపులాటకు దారి తీసింది. పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అక్కడే ఉన్నప్పటికీ వారించే ప్రయత్నం చేయలేదు. కమిషనర్ వెంకటేశ్వర్లు అక్కడే ఉన్న పోలీసులకు సైగ చేశారు. దీంతో పోలీసులు కేవలం వైఎస్సార్సీపీకి చెందిన 25, ఒకటో వార్డు కౌన్సిలర్లు సుధీర్, ఆర్.బంగారునాయుడులను తోసుకుంటూ, నెట్టు కొంటూ బయటకు తరిమేశారు. ఎమ్మెల్యే, పోలీసుల వైఖరిని వైఎస్సార్సీపీ సభ్యులు తప్పుపట్టారు. ఏదో వివాదం చేద్దామనే ఉద్దేశంతోనే కూటమి సభ్యులు ఇక్కడికి వచ్చినట్లు అర్థమవుతోందని.. బడ్జెట్కు తాను ఆమోదం తెలుపుతున్నామని చెబుతూ చైర్పర్సన్ గౌరీశ్వరి సీటు నుంచి లేచి వెళ్లిపోయారు. ఆమె వెంటే వైఎస్సార్సీపీ సభ్యులు కూడా వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే, కమిషనర్, పోలీసుల వైఖరిని నిరసిస్తూ కార్యాలయం గేటు వద్ద ధర్నా చేపట్టారు. -
చిట్టిబాబుకు జాతీయ అవార్డు
విజయనగరం టౌన్: భారత రాజ్యాంగ విధాన పరిషత్ సభ్యుడు, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా వ్యవస్థాపకుడు, భారతరత్న సి.సుబ్రహ్మణ్యం జాతీయ అవార్డును జిల్లాకు చెందిన దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చిట్టిబాబు శుక్రవారం న్యూఢిల్లీలోని ఇండియన్ హేబిటేట్సెంటర్లో అందుకున్నారు. ఛీప్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సత్యానంద మిశ్రా, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా డైరెక్టర్ బిరాజ్ పట్నాయక్, ఎన్సీడీహెచ్ఆర్ నేషనల్ జనరల్ సెక్రటరీ బీనాపలికల్ తదితరుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. సమాజ మార్పునకు కృషిచేసే 14 మందిని గుర్తించి జాతీయ అవార్డు అందించారని, అందులో తనను ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. -
సత్వర వైద్యంతో మలేరియా నివారణ
గుమ్మలక్ష్మీపురం: మలేరియా బాధితులకు సత్వరమే మెరుగైన వైద్యసేవలు అందించాలని మలేరియా నివారణ విభాగం డిప్యూటీ డైరెక్టర్ రామనాథరావు అన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని దుడ్డుఖల్లు పీహెచ్సీ పరిధిలోని జర్న గ్రామంలో మలేరియాతో బాధపడుతూ చికిత్స పొందిన వారిని శుక్రవారం కలిశారు. వైద్యసేవలపై ఆరా తీశారు. పీహెచ్సీలోని ల్యాబ్ను తనిఖీ చేశారు. ల్యాబ్లో చేపడుతున్న పరీక్షలతో పాటు జ్వరాల అదుపునకు చేపడుతున్న చర్యలపై వైద్యాధికారి ప్రవీణ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేగిడి పీహెచ్సీ పరిధిలోని పెంగవ గ్రామాన్ని సందర్శించారు. దోమల లార్వా ప్రదేశాలను గుర్తించి ఫ్రైడే డ్రైడే ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు. రేగిడి పీహెచ్సీ వైద్యులు, వైద్య సిబ్బందితో మాట్లాడుతూ జ్వరంతో వచ్చే ప్రతిరోగికి మలేరియా పరీక్షలు నిర్వహించాలని, నిర్థారణ అయితే సత్వరమే మందులను అందజేసి, పర్యవేక్షణతో కూడిన వైద్య సేవలను అందించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా మలేరియా నివారణ అధికారి వై.మణి, సహాయ అధికారి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
ఎల్ఎంసీ పోస్టు... రూ.10 లక్షలు!
● విద్యుత్ శాఖలో రూ.38 లక్షలకు నాలుగు పోస్టుల బేరం? ● ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదరక కలగని మోక్షం సాక్షి, పార్వతీపురం మన్యం: విద్యుత్ శాఖలో లోడ్ మోనటరింగ్ సెల్ (ఎల్ఎంసీ) విభాగంలో పాలిటెక్నికల్ విద్యార్హతతో భర్తీచేసే నాలు గు పోస్టులకు భారీ ‘ధర’ పలికినట్టు సమాచారం. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఈ పోస్టులను టెండరు ద్వారా కాంట్రాక్టర్కు అప్పగిస్తారు. కొత్త సర్కిల్ కార్యాలయం కావడంతో ఈ నాలుగు పోస్టులతో పాటు.. మూడు స్వీపర్ పోస్టులు మంజూరయ్యాయి. ఎల్ఎంసీ విభాగ పోస్టులకు గత నెలలోనే టెండర్ ప్రక్రియ చేపట్టారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీరు విధుల్లో చేరిపోవాల్సి ఉంది. ఒక్కొక్కరికీ రూ.25 వేలు వేతనం చొప్పున టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరే నేరుగా వారికి చెల్లిస్తారు. ఈ పోస్టులకు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే కేవలం ప్రజాప్రతినిధుల సిఫారసులతో నియామక ప్రక్రియ పూర్తి చేసేశారు. మొత్తం నాలుగు ఖాళీల్లో ఒకటి కార్పొరేట్ కార్యాలయానికి చెందిన ఒక అధికారి తమ వారి పేరును సిఫారసు చేసుకోగా.. మిగిలిన మూడు పోస్టులూ జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకూ రూ.10 లక్షల వరకు బేరం పె ట్టి, అమ్ముకున్నట్లు ఆ శాఖలోనే వినిపిస్తోంది. మొత్తంగా నాలుగు పోస్టులకూ రూ.38 లక్షల వరకు పలికినట్లు సమాచారం. పార్వతీపురం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధికి విషయం తెలిసి, తనకు తెలియకుండా ఎలా వేసుకుంటారని అభ్యంతరం పెట్టడంతో వివాదం రేగినట్లు తెలిసింది. మొత్తం ప్రక్రియలో ఈపీడీసీఎల్ పార్వతీపురం సర్కిల్ ఎస్ఈ పాత్ర కూడా నామమాత్రమైపోయిందని కార్యాలయ వర్గాల భోగట్టా. ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య పోస్టు ల పంపకంలో వివాదం రేగడం వల్లే నేటికీ వారు విధుల్లో చేరకుండా ఉండిపోయారు. అంత మొత్తంలో వసూలా? లోడ్ మోనటరింగ్ సెల్ విభాగంలో భర్తీ చేస్తు న్న ఈ నాలుగు పోస్టులూ కేవలం కాంట్రాక్టు పద్ధతిలోనివే. ఏటా కాంట్రాక్టును పొడిగించా ల్సి ఉంటుంది. విద్యుత్ సరఫరా పరిస్థితిని ఎ ప్పటికప్పుడు గమనిస్తూ.. రీడింగ్ ఎంత తగ్గింది, ఏ మేరకు వచ్చింది అన్న వివరాలు పరిశీలిస్తూ. పైకి పంపడం వీరి ప్రధాన విధి. ఈ పోస్టు కోసం రూ.10 లక్షలు చొప్పున లంచంగా తీసుకోవడం.. నిరుద్యోగులు ఇవ్వడంపైనా ఆ శాఖలోని ఉద్యోగులే ఆశ్చర్యపోతున్నారు. -
పైడితల్లి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు శుక్రవారం స్వర్ణ పుష్పార్చనలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు శంబర కృష్ణ, సాయికిరణ్, అచ్యుతశర్మ, దూసి శివప్రసాద్లు శాస్త్రోక్తంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఇంచార్జ్ ఈవో కెఎన్విడివి.ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. వన్ స్టాప్ సెంటర్లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు విజయనగరం ఫోర్ట్: ఐసీడీఎస్ పరిధిలోని వన్ స్టాఫ్ సెంటర్లో ఉద్యోగాల భర్తీకి కలెక్టరేట్లో శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. మల్టీ పర్పస్ స్టాఫ్ కమ్ కుక్ ఫోస్టు –1, పారా లీగల్ పర్సనల్ పోస్టు – 1కి ఇంటర్వ్యూలు నిర్వహించారు. పారా లీగల్ పోస్టుకు ముగ్గురు, మల్టీపర్పస్ స్టాఫ్కు 13 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు అయిన సివిల్ సప్లయిస్ డీఎం బి.శాంతి, డీపీవో టి.వెంకటేశ్వరావు, ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం, గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సూర్యనారాయణ, మహిళా పోలీస్స్టేషన్ సీఐ నరసింహమూర్తి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. కొత్తవలస సమీపంలో ఏనుగులు కొమరాడ: మండల కేంద్రం సమీపంలోని కొత్తవలస గ్రామ పరిసరాల్లో ఏనుగులు సంచారిస్తూ కనిపించాయి. దీంతో చినఖేర్జిల, నయా బంజుకుప్పు, బూర్జివలస తదితర గ్రామాల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖాధికారులు సూచించారు. కొమరాడ నుంచి ఖేర్జిల వైపు వెళ్లే ప్రయాణికులు ఏనుగుల సమాచారాన్ని తెలుసుకుని వెళ్లాలని కోరారు. ఏనుగుల సంచార గ్రామాల్లో ప్రజల బయటకు రావొద్దని సూచించారు. వడదెబ్బకు వ్యక్తి మృతిసంతకవిటి : మండలంలో మందరాడ గ్రామానికి చెందిన బురావెల్లి అప్పారావు(58) ఉపాధి వేతనదారుడు పనులు వద్ద వడదెబ్బకు గురై మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 22న మందరాడలోని పెద్దచెరువులో ఉపాధి పనులు నిమిత్తం వెళ్లిన ఆయన మధ్యాహ్నం 5 గంటల సమయంలో అస్వస్తతకు గురయ్యాడు. ఒంట్లో అలసటగా ఉండడంతో తన భార్య ఆదమ్మకు చెప్పి అక్కడే కూర్చుండిపోయాడు. వెంటనే ఆమె తన భర్తకు ప్రాథమిక చికిత్స నిమిత్తం అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చి ఆర్ఎంపీ వైద్యున్ని తీసుకొచ్చింది. ఇంతలోనే అప్పారావు మృతి చెందాడు. ఆరోగ్యంగా తిరిగాడే తన భర్త మృతి చెందడంతో ఆదమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. పొట్ట కూటి కోసం ఉపాధి పనులకు వెళ్తే వడదెబ్బకు తన భర్త గురయ్యాడని రోదిస్తుంది. అప్పారావు ఉపాధి పనులకు వచ్చి అస్వస్తతకు గురయ్యాడని, ఆ కుటుంబానికి ఉపాధి పథకం ద్వారా సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
గిరిజన గురుకులాల్లో.. ఇంటర్ చదువుకు ఆసక్తి
● జిల్లాలో 1030 సీట్లకు 2,500కు పైగా దరఖాస్తులు ● సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఒకే ఒక బాలికల కళాశాల ● ఇక్కడ 140 సీట్లకు 507 దరఖాస్తులు ● పదోతరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ● నేడు నోడల్ కళాశాలల్లో కౌన్సెలింగ్ సీతంపేట: గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంట ర్మీడియట్ ఇంగ్లిష్ మీడియం చదువుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. 2025–26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాలో 8 గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్లో 1030 సీట్లకు 2,500 మంది దరఖాస్తు చేశారు. సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్న నోడల్ గిరిజన గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపీసీ, బైపీసీ,హెచ్ఈసీ, సీఈసీ, ఒకేషనల్ ఎఅండ్టీ, సీజీఏ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో సుమారు 3 వేల మంది విద్యార్థులు పదోతరగతి పాసయ్యారు. అధిక మార్కులు సాధించిన వారికే గురుకులాల్లో సీట్లు లభించనున్నాయి. సదుపాయాలతో కూడిన విద్యాబోధన గిరిజన గురుకులాల్లో చేరే విద్యార్థులకు ఉచిత భోజనం, వసతితో పాటు వైద్య సదుపాయాలు, యూనిఫారం, పుస్తకాలు, ఇతర మెటీరియల్ను ప్రభుత్వం సమకూర్చుతుంది. ఈ కళాశాలల్లో సీటు లభించిందంటే కార్పొరేట్ కళాశాలల్లో సీటు లభించినంత ఫలితం ఉంటుంది. సీతంపేట ఐటీడీ ఏ పరిధిలో సీతంపేట బాలికల గురుకుల జూనియ ర్ కళాశాల ఒక్కటే ఉండడంతో ప్రవేశాలకు అధిక డిమాండ్ ఉంది. 140 సీట్లకు 507 మంది బాలికలు దరఖాస్తు చేశారు. ఇందులో బైపీసీ గ్రూపునకు 362 మంది దరఖాస్తు చేయడం గమనార్హం. సీట్ల కేటాయింపు ఇలా... జనరల్ గ్రూపులు ప్రతీ గ్రూపుకు 40 సీట్లు కేటాయించారు. దీనిలో ఎస్టీలకు 36, ఎస్సీ, బీసీ, ఓసీ, ఏఈక్యూ (ఏజెన్సీ ఎంప్లాయ్ కోటా) ఒక్కో సీటు చొప్పున భర్తీ చేస్తారు. ఒకేషనల్ ఎఅండ్టీ 20, సీజీఏ గ్రూపులో 30 సీట్లు పూర్తిస్థాయిలో ఎస్టీలకు కేటాయించారు. కౌన్సెలింగ్కు అభ్యర్థులు తీసుకురావాల్సినవి... టీసీ, స్టడీ సర్టిఫికెట్ ( 6 నుంచి 10వ తరగతి వరకు), మార్కుల జాబితా, కులధ్రువీకరణ పత్రం (ఒరిజనల్), తల్లి,దండ్రులు, విద్యార్థి ఆధార్ జిరాక్స్లు, బ్యాంకు ఖాతా జిరాక్స్ (తల్లి, విద్యార్థి), 6 పాస్ఫొటోలు, అన్ని సర్టిఫికె ట్లు 3 సెట్ల జిరాక్స్ కాపీలు. -
ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుంటే స్థలాల స్వాధీనం
విజయనగరం అర్బన్: గృహ నిర్మాణ పథకాల కింద గతంలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరైన ఇళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి చేయని లబ్ధిదారులంతా వెంటనే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) వెంకటరమణ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అదనపు సహాయాన్ని వినియోగించుకొని ఆయా లబ్ధిదారులంతా తమకు కేటాయించిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని లేని పక్షంలో ఆ ఇళ్ల స్థలాలు స్వాధీనం చేసుకొని కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించడం జరుగుతుందన్నారు. జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిని పరిశీలించే నిమిత్తం గృహ నిర్మాణ సంస్థ జీఎం శుక్రవారం పలు మండలాల్లో పర్యటించారు. నెలిమర్ల మండలం సీతారాంపేట, బొంపల్లి మండలం గొట్లాం, బొబ్బిలి మండలం పారాదిలో ఇళ్ల కాలనీలను సందర్శించి ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ కార్యాలయంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ ఈఈ, డీఈలతో గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్షించారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని నిర్మాణాలకు ఈ సీజన్ అనుకూలంగా ఉన్నందున లబ్ధిదారులతో అధికారులు నేరుగా మాట్లాడి ఇళ్ల నిర్మాణంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించాలని సూచించారు. జిల్లాలో 11,648 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 4,649 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన 6,999 ఇళ్ల నిర్మాణాన్ని జూన్ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట గృహనిర్మాణ సంస్థ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జి.మురళీమోహన్ తదితర అధికారులు ఉన్నారు. గృహ నిర్మాణ సంస్థ ప్రత్యేక అధికారి వెంకటరమణ -
కోటిపాం వంతెనపై వినూత్న నిరసన
కొమరాడ: పార్వతీపురం నుంచి కూనేరు వెళ్లే అంతర్ రాష్ట్ర రహదారి పూర్తిగా గోతులు మయం అయింది. వాహన చోదకులు నరకయాతన అనుభవిస్తున్నారు. వాహనాలు తరచూ మరమ్మతుల కు గురై రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. 1933లో నిర్మించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనికి నిరసనగా సీపీఎం నాయకు డు కొల్లు సాంభమూర్తి వంతెనపై గోతుల్లో చేరిన వర్షపునీటిలో శుక్రవారం స్నానం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మూడు రాష్ట్రాల ప్రజ లు, వాహనాల రాకపోకలకు ఆధారమైన కోటి పాం వంతెన కూలేపోయే దశలో ఉన్నా పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. పాలకులు, అధికా రులు కళ్లుతెరిచి చూడాలని కోరారు. కనీసం గోతులను పూడ్చాలని డిమాండ్ చేశారు. -
కోవిడ్పై తస్మాత్..
విజయనగరం ఫోర్ట్: యావత్ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి మళ్లీ పంజా విసురుతుంది. కోవిడ్ పేరు చెబితే ఇప్పటికీ జనం హడలిపోతున్నారు. మొదటి, రెండు కోవిడ్ల్లో కోవిడ్ బారిన ఎంతో మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది సకాలంలో చికిత్స చేయించుకుని ప్రాణాలతో భయపడ్డారు. రెండేళ్లు పాటు ప్రజలు కోవిడ్ కారణంగా బిక్కుబిక్కుమంటూ జీవించారు. గత కొన్నేళ్లుగా వ్యాప్తి లేకపోవడంతో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. తాజాగా ప్రపంచలోని పలు దేశాలతో పాటు మన దేశంలో కూడా కోవిడ్ కేసులు మళ్లీ నమోదు అవుతున్నాయి. పొరుగున ఉన్న విశాఖలో కూడా కోవిడ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కోవిడ్ బారిన పడకుండా జనం అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్వో డాక్టర్ జీవనరాణి సూచించారు. జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్క కారడం లేదా ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు, విరేచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సామూహిక ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్క్లు వాడాలన్నారు. భౌతిక దూరం పాటించాలని, హ్యాండ్ వాష్ తదితర వాటితో పాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆందోళన అవసరం లేదు.. డీఎంహెచ్వో డాక్టర్ జీవనరాణి -
స్తంభాన్ని ఢీకొని కాలువలోకి దూసుకెళ్లిన కారు
బొబ్బిలి: పట్టణంలోని గ్రోత్సెంటర్ వద్ద ఘోర ప్రమాదం తప్పింది. విజయనగరం నుంచి బొబ్బిలి వస్తున్న పెళ్లి కారు రాయగడ రోడ్డులోని గ్రోత్ సెంటర్లో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. వేగానికి పక్కనే ఉన్న కాలువలోకి పక్కకి ఒరిగి పోయింది. ఈ సమయంలో విద్యుత్ నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు కారులోని పెళ్లి బృందాన్ని బయటకు తీశారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం, కొప్పుల వెలమ సంఘం రాష్ట్ర నాయకులు బలగ సాయికృష్ణ కుమార్తె పెళ్లి అనంతరం జరిగిన ఈ ఘటనలో కారులో సాయికృష్ణతో పాటు నలుగురు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు. ఘటన సంగతి తెలుసుకున్న బొబ్బిలి సీఐ కె.సతీష్కుమార్ తన సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించి ప్రయాణికుల క్షేమ సమాచారాలను కనుగొన్నారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
● విజయనగరం విధ్వంసానికి పథక రచన ● తవ్వేకొద్దీ బయటకొస్తున్న సిరాజ్ కుట్రకోణం ● మతోన్మాద శక్తులతో స్నేహం ● ప్రత్యేక యాప్లో సంభాషణలు ● పేలుళ్లకు పథకం ● కస్టడీలో ఉన్న సిరాజ్, సమీర్ల నుంచి వివరాలు రాబడుతున్న పోలీసులు
జూన్ 10 నాటికి గృహ నిర్మాణాలు పూర్తికావాలి ● హౌసింగ్ జీఎం వెంకటరమణ పార్వతీపురం రూరల్: పేదలకోసం నిర్మించే గృహాలను జూన్ 10 నాటికి పూర్తిచేయాలని గృహ నిర్మాణ శాఖ జీఎం, మూడు జిల్లాల హౌసింగ్ ప్రత్యేకాధికారి వెంకటరమణ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మండ లం నర్సిపురం లే అవుట్ను శుక్రవారం సందర్శించారు. గృహనిర్మాణ లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో హౌసింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంట్, స్టీల్, ఇతర సామగ్రికి కొరత లేదన్నారు. నీటి సౌలభ్యం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. నిర్మాణదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. సమావేశంలో కేఆర్ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్, హౌసింగ్ పీడీ పి.ధర్మచంద్రారెడ్డి పాల్గొన్నారు. జీకేఆర్ పురం నుంచి జపాన్కు.. బాడంగి: మండలంలోని జీకేఆర్ పురం గ్రామానికి చెందిన ఉత్తరాంధ్ర తప్పెటగుళ్ల కళాకారుడు నీలబోను సత్యం బృందానికి జపాన్ నుంచి పిలుపు అందింది. జపాన్ లో తప్పెటగుళ్ల ప్రదర్శన ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అవకా శం కల్పించింది. ఇక్కడ నుంచి ఆయనతో పాటు ఆరుగురు కళాకారులు శనివా రం జపాన్ చేరుకుంటారు. అక్కడ మన దేశం తరఫున ప్రదర్శన ఇవ్వనున్నారు. జపాన్లో ఈ నెల 25 నుంచి 30వ తేదీవరకు నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనల్లో తప్పెటగుళ్ల కళను ప్రదర్శిస్తామని సత్యం తెలిపారు. ఇతర దేశాలకు తమ కళను పరిచయం చేయడం గర్వంగా ఉందన్నారు. మతోన్మాద శక్తులతో చేతులు కలిపి... విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆబాద్ వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ను అందరిలాంటి విద్యార్థిగానే ఆ వీధివాసులు భావించారు. పోటీ పరీక్షలకు చదువుతుంటే మంచి విద్యార్థిగానే నమ్మారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ నెల 16న అరెస్టు చేశాక ఆయనలోని ఉగ్రవాద భావజాలం తెలిసి నిశ్చేష్టులయ్యారు. జన్మనిచ్చిన స్థలం, ప్రశాంతతకు నిలయం.. అన్నిమతాల వారు ఆనందంగా జీవించేందుకు అనువైన.. కళలకు కాణాచిగా ఉన్న విజయనగరాన్ని ధ్వంసం చేసేందుకు పథక రచన చేశాడన్న వార్తతో ఉలిక్కిపడ్డారు. పోలీసుల రిమాండ్ నివేదికలో ఆయన అంగీకరించిన అంశాలను తెలుసుకుని అమ్మో అంటున్నారు. మతోన్మాద శక్తులతో కలిసి సిరాజ్, సమీర్ల ఉగ్రకోణంపై ఎన్ఐఏ, స్థానిక పోలీస్ అధికారులు కూపీలాగుతున్నారు. విశాఖ సెంట్రల్ జైల్ నుంచి శుక్రవారం కస్టడీకి తీసుకున్న పోలీసులు సౌదీతో వారికి ఉన్న సంబంధాలు, ప్రత్యేక యాప్లో చేసిన చాటింగ్లపై ఆరా తీసున్నారు. ఆరేళ్లుగా దేశంలోని ముంబయి, ఉత్తరప్రదేశ్ తదితర చోట్ల జరిగిన మత సమ్మేళనాలకు వీరిద్దరూ హాజరై అక్కడ కలిసిన వ్యక్తుల వివరాలను రాబడుతున్నారు. దేశవ్యాప్తంగా మతోన్మాదాన్ని పెంచేందుకు మజ్వా–ఇ–హింద్ స్థాపించాలని నిర్ణయించడం, దేశం మొత్తం అలజడు లు సృష్టించేందుకు పథకరచన చేయడంపై ఆరా తీస్తున్నారు. ఇద్దరి ఉగ్రవాద కుట్రకోణా లను వారం రోజుల్లో సేకరించే దిశగా పోలీసులు విచారణ సాగిస్తున్నట్టు సమాచారం. -
శనివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2025
● రణరంగానికి వచ్చినట్లుగా కౌన్సిల్ సమావేశానికి.. ● ముందస్తు ప్రణాళిక అన్నట్లుగా పోలీసుల మోహరింపు ● ప్రారంభానికి ముందే బాహాబాహీ ● రౌడీ షీటర్లంటూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్ను రెచ్చగొట్టిన ఫిరాయింపు కౌన్సిలర్ ● సైకో చైర్పర్సన్ అంటూ మరోసారి ఓ మహిళపై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ● పక్కా టీడీపీ కార్యకర్తల మాదిరి వ్యవహరించిన ఖాకీలు ● వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను నెట్టుకొంటూ బయటకు పంపించిన వైనం సాక్షి, పార్వతీపురం మన్యం: ●ఒక మున్సిపల్ సమావేశానికి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం ఎప్పుడైనా చూశామా.. పోనీ, పాలకవర్గమేమైనా తమకు రక్షణ కల్పించాలని కోరిందా.. ఇంతకుముందు ఎన్నడైనా పెద్ద స్థాయిలో ఘర్షణలు జరిగాయా? మరి ఎవరి డైరెక్షన్లో పోలీసులు పార్వతీపురం మున్సిపల్ సమావేశానికి వచ్చినట్లు.. ఎవరి డైరెక్షన్లో సమావేశం ప్రారంభంలోనే లోపలికి ప్రవేశించినట్లు..!! ●●●ఇరువురు ఘర్షణ పడితే.. ఇద్దరికీ సర్దిచెప్పి, అక్కడ నుంచి పంపించేయడానికి ప్రయత్నించడం, రాజీ కుదర్చడం ధర్మం. అలా అని ఒకరిని వదిలి.. రెండో వ్యక్తిని నెట్టుకొంటూ, తోసుకుంటూ.. కలబడుతూ బయటకు లాక్కెళ్లడం.. అదీ ధర్మం కోసం పని చేసే ఒక పోలీస్ అలా చేయడం న్యాయమేనా? పోలీసులు ఎవరి కనుసన్నల్లో పని చేస్తున్నట్లు? ● ●దాదాపు అయిదు నెలల తర్వాత శుక్రవారం జరిగిన పార్వతీపురం మున్సిపల్ బడ్జెట్ సమావేశం పట్టుమని 20 నిమిషాలైనా నడవకుండానే ముగిసిపోయింది. బడ్జెట్, సాధారణ సమావేశాలు నిర్వహించాలని.. మున్సిపల్ అభివృద్ధిపై చర్చ జరపాలని పట్టుబట్టి, పోరాటం చేసి మరీ పాలకవర్గ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, వైఎస్సార్సీపీ సభ్యులు దానిని సాధిస్తే... అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో కూటమి సభ్యులు పక్కా ప్రణాళిక ప్రకారం వచ్చి, సమావేశాన్ని రచ్చచేసి వెనుదిరిగారు. అక్కడ జరగబోతోంది రణరంగమా అన్నట్లు.. పెద్ద ఎత్తున పోలీసులను వెంటబెట్టుకుని మరీ వివాదం చేయడం పట్టణ ప్రజలను విస్మయపరిచింది. ●న్యూస్రీల్ -
●ఏ అంశాలూ చర్చించనీయలేదు..
సమావేశమంతటినీ కూటమి ఎమ్మెల్యే, నాయకులు వారి కనుసన్నల్లోనే జరగాలని చూశారు. అజెండా లో రెండు అంశాలు వద్దని చెప్పాను. వినలేదు. సమావేశం ప్రారంభం కాగానే వివాదానికి తెర తీ శారు. కొద్దిరోజుల్లో పండగ రానుంది. నీరు, శానిటేషన్, జనరేటర్ల కోసం అజెండాలో పెట్టారు. పార్వతీపురం ప్రజల కోసం ఆ అంశాలనైనా చర్చిస్తే బాగుండేది. పోలీసులను పెట్టి, మా సభ్యులను ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లిపోయారు. మొన్న తహసీల్దార్ మాదిరి ఇప్పుడు నాపైనా సంతకం కోసం ఒత్తిడి చేశారు. – బోను గౌరీశ్వరి, మున్సిపల్ చైర్పర్సన్ -
భూ సమస్యలు తలెత్తకూడదు..: జేసీ
గజపతినగరం : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతన్నలకు భూ సమస్యలు వస్తే తక్షణమే ఆయా గ్రామాలకు వెళ్లి సమస్యలను పరిష్కారం చేయాలని రెవెన్యూ అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆదేశించారు. గజపతినగరం మండల కేంద్రం పురిటిపెంట పాల్తేరు వారి కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన ఐదు మండలాల రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు సలహాలు ఇచ్చారు. రైతులు సమస్యలతో కార్యాలయాలకు వచ్చినప్పుడు వారిని ఆహ్వానించి వారి సమస్యలను సంపూర్ణంగా అడిగి తెలుసుకొని పరిష్కరించేలా ఉండాలని సిబ్బందికి సూచించారు. భూ సమస్యల పరిష్కారం విషయంలో రీసర్వే అయిన తరువాత వచ్చిన ఎల్పీఎం నంబర్లు, సర్వే నంబర్లు టాలీ చేసుకొని తప్పులు దొర్లకుండా క్షేత్ర స్థాయికి వెళ్లి వాస్తవాలను తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. బొబ్బిలి ఆర్డీవో జెవిఎస్ఎస్.రామ్మోహన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమీలాగాంధీ, ఈడీ ఎస్సీ సొసైటి ఇంచార్జ్ ఆర్డీవో వెంకటేశ్వరరావు, స్థానిక తహసీల్ధార్ బి.రత్నకుమార్తో పాటు ఐదు మండలాల తహసీల్లార్లు, సర్వేయర్లు, డీటీలు తదితరులు పాల్గొన్నారు. -
వివాహ వేడుకకు వచ్చి.. మృత్యు ఒడిలోకి...
తెర్లాం: వివాహ వేడుకలకు వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకున్న తల్లి, తమ్ముడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాలుగు రోజుల కిందట తెర్లాం మండలంలోని రాజయ్యపేట గ్రామానికి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ యువకుడు బుధవారం రాత్రి జరిగిన ఆటో బోల్తా పడిన ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. దీనికి సంబంధించి తెర్లాం ఎస్ఐ సాగర్బాబు, కుటుంబ సభ్యులు గురువారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గరివిడి మండలం కోడూరు గ్రామానికి చెందిన గెడ్డ రామకృష్ణ(24) తెర్లాంలోని శ్రీ వేంకటేశ్వర కళాశాల వద్ద బుధవారం రాత్రి ఆటో బోల్తా పడిన ప్రమాదంలో మరణించాడు. తెర్లాం మండలం రాజయ్యపేట గ్రామంలో జరగనున్న వివాహ వేడుకలో పాల్గొనేందుకు తన మేనమామ ఇంటికి నాలుగు రోజుల క్రితం రామకృష్ణ వచ్చాడు. అక్కడ జరిగిన వివాహ వేడుకలో పాల్గొని అందరితో సరదాగా గడిపాడు. బుధవారం రాత్రి తెర్లాం మండలం ఎం.ఆర్ అగ్రహారంలో జరుగుతున్న స్నేహితుని వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు రామకృష్ణ తన చినమేనమామతో కలిసి ఆటోలో వెళ్లాడు. వివాహ వేడుకలో పాల్గొని అక్కడ భోజనం చేసి తిరిగి రాజయ్యపేట గ్రామానికి ఆటోలో వెళ్తున్నాడు. ఆటోను తన చినమేనమామ నడుపుతుండగా అతని పక్కన రామకృష్ణ కూర్చొన్నాడు. తెర్లాం వెంకటేశ్వర కళాశాల వద్దకు వచ్చే సరికి ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా పడింది. దీంతో రామకృష్ణ కింద పడిపోగా, ఆటో అతనిపై పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కొందరు రామకృష్ణను బయటకు తీశారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స చేసేటప్పటికే రామకృష్ణ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారని ఎస్ఐ చెప్పారు. మృతుని సోదరుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించినట్టు ఎస్ఐ సాగర్బాబు తెలిపారు. బైక్ మెకానిక్గా పనిచేస్తూ.. రామకృష్ణ బైక్ మెకానిక్గా పని చేస్తున్నాడు. రామకృష్ణ తండ్రి వెంకటరమణ ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి రామకృష్ణ బైక్ మెకానిక్గా పని చేస్తూ తనకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతో తల్లి, తమ్ముడిని పోషిస్తున్నాడు. వివాహ వేడుకకు మేనమామ ఊరు వెళ్లి వస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకున్న రామకృష్ణ తల్లి, తమ్ముడు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
జాడ లేని సంక్షేమం..!
ఆదుకునే పథకాలేవీ? రోజూ ఉదయాన్నే విజయనగరం గణేష్ గుడి మీదకు పని కోసం వస్తాను. వారంలో మూడు రోజులు పని దొరకడం చాలా కష్టంగా ఉంటోంది. గతంలో ఈ పరిస్థితులు లేవు. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో జీవనం సాగిస్తున్నాం. ముఖ్యంగా పిల్లల చదువులు భారంగా మారాయి. గతంలో అమ్మ ఒడి, వసతి దీవెన కింద సాయం అందేది. ఇప్పుడు ఆదుకునే ఆ పథకాలు కూడా లేకుండా పోయాయి. – సత్యం, తాపీ మేసీ్త్ర, విజయనగరం ఆగిన ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వం మా ఊర్లో పేదల ఇళ్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున లేఅవుట్లు ఏర్పాటు చేసింది. వాటిలో వేలల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. దీంతో బయటకు ఎక్కడికి వెళ్లే పని లేకుండా ఊర్లోనే పనులు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చాక కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. పెయింటింగ్, ఉడ్వర్క్స్, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులపై ఈ ప్రభావం పడుతోంది. వారాలు, నెలల తరబడి ఇంటి పట్టునే ఉంటే మా కుటుంబాలు ఎలా గడుస్తాయి? –కృష్ణ అప్పారావు, పెయింటర్, విజయనగరం కార్మికుల పొట్ట కొట్టారు.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్న పైసా కూడా ఇవ్వలేదు. కార్మికులకు తీరని అన్యాయం చేసింది. విజయనగరం జిల్లా పరిధిలో చాలా మంది కార్మికులకు గుర్తింపు ఇవ్వలేదు. ఈ ఏడాదిలో ఒక్క క్లెయిమ్ చెల్లించలేదు. ప్రభుత్వం ఏమాత్రం సాయం చేయడం లేదు. భవన నిర్మాణ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. –బి.రమణ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి కార్మిక బోర్డును తక్షణమే పునరుద్ధరించాలి ఎన్ని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన భవన నిర్మాణ కార్మికులకు ప్రయోజనం లేకుండా పోయింది. ఇసుకఽ కొరత లేకపోయినా పనుల్లేకుండా పోయాయి. భవన కార్మికుల సంక్షేమ బోర్డును రద్దును పునరుద్ధిరస్తానన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే లేదు. కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి. –మజ్జి ఆదినారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ● అర్థాకలితో నిర్మాణ రంగ కార్మికులు ● ఉమ్మడి జిల్లాలో నిలిచిపోయిన 1590 క్లెయిమ్స్ ● కార్మికుల సంక్షేమం పట్టని కూటమి ప్రభుత్వం ● ఎన్నికల నాటి హామీలు ఏమయ్యాయి? విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కార్మికుల పొట్టకొట్టింది. కార్మికుల సంక్షేమ బోర్డులోని నిధులను దారి మళ్లించారు. కనీసం మరణ క్లెయిమ్స్, ప్రసూతి క్లెయిమ్స్, స్కాలర్షిప్ క్లెయిమ్స్, అనారోగ్య క్లెయిమ్స్ కూడా అందకుండా చేశారు. ఫలితంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సుమారు 1590 క్లెయిమ్స్ ఇప్పుడు వరకు అపరిష్కృతంగానే ఉన్నాయి. భవన నిర్మాణ, ఇతర అసంఘటిత రంగ కార్మికులు, కూలీల జీవితాలు కొద్ది నెలలుగా దుర్భరంగా మారాయి. అరకొర పనులు, అప్పుల బాధలు, కష్టాల సుడిగుండాల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులకు సైతం డబ్బు పుట్టక బతుకు భారంగా ఈడుస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ అలవిగాని హామీల వర్షం కురిపించి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. కొత్త పథకాలు అమలు చేయకపోగా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన పథకాలకు సైతం గండి కొట్టింది. కార్మిక శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి విజయనగరం జిల్లాలో దాదాపు 2లక్షల పైగా మంది అసంఘటిత రంగ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. లెక్కల్లోకి రాని వారు మరికొన్ని వేలల్లో ఉంటారు. ఇప్పుడు వరకు నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులు 91,528 మంది. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగంపై ఆధారపడిన తాపీ మేసీ్త్రలు, కూలీలు, రాడ్ బెండర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వడ్రంగులు, పెయింటర్లు ఉన్నారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలప్పుడు భవన నిర్మాణ బోర్డును పునరుద్ధరిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. సాధికార సంస్ధ ఏర్పాటు చేస్తామని, అన్ని వర్గాల కార్మికులకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని, కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నేటి వరకు ఆ ఊసే ఎత్తలేదు. పేరు మార్పు తప్ప సాయం లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ బీమా పథకాన్ని చంద్రన్న బీమాగా పేరు మార్చారు. అంతకు మించి పథకం అమలుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ ఉత్తివిగానే మిగిలిపోయాయి. గత ప్రభుత్వంలో వైఎస్సార్ బీమా పథకం కింద విజయనగరం జిల్లాలో దాదాపు 11వేల కుటుంబాలకు రూ.118 కోట్ల మేర సాయం అందింది. ఈ ప్రభుత్వంలో అది పూర్తిగా నిలిచిపోయింది.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సాయం ఇలా.. వైఎస్సార్ కల్యాణమస్తు కింద భవన, ఇతర నిర్మాణ కార్మికులకు రూ.20వేలు చొప్పున అందించారు. వైఎస్సార్ బీమా పథకం కింద ప్రమాద మరణాల్లో బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, సహజ మరణాలకు రూ.లక్ష, వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షల చొప్పున ఇచ్చి ఆదుకున్నారు. రిజిస్టర్ కాని కార్మికులు ప్రమాదాల్లో మరణిస్తే రూ.5 లక్షలు, వైకల్యం సంభవిస్తే రూ.2.5 లక్షలు ఇచ్చారు. అసంఘటిత రంగ కా ర్మిక కుటుంబాల్లోని వ్యక్తులు అనారోగ్యం బారిన పడిన సందర్భాల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకు వైద్య సేవలను పూర్తి ఉచితంగా అందించారు. -
శ్యామలాంబ హుండీ ఆదాయం రూ.8.19 లక్షలు
సాలూరు: సాలూరు శ్యామలాంబ అమ్మవారి హుండీ ఆదాయం 8,19,900 రుపాయిలు వచ్చినట్లు ఎండోమెంట్ అధికారి రమేష్ గురువారం తెలిపారు. శ్యామలాంబ పండగ నేపథ్యంలో అమ్మవారి గుడికి భక్తులు పోటెత్తారు. హుండీ ఆదాయాన్ని ఆలయంలోనే లెక్కింపు చేపట్టారు. ప్రీ ఎక్లాంప్సియాపై అవగాహన పార్వతీపురం టౌన్: గర్భిణుల్లో ప్రీ ఎక్లాంప్సియా ఒక ప్రమాదకర సూచికని, సకాలంలో లక్షాణాలు గుర్తించాలని డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.భాస్కరరావు సూచించారు. ప్రపంచ ప్రీ ఎక్లాంప్సియా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య కార్యాలయ ప్రాంగణంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు హైరిస్క్ సమస్యలు ముందస్తుగా గుర్తించాలన్నారు. బీపీ అధికంగా ఉండడం, తీవ్రమైన తలనొప్పి, దృష్టి సమస్య, ముఖం,చేతులు, కాళ్లు ఉబ్బడం, మూత్ర విసర్జన తగ్గడం తదితర లక్షణాల ద్వారా దీన్ని గుర్తించాలన్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి.జగన్మోహనరావు, పీఎల్ రఘుకుమార్, డీపీహెచ్ఎన్వో ఉషారాణి, డీపీవో లీలారాణి, కార్యాలయ సూపరింటెండెంట్ కామేశ్వరరావు, డీసీఎం విజయలత, సీసీ శ్రీనివాసరావు, వైద్య మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అమ్మవారి హుండీల్లో చోరీసాలూరు: పట్టణంలోని పలు ఆలయాల్లో హుండీల్లో చోరీలు జరిగాయి. పట్టణంలోని నూకాలమ్మ తల్లి, సత్తమ్మ తల్లి, దేశమ్మ తల్లి ఆలయాల్లో హుండీలను దుండగలు పగులగొట్టి నగదు, కానుకలను ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.ఉపాధ్యాయ బదిలీల వెబ్సైట్ వేగాన్ని పెంచాలి ● ఏపీ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ పార్వతీపురం టౌన్: రాష్ట్రంలో మొట్టమొదటిసారి బదిలీల చట్టాన్ని అనుసరించి జరుగుతున్న బదిలీల ప్రక్రియలో ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేయడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన స్థానికంగా మాట్లాడారు. బదిలీలకు దరఖాస్తు చేయడంలో సర్వరు యొక్క వేగాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. ఏఏ పాఠశాలల్లో ఏఏ పోస్టులు అదనంగా ఉన్నాయో ఈ జాబితాల ద్వారా తెలుస్తుందని తద్వారా సంబంధిత ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని పేర్కొన్నారు. కావున ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ఉపాధ్యాయుల రీఅపోర్షన్మెంట్ వివరాలు వెంటనే అందజేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నామన్నారు. న్యాయస్థానాల ఉత్తర్వులను అనుసరించి బెంచి మార్క్ వ్యాధులు గల ఉపాధ్యాయులకు ఈ బదిలీ నియమాలు వర్తించవనీ, అయితే సంబంధిత వ్యక్తులు వారికి అంగీకారం అయితే బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. -
వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లపై.. టీడీపీ వర్గీయుల దాడి
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ125 శ్రీ220 శ్రీ230బాడంగి: మండలంలోని పినపెంకి గ్రామంలో అమ్మవారి పండగ ముగింపు రోజు బుధవారం సాయంత్రం వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన రజకుల ఇళ్లపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులైన బెవర కులస్తులు దాడికి తెగబడ్డారు. పిడిగుద్దులతో పాటు కర్రలతో దాడి చేసినట్టు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది. ఈ దాడిలో గాయపడిన వాడాడ పోలమ్మ, వెంపడాపు రమేష్, నందిగాం సీత, చోడవరపు అరుణలను గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కుప్ప సింహాచలం స్థానిక సీహెచ్సీకి ఆటోపై తరలించారు. వీరిలో పోలమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరిలో అరుణ బాలింత కావడంతో ప్రధమ చికిత్స చేసి ఇంటికి పంపినట్టు వైద్యులు తెలిపారు. ఇదే విషయమై రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన యువకుల మధ్య మంగళవారం నాడే తగాదా జరిగింది. టీడీపీ వర్గీయులు ఎప్పుడు ఎలాంటి దాడులకు పాల్పడతారోనని రజకులు ఆందోళన చెందుతున్నారు. తమకు భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందినా కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నట్టు సింహాచలం ఆరోపించారు. -
అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య
గుర్ల: మండలంలోని కెల్లకు చెందిన సువ్వాడ గాంధీ (32) అప్పులు బాధ భరించలేక పురుగులు మందు తాగి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. కెల్లకు చెందిన సువ్వాడ గాంధీ తన అవసరాల నిమిత్తం అప్పులు ఎక్కువగా తీసుకున్నాడు. అప్పులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి రావడంతో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇది గమనించి కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అందుతుండగా గురువారం ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతునికి భార్య మంగ, కుమారుడు రుషివర్ధన్, కుమార్తె లహరి ఉన్నారు. గుర్ల ఎస్ఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధి వేతనదారు మృతి బాడంగి: మండలంలోని కోటిపల్లి గ్రామానికి చెందిన ఉపాధి వేతనదారు చెలపురెడ్డి తవుడమ్మ(68) పని చేస్తున్న ప్రదేశంలో గురువారం మృతి చెందినట్టు ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు మరియదాస్ తెలిపారు. గ్రామంలో జగ్గన్న చెరువు పూడిక పనులు చేస్తుండగా చద్దన్నం తిని చేతులు కడుగుతుండగా తీవ్ర అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న ఏపీవో సాయిరాం, టీఏ శ్రీనివాసరావు ఎంపీడీవో ఆదేశాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంపీడీవో వేతనదారు మృతి పట్ల సంతాపం తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి నెల్లిమర్ల రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న మండలంలోని సారిపల్లి గ్రామానికి చెందిన యువకుడు నడిపేన పురుషోత్తం(27) గురువారం మృతి చెందాడు. యువకుడి మృతిపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బద్రీనాధ్ యాత్ర నిమిత్తం యాత్రికులను తీసుకువెళ్లేందుకు బస్సు డ్రైవర్లుగా సారిపల్లికి చెందిన పురుషోత్తం, శ్రీనివాసరావు ఈ నెల 15న వెళ్లారు. 17వ తేదీ అర్ధరాత్రి జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్గడ ప్రాంతంలో బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టడంతో క్యాబిన్లో కూర్చున్న పురుషోత్తంకు తీవ్ర గాయాలయ్యాయి. మరుసటి రోజు చికిత్స నిమిత్తం ప్రైవేటు అంబులెన్సులో విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో కేజీహెచ్కు వైద్యులు పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ పురుషోత్తం ప్రాణాలు విడిచాడు. మృతుడికి తల్లిదండ్రులు, అన్నయ్య ఉన్నారు. పురుషోత్తం మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
నిర్మాణాలు వేగవంతం చేయాలి : కలెక్టర్
పార్వతీపురం రూరల్: మన్యం జిల్లాలో వివిధ దశల్లో ఉన్న పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం పార్వతీపురం మండలంలోని చప్పవానివలస గ్రామంలో కలెక్టర్ పర్యటించి వివిధ దశల్లో ఉన్న పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలను ఆయన నేరుగా స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. గృహ నిర్మాణాలు జాప్యానికి గల కారణాలను అధికారులను, లబ్ధిదారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, పనులను మరింత వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించిన రెండవ విడత బిల్లులు మరి కొద్ది రోజుల్లో మంజూరు కానున్నాయని, తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన మెటీరియల్ ఎంతమేరకు అందుబాటులో ఉందో అధికారులను ఆరా తీశారు. గృహ నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా అవసరమైన మెటీరియల్ను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ పరిశీలన కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారి జి.సోమేశ్వరరావు, చిరంజీవి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పీఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఎండీయూ ఆపరేటర్ల ఆందోళన
విజయనగరం ఫోర్ట్: ఎండీయూ వ్యవస్థను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వ కేబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్ర సమైఖ్య ఎండీయూ ఆపరేటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఎండీయూ వాహనాలతో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో 27 వేల మంది కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు. రేషన్కు బదులు నగదు బదిలీ అమలు కోసం కూటమి ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థపై దాడి చేస్తుందన్నారు. అతి తక్కువ ఖర్చు వేతనాలతో వాహన సర్వీసు, పెట్రోల్, రేషన్ తరలింపు ఖర్చు భరించి ప్రజలకు ఇంటింటికి సకాలంలో పంపిణీ చేస్తున్న వ్యవస్థను రద్దు చేయటం ప్రజల్ని మరింత ఇబ్బందులకు గురిచేయడమే అన్నారు. ధర్నాలో యూనియన్ నాయకులు సిహెచ్.వెంకటరావు, పవన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
2
కిలో బెండకాయలు రూ.ధరల కల్పనకు చర్యలు తీసుకుంటాం రైతులతో మాట్లాడి కూరగాయలకు గిట్టుబాటు ధరల కల్పనకు చర్యలు తీసుకుంటాం. రైతులతో మాట్లాడి ఉద్యానశాఖాధికారులతో అనుసంధానం చేసుకుని రైతు బజారులో గిట్టుబాటు ధరకు విక్రయించేకునేలా సౌకర్యాలు కల్పిస్తాం. – కిరణ్కుమార్, మార్కెటింగ్శాఖ ఎ.డి., బొబ్బిలి కష్టానికి ఫలితం దక్కడం లేదు.. బెండకాయలకు కనీస ధరలేదు. చీడపీడల నివారణ, పంట కోత, రవాణా ఖర్చులు కూడా రావడంలేదు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి చూడలేదు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – కె సత్యం, బెండ రైతు, చింతలవలస ● 15 కిలోల బరువున్న క్రేట్ బెండకాయల ధర గరిష్టంగా రూ.30 ● నష్టాల్లో బెండ రైతులు ● కోత ఖర్చులు సైతం దక్కని దైన్యం రామభద్రపురం: బెండ రైతుకు క(న)ష్టకాలం వచ్చింది. రామభద్రపురం అంతర్ రాష్ట్ర మార్కెట్లో కిలో బెండకాయల ధర రూ.2 పలుకుతోంది. 15 కిలోల బరువున్న క్రేట్ బెండకాయలను గరిష్టంగా రూ.30కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ధరలు లేక కోత, రవాణా ఖర్చులకు తిరిగి అప్పుచేయాల్సి వస్తోందంటూ రైతులు గగ్గోలుపెడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు సాగుచేసిన రైతుకు కష్టాలే ఎదురవుతున్నాయని, పది నెలలుగా పంటను కొనుగోలుచేసేవారి కోసం ఎదురు చూడాల్సిన గడ్డు పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి పైసా పెట్టుబడి సాయం అందక, పంటకు గిట్టుబాటు ధరలేక అప్పుల్లో కూరుకుపోతున్నామంటూ ఆవేదన చెందుతున్నారు. ధాన్యం నుంచి కూరగాయల వరకు ఏ పంటకూ మార్కెట్లో మద్దతు ధర లేదని చెబుతున్నారు. రైతులంటే కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, సమస్యలను పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. ఓటు వేసి అధికారం కట్టబెట్టిన రైతన్నకే వెన్నుపోటు పొడవడం, నష్టాల్లో ముంచడంపై గగ్గోలు పెడుతున్నారు. కోత ఖర్చులకు అప్పుచేయాల్సిందే.. నేను 20 సెంట్ల విస్తీర్ణంలో బెండ పంట సాగుచేశాను. కాపుకొచ్చిన పంటను చూసి ఆనందించాలో, గిట్టుబాటు ధర లేక బాధపడాలో తెలియడం లేదు. పంటను మార్కెట్కు తెస్తే కోత, రవాణా ఖర్చులు రావడం లేదు. 10 క్రేట్లను ఆటోపై రామభద్రపురం అంతర రాష్ట్ర మార్కెట్కు తెస్తే రూ.300కు వచ్చాయి. అందులో ఆశీలు రూ.100, ట్రాన్స్పోర్ట్ చార్జీలు రూ.100 పోగా రూ.100లు మిగిలింది. కూలీలకు, పురుగు మందులు, ఎరువులకు అప్పు చేయాల్సి వస్తోంది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – కటికి గంగమ్మ, బెండ రైతు, రామభద్రపురం -
అంతన్నారు.. ఇంతన్నారు..
–10లోజాడ లేని సంక్షేమం..! రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కార్మికుల పొట్టకొట్టింది. కార్మికుల సంక్షేమ బోర్డులోని నిధులను దారి మళ్లించింది.శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025పండగలో విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యం ఫలితంగా మూడు రోజులపాటు స్థానిక ప్రజలు, బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సహనం నశించిన పలు వీధుల్లోని ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. కొవ్వొత్తులు పట్టుకుని.. సంధ్యారాణి డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. పండగకు రెండు రోజులు ఉందామని దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సైతం ఇక్కడ నీరు, కరెంటు లేక రాత్రికి రాత్రే పయనమవ్వడం కనిపించింది. మంగళవారం సిరిమానోత్సవం తర్వాత కొన్ని వీధులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినప్పటికీ.. మరికొన్ని వీధులకు బుధవారం రాత్రి వరకు ఇవ్వలేదు. దీంతో విసుగు చెందిన నాయుడువీధి వాసులు.. ఎలక్ట్రికల్ డీఈఈ రంగారావును రామమందిరంలో నిర్బంధించి, తాళం వేశారు. వాస్తవానికి శ్యామలాంబ ఉత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ లోడును తట్టుకునేలా ముందస్తుగా రూ.1.24 కోట్ల వ్యయంతో అయిదు 160 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 100 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 14, రెండు సింగిల్ ఫేజ్ 16కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఉత్సవ సమయంలో ఒక ఎస్ఈ, ఈఈ, ఏడుగురు డీఈఈలు, ఆరుగురు ఏఈలు, ఆరుగురు జూనియర్ ఇంజినీర్లు, 57 మంది ఓఎం సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ, పనిచేసినా కష్టాలు తప్పలేదు. ఉత్సవంలో భాగంగా కొన్ని వీధులకే విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి మూడు రోజులూ సరఫరా లేక ప్రజలు నరకయాతన చవిచూశారు. భోను, మజ్జుల, తోటవీధులకు గురువారం రాత్రికి కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడంతో ఆందోళనకు దిగారు. మెయిన్ రోడ్డుపై టైర్లు కాల్చారు. మంత్రికి వ్యతిరేకంగా నినదించారు. సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు: సాలూరు ప్రజల ఆరాధ్య దైవం శ్యామలాంబ ఉత్సవం 15 ఏళ్ల తర్వాత జరగడంతో ఆ ప్రాంత వాసులంతా ఎంతగానో సంతోషించారు. ఎక్కడెక్కడో ఉంటున్న తమ ఇంటి పిల్లలను, బంధువులను, స్నేహితులను పిలిచారు. రెండు లక్షల మందికిపైగా పండగకు వస్తారని ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం ఊహించారు. ఉత్సవం ఎటువంటి లోటుపాట్లూ లేకుండా నిర్వహిస్తామని ఊదరగొట్టారు. స్వయంగా స్థానిక శాసనసభ్యురాలు, రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఏర్పాట్లన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు. సంధ్యమ్మ వచ్చింది.. పండగ తెచ్చిందంటూ వీధివీధినా ఫ్లెక్సీలు వేయించారు. సోమవారం నుంచి బుధవారం జరిగిన పండగలో అడుగడుగునా అవరోధాలే. మంచినీటి సరఫరా మొదలు విద్యుత్ అంతరాయం వరకూ.. అస్తవ్యస్త ట్రాఫిక్.. ఇలా స్థానిక ప్రజలతోపాటు, పండగకు వచ్చే వారికి పరీక్షలు పెట్టాయి. ప్రణాళికాలోపం.. పట్టణ ప్రజలకు శాపంగా మారింది. చుట్టుపక్కల జరిగే ఏ పండగలోనూ మునుపెన్నడూ ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలియజేయడం చోటుచేసుకోలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా చివరికి సాలూరు తొలిసారిగా ఆ పేరు దక్కించుకుంది. డమ్మీగా మారిన ఉత్సవ కమిటీ... పండగ మొత్తం మంత్రి సంధ్యారాణి అంతా తానై నడిపించారు. ఉత్సవ కమిటీని డమ్మీ చేశారు. అధికారులతో ఒకట్రెండు సమావేశాలు నిర్వహించారు. సమన్వయ సమావేశం ఒక్కసారి కూడా నిర్వహించలేదు. సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. పండగ రోజుల్లో వేలాది మంది జనసందోహంలోనే మంత్రి నాలుగు వాహనాల కాన్వాయ్తో వచ్చేవారు. ఇంతమంది జనాల్లో వాహన శ్రేణిలో రావడమేమిటని భక్తులు చర్చించుకున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య కూడా ఉత్పన్నమైంది. ఎన్నడూ లేని విధంగా కొన్ని ఆచారాలకు, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉత్సవాలు జరిగా యన్న విమర్శలున్నాయి. ఉత్సవ కమిటీని కీలుబొమ్మలా మార్చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్గా అనుభవం లేని వ్యక్తిని నియమించారన్న ఆరోపణలున్నాయి. ఏకపక్షంగానే నియామకమైన కమిటీ.. కేవలం టీడీపీ కమిటీగానే ముద్రపడింది. పెద్దలు నిర్ణయించిన ప్రకారం సిరిమానోత్సవం మంగళవారం సాయంత్రం 4.05 నిమిషాలకు ప్రారంభం కావాలి. మంత్రి సాయంత్రం 6 గంటలకు వచ్చారు. ఆమె వచ్చిన తర్వాతనే ప్రారంభమైంది. దీనివల్ల సిరిమానోత్సవం ఆలస్యమైంది. సిరిమా ను పూజారి సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అల్లువీధి రామమందిరం నుంచి ప్రారంభమైన కొద్దిసేపటికే అంజలి రథం చక్రం విరిగిపోవడంతో ఆగిపోయింది. మొత్తం సిరిమాను ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి బుధవారం తెల్లవారుజామున 3 గంటలైంది. ఉత్సవ కమిటీ అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపించింది. చివరికి తప్పంతా మున్సి పల్ పాలకవర్గంపై నెట్టివేసే ప్రయత్నం జరుగుతోంది. పండగ విజయవంతమైతే అంతా తమ గొప్పతనంగా అధికార పార్టీ నేతలు ప్రచారం చేసుకునేవారు. ఫెయిలవ్వడంతో మున్సిపల్ పాలకవర్గంలో ఖాతాలోకి నెట్టేశారని ప్రజలు చర్చించుకుంటున్నారు. సాలూరు మెయిన్ రోడ్డుపై ఆందోళన చేస్తున్న భోను, మజ్జుల, తోటవీఽధి ప్రజలున్యూస్రీల్కాంట్రాక్టరు నిర్వాకమేనా? అసలే వేసవి కాలం.. ఆపై కరెంటు కష్టం శ్యామలాంబ పండగ ఏర్పాట్లలో ఘోర వైఫల్యం 15 ఏళ్ల తర్వాత నిర్వహించిన పండగకు భారీగా తరలివచ్చిన భక్తులు ఏర్పాట్లన్నీ స్వయంగా పర్యవేక్షించిన మంత్రి సంధ్యారాణి కనీసం నీరు, విద్యుత్ కూడా అందించలేకపోయిన వైనం పండగ వేళ సాలూరులో చీకట్లు వచ్చిన బంధువులకు మర్యాదలు చేయలేకపోయామని ఆవేదనతో రోడ్డెక్కిన ప్రజలు ఉత్సవం నేపథ్యంలో విద్యుత్ శాఖ తరఫున పనులు చేపట్టగా.. అవన్నీ కాంట్రాక్టరుకు అప్పగించినట్లు తెలిసింది. సదరు కాంట్రాక్టరు కాసులకు కక్కుర్తిపడి నాసిరకం పనులు చేశారన్న విమర్శలు పట్టణ ప్రజల నుంచి వినిపించాయి. ఐదు 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు, మూడు 40 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు, రెండు సింగిల్ ఫేజ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీనికి కారణం అధిక లోడు అని ఆ శాఖాధికారులు అంటున్నారు. విపరీతమైన ఎయిర్ కండీషనర్లు, కూలర్లు, వాటర్ మోటార్లు, మిక్సీలు, గ్రైండర్లు వాడటం వల్లే లోడు పెరిగి.. సెక్షన్ ఫ్యూజులు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయని వివరణ ఇస్తున్నారు. భారీ వర్షాలు కూడా ఒక కారణంగా చెప్పుకొచ్చారు. విద్యుత్ అంతరాయంతో మోటార్లు పని చేయక తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. వాడకానికి కూడా నీరు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. అటు విద్యుత్తు లేక.. ఇటు నీరు రాక.. బంధువులను పిలిచి కనీస మర్యాదలు కూడా చేయలేకపోయామని ఆవేదనతో ప్రజలు రోడ్డెక్కారు. -
ఎవరెస్టు ఎక్కినా ‘ఉపాధి’ కరువే..!
జియ్యమ్మవలస రూరల్: రాత్రింబవళ్లు శ్రమించి.. కఠోర సాధన చేసి.. చివరకు ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మన్యం బిడ్డ.. ఇప్పుడు ఉపాధిలేక దిక్కులు చూస్తున్నాడు. తండ్రితో కలిసి కూలి పనులకు వెళ్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే... ప్రపంచంలో అతి ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం అంటే ప్రాణాన్ని పణంగా పెట్టడమే. ఎన్నో ఆశలు ఆశయాలు ఆలోచనల నడుమ ఎవరెస్టు శిఖరాన్ని జియ్యమ్మవలస మండలం పరజపాడు పంచాయతీ గదబవలస గ్రామానికి చెందిన బొడ్ల చిన్న నారాయణరావు తవిటమ్మల కుమారుడు బొడ్ల సాగర్ అధిరోహించాడు. యువకుడి సాహసాన్ని మే 7వ తేదీ 2017 సంవత్సరంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అన్ని పత్రికలు ప్రచురించి ప్రశంసలతో ముంచెత్తాయి. అప్పటి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు జిల్లా అధికారులు సైతం సాగర్ సాహసంపై ప్రశంసలు కురిపించారు. సన్మానాలు చేశారు. విద్యార్హతను బట్టి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అంతే.. ఆ తరువాత 8 సంవత్సరాలు గడిచిపోయినా.. ఈ ఎవరెస్టు వీరుడు ఎక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు భద్రగిరి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యాభ్యాసం చేస్తూ సుమారు 6 నెలల పాటు కఠోరమైన శిక్షణ పొంది 120 మందిలో కేవలం ఆరుగురు మాత్రమే ఎవరెస్టు శిఖరం ఎక్కగలిగారు. వారిలో సాగర్ ఒకడు. ఆ ప్రయాణంలో తన కుడిచేతి రెండు వేళ్లను పోగొట్టుకున్నాడు. ఆ తరువాత ఏళ్లు గడిచినా సాగర్కు ఎలాంటి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం తన తండ్రితో కూలి పనులకు, బోర్లు వేసేందుకు వెళ్తున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబాన్ని కూలి డబ్బులతో నెట్టుకొస్తున్నాడు. సాగర్ను ఉద్యోగిగా ఉన్నత స్థాయిలో చూడాలన్న కన్నవారి కలలు కళ్లగానే మిగిలిపోయాయి. పర్వతారోహణకు ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి రూ.25లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఖర్చు చేసినా.. విజయాన్ని, పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టిన ఆ యువతను ఆదుకోవడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, జిల్లా అధికారులు స్పందించి సాగర్కు ఉద్యోగ అవకాశాన్ని కల్పించి ఆదుకోవాలని తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కోరుతున్నారు. -
సంఘాలుగా ఏర్పడితే రాయితీలు
పార్వతీపురం రూరల్: ప్రభుత్వం అమలుచేస్తోన్న పథకాల రాయితీలు, రుణాలు వర్తించేలా రైతులు సంఘాలుగా ఏర్పడాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ రైతులకు పిలుపు నిచ్చారు. పార్వతీపురం మండలం వెలగవలస గ్రామంలో గురువారం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. నిమ్మగడ్డి సాగు, దిగుబడి, ఆదాయం, సాగులోని సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. నిమ్మగడ్డి సాగుకు సాగునీటి సమస్య ఉందని పలువురు రైతులు కలెక్టర్కు తెలిపారు. రైతులు సంఘాలుగా ఏర్పడి ఉమ్మడిగా బావులు తవ్వి సోలార్ విద్యుత్ మోటార్లు అమర్చుకోవాలని సూచించారు. దీనికోసం రాయితీలు వర్తిస్తాయన్నారు. సూక్ష్మ నీటి సేద్యం కింద స్ప్రింక్లర్లు ఉచితంగా అందిస్తామని స్పష్టంచేశారు. నిమ్మగడ్డి సాగుకు ఉపాధి హామీ పథకం వర్తింపజేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఆయిల్ ఉత్పత్తికి అవసరమైన బ్రాయిలర్ల ఏర్పాటుకు రైతుల భాగస్వామ్యం అవసరమన్నారు. నూజివీడు సీడ్స్ సంపద రకం వరి విత్తనాలు సరఫరా చేయాలన్న రైతుల వినతిమేరకు వ్యవసాయ శాఖ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. అదే రకమైన 1318 రకం విత్తనాలు అందుబాటులో ఉంచుతామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దాలమ్మ, జిల్లా ఉద్యానవన అధికారి బి.శ్యామల, ఎంపీడీఓ గోర్జి రమేష్ బాబు, మండల ఉద్యానవన అధికారి ప్రియాంక, పంచాయతీ కార్యదర్శి వి.భార్గవ్, ఫీల్డ్ అసిస్టెంట్ పి.నూకరాజు, పంచాయతీ కార్యదర్శి వి.భార్గవ్, తదితరులు పాల్గొన్నారు. రుణ లక్ష్యాలు అధిగమించాలి పార్వతీపురంటౌన్: జిల్లాలో కిసాన్ క్రెడిట్కార్డుల రుణాలపై బ్యాంకర్లు తక్షణమే స్పందించాలని, లక్ష్యాలు అధిగమించాలని కలెక్టర్ ఎ. శ్యామ్ప్రసాద్ స్పష్టం చేశారు. కేసీసీలో వచ్చిన దరఖాస్తులన్నీ 15 రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బ్యాంకు అధికారులు, పలు శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన బీసీసీ, జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ 2024 సంవత్సరానికి తీసుకున్న పంట రుణాలు తిరిగి చెల్లించిన రైతులకు ఈ ఏడాది రుణాలు మంజూరు చేయాలని సూచించారు. మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక ఊతం కల్పించాలన్నారు. కార్యక్రమంలోజిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్ ఎస్.మన్మథరావు, ఎల్డీఎం ఎన్.విజయ్స్వరూప్, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ ఎం.వి.కరుణాకర్, డీసీసీబీ బ్యాంక్ సీఈఓ సీహెచ్ ఉమామహేశ్వరావు, జిల్లా సహకార శాఖాధికారి పి.శ్రీరామ్మూర్తి , ఏఎల్డీఎం కె.మౌనిక, ఇతర బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
గృహనిర్మాణాల్లో ప్రగతి లేకుంటే చర్యలు
పార్వతీపురం టౌన్: జిల్లాలో పేదల కోసం నిర్మితమవుతున్న గృహ నిర్మాణాల్లో వచ్చేవారానికి ప్రగతి లేకుంటే ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ హెచ్చరించారు. కలెక్టరేట్లో గృహనిర్మాణశాఖ అధికారులతో గురువారం నిర్వహించిన సమాశంలో ఆయన మాట్లాడారు. ప్రతివారం వందల సంఖ్యలో గృహాలు పూర్తికావాల్సి ఉన్నప్పటికీ ఈ వారం 70 గృహాలు మాత్రమే పూర్తికావడంపై మండిపడ్డారు. గృహ నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఇసుక, స్టీల్ అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ గృహ నిర్మాణాలు వెనుకంజలో ఉండడం సరికాదని, వచ్చే వారానికి ప్రగతి కనిపించకపోతే సంబంధిత డీఈఈలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. పీఎం జన్మన్ గృహ నిర్మాణాలు మరింత వేగవంతం చేసి వచ్చే వారానికి 90 శాతం ప్రగతి కనిపించాలని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గృహ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయని, అందుకు తగిన విధంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. యోగాంధ్రను విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సేవలు పట్ల సంతప్తి స్థాయి ఏ మేరకు ఉందన్న విషయమై వివిధ రకాల సర్వేలను చేపడుతుందని, అందులో జిల్లా ముందంజలో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేసీ ఎస్.ఎస్.శోభిక, ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో కె.హేమలత, జిల్లా ఉద్యానవన అధికారి బి.శ్యామల, డీఆర్డీఏ, ఐసీడీఎస్ పీడీలు ఎం.సుధారాణి, డాక్టర్ టి.కనకదుర్గ, డీపీఓ టి.కొండలరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎస్.భాస్కరరావు, ప్రొగ్రాం అధికారి జగన్మోహన్రావు, మునిసిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
24న గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
పార్వతీపురం: ఐటీడీఏ ఆధ్వర్యంలోని గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్లో ప్రవేశాలకు ఈ నెల 24న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పీఓ అశుతోష్ శ్రీవాత్సవ తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ, ఏఈక్యూలకు చెందిన విద్యార్థులు పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో ఉదయం 10గంటల నుంచి జరగనున్న కౌన్సెలింగ్కు హాజరు కావాలని కోరారు. విద్యార్థులు పదోతరగతి మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు. సీతంపేటలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక పార్వతీపురం టౌన్: పజాసమస్యల పరిష్కార వేదికను సోమావారం 10 గంటల నుంచి సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహిస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను సీతంపేట వచ్చి అందజేయాలని కోరారు. జిల్లా అధికారులందరూ సీతంపేటలో జరిగే పీజీఆర్ఎస్కు హాజరుకావాలని ఆయన ఆదేశించారు. ఆధునిక సాగుకు మార్గనిర్దేశం గుమ్మలక్ష్మీపురం(కురుపాం): ఆధునిక విజ్ఞానం, సంప్రదాయ పద్ధతులు కలగలిపిన వ్యవసాయం అందరి లక్ష్యం కావాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివారాజ్ సింగ్ చౌహాన్ దేశవ్యాప్తంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఐసీఏఆర్ డైరెక్టర్లకు సూచించారని రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఽధ్రువ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సదస్సును ప్రారంభించారని గురువారం విలేకరులకు తెలిపారు. రైతుల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలంటే ఆధునిక విజ్ఞానం, సంప్రదాయ పద్ధతులు కలగలిపిన వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ‘వికసిత భారత్’ లక్ష్యంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారని, ఉత్పత్తి పెంపు, ఖర్చుల తగ్గింపు, సరైన ధర, సహజ వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి విషయాలపై కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని వివరించారన్నారు. రైతుల సమస్యలపై నేరుగా చర్చించేందుకు ఆయన పాదయాత్ర చేపడతారని తెలిపారన్నారు. వ్యవసాయ విద్యను ప్రాయోజితంగా మార్చాలని, పరిశోధనలు రైతుల వరకూ చేరాలని సూచించినట్లు పేర్కొన్నారన్నారు. వ్యాసరచన పోటీల్లో బొబ్బిలి విద్యార్థినికి ఫస్ట్ బొబ్బిలిరూరల్: మండలంలోని పెంట గ్రామ ఉన్నత పాఠశాలకు చెందిన తమ్మిరెడ్డి యశస్విని జీవవైవిధ్యంపై జోనల్ విభాగంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం జరిగిన అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంలో భాగంగా యశస్వినికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేసినట్టు పాఠశాల హెచ్ఎం చింతా రమణ తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. -
బావిలో పడి మతిస్థిమితంలేని మహిళ మృతి
రాజాం సిటీ: కుమారుడు మృతిచెందడంతో మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళ నేలబావిలో పడి మృతిచెందింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్సై వై.రవికిరణ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా ఉయ్యురుకు చెందిన పోతిరెడ్డి కుమారి (45) ఏడాది క్రితం రాజాం వచ్చి గాయత్రికాలనీలో నివాసం ఉంటోంది, ఆమె రెండో కుమారుడు నరేంద్ర నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో ఆమె అప్పటినుంచి మానసికంగా ఇబ్బందులు పడి మతిస్థిమితం కోల్పోయి అనారోగ్యం పాలైంది. దీంతో కుటుంబసభ్యులు పలు ఆస్పత్రులకు తీసుకువెళ్లి వైద్యసేవలు అందించారు. అయినప్పటికీ అప్పుడప్పుడు బయటకు వెళ్లిపోవడం కుటుంబసభ్యులు వెతికి తీసుకురావడం పరిపాటిగా మారింది. నాలుగు రోజుల క్రితం తన పెద్దకుమారుడు సాయితేజ రాగోలు జెమ్స్కు తీసుకువెళ్లి చికిత్స అనంతరం మృతురాలి తమ్ముడైన తెలగవీధిలో నివాసం ఉంటున్న కొనిశెట్టి ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద ఉంచారు. ఈ నెల 20వ తేదీ రాత్రి ఇంటి నుంచి ఆమె బయటకు వెళ్లిపోయిన విషయాన్ని బుధవారం కుటుంబ సభ్యులు తెలుసుకుని అన్ని ప్రాంతాల్లో వెతికారు. తెలగవీధి శ్మశానవాటిక వెనుకభాగంలోని నేలబావిలో ఆమె మృతదేహం గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేక బావిలోపడి మృతిచెందినట్లు మృతురాలి కుమారుడు సాయితేజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వై.రవికిరణ్ తెలిపారు. -
ప్రమాదంలో మానవ మనుగడ.!
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ప్రకృతి సిద్ధమైన వాతావరణానికి, కృత్రిమ వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. ప్రస్తుతం ప్రకృతి వైద్యంలో కూడా మన పాత ఆచారాలే ఉంటున్నాయి. ప్రకృతి, తోటి జీవాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఆర్వీజే నాయుడు, పర్యావరణ పరిరక్షణ సమితి కన్వీనర్, రాజాంమనిషి ప్రతి అవసరానికి ప్రకృతిపై ఆధారపడి జీవించాల్సి ఉంది. ప్రకృతి లేనిదే మనిషి లేడు. వ్యవసాయ పద్ధతులైనా, ఆహారపు అలవాట్లయినా, మానవ ధర్మాలైనా, జీవన విధానమైన సృష్టి చక్రానికి లోబడి ఉండాలి. – భారతీయ మహర్షులు రాజాం సిటీ: భూమిపై జీవాల మధ్య భేదమే జీవవైవిధ్యం. ప్రపంచంలో మిలియన్ జాతుల జీవాలు ఉన్నాయి. నేడు భూమి వేడెక్కిపోతోంది. కాలుష్యం అధికమవుతోంది. అడవులు, వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. పర్యావరణ మిత్ర జాతులు అంతరించిపోయి ప్రమాదకర కీటకజాతులు పుట్టుకొస్తున్నాయి. టెక్నాలజీని రుచిమరిగిన మానవ మనుగడ ఈ టెక్నాలజీ కారణంగా నష్టపోతున్న ఇతర జాతుల గురించి పట్టించుకోవడం లేదు. అంతరిస్తున్న జీవజాతులు ప్రపంచంలో పలు జీవజాతులు అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడాలనే ఉద్దేశంతో పర్యావరణ ప్రేమికులు విస్తృత ప్రచారాలు, పోరాటాలు చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి జీవజాతుల పరిరక్షణ నిమిత్తం మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం నిర్వహిస్తోంది. 1992 మే 22 నుంచి ఈ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం నిర్వహిస్తూ వస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రక్షణగా.. మన దేశంలో ఆదివాసీలు ఉన్న ప్రాంతాల్లో జీవవైవిధ్యం రక్షణగా ఉన్నట్లు ఒక అధ్యయనం తెలుపుతోంది. ప్రధానంగా మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్లలో 80 శాతానికి పైగా గిరిజనులు ఉన్నారు. ఈ ప్రాంతాల్లో జీవవైవిధ్యం, ప్రకృతి సంపద పుష్కలంగా ఉంది. మన రాష్ట్రంలో గిరిజన తెగలు జీవిస్తున్న ప్రాంతాల్లో జీవవైవిధ్యం ఉన్నప్పటికీ పాలకుల్లో సమన్వయం లేకపోవడంతో అక్కడ కూడా యాంత్రీకరణ పెరిగి జీవవైవిధ్యం కనుమరుగవుతోంది. జన్యుమార్పిడితో ఇబ్బందులు.. జన్యుమార్పిడి విధానం ఇటీవల అధికమైంది. ఫలితంగా ఎక్కడికక్కడే సంకరజాతి ఉత్పత్తులు ఎక్కువవుతున్నాయి. వాటి కారణంగా కొత్త విత్తనాలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. జన్యుమార్పిడి వల్ల ఇతర జాతులకు నష్టం వాటిల్లితే భవిష్యత్లో మానవ మనుగడకు తీవ్రనష్టం కలిగే ప్రమాదం ఉంది. పెరిగిపోతున్న కాలుష్యం.. ప్రస్తుతం వాతావరణంలో కాలుష్యం పెరగిపోతోంది. పర్యావరణ పరిరక్ష ణకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం సైతం తూతూ మంత్రంగానే వ్యవహరిస్తోంది. వాల్టా చట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఎక్కడికక్కడే ఇసుక తవ్వకాలు, చెట్ల నరికివేత, కాలుష్యాన్ని వెదజల్లే మందుసామగ్రి వినియోగించి కొండలు బద్దలుచేయడం, చెరువుల ఆక్రమణ, జనావాసాల మధ్య సెల్ఫోన్ టవర్లు నిర్మించడం సాధారణమైపోయింది. వీటికి తోడు కాలం చెల్లిన కాలుష్య వాహనాల వినియోగం, రణగొణ ధ్వనులు, అనుమతులుకు మించి నిర్మాణాలు చేయడం, ప్లాస్టిక్ వినియోగించడం వంటివి జీవావరణానికి నష్టం కలిగిస్తున్నాయి. ఫలితంగా పలు జాతుల పక్షులు అంతరించిపోతున్నాయి. రసాయన వ్యవసాయం..ప్రస్తుతం వ్యవసాయం కూడా రసాయన ఎరువుల మయంగా మారిపోయింది. గతంలో కృత్రిమ విత్తనోత్పత్తితో పాటు కృత్రిమ వ్యవసాయం ఉండేది. ప్రస్తుతం రసాయన ఎరువుల వినియోగం అధికం కావడం కారణంగా ఉత్పత్తిచేసే ఆహారపు పంటల్లో కూడా నాణ్యత ఉండడం లేదు. వీటికి తోడు రసాయన ఎరువుల కారణంగా పర్యావరణానికి మేలు చేసే కీటకాలు మృతిచెంది, విషజ్వరాలు, రోగాలను వ్యాప్తిచేసే కీటకాలు అధికమవుతున్నాయి. ఇప్పటికై నా పాలకులు, ప్రజలు మేల్కొనకుంటే మున్ముందు భవిష్యత్ అంధకారమే. అంతరించిపోతున్న జీవజాతులు ప్రమాదంలో జీవసంపద మేల్కొనకుంటే ముందుతరాలకు ముప్పు నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం -
ఉపాధిలో బినామీ మస్తర్లు..!
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల పేరిట మస్తర్లు ఉపాధి హామీ పథకంలో డబ్బులు దోచేందుకు అడ్డదారులను వెతుకుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారి పేరిట బినామీ మస్తర్లు వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది మేట్లైతే తమ భార్య/భర్తల పేరిట బినామీ మస్తర్లు వేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.● మేట్ల అండతో కూటమి నేతల దోపిడీ ● ప్రభుత్వ ఉద్యోగులు సైతం పనికి వస్తున్నట్లు మస్తర్లు ● లక్షలాది రుపాయలు స్వాహా విజయనగరం ఫోర్ట్: ● గంట్యాడ మండలం నరవ గ్రామంలో ఎస్.సత్యనారాయణ అనే వ్యక్తి ఉపాధి హామీ పనికి వెళ్లకపోయినా వెళ్లినట్లు మస్తరు వేశారు. ఆయన విజయనగరం కలెక్టరేట్లోని సర్వశిక్ష అభియాన్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. మే నెలలో ఆయన పనికి వెళ్లినట్లు మస్తర్ వేయగా ఆయనకు రూ.1260 వేతనం జనరేట్ అయింది. ● ఇదే గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే మరో వ్యక్తి విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో ఉన్న ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఈయన ఏప్రిల్, మే నెలల్లో పనికి వెళ్లినట్లు మస్తర్ వేశారు. దీంతో ఈ అధ్యాపకుడికి మూడు వారాలకు గాను రూ.3356 వేతనం జనరేట్ అయింది. వీరితో పాటు మరి కొంతమందికి కూడా బినామీ మస్తర్లు వేశారని గ్రామ సర్పంచ్ పతివాడ భాస్కరరావు ఎంపీడీఓ ఆర్వీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. ఈ ఒక్కగ్రామంలోనే కాదు. జిల్లాలోని అనేక చోట్ల బినామీ మస్తర్లు వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల బయటపడుతున్నాయి. మరి కొన్ని చోట్ల గుట్టుగా సాగి పోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. బినామీ మస్తర్ల పేరిట ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోకుండా అధికారులు చోద్యం చూడడం వల్లే ఉపాధి హామీలో అక్రమాలు పెరిగిపోతున్నాయనే వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి సర్కార్ వచ్చాక పెరిగిన అవినీతి కూటమి సర్కార్ రాష్ట్రంలో ఏర్పాటైన తర్వాత ఉపాధి హామీ పథకంలో అవినీతి పెచ్చు మీరుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో పనిచేసిన మేట్లను తొలగించి కూటమికి చెందిన సానుభూతిపరులను మేట్లుగా నియమించుకున్నారు. అధికారులు కూడా కూటమి నేతల ఆదేశాలకు వంత పాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి నేతలు నియమించుకున్న మేట్ల ద్వారా బినామీ మస్తర్లు వేసుకుని కాసులు దండుకుంటున్నట్లు విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అక్రమాలు జరుగుతున్నా అధికార పార్టీ వారు కావడంతో అధికారులు ఏమీ అనకుండా చూసీచూడనట్లు ఉంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బినామీ మస్తర్ల ద్వారా లక్షలాది రుపాయలు దండుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో 3.53 లక్షల జాబ్ కార్డులు ఉండగా అన్నీ యాక్టివ్లో ఉన్నాయి. జిల్లాలో 6.08 లక్షల వేతనదారులు ఉన్నారు. వారిలో 5.95 లక్షల మంది వేతనదారులు ఉపాధి పనులకు వెళ్తారు. బినామీ మస్తర్లపై విచారణ చేపట్టి చర్యలు ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్ప డిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నాం. ఎస్.శారదా దేవి, పీడీ, డ్వామా -
ఎంఆర్పీ ఉల్లంఘన జరగలేదు
నెల్లిమర్ల రూరల్: మద్యం అమ్మకాల్లో ఎలాంటి ఎంఆర్పీ ఉల్లంఘన జరగలేదని ఎకై ్సజ్ సీఐ వెంకట్రావు స్పష్టం చేశారు. నెల్లిమర్ల మండలంలోని సతివాడ మద్యం దుకాణంలో ఎంఆర్పీకి అదనంగా మద్యం అమ్ముతున్నారని పలువురు మద్యం ప్రియులు ఇచ్చిన ఫిర్యాదుపై బుధవారం ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొంత మంది వ్యక్తుల ఫిర్యాదుతో సతివాడలో మద్యం దుకాణాన్ని పరిశీలించి విక్రయాలపై ఆరా తీశామన్నారు. కొత్త ధరలపై పాత స్టిక్కర్లు ఉండడమే ఈ విధమైన ఆరోపణలకు ప్రధాన కారణంగా గుర్తించామని చెప్పారు. నెల్లిమర్ల పట్టణంలో ఉన్న మద్యం డిపోను కూడా సందర్శించి ధరలను సరిచూశామని తెలిపారు. సిగ్నేచర్ విస్కీ క్వార్టర్ బాటిల్ పాత ధర రూ.330గా ఉండేదని, ప్రస్తుతం పెంచిన ధరతో రూ.350గా అమ్మకాలు సాగుతున్నాయన్నారు. పాత స్టిక్కర్ రూ.330 బాటిల్పై ఉండడంతో మద్యం తాగేందుకు వచ్చిన వారు ఫిర్యాదు చేశారని, ప్రస్తుత ధరతోనే షాపులో అమ్మకాలు జరిగాయని స్పష్టం చేశారు. మండల వ్యాప్తంగా ఏ మద్యం షాపులోనూ పైసా కూడా అదనంగా తీసుకోవడం లేదని చెప్పారు. నిత్యం షాపులపై తనిఖీలు జరుపుతున్నామని, ఎంఆర్పీని ఉల్లంఘిస్తే షాపులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎకై ్సజ్ సీఐ వెంకట్రావు -
అంకితభావంతో పని చేయాలి
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాల్సిన బాధ్యత ఉద్యోగుల పట్ల ఉందని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్ కార్యాలయంలో సహాయకులుగా పని చేస్తున్న 6గురు సిబ్బందికి రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ బుధవారం ఆయన ఉత్తర్వులు అందజేశారు. ఈ క్రమంలో సీహెచ్.సీతమ్మ, టి.రాములు, డి.రామస్వామి, ఆర్.సింహాచలం, జి.వెంకటరత్నం, ఎం.వెంకటరమణలకు జామి, మెట్టపల్లి, నాగూరు, బలిజిపేట, చింతాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు విజయనగరం జిల్లా పరిషత్లో మరొకరిని రికార్డ్ అసిస్టెంట్గా నియమించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బీవీ. సత్యనారాయణ, డిప్యూటీ సీఈఓ ఆర్.వెంకట్రామన్ తదితరులు పాల్గొన్నారు. సారాతో నలుగురి అరెస్టుపాలకొండ: సారా తరలిస్తున్న కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశామని ఎకై ్సజ్ సీఐ సూర్యకుమారి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆమె బుధవారం స్థానిక విలేకరులకు వివరించారు. వీరఘట్టం మండలం మోకాసరాజపురం గ్రామ సమీపంలో జలుమూరు ప్రశాంత్కుమార్, వడ్డి సునీల్లు 160లీటర్లు సారాను కారులో తరలిస్తున్నట్లు గుర్తించి అదపులోకి తీసుకున్నామన్నారు. అలాగే వీరఘట్టం ఎస్సీ కాలనీలో దాడులు చేయగా బండి కస్తూరి ఐదు లీటర్ల సారాతోను, సిరిపురం ఉష మరో ఐదు లీటర్ల సారాతోను పట్టుబడినట్లు తెలిపారు. సారాతో పాటు కారును సీజ్ చేశామని, నలుగురు నిందితులను రిమాండ్కు తరలించామని వివరించారు. ఈ దాడుల్లో పాలకొండ ఎకై ్సజ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. కొండ దిగిన ఏనుగుల గుంపు● మొదలైన ఘనసర రైతుల కష్టాలు భామిని: మండలంలోని ఘనసర రైతులకు ఏనుగుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. కొంతకాలంగా తివ్వాకొండల్లోకి ఏనుగులు వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్న రైతులకు మళ్లీ కష్టం వచ్చిపడింది, బుధవారం భామిని మండలం ఘనసర గ్రామాన్ని ఆనుకుని ఉన్న ఐలమ్మ తోటలో నాలుగు ఏనుగుల గుంపు ప్రత్యక్షమైంది.తివ్వాకొండల్లో తాగునీటికి విలవిలలాడి కొండ దిగి వచ్చినట్లు ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు.తిరిగి ఎలిఫెంట్ ట్రాకర్స్, ఫారెస్టు సిబ్బందికి ఏనుగుల రక్షణ బాధ్యతలు ఆరంభమయ్యాయి. గంజాయి పట్టివేతవిజయనగరం క్రైమ్: పశ్చిమ గోదావరి జిల్లానుంచి సుమారు 4.5 కేజీల గంజాయిని తరలిస్తుండగా విజయనగరం జీఆర్పీ సిబ్బంది బుధవారం స్టేషన్లో పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కోపల్లెకు చెందిన లెంక కరుణానిధి విజయనగరం రైల్వే ప్లాట్ ఫాంపై అనుమానంతో రెండు బ్యాగులతో సంచరిస్తుండగా పట్టుకున్నామన్నారు. నిందితుడి దగ్గర నుంచి రూ.22,500 విలువ గల 4.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం విశాఖ రైల్వే కోర్టుకు తరలించినట్లు చెప్పారు. -
విజేతల స్ఫూర్తితో ముందుకు సాగాలి
విజయనగరం గంటస్తంభం: సమాజంలో నేటితరం విద్యార్థులకు అనేక సవాళ్లు ఉన్నప్పటికీ లక్ష్యసాధనకు కసిగా కృషి చేయాలని విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి మజ్జి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం జామి మండలంలోని అట్టాడ గ్రామంలో గల బీఎస్ఆర్ ఆశ్రమంలో జిల్లా పౌరవేదిక, ఎన్వీఎన్ బడ్ల్ బ్యాంక్ సంయుక్తంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో సత్తా చాటిన విద్యార్థులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు నిరంతరం జాతీయ, అంతర్జాతీయ విజేతల జీవిత ఘట్టాలు చదవాలని వారినుంచి స్ఫూర్తి పొందాలని గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు సాధించిన విజయాలను చూసి చదువు పట్ల ఆసక్తి ఉన్నవారికి ఉత్సాహం కలుగుతుందన్నారు. విశ్రాంత చీఫ్ బ్యాంకింగ్ అధికారి పిడకల ప్రభాకరరావు మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ ప్రతిభను చూపిన విద్యార్థులను చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నారు. చదువుతో పాటు విద్యార్థులకు క్రమశిక్షణ చాలముఖ్యమని పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చాలా ఆరాటపడుతుంటారనే విషయాన్ని విద్యార్దులు మరిచిపోకూడదని హితవు పలికారు. పాఠశాలల వారీగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అతిథులు ఘనంగా సన్మానించారు. సమావేశంలో పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, ఎన్వీఎస్ బ్లడ్ బ్యాంక్ అధినేత తాడేపల్లి నాగేశ్వరరావు, తుమ్మగంటి రాంమోహన్రావు, ఇప్పలవలస గోపాలరావు, ఆశ్రమం నిర్వాహకులు భీశెట్టి శారద, ఆడారి హరిత సాయి తదితరులు పాల్గొన్నారు. సైనిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి మజ్జి కృష్ణారావు టెన్త్లో ప్రతిభ కనబరిచిన ఆశ్రమ విద్యార్ధులకు అభినందన -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
వేపాడ: మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన యువకుడు జి.రాకేష్(20) వ్యసనాలకు బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి వల్లంపూడి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొద్దాం గ్రామానికి చెందిన జి.రాకేష్ తండ్రి వెంకటసత్యం ఎస్.కోట సర్కిల్ పరిధిలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ పదినెలల క్రితం విద్యుత్ఘాతంతో మరణించారు. అప్పటినుంచి రాకేష్ వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ నెల 11న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబసభ్యులు ఎస్.కోట సామాజిక ఆసుత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విజయనగరంలోని మహారాజా ఆస్పత్రిలో చేర్చారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖలోని కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి తల్లి పార్వతి కారుణ్య నియామకంపై కొత్తవలసలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాన్ ఢీకొని యువకుడి మృతిపార్వతీపురం రూరల్: మండలంలోని రావికోన పంచాయతీ రంగాలగుడ గ్రామంలో వివాహానికి హాజరైన ఒడిశాకు చెందిన ముగ్గురు యువకుల్లో ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ దుర్ఘటన వివరాలిలా ఉన్నాయి. పెళ్లికి వెళ్లిన యువకులు ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా రంగాలగూడ గ్రామం మలుపు వద్ద ఒడిశా నుంచి ఎదురుగా వస్తున్న పౌల్ట్రీ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న యువకులు రోడ్డుపై పడిపోగా తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్తులు హుటాహుటిన పార్వతీపురం కేంద్రాస్పత్రికి 108 సాయంతో తరలించగా మార్గమధ్యంలో కండ్రిక నారు అనే వ్యక్తి మృతిచెందాడు. మరో ఇద్దరు యువకులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ముగ్గురి యువకులను ఒడిశాలోని అలమండ పంచాయతీ జగ్గుగూడ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పార్వతీపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మామిడి కాయలు నిల్వ చేసిన ఇళ్లపై విజిలెన్స్ తనిఖీలు
గంట్యాడ: మండలంలోని రామవరం గ్రామంలో కాకర్లపూడి రామకృష్ణరాజు, సిరపురపు శివ అనే వ్యక్తుల ఇళ్లలో నిల్వ చేసిన మామిడి కాయలపై విజిలెన్స్, ఆహార తనిఖీ అధికారులు సంయుక్తంగా బుధవారం తనిఖీలు నిర్వహించారు. రామకృష్ణ రాజు, శివలు పండించిన మామిడి కాయలకు మంచి రంగు వచ్చి ఆకర్షణీయంగా కనబడడానికి, తద్వారా పళ్లను ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి మామిడి కాయలకు ఈపి–50, రిఫాన్ అనే కెమికల్ ద్రావణం ఉపయోగించి రంగు వచ్చిన తర్వాత మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు మాట్లాడుతూ ఈ విధంగా కృత్రిమంగా కెమికల్స్ వాడి మామిడి కాయలు పండించరా దన్నారు. ఇలా పండించడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. కృత్రిమంగా కెమికల్స్ వాడి మామిడి కాయలు పండించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఆహార భద్రత అధికారులు కెమికల్ స్ప్రే చేసిన మామిడి కాయల నమూనాను సేకరించి వాటిని రసాయన పరీక్ష నిమిత్తం నాచారాం, హైదరాబాద్కు పంపి దాని రిపోర్ట్ అధారంగా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ తనిఖీలో విజిలెన్స్ అధికారులు సీఐ సింహాచలం, హెచ్సీ కామేశ్వరావు, పురుషోత్తం పాల్గొన్నారు. -
సూర్యప్రకాష్కు విజనరీ ఇండియన్స్ అవార్డు
గరుగుబిల్లి: విభిన్న రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని కేంద్ర ప్రసార భారతి మంత్రిత్వశాఖ గుర్తించి విజనరీ ఇండియన్స్ అవార్డులను అందజేసింది. ఇందులో భాగంగా గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన డా.గుల్ల సూర్యప్రకాష్ హైదరాబాద్లోని కేర్ హస్పిటల్లో కార్డియాలజిస్టుగా విధులను నిర్వహిస్తున్న ఆయన విజనరీ ఇండియన్స్ అవార్డుకు ఎంపిక కాగా ప్రసిద్ధ బాలీవుడ్ నటి పూనమ్ ధిల్లాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆయన కేర్ ఆస్పత్రిలో సేవలను అందిస్తూనే ఈ ప్రాంతీయులకు సేవలను అందించాలనే ఉద్దేశంతో మండలంలోని రావుపల్లి, కొత్తూరు తదితర గ్రామాలలో ప్రత్యేక వైద్యశిబిరాలను నిర్వహించి వందలాదిమందికి సేవలను అందిస్తున్నారు. చిరకాలంగా వైద్యసేవలను అందిస్తూ ఈ ప్రాంతీయుల మన్ననలను పొందుతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణ రాష్ట్రంలో సేవలను అందిస్తున్నారు. ఆయన సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి కేంద్రప్రసారభారతి మంత్రిత్వశాఖ ఈనెల 18న న్యూ ఢిల్లీలోని ఆకాశవాణి భవనంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డా.సూర్యప్రకాష్కు విజనరీ ఇండియన్స్ అవార్డును బహుకరించింది. ఆయన ప్రత్యేక అవార్డును అందుకోవడంపట్ల గ్రామసర్పంచ్ బొంతాడ మహేశ్వరరావు, మాజీ సర్పంచ్ గుల్ల కాశినాయుడు, అన్నపూర్ణమ్మ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
ఆవేదనలో రైతన్న
అధ్వానంగా సాగునీటి వనరులు..● పూడుకుపోయిన పంట కాలువలు ● శివారు భూములకు సాగునీరు ప్రశ్నార్థకం ● పట్టించుకోని కూటమి నేతలుఆదేశాలు వచ్చాయి ఉపాధిహామీ పథకం కింద చేపట్టే చెక్డ్యాంలు, క్యాస్కేడింగ్స్, చెరువుల పనులు ఆరువారాల్లో పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలో 39 చెక్డ్యాంలు, 122 చెరువులు, 40 క్యాస్కేడింగ్స్ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నాం. ఉపాధిహీమీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయిచిన రూ. 210కోట్ల నిధుల్లో జలవనరుల పనులకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. – కె.రామచంద్రరావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకుడు, పార్వతీపురం మన్యంపార్వతీపురం రూరల్: ఖరీఫ్ సాగు సమయం ఆసన్నమవుతోంది. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రైతులు పొలాలను దుక్కిచేసి సాగుకు సిద్ధం చేస్తున్నారు. అయితే, పంటకు సాగునీరందించే కాలువలు, చెరువులు అధ్వానంగా ఉండడం రైతన్నలను ఆవేదనకు గురిచేస్తోంది. పూడుకలు, పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్న కాలువలను చూసి రైతులు కలతచెందుతున్నారు. సాగునీరు అందుతుందో లేదోనని బెంగపడుతున్నారు. ఇప్పటికే రైతు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించడంలేదు. సాగునీటి వనరుల అభివృద్ధికి కనీస చర్యలు తీసుకోవడంలేదంటూ రైతన్నలు వాపోతున్నారు. తక్షణమే స్పందించి కనీసం ప్రధాన, పిల్లకాలవలను బాగుచేయాలని కోరుతున్నారు.ఇప్పటికే పనులు పూర్తి చేయాలి జిల్లాలో తోటపల్లి, జంఝావతి, వట్టిగెడ్డ, వెంగళరాయ, రావాడ గెడ్డ, సాకిగెడ్డల పరిధిలోని కాలువలు, చెక్డ్యామ్లు, షట్టర్లను బాగుచేయాల్సి ఉంది. కాలువలు పూడుకలతో నిండినా పట్టించుకోకపోవడం విచారకరం. మరికొద్ది రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆరంభమై వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ సమయంలో పనులు ఎలా చేపడతారో పాలకులు, అధికారులకే తెలియాలి. – వంగల దాలినాయుడు, చెరువుల పరిరక్షణ సమితి సభ్యుడు, పార్వతీపురం మన్యం -
అల్లం విత్తనాల పంపిణీ
సీతంపేట: ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పలు గ్రామాల్లో పీహెచ్ఓ ఎస్.వి.గణేష్ చేతుల మీదుగా మహిమ అనే అల్లం విత్తన రకాన్ని పంపిణీ చేశారు. బూతలగూడ, చాపరాయిగూడ, గొట్టిపల్లి, అడ్డంగి, చాపరా యిగూడ గ్రామాల రైతులకు అందజేశారు. సాగు పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో వెలుగు ఎన్జీవో ఆనంద్ పాల్గొన్నారు. పాలకొండలో తమ్ముళ్ల తోపులాట ● మినీసంగ్రామంగా మారిన మినీ మహానాడు సన్నాహక సమావేశం పాలకొండ: పాలకొండ సీఎల్ నాయుడు కల్యాణమండపం ఆవరణలో బుధవారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు సన్నాహక సమావేశం తెలుగుతమ్ముళ్లు తన్నులాటకు వేదికగా మారింది. నువ్వెంతంటే నువ్వెంతంటూ ఒకరినొకరు తోసుకున్నారు. తమ్ముళ్లు కుమ్ములాటతో సమావేశ మందిరం దద్దరిల్లింది. పరిశీలకులు సైతం పాలకొండ నాయకు లకు ఒక నమస్కారం అంటూ వేదిక నుంచి బయటకు వెళ్లిపోయారు. చివరకు పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేసినా ఫలితం లేకపోయింది. గంటపాటు జరిగిన ఈ సగ్రామంలో టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి వ్యతిరేక వర్గం భూదేవి డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. తంపటాపల్లి, పొట్లి గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు హంగామా చేయడంతో ఇటు నుంచి భూదేవి వర్గీలు అరుపులు మొదలుపెట్టారు. దీంతో ఇరు వర్గాలు వారు తోపులాడుకున్నా రు. మేమే అసలైన టీడీపీ అంటూ కొందరు, మేమే మొదట నుంచి పార్టీలో ఉన్నామంటూ కొందరు వాదనలతో స్టేజిపైన ఉన్నవారు అవాక్కయ్యారు. అరకు పార్లమెంట్ పరిశీలకుడు తొట్టపూడి హర్షవర్దన్, నియోజకవర్గ పరిశీలకుడు కలమట సాగర్లు దీంతో స్టేజ్పైనుంచి దిగి వెల్లిపోయారు. గంట సమయం పాటు జరిగిన గందర గోళం అనంతరం సమావేశం ప్రారంభించి మమ అనిపించారు. -
కాళ్లు ఈడ్చుకుంటూ
ప్రభుత్వం మారింది. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కష్టాలు ఆరంభమయ్యాయి. ప్రజా సంక్షేమ పథకాలు ఎండమావిగా మారాయి. వలంటీర్ వ్యవస్థ రద్దయింది. లక్షల మందికి జీవనోపాధి పోయింది. ప్రజారోగ్యానికి భరోసా లేదు. ఆరోగ్య ఆసరా అందదు. పేద కుటుంబాల పిల్లల చదువుకు సాయం అందని ద్రాక్షగా మారింది. రైతన్నకు సాగుభరోసా, పంటకు గిట్టుబాటు ధర కరువైంది. నిరుద్యోగులకు భృతి ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎండీఎం వాహన వ్యవస్థను రద్దు చేయడంతో వేలాది మంది నిరుద్యోగులకు వచ్చేనెల 1 నుంచి ఉపాధి పోతుంది. ఇన్నాళ్లూ ఇంటివద్దనే అందిన రేషన్ సరుకుల కోసం ప్రజలకు పాట్లు తప్పవు. రోజుల తరబడి పనులు మానుకుని కాళ్లుఈడ్చుకుంటూ సరుకుల కోసం రేషన్ దుకాణాల వద్ద క్యూకట్టాల్సిందే. కొండలు దిగి ఎక్కాల్సిందే అంటూ జనం నిట్టూర్చుతున్నారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలపై మండిపడుతున్నారు.మళ్లీ పాత రోజులే... పార్వతీపురం మన్యంలోని 15 మండలాల పరిధి లో ఎనిమిది ఎంఎల్ఎస్ పాయింట్లు ఉన్నాయి. 2.81 లక్షల కార్డుదారులుండగా.. వీరందరికీ రేషన్ సరకులను ఇంటికి తీసుకొచ్చే క్రమంలో ఎండీయూ వాహన వ్యవస్థను గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశా లు కూడా కలిగాయి. మొత్తం జిల్లాకు 196 వాహ నాలు కేటాయించగా.. ఇందులో రూరల్లో 169, పట్టణ ప్రాంతాల్లో 27 వాహనాలు ఉన్నాయి. ఇందులో కూడా నాటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ప్రాధాన్యమిచ్చింది. మొత్తం వాహనాల్లో ఎస్టీలు 67, ఎస్సీలు 28, బీసీలు 90, ఈబీసీలు 10, మైనారిటీస్ 01 చొప్పున వాహ నాలు కేటాయించారు. వీరితో పాటు.. సహాయకు లకు కూడా వాహనాల వల్ల ఉపాధి దొరికింది. కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థనే మొత్తంగా ఎత్తివేస్తామని ప్రకటించడంతో వారంతా కుటుంబాలతోపాటు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కార్డుదారులు కూడా గతం మాదిరి రేష న్ దుకాణాలకు వెళ్లి సరకులు తెచ్చుకోవాల్సిందే. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పార్వతీపురం టౌన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రతిఒక్కరూ యోగాను జీవనంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఆయుష్, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో యోగాభ్యసన మాసోత్సవాన్ని బుధవారం ప్రారంభించారు. ఆర్సీఎం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టరేట్ వరకు సాగిన యోగాంధ్ర ప్రచార ర్యాలీకి పచ్చజెండా ఊపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా నెలరోజుల ముందు నుంచే గ్రామ, మండల స్థాయిలో యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు యోగాంధ్రకు రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర యాప్ను డౌన్లోడ్ చేసుకొని తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి రోజు యోగాభ్యసన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఆసనాలు వేయడం సులభమవుతుందన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక, ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, జిల్లా ఆయుష్ వైద్యాధికారి బి.సుశీల, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్.భాస్కరరావు, జిల్లా ప్రొగ్రాం అధికారులు ఎం.వినోద్కుమార్, టి.జగన్మోహనరావు, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, యోగా శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు. -
హనుమాన్ జయంతికి సర్వం సిద్ధం
విజయనగరం టౌన్: వైశాఖ బహుళ దశమి ఈ నెల 22న గురువారం నిర్వహించే హనుమాన్ జయంతికి సర్వం సిద్ధం చేసినట్లు ప్రాజెక్ట్ చైర్మన్ మడిపల్లి వెంకటాచలం పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం ఆవరణలో మంగళవారం ఉత్సవ ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ రోజు ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, లక్ష తమలపాకులతో అర్చనలు ఉంటాయన్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్ జీఎస్.గుప్త మాట్లాడుతూ అదేరోజు సాయంత్రం చిన్నారులతో సిందూరార్చన, 27 రకాల పిండివంటలతో స్వామికి నైవేద్యం సమర్పిస్తామన్నారు. దేవాలయం కన్వీనర్ పెంటపాటి కామరాజు మాట్లాడుతూ భక్తులకు మంచినీరు మజ్జిగ, మధ్యాహ్నం 7వేల మందికి అన్నప్రసాద వితరణ ఏర్పాటుచేశామని తెలిపారు. భక్తులందరూ స్వామివారిని దర్శించి, తరించాలని కోరారు. కార్యక్రమంలో కలగర్ల నారాయణరావు, రామకృష్ణ, కేవీ. శంకరరావు, నాదం తదితరులు పాల్గొన్నారు. -
మద్యం దుకాణం వద్ద రగడ
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడ మద్యం దుకాణంలో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మధ్యాన్ని అమ్ముతున్నారంటూ పలువురు మద్యం ప్రియులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. వల్లూరు గ్రామానికి చెందిన పంచాది శ్రీనివాసరావు, గోవింద, తాతినాయుడు, తదితరులు మద్యం కొనేందుకు షాపుకు వెళ్లగా రూ.660 ఖరీదు గల రెండు బాటిల్స్ మద్యాన్ని రూ.700కు విక్రయించారు. బాటిల్స్పై అదనంగా వసూలు చేస్తుండడంతో మరి కొంతమందితో కలిసి షాపు నిర్వాహకులను కొనుగోలుదారులు తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే స్టిక్కర్ మారలేదని షాపులోని వ్యక్తి సమాధానం ఇచ్చాడన్నారు. ఎకై ్సజ్ సీఐకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. చీప్ లిక్కర్ బాటిల్ నుంచి పెద్ద బ్రాండ్ల వరకు ఇదే దందా కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులైనా స్పందించి బాటిల్పై ఉన్న ధరకే మద్యం విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సీరాజ్ కాల్ డేటాపై ఎన్ఐఏ ఆరా!
విజయనగరం క్రైమ్: విజయనగరం ఆబాద్ వీధికి చెందిన సీరాజ్ ఉర్ రెహ్మన్ ఉగ్ర మూలాలపై ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు రెండో రోజు మంగళవారం కూడా రెండో పట్టణ పోలీస్స్టేషన్లో మధ్యాహ్నం వరకు మకాం వేశారు. ఈ సమయంలో సీరాజ్ ఉపయోగించిన ఫోన్ ఆధారంగా కాల్ డేటాపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిసింది. తన ఫోన్లో ఐదుగురు గ్రూపు సభ్యులతో కలిసి ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ చాటింగ్పై ఆరా తీసినట్టు సమాచారం. ఎస్ఐ శిక్షణ తీసుకునే సమయంలో హైదరాబాద్లో సమ్మీర్తో ఏర్పాటైన సంబంధాల నుంచి నేటి వరకు ఆయన కాల్ డేటాను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అసలు ఆయనకు ఉగ్ర మూలాలకు ఎక్కడ బీజం పడిందన్న దానిపై లోతైన సమాచారం సేకరిస్తున్నట్టు సమాచారం. ఉగ్ర వాదులతో సంబంధాలు ఎక్కడ ఏర్పడ్డాయి? ఎవరెవరితో ఈ సంబంధాలు కొనసాగుతున్నాయి... పేలుళ్లకు కుట్ర ఎక్కడ పన్నారు... ఎవరెవరితో దీనికి స్కెచ్ వేశారన్న దానిపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఇటు విజయనగరం, అటు హైదరాబాద్లో కలసి పేలుళ్లకు సమ్మీర్తో కలిసి పన్నిన కుట్రకు ఎక్కడ బీజం పడిందనే కోణంతో లోతుగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో ఆయన కుటుంబ సభ్యులను విచారణ చేసే పనిలో ఉన్నట్టు తెలిసింది. విజయనగరంలో పలు చోట్ల పేలుళ్లకు స్కెచ్ వేసిన సీరాజ్ ఏఏ ప్రాంతాల్లో వీటికి పథక రచన చేశాడన్న దానిపై కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఎన్ఐఏ అధికారులు విచారణ మరింత వేగవంతం చేశారు. రెండో రోజు దర్యాప్తు ఉగ్ర మూలాలపై ప్రత్యేక దృష్టి -
కళామతల్లి ముద్దుబిడ్డను ఆశీర్వదించండి
విజయనగరం టౌన్: కళలకు కాణాచిగా పేరొందిన విద్యలనగరం విజయనగరం అమ్ములపొది నుంచి జాలువారిన కళామతల్లి ముద్దుబిడ్డ దియారాజ్ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ఫ్రైడే చిత్ర నిర్మాత కేసనకుర్తి శ్రీనివాస్ కోరారు. శ్రీ గణేష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మాణమవుతున్న ఫ్రైడే చిత్రం యూనిట్ మంగళవారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న జీఎస్ఆర్ గ్రాండ్లో సందడి చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లాకు చెందిన హీరోయిన్ దియారాజ్తో పాటు హీరో, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల అభిమానుల మనసు దోచుకునేలా ఫ్రైడే చిత్రం రూపకల్పన ఈశ్వర్బాబు ధూళిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోందన్నారు. హీరోయిన్ దియారాజ్ మాట్లాడుతూ జిల్లావాసులందరూ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందన్నారు. అనంతరం గురానా చారిటబుల్ ట్రస్ట్ అధినేత, జనసేన సీనియర్ నాయకుడు గురాన అయ్యలు దియారాజ్ను సత్కరించి, అభినందించారు. కార్యక్రమంలో ఆదాడ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలుశిక్ష
విజయనగరం క్రైమ్: మూడేళ్ల క్రితం విజయనగరం టుటౌన్ పోలీస్స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయి ఉమామహేశ్వరరావుకు (20) 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2500 జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి తీర్పు వెల్లడించినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే..విజయనగరంలో 9వతరగతి చదువుతున్న బాలికతో శ్రీకాకుళం జిల్లా గార మండలం దీపావళి గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు ఇన్స్ర్ట్రాగామ్లో పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి బాలికను లోబరుచుకుని శ్రీకాకుళం తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై 2023లో సదరు బాలిక తల్లిదండ్రులు విజయనగరం టుటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి సీఐ లక్ష్మణరావు పోక్సో కేసు నమోదు చేశారు. అలాగే అప్పటి విజయనగరం దిశ మహిళా పోలీస్స్టేషన్ సీఐ నాగేశ్వరరావు కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ఈ కేసులో నిందితుడు ఉమామహేశ్వరరావుపై చేసిన నేరారోపణలు రుజువు కావడంతో పోక్సో జడ్జి పై విధంగా తీర్పు ఇచ్చినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి రూ.2లక్షలు పరిహారంగా ఇప్పించాలని జడ్జి తీర్పు వెల్లడించారన్నారు. పోలీసుల తరఫున పబ్లిక్ప్రాసిక్యూటర్ మెట్ట ఖజానారావు వాదనలు వినిపించగా కోర్టు కానిస్టేబుల్ లక్ష్మి, సీఎంఎస్ హెచ్సీ రామకృష్ణ సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టు సిబ్బందిని, తమ శాఖ సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. -
అంతర్జాతీయ స్థాయిలో ప్రవల్లిక ప్రతిభ
విజయనగరం టౌన్: పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ ఆఫ్ దుబాయ్, పిరమిడ్ యోగా అండ్ డ్యాన్స్ అకాడమీ సంయుక్తంగా అంతర్జాతీయ స్థాయిలో దుబాయ్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 18న నిర్వహించిన పోటీల్లో భారత్కు చెందిన సాయినాథ్ కళా కమిటీ, ఎస్కేఎస్ అకాడమీలు పాల్గొన్నాయి. జిల్లాకు చెందిన కోలక ప్రవల్లిక దుర్గాదేవీగా వివిధ భారతీయ నృత్య రీతులను ప్రదర్శించి మన్ననలు పొందారు. ఇండియన్ కాన్సులేట్కి చెందిన అరుజిత్ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రవల్లికకు నృత్య యువ ప్రతిభ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం వివరాలు వెల్లడించారు. ప్రవల్లికను పలువురు అభినందించారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా నిత్య పూజలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. చదురుగుడిలో చండీయాగం మూడులాంతర్లు వద్దనున్న పైడితల్లి అమ్మవారి చదురుగుడి ఆలయ ప్రాంగణంలో మూడో మంగళవారాన్ని పురస్కరించుకుని వేదపండితులు వేదమంత్రోచ్చారణలతో చండీయాగం ఘనంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు శంబరి కృష్ణ యాగాన్ని నిర్వహించి, యాగవిశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం యాగంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి తీర్ధప్రసాదాలను అందజేశారు. -
అమ్మ పండగలో అపశ్రుతి
సాలూరు: పట్టణంలోని శ్యామలాంబ అమ్మవారి పండగ అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం ఉయ్యాల కంబాలు, సోమవారం తొలేళ్ల ఉత్సవం జరగ్గా.. మంగళవారం సిరిమానోత్సవం భక్తజన సంద్రం నడుమ వేడుకగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సిరిమానును తిలకించారు. మొక్కులు చెల్లించుకున్నారు. అయితే మంగళవారం సిరిమానోత్సవం జరుగుతున్న క్రమంలో అపశ్రుతి దొర్లింది. విరిగిన అమ్మవారి అంజలి రథచక్రం మంగళవారం సాయంత్రం భక్తజనం నడుమ సిరిమానోత్సవం ప్రారంభమైంది. జన్నివారు సిరిమానును అధిరోహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు జై శ్యామలాంబ అంటూ చేసిన నామస్మరణ నడుమ సిరిమాను నాయుడు వీధి రామమందిరం నుంచి కదిలింది. సాయంత్రం 4.05 గంటలకు సిరిమాను ప్రారంభ ముహుర్తం కాగా కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. సిరిమాను వద్ద కట్టిన తాళ్లు తెగిపోగా వెంటనే వాటిని సరి చేశారు. దీంతో సిరిమాను కదిలింది. కొద్ది సేపటికి బోసు బొమ్మ సమీపంలో రూరల్ సీఐ కార్యాలయం వద్దకు చేరుకోగా అంజలి రథం ఎడమ చక్రం విరిగింది. దీంతో సిరిమానోత్సవం తాత్కాలికంగా ఆగింది. వేరే చక్రం తీసుకువచ్చి ఏర్పాటు చేస్తామని వెల్లడించిన నిర్వాహకులు సుమారు రాత్రి 9 గంటల సమయంలో నూతన చక్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సిరిమానోత్సవంలో ఏమైనా పొరపాట్లు దొర్లి ఉంటే శ్యామలాంబ తల్లే తమను మన్నించాలని భక్తులు వేడుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్, పీవో శ్యామలాంబ అమ్మవారిని జిల్లా కలెక్టర్ శ్యామ్ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ పీవో అశుతోష్ శ్రీవాస్తవ అమ్మవారిని దర్శించుకున్నారు. సిరిమాను ఊరేగింపు ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు శ్యామలాంబ అమ్మవారి పండగ నేపథ్యంలో పట్టణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పాటలు, నృత్యాలు, బళ్ల వేషాలు, తప్పెటగుళ్లు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ప్రతి చోట భక్తుల సందడి కనిపించింది. ఏర్పాట్లపై కలెక్టర్ అసహనం పట్టణంలో శ్యామలాంబ పండగను భక్తులు తమ స్థాయి కొలది ఘనంగా నిర్వహించుకున్నారు. పండగ ఏర్పాట్లు నేపథ్యంలో అడుగడుగునా ఆంక్షలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పట్టణానికి తరలివచ్చారు. అమ్మవారి ఆలయానికి సుదూర ప్రాంతాల్లోనే పార్కింగ్లతో భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. శ్యామలాంబ ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదు. క్యూలైన్లో ఉండే భక్తుల కోసం తాగునీరు, మజ్జిగ విరివిగా అందించే ఏర్పాట్లు చేయలేదు. దీన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ప్రసాద్ పండగలో కొరవడిన ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. రూరల్ సీఐ కార్యాలయ సమీపంలో విరిగిన అంజలి రథచక్రం నిరుత్సాహ పడిన భక్తజనం ఘనంగా శ్యామలాంబ అమ్మవారి సిరిమానోత్సవం -
ఇద్దరి ప్రాణాలు నిలిపిన ప్రభుత్వ వైద్యులు
● కోమా స్థితిలో సర్వజన ఆస్పత్రిలో చేరిన రోగులువిజయనగరం ఫోర్ట్: ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు రోగుల ప్రాణాలను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు కాపాడారు. కోమా స్థితిలో ఆస్పత్రిలో చేరిన రోగులు ప్రస్తుతం కోలుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంబంగి అప్పలనాయుడు, జనరల్ మెడిసిన్ విబాగం హెచ్ఓడీ డాక్టర్ సుదర్శి అందించిన వివరాల ప్రకారం..పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వాడపుట్టి గ్రామానికి చెందిన వెంకట ఈశ్వరరావు అనే బాలుడు సెరిబ్రల్ మలేరియా, న్యుమోనియాతో కోమాస్థితిలో ఈనెల5నప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరాడు. బాలుడు మూగ, చెవిటి దివ్యాంగుడు. బాలుడిని ఆస్పత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగం వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకున్నాడు. ఆస్పత్రిలో చేరినప్పుడు ఆహారం కూడా తీసుకోలేకపోయేవాడు. అలాగే బొండపల్లి మండలం మరువాడ గ్రామానికి చెందిన లక్కిడాపు అప్పారావు నెలరోజుల పాటు జ్వరంతో బాధపడడంతో సోడియం లెవెల్స్ తగ్గిపోయి కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఈనెల 5వతేదీన చేర్చారు. ఆ వ్యక్తికి వైద్య పరీక్షలు చేయగా బ్రెయిన్ టీబీ అని తేలింది. ప్రస్తుతం ఆ వ్యక్తి కూడా కోలుకున్నాడు. వారిద్దరికీ జనరల్ మెడిసిన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బోళం పద్మావతి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పద్మలత, హెచ్ఓడీ డాక్టర్ సుదర్శిలు వైద్యం అందించారు. -
కదం తొక్కిన కార్మిక సంఘాలు
విజయనగరం గంటస్తంభం: కార్మికులను బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం అఖిల భారత కార్మిక సంఘాల పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అ ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్మి కె.సురేష్, ఏఐఎఫ్టీయు రాష్ట్ర నాయకులు బెహరా శంకర్రావు, ఐఎఫ్టీయు రాష్ట్ర నాయకులు ఎం.లక్ష్మి మాట్లాడుతూ..లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి. ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి. మూతపడిన పరిశ్రమలను తెరిపించాలి. ఎనిమిది గంటల పని దినం అమలు చేయాలి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం కార్మిక, రైతుల వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ఆపరేషన్ కాగార్ పేరుతో ఆదివాసీలపై దాడులు చేస్తూ అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టే విధంగా వారికి కొమ్ము కాసేలా వ్యవహరిస్తోందన్నారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను నేడు మారుస్తూ కార్మికులకు సంఘం పెట్టుకునే, సమ్మె చేసే హక్కు లేకుండా కట్టు బానిసలుగా చేసే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇటువంటి పరిస్థితుల్లో జూలై 9న జరిగే జాతీయ సమ్మెను జయపద్రం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు టివీ.రమణ, నగర కార్యదర్శి బి.రమణ, ఆర్.శంకర్రావు, సుధీర్, శ్రీను, అప్పలరాజు, గిరి ప్రసాద్, బి.గీత, అప్పల సూరి, వెంకటలక్ష్మి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ధర్నా -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ130 శ్రీ230 శ్రీ240ఇద్దరు కానిస్టేబుల్స్ ఏఆర్కు అటాచ్..!కొత్తవలస: స్థానిక పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్స్గా పనిచేస్తున్న జి.రమేష్, డి.దేముడులను ఏఆర్కు అటాచ్ చేస్తూ ఎస్పీ వకుల్ జిందల్ ఈ నెల 17న ఉత్తర్వులు జారీ చేశారు. వారిపై వివిధ రకాల ఆరోపణలు రావడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏఆర్కు అటాచ్ చేసినట్లు సమాచారం. కాగా ఈ విషయమై స్థానిక సీఐ షణ్ముఖరావును వివరణ కోరగా ఇంకా ఎటువంటి ఆర్డర్స్ అందలేదని, డిపార్ట్మెంట్లో ఇలాంటి విషయాలు సహజమని చెప్పారు. వడదెబ్బతోగొర్రెల కాపరి మృతిమక్కువ: మండలంలోని కోన గ్రామానికి చెందిన పోలయ్య (42) మంగళవారం వడదెబ్బతోమృతిచెందినట్లు కుబుంబసభ్యులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం పోలయ్య మంగళవారం కోన గ్రామం పక్కనే ఉన్న దబ్బగెడ్డ గ్రామం సమీపంలో గొర్రెలను మేతకోసం తీసుకుని వెళ్లాడు. సాయంత్రం గొర్రెలు ఇంటికి వచ్చినప్పటికీ పోలయ్య రాకపోవడంతో, కుటంబసభ్యులు వెతకగా పొలాల్లో విగతజీవిగా పడి ఉన్నాడు. వడదెబ్బకు తాళలేక మృతిచెందినట్లు భార్య పార్వతి కన్నీరుమున్నీరైంది. పోలయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కోన పంచాయతీ వీఆర్ఓ ఈ సమాచారాన్ని తహసీల్దార్ షేక్ ఇబ్రహీంకు అందించారు. ఈ విషయంపై కలెక్టర్కు రిపోర్ట్ చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. భార్యను గాయపరిచిన భర్తపార్వతీపురం రూరల్: కుటుంబ కలహాల కారణంగా భార్యను భర్త గాయపరిచాడు. పార్వతీపురం పట్టణంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సీఐ కె. మురళీధర్ మంగళవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కొత్తవీధికి చెందిన భార్యభర్తల మధ్య కుటుంబ కలహాల కారణంగా వివాదం తలెత్తడంతో భర్త క్షణికావేశంతో భార్య వీపుపై సమీపంలో ఉన్న దబ్బనంతో పొడిచి గాయపరిచాడని ఈ మేరకు భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. గాయపడిన భార్య ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్నారు. 10 లీటర్ల సారాతో ముగ్గురి ఆరెస్టుకొత్తవలస: మండలంలోని అప్పన్నదొరపాలెం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఎకై ్సజ్ దాడుల్లో 10 లీటర్ల సారాతో ముగ్గురు వ్యక్తులు పట్టుబడడంతో వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్.రమశ్రీ తెలిపారు. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో సారా విక్రయాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో భీశెట్టి నాగమణి, జోడు పైడితల్లమ్మ, కె.సూర్యనారాయణలు 10 లీటర్ల సారాతో పట్టుబడినట్లు ఆమె తెలిపారు. వారి దగ్గర గల సారాను స్వాధీనం చేసుకుని వారిని ఆరెస్టు చేసి కొత్తవలస న్యాయస్థానంలో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు ఎస్సై చెప్పారు. కారులో తరలిస్తున్న సారా పట్టివేత వీరఘట్టం: కొందరు వ్యక్తులు కారులో గుట్టుగా తరలిస్తున్న సుమారు 160 లీటర్ల సారాను మంగళవారం తెల్లవారుజామున వీరఘట్టం కొత్త బస్టాండ్లో ఎకై ్సజ్శాఖ అధికారులు పట్టుకున్నారు. వీరఘట్టానికి చెందిన ఓ వ్యక్తి కారును కొందరు వ్యక్తులు అద్దెకు తీసుకుని, ఆ కారులో సారా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో కొత్త బస్టాండ్ వద్ద మాటువేసిన ఎకై ్సజ్శాఖ అధికారులు మంగళవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఆ కారును ఆపి సోదాలు చేయగా 160 లీటర్ల సారా పట్టుబడింది.అయితే కారులో ఉన్నవారు పరారైనట్లు సమాచారం. ఈ విషయంపై పాలకొండ ఎకై ్సజ్ సీఐ సూర్యకుమారిని వివరణ కోరగా..కారులో 160 లీటర్ల సారా పట్టుకున్నట్లు తెలిపారు.దీని వెనుక ఎవరెవరున్నారో దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తామన్నారు. -
సెన్సార్లు, ఏఐ ద్వారా మానవ కార్యకలాపాల గుర్తింపు
● లెండిలో సిల్చూర్ నిట్ నిపుణుడు డాక్టర్ బాదల్ సోనిడెంకాడ: అల్గారిథమ్ను ఉపయోగించి మానవ కార్యకలాపాల గుర్తింపు‘ అనే అంశంపై లెండి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో మంగళవారం ఒక రోజు సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా అసోం లోని సిల్చూర్లో గల నిట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాదల్ సోని హాజరై కార్యక్రమంపై ప్రసంగించారు. ‘సెన్సార్ డేటా, స్మార్ట్ లెర్నింగ్ అధునాతన సెన్సార్ టెక్నాలజీలు, మెషిన్ లెర్నింగ్ విధానాల ద్వారా కార్యాచరణ గుర్తింపుపై దృష్టి సారించాలని సూచించారు. స్మార్ట్ లెర్నింగ్ అల్గారిథమ్తో సెన్సార్ డేటాను సమగ్రపరచడం పెరుగుతున్న ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. ఇంటర్ డిసిప్లినరీ రంగం ఆరోగ్య సంరక్షణ, స్మార్ట్ హోమ్లు, భద్రత, మానవ–కంప్యూటర్ పరస్పర చర్య, మానవ ప్రతిచర్యలపై ఏఐ, నిజంగా తెలివైన వాతావరణాన్ని సృష్టించడానికి వీలు కల్పించడం వంటి కీలక రంగాల్లో ఎలా విప్లవాత్మక మార్పులు తెస్తోందో ఆయన వివరించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఇటువంటి ఈవెంట్ను నిర్వహించడంలో ఇనిన్స్టిట్యూట్ ప్రయత్నాలను ప్రశంసిస్తూ, విద్యార్థులు, పరిశోధకులు ఈ ఆశాజనకమైన టెక్నాలజీ రంగాన్ని అన్వేషించడం, ఆవిష్కరణలు చేయడం ద్వారా చురుగ్గా సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వీవీ రామారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ అకడమిక్స్ డాక్టర్ వి.అంజి రెడ్డి, డీన్న్లు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందివ్వాలి
● ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు గుమ్మలక్ష్మీపురం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందివ్వాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.డీవీజీ శంకరరావు అన్నారు. మంగళవారం గుమ్మలక్ష్మీపురం వచ్చిన సందర్భంగా మండలంలోని తాడికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి సదుపాయాలు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జ్వరంతో చికిత్స పొందుతున్న బాలుడ్ని పరీక్షించారు. ఆరోగ్య స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఏజెన్సీలో జ్వరాలు పెరుగుతున్నాయని, మెరుగైన వైద్యం జ్వర పీడితులకు అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రత్యేక దృష్టి సారించాలని పార్వతీపురం ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు. అంతకు ముందు ఆయన తాడికొండ గ్రామంలో మాతృ వియోగం పొందిన సాక్షి రిపోర్టర్ జి.పెంటయ్యను పరామర్శించారు. జూన్ 15 నుంచి అవగాహన కార్యక్రమాలు ● జిల్లా కలెక్టర్ శ్యామ్ప్రసాద్ పార్వతీపురం టౌన్: ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డీఏజేజీయూఏ) అవగాహన కార్యక్రమాలు జూన్ 15 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జన్మాన్) ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమాలను త్రికరణ శుద్ధితో అమలు చేసేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా గిరిజన ప్రాంతాలలో సేవలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. సాంప్రదాయ ప్రచారాల మాదిరిగా కాకుండా ఈ ప్రచారం గ్రామ స్థాయి/క్లస్టర్ స్థాయి శిబిరాల ద్వారా హక్కులను క్షేత్ర స్థాయిలో అందించేలా చూస్తుందని తెలిపారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ కార్డ్(పీఎంజేఏవై), కుల, నివాస ఽధ్రువీకరణ పత్రం, కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ), పీఎం కిసాన్, జన్ధన్ ఖాతా, బీమా కవరేజ్, సామాజిక భద్రత (వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, దివ్యాంగ పెన్షన్), ఉపాధి, జీవనోపాధి పథకాలు (ఎంజీఎన్ఆర్ఈజీ, పీఎం విశ్వకర్మ, ముద్ర రుణాలు), సీ్త్ర, శిశు సంక్షేమం, ప్రయోజనాలు, ఇమ్యునైజేషన్ మొదలైనవి అందించనున్నట్టు పేర్కొన్నారు. పీవీటీసీ గృహాలు, గిరిజన గ్రామాలను గుర్తించడం, గ్రామ/క్లస్టర్ స్థాయి ప్రయోజన సంతృప్త శిబిరాలను నిర్వహించడం, ఆరోగ్యం, ఆహారం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, వ్యవసాయం, రెవెన్యూ ఇతర విభాగాల సమన్వయంతో ప్రచార కాలంలో తదితర కార్యకలాపాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఆధార్, ఈకేవైసీ డాక్యుమెంటేషన్ సంబంధిత సేవల కోసం సంబంధిత విభాగాలు పని చేస్తాయన్నారు. ప్రధానమంత్రి జన్మాన్, ధర్తి ఆబా అభియాన్ కింద ఊహించిన విధంగా సమ్మిళిత, సాధికారత కలిగిన గిరిజన సమష్టి దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో ఈ ప్రచారం కీలకమైన అడుగు అని కలెక్టర్ అన్నారు. శిబిరాలను పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు. డీఎంహెచ్వో ఆకస్మిక పరిశీలన చీపురుపల్లి రూరల్ (గరివిడి): గరివిడి మండలం బొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్వో జీవనరాణి మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ఓపీ, ఐపీలను పరిశీలించి శత శాతం ఈహెచ్ఆర్ అబా నంబరుతో ఆన్లైన్ చేయా లని సూచించారు. ప్రతీ ఓపీకి అవసరమైన పరీక్షను నిర్వహించాలన్నారు. ల్యాబ్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. హెచ్బీ టెస్ట్ను మెరుగుపరచాలని సూచించారు. ఐపీ వార్డును పరిశీలించి చిన్న పిల్లల వ్యాక్సిన్ను పరిశీలించారు. ఓపెన్ ఓవెల్ పాలసీని అనుసరిస్తున్నారా... లేదా.. అని వ్యాక్సిన్ను పరిశీలించారు. మెడికల్ స్టోర్లో బిన్ కార్డ్స్ను పరిశీలించారు. విటమిన్ ఏ సిరప్ తగిన మోతాదులో ఉందో.. లేదో పర్యవేక్షించారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. -
భూసర్వేపై తస్మాత్..
● సర్వే శాఖ డీడీ కుమార్ పూసపాటిరేగ: భూసర్వేపై అప్రమత్తంగా వుండాలని సర్వే శాఖ డెప్యూటీ డైరెక్టర్ డిఎల్బిఎల్.కుమార్ అన్నారు. పూసపాటిరేగలో జరుగుతున్న సర్వేను మంగళవారం పరిశీలించారు. రోవర్తో సర్వే చేసినప్పుడు హద్దులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలన్నారు. బ్లాక్ల వారీగా సర్వే జరిగినప్పుడు వీఆర్వోలు, విలేజి సర్వేయర్ తప్పనిసరిగా ఉండాలన్నారు. పూసపాటిరేగ మండలం గోవిందపురంలో సర్వే పూర్తయిందని మండల సర్వేయర్ గణపతిరావు తెలియజేశారు. పూసపాటిరేగ గ్రామంలో 170 ఎకరాల వరకు సర్వే జరిగినట్టు చెప్పారు. అనంతరం తహసీల్దార్ గోవిందను కలిసి సర్వే జరుగుతున్న తీరు, ఏవైనా సమస్యలు వున్నాయా.. మొదలగు అంశాలను అడిగారు. ఆయనతో పాటు ఆర్ఎస్ డీటీ కల్యాణి, డీటీ రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధురి ఉన్నారు. -
గత ప్రభుత్వ చర్యలతో గిట్టుబాటు ధర
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇక్కడ పండిన పైనాపిల్ పంటను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ గుంటూరు, పల్నాడు తదితర జిల్లాల్లో 41 రైతు బజార్లకు తరలించేది. రైతు సంఘాల గ్రూపుల ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకునేది. దళారీ వ్యవస్థ ఉండేది కాదు. పంట సీజన్ ముగిసేవరకు గ్రేడ్ను బట్టి ఒక్కో పండు రూ.15కు ఎఫ్పీవోలు కొనుగోలు చేసేవారు. దీంతో రైతులకు మంచి ఆదాయం వచ్చేది. ప్రస్తుతం అలాంటి చర్యలేవీ కనిపించడం లేదని, కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
వైభవంగా శ్యామలాంబ తొలేళ్ల ఉత్సవం
● నేడు సిరిమాను ఊరేగింపు సాలూరు: శ్యామలాంబ అమ్మవారి పండగలో రెండో రోజైన సోమవారం తొలేళ్ల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవానికి భక్తులు పోటెత్తారు. మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాలు, కోలాట ప్రదర్శనల నడుమ జన్నివారి గద్దె నుంచి ఘటాలను పెదకోమటిపేట గద్దె వద్దకు తీసుకొచ్చారు. అక్కడ పూజలు అనంతరం జన్నివానితో కలిసి అన్ని వీధుల్లోనూ ఘటాలను ఊరేగింపు చేశారు. అక్కేనవీధిలోని పూజును, ముత్యాల బుట్టను(పాలజంగిడి) తీసుకుని రావడంతో తొలేళ్ల ఉత్సవం ప్రారంభమయింది. పెద్దలు మేళతాళాలతో యువరాజును తీసుకురాగా ఆయన సమక్షంలో పూజు, పాలజంగిడి, అమ్మవారికి ప్రత్యేక పూజలుచేశారు. భక్తుల జై శ్యామలాంబ నామస్మరణ నడుమ పెద్దల సమక్షంలో పూజు, పాలజంగిడిని ఊరేగింపు చేశారు. పూజు కర్రను యువరాజు పెదకోమటిపేట వద్ద ఉన్న అమ్మవారి గద్దెకు చేర్చడంతో తొలేళ్ల ఉత్సవం ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం జరగనున్న సిరిమాను ఉత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు సన్నద్ధమవుతున్నారు. శ్యామలాంబ తల్లి సేవలో డీవీజీ సాలూరు: పట్టణంలోని శ్యామలాంబ అమ్మవారిని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. -
బీసీలంటే అంత చులకనా?
● మహిళలన్న సానుభూతి లేకుండా తహసీల్దార్, మున్సిపల్ చైర్పర్సన్ను కన్నీరు పెట్టించారు.. ● బుల్డోజర్ ఎమ్మెల్యే విజయచంద్ర హయాంలో సెటిల్మెంట్లు, దందాలు, ఆక్రమణలే.. ● పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఫైర్ సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కు బీసీలంటే చిన్నచూపు ఉందని... కనీసం మహిళలన్న సానుభూతి కూడా లేకుండా వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన స్థానిక తహసీల్దార్ జయలక్ష్మిని, మున్సిపల్ చైర్పర్సన్ను వేధించి కన్నీ రు పెట్టించారని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారా వు ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 నెలల కాలంలోనే ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర అవినీతి, అక్రమా ల్లో ఆరితేరారని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీలను పక్కన పెట్టి.. అవినీతి, అక్రమాలు, వసూళ్లు, కబ్జాలు, బెదిరింపులపైనే దృష్టి సారించారని విమర్శించారు. తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి సోమ వారం మాట్లాడారు. ఒక బీసీ మహిళా తహసీల్దార్ ను అసభ్యపదజాలంతో దూషించడం దారుణమన్నారు. రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ చేయాలని మూడు నెలలుగా తహసీల్దార్ను ఎమ్మెల్యే విజయచంద్ర వేధిస్తున్నారని తెలిపారు. ఆమె కొద్దిరోజుల కిందట ఎందుకు సెలవుపెట్టి వెళ్లిపోయారని ప్రశ్నించారు. అంతా సవ్యంగా ఉంటే ములగ గ్రామంలో డిజిటల్ సిగ్నేచర్లను ఎమ్మెల్యే చెబితే ఒక తహసీల్దార్ ఎందుకు చేయరన్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిని, తనది కాని భూమిని ఆన్లైన్లో పెట్టాల నడం సబబేనా అని ప్రశ్నించారు. సర్వే నంబర్ 137లో కొంత భూమిని రికార్డు ట్యాంపరింగ్ చేసి ఇన్ కార్పొరేషన్ చేయాలని ఆమైపె ఒత్తిడి చేయడం నిజం కాదా? అని నిలదీశారు. బడిదేవర కొండ మైనింగ్ విషయంలో అక్కడ తమ ఆరాధ్య దైవం కొలువై ఉందని గిరిజనులు చెప్పినా, వామపక్షాల నాయకులతో కలసి పోరాటం చేసినా.. మైనింగ్కు సిఫార్సు చేయడం ఏమిటన్నారు. ఆ విషయంలో నూ తహసీల్దార్పై ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారన్నారు. బేరాలు లేవు.. రేటు ఫిక్స్ తన వద్ద బేరాల్లేవు అని చెప్పుకొంటున్న ఎమ్మెల్యే విజయచంద్ర.. ప్రతి పనికీ ఒక రేటు ఫిక్స్ చేశారని ఆరోపించారు. రేషన్ డీలర్, అంగన్వాడీ ఉద్యోగాలను సైతం అమ్ముకున్నట్లు పత్రికల్లో కథనాలొచ్చాయని.. తన వద్ద కూడా పూర్తి ఆధారాలున్నాయని జోగారావు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన అంశాల మీద వివరణ ఇస్తున్న ఎమ్మెల్యే.. ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఎందుకు స్పందించడం లేదన్నారు. రేషన్ డీలర్లు, అంగన్వాడీ పోస్టులను విక్రయించారా? లేదా? గోశాలలకు రూ.23 వేలు కప్పం కట్టాలంట.. నిజం కాదా? ఉపాధి వేతనదారుల నుంచి వారానికి రూ.200 చొప్పున వసూలు చేస్తున్నది నిజమా, కాదా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్లు, అపార్ట్మెంట్ ఎలా వచ్చాయి? తహసీల్దార్ జయలక్ష్మి అవినీతి చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్న బుల్డోజర్ ఎమ్మెల్యే.. మున్సిపల్ కమిషనర్ తాను డబ్బులిచ్చి, ఈ పోస్టులోకి వచ్చానని, డబ్బులు తీసుకుంటానని బహిరంగంగా చెబుతు న్నా ఎందుకు స్పందించడం లేదని జోగారావు ప్రశ్నించారు. వరహాలగెడ్డ ఆక్రమణల పేరిట నోటీ సులు పంపించి, ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. 11 నెలల్లో ఎమ్మెల్యేపై ముగ్గురు బీసీ మహి ళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వీటి గురించి ఏ రోజూ ఎందుకు స్పందించలేదన్నారు. ‘దేవునిబంద ఆక్రమణలపై నా మీద ఆరోపణలు చేశావ్.. నేను తప్పు చేస్తే దోషిగా నిలబెట్టు. దేవునిబంద విషయంలో నాడు హడావిడి చేశావ్.. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు. దాంట్లో ఆక్రమణ దారులెవరు? మీ రెండు ఖరీదైన కార్లు, విజయనగరంలో అపార్ట్మెంట్ ఎలా కొన్నావ్.. ఏ విషయంలో బహుమతులు వచ్చాయి.. వాస్తవాలు చెప్పగలరా?’ అని ప్రశ్నించారు. బెదిరింపులు, కక్షసాధింపు మీ పాలన! ఏమీ చేయలేక, నిరూపించలేక చివరికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మీద కక్ష సాధిస్తున్నార ని జోగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అడ్డాపుశీల బీసీలంటే ఎమ్మెల్యేకు నచ్చదేమో : చైర్పర్సన్ -
రూ. 4,215.30 కోట్లతో పీఎల్ క్రెడిట్ ప్లాన్
పార్వతీపురం టౌన్ : జిల్లాలో రూ.4,215.30 కోట్లతో ప్రొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2025–26 ను కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ విడుదల చేశారు. నాబార్డు రూపొందించిన క్రెడిట్ ప్లాన్ను కలెక్టరేట్ లో సోమవారం జరిగిన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశంలో విడుదల చేశారు. ప్రాధాన్యతా రంగాలకు రుణాలు పెంచడం, మౌలి క సదుపాయాల అంతరాలను తగ్గించడం, స్థిరమై న– సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు ఈ ప్రణాళికలో ప్రాధాన్యమిచ్చామన్నారు. మొత్తం రుణసామర్థ్యం రూ. 4,215.30 కో ట్లు కాగా, ఇందులో మౌలిక సదుపాయాలు, అనుబంధ రంగాలకు రూ.3,316.04 కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ.386.69 కోట్లు, గృహ నిర్మాణానికి రూ. 221.40 కోట్లు, విద్యకు రూ. 21.68 కోట్లు, ఎగుమ తి క్రెడిట్ రూ.5.10 కోట్లు, పునరుత్పాదక ఇంధనానికి రూ.25.24 కోట్లు, సామాజిక మౌలిక సదుపా యాలకు రూ.107.24 కోట్లు, ఇతర రంగాలకు రూ. 131.90 కోట్లు కేటాయించామన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, జిల్లా పరిశ్రమల అధికారి కరుణాకర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ విజయస్వరూప్, తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లికి వచ్చి మృత్యుఒడిలోకి..
పార్వతీపురం రూరల్: స్నేహితుడి అక్క వివాహంలో పాల్గొనేందుకు స్నేహితులతో కలిసి సరదాగా వచ్చారు. స్నానం కోసం వెళ్లిన ఐదుగురు యువకుల్లో ఇద్దరు మృత్యు ఒడికి చేరుకున్నారు. ఈ విషాదకర ఘటనతో పెళ్లి ఇంట విషాదం అలముకుంది. పార్వతీపురం మండలం పులిగుమ్మిలోని సాకిగెడ్డ తీరం కన్నీటి సంద్రంగా మారింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మండలంలోని పులిగుమ్మి గ్రామంలో బుధవారం జరగనున్న వివాహ వేడుకకు ఏలూరు జిల్లా నూజివీడు ప్రాంతానికి చెందిన 20 మంది బంధువులు పెళ్లి కుమార్తె తరఫున సోమవారం పులిగుమ్మి గ్రామానికి చేరుకు న్నారు. సాయంత్రం గ్రామ శివారులో ఉన్న సాకి గెడ్డలో స్నానం చేసేందుకు వెళ్లిన ఐదుగురులో తొలుత గెడ్డలో దిగిన నగిరెడ్డి రాము (16) బొత్స ఈశ్వర్ కుమార్(16) అనే ఇద్దరు యువకులు ఈతరాక నీటిలో మునిగి మృతి చెందారు. వెంటనే మిగిలిన ముగ్గురు స్నేహితులు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో గెడ్డలో యువకులను వెతికి బయటకు తీశారు. అప్పటికే మృతి చెందడంతో పార్వతీపురం గ్రామీణ పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన వారే.. మృతి చెందిన ఇద్దరు యువకులలో నాగిరెడ్డి రాము విజయనగరం జిల్లా రేగిడి మండలం ఒప్పంగి గ్రామానికి చెందిన వాడుకాగా, మరో మృతుడు బొత్స ఈశ్వర్కుమార్ బలిజిపేట మండలం సుభద్ర గ్రామం. 20 సంవత్సరాల కిందట మృతుల తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం ప్రస్తుత ఏలూరు జిల్లా నూజివీడు ప్రాంతానికి వెళ్లిపోయారు. మృతి చెందిన ఇద్దరూ ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశారు. అందివచ్చిన కుమారులు అందని లోకాలకు వెళ్లిపోయారంటూ తల్లిదండ్రులు కన్నీరుపెట్టారు. ఘటనా స్థలాన్ని పార్వతీపురం రూరల్ పోలీసులు సందర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. -
ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పార్వతీపురం టౌన్: జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కు ల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఎ. శ్యామ్ప్రసాద్ పరిశ్రమలశాఖ అధికారులను ఆదే శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ పరిధిలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాల ని ఇప్పటికే ఆదేశాలు జారీచేసిన సంగతిని గుర్తుచేశారు. అందులో భాగంగా పాలకొండ, పార్వతీపు రంలో ఏర్పాటు చేస్తున్నామని, సాలూరు, కురు పాం నియోజక వర్గాల్లో స్థలాలు గుర్తించినప్పటికీ, ప్రారంభించాల్సి ఉందన్నారు. పారిశ్రామిక ఎగుమ తుల ప్రోత్సాహక మండలి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్థితిని సమీక్షిస్తూ శిక్షణ పొందిన లబ్ధిదారుల డేటాను వేరు చేసి సంబంధిత ఎంపీడీఓ, ఏపీఎం, క్లస్టర్ కోఆర్డినేటర్లు, సంక్షేమ సహాయకులకు తెలియజేయాలని ఆదేశించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి సంబంధిత అధికారులు ఆమోదం తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు మొత్తం 97 దరఖాస్తులను స్వీకరించామని, వాటిలో ఏపీపీసీబీ వద్ద మూడు, ఫ్యాక్టరీల వద్ద ఒకటి, లీగల్ మెట్రాలజీ విభాగం వద్ద మూడు వెరసి మొత్తం ఏడు పెండింగ్ మినహా మిగిలిన 90 దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్టు పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కలెక్టర్కు వివరించారు. 2022 ఏప్రిల్ 4 నుంచి ఇప్పటి వరకు 398 దరఖాస్తులకు అనుమతులు జారీ కాగా 94 యూనిట్లు గ్రౌండింగ్ అయినట్లు చెప్పారు. పీఎం విశ్వకర్మ కింద జిల్లావ్యాప్తంగా 25,493 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 1,253 మందికి శిక్షణ ఇచ్చామని, 76 మందికి రుణాలు మంజూరు చేసినట్టు వెల్లడించారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.వి.కరుణాకర్, సహా య సంచాలకులు పి.సీతారాము, రామకష్ణ, ఐపీఓ కిరణ్, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ఎన్.విజయ్స్వరూప్, నాబార్డు ఏజీఎం దినేష్, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మద్దతు ధర కల్పించాలి
పైనాపిల్కు ప్రభుత్వ పరంగా మద్దతు ధరలు కల్పించాలి. గత సంవత్సరం కంటే ఈ ఏడాది దిగుబడి బాగా ఉంటుందని ఆశిస్తు న్నాం. సంతల్లోకి తెచ్చి విక్రయిస్తుంటే ఒక్కో పైనాపిల్ సీజన్ ఆఖరులో రూ.5కు పడిపోయి న సందర్భాలున్నాయి. – ఎస్.ఫల్గుణరావు, పాండ్ర గిరిజన సంతలు ఇలా.. పైనాపిల్ వ్యాపారం సంతల్లో కూడా జోరుగా సాగుతుంది. సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, దోనుబాయిలో గురువారం, పొల్ల, కుశిమిలలో శనివారం వారపు సంతలు జరుగుతా యి. ఇక్కడకు వ్యాపారులు వచ్చి పంటను కొనుగో లు చేస్తారు. కొన్నిసార్లు వ్యాపారులు సిండికేట్గా మారి నాణ్యతను బూచిగా చూపి పంటను చౌకగా దోచుకుంటారన్నది గిరిజన రైతుల ఆరోపణ. -
అమ్ముడు పోయిన ప్రజాస్వామ్యం
● బొబ్బిలి మున్సిపల్ చైర్మన్గా రాంబార్కి శరత్ ● దగ్గరుండి కథ నడిపించిన ఎమ్మెల్యే బేబీనాయన, ● మాజీ మంత్రి సుజయ్బొబ్బిలి: అధికార తాపత్రయం, అడ్డగోలుగానైనా పీఠం దక్కించుకోవాలనే కుటిల రాజకీయం వెరసి బొబ్బిలి మున్సిపల్ పీఠం టీడీపీ వశమైంది. గత నెల 29న అవిశ్వాస తీర్మానం నెగ్గిన తరువాత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఎన్నికల పరిశీలకుడిగా హాజరైన ఈ ఎన్నిక ప్రక్రియను ఆర్డీఓ జేవీఎస్ఎస్ రామమోహన రావు నిర్వహించారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఒక్కరి పేరే నామినేట్ చేస్తూ బీఫాం అందజేయడంతో సభకు ఆర్డీఓ వివరించారు. మున్సిపాలిటీలోని 8వ వార్డు కౌన్సిలర్గా ఉన్న రాంబార్కి శరత్ పేరును ఒక టీడీపీ కౌన్సిలర్ ప్రతిపాదించి, మరో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ (ఎన్నికకు ముందురోజే టీడీపీ కండువా కప్పారు) బలపరుస్తున్నట్లు వారి చేతే చెప్పించారు. కోరం కోసం అవసరమైన 16 మంది మాత్రమే హాజరయ్యారు. వారితో పాటు వైఎస్సార్సీపీ వైస్ చైర్మన్గా మొన్నటి వరకూ వ్యవహరించిన 19వ వార్డు కౌన్సిలర్ చెలికాని మురళీకృష్ణ కూడా హాజరయ్యారు. చేతులెత్తే ప్రక్రియ అవసరం లేకుండానే.. చైర్మన్ ఎన్నికకు ఒకటే ప్రతిపాదన వచ్చిందని, మరెవరైనా పోటీ చేసే అవకాశం ఉందా అని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ సమక్షంలో ఆర్డీఓ రామమోహన రావు కౌన్సిలర్లను ప్రశ్నించారు. దీనికి ఎవరూ నోరు మెదపలేదు. మరోసారి అడిగి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరువాత రాంబార్కి శరత్ చైర్మన్గా ఎన్నికై నట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఆ వెంటనే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రేసులో ఉన్న కౌన్సిలర్తోనే ప్రతిపాదన అవిశ్వాస రాజకీయంలో దించేసిన చైర్మన్ ఎస్వీ మురళీ కృష్ణారావు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ సామాజిక వర్గానికే చైర్మన్ పదవి ఇస్తారని మొదటి నుంచి ప్రచారం సాగింది. అయితే కౌన్సిలర్లకు ఇవ్వాల్సిన, ఇతర ఖర్చుల కోసం మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 6వ వార్డు కౌన్సిలర్ గెంబలి శ్రీనివాసరావు భారీగా ఖర్చు చేశారని, ఆయన ఇప్పుడు రేసులో ఉన్నారని ప్రచారం సాగింది. అయితే దీనిని ఖండించని బేబీనాయన తదితరులు గుంభన రాజకీయాలు నడిపారు. చివరికి గెంబలి శ్రీనివాసరావు కూడా తనకు చైర్మన్ గిరీ ఇచ్చేందుకు బేబీనాయన హామీ ఇచ్చారని ఆయనే సుప్రీమ్ కనుక మరెవరు చెప్పినా జరిగే పనికాదని నాదే చైర్మన్ గిరీ అనీ ఢంకా భజాయించారు. చివరికి డొంకలో ఇరుక్కుపోయారు. ఆయనకు ప్రస్తుత చైర్మన్ రాంబార్కి శరత్ చేస్తున్న టీడీపీ పట్టణ అధ్యక్షుడి పదవినిచ్చి మరోసారి చూద్దాంలే అని చివరి నిమిషంలో పక్కన పెట్టేశారు. అంతే కాదు. శరత్ చైర్మన్ కావడానికి సభలో నువ్వే ప్రతిపాదించాలని ఇరికించారు. దీంతో గెంబలి మరోసారి నిరుత్సాహ పడక తప్పలేదు. మరో కౌన్సిలర్ రామారావు గెంబలి ప్రతిపాదనను బలపర్చారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మున్సిపల్ చైర్మన్గా రాంబార్కి శరత్ కౌన్సిల్ హాల్లో బాధ్యతలు స్వీకరించారు. హాజరు కాని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు: బలం ఉన్నా టీడీపీ ఆడిన ప్రలోభాలు, పైరవీల వలలో పది మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు చిక్కుకున్నారు. టీడీపీకి కేవలం పది మంది కౌన్సిలర్లే ఉన్నా ప్రలోభాలతో బలం పెరగడంతో ఎన్నిక లాంఛనమే అయింది. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఈ చైర్మన్ ఎన్నిక సమావేశానికి గైర్హాజరయ్యారు. నీతి వదిలేసిన రాజకీయాలు ప్రస్తుత రాజకీయాలు నీతిమాలిపోయాయి. కేవలం కొద్ది రోజుల పరిపాలన కోసం స్థానిక సంస్థలను కూడా కూటమి నాయకులు నిస్సిగ్గుగా చేజిక్కించుకునేందుకు బరితెగించడం సరికాదు. దమ్ముంటే సక్రమంగా రాజకీయాలు చేయాలి. అమ్ముకునే, కొనుగోలు చేసే రాజకీయాలు చేస్తే ప్రజలు తగిన జవాబిస్తారు. వచ్చే రోజుల్లో సరైన గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది. శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే -
ఐటీడీఏ ద్వారా గిరిజన ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలి
పార్వతీపురంటౌన్: మెగా డీఎస్సీ నుంచి గిరిజన ప్రాంత పోస్టులు మినహాయింపు చేసి ఐటీడీఏ ద్వారా గిరిజన ప్రత్యేక డీఎస్సీని ప్రకటించాలని ఆదివాసీ జేఏసీ చైర్మన్ కొండగొర్రి ధర్మారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సలహామండలి(టీఏసీ) తక్షణమే ఏర్పాటు చేసి రద్దయిన జీఓ నంబర్ మూడు స్థానంలో కొత్త చట్టం తీసుకువచ్చి గిరిజన ప్రాంత ఉద్యోగాలు గిరిజనులకు వచ్చే విధమైన చట్టం తీసుకువస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని కోరారు. విలీనం ఆలోచన విరమించుకోవాలి ● గిరివెలుగు డీఆర్డీఏలోకి విలీనం సరికాదు పార్వతీపురం: గిరిజనులకు సేవలందించేందుకు ఐటీడీఏను ఏర్పాటు చేసి శాఖలుగా విభజించి సేవలు అందించే క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఐటీడీఏను కనుమరుగు చేసే విధంగా వ్యవహరిస్తోందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కె.సాంబమూర్తి పేర్కొన్నారు. ఇప్పటికే గ్రీవెన్స్సెల్ను కలెక్టర్ కార్యాలయానికి తరలించి గిరిజనులు ప్రత్యేకంగా తమ గోడును విన్నవించుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని ఇదే వైఖరితో మళ్లీ ఐటీడీఏకి అనుసంధానంగా ఉండే గిరివెలుగును డీఆర్డీఏలో కలిపి అనుసంధానం చేసే ఆలోచన గిరిజనులకు అన్యాయం చేసేలా విడ్డూరంగా ఉందన్నారు. గిరిజన మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కార్యక్రమాలు నిర్వహించే గిరివెలుగును డీఆర్డీఏలో అనుసంధానం చేసే ఆలోచనను తక్షణమే రాష్ట్రప్రభుత్వం విరమించుకోవాలని సాంబమూర్తి అన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన శివాలయం ప్రతిష్ట
సీతానగరం: మండలంలోని కృష్ణారాయపురం గ్రా మస్తులు, మరికొంతమంది దాతల ఆర్ధిక సహా యంతో నిర్మాణం జరిగిన శివాలయం ప్రతిష్టాపన మహోత్సవాలు సోమవారం ముగిశాయి. అసంఖ్యాక దేవాలయాల ప్రతిష్టాపకుడు, వేదపండితుడు ఎస్వీఎల్ఎన్ శర్మయాజీ ఆధ్వర్యంలో 12 మంది అర్చకులతో ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని కంకణధారులు పూజా సామగ్రితో ఉదయం 5 గంటలనుంచి పూజలు ప్రారంభించారు. అనంతరం భక్తులంతా కొబ్బరి నీటితో దేవతామూర్తులకు అభిషేకాలు చేశారు. అభిషేకం చేసిన దేవతామూర్తులను సాయంత్రం 5 గంటలనుంచి రాత్రి 7 గంటల వరకూ తిరువీధి నిర్వహించారు. 8 గంటలకు జలాభిషేకం, 9 గంటలకు ఉపనిషత్ పారాయణం జరిగాయి. ఈ సందర్భంగా వేదపండితుడు ఎస్వీఎల్ఎన్ శర్మయాజీ మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలోనే కృష్ణారాయపురం శివాలయం ప్రశస్థమైనదన్నారు. శివాలయంలో మరకత శివలింగం ప్రతిష్టించామని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో నవగ్రహ దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టించినట్లు చెప్పారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకున్న వారు సిరిసంపదలతో తులతూగుతారని, చేసిన పాపాలు హరిస్తాయన్నారు. స్థలదాతలు పోల లక్ష్మునాయుడు, బోడెమ్మల జ్ఞాపకార్ధం వారి కుటుంబసబ్యులు, బడేశ్రీరాములు దంపతులు మహాపంచముఖేశ్వ మరకత శివలింగం ఆలయానికి సమర్పించినట్లు తెలియజేశారు. -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ130 శ్రీ230 శ్రీ240పింఛన్ పెంచండి సారూ● కలెక్టర్కు వేడుకోలు పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వంలో పింఛన్ దారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సోమవారం వస్తేచాలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు కలెక్టర్ కార్యాలయానికి నడవలేని పరిస్థితుల్లో కుటుంబసభ్యుల సహాయంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. కొంతమందికి అర్హత ఉన్నా పింఛన్ రావడం లేదని, మరికొంతమందికి 90శాతం దాటి వైకల్యం ఉన్నా కేవలం రూ.6వేలే పింఛన్ ఇస్తున్నారని, తమ సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్కు వినతిపత్రాలు అందజేస్తున్నారు. స్టేట్లెవెల్ కరాటే చాంపియన్షిప్కు రాజాం విద్యార్థులు రాజాం సిటీ: త్వరలో జరగనున్న స్టేట్లెవెల్ కరాటే చాంపియన్షిప్ పోటీలకు రాజాంలోని శివసైన్యం కరాటే విద్యార్థులు ఎంపికయ్యారని కోచ్ ఆర్.శివ సోమవారం తెలిపారు. ఈ నెల 18న విజయనగరంలోని రాజీవ్ ఇండోర్స్టేడియంలో జరిగిన పోటీల్లో కుమిటీ విభాగంలో వి.రిషిక (ప్రథమస్థానం), కాటా విభాగంలో వి.మోహిత్ (ద్వితీయ స్థానం), కె.మహేష్ (మూడో స్థానం)లో నిలిచి ఈ ఘనత సాధించారన్నారు. విద్యార్థుల ప్రతిభను పట్టణానికి చెందిన పలువురు అభినందించారు. ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్యచీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని శివరాం గ్రామానికి చెందిన కుమిలి భాస్కరరావు(27)అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు భాస్కరరావు గ్రామంలో డబ్బులు అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వారు తిరిగి డబ్బులు అడగడంతో మనస్తాపం చెంది సోమవారం ఉదయం ఇంటిలో ఇనుపరాడ్డుకు బెడ్షీట్ను కట్టి ఉరివేసుకున్నాడు. ఈ మేరకు గరివిడి ఎస్సై బి.లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోవులపై వికృత చేష్టలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు పూసపాటిరేగ: మండలంలోని కుమిలి గ్రామంలో గోవులపై వికృత చేష్టలకు పాల్పడి, గో హత్య చేసిన వ్యకిని పూసపాటిరేగ పోలీసులు ఎట్టకేలకు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..కొమరాడ మండలంలోని పెళ్లిగుడ్డి కంపవలసకు చెందిన నల్లిమిల్లి చంటి (45) ఉరఫ్ మల్లేష్ గోవులపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మల్లేష్ కుమిలి సమీపంలో క్వారీలో జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తూ కుమిలిలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే రైతు ఆవుకు తాడుతో ఉరిపెట్టి వికృత చేష్టలకు పాల్పడుతుండగా ఆవు అరవడంతో గ్రామస్తులు వచ్చి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గత నెలలో కుమిలి గ్రామంలో ఆవు రొమ్మలు, మర్మాంగాలు కోయడంతో ఆవు మృతి చెందిన విషయం విదితమే. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తి మల్లేష్ అని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. మూగజీవాలపై కిరాతకంగా వ్యవహరిస్తున్న మల్లేష్ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ మేరకు పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత హత్య కేసును ఛేదించిన పోలీసులుశృంగవరపుకోట: మండలంలోని వెంకటరమణపేట గ్రామానికి చెందిన వివాహిత ఎర్రాప్రగడ వెంకటలక్ష్మి (38) హత్యకేసును ఎస్.కోట పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి సీఐ నారాయణమూర్తి సోమవారం రాత్రి అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి హత్యలో మృతురాలి కుమారై రుచిత ప్రమేయం ఉన్నట్లు చెప్పారు. ప్రణాళిక ప్రకారం తన తల్లిని ఇద్దరు స్నేహితులతో హత్య చేయించి గ్రామ సమీపంలోని నూతిలో తోయించినట్లు చెప్పారు. పూర్తి దర్యాప్తు నిమిత్తం కుమార్తె రుచితను అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితురాలిని జువైనల్ హోమ్కు తరలించామన్నారు. మిగిలిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. వెంకటలక్ష్మి మృతిపై కుమారుడు హరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామన్నారు. -
నాలుగోరోజుకు చేరిన రిలేనిరాహార దీక్ష
పార్వతీపురం: ఐటీడీఏ ద్వారా ఏజెన్సీ ప్రాంతాలలోని ఉపాధ్యాయ పోస్టులను ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి ఆదివాసీలతోనే నియామాకాలను చేపట్టాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా ఆదివాసీ సంఘాల ఐక్యకార్యచరణ సమితి (ఏజేఏసీ) ఆధ్వర్యంలో యువత రిలే నిరాహార దీక్షను చేపట్టారు. సోమవారం ఏపీ ఆదివాసీ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఐటీడీఏ ఆవరణలో ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాలుగో రోజు ప్లకార్డులతో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. రిలే నిరాహర దీక్షలో కె.ధర్మారావు, ఆరిక నీలకంఠం, డి.సీతారాం, రామకృష్ణ, చంద్రశేఖర్, మల్లయ్య, గిరిధర్, సాయిబాబు, ఆదివాసీ టీచర్స్ అసోషియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు టి.సత్యనారాయణ, వై.సూర్యనారాయణ, డీఎస్సీ నిరుద్యోగ అభ్యర్ధులు పాల్గొన్నారు. -
అధికారులంతా పీజీఆర్ఎస్కు హాజరుకావాలి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ● పీజీఆర్ఎస్కు 154 వినతులువిజయనగరం అర్బన్: ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్కు జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.సెలవు కోసం ఫోన్లో మెసేజ్ పెట్టే వారికి షోకాజ్ నోటీసు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. సెలవు కావాల్సిన వారు ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇకపై ప్రతి శనివారం సాయంత్రం అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజా వినతుల పరిష్కా వేదికకు వచ్చే నిరక్షరాస్యులకు అర్జీలను రాయడంలో సహకరించాడానికి కలెక్టరేట్ నుంచి ఇద్దరు సిబ్బందిని వచ్చే సోమవారం నుంచి కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ తెలిపారు. నిరక్షరాస్యులైన వారు తమ అర్జీలను రాయడానికి దళారీలను ఆశ్రయిస్తున్నారని వారు అర్జీదారులను మభ్యపెట్టి వారి నుంచి డబ్బు తీసుకొని ప్రతి వారం కలెక్టరేట్ చుట్టు తిరిగేలా చేస్తున్నారని తెలిపారు. ఇకపై అర్జీదారులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని జిరాక్స్ కేంద్రాల్లో రాయించవద్దని కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన సహాయ కేంద్రంలో సంప్రదించాలని కలెక్టరేట్ సూచించారు. అర్జీలు రాయడానికి డబ్బులు ఇచ్చిన వారిపై తీసుకున్న వారిపై కూడా దృష్టి పెట్టాలని చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. కింది స్థాయిలోనే అర్జీలను ఇవ్వాలి అర్జీదారులు తమ సమస్యలను ముందుగా గ్రామస్థాయిలో లేదా మండల స్థాయిలో లేదా డివిజన్ స్థా యిలో పరిష్కారం కాని పక్షంలో మాత్రమే జిల్లా స్థాయికి రావాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయిలో ఇచ్చిన అర్జీని గ్రామ స్థాయి లేదా మండల స్థాయి వా రికే పంపిస్తాం కాబట్టి సమయం వృథా కాకుండా అ ర్జీదారు గ్రామ లేదా మండలం లేదా డివిజన్ స్థాయిలో సంప్రదించి పరిష్కారం కానప్పుడు మాత్రమే జిల్లా స్థాయిలో సమర్పించాలని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు 188 వినతులు అందాయి. కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్, ఇన్చార్జ్ డీఆర్ఓ మురళి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, నూకరాజు, ప్రమీల గాంధీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 35 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: పోలీస్ ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు సోమవారం 35 ఫిర్యాదులు అందాయి. జిల్లా అడిషనల్ ఏఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. మొత్తం వచ్చిన ఫిర్యాదుల్లో భూ తగాదాలకు సంబంధించి 12, కుటుంబకలహాలు 6, మోసాలకు సంబంధించి 3, ఇతర సమస్యలకు సంబంధించి 14 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్బంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సిబ్బంది సానుకూలంగా స్పందించాలని, చట్టపరిధిలో వాటిని పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేసేలా దర్యాప్తు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, డీసీఆర్బీ సీఐ సుధాకర్, ఎస్సై రాజేష్ పాల్గొన్నారు. -
ఉపాధి వేతనదారు మృతి
పాలకొండ రూరల్: మండలంలోని వెలగవాడ పంచాయతీ సిరికొండ గిరిజన గ్రామంలో ఉపాధి పనులకు హాజరైన పాలక సరోజిని(54) అకస్మాత్తుగా మృతిచెందింది. గ్రామంలోని ఊరచెరువులో ఉపాఽధి పనులకు కుమారుడు నారాయణరావుతో కలసి సోమవారం ఆమె వెళ్లింది. మస్తర్లు వేయించిన తరువాత యథావిధిగా వేతనదారులు పనులకు ఉపక్రమించారు. ఈ క్రమంలో సరోజిని అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంది. విషయం గమనించిన సహచర వేతనదారులు, బాధితురాలిని కుమారుడితో పాటు ఇంటికి తరలించి, 108కు సమాచారం అందించారు. వాహనం చేరుకుని సిబ్బంది పరీక్షించి సరోజిని మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ ఎం.విజయరంగారావు, ఉపాఽధి ఏపీఓ ఈశ్వరమ్మ, క్షేత్ర సహాయకుడు బుల్లిబాబు మృతురాలి ఇంటికి వెళ్లి ఘటనపై ఆమె కుమారుడిని అడిగి తెలుసుకున్నారు, ఆ సమాచారం డ్వామా పీడీకి వివరించారు. మృతురాలికి భర్త పెంటయ్య ఉన్నాడు. గ్రామస్తులతో కలిసి పనులు చేస్తూ మృత్యువాత పడడంతో సహచర వేతనదారులు, గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. -
ఆరు వారాల్లో చెక్ డ్యామ్ల పనులు పూర్తికావాలి
పార్వతీపురం టౌన్: జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న చెక్ డ్యామ్లు, క్యాస్కేడింగ్స్, చెరువుల పనులు ఆరు వారాల్లో పూర్తికావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన తన చాంబర్లో జిల్లాలో చేపట్టిన జల వనరుల పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 39 చెక్డ్యామ్లు, 122 చెరువులు, 40 క్యాస్కేడింగ్స్ పనులను చేపట్టేందుకు మంజూరు ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు. త్వరలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఈలోగా పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. మంజూరుచేసిన పనులన్నీ ఆరు వారాల గడువులోగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి త్వరగా పనులను ప్రారంభించాలన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఉపాధి హామీలో జిల్లాకు కేటాయించిన రూ. 210 కోట్ల నిధుల్లో ప్రప్రథమంగా జల వనరుల పనులకే తొలి ప్రాధాన్యం ఇచ్చామని, తద్వారా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల్లో ఒక్క పని కూడా ప్రారంభం కాలేదని, దీనిపై ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎంత త్వరగా పనులు పూర్తిచేస్తే అంత త్వరగా నిధులు విడుదలవుతాయని, కావున ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకుడు కె.రామచంద్రరావు, జల వనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ ఆర్.అప్పల నాయుడు, సహాయ ఇంజినీర్లు, జూనియర్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
మానవత్వంతో సమస్యలు పరిష్కరించాలి
పార్వతీపురంటౌన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన సమస్యలను మానవతా దృక్పఽథంతో ఆలోచన చేసి పరిష్కరించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆయన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించి 108 మంది అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా, రెవెన్యూ అధికారి కె. హేమలత, కేఆర్ఆర్సీ ప్రత్యేక ఉపకలెక్టర్ డా.పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి భాగస్వామ్యులయ్యారు. అనంతరం కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. వచ్చిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి సమస్య పరిష్కరం ఏ దిశలో ఉందో సెల్ఫోన్ మెసేజ్ ద్వారా అర్జీదారుకు తెలియజేయనున్నట్లు తెలిపారు. కావున ఆర్జీల పరిష్కార ప్రక్రియలో ఎటువంటి పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి సమస్యకు నాణ్యతతో కూడిన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సంతృప్తే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. పీజీఆర్ఎస్లో అందిన కొన్ని వినతులు ● పార్వతీపురం మండలం జగన్నాథపురం గ్రామ యవత పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యాలా అవసరమైన పుస్తకాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ఆర్.ప్రవీణ్ తదితరులు వినతిపత్రం అందజేశారు. ● పాచిపెంట మండలం గంగన్న దొరకోనవలస గ్రామానికి ఉపాధిహామీ పథకం కింద సీసీ రోడ్డు, కాలువల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 5లక్షల నిధులను మంజూరు చేసినప్పటికీ గ్రామసర్పంచ్, ఎంపీడీఓ అనుమతులు మంజూరు చేయడం లేదని, కావున అనుమతులు మంజూరుపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు గ్రామస్తులు విన్నవించారు. ● తోటపల్లి రిజర్వాయర్లో బోటింగ్ పాయింట్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి కల్పించాలని జి.చిరంజీవి, తోట ప్రసాద్, అల్లు సురేష్, సమ్మిడి రాజేష్ వినతిపత్రం అందజేశారు. ● కొమరాడ మండలం అర్తాం రెవెన్యూ పరిధిలోని 0.3 ఎకరాల కొండ పోరంబోకు భూమిని సాగు చేసుకుంటున్నామని, ఆ భూమికి పట్టాదారు పాస్పుస్తకాన్ని మంజూరు చేయాలని కోరుతూ కె. కృష్ణందొర వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు. వాస్తవాలైతే చట్టపరిధిలో చర్యలు పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల దర్యాప్తులో వాస్తవాలు అయినట్లయితే చట్టపరిధిలో తక్షణమే చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ఫిర్యాదు దారుల నుంచి స్వయంగా సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సంబంధించిన స్టేషన్ అధికారులకు సిఫార్సు చేయనున్నామని, ఆయా అధికారులు ఫిర్యాదులు వాస్తవాలైతే చట్టపరమైన చర్యలతో పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ సిబ్బందికి ఫోన్లో ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో ముఖ్యంగా కుటుంబ కలహాలు, భర్త, భూ ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, అత్తారింటి వేధింపులు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీల వసూలు, ప్రేమ పేరుతో మోసాలపై పలు ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. కార్యక్రమంలో 6 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. డీసీఆర్బీ ఎస్ఐ ఫకృద్దీన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 46 వినతులు సీతంపేట: ఐటీడీఏలో పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 46 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో పుబ్బాడ గ్రామస్తులు పద్మ గ్రామానికి సీసీ రోడ్డు వేయాలని కోరారు. రెల్లిగూడకు చెందిన బంగారమ్మ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని, వరదగోడ తన గ్రామంలో నిర్మించాలని రాజమానుగూడకు చెందిన సవర చిన్నారావు విజ్ఞప్తి చేశారు. సవర నవీన్ వన్బీ అడంగల్ ఇప్పించాలని కోరారు. తాగునీటి బోరు ఏర్పాటు చేయాలని కుంబికి చెందిన రామారావు వినతి అందజేశారు. వీధికాలువలు నిర్మించాలని మెట్టుగూడ గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ రమాదేవి, గిరిజన సంక్షేమశాఖ డీడీ అన్నదొర, పీహెచ్వో ఎస్వీ గణేష్, ఏఎంఓ కోటిబాబు, పీఆర్ ఏఈ కిరణ్, సీడీపీఓ రంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ -
రేషన్కార్డు విభజనకు చిన్నారుల అవస్థలు
పార్వతీపురం: ఉమ్మడి కుటుంబంలో ఉన్న తమకు రెండు రేషన్ కార్డులుగా విభజించి మంజూరు చేయాలని ఫొటోలో ఉన్న చిన్నారులు తమ నాయనమ్మతో కలిసి సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. గరుగుబిల్లి మండలం పెదగుడబ గ్రామానికి చెందిన సిరిపోల ఇలవేణి పెద్ద కుమారుడు భానుప్రసాద్ భార్య, వారి పిల్లలు, చిన్నకుమారుడు కలిసి ఒక కార్డులో ఉన్నారు. భాను ప్రసాద్కు వివాహమై ఐదు సంవత్సరాలు కావస్తోంది. పెద్దకుమారుడు భాను ప్రసాద్ వారి కుటుంబ సభ్యుల పేరున కార్డును మంజూరు చేయాలని ఎస్ఆర్పేట పంచాయతీ అధికారుల వద్దకు మూడు, నాలుగు సార్లు వెళ్లినప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ సర్వర్ పనిచేయడం లేదని బదులివ్వడంతో తమకు రేషన్కార్డు విభజన నిమిత్తం ఏమీ చేయలేని పరిస్థితుల్లో తల్లి ఇలవేణి, తన ముగ్గురు పిల్లలతో కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్కు సమస్యను విన్నవించారు. విభజన కాని కారణంగా తన తల్లి వితంతు పింఛన్కూడా మంజూరు చేయడం లేదని భాను ప్రసాద్ సాక్షికి తెలిపారు. -
కిడ్నాపైన వివాహిత హత్య
శృంగవరపుకోట: మండలంలోని వెంకటరమణ పేట గ్రామానికి చెందిన వివాహిత కిడ్నాప్కు గురికావడం..ఆపై ఆమె మృతదేహం బావిలో లభ్యం కావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎర్రాప్రగడ వెంకటక్ష్మి (38) శనివారం రాత్రి 10 గంటల సమయంలో కుమారై రిషితతో కలిసి బహిర్భూమికి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత రిషిత ఇంటికి వచ్చి ఎవరో గుర్తుతెలియని కొందరు వచ్చి అమ్మను ఆటోఎక్కించి తీసుకెళ్లిపోయారని, తనను పక్కకు తోసేశారని తండ్రి సత్యనారాయణ, అన్నయ్య హరీష్కు చెప్పగా వారు పరిసర గ్రామాలకు బైక్లతో వెళ్లి వెతికినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే పోలీసులకు హరీష్ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కిడ్నాప్ అయిన వివాహిత ఆచూకీ కోసం సీఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. ఆదివారం ఉదయం డాగ్స్క్వాడ్తో ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా గ్రామసమీపంలోని బావిలో మహిళ మృతదేహం ఉన్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. వెలికితీసిన మృతదేహాన్ని వెంకటలక్ష్మిగా గుర్తించడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించి వివరాలు సేకరించారు. బావిలో లభ్యమైన మృతదేహం ఉలిక్కిపడిన గ్రామస్తులు -
ముగిసిన జిల్లా స్థాయి చెస్ పోటీలు
విజయనగరం: చెస్అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలకు స్పందన లభించింది. రింగ్రోడ్లో ఉన్న ఫైర్ చెస్ స్కూల్లో అసోసియేషన్ కార్యదర్శి కేవీ జ్వాలాముఖి ఆధ్వర్యంలో అండర్–7,9,11,13 విభాగాలతో పాటు ఓపెన్ విభాగాల్లో నిర్వహించిన పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 80 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో రాజాంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ పోటీలను వి.వెంకటేష్, ధనలక్ష్మి, పద్మావతి, అర్చనలు పర్యవేక్షించారు. -
కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె వాయిదా
● జూలై 9న చేపట్టనున్నట్లు వెల్లడి విజయనగరం గంటస్తంభం: లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా ఈ నెల 20న కలెక్టరేట్ ఎదుట జరగాల్సిన సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా పడినట్లు కేంద్ర కార్మిక సంఘాల నేతలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఐటీయూ, ఏఐఎఫ్టీయూ న్యూ, ఇఫ్టూ దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. దేశం ఇంత తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్రప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ లేబర్ కోడ్ల అమలును దూకుడుగా ముందుకు తీసుకెళ్తోందని విమర్శించారు. కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తోందని కేంద్ర కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. జూలై 9వ తేదీన సమ్మె జయప్రదం చేసేందుకు సమాయత్తం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆలయంపై పడిన పిడుగుగంట్యాడ: మండలంలోని పెదవేమలి గ్రామంలో కాళీమాత ఆలయంలో కొలువైన లక్ష్మీగణపతి ఆలయంపై ఆదివారం మధ్యాహ్నం పిడుగు పడింది, పిడుగు శబ్దానికి ఆలయం గోపురం పెచ్చులు ఊడిపోయాయి. ఆలయం కింద భక్తులు ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వ్యక్తిపై దాడి కేసు నమోదుసంతకవిటి: మండలంలోని పొనుగుటివలస గ్రామంలో బొండాడ నారాయణ తమ్ముడి కొడుకు బొండాడ గణేష్ శనివారం రాత్రి పెదనాన్న నారాయణపై వెదురు కర్రతో దాడి చేయడంతో గణేష్పై కేసు నమోదు చేశామని ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం బొండాడ నారాయణ, బొండాడ గణేష్ కుటుంబాల మధ్య ఉన్న పాత తగాదాల నేపథ్యంలో, శనివారం రాత్రి తాగిన మైకంలో గణేష్ నారాయణపై దాడి చేయడంతో నారాయణ చేతికి గాయమైంది..దీంతో నారాయణ ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నారాయణ ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. తివ్వాకొండల్లో ఏనుగుల సంచారంభామిని: మండలం సరిహద్దుగా గల తివ్వాకొండల్లో ఏనుగుల గుంపు తాగునీటి కోసం తహతహ లాడుతోంది. ఈ మేరకు ఆదివారం భామిని–గుమ్మలక్ష్మీపురం మండలాల సరిహద్దుల్లో ఏనుగుల గుంపు పచార్లు కొట్టినట్లు గిరిజనులు తెలిపారు. రాతి గుట్టల్లో నడుస్తూ నీటి కోసం పయనిస్తున్నట్లు చెప్పారు. ఒక పక్క మండు వేసవితో అల్లాడుతున్న పరిస్థితిలో ఏనుగుల గుంపు అవస్థలు పడుతున్నట్లు తెలియజేశారు. ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్యమెరకముడిదాం: మండలంలోని ఎం.గదబవలస గ్రామానికి చెందిన ఆరంగి అప్పలనాయుడు (42) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆరంగి అప్పలనాయుడు తరచూ మద్యం తాగుతుండడంతో కుటుంబకలహాలు నెలకొన్నాయి, ఈ క్రమంలో మనస్తాపం చెందిన అప్పలనాయుడు ఆదివారం ఇంట్లో ఉన్న ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బుదరాయవలస ఎస్సై జె.లోకేష్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి అప్పలనాయుడు మృతికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
●ఒకే సమయంలో నలుగురు చిన్నారుల మృతి
●కారులో చిక్కుకుని ప్రాణాలు విడిచిన పిల్లలు ●శోకసంద్రంగా మారిన సర్వజన ఆస్పత్రి అమ్మా... అందరం కలిసి ఆడుకుంటామంటే సరే అన్నారు.. అదే పిల్లల చివరి మాట అని ఆ తల్లులకు తెలియదు.. అక్కడే మృత్యువు కాపుకాసి ఉందని గుర్తించలేకపోయారు.. మూడు గంటల పాటు పిల్లలు కనిపించకపోయే సరికి తల్లిడిల్లిపోయారు.. ఊరంతా గాలించారు.. చివరకు కారులో ప్రాణవా యువు అందక విలవిల్లాడుతూ విగత జీవులుగా కనిపించిన పిల్లలను చూసి కుప్పకూలిపోయారు.చిన్నారుల మృతికి కారణమైన కారు ఇదే.. విజయనగరం క్రైమ్: సమయం మధ్యాహ్నం 2 గంటలు.. గ్రామంలోని పెళ్లివేడుకలో పెద్దలు, ఆటపాటల్లో చిన్నారులు నిమగ్నమయ్యారు. ఆటలాడుతూ గ్రామ బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఉన్న కారులోకి నలుగురు చిన్నారులు వెళ్లారు. పొరపాటున డోర్లు వేయడంతో లాక్ అయ్యాయి. అంతే.. వారికి ప్రాణ వాయువు అందలేదు. కాపాడాలంటూ వారి ఆర్తనాదాలు బయటకు వినిపించలేదు. మూడుగంటల తర్వాత వెతుకుతూ వెళ్లిన పెద్దలకు కొనఊపిరితో కారులో కొట్టుమిట్టాడుతున్న చిన్నారులు కనిపించారు. డోర్లు బద్దలగొట్టి చిన్నారులను బయటకు తీసినా ఫలితం లేకపోయింది. చిన్నారుల ప్రాణా లు గాలిలో కలిసిపోయాయి. కారు రూపంలో మృత్యువు కాటేసింది. విజయనగరం సమీపంలోని ద్వారపూడిలో మృత్యుఘోష వినిపించింది. సర్వజన ఆస్పత్రి ప్రాంగణం శోకసంద్రంగా మారింది. మాటలకందని విషాదం అందరూ పదేళ్లలోపు పిల్లలే. కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులు వారిని అల్లారు ముద్దుగా సాకుతున్నారు. పిల్లలు ఆడుకుంటేంటే సంబర పడ్డారు. పెళ్లివేడుకలో బిజీ అయ్యారు. ఒకేసారి కారు రూపంలో కంది మణీశ్వరి (6), బూర్లె చారులత (7), పండి ఉదయ్ (7), బూర్లె జాస్రిత(8)ను మృత్యువు కాటేయడంతో కన్నీరుకార్చారు. విగతజీవులుగా మారిన చిన్నారులను పట్టుకుని బోరున విలపించారు. కడుపుకోత.. మృతిచెందిన చిన్నారుల్లో బూర్లె చారులత, జాస్రిత అక్కాచెల్లెళ్లు. వీరిద్దరూ ఒకే సారి మృతిచెందడంతో తల్లిదండ్రులు ఉమ, ఆనంద్లు విషాదంలో ముని గిపోయారు. ఇద్దరు కుమార్తెల మృతదేహాలను పట్టుకుని గుండెలవిసేలా రోదించారు. దేవుడా.. కడుపుకోత మిగిల్చావా అంటూ విలపించారు. సర్వజన ఆస్పత్రి మార్చురీ వద్ద ఉన్న కుమార్తెల మృతదేహాలను చూసిన తల్లి ఓ దశలో సొమ్మసిల్లి పోయింది. ఉదయ్ తల్లిదండ్రులు బుచ్చిబాబు, భవానీ, మణీశ్వరి తల్లిదండ్రులు సురేష్ అరుణలు సైతం బిడ్డల మృతదేహాలను పట్టుకుని రోదించారు. ఇళ్లమధ్యనే ఘటన... మృత్యువుకు కారణమైన కారు వీధిలో ఇళ్ల మధ్యనే ఉంది. దాని పక్కగుండానే అందరూ రాకపోకలు సాగించినా.. అందులో ఉన్న చిన్నారులను గుర్తించలేకపోయారు. వారి ఆర్తనాదాలను ఆలకించలేకపోయారు. కారు అద్దాలు నలుపువి కావడం కూడా దీనికి ఓ కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్, వన్టౌన్ ఎస్ఐ రామ్గణేష్లు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సర్వజన ఆస్పత్రికి వచ్చి మృతుల వివరాలు సేకరించారు. కారు ఎవరిది? బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఆగి ఉన్న కారు ఎవరిది..? అక్కడే ఎందుకు పార్క్ చేశారు? డోర్కు లాక్ ఎందుకు వేయలేదు అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ద్వారపూడిలో జరుగుతున్న పెళ్లి వేడుకకు సంబంధించి వైజాగ్ నుంచి ఆ కారు వచ్చినట్టు సమాచారం. కారు ఓనర్, డ్రైవర్ ఒక్కరేనని తెలిసింది. సంబంధిత వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. -
రైల్వేశాఖ నిర్లక్ష్యం
● ఈ ఏడాదీ మామిడి ఎగుమతులు నిల్ ● కిసాన్ రైళ్లకు ప్రాధాన్యం కల్పించని అధికారులు ● అధిక మొత్తంలో డబ్బులు చెల్లించలేక.. ప్రత్యామ్నాయ మార్గాల వైపు రైతులు ● సాధారణ రైళ్ల కై నా... డిస్కౌంట్ లిచ్చి నడపని అధికారులు ● తూతూ మంత్రంగా ఎగుమతిదారులతో మంతనాలు ● నష్టాలబాట పట్టలేక రోడ్డు రవాణా వైపే రైతుల మొగ్గుమేంగో అసోసియేషన్లతో సమావేశం నిర్వహించాం ఈ ఏడాది మామిడి పంటను ఎగుమతులు చేసే విధంగా చూడాలని మేంగో అసోసియేషన్లతో సమావేశాన్ని నిర్వహించాం. అయితే పంట తక్కువ ఉందన్న కారణంగా వారంతా సుముఖత చూపించలేదు. పైగా కిసాన్ రైళ్లు, రాయితీలు కావాలని అడుగుతున్నారు. దీనిపైన ఉన్నతాధికారులకు నివేదించాం. జనరల్ బోగీలను ఇస్తామన్నాం. సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. – బి. వెంకట సత్యనారాయణ, చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్, విజయనగరంఅవసరం మేరకు అడిగాం రైల్వేశాఖ ద్వారా ఏటా మామిడి ఎగుమతులు రాయితీపై పంపించేవారం. కిసాన్ రైళ్లను అందించలేదు. జనరల్ బోగీల ద్వారా ఎగుమతులు చేసేందుకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. రోడ్డు రవాణా ద్వారా మామిడి ఎగుమతులును నేరుగా స్టాక్ పాయింట్కే పంపించేస్తున్నాం. దీనివల్ల ఖర్చు తగ్గింది. రైల్వే అధికారులు కొంచెం ప్రాధాన్యం కల్పించి, రాయితీలు కల్పించి ఉంటే బాగుండేది. – ముదునూరి నారాయణమూర్తి రాజు, మేంగో అసోసియేషన్ ప్రతినిధి, విజయనగరంవిజయనగరం టౌన్: మామిడి ఎగుమతులనుద్దేశించి విజయనగరం ఖ్యాతిని దేశ ప్రధాని మోడీ ప్రస్తుతించిన సంగతి తెలిసిందే. అటువంటి మామిడి ఎగుమతులపై రైల్వేశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో గతేడాది ఎగుమతుల్లేకుండా పోయాయి. ఈ ఏడాది కూడా పంట పూర్తయిపోయి, ఇతర మార్గాల గుండా వెళ్లిపోతున్నప్పటికీ అధికారులు ఏమాత్రం చలించకపోవడం గమనార్హం. సంబంధిత మేంగో అసోసియేషన్లతో తూతూమంత్రంగా సంప్రదింపులు చేసి వదిలేయడంతో వ్యాపారస్తులు ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టిసారించాల్సిన పరిస్థితి నెలకొంది. ఏమాత్రమైనా వ్యాపారస్తులకు అవకాశం కల్పించి, రాయితీలిచ్చినట్లయితే ఈ ఏడాదైనా మామిడి పంట రైళ్ల ద్వారా వెళ్లేది. కానీ కేవలం నిర్లక్ష్యం కారణంగానే కోట్లాది రూపాయలను రైల్వేశాఖ నష్టపోయిందనడంలో అతిశయోక్తిలేదు. ఏడాదికోమారు పండే మామిడి పంటను ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలకు రైల్వే ద్వారా ఎగుమతులు చేస్తూ ఎంతో కొంతమేర రైతులు లాభాన్ని చూద్దామనుకుంటుంటారు. అయితే చద్దన్నం కన్నా ఊరగాయ ఖర్చే ఎక్కువ అన్న చందాన ప్రస్తుతం రైతుల పరిస్థితి ఉంది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా మామిడి పంటను రైతన్నలు బుట్టలు కట్టి, ప్యాకింగ్లు చేసి రైల్వే ద్వారా ఇతర ప్రాంతాలకు పంపించే మేంగో అసోసి యేషన్కు అమ్మకాలు చేపట్టడమే కాకుండా దగ్గరుండి బుట్టలను రైలుపెట్టెల్లో సర్ది మరీ పంపిస్తుంటారు. అయితే గతేడాది కూడా రైల్వేశాఖ నిర్లక్ష్యం కారణంగానే మామిడి ఎగుమతుల్లేకుండా పోయాయి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి తలెత్తింది. కేవలం అధిక లభార్జానే ధ్యేయంగా రైల్వేశాఖ పనిచేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సాధారణ ఎక్స్ప్రెస్, పాసింజర్ రైళ్ల టికెట్ల ధరలను రైల్వేశాఖ పెంచేసింది. జనరల్ బోగీలతో పాటు స్లీపర్క్లాస్లను కుదించేసింది. ఏసీ భోగీలకు ప్రాధాన్యం కల్పించి సామాన్యుడి నడ్డి విరగ్గొట్టింది. మామిడి ఎగుమతులను కరోనా వంటి విపత్కర సమయంలోనూ కిసాన్ రైళ్లను ప్రవేశపెట్టి రైతులకు వెన్నుదన్నుగా నిలబడిన రైల్వేశాఖ కరోనా తర్వాత సగం ధరకే వచ్చే కిసాన్ రైళ్లకు స్వస్తిపలికింది. దీంతో సరైన పంటలేక, చాలీచాలని లోడ్లను వ్యాపారస్తులు నలుగురైదుగురు కలిసి రైళ్ల ద్వారా పంపిద్దామంటే కిసాన్ రైళ్లు లేకుండా పోయాయి. సాధారణ గూడ్స్ ద్వారా పంపిద్దామంటే నాలుగైదు బోగీలే తప్ప మిగతావన్నీ ఖాళీగానే వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ప్రతి బోగీకి డబ్బులు చెల్లించాల్సిందే. దీంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. దానిమూలంగా ప్రత్యామ్నాయమార్గాలవైపు వ్యాపారులు దృష్టిసారించారు. ఉన్నతాధికారుల బాధ్యతా రాహిత్యం కారణంగానే రెండేళ్లుగా మామిడి ఎగుమతుల్లేకుండా పోయాయని పలువురు వ్యాపారస్తులు అభిప్రాయపడ్డారు. -
గంజాయి పీలుస్తున్న వ్యక్తి అరెస్ట్
నెల్లిమర్ల: గంజాయి పీలుస్తూ పట్టుబడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై బి.గణేష్. తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ నారాయణపట్నం బ్రిడ్జి దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ ప్రాంతంలో ఒక వ్యక్తి అక్రమంగా గంజాయి కలిగి ఉండి పీలుస్తున్నాడన్న సమాచారంపై సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. అలాగే జరజాపు పేటకు చెందిన యశ్వంత్ అనే వ్యక్తి వద్ద 100 గ్రాముల గంజాయి, గంజాయి పీల్చడానికి ఉపయోగించే పరికరాలను సీజ్ చేసి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. నిందితుడు గడిచిన ఆరేడు సంవత్సరాల నుంచి గంజాయి వినియోగిస్తున్నాడని, ఒడిశా రాష్ట్రంలోని రాయగడ రైల్వేస్టేషన్ ప్రాంతంలో కొనుక్కుని ఇక్కడికి తీసుకొని వచ్చి వినియోగిస్తున్నట్లు విచారణలో చెప్పినట్లు తెలిపారు. మండలంలో ఎవరైనా గంజాయి వినియోగించినా.. గంజాయి కలిగి ఉన్నా, ఏ రూపంలో అయినా గంజాయికి సంబంధించి కార్యక్రమాల్లో పాలుపంచుకున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై గణేష్ హెచ్చరించారు. గంజాయి గురించి సమాచారాన్ని ఫోన్ 912110944 నంబర్కు తెలియజేయాలని కోరారు. దాడుల్లో సిబ్బంది దామోదర్ రావు, వీఆర్వో వెంకటలక్ష్మి, మహిళా పోలీస్ పాల్గొన్నారు. -
కనులపండువగా శ్యామలాంబ పండగ ప్రారంభం
సాలూరు: శ్యామలాంబ అమ్మవారి ఉత్సవం కనులపండువగా ప్రారంభమైంది. ఆదివారం ఉయ్యాలకంబాల వేడుకను పెదకోమటిపేట గద్దె వద్ద సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. గద్దె వద్ద ఏర్పాటుచేసిన ఉయ్యాలలో జమిందార్ కుటుంబానికి చెందిన విక్రమచంద్ర సన్యాసిరాజు, తదితరులను ఉయ్యాలలో కూర్చోబెట్టి పెద్దలు ఊపారు. వేలాది మంది భక్తులు ఈ వేడుకను తిలకించేందుకు తరలివచ్చారు. స్వల్ప తోపులాట నేపథ్యంలో యువరాజు, పెద్దలు కొంత ఇబ్బందిపడ్డారు. కార్యక్రమంలో సీ్త్రశిశు,గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్దేవ్ తదితరులు పాల్గొన్నారు. నేడు తొలేళ్ల ఉత్సవం సోమవారం తొలేళ్ల ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జన్నివీధిలో ఉన్న అమ్మవారి గద్దె నుంచి ఘటాను గొల్లవీధి వాసులు తీసుకొస్తూ కర్రలతో సాము చేస్తారు. ఒక వీధి తరువాత మిగిలిన వీధి వాసులంతా ఈ ఉత్సవంలో పాల్గొని ఘటాలను ఊరేగిస్తారు. ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ మాధవరెడ్డి పండగ నేపథ్యంలో ఏర్పాట్లను ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. ఆదివారం పట్టణానికి వచ్చిన ఆయన సిరిమాను తిరిగే ప్రాంతాలు, పార్కింగ్ తదితర అంశాలపై ఆరా తీసి అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు. కంట్రోల్రూమ్ను పరిశీలించారు. ఇబ్బందులు పడిన పోలీసులు సుమారు వెయ్యి మంది పోలీసులు ఈ ఉత్సవానికి బందోబస్తు నిమిత్తం వచ్చారు. అయితే బందోబస్తు పోలీసులకు పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి అక్కడ విద్యుత్ వెలుగులు లేకపోవడంతో చీకట్లో పోలిసులు భోజనాలు చేయడం కనిపించింది. సెల్ఫోన్లైట్లు వేసుకుని, అటుగా వచ్చే వాహనాల వెలుతురు మధ్య పలువురు పోలీసులు భోజనాలు చేస్తూ ఇబ్బందులు పడ్డారు. -
●నగరానికి చెందిన సిరాజ్ అరెస్టుతో ఉలిక్కిపడిన జిల్లా ● పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ●ఆబాద్వీధిలో భయంభయం ●అప్రమత్తమైన పోలీస్ శాఖ ●నిశిత సోదాలు
విజయనగరం/విజయనగరం క్రైమ్: విజయనగరం.. రాష్ట్రంలోనే సున్నితమైన, శాంతియుతమైన జిల్లా. కళలకు కాణాచి. సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం. వ్యవసాయమే అధికమంది జీవనాధారం. ఇలాంటి జిల్లాలో ఇప్పుడు ఉగ్రజాడ కలకలం రేపుతోంది. విశాఖపట్టణానికి చేరువగా ఉన్న విజయనగరాన్ని ఉగ్రకార్యకలాపాలకు అనువుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు జిల్లా వాసుల్లో భయాందోళన నింపుతున్నాయి. ఉగ్రభావజాలంతో కూడిన వ్యక్తిని ఇంటెలిజెన్స్ వర్గాలు అరెస్టు చేయడం, ఆయన వద్ద నుంచి బాంబుల తయారీకి వినియోగించే పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. విజయనగరం ఉగ్రవాద చర్యలకు స్థావరంగా మారిందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆబాద్ వీధిలో భయంభయం.. విజయనగరం కార్పొరేషన్ నడిబొడ్డున ఉన్న ఆబాద్వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ (28) ఉగ్రవాద భావజాలంతో పనిచేస్తున్నట్టు తెలంగాణా రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆయన ఇంటి పై శుక్రవారం రాత్రి దాడిచేసి అదుపులోకి తీసుకున్నాయి. రహస్యప్రదేశంలో విచారణ జరిపాయి. ఆయన వద్ద నుంచి బాంబుల తయారీలో వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ను స్వాధీనం చేసుకున్నాయి. ఆయనను కోర్టులో హాజరుపర్చి రిమాండ్లోకి తీసుకున్నాయి. ఈ సమాచారంతో ఆబాద్వీధిలో నిశ్శబ్దం ఆవరించింది. స్థానికులు భయంభయంతో గడుపుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా... విజయనగరం జిల్లా చరిత్రలో గతంలో ఎప్పడూ బాంబు పేలుళ్లు, ముష్కర మూకలదాడులన్న మాటే లేదు. ఇప్పుడు అదే విజయనగరం సిరాజ్ అరెస్టుతో వార్తల్లోకెక్కింది. తెలంగాణ రాష్ట్రం నుంచి కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం నేరుగా విజయనగరం వచ్చి ఆబాద్వీధిలో బాంబులను తయారుచేసేందుకు వినియోగించే సోడియం సల్ఫర్, అమ్మొనియం పాస్ఫరేట్, అల్యూమినియం పౌడర్తో సిరాజ్ను అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. ఈ విషయం ఇక్కడి ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించకపోవడం విస్మయం కలిగిస్తోంది. దాడులు చేసేందుకేనా? ఉమ్మడి ఏపీలో 2013లో హైదరాబాద్లో ఐఎస్ఐఎస్ సంబంధాలు కలిగిన యాసిన్ భత్కల్, సయ్యద్ షెహెన్ షా తదితర ఏడుగురు ఉగ్రవాదులు ఐసిస్ తో సంబంధం పెట్టుకుని ఏడుచోట్ల బాంబులు పేల్చి దాదాపు 20 మంది ప్రాణాలు తీశారు. ఇప్పటికీ ఇది మర్చిపోలేని మారణహోమం. ఇప్పుడు అలాంటి దాడికే విజయనగరం వేదికగా పథక రచన చేస్తూ సిరాజ్ పట్టుబడ్డాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కా ఆధారాలతో ఆబాద్వీధిలో ఉర్థూ పాఠశాల ఎదురుగానే నివసిస్తున్న సిరాజ్ ఇంట్లో సోదాలు చేపట్టి పేలుడుపదార్థాలు స్వాధీ నం చేసుకోవడం దీనికి బలం చేకూర్చుతోంది. ఎవరికీ అనుమానం రాదనే... హైదరాబాద్లో బాంబు పేలుళ్లు చేసి అల్లర్ల సృష్టించేందుకు సౌదీ అరేబియాలోని ఐఎస్ఐఎస్ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడించినట్టు సమాచారం. వాస్తవానికి ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా ముందుగుండు సామగ్రి విక్రయాలకు పెట్టింది పేరు. ఇటువంటి వెనుకబడిన ప్రాంతంలో పేలుళ్లకు అవసరమైన పదార్థాలను సులభంగా సేకరించవచ్చని, నిఘా ఉండదని భావించారు. అందులో భాగంగానే సోడియం సల్ఫర్, అమ్మోనియం ఫాస్మరేట్ వంటి పదార్థాలు కొనుగోలుచేసి సిరాజ్ తన ఇంట్లో భద్రపరిచినట్టు తెలుస్తోంది. అయితే, నగరంలోని ఏ దుకాణంలో ఈ పేలుడు పదార్ధాలను ఎంత మొత్తంలో కొనుగోలు చేశారు...? వాటి తయారీతో ఎంత మొత్తంలో నష్టం చేకూర్చేందుకు పథకరచన చేశారన్న అంశాలపై నిఘా వర్గాలు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. తెలియని వ్యక్తులకు పేలుడు పదార్థాలు విక్రయిసున్నవారి వివరాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇంజినీరింగ్ విద్య నభ్యసించిన సమయంలోనే... సిరాజ్ ఉర్ రెహ్మాన్ 2018 సంవత్సరంలో హైదరాబాద్లో ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన సమయంలో అక్కడ బోయగూడలో ఉంటున్న సమీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్టు నిఘావర్గాలు గుర్తించాయి. ఇద్దరూ సౌదీఅరేబియాకు చెందిన ఐఎస్ఐఎస్తో సంబంధాలు నెరిపినట్టు తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉన్న సమీర్ను పట్టుకోవడంతో విజయనగరంలో ఉన్న సిరాజ్ వ్యవహారం బయటపడింది. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులతో కార్డెన్ సెర్చ్, నాకాబందీ నిర్వహించిన పోలీసులకు సమీర్, సిరాజ్ల భాగోతం బహిర్గతమైంది. ఇద్దరూ కలిసి బాంబుల తయారీకి పథకరచన చేసినట్టు సమాచారం. అదుపులోకి తీసుకున్నాం ఇంటెలిజెన్స్ సమాచారంతో విజయనగరం ఆబాద్వీధిలో ఉగ్రవాద భావజాలంతో ఉన్న సిరాజ్ను అదుపులోకి తీసుకున్నాం. అతనితో పాటు హైదరాబాద్కు చెందిన సమీర్ను కూడా అక్కడి ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో విజయనగరం టూటౌన్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ కృష్ణమూర్తితో కలిసి వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించాం. – ఎం.శ్రీనివాస్, డీఎస్పీ, విజయనగరం రక్షణ కుటుంబంలో చీడపురుగు..! సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో ఏఎస్ఐగా, అన్న య ఆర్పీఎఫ్లో విధులు నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నమైన కుటుంబానికి చెందిన వ్యక్తి ఉగ్రభావజాలానికి ప్రేరేపితం కావడం చర్చనీయాంశంగా మారింది. ఆది నుంచి సిరాజ్కు విచ్చలవిడి తనం ఎక్కువ. తండ్రి మందలించినా పెడచెవిన పెట్టేవాడు. ఎప్పుడు ఇంటికి వస్తాడో.. వెళ్తాడో తెలియదు. మూడులాంతర్ల సమీపంలోని ఓ మొబైల్ షాపు యజమానికి దగ్గర బంధువుగా సిరాజ్ను పోలీసులు గుర్తించారు. -
కూటమి పాలనలో.. భద్రత కరువు
● తహసీల్దార్ను భయభ్రాంతులకు గురిచేసేలా పార్వతీపురం ఎమ్మెల్యే తీరు ● అర్ధరాత్రి సమయంలో వాట్సప్ కాల్ చేయడంలో ఆంతర్యం ఏమిటి? ● అధికారి తప్పుచేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి ● చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు అధికారిపై తప్పుడు ఆరోపణలు ● ఓ ఎమ్మెల్యేపై అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడం జిల్లా చరిత్రలో ప్రథమం ● దీనిపై విచారణ జరిపించాలి ● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఓ గ్రామంలో సమస్య వచ్చింది. నేను ఫోన్ చేశాను.. తహసీల్దార్ ఫోన్ తీయలేదంటూ స్వయానా ఎమ్మెల్యే విజయచంద్ర చెప్పారు. సమస్య వస్తే తహసీల్దార్ ఒక్కరే కాదు.. ఆపైన ఆర్డీఓ ఉంటారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఉంటారు. కలెక్టర్ ఉంటారు. ఎవ్వరికై నా ఫిర్యాదు చేయవచ్చు. అలా కాకుండా రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేసి మహిళా అధికారిని దుర్భాషలాడి, భయభ్రాంతులకు గురి చేయడం ఎంత వరకు సమంజసం. ఓ మహిళా అధికారితో రాత్రి సమయంలో ఎలా మాట్లాడతారు. ఇదే విషయాన్ని తహసీలార్ద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తను చెప్పలేని మాటలు మాట్లాడారంటూ అందులో పేర్కొన్నారు. వాస్తవానికి మొట్ట మొదటి నుంచి పార్వతీపురం ఎమ్మెల్యే పనితీరు వివాదాస్పందంగా ఉంది. అక్కడ ఎంపీడీఓలు సైతం పని చేసేందుకు భయపడుతున్నారు. సీతానగరం ఎంపీడీఓ సెలవుపై వెళ్లిపోయారు. ఆ నియోజకవర్గంలో అధికారులు పని చేయలేకపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి స్థానిక ఎమ్మెల్యేను నియంత్రించేలా చర్యలు చేపట్టాలి. తహసీల్దార్పై జరిగిన ఘటనలు పునారవృతం కాకుండా చూసుకోవాలి. మొదటి నుంచి వివాదస్పదంగా ఎమ్మెల్యే తీరు.. విజయనగరం: కూటమి ప్రభుత్వంలో అధికారులకు భద్రత కరువైందని ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా ఎమ్మార్వో వనజాక్షిని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో దాడి చేయించగా... తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం తహసీల్దార్ వై.జయలక్ష్మిపై స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర భయభ్రాంతులకు గురిచేయడం వివాదస్పదంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలపై నియంత్రణ కరువైందని, కనీసం సీఎం, ఇన్చార్జి మంత్రులు, మంత్రులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పార్వతీపురం ఎమ్మెల్యేపై తహసీల్దార్ చేసిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పాలనలో కీలకమైన అధికారులను బెదిరించడం తగదన్నారు. ధర్మపురిలోని సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. అర్ధరాత్రి సమయంలో వాట్సప్ కాల్ చేయడంలో ఆంతర్యం ఏంటి... పార్వతీపురం తహసీల్దార్ జయలక్ష్మి పార్వతీపురం ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శుక్రవారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాతో పాటు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిని ఎమ్మెల్యే సైతం మీడియా సాక్షిగా ధ్రువీకరించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై తహసీల్దార్ ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారి. తహసీల్దార్తో వాట్సాప్ కాల్లో మాట్లాడని ఎమ్మెల్యే స్వయంగా చెప్పారు. ఒక మహిళా అధికారికి రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేయడం, వాట్సాప్ కాల్ మాట్లాడడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే దూషించారని, భయంభ్రాంతులకు గురిచేశారంటూ ఆమె లిఖిత పూర్వకంగా చేసిన ఫిర్యాదుకాపీ బయటకు రావడంతో లేనిపోని ఆరోపణలు చేస్తూ ధర్నాలకు ఉసిగొల్పడం విడ్డూరంగా ఉంది. ఇలా అయితే అధికారులు పాలన సాగించడం కష్టం. ఎమ్మెల్యే ఏమైనా డాక్టరా...? పార్వతీపురం తహసీల్దార్ మానసిక స్థితి సరిగా లేదని ఎమ్మెల్యే వాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఆయనేమైనా డాక్టరా అంటూ ప్రశ్నించారు. ఆమె పనితీరు బాగులేకుంటే ఉన్నతాధికారులే చర్యలు తీసుకుంటారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలే తప్ప అధికారులను ఇబ్బందులకు గురిచేసే అధికారం ఎవరిచ్చారు?. ఓ మండల మేజిస్ట్రేట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన తహసీల్దార్ ఫిర్యాదుపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపించాలి. అధికారులకు భద్రత కల్పించాలి. సమస్యలుంటే డీఆర్సీ సమీక్షలో ప్రస్తావించి పరిష్కరిచుకోవాలే తప్ప లేనిపోని ఆరోపణలు తగవు. అభివృద్ధి లేదు... అంతా అవినీతే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి జరగకపోగా.. అవినీతి రాజ్యమేలుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు అమలుచేయడంలేదు. అభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగడంలేదు. కేవలం అవినీతి కార్యక్రమాలకే ప్రజాప్రతినిధులు మొగ్గు చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమావేశంలో పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, జెడ్పీటీసీ సభ్యుడు వర్రి నరసింహమూర్తి, ఎంపీపీ ఉత్తరావల్లి సురేష్ ముఖర్జీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, ఎస్సీసెల్ కార్యదర్శి పీరుబండి జైహింద్కుమార్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంత్ తదితరులు పాల్గొన్నారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకే... జిల్లాలో మహిళా తహసీల్దార్పై అనుచిత ప్రవర్తన జరుగుతుంటే అదే జిల్లాలో ఉన్న మహిళా మంత్రి, విప్గా పనిచేస్తున్న మరో మహిళా ఎమ్మెల్యే స్పందించకపోవడం శోచనీయం. ములగ గ్రామానికి చెందిన రైతుల నుంచి తహసీల్దార్ రూ.10 లక్షలు డిమాండ్ చేశారని అందులో రూ.2 లక్షలు ఇచ్చినట్టు ఎమ్మెల్యే చెబుతున్నారు. ఈ విషయం రైతులు తన వద్ద చెప్పలేదంటున్నారు. తాను చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఎమ్మెల్యే మహిళా తహసీల్దార్ను అవినీతి పరురాలిగా చిత్రీకరించడం, రాజకీయ రంగు పులమడం బాధాకరం. కొత్తగా పార్వతీపురం ఎమ్మెల్యేగా ఎన్నికై న విజయచంద్ర ఒక్క విషయాన్ని గుర్తించుకోవాలి. ప్రభుత్వాలు మారినప్పటికీ అధికారులు మారరన్న విషయాన్ని తెలుసుకోవాలి. -
ప్రాణం తీసిన ఈత సరదా
కలికిరి: ఈత సరదా ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు తీసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కలికిరి జేఎన్టీయూ కళాశాల నుంచి శనివారం మధ్యాహ్నం సుమారు పది మంది విద్యార్థులు కళాశాల సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు ఈతకెళ్లారు. ఈత వచ్చిన వారు బావిలో దిగగా.. ఈత రానివారు గట్టుపై కూర్చుని చూస్తున్నారు. ఈ క్రమంలో సివిల్ ఇంజిరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామానికి చెందిన సూర్యనారాయణ కుమారుడు చింతా రాకేష్(18) బావిలోకి ఒడ్డుపై నుంచి దూకాడు. బావిలోని పూడిక మట్టిలో ఇరుక్కుపోయాడు. గమనించిన స్నేహితులు కాపాడటానికి ప్రయత్నించినా ఉపయోగం లేక పోవడంతో కళాశాలకు వెళ్లి అధ్యాపకులకు, సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పీలేరు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సాయంతో సుమారు మూడు గంటల పాటు శ్రమించి విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీశారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ మదన్మోహన్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల పట్ల పర్యవేక్షణ కరువు... జేఎన్టీయూ కళాశాల విద్యార్థుల పట్ల పర్యవేక్షణ కరువవ్వడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు నిత్యం కళాశాల బయటకు వెళ్తూ వస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. రాత్రి సమయాల్లోనూ ఇలాగే జరుగుతోందని, సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బందిపై మండిపడ్డారు. గతంలోనూ ఇలా ఓ విద్యార్థి ఈతకెళ్లి మృతి చెందినా కళాశాల అధికారులకు కనువిప్పు కలగలేదని చెప్పారు. -
నిబంధనల శాపం
పల్లె విద్యార్థులకు● ఉచిత విద్యకు గ్రామీణ విద్యార్థుల దూరం ● ఒకటి, మూడు కిలోమీటర్ల నిబంధనలతో ఇక్కట్లు ● జిల్లాలో 302 ప్రైవేటు పాఠశాలల్లో చేరేందుకు అవకాశం ● దరఖాస్తు చేసేందుకు ఈ నెల 19 వరకు అవకాశం ● నిబంధనలు సడలించాలని కోరుతున్న తల్లిదండ్రులు, విద్యా వేత్తలు నిబంధనలు సడలించాలి ఉచిత సీట్లు కేటాయింపుల్లో ప్రభుత్వ నిబంధనలను సడలించాలి. విద్యార్థి నివాసం నుంచి ఒక కిలో మీటరు, మూడు కిలోమీటర్లు పరిధి విధించడం ద్వారా గ్రామీణ పేద విద్యార్థులకు సీట్లు పొందే అవకాశం లేదు. మండలాన్ని యూనిట్గా తీసుకుని సీట్లను కేటాయిస్తే బాగుంటుంది. దీంతో గ్రామీణ విద్యార్థులు ఉచిత సీట్లు పొందే అవకాశం కలుగుతుంది. పక్కాగా ప్రణాళికబద్ధంగా అమలు చేయాలి. – కె.విజయగౌరి, యూటీఎఫ్ నాయకురాలురామభద్రపురం: విద్యాహక్కు చట్టం – 2009 ప్రకారం పేద, బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించాలి. అయితే పాఠశాల విద్యార్థి నివాసం నుంచి ఒకటి లేదా మూడు కిలోమీటర్లలోపు ఉండాలనే నిబంధన గ్రామీణ విద్యార్థులకు శాపంగా మారింది. ఈ నిబంధనలతో పట్టణాల్లోనే ప్రైవేట్ పాఠశాలలు ఉండడంతో ఆ పరిసర ప్రాంతాలకు చెందిన వారే ఉచిత విద్య సీట్లు పొందే అవకాశం ఉంది. దీంతో గ్రామీణ విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో సీట్లను పొందలేకపోతున్నారు. శాపంగా మారిన నిబంధనలు ఉచిత సీట్లు కేటాయింపుల్లో ప్రభుత్వ నిబంధనలు గ్రామీణ విద్యార్థులకు శాపంగా మారాయి. విద్యార్థి నివాసం నుంచి ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో సీట్లు పొందేందుకు మొదటగా అవకాశం కల్పిస్తారు. తరువాత పరిస్థితులను బట్టి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. అంటే ఒక కిలోమీటరు పరిధిలోని విద్యార్థుల సీట్లు కేటాయింపులో మిగిలి ఉంటే 3 కిలోమీటర్లు పరిధిలో ఉన్న విద్యార్థికి కేటాయించేందుకు అవకాశం ఉంది. ప్రైవేట్ పాఠశాలలు ఉండేది పట్టణాల్లోనే కనుక పట్టణ పరిసర ప్రాంతాల వారికే ఉచిత సీట్లు దక్కుతాయి. అయితే గ్రామీణ పేద విద్యార్థులకు దక్కే అవకాశం లేదు. ఈ నిబంధనలను డలించి గ్రామీణ విద్యార్థులకు కూడా సీట్లు పొందే అవకాశం కల్పించాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు. పేదలకు 25 శాతం ఉచిత సీట్లు.. పేద విద్యార్థులకు ఉచిత సీట్లు పొందేందుకు ప్రభుత్వం ఈ నెల 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం అన్ని ప్రైవేటు, అన్ ఎయిడెడ్, పాఠశాలల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న అనాధలు, హెచ్ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు చెందిన నిరుపేద పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. డ్రాపౌట్లు లేకుండా చర్యలు చేపట్టడమే కాకుండా, పాఠశాలల్లో సీట్లు పొందిన విద్యార్థుల నుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదు. జిల్లా వ్యాప్తంగా 302 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా విద్యాహక్కు చట్టం – 2009 సెక్షన్ 12(1)సీ ద్వారా గత ఏడాది 283 పాఠశాలల్లో 1326 మంది పేద విద్యార్థులు ప్రవేశం పొందారు. వీరిలో అధిక శాతం విద్యార్థులు ఆయా విద్యా సంస్థల్లో కొనసాగుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పక్కాగా అమలు చదువు కొనుక్కొనే స్థోమత లేని ఎంతో మంది పేద విద్యార్థులకు చదువుకు అంతరాలు, అడ్డుగోడలు ఉండకూడదని ఆలోచించి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలనే నిబంధనను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పక్కాగా అమలు చేసింది. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో గతంలో అనేక ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేసింది.ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సీట్ల కేటాయింపు ప్రభుత్వ నింబధనల ప్రకారమే సీట్లు కేటాయిపు ఉంటుంది. విద్యార్థి నివాసం నుంచి ఒక కిలోమీటరు, మూడు కిలోమీటర్లు పరిధి మాత్రమే ఉండాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశానికి అవకాశం కల్పించడం పేద విద్యార్థులకు వరం లాంటిది. నోటిఫికేషన్ ప్రకారం అర్హులు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు పక్కాగా పాటించాలి. – యు.మాణిక్యంనాయుడు, డీఈవో, విజయనగరం -
పిడుగులు పడేటప్పుడు తస్మాత్..: కలెక్టర్
పార్వతీపురం టౌన్: పిడుగులు పడేటప్పుడు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ప్రజలకు సూచించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావరణంలో మార్పులపై రాష్ట్ర విపత్తుల సంస్థ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఫోన్ ద్వారా కూడా అందిస్తుందని, వాటి ఆధారంగా ప్రజలు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. వాతావరణ విపత్తులపై ఏపీ విపత్తుల సంస్థ ఫోన్లలో అప్రమత్తం చేస్తుందని వాటిని పాటించాలని కోరారు. వివిధ ప్రాంతాల్లో పిడుగు పాటుకు ఒకరిద్దరు మృతి చెందినట్టు సమాచారం అందుతుందని ప్రజలందరూ వీటి పట్ల జాగ్రత్త వహించాలన్నారు.విద్యుదాఘాతంతో రెండు దున్నల మృతి భామిని: మండలంలోని సొలికిరికి చెందిన బిల్లింగి కురువులకు చెందిన రెండు దున్నపోతులు విద్యుదాఘాతానికి గురై శనివారం మృతి చెందాయి. వీటి సుమారు రూ.లక్ష ఉంటుందని చెబుతున్నారు. సొలికిరి నుంచి ఇసుకగూడ వెళ్లే దారిలో విద్యుత్ స్తంభాలు ఒరిగి ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయం భామిని విద్యుత్ శాఖాధికారులకు తెలియడంతో ప్రమాదాన్ని వచ్చి చూశారు. అనంతరం పశు సంవర్ధక శాఖ అధికారులు వచ్చి దున్నపోతులకు పోస్టుమార్టం చేసి బాధిత రైతుకు అప్పగించారు.బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు బొండపల్లి: మండల కేంద్రంలోని జాతీయ రహదారి 26పై నడిచి వెళ్తున్న కిలపర్తి సన్యాసప్పడును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గాయాల పాలయ్యాడు. సన్యాసప్పడు జాతీయ రహదారిని దాటే క్రమంలో విజయనగరం వైపు నుంచి గజపతినగరం వైపు వెళ్తున్న వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన పీడీఎస్ బియ్యం పార్వతీపురం రూరల్: మండలంలోని గోచెక్క గ్రామంలో ఆంధ్రా నుంచి ఒడిశాకు అక్రమంగా బొలెరో వాహనంలో పది క్వింటాళ్ల ప్రభుత్వ ఉచిత సరఫరా బియ్యాన్ని తరలించేందుకు సిద్ధం చేస్తుండగా ముందస్తు సమాచారంతో తరలించిన వారితో పాటు బొలెరో వాహనం పట్టుకున్నామని విజిలెన్స్ ఎస్ఐ బి.రామారావు తెలిపారు. బొలెరోలో ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. గోచెక్క గ్రామానికి చెందిన వ్యక్తులు ఈ బియ్యాన్ని తరలించేందుకు సిద్ధమవుతుండగా శనివారం పక్కా సమాచారంతో దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పట్టుబడిన బియ్యాన్ని ప్రభుత్వ గోదాంలకు తరలించినట్టు తెలిపారు. అలాగే వ్యక్తిపై కేసు నమోదు చేసి వాహనాన్ని పార్వతీపురం గ్రామీణ ప్రాంత పోలీసుస్టేషన్కు అప్పగించామన్నారు. దాడుల్లో సీఎస్డీటీ ఎం.రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. పాడైన రైల్వేగేట్ ● గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ దత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురం రైల్వే గేట్ శనివారం రాత్రి పాడవ్వడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. రెండువైపులా సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అటు వైజాగ్, విజయనగరం, గజపతినగరం.. ఇటు ఒడిశా, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి తదితర దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సిబ్బంది వచ్చి సమస్య పరిష్కరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు నేరం : డీఎంహెచ్వో
పార్వతీపురం టౌన్: జిల్లాలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి వివరాలు వెల్లడించడం చట్టరీత్యా నేరమని డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.భాస్కరరావు అన్నారు. అటువంటి స్కానింగ్ సెంటర్లపై, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా సెంటర్ల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. గర్భస్థ శిశు స్థితిగతులు, సమస్యలు తెలుసుకునేందుకే స్కానింగులు చేయాలే తప్ప, వీటిని ఆసరాగా తీసుకుని గర్భస్థ శిశు వివరాలు వెల్లడించడం నేరమన్నారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లా స్థాయి సలహా మండలి సమావేశం డీఎంహెచ్వో అధ్యక్షతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 44 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, ప్రతి స్కానింగ్ సెంటరులో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు ఆయా కేంద్రాలపై ప్రోగ్రాం అధికారుల ద్వారా ఎప్పటికపుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇకపై ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగే అబార్షన్ల వివరాలతో పాటు అందుకు తగిన కారణాలను తమకు సమర్పించాలని స్పష్టం చేశారు. సీ్త్రల పట్ల వివక్ష కూడదని వివరించారు. సమాజంలో చైతన్యం తీసుకురావాలి బాలికల పట్ల వివక్ష లేకుండా సమాజంలో చైతన్యం తీసుకురావాలన్నారు. ముఖ్యంగా జూనియర్ కళాశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో అవగాహన కల్పించడం ద్వారా మంచి ఫలితాలు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆడపిల్లల పట్ల అవగాహన పెరిగిందని, అది మరింత పెరగడం మంచి శుభ పరిణామమని, ఆ విధంగా అవగాహన కల్పించనున్నట్టు చెప్పారు. కమిటీ సభ్యులు సూచించిన సలహాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో మరింత పటిష్టంగా చట్టాన్ని అమలు చేస్తామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్వో డా.కేవీఎస్ పద్మావతి, జిల్లా ప్రోగ్రాం అధికారి డా.టి.జగన్మోహన్రావు, డీఐవో డా.ఎం.నారాయణ, డీజీవో డా.సీహెచ్ కమలకుమారి, చిన్న పిల్లల వైద్యులు డా. వి.శ్రీధర్, రేడియోలజిస్ట్ డా.ఎం.జయరాం, సామాజిక కార్యకర్త శ్రీహరి, ఇతర వైద్యులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025
● మహిళా తహసీల్దార్పై భగ్గుమన్న టీడీపీ శ్రేణులు ● ఎమ్మెల్యేపై ఫిర్యాదు నేపథ్యంలో భారీగా తహసీల్దార్ కార్యాలయానికి.. ● రైతులు, బాధితుల పేరుతో హడావిడి ● రాత్రికి రాత్రే సిద్ధమైన ఫిర్యాదులు ● తహసీల్దార్కు మతిస్థిమితం లేదని.. ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని.. ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ వాస్తవానికి ములగ గ్రామంలో డిజిటల్ సంతకాల కోసం డబ్బులు తీసుకున్నట్లు చెప్పిన వారు ఒకరిద్దరే. మిగిలినవారంతా తమ పనులు చేయడం లేదనే గగ్గోలు పెట్టారు. అది కూడా శుక్రవారం రాత్రి నుంచే రూ.2 లక్షలు ఆమె అడిగినట్లు బయటకు వచ్చింది. ఆ డబ్బులు కూడా తహసీల్దార్కే ఇచ్చినట్లు ఏ ఒక్కరూ స్పష్టంగా చెప్పలేదు. టీడీపీ నాయకులు మాత్రం ఆమె డబ్బులు తీసుకున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో తహసీల్దార్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, పీఓ ఎదుటే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తహసీల్దార్ డౌన్డౌన్ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అసలు ఆమెను ఇక్కడ నుంచి పంపించేయాలని పట్టుబట్టారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం వచ్చిన బాధితులు ఇలా ఆగ్రహంతో ఊగిపోవడం.. ఇటువంటి డిమాండ్లు చేయడం అరుదు. తహసీల్దార్ ఫిర్యాదు నేపథ్యంలోనే విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఇలాంటి డ్రామాకు తెర తీశారన్న విమర్శలు వినిపించాయి. దీని వెనుక కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం ఎవరన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: ‘‘పంపించేయండి సార్ ఇక్కడ నుంచి ఆవిడను.., వుయ్ వాంట్ జస్టిస్.., అవినీతి తహసీల్దార్ను సస్పెండ్ చేయాలి.., ఫిర్యాదు వెనక్కి తీసుకుని, ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలి.., తహసీల్దారు డౌన్డౌన్.. ఆమెను విధుల నుంచి టెర్మినేట్ చేయాలి.., ఎమ్మార్వోకు మానసిక స్థితి సరిగ్గాలేదు.. ఆవిడను వెంటనే ఇక్కడ నుంచి పంపించేయాలి..’’ ఇవన్నీ పార్వతీపురం తహసీల్దార్ జయలక్ష్మికి వ్యతిరేకంగా సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ అశుతోశ్ శ్రీ వాత్సవ ఎదుట పలువురు చేసిన నినాదాలు. నిజంగా తహసీల్దార్ వారిని ఇబ్బంది పెడితే.. కడుపు మండిన బాధితులెవరైనా... ఒక ఐఏఎస్ అధికారి వద్ద తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ న్యాయం చేయాలని కన్నీటిపర్యాంతమవుతారు. అంతేగానీ.. ఆమెను సస్పెండ్ చేయాలని, మతిస్థిమితం లేదని, ఇక్కడ నుంచి పంపించేయాలని, డౌన్డౌన్.. అంటూ నినాదాలు చేయడం బహుశా ఇక్కడే జరిగి ఉండొచ్చేమో అన్న వ్యాఖ్యలు వినిపించాయి. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తనను అసభ్య పదజాలంతో దూషించారని స్థానిక ఎమ్మెల్యే జయలక్ష్మి ఫిర్యాదు చేసినట్లు బయటకు వచ్చిన లేఖ కలకలం రేపిన విషయం విదితమే. దీనిపై శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే విజయచంద్ర అవన్నీ ఆరోపణలని ఖండించారు. దీంతోపాటు.. తహసీల్దార్ పెద్ద అవినీతిపరురాలని వ్యాఖ్యానించారు. ములగ గ్రామంలో రైతులకు సంబంధించిన డిజిటల్ సంతకాల కోసం రూ.10 లక్షలు ఆమె డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. బాధితులంతా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తారని ప్రకటించారు. అనుకున్నట్లుగానే శనివారం ఉదయం మండలంలోని ములగ, అడ్డాపుశీల, కృష్ణపల్లి, వెంకంపేట తదితర గ్రామాల నుంచి వచ్చినట్లుగా పెద్ద సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించారు. ఈ క్రమంలో అక్కడ ఏం జరుగుతుందోనని కాసేపు ఉత్కంఠ రేగింది. ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఆ సమయంలో తహసీల్దార్ జయలక్ష్మి లేకపోవడంతో ఆయా గ్రామాల నుంచి వచ్చిన వారంతా కార్యాలయ ఆవరణలోనే గుమికూడారు. కాసేపటి తర్వాత సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో అశుతోశ్ శ్రీ వాత్సవ అక్కడికి చేరుకున్నారు. వారి సమస్యలు విన్నారు. విజ్ఞప్తులు స్వీకరించారు. విచారణ జరిపి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఏకరువు పెట్టిన వారంతా టీడీపీ వారే.. సబ్ కలెక్టర్ను చుట్టుముట్టి సమస్యలు చెప్పిన వారంతా టీడీపీ వారే కావడం గమనార్హం. ఆ పార్టీ పట్టణ, మండల నాయకులు, కాంట్రాక్టర్లు, కౌన్సిలర్లు అంతా ఒక్కొక్కరిగా తహసీల్దార్ మీద విమర్శల దాడి మొదలుపెట్టారు. ఆమె అవినీతిపరురాలంటూ చిట్టా విప్పారు. ఒక్కొక్కరితో ఒక్కో ఫిర్యాదు ఇప్పించేశారు. తహసీల్దార్ ఏ పనీ చేయడం లేదని గగ్గోలు పెట్టారు. ధ్రువీకరణ పత్రాలు, వన్బీలు, డిజిటల్ సంతకాలు, నోటీసుల జారీ, విచారణలో జాప్యాలు.. ఇలా సమస్యలను ఏకరవు పెడుతూ, పది నెలలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. ప్రతి పనికీ డబ్బులు అడుగుతున్నట్లు తెలిపారు. ముందు ఆమెను ఈ మండలం నుంచి పంపించేయాలని ‘గట్టిగా’ డిమాండ్ చేశారు. మతిస్థిమితం లేని ఆవిడంటూ దుర్భాషలాడారు. ఒక మండల మేజిస్ట్రేట్ అని కూడా చూడకుండా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. మధ్యమధ్యలో కొంతమంది వృద్ధులతోనూ మాట్లాడించారు. వాస్తవానికి మాట్లాడిన వారితోపాటు.. ఇక్కడకు వచ్చిన వారిలో ఏ సమస్యలూ లేనివారూ ఉండటం గమనార్హం. మండల కార్యాలయం వద్ద సమావేశం ఉందని చెప్పి తీసుకొచ్చారంటూ కొంతమంది చెప్పడం విశేషం. గత ఏడాది పదో నెలలో ఆమె ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆమె అవినీతి చేస్తున్నారని, ఏ పనీ చేయడం లేదని చెబుతున్న టీడీపీ నాయకులకు.. ఇన్నాళ్లూ ఫిర్యాదు చేయకుండా, ఇప్పుడు ఒక్కసారిగా రావడం వెనుక, ఆరోపణలు చేయడం వెనుక కారణాలు ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముందు రోజు రాత్రి ఎమ్మెల్యే మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలనే ఇక్కడ ప్రస్తావించడం అనుమానాలకు తావిస్తోంది. న్యూస్రీల్ఆగ్రహంతో ఊగిపోతూ... -
విచారణ జరిపి, నివేదిక అందిస్తాం..: సబ్ కలెక్టర్
ఈ ఘటనపై ఐటీడీఏ పీఓ, సబ్ కలెక్టర్ అశుతోశ్ శ్రీవాత్సవ మీడియాతో మాట్లాడారు. పార్వతీపురం మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారణ చేస్తామని తెలిపారు. ప్రధానంగా తహసీల్దార్పైన, ఇక్కడ సిబ్బందిపైన అనేక అవినీతి ఆరోపణలు చేశారని వివరించారు. ములగ గ్రామానికి సంబంధించిన సమస్యపై గతంలోనూ ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. దీనిపై విచారణ జరిపి, కలెక్టర్కు నివేదిక అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మీద తహసీల్దారు ఇచ్చిన ఫిర్యాదుపైనా విచారణ చేస్తామని చెప్పారు. అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటెలిజెన్స్ ఆరా! పార్వతీపురం ఎమ్మెల్యే, తహసీల్దార్ మధ్య వివాదం.. శనివారం తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులు తదితర అంశాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీసినట్లు తెలిసింది. తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఇంటెలిజెన్స్ వర్గాలు మొత్తం ఘటనను అంతా తమ సెల్ఫోన్లో చిత్రీకరించారు. స్వయంగా వచ్చి పరిశీలించినట్లు తెలిసింది. -
రాష్ట్రంలో ఐఏఎస్లు, ఐపీఎస్లకే రక్షణ కరువు
సాలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం అమలుచేస్తూ కక్షపూరిత పాలన సాగిస్తోందని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో విలేరులతో శనివారం మాట్లాడారు. లిక్కర్స్కాం అంటూ రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డిను అక్రమంగా అరెస్టు చేసిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి వ్యక్తులను అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపుతున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. ఉన్నత అధికారులుగా పనిచేసిన వ్యక్తులకే రక్షణ కరువైందని, సాధారణ అధికారులు, ప్రజలు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పార్వతీపురం మహిళా తహసీల్దార్పై అసభ్య పదజాలంతో దూషించడం అమానుషమన్నారు. 2014–2019 మధ్య టీడీపీ పాలనలో తహసీల్దార్లు వనజాక్షి, నారాయణమ్మలపై టీడీపీ నేతలు దాడులు చేసినా కేసులు లేవని పేర్కొన్నారు. సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ పట్ల మూడు రోజుల కిందట సాలూరు పట్టణాధ్యక్షుడు దురుసుగా మాట్లాడిన ఘటనను గుర్తుచేశారు. టీడీపీ నేతలకు మహిళలంటే చిన్నచూపని విమర్శించారు. టీడీపీ పాలనలో తను కూడా ఉద్యోగిగా బాధితుడునేనని, అందుకే ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చినట్టు వివరించారు. ఉద్యోగులను గౌరవించాలే తప్ప వేధించడం తగదన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, ఎప్పుడూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండదన్న విషయం గుర్తించుకోవాలని తెలిపారు. అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని కోరారు. లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగంలో కక్షపూరితంగా అక్రమ అరెస్టులు అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదన్నది గుర్తురెగాలి టీడీపీ నేతలకు మహిళలంటే చిన్నచూపు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
జిల్లాలో మహిళా అధికారికి రక్షణ కరువు: సీపీఎం
పార్వతీపురం రూరల్: పార్వతీపురం తహసీల్దార్ను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర బూతు పదజాలాలతో అసభ్యకరంగా తిట్టడాన్ని సీపీఎం పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని జిల్లా కార్యదర్శి కొల్లి గంగనాయుడు తెలిపారు. రావికోన గ్రామం వద్ద జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.వై.నాయుడు, జిల్లా కమిటీ సభ్యులు కె.ఈశ్వరరావుతో కలిసి శనివారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మహిళా అధికారికి రక్షణ కరువవ్వడం బాధాకరమన్నారు. రాజ్యాంగాన్ని కాపాడతానని ప్రమాణం చేసిన ఎమ్మెల్యే.. పార్వతీపురం తహసీల్దార్ ఒక మహిళ అని కూడా చూడకుండా రాత్రి సమయంలో ఫోన్చేసి తిట్టడం, బయటకు చెప్పుకోలేని పదజాలంతో అసభ్యకరంగా దూషించడం దుర్మార్గమని మండిపడ్డారు. మండల మెజిస్ట్రేట్గా ఉన్న తహసీల్దార్కే రక్షణ లేకపోతే సామాన్య ప్రజానీకంపై ఎమ్మెల్యే ఏరకంగా వ్యవహరిస్తారో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
స్వచ్ఛ పార్వతీపురం మనందరి బాధ్యత
పార్వతీపురంటౌన్: స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ పార్వతీపురం మనందరి బాధ్యతని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ నారాయణ భరత్గుప్తా, కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. కలెక్టర్తో కలిసి కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం మొక్కలు నాటారు. పురపాలక సంఘం ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగను పంపిణీ చేశారు. బీట్ ది హీట్ నివాదంతో తాగునీటి సదుపాయాలు కల్పించాలని, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు. ప్రతీ కుటుంబం మరుగుదొడ్డిని నిర్మించుకోవాలన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, డీఆర్వో కె.హేమలత, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి సీహెచ్ రాధాకృష్ణమూర్తి, పలు విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం పార్వతీపురంటౌన్: ప్రతిష్టాత్మక పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. భారత హోం మంత్రిత్వశాఖ ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు (పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ)లను ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి పద్మ అవార్డులకు ఎంపిక చేస్తుందన్నారు. జిల్లాల్లో ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన యువత, వ్యక్తులు తగిన వివరాలతో దరఖాస్తులు సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు. దరఖాస్తు, నియమ నిబంధనలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పద్మ అవార్డ్స్.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో పరిశీలించ వచ్చని ఆయన అన్నారు. యువజన సర్వీసుల శాఖ సెట్విజ్, విజయనగరం కార్యాలయానికి రెండు సెట్లులో దరఖాస్తు సమర్పించాలని ఆయన సూచించారు. వివరాలకు సెల్: 98499 09080, 984990 13080 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. ఉపాధి నిధులతో మౌలిక వసతులు ● జిల్లా ప్రత్యేక అధికారి డా.నారాయణ భరత్ గుప్తా పార్వతీపురం రూరల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆదేశించారు. పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలకు కావాల్సిన రోడ్లు, కాలువలు, చెరువుల్లో పూడికతీత పనులు, వ్యవసాయ భూమి చదును పనులు, ఇంకుడు గుంతలు, ఫారంపాండ్లు, నీటికుంటల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలకు సంబంఽధించిన పనులను ఉపాధిహామీ నిధులతో చేపట్టాలన్నారు. వీటివల్ల గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజల జీవనోపాధి మెరుగవుతుందన్నారు. అనంతరం వేతనదారుల కోసం ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సందర్శించి మజ్జిగను పంపిణీ చేశారు. వైద్యశిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకుడు కె.రామచంద్రరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆండ్ర జలాశయం నీరు విడుదల విజయనగరం: నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశాల మేరకు నీటిపారుదలశాఖ అధికారులు శనివారం ఆండ్ర జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. మరి కొద్దిరోజుల్లో మెంటాడ, పిట్టాడా, గజపతినగరం, రామతీర్థం మూల స్టేషన్ మీదుగా నెల్లిమర్లలోని చంపావతి నదిలోకి నీరు చేరనుంది. అక్కడ నుంచి ఇన్ఫిల్టరేషన్ ద్వారా నగరంలోని రిజర్వాయర్లకు పంపింగ్ చేస్తారు. ప్రస్తుతం చంపావతి నీటి మట్టం తగ్గిపోవడంతో నగర ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చూసేందుకు విజయనగరం కార్పొరేషన్ చర్యలు చేపడుతోంది. -
మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలి: కాంగ్రెస్
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మండల తహసీల్దార్ వై.జయలక్ష్మి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మధ్య రెండు రోజులుగా నెలకొన్న వివాదంపై దర్యాప్తు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గం ఇన్చార్జి బత్తిన మోహన్రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సాలూరు ఇన్చార్జి గేదెల రామకృష్ణ, పార్వతీపురం మన్యం జిల్లా ఓబీసీ జిల్లా చైర్మన్ వంగల దాలినాయుడు, వైస్ చైర్మన్ వెన్నెల సురేష్, మండలాధ్యక్షుడు గౌరీ శంకరరావు, సాలూరు మండలాధ్యక్షుడు ఒంటి బుచ్చయ్య, మండల ఉపాధ్యక్షుడు మజ్జి పరమేశ్వరరావు, కె. రమణమూర్తి తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మండల మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న ఓ మహిళా తహసీల్దార్.. ఎమ్మెల్యే తనను బూతు పదాలతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు అనే లెటర్ సోషల్ మీడియాలో, పత్రికల్లో హల్చల్ చేసినా పోలీసులు ధ్రువీకరించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. దీన్ని బట్టి చూస్తే పార్వతీపురం నియోజకవర్గంలో ప్రజాస్వామ్య బద్ధంగా పాలన జరుగుతోందా...? లేక నియంత పాలన సాగుతోందా...? అనే అనుమానం కలుగుతోందన్నారు. మండల మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న మహిళా అధికారికే రక్షణలేని పక్షంలో సామాన్య ఉద్యోగులు, మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై చేసిన పోలీస్ ఫిర్యాదును నిరసిస్తూ, టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టడం అత్యంత విచారకరం, హాస్యాస్పదమన్నారు. రాత్రికి రాత్రి ఎమ్మెల్యే ప్రెస్ మీట్, టీడీపీ శ్రేణులు ఆందోళన ఇవన్నీ చూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. -
ఎస్పీ ఆకస్మిక తనిఖీ
జియ్యమ్మవలస రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి శుక్రవారం జియ్యమ్మవలస మండలంలోని చినమేరంగి, జియ్యమ్మవలస పోలీస్స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి రెండు పోలీస్స్టేషన్లో దస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించా రు. అంతేకాకుండా గంజాయి, మత్తు పదార్థాలు యువతకు చేరవేస్తున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే రహదారి భద్రత, శక్తి టీమ్ల నిర్వహణ, క్రైమ్ రేటు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చినమేరంగి ఎస్సై అనీష్, జియ్యమ్మవ ఎస్సై ప్రశాంత్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దాతలకు డీఎస్పీ అభినందనలుసాలూరు: శ్యామలాంబ పండగ నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం 35 రోడ్డు స్టాపర్స్ను వితరణగా అదజేసిన నిహాల్ మల్టీ సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బంకురునాయుడు, డాక్టర్ దాక్షాయణి దంపతులను ఇన్చార్జ్ డీఎస్పీ రాంబాబు, సీఐ అప్పలనాయుడులు శుక్రవావారం అభినందించారు. అమ్మవారి పండగ కోసం తమవంతు సాయం అందించడం చాలా ఆనందంగా ఉందని డాక్టర్ అప్పలనాయుడు ఈ సందర్భంగా అన్నారు. తిరంగా యాత్రలో మంత్రి సాలూరు: పాకిస్తాన్పై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమవడంతో త్రివిధ దళాలకు కృతజ్ఞతాభివందనాలు తెలిపేందుకు నిర్వహించిన తిరంగా యాత్రలో సీ్త్ర శిశు, గిరిజన సంక్షేమశాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయం నుంచి మెయిన్రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్వీరమణ, మున్సిపల్ కమిషనర్ కృష్ణారావు, పలువురు అధికారులు, ఉద్యోగులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కలుపు మందు నిషేధం● అమ్మినా, వినియోగించినా చర్యలు ● వ్యవసాయ అధికారి గోవిందరావుపాచిపెంట: గ్లైఫోసిట్ కలుపు మందు విక్రయం, వినియోగంపై ఆంక్షలు ఉన్నాయని..షాపు యజమానులు అమ్మినా..రైతులు వినియోగించినా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వ్యవసాయ అధికారి కె.తిరుపతిరావు స్పష్టం చేశారు. ఈ మేరకు మండలం లోని పి.కోనవలస, పెద్ద చీపురువలస శ్యామల గౌరీపురం, చెరుకుపల్లి గ్రామాల్లో భూసారం పెంపులో భాగంగా నవధాన్యాల సాగు ఆవశ్యకతపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు సాధ్యమైనంత వరకు కలుపు మందులకు దూరంగా ఉండాలని, గ్లైఫోసిట్ అనే కలుపుమందు సాధారణ వినియోగం విక్రయం రాష్ట్రంలో నిషేధించారన్నారు. దీనివల్ల అనేక అనర్థాలు ఉన్నాయన్నారు. జీవ వైవిధ్యం పూర్తిగా నశించిపోతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు వినోద్, నాగమణి ప్రకతి వ్యవసాయ సిబ్బంది విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్ బియ్యం పట్టివేత బాడంగి: వినియోగదారులకు రేషన్డిపోల ద్వారా పంపిణీచేస్తున్న పీడీఎస్ బియ్యం ఆటోలో అక్రమరవాణా జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న సీఎస్డీటీ దారికాచి పట్టుకున్నారు. మండలంలోని ముగడ గ్రామానికి చెందిన వ్యాపారి పెద్దాడ వెంకటరమణ 6.50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని వినియోగదారులు, డీలర్లనుంచి కొనుగోలుచేసి సాలూరువైపు అక్రమంగా రవాణాచేస్తున్నట్లు తెలుసుకున్న సీఎస్డీటీ స్వర్ణలత బుధవారం సీహెచ్సీ–డొంకినవలస ఎత్తుకానా సమీపంలో దారికాచి పట్టుకున్నారు. -
రైతుల భూములు పోకుండా పైప్లైన్ వేయాలి
● రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంబాబు విజయనగరం ఫోర్ట్: రైతుల భూములు పోకుండా ప్రత్యామ్నాయంగా విశాఖ నుంచి రాయపూర్ వెళ్లే గ్రీన్హైవే పక్కగుండా హెచ్పీపీఎల్ వారు పైప్లైన్ వేసుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైప్లైన్ భూమి వినియోగపు హక్కు కోసం తీసుకునే ఉపరితల భూమిపై ఇళ్లు, తోటలు, బోర్లు, కట్టడాలు, పశువులు, కోళ్ల షెడ్లు వేసుకునే అవకాశం లేనందున మొత్తం భూమి విలువ కోల్పోతున్నందున రిజిస్ట్రార్ వేల్యూ పరిగణనలోకి తీసుకుని నాలుగు రెట్లు పెంచి ధరను నిర్ణయించి అందులో నుంచి 10 శాతం కాకున్నా 30 శాతం పరిహారం లెక్కకట్టి ఇవ్వాలని కోరారు. పండ్ల తోటలు, చెట్లు జీవిత కాలాన్ని లెక్కించి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు లోకవరపు ఆదినారాయణమూర్తి, గంట్యాడ మండల ఽ అధ్యక్షుడు కోడెల శ్రీను, రైతు సంఘం నాయకులు గణేష్, నారాయణరావు, గోపాలం, రాములు, పైడిపినాయుడు, ప్రసాద్, దాలినాయుడు, జగన్, సంగమయ్య తదితరులు పాల్గొన్నారు. -
చెత్త తొలగదు.. కంపు వదలదు
పార్వతీపురం రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ఆ వీధుల శివారుల్లో పడవేయడంతో స్థానికంగా ఉండేవారు దుర్వాసన పీలుస్తూ ఆరోగ్యపరమైన సమస్యలకు గురవుతున్నారు. క్రమం తప్పకుండా సేకరించిన చెత్తను ఆయా గ్రామాల్లోని ఉన్న చెత్త సేకరణ కేంద్రాలకు తరలించి తడి, పొడి, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుచేసి వర్మీకంపోస్టు తయారు చేయాలి. కానీ గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. రోజుల తరబడి చెత్తను ఒకే చోట పోగు చేసే దుస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు దృష్టిసారించి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు చెత్త నిల్వలను తరలించాలని స్థానికులు కోరుతున్నారు. -
తాగునీటికి కటకట..!
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో తీవ్రంగా తాగునీటి ఎద్దడి నెలకొంది. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల గొంతెండుతోంది. అంతటా దాహం కేకలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా వర్షాలు కురవకపోవడంతో మన్యంలో చాలా చోట్ల భూగర్భ జలాలు, నదులు, చెరువులు అడుగంటాయి. అనేక చోట్ల బోర్లు మొరాయించాయి. రక్షిత నీటి పథకాలు కూడా సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో జిల్లావాసులు తాగునీటికి కటకటలాడుతున్నారు. బిందెడు నీటి కోసం పరుగు పెడుతున్నారు. మరోవైపు వేసవిలో తాగునీటి సరఫరాపై అధికారుల ముందస్తు ప్రణాళిక కొరవడింది. జల్జీవన్ మిషన్ పథకం కింద చేపట్టిన పనులను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. కొన్ని గ్రామాల్లో ఇంటింటికి వేసిన కుళాయిలు దిష్టిబొమ్మల్లా మారాయి. పైప్లైన్ల లీకులు తదితర సమస్యలతో కొన్ని ప్రాంతాలకు పూర్తిస్థాయిలో తాగునీరు చేరడంలేదు. కొందరికి బురద నీరే సరఫరా అవుతోంది. విధిలేని పరిస్థితుల్లో ఆ నీటినే తాగి జిల్లా వాసులు రోగాల బారిన పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రజలు చెలమల నీటిపై ఆధారపడుతున్నారు. ఇంకొన్ని చోట్ల రెండు, మూడు రోజులకోసారి మాత్రమే తాగునీరు అందిస్తున్నారు. గిరిజనప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కిలోమీటర్ల దూరంలో ఉన్న గెడ్డ, వాగు నీటినే గిరిజనులు వినియోగిస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో రోజు తప్పించి రోజు మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లాలో తాగునీటి పరిస్థితిని ఆధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోక వడంపై జిల్లా వాసులు మండిపడుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో రెండు మున్సిపాల్టీలు, ఒక నగర పంచాయతీ, 451 పంచాయతీలున్నాయి. వాటి పరిధిలో 2,282 గ్రామాలున్నాయి. సీపీడబ్ల్యూఎస్ స్కీమ్లు 11, పీడబ్ల్యూఎస్ స్కీమ్లు 808, ఎంపీ డబ్ల్యూస్కీమ్లు 491, సోలార్ స్కీమ్లు 407, డైరెక్ట్ పంపింగ్ స్కీమ్లు 1,525 ఉన్నాయి. బోర్లు 7,518 వరకూ ఉన్నాయి. అయితే వాటి ద్వారా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు గతంలో జల్జీవన్మిషన్(జేజేఎం) పథకం కింద 2,013 పనులు మంజూరు చేశారు. ఇందులో 851 పనులు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. వివిధ దశల్లో 703 పనులున్నాయి. అసలు ప్రారంభం కాని పనులు459 వరకూ ఉ న్నాయి. ఈ స్కీమ్ ద్వారా గతంలో 1,21,246 కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో 65,959 కుళాయి కనెక్షన్లు మాత్రమే పూర్తిచేశారు. 55,287 కుళాయి పనులు పెండింగ్లో ఉన్నాయి. ఆ పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో నాలుగురోజులకోసారి.. జిల్లాకేంద్రం పార్వతీపురం మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో 220 పైగా బోరుబావులున్నాయి. వాటి నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. గతంలో జిల్లా కేంద్రంలో సుమారు రూ. 65కోట్లతో మెగా రక్షిత నీటి పథకం పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం కూటమి నేతలు, అధికారులు ఈ పథకం ఊసే ఎత్తడం లేదు. మున్సిపాల్టీలో సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ప్రధాన పైప్లైన్, దానికి అనుసంధానించిన లింకు పైప్లైన్ల లీకుల కారణంగా తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వేసవికాలంలో కుళాయిల ద్వారా నాలుగు రోజులకోసారి తాగునీటిని అందిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా రెండురోజులకోసారి నీటిని పంపిణీ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో చెలమలు, నేలబావులే దిక్కు జిల్లాలో ఎక్కువశాతం గిరిజన ప్రాంతం ఉంది. గిరిజన ప్రాంతాల్లో, కొన్ని గిరిశిఖర గ్రామాల్లో తాగునీటి సమస్యకు గిరిపుత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మండలాల్లో చెలమల నీటినే గిరిజనులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని మండలాల్లో తాగునీరు సరిగా అందక సమీపంలో గల వసతి గృహాలకు వెళ్లి నీటిని బిందెలతో తీసుకురావల్సిన పరిస్థితి ఏర్పడింది. భామిని, సీతంపేట మండలాల్లో కిలోమీటర్ల దూరం మహిళలు, గర్భిణులు నీటికోసం తహతహలాడాల్సిన పరిస్థితి నెలకొందని గిరిజనులు వాపోతున్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. జిల్లాకేంద్రంలో నాలుగురోజుల కోసారి సరఫరా గిరిజన ప్రాంతాల్లో తాగునీటికి అవస్థలు తూతూ మంత్రంగా క్రాస్ ప్రోగాం ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరిచిన నేతలు జిల్లాలో నాలుగు తాగునీటి ప్రాజెక్టులు డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేస్తాం జిల్లాలో పెండింగ్లో ఉన్న జల్జీవన్ మిషన్ పనులు డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేస్తాం. 55,287 కుళాయి పనులు పెండింగ్లో ఉన్నాయి. వేసవి ఎద్దడిని నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా క్రాస్ ప్రోగ్రాం నిర్వహించాం. కొన్ని గిరిశిఖర గ్రామాలకు తాగునీటి ఇబ్బందులను గుర్తించాం. తాగునీటి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నాం. అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించాం. –ఒ. ప్రభాకరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారి, పార్వతీపురం మన్యం -
వైభవంగా సహస్ర దీపాలంకరణ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం కనులపండువగా జరిపించారు. వెండి మంటపంలో ఉన్న శ్రీ సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి, దీపారాధన మంటపంలో ఉన్న ప్రత్యేక ఊయలలో వేంచేపుజేశారు. అనంతరం దీపాలను వెలిగించి, స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహస్ర దీపాల శోభలో సీతారామస్వామికి ఊంజల్ సేవ జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్కుమార్, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. చితికిపోయిన చిన్నారి● లారీ ఢీకొని బాలుడి దుర్మరణం కొత్తవలస: తెల్లతెల్లవారగానే అప్పుడే నిద్ర లేచి అక్క పాల ప్యాకెట్కు వెళ్తోందని తాను కూడా వెంట వెళ్తానని ఏడేళ్ల బాలుడు మారాం చేసి అక్కతో పాటు వెళ్లాడు. పాల ప్యాకెట్ తీసుకుని అక్కాతమ్ముళ్లు రోడ్డు దాటుతుండగా యమపాశం రూపంలో దూసుకుచ్చిన భారీ లారీ బాలుడిపైకి వెళ్లడంతో శరీరం నుజ్జ నుజ్జుయి అక్కడికక్కడే మృతిచెందాడు. శుక్రవారం తెల్లవారుజూమున జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాలుడి తల్లి, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తవలస మండలంలోని అరకు–విశాఖ జాతీయ రహదారి కొత్తవలస ఫైర్స్టేషన్ సమీపంలోని జనార్దన్ లేవుట్లో గల సాయిసంపత్ అపార్ట్మెంట్లో వాణికుమారి ఇద్దరు పిల్లలతో కలిసి తన తల్లి వద్ద ఉంటోంది. ఇటీవల భర్తతో కలహాలు రావడంతో ఆమె పిల్లలతో వచ్చి తల్లి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఎప్పటిలాగానే కూతురు చందస్వి(9)నిని పాలప్యాకెట్ కోసం రోడ్డు అవతలి వైపు గల పాలబూత్కు పంపించగా తాను కూడా వెళ్తానని కుమారుడు లేఖనకుమార్ (7) అక్కతో పాటు వెళ్లాడు. పాలప్యాకెట్ కొని రోడ్డు దాటుతుండగా మితిమీరిన వేగంతో ఎస్కోట వైపు వెళ్తున్న భారీ లారీ ఢీకొట్టడంతో బాలుడు శరీరం ముక్కముక్కలై రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్లిన పాప జరిగిన విషయాన్ని తల్లి, అమ్మమ్మకు చెప్పడంతో వారు వచ్చి చూసేసరికి దారుణం జరిగిపోయింది. తల్లి వాణికుమారి గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడ ఉన్నవారిని కంట తడి పెట్టించింది. విషయం తెలుసుకున్న కొత్తవలస సీఐ షణ్ముఖ రావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేసి లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తాపడి ఉపాధి వేతనదారు మృతి
వీరఘట్టం: మండలంలోని గడగమ్మ గ్రామానికి చెందిన ఉపాధి వేతనదారు అరసాడ ప్రసాదరావు(49) ఆటో బోల్తా పడడంతో జరిగిన ప్రమాదంలో శుక్రవారం మృతిచెందాడు. ఈ మేరకు ఉపాధి హామీ ఏపీఓ జి.సత్యంనాయుడు తెలిపిన వివరాల ప్రకారం గడగమ్మ గ్రామం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నగోర గ్రామంలోని ఆరుద్రమ్మ చెరువులో జరుగుతున్న ఉపాధి పనులకు గ్రామానికి చెందిన వేతనదారులు గడిచిన 7 వారాలుగా ఆటోలపై వెళ్తున్నారు. ఎప్పటిలాగానే శుక్రవారం కూడా వేతనదారులతోబయల్దేరిన ఆటోల్లో ఒక ఆటో అచ్చెపువలస గ్రామ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలైన అరసాడ ప్రసాదరావును మెరుగైన వైద్య చికిత్స కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసాదరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి.కళాధర్ తెలిపారు. పిడుగుపాటుతో గిరిజన యువకుడు.. సీతంపేట: మండలంలోని దేవనాపురం సమీపంలో పిడుగుపాటుకు గురై ఓ గిరిజన యువకుడు శుక్రవారం మృతిచెందాడు. జేపీ బూర్జగూడకు చెందిన సవర చంద్రరావు(28) దేవనాపురం ప్రాంతంలో ఉన్న పొలంలో ట్రాక్టర్తో వేసవి దుక్కి దున్నించిన అనంతరం ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు రావడంతో పిడుగు ఒక్క ఉదుటన దగ్గరగా పడడంతో అక్కడికక్కడే మృతిచెందినట్టు స్థానికులు తెలిపారు. మృతుడు అవివాహితుడు. తండ్రి జమ్మయ్య కొన్నేళ్ల కిందట మృతిచెందాడు. చంద్రరావు మృతివార్త విన్న తల్లి సొట్టమ్మ, సోదరుడు రమేష్లు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఎస్సై వై.అమ్మన్నరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
శాంతిని కోరుతూ చండీయాగం
విజయనగరం టౌన్: భారత్ పాకిస్తాన్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగా భారతీయ సైనికుల క్షేమం, దేశ శాంతిని కోరుతూ రైల్వేస్టేషన్ వద్దనున్న పైడితల్లి అమ్మవారి వనంగుడిలో శుక్రవారం వేదపండితులు శాస్త్రోక్తంగా చండీయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధర్వణ వేదపండితుడు సాయికిరణ్ శర్మ, యుజుర్వేద పండితుడు వెలువలపల్లి నరసింహమూర్తి మాట్లాడుతూ విశ్వశాంతికి, భారతదేశం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, యుద్ధంలో మన సైనికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని యజ్ఞయాగాదులను నిర్వహించామన్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని చండీయాగం చేపట్టామని తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు ప్రసిద్ధికెక్కారని, సుమారు 80 మంది దంపతులు యాగంలో పాల్గొనడం విశేషమన్నారు. యాగ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రాలను, తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ ప్రసాద్ పర్యవేక్షించారు. -
సారా రహిత గ్రామంగా అప్పయ్యపేట
● గ్రామసభలో పంచాయతీ తీర్మానం నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొత్తపేట పంచాయతీ అప్పయ్యపేట గ్రామాన్ని సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దామని ఎకై ్సజ్ సీఐ వెంకట్రావు తెలిపారు. గ్రామపెద్దలు, ప్రజల సమక్షంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించి ఈ మేరకు పంచాయతీ తీర్మానం చేశామన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నవోదయ 2.0 కార్యక్రమంలో భాగంగా సారా అమ్మకాలు జరిపే ‘బి’ కేటగిరిలో అప్పయ్యపేటను గతంలో గుర్తించామని, గడిచిన మూడు నెలల నుంచి గ్రామ, మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సారా అమ్మకాలు, నిల్వలపై నిఘా పెట్టామని, అనుమానితులను గుర్తించి బైండోవర్ చేశామన్నారు. అనంతరం జరిపిన దాడుల్లో మూడు నెలలుగా సారా విక్రయిస్తున్నట్లు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, తాజాగా నిర్వహించిన గ్రామసభలో పూర్తిస్థాయి అంచనాకు వచ్చి సారా రహిత గ్రామంగా ఏకగ్రీవంగా తీర్మానించామని తెలిపారు. ఇకపై ఎలాంటి అమ్మకాలు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై నాగేశ్వరరావు, సర్పంచ్ అట్టాడ శ్రీను, దత్తత అధికారి కృష్ణ, కార్యదర్శి బంగార్రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
మూడు పెంకుటిళ్లు దగ్ధం
గరుగుబిల్లి: మండలంలోని చినగుడబలో మూడు పెంకుటిళ్లు శుక్రవారం దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన ముదిలి కళావతి, ముదిలి మోహన్రావు, ముడిలి భాస్కరరావులకు చెందిన పెంకుటిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. కళావతి ఇంట్లో దీపం వెలిగించి ఉపాధిహామీ పనులకు వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన విషయాన్ని తెలుసుకున్న పార్వతీపురం అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో కళావతి కుటుంబం కట్టుబట్టలు మినహా గృహోపకరణాలు, నగదు, బీరువాలో ఉన్న బట్టలు విలువైన పత్రాలు, ధాన్యం అగ్నికి ఆహుతయ్యాయి. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉండడంతో ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రజలు ముందుకు రాలేదు. అయితే అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వెళ్లి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ను తీసుకురాగా గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. మిగిలిన రెండు ఇళ్లలో పెద్దగా నష్టం జరగలేదు. ప్రమాద సమాచారం మేరకు ఘటనా స్థలానికి తహసీల్దార్ పి.బాల, ఆర్ఐ శ్రీనివాసరావు తదితరులు వచ్చి పరిశీలించి ఆస్తినష్టాన్ని అంచనా వేశారు. నష్టనివేదికలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ ప్రమాదంలో రూ.5లక్షలవరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపకశాఖాధికారి జి. ప్రభాకరరావు తెలిపారు. -
ఉషు పోటీల్లో భామిని విద్యార్థుల సత్తా
భామిని: ఉషు పోటీల్లో భామిని విద్యార్థులు సత్తాచాటి మెడల్స్ సాధించి పలువురి మన్ననలు పొందారు. ఈ నెల 12,13 తేదీల్లో కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో భామిని విద్యార్థులు విజేతలుగా నిలిచారని క్రీడల కోచ్ కె.సోమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీతంపేట ఐటీడీఏ స్పోర్ట్స్ అధికారి ఎన్.జాకోబ్ దయానందం సహాయ సహకారాలతో పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఉషు పోటీలలో జూనియర్ విభాగంలో ఎన్.కె.శాంతి, సీనియర్ విభాగంలో పి.దీపిక, కె.సోమేష్లు గోల్డ్ మెడల్స్, పి.నాగరాజు, పి.చరణ్లు సిల్వర్ మెడల్స్ సాధించారని కోచ్ తెలిపారు. ఈ మేరకు పసుకుడిలో విజేతలను మండల నాయకులు బి.రవినాయుడు, కిరణ్కుమార్లు అభినందించారు. -
ఉసురు తీసిన పిడుగు
పాలకొండ రూరల్: పట్టణంలోని ఎన్ఎస్ఎన్ కాలనీ (జగన్నాథస్వామి ఆలయ సమీప) ప్రాంతంలో శుక్రవారం పిడుగు రూపంలో ఓ మహిళను మృత్యువు కాటేసింది. భర్త కళ్లముందే భార్యను విగతజీవిగా మార్చేసింది. వివరాల్లోకి వెళ్తే... గృహ నిర్మాణంలో భాగంగా కటుంబసభ్యులు సూర్యనారాయణ, కృష్ణలతో కలిసి జోగ లక్ష్మీదేవి(47) నిమగ్నమైంది. శుక్రవారం సాయంత్రం అకాలవర్షం కురవడంతో అప్పుడే కట్టిన ఇంటి డూమ్ నిర్మాణం పాడవకుండా పరదాలు కప్పేపనిలో నిమగ్నమైంది. ఉరుములు, మెరుపులు తీవ్రం కావడంతో ఇంటికి చేరుకుంది. అంతలోనే పనులు ముగించుకుని ఇంటికి చేరుకుంటున్న భర్త ఎర్రన్నాయుడిని గమనించిన లక్ష్మి జాగ్రత్త.. ఉరుములు, పిడుగులు పడుతున్నాయి.. త్వరగా ఇంట్లోకి రమ్మని చేప్పేందుకు బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. అంతే.. పిడుగు పడడంతో ఇంటి ముంగిటే ప్రాణం విడిచింది. కళ్ల ముందే జీవిత భాగస్వామి మరణించడంతో భర్త ఎర్రన్నాయుడు, కుటుంబసభ్యులు సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
సాగునీటి పనులకు ప్రాధాన్యం
గరుగుబిల్లి: జాతీయ ఉపాధిహామీ పథకం పనుల్లో సాగునీటి పనులకు ప్రాధాన్యమిస్తున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. గరుగుబిల్లి మండలం కొంకడివరంలో ఉపాధిహామీ పథకం నిధులతో చేపట్టే చెరువు ఫీడర్ నిర్మాణం పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఉపాధిహామీ వేతనదారులతో మాట్లాడారు. వేతనాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. జిల్లాలో చెరువులను అనుసంధానిస్తూ 120 పనులు మంజూరయ్యాయన్నారు. కొంకడివరంలో బోనివాని చెరువులోకి వచ్చే ఫీడర్ చానల్కు గతంలో గండి కొట్టినచోట రూ.8 లక్షల వ్యయంతో పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అల్లు అప్పలనాయుడు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, జలవనరుల శాఖ ఈఈ ఆర్.అప్పలనాయుడు, ఉదయభాస్కర్, ఎంపీడీఓ జి.పైడితల్లి, తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి పార్వతీపురంటౌన్: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ జిల్లా అధికారులను టెలీకాన్ఫరెన్స్లో ఆదేశించారు. బీట్దిహీట్ శీర్షికన ఈనెల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు మండల స్థాయిలో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండడం, చలి వేంద్రాలను ఏర్పాటుచేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కలెక్టర్ శ్యామ్ప్రసాద్ -
అభివృద్ధి చేతకాక అభాండాలు
శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025ఆ మాటలు గుర్తున్నాయా? ●మున్సిపాలిటీ మొదటి సమావేశంలోనే కలెక్టర్ నుంచి రూ.30 లక్షలు తెప్పించి 15 రోజుల్లో సాలూరు పట్టణ పబ్లిక్ టాయిలెట్స్ను మరమ్మతులు చేయించి మహిళల ఆత్మగౌరవం కాపాడతానని మంత్రి సంధ్యారాణి చెపారు. ఏడాది కావస్తున్నా పనులు మాత్రం జరగలేదని, మంత్రికి ఆ మాటలు గుర్తులేకపోవడం విచారకరమని కౌన్సిల్ సభ్యులు పేర్కొన్నారు. ●పండగ నేపథ్యంలో ఓపెన్ టాయిలెట్స్ కోసం, 80 మంది పారిశుద్ధ్య కార్మికుల ఏర్పాటు, రెండు ట్రాక్టర్లు, చెత్త నిర్వహణ పనులకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు. దీనిని మంత్రి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. ●దండిగాం రోడ్డు వద్ద మంత్రి చేతుల మీదుగా ప్రారంభించిన వాటర్ ట్యాంకు శిలాఫలకంపై మంత్రి పేరు మినహా, మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు పేర్లు రాయించకపోవడం కమిషనర్కు తగదన్నారు. ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎమ్మెల్సీగా సంధ్యారాణి ఉన్నప్పుడు, ప్రోటోకాల్ పాటించలేదని మక్కువ మండలానికి చెందిన దళిత ఎంపీడీఓను సస్పెండ్ చేయించారని గుర్తుచేశారు. ఇప్పుడు కమిషనర్కు ఇది వర్తించదా అని ప్రశ్నించారు. ●గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన రాజన్నదొర పాడేరులో మోదుకొండమ్మ అమ్మవారి పండగకు, శంబర పండగకు లక్షలాది రూపాయలు ప్రభుత్వం నుంచి విడుదల చేయించారని, 15 ఏళ్ల తర్వాత జరిగే శ్యామలాంబ పండగకు మంత్రిగా కొనసాగుతున్న సంధ్యారాణి ఎందుకు గ్రాంటు తెచ్చుకోలేకపోయారని ప్రశ్నించారు. ●శ్యామలాంబ పండగ విజయవంతాన్ని చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, అధికారులకు పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు. తల్లి చల్లని కరుణ పట్టణ ప్రజలందరిపైనా ఉండాలన్నారు. కూటమి నేతలు తమ తప్పులను వైఎస్సార్సీపీ పాలకవర్గంపై నెట్టే కుటిల రాజకీయాలకు అమ్మవారే గట్టిగా బుద్ధిచెబుతారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్లు గిరిరఘు, గొర్లె జగన్మోహన్రావు, సింగారపు ఈశ్వరరావు, సత్యవతి, హరి బాలాజీ, తదితరులు పాల్గొన్నారు. మళ్లీ వచ్చిన ఏనుగులు కొమరాడ: నాగవళి నది ఆవల ఒడిశావైపు సంచరించిన ఏనుగులు గురువారం అర్ధరాత్రి నది దాటి దుగ్గి మీదుగా ఆర్తాం గ్రామ పరిసరాలకు చేరుకున్నాయి. గుణానపురం, దుగ్గి, కళ్లికోట తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి పూట ప్రయాణం చేసేవా రు టేకర్స్ నుంచి ఏనుగుల సంచారం సమచా రం తెలసుకోవాలని సూచించారు. ప్రభుత్వం స్పందించి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. అక్టోబర్ నాటికి గృహనిర్మాణాలు పూర్తి చేయాలి సీతంపేట: గృహనిర్మాణాలను అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్రెడ్డి తెలిపారు. పలు గ్రామాల్లో పీఎం జన్మన్ పథకంలో మంజూరైన ఇళ్ల పనులను శుక్రవారం పరిశీలించారు. పెద్దగూడ, మండ, దీసరిగూడ గ్రామాలను సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. బిల్లులు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నా రు. ఇప్పటి వరకు పూర్తయిన ఇళ్లకు బిల్లులు ఈ నెలాఖరుకు చెల్లించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బీబీ మిశ్రో, హౌసింగ్ ఏఈ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. ఎంఈఓ బదిలీలు చేపట్టాలి పార్వతీపురంటౌన్: రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న ఎంఈఓలకు బదిలీ ప్రక్రియ చేపట్టాలని ఎంఈఓ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం విద్యా శాఖ మంత్రి లోకేశ్కు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు శుక్రవారం లేఖ రూపంలో విన్నవించామన్నా రు. ఎంఈఓలుగా పని చేస్తున్న వారిలో చాలామంది 2017 నుంచి ఒకే ప్రదేశంలో పనిచేస్తు న్నా బదిలీలు నిర్వహించలేదన్నారు. టీచర్ల బదిలీ ప్రక్రియ పూర్తయిన తరువాత ఎంఈఓ లు నూతన ప్రదేశాల్లో చేరేలా ఉత్తర్వులు ఇవ్వా లని లేఖలో కోరినట్టు తెలిపారు. పైడితల్లికి స్వర్ణపుష్పార్చన విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి పైడితల్లికి శుక్రవారం స్వర్ణ పుష్పార్చన చేశారు. వేకువజాము నుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు అచ్యుతశర్మ, శివప్రసాద్ శాస్త్రో క్తంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయ ఇన్చార్జి ఈఓ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. సాలూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయలేక, అభివృద్ధి పనులు చేతకాక కూటమి నేతలు అబద్ధాలు చెబుతూ ప్రతిపక్ష నేతలు, ప్రజాప్రతినిధులపై అభాండాలు వేస్తున్నారని సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, కౌన్సిలర్లు ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సంధ్యారాణి ఎమ్మెల్యేగా గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన సాలూరు మున్సిపాలిటీలో 15 ఏళ్ల తరువాత జరుగుతున్న శ్యామలాంబ అమ్మవారి పండగ కోసం ప్రభుత్వం నుంచి నిధులు సాధించలేకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో 40 మున్సిపాలిటీలకు అప్పు రూపేణా (రీయింబర్స్మెంట్) రూ.2కోట్లు చొప్పు న మంజూరైందని, సాలూరు మున్సిపాలిటీకి మంజూరైన రూ.2కోట్లతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం చేయడం మంత్రికి తగదన్నారు. పండగ ఏర్పాట్లలో అలసత్వంపై భక్తుల నుంచి విమర్శలు వస్తుండడంతో ఆ నిధులను పండగ కోసం వినియోగిస్తున్నారన్నారు. పనుల పేరుతో నిధులు కై ంక్యర్యం చేసేందుకు పలువురు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్న విషయాన్ని పట్టణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ నెల 14న జరి గిన అత్యవసర మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అజెండాలో పెట్టిన అన్ని అంశాలకు నిబంధనల ప్రకారం ఆమోదం తెలిపినట్టు తెలిపారు. ఈ విషయాన్ని మరచి పండగ పనులు అడ్డుకుంటున్నారంటూ మంత్రి సంధ్యారాణి కౌన్సిల్ను విమర్శించడం విచారకరమన్నారు. చైర్పర్సన్పై టీడీపీ మండలాధ్యక్షుడు నిమ్మాది చిట్టి దుర్బాషలాడుతూ దౌర్జనం చేసినా సాటి మహిళగా మంత్రి మందలించకపోవడం బాధాకరమన్నారు. పనుల్లో జాప్యం ఎవరిది? మున్సిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల్లో జాప్యం మంత్రి, కమిషనర్దేనని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. ఏ వార్డుకు ఎంత కేటాయించాలి, ఏ పనులు చేపట్టాలనే అంశంపై మంత్రి సూచించక, అధికారులు పనుల జాబితా తయారుచేసి అజెండాలో పెట్టక పోవడంతో ఆలస్యమైందన్నారు. ఆ నెపాన్ని మున్సిపల్ కౌన్సిల్పై నెట్టే యత్నం శోచనీయమన్నారు. రూ.18 లక్షల ఖర్చుతో చీపుర్లు, బ్లీచింగ్ పౌడర్, ఇతర సామగ్రి కొనుగోలుకు కాంట్రాక్టర్ వానపల్లి శంకరరావు, ఇతరుల పేరున అజెండాలలోనే ఆమోదించాలని ఆర్డర్ వేసినది ఎవరో అందరికీ తెలుసన్నారు. మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం టెండర్లు పిలవకుండా శంకరరావు, ఇతరులకు అప్పగించేందుకు మంత్రి ఆదేశాలను ఆమోదించలేదనే తమపై నిందలు మోపుతున్నారని వాపోయారు. న్యూస్రీల్ కలెక్టర్ శ్యామ్ప్రసాద్ శ్యామలాంబ జాతరకు నిధులు విదల్చని ప్రభుత్వం మంత్రి నిర్లక్ష్యంతో రూ.2కోట్ల అప్పుతో పండగ పనులు! పనుల పేరుతో అప్పుడబ్బును, విరాళాలను దోచుకునే ప్రయత్నాలు మహిళపై దౌర్జనం చేసిన టీడీపీ నాయకుడిని మంత్రి మందలించకపోవడం శోచనీయం మంత్రి తీరుపై మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్ల అసహనం -
తనిఖీలా.. విచారణా?
సాక్షి, పార్వతీపురం మన్యం: వివాదాలతో కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్న పార్వతీపురం పురపాలక సంఘం కార్యాలయాన్ని ఆ శాఖ ఆర్డీ రవీంద్ర శుక్ర వారం సందర్శించారు. సిబ్బంది పనితీరు, వివిధ అంశాలపై సమీక్షించారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఆయన జిల్లాకు వచ్చినట్లు చెబుతున్నప్పటికీ.. ఇటీవల కమిషనర్ తీరు పట్ల వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టారని కార్యా లయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నిక ల కోడ్ తర్వాత పార్వతీపురం పురపాలక సంఘంలో సాధారణ, బడ్జెట్ సమావేశాలు నిర్వహించలే దు. మార్చి 8వ తేదీతో కోడ్ ముగిసినా.. ఎన్నో మార్లు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చైర్ పర్సన్, వైస్ చైర్మన్లు కోరినా కమిషనర్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ సీపీకి చెందిన సభ్యులు దీనిపై పత్రికా ముఖంగా ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు.. అధికారులకూ ఫిర్యాదు చేశా రు. సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల అభివృద్ధి పనులకు ఆమోదం లభించడం లేదని.. కమిషనర్ కూడా తమ పట్ల ప్రోటోకాల్ పాటించడం లేదని తెలిపారు. ఇదే విషయమై శుక్రవారం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆర్డీ రవీంద్రకు కమిషనర్ వెంకటేశ్వర్లు సమక్షంలోనే మరోసారి ఫిర్యాదు చేశారు. తగు చర్యలు తీసుకోవాలని కోరా రు. ఇదే సమయంలో పట్టణంలో నెలకొన్న నీటి ఎద్దడి, ఆక్రమణలు, ఇతర సమస్యలను ఆర్డీ దృష్టికి తీసుకెళ్లిన పలు ప్రజాసంఘాల నాయకులు.. కమిషనర్ తీరుపైనా ఏకరవు పెట్టడం గమనార్హం. అధికార పార్టీ ఎమ్మెల్యేకు తొత్తులా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సాధారణ తనిఖీలే.. ఇదే విషయమై ఆర్డీ వద్ద ప్రస్తావించగా.. నెలవారీ సాధారణ తనిఖీల్లో భాగంగానే వచ్చానని, పలు అంశాలపై సమీక్షించానని వివరించారు. చైర్ పర్స న్, ఇతర సభ్యులు పలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, విచారణ చేపడతామని చెప్పారు. మున్సిపల్ కార్యాలయానికి ఆర్డీ.. కమిషనర్పై ఫిర్యాదు చేసిన పాలకవర్గ సభ్యులు -
డెంగీ పట్ల అప్రమత్తం
ఆందోళన అవసరం లేదుదోమల వృద్ధిని అరికట్టడం ద్వారా డెంగీ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. డెంగీ వ్యాధి పట్ల ఆందోళన అవసరం లేదు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ద్రవపదార్థాలు, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. డాక్టర్ ఎస్.జీవన రాణి, డీఎంహెచ్ఓ ● జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి బారిన పడకుండా ఉండే అవకాశం ● 2024లో 203 కేసుల నమోదు ● ఈఏడాదిలో 23 కేసుల నమోదు ● నేడు డెంగీ నివారణ దినంవిజయనగరం ఫోర్ట్: డెంగీ వ్యాధి పట్ల ఏమాత్రం అలసత్వం వహించినా మృత్యువాత పడే ప్రమాదం ఉంది. తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. శుక్రవారం జాతీయ డెంగీ నివారణ దినం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. గత ఏడాది రెండు వందలకు పైగా డెంగీ కేసులు జిల్లాలో నమోదయ్యాయి. సకాలంలో చికిత్స చేయించుకుంటే కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. డెంగీ లక్షణాలు వైరల్ జ్వరం మాదిరి వచ్చి ఆకస్మాత్తుగా తీవ్రంగా పరిణమిస్తుంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్లనొప్పులతో పాటు ఎముకలు విరిగేటంత నొప్పి కలిగిస్తుంది. ఒక్కోసారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావం జరగడం వల్ల కాళ్లు, చేతులు, ముఖం, వీపు ఉదర భాగాల చర్మంపై ఎర్రగా కందినట్లు చిన్నచిన్న మొటిమలు కనిపిస్తాయి. ఒక్కో సారి ప్లేట్లెట్స్ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా ఉంటుంది. ఈడిస్ ఈజిప్టు అనే దోమకాటు వల్ల డెంగీ వ్యాప్తి చెందుతుంది. దోమ పగటి పూట కుడుతుంది. దోమ కుట్టినప్పుడు ఒళ్లుంతా దద్దుర్లు కనిపిస్తాయి. ఇళ్లలోని కుండీలు, గోలాలు, ఓవర్హెడ్ ట్యాంకుల్లోను, ఎయిర్ కూలర్లు, ఇళ్ల పరిసరాల్లో నిర్లక్ష్యంగా పడేసిన కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ కప్పులు, పగిలిన సీసాలు, టైర్లు వంటి వాటిల్లో చేరిన దోమలు వర్షపు నీటిలో గుడ్లు పెట్టడంతో ఈడిస్ దోమ పెరుగుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంటి పరిసర ప్రాంతాల్లో వృథా నీటిని నిల్వ ఉంచరాదు. పెంటకుప్పులు, ఇంట్లో వచ్చే చెత్తాచెదారం ఇంటికి దూరంగా వేయాలి. ఇళ్లలో ఉన్న అన్ని గదుల్లో దోమల మందు చల్లించాలి. దోమతెరలు వాడడం లేదా ఇంటి కిటీకీల తలుపులకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. నీరు నిల్వ చేసే పాత్రలను ప్రతి వారానికి ఒక సారి ఖాళీ చేసి మళ్లీ నింపుకోవాలి. తాగి వదిలేసిన కొబ్బరి బొండాలు, పాతటైర్లు, ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు, పూలకుండీల్లో నీటిని తరచూ మార్చాలి. నీళ్ల ట్యాంకులపై సరైన మూతలను అమర్చాలి. క్రమంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. దోమ కాటునుంచి రక్షణకోసం శరీరం అంతా కప్పి ఉంచుకునే విధంగా దుస్తులు వేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలను బట్టలు లేకుండా బయట తిరగనీయరాదు. కుళాయి దగ్గర నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలో గల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలి. -
ఈ శ్రమ్కు ఆదరణ కరువు
విజయనగరం గంటస్తంభం: అసంఘటిత రంగంలో కార్మికులు, వలస కార్మికులు, చిరు వ్యాపారులకు భరోసా కల్పించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ ఈ–శ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది. దీంతో కార్మికుల సంక్షేమం కోసం వివిధ సామాజిక భద్రత పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయడానికి వీలవుతుంది. కామన్ సర్వీస్ సెంటర్లలో కార్మికులు ఉచితంగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ పోర్టల్ను ప్రారంభించి ఏడాది గడిచినా..చాలా మంది దరఖాస్తు చేసుకోకపోవడంతో సంక్షేమ పథకాల హక్కులకు దూరమవుతున్నారు. చేకూరే ప్రయోజనాలివి.. అసంఘటిత రంగంలో కార్మికులు ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకుంటే 12 అంకెలు కలిగిన ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేస్తారు. ఈ కార్డులు ఉన్నవారికే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు, సంక్షేమ పథకాలను వర్తింపజేస్తారు. ఇందులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు అంగవైకల్యం చెందితే రూ.ఒక లక్ష బీమాను ఉచితంగా అందజేస్తారు. అసంఘటిత రంగంలో కార్మికుల కోసం ప్రవేశపెట్టే పథకాల్లో నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్య మిస్తారు. వలస కార్మికులు ఎక్కడ ఉన్నారో గుర్తించి ఉపాధి మార్గాలను చూపిస్తారు. కార్మికుడిగా నమోదైతే ప్రభుత్వమే తోడ్పాటు అందిస్తుంది. విపత్తులు సంభవించినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయకారిగా ఉంటుంది. ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవడంలో చాలా మంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కొందరు మాత్రమే సద్వినియోగం చేసుకుంటున్నారు. కొరవడిన అవగాహన.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 10 లక్షల 90వేల మందికి పైగా కార్మికులు ఉండగా..ఇంకా 5 లక్షల పైచిలుకు మంది ఈ–శ్రమ్ నమోదు చేసుకోవాల్సి ఉంది. ప్రారంభంలో అధికారుల అవగాహన కార్యక్రమాలు, కార్మిక సంఘాల నేతల సూచనలతో నమోదు చేసుకునేందుకు కార్మికులు పోటీపడ్డారు. క్రమంగా ఈ–శ్రమ్ పోర్టల్కు ఆదరణ కొరవడుతోంది. సంక్షేమ పథకాల ఫలాలు కార్మికులందరికీ అందేలా కార్మిక సంఘాల నే తలు, అధి కారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు. నమోదు ఉచితం ఈ–శ్రమ్లో వివరాల నమోదుకు అనుసంధానమైన మొబైల్ నంబర్ నామినీ ఆధార్ వివరాలు అవసరం. సమీప గ్రామ, వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ) లేదా కార్మికశాఖ కార్యాలయాల్లో సంప్రదిస్తే ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా అయ్యాక యూఏఎన్ గుర్తింపు కార్డు జారీ అవుతుంది. అసంఘటిత కార్మికులకు అండ నమోదు కాని వారు ఉపాధి వేతనదారులే సామాజిక భద్రత కోసం పోర్టల్ ఏర్పాటు బీమా అందజేయనున్న కేంద్రప్రభుత్వం అర్హులు వీరే.. 16 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉండాలి ఆదాయపు పన్ను పరిధిలోకి రానివారు ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్ఓ), ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్(ఈఎస్ఐ)సదుపాయం లేనివారు ఉద్యానవనాలు, నర్సరీలు, పాడి పరిశ్రమ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు టైలర్లు, డ్రైవర్లు, హెల్పర్లు, వీధి వ్యాపారులు, కల్లుగీత, రిక్షా కార్మికులు, చెత్త ఏరేవారు, కొరియర్ బాయ్లు, ఇళ్ల పనివారు, ఉపాధి వేతనదారులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, మధ్యాహ్న భోజనం వర్కర్లు, లోడింగ్,అన్ లోడింగ్ కార్మికులు, తదితరులందరూ ఈ పఽథకానికి అర్హులు.అవగాహన కల్పిస్తున్నాంఈ–శ్రమ్ పథకంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు ఆరుగురికి ప్రమాద బీమా పరిహారం రూ.2 లక్షలు చొప్పున అందజేశాం. ఒక ఇంటిలో ఎంతమంది ఉన్నా ఈ పథకానికి అర్హులే. – ఎస్డీవీ ప్రసాదరావు, కార్మికశాఖ ఉప కమిషనర్, విజయనగరం జిల్లా -
పనిలో పారదర్శకత, వేగవంతం
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలనలో పారదర్శకత, వేగవంతమైన సేవలందించేందుకు ‘ఈఆఫీస్‘ విధానాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయం ఉద్యోగులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం చేపట్టామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన బిల్డింగ్లో ప్రారంభించిన ఈ శిక్షణను ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ ప్రభుత్వం డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తూ, కార్యాలయం పరిపాలనలో పారదర్శకతను, వేగవంతంగా సేవలందించేందుకు ‘ఈఆఫీసు‘ విధానాన్ని ప్రారంభించిందన్నారు. ఈ ఆఫీస్ విధానంతో అధికంగా పేపర్లు వినియోగించకుండా, వేగవంతంగా సేవలందించే వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ వ్యవస్థ ద్వారా నోట్ఫైల్స్, నిర్ణయాలు, అధికారుల మధ్య సమాచార మార్పిడి పూర్తిస్థాయిలో డిజిటల్ రూపంలోనే జరుగుతాయన్నారు. ‘ఈఆఫీసు‘ విధానం పరిపాలనలో వినియోగం వల్ల కార్యాలయం సిబ్బందికి సౌలభ్యంగా ఉండడమే కాకుండా, ఫైల్స్కు భద్రత పెరుగుతుందని తెలిపారు. కావున, పోలీసు కార్యాలయం సిబ్బంది ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని, నిపుణులను అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలని పోలీసు కార్యాలయ ఉద్యోగులకు ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. ఎంత పనైనా సులువుగా.. కార్యక్రమంలో ఈ ఆఫీసు డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేటిక్ ఆఫీసర్ ఆర్.నరేంద్ర మాట్లాడుతూ ఈఆఫీస్ వినియోగించడం ప్రారంభంలో కొద్దిగా ఇబ్బంది అనిపించినప్పటికీ, భవిష్యత్తులో ఎంత పనినైనా సులువుగా చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ప్రతిరోజూ అరగంట సమయాన్ని ఈఆఫీసు పట్ల అవగాహన కోసం వినియోగిస్తే, సులువుగా నిష్ణాతులు కావచ్చని చెప్పారు. ఈఆఫీసు వినియోగం వల్ల పంపిన ఫైల్స్ ఎవరి వద్ద పెండింగ్లో ఉన్నాయన్న విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చునని నరేంద్ర అన్నారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సామ్యలత, ఏఓ పి.శ్రీనివాసరావు, పర్యవేక్షకులు వెంకటలక్ష్మి, రామకృష్ణ, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, పోలీసు కార్యాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బందికి ఈ ఆఫీస్ శిక్షణ ఎస్పీ వకుల్ జిందల్ -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
వీరఘట్టం: మండలంలోని చిట్టపులివలస, ఎం.రాజపురం గ్రామాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. చిట్టపులివలస గ్రామానికి చెందిన కుప్పిలి పాపారావు(69) బుధవారం సాయంత్రం తన పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే ఎం.రాజపురం గ్రామానికి చెందిన కొప్పర రాము (54) గురువారం తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకుని ఇంటికి వస్తుండగా తెగిపడిన విద్యుత్ వైరును గమనించకపోవడంతో అది కాలికి తగిలి షాక్కు గురై తన ఇంటి ముందరే మృతిచెందాడు. ఈ ప్రమాదాలపై ఫిర్యాదుల మేరకు ఎస్సై జి.కళాధర్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి..రామభద్రపురం: మండలకేంద్రానికి చెందిన వ్యక్తి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక చింతల వీధికి చెందిన చింతల రామినాయుడు(80) కొన్ని నెలలుగా కడుపు నొప్పితో ఇబ్బందులు పడుతున్నాడు. ఆ బాధను తట్టుకోలేక ఈ నెల 7వ తేదీన తన పొలంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం విసయనగరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై వి. ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జంఝావతి రబ్బర్ డ్యామ్ తనిఖీలు
కొమరాడ: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్రెడ్డి ఆదేశాల మేరకు కొమరాడ మండలంలోని జంఝావతి నదిపై నిర్మాణం చేసిన జంఝావతి రబ్బర్ డ్యామ్తో పాటు రిజ్వయిర్ పరిసరాల్లో పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఎస్సై కె.నీలకంఠం ఆధ్వర్యంలో బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎస్సై నీలకంఠం మాట్లాడుతూ దేశ సరిహద్దులో ఏర్పడిన యుద్ధ వాతా వరణం నేపథ్యంలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రిజర్వాయర్ పరిధిలో ఎలాంటి అపరిచిత వ్యక్తులు కనిపించినా స్థానిక పోలీసులకు సమచారం ఇవ్వాలని కోరారు. రబ్బర్ డ్యామ్ పరిసరాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నాయి. -
ని–క్షయ్ మిత్రలుగా ప్రభుత్వ ఉద్యోగుల నమోదు
పార్వతీపురంటౌన్: జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, లయన్స్ క్లబ్ సభ్యులు, ఐఎంఏ సభ్యులు, ఎన్జీఓలు ని–క్షయ్ మిత్రలుగా నమోదు కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పిలుపునిచ్చారు. 100 రోజుల ఇంటెన్సిఫైడ్ టీబీ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ బారిన పడిన వ్యక్తులను దత్తత తీసుకుని, వారికి అవసరమైన పోషకాహార మద్దతుతో పాటు మెరుగైన జీవనం కోసం స్వచ్ఛందంగా ప్రతి నెలా రూ.700లు చొప్పున ఆరు మాసాల పాటు ఇచ్చేందుకు యోచించాలని కోరారు. వీటితో పాటు ప్రభుత్వం ఉచితంగా అందించే మందులను రోగి క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా టీబీని పూర్తిగా అంతమొందించవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే 10 మంది వరకు ప్రభుత్వ వైద్యులు టీబీ బారిన పడిన వ్యక్తులను దత్తత తీసుకుని, వారికి పోషకాహార మద్దతును ఇస్తున్నారని, అదేవిధంగా మిగిలిన ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రధానమంత్రి క్షయ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా జిల్లాలో టీబీని పూర్తిగా అంతమొందించేందుకు 100 రోజుల ఇంటెన్సిఫైడ్ కార్యక్రమాన్ని ఈ నెలాఖరు నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇందుకు స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని, టీబీ బారిన పడిన వ్యక్తులకు పోషకాహారం కోసం విరాళాలు అందించాలనుకున్న వారు జిల్లా లెప్రసీ ఎయిడ్స్, టీబీ అధికారి, ఖాతా నంబర్ 004012010003135, ఐఎఫ్ఎస్సీ కోడ్ 0800406, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బెలగాం మెయిన్ రోడ్, పార్వతీపురం జిల్లా ఖాతాలో జమ చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇతర వివరాల కోసం ఫోన్ 80083 11511 నంబర్ను సంప్రదించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కాన్ఫరెన్న్స్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్.భాస్కరరావు, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా.ఎం.వినోద్ కుమార్, ఇతర వైద్యాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ125 శ్రీ220 శ్రీ230భోగాపురం విద్యార్థికి షైనింగ్స్టార్–2025 ఆవార్డుపూసపాటిరేగ: పదవతరగతిలో అత్యధిక మార్కులు సాధించిన భోగాపురం మోడల్స్కూల్ విద్యార్థి కొయ్య హరీష్కు షైనింగ్ స్టార్స్–2025 అవార్డు వచ్చింది. ఈ ఏడాది పదవతరగతి ఫలితాల్లో హరీష్ 593 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి మోడల్స్కూల్స్లో ప్రథమస్థానంలో నిలిచాడు. దీంతో ఈనెల 20 వతేదీన అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం, మంత్రుల చేతుల మీదుగా షైనింగ్స్టార్ –2025 అవార్డు తీసుకోనున్నాడు. ఈనెల 19 వతేదీన మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్లో విద్యార్ధి తల్లిదండ్రులుతో పాటు రిపోర్టు చేయాలని భోగాపురం మోడల్స్కూల్ ప్రిన్సిపాల్ సి.పార్వతి తెలిపారు.ప్రభుత్వ ఉత్తర్వు 20ని సవరించాలిపార్వతీపురంటౌన్: రాష్ట్ర విద్యాశాఖలో తొమ్మిది రకాల పాఠశాలల ఏర్పాటు ఆశాసీ్త్రయమని, కొత్తగా విడుదల చేసిన ప్రభుత్వ ఉత్వర్వు 20లోని నియమాలు విద్యాహక్కు చట్టం స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయని ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్. బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 117నంబర్ ఉత్తర్వులకన్నా ఈ నిబంధనలు దారుణంగా ఉన్నాయని, ఉపాధ్యాయ సంఘాలతో లెక్కలేనన్ని సమావేశాలు ఏర్పాటు చేసినా వారి సూచనలను వేటినీ పరిగణనలోకి తీసుకోకపోవడం అప్రజాస్వామ్యమన్నారు. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి సహేతుకం కాదన్నారు. ప్రస్తుత ఉత్తర్వులు ఉపాధ్యాయులకు పనిభారాన్ని పెంచాలనే లక్ష్యంతోనే రూపొందించినట్లు అర్ధమవుతోందన్నారు. వీటి ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు కనీసం వారానికి 40 పీరియడ్లకు తక్కువ కాకుండా పనిచేయాల్సి ఉంటుందని, కొంతమంది ఇంకా ఎక్కువ పీరియడ్స్ కూడా పనిచేయవలసి వస్తుందన్నారు. కావున ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉత్వర్వులను సవరించాల్సిందిగా కోరుతున్నామన్నారు. యూపీహెచ్సీల్లో వైద్యసేవలు మెరుగు పరచాలిపార్వతీపురంటౌన్: పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను మెరుగు పర్చాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు ఆ దేశించారు. ఈ మేరకు యూపీహెచ్సీ వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో గురువారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో, క్షేత్రస్థాయి సేవలపై నెలవారీ నివేదికలను పరిశీ లించారు.ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ వివరాలు, ల్యాబ్ పరీక్షలు, మందులు, ఈహెచ్ఆర్ నమోదుపై సమీక్షించారు. కార్యక్రమంలో డీఐఓ నారాయణరావు, జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి.జగన్మోహనరావు, డా పీఎల్.రఘు కుమార్, డీపీఓ లీలారాణి, వైద్యాధికారులు డా.రవిచంద్ర, డా.గణేష్, డా.చాంద్, కార్యాలయం ఏఓ సాల్మన్ రాజ్, సీసీ శ్రీనివాసరావు, ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పిడుగుపాటుకు మూడు ఆవుల మృతి మక్కువ: మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ గిరిశిఖర గ్రామమైన చిలకమండంగి గ్రామంలో గురువారం రాత్రి పిడుగుపడి మూడు ఆవులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన గిరిజన రైతు కొండతామర సోములు ఇంటి ముందు ఉన్న చెట్టు సమీపంలో మూడు పాడి ఆవులను కట్టాడు. భారీ వర్షంతో పాటుగా పిడుగులు పడడంతో ఆవులు మృతి చెందాయి. కుటుంబానికి జీవనాధారమైన ఆవుల మృతితో రైతు సోములు, కుటుంబ సభ్యులు కన్నీరుపెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. -
‘మైనార్టీ’ రుణాలకు ఆహ్వానం
పార్వతీపురంటౌన్: జిల్లాలో మైనారిటీ వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు మంజూ రు చేస్తోందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మైనారిటీ వర్గాలైన ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలకు బ్యాంకు ద్వారా సబ్సిడీతో కూడిన రుణాల మంజూరుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖా స్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. దరఖాస్తుదారుని వయస్సు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలని, ఆదాయం సంవత్సరానికి గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు రూ. 1.5 లక్షలు, పట్టణ ప్రాంత అభ్యర్థులకు రూ. 2లక్షలు ఉండాలని పేర్కొన్నారు. రేషన్కార్డు, ఆధార్కార్డుతో స్థానికంగా ఉన్న మీ సేవ లేదా ఇంటర్నెట్ సెంటర్లో హెచ్టీటీపీఎస్://ఏపీఓబీఎంఎంఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసేటప్పుడు రేషన్కా ర్డు, ఆధార్కార్డు, కమ్యూనిటీ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జత చేయాలని సూచించారు. అర్హత కలిగిన అభ్యర్థులకు స్థానిక మండల, మున్సిపాల్టీలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూకు వచ్చేటప్పు డు దరఖాస్తును ఆయా కార్యాలయాల్లో సమర్పించి హాజరు కావాలని సూచించారు. మరి న్ని వివరాలకు ఫోన్ 08922 230250, 98499 01160, 799508703752 నంబర్లలో సంప్రదించాలని స్పష్టం చేశారు. ఏపీఈసెట్లో ర్యాంకుల పంట విజయనగరం అర్బన్: ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈసెట్–2025 ఫలితాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. పలువురు విద్యార్థులు మొదటి పది ర్యాంకుల్లో నిలిచారు. విజయనగరం పట్టణానికి చెందిన వై.పద్మాకర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ గ్రూప్లో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మెటలర్జి కల్ గ్రూప్లో కొత్తవలస గొల్లలపాలెంకు చెందిన నంబూర్ అభిషేక్ ఫస్ట్ ర్యాంక్, లక్కవరపుకోట మండలం వీరభద్రపేటకు చెందిన యేడువాక తరుణ్కుమార్ 6వ ర్యాంక్ సాధించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ గ్రూప్లో పార్వతీపురం మన్యం జిల్లా వీరఘ ట్టం మండలం నీలానగరానికి చెందిన తుమ్మలపల్లి అమూల్య 8వ ర్యాంక్ సాధించారు. ప్రభుత్వ భూములు కాపాడాలిపాలకొండ రూరల్: మండలంలోని కొండాపురంలో గల ప్రభుత్వ భూములు కబ్జాకు గురవడంతో వాటిని కాపాడాలని అదే గ్రామానికి చెందిన కరణం మురళి ఆమరణ దీక్షకు దిగారు. ఈ మేరకు గురువారం పాలకొండ సబ్ కలెక్టర్ కార్యాలయ సమీపంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మురళి విలేకరులతో మాట్లాడుతూ తమ గ్రామంలో 30 సెంట్ల గ్రామకంఠం, 40 సెంట్ల రుద్రభూమి కొందరు వ్యక్తుల ఆక్రమణలో ఉందని, గడిచిన ఐదు నెలలుగా ఈ ఆంశమై మండల స్థాయి మొదలు రాష్ట్ర సీసీఎల్ఏ వరకూ పలువురు అధికారులకు ఫిర్యాదు చేశామని, ఫలితం లేకపోవడంతో దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. -
ఎస్పీని కలిసిన ప్రొబేషనరీ ఎస్సైలు
పార్వతీపురం రూరల్: జిల్లాకు శిక్షణ నిమిత్తం కేటాయించిన 38మంది ప్రొబేషనరీ ఎస్సైలు గురువారం జిల్లా పోలీస్శాఖ కార్యాలయంలో ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారితో ఎస్పీ వారికి విధి నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. పోలీసు శాఖలో అడుగుపెడుతున్న ప్రొబేషనరీ ఎస్సైలను ముందుగా ఎస్పీ అభినందించారు. క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్స్టేషన్లకు శిక్షణ నిమిత్తం వారికి కేటాయిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, క్రమ శిక్షణగా నిజాయితీతో పారదర్శకంగా జవాబుదారీతనం పాటిస్తూ ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించి పోలీసుశాఖ ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలని కోరారు. కేటాయించిన పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాలను తరచూ సందర్శిస్తూ ముఖ్యంగా ఏఓబీ ప్రాంతాలను సందర్శించి అక్కడి ప్రజలతో మమేకం అవ్వాలని సూచించారు. వారికి సైబర్, నక్సలిజం, మత్తు పదార్థాలు, సారా వల్ల కలిగే దృష్ప్రబావాల గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై అవగాహన అవసరం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పరిధిలో గల పోలీస్ స్టేషన్లలో నిర్వర్తించాల్సిన విధి విధానాలపై ఎస్పీ క్షుణ్ణంగా వారికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా జిల్లాను ఆనుకుని ఉన్న ఏజెన్సీ ప్రాంతాలను తరచూ సందర్శిస్తూ అక్కడి ప్రజలతో సమావేశమై, మమేకమై వారి ద్వారా సరైన సమాచారాన్ని సేకరించి కూంబింగ్ ఆపరేషన్ల గురించి తెలుసుకుని, నిర్వహిచాలని చుట్టుపక్కల ఏజెన్సీ ప్రభావిత ప్రాంతాలలో సంచరించే దళాల గురించి, వారికి సాయం చేసే వారిగుంచి వివరాలు సేకరించాలని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ థామస్ రెడ్డి, ఏఆర్ ఆర్ఐలు నాయుడు, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. -
భద్రమేనా!
సాలూరులో ఒక్కటే నిఘా నేత్రం ●నిత్యం రద్దీగానే ఉంటున్నా... పార్వతీపురం ఆర్టీసీ డిపో నుంచి 103 బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. నిత్యం వేలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడ కేవలం మూడు సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రధానంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రతి ఎక్కువగా ఉంటుంది. నిఘా నేత్రాలు ఉన్నప్పటికీ.. దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా కళాశాలలు వదిలే సమయంలో విద్యార్థులు గంటల కొద్దీ ఇక్కడే తిష్ట వేసి, అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ప్రయాణికుల నుంచి వినిపిస్తున్నాయి. కాలేజీ విద్యార్థులు, విద్యార్థినుల ప్రవర్తన కొన్ని సందర్భాల్లో శ్రుతి మించుతోందని అంటున్నారు. మరోవైపు రద్దీ సమయంలో చిల్లర దొంగలు రెచ్చిపోతున్నారని వాపోతున్నారు. నిఘా మరింత పెంచాలని కోరుతున్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం టౌన్/సాలూరు/పాలకొండ రూరల్: జిల్లాలోని ప్రధాన ఆర్టీసీ కాంప్లెక్సెలన్నీ ఒడిశా రాష్ట్ర సరిహద్దులో ఉన్నవే. నిత్యం వేలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి చోట ప్రయాణికుల భద్రత ప్రశ్నార్ధకంగా మారుతోంది. కొన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ.. వాటి పనితీరు అంతంత మాత్రంగానే ఉంటోంది. మరికొన్ని ప్రాంతాల్లో కెమెరాల జాడే ఉండటం లేదు. ఫలితంగా జేబు దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ రవాణా సైతం జోరుగా సాగుతోంది. బస్సుల్లో, ఆర్టీసీ కాంప్లెక్స్ల వద్ద తనిఖీలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. చాలామంది ప్రయాణికులు బస్సులు ఎక్కాలన్న ఆత్రంతో ఉంటారు. ఇదే సందర్భంలో చిల్లర దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రయాణికుల సెల్ ఫోన్లను, ఇతర విలువైన వస్తువులను తస్కరిస్తున్నారు. పోలీస్ అవుట్ పోస్టు ఉంటున్నా.. సేవలు నామమాత్రంగానే అందుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ●భద్రత డొల్ల.. డివిజన్ కేంద్రం పాలకొండలో 1990వ దశకంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఏర్పాటైంది. దాదాపు 100కు పైగా ప్రాంతాలకు ఇక్కడ నుంచి ఆర్టీసీ సేవలు కొనసాగుతున్నాయి. ఇందులోనే పార్సిల్ సర్వీసులకు సంబంధించిన కార్గో సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. నిత్యం 73 ఆర్టీసీ, మరో 22 హయ్యర్ బస్సుల ద్వారా వేలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సగటున రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల మేర రోజువారీ ఆదాయం లభిస్తున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. ప్రయాణికుల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. తరచూ కాంప్లెక్స్లో జేబుదొంగ లు, అగంతకులు చోరీలకు పాల్పడుతున్నారు. దీనిపై కేసులు కూడా నమోదైన ఘటనలు ఉన్నా యి. దీనికి తోడు రాత్రి సమయాల్లో అల్లరి మూక లు, మందుబాబులు కాంప్లెక్స్ను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. ప్రయా ణికులను బస్సులు ఎక్కించే ఈ ప్రాంతంలో భద్రత డొల్లతనం ఎప్పటికప్పుడే బయటపడుతోంది. ఇది వరకే ఏర్పాటు చేసిన సీసీ కెమెరా వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది. రెండు రోజుల కిందట మరలా ఇక్కడ సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నప్పటికీ పూర్తిస్థాయి పనులు ఇంకా చేపట్టలేదు. ఒడిశాకు సరిహద్దున ఉన్న సాలూరు డిపో నుంచి నిత్యం 70 బస్సులు తిరుగుతుండగా.. సుమారు 15 వేల మంది ప్రయాణికులు రోజూ గమ్యస్థానం చేరుకుంటున్నారు. ఒడిశాకు కూత వేటు దూరంలో ఉన్నప్పటికీ.. బస్టాండులో భద్రత చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క సీసీ కెమెరా అందుబాటులో ఉంది. సాలూరు, పాచిపెంట ప్రాంతాల మీదుగా గంజాయి, నాటు సారా రవాణా పెద్ద ఎత్తున అక్రమంగా సాగుతోంది. బస్సుల్లోనూ గంజాయి తరలిపోతున్న ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ఇటువంటి చోట నిఘానేత్రాలు లేకపోవడం గమనార్హం. దీనికి తోడు చీకటి పడితే కాంప్లెక్స్ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారుతుంది. ఈ సమయంలో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూనే ఉంటున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణాల్లో భద్రత ఎంత? చీకటి పడితే అసాంఘిక కార్యకలాపాలు.. అరకొరగా సీసీ కెమెరాల పనితీరు -
జీఓ నంబర్ 3ను రద్దుచేయాలి
● షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన ఉపాధ్యాయులనే నియమించాలి ● ఐటీడీఏ ఎదుట నిరాహార దీక్షపార్వతీపురం: గిరిజన నిరుద్యోగ యువతకు హాని కలిగించే జీఓ నంబర్ 3ను రద్దుచేసి దాని స్థానంలో కొత్త జీఓను విడుదల చేసి అమలు చేయాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో గిరిజన యువత రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ మేరకు గురువారం ఏపీ ఆదివాసీ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపుతో పార్వతీపురంలోని ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రిలే నిరాహారదీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా ఏజేఏసీ నాయకులు టి.జయన్న, ఎం.అమర్నాఽథ్, వై.సూర్యనారాయణ, డి.సీతారాంలు మాట్లాడుతూ 2025 మెగా డీఎస్సీలో ప్రకటించిన ఐటీడీఏ పరిధిలోని ఉపాధ్యాయ పోస్టులను మినహాయించి ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఆదివాసులనే నియమించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ నిరక్ష్యరాస్యత దృష్ట్యా షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజన ఉపాధ్యాయులనే నియమించాలనే చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని కోరారు. ఏపీ గిరిజన సలహా మండలిలో ఏడుగురు ఎస్టీ ఎమ్మెల్యేలను నియమించడంతో పాటు మిగిలిన ఎస్టీ ఎమ్మెల్యేలను కూడా కమిటీలో నియమించి జీఓ నంబర్ 3ను రద్దుచేసి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజన యువతను ఉపాధ్యాయులుగా నియమించేలా కొత్త జీఓను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గిరిజన యువతకు న్యాయం చేయకపోతే పోరాటం మరింత ఉధృతం చేయనున్నామని హెచ్చరించారు. ఈ దీక్షలో ఐ.రామకృష్ణ, ఎ.చంద్రశేఖర్, కె. గౌరమ్మ, పి. రంజిత్కుమార్, యు.మల్లయ్య, సురేష్, నాగభూషణంతో పాటు నిరుద్యోగ యువత పాల్గొన్నారు. -
అనంత లోకాలకు
నవ్వూతూ.. నృత్యం చేస్తూ.. పాలకొండ రూరల్: అప్పటివరకూ పెళ్లింట సందడి చేస్తూ..సహచరులతో కలిసి సంతోషంగా గడుపుతూ..స్నేహితులు, బంధువులతో కలిసి నృత్యాలు చేస్తూ కుప్పకూలిపోయిన ఓ వ్యక్తి అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో అంతవరకూ ఎంతో సందడిగా ఉన్న ఆ ప్రాంగణంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పాలకొండ మండలంలోని భాసూరు గ్రామంలో బుధవారం ఓ ఇంట వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాత్రి సయమంలో సౌండ్ బాక్సుల్లో పాటలకు అక్కడి వారు నృత్యాలు చేస్తున్నారు. వారితో కలిసి అడుగులో అడుగు కలిపిన గ్రామానికి చెందిన సుంకరి బంగారునాయుడు(40) సంతోషంగా డ్యాన్స్ చేశాడు. సహచరులను తనతోపాటు ఉత్సాహపరుస్తూ నృత్యంలో నిమగ్నమయ్యాడు. అంతలోనే ఒక్కసారిగా ముందుకు తూలి పడి కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో తెలియక సహచరులు డ్యాన్సులు చేస్తూ బంగారునాయుడిని గమనించారు. ఆయనకు తక్షణ సపర్యలు అందించినా చలనం లేకపోవడంతో కంగారుపడి హుటాహుటిన పాలకొండ ఆస్పత్రికి ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో మృతుని బంధువులు గుండెలవిసేలా రోదించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన బంగారునాయుడు జీవనోపాధిలో భాగంగా పెయింటర్గా పనిచేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య నాగమణితో పాటు ఇద్దరు అమ్మాయిలు, వృద్ధులైన తల్లిదండ్రులు చిన లక్ష్ముంనాయుడు, పార్వతి ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన బంగారునాయుడి మరణంతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో కలివిడిగా ఉండే బంగారునాయుడి అంత్యక్రియలకు గురువారం గ్రామస్తులంతా హాజరై తమ సంతాపం తెలిపారు. -
జిల్లాలో 16 టైలరింగ్ శిక్షణ కేంద్రాలు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 16 టైలరింగ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన జిల్లా, మండల అధికారుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్కో కేంద్రంలో 144 మందికి శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు. శిక్షణ 90 రోజుల పాటు ఉంటుందని, శిక్షణ అనంతరం సర్టిఫికెట్, కుట్టు మిషన్ అందించనున్నామన్నారు. ఎంపీడీఓలు శిక్షణ కేంద్రాలను తనిఖీ చేసి శిక్షణ ఇస్తున్న తీరును పరిశీలించాలని ఆదేశించారు. సీసీఆర్సీ కార్టులు డ్రైవ్ మోడ్లో చేయాలి సీసీఆర్సీ కార్డులు డ్రైవ్ మోడ్లో చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నుంచి కూడా రుణాలు పొందవచ్చని తెలిపారు. రైతు ఆధార్ కోసం జనన ధ్రువీకరణ పత్రాలు అవసరమైన పిల్లలకు వారి తల్లిదండ్రుల ద్వారా వెంటనే దరఖాస్తు చేయించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్ శోభిక, ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీ వాస్తవ, పాలకొండ సబ్ కలెక్టర్, సీతంపేట ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి , డీఆర్ఓ హేమలత, కేఆర్సీసీ ఎస్డీసీ పి.ధర్మచంద్రా రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పీఎం జన్మాన్ ప్రాధాన్యత పీఎం జన్మాన్ ప్రాధాన్యత గల కార్యక్రమమని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన జిల్లా, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఎం జన్మాన్ కార్యక్రమం కింద జిల్లాలో 5,853 గృహాలను గిరిజనులకు మంజూరు చేసినట్లు చెప్పారు. వాటిలో ఇంకా 2967 గృహాల నిర్మాణం ప్రారంభం కాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. వారం రోజుల్లో ప్రారంభం కావాలని ఆదేశించారు. లక్ష్య సాధన దిశగా అధికారులు కృషి చేయాలి జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో నిర్దేశించిన లక్ష్య సాధన దిశగా అధికారులు కృిషి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ప్రాథమిక రంగాల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రాథమిక రంగాల వృద్ధిపై కలెక్టర్ వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏటా 15 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఏటా 2.20 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉండే పాల దిగుబడి ఈ ఏడాది మరింత పెరిగేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. జిల్లాలో మత్స్యసంపద మరింత పెరగాల్సి ఉందని, మార్చి 2026 నాటికి 150 లక్షల ప్లింగరింగ్ ఫిష్ లక్ష్యం కావాలని, అందుకు అందుబాటులో ఉన్న ట్యాంకులను వినియోగించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పట్టు, పశుసంవర్థక శాఖల అధికారులు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు ఎనిమిది గొర్రెల మృతి
నెల్లిమర్ల రూరల్: మండలంలోని పెద్ద బూరాడపేట సమీపంలో సోమవారం మధ్యాహ్నం పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు గ్రామానికి చెందిన డొప్ప త్రినాఽథ్ అనే రైతుకు చెందిన ఎనిమిది గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సమీప పొలాల్లో గొర్రెలు మేత మేస్తుండగా ఆకస్మాత్తుగా పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. గొర్రెలు మేత మేస్తున్న సమయంలో పిడుగు పడడంతో ఎనిమిది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు రూ.80వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు త్రినాఽథ్ వాపోయాడు. రైతును వెంటాడుతున్న దురదృష్టంబూరాడపేటకు చెందిన రైతు డొప్ప త్రినాఽథ్ను దురదృష్టం వెంటాడుతోంది. సుమారు ఐదు నెలల క్రితం ఖరీఫ్ సీజన్లో కురిసిన వర్షానికి పొలంలో రాలిన ధాన్యం గింజలను మేయడంతో సుమారు 100కు పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ధాన్యాన్ని జీర్ణించుకోలేకపోవడంతో గొర్రెలు మృతి చెందాయి. అప్పట్లో సుమారు రూ.10లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. ఆ బాధ నుంచి తేరుకోకుండానే మళ్లీ పిడుగు రూపంలో ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి. దీంతో బాధిత కుటుంబసభ్యులు తీవ్రంగా రోదించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. -
పోలీస్ కస్టడీలో గంజాయి డాన్..!
రామభద్రపురం: గంజాయి అక్రమరవాణా చేస్తున్న వ్యక్తులపై సీఐ కె నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ డాన్గా పేరున్న వ్యక్తి, కొట్టక్కి పోలీస్ చెక్ పోస్టు వద్ద కారులో అక్రమంగా గంజాయి తరలింపునకు కారకుడైన ప్రధాన నిందితుడు రామభద్రపురం పోలీసుల కస్టడీలో ఉన్నట్లు తెలిసింది. ఈ నిందితుడు గంజాయి అక్రమరవాణాలో పట్టుబడడంతో రామభద్రపురంతో పాటు ఎస్కోట, సాలూరు, కొత్తవలస, పాచిపెంట తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సమాచారం ఉంది.అయితే విశాఖ సెట్రల్ జైల్లో ఉన్న ప్రధాన నిందితుడిని హుకుంపేట పోలీస్స్టేషన్కు తరలించి అక్కడి నుంచి పీపీ వారెంట్పై రామభద్రపురం పోలీస్ కస్టడీకి తీసుకొచ్చి పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రథమ నిందితుడు అనంతగిరి చెందిన వ్యక్తిగా తెలిసింది. కొట్టక్కి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టులో ఫిబ్రవరి 10 వతేదీ రాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో వాహనాలు చెక్ చేస్తున్నారు. ఇంతలో వాహనాల వెనుకన ఒడిశా నుంచి అక్రమంగా ఒడిశా నుంచి 150 కిలోల గంజాయిని తరలిస్తున్న డస్టర్ కారు డ్రైవర్ కారును జాతీయ రహదారి పక్కన చిన్న రూట్లో తప్పించి స్పీడ్గా లాగించేశాడు. దీంతో అప్రమత్తమైన ఏఎస్సై అప్పారావు, పోలీస్ సిబ్బంది వెంటాడారు. సరిగ్గా కొట్టక్కి దుర్గమ్మ గుడి వద్దకు వెళ్లేసరికి సరిగా దారి కనిపించకపోవడంతో కారు వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. ఈ నేపథ్యంలో కారును, అందులో ఉన్న 150 కిలోల గంజాయి(74 ప్యాకెట్లు)ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులు ఉన్నట్లు విచారణలో తేలగా ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. వివరాలు సేకరిస్తున్న పోలీసులు -
వెటర్నరీ కళాశాలలో వీసీఐ బృందం పర్యవేక్షణ
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాలలో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(వీసీఐ) బృందం సభ్యులు బుధవారం పర్యవేక్షించారు. గుజరాత్ రాష్ట్రంలోని కామధేను యూనివర్సిటీ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ డా.పి.యమ్.లునగారియా, ఒడిశా వెటర్నరీ కళాశాల నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ డా.అంబికాప్రసాద్ కె.మహాపాత్ర, మహారాష్ట్ర వెటర్నరీ కళాశాల నుంచి డా.ప్రతిభా జండేతో కూడిన బృందం కళాశాలను సందర్శించింది. ఈ సందర్శనలో భాగంగా కళాశాలలో నిర్మించిన భవన సముదాయాన్ని బృందంసభ్యులు పర్యవేక్షించారు. విద్యార్థులకు సరిపడా తరగతి భవనాలు సక్రమంగా అందుబాటులో ఉన్నదీ లేనిదీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ భవనాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు సక్రమంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించారు. కళాశాలలో మరో రెండు రోజుల పాటు పర్యవేక్షణ చేయనున్నారు. పర్యవేక్షణలో కళాశాల అసోసియేట్ డీన్ మక్కేన శ్రీను పాల్గొన్నారు. డీఈఓకు ఎస్టీయూ జిల్లా కమిటీ వినతివిజయనగరం అర్బన్: ప్రభుత్వం తాజాగా ప్రకటించిన టీచర్ల బదిలీ ప్రక్రియలోని అసంబద్ధ నిబంధనలను సడలించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు బుధవారం డీఈఓ యూ.మాణిక్యంనాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. 2021, 2023వ సంవత్సరంలో రేషనలైజేషన్కు గురైన పీఎస్హెచ్ఎంలకు 2021వ సంవత్సరం ముందు పనిచేసిన ‘ఓల్డ్ స్టేషన్ పాయింట్’ను మంజూరు చేయాలని కోరారు. గత నెల 24, 25, 26 తేదీన వైద్య ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు హాజరుకాలేకపోయిన ఉపాధ్యాయులకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. టిస్లో ఉన్న తప్పుల సవరణకు ఎంఈఓలకు అవకాశం కల్పించాలని సూచించారు. ప్రిఫరెన్స్ కేటగిరి ఉన్న ఉపాధ్యాయులకు వారికి ఇష్టమైన మోడల్ ప్రైమరీ పాఠశాలకు వెళ్లే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మోడల్ ప్రైమరీ పాఠశాలల హెచ్ఎంగా ఎస్జీటీలకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. డీఈఓను కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు కె.జోగారావు, ప్రధాన కార్యదర్శి చిప్పాడ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. శుభం చిత్రయూనిట్ సందడివిజయనగరం టౌన్: ప్రముఖ హీరోయిన్ సమంత నిర్మించిన శుభం చిత్రయూనిట్ విజయనగరంలో బుధవారం సందడి చేసింది. ఈ మేరకు స్థానిక సప్తగిరి మల్టీప్లెక్స్లో సెకెండ్ షోలో ప్రేక్షకులను సినీ హీరోలు, హీరోయిన్లు షాలిని, షరియా, హర్షిత్, చరణ్, శార్వాణి, శ్రీనివాస్లు అలరించారు. దర్శకుడు కె.ప్రవీణ్, హాస్యనటుడు వంశీ ఇతర నటులు సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగరం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. జిల్లావాసుల ఆదరణ ఎనలేనిదన్నారు. తమ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమంత తన సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటుచేసి తమలాంటి వారికి అవకాశమిచ్చి బాగా ప్రోత్సహించారన్నారు. సినిమా మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకుని తీశారన్నారు. ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పడం మర్చిపోలేని అనుభూతి ఇచ్చిందన్నారు. త్వరలోనే మరిన్ని చిత్రాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటామన్నారు. కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ నాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
సుఖీభవ లేక.. దుఃఖం దిగమింగలేక..!
సుఖీభవ సాయం తక్షణమే వేయాలిఖరీఫ్ సీజన్ మరో 15 రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో అన్నదాత సుఖీభవ సాయం తక్షణమే రైతుల అకౌంట్లలో జమచేయాలి. గతంలో మాదిరి సాగు పెట్టుబడికి సాయం అందజేయాలి. రైతుల ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పందించాలి. సీహెచ్.అప్పలనాయుడు, రైతు రెల్లివలస● డోలాయమానంలో అన్నదాతలు ● పథకం మంజూరుకు పూర్తికాని వెరిఫికేషన్ ● మరో 15 రోజుల్లో ఖరీఫ్సాగు ప్రారంభం ● సాగుకు అప్పుకోసం రైతన్న వెతుకులాట పూసపాటిరేగ: రైతు సంక్షేమానికి పెద్దపీటవేస్తామని హామీలు గుప్పించిన కూటమి ప్రభుత్వం ఏడాదవుతున్నా ఇచ్చిన హామీని నెలబెట్టుకోవడంలో విఫలమమైంది. కేంద్రం నుంచి మంజూరు కావాల్సిన పీఎం కిసాన్ నిధులు రైతుల అకౌంట్లలో ఇప్పటికే జమకాగా, రాష్ట్రం నుంచి అందజేయాల్సిన అన్నదాత సుఖీభవ మంజూరుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ పథకంలో ప్రతి రైతుకు రూ.20 వేలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు. రెవెన్యూ రికార్డుల ప్రకారం జిల్లాలో 4,85,158 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 1,42,222 మంది రైతుల రికార్డులు మాత్రమే తనిఖీ అయ్యాయి. ఇంకా 3,42,936 మంది రికార్డుల వెరిఫికేషన్ పూర్తి చేసిన తరువాత వ్యవసాయ అధికారి లాగిన్లో వెరిఫికేషన్ పూర్తి చేశాక తుది జాబితా సిద్ధం కానుంది. ఈనెల 20 వతేదీ లోపు రికార్డుల వెరిఫికేషన్ పూర్తి చేయడానికి గడువు ఇచ్చినట్లు సమాచారం. రబీ సీజన్ దాదాపు పూర్తవడంతోమరో 15 రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటికే చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. ఈసమయానికి గతంలో రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో జమఅయ్యేవి. నేటి పరిస్థితి చూస్తే భిన్నంగా ఉంది. అన్నదాత సుఖీభవ కోసం జిల్లాలోని రైతులు ఎదురు చూస్తున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లు వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే మార్గదర్శకాలను అనుసరించి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసి రైతులకు అవసరమైన పెట్టుబడి సాయం అకౌంట్లలో జమచేసి, ఎరువులు, విత్తనాలు రైతులకు రైతుభరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉండేవి. వీటితో పాటు వైఎస్సార్ పంటల బీమా, పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందించే వారని, నేడు ఆ పరిస్థితి లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయం ఎప్పుడు వేస్తారు..? ప్రతి ఏడాది మే నెలలో వేయాల్సిన పెట్టుబడి సాయం రైతులకు ఎప్పడు వేస్తారు? అధికారంలోకి వచ్చి 11 నెలలవుతున్నా రైతులను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. పెట్టుబడి సాయం కోసం ఇంకా వెరిఫికేషన్లు పూర్తికాని పరిస్థితి. అధికారులు సర్వేలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించి అన్నదాత సుఖీభవ ఖరీఫ్ సీజన్కు ముందే అందేవిధంగా చర్యలు తీసుకోవాలి. కోరాడ వెంకటరమణ, రైతు పూసపాటిరేగ -
ప్రతి నెలా అనీమియా కమిటీ సమావేశం
పార్వతీపురం టౌన్: జిల్లాలోని ప్రతి సచివాలయం పరిధిలో అనీమియా యాక్షన్ కమిటీ సమావేశాన్ని ఇకపై ప్రతి నెలా మొదటి బుధవారం నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులకు స్పష్టం చేశారు. కమిటీ సమావేశంలో తీసుకున్న చర్యలు, తద్వారా వచ్చిన ఫలితాలపై ఇక నుంచి సమీక్షిస్తానని తేల్చిచెప్పారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఇతర జిల్లా అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. జిల్లాలో కొత్తగా నిర్మించి అసంపూర్తిగా ఉన్న సీహెచ్సీలు, పీహెచ్సీలు, బీహెచ్పీయులను వినియోగంలోకి తీసుకురావాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ప్రధానంగా సీతానగరం, మామిడిపల్లి, శంబర పీహెచ్సీలో పనులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని, మిగిలిన భవనాలను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. చిన్న చిన్న పనులు జరగక భవనాలు నిరుపయోగంగా ఉండడం సబబు కాదని, ప్రభుత్వం తప్పక నిధులు విడుదల చేస్తుందనే భరోసా కల్పించి ఆయా కాంట్రాక్టర్లతో పనులు త్వరగా చేయించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో మలేరియా కేసులు ఉండకూడదు జిల్లాలో మలేరియా కేసులు ఉండడానికి వీల్లేదని, పోలియో, ఎయిడ్స్ మాదిరిగా ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించి మలేరియా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం గ్రామ, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మండల స్థాయి కమిటీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి మలేరియా కేసులు లేకుండా చూడాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి వారం తాగునీటి ట్యాంకులను పరిశీలించాలని, ప్రతి శుక్రవారం డ్రైడే కచ్చితంగా పాటించాలని కలెక్టర్ అన్నారు. రోగుల పట్ల వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్.భాస్కరరావు, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా.ఎం.వినోద్ కుమార్, జిల్లా ప్రోగ్రాం అధికారి డా.టి.జగన్మోహనరావు, డీసీహెచ్ఎస్ డా.బి.వాగ్దేవి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు డా.కె.విజయపార్వతి, డా.పద్మావతి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ కె.చలపతిరావు, యూపీహెచ్సీ, పీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల వైద్యాధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
ఈశ్వరమ్మ కంటకన్నీరు
సాలూరు: మున్సిపాలిటీ మీ తాతగారిదా? మేము అధికార పార్టీలో ఉన్నాం అంటూ వయస్సు పైబడిన మహిళా మున్సిపల్ చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మపై టీడీపీ పట్టణాధ్యక్షుడు నిమ్మాది చిట్టి ఆగ్రహంతో ఊగిపోయాడు, బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం పూర్తయిన తరువాత, మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న వార్డుల్లో నీటి సరఫరా కోసం నూతనంగా ఏర్పాటుచేసిన ట్రాక్టర్ వాటర్ట్యాంకర్ను చైర్పర్సన్, కౌన్సిలర్లు, అధికారులు ప్రారంభించారు. అక్కడి నుంచి ఆమె వస్తున్న సమయంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు నిమ్మాది చిట్టి పండగ పనులపై ఆరోపణలు చేస్తూ చైర్పర్సన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ మీ తాతగారిదా? మేము అధికార పార్టీలో ఉన్నాం అంటూ కనీసం ఆమె వయస్సుకు విలువ ఇవ్వకుండా విరుచుకుపడ్డాడు, టీడీపీ పట్టణాధ్యక్షుడితో పాటు పలువురు టీడీపీ నాయకులు ఆమైపె విరుచుకుపడడంతో శ్యామలాంబ తల్లి అంతా చూస్తుందని, ఎవరు తప్పు చేస్తే వారికి ఆ పాపం తగులుతుందని అంటూ చైర్పర్సన్ కంటనీరు పెట్టుకుంటూ చీర కొంగుతో తుడుచుకుంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ విషయం గుర్తించిన మున్సిపల్ వైస్ చైర్మన్ సంఘటనా స్థలానికి వచ్చి చైర్పర్సన్పై ఇలా మాట్లాడడం సమంజసం కాదని, పండగ పనుల నేపథ్యంలో అధికారులు అజెండాలో పెట్టిన అన్ని అంశాలను కౌన్సిల్లో ఆమోదించామని తామెప్పుడూ పండగ పనులకు ఎటువంటి అడ్డంకులు సృష్టించలేదని, సహకరించామన్నారు. టీడీపీ కూటమి పెద్దలు ఈ పండగకు ప్రత్యేక గ్రాంట్లు తెస్తామని హామీలు ఇచ్చి తేలేక, చివరకు అప్పు (రియింబర్స్మెంట్)గా వచ్చిన రూ.2 కోట్లతో పండగ ముందు పనులు చేయించుకోలేక వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి రాజకీయాలకు దిగుతున్నారంటూ పలువురు పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. -
శ్యామలాంబ జాతరను విజయవంతం చేయాలి
● అధికారులను ఆదేశించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం టౌన్: సాలూరులో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న శ్యామలాంబ అమ్మవారి జాతరను విజయవంతం చేసేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ స్పష్టం చేశారు. జాతర నిర్వహణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో బుధవారం మాట్లాడారు. 15 ఏళ్ల తరువాత జరుగుతున్న అమ్మవారి జాతరకు భక్తులు పెద్దఎత్తున హాజరయ్యే అవకాశం ఉందన్నారు. జాతర జరిగే మూడు రోజులూ ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతరకు విచ్చేసే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పన ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ●జాతర జరిగే నాలుగు రోజుల్లో నాలుగు జిల్లాలకు చెందిన 1240 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు కలెక్టర్కు వివరించారు. ●సిరిమాను తిరిగే ప్రాంతాలతో పాటు అన్ని ముఖ్య ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తుతో పా టు 30 రోప్ పార్టీలను సంసిద్ధం చేయాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భక్తులందరూ ఒకే ప్రాంతంలో గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సాలూరు పట్టణ రహదారుల్లో గుర్తించిన 22 పాట్ హోల్స్ను తక్షణమే పూడ్చివేయాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. ●విద్యుత్ లోఓల్టేజీ సమస్య తలెత్తకుండా అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేశామని, సిరిమాను తిరిగే సమయంలో విద్యుత్ను నిలిపివేస్తున్నామని, ఆ సమయంలో విద్యుత్కు అంతరాయం కలగకుండా కమిటీ సహకారంతో జనరేటర్లను ఏర్పాటుచేయనున్నట్లు ఎస్ఈ కలెక్టర్కు వివరించారు. ●14 వైద్య బృందాల ద్వారా 378 మంది వైద్య సిబ్బంది జాతర ముగిసే వరకు నిత్యం సేవలు అందించాలని, అంబులెన్సులు, మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశా రు. దేవాలయానికి అలంకరణ, క్యూలైన్లు, భక్తుల కు, చిన్నారులకు తాగునీరు, పాలు, మజ్జిగ వంటి ఏర్పాట్లతో పాటు మరుగుదొడ్ల సదుపాయం కల్పించాలని ఆలయ ఈఓను ఆదేశించారు. అధికారులందరూ వారికి అప్పగించిన విధులను బాధ్యతగా నిర్వర్తించి జాతరను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జేసీ ఎస్.ఎస్.శోభిక, ఎస్డీసీ డా.పి.ధర్మ చంద్రారెడ్ది, ఆలయ ఈఓ టి.రమేష్, మండల ప్రత్యేక అధికారి శివన్నరాయణ, మున్సిప ల్ కమిషనర్ డి.టి.వి.కష్ణారావు, మండల తహసీల్దార్ ఎన్.వి.రమణ, ఎంపీడీఓ జి.పార్వతి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ కె.చలపతిరావు, డీపీఓ టి.కొండలరావు, జిల్లా ఎకై ్సజ్ అధికారి ఎం.రవిప్రసాద్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి బి.చంద్రశేఖర్, జిల్లా విపత్తు ల స్పందన అధికారి కె.శ్రీనుబాబు, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు. -
నిబద్ధతతో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర
పార్వతీపురం టౌన్: జిల్లాలో ఈ నెల 17న చేపట్టనున్న స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిబద్ధతతో చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రలో జిల్లాను ముందంజలో నిల పాలని సూచించారు. జిల్లాలో 80 పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు వెల్లడించారు. 248 మలేరియా ప్రభావిత గ్రామాలుగా గుర్తించి 50 వేల మందికి రక్త పరీక్షలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో హేమలత, డీపీఓ పి.వీరరాజు, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోక్సో కేసు నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విజయనగరం క్రైమ్: జిల్లాలో మూడేళ్ల కిందట నమోదైన పోక్సో కేసులో 72 ఏళ్ల వృద్ధుడు కింతాడ అంజిబాబుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తూ మహిళా, పోక్సో కో ర్టు జడ్జి నాగమణి తీర్పు ఇచ్చినట్టు ఎస్పీ వకు ల్ జిందల్ బుధవారం తెలిపారు. 2023లో ఇంటి మేడపై ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను అంజిబాబు లైంగికంగా వేధించినట్టు చిన్నారి తల్లి అప్పటి దిశ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ లక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు. కోర్టుకు అభియోగపత్రాలు దాఖలు చేశారు. మహిళా స్టేషన్ డీఎస్పీ గోవిందరావు సాక్షలను కోర్టులో ప్రవేశ పెట్టారు. నేరం నిరూపణ కావడంతో జడ్జి నాగమణి తీర్పు వెలువ రించినట్టు ఎస్పీ తెలిపారు. పోలిపల్లి పైడితల్లి హుండీల ఆదాయం రూ.3.24 లక్షలు రాజాం సిటీ: బొబ్బిలి రోడ్డులోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి హుండీల ఆదాయం బుధవారం లెక్కించారు. రెండు నెలలకు గాను రూ.3,24,800లు ఆదాయం వచ్చినట్టు ఈఓ బీవీ మాధవరావు తెలిపారు. కార్యక్రమంలో చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఈఓ శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్త వాకచర్ల దుర్గాప్రసాద్, సిబ్బంది, పర్యవేక్షకులు పాల్గొన్నారు. కియోస్క్లపై కూటమి నిర్లక్ష్యం విజయనగరం ఫోర్ట్: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి సచివాలయంలో రైతులకు సేవలందించిన కియోస్క్ యంత్రాలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యంత్రాల కోసం ఇండెంట్ పెట్టేందుకు ఉపయోగపడే యంత్రాలు ఇప్పుడు వినియోగంలేక మూలకు చేరుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రైతుసేవా కేంద్రాల్లో ఉన్న 505 కియోస్క్ యంత్రాల్లో 125 మరమ్మతులకు గురైనా పట్టించుకునేవారే కరువయ్యారు. ఇదే విషయాన్ని జిల్లా వ్యవసాయాధికారి వి.తారకరామారావు వద్ద ప్రస్తావించగా రైతు సేవా కేంద్రాల్లో పాడైన కియోస్క్ల విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. బాగుచేయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉష్ణతాపం నుంచి ఉపశమనం కల్పిద్దాం విజయనగరం అర్బన్: వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 17వ తేదీ మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఉష్ణతాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మండల, జిల్లా అధికారులను ఆదేశించారు. వచ్చేనెల రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో వేసవి నుంచి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల మూడో శనివారం ‘బీట్ ద హీట్’ పేరుతో స్వచ్ఛాంద్ర కార్యక్రమం నిర్వహించాలన్నారు. జన సమూహాలు ఉండే ప్రదేశాల్లో తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, సీపీఓ పి.బాలాజీ, జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, పంచాయతీ అధికారి టి.వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ పి.నల్లనయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పాలిసెట్లో ప్రతిభ
విజయనగరం అర్బన్: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో ఉమ్మడి విజయనగరం జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. అధికమంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష రాసిన 8,097 మందిలో 7,705 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో విజయనగరం జిల్లాలో 6,938 మందిలో 95.36 శాతంతో 6,616 మంది, పార్వతీపురం మన్యంలో 1,159 మందిలో 93.96 శాతంతో 1,089 మంది ఉత్తీర్ణలయ్యారు. విజయనగరం జిల్లాలో బాలికలు 97.44 శాతం, బాలురు 93.9 శాతం, మన్యంలో బాలికలు 96.59 శాతం, బాలురు 92.35 శాతం పాసయ్యారు. 117 మార్కులు సాధించిన షేట్ అబ్దుల్ ముజీర్, చిల్లా పూర్ణ సంజయ్, మండల వాగ్దేవిలు విజయనగరం జిల్లా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి ర్యాంకర్లగా నమోదయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 113 మార్కులతో పప్పల చక్రి (ప్రథమ), 112 మార్కులతో పొడుగు యోగిభద్రినాథ్ (ద్వితీయ), 111 మార్కులతో ఇప్పిలి వెంకటరమణ తృతీయ స్థానంలో నిలచారు. వంద మార్కులు పైబడి.. పాలిసెట్లో 120కు 100 మార్కుల పైబడి అధికమంది విద్యార్థులు సాధించారు. వెయ్యిలోపు ర్యాంకులు తెచ్చుకున్నారు. ఉప్పు లాస్య మాధురి (116/120), ఎల్.భాషిణి (114/120), పూసపాటిరేగ మండలం కొప్పెర్లకు చెందిన పల్లా హేమశ్రీ (112/120), మత్స వెంకటలక్ష్మి (111/120), బి.జ్యోత్స్న (110/120), గరివిడి మండలం ఆర్తమూరుకు చెందిన పెద్దపోలు తేజా (106/120) ఉన్నారు. విజయనగరంలో 95.36 శాతం, మన్యంలో 93.96 శాతం మంది ఉత్తీర్ణత -
గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవాలి
విజయనగరం క్రైమ్: జిల్లాలో గిరిజన, మైదాన ప్రాంతాల పోలీస్స్టేషన్లలో నమోదైన గంజాయి కేసులను పరిశోధించాలి.. మూలాలను వెలికితీసి గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ వకుల్జిందల్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం జరిగిన మాసాంతర నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి రవాణా జరగకుండా కొత్తగా ఏర్పాటుచేసిన నాలుగు చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నెల రోజుల్లో నమోదైన కేసుల పురోగతిపై సమీక్షించారు. శక్తియాప్ ఫిర్యాదులు 112, బీఎన్ఎస్, ఎస్టీ, ఎస్పీ, పోక్సో, ఎన్డీపీఎస్, మిస్సింగ్, మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రాత్రి 11 గంటల తర్వాత అకారణంగా ఎవరైనా రోడ్ల మీద తిరిగితే కేసులు నమోదు చేయాలన్నారు. హిస్టరీ షీట్ల వివరాలను సీసీటీఎన్ఎస్ పోర్టల్లో నిక్షిప్తం చేయాలన్నారు. వేసవి కాలంలో దొంగతనాలు జరగకుండా నిఘా పెంచాలని సూచించారు. -
దక్షిణ భారతదేశ యాత్రకు ఐఆర్ సీటీసీ ఏర్పాట్లు
పార్వతీపురం టౌన్: ఐఆర్ సీటీసీ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశ యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి ‘భారత్ గౌరవ్‘ పేరుతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసిందన్నారు. ప్యాకేజీ వివరాలు ఇలా... అరుణాచలం–మధురై రామేశ్వరం యాత్ర: ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు 8 రాత్రులు, 9 పగలు ప్రయాణంలో అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరులలో ఉన్న పుణ్యక్షేత్రాల దర్శనం కల్పిస్తారు. దీనికోసం ఒక్కో పర్యాటకుడు రూ.14,700 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. హరిద్వార్–రిషికేశ్ వైష్ణోదేవి యాత్ర: జూన్ 3 నుంచి 12వ తేదీ వరకు 9 రాత్రులు, 10 పగలు ప్రయాణంలో హరిద్వార్, రిషికేశ్, ఆనందపూర్, నైనా దేవి ఆలయం, అమృతసర్, మాతా వైష్ణోదేవి ఆలయాల సందర్శన ఉంటుంది. దీని కోసం రూ.18,510 చెల్లించాలి. కాశి–అయోధ్య–ప్రయాగరాజ్ యాత్ర: జూన్ 14 నుంచి 22వ తేదీ వరకు 8 రాత్రులు, 9 పగలతో కూడిన కాశి, అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగ్రాజ్, శ్రీంగవేరపురం ఆలయాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం టికెట్ ధర రూ.16,200. ఉజ్జయిని, త్రయంబకేశ్వర్–భీమశంకర్ ఘృష్టేశ్వర్: జూలై 5 నుంచి 23వ తేదీ వరకు 8 రాత్రులు, 9 పగలు ప్రయాణంలో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీంశంకర్, ఘృష్టేశ్వర్, ఎల్లోరా, మోవ్, నాగ్పూర్తో యాత్ర కోసం పర్యాటకులు రూ:14,700 వరకు చెల్లించాలి. దక్షిణ భారతదేశ యాత్రలో రైలు, బస్సు, హోటల్ ఐఆర్ సీటీసీ ఏర్పాటు చేస్తుంది. ఉదయం అల్పాహారం, మధ్యా హ్నం, రాత్రి భోజనం, మంచి నీళ్ల బాటిల్స్, పర్యా టకుల ఆలయాల సందర్శన సమయంలో గైడ్ సేవలను ఐఆర్ సీటీసీ ఏర్పాటు చేస్తుంది. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ప్రయాణికులకు ప్రయాణ సమయంలో బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. పూర్తి వివరాలకు 040–27702407, 97013 60701, 92814 95845, 92814 95843, 92810 30712, 92810 30740 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. -
రోడ్లపై వదిలేస్తున్నారు
పశువులను రోడ్లపైనే వదిలి వేయడంతో అవి రోడ్లపై అడ్డంగా తిష్ఠ వేస్తున్నాయి. ఈ కారణంగా పట్టణంలో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. దీనికి తోడు వాటికి సరైన మేత లేక సమీపంలో ఉన్న వ్యర్థాలను, చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్నాయి. పశువుల పోషణ సంరక్షణ యజమానులే బాధ్యతగా తీసుకోవాలి. వీధుల్లోకి రహదారుల పైకి యజ మానులు ఈ విధంగా విడిచిపెట్టడం సరికాదు. యజమానులకు కుదరకపోతే వాటిని సంబంధించిన అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు అప్పగించాలి. –వంగల దాలినాయుడు, జాతీయ మానవహక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు -
ప్రాథమిక వైద్యమే కీలకం
పార్వతీపురం రూరల్: అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక వైద్య చికిత్స అందించడం వల్ల ప్రాణాపాయస్థితి నుంచి తప్పించవచ్చని ఆరోగ్యశాఖ జిల్లా ప్రొగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు అన్నారు. పెదబొండపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. అత్యవసర సమయంలో ప్రాథమిక వైద్యానికి అందుబాటులో ఉన్న పరికరాలు, నిర్వహణ తీరు పరిశీలించారు. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్, ఆక్సిజన్ ఫ్లో మీటర్, అంబుబ్యాగ్, ఈసీజీ యంత్రం, సీబీసీ, యూరిన్ అలైజర్స్, అగ్నిమాపక యంత్రం, కోల్డ్ చైన్ సిస్టమ్ వంటివి పనిచేస్తున్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు జి.ధరణి, జి.గోపాలకృష్ణ, ఎపిడమిక్ సత్తిబాబు, సూపర్వైజర్లు వెంకటనాయుడు, జయలక్ష్మి పాల్గొన్నారు. -
రైతుకు నష్టం
–8లోఅకాలవర్షం.. ఉక్కపోతతో ‘షాక్’ వేసవి తీవ్రత దృష్ట్యా రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. రోజువారీ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025జిల్లాలో సుమారు 70 వేల ఎకరాల్లో జీడి తోటలు ఉన్నాయి. దాదాపు 30 వేల కుటుంబాలకు పైగా వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. మన్యం ప్రాంతంలో విరివిగా పండే వాణిజ్య పంట ఇది. ఒకవైపు తెగుళ్లు, మరోవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏటా నష్టపోతున్నామని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. భామిని తదితర మండలాల్లో మొక్కజొన్న రైతులు కూడా వర్షాలకు నష్టపోతున్నారు. గింజలను ఆరబెడుతున్న సమయంలో ఒక్కసారిగా వర్షం వల్ల తడిచిపోతున్నాయని చెబుతున్నారు. కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాల్లో నువ్వులు, మొక్కజొన్న, అరటి పంటలకు నష్టం వాటిల్లుతోంది. కోసిన నువ్వు పంట ఆరబెట్టే సమయంలో వర్షాలు కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలులు, వర్షాలతో జిల్లా రైతాంగం నష్టపోతున్నా ప్రభుత్వం నుంచి స్పందన ఉండడం లేదు. 33 శాతం నష్టం వాటిల్లితేనే పరిహారం అందుతుందన్న ప్రభుత్వం నిబంధనలు శరాఘాతంగా మారుతున్నాయి. సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఓవైపు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడగాల్పులు బెంబేలెత్తిస్తున్నాయి. మరోవైపు వాతావరణం ఒక్కసారిగా మారుతూ.. గాలులతోపాటు వర్షం కురుస్తోంది. మండు వేసవిలో వర్షం కాస్త ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ.. జోరుగా వీస్తున్న గాలులు ఉద్యాన, వాణిజ్య పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి రైతులను కలవరపెడుతోంది. సోమవారం సాయంత్రం గాలులతో పాటు కురిసిన వర్షానికి పాలకొండ మండలంలోని పాలకొండ, బుక్కూరు, రుద్రిపేట, అట్టలి, వెలగవాడ తదితర ప్రాంతాల్లో జీడి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. బొప్పాయి, అరటి తదితర చెట్లు నేలకొరిగాయి. తుమరాడ, గరుగుబిల్లి గ్రామాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. సీతంపేట మండలంలోనూ అరటి, జీడి, మామిడి పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు భామిని, బలిజిపేట, సీతానగరం మండలాల్లోనూ గాలులతో పాటు కురుస్తున్న వర్షం వల్ల జీడి, మామిడి పంటలు దెబ్బతిని కాయలు నేలరాలాయి. నేల రాలిన జీడిపిక్కలు రంగు మారడంతో నష్టపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. నాణ్యత లేకపోవడంతో దళారులు కిలో రూ.100 చొప్పున కొనుగోలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యూస్రీల్ఆందోళనలో రైతాంగం గాలులకు నేలకొరుగుతున్న మామిడి, అరటి ఆదుకోని యంత్రాంగం పిడుగులతో ప్రాణ నష్టం వర్షంతో పాటు.. పిడుగులు పడటం వల్ల అటు ప్రాణా నష్టం కూడా సంభవిస్తోంది. మెంటాడ మండలంలోని కుంటినవలస గ్రామానికి చెందిన కొల్లి రాంబాబు (45) పిడుగుపాటుకు గురై మృతి చెందగా.. సీతానగరం మండలం సుభద్ర సీతారాంపురం గ్రామ సమీపంలో 11 జీవాలు ప్రాణాలు వదిలాయి. దీంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. -
శ్యామలాంబకు ప్రత్యేక పూజలు
సాలూరు: సాలూరు పట్టణంలో వెలసిన శ్యామలాంబ అమ్మవారికి వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి పండగ నేపథ్యంలో జన్నివీధిలో ఉన్న అమ్మవారి ఘటాలను రాజన్నదొర, సతీమణి రోజమ్మలు దర్శించారు. అమ్మవారి ఘటాలను తలపై పెట్టి మోసారు. అక్కడ నుంచి కాలినడకన శివాజీ సెంటర్లోని సిరిమాను చెట్టువద్దకు వెళ్లి పూజలు చేశారు. చివరిగా శ్యామలాంబ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు వంగపండు అప్పలనాయుడు, గిరి రఘు, గొర్లె మాధవరావు, గొర్లె విజయకుమారి, మండల ఈశు, చొక్కాపు రమణమ్మ, గులిపల్లి నాగ, పిరిడి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకాభివృద్ధి పనులు పూర్తిచేయండి
పార్వతీపురంటౌన్: జిల్లాలోని తోటపల్లి, ఏనుగుకొండ, పెద్దగెడ్డ, వీరఘట్టం, కూర్మసాగరం ప్రాంతాలు బోటింగ్కు అనుకూలమని, వాటి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తన చాంబర్లో అటవీ, పర్యాటక శాఖ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు ప్రాంతాల్లో స్పీడ్ బోటింగ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఒక్కో ప్రాంతంలో ఆరు నుంచి పది మంది ఆసక్తి కలిగిన గిరిజన యువతకు స్పీడ్ బోటింగ్పై శిక్షణ ఇప్పిస్తామని, యువతను ఎంపికచేయాలన్నారు. బోటింగ్ నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు నిర్వహించుకునే అవకాశం ఉందన్నారు. సీతంపేట మండలం పనుకుపేటలో గిరి గ్రామదర్శిని పనులు వీలైనంత త్వరగా ప్రారంభం కావాలన్నారు. గ్రామదర్శినిలో గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా మట్టితో నిర్మించిన గృహాలు, ప్రవేశ ద్వారం, గిరిజనులు వినియోగించే సామగ్రి, థింసా నృత్యం, గిరిజన వస్తువుల విక్రయ దుకాణాలు, కల్యాణమండపం వంటి ఏర్పాట్లు ఉండాలన్నారు. జగతిపల్లి రీసార్ట్స్ ప్రాంత అభివృద్ధికి ఆలోచన చేయాలని సూచించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, జిల్లా అటవీ శాఖాధికారి జీఏపీ ప్రసూన, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్, జిల్లా దేవదాయశాఖ అధికారి ఎస్.రాజారావు, తదితరులు పాల్గొన్నారు. రక్త నిల్వలు పెంచాలి రక్తహీనత నివారణతో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తాన్ని తక్షణమే అందించేందుకు వీలుగా రక్త నిల్వలు పెంచాలని వైద్యాధికారులను కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. జిల్లా ఆస్పత్రిని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో జనరల్ వార్డు, బ్లడ్బ్యాంక్, సదరం, కంటి తనిఖీ కేంద్రం, ఓపీతో పాటు ప్రతీ విభాగాన్ని ఆయన పరిశీలించారు. అత్యవసర కేసుల వివరా లు ఏ అంశంపై వస్తున్నాయని ఆరా తీశారు. వైద్యసిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. రోగులకు అందిస్తున్న భోజన వంటకాలను పరిశీలించి మరింత శుచి, రుచిగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ నాగ శివజ్యోతి, ఆస్పత్రి వైద్యులు డాక్టర్ బి.వాగ్దేవి, ఏపీఎంఐడీసీ ఇంజినీరింగ్ అధికారి బి.ప్రసన్నకుమార్, వివిధ విభా గాల వైద్యులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
అత్యవసర రక్షణపై మాక్డ్రిల్
పార్వతీపురం టౌన్: అత్యవసర పరిస్థితు ల్లో పౌరుల సురక్షిత సంసిద్ధతకు వీలుగా బుధవారం ఉదయం 9 గంటలకు పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్లో మాక్డ్రిల్ నిర్వహించనున్నట్టు జేసీ ఎస్ఎస్ శోభిక తెలిపారు. మాక్ డ్రిల్ సన్నాహక చర్యలపై కలెక్ట్ర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. పోలీసులు, ఫైర్, వైద్య విభాగాలు సంయుక్తంగా నిర్వహించే మాక్డ్రిల్కు ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లా ముఖ్య అగ్ని మాపక అధికారి కె.శ్రీనుబాబు మాట్లాడుతూ అణుబాంబు విస్పోటన జరిగితే మూడు నుంచి 5 కిలోమీటర్ల మేర తీవ్ర ప్రభావం ఉంటుందని, దట్టమైన గోడలతో ఉండే ఇళ్లలో ఉండడం వల్ల రేడియేషన్ ప్రభా వం నుంచి సురక్షితంగా బయటపడవచ్చన్నారు. యుద్ధ సమయాల్లో లైట్లు పూర్తిగా ఆపివేయాలన్నారు. 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం సైరన్ మోగితే పరిస్థితిలో తీవ్రత ఉందని గ్రహించాలని, అందుకు తగిన విధంగా సురక్షిత చర్యలకు అధికార యంత్రాంగానికి సహకరించాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె.హేమలత, కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు కోడా చలపతిరావు, ఒ.ప్రభాకరరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.టి.జగన్మోహన్రావు, పౌర సరఫరాల సంస్థ జిల్లామేనేజర్ ఐ.రాజేశ్వరి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.శికుమార్, డీఎస్పీ థామస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇసుక సరఫరాకు రీచ్లు సిద్ధం పార్వతీపురం టౌన్: జిల్లాలోని భామిని మండలం నేరడి, పాలకొండ మండలం చినమంగళాపురం ఇసుక రీచ్ల నుంచి ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ సంబంధిత అధికారులను వీడియో కాన్ఫరెన్స్ లో మంగళవారం ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఇసుక సరఫరా కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు, బారికేడ్లు, చెక్పోస్టు, ఆన్లైన్ వే బిల్లు, రికార్డులన్నీ పక్కాగా ఉండాలన్నారు. సమావేశంలో జేసీ ఎస్.ఎస్.శోభిక, పాలకొండ సబ్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, జిల్లా గనులు, భూగర్భ వనరుల శాఖాధికారి జి.జయప్రసాద్, పోలీస్, భామిని, పాలకొండ తహసీల్దార్లు పాల్గొన్నారు. బిత్రపాడులో ఏనుగుల గుంపు జియ్యమ్మవలస: మండలంలోని నిమ్మలపాడు, బిత్రపాడు పంట పొలాల్లో మంగళవారం సాయంత్రం ఏనుగులు దర్శనమిచ్చాయి. నిమ్మలపాడు దగ్గర నాగావళి నదిలో ఉన్న ఏనుగులు సాయంత్రానికి బిత్రపాడు పొలిమేరలోకి చొచ్చుకురావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పామాయిల్ తోటలో ఉంటూ అరటి పంట ధ్వంసం చేయడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై నా వాటిని తరలించే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
డీజే దాబాపై విజిలెన్స్ దాడులు
డెంకాడ: మండలంలోని పెదతాడివాడ జంక్షన్ సమీపంలో ఉన్న డీజే దాబాపై మంగళవారం విజిలెన్స్ దాడులు జరిగాయి. ఇంటి అవసరాలకు వాడాల్సిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరమైన డీజే దాబాలో వినియోగించుతుండడంతో విజిలెన్స్ సీఐ బి.సింహాచలం, సిబ్బంది తనిఖీ చేసి పట్టుకున్నారు. దీంతో డీజే దాబాపై 6ఏ కేసు నమోదు చేశామని వివరించారు. పట్టుకున్న 5 గ్యాస్ సిలిండర్లను విజయనగరం ఆదిత్య గ్యాస్ ఏజెన్సీకి అప్పగించామన్నారు. విజిలెన్స్ దాడిలో సీఎస్డీటీ ఆర్.శంకరరావు, వీఆర్వోలు డి.కృష్ణబాబు, మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలి ● ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాస్తవ పార్వతీపురం: జీడి ప్రాసెసింగ్ యూనిట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ సిబ్బందికి పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. పట్టణ పరిధిలోని మార్కెట్ యార్డ్లో నిర్మిస్తున్న జీడి ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన జరుగుతున్న పనులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీడి తోటలను సాగు చేసే రైతులకు జీడి పంటకు విలువ ఆధారితను కల్పించేందుకు జీడి ప్రాసెసింగ్ యూనిట్ ఎంతో దోహదం చేస్తుందన్నారు. జీడి రైతులకు, గిరిజనులకు ఈ యూనిట్ ఎంతో లాభదాయకంగా ఉంటుందన్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ పరిశీలనలో ఇంజినీరింగ్ అధికారి మణిరాజ్, ఏపీవో మురళీధర్ తదితరులున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ తీరుపై ఎంపీడీవో విచారణ పూసపాటిరేగ: మండలంలోని బత్తివలస గ్రామ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ తీరుపై ఎంపీడీవో ఎం.రాధిక మంగళవారం విచారణ చేపట్టారు.ఆయనపై బినామీ మస్తర్లు వేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయనను కార్యాలయానికి పిలిపించి మరీ విచారణ చేశారు. పలువురు వేతనదారులను కూడా కార్యాలయానికి రప్పించి ఫీల్డ్ అసిస్టెంట్ బినామీ మస్తర్లు వేయడంపై ఆరాతీశారు. గతంలో జరిగిన ఉపాధి పనుల సోషల్ ఆడిట్లోనూ అవకతవకలు జరిగినట్లు బయపడిందని గుర్తు చేశారు. తదుపరి చర్యలు ఏం తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది. ఆమె వెంట ఏపీవో తిరుపతిరావు తదితరులు ఉన్నారు. అరటి పంటకు నష్టం చీపురుపల్లి: మండలంలో సోమవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు అరటి పంటకు నష్టం వాటిల్లినట్టు ఉద్యానవన శాఖాధికారి సీహెచ్ చంద్రశేఖర్ తెలిపారు. మండలంలోని పీకే పాలవలస, పేరిపి, గొల్లలములగాం, గొల్లలపాలెం తదితర గ్రామాల్లో ఎనిమిది ఎకరాల్లో అరటి పంట, మూడు ఎకరాల్లో బొప్పాయి పంట నేలకొరిగినట్టు ఆయన తెలిపారు. భూముల వివరాల పరిశీలన లక్కవరపుకోట : అన్నధాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకాల వర్తింపుకై రైతులకు సంబంధించి భూముల వివరాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీ చేస్తున్నట్టు ఏవో స్వాతికుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ రైతు తన భూమికి సంబంధించిన 1 బీ, ఆధార్, రేషన్ కార్డు, ఫోన్ నంబరుతో సమీప రైతు సేవా కేంద్రాలకు వెళ్తే.. అక్కడ సిబ్బంది సంబంధిత పత్రాలను పరిశీలన చేసి నమోదు చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియ ఈ నెల 20వ తేదీ వరకు జరుగుతుందన్నారు. అలాగే పచ్చి రొట్ట విత్తనాలైన జీలుగా, కట్టి జనుము, పిల్లి పెసర విత్తనాలు 50 శాతం రాయితీపై రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. విత్తనాల కావల్సిన రైతులు 1బీ, ఆధార్ కార్డుతో సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. -
మన క్రీడా విధానం దేశానికే ఆదర్శం
● చదువుతో పాటు ఆటలకూ ప్రాధాన్యత ● రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్విజయనగరం: క్రీడా విధానంలో మనం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే ఉద్యోగాల భర్తీలో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్లు కల్పించామని, క్రీడల కోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నామని చెప్పారు. చదువుతో పాటు ఆటలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో జరుగుతున్న 3వ జాతీయ తైక్వాండో శిక్షణా సెమినార్కు మంత్రి శ్రీనివాస్ మంగళవారం హాజరయ్యారు. క్రీడాకారులకు ఇస్తున్న శిక్షణను తిలకించారు. ఒడిశా, ఛత్తీస్ఘడ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన కోచ్లు, క్రీడాకారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, మానవ వనరులే మన దేశానికి ఆస్తి అని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థి చదువుతో పాటు, ఆటల్లో కూడా రాణించి మన రాష్ట్రానికి, ప్రాంతానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో తైక్వాండో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.వేణుగోపాల్, అంతర్జాతీయ క్రీడాకారుడు, తైక్వాండో కోచ్ అబ్బాస్ షేకీ, తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి కె.శ్రీహరి, మక్కువ శ్రీధర్ తదితర ప్రముఖులు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు
● ఎన్ఎంయూ రాష్ట్ర కార్యదర్శి అప్పారావు విజయనగరం క్రైమ్ : ఆర్టీసీలో కార్మికుల డిమాండ్లు గడువులోగా పరిష్కరించకుంటే సమ్మె తప్పదని నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ) రాష్ట్ర కార్యదర్శి వి.అప్పారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు విజయనగరం ఆర్టీసీ డిపో వద్ద మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము కోరుతున్న 38 డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన రాలేదన్నారు. తమ డిమాండ్లపై ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే వినతిపత్రాలు అందజేశామన్నారు. తక్షణమే తమ డిమాండ్లపై స్పందించాలన్నారు. లేకుంటే సమ్మె నోటీసు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ధర్నాకు రాహుల్ అధ్యక్షత వహించగా దుర్గరాజు, విజయనగరం, ఎస్.కోట సంఘ కార్యదర్శులు రామారావు, చంద్రమౌళి, మహిళ ప్రతినిధులు సరిత, సుజాత, భాను, కుమారి తదితరులు పాల్గొన్నారు. -
రీసర్వేలో పక్కాగా సరిహద్దులు నిర్ణయించాలి
● రీసర్వే ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పార్వతీపురం రూరల్: ప్రభుత్వం చేపడుతున్న రీ సర్వేతో భూ సమస్యలు తొలగి రైతులకు, భూ యజమానులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. రెండవ విడత రీ సర్వే కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మండలంలోని తాళ్లబురిడి గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వే ప్రక్రియను మంగళవారం ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ భూ సర్వే జరిపే ముందు రైతులకు నోటీసులు జారీ చేసి, గ్రామంలో రైతుల భూములతో పాటు గ్రామ సరిహద్దులు, నీటి వనరుల భూములు, పోరంబోకు భూములకు కొలతలు వేసి కచ్చితమైన సరిహద్దులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తద్వారా రైతులకు, భూ యజమానులకు శాశ్వత మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రైతుల సమక్షంలోనే భూమి కొలతలు వేసి తమ భూమికి సంబంధించిన హద్దులు నిర్ణయిస్తారని తెలిపారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి రీ సర్వే జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. తప్పులు దొర్లకుండా పక్కగా నిర్వహించాలన్నారు. రైతులకు నోటీసులు జారీ చేస్తున్నది లేనిది అడిగి ఆరా తీశారు. ఇప్పటివరకు ఎంత మేర సర్వే నిర్వహించిన విషయమై తహసీల్దార్ వై.జయలక్ష్మిని ప్రశ్నించగా 1147 ఎకరాల గ్రౌండ్ ట్రూటింగ్ పూర్తి కాగా మిగతా 31 ఎకరాలు సర్వే నిర్వహించాల్సి ఉందని ఆమె తెలిపారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తహసీల్దార్తో మాట్లాడుతూ మరణించిన భూ యజమానుల వారసులకు మార్పు చేసే విధంగా ఎఫ్ఎంసీ విచారణ పూర్తి చేసి మ్యుటేషన్లను పరిష్కరించాలని ఆదేశించారు. భూ సమస్యలు తలెత్తకూడదనేది ప్రధానమైన రీ సర్వే ఉద్దేశమని, రైతులు పక్కా భూ రిజిస్ట్రేషన్లు చేసుకొనేలా ప్రోత్సహించాలని సూచించారు. రోడ్లుకు కేటాయించిన భూములలో హద్దులు నిర్ణయించి రక్షణ కల్పించాలన్నారు. చెరువులు, వాగులలోని ఆక్రమణలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్వే, భూ రికార్డుల నిర్వహణ శాఖ సహాయ సంచాలకులు లక్ష్మణరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జి.రవి తేజ, మండల సర్వేయర్ స్వామి, గ్రామ సర్వేయర్ నాయుడు, గ్రామ సచివాలయ సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు. -
ఏపీ క్రెడయ్ చాప్టర్లో చంద్రబోస్కి కీలక బాధ్యతలు
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రెడయ్ చాప్టర్ నూతన కార్యవర్గ ఎన్నికలో విజయనగరం జిల్లాకు చెందిన కట్టూరు సుభాష్ చంద్రబోస్ కీలక బాధ్యత లు చేపట్టారు. మంగళవారం విజయవాడలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమక్షంలో 2025–27 సంవత్సరాలకు సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా విజయనగరానికి చెందిన సుభాష్ చంద్రబోస్ క్రెడయ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదేవిధంగా క్రెడయ్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కన్వీనర్గా, జీఎస్టీ కన్వీనర్గా, సెంటర్ జోన్ ఇంచార్జ్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరానికి చెందిన తనకి క్రెడయ్ ఏపీ చాప్టర్లో కీలక బాధ్యతలు అప్పగించటం సవాల్గా స్వీకరిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్లో నిర్మా ణ రంగం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొ న్నారు. వ్యవసాయం తరువాత అధికంగా ఉపాధి పొందే నిర్మాణ రంగంలో పూర్తి స్థాయిలో సేవలందిస్తానని చెప్పారు. నిర్మాణ రంగ కార్మికుల నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేలా ముందుకు వెళతానన్నారు. కార్మి కులకు గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామన్నారు. -
వైభవంగా పైడితల్లమ్మ దేవర మహోత్సవం
● వేపాడ, వల్లంపూడి గ్రామాల్లో భక్తజనం ● 19న తొలేళ్లు, 20 అమ్మవారి పండగవేపాడ: మండలంలోని వల్లంపూడి గ్రామదేవత పైడితల్లమ్మ పండగ సందర్భంగా మంగళవారం దేవర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం గ్రామానికి చెందిన పెద్దవీధి చేనేత కార్మికులు 42 అడుగులు, చిన్నవీధివారు 40 అడుగుల ఎత్తులో ప్రభలను ఊలుతో అలంకరించారు. వేపాడ, వల్లంపూడి జంటగ్రామాల్లో ప్రభలను ఊరేగింపు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయం ప్రాంగణ సమీపంలో రెండు ప్రభలను నిలిపారు. 19న తొలేళ్ల ఉత్సవం రోజు ఊలు అలంకరణ మార్పుచేసి నిలపనున్నారు. 20న అమ్మవారి పెద్దపండగ జరగనుంది. -
జీవనోపాధికి విస్తృతంగా రుణాలు
బొబ్బిలి రూరల్: పొదుపు సంఘాల్లోని సభ్యులకు జీవనోపాధిని కల్పించేందుకు విస్తృతంగా బ్యాంకర్ల సహకారంతో లింకేజీ రుణాలందిస్తున్నామని, ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకుంటామని మెప్మా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ గంటా వెంకట చిట్టిరాజు తెలియజేశారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మెప్మా పరిధిలో 2వేల 602 సంఘాలుండగా వాటికి రూ.275 కోట్లను రుణాలుగా అందించేందుకు లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటికే 244 సంఘాల సభ్యులకు దాదాపు 25 కోట్ల రూపాయిలను రుణాలుగా అందించామన్నారు. ప్రతి సభ్యునికి రెండు లక్షల వరకు వ్యక్తిగత రుణాలందిస్తున్నామని, చిన్నతరహా వాణిజ్య, వ్యాపారాలకు అవసరమైన మొత్తాలను పూర్తి స్థాయిలో అందించేందకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సంఘంలోని ప్రతి సభ్యురాలి వివరాలు ఆన్లైన్ చేశామని ఈ విధానం వల్ల నిధులు దుర్వినియోగం కావన్నారు. కొత్తగా 160 సంఘాలను తయారు చేయగా 304 పాత సంఘాలను అప్గ్రేడ్ చేశామని వివరించారు. రిక్షా, ఆటో, ఇతర రంగాల్లో ఉన్న కార్మికులను, పురుషులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారితో ఐదుగురు చొప్పున సంఘాలను ఏర్పాటు చేస్తున్న వారి జీవనోపాధికి అవసరమైన రుణాలనందించేందుకు బ్యాంకర్లతో సమావేశాలు జరుపుతున్నామని తెలియజేశారు. సమావేశంలో ఎంపీడీవో పి.రవికుమార్ తదితరులున్నారు. మెప్మా పీడి చిట్టిరాజు -
ఆదర్శనీయులు... ఆ దంపతులు
చీపురుపల్లి: ఆదర్శం అంటే అదేదో మాటల్లో చెప్పేది కాదు చేతల్లో చూపించాలి. అందులోనూ నేత్రదానం అంటేనే భయపడిపోతున్న ఈ రోజుల్లో ఏకంగా అవయవదానం అంటే మరి ఎంత కాదనుకున్నా కాస్త భయం లేకపోలేదు. అయినప్పటికీ ప్రతీ మనిషి మరణానంతరం మిగిలేది బూడిదే కదా.. అయినా ఎందుకు అవయవ దానం చేయడానికి భయం అంటూ ప్రతీ ఒక్కరూ మాట్లాడుతుంటారు. కానీ అవయవదానం చేసేందుకు ముందుకు రావడానికి మాత్రం అడుగులు వేయరు. ఇలాంటి నేపథ్యంలో ఆ దంపతులు ఇద్దరూ ఒకే ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చారు. తమ మరణానంతరం అవయవ దానం చేసేందుకు సిద్ధం అంటూ ముందుకొచ్చారు. అంతేకాకుండా తమ మరణానంతరం అవయవ దానం చేయడానికి తాము సిద్ధమే అంటూ మానవీయత స్వచ్ఛంద సంస్థ సిద్దం చేసిన అంగీకార పత్రాలపై సంతకాలు చేసి అందజేసి సమాజానికి ఆదర్శప్రాయులుగా నిలిచారు. వారే నెలిమర్ల మండలంలోని తంగుడుబిల్లికి చెందిన శివుకు బంగారయ్య, రామలక్ష్మి దంపతులు. బంగారయ్య తంగుడుబిల్లి గ్రామంలో గణిత ఉపాధ్యాయుడుగా పని చేస్తుండగా, రామలక్ష్మి విజయనగరం కంటోన్మెంట్ వీఆర్వోగా పని చేస్తున్నారు. బంగారయ్య ఆయన భార్యతో కలిసి ఎంతో గొప్పగా ఆలోచన చేసి తమ మరణానంతరం శరీరం మట్టిలో కలిసిపోకుండా మరికొంత మందికి ఉపయోగపడాలనే గొప్ప ఆలోచనతో అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో పట్టణానికి చెందిన మానవీయత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బివి.గోవిందరాజులు, ప్రతినిధి విజయతో బాటు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.పి.సుధీర్కు మంగళవారం అంగీకార పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతటి గొప్ప వారి శరీరమైనా మట్టిలో కలిసిపోవాల్సిందేనని అలా కాకుండా అవయవదానం చేయడం ద్వారా మరికొంత మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అతడు ఉపాధ్యాయుడు.. ఆమె వీఆర్వో అవయవ దానానికి అంగీకార పత్రాల అందజేత -
విజయలక్ష్మికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు
చీపురుపల్లి: మండలంలోని కర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్నర్స్గా విధులు నిర్వహిస్తున్న ఎం.విజయలక్ష్మికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు దక్కింది. విజయవాడకు చెందిన హెల్త్ కేర్ ట్రస్టు ప్రతీ ఏటా ఉత్తమ సేవలు అందిస్తున్న స్టాఫ్నర్స్ల కోసం నిర్వహిస్తున్న అవార్డులు ఎంపికలో భాగంగా ఈ ఏడాది జిల్లా నుంచి కర్లాం స్టాఫ్ నర్స్ విజయలక్ష్మికి అవకాశం లభించింది. ఈ మేరకు త్వరలో విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకోనున్నారు. దీంతో ఆమెను పీహెచ్సీలో ఉన్న సిబ్బంది అభినందించారు. -
ఆత్మరక్షణ విద్యలో ప్రావీణ్యం సాధించాలి
విజయనగరం: ఆత్మరక్షణ విద్య తైక్వాండోలో క్రీడాకారులు మరింత ప్రావీణ్యం సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఒలింపిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కె.పురుషోత్తం ఆకాంక్షించారు. ఈ మేరకు న్యూ ఆంధ్ర తైక్వాండో అసోసియేషన్ సారథ్యంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో తలపెట్టిన మూడవ నేషనల్ తైక్వాండో సెమినార్ సోమవారం ప్రారంభమైంది. ఈ సెమినార్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 120 మంది క్రీడాకారులు పాల్గొనగా..క్రీడాకారులకు ఇరాన్ దేశానికి చెందిన అబ్బాస్ షేక్ నూతన మెలకువలను నేర్పించారు. నాలుగు రోజుల పాటు జరిగే శిక్షణను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని పురుషోత్తం సూచించారు. అంతర్జాతీయ యవనికపై తలపడే క్రీడాకారులకు ఈ సెమినార్ దోహపడుతుందని పేర్కొన్నారు. సెమినార్లో నేర్చుకున్న అంశాలను నిరంతరం సాధన చేయడం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం సెమినార్లో శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన అబ్బాస్ షేక్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి కె.శ్రీహరి, జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి వారం పురోగతి కనిపించాలి
ఆదర్శ గ్రామంగా ‘మనుమకొండ’ పార్వతీపురంటౌన్: భామిని మండలం మనుమకొండ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో సోమవారం వీడియోకాన్ఫరెన్స్లో మాట్లాడారు. వివిధ రంగాల్లో యంత్రాల వినియోగం పెంపుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి రంగంలో కనీసం 15 శాతం సుస్థిర అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక, మత్స్య శాఖలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు, వంట గ్యాస్, గృహం, ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు, తాగు నీరు, విద్యుత్, మరుగుదొడ్లు ఉండాలని, వాటి విని యోగం పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామంలో ఫోన్ సేవలు, బ్రాడ్బ్యాండ్ సేవలు, విద్యా సంస్థ, వైద్య సేవలు అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు. పసుపు, చింతపండు, అడ్డాకులు తదితర ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్తుల్లో ఆర్థిక అక్షరాస్యత పెంచాలన్నారు. కార్యక్రమంలో సీతంపేట ఐటీడీఏ పీఓ, పాలకొండ సబ్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రణాళిక అధికారి పి.వీరరాజు, బ్లాక్ కోఆర్డినేటర్ మహేశ్వరరావు పాల్గొన్నారు. పార్వతీపురంటౌన్: కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లాలో చేపట్టే క్యాస్కెడింగ్, చెక్ డ్యామ్లు, కోకోనట్ ప్లాంటేషన్ పనుల్లో ప్రతివారం పురోగతి కనిపించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నీటి పారుదలశాఖ ఈఈలు, డీఈఈలు, ఏఈఈలతో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. చెరువులు, చెక్డ్యామ్ల పనులను పంచాయతీ సర్పంచ్ల తీర్మానంతో వెంటనే ప్రారంభించాలన్నారు. ఏఈఈల వారీగా లక్ష్యాలు నిర్దేశించాలన్నారు. ఇకపై ప్రతి సోమవారం వీటిపై సమీక్షిస్తామన్నారు. ఇచ్చిన లక్ష్యాలు నాలుగు వారాల్లో పూర్తిచేసిన అధికారులకు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతిని అందజేస్తామని తెలిపారు. ఎకరాకు 60 కొబ్బరి మొక్కల చొప్పున 5వేల ఎకరాల్లో కొబ్బరి తోటల పెంపకానికి ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ ఆర్.అప్పల నాయుడు, ఇతర ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నీరుపేద రైతుల ఆందోళన
● సాగునీటి కష్టాలు తీర్చండంటూ వేడుకోలు ● ఇబ్బందులు పడుతున్న ఐదుగ్రామాల రైతులు ● సమస్య పరిష్కరించాలని కలెక్టరేట్ ఆవరణలో నిరసనపార్వతీపురంటౌన్: కొమరాడ మండలం కోటిపాం గ్రామ ప్రజలు వనకాబడి గెడ్డ ఆయకట్టు ద్వారా వచ్చే సాగు నీటి ద్వారా వ్యవసాయపనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గెడ్డపై కొత్త చెక్ డ్యాం నిర్మాణం చేపట్టడంతో తమకు సాగునీరు అందడం లేదని అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం కలెక్టరేట్ వద్ద గ్రామస్తులు నిరసన తెలియజేశారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కోటిపాం గ్రామలో 500 కుటుంబాలున్నాయని వనకాబడి గెడ్డ ఆయకట్టు నుంచి వచ్చిన నీటి ద్వారా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నామన్నారు. వనకాబడి గెడ్డ నుంచి వనకాబడి, బట్టిమాగవలస, చినఖేర్జల, లింగందొర వలస, బూర్జి వలస మీదుగా వచ్చి కోటిపాం కొత్తచెరువులో గెడ్డ నీరు కలుస్తుందని, చెరువు నిండిన తర్వాత ఈ చెరువు నుంచి సుమారు పది చెరువులు, బందలు నిండుతాయని, ఈ నీటి వనరుల మీదే తాము సాగుచేసుకుంటూ బతుకుతున్నామని తెలిపారు. వెయ్యి ఎకరాలకు ఈ సాగు నీరే ఆధారం వెయ్యి ఎకరాల సాగు ఈనీటి మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నామన్నారు. వనకాబడి ఆయకట్టు నీరు ప్రధానంగా కోటిపాం గ్రామానికి వస్తుంది. కావున గత 28న వనకాబడి గెడ్డపై చెక్డ్యామ్ నిర్మించేందుకు పరిశీలించారని, దీనికి సంబంధించిన చెక్ డ్యాం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాత నిర్మాణం అలాగే ఉంటే తమ గ్రామానికి రావాల్సిన ఆయకట్టు నీటికి ఇబ్బంది ఉండదన్నారు. కానీ కొత్తగా చెడ్డ్యామ్ నిర్మించడం వల్ల మా గ్రామానికి రావాల్సిన నీరు ఆగిపోతుంది. దీంతో చాలామంది రైతులు ఇబ్బందికి గురవుతారని తెలియజేస్తున్నారు. తమ గ్రామ రైతులకు వ్యవసాయానికి ఈ చెక్డ్యాం ద్వారా వచ్చే నీరు మాత్రమే ఆధారమని, పరిశీలించి ఎవరికీ ఇబ్బంది కలగకుండా చేసి తమకు సాగునీరు అందించాలని కోరుతున్నారు. కొత్త చెడ్డ్యామ్ నిర్మాణం వద్దు గ్రామంలో 500మంది కుటుంబాలకు సంబంధించిన సుమారు 1000 ఎకరాలకు వనకాబడి గెడ్డ ఆయకట్టు ద్వారా వచ్చే సాగు నీటి ద్వారా పంటలు పండుతున్నాయి. ప్రస్తుతం ఉన్న చెక్డ్యాం ప్రాంతంలో కొత్తగా మరో చెక్డ్యాం నిర్మాణం చేపట్టనున్నారు. దీనివల్ల రైతులకు తీవ్రనష్టం చేకూరుతుంది. అధికారులు ఈ విషయంపై పునరాలోచించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. – ఎజ్జు గుంపస్వామి, రైతు, కోటిపాంరైతులను ఆదుకోండి ఎన్నోఏళ్లుగా వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న రైతులను ఆధికారులు ఆదుకోవాలి. వనకాబడి ఆయకట్టు గెడ్డపై నిర్మించనున్న చెక్డ్యాం పనులను ప్రారంభించరాదు. సుమారు వెయ్యి ఎకరాలకు పైబడి సాగునీరు అందిస్తున్న గెడ్డపై ప్రస్తుతం ఉన్న చెక్డ్యాంను యథావిదిగా ఉంచి రైతులకు సాగునీటిని అందజేయాలి. – పాండ్రంకి రామకృష్ణ, రైతు, కోటిపాం500 కుటుంబాల జీవనాధారం పోతుంది నూతన చెక్డ్యాం నిర్మాణం వల్ల గ్రామంలో గల 500మంది కుటుంబాలకు జీవనాధారం పోతుంది. ఐదు గ్రామాలకు సాగునీటి కష్టాలు ఏర్పడతాయి. ప్రభుత్వం, అధికారులు పునరాలోచించి చెక్డ్యాం నిర్మాణం చేపట్టకుండా చూడాలి. ప్రస్తుతం ఉన్న చెక్డ్యాం ద్వారానే నీటిని సరఫరా చేయాలి. – పప్పల సోమేశ్వరరావు, రైతు, కోటిపాం -
అగచాట్లు
మంగళవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2025పింఛన్ కోసం.. ఈ చిత్రంలో కనిపిస్తున్న దివ్యాంగురాలి పేరు గంగమ్మ. మక్కువ మండలం డి.శిర్లాం గ్రామం. వయస్సు 65 సంవత్సరాలు. అనారోగ్యం కారణంగా నడవలేని పరిస్థితి. గతంలో అందే పింఛన్ కొన్నినెలలుగా ఆగిపోయింది. జీవనానికి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కుటుంబ సభ్యుల తోడుతో కలెక్టరేట్కు వచ్చింది. పింఛన్ మంజూరు చేసి జీవన భరోసా కల్పించాలంటూ కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ను వేడుకుంది. ●పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలవుతోంది. గతేడాది నవంబర్ నెల తర్వాత పింఛన్లు పొందుతూ భర్తలు కోల్పోయిన వితంతువులకు మినహా.. కొత్త పింఛన్ ఒక్కటీ మంజూరుకాని పరిస్థితి. వివిధ కారణాలతో పింఛన్ రద్దయినవారు, కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించేవారికి పింఛన్ ఎండమావిగానే కనిపిస్తోంది. పింఛన్ కోసం దివ్యాంగుల కష్టాలకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం కనిపించిన ఈ చిత్రాలే సజీవసాక్ష్యం. పింఛన్ కోసం అగచాట్లు పడుతూ పలువురు దివ్యాంగులు కలెక్టరేట్కు చేరుకున్నారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్కు తమ గోడు వినిపించారు. పింఛన్ కోసం దరఖాస్తు చేసేందుకు వెబ్సైట్ ఓపెన్ కావడంలేదంటూ సమస్యను తెలియజేశారు. పింఛన్ మంజూరుచేసి ఆదుకోవాలని వేడుకున్నారు. ● 10 నెలలుగా మంజూరుకాని కొత్త పింఛన్లు ● పింఛన్లకోసం దివ్యాంగుల అవస్థలు ● కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్కు విన్నపాలు న్యూస్రీల్