breaking news
Parvathipuram manyam District News
-
గోపీనాథ ఆలయంలో చోరీ
● రాధాకృష్ణుల విగ్రహాలపై ఉన్న వెండి, బంగారు నగలు మాయంభామిని: వంశధార నదీ తీరంలో ప్రముఖ వైష్ణవాలయంగా వెలుగొందుతున్న లివిరి గోపీనాథ రాధాకృష్ణ ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం వేకువ జామున దేవాలయంలో దొంగలు పడ్డారనే వార్త గుప్పుమంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయాన్ని చుట్టుముట్టి జరిగిన చోరీపై చర్చించారు. ఈ సమాచారం అందుకున్న పాలకొండ డీఎస్పీ రాంబాబు, బత్తిలి ఎస్సై జి.అప్పారావులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వెనువెంటనే క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. చోరులు ఆలయం తలుపులకు ఉన్న నాలుగు తాళాలు దుండగులు విరగొట్టారు. రాధాకృష్ణుల మూర్తులపై ఉన్న ఆభరణాలను సీసీ కెమెరా వైర్లు కట్ చేసిన వీడియోలు నిలువ చేసే డీబీఎంను కూడా చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ చోరీలో సుమారు 56 తులాల వెండి వస్తువులు, అరతులం బంగారు ముక్కెరలు పోయినట్లు ఆలయ ఆర్చకుడు గోపీనాథ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బత్తిలి ఎస్సై జి.అప్పారావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సర్పంచ్ బౌరి సౌదామిని, మాజీ ఏఎంసీ చైర్మన్ సోమరాజు గోపాలరావు, మాజీ సర్పంచ్ ఎస్.రమణారావు, మిల్లరు కై లాస్ గౌడో, మండల నాయకులు తరలివచ్చి పోలీసులకు సహకరించారు. -
సాఫ్ట్బాల్ పోటీల్లో సత్తాచాటిన జిల్లా జట్లు
తెర్లాం: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 సాఫ్ట్బాల్ పోటీల్లో జిల్లా బాలురు, బాలికల జట్లు సత్తా చాటాయి. ఈనెల 6 నుంచి 8వరకు గుంటూరు జిల్లా మోదుకూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్–19 సాఫ్ట్బాల్ పోటీల్లో జిల్లాకు చెందిన బాలుర జట్టు ప్రథమ స్థానం సాధించగా, బాలికల జట్టు తృతీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బాలురు, బాలికల జట్లు పాల్గొన్నాయని, ఈ పోటీల్లో విజయనగరం జిల్లా జట్లు అత్యుత్తమ ప్రతిభను కనబరిచినట్లు జిల్లా జట్ల మేనేజర్ చొక్కాపు సత్యనారాయణ మంగళవారం తెలియజేశారు. రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ ఫైనల్ పోటీల్లో జిల్లా బాలుర జట్టు కడప జట్టుతో తలపడి ప్రథమ స్థానం సాధించింది. అలాగే బాలికల జట్టు కడప బాలికల జట్టుతో పోటీపడి తృతీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొన్న జిల్లా బాలురు, బాలికల జట్లకు కోచ్లుగా శివ, మహేష్, మేనేజర్గా పీడీ సత్యనారాయణ వ్యవహరించారు. జిల్లాకు చెందిన బాలురు, బాలికల జట్లు రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో రాణించడంతో క్రీడాకారులను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, పలువురు పీడీలు, పీఈటీలు అభినందించారు. మరిన్ని పోటీల్లో జిల్లా బాలికల, బాలుర జట్లు మరింత బాగా రాణించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని వారంతా ఆకాంక్షించారు. ఈనెల 6 నుంచి 8 వరకు గుంటూరు జిల్లాలో జరిగిన పోటీలు రాష్ట్రస్థాయిలో ప్రఽథమ స్థానం సాధించిన బాలుర జట్టు తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్న బాలికల జట్టు -
రెవెన్యూ క్లినిక్ను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డి పార్వతీపురం: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 29 నుంచి నేటి వరకు తొమ్మిది రెవిన్యూ క్లినిక్లను నిర్వహించామన్నారు. జేసీ ఆద్వర్యంలో తహసీల్దార్లందరూ రెవెన్యూ ఫిర్యాదుల పరిష్కారానికి కృషిచేస్తున్నారని చెప్పారు. దీర్ఘకాలిక రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జేసీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లను ఓ రోజంతా ఒకే చోట ఉంచడమే రెవెన్యూ క్లినిక్ ప్రధాన ఉద్దేశమన్నారు. సీనియర్ సిటిజన్ యాక్ట్, సిర్టిఫికెట్లు, సర్వీస్ రిక్వెస్ట్ రేజింగ్లో ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ వంటివి అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. జేసీ స్థాయి అధికారి ప్రతి పిటిషన్ను ఆడిట్ చేస్తారన్నారు. తొమ్మిది వారాలకు గాను ఆరు వారాల్లో వచ్చిన 227 ఫిర్యాదులను పరిష్కరించినట్టు వెల్లడించారు. మిగిలిన వూడు వారాల్లో వచ్చిన సమస్యలు పరిశీలనలో ఉన్నాయన్నారు. జేసీ సి.యశ్వంత్ కుమార్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని రెవెన్యూ సిబ్బంది అంతా ఒకే వేదికవద్ద పాల్గొని సమస్యలు పరిష్కారానికి చొరవ చూపడంతో సమస్యలు పరిష్కారానికి మార్గం సుగమం అయ్యిందన్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ టెట్పై యూటీఎఫ్ నిరసన
విజయనగరం అర్బన్: రాష్ట్రంలో 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులను టెట్ పరీక్ష నుంచి పూర్తిగా మినహాయించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ జిల్లా కమిటీ నాయకులు మంగళవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండురోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో తొలిరోజున జిల్లా వ్యాప్తంగా తాలూకా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. రెండోరోజు జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2010కి ముందు నియమితమైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి శాశ్వత మనహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టెట్ అర్హతపై సుప్రీం కోర్టులో ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని, 100 రోజుల యాక్షన్ ప్లాన్ను ఆదివారాలు, ప్రభుత్వ సెలవులు మినహాయించి రీ షెడ్యూల్ చేయాలని కోరారు. బదిలీ అయిన ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్ చేయాలన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి జేఏవీఏఆర్కే ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో యూటీఫ్ నాయకులు సీహెచ్ తిరుపతినాయుడు, జి.రాజారావు, శ్రీదేవి, అల్లు శంకరరావు, గంగాధర్, ఎస్.వెంకటరావు, పల్లి శ్రీనివాసరావు, సుశీల తదితరులు పాల్గొన్నారు. -
వెనుకబడిన విద్యార్థులపై నిర్లక్ష్యం
పార్వతీపురం రూరల్: ర్యాంకుల రేసులో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న అధికారుల తాపత్రయం పదో తరగతి విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందా? ‘వంద రోజుల ప్రణాళిక’ పేరుతో విద్యాశాఖ అమలు చేస్తున్న కార్యాచరణ విద్యార్థులను తీర్చిదిద్దడం పక్కన పెడితే..వారిని మానసిక ఒత్తిడిలోకి నెట్టివేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘అందరికీ ఒకే మందు’ అన్న చందంగా.. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా రూపొందించిన ఈ షెడ్యూల్ వల్ల విద్యార్థులు లాభం కంటే నష్టమే ఎక్కువ పొందే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ లోకం హెచ్చరిస్తోంది. బోధన కన్నా..‘యాప్’ల గోలే మిన్న పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్న సంకల్పం మంచిదే అయినా.. ఆచరణలో ఉపాధ్యాయులపై పడుతున్న పని భారం అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తోంది. రోజూ ఉదయం జిల్లా కార్యాలయం నుంచి వచ్చే వాట్సాప్ ప్రశ్నపత్రాలను జిరాక్స్ తీయించడం, పరీక్ష పెట్టడం, ఆ వెంటనే మార్కులను సాయంత్రం లోపు ‘లీప్ యాప్’లో అప్లోడ్ చేయడం..ఇదంతా ఒక ప్రహసనంగా మారింది. బోధన కంటే ఈ సాంకేతిక పనులకే ఉపాధ్యాయుల సమయం హరించుకుపోతోంది. పిల్లలకు పాఠం చెప్పాలా? లేక యాప్ లో మార్కులు ఎక్కించాలా? అన్న సందిగ్ధంలో టీచర్లు కొట్టుమిట్టాడుతున్నారు. విరామం ఎరుగని ‘యంత్రాలు’ పిల్లలంటే యంత్రాలు కాదు..రక్తమాంసాలున్న మనుషులు. కానీ విద్యాశాఖ మాత్రం రెండవ శనివారాలు, ఆదివారాలు కూడా క్లాసులు పెట్టి వారిని రోబోల్లా మార్చేస్తోంది. ఇప్పటికే సిలబస్ పూర్తయిన తరుణంలో.. విద్యార్థులకు స్వయంగా చదువుకునేందుకు, పునశ్చరణ చేసుకునేందుకు సమయం ఇవ్వాలి. కానీ, సెలవు రోజుల్లో కూడా బడికి రప్పించడం వల్ల విద్యార్థులు తీవ్ర అలసటకు, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ‘మెదడుకు కాస్తంత విశ్రాంతి దొరికితేనే చదివింది వంటబడుతుంది. ఇలా ఊపిరి ఆడనివ్వకుండా చదివిస్తే..అసలుకే ఎసరు వస్తుంది’ అని సీనియర్ ఉపాధ్యాయులు సైతం వాపోతున్నారు. పది పరీక్షలకు వంద రోజుల ప్రణాళికతో ‘స్లో లెర్నర్స్’ బలి! అందరికీ ఒకే విధానం.. ఎలా సాధ్యం? జిల్లాలో 187 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ర్యాంకుల పరుగులో విద్యార్థులకు గండం వందరోజుల ప్లాన్తో ఒత్తిడి -
అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పార్వతీపురం: పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు గల క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేలా ఒక ప్రత్యేక శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశమందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో క్రీడాకారులకు కొదవలేదన్నారు. అర్జున అవార్డు గ్రహీతలు, కోడిరామూర్తినాయుడు లాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వెయిట్ లిఫ్టర్లున్నారన్నారు. అలాగే జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడాకారుల్లో రాణించిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 13 క్రీడా విభాగాల్లో జిల్లాస్థాయిలో ఎంపికలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించి తగిన తర్ఫీదు ఇవ్వనున్నట్లు తెలిపారు. పాఠశాల స్థాయిలో ఈనెల 12, 13 తేదీలలో, ఈనెల 15, 16, 17వ తేదీలలో జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. అలాగే జిల్లాలో వాటర్ స్పోర్ట్స్ (జలక్రీడలు) నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతాయని చెప్పారు. దీనికి సంబంధించి శాప్తో చర్చించగా అంగీకారం తెలిపిందన్నారు. 2030లో కామన్వెల్త్ గేమ్స్ భారతదేశానికి కేటాయించనున్న తరుణంలో క్రీడల్లో మరింత ప్రతిభ కనబరిచి కామన్వెల్త్ క్రీడలలో పాల్గొనేలా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో 3శాతం రిజర్వేషన్ ఉందని ఈమేరకు స్పోర్ట్స్లో ప్రతిభ కనబరిచిన వారికి ఉద్యోగాలు, ప్రవేశాలలో రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి పొల్గొన్నారు. -
చికిత్స పొందుతూ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
కురుపాం: కురుపాం–గొరడ ప్రధాన రహదారిలో బుడ్డెమ్మ ఖర్జ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఆదివారం సాయంత్రం ఢీ కొన్న ఘటనలో కిచ్చాడ పంచాయతీ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గోళ్ల గౌరీశంకర్ కు తీవ్ర గాయాలైన సంఘటన విదితమే. ఈ మేరకు సంఘటన స్థలం నుంచి కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి 108 వాహనంలో తరలించగా వైద్యులు ప్రాథమిక వైద్యం అందించిన తరువాత మెరుగైన వైద్య సేవల కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి విజయనగరం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడు గౌరీశంకర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ షాపులో అగ్నిప్రమాదంరాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి డోలపేట గ్రామంలోని ఎలక్ట్రానిక్స్ దుకాణంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. షాపులోనుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో షాపు యజమానితోపాటు స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్స్టేషన్కు సమాచారం అందించడంతో ఎస్సై పి.అశోక్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు ఏసీ, ఫ్రిడ్జ్, రిమ్మల్స్ స్పేర్పార్ట్స్ కాలిపోగా సుమారు రూ.2లక్షలు ఆస్తినష్టం సంభవించిందని ఫైర్ ఎస్సై తెలిపారు. 800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసంకురుపాం: ఎకై ్సజ్ దాడుల్లో 800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు సర్కిల్ పరిధిలో కొమరాడ మండలంలోని రెబ్బ గ్రామంలో సారా తయారీ కేంద్రాలపై సంయుక్తంగా దాడులు నిర్వహించగా సారా తయారీ కోసం 800 లీటర్ల బెల్లం ఊట నిల్వ ఉంచినట్లు గుర్తించి ధ్వంసం చేసినట్లు తెలిపారు. సారా బట్టీ నిర్వాహకుడిగా తాడంగి గోపాల్ను ఈ దాడుల్లో గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వి.వి.వి.ఎస్. శేఖర్బాబు, ఎస్సైలు రాజశేఖర్, చంద్రకాంత్, కురుపాం ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారన్నారు. 63 మద్యం బాటిల్స్ ధ్వంసం రాజాం సిటీ: స్థానిక టౌన్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడిన 63 మద్యం బాటిల్స్ను అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీరంగందొర మంగళవారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటున్నామ న్నారు. ఇప్పటికే ఎకై ్సజ్ సిబ్బందికి బెల్టు నిర్వహణపై దాడులు నిర్వహించేలా ఆదేశాలు జారీచేశామని తెలిపారు. అనంతరం పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలకు వేలం నిర్వహించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ కె.అశోక్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ముత్తూట్ ఫైనాన్స్లో అరకిలో బంగారం మాయంవిజయనగరం క్రైమ్: విజయనగరం ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో నుంచి అరకేజీ బంగారం మాయమైంది. ఆడిట్ తనిఖీకి వచ్చిన ఉద్యోగే ఏడు ప్యాకెట్లలో ఉన్న బంగారాన్ని సైడ్ చేశాడు. ఇందుకు సంబంధించి వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై రవి కేసు నమోదు చేశారు. ఆడిట్ తనిఖీల్లో భాగంగా ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో ఆడిట్ ఇన్స్పెక్టర్ మనోజ్ తనిఖీలు చేసే క్రమంలో మేనేజర్తో మాట్లాడుతుండగానే దాదాపు రూ.48 లక్షలు విలువ చేసే అరకేజీ బంగారాన్ని స్వాహా చేశాడు. తనిఖీ అనంతరం సీసీ ఫుటేజీని పరిశీలించిన బ్రాంచ్ మేనేజర్ కంగుతిని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తానే ఆ బంగారాన్ని పట్టుకెళ్లానని తిరిగి ఇమ్మని అడిగినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆత్మహత్య చేసుకుంటానని ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్కు మెసేజ్ చేశాడు. దీనిపై వన్టౌన్ ఎస్సై రవి ఫండ్స్ మిస్ అప్రోప్రియేషన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పిల్లల్ని యంత్రాలుగా మార్చొద్దు
పదో తరగతి విద్యార్థులపై ‘వంద రోజుల ప్రణాళిక’ పేరిట తీవ్ర ఒత్తిడి పెంచడం తగదు . శని, ఆదివారాల్లో తరగతుల నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాం.ఇప్పటికే సిలబస్ పూర్తయినందున వారికి కావాల్సింది విశ్రాంతి, స్వయం పఠనమే. అలాగే మరోవైపు సెలవుల్లో పనిచేయిస్తూనే.. ఉపాధ్యాయులకు ‘సీసీఎల్’ మంజూరులో కఠిన నిబంధనలు, మెలికలు పెట్టడం అన్యాయం. బోధనేతర పనుల భారం తగ్గించి, సీసీఎల్పై విధించిన అసంబద్ధ నిబంధనలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. – ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యాయుడు ఎన్.బాలకృష్ణ -
హింసకు గురైన మహిళలకు తక్షణ సహాయం
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ● వన్స్టాప్ సెంటర్ వాహనం ప్రారంభంవిజయనగరం ఫోర్ట్: హింసకు గురైన మహిళలకు తక్షణ సహాయం అందించాలనే ఉద్దేశంతో వన్స్టాప్సెంటర్ నూతన వాహనాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్ వద్ద వన్స్టాప్ సెంటర్ హెల్ప్ లెన్ వాహనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనంలో వైద్యం, న్యాయం, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలను అందించనున్నారని తెలిపారు. మహిళలను హింసజరిగే ప్రదేశం నుంచి (ఇల్లు, పని స్థలం) ఈకేంద్రాలకు తీసుకురావడం లేదా వారిని అవసరమైన ప్రదేశాలకు తరలించడానికి ఈ వాహనం ఉపయోగపడుతుందన్నారు. ఆపదలో ఉన్న మహిళకు హెల్ప్లైన్ వాహనం వన్స్టాప్ సెంటర్గా ఉపయోగపడుతుందన్నారు. మహిళలకు హెల్ప్లైన్ 181, పోలీస్ 100, ఆస్పత్రి 108 లీగల్ సర్వీసెస్ అనుసంధానం చేసి ఉన్నందున 24 గంటల పాటు సేవలు అందుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విమలారాణి, డీఎంసీ సుజాత, వన్స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ సాయి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కీలక ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయండి విజయనగరం అర్బన్: జిల్లాలో అమలవుతున్న పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, తోటపల్లి ప్రాజెక్టు, తారకరామ తీర్థసాగర్, జాతీయ రహదారి 130సీ, జాతీయ రహదారి 519ఈ, ఖుర్దారోడ్–విజయనగరం మూడోలైన్, కొత్తవలస, విజయనగరం నాలుగోరైల్వే లైన్ తదితర మేజర్ ప్రాజెక్ట్ల భూసేకరణ ప్రకటనలు, పరిహార చెల్లింపులు వంటి అంశాలను వివరంగా సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే సేకరించిన ప్రభుత్వ భూమిని వెంటనే సంబంధిత శాఖలకు అప్పగించాలని మిగతా భూసేకరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర ఎస్.సేతుమాధవన్, ఆర్డీఓలు దాట్ల కీర్తి, రామ్మోహన్, ఎస్డీసీ కళావతి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, అటవీశాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఆర్అండ్బీ, రైల్వే శాఖ అధికారులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు (భూసేకరణ) పాల్గొన్నారు. -
అదనపు ధాన్యం దోపిడీపై.. రైతన్న తిరుగుబాటు
పాలకొండ: చంద్రబాబు ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలు కర్షకులను ఆందోళనకు, అవస్థలకు గురిచేస్తున్నాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం ధర్నాలు చేస్తున్నారు. వ్యాపారులు, మిల్లర్ల దోపిడీపై పోరుబాటు సాగిస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో రైతు చేతికొచ్చిన ధాన్యం కోనుగోలు చేయాలంటే 80 కేజీల బస్తాకు మరో నాలుగు కేజీలు అదనంగా ఇవ్వాలని మిల్లర్లు డిమాండ్ చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా రైతులు తీసుకెళ్లిన ధాన్యం మిల్లుల వద్ద దింపేందుకు ఇబ్బందులు పెడుతుండడంతో చేసేది లేక మంగళవారం ఆందోళనకు దిగారు. పాలకొండ మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు.. మిలర్ల తీరుకు నిరసనగా రోడ్డెక్కారు. ముందుగా తహసీల్దార్ కార్యలయం వద్ద ధర్నా చేశారు. అక్కడ నుంచి నేరుగా పాలకొండ పట్టణంలోని రైస్ మిల్లుకు ధాన్యంతో ఉన్న ట్రాక్టర్లతో చేరుకున్నారు. అక్కడ రైసు మిల్లు యజమానితో వాగ్వాదానికి దిగారు. అదనంగా నాలుగు కేజీలు ధాన్యం ఇస్తేనే కొనుగోలు చేస్తామని మిలర్లు పట్టుబట్టారు. అక్కడికి పట్టణంలోని రైసు మిలర్లు అందరూ చేరుకుని రైతులతో ఎదురుదాడికి దిగారు.ఈ ఘటనతో రైతులు కలత చెందారు. వ్యవసాయశాఖ ఏఓను నిలదీశారు. అదనంగా ధాన్యం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపారు. రైతన్నను కన్నీరుపెట్టించే ప్రభుత్వం కూలిపోక తప్పదంటూ శాపనార్థాలు పెట్టారు. రైతు వ్యతిరేక విధానాలపై నినదించారు. ట్రైనీ ఎస్ఐ హేమలత, వ్యవసాయశాఖ ఏఓ, సీఎస్టీడీ సన్యాసిరావు రైతులు, మిలర్లకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అప్పటికీ రైతులు శాంతించక ధాన్యం బస్తాలను ప్రధాన రహదారిపై పారబోసేందుకు వాహనాలను తరలించారు. రోడ్డు మధ్యలో బస్తాలను పడేసేందుకు ప్రయత్నించారు. ట్రాక్టర్ను రోడ్డుపైకి తీసుకెళ్లిన సమయంలో ట్రైనీ ఎస్సై హేమలత అడ్డుకున్నారు. మిల్లర్లతో మాట్లాడుతానని చెప్పి రైతులను ఒప్పించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం తీసుకోవాలని చెప్పడంతో చేసేది లేక మిల్లర్లు 80 కేజీల లెక్కనే ధాన్యం తీసుకునేందుకు అంగీకరించారు. రైతులు ఆందోళన విరమించి ధాన్యం మిల్లులకు అప్పగించారు. పాలకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా రైస్ మిల్లు వద్ద ఆందోళన రహదారిపై ధాన్యం పారబోసే ప్రయత్నం అడ్డుకుని సర్దిచెప్పిన పోలీసులు -
సీపీఎస్ రద్దు చేయాలి
● కలెక్టర్కు ఏపీ సీపీఎస్ఈఏ నాయకుల వినతి విజయనగరం అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు అమలవుతున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ (ఏపీ సీపీఎస్ఈఏ) రాష్ట్ర అధ్యక్షుడువ బాజీ పఠాన్ డిమాండ్ చేశారు. జిల్లా ఖజానా కార్యాలయంలో సీపీఎస్ ఉద్యోగులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలవుతున్నా సీపీఎస్ రద్దుపై ఊసేలేదని విమర్శించారు. జీతాలు, డీఏ, పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లోని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కరీం రాజేశ్వరరావు, చీరల కిరణ్కుమార్, ఎల్బీ యుగంధర్, జి.సతీష్కుమార్, ఎస్టీయూ ఆదినారాయుణ, తదితరులు పాల్గొన్నారు. -
● రబీలోనూ వీడని యూరియా వెతలు
ఖరీఫ్లో యూరియా కోసం తిప్పలు పడిన రైతులకు రబీలోనూ కష్టాలు తప్పడం లేదు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం సాగులో ఉన్న కూరగాయలు, మొక్కజొన్న, ఉద్యానవన పంటలకు జల్లేందుకు యూరియా దొరకడం లేదు. చీపురుపల్లి మండలంలోని అలజంగి, గొల్లలములగాం, పెదనడిపల్లి, చీపురుపల్లి రైతు సేవా కేంద్రాల్లో మంగళవారం పంపిణీ చేసిన యూరియా కోసం రైతులు బారులు తీరారు. మండలానికి 49 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రావడం, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పంపిణీకి వ్యవసాయ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. పోలీసుల సమక్షంలో రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నారు. – చీపురుపల్లి -
163 సెల్ఫోన్స్ రికవరీ
● బాధితులకు అప్పగించిన ఎస్పీ దామోదర్విజయనగరం క్రైమ్: ఏ మొబైల్ ఫోన్ పోయినా ఇక నుంచి సైబల్ సెల్ స్టేషన్కు వెళ్లవనసరం లేదని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో మొబైల్ పోయినట్లు లేదా మిస్ అయినట్లు ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా పోయిన 163 సెల్ ఫోన్స్ రికవరీ చేసి వాటిని పొగొట్టుకున్న వారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసేందుకు ప్రత్యేకంగా ’మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం’ ఏర్పాటు చేశామన్నారు. ఈ విధానంతో విజయనగరంలో సైబర్ సెల్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదన్నారు. మొబైల్ పోగొ ట్టుకున్న వ్యక్తులు తమకు దగ్గరలోని పోలీస్ స్టేషన్ ను సంప్రదించి, పోగొట్టుకున్న మొబైల్స్ వివరాల ను అందించినట్లయితే, ’మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం’ ద్వారా పోయిన మొబైల్ను ట్రాక్ చేసేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు రూ.6.23కోట్ల విలువైన 3,463 మొబైల్ ఫోన్లు ట్రాక్ చేసి, బాధితులకు అందజేశామన్నారు. అదే విధంగా ప్రస్తుతం మరో 163 మొబైల్ ఫోన్లు సైబర్ సెల్ పోలీసులు, సిబ్బంది నిరంతరం శ్రమించి, ట్రాక్ చేశారని తెలిపారు. కార్యక్రమంలో సైబర్ సెల్ సీఐ శోభన్ బాబు, ఎస్బీ సీఐలు ఏవీ లీలారా వు, అంబేడ్కర్, డీసీఆర్బీ సీఐ కె.కుమార స్వామి, ఎస్సై రాజేష్, సైబర్ సెల్ సిబ్బంది శ్రీనివాసరావు, వాసుదేవ్, తిరుపతి నాయుడు, రాజేష్, నాగమణి, శిరీష పాల్గొన్నారు. -
సరుకుల సరఫరాకు టెండర్లు
సీతంపేట: స్థానిక గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలు, గిరిజన గురుకులాలు, కళాశాలలకు కాస్మోటిక్స్, నిత్యావసర సరుకుల సరఫరాకు అధికారులు మంగళవారం టెండర్లు నిర్వహించారు. జీసీసీ ఆధ్వర్యంలో నూనెలు, కందిపప్పు, మినపపప్పు, శనగ పలుకులు, ఇడ్లీనూక, కారం, పసుపు తదితర 25 రకాల నిత్యావసర సరుకులు, 10 రకాల కాస్మోటిక్స్ సరఫరాకు 9 మంది టెండర్ దారులు హాజరయ్యారు. టెండర్లు దక్కించుకున్నవారు ఈ నెల నుంచి ఫిబ్రవరి 2026 వరకు నాణ్యమైన సరుకులను సరఫరా చేయాలని ఐటీడీఏ ఏపీఓ ఎస్.వి.గణేష్ ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, జీసీసీ డీఎం సంధ్యారాణి, సీతంపేట, పాతపట్నం బ్రాంచ్ మేనేజర్లు దాసరి కృష్ణ, గొర్లె నరసింహులు, ఏటీడబ్ల్యూవోలు, హెచ్డ బ్ల్యూవోలు పాల్గొన్నారు. డీఈఓగా బ్రహ్మాజీరావు పార్వతీపురం: జిల్లా విద్యాశాఖాధికారిగా పి.బ్రహ్మజీరావును నియమిస్తూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. అల్లూరి జిల్లా డీఎస్ఈఓ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయనను పార్వతీపురం మన్యం జిల్లాకు పూర్తి బాధ్యతలను అప్పగిస్తూ బదిలీ చేశారు. ఇక్కడ డీఈఓగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న రాజ్కుమార్ డిప్యూటీఈఓగా కొనసాగనున్నారు. బ్రహ్మజీరావుకు గతంలో పార్వతీపురం మన్యం జిల్లాలో డీఈఓగా, పార్వతీపురం ఐటీడీఏ డిప్యూటీ ఈఓగా పనిచేసిన అనుభవం ఉంది. గత ఏడు నెలలుగా చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చిందని, రెగ్యులర్ డీఈఓను నియమించిందని ఉపాధ్యాయ, గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. బ్రహ్మజీరావు గురువారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని కార్యాలయ వర్గాలు తెలిపాయి. సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోని పాఠశాల నుంచి కళాశాల స్థాయిలో గల క్రీడాకారులను, ప్రతిభావంతులను గుర్తించి, వారికి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చి ప్రోత్సహించేలా ఒక ప్రత్యేక క్రీడా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో విద్యార్థి స్థాయి నుంచి కళాశాల వరకు కూడా ప్రత్యేక దృష్టి సారించి, క్రీడలపై పూర్తి స్థాయి తర్ఫీదు ఇవ్వడానికి వీలుగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని యంత్రాంగం నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగా 13 క్రీడా విభాగాలలో జిల్లా స్థాయిలో ఎంపికలు జరుగుతాయని, జిల్లా వ్యాప్తంగా ఎంపికలను నిర్వహించి తగిన ప్రతిభ, అర్హత కలిగిన క్రీడాకారులను గుర్తించి, వారు ఎక్కడ చదువుతున్నప్పటికీ ఒక ప్రత్యేకమైన స్పోర్ట్స్ స్కూల్ను గుర్తించి తగిన తర్ఫీదు ఇవ్వనున్నామని చెప్పారు. 12న కోటదుర్గమ్మ హుండీల ఆదాయం లెక్కింపు పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మవారి హుండీల ఆదాయా న్ని ఈ నెల 12న లెక్కిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యనారాయణ మంగళవా రం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ పెద్దలు, పురోహితులు, దేవదాయశాఖ, పోలీస్ అధికారుల సమక్షంలో ఉదయం 9 గంటలకు హుండీలను తెరచి కానుకలు లెక్కిస్తామన్నారు. మెరుగైన విద్యాబోధన అందించాలి ● విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ విజయభాస్కర్ నెల్లిమర్ల: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని పాఠశాల విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ కె.విజయభాస్కర్ సూచించారు. నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన టీచ్టూల్ శిక్షణను ఆయన పరిశీలించారు. శిక్షణకు సంబంధించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు సూర్యనారాయణమూర్తి, జ్ఞానశంకర్, తదితరులు పాల్గొన్నారు. -
13న పారా రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు
విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 13న స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో 4వ రాష్ట్రస్థాయి పారా పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్–2025 పోటీలు నిర్వహించనున్నామని జిల్లా క్రీడాధికారి ఎస్. వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన కార్యాలయంలో పోటీలకు సంబంధించిన పోస్టర్స్ను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.దయానంద్తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిసారిగా పారా రాష్ట్ర స్థాయి పోటీలు విజయనగరంలో నిర్వహించడం శుభపరిణామమన్నారు. ఈ పోటీలకు అన్ని జిల్లాల నుంచి పారా క్రీడాకారులు హాజరు కానున్నారని, జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ విభాగాలకు సంబంధించి పోటీలు నిర్వహించనున్నారన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను ఉత్తరాఖండ్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న పారా పవర్ లిఫ్టర్ లు ఈ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ చాటాలని కోరారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ 9849377577 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె. దయానంద్, కోచ్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రెయిన్ యోగా ఒక అద్భుతం
● అంతర్జాతీయ బ్రెయిన్ యోగా గురువు పిడుగు శ్రీనివాసులువిజయనగరం: బ్రెయిన్ యోగా ఒక అద్భుతమని బెంగళూరుకు చెందిన ప్రముఖ బ్రెయిన్ యోగా గురువు, అంతర్జాతీయ శిక్షకుడు పిడుగు శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లాశాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక స్పష్టతను పెంచడం, ఆందోళనను తగ్గించడం, నాడీ వ్యవస్థను ఉత్తేజపరచడం, మెదడుకు రక్త ప్రసరణను పెంచడం, న్యూరోన్ల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం వంటివి బ్రెయిన్ యోగాతో సాధ్యమన్నారు. ఈ సందర్భంగా వివిధ ముద్రలతో బ్రెయిన్ ఎక్సర్సైజ్ విద్యార్థులతో చేయించడమే కాక వాటి విశిష్టతను విపులంగా వివరించారు. ఈ సందర్భంగా యోగా గురువు పిడుగు శ్రీనివాసులును, రోటరీ లీడ్ ఇండియా చైర్మన్ దుర్గాబాలాజీ, పాఠశాల ప్రిన్సిపాల్ పూడి శేఖర్తో కలిసి గురుప్రసాద్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ లీడ్ ఇండియా ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ చైతన్య, జగదీష్, లత తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
పాలకొండ రూరల్: మండలంలోని పణుకువలస కూడలి వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్సై కె.ప్రయోగమూర్తి అందించిన వివరాల మేరకు మండలంలోని బుక్కూరు గ్రామానికి చెందిన పొట్నూరు రామినాయుడు(57) పణుకువలస నుంచి తన స్వగ్రామం వస్తుండగా వీరఘట్టం వెళ్తున్న గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొంది. దీంతో రామినాయుడు తీవ్రంగా గాయపడగా పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. మృతుడి భార్య చిన్నమ్మడు మరణించగా కుమార్తె రూప ఉంది. తండ్రి మరణంతో నిరుపేద కుటుంబానికి చెందిన కుమార్తె ఒంటరిగి మిగిలింది. వ్యవసాయ వేతనదారుగా, పశువుల కాపరిగా గ్రామస్తులతో కలివిడిగా ఉండే రామినాయుడు మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
లారీ యజమానుల వర్రీ..!
సాలూరు: విజయవాడ తరువాత సాలూరులోనే లారీ పరిశ్రమ పెద్దది. సుమారు 2 వేలకు పైగా లారీలు సాలూరులో ఉన్నాయి. ఈ లారీపరిశ్రమ ఆధారంగా సాలూరు, పరిసర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్ను అమలుచేస్తూ రాష్ట్రంలో లారీలకు సంబంధించి టెస్టింగ్ ఫీజులు, సర్టిఫికేషన్ ఫీజులు భారీగా పెంచి వసూలు చేయడం లారీ పరిశ్రమకు తీరని దెబ్బగా మారింది.ఇప్పటికే అన్ సీజన్ కావడంతో ట్రిప్పులు లేక లారీ పరిశ్రమ మందకొడిగా సాగుతోంది. ఇటువంటి సమయంలో పక్క రాష్ట్రాల్లో అమలుచేయకపోయినా, మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అమలుచేసి తద్వారా టెస్టింగ్ ఫీజులు సర్టిఫికేషన్ ఫీజులు భారీగా పెంచి వసూలు చేయడం ప్రారంభించారు, ప్రస్తుతం హెవీ వాహనాలకు వసూలు చేస్తున్న రూ.1.340 ఫిట్నెస్ ఫీజును 20 సంవత్సరాలు దాటిన వాహనాలకు రూ.33,040లకు పెంచి వసూలు చేస్తున్నారు. అంతేకాక 13 సంవత్సరాలు దాటిన వాహనాలపై కూడా గణనీయమైన పెరుగుదల విధించారు. ఈ నిర్ణయం లారీ పరిశ్రమకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తోంది. పాత వాహనాలే అధికం నూతన లారీల ధరలు అధికం కావడంతో, సాధారణంగా చాలావరకు పాత వాహనాలను వీలైనంత వరకు కొనుగోలు చేసి స్థానిక ప్రాంతాల్లో స్వయం ఉపాధితో కుటుంబాలను పోషించుకుంటున్నారు. ముఖ్యంగా రైల్వే గూడ్స్ షెడ్ల నుంచి షిప్పింగ్ యార్డుల నుంచి గోదాములకు సరుకుల రవాణా కోసం లారీలను వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోనూ 15 సంవత్సరాలు దాటిన వాహనాల శాతం చాలా తక్కువ. పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో సుమారు 3500 రైల్వే,షిప్యార్డు గూడ్స్ రవాణా చేసే లారీలు ఉన్నాయి. ఉపాధికోల్పోయే ప్రమాదం పెంచిన ఽఫీజులకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ యథాతథంగా అమలుచేస్తే పాత లారీ యజమానులు అందరూ ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. టెస్టింగ్ ఫీజులు, సర్టిఫికేషన్ ఫీజులు భారీగా పెంపునకు సంబంధించి కేంద్రప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ మిగిలిన చాలా రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు. మరి మన రాష్ట్రంలోనే ఎందుకు అమలుచేస్తున్నారు. దీని అమలు వల్ల లారీ పరిశ్రమ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంది. మనకు చాలా వరకు పాతలారీలే అధికంగా ఉన్నాయి. పార్వతీపురం,విజయనగరం జిల్లాల్లో సుమారు 3500 రైల్వే,షిప్యార్డు గూడ్స్ రవాణా చేసే లారీలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ చార్జీలను తగ్గించాలని కోరుకుంటున్నాం. గొర్లె మధుసూదనరావు, స్టేట్ లారీ జోనల్ అసోసియేషన్ సెక్రటరీ, సాలూరు రాష్ట్ర ప్రభుత్వం పాత టెస్టింగ్ ఫీజులు, సర్టిఫికేషన్ ఫీజులను కొనసాగించి స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్న వాహనయజమానులకు అండగా నిలవాలని లారీ యజమానులు కోరుకుంటున్నారు. అలాకాకుండా ఈ పెంచిన ఫీజులను వసూలు చేసినట్లయితే ,మంగళవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో ఉన్న రైల్వే గూడ్స్షెడ్స్, షిప్యార్డుల్లో గూడ్స్ రవాణా నిలుపుదల చేస్తామని స్పష్టం చేశారు. టెస్టింగ్ ఫీజులు, సర్టిఫికేషన్ ఫీజులు భారీగా పెంపు ఫీజుల పెంపు వల్ల పరిశ్రమపై తీవ్రభారం నేటి అర్ధరాత్రి నుంచి లారీల్లో రైల్వే, షిప్యార్డు గూడ్స్ రవాణా నిలుపుదల పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో సుమారు 3500 రైల్వే, షిప్యార్డు గూడ్స్ రవాణా చేసే లారీలు -
పీజీఆర్ఎస్కు పోటెత్తిన వినతులు
● త్వరితగతిన పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు ● 273 అర్జీల స్వీకరణవిజయనగరం అర్బన్: కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ సంఖ్యలో అర్జీలు పోటెత్తాయి. ఈ కార్యక్రమంలో మొత్తం 273 వినతులు స్వీకరించగా వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎం.రాంసుందర్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మొత్తం వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖకు 120, డీఆర్డీఏకు 45, జిల్లా పంచాయతీ రాజ్కు 13, వైద్యశాఖకు 15, మున్సిపల్, విద్యుత్ శాఖలకు 10, గ్రామసచివాలయాలకు సంబంధించి 7, హౌసింగ్కు 4, ఇతర శాఖలకు 43, డీసీహెచ్ఎస్ శాఖకు రెండు అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలపై ఎండార్స్మెంట్ చేసే ముందు అధికారులు అర్జీదారును తప్పనిసరిగా కలిసి మాట్లాడాలని మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్టులో నమోదు చేయాలని స్పష్టం చేశారు. అలాగే పీజీఆర్ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100కు అందే కాల్స్కు కూడా సత్వరం సరైన సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. వినతుల స్వీకరణలో కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, బి.శాంతి, కళావతి తదితరులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను విని వెంటనే సంబంధిత శాఖల అధికారులకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో సర్వే ఎ.డి ఆర్. విజయకుమార్, కలెక్ట్రేట్ ఏవో దేవీప్రసాద్, సీపీఓ బాలాజీ, జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంనాయుడు, వ్యవసాయ శాఖ జేడీ రామారావు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ అన్నపూర్ణమ్మ, బీసీ సంక్షేమ అధికారి జ్యోతిశ్రీ, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, మార్క్ఫెడ్ మేనేజర్ వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ విమలరాణి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి, మైక్రో ఇరిగేషన్ పీడీ లక్ష్మీనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదు దారులపై పోలీస్ సిబ్బంది అసహనం విజయనగరం క్రైమ్: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ దామోదర్ తన చాంబర్లోను, ఏఎస్పీ సౌమ్యలత కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించారు. పీజీఆర్ఎస్లో 40 మంది ఫిర్యాదు దారులు తమ సమస్యలను చెప్పుకోగా, సిబ్బంది మాత్రం ఫిర్యాదుదారులపై అసహనం వ్యక్తం చేశారు. ఏఎస్పీ సౌమ్యలత ఫిర్యాదు దారుల సమస్యలను క్షుణ్ణంగా ఆలకించి వారి సమస్యలపై వారిముందే సంబంధిత స్టేషన హౌస్ ఆఫీసర్లతో ఫోన్లో మాట్లాడారు.అనంతరం ఫిర్యాదు దారుల సమస్యలను డేటాలో నిక్షిప్తం చేసే క్రమంలో సిబ్బంది వారిపై అసహనం ప్రదర్శించారు. పనిలో వస్తున్న ఒత్తిడిని, ఫిర్యాదు దారులపై అసహనం రూపంలో వ్యక్తం చేశారు. సమస్యతో రోడ్డుక్కినప్పుడు లేని సిగ్గు, ఆందోళన, భయం..స్టేషన్ కు వెళ్లమంటే ఏమొచ్చిందంటూ ఓ పెద్దాయనతో డీపీఓలో సిస్టం ముందు కూర్చుని అంశాలను కంప్యూటర్ లోకి ఎక్కిస్తున్న ఓ కానిస్టేబుల్ అసహనం వ్యక్తం చేశాడు. వచ్చిన ఫిర్యాదులను ఎస్హెచ్ఓలు క్షుణ్ణంగా పరిశీలించాలని వాటిని ఏడు రోజుల్లో పరిష్కరించాలని ఎస్పీ దామోదర్ అదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సిబ్బందిని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ కె. కుమార స్వామి, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, అంబేడ్కర్, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డిపార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారాన్ని ఇవ్వాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన ప్రజలు 82 వినతులు అందజేశారు. వినతుల్లో రెవెన్యూకు సంబంధించి 12, సాధారణ అర్జీలు 70 ఉన్నాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యంగా అర్జీలను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అర్జీలను స్వీకరించినవారిలో డీఆర్ఓ కె.హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్.దిలీప్ చక్రవర్తి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీసులు, ప్రజల మధ్య పరస్పర విశ్వాసం బలోపేతం చేయాలి పార్వతీపురం రూరల్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారుల నుంచి స్వీకరించిన సమస్యలను వీలున్నంత మేరకు పరిష్కరించి పోలీసుశాఖ, ప్రజల మధ్య పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేయాలని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలో ఉన్న పలు స్టేషన్ల పరిధిలో నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా వచ్చిన ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీపత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసం, ప్రేమ పేరుతో మోసం, ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించగా వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఎస్పీ ఫోన్లో మాట్లాడి వచ్చిన ఫిర్యాదులు వాస్తవాలైనట్లైతే చట్టపరిధిలో చర్యలు చేపట్టి తీసుకున్న చర్యల నివేదికను తన కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. మొత్తంగా 9 ఫిర్యాదులు ఎస్పీ పీజీఆర్ఎస్కు అందాయి. కార్యక్రమంలో ఎస్పీతోపాటు జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీసీఐ ఆదాం, ఎస్సై రమేష్నాయుడు మరికొందరు సిబ్బంది ఉన్నారు. డీకేటీ భూములకు అందని అన్నదాత సుఖీభవ సీతంపేట: డీకేటీ, ఆర్వోఎఫ్ఆర్ భూములు సాగుచేస్తున్న గిరిజన రైతులకు అన్నదాత సుఖీబవ నిధులు బ్యాంకు ఖాతాలో జమకాలేదని వైఎస్సార్సీపీ నాయకులు హెచ్.మోహన్రావు, వి.చలపతి, అప్పారావు, మంగయ్య, వెంకునాయుడు తదితరులు ఐటీడీఏలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పీహెచ్వో ఎస్వీ గణేష్కు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో రైతు భరోసాలో అందరికీ నిధులు వచ్చాయని, ఇప్పుడు పూర్తిగా అందలేదన్నారు. గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. ఇతర వినతులు పరిశీలిస్తే ఓండ్రుజోలకు చెందిన అంగన్వాడీ ఆయా సునోమి 19నెలల పెండింగ్ వేతనాలు ఇప్పించాలని కోరింది. ఐటీఐ ఎదురుగా ఇళ్ల నిర్మాణం చేసుకున్న గిరిజనులకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు వినతిపత్రం ఇచ్చారు. కిరాణాషాపు పెట్టుకోవడానికి రుణం ఇప్పించాలని శిలిగాంకు చెందిన సవర అప్పలమ్మ కోరింది. చింతలగూడకు చెందిన వి.సొంబరు ఆర్వోఎఫ్ఆర్ భూములను సర్వే చేసి పట్టాలిప్పించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీఈవో రామ్మోహన్రావు, వ్యవసాయాధికారి వాహినిణి, ఏపీడీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
తండ్రే హంతకుడు
● అనుమానాస్పద మృతిలో వీడిన మిస్టరీ పాలకొండ రూరల్: ఇటీవల పాలకొండ మండలం బుక్కూరు గ్రామంలోని స్వగృహంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ జామి విఠల్రావు (49) మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సీఐ ఆమిటి ప్రసాదరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. వ్యసనాలకు బాని సైన విఠల్రావు నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి కుటుంబసభ్యులను వేదిస్తుండేవాడన్నారు. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీన రాత్రి మద్యం మత్తులో వచ్చిన విఠల్రావు ఇంట్లో గొడవ పడ్డాడు. ఈ ఘర్షణలో మృతుడి తండ్రి రామప్పడు కోపం తట్టుకోలేక, సహనం కల్పోయి గొడ్డలితో తన కుమారుడిపై దాడి చేయగా తీవ్రంగా గాయపడిన విఠల్రావు మృతి చెండాడు. తమ దర్యాప్తులో తండ్రి ఈ నిజం అంగీకరించినట్లు సీఐ సోమవారం మీడియాకు తెలిపారు. మండల వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ మృతి కేసును కేవలం 7 రోజుల వ్యవధిలో పోలీసులు ఛేదించారు. ఘటన జరిగిన రోజు జాగిలాలు ఘటన స్థలం చుట్టూ తిరిగి రామప్పడు వద్దకు వచ్చి నిలిచిపోవడంతో ఆ దిశగా దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ షాక్కు గురైన విద్యార్థిమెంటాడ: మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి చదువుతున్న కిలారి రామ్చరణ్ విద్యుత్ షాక్కు గురయ్యాడు. రామ్చరణ్ ఆడుకుంటూ మేడపైకి వెళ్లి అక్కడున్న ఊచను పైకెత్తి పట్టుకున్నాడు. ఈ క్రమంలో పై నుంచి వెళ్తున్న 11కేవీ విద్యుత్ తీగలకు ఇనుప ఊచ తగలడంతో షాక్కు గురయ్యాడు. అరచేతులు బొబ్బలెక్కాయని, అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదమే తప్పిందని విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పటికై నా పాఠశాల పై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలను తరలించాలని స్థానికులు కోరుతున్నారు. -
పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష
● 4 నెలల్లోనే కోర్టు తీర్పు విజయనగరం క్రైమ్: విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయికి శిక్ష పడేలా ఎస్సై శిరీష చార్జ్షీట్ తయారు చేసి..4 నెలల్లో ముద్దాయికి జైలు శిక్ష పడేలా చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..నగరంలోని గాజులరేగకు చెందిన బొండపల్లి సత్యారావు, (59) ఈ ఏడాది ఆగస్ట్ 18న తన మనుమరాలు బాలిక (6)పై ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగికదాడికి యత్నించాడు. వెంటనే బాలిక తల్లి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్సై శిరీష పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ ఆర్.గోవిందరావు కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. విచారణలో నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి ముద్దాయికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించడంతో పాటు, బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఆరుగురు పేకాటరాయుళ్లపై కేసు నమోదువీరఘట్టం: మండలంలోని చిట్టపులివలస మామిడితోటలో పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.కళాధర్ సోమవారం తెలిపారు. ఆదివారం రాత్రి ఇక్కడ పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి దాడి చేసి పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.43,500లు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై చెప్పారు. విజయనగరం: ఇటీవల ముంబైలో కేంద్రప్రభుత్వం నిర్వహించిన ‘ఒలింపియాడ్ అమెచ్యూర్ ఇండియా‘ బాడీ బిల్డింగ్ పోటీల్లో దివ్యాంగుల విభాగానికి సంబంధించి జరిగిన పోటీలో జిల్లాకు చెందిన బాడీ బిల్డర్ ఈదుబిల్లి సూర్యనారాయణ గోల్డ్ మెడల్ సాధించి అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని, ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ప్రశంశించారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్తో కలిసి సూర్యనారాయణ సోమవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పుట్టుకతోనే పోలియో బారిన పడిన సూర్యనారాయణ ఏ మాత్రం నిరాశ చెందకుండా బాడీ బిల్డింగ్ పట్ల తనకున్న ఆశక్తితో సాధన చేస్తూ అనేక రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో మెడల్స్ సాధిస్తూ అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రశంసించారు. వచ్చే ఏడాది మార్చి 6న అమెరికాలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికై న సూర్యనారాయణ అక్కడ కూడా ప్రతిభ చాటి అంతర్జాతీయస్థాయిలో జిల్లా కీర్తి ప్రతిష్టలు మరింతగా పెంచాలన్నారు. ఈ సందర్భంగా సూర్యనారాయణను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
మత్తుపై సమర భేరి
● జిల్లా కేంద్రంలో అభ్యుదయ సైకిల్ యాత్రకు బ్రహ్మరథం ● 3వేల మందితో భారీ మానవహారంపార్వతీపురం రూరల్: మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మార్గదర్వకత్వంలో పాయకరావుపేటనుంచి ఇచ్చాపురం వరకు సాగుతున్న అభ్యుదయం సైకిల్ యాత్ర సోమవారం జిల్లా కేంద్రంలో అడుగుపెట్టగా అపూర్వ స్పందన లభించింది. మరిపివలస నుంచి మొదలైన ఈయాత్ర జిల్లా కేంద్రంలోని చర్చి జంక్షన్కు చేరుకోగానే పండగ వాతావరణంలో కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి, ఎస్పీ మాధవ్ రెడ్డి, జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనిషా రెడ్డిలు యాత్రకు ఘన స్వాగతం పలికారు. డప్పులు, తప్పెటగుళ్లు, కోలాటాల నడుమ అధికారులే స్వయంగా సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొనడం యువతలో నూతనూత్తేజం నింపింది. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్వద్ద 3వేలమంది విద్యార్థులు, ప్రజలతో భారీ మానవహారంగా రూపొంది డ్రగ్స్ వద్దుబ్రో అంటూ ముక్తకంఠంతో నినదించారు. సరదాకోసం చేస్తే జీవితం బలి స్థానిక కన్యకాపరమేశ్వరి కల్యాణ మంటపంలో జరిగిన సభలో ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ యువతను పక్కదోవ పట్టించేందుకు కొందరు చాక్లెట్ల రూపంలో మత్తును చిమ్ముతున్నారని ఆకర్షణీయమైన మాటలతో వలవేసే వారిని నమ్మొద్దని , గంజాయి మహ్మరి మొదడును మొద్దుబార్చి, భవిష్యత్ను అంధకారం చేస్తుందని హెచ్చరించారు. గంజాయి రహిత జిల్లానే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మేరకు డీఐజీ గోపీనాఽథ్ జెట్టి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. -
రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలి
● జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు గోపాల్, విజయలక్ష్మివిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్గేమ్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజేతలుగా తిరిగి రావాలని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మిలు ఆకాంక్షించారు. ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరగనున్న అండర్ –14 బాలబాలికల ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్లతో పాటు ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో జరగనున్న అండర్–17 బాలుర హాకీ పోటీల్లో పాల్గొనబోయే జట్టు సోమవారం బయల్దేరాయి. ఈ సందర్భంగా జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. విద్యార్థి దశలో క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉంటుందని, ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభాపాటవాలు కనబరచాలని ప్రోత్సహించారు. తద్వారా జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించి, ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
కోటి సంతకాల ర్యాలీలను విజయవంతం చేయండి
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సాలూరు: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నిర్వహించిన కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన వచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. సేకరించిన సంతకాల ప్రతులతో ఈ నెల 10న సాలూరులో, 15న జిల్లా కేంద్రంలో నిర్వహించే ర్యాలీల్లో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొనాలని కోరారు. సాలూరు పట్టణంలోని తన గృహంలో ఆయన మాట్లాడుతూ బుధవారం ఉదయం 10.30 గంటలకు పట్టణంలోని ఆఫీషియల్ కాలనీలోని తన గృహం నుంచి మెయిన్ రోడ్డు వరకు ర్యాలీ సాగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజల నుంచి సేకరించిన సంతకాల ప్రతుల బాక్సుల వాహనాన్ని మెయిన్రోడ్డు వద్ద జెండా ఊపి జిల్లా కేంద్రానికి తరలిస్తామని చెప్పారు. -
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
● అందరిదీ ఒకటే మాట ● క్వింటాకు 5 కిలోలు అదనంగా ఇస్తేనే ధాన్యం దించేది.. ● చోద్యం చూస్తున్న అధికారులు అందరికీ అన్నంపెట్టే రైతులను ఆదుకోకపోతే ఎలా? కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పని చేయకపోవడం, మిల్లర్ల దోపిడీ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టి సారించాలి. ధాన్యం సేకరణలో నిబంధనలు కఠినతరం చేయాలి. – గులిపిల్లి అప్పలనాయుడు, రైతు సంఘం నాయకుడు పంట పండించిన తర్వాత ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. లోడింగ్, రవాణా.. ఇలా అన్ని విషయాల్లోనూ దోపిడీకి గురవుతున్నాం. క్వింటాకు రూ.150 నుంచి రూ.200 వరకు పొలం నుంచి తీసుకురావడానికి ఖర్చవుతోంది. ఆ మొత్తం మేమే పెట్టుకుంటున్నాం. మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారు. ఏదో ఒక మెలిక పెట్టి, దోచుకుంటున్నారు. – గొర్లె వెంకట జగన్నాథరావు, తంపటాపల్లి, పాలకొండ మండలం జిల్లాలో మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు జోరుగా ప్రచారం చేశారు. దళారులకు విక్రయించవద్దని చెప్పుకొచ్చారు. అందుకు భిన్నంగా క్షేత్రస్థాయిలో ఉంది. క్వింటాకు 5 కిలోల నుంచి పది కిలోల వరకు మిల్లర్లు అడుగుతున్నారు. గట్టిగా అడిగితే.. ఏ మిల్లుకు తీసుకెళ్లినా ఇదే పరిస్థితి అని పబ్లిక్గా చెబుతున్నారు. అధికారులు ఏం చేస్తున్నట్లు? – బుడితి అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం.సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించి ప్రభుత్వం చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయి పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంటోంది. కొనుగోలు కేంద్రాల నుంచి సేకరణ ఎక్కడా పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఇదే మిల్లర్లకు, వ్యాపారులకు అవకాశంగా మారింది. మిల్లర్లు అంతా సిండికేట్ అయి, ఒకే తీరున రైతులను దోచుకుంటున్నారు. జిల్లాలో 104 రైస్ మిల్లులున్నాయి. క్వింటా ధాన్యానికి ఐదు కిలోలు అదనంగా ఇస్తే గానీ, రైతులు తెచ్చిన బస్తాలను ఎక్కడా దించడం లేదు. ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే.. వివిధ సాకులు చూపి ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏ మిల్లుకు తీసుకెళ్లినా ఇలానే ఉంటుందని నేరుగా చెబుతున్నారు. దీంతోపాటు దింపుడు కూలీల కింద రూ.5 నుంచి రూ.10 వరకు వసూలు చేస్తున్నారు. రైతు నుంచి నుంచి ప్రతి గింజనూ తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ఆచరణలో అది అమలు కావడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని 150 కొనుగోలు కేంద్రాలు ఉండగా.. ఇప్పటి వరకు లక్ష్యంలో పావువంతు కూడా సేకరణ కాలేదు. దీంతోపాటు.. మిల్లర్ల, వ్యాపారుల అదనపు దోపిడీకి రైతులు బలవుతున్నారు. రైతు పొలం నుంచి బయటకు రావడానికి బస్తాకు రూ.40 ఖర్చు అవుతోంది. తూకానికి రూ.25, లోడింగుకు రూ.10, మిల్లుకు వెళ్లడానికి రూ.50 నుంచి రూ.100 వరకు రవాణా కోసం వసూలు చేస్తున్నారు. దూరాన్ని బట్టి దోచుకుంటున్నారు. రైతులు ఇవేవీ భరించలేక.. పొలం నుంచి ఇళ్లకు బస్తాలు తీసుకెళ్లలేక ఎంతోకొంతకు వ్యాపారులు, దళారులకే విక్రయించుకుంటున్నారు. అధికారుల తనిఖీలూ తూతూమంత్రంగానే సాగుతున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రకృతి విపత్తుల వల్ల కోతలు కొన్నిచోట్ల ఆలస్యమయ్యాయి. పంట ముదిరింది. దీంతో కొంత గుండవ్వగా.. మరికొన్ని చోట్ల రంగు మారింది. ఇదే అదునుగా దళారులు, మిల్లర్ల దోపిడీకి పాల్పడుతున్నారు. అధికారులు వినే పరిస్థితి లేదు. మొక్కుబడిగా తనిఖీలు చేసి ఊరుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న అధికార యంత్రాంగం చేతులెత్తేస్తోంది. జిల్లాలో 3.50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది. 2.50 లక్షల ఎంటీలు కొనుగోలు చేస్తామని పౌరసఫరాల సంస్థ అధికారులు అంటున్నారు. వాస్తవానికి ఏటా వస్తున్న దిగుబడిని పరిగణనలోకి తీసుకుంటే అంతకుమించి కొనుగోలు చేయాల్సి ఉంది. చివరికి వచ్చేసరికి తమ లక్ష్యం పూర్తయ్యిందని అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే మిల్లర్లు ఆలస్యం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చాలా వరకు సచివాలయాల్లో గ్రేడింగ్ చేయడం లేదు. మిల్లర్ల వద్దకే పంపిస్తున్నారు. వారు ఇష్టానుసారం మెలికలు పెట్టి దోచుకుంటున్నారు. తేమశాతమని, రంగు మారిందని, పొల్లు ఎక్కువగా ఉందని సాకులు చెబుతూ క్వింటా వద్ద 5 నుంచి 10 కిలోల వరకు అదనంగా తీసుకుంటున్నారు. పాలకొండ డివిజన్ పరిధిలో సబ్కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సైతం మిల్లర్ల దోపిడీని గుర్తించి.. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. బలిజిపేట మండలంలోని ఓ రైస్ మిల్లులో కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఆకస్మిక తనిఖీ చేయగా.. అక్కడ తూనిక యంత్రం సరిగ్గా లేకపోవడం, తూకంలో అవకతవకలకు పాల్పడటం గుర్తించారు. మిల్లుకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఇటువంటి పరిస్థితే మిల్లుల్లో ఉంది. -
‘కోటి సంతకాలకు’ విశేష స్పందన
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ రేగిడి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటిసంతకాల సేకరణకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో అనూహ్య స్పందన వస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. రేగిడిలో విలేకరులతో సోమ వారం ఆయన మాట్లాడారు. ఈ నెల 10న నియో జకవర్గ స్థాయిలో కోటి సంతకాల ప్రతుల సేకరణకు, ఈ నెల 15న జిల్లా స్థాయిలో చేపట్టనున్న కోటి సంతకాల ర్యాలీకి ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫీజురీయింబర్స్ మెంట్ నిధులు విడుదల కాక విద్యార్థులు, ఎరువులు, విత్తనాలు దొరకకపోవడం, పంట కొనుగోలు చేయక రైతులు, ఉద్యోగాలులేక, నిరుద్యోగ భృతి అందక నిరుద్యోగులు, పింఛన్లు మంజూరుకాక అర్హులు, రీ వెరిఫికేషన్తో దివ్యాంగులు.. ఇలా ప్రతి వర్గం ఇబ్బందులు పడుతోందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని ఇచ్చిన హామీ నీటిమూటగా మారిందన్నారు. ఆయన వెంట పార్టీ ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు పాలవలస దవళేశ్వరరావు ఉన్నారు. -
నిబంధనలు పాటించకపోతే చర్యలు
పార్వతీపురం: ధాన్యం కొనుగోలు, మిల్లింగ్ ప్రక్రియలో నిబంధనలను పాటించని మిల్లర్లపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ధాన్యం కొనుగోలుపై కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీస ప్రాథమిక వసతులు, భద్రతా ప్రమాణాలను పాటించని మిల్లులను బ్లాక్లిస్టులో చేర్చాలని ఆదేశించారు. బ్యాంకు గ్యారెంటీలు ఆలస్యం చేస్తున్న మిల్లర్ల వివరాలు అందజేయాలన్నారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని, తూనికల్లో తేడాలు చేసినా, అదనపు ధాన్యం డిమాండ్ చేసినా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, సివిల్ సప్లై డీఎం శ్రీనివాస్, డీఎస్ఓ బాల సరస్వతి, జిల్లా వ్యవసాయాధికారి అన్నపూర్ణ, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ● కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి -
గిరిజన జీవన విధానంపై అధ్యయనం
సీతంపేట: గిరిజన జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలపై తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ, అభ్యుదయ కవి గోరటి వెంకన్న సోమవారం అధ్యయనం చేశారు. సీతంపేట మండలంలోని అక్కన్నగూడ గ్రామాన్ని సందర్శించారు. ఆదివాసీ గిరిజనులతో మాట్లాడారు. వారు మాట్లాడే భాష, పండగలు జరుపుకుంటున్న విధానం తెలుసుకున్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. అభ్యసన తీరును పరీక్షించారు. ఆయన వెంట సీఎంఓ చిరంజీవి, టీడబ్ల్యూటీయూ నాయ కుడు మూటక రవి, తదితరులు పాల్గొన్నారు. 13, 14 తేదీల్లో జెన్ఏఐ హ్యాక్థాన్ సమ్మిట్ ● విజయవంతం చేయాలని జేఎన్టీయూ జీవీ వీసీ సుబ్బారావు పిలుపు విజయనగరం రూరల్: జేఎన్టీయూ జీవీలో ఈ నెల 13, 14న నిర్వహించనున్న జెన్ఏఐ హ్యాక్థాన్ సమ్మిట్ను విజయవంతం చేయా లని వర్సిటీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు పిలుపునిచ్చారు. జెన్ఏఐ వర్సిటీ సహకారంతో నిర్వహిస్తున్న ‘జెన్ఏఐ హ్యాక్థాన్ ఫర్ నెక్ట్స్ జెనరేషన్ జాబ్స్’ వాల్పోస్టర్ను వర్సిటీలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ భవిష్యత్ ఉద్యోగాల రూపకల్పనలో జనరేటివ్ ఏఐ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. జెన్ఏఐ వర్సిటీ భాగస్వామ్యంతో జాతీయస్థాయి హ్యాక్థాన్ను నిర్వహించడం ఒక ముందడుగని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను బోధన, పరిశోధన వ్యవస్థల్లో సమన్వయం చేసి విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడమే జేఎన్టీయూ జీవీ లక్ష్యమన్నారు. 48 గంటల పాటు జరిగే హ్యాక్థాన్ విద్యార్థులకు వాస్తవ ప్రపంచ ఏఐ సవాళ్లను పరిష్కరించే అవకాశం లభిస్తుందన్నారు. ఆధునిక ఏఐ సాధనాలతో ప్రత్యక్ష అనుభవం పొందడానికి ఈ కార్యక్రమం వేదిక కానుందని తెలిపారు. వివిధ విద్యా సంస్థల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనే ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయ ఆవిష్కరణ, సాంకేతికతకు కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, ఆచార్యులు, పాల్గొన్నారు. 8వ తేదీ వచ్చినా జీతాల్లేవు ● రెండు శాఖల ఉద్యోగులు మినహా మిగిలిన వారికి అందని జీతం విజయనగరం అర్బన్: ‘వ్యవసాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి జిల్లా కేంద్రంలో కట్టుకున్న ఇల్లుకోసం బ్యాంకు రుణం తీసుకున్నారు. రుణం నెలవారీ వాయిదా మొత్తం 5వ తేదీలోపు జీతం నుంచి జమచేసుకోవాలని బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు 8వ తేదీ వచ్చినా జీతం జమకాకపోవడంతో అకౌంట్ బౌన్స్ చార్జీలతో పాటు సెబీ విలువ పడిపోయి డిఫాల్టర్గా మారిపోయాడు.’ ఇది ఒక వ్యవసాయ శాఖ ఉద్యోగి సమస్యేకాదు. విద్య, పోలీస్ శాఖ ఉద్యోగులు మినహా జిల్లాలోని మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి అని ఆయన వాపోయాడు. అంతన్నారు.. ఇంతన్నారు... ప్రజాసంక్షేమ పథకాలను పక్కనపెట్టేశారు. కనీసం ఉద్యోగుల జీతాలను కూడా ఒకటో తేదీన చెల్లించలేని దుస్థితిలో చంద్రబాబు సర్కారు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్లలో లక్షలకోట్ల రూపాయలు అప్పుడుచేసిన సర్కారు... జీతాల చెల్లింపులో జాప్యంపై ఉద్యోగవర్గాలు మండిపడుతున్నాయి. జీతాల చెల్లింపులో వివక్ష చూపడాన్ని ఖండిస్తున్నాయి. 8వ తేదీ ముగిసినా జీతాలు చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వివిధ విభాగాల్లో సుమారు 57 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో దాదాపు 24 వేల మంది వరకు ఉన్న టీచర్లు, పోలీస్ ఉద్యోగులకు మాత్రమే జీతాలు వేశారు. మిగిలిన వివిధ శాఖల సిబ్బందికి వేతనాలు పడలేదు. జీతాల చెల్లింపులో ఆలస్యంపై ఆయా ఉద్యోగవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఓటేసిన పాపానికి అనుభవిస్తున్నామంటూ మదనపడుతున్నాయి. -
రాజకీయ కక్షతో వేధింపులు
పార్వతీపురం రూరల్: రాజకీయ కక్ష సాధింపులు హద్దులు దాటాయి. పార్టీ మారలేదన్న అక్కసుతో ఏకంగా ఒక వ్యక్తి గౌరవమర్యాదలను బజారుకీడ్చేలా అత్యంత జుగుప్పాకరమైన రాతలతో సోషల్ మీడియాలో దాడికి తెగబడ్డారు. సాలూరు పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో అధికార పార్టీ అండ చూసుకొని ఓ మంత్రి డ్రైవర్ బరితెగించడాన్ని, తన వ్యక్తిగత జీవితంపై నీచమైన ప్రచారం చేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నాడని బాధితుడు, మాజీ ఉపముఖ్యమంత్రి పీఏ అధికార్ల నాగ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసి రోజుల గడుస్తున్నా పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని, అందుకే జిల్లా ఎస్పీని ఆశ్రయించినట్టు తెలిపారు. గతంలో టీడీపీలో ఉన్న తను వైఎస్సార్సీపీలో చేరానని, ప్రస్తుతం మంత్రి గుమ్మడి సంధ్యారాణి వద్ద డ్రైవరుగా పనిచేస్తున్న రౌతు హరికుమార్ అనే వ్యక్తి తిరిగి టీడీపీలో చేరాలంటూ పలుమార్లు ఒత్తిడి తెచ్చారన్నారు. దీనికి అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నారని, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ మానసికంగా వేధిస్తున్నారని వాపోయాడు. అన్ని ఆధారాలతో హరికుమార్పై ఈ నెల 3న సాలూరు టౌన్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంతో ఎస్పీ మాధవ్రెడ్డికి గోడువినిపించినట్టు తెలిపారు. ఫిర్యాదు కాపీ, మంత్రి డ్రైవర్ సోషల్ మీడియాలో పెట్టిన అసభ్యకర పోస్టులను విలేకరులకు చూపించారు. పార్టీ మారలేదని మంత్రి డ్రైవర్ పైశాచికం వాట్సాప్ గ్రూపుల్లో అశ్లీల పోస్టులతో ప్రచారం ఫిర్యాదు చేసి 4 రోజులైనా స్పందించని పోలీసులు ఎస్పీకి మొరపెట్టుకున్న మాజీ ఉపముఖ్యమంత్రి పీఏ నాగరాజు -
మంత్రి కుమారుడిపై కేసు నమోదుకు డిమాండ్
● ఉద్యోగినిపై వేధింపులకు పాల్పడిన పీఏను అరెస్టు చేయాలి ● రౌండ్టేబుల్ సమావేశంలో మహిళా సంఘాల డిమాండ్ పార్వతీపురం రూరల్: మహిళలకు రక్షణ కల్పించాల్సిన సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి సొంత నియోజకవర్గంలోని మహిళా ఉద్యోగినికి రక్షణ కరువవడం సిగ్గుచేటని, వేధింపులకు పాల్పడిన మంత్రి కుమారుడిపై తక్షణమే కేసు నమోదుచేయాలని, అనధికారిక పీఏను అరెస్టు చేయాలని మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఆర్.శ్రీదేవి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో మహిళా సంఘాల నాయకులు మాట్లాడారు. సాలూరుకు చెందిన మహిళా ఉద్యోగినిని మంత్రి పీఏ, కుమారుడు శారీరకంగా, మానసికంగా వేధించారని ఆరోపించారు. దీనిపై ఆధారాలతో సహా ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మంత్రి కుమారుడిపై కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. పీఏపై కేసు ఉన్నప్పటికీ అరెస్టు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. బాధితురాలికి న్యాయం చేయాల్సిన అధికారులు ఆమెకు నిబంధనల ప్రకారం రావాల్సిన సెలవులు నిరాకరిస్తూ జీతాల్లో కోత విధిస్తూ వేధించడం హేయమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే నిందితులను అరెస్టు చేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని, అవసరమైతే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఐద్వా, ప్రగతిశీల మహిళా సంఘం, శ్రామిక మహిళా సంఘం నాయకులు బి.లక్ష్మి, పి.రమణి, వి.ఇందిర, తులసి, కుమారి, తదితరులు పాల్గొన్నారు. -
‘ముస్తాబు’తో ఆరోగ్య సంరక్షణ
● రాష్ట్రానికి రోల్ మోడల్గా మన్యం పార్వతీపురం: పాఠశాల విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ ‘ముస్తాబు’తోనే సాధ్యమని భావించిన కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పాఠశాలల్లో చిత్తశుద్ధితో అమలుచేయాలని దిశానిర్దేశం చేశారు. పలు పాఠశాలలకు వెళ్లి స్వయంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముస్తాబు కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించారు. అమలుపై ఉపాధ్యాయులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీలకు దిశా నిర్దేశం చేశారు. ‘విద్యార్థి ఆరోగ్యమే భవిష్యత్ రాష్ట్రానికి పునాది’ అనే సంకల్పంతో జిల్లాలో కలెక్టర్ ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమానికి అనతికాలంలోనే పాఠశాల స్థాయికి చేరింది. జిల్లాలోని 1272 పాఠశాలల్లో చదువుతున్న సుమారు 89వేల మంది విద్యార్థులు ప్రతిరోజు ‘ముస్తాబు’ అవుతున్నారు. దీనికి రాష్ట్రస్థాయిలో పేరొచ్చింది. ఇటీవల భామినిలో పీటీఎం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, ప్రజా ప్రతినిధుల సమష్టి కృషితో జిల్లాలో ముస్తాబు కార్యక్రమం విజయవంతమైంది. ప్రతీగ్రామానికి, పాఠశాలకు కార్యక్రమం చేరింది. పిల్లల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలలో వైద్య పర్యవేక్షణను నిరంతరం కొనసాగిస్తాం. పార్వతీపురం మన్యం జిల్లాను ఆరోగ్యహమీ నిలిపే లక్ష్యంతో పనిచేస్తాం. – డా.ఎన్.ప్రభాకరరెడ్డి, కలెక్టర్, పార్వతీపురం మన్యం జిల్లా. -
ఒడిశా వద్దు– ఆంధ్రాయే ముద్దు
సాలూరు: వివాదాస్పద ఆంధ్రా–ఒడిశా సరిహద్దు కొటియా గ్రూపు గ్రామాల్లో పలువురు గిరిజనులు ఒడిశా వద్దు–ఆంధ్రాయే ముద్దు అంటూ తీర్మానం చేశారు. పట్టుచెన్నేరు గ్రామ సమీపంలో పగులుచెన్నేరు, గంజాయిభద్ర, పట్టుచెన్నేరు పంచాయతీల పరిధిలోని గిరిజనులు సోమవారం సమావేశమయ్యారు. ఒడిశా అధికారుల తీరు సరిగా లేదని, ఆ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్, రేషన్ సరుకులతో పాటు మరే పథకాల లబ్ధిని తీసుకోరాదని నిర్ణయించారు. కలిసికట్టుగా ఆంధ్రావైపే ఉండాలని నిర్ణయించారు. ఆంధ్రా ప్రభుత్వం, అధికారులకు మద్దతు ఇవ్వాలని కోరారు. -
పెరుగుతున్న ప్రకృతి సాగు
● ఆరోగ్యకరమైన జీవితం..సారవంతమైన భూమిభామిని: గ్లోబల్ వార్మింగ్ నుంచి పర్యావరణ పరిరక్షణతో పాటు భూ సారవంతాన్ని కాపాడి ఆరోగ్యం పంచే ప్రకృతి వ్యవసాయం వైపు పార్వతీపురం మన్యం జిల్లాలో జోరుగా అడుగులుపడుతున్నాయి. సుస్థిర వ్యవసాయ విధానాల వైపు రైతుల దృష్టి మరల్చి ప్రకృతి సాగు ప్రయోజనాలు వివరణతో పూర్తి స్థాయిలో సుస్థిర వ్యవసాయ పద్ధతులు అమలు చేస్తున్నారు. మరోవైపు మిశ్రమ సాగు పద్ధతిలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతి అమలు చేస్తూ పాక్షికంగా మిశ్రమ పంటల సాగుకు ప్రోత్సహిస్తూ నిరంతర ఆదాయ వనరులు కల్పిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో క్రిమిసంహారక మందుల వాడకం, రసాయన ఎరువులతో కలిగే నష్టాలు వివరిస్తూ ఏపీసీఎన్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రకృతి సాగు సిబ్బంది రైతుల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎం.శ్రావణ్కుమార్ నాయుడు తెలియజేశారు. ఆర్గానిక్ కార్బన్ పెరుగుదల నివారించి భూమిశుద్ధి చేసే కార్యాచరణ చేపడుతున్నట్లు వివరించారు. భూమి పొరల్లోని సూక్ష్మజీవులు,వానపాములను కాపాడడంతో పాటు భూసారాన్ని పెంచేందుకు సహకరించే సుస్థిర పద్ధతులను అలవరుస్తున్నామన్నారు. నవధాన్యాల సాగు పద్ధతిలో నిత్యం భూమిపై పచ్చదనం పెంచుతున్నట్లు వివరించారు. ప్రకృతి సాగులో విధానాలు.. ప్రకృతి వ్యవసాయంలో ఆవు పేడ,మూత్రంలో ద్రవామృతాలు,అందుబాటులోని ఆకులు,అలములతో కషాయాల తయారీతో ప్రకృతి వ్యవసాయం చేయించడాన్ని అలవర్చుతున్నారు. రైతుకు పంట పెట్టుబడి తగ్గించి,నికర ఆధాయానికి ఢోకా లేకుండా ఆరోగ్యవంతమైన వ్యవసాయం అలవర్చడం భూసారాన్ని కాపాడేందుకు సీడ్బాల్స్ పోలాల్లో జల్లించడంతో వర్షాకాలంలో అన్ని రకాల మొలకలు వచ్చి భూమి సారవంతాన్ని కాపాడుతుంది.నవధాన్యాల సాగు పేరున పది రకాల పంటలను పండించి అన్ని వేళల్లో పొలాల్లో పచ్చని పంటలు ఉండేలా పండిస్తున్నారు.సూర్యమండలం పేరున కూరగాయలు,ఆకుకూరలు,చిరుధాన్యాల,ఆహార పంటలు వేసే విధానం విస్తృతం చేస్తున్నారు. మహిళా సంఘాలకు ప్రోత్సాహం.. ఆరోగ్యకరమైన వాతావరణం,భూ సంరక్షణకు చర్యలు చేపడుతున్నాం. క్రిమిసంహారకాలు, రసాయనాలు వాడకుండా నివారిస్తున్నాం. అంతరించి పోతున్న పంటలను పునరుద్ధరించడం, భూ పొరల్లో సారవంతం పోకుండా ఆరోగ్యవంతమైన పంటలు పండించడానికి మార్గం సుగమం చేస్తున్నాం. .. ఎం.శ్రావణ్కుమార్,డీపీఎం,ఏపీసీఎన్ఎఫ్,పార్వతీపురం మన్యం జిల్లా -
వాటర్ఫాల్స్లో పడి యువకుడి మృతి
రామభద్రపురం: చేతికి అందివచ్చిన కొడుకు హఠాత్తుగా అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రుల ఘోష అంతా ఇంత కాదు. కంటికీమింటికీ ఏకధారగా తల్లిదండ్రులు రోదిస్తున్నారు. మండలకేంద్రానికి చెందిన యువకుడు ఆదివారం స్నేహితులతో కలిసి పిక్నిక్కు సాలూరు మండలంలోని కురికూటి వద్ద గల దళాయివలస వాటర్ ఫాల్స్కు వెళ్లి ప్రమాదవశాత్తు లోయలో పడి మృతిచెందాడు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలకేంద్రంలోని కోవెల వీధికి చెందిన గర్భాపు హరి బలరామకృష్ణ(26) కీర్తన గోల్డ్ లోన్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో స్నేహితులతో పిక్నిక్కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. స్నేహితులతో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని దళాయివలస వాటర్ ఫాల్స్ దగ్గరకు పిక్నిక్కు వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం సమయం వరకు సరదాగా గడిపాడు. మధ్యాహ్నం భోజన సమయంలో చేతులు కడుక్కుని వస్తానని స్నేహితులకు చెప్పి కింద లోయలోకి దిగాడు.ఇంతలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందకు పడిపోయాడు. ఎంతకీ రాకపోవడంతో స్నేహితులు వెళ్లి వెతకగా కనిపించలేదు. దీంతో దగ్గరలో ఉన్న గిరిజన వ్యక్తులను పిలిచి విషయం చెప్పారు. ఓ గిరిజన వ్యక్తి లోయలోని నీటిలోకి దిగి చూడగా హరి బలరామకృష్ణ నీటిలో దొరికాడు వెంటనే స్నేహితులు సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో కుటుంబసభ్యులకు జరిగిన విషయంపై సమాచారం ఇచ్చారు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం సాలూరు ఆస్పత్రిలో మృతదేహాన్ని ఉంచారు.తండ్రి గోవిందరావు తాపీమేసీ్త్రగా పనిచేస్తుండగా తల్లి మగమ్మ గృహిణి. -
13మంది అగ్నివీర్కు ఎంపిక
చీపురుపల్లి: రన్మిషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న 13 మంది యువకులు ఒకేసారి అగ్నివీర్ జవాన్లుగా ఎంపికయ్యారు. పట్టణానికి చెందిన కంది హేమంత్ అనే ఎయిర్ఫోర్స్ ఉద్యోగి రన్మిషన్ స్థాపించి గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. రన్మిషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రతిరోజూ శరీరదారుఢ్యంలో శిక్షణ ఇస్తున్నారు. దీంతో పాటు పరీక్షలకు సంబంధించిన సూచనలు, పుస్తకాలు కూడా ఇస్తున్నారు. రన్మిషన్ నేతృత్వంలో గతంలో కూడా ఎంతో మంది యువత సీఐఎస్ఎఫ్, కానిస్టేబుల్, ఆర్మీ, ఐటీబీపీ వ్యవస్థల్లో ఉద్యోగాలు సాధించారు. తాజాగా 13 మంది యువత అగ్నివీర్కు ఎంపికయ్యారు. హేమంత్ సెలవు రోజుల్లో యువతకు శిక్షణ ఇస్తుండగా ఆయన విధి నిర్వహణలో ఉన్న సమయంలో అసిస్టెంట్ కోచ్ నవీన్ యువతకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు. తాజాగా అగ్నివీర్కు ఎంపికై న యువతను రన్మిషన్ ఆధ్వర్యంలో ఆదివారం సత్కరించారు. ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష● పరీక్షకు 97.92 శాతం హాజరు విజయనగరం అర్బన్: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) ప్రతిభా పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 3 డివిజన్ల పరిధిలో 19 పరీక్షా కేంద్రాల్లో 4,094 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 97.92 శాతంతో 4,009 మంది హాజరయ్యారు. పట్టణంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లోని పరీక్ష కేంద్రంలో పరీక్ష నిర్వహణను డీఈఓ యూ.మాణిక్యం నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష నిర్వహణలో ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుని సాఫీగా నిర్వహించామని తెలిపారు. మూడు షాపుల్లో చోరీరాజాం సిటీ: పట్టణ నడిబొడ్డున తిరుమలనగర్లో ఆదివారం వేకువజామున రెండు సెల్సాయింట్లు, టైలరింగ్ షాపుల్లో దొంగతనం జరిగింది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం యథావిధిగా దుకాణాలకు వచ్చిన యజమానులు తాళాలు విరగ్గొట్టి ఉండడాన్ని చూసి ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. ఒక సెల్పాయింట్లో ఉంచిన ముప్పావు తులం బంగారంతో పాటు, రూ.10వేలు, మరో సెల్పాయింట్లో రూ.15వేలు అపహరణకు గురయ్యాయని బాధితులు పోలీసులు వద్ద వాపోయారు. అలాగే టైలరింగ్ షాపులో ఏమీ దొరకపోవడంతో బట్టలు చిందరవందరగా పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీపీ ఫుటేజీ పరిశీలించిన అనంతరం క్లూస్టీమ్కు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కె.అశోక్కుమార్ తెలిపారు. ఆలయంలో చోరీ కేసులో ఇద్దరి అరెస్టుబొబ్బిలి: మండలంలోని పిరిడి గ్రామంలోని శాంకరిమాత ధ్యానమందిరంలో పుస్తెలతాడు,శతమానాలు దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం నవంబరు 5న శాంకరిమాత ధ్యానమందిరంలో భక్తులుగా ధ్యానం చేస్తున్నట్లు నటించి అక్కడే ఉన్న బంగారు పుస్తెల తాడు, శతమానాలను దొంగిలించారు. ఆలయ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సతీష్కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పోలీసులు నిందితులైన సీతానగరం మండలానికి చెందిన పోల భాస్కర్రావు, శ్రీకాకుళం జిల్లా హిరమండలానికి చెందిన సవర సూర్యంలను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నేరం అంగీకరించారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. వారిద్దరూ గతంలో సీతానగరం మండలంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలోను వెండివస్తువుల దొంగతనానికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని,జిల్లాలో పలు దొంగతనాల్లో వారి పాత్ర ఉందని తెలియజేశారు. -
సక్రమంగా ధాన్యం కొనుగోలు : సబ్ కలెక్టర్
పాలకొండ: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగాలని సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశించారు. మండలంలోని తుమరాడ రైస్మిల్లును ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ రికార్డులు పరిశీలించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఎటువంటి ఆంక్షలు పెట్టకూడదని పేర్కొన్నారు. అదనంగా ధాన్యం తూకం వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం అన్లోడింగ్ చేయడం కోసం డబ్బులు వసూలు చేయొద్దని ఆదేశించారు. తేమ శాతం పరిశీలించిన తరువాతే ఆర్ఎస్కేల నుంచి ధాన్యం తరలించడం జరుగుతుందన్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట సీఎస్డీటీ సన్యాసిరావు ఉన్నారు. -
ఇల్లు పీకి పందిరి..!
సీతంపేట: అదో మారుమూల గిరిజన గ్రామం. అటు శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం.. ఇటు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండల సరిహద్దున చిట్టచివరన ఉంది. ఇక్కడ 38 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరి జీవితాలతో అధికారులు బంతాట ఆడుతున్నారు. ఆ గ్రామమే సీతంపేట మండలంలోని అత్యంత మారుమూల గిరిజన గ్రామం నారాయణగూడ. ఈ గ్రామానికి అన్నీ సమస్యలే ఉన్నా.. ప్రధానమైనది ఇంటి సమస్య. వీరిలో కొందరికి కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ పథకంలో పీవీటీసీ(పర్టికులర్లీ వాలనర్బుల్ ట్రైబ్ గ్రూప్)కు గృహాలు మంజూరు చేసింది. దీనిలో భాగంగా ఈ గ్రామంలో 13 మంది వరకు ఇళ్లు లేని వారికి గృహాలను శాంక్షన్ చేశారు. అప్పటి వరకు ఆ గిరిజనులు వారి స్థలాల్లో పూరి గుడిసెలు, రేకిళ్లలో నివసిస్తున్నారు. అయితే గృహాలు మంజూరయ్యాయనే ఉద్దేశంతో ఉన్న గుడిసెలను తొలగించారు. వాటి స్థానంలో కొత్తవి నిర్మించుకోవడానికి వీలుగా పునాదులు తవ్వడానికి సవర జ్యోతమ్మ, రెయ్యమ్మ, లక్కమ్మ, గంగమ్మ, బొగ్గులమ్మ తదితరులు సిద్ధమయ్యారు. ఇంటి నిర్మాణం కోసం బేస్మెంట్ లెవెల్ కొలతలు తీశారు. అంతే ఇంతలో ఫారెస్టు సెక్షన్ అధికారులు వచ్చి ఇక్కడ ఇళ్లు నిర్మించవద్దని, అటవీ శాఖ పరిధిలో ఉన్నందున కట్టడానికి వీల్లేదని చెప్పడంతో నిర్మాణాలు నిలిపేశారు. ఏం చేయలేని స్థితిలో ఉన్న ఇళ్లు తీసివేయడంతో నిలువునీడ కరువైంది. మళ్లీ చిన్నచిన్న గుడిసెలు వంటివి నిర్మించుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం విపరీతమైన చలి, మంచు పడుతుండడంతో పిల్లాపాపలతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొత్త ఇళ్లు మంజూరయ్యాయంటేనే తమకు ఉన్న ఇళ్లు పీకేసామని, ఇంతలో అటవీ శాఖ అధికారులు అడ్డుపడడంతో ఏం చేయాలో తోచడం లేదని ఆ కుటుంబాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు పీఎం జన్మన్ కింద ఇళ్లు మంజూరైతే... మరోవైపు అటవీ శాఖ పేరిట అడ్డంకుల పేరిట నిర్మాణాలను నిలిపేయడంతో అధికారుల బంతాటలో వారు నలిగిపోతున్నారు. ఇదిలా ఉంటే ఆ గ్రామంలో మరికొన్ని సమస్యలు ఉన్నాయి. సీసీ రహదారులు లేవు. పాఠశాల, అంగన్వాడీ సెంటర్ వంటివి లేకపోవడంతో కొద్ది దూరంలో ఉన్న లోకొత్తవలస గ్రామానికి పిల్లలు వెళ్తున్నారు. రేషన్ తెచ్చుకోవాలన్నా అవస్థలు పడాల్సిందే. గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కుశిమి గ్రామానికి వెళ్తున్నామని గిరిజనులు తెలిపారు. గతంలో రేషన్ ఇంటికి వచ్చేదని ఇప్పుడు నడకయాతన తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హౌసింగ్ ఏఈ ఏమన్నారంటే... హౌసింగ్ ఏఈ వెంకటేష్ వద్ద ఈ విషయం ప్రస్తావించగా ఆర్వోఎఫ్ఆర్లో గ్రామం ఉండడంతో ఫారెస్టు అనుమతులు రావాల్సి ఉందన్నారు. ఇందుకు రెవెన్యూ శాఖ ద్వారా ప్రతిపాదించాం. శ్రీకాకుళం జిల్లా నుంచి ఫారెస్టు క్లియరెన్స్ వచ్చిన వెంటనే పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్మాణాలకు చర్యలు తీసుకుంటాం. ముందు భాగంలో ఉన్న ఇంటిని పడగొట్టి ప్రస్తుతం నివసిస్తున్న గిరిజన గుడిసెలుఇల్లు మంజూరైందంటే ఉన్న ఇల్లు తొలగించాం. చాలా అవస్థలు పడుతున్నాం. కొత్త గృహం నిర్మించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. గత రెండు నెలలుగా ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు మాకు అనుమతులు వస్తే అప్పుడు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంతవరకు చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. – ఎస్.సుమిత్ర, నారాయణగూడ గిరిజన జీవితాలతో అధికారుల బంతాట! ఇళ్లు మంజూరయ్యాయంటే ఉన్న ఇళ్లు పీకి పందిరేసుకున్నారు.. ఆ స్థలంలో పునాదులు తవ్వేసరికి అటవీ శాఖ అధికారుల అడ్డంకి ఉన్న ఇళ్లు లేవు.. కొత్త ఇళ్లు రావు.. చలి, మంచులో కాలం నెట్టుకొస్తున్న గిరిజనులు దీనావస్థలో నారాయణగూడ గ్రామస్తులు అన్ని గ్రామాల్లో పీఎం జన్మన్ పథకంలో గృహాలు నిర్మించుకుంటున్నారు. మాకు వచ్చేసరికి ఫారెస్టు అధికారులు నిలుపుదల చేశారు. దాదాపు 30 ఏళ్లుగా ఇక్కడే నివిసిస్తున్నాం. పూర్తి స్థాయిలో గృహాలు లేక అవస్థలు పడుతున్నాం. ఇప్పటికై నా మంజూరు చేయాలని కోరుతున్నాం. – ఎస్.ప్రసాదు, నారాయణగూడ -
ఇదేం తూకం.. : కలెక్టర్
బలిజిపేట: బలిజిపేటలోని జయలక్ష్మి మోడరన్ రైస్మిల్లును జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీచేసి అక్కడ ఉన్న ధాన్యం బస్తాను తూకం వేయించగా అదనపు ధాన్యం ఉండడంతో ఆగ్రహించారు. మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న 40 కిలోల ధాన్యం బస్తాను తీయించి తూకం వేయించగా 42.500 కిలోలు రావడంతో ఇదేంటి ఈ తూకం 40 కిలోలు మాత్రమే ఉండాలి కదా అదనంగా 2కిలోలకు పైగా ఉన్నాయేంటి.. ఎందుకు అలా తీసుకున్నారు, రైతులను ఎందుకు నష్టపెడుతున్నారని మిల్లరును ప్రశ్నించారు. అక్కడే ఉన్న మిల్లర్లు గన్నీకి కొంత పోతాయండి అంతే తప్పా అదనం ఏమిలేదని తెలిపారు. అక్కడే ఉన్న ఒక ట్రాక్టరు ట్రక్షీట్ తీసుకొని దానిని పరిశీలించగా 200 బస్తాలకు ఉంది. కాని దానిలో 150బస్తాలు ఉన్నట్టు గుర్తించి ఎందుకు ఈ విధంగా జరిగిందని ప్రశ్నించారు. రైతు దింపుడు కూలి కింద రూ.5లు అదనంగా వసూలు చేస్తున్నారని కలెక్టర్ దృష్టిలో పెట్టగా అలా ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించగా అవి రైతు ఖాతాకు జమ అవుతాయని మిల్లర్లు తెలిపారు. ఏది ఏమైనా అదనంగా ధాన్యాలు తూకాలు వేసి రైతులను నష్టపెడుతున్నట్టు ఫిర్యాదులు అందాయని కలెక్టర్ ప్రభాకరరెడ్డి మిల్లర్లను హెచ్చరించారు. అదనపు ధాన్యాలు తూకాలు వేసి రైతులను నష్టపెట్టవద్దని సూచించారు. మిల్లుకు సంబంధించిన కాగితాలను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ బాలమురళీ, అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
పడక దొరకదు..
సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్ శ్రీ 2025స్కానింగ్ జరగదు... పార్వతీపురం రూరల్: అమ్మోరు గండం గట్టెక్కినా.. చలి జ్వరం చంపేసినట్టుంది పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రి పరిస్థితి. బోర్డు మారింది.. భవనం రంగు మారింది.. జిల్లా ఆసుపత్రిగా స్థాయి పెరిగింది. కానీ, ఆ స్థాయికి తగ్గట్టుగా వైద్యులను, సిబ్బందిని పెంచడంలో మాత్రం పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. ఉన్న వైద్యులు అదనపు పని భారంతో సతమతమవుతుంటే.. కొత్త నియామకాలు చేపట్టాల్సిన వైద్యవిధాన పరిషత్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఫలితంగా ఆసుపత్రికి వచ్చే వందలాది మంది రోగులకు సకాలంలో వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తోందని ప్రకటనలకే పరిమితమైందా? అన్న అనుమానాలు క్షేత్ర స్థాయి పరిస్థితులు చూస్తే కలుగుతున్నాయి. రేడియాలజిస్ట్ పోస్టు ఖాళీ.. ఆసుపత్రిలో స్కానింగ్ యంత్రాలు ఉన్నప్పటికీ, వాటిని నిర్వహించే రేడియాలజిస్ట్ పోస్టు గత రెండేళ్లుగా ఖాళీగా ఉండటం గమనార్హం. దీనివల్ల స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. ఉన్న ఇతర వైద్యులు ఓపీ, వార్డు సేవల్లో బిజీగా ఉండటంతో స్కానింగ్ కోసం పేద రోగులు ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఉచితంగా జరగాల్సిన పనికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని, ఆసుపత్రిని సేవలు నిమిత్తం సంప్రదింపులు చేస్తున్న ప్రజలు, గిరిజనులు వాపోతున్నారు. పోస్టును భర్తీ చేయడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కీలక విభాగాల్లోనూ అదే తీరు.. ఆసుపత్రి నిర్వహణలో అతి ముఖ్యమైన నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టు కొన్ని ఏళ్లుగా భర్తీకి నోచుకోలేదు. అలాగే రోగుల సంఖ్యకు అనుగుణంగా ఉండాల్సిన హెడ్ నర్సులు లేరు. ఉన్న కొద్ది మంది నర్సులే అటు వార్డులు, ఇటు ఎమర్జెన్సీ సేవలు చూసుకోవాల్సి రావడంతో వారికి పనిభారం తడిసి మోపెడవుతోంది. మరోవైపు మైక్రో బయాలజీ విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ లేకపోవడంతో వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కొంత జాప్యం జరుగుతోంది. ఇన్చార్జిలతోనే నెట్టుకొస్తున్న వైనం పూర్తి స్థాయి ఆర్ఎంవో లేకపోవడంతో, ప్రస్తుతం మహిళా వైద్యురాలు ఒకరు ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పరిపాలనా వ్యవహారాలు, వైద్య సేవలు రెండూ ఒకరే చూడాల్సి రావడంతో ఒత్తిడి పెరుగుతోంది. ఇక అత్యవసరమైన ఐసీయూ విభాగంలో ప్రత్యేక నిపుణులు, సిబ్బంది ఉండాలి. కానీ, ఆ పోస్టులు ఖాళీగా ఉండటంతో సాధారణ డ్యూటీలో ఉన్న వైద్యులే ఐసీయూ బాధ్యతలను కూడా భుజాన వేసుకోవాల్సి వస్తోంది. ఇలా ఒకే వైద్యుడు పలు విభాగాలు చూడాల్సి రావడంతో ఏ ఒక్కరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారనే ఆవేదన వైద్య వర్గాల్లోనూ ఉంది. జిల్లా కేంద్ర ఆసుపత్రికి వచ్చే రోగులకు వీలైనంత మేరకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న వైద్యులు, సిబ్బందితోనే సమన్వయం చేసుకొని నిరంతరాయంగా సేవలందుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. రేడియాలజి సేవలందించే వైద్యులు పదోన్నతిపై ఇక్కడకు రావల్సి వుంది. ఎమర్జెనీ, ఐసీయూ సహా అన్ని విభాగాల్లో సేవలు సక్రమంగానే కొనసాగుతున్నాయి. – డాక్టర్ జి.నాగభూషణరావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి, పార్వతీపురం మన్యం ప్రజారోగ్యంపై చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదనడానికి ఈ ఆసుపత్రే నిలువెత్తు నిదర్శనం. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రధానంగా వైద్యం చేసే చేతులు కావాలి. అవసరమైన వైద్యులను, పారా మెడికల్ సిబ్బందిని నియమించకుండా జిల్లా ఆసుపత్రి అని బోర్డు తగిలిస్తే ప్రయోజనం ఏముంటుంది? ఇప్పటికై నా సంబంధిత శాఖామాత్యులు, అధికారులు స్పందించి.. యుద్ధ ప్రాతిపదికన ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ఉన్న సిబ్బందిపై పనిభారం తగ్గించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో రోగులకు తప్పని అవస్థలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం రెండేళ్లుగా ఖాళీగా రేడియాలజిస్ట్ పోస్టు 150 పడకల ఆసుపత్రికి.. 250 మంది ఇన్పేషెంట్లు! ఆర్ఎంవోతో సహా నాలుగు ప్రధాన కుర్చీలు ఖాళీ ఐసీయూ సహా 3 కీలక విభాగాల్లో డాక్టర్ల కొరత ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న వసతులకూ, వస్తున్న రోగుల సంఖ్యకూ ఏమాత్రం పొంతన కుదరడం లేదు. ప్రతీ రోజూ ఓపీకి 300 మందికి తగ్గకుండా జనం వస్తుండగా, నిత్యం 150 నుంచి 250 మంది ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. కానీ అక్కడ ఉన్నది మాత్రం 150 పడకలే. ఉన్న మంచాలు నిండిపోయి, కొత్త రోగులకు చోటు లేక.. ఒక మంచంపై సర్దుబాటు చేస్తూ చికిత్స పొందాల్సిన దుస్థితి నెల కొంది. పడకల సంఖ్య పెంచకపోవడంతో, ఉన్న సిబ్బందిపైనే రోగుల ఒత్తిడి పెరిగి సేవల్లో నాణ్యత లోపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
రహదారి భద్రతకు ప్రాధాన్యం
● సిబ్బందితో ఎస్పీ దామోదర్ సెట్ కాన్ఫరెన్స్ విజయనగరం క్రైమ్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికలు రూపొందించాలని ట్రాఫిక్ సిబ్బందికి ఎస్పీ దామోదర్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల హౌస్ ఆఫీసర్లతో ఎస్పీ దామోదర్ ఆదివారం సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రహదారి భద్రత నియమాలను ప్రజలు తప్పక పాటించాలని ప్రమాదాల నియంత్రణకు సిబ్బంది భద్రతాచర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు,. వాహనదారులకు రహదారి భద్రతపట్ల అవగాహన కల్పించాలన్నారు. వాహనదారులు వాహనం తాలూకా అన్ని డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి, ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా చూడాలి. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను, ప్రమాదాలు జరిగినప్పటికీ స్వల్పగాయాలతో ఎలా ప్రాణాలతో భయటపడవచ్చునో ద్విచక్ర వాహనదారులకు వివరించాలని కోరారు. ప్రతిరోజూ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, వాహన తనిఖీలు చేపట్టి, ప్రజలకు, వాహనదారులకు రహదారి భద్రత, మోటార్ వాహన చట్టం గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపించే విధంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి, ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేయాలని చెప్పారు. కాషనరీ బోర్బులు ఏర్పాటు చేయాలి రహదారి ప్రమాదాల నియంత్రణలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్కు ఇరువైపులా కాషనరీ బోర్డులను ఏర్పాటు చేయడం, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్టాపర్లు, డ్రమ్ములు ఏర్పాటు చేసి, రాత్రి సమయాల్లో వాహనదారులకు కనిపించే విధంగా రేడియం స్టిక్కర్లు అతికించాలని సూచించారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో భాగంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులపై 19,077 కేసులు, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడిపే వారిపై 2370 కేసులు, మైనర్లు వాహనాలను నడిపిన కారణంగా వాహన యజమానులపై 1020 కేసులు, డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారిపై 5510 కేసులు, గడిచిన 20 రోజులలో మద్యం తాగి వాహనాలు నడిపిన 45 మందికి జైలు శిక్ష పడిందన్నారు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై 17,246 కేసులు నమోదు చేశామని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. -
నెల్లిమర్ల టు విజయవాడ
● దుర్గమ్మ దర్శనానికి మూడోసారి సైకిల్ యాత్ర నెల్లిమర్ల రూరల్: భక్తి, దీక్ష, సంకల్ప బలానికి ప్రతీకగా నిలుస్తూ నెల్లిమర్ల మండలంలోని ఒమ్మి, అలుగోలు గ్రామాలకు చెందిన భవానీ భక్తులు మూడోసారి సైకిల్ యాత్రకు పయనమయ్యారు. ఒమ్మి గ్రామంలో అమ్మవారి నామస్మరణతో, భక్తి నినాదాల నడుమ ఈ యాత్ర ప్రారంభమైంది. 41 రోజుల పాటు భవాని అమ్మవారి దీక్షను నిష్టగా నిర్వర్తించిన భక్తులు అంబళ్ల అప్పలనాయుడు, కోరాడ గోవర్ధన్లు గురుస్వామి నారాయణరావు ఆధ్వర్యంలో ఇరుముడి ధరించి సైకిళ్లపై విజయవాడకు బయలుదేరారు. ఇప్పటికే రెండు సార్లు సైకిల్పై వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నామని, సుమారు 480 కిలోమీటర్లు యాత్రను మూడు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. లోక కల్యాణార్థం..హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఏటా ఈ సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో గురుస్వాములు కురిమినేని నారాయణరావు, అంబళ్ల సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
‘కొటియా’ ప్రజల పయనమెటు!
● పట్టుచెన్నేరులో నేడు సమావేశం సాలూరు: వివాదస్పద ఆంధ్రా – ఒడిశా సరిహద్దు కొటియా గ్రూపు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టు సడలిపోతుందా అంటే అవుననే జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కొటియా గ్రూపు గ్రామాల వివాదం రెండు రాష్ట్రాల మధ్య నలుగుతూనే ఉంది. న్యాయస్థానంలో స్టేటస్ కో అమల్లో ఉన్న నేపథ్యంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించి పట్టు పెంచింది. ఒడిశా అధికారులు కవ్వింపు చర్యలకు పాల్పడినా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అప్పటి ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తనదైన శైలిలో స్పందించి ఒడిశా అధికారుల ఆగడాలను పూర్తి స్థాయిలో నిలువరించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒడిశా అధికారులు మళ్లీ దూకుడు పెంచారు. ఏపీ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అడ్డుకున్నారు. తాజాగా ఒడిశా ప్రభుత్వం కొటియా గ్రామ పంచాయతీ వద్ద వెల్కమ్ అని ఒడియా.. ఇంగ్లిష్ భాషలో బోర్డును పట్టుచెన్నేరులో ఏర్పాటు చేసింది. కొటియాలో ఒడిశా ప్రభుత్వ పోలీస్స్టేషన్ ఉండగా, పట్టుచెన్నేరులో మరో పోలీస్స్టేషన్ ఏర్పాటుకు సిద్ధమవుతుందని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. ఒడిశా ప్రభుత్వ తీరుపై అక్కడి గిరిజనుల మండిపడుతున్నారు. దీనిపై పట్టుచెన్నేరు, పగులుచిన్నేరు, సొల్పగూడ, కోనదొర, ఎగువమెండంగి గ్రామాల ప్రజలు ఆదివారం రాత్రి సమావేశమయ్యారు. మిగిలిన ఏడు గ్రామాల ప్రజలతో కలిసి సోమవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఒడిశా ప్రభుత్వం నుంచి రేషన్ కార్డులు, పింఛన్లు తీసుకోరాదని తదితర వాటిపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రా పోలీసుల సహకారం కోసం ఈ ప్రాంత గిరిజనులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తామంతా ఆంధ్రా వైపు ఉండాలనుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు ఉండడం లేదని దీంతో ఒడిశా ప్రభుత్వ చర్యలు, పోలీసులతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఏం చేస్తున్నారు.. రెండు శాఖలకు మంత్రిగా ఉన్న సంధ్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా ఈ గ్రామాల వివాదాన్ని పరిష్కరించడంలో మంత్రి వ్యవహర శైలి చర్చనీయాంశమైంది. ఇక్కడ బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వం, ఒడిశాలో బీజీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో కచ్చితంగా ఈ కొటియా గ్రామాల సమస్య పరిష్కారమవుతుందని భావించిన ఈ ప్రాంత ప్రజలు ఒడిశా ప్రభుత్వ దూకుడును చూసి విస్తుపోతున్నారు. ఈ గ్రామాల సమస్య పరిష్కరించాలని ఇటీవల మంత్రి సంధ్యారాణి ఒడిశా ముఖ్యమంత్రిని కోరి వినతిపత్రం ఇచ్చినట్టు పలు వార్తలు వచ్చాయి. అయితే ఇదే సమయంలో ఓ వైపు వినతులు తీసుకున్న ఒడిశా ప్రభుత్వం, ఈ కొటియా గ్రామాల్లో తన కార్యకలాపాలు మరింత ముమ్మరం చేసింది. ఇటీవల ఒడిశా బ్లాక్ అధికారులతో కూడిన యంత్రాంగం కొటియా గ్రామాల్లో పర్యటించి అక్కడ ప్రజలతో సమావేశాలను ఏర్పాటు చేసింది. శాఖల వారిగా ఒడిశా అధికారులు గ్రామాల్లో తమ శాఖల ద్వారా జరుగుతున్న పనులపై అక్కడ గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఇటీవల ఆంధ్రా అధికారులను ఒడిశా అధికారులు అడ్డుకున్నారు. గతంలో కొటియాకే పరిమితమైన ఒడిశా అధికారులు దౌర్జన్యం క్రమేణా పట్టుచెన్నేరు, పగులుచిన్నేరు పంచాయతీలకు విస్తరిస్తుండడం గమనార్హం. విలువైన రంగురాళ్లు, ఐరన్ ఓర్, గ్రానైట్ తదితర వివిద ఖనిజ నిక్షేపాలు కొటియా గ్రూప్ గ్రామాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. తామంతా ఆంధ్రాలో ఉండాలని ఇక్కడ గ్రామాల్లో అధిక శాతం గిరిజనులు ఆసక్తి చూపుతున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. -
మీ కోసం వెబ్సైట్లో పీజీఆర్ఎస్ అర్జీల నమోదు
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు మీకోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ రోజు వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అర్జీదారులు మీకోసం.ఏపి.జిఓవి.ఇన్ వెబ్సైట్లో అర్జీలను నమోదు చేసుకోవచ్చునన్నారు. అర్జీల స్థితిని 1100 నంబరుకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని తెలిపారు. బట్లబద్ర పంట పొలాల్లో గజరాజులు జియ్యమ్మవలస: మండలంలోని బట్లబద్ర, బిత్రపాడు పంట పొలాల్లో గజరాజులు సంచరిస్తున్నాయి. ఆదివారం ఉదయం వెంకటరాజపురం అరటి తోటలో ఉన్న గజరాజులు మధ్యాహ్నం గుమ్మిడివాగులోకి జారుకున్నాయి. సాయంత్రానికి బట్లబద్ర పామాయిల్ తోటలోకి చేరుకున్నాయి. అరటి, పామాయిల్, వరి పొలాల్లో ఉంటూ పంటలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వాటిని తరలించే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. వేతన వివక్ష తగదు ● జీతాలు ఇవ్వండి.. లేదంటే ఆందోళనే..: యూటీఎఫ్ పార్వతీపురం రూరల్: అందరికీ ఒక న్యాయం, గిరిజన సంక్షేమ టీచర్లకు మరొక న్యాయమా? అని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహనరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నవంబరు నెల గడచినా.. డిసెంబర్ 8 దాటిన గిరిజన సంక్షేమ టీచర్లకు జీతాలు అందలేదని, ఇతర యాజమాన్యాలకు జీతాలు చెల్లించి తమపై వివక్ష చూపడం అన్యాయమని ఆయనన్నారు. ఈ కారణంగా ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీతాలు చెల్లించాలని, లేకుంటే ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామివారి దేవస్థానం శ్రీరామనామ సంకీర్తనతో ఆదివారం మార్మోగింది. స్వామి సన్నిధిలో పలువురు భక్తులు సహస్ర శ్లోకీ రామాయణ పారాయణం ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరాకాండ హోమాన్ని జరిపించారు. ఉత్సవమూర్తుల వద్ద స్వామివారికి నిత్య కల్యాణం నిర్వహించిన అనంతరం భగవత్ రామానుజ దాస బృందానికి చెందిన భక్తులు సహస్ర శ్లోకి రామాయణం 72వ ఆవృతం, శ్రీమన్నారాయణ వైభవం 70వ ఆవృతం పారాయణం చేశారు. ఈ సందర్భంగా బృంద సభ్యుడు శ్రీమాన్ కందాల రాజగోపాలాచార్యులు మాట్లాడుతూ ఇప్పటివరకు సింహాచలం, శ్రీకూర్మం, పద్మనాభం, తదితర దివ్య క్షేత్రాల్లో పారాయాణాలు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: హిందీ భాషాభిమానుల వేదికగా పేరొందిన హిందీ మంచ్ జిల్లా శాఖ కొత్త కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. స్థానిక పూల్బాగ్లోని సరస్వతి శిశుమందిర్లో జరిగిన ఎన్నికల సభలో జిల్లా అధ్యక్షులుగా ఏలూరు శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీగా నందివాడ చిన్నాదేవి, గౌరవాధ్యక్షురాలుగా పి.ఉమాబాల, సహాధ్యక్షురాలుగా భోగరాజు సూర్యలక్ష్మి ఎన్నికయ్యారు. ఉత్తరాంధ్ర కార్యదర్శి కోనే శ్రీధర్ ఎన్నికల సమన్వయకర్త గా వ్యవహరించారు. సంఘం కార్యదర్శిగా కె.రోజా, కె.శారదా పద్మావతి, ఉపాధ్యక్షులుగా ఆశాపు చంద్రారావు, విజయలక్ష్మి, సహాయ కార్యదర్శులుగా సాలూరు సంతోషి, వై.సూర్యకుమారి, శ్రీదేవి ఎన్నికయ్యారు. ముఖ్య సలహాదారుగా కె.సుబ్బారావు, గౌరవ సలహాదారుగా దవళ సర్వేశ్వరరావును ఎంపిక చేశారు. -
ఇందువదన..కుందరదన
చీపురుపల్లి: అదో పల్లెటూరు. అక్కడ పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అమ్మాయి దేశ స్థాయిలో జరిగే 42వ టెన్నికాయిట్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించింది. చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి గ్రామానికి చెందిన కిలారి ఇందు పదో తరగతి చదువుతోంది. ఇప్పటికే జాతీయస్థాయిలో జరిగే టెన్నికాయిట్ చాంపియన్షిప్లో ఎన్నో బంగారు పతకాలు సాధించింది. ఇందుకు చిన్న వయస్సు నుంచే టెన్నికాయిట్పై ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించిన ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రామారావు నాణ్యమైన తర్ఫీదు ఇచ్చి మట్టిలో మాణిక్యాన్ని వెలికితీశారు. దీంతో ఇందు కోచ్ రామారావు వద్ద అకుంఠిత దీక్షతో శిక్షణ పొందుతోంది. వ్యవసాయ కుటుంబంలో పుట్టి కిలారి ఇందు మండలంలోని పెదనడిపల్లి గ్రామంలో వ్యవసాయ వృత్తిలో ఉన్న గొల్ల, భారతి దంపతుల కుమార్తె. అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు టెన్నికాయిట్ క్రీడలో రాణిస్తోంది. నవంబర్ 26 నుంచి 30 వరకు జమ్ముకశ్మీర్లో జరిగిన 42వ జాతీయ టెన్నికాయిట్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొన్న ఇందు ఉత్తమ ప్రతిభ కనపిరిచి బంగారు పతకం సాధించింది. కోచ్ రామారావు ప్రత్యేక శ్రద్ధతో పెదనడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు రామారావుకు క్రీడల పట్ల ఎంతో ఆసక్తి ఉంది. దీంతోనే పల్లెటూరిలో చదువుతున్న పిల్లలను చక్కగా తీర్చిదిద్దుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే దిశగా తర్ఫీదు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కిలారి ఇందు టెన్నికాయిట్లో జాతీయస్థాయిలో ప్రతిభ చూపి బంగారు పతకం సాధించింది.రాష్ట్ర, జాతీయ స్థాయిలో సాధించిన పతకాల ఇందుఅంతర్జాతీయ స్థాయిలో విజేతగా నిలవాలి కేరళలో 2027లో జరగనున్న అంతర్జాతీయ టెన్నికాయిట్ చాంపియన్షిప్లో భారతదేశం తరఫున పాల్గొని విజేతగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. దీనికి కోచ్ రామారావు ప్రోత్సాహం పూర్తిగా ఉంది. ఆయన శిక్షణతోనే జాతీయ స్థాయి వరకు ఆడగలిగాను. అంతర్జాతీయ స్థాయిలో విజేతగా నిలవడమే కాకుండా పోలీస్ ఆఫీసర్ అవడమే నా లక్ష్యం. కిలారి ఇందు, జాతీయ క్రీడాకారిణి, పెదనడిపల్లి పల్లెలో మెరిసినన ‘బంగారుతల్లి’ పేదింటిలో పుట్టి ఆటల్లో దేశస్థాయిలో గుర్తింపు మట్టిలో మాణిక్యాన్ని తీర్చిదిద్దిన కోచ్ రామారావు టెన్నికాయిట్లో రాణిస్తున్న ఇందు అంతర్జాతీయ పోటీలకు సిద్ధం -
ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్కు తీవ్రగాయాలు
కురుపాం: కురుపాం–గొరడ ప్రధాన రహదారిలో బుడ్డెమ్మ ఖర్జ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఆదివారం సాయంత్రం ఢీ కొన్న ఘటనలో కిచ్చాడ పంచాయతీ ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు గోళ్ల గౌరీశంకర్కు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలం నుంచి కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి 108 వాహనంలో తరలించగా వైద్యులు ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్య సేవల కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. బుడ్డెమ్మఖర్జ గ్రామంలో శుభకార్యానికి వెళ్లి స్వగ్రామం పట్టాయి దొరవలసకు ఫీల్డ్ అసిస్టెంట్ తిరిగి వెళ్లిపోతుండగా బుడ్డెమ్మఖర్జ సమీపంలో కురుపాం నుంచి కొల్లిగూడ గ్రామానికి వెళ్తున్న పి.మహేష్ తన ద్విచక్రవాహనంతో ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగి గౌరీశంకర్ చెవి, ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావమైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కవి అంటే భ్రష్టయోగి
● పచ్చడం పుస్తకావిష్కరణలో వాగ్గేయకారుడు గోరటి వెంకన్నరాజాం: కవి అంటే సాఫీగా జీవితాన్ని గడిపే వ్యక్తి కాదని, ఒక భ్రష్టయోగి అని వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. ఈ మేరకు ఆదివారం రాజాంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో రాజాం రచయితల వేదిక నిర్వహించిన 11 వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పచ్చడం పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. కవిలోపల భావాలెంతో గొప్పవని వెల్లడించారు. అతిశయాలు కవులకు శాపమని, పసితనమే కవులకు బలమని వివరించారు. ఈ సృష్టిలో గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి వంటివి సౌందర్యవంతమైనవేనని, వాటిని ఏ వ్యక్తికి ఆ వ్యక్తి స్వేచ్ఛగా ఆస్వాదించే అవకాశం లేకుండా రాజులు, భూ స్వాములు, పెత్తందారీలు, నిజాందారులు అణగదొక్కుతుంటే వాటి నుంచి ప్రజలను చైతన్యవంతులను చేయగలిగేవే కవితలని పేర్కొన్నారు. జీవితం నుంచే కవిత్వం వస్తుంది. స్వప్నయోగంలో కవిత్వాలు పుడతాయి. ధూర్జటి, పోతన, కాళిదాసు వంటి కవులు మొదలుకుని ఈకవుల పరంపర కొనసాగుతోందని తెలిపారు. పరోపకారం కవి లక్షణమన్నారు. ఆకలి, దైన్యం, పేదరికం వంటివి చూసి, రాజులను ధిక్కరించేవి కవిత్వాలు. విశ్వనాథ, శ్రీశ్రీ, జాషువా, దేవులపల్లి కృష్ణశాస్త్రి, గురజాడ వంటివారందరూ పరోపకారానికి సంబంధించి కవితలు రాశారని వివరించారు. అటువంటి వారసత్వం నుంచి వచ్చినవారమే తామంతా అన్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాలో ఎప్పటినుంచే కవులు రాజ్యధిక్కార కవితలు రాశారని గుర్తుచేశారు. పోరాటాలు, కవులకు పుట్టినిల్లు ఉత్తరాంధ్ర పోరాటాలకు, కవులకు పుట్టినిల్లు ఉత్తరాంధ్ర అని గోరటి వెంకన్న వెల్లడించారు. ఇక్కడ ఎన్నో పోరాటాలు కవుల నుంచి పుట్టుకొచ్చాయని, కవులు అంటే హాయిగా జీవితం గడిపేవారుకాదని పేర్కొన్నారు. క్షామంతో అల్లాడిపోతున్న పేదరికం కవి లక్షణమని, సంప్రదాయాన్ని, దైవత్వాన్ని ఎత్తుకుని ఆ పరంపరను కొనసాగించాలని, మానవత్వ విలువలు పెంచాలని, ఎప్పటికప్పుడు తనకు తాను కరిగిపోయి కవి నైతిక విలువలు పెంపొందించాలని పిలుపునిచ్చారు. బుద్ధభగవానుడు పుట్టకుంటే దయ, జాలి వంటివి ఉండేవి కావేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రారెడ్డి, రామలింగారెడ్డి, రంగమాచార్యులు, వేరుచూరి నారాయణరావు, పిల్లా తిరుపతిరావు, గార రంగనాథం వంటివారు తమ పద్ధతిలో తాము రచనలు చేస్తున్నారన్నారు. ప్రశంసలకు దూరంగా ఉన్నవారే మంచి కవిత్వాలు రాయగలరన్నారు. రాజాంలో రచయితల వేదిక 11 సంవత్సరాలు పూర్తిచేసుకోవడం, 11 పుస్తకాలు ఆవిష్కరించడం చాలా ఆనందించదగిన విషయమన్నారు. రచయిత పిల్లా తిరుపతిరావు రచించిన పచ్చడం పుస్తకాన్ని రారవే నిర్వాహకులు సభలోని సభ్యులకు పరిచయం చేశారు. గోరటి వెంకన్న గొప్పతనాన్ని వివరించారు. పచ్చడం పుస్తకంలోని విశేషాలు వివరించారు. ఈ పుస్తకానికి రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇన్చార్జ్ హెచ్ఎం బీవీ అచ్యుతరావు దంపతులు ఆర్థికసాయం అందించారని వెల్లడించారు. రచయిత తిరుపతిరావు తాను రచించిన పుస్తకంలోని సాహిత్య వ్యాసాలు వివరించారు. పలువురికి సత్కారం అనంతరం గోరటి వెంకన్నను రారవే సభ్యులు సత్కరించారు. పుస్తక రచయిత తిరుపతిరావును రారవే సభ్యులు, గోరటి వెంకన్న, స్నేహితులు, బంధువులు సత్కరించారు. పుస్తకావిష్కరణకు సహకరించిన అచ్యుతరావుతో పాటు ఆయన కుటుంబసభ్యులను రాజాం అమృత హాస్పిటల్ వైద్యురాలు సూర్యశైలజను అభినందించారు. అంతకుముందు సమతం మహేశ్వరరావు సమావేశాన్ని ప్రారంభించగా, డాక్టర్ ఆల్తి మోహనరావు, శ్రీనివాసరావు తదితరులు స్వాగత కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరానికి చెందిన రచయిత చీకటి దివాకర్, రాజాం రచయిత వెలుగు రామినాయుడు, మజ్జి మదన్మోహన్, రాజాం పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన రచయితలు, కవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
పీటీఎం.. సిగ్గుచేటు!
సినిమా సెట్టింగ్లతో సాక్షి, పార్వతీపురం మన్యం: చంద్రబాబు ప్రభు త్వం గత 18 నెలల పాలనలో వైద్య, విద్యా రంగాలను పూర్తిగా భ్రష్టు పట్టించిందని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ ఉపముఖ్యమంత్రులు పీడిక రాజన్న దొర, పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పాలనలో ప్రజలకేం చేశామో చెప్పుకోలేకే.. సీఎం చంద్రబాబు పార్వతీపురం జిల్లాలో పేరెంట్–టీచర్ సమావేశంలో విమర్శలకు దిగారని తెలిపారు. భామిని ఆదర్శ పాఠశాలలో జరిగిన పీటీఎంలో తరగతి సెట్టు వేయడం సిగ్గు చేటన్నారు. సినిమా సెట్టింగులు వేస్తే.. పాఠశాలల్లో లోటుపాట్లు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. పార్వతీపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజుతో కలిసి శనివారం వారు మీడియాతో మాట్లాడారు. జిల్లాకు చంద్రబాబు హామీలిస్తారనుకుంటే ఉసూరుమనిపించారని అన్నారు. తన శాఖలో ఏం జరుగుతుందో తెలియని గుమ్మడి సంధ్యారాణి ఓ ఫెయిల్యూర్ మంత్రి అని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య, వైద్య వ్యవస్థలు పూర్తిగా నాశనమయ్యాయని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో జిల్లాకు వరాలు కురిపిస్తారని ఆశించిన వారికి భంగపాటే మిగిలిందన్నారు. 2022లో పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడగా.. తాము జిల్లా అభివృద్ధికి ఏమీ చేయలేదని చెబుతున్న అధికార పార్టీ నేతలు.. అసలు ఈ 18 నెలల కాలంలో చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు–నేడు నిధులతో గత ప్రభుత్వం మెట్టవలస, నగులు, పెద్దవలస తదితర గ్రామాల్లో తలపెట్టిన పాఠశాల భవనాలను ఎందుకు పూర్తిచేయలేకపోయారో మంత్రి సంధ్యారాణి సమాధానం చెప్పాలన్నారు. ● గిరిజన విశ్వవిద్యాలయాన్ని సాలూరు నియోజకవర్గానికి తీసుకువస్తే... ఇక్కడ అవసరం లేదు, దానిని ఎస్.కోట నియోజకవర్గంలో పెట్టండని చెప్పిన పెద్ద మనిషి.. ఇప్పుడు గిరిజన సంక్షేమశాఖ మంత్రి కావడం దౌర్భాగ్యమన్నారు. గిరిజన విద్యాసంస్థల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయుల ఉద్యోగాలు పోవని కౌన్సిల్ సాక్షిగా అబద్ధాలు చెప్పిన మంత్రి సంధ్యారాణి.. ఇప్పుడు చేసిందేమిటన్నారు. కౌన్సిల్లో అబద్ధాలు చెప్పినందుకు వారిపై సభాహక్కులు నోటీసులు కూడా ఇవ్వొచ్చన్నారు. పీవీటీజీ పీఓను మంత్రి సంధ్యారాణి కక్షగట్టి సస్పెండ్ చేశారని ఆరోపించారు. గిరిజన విద్యార్థుల మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. దీనికి ప్రతిగా మంత్రిని సస్పెండ్ చేయాలన్నారు. పోలవరం నియోజకవర్గంలో ఒక విద్యార్థి చనిపోతే స్వయంగా అధికారులతో కలిసి వెళ్లి ఆ కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గిరిజన ప్రాంతాల్లో రేషన్ బియ్యంకోసం గిరిజనులు అవస్థలు పడుతున్నా మంత్రికి పట్టకపోవడం విచారకరమన్నారు. అన్ని విధాలా మంత్రిగా విఫలమైన సంధ్యారాణి.. వైఎస్ జగన్ను విమర్శంచడం, ఆమె వాడు తున్న భాష సంస్కారహీనతను తెలియజేస్తుందన్నారు. ● ‘దండిగాం వంతెన నిర్మాణం కోసం రూ.11 కోట్లు మంజూరు చేయించాం. దుగ్గేరుమండలంలోని ఆడారుగెడ్డలో రూ.6 కోట్లతో మరో బ్రిడ్జి మంజూరు చేయిస్తే.. ఆ పనులు కూడా చేయించడం లేదు. సాలూరు మండలం శివరాంపురంలో మరో రూ.6 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేయిస్తే.. ఆ పనులు కూడా మొదలుపెట్టడం లేదు. మా హయాంలో మంజూరైన, ప్రారంభించిన ఏ పనులనూ పూర్తి చేయడం లేదు కానీ... మా హయాంలో ప్రారంభమై పనులు పూర్తయిన వాటికి మాత్రం ప్రారంభోత్సవాలు చేస్తారు. సాలూరులో 100 పడకల ఆస్ప త్రికి సంబంధించి వారి హయాంలో కేవలం మెమో మాత్రమే జారీ చేశారు. మా ప్రభుత్వ హయాంలో 75 శాతం పనులు పూర్తిచేశాం. కరోనా కారణంగా పనులు ఆలస్యమైతే... ఇవాళ రూ.5 కోట్లు తెచ్చి వారే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. గతంలో వారు మొదలుపెట్టిన పనులన్నీ తాము బాధ్యతతో పూర్తి చేశాం.’ అని తెలిపారు. ● మంత్రి సంధ్యారాణి పీఏతో పాటు ఆమె కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వస్తే.. దానికి తాము కారణమని చెప్పడం ఏమిటన్నారు. ఆ ఘటనతో పార్టీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. ‘గిరిజనులకు మేలు చేయకుండా, మా పై నిందలు వేయడం ద్వారా మీ మంత్రి పదవిని కాపాడుకుందామనుకుంటున్నారే తప్ప.. గిరిజనులకు మేలు చేయాలన్న ఆలోచన లేద’ని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనీసం 18 నెలల తర్వాతైనా తీరుతాయని ఆశించిన పార్వతీపురం జిల్లా వాసులకు నిరాశే మిగిలిందని మాజీ ఎమ్మెల్యే కళావతి అన్నారు. ‘మాజీ ముఖ్యమంత్రి జగన్పై సంధ్యారాణి మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరం. గిరిజనులున్నా, గిరిజన విద్యార్థులన్నా చంద్రబాబు ప్రభుత్వానికి, మంత్రి సంధ్యారాణికే చిన్నచూపు. ట్రంకుపెట్టులు, గ్లాసులు, ఆర్వోప్లాంట్లు ఇచ్చామని మంత్రి సంధ్యారాణి చెప్పడం సిగ్గుచేటు. అవి ప్రతి ఏటా పిల్లలకు అందిస్తారని మంత్రికి కనీస అవగాహన లేకపోవడం దారుణం. వైఎస్.జగన్ హయాంలో ఈ రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేశారన్నది పచ్చినిజం. నిన్న సీఎం చంద్రబాబు సభలో అనర్గళంగా ఇంగ్లిష్లో మాట్లాడిన విద్యార్థుల ప్రతిభ వెనుక వైఎస్ జగన్ ఉన్నారు.’ అని చెప్పారు తన పీఏ ఒక మహిళా ఉద్యోగిని వేధిస్తే... న్యాయం చేయలేని మహిళా సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి.. రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది మహిళలకు ఏం రక్షణ కల్పించగలరని ప్రశ్నించారు. ‘మీ పనితీరుపై మీ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. మీ భాష, సంస్కారహీనం గిరిజనులకే తలవంపులు తెస్తోంద’ని అన్నారు. సీఎం చంద్రబాబు పర్యటనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఒమ్ము అయిందని మాజీ డిప్యూ టీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులు మంజూరు చేస్తారనుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయన్నారు. చంద్రబాబు పీటీ ఎం కార్యక్రమం తూతూమంత్రంగా సాగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యావ్యవస్థలో సమూలమార్పులు, కొత్త సంస్కరణలు తీసుకొచ్చి విద్యావ్యవస్థను దూసుకుపోయేలా చేసింది జగన్ ప్రభుత్వమే. నాడు–నేడు ద్వారా దశలవారీగా 45 వేల స్కూళ్లు బాగుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వసతి దీవెన, విద్యాదీవెన, అమ్మఒడి, ఐబీ, 8వతరగతి పిల్లలకు ట్యాబుల పంపిణీతో పాటు నాడు–నేడు ద్వారా 9 అంశాలతో కూడిన వసతులు కల్పించి.. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో 83 లక్షల మంది తల్లులుంటే... ఇవాళ కేవలం 66 లక్షల మంది తల్లులకు మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం ప్రకటించింది. అందులో 63 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం నగదు అందించారని తెలిపారు. ‘ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మరీ దారు ణం. 8 త్రైమాసికాలకు సంబంధించి రూ.5,600 కోట్లు చెల్లించాల్సి ఉంటే... రూ.700 కోట్లు మాత్రమే చెల్లించి రూ.4,900 కోట్లు బకాయిలు పెండింగ్.. వసతి దీవెన ఏడాదికి రూ.1,100 చొప్పున రెండేళ్లలో రూ.2200 కోట్లు పెండింగ్.. మొత్తం రూ.7800 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో డబ్బులు చెల్లించకుండా పెండింగ్లో ఉంచారు. ‘ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో గతంలో 1 నుంచి ఇంటర్ వరకు 87.41 లక్షల మంది ఉంటే.. ఇవాళ 78.89 లక్షలమందికి తగ్గారు. 9.5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. విద్యా ప్రమాణాలు తగ్గిపోవడమే ఇందుకు కారణం. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఏటా మధ్యాహ్న భోజనానికి రూ.400 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టగా.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏడాదికి రూ.1400 కోట్లు ఖర్చుపెట్టారు. గత ప్రభుత్వ మార్కు కనిపించకూడదన్న దురుద్దేశంతో ట్యాబుల పంపిణీ, టోఫెల్ ఇలా అన్నిరకాల కార్యక్రమాలనూ నిలిపివేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమంలో జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యలు ప్రస్తావించడం ద్వారా ప్రజలకు మంత్రి మేలు చేస్తారని ఎదురుచూస్తే... మంత్రి సంధ్యారాణికే ఆహ్వానం లేనట్టుంది. ముందురోజు పాత్రికేయుల సమావేశంలో సీఎం చంద్రబాబు సభను మనందరం విజయవంతం చేయాలన్న మంత్రే సమావేశంలో కనిపించలేదు. మీకు ఆహ్వానం లేదా? సమావేశానికి రావద్దని చెప్పా రా? మాట్లాడితే జగన్కు గిరిజనులంటే చులకనా? గౌరవం లేదని చెబుతారు... అలాంటిది మీ ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రే ఒక గిరిజన మంత్రికి గౌరవం ఇవ్వలేదు. అలాంటి మీరు మీ స్థాయి తెలుసుకోకుండా జగన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తారా? మీ పనితీరు, ప్రభుత్వ తీరుపై ప్రశ్నిస్తే.. మీరు మాత్రం వ్యక్తిగతంగా దాడులకు దిగుతారు తప్ప, అడిగిన ప్రశ్నలకు జవాబు మీ నుంచి రాదు. కానీ గత ఐదేళ్లలో గిరిజనులను చులకనగా చూశారని, రోడ్లు వేయలేదని, ఆర్వో ప్లాంట్లు పెట్టలేదంటూ పచ్చి అబద్ధాలు చెప్పా రు. జగన్ ప్రభుత్వంలో గిరిజనులకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మొత్తం రూ.19వేల కోట్లు ఖర్చు పెట్టారు. గిరిజన ప్రాంతాల్లో మెడికల్కాలేజీ, గిరిజన యూనివర్సిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇంజినీరింగ్ కాలేజీలు జగన్ హయాంలోనే వచ్చాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఒకే స్కూల్లో 200 మంది పచ్చకామెర్ల బారిన పడిన ఘటనలు ఎక్కడైనా ఉన్నాయా? ఇది చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ పాలన కాదా? అనారోగ్యంతో చనిపోయిన గిరిజన పిల్లల కుటుంబాలకు కనీసం ఎక్స్ గ్రేషియా కూడా ఇప్పించలేని సంధ్యారాణి ఓ అసమర్థ మంత్రి అని పుష్పశ్రీవాణి విమర్శించారు. ఒక బాధిత మహిళ తనకు అన్యాయం జరగకపోతే.. మంత్రి పీఏపై ఫిర్యాదు చేయగలుగుతుందా? సాటి మహిళగా మీరే సమాధానం చెప్పండి. బాధ్యతగల మంత్రిగా విజ్ఞతతో వ్యవహరించండి, లేనిపక్షంలో సహించేది లేదు’ అని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన చంద్రబాబు ప్రభుత్వం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే వారి పని.. 18 నెలల్లో ఏం చేశామో చెప్పుకోలేకే ఆ నిందలు సెట్లు వేస్తే పాఠశాలల్లో లోటుపాట్లు ఎలా తెలుస్తాయి? ఉసూరుమనిపించిన చంద్రబాబు మన్యం జిల్లా పర్యటన -
ప్రైవేటీకరణపై నిరసన
భామిని: వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై ప్రజలు నిరసన తెలుపుతున్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీరును తప్పుబడుతున్నారు. భామిని మండలంలోని 27 పంచాయతీల పరిధిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో ప్రజల నిరసన తెలిపారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండల వ్యాప్తంగా 17,500 మంది సంతకాలు చేశారు. వీటిని గవర్నర్కు చేర్చాలని వైఎస్సార్సీపీ నాయకులను కోరారు. తాలాడలో ఎమ్మెల్సీ విక్రాంత్తో కలిసి సంతకాలు చేసిన ప్రతులను ప్రదర్శించారు. -
దోమతెరలు పాడయ్యాయి..
వాస్తవానికి దోమతెరల కాలపరిమితి ఐదేళ్లు. దోమతెరలను ఉతకడం వంటివి చేస్తే మూడేళ్లకే పాడవుతాయి. ఇప్పటికే చాలా గ్రామాల ప్రజల వద్ద ఉన్న దోమ తెరలు పాడయ్యాయి. కొన్ని గ్రామల్లో వీటిని చేపల వేటకు, పూలమొక్కలు, ఇళ్లకు కర్టైన్లుగా, ద్విచక్రవాహనాలు కప్పేందుకు వినియోగిస్తున్నారు. ఏజెన్సీలో ఏటా జూన్ నుంచి నవంబర్ వరకు మలేరియా వ్యాప్తి చెందుతుంది. ఈ కాలంలో ఇక్కడి ప్రజలు దోమ తెరలు వినియోగం తప్పనిసరి. సీజన్ ముగిసినా ఇప్పటికీ దోమతెరలు సరఫరా చేయకపోవడంపై గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
దోమతెరలు ఏవి బాబూ?
సీతంపేట: జ్వరాల వ్యాప్తితో ఏజెన్సీ వణుకుతోంది. మలేరియా కారక దోమలు జనాలపై దాడిచేస్తున్నాయి. అస్వస్థతకు గురిచేసి ఆస్పత్రుల పాలచేస్తున్నాయి. పెద్దలతో పాటు చిన్నారులు, విద్యార్థులు తరచూ జ్వరాలబారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క దోమతెర కూడా పంపిణీ చేయలేదు. అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా దోమల తెరల పంపిణీపై ప్రభుత్వం శ్రద్ధచూపకపోవడంపై మన్యం ప్రజలు మండిపడుతున్నారు. పేరెంట్–టీచర్ మీటింగ్ అంటూ సినిమాసెట్టింగ్లు వేసి జనాలను మభ్యపెట్టడం కాదని, ప్రజలకు, విద్యార్థులకు ఏమి కావాలో తెలుసుకుని ముందుకు సాగాలని గిరిజన, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదీ పరిస్థితి... పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్ప్లాన్ మండలాలుండగా వీటిలో 1187 గిరిజన గ్రామాలున్నాయి. 36,452 గిరిజన కుటుంబాలు ఉండగా, 1,51,052 మంది జనాభా నివసిస్తున్నారు. మలేరియా హైరిస్క్ గ్రామాలు 120 వరకు ఉన్నాయి. పీహచ్సీలు, ఏరియా ఆస్పత్రుస్పెపిడమిక్ సీజన్లో 400లకు పైగా మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందిన వారి సంఖ్య దీనికి రెట్టింపు ఉంటుంది. ఐదేళ్ల కిందట రెండు లక్షల దోమతెరలను పంపిణీ చేశారు. దోమల నివారణకు దోహదపడేలా సింథటిక్ పెరాత్రిన్ మందు పూతతో ప్రత్యేకంగా తయారు చేసిన దోమతెరలను అప్పట్లో పంపిణీ చేశారు. మూడు నుంచి ఐదుగురు కుటుంబ సభ్యులున్న ఒక్కో కుటుంబానికి రెండు చొప్పున.. అంతకు మించి ఉన్నవారికి మూడు చొప్పున అందజేశారు. అవి ఇప్పుడు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. విద్యార్థులకు తప్పని దోమకాట్లు.. ఐటీడీఏ పరిధిలో 44 ఆశ్రమ పాఠశాలలు, 13 రెసిడెన్షియల్ పాఠశాలలు, మూడు గురుకుల కళాశాలలు, 13 పోస్టు మెట్రిక్ వసతిగృహాలున్నాయి. వీటిలో దాదాపు 20 వేల మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి కూడా దోమతెరలు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు వారికి కూడా పంపిణీ జరగలేదు. గతంలో ఇచ్చిన దోమతెరలు నామమాత్రంగా అక్కడక్కడా వినియోగిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులు పెరిగిన స్థానంలో దోమతెరలు పంపిణీ లేదు. దోమతెరల పంపిణీ ప్రతిపాదన ఉంది. స్టాక్ వచ్చిన వెంటనే పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటాం. మలేరియా కేసులు నమోదైనచోట పంపిణీ చేస్తున్నాం. వసతి గృహాల విద్యార్థులకు కూడా దోమతెరలు పంపిణీ చేస్తాం. – జె.మోహన్రావు, మలేరియా నివారణ సబ్యూనిట్ ఆఫీసర్ ఏజెన్సీ వాసులకు పంపిణీకాని దోమతెరలు అధికారం చేపట్టి 17 నెలలైనా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ఒక్క దోమతెర కూడా ఇవ్వని వైనం దోమల దాడితో ఇబ్బందులు పడుతున్న మన్యం ప్రజలు -
1800 కేజీల పేదల బియ్యం పట్టివేత
సాలూరు రూరల్: సాలూరు మండలం సారిక గ్రామంలో అక్రమంగా తరలించేందుకు ఆటో లో సిద్ధంగా ఉన్న 1800 కేజీల పేదల బియ్యంను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సతీష్, సిబ్బంది శనివారం పట్టుకున్నారు. ఒడిశాకు అక్రమంగా తరలిస్తుండగా పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్టు ఆయన తెలిపారు. నిందుతులు జంపా సురేష్, కొర్ర మహేంద్రపై కేసు నమోదుచేసి బియ్యాన్ని తహసీల్దార్కు అప్పగించామని తెలిపారు. పంట పొలాల్లో ఏనుగులు.. ఆవేదనలో కర్షకులు జియ్యమ్మవలస: పంట చేతికొచ్చేవేళ పొలాల్లో ఏనుగుల సంచారంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. కళ్లముందే ఏనుగులు పంటను ధ్వంసం చేస్తుండడంతో కంటతడిపెడుతున్నారు. వెంకటరాజపురం, గవరమ్మపేట, సుభద్రమ్మవలస, చింతల బెలగాం, సింగనాపురం, రాజీపేట, పెదమేరంగి, బాసంగి, బట్లభద్ర, బిత్రపాడు గ్రామాలకు చెందిన రైతులు ఏనుగుల రాకతో బెంబేలెత్తుతున్నారు. శని వారం ఉదయం వెంకటరాజపురం గ్రామంలో వరి ధాన్యం రాశులను చిందరవందర చేసిన ఏనుగులు సాయంత్రం 6 గంటల సమయంలో గ్రామంలోకి రావడంతో మళ్లించే ప్రయ త్నం చేశారు. అటవీ సిబ్బంది ఏనుగులకు కాపలాగా ఉంటున్నారే తప్ప తరలించే ఏర్పాటు చేయడంలేదని రైతులు వాపోతున్నారు. దివ్యాంగుల జీవితాల్లో ‘గురుదేవా’ వెలుగులు ● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి కొత్తవలస: వివిధ ప్రమాదాలు, పోలియో, కుష్టు వ్యాధితో అవయవాలు కోల్పోతున్నవారి జీవితాల్లో గురుదేవా చారిటబుల్ ట్రస్టు వెలుగులు నింపుతోందని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. మంగళపాలెం సమీపంలోని గురుదేవా చారిటబుల్ ట్రస్టును కలెక్టర్ శనివారం సందర్శించారు. ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, క్యాన్సర్ ఆస్పత్రి, కృత్రిమ అవయవాల తయా రీ యూనిట్ విభాగాలను పరిశీలించారు. కృత్రిమ అవయవాలను వినియోగిస్తున్న దివ్యాంగులతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు సేవ చేయడం దైవసేవగా భావించాలన్నారు. అతి తక్కువ ఖర్ఛుతో కృత్రిమ అవయవాలు తయారుచేసి అందజేయడం గొప్పవిషయమన్నారు. దివ్యాంగులకు సేవచేసే భాగ్యం గురుదేవాకు దక్కిందన్నారు. ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబును ప్రత్యేకించి అభినందించారు. ఈ సేవలు కొనసాగించేందుకు తనవంతు సహకారం అందస్తానని తెలిపారు. కార్యక్రమంలో కొత్తవలస తహసీల్దార్ పి.సునీత, ఆర్ఐ షణ్ముఖరావు, తదితరులు పాల్గొన్నారు. వరలక్ష్మి రైస్ మిల్లుపై చర్యలు ● డీ ట్యాగ్ చేసిన అధికారులు విజయనగరం ఫోర్ట్: రైతుల నుంచి అదనంగా ధాన్యం డిమాండ్ చేస్తున్న రైస్ మిల్లును పోర్టల్ నుంచి డీ ట్యాగ్ చేశారు. శ్రీకేవీర్ వరలక్ష్మి రైస్ ఇండసీ్త్ర మిల్లు యాజమాన్యం అదనపు ధాన్యం డిమాండ్ చేస్తున్నారని చీపురుపల్లి మండలానికి చెందిన రైతులు యల్లంటి సూర్యారావు, బూరాడ రమణ, తుంపల్లి త్రినాథ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం విచారణలో నిజమని తేలడంతో జేసీ సేతుమాధవన్ చర్యలు తీసుకున్నారు. రైస్ మిల్లుకు తదుపరి ధాన్యం కేటాయింపు లేకుండా చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు. -
మార్కెట్కు మన్యం గుమ్మడి
● సైజును బట్టి రూ.40 వరకు విక్రయం సీతంపేట: మన్యంలో గుమ్మడి సీజన్ ఆరంభమైంది. మార్కెట్, సంతల్లో గిరిజన రైతులు విక్రయిస్తున్నారు. సైజ బట్టి రూ.20 నుంచి రూ.40 మధ్యన ఒక్కో గుమ్మడి కాయ ధర పలుకుతోంది. పర్లాఖిమిడి, బరంపురం ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఏజెన్సీలో కొండపోడు వ్యవసాయంలో భాగంగా సుమారు 100 ఎకరాల్లో గుమ్మడిపంటను పండిస్తునానరు. దిగుబడి బాగున్నా ధర లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. గతేడాది ఒక్కో పండు రూ.50 వరకు ధర పలకగా ఈ ఏడాది ధర తగ్గిందంటూ వాపోతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి గుమ్మడి వంటి అటవీ ఉత్పత్తులను కొండలపై నుంచి మోసుకురావడమే మిగులుతోంది. గిట్టుబాటు ధర లభించడం లేదు. తెచ్చిన పంటను తిరిగి తీసుకెళ్లలేక వ్యాపారులు అడిగిన ధరకే విక్రయిస్తున్నాం. – ఎస్.తోటయ్య, గొయ్యిగూడ ఈ ఏడాది అటవీఉత్పత్తుల ధరలన్నీ తగ్గుముఖం పట్టాయి. గిరిజన రైతులకు నష్టాలు తప్పడంలేదు. కొన్నిపంటలకు పెట్టుబడి కూడా రావడంలేదు. ప్రభుత్వ పరంగా గిరిజనులను ఆదుకోవాలి. – ఎస్.మోజేషు, లంబగూడ -
పరజపాడుగదబవలసలో ఏనుగుల తిష్ఠ
జియ్యమ్మవలస రూరల్: పంట చేతికి అందికొస్తున్న సమయంలో అటవీ ఏనుగులు గుంపు ఈ మండలానికి వచ్చి రైతు కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. ఈ విషయమై కూటమి నాయకులంతా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏనుగులను తరలించాలని గగ్గోలు పెట్టారు. ఎన్నికల సమయంలో కుంకీ ఏనుగులను తెప్పించి ఈ ప్రాంతం నుంచి అటవీ ఏనుగుల గుంపును తరలిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం కిక్కురుమనకుండా చోద్యం చూస్తున్నారు.మరోవైపు ఏనుగులను తరలించాలని గట్టిగా నిలదీస్తే కేసుపెడతారేమోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో జియ్యమ్మవలస మండలంలో గడిచిన ఐదు రోజులుగా ఏనుగులు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నాశనం చేస్తూ నిద్రాహారాలు లేకుండా చేస్తున్నాయి. గురువారం చింతల బెలగాం పరిసరాల్లో రైతుల ధాన్యం బస్తాలను పాడుచేసి శుక్రవారం పరజపాడు గదబవలసలో తిష్ఠ వేశాయి. దీంతో కళ్లాల్లో ధాన్యం, చెరుకు పంటలను నాశనం చేస్తూ ప్రాణహాని కలిగిస్తాయన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ఏనుగుల గుంపును తరలించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అడుగడుగునా ఇబ్బందులే...
సాక్షి, పార్వతీపురం మన్యం/భామిని/పాలకొండ రూరల్: మెగా పేరెంట్– టీచర్ సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో అడుగడుగునా ప్రజలకు ఇబ్బందులే ఎదురయ్యాయి. పాలకొండ నియోజకవర్గం భామిని ఆదర్శ పాఠశాలలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యా రు. ఉదయం 10.50 గంటల సమయంలో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అంతకు అరగంట ముందుగానే అలికాం బత్తిలి రహదారిలో రాకపోక లు నిలిపివేశారు. ఆయన వేదిక వద్దకు వెళ్లిన కొద్దిసేపటి తర్వాత బస్సులను ఆ మార్గంలో విడిచి పెట్టారు. దీంతో ప్రయాణికులు, అటుగా నాలుగు చక్రాల వాహనాల్లో రాకపోకలు సాగించే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాదచారులను కూడా చాలా సమయం వరకు నిలిపి వేశారు. ఆ తర్వాత ఒకేసారి వదిలేయడంతో రద్దీ పెరిగింది. హెలిప్యాడ్ మార్గంలో ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి అవమానం జరిగింది. చంద్రబాబు వస్తారని ముందుగానే రహదారిని బ్లాక్ చేసిన పోలీసులు.. అదే సమయంలో అటువైపు వచ్చిన విప్ తోయక జగదీశ్వరిని కూడా విడిచిపెట్టేందుకు ససేమిరా అన్నారు. దీంతో ఆమె నిరాశగా వెనుదిరిగి.. తన కారులోనే చాలా సేపు ఉండిపోయారు. సీఎం సమావేశ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లిన కొద్ది సేపటికి విడిచిపెట్టారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇతర టీడీపీ నాయకులు కూడా ఆయన్ను కలిసేందుకు వచ్చి, కుదరక వెనుదిరిగారు. ముఖ్యమంత్రి పర్యటనలోనూ కూటమిలో వర్గ విబే ధాలు చల్లారలేదు. చంద్రబాబు పర్యటన సమ యంలో ఎక్కడా జనసేన జెండాలు కనిపించలేదు. వారి హడావిడి కానరాలేదు. ఇక్కడ టీడీపీలోనూ రెండు వర్గాలు ఉన్న విషయం విదితమే. ముందు రోజు రాత్రి పార్టీ శ్రేణులతో మంత్రి లోకేశ్ సమావేశమై హితోపదేశం చేసినప్పటికీ.. పరిస్థితిలో మా ర్పు రాలేదని స్పష్టమైంది. సీఎం స్వాగత ఫ్లెక్సీల సందర్భంలోనూ ఇదే విషయం తేటతెల్లమైంది. నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి వర్గానికి అంతగా ప్రాధాన్యం దక్కలేదు. ఒకరి ఫ్లెక్సీల్లో ఇంకొకరి జాడ లేదు. మరోవైపు హెలిప్యాడ్ నుంచి ఆదర్శ పాఠశాల వరకూ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఫ్లెక్సీలే రహదారికి ఇరువైపులా దర్శనమిచ్చాయి. అందులోనూ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్, జిల్లా మంత్రి సంధ్యారాణి, ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయు డు, నాగబాబు ఫొటోలు వేసుకున్న ఆయన.. ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకుల చిత్రాలేవీ లేకుండా జాగ్రత్త పడ్డారు. తన గురువు అయిన కళా వెంకటరావు ఫొటోను మాత్రం వేయడం గమనార్హం. ఇదే సమయంలో నియోజక వర్గ ఇన్చార్జి పడాల భూదేవి వర్గం వేసిన ఫ్లెక్సీలను రహదారి పక్కన పడేయడం.. వర్గ పోరును తేటతెల్లం చేసింది. సీఎం పర్యటనలో జిల్లా మంత్రి సంధ్యారాణి జాడ లేదు. ముందు రోజు పార్టీ నియోజక వర్గ శ్రేణులతో లోకేశ్ నిర్వహించిన సమావేశంలో ఆమెతోపాటు.. ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. సీఎం కార్యక్రమానికి ఆమె రాకపోవడం చర్చనీయాంశమైంది. పేరెంట్–టీచర్ మీట్లో నియోజక వర్గ ఎమ్మెల్యే జయకృష్ణ, టీడీపీ ఇన్చార్జి భూదేవి మాత్రమే ముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్తో కలిసి పాల్గొన్నారు. ఇతర నాయకులను ఎవరినీ అనుమతించలేదు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కూడా హెలిప్యాడ్ వద్దకు వచ్చారు. వీరేష్ చంద్రదేవ్, భూదేవి వంటివారు కనిపించారు. జిల్లా మంత్రిగా సంధ్యారాణి కనిపించకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఇటీవల మంత్రి పీఏ, కుమారుడి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం విదితమే. అధిష్టానం నుంచి కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమెను దూరం పెట్టారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
ఆర్టీసీ టికెట్పై రాయితీ
పాలకొండ రూరల్: పాలకొండ నుంచి విజయవాడ వెళ్తున్న ఇంద్ర బస్సులకు సంబంధించి టికెట్పై 20 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు జిల్లా ఆర్టీసీ అధికారి పి.వెంకటేశ్వరరావు తెలిపారు. పాలకొండ డిపోను ఆయన శుక్రవారం సందర్శించారు. ఇంద్ర బస్సుల్లో ప్రయాణికుల కు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. డిసెంబ ర్ 31వరకు ప్రయాణ రాయితీ కొనసాగుతుందన్నారు. పాలకొండలో రాత్రి 7 గంటలకు బస్సు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విజయవాడ చేరుతుందని, ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. విజయనగరం: పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆరోగ్యమే పరమావధిగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపడితే, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమంటూ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ బాధ్యత గల ప్రతిపక్షంగా చేస్తున్న పోరాటం అంతం కాదని, ఆరంభం మాత్రమేనని స్పష్టంచేశారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకునేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న భయంతోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుందన్నారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తుది దశకు చేరుకుందని చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేల నుంచి 70వేల వరకు సంతకాలు సేకరణ జరిగిందన్నారు. గ్రామాలు, వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి సంతకాలు సేకరించిన పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు. సేకరించిన సంతకాలను ఈ నెల 16న రాష్ట్ర గవర్నర్కు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అందజేస్తామన్నారు. విజయనగరం అర్బన్: జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం కింద 100 రోజుల పని కల్పనలో అలసత్వం తగదని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. పనుల కల్పనలో వెనుకబడిన మండలాల అధికారులపై శుక్రవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో అసహనం వ్యక్తంచేశారు. వంగర, మెంటాడ, జామి, వేపాడ, కొత్తవలస మండలాలు ప్రతి వారం ప్రగతి తగ్గుతుండడంపై నిలదీశారు. వెంటనే మెమోలు జారీ చేయాలని ప్రాజెక్టు డైరెక్టర్ను ఆదేశించారు. గుర్ల, విజయనగరం, ఎల్.కోట, రేగిడి, భోగాపురం మండలాల్లో నిర్దేశిత లక్ష్యాల సాధనకు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రోజువారీ వేతనం రూ.300 కంటే తక్కువ రాకుండా చూడాలన్నారు. ● వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన మరో టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్క్రబ్టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అనవసర ఆందోళన రాకుండా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ● జిల్లా అభివృద్ధి సూచికల్లో పలు శాఖలు వెనుకబడి ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. పరిశ్రమలు, మహిళా అండ్ శిశు సంక్షేమం, పోలీస్, ఫిషరీస్, పశుసంవర్థక, ఉద్యానవన శాఖలు తమ ప్రగతిని తక్షణం మెరుగుపరచుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగితాలపై మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో నిజమైన, రియలిస్టిక్ డేటాను సిద్ధం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో సీపీఓ బాలాజీ పాల్గొన్నారు. -
అట్టహాసంగా సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభం
● అలరించిన సినీ తారలు రితిక, నిధి అగర్వాల్ పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రం వాకిట ప్రముఖ వస్త్ర వాణిజ్య సంస్థ ‘ిసీఎంఆర్ షాపింగ్ మాల్’ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. పార్వతీపురంలోని సౌందర్య జంక్షన్లో ఏర్పాటు చేసిన ఈ భారీ షోరూమ్ను స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎంఆర్ రాకతో జిల్లా ప్రాంత ప్రజల షాపింగ్ కష్టాలు తీరాయన్నారు. గతంలో శుభకార్యాల కోసం విశాఖ, విజయవాడ వెళ్లేవారని, ఇప్పుడు ఆ అవసరం లేకుండా అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభవం, ఉపాధి అవకాశాలు స్థానికంగానే లభించడం ఆనందదాయకమన్నారు. సంస్థ చైర్మనన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా తెలుగు ప్రజల ఆదరణే తమ బలమని, సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను ఫ్యాక్టరీ ధరలకే సామాన్యులకు అందిస్తున్నామని తెలిపారు. ‘వన్న్స్టాప్ ఫ్యామిలీ డెస్టినేషన్’గా అన్ని వర్గాలకు నచ్చేలా మాల్ను తీర్చిదిద్దామని డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ పేర్కొన్నారు. ప్రారంభోత్సవంలో సినీ తారలు రితిక నాయక్, నిధి అగర్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వస్త్ర శ్రేణులను తిలకించి, తమ ఆటపాటలతో అభిమానులను ఉర్రూతలూగించారు. -
సమస్య చెప్పుకుందామని వస్తే.. గెంటేశారు!
ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు చెప్పుకోవాలని వచ్చిన పలువురు ప్రజలకు నిరాశే ఎదురైంది. తమ నియోజక వర్గ ప్రజా ప్రతినిధులు పట్టించుకోకవడం.. అధికారులు కూడా స్పందించకపోవడంతో నేరుగా సీఎంకే మొర పెట్టుకుందామని సుదూర ప్రాంతాల నుంచి పలువురు దివ్యాంగులు, వృద్ధులు, పిల్లల తల్లిదండ్రులు విచ్చేశారు. సీఎం దరిదాపులకు కూడా వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. హెలికాప్టర్ దిగి కాన్వాయ్లో ముఖ్యమంత్రి వెళ్తున్న సమయంలోనూ.. వీరి గోడు వినే పరిస్థితి లేకపోయింది. ●గుమ్మలక్ష్మీపురం మండలం పెదఖేర్జకు చెందిన నిమ్మల కళావతి దంపతులు.. నడవలేని స్థితిలో ఉన్న తమ ఎనిమిదేళ్ల కుమారుడు సంపత్ను తీసుకుని వచ్చా రు. 94 శాతం మానసిక దివ్యాంగత్వంతో బాధపడుతున్న తమ కుమారుడికి నేటికీ పింఛన్ రావడం లేదు. తమ ప్రాంత ఎమ్మెల్యేను, అధికారులను కలిసినా ప్రయోజనం లేదని నేరుగా ముఖ్యమంత్రి వద్దే మొర పెట్టుకుందా మని ఆశ పడ్డారు. ఎంత ప్రయత్నించినా సీఎంను కలిసే అవకాశం రాలేదు. చివరికి సీఎం కాన్వాయ్లో ఉన్న ఒకరికి వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగారు. ●భామిని మండలం కొసలి గ్రామానికి చెందిన గొర్లె తవిటమ్మ అనే దివ్యాంగురాలు.. తనకు వికలాంగ ధ్రువపత్రం ద్వారా రూ. 25 లక్షల రుణం ఇప్పిస్తానని చెప్పి మండపాటి నిర్మల, సుధీర్ అనే దంపతులు.. సుందరరావు అనే వ్యక్తి మధ్యవర్తిత్వంతో రూ. 6.15 లక్షలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రుణం లేదూ.. తన డబ్బులూ ఇవ్వడం లేదని వాపోయింది. ఎవరిని కలిసినా న్యాయం జరగడం లేదని.. సీఎం వద్దే తన గోడు చెప్పుకుందామని వచ్చింది. అక్కడా ఆమెకు నిరాశే ఎదురైంది. -
వృద్ధుడి అదృశ్యం
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 75 ఏళ్ల వృద్ధుడు కనిపించడం లేదని పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు అందింది. వృద్ధుడు లెక్కల అప్పారావు గత నెల 29వ తేదీన చెల్లూరు సమీపంలో ఉన్న ఇంటి నుంచి వెళ్లిపోయాడని కొడుకు రామకృష్ణ ఫిర్యాదు చేశాడు. అదే రోజు ఉదయం 10.15గంటలకు ఇంటి నుంచి సమీప షాపుకు వవెళ్లిన అప్పారావు మధ్యాహ్నం 1గంట అయినా ఇంటికి రాలేదు. అప్పటి నుంచి స్థానికులతో పాటు చుట్టు పక్కల వారిని వాకబు చేసినప్పటికీ అప్పారావు జాడ తెలియరాలేదు. తన తండ్రి అప్పారావు కనిపించలేదంటూ కొడుకు రామకృష్ణ ఫిర్యాదు చేశాడని కేసు కట్టి నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై అశోక్ తెలిపారు.బస్సు, బైక్ ఢీకొని ద్విచక్రవాహనదారు మృతిసీతానగరం: మండలంలోని ప్రధాన రహదారిపై గుచ్చిమి వద్ద శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.విజయనగరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పార్వతీపురం నుంచి సీతానగరం మీదుగా విజయనగరం వస్తుండగా సీతానగరం నుంచి పార్వతీపురం మధ్యలో బస్సు గుచ్చిమి బస్టాప్ వద్ద ఆగింది.ఆగి ఉన్న బస్సును మోటార్ సైకిలిస్ట్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదం జరిగిందని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఏఎస్సై లక్ష్మణరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని గుర్తించడానికి మోటార్సైకిల్లో ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తించలేకపోయామని తెలియజేశారు. హోండాషైన్ మోటార్ సైకిల్ (ఎపి35ఎసి2190 నంబర్) బస్సు ఫ్రంట్వీలును చుట్టుకోవడంతో బైక్ నుజ్జునుజ్జు అయింది. ఈ వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని కోరారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతిగజపతినగరం: గంట్యాడ మండలం బుడతనాపల్లి గ్రామానికి చెందిన కొర్నాన అప్పలనాయుడు(30) అనే వ్యక్తి గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామ సమీపంలో విద్యుత్ వైర్లు తగిలి షాక్ కొట్టి మృతిచెందినట్లు ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మట్లాడుతూ కొర్నాన అప్పలనాయుడు గజపతినగరం మండలం పురిటి పెంట గ్రామ సమీపంలో ఇసుక లోడు పట్టిన అనంతరం ట్రాక్టర్ పైకి ఎక్కి ఇసుకను సర్దుతుండగా దగ్గరలో ఉన్న విద్యుత్ వైర్లు తగిలి గురువారం రాత్రి చనిపోయినట్లు మృతుడి తండ్రి మల్లయ్య చెప్పాడన్నారు.ఈ విషయంపై శుక్రవారం మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. -
స్వరరాగ గంగా ప్రవాహం
విజయనగరం టౌన్: శతాబ్దిగాయకుడు పద్మశ్రీ ఘంటసాల 103వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఆనందగజపతి కళాక్షేత్రంలో ఘంటసాలకు 12 గంటల నిర్విరామ ఘంటసాల స్వరాభిషేకం వేడుకగా నిర్వహించారు. వర్ధమాన గాయనీగాయకులు ఆలపించిన ఆపాతమధురాలు ఆద్యంతం ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఇండియన్ ఐడల్ గాయకులు నజీరుద్దీన్, శిరీష, సౌజన్యలు ఘంటసాల గీతాలాపన చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ కళాకారులు అద్భుతమైన పాటలతో ఆకట్టుకున్నారు. భారతమాతకు జేజేలు అంటూ చిన్నారులు పాడుతూ చూపరుల కరతాళ ధ్వనులందుకున్నారు. చిన్నారులే సంగీత పరికరాలను వినియోగిస్తూ, నటన కౌశల్యాన్ని ప్రదర్శిస్తూ చేసిన ప్రదర్శన ఆద్యంతం అలరించింది. ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్ధాపకుడు ఎం.భీష్మారావును చిన్నారుల తల్లిదండ్రులు దుశ్సాలువతో ఘనంగా సత్కరించారు. తనవద్దనున్న సంగీత వాయిద్యపరికరం వాయిస్తూనే సంగీత మాంత్రికుడు పద్మశ్రీ డాక్టర్ శివమణి స్టేజిపైకి వచ్చి చూపరులను అలరించారు. తన శిష్యుడు భీష్మారావు కుమారులు సాయి,పవన్లతో కలిసి సంగీత స్వరఝురి మధురిమలను ప్రదర్శించి విజయనగరవాసులను కట్టిపడేశారు. విభిన్నరకాల సంగీత పరికరాలను శివమణి తనదైనౖశైలిలో వాయిస్తూ పవన్తో కలిసి డప్పు వాయిద్య ప్రదర్శనకు ఆడిటోరియంలో ప్రేక్షకులు నిలబడి కరతాళధ్వనులందించి, ఆద్యంతం ఆస్వాదించారు. ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ 1909లో మా పూర్వీకులు సంగీత కళాశాలను స్ధాపించారని, అదే కళాశాల నుంచి ఎందరో మహానుభావులు ప్రపంచ వ్యాప్తంగా విజయనగర ఖ్యాతిని వ్యాప్తి చేశారన్నారు. అందులో ఒకరు ఘంటసాల అని గుర్తుచేశారు. నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ఘంటసాల స్మారక కళాపీఠం 35 ఏళ్లుగా నిర్విరామ కృషిచేస్తోందన్నారు. ఘంటసాల జయంతి సందర్భంగా శివమణిని సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కళాపీఠం ప్రతినిధులు దుర్వాసుల రాజేంద్రప్రసాద్, ధవళసర్వేశ్వరరావు, ఈఆర్ సోమయాజులు, మేకా అనంతలక్ష్మి, డాక్టర్ జి.సన్యాసమ్మ, డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, డాక్టర్ ఎ.గోపాలరావు, మారుతీ శ్రీనివాస్, కాపుగంటి ప్రకాష్, అధిక సంఖ్యలో కళాకారులు, అభిమానులు పాల్గొన్నారు. శివమణికి ఘంటసాల స్మారక విశిష్ట పురస్కారం ప్రపంచ ప్రసిద్ధ పెర్కషన్ మాస్ట్రో, పద్మశ్రీ డాక్టర్ శివమణికి ఘంటసాల స్మారక విశిష్ట పురస్కారాన్ని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల శ్రావణిల చేతుల మీదుగా అందజేసి పెద్దలు గజమాలతో ఘనంగా సత్కరించారు. సువర్ణ కంకణం, ప్రశంసాపత్రం, జ్ఞాపిక, దుశ్సాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అలరించిన నిర్విరామ సినీ సంగీత విభావరి తెలుగు ఇండియన్ ఐడల్స్ అద్భుత గానాలాపన పద్మశ్రీ డాక్టర్ శివమణికి ఘంటసాల స్మారక విశిష్ట పురస్కారం -
కన్నవారికి శోకం
గత నెల 29న కొమరాడ మండలం మాదలింగి గ్రామంలో తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లమని మందలించారన్న చిన్న కారణానికి 27ఏళ్ల బి.మధుసూదనరావు అనే యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు. భవిష్యత్లో ఉన్నత స్థాయికి వెళ్లాల్సిన యువకుడు చిన్న మందలింపునకే ఆయువు తీసుకోవడం తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగిల్చింది. క్షణికావేశం.. కన్నవారికి శోకం● మందలిస్తే మరణమేనా? ● ఓర్పులేని తనం..బలవుతున్న జీవనం ● చిన్నపాటి మనస్తాపాలకే బలవన్మరణాలు ● ఆందోళన కలిగిస్తున్న వరుస విషాదాలు పెంపకమే పునాది... సంభాషణే పరిష్కారం పిల్లలకు చిన్న నాటి నుంచే మంచి, చెడుల విచక్షణ నేర్పాలి. కోరినవన్నీ ఇవ్వడమే ప్రేమ అనుకోకూడదు. ఆ కోరికల వెనుక ఉన్న పర్యవసానాలను వారికి అర్థమయ్యేలా వివరించాలి. చిన్ననాటి నుంచి గారాబం చేసి పెద్దయ్యాక ఒక్కసారిగా వారిపై ఆంక్షలు విధిస్తే తట్టుకోలేరు. యవ్వనంలో వారిని మందలించడం కంటే మిత్రుడుగా మారి సమస్యను విశ్లేషించి నచ్చజెప్పాలి. వారి ఆసక్తులను గౌరవిస్తూనే అవి ఉన్నత భవిష్యత్కు ఏ విధమైన బాటలు వేస్తాయో నచ్చజెప్పాలి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ప్రోత్సహించాలి. యువత కష్టమొస్తే కుమిలిపోకూడదు. తల్లిదండ్రులతో మనస్సు విప్పి మాట్లాడాలి. వారి అనుభవం, ప్రేమ ఏ సమస్యకై నా పరిష్కారం చూపుతాయని గుర్తించాలి. – రష్మిత, మానసిక వైద్య నిపుణురాలుయువకుడి ఆత్మహత్యవిజయనగరం క్రైమ్: పట్టణంలోని దాసన్నపేటలో గొల్లవీధికి చెందిన కోరాడ వీరేంద్ర (25) ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వీరేంద్ర మూడేళ్ల నుంచి నగరానికి చెందిన దుర్గ అనే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది.పెళ్లి చేసుకుందామని ఇద్దరూ నిర్ణయించుకుని ప్రేమ వ్యవహారం ఇరుకుటుంబాల పెద్దలకు తెలియచెప్పారు. ప్రస్తుతం పెళ్లిముహూర్తాలు లేవని, మూడు నెలలు ఆగాలని వీరేంద్ర తరఫున అమ్మానాన్నలు అమ్మాయి కన్నవారికి చెప్పి మిన్నకున్నారు. అయితే అమ్మాయి మాత్రం అత్యవసరంగా తన మెడలో తా ళి కట్టాలని వీరంద్రపై ఒత్తిడి చేసింది. ముహూర్తాలు లేకపోయినా, పెళ్లి చేసుకోవాలని ప్రేమించిన యు వతి ఒత్తిడి చేయడంతో ఇంట్లో చెప్పలేక వీరేంద్ర తీవ్ర ఘర్షణ పడ్డాడు. ఆపై మనో వేదన చెందాడు. కొడుకు మనోవ్యథను కళ్లారా చూసిన వీరంద్ర తల్లిదండ్రులు మీ ఇద్దరి పెళ్లి సింహాచలంలో చేస్తామని ఆగాలని తొందర పడొద్దని నచ్చజెప్పారు. కానీ అంతలోనే ఏమైందో ఏమో గానీ శుక్రవారం ఉదయాన్నే తన ఇంట్లోని మేడపైకి వెళ్లిన వీరేంద్ర ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం తెలుసుకున్న టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరా వు, ఎస్సై కనకరాజు లు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీ లించారు. కన్నవారు, స్థానికుల నుంచి వివరాలు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ శ్రీనివాస్ చెప్పారు.పార్వతీపురం రూరల్: జీవితం ఒక యుద్ధం..పోరాడి గెలవాలి. కానీ నేటి యువత ఆయుధం చేతపట్టకముందే చేతులెత్తేస్తోంది. సమస్య ఎదురైతే పరిష్కారం వెతకాల్సిందిపోయి ప్రాణం తీసుకోవడమే పరమావధిగా భావిస్తోంది. ‘ఛీ’ అంటే చిన్నబుచ్చుకోవడం ‘వద్దు’ అంటే విగతజీవిగా మారడం నేటి యువతకు పరిపాటిగా మారింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబకలహాలు, ప్రేమ వ్యవహారాలు ఇలా కారణమేదైనా పర్యవసానం మాత్రం మరణంగానే మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉద్వేగమే ఉరితాడై.. నేటితరం ఉద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోతోంది. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు నిండు నూరేళ్ల జీవితాన్ని సమాధి చేస్తున్నాయి. ప్రేమలో ప్రమాద ఘంటికలు ప్రేమంటే రెండు మనస్సుల కలయిక మాత్రమే కాదు. బాధ్యత కూడా అని మరిచిపోతున్నారు. ● గతేడాది ఆగస్టు నెలలో పాచిపెంటలో జరిగిన ఘటన ప్రేమికుల అనాలోచిత నిర్ణయాలకు ఆద్దం పట్టింది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరగలేదన్న బాధతో ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా అక్క మృతిచెందిన ఆలోచనను తట్టుకోలేక ఆమె చెల్లెలు కూడా బలవన్మారణానికి పాల్పడడం స్థానికులను కంటతడిపెట్టించింది. ● అలాగే ఈ ఏడాది ఏప్రిల్లో సాలూరు పరిధిలో వెలుగు చూసిన ఘటన ప్రేమ ముసుగులో జరిగిన ఘాతుకాన్ని బయటపెట్టింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిన పాపానికి ప్రియరాలిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రియుడు ప్రయత్నించడం సభ్య సమాజాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. మానిసిక స్థైర్యమే రక్ష జీవితంలో ఎత్తు, పల్లాలు సహజం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా కుటుంబసభ్యులతో పంచుకుంటే పరిష్కారం లభిస్తుంది. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు. అది పలాయనవాదం. తల్లిదండ్రులు కూడా పిల్లలతో స్నేహ పూర్వకంగా చిన్న నాటి నుంచే వారితో మెలుగుతూ, వారిలో మానసిక స్థైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. -
క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరచాలి
● జేఎన్టీయూ, గురజాడ వర్సిటీ వీసీ సుబ్బారావు డెంకాడ: ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకూ కాకినాడ జేఎన్టీయూలో జరగబోయే సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనే జేఎన్టీయూ, విజయనగరం గురజాడ విశ్వవిద్యాలయం జట్టు ఉత్తమ ప్రతిభ కనబరచాలని వీసీ వీవీ సుబ్బారావు అన్నారు. ఈ పోటీల్లో గురజాడ విశ్వవిద్యాలయం తరఫున ఆడబోయే వాలీబాల్ పురుషుల జట్టు, ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ కమ్ యూనివర్సిటీ వాలీబాల్ పురుషుల జట్టు ఎంపిక పోటీలను చింతలవలసలోని ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం వీసీ వీవీ సుబ్బారావు రిబ్బన్కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిక పోటీల్లో విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల జట్ల క్రీడాకారులు మెరుగైన ఆటతీరును ప్రదర్శించాలన్నారు. క్రీడలతో శారీరక, మానసిక వికాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైఎంసీ శేఖర్, టోర్నమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ, పీడీ రామచంద్రరాజు, క్రీడా సమన్వయకర్త జి.అప్పలనాయుడు, పరిశీలకులు కె.నాగరాజు, పీడీలు, కోచ్లు, రిఫరీలు,కళాశాల డీన్లు, హెచ్ఓడీలు, అధ్యాపకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంతర్ వర్సిటీ క్రీడాపోటీలకు మిమ్స్ విద్యార్థి నెల్లిమర్ల: సౌత్జోన్ అంతర్ విశ్వవిద్యాలయ టేబుల్ టెన్నిస్ పోటీలకు మిమ్స్ హోమియోపతి కళాశాల సెకండియర్ విద్యార్థి కళ్యాణి ఎంపికై నట్లు ఆ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కె.కళావెంకటరావు ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపారు. నవంబర్ 21న ఏలూరులోని ఆశ్రం మెడికల్ కళాశాలలో జరిగిన ఎంపిక పోటీల్లో సదరు విద్యార్థి ప్రతిభ కనబరిచి, పై స్థాయి పోటీలకు అర్హత సాధించిందన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు విశాఖ గీతం యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ మేరకు సదరు విద్యార్థిని మిమ్స్ చైర్మన్ అల్లూరి సత్యనారాయణరాజు, మేనేజింగ్ ట్రస్ట్ ప్రవీన్ వర్మ, లైఫ్ ట్రస్ట్ శ్రీ రామకృష్ణరాజు, డీన్ లక్ష్మికుమార్, మిమ్స్ డైరెక్టర్ వేణుగోపాలరావు, ప్రిన్సిపాల్ శ్రీధర్ తదితరులు అభినందించారు. -
రేషన్ ఉచితం.. చార్జీల భారం
సాలూరు: వారంతా రెక్కాడితే గాని డొక్కాడని గిరిజనులు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్ బి య్యం కోసం చార్జీల భారం మోసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినెలా ఆర్థికంగా చితికిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సాలూరు మండలంలోని కరడావలస గిరిశిఖర గ్రామం. అక్కడ గిరిజనులంతా ప్రతి నెలారేషన్ సరుకుల కోసం దండిగాం జీసీసీ డిపోకు రావాలి. దీనికోసం వారు కరడావలస గ్రామం నుంచి రొడ్డవలస మీదుగా ఆంధ్రా–ఒడిశా ఘాట్రోడ్డు దిగి పి.కోన వలస దాటి సాలూరుకు చేరుకుంటున్నారు. సాలూరు నుంచి మామిడిపల్లి మీదుగా దండి గాంకు చేరుకుంటారు. ఓ వైపు సుమారు 50 కి. మీ దూరం. దీనికోసం ప్రైవేటు వాహనానికి ఒక వైపు మనిషికి రూ.200 చొప్పున చెల్లిస్తున్నారు. రానుపోను చార్జీలు ఒక్కొక్కరికి రూ.400 అవుతోంది. మరోవైపు భోజనం ఖర్చులు, కోల్పోయి న పనిదినం అన్నీ కలిపి రేషన్ సరుకుల కోసం సరాసరి రూ.1000 నష్టపోవాల్సి వస్తోందంటూ గిరిజనులు వాపోతున్నారు. బియ్యం ఉచితంగా ఇచ్చిన చార్జీలు తడిసిమోపెడు అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత ఐదేళ్లూ వాహనంతో వచ్చి మా ఊరికి దగ్గరలోనే బియ్యం ఇచ్చేవారని చెబుతున్నారు. కూలి పనులు కూడా మానుకోవాల్సిన అవసరం ఉండేది కాదని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మాకు కష్టాలు తప్పడంలేదన్నారు. కరడావలస నుంచి ఘాట్రోడ్డు గుండా పి.కోనవలస మీదుగా సాలూరు చేరుకుంటాం. అక్కడ నుంచి దండిగాంకు వెళ్తాం. ప్రైవేటు వాహనాలే మాకు ఆధారం. చేసేది లేక రానుపోను రూ.400 చార్జీలు అవుతున్నాయి. భోజనం ఖర్చులు, కూలి పని మానుకోవడం వల్ల కోల్పోయిన డబ్బులు కలిపితే రూ.1000 వరకు నష్టపోతున్నాం. ప్రభు త్వం, అధికారులు ఆలోచించి గ్రామంలోనే ఇచ్చే ఏర్పాట్లు చేయాలి. – చోడిపల్లి సుబ్బారావు, రేషన్ లబ్ధిదారుడు, కరడావలస రేషన్ సరుకుల కోసం మేము చాలా కష్టపడాల్సి వస్తోంది. వ్యయప్రయాసలు పడుతున్నాం. ప్రభుత్వం మా గురించి ఆలోచించాలి. – పాలిక ఈశ్వరరావు, గిరిజన రేషన్ లబ్ధిదారుడు, కరడావలస -
వైభవంగా సహస్ర దీపారాధన
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపారాధన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన పూజలనంతరం యాగశాలలో విశేష హోమాలు నిర్వహించారు. అనంతరం వెండి మంటపం వద్ద సీతారాముల నిత్యకల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామివారి విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మంటపం వద్దకు తీసుకువెళ్లి అక్కడున్న ప్రత్యేక ఊయలలో ఆశీనులు చేశారు. అనంతరం సహస్ర దీపాలను వెలిగించి దీపాల కాంతుల శోభలో స్వామికి ఊంజల్ సేవ జరిపించారు. -
విద్యార్థులకు పనిపాఠం!
తాళ్లబురిడి ఎంపీపీ స్కూల్లో కుర్చీని శుభ్రం చేస్తున్న విద్యార్థి పార్వతీపురం రూరల్: పిల్లలు చక్కగా చదువుకుని ప్రయోజకులైతే కుటుంబ పరిస్థితి మారుతుందన్న ఆశతో తల్లిదండ్రులు కూలీనాలీచేసి ప్రభుత్వ బడులకు సాగనంపుతున్నారు. అక్కడ పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులతో పనులు చేయిస్తుండడం వారిలో ఆందోళన నింపుతోంది. ప్రతినెలా ప్రభుత్వం ఏదో ఒక కార్యక్రమాన్ని తలపెట్టడం.. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న చిన్నారులకు చదువును దూరం చేయడం పరిపాటిగా మారిందంటూ వాపోతున్నారు. ప్రైవేటు పాఠశాలల పిల్లలు ఏ బాదరబందీ లేకుండా చదువులు సాగిస్తుంటే.. ఇక్కడ మాత్రం అరకొర నిధులు విదిల్చి మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం) అంటూ హడావుడి చేయడం... పిల్లల తో షామియానాలు మోయించడం, కుర్చీలు, బెంచీలు తుడిపించడంపై తల్లిదండ్రులు భగ్గుమంటు న్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును చక్కదిద్దాల్సి న చదువుల నిలయం చివరకు పనులు చేయించే నిలయంగా మార్చేస్తున్నారని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు ఊదరకొడుతున్న ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్’ క్షేత్రస్థాయిలో నిధుల లేమితో ‘మెగా ఇబ్బందుల మీటింగ్’లా దర్శనమిచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని పనులూ విద్యార్థులతోనే... పార్వతీపురం మండలంలోని బందలుప్పి,తాళ్లబురి డి పాఠశాలల్లో నిర్వహించిన పీటీఎం ఏర్పాట్లన్నీ విద్యార్థులతోనే చేయించారు. టెంట్లు వేయడం దగ్గరి నుంచి కార్యక్రమం అయ్యాక వాటిని తీసి అప్పగించే వరకు అన్నీ చిన్నారులే చేశారు. చదువుల తల్లి ఒడిలో అక్షరాలు దిద్దాల్సిన చేతులు.. బరువులు మోస్తూ, టెంట్లు కడుతూ కనిపించడం తల్లిదండ్రులను విస్మయానికి గురిచేసింది. అతిథులకు మర్యాద.. విద్యార్థులకు ఇబ్బంది వచ్చిన వారికి మంచినీళ్లు, భోజనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, తగిన సిబ్బంది లేకపోవడంతో ఆ భారం కూడా పిల్లలపైనే పడింది. తాళ్లబురిడి ఎంపీపీ స్కూల్లో 50 మంది విద్యార్థులు ఉంటే, వారిని ఉపాధ్యాయుల పర్య వేక్షణలోనే పనులకు పురమాయించారు. అద్దెకు తెచ్చిన కుర్చీలు మోయడం, బెంచీలు సర్దడం వంటి పనులు విద్యార్థులే చేశారు. భోజనాల అనంతరం బెంచీలపై, కుర్చీలపై పడిన మెతుకులను శుభ్రం చేసే పనులనూ విద్యార్థులే చక్కబెట్టారు. పిల్లలతో ఈ పనులేంటి? అని పలువురు తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏ మూలకు? అన్నట్టుగా ఉన్నాయి. తాళ్లబురిడి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 130 మంది విద్యార్థులు ఉన్నారు. కనీసం టెంట్ వేయడానికి కూడా నిధులు చాలలేదో.. లేక ఆసక్తి లేదో తెలియదు కానీ, చెట్టు నీడనే వేదికగా మార్చేశారు. కొన్ని బెంచీలు, మరికొన్ని కుర్చీలు వేసి సమావేశాన్ని ‘మమ’ అనిపించారు. నిధులు ఇవ్వకుండా ఆర్భాటంగా ఆదేశాలు జారీచేస్తే క్షేత్రస్థాయిలో జరిగేది ఇలాంటి తంతు మాత్రమేనని ఈ ఘటన అద్దం పడుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విద్యార్థుల భవితవ్యంపై శ్రద్ధ అంటే.. వారిని ఇలా పనులకు వినియోగించడమేనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
ఎంఓయూలతో విద్యార్థులకు మేలు
విజయనగరం రూరల్: విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి వివిధ సంస్థలతో కుదుర్చుకుంటున్న ఎంఓయూలతో విద్యార్థులకే మేలు అని జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వీవీ సుబ్బారావు అన్నారు. జేఎన్టీయూ గురజాడ విజయనగరం, హైదరాబాద్లోని టార్చ్ ఫిన్టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ఉపకులపతి సుబ్బారావు మాట్లాడుతూ ఈ ఒప్పందంతో వర్సిటీ విద్యార్థులకు పరిశ్రమ ఆధారిత నైపుణ్యాలు, స్వయం కోర్సులు, స్కిల్ ఎసెస్మెంట్ ప్రొగ్రాంలు అందించడం జరుగుతుందన్నారు. ఈ ఒప్పందం విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధికి, స్టార్టప్ సంస్కృతి పెంపొందించేందుకు, పరిశ్రమ–విశ్వవిద్యాలయ అనుసంధానానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి.జయసుమ, టార్చ్ ఫిన్టెక్ ఎండీ వైభవ్ తదితరులు పాల్గొన్నారు. గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం విజయనగరం క్రైమ్: విజయనగరం, కోరుకొండ రైల్వేస్టేషన్ ల మధ్య రైలు పట్టాలపై సుమారు 50నుంచి 55 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని విజయనగరం రైల్వే పోలీసులు శుక్రవారం గుర్తించారు. ఇందుకు సంబంధించి జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం కోరుకొండ రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ పై సుమారు 5 అడుగుల 3 అంగుళాల పొడవు కలిగి, ఎరుపు రంగు ఛాయతో, పసుపు రంగుపై ఎరుపు, తెలుపు రంగు చిన్న గడుల చీర, ఎరుపు రంగు జాకెట్ ధరించి ఉన్న మహిళ మృతదేహాన్ని కనుగొన్నామని తెలిపారు. మృతురాలి కుడి చేతిపై ఒడిశా భాషలో పచ్చబొట్టు గుర్తు ఉందన్నారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 9490617089,94419 62879 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై బాలాజీ రావు కోరారు. -
రెచ్చిపోతున్న ట్రాన్స్ఫార్మర్ల దొంగలు
నెల్లిమర్ల రూరల్: మండలంలో కొంతకాలంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగలు రెచ్చిపోతున్నారు. పొలాల్లోని రైతుల వ్యవసాయ మోటార్లకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు ఎత్తుకు పోతున్నారు. దొంగల స్వైర విహారంతో రైతులు హడలిపోతూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వ్యవహారంపై విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.చోరీ సమయంలో విద్యుత్ ప్రమాదం జరిగితే తమకు సంబంధం లేదనే ప్రకటనలు ఇస్తున్నారే తప్ప తమ సంస్థకు దొంగల వల్ల జరుగుతున్న నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మండలంలోని సతివాడ, మధుపాడ గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని కాపర్ వైర్లను ఎత్తుకుపోయారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ ధర సుమారు రూ.3లక్షల వరకు ఉంటుందని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. చోరీపై బాధిత ఏఈకి ఫిర్యాదు చేసి మూడు రోజులు గడుస్తున్నా పోలీసులకు సమాచారం అందించలేదని బాధిత రైతులు తెలియజేస్తున్నారు. ఇప్పటికై నా విద్యుత్, పోలీస్ అధికారులు చోరీలపై నిఘా ఉంచి నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు గ్రామాల్లో నాలుగు చోట్ల చోరీ -
అడుగుకో గుంత.. రాకపోకలకు చింత
జియ్యమ్మవలస రూరల్: వంద రోజుల్లో వంద రోడ్లు వేస్తామన్న ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కనీసం రోడ్లపై ఏర్పడిన గోతులను పూడ్చే పనులు పూర్తిచేయడంలోనూ విఫలమయ్యా రని జియ్యమ్మవలస జెడ్పీటీసీ సభ్యురాలు మూడడ్ల శశికళ విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తున్న పల్లెపండగ కార్యక్రమం క్షేత్రస్థాయిలో నిధుల లేమితో వెక్కిరిస్తోందన్నారు. దీనికి పార్వతీపురం–గుణుపూర్ ప్రధాన రహదారి నుంచి దత్తివలస, పరజపాడు, లక్ష్మీపురం మీదుగా పిప్పల భద్ర వెళ్లే బీటీ రోడ్డే నిలువెత్తు నిదర్శనమన్నారు. అడుగుకో గుంతతో రాకపోకలకు ప్రయాణికు లు అవస్థలు పడుతున్నారన్నారు. నెలరోజు లుగా బస్సు రాకపోకలు నిలిచిపోయినా ఎమ్మెల్యేకు పట్టకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో స్థానికులు రూ. 32వేలు చందాలు వేసుకొని గోతులు పూడ్చుకునేందుకు సిద్ధమయ్యారన్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సరిగ్గా జరగడం లేదని.. మిల్లర్లు అదనపు తూకంతో దోచుకుంటున్నారని సాలూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ధాన్యం సేకరణ లోపాలు, మిల్లర్ల అవకతవకలపై ఏఎంసీ చైర్మన్తోపాటు.. అధికార పార్టీకి చెందిన వారే ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలు ఎంత సక్రమంగా నడుస్తున్నాయో చెప్పడానికి సొంత పార్టీ వారు చేసిన విమర్శలే అద్దం పడుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైస్ మిల్లర్లకు చేరిన ధాన్యాన్ని గ్రేడ్, తేమ, నాసిరకం పేరుతో రైతుల వద్ద క్వింటాకు 10 నుంచి 20 కిలోల వరకు అదనంగా దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. మిల్లుకు చేరిన వెంటనే తక్షణమే హమాలీ పేరుతో ప్రతి చిన్న బస్తాకూ రూ.5 నుంచి రూ.10 వసూలు చేస్తున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు ధాన్యం చేర్చిన క్రమంలో అద్దె కూడా రైతుల నుంచి వసూలు చేస్తున్నారని.. మిల్లర్లు సొంతంగా ఏర్పాటు చేసుకున్న వే బ్రిడ్జి తూకంలో చాలా వ్యత్యాసం ఉంటోందని పేర్కొన్నారు. ఫలితంగా వరి పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అలిగితే నష్టపోయేది మనమే.. ● పార్టీ శ్రేణులకు లోకేశ్ సూచన సాక్షి, పార్వతీపురం మన్యం: టీడీపీలో వ్యక్తులు శాశ్వతం కాదు, పార్టీ శాశ్వతమని పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. భామినిలో పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన గురువారం మాట్లాడారు. అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమేనని, గ్రూపు రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టాలని సూచించారు. ప్రతి పనికి లోకేశ్, ఎమ్మెల్యే ఫోన్ చేయాలంటే కుదరదు. ఈ విషయంలో ఇన్చార్జి మంత్రి అచ్చెన్న కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలివ్వాలి అంటూ లోకేశ్ చెప్పడం గమనార్హం. -
అటకెక్కిన కళాశాలల నిర్మాణం
జిల్లా అభివృద్ధికి కీలకమైన ప్రభుత్వ వైద్యకళాశాలను అటకెక్కించారు. కురుపాం నియోజకవర్గంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండిపోయాయి. పేదలకు వైద్యం అందించేదుకు గత ప్రభుత్వ హయాంలో పార్వతీపురం, సీతంపేటల్లో రూ.50 లక్షల చొప్పున వెచ్చించి నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. కేవ లం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందన్న కారణంతోనే వీటిపై నిర్లక్ష్యం చూపడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా పేదల విద్య, వైద్యానికి ప్రభుత్వం చొరవ చూపి, త్వరితగతిన వీటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. 17 నెలలుగా కురుపాం ఇంజినీరింగ్ కళాశాల ఇలా.. -
వసారాలే తరగతులు.. సమస్యలే పాఠాలు
తల్లికి వందనం పేరిట చదువుకున్న ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది. మొదటి ఏడాది పూర్తిగా పథకం ఎగ్గొట్టేయగా.. రెండో ఏడాదిలోనూ వేలాదిమందిని పథకానికి దూరం చేసింది. ఇచ్చిన రూ.15 వేలలోనూ తగ్గించారు. పాఠశాల నిర్వహణ కోసమని రూ.2 వేలు చొప్పున కోత పెట్టారు. జిల్లాలో మొదటి విడతగా 1,08,951 మందికి పథకం వర్తింపజేశారు. వీరికి పాఠశాల నిర్వహణ కోసమని కోత పెట్టిన నిధులన్నీ కలిపినా.. చాలా స్కూళ్లలో మరుగుదొడ్లు, తాగునీటి అవసరాలను తీర్చవచ్చు. ఆ నిధులు ఏమవుతున్నాయో అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పార్వతీపురం మండలం రావికోన ప్రభుత్వ పాఠశాలలో కుక్కల మధ్యనే విద్యార్థుల భోజనం సాక్షి, పార్వతీపురం మన్యం : ఈ చిత్రంలోని మహిళలంతా సాలూరు మండలం కొత్తవలస గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లులు. తమ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాలని గత సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు వచ్చి వినతిపత్రం అందించారు. పాఠశాలలో 45 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరుగుదొడ్లు లేక.. పిల్లలంతా రోడ్డు దాటి ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. పాఠశాల భవనం కూడా శిథిలావస్థకు చేరుకుందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువు అసంపూర్తిగా నాడు–నేడు పనులు ఆవేదనలో విద్యార్థులు -
ప్రగల్భాలు పలికారు.. డోలీ మోతలే మిగిల్చారు
గిరిజన ప్రాంతాల్లో డోలీల మోత లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికారు. వంద రోజుల్లో వంద రహదారులంటూ హడావిడి చేశారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేసిన గిరిశిఖర సిరివర రహదారి ఏడాది దాటినా నేటికీ పూర్తి కాలేదు. ఇప్పటికీ వైఎస్సార్సీపీ హయాంలో వేసిన రహదారులే దర్శనమిస్తున్నాయి. జిల్లాలో డోలీ మోతలు ఉండకూడదని పల్లె పండగ, అడవితల్లిబాట, డోలీ రహదారులు పేరిట ఉపాధి హామీ నిధులు మంజూరు చేశామని ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లో 71 రహదారి పనులకు పంచాయతీరాజ్ శాఖ ఉపాధి నిధులు దాదాపు రూ.52 కోట్ల మేర మంజూరు చేస్తే.. అందులో 11 మాత్రమే పూర్తయ్యాయి. అడవితల్లి పేరుతో మూడు రోడ్లు మంజూరు కాగా.. అవి బాలారిష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ పనులకు నిధుల సమస్య వెంటాడుతోంది. డోలీ మోతలను తప్పించేందుకు గుమ్మలక్ష్మీపురం, సాలూరుల్లో గిరిజన గర్భిణుల వసతిగృహాలను గతంలో ప్రారంభించారు. ఇక్కడ సేవలందించే సిబ్బందిని తొలగిస్తూ.. వసతిగృహాలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది. -
పూర్తిచేసేదెన్నడు?
సీతానగరం మండలం నిడగల్లు ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలో నాడు–నేడు కింద ప్రారంభించి, తర్వాత కాలంలో మధ్యలోనే నిలిచిపోయిన అదనపు భవన నిర్మాణమిది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు పథకం కింద జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి. తొలిదశలో 486 పాఠశాలల్లో రూ.130.14 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. మౌలిక సదుపాయాలు కల్పించారు. రెండోవిడతలో రూ.144.51 కోట్లతో 535 పాఠశాలల్లో ఆధునికీకరణ పనులు జరిపారు. ఈలోగా ప్రభుత్వం మారడంతో ఏడాదిన్నర కాలంలోనే బడి గతి మారిపోయింది. నాడు–నేడు పనులు ఇదిగో ఇలా అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ఏనుగుల సమస్యకు పరిష్కారం ఏదీ?
దశాబ్దానికిపైగా ఈ ప్రాంతాన్ని ఏనుగులు పట్టి పీడిస్తున్నాయి. పంట, ఆస్తి, ప్రాణ నష్టాలతో కలవపెడుతున్నాయి. శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. కుంకీ ఏనుగులు అదిగో ఇదిగో అంటున్నారు గానీ.. ఇప్పటికీ జిల్లా ముఖం చూడలేదు. జిల్లాలో రెండు గుంపులు నాగావళి, వంశధార తీర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం, పార్వతీపురం, భామిని మండలాల్లో సంచరిస్తూ.. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎలిఫెంట్ జోన్ అంటూ చేస్తున్న ప్రకటన గడప దాటడం లేదు. -
నీతి కథలే వ్యక్తిత్వానికి పునాది
● అలరించిన విద్యార్థుల కోలాటం ● ఘనంగా 9వ రోజు పుస్తక మహోత్సవం పార్వతీపురం రూరల్: పిల్లలకు బాల్యం నుంచే నీతి కథలు వినిపించడం ద్వారా వారిలో దేశభక్తి, వినయం, సమయస్ఫూర్తి వంటి సద్గుణాలను పెంపొందించి, ఉత్తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దవచ్చని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక పురిపండా అప్పలస్వామి ప్రాంగణంలో బుధవారం 9వ రోజు పుస్తక మహోత్సవ సాహిత్య సభ కళారత్న డా.డి.పారినాయుడు అధ్యక్షతన జరిగింది. బాలసాహితీవేత్తలకు పార్వతీపురం నిలయంగా మారిందని ఈ సందర్భంగా పారినాయుడు కొనియాడారు. కార్యక్రమంలో బెహరా ఉమామహేశ్వరరావు రచించిన ‘చెట్లు చెప్పిన కథలు’ నవలను ఆవిష్కరించారు. పర్యావరణ ఆవశ్యకతను ఈ పుస్తకం అద్భుతంగా వివరిస్తోందని సమీక్షకుడు పక్కి రవీంద్రనాథ్ పేర్కొన్నారు. కాగా, ఎన్.ములగ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థుల ప్రతిభను ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో బెలగాం భీమేశ్వరరావు, తుంబలి శివాజీ, బీవీ పట్నాయక్, ఈదుబిల్లి ఉషారాణి, గొట్టాపు శ్రీనివాసరావు తదితర కవులు తమ కవితా గానంతో అలరించారు. -
వైభవంగా హనుమద్ వ్రతం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో హనుమద్ వ్రతం బుధవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. వేకువజామున ఆలయంలో ప్రాతఃకాలార్చన, బాలభోగం అనంతరం యాగశాలలో సుందరకాండ హోమం నిర్వహించారు. అనంతరం వెండి మంటపంలోని ఉత్సవ మూర్తులకు నిత్య కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ప్రతి ఏటా మార్గశిర మాస శుద్ధ త్రయోదశి భరణి నక్షత్రం రోజున జరుపుకునే హనుమాన్ వ్రతం ఈ సారి మరింత భక్తి ప్రపత్తులతో సాగింది. ఆంజనేయస్వామికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో అర్చకులు విశేష అభిషేకాలు జరిపించారు. అనంతరం తమలపాకులు, సిందూరంతో సహస్రనామర్చన నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఇందు
చీపురుపల్లి: జాతీయస్థాయిలో జరిగిన టెన్నికాయిట్ చాంపియన్ షిప్లో చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని కిలారి ఇందు సత్తా చాటింది. జాతీయ స్థాయిలో జరిగిన చాంపియన్షిప్లో చక్కని ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించింది. దీంతో బుధవారం పెదనడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బంగారు పతకం సాధించిన ఇందును పాఠశాల హెచ్ఎం ఎల్.తిరుపతిరావు, కోచ్ ఎం.రామారావు అభినందించారు. ఈ సందర్భంగా కోచ్ రామారావు మాట్లాడుతూ నవంబర్ 26 నుంచి 30 వరకు జమ్ము కాశ్మీర్లో జరిగిన 42వ జాతీయ టెన్నికాయిట్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయని ఈ పోటీల్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ తరఫున ఇందు పాల్గొన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి జట్లు పాల్గొనగా అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్ జట్టు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించిన ఇద్దరిలో పెదనడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కిలారి ఇందు ఒకరని తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగిన చాంపియన్షిప్ పోటీల్లో చక్కని ప్రతిభ కనపరిచి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చిన ఇందును ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని హెచ్ఎం తిరుపతిరావు పిలుపునిచ్చారు. టెన్నికాయిట్లో బంగారు పతకం -
చికిత్స పొందుతూ వైఎస్ఆర్సీపీ నాయకుడి మృతి
రామభద్రపురం: మండలంలోని బూసాయవలస జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై గత నెల 28వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మామిడివలస మాజీ సర్పంచ్, వైఎస్ఆర్సీపీ నాయకుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గతనెల 28వ తేదీన మామిడివలస గ్రామానికి చెందిన మండల సన్యాసిరావు (56) పనినిమిత్తం మామిడివలస నుంచి రామభద్రపురం వెళ్లి పని ముంగించుకుని తిరిగి తన గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్లిపోతుండగా బూసాయవలస జంక్షన్ వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో విజయనగరం నుంచి ఒడిశా వెళ్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో సన్యాసిరావు తలకు తీవ్ర గాయమవడంతో కుటుంబసభ్యులు, స్థానికులు ప్రథమ చికిత్స నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వి. ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. సన్యాసిరావు మృతి పార్టీకి తీరని లోటుమామిడివలస గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు మండల సన్యాసిరావు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడన్న సమాచారం తెలుసున్న మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, జెడ్పీటీసీ అప్పికొండ సరస్వతి వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పిచారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. కార్యక్రమంలో మామిడవలస సర్పంచ్ మూడడ్ల అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ మండల నాయకుడు చింతల సింహాచలం నాయుడు, మండల యూత్ అధ్యక్షుడు పత్తిగుళ్ల ఏక్నాథ్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు డర్రు పైడిరాజు పాల్గొన్నారు. -
ఎడతెగని చర్చలు
గిరిజన రైతుల కన్నీరుఈ సమావేశంలో కూడా దశాబ్దాల కాలంగా నేల తల్లినే నమ్ముకుని ఉన్నాం..మేము సాగు చేస్తున్న భూములు లాక్కుని మాకు అన్యాయం చేయకండని గిరిజన రైతులు కన్నీరు పెట్టుకున్నారు.ఏపీఐఐసీకి కేటాయించక ముందు నుంచి ఆ భూమిలో సాగు చేస్తున్నామని, తాము మొక్కలు వేస్తున్నప్పుడు కూడా ఎవరూ అడ్డుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సుమారు 30 కుటుంబాలకు చెందిన తామంతా పిల్లలతో వివిధ పంటలు సాగు చేసుకుని బతుకుతున్నామని మమ్మల్ని ఇబ్బంది పెట్టొదని వాపోయారు. పంటలు చేతికొస్తున్న సమయంలో పరిశ్రమల ఏర్పాటు పేరుతో ఏపీఐఐసీ అధికారులు మొక్కజొన్న, మామిడి, జీడిమామిడి తదితర పంటలు నాశనం చేశారని,అదే జీవనాధారంగా బతుకుతున్న ఆ భూములు లాక్కోవడం అన్యాయమని కన్నీరుమున్నీరయ్యారు. ఈ భూములు ఇచ్చేస్తే తర్వాత తరాలకు జీవనోపాధి లేక ఇబ్బందులు పడతారని ఒక్కో కుటుంబానికి రూ.8 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వడంతో పాటు మాకు ఇస్తామన్న భూమిలో సాగుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.రామభద్రపురం: మేము సాగు చేసుకుంటూ జీవనాధారం పొందుతున్న భూములకు మెరుగైన పరిహారం ఇవ్వడంతో పాటు మాకు చూపిస్తున్న భూముల్లో సాగుకు అవసరమైన సౌకర్యం కల్పించాలని కాకర్లవలస, కారేడువలస గిరిజన రైతులు డిమాండ్ చేశారు. రామభద్రపురం మండలంలోని కొట్టక్కి రెవెన్యూ, మిర్తివలస పంచాయతీ పరిధి కాకర్లవలస, కారేడువలస గ్రామాల మధ్య 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సుమారు 187.08 ఎకరాల భూమిని రూ.7.48 కోట్లకు ఏపీఐఐసీకి విక్రయించింది.అయితే అ భూమిలో ఏపీఐఐసీ సుమారు ఆరు ఏళ్ల వరకు కనీసం ఒక్క పరిశ్రమ పెట్టలేదు సరికదా, భూమి ఎక్కడుందో?ఎలా ఉందో? ఎవరు ఆక్రమించుకున్నారో అని కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఏపీఐఐసీకి సంబంధించిన భూమిలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు కోసం 20 ఎకరాల భూమిని కేటాయించిది. ఆ 20 ఎకరాల్లో చిన్న, పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు ఒక్కొ ప్లాట్ 300 స్క్వేర్ ఫీట్స్ చొప్పున 139 ప్లాట్లుగా చేశారు.ఒక్కో స్క్వేర్ ఫీట్ రూ.1112లు ధర నిర్ణయించారు. అలాగే ఎస్సీ, ఎస్టీలు పరిశ్రమలు స్థాపించి ఆర్ధికంగా అభివృద్ధి చెదుతామని ముందుకు వస్తే వారికి 50 శాతం రాయితీపై ప్లాట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ముందుగా 1.3 కిలో మీటర్ల రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి కోసం రూ.4 కోట్లు నిధులు విడుదల చేసింది. దాంతో మే నెల 10వ తేదీన మంత్రి కొడపల్లి శ్రీనివాస్, ఎమ్మెలే బేబీనాయన, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులు శంకుస్థాపన కూడా చేసిన విషయం విదితమే. సంబంధిత కాంట్రాక్టర్ జూలై నెలలో రోడ్లు,డ్రైన్లు అభివృద్ధి కోసం పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో ఏపీఐఐసీకి సంబంధించిన భూమిలో ప్రస్తుతం పత్తి, మొక్కజొన్న, మామిడి, జీడితోటలు సాగు చేస్తున్న గిరిజన రైతులకు కనీసం నోటీసు ఇవ్వడకుండా జేసీబీతో పంటలను ధ్వంసం చేశారు. దీంతో తమ సాగులో ఉన్న భూముల్లో ఎలా రోడ్లు ఎలా వేస్తారని గత 5 నెలలుగా గిరిజన రైతులు నిరసనలు, ధర్నాలు చేస్తూ అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారు. ఏపీఐఐసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు పలుమార్లు గిరిజన రైతులతో సమావేశమై చర్చలు జరిపారు. అయినప్పటికీ గిరిజన రైతులు ససేమిరా అనడంతో చర్చలు విఫలమయ్యాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం మరోసారి తహసీల్దార్ అజూ రఫీజాన్, సీఐ కె నారాయణరావు, ఏపీఐఐసీ డీఈ విజయ చంద్ర, జేఈ రాజేష్లు మిర్తివలస సర్పంచ్ మజ్జి రాంబాబు, సీఐటియూ నాయకుడు బలస శ్రీనివాసరావు సమక్షంలో గిరిజన రైతులతో సమావేశమయ్యారు. మా సంతకాలు లేకుండా తీర్మానం ఎలా? సమావేశంలో సర్పంచ్ మజ్జి రాంబాబు మాట్లాడుతూ మిర్తివలస పంచాయతీ పరిధిలో ఉన్న సర్పంచ్, గ్రామ ప్రజల సంతకాలు లేకుండా కొట్టక్కి రెవెన్యూ పరిధిలో ఉన్నంత మాత్రాన ఆ సర్పంచ్ సంతకంతో తీర్మానం ఎలా చేస్తారు? నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అలాగే మా నిధులతో రోడ్లు అభివృద్ధి చేసుకుంటే ఏపీఐఐసీ అధికారులు ఆ రోడ్డును ఎలా వినియోగించుకుంటారని నిలదీశారు. గిరిజన రైతులకు న్యాయం ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటును అడ్డుకుంటున్న గిరిజన రైతులు గిరిజన రైతులతో మరోసారి సమావేశమైన అధికారులు పరిహారం ఇచ్చి..సౌకర్యాలు కల్పించాలని రైతుల డిమాండ్ ఉన్నతాధికారుల దృష్టిలో పెడతామన్న అధికారులుజరిగే వరకు వారికి మద్దతుగా తాము నిలబడతామని స్పష్టం చేశారు. దీంతో ఏపీఐఐసీ డీఈఈ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు మే నెలలో అందరికీ తెలిసేలా పెద్ద షామియానాలు, కర్టెన్లు, కార్పెట్లు వేసి మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ వచ్చి శిలాఫలకం ప్రారంభిస్తే అప్పట్లో అడ్డుకోకుండా ఇప్పుడు అడ్డుకోవడం మంచిది కాదన్నారు.అలాగే ప్రభుత్వానికి రూ.7.48 కోట్ల డబ్బులు ఇచ్చి ఏపీఐఐసీ కొనుగోలు చేసిందని, భూమి ఊరకనే రాలేదని మీరు పరిహారం అడగడం సబబుకాదన్నారు. తహసీల్దార్ అజు రఫీజాన్ స్పందిస్తూ మీ డిమాండ్లు రాసి ఇవ్వాలని, ఉన్నతాధికారుల దృష్టిలో పెడతామని సూచించారు. ఈ చర్చల్లో గిరిజన రైతులు కోరిన కోరికలకు తతంగమంతా మళ్లీ మొదటికొచ్చే విధంగా కనిపిస్తోంది. -
ఏఓబీలో 6,050 లీటర్ల ఊట ధ్వంసం
● 100 లీటర్ల సారా స్వాధీనంపార్వతీపురం రూరల్: భామిని సరిహద్దు ఒడిశా గ్రామాల్లో బుధవారం ఆంధ్రా, ఒడిశా ఎకై ్సజ్ సిబ్బంది ఉమ్మడిగా దాడులు చేశారు. ఈ సందర్భంగా మంగళగూడలో 2200 లీటర్లు, కొత్తగూడలో 2000 లీటర్లు, నడిమిగూడలో 1850 లీటర్లు బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే మంగళగూడలో 100 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో పాలకొండ, రాజాం, చీపురుపల్లి, ఆమదాలవలస, కొత్తూరు, పొందూరు ఎస్హెచ్ఓలు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
● సర్టిఫికెట్ల మంజూరులో ఆలస్యం చేయొద్దు ● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డివిజయనగరం అర్బన్: అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చే ప్రభుత్వ లక్ష్యం నేపథ్యంలో వారి పేర్లను నమోదు చేసుకునే అవకాశం ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సూచించారు. ఈ నెల 14 వరకూ ఇళ్ల స్థలాలకు దరఖాస్తుల నమోదుకు గడువు ఉన్నందున ప్రజలకు ఈ సమాచారం చేరేలా చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్లస్థలాల మంజూరుకు గ్రామాలవారీగా ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలాలు, ఇంకా అవసరమయ్యే భూముల వివరాలు పూర్తిస్థాయిలో సేకరించాలని ఆదేశించారు. మ్యుటేషన్లు, రెవెన్యూ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు, ప్రజలకు కావాల్సిన సర్టిఫికెట్లను తక్షణమే మంజూరు చేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ మాట్లాడుతూ సివిల్ సప్లైస్ విభాగానికి సంబంధించిన రైస్ కార్డుల పెండింగ్ కేసులను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. నిర్ణయించిన అజెండా అంశాలపై తాజా సమాచారంతో ప్రతి అధికారి తప్పనిసరిగా సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై జరిగిన సమీక్షలో గోనెసంచులు, జీపీఎస్తో కూడిన వాహనాలు సిద్ధంగా ఉన్నాయని రెండు రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు కూడా పూర్తి అవుతాయని కలెక్టర్ తెలిపారు. బీజీలు రాని మిల్లర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని దళారులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వివిధ శాఖలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ డివిజన్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి, వ్యవసాయ శాఖ జేడీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎ.డి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్, హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. -
వెటరన్ బాడ్మింటన్ చాంపియన్ షిప్కు పేర్లు నమోదు
శృంగవరపుకోట: జిల్లాస్థాయి వెటరన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్, సెలక్షన్కు హాజరయ్యేవారు ఈనెల ఏడోతేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని ఎస్.కోట ఫ్రెండ్స్ రిక్రియేషన్ బ్యాడ్మింటన్ అకాడమీ చీఫ్కోచ్, బ్యాడ్మింటన్ ఆసోసియేషన్ సీఈఓ పొట్నూరు శ్రీరాములు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 14వ తేదీ ఉదయం 9 గంటల నుంచి విజయనగరంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో జిల్లా బ్యాడ్మింటన్ ఆసోషియేషన్ చైర్మన్ ఇందుకూరు రఘురాజు, గౌరవ అధ్యక్షుడు ద్వారపూడి జగదీష్, అధ్యక్షుడు కేఏ నాయుడు కార్యదర్శి సురేష్ ఆధ్వర్యంలో ఎంపిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో 35,40,45,50,55,60,65,70ఏళ్ల విభాగాల్లో సీ్త్రలు, పురుషులకు వేర్వేరుగా సింగిల్స్, డబుల్స్ మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించి గెలుపొందిన క్రీడాకారులను ఫిబ్రవరిలో విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి వెటరన్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన దలిచినవారు బొబ్బిలి అపర్ణబాబా 7981111705, ఎస్.కోట పొట్నూరు శ్రీరాములు 7989199534.విజయనగరం జి.శ్రీనివాసరావు9133773485 ఫోన్ నంబర్లకు ఫోన్చేసి ఈ నెల 7వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. -
జాతీయస్థాయి పోటీలకు జీసీఎస్ఆర్ విద్యార్థి
రాజాం సిటీ: ఈ నెల 5 నుంచి 9 వరకు హర్యానా రాష్ట్రం రోహ్తక్లో జరగనున్న జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు స్థానిక జీసీఎస్ఆర్ కళాశాల విద్యార్థి టొంపల జగదీష్కుమార్ ఎంపికయ్యాడని పీడీ సీహెచ్ కేశవనారాయణ బుధవారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో అండర్–19 విభాగంలో రాష్ట్రస్థాయిలో చక్కని ప్రతిభ కనబరిచాడన్నారు. విద్యార్థి జాతీయస్థాయికి ఎంపిక కావడంపట్ల ప్రిన్సిపాల్ ఎం.పురుషోత్తం, సీహెచ్ రవీంద్రకుమార్, అధ్యాపకులు అభినందించారు. జీఆర్పీ అదుపులో రైళ్లలో చోరీల నిందితుడువిజయనగరం క్రైమ్: వెళ్తున్న రైళ్లల్లో నేరాలకు పాల్పడే నిందితుడిని విజయనగరం గవర్నమెంట్ రైల్వే పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. విజయనగరం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఉంటున్న పుల్లేటికుర్తి వంశీ(25)ట్రైన్లలోను, రైల్వే ఫ్లాట్ఫారాల వద్ద ప్రయాణికుల నుంచి దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో సుమారు రెండు లక్షల రూపాయల విలువగల 8 మొబైల్ ఫోన్ల అపహరణ కేసులో నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రైల్వే కోర్టులో ప్రవేశపెట్టామని ఎస్సై బాలాజీ రావు తెలిపారు. పోలమాంబ జాతరలో వస్తువులకు వేలం పాటమక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి జాతర వచ్చే ఏడాది జనవరి నెలలో జరగనున్న నేపథ్యంలో ఫస్ట్ బోర్డ్ చైర్మన్ లైలా తిరుపతిరావు, కమిటీ సభ్యులు, ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం వేలపాట నిర్వహించారు. చీరలు, రవికలకు 2025–2026 సంవత్సరానికి 4,40,000 ఆదాయం వచ్చింది. కొబ్బరి ముక్కల నిమిత్తం ఆరు లక్షల ఒక వెయ్యి రూపాయలు, తలనీలా ల నిమిత్తం 3,42,000 వచ్చింది. అమ్మవారి లామినేషన్ ఫొటోలు, వనం గుడి వద్ద దీపాలు పెట్టుకునే హక్కు కోసం పాట దారులు ఎవరూ రాకపోవడంతో వాయిదా వేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ తనిఖీదారు ఎన్.రాజకుమారి, సర్పంచ్ సింహాచలమమ్మ, ఎంపీటీసీ తీళ్ల పోలినాయుడు, ఉప సర్పంచ్ అల్లు. వెంకటరమణ, గ్రామపెద్దలు పాల్గొన్నారు. వృద్ధుడి ఆత్మహత్యకొత్తవలస: బతుకు తెరువు కోసం చేసిన అప్పులను తిరిగి చెల్లించలేక మనస్తాపానికి లోనైన మండలంలోని సబ్బవరం రోడ్డులో గల శివాజీనగర్కు చెందిన ఎస్.సూరిబాబు (71) రైలుకింద పడి మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు గవర్నమెంట్ రైల్వే ఎస్సై బాలాజీరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూరిబాబు కొత్తవలస మండలంలోని రెండు బ్యాంకుల్లో సుమారు రూ.4లక్షలకు పైగా రుణాలు తీసుకుని టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు. వ్యాపారం సక్రమంగా సాగకపోవడంతో రుణ వాయిదాలను సకాలంలో చెల్లించకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలాజీరావు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో మరో వ్యక్తి సీతంపేట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక సీతంపేట మండలంలోని శిలిగాం గ్రామానికి చెందిన సవర చంద్రరావు(36) అనే గిరిజనుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చంద్రరావు మానసిక అనారోగ్యం బాగులేకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న పురుగు మందు తాగాడు. గతనెల 30న పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న చంద్రరావును మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేయగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అమ్మన్నరావు తెలిపారు. మృతునికి బార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
జాతీయస్థాయి కరాటే పోటీలకు జిందాల్ విద్యార్థి
కొత్తవలస: జాతీయస్థాయిలో న్యూఢిల్లీలో ఈ నెల 10వ తేదీ నుంచి జరగనున్న కరాటే పోటీలకు మండలంలోని అప్పన్నపాలెం గ్రామం సమీపంలో గల ఓపీ జిందాల్ పాఠశాలకు చెందిన విద్యార్థి అడ్డూరి యోగికార్తీక్ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు పీవీఎస్ఎస్.విశ్వనాథం బుధవారం తెలిపారు. నవంబర్ 24,25 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్–14 విభాగంలో యోగికార్తీక్ ప్రథమ స్థానం సాదించడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయన చెప్పారు. కోచ్ సూరిబాబు శిక్షణలో యోగికార్తీక్ తర్ఫీదు పొందినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ఆరవ తరగతి చదువుతున్న ఈ.దేవకీలత రెండోస్థానంలో నిలిచి సిల్వర్ పతకం సాధించిందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇద్దరు వి ద్యార్థులను అభినందించారు.కార్యక్రమంలో పాఠశాల పీడీ అప్పలనాయుడు పాల్గొన్నారు. -
బీఏ నారాయణకు ఘంటసాల స్మారక పురస్కారం
విజయ నగరం: ఘంటసాల జయంతిని పురస్కరించుకుని ఈనెల 5వ తేదీన ప్రముఖ సంగీత విద్వాంసుడు బీఏ నారాయణకు ఘంటసాల స్మారక పురస్కారం ప్రదానం చేయనున్నామని ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకుడు సముద్రాల గురుప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజున సీతం కాలేజీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ గాయనీ గాయకులు ఉమామహేశ్వరి,కూర్మారావు,సూర్య ప్రకాష్, నీలిమా రాణి, గిరిజాప్రసన్న తదితరులు తమ పాటలతో అలరిస్తారని పేర్కొన్నారు. అట్రాసిటీ కేసులో ఇద్దరు ముద్దాయిలకు జైలుశిక్షవిజయనగరం క్రైమ్: జిల్లాలోని సంతకవిటి పోలీస్స్టేషన్లో 2020లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముద్దాయిలైన సంతకవిటి మండలం గోళ్లవలసకు చెందిన వెంపటాపు గోపి (35), కొప్పల రామినాయుడు (50)లకు శ్రీకాకుళం ఎస్సీ, ఎస్టీ కోర్టు కం 4వ అదనపు జిల్లా సెషనన్స్ జడ్జి, ఎస్.ఎం.ఫణికుమార్ నాలుగున్నరేళ్ల జైలు శిక్ష, రూ.12,000లు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ మేరకు ఎస్పీ ఏఆర్.దామోదర్ బుధవారం తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. సంతకవిటి మండలంలోని గోళ్లవలస గ్రామంలో ఉపాధి హామీ పథకం పనుల ఆడిట్ జరుగుతున్న సమయంలో గ్రామానికి చెందిన ఫిర్యాదు దారు చింతాడ అసిరయ్య (40)ను అదే గ్రామానికి చెందిన వెంపటాపు గోపి, కొప్పల రామినాయుడు కులం పేరుతో దూషించి, కర్రతోను, చేతులతో దాడి చేసి గాయ పరిచినట్లు సంతకవిటి పోలీస్ స్టేషన్లో 6.2.2020న బాధితుడు ఫిర్యాదు చేయగా సంతకవిటి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ కేసుపై, అప్పటి ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎ.సత్యనారాయణ దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. నిందితులపై నేరం రుజువు కావడంతో శ్రీకాకుళం ఎస్సీ, ఎస్టీ కోర్టు కం 4వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, ఎస్.ఎం.ఫణికుమార్ పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. -
చంద్రన్నా.. ఐటీడీఏల వైపు చూడన్నా..!
సీతంపేట ఐటీడీఏ సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు రెండు ఐటీడీఏలకు రెగ్యులర్ ప్రాజెక్టు అధికారులను నియమించిన దాఖలా లేవు. శాఖలకు సరైన దిశానిర్దేశం లేదు. ఇన్చార్జిలతోనే ఐటీడీఏల పాలన కొనసాగుతోంది. సీతంపేటకు పాలకొండ సబ్కలెక్టర్, పార్వతీపురం ఐటీడీఏకు జేసీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. రెండు ఐటీడీఏల పరిధిలో 31 గిరిజన మండలాలు ఉన్నాయి. దాదాపు 1500లకు పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 16 గిరిజన సబ్ప్లాన్ మండలాలు శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. వివిధ శాఖలు నిర్వహిస్తున్నప్పటకీ పూర్తిస్థాయిలో అధికారులు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని గిరిజనులు వాపోతున్నారు. సీతంపేట ఏటీడబ్ల్యూఓ పోస్టు ఖాళీగా ఉంది. ప్రాజెక్టు వ్యవసాయాధికారి పోస్టు బాధ్యతలను పీహెచ్ఓ నిర్వర్తిస్తున్నారు. గిరిజన సహకార సంస్థకు రెగ్యులర్ డివిజనల్ మేనేజర్ లేరు. జీసీసీ జనరల్ మేనేజర్ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఇంజినీరింగ్ శాఖలో డీఈ, ఏఈ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఆశ్రమపాఠశాలల్లో హెల్త్వలంటీర్లు ఏరీ?... గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలు 103 ఉన్నాయి. సుమారు 17 వేల మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. వీరికి వైద్యసేవలు అందించడానికి వీలుగా ఏఎన్ఎంలను నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. హెల్త్వలంటీర్లు లేక అత్యవసర వైద్యసేవలు అందడంలేదు. ఆశ్రమపాఠశాలల్లో ఆరోగ్యవలంటీర్లను నియమిస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు ఉద్యోగభద్రత కరువైనా పట్టించుకునేవారే లేరు. ఆ శాఖల పరిస్థితి ఏంటి?.. సీతంపేట ఐటీడీఏలో ఏ శాఖ ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని గిరిజన సంఘాల నాయకులు వాపోతున్నారు. ఇక్కడి ట్రైబల్వెల్ఫేర్ కార్యాలయం శ్రీకాకుళం తరలించేందుకు రంగం సిద్ధమైంది. మరో రెండు, మూడు నెలల్లో శ్రీకాకుళం కలెక్టరేట్లోని కొత్త ఆఫీస్కు తరలిపోనున్నట్టు తెలిసింది. వెలుగు కార్యాలయం ఇప్పటికే ఎత్తేశారు. నాలుగు నెలల కిందటే ట్రైబల్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (టీపీఎంయూ)ను ఎత్తేశారు. అంతకముందు చిన్ననీటి వనరుల విభాగాన్ని తరలించేశారు. ఇలా.. ఒక్కో శాఖ కార్యాలయాన్ని ఎత్తేయడంతో సీతంపేట ఐటీడీఏ ఉంటుందా, ఊడుతుందా తెలియని పరిస్థితి నెలకొంది. మౌలిక వసతులు నిల్... గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు మృగ్యమయ్యాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీల మోత తప్పడం లేదు. ఉసిరికపాడు, దరబ, ఎగువద్వారబందం, కొండాడ తదితర ప్రాంతాలకు వెళ్లే గిరిజనుల అవస్థలు వర్ణణాతీతం. అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రులకు తరలించాలన్నా, గిరిజన ఉత్పత్తులను మార్కెట్కు, సంతకు చేర్చాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. ఎండీయూ వాహనాల రద్దుతో బియ్యం కోసం కిలోమీటర్ల దూరంలోని డిపోలకు రావాల్సిన పరిస్థితి. చివరకు పాఠశాలలకు సైతం ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వని దుస్థితి దాపురించింది. జిల్లాకు వస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ స్పందించి గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు. -
తీరనుందా అలక!
సాక్షి, పార్వతీపురం మన్యం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఆకస్మికంగా పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ఒక్కరోజు ముందుగానే ఆయన ఇక్కడికి వస్తుండటం.. ప్రధానంగా పార్టీ శ్రేణులతో సమావేశం కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాలకొండ నియోజకవర్గంలో ఢీ అంటే ఢీ అనేలా కూటమి నాయకులు, కార్యకర్తల మధ్య ‘సఖ్యత’ ఉన్న విషయం విదితమే. ముఖ్యంగా టీడీపీలోనే వర్గవిభేదాలున్నాయి. సమయం దొరికినప్పుడల్లా అరుపులు, కేకలు, కొట్లాటలు.. పోటాపోటీ కార్యక్రమాల నిర్వహణతో వీధికెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో పాలకొండ నియోజకవర్గం భామినిలో ఈ నెల 5వ తేదీన జరిగే మెగా పేరెంట్–టీచర్ మీట్లో పాల్గొనేందుకు చంద్రబాబు రావడం.. ఆయన ముందు ఎక్కడ రభస జరుగుతుందోనన్న భయంతోనే ఒక్క రోజు ముందుగా లోకేశ్ వస్తున్నారన్న చర్చ జిల్లాలో సాగుతోంది. పార్టీలోనూ, కూటమిలో అంతర్గత విభేదాలు పరిష్కారం కోసమే ఆయన ఆకస్మిక పర్యటనగా తెలుస్తోంది. పాలకొండ నియోజకవర్గం టీడీపీలో ఆది నుంచి రెండు వర్గాలున్న విషయం విదితమే. సీనియర్ నాయకులు కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళావెంకటరావు వర్గాలుగా ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ(ఎన్నికలకు ముందు టికెట్ కోసమని జనసేనలోకి మారారు), టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి ముద్రపడ్డారు. గత ఎన్నికలకు ముందు టికెట్ కోసం పార్టీ మార్పులతో పెద్ద హైడ్రామానే నడిచింది. పొత్తులో భాగంగా ఇక్కడి సీటు జనసేనకు వెళ్లడం.. ఆ పార్టీకి సరైన అభ్యర్థి లేకపోవడం.. టీడీపీలో ఉన్న నిమ్మక జయకృష్ణ పవన్ కల్యాణ్ చెంతన చేరడం చకచకా జరిగిపోయాయి. పార్టీలు మారినంత సులువుగా ఇరు వర్గాల మధ్య సఖ్యత కుదరలేదు. ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మరింత ముదిరాయి. దీంతో అప్పటి నుంచి నియోజకవర్గంలో బద్ధశత్రువులుగానే వీరు మిగిలిపోయారు. నియోజకవర్గ టీడీపీ కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది. పార్టీ సమావేశాల్లోనూ, పెద్దలు వచ్చిన పలు సందర్భాల్లోనూ బాహాబాహీకి దిగిన పరిస్థితులున్నాయి. స్థానిక ఎమ్మెల్యేగా నిమ్మక జయకృష్ణ నుంచి ప్రభుత్వం తరఫున చేపట్టిన ఏ కార్యక్రమానికీ పడాల భూదేవి వర్గానికి పిలుపు ఉండదు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జయకృష్ణ నిర్వహించలేదు. భూదేవి తన వర్గంతో కొన్ని ప్రాంతాల్లో చేపట్టారు. ఇలా ఆధిపత్యం కోసం కొన్నాళ్లుగా ఇక్కడ అంతర్యుద్ధం సాగుతోంది. పలుమార్లు అధినేతల దృష్టికీ తీసుకెళ్లారు. మార్పులేదు. ప్రస్తుతం చంద్రబాబునాయుడు పర్యటించనున్న భామిని నియోజకవర్గంలోనూ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. గ్రూపుల కారణంగానే కోఆపరేటివ్ సొసైటీలో నియామకాలు కాలేదు. ఇటీవల సొలికిరిలో టీడీపీలోని రెండు వర్గాలు బహిరంగంగా కొట్టుకున్నాయి. జయకృష్ణ, భూదేవి వర్గాలకు చెందిన ఆనందరావు, కొత్తకోట గోవిందరావులు తగాదాకు దిగారు. జయకృష్ణ బంధువర్గం భామినిలో ఉంది. ఆ నేపథ్యంలో ఇక్కడ కాస్త ఆయనకు పట్టుంది. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య విభేదాలు ఎక్కువగా ఉంటున్నాయి. చంద్రబాబు పర్యటన ఇక్కడే ఉండటం.. ఆయన ఎదురుగా ఏదైనా రచ్చ జరిగితే పరువు పోతుందన్న భయంతోనే లోకేశ్ ముందుగా వస్తున్నట్లు టీడీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఇందుకోసం లివిరి వద్ద ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. 4వ తేదీన రాత్రి ఇక్కడే పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యులతో చినబాబు సమావేశం అవుతారని తెలిసింది. ఇది పూర్తి అంతర్గత సమావేశామని కూటమి నాయకులు అంటున్నారు. పార్టీ సమావేశం తర్వాతనే ఈ నెల 5న భామిని మోడల్ స్కూల్లో మెగా పేరెంట్ డేలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి లోకేశ్ పాల్గొంటారని తెలుస్తోంది. దీంతో పాటు.. సాలూరులో ఇటీవల మంత్రి అనధికార పీఏ, కుమారుడి వివాదం.. పార్వతీపురం నియోజకవర్గంలో గ్రూపుల గోల, కురుపాం నియోజకవర్గంలోనూ విభేదాలపై చినబాబు ‘క్లాస్’ తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. -
పాఠశాల భోజన సరుకులు.. పక్కాదారి!
పార్వతీపురం రూరల్: గిరిజన విద్యార్థుల ఆకలి తీర్చాల్సిన ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల కడుపుకొట్టి సరుకులను వారితోనే గుట్టుచప్పుడుగా తరలించేస్తున్నారు. మార్కెట్లో విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. బియ్యం మాత్రమే కాదు.. పప్పులు, నూనె ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులను సైతం పాఠశాల నుంచి అక్రమంగా దారిమళ్లిస్తున్న వ్యవహారం పార్వతీపురం మండలం రావికోన గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 150 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొద్దిరోజుల కిందట వార్డెన్ మృతి చెందడంతో ఆ బాధ్యతలను హెచ్ఎం నిర్వర్తిస్తున్నారు. అప్పటి నుంచి పాఠశాల వంట సామగ్రి గోదాంపై ఆయన ‘గుత్తాధిపత్యాన్ని’ ప్రదర్శిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. చదువుల క్షేత్రంలో అక్షరాలు నేర్పించాల్సిన హెచ్ఎం... వంట సిబ్బందితో కలిసి సరుకులు అక్రమంగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
దొంగతనం
●రెండు రోజులకోసారి రాత్రిళ్లు స్కూల్ నుంచి బియ్యం మాత్రమే కాదు పప్పులు కూడా తరలిస్తున్నా రు. రెండు మూడు రోజులకోసారి ఈ తరలింపు జరుగుతోంది. పిల్లలకు పెట్టాల్సిన తిండిని వ్యాపారులకు తెగనమ్ముకుంటున్నారు. – కోలక పెంటయ్య, గిరిజనుడు, రావికోన మా గిరిజన విద్యార్థులను కూలీలుగా వాడుకుంటూ బస్తాలను తరలిస్తున్నారు. మా పిల్లల కడుపు మాడ్చి సరుకులు అమ్ముకుంటున్నారు. అధికారుల భయం లేకపోవడంతో హెచ్ఎం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. – కోలక చామంతి, గిరిజన మహిళ, రావికోన -
జగనన్న సీఎం కావాలని...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ శబరిమలలో అయ్యప్పకు రేగిడి మండలం లచ్చన్నవలస గ్రామానికి చెందిన అయ్యప్పదీక్ష ధారులు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి చెందిన 20 మంది భక్తులు 41 రోజుల కిందట అయ్యప్పదీక్ష ప్రారంభించారు. దీక్ష ముగియడంతో శబరిమల యాత్రకు వెళ్లిన వీరంతా అక్కడ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ ఆలయానికి చేరుకున్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అయ్యప్పను ప్రార్థించారు. –రేగిడి -
రేపటి నుంచి చెరకు క్రషింగ్
రేగిడి: మండలంలోని సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో ఈ నెల 5 నుంచి చెరకు క్రషింగ్ ప్రారంభించనున్నట్టు యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2025– 26 సీజన్లో మెట్రిక్ టన్ను చెరకు రూ. 3,360 లు మద్దతు ధరగా ప్రకటించామని వెల్లడించింది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది టన్నుకు రూ.209లు మద్దతు ధర పెంచినట్టు పేర్కొంది.రైతులకు కటింగ్ ఆర్డర్లు ఇస్తున్నామని తెలిపి ంది. చెరకు నరికేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చామని వెల్లడించింది. జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపేట పంచాయతీ వెంకటరాజపురానికి చెందిన రైతు లు మర్రాపు ధనుంజయరావు, లక్ష్మునాయుడుకు చెందిన ధాన్యం రాశులను ఏనుగులు బుధవారం చిందరవందర చేశాయి. టార్పాలిన్లను కాళ్లతో కుమ్మి ధ్వంసం చేశాయి. అటవీ శాఖ అధికారులు స్పందించి ఆదుకోవాలని, ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాల ని రైతులు విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం చింతలబెలగాం, గవరమ్మపేట గ్రామాల నడుమ ఏనుగు లు సంచరిస్తున్నాయి. సాలూరు: రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖమంత్రి గుమ్మిడి సంధ్యారాణి కారు డ్రైవర్ రౌతు హరికుమార్ సామాజిక మాధ్యమం వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారంటూ సాలూరులో నివసిస్తున్న పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన అధికార్ల నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సాలూరు మున్సిపల్ వైస్చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ కౌన్సిల ర్లు, నాయకులతో కలిసి హరిపై సాలూరు పట్టణ పోలీస్స్టేషన్లో సీఐ అప్పలనాయుడుకు బుధవారం ఫిర్యాదు చేశారు. 35 ఏళ్లు అయినా పెళ్లి కాలేదని, మగాడు కాదు.. మగతనం పనిచేయదు.. వీడు కొజ్జావాడు.. మీరు చెక్ చెసుకోవచ్చు.. ఇది వంద శాతం నిజం.. అంటూ హరికుమార్ తనపై ఎన్పీఎన్ న్యూస్ మన్యం, విజయనగరం, సన్నీ అందరివాడు మనందరివాడు, జై తెలుగుదేశం, సాలూరు, టీడీపీ ఉత్తరాంధ్ర విభాగం, సాలూరు–విజయనగరం యువకెరటాలు అనే గ్రూపుల్లో మెసేజ్లు పెడు తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి డ్రైవర్తో పాటు నాలుగు ఫోన్ నంబర్లతో తనను అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. నాగరాజు వెంట కౌన్సిలర్లు గిరిరఘు, సింగారపు ఈశ్వరరావు, గొర్లె వెంకటరమణ, నాయకు లు పిరిడి రామకృష్ణ,మజ్జి అప్పారావు పాల్గొన్నారు. -
9 న కాలంచెల్లిన వస్తువుల బహిరంగ వేలం
విజయనగరం క్రైమ్: ఈ నెల 9 వ తేదీన జిల్లా పోలీస్ కార్యాలయంలో కాలం చెల్లిన వస్తువులను వేలం వేయనున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ మంగళవారం తెలిపారు. జిల్లా పోలీసు శాఖ వినియోగించిన, కాలం చెల్లిన జనరేటర్లు, బ్యాటరీలు, ఎలక్ట్రికల్ వస్తువులు (ఫ్యాన్స్, టేబుల్స్ వగైరా), ఎలక్ట్రానిక్ వస్తువులు (రిఫ్రిజిరేటర్లు, వాటర్ డిస్పెన్సర్లు, డీప్ ఫ్రీజర్లు, ఏసీలు), ఫర్నిచర్ వస్తువులు, ఐరన్ స్క్రాప్, మిగతా వస్తువులు 8 స్లాట్లుగా విభజించామన్నారు. ఈ వస్తువులకు బహిరంగ వేలం నిర్వహించనున్నామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. వేలం వేయనున్న వస్తువులను డీపీఓ ప్రాంగణంలో భద్రపర్చామని ఆసక్తి కలిగిన వేలందారులు డిసెంబరు 3 నుంచి 8 వరకు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిశీలించుకోవచ్చునన్నారు. వివరాల కోసం విజయనగరం ఏఆర్ అడ్మిన్ ఆర్ఐ ఎన్.గోపాల నాయుడు ఫోన్ నంబర్ 9121109485 ను సంప్రదించవచ్చునని ఎస్పీ తెలిపారు. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన బిడ్డర్లు డిసెంబరు 9న ఉదయం 10గంటలకు జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణం వద్ద నిర్వహించే వేలంలో పాల్గొనాలన్నారు. ఆసక్తి కలిగిన బిడ్డర్లు అదే రోజున బిడ్ అమౌంట్ను జీఎస్టీతో సహా ఆన్లైన్లో చెల్లించి, వస్తువులను 24గంటలలో తీసుకుని వెళ్లాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ వివరించారు. -
అరకొర నిధులు.. ఆందోళనలో ఉపాధ్యాయులు
1796 వీరఘట్టం: మన ఇంటిలో జరిగే ఓ శుభకార్యానికి షామియానా వేసి... మైక్సెట్ పెట్టి.. ఓ 30 మంది బంధుమిత్రులను పిలిచి వారికి అన్ని మర్యాదలు చేయాలంటే మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం సుమారు రూ.10 వేలు వరకు ఖర్చు అవుతుంది. అదే బంధువుల సంఖ్య పెరిగితే ఖర్చు రూ.వేల నుంచి రూ.లక్షలకు చేరుంది. ఈ విషయం అందరికీ తెలిసినదే. మరి అలాంటప్పుడు ప్రతి పాఠశాలలో ఈ నెల 5న నిర్వహించనున్న మెగా పేరెంట్–టీచర్ (పీటీఎం)3.0 మీటింగ్ను ఘనంగా నిర్వహించాలని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం అరకొర నిధుల కేటాయింపుపై అయ్యవార్లు పెదవివిరుస్తున్నారు. 30 మంది విద్యార్థులున్న పాఠశాలకు రూ.900 నిధులు కేటాయిస్తే ఎక్కడ సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టికాకుండా మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. నిధుల కోసం దాతల వద్ద చేయిచాచమని పరోక్షంగా అయ్యవార్లకు చంద్రబాబు సర్కారు సూచిస్తోందంటూ మండిపడుతున్నారు. డబ్బులు లేకుండా పండగ ఎలా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 5న పీటీఎంను పండగలా నిర్వహించాలని ప్రభుత్వం విద్యాశాఖ అధికారులకు దిశానిర్దేశం చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాకమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఆహ్వానించి స్కూల్ ప్రగతిని చాటి చెప్పాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రొగ్రెస్ను వారి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా చేసుకుని ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. దీనిని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం పీటీఎం నిర్వహణకు నిధులు చాలవని చెబుతున్నారు. ఇదీ పరిస్థితి.... ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో 3,386 సర్కారు బడులు ఉన్నాయి. ఇందులో విజయనగరం జిల్లాలో 1796, పార్వతీపురం మన్యం జిల్లాలో 1590 సర్కారు బడులు ఉన్నాయి. వీటిలో పీటీఎంల నిర్వహణకు విజయనగరం జిల్లాకు రూ.38,20,500లు, పార్వతీపురం మన్యం జిల్లాకు రూ.25,12,800లు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. అయితే, ప్రభుత్వం చెప్పిన ప్రకారం కార్యక్రమం చేయాలంటే ఈ నిధులు చాలవని హెచ్ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెదవి విరుస్తున్నారు. నిధుల కేటాయింపును పెంచాలని కోరుతున్నారు. నిధుల కేటాయింపు ఇలా... పాఠశాలల్లో 0–30 మంది విద్యార్థులుంటే రూ.900, 31–100 మంది మధ్య విద్యార్థులున్న పాఠశాలకు రూ.2,250, 101–250 మధ్యన రూ.4,500, 251–1000 మంది విద్యార్థులుంటే రూ.6,750, వెయ్యి మంది విద్యార్థులు కంటే ఎక్కువ ఉండే పాఠశాలకు రూ.9 వేలు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 5న పీటీఎంను గ్రాండ్గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఉపాధ్యాయులు చేపట్టాల్సిన విధి, విధానాలను ఇప్పటికే తెలియజేశాం. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా చేసుకుని ప్రభుత్వం నిధులు విడుదల చేయనున్నట్టు ఉత్తర్వులు కూడా వచ్చాయి. ఆ నిధులతో అందరి భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి. – బి.రాజ్కుమార్, డీఈఓ, పార్వతీపురం మన్యం జిల్లా రూ.25,12,800 పైసలు విదల్చకుండా పండగ ఎలా..? మెగా పేరెంట్ –టీచర్ డేకు నిధులు చాలవంటున్న ఉపాధ్యాయులు పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ -
‘అమృతం’లో ఆయువు తీసే నిర్లక్ష్యం!
● అంగన్వాడీలకు కాలం చెల్లిన బాలామృతం పంపిణీ ● ఎప్పటి నుంచో ఇదే తంతు ● పట్టించుకోని ఐసీడీఎస్ అధికారులు సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే ఉద్దేశంతో ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల నుంచి బాలామృతం ఉచితంగా అందజేస్తారు. దీనిని బాలలకు అమృతతుల్యంగా భావిస్తారు. బిడ్డకు పుష్టినిచ్చే ఈ బాలామృతం.. ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విషతుల్యమవుతోంది. మందులకై నా, తినే వస్తువులకై నా కాలపరిమితి ఉంటుంది. గడువు దాటిన తర్వాత వాటిని వినియోగించరాదని స్పష్టంగా చెబుతా రు. అటువంటిది చిన్నారులకు అందించే పౌష్టికాహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఐసీడీఎస్ అధికారుల తీరు ఇందుకు భిన్నం. పార్వతీపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. పసిబిడ్డల ఆరోగ్యాన్ని పెంచాల్సిన పౌష్టికాహారం.. కాంట్రాక్టర్ల అలక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా దారి తప్పింది. గడువు తీరిన బాలామృతం ప్యాకెట్లను ప్రాజెక్టు పరిధిలో పంపిణీ చేయడం.. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యానికా.. అనారోగ్యానికా? అంగన్వాడీ కేంద్రాల్లో ఏడు నెలల పసికందు నుంచి మూడేళ్ల చిన్నారులకు బాలామృతం ఇస్తారు. రెండున్నర కిలోల ప్యాకెట్ను ఒక లబ్ధిదారుకు 25 రోజులకోసారి అందిస్తారు. తెలంగాణ నుంచి కాంట్రాక్టర్ ద్వారా వీటిని సరఫరా చేస్తారు. జిల్లాలో 10 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 1,475 ప్రధాన, 600 మినీ అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. 7 నెలల నుంచి 36 నెలల మధ్య వయస్సున్న చిన్నారులు దాదాపు 27 వేల మంది ఉన్నారు. జిల్లాలో ఏటా 10 వేల వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. మన్యంలో ఎనిమీయాతో పాటు, రక్తహీనత సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పౌష్టికాహారలోపం వల్ల ఎత్తుకు తగ్గ బరువు, వయస్సుకు తగ్గ ఎత్తు ఉండడం లేదు. ప్రధానంగా గిరిజన, గ్రామీణ ప్రాంత చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారమే దిక్కవుతోంది. ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ లోపం, అవినీతి కారణంగా చాలా వరకు పిల్లలకు అందించే పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. కాంట్రాక్టర్లతో కాసుల కక్కుర్తి కారణంగా చిన్నగుడ్లు సరఫరా చేయడం, కాలపరిమితి దాటిన సరకు లు అందజేయడం వంటి ఘటనలు తరచూ జిల్లా లో చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.తెలంగాణ నుంచి బాలామృతం ప్యాకెట్లు వస్తాయి. వీటిని గోదాముల్లో భద్రపరిచేటప్పుడు, కేంద్రాలకు తరలించేటప్పుడు కనీస తనిఖీలు చేపట్టాలి. ఇక్కడ ఆ విధమైన పరిస్థితి లేదు. కాంట్రాక్టర్లతో లాలూచీ కారణంగా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. పార్వతీపురం ప్రాజెక్టు పరిధిలో గత నవంబరులో వచ్చిన సుమారు 2,786 ప్యాకెట్లలో అధిక భాగం కాలం చెల్లినవే కావడం గమనార్హం. ప్యాకెట్లపై స్పష్టంగా 22/11 అని గడువు తేదీ ఉన్నప్పటికీ.. నేటికీ వాటిని కేంద్రాలకు సరఫరా చేసి వినియోగిస్తుండడం ఆ శాఖాధికారుల నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది. పార్వతీపురం మండలంలో ఇప్పటికే బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు గత నెల 22 వరకు గడువు ఉన్న బాలామృతాన్ని తమ చిన్నారులకు అందించామని చెబుతున్నారు. పౌష్టికాహారం పేరుతో ప్రభుత్వం ఇస్తున్న ప్యాకెట్లను నమ్మి పిల్లలకు తినిపిస్తే.. రేపు ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కాలం చెల్లిన ఆహారాన్ని ఎలా పెడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన సీడీపీవో, సూపర్వైజర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. బస్తాల్లో ఉండటం వల్ల గడువు తేదీని గమనించలేకపోయామని గోదాము సిబ్బంది చెప్పుకురావడం గమనార్హం. దీనిపై సీడీపీవో రేఖావాణి వద్ద ప్రస్తావించగా.. పొరపాటు జరిగిందని, ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. గత నెల ఇచ్చిన ప్యాకెట్లను ఇంకా ఉంటే ఉపయోగించవద్దని, అలాగే, ఈనెల ఇచ్చే నిల్వలను ఫిబ్రవరి లేదా జూలై వరకు గడువు తేదీ ఉన్న స్టాక్ను సరఫరా చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలకు తెలియజేశామన్నారు. -
టమాటా పంటను ధ్వంసం చేసిన ఏనుగులు
కొమరాడ: మండలంలోని కళ్లికోట గ్రామానికి చెందిన బొద్దిన నారాయణ, జాగన రామకృష్ణ సాగుచేసిన టమాటా పంటను ఏనుగులు మంగళవారం ధ్వంసం చేశాయి. పంట పొలంలో సంచరించడంతో మొత్తం పాడైందని, అటవీశాఖ అధికారులు స్పందించి పరిహారం అందజేయాలని రైతులు విజ్ఞప్తిచేశారు. ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. ● జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి గరుగుబిల్లి: రైస్మిల్లు యజమానులు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి అన్నారు. మండలంలోని సంతోషపురం రైతు సేవాకేంద్రాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. మిల్లులో నిర్వహిస్తున్న ధాన్యం సేకరణ, ధాన్యం తరలింపు, నాణ్యతా ప్రమాణాలు తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం సేకరణలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా అందుకు బాధ్యులుపై చర్యలుంటాయన్నారు. రైతుల నుంచి మిల్లు యజమానులు, సిబ్బందిపై ఫిర్యాదులొస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. రైతులు తమ ధాన్యంను నిర్దేశించిన కొనుగోలు కేంద్రంలోనే విక్రయాలు జరిగేలా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యంను దళారులకు విక్రయాలు చేయవద్దని సూచించారు. ప్రస్తుతం తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులకు ఎలాంటి అసౌకర్యంలేకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఏఓ జ్యోత్స్న ఉన్నారు. మా భూములు సేకరించొద్దు బాడంగి: ఆ భూములే మాకు జీవనాధారం.. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ పైపులైన్ నిర్మాణానికి భూములు ఇచ్చేదేలేదని భీమవరం, పాల్తేరు, ముగడ, పిండ్రంగివలస, వీరసాగరం, బాడంగి గ్రామాలకు చెందిన రైతులు తేల్చిచెప్పారు. భూ సేకరణ కోసం ఆయా గ్రామాల రైతులకు 3(1)నోటీసులను అధికారులు అందజేశారు. వారందరితో బాడంగి మండలపరిషత్ సమావేశ భవనంలో ప్రజావిచారణ పేరుతో మంగళవారం సమావేశమయ్యారు. రైతుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మా గ్రామాలు మీదుగా 18 కిలోమీటర్ల పొడవున 12 మీటర్ల వెడల్పున భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చెప్పారు. పైపులైన్ కోసం భూములు ఇస్తే ధరలు పడిపోతాయని, అవసరానికి అమ్ముకోలేమని అభిప్రాయం తెలిపారు. దీనిపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.సుధాసాగర్ మాట్లాడుతూ పైపులైన్ వల్ల నష్టంకలగదని, 12 మీటర్ల వెడల్పులో 1.5 మీటర్ల లోతులో కంతకాలు తవ్వుతారని, 14 అంగుళాల అధునాతనమైన పైపులనే వాడుతారని చెప్పారు. ఒక లైన్ కోసం అవకాశమిస్తే రెండోలైన్ వేయరని గ్రారంటీ ఏమిటని రైతులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇస్తే ఇది భారత ప్రభుత్వం విశాఖ నుంచి రాయపూర్ వరకు పైప్లైన్ వేసేందుకు నిర్ణయించిందన్నారు. ప్రత్యేక అవసరంగా భూములు ఇవ్వకపోయినా తీసుకునే అవకాశంలేక పోలేదని ఎస్డీసీ చెప్పగా.. వీలైనంతవరకు మా జిరాయితీ భూములను తప్పించి వేరే ప్రదేశంనుంచి లైన్వేసుకునేలా చూడాలని అధికారులను కోరారు. సమావేశంలో హెచ్పీసీఎల్ చీఫ్ఇంజినీరు జి.కిశోర్, తహసీల్దార్ ఎన్.వరప్రసాద్, విశ్రాంత తహసీల్దార్ గిరడ అప్పలనాయుడు, వీరసాగరం, పిన్నవలస రైతులు పాల్గొన్నారు. -
సమస్యలు వినరు..
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025● పీజీఆర్ఎస్పై సడలుతున్న నమ్మకం ● విజ్ఞప్తులు బుట్టదాఖలు ● పదేపదే తిరుగుతున్నా ఫలితం ఉండకపోవడమే కారణం సాక్షి, పార్వతీపురం మన్యం: కలెక్టరేట్లో ఒకటో తేదీ సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వినతుల సంఖ్య 69... అంతకు ముందు వారం 92... ఆ క్రితం వారం 99... రోజురోజుకూ వివిధ సమస్యలపై కలెక్టర్ కార్యాలయానికి వచ్చి, అర్జీలు ఇచ్చే వారి సంఖ్య తగ్గిపోతుంది అంటే... సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినట్లు కాదు... తాము చెప్పుకున్నా, వినతులకు ఇక్కడ మోక్షం దొరకడం లేదన్న అభిప్రాయంతో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వస్తున్న వారు క్రమేపీ తగ్గిపోతున్నారు. చిన్న చిన్న సమస్యలకు కూడా ఇక్కడ పరిష్కారం లభించడం లేదన్న అభిప్రాయం బలంగా ప్రజల్లో వినిపిస్తోంది. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమని ప్రత్యేకంగా వినతుల స్వీకరణ నిర్వహిస్తున్నారు. వచ్చిన విజ్ఞప్తుల్లోనూ సగం వరకూ రెవెన్యూ సమస్యలపైనే ఉంటున్నాయి. ఈ సోమవారం మొత్తం 69 వినతులు రాగా.. అందులో రెవెన్యూపరమైనవి 31, సాధారణ అర్జీలు 38 ఉండటం గమనార్హం. కొద్ది రోజుల కిందటి వరకు ప్రతి వారం 150కి పైగా అర్జీలు అందేవి. క్షేత్రస్థాయిలో పరిష్కారం కాకనే... క్షేత్ర స్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం కారణంగా గ్రామాల్లో సమస్యలు కోకొల్లలుగా ఉండిపోతున్నాయి. అర్హులై ఉన్నప్పటికీ పథకాలు అందకపోవడం, ఆక్రమణలు, సామాజిక, వ్యక్తిగత ఇబ్బందులు, రాజకీయ వేధింపులు, ఆన్లైన్లో తప్పిదాలు, భూములకు సంబంధించినవి, రహదారులు కావాలని.. ఇలా అనేక విధాలా సమస్యలపై క్షేత్ర స్థాయిలో అడిగి అడిగి అలసిపోయి, జిల్లా కేంద్రానికి వస్తుంటారు. ప్రతివారం సుమారు 200 మంది వరకూ వ్యయ ప్రయాసలకు ఓర్చి ఉన్నతాధికారులపై నమ్మకంతో పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందిస్తున్నారు. మళ్లీ వాటిని క్షేత్రస్థాయికి పంపించడం, ఆన్లైన్లో పెండింగ్లో చూపకుండా క్లియర్ చేసేయడం వంటి చర్యల వల్ల ఆ సమస్యలు అలానే ఉండిపోతున్నాయి. అందువల్లే ప్రతివారం వస్తున్న వినతుల్లో రీఓపెన్ అయినవే అధికంగా ఉంటున్నాయి. ముందే స్క్రూటినీ..? ఇటీవల కాలంలో కలెక్టరేట్ పీజీఆర్ఎస్ వద్ద వివిధ దశలను ఏర్పాటు చేశారు. ముందుగానే కొన్ని విభాగాలకు వచ్చిన వినతులను ఆయా కౌంటర్ల వద్ద పరిశీలిస్తున్నారు. చాలా వినతులను లోపలికి వెళ్లనీయకుండా అక్కడే ఏదో కారణం చెప్పి, వెనక్కి -
పారా జిల్లా స్థాయి పోటీలు ప్రారంభం
విజయనగరం: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సహకారంతో మంగళవారం స్థానిక విజ్జి స్టేడియంలో దివ్యాంగ క్రీడాకారుల జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహ భరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త ఎ.రామారావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వర రావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ లతో కలిసి జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని, వైకల్యాన్ని జయించే శక్తి క్రీడలకు ఉందన్నారు. ప్రభుత్వాలు కూడా పారా క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేలా క్రీడల్లో రాణించాలని సూచించారు. రన్నింగ్, షాట్పుట్, డిస్క్త్రో, జావెలిన్త్రో, లాంగ్జంప్, హై జంప్ అంశాల్లో జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 150 మంది వరకు దివ్యాంగ క్రీడాకారులు పోటీలకు హజరుకాగా..జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమలో సమగ్ర శిక్ష జిల్లా కో ఆర్డినేటర్ ఎస్.సూర్యారావు, సహాయ కో–ఆర్డినేటర్ ఎం.భారతి, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జాతీయ జంబోరీలో జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందానికి అవార్డులు
విజయనగరం అర్బన్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నవంబర్ 23 నుంచి 29వ తేదీ వరకు జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జంబోరీలో జిల్లా బృందం అద్భుతంగా రాణించింది. దేశవ్యాప్తంగా 35 వేల మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 455 మంది, వారిలో విజయనగరం జిల్లా నుంచి 30 మంది పాల్గొన్నారు. అందులో కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచే 27 మంది విద్యార్థులు పాల్గొనడం విశేషం. రాష్ట్రబృందం మొత్తం 9 అవార్డులు సాధించగా జిల్లా కంటిన్జెంట్ టీమ్ ఈ విజయంలో కీలకపాత్ర పోషించింది. గెలుచుకున్న అవార్డులలో బ్యాండ్–ఎ గ్రేడ్, మార్చ్పాస్ట్–ఎ గ్రేడ్, క్యాంప్క్రాఫ్ట్ ఎ గ్రేడ్, క్యాంప్ ఫైర్ –ఎ గ్రేడ్, స్టేట్ గేట్ –బి గ్రేడ్, పయనీరింగ్–బి గ్రేడ్, రంగోలి–సి గ్రేడ్ విభాగాలు ఉన్నాయి. జంబోరి ముగింపు కార్యమానికి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్ధులను ఆశీర్వదించారు. జిల్లాకు చేరుకున్న విజేతల బృందానికి జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యంనాయుడు మంగళవారం ఘనంగా స్వాగతం పలికారు. గెలుచుకున్న షీల్డ్లు, సర్టిఫికెట్లను విజేతలకు, గైడ్ టీచర్లకు అందజేశారు. బృంద ప్రతినిధులు ఏఎస్ఓసీ కె.దుర్గానాగేశ్వరరావు, డీటీసీ ఎ.కనకలక్ష్మి, కె.సూరిబాబులను డీఈఓ అభినందించారు. కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ జిల్లా కార్యదర్శి వాక చిన్నంనాయుడు, కమిషనర్ ఈ.విజయకుమార్, సీఈఓ సన్యాసిరాజు, డైట్ వైస్ ప్రిన్సిపాల్ దత్తి అప్పలనాయుడు, నాగరాజు, శర్మ తదితరులు పాల్గొన్నారు. -
20 లాడ్జిల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్ పరిఽధిలో గల పలు లాడ్జిల్లో వన్టౌన్ పోలీసులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలోని సీఎంఆర్ జంక్షన్ నుంచి స్వీట్ ఇండియా వరకు 20 లాడ్జిల్లో సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విస్తృత తనిఖీలు చేశారు. వన్టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరితో పాటు క్రైమ్ ఎస్సైలు సురేంద్రనాయుడు, రవిలు మూకుమ్మడిగా ఏకకాలంలో మొత్తం 20 లాడ్జిలలో సోదాలతో పాటు తనిఖీ చేశారు. రెండు రోజుల క్రితమే నగరం మొత్తం దాదాపు 120 ప్రాంతాల్లో వెయ్యి మంది సిబ్బందితో నాకాబందీ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తనిఖీల్లో దాదాపు 70 మంది వాహనాలను సీజ్ చేశారు. ఈ క్రమంలోనే వన్టౌన్ పోలీసులకు వచ్చిన సమాచారంతో క్రైమ్ ఎస్సై సురేంద్రనాయుడు రైల్వే స్టేషన్ వద్ద యామిని, ఎస్ఆర్, సామ్రాట్ లాడ్జిలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ లాడ్జిలలోనే నెలరోజుల క్రితం కొరాపుట్ నుంచి రెండు సూట్ కేసుల్లో గంజాయితో అనుమానితులు వచ్చిన దరిమిలా పోలీసులు విస్తృతంగా ఈ తనిఖీలు నిర్వహించారు. -
ప్రపంచ చాంపియన్షిప్లో ఉణుకూరు యువకుడి ప్రతిభ
రేగిడి: మండల పరిధిలోని ఉణుకూరు గ్రామానికి చెందిన ఎందువ రాహుల్ ప్రపంచ చాంపియన్షిప్లో సత్తాచాటాడు. గత నెల 28 నుంచి 30 వరకు హంగేరీలో జరిగిన కెటిల్బెల్ ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొని 48 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం సాధించి భారత జాతీయ పతాకాన్ని ఆ దేశంలో రెపరెపలాడించాడు. రాహుల్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఆయన తండ్రి ఎందువ రామకృష్ణ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా శిర్లాం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. మండలానికి చెందిన యువకుడు ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లాతోపాటు రేగిడి మండలాన్ని నిలబెట్టడంతో గ్రామస్తులు, ఉపాధ్యాయులు, యువకులు అభినందించారు. మంగళవారం ఈ విషయాన్ని రాహుల్ తండ్రి ఎందువ రామకృష్ణ విలేకరులకు తెలిపారు. -
పోలియోపై పోరుకు సిద్ధం
● డిసెంబర్ 21న పోలియో చుక్కలు ● డీఎంహెచ్ఓ భాస్కర రావు పార్వతీపురం రూరల్: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ సన్నద్ధమైంది. ఈ నెల 21న జరగనున్న పోలియో డ్రైవ్పై వైద్యాధికారులకు, పర్యవేక్షకులకు స్థానిక ఎన్జీఓ హోంలో మంగళవారం రీ–ఓరియంటేషన్ శిక్షణ జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు మాట్లాడుతూ, చిన్నారుల భవిష్యత్తు ఆరోగ్యం దృష్ట్యా వ్యాక్సిన్ ఆవశ్యకతపై ఇప్పటి నుంచే ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల జాబితాతో పక్కా మైక్రో ప్లాన్ రూపొందించాలని, హైరిస్క్ ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కోల్డ్ చైన్ నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసి, వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా సిబ్బంది కృషి చేయాలని కోరారు. డాక్టర్ జాన్ పవర్ శిక్షణ ఇవ్వగా, కార్యక్రమంలో డీఐఓ డా.విజయ మోహన్ సహ జిల్లా ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
పాలకొండ రూరల్: మండలంలోని బుక్కూరు ఎస్సీవీధిలో నివాసముంటున్న పాలకొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న జామి విఠల్రావు (49) అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు ఎస్సై కె.ప్రయోగమూర్తి తెలిపారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం రాత్రి తన ఇంట్లో నిద్రించిన విఠల్రావు మంగళవారం ఉదయం విగత జీవిగా ఉండడాన్ని గుర్తించిన ఆయన తండ్రి రామప్పడు షాక్కు గురుయ్యారు. కరుణ అనే మహిళతో ఇటీవల విఠల్రావుకు వివాహమైంది. భార్య శ్రీకాకుళంలో ఉండడంతో భర్త మరణించినట్లు సమాచారం ఆమెకు అందించారు. ఆమె బుక్కూరు చేరుకుని భర్త మృతదేహంపై గాయాలున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆమె అందించిన ఫిర్యాదుతో పోలీసులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ ఆమిటి ప్రసాద్ వివిధ కోణాల్లో తమదైన శైలిలో దృష్టి పెట్టామని చెప్పారు. తమ ఉద్యోగి జేవీ రావు మృతిపట్ల ఈయూ జోనల్ సెక్రటరీ బీకే.మూర్తి, సహ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. లారీ వ్యాన్ ఢీ● వ్యాన్ డ్రైవర్ మృతి దత్తిరాజేరు: మండలంలోని ఎస్ బూర్జవలస పోలీస్స్టేషన్ పరిధి మర్రివలస వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన వ్యాన్ డ్రైవర్ మృతి చెందినట్లు ఎస్సై జి.రాజేష్ తెలిపారు. ఈ ప్రమాదంపై ఎస్సై, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామభద్రపురం నుంచి వస్తున్న లారీ మరడాం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న వ్యాన్ను ఢీకొనడంతో వ్యాన్ డ్రైవర్ తీవ్ర గాయాల పాలు కాగా 108లో విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబ వివరాలు, చిరునామా తెలియాల్సి ఉందని కుటుంబసభ్యులు బుధవారం వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయనున్నామని ఎస్సై తెలిపారు. -
ఆత్మవిశ్వాసమే ఆలంబనగా..
● నర్సిపురంలో పారా ఒలింపిక్స్ క్రీడలు ● విజేతలకు బహుమతులుపార్వతీపురం రూరల్: శారీరక వైకల్యాన్ని జయిస్తూ మానసిక స్థైర్యంతో దివ్యాంగ విద్యార్థులు క్రీడా మైదానంలో కదం తొక్కారు. మంగళవారం పార్వతీపురం మండలంలోని నర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా పారా ఒలింపిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీలు ఆద్యంతం ఉల్లాసంగా సాగాయి. 15 మండలాల నుంచి వచ్చిన 85మంది విద్యార్థులు పతాకాల వేటలో పోటాపోటీగా తలపడ్డారు. డీఈఓ బి.రాజ్కుమార్, సమగ్ర శిక్ష ఏపీసీ తేజేశ్వరరావు డీఎల్ఈసీ భానుమూర్తి ఈ పోటీలను పర్యవేక్షించారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న ఆణిముత్యాలు పోటీల్లో సత్తాచాటి రాష్ట్రస్థాయికి అర్హత సాధించిన వారిలో 400మీటర్ల పరుగుకు సంబంధించి కె.ప్రమీల, జూనియర్ విభాగంలో సీహెచ్ జాను, ప్రధమ స్థానాల్లో నిలవగా జి. మణి, రాంనరేష్ ద్వితీయ స్థానాలు దక్కించుకున్నారు. లాంగ్ జంప్ విభాగంలో ఎస్.శివ, పి.రామచంద్ర (అండర్ జూనియర్స్) వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో నిలిచారు. జావెలెన్ త్రోకు సంబంధించి జూనియర్ విభాగంలో వెంకటసాయి, మనీషా స్వర్ణాలు సాధించారు. ఈ మేరకు విజేతలతో పాటు పాల్గొన్న క్రీడాకారులకు అతిథుల చేతుల మీదుగా పతాకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రదాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. చదురుగుడి వద్దనున్న బాలాలయంలో మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలతో అర్చనలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు. న్యాయమూర్తి మానవతా దృక్పథంవిజయనగరం టౌన్: పాక్షికదృష్టి లోపంతో నడిరోడ్డుపై అగమ్యగోచరంగా ఓ వృద్ధుడు తిరుగుతున్నట్లు తెలుసుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత మానవతా దృక్పథంతో స్పందించారు. ఈ మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కృష్ణప్రసాద్ను పంపించి ఆ వృద్ధుడిని ప్రేమసమాజంలో మంగళవారం చేర్పించారు. ఈ సందర్భగా వృద్ధుడి పేరు అప్పన్నగా కృష్ణప్రసాద్ తెలుసుకుని ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడి, బాగోగులను చూసుకోవాలని, ఎటువంటి సహాయ, సహకారాలు కావాల్సిన జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. చట్టప్రకారమే చర్యలు● ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పార్వతీపురం రూరల్: సాలూరులో మంత్రి అనధికార పీఏ, ఓ ఒంటరి మహిళ పరస్పరం చేసుకున్న ఫిర్యాదులపై చట్టప్రకారమే నడుచుకుంటున్నామని, ఇందులో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీమాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగం పేరుతో మోసం చేశారని మహిళ, తమపై అసత్య ప్రచారాలు చేస్తూ కుట్ర పన్నుతున్నారని పీఏ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సాలూరులో రెండు కేసులు నమోదు చేశామన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నది అవాస్తవమని ఎస్పీ కొట్టిపారేశారు. ‘కేసులో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు సాంకేతిక ఆధారాలను, వాట్సాప్ చాటింగ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని, ఆ నివేదిక ఆధారంగా, సమగ్ర విచారణ జరిపి తప్పు ఎవరిదైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తేల్చిచెప్పారు. సామాజిక రుగ్మతలపై.. గురజాడ ‘అక్షర’ కొరడా● చరిత్రను సాహిత్యంగా మలిచిన వైతాళికుడు● ప్రముఖ సాహితీవేత్త పొదిలాపు శ్రీనివాస్పార్వతీపురం రూరల్: గురజాడ లేని సాహిత్య జాడ శూన్యమని, తరాలు మారినా ఆయన అక్షరం తరగని గని అని ప్రముఖ సాహితీవేత్త పొదిలాపు శ్రీనివాస్ అభివర్ణించారు. పార్వతీపురం మన్యం పుస్తక మహోత్సవం మంగళవారంతో ఎనిమిదో రోజుకు చేరుకుంది. వంగపండు–భూషణం– గణేష్ పాత్రో సాహిత్య వేదికపై జరిగిన సభకు పిల్ల తిరుపతిరావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా హాజరైన పొదిలాపు ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. పురాతన అహంకారం మొదలు..నేటి కార్పొరేట్ అధికారం వరకు సాగుతున్న దోపిడీని తన సాహిత్యంతో ఎండగట్టిన ధీశాలి గురజాడ అని కొనియాడారు. ‘కన్యాశుల్కం’ ద్వారా మహిళా లోకానికి వెలుగులద్ది, అణగారిన వర్గాల హక్కుల కోసం అక్షరాయుధాన్ని ప్రయోగించిన సంఘ సంస్కర్త అని ప్రస్తుతించారు. పేదల బతుకులను ఛిద్రం చేసే కుట్రలను తన రచనల ద్వారా ప్రతిఘటించిన తీరు అమోఘమన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి సిరికి స్వామినాయుడు రచించిన ‘శతర’ పుస్తకాన్ని సాహితీవేత్త అల్తి మోహన్న్ సమీక్షించారు. గురజాడ ఆశయ సాధనే లక్ష్యంగా సాగిన ఈ వేడుకలో కామాక్షి నృత్య ప్రదర్శన ఆహూతులను విశేషంగా అలరించింది. -
ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి
పార్వతీపురం: విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందస్తు జాగ్రత్తలు అవసరమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నా రు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏపీ విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల శాఖ జిల్లా కు సరఫరా చేసిన రక్షణ పరికరాలను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విపత్తులశాఖ సామర్థ్యా న్ని మరింత పెంపొందించుకోవాలన్నారు. రక్ష ణ పరికరాలతో జిల్లాలోని ప్రజలకు సమయానుకూలంగా, త్వరితగతిన, నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో విపత్తుల నిర్వాహణాధికారి పి.సింహాచలం, సిబ్బంది పాల్గొన్నారు. మెట్టపల్లిలో వైద్య శిబిరం ● వైద్య శిబిరాన్ని సందర్శించిన డీఎంహెచ్ఓ చీపురుపల్లి: స్క్రబ్ టైఫస్ వైరస్ కలకలం నేపథ్యంలో చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామంలో సోమవారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. స్క్రబ్ టైఫస్ వైరస్ లక్షణాలతో భార్య మృతి చెందినట్టు భర్త తెలిపిన వివరాల మేరకు గతనెల 30న ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు వైద్య సిబ్బంది స్పందించారు. కర్లాం పీహెచ్సీ వైద్యాధికారి శ్రీలక్ష్మి, సిబ్బంది వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. డీఎంహెచ్ఓ జీవనరాణి వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యాధికారితో మాట్లాడి వివరా లు తెలుసుకున్నారు. మృతురాలు చికిత్స పొందిన ఆస్పత్రి వివరాలపై ఆరా తీశారు. ప్రస్తు తం మెట్టపల్లిలో ఎలాంటి స్క్రబ్ టైఫస్ వైరస్ వ్యాప్తి చెందలేదని పీహెచ్సీ వైద్యాధికారి శ్రీలక్ష్మి తెలిపారు. డీఎంహెచ్ఓ వెంట జిల్లా ఇమ్యూనిటీ అధికారి సత్తిరాజు, జిల్లా సర్వేలైన్స్ అధికారి సత్యనారాయణ ఉన్నారు. చీపురుపల్లి: ‘ఇది అనధికార లే అవుట్.. ఈ లే అవుట్కు ఎలాంటి అనుమతులు లేవు.. క్రయ విక్రయాలకు గ్రామ పంచాయతీ ఎలాంటి బాధ్యత వహించదు.. ఇక్కడ ప్లాట్లు కొన్న వారికి ఇంటి ప్లాన్లు ఆమోదించబడవు.. తాగునీటి సదుపాయం అనుమతించబడదు’.. ఇదీ రావివలస రెవెన్యూ పరిధిలో వెలసిన అనధికార రియల్ ఎస్టేట్ వెంచర్లో అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు. రావివలస రెవెన్యూ పరిధిలో ఏర్పాటైన అనధికార లే అవుట్పై ‘దర్జాగా రియల్ దందా’ అనే శీర్షికన గతనెల 30న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అదేరోజు ఎంపీడీఓ సురేష్ ఆధ్వర్యంలో సిబ్బంది రియల్ ఎస్టేట్ వెంచర్ను పరిశీలించి నోటీసులు జారీచేశారు. పంచాయతీ కార్యదర్శి కె.సతీష్, వీఆర్వో ఏ.జగన్నాథం నేతృత్వంలో అనధికార లే అవుట్లో సోమవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వే నంబర్ 164/11,12,13,14,15, 165/1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 12, 13, 14, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 166/1, 2, 3పి, 4పి నంబర్లల్లో ఏర్పాటు చేసిన లే అవుట్కు ఎలాంటి అనుమతులు లేవని హెచ్చరిక బోర్డులో పేర్కొన్నారు. అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసి విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ● హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు ● ఇంటి ప్లాన్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం మంజూరు చేయం -
మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సాక్షి, పార్వతీపురం మన్యం: వరి పంట కోతకొచ్చిన సమయంలో మోంథా తుపాను కలవరపెట్టింది. చేలను నేలవాల్చి అన్నదాత ఆశలను నేలపాలచేసింది. ఇప్పుడు కోతలు, నూర్పిడిలు చేస్తూ.. పంట విక్రయానికి సిద్ధంగా ఉన్న వేళ.. మరోసారి దిత్వా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలు రైతన్నను వణికిస్తున్నాయి. చాలా చోట్ల వరి పంట కోతలు పూర్తయి ఓవులు(పనల) రూపంలో ఉంది. మరికొన్ని చోట్ల నూర్పిడి చేసి కళ్లాల్లోనే రాశులుగా పోసి ఉంచారు. బస్తాలకు నింపి విక్రయానికి సిద్ధం చేశారు. ఈలోగా తుఫాన్ ప్రభావం వల్ల ఆకాశం మేఘావృతమైంది. సోమ వారం మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండడంతో.. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఆపసోపాలు పడుతున్నారు. టార్పాలిన్ల కోసం పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం నుంచి కొనుగోలు లేకపోవడం.. కనీసం ముందస్తు జాగ్రత్త చర్యగా టార్పాలి న్లు కూడా ఇవ్వకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు వర్షాన్ని బూచిగా చూపి దళారులు, వ్యాపారులు కల్లాల వద్దకు వాలిపోతున్నారు. మద్దతు ధర కంటే బస్తా (80కిలోలు)ను రూ.200 నుంచి రూ.300 తక్కువకు అడుగుతున్నా రు. రైతులు కూడా పంటను కాపాడుకునే పరిస్థితి లేక, వచ్చిన మొత్తానికే విక్రయించుకుంటున్నారు. 5 కేజీలు అదనంగా దోపిడీ.. జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించా రు. ఇప్పటివరకు కేవలం 20 వేల టన్నులు మాత్ర మే కొనుగోలు చేశారు. జిల్లాలో 104 రైస్ మిల్లులు ఉండగా.. బీజీలు ఇవ్వడంలో మిల్లర్లు ఇంకా తాత్సారం చేస్తున్నారు. ఫలితంగా కొనుగోలు మందకొడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఖరీఫ్ సాగు చేస్తున్న వరి ధాన్యం పంట నూర్పులు చేస్తూ, అమ్మకానికి రైతన్న సిద్ధమవుతున్నారు. ఒకవైపు వర్షాలు.. వాతావరణ పరిస్థితులు బాగోలేక చేతికి అందిన పంటను అమ్ముకోవాలని చూస్తున్నారు. రైతుల ఆందోళనను ఆసరాగా చేసుకుని జిల్లాలో ఉన్న మిల్లర్లు, దళారులు అంతా ఒకే మాటపై క్వింటా ధాన్యానికి అదనంగా 5 కేజీలు ధాన్యం ఇవ్వాల ని డిమాండ్ చేస్తున్నారు. దింపుడు కూలి రూ.10 ఇస్తే గానీ మిల్లుకు వచ్చిన ధాన్యం దించబోమని రైతులపై అదనపు భారాన్ని రుద్దుతున్నారు. ధ్యానం సేకరణ వేగవంతం చేయాలి.. ఓ వైపు వాతావారణం అనుకూలంగా లేదు.. మరో వైపు రైతులను మిల్లర్లు, వ్యాపారులు మోసం చేస్తున్నారు. తక్షణమే రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనా యుడు, అధ్యక్షుడు వెలమల సత్యనారాయణ, సంఘం నాయకులు పోలురోతు చంద్రశేఖర్ కోరారు. సబ్ కలెక్టర్ వైశాలిని కలిసి రైతు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. 5 కేజీల దోపిడీపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుకు అవసరం అయిన అంకెలు సచివాలయంలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. పాలకొండ రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షం నుంచి వరి పంటను కాపాడుకునేందుకు రైతులు పొలాలకు పరుగులు తీశారు. ఇంటిళ్ల పాదీ సోమవారం ఉదయం నుంచి పొద్దుపోయేవరకు వరి సంరక్షణ పనుల్లోనే నిమగ్నమయ్యారు. కోసిన చేనును చిన్నచిన్న కుప్పలుగా పెట్టారు. కొన్ని చోట్ల రాశులుగా ఉన్న ధాన్యంను బస్తాల్లోకి ఎత్తి టార్పాలిన్లు కప్పారు. పాలకొండ మండలంలోని లుంబూరు, గరుగుబిల్లి, కోటిపల్లి, భాసూరు, యరకారాయపురం, ఓని తదితర ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో నూర్పిడి చేయలేకపోయామని, తుఫాన్ వర్షాలకు తడిసి ముద్దయిందంటూ రైతులు వాపోయారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటను తుఫాన్ వర్షాలు తడిసిముద్ద చేస్తున్నాయి. కోతకొచ్చే సమయంలో మోంథా తుఫాన్ ముంచేసింది. ఇప్పు డు దిత్వా తుఫాన్తో కురుస్తున్న చిరుజల్లులు వరి ఓవులు (పనలను) తడిపేస్తున్నాయి. ఉన్న పంట కాపాడుకుందామన్నా ఒడుపు కుదరడం లేదు. కోతలు పూర్తిచేసి కుప్పలు వేసిన చేను నూర్పిడి చేద్దామంటే ధాన్యం కొనుగోలు జోరుగా సాగడం లేదు. ధాన్యం ఇంటి వద్ద ఉంచే అవకాశం లేదు. మా ప్రాంతంలో దాదాపు 5 వందల ఎకరాల్లో వరిచేను కుప్పల రూపంలోనే ఉంది. మరోవైపు తోటపల్లి కాలువకు నీరు తగ్గించలేదు. తుఫాన్ వర్షాలు, తోటపల్లి కాలువ నీరు పొలాల్లో చేరుతోంది. ఏం చేయాలో పాలు పోవడం లేదు. –ముల్లు గోపాలరావు, రైతు, పాలకొండ మండలం -
చర్యలేవీ?
మంత్రి కుమారుడు, పీఏపైపార్వతీపురం రూరల్: మహిళను లైంగికంగా, మానసికంగా వేధించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు, పీఏ లపై నేటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఐద్వా నాయకులు ప్రశ్నించారు. సాలూరుకు చెందిన ఒక మహిళా ఉద్యోగిని.. తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేసినట్లు ఆధారాలతో సహా పార్వతీపురం ఏఎస్పీకి ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. నిందితులు ఇరువురిపై కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాల్సిన యంత్రాంగం ఆ దిశగా చేయలేదని... పైగా ఫిర్యాదు చేసిన మహిళకు వైద్య పరీక్షల నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తిప్పుతూ, తన వ్యక్తిగత సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అధికారులు ఈ రకమైన కక్షపూరిత వైఖరి ప్రద ర్శించడం పట్ల అఖిల భారత ప్రజాతంత్ర మహి ళా సంఘం (ఐద్వా) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.శ్రీదేవి, బి.లక్ష్మి మీడియాతో సోమవా రం మాట్లాడారు. రాష్ట్ర సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వ్యక్తిగత సిబ్బంది, కుమారునిపై ఇంతటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పటికీ.. కనీసం వారిపై చర్యలు చేపట్టక పోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. నిందితులు దర్జాగా తిరుగుతున్నారని, ఫిర్యాదు చేసిన మహిళను మాత్రం తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఇటీవల చేసిన పత్రిక ప్రకటనలో నిందితులను శిక్షిస్తామని గానీ, జరిగిన తప్పు సరిదిద్దుతామని గానీ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పైగా ఫిర్యాదు చేసిన మహిళను బెదిరించే విధంగా ప్రకటించడంపై ఐద్వా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని మహిళలను వేధింపుల కు గురిచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఐద్వా ఆధ్వర్యంలో బాధిత మహిళకు మద్దతుగా ఆందోళన చేపడతా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ఉపాధ్యక్షులు ఎం.గౌరమ్మ పాల్గొన్నారు. -
హెచ్చరిక బోర్డు ఉన్నా..
ఈ చిత్రాలు చూశారా.. ఓ వైపు హెచ్చరిక బోర్డు ఉన్నా.. అదే స్థానంలో కొత్తగా నిర్మాణాలకు మట్టివేశారు. ఇది కురుపాం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఆంధ్రా–ఒడిశా ప్రధాన రోడ్డు పక్కన సర్వే నంబర్ 27–2లో ఉన్న 60 సెంట్లు భూమి. ఇది డీ పట్టా భూమి. ఓ గిరిజన రైతుకు దశాబ్దాల కిందట సాగుపట్టా ఇచ్చారు. ముందుచూపుతో కొన్నేళ్ల కిందట ఓ నాయకుడు ఈ భూమిని కేవలం రూ.6వేలకు కొనుగోలుచేశాడు. ఇక్కడి ధర అమాంతం పెరగడంతో ఏడాది కిందట రూ.45 లక్షలకు వేరేవారికి విక్రయించాడు. దీంతో వారు వ్యాపార సముదాయాల నిర్మాణాలకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు డీ పట్టా భూమిలో నిర్మాణాలు చేపట్టరాదంటూ అడ్డుకున్నారు. నిర్మాణాలు కూల్చివేసి హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటుచేశారు. ఇప్పుడు మళ్లీ అదే స్థలంలో నిర్మాణాలకు పూనుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనివెనుక అధికార పార్టీకి చెందిన నాయకుడు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. రెవెన్యూ అధికారులతో మంతనాలు జరుపుతూ నాడు అక్రమమని తేల్చిన భూమిని నేడు సక్రమంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సాగు హక్కు పట్టా కలిగిన గిరిజనుడి పేరుతోనే నిర్మాణాలకు పూనుకున్నట్టు సమాచారం. సాగు కోసం అందజేసిన భూమిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఎలా అంగీకారం తెలిపారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణాలు అడ్డుకుంటారా? అనుమతులు ఇస్తారా అన్న చర్చ కురుపాం జోరుగా సాగుతోంది. – కురుపాం -
మా ఊరికి రోడ్డు ఎప్పుడు వేస్తారు ‘బాబూ’
గుమ్మలక్ష్మీపురం: మా గ్రామానికి రెండేళ్ల కిందట రోడ్డు మంజూరైంది... రోడ్డు నిర్మాణ పనులను మధ్యలో నిలిపివేశారు.. ఇప్పటివరకు తిరిగి చేపట్టలేదు.. రోడ్డు ఎప్పుడు వేస్తారో చెప్పండి ‘బాబూ’ అంటూ గుమ్మలక్ష్మీపురం మండలం లుంబేసు పంచాయతీ దేరుగండ గిరిజనులు సోమవారం ఆందో ళన చేశారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను డోలీ లో తరలించాల్సి వస్తోందని వాపోయారు. అటవీ ఫలసాయాలను సంతకు తరలించాలన్నా, కొనుగో లు చేసిన నిత్యావసర సరుకులు ఇళ్లకు తీసుకెళ్లాల న్నా ఇబ్బందులు పడుతున్నామన్నారు. రోడ్డు నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి విజ్ఞప్తి చేస్తే.. ‘నాకు ఓటు వేయలేదు.. రోడ్డు వేయలేనంటూ’ సూటిగా చెప్పడం భావ్యం కాదన్నారు. ఎమ్మెల్యేగా ప్రజాధనాన్ని వేతనం రూపంలో తీసుకుని, ప్రజల సమస్యలు పట్టించుకోకుంటే ఎలా అని ప్రశ్నించారు. రోడ్డు వేయకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల సహాయ కార్యదర్శి మండంగి సన్యాసిరావు, యువజన సంఘం నాయకులు బిడ్డిక రమేష్, గిరిజనులు పాల్గొన్నారు. -
విద్యార్థుల వివరాల నమోదులో జాగ్రత్త
విద్యార్థుల వివరాల నమోదులో ఆందోళన వద్దు పదో తరగతి విద్యార్థుల వివరాలు నామినల్ రోల్స్లో ఎంట్రీ చేసేందుకు ఆందోళన చెందొద్దు. గడువు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలి. నమోదు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ప్రతి అక్షరం చెక్ చేయాలి.గడువు ఇచ్చే అవకాశం ఉంది కదా అని నిర్లక్ష్యంగా చేయకూడదు. – బి.మోహనరావు, డీఈఓ, విజయనగరంఈ ఏడాది గందరగోళం ఈ ఏడాది యూడైస్ ప్రామాణికంగా నామినల్ రోల్స్లో విద్యార్థుల వివరాలు నమోదుకు గందగోళంగా ఉంది.గతంలో ఇలా ఎప్పుడూ లేదు. అన్లైన్లో విద్యార్థుల వివరాలు నమోదు చేసేటప్పుడు పొరపాటున తప్పు దొర్లితే సరిదిద్దేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు.దాంతో ఇబ్బందిగా ఉంది.యూడైస్ ప్లస్లో ఎడిట్,సేవ్ సబ్మిట్ ఆప్షన్,బీఎస్ఈ సైట్లో కూడా ఎడిట్,సేవ్ సబ్మిట్ ఆప్షన్స్ లేకుండా కేవలం యూడైస్ ప్లస్లో మాత్రమే సబ్మిట్ ఆప్షన్ పెట్టడం వల్ల 24 గంటల తర్వాత బీఎస్ఈ సైట్లో డేటా రిఫ్లెక్ట్ కావడం ఇబ్బందిగా ఉంది.విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం వివరాల నమోదు తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇస్తామంటున్నారు. – వి.గోపాలనాయుడు, హెచ్ఎం, ఉన్నత పాఠశాల రామభద్రపురంరామభద్రపురం/మెరకముడిదాం: విద్యార్థులకు పదవ తరగతి సర్టిఫికెట్ ఎంతో కీలకం.మార్కులొక్కటే కాదు.. అందులో నమోదయ్యే వివరాలు కూడా ముఖ్యమే. భవిష్యత్లో ఉన్నత చదువులకే కాకుండా ఉపాధి అవకాశాలకు పదో తరగతి సర్టిఫికెట్లోని వివరాలే ప్రధానం.ఇంతటి ప్రాధాన్యం కలిగిన మార్కుల జాబితాల్లో విద్యార్థుల వివరాల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాల్సిన అవసరం ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థుల తల్లిదండ్రులపై ఉంది. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు 16,287 మంది. ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 6,878 మంది మొత్తం 23,165 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. తాజాగా ఆన్లైన్లో వారి నామినల్ రోల్స్ ఎంట్రీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పకడ్బందీగా విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని, తప్పొప్పులు నమోదు కాకుండా చూడాలని, విద్యార్థుల వివరాల నమోదులో నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్లో విద్యార్థులకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. నామినల్ రోల్స్ చేయించుకునేటప్పుడు ఆపార్లో అన్ని వివరాలు అప్డేట్ ఉండాలి. దీంతో పదో తరగతి నామినల్ రోల్స్ ఎంట్రీ కోసం ఈ నెల 6 వ తేదీ గడువు కావడంతో వివరాల నమోదులో ఆయా పాఠశాలల హెచ్ఎంలు నిమగ్నమై ఉన్నారు.అలాగే ఆన్లైన్లో నామినల్ రోల్స్కు సంబంధించి వివిరాలు నమోదు చేసే సమయంలో పొరపాటున తప్పులు దొర్లితే సరిదిద్దేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో ఇబ్బందిగా ఉందని హెచ్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్లో ఇబ్బంది పదో తరగతి నామినల్ రోల్స్ ఎంట్రీలో జాగ్రత్తలు అవసరం ఈ నెల 6వ తేదీ వరకు గడువు ఆన్లైన్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో హెచ్ఎంల ఇబ్బందులు -
13న జాతీయ లోక్ అదాలత్ను జయప్రదం చేయండి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబితవిజయనగరం లీగల్: ఈనెల 13న జరిగే జాతీయ లోక్ అదాలత్ను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కోర్టు పరిధిలో ఉన్న న్యాయమూర్తులందరితో ఆమె సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద కేసులు, బ్యాంకుకేసులు, చెక్బౌన్స్, మనీ కేసులు, ప్రాంసరీ నోట్ కేసులు, పర్మినెంట్ ఇంజక్షన్ దావాలు, ఎకై ్సజ్, ల్యాండ్ కేసులు, మున్సిపాలిటీ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులకు ఇరు పార్టీల అనుమతితో రాజీమార్గంలో శాశ్వత పరిష్కారం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు మొదటి న్యాయమూర్తి ఎం.మీనా దేవి, మూడవ అదనపు న్యాయమూర్తి కె.విజయకల్యాణి, నాల్గవ అదనపు న్యాయమూర్తి బి.అప్పలస్వామి, ఐదవ అదనపు న్యాయమూర్తి ఎం.పద్మావతి, పోక్సోకోర్టు జడ్జి కె.నాగమణి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి. దుర్గయ్య,సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సమర్థంగా విధుల నిర్వహణకు ఆరోగ్యం ముఖ్యం
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డిపార్వతీపురం: జిల్లా పరిపాలనా యంత్రాంగం సమర్థవంతంగా విధులను నిర్వహించాలంటే ఆరోగ్యం ముఖ్యమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులు, సిబ్బంది కో సం ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లా అబివృద్ధిలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్క అధి కారి, సిబ్బంది ఆరోగ్యం చాలా ముఖ్యమన్నారు. సిబ్బంది ఆరోగ్యం, శ్రేయస్సు దృష్ట్యా ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ శిబిరంలో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, అంకాలజీ, జాయింట్ రీప్లేస్మెంట్, ఎకో, ఈసీజీ తదితర పరీక్షలను నిర్వహించి అనుభవజ్ఞులైన వైద్యులతో చికిత్సలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.పి.భాస్కరరావు, డీసీహెచ్ఎస్ డా.జి.నాగభూషణరావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డా.ఎం.వినోద్, ప్రోగ్రాం మేనేజర్ డా.టిజగన్మోహన్రావు పాల్గొన్నారు. -
ఎయిడ్స్పై ‘అవగాహనే’ ఆస్త్రం
● కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డిపార్వతీపురం రూరల్: అవగాహన అనే అస్త్రంతోనే ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేయగలమని, అప్రమత్తతే ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఉద్ఘాటించారు. ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినం సందర్భంగా ఆదివారం ప్రభుత్వ భవనాల సముదాయం నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవీ బాధితుల పట్ల సమాజంలో ఉన్న వివక్షను రూపుమాపడమే వ్యాధి నియంత్రణకు తొలిమెట్టు అని పిలుపునిచ్చారు. వ్యాధిగ్రస్తులను చిన్నచూపు చూడకుండా వారిని గుండెలకు హత్తుకునే మానవత్వం పరిమళించాలని హితవు పలికారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటూ ఏఆర్టీ మందులు, పెన్షన్లు అందిస్తోందని, ఎవరూ అధైర్యపడవ్దని భరోసా ఇచ్చారు. క్షణిక ఆనందం కోసం జీవితాలను పణంగా పెట్టవద్దని, సురక్షిత జీవన విధానమే యువతకు రక్షాకవచమని కలెక్టర్ హితవు పలికారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.భాస్కరరావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డా.వినోద్ కుమార్, ఇతర అధికారులు, పెద్దఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. -
సకాలంలో వినతుల పరిష్కారం
● కలెక్టర్ డాక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డివిజయనగరం అర్బన్: జిల్లాలో ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెవెన్స్ సిస్టమ్)ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అందుకు సంబంధించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజలు విశేషంగా స్పందించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రజల నుంచి 201 వినతులను స్వీకరించారు. ప్రతి అర్జీదారుతో మాట్లాడి, వారి సమస్యలను శ్రద్ధగా విని వెంటనే సంబంధిత అధికారులకు పరిష్కార సూచనలు జారీ చేశారు. విభాగాల వారీగా స్వీకరించిన వినతులలో అత్యధికంగా రెవెన్యూశాఖకు 73, మిగిలిన వాటిలో డీఆర్డీఏ 32, గ్రామ సచివాలయం 12, మున్సిపాలిటీ 6, పంచాయతీరాజ్ 10, విద్యుత్ శాఖ 3, వైద్య ఆరోగ్యశాఖ 2, హౌసింగ్ 7, ఇతర శాఖలు మరో 50 అర్జీలు ఉన్నాయి. ఫిర్యాదులపై చర్యల విషయంలో అర్జీదారులతో మాట్లాడిన తేదీ, సమయాన్ని తప్పకుండా పోర్టల్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, బి.శాంతి, కళావతి, సర్వే శాఖ ఎ.డి ఆర్.విజయకుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవీప్రసాద్, సీపీఓ బాలాజీ, డీఈఓ మాణిక్యంనాయుడు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అర్జీలు పునరావృతం కారాదు: కలెక్టర్ ప్రభాకరరెడ్డి పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలు ఎట్టిపరిస్థితుల్లో కూడా పునరావృతం కారాదని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు 69 వినతులు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును శ్రద్ధతో పరిశీలించి ప్రజలకు సంతృప్తి కలిగే విధంగా నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. పరిష్కారంలో జాప్యం వహించరాదని స్పష్టం చేశారు. అధికారులు చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించి ప్రజల మన్ననలను పొందాలని సూచించారు. ఒకవేళ అర్జీలు పరిష్కారం కాకపోతే అందుకు గల కారణాలను అర్జీదారులకు వివరించాలని కెప్పారు. అర్జీలను స్వీకరించినవారిలో డీఆర్ఓ కె.హేమలత, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అక్రమ తవ్వకాలు వాస్తవమే
కొత్తవలస: మండలంలో సర్వే నంబర్ 168లో గల ఫిరంగి కొండ వద్ద అక్రమ తవ్వకాలు జరుగుతుండడం వాస్తవమేనని తహసీల్దార్ పి.సునీత స్పంష్టం చేశారు. సాక్షి దిన పత్రికలో సోమవారం ప్రచురితమైన ‘కొండ’ పై అక్రమార్కుల ‘ఫిరంగి’ అనే కథనానికి రెవెన్యూ అదికారులు ఆగమేఘాలపై స్పందించారు.అక్రమ తవ్వకాల ప్రాంతంలో రెవన్యూ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు, వీఆర్ఓ ఆర్.రాధాకృష్ణతో పాటు మరికొంతమంది రెవెన్యూ సిబ్బంది సోమవారం విచారణ చేశారు. ఈ ప్రాంతంలో రాత్రి సమయాల్లో ముఖ్యంగా సెలవుదినాల్లో తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయని స్థానికులు చెప్పారని తహసీల్దార్ సునీత తెలిపారు.ఈ తవ్వకాల వల్ల రెండు జీడిచెట్లు, ఒక తుమ్మచెట్టు నేలకొరిగినట్లు గుర్తించామన్నారు. తవ్వకాలను నిరోధించేందుకు ఆప్రాంతంలో వాహనాలు వెళ్లకుండా ఉండే విధంగా పెద్ద కందకం జేసీబీతో తవ్వించినట్లు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు ఎంత మేర తవ్వకాలు జరిగాయో గుర్తించాలని మైనింగ్ శాఖ అధికారులకు లేఖ పంపించినట్లు చెప్పారు. రాత్రి వేళ అక్రమంగా తవ్వకాలు జరిపిన వ్యక్తులను తక్షణమే గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఫిరంగి కొండ, గ్రేహౌండ్స్కు కేటాయించిన ప్రాంతంలో ప్రత్యేకించి ఇద్దరు వీఆర్ఏలను కాపలా నియమించినట్లు ఆమె తెలిపారు. తహసీల్దార్ పి.సునీత సాక్షి కథనంపై స్పందించిన రెవెన్యూ అదికారులు ఆక్రమార్కులను గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు -
పవర్ లిఫ్టింగ్లో గోల్డ్మెడల్స్
● వన్ టౌన్ ఏఎస్సై త్రినాథ రావు ప్రతిభ ● అభినందించిన ఎస్పీ దామోదర్విజయనగరం క్రైమ్: రాష్ట్ర స్థాయి డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ పోటీల్లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన విజయనగరం వన్ టౌన్ ఏఎస్సై త్రినాథ్ను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమవారం అభినందించారు. వన్ టౌన్లో ఏఎస్సై పని చేస్తున్న ఆల్తి త్రినాథరావు ఇటీవల విశాఖలోని వెలమపేట శ్రీ విజయేంద్ర వ్యాయామ మండలిలో ‘పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియా‘ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించారు. బంగారు పతకాలు సాధించిన ఏఎస్జై ఆల్తి త్రినాథరావు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ను ఆయన చాంబర్ లో సోమవారం మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించి, జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలని అభిలషించారు. గత నెల 30న జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ సెలక్షన్స్ కమ్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మాస్టర్స్ విభాగం 60+, 93 కేటగిరిలో ఏఎస్సై త్రినాథరావు బెంచ్ ప్రెస్లో 95 కిలోలు, డెడ్ లిఫ్ట్లో 142.5 కిలోల బరువును ఎత్తి, రెండు విభాగాల్లోను బంగారు పతకాలు సాధించి, స్టేట్ సెలక్షన్స్కు కూడా ఎంపికయ్యారు. కార్యక్రమంలో విజయనగరం వన్ టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అక్రమ కబేళాలు మూసివేయాలి
● ఏపీ గో సంరక్షణ సమాఖ్య డిమాండ్విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల కంటోన్మెంట్లో అక్రమంగా నడుస్తున్న గో మాంసం కబేళాలు, దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. స్థానిక కంటోన్మెంట్ మసీదు ఎదురుగా ఉన్న బిర్యానీ సెంటర్ వెనుక బ్లూ గేట్తో పాటు దాని చుట్టు పక్కల యథేచ్ఛగా ప్రతిరోజూ ఆవులు, దూడలను చంపి రాష్ట్రంలో కంపెనీలకు పంపిస్తున్నారని గతంలో మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్కు ఫిర్యాదు చేయగా వారి లైసెన్సులు రద్దు చేసినప్పటికీ కబేళాలు, షాపులను నిర్వహిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. తక్షణమే అక్రమ కబేళాలు, గో వధ శాలల మూసివేతకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని ఈ మేరకు కమిషనర్ నల్లనయ్యను మున్సిపల్ కార్యాలయంలో కలిసి నోటీసు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కేవీఆర్ సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి భీమపల్లి సంధ్యారాణి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పాడ పైడితల్లి, సారిక రేణుక తదితరులు పాల్గొన్నారు. -
నేడు జిల్లా స్థాయి పోటీలు
పాలకొండ రూరల్: పారా ఒలింపిక్స్ అసోసియేషన్ సౌజన్యంతో మంగళవారం జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడాపోటీలు చేపట్టనున్నామని సహిత విద్య జిల్లా కోఆర్డినేటర్ పి.భానుమూర్తి తెలిపారు. 13–20 ఏళ్లలోపు 40 శాతం దివ్వాంగులైన ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో చదువుతున్న బాల బాలికలు ఈ పోటీలకు అర్హులన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో గల నర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ పోటీలు చేపడతామని పేర్కొన్నారు. సోమవారం పాలకొండ వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ డీఈఓ బి.రాజ్కుమార్, సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త తేజేశ్వరరావుల పర్యవేక్షణలో ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు. ప్రధాన రహదారి నుంచి క్రీడా వేదిక వద్దకు నడవ లేని వారి కోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశామని, ఔత్సాహిక క్రీడాకారులకు భోజన వసతితో పాటు అవసరమైన క్రీడా పరికరాలు తామే సమకూరుస్తామని తెలిపారు. జాతీయ తైక్వాండో పోటీల్లో నేషనల్ స్కూల్ విద్యార్థికి కాంస్యంవిజయనగరం అర్బన్: ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి అండర్–17 తైక్వాండో పోటీల్లో పట్టణానికి చెందిన ది నేషనల్ స్కూల్ విద్యార్థి వై.ముఖేష్ విశ్వనాఽథ్కు కాంస్య పతకం లభించింది. ఈ మేరకు సోమవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విజేతను పాఠశాల కరస్పాండెంట్ బొడ్డు రామారావు, స్కూల్ ఇన్చార్జ్ దీపక్, ఉపాధ్యాయులు అభినందించారు. -
ఎస్పీ పీజీఆర్ఎస్కు 24 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: ప్రతి వారం మాదిరిగానే జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక సోమవారం జరగ్గా రెండు చోట్ల ఫిర్యాదు దారుల నుంచి ఎస్పీ, ఏఎస్పీలు ఫిర్యాదులు స్వీకరించారు. సరిగ్గా పదిగంటలకు డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ సౌమ్యలత ఫిర్యాదులు స్వీకరించారు. పన్నెండున్నర గంటలకు ఎస్పీ దామోదర్ తన చాంబర్లో ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తంగా 24 ఫిర్యాదులను స్వీకరించి ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ, ఏఎస్పీలు ఆదేశించారు. కార్యక్రమంలో డీజీఆర్బీ సీఐ కె.కుమార స్వామి, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, అంబేడ్కర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 27 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలో పరిపాలనాధికారి వి.సునీల్ నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో 27 వినతులు స్వీకరించారు. మోంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని కోడిశ పంచాయితీ బిల్లగూడకు చెందిన అప్పన్న కోరాడు. కొంజరగూడ గ్రామస్తురాలు లలిత అంగన్వాడీ సెంటర్ మంజూరు చేయాలని, పొలంగూడ గ్రామస్తుడు రాజయ్య మేకల కొనుగోలుకు రుణం ఇప్పించాలని కోరారు. మండ పాఠశాల ఎండీఎం నిర్వాహకులు బియ్యం పాఠశాలకు సరఫరా చేయలని వినతి అందజేశారు. డిప్యూటీ ఈఓ రామ్మోహన్రావు, డీఈ నాగభూషణరావు, వ్యవసాయాధికారి వాహిని పాల్గొన్నారు. -
సర్వకాలీనం, సార్వజనీనం భగవద్గీత
విజయనగరం: కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణపరమాత్ముడు కర్తవ్య నిర్వహణ గురించి అర్జునుడికి చేసిన హితబోధే భగవద్గీత అని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శ్రీ సాయి సత్సంగ సేవా సంఘం వ్యవస్థాపకుడు ఉపద్రష్ట వరప్రసాద్ పేర్కొన్నారు. గీతా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాష పరిరక్షణ సమితి అధ్యక్షుడు సముద్రాల గురు ప్రసాద్ ఆధ్వర్యంలో కేఎల్పురంలో గల గీతాంజలి స్కూల్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరప్రసాద్ మాట్లాడారు. భగవద్గీతలోని ప్రతి అక్షరం ఒక శక్తిమంతమైన బాణం అని, ప్రతి భావం అమూల్య సందేశం అని భగవద్గీత సర్వకాలికం, సార్వజనీనం అని అన్నారు. రచయిత, ప్రముఖ వైద్యుడు డాక్టర్ జీవీఎన్ భూపతి మాట్లాడుతూ భగవద్గీత ధర్మయుద్ధానికి సంబంధించిన సందేశం మాత్రమే కాదు. మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారాలను అందించే జీవన శాస్త్రం అన్నారు. అందుకే భగవద్గీత ఒక ఆధ్యాత్మిక గ్రంథమేకాదు, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి సంపూర్ణ మార్గదర్శిని అని పేర్కొన్నారు కార్యక్రమంలో భాగంగా పూసపాటి రేగకు చెందిన టేకుమళ్ల అమిత్ సాయి శశాంక్ భగవద్గీత లోని భక్తి యోగాన్ని అర్థవంతంగా భక్తిశ్రద్ధలతో చదివి వినిపించారు .ఈ సందర్భంగా ఉపద్రష్ట వరప్రసాద్, డాక్టర్ జీవీఎన్ భూపతి లను పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరావు, డైరెక్టర్ రాజేష్, ప్రిన్సిపాల్ మల్లికలతో కలిసి గురుప్రసాద్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సమితి కార్యదర్శి డాక్టర్ జక్కు రామకృష్ణ, సలహాదారు సుభద్రాదేవి, డిమ్స్ రాజు, గిరి తదితరులు పాల్గొన్నారు. -
అమాత్యా... ఇదేమి తీరు..!
సాలూరు: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పీఎస్ సంఘటన చాలా బాధాకరమని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పేర్కొన్నారు. పీఎస్ వ్యవహారంపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీని, సాక్షి దినపత్రికను, తనను విమర్శిస్తూ నిందను మాపై నెట్టి బురదజల్లే విధంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడారని ఇది సరికాదని అన్నారు. కుటుంబ బంధాలకు విలువనిచ్చే తాను ఏనాడు కుటుంబాల జోలికి వచ్చి రాజకీయాలు చేయలేదన్నారు. అధికారంలో ఉన్న వారు తప్పులు, పొరపాట్లు చేసి వాటిని ప్రతిపక్షంలో ఉన్న తమపై నెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. పట్టణంలో తన స్వగృహం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భర్త లేని బాధిత మహిళ తనకు జరిగిన అన్యాయంపై మంత్రి వద్దకు వెళ్లానని చెబుతున్నారని, అప్పుడే మంత్రి స్పందించి ఉంటే నేడు పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదన్నారు. బాధిత మహిళ, సతీష్ ఇరువురు పరస్పర ఫిర్యాదులు పోలీస్స్టేషన్లో చేసుకున్న నేపథ్యంలో నిష్పక్షపాతంగా విచారణ జరిగితే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. ఇప్పటికే బాధిత మహిళ హైకోర్టుకు వెళ్లారని అవసరమైతే న్యాయస్థానాన్ని మళ్లీ ఆశ్రయించే అవకాశం ఉంటుందన్నారు. తాను కుటుంబ బాంధవ్యాలకు విలువ ఇచ్చే వాడినని, కుటుంబాల విషయాల్లో రాజకీయాలు ఏనాడు చేయలేదని పునరుద్ఘాటించారు. తాను ఏనాడూ కక్షపూరిత రాజకీయాలు చేయలేదని మానవత్వంతోనే రాజకీయాలు చేశానని చెప్పారు. తనను ఇబ్బంది పెడుతున్నారని మంత్రి సంధ్యారాణి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడే ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, అటువంటిది ప్రతిపక్షంలో ఉన్న తాము అధికారంలో ఉన్న వారిని ఎలా ఇబ్బంది పెట్టగలమని ప్రశ్నించారు. బాధిత మహిళ తనకు అన్యాయం జరిగిందని సాక్షి టీవీకి తెలిపిన తరువాత ఆ మహిళ అదే విషయాన్ని ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అన్ని మీడియా చానళ్లకు కూడా విషయం చెప్పారన్నారు. మంత్రి పీఏ, బాధిత మహిళ విషయంలో తమకు, వైఎస్సార్సీపీకి, సాక్షి దినపత్రికకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. మాజీ ఉప ముఖ్యమంత్రినైన తనపై టీడీపీ శ్రేణులు, నేతలు సామాజిక మాధ్యమాల్లో మెసేజ్లు, పోస్టింగ్లు పెడుతున్నారని, వాటిని భద్రపరుస్తున్నానని పోలీస్స్టేషన్లో, సైబర్ క్రైమ్కు సమయం చూసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇందులో ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోండి.. సాలూరు నియోజకవర్గ వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, మంత్రి లోకేష్ తెలుసుకోవాలని సూచించారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఏ ఒక్కరిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. రెండు శాఖలకు మంత్రిగా ఉన్న సంధ్యారాణి తమ నాయకుడు జగన్మోహన్రెడ్డిని, తమను ఎంత దారుణంగా విమర్శిస్తుంటారో ప్రజలకు తెలుసునని, ప్రజలు ఆమె వ్యవహార శైలిని గమనిస్తున్నారన్నారు. మంత్రి పీఎస్ వ్యవహారంలో తాను ఇప్పటి వరకు స్పందించలేదని, కానీ మంత్రి సంధ్యారాణి తనను, వైఎస్సార్సీపీని ఉద్దేశిస్తూ మాట్లాడడం వల్లే స్పందించానని చెప్పారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు. మంత్రి పీఎస్ వ్యవహారంపై మాపై బురద చల్లడం సరికాదు సమస్య వచ్చినప్పుడే పరిష్కరించి ఉంటే ఇలా జరిగేది కాదు.. మంత్రి సంధ్యారాణి వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారు.. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర -
మన్యంలో కందికి ప్రోత్సాహమేదీ!
● విస్తరిస్తే జిల్లాకు తీరనున్న కంది కొరత ● మార్కెటింగ్ సదుపాయాల్లేక తగ్గుతున్న సాగు ● వెలుగు మార్కెటింగ్ నిల్ సీతంపేట: మన్యంలో కంది పప్పుకు మార్కెట్ విస్తృతంగా ఉంది. ఇంటి అవసరాలకు కందిపప్పు తప్పనిసరి. అయితే కొద్ది నెలల కిందట కంది పప్పు కిలో ధర రూ.200లకు పైగా విక్రయించబడింది. గత ఆరు నెలలుగా రేషన్ డిపోల్లో కందిపప్పు లబ్ధిదారులకు ఇవ్వడం నిలిపివేశారు. అవసరమైన కందిపప్పు లేదు. కందిపప్పు కొనుగోలు చేయాలంటేనే వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. మార్కెట్లో ప్రస్తుతం రూ.140పైనే కిలో కందిపప్పు విక్రయిస్తున్నారు. ఏజెన్సీలో పండే కందిని ప్రోత్సాహిస్తే జిల్లాకు సరిపడే నాణ్యమైన కందిపప్పును అందించవచ్చని రైతులు చెబుతున్నారు. గతంలో ఐటీడీఏ పరిధిలో వివిధ మండలాల్లో కంది పంట విస్తారంగా పండేది. సీతంపేట ఏజెన్సీలో రైతులు ఎక్కువగా ఈ పంట పండించే వారు. తగిన ప్రోత్సాహం లేకపోవడంతో మరీ వెనుకబడిపోతుంది. ఐటీడీఏ పరిధిలో సీతంపేట, భామిని, మెళియాపుట్టి, మందస, కొత్తూరు, పాతపట్నం, హిరమండలం మండలాలు టీపీఎంయూ (ట్రైబుల్ ప్రాజెక్టు మానటెరింగ్ యూనిట్) మండలాలుగా ఉన్నాయి. ఈ పరిధిలో దాదాపు 200ల ఎకరాల వరకు కంది పండుతుంది. అయితే సీతంపేట ఏజెన్సీలో 50 ఎకరాల వరకు పండుతుంది. హెక్టార్కు 50 నుంచి 60 క్వింటాళ్ల వరకు కంది దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. 180 రోజులకు ఈ పంట ఖరీఫ్ సీజన్లో పండుతుంది. వరితో పాటు మెట్ట భూముల్లో, జీడిలో అంతర్ పంటగా వేసినా జిల్లాకు సరిపడా కందిని ఏజెన్సీలోనే పండించుకోవచ్చని నిపుణుల అభిప్రాయం. కొనుగోలు చేసి నిలిపేశారు.. గతంలో ఏజెన్సీలో పండే కందిని వెలుగు ద్వారా కొనుగోలు చేసి కందిపప్పుగా తయారు చేసి ఇతర జిల్లాలకు సైతం విక్రయించేవారు. అంతలోనే మళ్లీ ఆ ప్రోసెస్కు అధికారులు మంగళం పాడేశారు. అటు తరువాత ఈ పంటపై మొగ్గు చూపని పరిస్థితి ఉంది. సీతంపేట ఏజెన్సీలోని నారాయణగూడ, మెట్టుగూడ, కుడ్డపల్లి, కడగండి, కుశిమి, పొల్ల, దోనుబాయి, మర్రిపాడు, గొయిది తదితర పంచాయతీల పరిధిలో కంది పండుతుంది. కొండపోడు పంటల్లో భాగంగా రైతులు ఎక్కువగా ఈ పంటను పండిస్తారు. -
సమాజ చైతన్యస్ఫూర్తి గురజాడ
విజయనగరం టౌన్: సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో తనదైన శైలిలో రచనలు చేసిన సమాజాన్ని చైతన్య పరిచిన మహనీయుడు గురజాడ అప్పారావు అని, అటువంటి మహనీయుని 110వ వర్ధంతిలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని గురజాడ విశిష్ట పురస్కార గ్రహీత పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ పేర్కొన్నారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య సాహితీ చైతనోత్సవంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక క్షత్రియ కల్యాణ మండపం ఆవరణలో గురజాడ విశిష్ట పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముందుగా గురజాడ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. వర లక్ష్మి త్యాగరాజ సంగీత కళాశాల, సూర్యతేజ డాన్స్ అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యరూపకా లు ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం అతిథులను, గురజాడ వారసులను దుశ్శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. శ్రీ సాయి ఫౌండేషన్ తరఫున ప్రముఖ న్యాయవాది కోలగట్ల తమ్మన్నశెట్టి పద్మశ్రీ కొలకలూరి ఇనాక్కు గురజా డ విశిష్ట పురస్కారం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, నగ దుతో ఘనంగా సత్కరించారు. సమాఖ్య కోశాధికా రి డాక్టర్ ఎ.గోపాలరావు ప్రశంసాపత్రాన్ని చదివి వినిపించారు. అనంతరం గురజాడ విశిష్ట పురస్కా ర గ్రహీత పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ గురజాడ వంటి మానవతా మూర్తి పుట్టడం వలన సమానత్వాన్ని పొందుతున్నామన్నారు. మహిళలను, చిన్నారులను, సామాన్యుల ను ఆయన ఆదరించారని, దేశమును ప్రేమించుమన్నా.. అంటూ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఉన్న వారికి హితబోధ చేశారన్నారు. భాష గొప్ప తనాన్ని వివరించిన మహనీయుడన్నారు. ముత్యాల సరాలను తయారు చేశారని, మనుషులంతా మనుషులుగా బతకాలని, దేశమంటే మట్టికాదు.. మనుషులని, దేశాన్ని ప్రేమిస్తే సమాజం బాగుంటుందని చాటి చెప్పారన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టి స్ సిహెచ్.మానవేంద్రనాథ్రాయ్ మాట్లాడుతూ మహాకవి రాసిన గేయాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. సొంతలాభం కొంతమానుకుని పొ రుగు వారికి సాయం చేయమన్నటువంటి వాఖ్యా లు ఎంతో విలువైనవన్నారు. సాంఘిక దురాచారాలను ఎలా రూపు మాపాలి, వాటిని ఏ విధంగా సంస్కరించాలని ఆలోచన చేసి కన్యాశుల్కం రూపొందించారన్నారు. ప్రజల మధ్యలోకి నాటకం రూపంలో తీసుకువెళ్లి ఆలోచన రేకెత్తించారన్నారు. అటువంటి మహనీయునికి మనమంతా రుణపడి ఉన్నామన్నారు. ఎస్పీ ఎఆర్.దామోదర్ మాట్లాడుతూ 130 ఏళ్లకి పూర్వమే సమాజంలోని సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు మహాకవి చేపట్టిన కృషి ఎనలేనిదన్నారు. తెలుగు సాహిత్యానికి విశేష కృషి చేసి న ఇనాక్ని సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కవితా పోటీలలో విజేతల వివరాల ను డాక్టర్ జక్కు రామకృష్ణ వెల్లడించారు. పొత్తూరి సీతారామరాజు (కాకినాడ), సునీత గంగవరపు, చిలకలూరిపేట (పల్నాడు), మహమ్మద్ అప్సర వలీషా, కోనసీమ (ద్వారపూడి), ఇనపకుర్తి చిన సత్యన్నారాయణ (విజయనగరం), చెళ్లపిళ్ల శ్యామ ల (విజయనగరం) తదితరులకు గురజాడ ఉత్తమ కవితా పురస్కారాలను, అదే విధంగా గురజాడ రచనలపై నిర్వహించిన వక్తృత్వం, వ్యాసరచన పోటీల విజేతలకు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమానికి ముందు మహాకవి గుర జాడ స్వగృహంలో గురజాడ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహాకవి ఇంటి నుంచి గురజాడ దేశభక్తి గీతాలాపన చేస్తూ ర్యాలీగా బయలుదేరి కాంస్య విగ్రహం వద్ద పూలమాలలను సమర్పించారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శు లు డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, కాపుగంటి ప్రకాష్ ల నేత్రత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత, కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, నవసాహితీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్వి.సూర్యప్రకాష్రావు (చైన్నె), సభ్యులు ఎం.అనిల్ కుమార్, మేకా అనంతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
కనిపించని కాటు.. తీరని చేటు!
ట్రాంబోక్యులిడ్ అనే కంటికి కనిపించని సూక్ష్మ కీటకం కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దీనిని చిగ్గర్ అని కూడా అంటారు. ఓరియెన్షియా సుసుగాముషి అనే బ్యాక్టీరియా దీనికి కారణం. ముఖ్యంగా పొలాల్లో, అటవీ ప్రాంతాల్లో, పొదలు, గడ్డి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తిరిగే రైతులు, కూలీలకు ఇది సోకే ప్రమాదం ఎక్కువ. అన్ని వయసుల వారికీ ఇది సోకే అవకాశముంది. కానీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, చిన్నారులు త్వరగా ప్రభావితం అవుతారు. పార్వతీపురం రూరల్: జిల్లాల్లో మారుతున్న వాతావరణం, పచ్చని పొలాల మాటున కంటికి కనిపించని ప్రమాదం పొంచి ఉంది. అదే స్క్రబ్ టైఫస్ వైరస్. ఉమ్మడి విజయనగరం జిల్లా వాసులను గత కొద్ది నెలలుగా ఈ వ్యాధి కలవరపెడుతోంది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదు కానీ అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది. సాదాసీదా జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది ఊపిరితిత్తులపై పంజా విసురుతుంది. అందుకే దీనిపై సంపూర్ణ అవగాహన, తక్షణ వైద్యమే మనకు శ్రీరామరక్ష. గణాంకాలు ఏం చెబుతున్నాయి? ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబరు 17 వరకు నమోదైన కేసులను పరిశీలిస్తే విజయనగరం జిల్లాలో 487 నమూనాలను పరీక్షించగా 59 మందికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా తేలింది. ఇక మన్యం జిల్లా (పార్వతీపురం) పరిధిలో 27 నమూనాల్లో 6 కేసులు బయటపడ్డాయి. ఇటీవల మెట్టపల్లికి చెందిన ఓ మహిళ ఈ లక్షణాలతో మృతి చెందడం విచారకరం. అయితే, ప్రస్తుతం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేకపోవడం ఊరటనిచ్చే అంశం. స్క్రబ్ టైఫస్ సోకినప్పుడు మొదట సాధారణ వైరల్ జ్వరంలాగే అనిపిస్తుంది. వైద్యుల దగ్గరకు వెళ్తే మందులు ఇస్తారు. జ్వరం తగ్గినట్టే తగ్గి, లోలోపల ఈ బ్యాక్టీరియా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. ప్రధాన లక్షణం కీటకం కుట్టిన చోట చర్మంపై సిగరెట్ కాలిన గాయం లాంటి మచ్చ ఏర్పడుతుంది. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, చలి జ్వరం, దగ్గు ఉంటాయి. సకాలంలో గుర్తించకపోతే కిడ్నీలు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జాగ్రత్తలే మన ఆయుధాలు పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లేవారు కాళ్లు, చేతులు పూర్తిగా కప్పుకునేలా దుస్తులు ధరించాలి. ఇంటి పరిసరాల్లో గడ్డి, పొదలు లేకుండా చూసుకోవాలి. ఎలుకల ద్వారా కూడా ఈ కీటకాలు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి, ఎలుకల నివారణ ముఖ్యం. పొలాల నుంచి రాగానే వేడి నీటితో స్నానం చేయడం, బట్టలు ఉతకడం మంచిది. తీవ్రమైన జ్వరం వచ్చి, చర్మంపై నల్లని మచ్చ కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలి. సొంత వైద్యం అసలు చేయకూడదు. ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో స్క్రబ్ టైఫస్ యాక్టివ్ కేసులు ఏమీ లేవు. ఇది ఒకరి నుంచి ఒకరికి సోకే అంటువ్యాధి కాదు. గాలి ద్వారా వ్యాపించదు. కేవలం పొదలు, తుప్పల్లో ఉండే మైట్ అనే సూక్ష్మ కీటకం కుట్టడం ద్వారానే వస్తుంది. కాబట్టి ప్రజలు అనవసర భయాలకు లోనుకావద్దు. వ్యాధి సోకిన ప్రాథమిక దశలోనే గుర్తిస్తే యాంటీ బయాటిక్ మందులతో సులభంగా నయం చేయవచ్చు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో దీనికి సంబంధించిన మందులను తగినంతగా అందుబాటులో ఉంచాం. జ్వరం వస్తే కాలయాపన చేయకుండా, సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించాలి. – డా.ఎస్.భాస్కరరావు, డీఎంహెచ్వో, పార్వతీపురం మన్యం పచ్చని పొదల్లో.. ప్రాణ గండం! అశ్రద్ధ చేస్తే.. ఆయువుకే ఎసరు! జ్వరమే కదా అని జారవిడిస్తే.. ప్రాణాలకే ముప్పు! సాధారణ జ్వరం కాదు.. ‘స్క్రబ్’ కాటు కావొచ్చు! చిగ్గర్ కాటుతో చిక్కులు.. పెరుగుతున్న కేసులు 11 నెలల్లో 65 కేసులు.. ‘స్క్రబ్’ విషయంలో నిర్లక్ష్యం వద్దు! వ్యాధి నివారణలో ప్రభుత్వ పాత్ర కీలకం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు చేసే పరికరాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అనుమానిత లక్షణాలు ఉన్నవారి నమూనాలను బయట ల్యాబ్లను సంప్రదించాల్సి వస్తోంది. చాలామంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ లెక్కలు అధికారిక గణాంకాల్లోకి రావడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జిల్లా ఆస్పత్రిలో పరీక్షలు చేసేందుకు కావల్సిన కిట్లును అందుబాటులోకి తేవాలి. మారుమూల గ్రామాల్లో ఈ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించాలి. -
మీకోసం వెబ్ సైట్లో పీజీఆర్ఎస్ అర్జీల నమోదు
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు మీకోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించనున్నట్టు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ రోజు వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక సెల్లార్ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జిఓవి.ఇన్ వెబ్పైట్లో అర్జీలను నమోదు చేసుకోవచ్చునన్నారు. అర్జీల స్థితిని 1100 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునన్నారు. జంఝావతి సాధన సమితి సమరభేరి పార్వతీపురం రూరల్: జంఝావతి ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణమే లక్ష్యంగా జంఝావతి సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఆయకట్టు గ్రామాల్లో సమితి నాయకులు ఉద్యమానికి పిలుపునిచ్చారు. సమితి అధ్యక్షుడు చుక్క భాస్కరరావు నేతృత్వంలో పార్వతీపురం మండలంలోని పెదబొండపల్లి, నిడగల్లు, పులిగుమ్మి, లచ్చిరాజుపేట తదితర గ్రామాల్లో పర్యటించి గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా 75 గ్రామాల్లో పర్యటించినట్టు తెలిపారు. ప్రతీ రైతు ఓ సైనికుడిలా కదిలి రావాలని, ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ విశ్రమించమని స్పష్టం చేశారు. త్వరలోనే వేలాది మంది రైతులతో కలెక్టరేట్ సాక్షిగా నిరవధిక దీక్షలు చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పల్లి రాజగోపాల్, మాలతి కృష్ణమూర్తినాయుడు, వంగల దాలినాయుడు, మండల పకీరు నాయుడు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం: ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటు న్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణీత వ్యవధిలో స్పందించి పరిష్కరించకుంటే త్వరలో అసెంబ్లీని ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దాసరి నాగభూషణ్ హెచ్చరించారు. ఆదివారం నగరంలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల దగ్గరి కి యువగళం పాదయాత్ర ద్వారా వచ్చి జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామన్నారని, ఫీజురీయింబర్స్మెంట్ అమలు చేస్తామని మోసం చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక యూనివర్సిటీలకు నిధులు తెస్తామంటూ చేసిన ప్రకటన అమలుకు నోచుకోలేదని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన మార్చుకోకపోతే విద్యార్థి ఉద్యమం గుణపాఠం నేర్పిస్తుందని, భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ప్రజాస్వామిక శక్తులతో కలిసి పోరాటం నిర్మిస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సుమన్, సహాయ కార్యదర్శి గౌరీ శంకర్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం: అండర్ – 12 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు మంగళవారం నిర్వహించనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు (రాంబాబు) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాబా మెట్ట శివారు విజ్జి స్టేడియంలో మంగళవారం ఉదయం 7 గంటలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు 2013 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని తెలిపారు. క్రీడాకారులు తెలు పు దుస్తులు ధరించి రావాలని సూచించారు. -
బహుపరాక్..!
ప్రాణాంతక వ్యాధితో..విజయనగరం ఫోర్ట్: హెచ్ఐవీ ఎయిడ్స్వ్యాఽధి పట్ల ఒకప్పుడు సమాజంలో వివక్ష ఉండేది. అరోగులు ఉన్న ఛాయలకు కూడా వెళ్లడానికి ఇష్టపడేవారుకాదు. అంతేకాకుండా హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవడానికి కూడా రోగులు ముందుకు వచ్చేవారు కాదు. హెచ్ఐవీ రోగులను కలవడానికి కానీ, వారితో మాట్లాడడానికి కాని ఇష్టపడేవారు కాదు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగుల పట్ల గతంలో కంటే అవగాహన వచ్చింది. హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవడానికి కూడా రోగులు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పటికీ ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. హెచ్ఐవీ/ఎయిడ్స్ పట్ల ఇంకా అవగాహన రావాల్సి ఉంది. సన్మార్గమే ఉత్తమం హెచ్ఐవీ వచ్చిన తర్వాత బాధపడేకంటే హెచ్ఐవీ బారిన పడకుండా ఉండడం మంచిది. చెడుఅలవాట్లకు దూరంగా ఉంటూ సన్మార్గంలో నడవడం ద్వారా హెచ్ఐవీ బారిన పడకుండా ఉండవచ్చు. హెచ్ఐవీ సోకిందంటే జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ఐసీటీసీ సెంటర్లో హెచ్ఐవీ పరీక్షలు చేసిన తర్వాత నిర్ధారణ అయినవారికి ఏఆర్టీ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసి మందులు అందిస్తారు. ఒకసారి మందుల వాడకం ప్రారంభించిన తర్వాత మధ్యలో మానివేయకూడదు. మందులు మధ్యలో మానివేస్తే వారి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తుంది. ఏఆర్టీ కేంద్రంలో 6582 మందికి చికిత్స జిల్లాలోని ఏఆర్టీ కేంద్రంలో 6582 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో పురుషులు 2836 మంది, మహిళలు 3707 మంది, పిల్లలు 39 మంది ఉన్నారు. 2008 నుంచి ఆక్టోబర్ నెలాఖరు నాటికి 13,897మంది హెచ్ఐవీ రోగులు నమోదయ్యారు. జిల్లాలో చికిత్స అందించే కేంద్రాల వివరాలు జిల్లాలో సమగ్ర, పరీక్ష కేంద్రా(ఐసీటీసీ)లు 11 ఉన్నాయి. అదేవిధంగా పీహెచ్సీల్లో 65 ఐసీటీసీలు ఉన్నాయి. అలాగే రక్తనిధి కేంద్రాలు జిల్లాలో 9 ఉన్నాయి. రక్త నిల్వ కేంద్రాలు 8 ఉన్నాయి. రక్తసేకరణ వాహనం ఒకటి ఉంది. జిల్లాలో ఏఆర్టీ కేంద్రాలు రెండు ఉన్నాయి. లింక్ ఏఆర్టీ కేంద్రాలు 7 ఉన్నాయి. సుఖవ్యాధి చికిత్స కేంద్రాలు రెండు ఉన్నాయి. హెచ్ఐవీ/ఎయిడ్స్ నిర్మూలనపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలు 6 ఉన్నాయి.అవగాహన కల్పిస్తున్నాం హెచ్ఐవీ/ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నాం. హెచ్ఐవీ ఏవిధంగా వ్యాప్తి చెందుతుంది, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హెచ్ఐవీ సోకిన వారికి ఎక్కడ చికిత్స అందిస్తారనే దానిపై అవగాహన కల్పిస్తున్నాం.ీ పీహెచ్సీ, సీహెచ్సీ, జిల్లా ఆస్పత్రుల్లో హెచ్ఐవీ పరీక్షలతో పాటు హెచ్ఐవీపై కౌన్సెలింగ్ ఇస్తారు. ప్రతి ఒక్కరూ హెచ్ఐవీపై అవగాహన కల్పించుకోవాలి. – డాక్టర్ కె.రాణి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి ఎయిడ్స్ పట్ల అవగాహన అవసరం జిల్లాలోని ఏఆర్టీ కేంద్రంలో రోగులు 6582 మంది హెచ్ఐవీ పరీక్ష చేసే ఐసీటీసీ కేంద్రాలు 77 నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం -
గాయపడిన వ్యక్తి మృతి
భామిని: మండల కేంద్రానికి చెందిన బొమ్మాళి సుదర్శన్(40) ఇటీవల శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనకు విశాఖ కేజీహెచ్లో వైద్యసేవలు అందిస్తుండగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. దీంతో మృతుని కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. చికిత్స పొందుతూ వృద్ధురాలు.. బాడంగి: స్థానిక పెద్దవీధికి చెందిన మరడాన పాపమ్మ(76) కాలిన గాయాలతో విజయనగరం ఆస్ఫత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందినట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. వృద్ధురాలు తనఇంటిలో శనివారం సాయంత్రం వంటచేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకొంగుకు నిప్పంటుకుని శరీరం కాలిపోగా మెరుగైనచికిత్సకోసం విజయనగరం సర్వజన ఆస్ఫత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమెకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలున్నారని ఎస్సై చెప్పారు. కుమారుడు అప్పల నాయుడి ఫిర్యాదుమేరకు కేసునమోదుచేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించి కేసుదర్యాఫ్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
‘కొండ’పై అక్రమార్కుల ‘ఫిరంగి’
● మొద్దునిద్రలో రెవెన్యూ సిబ్బంది ● కొత్తవలసలో లే అవుట్లకు కంకర తరలింపు ● సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులుకొత్తవలస: మండలంలో రోజురోజుకు ఆక్రమణలు, ప్రభుత్వ భూముల కబ్జా, గ్రావెల్ అక్రమ తవ్వకాలు పెరుగుపోతున్నాయి. ఈ తవ్వకాలు చంద్రబాబు ప్రభుత్వ పాలన ప్రారంభం నాటి నుంచి జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ అండతో అక్రమార్కులు రెచ్ఛిపోతున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అదికారులు మొద్దు నిద్ర వహిస్తున్నారు.దీంతో అక్రమార్కులు రెచ్చిపోయి బరితెగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో కొంతమొత్తం రెవెన్యూ అధికారులకు చేరుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెలవు రోజులు వచ్చాయంటే చాలు అక్రమార్కులు తెరలేపుతున్నారు. అధికారులు ఎక్కువ శాతం మంది స్థానికేతరంగా ఉండడంతో అక్రమార్కుల పని సులువవుతోంది. మండలంలోని కొత్తవలస రెవెన్యూ పరిధి ఫిరంగి కొండ ప్రాంతంలో రాత్రి, పగలు తేడా లేకుండా జోరుగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.సర్వే నంబర్ 168లో సుమారు 15 సెంట్లు, సర్వే నంబర్ 168–1లో 415–37 ఎకరాల కొండ ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రాంంతంలో ఇప్పటికే ఎక్కువశాతం ఆక్రమణలకు గురైంది. కాగా ప్రస్తుతం ఈ కొండప్రాంతంలో గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కొత్తవలస మండలంలో ఎక్కడ లేఅవుట్ వేసినా అవసరమైన గ్రావెల్ ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే.దీంతో అక్రమార్కులు రెండు చేతులా డబ్బులు సంపాదించుకుంటున్నారు. అధికారులు మాత్రం తూతూ మంత్రంగా హెచ్చరించి వదిలేస్తున్నారు.ముందుగా కొండ ప్రాంతంలో గ్రావెల్ను తవ్వేసి అమ్ముకున్న తరువాత చదునైన భూమిని ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకుంటున్నారు. అలాగే రెల్లి రెవెన్యూ పరిధిలో గ్రేహౌండ్స్కు కేటాయించిన కొండ ప్రాంతంలో సైతం జోరుగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి.ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమార్కులను అదుపు చేయాలని పలువురు కోరుతున్నారు. తవ్వకాలు నిరోధిస్తాం ఈ తవ్వకాలపై తహసీల్దార్ సునీతను వివరణ కోరగా సంబంధిత రెవెన్యూ కార్యదర్శిని అప్రమత్తం చేసి తవ్వకాలను నిరోధిస్తామన్నారు. పట్టుబడిన వ్యక్తులపై కేసుల నమోదుకు సిఫారసు చేస్తామని చెప్పారు. -
ఆధునిక మహిళ చరిత్ర తిరగరాసేలా గురజాడ రచనలు
● సాహితీగోష్ఠిలో ప్రముఖుల సందేశాలువిజయనగరం టౌన్: ఆధునిక మహిళ చరిత్రను గురజాడ రచనలు తిరగరాస్తాయని ప్రముఖ సామాజికవేత్త పీఏ దేవి పేర్కొన్నారు. మహాకవి గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని సాహితీస్రవంతి, జనవిజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జిల్లాపరిషత్ కార్యాలయంలోని సెమినార్ హాల్లో ఆదివారం సాహితీ గోష్ఠి నిర్వహించారు. గురజాడ సీ్త్ర పాత్రల ఔన్యత్యంపై సామాజికవేత్త దేవి ప్రసంగిస్తూ గురజాడ రచించిన కన్యాశుల్కం నాటకంలో పాత్రలేవీ కల్పితాలు కావన్నారు. పాత్ర నేపథ్యాలున్నవేనని తెలిపారు. కన్యాశుల్కంలో కన్యక, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, పూటకూళ్లమ్మ, బుచ్చమ్మ , మధురవాణి వంటి సీ్త్రపాత్రలన్నీ సంఘసంస్కరణకు చేయాల్సిన పనులన్నీ ఆ నాటకంలో చేసి చూపించారన్నారు. గురజాడ సాహిత్య విషయాలు ఇంకా అనేకం బయటకు రావాల్సి ఉందన్నారు. కవి, రచయిత, జర్నలిస్ట్ రెహానా మాట్లాడుతూ మధురవాణి పాత్ర ఒక వర్గానికే కాదని, సీ్త్ర ధైర్యాన్ని, ఔన్యత్యాన్ని చూపిందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు ఉపన్యాసకులు రమాగీతాదేవి మాట్లాడుతూ గురజాడ పాత్రలు దార్శనీకమైనవన్నారు. ప్రముఖ సీ్త్రల వైద్యనిపుణురాలు డాక్టర్ జి.సన్యాసమ్మ మాట్లాడుతూ మహిళాభ్యున్నతికి మహాకవి మహోన్నతమైన విషయాలను ప్రజల కళ్లకు కట్టినట్లు నాటకం ద్వారా చూపించి మార్పు తీసుకువచ్చారన్నారు. జనవిజ్ఞానవేదిక రాష్ట్ర సమత కన్వీనర్ జి.నిర్మల, మహిళాచేతన కార్యదర్శి కత్తిపద్మ, ఎం.సుశీల, డాక్టర్ లెక్కల చిన్నారి తదితరులు ప్రసంగించారు. గురజాడ ప్రవచించిన దేశభక్తిపై సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్ష్యులు తెలకపల్లి రవి ప్రసంగించారు. ప్రముఖ రచయితలు అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, మక్కెన శ్రీనివాస్, సాహితీస్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్లు గురజాడ విశిష్టతను వివరించారు. ప్రముఖుల స్మారక భవనాలు, చిహ్నాలు పరిరక్షణ – ఆవశ్యకత అనే అంశంపై ఇన్టాక్ కన్వీనర్, చరిత్ర పరిశోధకులు ఈమని రాణీశర్మ ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్. శర్మ, తవ్వా సురేష్, గొంటి గిరిధర్, జి.మురళీధర్, ప్రొఫెసర్ కె.ఎస్.చలం, కొత్తూరి శ్రీనివాస్లు మాట్లాడుతూ మహనీయుల స్మారక భవనాలను పరిరక్షించుకునేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. అనంతరం కన్యాశుల్కం–సామాజిక ప్రయోజనం అనే అంశంపై జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రకరకాల పేర్లతో వేలకోట్లు ఖర్చుపెడుతోందని సమాజం కోసం దేశం కోసం కష్టపడిన వారిని గుర్తించడం లేదన్నారు. తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్.లక్ష్మణరావు, జేవీవీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఎన్.వెంకటరావు, తవ్వాసురేష్లు ప్రసంగించారు. కార్యక్రమానికి ముందు గురజాడ విగ్రహం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు గురజాడ గౌరవ యాత్రను నిర్వహించారు. యుగస్వరం గురజాడ పుస్తకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో సాహితీ అభిమానులు పాల్గొన్నారు. -
మెనూ అమలు చేయకుంటే ఎలా?
గుమ్మలక్ష్మీపురం: విద్యార్థుల కోసం కేటాయించిన మెనూ అమలు చేయకుంటే వారి ఆరోగ్యాలెలా బాగుంటాయని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ నాయకులు టి.అఖిల్, హెచ్.సింహాచలం ప్రశ్నించారు. ఈమేరకు ఆదివారం వారు మండలంలోని టిక్కబాయి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. మెనూ ప్రకారం ఉదయం పూరి పెట్టాల్సి ఉన్నప్పటికీ కిచిడీ అంటూ అన్నం పెట్టారని, మధ్యాహ్నం చికెన్ బిర్యానీ పెట్టాల్సి ఉన్నప్పటికీ వాటి స్థానంలో గుడ్డు కూరతో ముద్దగా ఉన్న అన్నం పెట్టారని..ఇలా మెనూ పాటించకపోవడం వల్ల విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారన్నారు. కావున సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఆశ్రమ పాఠశాలలో మెనూ అమలుపై దృష్టిసారించాలని, విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ..విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. -
హెచ్ఐవీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
● జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రాణివిజయనగరం ఫోర్ట్: హెచ్ఐవీ/ఎయిడ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా ఆదివారం రంగోలి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవగాహన ద్వారానే హెచ్ఐవీని నియంత్రించవచ్చన్నారు. హెచ్ఐవీ రోగుల పట్ల ప్రేమ, అప్యాయత చూపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం ఉమామహేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
చెరకు తూనిక కేంద్రాలు సిద్ధం
● డిసెంబర్ 5న క్రషింగ్ ● తగ్గిన ఉత్పత్తిపండించిన చెరకు అంతా క్రషింగ్ జిల్లాలో 2025–26 క్రషింగ్ సీజన్కు ఈఐడీ ప్యారీస్ లిమిటెడ్, భీమసింగి, ఎన్సీఎస్,గోవాడ సుగర్ ప్యాక్టరీల పరిధిలో చెరకు ఉత్పత్తి చేసిన 2.5 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ చేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఓవర్ హాలింగ్ చేసినట్లు యాజమాన్యం కార్యాలయానికి సమాచారం ఇచ్చింది. ఇప్పటికే ఉన్న చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులు ఉత్పత్తి చేసిన చెరకు క్రషింగ్కు పూర్తిస్థాయిలో ఈఐడీ ప్యారీస్ యాజమాన్యం సిద్ధం చేసింది. – ఎం.సత్యనారాయణ, సుగర్కేన్ డిప్యూటీ కమిషనర్, బొబ్బిలిసీతానగరం: సంకిలి ఈఐడీ ప్యారీస్ లిమిటెడ్ చక్కెర కర్మాగారంలో 2025–26 క్రషింగ్ ప్రారంభించడానికి యాజమాన్యం సిద్ధం చేయడంతో రైతులు ఉత్పత్తి చేసిన చెరకు తరలించడానికి రహదారులు సక్రమంగాలేక మల్లగుల్లాలు పడుతున్నారు. సంకిలి ఈఐడీ ప్యారీస్ ప్రైవేట్ చక్కెర కర్మాగారం ఓవర్హాలింగ్ చేసి డిసెంబర్ 5న క్రషింగ్ చేయడానికి యాజమాన్యం సిద్ధం చేసింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎనన్్ సీఎస్, భీమసింగి,సంకిలిలో ఈఐడీ ప్యారీస్ చెరకు కర్మాగారాలు ఉన్నాయి. పేరుకే మూడు చక్కెర కర్మాగారాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లచ్చయ్యపేట ఎన్సీస్ కర్మాగారాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విజయనగరం ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు విక్రయించారు. అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఇక్కడి రైతులు వాణిజ్య పరంగా చెరకుపంటసాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఎన్సీఎస్ కర్మాగారం పరిధిలోఉన్న 16 మండలాల్లో వేలాదిమంది రైతులు 5లక్షల నుంచి 6 లక్షల టన్నుల చెరకు ఉత్పతి చేసేవారు. కర్మాగారం మూతపడడంతో చెరకు విస్తీర్ణం తగ్గడం, ఉన్న చెరకును సంకిలి ఈఐడీ ప్యారీస్కు తరలించడం ఆనవాయితీగా వస్తోంది. కర్మాగారం పరిధిలో ఉన్న గ్రామాల్లో 2025–26 క్రషింగ్ సీజన్కు సుమారు 2.9లక్షల టన్నులచెరకు ఉత్పత్తి చేసినట్లు గణాంకాల ద్వారా తెలియవచ్చింది. అలాగే భీమసింగి కోఆపరేటివ్ చక్కెర కర్మాగారం పరిధిలో 20 వేలు, గోవాడ కో ఆపరేటివ్ చక్కెర కర్మాగారం పరిధిలో 40 వేల టన్నుల చెరకు ఉత్పత్తి చేసినట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలియవచ్చింది.ఈ క్రమంలో ఈఐడీప్యారీస్ లిమిటెడ్ చక్కెర కర్మాగారం యాజమాన్యం 2 లక్షల 50 వేల టన్నులు క్రషింగ్ చేయడానికి వీలుగా ఓవర్ హాలింగ్ చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో చెరకు ఉత్పత్తి 3.5 లక్షల టన్నుల వరకూ ఉంది. అ మేరకు తెర్లాం, బాడంగి, సీతానగరం, కొమరాడ,బలిజిపేట, వంగర మండలాల్లో బెల్లం క్రషర్లు బెల్లం తయారు చేయడానికి గానుగలను చిన్నరైతులు ఏర్పాటు చేసుకుంటున్నారు. టన్ను చెరకు రూ. 3,200గా సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ధారించగా బెల్లం క్రషర్ యాజమాన్యాలు చెరకు టన్నుకు రూ.2800కు మించి కొనుగోలు చేయలేమని చెప్పడంతో చెరకు పండించే రైతులంతా పండించిన చెరకును ఏం చేసు కోవాలో అర్ధంకాక ఆందోళన చెందుతున్నారు. లచ్చయ్యపేట ఎన్సీఎస్ కర్మాగారాన్ని తెరిపిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి చెరకు రైతులు ఉత్పత్తి చేసిన చెరకును కొనుగోలు చేయాలని, మూత పడిన కార్మాగారాలను తెరిపించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సీతానగరం మండలంలో చెరకు తూనిక కేంద్రాలు.. సీతానగరం మండలంలోని బూర్జ, కృష్ణారాయపురం, వెంకటాపురం, లక్ష్మీపురం, నిడగల్లు, సీతానగరం, పణుకుపేట, బగ్గందొరవలస గ్రామాల్లో చెరకు తూనిక కేంద్రలున్నాయి. అలాగే మక్కువ, బాడంగి, తెర్లాం,బొబ్బిలి ప్రాంత గ్రామాల్లో చెరకు తూనిక యంత్రాలను ఏర్పాటు చేశారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
గరుగుబిల్లి: పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి సినీఫక్కీలో పల్టీకొట్టింది. ఆదివారం ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం కురుపాం వెళ్లి తిరు గు ప్రయాణంలో పార్వతీపురం వస్తుండగా మార్గమధ్యంలో తోటపల్లి శ్రీ కోదండరామాలయం సమీపంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఆయన సరక్షితంగా బయటపడ్డారు.కుక్కల దాడిలో పది గొర్రెపిల్లల మృతివంగర: మండలకేంద్రంలో కుక్కలు ఆదివారం దాడిచేయడంతో పది గొర్రెపిల్లలు మృతిచెందాయి. గ్రామానికి చెందిన పడాల గంగులు ఇంటి సమీపంలోని గొర్రెల షెడ్డులోకి కుక్కలు చొరబడి దాడిచేశాయి. ఈ దాడిలో పది గొర్రెపిల్లలు మృతిచెందడంతో బాధితుడు లబోదిబో మంటున్నాడు. ఇదిలా ఉండగా అదే గ్రామంలో వారం రోజుల క్రితం 20 గొర్రె పిల్లలను కుక్కలు దాడిచేసి హతమార్చాయి. అధికారులు స్పందించి కుక్కల నివారణకు చర్యలు చేపట్టడంతోపాటు తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలురామభద్రపురం: మండలంలోని తారాపురం వద్ద ఆదివారం బైక్ ఢీ కొని ఓ వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ప్రమాదంపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తారాపురం గ్రామానికి చెందిన పిల్లా రమణ తన పాడిపశువులను మేతకు తోలుకుని వెళ్లి మేత తర్వాత తిరిగి ఇంటికి తొలుకోస్తుండగా వెనుకనుంచి మితిమీరిన వేగంతో వస్తున్న ద్విచక్రవాహనదారు ఢీ కొట్టి ఆపకుండా పరారయ్యాడు. దీంతో రమణ తలకు తీవ్రగాయమైంది. కుటుంబసభ్యులు ప్రథమ చికిత్స నిమిత్తం సాలూరు సీహెచ్సీకి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి భార్య సాయి ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బుడతనాపల్లిలో అగ్ని ప్రమాదం
గంట్యాడ: మండలంలోని బుడతనాపల్లిలో శనివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన బొమ్మిడి సూరమ్మకు చెందిన పూరిల్లు కాలిపోయింది. ఒక్కసారిగా ఇంటి నుంచి మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు స్పందించి మంటలను ఆర్పారు. అయితే అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద సమయంలో బాధిత మహిళ ఇంటిలో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ‘మళ్లీ విచారణకు రావాలి’ సాలూరు: గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పీఎస్ సతీష్పై ఫిర్యాదు చేసిన బాధిత మహిళను పోలీసులు విచారించారు. పట్టణ పోలీస్స్టేషన్లో శుక్రవారం విచారణ చేపట్టి సాయంత్రం వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం ఆమెను విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించి, మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం ఆమెను ఇంటికి పంపించి వేసి మళ్లీ విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం వంగర: మండల పరిధి నీలయ్యవలస గ్రామానికి చెందిన సీహెచ్ విజయమ్మ (60) గడ్డి మందు తాగి శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు.. కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగు మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో రాజాం ఆస్పత్రికి తరలించారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి గుర్ల: మండలంలోని చుక్కపేట, సొలిపిసోమరాజుపేట వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో కలవచర్లకు చెందిన నడుపూరు అప్పలనర్సమ్మ (65), చీపురుపల్లికి చెందిన ఇప్పిలి భూషణరావు (48) మృతి చెందారు. నడుపూరు అప్పలనర్సమ్మ తన కుటుంబ సభ్యులతో ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. చుక్కపేట వద్దకు వచ్చే సరికి ప్రమాదవశాత్తూ జారి పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అప్పలనరసమ్మను విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరో ప్రమాదంలో చీపురుపల్లికి చెందిన ఇప్పిలి భూషణరావు విజయనగరం నుంచి తన స్వగృహానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. సొలిపిసోమరాజు పేట వద్ద వాహనం బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదాలపై గుర్ల పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ నాయకులు చెబితేనే కొంటాం..
గుర్ల: రైతులు ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఇబ్బంది పడాల్సి వస్తోంది. పండించిన పంటను మిల్లులకు తరలించాలన్న టీడీపీ నాయకుల అనుమతి ఉండాలని అధికారులు చెబుతుండడంపై అన్నదాతలు నివ్వెరబోతున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని చింతలపేటకు చెందిన సంచాన గౌరినాయుడు, యడ్ల ఉమామహేశ్వరి, పతివాడ శ్రీనువాసరావు, పతివాడ రమణ, పతివాడ పద్మ, తదితరులు కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని కళ్లాల్లో ఉంచారు. రైతుసేవా కేంద్రానికి వెళ్లి ధాన్యం మిల్లుకు తరలించాలని వీఏఏను కోరారు. దీంతో ఆమె గురువారం షెడ్యూల్ ఇచ్చి గూడెం సొసైటీ సిబ్బంది నియమించిన టీఏ, డీఈఈల వద్దకు పంపించింది. రైతులు టీఏ, డీఈఈలను సంప్రదించి ధాన్యం తరలింపునుకు సంబంధించి ఽట్రక్షీట్ జనరేట్ చేయాలని కోరారు. అయితే ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేయాలంటే తప్పనిసరిగా గ్రామ టీడీపీ నాయకుడు, గూడెం సొసైటీ చైర్మన్ను కలవాలని.. అతను చెబితే కొనుగోలు ప్రారంభిస్తామని సొసైటీ నియమించిన సిబ్బంది తెలిపారు. రెండు రోజులుగా నిలిచిన లారీలు చింతలపేటలో ఐదుగురు రైతులకు చెందిన 1100 బస్తాల ధాన్యం రెండు లారీలకు లోడ్ చేశారు. ధాన్యం లోడ్ చేసి రెండు రోజులవుతున్న సొసైటీ సిబ్బంది మాత్రం ట్రక్షీట్ జనరేట్ చేయలేదు. దీంతో రైతులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులు ట్రక్షీట్ జనరేట్ చేయాలని చెప్పినా శనివారం సాయంత్రం వరకు జనరేట్ చేయలేదు. దీంతో అధికారులు గ్రామానికి వచ్చి ట్రక్షీట్ జనరేట్ చేయించారు. మండిపడుతున్న అన్నదాతలు.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రారంభంలోనే టీడీపీ నాయకుల తీరు ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఇంకెంత దారుణంగా వ్యవహరిస్తారోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నాయకుల చుట్టూ తిరిగితే ధాన్యం కొంటారా అంటూ మండిపడుతున్నారు. ధాన్యం లోడ్ చేసి రెండు రోజులవుతున్నా ట్రక్షీట్ జనరేట్ చేయని వైనం గూడెం సొసైటీ సిబ్బంది నిర్వాకం అధికారుల ఆగ్రహించడంతో మిల్లుకు తరలింపు -
సాహితీ చైతన్య రజతోత్సవం..
విజయనగరం టౌన్: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహనీయుడును స్మరిస్తూ గురజాడ సాంస్కృతిక సమాఖ్య పేరుతో జిల్లాలోని సాహితీవేత్తలు, అభిమానులు 2000 సంవత్సరంలో ఓ సంస్థ ఏర్పాటు చేశారు. కేవలం సభ్యుల సహకారంతోనే ప్రతి ఏటా ఉత్సవాలను నిర్వహిస్తూ గురజాడ సాహిత్యంపై కృషి చేస్తున్న వారిని గుర్తించి గురజాడ విశిష్ట పురస్కారాలను అందజేస్తోంది. నేటికి 25 ఏళ్లు పూర్తి కావడంతో ఈ ఏడాది సాహితీ చైతన్యోత్సవం పేరుతో రజతోత్సవ వేడుకలకు రంగం సిద్ధం చేసింది. భావితరాలకు అవగాహన మహాకవి చేసిన రచనలపై నేటితరానికి అవగాహన కల్పించే దిశగా సమాఖ్య కృషి చేస్తోంది. జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తున్నారు. జాతీయస్థాయిలో కవితల పోటీలు నిర్వహించి ఉత్తమ కవులకు గురజాడ ఉత్తమ కవితా పురస్కారంతో సత్కరిస్తున్నారు. ఇప్పటివరకు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 190 మందికి పైగా కవులు పాల్గొన్నారు. మరణాంతరం కూడా జీవిస్తారు.. మహా పురుషులందరూ మరణాంతరం కూడా జీవిస్తారు. ప్రతి ఒక్కరూ మహానుభావుల జయంతి రోజున కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. కానీ గురజాడ సాంస్కృతిక సమాఖ్య మాత్రం గురజాడ వర్ధంతి రోజున కార్యక్రమాలు నిర్వహిస్తూ..ఆయనకు మరణం లేదని చెబుతూ వస్తున్నాం. మహాకవి సాహితీవనంలో వేసిన బాటలో నడయాడడమే మనందరి బాధ్యత. – కాపుగంటి ప్రకాష్, ప్రధాన కార్యదర్శి, గురజాడ సాంస్కృతిక సమాఖ్య, విజయనగరం -
మాదకద్రవ్యాల రవాణాను అరికట్టాలి
పార్వతీపురం: జిల్లాలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల రవాణాను పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ జిల్లా స్థాయి సమావేశం, జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం కలెక్టర్, ఎస్పీ మాధవరెడ్డి అధ్యక్షతన శనివారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో డ్రగ్స్, గంజాయి నివారణపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. ఇందుకోసం ప్రతి పది ఇళ్లకు ఒక వలంటీర్ను ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. ఫొటోల కోసం కాకుండా నివారణే అంతిమ లక్ష్యంగా భావించి అధికారులు పని చేయాలన్నారు. రవాణా, అటవీ, ఆర్టీసీ, ఎకై ్సజ్, తదితర శాఖల ద్వారా నిర్వహిస్తున్న ర్యాలీలు, చైతన్య కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. రహదారి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఎస్పీ ఎం.రాంబాబు, ఎస్టీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, పశుసంవర్థక శాఖాధికారి ఎస్.మన్మధరావు, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, సీపీఓ ఎస్ఎస్ఆర్ పట్నాయక్, డీటీఓ దుర్గాప్రసాద్, డీపీటీఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రభాకరరెడ్డి -
గురజాడ.. భావితరాలకు దిక్సూచి..
● ఆచార్య కొలకలూరి ఇనాక్కు గురజాడ విశిష్ట పురస్కారం విజయనగరం టౌన్: విజ్ఞానదాయకమైన విద్య విజయానికి దోహదపడుతుందని ముందుచూపుతో పటిష్టమైన ప్రణాళిక రచించి భావితరాలకు గురజాడ వేంకట అప్పారావు వెలుగుజాడగా నిలిచారు. సంఘ సంస్కరణ, సాంఘిక చైతన్యమవసరమని ఆశించారు. ఆయన ఆశయాలు, వారి రచనలు అజరామరం. విజయనగరం సంస్థానంలో ఆనందగజపతికి అభిమానపాత్రునిగా.. రీవారాణి అప్పలకొండమాంబ అంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు. నాలుగో విజయరామ గజపతి దత్తత విషయంలో ప్రముఖ పాత్ర వహించిన నిస్వార్థపరులు మహాకవి గురజాడ. అటువంటి మహానుబావుడికి సొంత ఇల్లు కూడా లేదు. సంస్థానం వారు ఉండమన్న అద్దె ఇంటిని రెండువేల రూపాయలకు కొనుక్కున్నారు. ఆ ఇల్లును బాగు చేసిన కొన్ని నెలలకే అనగా 1915 నవంబర్ 30న పరమపదించారు. ఇప్పుడా గృహం అధ్యయన కేంద్రంగా విరాజిల్లుతోంది. సాహితీ సౌరభాలు.. విజయనగర ఖ్యాతిని దశ దిశలా చాటిన మహోనుభావులు ఎందరో ఉన్నారు. వందల ఏళ్లు దాటినా ఆ సాహితీవేత్తలు అజరామరులే. అటువంటిి సాహితీవేత్తలు నడయాడిన నేలపై మనం జన్మించడం మనందరి అదృష్టం. అంతటి మహనీయుల్లో వెలుగుజాడ గురజాడ ఒకరు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో 24 ఏళ్లుగా సాహితీ చైతనోత్సవం పేరిట గురజాడ విశిష్ట పురస్కారంతో విశిష్ట వ్యక్తిని సత్కరించుకుంటున్నారు. కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు గురజాడ పురస్కారం వాయిదా పడింది. మరలా 2022 నుంచి ఈ పురస్కారాన్ని సమాఖ్య ప్రతినిధులు అందజేస్తున్నారు. ఈ ఏడాది సమాఖ్య 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. 2025 సంవత్సరానికి గాను పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్కు ఆదివారం ఉదయం 10.30 గంటలకు డాక్టర్ పీవీజీ.రాజు క్షత్రియ కల్యాణ మంటపం ఆవరణలో గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేయనున్నారు. గురజాడ విశిష్ట పురస్కారం అందుకోనున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ -
అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?
● ఎమ్మెల్యే లోకం నాగమాధవికి వైఎస్సార్ సీపీ నాయకుల సవాల్ పూసపాటిరేగ: వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధికి, ఇప్పుడు అధికారంలోని చంద్రబాబు ప్రభుత్వం 18 నెలల కాలంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు, మండల వైస్ ఎంపీపీ అల్లాడ రమేష్లు సవాల్ విసిరారు. ఇదే విషయమై మండల కేంద్రంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ఎరుకొండ, అల్లాడపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించినప్పుడు ఆయా గ్రామాల్లో వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన అభివృద్ధి ఎమ్మెల్యేకు కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. ఏ గ్రామం వెళ్లినా వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే కనిపిస్తోందన్నారు. అల్లాడపాలెంలో రూ.కోటి నిధులతో సీసీ రోడ్లు, కాలువలు, బోర్లు వేశారని, అవేవీ కానరాలేదా అని మండిపడ్డారు. అదే గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు కేంద్రం ప్రారంభోత్సవంలో కనీసం ప్రోటోకాల్ పాటించకుండా జనసేన జెండాలతో నింపేసి అదొక పార్టీ కార్యక్రమంలా చేసేశారని ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలెప్పుడిస్తారు? ఎమ్మెల్యే నాగమాధవి గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు అక్కడి సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులను లేనిపోని మాటలతో దూషిస్తుండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారం ఉంది కదా అని లేనిపోని మాటలు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రెల్లివలసలో కార్పొరేట్ స్థాయిలో శ్మశానవాటికను అభివృద్ధి చేస్తే దానిపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం అర్థరహితమన్నారు. తాను గెలిచి అధికారం కూడా వస్తే వంద రోజుల్లో వంద కంపెనీలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామన్న మాట ఎప్పుడు నెరవేరుస్తారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అధికారులు కూడా వృత్తి ధర్మం పాటించకుండా రాజకీయ నాయకులకు తొత్తులుగా మారడం సిగ్గుచేటన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్న అధికారులపై ఫిర్యాదులు చేస్తామన్నారు. మండలంలోని 28 పంచాయతీల్లో ఏ పంచాయతీ అభివృద్ధిపైనా అయినా ఎమ్మెల్యేతో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. సమావేశంలో వైస్ ఎంపీపీ ఎన్.సత్యనారాయణరాజు, ఎంపీపీ ప్రతినిధి మహంతి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ ప్రతినిధి మహంతి జనార్థనరావు తదితరులు పాల్గొన్నారు. -
వైద్యాధికారిపై విచారణ
చీపురుపల్లి రూరల్ (గరివిడి): గరివిడి మండలంలోని కోనూరు పీహెచ్సీ వైద్యాధికారి వెంకటరమణమ్మపై జిల్లా వైద్యశాఖాధికారులు శనివారం విచారణ చేపట్టారు. వెంకటరమణమ్మ విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని, సకాలంలో అందుబాటులో ఉండడం లేదంటూ కోనూరు, గొలగాం గ్రామాలకు చెందిన నాయకులు మాజీ సర్పంచ్ వెంపడాపు రమణమూర్తి, ఎం.అప్పలనాయుడు, వై.రమణ, ఎం. రాము, తదితరులు ఇటీవల కలెక్టర్, డీఎంహెచ్ఓలకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎంహెచ్ఓ జీవనరాణి ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రొగ్రాం అధికారి సుబ్రహ్మణ్యం స్థానిక పీహెచ్సీలో ఫిర్యాదుదారుల సమక్షంలో విచారణ చేశారు. ఆరోగ్య కేంద్రానికి సకాలంలో విధులకు హాజరు కావటం లేదని, ప్రతీరోజు 11, 12 గంటలకు పీహెచ్సీకి వచ్చి వెంటనే వెళ్లిపోతున్నారని.. ఆస్పత్రిలో ప్రసవాలు జరిపించడం లేదంటూ ఫిర్యాదుదారులు అధికారులకు తెలియజేశారు. ఇదే పీహెచ్సీ పరిధిలో గల గుర్ల మండలం తాటిపూడి సచివాలయంలో పనిచేస్తున్న ఎంఎల్హెచ్పీ కస్తూరి సక్రమంగా విధలకు హాజరుకావడం లేదని గొలగాం గ్రామానికి చెందిన సర్పంచ్ కలిశెట్టి అప్పలరాజు విచారణాధికారులకు తెలియజేశారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అధికారులు తెలిపారు. -
గురజాడ భావజాలం దేశానికి అవసరం
● సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తెలకపల్లి రవివిజయనగరం టౌన్: జాతీయ పునర్వికాసానికి ప్రతిబింబంగా, ప్రతీకగా నిలిచిన వ్యక్తి గురజాడ అప్పారావు భావజాలం దేశానికి ఎంతైనా అవసరం.. అటువంటి మహనీయుడి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించుకోవడం మన కనీస బాధ్యతని సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తెలకపల్లి రవి అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గురజాడ పేరుతో సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఆయన నివాసాన్ని ఆధునీకరించాలని సూచించారు. ఉత్తరాంధ్రలో శ్రీశ్రీ, ఆరుద్ర, ఘంటసాల, సుశీల , ఆదిభట్ల, ద్వారం వంటి మహానుభావులెందరో ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. కార్యక్రమంలో సాహితీస్రవంతి ప్రతినిధి చీకటి దివాకర్, జనవిజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ ఎంవీఎన్ వెంకటరావు, డాక్టర్ జక్కు రామకృష్ణ, గురజాడ వెంకటేశ్వరరావు, ఇందిర, తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర సమాచారం ఉండాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డి పథకాలకు సంబంధించిపార్వతీపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతీ అధికారి వద్ద పూర్తి సమాచారం ఉండాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పలు పథకాల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో తన సమావేశ మందిరంలో కలెక్టర్ శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ వున్న పనుల వివరాలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లి నిధులు విడుదలయ్యేలా చూసుకోవాలని అధికారులు తెలిపారు. పథకాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిధులు ఇతర సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి విద్యాశాఖాధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతిలో గత మూడేళ్లుగా రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రధమ స్థానంలో నిలిపారని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా ప్రధమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. విద్యా ప్రమాణాలను పెంచేందుకు, సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు నూతన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ముస్తాబు కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలన్నారు. చదువుతో పాటు ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కోసం ఆనందలహరి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఈవోబి.రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆకాంక్షిత జిల్లాలలో పార్వతీపురానికి 5వ ర్యాంకు ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో జాతీయ స్థాయిలో పార్వతీపురం మన్యం జిల్లా 5వ ర్యాంకులో నిలిచిందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. అద్భుతమైన పనితీరును కనబరిచి మార్చి 2025లో వున్న 93వ డెల్టా ర్యాంక్ నుంచి జాన్ 2025 నాటికి 4వ డెల్టా ర్యాంకుకు చేరిందన్నారు. జిల్లా యొక్క కాంపోజిట్ స్కోర్ 50.2 నుంచి 70.3కు పెరిగిందని, ఇది ఏడీపీలోని ఐదు ప్రధాన అంశాలలోనూ గణనీయమైన పెరుగుదలను ప్రదర్శించిందన్నారు. జిల్లాలో ప్రాధమిక మౌలిక సదుపాయాలు కల్పనలో మొదటి ర్యాంకును సాధించిందన్నారు. విద్య, ఆర్థిక చేరిక, నైపుణ్యం, ఆరోగ్యం, పోషకాహరం, వ్యవసాయం, నీటివనరులు, అభివృద్ధి రంగాలల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి సహకార, పోటీ సమాఖ్య వాదానికి జిల్లా కొత్త బెంచ్మార్క్ నెలకొల్పాయని వివరించారు. -
ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025
పార్వతీపురం రూరల్: పెళ్లి పందిరిలో సందడి... వేద పండితుల మంత్రోచ్ఛారణలు... మంగళవాయిద్యాల హోరు... బంధుమిత్రుల కోలాహలం... ఇవన్నీ ఇక కొన్నాళ్ల పాటు నిలిచిపోనున్నాయి. ముహూర్తం బాగుంటేనే ముచ్చటగా నూరేళ్లు బతుకుతారు.. అన్నది మన సంప్రదాయం. అందుకే ఘడియలు, విఘడియలు లెక్కగట్టి మరీ లగ్నాలు పెడతారు. కానీ, ఆ శుభ ఘడియలకు బ్రేక్ పడింది. శుక్రవారం నుంచి మొదలైన శుక్రమౌఢ్యమి (మూఢం) కారణంగా సుదీర్ఘ విరామం ఏర్పడింది. రేపటి (నవంబర్ 30) నుంచి మొదలై వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 వరకూ, అంటే దాదాపు 80 రోజుల పాటు ముహూర్తాలకు బ్రేక్ పడనుంది. దీంతో పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా శుభకార్యాల సందడి సద్దుమణిగింది. సాధారణంగా కార్తీక మాసం ముగిసిందంటే మాఘ మాసం కోసం పెళ్లివారి చూపులు ఉంటాయి. మాఘ మాసంలో మట్టిని ముట్టుకున్నా మాణిక్యమే అన్న నానుడి ఉంది. అంతటి పవిత్రమైన మాసంలో ఈసారి ఒక్కటంటే ఒక్క ముహూర్తం కూడా లేకపోవడం గమనార్హం. ఈసారి మాఘమంతా మూఢంలోనే కలిసిపోవడంతో శుభకార్యాల ఆశలు ఆవిరయ్యాయి. గృహ ప్రవేశాలకు అత్యంత ప్రీతిపాత్రమైన రథసప్తమి, చదువుల తల్లిని కొలిచే వసంత పంచమి, మాఘ పౌర్ణమి వంటి విశేష పర్వదినాలు సైతం ఈ మూఢం నీడన మసకబారాయి. ఇప్పటికే సంబంధాలు కుదుర్చుకున్న వారు సైతం ఫిబ్రవరి మూడో వారం వరకు వేచి చూడక తప్పని పరిస్థితి. శుభ కార్యాలంటే కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు. అది అనేక రంగాల ఉపాధికి ఆలంబన. ఈ 80 రోజుల విరామం వ్యాపార వర్గాలకు నిజంగా గడ్డుకాలమే. జిల్లాలోని కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు రాబోయే మూడు నెలలు ఖాళీగా దర్శనమివ్వనున్నాయి. పెళ్లిళ్ల సీజన్పైనే ఆధారపడే పట్టుచీరల వ్యాపారులు, స్వర్ణకారుల గిరాకీ గణనీయంగా పడిపోనుంది. స్థానిక వస్త్ర దుకాణాలు కళ తప్పనున్నాయి. పెళ్లిళ్లలో సందడి చేసే సన్నాయి మేళాలు, డెకరేషన్ పనివారు, టెంట్ హౌస్ నిర్వాహకులు, క్యాటరింగ్ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, పూల వ్యాపారులు, లైటింగ్, డీజే ఆపరేటర్లు ఇలా ఒకరేమిటి, శుభకార్యాలే జీవనాధారంగా బతికే వేలాది కుటుంబాల ఉపాధికి గండి పడనుంది. నిత్యం పెళ్లి పీటలపై వేదమంత్రాలు చదివే పురోహితులు, అర్చకులకు కూడా ఈ సమయం ఆర్థికంగా సవాళ్లతో కూడుకున్నదే. జ్యోతిష్య శాస్త్ర రీత్యా వివాహ వ్యవస్థకు, దాంపత్య సౌఖ్యానికి శుక్రుడే ప్రధాన కారకుడు (కళత్ర కారకుడు). సూర్యునికి అత్యంత సమీపంలోకి శుక్రుడు వచ్చినప్పుడు, సూర్యరశ్మి తీవ్రతకు శుక్ర గ్రహ ప్రభావం కనుమరుగవుతుంది. దీనినే అస్తంగత్వం లేదా మౌఢ్యమి అంటాం. వరుడికి బలం ఇచ్చే రవి, వధువుకు బలం ఇచ్చే గురుడు, భోగభాగ్యాలనిచ్చే శుక్రుడు వీరిలో ఏ ఒక్కరు బలహీనపడినా ఆ సమయంలో చేసే వివాహాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. ముఖ్యంగా శుక్ర మౌఢ్యమిలో వివాహం చేసు కుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం, సంతానలేమి లేదా అనారోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని ముహూర్త చింతామణి, కాలవిధానం వంటి ప్రామాణిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది మూఢనమ్మకం కాదు, ఖగోళ శాస్త్ర రీత్యా గ్రహాల నుంచి వెలువడే కిరణాల ప్రభావం. అందుకే ఈ 80 రోజులు శుభకార్యాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. – మురపాక కాళిదాసు శర్మ యాజీ, ప్రముఖ నాడీ జ్యోతిష్యులు జ్యోతిష్య శాస్త్ర రీత్యా దాంపత్య సౌఖ్యానికి, భోగభాగ్యాలకు కారకుడు శుక్రుడు. ఆ శుక్రగ్రహం సూర్యుని కిరణాల ప్రతాపానికి కనుమరుగవడాన్నే మౌఢ్యమి అంటారు. శుక్రుడు అస్తంగతుడైన వేళ చేసే వివాహాలు దంపతుల మధ్య కలతలకు, ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తాయని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ 80 రోజులు ఎలాంటి శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, వివాహాలు నిషిద్ధమని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి కల్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అంటారు గానీ, ఈ మూఢం దెబ్బకు మాత్రం ఆగక తప్పదు. మళ్లీ ఫిబ్రవరి 17న మాఘ బహుళ అమావాస్య తర్వాతే జిల్లాలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అప్పటి వరకు శుభస్య శీఘ్రం కాస్తా... శుభస్య ఆలస్యంగా మారనుంది. బాజా మోగదు.. బంతీ సాగదు..! మాఘ మాసపు పెళ్లి సందడి మౌఢ్యంతో నిశ్శబ్దం ఫిబ్రవరి 17 వరకు ముహూర్తాలకు సెలవు కల్యాణ మండపాలు, కేటరింగ్, పూల వ్యాపారాలు డీలా కల్యాణ ఘడియలకు ‘శుక్ర’ గ్రహణం ఓ పక్క మూఢం కారణంగా సంప్రదాయ వివాహాలు ఆగిపోతుంటే, మరోపక్క ఇదే అదనుగా ఆదర్శ వివాహాల వైపు అడుగులు వేయాలన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మూఢమి, ముహూర్తాల పేరుతో నెలల తరబడి వేచి చూడకుండా, రిజిస్టర్ మ్యారేజ్ (చట్టబద్ధ వివాహం) చేసుకోవడానికి ఈ సమయం అనుకూలమని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు. వేల రూపాయలు వెచ్చించి ఆర్భాటాలకు పోకుండా, కేవలం దండలు మార్చుకుని, చట్ట ప్రకారం ఒక్కటవ్వాలనుకునే వారికి గ్రహాల గమనం అడ్డురాదు. మూఢమి భయంతో వాయిదా పడే పెళ్లిళ్లను, నిరాడంబరంగా ‘రిజిస్టర్’ ఆఫీసులో జరిపించడానికి యువత చొరవ చూపితే ఖర్చుతో పాటు, సమయం కూడా ఆదా అవుతుందని, మూఢ నమ్మకాలకు చెక్ పెట్టినట్లవుతుందని విజ్ఞుల మాట. -
‘తోటపల్లి’పై చిత్తశుద్ధి లేని చంద్రబాబు సర్కార్
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ వీరఘట్టం: తోటపల్లి పాత ఆయకట్టులో వరుణదేవుని దయవల్ల ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ గెట్టెక్కిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. వీరఘట్టం శనివారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తోటపల్లి పాత ఆయకట్టు కాల్వల ఆధునికీకరణపై చంద్రబాబు సర్కార్కు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొదట్లో నీరు లేక వరినాట్లు ముదిరిపోయే పరిస్థితి వచ్చిందని, ఇంతలో వరుణ దేవుడు కరుణించడంతో వర్షాలు కురవడంతో పాలకొండ శివారు ప్రాంత రైతులు ఉభాలు పూర్తి చేశారన్నారు. ఇలా తరచూ వర్షాలు కురవడంతో సాగునీటి కోసం రైతులు ఇబ్బంది పడకుండా ఖరీఫ్ సీజన్ గట్టెక్కారన్నారు. గత ఎన్నికల్లో తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులపై తప్పుడు ప్రచారం చేసి ఓట్లు దండుకున్న చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే తోటపల్లి రైతులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించారు. 25 శాతంలోపు ఈ పనులు జరిగాయనే సాకు చూపించి ఏకంగా పాత ఆయకట్టు ఆధునికీకరణ పనులు రద్దు చేశారన్నారు. తోటపల్లి ఆధునికీకరణ పనులు చేపట్టాలని శుక్రవారం శ్రీకాకుళంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావుకు వినతిపత్రం కూడా ఇచ్చామన్నారు. ఆయకట్టు దారులు తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని, 2026 ఖరీఫ్లో పాలకొండ శివారుకు పూర్తి స్థాయిలో నీరందేలా చర్యలు తీసుకోవాలని అంచనాల కమిటీ చైర్మన్కు తోటపల్లి రైతుల గోడు వినిపించామని ఎమ్మెల్సీ అన్నారు. తోటపల్లి కాలువల పనులపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రైతులతో కలసి వైఎస్సార్సీపీ పోరాడుతుందని హెచ్చరించారు. ఆయనతో పాటు ఎంపీపీ దమలపాటి వెంకటరమణనాయుడు, జెట్పీటీసీ జంపు కన్నతల్లి, తూడి సర్పంచ్ కుద్దిగాన వెంకటరమణ, తలవరం సర్పంచ్ శిష్టు మధుసూదనరావు, భుక్త తదితరులున్నారు. -
గిరిమిత్రలో టెండర్ ప్రక్రియ
పార్వతీపురం: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలలకు జీసీసీ సరుకుల టెండర్లు ప్రక్రియను జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో సి.యశ్వంత్ కుమార్రెడ్డి పర్యవేక్షణలో శనివారం నిర్వహించారు. గిరిజన సంక్షేమ వసతిగృహలకు, పాఠశాలలకు అత్యవసరమైన, నాణ్యమైన సరుకులను సరఫరా చేసేందుకు ఈ టెండర్ ప్రక్రియ నిర్వహించినట్టు పీఓ తెలిపారు. టెండర్ దక్కించుకున్న వారు వసతిగృహలకు, పాఠశాలలకు విధిగా సరుకులను ఏడాది పాటు సరఫరా చేయాల్సి వుంటుందన్నారు. కార్యక్రమంలో ఏపీవో పి.మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
అవి తిట్లు సంసారం కాదు..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఒక జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు.. ఒక టెండూల్కర్ వరుస సిక్సులు కొట్టినట్టు.. శివమణి డ్రమ్స్ కొట్టినట్టు.. శంకర్ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం వాయించినట్టు.. సీఎంవో నుంచి మంత్రి సంధ్యారాణికి చీవాట్ల పరంపర కొనసాగినట్టు తెలిసింది. తన అనధికార పీఏ సతీష్ చేసిన అనైతిక కార్యకలాపాలు గిరిజన, మహిళా సంక్షేమ శాఖా మంత్రికి తలవంపులు తెచ్చాయి. దీంతో ఆమె ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయారు. దీంతో టీడీపీ అధిష్టానం, ముఖ్యంగా విద్యా శాఖ మంత్రి లోకేష్ పేషి నుంచి మంత్రికి గట్టిగా తిట్లు.. చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో ఇతరత్రా అంశాల కన్నా మంత్రి సంధ్యారాణి అనధికారిక పీఏ సతీష్ వ్యవహారం.. అయన దూకుడు.. దందాల అంశం ఎక్కువ చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఇన్నేళ్ల పోరాటం.. ఒక్క పీఏతో సరి పదిహేనేళ్లుగా టీడీపీలో కొనసాగుతూ తొలిసారిగా ఎన్నికల్లో గెలిచి రెండు శాఖలకు మంత్రిగా ప్రాధాన్యపరమైన పోస్టింగులు దక్కించుకున్న సంధ్యారాణి ఒక్క పీఏ కారణంగా మొత్తం పరువు కోల్పోయారు. ఇప్పటికే ఆమెకు మహిళా శిశుసంక్షేమ శాఖతో పాటు గిరిజన సంక్షేమ శాఖను ఇచ్చి చంద్రబాబు అధిక ప్రాధాన్యం కల్పించారన్న అసూయ టీడీపీ నేతల్లో ఉండగా.. ఇప్పుడు ఏకంగా ఆమె ఇలా జనంలో పలుచన అయిపోయి పరువు పోగొట్టుకున్నారు. అంతేకాకుండా ఏకంగా ఆమె కుమారుడు కూడా ఈ వ్యవహారంలో పాత్ర ఉందని తేలడంతో ఆమె కాళ్లు చేతులు అందని పరిస్థితి నెలకొన్నది. వాట్సాప్ చాటింగులు.. బాధిత మహిళ పోలీసు ఫిర్యాదుతో సంధ్యారాణి పరిస్థితి సాలూరు ప్రజలకు మొహం చూపలేని విధంగా మారింది. అటు పార్టీ పెద్దల నుంచి వస్తున్న ప్రశ్నల పరంపరకు ఒకే సార్.. సార్.. సార్... నేను చూస్తాను సార్.. అంతా సరిదిద్దుకుంటాను... సెట్ చేస్తాను.. అనే మాట తప్ప ఇంకేం సమాధానం లేకపోయిందని ఆమె అనుచరులే చెబుతున్నారు. దీంతో ఇక అనివార్యంగా తన పీఏను తొలగించక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఏమీ తప్పు జరగనప్పుడు ఆయన్ను ఎందుకు ఉద్యోగంలోంచి తీసేశారమ్మా అనే ప్రశ్నలకు ఆమె వద్ద సమాధానం కరువైంది. సౌండ్ లేని ఇన్చార్జ్ మంత్రులు తన పొలిటికల్ కొలీగ్ సంధ్యారాణి కుమారుడు, ఆమె పీఏ ఇలా ఒక లైంగిక వేధింపుల వ్యవహారంలో చిక్కుకోగా విజయనగరం ఇన్చార్జ్ మంత్రి, హోమ్ మంత్రి వంగలపూడి అనిత మాత్రం ఏమాత్రం స్పందించలేదు. ఆమె ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న విజయనగరంలోనే సాలూరు కూడా మొన్నటి వరకూ భాగం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అంశం మీద ఆమె ఈప్పటికే ఒక ప్రకటన చేయాల్సి ఉండాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సాలూరు నియోజకవర్గం ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కూడా ఈ అంశం మీద ఏమీ పెదవి విప్పడం లేదు. తమ మంత్రి కొడుకు, పీఏ ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న తరుణంలో ఆయన సైతం సైలెంట్గా ఉండడం ప్రజల్లో విమర్శలకు అవకాశం కలుగుతోంది. మొత్తం మీద.. కొడుకు, పీఏ చేసిన నిర్వాకాలతో పైనుంచి వస్తున్న చీవాట్లు.. సంజాయిషీ ప్రశ్నలతో సంధ్యారాణి తీవ్రంగా కలత చెందుతున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. సీఎంవో నుంచి మంత్రి సంధ్యారాణికి చీవాట్లు కేబినెట్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ తప్పించుకునే మార్గం కరువు అనివార్యంగా పీఏ సతీష్ తొలగింపు -
దేశ సేవలో భాగస్వాములు కావాలి
విజయనగరం రూరల్: సైనిక పాఠశాల విద్యార్థులు దేశ సేవలో భాగస్వాములు కావాలని తూర్పు నావికాదళ కమాండ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్, రియర్ అడ్మిరల్ మురళీమోహన్రాజు అన్నారు. కోరుకొండ సైనిక పాఠశాల వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. సైనిక పాఠశాల యూనిఫాం పాఠశాల నైతికతను, తల్లిదండ్రుల త్యాగాలను, అంచలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. విద్యార్థుల క్రమశిక్షణలో తొలి గురువులు తల్లిదండ్రులేనని, నాయకత్వ ప్రయాణంలో నిజమైన భాగస్వాములని పేర్కొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్ఎస్ శాస్త్రి మాట్లాడుతూ సైనిక పాఠశాల క్రమశిక్షణతో కూడిన విద్య, క్రీడాంశాల్లో ఉత్తమ ప్రదర్శనలో ముందు వరుసలో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాహస కృత్యాలు, జానపద, ఇతర సాంస్కతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులకూ పలు పోటీలను నిర్వహించారు. అనంతరం ప్రతిభ గల విద్యార్థులు, వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులు, మెడల్స్, షీల్డ్లు అందజేశారు. పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తూర్పు నావికాదళ కమాండ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్, రియర్ అడ్మిరల్ మురళీమోహన్రాజు ఘనంగా కోరుకొండ సైనిక పాఠశాల వార్షికోత్సవం -
ఆకతాయిలపై డేగకన్ను
పార్వతీపురం రూరల్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఆధునిక అస్త్రాన్ని ప్రయోగించారు. ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి ఆదేశాల మేరకు, ఏఎస్పీ మనీషా రెడ్డి పర్యవేక్షణలో శక్తి టీమ్స్ శుక్రవారం డ్రోన్ల సాయంతో విస్తృత నిఘా చేపట్టాయి. బస్టాండ్లు, మార్కెట్లు, కళాశాల ప్రాంగణాల వంటి రద్దీ ప్రదేశాలతో పాటు, జనశక్తి కాలనీ అవుట్స్కట్స్, కొత్తవలస రైల్వేస్టేషన్, అమరావతి లేఅవుట్లలో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టారు. దీనివల్ల గంజాయి సేవించే హాట్స్పాట్లు, పేకాట స్థావరాలను తక్షణమే గుర్తించి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. పాఠశాలలు, కళాశాలల వద్ద ఈవ్ టీజింగ్ను నిలువరించి, ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అదే విధంగా, ప్రజలకు, విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల దుష్ఫలితాలపై అవగాహన కల్పించారు. ఆపదలో డయల్ 112, 1930, 1972 సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. -
డిజిటల్ అసిస్టెంట్పై దాడి
వంగర: మండల పరిధి శ్రీహరిపురం గ్రామానికి చెందిన డిజిటల్ అసిస్టెంట్ బోనెల మహేష్బాబుపై అదే గ్రామానికి చెందిన శెట్టి అప్పలనాయుడు దాడికి పాల్పడినట్టు ఎస్సై షేక్ శంకర్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో విధుల్లో ఉన్న సమయంలో ఓబీసీ సర్టిఫికెట్ కోసం అప్పలనాయుడు సచివాలయానికి వెళ్లాడు. కొంత సమయం పడుతుందని డిజిటల్ అసిస్టెంట్ సమాధానం ఇవ్వడంతో ఒకింత అసహనానికి గురైన అప్పలనాయుడు డిజిటల్ అసిస్టెంట్ను చేతితో కొట్టి దుర్భాషలాడాడని, విధులకు ఆటంకం కలిగించినట్టు ఎస్సై తెలిపారు. ఈ విషయంపై మహేష్బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. -
ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 23 వినతులు
సీతంపేట: సీతంపేట ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 23 వినతులు వచ్చాయి. ఏపీవో జి.చిన్నబాబు అర్జీలు స్వీకరించారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేయడానికి ఆర్థిక సాయం అందించాలని పరుసరాంపురానికి చెందిన హేమలత తెలిపారు. బుడార్సింగికి చెంది న లక్ష్మీకాంతం హౌసింగ్ బిల్లులు చెల్లించాల న్నారు. ఆటో, మేకల లోన్ ఇప్పించాలని పీవీఈతమానుగూడ గ్రామస్తుడు దాసు కోరా రు. పెదరాజపురానికి చెందిన చిన్నసొంబురు కోళ్ల ఫారం పెట్టుకోవడానికి రుణం మంజూరు చేయాలని విజ్ఙప్తి చేశారు. కురసింగికి చెందిన బి.కావ్య పాలకొండ ఏరియా ఆస్పత్రిలో నర్స్ పోస్టు కావాలని దరఖాస్తు చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పెంపు విజయనగరం అర్బన్: రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి మరో రెండు నెలలు పాటు డిసెంబర్ 1 నుంచి జనవరి 31, 2026 వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గానీ ఏది ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నవంబర్ 30 నాటికి అక్రిడిటేషన్ కార్డులు కలిగిన పని చేయుచున్న పాత్రికేయులకు మాత్రమే మరో రెండు నెలలు పాటు డిసెంబర్ 1, 2025 నుంచి జనవరి 31, 2026 వరకు ఈ పొడిగింపు సౌకర్యం వర్తిస్తుందని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు తెలిపారు. పార్వతీపురం: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో రెండు నెలలు గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అక్రిడిటేషన్ల గడువు ఈ నెల 30తో ముగియనున్న తరుణంలో డిసెంబర్ 01, 2025 నుంచి జనవరి 31, 2026 వరకు లేదా కొత్తకార్డులు జారీ ప్రక్రియ చేయడంగానీ ఏది ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం అక్రిడిటేషన్లు వున్న వారికి మాత్రమే పొడిగింపు నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. యువకుల మధ్య కొట్లాట పాలకొండ: పట్టణంలోని గాయత్రి దేవి ఆలయ సమీపంలో శుక్రవారం సాయంత్రం యువకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. రెండు గ్రూపులకు చెందిన యువకులు మధ్య ఉన్న విభేదాలు కొట్లాటకు దారి తీశాయి. ఇందులో కోటిపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్కు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి ట్రైనీ ఎస్సై హేమలత తెలిపిన వివరాలు.. రెండు గ్రూపులకు చెందిన యువకుల మధ్య వివాదం గొడవకు దారి తీసిందని తెలిపారు. ఈ గోడవలో మండలంలోని కోటిపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్కు గాయాలు కాగా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని వివరించారు. తనను రాంబాబు అనే యువకుడు గాయపరిచినట్టు తెలిపారని దీనిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ గొడవ వద్దని సర్ది చెప్పిన పట్టణానికి చెందిన గణపతికి చేతిపై కూడా గాయం అయిందని తెలిపారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసును పరిశీలిస్తున్నామని వివరించారు. పాము కాటుతో ముగ్గురికి అస్వస్థతసీతంపేట: మండలంలోని పలు గ్రామాలకు చెందిన ముగ్గురు శుక్రవారం పాముకాట్లకు గురై స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేరారు. పొంజాడకు గ్రామస్తురాలు సవర సుభాషిణి, బుడగరాయికి చెందిన సవర లక్ష్మి, ముత్యాలుకు చెందిన సవర గంగమ్మకు పాము కాట్లు వేయడంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్టు సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు తెలిపారు. -
మాయిశ్చరైజర్.. మిషన్ల కొనుగోలులో మతలబు
పాలకొండలో ఓ రైస్ మిల్లుకు అధికారులు అందజేసిన మాయిశ్చరైజర్ మిషన్ మిల్లరుకు ఇచ్చిన మాయిశ్చరైజర్ మిషన్ బిల్లువీరఘట్టం/పాలకొండ: మాయిశ్చరైజర్ మిషన్లలో ధాన్యంలో తేమ శాతం లెక్కిస్తారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు రైతు సేవా కేంద్రాల సిబ్బంది ఈ మిషన్లతో ధాన్యంలో తేమ శాతం ఎంత ఉందో గుర్తిస్తారు. తేమ శాతం 17 కంటే ఎక్కువ ఉంటే ఆ ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. ఆర్ఎస్కేలు తేమ శాతం పరిశీలించిన తర్వాత వారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర పట్టించేందుకు సమీపంలో ఉన్న మిల్లుకు ట్యాగ్ చేసి పంపిస్తారు. మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని మర పట్టించిన తర్వాత సీఎంఆర్ రైస్ పేరిట మరలా ప్రభుత్వానికి మిల్లరు బియ్యాన్ని అందజేస్తారు. అయితే ఆర్ఎస్కే సిబ్బంది పరిశీలించి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుకు పంపించేటప్పుడు అక్కడ మిల్లరు ఎక్కడా ధాన్యం తేమ శాతం చూడాల్సిన పని లేదు. కానీ ప్రతీ మిల్లు వద్ద కచ్చితంగా మాయిశ్చరైజర్ మిషన్లు ఉండి తీరాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రతీ మిల్లరుకు ప్రభుత్వం సూచించిన కంపెనీ నుంచి మాయిశ్చరైజర్ మిషన్లు కొనుగోలు చేసి ఇస్తామని హుకుం జారీ చేశారు. ప్రతీ మిల్లరు వద్ద రూ.30 వేలు వసూలు చేసి మాయిశ్చరైజర్ మిషన్లు అందజేశారు. అయితే ఈ మిషన్లు అంత ఖరీదు ఉండవని మిల్లర్లు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఏం జరిగింది... ప్రస్తుతం ధాన్యం కొనుగోలు సీజన్ కావడంతో ఽ ప్రభుత్వం నుంచి ధాన్యం వస్తే మర పట్టించేందుకు ముందు ప్రతీ మిల్లరు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలి. బీజీలు ఇచ్చిన మిల్లులకు ప్రభుత్వం ఽరైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇస్తుంది. అందుచే ప్రతీ మిల్లు వద్ద మాయిశ్చరైజర్ మిషన్ ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మిల్లరు తనకు నచ్చిన మాయిశ్చరైజర్ మిషన్ కొనుగోలు చేసుకోవడానికి వీలు లేదు. పౌర సరఫరాల శాఖ అధికారులు ఇచ్చిన మిషన్ మాత్రమే తీసుకోవాలని హుకుం జారీ చేశారు. అందుకుగాను రూ.25,100 మిషన్ ఖరీదు, 18 శాతం జీఎస్టీ కింద రూ.4512లు, సర్వీసు చార్జ్ కింద రూ.388లు కలుపుకుని మొత్తం రూ.30 వేలను మిల్లర్లు అందరి నుంచి పౌర సరఫరాల శాఖ అధికారులు వసూలు చేశారు. ఇలా జిల్లా మిల్లర్లు నుంచి తమ అనుయాయులకు మాయిశ్చరైజర్ మిషన్లు ద్వారా సుమారు రూ.26 లక్షలను కట్టబెట్టారని పౌర సరఫరాల శాఖ అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి కొందరి వద్ద పాత మాయిశ్చరైజర్ మిషన్లు ఉన్నప్పటికీ, కొత్తవి తీసుకోవాలని అధికారులు ఆదేశించడంతో మిల్లర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మిషన్లు కొనుగోలు చేశామంటున్నారు.ప్రభుత్వ నిర్ణయమిది ప్రతీ మిల్లు వద్ద ఒకే కంపెనీకి చెందిన ఒకే రకమైన మాయిశ్చరైజరు మిషన్లు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మాకు వచ్చిన మిషన్లు మిల్లర్లకు అందజేశాం. ఇందులో ఎటువంటి లోపాయికారి ఒప్పందాలు లేవు. మిషన్లు అన్నీ పారదర్శకంగా కొనుగోలు చేశాం. ఇందులో మిల్లర్లు అపోహలు చెందవద్దు. – కె.శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల శాఖ డిపో మేనేజర్, పార్వతీపురం మన్యం నోరు మెదపలేకపోతున్న మిల్లరు... తమ వద్ద రూ.30 వేలు తీసుకుని ఇచ్చిన మాయిశ్చరైజర్ మిషన్లు అంత ఖరీదు ఉండవని మిల్లర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయితే ధాన్యం సీజన్ కావడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్పినట్టు వినకపోతే ఇబ్బందులు వస్తాయనే భయంతో వారు అడిగినంతా ఇచ్చేసి వారు ఇచ్చిన మాయిశ్చరైజరు మిషన్లు తీసుకున్నామని మిల్లర్లు పేర్కొంటున్నారు.


