breaking news
Parvathipuram manyam District News
-
భోగాపురం, విజయనగరంలో ఏసీబీ సోదాలు
విజయనగరం క్రైమ్/భోగాపురం: ఏసీబీ అధికారుల సోదాలతో విజయనగరం, భోగాపురంలో అలజడి నెలకొంది. ఏకకాలంలో ఏసీబీ బృందాల సోదాలతో ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. గత నెల 5, 6, 7 తేదీల్లో భోగాపురం సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో తనిఖీలు జరిపిన అధికారులు ఈ సారి సబ్రిజిస్ట్రార్ పి.రామకృష్ణ ఇంటిలోను, కార్యాలయ ఆఫీస్ బోయ్ అలేటి కనకరాజు ఇంటిలో సోదాలు చేశారు. ఏసీబీ డీఎస్పీ రమ్య, సీఐ మహేష్ ఆధ్వర్యంలో సోదాలు సాగా యి. భోగాపురంలో కనకరాజు ఇంటికి మంగళవారం ఉదయం 6 గంటలకే డీఎస్పీ రమ్మ తన బృందంతో చేరుకుని సోదాలు జరిపారు. రాత్రి వరకు జరిపిన సోదాల్లో ఆయన వద్ద అక్రమంగా ఉన్న రూ.18లక్షల10వేల నగదు, 40తుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలో ఉన్న వస్తువులు, డాక్యుమెంట్లతో పాటు కనకరాజు, ఆయన భార్య బ్యాంకు అకౌంట్లను పరిశీలించారు. ఆయా ఖాతాల నుంచి జరిగిన లావాదేవీలపై ఆరా తీశారు. డీఎస్పీ రమ్య ఆదేశాల మేరకు సీఐ మహేష్ సిబ్బందితో కలిసి విజయనగరంలోని ఎస్వీఎన్ నగర్లో నివసిస్తున్న సబ్రిజిస్ట్రార్ రామకృష్ణ ఇంటిలో సోదాలు జరిపారు. దాదాపు రూ.మూడు కోట్లు విలువచేసే భవనాల డాక్యుమెంట్లు, రూ.25 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం అక్రమంగా సంపాదించినట్టు గుర్తించారు. రామకృష్ణకు చెందిన ఆరు ప్రాంతాల్లో సోదాలు చేశారు. విజయనగరంలోని ఎస్వీఎన్ నగర్, ప్రదీప్నగర్, దాసన్నపేట కుమ్మరివీధి, ప్రదీప్నగర్–1, ఉడాకాలనీ, కంటోన్మెంట్, వీటీ అగ్రహారంలో బినామీ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. రామకృష్ణ అత్త, తోడల్లుడి పేరుతో కూడబెట్టిన ఆస్తులను గుర్తించి సీజ్చేశామని సీఐ తెలిపారు. భోగాపురం సబ్రిజిస్ట్రార్ ఇంటిలో అక్రమాస్తుల గుర్తింపు కార్యాలయ బోయ్ ఇంటిలో పట్టుబడిన నగదు, బంగారం గతనెలలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు అనతికాలంలోనే తనిఖీలతో ఉద్యోగుల్లో గుబులు ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన సోదాలు -
తల్లి వెంటే తనయ...
● మృత్యువులోనూ వీడని తల్లీకూతుళ్ల అనుబంధం ● తల్లిని కడసారి చూసేందుకు వచ్చి మృత్యుఒడిలోకి.. ● విలపిస్తున్న కుటుంబ సభ్యులు ● చింతపల్లిపేటలో విషాదం గుర్ల: తల్లి అంటే ఆమెకు ప్రాణం. తల్లి మర ణంతో తల్లఢిల్లింది. ఆమె భౌతిక కాయాన్ని పట్టుకుని బోరున ఏడ్చింది. ఆ క్రమంలో కుప్పకూలి ఆస్పత్రిపాలైంది. అక్కడే ప్రాణం విడిచిన ఘటన గుర్ల మండలం చింతపల్లిపేటలో చోటుచేసుకుంది. తల్లిని కడసారి చూసేందుకు వచ్చిన కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుపెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... చింతపల్లిపేటకు చెందిన సోమురోతు అప్పలనర్సమ్మ (60) అనారోగ్యంతో సోమవా రం మృతి చెందింది. తల్లిని చివరిగా చూసేందుకు విశాఖపట్నం నుంచి వచ్చిన కుమార్తె గౌరి (39) తల్లి మృతదేహం వద్ద విలపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తల్లికి ఓ వైపు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తిచేస్తూనే మరోవైపు గౌరిని చీపురుపల్లి సీహెచ్సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే సోమవారం అర్థరాత్రి సమయంలో మృతి చెందింది. 24 గంటల వ్యవధిలో తల్లీకుమార్తె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గౌరి భర్త శంకరరావు విశాఖపట్నం పోర్టులో కూలిపని చేస్తూ అక్కడే నివసిస్తున్నారు. వారికి కుమారుడు హర్షవర్థన్, కుమార్తె కుసుమ ఉన్నారు. పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయండిపార్వతీపురం: పర్యాటకులను ఆకర్షించేలా పిక్నిక్ స్పాట్లను అభివృద్ధిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది జిల్లాలో 2లక్షల మంది పర్యాటకులు పర్యాటక ప్రాంతాలను సందర్శించారన్నారు. మండలాల పరిధిలోని దేవాలయాలు, జలపాతాలు, ట్రెక్కింగ్ పాయింట్స్ వంటి ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.52 కోట్లు లక్ష్యం కాగా ఇంత వరకు రూ.32కోట్లు ప్రగతిని సాధించిందన్నారు. గృహ నిర్మాణశాఖలో పీఎం జన్మాన్, పీఎంఏవై కింద 9,438 ఇళ్లకు 8వేలు ఇల్లు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఇంటి నిర్మాణాల కోసం 31,325 మందిని అర్హులుగా గుర్తించామని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్పై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరని, హాజరు వేయనివారికి జీతాలు నిలిపివేయాలని హెచ్ఓడీలను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్వో కె.హేమలత పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
● ఆగని ఇసుక దందా ● మొద్దునిద్రలో అధికార యంత్రాంగం!సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారం అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. అధికారులకు ఎన్ని ఫిర్యాదులు వెళ్తున్నా.. అది మూడు రోజుల ముచ్చటగానే మారుతోంది. వెళ్లడం.. వాహనాలను పట్టుకోవడం.. తర్వాత విడిచిపెట్టేయడం షరామాములుగా మారింది. మరలా కొద్దిరోజులకే ఇసుకాసురులు బరి తెగించేస్తున్నారు. కొమరాడ, పాలకొండ, భామిని తదితర నాగావళి, వంశధార నదీ పరివాహక ప్రాంతాలను అక్రమార్కులు గుల్ల చేస్తున్నారు. సీతానగరం, పాచిపెంట మండలాల్లోనూ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. కొమరాడ మండలంలోని కూనే రు రామభద్రపురం, కొరిశీల రెవెన్యూ పరిధిలో కొన్నాళ్లుగా తవ్వకాలు సాగుతున్నాయి. వాహనాల రాకపోకలకు దర్జాగా మెటల్ రోడ్డు వేసేసినా.. అధికార యంత్రాంగం కళ్లు మూసుకుందా? అన్న ప్రశ్నలు తీరప్రాంత ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతోనే సాగుతోందన్న ఆరోపణలున్నాయి. పాలకొండ డివిజన్ పరిధిలోని గోపాలపురం, అంపిలి తదితర ప్రాంతాల్లో ఇసుక దందా సాగుతోందని స్వయంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. భామిని పరిసరాల్లోనూ నది గుల్ల అయిపోతోంది. నదిలో యంత్రాల సాయంతో ఇసుకను గుట్టలుగా పోగు చేసి.. అక్కడ నుంచి లారీలతో తరలిస్తున్నారు. ప్రధానంగా రాత్రి వేళల్లో భారీ వాహనాల ద్వారా విశాఖ తదితర ప్రాంతాలకు తరలిపోతోంది. చూసీచూడనట్లు వదిలేస్తున్న యంత్రాంగం అధికార పార్టీ అండదండలు ఉండడంతో అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పాలకొండ డివిజన్ పరిధిలో ఇటీవల సబ్ కలెక్టర్ అర్ధరాత్రి పూట ఆకస్మిక తనిఖీలు చేసి కొన్ని వాహనాలను పట్టుకున్న విషయం విదితమే. పగటివేళ పోలీస్, రెవెన్యూ, సచివాలయ సిబ్బందికి తెలియకుండా తవ్వకాలు సాగుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల తమ పరిధిలోకి రాదని ఇటు రెవెన్యూ, అటు గనుల శాఖాధికారులు ఒకరిపై ఒకరు వేసుకుంటూ, తప్పించుకుంటున్నారు. -
ఏటీఎం మోసాలు అరికట్టవచ్చు ఇలా..
స్మార్ట్ ఏటీఏం సిస్టంను ఉపయోగించి ఏటీఏం మోసాలను ఇట్టే అరికట్టవచ్చని సీతంపేట గిరిజన సంక్షేమ గిరిజన గురుకుల బాలుర ఆశ్రమ పాఠశాల ఏడోతరగతి విద్యార్థులు ఎస్.సిద్ధార్థ, మనోజ్లు చేసిన ప్రాజెక్టు ఆకట్టుకుంది. ఒకరు ఏటీఏం కార్డును మరొకరు ఏటీఎంలో పెట్టి డబ్బులు తీయడానికి ప్రయత్నిస్తే ఓ డివైస్ ద్వారా మొబైల్కు మేసేజ్ వచ్చే విధానంపై ప్రాజెక్టు రూపొందించారు.జంక్ఫుడ్ తింటే కిడ్నీలకు ప్రమాదం...జంక్ఫుడ్ తినడం వల్ల కిడ్నీలపై చూపే దుష్ప్రభావం, కిడ్నీలు రాళ్లు ఏర్పడే విధానాన్ని పెద్దమడి ఆశ్రమపాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థినులు పి.గుణశ్రీ, జి.మౌనిక వివరించారు. -
మంత్రి సంధ్యారాణి పీఏ కేసులో ట్విస్ట్
సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పీఏ సతీష్, ఆమె కుమారుడిపై మహిళా ఉద్యోగిని చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్రెడ్డి తెలిపారు. ఆమె ఉద్దేశపూర్వకంగా ఫేక్ కేసులు పెట్టేశారని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్, కుమారుడు పృథ్వీ తనను వేధిస్తున్నట్లు సాలూరుకు చెందిన త్రివేణి అనే ఉద్యోగిని కొద్దిరోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎస్పీ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని, అదే సమయంలో రెండో వర్గం నుంచి కూడా ఫిర్యాదు అందిందని చెప్పారు. రెండు ఫిర్యాదులపై విచారణ జరిపి, వారి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని చెప్పారు. నిపుణుల పరిశీలనలో సతీష్, మంత్రి కుమారుడు పృథ్వీ చేసినట్లుగా ఉన్న వాట్సాప్ చాట్లన్నీ అబద్ధమని తేలిందన్నారు. త్రివేణి, ఆమె స్నేహితుడు దేవిశ్రీప్రసాద్ కలిసి తప్పుడు చాట్లు సృష్టించి సతీష్, పృథ్వీలను బెదిరించారని పేర్కొన్నారు. సతీష్, త్రివేణి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి సతీష్కు, త్రివేణికి మధ్య గతంలో ఉద్యోగం విషయమై ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. ఇదే విషయమై వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయని తెలిపారు. ఆ తర్వాత దేవిశ్రీప్రసాద్ అనే మున్సిపల్ ఉద్యోగితో కలిసి ఆమె పలుమార్లు సతీష్ను బెదిరించినట్లు వివరించారు. ఈ క్రమంలోనే గత నెల 24న సతీష్ ఆమె ఇంటికి వెళ్లి గొడవపడ్డాడని చెప్పారు. దీంతో సతీష్పై పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఆమె మంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఫిర్యాదులతో మీడియా ముందుకొచ్చినట్లు గుర్తించామన్నారు. త్రివేణి, దేవిశ్రీప్రసాద్లపై ఫోర్జరీ, ఛీటింగ్, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు వివరించారు.ఫిర్యాదు చేసిన మహిళే నిందితురాలిగా... బాధితురాలిగా ఫిర్యాదు చేసిన మహిళనే నిందితురాలిగా పోలీసులు తేల్చారు. అలాంటిది ఆమెను గానీ, దేవీశ్రీప్రసాద్ను గానీ మీడియా ముందుకు తీసుకురాకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు ఎస్పీ వద్ద ప్రస్తావించగా.. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వారిని మీడియా సమావేశానికి తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. మహిళా ఉద్యోగిని తప్పుడు ఫిర్యాదు చేశారు ఆమె చూపించిన వాట్సాప్ మెసేజ్లన్నీ అబద్ధం స్నేహితుడితో కలిసి ఆమె తప్పుడు మెసేజ్లు సృష్టించారు వాటి ద్వారా మంత్రి కుమారుడు, పీఏలను బెదిరించారు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ వెల్లడి -
సీనియర్స్ ఖోఖో పోటీలకు జిల్లా జట్లు పయనం
● 24 నుంచి గుడివాడలో జరగనున్న మహిళ, పురుషుల పోటీలు విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న సీనియర్స్ మహిళ, పురుషుల ఖోఖో పోటీలకు జిల్లా జట్లు మంగళవారం పయనమయ్యాయి. ఈ నెల 24 నుంచి 26 వరకు గుడివాడలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ సీనియర్ అంతర్ జిల్లాల ఖోఖో పోటీలు జరగనున్నాయి. జిల్లా జట్లు పోటీలకు బయలుదేరి వెళ్తున్న సందర్భంగా డిగ్రీ కాలేజీలో కోచింగ్ క్యాంప్ ముగించుకొని కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పురుషుల జట్టుకు వజ్రపు శ్రీనివాసరావు, అదే విధంగా మహిళల జట్టుకు సత్య డిగ్రీ కళాశాల యాజమాన్యం కీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు ఏఎంఎన్ కమలనాభరావు మాట్లా డుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శనతో విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. సత్య డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సత్యవేణి, జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.గోపాల్, ఉపాధ్యక్షుడు రామారావు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్కు బ్రాంజ్ మెడల్
విజయనగరం క్రైమ్ : జాతీయ స్థాయి తైక్వాండో చాంపియన్ షిప్లో బ్రాంజ్ మెడల్ సాధించిన విజయనగరం ట్రాఫిక్ పోలీస్స్టేసన్ కానిస్టేబుల్ బీఎస్ఎన్ మూర్తిని ఎస్పీ దామోదర్ తన చాంబర్లో మంగళవారం అభినందించారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ నెల 12 నుంచి 14 వరకు 14 జాతీయ స్థాయి సీనియర్ పూమ్సే తైక్వాండో చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఇందులో మూర్తి జిల్లా పోలీసు విభాగం తరఫున పాల్గొన్నారు. మూర్తిని అభినందించిన ఎస్పీ భవిష్యత్లో మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో జిల్లాకు పతకాలు విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన క్యాడిట్, జూనియర్స్ జూడో పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో జరిగిన పోటీల్లో జిల్లా క్రీడాకారులు మొత్తంగా పది పతకాలు సాధించారు. మూడు రోజుల పాటు జరిగిన పోటీల్లో దుర్గ బంగారు పతకం దక్కించుకోగా... ప్రవల్లిక, ప్రణిత, యశస్విప్రియ, మహమ్మద్ మున్నా, హేమంత్, సిద్విక్, ప్రణీత్, తేజ వికాస్, నితీష్ కాంస్య పతకాలు చేజిక్కించుకున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, జిల్లా కో ఆర్డినేటర్ రామకృష్ణ, కోచ్లు బంగారునాయుడు, ఆనంద్ తదితరులు అభినందించారు. అటవీ ఉత్పత్తులకు అడ్వాన్స్ టెండర్లు సీతంపేట: అటవీ ఉత్పత్తులకు అడ్వాన్స్ టెండర్లు నిర్వహించనున్నట్టు పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సహకార సంస్థతో సేకరించబడే కొండచీపుర్లు, పసుపుకొమ్ములు, కుంకుడు కాయలు, చింతపండు వంటి వాటికి అడ్వాన్స్ టెండర్లు నిర్వహిస్తామన్నారు. ప్రతీ పక్షం రోజులకొకమారు ఈ టెండర్లు ఉంటాయన్నారు. వ్యాపారులు ఈ టెండర్లలో పాల్గొనవచ్చన్నారు. టెండర్లు ఎప్పుడు నిర్వహిస్తామనేది ముందస్తుగా తెలియజేయనున్నామని తెలిపారు. పుస్తెలతాడు చోరీ సీతానగరం: మండలంలోని కొత్తవలస – వీరభధ్రాపురం గ్రామాల మధ్య మహిళ మెడలో ఉన్న పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి తెంపుకుని పారిపోయిన వైనమిది. స్థానిక పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మక్కువ మండలం శంబర గ్రామానికి చెందిన తీళ్ళ భూలక్ష్మి మంగళవారం సాయంత్రం శంబర నుంచి కొత్తవలస మీదుగా కాలినడన కన్నవారిల్లు అయిన వీరభధ్రపురం వెళ్తుంది. అదే సమయంలోమోటారు సైకిల్తో గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి తన మెడలో ఉన్న రెండు పుస్తెల తాడును తెంపుకుని వెళ్లిపోయాడు. ఈ మేరకు బాధితురాలు భూలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఎం.రాజేష్ తెలిపారు. బస్తా దించుతూ.. బతుకు చాలించి... పార్వతీపురం రూరల్: పశువుల దాణా ఆ కూలి పాలిట మృత్యుపాశమైంది. బస్తాలు దించే క్రమంలో లారీ పైనుంచి జారిపడి ఓ కార్మికుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మంగళవారం ఉదయం మండలంలోని హిందూపురం కూడలి వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు.. శ్రీకాకుళం నుంచి విశాఖ డెయిరీకి చెందిన పశువుల దాణా లోడ్తో వచ్చిన లారీ పార్వతీపురం చేరుకుంది. మండలంలోని గంగాపురం వైపు వెళ్తూ హిందూపురం కూడలి వద్ద బస్తాలు దించుతుండగా, లారీపై ఉన్న ఆమదాలవలసకు చెందిన తారకేశ్వరరావు (35) ప్రమాదవశాత్తు అదుపుతప్పి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. రూరల్ ఎస్ఐ సంతోషి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
అదనంగా ఇస్తేనే.. ధాన్యం బస్తాలు దించేది..!
● 80 కిలోలకు అదనంగా మరో 4 కిలోల ధాన్యం వసూళ్లు ● అర్థరాత్రి వరకూ ఇబ్బందులు పడ్డ రైతులురాజాం : పట్టణంలోని పాలకొండ రోడ్డులో లక్ష్మీనారాయణ రైస్ మిల్లు వద్ద సోమవారం అర్థరాత్రి వరకూ కొంతమంది రైతులు ఇబ్బందులు పడ్డారు. సంతకవిటి, రేగిడి మండలాలకు చెందిన రైతులతో పాటు రాజాం మండల రైతులు కొందరు ఇక్కడకు సోమవారం ధాన్యం విక్రయాలు నిమిత్తం తీసుకొచ్చారు. ముందస్తుగా తమ గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల వద్ద ధాన్యం శాంపిల్స్ తీయడంతో పాటు వాటిని ఈ మిల్లర వద్దకు తీసుకొచ్చి అనుమతులు ఇచ్చిన తరువాత ట్రక్షీట్లు తీసుకున్నారు. ఆయా ట్రక్షీట్లుతో ట్రాక్టర్ల ద్వారా ఎనిమిది గ్రామాలకు చెందిన రైతులు ధాన్యం తీసుకుని రాగా మిల్లరు ధాన్యంలో నాణ్యత లేదని, కళాసీలు లేరని మొండికేసి ధాన్యం అన్లోడింగ్ చేయకుండా ట్రాక్టర్లపైనే వదిలేశారు. ఓ వైపు గజగజలాడించే చలి, మరో వైపు ట్రాక్టర్ల యాజమాన్యంతో ఇబ్బందులు పడుతూ రైతులు నానా అవస్థలు పడ్డారు. అదనపు చెల్లింపుతో దిగిన యజమాని చివరకు రైతులు ఒక్కో 80 కిలోల బస్తా ధాన్యంకు అదనంగా నాలుగు నుంచి ఐదు కిలోలు చెల్లిస్తామని చెప్పడంతో రైతులు ధాన్యం దించేందుకు మిల్లరు అనుమతులు ఇచ్చాడు. పలువురు రైతులు ఈ ఒప్పందానికి అంగీకరించి ధాన్యం బస్తాలు దించారు. వీరికి రాత్రి 12 గంటల సమయం పట్టింది. మరికొంతమంది రైతులు అదనంగా ధాన్యం ఇచ్చేందుకు నిరాకరించి అక్కడి నుంచి వెనుదిరిగారు. తాము మధ్యాహ్నం 2 గంటలకు ధాన్యం తీసుకెళ్తే రాత్రి 11 గంటల వరకూ ధాన్యం దించకుండా లక్ష్మీనారాయణ మిల్లర్ల యజమాని అడ్డుకున్నారని సంతకవిటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆరోపించారు. ఈ విషయంపై మిల్లరు యజమాని అవినాష్ వద్ద సాక్షి ప్రస్తావించగా, ధాన్యం నాణ్యత బాగోలేని కారణంగా రైతులే అదనంగా ధాన్యం ఇచ్చేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు. -
ముందస్తు ప్రణాళికలు అవసరం : కలెక్టర్
పార్వతీపురం: అభివృద్ధికి ముందస్తు ప్రణాళికలు అవసరమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు సూచించారు. సుపరిపాలన వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి వర్క్షాపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యం పెద్దదైనపుడు అందుకు తగ్గ ప్రణాళిక కూడా పక్కాగా ఉండాలని, అప్పుడే సామాన్యుల దరికి అభివృద్ధి చేరుతుందన్నారు. మండల ప్రత్యేకాధికారి గ్రామ స్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకొని అభివృద్ధికి ప్రణాళికలు చేయాలన్నారు. జిల్లాలో 15 మండలాలకుగాను 14 మండలాలు ఏ గ్రేడ్లో ఉన్నాయని, పాచిపెంట మండలం బీ గ్రేడ్లో ఉందన్నారు. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిని జిల్లా ఉద్యానశాఖాధికారి కలెక్టర్కు వివరించారు. మత్య్సశాఖ, ఈ–ఆఫీస్ ఫైలింగ్, ఉద్యానశాఖ తదితర శాఖల పురోగతిపై సమీక్షించారు. సమీక్షలో జేసీ యశ్వంత్ కుమార్రెడ్డి, డీఆర్వో కె.హేమలత, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పట్టపగలే గాయత్రీదేవి ఆలయంలో చోరీ
పాలకొండ: నగర పంచాయతీ సమీపంలోని కొండాపురం గ్రామ సమీపంలో ఉన్న పంచముఖ గాయత్రీదేవి ఆలయంలో మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో చోరి జరిగింది. భక్తుల వేషంలో వచ్చిన భార్యాభర్తలు ఆలయ అర్చకులు ఆలయ మెట్లపై టిఫిన్ చేయడాన్ని గుర్తించారు. అమ్మవారిని దర్శించుకున్నట్టు నటించి గర్భగుడిలోకి ప్రవేశించారు. అమ్మవారి ముక్కుపుడక, మంగళసూత్రాలు, కళ్లు తీసుకుని ఆలయం నుంచి హడావుడిగా బయటకు వెళ్లిపోయారు. ఇది గమనించిన అర్చకులు చిట్టిబాబు శర్మ అమ్మవారిని చూడగా అమ్మవారి అలంకరణలో చేసిన బంగారు వస్తువులు కనిపించలేదు. వెంటనే కేక వేయగా నిందితులు తాము తెచ్చుకున్న వాహనంపై వుడాయించారు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఎస్ఐ ప్రయోగమూర్తి కేసు నమోదు చేశారు. దొంగలించిన వస్తువులు సుమారుగా 23 గ్రాములు ఉంటాయని అర్చకులు తెలిపారు. కాగా చోరి చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నట్టు విశ్వాసనీయ సమాచారం. వీరు నగర పంచాయతీ పరిధిలోని నక్కలపేటకు చెందిన భార్యాభర్తలుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు బుధవారం వెల్లడించే అవకాశం ఉంది. -
ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి
సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని వెంపలగూడ సమీపంలో మంగళవారం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో పెద్దింటి సోమేశ్వరరావు (53) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆర్.యుగంధర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో పరిస్థితి విషమంగా ఉంది. టి.జయరాజు, అరవింద్లకు స్వల్ప గాయలవ్వడంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ వై.అమ్మన్నరావు తెలిపిన వివరాలు.. పీపీ ఈతమానుగూడ పంచాయతీ ఇప్పగూడకు చెందిన సోమేశ్వరరావు తన స్వగ్రామం నుంచి సీతంపేటకు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఎదురుగా కొత్తూరుకు చెందిన యుగంధర్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురెదురు వాహనాలు బలంగా ఢీకొట్టాయి. దీంతో సోమేశ్వరరావు తలపై బలమైన గాయం తగలడంతో రక్తపు మడుగులో ఉన్న ఆయన్ను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన యుగంధర్కు ప్రధమ చికిత్స చేశారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేసినట్టు, స్వల్ప గాయాలైన ఇద్దరు ఇక్కడే ట్రీట్మెంట్ పొందుతున్నట్టు సూపరెండెండెంట్ బి.శ్రీనివాసరావు తెలిపారు. మృతుని భార్య బుచ్చమ్మ రెండేళ్ల క్రితం మృతి చెందగా ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించడానికి పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మరొకరి పరిస్థితి విషమం -
అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు జీఎంఆర్ విద్యార్థులు
రాజాం సిటీ: చైన్నె ఎస్ఆర్ఎం ఐటీ డీమ్డ్టుబీ యూనివర్సిటీలో ఈ నెల 25 నుంచి 28 వరకు జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల బాస్కెట్బాల్ పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారని పీడీ బీహెచ్ అరుణ్కుమార్ మంగళవారం తెలిపారు. ఇటీవల రఘు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో కళాశాలకు చెందిన ఎం.కార్తీక్, కె.శ్రీనివాస్ జేఎన్టీయూ జీవీ తరఫున ఆడారని తెలిపారు. విద్యార్థుల ఎంపికపట్ల ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, అధ్యాపకులు అభినందించారు. -
ఆలయాల్లో హుండీల చోరీని చేధించిన పోలీసులు
● నిందితుడి నుంచి రూ.42,135 స్వాధీనం ● సబ్బవరం స్టేషన్ పరిధిలో మరో చోరీకి పాల్పడిన నిందితుడు వేపాడ: మండలంలోని బానాది గ్రామంలో ఐదు ఆలయాల్లో జరిగిన చోరీని వల్లంపూడి ఎస్ఐ సుదర్శన్ నేతృత్వంలో సిబ్బంది హుంఽడీల చోరీని చేధించినట్టు ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు తెలిపారు. స్థానిక వల్లంపూడి పోలీసుస్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడారు. పోలీసులకు మంగళవారం వచ్చిన సమాచారం మేరకు కె.ఆర్.పేట జంక్షన్లో చోరీకి సంబంధించి పెందుర్తి గ్రామానికి చెందిన పెందుర్తి నాగరాజుగా గుర్తించిన పోలీసులు నిందితుని వద్ద రూ.42,135ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 13న బానాదిలో వినాయక ఆలయం, శివాలయం, ఆంజనేయస్వామి, పరదేశమ్మ, మరిడిమాంబ ఆలయాల్లో తాళాలు పగులకొట్టి హుండీల్లో సోమ్ము చోరీకి గురైన సంగతి పాఠకులకు విదితమే. దీనిపై ఎస్ఐ సుదర్శన్ సిబ్బందితో కలసి నిందితుడు నాగరాజును పట్టుకున్నట్టు చెప్పారు.ఐదు ఆలయాల్లో చోరీకి పాల్పడిన సొమ్ము రూ.42,135లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్టు సీఐ తెలిపారు. సబ్బవరం పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల 10వ తేదీ రాత్రి ఓ ఆలయంలో చోరీకి పాల్పడి 10,170 రూపాయలు చోరీ చేసినట్టు నిందితుడు చెప్పినట్టు సీఐ అప్పలనాయుడు తెలిపారు. కార్యక్రమంలో వల్లంపూడి ఎస్ఐ ఎస్.సుదర్శన్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతీ నెల పౌరహక్కుల దినం నిర్వహించాలి
● అట్రాసిటీ ఘటనల ప్రాంతాలకు ఆర్డీవో, డీఎస్పీలు హాజరు కావాలి ● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: ప్రతి నెల 30వ తేదీని పౌర హక్కుల దినాన్ని పక్కాగా నిర్వహించి డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సభ్యులందరినీ తప్పనిసరిగా ఆహ్వానించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. సివిల్ రైట్స్ డే నిర్వహించే గ్రామం, సమయం తదితర వివరాలను నెల రోజుల ముందే షెడ్యూల్ చేయాలని, అనంతరం మినిట్స్ను కలెక్టర్కు పంపించాలని, వాటిపై జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో చర్చ జరుగుతుందని తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ, మాన్యువల్ స్కావెంజర్ నిరోధక మరియు పునరావాస చట్టంపై కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 30న అన్ని మండలాల్లో ఎస్హెచ్వో, తహసీల్దార్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్డే నిర్వహించి సమావేశపు వివరాలు పంపాలని ఆదేశించారు. సమావేశంలో డీవీఎంసీ సభ్యులు బసవ సూర్యనారాయణ ఎస్సీ కాలనీల్లో కొన్ని చోట్ల శ్మశానాలు లేకపోవడం మరికొన్ని చోట్ల ఆక్రమణలు జరిగిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ గ్రామ జనాభాను బట్టి శ్మశాన విస్తీర్ణం ఉండాలని ముగ్గురు ఆర్డీవోలు తనిఖీలు చేసి ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ ఆక్రమణలు జరిగాయో నివేదిక పంపాలని ఆదేశించారు. ఉపాధి హామీ నిధులతో శ్మశానాలు, వాటికి రోడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులకు పరిహారం చెల్లింపులో ఆలస్యం జరుగుతోందని సభ్యుడు చిట్టిబాబు ప్రస్తావించగా నిధుల కోసం డీవోకు లేఖ రాసినట్టు, నిధులు రాగానే పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కులాలపై దాడులు జరిగినప్పుడు ఆర్డీవో, డీఎస్పీలు, తప్పనిసరిగా సంఘటనా స్థలానికి హాజరై విచారణ జరపాలని, హత్య కేసులైతే కలెక్టర్, ఎస్పీలు కూడా హాజరు కావాలని సభ్యులు మజ్జి గణపతి, ఎం.రాము కోరారు. దీనికి కలెక్టర్ స్పందించి ఆర్డీవోలు, డీఎస్పీలు స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేశారు. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 17 నమోదయ్యాయని, అందులో 14 కేసులు విచారణలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు 21 నుంచి డిసెంబర్ 15 వరకు 49 కేసుల్లో 68 మందికిగాను రూ.58 వేల పరిహారం చెల్లించినట్టు తెలిపారు. జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్లు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. విజయనగరం మున్సిపాలిటీలో రెండు చోట్ల మాన్యువల్ స్కావెంజర్లు ఉన్నారన్న సమాచారంపై మున్సిపల్ కమిషనర్ వెరిఫై చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. జేసీ సేతుమాధవన్, అదనపు ఎస్పీ సౌమ్యలత, డీఆర్వో మురళి, డీఎస్పీలు, ఆర్డీవోలు, సోషల్ వెల్ఫేర్ డీడీ అన్నపూర్ణమ్మ, జిల్లా అధికారులు, డీవీఎంసీ సభ్యులు సున్నపు రామస్వామి, ఎం.రాము తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వృద్ధుడు మృతి
రాజాం సిటీ: స్థానిక వైఎస్సార్ పార్కు సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. వైఎస్సార్ పార్కు ఏరియా, శ్రీనివాస థియేటర్ రోడ్డుల్లో గుర్తు తెలియని వృద్ధుడు యాచిస్తూ సంచరిస్తుండేవాడు. మంగళవారం వైఎస్సార్ పార్కు సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది వృద్దుడుని ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. వృద్ధుని గుర్తించిన వారి బంధువులు పోలీసులను సంప్రదించాలని తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
విజయనగరం క్రైమ్ : నగరంలోని అయ్యకోనేరులో ఓ వివాహిత మృతదేహాన్ని టు టౌన్ పోలీసులు మంగళవారం కనుగొన్నారు. ఎస్ఐ కనకరాజు తెలిపిన వివరాలు... దాసన్నపేటలోని గొల్లవీధికి చెందిన కోరాడ సునీత(35)కు పదేళ్ల కిందట వివాహమైంది. పెళ్లయి పదేళ్లు అవుతున్నా పిల్లలు పుట్టకపోవడంతో, భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న సునీత మానసిక స్థితిని కోల్పోయింది. ఈ పరిస్థితిలో సునీత బాగోగులను అన్నయ్య చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో సునీత కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాలను వెతికాడు. స్థానికులను సంప్రదించాడు. ఇంతలో స్థానిక అయ్యకోనేరులో ఓ మహిళ మృతదేహం కనిపించిందని సునీత అన్నయ్యకు సమాచారం అందింది. అయ్యకోనేరుకు వెళ్లి చూడగా పడమర గట్టున సునీత మృతదేహం కనిపించింది. పోలీసులు సీసీ పుటేజీలో చూడగా సోమవారం రాత్రే ఇంటి నుంచి వెళ్లి కోనేరులో దూకేసినట్టు రికార్డు అయినట్టు పోలీసులు గుర్తించారు. సునీత అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కనకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బిగ్బాస్ విజేత భోగాపురం వాసి
భోగాపురం: నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం పంచాయతీ మధుర గ్రామం సుందరపేటకు చెందిన పడాల లక్ష్మణరావు, లక్ష్మి దంపతుల కుమారుడు పడాల కళ్యాణ్ సినిహీరో నాగార్జున నిర్వహించిన బిగ్బాస్ గ్రాండ్ ఫినాలేలో పాల్గొని విజేతగా నిలిచాడు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి కామన్మెన్గా బిగ్బాస్ హౌస్లోకి చేరి విజేతగా నిలిచి విజయం సాధించిన తొలి ఉత్తరాంధ్ర వాసిగా కళ్యాణ్ గుర్తింపు పొందాడు. బిగ్బాస్ హౌస్లోకి చేరిన మొదటలో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ పట్టువదలకుండా శ్రమించి చివరకు ఫైనల్కు చేరి విజేతగా నిలిచాడు. చిన్నప్పటి నుంచి సినీ హీరోగా ఎదగాలనే ఆశ ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మూడేళ్లకిందట సీఆర్ఫీఫ్ జవాన్గా చేరాడు. బిగ్బాస్ షోలో పాల్గొనేందుకు సామాన్యులకు అవకాశం ఉందన్న విషయం తెలుసుకుని దరఖాస్తు చేశాడు. కోట్లాది మంది వీక్షకుల మద్దతుతో బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టి 105 రోజుల పాటు సాగిన పోటీలో విజేతగా నిలిచాడు. తుది పోటీలో కళ్యాణ్, తనుజాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోటీలో ఎక్కువ మంది ఓట్లువేసి కళ్యాణ్ను విజేతగా నిలిపారు. సినీ హీరో అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విన్నర్ ట్రోఫీ అందుకున్నారు. ట్రోఫీతో తొలిసారి బుధవారం గ్రామానికి వస్తున్న కళ్యాణ్కు ఘనస్వాగతం పలికేందుకు యువత సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా తన కుమారుడికి ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ కళ్యాణ్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
పాలకొండలో మైనింగ్ దందా
అధికార బలంతో పాలకొండలో మైనింగ్, ఇసుక దందాపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి స్వయంగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అక్రమాలను ఆధారాలతో సహా వివరించారు. ఈ విషయం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని సహజ వనరులను దోచుకుంటున్న నేతల తీరు బట్టబయలైంది. స్వయంగా అధికార పార్టీకి చెందిన వ్యక్తే ఫిర్యాదు చేశారంటే జిల్లాలో సాగుతున్న అక్రమాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ● కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి భూదేవి ● ఇసుక, మైనింగ్ అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు సాక్షి, పార్వతీపురం మన్యం: పాలకొండలో అక్రమ మైనింగ్ సాగుతోంది.. ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.. గోపాలపురం, అంపిలి గ్రామాల వద్ద నాగావళి నదిని యంత్రాలతో గుల్లచేస్తున్నారు.. రాత్రీపగలు తేడాలేకుండా లారీలు, ట్రార్లతో తరలించి సొమ్ముచేసుకుంటున్నారు.. అధికారులు కొన్ని వాహనాలను సీజ్ చేసినా పరిస్థితిలో మార్పులేదంటూ టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. మైనింగ్ ఏడీకి తెలిసే ఇదంతా జరుగుతుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవానికి మైనింగ్ ఇసుక తవ్వకాలు ఎమ్మెల్యే జయకృష్ణ వర్గం కన్నుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. జేసీబీలతో తవ్వి, లారీలతో అక్రమంగా తరలిస్తున్నా చర్యలు లేకపోవడంతో ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తోంది. ఇదే విషయమై భూదేవి వర్గం సాక్ష్యాలతో సహా కలెక్టర్ దృష్టిలో పెట్టినట్లు తెలుస్తోంది. కలెక్టర్ను కలసిన అనంతరం పడాల భూదేవి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. పార్టీ ఇన్చార్జిగా తనకూ బాధ్యతలున్నాయని.. కార్యకర్తలకు తాను కూడా సమాధానం చెప్పుకోవాలని తెలిపారు. నమ్ముకున్న టీడీపీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కూటమి అంటే అందరూ కలిసే.. అందరి భాగస్వామ్యంతో పనులు చేయాలన్నారు. నియోజకవర్గంలో అందుకు భిన్నంగా జరుగుతోందన్నారు. గృహాలు, పింఛన్లు, ఇటీవల పంపిణీ చేసిన రేషన్ కార్డుల విషయంలోనూ వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు దృష్టిలో కూడా పెడతామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవల పాలకొండ నియోజకవర్గంలో పర్యటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అలకలు వీడి, అంతా కలసికట్టుగా పని చేయాలని హితవు పలికారు. నియోజకవర్గంలో అంతా ఏకపక్షమేనని.. జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తమను కలుపుకొని వెళ్లడం లేదని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి భూదేవి పలుమార్లు బహిరంగంగానే తన ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తీరు, అవినీతి, అక్రమాల పాలనను ఆమె కలెక్టర్కు దృష్టికి తీసుకెళ్లారు. పడాల భూదేవి వర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు కలెక్టరేట్లో కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డిని కలిసి ముస్తాబు కార్యక్రమం నిర్వహణలో అభినందించారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవానికి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, ఎమ్మెల్యే జయకృష్ణ ఏకపక్ష వైఖరిపై ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గృహాల మంజూరు విషయం తమకు తెలియడం లేదని.. అర్హులకు అందడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలెవరికీ ఇల్లు, పింఛన్లు రానీయకుండా ఎమ్మెల్యే వర్గం ఇబ్బందులు పెడుతున్నట్లు వివరించారు. గోశాలల విషయంలోనూ టీడీపీ కార్యకర్తలను వెనక్కి పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమాచారం తమ కార్యకర్తలకు తెలియడం లేదని.. దీని వల్ల ప్రజలకు ఆ ప్రయోజనాలు, లబ్ధి వివరించలేకపోతున్నామని చెప్పా రు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నప్పటికీ తనకు ఏ కార్యక్రమాల సమాచారమూ చెప్పడం లేదని వివరించారు. అధికారులైనా సమన్వయం చేసుకుని వెళ్లాలని కలెక్టర్ను కోరినట్లు తెలిసింది. -
పోలీసుల పాత్ర కీలకం
● విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి ● చింతలవలస ఏపీఎస్పీ ఐదో బెటాలియన్లో పోలీస్ శిక్షణ ప్రారంభం శాంతిభద్రతల పరిరక్షణలోడెంకాడ: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమైనదని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి అన్నారు. నూతనంగా ఎంపికై న కానిస్టేబుళ్లకు చింతలవలస ఏపీఎస్పీ ఐదో బెటాలియన్లో సోమవారం శిక్షణ ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన తొలి పోలీస్ అధికారి కానిస్టేబుల్ అని అన్నారు. శిక్షణ కాలం ఎంతో విలువైనదని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా శిక్షణలోని క్రమశిక్షణ దోహదపడుతుందన్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజలకు సేవ చేయాలనే భావన బలంగా ఉండాలన్నారు. చట్టం పట్ల గౌరవం, విధి నిర్వహణలో నిజాయితీ, సమయపాలన వంటి లక్షణాలు పోలీస్ జీవితంలో అత్యంత అవసరమని చెప్పారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలు భవిష్యత్లో ప్రజల శాంతి భధ్రతల పరిరక్షణకు ఉపయోగపడాలన్నారు. 9 నెలల పాటు శిక్షణ కొనసాగుతుందని, ఇక్కడకు శిక్షణకు వచ్చిన 187 మంది పోలీస్ అభ్యర్థులు సమర్థవంతంగా శిక్షణ పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్ రెడ్డి, ఒకటవ బెటాలియన్ కమాండెంట్ సీహెచ్వీఎస్ పద్మనాభరాజు, 16వ బెటాలియన్ కమాండెంట్ అరుణ్బోస్, పోలీస్ అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
నలుగురు విద్యార్థులకు పచ్చకామెర్లు
● జిల్లా కేంద్రాస్పత్రిలో వైద్య సేవలు పార్వతీపురం రూరల్: గుమ్మలక్ష్మీపురం మండలం దొరజమ్ము గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు పచ్చకామర్ల బారినపడి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరో తరగతి చదువుతున్న కడ్రక విద్యాసాగర్, బచ్చల ఇసంత్, ఏడో తరగతికి చెందిన పువ్వల ధాన్యాలు, గంట ఫిరోష్లు నాలుగు రోజులుగా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్నా వార్డెన్ పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు హెచ్.సింహాచలం ఆరోపించారు. ఇటీవల పిట్స్ వ్యాధితో ఈ పాఠశాలకు చెందిన ఒక విద్యార్థి మృతి చెందిన ఘటన మరువక ముందే అధికారులు ఇలా నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. విద్యా ర్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా వార్డెన్ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే వార్డెన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నేటి నుంచి అన్వేష సైన్స్ ఫెస్ట్ సీతంపేట: స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమపాఠశాల ఆవరణలో అన్వేష సైన్స్ఫెస్ట్ను ఈనెల 23, 24 తేదీల్లో జరగనుందని పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవర్ స్వప్నిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 53 గిరిజన విద్యాసంస్థలు పాల్గొంటాయన్నారు. విద్యార్థులు రూపొందించిన 277 ప్రాజెక్టులు, టీచర్లు తయారుచేసిన 36 ప్రాజెక్టుల ప్రదర్శనలో 469 మంది విద్యార్థులు, 150 మంది ఉపాధ్యాయులు పాల్గొంటారని పేర్కొన్నారు. వెంకటరాజపురంలో ఏనుగులుజియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం గ్రామంలో సోమవారం ఉదయం ఏనుగులు దర్శనమిచ్చాయి. అనంతరం బిత్రపాడు, బట్లభద్ర, బాసంగి గ్రామాల్లోని పంట పొలాల్లోకి జారుకున్నాయి. అధికారులు స్పందించి ఏనుగుల తరలింపు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ● బొబ్బిలిలో అనసూయ సందడి బొబ్బిలి పట్టణంలో సినీనటి అనసూయ సోమవారం సందడి చేశారు. ముందుగా ఎస్ఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభించారు. అనంతరం షాపంతా కలియతిరిగారు. సరమైన ధరలకే వస్త్రాలను విక్రయించడం ఎస్ఆర్ షాపింగ్మాల్ ప్రత్యేకమని, వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సంక్రాంతి ఆఫర్లను అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ కొన్ని చిత్రాల పాటలకు స్టెప్పులు వేసి సందడి చేశారు. అభిమానులతో కేరింతలు కొట్టించారు. కార్యక్రమంలో షాపింగ్మాల్ య జమానులు ప్రసాదరెడ్డి, కేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ హక్కులను హరించడమే..
కురుపాం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీన పరచడం అనేది రాజ్యాంగబద్ధంగా గ్రామీణ కార్మికులకు కల్పించిన హక్కులను హరించడమేనని, ఇది ఆదివాసీ, ఆర్థికంగా అనగారిన ప్రజల జీవన గౌరవంపై నేరుగా దాడి చేయడమేనని మాజీ కేంద్ర మంత్రి, జాతీయ ఉపాధి హామి పథకం రూపకల్పన కమిటీ సభ్యుడు వైరిచర్ల కిశోర్చంద్ర సూర్యనారాయణదేవ్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణతో పాటు నిరుపేదలకు ఆహార భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. తను గిరిజన వ్యవహారాల, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న సమయంలో గిరిజన ప్రాంతాల్లో సమస్యలు అక్కడ ఉండే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 150 రోజుల పనిదినాలు చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న చర్యలు సరైనవి కాదన్నారు. ఈ పథకం పేదల కోసం ఇచ్చే దానధర్మం కాదని, గ్రామీణ పేదలు, ఆదివాసీలు, దళితులు, చిన్నసన్నాకారు రైతులు, ఆర్థిక బలహీన వర్గాలకు ఉపాధి కల్పించే హక్కుల ఆధారిత చట్టమన్నారు. గ్రామీణ కార్మికుల హక్కులకు రక్షణ కల్పించాలని ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి, జాతీయ ఉపాధి హామీ రూపకల్పన కమిటీ సభ్యుడు కిశోర్ చంద్రసూర్యనారాయణ దేవ్ -
పరిశుభ్రతతోనే ఆరోగ్యం
● కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్ది పార్వతీపురం టౌన్: పాఠశాలల్లో విద్యార్థులు చేతులు కడుక్కునే కార్యక్రమం ప్రతి ఇంటిలో పక్కాగా జరగాలని, దీనికోసం ‘ఫ్యామిలీ ముస్తాబు‘ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్టు కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. స్థానిక లూథరన్ చర్చి పక్కన ఉన్న సమావేశ మందిరంలో ‘ఫ్యామిలీ ముస్తాబు’పై సోమవారం శిక్షణ ఇచ్చారు. పరిశుభ్రతతోనే ప్రజలకు ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. ప్రతి ఫ్రైడేను డ్రైడే పాటించాలని కోరారు. సమష్టిగా దోమల నిర్మూలన చర్యలు చేపడితే మలేరియాను అరికట్టవచ్చన్నారు. అనారోగ్యానికి గురైతే ఆస్పత్రికి వెళ్లి వైద్యసేవలు పొందాలని, నాటువైద్యం సరికాదన్నారు. డిగ్రీ తరువాతే తల్లితండ్రులు అమ్మాయిలకు వివాహం చేయాలని పిలుపునిచ్చారు. ఇంటర్ఫెయిలైన విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్డీఏ, డ్వామా, ఐసీడీఎస్ పీడీలు ఎం.సుధారాణి, కె.రామచంద్రరావు, టి.కనకదుర్గ, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి ఎస్.మన్మథరావు, జిల్లా మత్య శాఖాధికారి టి.సంతోష్ కుమార్, జిల్లా స్థాయి అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన పాఠశాలలకు ప్రత్యేక గుర్తింపు పార్వతీపురం: విద్యార్థుల ఆరోగ్యంపట్ల శ్రద్ధ చూపే పాఠశాలల్లోని ఉపాధ్యాయులను గుర్తించి వచ్చే ఏడాది జనవరి 26న రిపబ్లిక్డే సందర్భంగా ప్రశంసాపత్రాను అందజేస్తామని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే పాఠశాలల్లోని ఉపాధ్యాయులను గౌరవిస్తామన్నారు. -
మిల్లరు దయతలిస్తేనే..
● ధాన్యమిచ్చిన మూడు రోజులైనా ఖాతాకు జమకాని డబ్బులు సాక్షి, పార్వతీపురం మన్యం: ధాన్యమిచ్చిన 48 గంటల్లో కాదు.. 4 గంటల్లో రైతుల ఖాతాకు డబ్బులు జమచేస్తున్నామని మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పలు చెబుతున్నారు. ప్రభుత్వం డబ్బులు ఎలా జమ చేస్తున్నా.. జిల్లాలో మాత్రం రైస్ మిల్లర్ల దయాదాక్షిణ్యాల మీదే అది ఆధారపడి ఉంది. మిల్లర్ల దోపిడీపై ఎన్ని విమర్శలొస్తున్నా.. ఏ ఒక్కరూ వెరవడం లేదు. అధికారుల సహకారంతో సంపూర్ణ దోపిడీకి పాల్పడుతున్నారు. సీతానగరం మండలం జగ్గునాయుడుపేట, ఆర్.వి.పేట రైతులు శంబంగి దమయంతి, యాండ్రాపు లావణ్య, పెంట సావిత్రమ్మ, పెంట పార్వతిలు రామవరం రైతు సేవా కేంద్రం ద్వారా ఈ నెల 20న ధాన్యమిచ్చారు. అదే రోజు ట్రక్షీట్ ద్వారా 304 బస్తాలు నిర్ధారించారు. బూర్జకు చెందిన చిన్నమ్మతల్లి మోడ్రన్ రైస్మిల్లుకు పంపించారు. మూడు రోజులైనా ఆ ధాన్యానికి గుర్తింపు ఇవ్వలేదు. నేటికీ డబ్బులు రాకపోవడంతో రైతులు రామవరం రైతు సేవా కేంద్రం సిబ్బందిని ప్రశ్నించారు. తమకేమీ సంబంధం లేదని.. మిల్లు యజమానితో మాట్లాడుకోండని వారు బదులిచ్చారు. మిల్లు వద్దకు వెళ్లి ఆరా తీస్తే.. రూ.4,800 అదనంగా కట్టాలని, లేకపోతే ధాన్యం వచ్చినట్టు గుర్తించడం(అక్నాల్జ్) చేయడం కుదరదని తేల్చిచెప్పారు. తేమశాతం కారణంగా ఒక బస్తాకు 43 కేజీల చొప్పున లెక్క కట్టి.. అదనపు ధాన్యం తీసుకోవడమే కాక.. ఆ మొత్తం చెల్లించాలని అంటున్నారని రైతులు వాపోతున్నారు. మిల్లరు కారణంగా డబ్బులు రాలేదని చెబుతున్న దమయంతి, పెంట పార్వతి -
వైద్యసేవలు వేగవంతం.. పారదర్శకతే లక్ష్యం
● విశాఖ జోనల్ సమీక్షలో హెల్త్ సెక్రటరీ సౌరబ్గౌర్ పార్వతీపురం రూరల్: వైద్యారోగ్య శాఖలో పారదర్శకతను పెంచి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాల వీసీ సమావేశ భవనంలో నిర్వహించిన ఉత్తర కోస్తా జిల్లాల ఆరోగ్య సమీక్షా సమావేశానికి పార్వతీపురం మన్యం జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు తన వైద్యబృందంతో హాజరయ్యారు. జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలుతీరు, ప్రగతి నివేదికలను కార్యదర్శికి వివరించారు. ఈ సందర్భంగా సౌరబ్ గౌర్ మాట్లాడుతూ.. కార్యాలయం వ్యవహారాలన్నీ ఇకపై ఈ–ఆఫీసు ద్వారానే నిర్వహించాలని, ప్రతి నివేదికను డిజిటలైజేషన్ చేయడం ద్వారా పర్యవేక్షణ సులభతరమవుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా మాతృ మరణాల విషయంలో కచ్చితమైన జవాబుదారీ తనం ఉండాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డులు, పోర్టల్లను పరిశీలిస్తూ వైద్య సేవలను పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి. జగన్మోహనరావు, డాక్టర్ రఘు కుమార్, డాక్టర్ ఎం. వినోద్ కుమార్, డాక్టర్ కౌశిక్, డీపీఓ లీలారాణి, ఏఓ మణిరత్నం తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
తండ్రిని హతమార్చిన కుమారుడిపై కేసు నమోదు
పాచిపెంట: మండలంలోని తుమరవల్లి పంచాయతీ నేరళ్లవలసలో పోయిరి సోమయ్య(50) ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందగా ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నేరళ్లవలస గ్రామానికి చెందిన పొయిరి సోమయ్య తన పెద్ద కుమారుడు పోయిరి సింహాచలం ఇంటి వద్ద ఉండేవాడు, సోమయ్య మతిస్థిమితం కోల్పోయి తరచూ తన పెద్ద కుమారుడిని విసిగిస్తూ అసహనానికి గురి చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఈనెల 17వ తేదీన కూడా అలా ప్రవర్తించడంతో అసహనానికి గురైన సింహాచలం తన తండ్రి సోమయ్య ఎడమ చెవి వద్ద కర్రతో బలంగా కొట్టాడు. దీంతో సోమయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో సింహాచలం అంగీకరించడంతో కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్లు సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. ఇద్దరు గిరిజనులకు గాయాలుభామిని: మండలంలోని బొడ్డగూడకు చెందిన ఆరిక రామయ్య, తులసి గ్రామానికి చెందిన మోహనరావు సోమవారం వేకువజా మున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలోని పర్లాకిమిడికి వారిద్దరూ బైక్పై వెళ్తుండగా మంచు తాకిడికి రోడ్డు కనిపించక పోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిద్దరికీ ముందుగా పర్లాకిమిడి ఆస్పత్రిలో వైద్యసేవలు అందించిన అనంతరం ఆరిక రామయ్యను శ్రీకాకుళం రిమ్స్కు, మోహనరావును సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి గాయాలువీరఘట్టం: మండలంలోని సీఎస్పీ రహదారిలో కడకెల్ల వద్ద సోమవారం రాత్రి 9 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరఘట్టానికి చెందిన బంగారం వ్యాపారి, వైఎస్సార్సీపీ నాయకుడు వూణ్ణ శ్రీనివాస్ (కోణార్క్ శ్రీను), ఆర్టీసీ డ్రైవర్ శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరూ బుల్లెట్పై గరుగుబిల్లి మండల ఖడ్గవలస వెళ్లి తిరిగి వస్తుండగా కడకెల్ల వద్ద రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.ఇటీవల కొత్తగా వేస్తున్న విద్యుత్ లైన్స్ కోసం కొన్ని విద్యుత్ స్తంభాలను కడకెల్ల వద్ద రోడ్డు పక్కనే డంపింగ్ చేశారు. అయితే ఖడ్గవలస నుంచి వస్తున్న వీరు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే డంపింగ్ చేసిన విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సంఘటనా స్థలంలో ఉన్నవారు తెలిపారు. క్షతగాత్రులను వైద్య చికిత్సల కోసం పార్వతీపురం తరలించారు. కారును ఢీకొట్టిన కంటైనర్● త్రుటిలో తప్పిన పెనుప్రమాదంగజపతినగరం: మండల కేంద్రంలో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా ఉన్న లక్ష్మిషాపింగ్ కాంప్లెక్స్ వద్ద జాతీయ రహదారిలో అదుపు తప్పి ఆదివారం రాత్రి పార్కింగ్లో ఉన్న ఓకారును కంటైనర్ బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. విశాఖ పట్నంనుంచి రామభద్రపురం వెళ్తున్న కంటైనర్ మార్గమధ్యంలో అదుపు తప్పి గజపతినగరంలో లక్ష్మిషాపింగ్ కాంప్లెక్స్ లోకి దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జయింది. ఆదివారం మార్కెట్ సెలవు కావడంతో అక్క జనసంచారం లేదు. లేదంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. -
నాయనమ్మను హత్య చేసిన మనుమడి అరెస్ట్
విజయనగరం క్రైమ్: ఈ నెల 13 జరిగిన జరిగిన హత్య కేసు మిస్టరీని భోగాపురం పోలీసులు ఛేదించారు. డబ్బులు ఇవ్వలేదని సొంత నాయనమ్మనే మనుమడు హత్య చేశాడని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి విలేకరుల సమావేశంలో ఎస్పీ దామోదర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని భోగాపురం మండలం ముడసలపేట గ్రామం ఎయిర్ పోర్టు కాలనీకి చెందిన ముడసల అప్పయ్యమ్మ (70) అనే వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు చెవి దిద్దులు, జుమ్మలు, ముక్కు కమ్ములు, వెండి పట్టీలను దొంగిలించుకుని పోయారని మృతురాలి కోడలు ముడసల లక్ష్మి డిసెంబర్ 13న ఫిర్యాదు చేసింది.ఈ మేరకు భోగాపురం పోలీసులు కేసు నమెదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా, నేర స్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు పరిశీలించాయి. విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలో భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాద్, ఎస్సై పి.పాపారావు, సీసీఎస్ ఎస్సై కె.లక్ష్మణరావు బృందాలుగా ఏర్పడి. విచారణ చేపట్టారు. నేర స్థలం పరిశీలనలో డాగ్స్క్వాడ్. నిందితుడు ముడసల గౌరి చుట్టూ తిరగడంతో అనుమానంతో అతని కదలికలపై నిఘా పెట్టారు. బంగారం, వెండి రికవరీ నేరం జరిగిన కొద్ది రోజుల తర్వాత, పోలీసులకు అనుమానం లేదని నిందితుడు ముడసల గౌరిపై భావించి, దొంగిలించిన వస్తువులను అమ్మేయాలన్న ఉద్దేశంతో వాటిని తీసుకుని వెళ్తుండగా భోగాపురం పోలీసులు అరెస్టు చేసి, 18.250 గ్రాముల బంగారు వస్తువులను, 106 గ్రాముల వెండి పట్టీలను రికవరీ చేశారని ఎస్పీ దామోదర్ తెలిపారు. విచారణలో మృతురాలు తన కుమార్తె, చిన్న కుమారుడికి తన వద్ద ఉన్న డబ్బులు ఇస్తున్నట్లు, పెద్ద కుమారుడి కుటుంబానికి డబ్బులు ఇవ్వడం లేదన్న కారణంగా ఆమైపె కక్ష పెంచుకున్నాడన్నారు. ముందు రోజు రాత్రి పెద్ద కొడుకు కొడుకై న గౌరి మద్యం మత్తులో తన నాయనమ్మను బైక్ ఫైనాన్స్ కట్టేందుకు డబ్బులు అడిగాడని, ఇవ్వకపోవడంతో ఆమె ముఖంపై తలగడతో అదిమి హత్య చేసి, ఒంటిపైగల చెవి కమ్ములు, జుమ్మాలు, చెవి మద్య రింగులు, రోల్డ్ గోల్డ్ చైన్, వెండి పట్టీలను దొంగిలించాడన్నారు. మృతురాలు బహిర్భూమికి బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, మృతురాలి ఒంటిపై బంగారు వస్తువులు తీసుకుని పోయినట్లు మభ్యపెట్టేందుకు మృతదేహాన్ని ఇంటినుంచి బయటకు తీసుకు వెళ్లి, నూతికి సమీపంలో పడేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, లాభాపేక్షతో హత్య కేసు మిస్టరీని చేధించామన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన డీఎస్పీ ఆర్.గోవిందరావు, భోగాపురం సీఐ కె.దుర్గా ప్రసాద్, ఎస్సైలు పి.పాపారావు, కె.లక్ష్మణరావు, ఏఎస్సై గౌరీ శంకర్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించి నగదు రివార్డులను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రదానం చేశారు. -
కరాటే చాంపియన్షిప్లో పతకాలు
విజయనగరం అర్బన్: విశాఖలో ఇటీవల జరిగిన 19వ కెన్యూరియో కరాటే చాంపియన్షిప్–2025లో పట్టణానికి చెందిన సత్య డిగ్రీ/పీజీ కళాశాల విద్యార్థులు పతకాలు సాధించారు. బంగారు పతకాలు సాధించిన వారిలో పి.హర్షవర్ధన్(2), సీహెచ్.రిషిత, పి.గురుసిద్దిక్, ఎన్.వేవన్ష్, ఎస్.శ్రీవత్సవ్, ఎస్.నవ్య, కె.ప్రేమేష్ ఉన్నారు. కాంస్య పతకాలు సాధించిన వారిలో కె.తనుశ్రీ, సీహెచ్.రిషిత, ఎన్.దేవాన్ష్, కె.ప్రేమేష్, వి.ఇందిరా ప్రియదర్శిని, మహమ్మద్ సమీర్, ఎం.హర్హవర్ధన్, కె.శివగణేష్, పి.గగన్సాయి, బి.లేవాన్ ఉన్నారు. రజత పతకం సాధించిన వారిలో కె.తనుశ్రీ, ఎం.యోగిత, పి.గురుసిద్ధిక్, ఎస్.శ్రీవత్సవ్, ఎస్.నవ్య, ఎన్.జనని, వి.ఇందిరా ప్రియదర్శిని, జి.వివేక్ వర్మ రెండు, మహమ్మద్ సమీర్, ఎం.హర్షవర్ధన్, కె.శివగణేష్, పి.కుష్వంత్కుమార్ (2), పి.గగన్ సాయి, బి.లేవాన్ ఉన్నారు. విజేతలను, కోచ్ కె.సంతోష్కుమార్, అసిస్టెంట్ కోచ్ శ్రీభార్గవ్ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, కళాశాల ప్రిన్సిపాల్ ఎంవీసాయిదేవమణి అభినందించారు. -
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డిపార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలను సొంత సమస్యగా భావించి నాణ్యమైన పరిష్కారాన్ని ఇచ్చి అర్జీదారుల సంతప్తిని స్థాయిని పెంచాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో వివిధ ప్రాంతాల ప్రజలు 185 వినతులు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను ఆడిట్ చేయనున్నట్లు చెప్పారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యంగా అర్జీలను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అర్జీలను స్వీకరించినవారిలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీలు పి.ధర్మచంద్రారెడ్డి, ఎస్.దిలీప్ చక్రవర్తి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మైనింగ్ అనుమతులు నిలిపివేయాలి పాచిపెంట మండలం శ్యామల గౌరీపురం గ్రామం సమీపంలో గల కొండకు ఉన్న మైనింగ్ అనుమతులను నిలిపివేయాలని కోరుతూ గ్రామంలోని ఎస్టీ గదబ కులానికి చెందిన ఎస్. మహేశ్వరరావు, ఎస్.కుమార్, ఎస్.వెంకట పాపారావు, ఎస్. శ్రీధర్తోపాటు గ్రామస్తులు వచ్చి కలెక్టర్ ప్రభాకరరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. శ్యామల గౌరీపురం సమీపంలో ఉన్న కొండచుట్టూ పోడు వ్యవసాయం రాగులు, జొన్నలు, కందులు, కొర్రలు, జీడిమొక్కలు తదితర పంటలను సాగు చేసి జీవనం సాగిస్తున్నామని, కొండ ప్రాంతాన్ని పశువులు, మేకలు మేత కోసం వినియోగిస్తున్నామని, అలాగే కొండపై ఉమామహేశ్వర గోకర్ణ స్వామి ఆలయం కూడా ఉందన్నారు. ఈ కొండకు, గుడికి రాకపోకలు చేసేందుకు ప్రభుత్వం గతంలో రహదారిని కూడా నిర్మించిందని గుర్తు చేశారు. ఈ కొండకు మైనింగ్ అనుమతుల కోసం 18.5.2025న జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మైనింగ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారన్నారు. అయితే ఈ కొండ సమీపంలో ఉన్న మంచాడవలస, పణుకువలస, శ్యామల గౌరీపురం గ్రామాలకు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సమావేశం నిర్వహించారని, కొండకు మైనింగ్ అనుమతులు ఇవ్వడం వల్ల ఈ గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాపోయారు. అధికారులు పునరాలోచన చేసి నవదుర్గ మైనింగ్కు ఇచ్చిన అనుమతులను నిలిపివేయాలని వారు కోరారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్లో వెలుగు సీఎఫ్పై ఫిర్యాదు సీతంపేట: తాము తీసుకున్న ఉన్నతి రుణాలను తిరిగి చెల్లిస్తుంటే వెలుగు సీఎఫ్ జమచేయడం లేదని కొత్తూరు మండలంల కురిగాం గ్రామానికి చెందిన ఆదివాసీ స్వయం శక్తిసంఘం మహిళా సభ్యులు ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబుకు సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ప్రజాసమస్యల పరిష్కారవేదికకు 27 అర్జీలను గిరిజనులు సమర్పించారు. గూనభద్రకు చెందిన చల్లా ఉమాదేవి, సుబ్బారావు తదితరులు పెండింగ్ హౌసింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. కొంకాడపుట్టి గ్రామాన్ని పంచాయతీగా గుర్తించాలని సవర శివకుమార్ వినతి ఇచ్చారు. పిల్లలు ఉన్నందున డబారుసింగి గ్రామానికి పాఠశాల మంజూరు చేయాలని దేవి తదితరులు కోరారు. సోదగ్రామం మండల పరిషత్ పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించాలని పి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశాడు. శ్మశాసస్థలాన్ని ఆక్రమిస్తున్నారని కొండపల్లికి చెందిన ఎం.రాజారావు ఫిర్యాదు చేశాడు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ఫిర్యాదులను చట్టపరిధిలో నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆయన ఫిర్యాదుదారుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబకలహాలు, సైబర్ నేరాలు, ఆస్తి వివాదాలు, వడ్డీ వ్యాపారుల వేధింపులు వంటి అంశాలపై మొత్తం 11 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ సంబంధిత స్టేషన్ల అధికారులతో ఫోనన్లో మాట్లాడి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు న్యాయం చేసి, ఆ నివేదికలను కార్యాలయానికి పంపాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
మిస్టర్ ఇండియా పోటీలకు కోన రమణ
శృంగవరపుకోట: మిస్టర్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీలకు ఎస్.కోటకు చెందిన బాడీ బిల్డర్ కోన రమణ ఎంపికయ్యాడు. ఈ నెల 21న తగరపువలసలో జరిగిన మిస్టర్ ఆంధ్రా ఓపెన్ బాడీ బిల్డింగ్ పోటీల్లో మాస్టర్స్ విభాగంలో పాల్గొన్న కోన రమణ 5వ స్థానం సాధించాడు. నిర్వాహకులు రమణకు రూ.1000లు నగదు ప్రోత్సాహకంతో పాటు మెడల్, ప్రశంసాపత్రం అందజేశారు. జనవరిలో ఛత్తీస్గఢ్లో జరగనున్న మిస్టర్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు రమణ చెప్పాడు. డీజీపీ కమోడేషన్కు ఎంపికై న విజయనగరం పీసీవిజయనగరం క్రైమ్: ఏపీ రాష్ట్ర పోలీస్ శాఖ ఇవ్వనున్న డీజీపీ కమోడేషన్ డిస్క్ అవార్డులను సోమవారం ప్రకటించింది. ఈ అవార్డుల్లో సిల్వర్ డిస్క్ విజయనగరం పోలీస్ శాఖ పరిధి రామభధ్రపురం పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ వై.అప్పలనాయుడును వరించింది. డీజీపీ సిల్వర్ డిస్క్లు నలుగురు ఐపీఎస్లతో పాటు మొత్తం 343 మందికి లభించాయి. కానిస్టేబుల్స్లో ఉత్తరాంధ్రలోని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి ఇద్దరికి ఈడిస్క్ అవార్డులు లభించాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శారద ఉన్నారు. -
పక్కా ప్రణాళికతో హత్య
● భీముడు మృతిపై సమగ్ర విచారణ జరపాలి ● ఎస్పీకి మృతుడి భార్య వినతిపార్వతీపురం రూరల్: రికార్డుల్లో గుండెపోటు..శరీరంపై మాత్రం గాయాల అనవాళ్లు..వెరసి గొర్రె భీముడు(52) మృతి మిస్టరీగా మారింది. తమకు న్యాయం చేయాలంటూ మృతుడి భార్య భారతి, ఆదివాసీ ఎరుకల సంఘాల నాయకులతో కలిసి సోమవారం ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించింది. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం తాలాడకు చెందిన భీముడు గత ఏప్రిల్ 22న వంశధార నది ఒడ్డున విగతజీవిగా లభ్యమయ్యాడు. మృతదేహంపై కంటి భాగం, పక్కటెముకల వద్ద గాయాలున్నా..పోస్టుమార్టం నివేదికలో గుండెపోటుగా పేర్కొనడంపై బాధితులు మండిపడ్డారు. గ్రామంలో చెత్త బండి నడిపే విషయంలో స్థానికంగా కొందరితో విభేదాలున్నాయని, వారే కులం పేరుతో దూషించి, దాడి చేసి చంపేశారని భారతి ఫిర్యాదులో ఆరోపించింది. దీనిపై సాక్షులున్నా పోలీసులు పట్టించుకోలేదని, పైగా హడావుడిగా అంత్యక్రియలు చేయించారని వాపోయింది. హైకోర్టు ఆదేశించినా న్యాయం జరగలేదని, తప్పుడు నివేదిక ఇచ్చిన వైద్యుడిపై, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.శంకరరావు, యూటీఎఫ్ అధ్యక్షుడు కె.సంజయ్బాబు, ఏపీఏవైఎస్ఎస్ నేతలు జి.శ్రీనివాసరావు, ఎస్.ముసలయ్య, ఎం.పోతురాజు, గొర్ల సత్యం,చల్ల చిన్నారావు, గొర్ల సన్యాసిరావు, గొర్ల రమణమూర్తి, గేదెల ఆదినారాయణ, గేదెల సురేంద్ర, గొర్ల బుల్లోడు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి ఆదర్శంగా మన్యం జిల్లా
పార్వతీపురం: పరిపాలనలో, ప్రజాసమస్యల పరిష్కారంలో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. కలెక్టర్ల సమావేశంలో జిల్లా సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, సబ్కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు గజమాలతో కలెక్టర్ను సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ముస్తాబు కార్యక్రమం అద్భుత ఫలితాన్ని ఇచ్చిందన్నారు. విద్యార్థుల్లో పరిశుభ్రత, క్రమశిక్షణ, సంస్కారాన్ని పెంపొందించేందుకు ఇది ఒక గొప్ప సంకల్పమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడం మన జిల్లాకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారంలో పార్వతీపురం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం ఎంతో అభినందనీయమన్నారు. రెవెన్యూ క్లినిక్ విధానాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా చూడాలని సిబ్బందిని కోరారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్కలెక్టర్లు వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ హేమలత, హౌసింగ్ పీడీ ధర్మచంద్రారెడ్డి తదితరులున్నారు. వినియోగదారుల హక్కులపై అవగాహన కలిగి ఉండాలి వస్తువులు కొనుగోలు, సేవల వినియోగం విషయంలో ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి హితవు పలికారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వినియోగదారుల హక్కులు, ప్రమాణాలకు సంబంధించిన వాల్పోస్టర్ను జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్వతీపురం, పాలకొండ సబ్కలెక్టర్లు వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ హేమలత, డీఆర్డీఏ పీడీ సుధారాణి, హౌసింగ్ పీడీ ధర్మచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
నాణ్యమైన వస్త్రాల కలబోత ఎస్ఆర్ షాపింగ్ మాల్
బొబ్బిలి: దేశ, విదేశాల నుంచి నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరలకు తీసుకువచ్చి బొబ్బిలి ప్రాంత ప్రజలకు అందించడమే ఎస్ఆర్ షాపింగ్ మాల్ లక్ష్యమని డైరెక్టర్ ప్రసాదరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఎస్ఆర్ షాపింగ్మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా సంస్థ ప్రతినిధులు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 14వ బ్రాంచ్ను బొబ్బిలిలో ప్రారంభిస్తున్నామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలనకు సినీనటి అనసూయ భరద్వాజ్ హాజరుకానున్నారని తెలిపారు. ముఖ్య అతిథులుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే బేబీ నాయన, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు, మున్సిపల్ చైర్మన్ ఆర్.శరత్బాబు, శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎం.డి శంబంగి వేణుగోపాల నాయుడు, టీబీఆర్ గ్రూప్స్ చైర్మన్ తూముల భాస్కరరావు హాజరు కానున్నట్లు తెలిపారు. -
ఖోఖో రాష్ట్ర జట్టుకు మేనేజర్గా రాజు
గంట్యాడ: ఈనెల 23వతేదీ నుంచి 28వతేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లో జరగనున్న 69వ నేషనల్ గేమ్స్ ఫెడరేషన్ ఖోఖో పోటీల్లో పాల్గొనబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలురు జట్టుకు మేనేజర్గా పీవీఎస్ఎన్ రాజు వ్యవహరించనున్నారు. ఆయన గంట్యాడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయమ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొటియాలో ఒడిశా మంత్రి పర్యటనసాలూరు: వివాదాస్పద ఆంధ్రా ఒడిశా సరిహద్దు కొటియా గ్రామంలో ఒడిశా రాష్ట్ర ఆహారసరఫరా మంత్రి కృష్ణ చంద్ర పాత్ర ఆదివారం పర్యటించారు. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వం మంజూరు చేసిన నూతన రేషన్కార్డులను లబ్ధిదారులకు ఆయన అందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొటియా గ్రామాలకు బియ్యం అందించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి కార్డుకు 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. బొలెరో ఢీకొని యువకుడి మృతిరేగిడి: మండల పరిధిలోని చిన్నశిర్లాం జంక్షన్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పాలకొండ మండలంలోని బెజ్జి గ్రామానికి చెందిన బొడ్డు భానుప్రకాష్ (22) ద్విచక్రవాహనంపై పాలకొండ నుంచి రాజాం వెళ్తుండగా రాజాం నుంచి పాలకొండ వస్తున్న బొలెరో వాహనం ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే యువకుడు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రాజాం సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి..బొండపల్లి: మండలంలోని గొల్లుపాలెం గ్రామానికి సమీపంలో గల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వస్తూ డివైడర్ను ఢీకొని తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు గ్రామ వీఆర్ఓ త్రినాథరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మెంటాడ మండలంలోని మెంటాడ గ్రామానికి చెందిన బండారు స్వామినాయుడు(35) మూడు రోజుల క్రితం అరకులో ఉన్న తన స్నేహితుడికి ద్విచక్ర వాహనంపై ఇచ్చేందుకు వెళ్తూ డివైడర్ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని జిల్లా కేంద్రంలోని కేంద్ర సర్వజన ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించగా ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థికసాయం డెంకాడ: బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్న బీహెచ్ లాస్య వైద్య ఖర్చుల కోసం విజయనగరం జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారు రూ.10 వేల ఆర్థికసాయం చేసినట్లు ఫౌండేషన్ ప్రతినిధి ఆదినారాయణ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు. దాతలు మరింతమంది ముందుకువచ్చి, సాయం చేస్తే లాస్య ఆరోగ్యం మెరుపడే అవకాశం ఉందని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
అక్కడ చేయి తడిపితేనే పని..!
నెల్లిమర్ల: నగర పంచాయతీ సిబ్బంది ప్రతి పనికీ లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైసలు ఇవ్వనిదే నగన పంచాయతీలో పనులు జరగడం లేదు. ఇంటి పన్నులు వేయడం, ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్ మంజూరు చేయడం, జనన, మరణ ధ్రువపత్రాల జారీ చేయడం కోసం పట్టణవాసుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. ఇదీ గత ఐదు దఫాలుగా జరిగిన కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు. అయినా సరే సిబ్బందిలో ఏమాత్రం మార్పు రాలేదని పట్టణవాసులు వాపోతున్నారు. ఏ పనికై నా మున్సిపల్ కార్యాలయం మెట్లు ఎక్కాలంటేనే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిని కంట్రోల్ చేయడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర పంచాయతీ కార్యాలయంలో ఏ పని జరగాలన్నా సంబంధిత సిబ్బంది చేతులు తడపాల్సిందేననే ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కావాలంటే అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ డబ్బులు గుంజుతున్నారని పట్టణవాసులు ప్రత్యక్షంగా చెబుతున్నారు. అవసరం లేకపోయినా అఫిడవిట్ కావాలంటూ వేలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. పాత సర్టిఫికెట్లు కావాలంటే కనీసం రూ.10వేలు అయినా ఇవ్వాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా నిర్మించుకునే ఇళ్లకు ప్లాన్ అప్రూవల్ కావాలంటే కనీసం రూ.50 వేలు అయినా సమర్పించుకోవాల్సిందే. తాజాగా మొయిద జంక్షన్లో నిర్మిస్తున్న ఓ భవనానికి అనుమతి కోసం ఏకంగా రూ.80 వేలు అదనంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. టౌన్ ప్లానింగ్ అధికారులు కాకుండా ఇతర విభాగానికి చెందిన కొంతమంది సిబ్బంది ఇలాంటి వ్యవహారాలు నడుపుతున్నట్లు సమాచారం. ప్రతి సర్టిఫికెట్కు సమర్పించాలి ఇక సర్టిఫికెట్ల విషయానికి వస్తే ప్రతి సర్టిఫికెట్కు పైసలు ఇవ్వాల్సిందేనని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. జనన, మరణ ధవీకరణ పత్రాలు కావాలంటే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు సమర్పించాలని వాపోతున్నారు. అన్నీ సక్రమంగా ఉన్నా అఫిడవిట్ పేరుతో కనీసం రూ.వెయ్యి అయినా ఇస్తే గాని సర్టిఫికెట్ ఇవ్వని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇదే విషయమై గత ఐదు దఫాలుగా జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో పలువురు కౌన్సిలర్లు చైర్పర్సన్, కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది సిబ్బంది పేర్లు కూడా సదరు సమావేశాల్లో ప్రస్తావించారు. అయినా సంబంధిత అధికారులు సిబ్బందిని నియంత్రించడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికై నా అధికారులు స్పందించి, సిబ్బంది వసూళ్లకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు, కౌన్సిలర్లు కోరుతున్నారు. వసూళ్లకు పాల్పడుతున్న నగర పంచాయతీ సిబ్బంది ఇంటి పన్ను, ప్లాన్ అప్రూవల్, ధ్రువపత్రాల కోసం నగర ప్రజల పాట్లు కౌన్సిల్ సమావేశంలో పలుమార్లు సభ్యుల ఫిర్యాద -
కోనేరంతా కన్నీరు
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీరా మలింగేశ్వరస్వామి పుష్కరిణిలో ఆదివారం సా యంత్రం ఇద్దరు చిన్నారులు జారి పడి మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. పట్టణంలోని గణేష్నగర్కు చెందిన సురవరపు నాగరాజు కుమారుడు పవన్(8), గణేష్ నగర్కు చెందిన శంకు సుదర్శన్ కుమారుడు శంకు ధనుష్(6)వి ఎదురెదురు ఇళ్లు. ఆదివారం సెలవు కావడంతో సైకిల్ తొక్కుకుంటూ పుష్కరిణి వద్దకు వెళ్లి ఆడుకుంటున్నారు. ఆ కోనేరు గట్టు జారుగా ఉండడంతో జారి కోనేరులో పడిపోయారని స్థానికులు చెబుతున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో వారిని రక్షించలేకపోయారు. కాసేపటి తర్వాత అక్కడున్న వేరే పిల్లలు చెప్పడంతో కొంతమంది యువకులు పుష్కరిణిలోకి దిగి గాలించారు. తొలుత పవన్ను గుర్తించారు. అలాగే మరికొంత సేపు గాలించగా ఊబిలో కూరుకుపోయి ఉన్న ధనుష్ను పైకి తీశారు. ఈ లోగా వారి తల్లిదండ్రులు కూడా అక్కడకు చేరుకున్నారు. 108కి సమాచారం అందించడంతో వారు వచ్చి చూసి పిల్లలు చనిపోయారనే విషాద వార్త తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపించారు. మృతుల్లో పవన్ స్థానిక లక్ష్మినగర్ ము న్సిపల్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాడు. తండ్రి నాగరాజు డ్రైవర్గా పనిచేస్తుంటాడు. తల్లి పార్వతి గృహిణి. మరో మృతుడు శంకు ధనుష్ పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. తండ్రి సుదర్శన్ పట్టణంలో కోటి కాంప్లెక్స్ సమీపంలో టిఫిన్ కొట్టు నడుపుతుంటారు. ఆదివారం తమ కళ్ల ముందు ఆడుకున్న పిల్లలు అంతలోనే చనిపోయారని తెలియడంతో స్థానికులు నిశ్చేష్టులైపోయారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టు మార్టంకు తరలించారు. ఇదే కోనేరులో గతంలోనూ ఇలాంటి దుర్ఘటనలు జరిగాయి. జనావాసాల మధ్యన ఉన్న ఈ పుష్కరిణి చుట్టూ సీసీ రోడ్డులు, మెట్లు నిర్మించారు గానీ రక్షణ గోడ ఏర్పాటు చేయలేదు. ఈ అలసత్వమే ఇప్పుడు పిల్లల పాలిట మరణ శాసనాలు రాస్తోంది. చెరువులో కూడా ఊబి ఎక్కువగా ఉండడంతో కనీసం ఆ చెరువు క్లీనింగ్కు కూడా నోచుకోవడం లేదు. దీంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణ వాసులంటున్నారు. పవన్ మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి -
ధాన్యం కొనుగోలులోనూ టీడీపీ హవా..!
విజయనగరం ఫోర్ట్: రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా టీడీపీ నేతలు వదల్లేదు. కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే వారు కూడా తమ పార్టీవారినే టీడీపీ నేతలు నియమించుకున్నారు. టీడీపీకి చెందిన వారు అయితే తమ పార్టీనేతల కనుసన్నల్లో నడుస్తున్నారని పసుపు పార్టీ సానుభూతిపరులనే జిల్లాలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నియమించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే అనుభవాన్ని కానీ, అర్హతను కానీ పట్టించుకోకుండా నియమకాలు చేపట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టారు. కానీ చంద్రబాబు సర్కార్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టినట్లు గుసుగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లో కానీ, సంస్థల్లో గాని పనిచేసే ఉద్యోగాలు తాత్కాలికమే అయినప్పటికీ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయడం అనవాయితీ. కానీ చంద్రబాబు సర్కార్ హయంలో పసుపు పార్టీయే అర్హతగా పోస్టులను భర్తీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత, అనుభవం లేక పోయినా పసుపు పార్టీకి చెందిన మద్దతు దారులు అయితే వారికి అప్పనంగా పోస్టులు కట్టబెట్టేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్స్, పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, వాచ్మెన్, వెలుగు వీఓఏలు, కేజీబీవీల్లో పనిచేసే కుక్, వాచ్మెన్లను తొలిగించి టీడీపీకి చెందిన వారిని నియమించుకున్నారు. తాజాగా ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందిని కూడా టీడీపీ వారినే నియమించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు: జిల్లాలో 382 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించారు. ఒక హెల్పర్, ఒక టెక్నికల్ అసిస్టెంట్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. రెండు, మూడు నెలల పాటు వీరు విధులు నిర్వహించనున్నారు. హెల్పర్కు రూ.9 వేలు, టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్కు రూ.12వేలు చొప్పన వేతనాలు అందించనున్నారు. రైతు కళ్లం నుంచి ధాన్యం శాంపిల్ సేకరించి తేమశాతం పరీక్షించడం టెక్నికల్ అసిస్టెంట్ చేయాల్సిన విధులు. అయితే ఎక్కడా క్షేత్ర స్థాయికి వెళ్లి శాంపిల్ సేకరణ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రక్ షీట్స్ జనరేట్ చేస్తారు. హె ల్పర్ వారికి సహాయంగా ఉంటారు. టీడీపీ సానుభూతిపరులే కొనుగోలు సిబ్బంది జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలు ఒక్కో కేంద్రంలో ముగ్గురు చొప్పున నియామకాలు రెండు, మూడు నెలల పాటు విధులు సిబ్బంది నియామకం పీఏసీఎస్లదే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే సిబ్బందిని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘా(పీఏసీఎస్)లు నియమించుకుంటాయి. సిబ్బంది నియామకం బాధ్యతే వారిదే. బి.శాంతి, జిల్లా మేనేజర్, సివిల్ సప్లైస్ -
మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ
● రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం ● ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం ● మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యదత్తిరాజేరు: తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కె.కొత్తవలస గ్రామానికి చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మార్పిన అప్పలనాయుడు, వంగర రామకృష్ణ, మరడ రాము మృతి చెందారని, వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆరోపించారు. ఈ మేరకు మృతుల కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సాయం చేశారు. ప్రమాద విషయాన్ని వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధిత కుటుంబాలను మరింత ఆదుకుంటామని ఆయన చెప్పారు. ఎలాంటి మగదిక్కు లేని వంగర రామకృష్ణ కుమార్తెకు ప్రైవేట్ ఉద్యోగం వేయించాలని పార్టీ నాయకులను ఆదేశించారు.రెండవ కుమార్తె చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వేయిస్తామన్నారు. మరడ రాము కుమారుడు చదువుతున్నందున జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకోనున్నట్లు తెలిపారు. గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ రెడ్డి సింహాచలంతో కలసి బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ గేదెల సింహాద్రి అప్పలనాయుడు, జెడ్పీటీసీ రౌతు రాజేశ్వరి, వైస్ ఎంపీపీ మిత్తిరెడ్డి రమేష్, మాజీ జెడ్పీటీసీ మంత్రి అప్పలనాయుడు, పార్టీ నాయకులు ఫణీంద్రుడు, దత్తి చిరంజీవి ఉన్నారు. -
కురుపాంకు కూతవేటు దూరంలో గజరాజులు
కురుపాం: కొన్నేళ్లుగా ఏజెన్సీ మన్యంలో తిష్ట వేసిన గజరాజుల గుంపు ఆదివారం కురుపాం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న శివ్వన్నపేట సోమసాగరం చెరువు వద్దకు చేరుకున్నాయి. సమీపంలోని పంటలను ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సంబంధిత అటవీ శాఖ అధికారులు గజరాజుల సంచారంపై ముందస్తు సమాచారం ఇవ్వడంలో జాప్యం చేస్తుండడంతో ఎప్పుడు ఎక్కడ గజరాజులు తిరుగుతాయో తెలియని పరిస్థితి ఉందని, ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో తమ ప్రాణాలకే ముప్పు పొంచి ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం ఫోర్ట్: ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించా లని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. స్థానిక కంటోన్మెంట్ మున్సిపల్ పార్కులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సుమారు 2 లక్షల మంది పిల్లల కోసం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీని కోసం జిల్లా వ్యాప్తంగా 1172 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశా మన్నారు. తొలి రోజు పోలింగ్ కేంద్రాల్లో పోలి యో చుక్కలు వేయడంతో పాటు, 22 నుంచి 23 వరకు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. 24వ తేదీన పట్టణ ప్రాంతాల్లో పోలియో చుక్కలు వేయనున్నారని తెలిపారు. మారుమూల ప్రాంతాలు, సంచార జాతుల పిల్లలకు పోలియో చుక్కలు వేయడంపై ప్రత్యే క దృష్టి పెట్టామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.జీవనరాణి, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, డీఐవో డాక్టర్ అచ్చుతకుమారి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని చెప్పారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి స్లిప్పును తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనపుడు ఫోన్కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోన్ చెక్ చేసుకోవచ్చన్నారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్గా పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలని సూచించారు. మండల, డివిజన్ అధికారుల కార్యాలయంలో కూడా పీజీఆర్ఎస్ నిర్వహించాలని ఆదేశించారు. -
వైఎస్సార్సీపీ శ్రేణుల జోలికొస్తే సహించేది లేదు..
సాలూరు: నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా పని చేసిన తాను ఎల్లప్పుడూ హుందా రాజకీయాలే చేశానని అటువంటి తనపై, మా వైఎస్సార్సీపీ శ్రేణులపై మంత్రి సంధ్యారాణి చుట్టూ ఉన్న కొందరు కోవర్టులు తప్పుడు పోస్టింగ్లు పెడుతున్నారని వారెవ్వరిని విడిచిపెట్టే ప్రసక్తిలేదని, వారు నాలో మరో కోణాన్ని తప్పక చూస్తారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర స్పష్టం చేశారు. పట్టణంలో ఆదివారం మాట్లాడుతూ, సదరు టీడీపీ నేతల పోస్టింగ్లు భద్రపరుస్తున్నామని, డిజిటల్ బుక్లో సేవ్ చేస్తున్నామని తెలిపారు. వారెవ్వరిని వదిలిపెట్టబోమని, రాజన్నదొరలో మరో కోణాన్ని తప్పక వారు చూస్తారని హెచ్చరించారు. గతంలో ఏనాడు లేని విధంగా మంత్రి సంధ్యారాణి అనుచర వర్గం వలన పలువురు మహిళలు ఇబ్బందులు పడుతున్న విషయాలను మనం ఇటీవల చూశామని వివరించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ నియోజకవర్గంలో జరగలేదని గుర్తు చేశారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లిందన్నారు. మంత్రి పీఎస్పై బాధిత మహిళ ఫిర్యాదు చేసిన క్రమంలో ఆధారాలు ఫోరెన్సిక్కు పంపి ఇన్ని వారాలవుతున్నా నేటికి తదుపరి చర్యలు లేకపోవడం వలన కేసు తారుమారు చేస్తారేమోనని ప్రజల నుంని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఏం చేసుకుంటావో చేసుకో, నేను మంత్రి సంధ్యారాణి మనిషినని ఇటీవల బంగారమ్మ కాలనీలో ఓ టీడీపీ నేత చెప్పాడని ఓ బాధిత మహిళ తెలిపిందన్నారు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే వెంటనే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారని, తన పీఎస్ నాగరాజుపై మంత్రి డ్రైవర్ అసభ్య పదజాలంతో పోస్టింగ్లు పెట్టినా పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని అన్నారు. నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని విమర్శించారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను తామే చేయించామని మంత్రి సంధ్యారాణి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తన రాజకీయ జీవితంలో తానెప్పుడూ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని, ఎవరి జోలికి వెళ్లలేదని తెలిపారు. ప్రజలకు ఎప్పుడు నేను విధేయుడునేనని స్పష్టం చేశారు. కొందరు టీడీపీ రౌడీలు, గూండాలపై పోలీసులు చర్యలు తీసుకుని వారి ప్రవర్తనపై కఠినంగా ఉండాలన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణుల జోలికొస్తే సహించేది లేదని పునరుద్ఘాటించారు. రాజన్నదొరలో మరో కోణాన్ని చూస్తారు... నేనెప్పుడూ ప్రజలకు విధేయుడినే.. తప్పుడు పోస్టింగ్లు చేస్తున్న వారి వివరాలు డిజిటల్ బుక్లో నమోదు మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర -
ఖండాంతరాలు దాటిన అభిమానం
● వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ పెనుమత్స ● డల్లాస్లో అంబరాన్నంటిన సంబరాలునెల్లిమర్ల రూరల్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు యూఎస్ఏలోని డల్లాస్లో ఆదివారం ఘనంగా జరిగాయి. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స వెంకట సూర్యనారాయణరాజు(సురేష్బాబు) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
దృశ్యం లేదు.. సాక్ష్యం దొరకదు..
పార్వతీపురం రూరల్: ఇంటికొచ్చి తలుపులు బద్దలు కొట్టే రోజులు పోయాయి. దారి కాచి, కత్తులు చూపించి బెదిరించే రోజులకు కాలం చెల్లింది. ఇప్పుడు దొంగతనానికి ఆయుధాలు అక్కర్లేదు.. ముఖం చూపించాల్సిన పనే లేదు. ఏడు సముద్రాల అవతల కూర్చుని.. అరచేతిలో ఉండే ఫోన్తోనే మన బతుకును అతలాకుతలం చేస్తున్నారు. కంటికి కనిపించకుండానే.. క్షణాల్లో కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. టెక్నాలజీ ముసుగులో జరుగుతున్న ఈ నిలువు దోపిడీ ఇప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లాను కుదిపేస్తోంది. అమాయకత్వంతో కొందరు, అత్యాశతో ఇంకొందరు, భయంతో మరికొందరు ఈ సైబర్ ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. గడిచిన మూడేళ్ల గణాంకాలే ఇందుకు సాక్ష్యం. అక్షరాలా రూ.22 కోట్లకు పైగా సొమ్ము సైబర్ కేటుగాళ్ల పాలైంది. సైబర్ కేటుగాళ్ల గారడీ సైబర్ నేరగాళ్ల తీరు అచ్చు గారడీ విద్యను తలపిస్తోంది. ఊరు, పేరు తెలియని ఈ అదృశ్య నేరగాళ్లు ఎక్కడో ఉండి రెక్కీలు నిర్వహించకుండానే జేబులకు చిల్లులు పెడుతున్నారు. కేవలం ఒకే ఒక్క లింక్తో జీవితాన్ని తలకిందులు చేస్తున్నారు. ఏదో ఒక బహుమతి వచ్చిందనో, కరెంట్ బిల్లు కట్టలేదనో, లోన్ ఇస్తామనో మెసేజ్లు పెట్టి, మాటల మాంత్రికుల్లా మాయచేసి ఆ లింకులు క్లిక్ చేయిస్తున్నారు. లేదా ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయించి ఫోన్ను వారి ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. కళ్లు మూసి తెరిచే లోపే, బ్యాంకు ఖాతాలోని సొమ్మును ఊడ్చేస్తున్నారు. ఉద్యోగులు సైతం చదువు రాని వారే మోసపోతారనుకుంటే పొరపాటే. సమాజానికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, డబ్బు లెక్కలు చూసే బ్యాంకు ఉద్యోగులు సైతం ఈ వర్చువల్ వలలో చిక్కుకుంటున్నారు. ఇటీవల బొబ్బిలికి చెందిన ఓ ఉపాధ్యాయుడు ఏకంగా రూ.22.18 లక్షలు పోగొట్టుకున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. యువత, మహిళలు, ఉద్యోగులే వీరి ప్రధాన లక్ష్యం. ఒకపక్క సైబర్ నేరాలు రాకెట్ వేగంతో దూసుకెళ్తుంటే, వాటి విచారణ మాత్రం నత్తనడకన సాగుతోంది. 2023 నుంచి నమోదైన కేసుల్లో కేవలం పది మాత్రమే కోర్టు మెట్లెక్కాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 28 కేసుల్లో సరైన ఆధారాలు దొరకలేదని ఛార్జిషీట్లు మూసేశారు. మిగిలిన వాటిపై విచారణ సాగుతూనే ఉంది. ఈ గణాంకాలు బాధితుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ అనే భూతం! ఇప్పుడు కొత్తగా డిజిటల్ అరెస్ట్ అనే భూతాన్ని తెరపైకి తెచ్చారు. సీబీఐ, ఈడీ, పోలీసులమంటూ వీడియో కాల్ చేసి, నీ ఆధార్తో డ్రగ్స్ పార్శిల్ వెళ్తోంది.. మనీ లాండరింగ్ జరిగింది అని బెదిరించి, గదిలో బంధించినట్టు భ్రమింపజేసి రూ.లక్షలు లాగేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అనేదే చట్టంలో లేదు. అది కేవలం భ్రమ మాత్రమే అని పోలీసులు నెత్తి నోరు బాదుకుంటున్నా, జనం మాత్రం భయంతో డబ్బులు సమర్పించుకుంటున్నారు. ఈ మాయగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే అప్రమత్తతే ఆయుధం. వాట్సాప్, మెసేజ్లలో వచ్చే అనవసరపు లింకులు, అస్సలు క్లిక్ చేయకూడదు. ప్లే స్టోర్ కాకుండా బయటి నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేశారో.. మీ ఫోన్ వారి చేతికి ఇచ్చినట్లే. ఎవరైనా వీడియో కాల్ చేసి అరెస్ట్ చేస్తామంటే ధైర్యంగా కట్ చేయాలి. ముఖ్యంగా మీ ఓటీపీలు, బ్యాంకు వివరాలు, పిన్ నెంబర్లు ఎవరికీ చెప్పకూడదు. ఒకవేళ పొరపాటున డబ్బులు పోయిన వెంటనే తేరుకుంటేనే రికవరీకి అవకాశం ఉంటుంది. జిల్లాలో సైబర్ నేరాల తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మోసగాళ్లు వాడుతున్న కొత్త పద్ధతులపై జాగ్రత్త వహించాలి. సైబర్ నేరగాళ్లు మరొకరి వలె నటించడం ద్వారా వంచన చేస్తున్నారు. నకిలీ కస్టమ్స్, సీబీఐ లేదా పోలీసు అధికారులమని వేషం వేసి, వాట్సాప్ లేదా వీడియో కాల్స్ ద్వారా ప్రజలను భయపెడుతున్నారు.అందుకే, అపరిచితుల కాల్స్కు స్పందించవద్దు. ముఖ్యంగా బెదిరించే కాల్స్ను నమ్మకూడదు. ఎవరికీ మీ వ్యక్తిగత, ఆర్థిక లావాదేవీల వివరాలను, ఓటీపీలను చెప్పవద్దు. మోసపోయినట్లు తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 నెంబరుకు కాల్ చేసి, సైబర్క్రైమ్.జివోవి.ఇన్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి. –బి రవీంద్ర రాజు, సైబర్ సెల్ ఎస్ఐ, పార్వతీపురం మన్యం జిల్లా లింకులతో లంకె.. ఖాతాలకు గాలం! కూర్చున్న చోట నుంచే రూ.కోట్లు కొల్లగొడుతున్నారు ఉమ్మడి జిల్లాలో మూడేళ్లలో రూ.22 కోట్లు హాంఫట్ డిజిటల్ అరెస్టు పేరుతో సరికొత్త దడ సైబర్ వలలో చిక్కుకుంటున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు గత మూడేళ్లలో 380 కేసులు మోసపోయామని తెలిసిన వెంటనే 1930 నెంబర్కు కాల్ చేయడం లేదా అధికారిక వెబ్సైట్లో ఫిర్యాదు చేయడం ఒక్కటే మన సొమ్మును కాపాడే మార్గమని సైబర్ సెల్ అధికారులు సూచిస్తున్నారు. ఇక్కడ ఆలస్యం అమృతం విషం కాదు.. ఆలస్యం అర్థం (డబ్బు) వ్యర్థం! -
జనవరి 4న చలో విశాఖ
బొబ్బిలిరూరల్: ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా వచ్చే ఏడాది జనవరి 4న ఆర్కేబీచ్లో నిర్వహిస్తున్న సీఐటీయూ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా ఉపాధ్యక్షుడు పి.శంకరరావు పిలుపునిచ్చారు. పిరిడి పీహెచ్సీలో ఆశవర్కర్లు, ఏఎన్ఎం, వైద్యసిబ్బందితో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 29 లేబర్ చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ అమలుచేస్తూ కోట్లాదిమంది కార్మికుల శ్రమదోపిడీకి మోదీ ప్రభుత్వం పూనుకుందని మండిపడ్డారు. చలో విశాఖను విజయవంతం చేయాలని కోరారు.జిల్లాలో 29 స్క్రబ్ టైఫస్ కేసుల నమోదు విజయనగరం ఫోర్ట్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు 29 నమోదైనట్టు డీఎంహెచ్ఓ ఎస్.జీవనకుమారి తెలిపారు. 194 మందిని పరీక్షించగా 29 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందన్నారు. పీహెచ్సీల్లో నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వస్తే ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ల్యాబ్లో ఎలిజా టెస్టు ద్వారా నిర్ధారిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం వ్యాధి సోకినవారంతా ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. -
నిబంధనలకు పాతర..!
విజయనగరం ఫోర్ట్: జిల్లా పౌరసరఫరాల సంస్థలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో చేపట్టిన పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారంటూ పలు వురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేశారు. అర్హతలు కాదని డబ్బులు ఇచ్చిన వారికే పోస్టులు కట్టబెట్టారన్నది వారి ఆరోపణ. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో దర్యాప్తునకు విజిలెన్స్ అధికారులను నియమించారు. కొద్ది రోజులుగా అధికారుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగుచూస్తున్నట్టు సమాచారం. పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలను గుర్తించినట్టు తెలిసింది. దర్యాప్తు నివేదికను ఒకటి రెండు రోజుల్లో ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు సమాచారం. ● ఇదీ పరిస్థితి... జిల్లా పౌరసరఫరాల సంస్థలో అకౌంటెంట్ గ్రేడ్–3 మూడు పోస్టులు (కాంట్రాక్టు పద్ధితిలో), డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు–01 (ఔట్ సోర్సింగ్), టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్–3 పోస్టులు–07 (కాంట్రాక్ట్ పద్ధతిలో) భర్తీకి 2023 నవంబర్ 25వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు. అకౌంటెంట్ పోస్టుకు ఎం.కామ్ విద్యార్హత, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ఏదైనా డిగ్రీ, ఎం.ఎస్ ఆఫీస్ అప్లికేషన్స్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ విద్యార్హతగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన కొద్ది నెలలకే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. 2024 ఆగస్టులో పోస్టులు భర్తీ చేశారు. నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టుల భర్తీలో రోస్టర్ పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోస్టర్ పాటించకపోవడం వల్ల అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగం రాలేదని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులను అసలు ఇంటర్వ్యూకే పిలవలేదని చెబుతున్నారు. అకౌంటెంట్ పోస్టుల విషయంలో ఎస్సీ మహిళ కేటగిరికీ అభ్యర్థినికి పోస్టు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఈ రెండు రోస్టర్లు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. విజిలెన్స్ దర్యాప్తులో కూడా ఈ విషయం నిర్ధారణ అయినట్టు సమాచారం. కొన్ని పోస్టుల విషయంలో విద్యార్హత లేక పోయినప్పటకీ పోస్టులు కట్టబెట్టారన్న విమర్శలు ఉన్నాయి. విజిలెన్స్ అధికారుల దర్యాప్తుతో అర్హత లేకుండా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళా అభ్యర్థి పేరు ఉప్పలాపు భారతి. ఈమెది నెల్లిమర్ల ప్రాంతం. జిల్లా పౌరసరఫరాల సంస్థ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్కు దరఖాస్తు చేశారు. అకౌంటెంట్ పోస్టుకు సంబంధించి అన్ని విద్యార్హతలు ఉన్నా ఆమెను ఇంటర్వ్యూకు పిలవలేదు. ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దర్యాప్తు జరుగుతోంది పోస్టులు భర్తీచేసిన సమయంలో జిల్లా మేనేజర్గా విధుల్లో చేరలేదు. పోస్టుల భర్తీ ప్రక్రియ తెలియదు. విజిలెన్స్ అధికారుల దర్యాప్తు జరుగుతోంది. – బి.శాంతి, జిల్లా మేనేజర్, సివిల్ సప్లయీస్ సివిల్సప్లై ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు..! అకౌంటెంట్ పోస్టుల భర్తీలో రోస్టర్ అమలు చేయలేదని ఆరోపణ విచారణ చేపడుతున్న విజిలెన్స్ అధికారులు పోస్టుల భర్తీకోసం డబ్బులు చేతులు మారాయన్న విమర్శలు -
మీరు చెప్పిందేనా.. నేను చెప్పింది వినరా!
పార్వతీపురం మండలం జమదల గ్రామంలో సుమారు 600 మంది రైతులు ధాన్యం పండించారు. దాదాపు పది రోజులుగా నూర్పిడిచేసిన సుమారు 60 లారీల లోడ్ల ధాన్యంను విక్రయానికి సిద్ధం చేశారు. ఇప్పటికీ ప్రభుత్వపరంగా కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. మిల్లర్లంతా సిండికేట్గా మారి.. జమదాల ధాన్యమంటే తీసుకోవద్దని ఒక మాట మీదకు వచ్చారు. 40 కిలోల బస్తా దగ్గర అదనంగా మూడు కిలోలు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. బంగారంలా ఉన్న ధాన్యాన్ని అదనంగా ఎందుకు ఇవ్వాలని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఎక్కడ అమ్ముకుంటారో చూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇదే విషయమై సంయుక్త కలెక్టర్ యశ్వంత్కుమార్రెడ్డిని కలిసి రైతులంతా వివరించారు. ఆయన సమాధానం.. ‘గతేడాది మీ దగ్గర ధాన్యానికి సంబంధించి ఫిబ్రవరి వరకు ట్రక్షీట్లు ఉన్నాయి. ఇప్పుడెందుకు తొందర!’ అని బదులిచ్చారు. రైతులు ఏదో చెప్పబోతుండగా.. ‘మీరు చెప్పిందేనా.. నేను చెప్పింది వినరా?’ అంటూ ఎదురుప్రశ్నించారు. -
రోడ్ల నిర్మాణంపై.. మక్కువ చూపేదెన్నడు?
సాలూరు రూరల్: జిల్లాలోని ఏజెన్సీ రోడ్లు అధ్వానంగా మారాయి. రాకపోకలకు గిరిజనం ఇబ్బంది పడుతున్నారు. పల్లెపండగ పేరుతో రోడ్లను అద్దంలా తీర్చిదిద్దుతామని చెప్పిన చంద్రబాబు సర్కారు మళ్లీ పండగ వస్తున్నా రోడ్ల నిర్మాణంపై కనీసం దృష్టిసారించలేదు. ‘ఏ రోడ్డు చూసినా ఏముంది గర్వకారణం.. అన్నీ రాళ్లమయం’ అన్న చందంగా మారాయి. సీ్త్రశిశుసంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో పలు గ్రామాల రోడ్లు గోతులతో దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వంలో మంజూరైన రోడ్ల పనులు కూడా నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర కృషితో సాలూరు నుంచి మక్కువకు 19 కిలోమీటర్ల మేర రోడ్డు, 9 వంతెనలు నిర్మాణ పనులకు రూ.55 కోట్లు మంజూరయ్యాయి. రోడ్లు భవనాల శాఖ అధికారులు వంతెన పనులు ప్రారంభించి మూడు వంతెన నిర్మాణాలు పూర్తిచేశారు. ఎన్నికలు రావడం, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. నిర్మిస్తామన్నారు.. వదిలేశారు.. మంత్రి సంధ్యారాణి ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మక్కువ రోడ్డు నిర్మాణం పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. 18 నెలలు గడిచినా రోడ్డు పనులు ప్రారంభించలేదు. దీంతో ఉన్న నిధులు వెనక్కి మళ్లిపోయాయి. రోడ్లు పనులకు రూ.55 కోట్లు అవసరం కాగా ప్రస్తుతం రూ.10 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. పనులు 6 నెలలుగా టెండరు దశలోనే ఉన్నాయి. చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్లే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిలిచిన బస్సు సర్వీసు మక్కువ రోడ్డంతా గుంతల మయం కావడంతో ఆర్టీసీ యాజమాన్యం సాలూరు–మక్కువ రోడ్డులో సర్వీసును నిలిపివేసింది. ఆరు నెలలుగా ఈ ప్రాంతీయులకు బస్సు సర్వీసు దూరమైంది. ప్రయాణానికి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. బాగువలస గ్రామం మీదుగా ప్రయాణించాల్సిన బస్సు ఇప్పుడు మామిడిపల్లి, శంబర గ్రామాల మీదుగా నడుపుతున్నారు. మంత్రి స్పందించి తక్షణమే రోడ్డు నిర్మాణానికి చొరవ చూపాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు. అధ్వానంగా మక్కువ రోడ్డు గత ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణానికి రూ.55 కోట్ల కేటాయింపు చంద్రబాబు ప్రభుత్వంలో రూ.10 కోట్లకు కుదింపు 6 నెలలుగా టెండర్ దశకే పరిమితం రాకపోకలకు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు -
మాకూ చలివేస్తోంది...
మనుషులనే కాదు మూగజీవాలను చలి వణికిస్తోంది. వెచ్చదనం కోసం అన్ని జీవులూ పాకులాడుతున్నాయి. దీనికి బొబ్బిలి పట్టణంలోని సీబీఎం బాలికల హైస్కూల్ వద్ద శుక్రవారం కనిపించిన ఈ చిత్రమే నిదర్శనం. ఇక్కడ రోడ్డుకిరువైపులా ఆకు కూరలు, కూరగాయలమ్మే విక్రయదారులు సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు అక్కడి చెత్తను తగులబెడతారు. వారు కొద్దిసేపు చలికాచుకున్నాక ఇళ్లకు వెళ్లిపోతారు. అంతవరకూ రోడ్డుపై సంచరించే ఆవులన్నీ మంట వద్దకు వెళ్లి ఇలా వెచ్చదనం పొందుతాయి. మాకూ చలి ఉందనే సంకేతాన్నిస్తున్నాయి. – బొబ్బిలి -
వాజ్పేయి ఆదర్శనీయులు
విజయనగరం రూరల్: మాజీ ప్రధాని, భారతరత్న ఏబీ వాజ్పేయి ఆదర్శనీయులని, ఆయన చూపిన మార్గంలోనే నరేంద్ర మోదీ సర్కారు పయనిస్తోందని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. వాజ్పేయి శతజయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్రవ్యాప్త సుపరిపాలన (బస్సు) యాత్రలో భాగంగా శుక్రవారం విజయనగరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధికి వాజ్పేయి అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ఆయన సంస్కరణ వాది అని కొనియాడారు. ఆయన స్థిరమైన నిర్ణయాలతో దేశం ఆర్థికంగా ముందుకు సాగుతుందని, నేడు దేశం ఆర్థికవృద్ధి రేటులో ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరుకుందన్నారు. కొందరు దేశాధినేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మనది డెడ్లీ ఎకానమీ అని ఎద్దేవా చేస్తూ, పొరుగు దేశానికి సాయం చేయాలని చూసినా మన దేశం సాధిస్తున్న ప్రగతిని ప్రపంచ ఆర్థిక సంస్థలు కొనియాడుతున్నాయన్నారు. యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. హింసా, వ్యసనాలకు లోనుకాకుండా మనంచేసే పనిమీద దృష్టి సారిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వాజ్పేయి ఆదర్శభావాలను ప్రతీ ఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమానికి ముందుగా విజయనగరం శివారు వై కూడలి వద్ద ఏర్పాటుచేసిన వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. ఆయన చూపిన మార్గంలోనే మోదీ సర్కారు పయనిస్తోంది 2047 నాటికి వికసిత్ భారత్ సుపరిపాలన యాత్రలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు -
కొఠియా ఒడిశాదే..
● వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఒడిశా మంత్రి సాలూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఉన్న వివాదాస్పద కొఠియా గ్రూపు గ్రామాలకు ఒడిశాయే తల్లి అని, ఆంధ్రా పిన్ని వంటిదంటూ ఒడిశా రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొఠియా ఎప్పటికీ ఒడిశాదేనంటూ నమ్మబలికారు. కొఠియాలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 31 మంది మహిళా సంఘాల సభ్యులకు ఒడిశా ప్రభుత్వం మంజూరు చేసిన కోటి రూపాయల రుణం, రైతులకు బఠానీ విత్తనాలు అందజేశారు. రూ.2లక్షల16 వేలు విలువైన బ్రాయిలర్ ఫాం యూనిట్ను మంజూరు చేశారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్, పొట్టంగి, కొరాపుట్, కోట్పాడ్ ఎమ్మెల్యేలు రామచంద్ర కదమ్, రఘరామ్ మాచ్, రూపు భత్రా, భద్రతా అధికారి రోహిత్ వర్మ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడిలో ఏఐ పాఠాలు
చీపురుపల్లి: చదువు మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుందని, విద్యార్థులు ప్రయోజకులైతే ఆ కుటుంబాలు బాగుపడతాయని నమ్ముతూ ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన విద్యను అందించేందుకు నాటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కృషిచేసింది. నాడు–నేడుతో ప్రభుత్వ బడులకు ఆధునిక హంగులు కల్పించడంతో పాటు ట్యాబ్లు, బైజూస్ కంటెంట్తో పాఠ్యాంశాలను బోధించేలా విద్యాసంస్కరణలు చేపట్టింది. అక్కడితో ఆగకుండా ప్రస్తుత రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్సీ(ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎనిమిదో తరగతి నుంచి ఏఐను పరిచయం చేయడంతోపాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి భవిష్యత్ను తీర్చిదిద్దుకోలిగే సామర్థ్యాలు అందించాలని భావించారు. ఇంటెల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని 2024 మార్చి 2న చీపురుపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద ఏఐ ల్యాబ్ను ప్రారంభించారు. తరువాత కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ల్యాబ్లు ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రతిపాదన మూలకు చేరిన విషయం తెలిసిందే. ఆలిండియా ఏఐ ఇంపాక్ట్ ఫెస్టివల్లో చీపురుపల్లి విద్యార్థులు 2025 నవంబర్ నెలలో ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో కేంద్ర విద్యాశాఖ, ఇంటెల్ సంస్థ సంయుక్తంగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్సీ ఇంపాక్ట్ ఫెస్టివల్ నిర్వహించాయి. ఈ ఫెస్టివల్లో చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఏఐ ల్యాబ్లో శిక్షణ తీసుకున్న ఆర్.హర్షిత (9వ తరగతి), పీవిఎల్.ప్రణవి, పి.తనిష్క్లు సిద్ధం చేసిన సిటిజన్ క్రెడిట్ కార్డు, ఏఐ ఆధారిత క్యూ మేనేజ్మెంట్ అనే రెండు ప్రాజెక్టులు ప్రదర్శించారు. వీటిని పరిశీలించిన ఇంటెల్ అంతర్జాతీయ వ్యవరాల ప్రతినిధి సారా కెంప్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. భారత ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్ కార్యదర్శి ఎస్.కృష్ణన్ చీపురుపల్లి పాఠశాలను పేరును ప్రస్తావిస్తూ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. 50 ప్రాజెక్టులకు రూపకల్పన చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో ఏఐ ల్యాబ్ ఏర్పాటైనప్పటి నుంచి అక్కడ ఫెసిలిటేటర్ బాధ్యతలను అదే పాఠశాలలోని హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఏవీఆర్డీ ప్రసాద్కు అప్పగించారు. ఆయన శిక్షణలో ఏడాదిన్నర కాలంలో విద్యార్థులు 50 ప్రాజెక్టులు వరకు రూపొందించారు. ఏఐ ఫర్ ఫ్యూచర్ అనే యూట్యూబ్ ఛానల్ను కూడా తయారుచేసి అందులో వీరు తయారు చేసిన ప్రాజెక్టులను అప్లోడ్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా బ్లైండ్ పీపుల్ అసిస్టెన్స్ డివైజ్ (బీఏడీ) యాప్ను తయారు చేశారు. ఇటీవల ఇదే పాఠశాలకు చెందిన ఆర్.హర్షిత, పీవీఎల్ ప్రణవి పారిశుద్ధ్యంపై ఎన్పవరింగ్ అవర్ శానిటేషన్ హీరోస్ పేరుతో సిటిజన్ క్రెడిట్ కార్డు అనే ప్రాజెక్టును రూపొందించారు. ఎంతో విలువైన సేవలందించే పారిశుద్ధ్యకార్మికులతో పాటు సమాజానికి ఉపయోగపడే ప్రతీ ఒక్కరికీ సిటిజన్ క్రెడిట్ కార్డు ద్వారా పాయింట్లు కేటాయించి వారికి విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను వంటి అంశాల్లో రాయితీలు ఇవ్వడం ఈ సిటిజన్ క్రెడిట్ కార్డు ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. నాటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ముందుచూపు చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో ఏఐ ల్యాబ్ ఏర్పాటు ఇంతవరకు 50 ఏఐ ప్రాజెక్టులు తయారు చేసిన విద్యార్థులు ఢిల్లీ స్థాయిలో ప్రదర్శనలు -
సక్రమంగా వైద్యసేవలు అందించాలి
బలిజిపేట: పీహెచ్సీలో రోగులకు అన్ని రకాల సేవలు సక్రమంగా అందించాలని హెల్త్ డైరెక్టర్ కె.పద్మావతి సూచించారు. బలిజిపేట పీహెచ్సీని ఆమె శనివారం సందర్శించారు. పీహెచ్సీ పరంగా ఓపీ సేవలతో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన సేవలు సక్రమంగా అందించాలన్నారు. ప్రభుత్వ పరంగా వారికి అందించాల్సిన పథకాలను పక్కాగా అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణుల విషయంలో పీహెచ్సీలలో ప్రసవాలు జరిగే విధంగా చూడాలన్నారు. చిన్నారులకు క్రమం తప్పకుండా వేక్సినేషన్లు వేయించాలన్నారు. రికార్డులు పరిశీలించారు. పల్స్ పోలియోను శతశాతం విజయవంతం చేయాలన్నారు. షెడ్యూల్ ప్రకారం పోలియో చుక్కలు వేయాలన్నారు. దీనికి సంబంధించి సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. డీఎంహెచ్వో భాస్కరరావు, రాష్ట్ర లెప్రసీ కన్సల్టెన్సీ సత్యం, బడ్జెట్ రాష్ట్ర ఫైనాన్స్ అధికారి జావీద్, జిల్లా ప్రోగ్రాం అధికారి రఘు, పీహెచ్సీ వైద్యాధికారిణి క్రాంతి కిరణ్మయి, మాధురి, సిబ్బంది పాల్గొన్నారు. హెల్త్ డైరెక్టర్ పద్మావతి -
సారా తయారీ కేంద్రాలపై దాడి
పార్వతీపురం రూరల్ : అంత్ర్రాష్ట్ర సరిహద్దుల్లో సారా తయారీ కేంద్రాలే లక్ష్యంగా ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళగిరి ప్రొహిబిషన్, ఎకై ్సజ్ డైరెక్టర్ ఆదేశాలతో పార్వతీపురం మన్యం జిల్లా అధికారులు శనివారం ఒడిశా పోలీసులతో కలిసి భారీ ఆపరేషన్ నిర్వహించారు. కోరాపుట్ జిల్లాలోని హతిగడ, కర్లీ, హతిగడ కాలనీ గ్రామాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో సుమారు 6,800 లీటర్ల బెల్లపు ఊటతో పాటు 150 లీటర్ల సారాను గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో జరిగిన దాడుల్లో పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం, సీతానగరం స్టేషన్ల సిబ్బందితో పాటు విజయనగరం ఎన్ఫోర్స్మెంట్, బృందాలు, సాలూరు బీఎంపీపీ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక ఒడిశా ఎకై ్సజ్ అధికారుల సహకారంతో నిర్వహించిన ఈ సోదాల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మూడు కేసులు నమోదు చేశారు. సరిహద్దు గ్రామాల్లో అక్రమ మద్యం రవాణా, తయారీపై నిరంతరం నిఘా ఉంటుందని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. -
సీడీపీవోకు ఏసీడీపీవోగా బదిలీ
● ఆకస్మిక బదిలీపై అనుమానాలు విజయనగరం ఫోర్ట్: విజయనగరం అర్బన్ సీడీపీవో జి.ప్రసన్న కు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏసీడీపీవోగా డిప్యూటేషన్పై బదిలీ అయింది. ఈ మేరకు రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అర్బన్ ప్రాజెక్టులో ఏసీడీపీవోకు ఇన్చార్జ్ సీడీపీవోగా బాధ్యతలు అప్పగించారు. అయితే సీడీపీవోల బదిలీ పక్రియ కొన్ని నెలలు క్రితమే ముగిసింది. ఎటువంటి బదిలీలు లేని సమయంలో సీడీపీవోను అది కూడా ఏసీడీపీవోగా డిప్యూటేషన్పై బదిలీ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్ సీడీపీవో, ఇన్చార్జ్ పీడీగా కూడా పని చేసిన ఆమెను ఏసీడీపీవోగా బదిలీ చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. గత కొంత కాలంగా ఐసీడీఎస్లో అంతర్గత విబేధాలు తలెత్తినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్(పి.డి)కి సీడీపీవోకు మధ్య అంతర్గత విబేధాలు నడుస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ తరుణంలో సీడీపీవో బదిలీ జరగడం సర్వత్రా చర్చినీయాంశమైంది. ఇదే విషయాన్ని ఐసీడీఎస్ పి.డి విమలారాణి వద్ద సాక్షి ప్రస్తావించగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో డిప్యూటేషన్పై ఏసీడీపీవోగా ప్రసన్నను బదిలీ చేశారని తెలిపారు. ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ శ్రీకాకుళం రూరల్: హెచ్పీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, బొల్లినేని మెడిస్కిల్ సంయుక్తంగా బ్యుటీషియన్, హోటల్ మేనేజ్మెంట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (నర్సింగ్), ప్రొడక్షన్ మిషన్ ఆపరేటివ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ మేడపై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ, పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 28 ఏళ్ల వారు అర్హులని తెలిపారు. శిక్షణలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. విజయనగరం అర్బన్: పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు కొన్నేళ్లుగా పరిష్కారం కాని అపరిశుధ్య సమస్య ఎదురయింది. ఐటీఐలోని తరగతుల నిర్వాహణ భవనానికి ఆనుకొని ఉన్న గిరిజన సంక్షేమ వసతిగృహం నుంచి మరుగుదొడ్ల మురుగునీరు రావడాన్ని మంత్రి కొండపల్లికి అక్కడి ఐటీఐ విద్యార్థులు చెప్పుకున్నారు. కొన్నేళ్లుగా ఈ సమస్య కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి దృష్టిలో ఉంది. మరుగుదొడ్ల మురుగునీటి ప్రవాహం ఐటీఐ ప్రాంగణంలోకి రాకుండా కాలువను నిర్మించుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావుకు కొన్ని నెలల క్రితం ఆదేశాలిచ్చానని ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందర్రెడ్డి అన్నారు. సంబంధిత గిరిజన సంక్షేమ అధికారి పట్టించుకోకపోవడంపై మంత్రి ఎదుటే కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుదొడ్ల ప్రవాహ మరుగునీటి సమస్యను శాఖపరమైన ఉన్నదాధికారులకు తెలియజేసి ప్రత్యామ్నాయ మార్గం పనుల చేపట్టాలని మంత్రి ఆదేశాలిచ్చారు. అనంతరం ఐటీఐ ప్రాంగణంలో మొక్కలు నాటి, పరిసరాలను పరిశభ్రం చేశారు. కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ టీవీగిరి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్, గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి బలిజిపేట: మండలంలోని బర్లి గ్రామం సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శశాంక్(20) మృతి చెందినట్టు ఎస్ఐ సింహాచలం తెలిపారు. వారి వివరాల ప్రకారం బర్లి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి లారీ, మోటార్ సైకిల్ ఢీ కొనడంతో ముగ్గురు గాయాలవగా వీరిని బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో శశాంక్ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి తిరిగి అక్కడ నుంచి మెరుగైన వైద్య నిమిత్తం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. -
గ్రంథాలయాలకు చంద్ర గ్రహణం
మెరకముడిదాం: విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఉపయోగపడే గ్రంథాలయాలు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారుతున్నాయనే చెప్పుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రంథాలయాలకు అవసరమయ్యే కొత్త పుస్తకాలు కొనుగోలు చేయకపోవడంతో పాత సమాచారంతో ఉన్న పుస్తకాలు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగపడడంలేదు. ఫలితంగా నిరుద్యోగులు గ్రంథాలయాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సిబ్బంది కొరత కూడా తోడు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తున్న గ్రంథాలయాలు మూతపడే పరిస్థితి నెలకొంది. ఆధునిక దేవాలయాలుగా పేరుబడిన గ్రంథాలయాలు మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు చెందకపోవడంతో అటు పాఠకులు, ఇటు నిరుద్యోగుల ఆదరణ కరువై నిర్వీర్యమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం గ్రంథాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం, కొత్త పుస్తకాలు కొనుగోలుకు అనుమతులు లేకపోవడంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు చేసేది లేక ఇతర మార్గాలను వెతుక్కుంటున్నారు. మరికొందరు విద్యార్థులు ఏఐ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మొత్తం 41 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో గ్రేడ్ – 1 గ్రంథాలయాలు – 1, గ్రేడ్ – 2 గ్రంథాలయాలు – 4, గ్రేడ్ – 3 గ్రంథాలయాలు–33, గ్రామీణ గ్రంథాలయాలు – 3 వున్నాయి. ఉమ్మడి విజయనగరంలో వున్న 41 గ్రంథాలయాల్లో 26 గ్రంథాలయాలకు సొంత భవనాలు వుండగా మిగిలిన వాటిలో 8 గ్రంథాలయాలు అద్దె భవనాల్లోనూ, 7 గ్రంథాలయాలను అద్దె లేని భవనాలలో అధికారులు నిర్వహిస్తున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో క్రీడలు, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు గణనీయంగా మారాయి. అన్ని రంగాల్లో కరెంట్ అఫైర్స్ మారిపోయాయి. వీటన్నింటితో కూడిన పుస్తకాలు టెట్, డీఎస్సీతో పాటూ బ్యాంకింగ్ రంగానికి చెందని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి గ్రంథాలయాల్లో అందుబాటులో లేవు. గ్రూప్ పరీక్షలకు హాజరయ్యే వారికి అవసరమైన ఎకనామీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ పుస్తకాలు అవసరం. నిరుద్యోగ అభ్యర్థులకు అప్డేట్ కరెంటు అఫైర్స్ అందుబాటులో లేకపోవడంతో గ్రంథాలయాలకు వచ్చిన అభ్యర్థులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొత్త పుస్తకాలు కొనుగోలులో చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం గ్రంథాలయాలను వేధిస్తున్న పుస్తకాలు, సిబ్బంది కొరత అందుబాటులో లేని కాంపిటేటివ్ పుస్తకాలు ఉమ్మడి విజయనగరం జిల్లాలో 41 గ్రంథాలయాలు 11 లైబ్రేరియన్ల పోస్టులు ఖాళీ సిబ్బంది కొరతతో మూతపడుతున్న కొన్ని గ్రంథాలయాలువేధిస్తున్న ఉద్యోగుల కొరత ఇదిలా వుంటే మరోవైపు ఈ గ్రంథాలయాలను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. జిల్లా వ్యాప్తంగా 11 లైబ్రేరియన్ పోస్టులు, 2 రికార్డు అసిస్టెంట్ పోస్టులు, 14 ఆఫీసు సబార్డినేట్ పోస్టులు ఖాళీగా వున్నాయని అధికారులు చెబుతున్నారు. గ్రంథాలయాధికారులు 11, రికార్డు అసిస్టెంట్లు రెండు, ఆఫీస్ సబార్డినేట్లు 14 ఖాళీలున్నాయి. జిల్లాలో వున్న 41 గ్రంథాలయాల పరిధిలో 33,640 మంది సభ్యులు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. లైబ్రేరియన్ల కొరత కారణంగా కొన్ని లైబ్రేరీలకు ఇన్చార్జ్లే దిక్కుగా మారింది. అదే విధంగా మరోవైపు ఇన్చార్జ్ బాధ్యతలను నిర్వహిస్తున్న లైబ్రేరియన్లకు అదనపు పని భారంతో పాటూ ఆర్థిక భారం కూడా తోడవుతుందంటున్నారు. అదనంగా చేస్తున్న పనికి ప్రభుత్వం అదనంగా జీతం ఇవ్వడం లేదు సరికదా కనీసం టీఏ, డీఏలైనా ఇవ్వకపోతే తమ వేతనాల్లో నుంచి ఎన్నాళ్లు ఖర్చు చేయగలగమని వాపోతున్నారు. -
ఏఐ ల్యాబ్తో గొప్ప లక్ష్యం
ఎంతో గొప్ప లక్ష్యంతో 2024 మార్చి2న గత ప్రభుత్వం ఏఐ ల్యాబ్ను చీపురుపల్లి బాలుర ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇదొక వరం. ల్యాబ్ ఏర్పాటైనప్పటి నుంచి దాదాపు 50 ప్రాజెక్టులు వరకు విద్యార్థులు తయారుచేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆర్టిఫీషియల్ ఇంప్లాక్ట్ ఫెస్టివల్లో తమ పాఠశాల విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ కార్యదర్శి ఎస్.కృష్ణన్, ఇంటెల్ సంస్థ అంతర్జాతీయ వ్యవరాల ప్రతినిధి సారా కెంప్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు సాంకేతిక రంగంలో ఎదిగేందుకు ఇదొక గొప్ప అరుదైన అవకాశం. పాఠశాల హెచ్ఎం ఉమామహేశ్వరి ప్రోత్సాహంతో విద్యార్థులకు ఏఐ పాఠాలు బోధిస్తున్నాం. – ఏవీఆర్డి.ప్రసాద్, ఏఐ ల్యాబ్ ఫెసిలిటేటర్, చీపురుపల్లి -
ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుద్దాం
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుద్దామని జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ, ఇతర శాఖల అధికారులతో ఆయన శనివారం సమీక్షించారు. మార్కెట్లు, దుకాణాలు, గ్రామ వారపు సంతల్లో ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ అధికంగా ఉంటుందన్నారు. దీనివల్ల డ్రైనేజీలు పూడుకు పోవడంతోపాటు పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ప్లాస్టిక్ నిషేదంపై కఠినంగా వ్యవహరించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీ అపరాద రుసుం విధించాలన్నారు. ప్లాస్టిక్ తయారీ యూనిట్లపై నిఘా పెంచాలని కోరారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె.హేమలతో పాటు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యం
పార్వతీపురం: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు, చిన్నారులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే లక్ష్యంగా పని చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో ఆయన శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అంగన్వాడీలకు పంపిణీ చేసే బియ్యం, కందిపప్పు, వంటనూనె నాణ్యతా ప్రమాణాలతో ఉండాలని ఎక్కడా నిల్వలు నిలిచిపోకుండా సకాలంలో సరఫరా చేయాలని ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. చిన్నారులకు, గర్భిణులకు అందించే పాలు తాజాగా ఉండేలా చూడాలని ఏపీ డెయిరీ ద్వారా సరఫరా ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు. కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్ల నాణ్యతను పర్యవేక్షించాలన్నారు. చిన్నారుల శారీరక పెరుగుదలకు అవసరమైన బాలామృతం, పోషకాహార కిట్ల పంపిణీని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. మెనూ ప్రకారం పోషకాహారం అందించేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. సమీక్షలో ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి -
కాళ్లపారాణి ఆరకముందే...
● రైలు నుంచి జారిపడి నవదంపతులు మృతి గరుగుబిల్లి: కాళ్లపారాణి ఆరకముందే వారిపై విధి కన్నెర్ర చేసింది. రైలు ప్రమాదం రూపంలో కాటేసింది. అందని లోకాలకు తీసుకుపోయి రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందిన కోరాడ సింహాచలం(25), జియ్యమ్మవలస మండలం అంకవరం వాసి భవానీ (19)కి ఈ ఏడాది అక్టోబర్ 22న పెళ్లి జరిగింది. అనంతరం జీవనోపాధి కోసం హైదరాబాద్ వెవెళ్లారు. కొద్దిరోజుల అనంతరం అక్కడ నుంచి విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు శుక్రవారం రాత్రి సికింద్రాబాద్లో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఎక్కారు. యాదాద్రి జిల్లా వంగపల్లి దాటిన తరువాత బోగి డోరు వద్ద నిలబడిన ఇద్దరు ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఏమైందో తేరుకొనేలోపే ఆ ఇద్దరు దంపతులు అనంతలోకాలకు చేరారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం స్వగ్రామమైన రావుపల్లికి తరలించారు. నవదంపతులిద్దరూ మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండగకు వచ్చి తమను పలకరిస్తారని ఎదరుచూస్తూ భావించిన కుటుంబ సభ్యులు.. వారి మృతదేహాలను చూసి కన్నీరుకార్చారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోదన మధ్య శనివారం అంత్యక్రియలు జరిపారు. -
చదువుకు అండగా నిలిచారు
‘నా పేరు వరిరెడ్డి పూజ. మాది పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని మాదలింగి గ్రామం. నిరుపేద కుటుంబం. నాకు తమ్ముడు రాంమకుమార్, చెల్లి శ్రీజ ఉన్నారు. మా చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. అమ్మ దమయంతికి వచ్చిన టైలరింగ్ వృత్తితో మా జీవనం సాగేది. ఉన్నత చదువులు చదివించాలని అమ్మ కలలు కనేది. ఊర్లో ఉన్న పాఠశాల వరకు మాత్రమే చదివించగల ఆర్ధిక స్థోమత మాత్రమే ఉండేది. ఫీజురీయింబర్స్ ఆర్థిక సాయంతో పిల్లలను చదివించవచ్చని అమ్మ తెలుసుకొని నన్ను ఇంజిరింగ్ విద్యకు ప్రోత్సహించింది. దీనివల్లే నేను ఇంజినీరింగ్ ఈసీఈ కోర్సు పూర్తిచేసి ప్రస్తుతం హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజినీరింగ్ వృత్తిలో స్థిరపడ్డాను. తమ్ముడు ఐటీఐ పూర్తిచేసి ఉద్యోగం తెచ్చుకున్నాడు. చెల్లి కూడా అమ్మఒడి సాయంతో చదువుకుంది. ఫీజురీయింబర్స్మెంట్తో గత ప్రభుత్వం సాయం చేయకపోతే చదువు పాఠశాల విద్యతోనే నిలిచిపోయేది. – వరిరెడ్డి పూజ, ఫీజురీయింబర్స్మెంట్ లబ్ధిదారు, మాదిలింగి, కొమరాడ నా పేరు బిడ్డిక నూకయ్య. మాది భామిని మండలంలోని నల్లరాయిగూడ గ్రామం. 2019లో ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక మా ఊరి దశ, దిశ మారింది. సచివాలయం భవనం నిర్మించారు. సీసీ రోడ్డు వేశారు. నల్లరాయిగూడ గ్రామ పంచాయితీగా ఏర్పాటైంది. ఆదివాసీ మహిళ బిడ్డిక గుయామి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఏన్నికై ంది. హెల్త్సెంటర్, ఆర్బీకే అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ గిరిజన పాఠశాలను నాడు–నేడు నిధులతో అందంగా తీర్చిదిద్దారు. పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. ప్రతీ మనిషి తన జీవితంలో సొంతిల్లు కట్టుకోవాలని కలలు కంటాడు. నేను కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని. వాచ్ మెకానిక్గా పనులు చేస్తూ భార్య సుగుణతో పాటు ఇద్దరు పిల్లలను పోషించుకొచ్చాను. స్మార్ట్ఫోన్ల రాకతో వాచ్ మెకానిక్గా ఉపాధి కోల్పోయాను. ఆటో డ్రైవర్గా కొత్తజీవితాన్ని పునఃప్రారంభించాను. జగనన్న హయాంలో భార్య సుగుణ పేరిట ఇంటి స్థలం కేటాయించారు. ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం అందజేశారు. సొంతింటి కల నెరవేరింది. జీవితం సాఫీగా సాగిపోతోంది. -
ఇద్దరి పిల్లలకూ సచివాలయ కొలువు
పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పలగర గ్రామానికి చెందిన ఎ.పోలినాయుడు, గౌరీశ్వరి దంపతులకు కుమారుడు మణికృష్ణ, కుమార్తె కీర్తిప్రియ ఉన్నారు. కుమారుడు అగ్రికల్చర్ డిప్లమో, కుమార్తె ఫిషరీస్లో బీఎస్సీ చదివారు. వీరి చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎంతగానో సహకరించింది. అంతేకాదు.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ వల్ల ఇద్దరికీ ఒకేసారి ప్రభుత్వ కొలువులు రావడంతో ఆ ఇంట ఆనందం వెల్లివిరిసింది. కీర్తిప్రియ వీఎఫ్ఏగా, మణికృష్ణ గ్రామ వ్యవసాయ సహాయకుడిగా సచివాలయాల్లో కొలువులు పొందారు. లక్షల సంఖ్యలో ప్రభుత్వ కొలువులు తీసి.. నిరుద్యోగ యువతకు, మధ్యతరగతి కుటుంబాలకు సర్కారు ఉద్యోగం కల నెరవేర్చిన జగన్మోహన్రెడ్డి చల్లగా ఉండాలని ఆ తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు. -
రైతన్నకు అండగా అగ్రిల్యాబ్లు
● గత ప్రభుత్వ హయాంలో విజయనగరం జిల్లాలో 8 అగ్రిల్యాబ్ల ఏర్పాటు బొబ్బిలి: గతంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జిల్లాలో ఏర్పాటుచేసిన అగ్రిల్యాబ్లు రైతన్నకు అండగా నిలుస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యతను పరీక్షించేందుకు సహకరిస్తున్నాయి. మట్టి పరీక్షలు చేసి భూసార నివేదికలు అందిస్తున్నాయి. ఏ నేలలో ఏ పంట సాగుచేస్తే లాభదాయకమో తెలియజేస్తున్నాయి. గతంలో స్థానికంగా అగ్రిలాబ్లు లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో రైతులు నష్టపోయేవారు. దీనికి చెక్ చెబుతూ జిల్లాలోని నాలుగున్నర లక్షల మంది రైతులకు మేలుచేకూర్చేలా ఉమ్మడి విజయనగరం జిల్లాలో 8 చోట్ల అగ్రిల్యాబ్లను గత ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఒక్కోల్యాబ్కు రూ.55 లక్షలు వెచ్చించింది. జిల్లా కేంద్రంలో రూ.3.68 కోట్ల ఖర్చుతో జిల్లాస్థాయి ల్యాబ్ను నిర్మించింది. డాక్టర్ వైఎస్సార్ సమీకృత వ్యవసాయ ప్రయోగ శాలలుగా పిలిచే ఈ అగ్రిల్యాబ్లలో ముగ్గురు సిబ్బందిని నియమించింది. వీరి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి రీజనల్ కోడింగ్ సెంటర్తో పాటు చైన్నె, బెంగుళూరు, ఫరీదాబాద్ ప్రాంతాల్లో నిర్వహించే పరీక్షల ఫలితాలను కోడింగ్ ద్వారా ఎంపికచేసి నాణ్యమయినవి, కానివి వీరు గుర్తించి రైతులకు ఆర్బీకేల ద్వారా సమాచారం అందించేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ల్యాబ్ల సేవలను అందకుండా చేస్తోందంటూ రైతులు వాపోతున్నారు. -
రాష్ట్ర స్థాయికి ‘గ్రామ ముస్తాబు’ నమూనా
పార్వతీపురం రూరల్: మండలంలోని నర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన గ్రామ ముస్తాబు నమూనా పార్వతీపురం మన్యం జిల్లా స్థాయి సైనన్స్ఫెయిలో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. పర్యావరణంపై ప్రేరణ, గ్రామాల పరిశుభ్రత, వ్యర్థాల సమర్థ నిర్వహణపై కలెక్టర్ ఆలోచనలకు ప్రతిరూపంగా గైడ్ టీచర్ గొట్టాపు మురళీకృష్ణ పర్యవేక్షణలో విద్యార్థులు రిషింద్ర నాయుడు, గుణవర్దన్ ఈ నమూనాను సిద్ధం చేశారు. పల్లెల ప్రగతికి పర్యావరణ పరిరక్షణే పునాది అన్నదే ప్రాజెక్టు సారాంశం. విద్యార్థులను హెచ్ఎం బోను సత్యనారాయణ, ఉపాధ్యాయులు శనివారం అభినందించారు. క్రమ‘శిక్షణ’తో పూర్తిచేయండి విజయనగరం క్రైమ్: కానిస్టేబుల్ ఉద్యోగం మిగిలిన శాఖల కన్నా భిన్నమైనది.. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది.. మారుతున్న నేరాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి.. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పోలీస్ అభ్యర్థులకు ఎస్పీ దామోదర్ దిశానిర్దేశం చేశారు. జిల్లా నుంచి ఎంపికై న 116 మంది అభ్యర్థుల్లో 38 మంది మహిళలను ఒంగోలు పీటీసీకి, 78 మంది పురుషులను చిత్తూరు పీటీసీకి శిక్షణకు వేశారు. ఈ సందర్భంగా వారితో పోలీస్ బ్యారెక్స్లో శనివారం ఎస్పీ మమేకమయ్యారు. శిక్షణలో నేర్చుకోవాల్సిన అంశాలను వివరించారు. శిక్షణలో ప్రతిభ చూపి జిల్లాకు పేరుతీసుకురావాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసాలను ఛేదించే నైపుణ్యాలు మన సొంతం కావాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌమ్యలత, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
దీర్ఘకాలిక రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి : కలెక్టర్
విజయనగరం అర్బన్: జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో శనివారం నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యాన్ని స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనలు, సాధ్యమైన పరిష్కార మార్గాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా జిల్లాలో ఉన్న ప్రధాన రెవెన్యూ పరమైన సమస్యలపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. సమావేశంలో రీసర్వే ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్వో మురళి, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు. సవరవిల్లి–తూడెం–భోగాపురం రోడ్డు పనులు వేగవంతం చేయాలి సవరవిల్లి, తూడెం, భోగాపురం రోడ్డు కనెక్టివిటీకి సంబంధించిన ఏడీఏసీఎల్ ప్రతిపాదించిన రహదారి పనులపై కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి శనివారం తన చాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిపాదిత రహదారిలో మామూలు కల్వర్టు స్థానంలో బాక్స్ కల్వర్టు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారి నిర్మాణ పనులను ఆరు నెలలలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో కలెక్టరేట్ నుంచి పీఆర్ శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏడీఏసీఎల్ జీఎం ప్రవీణ్, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, సంబంధిత కాంట్రాక్టర్్ పాల్గొన్నారు. -
సాగుకు అండ
మాది సీతంపేట మండలంలోని జగ్గడుగూడ గ్రామం. మా కుటుంబం పేరిట 2020 అక్టోబర్ 2న జగనన్న ప్రభుత్వంలో 2.14 సెంట్లలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇచ్చారు. అనంతరం రైతు భరోసా కింద ఏటా రూ.13,500ల చొప్పున పెట్టుబడి సాయం అందించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి సాయం అందడం లేదు. – సవర జయమ్మ, తిరుపతి, జగ్గడుగూడ గ్రామం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడకుండానే మేము సాగు చేస్తున్న 2 ఎకరాల కొండపోడు భూమికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాను మంజారు చేశారు. రైతు భరోసా సాయం కూడా అందజేశారు. ఆయన మేలు మరచిపోలేనిది. –మండంగి ఆనంద్, గిరిజన రైతు, బల్లేరుగూడ, జియ్యమ్మవలస మండలం -
సైన్స్ ఫెయిర్ విజయవంతం
విజయనగరం అర్బన్: జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్–2025ను పాఠశాల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విజయనగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తొలుత పదర్శన కార్యక్రమాన్ని ఆర్డీఓ దాట్ల కీర్తి ప్రారంభించారు. ఈ సైన్స్ ఫెయిర్లో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘సస్టైనబుల్ అగ్రికల్చర్, పర్యావరణ నిర్వహణ, గ్రీన్ ఎనర్జీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, క్రీడలు అండ్ వినోదం, ఆరోగ్యం అండ్ పరిశుభ్రత, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ’ వంటి అంశాలపై వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం ఉత్తమ వైజ్ఞానిక ప్రాజెక్టులను జ్యూరీ సభ్యులు ప్రకటించారు. విద్యార్థుల గ్రూప్ కేటగిరి విజేతలలో అంశాల వారిగా ఏడు ప్రదర్శనలు ఎంపిక చేశారు. జిల్లా స్థాయి విజేతలు వీరే సైన్స్ ఫెయిర్లో సస్టైన్బుల్ అగ్రికల్చర్ అంశంలో జెడ్పీహెచ్ఎస్ చీపురుపల్లి (బాలికలు), ‘పర్యవరణ నిర్వహణ–పర్యావరణ హిత ప్రత్నామ్నాయాలు’ అనే అంశంలో జెడ్పీహెచ్ఎస్ జామి, ‘గ్రీన్ ఎనర్జీ–ఈవీ చార్జింగ్ స్టేషన్’ అనే అంశంలో జెడ్పీహెచ్ఎస్ రామభద్రపురం, ‘అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు–మాగ్నటిక్ గేర్స్’ అనే అంశంలో వల్లాపురం జెడ్పీహెచ్ఎస్, ‘నీటి సంరక్షణ–డ్రైయిన్ ఓవర్ఫ్లో గుర్తింపు వ్యవస్థ’ అనే టాపిక్లో రామతీర్ధం జెడ్పీహెచ్ఎస్, ‘ఆరోగ్యం అండ్ పరిశుభ్రత–స్మోక్ అబ్జార్బర్స్’ అనే అంశంపై కెల్ల జెడ్పీహెచ్ఎస్, ‘వాటర్ లీకేజ్ అండ్ డ్రైయిన్ ఓవర్ఫ్లో డిటెక్షన్ సిస్టమ్’ అనే అంశంలో కొండవెలగాడ జెడ్పీహెచ్ఎస్ ప్రాజెక్టులు విజేతలుగా నిలిచాయి. ఉపాధ్యాయుల కేటగిరిలో రామతీర్థం జెడ్పీహెచ్ఎస్ టీచర్ బల్లా శ్రీనివాసరావు (నీటి పొదుపు, పరిశుభ్రతకు పర్యావరణ హిత స్థూపాకార యూరినల్ బ్లాక్ డిజైన్), కొట్టాం జెడ్పీహెచ్ఎస్ టీచర్ పి.స్వప్న (స్కూల్ గ్రీన్ ల్యాబ్) విజేతలుగా ఎంపికయ్యారు. విద్యార్థుల వ్యక్తిగత కేటగిరి విజేతలుగా వియ్యంపేట కొత్తవలస ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ (బాలికలు) విద్యార్థులు రూపొందించిన ‘ఎఫిషియంట్ ట్రైన్ ప్లాట్ ఫాం క్రాసింగ్ సిస్టం’ ప్రదర్శన, దేవుపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు రూపొందించిన వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు’ ఎంపికయ్యాయి. అనంతరం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు చేతుల మీదుగా విజేతలకు జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ యూ.మాణిక్యంనాయుడు, డిప్యూటీ ఈఓలు విజేతలైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా విజేతలు జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ టి.రాజేష్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో విజేతలుగా ఎంపికై న గ్రూప్ కేటగిరిలో ఏడు ప్రాజెక్టులు, టీచర్ కేటగిరిలో రెండు ప్రాజెక్టులు, వ్యక్తిగత విద్యార్థి కేటగిరిలో రెండు ప్రాజెక్టులు ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటాయని తెలిపారు. రాష్ట్రస్థాయి విజేతలు ఆ తరువాత జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. విజేతలకు బహుమతుల ప్రదానం -
సత్ప్రవర్తనతో శిక్ష పూర్తిచేయండి
● విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత పార్వతీపురం: సత్ప్రవర్తనతో ఖైదీలు శిక్షను పూర్తిచేయాలని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత సూచించారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె సబ్ జైలును తనిఖీచేసి వసతులను, రికార్డులను, జైలు పరిస్థితులు, ఆహారం, వైద్య సౌకర్యాలు, ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నాణ్యమైన ఆహారం అందుతోందా? లేదా? అని ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు నడుచుకోవాలని, నైతిక విలువలను పెంపొందించుకుంటే మానసిక ప్రఽశాంతత లభిస్తుందని ఖైదీలకు తెలిపారు. ఖైదీల ఫిర్యాదులు, అభ్యర్ధనలు, ఏవైనా సమస్యలుంటే వాటిని వెంటనే పరిష్కరించాలని సబ్ జైలు అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో పార్వతీపురం జిల్లా రెండవ అదనపు జడ్జి ఎస్.దామోదరరావు, విజయనగరం సీనియర్ జడ్జి బీహెచ్వీ లక్ష్మీకుమారి, పార్వతీపురం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్టుక్లాస్ మెజిస్ట్రేట్ జె.సౌమ్య జాస్పిన్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలి
● చట్టాన్ని పథకంగా మారిస్తే కూలీల హక్కులు కోల్పోతారు ● కలెక్టరేట్ దగ్గర గాంధీజీ విగ్రహం వద్ద సీపీఎం నిరసనవిజయనగరం గంటస్తంభం: గ్రామీణ పేదలకు ఉపాధిని హక్కుగా కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చడం ద్వారా ఉపాధికి ఉన్న గ్యారంటీని తొలగించే ప్రయత్నం జరుగుతోందని సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం విజయనగరం కలెక్టరేట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ చట్టంలో ఉన్న హక్కులను బలహీనపరిచేందుకే గాంధీజీ పేరు తొలగించి చట్టాన్ని సాధారణ పథకంగా మార్చారని ఆరోపించారు. వామపక్షాలు, ప్రజాసంఘాలు సాధించుకున్న ఈ చట్టంపై గాంధీజీపై ఉన్న వ్యతిరేకతతోనే కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పార్లమెంటులో ఉన్న మోజారిటీతో కూలీలకు హక్కుగా ఉన్న చట్టాన్ని మార్చే ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. చట్టం స్థానంలో పథకం అమలులోకి వస్తే ఉపాధికి గ్యారంటీ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి నేతలు స్పందించాలి ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించడం వల్ల రాష్ట్రాలపై తీవ్ర భారం పడుతోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రానికి వ్యతిరేకంగా స్పందించడం లేదని విమర్శించారు. ఇప్పటికై నా టీడీపీ, జనసేన పార్టీలు ఈ విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, ఈ చట్టాన్ని కాపాడుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జగన్మోహన్, వెంకటేష్, విజయనగరం పట్టణ నాయకులు బుల్లి రమణతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సాలూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పూదోట ప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద నిర్వహించిన ధర్నాకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఏజెన్సీల చట్ట ప్రకారం కార్మికులకు పీఎఫ్, బీమా చెల్లింపులు చెల్లించకుండా ఒక్కో చోట ఒకలా చెల్లిస్తున్నారని ఆరోపించారు. పేదరోగులకు సేవచేసుకుంటూ జీవిస్తున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బుగత అశోక్, బలగ రాధ తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో ఇద్దరు ముద్దాయిలకు మూడేళ్ల జైలు
● రూ.13వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు పార్వతీపురం రూరల్: తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్. రాత్రి వేళ ఇళ్లలో చొరబడి చేతివాటం ప్రదర్శించిన దొంగలకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. పదేళ్ల క్రితం నాటి దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో ఇద్దరు ముద్దాయిలకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సాలూరు జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ హర్షవర్ధన్ శుక్రవారం తీర్పు వెలువరిచారు. ఎస్పీ మాధవ్రెడ్డి తెలియజేసిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. సాలూరు మండలంలోని యరగాడ వలస గ్రామానికి చెందిన కొత్తపల్లి సత్తిపండు 2015లో పని నిమిత్తం రాజమండ్రి వెళ్లాడు. ఈ క్రమంలో ఇల్లంతా ఖాళీగా ఉండడం గమనించిన అదే గ్రామానికి చెందిన కొండగొర్రి రమేష్, ఆలూరి గణపతిలు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పటిలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులపై సమర్పించిన సాక్ష్యాధారాలు, ఏపీపీ మాధవి వినిపించిన బలమైన వాదనలతో నేరం రుజువైంది. దీంతో ముద్దాయిలిద్దరికీ మూడేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.13వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి వివరించారు. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతిభోగాపురం: మండలంలోని అమటాం గ్రామానికి చెందిన కోరాడ సూరి (70) అనే వృద్ధుడు విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోరాడ సూరి కొబ్బరి చీపుళ్లు తయారు చేసి వాటిని విశాపట్నంలో విక్రయిస్తూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4న విశాఖపట్నంలో చీపుళ్లను విక్రయించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సూరిని తగరపువలస ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య కోసం విశాఖపట్నం కేజీహెచ్లో చేర్చగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్సై తిరుపతి తెలిపారు. జాతీయస్థాయి ఫుట్ బాల్ పోటీలకు నెల్లిమర్ల క్రీడాకారులునెల్లిమర్ల: నెల్లిమర్ల నగర పంచాయతీకి చెందిన ముగ్గురు క్రీడాకారులు జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు నెల్లిమర్ల రిక్రియేషన్ ఫుట్బాల్ క్లబ్ ప్రతినిధులు కె.సురేష్, ఎం.నాని తెలిపారు. ఈ నెల 22 నుంచి కేరళ రాష్ట్రంలో జరగనున్న ఆంధ్ర యూనివర్సిటీ జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు బి.రామకృష్ణ, బి. వరుణ్లు ఎంపికై నట్లు తెలిపారు. అలాగే ఇదే ప్రాంతానికి చెందిన సంతోష్ కుమార్ అనంతపురం జిల్లాలో జరగనున్న జాతీయ స్థాయి సంతోష్ ట్రోఫీకి ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు రామకృష్ణ, వరుణ్, సంతోష్ కుమార్ జాతీయస్థాయి పోటీల్లో రాణించి, విజేతలుగా నిలవాలని క్లబ్ ప్రతినిధులు, పూర్వ శిక్షకుడు కోల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. రోడ్లపై పశువులను విడిచిపెడితే కేసులు విజయనగరం క్రైమ్ : రోడ్లపై పశువులను విడిచిపెడితే సంబంధిత యజమానులపై కేసులు పెడతామని ఎస్పీ దామోదర్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో రహదారులపై పశువులు విచ్చలవిడిగా స్వేచ్ఛగా సంచరించే విధంగా విడిచిపెడితే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. వీటి విచ్చలవిడి సంచారం వల్ల పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. -
గోడకూలి విద్యార్థికి గాయాలు
శృంగవరపుకోట: పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో పై అంతస్తులో ఉన్న వాటర్ట్యాంక్ గోడకూలి ఓ విద్యార్థి తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గాంధీనగర్ నాల్గవవీధిలో ఉన్న త్రినేత్ర డిఫెన్స్ కాన్సెప్ట్ స్కూల్లో పందిరప్పన్న జంక్షన్కు చెందిన వేమలి భార్గవ్ 6వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం 4గంటల సమయంలో భార్గవ్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి పాఠశాల వెనుక వైపు ఉన్న రేకుల బాత్రూమ్కు మూత్రవిసర్జనకు వెళ్లాడు. మూత్రవిసర్జన చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పాఠశాల భవనం మూడవ అంతస్తుపైన ఉన్న వాటర్ట్యాంక్ గోడ కూలిపోయి బాత్రూమ్పైన పడిపోవడంతో భార్గవ్ రేకులు, గోడ శిథిలాల మధ్య చిక్కుకు పోయాడు. హఠాత్తుగా వచ్చిన శబ్దంతో వెనుక వీధిలో ఉన్న కార్పెంటర్ వాసు, చిల్డ్రన్ హాస్పిటల్లోని నర్స్లు వచ్చి శిథిలాలను తొలగించి విద్యార్థిని కాపాడారు. భార్గవ్ తలకు కుడివైపు లోతైన గాయం కాగా, ఎడమకాలు విరిగిపోయింది. స్కూల్కు పక్కనే ఉన్న అభినవ్ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం చేయించారు. విషయం తెలిసి విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై నిలదీశారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఘటనలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యవైఖరి, నిర్మాణంలో లోపాలే ప్రమాదానికి కారణం ఆరోపించారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి విచారణ చేశారు. గాయపడిన భార్గవ్కు వైద్యం చేసిన ఆస్పత్రి నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థికి ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. -
నేర పరిశోధనలో రాష్ట్రస్థాయి అవార్డు
పార్వతీపురం రూరల్: నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు దక్కింది. దర్యాప్తులో చాకచక్యం ప్రదర్శించిన కేసులకు ఇచ్చే ‘ఏబీసీడీ’ అవార్డుల్లో జిల్లా పోలీసు శాఖ రాష్ట్రంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుంది. శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, గత ఏఎస్పీ అంకిత సురానా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సాలూరు మండలం చీపురువలస సమీపంలోని ఒక జీడితోటలో యువతి మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. తొలుత అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును, ఎస్పీ ఆదేశాల మేరకు సాంకేతిక ఆధారాలతో విశ్లేషించారు. కాల్డేటా, సీసీటీవీ ఫుటేజీ. సెల్ టవర్ లొకేషన్ సాయంతో అది ’హత్య’ అని తేల్చడమే కాకుండా, కేవలం 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. 2025 మొదటి త్రైమాసికంలో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఈ దర్యాప్తు అత్యుత్తమమైనదిగా నిలిచింది. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన సాలూరు రూరల్ సీఐ పి.రామకృష్ణ, ఎస్సైలు నరసింహమూర్తి, వెంకట సురేష్, రమణ, క్లూస్ టీం సభ్యులను డీజీపీ అభినందించారు. -
ఎస్పీ దామోదర్కు ఏబీసీడీ అవార్డు
● అభినందించిన డీజీపీ హరీష్కుమార్ గుప్తా విజయనగరం క్రైమ్ : డీజీపీ హరీష్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ దామోదర్ అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్ (ఏబీసీడీ) అవార్డును శుక్రవారం అందుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పోలీసులు ఛేదించిన ముఖ్య కేసుల దర్యాప్తును పరిశీలించి, వాటిలో ఉత్తమంగా దర్యాప్తు చేసిన కేసులకు ఇచ్చే ఏబీసీడీ (అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్) అవార్డును ఎస్పీ దామోదర్ అందుకున్నారు. ప్రకాశం జిల్లాలో మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించినందుకు గాను అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేసిన దామోదర్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా అభినందించి, ఏబీసీడీ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ గతేడాది ఏప్రిల్ 22 వ తేదీన ప్రకాశం జిల్లా, ఒంగోలు మెయిన్ రోడ్డు వద్ద నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీపై వచ్చి ముప్పవరపు వీరయ్య చౌదరిని కత్తులతో విచక్షణా రహితంగా 49 పోట్లు పొడిచి అక్కడ నుంచి పారిపోయారన్నారు. అనంతరం ఒంగోలు తాలూకా పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేయగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును తొందరగా ఛేదించి నిందితులను పట్టుకుని చట్టం ముందు నిలపాలని ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం పెంచిందన్నారు. అప్పటి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ డీఎస్పీ స్థాయి అధికారులతో వెంటనే 60 క్రైమ్ బృందాలను ఏర్పాటు చేసి, రాత్రింబవళ్లు శ్రమించి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తక్కువ వ్యవధిలోనే సంచలన హత్య కేసులో నిజాలు నిగ్గు తేల్చి, 9మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారన్నారు. సంచలన హత్య కేసును తక్కువ వ్యవధిలో ఛేదించిన ఎస్పీ దామోదర్ను డీజీపీ ప్రత్యేకంగా అభినందించి, కేసు ఛేదనలో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందికి నగదు బహుమతి ప్రదానం చేశారు. -
తపాలా బీమా పథకాలపై అవగాహన తప్పనిసరి
విజయనగరం టౌన్: తపాలా బీమా పథకాలపై ఉద్యోగులందరూ అవగాహన తప్పనిసరిగా పెంపొందించుకోవాలని విశాఖపట్నం రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ వీఎస్.జయశంకర్ సూచించారు. ఈ మేరకు స్థానిక జెడ్పీసమావేశమందిరంలో శుక్రవారం ఉద్యోగులకు బీమా సంకల్ప్ 2.0పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ నెలలో నిర్దేశించిన కోటి రూపాయల ప్రీమియానికి ఇప్పటివరకూ రూ.70లక్షలకు పైగా టార్గెట్ సాధించడం అభినందనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా తపాలా ఉద్యోగుస్తులందరూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తపాలా బీమా సేవలపై అవగాహన కల్పించాలని కోరారు. తద్వారా తమ సేవలను విస్తృతం చేయాలని సూచించారు కార్యక్రమంలో విజయనగరం డివిజన్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాస్, సహాయ సూపరింటెండెంట్లు జీవీ.రమణారావు, టి.సుందరనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా గోదాదేవి పల్లకి సేవ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ధనుర్మాస పూజలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత గోదాదేవి పల్లకి సేవను అర్చకులు చేపట్టారు. అమ్మవారిని ప్రత్యేక పల్లకిలో ఉంచి మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం యాగశాలలో విశేష హోమాలు, స్వామి సన్నిధిలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామి సన్నిధిలో తిరుప్పావై సేవా కాలములు జరిపించి స్వామికి ఆరాధన చేశారు. చెరకు తోట దగ్ధంరేగిడి: మండల కేంద్రం రేగిడిలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 20 ఎకరాల చెరకు తోట దగ్ధమైంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెరకు చెత్తకు అగ్గిపెట్టడంతో ప్రమాదవశాత్తు చెరకు తోటలకు నిప్పంటుకుంది. దీంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లావేటి విష్ణుమూర్తి, ముంజేటి సన్యాసినాయుడు, జల్లు సాయిరాం జల్లు సింహాద్రి, కరణం గోవింద, ముంజేటి వెంకటప్పలనాయుడు తదితర రైతులకు చెందిన చెరకు పంట దగ్ధమైంది. స్థానికుల సమాచారం మేరకు పాలకొండ అగ్నిమాపక శకటం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసింది. చక్కెర కర్మాగారం యాజమాన్యం స్పందించి కాలిన చెరకుకు కటింగ్ ఆర్డర్ ఇప్పించి తరలించాలని బాధితులు కోరుతున్నారు. పాపం పసివాళ్లకు సాయం● ముందుకు వచ్చిన దాతలు గజపతినగరం: జామి మండలం జన్నివలస గ్రామానికి చెందిన మైలపల్లి విజయ్, మైలపల్లి గౌతమ్లతో పాటు రామయ్యపాలెం కొత్తూరుకు చెందిన మరో పిల్లవాడు ముంతాగౌతమ్లకు గజపతినగరం మండల ఉపాధ్యాయ బృందం దాతృత్వంతో రూ.20వేల నగదు, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ పిల్లల తల్లిదండ్రులు మృతి చెందడంతో వారు అనాథలయ్యారు. ఆ పిల్లలకు గురువారం గజపతినగరం మండల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారిణి విమలమ్మ, ఎంఈఓ–2 సాయిచక్రధర్ల చేతులు మీదుగా నగదు, వస్త్రాలను, నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అంద జేశారు. పాపం పసివాళ్లు అనే శీర్షికన ఇటీవల సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనం చూసిన దాతలు స్పందించి ముందుకు వచ్చి అనాథ పిల్లలకు సహకారం అందజేశారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిదత్తిరాజేరు: మండలంలోని ఎం.లింగాలవలస గ్రామానికి చెందిన అలజింగి సన్యాసప్పడు(55)ను కొద్ది రోజుల క్రితం వెనుక నుంచి ట్రాక్ట ర్ ఢీకొనడంతో గాయపడగా వైజాగ్లోని కేజి హెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పెదమానాపురం ఎస్సై ఆర్ జయంతి తెలిపారు. ఈనెల 12వ తేదీన అదే గ్రామాని కి చెందిన ఇనుముల సత్యనారాయణ ట్రాక్టర్ ను నిర్లక్ష్యంగా, వేగంగా, నడిపి సన్యాసప్పడును వెనుక నుంచి ఢీకొట్టడంతో అప్పటి నుంచి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య ఆదిలక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మహిళ ఆత్మహత్యసీతంపేట: మండలంలోని అంబలగండి గ్రామానికి చెందిన గేదెల లక్ష్మి (35) అనే గిరిజన మహిళ కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఆరునెలలుగా కడుపులో నొప్పితో ఆమె బాధపడుతోంది. ఈనెల 15న కడుపులో నొప్పి ఎక్కువవడంతో ఇంటిలో ఉన్న గడ్డిమందును తాగేసింది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను భర్త శోభన్బాబు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేయగా రిమ్స్లో చికిత్సపొందుతూ గురువారం మృతిచెందినట్లు ట్టు దోనుబాయి ఎస్సై ఐ మస్తాన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి నట్లు చెప్పారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
అటవీశాఖ, గిరిజనుల మధ్య వాగ్వాదం
సీతంపేట: అటవీశాఖ అధికారులు, గిరిజనుల మధ్య గురువారం అడ్డాకులగూడ గ్రామంలో వాగ్వాదం జరిగింది. సీతంపేట మండలంలోని కర్రగూడ, పాలమానుగూడ, అడ్డాకులగూడ, కారిమానుగూడ పరిధిలో వీఎస్ఎస్ భూముల్లో నగరవనం నిర్మాణానికి అటవీశాఖ తవ్వకాలు జరుపుతుండగా పలు గ్రామాల గిరిజనులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పాలకొండ అటవీశాఖ రేంజర్ రామారావుతో పాటు సిబ్బంది మాట్లాడుతూ పనులు జరుగుతాయని, అటవీశాఖకు సంబంధించిన భూములు కాబట్టి ఇక్కడ నగరవనం నిర్మిస్తామని పట్టుబట్టారు. ఈ క్రమంలో తీవ్రవాగ్వాదం నెలకొంది. 25 ఎకరాల్లో వనసంరక్షణ సమితులు, అటవీశాఖ జాయింట్ పట్టాలు ఉన్నాయని సర్పంచ్ ఎస్.సిమ్మయ్య, గిరిజన నాయకులు ఎ.భాస్కరరావు, ఎం.లక్ష్మణరావులు తెలిపారు. గతంలో నీలగిరి మొక్కలు వేసినప్పటికీ ఒక్కపైసా కూడా గిరిజనులకు ఇవ్వలేదన్నారు. ఇక్కడ నగరవనం నిర్మిస్తే గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు నష్టం వాటిల్లుతుందని వాపోయారు. ఈ భూములు గిరిజనులకే దక్కాలని, ఈ విషయమై ఐటీడీఏ పీఓకు కూడా వినతిపత్రం ఇచ్చామన్నారు. ఇప్పుడు అటవీశాఖ అధికారులు గిరిజనులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయమై ఎఫ్ఆర్వో రామారావు మాట్లాడుతూ 15 ఏళ్ల క్రితం నుంచే నగరవనం ప్రతిపాదన ఉందన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నగరవనాలు మంజూరు కావడంతో పాలకొండ నియోజకవర్గానికి ఇక్కడ మంజూరైందన్నారు. గిరిజనులకు ఎటవంటి నష్టం ఉండదన్నారు. -
దివ్యాంగులకు రీవెరిఫికేషన్ కష్టాలు
● కాటికి కాలు చాచే వయసులో ఇవేం కష్టాలంటూ వాపోతున్న బాధితులువిజయనగరం ఫోర్ట్: ఇలా వీరిద్దరే కాదు. నిత్యం అధిక సంఖ్యలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి సదరం రీవెరిఫికేషన్ కోసం దివ్యాంగులు వస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి దివ్యాంగులు అష్టకష్టాలు పడి వస్తూ ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. ముఖ్యంగా నడవలేని స్థితిలో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాటికి కాలుచాచే వయసులో ఇవేమి కష్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం సదరం రీవెరిఫికేషన్ కోసం పదేపదే తిప్పుతుండడం వల్ల దివ్యాంగులు అవస్థలు పడక తప్పడం లేదు. ముఖ్యంగా ఈఎన్టీ విభాగానికి చెందిన దివ్యాంగుల్లో చాలా మందికి రీవెరిఫికేషన్ పూర్తయినప్పటికీ మళ్లీ రీ వెరిఫికేషన్ చేయాలని పిలుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇచ్చే పింఛన్ మాట దేవుడెరుగు. వెరిఫికేషన్కు వెళ్లడానికి ఇబ్బంది పడాల్సి వస్తోందని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సైన్స్ సంబరానికి వేళాయె..
● నేడు జిల్లాస్థాయి సైన్స్ఫెయిర్ పోటీలు ● ముగిసిన మండల, నియోజకవర్గ పోటీలు ● జిల్లాకు ఎంపికై న 150 ప్రాజెక్టులుపార్వతీపురం రూరల్ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, విద్యార్థుల శాసీ్త్రయ జ్ఞానాన్ని, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. దీనిలో విద్యార్థులు, తమ ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నారు. తద్వారా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే విద్యార్థుల్లో శాసీ్త్రయ అవగాహన, ఆలోచన శక్తి పెంచడం, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు చేయడానికి విద్యార్థులను ప్రోత్సహించడం, ప్రయోగాత్మక నైపుణ్యాలు, సిద్ధాంతాలను ప్రయోగాత్మకంగా నిరూపించే అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. విద్యార్థులు, ఉపాధ్యాయులకు కొత్త పాత్రలను స్వీకరించడానికి, లోతైన విజ్ఞానాన్ని పెంపొందించడానికి ప్రేరణ కల్పించడమే పరమార్థం. భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే సైన్స్ ఇన్స్పైర్ విజ్ఞాన సంబరానికి వేళైంది. గడిచిన 15 రోజులుగా మండల, నియోజక వర్గ స్థాయిలో సైన్స్ ఫెయిర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు శుక్రవారం జిల్లాస్థాయి ప్రదర్శనలు నిర్వహించనున్నారు. సైన్స్ ఫెయిర్ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి గత ఏడేళ్లుగా ఎక్కువైంది. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 1010 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులతో మండల స్థాయిలో పాల్గొన్నారు. అందులో ప్రతిభ చూపించిన 150 ప్రాజెక్టులు జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి. గతేడాది పోటీల్లో జిల్లా నుంచి జెడ్పీహెచ్ఎస్ తలవరం విద్యార్థులు నిర్వహించిన ప్రాజెక్టు జాతీయస్థాయికి వెళ్లడమే కాకుండా జాతీయస్థాయిలో ద్వితీయ బహుమతిని సాధించింది. ఈ ఏడాది మరిన్ని ప్రాజెక్టులు జాతీయస్థాయికి వెళ్లి బహుమతులు సాధిస్తాయని ఆశిస్తున్నారు నేడు జిల్లా స్థాయి పోటీలు మండల, నియోజకవర్గ స్థాయిలో పాల్గొన్న 1010మంది తయారు చేసిన ప్రాజెక్టుల్లో అత్యుత్తమమైన 150 ప్రాజెక్టులను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. వాటిలో గ్రూప్స్థాయిలో 105 ప్రాజెక్టులు, వ్యక్తిగతంగా 30 ప్రాజెక్టులు, ఉపాధ్యాయుల సహకారంతో రూపొందించిన 15 ప్రాజెక్టులను జిల్లాస్థాయికి ఎంపిక చేశారు. జిల్లా కేంద్రంలో గల డీవీఎం ఉన్నత పాఠశాలలో ఈ వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహించనున్నారు. కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి, ప్రజాప్రతినిధులు, సైన్స్ కమిటీ ఈ పోటీలలో ప్రదర్శించే 11 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను హైదరాబాద్లో నిర్వహించనున్న జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరుస్తున్న మన్యం విద్యార్థులు గత ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం, క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన, బైజూస్ విధానంలో విద్యాభ్యాసం వంటి మార్పుల కారణంగా గిరిజన విద్యార్థులు విద్య, విజ్ఞాన ప్రదర్శనలపై మక్కువ చూపుతున్నారు. ఫలితంగా గత ఏడేళ్లుగా జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల్లో మంచి ప్రతిభ కనబరిచి మన్యం జిల్లాకు మంచి పేరు తీసుకువస్తున్నారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మండల స్థాయిలో 1010 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులతో సైన్స్ఫెయిర్లో పాల్గొనడం గమనార్హం. ఈ ఏడాది జాతీయ స్థాయిలో మన్యం విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తారని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్లో జ్ఞానం పెంపొందించడానికే.. విద్యార్థుల్లో వైజ్ఞానాన్ని, సృజనాత్మకతను వెలికి తీసేందుకే ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది జిల్లా స్థాయికి 150 సైన్స్ ప్రాజెక్టులను ఎంపిక చేశాం. విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో వారి ప్రదర్శనను కనబరుస్తారన్న నమ్మకం ఉంది. కేవలం పారదర్శకంగా మాత్రమే ప్రాజెక్టులను ఎంపిక చేసేలా చర్యలు చేపట్టాం. జాతీయస్థాయిలో మన్యం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం. – లక్ష్మణరావు, జిల్లా సైన్స్ అధికారి, పార్వతీపురం మన్యం ఉత్తమ ప్రదర్శనలు తేవాలి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు తమ ఆలోచనలతో ప్రాజెక్టులు చేసి ఉత్తమమైన వాటిని తీసుకురావాలి. జిల్లా నుంచి జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థుల ప్రాజెక్టులు గతంలో ఎంపికయ్యాయి. ఈ ఏడాది కూడా జాతీయ స్థాయికి ఎంపికవుతాయనే అశిస్తున్నాం. జిల్లా కేంద్రంలో డీవీఎంఎం పాఠశాలలో జిల్లాస్థాయి పోటీలకు సర్వం సిద్ధం చేశాం. పి.బ్రహ్మాజీరావు, డీఈఓ, పార్వతీపురం మన్యం -
రూ.283 కోట్ల సీ్త్రనిధి రుణ లక్ష్యం
రామభద్రపురం: జిల్లాలో ఈ ఏడాది రూ.283 కోట్లు సీ్త్రనిధి రుణ లక్ష్యమని సీ్త్రనిధి ఏజీఎం వై.చిట్టిబాబు అన్నారు. ఈ మేరకు రామభద్రపురంలోని వెలుగు కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించి సిబ్బందితో సమీక్ష నిర్వహించి సీ్త్రనిధి రుణ వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.193 కోట్లు రుణాల వసూలు అయిందన్నారు. సీ్త్రనిధి రుణం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. బ్యాంకులో రుణం తీసుకుంటే డాక్యుమెంట్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ ఫీజులు వంటి అదనపు వసూళ్లు ఉంటాయని, సీ్త్రనిధి రుణం తీసుకుంటే అదనపు వసూళ్లు ఉండవన్నారు.అలాగే నూటికి నెలకు 92 పైసలు మాత్రమే వడ్డీ పడుతుందని చెప్పారు. రుణం తీసుకున్న సభ్యులు సకాలంలో సక్రమంగా వాయిదాలు చెల్లిస్తే అదనపు వడ్డీ ఉండదన్నారు. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో నగదు సభ్యుల ఖాతాలో పడుతుందని చెప్పారు. గ్రూప్లో ఒక్క సభ్యురాలికై నా రుణం ఇస్తామని, ఆ రుణంతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. కార్యక్రమంలో సీ్త్రనిధి మేనేజర్ వై ఎర్రినాయుడు, సీసీలు సింగరాజు తదితరులు పాల్గొన్నారు. సీ్త్రనిధి ఏజీఎం వై చిట్టిబాబు -
22 నుంచి కానిస్టేబుల్స్కు శిక్షణ ప్రారంభం
విజయనగరం క్రైమ్: ఈ నెల 22 వ తేదీ నుంచి కానిస్టేబుల్స్ అభ్యర్థుల శిక్షణ ప్రారంభమవుతుందని ఎస్పీ దామోదర్ గురువారం తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కానిస్టేబుల్స్గా ఎంపికై న 133 మంది పురుష, మహిళా అభ్యర్థులు ఈ నెల 20 వతేదీన జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉదయం 8గంటలకు హాజరు కావాలని సూచించారు. తొమ్మిది నెలల పాటు కానిస్టేబుల్స్కు శిక్షణ ఉంటుందన్నారు. కానిస్టేబుల్స్గా ఎంపికై న పురుష, మహిళా అభ్యర్థులు తొమ్మిది నెలల పాటు శిక్షణలో ఉండేందుకు లగేజీతో హాజరు కావాలని సూచించారు. శిక్షణ నిమిత్త పురుష అభ్యర్థులను చిత్తూరు పీటీసీకి, మహిళా అభ్యర్థులను ఒంగోలు పీటీసీకి పంపుతామని ఎస్పీ తెలిపారు. అభ్యర్థులు తమ వెంట విలువైన వస్తువులను తీసుకురాకూడదని, శిక్షణ కేంద్రానికి అభ్యర్థుల వెంట బంధువులను అనుమతించరని ఎస్పీ ఏఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ఎస్పీ దామోదర్అభ్యర్థులు తీసుకురావాల్సిన పత్రాలు 5 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోలు 2 స్టాంప్ సైజ్ కలర్ ఫొటోలు ఒరిజినల్ సర్టిఫికెట్లు రూ.100/ నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్ 2 బ్లాంకెట్స్ రూ.10,000లు తిరిగి ఇవ్వబడే కాషన్ డిపాజిట్, మెస్ చార్జీల కోసం తీసుకుని రావాలని ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు. -
రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలి
● సత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సాయిదేవమణి విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సీనియర్స్ పురుషుల ఖోఖో పోటీల్లో జిల్లా జట్టు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని సత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సాయిదేవమణి పిలుపునిచ్చారు. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు గుడివాడలో జరగనున్న అంతర్ జిల్లాల పురుషుల ఖోఖో పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్టు కోచింగ్ క్యాంప్ను ఆమె కళాశాల ప్రాంగణంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కబడ్డీ, ఖోఖో క్రీడల్లో విజయనగరం జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఎంతో మంది క్రీడాకారులు జాతీయస్థాయికి ప్రాతినిధ్యం వహించిన ఘనత ఉందని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని సూచించారు. కళాశాలలో శిక్షణ పొందుతున్న జట్టుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఖోఖో పితామహుడు పి.చిన్నంనాయుడు, కళాశాల పీడీ ప్రసాద్, జిల్లా ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కె.గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
గురుకులంలో భోజన సమస్య లేదు
● డీసీఓ మాణిక్యం భామిని: స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో విద్యార్థులకు భోజన సమస్య లేదని గుర్తించినట్లు విజయనగరం గురుకులాల సమన్వయ కర్త(డీసీఓ) మల్లా మాణిక్యం గురువారం స్పష్టం చేశారు. గురుకులం ప్రిన్సిపాల్ విజయ నిర్మలతో కలిసి గురుకుల విద్యార్థులతో మాట్లాడినట్లు వివరించారు. ఇటీవల ఆదివారం మధ్యాహ్న భోజనం ఆలస్యంపై విద్యార్థుల ఆకలికేకలపై విచారణ చేసినట్లు తెలిపారు. ఆ భోజన జాప్యానికి గ్యాస్ రెగ్యులేటర్ మరమ్మతు కారణమని గుర్తించామన్నారు.మిగతా రోజుల్లో యథావిధిగా సమయ పాలనతో భోజనాలు అందుతున్నట్లు విద్యార్థులు తెలిపారన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఫోన్లో సిబ్బందితో మాట్లాడానని డీసీఓ మాణిక్యం వివరించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్న తీరు పరిశీలించానని, వంట గది, భోజనశాల అన్నీ పరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. -
జాతీయ పారా పవర్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరగబోయే పారా (దివ్యాంగుల) పవర్ లిఫ్టింగ్ జాతీయస్థాయి పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు దివ్యాంగ క్రీడాకారులు అర్హత సాధించినట్లు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. ఈ మేరకు ఎంపికై న క్రీడాకారులకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల విజయనగరంలోని రాజీవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పారా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వడ్డి సతీష్ కుమార్ సాహు, తాళ్లపూడి గౌతమిలు పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అర్హత సాధించడంతో జాతీయ పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 16 నుంచి 18 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరగబోయే పారా జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు వీరు బయలుదేరి వెళ్లనున్నారన్నారు. ఇదే స్ఫూర్తి తో జాతీయ స్థాయి పోటీలలోనూ ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. వారిద్దరి ఎంపిక పట్ల కలెక్టర్ రాం సుందరరెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావులు అభినందనలు తెలిపారు. -
జనకోటి సమరం
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025● స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేసిన విద్యార్థులు, యువత, పెద్దలు, మహిళలు ● పీపీపీ విధానం రద్దు చేయాలంటూ కోటి సంతకాల సేకరణకు పిలుపు నిచ్చిన వైఎస్సార్సీపీ అధినేత ● స్పందించిన రాష్ట్ర ప్రజలుసాక్షి నెట్వర్క్: చినుకు చినుకు వానగా మారి..వాన వరదై..వరద తుఫాన్గా రూపాంతరం చెందినట్లు కోటి సంతకాల సేకరణ ఉద్యమం నిరూపించింది. కలంతో చేసిన సంతకానికి తిరుగులేదని నిరూపించారు రాష్ట్రంలోని విద్యార్థులు, యువత, పెద్దలు, మహిళలు, మేధావులు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి 17 వైద్య కళాలలు మంజూరు చేయించి వాటి నిర్మాణం చేపట్టి 5 కళాశాలలను పూర్తి చేశారు. పూర్తి చేసిన కళాశాలల్లో తరగతులు కూడా జరుగుతున్నాయి. అయితే మిగిలిన వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి చేయాల్సిన కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ పద్ధతిలో కార్పొరేట్లకు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని విజయవంతం చేశారు. కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువత, పెద్దలు, మేధావులు, మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. -
క్వారీ అనుమతులపై ప్రజాభిప్రాయం
పాచిపెంట: మండలంలోని మంచాడవలస సమీపంలో సర్వే నంబర్ 531లో గల సుమారు 15 హెక్టార్ల క్వారీ అనుమతులకు సంబంధించి గురువారం పనుకువలస వద్ద పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. సబ్కలెక్టర్ యశ్వంత్కుమార్ రెడ్డి పర్యావరణ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు హాజరై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ మేరకు మెజారిటీ ప్రజలు క్వారీ ఏర్పాట వల్ల ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. స్టోన్ క్రషర్ క్వారీ ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఉపాధి లభించడంతో పాటు ఇళ్ల నిర్మాణాలు, రోడ్లు, వివిధ అభివృద్ధి పనులకు స్టోనన్స్ అందుబాటులో ఉంటాయని జీగిరాం సర్పంచ్తో పాటు పణుకువలస సర్పంచ్ సీతారాం ఎంపీటీసీ లక్ష్మి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా క్వారీ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణం దెబ్బతినకుండా చుట్టూ మొక్కలు నాటడం వంటి పర్యావరణ పరిరక్షణ చర్యలను క్వారీ నిర్వాహకులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు తెలిపారు. క్వారీకి అతి సమీపంలో గల శివాలయం దెబ్బతినకుండా చూడాలని చుట్టుపక్కల ప్రాంతాల రైతులు పంటలు నాశనం కాకుండా చూడాలని మంచాడవలస గ్రామస్తులు కోరారు. క్వారీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న నవదుర్గ మైనింగ్ మేనేజింగ్ నిర్వాహకుడు నెక్కంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిబంధనల మేరకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా క్వారీ నిర్వహణ చేపట్టేందుకు అనుమతులు ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ విషయాన్ని ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లి పై స్థాయి కమిటీ నిర్ణయాల మేరకు క్వారీ అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. పర్యావరణ శాఖ ఇంజినీర్ అరుణశ్రీ తహసీల్దార్ రవి ఎంపీడీఓ బీవీజే పాత్రో తదితరులు పాల్గొన్నారు. -
దాచేస్తే దాగుతాయా.. మరణాలు ఆగుతాయా!
● ఏం జరుగుతోంది.. ఆశ్రమాల్లో? ● ముస్తాబులు సరే.. పిల్లల ఆరోగ్యంపై ఏం చెబుతాం! ● ఇటీవల జిల్లాలోని ఓ ఆశ్రమ పాఠశాలలో చదు వుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కారణాలేమైనా.. విషయాన్ని బయ టకు రాకుండా తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ● కొద్దిరోజుల కిందట గుమ్మలక్ష్మీపురం మండలం దొరజమ్ము ఆశ్రమ పాఠశాల పదో తరగతి విద్యార్థి మరణించాడు. విషయం చాలా రోజుల వరకూ బయటకు రాలేదు. చేతికి అందొచ్చిన కుమారుడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రుల నుంచి పాఠశాల ఉపాధ్యాయులు.. విద్యార్థి మరణంతో తమకేమీ సంబంధం లేదని ఏకంగా పూచీపత్రం రాయించుకోవడం విమర్శలకు తావిస్తోంది. ● విద్యార్థుల మరణాలు సంభవిస్తే సహించేది లేదని.. సిబ్బందిని సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ప్రతి నెలలోనూ ఒకట్రెండు మరణాలు సంభవిస్తున్న జిల్లాలో ఎంతమంది సిబ్బందిని సస్పెండ్ చేయాలి.. ఎందరిని బాధ్యులు చేస్తారన్న గిరిజన సంఘాల ప్రశ్నకు సమాధానం లేదు. ● జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ముస్తాబు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. విద్యార్థుల ఆరోగ్య రక్షణ.. క్రమశిక్షణ, శుభ్రత అలవాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. కోట్లాది రూపాయలు నిధులు ఖర్చు చేసి పౌష్టికాహారం అందిస్తున్నా.. అది సక్రమంగా అందకనే రక్తహీనత వంటి కేసులు వెలుగు చూస్తున్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో చిన్నపాటి జ్వరానికి వైద్యం అందించలేని పరిస్థితుల్లో విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయి. వీటిని సరి చేయలేకపోతున్న యంత్రాంగం.. ఎన్ని ముస్తాబులు చేసినా ఏం లాభం? అన్నది గిరిజన సంఘాల వాదన -
వైద్యవిద్యపై ప్రైవేట్ నీడ వద్దు
పార్వతీపురం రూరల్: ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) విధానంలోకి నెట్టడం పేద విద్యార్థుల పాలిట శరాఘాతమని సీపీఐ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం పార్వతీపురంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కె.మన్మథరావు, ఏఐటీయూసీ నేత ఆర్వీఎస్ కుమార్ మాట్లాడుతూ..ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి, మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసేందుకు జీవో 590 తీసుకురావడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. పీపీపీ అమలులోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వైద్యవిద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యులకు వైద్యం భారమవుతుందని అసంతృప్తి వెలిబచ్చారు. విద్యాశాఖ మంత్రి తన ’యువగళం’ హామీని నిలబెట్టుకోవాలని, తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి బి. రవికుమార్, పలువురు విద్యార్థులు, సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు. సీతంపేట: స్థానిక ఐటీడీఏ పరిధిలోని వివిధ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో పనిచేస్తున్న 32 మంది పీడీ, పీఈటీలకు మోమోలు జారీ చేసినట్లు ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర గురువారం తెలిపారు. ఆయా విద్యాసంస్థల్లో విద్యార్థుల రోజువారీ ఫిజికల్ యాక్టివిటీస్ కొద్ది రోజులుగా లేకపోవడంతో మోమోలు జారీచేసినట్లు స్పష్టం చేశారు. -
విజయవంతం
ప్రభుత్వ వైద్యం..సామాన్యుడికి ప్రాణవాయువు వంటిది. కానీ నేడు చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూడడం శోచనీయం. ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన వైద్య విద్యను ప్రైవేటు గడప దాటించడం అంటే, పేద విద్యార్థుల కలలను చిదిమేయడమే. ఫీజుల భారం మోయలేక మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు స్వస్తి చెప్పాల్సి వస్తుంది. లాభాపేక్షే పరమావధిగా సాగే ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లో విద్యార్థుల భవితవ్యం చిక్కుకుంటే, అది విద్యార్థి లో కానికే తీరని నష్టం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, వైద్య విద్యను ’ప్రజాహితం’ గానే ఉంచాలని, ’లాభసాటి’ వ్యాపారంగా మార్చవద్దని కోరుతున్నాం. –ఎల్. మణి, డిగ్రీ పట్టభద్రురాలు, పార్వతీపురం -
●కళాశాలలు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
ప్రజలతో ఎన్నికై న సర్కారు ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిందిపోయి ప్రైవేట్ శక్తులకు దోచిపెట్టేలా వ్యవహరించడం సరికాదు. సామాన్యులకు వైద్యవిద్యను అందుబాటులోకి తేవడంతో పాటు పేదప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి సర్కారుపై ఉంది. పీపీపీ విధానం పేరిట తీసుకున్న నిర్ణయం సహేతుకం కాదని ప్రజలే తమ సంతకాల ద్వారా తెలియజేశారు. ఈ క్రమంలో ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించాలి. కేవలం భేషజాలకు పోయి ప్రజలకు అందాల్సిన ఉచిత వైద్యసేవలను, భవిష్యత్తు తరాలకు అండగా నిలవాల్సిన వైద్యవిద్యార్థులకు అన్యాయం చేసే యత్నం మానుకోవాలి. –తిర్లంగి ఉపేంద్రకుమార్, లుంబూరు, పాలకొండ -
సచివాలయ సిబ్బంది నిర్వాకం
వీరఘట్టం: మండలంలోని కంబరవలస గ్రామానికి చెందిన రెట్టి కమల భర్త కామయ్య 2.7.2023న మృతి చెందాడు. వారి రేషన్కార్డులో భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు. వారికి ప్రతి నెలా పది కిలోల బియ్యం వస్తున్నాయి. సచివాలయ సిబ్బంది కామయ్య చనిపోయినట్లు సివిల్ సప్లయిస్ పోర్టల్లో నమోదు చేశారు. దీంతో వారి రేషన్కార్డు రద్దయింది. 1.8.2023 నుంచి కమలకు రేషన్ సరుకులు నిలిచిపోయాయి. కొత్త రేషన్కార్డు కోసం ఆమె దరఖాస్తు చేస్తే ఆమె ఆధార్కార్డు నంబర్ ఎంటర్ చేయగానే డెత్ అని ఆన్లైన్లో చూపిస్తోంది. తన భర్తతో పాటు తాను కూడా డెత్ అని నమోదు చేయడంతోనే తన రేషన్కార్డు రద్దయిందని కమల వాపోతోంది. తాను బతికుండగానే తన రేషన్కార్డు రద్దు చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒంటరి మహిళను అయిన తనకు అంత్యోదయ కార్డు మంజూరు చేసి 35 కిలోల బియ్యం ఇప్పించాలని ఆమె కోరుతోంది. -
ఉపాధ్యాయులకు వాచ్మెన్ విధులా?
సాక్షి, పార్వతీపురం మన్యం: గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు రాత్రి కాపలాదారు విధులు వేయడం ఎంతవరకు సమంజసమని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్రావు ప్రశ్నించారు. పాఠశాలల్లో రాత్రి బస చేసి 9 గంటలకు, అర్ధరాత్రి 12గంటలకు, తెల్లవారుజామున 6 గంటలకు ఫొటోలు అప్లోడ్ చేయాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఎటువంటి సౌకర్యాలూ కల్పించకుండా మహిళా ఉపాధ్యాయులు సైతం పాఠశాలలో బస చేయాలని చెప్పడం దుర్మార్గమన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం సాయంత్రం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. జీవో కాపీలను మంటల్లో తగలబెట్టారు. మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ రాయాలని నిర్దేశించడం సరికాదన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య సమస్యలకు ఉపాధ్యాయులను బాధ్యులను చేయడమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భాస్కరరావు, కార్యదర్శి కృష్ణారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పార్వతీపురం రూరల్: ’వైరస్ రహిత సమాజం–వ్యాధి రహిత బాల్యం’ అనే నినాదంతో జిల్లాలో పల్స్ పోలియో సమరానికి వైద్యారోగ్య శాఖ సర్వం సిద్ధం చేసింది. ఈనెల 21వ తేదీన ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు గురువారం కార్యాలయంలో ప్రకటించారు. ఈ మేరకు పల్స్ పోలియో పోస్టర్ను అధికారులతో కలిసి గురువారం ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా 99,507 మంది చిన్నారులకు రక్షణ కవచంలా రెండు చుక్కల మందు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం 905 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రయాణాల్లో ఉన్న పిల్లల కోసం 19 ట్రాన్సిట్ బూత్లు, గిరిజన మారుమూల ప్రాంతాల కోసం 42 సంచార (మొబైల్) బృందాలను రంగంలోకి దించుతున్నట్లు వివరించారు. ఆదివారం బూత్లకు రాలేని వారి కోసం 22, 23 తేదీలలో వైద్య సిబ్బంది ’ఇంటింటికీ–చుక్కల మందు’ కార్యక్రమం చేపడతారని తెలిపారు. ఆశ, అంగన్వాడీ కార్యకర్తల సమన్వయంతో సాగే ఈ యజ్ఞంలో తల్లిదండ్రులు భాగస్వాములై తమ పిల్లలకు వైకల్యం లేని భవితను అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి విజయ మోహన్, డా.వినోద్, డా.రఘు తదితరులు పాల్గొన్నారు. -
శ్మశానం కబ్జా!
సాక్షి, పార్వతీపురం మన్యం: సీతంపేట మండలం కొండపల్లి గ్రామంలో తరతరాలుగా గిరిజనులు ఉపయోగించుకుంటున్న శ్మశానవాటికను ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నాడు. కొద్దిరోజులుగా జేసీబీతో చదును పనులు సైతం చేయిస్తున్నాడు. ఆర్వోఎఫ్ఆర్ పరిధిలోని ఈ స్థలాన్ని ఎలా ఆక్రమించుకుంటారని గిరిజనులు ప్రశ్నిస్తే.. ‘మీకు దిక్కున్నచోట చెప్పుకోండ’ని బెదిరిస్తున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. ‘అధికారులకు చెప్పుకున్నాం. ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నాం. ఎక్కడా న్యాయం జరగడం లేదని’.. వారంతా గురువారం పార్వతీపురం కలెక్టరేట్కు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. -
నేరాలు,దారుణాలు పట్టించుకోరా?
● పోలీసులకు సవాల్గా నిలుస్తున్న దోపిడీలు, చోరీలు, హత్యలు కొత్తవలస: మండలంలో వరుస దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, యథేచ్ఛగా గంజాయి రవాణా జరుగుతున్నా కనీసం పట్టించుకునే పోలీసులే కరువయ్యారు. ఈ అంశాలపై కేసులు నమోదు చేయడమే తప్ప అరెస్టులు, రికవరీలు, దొంగలను పట్టుకునే పరిస్థితి ఏమీ లేకపోవడం గమనార్హం. కొత్తవలస మండలంలోని జరిగిన ఘటనల వివరాలు ఆగస్టు 26, 2024లో ఒక లారీలో 450 కేజీల గంజాయిని విశాఖపట్నం తరలిస్తుండగా అరకు–విశాఖ రోడ్డులో అప్పన్నపాలెం గ్రామం సమీపంలో పోలీస్లకు అజ్ఞాత వ్యక్తి సమాచారం ఇవ్వండంతో లారీని పట్టుకున్నారు. కాగా పోలీసులను చూసి నిందితులు పరరయ్యారు. లారీని సీజ్ చేసి 450 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నేటికీ నిందితులను పట్టుకోలేదు. కేసును మూసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ● మండలంలోని గురుదేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు ఇంటో ఈ ఏడాది మే నెల 28వ తేదీన దొంగలు పడి సుమారు మూడు కేజీల బంగారం, రూ 5 లక్షలకు పైగా నగదు దోచుకు పోయారు.ఈ కేసును పోలీసులు ప్రతిస్టాత్మకంగా తీసుకుని అప్పటి జిల్లా ఎస్పీ స్వయంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. అయినా నేటికీ అనుమానితులను పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. ఒక్క పైసా నగదు, గ్రాము బంగారం రికవరీ చేయలేదు. ఈ దొంగతనం జిల్లా చరిత్రలోనే అతి పెద్దది కావడం విశేషం. ● అలాగే ఈ ఏడాది నవంబర్ 14న చింతలపాలెం గ్రామం సమీపంలో గల మీసాల రవిప్రకాష్ ఇంటిలో రాత్రి 12 గంటల సమయంలో కుటుంబ సభ్యులు అందరూ నిద్రిస్తుండగా బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను కొట్టి బంధించి రూ.24 వేల నగదు, కొంత బంగారాన్ని దోచుకుపోయారు. నేటికీ ఈ కేసులో అనుమానితులను పోలీసులు పట్టుకోలేకపోయారు. ● గత నెల 15న వియ్యంపేట గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ దూది రాము (మహిళ)ను ఇంటిలోనే దుండగులు హత్య చేశారు. ఈ హత్య కేసులో అనుమానితులను నేటికీ పట్టుకోలేకపోయారు. ● ఇలా చెప్పుకుంటూ పోతే మంగళపాలెం గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలోను, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల ఆటోమైబెల్ షాపులోను దొంగలు పడి దోచుకుపోయినా నేటికీ పోలీసులు గుర్తించలేదు. ● స్వయాన రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నా పట్టించుకోకపోవడం ఈ ప్రభుత్వం చేతకాని తనానికి నిదర్శనంగాా నిలుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఆ తల్లిదండ్రుల దాతృత్వానికి సత్కారం
● రోడ్డు ప్రమాదంలో మరణించిన కుమారుడి అవయవ దానం ● తల్లిదండ్రుల గొప్పతనాన్ని గుర్తించి సత్కరించిన మానవీయత సంస్థచీపురుపల్లిరూరల్(గరివిడి): కన్నకొడుకు మరణించాడని తెలిసినా, ఇక ముందు తమ కుమారుడు తమముందు కనిపించడని తెలిసినా, తమ కొడుకు మరణం మరో పది మందికి జన్మనివ్వాలనే ఆశయంతో దుఃఖంలో కూడా కొడుకు అవయవాలను దానం చేసి ఆ తల్లిదండ్రులు తమ దాతృత్వం చాటుకున్నారు. గరివిడి మండలంలోని కాపుశంభాం గ్రామానికి చెందిన టొంపల సుమంత్ రాజాంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఏజెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు.ఈనెల 13న విధులు ముగించుకుని రాజాం నుంచి చీపురుపల్లి వైపు ఆటోలో వస్తుండగా ఓ వ్యాన్ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన సుమంత్ను శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా బ్రెయిన్డెడ్గా వైద్యాధికారులు నిర్ధారించారు. ఈ మేరకు సుమంత్ తల్లిదండ్రులు రమణ, ఆరుద్రలు కొడుకు మరణించిన బాధలో ఉండి కూడా కొడుకు అవయవాలను దానం చేశారు. ఆ తల్లిదండ్రుల దాతృత్వాన్ని గుర్తించిన చీపురుపల్లి పట్టణానికి చెందిన మానవీయత స్వచ్చంద సంస్థ వ్యవస్ధాపకుడు, రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ గోవిందరాజులు గ్రామంలోనికి బుధవారం వెళ్లి సుమంత్ తల్లిదండ్రులను సత్కరించారు. 12 మందికి పునర్జీవం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో కొడుకు అకాల మరణంతో చెప్పలేని దుఖంలో ఉన్నప్పటికీ కొడుకు అవయవాలైన కిడ్నీలు, కాలేయం, హృదయం, నేత్రాలు దానం చేసి మరో 12 మందికి పునర్జీవం కల్పించారని ప్రశంసించారు. శ్రీకాకుళం జిల్లాలోని జెమ్స్ హాస్పిటల్లో జరిగిన ఈ అవయవాల దానం గ్రీన్ఫీల్డ్ ద్వారా పంపించి అవసరమైన వారికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ జనరల్ సెక్రటరీ రామ్మూర్తినాయుడు, స్థానిక ఎంపీటీసీ టి.సంజీవ్ ఉన్నారు. -
జిల్లా ఆస్పత్రిలో ‘బర్త్ వెయిటింగ్ హోమ్’
● పరిశీలించిన జిల్లా జేసీ యశ్వంత్ కూమర్ రెడ్డి పార్వతీపురం రూరల్: మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణులకు మెరుగైన ప్రసవ సేవలందించేందుకు జిల్లా ఆస్పత్రిలో ‘బర్త్ వెయిటింగ్ హోమ్’ ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ కేంద్రాస్పత్రిలో రూ. 11.50 లక్షల వ్యయంతో సమకూర్చిన ఆధునిక వైద్య పరికరాలను జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో, సి.యశ్వంత్ కుమార్ రెడ్డి బుధవారం రాత్రి నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆస్పత్రికి వచ్చే రోగులకు, ముఖ్యంగా గర్భిణులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సిబ్బందికి స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారిణి డాక్టర్ పద్మావతి, ఆర్ఎంవో డాక్టర్ శ్యామల పాల్గొన్నారు.రెండు గడ్డివాములు దగ్ధంబొండపల్లి: మండలంలోని గొల్లుపాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి ఎంఎస్వీ.రవిప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో గొర్లె బంగారునాయుడికి చెందిన రెండు గడ్డివాములపై గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ కాల్చిపడేయడంతో మంటలు వ్యాపించి అగ్నికి ఆహుతయ్యాయి. సూమారు రూ.15 వేలు ఆస్తినష్టం సంభవించగా, పక్కన ఉన్న గడ్డివాములకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. రెండు తులాల బంగారం చోరీజియ్యమ్మవలస రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దొంగలు ఒంటరి మహిళలను టార్గెట్ చేసి బరి తెగిస్తున్నారు. బుధవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో చినకుదమ గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో పొలం నుంచి ఇంటికి వస్తున్న నల్ల నారాయణమ్మ ముఖానికి మత్తు మందు కొట్టి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారం తాడును ఎత్తికెళ్లినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. తాను పొలం నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఎదురుగా మోటార్ బైక్పై వచ్చిన వ్యక్తి కనీసం ముఖానికి మాస్క్, హెల్మెట్ కానీ లేకుండా వచ్చి మత్తు మందు చల్లడంతో ఆ క్షణంలో ఏం జరిగిందో తనకు తెలియలేదని తెలిపింది. పరజపాడు గ్రామంలోని శివాలయంలో హుండీ కానుకలను మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో ఓ దొంగ చాకచక్యంగా దోచుకున్న ఘటనపై చినమేరంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్సై అనీష్ తెలిపారు. వైఎస్సార్సీపీలో నూతన నియామకాలువిజయనగరం: రాష్ట్రంలో బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన నియామకాలకు సంబంధించిన జాబితాను పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గజపతినగరానికి చెందిన ఇజ్జరోతు రామునాయుడు, కార్యదర్శిగా బొబ్బిలికి చెందిన బొమ్మి అప్పలనాయుడు నియామకమయ్యారు. అదేవిధంగా జిల్లా ఫెడరేషన్ అధ్యక్షుడిగా రాజాంకు చెందిన మరిశర్ల గంగారావుకు బాధ్యతలు అప్పగించగా.. ఎస్కోట నియోజకవర్గ అధ్యక్షుడిగా గోపాల కృష్ణారావు, విజయనగరం నియోజకవర్గం అధ్యక్షుడిగా ఎం.పరమేశ్వరరావు, చీపురుపల్లి నియోజకవర్గం అధ్యక్షుడిగా సింగవరపు రామకృష్ణ, నెల్లిమర్ల నియోజకవర్గం అధ్యక్షుడిగా బోని చంద్రరావు నియామకమైనట్లు జాబితాలో పేర్కొన్నారు. -
టీచర్ల కామన్ సర్వీస్ రూల్స్కు తొలగిన అడ్డంకులు
● ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడువిజయనగరం అర్బన్: కొన్నేళ్లుగా కోర్టుల్లో వివాదాలతో నడుస్తున్న టీచర్ల కామన్ సర్వీసు రూల్స్ అంశానికి అడ్డంకులు తొలగాయని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు అన్నారు. ఈ మేరకు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన 26 జిల్లాలను రాష్ట్రపతి అనుమతించి గెజిట్ ఇటీవల విడుదలైందని ఈ నేపథ్యంలో గతంలో ఉమ్మడి రాష్ట్రంలోని జోన్, డివిజన్, జిల్లా ప్రామాణికాలు రద్దవుతాయన్నారు. నూతనంగా ఏర్పడిన 26 జిల్లాలు, జోన్లు ప్రామాణికంగా తీసుకుని జిల్లాపరిషత్, మున్సిపాలిటీ, ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలన్నింటి నిర్వహణ విద్యాశాఖలోకి తీసుకురావడానికి రాష్ట్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. గెజిట్ను అమలు చేయడానికి ముందుగా ఉన్నతాధికారులతో కమిటీ వేసి రాష్ట్రప్రభుత్వం అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. కామన్ సీనియారిటీ ఆధారంగా లోకల్ కేడర్, నిబంధనలు, పదోన్నతుల ప్రక్రియకు మార్గదర్శకాలను కమిటీ కనీసం 27 రోజుల మినిమమ్ కాలవ్యవధిలో రూపకల్పన చేయాల్సి ఉంటుందని వివరించారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ సెలవుల వయోపరితిని సర్వీసులో ఉన్నంత వరకు పెంచడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని చెప్పారు. 2004 సెప్టెంబర్ తరువాత ఉద్యోగాల్లో ప్రవేశించిన వారికి వర్తింప చేసిన సీపీఎస్ పెన్షన్ స్కీం అప్పడికే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు రాసి ఉద్యోగాలకు పెంపికై న వారికి సీపీఎస్ కాకుండా పాత పెన్షన్ స్కీం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.రవీంద్రనాయుడు, డి.శ్రీనివాస్, పీఆర్టీయూ ఉత్తరాంధ్ర మీడియా ఇన్చార్జ్ బంకపల్లి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా పెన్షనర్స్ డే
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెన్షనర్స్ దినోత్సవాన్ని బుధవారం స్థానిక సంఘం భనవనంలో ఘనంగా నిర్వహించారు., జిల్లా శాఖ అధ్యక్షుడు రామచంద్రపాండా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత అసోసియేషన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 75 సంవత్సరాలు దాటిన పలువురు సీనియర్ రిటైర్డ్ ఉద్యోగులను సంఘం ఘనంగా సత్కరించింది. అనంతరం పలువురు మాట్లాడుతూ పీఆర్సీని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కలిపి బకాయిలు ఉన్న సుమారు రూ.35 వేల కోట్లను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు పి.రామచంద్రరావు, ఏపీజీఈఏ రాష్ట్ర కార్యదర్శి ఎల్వీ యుగంధర్, జిల్లా కార్యదర్శి బలివాడ బాల భాస్కర్రావు, కార్యనిర్వాహక కార్యదర్శి పక్కి భూషణ్రావు, పెన్షనర్స్ ఎస్టీఓ నూకరాజు, కోశాధికారి సొంటి కామేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి కె.ఆదినారాయణ, ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, డ్రైవర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రామారావు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 100 మంది పెన్షనర్లకు సన్మానంఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆలిండియా పెన్షనర్స్డే కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా 100 మంది వృద్ధ పెన్షనర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షుడు వి.సూర్యనారాయణ, కార్యదర్శి త్రినాఽథ్ ప్రసాద్తో పాటు సంఘం కార్యవర్గ సభ్యులు, జిల్లావ్యాప్తంగా పెన్షనర్లు హాజరయ్యారు. -
లగ్జరీ బస్సును ఢీకొట్టిన లారీ
గజపతినగరం: మండలంలోని మరుపల్లి గ్రామం జంక్షన్ వద్ద లగ్జరీ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం నుంచి గజపతినగరం మీదుగా ప్రయాణిస్తూ మరుపల్లి గ్రామం సమీపంలో ఒక ఆర్టీసి పల్లె వెలుగు బస్సు ఆగి ఉంది. దాని వెనుక వస్తున్న వస్తున్న లగ్జరీ ఆర్టీసీ ఎక్స్ప్రెస్బస్సు ఆగి కొంతసమయం తరువాత ఆగి ఉన్న పాసింజర్ బస్సును తప్పించి కుడివైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో వెనుక నుంచి లగ్జరీ ఆర్టీసీ బస్సును లారీ డ్రైవర్ బలంగా ఢీకొట్టాడు.ఆతరువాత బైక్ను కూడా లారీ డ్రైవర్ ఢీకొట్టాడు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో గాయాలపాలయిన డి.అప్పలనాయుడు(రేగిడి),కె.సూర్యప్రకాష్ (మిర్తివలస),పి.శ్రీను(గజపతినగరం మండలం మరుపల్లిగ్రామం),కె.మురళీకృష్ణ(గజపతినగరం మండలం మరుపల్లి గ్రామం),ఎన్.అప్పారావు(గంట్యాడ మండలం నరవ గ్రామం)లను గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.బస్సు డ్రైవర్ సూర్యప్రకాష్ ఫిర్యాదు మేరకు ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు లారీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురికి గాయాలు -
స్వచ్ఛగ్రామంగా అంటిపేట రూపుదిద్దుకోవాలి
సీతానగరం: మండలంలోని అంటిపేట పంచాయతీ స్వచ్ఛగ్రామంగా రూపుదిద్దు కోవాలని సబ్కలెక్టర్ ఆర్ వైశాలి అన్నారు. ప్రతిపాదిత స్వచ్ఛగ్రామం అంటిపేటను సబ్కలెక్టర్ ఆర్ వైశాలి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛగ్రామంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. గ్రామంలో ఎక్కడా చెత్తకనిపించరాదని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు శుద్ధి చేసుకుని స్వచ్ఛమైనగ్రామంగా తీర్చి దిద్దుకోవాలని గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్, ఎంపీడీఓ ఎంఎల్ఎన్ ప్రసాద్, సర్పంచ్ బి.తిరుపతిరావు, ఎంఈఓ సూరిదేముడు,ఇంజినీరింగ్ అధికారులు, గ్రామపెద్దలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. కోటసీతారాంపురంలో మౌలికవసతుల కల్పనమండలంలోని కోటసీతారాంపురం గ్రామంలో ప్రజావసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం నిమిత్తం సబ్కలెక్టర్ ఆర్. వైశాలి బుధవారం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరాతీశారు. గ్రామాన్ని వ్యవసాయ, ఆర్ధిక,వాణిజ్య, విద్యాపరంగా అభివృద్ది పధకంలో నడిపించడానికి అవసరమైన వసతులు కల్పించడానికి వనరులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం రైతు సేవాకేంద్రం ఆవరణలో గ్రామ పెద్దలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ ఉద్యోగుల నుంచి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి అభిప్రాయాలను సేకరించారు. -
వెబ్ల్యాండ్ ప్రాతిపదికన రీసర్వే చేయాలి
పార్వతీపురం: వెబ్ల్యాండ్ ప్రాతిపదికన భూముల రీసర్వేను పక్కాగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశమందిరంలో రెండవ విడత రీసర్వేపై గ్రామ సర్వేయర్లు, వీఆర్ఓలు, వీఆర్ఏలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత రికార్డులు, కొత్త డిజిటల్ మ్యాపింగ్ వివరాలను సరి పోల్చి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా రీసర్వే చేపట్టాలని సూచించారు. రైతులనుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించి రీసర్వేపై నమ్మకం కలిగించాలని చెప్పారు. తహసీల్దార్లు, సర్వేయర్లు సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రతి మండలంలో రోజువారీ పురోగతి నివేదికలను పంపించాలని కోరారు. ప్రతి గ్రామంలో అసైన్మెంట్ రిజిస్టర్ను మెయింటైన్ చేయాలని చెప్పారు. ఒరిజినల్ పట్టాదారు కానప్పుడు వారికి పీఓటీ యాక్ట్ ప్రకారం నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూమిని జిరాయితీగా మార్చే అవకాశం లేదన్నారు. ఒకవేళ ఎక్కడైనా ప్రభుత్వ భూమి జిరాయితీగా మార్చితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సెటిల్ చేసిన ఈనామ్ భూములకు ఈనామ్ రైత్వారీ పట్టా అని క్లాసిఫికేషన్ పెట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి పి.లక్ష్మణరావు, పార్వతీపురం, పాలకొండ డీఐఓఎస్లు, రీసర్వే తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి -
ఇలాగైతే కష్టం.. వెళ్లిపోతాం..
● భార్య అధికారంతో అధికారులపై భర్త స్వారీ ● గ్రామాల్లో తాము చెప్పే పనులే చేపట్టాలని హుకుం ● ఉపాధి హామీ పనుల్లో జోక్యం ● అనుమతులు ఇవ్వద్దని అధికారులపై ఒత్తిడి ● సామూహికంగా సెలవుకు ఇంజినీరింగ్ అధికారుల నిర్ణయం సాక్షిప్రతినిధి, విజయనగరం: ఏమయ్యా ఆఫీసర్లు.. నేను చెబితే వినరా..? ఏం.. నాకేం తక్కువ.. నాకు పవర్ లేదా..? నేను మీ అమ్మగారికే అయ్యగార్ని.. అంటే నేనే ఎక్కువ పవర్ ఫుల్.. కాబట్టి నేను చెప్పేది టకటకా నోట్ చేసుకుని ఫటఫటా చేసేయాలి. నేను వద్దన్న చోట ఉపాధి హామీ పనులు గట్రా శాంక్షన్ ఇవ్వకండి.. అంతా మనం చెప్పినట్లే అవ్వాలి.. మనం చెప్పినవాళ్లకే ఇవ్వాలి. ఇదీ ఆయనగారి దాదాగిరి. మళ్లీ గెలుస్తామో లేదో.. ఇప్పుడే ఎంతైనా పవర్ చూపేయాలి.. అనే ఆతృతతో అసంబద్ధంగా ఇష్టానుసా రం అధికారులపై స్వారీ చేస్తున్నారు. ఈయన తొందర.. తుత్తర వ్యవహారంతో భరించలేని అధి కారులు ‘ఈయనకు తెలియదు.. చెబితే వినడు.. ఇక్కడ ఉద్యోగం చేయడం కన్నా సెలవుపై పోవ డం’ మేలు అంటూ ఒక్కొక్కరుగా విధుల నుంచి తప్పుకుంటున్నారట. నెల్లిమర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మొత్తం 105 పంచాయతీలు ఉండగా ఆయా పంచాయతోల్లో అభివృద్ధి పనుల నిమిత్తం ఒక్కో మండలానికి రూ.20 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ నిధులు మంజూరయ్యాయి. పంచాయతీలు తీర్మానం చేసుకుని ఆ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. చాన్నాళ్లకు నిధులు రావడంతో పల్లె ప్రజల అవసరాలు తీర్చేలా సర్పంచులు, ఎంపీటీసీలు సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలు వంటివి చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. నిబంధనల ప్రకా రం అధికారులు కూడా పనులకు ఆమోదం తెలిపారు. అంతే... ‘లోకం’మెచ్చిన పనులను అడ్డుకునేందుకు అమ్మగారి భర్త రంగంలోకి దిగారు. తా ము ఎక్కడ చెబితే అక్కడే పనులు చేపట్టాలంటూ అధికారులను బెదిరిస్తున్నారు. అమ్మగారి పీఏ కూ డా ‘రాజు’ అవతారంలో అధికారులకు ఆదేశాలు జారీచేసేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన పనుల ను కూడా ఆపాలని చెబుతుండడంతో అధికారు లు ఇరకాటంలో పడ్డారు. చేస్తే మేము చెప్పినట్లు చేయండి.. లేదా సెలవుపై వెళ్లిపోండి అని వాళ్లిద్ద రూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఒక జేఈ స్థా యి అధికారి ఆవేదన వ్యక్తం చేయడంగమనార్హం. ఆధిపత్య పోరుతో జనం ఇబ్బందులు టీడీపీ తరఫున ఎమ్మెల్యే సీటు వస్తుందని బంగార్రాజు ఆశించారు. ఆయనకు పార్టీ క్యాడర్ నుంచి సపోర్ట్ ఉంది. పైగా స్థానికుడు. పొత్తులో భాగంగా ఎమ్మెల్యే టికెట్టు జనసేనకు ఇచ్చారు. ఆయన సహకారంతో గెలిచినా... అనంతర కాలంలో ఇరువర్గాల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఆయన ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు అభివృద్ధి పనులను అడ్డుకుంటూ ‘లోకం’ దృష్టిలో దంపతు లు పలచన అయిపోతున్నారన్నది జనంమాట. అసంబద్ధమైన ఆలోచనలతో తమను బెదిరిస్తున్న ప్రజాప్రతినిధి భర్తతో వేగలేక పోతు న్నాం అంటూ ఉపాధిహామీ అధికారులు లోలో న బాధపడుతున్నారు. ఈయనకు పాలసీ తెలియదు.. చెబితే వినేరకం కాదు. ఇలా అడ్డదిడ్డంగా వాదిస్తూ విరుచుకుపడితే ఉద్యోగాలు ఎలా చేస్తాం అని మదనపడుతూ అధికారులు సెల వుపై వెళ్లిపోతున్నారని ఉద్యోగవర్గాల సమాచారం. ఇప్పటికే నెల్లిమర్ల, డెంకాడ జూనియర్ ఇంజినీర్లు, డీఈ సెలవుపై వెళ్లిపోయారు. కొన్నాళ్లు ఆగి వద్దాం.. అప్పటికి వేరే చోట పోస్టింగ్ వెతుక్కుందాం.. ఈ తలనొప్పులు లేకుండా ఉద్యోగం చేసుకునే చోట పోస్టింగ్ దొరికితే మేలు అనే భావనలో వారున్నారని తెలుస్తోంది. భోగాపురం, పూసపాటిరేగ జూనియర్ ఇంజినీర్లు కూడా అయ్యగారి మెహర్బా నీతో భరించలేక సెలవుమీద వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. పనులు నిలిపివేసి... నెల్లిమర్ల ఎంపీపీ అంబళ్ల సుధారాణి స్వగ్రా మం ఒమ్మి పంచాయతీలో చాన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని ఉపాధిహామీ నిధులతో ఇటీవల శ్రీకారం చుట్టారు. జేసీబీల ను ఏర్పాటు చేసి కాలువ పనులు ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న అయ్యగారు, సహాయకుడు ఫీల్డ్లోకి వెళ్లి రచ్చరచ్చ చేశారు. ఎవరికి చెప్పి పనులు చేస్తున్నారని అక్కడున్న కూలీలతో వాగ్వాదానికి దిగారు.వెంటనే జేఈ, డీఈలకు ఫోన్చేసి తక్షణమే పనులు ఆపాలంటూ హుకుంజారీచేశారు. అభివృద్ధి పనులు ఆపడంతో అక్కడున్న స్థానికులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. మేము లేనప్పుడు వచ్చి పనులు ఆపారని... ఈ సారి గ్రామంలోకి వస్తే తమ సత్తా చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారట. కొత్తపేట గ్రామంలో కూడా సీసీ రోడ్డు పనులను ఇదే తరహాలో నిలిపివేశారు. -
క్లాట్లో బొబ్బిలి కుర్రాడి ప్రతిభ
బొబ్బిలి: పట్టణానికి చెందిన వేమిరెడ్డి నితిన్ చంద్ర మంగళవారం విడుదలైన క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్–26) ఫలితాల్లో జాతీ య స్థాయిలో 90వ ర్యాంకు సాధించాడు. ఓబీసీలో 5వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. క్లాట్లో కుమారుడు ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులు శ్యామల, బాబూరావు సంతోషం వ్యక్తం చేశా రు. పట్టణ వాసులు, విద్యావేత్తలు, న్యాయవాదులు నితిన్చంద్రను అభినందించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన బెంగళూరు లా యూనివర్సిటీలో మాస్టర్స్ లా చేసి ప్రజలకు న్యాయ సేవలందించడమే ఆశయమని నితిన్ తెలిపాడు. విజయనగరం అర్బన్: ప్రతి గ్రామంలో పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయవచ్చని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం ప్రారంభమైన ముఖ్యమంత్రితో కలెక్టర్ల సమావేశంలో ఆయన ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పశుగ్రాస కేంద్రాల ఏర్పాటువల్ల పాలఉత్పత్తి పెరగడంతో రైతులు, పాడి రైతుల ఆదాయం మెరుగుపడుతుందన్నారు. గ్రామీణ ప్రజల ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుందని తెలిపారు. చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాలకు చెందిన విద్యార్థులు క్విజ్ పోటీల్లో ప్రతిభ చూపారు. సొసైటీ ఆఫ్ యానిమల్ ఫిజియాలజిస్టు ఆఫ్ ఇండియా ఆధ్వ ర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన దక్షిణ భారత క్విజ్ పోటీల్లో కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న బి.జ్ఞాన సంధ్యారాణి, తృతీయ సంవత్సరం చదువుతున్న వి.సంజనశర్మ విజేతలుగా నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను కళాశాలలో బుధవారం నిర్వహించిన అభినందన సభలో అసోసియేట్ డీన్ మక్కేన శ్రీను అభినందించి దుశ్శాలువతో సత్కరించారు. క్విజ్ పోటీలు విద్యార్థుల మేధోశక్తికి దోహదపడతాయన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో రాణించి కళాశాలకు పేరు తీసుకురావా లని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థి వ్యవహారాల అధికారి డా.వై.ఆర్.అంబేడ్కర్, అకడమిక్ అధికారి దీపిక, డిపార్ట్మెంట్ హెడ్ టి.ప్రసాదరావు, గంగునాయుడు, రాజీవ్, విద్యార్థులు పాల్గొన్నారు. ● యూరియా కోసం.. -
రెవెన్యూ వేదన.. క్లినిక్లో చికిత్స అందేనా!
ఈయన పేరు గుణుపూరు పారినాయుడు, సీతానగరం మండలం కృష్ణరాయపురం గ్రామం. ఆయనకు సర్వే నంబర్ 160–1లో 52.50 సెంట్ల భూమి ఉంది. రీసర్వే సమయంలో 50 సెంట్లు పడితే అదే భూమి కొలిచారు. తన భూమిని అదే సర్వే నంబరులో ఇంకొకరి పేరులో ఉంది. వారికి 91.50 సెంట్లు ఉంటే.. దానిని 98 సెంట్లుగా ఆన్లైన్ చేశారు. సర్వే నంబరు 160–3లో పాస్ పుస్తకం ప్రకారం 29 సెంట్లు ఉంటే.. ఆన్లైన్లో 27 సెంట్లుగా చూపించారు. తర్వాత 27 సెంట్లను కాస్త 23 సెంట్లుగా మార్చి చూపారు. రీసర్వే జరిపి, తప్పులను సరి చేయాలని.. అందుకయ్యే మొత్తం భరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన మొర పెట్టుకుంటున్నా ప్రయోజనం లేకపోతోంది. బలిజిపేటకు చెందిన చోడవరపు సూర్యనారాయణ పేరు మీద ఉన్న 48 సెంట్ల భూమిని.. తన కుమార్తె కెల్ల లక్ష్మి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు కొద్దిరోజుల కిందట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. తీరా, అందులో 40 సెంట్ల భూమి మాత్రమే ఉన్నట్లు చూపించడంతో సమస్యను పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే మూడు దఫాలు కలెక్టరేట్కు వచ్చానంటూ ఆయన వాపోయారు. సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో రెవెన్యూపరమైన సమస్యలు కోకొల్ల లు. ప్రతి వారం కలెక్టరేట్లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే వినతుల్లో రెవెన్యూ సంబంధితమైనవే అధికం. దాదాపు సగానికిపైగా భూ సంబంధిత సమస్యలే. చాలా వరకు వివాదాల్లో ఉన్నవే. వీటిని పరిష్కరించడానికి సమ యం పట్టవచ్చు. ఇదే విషయం అర్జీదారులకు అర్థ మయ్యేలా, సంతృప్తికర స్థాయిలో చెప్పడం అధికారుల బాధ్యత. రెవెన్యూ శాఖలో అది జరగడం లే దు. అధికారులకు, సిబ్బందికి డబ్బులిచ్చినా, ప్రజాప్రతినిధుల సిఫారసులున్నా.. ఎలాంటి పనైనా ఇట్టే పూర్తి చేస్తారన్న ఆరోపణలు ఈ శాఖ మీద ఉన్నా యి. అదే సామాన్యులు ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం ఉండదు. ఈ కారణం వల్లే ఎక్కువగా ఏసీబీ వలలో పడే అధికారుల్లో రెవెన్యూవారే ఉంటున్నారు. రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టేలా.. సంయుక్త కలెక్టర్ నాయకత్వంలో జిల్లాలో రెవెన్యూ క్లినిక్కు కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి శ్రీకారం చుట్టారు. కలెక్టరేట్లోనే ప్రతి సోమవారం ఒకవైపు పీజీఆర్ఎస్ జరగగా.. మరోచోట రెవెన్యూ క్లినిక్ను నిర్వహిస్తున్నారు. దీనిని సెప్టెంబర్ 29న ప్రారంభించారు. ఇప్పటి వరకు 10 ‘క్లినిక్’లు చేపట్టారు. ప్రత్యేకంగా ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసి, వీలైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు అధికారులు అంటున్నారు. దీర్ఘకాలిక సమస్యలున్నప్పుడు వాటిని ప్రాథమికంగా విచారణ చేయడానికి మండలాల తహసీల్దార్లు, ఇద్దరు సబ్ కలెక్టర్లు, జేసీని ఉంచి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్లినిక్కు మొదటి ఆరు వారాల్లో 227 ఫిర్యాదులు అందగా.. అవన్నీ పరిష్కరించేశామని ప్రకటించుకోవడం గమనార్హం. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రయత్నిస్తే.. 173 మంది ఫోన్ తీసి, తమ సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పుకొంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. విజ్ఞప్తులు ఇచ్చిన వారే మరలామరలా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతివారం పెరుగుతున్న వినతుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం మంది నిరక్షరాస్యులే. ఐవీఆర్ఎస్ కాల్స్ పట్ల వారికి ఉన్న అవగాహన కూడా తక్కువే. అటువంటి వారి నుంచి అభిప్రాయాలు సేకరించి, వంద శాతం పూర్తి చేసేశామని అధికారులు చెప్పుకోవడంపై ప్రజాసంఘాల నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నపాటి ఆన్లైన్ సమస్యలకే మోక్షం చూపడం లేదని, క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే.. ఇక్కడి వరకు రావాల్సిన అవసరం ఏముంటుందని సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రంలోని వ్యక్తి పేరు చింతా సత్యనారా యణ. పెద్దగైశీల గ్రామం. తల్లి పేరిట ఉన్న డీ పట్టా భూమిని తన పేరున మార్చాలని కోరుతూ.. ఇటీవల కలెక్టరేట్లో జరిగిన ‘రెవెన్యూ క్లినిక్’కు వచ్చాడు. ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ఆయన రావడం ఇది మూడోసారి. అది అవుతుందా? లేదా?.. అవ్వకపోతే ఎందు కు మారదు? వంటి సహేతుకమైన కారణాన్ని గ్రా మ, మండల స్థాయిలోనే చెప్పి సమస్యను పరిష్కరించవచ్చు. ఆ పనిని రెవెన్యూ యంత్రాంగం సక్రమంగా చేయలేకపోవడంతో కొన్నాళ్లుగా ఆయన అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. -
విద్యార్థి మరణానికి పూచీకత్తు..!
గుమ్మలక్ష్మీపురం: ఇటీవల కాలంలో వివిధ ఆరోగ్య సమస్యలతో పార్వతీపురం మన్యం జిల్లాలోని పలువురు విద్యార్థులు ఆస్పత్రుల్లో చేరడం, కొందరు మరణించడం షరామామూలుగా మారింది. అయితే... ఓ పదో తరగతి విద్యార్థి మృతిని దాచిపెట్టడం, మృతికి తాము కారణం కాదంటూ నిరక్షరాస్యులైన తల్లిదండ్రులతో పాఠశాల హెచ్ఎం పేరున పూచీకత్తుపత్రం రాయించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పాఠశాల సిబ్బంది తీరుపై గిరిజన సంఘాలు భగ్గుమంటున్నాయి. మరణానికి కారణం ఏదైనా కావచ్చని, పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులతో పూచీకత్తు రాయించడం గతంలో ఎన్నడూ చూడలేదంటూ మండిపడుతున్నారు. గిరిజన సంక్షేమశాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి సంధ్యారాణి సొంత జిల్లాలోనే గిరిజనుల ఆరోగ్యానికి భరోసా లేకుండా పోయిందంటూ విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... గుమ్మలక్ష్మీపురం మండలం దొరజమ్ము ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న తాడంగి అవిష్ (15) అనారోగ్యంతో ఈ నెల 14న మృతి చెందాడు. అవిష్ది గుమ్మలక్ష్మీపురం మండలం వాడజంగి గ్రామం. విద్యార్థి చిన్నాన్న కుమార్తె ఈ నెల 13న మృతి చెందింది. ఆమె అంత్యక్రియల కోసం పాఠశాలకు వచ్చి అవిష్ను ఇంటికి తీసుకెళ్లారు. మరుసటిరోజు అవిష్ అకస్మాత్తుగా మృతిచెందాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా పాఠశాల సిబ్బంది జాగ్రత్తపడ్డారు. ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో అవిష్ మృతి చెందాడని, ఈ ఘటనకు పాఠశాల సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదంటూ నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు డెక్కన్న, డోరమ్మ రాతపూర్వకంగా తెలియజేసినట్టు వారితో వేలిముద్రలు వేయించారు. పాఠశాల హెచ్ఎంకు అడ్రస్ చేస్తూ అమానవీయంగా రాయించుకున్న పూచీకత్తు పత్రం ఇప్పుడు వెలుగు చూడడంతో గిరిజన సంఘాల నాయకులు, మేధావులు విస్తుపోతున్నారు. ఆదుకుంటాడనుకున్న కుమారుడి మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చాల్సిన సిబ్బంది ఎవరి సూచనల మేరకు ఇలా పూచీకత్తు పత్రం రాయించారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. మరణానికి కారణాలు ఏవైనా కావచ్చని, నిరక్షరాస్యులైన గిరిజనులతో వేలిముద్రలు వేయించడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవంగా మృతిచెందిన అవిష్ ఏడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది. విద్యార్థికి వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం చేసినట్టు సమాచారం. విద్యార్థి మృతిని గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం అర్థంకాని ప్రశ్నగా మారింది. -
ఇదెక్కడి తీరు ‘బాబూ’..!
● బస్తా యూరియా కోసం పొటాష్, గడ్డి మందు కొనుగోలు చేయాలా? ● వాటికోసం వేల రూపాయలు ఖర్చుపెట్టాలా? ● చీపురుపల్లిలో రైతుల ఆందోళన ● ఎరువుల దుకాణదారు తీరుపై ఆగ్రహం చీపురుపల్లి: ఒకే ఒక్క యూరియా బస్తా కోసం వేలకు వేలు ఖర్చు చేయాలంటే ఎక్కడి నుంచి అప్పులు తేవాలి?.. వ్యవసాయం ఎలా చేయాలి?.. పంటలు పండించొద్దు అంటే చెప్పండి.. మానేస్తాం... కానీ ఇలా బస్తా యూరియా కోసం వేలకువేలు ఖర్చు చేయలేం.. ఇదెక్కడి అన్యాయం ‘బాబూ’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎరువుల కోసం ఇన్నిపాట్లా అంటూ నిట్టూర్చారు. చీపురుపల్లి పట్టణంలోని శివరాం రోడ్డులో ఉన్న మనగ్రోమోర్ కేంద్రం వద్ద బుధవారం యూరియా కోసం వచ్చిన రైతులకు చేదు అనుభవం ఎదురైంది. యూరియా కావాలంటే పొటాష్, డీఏపీ, గడ్డి మందు కొనుగోలు చేయాలని, లేదంటే యూరియా ఇవ్వమని అక్క డి సిబ్బంది చెప్పడంతో రైతులు ఖంగుతిన్నారు. కొద్ది రోజుల కిందట నాలుగైదు వేలు వెచ్చించి మనగ్రోమోర్ సిబ్బంది చెప్పినవన్నీ కొనుగోలు చేశామని, అయినప్పటికీ యూరియా ఇవ్వడం లేదంటూ బిల్లుల తీసుకుని వచ్చిన మరికొందరు రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఏపీ, పొటాష్, గడ్డి మందు కొనుగోలు చేసిన వారికి కూడా యూరి యా ఇవ్వకపోవడంతో వారంతా ఆందోళనకు దిగా రు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతన్న కష్టాలపై ఏకరువుపెట్టారు. రైతంటే గౌరవం పోయిందంటూ వాపోయారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ ఏడీ ఎన్.కోటేశ్వరరావు, ఏఓ సూర్యకుమారి దుకాణం వద్దకు చేరుకున్నారు. ఏఓ సూర్యకుమారి స్వయంగా మనగ్రోమోర్ కౌంటర్లో కూర్చుని రైతులకు ఎలాంటి అదనపు కొనుగోళ్లు లేకుండా యూరియా పంపిణీ చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పష్టంచేశారు. -
గురుకులంలో ఆకలికేకలపై స్పందించిన అధికారులు
భామిని: సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాన్ని ఎంపీడీవో ఎస్.వసంతకుమారి మంగళవారం సందర్శించారు. ఈ నెల 15న ‘గురుకులంలో ఆకలికేకలు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఎంపీడీవో వసంతకుమారి గురుకులాన్ని సందర్శించారు. ప్రిన్సిపాల్ విజయనిర్మలతో కలిసి వంట గదిని నిశితంగా పరిశీలించారు. పరిశుభ్రత లేకపోవడంపై సిబ్బందికి సూచనలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు విద్యార్థులకు భోజనం పెట్టకపోవడంపై కారణాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రిన్సిపాల్, సిబ్బంది వహించాలన్నారు. చేసిన వంటలను పరిశీలించి మెనూ ప్రకారం అమలు చేయా లని సూచించారు. గురుకుల సిబ్బంది ఉన్నారు. -
ఇంటర్ పరీక్షల నిర్వహణ పకడ్బందీగా జరగాలి
● ఇంటర్ బోర్డు రిసోర్స్ పర్సన్, ప్రొఫెసర్ ఎన్.మోహన్కుమార్విజయనగరం అర్బన్: రానున్న మార్చి 2026లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను (ఐపీఈ–2026) ఎటువంటి లోపాలు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు రిసోర్స్ పర్సన్, ప్రొఫెసర్ ఎన్.మోహన్కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం తోటపాలెంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి శివ్వాల తవిటినాయుడు అధ్యక్షతన వివిధ కళాశాలల యాజమాన్యాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.మోహన్ కుమార్ మారిన సిలబస్, ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల విధానాలపై పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరానికి సైన్స్, ఆర్ట్స్ గ్రూపుల్లో (భాషా సబ్జెక్టులు మినహా) 14 సబ్జెక్టులకు నూతన సిలబస్ అమలులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రశ్నపత్రాలు పూర్తిగా సీబీఎస్ఈ తరహాలో రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. బోటనీ, జూవాలజీని బయాలజీగా కలిపి ఒకే సబ్జెక్టుగా చేయడం, గణితాన్ని 1ఏ, 1బీగా కాకుండా ఒకే ప్రశ్నపత్రంగా ప్రవేశపెట్టడం, సైన్స్ పేపర్ల సంఖ్యను 6 నుంచి 5కు తగ్గించడం వంటి కీలక సంస్కరణలను వివరించారు. సిలబస్ మారిన 14 సబ్జెక్టులకు 32 పేజీల సమాధానం బుక్లెట్లు, బయాలజీ (బోటనీ–జూవాలజీ)కి 24 పేజీల బుక్లెట్లు అందించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి పబ్లిక్ పరీక్షలు 30 రోజుల పాటు నిర్వహించే నేపథ్యంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు (డీఓలు) అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రశ్నపత్రాల భద్రత, తరలింపు ప్రక్రియలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఏర్పాట్లు పూర్తి డీవీఈఓ శివ్వాల తవిటినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల నేపథ్యంలో అధ్యాపకులు మారిన సిలబస్, పరీక్షల విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జిల్లాలోని 66 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ఎం.సత్యనారాయణ, ఎన్ఎల్వీజగన్నాథరావు, కె.అప్పారావు, పీఎల్ఎస్ప్రకాష్ పట్నాయక్, వీకేవీకృష్ణారావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
చేతి వృత్తిదారులకు శఠగోపం
పార్వతీపురంటౌన్: చేతివృత్తులు, కులవృత్తులపై ఆధారపడి జీవించేవారి అభ్యున్నతికి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మయోజన అమలులో నీరుగారిపోయింది. లక్ష్యాలు ఘనంగా ఉన్నా అమలు మాత్రం తూతూ మంత్రంగానే ఉంది. మొక్కుబడిగా లబ్ధిదారులను ఎంపిక చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. పథకం చేరువ కాక పూర్తిస్థాయిలో నష్టపోతున్నామని లబ్ధిదారులు వా పోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో విశ్వకర్మ కోసం అనేకమంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే అర్హత ఉన్నా సాంకేతికత, ఽధ్రువీకరణ పత్రాల అప్లోడేషన్ వంటి కారణాలతో లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం గమనార్హం. బ్యాంకర్లు విశ్వకర్మ పథకం అమలుకు అసలు సహకారం అందించడం లేదని లబ్ధిదారుల నుంచి విమర్శలు చాలా ఉన్నాయి. బ్యాంకర్లను రుణాలు ఇచ్చేందుకు ఒప్పించడంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం విఫలమయ్యాయి. చేతివృత్తులను ప్రోత్సహించేందుకు పీఎం విశ్వకర్మ పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. చేతివృత్తులు, కళాకారులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఆర్థిక సహాయం, పనిముట్లు అందించడం పథకం ముఖ్య ఉద్దేశం. ఆధునిక పనిముట్లు, వస్తువుల కొనుగోళ్లలో రాయితీ అందించడం, చేతివృత్తుల ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించడం ద్వారా సంప్రదాయ కళలు, చేతి వృత్తులను ప్రోత్సహించడం ఈ పథక ఉద్దేశం. ఈ మేరకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రాథమిక, ఆధునిక నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. ప్రోత్సాహకం కింద రూ.15వేల కిట్లను అందజేశారు. శిక్షణ పొందిన వారికి బ్యాంకు నుంచి తొలి విడతలో తక్కువ వడ్డీకి రూ.లక్ష, అనంతరం రూ.3లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. కుమ్మరి, వడ్రంగి, కమ్మరి, శిల్పి, స్వర్ణకారులు, దోబి, పూలమాలలు అల్లేవారు. చేపలు పట్టేవారు. ఇలా 18 రకాల వృత్తుల వారికి విశ్వకర్మ పథకం వర్తిస్తుంది. చేతి వృత్తుల వారు విశ్వకర్మ పథకం కోసం దరఖాస్తు చేసుకోగా మొక్కుబడిగా మాత్రమే రుణాలు మంజూరు చేయడం గమనార్హం. విశ్వకర్మ పథకం అమలులో నిర్లక్ష్యం వేలల్లో దరఖాస్తులు.. వందల్లో లబ్ధిదారుల ఎంపిక జిల్లాలో 25,816 మంది దరఖాస్తులు ఎంపిక చేసింది కేవలం982మందిని మాత్రమే -
తిరుగు ప్రయాణంలో భవానీ భక్తుడి మృతి
చికెన్● గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రమాదంపాలకొండ రూరల్: ఆధ్యాత్మిక చింతనతో భవానీ మాల ధరించిన పట్టణంలోని 16వ వార్డు కుమ్మరివీధికి చెందిన ద్రాక్షవరపు రాంబాబు(36) కూరగాయల మార్కెట్లో కలాసీగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీక్ష ముగింపులో భాగంగా ఈ నెల 12న సహ దీక్షాధారులు 19 మందితో కలసి ప్రత్యేక వాహనంలో విజయవాడ పయనమయ్యారు. అమ్మవారి దర్శనం అనంతరం మాల విసర్జన పూర్తి చేసి 13వ తేదీన తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో రాత్రి 10 గంటల సమయంలో తమ వాహనం పుణ్యక్షేత్రం అన్నవరం సమీపంలో పత్తిపాడు ప్రాంతం వద్దకు చేరుకున్న క్రమంలో బహిర్భూమికి వెళ్లేందుకు వాహనం దిగివెళ్లిన రాంబాబు ఎంతసేపటికీ వాహనం దగ్గరకు చేరలేదు. తన వద్ద సెల్ఫోన్కుడా లేకపోవడంతో సహచరులు ఆచూకీ తెలుసుకోలేకపోయారు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో మరునాటి ఉదయం వరకూ వాహనం నిలిపిన ప్రదేశంలో ఎదురు చూసి 14వ తేదీ ఉదయం అన్నవరం పోలీస్ స్టేషన్లో సహ భవానీలు ఫిర్యాదు చేశారు. పాలకొండ వచ్చిన వారికి మంగళవారం రాంబాబు గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన నట్లు పోలీసుల నుంచి సమాచారం అందింది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు, ఆ వార్డు కౌన్సిలర్ కడగల వెంకట రమణ అన్నవరం పయనమయ్యారు. దగ్గరుండి పోస్టుమార్టం పూర్తి చేయించి, రాంబాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. మృతునికి భార్య రాజేశ్వరి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ బంధువులు కన్నీరుపెట్టారు. -
రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికలు
లక్కవరపుకోట: మండల కేంద్రంలో గల ఏపీ మోడల్ స్కూల్ మైదానంలో జిల్లా స్కూల్గేమ్స్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికలను మంగళవారం నిర్వహించారు. ఈ ఎంపికల్లో జిల్లాస్థాయి జట్టుకు అండర్ 14,17,19 విభాగాల్లో బాల,బాలికలను ఎంపిక చేశారు. జిల్లాలోని 17 పాఠశాలల నుంచి 173 మంది విద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఎంపికల్లో 30 మంది బాలికలను, 30 మంది బాలురును ఎంపిక చేసినట్లు చెప్పారు. వారు త్వరలో రాష్ట్రస్థాయిలో జరగబోయే పోటీల్లో విజయనగరం జిల్లా జట్లుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.కార్యక్రమంలో ఎంఈఓ సీహెచ్.కూర్మారావు, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి జి.లక్ష్మణరావు, చందులూరు పీడీ డాక్టర్ పి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదో చెప్పండి?
● మెడికల్ కాలేజీలపై మీ ప్రాధాన్యత ఏమిటి? ● ప్రైవేటుకు అప్పగిస్తే ఉచిత వైద్యం అందుతుందా? ● పేదవాడి వైద్యానికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్తో పోలికా ● మంత్రి శ్రీనివాస్ వ్యాఖ్యలను ఖండించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ఆరోగ్యమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగా ఎందుకు నిర్వహించలేరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పాలని విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ పరంగా అవలంభించే విధానాన్ని తెలియజేయాలని కోరారు. నగరంలోని ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ విజయనగరం జిల్లా కేంద్రంలో సోమవారం తలపెట్టిన ప్రజాఉద్యమ ర్యాలీకి అపూర్వ స్పందన లభించిందన్నారు. జిల్లా ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పేదవాడి వైద్యానికి, శంషాదాబాద్ విమానాశ్రయానికి పోలికచేస్తూ మంత్రి చేసిన వాఖ్యలు అర్ధరహితమని పేర్కొన్నారు. మంత్రి కొండపల్లి తన నేపథ్యాన్ని, స్థానిక పరిస్థితులను పదవీ వ్యామోహంలో విస్మరించడం దురదృష్టకరమన్నారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణపై ఆరోపణలు చేస్తున్న మంత్రి క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రజలు ఇష్టపూర్వకంగా ఎందుకు సంతకాలు చేశారో తెలుసుకోవాలని హితవుపలికారు. అవసరమైతే వారి వివరాలు తామే ఇస్తామని చెప్పారు. ● పీపీపీ విధానంలో ప్రభుత్వమే కళాశాలలను నిర్మించి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగించిన తరువాత ప్రభుత్వం ఏం చేయగలుగుతుందని జెడ్పీ చైర్మన్ ప్రశ్నించారు. అలా చేస్తే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఇంకెందుకని ధ్వజమెత్తారు. జిల్లాలో ఉన్న మిమ్స్ మెడికల్ కాలేజీతో పాటు, పక్కనే విశాఖ జిల్లాలోని గీతం మెడికల్ కాలేజీలో రోగులకు ఉచితంగా సేవలందించగలరా అని ప్రశ్నించారు. అదే తరహాలో ప్రస్తుత ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తే పేదలు డబ్బులిచ్చి వైద్యం చేయించుకోగలరా అని నిలదీశారు. దశాబ్దాల కిందట విశాఖలో నిర్మించిన కేజీహెచ్లో ఎంత మంది ఉచితంగా వైద్యసేవలు పొందుతున్నారో మంత్రి తెలుసుకోవాలని హితవుపలికారు. ప్రభుత్వానికి సత్తా లేకే ఇటువంటి వాఖ్యలు చేస్తు న్నారని దుమ్మెత్తి పోశారు. ● రాష్ట్రప్రజలంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్తో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగించారని మజ్జి శ్రీని వాసరావు గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల ఎంతో మంది నిరుపేదలు ఉన్నత చదువులు అభ్యసించి డాక్టర్లు, ఇంజినీర్లుగా స్థిరపడ్డారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, వైద్యకళాశాలలో ఆరోగ్య భరోసా కల్పించారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు అందించే సేవల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలని మంత్రికి హితవుపలికారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, ఉపాధ్యక్షుడు పతివాడ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. జీతాల చెల్లింపులో తప్పుడు ప్రకటనలా...? అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ చెల్లించాల్సిన జీతాల విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్న విషయం బాధ్యత గల మంత్రికి తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. నవంబర్ నెలలో పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ సహా 7 శాఖలకు చెందిన ఉద్యోగులకు 7 నుంచి 10వ తేదీల మధ్య జీతాలు చెల్లించారన్న విషయాన్ని మంత్రి తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ఆరు నెలలు మాత్రమే జీతాలు సక్రమంగా వేశారని, అనంతరం కాలంలో ఎప్పుడు వేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య ఉన్న సమన్వయం తేటతెల్లమవుతుందన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాల్సిన ధాన్యంలో పారదర్శకత పాటిస్తున్నమంటూ మంత్రి కొండపల్లి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. క్వింటా దగ్గర 10 కేజీలు ధాన్యం రైతుల వద్ద నుంచి మిల్లర్లు దోపిడీ చేయడమేనా మీ పారదర్శకత అంటూ ఎద్దేవాచేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి చెందిన అనుకూల పత్రికలో ప్రత్యేక కథనం ఇచ్చారని, ఆ కథనాన్ని ఖండించి మాట్లాడాలని సవాల్ విసిరారు. -
గిరిజన యువకుడి ఆత్మహత్య
సీతంపేట: కొండపోడు పనికి నాతో రా, లేకపోతే అన్నయ్య కుమారుడికి జ్వరంగా ఉంది పాలకొండ ఆస్పత్రికి అయినా తీసుకువెళ్లు అని తాత చెబితే వినకుండా వాగ్వాదానికి దిగిన మనుమడు చివరకు క్షణికావేశంలో కత్తితో పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీతంపేట మండలంలో మంగళవారం జరిగిన ఈ సంఘటనపై స్థాని కులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. చాకలిగూడ గ్రామానికి చెందిన సవర ప్రేమ్కుమార్(23) తండ్రి రాజేష్, వెంకటమ్మలు పదేళ్ల కిందట అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందారు. తాతయ్య గోపాలు, నాన్నమ్మ సుక్కమ్మ వద్ద ప్రేమ్కుమార్ ఉంటున్నాడు. వారితో పాటు అన్నయ్య శాంతకుమార్, వదిన వారి కుమారుడు అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం ఎవరి పనుల్లో వారు ఉండగా తాత గోపాలు కొండపోడు పనులకు వెళ్దామని చెప్పి ఒక సంచిలో కత్తి, వాటర్ బాటిల్ సిద్ధం చేసి పడుకుని ఉన్న ప్రేమ్కుమార్ను లేపి పనికి వెళ్దాం రమ్మని పిలిచాడు. నేను రాను అని చెప్పగా అయితే అన్నయ్యను పనికి తీసుకువెళ్తాను. అన్నయ్యకుమారుడికి జ్వరంగా ఉండడంతో వదినతో పాటు పాలకొండ ఆస్పత్రికి వెళ్లమని చెప్పాడు. అక్కడికి కూడా వెళ్లనని ప్రేమ్కుమార్ చెప్పడంతో కొద్ది సేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో తాత వంటింటిలోకి అన్నం పెట్టిన బాక్సు తీసుకురావడానికి వెళ్లాడు. దీంతో సంచిలో ఉన్న కత్తిని ప్రేమ్కుమార్ తీసుకుని పీక కోసేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి ఆటోలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మర్గమధ్యంలో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అన్నయ్య శాంతకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. -
చట్ట ప్రకారం పిల్లల దత్తత
● ఐసీడీఎస్ పీడీ విమలరాణి విజయనగరం ఫోర్ట్: పిల్లలను చట్ట ప్రకారం దత్తత ఇవ్వనున్నట్లు ఐసీడీఎస్ పీడీ టి.విమలరాణి అన్నారు. ఈ మేరకు పట్టణంలోని కేఎల్ పురంలో ఉన్న శిశు గృహాన్ని ఆకస్మికంగా ఆమె మంగళవారం తనిఖీ చేశారు. పిల్లలను అనధికారికంగా దత్తత తీసుకోవడం చట్ట రీత్యానేరమని తెలిపారు. పిల్లలు లేని తల్లిదండ్రులకు చట్ట ప్రకారం దత్తత ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. శిశుగృహలో ఉన్న పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు, ప్రతిరోజూ మెనూ కచ్చితంగా అమలు చేయాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత మహారాణి పేటలో ఉన్న బాలసదన్ను తనిఖీ చేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలకు బాలసదన్లో ఉచిత విద్య, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. 6 నుంచి11 సంవత్సరాల వయసు గల బాలికలు బాలసదన్లో ఆశ్రయం పొందుతారన్నారు. కార్యక్రమంలో డీఎంసీ సుజాత, శిశు గృహ మేనేజర్ త్రివేణి తదితరులు పాల్గొన్నారు.రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేతబొబ్బిలిరూరల్: మండలంలోని పారాది వద్ద వేగావతి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వి బొబ్బిలి పట్టణానికి తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను ఆర్ఐ కొల్లి రామకుమార్ మంగళవారం పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.ఇసుక అక్రమ రవాణాలో మొదటిసారి దొరికినందున ఒక్కో ట్రాక్టర్కు రూ.10 వేలు చొప్పున జరిమానా విధించినట్లు ఆర్ఐ తెలియజేశారు. వేగావతి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై రెవెన్యూ విభాగం నిఘా ఉందని తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని, మరో మారు అక్రమ ఇసుకతో పట్టుబడితే కేసులు పెడతామని ట్రాక్టర్ యజమానులను ఆర్ఐ హెచ్చరించారు. గంజాయి కేసులో ముద్దాయికి ఎనిమిదేళ్లు జైలు శిక్షవిజయనగరం క్రైమ్: గంజాయితో పట్టుబడిన నిందితుడికి ఎనిమిదేళ్లు జైలు శిక్ష, రూ.75 వేల జరిమానాను కోర్టు విధించిందని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు మంగళవారం తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..గతేడాది ఫిబ్రవరి 8 వ తేదీన దక్షిణ ఢిల్లీకి చెందిన నీరజ్ సింగ్(25)విజయనగరం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం 4,5లలో జీఆర్పీ సిబ్బంది తనిఖీ చేస్తుండగా ఒడిశా రాష్ట్రం నుంచి ఢిల్లీకి గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని, 17.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై అప్పటి విజయనగరం రైల్వే ఎస్సై వి.రవి వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందిడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించి దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగ పత్రాలను దాఖలు చేశారు. కోర్టు విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో ముద్దాయికి విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి జైలు శిక్ష విధించారని, జరిమానా చెల్లించని ఎడల మరో ఆరు నెలలు జైలు శిక్ష వర్తిస్తుందని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. బైక్, మినీ వ్యాన్ ఢీకొని మహిళ మృతిచీపురుపల్లి: పట్టణంలోని జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట చీపురుపల్లి–రాజాం ప్రధాన రహదారిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు ఆదిలక్ష్మి(25) మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజాంకు చెందిన బల్ల జగదీష్, ఆర్.ఠాగూర్లతో కలిసి చీపురుపల్లి పట్టణంలోని కూరాకుల వీధికి చెందిన పొందూరు ఆదిలక్ష్మి ద్విచక్ర వాహనంపై చీపురుపల్లి నుంచి రాజాం వెళ్తున్నారు. జీవీఆర్ కళాశాల వద్ద ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న మినీ లగేజ్ వ్యాన్ను బైక్తో ఢీకొ ట్టారు. దీంతో ఆదిలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. జగదీష్కు చేయి విరిగింది. ఠాగూర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతదేహాన్ని చీపురుపల్లి ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీఐ జి.శంకరరావు ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తోటపాలెంలో పశువైద్య సేవలు విజయనగరం అర్బన్: స్థానిక పట్టణంలోని తోటపాలెం సత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం పశువైద్య సేవలు అందించారు. పశు వైద్యులు మోహన్..పాడిరైతులు తీసుకువచ్చిన మూగజీవాలకు ఆరోగ్య తనిఖీలు నిర్వహించి, అవసరమైన వాటికి మందులు అందజేశారు. అలాగే వ్యాధులు రాకుండా నివారణ టీకాలు వేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ సాయిదేవమణి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఆదా ప్రాజెక్టుకు తృతీయస్థానం
పాలకొండ రూరల్: మండలంలోని ఎం.సింగుపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు అలజంగి వినోద్కుమార్, ఆర్నాల కార్తీక్, శంబాన గణేష్ విద్యుత్ఆదాపై రూపొందించిన షార్ట్ ఫిలిమ్ రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచింది. పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కె.సంతోష్ కుమారస్వామి దర్శకత్వంలో విద్యుత్ ఆదాపై రూపొందించిన రెండు నిమిషాల నిడివిగల షార్ట్ ఫిలిమ్ను పోటీల్లో ప్రదర్శించారు. విద్యుత్ ఆదా.. భవిష్యత్తు తరాలకు విద్యుత్ పొదుపు అనే అంశాన్ని ప్రస్పుటించారు. బహుమతి సాధించిన విద్యార్థులను పాఠశాల హెచ్ఎం బి.సంగంనాయుడు, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు. విజయవాడలో త్వరలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులు రూ.5వేలు నగదు అందుకోనున్నారు. ‘కౌశల్’ విజేతలకు బహుమతుల ప్రదానం ● రాష్ట్రస్థాయి పోటీలకు 12 మంది ఎంపిక పార్వతీపురం టౌన్: భారతీయ విజ్ఞాన మండలి, ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కౌశల్ ఆన్లైన్ పోటీల జిల్లా స్థాయి విజేతలకు డీఈఓ బ్రహ్మాజీ బహుమతులు ప్రదానం చేశారు. నవంబర్ 26, 27 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించిన పోటీల్లో 8, 9, 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో క్విజ్, పోస్టర్ ప్రజెంటేషన్ (8, 9 తరగతులకు), రీల్స్ (10వ తరగతికి) విభాగాల్లో విజేతలను ఎంపిక చేశారు. పార్వతీపురం డీవీఎం హైస్కూల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మొదటి ఇద్దరు విజేతలకు రూ.1500, రూ.1000 చొప్పున బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయిలో బహుమతులు పొందిన 12 మంది విద్యార్థులు ఈ నెల 27వ తేదీన తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరగనున్న రాష్ట్రస్థాయి కౌశల్ పోటీల్లో తలపడనున్నారు. కార్యక్రమంలో కౌశల్ జిల్లా కోఆర్డినేటర్ కోట అయ్యప్ప, అకాడమీ కోఆర్డినేటర్ బెహరా సంతోష్ కుమార్, జిల్లా సైన్స్ ఆఫీసర్ జి.లక్ష్మణరావు, పార్వతీపురం ఎంఈఓ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. క్విజ్: ప్రథమ బహుమతి: ఎన్.లోకేష్ (8వ తరగతి, జెడ్పీ హెచ్ఎస్, ఎంఆర్ నగరం), డి.పవన్ కల్యాణ్ (9వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, మక్కువ 3) కె.సాయి శరత్కుమార్ (10వ తరగతి, జెడ్పీహెచ్ఎస్ రావివలస) ద్వితీయ బహుమతి: కె.ప్రసన్న (8వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, రావివలస), ఎం.హిజ్కియారాజు (9వ తరగతి, జెడ్పీహెచ్, ఎంఆర్ నగరం), పి.రోహిత్ (10వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, కురుపాం) ● పోస్టర్ ప్రజెంటేషన్ (8వ తరగతి పోటీలు)లో ఎం.లిఖిత (జెడ్పీహెచ్, ఎం.ఆర్.నగరం) ప్రథమ, ఎస్.భారతమ్మ (జీటీ డబ్ల్యూఏ హెచ్ఎస్, హడ్డుబంగి) ద్వితీయ. ● పోస్టర్ ప్రెజెంటేషన్ (9వ తరగతి)లో... ఏ.కీర్తన (జెడ్పీహెచ్ఎస్–ఎం.ఆర్.నగరం) ప్రథమ, టి.హారిక (జెడ్పీహెచ్ఎస్–మక్కువ) ద్వితీయ. ● రీల్స్ (10వ తరగతి) పోటీల్లో బి.లిఖిత్ (ఏపీ ఎంఎస్, భామిని) ప్రథమ, వి.సుజ్విన్ (జెడ్పీహెచ్ఎస్, కురుపాం) ద్వితీయ. వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు కుడి ప్రధాన కాలువకు అధికారులు సాగునీటి సరఫరాను పెంచారు. రబీ పంటల సాగుకోసం ఇటీవల 200 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టగా... ప్రస్తుతం మరో 200 క్యూసెక్కుల నీటిని పెంచి 400 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు ఏఈ నితిన్ తెలిపారు. ప్రాజెక్టు వద్ద 64.60 మీటర్ల నీటిమట్టం నమోదైనట్టు ఆయన వెల్లడించారు. -
మనమిత్రతో పోలీసు సేవలు సులభతరం
● ఎస్పీ ఏఆర్ దామోదర్విజయనగరం క్రైమ్: ‘మనమిత్ర‘ అనే వాట్సాప్ గ్రూప్తో పోలీసు సేవలు మరింత సులభతరం చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ మంగళవారం అన్నారు. డిజిటల్ పాలనలో భాగంగా పోలీస్ సేవలు మరింత సులభతరంగా, త్వరితంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో వాట్సాప్ గవర్నెన్స్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువ చ్చామన్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచే పోలీసు సేవలను పొందవచ్చునన్నారు. ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్ ప్రస్తుత స్థితి, ఈచలాన్ వివరాలు వంటివి సంబంధిత పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే సులభంగా పొందవచ్చన్నారు. ఈ సేవలను పొందేందుకు ప్రజలు ముందుగా 9552300009 సెల్ నంబరును వారి మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకుని, ఆ నంబర్కు ఏజీ అని మెసేజ్ చేయగానే వివిధ రకాల ప్రభుత్వ సేవలు వివరాలు మొబైల్ కు వస్తాయన్నారు. అందులో పోలీసుశాఖ సేవలను ఎంచుకుని, ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్ స్థితి, ఈచలాన్ వివారాలు సులభంగా ఇంటివద్ద నుంచే పొందవచ్చన్నారు. క్యుఆర్ కోడ్ ను స్కాన్ చేసి కూడా పైన తెలిపిన పోలీసు సేవలు తక్షణమే పొందవచ్చునన్నారు. ఈ క్యూఆర్ కోడ్ ను జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో, పోలీసు ఆఫీసులలో అందుబాటులో ఉంచామన్నారు. ఈ మనమిత్ర (వాట్సాప్ గవర్నెన్స్)ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీని ద్వారా ప్రజల సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా, ప్రభుత్వం, ప్రజల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. -
ఇంటర్ యూనివర్సిటీ బేస్బాల్ పోటీలకు గరివిడి విద్యార్థుల ఎంపిక
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి ఎస్డీఎస్ కళాశాలకు చెందిన విద్యార్ధులు ఎం.అజయ్, ఎస్.ప్రవల్లికలు ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఆంధ్రాయూనివర్సిటీలో ఈ నెల 15న జరిగిన బేస్బాల్ టీమ్ సెలక్షన్లో ఈ విద్యార్ధులు అర్హత సాధించారు. వచ్చే ఏడాది జనవరి 4 నుంచి 8 వరకు మహారాష్ట్రలోని పూణేలో జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్బాల్ పోటీల్లో ఆంధ్ర యూనివర్సిటీ తరఫున ఈ విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తారు. తమ కళాశాల విద్యార్థులు ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్బాల్ పోటీలకు ఎంపిక కావడం పట్ల కరస్పాండెంట్ బి.రవి, ప్రిన్సిపాల్ డా.ఎ.రామకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్.సురేష్కుమార్, పీడీ ఎం.భానుమూర్తి విద్యార్థులను మంగళవారం అభినందించారు. -
‘పది’ంతల ఉత్సాహంతో.. పరీక్షలకు సన్నద్ధం
వీరఘట్టం: పదోతరగతి పరీక్షలకు పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులను ఉపాధ్యాయులు సంసిద్ధం చేస్తున్నారు. పాఠశాలల్లో వంద రోజుల విద్యాప్రణాళికను పకడ్బందీగా అమలుచేస్తున్నారు. వరుసగా మూడేళ్లు పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మన్యం జిల్లా ముందంజలో నిలిచింది. ఈ ఏడాది కూడా ఉత్తమ ఫలితాలు సాధనకు విద్యాశాఖ అధికారులు కృషిచేస్తున్నారు. జిల్లాలోని 187 సర్కారు బడుల్లో ఈ ఏడాది 10,856 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వీరిలో చదువులో వెనుకబడిన వారిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సులభ పద్ధతుల్లో బోధిస్తున్నారు. ఉత్తీర్ణత మార్కు లు సాధించేలా తర్ఫీదు ఇస్తున్నారు. చదువులో ప్రతిభ చూపినవారికి అధిక మార్కులు సాధించేలా బోధన సాగిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా మార్చి 13వ తేదీ వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా విద్యార్థులు చదవడం, రాయడం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు. గత మూడేళ్లలో సాధించిన టెన్త్ ఫలితాలు పునరావృతం చేసేందుకు విద్యార్థులకు వందరోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధంచేశాం. ప్రతిరోజు స్లిప్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ఆదివారం కూడా సబ్జెక్టు టీచర్లతో ప్రత్యేక తరగతులు చెప్పిస్తున్నాం. – పి.బ్రహ్మాజీరావు, డీఈఓ, పార్వతీపురం మన్యం జిల్లా ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. శతశాతం ఫలితాలు సాధించేందుకు సబ్జెక్టు టీచర్లు ప్రత్యేక ప్రణాళిక సిద్ధంచేశారు. ఇంగ్లిష్, గణితం, సైన్సు సబ్జెక్టులపై ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నాం. హిందీ, తెలుగు, సోషల్ సబ్జెక్టులపై విశ్లేషణాత్మకంగా తరగతులు నిర్వహిస్తున్నాం. – సీహెచ్ రత్నాకరరావు, హెచ్ఎం, బిటివాడ హైస్కూల్, వీరఘట్టం మండలం పకడ్బందీగా వంద రోజుల ప్రణాళిక ఈ ఏడాది కూడా పదోతరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ సాధించేలా కార్యాచరణ చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పరీక్షలు రాయనున్న విద్యార్థులు 10,869 మంది -
ఆటోలకు సీరియల్ నంబర్లు కేటాయిస్తాం
విజయనగరం క్రైమ్: నగరంలో తిరుగాడుతున్న ఆటోలకు త్వరలో సీరియల్ నంబర్లు జారీ చేస్తామని విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు తెలిపారు. ఇదే విషయమై ఆయన స్థానిక ట్రాఫిక్ పోలీస్స్టేషన్ వద్ద ఆటో యూనియన్ నాయకులతో మంగళవారం సమావేశమయ్యారు. ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు ఆటోల క్రమబద్ధీకరణకు ప్రత్యేకంగా సీరియల్ నంబర్లు కేటాయించనున్నామన్నారు. ఆటోడ్రైవర్ల భద్రతా ప్రమాణాలు కాపాడడంతో పాటు ఆటోల్లో ప్రయాణించే వారి రక్షణకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఆటోల్లో ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువులను కొనుగొనేందుకు కూడా ఇది దోహదపడుతుందన్నారు. సీరియన్ నంబర్ చూడగానే ఇది ఎవరి ఆటో, ఏ ఆటోస్టాండ్, యూనియన్కు చెందినది..ఇలా అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. సమావేశంలో ట్రాఫిక్ ఎస్ఐ ఎస్.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఆటోస్టాండ్లు మంజూరు చేయండి.. విజయనగరం గంటస్తంభం: జిల్లా కేంద్రంలోని చాలామంది ఆటోవాలాలకు సంబంధించిన ఆటోలను నిలుపుదల చేసేందుకు ఆటోస్టాండ్లు లేవని తక్షణమే ఆటోస్టాండ్లు మంజూరు చేయాలని ఆటో యూనియన్ నాయకులు కనకారావు, అప్పలరాజు కోరారు. ఆటోస్టాండ్లు లేని కారణంగా ఆటోడ్రైవర్లు రన్నింగ్ ఆటోవాలాలుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. -
జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఆరికతోట విద్యార్థులు
రామభద్రపురం: ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన మండలంలోని ఆరికతోట ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బి.రత్నకిషోర్ తెలిపారు.అండర్ 17 విభాగంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీల్లో జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానం సాధించింది. బాలుర జట్టు ద్వితీయ స్థానం సాధించిందన్నారు. అందులో ఆంఽధ్రప్రదేశ్ తరఫున జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే 16 మంది సభ్యులలో తమ పాఠశాలకు చెందిన రేజేటి శ్రావణి, బాలుర జట్టు తరఫున ఎం.రంజిత్ కుమార్లు ఎంపికై నట్లు తెలిపారు. జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికై న విద్యార్థులను పాఠశాల హెచ్ఎం జి కృష్ణవేణి, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు. -
కుంకీలొచ్చేనా? కరి కలత తీర్చేనా..?
సాక్షి, పార్వతీపురం మన్యం: ఒడిశా నుంచి అటవీ ప్రాంతం మీదుగా మన్యం భూభాగంలోకి వచ్చిన గజరాజులు.. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇక్కడే తిష్ట వేశాయి. జిల్లాలో రెండు ఏనుగుల గుంపులు నాగావళి, వంశధార తీర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. పార్వతీపురం, కొమరాడ, జియ్యమ్మవలస, భామిని పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం 12 ఏనుగులు తిరుగుతున్నాయి. వీటివల్ల అటు ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లడమే కాక.. సమీప గ్రామాల ప్రజలకు కంటిమీద నిద్ర కరవవుతోంది. వీటిని దారిలోకి తెచ్చేందుకు కుంకీ ఏనుగులను తీసుకొస్తామని ఏళ్లుగా చెబుతున్న మాట నేటికీ కార్యరూపం దాల్చలేదు. వచ్చే సంక్రాంతినాటికి జిల్లాకు కుంకీలొస్తాయని ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇటీవల డీఆర్సీలో చెప్పారు. ఆ మాట.. ఈసారైనా అమలవుతుందో లేదో చూడాలి. తరలింపా.. ఇక్కడే ఉంచుతారా? ఎలిఫెంట్ జోన్, కుంకీలు.. తరలింపు ఇలా రకరకాల ఆలోచనల్లో అధికార యంత్రాంగం ఉంది. అందుకు కొన్ని ప్రాంతాలనూ గుర్తించారు. ఏదీ ముందుకు సాగడం లేదు. పునరావాస కేంద్రం కోసం స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు జోన్ అయితే రూ.30 కోట్ల వరకు అవసరం అవుతుంది. పెద్దమొత్తంలో ఆహారం తీసుకునే ఏనుగులకు.. ఇక్కడ ఉంచిన తర్వాత ఆ స్థాయిలో ఆహారం కల్పించడమూ కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక కేంద్రంవైపే అధికారులు మొగ్గు చూపుతున్నారు. కుంకీలొచ్చాక వాటి ద్వారా జిల్లాలోని ఏనుగులను కొన్నాళ్లు గుచ్చిమి కేంద్రం వద్ద ఉంచి.. అనంతరం శేషాచలం అడవులకు తరలించే యోచన చేస్తున్నారు. లేకుంటే ఒడిశా ప్రభుత్వం, అధికారులను సమన్వయం చేసుకుని అక్కడి లఖేరి ప్రాంతానికి తరలించాలని భావిస్తున్నారు. కుంకీలు రాగానే.. భామిని వైపు ఉన్న గుంపును తొలుత కేంద్రానికి తరలించాలని చూస్తున్నారు. త్వరలోనే కుంకీలొచ్చే అవకాశం ఉంది. అవి రాగానే.. జిల్లాలో ఉన్న గుంపును గుచ్చిమి వద్ద నిర్మిస్తున్న టెంపరరీ ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియాకు తరలిస్తాం. కేంద్రం నిర్మాణ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. ఏనుగుల కదలికలను నిత్యం గమనిస్తూ.. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. పంట నష్టపోయిన రైతులకు పరిహారం కూడా జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు అందిస్తున్నాం. – జీఏపీ ప్రసూన, జిల్లా అటవీశాఖాధికారిణి పసుకుడి చేరిన ఏనుగులు భామిని: మండలంలోని పసుకుడి గ్రామ సమీపంలోకి నాలుగు ఏనుగుల గుంపు మంగళవారం చేరింది. వంశధార నది ఆవల ఒడిశా గ్రామాల నుంచి ఏనుగులు తరలివచ్చాయి. పంటపొలాల్లో సంచరిస్తుండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. పంటలకు నష్టం చేకూర్చుతున్నాయంటూ గగ్గోలుపెడుతున్నారు. -
కోటి గళాల గర్జన
–10లోమంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఆధ్యాత్మికం.. ధనుర్మాసం పల్లెలు, పట్టణాల్లోని దేవాలయాలు ధనుర్మాసం పూజలకు సిద్ధమయ్యాయి. ఆధ్యాత్మిక వెలుగులు పంచనున్నాయి. కొమరాడ: కూనేరు జీసీసీ డిపోకు వెళ్లి రేషన్ తీసుకోవాలంటే ఐదు కిలోమీటర్ల ప్రయాణించాలి... నాగావళి నదిని దాటాలి.. తీరా అక్కడి కి వెళ్లాకు సేల్స్మన్ రేషన్ ఇవ్వడంలేదు... రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది.. శనివా రం వస్తే సోమవారం రావాలని చెప్పారు... సోమవారం కూడా రేషన్ ఇవ్వకపోవడంతో కొమరాడ మండలం చోళ్లపదం పంచాయతీ పరిధిలోని రెబ్బ, వనధార గ్రామాలకు చెందిన 80 కుటుంబాల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. సేల్స్మన్ అలసత్వంపై అభ్యంతరం చెబుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. డీటీ స్పందించి బియ్యం అందజేస్తామని, ఆందోళన విరమించాలని సర్దిచెప్పారు. పార్వతీపురం: ప్రభుత్వ సేవలను మరింత విస్తృతం చేయాలని జేసీ పి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పార్వతీపురం, పాలకొండ, సబ్కలెక్టర్లు, మండల తహసీల్దార్ల తో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ధాన్యం కొనుగో లు చేయాలన్నారు. రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో సబ్కలెక్టర్లు ఆర్. వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్ పాల్గొన్నారు. వీరఘట్టం/ పాలకొండ: ఎలాంటి పనినైనా తనకు అనుకూలంగా మార్చుకుని ప్రచార ఆర్భాటం చేయడం, అబద్ధాలను నిజమని నమ్మించడం.. హామీలిచ్చి మోసం చేయడంలో సీఎం చంద్రబాబునాయుడుని మించిన వారు ఉండరన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు చంద్రబాబు చేస్తున్న హడావుడి దీనికి అద్దం పడుతోంది. విమర్శలకు తావిచ్చింది. కానిస్టేబుల్ పోస్టులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 30–11–2022న నోటిఫికేషన్ ఇచ్చింది. 22–01–2023న రాతపరీక్ష కూడా నిర్వహించింది. అనంతరం కోర్టు కేసులతో పోస్టుల భర్తీ వాయిదా పడింది. 2024లో ప్రభుత్వం మారింది. కోర్టు కేసుల పరిష్కారంతో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. వాస్తవంగా నియామక పత్రాలు ఎస్పీ చేతుల మీదుగా అందజేయాలి. అయితే, పోస్టుల భర్తీ తమ ప్రభుత్వమే చేపట్టిందని ప్రచారం చేసుకునేందుకు నియామక పత్రాలను మంగళగిరిలో మంగళవారం అందజేసేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేయించారు. పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేక బస్సుల్లో రాజధానికి తరలిస్తున్నారు. ప్రచార యావ కోసం ప్రజాధనం దుర్వినియోగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్పీ కార్యాలయాల్లో అందుకోవాల్సిన నియామక పత్రాలకోసం చలిలో కుటుంబ సభ్యులతో కలిసి వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడంపై కొందరు అభ్యర్థులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. పేదలకు వైద్యం.. విద్యార్థులకు వైద్యవిద్య ఉచితంగా అందాల్సిందేనని జనం నినదించారు. వైద్యకళాశాలలు ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోశారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రభుత్వ మెడలు వంచేందుకు తాము సైతం అంటూ ముందుకు కదిలారు. సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ చేసిన సంతకం ప్రతులను గవర్నర్వద్దకు చేర్చే బృహత్తర క్రతువులో భాగస్వాములయ్యారు. సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. ప్రజా ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల పేరుతో ప్రజల అభిప్రాయాలను వైఎస్సార్సీపీ సేకరించిన విషయం విదితమే. జిల్లావ్యాప్తంగా 2 లక్షలకుపైగా సంతకాలను సేకరించి, పార్టీ కేంద్ర కార్యాలయానికి సోమవారం ప్రత్యేక వాహనంలో తరలించారు. ఇందులో భాగంగా నాలుగు నియోజకవర్గాల నుంచి వందలాది మందితో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. పార్వతీపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపాన వైఎస్సార్ కూడలి వద్ద దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వరకు వెళ్లారు. సంతకాల ప్రతులతో ప్రదర్శనగా సాగారు. ప్రభుత్వ వైద్యకళాశాలలను పరిరక్షించాలని.. ప్రైవేట్ భాగస్వామ్యంతో పేదలకు వైద్యాన్ని, వైద్యవిద్యను దూరం చేయ వద్దని నినాదాలు చేశారు. అనంతరం ఐటీడీఏ పెట్రోల్ బంకు వద్ద నుంచి వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించి, సంతకాల ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. అక్కడే మీడియా తో నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, అరకు పార్ల మెంట్ పరిశీలకులు ఎ.చిన్నప్పలనాయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, పాలకొండ, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో పది మెడికల్ కళాశాలల ప్రైవే టీకరణకు సిద్ధమయ్యా రు. అందులో పార్వతీపు రం నియోజకవర్గంలో చేపట్టాల్సిన మెడికల్ కాలేజీ కూడా ఉంది. ఇది కుట్రపూరితమైన చర్య. రూ.150 కోట్ల విలువ చేసే స్థలాన్ని ఇచ్చాం. రూ.70 కోట్లు వెచ్చించి ఆస్పత్రి నిర్మాణాలు కూడా చేపట్టాం. 80 శాతం పనులు పూర్తయ్యాయి. నేడు ప్రజల ఆస్తిని ప్రైవేట్కు కట్టబెట్టేందుకు చూస్తున్నారు. చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని ఒకటే అడు గుతున్నాం.. రూ.3 లక్షల బడ్జెట్ పెట్టి, రూ.లక్షల కోట్లు అప్పులు తెస్తున్న చంద్రబాబూ.. కేవలం రూ.5 వేల కోట్లు వెచ్చించి ప్రభుత్వ వైద్యకళాశాలలను పూర్తి చేయలేవా? అంత దయనీ య స్థితిలో ఉన్న చేతకానివారా? ప్రశ్నిస్తానన్న పవన్కల్యాణ్కు పేదవర్గాల మేలు అవసరం లేదా? ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్తా పోరాటం చేస్తారు. ప్రభుత్వం మెడలు వంచేదాకా విశ్రమించం. – అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం నియోజకవర్గం విద్య, వైద్యం, ప్రజారవాణా వ్యవస్థల విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించి, మార్గదర్శకంగా నిలవాలి. ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణ అంశాన్ని శాసన మండలిలో పలుమార్లు ప్రస్తావించాం. రాష్ట్రంలోని రెడ్బుక్ పాలనలో ప్రజల సంక్షేమం అవసరం లేదు. ప్రైవేట్ వ్యక్తుల కోసమే చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రభుత్వ వైద్యకళాశాలల పరిరక్షణకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంది. మా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ప్రజా ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ చేపట్టాం. మళ్లీ వచ్చేది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే. ప్రజావైద్యం, ప్రభుత్వ వైద్యకళాశాలలను మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. రాష్ట్రంలో సామాన్యుల హక్కులను కాలరాస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో ఈ ఏడాదిన్నర తరహా పాలనను ఎన్నడూ చూడలేదు. – పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను ఎలా వంచన చేయాలో చూస్తోంది. పేదలకు వైద్యం.. విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలా నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ఏడాదిన్నర కాలంగా ఎక్కడ చూసినా అవినీతి, కక్షసాధింపులే. – మావుడి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పార్లమెంట్ కార్యదర్శి గత ప్రభుత్వ హయాంలో వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చాం. పీహెచ్సీల ఆధునికీకరణతో పాటు, ఏరియా ఆస్పత్రులనూ అప్గ్రేడ్ చేశాం. అన్ని సౌకర్యాలు కల్పించాం. మందులు అందుబాటులోకి తెచ్చాం. 108 వాహన సేవలను బలోపేతం చేశాం. ఇప్పుడు వాటన్నింటినీ నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీని అమలు చేయలేకపోతున్నారు. ప్రజలకు ఆరోగ్య ఆసరా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. జగన్ ఆలోచనలకు అనుగుణంగా ఐదు ఐటీడీఏల పరిధిలో సూపర్స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. కేవలం జగన్కు పేరు రాకూడదనే ఉద్దేశంతో వీటి నిర్మాణాలను చంద్రబాబు నిలిపివేశారు. వైద్యకళాశాలలను ప్రైవేట్కు కట్టబెడుతన్నారు. చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా గిరిశిఖర గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారు. ప్రజల ఆకాంక్షలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇప్పటికై నా చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. లేకుంటే ప్రజాగ్రహానికి గురి కాక తప్పదు. – విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ నియోజకవర్గం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ప రం చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉద్య మం సాగింది. కోటి సంతకాల కార్యక్రమానికి పార్టీలకతీతంగా ప్రజలు మద్దతు గా నిలిచి, సంతకాలు చేశారు. ఈ స్థాయి లో ప్రజా ఉద్యమం చూసినా ప్రభుత్వంలో చలనం లేదు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని గత ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పుడు మాట తప్పి, దశలవారీగా ప్రైవేట్పరం చేస్తున్నారు. – శరగడం చినప్పలనాయుడు, పార్లమెంట్ పరిశీలకులు మన్యం జిల్లాలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వ వైద్యకళాశాలను తీసుకొచ్చారు. మాకు రాక రాక వచ్చిన వైద్యకళాశాలను ప్రైవేట్పరం చేయడమేమిటి? రహదారులను కూడా ప్రైవేట్పరం చేస్తారంట. ఇంకెందుకు.. ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కూడా ప్రైవేట్పరం చేసేయండి. ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకో దు. ప్రభుత్వ వైద్యకళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల ను 18వ తేదీన గవర్నర్కు అందజేస్తాం. ఈ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి కాక తప్పదు. తగిన మూల్యం చెల్లించుకుంటుంది. – శత్రుచర్ల పరీక్షిత్రాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం -
చోరీకి గురైన బంగారు ఆభరణాల రికవరీ
వేపాడ: మండలంలోని పలు గ్రామాల్లో పట్టపగలు చోరీలకు పాల్పడిన వ్యక్తిని వల్లంపూడి పోలీసులు సోమవారం పట్టుకుని దొంగిలించిన బంగారాన్ని రికవరీ చేశారు. ఇందుకు సంబంధించి ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు సోమవారం రాత్రి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో వావిలపాడు, వల్లంపూడి, రామస్వామిపేట గ్రామాల్లో పట్టపగలు ఇళ్లలో ఎవరూ లేని సమయంలో దొంగతనాలు జరిగిన విషయం విదితమే. దీనిపై వల్లంపూడి ఎస్సై సుదర్శన్, సిబ్బందితో నిర్వహించిన తనిఖీల్లో సోమవారం కుమ్మపల్లి జంక్షన్ వద్ద అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన పిల్లా నూకరాజును నిందితుడిగా గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తివద్ద రామస్వామిపేటలో దొంగిలించిన ఐదున్నర తులాలు, వావిలపాడులో దొంగిలించిన తులంన్నర బంగారం రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు. వల్లంపూడిలో చోరీ చేసిన బంగారం చోడవరంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టినట్లు సీఐ చెప్పారు. పట్టుబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని కోర్టుకు తరలిస్తామన్నారు. -
ఆధ్యాత్మికం.. ధనుర్మాసం
బలిజిపేట: పల్లెలు, పట్టణాల్లో దేవాలయాల ద్వారా ధనుర్మాసంలో ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతాయి. ఆలయాల్లో నిత్య కై ంకర్య సేవలు, విశేష రోజులు, సేవలు, శ్రీ గోదా రంగనాఽథ స్వామివార్ల కల్యాణం, ప్రత్యేక పాశురాలు, పులకింపజేసే తిరుప్పావై ప్రవచనాలు, పూజా కార్యక్రమాలు, భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలతో ధనుర్మాసం శ్రీమహా విష్ణువుకు అత్యంత్ర ప్రీతికరమైనదిగా ప్రాచుర్యం పొందింది. వేదాల్లో సామవేదం, మాసాల్లో మార్గశిరం అత్యంత పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఈ మాసంలో రంగనాథుడిని పరమభక్తితో సేవించడం ద్వారా గోదాదేవి ఆయనను వరించి, తన భక్తిని చాటుకుంది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ఈనెలలోనే ప్రవేశిస్తాడు. విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి గోదాదేవి రోజుకో రీతిలో తిరుప్పావై పాశురాలను ఆలపించడం విశేషం. ధనుర్మాసంలో పండగ నెల ప్రారంభం కావడంతో పట్టణ, పల్లె ప్రాంతాలు పరవశిస్తాయి. నెల మొదలైన నాటినుంచి సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. హరిదాసు కీర్తనలతో పల్లెలు పులకిస్తాయి. గొబ్బెమ్మల కొలువు పండగ నెల ప్రారంభమైన నాటి నుంచి ప్రతి ఇంటిముందు కళ్లాపు చల్లి అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి గోదాదేవి, లక్ష్మీదేవి, గౌరీమాతగా భావిస్తారు. గోవుపేడతో పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో ఉంచుతారు. భోగిభాగ్యాలు గ్రామాలు, పట్టణాల్లో భోగి మంటలు వేస్తారు. దీంతో సకల దోషాలకు పరిహారం లభిస్తుందని భావిస్తారు. కనుమతో ధనుర్మాసం పూర్తి కనుమ పండుగతో ధనుర్మాసం ముగుస్తుంది. దీన్నే పశువుల పండుగ అని అంటారు. ఏడాది పొడవునా వ్యవసాయ పనుల్లో సాయం చేసిన పశువులకు రైతులు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ధనుర్మాసం ప్రారంభం కాగానే పండగ వాతావరణంతో పల్లెలు కళకళలాడుతాయి. శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రం ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. వేకువనే స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు చేస్తారు. తిరుప్పావై నిర్వహిస్తారు. సంక్రాంతి..పితృదేవతలకు శాంతి మకర సంక్రాంతిని పెద్దల పండగ అంటారు. ఈ రోజున పితృదేవతలకు కొత్త బట్టలు పెట్టుకుని తర్పణాలు వదులుతారు. పంచభక్ష్య పరమాణ్నాలతో నైవేద్యం సమర్పించి పెద్దల ఆశీర్వచనం పొందుతారు. ధనుర్మాసంలో విశిష్టమైన రోజులు 2025, డిసెంబరు 24వ తేదీన వేశేష ధూప్ సేవ(తూమని మాడత్తు) డిసెంబరు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి (ఉత్తరద్వార దర్శనం) 2026, జనవరి 3వ తేదీన విశేష దీపాలంకరణ సేవ(కుత్తు విళక్కెరియ) జనవరి 8వ తేదీన పొన్నాకుల హారతి (అన్జు ఇవ్వులగం) జనవరి 11వ తేదీన విశేష ప్రసాద సేవ (కూడారై వెల్లుం) జనవరి 14వ తేదీన భోగి రోజున పూలంగి సేవ, శ్రీగోదారంగనాథుల కల్యాణం నేటి నుంచి వచ్చేనెల 14వరకు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం భోగి, సంక్రాంతి, కనుమల సమాహారం సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలంఎంతో పవిత్రమైనది ధనుర్మాసం ఎంతో పవిత్రమైనది. శ్రీగోదారంగనాథులను కొలుచుకుని వారి ఆశీస్సులను పొందినవారికి ఎంతోమేలు జరుగుతుంది. అధ్యాత్మికంగా ఈమాసం అందరినీ మేలుకొలుపుతుంది. – సురేష్, అర్చకుడు, బలిజిపేట వైష్ణవాలయాల్లో తిరుప్పావై ప్రవచనాలు శ్రీవైష్ణవులకు తిరుప్పావై వ్రతం ముఖ్యమైనది. ఈ వ్రతంలో నెలరోజులపాటు రోజుకో పాశురం చొప్పున విన్నపం చేస్తారు. ఒకటి నుంచి 5రోజులు నియమ, నిబంధనలకు సంబంధించిన పాశురాలు. 6వ రోజునుంచి 15 పాశురాలతో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి నందగోపుని గృహానికి వెళ్లడం, 16,17,18పాశురాలలో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొలపడం, 23వ పాశురంలో మంగళాశాసనం, 25, 26పాశురాలలో స్వామికి అలంకారాలైన ఆయుధాలలో పరా అనే వాయిద్యాన్ని తమ శరణాగతి అనుగ్రహించి, తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తారు. ఆఖరి రోజున గోదారంగనాథుల కల్యాణం అట్టహాసంగా నిర్వహిస్తారని అర్చకులు చెబుతున్నారు. గోదాదేవితో కూడుకుని ఉండే నారాయణ అర్చన సేవయే ఈమాసపు ప్రాధాన్యంగా పేరొందిందని, భగవంతుని ఏవిధంగా చేరుకోవాలో తెలిపే మాసం ఇది అని అర్చకులు తెలియజేస్తున్నారు. భక్తులు ఈమాసంలో స్వామివారి సేవలో పాల్గొని చూసి, విని తరించాలని అర్చకులు కోరుతున్నారు. -
సీఎస్పీపై మహిళా సంఘాల ఫిర్యాదు
రేగిడి: మండలంలోని తునివాడ గ్రామానికి చెందిన స్వయం సహాయ సంఘాల మహిళలు సోమవారం రేగిడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో సంఘాలకు సంబంధించిన పొదుపు నగదును గ్రామానికి చెందిన సీఎస్పీ అల్లు శ్రీధర్ స్వాహా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాంకులకు ప్రతి నెలా చెల్లించాల్సిన సొమ్మును అల్లు శ్రీధర్కు అందజేశామని, ఆ నగదు బ్యాంకు ఖాతాలకు జమ కాలేదని ఆవేదన చెందారు. పొదుపు, రుణ చెల్లింపులకు సంబంధించి రూ.43 లక్షలు స్వాహా చేశాడని, బాధ్యుడిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. -
జాతీయస్థాయి పోటీలకు కంచరాం విద్యార్థి
రాజాం సిటీ: మండల పరిధిలోని కంచరాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అలజంగి సంతోషిణి జాతీయస్థాయి పెంటాథ్లాన్ పోటీలకు ఎంపికై ందని పీడీ టి.దుర్గారావు, పీఈటీ బి.నారాయణనాయుడులు సోమవారం తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో చక్కని ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి ఎంపికై ందన్నారు. విద్యార్థిని ఎంపికపట్ల హెచ్ఎం వీవీ వసంతకుమార్తోపాటు పాఠశాల స్టాఫ్ కార్యదర్శి మజ్జి మదన్మోహన్, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థిని ఆత్మహత్యా యత్నంపై ఎటీడబ్ల్యూఓ విచారణసాలూరు: మండలంలోని కురుకుట్టి ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని ఆదివారం ఫినాయిల్తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటనపై ఏటీడబ్ల్యూఓ కృష్ణవేణి విచారణ చేపట్టారు. ఈ మేరకు సోమవారం ఆమె పాఠశాలకు వెళ్లి విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినితో మాట్లాడారు.ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగితెలుసుకున్నారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని ఆమె తెలిపారు. రెండు బైక్లు ఢీకొని ఒకరికి గాయాలుపాచిపెంట: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పాచిపెంట మండలంలోని పణుకువలస సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. దీనిపై పోలీసులు సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్తవలస గ్రామానికి చెందిన మాదిరెడ్డి సత్యనారాయణ(35) రామభఽధ్రపురం మండల కేంద్రంలో కారు మెకానిక్గా పనిచేస్తున్నాడు. మెకానిక్ పని నిమిత్తం ప్రతిరోజూ రామభధ్రపురం వెళ్లి వస్తూ ఉంటాడు. రోజులాగానే ఆదివారం పని ముగించుకుని తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108లో సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్సీ కృష్ణారావు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిరాజాం సిటీ: మండల పరిధి ఇప్పిలిపేట సమీపంలో ఈ నెల 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన టొంపల సుమంత్ (26) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. రాజాంలో విధులు ముగించుకుని స్వగ్రామమైన గరివిడి మండలం కాపుశంభాం గ్రామానికి ఆటోలో వెళ్తుండగా ఇప్పిలిపేట సమీపంలో వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొనడంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుమంత్ను స్థానికులు రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం కిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు వివరించారు. చికిత్స పొందుతూ మరో వ్యక్తి..గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. విజయనగరంలోని కణపాకకు చెందిన కోరాడ పైడిరాజు ఈనెల 12వతేదీన ఉదయం మార్నింగ్ వాక్కు వచ్చి తిరిగి వెళ్తుండగా రామవరం పప్పుల మిల్లు వద్ద నరవ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్తో వెనుక నుంచి ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు తొలుత ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడినుంచి విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మృతి చెందాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి. సాయికృష్ణ తెలిపారు. మర్మాంగాన్ని కోసుకున్న మతిస్థిమితం లేని యువకుడుబొబ్బిలి: విశాఖకు చెందిన మతిస్థిమితం లేని ఓ యువకుడు తన మర్మాంగాన్ని సోమవారం రాత్రి కోసుకున్నాడు. ఈ ఘటనపై స్థానికుల కథనం ప్రకారం స్థానిక ఫ్లైఓవర్ వద్ద ఓ యువకుడు కాళ్ల వెంబడి రక్తమోడుతూ తిరుగుతుండడంతో స్థానికులు అంబులెన్స్కు సమాచారమందించారు. అంబులెన్స్లో ఎక్కేటప్పుడు ముప్పుతిప్పలు పెట్టిన యువకుడు గడియకోమాట చెబుతూ అర్థంలేని విధంగా ప్రవర్తించాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్సకూ ఇబ్బందులు పెట్టాడు. ఆస్పత్రి ప్రధానవైద్యాధికారి జి.శశిభూషణ రావు పరీక్షించి విశాఖ రిఫర్ చేశారు. ఈ లోగా యువకుడు చెప్పిన మేరకు సమాచారం అందడంతో వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులు కూడా బొబ్బిలి చేరుకున్నారు. యువకుడిని చికిత్స నిమిత్తం వెంట తీసుకెళ్లారు. -
ప్రజల ఆకాంక్ష
●కోటి సంతకాలే కాదు.. దేశంలో ఏ రాష్ట్రంలో నూ ఒకే దశలో 17 మెడికల్ కళాశాలల ను తీసుకొచ్చిన పరి స్థితి లేదు. జగన్మోహన్రెడ్డి ఆ చరిత్ర సృష్టించారు. అటువంటి కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు. ఈ ప్రభు త్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ను ప్రజలు చేశారు. జిల్లాలోనూ జగన్ సంకల్పానికి మద్దతుగా 2 లక్షలకుపైగా సంతకాల ను ప్రజలు చేశారు. నేడు ఆరోగ్యశ్రీ.. రోగశ్రీగా మారింది. ఈ రోజు కోటి సంతకాల గర్జనే కాదు.. కోటి గళాల గర్జనగా దీన్ని చూడాలి. గవర్నర్ న్యాయం చేయాలి. ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి. ఇది ప్రజావ్యతిరేక పాలన. రైతులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాలవారూ ఇబ్బందులు పడుతున్నారు. ఎరువులు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. నేడు 92 మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. వీరు ప్రజలకు ఏమీ మేలు చేయడం లేదు. ఈ ప్రభుత్వంలో సంపద సృష్టి కాదు.. అప్పులు సృష్టిస్తున్నారు. 18 నెలల కాలంలో లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. – పీడిక రాజన్నదొర, మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు ప్రజారోగ్యం కోసం.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలన్న ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్ 17 వైద్యకళాశాలలను తీసుకొచ్చారు. అందులో ఏడు కాలేజీలను గత ఎన్నికలకు ముందే పూర్తి చేశాం. మిగిలిన 10 కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ప్రతిదీ ప్రైవేట్పరం చేయాలన్నది ఈ ప్రభుత్వ సంకల్పం. ప్రజావైద్యాన్ని ప్రైవేట్పరం చేసే కుట్ర. మొత్తం రూ.8,500 కోట్ల ఈ ప్రాజెక్టులో మిగిలిన 10 కళాశాలలకు రూ.5 వేల కోట్లు సరిపోతాయి. అమరావతికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకొంటున్న చంద్రబాబు.. వైద్యకళాశాలల నిర్మాణానికి మాత్రం ఖజానాలో డబ్బులు లేవంటూ ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కుఠిల నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా, జగన్ సంకల్పానికి మద్దతుగా కోటి సంతకాలను ప్రజలు చేశారు. అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఇది చూసైనా చంద్రబాబు కళ్లు తెరవాలి. ఆయన మనసు మారాలి. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉప ముఖ్యమంత్రి -
విశాఖలో కార్మిక గర్జనకు సన్నాహాలు
విజయనగరం గంటస్తంభం: డిసెంబర్ 31నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగనున్న సీఐటీయూ జాతీయ మహాసభలను కార్మికులంతా విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు రెడ్డి శంకరరావు, ఎ.జగన్మోహనరావులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మహాసభల ప్రచారంలో భాగంగా సోమవారం స్థానిక కోట జంక్షన్ ఆటోస్టాండ్ వద్ద సీఐటీయూ జెండాను రెడ్డి శంకరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కార్మిక హక్కులు, కార్మిక చట్టాల పరిరక్షణ కోసం సీఐటీయూ సాగించిన పోరాటాలకు గొప్ప చరిత్ర ఉందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కార్మిక కోడ్ల పేరుతో కార్మికులు సాధించుకున్న హక్కులను కుదిస్తోందని విమర్శించారు. అలాగే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాబోయే జాతీయ మహాసభల్లో కార్మిక చట్టాల పరిరక్షణ, ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకత, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలనే అంశాలపై తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. జనవరి 4న విశాఖపట్నం బీచ్లో జరిగే బహిరంగ సభలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బి.రమణ, పాపారావులతో పాటు ఆటో, కలాసీ కార్మికులు పాల్గొన్నారు. -
ఆంధ్రరాష్ట్ర సాధకుడు పొట్టి శ్రీరాములు
పార్వతీపురం: ఆంధ్రరాష్ట్ర సాధకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగా భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయన్నారు. అలాగే, ఉక్కుమనిషిగా పేరుగాంచిన సర్ధార్ వల్లభాయ్పటేల్ వర్ధంతిని పురస్కరిచుకుని ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలువేసి నివాళులర్పించారు. స్వదేశీ సంస్థానా లను భారతదేశంలో విలీనం చేయడంలో ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, డీఆర్వో కె.హేమలత, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి పాల్గొన్నారు. -
నిధులు లేకుండా ముస్తాబులేమిటి?
సాక్షి, పార్వతీపురం మన్యం: ‘ఉత్తి మాటలతో ఊరు శుభ్రమవుతుందా.. పారిశుద్ధ్య కార్మికుల జీతాలకే దిక్కులేదు.. నిధుల ఊసెత్తితే దాటవేస్తున్నారు.. ఖర్చు లేకుండా గ్రామాల్లో ‘ముస్తాబు’ అమలు చేయాలంటే ఎలా సాధ్యం?’ ఇదీ.. పలువురి సర్పంచ్ల ఆవేదన. పార్వతీపురంలోని ప్రైవేట్ కల్యాణ మండపంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సర్పంచ్ల సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి సర్పంచ్లకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలోనూ కుటుంబం ముస్తాబు కావాలన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామాలు, పల్లెలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సర్పంచులే గ్రామాల కు బాస్లని.. ఆ దిశగా తమ గ్రామాలను అభివృద్ధిపరచాలని ఆకాంక్షించారు. ముస్తాబుపేరిట గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ, బహిరంగ మలమూత్ర విసర్జనకు కృషి చేయాలని కోరారు. కాలు వల శుభ్రత, చెత్తకుప్పలు లేకుండా గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఎలాంటి ఖర్చూ లేకుండా ఇలాంటి పనులు నిర్వహించవచ్చ ని చెప్పారు. దీనిపై సర్పంచ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలిచ్చేందుకే పంచాయతీల్లో నిధులు లేవని చెప్పా రు. ఎన్నోసార్లు విన్నవించుకున్నా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన జరగడం లేదన్నారు. పలు సమస్యలపై సర్పంచ్లు చెప్పేందుకు ప్రయత్నించగా.. అధికారులు మధ్యలోనే బ్రేక్ వేశారు. దీంతో కలెక్టర్కు తమ పంచాయతీల్లో సమస్యలపై నామమాత్రంగానే సర్పంచ్లు వినతిపత్రాలిచ్చి సరిపెట్టుకున్నారు. నిధులు నిల్.. నీతులు ఫుల్: సర్పంచుల ఆవేదన జిల్లా యంత్రాంగం తీరుపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు నిల్.. నీతులు ఫుల్ మాదిరి అధికారుల తీరు ఉందని అసహనం వ్యక్తం చేశారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ముస్తాబు పేరిట హడావిడి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉత్తి మాటలతో ఊరు శుభ్రపడదని పేర్కొన్నారు. నిధులు ఊసెత్తితే దాటవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులెవరికీ బాధ్యత లేదని విమర్శించారు. గ్రామాల్లో మిల్లర్ల దోపిడీ, రైతుల ఇబ్బందులపైనా పలువురు నిలదీశారు. మంచినీరు, మౌలిక సదుపాయాల సమస్యలనూ ప్రస్తావించారు. -
జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు గురుకుల కళాశాల విద్యార్థిని
గుమ్మలక్ష్మీపురం: జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు గుమ్మలక్ష్మీపురం మండలంలోని భద్రగిరి గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాల(పీటీజీ)లో సెకెండ్ ఇయర్ బైపీసీ చదువుతున్న తోయక ప్రవల్లిక ఎంపికై నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డి.భారతి, ఫెన్సింగ్ కోచ్ పి.బాలరాజు సోమవారం విలేకరులకు తెలిపారు. ఈ మేరకు గుంటూరు జిల్లా వెనిగండ్లలోని శ్రీవేమన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా ఈనెల 13, 14వ తేదీల్లో జరిగిన 69వ స్టేట్ లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్ ఫెన్సింగ్ పోటీల్లో ఫోయిల్ వ్యక్తిగత విభాగంలో ప్రవల్లిక పాల్గొ ని ఉత్తమ ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించిందన్నారు. ఈ విద్యార్థిని త్వరలో ఇంఫాల్లో జరగనున్న జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలియజేస్తూ..జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినికి అభినందనలు తెలియజేశారు. -
వినతుల పరిష్కారంలో ఆలస్యం తగదు
● పీజీఆర్ఎస్లో కలెక్టర్ రాంసుదర్రెడ్డివిజయనగరం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి అందే వినతులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ఎస్.రాంసుందర్రెడ్డి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. వినతుల పరిష్కారంలో ఆలస్యం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్తో పాటును జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీలాగాంధీ, బి.శాంతి, కళావతి తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి సమర్పించిన ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో మొత్తం 186 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులతో నేరుగా మాట్లాడిన తర్వాతనే ఎండార్స్మెంట్ ఇవ్వాలని, మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్టులో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్వేశాఖ ఎ.డి ఆర్.విజయకుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవీప్రసాద్, సీపీఓ బాలాజీ, డీఈఓ యూ.మాణిక్యం నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల పరిష్కారంపై ఆడిట్ టీమ్కు శిక్షణ ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ఆడిట్ ఆధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. రీ ఓపెన్ కేసులు, ఫ్రీ ఆడిట్, ఆడిట్, ప్రజల సంతృప్తి తదితర అంశాలు కచ్చితంగా ఉండేలా మరోసారి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించిన ఫిర్యాదులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పెండింగ్లో ఉన్న ధరఖాస్తులు, గడువు దాటినవి, రీ ఓపెన్ అయినవాటిపై వివరంగా సమీక్షించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ మురళి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆన్లైన్ ద్వారా మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 25 ఫిర్యాదులు ● ఏఎస్పీ చాంబర్లో కార్యక్రమం నిర్వహణ విజయనగరం క్రైమ్: ప్రతి వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఈ వారం 25 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ సౌమ్యలత సోమవారం డీపీఓలోని తన చాబర్లో ఫిర్యాదులు స్వీకరించారు.ఈ మేరకు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించిన ఏఎస్పీ సౌమ్యలత వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత సిబ్బందితో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను వివరించారు. ఏఎస్పీ స్వీకరించిన ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలకు సంబంధించి 4, మోసాలకు పాల్పడినట్లు 3, ఇతర అంశాలకు సంబంధించి 10 ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో పరిష్కరించాలని ఏఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ కె. కుమారస్వామి, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ పొదుపు ప్రగతికి మార్గం
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డివిజయనగరం ఫోర్ట్: విద్యుత్ పొదుపు చేయడం ద్వారా ప్రగతికి మార్గం వేయవచ్చునని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా విద్యుత్ పొదుపు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఏపీఈపీడీసీఎల్ సోమవారం నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ఆర్అండ్బీ జంక్షన్, మయూరి జంక్షన్ మీదుగా బాలాజీ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంధనాన్ని ఎంత పొదుపు చేస్తే, అంత అదనంగా ఉత్పత్తి చేసినట్లునన్నారు. రోజురోజుకు విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం పెరుగుతోందని, ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆదాపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. దీనికోసం విద్యుత్ను ఆదా చేసే 5స్టార్ పరికరాలను వినియోగించాలని సూచించారు. అవసరమైనప్పడు విద్యుత్ ఉపకరణాలను వినియోగించాలని కోరారు. తమ ఇళ్లలోని విద్యుత్ వినియోగాన్ని ఆడిట్ చేసుకుని విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. విద్యుత్ను వృథా చేయవద్దన్నారు. కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు, ఈఈలు పి.త్రినాథరావు, జి.సురేష్బాబు, బి.రఘు, ఏడీఈ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇందన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత పార్వతీపురం: ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యుత్ ఆదా చేసే విధానంపై అందరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో జాతీయ ఇంధనపొదుపు వారోత్సవాల ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం సమావేశ మందిరంలో మాట్లాడుతూ ఇంధన పొదుపు కచ్చితంగా అమలు కావాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు, వసతిగృహాలు, సచివాలయాలు, మండల, జిల్లా స్థాయి కార్యాలయాల్లో ఇంధనాన్ని పొదుపు చేసేలా అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. ప్రతి ప్రభుత్వ భవనంలో విద్యుత్ను ఆదా చేయాలని సూచించారు. గత నెలలో విద్యుత్ బిల్లు ఆదారంగా వీలైనంతవరకు విద్యుత్ పొదుపు చేసి ఆదా చేయాలని కోరారు. విద్యుత్ను ఆదా చేయడమంటే విద్యుత్ను ఉత్పత్తి చేయడమేనని పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించి నాణ్యమైన విద్యుత్ పరికరాల వినియోగం, పొదుపు చేయడం తదితర అంశాలపై అవగాహన సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ కె.హేమలత, సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, విద్యుత్శాఖ ఎస్ఈ పాల్గొన్నారు. -
అర్జీలను సొంత సమస్యగా భావించాలి
చికెన్ ● కలెక్టర్ ప్రభాకరరెడ్డి పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలను సొంత సమస్యగా భావించి నాణ్యమైన పరిష్కారాన్ని ఇవ్వాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన ప్రజలు 117 వినతులు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యంగా అర్జీలను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అర్జీలను స్వీకరించినవారిలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి, డిఆర్ఓ కె.హేమలత, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్లోని రెవెన్యూ క్లినిక్లో కూడా కలెక్టర్ వినతులను స్వీకరించారు. వినతులలో కొన్ని.. ● పార్వతీపురం మండలం చందలింగి గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 28–5లో గల ఆర్ఓఎఫ్ఆర్ భూములను అక్రమంగా సాగు చేస్తున్నారని, ఆక్రమణ దారుల తొలగించి ఫారెస్టు భూములను కాపాడాలని ఆర్.ప్రభాకర్ అర్జీ అందజేశారు. ● తన ఇంటి వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలాన్ని కొంతమంది ఆక్రమించి ప్రహరీ నిర్మించారని, ఆక్రమణలను తొలగించాలని కోరుతూ భామిని మండలం బాలేరు గ్రామానికి చెందిన నిమ్మక వసంతకుమార్ వినతిపత్రం అందజేశాడు. . ● సీతానగరం మండలం నిడగల్లు గ్రామానికి చెందిన జి. సత్యం తనకు దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కోరాడు. ● పార్వతీపురం పట్టణానికి చెందిన సీహెచ్. పైడిరాజు గ్యాస్ సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదని నగదు జమ అయ్యేలా చూడాలని వినతిని అందజేశారు. ● పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామానికి చెందిన డి. శ్రీరాములు గృహ నిర్మాణం పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశాడు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 19 వినతులు సీతంపేట: సీతంపేట ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ఐటీడీఏ ఏపీఓ ఎస్.వి.గణేష్ నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 19 వినతులు వచ్చాయి. కొండచీపుళ్ల తయారీ యూనిట్ పెట్టుకోవడానికి రుణం ఇప్పించాలని అడ్డంగి గ్రామస్తుడు గోవిందరావు, మేకల యూనిట్ నిర్వహణకు లోన్ ఇప్పించాలని ఎం.సింగుపురం గ్రామస్తుడు సింహాచలం అర్జీలు అందజేశారు. జన్నోడుగూడ గ్రామస్తులు అంతర్గత సీసీరోడ్డు గ్రామానికి నిర్మించాలని విన్నవించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పారదర్శకంగా పరిష్కరించాలి: ఎస్పీ పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదుదారుల నుంచి వచ్చిన 9 అర్జీలను నేరుగా స్వీకరించి అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఫిర్యాదుల పరిష్కారం దిశగా సంబంధిత అధికారులకు ఫోన్లో ఎస్పీ ఆదేశాలను జారీ చేస్తూ ఫిర్యాదుల పూర్వా పరాలను విచారణ చేసి వాస్తవాలైనట్లైతే చట్టపరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అమర జీవికి ఘనంగా నివాళి ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసుకున్న అమర జీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని ఆయన ఆశయాలు, సేవలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితం కావాలని ఎస్పీ మాధవ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి
రాజాం సిటీ: విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డవలప్ చేసుకోవడంతో పాటు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని పార్లమెంట్ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండర్ చైర్పర్సన్, మూర్తి ట్రస్టు చైర్పర్సన్ సుధామూర్తి అన్నారు. స్థానిక జీఎంఆర్ ఐటీలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంగ్లంలో పట్టు సాధించడంతో పాటు మాతృభాషను చిన్నచూపు చూడకూడదన్నారు. మాతృభాష, ఆంగ్లభాష శ్రీకృష్ణుడికి ఇద్దరు తల్లులైన దేవకి, యశోదలు వంటివన్నారు. ఆ రెండు భాషలు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. లక్ష్య సాధనలో మనసులను ఇతర ప్రభావాల నుంచి దూరం చేయడానికి నిరంతర కృషి, సాధన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉద్బోధించారు. విద్య, వైద్య రంగాలతో పాటు గ్రామీణాభివృద్ధి రంగాల్లో జీఎంఆర్ చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వారిని ఉత్తేజపరిచారు. అనంతరం జీఎంఆర్ కేర్, నైరెడ్లను సందర్శించారు. 19 మంది గిఫ్టెడ్ చిల్డ్రన్స్కు స్కూల్ బ్యాగులను అందించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన 10 మంది విద్యార్థులను సత్కరించారు. అంతకుముందు జీఎంఆర్ గ్రూపు సంస్థల చైర్మన్ గ్రంథి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ సంఘ సంస్కర్తగా, విద్యావేత్తగా రచయితగా పేరుగాంచిన సుధామూర్తి ఎంతో మందికి ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో జీఎంఆర్ గ్రూపు చైర్మన్లు బీవీ నాగేశ్వరరావు, జీబీఎస్ రాజు, బొమ్మిడాల రమాదేవి, గ్రంథి పెదబాబు, పీడీకే రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న జూనియర్స్ బాల, బాలికలు, సీనియర్స్ సీ్త్ర, పురుషుల ఖోఖో పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపికలు ఆదివారం పూర్తయ్యాయి. జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కార్పొరేషన్ కస్పా ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 170 మంది క్రీడాకారులు హాజరయ్యారు. హాజరైన క్రీడాకారులకు జూనియర్స్, సీనియర్స్ విబాగాల్లో ఎంపిక పోటీలు నిర్వహించగా ఆద్యంతం ఉత్కంఠభరితంగా పోటీలు సాగాయి. ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది క్రీడాకారులను జూనియర్స్ విభాగంలో ఎంపిక చేయగా.. సీనియర్స్ విభాగంలో మరో 30 మంది అర్హత సాధించారు. జూనియర్స్ విభాగంలో ఎంపికై న బాల, బాలికల క్రీడాకారులు ఈనెల 19,20,21 తేదీల్లో ప్రకాశం జిల్లా పంగులూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి పాల్గొననున్నారు. అదేవిధంగా సీనియర్స్ విభాగంలో అర్హత సాధించిన క్రీడాకారులు ఈనెల 24,26 తేదీల్లో గుడివాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపిక పోటీలను జిల్లా ఖోఖో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వీవీ రమణమూర్తి, అధ్యక్షుడు ఏఎంఎన్ కమలనాభరావు, ప్రధాన కార్యదర్శి కె.గోపాల్, కోశాధికారి ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మల్లి కార్జునారావు, ఎస్జీఎఫ్ కార్యదర్శి ఎస్.విజయలక్ష్మి, పీడీ వరలక్ష్మి, రామకృష్ణ, రాంబాబు, హరీష్, సత్యనారాయణ, శ్రీను తదితరులు పర్యవేక్షించారు. -
మీ కోసం వెబ్సైట్లో పీజీఆర్ఎస్ అర్జీల వివరాలు
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు మీ కోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతి రోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరించుటకు సెల్లార్లో ప్రత్యేకంగా సెల్ను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అర్జీదారులు మీకోసం.ఏపీజీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించి సమాచారం తెలుసుకునేందుకు 1100 నంబరుకు డయల్ చేయాలని సూచించారు. విజయనగరం టౌన్: గోవా గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ వేత్త పూస పాటి అశోక్ గజపతిరాజు ఎంపికవ్వడం తెలు గు వారందరికీ గర్వకారణమని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పేర్కొన్నారు. క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం ఆత్మీ య సత్కార సభను నిర్వహించారు. కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో విలువలకు, విశ్వసనీయతకు మారుపేరు గా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో క్షత్రియ పరిషత్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాజాం : స్థానిక జీఎంఆర్ వరలక్ష్మీ కళాక్షేత్రంలో రాజాంకు చెందిన శ్రీ పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివా రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు కత్తులకవిటికి చెందిన ఎన్ఆర్ఐ, సామాజిక సేవా కార్యకర్త దాము గేదెలను సేవారత్న అవార్డుతో సత్కరించారు. అవార్డు అందుకున్న దాము మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. కుటుంబీకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఉత్సాహం రెట్టింపు అయ్యిందని, సేవా కార్యక్రమాలు బాధ్యతను, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దామును పలువురు కళాకారులు, ఆయన బంధువులు ఘనంగా సత్కరించారు. అంతకు ముందు జగన్మోహిని పద్య నాటక ప్ర దర్శన, కేవీ పద్మావతి శిష్య బృందంతో భరత నాట్య నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కా ర్యక్రమంలో పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం కమిటీ సభ్యులు, రాజాంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బొబ్బిలి: పట్టణంలో క్రిస్మస్ సందడి ప్రారంభమైంది. మెయిన్ రోడ్డు, బజార్లోని పలు దుకాణాల వద్ద క్రిస్మస్ స్టార్లు, ట్రీలు లైటింగ్ డెకరేషన్ల లైట్లు విక్రయిస్తున్నారు. వస్త్ర దుకాణాలు క్రైస్తవ సోదరులు, పిల్లలతో సందడిగా కనిపిస్తున్నాయి. బొబ్బిలిలోని వందేళ్ల పైబడ్డ చరిత్ర ఉన్న స్థానిక సీబీఎం చర్చి రంగులేసుకుని రాత్రి వేళల్లో విద్యుద్దీపాలతో తణుకులీనుతున్న దృశ్యాలు పట్టణంలో కనుల పండువగా కనిపిస్తున్నాయి. -
గురుకులంలో ఆకలి కేకలు
భామిని: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నం ఆకలితో అలమటించారు. రోజూ మధ్యాహ్నం 12.30 గంటలకే పెట్టాల్సిన భోజనాన్ని మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు విద్యార్థులకు పెట్టలేదు. దీంతో పలువురు విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడ్డారు. గురుకులంలో 460 మంది విద్యార్థులున్నారు. భోజనం ఆలస్యం కావడంతో గదుల్లో, వరండాల్లో చేరి భోజనం కోసం పడిగాపులు కాశారు. గురుకులంలో సరైన పర్యవేక్షణ లేకే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా గురుకులంలో వంట ఏజెన్సీకి, నిర్వాహకులకు మధ్య వివాదం రేగుతోంది. దీంతో కావాలనే జాప్యం చేస్తూ విద్యార్థులను ఆకలికి గురి చేస్తున్నట్ట్టు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక విలేకరులు గురుకులానికి వెళ్లగా ప్రిన్సిపాల్ విజయనిర్మల అడ్డుకొని భోజన సమస్య పరిష్కరిస్తున్నట్టు సర్ది చెప్పారు. గ్యాస్ రెగ్యులేటర్ మరమ్మతులకు గురవడంతోనే భోజనంలో జాప్యం జరిగిందని పొంతన లేని సమాధానం ఇచ్చారు. చివరకు మధ్యాహ్నం 3.30 గంటల తరువాత విద్యార్థులకు భోజనం పెట్టారు. -
పంచాయతీ స్థలం ఆక్రమణ
● ఇంటి నిర్మాణానికి టీడీపీ నాయకుల యత్నం ● అడ్డుకున్న గ్రామస్తులు, మహిళలుబొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామంలో పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి ఇంటినిర్మాణానికి పూనుకున్న టీడీపీ నాయకుల ఆగడాలను స్థానికులు అడ్డుకున్నారు. గ్రామంలో మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న సుమరు 150 గజాల స్థలంపై టీడీపీ నాయకుల కన్నుపడింది. కొత్తగా ప్రభుత్వం ఇంటినిర్మాణాలకు రుణసహాయం చేస్తామని ప్రకటించడంతో ఇంటి నిర్మాణానికి అనుమతి తెస్తానని గ్రామ పంచాయతీకి చెందిన కాలువ, రోడ్డును ఆక్రమించుకుని ఇంటి నిర్మాణం చేపట్టవచ్చని గ్రామ టీడీపీ నాయకుడి సూచనతో శనివారం రాత్రి జేసీబీతో అక్కడి మట్టిని తొలగించేందుకు ఆక్రమణ దారు ప్రయత్నించాడు. దీంతో గ్రామస్తులు, మహిళలు తిరగబడ్డారు. గ్రామంలో ఉన్న ప్రధాన మురుగునీరు పోయే కాలువను, రోడ్డును ఆక్రమించి చేపడుతున్న నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఈ ఆక్రమణపై పంచాయతీ సెక్రటరీ ఇప్పటికే నోటీసులిచ్చినా తోసిరాజని నిర్మాణానికి ప్రయత్నించడంపై పంచాయతీ శాఖ డీఈఈ వెంకటప్పారావుకు విషయాన్ని చేరవేశారు. జేఈతో సమగ్ర దర్యాప్తుకు డీఈఈ ఆదేశించగా ఇంతలోనే నిర్మాణానికి యత్నించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో మురుగునీరు పారే కాలువ, వేగావతికి వెళ్లే రహదారి పూర్తిగా మూసుకుపోతుందని వెంటనే చర్యలు చేపట్టాలని ఇటీవల గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో కలెక్టర్ నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్లో సైతం ఫిర్యాదు చేసినా ఆక్రమణను అధికారులు అడ్డుకోకపోవడం, అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇంటి నిర్మాణానికి పూనుకుం టుండంతో గ్రామస్తులంతా మూకుమ్మడిగా అక్కడి పనులను అడ్డుకున్నారు. పంచాయతీ అధికారులనుంచి స్పందన రాకపోవడంతో స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. ఆక్రమణ దారు అధికార పార్టీకి చెందిన వాడు కావడంతో దౌర్జన్యంగా జేసీబీతో పనులు చేపడుతున్నాడని, పంచాయతీ అధికారులు ఇచ్చిన నోటీసులను సైతం పట్టించుకోకుండా ఇంటినిర్మాణానికి పూనుకుంటున్నట్లు, అడ్డగించిన వారిపై దౌర్జన్యం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ తీర్మానాలు, అనుమతులు లేకుండా చేస్తున్న నిర్మాణానికి అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడి అండదండలున్నాయని ఈ దురాక్రమణను అడ్డుకోవాలని కోరారు. దీంతో ప్రస్తుతం నిర్మాణం ఆగిపోయినా మళ్లీ చేపడితే తీసుకోవాల్సిన చర్యలపై ఇరు వర్గాలను పిలిచి చర్చిస్తామని పోలీసులు తెలిపారు. -
యూత్ ఏషియన్ పారా గేమ్స్లో గోల్డ్ మెడల్
విజయనగరం: దుబాయ్ వేదికగా జరుగుతున్న యూత్ ఏషియన్ పారా గేమ్స్ 2025 పారా బాడ్మింటన్లో విజయనగరం జిల్లా క్రీడాకారుడు పొట్నూరు ప్రేమ్ చంద్ గోల్డ్ మెడల్ సాధించడం జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు విజయాలు సాధించడం వెనుక ప్రేమ్ చంద్ సంకల్పం, నిరంతర సాధనతో పాటు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి అందించిన ప్రోత్సాహం ఉన్నాయన్నారు. ఈ నెల 7 నుంచి 14 వరకు దుబాయ్లో జరుగుతున్న యూత్ ఏషియన్ పారా గేమ్స్లో గతం కంటే పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ బాడ్మింటన్ ఎస్.హెచ్ 6 కేటగిరిలో గోల్డ్ మెడల్ సాధించి జిల్లా పేరును అంతర్జాతీయ స్థాయిలో మారు మోగేలా చేశాడని ప్రశంసించారు. పొట్నూరు ప్రేమ్ చంద్ విజయం పట్ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రాం సుందర రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వర రావులు అభినందనలు తెలియజేశారు. -
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
● మద్యం మత్తులో టిప్పర్ను ఢీకొన్న ద్విచక్ర వాహదారు భోగాపురం: మద్యం మత్తులో ఓ యువకుడు ద్విచక్ర వాహనానంపై వస్తూ ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టాడు. అయితే ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారు స్వల్ప గాయాలతో బయట పడగా పెనుప్రమాదం తప్పడంతో ముంజేరు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. భోగాపురం మండలంలోని ముంజేరు గ్రామంలో ఆర్అండ్బీ రహదారిపై ఆదివారం జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని దేవరాపల్లి గ్రామానికి చెందిన యువకుడు గండ్రేటి పాలవెల్లి రెడ్డికంచేరు సమీపంలో నిర్మాణంలో ఉన్న విమానాశ్రయంలో జేసీబీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో పూటుగా మద్యం తాగి బైక్పై భోగాపురం బయలు దేరాడు. భోగాపురం నుంచి ముక్కాం వైపు వస్తున్న టిప్పర్ ముంజేరు వద్దకు చేరుకునేసరికి మద్యం మత్తులో ఉండి ఎదురుగా బైక్పై వస్తున్న వాహదారును గమనించిన టిప్పర్ డ్రైవర్ రోడ్డుపై ఆపివేశాడు. అయినప్పటికీ మద్యం మత్తులో ఉన్న ద్విచక్ర వాహనదారు ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అక్కడే ఉన్న గ్రామస్తులు స్వల్ప గాయాలపాలైన పాలవెల్లిని లేపి సపర్యలు చేసి, టిప్పర్కు అడ్డంగా ఉన్న ద్విచక్ర వాహనాన్ని పక్కకు తీసి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చేశారు. -
ప్రమాదకరంగా జలాశయంలో నీటి నిల్వ
తోటపల్లి జలాశయంలో ప్రస్తుతం నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయని, రానున్న వేసవిలో మరిన్ని నీటి ఇబ్బందులు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు. జలాశయం ద్వారా ప్రతీ ఏటా ఖరీఫ్లో పాత ఆయకట్టులోని 64 వేల ఎకరాలకు, కుడి ప్రధాన కాలువలో 1.35 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారు. వీటితో పాటు పార్వతీపురం జిల్లా కేంద్రంలోని రక్షిత మంచినీటి పథకానికి కూడా తోటపల్లి నీరే అందిస్తున్నారు. వర్షాకాలం, శీతాకాలం మినహాయిస్తే డిసెంబర్ నుంచి వచ్చే జూన్ వరకు ఇన్ప్లోస్ ఉండవు. ప్రస్తుతం నీటి నిల్వ 2.1 టీఎంసీలు ఉంది. పాత కుడి, ఎడమ కాలువల నుంచి గత నెల రోజులుగా 0.66 టీఎంసీల నీరు వృథాగా పోతోంది. ఈ నీటి వృథాను తక్షణమే అరికట్టకపోతే మరో రెండు నెలల్లో ప్రాజెక్టులో నీటి నిల్వ ప్రమాదకర స్థితికి చేరే అవకాశం ఉందని సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. -
రాజాంలో శ్రీలీల సందడి
రాజాం: పట్టణంలోని పాలకొండ రోడ్డులో సీఎంఆర్ షాపింగ్ మాల్ 44వ స్టోర్ను సినీనటి, డ్యాన్స్ క్వీన్ శ్రీలీల ఆదివారం ప్రారంభించారు. తొలుత షాపులో జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్లోని పలు రకాల వస్త్రాలను సందర్శించారు. షాపింగ్మాల్ను ప్రారంభించిన అనంతరం పక్కన ఏర్పాటుచేసిన ఓపెన్ స్టేజ్పైనుంచి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. డ్యాన్స్తో అలరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎంఆర్ షాపింగ్ మాల్తో తనకెంతో అనుబంధం ఉందని వెల్లడించారు. సీఎంఆర్ అంటే నమ్మకమని వెల్లడించారు. నాణ్యమైన వస్త్రాలు, జ్యూవెలరీ అందరికీ అందుబాటులో సీఎంఆర్ అందిస్తుందన్నారు. రాజాం పట్టణంలో ఈ షాపింగ్ మాల్ ప్రారంభించడంతో పాటు ఈ ప్రాంత ప్రజలు అందరికీ సరసమైన ధరలకు వస్త్రాలు లభిస్తాయని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. సీఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ రాజాంలో కొన్ని నెలల క్రితం సీఎంఆర్ జ్యూయలరీ ప్రారంభించామని, ప్రజలు ఎంతో ఆదరించారని తెలిపా రు. ఇప్పుడు వస్త్రదుకాణాన్ని ప్రారంభించామని, 20 మండలాల ప్రజలకు ఈ షాపింగ్ మాల్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నాణ్యమైన వస్త్రాలును అందుబాటు ధరలో ఉంచుతున్నామని, అన్ని రకాల వస్త్రాలపై క్రిస్మస్, సంక్రాంతి ఆఫర్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, సీఎంఆర్ డైరెక్టర్ బాలాజీ, లింగమూర్తి, సీవీ జగన్నాథస్వామి, కోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది, దొరబాబు, రైజింగ్ రాజు తదితరులు ప్రేక్షకులును అలరించారు. -
24/7 అందుబాటులో మద్యం
● మద్యం కేరాఫ్ మన్యం జిల్లా ● జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా బెల్ట్ షావుల నిర్వహణగఅనధికార విక్రయాలపై ప్రత్యేక నిఘా అనధికార విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఎప్పటికప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. జిల్లాలో బెల్ట్ షావులపు గుర్తించి కేసులు నమోదు చేస్తున్నాం. సారా రవాణా తయారీ అమ్మకాలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నాం. అనధికార మద్యం, సారా వంటివి విక్రయిస్తూ ప్రజారోగ్యానికి ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లావ్యాప్తంగా పీడీయాక్ట్లను నమోదు చేస్తాం. బి.శ్రీనాథుడు, ఎకై ్సజ్ ఈఎస్, ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం టౌన్: ఓ వైపు ప్రభుత్వ వైఫల్యం, మరోవైపు ఎకై ్సజ్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజారోగ్యానికి తూట్లు పడుతున్నాయి. గడిచిన ఏడాదిన్నరగా జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు, పారిశుద్ధ్య లోపం, తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న మన్యం వాసులకు మద్యం కష్టాలు తెచ్చి పెడుతోంది. జిల్లాలో గ్రామ గ్రామాన మద్యం, సారా ఏరులై పారుతోంది. జిల్లా కేంద్రంలో వేకువ జాము నుంచే మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దానికి తోడు మన్యం జిల్లా వ్యాప్తంగా, ఏఓబీ గ్రామాల్లో, గిరిజన సీమల్లో, గిరిశిఖర గ్రామాల్లో మద్యం, సారా ఏరులై పారుతోంది. దాదాపు అన్ని గిరిజన గ్రామాలు, మైదాన ప్రాంతాలు, గ్రామాల్లో, పట్టణాల్లో బహిరంగంగానే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలోని ఏఓబీ గ్రామాల్లో సారా తయారీ చేస్తున్న కేంద్రాలు కుటీర పరిశ్రమలుగా ఏర్పడ్డాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, గెడ్డలు, వాగులు, నిండుగా ప్రవహిస్తుండడంతో ఆయా ప్రాంతాలను వ్యాపారులు తమకు అనువుగా మార్చుకుని బెల్లపు ఊటలను తయారు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో అక్రమంగా సారాను తయారు చేస్తూ జిల్లా కేంద్రంగా అనేక జిల్లాలకు దాటిస్తున్నారు. నెలలో ఏదో ఒకరోజు ఎకై ్సజ్ అధికారులు తామున్నామంటూ తూతూ మంత్రంగానే దాడులు నిర్వహిస్తూ మమ అనిపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. పూర్తిస్థాయిలో నిఘా లేకపోవడంతో మన్యం జిల్లా మద్యం, సారా క్రయ విక్రయాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ప్రతి నెలా మంత్లీలు బెల్ట్ షావు నిర్వహణకు ఎకై ్సజ్ దిగువ స్థాయి సిబ్బంది నుంచి పై అధికారుల వరకు ఒక్కొకరికి భారీ మొత్తంలో ముడుపులు అందిస్తున్నారన్న బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. రవాణా అంతా రాత్రివేళలోనే.. గిరిజన ప్రాంతాల్లో తయారు చేసిన సారాను కొంతమంది వ్యాపారులు రాత్రివేళల్లో ఆటోలు, బైక్ల ద్వారా మైదానం, పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. మన్యంలో సరిహద్దు గ్రామాలైన జయకోట, బొత్తరాపల్లి, మూలకర్ని, విక్రాంపురం, అలమండ, సోరుపల్లి, సందుబడి. రేగులపాడు, సంబలబాయి, ఎగువ పిల్లిడ్డి, జీడివలస, అత్తిగడ, జగ్గూడ, టికరపాడు, కప్పలాడ, మానిక్యంవలస, ఎడుగుమ్మలవలస, పొల్ల, చిన్నబగ్గ, కడగండి, ఓండ్రుజోల, వలగజ్జి, వలగజ్జి గ్రామాల మీదుగా జనసంచారం లేని మార్గాలగుండా సారాను తరలిస్తున్నారు. పార్వతీపురం, కురపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో పలు ప్రాంతాలకు ఇక్కడనుంచి ప్లాస్టిక్ కేన్లలో రవాణా చేస్తున్నారు. దీనిపై ఎకై ్సజ్ శాఖ నిఘా కొరవడింది. దీంతో రోజుకు కొన్ని వేల లీటర్ల సారా రవాణా అవుతోంది. జిల్లాలో అనధికారికంగా 600 పైగా మద్యం బెల్టు దుకాణాలు ఉన్నాయి. ఏడాదిన్నరగా ఇప్పటి వరకు 700 కేసులు నమోదు చేశామని అధికారులు చెబుతున్నారు. ఏఓబీ గ్రామాల్లో 18 అంతరాష్ట్ర దాడులు నిర్వహించి 4లక్షల లీటర్ల పులిసిన బెల్లపు ఉటలు ధ్వంసం చేశారు. 21 వేల లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో బతుకులు ఛిద్రం శుభకార్యాలు, పండుగల సమయాల్లో ఎక్కువగా మద్యాన్ని తాగుతారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యం మద్యం లభిస్తుండంతో వేకువజాము నుంచే మందుబాబులు బెల్ట్ షావుల వద్ద క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. గతం కంటే అధిక ధరకే లభిస్తున్నా వెనుకంజ వేయడం లేదు. దీనికి బానిసలై బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు. కాయకష్టం చేసి సంపాదించిన మొత్తం మద్యానికి తగలేసి కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. కిడ్నీ, కాలేయం, గుండె సంబంధిత వ్యాధులతో ఆస్పత్రి పాలవుతున్నారు. మద్యం, సారా తాగడం వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్థాయిలో పెద్దగా అవగాహన సదస్సులు నిర్వహించడం లేదు. దీంతో గిరిజనుల్లో చైతన్యం కొరవడింది. -
ఉత్సాహంగా వెటరన్స్ బ్యాడ్మింటన్ పోటీలు
విజయనగరం: జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాట్మింటన్ పోటీలు ఉల్లాసంగా సాగాయి. విజయనగరం జిల్లా కేంద్రంలో గల ఇండోర్ స్టేడియంలో వెటరన్స్ విభాగంలో సీ్త్ర, పురుషులకు నిర్వహించిన బాడ్మింటన్ పోటీలను బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రారంబించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 100మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ బాడ్మింటన్కు జిల్లాలో పెరుగుతున్న ఆదరణ చూసి ఆనందంగా ఉందన్నారు. మానసిక ఆరోగ్యంతో పాటు, శారీరక ఆరోగ్యం ఎంతగానో మెరుగు పడతాయన్నారు. వెటరన్స్ ఇంతమంది ఆడడం వల్ల యువతకు కూడా స్ఫూర్తిగా నిలిచినవారవుతున్నారనారు. జిల్లాస్థాయి పోటీల్లో క్రీడా స్ఫూర్తితో ఆడి రాష్ట్ర పోటీల్లో సత్తా చాటాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ ద్వారాపురెడ్డి జగదీశ్, అసోసియేషన్ నాయకులు డా.వీఎస్ ప్రసాద్, కుసుంబచ్చన్, కార్యదర్శి నున్నా సురేష్, అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో వెటరన్ క్రీడాకారులు పాల్గొన్నారు. ధాన్యం కుప్పలు దగ్ధంబాడంగి: మండలంలోని రావివలస గ్రామానికి చెందిన గొర్లిలక్ష్మి అనే మహిళా రైతుకు చెందిన మూడు ధాన్యం కుప్పలు ఆదివారం కాలిపోయినట్లు బాధితురాలు తెలిపింది. పాల్తేరు రెవెన్యూ పరిధిలోగల పెద్దచెరువు పొలంలో రెండెకరాల వరిచేనును ఒకేచోట మూడుకుప్పలుగా వేయగా కాలిపోయినట్టు కన్నీటి పర్యంతమైంది. మూడుకుప్పలను నూర్చితే సుమారు లక్షరూపాయలకు ధాన్యం వచ్చేవని విలపించింది. ఎవరో కావాలనే తనపై కక్షతో ఈపనిచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. రెవెన్యూ సిబ్బంది, పోలీసులు కల్పించుకుని తమకు న్యాయంచేయాలని మొరపెట్టుకుంటోంది. ఐదు దేవాలయాల్లో చోరీవేపాడ: ఒకే రాత్రి..ఒకే ఊరు..ఒకే రహాదారిని ఆనుకుని ఉన్న ఐదు దేవాలయాల్లో హుండీలను దుండగులు పగులగొట్టి సొమ్ము దొంగిలించారు. ఈ సంఘటనతో గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించి ఎస్సై సుదర్శన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేపాడ మండలంలోని బానాది గ్రామంలో ఎం.సింగవరం బల్లంకి వెళ్లే రహాదారిని ఆనుకుని ఉన్న ఐదు దేవాలయాల్లో ఏడు హుండీలు పగులగొట్టి శనివారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.41 వేల నగదు ఉంటుందని ప్రాథమిక అంచనా వేసినట్లు ఎస్సై తెలిపారు. ఆదివారం ఉదయం ప్రజలు, ఆలయ అర్చకులు వచ్చేసరికి హుండీలు పగలగొట్లి ఆలయం బయట ఉండడంతో ఆవాకై ్క వెంటనే గ్రామపెద్దలు, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఆలయ ఆర్చకుడు మేడపాటి కిశోర్శర్మ ఇచ్చిన ఫిర్యాదుమేరకు వల్లంపూడి ఎస్సై సుదర్శన్ కేసు నమోదు చేశారు. ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు ఐదు ఆలయాల్లో చోరీ సంఘటనపై పరిశీలించి గ్రామస్తులను ఆరాతీశారు. క్లూస్ టీమ్ హుండీలు, ప్రధానగేట్పై వేలిముద్రలు సేకరించారు. బైక్పై నుంచి జారిపడి మహిళ మృతిసీతానగరం: మండలంలోని జాతీయరహదారిపై అంటిపేట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. ఈ మేరకు స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. రామవరం పంచాయతీ, రెడ్డివాని వలస గ్రామానికి చెందిన రెడ్డి విజయలక్ష్మి గ్రామంలో నుంచి ఓ వ్యక్తి మోటార్ సైకిల్పై ఎక్కి వస్తుండగా ప్రమాదవశాత్తు బైక్పై నుంచి జారి పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. గాయాల పాలైన విజయలక్ష్మిని అదే మోటార్ సైకిల్పై చికిత్స నిమిత్తం బొబ్బిలి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. -
ప్రజాగ్రహం
నేడు జిల్లా కేంద్రాల్లో ప్రజా చైతన్య ర్యాలీలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించ తల పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న సోమ వారం విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లా కేంద్రంలో ఆయా జిల్లా పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ప్రజా చైతన్య ర్యాలీలు నిర్వహించనున్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఇప్పటికే నియోజకవర్గ కేంద్రాల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను జిల్లా కేంద్రాల నుంచి విజ యవాడలోని పార్టీ కార్యాలయానికి తరలించనున్నారు. అనంతరం ఈ నెల 18న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గవర్నరుకు కోటి సంతకాలు అందజేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కోరనున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో విస్తృత పరించేందుకు చేపట్టిన ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మద్దతు తెలియజేయటం ద్వారా ర్యాలీలను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ నేతలు పిలుపునిచ్చారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రజా వైద్యాన్ని ప్రైవేటుపరం చేస్తూ తమనెవ రూ ఆపలేరని... తన మాటే శాసనమని విర్రవీగిన చంద్రబాబు ప్రభుత్వ అహంకారాన్ని కలంతో ప్రజ లు నిలదీశారు. తమ ప్రాణాలకు విలువ లేదా.. ఆరోగ్యమంటే లెక్కలేదా..? అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజా వైద్యానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేసిన కృషిని నేటి కార్పొరేట్ ప్రభుత్వం తుంగలోకి తొక్కుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు చేస్తున్న యత్నాన్ని ప్రజలు గొంతెత్తి ప్రశ్నించారు. తమ పట్ల ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను.. మోసాన్ని సహించలేని ప్రజలు ఆగ్రహోగ్రులయ్యారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని దించేసి అధికారం ఉంటే కచ్చితంగా దించేసేవారే... కానీ దానికింకా టైముంది.. అందుకే అందాకా సంతకాలతో తమ నిరసన తెలియజేశారు. కోటి సంతకాల సేకరణకు స్వచ్ఛంద ప్రజా మద్దతు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు గత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకోగా.. అందులో 5 కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకుని తరగతులు ప్రారంభమయ్యాయి. మరో రెండు కాలేజీలు నిర్మాణాలు పూర్తి చేసుకోగా.. మిగిలిన 10 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయాల్సిన కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం పేరిట పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయటాన్ని బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి ఊరూ వాడా మద్దతు పలికింది. భవిష్యత్తు మీద ఆందోళనతో విద్యార్థి లోకం.. ఆరో గ్య భద్రతపై బెంగతో వృద్ధులు సైతం ఈ సంతకా ల్లో మేము సైతం అని పాల్గొన్నారు. మన్యం ప్రజ లు ఈ ఉద్యమానికి మోసులెత్తగా.. పట్టణ ప్రజలు పరుగులెత్తారు. పల్లెలు పట్టుగొమ్మలయ్యాయి.. విద్యార్థులు వీరులై కదలివచ్చారు. దీంతో మొత్తానికి విజయనగరం... పార్వతీపురం మన్యం జిల్లాల్లో కోటి సంతకాల ఉద్యమం ఘనంగా సాగింది. ఈ సంతకాల ప్రతులు ఇప్పుడు గ్రామాలూ.. మండలాలు.. పట్టణాలను దాటుకుని జిల్లా కేంద్రాలకు చేరుతున్నాయి. ఇవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని అక్కడి నుంచి గవర్నరుకు అందజేస్తారు. ప్రజా వ్యతిరేకతను గవర్నరుకు వివరించడం ద్వారా ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు.. దమననీతిని దేశవ్యాప్తం చేసేందుకు వైఎస్సార్సీపీ కంకణం కట్టుకుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గాల వారిగా సేకరించిన సంతకాల వివరాలు.. విజయనగరం : 54,889 ఎస్.కోట : 52,000 గజపతినగరం : 60,000 చీపురుపల్లి : 62,500 నెల్లిమర్ల : 67,019 బొబ్బిలి : 52,500 రాజాం : 51,000 పాలకొండ : 63,000 కురుపాం : 55,000 పార్వతీపురం : 64,000 సాలూరు : 35,000 -
వృథాగా.. నాగావళి నీరు
వీరఘట్టం: ప్రతీ ఏటా ఖరీఫ్లో తోటపల్లి ప్రాజెక్టులో కుడి, ఎడమ కాలువ పరిధిలో ఉన్న పాత ఆయకట్టులో సాగునీటి కోసం రైతులు అవస్థలు పడుతునే ఉన్నారు. శివారు ఆయకట్టుకు సకాలంలో నీరందక రైతులు రోడ్డెక్కుతునే ఉన్నారు. ఇంతలో ఖరీఫ్ ముగిసేలోపు శివారు ఆయకట్టుకు నీరందిస్తున్నారు. అయితే ఖరీఫ్ ముగిసిన తర్వాత కూడా కాలువల ద్వారా నిరంతరంగా సాగునీరు పంట పొలాల్లోకి వస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కోత కోసిన వరి పంటను కుప్పలుగా వేయగా నాగావళి నీరు కుప్పల చుట్టూ చేరడంతో శివారు ప్రాంత రైతులు నూర్పులు చేసేందుకు అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్లో సకాలంలో నీరందక ఇబ్బందులు పడిన తమకు ఇప్పుడు పొలంలో ఉన్న పంటను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల నవంబర్ 15తో ఖరీఫ్ సీజన్ ముగిసినా కుడి, ఎడమ కాలువల గుండా నీటి సరఫరా ఆగకుండా రావడంతో ప్రస్తుతం వేసిన అపరాల పంటలకు నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏం జరుగుతోంది.. తోటపల్లి జలాశయం నుంచి పాత ఆయకట్టుకు నీరందించే కుడి, ఎడమ కాలువల రెగ్యులేటర్ల షట్టర్లు మరమ్మతులకు గురయ్యాయి. ఖరీఫ్ సీజన్లో ఎడమ కాలువ ద్వారా 400 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా సీజన్లో నీటిని విడిచిపెట్టారు. ప్రస్తుతం సీజన్ ముగియడంతో నీటిని నిలుపుదల చేసేందుకు షట్టర్లు మొరాయిస్తుండడంతో ఇటీవల షట్టర్లు ఆపరేట్ చేశారు. కొంత వరకు షట్టర్లు కిందకు దిగి ఆగిపోయాయి. దీంతో ప్రస్తుతం ఎడమ కాలువకు 200 క్యూసెక్కుల నీరు, కుడి కాలువకు 60 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ నీటిని కంట్రోల్ చేయలేక జల వనరుల శాఖ అధికారులు చేతులెత్తేసారు. దీంతో గత నెల రోజులుగా కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీరు వృథాగా పోతోంది. అంతేకాకుండా పొలాల్లో వేసిన వరి కుప్పలు చుట్టూ నీరు చేరడంతో నూర్పులు చేసేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. నెల రోజులుగా వృథా గత నెల రోజులుగా తోటపల్లి ప్రాజెక్టు నుంచి 0.66 టీఎంసీల నీరు వృథాగా ప్రవహిస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. పాత ఆయకట్టులోని ఎడమ కాలువ ద్వారా 200 క్యూసెక్కులు నీరు విడిచి పెడుతున్నారు. ఈ లెక్కన గత నెల రోజులుగా ఎడమ కాలువ 0.51 టీఎంసీలు నీరు వృథాగా పోతోంది. అలాగే కుడి కాలువ ద్వారా 60 క్యూసెక్కులు నీటిని విడిచి పెడుతున్నారు. ఈ లెక్కన గత నెల రోజులుగా కుడి కాలువ 0.15 టీఎంసీల నీరు వృథా అవుతోంది. మొత్తం కుడి, ఎడమ కాలువల నుంచి గత నెల రోజులుగా 0.66 టీఎంసీల నీటి వృథా జరుగుతోంది. తోటపల్లి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.5 టీఎంసీలు కాగా ఆదివారం నాటికి నీటి నిల్వ 2.1 టీఎంసీలు ఉంది. నీటి వృథాను అరికట్టకపోతే రానున్న వేసవికి నీటి ఎద్దడి తప్పదని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతంలో ప్రారంభమైన రెండో పంట కుడి, ఎడమ కాలువలకు ఎగువ ప్రాంతంలో (1వ బ్రాంచ్ దిగువ ప్రాంతం) ప్రతీ ఏటా ఖరీఫ్ సీజన్ తొందరగా ప్రారంభమై, దిగువ ప్రాంతం కంటే వేగంగా ముగుస్తోంది. వెంటనే వీరు రెండో పంటగా వరినే వేస్తున్నారు. వీరికి నీరందించేందుకు కొంత మంది అధికారులు ముడుపుల కోసం షట్టర్లు మరమ్మతులకు గురైనట్టు చెబుతున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతీ ఏటా ఖరీఫ్ ముగిసినా షట్టర్లు మూతపడకపోవడం, కొంత కాలం తర్వాత మళ్లీ మూతపడడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తోటపల్లి ప్రాజెక్టు వద్ద పాత రెగ్యులేటర్లు మరమ్మతులకు గురయ్యాయి. నీటి నిలుపుదల చేయడం సాధ్యం కావడం లేదు. ఈ షట్టర్లు మరమ్మతులకు రూ.18 లక్షలతో టెండర్లు పిలిచాం. ఎవరూ ముందుకు రాలేదు. పూర్తి వివరాలతో ఓ నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి, షట్టర్లు మరమ్మతులు చేపట్టి, నీటి వృథాను అడ్డుకుంటాం. – డి.వి.రమణ, ఏఈ,, కుడి, ఎడమ కాలువల పర్యవేక్షణ ఇంజినీరు ప్రస్తుతం తోటపల్లి జలాశయం పరిధిలోని రెగ్యులేటర్లు మొరాయిస్తుండడంతో నీటి సరఫరాను కంట్రోల్ చేయలేకపోతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఈ షట్టర్లు మరమ్మతులకు రూ.18 లక్షలతో మూడు నెలల క్రితం అధికారులు టెండర్లు పిలిచారు. అయితే ఎవరూ టెండర్లుకు ముందుకు రాలేదు. దీంతో షట్టర్లు బాగుపడక లక్షల కూసెక్కుల నీరు వృథాగా పోతోంది. ఖరీఫ్ ముగిసినా..నిర్విరామంగా ప్రవాహం పొలాల్లోకి వస్తున్న నీటితో అపరాల పంటలకు తీవ్ర నష్టం నెల రోజులుగా పాత కుడి, ఎడమ కాలువల్లో వృథాగా ప్రవహిస్తున్న నీరు ఎడమ కాలువ ద్వారా విడిచిపెడుతున్న నీరు 200 క్యూసెక్కులు నెల రోజులుగా ఎడమ కాలువ ద్వారా వృథాగా పోయిన నీరు 0.51 టీఎంసీలు కుడి కాలువ ద్వారా విడిచిపెడుతున్న నీరు 60 క్యూసెక్కులు తోటపల్లి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.5 టీఎంసీలు ఆదివారం నాటికి నిల్వ ఉన్న నీరు 2.1 టీఎంసీలు వేసవికి ముందే తోటపల్లి ప్రాజెక్టులో తగ్గిపోయిన నీటి నిల్వలు -
పతకాలు పట్టిన పైలెట్
శృంగవరపుకోట: వెటరన్ అథ్లెట్గా పతకాలు పట్టేస్తున్న ఆ పైలెట్ మరోమారు సత్తాచాటి పతకాలు పట్టేశాడు. 108వాహనంలో పైలెట్గా విధులు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ మూర్తి బాపట్లలోని ఆర్ట్స్ ఎండ్ సైన్స్ కళాశాల మైదానంలో డిసెంబర్ 13,14 తేదీల్లో నిర్వహించిన 7వ ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2025 పోటీలకు జిల్లాకు ప్రాతినిధ్యం వహించాడు. నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 45+ విభాగంలో పోటీపడిన ఎంఎస్ఎన్.మూర్తి జావెలిన్ త్రోలో స్వర్ణం, డిస్క్త్రోలో స్వర్ణం, హేమర్ త్రోలో రజత పతకాలను సాధించాడు. వరుసగా పతకాల పంట పండిస్తున్న వెటరన్ పైలెట్ను స్థానిక క్రీడాకారులు అభినందించారు. -
సూర్యప్రకాష్కు ఇన్స్పైరింగ్ ఇండియన్స్ అవార్డు
గరుగుబిల్లి: ప్రముఖ కార్డియాలజిస్టు డా. గుల్ల సూర్యప్రకాష్కు ఇన్స్పైరింగ్ ఇండియన్స్ అవార్డును ఢిల్లీలో ఇన్స్పైర్ మనక్ సంస్థ ప్రధానం చేసింది. ఈయన గ్రామీణ నేపథ్యం నుంచి వైద్య రంగంలో అత్యున్నత స్థాయికి చేరి వైద్య రంగంతో పాటు ప్రజల మన్ననలను కూడా అందుకుంటున్నారు. వైద్యాన్ని లాభసాటిగా కాకుండా పేదలకు సేవలు చేస్తూ ప్రజలకు చేరువయ్యారు. నగరాలకే పరిమితమైన కార్డియాక్ట్ పరీక్షలను గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఉచిత వైద్య శిబిరాలను, స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించి అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. వైద్యాన్ని ఒక వృత్తిగా కాకుండా సామాజిక సేవగా భావించి యువ వైద్యులను, వాలంటీర్లను సేవా మార్గంలో నడిపించేలా వైద్యం ఒక మిషన్ అనే భావనను కల్పించారు. ఈయన వైద్య రంగంలో చేస్తున్న సేవలను గుర్తించి ఢిల్లీలో ఇన్స్పైర్ మనక్ సంస్థ ఇన్స్పైరింగ్ అవార్డును ప్రధానం చేసి ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. సూర్యప్రకాష్ మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయనను సర్పంచ్ బి.మహేశ్వరరావుతో పాటు పలువురు అభినందించారు. -
రామతీర్థసాగర్పై నిర్లక్ష్యం
● ఏడాదిన్నరగా ముందుకు సాగని పనులు ● ప్రాజెక్టు పూర్తయితే 24,710 ఎకరాలకు సాగునీరు ● విజయనగరం పట్టణానికి తాగునీరు ● కూటమిసర్కారు తీరుతో ఆందోళనలో రైతులుపూసపాటిరేగ: కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర సమయం పూర్తవుతున్నా ఒక్క పైసా కూడా విదల్చకపోవడంతో రామతీర్థసాగర్ రిజర్వాయర్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. రిజర్వాయర్ ట్యాంకులో అడవిని తలపించినట్లు తుప్పలు పెరిగాయి. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల మండలాల్లోని 24,710 ఎకరాలకు సాగునీరు, విజయనగరం పట్టణానికి తాగునీరు అందుతుంది. గుర్ల మండలం కోటగండ్రేడు వద్ద చంపావతినదిలో బ్యారేజీ నిర్మించి కాలువ ద్వారా రోజుకు 1200 క్యూసెక్కుల నీరు మళ్లించి 2.728 టీఎంసీల నీరు రిజర్వాయర్లో నిల్వ ఉండే విధంగా డిజైన్ చేశారు. రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలు 25.22 కిలోమీటర్లు కాగా, సుమారు 12 కిలో మీటర్ల మేర పనులు మాత్రమే ఇప్పటికి పూర్తయ్యాయి. మిగిలిన 13.22 కిలో మీటర్ల పనులు జరగాల్సి ఉంది. రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ 0.48 టీఎంసీల నీటితో విజయనగరం పట్టణానికి తాగునీరు అందించడానికి ప్రణాళిక సిద్ధమైంది. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత 18 నెలల కాలంగా రిజర్వాయర్ పనులు ముందుకు సాగలేదు. 2006లో రామతీర్థసాగర్ రిజర్వాయర్ను రూ.220 కోట్ల ఖర్చు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. దఫదఫాలు అంచనా వ్యయం పెంచిన ప్రభుత్వాలు 2025 ఫిబ్రవరి నాటికి రూ.808 కోట్లు అంచనా వ్యయంగా ఖరారు చేసింది. ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలకు సుమారు రూ.100 కోట్ల వరకు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. రామతీర్ధసాగర్ ప్రాజెక్టు ద్వారా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవసరమైన నీటితో పాటు జిల్లాలో నూతనంగా నిర్మాణం అవుతున్న పరిశ్రమలకు కావాల్సిన నీరు ప్రాజెక్టు ద్వారానే అందించడానికి సన్నాహాలు చేశారు. ప్రాజెక్టు ప్రారంభమై 19 సంవత్సరాలు అవుతున్నా నేటికీ పనులు పూర్తికాని పరిస్థితి. ఇప్పటివరకు సుమారు 55 శాతం వరకు పనులు మాత్రమే జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2026 నాటికి పనులు పూర్తి చేయడానికి ఒప్పందం జరిగినప్పటికీ పనుల్లో మాత్రం కదలిక లేదు. నెల్లిమర్ల నియోజకవర్గం ప్రజలు సాగునీరు, విజయనగరం పట్టణ ప్రజలు తాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు రామతీర్థసాగర్ రిజర్వాయర్ పనులు సకాలంలో పూర్తిచేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. పనులు సకాలంలో పూర్తి చేయాలి రామతీర్థసాగర్ రిజర్వాయర్ పనులు సకాలంలో పూర్తి చేయాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే 55 శాతం పనులు పూర్తి అయ్యాయి. నేటి పరిస్థితి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు నిలిచిపోయాయి. నియోజకవర్గంలో ప్రజలకు సాగునీరు అందేవిధంగా చర్యలు తీసుకోవాలి. తాళ్లపూడి అప్పలనాయుడు, రైతు, పూసపాటిరేగ ఆర్ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలికోరాడపేట, ఏటీ అగ్రహారం గ్రామాలకు ఆర్ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలి. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించి సుమారు 19 సంవత్సరాలు అవుతున్నా పనులు పూర్తి కాలేదు. సకాలంలో పునరావాసం కల్పించాలి. నిర్వాసితుల కాలనీలకు నిధులు మంజూరు చేసి గృహాలు తక్షణమే నిర్మాణం జరిగే విధంగా చూడాలి. కె.కృష్ణ, కోరాడపేట నిర్వాసితుడు -
కె.సీతారాంపురంలో ఘోర అగ్ని ప్రమాదం
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో కె.సీతారాంపురంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని తహసీల్దార్ జి.హేమంత్కుమార్ జిల్లా కలెక్టర్, ఆర్డీవోల దృష్టికి తీసుకువెళ్లడంతో ఆర్డీవో రామమోహన్రావు శనివారం గ్రామానికి వచ్చి పాపమ్మ మృతదేహాన్ని, బాధితులను పరామర్శించారు. రెవెన్యూ పరంగా ఐదు రోజులకు సరిపోయే ఆహార పదార్ధాలను బాధితులకు అందజేశారు. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో బాధితులకు పునరావాస కేంద్రాన్ని తహసీల్దార్ ఏర్పాటు చేశారని, ఇల్లు కాలిపోయిన బాధితులకు నష్టపరిహారంగా రూ.13వేలు చొప్పున అందించనున్నట్టు చెప్పారు. ఉప తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్ఐ కృష్ణమూర్తి, వీఆర్వోలు గణపతి, రాము, శ్రీనివాసరావు, సుధాకర్, రవి తదితరులు సంఘట జరిగిన నుంచి గ్రామంలోనే ఉండి వివరాలు సేకరించడంతో పాటు, బాధితులకు సేవలు అందించారు. బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు, తెర్లాం ఎస్ఐ సాగర్బాబు సంఘటనా స్థలానికి వచ్చి అగ్ని ప్రమాదంలో మృతి చెందిన పాపమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలోనే మృతురాలికి శవపంచనామ నిర్వహించి పోస్టుమార్టం చేయించారు.తెర్లాం: మండలంలోని కొరటాం గ్రామ పంచాయతీ కె.సీతారాంపురం(చిన గొలుగువలస) గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 12 పూరిళ్లు పూర్తిగా కాలిపోగా, 85ఏళ్ల వృద్ధురాలు సజీవ దహనమైంది. దీనికి సంబంధించి శనివారం స్థానికులు, బాధితులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని యాతవీధి(కల్లుగీత కార్మికులు)లో శుక్రవారం రాత్రి 10.30గంటల సమయంలో కోష్టు లక్ష్మి ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో అదే వరుసలో ఉన్న 12 పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో కోష్టు లక్ష్మి ఇంట్లో ఉంటున్న ఆమె అత్త కోష్టు పాపమ్మ(85)మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైంది. ప్రమాదంలో గ్రామానికి చెందిన ఎద్దుమంటి వెంకటమ్మ, కోష్టు చినవెంకటయ్య, పోలారావు, లక్ష్మి, గురువులు, ఆదమ్మ, పెదవెంకట రమణమ్మ, పెదనర్సయ్య, అప్పడు, నక్క రవణమ్మ, చోడి సింహాచలం, రాములుకు చెందిన ఇళ్లన్నీ పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదంలో సుమారు రూ.6లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని రాజాం అగ్నిమాపక కేంద్రం అధికారులు, రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. సజీవ దహనమైన వృద్ధురాలు పాపమ్మ గ్రామంలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరగడంతో ఇంట్లో ఉన్న కోడలు, పిల్లలు భయంతో బయటకు వెళ్లిపోయారు. మంచంపై ఉన్న కోష్టు పాపమ్మ(85) అనే వృద్ధురాలు బయటకు రాలేకపోవడంతో మంటల్లో చిక్కుకుంది. గ్రామస్తులు స్పందించి ఆమెను మంటల్లో నుంచి బయటకు తీసేటప్పటికే కాలిపోయి మృతి చెందింది. మృతురాలు పాపమ్మకు కోడలు లక్ష్మి, ఆమె కుమారుని పిల్లలు మాత్రమే ఉన్నారు. పాపమ్మ అగ్ని ప్రమాదంలో మృతి చెందడంతో కోడలు, ఆమె మనవరాళ్లు కన్నీరుమున్నీరుగా విలపించారు. కట్టుబట్టలతో... ఈ అగ్ని ప్రమాదంలో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ప్రమాదంలో ఇళ్లల్లో ఉన్న సామగ్రి, బట్టలు, తిండి గింజలు, బంగారం, వెండి, నగదు, ఇండేన్ గ్యాస్ సిలెండర్లు, ధ్రువీకరణ పత్రాలు, రేషన్కార్డులు, పెన్షన్ కార్డులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన కోష్టు గురువులకు చెందిన రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.80వేలు నగదు, 50తులాల వెండి, తిండి గింజలు కాలిపోయాయి. కోష్టు అప్పన్నకు చెందిన అర తులం బంగారు వస్తువులు, సారి సామాన్లకు ఉంచిన రూ.లక్ష నగదు కాలి బూడిదైంది. కోష్టు పెదనర్సయ్యకు చెందిన 10 తులాల వెండి, రూ.20 వేలు నగదు కాలిబూడిదైంది. కోష్టు లక్ష్మికి చెందిన పావు తులం బంగారం, 10తులాల వెండి పట్టీలు, రూ.8వేలు నగదు ఈ ప్రమాదంలో కాలిపోయాయని బాధితులు లబోదిబోమంటూ రోదిస్తున్నారు. బాధితులందరికీ కట్టు బట్టలు మినహా ఒక్క వస్తువు కూడా మిగలకుండా కాలిపోయాయి. ప్రమాద విషయాన్ని రాజాం అగ్ని మాపక కేంద్రానికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంబంధిత అధికారులు, సిబ్బంది శకటంతో వచ్చి మంటలను అదుపు చేశారు.కె.సీతారాంపురం అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి అధికారులతో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీను, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు కాలిపోయిన 12 పూరిళ్లు మంటల్లో సజీవ దహనమైన వృద్ధురాలు కోష్టు పాపమ్మ బాధితులను పరామర్శించిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన బొబ్బిలి ఆర్డీవో, తహసీల్దార్ రూ.6 లక్షల ఆస్తి నష్టం కె.సీతారాంపురం(చినగొలుగువలస) గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద వార్తను తెలుసుకున్న జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడుతో కలిసి శనివారం ఉదయం గ్రామానికి వచ్చి అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. ప్రమాద వివరాలను స్థానిక నాయకులను, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామని, ప్రభుత్వపరంగా అందాల్సిన సహాయం అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారితో పాటు తెర్లాం ఎంపీపీ, జెడ్పీటీసీ ప్రతినిధులు నర్సుపల్లి బాబ్జీరావు, గర్భాపు రామారావు, వైస్ ఎంపీపీలు చేపేన సత్యనారాయణ, అప్పలరాజు, కొరటాం ఎంపీటీసీ సాకేటి నాగమణి, గొలుగువలస సర్పంచ్ ప్రతినిధి గులివిందల శంకరరావు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు. అగ్ని ప్రమాద బాధితులను బుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పరామర్శించారు. -
గడ్డివాములు దగ్ధం
తెర్లాం: మండలంలోని గొలుగువలస గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు గడ్డివాములతో పాటు ధాన్యం పాక్షికంగా కాలిపోయాయి. దీనికి సంబంధించి బాధితులు శనివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాకేటి శ్రీనివాసరావు, అప్పలనాయుడులకు చెందిన గడ్డివాములు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. గడ్డివాముల పక్కనే నూర్పిడి చేసి నిల్వ ఉంచిన ఽగొట్టిపల్లి గణపతికి చెందిన ధాన్యం కూడా పాక్షికంగా మంటలకు కాలిపోయాయి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వెళ్లి మంటలను ఆదుపు చేయడంతో ధాన్యం పూర్తిగా కాలిపోకుండా నివారించగలిగామని రైతులు అంటున్నారు. గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న తహసీల్దార్ హేమంత్కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు గ్రామానికి వెళ్లి కాలిపోయిన గడ్డివాములను, పాక్షికంగా దెబ్బతిన ధాన్యాన్ని పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. ఆయనతో పాటు జెడ్పీటీసీ ప్రతినిధి గర్భాపు రామారావు, గొలుగువలస సర్పంచ్ ప్రతినిధి గులివిందల శంకరరావు, ఎంపీటీసీ సభ్యురాలు సాకేటి నాగమణి, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు ఉన్నారు. నాకౌట్ దశకు సాఫ్ట్బాల్ పోటీలు వీరవాసరం: వీరవాసరం ఎంఆర్కే జడ్పీహెచ్ఎస్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 సాఫ్ట్బాల్ పోటీలు నాకౌట్ దశకు చేరుకున్నాయని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, దాసరి సునీత తెలిపారు. రెండవ రోజు విజయనగరం జిల్లా బాలికల జట్టు గుంటూరు జట్టుపై 02:01 తేడాతో.. విజయనగరం జట్టు కృష్ణా జిల్లా జట్టుపై 04–01 తేడాతో గెలుపొందాయి. బాలికల క్వార్టర్ ఫైనల్లో విజయనగరం జట్టు శ్రీకాకుళం జట్టుపై 12–01 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అలాగే బాలుర ఫలితాల్లో విజయనగరం జట్టు విశాఖ జట్టుపై 03–00 తేడాతో, విజయనగరం జట్టు చిత్తూరు జట్టుపై 05–00 తేడాతో విజయం సాధించాయి. బాలుర క్వార్టర్ ఫైనల్లో విజయనగరం జట్టు ప్రకాశంపై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం ముగింపు కార్యక్రమం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ బాల బాలికల జట్లను ఎంపిక చేయడం జరుగుతుందని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, దాసరి సునీత, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాచింకి శ్రీనివాస్ తెలిపారు. ప్రారంభమైన పారా రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 4వ పారా రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు శనివారం స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ డాక్టర్ డీవీజీ శంకరరావు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏది ఉండదని దివ్యాంగ క్రీడాకారులు నిరూపిస్తున్నారని కొనియాడారు. పారా రాష్ట్ర స్థాయి పోటీలను తొలిసారిగా విజయనగరంలో నిర్వహించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. దివ్యాంగులు ఎవరికి తక్కువ కాదని, జిల్లాలో ప్రతిభ గల దివ్యాంగ క్రీడాకారులకు కొదవ లేదని వారిని గుర్తించి క్రీడల్లో ప్రోత్సహిస్తున్న పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వారికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. అనంతరం విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, మాజీ రోటరీ గవర్నర్ డాక్టర్. ఎం.వెంకటేశ్వరరావు, రాష్ట్ర స్థాయి పోటీల కన్వీనర్ నాలుగెస్సుల రాజు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్, విశాఖపట్నం గౌరవ అధ్యక్షులు డాక్టర్ షీతల్ మదాన్, వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి గణేష్, సారధి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ప్రదీప్, ప్రతాప్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక నైపుణ్యాలపై పరిజ్ఞానం అవసరం
● విశాఖ ఎఫ్ అండ్ ఓఐసీ, ఎస్టీపీఐ శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ బాత ● జేఎన్టీయూ జీవీలో ఘనంగా జెన్ ఏఐ హ్యాకథాన్ ప్రోగ్రామ్ విజయనగరం రూరల్: ప్రపంచ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలపై పరిజ్ఞానం పెంపొందించుకోవాల్సిన అవపరం ఎంతైనా ఉందని విశాఖపట్నానికి చెందిన ఎఫ్ అండ్ ఓఐసీ, ఎస్టీపీఐ శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ బాత అన్నారు. స్థానిక జేఎన్టీయూ – జీవీలో హైదరాబాద్కు చెందిన జెన్ ఏఐ వర్సిటీ, జేఎన్టీయూ జీవీ సంయుక్త ఆధ్వర్యంలో ‘జెన్ ఏఐ హ్యాక్థాన్ ఫరధ నెక్ట్స్ జనరేషన్ జాబ్స్’ సాంకేతిక కార్యక్రమాన్ని శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాస్త్రవేత్త సురేష్ బాత మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్య పూర్తయిన తరువాత విద్యార్థులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని అన్నారు. వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ప్రతీ విద్యార్థి ఇటువంటి హ్యాక్థాన్ కార్యక్రమాలకు హాజరవడంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. తద్వారా కృత్రిమ మేధస్సును (ఏఐ) ఉపయోగించి సమాజానికి మేలు చేస్తూ, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. గౌరవ అతిథిగా హాజరైన జెన్ ఏఐ వర్సిటీ చీఫ్ అకాడమీ అధికారి నరేంద్ర అల్లం మాట్లాడుతూ ఏఐలో నైపుణ్యం ఉన్న వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, మానవ మనుగడలో ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. జేఎన్టీయూ జీవీ రిజిస్ట్రార్ జి.జయసుమ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సుతో భావి తరాల నాయకులు, ఆవిష్కర్తలు, సమస్యలకు పరిష్కారాలు చూపే వారిని రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర అల్లం రచించిన పైథాన్ ప్రోగ్రామింగ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శాస్త్రవేత్త సురేష్ బాతను ఘనంగా సత్కరించారు. ప్రోగ్రామ్ కన్వీనర్, జేఎన్టీయూ జీవీ ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు, సమన్వయకర్తలు డాక్టర్ జిజె.నాగరాజు, ఆర్డిడివి.శివరామ్, ఆచార్యులు కె.బాబు, జి.స్వామినాయుడు, కెసిబి.రావు, డి.రాజ్యలక్ష్మి, కలేషావలి, ఆర్.గురునాధ, కె.అచ్యుతకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి శృంగవరపుకోట : అరుకు ఘాట్ రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృత్యువు పాలయ్యాడు. ఎస్.కోట పట్టణంలో జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న షేక్ ఇర్ఫాన్(19) శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎస్.కోట నుంచి మేక మాంసం తీసుకుని, స్నేహితునితో కలిసి అనంతగిరిలో ఇటీవల ప్రారంభించిన దుకాణానికి రాత్రి 9.30గంటల సమయంలో వెళ్తుండగా కాశీపట్నం టోల్గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారుని ఢీకొట్టాడు. దీంతో ఇర్ఫాన్ బైక్ పై నుంచి ఎగిరి తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రుడిని ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి తెచ్చి అక్కడి నుంచి విశాఖకు తరలిస్తుండగా మార్గం మద్యలోనే ఇర్ఫాన్ మృతి చెందాడు. ఇర్ఫాన్ తండ్రి మదీనా బైక్ మెకానిక్గా పని చేస్తుండగా, తల్లి, తమ్ముడు ఉన్నారు.


