breaking news
Parvathipuram manyam District News
-
ఇదేం కొలువు.. గురూ!
–8లో● గురువులకు అదనపు ‘తరగతులు’ ● పాఠాలు కంటే ఇతర పనులే అధికం ● ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేలా కూటమి చర్యలు మీరొస్తేనే.. పూడికలు తీస్తారా? ఆరోగ్య, అభివృద్ధి ప్రదాతసానుకూలంగా స్పందించండి అర్జీదారులు తెలియజేసిన సమస్యలపై సానుకూలంగా స్పందించాలని ఎస్పీ మాధవ్రెడ్డి అన్నారు. –8లోఅర్జీలను పరిష్కరించాలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని కలెక్టర్ ఎ. శ్యామ్ప్రసాద్ అధికారులకు హితవు పలికారు. జిందాల్ భూములు రైతులవే.. జిందాల్ కంపెనీ కోసం సేకరించిన భూములపై పూర్తి హక్కులు రైతులకే ఉన్నాయని మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. –8లోమంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025డీఈవో కార్యాలయం వద్ద నిరసన తల్లిదండ్రుల సమావేశం కోసం ప్రతి పాఠశాల కూ ఒక ‘సాక్ష్యం’ అధికారిని నియమించడాన్ని పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, హెచ్ఎంఏ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సోమవారం జిల్లా విద్యాశాఖాధికా రి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుల కంటే తక్కువ స్థాయి వారిని విట్నెస్ అధికారిగా నియమించడం ఏమిటని ప్రశ్నించారు. హంగామా వద్దు.. బోధన ముద్దు అంటూ నినాదాలు చేశారు. తక్షణమే విట్నెస్ అధికారి నియామకం రద్దు చేసి, ఉపాధ్యాయుల గౌరవం పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కాగాన విజయ్, భాస్కరరావు, బాలకృష్ణ, పీహెచ్ శ్రీను, రవిప్రసాద్, నారాయణరావు, రామారావు, లక్ష్మునాయుడు, రవి, రామినాయుడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: మొన్నటి వరకూ యోగాంధ్ర.. ఇప్పుడు పేరెంట్స్ మీట్... గురువులకు పాఠాలు కంటే అదనపు ‘తరగతులే’ అధికమవుతున్నాయి. ఈ నెల 10న మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహించాలంటూ ప్రభుత్వం ఆదేశించిన విషయం విదితమే. దీనికి పెద్త ఎత్తున హంగామానే చేస్తున్నారు. కార్యక్రమ నిర్వహణ ఒక ఎత్తయితే.. మరోవైపు హెచ్ఎంలను కాదని, ఇతర శాఖల ఉద్యోగులను ‘సాక్ష్యం’ కింద నియమించడంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నిర్వహించిన పేరెంట్స్ మీట్లోనే ప్రజాప్రతినిధులు.. తల్లిదండ్రులకు రాజకీయ పాఠాలు బోధించారు. ఈసారి కార్యక్రమాన్ని ఇంకే విధంగా ఉపయోగించుకుంటురోనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహణ ఈ నెల పదో తేదీన జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు తదితర అన్ని మేనేజ్మెంట్ విద్యాసంస్థల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నా రు. పార్వతీపురం మన్యం జిల్లాలో 1,787 విద్యాసంస్థల్లో 1,29,730 మంది విద్యార్థులు ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులను పిలిచి విద్యార్థులను ప్రగతిని వివరించడం.. వారికి అక్క డే మధ్యాహ్న భోజనం, క్రీడల నిర్వహణ, సమావేశం, అతిథుల ప్రసంగాలు.. ఇలా ఉదయం 9 గంటల నుంచే వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఇందుకోసం పాఠశాలల్లో 16 రకాల కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్వాన పత్రికలు, వేదికల ఏర్పాట్లు, బహుమతుల ప్రదానం, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించడం.. ఇలా వివిధ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు రావడంతో ఆ బాధ్యతంతా ఉపాధ్యాయులపైనే పడుతోంది. దీనికితోడు కొద్దిరోజులుగా నిత్యం వీసీలు, సమావేశాలంటూ హెచ్ఎంలను, ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు యోగాంధ్ర పేరిట నెల రోజులపాటు హడావిడి చేశారు. విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇందు లో భాగస్వామ్యం చేయడంతో చదువులు అటకెక్కా యి. మధ్యలో ఆదర్శ పాఠశాలల్లో విలీనం.. వ్యతిరే కిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళన.. బడులకు పిల్లలెవరూ రాకపోవడంతో సక్రమంగా పాఠా లు సాగే పరిస్థితి కనిపించలేదు. దీనికితోడు గ్రామాలకు వెళ్లి, తల్లిదండ్రులను నచ్చజెప్పే బాధ్యతను గురువులపైనే మోపారు. అక్కడ గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకతనూ ఉపాధ్యాయులే ఎదుర్కొన్నారు. ఇప్పుడు కొద్దిరోజులుగా తల్లిదండ్రుల సమావేశానికంటూ హంగామా చేస్తున్నారు. ఈ ఏర్పాట్లలో పడి, అసలే విద్యాబోధననే సాగడం లేదని గురువులు ఆందోళన చెందుతున్నారు. యోగాంధ్ర మాదిరి ఈ కార్యక్రమాన్నీ రికార్డు స్థాయిలో గిన్నిస్ బుక్లో నమోదయ్యేలా నిర్వహించాలని ఒత్తిడి చేయడంతో తలలు పట్టుకుంటున్నారు. ‘యాప్’రే... తల్లిదండ్రుల సమావేశం సందర్భంగా విద్యార్థులతో మొక్కలు నాటించడం.. దాన్ని లీఫ్ యాప్లో నమోదు చేయించడం, ప్రతి మూడు నెలలకు ఆ మొక్క ఫొటోలను అప్లోడు చేయించడం, సమావేశం జరిగిన వెంటనే 30 సెకన్ల వీడి యో, మూడు ఫొటోలను యాప్లో తప్పనిసరిగా నమోదు చేయడం.. ఇదంతా ఉపాధ్యాయుల పనే. ప్రభుత్వ పాఠశాలలను బలపర్చే దిశగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు లేవని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నాణ్యమైన విద్యను అందించడం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడం వంటి చర్యలు కాకుండా... యోగాడే, మెగా పేరెంట్స్ మీట్ వంటివేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా పాఠశాల సమయాన్ని మొత్తం బోధనకు కాక, బోధనేతర పనులకే ఉపాధ్యాయులు కేటాయించాల్సి వస్తోంది. దీనికితోడు మిగులు ఉపాధ్యాయులను క్లస్టర్ పాఠశాలలకు కేటాయించకుండా, తిరిగే విధంగా నియమించడం మరింత ప్రభావం చూపుతోంది. ఇతర శాఖల వారు ‘సాక్ష్యమా?’ తల్లిదండ్రుల సమావేశాల పర్యవేక్షణకు ఒక్కో పాఠశాలకూ ఒక ఉద్యోగిని ఇతర శాఖల నుంచి కేటాయించారు. వీరు సాక్షిగా ఉంటారని విద్యాశాఖ ఉత్తర్వు లు జారీ చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఫొటోలు, సమాచారమంతా ప్రధానోపాధ్యాయుడు ఉపయోగిస్తున్న యాప్లో అదే రోజున అప్లోడు చేయాలని విద్యాశాఖ పేర్కొంది. బాహ్య పరిశీలకులు పేరిట ఇతర శాఖ ల ఉద్యోగులను నియమించడం పాఠశాల నిర్వహ ణ వ్యవస్థ, ఉపాధ్యాయుల పనితీరును కించపరచ డమేనని యూటీఎఫ్, పీఆర్టీయూ, ఏపీటీఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ● సొంత పార్టీ కార్యకర్తలకు ఏం చేశారు.. ● ఎమ్మెల్యేను నిలదీసిన 28వ వార్డు టీడీపీ యువత, మహిళలు న్యూస్రీల్ -
సానుకూలంగా స్పందించండి
తక్షణమే చర్యలు తీసుకోవాలి.. పార్వతీపురం రూరల్: అర్జీదారులు తెలియజేసిన సమస్యల్లో వాస్తవం ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో వివిధ సమస్యలపై వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చిన అర్జీలను తానే స్వయంగా పరిశీలించిన అనంతరం సంబంధించిన స్టేషన్ అధికారులకు సిఫార్సు చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కువగా కుటుంబ కలహాలు, భూ, ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీల వసూళ్లు, ప్రేమ పేరుతో మోసాలపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. మొత్తం 16 వినతులు స్వీకరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, తదితరులు పాల్గొన్నారు.విజయనగరం క్రైమ్: అర్జీదారులు తెలియజేసిన సమస్యలపై సానుకూలంగా వ్యవహరించాలని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్మం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తెలియజేసిన సమస్యలను సానుకూలంగా విన్నారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 40 ఫిర్యాదులు స్వీకరించగా.. ఇందులో భూ తగాదాలకు సంబంధించినవి 13.. కుటుంబ కలహాలకు సంబంధించినవి 4.. మోసాలకు పాల్పడినవి 5.. ఇతర అంశాలకు సంబంధించినవి 18 ఫిర్యాదులున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ వకుల్ జిందల్ పీజీఆర్ఎస్లో 40 వినతుల స్వీకరణ -
అనుమతుల్లేని పాఠశాలను రద్దు చేయండి
పార్వతీపురం టౌన్: అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలను రద్దు చేయాలని ఏఐఎస్ఎప్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవికుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జేసీ శోభికకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. మక్కువ మండల కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ అనుమతుల్లేకుండానే ఫ్లెక్సీల్లో ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ సిలబస్లు ఉన్నట్లు పొందుపరిచి తల్లిదండ్రులను మోసం చేస్తోందన్నారు. పాఠశాలలో పుస్తకాలను కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. సదరు పాఠశాలకు తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.హరికృష్ణ, దుర్గాప్రసాద్, నాయకులు వికాస్, చరణ్, తదితరులు పాల్గొన్నారు. -
జిందాల్ భూములు రైతులవే..
శృంగవరపుకోట: జిందాల్ కంపెనీ కోసం సేకరించిన భూములపై పూర్తి హక్కులు రైతులకే ఉన్నాయని మాజీ వ్యవసాయశాఖా మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. జిందాల్ నిర్వాసితులకు సంఘీభావంగా బొడ్డవర గ్రామంలో ఎమ్మెల్సీ రఘురాజు స్వగృహంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. 18 ఏళ్లు గడిచినా పరిశ్రమ స్థాపించకపోతే కంపెనీకి భూములపై ఏ హక్కు ఉంటుందని ప్రశ్నించారు. జిందాల్పై పోరాటం చేస్తున్న రైతులకు ఏపీ రైతు సంఘాలు సమైక్యంగా మద్దతిస్తాయన్నారు. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసి బడా నాయకులు, కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు కొమ్ముకాయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వ మాజీ సలహాదారు మహదేవ్ మాట్లాడుతూ.. రైతుల నుంచి భూములు లాక్కుంటే వారి పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. సేకరించిన భూముల్లో కంపెనీలు పెట్టకపోతే మూడేళ్ల తర్వాత ఆ భూములు రైతులకే చెందుతాయని చెప్పారు. ‘లీడర్’ పత్రిక సంపాదకుడు రమణమూర్తి మాట్లాడుతూ, రైతులు భూములు వదులుకోవాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఢిల్లీలో రైతు ఉద్యమ స్పూర్తితో మనం పని చేయాలన్నారు. నాడు ప్రభుత్వ సమక్షంలో ఒప్పందం జరిగింది కాబట్టి.. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ.. రైతులకు అండగా అన్నివర్గాలు నిలుస్తున్నాయని చెప్పారు. జిల్లా రైతుసంఘ అధ్యక్షుడు చల్లా జగన్ మాట్లాడుతూ... పక్షం రోజులుగా రైతులు రోడ్డున పడి ఆందోళన చేస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పడం బాధాకరమన్నారు. సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాల, వర్గాల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమావేశంలో జిందాల్కు భూములిచ్చిన ఐదు పంచాయతీల రైతులు హాజరయ్యారు. రైతులకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి -
మడ్డువలస నీరు విడుదల
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ ద్వారా ఖరీఫ్ పంటల సేద్యానికి రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సోమవారం సాగునీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఆవరణలో ఉన్న కుడి ప్రధాన కాలువ హెడ్ స్లూయీస్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్విచ్ ఆన్ చేసి సాగునీటిని విడిచిపెట్టారు. తొలి రోజు 100 క్యూసెక్కుల నీటిని వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయకట్టు పరిధిలో ప్రతి ఎకరాకూ సాగునీటిని అందేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బొత్స వాసుదేవరావునాయుడు, పిన్నింటి మోహనరావు, పైల వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. -
‘వసుదైక కుటుంబం’ సేవలు శ్లాఘనీయం
బాడంగి: కర్నాటక రాష్ట్రం బెంగుళూరుకు చెందిన వసుదైక కుటుంబం (యూనివర్సిల్ ఫ్యామిలీ ఫౌండేషన్) స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు శ్లాఘనీయమని వక్తలు కొనియాడారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న అనాథ బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. హెచ్ఎం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ రాజ్యలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు డి.శ్రీనివాసరావు, సర్పంచ్ కండి రమేష్, పీఎంసీ కార్యదర్శి శ్రీనివాసరావు, భవిత టీచర్ ఈశ్వరరావు మాట్లాడుతూ.. సంస్థ వ్యవస్థాపకుడు రెళ్ల శ్రీనివాసరావు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. సంస్థ డైరెక్టర్ సత్యకుమార్ మాట్లాడుతూ.. కేబీఎన్బీఎఫ్సీ సహకారంతో 200 సైకిళ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది ఆఖరులో వంద మంది విద్యార్థులకు వెయ్యి రూపాయలు చొప్పున స్కాలర్షిప్ అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 36 పాఠశాలలకు చెందిన బాలికలు, తల్లిదండ్రులు హాజరయ్యారు. -
రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
● కుమారుడికి తీవ్ర గాయాలుజియ్యమ్మవలస రూరల్: మండలంలోని బీజేపురం గ్రామానికి చెందిన కరకవలస రమణమూర్తి (57) ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తూ కొంతకాలంగా పార్వతీపురంలో నివాసముంటున్నాడు. సోమవారం ఉదయం కుమారుడు దేవీ సంతోష్కుమార్తో కలిసి విశాఖపట్నం మద్దిలపాలెంలో ఉన్న కుమార్తె గాయత్రి ఇంటికి వెళ్తేందుకు ఏపీ 35కేజీ 9236 నంబర్ గల కారులో బయలుదేరారు. సరిగ్గా ఆనందపురం బ్రిడ్జి సమీపంలోకి వచ్చే సరికి ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో రమణమూర్తి అక్కడికక్కడే మృతి చెందగా.. కుమారుడు సంతోష్కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రుడ్ని విశాఖపట్నం ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. ఆనందపురం సీఐ చింత వాసునాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆహ్లాదకర వాతావరణంలో పీటీఎం
పార్వతీపురంటౌన్: జిల్లా వ్యాప్తంగా ఈనెల 10వ తేదీన జరగనున్న మెగా పేరెంట్ టీచర్ మీట్ (పీటీఎం)ను ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ కోరారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రముఖు ల హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం సమీక్షించారు. జిల్లాలోని అన్ని ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పీటీఎం నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణ కోసం ప్రతికళాశాల, పాఠశాలలో 16 రకాల కమిటీలను ఏర్పాటుచేసుకోవాలని, వాటి సారథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వివరించారు. మ్యాపింగ్లో జాగ్రత్తలు పాటించాలి బంగారు కుటుంబం మ్యాపింగ్లో మార్గదర్శకాలు పాటించాలని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ అధికారులకు సూచించారు. బంగారు కుటుంబం – మార్గదర్శి, పీఎం సూర్యఘర్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కొంత మంది మార్గదర్శులు మొత్తం మండలాన్ని దత్తత తీసుకుంటున్నట్టు వెబ్ సైట్లో చూపుతోందని, దీనిని సరిచేయాలన్నారు. జిల్లా, నియోజక వ ర్గం, మండలం, గ్రామ/వార్డు సచివాలయం ఎంపి క చేసుకుని సచివాలయం పరిధిలోని కుటుంబాల ను మాత్రమే ఎంపిక చేయాలని సూచించారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద జిల్లాలో 312 గృహాలకు యూనిట్లు బిగించినట్టు తెలిపారు. యూనిట్ల నమోదు పెరగాలన్నారు. వర్షాకాలంలో పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులపై దృష్టిసారించాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎస్.ఎస్.శోభిక, ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, కేఆర్ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్ది, డీఈఓ బి.రాజ్కుమార్, వివిధ విభాగాల అధికారులు పి. రమాదేవి, ఆర్.తేజేశ్వరరావు, వై.నాగేశ్వరరావు, ఎస్.మన్మథరావు, కె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
స్పందించని అధికారులకు షోకాజ్ నోటీసులు
విజయనగరం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (పీజీఆర్ఎస్) వచ్చే వినతుల పట్ల సక్రమంగా స్పందించని అధికారులకు షోకాజ్ నోటీసులు అందించక తప్పదని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ నిర్వహించి 194 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ.. ప్రతిరోజూ లాగిన్ అయి వినతులను పరిశీలించాలన్నారు. గడువు లోపలే వినతులకు సమాధానాలు పంపాలని ఆదేశించారు. వచ్చిన వినతుల్లో రెవెన్యూ శాఖకు అత్యధికంగా 97 వినతులు అందాయని చెప్పారు. అక్రమ ఆశీలుపై ఫిర్యాదు జామి మండలంలోని అలమండ సంతలో లైసెన్స్ లేకుండా చిరువ్యాపారుల నుంచిన అక్రమంగా ఆశీలు వసూలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని గంట్యాడ మండలం పెదవేమలి సర్పంచ్ వర్రి పాపునాయుడు అధికారులకు వినతి అందజేశారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
భరతనాట్యంలో కొత్తవలస విద్యార్థినుల ప్రతిభ
కొత్తవలస: మండల కేంద్రంలోని శివశక్తి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అకాడమికీ చెందిన జి.తపస్వి, కె.ధన్విక, జి.ఊర్వజ ఈ నెల 5న తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాలో నటరాజ నర్తనయజ్ఞంలో భాగంగా నిర్వహించిన భరతనాట్యం ప్రదర్శనలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రదర్శనలో మూడు వేల మంది విద్యార్థులు 27 నిమిషాల 31 సెకెన్ల పాటు నృత్యం చేసి ప్రపంచ రికార్డు నమోదు చేశారని మాస్టర్ కేఏ రాజు తెలిపారు. విద్యార్థినులు పలువురు అభినందించారు. పీడీఎస్ బియ్యం పట్టివేత జామి: మండలంలోని భీమసింగి వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యంను విజిలెన్స్, సీఎస్డీటీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. వాకచర్ల నరేష్ అనే వ్యక్తి మీసాల నాయుడు ఆటోలో బియ్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. అధికారులు ఆటో సీజ్ చేసి 856 కిలోల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నరేష్, నాయుడులపై కేసు నమోదు చేసి, బియ్యంను భీమసింగి –1 డిపోకు అప్పటించారు. కార్యక్రమంలో సీఎస్డీటీ వీవీఎస్ మూర్తి, విజిలెన్స్ సీఐ బి.సింహాచలం, హెచ్సీలు పురుషోత్తం, కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలను పరిష్కరించాలి
మానవీయ కోణంలో.. ● కలెక్టర్ శ్యామ్ప్రసాద్ఈ చిన్నారి పేరు సవర రిత్విక్. తల్లి సవర జ్యోతి, తండ్రి తిరుపతి. వీరిది సీతంపేట మండలం రేగుల గూడ గ్రామం. చిన్నతనం నుంచి ఎడమ కాలు పనిచేయడం లేదు. ఈ చిన్నారికి సదరం సర్టిఫికెట్ ఉంది. అయితే తిరుపతికి ఉద్యోగం లేకపోయినా ఉందని చెబుతూ ఇంతవరకు చిన్నారికి పింఛన్ మంజూరు చేయలేదు. దీంతో కలెక్టరేట్లో వినతిపత్రం అందజేసేందుకు తల్లిదండ్రులతో చిన్నారి వచ్చింది.పార్వతీపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని కలెక్టర్ ఎ. శ్యామ్ప్రసాద్ అధికారులకు హితవు పలికారు. సమస్యల పరిష్కారంతో అర్జీదారులకు మేలు జరగాలని.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 109 మంది అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీదారులు తెలియజేసిన సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని సిబ్బందిక సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను చిత్తశుద్ధితో 48గంటల్లోగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత, కేఆర్ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ డాక్టర్. పి. ధర్మచంద్రారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు ఎం. సుధారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ● తోటపల్లి దేవాలయ ప్రాంగణంలో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని ఆవాల పకీరునాయుడు, తదితరులు కోరుతూ వినతిపత్రం అందజేశారు. ● గోశాల నిర్మాణానికి సంబంధించి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న భూమిని సబ్ కలెక్టర్ పరిశీలించారని, అనుమతులు మంజూరు చేస్తే గోశాల పనులు ప్రారంభిస్తామని తెలియజేస్తూ తోటపల్లి సర్పంచ్ ఆవాల సింహాచలం, తదితరులు వినతిపత్రం ఇచ్చారు. -
● నేడు వైఎస్సార్ జయంతి ● ఆరోగ్యశ్రీ పథకంతో వైద్యభరోసా ● 108 అంబులెన్సులతో అత్యవసర సేవలు ● 104తో గ్రామీణ ప్రాంత ప్రజల ముంగిటకు వైద్య సేవలు ● కష్టాల్లో ఉన్న రైతులకు రుణ మాఫీ చేసిన రైతుబాంధవుడు ● వివిధ ప్రాజెక్టుల రూపకర్త వైఎస్సార్
విజయనగరం ఫోర్ట్/కొమరాడ: వైఎస్సార్.. ఈ పేరు వింటేనే పేద, మధ్య తరగతి కుటుంబాలతో పాటు ఉద్యోగ వర్గాల మనసు పులకించిపోతుంది. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమపాలన చేరువచేసిన ఘనత వైఎస్సార్దే. ఆయన హయాంలోనే జిల్లాలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడింది. జంఝావతి రబ్బర్ డ్యామ్ సాకారమైంది. విద్య, వైద్య సదు పాయాలు ప్రజలకు చేరువయ్యాయి. ఫీజురీయింబర్స్ పథకంతో పేద కుటుంబాల విద్యార్థుల ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుల కలసాకారమైంది. ఉద్యోగులకు పెద్దమొత్తంలో వేతనపెంపు జరిగింది. ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి సేవలు ప్రజలకు ఆపద్భాంధువులుగా మారాయి. అందుకే.. ఆయన భౌతికంగా దూరమైనా ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారు. ఆయన జయంతి వేడుకలను మంగళవారం జరుపుకునేందుకు ఊరూవాడా సన్నద్ధమవుతోంది. ●జిల్లాకు చెందిన విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసించాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సూచన మేరకు జేఎన్టీయూ కళాశాలను జిల్లాకు మంజూరు చేసిన ఘనత వైఎస్సార్దే. ఇంజినీరింగ్ కళాశాలను వర్సిటీగా స్థాయి పెంచేందుకు కృషిచేసినది వైఎస్సార్ తనయుడు జగన్మోహన్రెడ్డి. ●దశాబ్దాలు గడిచినా ఒడిశా–ఆంధ్రా మధ్య నెలకొన్న వివాదంతో మన్యం రైతులకు సాగునీరు అందని పరిస్థితి. 2006వ సంవత్సరంలో ఆస్ట్రి యా టెక్నాలజీతో జంఝావతి నదిపై రాజ్యలక్ష్మీపురం గ్రామం వద్ద రబ్బర్ డ్యామ్ నిర్మించి సుమారు 12వేల ఎకరాలకు సాగునీటి సదుపాయాన్ని సమకూర్చిన ఘనత వైఎస్సార్దే. ఈ రోజు సాగునీరు అంది పంటలు పండుతున్నాయంటే అది వైఎస్సార్ చలువేనన్న మాట తోటపల్లి, మడ్డువలస ఆయకట్టు రైతులనోట ఇప్పటికీ వినిపిస్తుంది. ●ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లాలోని వేలాదిమంది గిరిజన రైతులకు సాగుపట్టాలు అందజేసి హక్కులు కల్పించారు. ఇల్లులేనివారికి ఇల్లు మంజూరు చేశారు. ●108 వాహనాలు అందుబాటులోకి తెచ్చి అత్యవసర వేళ వైద్యభరోసా కల్పించారు. 104 వాహనాలతో పల్లెప్రజలకు వైద్యసేవలను చేరువచేశారు. ●ఫీజురీయింబర్స్మెంట్ పథకంతో పేద విద్యార్థుల ఉన్నత చదువులకు బాటలు వేసిన మహానుభావుడు వైఎస్సార్. అందుకే.. ఫీజురీయింబర్స్మెంట్ పథకం విద్యార్థుల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోయింది. వైఎస్సార్ కృషి వల్లే... ఒడిశాతో వివాదం వల్ల దశాబ్దాల నుంచి మూలకు చేరిన జంఝావతి రిజర్వాయర్ నుంచి 12వేల ఎకరాలకు సాగునీరు అందుతుందంటే అది వైఎస్సార్ చలువే. 2006లో మహానేత కృషితో జంఝావతి నదిపై దేశంలో ఎక్కడా లేనివిధంగా రబ్బర్ డ్యాం నిర్మితమైంది. ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు జంఝావతి ప్రాజెక్టు అభివృద్ధికి చేసిన సాయం శూన్యం. ఇప్పుడు ఒడిశాలో, ఏపీలో కూటమి పాలనే సాగుతోంది. జంఝావతి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిర్మిస్తే సుమారు 24వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో సమస్యను పరిష్కరిస్తారో లేదో చూడాలి. – నంగిరెడ్డి శరత్బాబు, రాజ్యలక్ష్మీపురం -
విలవిల
సీజనల్ వ్యాధులతో..ఆరు నెలల్లో 1224 మలేరియా, 8 డెంగీ కేసులు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నెల నుంచి జూన్ నెలాఖరు వరకు అధికారికంగా 1224 మలేరియా కేసులు, 8 డెంగీ కేసులు నమోదైనట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఇది కాకుండా గిరిజన గ్రామాల్లో జ్వరాల బారిన పడి రక్త పరీక్షలు చేయించుకోకుండా ఆర్ఎంపీల వద్ద చికిత్స పొందుతున్న వారు వేలల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు గతంలో మాదిరిగానే గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి రక్త పరీక్షలు నిర్వహించి వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం.. నేను పార్వతీపురం ఎస్సీ వసతిగృహంలో ఉంటున్నాను. గత రెండు రోజుల క్రితం జ్వరం వచ్చిందని జిల్లా ఆసుపత్రిలో చేరాను. వైద్యులు రక్తపరీక్షలు నిర్వహించి ఏమీ చెప్పడం లేదు. ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు. ఒకే బెడ్ మీద ఇద్దరం ఉంటున్నాం. మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలి. – సిద్దు, గిరిజన సంక్షేమ వసతిగృహం, పార్వతీపురం పట్టించుకోవడం లేదు.. మా అబ్బాయి అరుణ్కుమార్కు జ్వరం వచ్చిందని జిల్లా ఆసుపత్రికి వచ్చాం. ఆసుపత్రిలో చేరమని వైద్యులు సూచించారు. వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలో చేరినా సరైన సౌకర్యాలు లేవు. ఒక బె బెడ్పైన ఇద్దరిని ఉంచారు. సకాలంలో వైద్యులు వచ్చి చికిత్సను అందించడం లేదు. రక్త పరీక్షలు చేస్తున్నారే తప్ప సరైన ఫలితాలు చెప్పడం లేదు. అధికారులు ఇప్పటికై నా స్పందించాలి. – మెల్లక లక్ష్మి, టేకులోవ గ్రామం నివారణ చర్యలు చేపట్టాం మలేరియా నివారణకు చర్యలు చేపట్టాం. మలేరియా ప్రభావిత గ్రామాలను గుర్తించి తొలి విడత స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని నిర్వహించాం. వసతిగృహాలు, పాఠశాలలు వద్ద తొలి విడత స్ప్రేయింగ్ పూర్తి చేశాం. గ్రామాల్లో పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు చేపడుతున్నాం. 178 చెరువుల్లో గంబూషియా చేపలను విడుదల చేశాం. – వై.మణి, జిల్లా మలేరియా అధికారి, పార్వతీపురం మన్యం పార్వతీపురం టౌన్: మన్యం జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు తోడు ఫ్రైడే – డ్రైడే అమల్లో అధికారుల నిర్లక్ష్యం ప్రజలను వ్యాధుల బారిన పడేస్తోంది. మరోవైపు పరిసరాల పరిశుభ్రతలో నిర్లక్ష్యం వల్ల మురుగు ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి చెంది వ్యాధులకు కారణమవుతున్నాయి. ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో మలేరియా కేసులు వస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఆసుపత్రి జ్వర పీడితులతో కిటకిటలాడుతోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ఫ్రైడే – డ్రైడే ఫొటో పోజులకే పరిమితమవుతుండడంతో సీజనల్ వ్యాధులు మరింత విజృంభిస్తున్నాయి. ఫలితంగా పదుల సంఖ్యలో మలేరియా, టైఫాయిడ్ బాధితులు జిల్లా ఆసుపత్రిలో చేరుతున్నారు. జ్వరంతో బాధపడుతున్న ఇద్దరేసి రోగులకు ఆసుపత్రిలో ఒకే బెడ్ కేటాయిస్తున్న పరిస్థితి ఉందంటే అర్ధం చేసుకోవచ్చు. తూతూ మంత్రంగా.. వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి సారించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మలేరియా నివారణకు సంబంధించి తూతూ మంత్రంగానే అధికారులు వ్యవహరిస్తున్నట్టు కన్పిస్తుంది. ముందస్తుగా చెరువుల్లో సరఫరా చేయాల్సిన గుంబూషియా చేపల విడుదల కేవలం 178 చెరువుల్లోనే చేపట్టారు. మలేరియా నివారణకు గ్రామాల్లో నిర్వహించాల్సిన పారిశుధ్య పనుల సైతం నిర్వహించలేనట్టు తెలుస్తోంది. మలేరియా, విషజ్వరాల నియంత్రణకు అధికారులు తగు చర్యలు చేపట్టకపోవడం కారణంగా మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు విజృంభించి గిరిజనులు ఆస్పత్రిలో చేరుతున్నారు. జిల్లాలో 1915 మలేరియా రిస్క్ గ్రామాలు జిల్లా వ్యాప్తంగా మలేరియా కేసులు ఎక్కువగా ఉన్న 1915 గ్రామాలను మలేరియా రిస్క్ గ్రామాలుగా గుర్తించారు. అధిక సంఖ్యలో మలేరియా కేసులు నమోదవుతున్న 248 గ్రామాలను హైరిస్క్ గ్రామాలుగా గుర్తించారు. గతంలో ఈ గ్రామాల్లో ప్రతీ ఏటా రెండుసార్లు మలేరియా నిర్మూలనకు స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించేవారు. కేవలం 915 గ్రామాల్లో ఐఆర్ఎస్ మొదటి దశ స్ప్రేయింగ్ మాత్రమే పూర్తి చేశారు. ప్రస్తుతం మలేరియా స్ప్రేయింగ్ ఒకేసారి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వసతిగృహాలు, గ్రామాల్లో మలేరియా నివారణకు మందుల పిచికారీ జరగడం లేదని ప్రజలు చెబుతున్నారు. -
అమలు కాని గిరిజన పథకాలు!
సీతంపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా గిరిజనాభివృద్ధికి సంబంధించిన కొన్ని పథకాలకు అతీగతి లేదు. దీంతో గిరిజనాభివృద్ధి అటకెక్కిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐటీడీఏలో కీలక విభాగాలైన వ్యవసాయ, ఉద్యాన శాఖ ద్వారా అమలు చేయాల్సిన పథకాలు చతికలపడ్డాయి. అంతకముందున్న వేగం ఇప్పుడు లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైతే, ప్రస్తుత ప్రభుత్వంలో ఎవ్వరూ పట్టించుకున్న వారు లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో ఫలాలు గిరిజనులకు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజన ఉప ప్రణాళికలో ఐటీడీఏ ద్వారా అన్ని శాఖలలాగే ముఖ్యమైన శాఖలు రెండు ఉన్నాయి. ఒకటి వ్యవసాయ శాఖ దీనితో పాటు అనుబంధ శాఖగా ఉన్న హర్టీకల్చర్. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్, రబీ పనులు సాగుతున్నాయి. జిల్లాలో ఐటీడీఏ సబ్ప్లాన్ పరిధిలో 18 మండలాలు ఉన్నాయి. 15 వేల గిరిజన కుటుంబాలు 12వేల హెక్టార్ల వరకు సాగు చేస్తున్నారు. హార్టీకల్చర్ ఆధ్వర్యంలో జీడి, మామిడి తోటల పెంపకం, పసుపు, పైనాపిల్ వంటి అంతర్ పంటలను సాగు చేస్తుంటారు. సాగుకు రైతులకు కావాల్సిన యంత్ర సామగ్రి గతంలో సమకూర్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతీ సోమవారం ఐటీడీఏ పరిధిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు సైతం అర్జీలు ఇస్తున్నా ఫలితం లేదని పలువురు గిరిజన రైతులు వాపోతున్నారు. మూలుగుతున్న రూ.76 కోట్లు రాష్ట్రంలోని ఏడు ఐటీడీఏల పరిధిలో ఉద్యాన, వ్యవసాయ శాఖల ద్వారా వివిధ పథకాలు అమలు చేయడానికి ప్రత్యేక సహాయక కేంద్ర నిధులు, గిరిజన ఉప ప్రణాళికలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.76 కోట్లు విడుదలయ్యాయి. ఒక్కో ఐటీడీఏకు సుమారు రూ.10 కోట్లు వరకు కేటాయింపులు జరిగాయి. వీటితో రైతులకు ఉపయోగపడే పవర్టిల్లర్లు, మినీ ట్రాక్టర్లు, పెద్ద ట్రాక్టర్లు, టార్పలిన్లు, పవర్వీడర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు వంటివి కొనుగోలు చేసి రైతులకు పంపిణీ చేయాలి. రాష్ట్ర హర్టీకల్చర్, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా పథకాన్ని అమలు చేయాల్సి ఉన్నప్పటకీ ఆ నిధులు ఉన్నాయా, వేరే పథకాలకు మళ్లించారనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరో ఏడాది అయితే ఆ నిధులు రద్దు అయ్యే ప్రమాదముంది. గతంలో ఏ ఐటీడీఏకు ఆ ఐటీడీఏ నిధులు కేటాయింపులు చేసి టెండర్ల ప్రక్రియ ద్వారా పరికరాలు కొనుగోలు చేసి పంపిణీ చేసేవారు. ఇప్పుడు ఏకమొత్తంలో రాాష్ట్ర స్థాయిలో టెండర్ల ప్రక్రియ నిర్వహించడం ద్వారా పంపిణీ చేయడానికి ప్రతిపాదన ఉన్నట్టు తెలిసింది. అయితే ఏడాదిగా ప్రతిపాదనే తప్ప ఫలితం కనిపించే పరిస్థితి లేదు. కొన్నేళ్ల క్రితం రైతులకు ఇచ్చిన యంత్ర పరికరాలు తుప్పు పట్టి మూలన పడ్డాయి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట మా ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైతే ఇంతవరకు రైతులకు పరికరాలు సప్లై చేయకపోవడం అన్యాయం. కొండ ప్రాంతాల్లో వ్యవసాయం చేయడం కష్టసాధ్యమైన పని. యంత్రాలు ఇస్తే కొంతమేర రైతులకు ఉపయోగపడతాయి. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవాలి. గిరిజనులకు రావాల్సిన పథకాలు వారికి ఇవ్వాలి. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే ఎటువంటి పరికరాలు ఇవ్వలేదు ఉద్యాన, వ్యవసాయ శాఖలకు సంబంధించి ఎటువంటి పరికరాలు మాకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. పలుమార్లు వినతులైతే ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి రైతులకు ఉపయోగపడే వివిధ రకాల పరికరాలు పంపిణీ చేయాలి. – ఎస్.పాయికుమార్, మాజీ సర్పంచ్, మండ చతికిలపడిన వ్యవసాయ, ఉద్యాన శాఖల పథకాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిధుల మంజూరు రూ.76 కోట్లు విడుదలైనా.. పరికరాల పంపిణీ లేదు.. ప్రభుత్వం వద్ద మూలుగుతున్న నిధులు కూటమి సర్కార్ వచ్చి ఏడాదైనా అతీగతి లేదు.. -
శివారు భూములకూ సాగునీరు
పార్వతీపురం: సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు ద్వారా శివారు భూములకు సాగునీరు సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ వద్ద సాగు నీటిని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి సమక్షంలో ఆమె నీటిని ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కాలువ వద్ద శాస్త్రాక్తంగా పూజలను నిర్వహించి నదికి హారతులిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. జంఝావతి, కోటియా సమస్యలపై ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పూర్ణపాడు–లాభేసు వంతెన నిర్మాణం పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. పార్వతీపురం సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ప్రాజెక్టుకు సంబంధించి భూ సమస్య పరిష్కారమైందన్నారు. రిజర్వాయర్ పరిసరాల్లో పర్యాటక అభివృద్ధికి చాలా అనుకూలంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉత్తర కోస్తా జల వనరుల శాఖ ఎస్ఈ కేవీఎన్ స్వర్ణకుమార్, ఈఈ హెచ్.మన్మధరావు, డీఈఈ బి.గోవిందరావు, టి.రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి సంధ్యారాణి -
అన్ని కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ : కలెక్టర్
పార్వతీపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను అన్ని కార్యాలయాల్లో నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు స్వీకరించాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్ వివరాలు 1100 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లోనూ అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించి సమాచారం తెలుసుకునేందుకు నేరుగా కాల్ చేయవచ్చని తెలిపారు. నేడు పీజీఆర్ఎస్ సీతంపేట: సీతంపేట ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఐటీడీఏ అఽధికారులు నిర్వహించనున్నారు. గిరిజనులు తమ సమస్యలకు సంబంధించి అర్జీలు సమ ర్పించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. 11న కలెక్టరేట్ వద్ద విద్యార్థుల మహాధర్నా విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంటు, స్కాలర్షిప్పుల బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 11న కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు ఏఐఎస్ఎఫ్ వెల్లడించింది. ఈ మేరకు నగరంలోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో దీనికి సంబంధించి కరపత్రాలను ఆదివారం ఆ సంఘ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎన్.నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు త్రైమాసికాల ఫీజు బకాయి లు రూ.4200 కోట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుదల చేస్తామని యువగళం పాదయాత్రలో ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ నేటికీ ఆ హామీ నెరవేరలేదన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారని ధ్వజమెత్తారు. అలాగే ఎన్నికల సమయంలో జీవో 77 రద్దు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని అదీ నెరవేరలేదన్నారు. ఈ జీవో వల్ల పేద వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య తీరని కల గానే మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను తక్షణ మే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీటి కోసం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 11న జరగనున్న కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు విద్యార్థులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఏస్ఎఫ్ జిల్లా సహాయ కార్యద ర్శి పి.గౌరీశంకర్, పట్టణ నాయకులు నవీన్, సా యి, రాము, రామకృష్ణ, ప్రవీణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే కుట్ర విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే సంస్కరణలను మానుకోవాలని యూటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. స్థానిక జిల్లా పరిషత్ మినిస్టీరియల్ సమావేశ మందిరంలో సంఘం జిల్లా కమిటీ ఆదివారం నిర్వహించిన సమావేశంలో పలువురు నేతలు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలలను బలపర్చే దిశగా కూట మి ప్రభుత్వ నిర్ణయాలు ఉండడం లేదని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని హెచ్చరించారు. నాణ్యమైన విద్యను అందించడంపై కాకుండా యోగా డే, మెగా పేరెంట్స్ మీటింగ్ల నిర్వహణలౖ పె దృష్టి పెట్టడం సరికాదన్నారు. పాఠశాల సమ యం మొత్తాన్ని బోధనకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మిగులు ఉపాధ్యాయులను క్లస్టర్ పాఠశాలలకే కేటాయించకుండా తిరిగే విధంగా నియమించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం సమస్యగా మారుతోందని పేర్కొన్నారు. ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో సుమారు 1500 మంది పొజిషన్ ఐడీలు లేక, క్యాడర్ స్ట్రెంత్ లేనందున జీతాలు పొందలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. వీరికి పొజిషన్ ఐడీలు కేటాయించి జీతాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 9న జాతీయ స్థాయి లో జరిగే సార్వత్రిక సమ్మెకు యూటీఎఫ్ పూర్తి మద్దతు ప్రకటించిందని, యూటీఎఫ్ సభ్యులు భాగస్వా మ్యం అవుతారని వెల్లడించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జేఏవీఆర్కే ఈశ్వరరావు, యూటీఎఫ్ సీనియర్ నాయకురాలు కె.విజయ గౌరి, రాష్ట్ర కమిటీ సభ్యులు జేఆర్పీ పట్నాయక్, రాష్ట్ర కార్యదర్శి పి.కస్తూరి, అకడమిక్ కమిటీ సభ్యుడు డి.రాము, కోశాధికారి సీహెచ్ భాస్కరరావు పాల్గొన్నారు. -
యువకుడి అదృశ్యం
రామభద్రపురం: మండలంలోని కోటవిర్లాం గ్రామానికి చెందిన బప్పడాల ప్రభాకర్(34) అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై వి. ప్రసాదరావు తెలిపారు. ఆ యువకుడు మతిస్థిమితిం లేక ఎటో వెళ్లిపోతుండడం, మళ్లీ తిరిగి ఇంటికి వస్తుండడం చేస్తుంటాడు.గత నెల 25 వ తేదీన మధ్యాహ్నం ఇల్లు విడిచి వెళ్లిపోయాడు.కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు ఫోన్లు చేసి వాకబు చేశారు. ఆదివారం వరకు ఇంటికి రాకపోవడంతో అతడి భార్య కుమారి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభాకర్కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
నేడు మడ్డువలస నీరు విడుదల
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ఖరీఫ్ సీజన్కు సాగునీటిని విడిచిపెట్టనున్నట్లు ఏఈ నితిన్ తెలిపారు. రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ చేతుల మీదుగా స్విచ్ ఆన్ చేసి నీటి విడుదల చేపడతామని వెల్లడించారు. ఆయకట్టు వివరాలు ఇలా.. ఈ ఏడాది ఆయకట్టు పరిధి ఆరు మండలాల్లో 30,077 ఎకరాలకు సాగునీటి సరఫరాను అధికారులు చేపట్టనున్నారు. వంగరలో 996 ఎకరాలు, రేగిడిలో 6777 ఎకరాలు, సంతకవిటిలో 10976 ఎకరాలు, జి.సిగడాంలో 6029 ఎకరాలు, పొందూరులో 99 ఎకరాలు, లావేరులో 5200 ఎకరాల ఆయకట్టు భూములకు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబంధించి సాగునీటి విడుదల చేపట్టనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పరిస్థితి ఇది.. మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది సాగునీటి విడుదల జాప్యమైందని చెప్పకతప్పదు. ఏటా జూన్ నెలలో నీటి విడుదల చేపట్టే పరిస్థితి ఉండేది. అయితే ఈ ఏడాది ప్రాజెక్టులో నీటి విడుదలకు సరిపడ నీరు నిల్వ ఉన్నప్పటికీ నీటిని విడుదల చేయడంలో అధికారుల అలసత్వంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి సామర్థ్యం.. ప్రాజెక్టులో ఆదివారం 64.62 మీటర్ల లెవెల్లో నీటిమట్టం నమోదైంది. ఈ లెక్కన 3.008 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 65 మీటర్లు కాగా ఆ స్థాయికి 3.337 మీటర్లు నిల్వ ఉండాల్సి ఉంది. అయితే ఈ లెక్కన ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యానికి 00.34 మీటర్ల దూరంలో ఉంది. పుష్కలంగా ఆయకట్టుకు సాగునీరు విడుదలకు అవసరమైన నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. చర్యలు చేపట్టిన అధికారులు -
ఇంత పెద్ద చేపా..!
సంతకవిటి: మండలంలోని నారాయణపురం ఆనకట్టలో 15 కేజీల బరువుండే భారీ చేప దొరికింది. తోటపల్లి జలాశయం నుంచి నీటిని దిగువకు విడిచి పెట్టడంతో పాటు వర్షాలు కురుస్తుండండంతో ఆనకట్టలోకి వరద నీరు పోటెత్తింది. దీంతో ఆనకట్టలో మత్స్యకారులు చేపల వేట కొనసాగిస్తున్నారు. శనివారం రాత్రి ఓ మత్స్యకారుడికి భారీ చేప దొరికింది. దీన్ని చూసేందుకు రంగారాయ పురం గ్రామస్తులు పరుగులు తీశారు. చిన్నబగ్గ–గోరపాడు మధ్య ఏనుగులుసీతంపేట: మండలంలోని చిన్నబగ్గ–గోరపాడు కొండల మధ్య ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు. గడిచిన రెండు రోజులుగా గోరపాడు జీడితోటల్లో ఉన్న ఏనుగులు ఆదివారం ఉదయం చిన్నబగ్గ తోటల్లో సంచరిస్తూ కొండశిఖరానికి వెళ్లినట్టు ట్రాకర్లు గుర్తించారు. జీడి, మామిడితోటల కొమ్మలు, అక్కడక్కడ అరటి పంటను నాశనం చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఎఫ్బీవో కె.దాలినాయుడుతో పాటు ట్రాకర్లు ఏనుగుల గమనాన్ని గుర్తించి తగు సూచనలిస్తున్నారు. వీణ కచేరీతో బాలమురళికి నీరాజనంవిజయనగరం టౌన్: ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విజయనగరంలోని ఆర్యసోమయాజుల కాశీపతిరావు స్మారక భవనంలో పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 95వ జయంతి ఉత్సవంలో విశాఖకు చెందిన డాక్టర్ నిష్టల కృష్ణవేణి చేసిన వీణకచేరీ ఆహూతులను ఆకట్టుకుంది. ప్రముఖ మృదంగ విద్వాంసుడు, సంస్థ కార్యదర్శి డాక్టర్ మండపాక రవి మృదంగంపై సహకారం అందించి కచేరీని రక్తి కట్టించారు. అసోసియేషన్ అధ్యక్ష్యుడు ధవళ సర్వేశ్వరరావు, సభ్యులు బాలమురళి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించి, వారి జీవిత విశేషాలను వివరించారు. కార్యక్రమంలో దూసి శివరాం శర్మ, టి.మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భగవతి చిన్నారులకు నంది, నాట్యమయూరి అవార్డులువిజయనగరం టౌన్: విజయనగరంలోని భగవతి నృత్యకళామందిర్ చిన్నారులు నాట్య మయూరి అవార్డులు అందుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం నృత్యాలయ నాట్యకళా వెల్పేర్ అసోసియేషన్, సిరి ఆర్ట్స్ అకాడమీల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణా బోనాల సంబరాలు, గురుపూజోత్సవంలో అద్భుతమైన ప్రదర్శన చేసి ఆహూతుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా నంది, నాట్యమయూరి అవార్డులను కై వసం చేసుకున్నట్లు అకాడమీ డైరెక్టర్ వడ్లమాని రమణకుమారి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు అభిమానులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలి
విజయనగరం గంటస్తంభం: డ్రైవర్ల మెడకు ఉరితాడు బిగించి, రవాణా రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టే మోటార్ వాహన చట్టం 2021,భారత న్యాయ సంహిత చట్టం 106(1,2)లను రద్దు చేయాలి. 10కోట్ల మంది రవాణా రంగ కార్మికులకు కేరళ తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు ప్రభుత్వమే యాప్ను నడపాలి. లైసెన్స్, రెన్యువల్, రిజిస్ట్రేషన్, వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఆర్టీవో కార్యాలయం ద్వారా జరగాలి. అచ్యుతాపురంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్లను రద్దు చేయాలి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. వాహన కొనుగోలుకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. వాహన మిత్ర రూ.15000 తక్షణమే చెల్లించాలని కోరుతూ జూలై 9న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో రవాణా రంగ, ఓనర్లు, డ్రైవర్లు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కోరింది. ఈ మేరకు ఆదివారం జిల్లా పరిషత్ మినిస్టీరియల్ భవన్లోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎ.జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రవాణా రంగంపై పెద్ద ఎత్తున దాడి చేస్తోందన్నారు. ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి సంస్థలను అనుమతించడంతో స్వయం ఉపాధిగా బతుకుతున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్లకు బేరాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, సొంత వాహనాలను అమ్ముకోవడం లేదా ప్రైవేట్ సంస్థల యాప్లకు బందీలుగా మారిపోతున్నారని వాటిని రద్దుచేసి కేరళ తరహాలో ప్రభుత్వం యాప్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రవాణా రంగాన్ని ఆదాయ వనరుగా కాకుండా సర్వీస్ రంగంగా గుర్తించి ప్రోత్సహించాలని, వారిౖపై వివిధ రూపాల్లో వేస్తున్న భారాలను తక్షణమే రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర రహదారుల్లో కూడా టోల్ గేట్లు ఏర్పాటు చేసి వాహనుదారులపై భారాలు వేస్తున్నారని మండిపడ్డారు. రవాణా రంగ డ్రైవర్లకు ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ పిలుపు -
గూడ్స్ కింద పడి వృద్ధుడి ఆత్మహత్య
కొత్తవలస: అనారోగ్య సమస్యల కారణంగా మనస్తాపం చెంది కొత్తవలస రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్కు ఎదురుగా వెళ్లి ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి గవర్నమెంట్ రైల్వే ఎస్సై బాలాజీరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా వేపగుంట సమీపంలోని సింహపురి కాలనీకి చెందిన చొప్ప సీతారామయ్య (78) తన కొడుకు వద్ద ఉంటున్నాడు. ఆయన భార్య నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు వెంటాడడం మొదలయ్యాయి. ఆదివారం ఉదయం సింహపురి కాలనీ నుంచి బస్సులో కొత్తవసల వరకు వచ్చి జంక్షన్ నుంచి నేరుగా రైల్వే ట్రాక్పై నడుచుకుంటూ వెళ్లి ఎదురుగా వస్తున్న గూడ్స్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారం మేరకు జీఆర్పీ ఎస్సై సిబ్బందితో వచ్చి ఘటనా స్థలంలో పరిశీలించారు. మృతుడి చేతుల్లో సూసైడ్ నోట్ ఉండడాన్ని గమనించారు. అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని, ఆరోగ్య సమస్యలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని విజయనగరం తరలించారు. -
రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలి
విజయనగరం క్రైమ్: రోడ్డు ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ వకుల్ జిందల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. తద్వారా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుంచి రక్షణ పొంది, సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని హితవు పలికారు. ఏటా చాలామంది వాహనదారులు రహదారి ప్రమాదాల్లో హెల్మెట్ ధరించని కారణంతో మృతి చెందుతున్నారని ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడైందని చెప్పారు. వాహనాలు నడిపినపుడు ప్రతి వాహనదారు విధిగా నాణ్యత కలిగిన హెల్మెట్ ధరిస్తే, ప్రమాదానికి గురైనప్పటికీ స్వల్ప గాయాలతో ప్రాణాలను రక్షించుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్క వాహనదారు హెల్మెట్ ధరించే విధంగా చేయాలనే సంకల్పంతో జిల్లా పోలీసుశాఖ పని చేస్తుందని చెప్పారు. ప్రజలందరికీ హెల్మెట్ ధారణ పట్ల అవగాహన కల్పించి, వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై ఎంవీ నిబంధనలు అతిక్రమించినట్లు పరిగణించి ఈచలానాలను విధించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రమాదాల నివారణలో పోలీసుశాఖకు సహకరించాలని ప్రజలకు ఎస్పీ వకల్ జిందల్ విజ్ఞప్తి చేశారు. సిబ్బందికి ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలు -
23 నుంచి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
విజయనగరం: జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23,24,25 తేదీల్లో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలతో పాటు, రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్ చైర్మన్, అధ్యక్షుడు కొండపల్లి అప్పలనాయుడు, ద్వారపురెడ్డి జగదీష్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోటీల నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న పోటీలు అండర్–11,13,15, 17, 19 వయస్సుల విభాగాల్లో జరుగుతాయన్నారు. ఇందులో భాగంగా ఈనెల 23న అండర్–19 విభాగంలో బాల, బాలికలకు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో, 24న అండర్–15,17 వయస్సుల విభాగాల్లో, 25న అండర్–11, 13 వయస్సుల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆయా విభాగాల్లో జరిగే పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు అదే రోజు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఏ కేటగిరీలోనైనా 6 జట్ల కన్నా తక్కువ జట్లు వస్తే చాంపియన్షిప్ నిర్వహించకుండా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక ప్రక్రియ మాత్రమే నిర్వహిస్తామని చెప్పారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9133773485, 79891 99534, 7981111705 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి నున్న సురేష్, ఎంకేబీ శ్రీనివాసరావు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు నిర్వహణ -
టీచర్లపై బోధనేతర పనుల భారం తగ్గించాలి
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయులపై అధికంగా మోపుతున్న బోధనేతర పనుల భారం తగ్గించాలని ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక సంఘం కార్యాలయం ఆవరణలో ఆదివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో పలు డిమాండ్లను సాధించాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బోధనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలంటే బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలని కోరారు. ఈ నెల 10న నిర్వహించనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కోసం లీవ్ యాప్లో ‘విట్నెస్’ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయాలని అధికారుల ఆదేశాలున్నాయని వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. యూనిఫారాలు, షూస్, బెల్టులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం వంటి అంశాలపై కోడ్ నంబర్లతో అప్లోడ్ చేయాలన్న సూచనలు ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని వాపోయారు. యాప్ల భారాన్ని తగ్గిస్తామని చెబుతూ అన్ని పనులు ఒకే యాప్లో పెట్టడం వల్ల ప్రతి క్షణం ఉపాధ్యాయులకు పని భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక భారం లేని అంశాలైన ఆప్షన్ హాలిడేల విషయంలో ఉపాధ్యాయుల అభిప్రాయాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్న విధానం ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుతోందన్నారు. సంఘం అధ్యక్షుడు షేక్ బుఖారీ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్తేరు శ్రీనివాస్, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్ మోమన్రావు, రాష్ట్ర అకడమిక్ సెల్ సభ్యుడు జేసీరాజు, జిల్లా గౌరవ అధ్యక్షుడు బంకురు జోగినాయుడు, జిల్లా సబ్కమిటీ సభ్యులు, వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ -
వివాహేతర సంబంధంతోనే ఆత్మహత్య?
● మృతుడి భార్య ఫిర్యాదు ● కేసు నమోదు చేసిన పోలీసులుకొత్తవలస: వివాహేతర సంబందం ఒక వ్యక్తి ఆత్మహత్యకు కారణమైంది. మండలంలోని కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధి ఉమాదేవికాలనీకి చెందిన గంగవరపు గౌరీసత్యవరప్రసాద్ (38) ఆదివారం అప్పన్నదొరపాలెం పంచాయతీ తమ్మన్నమెరక సమీపంలో గల మామిడితోటలో చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన భర్త మరణానికి తమ్మన్నమెరక గ్రామానికి చెందిన ఒక మహిళ కారణమంటూ మృతుడి భార్య ఎర్నెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ షణ్ముఖరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వివాహేతర సంబంధం ఉన్న మహిళ వేధింపులు గంట్యాడ మండలం లక్కిడాం గ్రామం నుంచి సుమారు 20 సంవత్సరాల క్రితం ఉమాదేవికాలనీకి కుటుంబంతో వలస వచ్చి ఇటుకల బట్టీ వ్యాపారం చేసుకుంటూ గౌరీ సత్యవరప్రసాద్ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి ఽభార్య ఎర్నెమ్మ, కుమార్తె తోరణశ్రీ, కుమారుడు శ్యామ్సుందర్ ఉన్నారు. అదే ఇటుకల బట్టీలో పనిచేసే తమ్మన్నమెరక గ్రామానికి చెందిన మహిళతో సాన్నిహిత్యం గౌరీవరప్రసాద్కు ఉంది. దీంతో తన సంగతి తేల్ఛాలంటూ సదరు మహిళ తరచూ తన భర్తను బెదిరిస్తూ ఉండేదని మృతుడి భార్య ఎర్నెమ్మ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ తెలిపారు. ఆదివారం కూడా సదరు మహిళ తన భర్తకు ఫోన్ చేసి నిలదీయడంతో చెంతనే గల మామిడి తోటలో ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. గౌరీ సత్యవరప్రాద్ ఉరివేసుకున్న విషయాన్ని సదరు మహిళ మృతుడి తమ్ముడికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో మృతుడి భార్యతో పాలు కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి చూసేసరికి అప్పటికే మృతిచెంది విగత జీవిగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ఉరివేసుకుని మృతి చెందాడా? లేదంటే ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడిదీశారా ? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో విజయనరగం నుంచి ప్రత్యేక క్లూస్టీమ్, డాగ్స్కాడ్ వచ్చి ఘటనా స్థలంలో పరిశీలించారు. మృతుడి భార్య ఎర్నెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చుసి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్సీకి మృతదేహాన్ని తరలించారు. -
జిల్లాలో 42,817 బంగారు కుటుంబాలు
పార్వతీపురం టౌన్: జిల్లాలో 42,817 బంగారు కుటుంబాలు ఉన్నాయని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. ఈ కుటుంబాలను మార్గదర్శితో సమన్వయం చేయాలని ఆయనన్నారు. ప్రభుత్వం బంగారు కుటుంబాలను ఆన్లైన్ ద్వారా ఎంపిక చేసిందన్నారు. శనివారం సంబంధిత అధికారులతో కలెక్టర్ వర్క్షాప్ నిర్వహించి, కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి నిబద్ధతతో పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నియోజకవర్గ స్థాయి వర్క్ షాప్లు జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు కుటుంబం, మార్గదర్శి మధ్య అంతరాన్ని పూడ్చడానికి అధికారిక బృందం స్ఫూర్తితో పని చేయాలన్నారు. యోగాంధ్రలో జిల్లా బృందం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. జిల్లాను ఒక నమూనాగా ఉంచడానికి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమంలో అదే స్ఫూర్తితో పని చేయాలని ఆయన కోరారు. మనస్సుతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇళ్లను మార్గదర్శితో మ్యాప్ చేయాలని ఆయనన్నారు. పనిని పర్యవేక్షించడానికి సిబ్బందిలో ఒకరిని కన్వీనర్గా నియమించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా ఉంటారని ఆయన అన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక మాట్లాడుతూ పీ4 వెబ్సైట్లో మార్గదర్శిగా నమోదు చేసుకోవడానికి ముందుకు రావాలని కోరారు. సమావేశంలో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పాలకొండ సబ్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్.భాస్కరరరావు, ఆర్బీఎస్కె ప్రాజెక్టు అధికారి డా. టి.జగన్మోహన్రావు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.సుధారాణి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి కొండలరావు, ఈపీడీసీఎల్ కార్య నిర్వాహక ఇంజినీర్ కె.వేణుగోపాల్నాయుడు, గ్రామీణ నీటి సరఫరా విభాగం డిప్యూటీ డీఈ రెడ్డి పాల్గొన్నారు. -
పీడీఎస్ బియ్యం పట్టివేత
పాలకొండ రూరల్: అక్రమంగా తరలిపోతున్న పీడీఎస్ బియ్యం విజిలెన్స్ అధికారులు మెరుపుదాడితో పట్టుకున్నారు. ఆ శాఖ ఎస్ఐ రామారావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. వీరఘట్టం నుంచి ఓ వ్యాన్లో ఒడిశాకు ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యం అక్రమంగా తరలిపోతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. దీంతో అధికారులు ఆ రహదారిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. పాలకొండ కార్గిల్ పాయింట్ వద్ద గల మార్కెట్ కమిటీకి చెందిన చెక్పోస్టు వద్ద మాటు వేసిన విజిలెన్స్ అధికారులు వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టుబడ్డాయని తెలిపారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.లక్ష 7వేల వరకూ ఉంటుందని అధికారులు లెక్క కట్టారు. పట్టుబడిన వాహనం సీజ్ చేయటంతో పాటు అందులో తరలించే యత్నం చేసిన బియ్యం బస్తాలను స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పజెప్పామని ఎస్ఐ తెలిపారు. ఆ శాఖ సిబ్బంది లక్ష్మీనారాయణ, కన్నబాబు, శ్రీనుబాబు తదితరులున్నారు. 7న గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గురుకుల బాలురు, బాలికల పాఠశాలలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల మిగులు సీట్ల భర్తీకి సంబంధించి కౌన్సెలింగ్ను ఈ నెల 7వ తేదీన నెల్లిమర్ల గురుకుల పాఠశాలలో చేపట్టనున్నామని ఉమ్మడి జిల్లా సమన్వయకర్త ఎస్.రూపావతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం ఎస్సీ, ఎస్టీ కేటగిరిలకు చెందిన విద్యార్థులకే ఈ కౌన్సెలింగ్ అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు బాలికలకు, మధ్యాహ్నం 1 గంటకు బాలురు కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు ఆధార్కార్డు జెరాక్స్ కాపీ, కుల ధ్రువీకరణ పత్రం, పదవ తరగతి విద్యార్థులైతే మార్కుల జాబితా తదితర పత్రాలతో హాజరు కావాలని ఆదేశించారు. పోలీసులకు చిక్కిన గంజాయి నిందితుడు విజయనగరం క్రైమ్: నగరంలోని అయ్యన్నపేట వద్ద గల వాకింగ్ ట్రాక్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి గంజాయితో వన్టౌన్ పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. వాకింగ్ ట్రాక్ వద్ద ఓ వ్యక్తి అనుమానితంగా సంచరిస్తుండడాన్ని ఎస్ఐ లక్ష్మీప్రసన్నకుమార్ శనివారం గుర్తించారు. ఆయన వద్ద ఒక కత్తి, తపంచా ఉండడాన్ని చూసి ప్రశ్నించడంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఎస్ఐ పట్టుకొని సోదా చేయగా మూడు కేజీల గంజాయి ప్యాకెట్లు అతని వద్ద లభ్యమయ్యాయి. ఈ వ్యక్తిని విజయనగరం ఎల్బీజీ నగర్కు చెందిన మజ్జి కృష్ణవర్దన్గా గుర్తించారు. రాయఘడ నుంచి గంజాయి కొనుగోలు చేసి విజయనగరంలో విక్రయించేందుకు సిద్ధపడ్డాడు. పోలీసులకు పట్టుబడ్డాడు. వన్టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మీప్రసన్నకుమార్ నిందితుడిని విచారించారు. కత్తి, తపంచా, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించినట్టు సీఐ తెలిపారు. ఇతనిపై గతంలో రౌడీషీట్ ఉందని సీఐ చెప్పారు. -
లోక్ అదాలత్లో 116 కేసుల రాజీ
పార్వతీపురం టౌన్: జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 116 కేసులను ఇరువురు అంగీకారంతో రాజీ చేసినట్టు రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ మంచి మార్గదర్శిగా ఉపయోగపడుతుందన్నారు. సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద పరిహార కేసులు, ఇతర వివాదాలను పరిష్కరించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. కక్షిదారులు రాజీ చేసుకోవడం వల్ల ఖర్చులు తగ్గుతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. కోర్టుకు ఎటువంటి ఫీజు చెల్లించకుండా కేసులు రాజీ చేసుకోవచ్చని సూచించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కారమైతే కోర్టుకు మొదట చెల్లించిన రుసుమును కక్షిదారులకు కోర్టు తిరిగి చెల్లిస్తుందన్నారు. లోక్ అదాలత్లో బాధితులకు న్యాయం త్వరగా లభించే అవకాశం ఉంటుందన్నారు. లోక్ అదాలత్లో సుమారు రూ.18,24,808ల విలువైన కేసులలో రాజీ చేసినట్టు వివరించారు. అడిషనల్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జె.సౌమ్యా జాస్పిన్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.చంద్రకుమార్, బార్ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు, అధిక సంఖ్యలో కక్షిదారులు పాల్గొన్నారు. -
ఏం కష్టం వచ్చిందో..
రాజాం సిటీ : ‘తాతయ్య, అమ్మ, నాన్న అందరూ నన్ను క్షమించండి. నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను.. అందువల్ల ఇలా చేస్తున్నాను.. ఇందులో నా తప్పు లేదు.. ఎవరినీ మోసం చేయలేదు.. నేను చేసిన తప్పుకు ఇదే పరిష్కారం.. నన్ను క్షమించండి.. పవన్ జాగ్రత్తగా ఉండు.. ఎవరి దగ్గరా మోసపోవద్దు.. తాతయ్య, అమ్మ, నాన్న, అక్కను జాగ్రత్తగా చూసుకో.. నేను లేని లోటు నువ్వు తీర్చు.. అందర్ని జాగ్రత్తగా చూసుకో...’ ఇది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునే ముందు తన కుటుంబీకులకు రాసిన సూసైడ్ నోట్. ఏం కష్టం వచ్చిందో తెలియదుకానీ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు సరైన కారణాలు తెలియరానప్పట్టకీ మృతుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజాం పట్టణ ఎస్ఐ వై.రవికిరణ్తో పాటు స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. వంగర మండలం కొప్పర గ్రామానికి చెందిన బూరి శ్రీనివాసరావు(29) రాజాం పట్టణంలో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేస్తున్నాడు. ఈయన బీటెక్ పూర్తి చేసి, ఉన్నత ఉద్యోగాలు నిమిత్తం ప్రయత్నిస్తున్నాడు. ఇంటికి తను భారంగా ఉండకూడదని భావించి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. 15 రోజుల క్రితం రాజాం పట్టణంలో తెలగవీధిలోని నివాసముంటున్న తన స్నేహితులు వద్దకు వచ్చి ఇక్కడే రూమ్లో ఉంటున్నాడు. ఇదే సమయంలో వ్యక్తిగత పనుల నిమిత్తం రెండు రోజుల క్రితం అతని స్నేహితులు బయటకు వెళ్లారు. ఇంతలో శ్రీనివాసరావు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో అతని తండ్రి నారాయణరావుకు అనుమానం వచ్చింది. తన కుమారుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అతని స్నేహితులకు నారాయణరావు ఫోన్ చేయగా, వారు వచ్చి చూడగా గదిలో ఫ్యాన్కు శ్రీనివాసరావు ఉరి వేసుకుని ఉన్నాడు. ఈ విషయాన్ని వెంటనే అతని తల్లిదండ్రులతో పాటు పోలీసులకు స్నేహితులు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు తండ్రి నారాయణరావుతో పాటు బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారుడి మృతిని జీర్ణించుకోలేక నారాయణరావు సొమ్మసిల్లిపడిపోయాడు. తన కుమారుడు కొద్ది నెలల నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడని, ఈమేరకు గ్రామంలో నాటు వైద్యం కూడా చేయించుకుంటున్నాడని పోలీసులకు తెలిపాడు. రాజాం వచ్చి ఉంటున్న తన కుమారుడు ఫోన్ ఉదయం స్విచ్ ఆఫ్ చేసి రావడంతో అనుమానం వచ్చి అతని స్నేహితులకు సమాచారం ఇచ్చామని, ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని వాపోయాడు. శ్రీనివాసరావు వద్ద లభించిన సూసైడ్ నోట్ను పరిశీలించి, అందులోని విషయాలు ఆదారంగా ఆరా తీస్తున్నారు. ఏదైనా మోసానికి గురై శ్రీనివాసరావు మృతి చెంది ఉండవచ్చునని బావిస్తున్నారు. తండ్రి నారాయణరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రవికిరణ్ తెలిపారు. శ్రీనివాసరావు ఉరి వేసుకుని ఒక రోజు దాటి ఉండవచ్చుననే అనుమానం వ్యక్తం చేశారు. రాజాం ఏరియా ఆసుపత్రిలో శవ పంచనామా అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. కొప్పరలో విషాదం వంగర : మండలంలో కొప్పర గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన బూరి శ్రీనివాసరావు రాజాం పట్టణంలో తన స్నేహితులు గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం తెలియగానే గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. శ్రీనివాసరావు మృతదేహం గ్రామానికి చేరుకోగానే తల్లిదండ్రులు మజ్జిగౌరి, నారాయణరావులతో పాటు సోదరుడు పవన్కళ్యాణ్లు కన్నీరుమున్నీరుగా రోదించారు. రాజాంలో కొప్పర యువకుడి ఆత్మహత్య కడుపు నొప్పి భరించలేకనే ఈ ఘోరం అంటూ తండ్రి ఫిర్యాదు మృతుడి వద్ద సూసైడ్ నోట్ లభ్యం -
వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి ప్రతిభ
నెల్లిమర్ల రూరల్/విజయనగరం: కజఖస్తాన్లో ఈ నెల 4 నుంచి జరుగుతున్న ఏషియన్ జూనియర్, యూత్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి సత్తా చాటింది. విజయనగరం మండలంలోని కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవాని శనివారం నిర్వహించిన పోటీల్లో పాల్గొని ఒకేసారి మూడు బంగారు పతకాలను కై వసం చేసుకుంది. స్నాచ్లో 69 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 90 కేజీలు..మొత్తంగా 159 కేజీల బరువును లేపి ట్రిపుల్ గోల్డ్ చాంపియన్గా నిలిచింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణికు రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోషియేషన్ అధ్యక్షురాలు నీలం శెట్టి లక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు బెల్లాన లక్ష్మి, కోచ్ చల్లా రాము, గ్రామస్తులు అభినందించారు. ట్రిపుల్ గోల్డ్ చాంపియన్గా నిలిచిన భవాని -
కచ్చితమైన సమాచారాన్ని అందజేయాలి : ఎస్పీ
పార్వతీపురం రూరల్: పోలీసు శాఖలో క్రియాశీలకమైన స్పెషల్ బ్రాంచ్ విభాగంలో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందితో జి ఎస్పీ మాధవ్ రెడ్డి శనివారం తన కార్యాలయంలో సమావేశమై వారు క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన విధులపై దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఎస్బీ నిర్వహించాల్సిన విధులపై కొన్ని మార్గదర్శకాలు చేశారని డీజీపీ ఆలోచనల మేరకు జిల్లాలో వాటిని పరిగణనలోకి తీసుకొని జిల్లా ఎస్బీ సిబ్బంది విధులు నిర్వర్తించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) పోలీసుల పనితీరు చాలా క్రియాశీలకమన్నారు. కచ్చితమైన సమాచారాన్ని సేకరించేందుకు సోర్సు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు వారితో మమేకమై అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. సేకరించిన విషయాలను రికార్డు రూపంలో భద్రపరుచుకోవాలని, వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. కార్యకలాపాలపై మరింత దృష్టి గ్రామ, వార్డు స్థాయిలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, రాజకీయ వివాదాలు అతిథుల రాకపోకల సమాచారం వారియొక్క ప్రతీ కార్యక్రమం, ధర్నాలు, కక్షలు, భూ తగాదాలు, మత సంబంధమైన గ్రూపుల యొక్క సమాచారం ముందస్తుగా సేకరించాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముందుగా గుర్తించి ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించాలన్నారు. ప్రజలతో నిత్యం మమేకమవుతూ పక్షపాతి ధోరణి లేకుండా సక్రమంగా విధులు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో ఎస్బీ సీఐ రంగనాధం, ఎస్బీ ఎక్స్ సీఐ రమేష్, ఎస్ఐలు దినకర్, రాజు, శంకరరావు, ఇతర పోలీసు అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
పెంపకం.. కావాలి అప్రమత్తం..!
రాజాం సిటీ/వేపాడ/గుమ్మలక్ష్మీపురం: మానవ జీవనంలో జంతువులు సైతం భాగమయ్యాయి. మనిషి తన అవసరాల కోసం కుక్కలు, పిల్లులు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కుందేళ్లు ఇలా రకరకాల జంతువులను పెంచుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు సరదాకు, ఇంటి కాపలాకు పరిమితమైన కుక్కల పెంపకం ప్రస్తుతం స్టేటస్ సింబల్గా మారిపోయింది. ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. నేడు ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా ... పెరుగుతున్న ప్రేమ.. జంతు ప్రేమ రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రేమనైతే పంచుతున్నారుగాని వాటితో కలిగే వ్యాధుల గురించి పట్టించుకోవడంలేదు. వైద్య నిపుణుల పరిశోధన ప్రకారం జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు 190 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. ఇలా సోకే వ్యాధులను జునోసిస్ అంటారు. కుక్క కాటు ద్వారా రేబిస్, పందుల ద్వారా మెదడువాపు, పశువులు, గొర్రెల నుంచి టీబీ వ్యాధులు సంక్రమిస్తాయని, వీటన్నింటిలో రేబిస్ వ్యాధి ప్రమాదకరమైనదిగా వైద్యులు పేర్కొంటున్నారు. జునోసిస్ ఎలా వచ్చిందంటే... పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల్లో రేబిస్ అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధి. పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తికి లూయీ పాశ్చర్ అనే శాస్త్రవేత్త 1885 జూలై 6న మొట్టమొదటిసారిగా యాంటీ రేబిస్ టీకాను ఇచ్చారు. ఇది విజయవంతమై అత్యంత ప్రాచుర్యం పొందింది. రేబిస్ టీకాను జూలై 6న కనిపెట్టడంతో ఆ రోజున ప్రపంచ జునోటిక్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. పిల్లల విషయంలో జాగ్రత్త... పిల్లల విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చిన్నారులు బయట తిరగకుండా చూసుకోవాలి. తమ పెంపుడు కుక్కలు బయట తిరిగే సమయంలో ఇతరులుపై దాడి చేయకుండా యజమానులు జాగ్రత్త పడాలి. వ్యాక్సినేషన్ వేయించాలి పెంపుడు జంతువులకు వేసే వ్యాక్సినేషన్పై చాలా మందికి అవగాహన ఉండదు. కొంతమంది ఖర్చుతో కూడినదని పట్టించుకోరు. పెట్స్కు మామూలుగా కరిచే గుణం ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించాలి. మనిషి, జంతువుకు ఉండే కాంటాక్ట్లో అది కరవడం, గీరడం వంటివి సాధారణంగా జరుగుతుంటాయి. దాని వల్ల ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. కుక్కలు, పిల్లలు పెంచుతున్న వారు కూడా వ్యాక్సినేషన్ అవసరాన్ని గుర్తించాలి. పెంపుడు జంతువులపై పెరుగుతున్న ఆసక్తి జంతు సంక్రమిత వ్యాధులు వచ్చే అవకాశం పెంపకంపై అవగాహన తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు నేడు ప్రపంచ జునోసిస్ డే వైద్యుల సలహాలు తప్పనిసరి జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే రోగాలను జునాటిక్ డిసీజస్ అంటారు. ఎబోలా, బర్డ్ ఫ్లూ, రేబిస్, మెదడు వాపు వంటివి జునోటిక్ వ్యాధులే. ఈ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే రెగ్యులర్గా వెటర్నరీ వైద్యుల సలహాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో కుక్కలు పెంపకం చేపట్టిన వారు చర్మ సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సరైన వ్యాక్సిన్ వేయకుండా పెంపుడు జంతువులు, కుక్కలతో సన్నిహితంగా ఉండొద్దు. – డాక్టర్ బి.జయప్రకాష్, ఏడీ, పశుసంవర్ధకశాఖ, రాజాం -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ78 శ్రీ166 శ్రీ176కానిస్టేబుల్ కుటుంబానికి ‘చేయూత’ విజయనగరం క్రైమ్ : జిల్లా పోలీసు శాఖలో ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహించి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సత్తిబాబు కుటుంబానికి పోలీసు శాఖ చేయూత కింద రూ.1,47,300ల విలువైన చెక్ను ఎస్పీ వకుల్ జిందల్ శనివారం అందజేశారు. ఈ మేరకు తన చాంబర్లో సత్తిబాబు భార్య బి.రాజేశ్వరికి దీన్ని అందజేశారు. సిబ్బంది ఈ మొత్తాన్ని సేకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో పని చేస్తూ ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మృతి చెందిన సిబ్బంది కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఆఫీసు సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మద్యం దుకాణంలో చోరీ సంతకవిటి: మండల కేంద్రంలోని జీపీ వైన్స్లో మద్యం దుకాణంలో చోరీ జరిగింది. పోలీసులు, దుకాణ యాజమాన్యం తెలిపిన వివరాలు.. మద్యం దుకాణం వెనుకన ఉన్న గోడకు శుక్రవారం రాత్రి కన్నం చేసి దొంగలు లోపలికి ప్రవేశించారు. తొలిత సీసీ కెమెరాను తప్పించి హర్డ్ డిస్క్తో పాటు రూ.14వేల నగదు, రూ.24 వేల విలువ చేసే మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం దుకాణం తెరిచిన సిబ్బంది చోరీ జరిగినట్టు గుర్తించి యాజమాన్యంకు తెలిపారు. దీంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ వాసుదేవరావు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ తెలిపారు. లారీ బోల్తా పడి ట్రాఫిక్ జామ్ బొబ్బిలి రూరల్: మండలంలోని పారాది గ్రామ సమీపంలో బొగ్గు లారీ శనివారం బోల్తా పడడంతో విశాఖ, రాయగడ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 8 గంటల సమయంలో బొబ్బిలి నుంచి విశాఖ వైపు వెళుతున్న బొగ్గు లారీ అదుపుతప్పి పారాది గ్రామ సమీపంలో బోల్తా పడింది. అప్పుడే విశాఖ నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ లారీ దానిని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న బురదలో చిక్కుకు పోయింది. దీంతో విశాఖ, రాయగడ వైపు వెళ్లే రహదారిలో అటు రామభద్రపురం, ఇటు గ్రోత్ సెంటర్ వరకు దాదాపు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా రాకపోకలు ఆగిపోయాయి. విషయం తెలుసుకున్న సీఐ సతీష్కుమార్ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు యధావిధిగా రాకపోకలు కొనసాగాయి. ఆటో బోల్తా పడి పలువురికి గాయాలు గుమ్మలక్ష్మీపురం: ఒడిశా ప్రాంతం పిప్పలభద్ర ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా పడిన ప్రమాదంలో మండలంలోని కొందుకుప్ప, మూలిగూడ గ్రామాలకు చెందిన పలువురు గాయాల పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని రాయగడలో జరుగుతున్న రథయాత్రకు పై గ్రామాలకు చెందిన సుమారు 17 మంది ఆటోలో వెళ్తుండగా మార్గ మధ్యలోని పిప్పలభద్ర ఘాట్ రోడ్డు వద్ద ఆటో అదుపు తప్పి సైడ్ వాల్కు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొందుకుప్పకు చెందిన పత్తిక సుమంతి, పత్తిక మన, జయంతితో పాటు మూలిగూడకు చెందిన పత్తిక శ్రీరాం, జీలకర్ర సరితలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా వైద్య నిమిత్తం క్షతగాత్రులను కురుపాం ఆసుపత్రికి తరలించారు. -
సాలూరులో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం రేపు
సాలూరు: సాలూరు పట్టణం మెంటాడ వీధి కోదండరామ కల్యాణ మండపంలో సోమ వారం మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి విస్తృతస్థాయి సమావేశం జరగనుందని, పార్టీ శ్రేణులంతా తరలిరావాలని పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించే సమావేశానికి శాసనమండలి విక్షనేత, మాజీమంత్రి బొత్స సత్యనారాయణ, పార్లమెంట్ పరిశీలకులు బి.ప్రసాద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఉమ్మడి విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితర పెద్దలు పాల్గొంటారన్నారు. సమావేశానికి ప్రజాప్రతినిధులు, పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు, వివిద విభాగాల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరుకావాలని కోరారు. మలేరియా నియంత్రణకు పటిష్ట చర్యలు పార్వతీపురంటౌన్: జిల్లాలో మలేరియా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు తెలిపారు. కొత్తవలస చెరువులో శనివారం గంబూషియా చేపలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జిల్లాలో ముందుగా గుర్తించిన 178 చెరువుల్లో గంబూషియా చేపలు విడుదలచేశామన్నారు. ఇవి చెరువులో ఉన్న దోమల లార్వాలను తినేయడం వల్ల మలేరియా, డెంగీకారక దోమల వ్యాప్తి తగ్గుతుందన్నారు. 915 గ్రామాల్లో ఐఆర్ఎస్ మొదటి దశ స్ప్రేయింగ్ పూర్తి చేశామని, ప్రస్తుతం రెండో విడత జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్సీడీ–ఆర్డీఎస్కే జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు, ఏఎంఓ సూర్యనారాయణ, కన్సల్టెంట్ రామచంద్ర, సూపర్వైజర్ జయగౌడ్, వైద్య సిబ్బంది సుజాత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. 10న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం పార్వతీపురంటౌన్: జిల్లాలో అన్ని పాఠశాలల్లోనూ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలను ఈనెల 10న నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతి నిధులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, పదో తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, పూర్వవిద్యార్థులతో కలిసి సమావేశాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు తదితర అన్ని మేనేజ్మెంట్ విద్యాసంస్థలు నిర్వహించాలని కోరారు. తల్లిదండ్రులకు క్రీడల నిర్వహణతో పాటు భోజన సదుపాయం కల్పించాలన్నారు. సమావేశంలో జేసీ ఎస్.ఎస్.శోభిక, పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పీఓలు అశుతోష్ శ్రీవాస్తవ, సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వై.నాగేశ్వరరావు, డీఆర్వో కె.హేమలత, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. డిపాజిట్ల స్వాహాపై విచారణ ● గైర్హాజరైన గెడ్డలుప్పి పోస్టాఫీస్ బీపీఎం బొమ్మిరాణి సీతానగరం: మండలంలోని గెడ్డలుప్పి పోస్టాఫీస్లో కొత్తవలస, గెడ్డలుప్పి గ్రామస్తులు వివిధ రూపాల్లో దాచుకున్న డబ్బులు స్వాహా చేశారన్న ఫిర్యాదు మేరకు పోస్టల్ అధికారులు శ్రీనివాసరావు, గుల్ల అచ్చుతరావు శనివారం విచారణ జరిపారు. పోస్టాఫీస్ రికార్డులను పరిశీలించారు. మెచ్యూరిటీ అయిన వివిధ రకాల బాండ్లు, ఆర్డీల వివరాలపై ఆరా తీశారు. పోస్టల్ ఖాతాదారులతో మాట్లాడారు. బాండ్లు మెచ్యూరిటీ అయినా డబ్బులు ఇవ్వడంలేదన్న విషయాన్ని తెలుసుకున్నారు. విచారణకు వస్తామని అధికారులు సమాచారం ఇచ్చినా బీపీఎం బొమ్మిరాణి గైర్జాజరుకావడంపై ఖాతా దారులు మండిపడ్డారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, రికార్డులు పరిశీలించిన అనంతరం పోస్టల్ ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి ఖాతాదారులకు న్యాయం చేస్తామని విచారణ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అల్లుతిరుపతిరావు పాల్గొన్నారు. -
త్రికరణశుద్ధితో ఇచ్చిన హామీలు
–8లోపెంపకం.. కావాలి అప్రమత్తం..! మానవ జీవనంలో జంతువులు సైతం భాగమయ్యాయి. వీటి పెంపకంలో అప్రమత్తతే ప్రధానమన్నారు. ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025● ప్రజల ఆశతో చంద్రబాబు రాజకీయం ● బాబు వంద అబద్ధాలు చెబితే.. లోకేశ్ రెండొందలు చెబుతారు ● మీ అరుపులకు, బెదిరింపులకు అదరం ● ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి నయవంచన పాలనను వివరిస్తాం ● శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ● వైఎస్సార్సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేతలు సాక్షి, పార్వతీపురం మన్యం: ‘ప్రజలకు ఉన్న ఆశతోనే చంద్రబాబు రాజకీయం చేస్తారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రధానంగా రెండు వర్గాలను లక్ష్యంగా చేసుకుంటారు. మహిళలను, రైతులను దగా చేస్తారు. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో రెండు పక్షాలు ఉంటాయి. ఒకటి అధికార పక్షం.. రెండు ప్రతి పక్షం. ప్రజా సమస్యలపై వారి గొంతుకగా నిలవడం.. ఇచ్చిన హామీల అమలుకు నిలదీయడం ప్రతిపక్ష బాధ్యత. త్రికరణ శుద్ధిగా చెబుతున్నామంటూ ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?’ అని శాసనమండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ‘హామీలు అమలు చేయాలని అడిగితే అరుస్తారు.. బెదిరిస్తారు.. కేసులు పెడతారు. తాట తీస్తాం.. తోక కత్తిరిస్తాం.. మక్కలు ఇరగ్గొడతాం.. నాలుక మందం అంటారు. ఇది మంచి సంప్రదాయం కాదని తెలిపారు. వైఎస్సార్సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం పార్వతీపురంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు అధ్యక్షతన శనివారం జరిగింది. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బొత్స మాట్లాడుతూ.. 40 శాతం ఓట్లు ఉన్న తమకు ప్రజల తరఫున అడిగే హక్కు ఉందన్నారు. 13 నెలలైనా మేనిఫెస్టోలో ఉన్న హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని చెప్పారు. ఇస్తున్నవీ అరకొరగానే అని తెలిపారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి ఎన్నికలప్పుడు పార్వతీపురం నుంచి తిరుపతికి ఉచిత బస్సు ప్రయాణమన్నారని.. తర్వాత శాసనమండలిలో మాట మార్చి, జిల్లాకే పరిమతమంటున్నారని ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలో ఉన్న ఉద్యోగాలు సైతం తీసేసి, నిరుద్యోగ భృతి లేకుండా చేశారని విమర్శించారు. గత ప్రభుత్వంలో హామీల అమలు కోసం మేనిఫెస్టోను జేబులో పెట్టుకుని తిరిగితే.. కుటమి నాయకులు అమలు చేయలేక బీరువాలో పెట్టారనిబాబు ష్యూరిటీ.. వంద శాతం మోసం గ్యారంటీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతోంది. బాబు ష్యూరిటీ ఇస్తే.. వంద శాతం మోసం గ్యారంటీ అని మరోసారి నిరూపితమైంది. మోసం, వెన్నుపోటుతోనే గత ఎన్నికల్లో గెలిచారు. గెలిచాక కేవలం కుర్చీకే పరిమితమయ్యారు. ఓడినా ప్రజల గుండెల్లో ఉండే వ్యక్తి జగన్. కూటమి ఏడాది పాలనలో అరాచకాలు పెరిగిపోయాయి. ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా తట్టుకోలేక రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నారు. మూడు పార్టీలు కలిసివచ్చి 52 శాతం ఓట్లు సాధిస్తే.. వైఎస్సార్సీపీ ఒక్కటిగానే వచ్చి 40 శాతం ఓట్లు దక్కించుకుంది. అదీ ప్రజాబలం అంటే.. – గుమ్మ తనూజారాణి, ఎంపీ, అరకు పార్లమెంట్ నియోజకవర్గం స్కీం ఆంధ్రాను.. స్కాం ఆంధ్రాగా మార్చారు... అధికారంలోకి వచ్చాక కూటమి ప్రజలను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం.. అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. అవినీతికి అడ్డాగా మారింది. అసమర్థ పాలనకు నిదర్శనమైంది. జగన్ స్కీం ఆంధ్రా చేస్తే.. వీరు స్కాం ఆంధ్రాగా మార్చారు. వైఎస్సార్సీపీ విద్యాంధ్ర చేస్తే.. కూటమి మద్యాంధ్రగా మార్చింది. జగనన్న గోరుముద్ద పెడితే.. వీరు బొద్దింకల ముద్ద పెడుతున్నారు. అమరావతి అని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఇసుక, మద్యం, మైనింగ్.. ఇలా అన్నింటా అక్రమాలే. చివరికి మధ్యాహ్న భోజనాన్నీ స్కాం చేశారు. వెన్నుపోటు, నయవంచన, అరాచకాలు బాబు పాలనలో పక్కా గ్యారంటీ. ఈ ప్రభుత్వంలో ఒక్క పేదవాడూ రిచ్ కాలేడు గానీ.. ఎమ్మెల్యేలు మాత్రం రిచ్ అవుతున్నారు. కురుపాం ఎమ్మెల్యే రిచ్ అయ్యే పనిలోనే ఉన్నారు. జగన్ను, వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టలేరు. మీరు భూస్థాపితం చేయడం కాదు.. మీరు అధికారంలో ఉన్న పీఠాల కింద భూకంపం తీసుకొస్తాం. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉపముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చంద్రబాబు కొడుకు లోకేశ్ తీరు ఉందన్నారు. తండ్రి వంద అబద్ధాలు ఆడితే.. కుమారుడు 200 ఆడుతారని విమర్శించారు. అన్నదాత సుభీభవ కార్యక్రమాన్ని ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఏడాది పూర్తయినా కేంద్రం ఇచ్చిన సాయం తప్ప రాష్ట్ర హామీ ఏమైందన్నారు. సభ సాక్షిగా మే నెలలో ఇస్తామని చెప్పిన మంత్రి లోకేశ్.. ఏ ఏడాది మే నెలలో ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థులపై ఆడపిల్లలు, చిన్న పిల్లలు అని చూడకుండా లాఠీ ఝులిపించడం ధర్మం కాదన్నారు. ‘జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామీణ స్థాయిలో రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో మోసాలను వివరిస్తాం.. హామీలు అమలు చేసే వరకూ ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. బెదిరింపులకు ఎవరూ బెదిరిపోరు.. అని బొత్స అన్నారు. న్యూస్రీల్చంద్రబాబు చేసిందంతా మోసమే.. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ తీసుకొచ్చిన సంస్కరణల వల్లే ప్రభుత్వ విద్య బలోపేతమైంది. వరుసగా మూడు సంవత్సరాలు మన్యం జిల్లా పదో తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఏం సాధించింది? గత ఎన్నికల్లో మోసంతో గెలిచింది. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజాబలం ఏమిటో చూపించాలి. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ.. రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంశాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి వివరించాలి. చంద్రబాబు చేసేది, చెప్పేది అంతా మోసమే. – మజ్జి శ్రీనివాసరావు,ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ -
ఈసారి జగన్ 2.0
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. కూటమి వారు బెదిరించి కొంతమందిని తమవైపునకు తిప్పుకుంటున్నారు. ఇదంతా తాత్కాలికమే. వారంతా తిరిగి వైఎస్సార్సీపీకి చేరుకుంటారు. ప్రజల్లో మార్పు మొదలైంది. కూటమి అరాచకాలను, ఇచ్చిన హామీలను అమలు చేయక చేసిన మోసాలను ఇంటింటా వివరిద్దాం. శ్రేణులంతా సమాయత్తం కావాలి. గతంలో ప్రజల కోసం.. వారి తరఫున వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పని చేసింది. ఈసారి కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని అధినేత మాట ఇచ్చారు. జగన్ 2.0లో వారికే మొదటి ప్రాధాన్యం. వైఎస్ఆర్ సీపీని దేశంలోనే అతి బలమైన పార్టీగా చూస్తాం. – శత్రుచర్ల పరీక్షిత్ రాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ● -
● తరలిస్తారా.. చావమంటారా..?
నివాసాల పక్కనే నిర్వహిస్తున్న కోళ్లఫారాల నుంచి వస్తున్న దుర్వాసనను భరించలేకపోతున్నాం.. వ్యాధుల బారిన పడుతున్నాం.. పిల్లలకు తిండి సైతం సహించడం లేదు.. తక్షణమే ఇక్కడ నుంచి కోళ్ల ఫారాలను తరలించి జీవించే హక్కు కల్పిస్తారా, లేదంటే సామూహికంగా చావమంటారా అంటూ బిరసాడవలస గ్రామానికి చెందిన పిల్లలు, పెద్దలంతా కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం ఆందోళన చేశారు. ఇప్పటికే 31 రోజులుగా నిరసన తెలుపుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సుపరిపాలనలో తొలిఅడుగు అంటూ మెంటాడలో పర్యటించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి సైతం గిరిజనుల ఆందోళన, ఆవేదనను పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై నిరసన తెలిపారు. తక్షణమే కోళ్లఫారాలు తరలించాలని, లేదంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని గిరిజన నాయకులు సుకరయ్య, స్థానిక నాయకుడు రెడ్డి రాజప్పలనాయుడు హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న గిరిజనుల దీక్షశిబిరాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోయిన మంత్రి తీరును తప్పుబట్టారు. – మెంటాడ -
మంత్రి ఇలాకాలో ఎరువు కరువు
ఈ చిత్రం చూశారా... వర్షంలో గొడుగులు వేసుకుని ఉన్నది రైతన్నలు. పత్తి, మొక్కజొన్న, వరి నారు మడులకు వేసేందుకు అవసరమైన ఎరువుకోసం సాలూరు మండలం శివరాంపురం పీఏసీఎస్ వద్ద శనివారం ఉదయం 6 గంటల నుంచి క్యూ కట్టారు. సుమారు 16 గ్రామాల రైతులు పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు. వచ్చిన వారిలో సగంమందికి కూడా ఎరువు అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. అదునుకు ఎరువు అందించకపోతే ఎలా అంటూ అధికారులను నిలదీశారు. కూటమి ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోశారు. మంత్రి సంధ్యారాణి రైతన్నల ఎరువు కష్టాలను పట్టించుకోవడంలేదంటా ఆగ్రహం వ్యక్తంచేశారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రైతులకు ఎంత ఎరువు కావాలంటే అంతమేర ఆర్బీకేల ద్వారా సరఫరా అయ్యేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటూ వాపోయారు. – సాలూరు రూరల్ -
నిల్వ బియ్యం వల్లే పురుగులు
సాక్షి, పార్వతీపురం మన్యం: పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్లే పెంకి పురుగులు కనిపించాయని జిల్లా పౌరసరఫరాల సంస్థ ప్రబంధకులు కె.శ్రీనివాసరావు తెలిపారు. ‘మెనూ.. పురుగులతోనే తిను’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. సంస్థ క్వాలిటీ సిబ్బందితో ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేయించారు. జూన్ అలాట్మెంట్కు సంబంధించి బియ్యం నిల్వలే ఇప్పటి వరకు ఉన్నాయని గుర్తించారు. వాటిలో పెంకి పురుగులు, లార్వాను గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు బలవర్థకమైన ఆహారాన్ని అందించే ఉద్దేశంతో ఫోర్టిఫైడ్ సన్నబియ్యాన్ని గత జూన్ నెల నుంచి ప్రారంభించామని తెలిపారు. జిల్లాలోని మొత్తం 1,662 పాఠశాలలకు ఎనిమిది ఎంఎల్ఎస్ కేంద్రాల నుంచి 11,944 బస్తాల బియ్యాన్ని గత నెల 12వ తేదీలోపే పంపిణీ చేశామని వివరించారు. జిల్లాకు గుంటూరు నుంచి ఈ ఏడాది మే 14న 897.209 టన్నుల బియ్యం వచ్చినట్లు తెలిపారు. వాటిని ఫ్యుమిగేషన్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేసి, పాఠశాలలకు తరలించామని పేర్కొన్నారు. 35 రోజుల కాలపరిమితి ముగియడం వల్ల పురుగు పట్టిందని తెలిపారు. వాటి స్థానంలో కొత్తగా బియ్యం బస్తాలు ఆయా పాఠశాలలకు పంపిస్తున్నామని వివరించారు. బియ్యం నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాలలకు, వసతిగృహాలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వాటి స్థానంలో పాఠశాలలకు కొత్త బస్తాల సరఫరా -
ఓటేసిన వారినే కాటేసే గుణం చంద్రబాబుది: కన్నబాబు
వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురుసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఓటేసిన వారినే కాటేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబేనని అన్నారు. వైఎస్సార్సీపీ అమలు చేసిన పథకాలను, పక్క రాష్ట్రాల్లోని పథకాలను కాపీ కొట్టి.. అంతకంటే ఎక్కువిస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. లక్ష అబద్ధాలు ఆడైనా ముఖ్యమంత్రి అవ్వాలన్నది చంద్రబాబు భావనని.. అందులో సఫలీకృతులయ్యారని విమర్శించారు. ‘50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చేతులెత్తేసిన ఘనత చంద్రబాబుది. ఎన్నికల సమయంలో హామీలు అమలు చేస్తామని బాండ్లు ఇచ్చారు. వాటి సంగతేమిటీ? రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో, కూటమి మోసాలపై ప్రజలను చైతన్య పరచాలి. ఏడాది పాలనలో ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయలేదో వివరించాలి’ అని శ్రేణులకు పిలుపునిచ్చారు. మోసం చేయడంలో చంద్రబాబును గిన్నిస్బుక్ రికార్డుల్లో ఎక్కించవచ్చని విమర్శించారు. ‘మీరు కనిపిస్తే తొలి అడుగు కాదు.. తొలిసారిగా మిమ్మల్ని నిలదీస్తారు ప్రజలు. మా ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమన్ని నేరుగా ఇంటికి వెళ్లి తెలియజేశామ’ని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మామిడి శ్రీకాంత్, జమ్మాన ప్రసన్నకుమార్, ఎస్.జయమణి, పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ బి.గౌరీశ్వరి, జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మీరు చెప్పిన త్రికరణ శుద్ధి ఏమైంది?
గతంలో మేమిచ్చిన పథకాలను సగర్వంగా ప్రజలకు చెప్పాం. ఇప్పుడు కూటమి నేతలు చేస్తున్నది దగా, మోసమే. త్రికరణశుద్ధితో అని హామీల అమలుకు సంతకాలు పెట్టారు. సనాతనవాదిగా చెప్పుకొనే పవన్.. ఎందుకు పాటించడం లేదు. చంద్రబాబును ఎందుకు అడగడం లేదు. ఏడాదిలో ఏం చేశారు? పాఠశాల భవనాలను అర్ధాంతరంగా వదిలేశారు. సాలూరు నియోజకవర్గం మెట్టవలస గ్రామంలో గ్రామస్తులు సొంత నిధులతో రేకులషెడ్డు వేసుకున్నారు. మక్కువలోనే అంతే. సంక్షేమ హాస్టళ్లలో సంక్షోభం పుట్టిస్తున్నారు. కూటమి నేతలు చేస్తున్నది రాక్షస సాలన. రెడ్బుక్ రాజ్యాంగం. వారి బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదు. ఎవరికై నా సహనం కొంత వరకే ఉంటుంది. ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. – పీడిక రాజన్నదొర, మాజీ ఉప ముఖ్యమంత్రి ● -
ధర్నా, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి
విజయనగరం క్రైమ్: ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించేందుకు పోలీసుశాఖ నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, ఇతర నిరసన కార్యక్రమాలను నిర్వహించేందుకు తప్పనిసరిగా పోలీసుశాఖ నుంచి ముందస్తుగా అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. పోలీసు శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేనిదే ఎలాంటి నిరసనలైనా చేపట్టడం చట్టవిరుద్ధమన్నారు. ఇందుకోసం ముందుగా సంబంధిత డీఎస్పీ ఆఫీస్లో దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాలని సూచించారు. పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, సమావేశాలు నిర్వహించడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. శాంతియుతంగా వ్యవహరించాలని, విజ్ఞతతో వ్యవహరించి ముందస్తు అనుమతులతోనే ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. అలా కాకుండా, చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తూ ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేపడితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు. -
పోలీసు వెల్ఫేర్ డే నిర్వహణ
విజయనగరం క్రైమ్: పోలీస్ శాఖ ప్రతి శుక్రవారాన్ని సిబ్బంది సంక్షేమానికి కేటాయించింది. ఈ మేరకు వారంలో ఒక్క రోజు ‘పోలీసు వెల్ఫేర్ డే’ నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఎస్పీ వకుల్ జిందల్ తన చాంబర్లో శుక్రవారం వెల్ఫేర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది సమస్యలపై విజ్ఙాపనలు స్వీకరించారు. సిబ్బంది పనితనం, విధుల్లో ఎదుర్కొంటున్న, ఎదురవుతున్న సమస్యలపై ప్రత్యక్షంగా తన వద్దకు పిలిచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యం కల్పిస్తానని చెప్పారు. వెల్ఫేర్ డే లో సిబ్బంది నుంచి అందుకున్న విజ్ఞాపనలను పరిశీలించారు.అనంతరం, వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటానని సిబ్బందికి హామీ ఇచ్చారు. సిబ్బంది తెలిపిన వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను ఎస్పీ స్వయంగా నోట్ చేసుకున్నారు. సిబ్బంది సమస్యలు తెలుసుకున్న ఎస్పీ -
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
● పీహెచ్సీ, సీహెచ్సీ భవన నిర్మాణాల్లో జాప్యంతో తప్పని అవస్థలు ● ఎరువులు, విత్తనాల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి ● జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చర్చించిన జెడ్పీ చైర్మన్, సభ్యులు విజయనగరం: సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు.. పీహెచ్సీ, సీహెచ్సీ భవన నిర్మాణాల పూర్తి.. ఎరువులు, విత్తనాల ధరల నియంత్రణ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుదల.. తదితర అంశాలపై విజయనగరం జిల్లా పరిషత్ సమావేశంలో సభ్యులు చర్చించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వవిప్ తోయక జగదీశ్వరి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, శ్యాంప్రసాద్, సభ్యులు పాల్గొన్నారు. తొలుత అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో వైద్యం, వ్యవసాయం, విద్య రంగాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఒకే మంచంపై ముగ్గురు రోగులకు వైద్యం ఏజెన్సీలోని ఆస్పత్రుల్లో ఒకే మంచంపై ముగ్గురు రోగులకు వైద్యం చేస్తున్నారని, కురుపాం సీహెచ్సీకి రోగుల తాకిడి పెరుగుతున్నా అవసరమైన భవన నిర్మాణ పనులు పూర్తి చేయడంలో తా త్సారం చేస్తున్నారంటూ కురుపాం మండల జెడ్పీటీసీ సభ్యురాలు గొర్లె సుజాత, ఎంపీపీ శెట్టి పద్మావతిలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, కొత్తవలసలో ఆసుపత్రి భవన నిర్మాణ పనులు పూర్తి చేయ కపోవడంతో స్థానికంగా ఉన్న ఎన్జీఓ హోంలో రోగులకు సేవలందిస్తున్నారని, ఒకే గదిలో రోగులకు తనిఖీలు, ఆపరేషన్లు చేస్తున్నారని జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి సభలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన అధికారులు త్వరలో భవన నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లా డుతూ ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందుస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో స్కానింగ్ యంత్రాలు ఎందుకు పని చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. సర్వజన ఆస్పత్రి నుంచి విశాఖలో కేజీహెచ్కు రిఫరల్ కేసుల సంఖ్య పెరుగుతోందని, ప్రజాప్రతినిధులు ఫోన్ చేసి చెబితే మరింత వేగంగా ఇతర ఆస్పత్రులకు పంపించడం వెనుక అంతర్యమేమటన్నారు. స్పందించిన సూపరిండెంట్ కార్డియాలజీ, గ్యాస్ట్రో తదితర అత్యవసర కేసులను తప్పనిసరి పరిస్థితుల్లో రిఫరల్ చేయిస్తున్నామని, ఆస్పత్రుల్లో అన్ని యంత్రాలు అందుబాటు లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనబంధంగా సర్వజన ఆస్పత్రిని మార్పు చేసే ప్రక్రియపై కళాశాల ప్రిన్సిపాల్తో చర్చించా రు. వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేయాలని సూచించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మెడికల్ కళాశాల వద్దకు ఆస్పత్రిని తరలిస్తే ప్రజలకు దూరం అవుతుందని, అటువైపు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కూడా లేదని, కొన్ని విభాగాలను బోధనాస్పత్రి వద్ద ఏర్పాటు చేసి, పాత ఆస్పత్రినే అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ●అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందించాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధికారులను కోరారు. మ్యుటేషన్ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. కొందరు రైతులు ఎరువులు, విత్తనాలు ప్రైవేటు డీలర్ల వద్ద అధిక మొత్తం చెల్లించి కొనుగోలు చేస్తున్నారని, అధిక ధరలకు విక్రయించే వారిపై విజెలెన్స్ అదికారులతో తనిఖీలు చేయించి రైతులకు న్యాయం చేయాలన్నారు. విద్యార్థుల తగ్గుదల ఆందోళన కలిగించే విషయం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గడం ఆందోళన కలిగించే విషయమని, సంఖ్య తగ్గకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని జెడ్పీ చైర్మన్ కోరారు. ఇటీవల మెరకముడిదాం మండలంలో తనిఖీ చేసినప్పుడు గత ఏడాది కన్నా 1100 మంది తగ్గారని తెలిసిందని, ఒకే మండలంలో ఇంత మంది తగ్గితే జిల్లా అంతటా ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందన్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కోవిద్యార్థి నుంచి కట్ చేసిన రూ.2వేలు పాఠశాలల ఖాతాలకు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు. విద్యార్థుల నమోదు తగ్గుదలపై శాసీ్త్రయంగా విశ్లేషణ జరగాలని, దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలని డీఈఓకు మంత్రి కొండపల్లి సూచించారు. తక్షణమే సర్వేచేసి కారణాలు తెలుసుకోవాలన్నారు. ఈ నెల 10న మెగా టీచర్ పేరెంట్స్ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ లోపల అడ్మిషన్లు పూర్తిచేస్తామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. -
చంద్రబాబుపై ఫిర్యాదు
● ఎస్సీలను కుక్కపిల్లతో పోల్చిన సీఎం పార్వతీపురం రూరల్: దళితులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, మరణించిన దళితుడు సింగయ్యను కుక్కపిల్లతో పోల్చడం మొత్తం సమాజాన్నే కించపర్చేలా ఉందని వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన స్థానిక నాయకులతో కలిసి చంద్రబాబుపై పార్వతీపురం పట్టణ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరణించిన దళితుడిని సైతం కుక్కపిల్లతో పోల్చి అవహేళన చేయడం దారుణమన్నారు. చంద్రబాబుకు దళితులంటే ఆదినుంచి చిన్నచూపేనని, మృతి చెందిన వ్యక్తికి కూడా కనీస స్థాయిలో గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడు కాబట్టే కుక్కతో పోల్చుతూ హీనంగా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తన ప్రచారం కోసం అనేక మందిని పొట్టన పెట్టుకున్న పుష్కరాల ఘటనను గుర్తుచేశారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ఏనాడూ తమ పార్టీనాయకులు బలహీన వర్గాలపై చేయలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, 13వ వార్డు సీనియర్ నాయకుడు నేతాజీ, రాజేష్, చింతగడ లక్ష్మి, నారాయణ, రాజ, రాజీవ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
తేలని ఈఈల పంచాయితీ!
సీతంపేట: ఐటీడీఏలో అన్ని శాఖల్లో కీలకమైనది ఇంజినీరింగ్ విభాగం. రోడ్లు, భవన నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనలో ఆ శాఖ అధికారులు పాత్ర కీలకం. కూటమి ప్రభుత్వ తప్పిదాలతో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ శాఖలో ఈఈ పోస్టు విషయంలో గందరగోళం నెలకొంది. మునుపెన్నడూ లేని విధంగా ఒక ఈఈ పోస్టుకోసం ఇద్దరు ఈఈల మధ్య కుర్చీలాట సాగుతోంది. ఇక్కడ ఎన్నిమిది నెలలుగా ఈఈగా పనిచేస్తున్న రమాదేవిని గత నెల 9న నెల్లూరుకు బదిలీ చేశారు. ఆ స్థానంలో కేవీఎన్ఎస్ కుమార్ను నియమించారు. ఆయన గత నెల 11న బాధ్యతలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తనను బదిలీ చేశారంటూ రమాదేవి కోర్టును ఆశ్రయించారు. ఆమె బదిలీ ఉత్తర్వులను కోర్టు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆ మేరకు తను తిరిగి ఈఈగా గత నెల 18న సీట్లో కూర్చున్నారు. ఈ పంచాయితీ గత నెల 26న ఐటీడీఏ పీఓ యశ్వంత్కుమార్ రెడ్ది వద్దకు వెళ్లింది. రమాదేవిని ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీని కలవాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు కుమార్ ఈఈగా కొనసాగుతారని అప్పట్లో తెలియజేశారు. దీంతో పరిపాలనా విధులన్నీ ఈఈ కుమార్ నిర్వహిస్తున్నారు. మళ్లీ మొదటి కొచ్చిన కథ.. తానే ఈఈని అంటూ మల్లీ రమాదేవి ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ కుర్చీలో యథావిధిగా వారం రోజుల తర్వాత వచ్చి శుక్రవారం కూర్చున్నారు. గిరిజన సంక్షేమశాఖ ప్రన్సిపల్ సెక్రటరీని కలిశానని, కోర్టు ఉత్వర్వుల మేరకు ఈఈగా బాధ్యతలు కొనసాగిస్తానని తెలిపారు. ఈ విషయమై ఈఈ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం తనను ఇక్కడకు బదిలీ చేయడంతో విధులు నిర్వహిస్తున్నాని తెలిపారు. డీడీఓ అధికారాలు కూడా ఉండడంతో ప్రశాంతంగా ఉద్యోగం చేస్తున్నానన్నారు. ఫైనల్ ఆర్డర్ ప్రభుత్వం నుంచి ఎలా వస్తే అలా చేస్తామన్నారు. కాగా కిందిస్థాయిలో ఉద్యోగులు, జేఈ, ఏఈలు మాత్రం ఎవరిని కలవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. -
ఎవరేమనుకున్నా.. అదే తీరు!
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పురపాలక సంఘంలో పాలకవర్గంపై వివక్ష కొనసాగుతోంది. ఎవరేమనుకున్నా.. ఎన్ని విమర్శలు వస్తున్నా.. కూటమి నేతలు వారి మాటే శాసనంగా భావిస్తున్నారు. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలను కనీసం పాలకవర్గాన్ని పిలవకుండానే నిర్వహిస్తుండటం గమనార్హం. ఒక వార్డు కౌన్సిలర్ ఇంటి ఎదురుగా జరుగుతున్న పనులు.. సదరు కౌన్సిలర్కు కూడా తెలియకపోవడం విశేషం. పార్వతీపురం పట్టణంలోని ఎస్ఎన్ఎం కాలనీ, కుసుంగుడ్డి వీధి తదితర ప్రాంతాల్లో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న రహదారులు, కాలువల నిర్మాణానికి గురువారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.. టీడీపీ నాయకులు, అధికారులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమాలకు మున్సిపల్ అధికారులు పాలకవర్గాన్ని ఆహ్వానించకపోవడం గమనార్హం. తనకు తెలియకుండానే పనులు: చైర్పర్సన్ మున్సిపల్ పాలకవర్గానికి తెలియకుండానే వార్డుల్లో అభివృద్ధి పనులు చేయడమేమిటని చైర్పర్సన్ బోను గౌరీశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని వాపోయారు. ఇదే విషయమై గతంలోనూ అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని తెలిపారు. దీనిపై కమిషనర్ వెంకటేశ్వర్లును శుక్రవారం నిలదీశారు. కనీసం ఆ వార్డు కౌన్సిలర్కు తెలియకుండా.. ఆయన ఇంటి ఎదురుగానే పనులు చేపట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తామూ వార్డుల అభివృద్ధినే కోరుకుంటున్నామని, గౌరవప్రదంగా సమాచారం అందిస్తే తప్పేమిటని నిలదీశారు. పనులు జరిగినప్పుడు తాను లేనని.. ఆ విషయాలేవీ తనకు తెలియదని కమిషనర్ వెంకటేశ్వర్లు సమాధానమివ్వడం గమనార్హం. ‘పుర’ పాలకవర్గంపై కొనసాగుతున్న వివక్ష చైర్పర్సన్కు తెలియకుండానే అభివృద్ధి పనులకు భూమిపూజ -
చందాలతో పాఠశాల షెడ్ నిర్మాణం
సాలూరు: పిల్లల బంగారు భవిష్యత్కు విద్య ఎంతో మూలమని గుర్తించి చందాలతో పాఠశాలకు రేకుల షెడ్డు నిర్మించిన విద్యార్థు ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దాతలకు పాదాభివందనాలు చేస్తున్నానని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు మండలంలో తోణాం పంచాయతీ మెట్టవలస గ్రామంలో చందాలతో నిర్మించిన పాఠశాల రేకుల షెడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మువ్వల ఆదయ్య మాట్లాడుతూ ,ఈ పాఠశాల షెడ్ ప్రారంభోత్సవానికి రావాలని రాజన్నదొరను అడగ్గా, ప్రోటోకాల్ ఉల్లంఘన అవుతుందని తాను రానని రాజన్నదొర తిరస్కరించగా, ఈ పాఠశాల ప్రభుత్వ నిధులతో నిర్మించలేదని మా గిరిజనులు, దాతలు చందాలతో నిర్మించుకున్నదని చెబితే రాజన్నదొర వచ్చారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి దండి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తప్పుగా మాట్లాడితే మూల్యం తప్పదు సాలూరు: తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు ఇటీవల తమను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని, సదరు నేతలు తగు మూల్యం చెల్లించుకోకతప్పదని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మండలంలోని తోణాం పంచాయతీ మెట్టవలసలో విలేకరులతో మాట్లాడుతూ, తమను రెచ్చగొట్టేలా టీడీపీ నేతలు మాట్లాడుతున్నా ఇంతవరకు ఎంతో సంయమనంతో ఆగామని, ఇకఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విజ్ఞత కోల్పోయి సంస్కారం లేకుండా మాట్లాడిన వారిపై కేసులు పెడతామన్నారు. రాజకీయాల్లో హుందాగా ఉండాలన్నారు.తాను ఏనాడూ తాను చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్కల్యాణ్లతో పాటు స్దానిక మంత్రి సంధ్యారాణిని వ్యక్తిగతంగా దూషించలేదని పేర్కొన్నారు. పార్టీలు, వ్యవస్థలపై విమర్శించడం వేరని, వ్యక్తిగత విమర్శలు చేయడం వేరనే విషయాన్ని టీడీపీ నేతలు గ్రహించాలని హితవు పలికారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు సువ్వాడ భరత్శ్రీనివాస్, పార్టీ జిల్లా కార్యదర్శి దండి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, నాయకులు మువ్వల ఆదయ్య, పీడిక సుదర్శనదొర, నూకయ్య, జన్ని సీతారాం, సుబ్బారావు,రఘుపాత్రుని సాంబమూర్తి, నెమలిపిట్ట కల్యాణ్, పెద్దింటిమాధవరావు, కొండగొర్రి ఉదయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
మ్యుటేషన్లు త్వరగా పరిష్కరించాలి
పాచిపెంట: గ్రామసభల్లో వచ్చిన మ్యుటేషన్లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ అన్నారు. ఈ మేరకు పాచిపెంట మండలంలోని మోసూరు గ్రామంలో రెవెన్యూ సమస్యలపై శుక్రవారం నిర్వహించిన గ్రామసభకు పీఓ హాజరై ఫిర్యాదులను స్వీకరించారు. భూ సవరణలకు సంబంధించి మ్యుటేషన్ కోసం పెట్టుకున్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామంలో ప్రైవేట్ భూములతో పాటు గ్రామ సరిహద్దులు, నీటివనరులున్న భూములు, పోరంబోకు భూములకు కొలతలు వేసి కచ్చితమైన సరిహద్దులను ఏర్పాటు చేయాలని, తద్వారా రైతులకు, భూ యజమానులకు శాశ్వత మేలు జరుగుతుందన్నారు. రీ–సర్వేలో తప్పులు దొర్లకుండా పక్కాగా నిర్వహించాలని సూచించారు. మృతి చెందిన రైతుల మ్యూటేషన్లపై ప్రత్యేక దృష్టిసారించాలని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ డి.రవి, ఆర్ఐ రమణారావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పడగ విప్పుతున్న మహమ్మారి
● జిల్లాలో 1264 మలేరియా పాజిటివ్ కేసులు ● సింగిల్ డాక్టర్లతో నడుస్తున్న పీహెచ్సీలు ● 14 వైద్యాధికారుల పోస్టులు ఖాళీ ● గ్రామాల్లో వైద్యశిబిరాలు అంతంతమాత్రమే ● దోమల తెరల పంపిణీ నిల్సీతంపేట/పాలకొండ రూరల్: పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా మహమ్మారి పడగ విప్పుతోంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా, అలాగే ఆశ్రమ, వసతిగృహాల్లో జ్వరాల బాధితులతో ఏజెన్సీలోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో వైరల్ జ్వరాలతో పాటు మలేరియా, టైఫాయిడ్ ఎక్కువవుతున్నాయి. ఈ సీజన్లో జనవరి నుంచి ఇప్పటివరకు వరకు 1264 మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారిక గణంకాలు చెబుతుండగా ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని అనధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 42, ఆరోగ్య ఉపకేంద్రాలు 200 వరకు ఉన్నాయి. ముఖ్యంగా పీహెచ్సీల్లో పూర్తిస్థాయిలో వైద్యులు ఇద్దరు చొప్పున ఉండాలి. ఒకరు మెడికల్ క్యాంప్ వెళ్లినా, మరొకరు పీహెచ్సీలో ఓపీ చూడాలి. 14 మంది వరకు వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని పీహెచ్సీల్లో వైద్యసేవలు నామమాత్రంగానే అందుతున్నాయనే ఆరోపణలు న్నాయి. రోజుకు ఓపీ 50 నుంచి 100 మధ్య పీహెచ్సీల్లో ఉండగా, ఏరియా ఆస్పత్రుల్లో 200 నుంచి 300ల మధ్య ఉంటోంది. మారుమూల గ్రామాల్లో జ్వరపీడితుల సంఖ్య అధికంగా ఉంది. పీహెచ్సీల నుంచి ఏరియా ఆస్పత్రులకు రిఫరల్ కేసులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. 550 హైరిస్క్ గ్రామాలు.. జిల్లాలో 1250 పైన గిరిజన గ్రామాలున్నాయి. వాటిలో సుమారు 550 గ్రామాలను మలేరియా హైరిస్క్ గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించింది. దీనిలో భాగంగా ఈ గ్రామాల్లో మలేరియా కారక దోమల నివారణకు ఐఆర్ఎస్ 5శాతం ఏసీఎం ద్రావణాన్ని దశల వారీగా పిచికారీ చేస్తున్నారు. మలేరియా నివారణ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ జ్వరాల నివారణ చర్యలు చేపట్టినప్పటికీ మలేరియా మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. జనవరి నుంచి ఇప్పటివరకు 1,31,902 మంది రక్తపూతలు సేకరించగా వాటిలో 1264 మలేరియా పాజిటివ్ కేసులు జూన్ నెలాఖరు వరకు నమోదయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రులు, చిన్నచిన్న క్లినిక్లు, గ్రామాల్లో సంచి వైద్యులు వంటి వారి వద్దకు వచ్చే మలేరియా పాజిటివ్ కేసులు ఇంతకు రెట్టింపు సంఖ్యలో ఉంటాయి. కాలం చెల్లిన దోమతెరలు.. దోమతెరల కాలపరిమితి ఐదేళ్లు. అయితే దోమతెరలను ఉతకడం వంటి పనులు చేస్తే మూడేళ్లకే పాడవుతాయని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో దోమతెర లకు కాలం చెల్లాయి. మరికొన్ని చినిగిపోయాయి. ఇప్పటికే పాడైన దోమతెరలను చాలా గ్రామాల్లో చేపలు పట్టడానికి, మొక్కలకు కంచె వేయడానికి వినియోగిస్తున్నారు. -
ఎరువు కొరత తీర్చండి
● మండల సర్వసభ్య సమావేశంలో ప్రజా ప్రతినిధుల డిమాండ్ పాచిపెంట: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు సరిపడా ఎరువులు లభించడం లేదని ప్రజాప్రతినిధులు మండల సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం పాచిపెంట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బడ్నాన ప్రమీల అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు ఎరువుల కొరతపై ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న ఎరువులు కొంతమందికే అందుతున్నాయని వాపోయారు. కేరంగి రైతుభరోసా కేంద్రానికి ఎరువులు పంపించినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఏ ఒక్క గిరిజన రైతుకు అందలేదని సర్పంచ్ సోముల లచ్చయ్య వ్యవసాయా ధికారి తిరుపతిరావును నిలదీశారు. రాయిగుడ్డివలస రైతు భరోసా కేంద్రానికి ఇంతవరకు ఎరువులు సరఫరా చేయలేదని సర్పంచ్ చింత సీతయ్య అధికారులను ప్రశ్నించారు. ప్రైవేట్ దుకాణాల్లో విక్రయిస్తున్న ఎరువులకు నిర్వాహకులు ఎరువుతోపాటు వారి వద్ద ఉన్న రకరకాల ఎరువులను అంటగడుతున్నారని వైస్ ఎంపీపీ కొల్లి రవీంద్రనాథ్ మండిపడ్డారు. దీనిపై ఎంపీపీ మాట్లాడుతూ రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని, సమయం దాటిన తరువాత ఎరువులను సరఫరా చేసినా ఉపయోగం ఉండదన్నారు. ఈ సందర్భంగా సాలూరు ఏఎంసీ చైర్మన్ ఎం.సూర్యనారాయణ మాట్లాడుతూ ఎరువుల కొరత లేకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, రెండు, మూడురోజుల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు. సమావేశంలో ఎంపీడీఓ పాత్రో, వైస్ ఎంపీపీ ఎం.నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్జేడీకి పీఆర్టీయూ నాయకుల వినతి
పార్వతీపురం: పాఠశాలల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై రీజనల్ డైరెక్టర్ బి.విజయ్ భాస్కరరావుకు పీఆర్టీయూ నాయకులు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు పార్వతీపురం జీజే కళాశాలను ఆర్జేడీ సందర్శించిన సందర్భంగా వినతిపత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ బేసిక్ ప్రైమరీ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. బదిలీల ప్రక్రియ ముగిసిన తరువాత కూడా పలు పాఠశాలలకు ఉపాధ్యాయులు లేక బోధనకు ఇబ్బంది కలుగుతోందన్నారు. ఆర్జేడీని కలిసిన వారిలో ఆ సంఘం నాయకులు వి.తవిటినాయుడు, కె.విజయ్, ఎ.సూర్యనారాయణ, జె.రామినాయుడు, జి.రామినాయుడు, శంకరరావు, తదితరులు ఉన్నారు. పీఆర్టీయూ బలోపేతానికి కృషిచేయాలి పార్వతీపురం: పీఆర్టీయూ బలోపేతానికి ఉపాధ్యాయులు కృషిచేయాలని ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అమరాపు సూర్యనారాయణ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం పార్వతీపురం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషిచేస్తున్నట్లు చెప్పారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సంఘం ఆదేశాలమేరకు కార్యక్రమాలు నిర్వహించనున్నామని అందుకు అందరు ఉపాధ్యాయులు సంసిద్ధంగా ఉండాలని కోరారు. సమావేశంలో పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతానగరం మండలాల నుంచి సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025
చదువుకోవాలన్న ఆ గిరిజన చిన్నారుల ఆశలను గెడ్డ నీళ్లు అడ్డుతున్నాయి. పార్వతీపురం మండలంలోని నరసయ్య పేట గ్రామం నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు గెడ్డల్లో తక్కువగా నీరు పారే సమయంలోనే హాజరయ్యే దుస్థితి గిరిజన విద్యార్థులది. రోజూ తమ చిన్నారులను పాఠశాలకు అప్పగించేందుకు పనులు మానుకుని సమయాన్ని కేటాయిస్తున్నామని తల్లిదండ్రులు వాపోతున్నారు. అలాగే మండలంలోని ఎన్.ములగ గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్కు వెళ్లాలంటే దాదాపు ఐదు గ్రామాలకు చెందిన విద్యార్థులు వరదనీటిలో బురదలో నడుచుకుంటూ పాఠశాలకు చేరాల్సిందే. సమీపంలో ఉన్న వ్యవసా య కాలువ నుంచి ములగ గ్రామం వైపు నీరు పారడంతో ఆ దారి నిత్యం జలమయమై బురదతో నరకంలా తయారవుతుంది. ఈ దారిలోనే విద్యార్థులు, చుట్టుపక్కల గ్రామస్తులు రాకపోకలు సాగిస్తుంటా రు. క్రమంగా వర్షాలు కురిస్తే రాకపోకలు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. –పార్వతీపురం రూరల్/కొమరాడచదువులకు అడ్డుగా గెడ్డ..!న్యూస్రీల్ -
గంగరేగువలసలో బెంగ..!
● గ్రామంలో కేన్సర్ మహమ్మారి అంటూ అలజడి ● ఆందోళనలో గ్రామస్తులు కొమరాడ: మండలంలోని గంగరేగువలస పంచాయతీ లోని సోమినాయుడువలస, చినగంగరేగువలస గ్రామాల్లో సుమారు 600 కుటుంబాలు, 2500మంది నివసిస్తున్నారు. గడిచిన మూడేళ్లుగా కేన్సర్ బారిన పడుతూ పలువురు చనిపోతున్నారని పంచాయతీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే నిత్యం పంటలతో సస్యశ్యామలంగా ఉన్న ఈ గ్రామానికి ఏమైందంటూ ప్రజాసంఘాలు, మేధావులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ముగ్గురు మాత్రమే కేన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని ప్రభుత్వ వైద్యాధికారుల లెక్కల ప్రకారం చెబుతున్నారు. గ్రామంలో పలురకాల వ్యాధులతో సుమారు 20మంది మంచం పట్టి ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న గ్రామంలో కేన్సర్ మహమ్మారి అంటూ అలజడి సృష్టించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల గ్రామంలో కేన్సర్ భూతం ఉందని అని ప్రచారం జరగడంతో గ్రామస్తులు, యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా అనిపించడం లేదు. వైద్యాధికారులు తూతూ మంత్రంగా పరీక్షలు నిర్వహించి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ అధికారులు కేన్సర్ వ్యాధి రావడానికి కారణం ఏమిటో ఎందుకు నిర్ధారణ చేయడం లేదు? గ్రామంలో గాలి కాలుష్యమా? కలుషితమైన తాగునీరా? తినే ఆహారంలో మార్పులవల్ల కేన్సర్ వ్యాధి వస్తోందా? అని ప్రజల్లో ఉన్న అనుమానాలను అధికారులు ఎందుకు నివృత్తి చేయడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో అలజడి సృష్టిస్తున్నారు మా గ్రామ పంచాయతీలో పలు రకాల వ్యాధులతో మృతి చెందుతున్నారు. ప్రస్తుతం ముగ్గురు కేన్సర్ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. గ్రామంలో ప్రత్యేకవైద్య నిపుణుల బృందం పూర్తిస్థాయిలో ఆహారం, నీరు, పరిసరాలను పరిశీలించి గ్రామస్తులకు పరీక్షలు నిర్వహించి ప్రజల్లో ఉన్న భయాందోళన తొలగించాలి. – కోడి తిరుపతిరావు, సర్పంచ్, గంగరేగువలసపూర్తిస్థాయి నివేదిక రావాలి గంగరేగువలస, సోమినాయుడువలస, చినగంగరేగువలస గ్రామాల్లో కేన్సర్ మహమ్మారి ఉందని గ్రామస్తుల్లో అలజడి సృష్టిస్తున్నా రు. వాస్తవానికి ముగ్గురు వ్యక్తులకు మాత్రమే కేన్సర్ వ్యాధి ఉంది. వారు కూడా చికిత్స పొందుతున్నారు. గతంలో కేన్సర్ బారిన పడి మృతి చెందారని ఆరోపిస్తున్న వాటికి పక్కా ఆధారాలు లేవు. ఈ గ్రామంలో కేన్సర్ వ్యాధికి పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించి నివేదిక పంపడానికి సమయం పడుతుంది. – సీహెచ్ అరుణ్కుమార్, వైద్యాధికారి, కొమరాడ పీహెచ్సీ -
మోత తప్పలే!
● డోలీ మోతలకు చెక్ పెట్టినట్లు చెప్పిన మంత్రులు ● కొద్దిరోజులకే సాలూరు నియోజకవర్గంలోనే మరో ఘటన ● ఆర్భాటంగా ప్రారంభించిన కంటైనర్ ఆస్పత్రికి సమీపంలోనే.. అక్కడే కంటైనర్ ఆస్పత్రి ఉన్నా.. సాక్షి, పార్వతీపురం మన్యం: సుపరిపాలనకు తొలి అడుగు అంటూ.. ఇటీవ ల కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశమయ్యారు. గిరి ప్రాంతాలకు రహదారు లు నిర్మిస్తున్నామని చెబుతూ.. డోలీ మోతలను అరి కట్టామని మంత్రులు చెప్పారు. అలా చెప్పి ఎన్ని రోజులూ కాలేదు. మంత్రి సొంత నియోజకవర్గమైన సాలూరు మండలంలోనే మరో మహిళను డోలీలో ఆసుపత్రికి తరలించడం గమనార్హం. ఆశ కార్యకర్తకే తప్పలేదు.. రెండు రోజుల కిందట సాలూరు మండలం కరడవలస పంచాయతీ ఎగువ కాషాయవలస గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త కూనేటి శ్యామల వాంతులు, విరేచనాలతో బాధ పడటంతో కుటుంబ సభ్యులు.. డోలీ కట్టి.. కొండలు, గుట్టలు దిగి, సువర్ణముఖి నదిని దాటి సాలూరు ఆస్పత్రికి తరలించారు. ●కొద్దిరోజుల క్రితం తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్న సాలూరు మండలం బొడ్డపాడు గిరిశిఖర గ్రామానికి చెందిన సీదరపు నాగేశ్వరరావు అనే గిరిజనుడిని పది కిలోమీటర్లు డోలీలో జిల్లేడు వలస వరకు తీసుకొచ్చి, అక్కడ నుంచి ఆటోలో సాలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ●విజయనగరం జిల్లా ఎస్.కోటలోని రేగపుణ్యగిరి గిరిజన గ్రామం నుంచి అర్జున్ అనే వ్యక్తిని చికిత్స నిమిత్తం సుమారు ఐదు కిలోమీటర్లు డోలీలో తరలించాల్సి వచ్చింది. ●కొన్నాళ్ల కిందట కొమరాడ మండలం చినఖేర్జిల పంచాయతీ సీసాడవలసకు చెందిన గర్భిణిని కుటుంబ సభ్యులు మంచంపై ఉంచి మైదాన ప్రాంతానికి తరలించారు. అక్కడ నుంచి 1089 వాహనంలో పార్వతీపురం ఆస్పత్రికి చేర్చారు. కంటైనర్ ఆస్పత్రికి కిలోమీటరు దూరంలో ఉన్నా సరే... మన్యం ప్రాంతాల్లో డోలీ మోతలకు స్వస్తి పలకాల ని గిరిశిఖర ప్రాంతాల్లో కంటైనర్ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టు కింద పార్వతీపురం మన్యం జిల్లాలో కంటైనర్ ఆస్పత్రిని ఇటీవల ప్రారంభించారు. పది గ్రామాల ప్రజలకు ఈ కంటై నర్ ద్వారా వైద్యసేవలు అందుతాయని ప్రకటించా రు. సాలూరు మండలం తోణాం పంచాయతీ పరి ధి గిరిశిఖర కరడవలసలో దీన్ని నెలకొల్పారు. అక్క డ సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయో చెప్పడాని కి బుధవారం జరిగిన డోలీ మోత ఘటనే నిదర్శనం. కరడవలసకు కేవలం కిలోమీటరు దూరంలోపునే బాధిత మహిళ గిరిజన గ్రామం ఉంది. అక్కడ సేవలు అందుబాటులో లేకపోవడంతోనే సుదూర ప్రాంతం తీసుకొచ్చి, సాలూరు ఆసుపత్రి లో చేర్చారు. డోలీల మోతలు లేకుండా చేస్తున్నామని.. గిరి ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పిస్తున్నామని కొద్ది నెలల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ జిల్లా పర్యటన సందర్భంగా తెలిపా రు. ఆయన శంకుస్థాపన చేసిన రహదారి నేటికీ ప్రారంభం కాకపోవడం గమనార్హం. కూరుకూటి ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. నేటికీ కార్యరూపం దాల్చలేదు. -
విస్తృతస్థాయి సమావేశం విజయవంతం చేయాలి
● ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి పాలకొండ: వైఎస్సార్సీపీ చేపడుతున్న పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతిలు కోరా రు. ఈ మేరకు గురువారం పాలకొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 5న పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజ్ అధ్యక్షతన పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుంద ని తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అనుబంధ విభాగాల సభ్యులు సమావేశానికి విధిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. నిలకడగా తోటపల్లి నీటి ప్రవాహంగరుగుబిల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు తోటపల్లి ప్రాజెక్టువద్ద నీటిప్రవాహం నిలకడగా ఉంది. నాగావళినదిలో తోటపల్లి ప్రాజెక్టువద్ద గురువారం సాయంత్రానికి 105 మీటర్ల లెవెల్కు గాను 104.5 మీటర్ల లెవెల్లో నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం నదిపై భాగం నుంచి ప్రాజెక్టుకు 3,558ల క్యూసెక్కుల నీరు రాగా ఈ మేరకు అధికారులు ఒక గేటును ఎత్తివేసి 3వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.53 టీఎంసీలకు గాను 2.216 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు వద్ద నీటిపరిస్థితిని ఇంజినీరింగ్ ఏఈ కిశోర్ పర్యవేక్షిస్తున్నారు. బ్లడ్ బ్యాంక్లకు షోకాజ్ నోటీసులు విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఐదు బ్లడ్ బ్యాంక్లకు ఔషధ నియంత్రశాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీచేశారు. అధికారుల పరిశీలనలో బ్లడ్ బ్యాంక్ల్లో రికార్డుల నిర్వాహణ సక్రమంగా లేకపోవడం, కొన్ని నిబంధనలు పాటించకపోవడం వల్ల నోటీసులు జారీచేసినట్టు ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.రజిత తెలిపారు. విజయనగరంలోని న్యూ లైఫ్బ్లడ్ బ్యాంక్, ఎన్వీఎన్ బ్లడ్ బ్యాంక్ , బొబ్బిలిలోని బొబ్బిలి బ్లడ్ బ్యాంక్, రాజాంలోని జీఎంఆర్ బ్లడ్ బ్యాంక్, నెల్లిమర్లలోని మిమ్స్ బ్లడ్ బ్యాంక్లకు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. -
గంజాయి అక్రమ రవాణా నివారణకు తనిఖీలు
పార్వతీపురం రూరల్: ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే రైళ్లలో గురువారం విస్తృత తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ నుంచి గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈగల్ స్పెషల్ ఫోర్స్, లోకల్ పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జీఆర్పీ సమన్వయంతో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి తనిఖీలు చేపట్టినట్లు పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురానా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాను నిరోధించడంలో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ముందుగా ప్లాట్ఫాంపై వేచిఉన్న ప్రయాణికుల లగేజీలను పలు శాఖల పోలీస్ అధికారులతో కలిసి డాగ్ స్క్వాడ్తో పరిశీలించారు. అనంతరం గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్లో బోగీల వారీగా ముమ్మరంగా విజయనగరం వరకు సిబ్బంది తనిఖీలు చేశారు. ఎప్పటికప్పుడు మాదక ద్రవ్యాల నివారణకు ఈగల్ బృందం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పోలీసు శాఖలో పలు బృందాల సహకారంతో విస్తృతంగా తనిఖీలు చేపటుతున్నట్లు ఏఎస్పీ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, సాగు, వినియోగం లేకుండా చేయడమే ఈగల్ బృందం ప్రధాన లక్ష్యమన్నారు. తనిఖీల్లో క్రైమ్స్టేషన్ సీఐ అప్పారావు, పార్వతీపురం రూరల్ సీఐ గోవిందరావు, మరికొంతమంది ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పలు శాఖల సమన్వయంతో రైళ్లలో సోదాలు ఏఎస్పీ అంకిత సురానా -
ప్రభుత్వం మెడలు వంచుదాం.. హామీలు అమలు చేయిద్దాం
● పవిత్రమైన ఎన్నికల ప్రణాళిక అమల్లో కూటమి వైఫల్యం ● ప్రమాణాలు చేస్తున్నామంటూ ఇచ్చిన బాండ్లకు విలువ ఎక్కడ..? ● బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీపై ఇంటింటా ప్రచారం ● వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 5 వారాల బృహత్తర కార్యక్రమం ● హామీలు అమలుపై ప్రజలతో చర్చించి చైతన్యవంతులు చేయండి ● పార్టీ శ్రేణులకు శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపు ● వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేతలు ● జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ●హామీలను విస్మరించడం దగా చేయడం కాదా..? ప్రజాస్వామ్యంలో పవిత్రమైన ఎన్నికల ప్రణాళికలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఎన్నికల ప్రణాళికలను భగవద్గీతగా, ఖురాన్గా, బైబుల్గా భావించి అమలు చేశాం. ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అలానే అమలు చేస్తుందని 5 కోట్ల మంది ప్రజలు నమ్మి మోసపోయారు. ఏడాది కాలం మాయమాటలతో పబ్బంగడిపేసింది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో బాధ్యత గల ప్రతిపక్షంగా అధికారం పక్షం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను మెడలు వంచి అమలు చేసేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చంద్రబాబునాయుడు, పవన్కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నామంటూ బాండ్ పేపర్లు ఇచ్చారు. ఏడాదిగా ప్రతిజ్ఞను పక్కనపెట్టి మోసం చేస్తున్నారు. – బొత్స సత్యనారాయణ, శాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి విజయనగరం: ఎన్నికలకు ముందు అధికార దాహంతో ఇచ్చిన హామీల అమలు కోసం కూటమి ప్రభుత్వం మెడ లు వంచేందుకు సిద్ధమని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఉద్ఘాటించారు. పవిత్రమైన ఎన్నికల ప్రణాళిక అమల్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. హామీల అమలుపై ప్రశ్నించేవారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వాఖ్యలు చేయడాన్ని ఖండించా రు. ఏడాది పాలనలో హామీల అమల్లో జరుగుతు న్న మోసాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులంతా ప్రజలకు వివరించాలని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన బాబుష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలకు గుర్తుచేస్తూ 5 వారాల బృహత్తర కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని సూచించారు. ముందుగా నియోజకవర్గ స్థాయిలో సమన్వయకర్తల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని, అనంతరం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి కార్యక్రమా న్ని అందరికీ తెలియజేయాలన్నారు. అనంతరం మండల స్థాయి నాయకులు గ్రామగ్రామానికి వెళ్లి అక్కడి స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచా రం చేసిన అనంతరం ఆ గ్రామంలో రచ్చబండ ఏర్పాటు చేసి కూటమి పాలనను వివరించాలన్నా రు. కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడు ప్రజలే జగన్మోహన్రెడ్డి కావాలో.... చంద్రబాబు కావాలో నిర్ణయించుకుంటారన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన పూల్బాగ్ లోని ఓ కల్యాణమండపంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ముందు గా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ ముఖ్య నాయకులంతా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గ్రామాల్లో చేసిన వాగ్దానాలను ప్రశ్నించాలి కూటమి నాయకులు ఎన్నికలకు ముందు గ్రామాల్లోకి వచ్చి చేసిన వాగ్దానాలపై ప్రశ్నించాలి. చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసాలను చెప్పేందుకే బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ కార్యక్రమం. జగన్మోహన్రెడ్డి న్యాయంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే.. కూటమి నేతలు మాయమాటలతో పాల న చేస్తున్నారు. 150 హామీలు ఎక్కడ అమలు చేశారో... ఎవరికి చేశారో చెప్పాలి. ప్రశ్నించే వారిపై రెడ్బుక్ పేరిట భయపెడుతున్నారు. ఇటువంటి దుర్మార్గపు పాలనను ప్రజల్లో నిలదీయాలి. – పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ సీఎం, సాలూరు భస్మాసురిడిలా లోకేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ కూటమి ప్రభుత్వానికి భస్మాసురిడిలా తయారయ్యాడు. రెడ్ బుక్లో అందరి జాతకాలు ఉన్నాయంటూ చివరికి ఆ అస్త్రంతోనే కూటమి ప్రభుత్వాన్ని, తన పక్కనున్న వారిని భస్మం చేసే పరిస్థితి వస్తుంది. బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్దాం. జగన్మోహన్రెడ్డి ప్రజల్లో ఉన్న అభిమానం చెక్కుచెదరలేదు. 2029 ఎన్నికల్లో మళ్లీ క్లీన్స్వీప్ చేస్తాం. – పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ -
చోరీ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష
విజయనగరం క్రైమ్/రామభద్రపురం: జిల్లాలోని రామభద్రపురం పోలీస్స్టేషన్లో నమోదైన రెండు చోరీ కేసుల్లో మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన ముద్దాయి జోకాడ భగవాన్(22)కు ఐదేళ్ల 10 నెలల జైలుశిక్ష, రూ.8 వేలు జరిమానా విఽధిస్తూ సాలూరు మెజిస్ట్రేట్ హర్షవర్ధన్ తీర్పు ఇచ్చారని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపారు. ఈ కేసుల వివరాల్లోకి వెళ్తే.. 2023లో రామభద్రపురం మండలం ఆరికతోట గ్రామంలో వి.కాంతమ్మ ఇంట్లో వారు నిద్రిస్తున్న సమయంలోను.. 2024లో ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్లోను జోకాడ భగవాన్ చొరబడి రూ.లక్షా 60వేల నగదు, తులం చెవిదిద్దులు, ఒక ల్యాప్టాప్ దొంగిలించాడు. అప్పట్లో బాధితులు ఇచ్చిన సమాచారంపై రామభద్రపురం పోలీసులు రెండు చోరీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో విచారణ చేపట్టిన జడ్జి నేరం రుజువుకావడంతో గురువారం పైవిధంగా జైలుశిక్ష, జరిమానా విధించారు. కాగా జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు మాసాలు సాధారణ జైలుశిక్షను అనుభవించాలని సాలూరు జైఎఫ్సీఎం కోర్టు మెజిస్ట్రేట్ హర్షవర్ధన్ తీర్పులో పేర్కొన్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ వివరించారు. ఈ కేసులో వాదనలు వినిపించిన వీహెచ్కే శర్మ, బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు, రామభద్రపురం ఎస్సై ప్రసాద్లు సకాలంలో కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారని ఎస్పీ ఈ సందర్భంగా చెప్పారు. -
పెట్రోల్ స్టేషన్ను ప్రారంభించిన డీఐజీ
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని చర్చివీధి కూడలి సమీపంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ స్టేషన్ను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డీఐజీ..విజిబుల్ పోలీసింగ్కు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన 41 కొత్త ద్విచక్ర వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి భధ్రత, ట్రాఫిక్ రెగ్యులేషన్ విధులను విజిబుల్ పోలీస్ సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాకు ఈ ద్విచక్ర వాహనాలను ఆధునిక టెక్నాలజీతో రూపొందించి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆ వాహనాల ద్వారా సైరన్, బ్లింక ర్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం, క్రౌడ్ కంట్రోల్ చేసేందుకు రూపొందించారన్నారు. జిల్లాలో ట్రాఫిక్ సమస్య తరచూ ఏర్పడుతున్న నేపథ్యంలో ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో రహదారి ప్రమాదాలు కూడా జరుగుతున్న క్రమంలో ఈ వాహనాలను కేటాయించినట్లు తెలిపారు. మినీ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ స్టేషన్ ప్రారంభం అనంత రం ఎస్పీ కార్యాలయంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయంలో సోషల్మీడియా, సైబర్సెల్, మినీ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించి సైబర్ సెల్, ఐటీకోర్ టీం, సిబ్బందితో చర్చించి వారు నిర్వహించే విధుల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ అంకిత సురానా, పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఎస్బీ సీఐ రంగనాథం, సీసీఎస్ సీఐ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. -
బీసీసీఐ అంపైర్ పరీక్షల్లో తోట విజయ్ ఉత్తీర్ణత
విజయనగరం: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో గత నెలలో అహమ్మదాబాద్లో నిర్వహించిన బీసీసీఐ అంపైర్ల పరీక్షల్లో విజయనగరానికి చెందిన తోట విజయ్ ఉత్తీర్ణత సాధించారు. బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అంపైర్ల పరీక్షల్లో జిల్లా చరిత్రలో తోట విజయ్ అంపైర్ సర్టిఫికేషన్ పొందిన తొలి వ్యక్తిగా గుర్తింపు సాధించారు. అంతేకాకుండా, ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అర్హత పొందిన ఏకై క అభ్యర్థి కూడా ఆయనే. ఆయన సాధించిన విజయం విజయనగరం క్రికెట్కు గర్వకారణమే కాకుండా భవిష్యత్ అంపైర్లకు ప్రేరణగా నిలుస్తుంది. ఇప్పటికే విజయ్ అంతర్జాతీయ మ్యాచ్లకు స్కోరర్గా వ్యవహరిస్తున్నారు. తోట విజయ్ బీసీసీఐ అంపైర్ల పరీక్ష ఉత్తీర్ణత కావడంతో ఇకనుంచి దేశవాళీ క్రికెట్ మ్యాచ్లు, రంజీ ట్రోఫీ, ఐపీఎల్, అంతర్రాష్ట్ర క్రికెట్ మ్యాచ్లకు ఎంపైరింగ్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా విజయ్కు జిల్లా క్రికెట్ అసోసియేషన్, నార్త్ జోన్ క్రికెట్ అకాడమీ ప్రతినిధులు, పలువురు కోచ్లు, క్రీడాకారులు అభినందనలు తెలిపారు.పీఎం జుగా నిధులతో పాఠశాలలకు భవనాల నిర్మాణంపార్వతీపురం/మక్కువ: పీఎం జుగా, పీఎం జన్మన్ నిధులు మంజూరైన వెంటనే పాఠశాలలకు భవనాలను నిర్మిస్తామని గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకురాలు ఆర్.కృష్ణవేణి తెలిపారు. ఈ మేరకు గురువారం (జూలై 3న) ‘‘సాక్షి’’ దినపత్రికలో ‘‘గిరిజన బిడ్డల చదువుల కష్టాలు’’ శీర్షికన ప్రచురితమైన కథనం పట్ల ఆమె స్పందిస్తూ మక్కువ మండలంలోని ఎర్ర సామంతులవలస స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో గిరిజన ప్రాథమిక పాఠశాల చిలకమెండంగిలో 8మంది విద్యార్థులు చదువుతున్నారని, రేకుల షెడ్డులో పాఠశాల నిర్వహిస్తున్నారన్నారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని 8 మండలాల్లో 352 పాఠశాలలు ఉన్నాయని, వాటిలో 58గిరిజన ప్రాథమిక పాఠశాలలకు భవనాలు లేనందున పీఎం జుగా, పీఎం జన్మన్ కింద పాఠశాలల భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని ఆమె స్పష్టం చేశారు. వర్షాలకు కూలిన పెంకుటిళ్లుజామి: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలకేంద్రం జామి లో రెండు పెంకుటిళ్లు గురువారం కూలిపోయాయి. గ్రామానికి చెందిన రాజాన సీతారాం, సీరెడ్డి సింహాచలంల పెంకుటిళ్లు వర్షాలకు నానడంతో కూలిపోయాయని గ్రామస్తులు, బాధితులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. తైక్వాండో విజేతలకు సత్కారంపార్వతీపురం టౌన్: పార్వతీపురం మన్యం జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొని సత్తా చాటిన విద్యార్థులను ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర గురువారం సత్కరించారు. అనంతపురం జిల్లా, తాడిపత్రిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్ తరఫున ఉత్తరఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో జూన్ 23 నుంచి 25 వరకు జరిగిన జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో అండర్ 25 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన షణ్ముఖ్ సిద్ధార్థ నాయుడు, అండర్ 48 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన బుగత హర్షవర్ధన్, మహిళల విభాగంలో అండర్ 32 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన ఇజ్జాడ వైష్ణవిదేవిలను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. నిషేధిత పాలిథిన్ కవర్లు వాడొద్దు -
పాపం పశువులు
పార్వతీపురంటౌన్: పట్టణ రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున గూడ్స్ ఢీకొని 8 వశువులు మృతిచెందాయి. ఈ సంఘటనపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొమరాడ మండలంలోని పరశురాంపురం గ్రామం నుంచి పార్వతీపురం సంతకు పశువులను తరలిస్తుండగా పార్వతీపురం సమీపంలో గల రైల్వే ట్రాక్ దాటుతున్న క్రమంలో రాయపూర్ పైపు వెళ్తున్న గూడ్స్ ఢీకొనడంతో 8 వశువులు అక్కడికక్కడే మృతిచెందాయి. వెంటనే గూడ్స్ను డ్రైవర్ ఆపి రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన రైల్వే సిబ్బంది ట్రాక్పై ఉన్న పశువులను పక్కకు తొలగించారు. ఈ విషయమై జీఆర్పీ సిబ్బందిని వివరాలు అడగ్గా ఎటువంటి ఫిర్యాదు అందక పోవడంతో కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఏటీఎంలో ఆవు.. రాజాం: పట్టణంలోని బొబ్బిలి జంక్షన్ వద్ద హెచ్డీఎఫ్సీ ఏటీఎం కేంద్రంలో ఒక ఆవు మృతిచెందింది. రెండురోజుల క్రితమే ఈ ఆవు మృతిచెంది ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గురువారం ఉదయం ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా తీసేందుకు వెళ్లిన బ్యాంకు ఖాతాదారులు విషయాన్ని గుర్తించి, మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న శానిటరీ ఇన్స్పెక్టర్ సీహెచ్.ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతిచెందిన గోవును పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ఏటీఎం కేంద్రంలోంచి బయటకు తీసుకొచ్చి డంపింగ్ యార్డు వద్ద ఖననం చేయించారు. రాజాం రోడ్లపై ఇటీవల ఆవులు అధికంగా సంచరిస్తున్నాయి. వర్షానికి ఏటీఎంలోకి ఆవు చేరి ఉంటుందని, కాలుజారి పడడంతో మృతిచెంది ఉంటుందని శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు. -
రెక్కీ నిర్వహించి హత్య
బొబ్బిలి: తన భార్య చనిపోవడానికి, బిడ్డ అనారోగ్యంతో ఉండడానికి తన పక్కింట్లో ఉంటున్న పిన్నే కారణమని అనుమానించి రెక్కీ నిర్వహించి మరీ ఆమెను హత్య చేశాడో ఓ యువకుడు. బొబ్బిలి పట్టణంలోని బండారు వీధిలో కరగాని పద్మ అనే మహిళ గాయాలతో బుధవారం ఇంటి గుమ్మం వద్ద పడి మృతి చెందిన ఘటన తెలిసిందే. కాగా ఇది హత్యేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ విషయమై డీఎస్పీ జి.భవ్యారెడ్డి గురువారం రాత్రి స్థానిక పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మహిళ మృతి చెందడానికి కత్తిపీటపై పడిపోవడమేనని కుటుంబసభ్యులు చెప్పిన మాటలపై నమ్మకం కలగక దర్యాప్తు చేపట్టామన్నారు. వంటిపై గాయాలుండడం, మెడికల్ రిపోర్టు, క్లూస్టీమ్ వివరాలను సేకరించి హత్య అని నిర్ధారణకు వచ్చామని డీఎస్పీ చెప్పారు. హత్య చేసింది స్వయానా ఆమె బావ కుమారుడు కరగాని సంతోష్ కుమార్ అని తెలిపారు. సంతోష్ కుమార్ భార్య పావని ప్రసవ సమయంలో చనిపోయింది. అలాగే నెలన్నర రోజుల పసిబిడ్డ ఆరోగ్యం కూడా బాగాలేక ఆస్పత్రిలో చేర్చారు. ఈ రెండు సంఘటనలకు తన పిన్నే కారణమని భావించిన సంతోష్ గురువారం ఉదయం 11 గంటల సమయంలో రెక్కీ నిర్వహించాడు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంట్లో పిన్ని ఒంటరిగా ఉన్న సమయంలో పొడిచి హత్యకు పాల్పడినటుల డీఎస్పీ చెప్పారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం అనంతరం బంధువులకు గురువారం అప్పగించామని, నిందితుడ్ని రిమాండ్ నిమిత్తం తరలించినట్లు తెలిపారు. సమావేశంలో సీఐ కె. సతీష్కుమార్, ఎస్సై ఆర్.రమేష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. మహిళ హత్య కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ -
ఎమ్మెల్యేలు డుమ్మా
విజయనగరం అర్బన్: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–2047’ ప్రణాళిక, పీ–4 కార్యక్రమాల తొలి సమీక్ష సమావేశానికి విజయనగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు మినహా మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఇది అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ విజన్ ప్రణాళిక అమలులో ప్రతిఒక్కరూ భాగాస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. రానున్న ఐదేళ్లలో వ్యవసాయంలో రెట్టింపు అభివృద్ధి సాధించాలన్నదే లక్ష్యమన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యాన, వాణిజ్యపంటల సాగుకు రైతులు ఆసక్తిచూపేలా చూడాలన్నారు. సర్వీస్ సెక్టార్ కింద పర్యాటక రంగంలో సన్రే రిసార్ట్స్ రూ.150 కోట్లు, జీఎంఆర్ రూ.150 కోట్లు, ఆదాని గ్రూప్ రూ.100 కోట్లతో హోటళ్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయన్నారు. పీ–4లో భాగంగా నియోజకవర్గం పరిధిలోని 264 పోలింగ్ బూత్ల నుంచి ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకుంటానని వెల్లడించారు. సమవేశంలో ఎమ్మెల్సీలు డాక్టర్ గాదె శ్రీనివాసులునాయుడు, రఘురాజు, ఎమ్మెల్యేలు అధితి విజయలక్ష్మి గజపతిరాజు, లోకం నాగమాధవి, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, జేసీ సేతుమాధవన్, ఎస్పీ వకుల్ జిందాల్, సీపీఓ బాలాజీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మహిళలకు శక్తియాప్ రక్షక కవచం మహిళలకు రక్షక కవచంగా శక్తియాప్ నిలుస్తుందని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కలెక్టరేట్లో గురువారం అధికారులతో జరిగిన సమావేశంలో శక్తి యాప్ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. ఎస్పీ వకుల్ జిందాల్ తొలిత శక్తి యాప్ విధి విధానలను పీపీటీలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల, ఆడ పిల్లల రక్షణ కోసం రూపొందించిన ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతరకు 1.2 కోట్ల మంది వినియోగిస్తున్నారని, ప్రతి మహిళ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
శతశాతం జీఎస్టీ వసూలు కావాలి
పార్వతీపురం టౌన్: జిల్లాలో వాణిజ్య, వాణిజ్యేతర సంస్థల నుంచి శతశాతం జీఎస్టీ వసూలు కావాలని, ఆ దిశగా చర్య లు చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఆదాయం తెచ్చిపెట్టే శాఖలైన గనులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎల్డీఎం, డీపీఓ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూ ఎస్, ఐటీడీఏలు, మున్సిపాలిటీలు, పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ శాఖలకు చెందిన అధికారులు తమ వద్ద ఉన్న జాబితాలను వాణిజ్య పన్నుల శాఖకు అందజేయాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జీఎస్టీ వసూళ్లపై సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఆస్తి పన్నులో కూడా జీఎస్టీ వసూలయ్యేలా చొరవ తీసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వత్తి పన్ను వసూలు కావాలన్నారు. జీఎస్టీ వసూళ్లపై డీడీఓలకు శిక్షణ ఇస్తామని చెప్పారు. టీడీఎస్ చెల్లింపులపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో రిజిస్టర్ కాబడిన వాణిజ్య వ్యాపారాలు, నూతన భవనాలు, ఇతర సముదాయాల మేరకు పన్నులు వసూలు చేసుకునేందుకు వీలుగా జాబితాలను వాణిజ్య పన్నుల శాఖకు అందజేయాలని తెలిపారు. మండల, గ్రామ స్థాయిలో ఆస్తి, ఇతర పన్నులు సక్రమంగా వసూలు చేసేలా గ్రామ సచివాలయ సిబ్బంది, ఎంపీడీఓలు అందజేయాలని స్పష్టం చేశారు. జీఎస్టీ వసూళ్లు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అందుకు గల కారణాలను తెలుసుకోవాలన్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జున మాట్లాడుతూ జిల్లాలో జీఎస్టీ వసూళ్లు తక్కువగా ఉన్నాయని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. తమ శాఖల ద్వారా చేపడుతున్న పనుల వివరాలను తమకు అందజేయడం ద్వారా జీఎస్టీ వసూలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అధికారుల సమన్వయంతో వసూలు చేసేందుకు సహకరించాలని కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ మోహనరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ డా.పి.ధర్మచంద్రారెడ్డి, డీఎంహెచ్ఓ డా.ఎస్.భాస్కరరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఎల్డీఎం ఎన్.విజయ్స్వరూప్, డీపీఓ టి.కొండలరావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇ.అప్పన్న, మున్సిపల్ కమిషనర్ సీహెచ్. వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఓ.ప్రభాకరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. పీఎం సూర్యఘర్పై ప్రత్యేక శ్రద్ధ పీఎం సూర్యఘర్ యూనిట్ల ఏర్పాటు, పీఎం జన్మ న్ గృహ నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్ర సాద్ ఆదేశించారు. వారంలోగా ప్రగతి కనబరచకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో హెచ్చరించారు. లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. ● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
సుపరిపాలనలో స్థానిక ప్రచారం!
● ఇంటింటికీ కాదు.. తూతూమంత్రంగా నిర్వహణ ● ముందుగానే గుర్తించిన ఇళ్ల సందర్శన ● పాలకొండలో పాల్గొనని ఎమ్మెల్యే ● శివరాంపురంలో సర్పంచ్ను టార్గెట్ చేసిన మంత్రి సాక్షి, పార్వతీపురం మన్యం: సుపరిపాలనలో తొలి అడుగు అంటూ.. ఏడాది పాలనపై కూటమి ప్రభు త్వం చేపట్టిన ఇంటింటా ప్రచారం నామమాత్రంగా సాగింది. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రచార ఆర్భాటంగా చేపట్టారు. నిలదీతలు ఉండొచ్చన్న అనుమానంతో ముందే గుర్తించిన కొన్ని ఇళ్లను సందర్శించి ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. పాలకొండలో మరోసారి వర్గ పోరు బహిర్గతమైంది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి వేరుగా కార్యక్రమం నిర్వహించా రు. జనసేన ఎమ్మెల్యే అసలు కార్యక్రమమే చేపట్టలేదు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం.. సాలూరు మండలం శివరాంపురం గ్రామంలో నిర్వహించిన సుపరిపాలన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. కొన్ని ఇళ్లను సందర్శించిన మంత్రి.. అనంతరం స్థానిక పాల ఉత్పత్తిదారుల సంఘ భవనంలోనే గ్రామస్తులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వంలో సాధించిన దాన్ని వివరించండం కంటే.. గత ప్రభుత్వంపై విమర్శలు, స్థానిక సర్పంచ్ జర్జాపు మోహన్ లక్ష్యంగా దాడికి దిగారు. కూటమి ప్రభుత్వంలో పంచాయతీ తీర్మానం లేకుండానే పనులు చేపడుతున్నారని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారిలో శివరాంపురం సర్పంచ్ మోహన్ ఒకరు. దీంతో ఆమె.. సర్పంచ్పై నిప్పులు చెరిగారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న ఇటువంటి సర్పంచ్ అవసరమా? అంటూ ప్రశ్నించారు. స్థానిక టీడీపీ నాయకుడు భాస్కర్ను చూపిస్తూ.. ఇక్కడి ప్రజలకు అండగా ఉంటారని, ఏ అవసరం వచ్చినా సంప్రదించాలని చెప్పారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో సదరు భాస్కర్నే సర్పంచ్ అభ్యర్థిగా ప్రచారంలో ఉండటం గమనార్హం. సచివాలయాన్ని సందర్శించిన సమయంలోనూ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్కు అనుకూలంగా పనిచేస్తున్నారా? అంటూ నిలదీశారు. పంచాయతీ ల అభివృద్ధికి తాము నిధులిస్తున్నప్పటికీ పనులు చేయకుండా అడ్డు తగులుతున్నారని సర్పంచ్ మోహన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ●పార్వతీపురం మండలం బంటువానివలస గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కేవలం 20లోపు ఇళ్లనే సందర్శించారు. ముందుగానే ఆయా ఇళ్లను గుర్తించి, ఎమ్మెల్యేను తిప్పి పంపినట్లు తెలుస్తోంది. కార్యకర్తల ఇళ్లకే పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి. స్థానిక నాయకులెవరూ అంతగా ప్రాధాన్యమివ్వకపోవడం గమనార్హం. పింఛన్లు, రోడ్లు, కుళాయి వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చారు. ●పాలకొండ నియోజకవర్గంలో కూటమిలోని జనసేనకు చెందిన నిమ్మక జయకృష్ణ ఎక్కడా పాల్గొనలేదు. భామిని మండలం పశుకుడిలో టీడీ పీ నియోజకవర్గ ఇన్చార్జి తన అనుచరులతో నామమాత్రంగా వేరుగా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ఇక్కడ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కురుపాంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాల్గొనగా.. ఇక్కడ కూడా నామమాత్రంగా సందర్శించి వెళ్లిపోయారు. -
ఏర్పాట్ల పరిశీలన
విజయనగరం: అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడే వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పూల్బాగ్లోని జగన్నాథ కళ్యాణ మండపంలో గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించే సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. శాసనమండలి విపక్షనేత బొత్ససత్యనారాయణ, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబుల ఆధ్వర్యంలో సాగే సమావేశంలో కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలనపై చర్చించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణ ప్రణా ళిక రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు, బూత్ కమిటీ అధ్యక్షుడు బూర్లె నరేష్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, పార్టీ నాయకులు కె.వి.సూర్యనారాయణరాజు, ఎంఎస్ఎన్ రాజు, తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన బిడ్డల చదువు కష్టాలు!
●అధ్వానంగా పాఠశాలలు ●వసతిలేని బడి ●కనీస సదుపాయాలు కరువు మక్కువ: గిరిజన బిడ్డలకు చదువు కష్టాలు వెంటాడుతున్నాయి. పక్కాభవనాలు లేకపోవడంతో చెట్లకింద, వంటషెడ్లు, సామాజిక భవనాలు, రేకులషెడ్లు, పూరిపాకల్లో అక్షరాలు నేర్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందిస్తామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పకతప్పదు. తమ పిల్లలు నిరక్ష్యరాస్యులుగా మిగిలిపోకూడదని, కష్టపడైనా పిల్లలను మంచి చదువులు చదివిద్దామని గిరిజన చిన్నారుల తల్లిదండ్రులు ఆశపడుతున్నా.. పిల్లలు చదువులు సాగించేందుకు కనీస సదుపాయాలు లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. పాఠశాలల విలీనంతో కష్టాలు మరింత ఎక్కువయ్యాయని వాపోతున్నారు. గిరిశిఖర గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడం, ఆర్థిక స్థితిగతులు అంతంతమాత్రం కావడంతో, సుదూర ప్రాంతాల్లోని పాఠశాలలకు ఆ చిన్నారులను చదువులకు పంపించలేకపోతున్నామని చెబుతున్నారు. గిరిజన, సీ్త్ర శిశుసంక్షేమ శాఖమంత్రిగా కొనసాగుతున్న గుమ్మడి సంధ్యారాణి ఇదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అయినా గిరిజనుల సంక్షేమం, పిల్లల చదువులను కనీసం పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు. -
చినుకుపడితే సాగని చదువులు
చిత్రంలో పిల్లలు చదువుతున్న రేకుల షెడ్ మక్కువ మండలంలోని గిరిశిఖర గ్రామమైన చిలకమెండంగిలోని సామాజిక భవనం. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు పక్కాభవనం లేదు. గత ప్రభుత్వం నాడు–నేడు కింద పక్కాభవనానికి నిధులు మంజూరు చేసినా నిర్మాణం ప్రారంభం కాలేదు. ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదు. ఫలితం.. వాతావరణం తెరిపిస్తే, ఆరుబయట చెట్ల కింద, వర్షం, ఎండ తీవ్రంగా ఉంటే గ్రామస్తులు చందాలతో నిర్మించుకున్న సామాజిక భవనం(రేకులషెడ్)లో ఒకటి నుంచి ఐదు తరగతులు చదువుతున్న 22 మంది విద్యార్థులకు తరగతులు బోధిస్తున్నారు. విద్యార్థులు పాఠశాలకు చేరుకోవాలంటే రాళ్లు, రప్పలతో కూడిన ఎత్తైన రహదారే మార్గం. -
మంత్రి ఇలాకాలో తప్పని డోలీమోత..
సాలూరు/సాలూరురూరల్: డోలీమోతలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన సీ్త్ర శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రాతినిథ్యం వహిస్తున్న సాలూరు నియోజకవర్గంలో డోలీ మోతలు నిత్యకృత్యంగా మారాయి. సాలూరు మండలం కరడవలస పంచాయతీ ఎగువకాసాయివలస గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త కూనేటి శ్యామల వాంతులు, విరోచనాలు, తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురైంది. లేవలేని స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యుల సుమారు 5 కిలోమీటర్ల మేర రాళ్లదారిలో డోలీలో సువర్ణముఖి నదిని దాటి కురుకూటి పీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక వైద్యం అందించిన తర్వాత మెరుగైన వైద్యసేవల కోసం సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. డోలీ మోతలు లేకుండా కంటైనర్ ఆస్పత్రిని ఏర్పాటుచేశామని మంత్రి ప్రకటించిన కరడవలస పంచాయతీ పరిధిలోని ఎగువ కాసాయివలసకు చెందిన ఆశ వర్కర్నే డోలీలో తరలించడం గమనార్హం. గిరిజనులకు డోలీ మోతలు తప్పిస్తామన్న మంత్రి సంధ్యారాణి ప్రకటనలకే పరిమితమవుతున్నారని, చేసేదేమీ లేదని సీపీఎం సాలూరు మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు విమర్శించారు. సాలూరు ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న ఆశవర్కర్ శ్యామలను ఆయన పరామర్శించారు. గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. -
ఫీల్డ్ అసిస్టెంట్స్కు బకాయి జీతాలివ్వాలి
విజయనగరం ఫోర్ట్: ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరినీ రెన్యువల్ చేసి వెంటనే బకాయి ఉన్న మూడు నెలల జీతాలు ఇప్పించాలని ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎస్. రాజారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మ్యాన్ డేస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సస్పెన్షన్కు గురైన ఫీల్డ్ అసిస్టెంట్స్ను విధుల్లోకి తీసుకోవాలని ఎన్ఎంఎంఎస్యాప్ సాఫ్ట్వేర్లో మార్పులు చేసి సాంకేతిక లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. టార్గెట్ పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్స్పై పని ఒత్తిడిని పెంచే విధానాన్ని విడనాడాలని కోరు. కార్యక్రమంలో లక్ష్మి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ విజ్ఞప్తి -
అక్రమ గ్రావెల్ తవ్వకాలకు జరిమానా
నెల్లిమర్ల రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం బోడికొండను సీతారామునిపేట జంక్షన్ వద్ద పలువురు అక్రమార్కులు గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్న అంశంపై గత నెల 27న ‘రామయ్యా..చూడవేమయ్యా..! శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై అధికార యంత్రాంగం స్పందించింది. రెవెన్యూ, మైనింగ్, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి బుధవారం వెళ్లి పరిశీలించారు. అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు నిర్ధారించి తవ్వకాలపై ఆరా తీశారు. తంగుడుబిల్లి గ్రామానికి చెందిన రామారావు అనే వ్యక్తికి రూ.15 వేలు జరిమానా విధించారు. గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ఐ సతీష్, వీఆర్వో షలీమా, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. -
పనుల పూర్తికి ఆరుమాసాల గడువు
● ఇంజినీర్లను ఆదేశించిన కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్, జలవనరులు, ప్రజా ఆరోగ్యం, గిరిజన సంక్షేమం, ఏపీ ఎంఎస్ఐడీసీ, ఏపీఈడబ్ల్యూ ఐడీసీ, ఏపీ టిడ్కో, గృహ నిర్మాణ సంస్థల ద్వారా చేపట్టిన పనులన్నీ ఆరు మాసాల్లోగా పూర్తికావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను సిద్ధం చేసి శాసనసభ్యుల ఆమోదంతో ప్రతిపాదనలను సమర్పించాలని పేర్కొన్నారు. నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం శాఖల వారీగా చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు, మార్గదర్శకాలు జారీచేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అన్ని శాఖల ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జన్మన్ పనులపై ప్రత్యేక శ్రద్ధసమావేశంలో కల్టెర్ శ్యామ్ప్రసాద్ మాట్లాడుతూ పీఎం జన్మన్ కార్యక్రమం కింద చేపట్టిన రహదారుల పనులను వేగవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమైన పీఎం జన్మన్ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇకపై ప్రతిరోజూ, ప్రతివారం, ప్రతి మాసం సాధించిన ప్రగతి వివరాలను తనకు సమర్పించాలని, ఆగస్టు 15 నాటికి పనులు పూర్తయ్యేలా బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రారంభించి కొనసాగుతున్న పల్లె పండుగ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని తేల్చిచెప్పారు. అలాగే శతశాతం పనులు పూర్తయి ప్రారంభం కాని గ్రామ సచివాలయ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర కట్టడాలను శాసనసభ్యుల ద్వారా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నియోజక వర్గంలో అవసరమైన పనులను గుర్తించి, వాటి జాబితాలను సిద్ధం చేయాలన్నారు. అటువంటి వాటిని ఆయా నియోజక వర్గ శాసనసభ్యుల ఆమోదంతో ప్రతిపాదిస్తే, వాటికి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో పూర్తయిన గృహాలను, అదేవిధంగా లేఅవుట్స్లో పూర్తయిన గృహాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ఉపకలెక్టర్ డా.పి.ధర్మచంద్రారెడ్డి, డీఎంహెచ్ఓ డా.ఎస్.భాస్కరరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీపీఓ టి.కొండలరావు, మునిసిపల్ కమిషనర్ సీహెచ్.వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఒ.ప్రభాకరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
చిల్లంగి నెపంతో మహిళ హత్య?
బొబ్బిలి: పట్టణంలోని బండారు వీధిలో నివాసముంటున్న కరగాని పద్మ(45) అనే మహిళ హత్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం తాను నివసిస్తున్న ఇంట్లోంచి తీవ్ర గాయాలతో అరుస్తూ వచ్చి గుమ్మం వద్ద పడిపోవడంతో స్థానికులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో పోస్ట్మార్టం రూమ్కు తరలించారు. పక్క పక్క ఇళ్లలో ఉంటున్న కుటుంబసభ్యులే హతమార్చి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. కరగాని పద్మ పలువురి ఇళ్లలో పనులు చేసుకుంటోంది. భర్త పైడిరాజు మేకలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. పెళ్లిళ్లై ఆటోలు నడుపుకుంటూ వేరే చోట ఉంటున్నారు. పద్మ చిల్లంగి పెట్టడం వల్ల తన భార్య చనిపోయిందని, కుమారుడు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చిందని, దీనందటికీ పద్మే కారణమన్న అనుమానంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసినట్లు పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు. డీఎస్పీ పరిశీలన ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ జి.భవ్యారెడ్డి మృతురాలు పద్మ నివసిస్తున్న ఇంటిని పరిసరాలను పరిశీలించారు. ఎస్సై రమేష్కుమార్తో కలిసి కుటుంబసభ్యులు, స్థానికులను విచారణ చేశారు. అనంతరం క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించారు. కత్తిపీటపై పడిపోయిందని.. డీఎస్పీ, పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను విచారణ చేయగా పద్మ కత్తిపీటమీద పడిపోయిందని, గాయాల పాలై చనిపోయిందని కుటుంబసభ్యులు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. -
రక్తహీనత నివారణలో పురోగతి ఉండాలి
పార్వతీపురం రూరల్: రక్తహీనత నివారణే ధ్యేయంగా పార్వతీపురం మన్యం జిల్లాలో చేపడుతున్న ఎనీమియా ఏక్షన్ కమిటీల ద్వారా పురోగతి సాధించే దిశగా కార్యాచరణ చేపట్టాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు మండలంలోని తాళ్లబురిడి, పెదబొండపల్లిలో నిర్వహించిన ఎనీమియా ఏక్షన్ కమిటీలను(ఏఏసీ) బుధవారం ఆయన పర్యవేక్షించారు. రక్తహీనత నివారణకు ఏ విధమైన కార్యాచరణ చేపడుతున్నారు? చేసిన కమిటీ తీర్మానం, రక్తహీనతగా గుర్తించిన గర్భిణి, బాలింతల వివరాలు అయన రికార్డులో పరిశీలించారు. గతనెలలో రక్తహీనత నివేదికల్లో ప్రస్తుతం పురోగతిపై ఆరా తీశారు. అనంతరం గర్భిణి, బాలింతలకు తగు సూచనలు, జాగ్రత్తలు తెలియజేశారు. పౌష్టికాహారం ఆవశ్యకతపై వివరించి అంగన్వాడీ కేంద్రం నుంచి అందజేస్తున్న టీహెచ్ఆర్ సద్వినియోగం చేసుకోవాలని, కిల్కారీ మొబైల్ సందేశాన్ని పాటించాలని సూచించారు. ఐరన్ మాత్రలు క్రమం తప్పకుండా వేసుకోవాలన్నారు. గర్భిణి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షణ చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం డీఎంహెచ్ఓ గర్భిణులకు పౌష్టికాహారం అందజేసి సీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహన్రావు, డీపీఎంఓ డా.పీఎల్ రఘుకుమార్, వైద్యాధికారులు డా.కౌశిక్, ధరణి తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు -
సర్వజన ఆస్పత్రిలో ఎస్టీ సెల్ ఏర్పాటు
● ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకర రావు విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఘోషాఆస్పత్రుల్లో షెడ్యూల తెగల ప్రజల సహాయం కోసం ప్రత్యేకంగా ఎస్టీ సెల్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకర రావు అఽధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ముందుగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఓపీ విభాగాలను, జనరల్ వార్డు, సర్జరీ విభాగం, ఐసీయూ, రేడియాలజీ, సిటిస్కాన్ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వైద్యసేవలు, భోజన నాణ్యత గురించి తెలుసుకున్నారు. అనంతరం ఘోషాఆస్పత్రిని సందర్శించి ప్రసూతి విభాగం, పిల్లల వార్డు, ఐసీయూ, చిన్నారులకు, పోషకాహారం అందించే వార్డులను తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఘోషాఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, ప్రజల అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుని అవసరమైన సేవల ఏర్పాటు గురించి ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఆస్పత్రిని సందర్శించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీ రాణి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంబంగి అప్పలనాయుడు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పీఏ.రమణి తదితరులు పాల్గొన్నారు. -
ఏనుగుల సంచారంతో బెంబేలు
వంగర: మండలంలోని వివిధ గ్రామాల్లో ఏనుగుల గుంపు సంచరించడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గడిచిన ఐదు రోజులుగా ఒకే ప్రదేశంలో తిష్ఠవేయడంతో అటు ప్రయాణికులు, ఇటు రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం కూడా మడ్డువలస వంతెన ఆవరణలోని పంటపొలాల్లో తొమ్మిది ఏనుగుల గుంపు సంచరిస్తోంది. పంట పొలాల్లో చొరబడి పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో మడ్డువలస, సంగాం, మగ్గూరు గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే వంగర–రాజాం రోడ్డును ఆనుకుని ఏనుగుల గుంపు తిష్ఠ వేయడంతో పలుమార్లు పోలీస్, అటవీశాఖ అధికారులు రోడ్డును బ్లాక్ చేస్తూ వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. రైతులు, వాహనచోదకులు అప్రమత్తంగా ఉండాలని, ఎలిఫెంట్ ట్రాకర్స్, రోడ్డుపై ఉన్న వివిధ శాఖల అధికారుల పరిశీలన అనంతరం ఏనుగులు సంచరించే ప్రదేశాలు దాటుకుని వెళ్లాలని సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి ఏనుగులు సంచరించే ప్రాంతంలో రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ హరి రమణారావు తెలిపారు. మడ్డువలస వద్ద ఏనుగుల గుంపును బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం అటవీశాఖ అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో అటవీ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఉన్నారు. మడ్డువలస బ్రిడ్జి ఆవరణలో తిష్ఠ -
రాజధానికి జిందాల్ సెగ
● షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్కు నిర్వాసితుల వినతి శృంగవరపుకోట: జిందాల్ పరిశ్రమ తమతో ఆడుతున్న ఆటలతో అలిసిపోయిన నిర్వాసితులు తమ నిరసన సెగ రాజధానిని తాకేలా చేశారు. ఈ మేరకు బుధవారం పలువురు జిందాల్ నిర్వాసితులు రాజధాని అమరావతిలో షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ను కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. జిందాల్ పరిశ్రమ ఏర్పాటు కానందున తమ భూములు తమకివ్వాలని కోరారు. ఎంఎస్ఎంఈ పార్కులకు కావాలంటే కొత్తగా భూసేకరణ చేయాలని, తాటిపూడి నీరు తాగునీటి అవసరాలకు కేటాయించాలని, శాంతియుతంగా పోరాడుతున్న తమపై పోలీసుల దమనకాండను నిరోధించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. అలాగే ప్రజాదర్బార్లోను, జనసేన కేంద్ర కార్యాలయంలోను వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాసితులు ఎం.సన్యాసిరావు, జి.ఈశ్వరరావు, ఎం.సన్యాసమ్మ, డి.సింహాచలం, బి.లక్ష్మణరావు, పి.రేవతి, కె.పైడితల్లి, బి,విజయ్బాబు, కేత వీరన్న, కిల్లో అర్జున, కె.సన్యాసిరావు, టి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్ దీనకుమార్కు సత్కారం
సీతానగరం: పార్వతీపురం బదిలీ అయిన పశుసంవర్థక ఎ.డి డాక్టర్ సీహెచ్ దీనకుమార్ను పశువైద్య సహాయకులు మంగళవారం ఘనంగా సత్కరించారు. దీర్ఘకాలంగా మండల పశువైద్యాధికారి, సీతానగరం పశువైద్య శాఖసబ్ డివిజినల్ ఎ.డిగా డాక్టర్ దీనకుమార్ సేవలందించిచారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీలు కావడంతో పార్వతీపురం సబ్డివిజన్ ఎ.డి గా బదిలీ అయినందున పశువైద్య సహాయకులు ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. సన్మాన గ్రహీత డాక్టర్ దీనకుమార్ మాట్లాడుతూ ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు అనివార్యమే అయినా విధుల్లో అందించిన సేవలు చిరస్మరణీయంగా ఉండిపోతాయన్నారు. సుదీర్ఘకాలం మండలంలో పశువులకు సేవలందించే సదవకాశం తనకు దక్కిందన్నారు. విధి నిర్వహణలో సహకరించిన ఉన్నతాధికారులు, సహచర ఉద్యోగులు. ,శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. -
సోషల్ మీడియా వరమా? శాపమా?
అడిక్షన్ ఉందో లేదో ఇలా గుర్తించొచ్చు... సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల ఉద్యోగం, చదువు, పనులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే ఏదైనా నిర్దిష్ట సమయంలో చేయాల్సిన పనికి బదులు ఫోన్లో యాప్లను తెరిస్తే అది వ్యసనానికి సంకేతంగా చెబుతున్నారు. ● స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి ఉన్నప్పుడు, భోజనం చేసేటప్పుడు స్మార్ట్ ఫోన్ను తీసుకోవడం, మెస్సేజ్లను చూడడం. ● ప్రతి చిన్న సమస్యకు పరిష్కారంగా ఆన్లైన్, సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడడం.విజయనగరం గంటస్తంభం: సోషల్ మీడియా ఇప్పుడు మనిషి నిత్యకృత్యాల్లో ఓ భాగమైంది. బంధుమిత్రులతో కనెక్ట్ అవ్వడానికి మంచి వేదికై ంది. అనుభావాలను, అలవాట్లను, ఆలోచనలను పంచుకునే చోటు. ఇది కొంతమేర బాగానే ఉన్నా ఎదుటివారి ‘సోషల్ బతుకు’లను చూస్తూ కుంగుబాటుకు లోనవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇతరుల వివరాలు, వినోదాలు, విలాసాలను చూస్తూ.. చాలామంది.తమను తాము తక్కువ చేసుకుంటున్నారు. మరి సోషల్ మీడియాలో మనం చూసే ప్రతిదీ నిజమేనా? అంటే..‘కాదు’ అనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకుంటే ‘ఫ్యామిలీ ఓవర్ ఎవ్రీఽథింగ్’ అంటూ ఫొటోను స్టేటస్ పెట్టుకునేవారు పట్టుమని పది నిమిషాలు కూడా ఫ్యామిలీతో గడపకపోవచ్చు. ‘ఫ్రెండ్స్ ఫర్ లైఫ్’ అనేవారు అసలు స్నేహితులే లేకపోవచ్చు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటూ అర్ధరాత్రి పూట పోస్టులు పెడుతుండవచ్చు, నిద్రపోకుండా ఆరోగ్యం పాడుచేసుకోవచ్చు. ‘అమ్మే దైవం’ అని ఎమోషనల్ క్యాప్షన్స్ పెట్టేవారంతా అమ్మకు పనుల్లో సాయం చేస్తారన్నది అపోహే. పొద్దున నిద్ర లేదగానే దేవుడి వీడియోలను స్టేటస్లుగా పెట్టుకున్నవారు మంచి మనుషులని ఏ తప్పూ చేయని వారని అనుకుంటే పొరపాటే. పిల్లికి బిచ్చం వేయనివారే ‘సొంత లాభం కొంత మానుకుని పొరుగువానికి తోడుపడవోయ్’ అంటూ ఫోజులు కొట్టవచ్చు. నువ్వు లేనిదే నేను లేనంటూ ఇన్ బాక్స్ల్లో ప్రేమ పాఠాలు వల్లె వేసేవారు..ఆ మాటే మరొకరికి చెప్పరని గ్యారంటీ లేదు. ఖరీదైన కారు ముందో, విలాసవంతమైన భవనం ముందో నిలబడి ఫొటోలు పెడితే వాళ్ల వైభోగాన్ని చూసి అసూయ కలుగుతుంది. కానీ అవి వాళ్ల సొంతమేనా కాదా? వారికి ఆ తాహతుందా, లేక ఆర్భాటాలకు పోయి ఆనక అప్పులతో ఇబ్బందులు పడుతున్నారా? అవేవీ మనకు తెలియదు. ఫొటోల కోసం ఎవరికో ఏదో సాయం చేస్తున్నట్లు నటించేవారు పెరుగుతున్నారని వారి సోషల్ మీడియా పోస్టులే చెబుతుంటాయి. ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్లలో అందమైన అమ్మాయిలు ఫొటోలు చూసి ఆత్మన్యూనతకు లోనయ్యేవారు, తామూ అలాగే కనపడాలని రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటున్న వారూ లేకపోలేదు. ఫొటోలకు ఫిల్టర్లు ఉంటాయని ఎలాంటి వారైనా అందంగా కనిపించవచ్చని ఆ క్షణం స్ఫురించదు. తెరమీద కనిపించేవన్నీ ఫిల్టరేసిన బతుకులు. నిజజీవితాలు కాదు. నిజాయతీగా ఉన్నదున్నట్లు చూపించుకునేవారూ ఉంటారు. కాకపోతే వారిది ప్రదర్శనలా ఉండదు. ఎవరికీ ఇబ్బంది కలిగించదు. లేనిది ఉన్నట్లూ ఉన్నది లేనట్లూ చూపించుకోవడానికి సోషల్ మీడియాను మయసభలా వాడుకునేవారితోనే సమస్యంతా. మంచికి వాడుకుందాం.. పోస్టులు పెడుతుంటారు, సమాచారాన్ని షేర్ చేస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో రాజకీయ, విధానాపరమైన పోస్టులే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి.ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాలు, న్యాయపరమైన విధానాలపై వచ్చే పోస్టులను ఇతరులకు పంపడం ద్వారా చిక్కుల్లో పడుతుంటాం. అనవసరంగా పోలీసు కేసుల బారిన పడుతుంటాం.అటువంటి సమయంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సాక్ష్యాలుగా చూపుతున్నారు పోలీసులు. లేనిపోని లింకులు క్లిక్ చేయడం, పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. యువతపై అత్యధిక ప్రభావం సెల్ఫీల మోజు బాగా పెరిగింది..సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడానికి వినియోగించుకోవాలి. అతిగా సెల్ఫోన్ వినియోగంచడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. ఇక యువతకు సెల్ఫీ మోజు బాగా పెరిగింది. సెల్ఫీ మోజులో ఎక్కడపడితే అక్కడ ఫొటోలు దిగుతున్నారు. దీంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. వై.సతీష్ కుమార్, సీనియర్ కెమిస్ట్రీ లెక్చరర్, విజయనగరం తల్లిదండ్రులు నియంత్రించాలి.. అనవసరమైన వయస్సులో పిల్లలకు సెల్ఫోన్ ఇవ్వకూడదు. యువత ఫోన్లను విపరీతంగా వాడుతోంది. సరదా కోసం తీస్తున్న సెల్ఫీలు చివరకు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. – ప్రశాంత్ కుమార్ ఎంఎస్సీ సైకాలజీ, విజయనగరం -
కొంతమందికే ప్రోత్సాహకం..!
● ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే గర్భిణులకు జేఎస్వై లబ్ధి ● ఏప్రిల్ నుంచి జూన్ 26వరకు 1842 మంది ఆన్లైన్లో నమోదు ● 1232 మందికి మాత్రమే నగదు జమ ● ఆరోగ్య ఆసరాకు మంగళం పాడేసిన కూటమి సర్కారువిజయనగరం ఫోర్ట్: మాతాశిశు సంక్షేమానికి కోట్లాది రుపాయలు ఖర్చు చేస్తున్నామని కూటమి సర్కార్ గొప్పలు చెబుతోంది, కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే మహిళలను ప్రోత్సహించడం కోసం అందించే జేఎస్వై ప్రోత్సాహకాలు అందించడంలో కూటమి సర్కార్ అలసత్వం వహిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రోత్సాహకాలు అందరికీ కాకుండా కొంతమందికి ఇచ్చినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఆస్పత్రుల్లో ప్రసవించే మహిళలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.5 వేలు ఆరోగ్య ఆసరా కింద ఇచ్చేది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య ఆసరాకు మంగళం పాడేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసవాలు జరిగే ఆస్పత్రులు జిల్లాలో ఎస్.కోట, గజపతినగరం, రాజాం, చీపురుపల్లి ఏరియా ఆస్పత్రులు, బాడంగి, నెల్లిమర్ల, భోగాపురం, బొబ్బిలి సీహెచ్సీలు, ఘోషాఆస్పత్రిలో ప్రసవాలు జరుగుతాయి. అదేవిధంగా జిల్లాలో ఉన్న 48 పీహెచ్సీల్లోనూ ప్రసవాలు జరుగుతాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే బాలింతలకు జననీ సురక్ష యోజన కింద ప్రోత్సాహకం (జేఎస్వై) అందజేస్తారు. గ్రామీణ ప్రాంత తల్లులకు రూ.1000, పట్టణ ప్రాంత తల్లులకు రూ.600 ఇస్తారు. 1842మంది తల్లుల నమోదు ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి జూన్ 26వతేదీ నాటికి ఎంఎస్ఎస్ పోర్టల్లో 1842 తల్లులు వివరాలు అప్లోడ్ చేశారు. అందులో 1232 మందికి మత్రమే నగదు జమ అయింది. 610 మందికి జేఎస్వై ప్రోత్సాహకం అందాల్సి ఉంది.మిగిలిన వారికి త్వరలో అందజేతజేఎస్వై కింద గ్రామీణ ప్రాంత మహిళలకు రూ.1000, పట్టణ ప్రాంత మహిళలకు రూ.600 చొప్పన ప్రోత్సాహకం అందించనున్నాం. ఈ ఏడాది ఇంతవరకు 1842 మందికి గాను 1232 మందికి ప్రోత్సాహకం వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. మిగతా 610 మందికి కూడా త్వరలో వారి ఖాతాల్లో జమ అవుతుంది. డాక్టర్ ఎస్. జీవనరాణి, డీఎంహెచ్ఓ -
తాగునీటి సమస్యలు పరిష్కరించాలి
విజయనగరం అర్బన్: తాగునీరు, భూమస్యలను పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కారిగూడ పంచాయతీ దొందమానుగూడ గ్రామ గిరిజనులు పలువురు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీశంకరరావును కలిసి వినతపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు మంగళవారం స్థానికంగా ఉన్న చైర్మన్ ఇంటికి వెళ్లి తమ గోడు చెప్పుకున్నారు. మంచినీటి సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గ్రామస్థాయిలో భూ సమస్యలపై చైర్మన్తో చర్చించారు. పైనాపిల్, కొండచీపుళ్లు, చిరుధాన్యాలు వంటి పంటలకు గిట్టుబాబు ధర లేక నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చైర్మన్ సానుకూలంగా స్పందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని గిరిజనులకు హామీ ఇచ్చారు. చైర్మన్ను కలిసిన వారిలో సవర సింహాచలం, హడ్డుబంగి శేషమ్మ ఉన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్కు గిరిజనుల వినతి -
వైఎస్సార్సీపీ విస్తృత సమావేశం విజయవంతం చేద్దాం
పార్వతీపురంటౌన్: వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేద్దామని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం పార్టీ ముఖ్యనాయకులతో కలిసి తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 5న శనివారం మధ్యాహ్నం 3గంటలకు జిల్లా కేంద్రంలో గల రాయల్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వద్ద వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అధ్యక్షతన వైఎస్సార్సీపీ శ్రేణులతో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నామన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్ కోఆర్డినేర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబులు హాజరవుతారని తెలియజేశారు. పార్లమెంట్ పరిశీలకులు, ఎంపీ, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్యనాయకులు హాజరు కానున్నారన్నారు. అందరూ హాజరుకావాలి ఈ సమావేశానికి పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో గల మూడు మండలాలు, పురపాలక సంఘం నుంచి పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలో వివిధ హోదాల్లో గల సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ కార్పొరేషన్ సభ్యులు, మాజీ డీసీసీబీ, మాజీ డీసీఎంఎస్ సభ్యులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు అందరూ తప్పక పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఆయనతో పాటు పార్టీ మండల అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, బొంగు చిట్టిరాజు, బొమ్మి రమేష్, పాలవలస మురళీకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, ఎంపీపీలు మజ్జి శోభారాణి, గుడివాడ నాగమణి, జెడ్పీటీసీ అలజంగి రవికుమార్, వైస్ ఎంపీపీలు సిద్ధా జగన్నాథం, బంకురు రవికుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి తప్పెట ప్రసాద్, అధికార ప్రతినిధి మువ్వల సత్యం నాయుడు, జిల్లా ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు పీఎస్ఆర్ నాయుడు, ఎంపీటీసీలు బడే రామారావు, వై.రమణ, సర్పంచ్లు తీళ్ల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు -
పోటాపోటీగా పింఛన్ల పంపిణీ
● రెండు ప్రాంతాల్లో రెండు వర్గాలుగా అందజేత ● టీడీపీలో రాజుకుంటున్న గ్రూపుల కుంపటి శృంగవరపుకోట: మేజర్ పంచాయతీ ఎస్.కోటలో మంగళవారం అధికార టీడీపీ నేతలు రెండు వర్గాలుగా, పోటాపోటీగా పింఛన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే లలితకుమారి తన అనుయాయులతో కలిసి కోటవీధిలో, ఏపీ టూరిజం బోర్డు డైరెక్టర్ సుధారాజు తన అనుయాయులతో కలిసి పుణ్యగిరిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంగళవారం పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీలో రాజుకుంటున్న అసమ్మతి కుంపటికి ఇది నిదర్శనం. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఆరంభం నుంచి రెండు గ్రూపులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యే లలితకుమారి, ఎమ్మెల్యే సీటు కోసం ఆశించి భంగపడి, డీసీఎంఎస్ చైర్మన్గిరితో సరిపెట్టుకున్న గొంప కృష్ణ రెండు వర్గాలుగా ఉన్నారు. గొంప కృష్ణ వర్గానికి ఎంపీ భరత్ ఆశీస్సులు మెండుగా ఉన్న విషయం విదితమే. కాగా ఇటీవల శాసనసభ ఎన్నికల్లో నారా లోకేష్ హామీతో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎంపీపీ సోమేశ్వరరావు, వైస్ ఎంపీపీ సుధారాజు, ఎస్.కోట సర్పంచ్ సంతోషికుమారితో పాటు కొందరు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అసంతృప్తిలో మూడో వర్గం మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వైస్ ఎంపీపీ సుధారాజు వర్గం అధికార పార్టీ నేతల తీరుపై గుర్రుగా ఉన్నారు. పార్టీలో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కార్యక్రమాలు వేటికీ తమకు సమాచారం ఇవ్వకుండా, తమ ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారని మధనపడుతున్నారు. నాడు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చి, నమ్మించి నట్టేట ముంచుతున్నారని కలత చెందుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, నిధులు, విధులు, సంక్షేమ కార్యక్రమాలు ఇలా ఎక్కడా తమ మాట చెల్లడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ దగ్గకు పంచాయితీ? తమకు తగిన గౌరవం దక్కడం లేదని నేరుగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేసి, నాడు ఇచ్చిన హామీలను గుర్తుచేయాలని సుధారాజు వర్గం యోచిస్తోంది. ఇందుకోసం లోకేష్ అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారని, త్వరలోనే అధిష్టానం పెద్దలకు వాస్తవాలు చెప్పేందుకు అమరావతి వెళ్లనున్నట్లు కచ్చితమైన సమాచారం. -
కళ్లకు గంతలతో నిరసన
శృంగవరపుకోట: జిందాల్ పరిశ్రమ కళ్లు మూసి జెల్ల కొట్టిందని, తడి గుడ్డతో రైతుల గొంతు కోసిందని నిర్వాసిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ రఘురాజు నివాసం వద్ద మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో రోడ్డుమీద కళ్లకు గంతలు కట్టుకుని జిందాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిందాల్తో చేతులు కలిపి అన్ని పార్టీల నాయకులు, జిల్లా అధికారులు తమను కళ్లు మూసి జెల్ల కొట్టారని, జిందాల్ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని, వాపోయారు. జిల్లా పెద్దదిక్కు అయిన కలెక్టర్ తన ఉద్యోగం మరిచిపోయి జిందాల్ ప్రతినిధిలా మాట్లాడటం విద్డూరంగా ఉందని, నాడు నమ్మించి ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులు నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పి వెళ్లిపోయారని, ఇప్పటికీ ముఖం చూపడం లేదన్నారు. నాడు జిందాల్ ఇచ్చిన హామీలు ఎవరు తీరుస్తారు? ఎలా తీరుస్తారని అడిగితే చెప్పకుండా ముఖం చాటేయడం న్యాయమా? జీవనోపాధి అయిన భూములు కోల్పోయి న్యాయం అడిగితే మమ్మల్ని పోలీసుల్ని పెట్టి బెదిరిస్తున్నారని వాపోయారు. కార్యక్రమంలో పలువురు రైతులు, మహిళలు పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీలకు ఎమ్మెల్సీ లేఖ జిందాల్ భూసమస్య చుట్టూ తతెత్తుతున్న పరిస్థితి అర్దం చేసుకోవాలని, తొలుత నిర్వాసితుల శాంతియుత నిరసనకు అనుమతించి తర్వాత వారిని అనుమతించక పోవడం వల్ల నిర్వాసితులు తన ఇంటికి వస్తున్నారని, స్థానికుడిని కావడం వల్ల వారిని కాదనలేక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఎమ్మెల్సీ రఘురాజు అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో వారి అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవడానికి అనుమతించి, తనపై ఒత్తిడి తగ్గించాలని ఎమ్మెల్సీ రఘురాజు కలెక్టర్, ఎస్పీలకు లేఖలు ఇచ్చారు. జిందాల్ మోసం చేసిందని నిర్వాసితుల ఆందోళన -
సమాజంలో వైద్యులకు ప్రత్యేక స్థానం
పార్వతీపురంటౌన్: సమాజంలో వైద్యునికి ప్రత్యేక స్థానం ఉందని, ప్రజారోగ్యమే ధ్యేయంగా అంకితభావంతో వైద్య సేవలందజేయాలని డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు కోరారు. జిల్లా వైద్యారోగ్య కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో వైద్య సేవల నిర్వహణపై సమీక్షించారు. జిల్లాలో గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలు అందజేస్తున్న వారిని అభినందించారు. వైద్యవృత్తిలో అంకిత భావంతో పాటు సేవావృక్పథం అలవర్చుకుంటే ప్రజలకు మెరుగైన వైద్యం అందడమే గాక, మనకెంతో సంతప్తి నిస్తుందన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు జగన్మోహన్, రఘు, వినోద్, నగేష్ రెడ్డి, కార్యాలయ సూపరింటెండెంట్ కామేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు -
విత్తుకు అదును కరువు!
వీరఘట్టం: ఈ ఏడాది ఖరీఫ్కు వాతావరణం సహకరించకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఏటా జూలై మొదటి వారానికి వరి నారుమడులు సిద్ధం చేసేవారు. జూలై నెలాఖరుకు 80 శాతం వరినాట్లు పూర్తయ్యేవి. మిగిలిన 20 శాతం ఆగస్టు 15 వరకు జరిగేవి. ప్రస్తుత వాతావరణంలో వింత పరిస్థితులు నెలకున్నాయి. గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో నారుమడుల్లో విత్తనాలు జల్లేందుకు అదును కుదరడంలేదు. వెదజల్లుదామన్నా తేమ ఎక్కువ కావడంతో దుక్కిచేయలేని పరిస్థితి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఎప్పుడు గట్టెక్కుతామో తెలియక రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. అనుకూలించని వాతావరణం ఏటా ఆరుద్ర కార్తెలో రైతులు వరి విత్తనాలను వేసి నారుమడులు సిద్ధంచేస్తారు. ఈ ఏడాది జూన్ 22న ఆరుద్ర కార్తె ప్రారంభమైంది. ఈ కార్తెలో విపరీతమైన ఉక్కపోత ఉంటుంది. ఇలా 14 రోజుల పాటు ఉండే ఆరుద్రకార్తెలో నారుమడులు సిద్ధం చేస్తారు. అయితే, గడిచిన 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఆరుద్రకార్తె సీజన్ ప్రభావం కనిపించ లేదు. వాతావరణం వరి నారుమడులకు అనుకూలించకపోవడంతో ఖరీఫ్కు ఎలా సన్నద్ధంకావాలో తెలియక రైతన్నలు దిగులు చెందుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 1.75 లక్షల ఎకరాలు కాగా, ఆ మేరకు సాగు అవుతుందా లేదా అన్న బెంగ రైతులను వెంటాడుతోంది. ఒక్క మొలక కూడా రాలేదు నేను ఐదెకరాల్లో వరి సాగుకు సిద్ధమయ్యాను. రెండు బస్తాల విత్తనాలను నారుమడిలో జల్లాను. 15 రోజులుగా రోజూ వర్షం కురుస్తుండడంతో విత్తనాలు కుళ్లిపోయాయి. ఒక్క మొలక కూడా రాలేదు. ఏం చేయాలో అర్థంకావడంలేదు. – డి.మహేష్.రైతు,వీరఘట్టం 20 కుంచాల విత్తనాలు వేశాను ఏటా వరినాట్లు వేస్తున్నాను. ఈ ఏడాది కూడా వరి నారుమడి సిద్ధం చేసి 20 కుంచాల విత్తనాలను జల్లాను. ఇంకా మొలకలు రాలేదు. వాతావరణం చూస్తే రోజూ వర్షం పడుతూనే ఉంది. ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉంది. – కె.రమణ, రైతు, వీరఘట్టం 15 రోజులుగా కురుస్తున్న చిరుజల్లులు అదునుకాని పొలాలు సమయం మించిపోతుండడంతో ఆందోళనలో అన్నదాత ఆందోళన వద్దు ప్రస్తుతం వాతావరణం గత 15 రోజులుగా బాగాలేనందున రైతులు నారుమడులు, వెదజల్లేందుకు ముందుకు రాలేదు. అక్కడక్కడా కొద్దిగా వేసిన నారుమడుల్లో మొలకలు రాలేదనే విషయం తెలిసింది. వర్షం నిరంతరాయంగా కురుస్తుంటే విత్తనం కుళ్లిపోయి మొలకలు రావు. అదును ఇంకా ఉంది. ఆగస్టు 15 వరకు వరినాట్లు వేయవచ్చు. – రాబర్ట్పాల్, జిల్లా వ్యవసాయశాఖాధికారి, పార్వతీపురం మన్యం జిల్లా -
పింఛన్ డబ్బులు లబ్ధిదారులకే అందించాలి
పార్వతీపురం రూరల్: పింఛన్ డబ్బులను నేరుగా లబ్ధిదారులకే అందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ సచివాలయ సిబ్బందికి సూచించారు. పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామంలో పలువురు లబ్ధిదారులకు మంగళవారం పింఛన్లు అందజేశారు. జిల్లాలో 1,40,982 మందికి రూ.60 కోట్లు నగదును పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం ఆయన అక్కడి అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. మౌలిక వసతులు, ఆహారం, పిల్లల విద్యాభ్యాసన తీరుపై ఆరా తీశారు. చిన్నారులతో కాసేపు ముచ్చటించిన కలెక్టర్ స్టోర్ రూమ్లో నిత్యావసర సరుకులు, కోడిగుడ్ల నిల్వల రికార్డులు నిర్వహణను పరిశీలించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి అడ్డాపుశీలలోని స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహిస్తున్న వస్త్ర వ్యాపారాన్ని కలెక్టర్ పరిశీలించారు. మహిళలు స్వశక్తితో ఆర్థిక స్వావలంబన దిశగా ఎదగాలన్నారు. సీ్త్ర నిధి నుంచి పొందిన రుణంతో వస్త్రవ్యాపారాన్ని నిర్వహించడం సంతోషదాయకమన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
ఎలా చూపించాలి మొఖం!
ఏడాదిలో ఏం చేశాం.. ఛసాక్షి, పార్వతీపురం మన్యం: ఎన్నికల్లో గెలిచి ఏడాదవుతున్నా.. ఏ ఎమ్మెల్యే కూడా పల్లె గడపకు వెళ్లి ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు. నాడు లెక్కకు మించి హామీలిచ్చి.. ఒక్కటీ నెరవేర్చిన ఆనవాళ్లు కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సర కాలంలో చేసిన ‘సుపరిపాలన’ను ఈ నెల 2వ తేదీ బుధవారం నుంచి ఇంటింటికీ వెళ్లి వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. నెల రోజులపాటు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులందరూ ప్రతి గడపకూ వెళ్లి, అక్కడి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని అంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక యాప్నూ సిద్ధం చేశారు. మరోవైపు ఏం చేశామని ప్రజల వద్దకు వెళ్లగలమని నాయకులు వాపోతున్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఎమ్మెల్యేల దందా అధికమైంది. ప్రతి పనికీ ఒక ‘రేటు’ కట్టేశారు. ఇసుక, వైన్స్, మైనింగ్.. ఇలా ఏదీ తేడా లేకుండా వాటాలు కొట్టేస్తున్నారు. ప్రభుత్వ, పేదల భూములను అప్పనంగా కాజేస్తున్నారు. కబ్జాలు, బెదిరింపులు పెరిగిపోయాయి. మరోవైపు ఇంటింటికీ అందిస్తామన్న సంక్షేమానికి మంగళం పాడేశారు. గతేడాది తల్లికి వందనం పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టగా.. ఇటీవల విడుదల చేసిన మొత్తంలో భారీగా కోత పెట్టారు. రైతులకు ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయం ఊసేలేదు. ఉచిత ప్రయాణం తుస్సుమంది. నిరుద్యోగ భృతి లేదు. నెలకు రూ.1,500 సాయం కానరాదు. మద్యాన్ని ప్రైవేట్పరం చేసి.. ఊరూరా లభించేలా చేశారు. విలీనం పేరుతో ప్రభుత్వ పాఠశాలలను ఊరికి దూరం పెట్టారు. దీంతో తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో కూటమికి జై కొట్టిన ఉద్యోగులు.. ప్రస్తుతం ప్రభుత్వం తీరుతో అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. బదిలీల్లో నాయకుల ఇష్టారాజ్యమైంది. రూ.లక్షలు వసూలు చేశారు. ఈ నేపథ్యంలో నాయకులకు ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయం గ్రహించి కూటమి నేతలు కూడా భయపడుతున్నారు. సమస్యల‘పురం’ ● పార్వతీపురం నియోజకవర్గం విషయానికి వస్తే.. జిల్లా కేంద్రంలో డంపింగ్యార్డు సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ● తాగునీటి ఎద్దడి నివారణకు పరిష్కారం చూపుతామని ప్రకటించారు. ● డిగ్రీ చదువుకున్న 100 మందిలో 90 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన ● ఇప్పుడున్న డిగ్రీ కళాశాలను పీజీ కళాశాలగా అప్గ్రేడ్ చేసి, హాస్టల్ సౌకర్యం కల్పన ● జంఝావతి, ఆడారుగెడ్డ, వరహాలగెడ్డ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తా.. ● మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తాం అన్నారు. వీటిలో ఎన్నినెరవేర్చారో ప్రజలను అడిగితే చెబుతారు. సెల్ఫీలకే పరిమితం పాలకొండలోనూ చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్లతోపాటు.. స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అనేక హామీలు గుప్పించారు. పాలకొండ మండలంలో జంపరకోట మినీ జలాశయం పూర్తి చేస్తామన్న హామీ నేటికీ నెరవేరలేదు. అక్కడికి వెళ్లి సెల్ఫీ కూడా తీసుకున్నారు. పాలకొండకు రైతుబజారు తీసుకొస్తానని చెప్పారు. తోటపల్లి కాలువల ఆధునికీకరణ చేస్తామని రైతాంగానికి భరోసా ఇచ్చారు. నియోజకవర్గాన్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్ది.. ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గట్టిగా.. గట్టిగా అంటూ చెప్పారు. ప్రధానంగా గిరిజన యువతకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. హామీ ఇచ్చారు.. విస్మరించారు సాలూరులో జీగిరాం జూట్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని మాటిచ్చారు. ఆటోనగర్ను పునఃప్రారంభించి, లారీ పరిశ్రమను ఆదుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 85 శాతం నిర్మాణం పూర్తయిన వంద పడకల ఆస్పత్రిని ఏడాదైనా పూర్తి చేయలేకపోయారు. జగ్గుదొరవలసలో అక్కడి స్థానికులకు కులధ్రువీకరణ పత్రాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నెరవేర్చలేదు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకం చేపడతామని మంత్రిగా తొలి సంతకం కూడా సంధ్యారాణి చేశారు. మంత్రిగా వచ్చిన మొదటి రోజునే సాలూరు పట్టణంలో మహిళల ఆత్మగౌరవం కోసమని ఉపన్యాసాలిచ్చి.. పాడైన మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తెస్తామని చెప్పారు. మక్కువ–బాగువలస రోడ్డును పూర్తి చేస్తామన్నారు. డోలీల మోతే లేకుండా చేస్తామని తెలిపారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. వీటిలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. ప్రజాప్రతినిధులు, కూటమి నేతల్లో అంతర్మథనం ‘సుపరిపాలన’ అంటూ నెల రోజులపాటు ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమాన్ని వివరించాలంటున్న చంద్రబాబు నిలదీతలు ఎదురవుతాయేమోనని స్థానిక నేతల్లో భయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ సమక్షంలోనే స్థానిక నేతలు.. ప్రస్తుత ఎమ్మెల్యేలు గత ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చారు. అందులో ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయారు. దీనికి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక వారంతా తల్లడిల్లుతున్నారు. ‘కురుపాంలో చదువుకున్న బిడ్డలు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే వర్క్ఫ్రం హోం చేసుకునేలా ఏర్పాటు చేస్తా. నైపుణ్య కేంద్రాలు, స్కిల్ సెన్సర్స్ చేసి మిమ్మల్ని ఆదుకుంటా. ఉద్యోగాలు వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తా.’ అని గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కురుపాం సభలో హామీ ఇచ్చారు. ఏనుగుల వల్ల పంటలు నాశనమవుతున్నాయి. దానికి పరిష్కారం చూపిస్తా. తోటపల్లి బ్యారేజ్ పాత ప్రధాన కాలువకు మిగులు జలాలు అందించి లిఫ్ట్ ద్వారా నీరందిస్తా. కొమరాడ, గరుగుబిల్లి మండలాలకు నీరిస్తా. పూర్ణపాడు–లాబేసు మధ్య వంతెన ఏర్పాటు చేస్తా.. కురుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం మండలాలకు సాగునీరిందంచడానికి గుమ్మడిగెడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మాణం చేస్తా. గుమ్మలక్ష్మీపురం మండలంలో జీడి పరిశ్రమ ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ఇప్పిస్తా. జీవో నంబరు 3 రద్దు చేస్తానని హామీ ఇస్తున్నా. ‘ఎంపీ గీతకు కమలం పువ్వు, ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరికి సైకిల్గుర్తుపై ఓటేసి గెలిపించే బాధ్యత మీది. మీ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత నాది’ అంటూ స్వయంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇందులో ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారు. -
ఇసుక ర్యాంప్ పరిశీలన
భామిని: మండలంలోని నేరడి బీ – బిల్లుమడ గ్రామాల మధ్య వంశధార నదీ తీరంలో నిర్వహించాల్సిన ఇసుక ర్యాంప్ స్థలాన్ని జిల్లా భూగర్భ గనులశాఖ ఏడీ శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. ఇప్పటికే నేరడి – బిల్లుమడ గ్రామాల మధ్య ఇసుక ర్యాంపు నిర్వహణకు ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసిన నేపథ్యంలో భూగర్భ గనుల అధికారుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చిన్నబగ్గ కొండ శిఖరాన గజరాజులు సీతంపేట: మండలంలోని చిన్నబగ్గ కొండ శిఖర గ్రామాల్లో మంగళవారం ఏనుగుల గుంపు సంచరించింది. కొండదిగువన ఉన్న ఏనుగుల గుంపు కొండపైకి వెళ్లడంతో చిన్నబగ్గ పరిసర ప్రాంతాల గిరిజనులు ఊపిరి పీల్చుకున్నారు. ఏ క్షణాన మళ్లీ కొండ దిగి వచ్చేస్తాయోనని భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ ట్రాకర్లు ఏనుగుల గమనాన్ని పరిశీలించి గిరిజనులను అప్రమత్తం చేస్తున్నారు. గిరిజన యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు ● 8, 9 తేదీల్లో ఓపెన్ కౌన్సెలింగ్ విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2025–26 విద్యాసంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఈ నెల 8, 9వ తేదీల్లో ఓపెన్ కౌన్సెలింగ్లో భర్తీ చేస్తామని విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్లో 8వ తేదీన ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ బయోటెక్నాలిజీ, ఎంబీఏ, 9వ తేదీన పీజీ ఇంగ్లిష్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆయా రోజుల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కౌన్సెలింగ్కు సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాలతో నేరుగా యూనివర్సిటీకి హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ ‘సీటీయూఏపీ.ఏసీ.ఐఎన్’ను సందర్శించాలన్నారు. మద్యంమత్తులో దొరికిన దొంగ బొబ్బిలి: ఓ ఇంటిలో ఐదు రోజులుగా దొంగతనం చేస్తూ అదే ఇంటింలో మద్యం మత్తులో నిద్రపోయిన దొంగను బొబ్బిలి పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బొబ్బిలి పట్టణం గొల్లపల్లి అంబేడ్కర్ కాలనీలో నివసిస్తున్న శీర శ్రీనివాసరావు వ్యవసాయ పనుల నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట స్వగ్రామమైన అలజంగి వెళ్లారు. ఈ విషయాన్ని కనిపెట్టిన పిరిడి గ్రామానికి చెందిన కె.కృష్ణ ఆ ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలో ఉన్న వెండి, ఇత్తడి సామాన్లు దొంగిలించి విక్రయించడం, కొనకపోతే తాకట్టు పెట్టడం చేసి మద్యం కొనుగోలు చేసి ఆ ఇంట్లోకే వెళ్లి తాగుతూ, తింటూ గడిపాడు. ఐదు రోజులుగా ఇదే తంతు జరుగుతోంది. ఇంటి యజమాని మరో రెండు రోజులు రాడనుకున్నాడో ఏమో మంగళవారం కూడా మరికొన్ని సామాన్లు విక్రయించి పూటుగా మద్యం తాగి ఎప్పటివలే చల్లగా ఉందని ఇంటి గచ్చుపై నిద్రపోయాడు. స్థానికులు దొంగను గుర్తించి అలజంగిలో ఉన్న శ్రీనివాసరావుకు సమాచారమందించారు. ఈ లోగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారమందుకున్న ఎస్ఐ ఆర్.రమేష్ కుమార్ తన సిబ్బందితో వచ్చ దొంగను పట్టుకున్నారు. అప్పటికే నిద్రమత్తులో ఉండడంతో పిరిడిలోని కృష్ణ ఇంటికి ఫోన్ చేశారు. అతడిని ఇంటికి పంపొద్దంటూ కుటుంబ సభ్యులు తిరిగి పోలీసులను వేడుకోవడం గమనార్హం. కేసు నమోదు చేయడమా, లేదంటే దొంగకు కౌన్సెలింగ్ ఇవ్వడమా అన్నది బుధవారం తేల్చుతామని ఎస్ఐ తెలిపారు. -
800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
జియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగి పరిసర ప్రాంతాల్లో సోమవారం దాడులు చేసి 800 లీటర్ల బెల్లం ఊటను పట్టుకుని ధ్వంసం చేసినట్లు చినమేరంగి ఎస్సై అనీష్ తెలిపారు. గ్రామాల్లో సారా, మద్యం అమ్మినా తెలియజేయాలని, అటువంటి వారిపేర్లు గోప్యంగా ఉంచుతామని ఎస్సై ప్రజలకు సూచించారు.యువత చెడువ్యసనాలకు బానిసకావద్దని హితవు పలికారు. సారా తయారీకి ఉపయోగించిన సామగ్రిని ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్సిబ్బంది ఉన్నారు. 230 సారా ప్యాకెట్లు సీజ్ సాలూరు రూరల్: మండలంలోని బాగువలస గ్రామం వద్ద ద్విచక్రవాహనంపై తరలిస్తున్న 230 సారా ప్యాకెట్లు సోమవారం పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. నక్కడ వలస గ్రామానికి చెందిన సురగడ రామ్మోహన్ ను పట్టుకుని సారా ప్యాకెట్లతో పాటు ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.40 వేలు ఫైన్రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నామని ఈ క్రమంలో మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తుల నుండి సోమవారం కోర్డులో రూ.40 వేలు ఫైన్ కట్టించినట్లు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. చిన్నబగ్గ సమీపంలో ఏనుగులుసీతంపేట: మండలంలోని చిన్నబగ్గ ఆశ్రమపాఠశాలకు సమీపంలో నాలుగు ఏనుగుల గుంపు ఘీంకరిస్తోంది. సోమవారం రాత్రి ఏనుగులు ఇక్కడికి రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. నిన్న, మెన్నటి వరకు చిన్నబగ్గ, గోరపాడు కొండల్లో సంచరించిన ఏనుగులు ఇప్పుడు ఏకంగా గ్రామానికి దగ్గరలోనే తిష్ఠ వేయడంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి గ్రామస్తులు భయపడుతున్నారు. ఏనుగులను కవ్వించవద్దని అటువైపు ఎవ్వరూ తిరగవద్దని స్థానికులకు ట్రాకర్లు తెలియజేస్తున్నారు. ఎఫ్బీవో దాలినాయుడుతో పాటు సిబ్బంది ఏనుగుల గమనాన్ని పరిశీలిస్తున్నారు. ప్రత్యేక అధికారిని నియమించండి విజయనగరం గంటస్తంభం: జిందాల్ భూ సేకరణలో అవకతవకలు జరిగాయని, దీనిని సరిదిద్దేందుకు కలెక్టర్ వెంటనే ఒక ప్రత్యేక అధికారిని నియమించి భూములు కోల్పోయిన రైతులకు న్యాయంచేయాలని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ అంబేడ్కర్కు వినతిపత్రం అందజేశారు. భూములిచ్చిన కోన సీతమ్మ, కొదల మదన మేరీ కుటుంబాలకు నేటికీ పరిహారం అందలేదన్నారు. -
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ
పార్వతీపురంటౌన్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆధికారులకు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎన్ఎస్.శోభిక, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, డీఆర్డీఏ పీడీ సుధారాణిలతో కలిసి ప్రజల నుంచి 112 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఐసీడీఎస్ పీడీ డా.టి.కనకదుర్గ, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ ఆర్.కృష్ణవేణి, జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీ ఎస్ మన్మథరావు, సర్వే ఎ.డి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వాస్తవాలైతే చట్టపరమైన చర్యలు పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు దారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు వాస్తవాలైతే తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే చట్టపరిధిలో నాణ్యమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల పరిధి నుంచి వచ్చిన బాధితుల ఫిర్యాదులను ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి స్వయంగా స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడి క్షుణ్ణంగా పరిశీలించారు. వచ్చిన ఫిర్యాదులలో ముఖ్యంగా కుటుంబ కలహాలు, భర్త, అత్తారింటి వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, నకిలీపత్రాలు, అధిక వడ్డీల వసూళ్లు, ప్రేమ పేరుతో మోసాలు ఉన్నాయి. మొత్తం 11 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ గ్రీవెన్స్ సెల్కు 72 అర్జీలు ీసతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 72 అర్జీలు వచ్చాయి. చొర్లంగిలో సీహెచ్డబ్ల్యూవో పోస్టు ఇప్పించాలని కోడూరుకు చెందిన నీలవేణి కోరారు. హడ్డుబంగి పాఠశాలలో నాడు–నేడు పనులకు బిల్లులు మంజూరు చేయాలని ఎ.గాయత్రి అర్జీ ఇచ్చారు. తల్లికి వందనం డబ్బులు బ్యాంకులో జమకాలేదని కారెంకొత్తగూడకు చెందిన సవర మల్లమ్మ వినతిపత్రం అందజేసింది. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, డీడీ అన్నదొర, ఈఈ కుమార్, డిప్యూటీ ఈఓ రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
బెదిరింపు ప్రకటనలు సరికాదు
● జిందాల్ భూములను రైతులకు అప్పగించాలి ● సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణవిజయనగరం గంటస్తంభం: 2006లో జిందాల్ పరిశ్రమ ఏర్పాటు కోసం తీసుకున్న భూములను చట్టప్రకారం పరిశ్రమ పెట్టనందున రైతులకు తిరిగి ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు బెదిరింపు ప్రకటనలు చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన విజయనగరంలోని ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల నుంచి భూములు తీసుకుని 17 సంవత్సరాలైనా నేటివరకు ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని, స్థానిక ప్రజలకు ఉపాధి చూపలేదన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల నుంచి తీసుకున్న భూములను ఐదేళ్లలో పరిశ్రమ కట్టకపోతే తిరిగి రైతులకు అప్పజెప్పాలని చట్టంలో ఉన్న విషయం అధికారులకు తెలియదా? అని ప్రశ్నించారు. 2006 భూ సేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఎందుకు అప్పటి జాయింట్ కలెక్టర్ నిర్వహించారని ప్రశ్నించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సేకరణ చేస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు ఆ రోజు పరిశ్రమను వ్యతిరేకించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. పరిశ్రమ పెట్టకపోతే భూములు వెనక్కి ఇవ్వకుండా ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కు పెడతామని, అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బెదిరించడాన్ని ఖండిస్తున్నామన్నారు. కేవలం కార్పొరేట్ శక్తులకు ఈ భూములు అప్పగించాలన్న కుట్ర తప్ప మరొకటి కాదన్నారు. ఒక వేళ కొత్త పరిశ్రమ కోసం భూమి కావాలంటే పబ్లిక్ హియరింగ్ పెట్టి మళ్లీ భూ సేకరణ చేపట్టి రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం చెల్లించి తీసుకోవాలి తప్ప బెదిరించి తీసుకుంటామని అనడం సరికాదన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకరరావు, టీవీ.రమణ పాల్గొన్నారు. -
రోడ్డుప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామం సమీపంలో అరకు–విశాఖపట్నం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దుర్మరణం చెందింది. అందాల లోకాన్ని చూడడానికి వెళ్తూ అనంత లోకాలకు పయనమైంది. ఈ ప్రమాదంపై స్థానికులు తెలిపిప వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామానికి చెందిన కర్రి నాగమణి(20) తన స్నేహితుడైన విశాఖపట్నం జిల్లా ప్రహ్లాదపురానికి చెందిన దాసరి కార్తీక్ ఇంటికి వచ్చింది. అక్కడి నుంచి అరకు అందాలను తిలకించేందుకు నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్రవాహనాలపై బయల్దేరారు. దాసరి కార్తీక్కు చెందిన స్కూటీపై నాగమణి పయనిస్తోంది.కాగా మంగళపాలెం సమీపానికి వచ్చేసరికి ఎదురుగా విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం డిపోకు చెందిన సిటీ బస్సు స్టాపర్ను తప్పించ బోయి స్కూటీపైకి వెళ్లడంతో స్కూటీపై పయనిస్తున్న ఇద్దరూ రోడ్డు అంచున పడిపోయారు. కార్తీక్ కొద్దిగా దూరంగా పడడంతో సురక్షితంగా తప్పించుకున్నాడు. నాగమణి బస్సుపై పడిపోవడంతో తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. నాగమణి విజయనగరంలో గల సీతం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మన్మథరావు తెలిపారు. -
కూటమి పెద్దలకి పరమాన్నం, పేదలకి గంజి నీళ్లు
● సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావువిజయనగరం గంటస్తంభం: కాంగ్రెస్, తెలుగుదేశం, నేటి కూటమి ప్రభుత్వాలు గత 20 ఏళ్లుగా కాగ్నిజెంట్, టీసీఎస్, జిందాల్ లాంటి కంపెనీలకు కారుచౌకగా భూములను కట్టబెడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం సీపీఐ జిల్లా కార్యాలయం డీఎన్ఆర్ అమర్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ..కోనేటి రంగారావు భూకమిటీ సిఫార్సులను అనుసరించి నాటి నుంచి నేటి వరకు ఎక్కడా ఎకరా భూమి కూడా పేద రైతులకు, పేదలకు 3 సెంట్లు ఇంటి స్ధలం ఇచ్చిన ధాఖలాలు లేవని మండిపడ్డారు. భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులను, నివాసం ఉంటున్న పేదల ఇళ్లను తొలగించడమే కానీ పేదలకు భూమి ఇవ్వడానికి చేతులు రాని ప్రభుత్వాలు కార్బొరేట్లకు మాత్రం వేలాది ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెడుతున్నాయని విమర్మించారు. విజయనగరం జిల్లాలోని ఎస్.కోట నియోజవర్గం బౌడార ప్రాంతంలో ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 1100 ఎకరాల్లో 900 ఎకరాలు ప్రభుత్వ భూమిని జిందాల్ కంపెనీకి ఇవ్వడానికి తలపెట్టి బాకై ్సట్ శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనే తలంపుతో ఆనాటి జిల్లా జాయింట్ కలెక్టర్ జగన్మోహన్ రావు నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిందన్నారు. ప్రస్తుత ఉన్న కలెక్టర్ ఇటీవల కాలంలో మీడియాలో ఏ ప్రభుత్వం భూ సేకరణ జరపలేదని మాట్లాడారు. భూ సేకరణ చేయకుంటే ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు జరిగిందో నేడున్న కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిందాల్ భూముల విషయంలో ఆందోళనకారులపై దాడులు, నిర్బంధాలు, అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియచేశారు. పేదలకు అందాల్సిన పరిహారంలో అవకతవకలు జరిగినట్లు అనేక ఆరోపణలు వచ్చాయని దీనిపై తగు న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ, అలమండ ఆనందరావు పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలి
పార్వతీపురంటౌన్: మాదక ద్రవ్యాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యామ్ప్రసాద్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, మత్తు మందులు కుటుంబాలను, ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయన్నారు. వాటిపై అవగాహన అత్యావశ్యమన్నారు. ఆరోగ్యమే మహా భాగ్యమని, దానిని కాపాడుకోవడం మన కర్తవ్యమని చెప్పారు. యోగా వంటి ఆరోగ్య అంశాల పట్ల ఆసక్తి కలిగి ప్రతిరోజూ సాధన చేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని హితవు పలికారు. మాదక ద్రవ్యాలు, మత్తు మందులు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా ఆర్థికంగా, మానసికంగా కుటుంబాలను నాశనం చేస్తాయన్నారు. పాఠశాలలు, వసతి గృహాలు పునఃప్రారంభమయ్యాయని వాటి చుట్టు పక్కల ఎటువంటి విక్రయాలు, కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన నిఘా ఉండాలని స్పష్టం చేశారు. అటవీ, మారుమూల ప్రాంతంలో సారా తయారీ వంటి అంశాలను గమనించాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల విక్రయాలు వివిధ రూపాల్లో ఉండే అవకాశం ఉందని, సంబంధిత అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాలు, మత్తు మందుల ఉత్పాదకత, సరఫరా, రవాణా, విక్రయాలు, వినియోగం జరిగితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వాటికి సంబంధించిన వివరాలు తెలిసినవారు 1972 ఫోన్ నంబర్కు సమాచారం అందించాలని కోరారు. రవాణా వాహనాలను తనిఖీలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ ఎస్వీ మాధవ రెడ్డి, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, జిల్లా రవాణా అధికారి వి.దుర్గాప్రసాద్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ కె.సుమిత్ర, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆశ షేక్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ వీవీవీ ఎస్ఎస్బాబు, ఆర్పీఎఫ్ ఎస్సై ఎ.కె.పాణిగ్రహి, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
విరమణ వృత్తికే కాని సేవా ధర్మానికి కాదు
పార్వతీపురం రూరల్: ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వృత్తికే కానీ సేవాధర్మానికి కాదని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన తన కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన ఎస్సై పి.సత్యనారాయణ, ఏఎస్సైలు ఎం.సత్యనారాయణ, వేణుగోపాల ప్రాణిగ్రహి, ఆరిక చిన్నయ్య, సత్యవరపు రజనిలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్శాఖలో అంకిత భావంతో సేవలందించిన వారి సేవలు పదిలంగా ఉంటాయని ఉద్యోగ విరమణ పొందిన వారు తమ అమూల్యమైన సూచనల మేరకు విధి నిర్వహణలో అనుభవ పూర్వకమైన సందర్భాలను ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో పంచుకోవాలని కోరారు. విరమణ అనంతరం వారి శేషజీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించారు. అనంతరం శాలువాలతో సన్మానించి, జిల్లా కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరఫున జ్ఞాపికలు, చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, డీసీఆర్బీ సీఐ ఆదాం, సీఐ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ రంగనాథం, ఏఆర్ఐలు నాయుడు, రాంబాబు, శ్రీనివాసరావు, ఏఏఓ సతీష్బాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
వైద్యుడు దేవుడితో సమానం
● విపత్కకాలంలోనూ రోగులకు సేవలు ●నేడు వైద్యుల దినోత్సవం విజయనగరం ఫోర్ట్: వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు. రోగులు వైద్యుడిని భగవంతుడిలా అరాధిస్తారు. ఎందుకంటే ప్రాణాలు నిలబెట్టగలిగే శక్తి వైద్యుడికి మాత్రమే ఉంటుంది. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో నైనా వెరవకుండా ధైర్యంగా సేవలు అందించేది వైద్యులే. నాలుగేళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి విలయతాండవం చేసినప్పటికీ వైద్యులు ఏమాత్రం భయపడకుండా వైద్యసేవలు అందించారు. వైద్యుల్లో సేవాదృక్పథంతో పనిచేసే వారు ఉన్నారు. ధనార్జనే ధ్యేయంగా పనిచేసే వారు కూడా ఉన్నారు. సమాజంలో కొత్త కొత్త వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. వాటి నివారణ చర్యలు కనుగొని వైద్యులు సేవలు అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో రోగులకు సేవలందించే సమయంలో కోవిడ్ బారిన పడి పలువురు వైద్యులు మృత్యువాత పడ్డారు. అయినప్పటికీ మిగిలిన వైద్యులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా కోవిడ్ బాధితులకు సేవలు అందించారు. జిల్లాలో 700 మంది వరకు వైద్యులు జిల్లాలో 50 పీహెచ్సీలు, 7 సీహెచ్సీలు, 18 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, 300 వరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. వాటిలో సుమారు 700మంది వరకు వైద్యులు పనిచేస్తున్నారు. వైద్యవృత్తి ఉన్నతమైనది వైద్యవృత్తి ఉన్నతమైనది. ప్రజలు డాక్టర్ని గౌరవించాలి. వైద్యం కోసం వచ్చే వారితో ప్రేమగా, అప్యాయంగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకుని అవసరమైన వైద్యాన్ని అందించాలి. వైద్యవృత్తిని చేపట్టినందుకు అదృష్టంగా భావించాలి. ప్రతి రోగిని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలి డాక్టర్ శంబంగి అప్పలనాయుడు, సూపరింటెండెంట్, సర్వజన ఆస్పత్రివైద్యులు గౌరవప్రదంగా మెలగాలి సమాజంలో వైద్యులు గౌరవప్రదంగా మెలగాలి. వెద్యులను ప్రోత్సహిస్తే వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. వైద్యులపై ఒత్తిడి పెట్టకూడదు. ఒత్తిడి లేకుండా ఉంటే మెరుగైన వైద్యసేవలు అందించగలరు. వైద్యులు రోగులకు ప్రేమతో సేవలు అందించాలి. డాక్టర్ పద్మశ్రీ రాణి, డీసీహెచ్ఎస్ సేవాభావం ఉంటే వైద్య వృత్తి చేపట్టాలి ఓపిక, సహనం ఉంటేనే వైద్య వృత్తిని చేపట్టాలి. సేవాదృక్పథంతో వైద్యసేవలు అందించాలి. సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వైద్యులు కృషి చేయాలి. ఆధునాతన వైద్యసేవలను ఎప్పటి కప్పుడు తెలుసుకోవాలి. రోగులు వైద్యులను గౌరవించాలి. డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ -
సీపీఓ సేవలు అభినందనీయం
పార్వతీపురంటౌన్: జిల్లా ప్రణాళిక అధికారి వీరరాజు సేవలు అభినందనీయమని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. జిల్లా ప్రణాళిక అధికారి వీరరాజు ఉద్యోగ విరమణ కార్యక్రమం సోమవారం కలెక్టరేట్లో జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై వీరరాజు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీరరాజు మంచి సేవాతత్పరతతో వృత్తిని నిర్వహించారని ప్రశంసించారు. అంకితభావంతో సేవలు అందించడం వల్ల మన్ననలు పొందగలరని పేర్కొన్నారు సీనియర్ల సేవలను జూనియర్లు గుర్తించి వారిని మార్గదర్శకంగా తీసుకుని పనిచేయాలని సూచించారు. రిటైర్ అయిన సీపీఓ పి.వీరరాజు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. వృత్తిలో సంతృప్తి పొందానని పేర్కొన్నారు. విధులు సక్రమంగా నిర్వర్తించేందుకు సహకరించిన కలెక్టర్, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎస్ఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు మన్యం బిడ్డలు
గుమ్మలక్ష్మీపురం: జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు గుమ్మలక్ష్మీపురం మండలం జొల్లగూడ గ్రామానికి చెందిన నిమ్మల దేశిక్, కన్నయ్యగూడకు చెందిన తోయక నరేంద్రనరసింహ ఎంపికై నట్టు కోచ్, కొత్తగూడ జీటీడబ్ల్యూహెచ్ఎస్ పీడీ ఎన్.మాధవరావు తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన సోమవారం మాట్లాడుతూ.. జూన్ 26వ తేదీన విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో దేశిక్ అండర్ –10, నరేంద్ర నరసింహ అండర్–12 ఈపీఈఈ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనపర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. విజయవాడలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో జూన్ 29న జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రాణించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్టు వెల్లడించారు. వీరిద్దరూ మహారాష్ట్రలోని నాశిక్లో జూలై 5 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇన్చార్జి సీపీఓగా పట్నాయక్ పార్వతీపురం రూరల్: జిల్లా ఇన్చార్జి ముఖ్య ప్రణాళిక అధికారిగా ఎస్ఎస్ఆర్కే పట్నాయక్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఇప్ప టివరకు పనిచేసిన పి.వీర్రాజు ఉద్యోగ విరమ ణ చేయడంతో ఆ స్థానంలో విశాఖపట్నం సీపీఓ కార్యాలయ సహాయ సంచాలకుడిగా పనిచేస్తున్న పట్నాయక్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. గణాంక సిబ్బంది ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. సచివాలయ ఏఎన్ఎంలకు బదిలీ కౌన్సెలింగ్ విజయనగరం ఫోర్ట్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సచివాలయం ఏఎన్ఎంలకు జూమ్లో సోమవారం బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించారు. విజయనగరం డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి, పార్వతీపురం డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు, ఏఓ ప్రభూజీ, సూపరింటెండెంట్ నాగరాజు కౌన్సిలింగ్ నిర్వహించారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పదోన్నతులుపార్వతీపురం: ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన ఎస్జీ టీలకు స్కూల్ అసిస్టెంట్స్, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించినట్లు గిరిజన సంక్షేమశాఖ డీడీ ఆర్.కృష్ణవేణి తెలిపారు. పీఓ ఆదేశాల మేరకు పదోన్నతుల ప్రక్రియను సోమవారం నిర్వహించి 19మందికి పదోన్నతులు కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అధికారులు కె.దేష్, ఏటీడబ్ల్యూఓ ఒ.కె చంద్రబాబు పాల్గొన్నారు. మడ్డువలసలో ఏనుగులు తిష్ట వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు పరిసరాల్లో తొమ్మిది ఏనుగులు తిష్టవేశాయి. చెరకు, వరినారు మడులను ధ్వంసం చేస్తున్నాయి. వంగర–రాజాం రోడ్డు పక్కన సోమవారం సంచరించడంతో అటవీ, పోలీస్ శాఖ సిబ్బంది అప్రమత్తమై రాకపోకలను కాసేపు నిలిపివేశారు. పార్వతీపురం మన్యం జిల్లా అటవీశాఖ రేంజర్ మణికంఠేశ్వరరావు, సిబ్బంది ఏనుగుల గమనాన్ని పరిశీలిస్తూ గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. -
ఊరి బడి.. గుండెల్లో అలజడి!
● తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు ● గ్రామంలోని పాఠశాలను మరోచోటకు విలీనం చేయవద్దని విజ్ఞప్తి సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వం చేపట్టిన స్కూళ్ల విలీనం ప్రక్రియపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో నని తల్లడిల్లుతున్నారు. ఏళ్ల తరబడి ఊర్లో ఉన్న బడిని దూరం చేస్తే.. చిన్న వయస్సులో ఉన్న తమ పిల్లలు రహదారులు, కాలువ గట్లు దాటుకుంటూ ఎలా వెళ్లగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలను అంత దూరం పంపలేమని.. టీసీలిచ్చేస్తే మరో చోటకు మార్చుకుంటామని హెచ్ఎంలను అడుగుతున్నారు. నెలల తరబడి వీరు పోరాటం చేస్తున్నా.. అధికారులు చలించడం లేదు. ప్రభుత్వం కూడా వీరి మొర వినడం లేదు. ఫలితంగా పిల్లలను బడులకు పంపలేక, విద్యాసంవత్సరం వృథా చేయలేక సతమతమవుతున్నారు. మరికొంతమంది ప్రభుత్వ బడుల నుంచి ప్రైవేట్ స్కూళ్లకు మార్చేస్తున్నారు. అన్నిచోట్లా ఇదే పరిస్థితి... పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని యాజమాన్యా ల్లో కలిపి 1,594 పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో అనేక పాఠశాలలు విలీనం పేరుతో ఊరికి దూరమ వుతుంటే.. అక్కడికి తమ పిల్లలను పంపలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిరోజుల కిందట బలిజిపేట మండలం పెదపెంకి–1 పాఠశా ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఇదే విషయమై కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి తిరుగు ప్రయాణంలో రహదారి ప్రమాదం బారిన పడ్డారు. ఇప్పటికీ వారి పాఠశాల తెరుచుకోలేదు. ●గరుగుబిల్లి మండలం హిక్కింవలస ఎంపీపీఎస్ లో 3, 4, 5 తరగతులను గరుగుబిల్లి జెడ్పీహెచ్ఎస్ లో కలపడంపై గ్రామస్తులు కొద్దిరోజులుగా ఆందో ళనలు చేస్తున్నారు. ఆ తరగతులను గతం మాదిరి కొనసాగించి, హిక్కింవలస ఎంపీపీఎస్ను మోడల్ ప్రైమరీ పాఠశాలగా మార్చాలని కోరుతున్నారు. గ్రామంలో ఎటువంటి విచారణా చేయకుండానే మార్పు చేశారని ఇప్పటికే మూడు సార్లు అధికారు లను కలిసి వినతిపత్రాలు అందించారు. ●తమ గ్రామంలోని పాఠశాలను తరలించొద్దని పాలకొండ మండలంలోని బెజ్జి గ్రామస్తులు ఇటీవల ఆందోళనకు దిగారు. ఈ పాఠశాలను కొద్దిదూరంలోని తలవరం యూపీ పాఠశాలలో విలీనం చేశారు. దూరం కావడంతో అక్కడికి తమ పిల్లలను పంపేది లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. విలీనం పేరుతో గ్రామాలకు దూరమైన పాఠశాలల్లో తల్లిదండ్రులంతా దాదాపు ఇదే ఆవేదనతో ఉన్నారు. ●స్కూళ్లు ప్రారంభమై మూడు వారాలు గడిచిపోతున్నాయి. ఇప్పటికీ ఆయా పాఠశాలల్లో పిల్లలు తరగతులకు హాజరు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా 175 పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఈ ఏడాది ఇంకా విద్యార్థులు చేరలేదని అధికారులు గుర్తించారు. గతేడాది ఒకటో తరగతి చదివిన విద్యార్థుల్లో 173 మంది రెండో తరగతిలో చేరలేదు. 3, 4, 5 తరగతుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. విలీన సమస్యను ప్రభుత్వం పునఃపరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫౌండేషన్ స్కూల్ వద్దు.. ప్రాథమిక పాఠశాలే ముద్దు చిత్రంలో కనిపిస్తున్నవారు గరుగుబిల్లి మండలం రావివలస గ్రామస్తులు. తమ ఊరి బడి సమస్యను కలెక్టర్కు వివరించేందుకు సోమవారం కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్కు వచ్చారు. ఇక్కడి అంబేడ్కర్ నగర్లో ఎంపీపీ పాఠశాల(ఎస్డబ్ల్యూ) ఉంది. గతంలో షెడ్యూల్ కులాలు, గిరిజన పిల్లల కోసం.. డ్రాపౌట్లను తగ్గించే ఉద్దేశంతో చాలా ఏళ్ల క్రితం ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వీరి పాఠశాలను ఫౌండేషన్ స్కూల్గా మార్చింది. దీనివల్ల 3, 4, 5 తరగతులను మరోపాఠశాలలో విలీనం చేశారు. దీనివల్ల కలిగే ఇబ్బందులను వివరిస్తూ.. బేసిక్ ప్రైమరీ పాఠశాలగానే ఉంచాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. గోడు వినండి సారూ... కలెక్టరేట్కు వచ్చిన వీరంతా ఒకప్పుడు మడ్డువలస రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వాసితు లు. సుమారు 20 ఏళ్ల కిందట బలిజిపేట మండలం పలగర గ్రామం గుడివాడ కాలనీ, కొట్టిస కాలనీగా ఏర్పడి 500 కుటుంబాల వరకు నివా సం ఉంటున్నాయి. అప్పట్లో ప్రభుత్వం నిర్వాసిత కాలనీ పిల్లల కోసం పాఠశాల నిర్మించింది. తల్లిదండ్రుల్లో అధిక శాతం మంది వ్యవసాయ, సిమెంట్ పనుల కోసం చైన్నె, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిపోతుంటారు. పిల్లలని ఇక్కడే వృద్ధుల వద్ద, బంధువుల ఇళ్లలో ఉంచి చదివిస్తున్నారు. ఇప్పుడు ఆదర్శ పాఠశాల పేరిట నిర్వాసితుల కాలనీ స్కూల్లో ఉన్న పిల్లలను అధికారులు తరలిస్తున్నారు. మార్గమధ్యంలో శ్మశానం, రెండు చెరువులు, పెదంకలాం కాలువ ఉన్నాయి. చిన్న పిల్ల లు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఇప్పటికే పలుమార్లు డీఈఓ, డీఆర్ఓ, కలెక్టర్ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. వారి మొర ఎవరూ వినడం లేదు. సోమ వారం మరోమారు కలెక్టరేట్కు వచ్చారు. ‘పాఠశాలల పునఃప్రారంభం నుంచి పిల్లలు బడులకు వెళ్లడం లేదు. వెళ్లినా తిరిగి పంపిస్తున్నారు. మధ్యాహ్న భోజ నం పెట్టడం లేదు. పోనీ, టీసీలు ఇచ్చేయండన్నా ఎవరూ వినడం లేద’ని విద్యార్థుల తల్లులు ఎల్.జయలక్ష్మి, బౌరోతు లక్ష్మి, గుడివాడ నాగమణి, సంధ్యారాణి, నాగళ్ల లక్ష్మి వాపోయారు. -
చేయి ఎత్తొద్దు!
గొంతు విప్పొద్దు..●బ్యానర్లు తెస్తే.. అటు నుంచి అటే... ● పీజీఆర్ఎస్లో కొత్త ఆంక్షలు ●పోలీసులతో వార్నింగులు ● వినతులిచ్చేవారి గళం నొక్కే ప్రయత్నం కొత్త ఆంక్షలు.. సరికొత్త నిబంధనలు అనుమతి లేనిదే నిరసనలు, ర్యాలీలు చేపట్టకూడ దన్నది కొత్తగా యంత్రాంగం తీసుకొచ్చిన నిబంధ న. కనీసం గుంపుగా తమ సమస్య వినిపించుకునేందుకు వచ్చినా.. పోలీసుల అనుమతి తీసుకోవాలని చెబుతున్నారు. రెండు రోజుల కిందట పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించేందుకు వస్తే.. కలెక్టరేట్ గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. వారిని వెనుకకు పంపించేశారు. తాజాగా సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలోనూ ఇదే తరహా ఆంక్షలు కనిపించాయి. సాధారణంగా సామాజిక సమస్యలపై సామూహికంగానే వినతులిచ్చేందుకు వస్తారు. ఆయా ప్రాంతంలోని గ్రామస్తులు.. వివిధ సంఘా ల వారు మూకుమ్మడిగా వచ్చి అధికారులను కలిసి తమ మొర వినిపిస్తారు. నెలలు, ఏళ్ల తరబడి ఆ సమస్యకు మోక్షం కలగకపోతే.. కాస్త గట్టిగానే తమ గళం వినిపించి, నినాదాలు చేస్తారు. ఎన్నో ఏళ్లుగా ఈ పద్ధతి ఉంది. అటువంటి గొంతులపైనా కూట మి ప్రభుత్వం కత్తిగట్టింది. కలెక్టరేట్ గేటు దాటి గుంపులుగా వస్తే ఆంక్షలే.. లోపలికి వినతి ఇచ్చేందుకు నలుగురైదుగురు మించి వెళ్లకూడదట. బ్యానర్లు ప్రదర్శించకూడదంట. చేయి ఎత్తి నినాదాలు చేయకూడదు. గొంతు ఎత్తి గట్టిగా తమ వాణి వినిపించకూడదంట! మరి వినతుల పరిష్కారం మాట అని అడిగితే.. ఆ మాటకు సమాధానమే ఉండదంట!! వచ్చిన వారికి పోలీసులతో ప్రశ్నలు, హెచ్చరికలు. ఇన్ని ఆంక్షలు తాము ఎన్న డూ చూడలేదని ప్రజాసంఘాల నాయకులు అంటుంటే.. తామేమీ నిందితులమా, తీవ్రవాదులమా అని సాధారణ అర్జీదారులు వాపోతున్నారు. అధికారుల వాహనాలకు షెడ్డులు.. అర్జీదారులకు ఆరుబయట గట్లు! కలెక్టరేట్ ప్రాంగణంలో ఇటీవల పలు మరమ్మతు పనులు చేపట్టారు. గదులు నిర్మించారు. అధికారుల వాహనాల పార్కింగ్కు షెడ్లు వేయించారు. పీజీఆర్ఎస్కు, వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్కు వచ్చే అర్జీదారులకు ఆంక్షలు పెట్టి, కట్టడి చేస్తున్నారు. పీజీఆర్ఎస్ మందిరంవైపు ఎక్కువ మంది రాకుండా వైర్లతో వలయం కట్టారు. కనీసం వారికి ఆరుబయట వేచి ఉండేందుకు ఏర్పాట్లు సైతం లేవు. సోమవారం వర్షం పడుతున్నా.. చెట్ల కింద, గట్లపైన, గొడుగులు వేసుకునే ప్రజలు అవస్థలు పడ్డారు. అర్జీదారులకు నిలువ నీడ చూపని మన అధికారులు.. తమ వాహనాలు మాత్రం ఎండకు, వానకు పాడవకుండా షెడ్డులు కట్టించుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని మహిళలు ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లు. వీరికి ఐదునెలల జీతాల బకాయిలు ఉన్నాయి. నెలల తరబడి జీతాల బకాయి ఉంటే.. నిరుపేదలమైన తాము ఎలా జీవించగలమని వాపోతున్నారు. పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందించేందుకు మూకుమ్మడిగా వస్తే పోలీసులు అడ్డుకున్నారు. పరిమితంగానే లోపలికి వెళ్లి వచ్చేయాలని సూచించారు. -
535 ఎంఎస్పీలకు స్థానచలనం
విజయనగరం క్రైమ్: ఉమ్మడి విజయనగరం జిల్లా లో ఐదేళ్ల సర్వీసు పూర్తయిన 535 మంది మహిళా సంరక్షణ పోలీసుల(ఎంఎస్పీ)కు స్థానచలనం కలి గినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీ స్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో సోమవా రం రాత్రి 10 గంటల వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ సాగింది. ఎస్పీతో పాటు ఏఎస్పీ సౌమ్యలత కౌన్సె లింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. రోగులైన వారు, వైవాహిక పరిస్థితులు, విజువల్ ఇంప్లైయిడ్, తదిత ర అంశాలపై బదిలీల్లో పరిగణనలోకి తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. మొత్తం 635 మందికి 535 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి వార్డు/గ్రామ సచి వాలయాలను కేటాయించామన్నారు. కలెక్టర్ ఉత్తర్వులు మేరకు బదిలీ ఉత్తర్వులను రెండు, మూడు రోజు ల్లో విడుదల చేస్తామ ని తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ ఏఓ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐలు లీలారావు, చౌ దరి, సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, ఎస్ఐ ప్రభావతి, ఆర్ఎస్ఐ లు నీలిమ,మంగలక్ష్మి, డీపీఓ సిబ్బంది తేజ, రాంబాబు, శ్రీనివాసరావు, సుధారాణి, హేమంత్, పీఆర్వో కోటేశ్వరరా వు, ఐటీ కోర్ టీమ్ పాల్గొన్నారు. -
అడవిబాట పట్టి.. బడిని తీర్చిదిద్ది..
● వసతిని విస్మరించిన కూటమి ప్రభుత్వం ● గిరిజనులే సొంతంగా గతంలో రేకుల షెడ్, ఇప్పుడు పూరిపాక నిర్మాణం మక్కువ: వారంతా అడవి బిడ్డలు. తమ వలే పిల్లలు నిరక్షరాస్యులు కాకూడదని తలచారు. పిల్లలు చదుకుని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. పిల్లల విద్యాభ్యాసనకు సరైన వసతి లేకపోవడంతో గతంలో రేకులషెడ్ నిర్మించారు. సమస్యను గుర్తించిన గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు శాశ్వతవసతి కల్పించాలని నాడు–నేడు రెండో విడతలో మార్కొండపుట్టి పంచాయతీ కె.పెద్దవలస ప్రాథమిక పాఠశాలకు రూ.37లక్షలు మంజూరు చేసింది. భవన నిర్మాణాలు తలపెట్టింది. రూ.10లక్షల విలువైన పనులు జరిపింది. ఇంతలో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పునాదుల దశలో ఉన్న పాఠశాల వైపు కన్నెత్తి చూడలేదు. తన నియోజకవర్గంలోని పాఠశాల పిల్లలు వసతిలేక ఇబ్బంది పడుతున్నా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పట్టించుకోకపోవడంతో కె.పెద్దవలస గ్రామస్తులు తల్లడిల్లారు. చివరకు.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న 52 మంది పిల్లలు విద్యాభ్యాసనకు ఇబ్బంది పడకుండా ఉండాలన్న లక్ష్యంతో శ్రమదానంతో అడవిలో కర్రలు సేకరించారు. విరాళాలు పోగుచేసి గడ్డెను కొనుగోలు చేశారు. సుమారు వారం రోజుల పాటు శ్రమించి ఉపాధ్యాయుల సూచనల మేరకు చక్కని పూరిపాకను నిర్మించారు. దీనిని రెండు, మూడురోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
అలకల్లోలం..!
● వేటకు అల్పపీడనం దెబ్బ ● ప్రతికూల వాతావరణంతో కొనసాగని చేపల వేట ● ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులుప్రతికూల వాతావరణంతో పతివాడబర్రిపేటలో ఉధృతంగా వస్తున్న కెరటాలుపూసపాటిరేగ: సముద్రమే సర్వస్వంగా జీవిస్తున్న గంగపుత్రులకు ప్రతికూల వాతావరణంతో వేట సాగక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన రెండు నెలలుగా వేట నిషేధం కారణంగా సముద్రంలో వేట నిలిపివేశారు. తీరా వేట ప్రారంభించిన నాటి నుంచి వాతావరణంలో మార్పులతో అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడం తదితర కారణాలతో కొంత సమయం వేట సాగలేదు. తాజాగా గత మూడురోజులుగా అల్పపీడనం కారణంగా కెరటాలు ఉధృతిగా రావడంతో చేపల వేటకు వెళ్లినా చేపలు వలకు చిక్కని పరిస్థితి నెలకొందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరంలో గాలులు వీయడం, అలలు ఎగిసి పడుతుండడంతో వేటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. జిల్లాలో పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 27 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో 21 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వేటపై ప్రత్యక్షంగా 6 వేల మంది, పరోక్షంగా 15 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. సంప్రదాయ బోట్లు, ఇంజిన్బోట్లు రెండు మండలాల్లో 1120 వరకు ఉన్నాయి. వాటిలో 885 బోట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ ఏడాది వేట నిషేధం తరువాత వేట ప్రారంభించినప్పటి నుంచి చేపలు వలకు చిక్కడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. నిషేధ సమయంలో కుటుంబాలు ఎలాగో నెట్టుకొచ్చినా మళ్లీ కష్టాలు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా అలల ఉధృతి ఎక్కువై బోట్లు తీరానికే పరిమితమయ్యాయి. వేట లేకపోవడంతో వలలకు మరమ్మతులు చేసుకుంటున్నామని పలువురు మత్స్యకారులు చెబుతున్నారు. వేట నిషేధ సమయంలో భృతి మంజూరుకు నిబంధనల పేరిట చాలామంది మత్స్యకారులకు మత్స్యకార భరోసా నిలిపివేశారు. గత ప్రభుత్వంలో వేట చేసిన ప్రతి మత్స్యకారుడికి మత్స్యకార భరోసా మంజూరైంది. కానీ నేడు మత్స్యకారుల పరిస్థితి అయోమయంగా మారింది. గత ఏడాది కూడా మత్స్యకార భరోసా ఊసెత్తని సర్కారు నిబంధనల పేరిట ఈ ఏడాది చాలా మందికి కోత విధించింది. ఏడాదిలో సగం రోజులు ప్రకృతి వైపరీత్యాలు, మరి కొన్ని రోజులు తుఫాన్ హెచ్చరికలు, ప్రతి కూలవాతావరణంతో వేట సాగక ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకార జీవనవిధానంలో మార్పులకు సర్కారు ప్రత్యామ్నాయం ఆలోచించి వేట లేని సమయంలో తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.అరకొరగా మత్స్యసంపద వేట నిషేధసమయం తరువాత వేటకు వెళ్లినా చేపలు వలకు చిక్కడం లేదు. ప్రతి ఏడాది నిషేధం తరువాత చేపల వేట చేస్తే మత్స్య సంపద సమృద్ధిగా దొరికేది. కానీ ఈ ఏడాది నిషేధం తరువాత చేపల వేట సాగడం లేదు. వేటకు వెళ్లినా డీజిల్ఖర్చు కూడా రాని పరిస్థితి నెలకొంది. అల్పపీడనం కారణంగా మూడురోజులుగా వేట సాగలేదు. – సూరాడ కొర్లయ్య, పతివాడబర్రిపేటప్రతికూల వాతావరణంతో ఇబ్బందులు సముద్రంలో అల్పపీడనం ప్రభావంతో ప్రతికూలవాతావరణం నెలకొని అలల ఉధృతి పెరిగింది. వాతావరణంలో మార్పుల కారణంగా వేట చేయలేని పరిస్థితి. వేట సాగకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. వేటలేని సమయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించి ఆదుకోవాలి. – ఆకుల కాశీలు, పతివాడ బర్రిపేట -
ఇంటర్ విద్యార్థి మృతి
బొబ్బిలి: బాడంగి మండలం హరిజన పాల్తేరుకు చెందిన అలమండ ఉదయ రాజ్(16) అనే ఇంటర్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో ఆదివారం దుర్మరణం చెందాడు. బాడంగి మండలానికి చెందిన అలమండ రవి బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తూ బొబ్బిలిలోనే స్థిరపడ్డాడు. రవికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఉదయరాజ్ విశాఖలోని శశి కాలేజ్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చిన ఉదయరాజ్ పాత బొబ్బిలిలోని తన స్నేహితుడిని కలిసి వస్తానని చెప్పి బైక్పై వెళ్లాడు. స్నేహితుడితో మాట్లాడి తిరిగి రాతిపనివారి వీధిలోని తన ఇంటికి వస్తుండగా పాత బొబ్బిలిలో ఉన్న గుంతల వద్ద అదుపు తప్పి కిందపడిపోవడంతో లారీ ఢీకొంది. దీంతో ఉదయ రాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తమ్ముడు ప్రేమ్కుమార్ 8వ తరగతి చదువుతున్నాడు. తల్లి ఉష భర్తకు చేదోడు వాదోడుగా షాపు దగ్గర ఉంటోంది. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్సై పి జ్ఙానప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని సీహెచ్సీకి తరలించారు. -
సైబర్ వలకు చిక్కి నగదు పోగొట్టుకున్న బాధితుడు
పాలకొండ రూరల్: ఓవైపు పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రజలు నేరగాళ్లు, హ్యాకర్ల బారిన పడుతున్నారు. తాజాగా పాలకొండ మండలం సింగన్నవలసకు చెందిన బిల్లకుర్తి ఉపేంద్రకుమార్కు సైబర్ వలకు చిక్కి నగదు పోగొట్టుకున్నాడు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 28 న సమీప గ్రామ సచివాలయానికి చెందిన ఓ కార్యదర్శి నంబర్ నుంచి ఓ ‘లింక్’ మెసేజ్ ఉపేంద్రకుమార్ వచ్చింది. గతంలో వలంటీరుగా పనిచేసిన క్రమంలో బహుశా కార్యదర్శి నుంచి ఈ లింక్ వచ్చి ఉంటుందని భావించి ఆ లింక్ ఓపెన్ చేశాడు. ఇంతలో సెల్ ఫోన్కు పలుమెసేజ్లు వరుసగా వస్తుండడంతో సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. అయితే అప్పటికే సెల్ హ్యాక్ కావడంతో స్నేహితులు, బంధువులకు పలు మెసేజ్లు వెళ్లాయి. తన ఆరోగ్య పరిస్థతి సరిగా లేదని ఆర్ధిక సాయం చేయాలని ఈ మెసేజ్ల సారాంశంగా బాధితుడు తెలుసుకున్నాడు. ఇంతలో తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతా ఇదే సెల్కు అనుసంధానం చేసి ఉండడంతో వరుసగా నగదు మాయం అవుతుండడం, సమాచారం సెల్ఫోన్కు మెజేజ్ల రూపంలో వస్తుండడంతో ఆందోళన చెందాడు. తన ప్రమేయం లేకున్నా రూ.56వేల పైచిలుకు నదగు పలు దఫాలుగా మాయం కావడంతో ఆదివారం స్థానిక పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. -
చెస్పోటీల్లో దివ్యాంగుల ప్రతిభ
● అంతర్జాతీయ పోటీలకు 21 మంది ఎంపికవిజయనగరం: ‘సరిలేరు మాకెవ్వరు’ అని నిరూపించారు దివ్యాంగ క్రీడాకారులు. మూడు రోజులుగా జిల్లా వేదికగా జరిగిన 5వ జాతీయ దివ్యాంగుల చెస్ చాంపియన్షిప్లో పాల్గొన్న దివ్యాంగులు తమ ప్రతిభ చాటిచెప్పారు. చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో నగరంలోని మెసానిక్ టెంపుల్లో జరిగిన పోటీల్లో దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 106 మంది క్రీడాకారులు పాల్గొన్న విషయం విదితమే. శనివారం రాత్రి వరకు 9 రౌండ్ల పోటీలు హోరాహరీగా సాగాయి. అనంతరం 9వ రౌండ్లో అత్యధిక పాయింట్లు సాధించిన క్రీడాకారులను ఆయా విభాగాల వారీగా విజేతలుగా ప్రకటించారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు చిన్నశ్రీను సోల్జర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర, జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం కార్యదర్శి కేవీ.జ్వాలాముఖిలు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు, నగదు ప్రోత్సాహకాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిన్నశ్రీను సోల్జర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర మాట్లాడుతూ మానసిక మేధోసంపత్తికి చెస్ వంటి క్రీడాకారులు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చదువుతో పాటు క్రీడలను తమ జీవితంలో అంతర్భాగంగా చేసుకున్నప్పుడే ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవచ్చన్నారు. దేశంలోని వివిద ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగ క్రీడాకారులు ప్రతిభా పాటవాలు చెప్పలేనివని, పోటీల్లో విజేతలుగా నిలిచిన వారితో పాటు పాల్గొన్న వారు విజేతలేనంటూ అభినందించారు. చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా కార్యదర్శి కేవీ జ్వాలాముఖి మాట్లాడుతూ జాతీయస్థాయిలో నిర్వహించిన దివ్యాంగుల చెస్ చాంపియన్షిప్ పోటీలు మొత్తం 7 కేటగిరీల్లో నిర్వహించామని, ఆయా కేటగిరీల్లో మొదటి మూడు స్థానాలు దక్కించుకున్న వారిని త్వరలో గోవాలో జరగనున్న ప్రపంచస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు రూ.2.30 లక్షల నగదు బహుమతులను అందజేశామని వివరించారు. కార్యక్రమంలో పలువురు చెస్ అసోసియేషన్ ప్రతినిధులు, అర్బిటర్లు, క్రీడాకారులు, వారి తలిదండ్రులు పాల్గొన్నారు. -
‘మధ్యతరగతి మందహాసం’ పుస్తకావిష్కరణ
విజయనగరం టౌన్: బెహరా వెంకట సుబ్బారావు సర్వ లభ్యరచనల పుస్తకం ‘మధ్యతరగతి మందహాసం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం అరసం జిల్లాశాఖ ఆధ్వర్యంలో జెడ్పీ సమావేశమందిరంలో ఆదివారం వేడుకగా నిర్వహించారు. కార్యక్రమానికి కలిగొట్ల సన్యాసిరాజు అధ్యక్ష్యత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బహుభాషా గ్రంథకర్త డాక్టర్ వీవీవీ.రమణ మధ్యతరగతి గాథలు, వ్యథలను స్వయంగా పరిశీలించి, అనుభవించి రాసిన గొప్ప రచయిత బెహరా సుబ్బారావు అని ప్రశంసించారు. మన జీవితాల్లో జరుగుతున్న అనేక సంఘటనల సమాహారం మధ్యతరగి మందహాసమని విశిష్ట అతిథి, వ్యంగ్య కథల రచయిత డాక్టర్ కొచ్చర్లకోట జగదీష్ పేర్కొన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ కేఎస్ఎస్ బాపూజీ కథలపై సమీక్ష చేస్తూ సునిశతమైన హాస్యాన్ని కథలలో జోడిస్తూ తాను చెప్పాల్సిన విషయాన్ని సున్నితంగా చెబుతూ ప్రతి కథకు గొప్ప కొసమెరుపులిచ్చారన్నారు. పుస్తక సంపాదకుడి సుబ్బారావు కుమారుడు మూర్తి మాట్లాడుతూ నాన్నగారి కథలు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా సామాజిక చైతన్యానికి దోహద పడ్డాయన్నారు. సుబ్బారావు కథలు మధ్యతరగతి మహాభారతమని, అటువంటి గొప్ప కథల పుస్తకాన్ని సుబ్బారావు పుత్రుడు మూర్తి పెద్ద గ్రంథంగా తీసుకురావడం తండ్రిరుణం తీర్చుకున్న కుమారుడిగా ధన్యుడయ్యాడని అరసం జిల్లా అధ్యక్ష్యుడు జీఎస్.చలం పేర్కొన్నారు. ప్రముఖ కవి, రచయిత రాజోలు నుంచి హాజరైన ఎం.ఎస్.సూర్యనారాయణ కథల మీద సమగ్రమైన విమర్శ రావాలని, ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నాల బాలకృష్ణ సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో రెండవ నిందితుడి అరెస్ట్
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో 2017లో డబ్బుల అపహరణ కేసులో రెండవ నిందితుడ్ని ఆదివారం అరెస్ట్ చేసినట్టు వన్టౌన్ సీఐ శ్రీనివాస్ చెప్పారు. ఆ కేసులో బాధితుడు కర్రి రవీంద్రరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, దర్యాప్తు పూర్తి చేశారు. ఆ కేసులో గుత్తి ప్రవీణ్ కుమార్, ఆర్.జయ ప్రకాష్ రెడ్డి, మహమ్మద్ అమీనుద్దీన్, చెల్లి రాజు, బూర రత్నాజీ, విశ్వనాథ్ రెడ్డి సంగీత కన్నన్లను ఇదివరకే అరెస్ట్ చేశారు. ఈ కేసులో రెండవ నిందితుడు తమిళనాడుకు చెందిన జీజే శ్రీనివాసులు పరారీలో ఉండగా ట్రాన్సిట్ వారెంట్తో విజయనగరం తీసుకువచ్చి జడ్జి ముందు హాజరుపరచగా 14 రోజలు రిమాండ్ విధించారని సీఐ శ్రీనివాస్ తెలిపారు. రెండు బైక్లు ఢీకొని వ్యక్తి దుర్మరణంవిజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పీఎస్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని నటరాజ్కాలనీకి చెందిన నూకరాజు(41) దుర్మరణం చెందాడు. నూకరాజు ఇంటి నుంచి బైక్పై ధర్మపురి వెళ్లాడు. తిరిగొస్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టడంతో నూకరాజు కింద పడిపోగా తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి భార్య సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్సై అశోక్ తెలిపారు. -
మద్యం వద్దు.. తాగునీరు ముద్దు
● సారిపల్లిలో వినూత్న ప్రచారం ● మద్యపాన నిసేధంపై ఇంటింటికీ కరపత్రాల పంపిణీనెల్లిమర్ల రూరల్: మండలంలోని సారిపల్లి గ్రామంలో మద్యం ఏరులై పారుతోంది. బెల్టు షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఎక్కడ చూసినా మద్యం లభిస్తోంది కానీ తాగునీరు మాత్రం దొరకడం లేదని గ్రామానికి చెందిన పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలకులకు కనువిప్పు కలిగేందుకు గ్రామస్తులు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ రాయి పైడమ్మ, ఎంపీటీసీ మజ్జి త్రివేణి ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటికీ పర్యటించి మద్యపాన నిషేధంపై ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఇటీవల పార్టీలకు అతీతంగా సమావేశం ఏర్పాటు చేశామని, ఆలయాల నిర్మాణంతో పాటు గ్రామాభివృద్ధికి పలు తీర్మానాలు చేశామన్నారు. పేదలను పీల్చిపిప్పి చేస్తున్న మద్యాన్ని గ్రామంలో అమ్మకూడదని హెచ్చరికలు కూడా జారీ చేశామన్నారు. అయినప్పటికీ కొందరు యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిసేధమే లక్ష్యంగా కరపత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. తాగునీరు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, జల్జీవన్ మిషన్లో భాగంగా మంజూరైన ఇంటింటి కుళాయిల ఏర్పాటుకు కూటమి నాయకులు సహకరించాలని కోరారు. -
బియ్యం దొంగలకు భరోసా..!
● వారి జోలికి వెళ్లొద్దని అధికారులకు కూటమి నేతల హుకుం ● అధికారులు మౌనం దాల్చారని విమర్శలువిజయనగరం ఫోర్ట్: బొండపల్లి మండలంలో పెద్దఎత్తున పీడీఎస్ బియ్యం పట్టివేత సంఘటన జరిగి 24 రోజులవుతున్నా చర్యలు శూన్యం. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించిన దొంగలకు కూటమి నేతలు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టించిన వారి జోలికి వెళ్లొద్దని కూటమికి చెందిన నేతలు సంబంధిత శాఖ అధికారులకు హుకుం జారీ చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుచేతనే అధికారులు మిన్నకుండిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారం చేపట్టిన తొలినాళ్లలో కూటమి నేతలు ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పడు పీడీఎస్ బియ్యం నేరుగా నారసంచులతోనే దొరికినప్పటికీ కిమ్మనకపోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రేషన్ వాహనాల ద్వారా పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతోందనే డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ చేపట్టామని కూటమి సర్కార్ గొప్పలు చెప్పింది. రేషన్ డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ చేపట్టిన మొదటి నెల ఆరంభంలోనే నార సంచులతో పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలించారు. ఇది పెద్ద ఎత్తున సంచలనమైంది. బొండపల్లి మండలంలో పట్టుబడిన బియ్యం పేదప్రజలకు అందించే పీడీఎస్ బియ్యం కొంతమంది వ్యాపారులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టించారు. పీడీఎస్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. బొండపల్లి మండలంలోని కొండకిండాంలో గల కోళ్ల ఫారంలో 106 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, కిండాం ఆగ్రహారం మామిడి తోటలో 43 క్వింటాళ్ల ిపీడీఎస్ బియ్యం అధికారులు గుర్తించారు. రేషన్ దుకాణాల్లో ఉండాల్సిన పీడీఎస్ బియ్యం కోళ్ల ఫారం, మామిడితోటల్లోకి తరలించడం సంచలనమైంది. అయితే ఈ సంఘటన జరిగి 24 రోజులవుతున్నా వ్యాపారులు ఏ రేషన్ షాపు నుంచి తరలించారనేది అధికారులు ఇంతవరకు తేల్చలేదు. ఎంతసేపు 6 ఎ కేసులు నమోదు చేశామని చెప్పడం తప్ప. వ్యాపారులకు సహకరించిన రేషన్ డీలర్ ఎవరనే వివరాలు అధికారులు వెల్లడించలేదు. అయితే పీడీఎస్ బియ్యం ఏ రేషన్ షాపు నుంచి వెళ్లాయన్న విషయం సివిల్ సప్లైస్ అధికారులకు తెలిసినప్పటికీ కూతమి నేతలు బయటకు చెప్పవద్దని ఆదేశించారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బయటకు చెప్పడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సంఘటన జరిగి ఇన్ని రోజులైనా సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి లేని పాలన అందిస్తామని కూటమి నేతలు గొప్పలు చెబుతున్నారు. కానీ పీడీఎస్ బియ్యం తరలింపు ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా నోరు మెదపడం లేదు. వ్యాపారులపై కోర్టులో కేసులు పీడీఎస్ బియ్యం తరలించిన వ్యాపారులపై కోర్టులో కేసులు పెడతాం. బియ్యం తరలించిన రేషన్ డీలర్ల వివరాలు కూడా తెలిశాయి. వారిపై నిఘా పెట్టాం. వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. – కె.మధుసూదన్రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
పడిపోయిన పైనాపిల్ ధర
సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025నేడు పీజీఆర్ఎస్ సమావేశం సీతంపేట: సీతంపేట ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అధికారులు నిర్వహించనున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలతో అభివృద్ధి సీతంపేట: కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే పీవీటీజీ గిరిజనుల అభివృద్ధి సాధ్యమని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ రాహుల్ ఖురానా అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం డీఏ జుగా, పీఎం జన్మన్ పథకాల అమలు తీరును పరిశీలించడానికి సీతంపేట ఏజెన్సీలో రెండో రోజు ఆదివారం మొగదార కాలనీ, డి.బుడగరాయి, చిన్నరామ గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో పీఎం జన్మన్ పథకాల ద్వారా నిరుపేద ఆదిమ గిరిజనులకు గృహాలు మంజూరు చేశామన్నారు. గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించి అన్ని విధాల అభివృద్ధి బాట పట్టిస్తామన్నారు. వీటిని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంగన్వాడీ భవనాలు లేని చోట కొత్తవి నిర్మించనున్నారని ప్రభుత్వ స్థలం లేకపోతే అవసరమైన ప్రైవేటు స్థలం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలు విన్నారు. అంగన్వాడీ స్టాల్స్ను పరిశీలించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ వెంకటేష్, సీడీపీవో సిమ్మాలమ్మ, పీవీటీజీ కో ఆర్డినేటర్ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వరాహ, నరసింహమూర్తి అవతారాల్లో జగన్నాథుడు విజయనగరం టౌన్: జగన్నాథస్వామి రథయా త్ర మహోత్సవాల్లో భాగంగా కోళ్ల బజారులో కొలువైన బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథస్వామి ఆదివారం వరాహ, నరసింహమూర్తి అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చ కులు పి.నగేషాచార్యులు, వెంకటరమణాచార్యులు స్వామివారికి పూజాదికాలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. ఒకటి, ఆరో తరగతుల్లో ప్రవేశాలు పెరగాలి : కలెక్టర్ పార్వతీపురం టౌన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి, ఆరో తరగతుల్లో ప్రవేశాలు పెరగాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1, 6 తరగతుల్లో ప్రవేశాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి విద్యార్థులు చేరేలా శ్రద్ధ కనబరచాలన్నారు. డిజిటల్ అసిస్టెంట్లు, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ సూపర్ వైజర్లు, వీఆర్వోల సహకారం తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రవేశాలన్ని ఈ డ్రైవ్ ద్వారా భర్తీ కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో పాటు అన్ని వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, షూస్, నోట్ బుక్స్ తదితర సామగ్రి కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. మధ్యాహ్న భోజన పథకంతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా తల్లికి వందనం కింద రూ.15 వేలు ప్రభుత్వం మంజూరు చేస్తోన్న సంగతిని కలెక్టర్ గుర్తు చేశారు. ఇన్ని వసతులు, లబ్ధిని చేకూర్చే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు ప్రతీ ఏటా పెరగాలని, ఆ దిశగా తల్లితండ్రులకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలో చేరే ప్రతి విద్యార్థికి పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబరు (పెన్) కేటాయించాలని, ఆ నంబరు ఉంటేనే విద్యార్థి రిజిస్టర్ అయినట్లవుతుందని తెలిపారు. తద్వారా తల్లికి వందనం వర్తిస్తుందని, ఇందుకు అవసరమైన ధ్రువపత్రాలు పొందాలని, లేకుంటే వాటికి దరఖాస్తు చేయించి పెన్ పొందేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జూలై 1వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. కాన్ఫరెన్స్లో జిల్లా విద్యాశాఖాధికారి బి.రాజ్ కుమార్, ఐసీడీఎస్ పీడీ డా. టి.కనకదుర్గ, మండల విద్యాశాఖాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.సీతంపేట మార్కెట్కు ఆదివారం భారీగా పైనాపిల్ను గిరిజనులు విక్రయించేందుకు తీసుకువచ్చారు. అయితే ఓ వైపు బోరున వర్షం.. మరోవైపు పడిపోయిన ధరతో ఏం చేయాలో గిరిజనులకు తెలియలేదు. చివరకు ఇదే అదునుగా వ్యాపారులు సిండికేట్గా మారి ధరను మరింత తగ్గించి ఒక్కో పైనాపిల్ను రూ.7 నుంచి 10 మధ్య కొనుగోలు చేశారు. గిరిజనులు చేసేది లేక వారికే విక్రయించాల్సి వచ్చింది. గత వారం ఇదే పైనాపిల్ను రూ.10 నుంచి 15 వరకు కొనుగోలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారుల మోసాలకు నష్టాలు చవి చూస్తున్నామని వాపోయారు. – సీతంపేట న్యూస్రీల్ -
బీమా భారం
● ఉచిత పంటల బీమా పథకానికి మంగళం ● పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాల్సిన పరిస్థితి ● వరి, మొక్కజొన్న, పత్తి, నువ్వు పంటలకు బీమా వర్తింపు ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లించింది విజయనగరం ఫోర్ట్: ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నంపెట్టే రైతన్నపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లు పూర్తయినా అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న రూ.20వేల పెట్టుబడి సాయం అందజేయలేదు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ఆరంభమైనా సాయం ఊసెత్తడం లేదు. మరోవైపు గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసింది. రైతులే పంటల బీమా ప్రీమియం చెల్లించుకోవాలి. లేదంటే విపత్తుల సమయంలో పంటలు కోల్పోయిన రైతులకు ఆర్థిక సాయం అందదు. జిల్లాలో సాగవుతున్న వరి, మొక్కజొన్న, పత్తి, నువ్వు పంటల సాగు విస్తీర్ణం ప్రకారం చూస్తే రైతులపై రూ.6.19 కోట్ల భారం పడనుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు పెట్టుబడి సాయం అందే దారి కనిపించక, మరోవైపు బీమా చెల్లింపునకు చేతిలో డబ్బులు లేక ఆవేదన చెందుతున్నారు. రైతన్నపై కూటమి ప్రభుత్వం కపటప్రేమ చూపుతోందని, తమ ఓట్లతోనే అధికారంలోకి వచ్చి ఇప్పుడు తమనే ఇబ్బందులకు గురిచేస్తోందంటూ మండిపడుతున్నారు. ఖరీఫ్లో నాలుగు పంటలకు బీమా వర్తింపు... ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో నాలుగు పంటలకు పంటల బీమా పథకాన్ని వర్తింపజేశారు. నాలుగు పంటలకు కూడా పంటల బీమా ప్రీమియం రైతులు చెల్లించుకోవాల్సిందే. వరి పంటకు హెక్టారుకు రూ.500, నువ్వు పంటకు హెక్టారుకు రూ.162.50, మొక్కజొన్నకు హెక్టారుకు రూ.412, పత్తి పంటకు హెక్టారుకు రూ.4,807 చెల్లించాలి. ఈ లెక్కన జిల్లాలో ఆయా పంటల సాగువిస్తీర్ణం ప్రకారం రైతులు రూ.6.19కోట్ల బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఉచిత పంటల బీమా నాకు మూడు ఎకరాల మెట్టు భూమి ఉంది. అందులో అరటి తోట సాగు చేస్తున్నాను. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నా తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లించడం వల్ల తుఫాన్ సమయంలో పంట నష్టపోతే 50వేల పరిహారం అందింది. ఇప్పడు కూటమి ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం రైతులను కట్టుకోమంటోంది. – గనివాడ సన్యాసినాయుడు, రైతు, పెదమధుపాడ గ్రామం రైతులే చెల్లించాలి పంటల బీమా పథకానికి సంబంధించి బీమా ప్రీమియంను రైతులే చెల్లించుకోవాలి. పంటల బీమా కడితే ప్రకృతి వైపరీత్యాల సమయంలో బీమా వర్తిస్తుంది. లేదంటే ఆర్థిక సాయం అందే పరిస్థితి ఉండదు. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఐదేళ్లూ ఒక్క రూపాయి కట్టలేదు.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పంటల బీమా ప్రీమియం ఒక్క రూపాయి కూడా మేము చెల్లించలేదు. అంతా ప్రభుత్వమే చెల్లించేది. విపత్తుల సమయంలో పరిహారం అందేది. నాకు రెండు ఎకరాల పొలం ఉంది. వరి పంట సాగుకు సిద్ధమవుతున్నాను. అధికారులు పంట బీమా ప్రీమియం చెల్లించాలని చెబుతున్నారు. లేదంటే పరిహారం అందదంటున్నారు. ఇది రైతుకు ఆర్థిక భారమే. ప్రభుత్వమే స్పందించి ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలి. – రంధి దేముడు, రైతు పెదవేమలి గ్రామం -
సంగాంలో ఏనుగుల సంచారం
వంగర:సంగాంలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. శనివారం అర్ధరాత్రి రేగిడి మండలం సరసనాపల్లి తోటల్లోంచి మడ్డువలస వంతెన కింది భాగం మీదుగా సంగాం పంట పొలాల్లోకి ప్రవే శించాయి. మొక్కజొన్న, చెరకు, వరి పంటలను నాశనం చేశాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. ఆదివారం రాత్రి వంగర నుంచి రాజాం వెళ్లే రోడ్డును ఆనుకొని సంగాం పంట పొలాల్లో తొమ్మిది ఏనుగులు తిష్ట వేశాయి. అటవీ శాఖ సిబ్బంది, ఎలిఫెంట్ టేకర్స్ వాటి వెంట ఉంటూ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
ఎంటీఎస్లకు అన్యాయం!
ఉపాధ్యాయ బదిలీల్లో... పార్వతీపురం టౌన్: ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల అనంతరం జిల్లాలో పలు పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని ఎంటీఎస్లతో సర్దుబాటు చేసేందుకు వారం రోజుల కిందట కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్లో తమకు తీరని అన్యాయం జరిగిందని మినిమమ్ టైమ్ స్కేల్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 475మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. 1998, 2008 డీఎస్సీ బ్యాచ్లకు చెందిన వీరంతా మినిమమ్ టైమ్ స్కేల్ విధానంలో జిల్లాలో వివిధ పాఠశాలల్లో ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన రెగ్యులర్ బదిలీల అనంతరం సుదూర ప్రాంతాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఫలితంగా ప్రస్తుతం పని చేస్తున్న ప్రాంతాలకు దూరంగా సుమారు 70–100 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బదిలీలపై ఎంటీఎస్ ఉపాధ్యాయులు వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. అరకొర జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తాము దూర ప్రాంతాలకు వెెళ్లి విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమలో సుమారు 80శాతం మంది రెండు మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయాల్సిన వారే ఉన్నారని చెబుతున్నారు. మండలాలకు ఎంటీఎస్లను పంపినా.. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు లేవనే కారణంతో 50శాతం మందికి పైగా ఎంటీఎస్లను విధుల్లోకి తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. క్లస్టర్ విధానంతో పాట్లు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన క్లస్టర్ విధానం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లస్టర్ విధానంలో ఎస్జీటీలతో కొన్ని ఉన్నత పాఠశాలలకు తాత్కాలికంగా భర్తీ చేశారు. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మార్గదర్శకాలు రాలేదని అధికారులు చెబుతుండంతో ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. కౌన్సెలింగ్ పూర్తయి వారం రోజులు గడుస్తున్నా.. పాఠశాలలు కేటాయించడం లేదని వాపోతున్నారు. విజయనగరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 475 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలు ఇవే... కేవలం రూ.32 వేలతో పని చేస్తున్న ఎంటీఎస్ ఉపాధ్యాయులను పని చేస్తున్న మండలాల్లో సర్దుబాటు చేయలేదు. ప్రతీ మండలంలో ఉన్న మోడల్ స్కూల్లో ఒక ఎంటీఎస్ను నియమించలేదు. ప్రభుత్వం చూపిస్తున్న ఖాళీలు నివాస ప్రాంతాలకు 200 కిలోమీటర్లు ఉన్నందున ప్రభుత్వం ఇచ్చే జీతం ప్రయాణ ఖర్చులకే సరిపోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రస్తుత ఖాళీల్లో సర్దుబాటు చేయాల్సి వస్తే హెచ్ఆర్ఎ, డీఏ ఇచ్చి రెగ్యులరైజేషన్ చేయాలి. జిల్లా వ్యాప్తంగా ప్రతీ క్లస్టర్లో క్లస్టర్ వేకెన్సీలు సృష్టించి ఎంటీఎస్లకు సర్దుబాటు చేయడంలేదు. దివ్యాంగులుగా ఉన్న ఎంటీఎస్లకు వారు కోరుకున్న మండలంలో పని చేసేందుకు అవకాశం కల్పించడం లేదు. మున్సిపల్ పాఠశాలలో వేకెన్సీలను కూడా 15 నుంచి 20మంది విద్యార్థులున్న ప్రతీ పాఠశాలలో ఒక ఎంటీఎస్ ఉపాధ్యాయుడిని నియమించాలి. పాఠశాలలు కేటాయించాలి ఎంటీఎస్లకు పాఠశాలలు కేటాయించాలి. దివ్యాంగులుగా ఉన్న ఎంటీఎస్లకు వారు కోరుకున్న మండలంలో పని చేసేందుకు అవకాశం కల్పించడం లేదు. అరకొర జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తాము దూర ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం, అధికారులు పునరాలోచించాలి. కొమరాడ మండలంలో క్లస్టర్కు కేటాయించారు. కాని పాఠశాల కేటాయించలేదు. – ఎంటీఎస్ ఉపాధ్యాయుడు క్లస్టర్ విధానంతో పాట్లు మండలాలను కేటాయించినా.. విధుల్లో చేర్చుకోని వైనం క్లస్టర్ పాఠశాలలకు నియామకం ఆందోళనలో ఎంటీఎస్లు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదంటున్న అధికారులు ఉమ్మడి జిల్లాలో 475 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు -
సెప్టెంబర్ 13, 14 తేదీల్లో జేవీవీ రాష్ట్ర మహాసభలు
విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 13, 14 తేదీల్లో నిర్వహించే 18వ జనవిజ్ఞాన వేధిక మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి కె.త్రిమూర్తులు పిలుపునిచ్చారు. స్థానిక ఏపీఎన్జీవో హోమ్లో ఆదివారం జరిగిన ఆహ్వాన సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగు ప్రజలు హేతుబద్దంగా ఆలోచించి జీవించాలని గత 37 సంవత్సరాలుగా జనవిజ్ఞాన వేదిక అవిరళ కృషి జరుపుతున్నదని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, వైద్యులు, ఉద్యోగులు ఉపాధ్యాయులు, విద్యార్ధులు, యువకులు, మహిళలు మధ్యతరగతి మేధావులు, వృత్తి నిపుణులు దాదాపు 30 వేలకు పైగా సభ్యులున్న అతి పెద్ద సైన్స్ ప్రచార సంస్థ జనవిజ్ఞాన వేదిక అని కొనియాడారు. జేవీవీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలాంటి అనారోగ్య పరిస్థితులు సంభవించినా సైన్స్కు సంబంధించి ఏ అంశం ముందుకొచ్చి చర్చనీయాంశంగా మారినా జేవీవీ కార్యకర్తలు ముందుండి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. అనంతరం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘానికి చైర్మన్గా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణను సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రమణప్రభాత్, సాహితీ స్రవంతీ రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి కె.విజయగౌరి పాల్గొన్నారు. ఘనంగా జాతీయ గణాంక దినోత్సవం విజయనగరం అర్బన్: గణాంక శాఖ పితా మహులు ప్రొఫెసర్ పీసీమహల్నోబిస్ జన్నదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా జరుపుకొనే జాతీయ గణాంక దినోత్సవం కలెక్టరేట్లోని ముఖ్య ప్రణాళికాధికా రి కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలిత ఆయన చిత్రపటానికి సీపీవో పి.బాలాజీ, సిబ్బంది పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సీపీవో మాట్లాడుతూ ప్రణాళిక వ్యవస్థకు పితామహుడు జవహర్లాల్ నెహ్రూ అయితే భారత ప్రణాళిక పథకానికి పీసీమహలనోబిస్ నిర్దేశకుడిగా ప్రసిద్ధి చెందారని కొనియాడారు. గ్రామంలో భూమికి హద్దులు నిర్ధారించి అందులో సాగైన భూమి, సాగుకి పనికి రాని భూమి, దేవాలయాలు, చెరువులు, శ్మశానాలు, పల్లం భూమి, మెట్టు భూమి, సత్రాలు, పన్నులు వసూలు, వస్తువుల అమ్మకాలు, చారిటీ ద్వారా ఆదాయం వంటి విషయాలను సేకరణ ప్రక్రియ ప్రాధాన్యతను పాలకులకు తెలియజేశారని తెలి పారు. ఏడీ, ఉప గణాంకాధికారులు పాల్గొన్నారు. -
అరుదైన జువెనరీ గ్లకోమా చికిత్స
బొబ్బిలి: పట్టణంలోని బొబ్బిలి కంటి ఆసుపత్రిలో జాతీయ స్థాయి కంటి శస్త్రచికిత్సల నిపుణులు డాక్టర్ కేవీ ఆప్పారావు అరుదైన కంటి శస్త్ర చికిత్స నిర్వహించారు. పార్వతీపురానికి చెందిన నరేంద్ర పంగి అనే మహిళకు చిన్నతనంలోనే గ్లకోమా (జువెనరీ గ్లకోమా)వ్యాధి సోకింది. ఈమె విశాఖ తదితర ప్రాంతాల్లో పలు ఆసుపత్రులకు వెళ్లి చికిత్సలు పొందినా నయం కాలేదు. చూపు మరింత మందగించింది. చివరికి డాక్టర్ కేవీ అప్పారావు డాక్టర్ను కలసింది. ఆయన చికిత్స చేసి ఇది అరుదైన జువెనరి గ్లకోమా వ్యాధి అని శస్త్ర చికిత్స అవసరమని ఆ ప్రకారం చేయడంతో ఈమెకు కంటి చూపు 70శాతం పైగా వచ్చినట్టు తెలిపారు. అసలు నాకు కంటి చూపు వస్తుందని అనుకోలేదని, బొబ్బిలిలో చికిత్స చేయించుకోవడం వలన తాను మునుపటిలా చూడగలుగుతున్నానని డాక్టర్ అప్పారావుకు కృతజ్ఙతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అప్పారావు మాట్లాడుతూ ఈమెకు 21 సంవత్సరాల వయసులోనే గ్లకోమా వచ్చిందన్నారు. ఇటువంటి వారికి వచ్చే అంధత్వాన్ని జువెనరీ గ్లకోమా వ్యాధి అంటారన్నారు. ఏమాత్రం దృష్టి లోపం ఉన్నా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలన్నారు. -
పెదపెంకి.. మూత‘బడి’!
సాక్షి, పార్వతీపురం మన్యం: బలిజిపేట మండలం పెదపెంకి–1 పాఠశాల కొద్దిరోజులుగా మూతపడే ఉంటోంది. 3, 4, 5 తరగతులను మరోచోటకు విలీనం చేయడాన్ని నిరసిస్తూ, కొద్దిరోజులుగా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. వీరి ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో 1, 2 తరగతులకు కూడా విద్యార్థులను గ్రామస్తులు పంపడం లేదు. ఉపాధ్యాయులు వస్తున్నా పిల్లలెవరూ రాకపోవడంతో పాఠాలు సాగని పరిస్థితి. శనివారం ఇన్చార్జి డీఈఓ రాజ్కుమార్ గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. అధికారులెంత ప్రయత్నాలు చేస్తున్నా.. తమ విద్యార్థులను మరో పాఠశాలకు భయంభయంగా పంపలేమని వారు స్పష్టం చేస్తున్నారు. సజావుగా వెల్ఫేర్ అసిస్టెంట్ల బదిలీలు పార్వతీపురం: ఐటీడీఏ పరిధిలోని గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ల బదిలీ ప్రక్రియ శనివారం సజావుగా సాగింది. ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకుడు ఆర్.కృష్ణవేణి, సూపరింటెండెంట్ కె.దేష్, ఏటీడబ్ల్యూఓ కె.చంద్రబాబు ఆధ్వర్యంలో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ల బదిలీ ప్రక్రియ జరిగింది. బదిలీల్లో 56 మంది వెల్ఫేర్ అసిస్టెంట్లకు స్థాన చలనం కలిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిబంధనలకు లోబడి బదిలీ ప్రక్రియ చేపట్టినట్టు కృష్ణవేణి తెలిపారు. గిరిజన విద్యార్థులు విద్యాభ్యాసానికి దూరం కారాదు ● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ శంకరరావు విజయనగరం అర్బన్: ఉపాధ్యాయులు లేక అరకు మండలం లో తేరు పంచాయతీ పరి ధిలోని వంతులగుడ, తోడుబంద, ఈడారి, దంసానివలస, బొరకాలవలస, లండిగుడ, కాగువలస, తదితర పాఠశాలలు ఇప్పటికీ తెరుచుకోలేదన్న వార్తలపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు స్పందించారు. మీడియాతో శనివారం మాట్లాడుతూ సంబంధిత అధికారులు గిరిజన విద్యార్థులు విద్యావకాశాలను కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన గ్రామాల్లోని బడి ఈడు పిల్లలందరూ విద్యనభ్యసించేలా చూడాలన్నారు. ఆయా గ్రామాల్లో విద్యార్థుల పాఠశాల విద్యపై క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైనందున విద్యార్థులు పాఠశాలలకు వచ్చి చదువుకునేలా చూడాలన్నారు. తల్లీబిడ్డలకు ఎఫ్ఆర్ఎస్ కష్టాలు సీతంపేట: మన్యంలోని తల్లీబిడ్డలకు ఎఫ్ఆర్ఎస్ (ఫేషియల్ రికగ్నేషన్ సిస్టం) రిజిస్ట్రేషన్ కష్టాలు వెంటాడుతున్నాయి. సిగ్నల్ లేకపోవడంతో పిల్లలను చంకన ఎత్తుకుని కొండలు దిగి సీతంపేట ఐసీడీఎస్ కార్యాలయానికి తరలివస్తున్నారు. యాప్లో నమోదు కాకపోతే వచ్చేనెలలో పోషణ పథకంలో భాగంగా ఐసీడీఎస్ లబ్ధిదారులకు ఎటువంటి టేక్హోం రేషన్ అందదని సంబంధిత అధికారులు చెప్పడంతో శనివారం అధిక సంఖ్యలో ఐసీడీఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. బాలింతలు, గర్భిణులు, 7 నెలల నుంచి మూడేళ్ల మధ్య ఉన్న చిన్నారులు 4,612 మంది ఉండగా వీరిలో అర్హులు 3,113 మంది ఎఫ్ఆర్ఎస్ చేయించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు 2,150 మంది మాత్రమే ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ నెలాఖరులోగా మిగిలిన వారంతా ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్టు సీడీపీఓ సిమ్మాలమ్మ తెలిపారు. -
జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ, సీతం ఇంజినీరింగ్ కళాశాల సంయుక్తంగా జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తున్నామని సీతం ఇంజినీరింగ్ కాలేజి డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు పేర్కొన్నారు. తోటపాలెం సత్య విద్యా సంస్థల వద్ద శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్యుల దినోత్సవం ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించి మాట్లాడారు. వెద్యులు ప్రాణదాతలని, సమాజంలో వారి స్థానం ఎల్లప్పుడూ గౌరవప్రదంగానే ఉంటుందన్నారు. సాంకేతికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలతో ప్రపంచం ముందుకు వెళ్తుందని ఈ నేపథ్యంలో విద్యార్థులకు వివిధ అంశాలపై జాతీయ వైద్యుల దినోత్సవం నాడు ప్రముఖ వైద్యులతో అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్, సత్య డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి దేవమణి తదితరులు పాల్గొన్నారు.గంజాయి కేసులో ఐదుగురు అరెస్టు బొండపల్లి: మండలంలోని గొట్లం బైపాస్ రోడ్డు మీదుగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకొని ఐదుగురు యువకులతో పాటు గంజాయిని సీజ్ చేసినట్టు సీఐ రమణ, ఎస్ఐ మహేష్ శనివారం తెలిపారు. కురుపాంకు చెందిన డి.కీర్తిరాజ్కుమార్, పి.అమర్, ఎం.అఖిల్, ఒడిశాకు చెందిన టి.రమేష్, ఇ.శ్యామ్లను అదుపులోకి తీసుకొని వారి నుంచి 1200 గ్రాముల గంజాయి, ఆరు సెల్ఫోన్లు, రూ.1000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈవీఎం గొడౌన్ వద్ద పటిష్ఠ భద్రత : కలెక్టర్ పార్వతీపురం టౌన్: ఈవీఎం గొడౌన్ వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. త్రైమాసిక తనిఖీలో భాగంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద గల ఈవీఎం గొడౌన్ను ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎం గొడౌన్ భద్రతకు చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎంల గొడౌన్ను పరిశీలించి నివేదిక పంపిస్తున్నట్టు రాజకీయ పక్షాల ప్రతినిధులకు తెలిపారు. అదే విధంగా ప్రతి మూడు మాసాలకు (త్రైమాసిక) ఒకసారి జిల్లాలోని గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలిసి గొడౌన్ను పరిశీలించడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఈవీఎం గొడౌన్ వద్ద లాగ్ బుక్లను పరిశీలించి, లాగ్బుక్లో అందరికీ అర్థమయ్యేలా వివరాలు నమోదు చేయాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను, భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
1850కి పైగా కేసుల నమోదు
విజయనగరం టౌన్: రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలందించేందుకు ఈస్ట్కోస్ట్ రైల్వే ప్రత్యేక కార్యాచరణ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో పూరి రథయాత్రకి వెళ్లి, వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులు శనివారం విశాఖపట్టణం నుంచి విజయనగరం మీదుగా రైళ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వెయిటింగ్ హాల్స్, క్యాటరింగ్ స్టాల్స్, ప్యాంట్రీకార్ల వద్ద ఆహార పదార్ధాలను పరిశీలించారు. టికెట్ లేకుండా ప్రయాణాలు చేసే వారిపై దృష్టి సారించారు. 1850 మందికి పైగా టికెట్ లేకుండా ప్రయాణాలు చేస్తున్న వారిని గుర్తించి, వారి నుంచి రూ.11 లక్షలకు పైగా అపరాధ రుసుం వసూలు చేసినట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ పేర్కొన్నారు. టికెట్ల కోసం సరైన క్యూలను నిర్వహించాలని, రైళ్లలో బోర్డింగ్ సులభతరం చేయాలని, క్యూఆర్ ఆధారిత కోడ్లతో డిజిటల్ చెల్లింపులను ఉపయోగించాలని, మండే వస్తువులను తీసుకువెళ్లవద్దని, టికెట్ తనిఖీ చేసినప్పుడు సరైన ఐడీ రుజువును చూపించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. -
గురుకులంలో ఇంటర్ విద్యకు మంగళం
● నీట్, ఐఐటీ బ్యాచ్ల పేరుతో రెగ్యులర్ ఇంటర్ను ఎత్తేశారు ● మూడు దశాబ్దాలుగా కొనసాగిన తరగతులు జరగవిక ● ఎంపీసీ, బైపీసీ కోసం జిల్లా శివారు ప్రాంతాలకు పరుగులు ● ఆవేదనలో గ్రామీణ ప్రాంత ఎస్సీ, ఎస్టీ కుటుంబాల బాలికలు చీపురుపల్లి: ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట’ అన్న చందంగా తయారైంది గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ పరిస్థితి. సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు గతంలో ఉన్న సౌకర్యాలు కంటే మరింత మెరుగైన సదుపాయాలు కల్పించడం చూస్తుంటాం. ప్రస్తుత కూటమి పాలనలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దీనికి పట్టణంలోని సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల కళాశాలలో మూడు దశాబ్దాలుగా ఉన్న రెగ్యులర్ ఇంటర్మీడియట్ కోర్సుకు మంగళం పాడడమే నిదర్శనం. చీపురుపల్లి గురుకుల బాలికల కళాశాలలో విద్యనభ్యసించేందుకు విద్యార్థినులు పోటీ పడేవారు. ఏటా ప్రవేశాల కోసం అధికమంది దరఖాస్తు చేసేవారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ కోర్సులు నిర్వహించడంలేదని తెలియడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన బాలికలు ఆవేదన చెందుతున్నారు. కళాశాల గేటుకు వేటాడుతున్న రెగ్యులర్ ఇంటర్ లేదన్న నోటీస్ బోర్డును చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. చీపురుపల్లి గురుకుల బాలికల కళాశాలను కేవలం నీట్, ఐఐటీ బ్యాచెస్కు కేటాయించారని, రెగ్యులర్ ఇంటర్ ఇక్కడ లేదని సిబ్బంది చెబుతున్నారు. నీట్, ఐఐటీ లాంటి ఉన్నత కోర్సులకు వెళ్లే విద్యార్థులు కోసం ప్రత్యేకంగా బ్యాచ్లు నడపడం మంచిదే అయినప్పటికీ, రెగ్యులర్ ఇంటర్ పూర్తిగా రద్దు చేయడం అన్యాయమని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జోనల్ స్థాయిలో ఒక నీట్, ఐఐటీ క్యాంపస్ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జోనల్ స్థాయిలో ఒక నీట్, ఐఐటీ క్యాంపస్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి చీపురుపల్లి గురుకుల బాలికల కళాశాలలో ఆ క్యాంపస్ను ఏర్పాటు చేసి రెగ్యులర్ ఇంటర్ను రద్దు చేశారు. ఈ క్యాంపస్ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతిలో ఒక్కటే ఉండేది. తాజాగా జోనల్స్థాయిలో ఒక్కోటి ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో అది కూడా చీపురుపల్లిలో ఏర్పాటు చేయడంతో రెగ్యులర్ ఇంటర్కు మంగళం పాడేలా చేసింది. ఇక్కడ ఏర్పాటు చేసిన నీట్, ఐఐటీ క్యాంపస్లో ఇంటర్మీడియట్ చదవాలనుకునే విద్యార్థులకు సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఎంట్రన్స్ కూడా నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేశారు. మూడు దశాబ్దాల చరిత్ర.. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 1984లో చీపురుపల్లి కేంద్రంగా గురుకుల బాలికల పాఠశాలను ఏర్పాటుచేశారు. తరువాత కాలంలో 1994లో గురుకుల బాలికల కళాశాలను ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులను తీసుకొచ్చారు. 31 సంవత్సరాలుగా ఉన్న ఇంటర్మీడియట్ కోర్సు ఇప్పుడిక లేదు. పక్కనే నెలిమర్లలో ఉన్న అంబేడ్కర్ గురుకుల బాలికల కళాశాల ఉన్నప్పటికీ అక్కడ ఎంపీసీ, బైపీసీ గ్రూపులు లేవు. దీంతో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు కావాలనుకునే చీపురుపల్లి, నెలిమర్ల, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, రాజాం నియోజవకర్గాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలు జిల్లాలోని సుదూరంగా ఉన్న వేపాడ, వియ్యంపేట వంటి గురుకుల కళాశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకుంది. రెగ్యులర్ ఇంటర్మీడియట్ లేదు.... జోనల్ స్థాయిలో ఏర్పాటు చేసిన నీట్, ఐఐటీ క్యాంపస్ను చీపురుపల్లి గురుకుల కళాశాలలో ఏర్పాటు చేశారు. దీంతో రెగ్యులర్ ఇంటర్మీడియట్ను రద్దు చేసి ఇక్కడి సీట్లను ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన నీట్, ఐఐటీ బ్యాచస్కు సంబంధించి సీట్లు కూడా పూర్తయ్యాయి. – రాణీశ్రీ, ప్రిన్సిపాల్, గురుకుల కళాశాల, చీపురుపల్లి -
శంబరలో 2,399 బస్తాల ఎరువు సీజ్
–8లోఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో పరిపాలన గాడి తప్పుతోంది. ప్రభుత్వ శాఖల్లో ఎవరికి వారే యమునాతీరే అన్న చందాన అధికారులు, ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. కొన్ని శాఖల్లో కుర్చీలాటలు జరుగుతుంటే.. మరికొన్ని చోట్ల ముష్టియుద్ధాలే సాగుతున్నాయి. నువ్వెంతంటే.. నువ్వెంత అనుకున్నంత వరకూ వ్యవహారం ఉంది. ప్రభుత్వ శాఖల్లో క్రమశిక్షణ లోపిస్తున్నా.. సరిదిద్దాల్సిన ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తుండగా, సయోధ్య కుదర్చాల్సిన ప్రజాప్రతినిధులు ‘రాజకీయం’ చేస్తున్నారు. ●పార్వతీపురం పురపాలక సంఘంలో కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో సిబ్బంది మధ్య విభేదాలు జరుగుతున్నాయి. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్లర్లు, ఆర్వో రూబిన్ల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం, రెవెన్యూ, ప్రజారోగ్యశాఖలోనూ విభేదాలు ఉన్నాయి. ప్రధానంగా కమిషనర్కు, మిగిలిన విభాగాల అధికారులకు మధ్య సమన్వయం కొరవడింది. ఇటీవల ఉద్యోగులు పలుమార్లు ఆందోళనలకు దిగారు. పెన్డౌన్ చేపట్టారు. ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన వ్యవహరిస్తున్నారు. ఆ ప్రభావం మున్సిపల్ సేవలపై పడుతోంది. ఉద్యోగులు సైతం ఎవరూ సమయానికి విధులకు హాజరు కాని పరిస్థితి. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ● జిల్లా విద్యాశాఖ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రజాప్రతినిధులు తానా అంటే.. ఇక్కడి అధికారులు తందానా అంటున్నారు. ఒక్కొక్కరి వెనుక.. ఒక్కో ప్రజాప్రతినిధి ఉన్నారన్న విమర్శలు ఈ శాఖ సిబ్బంది నుంచే వినిపిస్తున్నాయి. సాక్షాత్తు డీఈఓ కుర్చీ కోసమే వివాదాలు రేగడం గమనార్హం. మరో ఉద్యోగి తనకున్న పలుకుబడితో ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట వేస్తూ, వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఇక్కడ డీఈఓ తిరుపతినాయుడు మార్చి 31న ఉద్యోగ విరమణ చేశారు. మూడు నెలలు గడుస్తున్నా ఇంకా రెగ్యులర్ అధికారిని నియమించలేదు. డీఈఓ కార్యాలయంలో సహాయ సంచాలకులుగా ఉన్న రమాజ్యోతికి కొన్నాళ్లు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కొద్దిరోజులకే ఇన్చార్జి డీడీఈఓగా ఉన్న రాజ్కుమార్ను నియమిస్తూ, కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన నియామకంపై విమర్శలు రావడంతో కొన్నాళ్లు ఆ ప్రక్రియ ఆగినా.. మరలా ఆయనకే బాధ్యతలు అప్పగించారు. దీని వెనుక జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి ఉన్నట్లు సంఘాల నాయకులు చెబుతున్నారు. ● సీతంపేట గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖలో రెండు రోజుల క్రితం ఈఈ పోస్టుపై కుర్చీలాట చోటుచేసుకున్న విషయం విదితమే. ప్రభుత్వమే తనను ఈఈగా నియమించిందని ఓ అధికారి.. కోర్టు ఉత్తర్వుల మేరకు తానే ఈఈగా కొనసాగుతానని మరో అధికారి ఛాంబర్లో వేర్వేరుగా కుర్చీలు వేసుకుని కూర్చోవడం గమనార్హం. ● గతంలో సాలూరు పట్టణ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సీటు వివాదమైన విషయం తెలిసిందే. ఇందులో రాజకీయ జోక్యం వల్ల పెద్ద దుమారమే రేగింది. చివరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ● ఇటీవల పార్వతీపురం తహసీల్దార్పై స్థానిక ఎమ్మెల్యే దూషణలకు దిగిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలో ఉన్న విభేదాలే దీనికి కారణమన్న విమర్శలున్నాయి. ఓ వర్గం ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చోద్యం చూస్తున్నారు.. ఈ నాలుగు విభాగాలే కాదు.. జిల్లాలోని పలు శాఖల్లో ఇదే పరిస్థితి ఉంది. రాజకీయ అండదండలున్న పలువురు ఉద్యోగులు, అధికారులు.. వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు. వివాదాలను పరిష్కరించాల్సిన ఉన్నతాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా శాఖల్లో వివాదాలు మరింత ముదురుతున్నాయి. ఉద్యోగులు పంతానికి పోతున్నారు. ఈ ప్రభావం పరిపాలన, అభివృద్ధిపై పడుతోందంటూ జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. న్యూస్రీల్ జిల్లాలో గాడి తప్పుతున్న పరిపాలన ప్రభుత్వ శాఖల్లో ఇష్టారాజ్యం ఎవరికి వారే యమునాతీరే.. -
రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు శనివారం పయనమయ్యారు. ఈ నెల 29నుంచి విజయవాడలో గల డీఎస్సీ ఇండోర్ స్టేడియంలో అండర్ – 10, 12 వయస్సుల విభాగాల్లో జరగనున్న పోటీల్లో సైబర్, ఇప్పి, ఫాయిల్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో జిల్లా నుంచి పడాల గణేష్, జాయ్ జబేజ్, టి.నరేంద్ర, హసీనా శ్రీవల్లి, మొహమ్మద్ షేక్ అహ్మద్ ప్రాతినిధ్యం వహించనున్నారు. క్రీడాకారులను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ చీఫ్ కోచ్ డివి చారిప్రసాద్, సభ్యులు దాలిరాజు, పిల్లా శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు అభినందించారు. తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాలు విజయనగరం: జాతీయ స్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించిన జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ పోటీల్లో విజయనగరం జిల్లాకు క్రీడాకారులు మొత్తం 6 పతకాలు సాధించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ఆరుగురు క్రీడాకారులు పాల్గొనగా.. ఆరుగురు క్రీడాకారులు పతకాలు సాధించటం విశేషం. పోటీల్లో షణ్ముఖ సిద్ధార్థ గోల్డ్ మెడల్, హర్షవర్ధన్ సిల్వర్ మెడల్, వైష్ణవి దేవి సిల్వర్ మెడల్, రోహిణి బ్రాంజ్ మెడల్, హర్షిని బ్రాంజ్ మెడల్, తరుణ్ బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నారు. అంతేకాకుండా అత్యధిక పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్షిప్లో తృతీయ స్థానం దక్కించుకున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు దక్కించుకున్న జిల్లా క్రీడాకారులను జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ వేణుగోపాలరావు, కోచ్లు, యశస్విని, కోటేశ్వరరావు అభినందించారు. ఒక్క రోజు ఎస్ఐగా ఖాన్ ● నలుగురు ఏఎస్ఐలకు పదోన్నతి విజయనగరం క్రైమ్: విశాఖ పోలీస్ రేంజ్ పరిధిలో నలుగురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి కల్పిస్తూ విశాఖ పోలీస్ రేంజ్ డీఐజీ గోపినాధ్ జెట్టీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారిలో బి.సురేష్ పార్వతీపురం మన్యం జిల్లాకు, డి.సత్యారావును శ్రీకాకుళం జిల్లాకు కేటాయించారు. మిగిలిన ఇద్దరు కె. శ్రీనివాసరావు, సర్దార్ ఖాన్లను విజయనగరం జిల్లాకు కేటాయించారు. ఎస్ఐగా పదోన్నతి పొందిన సర్దార్ ఖాన్ భోగాపురం ఏఎస్ఐగా పని చేస్తున్నారు. ఈ మేరకు విశాఖ రేంజ్ డీఐజీ కార్యాలయంలో ఆయన్ను సర్దార్ ఖాన్ కలిసి అభినందనలు తెలిపారు. కాగా, ఎస్ఐగా పదోన్నతి పొందిన సర్దార్ ఖాన్ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. 1982లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా చేరిన సర్దార్ ఖాన్ 2009లో ఏఎస్ఐగా, ఇప్పుడు ఎస్ఐగా పదోన్నతి పొందారు. సోమవారం రిటైర్ కానున్నారు. -
మంత్రి ఉంటే ఆ మార్గం మూతే..!
● మంత్రి ఇంటి వద్ద ట్రాఫిక్ సమస్య ● రాకపోకలకు ఇబ్బందులు ● మంత్రి స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్న అఫీషియల్ కాలనీవాసులు సాలూరు: సీ్త్ర శిశుసంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నివాసముంటున్న సాలూరులోని అఫీషియల్ కాలనీ వద్ద తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఆమెను కలిసేందుకు వచ్చిన పార్టీ నాయకులు రోడ్డుపైనే వాహనాలను నిలిపివేస్తున్నారు. దీంతో కాలనీవాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ సమావేశాల సమయంలో నడిచేందుకు కూడా దారి ఉండని పరిస్థితి. రోడ్డుపై నిలిపిన వాహనాలను పక్కకు తీసుకుని తమ వాహనాలతో ముందుకువెళ్లాళ్సి వస్తోంది. సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోతోందని వాపోతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా స్థానికుల సమస్యపై స్పందించని మంత్రి తీరును తప్పుబడుతున్నారు. రాజన్నదొరకూ దారి కరువే... అదే మార్గంలో నిరంతరం ప్రయాణించే మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరకు కూడా తరచూ ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. మంత్రి సంధ్యారాణి ఇంటిముందు నిలిపిన వాహనాలను పక్కకు తీసి శనివారం వెళ్లాల్సి వచ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు మంత్రి తీరును దుమ్మెత్తిపోశారు. ఈ సమస్యపై రాజన్నదొర స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ.. సాధారణంగా ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు వారి ఇళ్లముందు ఇటువంటి ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, చొరవ తీసుకుని సమస్యను చక్కదిద్దాలన్నారు. తను డిప్యూటీ సీఎంగా పనిచేసిన సమయంలో బాధ్యతాయుతమైన పాలకుడిగా కాలనీ వాసులకు ఏ ఒక్కరోజు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను రోడ్డు పక్కగా పార్కింగ్ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించేవాడినన్నారు. మంత్రి సంధ్యారాణి ఇంటి వద్ద ఏడాదిగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పట్టణ సీఐకు ఫోన్ చేసి విషయం చెప్పినా సరైన స్పందన లేదన్నారు. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే పోలీసులు, మీడియా వచ్చే వరకు తన వాహనాన్ని ట్రాఫిక్లో నిలుపుదలచేస్తానని, అప్పుడు అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూస్తామన్నారు. -
మలేరియాపై అప్రమత్తతే ప్రధానం
● త్వరలో దోమతెరలు పంపిణీ చేస్తాం ● మలేరియా నివారణ జోనల్ అధికారి మీనాక్షి సీతంపేట: మలేరియా జ్వరాల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని మలేరియా నివారణ జోనల్ అధికారి (జెడ్ఎంఓ) బొడ్డేపల్లి మీనాక్షి వైద్యులకు సూచించారు. మండలంలోని దోనుబాయి పీహెచ్సీ, సీతంపేట ఏరియా ఆస్పత్రులను శనివారం సందర్శించారు. మలేరియాతో బాధపడుతున్న రోగులను పరామర్శించారు. మలేరియా వ్యాప్తిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్షలు, వైద్యసేవల తీరుపై ఆరా తీశారు. దోనుబాయి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన వసతిగృహ సిక్ రూంను తనిఖీ చేశారు. కిటికీలకు మెస్లు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. బూర్జగూడలో మలేరియా పాజిటివ్తో బాధపడుతున్న వ్యక్తి ఇంటికి వెళ్లి పరీక్షించారు. దోమల వ్యాప్తిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మలేరియా హైరిస్క్ గ్రామాల్లో విస్తృతంగా ఐఆర్ఎస్ 5 శాతం ఏసీఎం ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ కె.వి.ఎస్.ప్రసాద్, డీఎంఓ పి.వి. సత్యనారాయణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయపార్వతి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, దోనుబాయి వైద్యాధికారి భానుప్రతాప్, సబ్ యూనిట్ ఆఫీసర్ మోహన్రావు, కన్సల్టెంట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
అక్కడ నర్సులే.. వైద్యులు!
కొమరాడ: కొమరాడ పీహెచ్సీలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులే డాక్టర్లుగా సేవలందిస్తున్నారు. ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులు ఉన్నా శనివారం ఒక్కరు కూడా ఆస్పత్రికి రాకపోవడంతో రోగులు, బంధువులు ఆందోళనకు దిగారు. వ్యాధులు ముసురుకున్న వేళ ప్రతిరోజు 80 ఓపీ నమోదవుతోంది. ఈ సమయంలో వైద్యులు రాకపోతే ఎలా అంటూ నిలదీశారు. 24 గంటలు వైద్యసేవలు అందించాల్సిన పీహెచ్సీలో కనీసం పగటిపూట కూడా వైద్యులు సేవలందించకపోవడంపై గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో వైద్యసేవలందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
● ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు విజిలెన్స్ అధికారుల దాడులు
మక్కువ: మండలంలోని శంబర గ్రామంలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు చేశారు. ఎరువుల బస్తాపై రూ.50 నుంచి రూ.70వరకు అధిక ధర వసూలు చేస్తున్నారన్న రైతుల ఆవేదనపై ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ప్రాంతీయ నిఘా, అమలు అధికారి బి.ప్రసాదరావు ఆదేశాల మేరకు శంబర గ్రామం కొత్తవీధిలో ఉన్న శ్రీ సత్య సాయి ట్రేడర్స్ను విజిలెన్స్, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు. ఎరువులు అధిక ధరకు రైతులకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఎరువుల బౌతిక నిల్వలకు, స్టాక్ రిజిస్టర్కు వ్యత్యాసం ఉన్నట్లు నిర్ధారించారు. ఎఫ్సీఓ 1985, 28(1)డి, ఈసీ యాక్ట్ 1955 ప్రకారం కేసు నమోదు చేశారు. రూ.28,77,422లు విలువ కలిగిన 2,399 బస్తాలు (119.925 టన్నులు) ఎరువును సీజ్ చేశారు. దుకాణం స్టాక్ రికార్డులు, తాళాలు, ఈ పాస్ మిషన్ను ఏఓ చింతల భారతికి అప్పగించారు. వాటిని జేసీకి సోమవారం అప్పగిస్తామని ఏఓ తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ అధికారి రామారావు, సబ్ఇన్స్పెక్టర్ పురుషోత్తం, పోలీస్ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
రైలు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి
బాడంగి: మండలంలోని డొంకినవలస–బొబ్బిలి రైల్వేస్టేషన్ల మధ్య గొళ్లాది మంగళ గేటు సమీపంలో రైలు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. బొబ్బిలి రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సుమారు 45ఏళ్ల వయస్సు కలిగిన మహిళను రైలు ఢీకొనడం లేదా జారిపడి పోవడం వల్ల మృతి చెంది ఉంటుందని రైల్వే హెచ్సీ ఈశ్వరరావు తెలిపారు. మృతురాలి శరీరంపై ఎరుపు, పసుపు రంగుచీర కలిగి ఉందని, గుర్తు పట్టడానికి ఎటువంటి ఆనవాళ్లు లేవని చెప్పారు. మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో భద్రపరిచామని తెలిపారు. వివరాలు తెలిసిన వారు ఆర్పీఎస్ఎస్ఐ 9490617089 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పాముకాటుతో వృద్ధుడు.. గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఒప్పంగి గ్రామానికి చెందిన ఎప్పరిక తిరుపతిరావు(63) పాము కాటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిరావు గ్రామ సమీపంలో పశువుల శాల వద్ద పెంచుతున్న కోళ్లను కప్పేందుకు శుక్రవారం సాయంత్రం వెళ్లగా అక్కడ నాగుపాము కాటేసింది. తిరుపతిరావు ఆ పామును అక్కడే కొట్టి చంపేశాడు. ఇంటికొచ్చి కుటుంబీకులకు తెలియజేయగా వైద్యం నిమిత్తం భద్రగిరి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే తిరుపతిరావు మృతి చెందినట్టు తెలిపారు. అనంతరం భద్రగిరి ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం నిర్వహించి తిరుపతిరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
ఉద్యోగాల పేరిట మోసం చేసిన నాల్గో వ్యక్తి అరెస్టు
విజయనగరం క్రైమ్ : ఉద్యోగాల పేరిట యువతను మోసం చేసిన కేసులో నాల్గో నిందితుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వన్టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. 2022లో రైల్వే, డాక్యార్డులో ఉద్యోగాలిస్తామంటూ నలుగురు ముఠాగా ఏర్పడి నిరుద్యోగ యువత నుంచి డబ్బులు వసూలు చేశారు. అప్పట్లో అందిన ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ వెంకటరావు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో నాల్గో నిందితుడైన కొత్తవలసకు చెందిన కోసూరు శివ వెంకట సత్యనారాయణను శనివారం అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని సీఐ తెలిపారు. రూ.80వేలు రికవరీ చేసినట్టు తెలిపారు. -
పంచాయతీ కార్యదర్శుల పోరుబాట
–8లోసాక్షి, పార్వతీపురం మన్యం: తమ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా పలు మండలాల కార్యదర్శులు శనివారం విధులు బహిష్కరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు.. అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఇక్కడ ఎటువంటి నిరసన కార్యక్రమాలూ చేయడానికి వీలులేదని స్పష్టం చేశారు. పోలీసు స్టేషన్కు వెళ్లి అనుమతి తీసుకురావాలని సూచించారు. దీంతో అక్కడ నుంచి కొంతమంది కార్యదర్శులు పోలీస్స్టేషన్కు వెళ్లగా.. మరికొంతమంది ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఎక్కడా వారి మొర వినేవారు లేకపోవడంతో వెనుదిరిగారు. ఉదయం 6 గంటలకే విధులా..? రోజూ ఉదయం 6 గంటలకే గ్రామాల్లో విధులకు హాజరై.. ఇంటింటి చెత్త సేకరణ, క్లోరినేషన్ చేసేటప్పుడు ఆ రోజు దినపత్రికతో ఫొటో దిగి, దానిని పంచాయతీరాజ్ శాఖ పోర్టల్లో అప్లోడు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కార్యదర్శులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నిర్ణయం తమను అవమానించేలా, అవహేళన చేసేలా ఉన్నాయంటూ వాపోతున్నారు. గతంలో వలంటీర్లు చేసిన కొద్దిపాటి సర్వేల భారమంతా తమపైనే వేస్తున్నారని.. దీనికితోడు స్వర్ణ పంచాయతీ పనులు, ఇంటి పన్నుల వసూళ్లు, పీఆర్ వన్ యాప్, రెవెన్యూ వారి పీజీఆర్ఎస్ పనులు, గ్రామసభలు, జీపీ సమావేశాలు, సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల విధులు, ప్రోటాకాల్ వంటివి తామే చేయాల్సి వస్తోందని అంటున్నారు. దీనివల్ల తీవ్ర పని ఒత్తిడితో కుటుంబాలకు దూరమవుతున్నామని చెబుతున్నారు. గ్రామ పంచాయతీ విధులకు న్యాయం చేయలేకపోతున్నామని వాపోతున్నారు. పంచాయతీ కార్యదర్శుల మనోవేదన, విధుల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాలని కోరుతున్నారు. పని వేళల్లో వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదయం 6 గంటలకే విధులంటే ఎలా అంటూ ఆవేదన పనిభారం తగ్గించాలని విజ్ఞప్తి -
‘మత్తు’ జోలికి వెళ్లొద్దు
విజయనగరం క్రైమ్: మత్తుపదార్థాల జోలికి వెళ్లవద్దని స్థానిక టాస్క్ఫోర్స్ సీఐ బంగారు పాప సూచించారు. నగర పరిధిలోని కస్పా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై శుక్రవారం అవగాహన కల్పించారు. గంజాయి, ఖైనీ, గుట్కా, మద్యం, సిగరెట్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై ఎంతో మంది యువత తమ బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని, కన్నవారికి తీరని శోకం మిగుల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మంచి అలవాట్లు అలవర్చుకోవాలని తెలిపారు. -
గిరిజనులపై చిన్నచూపెందుకో?
గిరిజనులకు అది చేస్తున్నాం... ఇది చేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం ప్రచారానికే పరిమితం అవుతుందేతప్ప ఇప్పటికే పేరుకుపోయిన సమస్యలపై దృష్టిసారించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ముల క్కాయవలస పాఠశాల వంటివి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఉన్నాయి. విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమస్యల పరిష్కారంవైపు అధికారులతో పాటు పాలకులు కూడా కన్నెత్తి చూడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందో అధికారులే సమాధానం చెప్పాలి. తక్షణమే పునాదుల దశలో ఉన్న పాఠశాల భవనాన్ని పూర్తిచేయాలి. – బి.రవికుమార్, అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకుడు, పార్వతీపురం -
శనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో పని చేస్తూ.. బదిలీపై వెళ్లిపోవాలని ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గట్టి షాక్ ఇచ్చారు. వారి స్థానంలో ఎవరైనా వస్తేనే వీరిని రిలీవ్ చేయాలని స్పష్టం చేశారు. జిల్లా విభజన తర్వాత వచ్చిన ఉద్యోగుల్లో అధిక శాతం మంది దాదాపు మూడేళ్లుగా ఇక్కడే చిక్కుకుపోయారు. వీరిలో కొంతమంది ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతోనో.. ఉన్నతాధికారులకు భారీ మొత్తంలో చెల్లించి విజయనగరం, విశాఖ వంటి ప్రాంతాలకు వెళ్లిపోయారు. కొందరు మాత్రం అడిగినంత ఇస్తామని మొత్తుకుంటున్నా.. కదలలేకపోతున్నారు. కీలక విభాగాల్లో పని చేస్తున్న వారి స్థానంలో ఇంకెవరూ రాకపోవడమే కారణం. ఇటీవల దాదాపు అన్ని శాఖల్లోనూ బదిలీలు జరిగాయి. కొంతమంది కదిలినా.. చాలామందికి మాత్రం స్థాన చలనం కలగలేదు. చాలాకాలంగా బదిలీపై ఇక్కడ నుంచి వెళ్తున్న వారే గానీ.. ఆ స్థానంలో ఎవరూ రావడం లేదు. ఈ ప్రభావం జిల్లా పాలనపై పడుతోంది. జిల్లా అధికారుల పోస్టులు సైతం ఖాళీగా ఉండిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాలు తీయకపోవడంతో ఉన్నవారితోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి. రెవెన్యూ, ఐటీడీఏ, వైద్యశాఖ తదితర కీలక విభాగాల్లో బదిలీల కోసం చూస్తున్న వారు అనేకమంది ఉన్నారు. ఇందులో కొంతమంది తమ పలుకుబడితో ఇక్కడి నుంచి వెళ్లినా.. కొంతమంది మాత్రం ఉండిపోయారు. పార్వతీపురం మన్యం జిల్లా మారుమూల ప్రాంతం కావడం.. ఏజెన్సీగా భావిస్తుండటమే ఇందుకు కారణం. ఎవరినీ వదలద్దని చెప్పేసిన ఇన్చార్జి మంత్రి.. జిల్లా పరిపాలనకు అవసరమైన సిబ్బందిలో 50 శాతం మందే ఉన్నారని స్వయనా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ఈ ప్రభావం జిల్లా పాలనపై పడుతోందని శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో తెలిపారు. ఇక్కడ ఉండటానికి ఎవరూ ఇష్టపడకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పిన ఆయన.. ఎవరికై నా ఇక్కడ నుంచి బదిలీ అయితే, ఆ స్థానంలో మరొకరు వస్తేనే ముందు వారిని రిలీవ్ చేయాలని స్పష్టం చేశారు. అసలు పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చేందుకే ఎవరూ ఇష్టపడటం లేదు. ఎవరినైనా ఇక్కడకు బదిలీ చేసినా, కొంతమంది వచ్చి సంతకం పెట్టి, సెలవు మీద వెళ్లిపోతున్నారు. మరికొందరు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతోనో.. పై స్థాయిలో పరిచయాలతోనో తమ ఉత్తర్వులు రద్దు చేయించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాము ఇక్కడ నుంచి ఎలా వెళ్లగలమని జిల్లాలో పని చేస్తున్న పొరుగు జిల్లాల ఉద్యోగులు వాపోతున్నారు. ఎన్నాళ్లయినా ఇక్కడే ఉండిపోవాలా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యూస్రీల్ రిలీవర్ ఉంటేనే బదిలీ స్పష్టం చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్నేళ్లయినా ఇక్కడే చిక్కుకుపోవాల్సిందేనా... జీతాలు ఇవ్వడం లేదు... పార్వతీపురం రూరల్/పార్వతీపురం: గతంలో ఠంచన్గా అందే జీతాలు ఆరు నెలలుగా అంద డం లేదని, అడిగితే ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వడం లేదని చెబుతున్నారని, ఉద్యోగభత్రతో పాటు జీతాలు నెలవారీ చెల్లించేలా చర్యలు తీసు కోవాలంటూ వైఎస్సార్ ఉద్యానవన కళాశాల సెక్యూరిటీ గార్డులు మంత్రి అచ్చెన్నాకుడుకు విన్నవించారు. తమను ఆప్కాస్లోనే కొనసాగించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆయనకు వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో శంకరరావు, రమేష్, బ లరాం, ముత్యాలరావు, రామారావు, జమ్మయ్య, భూషణ్, రామకృష్ణ, మౌళి తదితరులున్నారు. మహిళా పోలీసుల పడిగాపులు సచివాలయ మహిళా పోలీస్ సిబ్బందికి శనివా రం జరగనున్న బదిలీలపై స్పష్టత ఇవ్వాలని, ఇతర మండలాలకు వేస్తే ఇబ్బందులు పడతా మంటూ మంత్రి అచ్చెన్నాయుడుకు విన్నవించేందుకు కలెక్టరేట్ వద్ద దాదాపు 4 గంటల సమ యం పడిగాపులు కాశారు. భోజన విరామ సమయంలో కొంతమంది మాత్రమే లోపలకు వెళ్లి మంత్రికి తెలిపే ప్రయత్నం చేసి వినతిపత్రాన్ని అందజేశారు. తమకు సమయం లేదని రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యకు పరిష్కారం చూపాల ని మంత్రికి తెలిపారు. ప్రభుత్వం ఈ బదిలీలపై ఆలోచించడం జరుగుతుందని, ఇప్పుడే ఒక నిర్ణ యానికి రాలేమని మంత్రి సమాధానం ఇచ్చారు. శనివారమే బదిలీల ప్రక్రియ ప్రారంభం కావడంతో స్పష్టమైన హామీ రాకపోవడంతో మహిళా పోలీసు సిబ్బంది నిరాశతో వెనుదిరిగారు. -
సిగ్నల్ లేక.. సకాలంలో 108 రాక..
● గంటన్నర పాటు నరకం చూసిన రోడ్డు ప్రమాద బాధితుడు ● ఆస్పత్రికి తరలించేందుకు అవస్థలు ● ఘాట్ రోడ్లో ఆటోబోల్తా సీతంపేట: మొబైల్ సిగ్నల్ లేక.. సకాలంలో 108 అంబులెన్స్ రాక రోడ్డు ప్రమాద బాధితుడు గంట న్నర పాటు నరకం చూసిన ఘటన సీతంపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... సీతంపేట మండలంలోని మారుమూలన ఉన్న బంజా రుగూడ–పుట్టిగాం మధ్య ఎత్తైన ఘాట్రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో మెట్టూరుకు చెందిన వీరన్నకు తీవ్రగాయాలయ్యా యి. ఈ సమయంలో అక్కడ 108కు ఫోన్ చేద్దామ ని ఆటోలో ఉన్న కుటుంబ సభ్యులంతా ఎంత ప్రయత్నించినా సెల్సిగ్నల్ లేకపోవడంతో వీలుపడలేదు. స్థానికులు సెల్సిగ్నల్ చోటకు పరుగుతీసి 108కు సమాచారం అందించారు. సీతంపేట, కొత్తూరు 108 అంబులెన్స్లు ఖాళీగా లేకపోవడంతో భామిని అంబులెన్స్ వస్తుందని సమాచారం ఇచ్చారు. మారుమూల ప్రాంతం కావడం, బాధితు ల సెల్ఫోన్కు సిగ్నల్ లేకపోవడం వంటి కారణాల తో భామిని అంబులెన్స్ వచ్చేసరికి మధ్యాహ్నం 1.50 అయ్యింది. అప్పటికే వీరన్నకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరామర్శకు వెళ్లి ప్రమాదం పాలై.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలానికి చెందిన వీరన్న, అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఒకే ఆటోలో మర్రిపాడు మీదుగా కురుపాం మండలం గగాలి గ్రామానికి ఓ మృతుని కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డు దిగుతుండగా ఆటో అదుపుతప్పి బోల్తా కొట్ట డంతో ప్రమాదం జరిగింది. ఇందులో వీరన్నకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. -
చిన్నబగ్గ కొండల్లోకి ఏనుగుల గుంపు
సీతంపేట: చిన్నబగ్గ కొండల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. శుక్రవారం ఉదయం కొండదిగువన ఉన్న ఏనుగుల గుంపు సాయంత్రానికి కొండపైకి చేరాయి. జీడి, అరటి చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. అటవీశాఖ సిబ్బంది ఏనుగు ల గమనాన్ని పరిశీలించి గిరిజనులను అప్రమ త్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గిరిజనులు కోరుతున్నారు. మన్యం బిడ్డలపై మలేరియా పంజా సీతంపేట: మన్యం బిడ్డలపై మలేరియా పంజా విసురుతోంది. మంచం పట్టిస్తోంది. మర్రిపా డు పీహెచ్సీ పరిధిలో మలేరియా వ్యాధి అధికంగా ఉంది. శుక్రవారం పీహెచ్సీలో ఓపీ 40 వరకు రాగా దీనిలో అధికమంది జ్వరపీడితులే ఉన్నారు. మలేరియాతో సౌజన్య, అఖిల్, అజిత్, నారాయణ ఆస్పత్రిలో ఇన్పేషెంట్లుగా చేరారు. తోటగూడలో లొంగిరి అనే వృద్ధురాలు, పీవీ ఈతమానుగూడలో ఆరిక అల్లూరి జ్వరంతో మంచం పట్టారు. 80కి పైగా గిరిజన గ్రామాల ప్రజల వైద్యానికి మర్రిపాడు పీహెచ్సీయే ఆధారం. గతంతో ఇక్కడ ఇద్దరు వైద్యులు ఉండేవారు. వీరిలో ఒకరు పీజీ చదువుకోవడానికి వెళ్లిపోడంతో కొన్ని నెలలుగా పోస్టు భర్తీకాలేదు. వైద్యురాలు సత్యవేణి ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. ఓపీ చూడడం, గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించడం కష్టసాధ్యంగా మారింది. మెరుగైన సేవలు అందడం లేదు. కొన్నిసార్లు స్టాఫ్ నర్సులే వైద్యసేవలు అందిస్తున్నారు. 3న వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ● జెడ్పీచైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: వైఎస్సా ర్సీపీ జిల్లా విస్తృతస్థా యి సమావేశం వచ్చేనెల 3న నిర్వహించనున్నట్టు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు జగన్నాథ ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబుతోపాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు, పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారన్నారు. సమావేశానికి కార్పొరేషన్/ మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, పార్టీ మండలాధ్యక్షులు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర/జిల్లా/నియోజకవర్గ/మండల స్థాయి పార్టీ కమిటీలో వివిధ హోదాలోగల సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ లు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా మైనారిటీ సంక్షేమాధికారిగా కుమారస్వామి విజయనగరం టౌన్: జిల్లా పర్యాటక శాఖ అధికారిగా పనిచేస్తున్న కుమారస్వామి జిల్లా మైనారిటీ అధికారిగా, కార్పొరేషన్ ఈడీగా ఇన్చార్జి బాధ్యతలను శుక్రవారం చేపట్టారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ రెండు పోస్టులలో కొనసాగాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సికిల్ సెల్ వ్యాధిని పూర్తిగా అరికట్టాలి
విజయనగరం ఫోర్ట్: సికిల్సెల్ వ్యాధిని పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లోని తన చాంబర్లో శుక్రవారం ఆయన వైద్యారోగ్యశాఖ, గిరిజన సంక్షేమశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వ్యాధి గ్రస్తులకు సికిల్సెల్ వ్యాధిపై అవగాహన కల్పించాలని కోరారు. గిరిజన గ్రామాల్లో 44 వేల మంది జనాభా నివసిస్తున్నారని, వారిలో 40 సంవత్సరాల లోపు జనాభా 22 వేలు ఉన్నారన్నారు. 17 వేల మందికి సికిల్ సెల్ టెస్టులు చేయగా ఇద్దరికి వ్యాధి ఉన్నట్లు తేలిందని చెప్పారు. 118 మందికి వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిర్ధారణ అయినట్లు తెలిపారు. వారే కాకుండా ప్రస్తుతం జిల్లాలో 160 మంది వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారని, వారికి అందిస్తున్న వైద్యంపై వారం రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వ్యాధి వచ్చే అవకాశం ఉన్న 118 మందితో సమావేశం నిర్వహించి వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల, డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, డీఎల్ఓ డాక్టర్ రాణి, డీఈఓ మాణిక్యం నాయుడు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అన్నపూర్ణ, ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ అరుద్ర, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ శివకుమార్, డాక్టర్ అర్చన, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్. అంబేడ్కర్ -
ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న ఆటగాళ్లు..!
విజయనగరం: చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ జాతీయ స్థాయి దివ్యాంగుల జాతీయ చెస్ చాంపియన్ షిప్ పోటీలు రెండవ రోజు ఆసక్తికరంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని మెసానిక్ టెంపుల్లో నిర్వహిస్తున్న రెండోరోజు పోటీలను చిన్న శ్రీను సోల్జర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ఆత్మీయంగా మాట్లాడిన ఆమె పోటీల్లో విజేతలుగా నిలవాలంటూ ప్రోత్సహించారు. ఇదిలా ఉండగా దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన106 మంది క్రీడాకారులు జాతీయ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో తలపడుతుండగా..రెండవ రోజు ముగిసే సమయానికి 8 రౌండ్లు పూర్తయినట్లు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా కార్యదర్శి కేవీ జాల్వాముఖి తెలిపారు. శనివారం 9వ రౌండ్ ముగిసిన అనంతరం విజేతలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. వివిద కేటగిరీల్లో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో మొదటి మూడు స్థానాలు కై వసం చేసుకున్న క్రీడాకారులను త్వరలో జరగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నామన్నారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. ఆసక్తికరంగా చెస్ పోటీలు -
సీ్త్రనిధి జిల్లా టార్గెట్ రూ.86 కోట్లు
సీతానగరం: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాధికి వివిధరకాల వృత్తులపై శిక్షణ ఇవ్వడంతోపాటు బ్యాంకుల ద్వారా రుణసదుపాయం కల్పించనున్నట్లు వెలుగు సీ్త్రనిధి జిల్లా ఏజీఎం పి.కామరాజు అన్నారు. ఈ మేరకు మండలకేంద్రంలోని మండల వెలుగు సమాఖ్య కార్యాలయంలో వెలుగు ఏపీఎం రెడ్డిశ్రీరాములు అధ్యక్షతన సిబ్బందితో సీ్త్ర నిధి రుణసదుపాయాలపై ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజీఎం కామరాజు మాట్లాడుతూ 2025–26 సంవత్సరానికి జిల్లా టార్గెట్ రూ.86 కోట్లుండగా ఇప్పటి వరకూ రూ.9 కోట్ల 20లక్షలు పొదుపు సంఘాల సభ్యులకు ఇచ్చినట్లు చెప్పారు. మండలసమాఖ్య పర్యవేక్షణలో అర్హులైన వారందరికీ జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా సీ్త్ర నిధి రుణాలు బ్యాంకుల ద్వారా సమకూర్చనున్నామన్నారు. అలాగే సీతానగరం మండలం టార్గెట్ రూ.8 కోట్లు ఉండగా ఇప్పటివరకూ రూ.90 లక్షలు రుణ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. వృత్తి పనిలో శిక్షణ పొందిన వారంతా అర్థికంగా లబ్ధిపొందడానికి వివిధ రకాల వ్యాపారాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మండల సమాఖ్య సభ్యులు సీసీలు, సిబ్బంది పాల్గొన్నారు. -
అక్కరకు రాని ఈఎస్ఐ
● ఎక్స్రేకు దిక్కులేదు ● అరకొరగా రక్తపరీక్షలు ● శిథిలావస్థలో భవనాలు ● జరగని ఎల్ఎఫ్టీ పరీక్షలు విజయనగరం ఫోర్ట్: కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తాం. ఈఎస్ఐ డిస్పెన్సరీ, డయోగ్నొస్టిక్ సెంటర్స్లో సౌకర్యాలు కల్పిస్తాం అంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ ఆ గొప్పమాటలు అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంక్షేమం మాట దేవుడెరుగు. కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా అందని పరిస్థితి ఉంది. దీంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. కార్మికులు ఏదైనా జబ్బు చేసినా, ప్రమాదం జరిగినా చికిత్స కోసం వచ్చే ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్లో సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఎక్స్రేకు రేడియాగ్రాఫర్ కరువు ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్లో ఎక్స్రేకు దిక్కు లేకుండా పోయింది. సెంటర్కు ఎక్కువగా ఎముకల సంబంధిత వ్యాధులతో కార్మికులు వస్తారు. అదేవిధంగా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పడు గాయాలతో వస్తారు. వారికి వ్యాధి నిర్ధారణ కోసం ఎక్స్రే తీయాల్సి ఉంటుంది. అయితే డయోగ్నొస్టిక్ సెంటర్లో ఎక్స్రే మిషన్ ఉన్నప్పటికీ తీసే నాథుడు లేకపోవడం వల్ల కార్మికులు ప్రైవేట్ ల్యాబొరేటరీలకు కార్మికులు వెళ్లి రూ. 300 నుంచి రూ. 350 వరకు వెచ్చించాల్సి వస్తోంది. అదేవిధంగా అల్ట్రాసౌండ్ స్కాన్ ఉన్నప్పటికీ రేడియాలజిస్టు లేకపోవడంతో గైనకాలజిస్టులు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్నారు. సెంటర్లో ఓపీ విభాగాలు ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఎముకల విభాగం, అప్తమాలజీ, గైనిక్, ఈఎన్టీ, పిడియాట్రిక్ ఓపీ విభాగాలు ఉన్నాయి. ఆయా ఓపీ విభాగాల్లో సేవలు పొందేందుకు కార్మిక కుటుంబసభ్యులు ప్రతి రోజు 50 నుంచి 60 మంది వరకు వస్తారు. జాడే లేని ఎల్ఎఫ్టీ పరీక్ష డయోగ్నొస్టిక్ సెంటర్లో ఎల్ఎఫ్టీ (లిఫిడ్ ప్రొఫైల్ టెస్ట్) జరగడం లేదు. దీంతో కార్మికులు ఈ టెస్టు కోసం ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తూ రూ.300 నుంచి రూ.400 వరకు ఖర్చు చేస్తున్నారు. సెంటర్ పరిధిలో 21 వేల మంది కార్మికులు ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్ పరిధిలో 21 వేల మంది కార్మికులు ఉన్నారు. వారంతా ఏదైనా జబ్బు చేస్తే చికిత్స కోసం వస్తారు. ఓపీ సేవలు అవసరమైన వారికి ఇక్కడ చికిత్స అందిస్తారు. ఇన్పేషేంట్ సేవలు అవసరమైన వారికి విశాఖలోని మల్కాపురంలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రికి రిఫర్ చేస్తారు. శిధిలావస్థకు చేరిన భవనాలు ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్ భవనాలు శిథిలావస్థకు చేరాయి. భవనాలన్నీ పెచ్చులు ఊడిపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని కార్మికులు, సెంటర్ వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గాజులరేగ వద్ద నిర్మాణంలో ఉన్న ఈఎస్ఐ 100 పడకల ఆస్పత్రి నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. రేడియోగ్రాఫర్ లేరు ఎక్స్రేలు తీసే రేడియోగ్రాఫర్ వేరే ఉద్యోగం వచ్చి వెళ్లి పోయారు. దీంతో ఎక్స్రేలు తీయడం లేదు. రేడియాగ్రాఫర్ను నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. సెంటర్ను ప్రైవేట్ భవనంలోకి మార్చాలని ప్రతిపాదన ఉంది. త్వరలోనే మార్చే అవకాశం ఉంది. డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, సూపరింటెండెంట్, ఈఎస్ఐ డయోగ్నొక్ సెంటర్ -
జిందాల్ రైతులకు వారంలో పరిహారం
విజయనగరం అర్బన్: జిందాల్ భూములకు సంబంధించి రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పరిహారాన్ని వారంరోజుల్లో అందజేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిందాల్ కోసం సేకరించిన భూములపై తన చాంబర్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. ఇప్పటివరకు చెల్లించిన పరిహారం, పెండింగ్ బకాయిలపై ఆరా తీశారు. సుమారు 28 ఎకరాలకు సంబంధించి 15 మంది రైతులకు మాత్రమే పరిహారం పెండింగ్ ఉందని, వారికి వెంటనే పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు జిందాల్ చెల్లించాల్సిన పరిహారంపైనా చర్చించారు. పదిరోజుల్లో పెండింగ్ బకాయిలను రైతులకు చెల్లించాలని జిందాల్ యాజమన్యాన్ని కలెక్టర్ ఆదేశించారు. జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్క్ జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ చెప్పారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిందాల్ భూములకు సంబంధించి కేవలం 15 మంది రైతులకు మాత్రమే బకాయి ఉందని చెప్పారు. జిందాల్ పరిశ్రమకు అప్పట్లోనే సుమారు 1,166 ఎకరాలను ప్రభుత్వం అప్పటించిందన్నారు. ఈ భూముల్లో 180 ఎకరాలను జిందాల్ యాజమాన్యమే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసిందని చెప్పారు. ఇది కాకుండా మొత్తం 375 మంది రైతుల నుంచి 834 ఎకరాల అసైన్డ్ భూమిని, 151 ఎకరాల ప్రభుత్వ భూమిని జిందాల్కు కేటాయించినట్లు తెలిపారు. జిందాల్ కోసం ఒక్క ఎకరం భూమిని కూడా రైతుల దగ్గర సేకరించలేదని, 2013 భూసేకరణ చట్టం ఇక్కడ వర్తించదని కలెక్టర్ స్పష్టం చేశారు. మొత్తం 28.72 ఎకరాలకు సంబంధించి 15 మంది రైతులకు ఉన్న బకాయిని వారం రోజుల్లో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 1962లో మొత్తం 20 మందికి పట్టాలు ఇవ్వగా వారిలో నలుగురు మాత్రమే ఇళ్లు కట్టుకోగా, వారికి అప్పట్లోనే పరిహారం చెల్లించినట్లు తెలిపారు. షేర్లు, ఉద్యోగ కల్పన, వన్టైమ్ సెటిల్మెంట్కు సంబంధించి జిందాల్ యాజమాన్యమే రైతులతో నేరుగా ఒప్పందం కుదుర్చుకుందని దానిలో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, ఎస్కోట తహసీల్దార్ డి. శ్రీనివాసరావు, కలెక్టరేట్ డి సెక్షన్ సూపరింటెండెంట్ తాడ్డి గోవింద, ఇతర అధికారులు, జిందాల్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. సమీక్షించిన కలెక్టర్ అంబేడ్కర్ -
పైడితల్లికి స్వర్ణపుష్పార్చన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారికి ఆలయంలో శుక్రవారం స్వర్ణ పుష్పార్చన చేశారు. వేకువజామునుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, వేదపండితులు సాయికిరణ్, అచ్యుతశర్మ, దూసి శివప్రసాద్లు శాస్త్రోక్తంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు. త్రుటిలో తప్పిన పెనుప్రమాదంబాడంగి: ఓ కారు అదుపుతప్పి భోజనం హోటల్లోకి దూసుకు పోయిన సంఘటనలో అదృష్టవశాత్తు పెనుప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. టెక్కలి నుంచి జయపూర్ వెళ్తున్న కారు స్పీడ్ బ్రేకర్ల ములంగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ముందుటైర్లు రాయిపైకి ఎక్కి పోవడంతో స్టీరింగ్ అదుపుతప్పింది. దీంతో మండలకేంద్రంలో పోలీస్స్టేషన్ ఎదురుగా గల ఎం.చైతన్య భోజనం హోటల్లోకి కారు ఒక్కసారిగా దూసుకుపోయింది. అయితే ఆ హోటల్లో టిఫిన్ సెక్షన్ లేకపోవడంతో పాటు ఉదయం 8గంటల సమయం కావడంతో పనివారు హోటల్ లోపల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బయట ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని తప్పిందని హోటల్ సిబ్బంది భయాందోళనతో చెప్పారు. మహిళపై కత్తిపీటతో దాడివేపాడ: మండలంలోని నల్లబిల్లి గ్రామానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి కత్తి పీటతో దాడి చేసినట్లు వల్లంపూడి పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన ఉడతా మణికంఠ గ్రామంలోని ఈర్లి సీతారాం (62)ఇంటికి వెళ్లి మంచినీళ్లు అడిగాడు. మంచినీళ్లు ఇవ్వడానికి ఆమె గదిలోకి వెళ్లగా మెడలోని బంగారం తాడు తుంచి వేయడానికి మణికంఠ ప్రయత్నం చేశాడు. దీంతో సీతారాం కేకలు వేయగా పరిసరాల్లో ఉన్న వ్యక్తులు వచ్చేసరికి ఇంట్లో ఉన్న కత్తిపీటతో సీతారాం మెడపై మణికంఠ దాడి చేసి గాయపర్చాడు. స్థానికులు వెంటనే 108కు సమాచారమిచ్చి కోటపాడు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యసేవలకు విశాఖ కేజీహెచ్కు తీసుకువెళ్లారు. సమాచారం మేరకు ఎస్.కోట రూరల్ ఎస్సై ఎల్.అప్పలనాయుడు గ్రామానికి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు. -
మద్యం మత్తు వల్లే ప్రమాదం
రామభద్రపురం: మండలంలోని జోగిందొరవలసలో ఈ నెల 21వ తేదీన వల్లం నాయుడు అనే వ్యక్తి మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి పాల్పడ్డాడని డీఎస్పీ ఎస్. రాఘవులు తెలిపారు. జొగిందొరవలసలో ట్రాక్టర్ ప్రమాదానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చూపారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రమాదానికి సంబంధించి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి మండలం మోసూరువలసకు చెందిన వంగపండు వల్లంనాయుడు, మోసూరు భాస్కరరావు, లక్ష్మణరావులు స్నేహితులు. అయితే వల్లంనాయుడు స్నేహితులిద్దరికి ఫోన్చేసి మద్యం తాగుదాం రమ్మని ఆహ్వానించాడు. ముగ్గురులో ఇద్దరు ద్విచక్రవాహనంపై, ఒకరు బ్లేడ్ ట్రాక్టర్పై రామభద్రపురం మండలంలోని జోగిందొరవలస గిరిజన గ్రామానికి వెళ్లి అక్కడ మందు తాగారు. ఆ తర్వాత వల్లంనాయుడు మద్యం మత్తులో భాస్కరరావు బైక్ తాళం తీసుకున్నాడు. నా తాళం ఇవ్వు అని భాస్కరరావు ఎంతసేపు అడిగినా వల్లం నాయుడు ఇవ్వలేదు. దీంతో భాస్కరరావు ట్రాక్టర్ వెళ్లనివ్వనని చెప్పి బోయినెట్పై కూర్చున్నాడు. మద్యం మత్తులో ఉన్న వల్లంనాయుడు కూడా ట్రాక్టర్ ఎక్కి స్టార్ట్ చేసి ముందుకు లాగించేశాడు. ఆ రోడ్డు గోతులమయంగా ఉండడం వల్ల ప్రమాదవశాత్తు భాస్కర రావు కింద పడిపోవడంతో ట్రాక్టర్ చక్రాలు వెళ్లిపోగా వెనుక ఉన్న బ్లేడ్స్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసునమోదు చేసిన సీఐ కె.నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు దర్యాప్తు చేశారు. ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా నిందితుడు అలా వ్యవహరించం వల్ల ప్రమాదకేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కార్యక్రమంలో ఏఎస్సై అప్పారావు పాల్గొన్నారు. ప్రమాదానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్ -
అంధకారంలో అవస్థలు
చిత్రంలో చిమ్మచీకటిలో ఆరుబయట కూర్చున్నవారంతా నిండు గర్భిణులు. డెలివరీ సమయం దగ్గర పడడంతో గిరిశిఖర గ్రామాల నుంచి గుమ్మలక్ష్మీపురంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో నిర్వహిస్తున్న గర్భిణుల వసతి గృహంలో చేరారు. భారీ వర్షం కారణంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలోనే గడిపారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. రాత్రంతా ఆరుబయటే జాగారం చేయాల్సిన పరిస్థితి. వైటీసీ సిబ్బంది సమాచారంతో విద్యుత్ సరఫరా పనులను సంబంధిత సిబ్బంది చేపట్టారు. అయితే, ట్రాన్స్ఫార్మర్ నుంచి వైటీసీకి సరఫరా అయ్యే విద్యుత్ తీగెలు అండర్ గ్రౌండ్లో ఉండడంతో సరఫరాను పునరుద్ధరించలేకపోయారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో గర్భిణులు ఊపిరిపీల్చుకున్నారు. వైటీసీకి జనరేటర్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి గర్భిణుల బంధువులు విజ్ఞప్తిచేశారు. – గుమ్మలక్ష్మీపురం -
వాచ్మన్ హత్య కేసులో నిందితుడి అరెస్టు
బొబ్బిలి: పట్టణంలోని గ్రోత్సెంటర్లో గల రాఘవ కన్స్ట్రక్షన్స్లో వాచ్మన్గా పనిచేస్తున్న కనిమెరకల వెంకట రమణ హత్య కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు చీపురుపల్లి డీఎస్పీ ఎస్ రాఘవులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాఘవులు నిందితుడి అరెస్టు చూపించి వివరాలను వెల్లడించారు. హతుడు వెంకటరమణ కుమార్తెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పాత బొబ్బిలిలోని చికెన్షాపులో పనిచేస్తున్న కోట సర్వేశ్వర రావు ఈ కేసులో నిందితుడని స్పష్టం చేశారు. వాచ్మన్ కనిమెరకల వెంకటరమణ విధుల్లో ఉండగా ఈనెల 20న రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో బొబ్బిలి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. భర్తతో గొడవలున్న తన కుమార్తెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సర్వేశ్వర రావును వెంకటరమణ గట్టిగా హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న సర్వేశ్వరరావు గ్రోత్ సెంటర్కు వెళ్లి వెంకటరమణపై దాడి చేశాడు. సీసీ టీవీ పుటేజీ, కాల్డేటా, సంఘటన స్థలం వద్ద దొరికిన పర్స్ ఆధారంగా విచారణ జరిపి నిందితుడ్ని ప్రశ్నించడంతో నేరం అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును త్వరగా ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన సీఐ కె.సతీష్కుమార్, ఎస్సై రమేష్, సిబ్బందిని డీఎస్పీ రాఘవులు అభినందించారు. -
సమన్వయలోపం ఉంది.. సరిదిద్దుకుంటున్నాం!
● అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి ● జంఝావతి, కొఠియా అంతర్రాష్ట్ర వివాదాలను త్వరలో పరిష్కరిస్తాం ● జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కొంత సమచారలోపం వల్లే ఇది ఏర్పడిందని.. దీనిపై బహిరంగంగానే చర్చించామని, సరిదిద్దుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమల్లో జిల్లా మంత్రి, పజాప్రతినిధులకు ముందస్తు సమాచారాన్ని చేరవేస్తూ సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ అంశాలపై సమీక్షించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్వతీపురం మన్యం జిల్లా మారుమూల గిరిజన ప్రాంతం అయినప్పటికీ జీడీపీలో 16.94 శాతం వృద్ధి సాధించి రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా పని చేయాలని సూచించారు. వరితో పాటు ఉద్యానవన పంటలను ప్రోత్సహించేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ప్రతి రైతూ సభ్యునిగా చేరాలని, తద్వారా వ్యవసాయ రుణాలను పొందవచ్చని మంత్రి హితవు పలికారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు జిల్లా అనుకూలంగా ఉన్నందున పారిశ్రామిక వేత్తలతో మాట్లాడి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే జీడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటైందని.. దాంతో పాటు జీడి, మామిడి, పైనాపిల్ వంటి ఇతర యూనిట్ల స్థాపనకు ఆలోచన చేయాలని తెలిపారు. సాగు నీటి వినియోగం కోసం అవసరమైన లష్కర్లను రానున్న నాలుగు మాసాల్లోగా వేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంతర్రాష్ట్ర వివాదాలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. కుంకీ ఏనుగుల మొదటి ఆపరేషన్ జిల్లాలోనే చేపట్టేలా కోరామని చెప్పారు. పీపీపీ విధానంలోనే వైద్య కళాశాల చేపడతామని స్పష్టం చేశారు. సమాచార శాఖ ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, కలెక్టర్ శ్యామ్ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే విజయ్చంద్రలతో కలసి పరిశీలించారు. వ్యవసాయ శాఖ ఏర్పాటుచేసిన స్టాల్ను సందర్శించి రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం పార్వతీపురం మార్కెట్ యార్డులో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన జీడి ప్రాసెసింగ్ యూనిట్ను తనిఖీ చేశారు. కూటమిలో విభేదాలు.. బీజేపీ, జనసేన డుమ్మా! ‘సుపరిపాలనలో తొలి అడుగు’.. అంటూ రాష్ట్రంలో మొదటి సమావేశం పార్వతీపురం మన్యం జిల్లాలో నే చేపట్టారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కూటమిలోని విభేదాలు బయటపడ్డాయి. కార్యక్రమానికి టీడీపీ మినహా.. కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులు హాజరు కాలేదు. ఏ ఒక్కరికీ ఆహ్వానం అందలేనట్లు తెలుస్తోంది. పాలకొండ జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ కూడా గైర్హాజరయ్యా రు. ఆయన స్థానికంగా లేరని సమాచారం. తమకు ఆహ్వానం అందకపోవడంపై రెండు పార్టీల నాయకులూ గుర్రుగా ఉన్నారు. తమను పట్టించుకోవడం లేదని ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎదుట కూటమి భాగస్వామ్యంలోని బీజేపీ నాయకులు మొరపెట్టుకున్నారు. తాను అంతా సరిదిద్దుతానని అప్పట్లో మంత్రి వారికి హామీ ఇచ్చారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరలా ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
కనులపండువగా జగన్నాథుని రథయాత్ర
మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వానాలు, భజనల నడుమ వీరఘట్టంలో జగన్నాథుని రథయాత్ర శుక్రవారం వైభవంగా సాగింది. తొలుత యజ్ఞకర్త ఎస్.వి.ఎల్.ఎన్ శర్మయాజీ దంపతులు, అర్చకుడు లింగరాజ్రథో స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం రథంపై సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథస్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి యాత్రను ప్రారంభించారు. పట్టణ వీధుల్లో రథంపై వస్తున్న స్వామివారిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. దేవదాయశాఖ ఈఓ సూర్యనారాయణ యాత్రను పర్యవేక్షించారు. – వీరఘట్టం -
నాలుగు తరగతులు..!
● ఉపాధ్యాయుడూ ఒక్కరే.. ● ఇదీ ములక్కాయవలస ప్రాథమిక పాఠశాల దుస్థితి ఒక గది.. పార్వతీపురం రూరల్: మానవుడు అంతరిక్షాన్ని చుట్టి వస్తున్న రోజుల్లోనూ గిరిజన ప్రాంత ప్రజలను విద్య, వైద్య కష్టాలు వీడడంలేదు. దీనికి పార్వతీపురం మండలం గోచెక్క పంచాయతీ ములక్కాయ వలస గ్రామంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలే నిలువెత్తు నిదర్శనం. గత ప్రభుత్వంలో రెండోవిడత నాడు–నేడు కార్యక్రమంలో పాఠశాలకు నూతన భవనాన్ని మంజూరు చేసింది. ప్రభుత్వం మారడంతో పాఠశాల భవనం పునాదులకే పరిమితమైంది. అనంతరం వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో కనీసం పాఠశాల వైపు కన్నెత్తి చూడలేదు. ఫలితం.. విద్యార్థులను వసతి కష్టాలు వెంటాడుతున్నారు. తాత్కాలికంగా వేసిన చిన్న రేకుల షెడ్లోనే ఆరు గ్రామాల నుంచి వస్తున్న చిన్నారులకు ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధన చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు తరగతుల విద్యార్థులకు ఇరుకు గదిలో బోధన సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. -
పురం పరువు గోవిందా!
● గాడి తప్పుతున్న మున్సిపల్ పాలన ● చీలిపోతున్న ఉద్యోగులు ● పెన్డౌన్కు దిగిన సిబ్బంది ● పట్టణ సమస్యలు గాలికి సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పురపాలక సంఘం పరువు పోతోంది. పుర పాలన గాడి తప్పుతోంది. నిత్యం ఏదో ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తోంది. పట్టణ ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, ఉద్యోగులు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వివాదాలతో రచ్చకెక్కుతున్నారు. ఏడాదిగా వివాదాలు.. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పాలన మారింది. ఇదే సమయంలో మున్సిపల్ పాలక వర్గం మాత్రం.. వైఎస్సార్ సీపీదే. మధ్యలో అడ్డదారిలోనైనా మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకోవాలని కూటమి నాయకులు విఫలయత్నం చేశారు. అది కుదరలేదు. ఈలోగా కొంతమంది కౌన్సిలర్లు కూటమి పక్షాన చేరారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు రాకతో పరిస్థితి మొత్తం మారిపోయింది. అభివృద్ధి కుంటుపడిందన్నది ప్రధాన ఆరోపణ. సాధారణ సమావేశాలు సైతం చాలా రోజులు నిర్వహించక అభివృద్ధికి మోకాలడ్డారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం కూటమి వార్డులపై ఫోకస్ పెట్టి.. వైఎస్సార్సీపీ వార్డులను, సభ్యులను టార్గెట్ చేశారు. పాలకవర్గం తీసుకునే నిర్ణయాలకు ఏకీభవించకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తూ కక్ష సాధింపునకు దిగారు. సిబ్బంది మధ్య విభేదాలు కొద్ది రోజులుగా సిబ్బంది మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. చివరికి కుర్చీలు విసురుకోవడం మొదలు.. పెన్డౌన్ చేపట్టి విధులు బహిష్కరించే వరకూ వచ్చింది. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ విభాగం అధికారి రూబిన్ మధ్య చాలా రోజుల నుంచి పొసగడం లేదు. తనకు సంబంధించిన మెడికల్ బిల్లుల విషయమై ఆర్వో రూబిన్.. కమిషనర్ను కొద్ది రోజుల క్రితం నిలదీశారు. ఆ తరువాత తమను ఆర్వో దూషించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కమిషనర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నల్లబ్యాడ్జీలతో కార్యాలయం ఆవరణలో నిరసన తెలిపారు. ఆ మరుసటి రోజే సెలవు విషయమై ఇద్దరి ఉద్యోగుల మధ్య ఘర్షణ జరిగింది. కార్యాలయంలోనే కేకలు వేసుకోవడంతోపాటు.. కుర్చీలు విసు రుకున్నారు. తాజాగా గురువారం కూడా ఆర్వో రూబిన్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్యోగులు పెన్డౌన్కు దిగారు. మున్సిపల్ చైర్పర్సన్ బి.గౌరీశ్వరికి ఫిర్యాదు చేశారు. ఈ వివాదం ఇప్పటికై నా చల్లారుతుందా, లేదా అన్నది చూడాలి. ప్రధానంగా కమిషనర్ తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంటోంది. ఆయనపై గతంలోనూ అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విచారణకు వచ్చిన ఆ శాఖ ఆర్డీ ఎదుట కూడా పలువురు నేరుగా ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో మున్సిపల్ సిబ్బంది అవినీతిపైనా ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకూ ఏ ఒక్కరిపైనా తీసుకున్న చర్యలు శూన్యం. కార్యాలయంలో పని చేస్తున్న మరికొంతమంది కూడా కమిషనర్ తీరుపై గుర్రుగా ఉన్నారు. పాలన గాలికి.. సిబ్బంది మధ్య విభేదాలు, రాజకీయ కారణాలతో పుర పాలన పూర్తిగా గాడి తప్పింది. పట్టణంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మంచినీరు, పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. మరోవైపు ఉద్యోగులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు తిరిగి.. తిరిగి విసిగిపోవాలే గానీ... ప్రయోజ నం ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
ధరాఘాతం..!
ఆయిల్ పామ్ ధర బాగుంది కదా అని రైతులు సాగుపై ఆసక్తి చూపించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 35వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. అయితే గతేడాది వరకు నిలకడగా సాగిన ఆయిల్పామ్ ధర ఒక్కసారిగా తిరోగమనం బాట పట్టింది. పదిరోజుల వ్యవధిలోనే ధర పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండు వారాల్లోనే రూ.2వేల వరకు ఆయిల్పామ్ ధర తగ్గింది. ఈ తగ్గుదల మరింత ఉండే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు పేర్కొంటుండడంతో ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ● ఒక్కసారిగా పడిపోయిన ఆయిల్పామ్ రేటు ● పదిరోజుల వ్యవధిలో టన్నుకు రూ.2వేలు తగ్గింపు ● ఆందోళనలో రైతులు ● జిల్లాలో 35వేల ఎకరాల్లో సాగు ●ధరలను స్థిరీకరించాలి రెతులను ఆదుకునేందుకు ఆయిల్పామ్ ధరలను స్థిరీకరించాలి. రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆయిల్పామ్ రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి. సమీక్షల పేరుతో కాలయాపన చేయకుండా ఆయిల్ పామ్ రైతులను ఆదుకునేందుకు కనీస మద్దతు ధరను ప్రకటించాలి. –కెంగువ పోలినాయుడు, రైతు, కంబవలస, కొమరాడ మండలం●దిగుమతి సుంకం పెంచాలి ఆయిల్ పామ్కు గతంలో 27.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకం ప్రస్తుతం 10 శాతానికి తగ్గిపోవడంతో పెట్టుబడి పెరిగి ఆయిల్పామ్ ధరలు తగ్గిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో టన్ను రూ.23వేలు ఉన్న ధర ప్రస్తుతం తగ్గిపోయింది. దిగుమతి సుంకం పెంచితే ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం స్పందించి ఆయిల్పామ్ ధరలను పెంచి రైతులను ఆదుకోవాలి. –అంబటి గౌరునాయుడు, రైతు, సంతోషపురం, గరుగుబిల్లి మండలంపార్వతీపురం: ఆయిల్ పామ్ ధరలు రోజురోజుకు పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది వరకు నిలకడగా సాగిన ధరలు ప్రస్తుతం తిరోగమన బాట పట్టాయి. పదిరోజుల వ్యవధిలో నే టన్నుకు రూ.2వేల మేర ధర తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పదిరోజుల క్రితం వరకు రూ.20,290లున్న టన్ను ధర నేడు రూ.18,650కి పడిపోయింది. అంతర్జాతీయ పరి ణామాలు, ముడిచమురు ధరల ఆధారంగా ఆయిల్పామ్ ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతుంటా యి. అంతర్జాతీయంగా ఆయిల్పామ్కు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దిగుమతి సుంకం తగ్గింపు ప్రభావం ధరలపై పడడంతో చివరిగా రైతులు నష్టపోతున్నారు. గత ఏడా ది వరకు ఆయిల్పామ్పై దిగుమతి సుంకం 27.50 శాతం ఉండడంతో దేశీయ సాగు విక్రయాలపైనే శతశాతం ఆధారపడి డిమాండ్ బట్టి దిగుమతి చేసుకునే అవకాశం ఉండేది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 27.50 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 17.50 శాతానికి తగ్గించారు. ఇదే అదునుగా భావించి మార్కెట్లో కంపెనీలు, వ్యాపారులు అమాంతం ధరలు తగ్గించి కొనుగోలుకు తెరతీశారు. రెండు వారాల్లోనే రూ.2వేల వరకు ధర తగ్గింది. ఈ తగ్గుదల మరింత ఉండే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని పార్వతీపురం, కురుపాం, గరుగుబిల్లి, కొమరాడ, సీతానగరం, పాలకొండ, సాలూరు, జియ్యమ్మవలస, మక్కువ మండలాల్లో వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఆయిల్పామ్ సాగును రైతులు ఆశాజనకంగా చేస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఏటా జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతూనే వస్తోంది. రెండేళ్ల క్రితం వరకు 20వేల ఎకరాల్లో ఉన్న ఆయిల్పామ్ సాగు ప్రస్తుతం 35వేల ఎకరాల వరకు చేరింది. ఆయిల్పామ్ ధరలు తగ్గడం కారణంగా అనుబంధ ఉత్పత్తులు కూడా ధరలు తగ్గితే రైతులపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.