breaking news
Parvathipuram manyam District News
-
అర్జీదారుల సమస్యలు అర్థం చేసుకోవాలి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ● పీజీఆర్ఎస్ నోడల్ అధికారులతో సమీక్షవిజయనగరం అర్బన్: తమ సమస్యలు, బాధలు తీరుతాయనే అర్జీదారులు పీజీఆర్ఎస్కు వస్తారని, వాటిని అర్థం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించడమే నిజమైన సేవ అని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ పేర్కొన్నారు. అర్జీదారుల పట్ల సానుకూలంగా వ్యవహారం ఉండాలని దరఖాస్తులో వాస్తవికత ఉంటే పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో పీజీఆర్ఎస్ నోడల్ అధికారులతో అర్జీల పరిష్కారంపై కలెక్టర్ సమీక్షించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా అర్జీల పరిష్కారం ద్వారా ఒకరి సమస్య తీర్చడమే నిజమైన సేవగా భావించాలని హితవు పలికారు. అర్జీలకు సమాధానాలు రాసేటప్పుడు స్వీకింగ్ అర్డర్ మాదిరి ఉండాలని ఏది అడిగారో దానికోసమే సమాధానం రాయాలని అయితే సమాధానం రాసిన తర్వాత అర్జీదారు సంతృప్తి చెందేలా ఉండాలని ఎట్టి పరిస్థితిల్లోనూ రీ ఓపెన్ కాకూడదని తెలిపారు. బాధ్యత గల ఉద్యోగిని కలెక్టరేట్కు పంపాలి అర్జీలను ఎలా పరిష్కరించాలో జిల్లా అధికారులు వారి స్టాఫ్కు ప్రతి సమావేశంలోనూ అవగాహన కలిగించాలన్నారు. అర్జీల పరిష్కారానికి ప్రతి కార్యాలయం నుంచి ఒక బాధ్యత గల ఉద్యోగిని డిజిగ్నేట్ చేసి వారిపేరును కలెక్టరేట్కు పంపాలని సూచించారు. ఆర్జీల కోసం ప్రతి రోజు లాగిన్లో చూడాలని అలాగే సాయంత్రం వెళ్లేటప్పుడు కూడా చూడాలని తెలిపారు. ఏ టైమ్లో నైనా చూడకుండా ఉన్న అర్జీలు సున్నా కనపడాలని స్పష్టం చేశారు. అర్జీ అందగానే అర్జీదారుతో ముందు మాట్లాడాలని తన సమస్య ఏంటో తెలుసుకుని సమాధానం రాయాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పీజీఆర్ఎస్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా ఉంటే ఆ అధికారి సీఆర్లో నెగటివ్గా రాయనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో అధనపు ఎస్పీ సౌమ్యలత, కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ మురళి, జిల్లా అధికారులు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో సేవలు శ్లాఘనీయం
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు శాఖలో హోంగార్డులుగా సుదీర్ఘ కాలం సేవలందించి, ఉద్యోగ విరమణ చేసిన వారికి ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం ’ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ హోంగార్డుల సేవలను కొనియాడి, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా, క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డులు కె.సూర్యనారాయణ, ఎం.వెంకట రామకృష్ణారావులను పోలీసుశాఖ తరఫున ఎస్పీ వకుల్ జిందల్ మనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఉద్యోగ విరమణ తరువాత ఇకపై ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డులకు ఎస్పీ సూచించారు. అనంతరం, ఉద్యోగ విరమణ చేసిన గార్డుల దంపతులను జిల్లా పోలీసుశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందించి, శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఆర్.రమేష్ కుమార్, ఇనార్జ్ హెచ్సీ రాజు, హోంగార్డ్స్, వారి కుటుంబ సభ్యులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయి కేసుల్లో దర్యాప్తు వేగవంతం
● ఎస్హెచ్ఓలతో ఎస్పీ జూమ్ కాన్ఫరెన్స్విజయనగరం క్రైమ్: గంజాయి కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్స్తో ఎస్పీ మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలను జారీ చేశారు. అన్ని పోలీస్ స్టేషన్లలో ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం నమోదై, దర్యాప్తులో ఉన్న గంజాయి కేసులపై ఎస్పీ వకుల్ జిందల్ సమీక్ష చేశారు. దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని అడిగి తెలుసుకుని కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెండింగ్లో ఉన్న కేసుల్లో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పరారీలో ఉన్న నిందితుల గురించి సమాచారం సేకరించాలని, వారి ఆచూకీని గుర్తించేందుకు సాంకేతికతను వినియోగించాలని సూచించారు. అవసరమైతే ఆయా కేసుల్లో ప్రెసిడెన్సీ పాస్పోర్టు తీసుకుని, ఇతర రాష్ట్రాలకు పోలీసు బృందాలను పంపాలని అధికారులను ఆదేశించారు. తరచూ ఇదే తరహా నేరాల్లో అరెస్టు అవుతున్న నిందితులపై హిస్టరీ షీట్లు ప్రారంభించి, వారి కదలికలపై నిఘా పెట్టాలని చెప్పారు. నిందితులు ఇతర ప్రాంతాలకు చెందిన వారైతే వారి హిస్టరీ షీట్లను సంబంధిత పోలీస్స్టేషన్లకు బదిలీ చేయాలన్నారు. ఎన్డీపీఎస్కు అనుకూలంగా ఉన్న కేసుల్లో అనుమతులు పొంది నిందితులను ముందస్తుగా అరెస్టు చేయాలన్నారు. నిందితుల ఆస్తులు అటాచ్ చేయాలి గంజాయి వ్యాపారంతో అక్రమంగా సంపాదించిన వారి ఆస్తులను గుర్తించి, ఫైనాన్షియల్ ఇన్విస్టిగేషన్ పూర్తి చేసి, వారి అక్రమ ఆస్తులను అటాచ్ చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. గంజాయితో పట్టుబడిన కేసుల్లో గంజాయి రవాణాకు పాల్పడిన వ్యక్తులతోపాటు, వారికి గంజాయిని సరఫరా చేసిన వ్యక్తులు, విక్రయించిన వ్యక్తులను, ఇతర ప్రధాన నిందితులను కూడా ఆయా కేసుల్లో నిందితులుగా చేర్చాలని తెలిపారు. నాన్ బెయిలబుల్ వారంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వాటిని ఎగ్జిక్యూట్ చేసేందుకు సిబ్బందిని నియమించాలని చెప్పారు. రాబోయే లోక్ అదాలత్లలో ఎక్కువ కేసులు డిస్పోజ్ అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పెండింగులో ఉన్న గంజాయి కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి, నిందితులపై అభియోగ పత్రాలను దాఖలు చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.ఈ జూమ్ కాన్ఫరెస్సులో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్య రెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
గెడ్డలో పడి వ్యక్తి మృతి
పాలకొండ: నగరపంచాయతీ పరిధిలోని కొండవీధికి చెందిన కారంగి రమేష్(42) గెడ్డలో పడి మృతిచెందాడు. మండలంలోని గోపాలపురం గ్రామ సమీపంలోని గెడ్డలో చేపల వేటకు వెళ్లిన రమేష్ ప్రమావశాత్తు కాలు జారి నీటిప్రవాహంలో కొట్టుకుపోయాడు. సోమవారం రాత్రి సయమంలో ప్రమాదం జరగడంతో గమనించిన సహచరులు బయటకు తీసి మరణించినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై ప్రయోగమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
భూగర్భ జలాల స్థాయి జిల్లాలో పెరగాలి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్విజయనగరం అర్బన్: జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచే మార్గాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో భూగర్భ జలాల స్థాయిలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపునకు దోహద పడే ఉపాధి హామీ పథకం ద్వారా చెక్ డ్యాంలను, ఫారం పాండ్స్ను వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. అందుకు అవసరమయ్యే మంజూరులను తీసుకుని ప్రతిపాదనలను పంపాలని చెప్పారు. జిల్లాలో 3 మీటర్ల లోపల 17 మండలాల్లో, 3 నుంచి 8 మీటర్లలోపు 9 మండలాల్లో, 8 మీటర్ల లోతులో 2 మండలాల్లో భూగర్భజలాల స్థాయి ఉందన్నారు. అయితే జిల్లా సరాసరి 3.80 మీటర్లలోపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో బాపట్ల సరాసరి 3.7 మీటర్ల లోతులో ఉంటూ మొదటి స్థానంలో ఉందని, విజయనగరం 2వ స్థానంలో ఉందన్నారు. జిల్లాలో 215 గ్రామాల్లో భూగర్భ నీటి స్థాయి తక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఈ గ్రామాల్లో భూగర్భ నీటిస్థాయిని పెంచడానికి వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. జలవనరుల శాఖ ద్వారా మైనర్ ఇరిగేషన్ ట్యాంక్లను క్లీనింగ్ చేయాలని వచ్చే 4 రోజుల్లో 174 చెరువులను పరిశుభ్రం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ శారదాదేవి, ఇరిగేషన్ ఈఈ రమణ, గ్రౌండ్ వాటర్ డీడీ దినకర్ తదితరులు పాల్గొన్నారు. నేడు జిందాల్ సమస్యలపై గ్రామసభ జిందాల్ రైతుల సమస్యల పరిష్కారం కోసం ఎస్.కోట మండలం మూల బొడ్డవర గ్రామంలో బుధవారం కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ వద్ద నున్న డాక్యుమెంట్ల ఆధారాలతో గ్రామ సభకు హాజరు కావాలని సూచించారు. న్యాయపరంగా రికార్డు పరంగా కచ్చితంగా ఉన్న వారికి అక్కడికక్కడే పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు. లేని వారికి కారణాలను తెలియజేయనున్నామని పేర్కొన్నారు. ఈ గ్రామ సభకు తహసీల్దార్తో పాటు రెవెన్యూ అధికారులు రికార్డులతో హాజరవుతారని అదేవిధంగా జిందాల్ కంపెనీ వారు కూడా రికార్డులతో హాజరవుతారని కలెక్టర్ తెలిపారు. -
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన ఫెన్సింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు దక్కించుకున్నారు. గత నెల 30,31 తేదీల్లో ప.గో జిల్లా భీమవరంలో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పారు. అంతర్ జిల్లాల పోటీల్లో కె.హిమశ్రీ, పి.తేజస్విని, టి. యమున సిల్వర్ మెడల్స్ సాధించగా..వి.కేసరి డి.ధరహాసిని, టి.భానుమతి బ్రాంజ్ మెడల్స్ దక్కించుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను కోచ్ డీవీ చారిప్రసాద్, ఫెన్సింగ్ అసోసియేషన్ సభ్యులు దాలిరాజు, పిల్లా శ్రీనివాస్, వెంకటేష్, సతీష్కుమార్లు అభినందించారు. -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
చికెన్● జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్డెంకాడ: బాల్య వివాహాలు చేయడం నేరమని, చేసిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తారని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. ఈ మేరకు డెంకాడ మండలంలోని పెదతాడివాడ గ్రామంలో యూత్క్లబ్ బెజ్జిపురం స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సమాజం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా బాల్య వివాహాల కేసులు నమోదు కావడం దురదృష్టకరమన్నారు. బాల్య వివాహాల వల్ల అనేక అనర్థాలు ఉన్నాయన్నారు. బాల్య వివాహాలు చేసిన వారికి, చేయించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తారని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల నిర్మూలనకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. న్యాయ సహాయం కోసం పేదలు జిల్లా న్యాయ న్యాయసేవా అధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. బాలలు పాఠశాలలో ఉండాలని, వారిని పనిలో ఉంచితే బాలకార్మిక చట్టాల ప్రకారం నేరమన్నారు. వీటిపై కూడా కేసులు నమోదు చేస్తారని చెప్పారు. పెదతాడివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్లపై బాలికలకు అవగాహన నిర్వహించారు. కార్యక్రమాల్లో బెజ్జిపురం యూత్క్లబ్ కోఆర్డినేటర్ ఝాన్సీ, సచివాలయ కార్యదర్శి అప్పలనాయుడు, వివిధ విభాగాల అధికారులు, గ్రామపెద్దలు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగుల నిరీక్షణ
● ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు ● ఇంకా అమలు కాని హామీ ● ఆశగా ఎదురు చూస్తున్న యువత రామభద్రపురం: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ప్రతి ఇంటికో ఉద్యోగం, లేదా నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో బాగంగా సూపర్ సిక్స్లో పథకాల్లో నిరుద్యోగ భృతిని మొదటి హామీగా పేర్కొన్నారు. రోజులు గడుస్తున్నా..ఈ హామీ ఇంకా అమలు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఇంట్లో నిరుద్యోగులు చంద్రబాబు ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తారా? అసలు చేస్తారా? చేయరా? చేస్తే ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఇంటికో ఉద్యోగం ఇస్తారా? ఒకవేళ నిరుద్యోగ భృతి ఎంత ఇస్తారు? వంటి సందేహాలతో యువత సతమతమవుతున్నారు.అసలు ఎప్పుడు వస్తుందోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. సందిగ్ధంలో నిరుద్యోగులు.. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ అప్పడు కూడా ఎన్నికల ప్రచారంలో జాబు కావాలంటే..బాబు రావాలి,ఇంటికో ఉద్యోగం లేదంటే ప్రతి నెల రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలిచ్చింది. కానీ ఎక్కడా ఆ హామీ కార్యరూపం దాల్చలేదు.ఇంటికో ఉద్యోగం మాట దేవుడెరుగు కనీసం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మొండిచేయి చూపారు. గత అనుభవంతో ఈ సారైనా హామీ అమలు చేస్తారా? లేదా మొండి చెయ్యి చూపిస్తారా? అనే సందిగ్ధంలో నిరుద్యోగులు ఉన్నారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో సుమారు 5 లక్షల మంది నిరుద్యోగులకు కార్యదర్శులు, వలంటీర్లుగా నియమించిన విషయం తెలిసిందే. మరి చంద్రబాబు ప్రభుత్వం ఏమేరకు ఉద్యోగాలు కల్పిస్తుందోనని యువత ఆశగా ఎదురు చూస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో వేలాది మంది ఉన్నత చదువులు అభ్యసించారు. నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్నారు.కూటమి ప్రభుత్వం నేటికీ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. -
సర్వేయర్ ఆత్మహత్య
సీతంపేట: మండలంలోని కొత్తగూడ పంచాయతీ వంబరెల్లి నాయుడుగూడ గ్రామానికి చెందిన సర్వేయర్ సవర బలరాం (31) ఆర్థిక ఇబ్బందులు తాళలేక జీడిచెట్టుకు ఉరివేసుకుని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు, గ్రామస్తులు తెలిపారు. గొయిది గ్రామ సర్వేయర్గా పనిచేస్తున్న ఆయనకు జూలైలో భామిని మండలం బత్తిలి వన్ గ్రామ సచివాలయానికి బదిలీ అయ్యింది. ఇటీవల ఆర్థికపరమైన సమస్యలు రావడంతో మనస్తాపానికి గురై ఇంటిపక్కనే ఉన్న జీడితోటలోకి వెళ్లి ఉరివేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య దేవి, ఇద్దరు కుమార్తెలు అనీష, చారుమతి ఉన్నారు. కుటుంబ పెద్ద మృతితో గుండెలవిసేలా కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. బలరాం బలవన్మరణానికి పాల్పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుని భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై వై.అమ్మన్నరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచార శాఖ ఎ.డిగా గోవిందరాజులువిజయనగరం అర్బన్: జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకుడిగా పి.గోవిందరాజులు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా డీపీఆర్ఓగా, డివిజనల్ పీఆర్ఓగా, ఇన్చార్జ్ డీపీఆర్ఓగా కూడా పనిచేస్తున్నారు. తాజాగా ఇక్కడికి పదోన్నతిపై రానున్నారు. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ప్రభుత్వ పాలనపై గుర్రుగా జనసైనికులు
పార్వతీపురం రూరల్: ఎన్నికల సమయంలో తామంతా ఒక్కటే. తమ ఎజెండా ఒక్కటే అంటూ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చి తీరా ఏడాదిన్నర గడవక ముందే జనసేన నాయకులు బహిరంగంగా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి మరీ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, జిల్లాస్థాయి అధికారుల తీరుపై ప్రజల తరఫున జనసేన ప్రశ్నిస్తుందంటూ ఎండగడుతున్నారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురం నియోజకవర్గం జనసేన ఇన్చార్జ్ ఆదాడ మోహనరావు ఆ పార్టీ అధినేత జన్మదినాన్ని పురస్కరించుకుని కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ స్థానిక నియోజకవర్గ పాలకుల తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే పార్వతీపురంలో అత్యంత అవినీతి పాలన సాగుతోందని నివేదికలు చెబుతున్నాయన్నారు. ఆరు నెలల క్రితం బడిదేవరకొండ అనుమతులు రద్దుచేయాలని తాము పోరాటం చేస్తే ఆరు నెలల తరువాత స్థానిక ఎమ్మెల్యేకు బడిదేవరకొండ సమస్య గుర్తుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. కంపెనీ యాజమాన్యంతో ఇంతవరకు సఖ్యంగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే విజయచంద్రకు ఇప్పుడు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తుకురావడం మరింత ఆశ్చర్చకరమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం పార్వతీపురంలో చెరువులు అక్రమాలకు గురైతే ఎన్నోమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పత్రికా ముఖంగా నిలదీశారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారన్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపాల్టీ ప్రజలకు తాగునీటిని సక్రమంగా సరఫరా చేయలేని దుస్థితిలో జిల్లా యంత్రాంగం, పాలకులు ఉన్నారన్నారు. ఏడాదిన్నరలో మంజూరైన నిధులు ఏం చేశారో తెలియడం లేదని ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఇకమీదట పార్టీ అధినేత ఆదేశాలకోసం ఎదురుచూడమని, ఇకనుంచి దోపిడీ పాలనపై ప్రశ్నిస్తామని మోహనరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్వతీపురంలోనే ఎక్కువ అవినీతి బడిదేవర కొండపై స్థానిక ఎమ్మెల్యే తీరు విడ్డూరం విలేకరుల సమావేశంలో ఎండగట్టిన జనసేన ఇన్చార్జ్ ఆదాడ -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం చదురుగుడి, వనంగుడిలలో పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు.త్రుటిలో తప్పిన ప్రమాదంబొండపల్లి: మండలం కేంద్రంలో జాతీయ రహదారి 26పై మంగళవారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి రాయ్పూర్ ఐరన్ ఓర్ లోడుతో వెళ్తున్న లారీ వేగంగా వెళుతూ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి పెద్దప్రమాదం జరగక పోవడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వట్టిగెడ్డలో గల్లంతైన రైతు మృతిసాలూరు రూరల్: మండలంలోని దుద్ది సాగరం గ్రామానికి చెందిన మంచాల రామయ్య (45) వట్టిగెడ్డలో సోమవారం సాయంత్రం గల్లంతైన విషయం తెలిసిందే. అయితే మంగళవారం రూరల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గెడ్డలో గాలించగా గ్రామ సమీపంలోని తుప్పల్లో మృతదేహం దొరికిందని రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిగంట్యాడ: మండలంలోని గింజేరు గ్రామానికి చెందిన చప్ప గౌరునాయుడు (32) మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తామరాపల్లి నుంచి కాలినడకన గింజేరు జాతీయ రహదారిపై వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.సాయికృష్ణ తెలిపారు. లాటరీ విధానంలో బార్ కేటాయింపుపార్వతీపురం రూరల్: లాటరీ విధానంలో సాలూరులోని ఒక బార్ను కేటాయించారు. నాలుగు దరఖాస్తులు రావడంతో బార్ కేటాయింపునకు కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ సమక్షంలో మంగళవారం లాటరీ తీశారు. బార్ను సాలూరుకు చెందిన రుంకాన నరేష్ దక్కించుకున్నట్టు ఎకై ్సజ్ అధికారి బి.శ్రీనాథుడు తెలిపారు. కొట్లాట కేసు నమోదుపార్వతీపురం రూరల్: మండలంలోని బందలుప్పి గ్రామంలో జగనన్న కాలనీలో పక్కపక్కనే ఉంటున్న రెండు ఇళ్లకు సంబంధించిన విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆ ఇద్దరు ఇళ్ల యజమానుల మధ్య కొట్లాట జరిగింది. ఫిర్యాదు చేసేందుకు సంబంధిత విద్యుత్ సిబ్బందిని కలవలేదనే కారణంతో ఆ ఇద్దరు పరస్పర వాగ్వాదంతో ఘర్షణకు దిగి కొట్లాటకు దిగారు. దీంతో ఒకరికి తలపై బలమైన గాయం కావడంతో ఫిర్యాదు మేరకు కొట్లాట కేసు నమోదు చేసినట్లు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి కుమారి తెలిపారు. -
స్వమిత్వతో కచ్చితమైన భూ రికార్డులు
పార్వతీపురం రూరల్: స్వమిత్వ సర్వేతో కచ్చితమైన భూ రికార్డులను అందించడం జరుగుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. పార్వతీపురం మండలం జమదాల పంచా యతీ లక్ష్మీపురం గ్రామంలో అమలవుతున్న స్వమిత్వ యోజన పథకాన్ని సబ్కలెక్టర్ ఆర్.వైశాలితో కలిసి మంగళవారం పరిశీలించారు. బందలుప్పి, జమదాల సమీపంలోని చెరువులను కలెక్టర్ పరిశీలించారు. ఎర్రంనాయుడు చెరువు అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఆయన వెంట డీపీఓ కొండలరావు, తహశీల్దార్ సురేష్ ఉన్నారు. పది కిలోల గంజాయి స్వాఽధీనం శృంగవరపుకోట: ఎస్.కోట పట్టణ పోలీసులు మంగళవారం బొడ్డవర కూడలిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు లగేజీ బ్యాగ్లతో పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద 7 ప్యాకెట్లలో 10కిలోల గంజాయి లభించింది. నిందితులు బెంగుళూరు సమీపంలోని తిరుమలశెట్టి గ్రామానికి చెందిన చరనా దారి, పవన్ మంజూనాథ్లుగా గుర్తించారు. వీరు అరకు నుంచి కర్ణాటక రాష్ట్రానికి గంజాయి రవాణా చేస్తుండగా పట్టుపడ్డారు. కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. పేదల బియ్యం పట్టివేత మక్కువ: మండలంలోని ఎర్ర సామంతవలస గ్రామం వద్ద మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ అధికారుల సంయుక్తంగా దాడిచేసి పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. మక్కువకు చెందిన ఓ వ్యక్తి ఆటోలో ఎర్రసామంతవలస మీదుగా ఒడిశా తరలిస్తున్న 950 కేజీల బియ్యంను స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేశారు. బ్యాంకు ఖాతా నుంచి రూ.8లక్షలు చోరీ ● వైద్య ఖర్చుల కోసం దాచిన డబ్బును దోచుకున్న సైబర్ నేరగాళ్లు పార్వతీపురం రూరల్: పట్టణంలోని గెంబలి వారి వీధికి చెందిన బరాటం బాలకృష్ణమూర్తి అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలో నుంచి అతని ప్రమేయం లేకుండా రూ.8 లక్షలను సైబర్ నేరగాళ్లు తస్కరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ కె.మురళీధర్ కేసు నమో దుచేశారు. వైద్య ఖర్చుల కోసం దాచిన సొమ్మును తీసుకునేందుకు సోమవారం బ్యాంకుకు వెళ్లగా గతనెల 28న తన ఖాతా నుంచి ఆన్లైన్లో విత్ డ్రా చేసినట్లు బ్యాంక్ అధికారులు తెలిపినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వింతవ్యాధితో లక్షకు పైగా కోళ్లు మృతి ● నమూనాలు విజయవాడ ల్యాబ్కు తరలింపు కొత్తవలస: వింత వ్యాధులతో దేశవాళీ, ఫారం కోళ్లు మృత్యవాత పడుతున్నాయని పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు కన్నంనాయుడు మంగళవారం తెలిపారు. కొత్తవలస పశు సంవర్థక శాఖ సబ్డివిజన్ పరిధిలోని కొత్తవలస, లక్కవరపుకోట మండలాల పరిధిలో నేటి వరకు లక్ష వరకు కోళ్ల మృతి చెందినట్టు వెల్లడించారు. రెండు మండలాల్లో 80కి పైగా కోళ్ల ఫామ్లు ఉన్నాయని, గత నెల రోజుల నుంచి వరుసగా కోళ్లు చనిపోవడం ప్రారంభమైందన్నారు. కోళ్లఫామ్ల యజమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారని, కోళ్లకు సోకిన వ్యాధి నిర్ధారణకు నమూనాలను విజయవాడ ప్రత్యేక ల్యాబ్కు పంపించామన్నారు. చనిపోయిన కోళ్లను ఆరుబయట వేయకుండా గొయ్యితీసి పాతిపెట్టాలని సూచించారు. ల్యాబ్ ఫలితాలు వస్తేగాని వ్యాధి నిర్ధారణ చేయలేమన్నారు. -
అధ్వాన రోడ్లే అభివృద్ధా?
సాలూరు: ప్రజాధనాన్ని ప్రచారాలకు దుర్వినియోగం చేయడం, ప్రతి మంగళవారం అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడం, అధ్వానంగా కనిపిస్తున్న రోడ్లును బాగుచేయకపోవడమే కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరు పట్టణంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,32,000 కోట్లు అప్పులు చేస్తే 14 లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేశారని, కూటమి ప్రభుత్వం 14 నెలల పాలనలో సుమారు 2 లక్షల కోట్లు అప్పులు చేశారని, దేశంలోనే అతి తక్కువ కాలంలో అత్యధిక అప్పులు తీసుకున్న రాష్ట్రంగా ఆంధ్రాను మార్చేశారన్నారు. ఇదేనా చంద్రబాబు సంపద సృష్టంటూ దుయ్యబట్టారు. కొత్తపింఛన్లు మంజూరు చేయకుండా పాత పింఛన్ల పంపిణీలో టీడీపీ నేతలు హడావిడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దివ్యాంగుల పింఛన్లు తొలగింపునకు పూనుకుని వారికి శోకం మిగులుస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, పేదలకు పింఛన్లు ఇస్తామన్న హామీని విస్మరించడం విచారకరమన్నారు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఇస్తామన్న నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగ యువతకు నెలకు ఇస్తామన్న రూ.3 వేలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. యూరియా ఏదీ... ‘గణపతిబప్పమోరియా... ఏదయ్యా యూరియా’ అంటూ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై సోషల్మీడియాలో వస్తున్న పోస్టులు ప్రభుత్వ వైఫల్యానికి అద్దంపడుతున్నాయని రాజన్నదొర అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోనే యూరియాకోసం రైతుల అగచాట్లు ప్రభుత్వ పాలనను ఎత్తిచూపుతున్నాయన్నారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు ఎరువుకోసం అవస్థలు పడిన దాఖలా లేవన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఎయిర్పోర్టులు, సీపోర్టులు, ఆస్పత్రులు, సచివాలయ భవనాలు, విద్యాలయాల నిర్మాణాలు జరిగాయని గుర్తుచేశారు. కూటమి పాలనా వైఫల్యానికి రాష్ట్రంలో అధ్వానంగా దర్శనమిస్తున్న రోడ్లే నిలువెత్తు నిదర్శనమన్నారు. టీడీపీ నేతలు అవినీతిపై ఆ పార్టీ అనుకూల పత్రికలోనే ‘వసూళ్ల రాజాలు’ శీర్షికన కథనం వచ్చిందని పేర్కొన్నారు. అవినీతిపరుడు ముఖ్యమంత్రిగా ఉండకూడదని పవన్కల్యాణ్ చెప్పారని, చంద్రబాబునాయుడిపై 19 కేసులు ఉన్నాయని టీడీపీ అనుకూల పత్రికలోనే కథనం వచ్చిందని, మరి అవినీతిపరుడుకు పవన్కల్యాణ్ ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్కల్యాణ్... సుగాలిప్రీతి విషయంలో ఎందుకు మాట తప్పారన్నారు. ఇచ్చిన హామీలను అమలుచేయని ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఓ అభిమానిగా తాను అడుగుతున్నానని అన్నారు. చంద్రబాబు, జగన్మోహన్రెడ్డిల పాలన మధ్య తేడాను ప్రజలు గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్న చంద్రబాబు రైతన్నల యూరియా కష్టాలు తీర్చని కూటమి 19 కేసులున్న అవినీతి సీఎంకు పవన్కల్యాణ్ మద్దతివ్వడం హాస్యాస్పదం మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
ఇంటిల్లిపాదినీ పట్టిపీడిస్తున్న మలేరియా
ఈ చిత్రంలో ఒకే మంచంపై వైద్యసేవలు పొందుతున్న ముగ్గురు చిన్నారులదీ ఒకే కుటుంబం. వారికి సపర్యలు చేస్తున్న మహిళ పిల్లలే వీరంతా. ఆమె పేరు మండంగి నిరోష. గుమ్మలక్ష్మీపురం మండలం పి.ఆమిటి పంచాయతీ పరిధిలోని మొరమగూడ గ్రామం. తొలుత ఆమెకు మలేరియా పాజిటివ్ వచ్చింది. భద్రగిరి సీహెచ్సీలో వైద్యసేవలు పొందుతోంది. ఇంతలోనే ఆమె కుమారుడు వినయ్కు మూడురోజుల కిందట, కుమార్తెలు ప్రియాంక, కల్పన రెండు రోజుల కిందట జ్వరం బారిన పడ్డారు. వైద్యపరీక్షలు చేస్తే మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అందరూ ఒకే ఆస్పత్రిలో, ఒకే మంచంపై వైద్యసేవలు పొందుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించిందని, స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదని, దోమ తెరలు ఇచ్చేవారే లేరంటూ నిరోష వాపోయింది. -
అన్నదమ్ముల మధ్య మద్యం చిచ్చు
● మద్యం సేవించి వస్తుండగా ఇద్దరి మధ్య గొడవ ● అన్నపై కత్తితో తమ్ముడి దాడి ● ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి ● కొత్తబగ్గాంలో దారుణం ● కేసు నమోదుచేసిన పోలీసులుగజపతినగరం రూరల్: మద్యం మహమ్మారి అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది. ఆ మత్తులో కత్తితో దాడికి ఉసికొల్పింది. ఒకరి హత్యకు కారణమైంది. గజపతినగరం మండలం కొత్తబగ్గాంలో మంగళవారం రాత్రి మద్యం మత్తులో అన్నపై తమ్ముడు కత్తితో దాడిచేయడంతో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ఎస్సై కిరణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పసుపురెడ్డి శ్రీను, చంటి అన్నదమ్ములు. ఇద్దరి మధ్య ఏడేళ్ల నుంచి మాటలు లేవు. మంగళవారం రాత్రి అన్నదమ్ములిద్దరూ తమ స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. అందరూ కలిసి ఇంటికి వస్తుండగా మద్యం మత్తులో చంటిని శ్రీను వ్యంగంగా విమర్శించాడు. ఇది ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. ఆ క్రమంలో శ్రీనుపై చంటి కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన శ్రీనును గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
మంచం పట్టిన మన్యం
జియ్యమ్మవలస రూరల్/గుమ్మలక్ష్మీపురం/సీతంపేట మన్యం ప్రజలపై జ్వరాలు పంజావిసురుతున్నాయి. జ్వరపీడితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. జియ్యమ్మవలస మండలంలోని గిరిజన గ్రామాలైన వనజ, పెదదోడిజ, పల్లపు సిరిపి, నడిమి సిరిపి, టి.కె.జమ్ము, పిటి మండ తదితర గ్రామాల ప్రజలు జ్వరాలతో మంచంపట్టారు. చాలామంది చినమేరంగి సీహెచ్సీలో చేరి వైద్యసేవలు పొందుతున్నారు. జ్వరపీడితుల్లో చిన్నారులే అధికమంది కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పల్లెల్లో పారిశుద్ధ్యలోపం, రక్షిత మంచినీరు అందకపోవడం, దోమల నివారణ చర్యలు లేకపోవడంతో జ్వరాలు వ్యాప్తిచెందుతున్నాయని గిరిజనులు చెబుతున్నారు. ఫీవర్ సర్వే చేపట్టి సకాలంలో వైద్యసేవలు అందించకపోవడంతో ఆస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందాల్సి వస్తోందంటూ వాపోతున్నారు. ● సీతంపేట ఏజెన్సీలోనూ జ్వరాల తాకిడి పెరిగింది. వర్షాలు కురుస్తుండడం, కలుషితమైన తాగునీరును ప్రజలు తాగుతుండడంతో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జూన్ నుంచి ఎపిడమిక్ సీజన్ ఆరంభమైంది మొదలు పీహెచ్సీలు, స్థానిక ఏరియా ఆస్పత్రులు, ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తూనే ఉన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటి ఫీవర్ సర్వే జరిగేది. ఫ్యామిలీ డాక్టర్ సేవలు అందేవి. నిరంతరం వైద్యుల పర్యవేక్షణ ఉండేది. రెండులక్షల దోమతెరలు పంపిణీ చేశారు. ఇప్పుడా పరిస్థితి లేదని, వైద్య భరోసా కరువైందంటూ రోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దోమలు కుట్టడంతో మలేరియా, డెంగీ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. 2020లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో దోమతెరలు అందించారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడంలేదు. గిరిజనులు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడంలేదు. – కొండగొర్రి సంతోష్, బబ్బి మా గ్రామంలో పారిశుద్ధ్యం లోపించింది. కాలువలు సరిగా లేవు. రక్షిత మంచినీటి పథకం నుంచి అందిస్తున్న తాగునీరు సైతం కలుషితమవుతోంది. రోగాలబారిన పడుతున్నాం. – ఉలక రవికుమార్, వనిజ జ్వరాలతో ఉక్కిరిబిక్కిరి ఆస్పత్రుల్లో చేరుతున్న గిరిజనులు చిన్నారులను పట్టిపీడిస్తున్న జ్వరాలు కలుషిత నీరు, పారిశుద్ధ్యలోపమే కారణమంటున్న గిరిజనం దోమతెరలు పంపిణీ చేయకపోవడంపై ఆందోళన -
ఫిర్యాదు దారులకు కారణాలు తెలియజేయాలి
● కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్విజయనగరంఫోర్ట్: ప్రతి వారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే వినతులకు సంపూర్ణ న్యాయం చేయాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేవిధంగా అర్జీలకు పరిష్కారం చూపించాలని సూచించారు. కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 188 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు సంబంధించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తామని తెలిపారు. అసలైన ఫిర్యాదుదారులకు న్యాయం చేకూర్చేవిధంగా అధికారులు వ్యవహరించాలన్నారు. సమస్య పరిష్కరించలేని పక్షంలో దానికి కారణాలు అర్జీదారులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. వినతుల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి చూపాలని చెప్పారు. ఐటీ శాఖ వెబ్సైట్లో అన్ని శాఖలు వారివారి ముఖ్యమైన శాఖ మెమోలు, ప్రభుత్వ ఉత్తర్వుల కాపీలు వచ్చే గురువారంలోగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో చర్యలు విజయనగరం క్రైమ్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు నిర్వహించే ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదు దారుల నుంచి వినతులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి, సమస్యలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ 28 ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
బావిలో పడి వ్యక్తి ఆత్మహత్య
కొమరాడ: మండలంలోని విక్రంపురం గ్రామానికి చెందిన తూతిక స్వామేశ్వరరావు(60)ఆదివారం అర్ధరాత్రి దిగువ వీధిలో ఉన్న మంచి నీటి బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై కె.నీలకంఠం తెలిపారు. దీనిపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కిడ్నీ సంబంధిత వ్యాధి కారణంగా బాధపడుతున్న సోమేశ్వర రావుకు పార్వతీపురం జిల్లా అస్పత్రిలో డయాలసిస్ చేసినప్పటికీ నడుము నొప్పి ఎక్కువ ఉన్నందున బాధ తట్టులేక మానసికంగా కుంగిపోయి బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భర్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరంలో యువకుడు.. విజయనగరం క్రైమ్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి కొండకరకాం గ్రామానికి చెందిన పి.గంగరాజు(20) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక అప్పులు చేసి, తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడని రూరల్ ఎస్సై అశోక్ తెలిపారు. మృతుని అన్నయ్య సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ఏనుగుల సంచార ప్రాంత పరిశీలన
భామిని: మండలంలోని తాలాడ సమీప ఐలమ్మ తోటలో ఏనుగులు సంచరించిన ప్రాంతాలను విశాఖ ఫారెస్ట్ కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే, జిల్లా పారెస్ట్ ఆదికారి జీఏపీ ప్రసూనల బృందం సోమవారం పరిశీలించింది, ఐలమ్మ తోట పక్కనే గల వంశధార నది తీరాన్ని కూడా సందర్శించారు. గడిచిన మూడేళ్లుగా వంశధార నదీ తీరంలో ఏనుగుల గుంపు ఎలా గడిపిందని మాత్రమే పరిశీలించారు. కూటమి నాయకులు చెబుతున్నట్లు గత మూడేళ్లుగా ఏనుగుల గుంపుతో రైతుల పడుతున్న ఇబ్బందులు తొలగించడానికి కాని, కుంకి ఏనుగులు తెచ్చి తరలించేందుకు చర్యలు తీసుకోవడం కోసం కానీ ఫారెస్టు అధికారులు చర్చించలేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ఏనుగుల బెడద లేకపోయినా వాతావరణం మారగానే తిరిగి వస్తాయని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపు ఎందుకు నివాసముంటోందనని ఆలస్యంగా ఆటవీ శాఖాదికారులు పరిశీలించడం ఆశ్చర్యం కలిగించింది. కన్జర్వేటర్ శాంతి ప్రియ పాండేకు ఎలిఫెంట్ రేంజర్ మణికంఠేశ్వరరావు ఏనుగుల జాడలు వివరించారు. పాలకొండ రేంజర్ రామారావు,కొత్తూరు సెక్షన్ అధికారులు దాలినాయుడు, రామకృష్ణ, కేశవ, ట్రాకర్స్ ఉన్నారు. -
ట్రాక్టర్ మీదపడి యువకుడి మృతి
తెర్లాం: మండలంలోని పెరుమాళి గ్రామంలో ట్రాక్టర్ మీదపడడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పెరుమాళి గ్రామానికి చెందిన పొడ్ల రాము(23) సోమవారం మధ్యాహ్నం ట్రాక్టర్ను కడిగేందుకు స్థానికంగా ఉన్న ఓ చెరువుకు తీసుకువెళ్లాడు. ట్రాక్టర్ కడగడం పూర్తవడంతో దాన్ని పైకి తెచ్చేందుకు డ్రైవింగ్ చేస్తుండగా ట్రాక్టర్ బురదలో కూరుకుపోయి ఇంజిన్ భాగం పైకి లేచిపోయింది. దీంతో ట్రాక్టర్ బోల్తాపడిపోతుందని గమనించిన డ్రైవర్ రాము వెంటనే కిందకు దూకేశాడు. దూకేసిన రాముపై ట్రాక్టర్ పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కొన ఊపిరి ఉందన్న అనుమానంతో కుటుంబ సభ్యులు రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి ప్రమాదం జరిగిన వెంటనే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై తెర్లాం ఎస్సై సాగర్బాబు వద్ద ప్రస్తావించగా దీనికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి సమాచారం రాలేదని తెలిపారు. లారీ కింద పడి యువకుడు.. విజయనగరం క్రైమ్: నగరంలోని జేఎన్టీయూ జంక్షన్ వద్ద సొమవారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఇందుకు సంబంధించి వన్ టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మధుపాడకు చెందిన ఎర్రయ్య (21) తన స్నేహితుడితో కలిసి బైక్పై వెళ్తుండగా జేఎన్టీయూ వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఎర్రయ్య స్నేహితుడు ముందు పడిపోగా బైక్ నడుపుతున్న ఎర్రయ్య లారీ వెనక చక్రం వద్ద పడ్డాడు. ఆగి ఉన్న లారీ అప్పుడే బయలుదేరడంతో లారీ చక్రాలు ఎర్రయ్య మీద నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సీఐ చౌదరి ఆదేశాలతో ఎస్సై లక్ష్మునాయుడు మృతదేహాన్ని ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కు పోస్ట్మార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యాన్ ఢీకొని వృద్ధురాలు.. నెల్లిమర్ల రూరల్: మండలంలోని సారిపల్లి గ్రామంలో ఇంటిబయట కుర్చీలో కూర్చుని సేదదీరుతున్న వృద్ధురాలిని వ్యాన్ ఢీకొట్టడంతో మృతి చెందింది. ఈ ఘటనపై ఎస్సై గణేష్, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మజ్జి అన్నపూర్ణ(65) ఆదివారం రాత్రి పాన్ షాపు వద్ద కుర్చీలో కూర్చుని సేదదీరుతోంది. అదే సమయంలో నెల్లిమర్ల నుంచి వచ్చిన ఓ వ్యాన్ ఆ వృద్ధురాలిని బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వ్యాన్ను నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మృతురాలి అల్లుడు గురునాయుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
కూటమి తీరుపై నిరసన హోరు
కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ వివిధ వర్గాల ప్రజలు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళనలు చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినదించారు. పీజీఆర్ఎస్లో వినతులు అందజేశారు. రైతుసేవా కేంద్రానికి వచ్చిన 120 బస్తాల యూరియాలో ఒక్క బస్తాకూడా రైతులకు పంపిణీ చేయలేదంటూ కొమరాడ మండలం పూడేసు రైతులు ఆందోళన చేయగా, ఇంటి బిల్లులు చెల్లించాలంటూ సీతంపేట మండలం మర్రిపాడు గ్రామస్తులు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ అరకు సభలో ఏజెన్సీ ప్రాంతాల్లో వందకు వందశాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇస్తామని హామీ ఇచ్చి మెగా డీఎస్సీతో అన్యాయం చేశారంటూ ఆదివాసీ గిరిజన, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిరుద్యోగులు నిరసన తెలిపారు. ఏజన్సీలో వందశాతం ఉద్యోగాలు ఆదివాసీలకే ఇవ్వాలని, జీఓ నంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. – పార్వతీపురం రూరల్ -
● ఉచిత విద్యుత్తో సాగు భరోసా..
సంవత్సరాలు గడుస్తున్నా వైఎస్సార్ చేసిన మంచి పనులు ప్రతి ఒక్కరి మదిలో నిలిచే ఉన్నాయి. రైతుల రుణాల మాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, సాగునీటి సదుపాయాల కల్పనతో రైతన్నల గుండెల్లో గుడికట్టుకున్నారు. ఫీజురీయింబర్స్మెంట్తో ఉన్నత చదువుకు ఊతమిచ్చి విద్యార్థుల మనసుగెలుచుకున్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలతో ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించి ఆరోగ్యప్రదాతగా పేరుగాంచారు. మంగళవారం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు పల్లె, పట్టణ ప్రజలు సిద్ధమవుతున్నారు. విజయనగరం ఫోర్ట్/కొమరాడ: తీవ్ర కరువు పరిస్థితులు.. ఎటుచూసినా దుర్భిక్షమే.. తినడానికి తిండలేక రైతులు వలస పట్టే రోజులు.. వరుస కరువులతో రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయిన వైనం.. చాలా మంది రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడిన దుస్థితి.. ఇటువంటి పరిస్థితులను చూసిన చలించిన నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలు మాఫీ చేసి రైతుబాంధవుడిగా పేరుకెక్కారు. రుణాలు చెల్లించిన వారికి ప్రోత్సాహకం అందించారు. అందుకే వైఎస్సార్ పాలన తమకు స్వర్ణయుగం వంటిదన్నది రైతుల మాట. వరుస కరువుల వల్ల 2004కు ముందు రైతులు కష్టాలతో కొట్టుమిట్టాడే రోజులు అవి. భూములు సాగుకు నోచుకోక పోవడంతో బీడు భూములుగా మారాయి. మరోవైపు విద్యుత్ చార్జీల భారం. రైతులు వ్యవసాయం చేయడానికి వెనుకాడే పరిస్థితి. ఆ సమయంలో అధికారం చేపట్టిన వైఎస్సార్ రైతుల రుణాలుమాఫీ చేయడంతో పాటు బోర్లు ద్వారా పంటలను సాగు చేసుకోవడం కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. అప్పటి ప్రతిప్రక్ష తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తానంటే హేళన చేశారు. కాని రైతు సంక్షేమం కోసం తాను ఎంత ఖర్చు అయినా చేస్తానని ఐదేళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకులకు మాట ఆడలేని పరిస్థితిని కల్పించారు. ఇప్పటికీ ఆ పథకం కొనసాగుతుండడం ఆయన చలువే అని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. రైతు బాంధవుడు వైఎస్సార్ రుణమాఫీ చేసి రైతుల ఊపిరి నిలిపిన మహనీయుడు ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలతో వైద్య భరోసా కల్పించిన ఆరోగ్యప్రదాత ఉచిత విద్యుత్తో రైతన్నకు సాగు అండ నేడు వైఎస్సార్ వర్ధంతి -
వెయిట్ లిఫ్టింగ్లో అజేయుడు
చికెన్నెల్లిమర్ల రూరల్: వారిది నిరుపేద కుటుంబం. కుటుంబ పోషణకు వ్యవసాయ పనులు చేస్తూ వచ్చిన కొద్దిపాటి కూలి డబ్బులతో సర్దుకుపోయే దుస్థితి. గ్రామీణ సంప్రదాయబద్ధ క్రీడల పట్ల ఆసక్తి ఆయనను అంచెలంచెలుగా ఎదిగేలా చేసింది. పెద్దగా చదువుకోకపోయినప్పటికీ నమ్ముకున్న క్రీడ ప్రస్తుతం ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పదుల సంఖ్యలో పతకాలు సాధించి దేశ, రాష్ట్ర, జిల్లా కీర్తిని ఖండతరాల్లో ఇనుమడింపజేశారు. ఆయనే విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన సీనియర్ వెయిట్లిఫ్టర్ వల్లూరి శ్రీనివాసరావు. 1997లో శిక్షణ ప్రారంభించిన ఆయన పలు రాష్ట్రాల్లో జరిగిన చాంపియన్ షిప్ పోటీల్లో వరుస బంగారు పతకాలు కై వసం చేసుకున్నారు. ఇండియన్ ఆర్మీలో సిఫాయి స్థాయి నుంచి జేఏఓ కేడర్ వరకు ఎదిగి ప్రస్తుతం రిటైర్ అయ్యారు. గ్రామంలోనే ఉంటూ మరికొంత మంది క్రీడాకారులను తయారు చేస్తున్నారు. వల్లూరి శ్రీనివాసరావు పెద్ద కుమారుడు అజయ్ బాబు తండ్రి సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని తన 8వ ఏట నుంచే వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ ప్రారంభించాడు. 2021లో జాతీయస్థాయి చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని యూత్ విభాగంలో తొలి స్వర్ణం సాధించాడు. 2022 జూలైలో ఉజెబికిస్తాన్, 2022 అక్టోబర్లో బహ్రెయిన్, 2023లో యూపీ(ఇండియా), 2024 డిసెంబర్లో ఖతర్, ఉజెబికిస్తాన్, అదే ఏడాది సెప్టెంబర్లో ఫిజ్జి దేశాల్లో వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో సత్తా చాటాడు. ప్రస్తుతం పాటియాలాలోని ఓ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. తండ్రిని ఆదర్శంగా తీసుకున్న అజయ్బాబు వరుస విజయాలు సాధిస్తూ మరికొందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో రాణించేందుకు అజయ్ బాబు ప్రస్తుతం పాటియాలాలోని ఓ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. శిక్షణకు సంబంధించి అకాడమీ ఖర్చులు భరిస్తున్నప్పటికీ అదనంగా నెల కు రూ.40వేలు ఖర్చు అవుతున్నట్లు తండ్రి శ్రీని వాసరావు చెబుతున్నారు. గేమ్స్లో రాణించడమే తన కుమారుడి లక్ష్యమని లక్ష్య సాధనకు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ స్థాయికి వచ్చినట్లు తెలిపారు. వెయిట్లిఫ్టింగ్లో రాణిస్తున్న అజయ్ బాబు ఆ కోటాలో ఇటీవల ఇండియన్ ఆర్మీలో జేఏఓ కేడర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మరో నె ల రోజుల్లో బాధ్యతలు కూడా స్వీకరించనున్నాడు. స్కాట్లాండ్లో జరగనున్న పోటీలకు ఎంపిక ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో జరిగిన కామన్వెల్త్ చాంపియన్షిప్ పోటీల్లో అజయ్బాబు స్వర్ణ పతకం సాధించడంతో 2026 జూలై 23 నుంచి స్కాట్లాండ్లో జరగనున్న అంతర్జాతీయ గేమ్స్కు అర్హత సాధించాడు. ఆ పోటీల్లో తన కుమారుడు తప్పనిసరిగా స్వర్ణం సాధిస్తాడడని తండ్రి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. తండ్రి బాటలో రాణిస్తున్న తనయుడు కామన్వెల్త్ చాంపియన్ షిప్లో స్వర్ణం స్కాట్లాండ్లో జరగనున్న గేమ్స్కు ఎంపిక స్పోర్ట్స్ కోటాలో ఆర్మీలో ఉద్యోగం ప్రతిష్టాత్మక గేమ్స్లో స్వర్ణంపైనే గురి -
ఉత్తమ పౌరసమాజనిర్మాణమే లక్ష్యం కావాలి
పార్వతీపురం: ఉత్తమ పౌర సమాజ నిర్మాణమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం కావాలని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురంలో జన విజ్ఞాన వేదిక జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గిరిజన గ్రామాల్లో పాఠశాలలు, వసతిగృహాలు, కళాశాలల్లో సమావేశాలు నిర్వహించి విద్యార్థులను చైతన్య పరచాలని సూచించారు. కొన్ని గ్రామాలను దత్తతను తీసుకుని అన్ని విషయాల్లో..అన్ని రంగాల్లో శత శాతం లక్ష్యం సాధించేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు పాలక రంజిత్కుమార్, వంగల దాలినాయుడు, డి.చంద్రమౌళి, ఎం.వెంకటరమణ, కె.చిన్నారావు, యు.నాగార్జున, పి.సురేష్, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. -
వచ్చారు..
●రోడ్డు వేయాలని ఐదుసార్లు వీరు గుమ్మలక్ష్మీపురం మండలం వల్లాడ, బయ్యాడ గ్రామస్తులు. గొరడ ఆర్అండ్బీ రహదా రి నుంచి తమ ప్రాంతానికి రహదారి సౌకర్యం కల్పించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇప్పటికి ఐదు దఫాలుగా పీజీఆర్ఎస్కు వచ్చి వినతిపత్రం అందజేశారు. రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల అత్యవసర సమయంలో గర్భిణులు, రోగులను ఆసుపత్రికి తరలించేందుకు చాలా ప్రయాసలు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోతున్నాయని వాపోతున్నారు. సరకులు తీసుకుని వెళ్దామన్నా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. మరోసారి అధికారులను కలిసి తమ సమస్య చెప్పుకొన్నారు. రావడమే మిగులుతుంది గానీ.. సమస్య పరిష్కారం కావడం లేదని వారు వాపోయారు. -
వినతులపై తక్షణమే స్పందించాలి
● కలెక్టర్ ఎ. శ్యామ్ప్రసాద్పార్వతీపురం రూరల్: పీజీఆర్ఎస్కు వచ్చిన సమస్యలకు సంబంధించిన వినతులపై తక్షణమే సంబంధిత అధికారులు స్పందించాలని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు సబ్కలెక్టర్ ఆర్.శాలి, డీఆర్ఓ హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణిలు అర్జీదారుల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించిన కలెక్టర్ వారు తెలిపిన ప్రతి సమస్యను సావధానంగా విని తగిన పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. వచ్చిన వినతుల్లో కొన్ని.. సీతంపేట మండలం పొడిదుమ్ము నుంచి దారబంద వరకు రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలి. కురుపాం మండలం పిరంగూడ నుంచి అడ్డాయిగూడ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేయాలి. గుమ్మలక్ష్మీపురం మండలం గొరడ నుంచి వల్లాడ వరకు సీసీ రోడ్డు మంజూరు చేయాలి. కురుపాం మండలం పట్టాయి గెడ్డలో అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణం పూర్తిచేయాలి. గతేడాదిలో ఎంపికై న డీలర్లకు నియామక పత్రాలు మంజూరు చేయాలని తదితర సమస్యలపై పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 73 వినతులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీ, వైద్య ఆరోగ్యశాఖాధికారులు కె.రాబర్ట్పాల్, వై.క్రాంతికుమార్, టి. కొండలరావు, డా.ఎస్.భాస్కరరావు, ఐసీడీసీ, డ్వామా పీడీలు టి. కనకదుర్గ, కె.రామచంద్రరావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకరరావు, సీపీఓ ఎస్ఎస్ఆర్కె పట్నాయిక్, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ఎస్పీ ఆదేశాలు పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్శాఖ కార్యాలయంలో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి తన వద్దకు వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించేందుకు సంబంధిత స్టేషన్ అధికారులకు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తన కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. వచ్చిన ఫిర్యాదుల్లో ప్రధానంగా కుటుంబకలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులు వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసం, ప్రేమ పేరుతో మోసం, ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించుకోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలపై విచారణ చేసి, చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో 7 ఫిర్యాదులు అందాయి. డీసీఆర్బీ సీఐ ఆదాం తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ గ్రీవెన్స్సెల్కు 55 అర్జీలు సీతంపేట: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వివిధ శాఖల సెక్టోరియల్ అధికారులు హాజరు కాకపోతే మెమోలు ఇవ్వాలని ఐటీడీఏ పీఓ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎస్ఆర్ శంకరన్ సమావేశమందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. అధికారులు సమయపాలన పాటించాలని, పీజీఆర్కు ఎవరెవరు వచ్చారో సంతకాలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.అందరూ బాధ్యతగా పనిచేసి వచ్చిన అర్జీలను తక్షణ పరిష్కారం చూపాలన్నారు. మొత్తం 55 అర్జీలు వివిధ సమస్యలపై వచ్చాయి. ఓండ్రుజోలలో జీపీఎస్ చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు వినతి ఇచ్చారు. తాగునీటి బోరు మంజూరు చేయాలని జరడగూడ గ్రామానికి చెందిన ఆరిక చిన్నారావు, తల్లికి వందనం డబ్బులు తమ పిల్లలు ఇద్దరికి రాలేదని పోలిష్కోటకు చెందిన బిడ్డిక బెన్నయ్య విన్నవించారు. భాషావలంటీర్ను నియమించాలని జన్నిగూడ గ్రామస్తులు కోరారు. ఆయిల్ ఇంజిన్ మంజూరు చేయాలని పోలవరానికి చెందిన ఊయక బోడమ్మ విన్నవించింది. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, డిప్యూటీ ఈవో రామ్మోహన్రావు, ఎంపీడీవో సత్యం, డిప్యూటీ డీఎంహెచ్వో విజయపార్వతి తదితరులు పాల్గొన్నారు. -
కాకి లెక్కలు..!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో గిరిజన, భూ సమస్యలపై అనేక వినతిపత్రాలిచ్చామని ప్రజాసంఘాల నాయకులు అంటున్నారు. ఒక్కటీ పరిష్కారం కాలేదని సీపీఎం నేత రాము చెబుతున్నారు. తాను ఒక్కడినే 40 వరకు వినతిపత్రాలందించానని.. అందులో దేనికీ మోక్షం కలగలేదని చెప్పారు. ఏదో న్యాయం జరుగుతుందన్న ఆశతో గిరిజనులు వస్తున్నారని.. ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా ఫలితం ఉండటం లేదని తెలిపారు. ఈమె పేరు పువ్వల శోభ. కొమరాడ మండలం. కొన్నాళ్ల కిందట ఆమె భర్త చనిపోయారు. వితంతు పింఛన్ కోసం కొద్ది నెలలుగా ఆమె దర ఖాస్తు చేసుకుంటోంది. మండలంలో అధికారుల చుట్టూ తిరిగింది. ఇప్పటికే రెండు దఫాలు పీజీఆర్ఎస్లోనూ వినతిపత్రం అందించింది. నేటికీ పింఛన్ మంజూరు కాలేదు. ఒంటరి మహిళనైన తనకు పింఛను ఇచ్చి ఆదుకోవాలని అధికారులను వేడుకుంటోంది. సాక్షి, పార్వతీపురం మన్యం: పేరుకే.. ప్రజాసమస్యల పరిష్కార వేదిక! ఒక్కటైనా పరిష్కారానికి నోచుకున్న దాఖలాలు లేవు. పదేపదే తిరిగి అర్జీదారులు విసిగిపోవాలే గానీ.. అధికారులకు పీజీఆర్ఎస్ వినతులంటే చీమకుట్టినట్లు కూడా ఉండడం లేదు. ఈ మాటలంటున్నవి స్వయంగా ప్రజలు, ప్రజాసంఘాల నాయకులే. ఏడాది కిందట ఇచ్చిన వినతులకు నేటికీ మోక్షం కలగడం లేదు. పింఛన్లు, భూమస్యలు, రెవెన్యూపరమైన అంశాలు, ప్రభుత్వ పథకాలు, సామాజిక, వ్యక్తిగత సమస్యలు.. ఇలా ఏదైనా సరే విజ్ఞప్తులు బుట్టదాఖలు కావాల్సిందే అంటూ వాపోతున్నారు. విజ్ఞప్తులు వేలల్లో.. పరిష్కారం? ప్రజాసమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యమివ్వాలని ఉన్నతాధికారులు చెబుతున్న మాటలు.. ఆచరణలో నీరుగారిపోతున్నాయి. ఏదైనా సమస్యను పరిష్కరించలేని యెడల సహేతుకమైన కారణాన్ని, దరఖాస్తుదారులకు అర్థమయ్యేరీతిలో వివరించాలని కలెక్టర్తోపాటు, ఇతర ఉన్నతాధికారులు చెబుతున్నారు. కిందిస్థాయిలో ఒక అంశంపై పదేపదే తిరిగినా న్యాయం జరగకపోవడంతోనే అర్జీదారులు కలెక్టరేట్కు వస్తుంటారు. ఇక్కడ వారి సమస్యను వింటున్న అధికారులు.. మరలా జిల్లా అధికారులు, మండలాలకే పంపుతున్నారు. వారేమో, అసలు పరిశీలించకుండానే పరిష్కరించేసినట్లు ఆన్లైన్లో నమోదు చేసేస్తున్నారు. అంకెల్లో అంతా బాగున్నట్లే అని చూపించేస్తున్నారు. తమ విజ్ఞప్తి ఏమైందో తెలియక.. ప్రజలు నమ్మకంతో మళ్లీమళ్లీ వచ్చి వినతిపత్రాలు అందిస్తున్నారు. పీజీఆర్ఎస్ వినతుల పరిష్కారంపై గిరిజన సంక్షేం సంఘం నాయకులు పాలక రంజిత్కుమార్ సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా, అధికారులు ఇచ్చిన అంకెలు.. కాకి లెక్కలను తలపించడం విశేషం. ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీ నాటికి జిల్లాలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 44,919 వినతులు అందాయి. అందులో 44,384 వినతులను పరిష్కరించేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 535 వినతులు పెండింగులో ఉన్నట్లు చూపుతున్నారు. తామే అనేక సమస్యలపై ఎన్నోసార్లు వినతిపత్రాలు అందించామని.. అందులో ఒక్కటీ పరిష్కారం కాలేదని.. చిత్తశుద్ధిలేని కార్యక్రమాన్ని నిర్వహించడం ఎందుకని గిరిజన సంఘ నేత రంజిత్కుమార్తో పాటు, పలు ప్రజాసంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. వీరంతా గుమ్మలక్ష్మీపురం మండలం రాయఘడ జమ్ము పంచాయతీకి చెందిన మహిళలు. పెంగువ గ్రామంలో ఉన్న డీఆర్ డిపోను ఇప్పటి వరకు సరస్వతీ మహిళా సంఘం వారు నడుపుతున్నారని.. వారి కాల పరిమితి అయిపోవడంతో పీసా గ్రామ సభ నిర్వహించి, ఇకపై సీతాదేవి మహిళా సంఘానికి అప్పగించాలని సభ్యులంతా తీర్మానించుకున్నారు. ఆ మేరకు అధికారులను కలిసి తమ తీర్మాన ప్రతులను అందజేశారు. ఫలితం లేదు.. గతంలో ఓ సారి కలెక్టరేట్కు వచ్చి వినతిపత్రం అందించారు. స్పందన లేకపోవడంతో మరోసారి పీజీఆర్ఎస్లో విజ్ఞప్తి చేశారు. -
శేఖర్ అవయవాలు సజీవం
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం గదంవలస గ్రామానికి చెందిన చిలకల శేఖర్ ఇటీవల ఎచ్చెర్ల వద్ద రోడ్డు ప్రమాదానికి గురై శ్రీకాకుళం రిమ్స్లో చేరారు. ఆయనకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు గుర్తించడంతో కుటుంబ సభ్యులు అంత బాధలోనూ అవయవదానానికి అంగీకరించారు. దీంతో రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో అవయవదాన ప్రక్రియను సోమవారం పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న గదంవలస గ్రామస్తులు శ్రీకాకుళం–పాలకొండ రోడ్డు మీదుగా ర్యాలీ చేస్తూ అంతిమయాత్ర నిర్వహించారు. –సీతంపేట/బూర్జ -
● ఆదుకున్న అత్యవసర సేవలు..
108 వాహన సేవలు రాక ముందు ఆపద సమయాన సకాలంలో ఆస్పత్రికి వెళ్లలేక ఎంతో మంది మృత్యువాత పడేవారు. 108 వచ్చిన తర్వాత ఫోన్ చేసిన 15 నిముషాల్లో కుయ్కుయ్మంటూ క్షణాల్లో సంఘటనా స్థలానికి వాహనం చేరుకుని ఆస్పత్రికి చేర్చడం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలిచాయి. 104 సేవలతో పల్లె చెంతకే వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చిన ఘనత వైఎస్సార్దే. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎలాంటి వ్యయప్రయాసలకు గురికాకుండా నెలనెలా వైద్యపరీక్షలతో పాటు అవసరమైన మందులు అందజేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినది ఆయనే.● కొమరాడ మండలంలోని రాజ్యలక్ష్మీపురం గ్రామం వద్ద 1976లో చేపట్టిన జంఝావతి రిజర్వాయర్ నిర్మాణం ఒడిశా వివాదంతో నిలిచిపోయింది. వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక ఆస్ట్రియా దేశ టెక్నాలజీతో రూ.6కోట్లు ఖర్చుచేసి రబ్బర్డ్యాం నిర్మించి 12 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. ఆ ప్రాంత రైతుల గుండెల్లో గుడికట్టుకున్నారు. తోటపల్లి ప్రాజెక్టు పనులు పూర్తిచేయడంలోనూ ఆయన కృషి ఎనలేనిదని ఇప్పటికీ ఈ ప్రాంతరైతులు చెబుతారు. ● విజయనగరం విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యను అందించాలనే ఉద్దేశంతో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను అందుబాటులోకి తెచ్చిన ఘనత వైఎస్సార్దే. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకువేసి కళాశాలను యూనివర్సిటీగా స్థాయి పెంచారు. విద్యార్థుల ఇంజినీరింగ్ కలను నెరవేర్చే విద్యాలయాన్ని అందుబాటులోకి తెచ్చారు. -
కనికరించండి సారూ..
సాక్షి, పార్వతీపురం మన్యం: ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. అన్యోన్యంగా ఉన్న బాంధవ్యాల ను చిన్నాభిన్నం చేసింది. వృద్ధాప్యంలో తనకు తోడు ఉంటారనుకున్న కుమారుడు, కోడలు.. కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు. ముక్కుపచ్చలా రని చిన్నారులకు ఇప్పుడు తానే అంతా! ఏ ఆధా రమూ లేని తనకు.. మరో ఇద్దరి బిడ్డల భారం! అధికారుల సాయం కోసం తిరుగుతోంది. మక్కువ మండలం మార్కొండపుట్టి పంచాయతీ కోదు పెద్దవలస గ్రామానికి చెందిన మండంగి లచ్చమమ్మ కుమారుడు శంబర పీహెచ్సీలో పని చేసేవాడు. అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం మరణించాడు. ఆయనకు ఉద్యోగం ఉండటం వల్ల ఆ కుటుంబానికి రేషన్ కార్డు, వారి ఇద్దరి పిల్లలకు తల్లికి వందనం రాలేదు. తమ దీనస్థితిని వివరిస్తూ.. న్యాయం చేయాలని పిల్లల తల్లి అధికారుల చుట్టూ తిరిగింది. చివరికి ఆమె కూడా అనారోగ్యంతో ఇటీవలే మరణించింది. తల్లిదండ్రులు ఇద్దరూ కొద్ది రోజుల వ్యవధిలోనే మృతి చెందడంతో ఆ పిల్లలు దిక్కు లేనివారయ్యారు. కూలి పనులు చేసుకుని బతికే నాయనమ్మే అన్నీ అయ్యింది. తండ్రి రేషన్ కార్డులో వీరి పేర్లు ఉండిపోవడంతో ఏ ప్రభుత్వ పథకానికీ నోచుకోవ డం లేదు. కనీసం బిడ్డల చదువుకు ఉపయోగపడే లా తల్లికి వందనం పథకం అయినా ఇవ్వాలని.. తనకు ఆధారం చూపాలని నాయనమ్మ లచ్చమ మ్మ కోరుతోంది. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు వచ్చి, అధికారులకు తన దీన స్థితిని వివ రించింది. కష్టమైనా వారి పరిస్థితి చూసి కొంత కనికరం చూపుతుందేమో.. మరి మన అధికారు లు ఏం చేస్తారో చూడాలి. -
‘టోల్’ ఊరట..!
పార్వతీపురం రూరల్: మండలంలోని వెలగవలస సమీపంలో ఉన్న బడిదేవరమ్మ చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు శనివారం మధ్యాహ్నం చెరువులో గల్లంతైన పాడి బంగారి దొర(45) మృతదేహం అర్ధరాత్రి 1గంట ప్రాంతంలో లభ్యమైంది. ఈ మేరకు పార్వతీపురం రూరల్ ఎస్సై బి. సంతోషికుమారి తెలిపారు. రెస్క్యూ బృందం సహాయంతో గాలించి జేసీబీ సాయంతో గట్టు తొలగించి నీరు మళ్లించిన అనంతరం బంగారి దొర మృతదేహం ఆచూకీ తెలిసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి మృతదేహాన్ని తరలించామని చెప్పారు. భోగాపురం: జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. నాలుగు చక్రాల వాహనాలు సహా ఆపై పెద్ద వాహనాలు నడిపే వారంతా టోల్గేట్ దాటినప్పుడల్లా టోల్ చార్జీ చెల్లించకుండా ఉండేలా కొత్తగా టోల్పాస్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇదివరకు మనం వెళ్లే దారిలో ఎన్నిసార్లు మనం వాహనంతో టోల్గేటు దాటితే అన్నిసార్లు టోల్చార్జీ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ కొత్త విధానం ద్వారా రూ.3 వేలకు ఫాస్టాగ్ టోల్పాస్ జారీ చేస్తారు. దీంతో ఏడాది కాలం పాటు గానీ 200 ట్రిప్పుల వరకు గానీ టోల్గేటు గుండా ఫ్రీ(ఉచితం)గా ప్రయాణం చేయవచ్చు. వీటిలో ఏది ముందు అయిపోతే దానిని పరిగణనలోకి తీసుకుని, ఆ తర్వాత పాస్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 1,087 టోల్గేట్లుదేశవ్యాప్తంగా సుమారు 1,087 వరకు టోల్ గేట్లు ఉన్నాయని అంచనా. విజయనగరం జిల్లాలో నాతవలస, జొన్నాడ, గంట్యాడ, శ్రీకాకుళం జిల్లాలో చిలకలపాలెం, మండపం, తర్లువాడ, విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి, అగన్పూడి వద్ద టోల్ గేట్లు కనిపిస్తాయి. పాస్ పొందే విధానం ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్న వాహన యాజమానులు తమ ఖాతా నుంచి ఫాస్టాగ్ పాస్ పొందవచ్చు. ఆగస్టు 15 నుంచి పెద్ద ఎత్తున వీటిని వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ పాస్ సొంత కార్లు, వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. బస్సులు, లారీలు, ట్యాక్సీలు, రవాణా వాహనాలకు చెల్లదు. ట్రావెల్స్కు వినియోగించే కార్లకు, జీపులు, వ్యాన్లకు కూడా వర్తించదు. ఈ ఫాస్టాగ్ ఏడాది పాస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించే జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్ప్రెస్ రహదారులలోని అన్ని టోల్ ప్లాజాలలో పని చేస్తుంది. డిజిటల్ రూపంలోనూ..ఫాస్టాగ్ ఏడాది పాస్ను డిజిటల్గా తీసుకోవచ్చు. రాజమార్గ్ యాత్ర యాప్నుసెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని పొందవచ్చు. లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా లభిస్తుంది. దీని కోసం రూ.3 వేలు చెల్లించాలి. సంబంధిత వాహనానికి చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉండాలి. బ్లాక్ లిస్టులో ఉండకూడదు. సంబంధిత వాహన రిజిస్ట్రేషన్ నంబర్ వివరాలు నమోదు చేయాలి. రూ3 వేలు చెల్లించిన తర్వాత ఏడాది పాస్ సంబంధిత వాహన ప్రసుత్త ఫాస్టాగ్ ట్యాగ్కు లింక్ అవుతుంది. గుమ్మలక్ష్మీపురం: అంతర్ జిల్లా ఫెన్సింగ్ పోటీల్లో మండలంలోని కన్నయ్యగూడకు చెందిన విద్యార్థినులు తోయక యమున, తోయక భానుమతిలు ప్రతిభ కనబరిచారు. ఆగస్టు 30వ తేదీన భీమవరంలో జరిగిన 11వ క్యాడెట్ అండర్–17 అంతర్ జిల్లా బాలబాలికల ఫెన్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని, ఇప్పీ టీమ్ విభాగంలో యమున వెండి పతకం, ఫోయిల్ టీమ్ విభాగంలో భానుమతి రజ త పతకం సాధించినట్లు కోచ్ బాలరాజు ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఇరువురు బాలికలను గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు. రూ.3 వేలతో ఫాస్టాగ్ టోల్ పాస్ ఏడాది కాలం లేదా 200 ట్రిప్పులకు చెల్లుబాటు ఆగస్టు 15 నుంచి అమలులోకి.. సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న కేంద్రంట్రిప్పులు ఇలా లెక్కిస్తారు.. గతంలో మనం రహదారులపై ప్రయాణించేటప్పుడు ఎన్నిచోట్ల టోల్గేట్లు వస్తే అన్నిచోట్లా టోల్చార్జీలు చెల్లించి, ముందుకు వెళ్లాల్సి వచ్చేది. ఇలా వెళ్లేటప్పుడు ఒక్కో ట్రిప్పుకు ఇరువైపులా రూ.90 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు ఆ భారం లేకుండా ఎన్హెచ్(జాతీయ రహదారి) అధికారులు పాస్ విధానం అమలులోకి తెచ్చారు. ఆగస్టు 15వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన ఈ విధానం కార్లు, జీపులు, వ్యాన్లు తదితర వాణిజ్యేతర వాహనాలకు వర్తిస్తుంది. ఒకసారి రూ.3 వేలు పెట్టి పాస్ తీసుకుంటే సంవత్సరం వరకు లేదా 200 ట్రిప్పుల వరకు ఉచితంగా టోల్గేటు గుండా వెళ్లవచ్చు. అయితే ఒకసారి టోల్గేటు దాటితే ఒక ట్రిప్పుగా పరిగణిస్తారు. -
సాఫ్ట్బాల్ పోటీల్లో జిల్లాకు ప్రథమస్థానం
బొబ్బిలిరూరల్: గుంటురు జిల్లా సత్తెన పల్లి లయోలా కళాశాలలో శని, ఆదివారాల్లో జరిగిన 12వ అంతర్జిల్లా మహిళా సాఫ్ట్బాల్ టోర్నమెంట్లో జిల్లాకు చెందిన మహిళల జట్టు ప్రథమ స్థానం సాధించిందని పారాది జెడ్పీహెచ్ఎస్ పీడీలు నల్ల వెంకటనాయుడు, సత్యనారాయణ తెలిపారు. ఈసందర్భంగా రాష్ట్రంలో ప్రథమ స్థానం కై వసం చేసుకున్న జట్టుకు, శిక్షణ ఇచ్చిన పీడీలకు సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బేబినాయన అభినందనలు తెలిపారు. రంగరాయపురంలో చేతబడి కలకలంలక్కవరపుకోట: మండలంలోని రంగరాయపురం, జమ్మాదేవిపేట గ్రామాల్లో చేతబడి కలకలం రేపింది. శనివారం రాత్రి గ్రామంలో ఓ ఇంటి ముందు ముగ్గులు వేసి మనిషి ఆకారంలో బొమ్మను తయారు చేసి మధ్యలో పెట్టి నిమ్మకాయలకు పసుపు, కుంకం రాసి కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు లోనయ్యారు. ఈ విధంగానే గత వారంలో కూడా ఒక వీధిలో చేశారని గ్రామస్తులు తెలిపారు. మరో ఇంటి వద్ద తాము లేని సమయంలో ద్వారబంధాల వద్ద నువ్వులు, నిమ్మకాయలను వేశారని ఆ ఇంటి యజమాని తెలిపారు. అలాగే జమ్మాదేవిపేట గ్రామంలో ఒక వ్యక్తి నూతనంగా ఇల్లు నిర్మించుకుని గృహప్రవేశం చేసేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోని ద్వారబంధాల వద్ద నల్ల నువ్వులను సుమారు 3కేజీలకు పైగా పోసి ఉన్నట్లు గుర్తించామని ఇంటి యజమానులు వాపోయారు. మండలంలో వరుసగా ఇటువంటి ఘటనలు జరగడంతో ప్రజలు భీతిల్లుతున్నారు. ఈ తరహా వ్యక్తులపై పోలీసులు నిఘా పెట్టాలని కోరుతున్నారు. పశువుల వ్యాన్ల సీజ్దత్తిరాజేరు: మండలంలోని మరడాం కూడలి వద్ద అక్రమంగా తరలిస్తున్న రెండు పశువుల వ్యాన్లు పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్. బూర్జవలస ఎస్సై జి.రాజేష్ ఆదివారం తెలిపారు. రాత్రి వేళల్లో వారపు తనిఖీల్లో భాగంగా ఆండ్ర ఎస్సై సీతారాం తనిఖీలలో భాగంగా పట్టుకున్నట్లు చెప్పారు.సరైన పత్రాలు లేకుండా పశువులను అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. భవనంపై నుంచి పడి కార్మికురాలి మృతికొమ్మాది(విశాఖ): జీవీఎంసీ 8వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైనుంచి జారిపడి ఓ కార్మికురాలు మృతి చెందింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనపై పీఎం పాలెం సీఐ జి. బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా, గుర్ల మండలం, గొలగాం గ్రామానికి చెందిన చందక సత్యాలు (48), భర్త సింహాచలంతో కలిసి మూడేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం విశాఖ వచ్చారు. వారు ఆరిలోవలోని తోటగరువు వద్ద నివాసం ఉంటూ భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. రుషికొండలోని తారకరామ లేఅవుట్లో గల ఆదిత్య అపార్ట్మెంట్ వెనుక నిర్మాణంలో ఉన్న ఒక భవనం వద్ద వారు కూలి పనులు చేస్తున్నారు. ఆదివారం మూడో అంతస్తులో శ్లాబ్ నిర్మాణం జరుగుతుండగా, పనిలో భాగంగా పైనున్న సత్యాలు కళ్లు తిరిగి మొదటి అంతస్తు శ్లాబ్పై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. భర్త సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీమద్రమారమణ గోవిందా..హరి!
విజయనగరం టౌన్: హరికథా పితామహుడికి విజయనగర వాసులు ఘనంగా నీరాజనం పలికారు. శ్రీమదజ్జాడాదిభట్ల నారాయణదాస 161వ జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీ ఆదిభట్ల నారాయణదాస ఆరాధనోత్సవ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ.గోపాలరావు నేతృత్వంలో ఆదివారం ఉదయం కానుకుర్తివారి వీధిలో ఉన్న ఆదిభట్ల గృహంలో పూజలు నిర్వహించారు. అనంతరం వెన్లాక్ పార్కు, సంగీత కళాశాలలో ఉన్న ఆదిభట్ల విగ్రహానికి పుష్పమాలలు అలంకరించి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం లయన్స్ కమ్యూనిటీ హాల్లో కపిలేశ్వరపురం శ్రీ సర్వారాయ హరికథా పాఠశాల విద్యార్థినులు నిర్వహించిన హరికథా గానామృతం ఆద్యంతం ప్రేక్షలకులను కట్టిపడేసింది. ఎం.వీరసత్య (అమలాపురం) శ్రీరామ జననం రక్తికట్టించింది. ఎం.సిరివల్లి (గుంటూరు) విశ్వామిత్ర యాగ సంరక్షణం హరికథ ఆకట్టుకుంది. సాయంత్రం 6గంటలకు ఆదిభట్ల రవిభాగవతార్తో, 7 గంటలకు హరికథా చూడామణి వై.శిఖామణి భాగవతారిణితో శ్రీరామపాదుకా పట్టాభిషేకం, హరికథలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో ఆరాధనోత్సవ సంఘం ప్రతినిధులు పీవీ.నరసింహరాజు(బుచ్చిబాబు) అధిక సంఖ్యలో సభ్యులు, హరికథా కళాకారులు పాల్గొన్నారు. నేడు హరికథా చూడామణి బిరుదు ప్రదానం ఆదిభట్ల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రెండోరోజు సోమవారం ఉదయం 10 గంటలకు ఆర్.గీత (కర్ణాటక) సీతా కల్యాణం, 11 గంటలకు మండా వరలక్ష్మి భాగవతారిణి హరికథ, సాయంత్రం హరికథాచూడామణి కాళ్ల నిర్మల సుందరకాండ హరికథ ఉంటాయి. అనంతరం నిర్వహించే సభా కార్యక్రమంలో ప్రొద్దుటూరు శ్రీ అన్నమాచార్య కళాపీఠంకి చెందిన యడ్లవల్లి రమణయ్య భాగవతార్కు హరికథా చూడామణి బిరుదు ప్రదానం చేయనున్నారు. డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి చేతుల మీదుగా పురస్కార ప్రదానం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. రాత్రి పురస్కార గ్రహీత భక్త మార్కండేయ కథాగానాలాపన చేస్తారన్నారు. సాహితీవేత్తలు, అభిమానులు హాజరుకావాలని కోరారు. హరికథా పితామహుడికి..ఘనంగా నీరాజనం భక్తిశ్రద్ధలతో ఆదిభట్ల 161వ జయంతి మహోత్సవాలు ఆకట్టుకున్న ‘సర్వారాయ’ విద్యార్థినుల గానామృతం -
సెంచూరియన్ యూనివర్సిటీతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం
కొరాపుట్/పర్లాకిమిడి: సెంచూరియన్ యూనివర్సిటీ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తర ప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వర్సిటీల మధ్య ఈ నెల 29న ఎంఓయూ కుదిరింది. లక్నోలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా పరిశోధనాత్మక, న్యాయ సంబంధిత, సాంకేతిక అంశాల్లో రెండు సంస్థలు పరస్పరం సహకారం అందించుకుంటాయి. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ డీఐజీ రాజీవ్ కృష్ణతో సెంచూరియన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ముక్తికాంత్ మిశ్రా సమాలోచనలు చేశారు. డీఐజీ మాట్లాడుతూ ఈ రెండు సంస్థల కలయిక పరిశోధన రంగంలో నూతన మార్పులు తీసుకువస్తుందని తెలిపారు. సెంచూరియన్ వర్సిటీ ప్రెసిడెంట్ ముక్తి కాంత్ మిశ్రా మాట్లాడుతూ తాము 2016లోనే గుజరాత్ ఫోరెన్సిక్ విభాగంతో పనిచేశామని, ఇప్పుడు ఈ కొత్త ఒప్పందంతో ఫోరెన్సిక్ సేవలు సమాజానికి ఉపయోగపడతాయన్నారు. ఈ ఒప్పందంపై ఉత్తర్ ప్రదేశ్ ఏడీఐజీ నవీన్ ఆరోరా, సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ సుప్రియ పట్నాయిక్ సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ లక్నో లోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్కి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్, సెంచూరియన్ యూనివర్సిటీ అంతర్జాతీయ, ప్రభుత్వ సంబంధాల డైరెక్టర్ మెనాలిసా ఘోష్, డాక్టర్ రీనా, సి.జమాతానీ తదితరులు పాల్గొన్నారు. -
ఆటల్లేవ్..ఆడుకోవడాల్లేవ్..!
పార్వతీపురం రూరల్: విద్యార్థుల్లో చురుకుదనాన్ని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపేందుకు ఎంతగానో దోహదపడేవి క్రీడలు, వ్యాయామం. ఇంటర్ విద్యనుంచి క్రీడలు, వ్యాయామం ప్రతి విద్యార్థికి అవసరం. విద్యార్థుల్లో ఆసక్తి ఉన్నా ఆడించేందుకు గురువులు కరువయ్యారు. సాధన చేయలేక, మెలకువలు చెప్పేవారే లేక, విద్యార్థులు ఉదాసీనంగా మిగిలిపోతున్నారు. ఇంటర్మీడియట్ రెండేళ్లలో ఉత్సాహంగా ఉన్న విద్యార్థులు క్రీడా జీవితాన్ని కోల్పోతున్నారు. ప్రభుత్వం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న 14 జూనియర్ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు ఆటలకు నోచుకోవడం లేదు. ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే కళాశాల విద్యార్థులకు చదువుతోపాటు ఇతర అంశాల్లో ప్రతిభ చాటితే కచ్చితమైన ఉజ్వల భవిష్యత్కు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. నష్టపోతోంది పేద విద్యార్థులే పల్లె, పట్టణ ప్రాంతాల్లో దిగువ, మధ్యతరగతి కుటుంబాలకుచెందిన విద్యార్థులు ప్రధానంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతారు. నేటి పోటీ ప్రపంచంలో వారికున్న అవకాశాలను వినియోగించుకుని భవిష్యత్లో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు కలలు కంటారు. విద్యతోపాటు మరో నైపుణ్యం కలిగి ఉండాల్సిన తప్పనిసరి పరిస్థితులు నేడు సంతరించుకున్న నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులు లేక జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో 15 కళాశాలల్లోని 5,800మంది విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. అలాగే క్రీడలకు, వ్యాయామానికి సంబంధించిన పరికరాలు కొనుగోలు చేసేందుకు కూడా ప్రభుత్వం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఏ విద్యార్థి అయినా తనకు ఉత్సాహంగా ఉండి క్రీడల్లో రాణించాలని కోరిక ఉన్నప్పటికీ సొంతంగా సాధన చేసేందుకై నా అవకాశం లేని పరిస్థితులు జూనియర్ కళాశాలల్లో వేలెత్తి చూపుతున్నాయి. దీంతో క్రీడల్లో ప్రోత్సాహం కరువై క్రమంగా విద్యార్థులకు ఆటలపై ఆసక్తి తగ్గుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేవారికి క్రీడా కోటా కింద రిజర్వేషన్ వర్తిస్తుంది. చదువుకు ఇది అదనపు అర్హతగా గుర్తింపునిస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ నిర్లక్ష్యంతో జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్ధులు ఈ అవకాశాలు కోల్పోతున్నారు. 15 కళాశాలలకు ఒకే పీడీ ఆటలకు దూరమవుతున్న ఇంటర్ విద్యార్థులు జిల్లావ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులు 5,800 మంది ఆటలాడించే గురువే కరువు వ్యాయామం, క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు -
ఉద్యోగులకు ఉత్తమ సేవలతో గుర్తింపు
విజయనగరం: విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించడం ద్వారా ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుందని, ప్రతి ఉద్యోగి తన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించి ప్రజలకు మంచి సేవలందించాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సూచించారు. మెంటాడ మండల ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన బీఎస్కేఎన్ పట్నాయక్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొదిన పట్నాయక్ దంపతులను దుశ్శాఽలువ, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించడం తోటి ఉద్యోగులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు జిల్లా, మండల పరిషత్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
పీడీలు లేరు..భోజనానికి బిల్లులులేవు
జిల్లాలో గల ప్రభుత్వ 14 జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పీడీలు లేకపోవడం దారుణం. విద్యార్థులు కోల్పోతున్న క్రీడాజీవితం పాపం ప్రభుత్వానిదే. అలాగే విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజనాల బిల్లులను ప్రభుత్వం నేటికీ చెల్లించలేదు. భోజనానికి బిల్లులు సమయానికి చెల్లించకపోవడానికి ప్రధాన కారణం జిల్లా విద్యాశాఖాధికారి నిర్లక్ష్యమే. నెలల తరబడి బిల్లుల బకాయిలు చెల్లింపులు జరగకపోతే నిర్వహణ ఎలా జరుగుతుంది? ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీడీల(వ్యాయామ అధ్యాపకులు)ను నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంటర్ విద్యార్థులకు ఈ దశలో వ్యాయామం, క్రీడలు చాలా అవసరం. – పాలక రంజిత్ కుమార్, గిరిజన సంక్షేమసంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి -
మోటారు వాహన చట్టాలను వ్యతిరేకించండి
బొబ్బిలి: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మోటారు వాహన చట్టాలను వ్యతిరేకించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకరరావు, ఆటో వర్కర్ల సంఘ నాయకులు ఎల్లంనాయుడు తదితరులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కఠిన చట్టాలు తెచ్చి జరిమానాలు, జైలుశిక్షలను వేధిస్తోందన్నారు. దేశంలోని రవాణా రంగాన్ని ప్రైవేటుకు అప్పగించే కుట్రకు కేంద్రం దారులు తెరిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్, బ్రేక్, ఫిట్నెస్ తదితర ధ్రువపత్రాల పేరిట భారీ చలానాలు విధించి మోటారు కార్మికుల కష్టాన్ని దోచుకుంటోందన్నారు. ఇది సరిపోక ఉచిత బస్సు పేరిట ఆటో కార్మికులను వీధిన పడేసిందన్నారు. వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఆటో నడుపుకుని కుటుంబాన్ని పోషించుకునేందుకు కూడా కనీసం అవకాశం లేకుండా చేసిందన్నారు. వీరందరినీ ఆదుకోవాలని కోరుతూ సెప్టెంబర్ 4న ఉదయం 9 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. -
మహానేత వర్ధంతికి తరలిరండి
● మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సాలూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. వర్ధంతి కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పట్టణంలో స్థానిక విలేకరులతో ఆయన ఆదివారం మాట్లాడారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న మహానేత వర్ధంతి కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలంతా పాల్గొనాలని కోరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మకుటం లేని మహరాజని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంటు, 108, జలయజ్ఞం వంటి పథకాల ద్వారా ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. రైతు రుణ మాఫీ, పంటలకు ఉచిత విద్యుత్ ద్వారా రైతు బాంధవుడుగా గుర్తింపు పొందారన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంటు వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు గొప్ప చదువులు చదివారని గుర్తు చేశారు. జల యజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా పాచిపెంట మండల కేంద్రంలో పెద్దగెడ్డ రిజర్వాయర్ను నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చి వేలాది ఎకరాల భూములను సస్యశ్యామలం చేశారని చెప్పారు. వ్యవసాయాన్ని రాజశేఖరరెడ్డి పండగగా మార్చితే, చంద్రబాబు దండగని నిర్వీర్యం చేశారన్నారు. నియోజకవర్గంలో పెద్దగెడ్డతో పాటు బురదాలమ్మ ఎత్తిపోతల పథకం నిర్మాణం రాజశేఖరరెడ్డి పాలనలోనే జరిగిందన్నారు. మక్కువ మండలం వెంగళరాయసాగర్, మెంటాడ మండలం ఆండ్ర ప్రాజెక్టుల ఆధునికీకరణకు జైకా నిధుల మంజూరుకు ప్రతిపాదనలు వైఎస్సార్ పాలనలోనే జరిగాయన్నారు. పావురాయిగెడ్డ, దళాయివలస మినీ రిజర్వాయర్లకు నాడు రాజశేఖరరెడ్డి హయాంలోనే ప్రతిపాదనలు చేశారన్నారు. వైఎస్సార్, ప్రజల ఆశీస్సులతో రానున్న ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు. -
శారీరక దృఢత్వంతో ఆరోగ్యం
● ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి ● జిల్లా కేంద్రంలో ఫిట్ ఇండియా సైక్లింగ్ ఆన్ సండే పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సైక్లింగ్ ఆన్ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి జెండా ఊపి సైక్లింగ్ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక ధృడత్వంతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని తెలిపారు. ప్రజలకు ఈ మేరకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రస్తుతం మన జీవన శైలిలో ప్రతీ రోజు ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణిస్తూ ఆధునిక సౌకర్యాలతో జీవనం సాగిస్తున్నప్పటికీ శారీరక చురుకుదనం లేకపోవడంతో అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు సైక్లింగ్ సాధారణ ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక సరళమైన, సురక్షితమైన మార్గంతో పాటు పర్యావరణాన్ని కొంతమేరకు కాపాడుకొనేందుకు ఆస్కారం ఉంటుందని ఎస్పీ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జిల్లా కేంద్రం మీదుగా వెళ్లి మళ్లీ మైదానానికి చేరుకుంది. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐలు రాంబాబు, నాయుడు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు తదితర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిపై ప్రజా వేదికకు సిద్ధమా..!
చీపురుపల్లి: అభివృద్ధి, ప్రజల కష్టాలు, ప్రజలకు అందుబాటులో ఉండడం వంటి అంశాలపై మాట్లాడే అర్హత ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావుకు ఉందా.... అసలు ఎన్నోసార్లు క్యాబినేట్లో ఉన్న కళా ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే కాదు కనీసం ఆయన స్వంత గ్రామానికై నా ఏమైనా అభివృద్ధి చేసారా... ? అలాంటి సీనియర్ నాయకుడు అభివృద్ధి కోసం మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ(పీఏసీ) మెంబర్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు ‘బొత్స’ చేసిందేమిటని ఎమ్మెల్యే కళా వెంకటరావు ప్రశ్నించడంపై ఆదివారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాపై మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో ఎవరి హయాంలో ఏం జరిగిందో చర్చించుకునేందుకు ఎమ్మెల్యే కళా వెంకటరావు సిద్ధమైతే ప్రజావేదికలో తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రజావేదిక స్థలం, సమయం, తేదీ ఎమ్మెల్యే చెప్పినా సరేనని, లేదంటే తామే చెబుతామని, ఆ రోజున అభివృద్ధిపై ఆధారాలతో సహా తాము వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని బెల్లాన స్పష్టం చేశారు. ఎంతో సీనియర్ నాయకునిగా, ఎన్నోసార్లు క్యాబినేట్ మంత్రిగా పని చేసిన కళా వెంకటరావు కేవలం బొత్సను విమర్శిస్తే మరోసారి మంత్రి పదవి వస్తుందనే ఉద్దేశంతో రాజాంలో కూర్చుని మాట్లాడుతుండడం హాస్యాస్పందంగా ఉందన్నారు. ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదవడమేనా ఆయన సీనియారిటీ అంటూ ప్రశ్నించారు. మహానేత వైఎస్సార్ హయాంలోనే బొత్స ఆధ్వర్యంలో రూ.79 కోట్లుతో ‘కళా’ స్వంత నియోజకవర్గంలోని సంకిలిలోని నాగావళి నది నుంచి నీరు తెచ్చి ఇందిరమ్మ సుజలధార పేరుతో చీపురుపల్లి నియోజవకర్గంలో ఇంటింటి కుళాయిలు అందించినట్లు గుర్తు చేశారు. అదే సమయంలో తోటపల్లి సాగు నీటి ప్రాజెక్టు పనులు చేపట్టి ఉమ్మడి జిల్లాలో 1.60 వేల ఎకరాలు ఆయకట్టుకు సాగు నీరు అందించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఖరీఫ్ సీజన్లో కనీసం సాగునీరు కూడా నియోజకవర్గంలో రైతులకు అందలేదన్నారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వంలో భోగాపురం ఎయిర్పోర్ట్కు ఉత్తుత్తి కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మోసం చేస్తే 2019 నుంచి 2024 మధ్య ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో అన్ని సమస్యలు పరిష్కరించి శంకుస్థాపన చేసి 2024 లోపు 23 శాతం పనులు పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల వస్తే తమ సొంత సామాజిక వర్గానికి చెందిన మిమ్స్ కళాశాలకు ఎక్కడ నష్టం వస్తుందోనని అశోక్గజపతిరాజు మెడికల్ కళాశాలను రాకుండా చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి బొత్స ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్రెడ్డి జిల్లాలో మెడికల్ కళాశాల మంజూరు చేసి పనులు పూర్తి చేసి ప్రారంభించినట్టు చెప్పారు. జిల్లాలో జేఎన్టీయూ, గిరిజన యూనివర్సిటీ, కురుపాంలో ఇంజినీరింగ్ కళాశాల ఎవరి హయాంలో వచ్చాయో కళా చెప్పాలన్నారు. బొత్స కంటే ముందు ఎన్నో ఏళ్లుగా మంత్రిగా పని చేసిన కళా వెంకటరావు తూర్పు కాపు సామాజిక వర్గానికి ఏదైనా మేలు చేసారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న తూర్పు కాపులను ఓసీలుగా గుర్తించడంతో ఎన్నో ఇబ్బందులు పడేవారని, తమ నేత బొత్స సత్యనారాయణ హయాంలో ఈ సమస్యను మహానేత వైఎస్సార్ దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్రంలో ఉన్న తూర్పుకాపులందరికీ బీసీ డీ రిజర్వేషన్ అమలు చేసిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, పార్టీ నాయకులు ఇప్పిలి తిరుమల, కొమ్ము చిరంజీవి, ముల్లు పైడిరాజు, పనస వెంకట్ తదితరులు పాల్గొన్నారు. కళా వెంకటరావుకు మాజీ ఎంపీ బెల్లాన సవాల్ వేదిక, సమయం మీరు చెబుతారా.. మేమే చెప్పాలా.. ఆధారాలతో అభివృద్ధిని చూపిస్తాం.. ‘బొత్స’ను విమర్శిస్తే మంత్రి పదవి వస్తుందనుకుంటున్నారా.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్లు చదవడమేనా మీ సీనియార్టీ తూర్పుకాపుల కోసం కళా చేసిందేమిటో చెప్పాలి ఎరువులు, సాగునీటి కష్టాలు కనిపించడం లేదా...! -
● కూలుతున్న కల్వర్టులు..
సంతకవిటి మండలంలో మూడు కల్వర్టులు, మాధవరాయపురం వద్ద సాయన్నగెడ్డపై వంతెన ఇటీవల శిథిలమై కూలిపోయాయి. సాయన్నగెడ్డపై వంతెన కూలడంతో రేగిడి మండలం ఖండ్యాం నుంచి సంతకవిటి మండలం కేఆర్ పురం, రంగారాయపురం, జావాం, శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలం ప్రజలు పాలకొండ, రేగిడి, వంగర, మడ్డువలస తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రయాణం భారంగా మారింది. సంతకవిటి, చిత్తారపురం ప్రధాన రహదారిలో పోతులజగ్గుపేట మూడు రోడ్ల కూడలి వద్ద కల్వర్టు సగం కూలడంతో ఈ మార్గంలో బస్సు ప్రయాణాన్ని కుదించారు. ఇదే మార్గంలో వినాయక రైస్మిల్లు సమీపంలో కల్వర్టు కూలడంతో దానిపై మట్టి పోశారు. రాజాం – సంతకవిటి ప్రధాన రహదారిలో గరికిపాడు వద్ద కల్వర్టు సగం కూలడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. – సంతకవిటి -
ప్రతీ రోజు వినతులు అందజేయవచ్చు..: కలెక్టర్
పార్వతీపురం రూరల్: ప్రతీ రోజు ప్రజలు తమ సమస్యలపై వినతులను అందజేసేందుకు కలెక్టరేట్ సెల్లార్లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామని, అలాగే ప్రతీ సోమవారం కలెక్టరేట్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల ఫిర్యాదులపై అర్జీలు అందజేయవచ్చునని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఆన్లైన్లో మీకోసం వెబ్సైట్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో(పీజీఆర్ఎస్)లో వివరాలు నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. వచ్చిన అర్జీల వివరాలను టోల్ఫ్రీ నంబరు 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని తెలిపారు. నేడు ఐటీడీఏలో పీజీఆర్ఎస్ సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నారు. ఐటీడీఏ పీవో పవర్ స్వప్నిల్ జగన్నాథ్ హాజరు కానున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని అధికార వర్గాలు తెలిపారు. మడ్డువలస ప్రాజెక్టులోకి 3వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులోకి మూడు వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నీరు వచ్చి చేరుతుందని అధికారులు ఆదివారం వెల్లడించారు. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి మూడు వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు వద్ద 64.34 మీటర్లు లెవెల్ నీటి మట్టం నమోదైంది. ఒక గేటు ఎత్తి 1720 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచి పెడుతున్నామని ఏఈ నితిన్ తెలిపారు. గోవా గవర్నర్కు ఘన స్వాగతం విజయనగరం: గోవా గవర్నర్ పూసపాటి అశోక్గజపతిరాజుకు ఘన స్వాగతం లభించింది. గవర్నర్గా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా ఆదివారం విజయనగరం విచ్చేశారు. ఆయనకు స్థానిక అశోక్ బంగ్లా వద్ద ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఇన్చార్జ్ ఆర్డీవో మురళి, అశోక్ కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అంతకు ముందు పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బంగ్లాకు చేరుకొని, అశోక్ గజపతిరాజుకు పుష్పగుచ్ఛం అందజేసి, దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఘనంగా దీపోత్సవం బొబ్బిలి: పట్టణంలోని దిబ్బ వీధిలో వెలసిన వినాయక మండపంలో ఆదివారం దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విగ్రహం వద్ద మహిళలు దీపాలు వెలిగించి భక్తి గీతాలు ఆలపించగా పురోహితులు మంత్రోచ్ఛారణ చేశారు. పట్టణంలోని పలు వీధుల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఐదో రోజైన ఆదివారం ఘనంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన శోభాయాత్రల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. -
గల్లంతైన గిరిజన మత్స్యకారుడి మృతదేహం లభ్యం
పాచిపెంట : మండలంలోని కోడికాళ్ళవలస గ్రామానికి చెందిన గిరిజన మత్స్యకారుడు జన్ని బాలరాజు(37) చేపల వేటకు వెళ్లి ఈ నెల 27వ తేదీన గల్లంతైన విషయం పాఠకులకు తెలిసిందే. అయితే స్థానిక ఎస్ఐ వెంకట్ సురేష్ నేతత్వంలో నాలుగు రోజులుగా గజ ఈతగాళ్లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా, శనివారం ఉదయం 8 గంటల సమయంలో బాలరాజు మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. క్షేమంగా ఉండి ఉంటాడని ఆశ పడ్డాను.. గల్లంతై మూడు రోజులుగా భర్త ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఎక్కడో ఒకచోట తన భర్త క్షేమంగా ఉండి ఉంటాడనే చిన్న ఆశతో ఉండే భార్య బుజ్జి భర్త మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ సంఘటన స్థానికంగా కలచివేసింది. -
ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్
పార్వతీపురం టౌన్: పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద గల ఈవీఎం గోదామును కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా శనివారం ఆయన గోదాములను సందర్శించి అక్కడ పరిస్థితిని గమనించారు. గోదాములకు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లును పరిశీలించారు. ఈ మేరకు పర్యవేక్షణ రిజిస్టర్లో ఆయన సంతకం చేసి గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించా రు. ఏర్పాట్లును పరిశీలించి అధికారులకు పలు సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ తనిఖీల్లో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, స్థానిక తహసీల్దార్ సురేష్ తదితరులున్నారు. -
పేరుకే రేషన్ పంపిణీ..!
పార్వతీపురం రూరల్: ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తూ లబ్ధిదారుల నుంచి ఎప్పటిలాగే అరకేజీ పంచదారకు రూ.17లు తీసుకుంటూ కేవలం ఈ రెండు సరుకులను మాత్రమే తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది. జిల్లాలో 2,76,873 మంది లబ్ధిదారుల ఉండగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాల ద్వారా గడప దాటకుండా లబ్ధిదారులకు బియ్యం, కందిపప్పు, పంచదారలతో పాటు సీజనల్గా గోధుమ పిండి, రాగులను పంపిణీ చేసేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేసే వ్యవస్థను రద్దు చేస్తూ జిల్లా వ్యాప్తంగా 578 రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తుంది. అయితే కేవలం రెండు సరుకుల పంపిణీకే ఈ రేషన్ దుకాణాలు నోచుకుంటున్నాయి. ఈ క్రమంలో పేరుకే ప్రభుత్వ రేషన్ సరుకుల పంపిణీ వ్యవస్థ అన్నట్టు లబ్ధిదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు సరుకులకే గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో సైతం లబ్ధిదారులు కిలోమీటర్ల మేర దూరంగా ఉన్న వారికి సంబంధించిన రేషన్ దుకాణాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతూ ఆ రోజు వారి పనులు పక్కన పెట్టి ఆటోలకు లేదా బండిలో పెట్రోల్ పోసుకొని లేదా తలపై బరువులు మోస్తూ శ్రమించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే కనీసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కందిపప్పుకు కూడా పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు కూటమి ప్రభుత్వంపై మరింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 14 నెలలు కాలం గడుస్తున్నా పండగలకు ఇస్తామన్న కానుకల పంపిణీ విషయమై కూడా ఊసే లేకుండా వ్యవహరిస్తుంది. కందిపప్పు కనుమరుగు, పంచదారలో నాణ్యత లోపం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కందిపప్పు రేషన్ ద్వారా పంపిణీని నిలిపివేసింది. ఏ ప్రభుత్వంలోనైనా రేషన్ పంపిణీ ద్వారా నాణ్యత గల సరుకులు మార్కెట్లో కన్నా అతి తక్కువ ధరకే అందుతాయన్న ఆశతో లబ్ధిదారులు ఆశిస్తారు. అయితే ఈ ప్రభుత్వంలో ఆ ఆశలన్నీ నిరాసై కేవలం బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. ఇచ్చిన అరకేజీ పంచదార కూడా నాణ్యత లేకుండా తెల్లగా ఉండాల్సిన పంచదార కాస్త ముదురు గోధుమ రంగులో ఉంటూ దుర్వాసన వస్తూ పంచదార కాస్త చిన్న తడిపదునుతో ఉంటుంది. కిలోమీటర్ల మేర శ్రమభారం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తూ ప్రజలకు గత ప్రభుత్వం సేవలందిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సేవలను కాస్తా కక్షపూరితంగా నిలిపివేసి ప్రజలను అవస్థలకు గురి చేస్తుంది. ఇచ్చిన బియ్యం, పంచదారకు లబ్ధిదారులకు సంబంధించిన రేషన్ షాపులకు వెళ్లేందుకు కిలోమీటర్ల మేర దూరం ఉండడంతో అవస్థలు పడుతూ తిరుగు ప్రయాణంలో తమ నెత్తిపై బాబు ఇలా బరువు భారాన్ని వేశారా అంటూ బియ్యం మూటలను మోసుకుంటూ ఇళ్లకు బయలు దేరుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో అయితే మరింత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రాంతాలకు సమీపంలో ఉన్న 101 రేషన్ షాపుల ద్వారా సరుకులు తీసుకొనేందుకు వచ్చి కిలోమీటర్ల మేర ఇచ్చిన బియ్యాన్నే బ్రతుకు జీవుడా అంటూ అవస్థలు పడుతూ మోసుకువెళ్తున్నారు. పట్టణాల్లో అయితే ఆటో చార్జీలు వెచ్చిస్తున్న లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన రేషన్ సరుకుల కంటే చార్జీలే ఎక్కువ అవుతున్నాయంటూ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో రేషన్ దుకాణాల వద్ద కాస్త క్యూ ఉన్నా లేదా సర్వర్ పని చేయకున్నా నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితులు, సందర్భాలు ఉన్నాయి. పంపిణీలో కనుమరుగైన కందిపప్పు ఇచ్చిన కాస్త పంచదారలో నాణ్యత లోపం ఇచ్చిన రెండు సరకులకు కిలోమీటర్ల మేర శ్రమభారం జిల్లాలో 2,76,873 మంది లబ్ధిదారులు రేషన్ దుకాణాలు 477– గిరిజన ప్రాంతాల్లో 101సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం.. రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తెస్తే తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. కందిపప్పు పంపిణీకి సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు అందించాం. ప్రభుత్వం నుంచి సరఫరాకు సంబంఽధించిన అనుమతులు వస్తే కందిపప్పు పంపిణీ జరుగుతుంది. పంచదార ఎక్కడైనా నాణ్యత లేకుంటే మా దృష్టికి వచ్చిన వెంటనే పరిశీలించి నాణ్యత లోపం రుజువైతే పంచదారను మార్చి పంపిణీ చేస్తాం. వచ్చే నెలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడో విడతలో రేషన్ స్మార్ట్కార్డులు పంపిణీ ఉంటుంది. – కె.శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి, పార్వతీపురం మన్యం జిల్లా -
యువకుడిని కత్తితో పొడిచిన వ్యక్తి అరెస్ట్
మక్కువ: మండలంలోని దేవరశిర్లాం పంచాయతీ లోవరఖండి గ్రామానికి చెందిన ఓ యువకుడిని కత్తితో పొడిచిన వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. స్థానిక పోలీస్స్టేషన్లో సాలూరు రూరల్ సీఐ పి.రామకృష్ణ విలేకరులతో శనివారం మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. లోవరఖండి గ్రామానికి చెందిన సాగరపు దమయంతి మేనళ్లులు మహేశ్, కిశోర్ వినాయకచవితి పండగకు జగన్నాధపురం గ్రామం నుంచి లోవరఖండి చేరుకున్నారు. సాయంత్రం లోవరఖండిలో వాలీబాల్ ఆటను మహేశ్, కిశోర్లు ఆడుతుండగా, అదే గ్రామానికి చెందిన సాగరపు శివందొర అలియాస్ ఆదినారాయణ బెట్టింగ్ కట్టి నాతో వాలీబాల్ ఆడాలంటూ, మహేశ్, కిశోర్ల వైపు చక్కరగుత్తి (ధాన్యం నాణ్యత చూసే పరికరం) చూపిస్తూ బెదిరించాడు. దీంతో వీరి మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో శివందొరకు చిన్నపాటి గాయాలయ్యాయి. అంతేకాకుండా అప్పటికే రెండు కుటుంబాల మధ్య వివాదం చోటుచేసుకుంది. సాగరపు దమయంతికి ఐదు ఆవులు ఉన్నాయి. శివందొర గ్రామంలో మొక్కలు పెంచుతున్నాడు. దమయంతికి చెందిన ఆవులు మొక్కలను మున్ముందు తినేస్తాయంటూ, దానివలన నష్టం జరిగే అవకాశముందని శివందొర ముందుగానే ఊహించుకొని, దమయంతి కుటంబంతో గొడవపడ్డాడు. తనను, నా భార్య హేమలతను తరుచూ ఎందుకు తిడుతున్నారంటూ, ఇంటిలో ఉన్న చక్కరగుత్తి పట్టుకొని, దమయంతి పైకి శివందొర వెళ్లాడు. ఇంటి మేడపై పిల్లలతో ఆడుకుంటున్న కార్తీక్ కిందకు దిగి అడ్డుకోబోతుండగా కత్తిపోటుకు గురై మృతి చెందినట్టు సీఐ తెలిపారు. నిందితుడు శివందొరను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్టు సీఐ తెలిపారు. సీఐ వెంట ఎస్ఐ మామిడి వెంకటరమణ ఉన్నారు. -
సారాను అరికడదాం.. : కలెక్టర్
పార్వతీపురం రూరల్: సారాను అరికట్టి కుటుంబాలను కాపాడుదామని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పిలుపునిచ్చారు. మత్తు మాదకద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని శనివారం తన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారాతో యువత కూడా అనారోగ్యం పాలవుతున్నారని, ఈ మేరకు వారిలో పనిచేసే శక్తి తగ్గి ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. ఈ మేరకు మత్తు మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, సరఫరా చేసే వారికి విధిగా శిక్షలు పడేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. అటవీ ప్రాంతం గుండా, బస్సులు ఇతర వాహనాల ద్వారా అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘాను ఉంచాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాల వలన కలిగే చెడు ప్రభావాలపై విద్యా సంస్థల్లో, గ్రామ స్థాయిల్లో విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు సమావేశంలో పాల్గొన్న ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి పోలీసు శాఖా పరమైన తీసుకున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అంకితా సురానా, డీఎస్పీ ఎం.రాంబాబు, జిల్లా రవాణా అధికారి పి.దుర్గాప్రసాద్, జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అధికారి ఆశాషేక్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
లారీ బోల్తా
గుమ్మలక్ష్మీపురం: విశాఖపట్నం నుంచి పశ్చిమ బెంగాల్కు హైడ్రో క్లోరైడ్ ఆమ్లం(రసాయం)తో ఒడిశా వైపు నుంచి వెళ్లేందుకు వస్తున్న లారీ శనివారం గుమ్మలక్ష్మీపురం మండలం పి ఆమిటి జంక్షన్ సమీంలోని ప్రధాన రహదారి పక్కనే అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ట్యాంకు నుంచి ఆ రసాయనం లీక్ కాకపోవడంతో ఎటువంటి నష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో కొద్దిపాటి గాయాలతో డ్రైవర్, క్లీనర్ బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న ఎల్విన్పేట ఎస్ఐ బి.శివప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. బోల్తా పడిన లారీలో రసాయనం ఉండడంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా వాహనదారులు స్థానికులు జాగ్రత్తలు తీసుకున్నారు. -
మొబైల్ రికవరీ మేళాలో 206 సెల్ఫోన్ల అప్పగింత
● సెల్ఫోన్ పోగొట్టుకుంటే తక్షణమే సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలి ● ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డిపార్వతీపురం రూరల్: పోగొట్టుకున్న, దొంగలించబడిన దాదాపు రూ.42లక్షల విలువైన 206 సెల్ఫోన్లను బాధితులకు అందజేశామని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేసి వివిధ కోణాల్లో సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు సెల్ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా తమ సెల్ఫోన్లు పోగొట్టుకున్న లేదా దొంగలించబడిన తక్షణమే వారు సంబంధిత పోలీసుస్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాలన్నారు. అలా అయితే సీఈఐఆర్ అనే పబ్లిక్ వెబ్సైట్లో ఆలస్యం లేకుండా లాకింగ్ అభ్యర్థన ద్వారా రిజిస్ట్రర్ చేసుకున్నట్లైతే ఆ ఫిర్యాదు ఆధారంగా ఫోను ఐఎంఈఐ నంబరుతో బ్లాక్ చేసిన తరువాత ఆ రిక్వెస్ట్ ద్వారా మొబైల్ను ట్రాక్ చేసి సెల్ఫోన్ రికవరీ అయిన తరువాత అన్లాక్ చేసి పోగొట్టుకున్న వ్యక్తులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ మేరకు ఈ ఏడాదిలో గత 8 నెలల వ్యవధిలో పోగొట్టుకున్న 206 సెల్ఫోన్లను రికవరి చేశామన్నారు. ఇప్పటికే వచ్చిన 1200 ఫిర్యాదులలో గతంలో 500 సెల్ఫోన్లు బాధితులకు అప్పగించగా మరో 206 సెల్ఫోన్లను పోగొట్టుకున్న వారికి ఇప్పుడు అప్పగించామన్నారు. మేళాలో పార్వతీపురం సబ్ డివిజన్ ఏఎస్పీ అంకితా సురానా, పాలకొండ సబ్ డివిజన్ డీఎస్పీ రాంబాబు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సోషల్ మీడియా, సైబర్ సెల్సీఐ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ రంగనాధం, సీసీ ఎస్ సీఐ అప్పారావు, డీసీఆర్బీ సీఐ ఆదాం, ఏఆర్ ఆర్ఐ నాయుడు, సోషల్ మీడియా సెల్ ఎస్ఐ రవీంద్రరాజు, ఆర్ఎస్ఐలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పిడుగు పాటుకు మహిళా రైతు మృతి
లక్కవరపుకోట : మండలంలోని గేదులవానిపాలెం పంచాయతీ శివారు వేచలపువానిపాలెం గ్రామానికి చెందిన మహిళా రైతు నెక్కల ఈశ్వరమ్మ(36) పిడుగు పాటుకు గురై శనివారం మృతి చెందింది. దీనికి సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మృతురాలు ఈశ్వరమ్మ గ్రామానికి సమీపంలో గల పంట పొలంలో వరి గాబు తీత పనులో ఉండగా మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. ఈ క్రమంలో పడిన పిడుగుకు ఈశ్వరమ్మ పొలంలోనే పడిపోవడంతో సమీపంలో వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న రైతులు గుర్తించి వెంటనే ఎస్.కోట సీహెచ్సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా మృతురాలికి భర్త, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈశ్వరమ్మ మృతితో కుటుండ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
విజయనగర కీర్తిని పెంచేలా పైడితల్లి పండగ
చికెన్విజయనగరం టౌన్: శ్రీపైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు విజయనగరం కీర్తిని పెంచేలా నిర్వహించాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అక్టోబరు 6, 7 తేదీల్లో నిర్వహించే ఉత్సవం ఆహ్లాదకర వాతావరణంలో చేసుకోవాలని, గతేడాది కంటే గొప్పగా నిర్వహించాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ బిఆర్.అంబేడ్కర్తో కలిసి పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవాలపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు వారం రోజుల ముందు నుంచే నగరమంతా విద్యుత్ కాంతులతో అలంకరించాలని, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సిరిమాను ఊరేగింపు 3 గంటలకే మొదలు పెట్టాలని, ఐదు గంటలకు ముగించేయాలన్నారు. కలెక్టర్ డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ మాట్లాడుతూ శాఖల వారీగా ఎవరెవరు ఏఏ పనులు చేయాలో ఆదేశించారు. సాధారణ దర్శనాలకు ఇబ్బంది కలగకుండా విఐపీ దర్శనాలను ఏర్పాటు చేయాలని దేవాలయ అధికారులకు ఆదేశించారు. కంట్రోల్ రూం, మెడికల్ క్యాంప్, 108 వాహనం కూడా ఏర్పాటు చేయాలన్నారు. మూడు రోజుల ముందు నుంచే పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని, తాగునీటి సరఫరా చేయాలని, ఆయా అధికారులకు సూచించారు. రథం ఫిట్నెస్ను అటవీశాఖ అధికారులు తనిఖీ చేయాలని, ఆర్డీవో అటవీ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. తెప్పోత్సవం దగ్గర గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశించారు. విజయనగరం ఉత్సవాలపై సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీని వేసి ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలో తదుపరి నిర్ణయించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.50 లక్షలు కేటాయించిందని, నిధుల విడుదల కోసం డీవో లేఖ రాయడం జరిగిందన్నారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి మాట్లాడుతూ సమన్వయంతో పనిచేసి పండగను విజయవంతం చేయాలని తెలిపారు. ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాల కోసం రెండువేల మంది పోలీసులను నియమిస్తామన్నారు. అనంతరం పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శిరీషా, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ -
నత్తల నివారణకు చర్యలు తీసుకోండి
● కలెక్టర్ శ్యామ్ప్రసాద్ పార్వతీపురం రూరల్: నత్తల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఉద్యాన, వ్యవసాయాధికారులను ఆదేశించారు. నత్తల నివారణపై సంబఽంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో శనివారం మాట్లాడారు. ఉద్యాన, వ్యవసాయాధికారులు అవిశ్రాంతంగా పనిచేసి పంటను కాపాడే మార్గం చూపాలన్నారు. రైతులకు ధైర్యం చెప్పాలని సూచించారు. పంటకు నష్టం కలిగిస్తున్న ఆఫ్రికన్ నత్తలను నిర్మూలించే పద్ధతులపై రైతులకిచ్చే సూచనలు స్పష్టంగా ఉండాలన్నారు. గాలి, వెలుతురు, నేలకు ఎండ తగలకపోవడమే నత్తల విస్తరణకు ప్రధానకారణమన్నారు. ఎప్పటికప్పుడు నత్తలను ఏరి ఉప్పునీటి ద్రావణంలో వేయాలని, మెటాల్డ్హైడ్ గుళికలను ఎకరానికి 3 నుంచి 5 కిలోలు వేయాలన్నారు. 25 కిలోల ఊక, మూడు కిలోల బెల్లం, వంద గ్రాముల థియోడీకార్స్, 100 మీ.లీ ఆముదం నూనె కలిపి చిన్నచిన్న ఉండలు చుట్టి అక్కడక్కడా పంట పొలాల్లో పెడితే వీటిని తిని నత్తలు చనిపోతాయని తెలిపారు. వీడియోకాన్ఫరెన్స్లో జిల్లా ఉద్యాన శాఖ అధికారి జీఎస్ఎన్ రెడ్డి పాల్గొన్నారు. -
మన్యంలో కిలో అల్లం రూ.40
● సీతంపేట ఏజెన్సీలో భారీగా దిగుబడి ● పట్టణ ప్రాంతాల్లో కిలో రూ.100 వరకు విక్రయం సీతంపేట: ఏజెన్సీ ప్రాంత రైతులు సుమారు 100 ఎకరాల కొండపోడులో సాగుచేసిన అల్లంపంట చేతికొచ్చింది. వ్యాపారులు సిండికేట్గా మారి పంటను చౌకగా కొనుగోలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కిలో రూ.100 నుంచి రూ.150వరకు ధర పలుకుతుండగా, గిరిజనుల నుంచి కిలో రూ.35 నుంచి రూ.40కే కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో కిలో వద్ద సగానికి సగం లాభం ఆర్జిస్తున్నారు. సీతంపేట మండలంలోని రంగంవలస, ఎగువ, దిగువ ద్వారబంధం, పుట్టిగాం, తుంబలిగూడ తదితర ప్రాంతాల్లో అల్లం సీజన్ ఆరంభమైంది. అయితే, ధర లేకపోవడంతో గిరిజన రైతులు దిగాలుపడుతున్నారు. ఈ ఏడాది అల్లం పంట కలిసి వచ్చింది. దిగుబడి బాగుంది. ప్రస్తుతానికి గ్రామాల్లోనే విక్రయిస్తున్నాం. ఆశించిన స్థాయిలో ధర లేకపోవడంతో పంటను తవ్వేందుకు వెనుకంజవేస్తున్నాం. – ఆనంద్, కలువరాయి, సీతంపేట మండలం ప్రభుత్వ పరంగా అల్లంతో పాటు అన్ని పంటలకు మద్దతు ధర కల్పించాలి. పైనాపిల్ వంటి పంటల్లో నష్టాలు చవి చూశాం. అల్లం పంటలో మంచి ఆదాయం వస్తుందని ఆశిస్తున్నా నిరాశే ఎదురవుతోంది. వ్యాపారులు సిండికేట్గా మారి పంటను దోచుకుంటున్నారు. – ఎస్.మంగయ్య, ఎంపీటీసీ -
ఆదాయ వనరులను సమకూర్చుకోండి
● పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర కమిషనర్ కృష్ణతేజ బొబ్బిలి రూరల్: పంచాయతీల్లోని ఇళ్ల పన్నులు, వాణిజ్య సముదాయాలు, ట్రేడ్ లైసెన్స్ల రెన్యువల్, తదితర పద్ధతుల ద్వారా పంచాయతీలకు ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఎం.కృష్ణతేజ సూచించారు. మండలంలోని మెట్టవలస, జగన్నాథపురం గ్రామాల్లో ఆయన శనివారం పర్యటించారు. జగన్నాథపురంలో డీడీఓ కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించి రేకులతో కాకుండా శాశ్వత భవనాన్ని నిర్మించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయ సిబ్బందితో మాట్లాడి ఆదాయ వివరాలను తెలుసుకున్నారు. ఆయనకు ఉచిత బస్సు వల్ల ఉపాధికోల్పోయామని ఆటోడ్రైవర్లు, 19 ఏళ్లుగా పనిచేస్తున్నా జీతాలు పెరగలేదంటూ ఫీల్డు అసిస్టెంట్లు వినతిపత్రాలు అందజేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేతో పాటు జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, డీడీఓ కిరణ్కుమార్, ఎంపీడీఓ పి.రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు భాషను పరిరక్షించుకోవాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం రూరల్: తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, తెలుగుభాష చిరస్థాయిగా ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆకాంక్షించారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన తెలుగుభాష దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి వాడుక భాష ఉద్యమానికి చేసిన కృషిని కొనియాడారు. విద్యార్థుల కోసం వచ్చేనెల 5న తెలుగు మాస పత్రికను విడుదల చేస్తామని, అందులో విద్యార్థులకు అవసరమైన సమాచారంతోపాటు రచనలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో చిన్నారుల నృత్యప్రదర్శనలు అలరించాయి. ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి వై.నాగేశ్వరరావు, ఎస్ఎస్ఏ ఏపీసీ తేజేశ్వరరావు, డీఎంహెచ్ఓ భాస్కరరావు, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, డీపీఆర్వో ఎల్.రమేష్, తదితరులు పాల్గొన్నారు. అవగాహన అవసరం ప్రభుత్వ పరమైన ప్రాధాన్యత గల అంశాలపట్ల రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ సూచించారు. మండల స్థాయిలో తహసీల్దార్తో పాటు వీఆర్ఓలు తదితర సిబ్బంది రెవెన్యూ పనుల్లో భాగస్వాములేనని తేల్చిచెప్పారు. విధుల్లో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించరాదన్నారు. సమావేశంలో జేసీ ఎస్.ఎస్.శోభిక, సబ్కలెక్టర్లు ఆర్.వైశాలి, స్పప్నిల్జగనాథ్, ఎస్డీసీలు పి.ధర్మచంద్రారెడ్డి, ఎస్. దిలీప్చక్రవర్తి పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం రెవెన్యూ అసోసియేషన్ రూపొందించిన కరపత్రాన్ని కలెక్టర్ విడుదల చేశారు. -
2025లో సరఫరా అయిన యూరియా 11,355 టన్నులు
ప్రస్తుతం ఆర్బీకేలు కాస్త ఆర్ఎస్కేలు మారాయి. వాటి సంఖ్య గణనీయంగా కుదించగా 2025 ఖరీఫ్ సీజన్లో కేవలం 11,355 టన్నులు మాత్రమే యూరియా వచ్చింది. అది కూడా బ్లాక్ మార్కెట్కు తరలిపోతోందన్నది రైతుల వాదన. అందమైన వసంతం తరువాత మంటెక్కించే గ్రీష్మం వచ్చినట్లు.. తీయని నేతి మిఠాయి తిన్నాక గొడ్డుకారం చప్పరించినట్లు.. చల్లని మంచు కాళ్లను గిలిగింతలు పెడుతున్న దారిలో నడిచిన అనంతరం నిప్పుకణికల్లా మండుతున్న రాళ్ల దారిలో అడుగేస్తున్నట్లు.. శ్రావ్యమైన సంగీతం విన్నాక గార్ధభ గాత్రం మన మనసును పాడు చేసినట్లు.. రైతు పక్షపాతి అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన తరువాత సేద్యం అంటేనే అసహ్యించుకునే చంద్రబాబుపాలన మొదలైందన్నది రైతుల మాట. ప్రస్తుతం రైతన్నలను కష్టాలే పలకరించాయి.. కాదు కాదు.. నేరుగా తలుపులు బద్దలుగొట్టుకుని రైతు ఇళ్లలో కష్టాలు తిష్టవేశాయి. ఓ ఏడాది పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు.. ఏదోలా అప్పోసప్పో చేసి పంటలు పండిస్తే అవి ఎక్కడ అమ్ముకోవాలో తెలియని దుస్థితి.. నిన్నమొన్నటివరకు ఊరిలో ఠీవీగా నిలబడిన ఆర్బీకేలను కాస్త ఆర్ఎస్కేలుగా పేరుమార్చి ఉసురు తీసేయడంతో అవి వెలవెలబోతున్నాయి. ధాన్యాన్ని అమ్మితే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఏ పంట వేయాలో చెప్పేవారు లేరు. చేతిలో ఉన్న మరచెంబులోని నీళ్లను లాక్కుని సహారా ఎడారి మధ్యలో వదిలేసినట్లుంది రైతుల పరిస్థితి. చనుబాలకోసం పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తున్నా పాలులేవని.. పాలివ్వలేనని.. బిడ్డ ఆకలితీర్చలేనని చెప్పలేని తల్లి పరిస్థితి రైతుకు దాపురించింది. నాట్లు వేసే చివరి కార్తె అయిన పుబ్బ వచ్చేసింది. ఇప్పటికే ఆశ్లేష కార్తెలో వేసిన ఉభాల్లో గాబు తీతలు అయిపోయాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చేను నల్లగా కమ్ముకురావాల్సిన రోజులొచ్చేశాయి. కానీ, పైన చంద్రబాబు ఉన్నాక ఇక చేను ఎలా నవ్వుతుంది.. ఎటు చూసినా యూరియా, డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులు దొరికే పరిస్థితి లేదు. వచ్చిన కాసిన్ని బస్తాలు సొసైటీల నుంచి నేరుగా టీడీపీ నేతల గోదాముల్లోకి తరలిపోతున్న దారుణం. కళ్లముందే ఈ దందా జరుగుతున్నా సినిమా చూసినట్లు చూడడం తప్ప ఏమీ చేయలేని అశక్తత. నడిసముద్రంలో మునిగిపోతూ గుక్కెడు నీటికోసం ఆకాశం కోసం చూస్తున్న పరిస్థితి. కడుపులో పట్టెడన్నం పడి మూడ్రోజులైంది.. ఎవరైనా కాసింత గంజి పోస్ట్ బాగుణ్ణు అనే దుస్థితి. చేనుకు ఎరువు వేయకపోవడంతో ఎదుగుదల లోపించింది. ఎరువుల కోసం చాంతాడంత లైన్లలో గంటలతరబడి నిలబడాల్సి రావడం. తమ కళ్లముందు నుంచి తరలిపోయిన ఎరువులు అంతలోనే బ్లాక్ మార్కెట్లో కనిపించడం.. రెట్టింపు ధరలు పెట్టి కొనుగోలు చేయాల్సి రావడం. ఇదంతా తమ ప్రారబ్ధం అనుకుంటూనే రైతులు పొలం వైపు సాగుతున్నారు. మంచి రోజులు ఎప్పుడొస్తాయా అంటూ ఊపిరిబిగబట్టి పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు. -
చెట్టుకిందనే ప్రసవం
బొబ్బిలిరూరల్: ఓ నిండు గర్భిణి ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్తుండగా పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. బొబ్బిలి ఆర్టీసీ కాంపెక్స్కు ఎదురుగా ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని ఓ చెట్టుకిందనే ఏడో సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎనిమిదేళ్ల కుమార్తె తల్లికి సపర్యలు చేసింది. వివరాల్లోకి వెళ్లే... బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని అక్కేనవలస గిరిజన గ్రామానికి చెందిన దుబ్బాక పార్వతి 9 నెలలు నిండు గర్భిణి. భర్త లక్ష్మణతో కలిసి రామభద్రపురం మండలంలోని రొంపల్లి సమీపంలోని పామాయిల్ తోటలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఒక కుమార్తె చనిపోయింది. శుక్రవారం ఏడో సంతానంలో పార్వతికి పురిటినొప్పులు రావడంతో తన 8 ఏళ్ల వయసున్న పెద్దకుమార్తె శైలజను వెంటపెట్టుకుని ఆటోలో బొబ్బిలి సీహెచ్సీలో చేరేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆటో దిగారు. అప్పటికే పార్వతికి నొప్పులు ఎక్కువ కావడంతో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఓ చెట్టు కిందకు చేరుకున్నారు. శైలజ భయపడకుండా తల్లికి సపర్యలు చేస్తూనే ఉంది. కాళ్లు, చేతులు నిమురుతూ తల్లికి ధైర్యం చెప్పింది. ఇంతలో తల్లి పార్వతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అక్కడే ఉన్న కొంతమంది పాత్రికేయులు 108కు సమాచారం ఇవ్వడంతో తల్లీబిడ్డను బొబ్బిలి సీహెచ్సీకి తరలించారు. అక్కడ మెరుగైన వైద్యచికిత్స పొందుతున్నారు. మొన్న కొత్తబట్టివలస, నేడు అక్కేన వలస... బొబ్బిలి నుంచి పార్వతీపురం రాష్ట్రీయ రహ దారి వైపు ఉన్న దాదాపు 10 పంచాయతీలకు వైద్యసేవలు అందుబాటులో లేవు. ఈ పంచాయతీల్లో ఎవరికీ వైద్యసహాయం కావాలన్నా 25 కిలోమీటర్ల దూరంలోని పిరిడి పీహెచ్సీకి వెళ్లాలి. అంతదూరం వెళ్లేందుకు ఇష్టపడని గిరిజనులు గ్రామాల్లోనే ఉంటూ సుఖప్రసవం కోసం ప్రయత్నించి చివరి నిమిషాల్లో వైద్యసహాయాన్ని పొందుతున్నారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు లేని గిరిజన గ్రామాల్లో డోలీలే దిక్కవుతుండగా, ప్రమాదకర పరిస్థితుల్లో ఇలాంటి ప్రసవాలు చోటుచేసుకుంటున్నాయి. పది రోజుల కిందట కొత్త బట్టివలస గ్రామానికి చెందిన నిండు గర్భిణిని 5 కిలోమీటర్లు డోలీలో మోసుకుని పిరిడి పీహెచ్సీకి తరలించగా, నేడు ఆ పక్కనే ఉన్న అక్కేనవలస గిరిజన గ్రామం మహిళ ఆస్పత్రికి వస్తూ చెట్టుకిందనే బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అత్యవసర వైద్యసహాయం కోసం గిరిజన పంచాయతీలకు చేరువలో పీహెచ్సీని ఏర్పాటుచేయాలని గిరిజన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
మూడు రెట్లు పెరిగిన గంజాయి కేసులు
● గంజాయి రవాణాపై గట్టి నిఘా ● ఎస్పీ వకుల్ జిందల్బొబ్బిలి: జిల్లాలో గంజాయి రవాణా నిరోధించేందుకు గట్టి నిఘా ఉంచామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో ఆయన శుక్రవారం వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత ఏడాదితో పోలిస్తే గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన కేసులు మూడు రెట్లు పెరిగాయన్నారు. అలాగే అరెస్టులు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. ఇప్పటికే అరెస్టయిన వారి నుంచి రూ.కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేశామన్నారు. గంజాయి రవాణా చేసిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఆన్లైన్ లోన్ యాప్లను ఓపెన్ చేయొద్దన్నారు. యాప్లలో రుణం తీసుకుంటే అసలు కన్నా అధిక రెట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్నారు. అలాగే ఆన్లైన్లో మీకు లక్షలాది రూపాయల లాటరీ వచ్చిందని, మీరు రూ.కొంత సొమ్ము కడితే మిగతా సొమ్ముతో పాటు చెల్లిస్తామని చెప్పి పత్తా లేకుండా పోతారన్నారు. దీని వలన ప్రజలు ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఈ సందర్భంగా స్టేషన్లోని కంప్యూటర్ విభాగాన్ని, సీసీ కెమెరాల కంట్రోల్ విభాగాన్ని పరిశీలించారు. వివిధ కేసుల్లో పట్టుబడ్డ బైక్లను పరిశీలించారు. వాటి వివరాలను డీఎస్పీ జి భవ్యారెడ్డి, సీఐలు కె.సతీష్ కుమార్, నారాయణరావులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుస్టేషన్లో గౌరవ వందనం స్వీకరించారు. ఎస్ఐలు ఆర్.రమేష్కుమార్, పి.జ్ఞానప్రసాద్, ఏఎస్ఐ డి.కొండలరావు తదితరులు పాల్గొన్నారు. దోనుబాయి పీఎస్ను సందర్శించిన ఎస్పీ సీతంపేట: దోనుబాయి పోలీస్స్టేషన్ను ఎస్పీ మాధవరెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ ఆవరణను, రికార్డులు పరిశీలించారు. సైబర్ క్రైం, రహదారి ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గణేష్ చతుర్దిని పురస్కరించుకుని ఊరేగింపుల్లో ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా చూడాలన్నారు. కాగా దోనుబా యి ప్రాంతంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ పలు అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ, ఆయనపై చర్యలు తీసుకోకపోతే నూతన నక్సలిజం పార్టీ త్వరలో జనంలోకి వస్తాదంటూ స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేసినట్టు దోనుబాయి యూత్ పేరిట ఓ లేఖ సోషల్ మీడియాలో శుక్రవారం హల్చల్ చేసింది. దీనిపై ఎస్పీ ఆరా తీసినట్టు తెలిసింది. తహసీల్దార్ శ్రీకన్య వద్ద ఈ విషయమై ప్రస్తావించగా దీనిపై ఆర్ఐను విచారణకు నియమించామన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ షేక్మస్తాన్ పాల్గొన్నారు. -
గూడ్స్ రైలు ఢీకొని యువకుడి మృతి
బొండపల్లి: మండలంలోని కనిమెరక రైల్వే గేటుకు సమీపంలో రైల్వేట్రాక్ దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి బొబ్బిలి రైల్వే హెచ్సీ ఈశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దత్తిరాజేరు మండలంలోని వింద్యావాసి గ్రామానికి చెందిన టి.శంకరరావు (26) రైల్వే ట్రాక్ దాటుతుండగా గూడ్స్ రైలు ఢీ కొనడంతో మృతి చెందినట్టు తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. గంట్యాడ: పాముకాటుతో ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని దిగువ కొండపర్తి గ్రామానికి చెందిన ఎర్రబోయిన కొత్తమ్మ (40) తాను నివసిస్తున్న పూరి గుడిసెలో గుర్తు తెలియని పాము కాటు వేయడంతో మరణించింది. దీనిపై ఫిర్యాదు అందడంతో గంట్యాడ పోలీసులు మృతదేహాన్ని ఎస్.కోట ఏరియా ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. మృతురాలికి 16 ఏళ్ల వయసు గల కుమార్తె ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిందితుడి భార్య ఆత్మహత్యా యత్నం
పార్వతీపురం రూరల్/మక్కువ: తన తల్లిపై దాడి చేసేందుకు వచ్చే క్రమంలో నిందితుడు ఆదినారాయణ పదునైన ఆయుధంతో పొడవడంతో ప్రాణాలు పోగొట్టుకున్న మృతుడు సాగరాపు కార్తీక్ ఘటన పాఠకులకు విదితమే. అయితే ఈ క్రమంలో శుక్రవారం ఈ కేసు దర్యాప్తు నిమిత్తం మక్కువ పోలీసులు నిందితుని ఇంటి వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్న క్రమంలో మృతుని తల్లి దమయంతి నిందితుడి భార్య హేమలత వైపు కోపంగా చూసిన కారణంతో భయాందోళన చెంది ఇంట్లో వున్న జొన్నచేళ్లకు ఉపయోగించే పురుగుల మందును తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు మక్కువ ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్టు ఈ మేరకు వివరాలు సేకరించినట్టు జిల్లా కేంద్ర ఆసుపత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపారు. -
ఆన్లైన్లో అప్పీల్ చేసుకున్న వారికి పింఛన్
పార్వతీపురం రూరల్: 40 శాతం పైగా అంగ వైకల్యం ఉన్న వారికి నోటీసులు జారీ చేయడం జరిగిందని తదనుగుణంగా ఆన్లైన్లో అప్పీల్ చేసుకున్న వారికి పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన అపీల్ను విధిగా అధికారులు ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గ్రామాల్లో స్పష్టమైన అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. కౌశలంలో అప్లోడ్ చేయాలి నిరుద్యోగ యువతీ యువకులు వివరాలను కౌశలం పోర్టల్లో నమోదు చేయాలని కలెక్టర్ శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు ధ్రువీకరణ పత్రాలు ఈ మెయిల్, మొబైల్ వివరాలను నమోదు చేయాలని ఆయన తెలిపారు. నమోదు చేసిన అభ్యర్థులకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, డీఎంహెచ్వో డా. ఎస్.భాస్కరరావు, డీసీహెచ్ డా.నాగభూషణరావు, ఎస్డీసీ దిలీప్ చక్రవర్తి పాల్గొన్నారు. కలెక్టర్ శ్యామ్ప్రసాద్ -
ఇక ఆన్లైన్లో రిమాండ్ ఖైదీల విచారణ
బొబ్బిలి: రిమాండ్లో ఉన్న ఖైదీలను జైలు నుంచి కోర్టులకు తరలించే సమయంలో భద్రత, సమయం, తరలింపు తదితర అంశాలను మరింత మెరుగు పర్చుకునే క్రమంలో కొన్ని మార్పులు చేసినట్టు జిల్లా జైళ్ల అధికారి జి.మధుబాబు తెలిపారు. స్థానిక సబ్ జైలును శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. రిమాండ్ ఖైదీల విచారణ సమయంలో కోర్టులకు తరలించే వ్యయ, ప్రయాసలను తగ్గించేందుకు, మరింత సులువుగా మెరుగైన ప్రక్రియ నేపథ్యంలో ఆన్లైన్లోనే వారి కేసులను విచారించేందుకు ఉన్నత న్యాయమూర్తుల ఆదేశాల మేరకు జైళ్లలో తగు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, ఎస్.కోట, చీపురుపల్లి సబ్ జైళ్లలో 150 మంది వరకూ వివిధ కేసులకు సంబంధించి రిమాండ్ ఖైదీలున్నారన్నారు. ఇవి నడుస్తున్న భవనాలు బ్రిటిష్ కాలం నాటివి కావడంతో కొత్త భవనాల నిర్మాణం కోసం అవసరమైన స్థలాల గుర్తింపునకు రెవెన్యూ అధికారులకు ప్రతిపాదించినట్టు చెప్పారు. జిల్లా జైలు కోసం సారిక వద్ద ఏడెకరాలను, బొబ్బిలి సబ్ జైలు కోసం గ్రోత్సెంటర్ వద్ద ఐదెకరాలను గుర్తించామన్నారు. మిగతా సబ్జైళ్ల స్థలాలు కూడా గుర్తిస్తే భవన నిర్మాణాలకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామన్నారు. సబ్ జైలర్ పాత్రో, సిబ్బంది ఉన్నారు. జైళ్ల అధికారి మధుబాబు -
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగు పెంచడానికి రైతులకు అవగాహన కల్గించాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులు కాకుండా కొత్త గ్రామాల్లో సర్వే చేసి కొత్త రైతులను గుర్తించి వచ్చే రబీ నుంచి సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయన చాంబర్లో శుక్రవారం ప్రకృతి వ్యవసాయంపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. మండల స్థాయిలో 3 రోజులు పాటు సమావేశాలు ఏర్పాటు చేయాలని, తదుపరి గ్రామ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో పాటు, మండల స్థాయి ప్రత్యేకాధికారులను డ్వాక్రా మహిళలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలన్నారు. ర్యాలీలు నిర్వహించాలని, ఎగ్జిబిషన్ ప్రదర్శనలను నిర్వహించి ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించాలన్నారు. రైతుల నుంచి సలహాలు, సూచనలను కూడా తీసుకోవాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని వీటిన్నటిని సమోదు చేసి డాక్యుమెంటరీని తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం సాగుకు ముందుకు వచ్చిన వారి జాబితాను తీసుకుని అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రుపొందించాలని అన్నారు. జిల్లాలో గుర్తించిన 290 క్లస్టర్లో బేసిక్ సర్వే ప్రారంభించాలన్నారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్, జిల్లా వ్యవసాయ అధికారి తారాకరామారావు, డీపీఎం ఆనందరావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, మత్య్స శాఖ డి.డి విజయ్కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సర్వజన ఆసుపత్రిలో రోగుల కష్టాలు..!
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సకాలంలో రోగులకు వైద్య సేవలు అందక అవస్థలు పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ వైద్య సేవలు అందించేగలిగే వాటిని కూడా వైద్యులు కేజీహెచ్కు రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి వేళ చాలా వైద్య సేవలు గగనంగా మారాయనే అపవాదు ఉంది. రాత్రి సమయంలో అందుబాటులో ఉండని స్పెషాల్టీ వైద్యులు రాత్రి పూట స్పెషాల్టీ వైద్యులు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంబీబీఎస్ వైద్యులు, పీజీ వైద్యులే రోగులకు పెద్దదిక్కుగా నిలుస్తున్నారు. వాస్తవంగా స్పెషాల్టీ వైద్యులు రాత్రి వేల ఆసుపత్రిలో ఉండాలి. కానీ గత కొంత కాలంగా స్పెషాల్టీ వైద్యులు ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాయంత్రం 4 గంటల తరువాత అందని అల్ట్రా సౌండ్ సేవలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సాయంత్రం 4 గంటల తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ సేవలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి పూట తీవ్రమైన కడుపునొప్పి, కడుపులో తీవ్రమైన మంటతో వచ్చే వారికి అత్యవసరంగా అల్ట్రాసౌండ్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో వైద్యులు అందుబాటులో లేక పోవడం వల్ల మరుసటి రోజు ఉదయం 9, 10 గంటలకు వైద్యులు వచ్చే వరకు నొప్పితోనే రోగులు నిరీక్షించాల్సిన పరిస్థితి. 1200 వరకు ఓపీ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఓపీకి 1000 నుంచి 1200 మంది వరకు రోగులు వస్తున్నారు. అదే విధంగా 60 నుంచి 80 మంది వరకు ఇన్పేషంట్లుగా రోగులు చేరుతున్నారు. రిఫర్ చేస్తే చర్యలు తీసుకుంటాం.. ఆసుపత్రిలో చికిత్స చేయగలిగే రోగులకు ఇక్కడే సేవలు అందిస్తారు. చికిత్స అందివ్వగలిగే వారిని రిఫర్ చేస్తే చర్యలు తీసుకుంటాం. రాత్రి సమయంలో జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజీషియన్ విధులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చాం. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటాం. అల్ట్రాసౌండ్ స్కాన్ అత్యవసరం అనుకుంటే వైద్యులు వచ్చి స్కాన్ చేయాలి. ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ సంబంగి అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రాత్రి వేళ మరింత కష్టాలు స్పెషాల్టీ వైద్యులు అందుబాటులో ఉండని వైనం అధిక శాతం వైద్యులు విశాఖ నుంచి రాకపోకలు రిఫరల్స్ ఎక్కువగా చేస్తున్నారనే ఆరోపణలువిశాఖ నుంచి రాక పోకలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యులంతా స్థానికంగా ఉండాలి. కానీ అధిక శాతం మంది వైద్యులు విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం అందరూ స్థానికంగా ఉండాలి. ఎందుకంటే వీరు హోమ్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉండకపోయినప్పటకీ తప్పడు అడ్రస్లు చూపించి హెచ్ఆర్ఏ పొందుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్పెషాల్టీ వైద్యులు అవసరం ఎంతో ఉంటుంది. రోగులు ప్రాణాలు కాపాడడంలో వీరిదే ప్రధాన పాత్ర. వీరు అందుబాటులో ఉంటే రోగులకు సకాలంలో వైద్యం అందించడానికి వీలుంటుంది. రిఫరల్స్ ఎక్కువగా చేస్తున్నారనే ఆరోపణలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యం అందించే గలిగే పరిస్థితి ఉన్నప్పటకీ కేజీహెచ్కు రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువగా రిఫరల్స్ చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. స్పెషాల్టీ వైద్యులు రాత్రి సమయంలో అందుబాటులో లేకపోవడం వల్ల తమకెందుకు వచ్చిన రిస్క్ అనుకుని రిఫర్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతీ రోజు ఇక్కడి ఆసుపత్రి నుంచి మూడు నుంచి నాలుగు రిఫరల్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. -
గిరిజన మత్స్యకారుడి గల్లంతు
● గజఈతగాళ్లతో గాలింపు ● లభ్యం కాని ఆచూకీ ● రోదిస్తున్న కుటుంబసభ్యులుపాచిపెంట: గిరిజన మత్స్యకారుల బతుకు చిత్రం ప్రతిక్షణం ప్రమాదకరంగా ఉంటోంది. వర్షాలు పడుతున్నా ప్రాణాలకు తెగించి వలవిసరక తప్పదు. లేకుంటే ఇంటిల్లిపాది పిల్లాపాపలతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి. వినాయక చవితి సందర్భంగా వర్షం కురుస్తోంది. జలాశయానికి నీటి ఉధృతి పెరుగుతుందని తెలుసు, కానీ పొట్టకూటి కోసం చేపలవేటకు వెళ్లిన పాచిపెంట మండలంలోని కోడికాళ్ల వలస గ్రామానికి చెందిన మత్స్యకారుడు పెద్ద గెడ్డ జలాశయంలో గల్లంతయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కోటికిపెంట పంచాయతీ, కోడికాళ్లవలస గ్రామానికి చెందిన జన్ని బాలరాజు(37) వత్తిరీత్యా పెద్దగడ జలాశయానికి చేపల వేటకు వెళ్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. రోజులాగానే బుధవారం ఉదయం పెద్దగెడ్డ జలాశయానికి చేపలవేటకు వెళ్లాడు. వల తీస్తున్న సమయంలో వరద ఉధృతికి నాటు పడవ బోల్తా పడడంతో జలాశయంలో గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు అందుబాటులో ఉన్న గజ ఈతగాళ్లతో రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే డ్రోన్ వినియోగించి గల్లంతైన వ్యక్తి కోసం గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. బాలరాజు గల్లంతైన వార్త విని కోడికాళ్లవలస గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. గల్లంతైన వ్యక్తికి భార్య జన్ని బుజ్జి, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. -
పొంగిన నదులు.. ఇబ్బందుల్లో గిరిజనులు
సాలూరు రూరల్: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని గోముఖి, సువర్ణముఖి నదులు పొంగి పొర్లుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో కొండలపై కురిసిన వర్షాలకు దండిగాం, తోణాం గ్రామాలను కలుపుతూ ప్రవహిస్తున్న నదులు అకస్మాత్తుగా పొంగి ప్రవహించడం ప్రజలు ఇబ్బందులు పడడం సర్వసాధారణమైంది. తోణాం మీదుగా సువర్ణముఖి నదిపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో కాజ్వే నిర్మింపజేసి ఏజెన్సీ గ్రామాలకు నది ప్రవాహ ప్రమాదాలను కొంతవరకు నివారించగలిగారు. అలాగే దండిగాం వద్ద కాజ్వే పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వం మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర రూ.11 కోట్లు మంజూరు చేయించినా కూటమి పాలనలో ఆ నిధులు కాస్త వెనక్కి మళ్లాయి. ప్రస్తుతం దాదాపు 15 గిరిజన గ్రామాల ప్రజలు ఈ నది పొంగి ప్రవహిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏ క్షణం ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆయా గిరిజన గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బుధవారం పొంగడంతో కొన్ని గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం తోణాం వద్ద గోముఖి నది కాజ్వే పై నుంచి ప్రవాహం కొనసాగుతోంది. గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు వినియోగించి వంతెనల నిర్మాణం పూర్తి చేయాలని ఆయా గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
పెన్సిల్తో ఆకర్షణీయంగా కలెక్టర్ చిత్రం
పార్వతీపురం: పార్వతీపురంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నతపాఠశాలలో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్న రుగడ శ్రీనివాసరావు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ చిత్రాన్ని పెన్సిల్తోవేసి తన ప్రతిభను కనబరిచి కలెక్టర్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ చిత్రాన్ని పెన్సిల్తో ఆయన ఆకర్షణీయంగా చిత్రీకరించారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ను కలిసి పెన్సిల్తో వేసిన చిత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పెన్సిల్తో వేసిన చిత్రాన్ని చూసిన కలెక్టర్, శ్రీనివాసరావును ప్రత్యేకంగా అభినందించారు. గరుగుబిల్లి మండలం, రావివలస గ్రామానికి చెందిన శ్రీనివాసరావు చిన్నతనం నుంచి చిత్రాలు వేసి ఈప్రాంతీయుల అభిమానాన్ని చొరగొంటున్నారు. -
మృతుడి ఆచూకీ లభ్యం
కొత్తవలస: ఈ నెల 26న మండలంలోని కొత్తసుంకరపాలెం గ్రామం సమీపంలోని చెరువులో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు కనుగొని ఎస్కోట సీహెచ్సీకి తరలించిన విషయం తెలిసిందే. కాగా ప్రధాన ప్రతికల్లో వచ్చిన కథనాలు, ఫొటోలను మృతుడి భార్య, కుమారుడు గుర్తించి పోలీసులను సంప్రదించారు. ఈ మేరకు చెరువులో కలువ పూలకోసం దిగి మృతి చెందిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లా బాతువ గ్రామానికి చెందిన అలుగోలు తవుడు(48)గా గుర్తించారు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు, సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి బతుకు తెరువు కోసం కొత్తవలస సమీపంలో గల కుమ్మరిబంజరి ప్రాంతానికి అలుగోలు తవుడు కుటుంబసభ్యులు వచ్చారు. టైలరింగ్, కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తవుడికి మద్యం తాగే అలవాటు ఉంది. సమీపంలో గల ఆటో డ్రైవర్, మరో వ్యక్తితో కలిసి తరచూ మద్యం తాగేవాడు. ఈ క్రమంలో వారు ముగ్గురూ ఈ నెల 25న మద్యం తాగి కొత్తసుంకరపాలెం గ్రామం సమీపంలో గల చెరువులో గల కలువ పువ్వులను ఏరి వినాయక చవితికి అమ్ముకుందామన్న ఉద్దేశంతో ఆటోలో వెళ్లారు. చెరువులోకి దిగిన తవుడికి లోతు తెలియక చాలా సేపు కనిపించక పోవడంతో ఆయనతో పాటు వెళ్లిన ఆటో డ్రైవర్, మరో వ్యక్తి అక్కడినుంచి పారిపోయారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
పారా జాతీయ స్థాయి పోటీలకు పయనం
విజయనగరం: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వేదికగా ఈనెల 29 నుంచి 31 వరకు జరుగబోయే 15 వ పారా జూనియర్, సబ్ జూనియర్స్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2025 పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి క్రీడాకారులు పయనమయ్యారు. వాంరందరికీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ అల్ ది బెస్ట్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారా రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 13 మంది క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. గతం కంటే ఈసారి దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరువుతున్నారని, జాతీయస్థాయి పోటీలలోనూ బాగా రాణించి క్రీడల్లో జిల్లా కీర్తి, ప్రతిష్టలు మరింతగా పెంచాలని పిలుపునిచ్చారు. -
గర్భిణి మృతిపై విచారణ
పాలకొండ: స్థానిక ఏరియా ఆస్పత్రిలో బుధవారం గర్భిణి మృతి చెందడంపై డీసీహెచ్ఎస్ నాగభూషణ్ గురువారం విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి ఆస్పత్రి సూపరింటెండెంట్ చిరంజీవి అందించిన వివరాల మేరకు మండలంలోని తంపటాపల్లి గ్రామానికి చెందిన బొమ్మాళి పధ్మ మూడవ కాన్పు కోసం ఏరియా ఆస్పత్రిలో ఉదయం 9గంటలకు ఆసుపత్రిలో చేరింది. అప్పటికే తీవ్ర రక్తసావ్రం కావడంతో ఆమెను అక్కడ ఉన్న సిబ్బంది పరిశీంచారు. ఇంతలో ఆమె ఆస్పత్రిలో ఉదయం 11 గంటల సమయంలో మరణించింది. అప్పటికే విధుల్లో ఉండాల్సిన వైద్యులు లేక పోవడంతోనే పద్మ మృతిచెందిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. అనంతరం గ్రామ పెద్దలు సర్ది చెప్పడంతో మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు. దీనిపై ఫిర్యాదు రావడంతో డీసీహెచ్ఎస్ ఏరియా ఆస్పత్రిని సందర్శించి విచారణ చేపట్టారు. గ్రామంలోని ఆశవర్కర్, ఏఎన్ఎం, ఎంల్హెచ్పీల నుంచి వివరాలు తీసుకున్నారు. రక్తస్త్రావం ఎక్కువగా అవడంతోనే మృతి చెందినట్లు వారంతా చెప్పారు. ఆస్పత్రికి తీసుకురావడం ఆలస్యమైందని సూపరింటెండెంట్ వివరించారు. హెల్మెట్ వాడకం తప్పనిసరి● ఎస్పీ వకుల్ జిందల్ విజయనగరం క్రైమ్: రహదారి భద్రత, ప్రమాదాల నివారణలో భాగంగా పలు పోలీసు స్టేషన్ల పరిధిలోని బ్లాక్ స్పాట్స్, హైవేలపై, ప్రధాన జంక్షన్ల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టి ‘హెల్మెట్ ధారణ’ పై అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం స్పష్టం చేశారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై కేసులు నమోదు చేశామని ఎస్పీ వకుల్ జిందల్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 18 నుంచి 24 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, 452 కేసులు నమోదు చేసి, ఈ చలానాగా రూ.4,75,725/లను విధించామన్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలోని బ్లాక్ స్పాట్స్ వద్ద వాహన తనిఖీలు చేపట్టామని తెలిపారు. రహదారి భద్రత నియమాలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనని వాహనదారులను ఎస్పీ హెచ్చరించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ను మూడు సబ్ వివిజన్లలో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యా రెడ్డి, చీపురుపల్లి డీఎస్పీఎస్.రాఘవులు పర్యవేక్షించారన్నారు. -
రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి..
జియ్యమ్మవలస రూరల్: (45) రైల్వే ట్రాక్ మెయింటనెన్స్ నాలుగవ తరగతి ఉద్యోగి, మండలంలోని సింగనాపురం పంచాయతీ తుమ్మల దత్తవలస గ్రామానికి చెందిన బంకపల్లి సత్యనారాయణ రైలు ఢీకొని మృతి చెందాడు. ఈనెల 26న కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే బైపాస్ లైన్ క్యాబిన్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఆ సమయంలో వస్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన గతంలో మిలట్రీలో పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నారు. దుర్ఘటన అనంతరం మృతుని కుటుంబానికి సమాచారం అందించి మృతదేహానికి పెద్దాపురం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బుధవారం ఆయన స్వగ్రామమైన తుమ్మల దత్తవలసకు రైల్వేసిబ్బంది తరలించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య సంధ్యారాణి, కుమారుడు నాని, కుమార్తె శశితో పాటు తండ్రి బంకపల్లి రాములు, తల్లి రేగాలమ్మ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. కుటుంబ పెద్ద సత్యనారాయణ మృతితో కుటుంబమంతా తీవ్ర మనస్థాపానికి గురైంది. సీతానగరం: మండలంలోని జాతీయ రహదారిపై మరిపివలస జంక్షన్ వద్ద రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఆర్టీసీబస్సు ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 13 మంది గాయాల పాలయ్యారు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో సీతానగరం మీదుగా రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు మరిపివలస జంక్షన్ వద్ద ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సుకు ఎడమ భాగాన సీట్లో కూర్చున్న బొబ్బిలి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ఎ.శ్రీను(41) మృతి చెందగా బస్పులో ఉన్న 13 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను పార్వతీపురంలోని ప్రైవేట్, ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రాజేష్ మాట్లాడుతూ శ్రీను మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలియజేశారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. బొబ్బిలి: మున్సిపాలిటీ పరిధి యాతవీధి లో నివాసముంటు న్న గొంప దాడిబా బు(27) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. దీనిపై ఎస్సై ఎల్. రమేష్ తెలియజేసిన వివరాల ప్రకారం బుధవారం ఇంటి పక్కనే ఉన్న పూరిపాకలో నిద్రించాడని, దాడిబాబు ఇంటి నుంచి పాకలో ఉన్న ఫ్యాన్కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వగా ఆ వైరు అక్కడక్కడా తెగి ఉండడంతో ప్రమాదవశాత్తు తగిలి షాక్కు గురై మృతి చెందాడని తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం వారికి అప్పగించామని తెలిపారు.మృతుడు దాడిబాబుకు భార్య రాధ ఉంది.కొమరాడ: మండలంలోని గంగరేగువలస గ్రామానికి చెందిన దాసరి తిరుపతి(50) పాము కాటుతో మృతి చెందాడు. బుధవారం రాత్రి వినాయక నిమజ్జనం చేసుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రహదారిపై తిరుపతిని పాము కాటు వేసింది. దీంతో గ్రామస్తులు ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణం విడిచాడు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. -
కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లు
పార్వతీపురం రూరల్: రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతూ కోట్ల రూపాయల డబ్బుపై అనేక రకాలుగా ఆశ చూపించి సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారు. ఒక్క పార్వతీపురానికి సంబంధించి గత జనవరిలోనే అక్షరాలా కోటి రూపాయలపై చిలుకు నగదును సైబర్ నేరగాళ్లు నాలుగు కేసులకు సంబంధించి కొల్లగొట్టారంటే ఏ స్థాయిలో సైబర్ వలలో ప్రజలు పడుతున్నారో తేటతెల్లమవుతుంది. ముందుగా సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు ఉన్న బ్యాంకు నమూనాలతో లింకులు పంపించి అలాగే మతపరమైన లింకులు పంపించి ఆ లింకులు తెరిస్తే, తెరిచిన వారి వాట్సాప్, టెలిగ్రామ్ అకౌంట్లను ఆధీనంలోకి తెచ్చుకుని వారి కాంటాక్ట్లకు కూడా లింకులు పంపించి ప్రత్యేకంగా గ్రూపులు క్రియేట్ చేస్తూ ఈజీ రిటర్న్స్’ ప్రామాణికంలో డబ్బులు వస్తాయని ఎర చూపుతున్నారు. ఈ మేరకు పార్వతీపురం పట్టణంలో ముగ్గురు, రూరల్ పరిధిలో ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసలు ఇటీవల కేసులు నమోదు చేశారు. ఇద్దరు ఉద్యోగుల నుంచి రూ.96లక్షలు పట్టణంలోని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని సైబర్ వలలో పడి ఏకంగా రూ.46లక్షలు పోగొట్టుకున్నారు. అలాగే ఓ మెడికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్న వ్యక్తి దగ్గర నుంచి రూ.48లక్షలు ఆన్లైన్ ద్వారా దోచుకున్నారు. ఇంకా ఇటీవల పార్ట్టైమ్ ఉద్యోగం, ఈజీ రిటర్న్స్ పేరిట ఓ మహిళ నుంచి రూ.4,30,000 లు కాజేశారు. రూరల్ పరిధిలో ఏకంగా ఓ పోలీసు ఉద్యోగికి రూ.60వేలు ఆశ చూపించి దోచేశారు. అయితే ముందుగా గ్రూప్లో యాడ్అయిన అనంతరం కొంతమొత్తాన్ని పెట్టుబడిగా పెడితే అనతికాలంలోనే పెట్టుబడికి కలిపి మరికొంత డబ్బును ఖాతాలో జమచేసి ఎరవేస్తారు. అనంతరం లక్షల మేర డిపాజిట్లు చేస్తున్నప్పుడు ఆయా సాఫ్ట్వేర్లో బాధితులకు లక్షల రూపాయలు వచ్చినట్లు చూపిస్తూ ప్రస్తుతానికి బాధితుల ఖాతానుంచి తీయడం కుదరదంటూ మరికొంత డబ్బులను జమచేస్తేనే ఖాతాలో లక్షల రూపాయలు క్రెడిట్ అవుతాయని ఆశ చూపించి ఎరవేస్తారు. బాధితులు తమ వద్ద మరి డబ్బులు లేవని తెలిపే సమయానికి మొత్తం గ్రూపును డిలీట్చేస్తూ వారి అసలు రూపాన్ని చూపిస్తారు. ఈ తరహాలోనే మోసాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు కొల్ల గొడుతున్నారు. పట్టణ పరిధిలో జనవరి నుంచి రూ.కోటి మేరకు లూటీ సామాజిక మాధ్యమాల్లో లింకులతో ఎర ఇద్దరు ఉద్యోగుల నుంచి 94లక్షలు కాజేసిన నేరగాళ్లుఅవగాహనతోనే అరికట్టవచ్చుఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాల ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. అయినప్పటికీ ఉద్యోగులు, చదువుకున్న వ్యక్తులు ఈ విధంగా మోసాలకు గురవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు గుర్తుతెలియని వ్యక్తులు సులువు పద్ధతిలో డబ్బులు ఇస్తామని చెబితే ఎలా నమ్ముతున్నారో అర్ధం కావడం లేదు. ఇప్పటికే జరిగిన కేసులకు సంబంధించి సైబర్ నేరగాళ్లు ఇతర రాష్ట్రాలైన బీహార్, రాజస్థాన్, తదితర రాష్ట్రాలకు చెందిన వారిగా ప్రాథమిక సమాచారం ఉంది. ఎస్పీ ఆదేశాలతో సామాజిక మాధ్యమాల్లో, బహిరంగ ప్రదేశాల్లో, కళాశాలల్లో, వివిధ కూడళ్లలో శాఖాపరంగా అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు అవగాహన కలిగి ఉండి ఆన్లైన్ కాల్స్ను నిర్ధారించకుండా తమకు తెలిసిన వారని చెప్పినా అది నిజమో, అబద్ధమో నిర్ధారణ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆఫర్లు అంటూ, పార్ట్టైం ఉద్యోగాంటూ వచ్చిన లింకులను తెరవకూడదు. – కె. మురళీధర్, పార్వతీపురం పట్టణ సీఐ -
డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
విజయనగరం అర్బన్: డీఎస్సీ–2025 సెలక్షన్ జాబితా జిల్లా అభ్యర్థు ల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ డెంకాడ మండ లం మోపాడలోని ఓ ప్రైవేటు స్కూల్లో గురువా రం ప్రారంభమైంది. సెలక్షన్ జాబితాను బహిరంగంగా ప్రకటించకుండా ఎంపికై న అభ్యర్థుల వ్యక్తిగత మెయిల్స్లో మాత్రమే పంపడం వల్ల సెలక్షన్ కాల్స్ రాని మంచి ర్యాంకుల అభ్యర్థులు కూడా కొందరు పరిశీలన కేంద్రానికి రావడం కనిపించింది. గతంలో జరిగిన అన్ని డీఎస్సీల్లోనూ సెలక్షన్ జాబితాను తొలిత బహిరంగంగా ప్రకటించేవారు. పోస్టుకు కటాఫ్ మార్కులపై అభ్యర్థులకు ఆ విధా నం నుంచి స్పష్టత లభించేదని అభ్యర్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత డీఎస్సీ సెలక్షన్ జాబితా ప్రకటించిన విధానంపై పలువురు అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తొలి రోజున తప్పని సర్వర్ డౌన్ సమస్యలు ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభించిన తరువాత ఉదయం పూట పూర్తిగా సర్వర్ డౌన్ ఇబ్బందులు తప్పలేదు. దీని కారణంగా ఇటు పరిశీలన బృందం, అభ్యర్థులు నిరీక్షించాల్సి వచ్చింది. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో వివిధ కేటగిరిల కింద 583 టీచర్ పోస్టులకు డీఎస్సీ–2025 నోటిఫికేషన్ విడుదల అయింది. వాటి భర్తీకి సంబంధించిన ప్రక్రియలో భాగంగా చేపడుతున్న రెండు రోజుల ధ్రువపత్రాల పరిశీలనలో తొలి రోజున 398 మంది అభ్యర్థుల పరిశీలన పూర్తయింది. వీరిలో రెండు, అంతకంటే ఎక్కువ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులు తొలి ప్రాధాన్యత పోస్టులకే పరిమితం అయ్యారు. ఇలాంటి అభ్యర్థుల కారణంగా మిగిలిన పోస్టులకు తర్వాత ర్యాంకర్లకు ఈ రోజే కాల్ లెటర్స్ని వ్యక్తిగత సమాచారంగా పంపుతారని డీఈవో యు.మాణిక్యంనాయుడు తెలిపారు. రెండో రోజు కేటాయించిన 182 పోస్టులతో పాటు వీరికీ ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో భర్తీ చేస్తున్న పోస్టులు 583 ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో వివిధ కేడర్ ఉపాధ్యాయ పోస్టుల ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ యాజమాన్యాల పాఠశాలలకు చెందిన పోస్టులు 446, ట్రైబుల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో మరో 137 పోస్టులు నోటిఫికేషన్లో ఉన్నాయి. అదే విధంగా జోన్–1 (నాలుగు ఉమ్మడి జిల్లాల) పరిధిలో భర్తీ చేసే ఏపీఆర్ఎస్/ఏపీఎంఎస్/ఏపీఎస్డబ్ల్యూ/బీసీవెల్ఫేర్/ట్రైబుల్ వెల్ఫేర్ తదితర సంక్షేమ సంస్థల గురుకులాల జోన్ల స్థాయి పోస్టులు ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ కేటగిరి పోస్టులు 400 వరకు ఉన్నాయి. -
వారంలో ఆరు చెరువుల పనులకు ప్రతిపాదనలు : కలెక్టర్
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఆరు మైనర్ ఇరిగేషన్ చెరువులకు సంబంధించిన ప్రతిపాదనలను వారం రోజుల్లోగా పూర్తి చేస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్కు గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో వివరించారు. వందెకరాలు దాటినవి, ఉవా ఆధ్వర్యంలో ఉన్న మైనర్ ఇరిగేషన్ చెరువులు మరమ్మతులు, పునరుద్ధరణ, విస్తీర్ణంకు సంబంధించిన పనులు కింద ముందుగా గుర్తించామన్నారు. మిగిలిన 100 చెరువులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ మేరకు ఏజెంట్ స్పేస్ డాక్యుమెంట్ అప్లోడ్, పీఎం కుసుమ్, పింఛన్లు, జూవైనల్, జస్టిస్ కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై సీఎస్ సమీక్షించినట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 2,808 చెరువులు ఉన్నాయని, వీటికి సంబంధించి 74 చెరువులకు ఆర్ఆర్ఆర్ కార్యక్రమంతో పనులు నిర్వహించగా మిగిలిన వాటికి ప్రణాళికలు చేస్తున్నామన్నారు. మరో 29 చెరువులకు ప్రణాళికలను వచ్చే నెల 16నాటికి సిద్ధం కానున్నాయన్నారు. అలాగే 29 మెగావాట్ల సోలార్ పవర్ప్లాంట్ నిమిత్తం 97 ఎకరాల స్థలం అవసరం మేరకు ఇప్పటికే 92.95 ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాన్నారు. ఈ మేరకు మరికొన్ని కార్యకలాపాలపై సీఎస్కు వివరించామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్ఓ హేమలత, ఎస్డీసీ ఎస్.దిలీప్చక్రవర్తి, డ్వామా, ఐసీడీఎస్ పీడీలు కె.రామచంద్రరావు, టి.కనకదుర్గ, జిల్లా వ్యవసాయశాఖాధికారి కె.రాబర్ట్పాల్, నీటి పారుదల, జలవనరుల, ఏపీఈపీడీసీఎల్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పార్వతీ తనయా.. పాహిమాం...
వినాయక చవితి ఉత్సవాలు పార్వతీపురం పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ రూపాల్లో గణనాథులు కొలువుదీరారు. పలుచోట్ల ఏర్పాటు చేసిన భారీ వినాయక ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పార్వతీపురం పట్టణంలోని కొత్తవలసలో 21 అడుగుల ఎత్తులో మొక్కజొన్న పొత్తులతో ఏర్పాటు చేసిన గణనాథుడు ప్రత్యేకంగా భక్తులను ఆకర్షించాడు. తెలుగు వారి తొలి పూజ వినాయక చవితిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వినాయక మండపాల వద్ద భక్తులు తొలి రోజు బారులు తీరారు. – పార్వతీపురం టౌన్ -
బాల్య వివాహాలు నేరం
విజయనగరం లీగల్: బాలబాలికలకు 18 సంవత్సరాల లోపు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, రెండు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా ఉంటాయని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు బాల్య వివాహాలపై ఆయన బాబా మెట్టలో గల కేంద్రియ విద్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనేక కారణాలవల్ల చిన్న వయసులోనే బాలికలకు వివాహాలు చేయడం సరైనది కాదన్నారు. చిన్న వయసులోనే వివాహాలు చేయడం వల్ల అనేక అనేక అనారోగ్య సమస్యలు, శారీరక సమస్యలు ఏర్పడతాయని చెప్పారు. బాల్య వివాహాల రద్దు చట్టం గురించి బాల బాలికలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా బాల్య వివాహం జరిగినట్లు లేదా చేస్తున్నట్లు తెలియవస్తే వెంటనే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098కు లేదా జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా కోరారు. ఇప్పటికీ అనేకచోట్ల బాల్యవివాహాలు ఇంకా నమోదవుతున్నాయన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా హైకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతి గ్రామం, విద్యాసంస్థల్లో బాల్యవివాహాల నిషేధం పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యవంతులను చేయాలన్నారు. అవగాహన సదస్సులో కేంద్రియ విద్యాలయం ప్రిన్సిపాల్ దిలీప్ మోడీ, బెజ్జిపురం యూత్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ ఝాన్సీలక్ష్మి అధిక సంఖ్యలో బాల, బాలికలు పాల్గొన్నారు. -
తల్లికి వందనం.. మాకేం సంబంధం..!
● వేలాది మందికి పథకం దూరం ● తల్లుల ఖాతాకు జమ కాని నగదు ● అధిక శాతం ‘కిల్లో స్వప్న’ పేరిటే.. ● కొందరికి అర్హత చూపుతున్నా కలగని లబ్ధి ● పట్టించుకోని అధికారులుసాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్ : కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం పొందడం లబ్ధిదారులకు ప్రహసనంగా మారింది. ఇంట్లో ఎందరు చదువుకున్న పిల్లలు ఉన్నా.. అందరికీ వర్తింపజేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఒక్క మన్యం జిల్లాలోనే వేలాది మందికి పథకం లబ్ధిని దూరం చేసింది. వేరొకరి కరెంటు బిల్లులు ఆధార్తో లింకు కావడం, భూమి లేకున్నా ఉన్నట్టు చూపడం.. ఇలాంటి సమస్యలే కాక, తల్లుల పేర్లు కూడా మారిపోవడం గమనార్హం. సీతానగరం, పార్వతీపురం, పాలకొండ, కొమరాడ, కురుపాం.. ఇలా అనేక మండలాల్లో తల్లి స్థానంలో ‘కిల్లో స్వప్న’ పేరు నమోదు కావడం విశేషం. విద్యాసంవత్సరం ప్రారంభంలో తల్లికి వందనం పథకం నిధులను ప్రభుత్వం విడుదల చేస్తే.. అన్ని అర్హతలూ ఉండి, అధికారుల తప్పిదాల వల్ల పథకానికి దూరమైన తల్లులు నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పాఠశాలకు వెళ్తే.. సచివాలయానికి వెళ్లాలని.. అక్కడికి వెళ్తే ఎంఈవో కార్యాలయంలో అడగాలని.. వారేమో డీఈవో కార్యాలయంలో కలవాలని.. ఇక్కడేమో.. కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో వినతిపత్రం ఇవ్వాలని.. ఇక్కడికి వచ్చేసరికి మళ్లీ పాఠశాలకో, సచివాలయానికో పోవాలని.. ఇలా ఏ ఒక్కరికీ సంబంధం లేనట్టు తప్పించుకుని తిప్పుతున్నారు. జిల్లాలో మొదటి విడతగా 1,08,951 మంది విద్యార్థులు పథకానికి అర్హత సాధించినట్టు అధికారులు ప్రకటించారు. అర్హతలు ఉండి పథకం పొందని విద్యార్థులు ఇంకా వేల మంది మిగిలిపోయారు. కొందరికి ‘ఎలిజిబుల్’ అని జాబితాలో చూపిస్తోంది గానీ, డబ్బులు పడటం లేదు. మలి విడతలో నగదు జమ అవుతుందని అధికారులు చెప్పి పంపించేస్తున్నారు. ఏ ఒక్కరి నుంచీ స్పష్టమైన సమాధానం రాకపోవడంతో తల్లులు నిరుత్సాహానికి గురవుతున్నారు. మా కుమార్తె సీతానగరం జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదువుతోంది. మాకు జమ కావాల్సిన తల్లికి వందనం నిధులు శ్రీదేవి అనే మరొకరి పేరిట జమైపోయాయి. వారిని అడిగితే తమకేమీ సంబంధం లేదని అంటున్నారు. అధికారులను కలసి వినతిపత్రం అందించాం. – ఎం.పుష్పలత, విద్యార్థిని తల్లి, సీతానగరం మాది పాపన్నవలస గ్రామం. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లికి వందనం పథకం డబ్బులు ఇద్దరికీ రాలేదు. ఎవరిని అడిగినా సరిగ్గా స్పందించడం లేదు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశాం. – ఎ.సత్యవతి, విద్యార్థుల తల్లి, సీతానగరం మండలం -
జారిపడి పెయింటర్ మృతి
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ కాలనీకి చెందిన బి.చినరాము (40) ప్రమాదవశాత్తు రెండతస్తుల బిల్డింగ్ పై నుంచి జారిపడి గురువారం అక్కడికక్కడే మృతిచెందాడు. పట్టణంలోని గూడ్షెడ్రోడ్డులో నివాసం ఉంటున్న చినరాము పెయింటర్గా పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి జారిపడి మృతిచెందినట్లు అందిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై గోవింద కేసు నమోదు చేశారు. విద్యార్థుల కొట్లాటపై కేసు నమోదుపట్టణంలో ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు నెలరోజుల క్రితం కళాశాలలో వాగ్వాదం జరిగి గొడవపడిన నేపథ్యంలో బుధవారం పట్టణంలోని నెహ్రూమార్కెట్ ఎదుట లస్సీషాపు వద్ద మళ్లీ ఇరువర్గాలు పడిన ఘర్షణ కొట్లాటకు దారితీయడంతో నలుగురు యువకులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై గోవింద తెలిపారు. -
నేడు భీమసింగిలో జాబ్మేళా
జామి: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యభివృద్ధి సంస్థ, భీమసింగి బాలాజీ డిగ్రీ కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో భీమసింగి బాలాజీ కళాశాలలో శుక్రవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ అధికారి భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేళాకు 17 బహుళజాతి కంపెనీలు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తాయని పేర్కొన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, బీటెక్, ఏదైనా పీజీలో ఉత్తీర్ణత సాధించి 18నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఉదయం 9గంటలకు బాలాజీ కళాశాలకు హాజరుకావాలని కోరారు. తొమ్మిది ఎకరాల జొన్న పంట ధ్వంసం ● లబోదిబో మంటున్న రైతులు ● పట్టించుకోని అటవీశాఖ అధికారులు కొమరాడ: మండలంలోని గుమడ గ్రామానికి చెందిన చిప్పాడ గౌరునాయుడు, గరుగుబిల్లి శంకరరావులకు చెందిన తొమ్మిది ఎకరాల్లోని జొన్న, పత్తి పంటలను ఇటీవల కోటిపాం పరిసరాల్లో సంచరిస్తున్న గజరాజుల గుంపు మంగళవారం అర్ధరాత్రి ధ్వంసం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ వేలాది రూపాయలు పెట్టబడి పెట్టి పంట చేతికి వచ్చిన సమయంలో ఇలా నాశనం అయితే మేము ఏం చేయాలో అర్థం కావడం లేదుని ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దిక్కు లేదుంటూ లబోదిబో మంటున్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. 2018లో వచ్చిన ఏనుగుల గుంపు వేలాది ఎకరాల్లో పంటనష్టంతో పాటు ప్రాణనష్టం జరుగుతున్నటికీ ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటోంది. కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగులను తీసుకువచ్చి అడవి ఏనుగులను తరలించే ప్రకియ చేపడతామని మాటలు చెబుతోందే కానీ కనీసం పట్టించుకోవడం లేదని ఈ ప్రాంత ప్రజలు, రైతులు వాపోతున్నారు. -
తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పూసపాటిరేగ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నందున తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి పి.అచ్యుతకుమారి సూచించారు. మండలంలోని తీర ప్రాంతాలైన కోనాడ, బొడ్డుగురయ్యపేట, తిప్పలవలస, మత్సవానిపాలెం గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించి, ఆయా గ్రామాల్లోని వైద్య శిబిరాలను సందర్శించారు. అనంతరం తుపాను సహాయక చర్యలపై ఆరాతీశారు. ప్రజలకు వైద్యారోగ్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, ఎవరైనా జ్వర లక్షణాలతో బాధపడితే వారికి వెంటనే వైద్యం అందేలా చూడాలన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై అవగాహన కల్పించాలన్నారు. తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ చేపట్టి, జనానికి పరిశుభ్రమైన తాగునీరు అందేలా చూడాలన్నారు. ప్రసవానికి దగ్గరగా ఉన్న గర్భిణులను దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి, సాధారణ ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడి నుంచి పూసపాటిరేగ పీహెచ్సీకి వెళ్లి, వైద్య సిబ్బంది పనితీరు, మందుల నిల్వలు, కుక్క, పాముకాటుల వ్యాక్సిన్లు పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని తెలిపారు. ఆమె వెంట వైద్యాధికారి ప్రమీలాదేవి ఉన్నారు. విజయనగరం అర్బన్: పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రియ గిరిజన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా కోరారు. జిల్లాలోని అదే యూనివర్సిటీలో టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో సుస్థిర పర్యాటకం–ఉపాధి అవకాశాలకు మూలం అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్షాపును గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పండగలు, జాతరలు, తిరునాళ్లు వంటి సామూహిక వేడుకలను పర్యావరణ హితంగా జరుపుకోవాలని సూచించారు. ఈ వర్క్షాపులో భాగంగా పట్టణంలోని సహజ పరిసరాలను విద్యార్థులు సందర్శించి, ప్రజలను కలిసి పర్యావరణకు వారు పాటుపడేలా చైతన్యం చేయాలన్నారు. అలాగే సంప్రదాయ కళలు, హస్తకళల రక్షణను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ప్రొగ్రాం కో–ఆర్డినేటర్ దీపక్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. -
● పొలం బాట...
వర్షాలు కురుస్తుండడంతో ఓ వైపు ఉభాలు... మరోవైపు వరి చేలలో కలుపుతీత పనులు ఊపందుకున్నాయి. పల్లె ప్రజలు ఉదయాన్నేలేచి క్యారేజీలు పట్టుకుని పొలంబాట పడుతున్నారు. పొద్దుకుంకేవరకు పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు. మహిళా కూలీలకు డిమాండ్ పెరిగింది. వరి చేలలో కలుపుతీత పనులకు రోజుకు రూ.250 నుంచి రూ.300 వరకు కూలి గిట్టుబాటవుతోంది. గుంపులు గుంపులుగా పొలాలకు చేరుకుంటున్నారు. దీనికి పాలకొండ–వీరఘట్టం రోడ్డులో పొలంబాట పట్టిన మహిళల చిత్రమే సజీవ సాక్ష్యం. – పాలకొండ రూరల్ -
29న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్మేళా
సాలూరు: ఈ నెల 29 న సాలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాలలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఉషశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. దివిస్ ల్యాబొరేటరీస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళా శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని అన్నారు.ఆసక్తిగల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9440537105 నంబర్ను సంప్రదించాలని సూచించారు. జాతీయ స్థాయి పారా త్రోబాల్ పోటీలకు సచివాలయం ఉద్యోగికొత్తవలస: మండలంలోని గనిశెట్టిపాలెం గ్రామ సచివాలయంలో డిజిటల్ సహాయకుడిగా పనిచేస్తున్న పొటిపిరెడ్డి శ్రీను జాతీయ స్థాయి పారా త్రోబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఒక ప్రకటనలో మంగళవారం ఆయన తెలిపారు.ఈ నెల 8వ తేదీన విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో శ్రీను ఉత్తమ ప్రతిభ కనబర్ఛడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా శ్రీనును పలువురు అభినందించారు. 4.8 కేజీల గంజాయి స్వాధీనంసంతకవిటి: మండలంలోని పొనుగుటివలస పరిధిలోని జీఎమ్ఆర్ఐటీ కళాశాల ఎదురుగా గల మామిడి తోటలో సోమవారం సాయంత్రం 4.8కేజీల గంజాయిని పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు నలుగురు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. పాలకొండ ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సోమవారం రాత్రి కేసు నమోదు చేసి మంగళవారం వారిని అంపోలు సబ్జైలుకు రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. సాలూరులో 5.60 కిలోల గంజాయి.. సాలూరు: పట్టణంలో ఇద్దరు వ్యక్తుల నుంచి గంజాయిని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ పాత బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ రోడ్డు వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని అందిన సమాచారం మేరకు వారి వద్దకు వెళ్లి విచారణ చేస్తున్న క్రమంలో తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఆ వ్యక్తుల బ్యాగుల్లో 5.60 కేజీల గంజాయిని గుర్తించామని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశామని, నిందితులను రిమాండ్కు తరలించామన్నారు. ఏనుగుల గుంపుతో జాగ్రతకొమరాడ: మండలంలోని కోటిపాం పరిసరాల్లో ఉన్న పంట పొలాల్లో తొమ్మిది ఏనుగుల గుంపు సంచరిస్తోంది. అయితే కోటిపాం గ్రామస్తులు సాయత్రం ఆరుగంటల నుంచి తెల్లవారు జామున ఆరు గంటల వరకు బయటకు రావద్దని జిల్లా అటవీశాఖ అధికారి ప్రసూన మంగళవారం ఒక ప్రకటనలో తెలయజేశారు. బయటకు రావాల్సి వస్తే అటవీశాఖ సిబ్బంది సహాయం కోరాలని ఆమె సూచించారు. -
స్మార్ట్ కార్డులు సరే.. సరుకులేవీ?
విజయనగరం ఫోర్ట్: ఓ వైపు రాష్ట్ర ఖజనాలో డబ్బులు లేవని కూటమి ప్రభుత్వం గగ్గోలు పెడుతోంది. మరోవైపు గత ప్రభుత్వ ఆనవాళ్లను దూరం చేసేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందన్నది జనం మాట. దీనికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీయే నిలువెత్తు నిదర్శనం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన రైస్ కార్డులు బాగానే ఉన్నా ఇప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చుచేసి స్మార్ట్ కార్డుల పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 5,73,137 రైస్ కార్డులు ఉన్నాయి. వీరికి కూటమి సర్కారు స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేస్తోంది. దీనికోసం రూ.6 కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తున్నట్టు సమాచారం. స్మార్ట్ కార్డులపై ఉన్న శ్రద్ధ పేద ప్రజలకు ఇచ్చే నిత్యావసర వస్తువులపై లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గత ఏడు నెలలుగా కందిపప్పు సరఫరా నిలివేసి... ఇప్పుడు కార్డులంటూ కొత్త డ్రామాకు తెరతీయడాన్ని దుయ్యబడుతున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.130 నుంచి రూ.140 వరకు ఉంది. రేషన్ షాపుల్లో రాయితీపై కేజీ రూ.67 చొప్పున అందించేవారు. జిల్లాలో రేషన్ లబ్ధిదారులకు అందజేసేందుకు నెలకు 5,73,137 కిలోల కందిపప్పు అవసరం. ఈ లెక్కన నెలకు రూ.7 కోట్లు వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏడు నెలలుగా కందిపప్పు ఇవ్వక పోవడం వల్ల రూ.35 కోట్లు వరకు కూటమి ప్రభుత్వం భారం తగ్గించుకుంది. పేదలకు పప్పును దూరం చేసింది. బయటమార్కెట్లో కొనుగోలు చేసుకుంటున్న రేషన్ లబ్ధిదారులపై ఆర్థిక భారం పడుతోంది. -
వినాయక పూజకు వేళాయె..
పార్వతీపురంటౌన్: వినాయక పూజకు వేళయింది. పల్లెలు, పట్టణాలు సందడిగా మారాయి. వీధివీధినా వెలసిన మంటపాలు, విద్యుత్ దీపాల అలంకరణలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. పల్లె నుంచి పట్టణం దాకా... మురికివాడల నుంచి ఖరీదైన అపార్ట్మెంట్ల వరకు ఎవరి స్థాయిలో వారు అంబరాన్నంటేలా బుధవారం జరుపుకునే విఘ్నేశ్వర పూజకు సర్వం సిద్ధం చేశారు. వినాయక విగ్రహాలు, ప్రతిమలు, పూజాసామగ్రిని మంగళవారం కొనుగోలు చేసి వాహనాల్లో మంటపాలకు తరలించారు. పర్యావరణ స్పృహతో పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి ప్రతిమలను పంపిణీ చేశాయి. పార్వతీపురం మార్కెట్లో చవితి సందడి కనిపించింది. పత్రి, పండ్లు, పూలు, వినాయక వ్రత పుస్తకాల అమ్మకాలు జోరుగా సాగాయి. -
ఉత్సవాలకు స్వయంభూ వినాయకుడు సిద్ధం
● ఈ ఏడాది ఐదురోజుల పాటు ఉత్సవాలు ● భూమిలో పుట్టిన ‘మంతిన’ శిలావినాయకుడిది ప్రత్యేకతరాజాం/సంతకవిటి: వినాయక చవితి అనగానే మంటపాలు వేయడం, ప్రతిమలు తీసుకురావడం నిమజ్జనం చేయడం షరామామూలే. సంతకవిటి మండలంలోని మంతిన గ్రామంలో నారాయణపురం కుడి కాలువ పక్కనే ప్రతిష్టించిన వినాయకుడికి ఈ చవితి పండగలో విశిష్టత ఉంటుంది. ఇక్కడ వినాయకుడికి గుడి కూడా ఉంది. 1960లో నారాయణపురం కుడికాలువ తవ్వుతున్న సమయంలో భూమిలోంచి రాతి(శిల) వినాయకుడి ప్రతిమ గ్రామస్తులకు లభించింది. అప్పట్లో ఈ ప్రతిమను కాలువ పక్కనే ఓ రావిచెట్టు వద్ద గ్రామస్తులు ప్రతిష్టించారు. అప్పటినుంచి ప్రతి ఏడాది ఇక్కడ వినాయకచవితికి గ్రామస్తులు పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. ఐదు రోజుల నుంచి తొమ్మిదిరోజులు పాటు ప్రత్యేక పూజలు, దర్శన కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఏడాది ఎప్పటిలాగానే ఐదురోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పంచాయతీ సర్పంచ్ ఈశ్వరరావు తెలిపారు. నాలుగు అడుగుల భారీ విగ్రహం అప్పట్లో ఇక్కడ ప్రతిష్టించిన వినాయకుడి ప్రతిమ ప్రస్తుతం పెరిగిందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఏడాది ఈ విగ్రహ పరిమాణంలో మార్పు ఉంటుందని తెలిపారు. భారీ కాయం, బొజ్జతో ఇక్కడి రాతి విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. నాలుగు అడుగుల ఈ శిలా విగ్రహాన్ని ఒక్క ఇంచ్ కూడా కదపలేదు. ఇక్కడ ఉత్సవాల సమయంలో మట్టి వినాయకుడి ప్రతిమ తెచ్చి పూజలు చేసి, అనుపు పండగ నిర్వహిస్తారు. మంతిన గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తమ ఇళ్లలో ఏ శుభకార్యక్రమం జరిగినా ముందుగా ఇక్కడే పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. -
విఘ్నాలు తొలగిపోవాలి
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: తెలుగు సంవత్సరంలో వచ్చే తొలి పండగ వినాయక చవితిని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఆది దేవుడు, విఘ్నాలు తొలగించే వినాయక చతుర్థశి సందర్భంగా ఉమ్మడి జిల్లాల ప్రజలకు మంగళవారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఆ గణనాథుని చల్లని చూపుతో, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రెండు జిల్లాలు అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. ఆ పార్వతీపుత్రుని అనుగ్రహంతో విఘ్నాలు తొలగి, అంతటా విజయాలు సిద్ధించాలని కోరారు. పర్యావరణ హితంగా పండగను జరుపుకోవాలని, మట్టి విగ్రహాలను పూజించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు పాటించాల్సిందే.. పార్వతీపురంటౌన్: వినాయక మంటపాల ఏర్పాటులో ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనని సబ్ కలెక్టర్ డా.ఆర్ వైశాలి స్పష్టంచేశారు. వినాయక చవితి పండగ నిర్వహణ, పర్యవేక్షణపై సంబంధిత అధికారులతో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏఎస్పీ అంకితా సురానాతో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైశాలి మాట్లాడుతూ మంటపాలను రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేయరాదన్నారు. డీజే సౌండ్ సిస్టం నిషేధమన్నారు. తిరువీధి, అనుపోత్సవాల్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యావరణ హితం దృష్ట్యా మట్టి విగ్రహాలను పూజించేలా చూడాలన్నారు. స్థలాలు గుర్తించండి పార్వతీపురం రూరల్: జిల్లాకు 80 పంచాయతీ భవనాలు మంజూరయ్యాయని, వీటిలో స్థలాలున్నచోట 68 భవనాల నిర్మాణానికి పరిపాలనా ఆమోదం మంజూరు చేసినట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. మిగిలిన 12 భవ నాల నిర్మాణానికి వెంటనే స్థలాలను గుర్తించి గ్రౌండింగ్ చేయాలని పంచాయతీరాజ్ సహాయ కార్యనిర్వహణ ఇంజనీర్లను ఆదేశించారు. ఒక్కో భవనాన్ని రూ.32 లక్షల నిధులతో పూర్తిచేయాలన్నారు. ఈ నెల 28, 29, వచ్చేనెల 2, 3 తేదీల్లో ఆదికర్మయోగి శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ రామచంద్రరావు, ఐటీడీఏ ఏపీఓ మురళీకృష్ణ, ఎంపీడీఓలు పాల్గొన్నారు. యూరియా పంపిణీలో పక్షపాతం కొమరాడ: మండలంలోని కెమిశీల రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీలో వ్యవసాయ సహాయకురాలు పక్షపాత ధోరణిపై రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఆర్ఎస్కేకు 200 బస్తాల యూరియా వచ్చింది. కూటమి నాయకులు చెప్పినవారికే యూరియా బస్తాలు ఇవ్వడంతో సాధారణ రైతులు నిలదీశారు. గాజులుగూడ, తులసివలస, బంద వలస తదితర గ్రామాల రైతులు కూటమినాయకుల ఒత్తిడితో ఏఏఓ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. రైతులందరికీ యూరి యా అందజేయాలని డిమాండ్ చేశారు. వంగర: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 2,500 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో చేరుతోంది. ప్రాజెక్టు వద్ద 64.49 మీటర్ల నీటిమట్టం నమోదైంది. రెండు గేట్లు ఎత్తి 4వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నట్టు ఏఈ నితిన్ తెలిపారు. -
ప్రభుత్వం బుద్ధి మారేలా చూడవయ్యా..
మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అంటే నమ్మేశాం. అదంతా గ్యాస్ సిలిండర్లు కాదు.. గ్యాస్ అని మెల్లగా అర్థమైంది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే మా మహిళలకు మూడు నామాలు పెట్టేశాడు. ఏడాదికి మూడు ఉచితంగా గ్యాస్ సిలెండర్లు ఇస్తామని చెప్పి కేవలం ఒక్కటంటే ఒక్కటే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అవి కూడా కొంతమందికే వచ్చాయట. మిగిలిన వారు మాకు ఎప్పుడు సబ్సిడీ డబ్బులు పడాతాయేనని కళ్లు కాయాలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సులు వేయిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు ఆర్టీసీలో ఉన్న 20 రకాల సర్వీసుల్లో కేవలం 5 సర్వీసుల్లో మాత్రమే వచ్చి పోవాలని చెప్పకనే చెప్పేశారు. ఆ బస్సుల్లో సీట్లు కోసం మాలో మేమే తన్నులాడుకునే దుస్థితికి దిగజార్చారు. ఇక మేం బతకడమే కష్టంగా ఉంది.. ఇక ఇంకేం పండగ చేస్తాం స్వామీ..! అందరి కష్టాలు తీర్చే నీ పండగ టైముకు జనాలకు కష్టాలు తెచ్చిపెట్టింది ఈ ప్రభుత్వం.. ఏం చేద్దాం వచ్చే ఏడాదికై నా ఈ ప్రభుత్వం బుద్ధి మారేలా చూడవయ్యా.. అప్పటికై నా మా కష్టాలు తీరి.. అన్నీ అనుకున్నట్లు జరిగితే నీకు కొబ్బరి బిళ్లకు బదులుగా ఒరిజినల్ లడ్డూ పెడతాను.. అయినా అదేంటి గణపతీ గతంలో మా ఊళ్లో ఎక్కడా బెల్ట్ షాపే ఉండేది కాదు.. ఈ సారి చూస్తే వీధికొకటి చొప్పున మొత్తం ఐదు బెల్ట్ షాపులున్నాయి. కుర్రోళ్లంతా పొద్దల్లా తాగి తందానాలు ఆడతన్నారు. సాయంత్రం వీధిలోకి వెళదామంటే భయంగా ఉంది. ఈ గణపతి నవరాత్రులు ఎంతలా తాగి ఊగుతారో చూస్తేనే భయంగా ఉంది స్వామి. ఏమో నీ పండగ .. నీ ఇష్టం.. ఎలా చేసుకుంటావో. ఎలా చేయించుకుంటావో నీ దయ... ఉంటాను మరి. .. చల్లగా బతికుంటే వచ్చే ఏడాది కలుద్దాం..! మహిళలకు మూడు నామాలు పెట్టిన చంద్రాలు సార్.... -
బదిలీ కోసం ఎంఈవో1ల నిరీక్షణ
● విద్యాశాఖ డైరెక్టర్కు లేఖ ● అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలంపార్వతీపురం టౌన్: ఎంఈఓ 1లకు సాధారణ బదిలీలు కూడా నిర్వహించినట్లైతే రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎంఈఓలకు ఉపయోగకరంగా ఉంటుందని ఎంఈఓ 1 అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం అన్నారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయ్ రామరాజుకు అసోసియేషన్ పక్షాన లేఖ రాసినట్లు ఆయన మంగళవారం తెలిపారు. 2017 నుంచి మెజారిటీ ఎంఈఓ1లు ఎనిమిదేళ్లుగా ఒకే చోట పని చేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఈఓ1 లు బదిలీల కోసం ఆశతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో అంతర్ జిల్లా బదిలీలతో పాటు ఎంఈఓ 1, 2 లకు జీరో సర్వీస్ తో సాధారణ బదిలీలు కూడా నిర్వహించేందుకు తగిన ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా విద్యాశాఖ డైరెక్టర్కు విజ్ఞప్తి చేసినట్లు సామల సింహాచలంతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్ బుక్సా రవి నాయక్లు తెలిపారు. -
ఉద్యోగం లేదు.. నిరుద్యోగ భృతికి అతిగతీ లేదయ్యా..
చంద్రబాబిచ్చే ఇరవైలచ్చల ఉద్యోగాల్లో వాడికొకటైనా రాకపోతుందా అని మా పెద్దమనవడు ఒకటే ఎదురు చూపులు గణేశా.. పోనీ అందాక నెలకు ఇస్తామన్న మూడువేల రూపాయల నిరుద్యోగ భృతి అయినా వస్తే బాగుణ్ణు.. జేబు ఖర్చులకు వచ్చేదని ఆశపడ్డాడు. అయినా చంద్రబాబును నమ్మితే నిరాశ తప్ప ఇంకేం ఉండదని తెలియని వెర్రి నాగన్న నా మనవడు.. వాణ్ని నువ్వే చూసుకోవాలి గణేశా.. మా యమ్మికి అప్పట్లో జగనన్న ఉన్నప్పుడు ఆసరా డబ్బులొచ్చేవి.. ఇప్పుడు అవన్నీ దుకాణం సర్దేశాడు చంద్రబాబు.. ఇక బాబును నమ్ముకో.. ఉన్నదంతా అమ్ముకో అన్నట్లుగా తయారైంది మా బతుకు. అయినా అన్నీ తెలిసినవాడివి నీకేం చెప్పగలను.. స్వామి! -
అధ్యక్ష పీఠంపై తమ్ముళ్ల సమరం!
● ‘ప్రాంతాల’ మధ్య పోటీ ● పెరుగుతున్న ఆశావహులు ● తెరపైకి రెండు వేర్వేరు అధ్యక్షులు ● కుదరని ఏకాభిప్రాయం సాక్షి, పార్వతీపురం మన్యం: అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష పీఠంపై ‘తమ్ముళ్ల’ మధ్య ఆసక్తికర సమరం నడుస్తోంది. ప్రధానంగా అటు ఏఎస్ఆర్.. ఇటు పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి పోటీ ఏర్పడింది. ఈ సారి ఎలాగైనా అధ్యక్ష పదవి తమకే ఇవ్వాలని రెండు జిల్లాల నుంచి పలువురు పోటీ పడుతున్నారు. దీనిపై రెండు రోజుల కిందట విశాఖపట్నంలో త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎవరికి వారు తమ వాణిని వినిపించారు. వాస్తవానికి అరకు పార్లమెంట్ స్థానం ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారు. ఈ పార్లమెంట్ ఏర్పడిన తర్వాత ఇక్కడ టీడీపీ ఒక్కసారి కూడా గెలిచిన దాఖలాలు లేవు. కొన్ని దఫాలుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులే అరకు పార్లమెంట్ స్థానాన్ని కై వసం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అన్ని విధాలా బలమైన వ్యక్తిని అధ్యక్షునిగా నియమించాలన్న ఆలోచనలో ఉంది. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అధ్యక్ష పీఠం మళ్లీ ఎస్టీకి కేటాయిస్తారా, లేక మరో సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తారా? అన్నది చూడాలి. ఒకవేళ అధ్యక్ష పదవిని ఎస్టీకి ఇస్తే.. ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఎస్టీ లేదా బీసీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెరపైకి ఇద్దరు వేర్వేరు అధ్యక్షులు? మరోవైపు అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా విభజించి అధ్యక్షులను నియమించాలన్న డిమాండ్ కూడా ఉంది. మన్యం జిల్లా పార్టీ అధ్యక్షునిగా బీసీ నాయకునికి అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతుండగా.. ఎస్టీకి ఇవ్వాలని మంత్రి సంధ్యారాణి తదితరులు గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. పార్టీ నాయకత్వంలో కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలకు ప్రాధాన్యమివ్వాలని విప్, ఎమ్మెల్యే జగదీశ్వరి అడుగుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకే అధ్యక్ష పదవి కేటాయించాలని.. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడినే కొనసాగించాలన్న డిమాండ్లూ అటు నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుత పార్లమెంట్ అధ్యక్షునిగా కె.శ్రవణ్కుమార్ ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కూడా అధ్యక్ష పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఆశావహుల జాబితా పెద్దదే.. అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధి ఎక్కువ. పార్వతీపురం మన్యం జిల్లాలో కేవలం నాలుగు నియోజకవర్గాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏఎస్ఆర్కు, మన్యం జిల్లాలకు వేర్వేరు అధ్యక్షుల నియామకం తెరపైకి వచ్చింది. అటు ఎస్టీకి ఇచ్చేసినా.. ఇటు బీసీకి ఇవ్వాలని పలువురు పట్టుపడుతున్నారు. మన్యం జిల్లా నుంచి అధ్యక్ష పదవి రేసులో చాలా మంది పోటీ పడుతున్నారు. జిల్లాలో మూడు ఎస్టీ, ఒక్కటి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ రిజర్వేషన్ కారణంగా బీసీ, ఇతర సామాజిక వర్గాలకు ఎటువంటి సముచిత పదవులూ దక్కడం లేదన్న అసంతృప్తి ఉంది. బలమైన సామాజిక వర్గ నాయకులు తెర వెనుక పాత్రకే పరిమితమవుతున్నారు. ఈసారైనా ఆ పరిస్థితిని మార్చాలని పలువురు కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే భంజ్దేవ్ ఈ పదవి చేపట్టేందుకు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కురుపాం నియోజకవర్గం నుంచి వైరిచర్ల వీరేశ్చంద్రదేవ్, ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ గ్రంథాయల చైర్మన్ దత్తి లక్ష్మణరావు తదితరులు ఆశిస్తున్నారు. వీరేశ్చంద్రదేవ్ 2024 ఎన్నికల్లో కురుపాం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. చివరి క్షణంలో తోయిక జగదీశ్వరి పేరును అధిష్టానం ఖరారు చేసింది. దీంతో అయిష్టంగానైనా పార్టీ గెలుపునకు ఆయన కృషి చేశారు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే జగదీశ్వరి వర్గం.. ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసిందన్న అసంతృప్తి వీరేశ్చంద్రదేవ్ వర్గీయుల్లో ఉంది. గోవా గవర్నర్ ఆశోక్ గజపతిరాజుకు ఈయన బంధువు కూడా. ఆ పరిచయంతోపాటు, వైరిచర్ల కుటుంబం నేపథ్యం ఆయనకు కలిసొస్తుందని సన్నిహితులు అంటున్నారు. ఇదే నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన దత్తి లక్ష్మణరావు కూడా పార్టీలో కీలక పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. పార్వతీపురం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ జగదీష్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్రతో వీరికి బహిరంగంగానే విభేదాలు ఉన్నాయి. జగదీష్కు బలమైన సామాజిక వర్గ నేపథ్యం ఉంది. పార్టీ సీనియర్ నేత అయినప్పటికీ.. గత ఎన్నికలకు ముందు నుంచి బోనెల విజయ్చంద్ర ఏకపక్ష నిర్ణయాలతో ఆయన తెరమరుగయ్యారు. వీరితోపాటు.. మరికొంతమంది కూడా పార్టీలో ముఖ్య పదవుల కోసం పోటీ పడుతున్నారు. -
ఎంపీఎఫ్సీ గొడౌన్లకు బిల్లుల చెల్లింపు
విజయనగరం అర్బన్: నిర్మాణాలు పూర్తయిన ఎంపీఎఫ్సీ (మల్టీ పర్పస్ ఫెసిలిటేటింగ్ సెంటర్) గొడౌన్లకు బిల్లుల చెల్లింపులకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సహకార శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ తన చాంబర్లో సహకార, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన జిల్లాలో నిర్మిస్తున్న ఎంపీఎఫ్సీ గొడౌన్ల పనులపై సమీక్ష చేశారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణాలు పూర్తయిన 11 గొడౌన్లకు ఫైనల్ పేమెంట్, ఒక గొడౌన్కు పార్ట్ ఫైనల్ పేమెంట్ కోసం ప్రతిపాదనలు పంపించాలన్నారు. పనులు మొదలుకాని గొడౌన్లకు అనుమతులు రద్దు చేయాలని తెలిపారు. మిగిలిన వాటి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా సహకార శాఖ అధికారి పి.రమేష్, డీసీసీబీ సీఈవో ఉమామహేశ్వరరావు, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
షెడ్యూల్ తెగలు, కులాల హక్కుల పరిరక్షణకు పటిష్ట చట్టాలు
బొబ్బిలి: షెడ్యూల్ తెగలు, కులాలకు చెందిన ప్రజల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన చట్టాలు పటిష్టమైనవని స్థానిక ప్రిన్సిపల్ జూనియర్ సివిల్జడ్జి హేమ స్రవంతి జానకిరామ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక కోర్టు ఆవరణ, ఎస్సీ బాలికల వసతిగృహంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌర హక్కుల రక్షణచట్టం(1955)షెడ్యూల్ కులాలు, తెగల అత్యాచారాల నివారణ చట్టం(1989)ప్రకారం ఆయా ప్రజల హక్కులు కాపాడడం, అత్యాచారాలు, దురాగతాలను నివారించడం, హక్కుల కల్పన,పునరావాసం వంటివి కల్పించడం జరుగుతుందన్నారు. వారి కోసం ప్రత్యేక న్యాయ విచారణ జరుగుతుందని చెప్పారు. వారిపై జరిగే నేరాలు, దౌర్జన్యాలను అరికట్టేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఉపశమన చర్యలు తీసుకునేందుకు పటిష్టంగా చట్టాలున్నాయని చెప్పారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎం.ఆనందకుమార్, రుంకాన ప్రసాద రావు, పలువురు సీనియర్ న్యాయవాదులు, కక్షిదారులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
వెలుగులో చీకటి కోణం
● పక్కదోవ పట్టిన సీ్త్ర నిధి డబ్బుల కలెక్షన్ ● రేగులపాడు వీఓఏకు నోటీసులు ఇచ్చిన ఏపీఎంవీరఘట్టం: మండలంలోని దశమంతుపురం గ్రామానికి చెందిన గ్రామ సంఘం సహాయకురాలు(వీఓఏ) ఇటీవల గ్రామ సంఘాల సభ్యుల నుంచి కలెక్షన్ చేసిన రూ.2 లక్షలు సీ్త్ర నిధి డబ్బులు బ్యాంకులో జమచేయకుండా సొంత అవసరాలకు వాడుకుని, అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు.ఈ డబ్బులు వెంటనే కట్టకపోతే ఆమెను విధుల నుంచి తొలగిస్తామని వెలుగు అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆమె దారిలోకి వచ్చారు. సొంత అవసరాలకు వాడుకున్న డబ్బులను చెల్లించేందుకు ఒప్పుకున్నారు.ఈ వ్యవహారం మరువక ముందే మరో వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు ఏపీఎం కె.రాము మంగళవారం మీడియాకు తెలిపారు.రేగులపాడు గ్రామానికి చెందిన వీఓఏ తమ గ్రామంలో గ్రామ సంఘాల నుంచి కలెక్షన్ చేసిన సీ్త్రనిధి డబ్బులు సుమారు రూ.1.18 లక్షలు పక్కదోవ పట్టించినట్లు గుర్తించామన్నారు.వెంటనే సీ్త్రనిధి లోన్ డబ్బులు కట్టకపోతే ఆమెను విధుల నుంచి తొలగిస్తామని నోటీసులు పంపించినట్లు ఏపీఎం రాము తెలిపారు. అన్ని గ్రామ సంఘాల అకౌంట్లు కొద్ది రోజుల్లో తనిఖీ చేస్తామన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కొరవడిన పర్యవేక్షణ.. వీరఘట్టం మండలంలో 50 గ్రామ సంఘాలు ఉన్నాయి. వాటి పరిధిలో 1,752 స్వయం సహాయక సంఘాలు ఉండగా 17,683 మంది మహిళలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వారికి సీ్త్ర నిధి కింద రూ.28.12 కోట్లు రుణాలుగా ఇచ్చారు.ఈ రుణాలను వీఓఏలు డ్వాక్రా సంఘాల నుంచి కలెక్షన్ చేసి సీ్త్రనిధి బ్యాంకు ఖాతాకు జమచేయాల్సి ఉంది. అయితే కొంత మంది డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి కలెక్షన్ చేసిన డబ్బులను బ్యాంకులకు సకాలంలో కడుతుండగా ఇంకొందరు సొంత అవసరాలకు వాడుకుని తర్వాత కడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.అయితే ఇంకొందరు పూర్తిగా చెల్లించకుండా అడ్డంగా దొరికిపోతున్నారు. వెలుగు అధికారులు పర్యవేక్షణ చేసి ఉంటే ఇటువంటి తప్పిదాలు జరగవని పలువురు అంటున్నారు.అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి కలెక్షన్ చేస్తున్న రుణాల రికవరీ డబ్బులను సకాలంలో బ్యాంకులో జమచేయాలి.అంతే తప్ప డ్వాక్రా సంఘాల మహిళల డబ్బులు సొంత అవసరాలకు వాడుకుని అక్రమాలకు పాల్పడితే అట్టివారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విధుల నుంచి తొలగిస్తాం. – కె.లలితకుమారి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు -
అర్హులకు కారుణ్య నియామకాలు
● హోంగార్డ్స్ కుటుంబాలతో ఎస్పీ మమేకంవిజయనగరం క్రైమ్: మృతిచెందిన పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. పోలీసు ఉద్యోగుల కుటుంబాల్లో అర్హత ఉన్న వారికి కారుణ్య నియామకాల కోసం చర్యలు చేపడతామని, ఎలాంటి సమస్యలున్నా, సందేహాలున్నా, సహాయం కావాలన్నా నేరుగా తనను కలవవచ్చని ఎస్పీ అన్నారు. మరణించిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలతో డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ మంగళవారం సమావేశమయ్యారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సర్వీసు బెనిఫిట్స్, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. మృతి చెందిన ఒక్కొక్క పోలీసు కుటుంబానికి పెండింగ్లో ఉన్న సరీ్వ్స్ బెనిఫిట్స్, ప్రస్తుతం వాటి స్థితి, ప్రగతి, కుటుంబంలో అర్హత కలిగిన వ్యక్తులకు కారుణ్య నియామకాలు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కార్యాలయ అధికారులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మరణించిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు మినహా మిగిలిన వారికి అన్ని బెనిఫిట్స్ ఇప్పటికే అందజేశామని తెలిపారు. ఇంకనూ కొన్ని కుటుంబాలకు పెండింగ్లో ఏపీజీఎల్ఐ, జీఐఎస్, లీవ్ ఎన్ క్యాష్మెంట్, పెన్షన్, భద్రత ఎక్స్గ్రేషియా వంటి బెనిఫిట్స్ మరణించిన పోలీసు కుటుంబాలకు త్వరితగతిన మంజూరు చేసేందుకు సంబంధిత అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నామని ఎస్పీ తెలిపారు. పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టేందుకు అర్హతలు కలిగిన వ్యక్తులు వెంటనే సర్టిఫికెట్లు జిల్లాపోలీసు కార్యాలయంలో అందజేస్తే, కారుణ్య నియామకాలకు చర్యలు చేపడతామన్నారు. కాగా ఇటీవల ట్రాఫిక్ పోలీసు స్టేషనులో విధులు నిర్వహిస్తూ హోంగార్డ్ పి.శ్రీనివాసరావు మరణించగా, వెల్ఫేర్ గ్రాంట్ కింద మంజూరైన రూ.15 వేల చెక్కును ఆయన సతీమణి పి.లక్ష్మీ ప్రసన్నకు ఎస్పీ వకుల్ జిందల్ అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీపీఓ పరిపాలనాధికారి పి.శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు, ఆఫీసు సూపరింటెండెంట్లు టి.రామకృష్ణ, వెంకటలక్ష్మి, ఆర్ఎస్సై ప్రసాదరావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.శ్రీనివాస రావు, జిల్లా పోలీసు కార్యాలయం ఉద్యోగులు, పోలీసు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
గిరిజనుల చెంతన విద్యా దీపం
దత్తిరాజేరు: కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయనికి 2023 ఆగస్టు 25వ తేదీన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసిన చోటే శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి, గిరిజనుల జీవితాల్లో కాంతులు నింపాలంటే ఈ విద్యాదీపం నిబంధనల ప్రకారం వారి చెంతనే ఉండాలన్న కృత నిశ్చయంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంజూరు చేశారు. ప్రస్తుతం విజయనగరం శివారు గాజులరేగ వద్ద ఏయూ స్టడీ సెంటర్లో తాత్కాలికకంగా కొనసాగుతోంది, ఈ ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థను ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సాలూరు పరిధిలోని మెంటాడ మండలం, గజపతినగరం నియోజకవర్గం పరిధిలోని దత్తిరాజేరు మండలాల మధ్యలో చినచామలాపల్లి, మర్రివలస రెవెన్యూలో 561.88 ఎకరాల విస్దీర్ణంలో సువిశాలమైన ప్రకృతి రమణీయతతో చక్కని ప్రాంతంలో విద్యా సౌరభాలు విరబూయనున్నాయని ఈ ప్రాంత ప్రజలు, విద్యావేత్తలు ఆనందోత్సాహంలో ఉన్నారు. 120 అడుగుల వెడల్పు రోడ్డు పనులతో పాటు తరగతి భవనాలు(అకడమిక్ బ్లాక్) పరిపాలన భవనం(అడ్మిన్ బిల్డింగ్) బాలికలు, బాలురు వసతి గృహాలు రానున్న విద్యా సంవత్సరానికి పూర్తి చేయడానికి కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తుండడంతో పనులు చక చకా జరుగుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. పూర్తిస్థాయిలో సౌకర్యాల కల్పన కోసం కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో తాగునీరు ఇతరత్రా నీటి అవసరాలను తీర్చేందుకు రూ.7 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పనులు గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రారంభమై పూర్తయ్యాయి. అలాగే పైప్లైన్ పనులు కూడా కొలిక్కి వస్తున్నాయి, మౌలిక వసతుల కల్పనకు నిధులు, రైతుల నుంచి సేకరించిన భుములకు పరిహారం చెల్లింపునకు గత ప్రభుత్వం హయాంలోనే రూ.61.06 కోట్లు మంజూరై పంపిణీ కూడా జరిగింది. రూ.16 కోట్లు అప్రోచ్ రోడ్డుకు డ్రైయిన్లు, అలాగే విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం మరో రూ.48.61 లక్షలు కేటాయించింది. అప్పటికే ఆ భూముల్లో ఉన్న 220 కేవీ విద్యుత్ టవర్లు తొలగించడానికి రూ.12.43 లక్షలు మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయి, ఫలిస్తున్న నాయకుల కృషి ఉత్తరాంద్రకు పెద్ద దిక్కయిన రాష్ట శాసన మండలి ప్రతిపక్ష నేత, అప్పటి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెనుకబడిన ప్రాంతంలో గిరిజన నియోజక వర్గానికి విద్యా కుసుమం లాంటి వర్సిటీ రావాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని గిరిజన శాఖ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడక రాజన్నదొరతో కలిసి ఒప్పించడంతో నేడు ఉమ్మడి జిల్లా విజయనగరంలో వర్సిటీ నిర్మాణం జరగడం శుభపరిణామమని పులువురు ప్రశంసిస్తున్నారు. వర్సిటీ ముఖద్వారం గజపతినగరం నియోజకవర్గం వైపు రావడంతో జాతీయ రహదారి మీదుగా రాక పోకలు సాగడానికి అప్పటి గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య చేసిన కృషిని నియోజకవర్గ, జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. యూనివర్సిటీకి వైజాగ్. భోగాపురం ఎయిర్ పోర్టులు దగ్గరగా ఉండడం, కోమటిపల్లి, బొబ్బిలి రైల్వే స్టేషన్లు కూడా దగ్గరలో ఉండడంతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విద్యను అభ్యసించేందుకు వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం చాలా దగ్గరగా ఉండడం గమనార్హం. నెరవేరనున్న జగనన్న ఆశయం కేంద్రియ విశ్వ విద్యాలయానికి సొంత క్యాంపస్ రూ.834 కోట్లతో సువిశాల ప్రాంగణంలో భవన నిర్మాణం ఇప్పటికే సిద్ధమవుతున్న అడ్మిన్, అకడమిక్ బ్లాక్ బిల్డింగ్లు వచ్చే విద్యా సంవత్సరానికి అంతా సిద్ధం -
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు పతకాలు సాధించారు. జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని శాప్ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి పాల్గొన్న క్రీడాకారులు రెండు బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకం కై వసం చేసుకున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు లీలాకృష్ణ, శ్రీకాంత్లు తెలిపారు. పతకాలు సాధించిన వారిలో పి.వసంత, ఎస్.దివ్యవాణి, ఎస్.శ్రావణి, బి.నీలిమ, పి.పవన్కల్యాణ్లు ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి శ్రీధర్ అభినందించారు. కిమిడి సోదరుడి మృతిరేగిడి: మండల కేంద్రం రేగిడి గ్రామానికి చెందిన కిమిడి నీలంనాయుడు (71) సోమవారం ఉద యం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు, మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతిరావుకు స్వయానా సోదరుడు. నీలంనాయుడు గతంలో సర్పంచ్గా పనిచేశారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. చిట్టీల పేరుతో టోకరాభోగాపురం: మండలంలోని సిమ్మపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రూ.22 లక్షలు చిట్టీలు వేసి ఉడాయించేందుకు సిద్ధమవ్వగా చిట్టీలు వేసిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై పాపారావు ఇరు వర్గాలను పిలిపించి విచారణ చేపట్టగా చిట్టీలు వేసిన వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్ అడడం వల్ల డబ్బులు పోయి అప్పుల్లో మునిగిపోయానని చెప్పాడు. తాను ఎవరిని మోసం చేయనని, అప్పులు తీర్చేద్దామని సిమ్మపేటలో తనకున్న ఇల్లును ఇతరులకు అమ్మేయగా వచ్చిన ఆ డబ్బులను పెద్దమనుషుల దగ్గర ఉంచానని చెప్పాడు. ఇంతలో బాధితులంతా కలిసి అప్పులు తీర్చమని అడగ్గా వారికి చిట్టీల నిర్వాహకుడు రాసి ఇచ్చిన ప్రాంసరీ నోట్లను పోలీసులకు చూపించి తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
అర్జీదారుల సమస్యకు తగిన పరిష్కారం చూపండి
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ● పీజీఆర్ఎస్కు 107 అర్జీలుపార్వతీపురం రూరల్: అర్జీదారుల సమస్యలకు తగిన పరిష్కారం చూపించి కచ్చితమైన సమాచారాన్ని అందజేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులకు తేల్చి చెప్పారు. పరిష్కారం కాకపోతే అందుకు గల కారణాలతో కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని వారికి అందజేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ సుధారాణిలు అర్జీదారుల నుంచి మొత్తం 107 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతి సమస్యను సావధానంగా పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లాలో ఉన్న పలుశాఖల ఉన్నతాధికారులు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించండి: ఏఎస్పీ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించి ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని ఏఎస్పీ అంకితా సురానా అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ఏఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత స్టేషన్ అధికారులకు సిఫార్సు చేశారు. కార్యక్రమంలో 3 ఫిర్యాదులు అందాయి. డీసీఆర్బీ ఎస్సై ఫకృద్దీన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 21 అర్జీలు సీతంపేట: ఐటీడీఏలో సోమవారం ప్రాజెక్టు అధికారి పవర్ స్వప్నిల్, జగన్నాథ్ నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 21 అర్జీలు వచ్చాయి. పట్టులోగా ఆశ్రమపాఠశాలలో కుల దూషణపై, ఇతర సంఘటనలపై గ్రూప్వన్ అధికారితో విచారణ చేయించాలని స్కూల్ కమిటీ చైర్మన్ సవర లక్ష్మీనారాయణ, గిరిజన సంఘం నాయకులు సవర ధర్మారావు తదితరులు వినతిపత్రం ఇచ్చారు. లాడ గ్రామంలో అంతర్గత సీసీ రహదారులు నిర్మించాలని గ్రామస్తులు కోరారు. తోరికవలసకు నూతన పాఠశాల భవనం నిర్మించాలని పి.లక్ష్మయ్య అర్జీ ఇచ్చారు. వడ్డంగిగూడకు చెందిన రఘు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీవో చిన్నబాబు, డిప్యూటీఈఓ రామ్మోహన్రావు, ఈఈ రమాదేవి, వ్యవసాయాధికారి వాహిని తదితరులు పాల్గొన్నారు. -
● సమసిన వివాదం
రామభద్రపురం: మండలంలోని జగనన్న కాలనీ సమీపంలో ఉన్న ఆల్ట్రాటెక్ సిమెంట్ గోదాం వద్ద ఆదివారం సాయంత్రం విద్యుత్ షాక్ తగిలి మండలం పరిధిలో గల జన్నివలస గ్రామానికి చెందిన ముచ్చుపల్లి శ్రీనివాసరావు మృతి చెందిన సంఘటన తెలిసిందే. అయితే ఇదే విషయంపై మృతుడి కుటుంబసభ్యులు గోదాం యజమానికి సమాచారం ఇవ్వగా తనకేమీ తెలియదన్నట్లు యాజమాన్యం కనీసం స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించ నివ్వకుండా కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. అలాగే గ్రామపెద్దలతో పాటు ప్రజలు సుమారు 200 మందితో కలిసి జీవనాధారమైన ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. సిమెంట్ గోదాంలో పనిచేస్తూ యాజమాన్యం నిర్లక్ష్యానికి బలైన శ్రీనివాసరావు కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఎస్సై వి. ప్రసాదరావుతో పాటు జన్నివలస గ్రామ పెద్దలు, రామభద్రపురం గ్రామ పెద్దలు, రామభద్రపురం సిమెంట్ వ్యాపారులు సిమెంట్ గోదాం యజమానితో మృతుని కుటుంబానికి పరిహారం చెల్లించి న్యాయం చేయాలని చర్చించారు. యజమాని ససేమిరా అంటూ పరిహారం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో కార్మిక యాక్ట్ ప్రకారం యాజమాన్యంపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవలసి ఉంటుందని హెచ్చరించడంతో దిగొచ్చిన యాజమాన్యం విద్యుదాఘాతంతో మృతిచెందిన శ్రీనివాసరావు కుటుంబానికి సుమారు రూ.4 లక్షల వరకు పరిహారం ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలిసింది. దీంతో కుటుంబసభ్యులతో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు శాంతించి వివాదం ముగించారు. వెంటనే మృతదేహాన్ని ిపోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి పోలీసులు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. గోదాం యజమాని నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణ మృతిపై సమాచారం ఇచ్చినా స్పందించని యాజమాన్యం మృతదేహం కదిలించేది లేదని కుటుంబసభ్యుల మొండి పట్టు -
పాఠశాల పక్కనే పశువుల అక్రమ రవాణా
కొమరాడ: మండలంలోని చిన మార్కొండపుట్టి గ్రామంలో మండల పరిషత్ పాఠశాల పరిసరాల్లో పరశురాంపురం కేంద్రంగా అక్రమ పశు దందా జరుగుతోంది. కొంతమంది పశువుల అక్రమ రవాణా వ్యాపారులు పాఠశాల పక్కనే వందలాది పశువులు కడుతుండడం వల్ల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశాలోని రాయగడ, అమలబడి తదితర ప్రాంతాల నుంచి కిలోమీటర్ల దూరం వాటిని నడిపించి గ్రామానికి తీసుకు వస్తున్న నేపథ్యంలో అవి నడవలేక రక్తస్రావంతో పాటు నీరసంతో పశువులు మృతి చెందడంతో ఆ పరిసర ప్రాంతంలో పశు కళేబరాల కుళ్లు కంపుతో పాటు దోములు, దుర్వాసన రావడంతో విద్యార్థులు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటారని గ్రామస్తులు ఎంత చెప్పినా అక్రమ వ్యాపారులు పట్టించుకోవడం లేదు. ఎన్నిమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు వాపోతున్నారు. పాఠశాల పరిసరాల్లో అక్రమ పశుదందాను అరికట్టాలని వారంతా కోరుతున్నారు. -
నిబంధనలు పాటించకపోగా అవమానం
● మున్సిపల్ కమిషనర్పై చైర్పర్సన్ ఫిర్యాదుపార్వతీపురం రూరల్: తానొక ప్రథమ పౌరురాలు, బీసీ నేత అని చూడకుండా, ప్రోటోకాల్ పాటించకుండా ఉద్దేశ పూర్వకంగా నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ తనను మున్సిపల్ కమిషనర్ జి.శ్రీనివాసరాజు అవమాన పరుస్తున్నారని పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభికకు తనకు జరిగిన అవమానాన్ని వినతిపత్రంలో వివరించారు. ఇటీవల జరిగిన స్వాతంత్య్ర దినం కార్యక్రమంలో ఉదయం 7.30గంటలకు కార్యక్రమానికి రమ్మని కార్యాలయం నుంచి తనకు ఆహ్వానం పంపి మళ్లీ ఫోన్ చేసి 9గంటలకు హాజరు కావాలని సమాచారం అందించారని, తాను 9 గంటలకు వెళ్లగా శాసనసభ్యులు రాలేదని తనతో పాటు తోటి కౌన్సిల్ సభ్యులను నిరీక్షించమని చెప్పి 10 గంటల వరకు కాలయాపన చేశారన్నారు. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా పట్టణ ప్రథమ పౌరురాలైన తనతో జాతీయజెండాను ఎగురవే యించాల్సిన నేపథ్యంలో కావాలని ఉద్దేశపూర్వకంగా చైర్పర్సన్ అయిన తనను అవమాన పరుస్తూ శాసనసభ్యుడితో ఎగురవేయించారని తెలిపారు. అలాగే పట్టణ పరిధిలో ఈ నెల 20న బైపాస్ రోడ్డులో జరిగిన సీసీ కాలువ భూమి పూజ కార్యక్రమానికి ప్రోటోకాల్ నిబంధనలు పాటించకుండా కావాలనే తనను అవమానపరుస్తున్నారని చైర్పర్సన్ గౌరీశ్వరి తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై న తనపై కమిషనర్ శ్రీనివాసరాజు ప్రోటోకాల్ ఉల్లంఘన కింద ఈ విధంగా ప్రవర్తించకుండా తగుచర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అలాగే ప్రాంతీయ మున్సిపల్ సంచాలకుడికి ఫిర్యాదు చేస్తున్నట్లు ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. -
సమస్యలు పరిష్కరించకపోతే చర్యలు
● కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ● పీజీఆర్ఎస్కు 188 వినతులువిజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే వినతులను లాగిన్లో నిర్దేశిత సమయంలో పరిష్కరించకపోతే జిల్లా అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ హెచ్చరించారు. అధికారులు ఎప్పటికప్పుడు లాగిన్లో చూడాలని చూడవలసిన కాలమ్లో ఎప్పుడు చూసినా సున్నా పరిష్కారం కనపడాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశమందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్కు 188 వినతులు అందాయి. కలెక్టర్తోపాటు జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఎస్డీసీలు మురళి, ప్రమీలా గాంధీ, వెంకటేశ్వరరావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 36 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించారు. సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ 36 ఫిర్యాదులను స్వీకరించారు. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: కంటకాపల్లి, కొత్తవలస రైల్వే లైన్లో గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నామని ప్రభుత్వ రైల్వే ఎస్సై బాలాజీరావు సోమవారం తెలిపారు. మృతుడికి సుమారు 30నుచి 35 ఏళ్ల వయస్సు ఉంటుందని సుమారు 5 అడుగుల 6 అంగుళాల పొడవు ఉంటాడన్నారు. చామన ఛాయ రంగుతో ఉన్న మృతుడు ఎరుపు రంగు ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్, లైట్ గ్రే కలర్, నీలం రంగు గల షార్ట్తో ఉన్నాడన్నారు. ఆ వ్యక్తిని గుర్తు పట్టినట్లయితే ఫోన్ 9490617089, 6301365605 నంబర్లకు కానీ జీఆర్పీ ల్యాండ్లైన్ నంబర్ 08912883218కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. చెరువులో పడి వ్యక్తి మృతిగంట్యాడ: మండలంలోని మదనాపురంగ్రామానికి చెందిన లగుడు సురేష్ (40) గ్రామంలోని ముని అక్కమ్మ చెరువులో పడి మృతి చెందాడు. సోమవారం ఉదయం 7:30 గంటల సమయంలో కలువు పువ్వులు తీసుకోవడానికి చెరువులోకి ఈదుకుంటూ వెళ్లాడు. చెరువు మధ్యలోకి వెళ్లిన తర్వాత లోతు ఎక్కువుగా ఉండడంతో నీటిలో మునిగి ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. కూలిన ఇంటి గోడకొమరాడ: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కొమరాడ మండలంలోని పరుశురాంపురంలో సోమవారం వేకువజామున ఐదు గంటల ప్రాంతంలో గ్రామానికి చెందిన కొత్తకోట బాలకృష్ణ పాత్రుడు, సత్యనారాయణ పాత్రుడుల పాత ఇంటి గోడ కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని స్థానికులు తెలిపారు. అధికారులు తమను ఆదుకోవాలని బాధితులు కోరారు. బహిరంగంగా మందు కొడితే చర్యలు ● ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరికవిజయనగరం క్రైమ్: జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పనని ఎస్పీ వకుల్ జిందల్ మరోసారి సోమవారం మందుబాబులను హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మందుబాబులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్లు చేపట్టినట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ న్యూసెన్స్ చేస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై దాడులు చేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలని, పట్టుబడిన మైనర్లు, మందుబాబులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులకు ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లేఅవుట్లు, గ్రామ శివారు, నగర శివారు ప్రాంతాల్లో, బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై పోలీసు అధికారులు, సిబ్బంది డ్రోన్లతో దాడులు నిర్వహిస్తున్నారని ఎస్పీ తెలిపారు. ఈ నెలలో ఇప్పటివరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై 1520 కేసులు నమోదు చేశామన్నారు. -
పోస్టల్ బీమా ఏజెంట్ల నియామకానికి ఆహ్వానం
విజయనగరం టౌన్: విజయనగరం డివిజన్ తపాలాశాఖ పరిధిలో తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా ఏజెంట్లుగా పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని విజయనగరం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కొల్లూరు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి 29 వరకూ అభ్యర్థులు తమ బయోడేటా, ఫొటో, ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని కోరారు. నియామకం పూర్తయిన ఏజెంట్లకు పాలసీననుసరించి కమీషన్ ఇవ్వనున్నామని, నెలవారీ జీతం ఉండదని స్పష్టం చేశారు. 5వేల జనాభాకు తక్కువగా ఉన్న ప్రాంతంలో పదోతరగతి, 5వేల జనాభాకు పైన ఉన్న ప్రాంతంలో ఇంటర్ ఉత్తీర్ణులై, మార్కెటింగ్, ఇన్సూరెన్స్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. అభ్యర్థులు కార్యాలయం పనివేళల్లో సంప్రదించాలని సూచించారు. -
వారి వల్లే కాదంటున్నారు.. మరెవరికి చెప్పుకోవాలి!
బలిజిపేట మండలం పెదపెంకి గ్రామానికి చెందిన ఈయన పేరు గుల్లిపల్లి నారాయణరావు. పెదపెంకి గ్రామ రెవెన్యూ పరిధిలో ఈయనకు 0.98 సెంట్ల భూమి ఉంది. వీరి ఖాతాకు ఇంకెవరిదో ఆధార్ లింకు అయిపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు, ఇతర రాయితీలేవీ అందుకోలేకపోతున్నాడు. ఇదే కారణంతో ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన అన్నదాత సుఖీభవ లబ్ధిని కూడా పొందలేకపోయాడు. దీనిపై గ్రామ వ్యవసాయ సహాయకులు, వీఆర్వో, తహసీల్దారులను కలిస్తే.. తొలగించడం తమ చేతుల్లో లేదని చేతులెత్తేస్తున్నారు. దీంతో పీజీఆర్ఎస్కు వచ్చి ఆయన అర్జీ పెట్టుకున్నాడు. -
దివ్యాంగుల జీవితాలతో ఆడుకోవద్దు
● తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలి ● మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పార్వతీపురం రూరల్: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్న వేలాదిమంది దివ్యాంగుల పింఛ న్ల రద్దుకు కూటమి ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ధ్వజమెత్తారు. రీ సర్వే పేరుతో దివ్యాంగుల పింఛన్ల రద్దును నిరసిస్తూ వైఎస్సార్సీపీ జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు ప్రసాద్, పలువురు దివ్యాంగులతో కలిసి కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేశారు. అనర్హత పేరుతో అర్హులైన దివ్యాంగుల పింఛన్లను తొలగించవద్దంటూ జేసీ ఎస్.ఎస్.శోభికకు వినతిపత్రం అందజేశా రు. జిల్లా వ్యాప్తంగా తొలగించిన 2 వేలు పింఛన్లను పునరుద్ధరించాలని విన్నవించారు. అనంతరం జోగారావు విలేకరులతో మాట్లాడుతూ సమాజంలో అనేక సవాళ్లను అధిగమిస్తూ జీవనపోరాటం సాగిస్తున్న దివ్యాంగులపై కూటమి ప్రభుత్వం కక్షకట్టడంపై మండిపడ్డారు. గతంలో ప్రభుత్వమే నిర్ధారించి వైకల్యం శాతాన్ని గుర్తించి జారీచేసిన సదరం ధ్రువీకరణ పత్రాలు నేడు చెల్లవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తొలగించిన పింఛన్లు పునరుద్ధరించకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, పార్టీ నాయకులు శ్రీరాముల నాయుడు, సత్యంనాయడు, బొమ్మి రమేష్, మురళీకృష్ణ, జెడ్పీటీసీ అలజంగి రవికుమార్, వైస్ ఎంపీపీలు సిద్ధా జగన్నాథం, రవికుమార్, అనుబంధ విభాగాల నాయకులు మాధవరావు, వెంకటేశ్వరులు, నాగేశ్వరరావు, తిరుపతిరావు, విశ్వనాథం, గౌరీశంకరరావు, షేక్సఫీ, వాసుదేవరావు, పీస్ఆర్ నాయుడు, మజ్జి శేఖర్, శంకరరావు, మన్మథరావు, గోపాలనాయుడు, సూర్యనారాయణ, కౌన్సిలర్లు, సర్పంచ్లు లావణ్య, నేతాజీ, శ్రీరంజన్, తిరుపతిరావు, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. -
విసిగి పోవాలే గానీ!
వేరెవరి పేరు మీదనైనా మార్చేయగలరు. క్షణాల్లో వన్బీలు, పాస్ పుస్తకాలు సృష్టించేయగలరు. లంచం లేకుండా నిజాయితీగా పేదలు ఎన్నిసార్లు తిరి గినా అక్కడ పట్టించుకునే వారు కరవు. రెవెన్యూ శాఖపై ఇది ఎప్పటి నుంచో ఉన్న ముద్ర. తరచూ ఏసీబీ అధికారుల దాడిలో దొరికిపోతున్నా అక్కడి సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదు. ఆదా యం సమకూర్చుకోవడంలో ఉన్న శ్రద్ధ.. వినతుల పరిష్కారంలో చూపడం లేదన్న విమర్శలు వినిపి స్తున్నాయి. ఈ కారణంగానే రెవెన్యూ సంబంధిత భూ సమస్యలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. బాధితులు కలెక్టరేట్ చుట్టూ పదేపదే తిరుగుతున్నా.. అక్కడా వారికి భరోసా దొరకడం లేదు. సాక్షి, పార్వతీపురం మన్యం : ‘ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలకు సరైన పరిష్కారాన్ని చూపాలి. లేకుంటే అందుకు గల కారణాలేమిటో కచ్చితత్వంతో కూడిన సమాచారంతో తెలియజేయాలి.’.. ఇదీ పీజీఆర్ఎస్పై కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులకు చేసిన దిశానిర్దేశం. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఇవే మాటలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిష్కారానికి నోచుకున్న హామీలను వేలిమీద లెక్కపెట్టి చెప్పవచ్చు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమానికి సగటున వంద నుంచి 150 వరకు అర్జీలు వస్తున్నాయి. ఇందులో 60–70 శాతం వరకు రెవెన్యూ, భూ సంబంధిత సమస్యలపైనే ఉంటున్నాయి. తన పేరిట ఉన్న భూమి.. వేరొకరి పేరు మీద ఆన్లైన్లో చూపించడం, పాస్ పుస్తకం మంజూరు చేయాలని.. వన్బీ, అడంగల్లో సవరణలు.. రికార్డుల్లో తప్పుగా నమోదు కావడం, భూ ఆక్రమణలు.. ఇలా వందలాది వినతులు వస్తున్నాయి. గ్రామ, మండల స్థాయిలో అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. పరిష్కారానికి నోచుకోకపోవడంతో కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు క్యూ కడుతున్నారు. ఇక్కడ కూడా అధికారులు వాటిని తీసుకోవడం.. కింది స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వడం.. అక్కడితో దానిని వదిలేయడం.. ఇదే తంతు ఎన్నిసార్లయినా సాగుతోంది. ఒకటికి పదిసార్లు వ్యయప్రయాసలకు ఓర్చి, కలెక్టరేట్కు వస్తున్నా.. రెవెన్యూపరమైన సమస్యలకు మోక్షం కలగడం లేదు. ఏదో కారణం సాలూరు మండలం కొట్టిపరువు పంచాయతీ యరగడవలస గ్రామంలోని ఎస్టీ కొండదొర సామాజిక వర్గానికి చెందిన మూదూరు సీతయ్యకు అక్కడి సర్వే నంబరు 142, 149, 40, 41, 38, 37, 139–7పీల్లో మొత్తం 3.59 ఎకరాల భూములు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా వీరి ఆధీనంలోనే ఉండటంతో పాటు.. స్థానిక తహసీల్దార్ నుంచి పట్టాదారుపాస్ పుస్తకం కూడా పొందారు. కొంత భూమి ఆన్లైన్ చేయాల్సి ఉందని, ఇటీవల కాలంలో తమ స్థలంలో కొంతమంది దౌర్జన్యం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. తమ భూమిలో వేసుకున్న జీడి, మామిడితోటలను నరికేయడమే కాక.. వరినాట్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. అడిగితే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదని.. తాను ఇప్పటి వరకు సమర్పించిన దరఖాస్తులను పట్టుకుని సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు వచ్చాడు. చూపిస్తూ, ఆ వినతిని పెండింగులో లేకుండా అధికారులు క్లియర్ చేసేస్తున్నారు. కనీసం అర్జీదారులు సంతృప్తి చెందేలా సమాధానం కూడా ఇవ్వడం లేదు. ఇటువంటి తరహాలోనే అనేక వినతులు పదేపదే రీఓపెన్ అవుతున్నాయి. ‘రెవెన్యూ’పైనే శ్రద్ధ.. రెవెన్యూలో కాసులిస్తే.. ఎవరి పేరిట భూమిని.. -
జిల్లాకు రెగ్యులర్ డీఈఓను నియమించేది ఎప్పుడు?
పార్వతీపురం: పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో వరుసగా మూడుసార్లు ప్రథమ స్థానంలో నిలిచిన పార్వతీపురం మన్యం జిల్లాకు రెగ్యులర్ జిల్లా విద్యాశాఖాధికారిని నియమించుకోలేని నిస్సహాయస్థితిలో కూటమి ప్రభుత్వం ఉండడం దౌర్భాగ్యమని గిరిజన సంక్షేమ సంఘ ఉత్తరాంధ్ర ప్రధానకార్యదర్శి పాలక రంజిత్కుమార్ విమర్శించారు. స్థానిక విలేకరులతో ఆయన సోమవారం మాట్లాడుతూ డీఈఓగా ఒక ఎంఈఓకు అదనపు బాధ్యతలను అప్పగించారని, ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్గా ఏటీడబ్ల్యూఓకు బాధ్యతలు అప్పగించడం సరికాదన్నారు. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలకు రెగ్యుల ర్ పీఓలను నియమించాలని కోరారు. పాలకొండ రూరల్: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ దేవస్థానంలోని హుండీల ఆదాయాన్ని దేవదాయ ధర్మాదాయశాఖ అధికారులు సోమవారం లెక్కించారు. మే నెల 31వ తేదీ నుంచి నేటి వరకు హుండీల నుంచి రూ.10,80,781లు ఆదాయం వచ్చినట్టు దేవదాయశాఖ తనిఖీ అధికారి ఎస్.రామారావు ఈఓ సూర్యనారాయణ తెలిపారు. -
మంగళవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఈ చిత్రంలోని వ్యక్తి పేరు పెద్దింటి శివప్రసాద్. పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామనివాసి. ఈయన ఆధార్కార్డు వివరాల్లో వేరేవరిదో 25 ఎకరాల భూమి లింకు అయిపోయింది. ఆ భూమి తనది కాదని, తొలగించాలని సచివాలయం, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇప్పటికే రెండు సార్లు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశాడు. తిరగడమే తప్ప ఫలితం ఉండడం లేదు. తాజాగా మరోసారి అధికారులను కలిసి వేడుకున్నాడు. అంత భూమి ఉండటం వల్ల ప్రభుత్వ పథకాలేవీ అందుకోలేకపోతున్నానని చెబుతున్నాడు. ఆ భూమిని తన పేరిట తొలగించాలని కోరుతున్నాడు. లేకుంటే మొత్తంగా తన పేరు మీదే రాయించేసి, సదరు భూమిని అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. -
మట్టి గణపతి ప్రతిమలనే పూజిద్దాం
పార్వతీపురం రూరల్: వినాయక చవితి సంద ర్భంగా మట్టి ప్రతిమలను పూజించి పర్యావర ణ పరిరక్షణ కోసం పాటుపడాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపుని చ్చారు. మట్టితో తయారుచేసిన గణపతి ప్రతిమలను కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం పంపిణీ చేశారు. గణపతి నవరాత్రుల నేపథ్యంలో ఎక్కడా డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శబ్ధ కాలుష్యం లేకుండా మైక్ సెట్లను ఏర్పాటుచేసుకోవచ్చన్నారు. మట్టి వినాయక ప్రతిమలు, వ్రతకల్ప పుస్తకాలను కలెక్టర్ శ్యామ్ప్రసాద్ చేతుల మీదుగా జేసీ శోభిక, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి మన్మథరావు, డీఎంహెచ్ఓ భాస్కరరావు అందుకున్నారు. కార్యక్రమంలో సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్వో కె.హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎన్.సుధారాణి, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. గరుగుబిల్లి: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం నిలకడగా ఉంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 105 మీటర్లుకాగా, సోమవారం సాయంత్రం నాటికి 104.2 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ప్రస్తు తం ప్రాజెక్టులో 3,622 క్యూసెక్కుల నీరు చేరు తుండగా ఒక గేటును ఎత్తివేసి 3,321 క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నట్టు ఏఈ కిశోర్ తెలిపారు. సీతానగరం: మండలంలోని సహకార సంఘా ల బలోపేతమే లక్ష్యంగా చైర్మన్లు పనిచేయా లని డీసీసీబీ నోడల్ అధికారి కె.జానకి కోరా రు. సీతానగరం డీసీసీబీ బ్రాంచి కార్యాలయంలో పీఏసీఎస్ చైర్మన్లు, సీఈఓలతో బ్రాంచి చీఫ్మేనేజర్ జి.సూర్యనారాయణ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులకు అవసరమైన రుణాల మంజూరుతో పాటు రెన్యువల్పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో అంటిపేట, గుచ్చిమి, తామరఖండి, గెడ్డలుప్పి, సీతానగ రం, ఆర్.వెంకంపేట, అజ్జాడ, బూర్జ పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: గిరిజన అధ్యయనాలు, విస్తృత పరిశోధనలు, గ్రంథాలు భద్రపరచడం అంశాలపై విజయనగరం కేంద్రీయ గిరిజన యూనివర్సిటీకి మరో నాలుగు కేంద్ర విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. వర్సిటీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఒప్పంద పత్రాలపై ఆయా వర్సిటీల ప్రతినిధులు సంతకాలు చేసినట్టు ఇన్చార్జి వీసీ టి.శ్రీనివాసన్ తెలిపారు. ఒడిశాలోని కేంద్ర విశ్వవిద్యాలయం, అమరకంటక్లోని ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, తెలంగాణలోని సమక్క సరక్క గిరిజన యూనివర్సిటీలు ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. కార్యక్రమంలో వర్సిటీల ప్రతినిధులు ఎన్.నాగరాజు, సౌభాగ్యరంజన్ పాడి, వై.ఎల్.శ్రీనివాస్, నరసింహ చరణ్ పాండా తదితరులు పాల్గొన్నారు. -
కూటమి తీరుపై.. కదంతొక్కిన ఆటోడ్రైవర్లు
కొమరాడ: కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు కదంతొక్కారు. ఉచిత బస్సు పథకంతో ఉపాధి కోల్పోయిన డ్రైవర్లను ఆదుకోవాలంటూ కొమరాడలో మజ్జిగౌరీ తల్లి ఆటో యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్డార్ సత్యనారాయణకు వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం వాహనమిత్ర పథకం కింద ఏడాది రూ.10వేలు అందజేస్తే.. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం పేరిట మా పొట్టకొట్టిందని వాపోయారు. వాహనమిత్ర పథకం కింద రూ.25 వేలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కొల్లు సాంభమూర్తి, బి.గోపి, కోరాడ చిన్న, బాసింగి శ్రీను, తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తం
విజయనగరం: సైబర్ మోసాల పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులకు ఎటువంటి వ్యక్తిగత సమాచారం చేరవేయవద్దని రిజర్వ్ బ్యాంక్ సీజీఎం సుబ్బయ్య సూచించారు. యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ‘బ్యాంకింగ్ సేవలు – సైబర్ మోసాలపై’ ద్వారపూడి గ్రామంలోని ఫంక్షన్ హాల్లో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు, సామాజిక భద్రతా పథకాలను ప్రభుత్వ రంగ బ్యాంక్ల ద్వారా వినియోగించుకోవాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ షాలిని, రిజర్వ్బ్యాంక్ డీజీఎం కల్యాణ చక్రవర్తి, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ జితేంద్ర శర్మ, ద్వారపూడి సర్పంచ్ అదిలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు మృణాళిని, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట రమణమూర్తి, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజినల్ మేనేజర్లు రాజా, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
కురుపాం విద్యార్థిని లాత్వికకు ఫ్రీ మెడికల్ సీటు
● మొదటి ప్రయత్నంలోనే గుంటూరులోని కాటూరి కళాశాలలో సీట్కురుపాం: కురుపాం మండల కేంద్రానికి చెందిన కాదా లాత్విక ఎంబీబీఎస్ ఉచిత సీటు సాధించింది.ఇటీవల ప్రకటించిన నీట్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలోని బీసీ(బి) కేటగిరిలో మొదటి ప్రయత్నంలోనే 463 మార్కులు సాధించి 3743వ ర్యాంకును కై వసం చేసుకుని గుంటూరు లోని కాటూరి మెడికల్ కళాశాలలో ఫ్రీ సీటు సాధించింది. లాత్విక తండ్రి కాదా చంద్రమౌళి సాక్షి దిన పత్రిక కురుపాం రిపోర్టర్ గా, తల్లి అనూరాధ జియ్యమ్మవలస మండలంలోని రావాడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్నారు. మొదటి ప్రయత్నంలోనే తమ కుమార్తె లాత్విక ఉచిత సీటు సాధించడంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.లాత్విక విశాఖపట్నం లోని శశి కళాశాలలో ఇంటర్ మీడియట్ అభ్యసించింది. శభాష్..సమీర..! నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండగుంపాం గ్రామానికి చెందిన పతివాడ సమీర ఎంబీబీఎస్లో ఉచిత సీటును సాధించింది. ఇటీవల ప్రకటించిన నీట్ పరీక్షలో 2020వ ర్యాంక్ను కై వసం చేసుకున్న సమీరకు గుంటూరులోని కాటూరి వైద్య కళాశాలలో ఉచిత సీటు లభించింది. సమీర తండ్రి పతివాడ త్రినాథ్ ఇదే మండలంలోని కుదిపి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఫ్రీ సీట్ సాధించిన సమీరను పలువురు అభినందించారు. -
అల్లర్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ సభ్యులదే..
విజయనగరం క్రైమ్: వినాయక ఉత్సవాల్లో అల్లర్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ సభ్యులదేనని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఎక్కడైనా అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డ్యాన్స్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మంటపాల ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీస్, ఎలక్ట్రికల్, ఫైర్ శాఖల అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఉత్సవాలు సాఫీగా సాగేందుకు పోలీస్ సూచనలు పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో మంటపాలు ఏర్పాటు చేయాలనుకుంటే సంబంధిత పంచాయతీ, మున్సిపల్ అధికారుల నుంచి అనుమతులు పొందాలన్నారు. ఉత్సవాల్లో డీజేలను వినియోగించేందుకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. మైక్సెట్లను నిర్ణీత సమయం వరకు మాత్రమే వేయాలని చెప్పారు. అలాగే సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. నిమజ్జనంలో ప్రమాదకర రంగులు చల్లుకోవడం.. బాణసంచా కాల్చడం నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సభ్యులపై చర్యలు తప్పవన్నారు. ఎస్పీ వకుల్ జిందల్ -
నదీ తీరంలో హెచ్చరిక బోర్డులు : సబ్ కలెక్టర్
భామిని: మండలంలోని లివిరి వద్ద వంశధార నదిలో కుమ్మరి లక్ష్మి అనే మహిళ గల్లంతు కాగా ఆ నదీతీరాన్ని పాలకొండ సబ్కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదివారం పరిశీలించారు. మహిళ గల్లంతు ఘటనపై ఆరాతీశారు. తహసీల్దారు శివన్నారాయణ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో జల్లెడ పడుతున్నా మహిళ ఆచూకీ లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదకరంగా ఉండే ఇటువంటి నదీతీరాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తహసీల్దారును సబ్కలెక్టర్ ఆదేశించారు. ఆదివారమూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక బోటు వేసుకుని మరీ నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. వేధింపుల వల్లే ఆత్మహత్య గజపతినగరం రూరల్: మండలంలోని పిడిశీలకు చెందిన కర్రోతు సాయిసుధ ఆత్మహత్యకు ప్రియుడి వేధింపులే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సాయిసుధకు అదే గ్రామానికి చెందిన యడ్ల ఈశ్వరరావుతో 11 ఏళ్లుగా పరిచయం ఉందన్నారు. కొద్దిరోజులుగా ఈశ్వరరావు నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో సాయిసుధ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. -
శారీరక చురుకుదనం లేకపోతే సమస్యలు
పార్వతీపురం రూరల్: ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవన శైలిలో ద్విచక్ర వాహనాలు, కార్లు భాగమైపోవడంతో శారీరక శ్రమ ఉండడం లేదని ఏఆర్ డీఎస్పీ థామస్రెడ్డి అన్నారు. శారీరక చురుకుదనం లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. క్విట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ పేరిట ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ కార్యాలయం నుంచి పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది ప్రతిరోజూ విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొంటారన్నారు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని సూచించారు. సైక్లింగ్ చేయడం వల్ల శారీరక దృఢత్వం వస్తుందని చెప్పా రు. ర్యాలీలో ఏఆర్ఐలు రాంబాబు, నాయుడు, ఆర్ఎస్సైలు, తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి -
అర్హత లేని గ్రామీణ వైద్యులపై చర్యలు
కురుపాం/జియ్యమ్మవలస రూరల్: గ్రామీణ వైద్యులు విచ్చలవిడిగా యాంటీబయాటిక్ మందులు ఇస్తూ రోగుల అనారోగ్యానికి కారణమవుతున్నారని.. అర్హత లేని ఆర్ఎంపీలపై చర్యలు తప్పవని జిల్లా ఔషధ నియంత్రణ అధికారి ఆషా షేక్ అన్నారు. కురుపాం మండల కేంద్రంలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్లకు ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మందుల షాపుల్లో పెద్ద మొత్తంలో యాంటీబయాటిక్స్, యాంటీ మలేరియా, స్టెరాయిడ్స్ను నిల్వ ఉంచరాదన్నారు. అంతేకాకుండా రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, తనిఖీ సమయంలో అధికారులకు చూపించాలని సూచించారు. పేషెంట్లను వీలైనంతవరకు ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలన్నారు. గ్రామాల్లోని ఆర్ఎంపీ, పీఎంపీలకు ఎట్టి పరిస్థితుల్లోను మందులు సరఫరా చేయొద్దని ఆదేశించారు. ప్రభుత్వ నిషేధిత మందులను పేషెంట్లకు డాక్టర్ చీటీ లేకుండా విక్రయిస్తే షాపుల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. మెడికల్ షాపు యజమానులు తప్పనిసరిగా బిల్లు పుస్తకాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మందుల షాపుల యజమానులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఔషధ నియంత్రణ అధికారి ఆపా షేక్ -
వెదురు కర్రలతో వంతెన
మక్కువ: మండలంలోని కొండరేజేరు, సీతానగరం మండలంలోని బళ్లకృష్ణాపురం గ్రామాలకు చెందిన రైతులు ఆదివారం కాలువపై వెదురు కర్రలతో వంతెన నిర్మించుకున్నారు. కొండరేజేరు గ్రామానికి చెందిన రైతులు పంటపొలాలకు వెళ్లాలన్నా కాలువ దాటి వెళ్లాల్సి వస్తోంది. అంతేకాకుండా గ్రామంలో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే పార్వతీపురం పట్టణంలోని అస్పత్రికి వెళ్లాలన్నా, కాలువలో దిగి, నీటిని దాటుకుని వెళ్లాల్సి వస్తోంది. కాలువ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు సాగించలేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మక్కువ మండలంలోని కొండరేజేరు, సీతానగరం మండలంలోని బళ్లకృష్ణాపురం గ్రామాల మధ్య రహదారి నిర్మాణానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.1.60లక్షలు మంజూరయ్యాయి. ఆ నిధులతో రెండు గ్రామాల మధ్య మెటల్రోడ్డు వేసి వదిలివేశారు. రెండు గ్రామాల మధ్యనున్న కాలువపై వంతెన నిర్మాణంకోసం మరో రూ.40లక్షల నిధులు మంజూరై, టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ వంతెన పనులు ప్రారంభంకాకపోవడంతో రెండు గ్రామాలకు చెందిన పలువురు రైతులు నడుంబిగించి వెదురు కర్రలతో తాత్కలికంగా వంతెన ఏర్పాటు చేసుకున్నారు. పనులు పూర్తిచేయాలంటూ మంత్రికి విజ్ఞప్తి కొండరేజేరు, బళ్లకృష్ణాపురం గ్రామాల మధ్య రహదారి పనులు నిలిచిపోవడం, వంతెన పనులు ప్రారంభంకాకపోవడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. కాలువలో నుంచి సాగునీరు ఉధృతంగా ప్రవహిస్తున్నందున రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నామని, సోషల్మీడియా ద్వారా మంత్రి సంధ్యారాణి, మండల టీడీపీ అధ్యక్షుడు గుళ్ల వేణుగోపాలనాయుడు, తెలుగుదేశం నాయకులకు విజ్ఞప్తిచేస్తూ ఆ రెండు గ్రామాల ప్రజలు సందేశాన్ని పంపించారు. -
దగా పడిన దళితులు
● సాగుదారుల భూముల అన్యాక్రాంతం ● 12 ఎకరాల అసైన్డ్ భూమిపై కూటమి నాయకుడి కన్ను ● నకిలీ పాస్ పుస్తకాల తయారీ ● లోబోదిబోమంటున్న అసలు హక్కుదారులువారంతా దళితులు. ఆర్థిక పరిస్థితులు బాగాలేక గ్రామంలో వారికి ప్రభుత్వం కేటాయించి అసైన్డ్ భూములను పెద్దలకు లీజుకిచ్చారు. లీజు గడువు ముగిసింది. మా భూములు మాకు అప్పగించండంటూ అసలైన హక్కుదారులు అడుగుతుంటే లీజుకు తీసుకున్న యజమానులు మాత్రం ఈ భూములపై మీకు హక్కు లేదని, పాస్ పుస్తకాలు మా పేరున ఉన్నాయంటూ దబాయించి వారిని తరిమి కొట్టారు. జియ్యమ్మవలస రూరల్: మండలంలోని చింతల బెలగాం గ్రామానికి చెందిన మండంగి అప్పలస్వామి బెలగాం బలరాం, లక్ష్మయ్య, పారయ్య, చిన్నయ్య, రెడ్డి బుచ్చయ్య, చంద్రయ్య, గరుగుబిల్లి బైరాగి పారయ్య, పండయ్య గుంపయ్య దొనక బోడయ్య, మండంగి చిన్నమ్మి ఇలా 14 మంది దళితులకు 1982లో ప్రభుత్వం అసైన్డ్ చేసిన డీ పట్టాలను సుమారు 12 ఎకరాలకు పైగా అప్పటి ప్రభుత్వం అందజేసింది. అయితే 1994 వరకు ఈ భూమికి సంబంధించి దళిత రైతులు శిస్తు కట్టి సాగు చేసుకున్నారు. అనంతరం వారి ఆర్థిక పరిస్థితులు బాగులేక ఆ భూమిని గ్రామంలోని కొంతమంది రైతులకు లీజుకు ఇచ్చారు. అయితే లీజు సమయం పూర్తి కావడంతో తమ భూమిని తమకు అప్పగించాలని దళితులు కోరగా, మీకు ఎలాంటి హక్కు లేదని లీజుదారులు చెప్పడంతో దళితులంతా అవాక్కయ్యారు. వెంటనే రెవెన్యూ అధికారులను ఆశ్రయిం చారు. ఇప్పటికే పలుమార్లు పాలకొండ రెవెన్యూ డివిజన్ అధికారి దృష్టికి సమస్యను తెలియజేసినప్పటికీ ఫలితం లేకపోయిందని వారంతా వాపోతున్నారు. ప్రస్తుతం 12 ఎకరాల అసైన్డ్ భూమిపై శంభాన శంకర దొర, తెంటు శ్రీనివాసరావు, మర్రాపు పార్వతమ్మ, ఉడుముల శంకరరావు, తిరుపతి నాయుడు, గుంపస్వామి మూడడ్ల సత్యంనాయుడు, దత్తవలస గ్రామానికి చెందిన మండల అప్పలనాయుడు, శంబంగి అప్పలనాయుడు, జయలక్ష్మి, శివున్నాయుడు, వాసుదేవరావులు ఆ భూమిపై నకిలీ పట్టాలను సృష్టించి పాస్ పుస్తకాలను కూడా తయారు చేసుకున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. ప్రధాన సూత్రధారి మాజీ వీర్వో ఈ భూ ఆక్రమణకు ప్రధాన సూత్రధారి మూడడ్ల సత్యం నాయుడేనని ఆయన గతంలో వీఆర్వోగా పనిచేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో వట్టిగెడ్డ ప్రాజెక్ట్ చైర్మన్గా ఉన్నారన్నారు. ఆయన అప్పటి రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క పీఓటీ చట్టానికి వ్యతిరేకంగా అసైన్డ్ భూములకు పట్టాలిచ్చి పాస్ పుస్తకాలు తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములు అమ్మడం, కొనడం ఆక్రమణకు పాల్పడడం పీఓటీ చట్టాన్ని అతిక్రమించడమేనన్నారు. తక్షణమే తమ భూమిపై ఉన్న రైతులంతా తమకు భూములను అప్పగించాలని అధికారులకు, కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మా భూములు అప్పగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వం కల్పించిందని వారు హెచ్చరించారు. -
మీకోసం వెబ్సైట్లో పీజీఆర్ఎస్ వివరాల నమోదు
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం రూరల్: మీకోసం వెబ్సైట్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం (పీజీఆర్ఎస్)లోని వివరాలు నమోదు చేసుకోవచ్చునని, అలాగే వచ్చిన అర్జీల వివరాలను టోల్ఫ్రీ నంబర్ 1100కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చునని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల సమస్యలపై ప్రతి సోమవారం వినతులు స్వీకరించనున్నామని పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజల వినతులు స్వీకరించడానికి కలెక్టరేట్లోని సెల్లార్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. నేడు ఐటీడీఏలో పీజీఆర్ఎస్సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని ఐటీడీఏ అధికార వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు. ఒక కట్టకు ఎన్ని కష్టాలో..!బలిజిపేట: ఒక యూరియా కట్ట కావాలంటే రైతులకు అష్టకష్టాలు తప్పడం లేదు. నానా పడిగాపులు పడినప్పటికీ ఎరువు దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. అందుకు తార్కాణంగా బలిజిపేట మండలంలోని పలగర సహకార సంఘం వద్ద రైతులు ఆదివారం రైతులు పడిన పడిగాపులు చూస్తుంటే వారి అవస్థలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. 260యూరియా బస్తాలు వచ్చాయని తెలియడమే తరువాయి రైతులు సొసైటీ వద్ద బారులు తీరారు. ఎక్కడికి యూరియా వచ్చిందన్నా అక్కడికి పరుగులు తీస్తున్నారు. కనీసం ఒక్క బస్తా యూరియా అయినా దొరకదా? అనే ఆశతో బారులు తీరుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా బారులు తీరి యూరియా కోసం పడిగాపులు పడలేదని, నేరుగా ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు అందేవని, ఇంకా అవసరమైతే ప్రైవేట్ డీలర్ల వద్ద సాధారణ రేటుకే కొనుగోలు చేసుకునే వారమని రైతులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాతే ఎందుకు ఇంత డిమాండ్ వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఏఓబీలో విస్తృత దాడులుకురుపాం: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏఓబీ) గ్రామాలైన వలవ, కెరడ, వనజ, బోరువలస గ్రామాల్లో ఆదివారం సారా తయారీ కేంద్రాలపై ఆంధ్రా–ఒడిశా ఎకై ్సజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7,600 లీటర్ల పులిసిన బెల్లపు ఊట, రవాణాకు సిద్ధంగా ఉంచిన 150 లీటర్ల సారాను ధ్వంసం చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు ఆదేశాల మేరకు సారా స్థావరాలపై దాడులు చేపట్టామన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో సారా తయారీ, అమ్మకాలు జరిగినా ప్రజలు తమకు సమాచారం అందించాలని కోరారు . ఈ దాడుల్లో ఎక్సైజ్ ఏఈఎస్ సంతోష్, కురుపాం ఎకై ్సజ్ సిబ్బంది, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు పాల్గోన్నారు. పార్వతీపురం టౌన్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ హిత వినాయక విగ్రహాల తయారీపై వర్క్షాప్లు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.రాజ్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కెమికల్ రంగులతో తయారు చేసిన విగ్రహాల వాడకాన్ని తగ్గించి, మట్టి విగ్రహాల వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. -
‘ఉపాధి’ అవకతవకలపై విచారణ వాయిదా
లక్కవరపుకోట: మండలంలోని కోనమసివానిపాలెం గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని గ్రామానికి చెందిన కాకర శ్రీనివాసరావు గత నెలలో కలెక్టరేట్ గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధిహామీ పథకం అధికారులు విచారణ చేపట్టడానికి శనివారం గ్రామానికి రాగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో అధికారులు వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఉపాధిహామీ పథకం క్షేత్ర సహాయకుడు బండ అప్పారావు (అప్పన్న) మరో 39 మంది వ్యక్తులతో కలిసి ఉపాధి నిధులను దుర్వినియోగం చేసినట్లు కాకర శ్రీనివాసరావు గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు చేశారు. 2011 సంవత్సరం నుంచి 2019 వరకు జరిగిన అవకతవకలపై సోషల్ ఆడిట్ బృందాలు సైతం సక్రమంగా ఆడిట్ నిర్వహించలేదని.. అలాగే 2024 వరకు పనికి వెళ్లని వారి పేరిట దొంగ మస్తర్లు వేసి నిధులు దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గజపతినగరం ఏపీడీ కె.రామామణి ఆధ్వర్యంలో అధికారులు గ్రామంలో గల పంచాయతీ కార్యాలయం వద్దకు శనివారం చేరుకుని విచారణకు సిద్ధపడగా గ్రామస్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. పనులకు సంబంధించి ఎటువంటి అవకతవకలు జరగలేదని ఒకవర్గం.. జరిగాయని మరోవర్గం ఆరోపిస్తూ వాదనకు దిగారు. దీంతో ఓ దశలో తోపులాట జరగడంతో అధికారులు భయంలో సమీపంలో గల రామాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. అయితే పరిస్థితి అనుకూలంగా లేదని పోలీసులు చెప్పడంతో విచారణను వాయిదా వేస్తున్నట్లు ఏపీడీ రమామణి ప్రకటించి, వెళ్లిపోయారు. కార్యక్రమంలో డీబీటీ మేనేజర్ ఆసీఫ్ హుసేన్, స్థానిక ఎపీఓ విజయలక్ష్మి , తదితరులు పాల్గొన్నారు. -
నిందితులను శిక్షించడంలో విజయనగరం టాప్
విజయనగరం క్రైమ్: మహిళలపై దాడులు చేపడుతున్న వారితో పాటు పోక్సో కేసుల్లోని నిందితులను శిక్షించడంలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని డీఐజీ గోపీనాథ్ జెట్టీ అన్నారు. శనివారం స్థానిక డీపీఓ అర్ధ సంవత్సరపు నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జిల్లా జడ్జి బబిత హాజరైన ఈ సమీక్షలో డీఐజీ మాట్లాడుతూ..ఎన్డీపీఎస్ కేసుల్లో ఎక్కువగా విద్యార్థులు అరెస్ట్ అవుతున్నారన్నారు. గంజాయికి అలవాటు పడిన వ్యక్తులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, డీ అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స అందించాలని సూచించారు. నేరాల నియంత్రణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సమాజానికి కీడు కలిగించే ప్రతీ అంశం తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీస్ సిబ్బందిపై ఉందన్నారు. సైబర్ కేసులను దర్యాప్తు చేసేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని పోలీస్ అధికారులు మెరుగుపరుచుకోవాలని తెలిపారు. అనుమతుల్లేకుండా కలిగి ఉన్న ఆయుధాలను స్వాధీన పరుచుకునేందుకు కార్డన్సెర్చ్ కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. పరిహారం మంజూరయ్యేలా చర్యలు.. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాట్లాడుతూ.. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు పరిహారం తక్షణమే మంజూరయ్యే విధంగా చర్యలు చేపడతామన్నారు. జాతీయ రహదారిపై 66 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రూ.5 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రతి పోలీస్స్టేషన్కు ఒక డ్రోన్ అందిస్తామన్నారు. అనంతరం ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ.. గంజాయి నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి రోజూ పది ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపడుతుండడంతో పాటు ఐదు చెక్పోస్టులు ఏర్పాటు చేసి గంజాయి రవాణాను అడ్డుకుంటున్నామని తెలిపారు. 25 పోక్సో కేసుల్లోను, మరో 18 కేసుల్లో నిందితులు శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం శక్తి యాప్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన షార్ట్ఫిల్మ్ను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆవిష్కరించారు. షార్ట్ ఫిల్మ్ను రూపొందించిన అగ్గిరాజు, రూప, హారికలను అధికారులు అభినందించారు. అదేవిధంగా గంజాయి కేసుల్లో ఇన్విస్టిగేషన్ను సమర్థవంతంగా పూర్తి చేసిన ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి, బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావులకు డీఐజీ గోపీనాథ్ జెట్టీ ప్రశంసాపత్రాలు అందజేశారు. సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్టు కమిషనర్ డి.మణికుమార్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటిండెంట్ బి.శ్రీనాథుడు, డీఎఫ్ఓ ఆర్. కొండలరావు, డీఎంహెచ్ఓ జీవన్రాణి, డీఈఓ కేవీ రమణ, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె.అప్పలరాజు, డీఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, జి. భవ్యారెడ్డి, డీఎస్పీ ఎస్.రాఘవులు, డీఎస్పీ ఆర్.గోవిందరావు, డీఎస్పీ ఎం.వీరకుమార్, న్యాయ సలహాదారులు వై.పరశురాం, జైళ్ల శాఖ, ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, డ్రగ్స్ అండ్ కంట్రోల్ శాఖాధికారులు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. డీఐజీ గోపీనాథ్ జెట్టీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలి.. న్యాయస్థానాల్లో ప్రాసిక్యూషన్ వేగవంతంగా పూర్తయ్యేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని జిల్లా జడ్జి బబిత కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను కోరారు. ఎన్డీపీఎన్ కేసుల్లో ఇన్వెంటరీ, సీజర్ చేయడంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. సెప్టెంబర్ 13న నిర్వహించనున్న లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని పోలీస్ అధికారులను కోరారు. -
ఉత్తరాంధ్ర మంత్రుల పేర్లు మిస్సింగ్
సాక్షి ప్రతినిధి,విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు తాను ఒక కార్పొరేట్ కంపెనీ సీఈఓగా భావించుకుంటూ మంత్రులను సెకెండ్ క్యాడర్ ఉద్యోగులుగా చూస్తూ వారి పనితీరును మదింపు చేస్తూ ర్యాంకింగులు ఇవ్వడం చాన్నాళ్లుగా ఉన్న అలవాటు. ఇదే క్రమంలో ఈసారి కూడా మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. ఇందులో భాగంగా ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అత్యద్భుత పని తీరు కనబరచిన వారు అంటూ ఐదుగురు మంత్రులతో టాప్–5 జాబితా ప్రకటించారు. అందులో జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రెండో స్థానం, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నారు. నాలుగో స్థానంలో హోం మంత్రి అనిత, ఐదో స్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చోటు దక్కించుకున్నారు. దాదాపు పాతికమంది మంత్రులు ఉన్న క్యాబినెట్లో కేవలం ఐదుగురికి మాత్రమే ర్యాంకుల కేటాయించిన సీఎం మిగతా వారిని పక్కనపెట్టినట్లుగా తెలుస్తోంది. పవన్కల్యాణ్ పేరు కూడా ఈ జాబితాలో కనిపించలేదు. ఆయనను పనితీరు విషయంలో పరిగణనలోకి తీసుకోలేదో, ఆయన ర్యాంకులకు అతీతం అనుకున్నారో కానీ పవన్ మాత్రం లిస్టులో లేరు. ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నా వారెవరూ లిస్ట్లో లేరు.ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉండగా, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ చిన్న, కుటీర పరిశ్రమలు, ప్రవాస భారతీయుల వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వ్యవసాయమంత్రిగా కొనసాగుతున్నారు. గత ఫిబ్రవరిలో కూడా ర్యాంకులు ప్రకటించగా అందులో కొండపల్లి శ్రీనివాస్ మూడో స్థానంలో నిలిచారు. అసెంబ్లీకి తొలిసారి ఎన్నికై , ఏకంగా మంత్రి పదవి దక్కించుకున్న కొండపల్లి కొత్తవారైనా మంచి పనితీరుతో సీనియర్లను దాటుకుని మూడో స్థానంలో నిలిచారని అప్పట్లో చెప్పుకున్నారు. అప్పట్లో అచ్చెన్నాయుడు 17, సంధ్యారాణి 18 ర్యాంకుల్లో నిలిచారు. అయితే, ఇప్పుడు కేవలం ఐదు ర్యాంకులు మాత్రమే ప్రకటించడంలో ఈ మంత్రులు ఎవరికీ పాపం అందులో స్థానం దక్కలేదు. -
అమ్మోరి ఆగ్రహం.. చిరుద్యోగుల విలాపం!
సాక్షి, పార్వతీపురం మన్యం: ఆ అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేస్తే.. ఎటువంటి వారు అయినా మాడిమసి అయిపోవాల్సిందే. అటువంటిది ఏదో చిన్న ఉద్యోగం.. గ్రామస్థాయిలో అలా పై అధికారులు, చోటా నాయకులు చెప్పింది తలూపుకొంటూ చేసుకొని పోయే వారిపై కన్నెర్ర చేస్తే.. ఇంకేమైనా ఉంటుందా.. ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్లు.. ఆ నియోజకవర్గంలో ఉన్న తమ్ముళ్ల గ్రూపుల గోల.. ఆ ఉద్యోగుల మెడకు చుట్టుకుంటోంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు లోలోపల కుమిలిపోతున్నారు. ఉద్యోగులపై ఇదెక్కడి పెత్తనం అంటూ ఆవేదన చెందుతున్నారు. కరవమంటే కప్పకు కోపం.. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపంలా ఉంది ఇక్కడి పరిస్థితి. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం కొలువై ఉన్న ఆ నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ తమ్ముళ్లు గ్రూపులు కట్టేశారు. ఒకరంటే ఒకరికి పడదాయె. ఒకరి పేరు చెబితే.. ఇంకొకరు అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. ఇటీవల అమ్మవారి సొంత మండలంలోనే కొత్తగా మంజూరైన పింఛన్లను ఓ ఇద్దరికి సచివాలయ ఉద్యోగి పంపిణీ చేశారు. అనధికార ప్రోటోకాల్ ప్రకారం.. అక్కడ స్థానిక టీడీపీ నాయకుడికి పాపం ఆ ఉద్యోగి చెప్పి.. తన ధర్మం తాను నిర్వర్తించాడు. ఇదే.. అధికార పార్టీలోని మరో వర్గం ‘తమ్ముడికి’ కోపం తెప్పించింది. తనను ఏం పిలవలేదని ఫోన్ చేసి మరీ చెడామెడా ఆ ఉద్యోగికి వాయించేశాడు. తాను ఇక్కడ విధుల్లో చేరి రెండు రోజులే అయ్యిందని సదరు ఉద్యోగి చెప్పినా వినడాయే..! ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తానంటూ బెదిరించాడు. మరోసారి నియోజకవర్గ కేంద్రానికి సమీప మండలంలోని ఓ గ్రామంలో నెలవారీ సరకుల పంపిణీకి తనను పిలవడం లేదని.. అంగన్వాడీ కార్యకర్తపై మరో ‘తమ్ముడు’ చిర్రుబుర్రులాడాడు. నేరుగా ఆ అమ్మవారి పేరు చెప్పే బెదిరించాడు. విషయం బయటకు వచ్చిందని.. ఆమె ఉద్యోగం తీసేసేందుకు అన్ని అస్త్రాలూ ఉపయోగించారు. వీటి అన్నింటి వెనుక.. అమ్మవారి అభయం ఉందనే తేలుతోంది. వారి గ్రూపులు.. వీరి మెడకు చుట్టుకుంటున్నాయి.. అమ్మవారి పుణ్యమానీ.. నియోజకవర్గంలో గ్రూపుల గోల తీవ్ర స్థాయిలో ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రతి మండలంలోనూ తనకంటూ ఓ వర్గాన్ని ఆమె ప్రత్యేకంగా తయారు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొత్త కొత్త వివాదాలు పుట్టుకొస్తున్నాయి. సొంత పార్టీలోనే కుమ్ములాటలు చోటు చేసుకుంటున్నాయి. ఇది కాస్త స్థానిక ఉద్యోగుల మెడకు చుట్టుకుంటోంది. రెండు వర్గాల పెత్తనంతో నలిగిపోతున్నారు. పొరపాటున అమ్మవారి వర్గానికి ఏ విషయంలోనైనా వ్యతిరేకంగా పరిణామాలు జరిగితే.. వీరిపై బదిలీవేటే. ఈ నియోజకవర్గంలో మహ‘రాణి’ పెత్తనం కింద బానిసల్లా బతకలేక ఉద్యోగులు నలిగిపోతున్నారు. బానిస సంకెళ్లు తెంచుకునే రోజుకోసం ఇప్పటినుంచే ఎదురుచూస్తున్నారు. పాపం.. ఆరు నెలల కిందట ఓ ‘పెద్ద’పంచాయతీకి ఆ కార్యదర్శి బదిలీపై వచ్చాడు. అందరితో ఆయన ‘పథం’ బాగానే కలిసి సాగేది. దాదాపు ఉద్యోగుల బదిలీలు అన్నీ అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే జరిగాయి. తాము కోరుకున్న వారినే మరీ తమ్ముళ్లు తెచ్చుకున్నారు. ఒక విషయం మాత్రం ఆ కార్యదర్శితో చెడింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి అధికారికమైనది. ప్రభుత్వ పరంగా నిర్వహించడం వల్ల అధికారులంతా హాజరయ్యేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు.. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం పూర్తిగా పార్టీకి సంబంధించినది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి హాజరైన దాఖలాలు లేవు. ఈ పంచాయతీలో సదర కార్యదర్శి హాజరు కాలేదని అమ్మవారు కోపద్రిక్తులయ్యారు. ఏకంగా సరెండర్ చేసి పడేశారు. ఆ ఉద్యోగి సంజాయిషీ ప్రయత్నిస్తే.. ‘సస్పెండ్ చేయలేదు కదా సంతోషించు’ అంటూ అమ్మవారు సెలవివ్వడం గమనార్హం. ‘కొత్త’గా ఉంటుందని మరో కార్యదర్శి ఆ పంచాయతీకి ‘వలస’ వచ్చాడు. అక్కడ కూడా పెన్షన్లను టీడీపీలోని వేరే వర్గం వారిని పిలిచి పంపిణీ చేశారని.. మరో వర్గానికి చెందిన అదే పార్టీ నాయకుడు సర్పంచ్, కార్యదర్శికి వ్యతిరేకంగా ధర్నా చేశాడు. ఈ పంచాయితీ కాస్త అమ్మవారి దగ్గరికి వెళ్లడంతో.. వచ్చిన ఏడాది కాలంలోనే ఆ పంచాయతీ నుంచి కార్యదర్శిని బదిలీపై పంపించేశారు. ఉద్యోగాలను నమ్మి.. కుటుంబాలను తీసుకొచ్చేస్తున్నామని.. ఎన్ని రోజులు ఉంటామో తెలియని పరిస్థితి ఎదురవుతోందని ఆయన వాపోతున్నాడు. పింఛన్ల పంపిణీకి పిలవలేదని తమ్ముడి ఫిర్యాదు కార్యదర్శిపై బదిలీ వేటు? పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదని మరో కార్యదర్శికి సరెండర్ శిక్ష తమ్ముళ్ల పెత్తనంతో నలిగిపోతున్న ఉద్యోగులు -
పూడికలు తొలగించిన రైతన్నలు
పట్టించుకోని పాలకులు..కురుపాం: కూటమి పాలకుల పాలనా వైఫల్యం, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వెరసి గుమ్మిడిగెడ్డ అక్విడెక్టు ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. ఒకప్పుడు సస్యశ్యామలంగా పండిన పంట భూములు సాగునీరు అందక బీడు భూములుగా తయారైనా అధికార యంత్రాంగంలో స్పందన కరువైంది. పూడికలు తొలగించి, 350 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేలా చూడాలని పాలకులు, అధికారులకు విన్నవించినా స్పందన కరువైంది. ఖరీఫ్ ఉభాల సమయం దాటిపోతుండడంతో ఆవేదన చెందారు. గోళ్లవలస, కర్లగండ, కుంబుకోట, పాలెం, గుజ్జుపాడు, ఈదలవలస, చెక్కవలస, వన్నాం, సీతంపేట, పూతికవలస గ్రామాల రైతులు చందాలు పోగుచేసి జేసీబీ సాయంతో కాలువల్లో పూడికలు తొలగింపునకు శనివారం నడుంబిగించారు. రైతుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోందని, పెట్టుబడి సాయం నుంచి విత్తనాలు, ఎరువులు, కాలువల్లో పూడికల తొలగింపు, పంటకు మద్దతు ధర కల్పన ఇలా అన్నింటిలోనూ రైతన్నకు ఆవేదన మిగుల్చుతోందని వాపోయారు. గుమ్మిడిగెడ్డ అక్విడెక్టు ఆయకట్టు పరిధిలోని 15 గ్రామాల రైతులకు చెందిన భూములు ఉన్నాయి. కాలువలు పూడుకుపోవడంతో సాగునీరు అందని పరిస్థితి. ఎన్నిసార్లు ఇరిగేషన్ అధికారులకు విన్నవించినా స్పందన లేదు. పాలకులూ పట్టించుకోలేదు. రైతులందరూ కలిసి చందాల రూపంలో రూ.50వేలు పోగుచేసి జేసీబీతో ప్రధాన కాలువల్లోని పూడికల తొలగింపు పనులు చేపట్టాం. ప్రజా ప్రతినిధులు స్పందించి గుమ్మిడిగెడ్డ అక్విడెక్టును అభివృద్ధి చేయాలి. – శెట్టి సురేష్, గుమ్మిడిగూడ సర్పంచ్ గుమ్మిడిగెడ్డ అక్విడెక్టు ప్రధాన కాలువలో పేరుకుపోయిన పూడికలు తొలగింపునకు చర్యలు తీసుకోని ప్రభుత్వం 350 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకం రైతులే చందాలు పోగుచేసి పూడికల తొలగింపునకు చర్యలు -
ఎరువు కోసం గిరిజన రైతుల ఆందోళన
జియ్యమ్మవలస రూరల్: ఎరువు దొరకక గిరిజన రైతులు ఆందోళనకు దిగారు. అలమండ పంచాయతీలో నిడగళ్లుగూడ, చినతోలుమండ, చినతోలుమండ గూడ, రామభద్రపురం, ఎస్సీ మరువాడ, ఎసీ్ట్ మరువాడ, నీలకంఠాపురం తదితర తొమ్మిది గ్రామాలకు చెందిన 600 మంది రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్నా పట్టించుకునేవారే లేరని వాపోయారు. ప్రస్తుతం 222 బస్తాల యూరియా వచ్చిందని, ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున ఇచ్చినా మరో 400 బస్తాల ఎరువు అవసరమని, పూర్తిస్థాయిలో ఎప్పుడు సరఫరా చేస్తారని కూటమి సర్పంచ్ చంటి అధికారులను ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రైతుపై చిన్నచూపు చేస్తోందని, విత్తనాలు, ఎరువులు అందించడంలో విఫలమైందటూ రైతులు నగేష్, అన్నపూర్ణ తదితరులు ఆరోపించారు. -
త్వరలో అన్ని పోలీస్స్టేషన్లకు డ్రోన్లు
విజయనగరం క్రైమ్ : త్వరలో అన్ని పోలీసుస్టేషన్లకు డ్రోన్లు పంపిణీ చేస్తామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. నేరాల నియంత్రణలో సాంకేతికతను విరివిగా ఉపయోగించాలని అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం టూటౌన్ పోలీసుస్టేషన్ను శనివారం సందర్శించారు. స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించారు. స్టేషన్లోని సీసీ టీవీ కమాండ్ కంట్రోల్ రూమును సందర్శించి వాటి పని తీరును చూశారు. స్టేషన్లో పని చేస్తున్న కోర్ట్ కానిస్టేబుళ్లతో మాట్లాడి శిక్షలు పడటానికి అనుసరించాల్సిన పద్ధతుల గురించి వివరించారు. సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పర్చాలని, సమన్లు సకాలంలో సర్వ్ చేయాలని సూచించారు. అనంతరం స్టేషన్లోని రిసెప్షన్, గదులను పరిశీలించి, రికార్డులు, సీడీ ఫైల్స్ తనిఖీ చేసి, పోలీసుస్టేషన్ పరిధిలో శాంతిభద్రతలపై సమీక్షించారు. నేరాల నియంత్రణలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించి అదుపు చేయాలన్నారు. సైబర్ నేరాలను నియంత్రించేందుకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. సైబర్ నేరాల దర్యాప్తులో సాంకేతికతను వినియోగించుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అనంతరం మహిళా సంరక్షణ పోలీసులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా సంరక్షణలో పోలీసుల పాత్ర చాలా కీలకం అని, వారు శక్తి యాప్ గురించి క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, గంజాయి సమాచారిన్ని సేకరించి సంబంధిత అధికారులకు చేరవేయాలని ఎం.ఎన్.పి.లను డీఐజీ ఆదేశించారు. అనంతరం సీఐ చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. ఇక ఎంఎస్పీలను బందోబస్తుకు ఉపయోగించబోమని, కేవలం స్టేషన్ వారీగా సమాచారం కొరకు వారి సేవలను వినియోగిస్తున్నామన్నారు. అనంతరం డీఐజీ జెట్టి, ఎస్పీ వకుల్ జిందల్ పోలీసుస్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. వార్షిక తనిఖీల్లో డీఐజీతో పాటు డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్పీ సీఐ ఎ.వి.లీలారావు, టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు,ఎస్ఐలు కృష్ణమూర్తి, కనకరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్రపై ప్రతిజ్ఞ
పార్వతీపురం రూరల్: ప్రతీ ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొనేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి అన్నారు. స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని నర్సిపురం గ్రామంలో స్థానికులతో కలసి శనివారం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె స్థానికులతో మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉండదని ఆమె తెలిపారు. బాధ్యతగా గ్రామాల్లో ఉన్న చెత్త సేకరణ సిబ్బందికి స్పందిస్తూ నిబంధనల మేరకు తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరుగా అందించి ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా చెత్త సేకరణ సిబ్బందికి అప్పగించాలన్నారు. పార్వతీపురం తహసీల్దార్ సురేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. సైబర్ నేరాల పట్ల తస్మాత్.. : ఎస్పీ సీతానగరం: సైబర్ నేరాలకు పాల్పడవద్దని, మాదక ద్రవ్యాల బారిన పడి యువకులు తప్పుదోవ పట్టొద్దని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి అన్నారు. మండలంలోని జోగింపేట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయ క్రీడా మైదానంలో సంకల్పం ఆధ్వర్యంలో సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలన అంశంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలు, మహిళా రక్షణ చట్టాలు, మాదక ద్రవ్యాల నిరోధం అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తల్లిదండ్రుల కలలను నిజం చేసే విధంగా విద్యావంతులు కావాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అదనపు ఎస్పీ అంకిత సురానా, డీవీఈవో నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాజారావు, ఎంఈవోలు సూరిదేములు, వెంకటరమణ, సీఐ గోవిందరావు, ఎస్ఐ ఎం.రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వంశధారలో వివాహిత గల్లంతు భామిని: మండలంలోని లివిరి గ్రామానికి చెందిన వివాహిత కుమ్మరి లక్ష్మి(38) గ్రామ సమీపాన ఉన్న వంశధార నదిలో శనివారం స్నానానికి దిగి గల్లంతైంది. దీన్ని గుర్తించిన నదిలోని తోటి మహిళలు కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చి అధికారులకు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్ శివన్నారాయణ, ఎంఆర్ఐ మణి ప్రభాకర్, బత్తిలి ఎస్ఐ అప్పారావు ఆధ్వర్యంలో కొత్తూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి తెప్పల సాయంతో నదిలో గాలించారు. అయినా లక్ష్మి జాడ కనిపించలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నదీ తీరాన ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్లు విజయనగరం టౌన్: ప్రభుత్వ రంగ సంస్ధ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ట్రిపుల్ పే ప్లాన్ను ప్రకటించిందని ఆ శాఖ డిప్యూటీ జనరల్ మేనేజర్ డి.దాలినాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు రూ. 400 చెల్లించడం ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్తో పాటూ 400పైగా టీవీ చానెల్స్, తొమ్మిది ఓటీటీ చానెల్స్, అపరిమిత ఫోన్కాల్స్ సేవలను పొందవచ్చని పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ ఎఫ్టీటీహెచ్ వాడుతున్న వినియోగదారులు కూడా రూ.140 చెల్లించి టీవీ, ఓటీటీ చానల్స్ పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
బ్యాడ్మింటన్ పోటీల విజేతగా విజయనగరం
అరసవల్లి: జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా జరుగుతున్న విద్యుత్ శాఖ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు శనివారంతో ముగిశాయి. తుది ఫలితాల్లో ఓవరాల్ చాంప్గా విజయనగరం సర్కిల్ ఈపీడీసీఎల్ జట్టు నిలిచింది. రెండో స్థానంలో నెల్లూరు ఎస్పీడీసీఎల్, మూడో స్థానంలో జెన్కో ఆర్టీపీఎస్ కృష్ణపట్నం నిలిచాయి. శనివారం శ్రీకాకుళం విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన బహుమతుల ప్రదాన కార్యక్రమంలో తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ డి.చంద్రం, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ టి.వనజ, చీఫ్ జనరల్ మేనేజర్ (ఆర్ఎ) ఎల్.మహేంద్రనాథ్, సీజీఎం (మెటీరియల్స్) పి.శ్రీదేవి, జనరల్ మేనేజర్ కె.సురేఖ తదతరులు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రం మాట్లాడుతూ తొలిసారి రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ వడివేలు, స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, జనరల్ సెక్రటరీ, డివిజనల్ ఈఈ పైడి యోగేశ్వరరావు, సెక్రటరీ మహంతి ప్రభాకరరావు, సనపల వెంకటరావు, డిప్యూటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావు, ఎస్ఏఓ ఎ.శ్రీనివాసరావు, డీ–1 ఏఈ జె.సురేష్కుమార్, డీ–2 ఏఈ కింజరాపు జయరాం తదితరులు పాల్గొన్నారు. -
స్ఫూర్తి ప్రదాత.. టంగుటూరి
● ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పార్వతీపురం రూరల్: రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తి ప్రదాత అని, ఆంధ్ర రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తిని తీసుకువచ్చారని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి అన్నారు. టంగుటూరి జయంతిని జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. న్యాయవాదిగా, రాజకీయ వేత్తగా, రచయితగా, సంపాదకీయుడిగా, రాజనీతిజ్ఞునిగా ప్రకాశం పంతులు విశేషంగా రాణించారని ఎస్పీ కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సీఐలు రంగనాథం, ఆదాం, ఆర్ఐలు నాయుడు, రాంబాబు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో... టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో ఆంగ్లేయులకు ఎదురు నిలిచి గుండె చూపిన ధైర్యశీలి టంగుటూరని ఆమె అన్నారు. -
రైతన్నకు కష్టాలే...
కూటమి పాలనలోవిజయనగరం గంటస్తంభం: చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రైతులు ఎరువులు, విత్తనాల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకుంటుందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. విజయనగరం ప్రదీప్నగర్లో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఇంటి వద్ద విలేకరులతో శనివారం మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల వద్ద స్టాక్ ఉంచి రైతులకు అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం రైతును వంచించడం సబబు కాదన్నారు. విజయనగరం, సాలూరు నియోజవర్గంలో సుమారుగా 2,500 మంది పింఛన్దారులకు నోటీసు అందజేయడం విచారకరమన్నారు. నోటీసులు ఇచ్చామే తప్ప పింఛన్లు తొలగించమంటూ జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పడం సిగ్గుచేటన్నారు. సూపర్ సిక్స్ హామీలను త్రికరణ శుద్ధితో అమలుచేయడంలో సీఎం చంద్రబాబు చేతులెత్తేశారని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 58,58,000 మందికి రైతు భరోసా అందజేస్తే.. నేడు సుమారు 78 లక్షల మంది రైతులు ఉండగా 50 లక్షల మందికే అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి కలిగిందన్నారు. తల్లికి వందనం పథకంలోనూ కోత పెట్టారన్నారు. అధికారంలోకి వచ్చి 16 నెలలవుతున్నా నిరుద్యోగభృతి ఊసేలేదన్నారు. రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఉత్త గ్యాస్గా మారిందని విమర్శించారు. ఆడబిడ్డ నిధికి సమాధి కట్టేశారని విమర్శించారు. 18 నుంచి 59 ఏళ్లలోపు వయస్సు మహిళందరికీ ఆడబిడ్డ నిధి కింద ప్రతీనెలా రూ.1500 అందజేస్తామని చెప్పి ఉసూరుమనిపించారన్నారు. అబద్ధాల పాలన గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి మాటల్లో నూరుకి తొంభై అబద్ధాలే ఉంటాయని రాజన్నదొర విమర్శించారు. సాలూరు నియోజకవర్గంలోని గిరిశిఖర గ్రామాలకు చంద్రబాబు హయాంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదన్నారు. మక్కువ నుంచి మంత్రి స్వగ్రామం కవిరిపలిక్లి, కవిరిపల్లి నుంచి శంబరకు, శంబర నుంచి మామిడిపల్లికి వెళ్లే రోడ్లు అధ్వానంగా మారినా మంత్రి స్పందించకపోవడం విచారకరమన్నారు. మక్కువ నుంచి భోగవలస మెయిన్ రోడ్డును రూ.56 కోట్లతో కొంతమేర పనులు చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనన్నారు. మంత్రికి బురద జల్లడం తప్ప పనులు చేయడం చేతకావడంలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలెప్పుడు? ఆడబిడ్డ నిధికి సమాధి నిరుద్యోగ భృతి ఎక్కడ? గ్యాస్ సబ్సిడీ నిల్ మంత్రి ఇలాకాలో రహదారులు అధ్వానం కూటమి సర్కారు వైఫల్యాలపై పీడిక రాజన్నదొర ధ్వజం -
రక్త పరీక్ష కేంద్రాల్లో అక్రమ వసూళ్లు!
● జిల్లాలో 47 రక్త పరీక్ష కేంద్రాలు ● మలేరియా, టైఫాయిడ్, డెంగీ స్పెషల్ ప్యాకేజీలంటూ వసూళ్లు ● ప్యాకేజీ కింద రూ.2 వేల నుంచి 2500 వరకు వసూళ్లు పార్వతీపురం టౌన్: పల్లె, పట్టణం అన్న తేడా లేదు.. మంచం పట్టని గ్రామం అంతకన్నా లేదు.. వీధివీధినా.. ఇంటింటిలో జ్వరంతో ప్రజలు అల్లాడుతున్నారు. జ్వర బాధితులను కాళ్లు వాపులు, ఒళ్లు నొప్పులు వేధిస్తున్నాయి. వచ్చింది ఏ జ్వరమో తెలుసుకునేందుకు రక్త పరీక్ష కేంద్రాలకు వెళ్తే మలేరియా, టైఫాయిడ్, డెంగీ ప్యాకేజీ అంటూ రూ.2వేల నుంచి రూ.2500 వరకూ కేంద్రాల నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. నెల రోజులుగా.. నెల రోజులుగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రైవేట్ రక్త పరీక్ష కేంద్రాల నిర్వాహకులు ఒక్కొక్క పరీక్షకు ఒక్కో రేటు అన్న చందంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏ పరీక్షకు ఎంత ధర అన్న వివరాలు తెలిపే బోర్డులు ఏవీ ఏర్పాటు చేయడం లేదు. జ్వర పీడితులు అధికంగా ఉండటంతో మలేరియా, టైఫాయిడ్, డెంగీ పరీక్షలకు ప్రత్యేక ప్యాకేజీ అంటూ వేల రూపాయిలు వసూలు చేస్తున్నారు. జ్వర పీడితులను తమ వద్దకు పంపించిన ప్రైవేటు వైద్యులు, ఆర్ఎంపీలకు రక్త పరీక్ష కేంద్రాల నిర్వాహకులు కమీషన్లు ముట్టజెబుతున్నారు. సీజనల్ వ్యాధుల ముసుగులో రక్త పరీక్ష కేంద్రాల వారు బాగా దండుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పీహెచ్సీల్లో అంతంతమాత్రంగానే... జిల్లాలొని 37 పీహెచ్సీలతో పాటు ఐదు పట్టణ అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. గతంలో ఆసుపత్రుల్లో నిత్యం ఓపీకి 20 నుంచి 30 వరకు వచ్చేవారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది పెరగడమే కాకుండా, అవసరమైన మందులు, రక్త పరీక్షలకు యంత్ర పరికరాలు సమకూరాయి. వైద్య సేవలు మెరుగు కావడంతో రోజుకు వంద మంది ఓపీ సేవలు అందించేవారు. రక్త పరీక్షల సామగ్రి పీహెచ్సీలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో గతంలో పరీక్షలు వేగవంతంగా చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పీహెచ్సీల అభివృద్ధి గాలికి వదిలేయడంతో పీహెచ్సీల్లో సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయన్న విమర్శలున్నాయి. డిస్ప్లే బోర్డులు తప్పనిసరి రక్త పరీక్ష కేంద్రాల్లో ధరలకు సంబందించి డిస్ప్లే బోర్డులు తప్పనిసరిగా ప్రదర్శించాలి. అధిక ధరలు వసూలు చేస్తున్న ల్యాబ్లను గుర్తించి ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన ల్యాబ్లలో మాత్రమే రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. అన్ని పీహెచ్సీలలో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రజలు గమనించాలి. – డాక్టర్ టి.జగన్మోహన్రావు, ఎన్సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి చర్యలు తీసుకుంటాం.. రక్త పరీక్ష కేంద్రాల నిర్వాహకులు అధిక ధరలు వసూలు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అధిక ధరలు వసూలు చేస్తున్న వారి వివరాలు తెలిపితే అక్కడకు వెళ్లి విచారణ చేస్తాం. ల్యాబ్ల్లో తనిఖీలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. ఎక్కడ అధికంగా వసూలు చేసినా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ భాస్కరరావు, డీఎంఅండ్హెచ్వో, పార్వతీపురం -
ఆర్ఎంపీ ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: పురుగుల మందు తాగి ఆర్ఎంపీ వైద్యుడు నరసింహరావు(48) ఆత్మహత్య చేసుకున్నట్టు వన్ టౌన్ పోలీసులు శనివారం తెలిపారు. దీనికి సంబంధించి ఏఎస్ఐ జగన్మోహనరావు తెలిపిన వివరాలు.. భోగాపురంలో ఆర్ఎంపీ డాక్టర్గా పని చేస్తున్న నరసింహరావు రెండు రోజుల కిందట భార్య జ్యోతికి విజయనగరంలో పని ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. నరసింహరావు నగరంలోని సంగీత కళాశాల వద్ద ఉన్న ఎల్లమ్మ గుడి వద్ద పడి ఉండడాన్ని శనివారం గుర్తించిన స్థానికులు ఫోన్ నంబరు ఆధారంగా భార్యకు సమాచారం అందించారు. వెంటనే భోగాపురం నుంచి వచ్చిన జ్యోతి అపస్మారక స్థితిలో ఉన్న భర్తను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించింది. కాగా, శనివారం మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు వన్ టౌన్ పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు చేశారు. -
25 నాటికి సమచారం అప్డేట్ కావాలి
● కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం రూరల్: అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఈ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ (కేపీఐ)లను ఈ నెల 25లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మాసిక, త్రైమాసిక, వార్షిక లక్ష్యాలు, ప్రగతిని నమోదు చేయాలని వీడియోకాన్ఫరెన్స్లో శనివారం సూచించారు. పొరపాట్లకు తావివ్వకుండా చూడాలన్నారు. సమావేశంలో జేసీ ఎస్ఎస్ శోభిక, డీఆర్వో కె.హేమలత, ఎస్డీసీ ఎస్.దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. బీఎల్ఓలకు సహకరించండి పార్వతీపురం: ఓటరు జాబితా తయారీలో రాజకీయ పక్షాల ప్రతినిధులు, బీఎల్ఓలకు సహకరించాలని కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి ఎన్.చిన్నారావు కోరారు. కలెక్టర్ కార్యాలయంలోని డీఆర్ఓ చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు ఒక నియోజకవర్గంలోనే నమోదై ఉండాలన్నారు. ఓటరు వేరే ప్రాంతానికి బదిలీ అయితే, తన ఓటుహక్కును కూడా బదిలీ చేసుకోవాలన్నారు. సమావేశంలో వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. చిన్నారులకు మెరుగైన వైద్యం ● డీఎంహెచ్ఓ భాస్కరరావు పార్వతీపురంటౌన్: చిన్నారులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు తెలిపారు. ఎన్హెచ్ఎం, ఆర్బీఎస్కేలో భాగంగా జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రంలో శనివారం నిర్వహించిన ఉచిత గుండె వైద్యశిబిరాన్ని ఆయన పరిశీలించారు. విశాఖపట్టణం నుంచి వచ్చిన గుండె వైద్యనిపుణులు ఎ.అశోక్రాజు 18 ఏళ్ల లోపు బాలలు 26 మందికి గుండె పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఏడుగురిని మెరుగైన వైద్యసేవల కోసం ఎన్టీఆర్ వైద్యసేవ కింద మెడికవర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు టి. జగన్మోహన్రావు, రఘుకుమార్, పిల్లల వైద్యనిపుణులు భరత్ చంద్ర, ఎపిడిమాలజిస్ట్ కౌశిక్ పాల్గొన్నారు. బొబ్బిలి: రాష్ట్రంలో కొత్తగా వితంతువులు, వృద్ధులు, నిరుపేద వర్గాలవారికి ఒక్క పింఛన్ మంజూరు చేయకుండా, గత ప్రభుత్వం మంజూరు చేసిన దివ్యాంగుల పింఛన్ల తొలగింపుకు కూటమి ప్రభుత్వం పూనుకోవడం దారుణమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. బొబ్బిలిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి పాలనలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, కోతలే కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఏడాది పాలనలో 4లక్షల పింఛన్లను నిలివేయగా, జిల్లాలో 80వేల పింఛన్లు తొలగించిన ఘనత కూటమిదేనన్నారు. దివ్యాంగులు దేవుడు బిడ్డలని, వారికి అండగా ఉండి ఆదుకోవాల్సిన ప్రభుత్వం కక్షసాధిస్తోందన్నారు. దివ్యాంగులకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుందని స్పష్టంచేశారు. యూరియా కోసం రైతులు నానా పాట్లు పడాల్సి వస్తోందన్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఎరువు కష్టాలకు ప్రధాన కారణమన్నారు. నిరుద్యోగ భృతి ఏదీ? ఎన్నికల ముందు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్న కూటమి నాయకులు ఇప్పుడు ఏం మాట్లాడడం లేదన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారన్నారు. 16 నెలల్లో ఎంతమందికి నిరుద్యోగ భృతి చెల్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
అనాథలైన అమ్మానాన్నలు
లక్కవరపుకోట: అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు నాడు బిడ్డలా? అన్నట్లు తయారైంది వృద్ధులైన ఆ దంపతుల పరిస్థితి. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నా అనాథల్లా రోడ్ల వెంబడి పిచ్చివారిలా తిరుగుతూ ఏవరైనా పెట్టింది తింటూ షాపుల ముందు పడుకుంటూ ఆ దంపతులు పడుతున్న దీనస్థితి కలిచివేస్తోంది. నలుగురు పిల్లలను కని పెంచి ప్రయోజకులుగా చేసిన ఆ తల్లిదండ్రులు అనాథల్లా మిగిలిపోయారు. ఈ దీనగాథ ఇలా ఉంది. లక్కవరపుకోట మండల కేంద్రానికి చెందిన సంఘం అప్పలనారాయణ, చిన్నమ్మలు భార్యాభర్తలు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. కాయగూరల వ్యాపారం చేస్తూ పిల్లలను పెంచి వారికి పెళ్లిళ్లు, పేరంటాలు జరిపించారు. అలాగే చిన్నమ్మలుకు తన కన్నవారి కుటుంబం నుంచి కొంత ఆస్తికూడా కలిసి వచ్చింది. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయగా వారు అత్తవారిళ్లకు వెళ్లిపోయారు. కొడుకులిద్దరూ తన తల్లి కన్న వారి ఇంటి నుంచి వచ్చిన భూమిని లక్షల్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. తీరా ప్రస్తుతం ఆదంపతులు వృద్ధాప్యంలోకి చేరడంతో వారి ఆలనా పాలన పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆ దంపతులు మతిస్థిమితం లేక ఇద్దరూ చెరో దారిలో పడి రోడ్లపై తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.. -
తోటపల్లి కాలువలో జారి పడి వ్యక్తి మృతి
తెర్లాం: తోటపల్లి ప్రధాన కుడికాలువలో ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయిన ఓ వ్యక్తి మృతి చెందాడు. తెర్లాం మండలంలోని కవిరాయునివలస గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు, తెర్లాం ఎస్సై బి.సాగర్బాబు తెలిపిన వివరాలి లా ఉన్నాయి. సింగిరెడ్డివలస గ్రామానికి చెందిన జమ్మల శంకరరావు(50) శుక్రవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో తోటపల్లి ప్రధాన కుడికాలువ పక్కకు బహిర్భూమికి వెళ్లాడు. కాలువలో దిగి పైకి ఎక్కుతున్న సమయంలో కాలుజారి నీటిలో పడిపోయాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో నీటిలో మునిపోయాడు. కొద్దిసేపటికి గ్రామస్తులు పొలం పనులకు తోటపల్లి కాలువ వైపు వెళ్తూ నీటిలో పడిపోయి ఉన్న వ్యక్తిని చూసి వెంటనే బయటకు తీసి పడిపోయిన వ్యక్తి తమ గ్రామానికి చెందిన జమ్మల శంకరరావుగా గుర్తించారు. అప్పటికే శంకరరావు మృతి చెందడంతో బంధువులు, గ్రామస్తులకు, తెర్లాం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాలువలో పడి వ్యక్తి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న తెర్లాం ఎస్సై సిబ్బందితో సహా సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ జి.హేమంత్కుమార్ వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతుడికి భార్య అప్పమ్మ, ఇద్దరు వివాహితులైన పిల్లలు ఉన్నారు. వారు ముగ్గురు చైన్నెకి కూలిపనుల నిమిత్తం వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. మృతదేహానికి బంధువులు, గ్రామ పెద్దల సమక్షంలో శవ పంచనామా చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సాగర్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాముకాటుతో మహిళ..సంతకవిటి: మండలంలోని మల్ల య్యపేట గ్రామానికి చెందిన మూల అమ్మడు(49) పాముకాటుకు గురై మరణించినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం ఎప్పటిలాగానే అమ్మడు భర్త వెంకటరావుతో కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లగా పొలంలో ఆమెను పాము కాటు వేయడంతో శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మరణించింది. ఈ ఘటనపై మృతురాలి భర్త వెంకటరావు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశామని, మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించామని ఎస్సై తెలిపారు.చెరువులో పడి వ్యక్తి ఆత్మహత్య? బొబ్బిలిరూరల్: మండలంలోని ఎం.బూర్జివలస గ్రామ సమీపంలోని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు చెరువులో గాలింపు చేపట్టారు. గ్రామానికి చెందిన సన్యాసమ్మ అనే మహిళ అదే దారిలో వెళ్తుండగా కొంత దూరంలో ఎవరో చెరువులో దూకినట్లు కనిపించిందని స్థానికులకు తెలియజేయడంతో స్థానికు సమాచారంతో ఎస్సై రమేష్ తన బృందంతో వచ్చి గాలింపు చేపట్టారు. ఈతగాళ్లను చెరువులో దింపి గాలింపు చేపట్టినప్పటికీ ఎవరి మృతదేహం లభ్యం కాలేదు.దీంతో నిజంగా జరిగిందా? లేక అపోహ? అన్న కోణంలో పోలీసులు స్థానికులను విచారణ చేశారు. చూసిన మహిళ వృద్ధురాలు కావడంతో నీటి బాతులను చూసి చెప్పి ఉంటుందని కొంతమంది, నిజంగా జరిగితే పరిస్థితి ఏమిటని మరి కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో శుక్రవారం సాయంత్రం వరకు గాలింపు కొనసాగుతునే ఉంది. చెరువులో ఎటువంటి అచూకీ లభ్యం కాలేదని ఎస్సై రమేష్ తెలిపారు. విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ స్టేషన్ పరిధి రంగిరీజువీధికి చెందిన తాడి శంకరరావు(68) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు వన్టౌన్ సీఐ చౌదరి శుక్రవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శంకరరావు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. భర్త శంకరరావు ఆత్మహత్యపై భార్య ఆరోపణలు చేయగా పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని సీఐ తెలిపారు. -
పోలీస్ శాఖ ఔన్నత్యాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలి
విజయనగరం క్రైమ్: జిల్లాలో హోంగార్డులుగా పనిచేస్తూ ఇటీవల రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి వెల్లడించిన ఫలితాల్లో కానిస్టేబుల్స్గా ఎంపికై న ఆరుగురు హోంగార్డులు శుక్రవారం ఎస్పీ వకుల్జిందల్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఎస్పీ అభినందిస్తూ పోలీస్శాఖలో హోంగార్డుగా పనిచేసిన మీరు సివిల్ కానిస్టేబుల్గా ఎంపికై న తరుణంలో శాఖను ఉన్నతస్థాయిలో తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలని సూచించారు. కానిస్టేబుల్గా ఎంపికై న మీపై మరింత బాధ్యత పెరిగిందని, శాఖపట్ల అవగాహన, అనుభవంతో కర్తవ్యదీక్షతో పనిచేయాలని హితవు పలికారు. కానిస్టేబుల్గా ఎంపికై న హోంగార్డులు నాగరాజు, ఈశ్వరరావు, గౌరినాయుడు, సత్యనారాయణ, దేవి, గౌరినాయుడులు ఎస్పీని అభినందించి దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో హోంగార్డుల ఇన్చార్జి ఆర్ఐ రమేష్కుమార్, హెచ్సీలు శ్రీను, రాజు పాల్గొన్నారు. ఎస్పీ వకుల్ జిందల్ -
ప్రభుత్వ స్థలంలో కూటమి నేత కబ్జా
● అక్రమంగా షెడ్డుల నిర్మాణం ● షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసమని ఆరోపణలుగంట్యాడ: అధికారం ఉందని కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అధికార దర్పంతో ఎక్కడ స్థలం కనబడినా అక్రమిస్తున్నారు. అంతేకాకుండా ఆక్రమించిన స్థలాల్లో నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. అధికారులు కూడా అఽధికార పార్టీ నేతలు ప్రభుత్వ స్థలాలు అక్రమించుకున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమణ కళ్లెదుట కనిపిస్తున్నా తమకు ఏమీ కనబడడం లేదన్న విధంగా అధికారులు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అందులోనూ మంత్రి సొంత మండలంలో తమను ఎవరు ఏమీ అనరనే ధీమాతో కూటమి నేతలు రెచ్చిపోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖరీదైన స్థలం కొట్టేసే ప్లాన్.. మండలంలోని నరవ గ్రామం జాతీయ రహదారిని ఆనుకుని ఉంది. దీంతో ఇక్కడ స్థలాలకు రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలు ప్రభుత్వ స్థలాలపై కన్ను వేశారు. జాతీయ రహదారిని అనుకున్న ప్రభుత్వ స్థలం అక్రమించి ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం షెడ్డు కూడా వేసేశారు. ఈ రోడ్డు గుండానే తహసీల్దార్ నుంచి వీఆర్వో వరకు అందరూ రాకపోకలు సాగిస్తారు. అయినప్పటికీ అక్రమ నిర్మాణం గురించి తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నరనే విమర్శలు ఉన్నాయి. కూటమి నేత అక్రమించిన స్థలం విలువ సుమారు గా రూ. 12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. దీంతో సదరు నేత సొంత స్థలం మాదిరి షెడ్డులు వేసి షాపులు నిర్మించేసి అద్దెకు ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కూటమి నేతల మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. పారదర్శకంగా పాలన సాగిస్తున్నామని మంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు వరకు గొప్పలు చెబుతున్నారు. కానీ అపార్టీ నేతలు ప్రభుత్వ స్థలాలను అక్రమించుకున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ స్థలంలో షెడ్డు నిర్మించినట్టు నా దృష్టికి వచ్చింది. తక్షణమే చర్యలు తీసుకుంటాం. పి.నీలకంఠేశ్వర రెడ్డి, తహసీల్దార్, గంట్యాడ -
బాల్యంపై బ్యాగుల బరువు
వీరఘట్టం: ప్రతి శనివారం బ్యాగు మోత లేకుండా విద్యార్థులకు ఆట, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్రలేఖనంతో పాటు సామాజిక అంశాలపై పట్టు సాధించేలా బోధన చేపట్టి ఒక్క శనివారం మాత్రం నో బ్యాగ్ డే పాటించేలా చర్యలు తీసుకుంటామని ఇటీవల ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటన ఇంత వరకు అమల్లోకి రాలేదు. నేటి కంప్యూటర్ కాలంలోనూ విద్యార్థులకు బ్యాగుల బరువు మోత తప్పడం లేదు. ఆధునిక బోధన విధానంలోనూ చిన్నారులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం లేదన్న విమర్శలున్నాయి. ఉల్లాసాన్ని ఇచ్చే క్రీడలు కనిపించడం లేదు. ఉత్సాహాన్నిచ్చే వాతావరణానికి దూరవుతున్నారు. కేంద్ర విద్యాశాఖ సైతం ఈ వాస్తవాలను ఒప్పుకుంది. చిన్నారులను బరువుల మోత నుంచి బయట పడేయాలని సూచనలు చేసింది. కానీ ఎక్కడా ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఆందోళనలో చిన్నారుల పరిస్థితి కేంద్ర విద్యాశాఖ అధ్యయనం ప్రకారం 70 శాతం మంది విద్యార్థులు పుస్తకాల బరువుతో అనారోగ్యం పాలవుతున్నారు. కండరాలు, మోకాళ్లపై ఒత్తిడి పడుతోంది. 22 శాతం మందిని వెన్నెముక నొప్పి వెంటాడుతోంది. అతి చిన్న వయస్సులోనే నీరసం, భుజాలు వంగి పోవడం సర్వ సాధారణమైంది. 90 శాతం మందికి ఏడు గంటల నిద్ర కరువే. దీంతో తరగతి గదిలో చురుకుదనం తగ్గుతోంది. బహుళ అంతస్తుల భవనాల్లో ప్రైవేట్ బడులు ఉంటున్నాయి. బరువు వేసుకుని మెట్లు ఎక్కడంతో అనేక అనారోగ్య సమస్యలొస్తున్నాయి. అమలు కాని నిబంధనలు..పుస్తకాల బరువుపై కేంద్ర విద్యాశాఖ ఐదేళ్ల క్రితమే హెచ్చరించింది. చిన్నపిల్లల బరువులో పది శాతమే పుస్తకాల బరువు ఉండాలని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్ధితి మరే దేశంలోనూ లేదని బరువుపై అధ్యయనం చేసిన యశ్పాల్ కమిటీ చెప్పింది. అధిక బరువు వల్ల కండరాలపై ఒత్తిడి పడి భవిష్యత్త్లో దీర్ఘకాల సమస్యలు వెంటాడుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. డిజిటల్ బోధన మేలని సూచించాయి. అయితే కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం డిజిటల్ విద్య వైపు మళ్లుతున్నా..మనం ఆ దిశగా అడుగులేయడం లేదు. మార్కుల కోసం గంటల కొద్దీ చదివించే ప్రైవేట్ స్కూళ్లను కట్టడి చేసే దిక్కులేదు. ప్రతి శనివారం అమలు కాని నో–బ్యాగ్ డే కంప్యూటర్ కాలంలోనూ విద్యార్థులకు కష్టాలు బ్యాగు బరువుతో అకెక్కిన ఆటలు చిన్నారుల్లో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు పట్టించుకోని విద్యాశాఖ -
సాంకేతిక పరిజ్ఞానంతో కేసులు ఛేదించాలి
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డిపార్వతీపురం రూరల్: సాంకేతిక పరిజ్ఞానంతో పెండింగ్ కేసుల పరిష్కారం త్వరితగతిన పూర్తిచేయాలని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాల నివారణకు సాంకేతికత వినియోగం, కొత్తక్రిమినల్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీసు అధికారులు విధుల్లో నిబద్ధత పాటిస్తూ ప్రతి కేసులో న్యాయపరమైన ఆధారాలు బలపరిచి బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం విధుల్లో విశేష ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ అంకితా సురానా, ఏఆర్ డీఎస్పీ థామస్రెడ్డి, ఎస్బీ సీఐ రంగనాథం, డీసీఆర్బీ సీఐ ఆదాం, సైబర్ సెల్ సీఐ శ్రీనివాసరావు, సీపీఎస్ సీఐ అప్పారావు, ఏఆర్ఐలు రాంబాబు, నాయుడు, జిల్లాలో ఉన్న సీఐలు, ఎస్సైలు, జీఆర్పీ ఎస్సైలు, ఎకై ్సజ్ సీఐలు తదితరులు పాల్గొన్నారు. -
వారంలోగా గుంతలకు మరమ్మతులు
● ఆర్అండ్బీ ఏఈ బి.రాజేంద్ర కుమార్ ● సాక్షి కథనానికి స్పందన పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రం నుంచి కొరాపుట్ వైపు వెళ్లేందుకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారిపై గుంతలకు వారంలోగా మరమ్మతులు చేపడతామని ఆర్అండ్బీ ఏఈఈ బి. రాజేంద్రకుమార్ అన్నారు. ఈనెల 19న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘‘చెరువులను తలపిస్తున్న రోడ్లు’’ అనే శీర్షికకు ఆయన స్పందిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రహదారి విస్తీర్ణం నిమిత్తం రూ.17కోట్లు మంజూరవగా అందులో భాగంగా 4/0 కిలోమీటర్ల నుంచి 12/8 కిలోమీటర్ల వరకు విస్తీర్ణ పనులు పూర్తయ్యాయన్నారు. అయితే 2023 నుంచి బిల్లులు చెల్లింపు నిలిచిపోయాయని, ఇటీవల బకాయి బిల్లులు చెల్లింపులు జరగడంతో త్వరలో పనులు ప్రారంభించి పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. పోలయ్య ఆచూకీ లభ్యంసంతకవిటి: మండలంలోని చిత్తారపురం పంచాయతీ పోడలి గ్రామానికి చెందిన ఉరదండ పోలయ్య(76) గత ఆదివారం ఉదయం నాగావళి నదిలో గల్లంతయ్యాడు. పోలయ్య ఆచూకీ లభించకపోవడంతో గత మంగళవారం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో గాలింపు చేపట్టగా శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెద్ద బొడ్డేపల్లి వద్ద ఓ మృతదేహం ఒడ్డుకు రావడంతో స్థానికులు అక్కడి వీఆర్ఓకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న పోలయ్య కుటుంబసభ్యులు వెళ్లి మృతదేహం పోలయ్యదేనని గుర్తించినట్లు వీఆర్ఓ అన్నారావు, పోలీస్ సిబ్బంది తెలిపారు. -
ఆర్థిక ఇబ్బందుల్లో ఆదివాసీలు...
రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష సాయం అందిస్తామని జీవో జారీ చేయడంతో పీఎం జన్మన్ పథకంలో గృహ లబ్దిదారులైన ఆదివాసీలు ఇంటి నిర్మాణాన్ని ఉత్సాహంగా ప్రారంభించారు. ఇప్పుడు ఆ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి సర్కారు మాట నిలుపుకోకపోవడంతో గిరిజనులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణ సామగ్రి, కూలీల ఖర్చులు పెరగడం, కేంద్రం ఇచ్చే ప్రోత్సాహక నిధులు ఎటూ సరిపోక పోవడంతో ఇంటినిర్మాణాలు మద్యలో నిలిచిపోయే పరిస్థితి ఉందని గిరిజనులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి రూ.లక్షలను తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు. -
వీవీఆర్ పేటను పార్వతీపురంలో విలీనం చేయాలి
వంగర: మండలంలోని వి.వి.ఆర్.పేట పంచాయతీని పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేయాలని గ్రామస్తులు కోరారు. గ్రామంలో పార్టీలకు అతీతంగా రామమందిరం వేదికగా శుక్రవారం సమావేశమయ్యారు. తమ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో పార్వతీపురం జిల్లా కేంద్రం ఉందని, ప్రస్తుతం ఉన్న విజయనగరం 110 కిలోమీటర్లు దూరంలో ఉందని వెల్లడించారు. రానుపోను దూరం 220 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు. నిత్యం వైద్యం, వ్యాపార, వాణిజ్య అవసరాలకు పార్వతీపురం వెళ్తుంటామని, పాలన పరంగా తమకు అనుకూలమని వెల్లడించారు. సమస్యను అవసరమైతే అమరావతిలోని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళదామని వారంతా నిర్ణయించారు. -
స్వచ్ఛాంధ్ర ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● జేసీ ఎస్.ఎస్.శోభిక పార్వతీపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రతినెలా నాలుగో శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ పార్వతీపురం కార్యక్రమం ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక అన్నారు. తన చాంబర్ నుంచి కార్యక్రమం నిర్వహణ, అవార్డుల ప్రదానంపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో శుక్రవారం సమీక్షించారు. పల్లెలు, పట్టణాలు, గృహాలు, బహిరంగ ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య పను లు చేపట్టాలన్నారు. పనులకు సంబంధించిన ఫొటోలు అప్లోడ్ చేయాలని సూచించారు. తాగునీటి పరీక్షలు నిర్వహించి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని కోరారు. మెరుగైన పనితీరు కనబరిచే వారికి అక్టోబర్ 2న బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. సమావేశంలో డీపీఓ కొండలరావు, డీఈఓ రాజ్కుమార్, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, డీఎంహెచ్ఓ డా.భాస్కరరావు, డీఏఓ కె.రాబర్ట్పాల్, ఎంపీడీఓలు, కమిషనర్లు పాల్గొన్నారు. ఇన్చార్జి పీఓగా బాధ్యతల స్వీకరణ సీతంపేట: ఐటీడీఏ ఇన్చార్జి ప్రాజెక్టు అధికారిగా పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ శుక్రవారం పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆయనకు ఐటీడీఏలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని సమీక్షిస్తానని, క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి చేయాల్సిన వివరాలు తెలియజేస్తానన్నారు. విద్యాసంస్కరణల అమలుతో వికసిత్భారత్ ● ఏబీఆర్ఎస్ఎం జాతీయ సంయుక్త వ్యవస్థాపక కార్యదర్శి జి.లక్ష్మీస్ విజయనగరం అర్బన్: నవ భారత్ నిర్మాణానికి జాతీయ విద్యా విధానం–2020 సంస్కరణల అమలు కీలకమని అఖిల భారత రాష్ట్రీయ శిక్షక్ మహాసంఘ్ (ఏబీఆర్ఎస్ఎం) జాతీయ సంయుక్త వ్యవస్థాపక కార్యదర్శి గుంథ లక్ష్మీస్ అన్నారు. కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో ‘హమారా సంవిధాన్–హమారా స్వాభిమాన్– వికసిత్ భారత్ కోసం జాతీయ విద్యావిధానం–2020 ఆత్మలా ఉంది’ అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రాజ్యాంగ విలువలు, సాంస్కృతిక గౌరవం, విద్యా సంస్కరణలు వంటి చర్యల అమలు వికసిత్ భారత్ నిర్మాణానికి కీలకమన్నారు. వర్సిటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ మాట్లాడుతూ నూతన విద్యావిధానం అమలుతో విద్యా నైపుణ్యాలు మెరుగుపడతాయన్నారు. అనంతరం ముఖ్య అతిథిని సత్కరించారు. కార్యక్రమంలో వర్సిటీ ఏబీఆర్ఎస్ఎం అధ్యక్షురాలు డాక్టర్ పరికిపాండ్ల శ్రీదేవి, వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా, వివిధ విభాగాల అధ్యాపకులు ప్రేమాచటర్జీ, బి.కోటయ్య, కె.సురేష్బాబు, బి.వెంకటేశ్వర్లు, ఎం.గంగునాయుడు, పి.కిశోర్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగోన్నతి తర్వాతే డీఎస్సీ నియామకాలు చేపట్టాలి విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతి కోటాను భర్తీ చేసిన తర్వాతే మెగా డీఎస్సీ నియామకాలు చేపట్టాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కమిటీ సభ్యులు శుక్రవారం డీఈఓ యు.మాణిక్యంనాయుడును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఉద్యోగోన్నతి కల్పించకుండా డీఎస్సీ నియామకాలు చేపడితే ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడైన పాఠశాలల భవనాలను బాగుచేయాలని విన్నవించారు. డీఈఓను కలిసిన వారిలో సంఘ నాయకులు కె.జోగారావు, సీహెచ్ సూరిబాబు, ఎస్.చిట్టిబాబు, పి.లక్ష్మణరావు, బి.అడివయ్య, వాసుదేవరావు, వి.మల్లేశ్వరరావు, రవి తదితరులు ఉన్నారు. -
జీవో ఇచ్చారు.. డబ్బులు మరిచారు..!
సీతంపేట: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా ఉంది... కూటమి ప్రభుత్వం తీరు. పీఎం జన్మన్ హౌసింగ్ స్కీమ్కు కేంద్రం నిధులు సమకూర్చుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న అదనపు సాయం చేయడంలో మొండిచేయి చూపుతోంది. లబ్ధిదారులను వేదనకు గురిచేస్తోంది. గృహ నిర్మాణదారులను ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తోంది. పేదలకు పక్కాఇంటి భాగ్యాన్ని దూరం చేస్తోంది. ఇదీ పరిస్థితి... అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి పక్కా గృహాలు లేని పీవీటీజీ (పర్టికులర్లీ వాలనర్బుల్ ట్రైబ్గ్రూప్)లకు ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పీఎం జన్మన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో గృహానికి రూ.2.39 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. దీనిని మూడు విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అదనంగా రూ.లక్ష మంజూరు చేస్తామని ప్రకటించింది. గతేడాది డిసెంబర్ 10వ తేదీన జీఓ కూడా జారీ చేసింది. గిరిజనులు సంతోషించారు. ఇంటి నిర్మాణానికి ఆర్థిక ఊతం లభిస్తుందని ఆశపడ్డారు. 9 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఒక్కరూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 1749 ఇళ్లు మంజూరయ్యాయి. కేవలం 42 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులు పూర్తి చేశారు. 901 ఇళ్లు పునాద దశలోను, మరో 400 రూఫ్ లెవెల్లో ఉన్నాయి. 94 మంది స్లాబ్లు వేయగా, 452 మంది ఇంకా నిర్మాణాలు ప్రారంభించలేదు. ఒక్కో ఇంటికి పునాదులు వరకు నిర్మిస్తే రూ.70 వేలు, రూఫ్ స్థాయిలో 90 వేలు, స్లాబ్ నిర్మిస్తే 40 వేలు, ఎన్ఆర్ఈజీఎస్ రూ.27 వేలు, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు చెల్తిస్తారు. బిల్లుల చెల్లింపులో అలసత్వం తగదు. ఇస్తామన్న ఆర్థిక సాయం నెలలు గడుస్తున్నా అందలేదు. ప్రభుత్వం స్పందించి జీవో ప్రాప్తికి నిధులు విడుదల చేయాలి. – నిమ్మక అరుణ, టిటుకుపాయి సర్పంచ్ పీఎం జనమన్ ఇంటి నిర్మాణానికి అష్టకష్టాలు పడుతున్నాం. పునాదులు, రూఫ్, స్లాబ్ స్థాయిలో నిర్మించిన వారికి బిల్లులు ఇచ్చారు. అదనపు సాయం అందిస్తే త్వరితగతిన ఇంటిని నిర్మించుకుంటాం. ఇప్పటి వరకు కొంతమందికి రెండువిడతల్లోని నిధులు జమయ్యాయి. ఆ నిధులు ఎటూ సరిపోవడం లేదు. – ఎస్.లక్ష్మి, హౌసింగ్ లబ్ధిదారు, ద్వారబందం పీఎంజన్మన్ కింద తలపెట్టిన గిరిజనుల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అదనపు సాయం కోసం జీవో ఇచ్చింది. నిధులు విడుదల కావాల్సి ఉంది. వచ్చిన వెంటనే లబ్ధిదారుల ఖాతాలకు జమచేస్తాం. – సీహెచ్ వెంకటేష్, హౌసింగ్ ఏఈ, సీతంపేట పీఎం జన్మన్ పథకానికి కూటమి తూట్లు పేదల గూళ్లకు నిధులు విదల్చని వైనం గృహ నిర్మాణ లబ్ధిదారులకు రూ.లక్ష ప్రోత్సాహం ప్రకటించి మిన్నకున్న ప్రభుత్వం జీవో జారీచేసి 9 నెలలైనా విడుదల కాని నిధులు అదనపు సాయం కోసం ఎదురుచూపు ఆర్థిక ఇబ్బందుల్లో గిరిజనులు ముందుకు సాగని ఇళ్ల నిర్మాణాలు -
సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్
రాజాం సిటీ: వచ్చే నెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి కె.శారదాంబ అన్నారు. రాజాం కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ న్యాయవాదులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీకి అనుకూలమైన క్రిమినల్, సివిల్, ప్రీ లిటిగేషన్ కేసులన్నీ లోక్ అదాలత్తో పరిష్కరించుకోవచ్చన్నారు. న్యాయవాదులు, పోలీసులు లోక్అదాలత్కు సహకరించి వీలైనన్ని కేసులను పరిష్కరించుకునే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సివిల్ కేసులు పరిష్కారమైతే కోర్టు ఫీజులు కూడా వాపసు ఇవ్వనున్నా మని పేర్కొన్నారు. జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి సీహెచ్ హరిప్రియ, బార్ అసోసియేషన్ కార్యదర్శి బి.తిరుపతినాయుడు, ప్రభుత్వ న్యాయ వాది పి.శ్రీనివాస్, కె.రమణమూర్తి, ఆర్.రామమూర్తినాయుడు, జె.అప్పలనాయుడు, వైఎస్ శ్రీనివాస్, ఎస్.జయలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు. -
వినేవారే లేరా?
వీఆర్ఏల గోడు.. పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తోంది... వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి కనీసం చొరవ చూపడంలేదు. వినతులు అందజేసినా ఫలితం లేదు. నెలకు ఇచ్చిన రూ.11వేల వేతనంతో కుటుంబాన్ని పోషించేందుక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పదోన్నతుల కల్పనలో కూటమి కినుక వహిస్తోంది. వాచ్మన్ ఉద్యోగం సైతం చేయిస్తోంది. ఖాళీలను భర్తీ చేయకుండా పనిభారం మోపుతోంది. వీఆర్ఏల గోడు వినేవారే లేరు. అందుకే శనివారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలకు సిద్ధమవుతున్నట్టు వీఆర్ఏల సంఘం నాయకులు తెలిపారు. సెప్టెంబరు 2న జిల్లా కేంద్రలో నిరసన తెలియజేస్తామన్నారు. వీఆర్ఏల సమస్యలపై దృష్టి సారించని కూటమి నిబంధనలకు విరుద్ధంగా వాచ్మన్ విధులు చాలీచాలని వేలతనాలతో ఆర్థిక ఇబ్బందులు జిల్లాలో 338 మంది వీఆర్ఏలు సమస్యలు పరిష్కరంచాలంటూ నేటి నుంచి పోరుబాట వీఆర్ఏలకు నెలకు రూ.11వేలు వేతనమే అందజేస్తుండడంతో జిల్లాలో పనిచేస్తున్న 338 మంది వీఆర్ఏలు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు అని చూడకుండా నైట్ వాచ్మన్ విధులకు పంపుతున్నారు. ఖాళీగా ఉన్న వాచ్మన్, అటెండర్ పోస్టులు భర్తీ చేయాలి. అదనపు పనిభారం నుంచి విముక్తి కలిగించాలి. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయినా మా సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నేటి నుంచి నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తాం. – ఈశ్వరరావు, వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం -
● కుంకుమార్చన
శ్రావణమాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. – పాలకొండ ప్రత్యేక అలంకరణలో కోటదుర్గమ్మ కోటదుర్గమ్మ ఆలయం ఆవరణలో సామూహిక కుంకుమ పూజలు చేస్తున్న మహిళలు -
ఏసీబీ వలలో వీఆర్వో
వేపాడ: మండలంలోని శింగరాయి వీఆర్వో కె.సత్యవతి ఏసీబీ వలకు చిక్కారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య అందించిన వివరాలు.. తన రెవెన్యూ పరిధిలో ఒక రైతు అనుభవంలో ఉన్న శింగరాయి, గుడివాడ భూములకు ముటేషన్ దరఖాస్తు చేశారు. ఇందుకోసం వీఆర్వో సత్యవతి సంబంధిత రైతు నుంచి రూ.లక్షా 70వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య ఆధ్వర్యంలో అధికారులు గురువారం సాయంత్రం వేపాడ సమీపంలో కళ్లాల వద్ద ఫిర్యాదుదారి నుంచి రూ.లక్ష నగదు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అక్కడ నుంచి వీఆర్వోను వేపాడ తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు. వీఆర్వో సత్యవతి విధులు నిర్వహిస్తున్న గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను కంప్యూటర్లలో పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐ ఎం.మహేశ్వరరావు, ఎస్ఐ వాసు నారాయణ, సిబ్బంది, మహిళా పోలీసులు, ఆర్ఐ రామలక్ష్మి పాల్గొన్నారు. -
25లోగా చెరువుల ప్రతిపాదనలు రావాలి : కలెక్టర్
పార్వతీపురం రూరల్: జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ చెరువుల కోసం ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ (మరమ్మతులు, పునఃనిర్మాణం, పునరుద్ధరణ) కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. దీని ద్వారా చిన్న నీటిపారుదల మౌలిక సదుపాయాల పరిస్థితి, నిర్వహణ మెరుగు పరచడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచే ప్రయత్నాల్లో కీలకమైన భాగం కానుందన్నారు. గురువారం కలెక్టరేట్లో నీటి పారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని మైనర్ ఇరిగేషన్ చెరువులకు సంబంధించి ఈ కార్యక్రమం కింద ప్రతిపాదనలన్నీ సిద్ధం చేయాలన్నారు. 25 నాటికి డాక్యుమెంట్లు అప్లోడ్ పూర్తి ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతీ శాఖలో గల డాక్యుమెంట్ల అప్లోడ్ ఈ నెల 25 నాటికి పూర్తవుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్కు వివరించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ పలు శాఖాధికారులతో కలసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో గ్రౌండ్ వాటర్, సానుకూల ప్రజాదృక్పథం, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్లోడ్, స్వమిత్వ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించినట్టు కలెక్టర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ప్రత్యేక ఉప కలెక్టర్లు పి.ధర్మచంద్రారెడ్డి, దిలీప్చక్రవర్తి, నీటి పారుదల శాఖ ఈఈ ప్రదీప్, భూగర్భ జలవనరుల శాఖ ఈఈ రామ్మూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు, సీపీఓ ఆర్కె.పట్నాయక్, డీపీవో కొండలరావుతో పాటు మరికొందరు అధికారులు పాల్గొన్నారు.