58వ సారి రక్తదానం
విజయనగరం ఫోర్ట్: నగరానికి చెందిన భవిరెడ్డి సుభాష్..గురువారం 58వ సారి రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. ఎం.ఆర్.టెక్నీషియన్గా పనిచేస్తున్న ఆయన ఏటా తన తండ్రి వర్ధంతి రోజున ఇలా రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా ఇన్నిసార్లు రక్తదానం చేయడమనేది స్ఫూర్తిదాయకమని పలువురు అంటున్నారు.
ఒలింపియాడ్లో శ్రీజన్ విద్యార్థుల ప్రతిభ
పార్వతీపురం రూరల్: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 33వ సర్ సీవీ రామన్ యంగ్ జీనియస్ ఒలింపియాడ్ (2025–26)లో పార్వతీపురంలోని శ్రీజన్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గురువారం జరిగిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో నాలుగో తరగతి విద్యార్థిని పి.చందనశ్రీ రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించింది. జిల్లా స్థాయిలో ఎం.లాలిత్య (3వ తరగతి), పి.మోక్షితాప్రియ (4వ తరగతి), కె.పార్థసారథి (5వతరగతి) ప్రథమ బహుమతులు, డి.రుత్ (4వ తరగతి), వి.ఉమామహేశ్ (7వ తరగతి) ద్వితీయ బహుమతులు అందుకున్నారు.
58వ సారి రక్తదానం


