breaking news
Yadadri
-
ఫాంపాండ్లో మునిగి విద్యార్థి మృతి
భువనగిరిటౌన్: మైనార్టీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి వసతి గృహం సమీపంలోని ఫాంపాండ్లో ఈత కొట్టేందుకు వెళ్లి అందులో మునిగి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం రాయపురం గ్రామానికి చెందిన ఆంథోనిరాజు, దీపారాణి దంపతుల కుమారుడు బాలఆకాష్(16), మరో విద్యార్థి రహమత్ అలీఖాన్ భువనగిరి శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం ఉదయం పాఠశాల వసతి గృహం నుంచి వారిద్దరు బయటకు వెళ్లి సమీపంలోని వ్యవసాయ బావి వద్ద ఫాంపాండ్లో స్నానం చేసేందుకు దిగారు. లోతు అంచనా వేయలేక, ఈత రాకపోవడంతో బాలఆకాష్ ఫాంపాండ్లో మునిగిపోయాడు. మరో విద్యార్థి రహమత్ అలీఖాన్ వెంటనే పాఠశాలకు వచ్చిన సిబ్బందికి విషయం చెప్పాడు. సిబ్బంది వెళ్లేసరికి అప్పటికే బాలఆకాష్ మృతిచెందాడు. మృతదేహాన్ని ఫాంపాండ్ నుంచి బయటకు తీసి భువనగిరి ఏరియా ఆస్పత్రిక తరలించారు. మరో విద్యార్థి రహమత్ అలీఖాన్ అస్వస్థతకు లోనుకావడంతో హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరీక్ష రాసి వస్తాడనుకున్నాం.. తమ కుమారుడు బాలఆకాష్ మరికొన్ని రోజుల్లో పదో తరగతి పరీక్షలు రాసి ఇంటికి వస్తాడని అనుకున్నామని.. కానీ ఇలా విగతజీవిగా ఇంటికి తీసుకెళ్తామని అనుకోలేదని అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతిచెందాడని బాలఆకాష్ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తూ భువనగిరి ఏరియా ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చే వరకు పోస్టుమార్టం చేయకూడదని పట్టుబట్టారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. మైనార్టీ గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ భువనగిరి ఏరియా ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన -
జీఓ సవరించకుండా రేషనలైజేషన్ సరికాదు
సూర్యాపేటటౌన్ : జీఓ నంబర్ 25ను సవరించకుండా ఉపాధ్యాయుల రేషనలైజేషన్ చేయడం సరికాదని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు చక్రధర్రావు అన్నారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 60మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండటం శాసీ్త్రయం కాదని, ప్రభుత్వం రకరకాల జీఓలతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని చూస్తోందని అన్నారు. విద్యారంగంలోకి కార్పొరేట్ వ్యవస్థను తీసుకురావాలని చూస్తే తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రాకపోవడానికి గల కారణాలను శాసీ్త్రయంగా విశ్లేషణ చేయాలని, విద్యారంగానికి బడ్జెట్ పెంచాలని, ప్రతి గ్రామంలో పాఠశాలలతో పాటు ప్రతి తరగతికి ఒక గది, ప్రతి సబ్జెక్టుకు ఉపాధ్యాయుడు ఉండేలాగా చూడాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ శాఖను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా డేగల జనార్దన్, అధ్యక్షుడిగా పబ్బతి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా పుప్పాల వీరన్న, అసోసియేట్ ఉపాధ్యక్షులుగా షేక్ సుభాని, అసోసియేట్ ప్రధాన కార్యదర్శిగా యోగానంద చారిలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యదర్శి రవిచంద్ర, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆర్. లింగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు సీహెచ్. వెంకటేశ్వర్లు, టీపీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు రామ నరసయ్య, వీరయ్య, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. వేణు తదితరులు పాల్గొన్నారు. వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు అపహరణ మునుగోడు: వ్యవసాయ బావి వద్ద చింతపండు ఏరుకుంటున్న వృద్ధురాలిని మాటల్లో పెట్టి ఆమె మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడును ఇద్దరు దుండగులు అపహరించారు. ఈ ఘటన ఆదివారం మునుగోడు మండలం పలివెల గ్రామంలో జరిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలివెల అదే గ్రామానికి చెందిన కొరుపోలు వెంకటమ్మ ఆదివారం మధ్యాహ్నం తమ వ్యవసాయ బావి వద్ద చింతచెట్టు కింద చింతపండు ఏరుకుంటుండగా.. మునుగోడు నుంచి కారులో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అటుగా వెళ్తూ ఆమెను గమనించి కొంతదూరం వరకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చారు. వారిద్దరిలో ఒకరు ‘పెద్దమ్మా.. మాకు కొంచెం చింతపండు పెడతావా’ అని అడగగా.. ‘రోడ్డు పక్కనే ఉన్న కవర్ తెచ్చివ్వు పెడుతాను’ అని చెప్పింది. వారు కవర్ ఇవ్వడంతో వెంకటమ్మ ఆ కవర్ తీసుకొని వంగి చింతపండు ఏరుతుండగా ఆమె మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడుని లాక్కోని అక్కడి నుంచి పరారయ్యారు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు, వెంకటమ్మ కుమారులు దుండగులను వెంబడించినా పట్టుకోలేకపోయారు. కారు నంబర్ ప్లేట్పై తెలుపు రంగు స్టిక్కర్ అంటించిన్నట్లు తెలిపారు. బాధితురాలి కుమారుడు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
టైర్ల రీసైక్లింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం
మోటకొండూరు: మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామ పరిధిలోని శ్రీజీ టైర్ల రీసైక్లింగ్ కంపెనీలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. కంపెనీలో నత్రజని శుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ ప్రమాదం సంభవించిందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. అయితే ఈ కంపెనీని తమ గ్రామం నుంచి తరలించాలని కాటేపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనల ప్రకారం శ్రీజీ టైర్ల రీసైక్లింగ్ పరిశ్రమ కార్యకలాపాలు కొనసాగించడానికి 2025 డిసెంబర్ 29న తాత్కాలిక అనుమతి లభించింది. కానీ 2025 డిసెంబర్ 18నే కంపెనీ యాజమాన్యం అక్రమంగా ట్రయల్స్ ప్రారంభించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాత్కాలిక అనుమతి గడువు కూడా ఫిబ్రవరి 3తో ముగిసిందని, ప్రస్తుతం కంపెనీ నిర్వహణకు ఎటువంటి అనుమతి లేదని, ఒకవేళ ఉంటే బహిరంగంగా చూపించాలని గ్రామస్తులు సవాల్ చేస్తున్నారు. ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నల్లగొండ రీజినల్ ఆఫీసర్ పరిశ్రమను సందర్శించి అన్ని నిబంధనలు పాటిస్తున్నారని నివేదిక ఇచ్చారు. కానీ ఇప్పటికీ అక్కడ నత్రజని శుద్ధి వ్యవస్థ పనులు జరుగుతూనే ఉన్నాయి. పీసీబీ అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కాటేపల్లి గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ పరిశ్రమపై గ్రామ పంచాయతీ అధికారులు, ఎమ్మార్వో, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, వీరిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ ఆందోళనలు.. శ్రీజీ టైర్ల రీసైక్లింగ్ కంపెనీతో పాటు మరో టైర్ల కంపెనీల ద్వారా వెలువడే పొగ, కాలుష్యంతో పరిసర ప్రాంతంలోని రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గతంలోనూ గ్రామస్తులు ఆందోళన చేశారు. కంపెనీ కాటేపల్లి నుంచి తరలించాలని లేదా మూసివేయాలని జిల్లా కలెక్టర్కు, సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించారు. ఈ అగ్నిప్రమాదం పెద్దగై ఉంటే పక్కనే ఉన్న ప్రీమియం ఎక్స్ప్లోజివ్ కంపెనీకి మంటలు నష్టం భారీ ఎత్తున ఉండేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కమ్ముకున్న దట్టమైన పొగ పరిశ్రమను తరలించాలని కాటేపల్లి గ్రామస్తుల డిమాండ్ -
సామిల్లు నిర్వహణ నుంచి చైర్పర్సన్గా..
ఆలేరు: నిన్నమొన్నటి వరకు ఆమె తన భర్తతో కలిసి సామిల్లు(కట్టకోత మిషన్) నిర్వహించేది. పెద్దగా రాజకీయ నేపథ్యం కూడా లేదు. కానీ మున్సిపల్ ఎన్నికల రూపంలో అదృష్టం కలిసొచ్చి మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఆమెను వరించింది. ఆలేరు మున్సిపల్ తొలి మహిళా చైర్పర్సన్గా బీజన బాలమణి పగ్గాలు చేపట్టనున్నారు. 7వ వార్డు నుంచి బాలమణి కౌన్సిలర్గా విజయం సాధించగా.. ఆమెతో పాటు ఏడుగురు కాంగ్రెస్ అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ రావడం, చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో బాలమణిని చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధికారికంగా ప్రకటించారు. దీంతో సోమవారం బాలమణి చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బాలమణి కుటుంబ నేపథ్యం ఇదీ..బాలమణి రాజాపేట ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి వరకు చదువుకుంది. ఆలేరుకు చెందిన బీజన భాస్కర్తో ఆమె వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు కార్తీక్, సాయితేజ ఉన్నారు. భర్త భాస్కర్తో కలిసి ఆమె సామిల్లు వ్యాపారం నిర్వహిస్తుందిది. బాలమణి భర్త భాస్కర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోదరుడు బీర్ల శంకర్కు స్వయానా సడ్డకుడు. ఆలేరు మున్సిపల్ తొలి మహిళా చైర్పర్సన్ బాలమణి -
టీవీఎస్ ఎక్సెల్ను ఢీకొట్టిన స్కూటీ.. ఒకరు మృతి
చౌటుప్పల్ : టీవీఎస్ ఎక్సెల్పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి స్కూటీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని తంగడపల్లి రోడ్డులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన ముస్కు మోహన్రెడ్డి(66) కుటుంబంతో కలిసి పట్టణంలోని హనుమాన్నగర్ కాలనీలో నివాసముంటున్నాడు. రోజుమాదిరిగా ఆదివారం ఉదయం టీవీఎస్ ఎక్సెల్పై స్వగ్రామంలోని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి 11.30గంటల ప్రాంతంలో తిరిగి చౌటుప్పల్కు వస్తున్నాడు. ఈ క్రమంలో తంగడపల్లి దాటిన తర్వాత ఎర్ర స్థూపం వద్దకు రాగానే.. లింగారెడ్డిగూడేనికి చెందిన తొర్పునూరి చందు స్కూటీపై వెనుక నుంచి వేగంగా వచ్చి టీవీఎస్ ఎక్సెల్ను ఢీకొట్టాడు. దీంతో టీవీఎస్ ఎక్సెల్పై నుంచి మోహన్రెడ్డి ఎగిరి రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు రాంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. లైంగిక దాడి కేసులో వ్యక్తి రిమాండ్మర్రిగూడ: వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. వివరాలు.. మర్రిగూడ మండలం సరంపేట గ్రామానికి చెందిన 60 ఏళ్ల పైబడిన వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడగా.. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసి దేవరకొండ కోర్టులో హాజరుపర్చి అనంతరం నల్లగొండ జైలుకు రిమాండ్కు తరలించినట్లు నాంపలి సీఐ డి. రాజు, ఎస్ఐ ఎం. కృష్ణారెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి● మరొకరికి గాయాలు ఆత్మకూరు(ఎం): మండలంలోని రాయిపల్లి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. వివరాలు.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన చెందిన కత్తుల వెంకన్న(55), మహబూబ్నగర్ జిల్లా అడ్డకల్ మండలం చక్రపూర్ గ్రామానికి చెందిన కొండూరు రాజు హైదరాబాద్లో ఉంటున్నారు. సోమవారం వారు పని నిమిత్తం తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామానికి బైక్పై వచ్చి తిరిగి హైదరాబాద్కు వెళ్తున్నారు. మార్గమధ్యలో ఆత్మకూరు(ఎం) మండలంలోని రాయిపల్లి గ్రా స్టేజీ సమీపంలో రోడ్డు క్రాసింగ్ వద్ద బైక్ అదుపుతప్పి చెట్ల పొదల్లోకి వెళ్లింది. దీంతో కత్తుల వెంకన్న అక్కడికక్కడే మృతిచెందాడు. కొండూరు రాజు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
ఓటు వేయలేదని బెదిరింపులు
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ 1వ వార్డులో కొందరు తమకు ఓట్లు వేయలేదంటూ ఓడిపోయిన ఇద్దరు అభ్యర్థులు, వారి మద్దతుదారులు స్థానిక అర్బన్ కాలనీకి చెందిన ఓటర్ల ఇంటి ముందు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వివరాలు.. 1వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఏలే భువనేశ్వరి విజయం సాధించింది. స్వల్ప తేడాతో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి, మరో స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారులు ఓట్ల లెక్కింపు జరిగిన రోజు రాత్రి నుంచి గెలుపొందిన అభ్యర్థి మద్దతుదారులపై కక్ష పెంచుకున్నారు. శనివారం రాత్రి తమకు ఓటు వేయని వారి ఇళ్ల ముందు బీరు సీసాలు పగులగొట్టడంతో పాటు తామిచ్చిన చీరలు, నగదు, ఇతర వస్తువులు తిరిగి ఇవ్వాలంటూ హెచ్చరించారు. దీంతో ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి ఇచ్చిన చీరలను తీసుకొచ్చి వీధుల్లో కుప్పగా పోశారు. ఈ మేరకు అర్బన్ కాలనీ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ లక్ష్మీనరసయ్య తెలిపారు. పద్మశాలీలే లక్ష్యంగా జరుగుతున్న ఈ దాడులు, బెదిరింపులను నియంత్రించాలని పద్మశాలీ సంఘం నాయకులు పోలీసులను కోరారు. ఓటర్ల ఇళ్ల ముందు బీరు సీసాలు పగలగొట్టిన ఓడిపోయిన అభ్యర్థుల అనుచరులు వారిచ్చిన చీరలు, ఇతర వస్తువులను రోడ్డుపై పడేసిన ఓటర్లు పోలీసులకు ఫిర్యాదు -
రాచకొండకు పూర్వ వైభవం తీసుకొస్తా
సంస్థాన్ నారాయణపురం : రాచకొండకు పూర్వ వైభవం తీసుకొచ్చి ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. రాచకొండలో రాచప్ప సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాచకొండ పర్యాటక ఉత్సవాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. రాచకొండ తవ్వకాల్లో బయల్పడిన స్వయంభూ శంభులింగేశ్వర స్వామికి ఎమ్మెల్యే దంపతులు జల, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాచకొండ పర్యాటక ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. దశాబ్దాల క్రితం రాజధానిగా వెలుగొందిన రాచకొండ అభివృద్ధి కోసం మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడతానని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం పూర్తికి సహకారమందిస్తానన్నారు. రాచకొండ అభివృద్ధికి కృషిచేస్తున్న రాచప్ప సమితిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుత్తా ఉమాదేవిప్రేమ్చందర్రెడ్డి, సర్పంచ్లు కాట్రోతు లక్ష్మీసాగర్, కవితరఘు, జర్పుల జగన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కరెంటోతు శ్రీనునాయక్, మందుగుల బాలకృష్ణ, ఉప్పల లింగస్వామి, ఎనుముల శంకర్రెడ్డి, రాచప్ప సమితి ఆధ్యక్షుడు బద్దుల కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి సూరపల్లి వెంకటేశం, కడారి అంజిరెడ్డి పాల్గొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
అభిషేక ప్రియుడికి శత రుద్రాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మహా శివుడికి, ముఖ మండపంలోని స్పటిక లింగానికి, ప్రథమ ప్రాకార మండపంలోని మహా శివుడికి ఉదయం భక్తులచే అభిషేకాలు జరిపించిన పూజారులు.. రాత్రి లింగోద్భవ కాలంలో శత రుద్రాభిషేకం జరిపించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం ఉదయం విశేష పూజలు జరిపారు. బ్రాహ్మణోత్తములచే నిత్య హవనములు, శివ పంచాక్షరీ జపములు, నందీశ్వర పారాయణములు, పంచసూక్త పఠనములు, మూలమంత్ర జపములు, వివిధ పారాయణములు నిర్వహించారు. మహాశివుడికి పాలు, పెరుగు, నెయ్యి, తేనెతో అభిషేకం చేశారు. ఆయా పూజా కార్యక్రమాల్లో ప్రధానార్చకులు, పారాయణీకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కొండపైన ప్రధాన శివాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉపవాస్య దీక్షలను విరమించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.. సాయంత్రం శివాలయం మాడ వీధుల్లో యాదగిరిగుట్టకు చెందిన యాదాద్రి సేవా సమితి, గుండ్లపల్లికి చెందిన వీరప్రతాప మారుతి భజన మండలి ఆధ్వర్యంలో భజన నిర్వహించారు. అనంతరం బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రిచే శివ పురాణ ప్రవచనం జరిపించారు. కుమారి జ్యోతి కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఒగ్గు శ్రీను బృందంచే ఒగ్గు కథ భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్లింది. -
నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పేరు ఖరారు
నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్గా కొణతం చిన వెంకట్రెడ్డి, వైస్ చైర్మన్గా నూకల సందీప్కుమార్రెడ్డిలను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆది వారం ప్రకటించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు గెలుపొందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరూ నేరుగా హైదరాబాద్ నుంచి రానున్నారు. ఎక్స్అఫీషియో సభ్యుడిగా నల్లగొండ ఎంపీ.. నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో సభ్యుడిగా నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్రెడ్డి పేరు నమోదు చేసుకున్నారు. సోమవారం జరగనున్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. చైర్మన్గా కొణతం చినవెంకట్రెడ్డి, వైస్ చైర్మన్గా నూకల సందీప్కుమార్రెడ్డిని ప్రకటించిన మంత్రి ఉత్తమ్ -
మార్మోగిన శివనామస్మరణ
నార్కట్పల్లి : మహాశివరాత్రి సందర్భంగా ఆది వారం నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి క్షేత్రం శివనామస్మరణతో మార్మోగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మహిళలు ఎల్లమ్మ దేవతకు బోనాలు సమర్పించారు. దేవాదాయశాఖ అధికారులు, పోలీసులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్లు సీఐ నాగరాజు, ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. అనుమానాస్పదంగా ఆలయంలో సంచరించే వ్యక్తులను పట్టుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాల ద్వారా భక్తుల కదలికలను పర్యవేక్షించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, సర్పంచులు నేతగాని కృష్ణ, ఉప్పల వెంకట్రెడ్డి, యేల్లేందుల లింగస్వామి, నాయకులు వడ్డే భూపాల్రెడ్డి, వరాల రమేష్, రేగట్టే నవీన్రెడ్డి, గడుసు శశిధర్రెడ్డి, రేగట్టె నర్సిరెడ్డి, పశుపతి, ప్రజ్ఞాపురం సత్తి, సంపత్, లింగస్వామి, శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా చెర్వుగట్టుకు భారీగా తరలివచ్చిన భక్తులు కిటకిటలాడి క్యూలైన్లు భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ఏర్పాట్లు చేసిన పోలీసులు -
మేరీమాత పుణ్యక్షేత్రం దైవ సంకల్పం
మఠంపల్లి: మండల కేంద్రంలోని శుభవార్త చర్చికి మేరీమాత పుణ్యక్షేత్రంగా నామకరణం చేయడం దైవ సంకల్పమని నల్లగొండ మేత్రాసన పీఠాధిపతి (బిషప్) డాక్టర్ ధమన్కుమార్ అన్నారు. ఆదివారం శుభవార్త చర్చికి వచ్చిన ఆయనకు మఠంపల్లిలో స్థానిక రెవరెండ్ ఫాదర్ రాజారెడ్డి, క్రైస్తవులు, చర్చికమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏప్రిల్లో జరిగే చర్చి వార్షికోత్సవాల నుంచి మేరీమాత పుణ్యక్షేత్రంగా వాడుకలోకి వస్తుందని బిషప్ ప్రకటించారు. అనంతరం ఆయన చర్చిలో దివ్యబలిపూజ చేసి క్రైస్తవులకు ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. క్రైస్తవులకు సత్ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫాదర్లు రాజారెడ్డి, అశోక్, మర్రెడ్డి, బాలరెడ్డి, బాలశౌరిరెడ్డి, అర్లారెడ్డి, మాజీ సర్పంచ్ స్రవంతికిషోర్రెడ్డి, లూర్థుమారెడ్డి, బ్రదర్ వినోద్రెడ్డి, సిస్టర్ రూబీ, శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్రెడ్డి, చర్చి కమిటీ పెద్దలు ఆంథోనిరెడ్డి, జార్జిరెడ్డి, టీఆర్ బాలశౌరెడ్డి, బాలరెడ్డి, కాకుమాను జోసెఫ్, తుమ్మా జోసెఫ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ బిషప్ ధమన్కుమార్ శుభవార్త చర్చిని మేరీమాత పుణ్యక్షేత్రంగా ప్రకటన -
ముగిసిన జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు
● ప్రథమ బహుమతిని కై వసం చేసుకున్న దక్షిణ మధ్య రైల్వే జట్టుపెద్దవూర: మండలంలోని చింతపల్లిలో దున్న ఇద్దాస్ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా నాలుగు రోజుల పాటు ప్లడ్ లైట్ల వెలుతురులో లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహించిన జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు శనివారం అర్ధరాత్రి దాటాక ముగిశాయి. ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 15 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి బహుమతులను అందించి మాట్లాడారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి రూ.లక్షను సౌత్ సెంట్రల్ రైల్వేస్ జట్టు, ద్వితీయ బహుమతిని రూ.80వేలను అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ హర్యానా జట్టు, తృతీయ బహుమతి రూ.60వేలు చింతపల్లి మిషన్ ఢిల్లీ జట్టు, నాలుగవ బహుమతి రూ.50వేలు కర్నాటక జట్టు, ఐదవ బహుమతి రూ.40వేలు తెలంగాణ, ఆరో బహుమతి రూ.30వేలు ఉత్తరప్రదేశ్ జట్లు గెల్చుకున్నాయి. వీరికి నగదుతో పాటు షీల్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జటావత్ రవినాయక్, మాజీ జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్, క్రీడల ఆర్గనైజింగ్ కన్వీనర్ షేక్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
భూదాన్పోచంపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. పోచంపల్లి మున్సి పాలిటీ పరిఽధిలోని ముక్తాపూర్కు చెందిన నోముల వెంకట్రెడ్డి(45) ఈ నెల 12న పని మీద బైక్పై పోచంపల్లికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ముక్తాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న ఆటోను ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వచ్చిన మరో వాహనదారుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో వెంకట్రెడ్డి రోడ్డుపై పడిపోవడంతో అతడి తలకు తీవ్రగాయమై కోమాలోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న వెంకట్రెడ్డి కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడు బోర్వెల్ డ్రిల్లర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఎంజీయూ హాస్టల్లో విద్యార్థుల ఆందోళననల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని హాస్టల్లో విద్యార్థులు ఉపయోగించే తాగు నీటి రిఫ్రిజిరేటర్లో శనివారం జెర్రి రావడంతో కలకలం రేగింది. యూనివర్సిటీలో ఇటీవల తరచుగా రిఫ్రిజిరేటర్లో కప్పలు, పురుగులు రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రిఫ్రిరేజిరేటర్ పాడైపోయినా దాన్ని మార్చకుండా ఉపయోగించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వసస్తోందని ఏబీవీపీ నాయకులు ఆందోళన చేశారు. జెర్రి ఉన్న రిఫ్రిరేజిరేటర్ను అక్కడి నుంచి తీసుకుపోయి బయట పడేశారు. విద్యార్థులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో హాస్టర్ డైరెక్టర్ రమేష్ వారికి సర్దిచెప్పారు. కొత్త రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేసి విద్యార్థులకు నాణ్యమైన తాగునీరు అందించాలని ఏబీవీపీ ఎంజీయూ అధ్యక్షుడు హనుమాన్ డిమాండ్ చేశారు. నేడు మఠంపల్లికి బిషప్ మఠంపల్లి : మండల కేంద్రంలోని శుభవార్త చర్చికి ఆదివారం నల్లగొండ మేత్రాసన పీఠాధిపతి (బిషప్) డాక్టర్ దమన్కుమార్ రానున్నారు. ఈ సందర్భంగా స్థానిక రెవరెండ్ ఫాదర్ రాజారెడ్డి పోగుల విలేకరులతో మాట్లాడారు. బిషప్ శుభవార్త చర్చిని మేరీమాత పుణ్యక్షేత్రంగా ప్రకటించనున్నారని తెలిపారు. దాంతో ఏప్రిల్లో జరిగే చర్చి వార్శికోత్సవాల నుంచి ఈ చర్చి మేరీమాత పుణ్యక్షేత్రంగా వాడుకలోకి వస్తుందన్నారు. బిషప్ చర్చిలో దివ్యబలిపూజ చేసి క్రైస్తవులకు ఆధ్యాత్మిక ప్రసంగం చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఫాదర్ అశోక్, శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు జయభారత్రెడ్డి ఉన్నారు. -
రాష్ట్రంలో ఉచిత విద్యనందించాలి
మునగాల : కేరళలో అమలు చేసినట్లుగా తెలంగాణలోనూ ఉచిత విద్యను అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ కోరారు. శనివారం మునగాల మండలంలోని జగన్నాధపురంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్మారకసభ నిర్వహించారు. ఈ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మునగాల చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతమని, ఆనాటి మునగాల పరగణాలో కలకోవ, జగన్నాధపురం గ్రామాలకు చెందిన ఎందరో యోధులు సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని అమరులయ్యారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుందని, కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనపై సీపీఎం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. సీపీఎం నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషిచేయాలని సూచించారు. పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన స్మారక సభలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లు లక్ష్మి, ములకపల్లి రాములు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, షేక్ సైదా, జూలకంటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
పాలకవర్గం మొత్తం కొత్తవారే..
ఆలేరు మున్సిపాలిటీలో 12 మంది తొలిసారి విజయంఆలేరు : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో గెలిచిన అభ్యర్థులందరూ కొత్త వారే. మొత్తం 12 వార్డుల్లో అందరూ మొదటిసారి విజయం సాధించిన వారే. కొందరు తొలి ప్రయత్నంలో, మరికొందరు రెండో ప్రయత్నంలో విజయాన్ని అందుకున్నారు. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. చండూరులో పదికి పది కొత్త ముఖాలే..చండూరు : నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పాలకవర్గం మొత్తం కొత్త వారితోనే కొలువుతీరనుంది. మున్సిపాలిటీలోని పది వార్డులకు గాను అన్నింట్లో కొత్తవారే ఎన్నికయ్యారు. ఈ పది మందిలో ముగ్గురు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలై.. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించారు. మిగతా ఏడుగురు ఈ ఎన్నికల్లోనే మొదటిసారి పోటీ చేసి విజయం సాధించారు. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి పది వార్డుల్లో 18 మంది పోటీ చేయగా.. అందులో 11 మంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే తెర మీదకు రావడం విశేషం. 27 ఏళ్లకే కౌన్సిలర్గా విజయం చండూరు: చండూరు మున్సిపాలిటీలో 5వ వార్డు నుంచి 27 ఏళ్ల యువకుడు కౌన్సిలర్గా గెలుపొందాడు. 5వ వార్డు ఎస్టీ జనరల్కు రిజర్వు కావడంతో కొన్రెడ్డి మధు బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచాడు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన మధు కాంగ్రెస్ ప్రభంజనంలో కూడా తన సమీప ప్రత్యర్థిపై 358 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. తల్లి పారిశుద్ధ్య కార్మికురాలు.. కుమారుడు కౌన్సిలర్చండూరు : తల్లి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న మున్సిపాలిటీలోనే కుమారుడు కౌన్సిలర్గా గెలుపొందాడు. నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ 2వ వార్డులో కాంగ్రెస్ నుంచి 30 ఏళ్ల బుషిపాక వాసు 51 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. వాసు తల్లి ఎల్లమ్మ చండూరు మున్సిపాలిటీలోనే పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. వాసుకు ఐదేళ్ల వయస్సులో అతడి తండ్రి భిక్షమయ్య మృతిచెందగా.. అప్పట్లో చండూరు గ్రామ పంచాయతీలో, ఇప్పుడు మున్సిపాలిటీలో అతడి తల్లి ఎల్లమ్మ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తూ వస్తోంది. వాసు డిగ్రీ చదువు మధ్యలోనే ఆపి చిన్నచిన్న పనులు చేస్తూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ వచ్చాడు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్యంగా కౌన్సిలర్గా పోటీచేసి విజయం సాధించాడు. -
ప్రేమికుల దినోత్సవం రోజు విషాదం
మోటకొండూర్: మైనర్ బాలిక, యువకుడు ప్రేమించుకున్నారు. ఇరువురి తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపంతో ఈ నెల 6వ తేదీన ఇద్దరు పురుగుల మందు తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రేమికుల దినోత్సవం రోజునే యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మోటకొండూర్ మండలం తేర్యాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేర్యాల గ్రామానికి చెందిన వరికుప్పల రాకేష్(21) ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రాకేష్ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమించాడు. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన రాకేష్, బాలిక ఈ నెల 6న నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం రాళ్లవాగుతండాలోని గుట్ట వద్దకు వెళ్లి పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిద్దరిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాకేష్ శనివారం ఉదయం మృతిచెందాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. తల్లిదండ్రులు మందలించారని ఈ నెల 6న పురుగుల మందు తాగిన ప్రేమ జంట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి మైనర్ బాలిక పరిస్థితి విషమం -
ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్దే హవా
యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ హవానే కొనసాగుతుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని తన నివాసంలో సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోద శ్రీరాములుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం ఇదే సీన్ రిపీట్ అవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటయ్యాయని, వారి ఎత్తుగడలను చిత్తు చేస్తూ ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు నిలిచారన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ను ఓటర్లు మరోసారి చిత్తు ఓడించారని, బీజేపీతో చీకటి ఒప్పందాలను తిప్పికొట్టారన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు ఏమీ చేయలేదనే ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ చీర సత్యనారాయణ, మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, జంగమ్మ, మండల కార్యదర్శి మహేందర్, ధర్మారెడ్డి గూడెం సర్పంచ్ రాజయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్నర్సయ్యగౌడ్ ఉన్నారు. ప్రమాణస్వీకారం సమయానికి వైస్చైర్మన్ల పేర్లను ప్రకటిస్తాం ఆలేరు: ఆలేరు మున్సిపాలిటీకి బీజన బాలమణి, యాదగిరిగుట్టకు గుండ్లపల్లి వాణిని చైర్పర్సన్లుగా ఎంపిక చేసినట్లు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. శనివారం ఆలేరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైస్ చైర్మన్ల పేర్లు కూడా అధిష్టానానికి పంపించామన్నారు. ఎంపికలో సామాజిక సమీకరణలు ఇతర అంశాలు పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం ప్రమాణస్వీకారం జరిగే సమయానికి వైస్చైర్మన్ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర మహిళా అభివృద్ధి సహకార సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, నాయకులు ఆకవరం మోహన్రావు, ఇజాజ్, ముదిగొండ శ్రీకాంత్, ఎగ్గిడి యాదగిరి, సాగర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రాజశేఖర్గౌడ్, జైనోద్దిన్, సీపీఐ నాయకుడు చెక్క వెంకటేష్, సీపీఎం నాయకుడు ఇక్బాల్ పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
పేలుడుతో భారీ నష్టం
చౌటుప్పల్ మండలం ఎల్లగిరి శివారులోని లేబొరేటరీస్లో రియాక్టర్ పేలుడుతో భారీ నష్టం వాటిల్లింది. ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026- 8లోశివపార్వతుల కల్యాణంయాదగిరిగుట్ట : యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మూడవ రోజైన శనివారం ఆలయంలో నిత్య హవనం, శివపంచాక్షరీ జపం, నందీశ్వర పారాయణం, పంచ సూక్త పఠనం చేశారు. యజ్ఞ బ్రహ్మ ఆధ్వర్యంలో రుద్ర హవనం జరిపించారు. సాయంత్రం స్తోత్ర, వేద, నమక, చమక పారాయణములు, మంత్ర పుష్ప పఠనం నిర్వహించారు. శివాలయ ఉత్తర దిశలోని కల్యాణ మండపంలో రాత్రి 8గంటలకు శ్రీపర్వత వర్ధిని రామలింగేశ్వరుడి కల్యాణం జరిపించారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం పర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
యూరియా యాప్ను రద్దుచేయాలి
ఆలేరు రూరల్ : యూరియా యాప్ను రద్దు చేసి, బ్లాక్ దందాను అరికట్టాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ అన్నారు. శనివారం ఆలేరు పట్టణంలోని కోఆపరేటివ్ బ్యాంక్ కార్యాలయం ఎదుట ఽసీపీఐ మండల పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా చెక్క వెంకటేష్ మాట్లాడుతూ.. యూరియా స్లాట్ బుకింగ్తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే యాప్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే యూరియా ఇస్తామనడంతో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు గిరిబోయిన స్వామి, గణేష్, ఓదయ్య, ఐలయ్య, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
16న ప్రజావాణి రద్దు
భువనగిరిటౌన్ : జిల్లా అధికారులు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున, ఈ నెల 16న సోమవారం ప్రజా వాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంత రావు శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా విడుదల చేయాలి భువనగిరిటౌన్ : గీత కార్మికులకు రావాల్సిన ఎక్స్గ్రేషియా నిధులు విడుదల చేయాలని కేజీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొలగాని జయ రాములు డిమాండ్ చేశారు. శనివారం భువనగిరి పట్టణంలోని ఫంక్షన్ హాల్లో సంఘం జిల్లా అధ్యక్షుడు రాగీరు కృష్ణయ్య అధ్యక్షతన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు కల్లుగీత కార్మికులను ఓటు బ్యాంకుగా చూడకుండా వారి సంక్షేమానికి బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలన్నారు. ఈ నెల 17న ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర కమిటీ సభ్యుల సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు, అంతటి అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు భావండ్లపల్లి బాలరాజు, బత్తుల లక్ష్మయ్య, సూదగాణి రామచంద్రయ్య, కొ క్కొండ లింగయ్య, సహాయ కార్యదర్శి పల్సం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దారి పునరుద్ధరణ యాదగిరిగుట్ట: యాదగిరి కొండకు దిగువన ఆర్యవైశ్య సత్రం నుంచి మొదటి ఘాట్ రోడ్డులోని జీయర్ కుటీర్ వరకు శ్రీస్వామి వారి కొండపైకి భక్తుల వాహనాలు వెళ్లేందుకు నూతనంగా బ్రిడ్జి నిర్మిస్తుండడంతో 5నెలలుగా వైకుంఠద్వారం నుంచి బ్రిడ్జి వైపు దారిని మూసివేశారు. ప్రస్తుతం బ్రిడ్జి పనులు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో బ్రిడ్జికి కింద ఏర్పాటు చేసిన ఇనుప పిల్లర్లను తొలగించారు. దీంతో వైకుంఠద్వారం నుంచి ఆర్యవైశ్య సత్రం పక్క నుంచి బ్రిడ్జి కిందుగా వాహనాలు వెళ్లే విధంగా మార్గాన్ని పునరుద్ధరించారు. రాచకొండలో శివరాత్రి సందడిసంస్థాన్ నారాయణపురం: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సంస్థాన్నారాయణపురం మండలంలోని రాచకొండలో స్వయంభూలింగేశ్వర శివాలయాన్ని సిద్ధం చేశారు. అదేవిధంగా రాచప్ప సమితి ఆధ్వర్యంలో రాచకొండ పర్యాటక ఉత్సవాలు, హజ్రత్ గాలిబ్ షాహిద్ దర్గాలో ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. -
మున్సిపల్ చైర్మన్ పదవుల్లో బీసీలకు 70 శాతం ఇవ్వాలి
భువనగిరిటౌన్ : మున్సిపల్ చైర్మన్ సీట్లలో బీసీలకు 70 శాతం ఇవ్వాలని, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవులు మూడు బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం భువనగిరిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు 70 శాతం మంది పోటీ చేస్తే 60 శాతం మంది విజయం సాధించారని, ఇది బీసీల రాజకీయ చైతన్యానికి నిదర్శనమని అన్నారు. జనరల్ స్థానాలంటే రెడ్డి, రావులది కాదని, అందులో అందరికీ అవకాశం ఉంటుందన్నారు. బీసీలు అగ్రకులాల మాటలు నమ్మవద్దని, ‘మనమెంతో మనకు అంత’ అనే నినాదంతో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యంభువనగిరి: మండలంలోని రాయగిరి గ్రామ చెరువు వద్ద శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60 సంవత్సరాలు ఉంటాయని, భిక్షగాడిలా కనిపిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 62472, 87126 62733 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు. -
తండ్రి కళ్లముందే కుమార్తె మృతి
● బైక్పై వెళ్తుండగా ఢీకొట్టిన లారీ చౌటుప్పల్ : తండ్రి, కుమార్తె బైక్పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి కళ్లముందే కుమార్తె మృతిచెందింది. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం శివారులో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన వడ్డగోని రమేష్, తన కుమార్తె రిహాన్సిక(9)తో కలిసి ద్విచక్ర వాహనంపై చౌటుప్పల్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. లింగోజిగూడెం గ్రామ శివారులోకి రాగానే హైదరాబాద్ నుంచి వేగంగా వస్తున్న లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రమేష్, రిహాన్సిక రోడ్డుపై పడిపోయారు. లారీ రిహాన్సిక తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. రమేష్కు గాయాలు కాగా.. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. అదృశ్యమై.. చెరువులో శవమై తేలి..చిట్యాల: చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పరిధిలోని చెరువులో శనివారం వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. చిట్యాల ఎస్ఐ ఎం. రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామానికి చెందిన నందగిరి రాములమ్మ(81)కు మతిస్థిమితం సరిగా లేదు. గతేడాది డిసెంబర్ 19 నుంచి ఆమె కనిపించడంలేదు. డిసెంబర్ 22న ఆమె కుటుంబ సభ్యులు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులోని చెరువులో శనివారం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన గొర్రెల కాపరులు వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు సమాచారం మేరకు చిట్యాల ఎస్ఐ రవికుమార్ చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. రాములమ్మ కుటుంబ సభ్యులు వచ్చి దుస్తులు, చెప్పులు చూసి మృతదేహం ఆమెదేనని గుర్తించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్● ఇద్దరు యువకులు దుర్మరణం వలిగొండ : బైక్పై వెళ్తున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మృతిచెందారు. ఈ ఘటన వలిగొండ మండలం సుంకిశాల గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండల కేంద్రానికి చెందిన కళ్లెం పరమేష్(23) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడితో పాటు సుంకిశాలకు చెందిన పోలేపెల్లి మనోజ్ (18) కలిసి బైక్పై పని నిమిత్తం రెడ్లరేపాక గ్రామ పరిధిలోని మర్లపాడుకు వెళ్లి వస్తుండగా.. సుంకిశాలలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. -
రియాక్టర్ పేలుడుతో భారీ నష్టం
● బృందావన్ లేబొరేటరీస్ కంపెనీని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, వివిధ శాఖల అధికారులు ● పూర్తిగా ధ్వంసమైన పరిశ్రమలోని రెండు ప్రొడక్షన్ బ్లాకులు ● రియాక్టర్లో ఒత్తిడి పెరగడంతోనే ప్రమాదం జరిగినట్లు అంచనా ● నలుగురు కార్మికులకు స్వల్ప గాయాలుచౌటుప్పల్: మండల పరిధిలోని ఎల్లగిరి గ్రామ శివారులోని బృందావన్ లేబొరేటరీస్ కంపెనీలో శుక్రవారం రాత్రి రియాక్టర్ పేలుడుతో భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కంపెనీలోని ఉత్పత్తుల విభాగంలోని రియాక్టర్లో ఒత్తిడి పెరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పరిశ్రమ నిర్వాహకులు అంచనా వేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయా బ్లాకుల్లో కార్మికులు ఉన్నప్పటికీ ప్రమాదాన్ని ముందే పసిగట్టి దూరంగా పరుగు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. ఒక్కో ఉత్పత్తుల విభాగంలో 20 వరకు రియాక్టర్లు ఉండగా.. రెండు విభాగాల్లో మాత్రమే ఈ ప్రమాదం జరిగింది. ఒక ఉత్పత్తుల విభాగంలో మాత్రమే ప్రమాదం చోటుచేసుకోవడంతో అందులోని ఒక రియాక్టర్ భారీ శబ్దంతో పేలిపోయింది. మరో విభాగంలోని రియాక్టర్లకు ఏమీ జరగలేదు. రియాక్టర్ పేలుడుతో ఉత్పత్తుల విభాగం బ్లాక్లతో పాటు కంపెనీలోని పలు భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని భవనాలు కూలిపోయాయి. పేలుడు ధాటికి సామగ్రి, శిథిలాలు కంపెనీ పరిసరాల్లో ఎగిరిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది శనివారం తెల్లవారుజాము వరకు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా నష్టం కోట్లల్లోనే ఉంటుందని పరిశ్రమ ఎండీ రామయ్య తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన అధికారులు బృందావన్ లేబొరేటరీస్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ అక్షాంశ్యాదవ్ శుక్రవారం అర్ధరాత్రే ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మంటలను అదుపుచేసి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కాలుష్యనియంత్రణ మండలి ఈఈ వెంకన్న, పరిశ్రమల విభాగం, రెవెన్యూ, పోలీసులు, ఇతర శాఖల అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. ప్రమాదంపై విచారణ జరిపించాలి ఈ ప్రమాదంపై విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన పరిశ్రమను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిథిలాలను వెంటనే తొలగించి కార్మికుల వివరాలు ప్రకటించాలని కోరారు. ఆయన వెంట కల్లూరి మల్లేశం, ఆవనగంటి వెంకటేశం, పాష, బూరుగు కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. నలుగురికి గాయాలురియాక్టర్ పేలిన సమయంలో శిథిలాలు ఎగిరిపడడంతో పరిశ్రమలో పనిచేస్తున్న పగడాల సాయి, దుర్గాప్రసాద్, అరుణ్కుమార్, కోమలేష్ అనే కార్మికులకు స్వల్ప గాయాలైనట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. వారిని శుక్రవారం రాత్రే చౌటుప్పల్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రుడు పగడాల సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
16న కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం
సాక్షి,యాదాద్రి : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో ఎన్నికై న వార్డు కౌన్సిలర్లతో సోమవారం ప్రమాణ స్వీకారం చేయించాలని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. శనివారం కలెక్టరేట్లో మున్సిపల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్స్, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఉదయం 11 గంటలకు వార్డు కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ.. మంచి వాతావరణంలో మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించి ప్రమాణ స్వీకారం చేయించాలన్నారు. ఎన్నిక ఆథరైజ్గా ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక్కొక అధికారిని నియమించడం జరిగిందని, భువనగిరి మున్సిపాలిటీ ఆర్థరైజ్డ్ ఆఫీసర్ గా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు , యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి గ్రామీణ అభివద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి , పోచంపల్లి మున్సిపాలిటీ కి సంబంధించి జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించి ఆర్డిఓ కష్ణారెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీకి ఆర్డిఓ శేఖర్ రెడ్డి, మోత్కూర్ మున్సిపాలిటీకి సంబంధించి అడిషనల్ డిఆర్డిఓ సురేష్ ను నియమించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
నేనున్నాను.. మీరు బాధపడొద్దు
● మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఎమ్మెల్యే ఐలయ్య భరోసాఆలేరు: ఆలేరు మున్సిపాలిటీలో ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్థులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు. శనివారం రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డితో కలిసి 1, 3, 4, 5, 8 వార్డుల అభ్యర్థులు చింతలఫణి సునీతాశ్రీనివాస్రెడ్డి, సందిల సురేష్, గుత్త శమంతారెడ్డి, చింతకింది మురళి, పాము అనితల నివాసాలకు ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించారు. వారు వెళ్లగానే మహిళా అభ్యర్థులు బోరున విలపించారు. నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధపడొద్దని తాను, పార్టీ అండగా ఉంటామని ఎమ్మెల్యే ఓదార్చారు. ఓడిపోయిన అభ్యర్థులు ఆయా వార్డులకు ఇన్ఛార్జిలుగా ఉంటారని, వార్డు ప్రజలకు సంక్షేమ ఫలాలు వారి ద్వారా అందించేలా బాధ్యతలు అప్పగిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఐదుగురు అభ్యర్థులు తమ ఓటమికి కారణాలను సూచనప్రాయంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పరిశీలిస్తానన్నారు. ఆయన వెంట నాయకులు ఇజాజ్, ముదిగొండ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. -
వైభవంగా ధ్వజారోహణం
యాదగిరిగుట్ట: యాదగిరి కొండపై అనుబంధ ఆలయమైన శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు శుక్రవారం రెండవ రోజుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా యజ్ఞబ్రహ్మ ఆధ్వర్యంలో ఆలయ సిద్ధాంతి, ఆలయ ప్రధానార్చకులు, అర్చకులు, పారాయణీకులు, పురోహితుల సమక్షంలో వైభవంగా మహా శివరాత్రి వేడుకలను జరుగుతున్నాయి. ఆలయ మండపంలో నిత్య హవనం, శివ పంచాక్షరీ జపాలు, నందీశ్వర పారాయణాలు, పంచసూక్త పఠనం, మూలమంత్ర జపంతో పాటు వివిధ పారాయణాలు చేశారు. భేరీ పూజ, దేవతాహ్వానం... శివాలయంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పరమ శివుడి వాహనమైన నందీశ్వర చిత్రమైన ధ్వజ పటాన్ని అర్చించి, ఆయా ఉపచారములను చేపట్టారు. అనంతరం ధ్వజ స్తంభంపై అలంకరించారు. అనంతరం భేరీ పూజ, దేవతాహ్వానం చేపట్టారు. అగ్ని ప్రతిష్ఠ.. శివరాత్రి మహోత్సవాలకు వేంచేసిన సకల దేవతలకు అగ్ని ముఖంగా హవిస్సులు అందించి పంచ సూక్త హవనములు, మూలమంత్ర జములతో దశాంక తర్పణాదులు చేపట్టి అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకను హోమ మండపంలో చేపట్టారు. ఆయా వేడుకల్లో ఈవో భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ అర్చకులు, అధికారులు, యాజ్ఞీకులు పాల్గొన్నారు. సాయంత్రం వేళ.. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం వేళ పారాయణీకులచే స్తోత్ర, వేద, నమక, చమక పారాయణాలు, మంత్రపుష్ప పఠనం, సోమకుంభార్చనలు, మూలమంత్ర పారాయణాలు యథావిధిగా నిర్వహించారు. అనంతరం లఘుపూర్ణాహుతి కార్యక్రమం చేశారు.ఫ రెండో రోజుకు చేరిన శివరాత్రి ఉత్సవాలు -
7వ వార్డులో దోబూచులాడిన విజయం
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు (లక్కారం)కు సంబంధించిన శుక్రవారం జరిగిన కౌంటింగ్లో ఫలితం దోబూచులాడింది. మూడు పర్యాయాలు ఓట్లను లెక్కించిన అనంతరం తుది ఫలితాన్ని ప్రకటించారు. వార్డులో 1324ఓట్లకు గాను 1232 పోలుకాగా 1221 చెల్లుబాటయ్యాయి. అందులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానుగు యాదమ్మకు 603 ఓట్లు లభించగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసర్ల మంజులకు 602 ఓట్లు లభించాయి. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి రీకౌంటింగ్ కోరారు. ఆ క్రమంలో మరోసారి ఓట్లను లెక్కించారు. లెక్కింపులో బండిళ్లలో కాంగ్రెస్కు చెందిన ఓ ఓటు లభించింది. దాంతో ఇరువురు అభ్యర్థులకు 603 చొప్పున వచ్చాయి. ఈ సమయంలో మూడో సారి ఓట్లను లెక్కిస్తుండగా బీఆర్ఎస్ ఓట్లలో స్వస్తిక్ గుర్తు సరిగా లేని రెండు ఓట్లు గుర్తించి వాటిని పక్కనపెట్టారు. దాంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసర్ల మంజుల రెండుఓట్ల తేడాతో విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. తమకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, పోలింగ్ ఏజెంట్లు వాదనకు దిగారు. -
ఐదుగురికి జైలు శిక్ష
కులం పేరుతో దూషించిన ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారు.- 10లోఉమ్మడి జిల్లాలో పార్టీల వారీగా సాధించిన సీట్లు మున్సిపాలిటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు మొత్తం నల్లగొండ కార్పొరేషన్ 27 9 4 8 48 చండూరు 6 3 0 1 10 చిట్యాల 9 2 0 1 12 దేవరకొండ 11 6 1 2 20 హాలియా 11 1 0 0 12 మిర్యాలగూడ 31 14 1 2 48 నందికొండ 11 1 0 0 12 హుజూర్నగర్ 19 4 0 5 28 కోదాడ 26 3 0 6 35 నేరేడుచర్ల 9 5 0 1 15 సూర్యాపేట 31 11 1 5 48 తిరుమలగిరి 5 10 0 0 15 ఆలేరు 7 3 2 0 12 భువనగిరి 22 4 4 5 35 చౌటుప్పల్ 13 3 3 1 20 మోత్కూరు 8 3 0 1 12 పోచంపల్లి 6 5 1 1 13 యాదగిరిగుట్ట 8 1 2 1 12 -
ఐదు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్
భువనగిరి: మున్సిపల్ ఎన్నికల్లో హస్తం హవా కొనసాగింది. ఆరు మున్సిపాలిటీలకు గాను ఐదింటిలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవులను కై వసం చేసుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు మించి వార్డులను సాధించింది. పోచంపల్లిలో మాత్రం ఏపార్టీకి కూడా పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు మున్సిపాలిటీలకు చెందిన ఓట్ల లెక్కింపు శుక్రవారం జిల్లా కేంద్రంలోని దివ్య బాల విద్యాలయంలో నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మొదటగా యాదగిరిగుట్టకు చెందిన మొదటి వార్డు ఫలితం ఉదయం 9.15 గంటలకు వెల్లడించారు. ఆ తర్వాత ఆలేరు, మోత్కూరు, పోచంపల్లి, చౌటుప్పల్, చివరిగా భువనగిరి మున్సిపాలిటీకి చెందిన ఫలితాలు వెలువడ్డాయి. మెజార్టీ సాధించడంలో సక్సెస్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీపై చేయిసాధించింది. చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పెద్దగా పోటీ ఇవ్వకలేకపోయారు. దీంతో భువనగిరి, చౌటుప్పల్, మోత్కూర్, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీతో పాటు మోత్కూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వార్డులు సాధించడంలో ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్కుమార్రెడ్డి, మందుల సామేల్, రాజగోపాల్రెడ్డి సక్సెస్ అయ్యారు. 102 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తే ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 104 వార్డులుండగా ఇందులో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 10వ వార్డు, చౌటుపల్లో 17వ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 102 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 99 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయగా 62, బీజేపీ 90 వార్డుల్లో పోటీ చేయగా 12, బీఆర్ఎస్ 91 స్థానాలలో పోటీ చేయగా 19, సీపీఎం 8 స్థానాలలో పోటీ చేస్తే 1, సీపీఐ 2 స్థానాలలో పోటీ చేస్తే 1, స్వతంత్రలు 63 స్థానాల్లో పోటీ చేయగా ఏడుగురు అభ్యర్థులు గెలుపొందారు. ఇందులో యాదగిరిగుట్టలో మొదటి సారి బీజేపీ అభ్యర్థులు ఇద్దరు విజయం సాధించి మున్సిపాలిటీల్లో ఖాతా తెరిచారు. ఏడుచోట్ల స్వతంత్రుల విజయం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏడు వార్డుల్లో స్వత్రంత అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో భువనగిరిలో 5, భూదాన్పోచంపల్లి, మోత్కూర్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరిలో పార్టీల నుంచి టికెట్ అశించి రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఐదు చోట్ల మ్యాజిక్ ఫిగర్ దాటి.. భువనగిరి మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కోసం మ్యాజిక్ ఫిగర్ 18, చౌటుప్పల్ మున్సిపాలిటీలో 11, ఆలేరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట, మోత్కూరులో 7 చొప్పున మ్యాజిక్ ఫిగర్ అవసరం. ఆయా మున్సిపాలిటీల్లో భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, మోత్కూరు, ఆలేరులో చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను మించి వార్డులను అధికార పార్టీ గెలుపొందింది, భూదాన్పోచంపల్లిలో మ్యాజిక్ ఫిగర్కు ఒక సీటు తక్కువగా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి టికెట్ లభించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా జింకల లావణ్య పోటీ చేసి విజయంసాధించారు. ప్రస్తుతం ఆమెను కాంగ్రెస్ పార్టీవారు క్యాంప్కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఆమె కాంగ్రెస్ గూటికి చేరితే జిల్లాలో ఉన్న ఆరు మున్సిపాలిటీలు హస్తగతం కానున్నాయి. క్యాంపులకు అభ్యర్థులు ఇప్పటికే యాదగిరిగుట్ట, ఆలేరు, చౌటుప్పల్కు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు క్యాంప్కు తరలివెళ్లగా తాజాగా భువనగిరి, పోచంపల్లికి చెందిన అభ్యర్థులను విజయం సాధించిన అనంతరం క్యాంప్కు తరలించారు. భువనగిరి మున్సిపాలిటీలో గెలుపొందిన 22 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అధ్వర్యంలో ప్రత్యేక బస్సులో రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతంలో ఉన్న ఓ ఫాంహౌస్కు వెళ్లినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చైర్మన్, వైస్చైర్మన్ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో క్యాంపులోనే నిర్ణయం తీసుకుని సీల్డ్కవర్తో ఈ నెల 16న సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. చైర్మన్ పదవి వరించేదెవరికో.. ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోనన్న చర్చ జరుగుతోంది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 10 వార్డు నుంచి ఏకగ్రీవమైన కాంగ్రెస్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి చైర్మన్గా, ముక్కెర్ల మల్లేష్ను వైస్ చైర్మన్ చేస్తారని ప్రచారం జరిగింది. ఆలేరులో 7వ వార్డుకు చెందిన బాలమణి, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో 7, 9, 13 వార్డులకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థులు, మోత్కూర్లో 2,6 వార్డులకు చెందిన అభ్యర్థులు, భువనగిరిలో 11,29,35 వార్డులకు చెందిన అభ్యర్థులు చైర్మన్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ వీరిలో ఎవరు చైర్మన్ అవుతారో ఈ నెల 16న తేలనుంది. ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్ ఆరుమున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగించేందుకు మూడంచెల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. కలెక్టర్ హనుమంతరావుతో పాటు ఎస్సీ అక్షాంశ్ యాదవ్ ఎప్పటికప్పుడు లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు.ఫ భూదాన్పోచంపల్లిలో ఏ పార్టీకి రాని పూర్తిస్థాయి మెజారిటీ ఫ 20లోపు స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్, బీజేపీ ఫ క్యాంప్లకు తరలివెళ్లిన అధికార పార్టీ అభ్యర్థులు -
కాంగ్రెస్ను తట్టుకోలేరు
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట: మున్సిపల్ ఎన్నికల్లో ఆలేరు, యాదగిరిగుట్టలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి వచ్చిన కాంగ్రెస్ను తట్టుకోలేదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. భువనగిరి శివారులోని దివ్యబాల విద్యాలయంలో ఓట్ల లెక్కింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నా.. ఓటర్లు మాత్రం ప్రజా ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారన్నారు. ఆలేరు, యాదగిరిగుట్టలో వచ్చిన ఫలితాలు సీఎం రేవంత్రెడ్డి చేసిన అభివృద్ధి పనులకు నిదర్శనం అని అన్నారు. ఆలేరు, యాదగిరిగుట్టలో సాధించిన విజయాన్ని సీఎం రేవంత్రెడ్డికి అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్, బీజేపీలు ఎక్కడ పోటీ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ రెండున్నర ఏళ్ల పాలన చూసి ప్రజలు మంచి విజయాన్ని అందించారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం సాధించేందుకు సహకరించిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.కాంగ్రెస్ శ్రేణుల గెలుపు సంబరాలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అధిక వార్డులు కై వసం చేసుకోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. బాణ సంచా కాల్చుతూ, నృత్యాలు చేస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అధిక సీట్లు గెలుచుకోవడమే కాకుండా చైర్మన్ పీఠాన్ని సైతం దక్కించుకోవడంతో మరింత ఉత్సాహంగా సంబరాలు చేశారు. ఇక కౌంటింగ్ కేంద్రం వద్ద గెలిచిన అభ్యర్థులతో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వచ్చి ధ్రువ పత్రాలను తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించారన్నారు. ఇద్దరికి ఒక్కొక్క ఓటు.. మరొకరికి రెండు..మోత్కూరు : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో ఇద్దరు అభ్యర్థులకు ఒక్కొక్క ఓటు, మరొక అభ్యర్థికి రెండు ఓట్లు వచ్చాయి. 1వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గుమ్మడెల్లి పరశురాములు పోటీ చేశారు. ఈ వార్డులో ఆయనకు ఓటు హక్కులేదు. కానీ ఒక్క ఓటు రావడం విశేషం. 3వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి రేవల్లి రవిప్రసాద్కు ఒక్క ఓటు, 2వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బోయినపల్లి లక్ష్మికి రెండు ఓట్లు వచ్చాయి. యాదగిరి క్షేత్రంలో లక్ష పుష్పార్చనయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో లక్ష పుష్పార్చన పూజను ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారంగా నిర్వహించారు. శుక్రవారం ఏకాదశి కావడంతో ఆలయ ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చన మూర్తులకు విశేషంగా పూజలు చేసి, వివిధ రకాల పుష్పాలు, తులసీ దళాలతో లక్ష పుష్పార్చన చేపట్టారు. ఇక ఆలయాన్ని వేకువజామునే తెరచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, సహస్రనామార్చన జరిపించారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణ వేడుకలను చేపట్టారు. శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి విశేషమైన రోజు కావడంతో అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించి, అద్దాల మండపంలో ఊంజల్ సేవోత్సవాన్ని జరిపించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం అనంతరం కల్యాణం జరిపి గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. తర్వాత నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. -
భువనగిరి ఖిలాపై కాంగ్రెస్ జెండా
భువనగిరిటౌన్ : మున్సిపాలిటీ ఎన్నికల్లో భువనగిరి ఖిలాపై కాంగ్రెస్ జెండా ఎగిరిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను శుక్రవారం ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. శాసన సభ ఎన్నికల్లో 40 సంవత్సరాల చరిత్రను తిరిగి రాసే విధంగా భువనగిరి నియోజకవర్గం ప్రజల తీర్పు ఇచ్చారని ఇదే స్ఫూర్తితో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారన్నారు. దాదాపు మొత్తం 35 వార్డుల్లో 27 స్థానాలు కై వసం చేసుకున్నట్లు తెలిపారు. భువనగిరి పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. -
కన్నీళ్లు పెట్టుకున్నా... 10 ఓట్లు మాత్రమే వచ్చాయి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 9వ వార్డులో బీజేపీ తరఫున పోటీ చేసిన బొమ్మగాని రాజమణి ఓటమి పాలయ్యారు. ప్రచారంలో భాగంగా దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్నానని, ఒక్క అవకాశం ఇవ్వాలని కన్నీళ్లు పెడుతూ యువతను ఓటు వేయాలని వేడుకుంది. అయితే ఆమెకు 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. View this post on Instagram A post shared by Politics Meter (@politicsmeter) మూడే ఓట్లు.. అయినా తగ్గేదేలె.. జనగామ: జనగామ మున్సిపాలిటీలోని 27వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన అనంతుల డు ఓట్లు మాత్ర మే వచ్చాయి. అయినా మూడు వేళ్లతో చూపిస్తూ చిరునవ్వు చిందించారు.కల్నల్ తల్లి ఓటమి సూర్యాపేట: భారత్–చైనా సరిహద్దులో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోశ్బాబు తల్లి బిక్కుమళ్ల మంజుల సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 44వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యరి్థగా పోటీ చేసి ఓడిపోయారు. -
ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం
సాక్షి యాదాద్రి: చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలోని బృందావనం ఫార్మా కంపెనీలో (శనివారం) ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తాజాగా అక్కడి ఒక కంపెనీలో రెండు రియాక్టర్ లు పేలాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, నలుగురు కార్మికులు గాయపడ్డట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకవచ్చాయి.దాదాపు మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించిన తర్వాత మంటలను అదుపులోకి వచ్చినట్లు సమాచారం. కాగా ప్రమాద సమయంలో కంపెనీలో 11 మంది ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. అగ్నిప్రమాదం సమయంలో భారీ శబ్ధాలు రావడంతో అక్కడి స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. మరోవైపు ఈ ప్రమాదంపై స్థానికులతో పాటు కార్మికుల కుటుంబ సభ్యులు కంపెనీ యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు. కంపెనీలో తరచుగా ప్రమాదాలు జరుగుతుంటే అధిక ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదంలో ప్రాణనష్టం జరిగితే బాధ్యత ఎవరిది అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల ఫార్మా కంపెనీలలో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యవహారం పలువురిని ఆందోళనకు గురిచేస్తుంది. -
శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండపైన అనుబంధంగా ఉన్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో గురువారం మహా శివరాత్రి ఉత్సవాలకు ఆచార్యులు, పండితులు శ్రీస్మార్త ఆగమ ప్రకారం పాంచాహ్నిక దీక్షతో శ్రీకారం చుట్టారు. ఉదయం 10.30గంటలకు ఆలయ మండపంలో స్వస్తీ వాచనం, విఘ్నేశ్వరపూజ, శుద్ధి పుణ్యాహ వాచనం, రక్షా బంధనం కార్యక్రమాలను యజ్ఞ బ్రహ్మ ఆధ్వర్యంలో ఆలయ సిద్ధాంతి, ప్రధానార్చకులు, అర్చకులు, పారాయణీకులు, పురోహితులు నిర్వహించారు. పారాయణీకులకు అధికారులు దీక్ష వస్త్రాలు అందజేశారు. స్వస్తీ వాచనం.. యాదగిరీశుడి ఆలయానికి అనుబంధంగా ఉన్న రామలింగేశ్వరస్వామి వారి ప్రధానాలయంలో సిద్ధాంతి, యజ్ఞ బ్రహ్మలు అత్యంత వైభవంగా వేడుకలను ప్రారంభించారు. ఈశ్వర అనుగ్రహం వల్ల విశ్వశాంతి, లోక హితం కలగడానికి ఈ స్వస్తీ వాచనం చేపట్టారు. ఇక ఉత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగడానికి విఘ్నేశ్వర ఆరాధన చేపట్టారు. అనంతరం వేద మంత్ర పఠనంతో పవిత్ర జలంతో పూజా ద్రవ్యములను, ఆలయ పరిసర ప్రాంతాలను సంప్రోక్షణ చేసి పుణ్యాహవాచన కై ంకర్యాన్ని నిర్వహించారు. ఈ వేడుకలను జరిపిన తరువాత పార్వతీ పరమేశ్వరులకు రక్షా బంధనం వేడుకను స్మార్త ఆగమ ప్రకారం చేపట్టారు. సాయంత్రం.. సాయంత్రం వేళ శివాలయంలో నమక, చమక పారాయణం, మంత్ర పుష్ప పఠనం చేశారు. అనంతరం అంకురారోపణం, సోమ కుంభ, కలశ స్థాపన, దేవతారాధన, తీర్థ ప్రసాద వితరణ వంటి వేడుకలు నిర్వహించారు. ఆయా వేడుకల్లో ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఫ ఉదయం స్వస్తీ వాచనం.. రాత్రి అంకురారోపణం -
కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి
భువనగిరిటౌన్ : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్పై అధికారులు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కౌంటింగ్ అనేది చాలా కీలకమైందన్నారు. రూల్ 56 ప్రకారం మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించాలన్నారు. ప్రతి బ్యాలెట్ పేపర్ కౌంటింగ్ ఏజెంట్స్ కు చూపించాలన్నారు. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ కౌంటింగ్లో ప్రతి టేబుల్కు ఒక సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించనున్నట్లు తెలిపారు. సక్రమంగా కౌంటింగ్ చేసి ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి, కౌంటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అవాంతరాలు లేకుండా చూడాలి భువనగిరి: ఓట్ల కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని కలెక్టర్ హనుమంతరావు కోరారు. ఆరు మున్సిపాలిటీలకు సంబంధించి భువనగిరి పట్టణ శివారులోని దివ్యబాల విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల కౌంటింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ భాస్కర్రావు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి గురువారం పరిశీలించి మాట్లాడారు. పారదర్శకంగా కౌంటింగ్ చేపట్టాలని సూచించారు. కౌంటింగ్ కోసం భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు. సమయపాలన పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. ఆయన వెంట ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
చిన్నారులకు అల్పాహారం!
అడ్డగూడూరు : అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న చిన్నారులకు ఉదయం పూట అల్పాహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు మధ్యాహ్నం భోజనం, ఉడికించిన కోడి గుడ్డు, బాలామృతం అందిస్తున్నారు. ఉదయం పూట అల్పాహారం ఇస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈపథకం అమలైతే జిల్లాలో 901 అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని 11,900 మంది చిన్నారులకు ప్రయోజనం కలగనుంది. రోజుకో రుచితో.. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఉదయం పూట రోజుకో రుచికరమైన అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చిన్నారులకు ఉదయం ఉప్మా, కిచిడి ఇలా వివిధ రకాలతో అల్పాహార పదార్థాలను అందజేయడంపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ దృష్టిసారించింది. చిన్నారులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో రాజీలేకుండా తెలంగాణ పుడ్స్ ద్వారా సిద్ధం చేసిన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఇవ్వనున్నారు. మొదట ఈ పథకాన్ని రాష్ట్ర రాజధాని కేంద్రంలో ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించారు. ఫ అంగన్వాడీ కేంద్రాల్లో ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం ఫ ఉదయం ఉప్మా, కిచిడీ అందించేలా కసరత్తు ఫ పథకం అమలైతే 11,900 మంది పిల్లలకు ప్రయోజనం అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. పిల్లలు లేక కేంద్రాలు వెలవెలబోతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న తల్లిదండ్రులు వారిని పూర్వ ప్రాథమికవిద్య కోసం ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు.. తల్లిదండ్రులను కలిసి చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని కోరుతున్నా వారు సానుకూలంగా స్పందించడం లేదు. కేంద్రాల నుంచి పౌష్టికాహారాన్ని తీసుకుంటున్న పిల్లలను సైతం పంపడానికి శ్రద్ధకనబర్చడం లేదు. అల్పాహారం పథకం అమలు చేస్తే కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య పెరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆట పాటలతో పూర్వ ప్రాథమిక విద్యను అందుబాటులోకి తెచ్చి తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్రాలకు పంపేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలో అల్పాహారం అందించే విషయంపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ప్రభుత్వం నుంచి జీఓ వస్తే ఈపథకాన్ని పక్కాగా అమలు చేయడానికి కృషి చేస్తాం. –నర్సింహారావు, డీడబ్ల్యూఓ -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం అంతరాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు విశేష అభిషేకాన్ని పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా చేపట్టి సహస్ర నామార్చన పూజ జరిపించారు. ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, సువర్ణ పుష్పార్చన పూజను చేపట్టారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించి గజ వాహన సేవ అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల నిత్య కల్యాణ వేడుకను సంప్రదాయంగా నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. -
కేసీఆర్పై ప్రజల్లో మరింత ఆదరణ పెరిగింది
యాదగిరిగుట్ట: కేసీఆర్పై ప్రజల్లో మరింత ఆదరణ పెరిగిందని, ఇందుకు మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలే నిదర్శనమని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 7 సీట్లకు పైగా బీఆర్ఎస్ విజయం సాధించనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని కులాలకు ప్రాధాన్యమిచ్చి టిక్కెట్లు కేటాయించామన్నారు. యాదగిరీశుడి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంతో పాటు పట్టణాన్ని కేసీఆర్ అభివృద్ధి చేసినందుకు ఓటర్లంతా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు ఓట్లు వేశారన్నారు. కాంగ్రెస్ అధికార బలాన్ని వినియోగించి ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని కొనుగోలు చేసిందని ఆరోపించారు. దీనికి బదులుగా బీఆర్ఎస్ అధిక సీట్లు సాధించి గుట్ట మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకుంటుందన్నారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య డబ్బు అహంకారానికి ఓట్ల రూపంలో ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మండల సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్ గౌడ్, యూత్ ప్రధాన కార్యదర్శి బీమగాని నర్సింహగౌడ్, కల్వకొలను సతీష్రాజ్, ముక్కెర్ల సతీష్, మిట్ట నర్సింగ్గౌడ్, సిరబోయిన నర్సింగ్యాదవ్, శారాజీ రాజేష్ యాదవ్, లింగం యాదవ్, పరుశరాములు, నాగరాజు పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత -
మిర్యాలగూడలో ఘర్షణలు
మిర్యాలగూడ అర్బన్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం మిర్యాలగూడ మున్సిపాలిటీలోని కొన్ని వార్డులు రణరంగాన్ని తలపించాయి. 29వార్డు బంగారుగడ్డలో బీఆర్ఎస్ బలపర్చిన సీపీఎం అభ్యర్థి డబ్బికార్ మల్లేష్ తరఫున షేక్ మస్తాన్న్, షేక్ జమీన్, షేక్ బడేమియా పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఉన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం బయటకు వచ్చిన వారిపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ జావెద్, అతడి సోదరులు అనుచరులతో కలిసి ఇనుపరాడ్లు, కర్రలతో దాడిచేశారు. దీంతో మస్తాన్ తలకు గాయమై స్పృహ కోల్పోయాడు జమీన్, బడేమియాకు గాయాలయ్యాయి. ముగ్గురిని స్థానికులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు తనయుడు నల్లమోతు సిద్దార్ధ చికిత్స పొందుతున్న కార్యకర్తలను పరామర్శించేందుకు ఏరియా ఆస్పత్రికి వచ్చారు. అదే సమయంలో జావెద్ అనుచరులు ఏరియా ఆస్పత్రికి చేరుకొని.. బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శిస్తున్న నల్లమోతు సిద్దార్ధపై కూడా దాడికి దిగారు. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మస్తాన్, జమీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వారిని నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మరో మూడు వార్డుల్లో ఘర్షణలు.. అదేవిధంగా 6వ వార్డు ఇందిరమ్మ కాలనీ, 32వ వార్డు బంగారుగడ్డలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. వారిని పోలీసులు చెదరగొట్టారు. 20వ వార్డు రెడ్డీకాలనీలో బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంటుగా కూర్చున్న అశోక్పై ఆ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి భర్త దాడి చేయడంతో అతడికి గాయాలయ్యాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగానే ఫిర్యాదు చేశాం.. 29వ వార్డులో ఘర్షణలు జరిగే ఆస్కారం ఉందని డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు తాను ముందుగానే ఫిర్యాదు చేశానని సీపీఎం అభ్యర్ధి డబ్బికార్ మల్లేష్ తెలిపారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జావెద్పై గతంలో పలు కేసులు ఉన్నాయని, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నానని, తన ఫిర్యాదుపై స్పందించి ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఈ దాడులు జరిగేవి కావని, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఏరియా ఆస్పత్రికి చేరుకుని బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించారు. కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ 29వ వార్డులో బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్లపై కాంగ్రెస్ వర్గీయుల దాడి ఫ పోలీసుల లాఠీచార్జి ఫ ముగ్గురికి గాయాలు ఫ మరికొన్ని వార్డుల్లో చెదురుమదురు ఘటనలుఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని, ఆ పార్టీ నాయకులు చేస్తున్న భౌతిక దాడులే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ కార్యకర్తల దాడుల్లో గాయపడి నల్లగొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్, సీపీఎం కార్యకర్తలను ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, కంచర్ల భూపాల్రెడ్డి, జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసిహారెడ్డి, నాయకులు నల్లమోతు సిద్ధార్థతో కలిసి బుధవారం సాయంత్రం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్, సీపీఎం కొన్ని చోట్లా కలసి పనిచేశాయని, మిర్యాలగూడలో కాంగ్రెస్ తప్పిదాలను కవర్ చేసుకునేందుకే కాంగ్రెస్ గుండాలు దాడులకు పాల్పడ్డారని అన్నారు. ఇంకా చాలా చోట్ల ఇలాంటి ప్రయత్నం చేసారని, బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారని తెలిపారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా మారారని, జిల్లా అధికారులు నిస్సహాయులుగా మారారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు బూత్లను ఆక్రమించే యత్నం చేసినా ఎన్నికల అధికారులు పట్టించు కోలేదన్నారు. మిర్యాలగూడలో జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. -
ఫ ఓటెయ్.. చికెన్ తీసుకో
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు అనేక ప్రయత్నాలు చేశారు. ఓటర్లకు డబ్బులు, మద్యంతో పాటు చికెన్ టోకెన్లను కూడా అందించారు. బుధవారం ఓటేసి చికెన్ తీసుకెళ్లండి అంటూ ఆఫర్ ప్రకటించారు. ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్న తర్వాత నేరుగా చికెన్ షాపులకు వెళ్లి టోకెన్ ఇచ్చి చికెన్ తీసుకున్నారు. దాంతో చికెన్ షాపులు కిటకిటలాడాయి. షాపుల నిర్వాహకులు ముందుగానే కోళ్లను తెప్పించుకొని, టోకెన్తో వచ్చిన వారికి ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేసి చికెన్ అందించారు. -
తాళం వేసిన ఇళ్లలో చోరీ
పెద్దఅడిశర్లపల్లి : మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లికి చెందిన జానపాటి లక్ష్మమ్మ సోమవారం తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. బుధవారం ఆమె ఇంటికి తాళం లేకపోవడంతో ఇంటిపక్క వారు గమనించి లక్ష్మమ్మకు సమాచారం అందించారు. లక్ష్మమ్మ ఇంటికి వచ్చి తలుపులు తీసేసరికి ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లోని బీరువాలో ఉంచిన తులం బంగారం, 40 తులాల వెండి ఆభరణాలు, రూ.20 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆధారాలు సేకరించారు. మండల కేంద్రానికి చెందిన ఓ రైతు ఇంట్లో కూడా దొంగలు చొరబడి వెండి సామగ్రి మెత్తుకెళ్లారు. తాళం వేసి ఉన్న మరో రెండు ఇళ్లలో కూడా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆయా ఇళ్ల వారు వచ్చి చూస్తేగానీ ఏమేమి చోరీకి గురయ్యాయనే విషయం తెలుస్తుంది. -
షార్ట్ సర్క్యూట్తో సామగ్రి దగ్ధం
డిండి : షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి బుధవారం మండల కేంద్రంలోని ఓ ఇంట్లో ఉన్న సామగ్రి దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మూడావత్ భీముడు నాయక్ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం చిట్టంకుంట గ్రామంలో జరిగే బంధువుల శుభకార్యానికి బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అంతకు ముందు భీముడు కుటుంబ సభ్యులు వేడి నీటి కోసం ఇంట్లోని బాత్రూంలో కరంట్ హీటర్ పెట్టి మర్చి పోయి వెళ్లారు. దాంతో బకిట్లోని నీరు అతిగా వేడి కావడంతో హీటర్ కాలిపోయి బాత్రూంతోపాటు బెడ్రూంలో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వారి ఇంట్లోంచి పొగలు రావడం గమనించిన చుట్టు పక్కల వారు ఫైరింజన్కు సమాచారం ఇచ్చారు. అచ్చంపేట ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లోని ఫర్నీచర్తో పాటు సర్టిఫికెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో రూ.3లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. -
మెరుగైన అభ్యర్థికి ఓటు వేశా
నేను డిగ్రీ చదువుతున్నాను. నా తొలి ఓటు మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన అభ్యర్థికే వేశాను. ఎవరు గెలిచినా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో పాటు వార్డు అభివృద్ధికి కృషిచేయాలి. – దబ్బెటి వరుణ్ సాయి, మోత్కూరు ఓటు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న నేను తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఓటు వేశాను. గెలిచిన అభ్యర్థులు ప్రజలకు అందుబాటులో ఉండి మంచి గుర్తింపు పొందాలి. – దబ్బెటి నేహ, జామచెట్లబావి, మోత్కూరు -
కాంగ్రెస్దే ఘన విజయం
ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోదాడ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతున్నదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ మున్సిపాలిటీలోని 14వ వార్డు పరిధిలో ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. సామాన్యులకు సన్న బియ్యం అందిచండంతో పాటు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిందన్నారు. అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హమీలను 100శాతం అమలు చేస్తుందని అన్నారు. 1994 నుంచి.. మంత్రి ఉత్తమ్ 1994లో కోదాడ ఎమ్మెల్యేగా పోటీచేసిన సమయంలో ఉత్తమ్ దంపతులు కోదాడలోని నయానగర్లో కాంగ్రెస్ నాయకుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి ఇంట్లో ఉండేవారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో వారు ఇక్కడి నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. -
స్వర్ణగిరీశుడికి కల్పవృక్ష వాహన సేవ
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి ఆలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మాడ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. పెరంబుదూర్కు చెందిన శ్రీఎంబార్ రామానుజ జీయర్స్వామి బహ్మ్రోత్సవాలకు హాజరై భక్తులకు మంగళశాసనాలు అందజేశారు. అనంతరం పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రామారావు, అర్చకులు పాల్గొన్నారు. కల్పవృక్ష వాహన సేవ నిర్వహిస్తున్న అర్చకులు -
ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
భువనగిరి(బీబీనగర్) : బీబీనగర్ మండలంలోని పడమటిసోమారం గ్రామంలో శ్రీ లింగ బసవేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ నందిగారి బస్వయ్య, ఈఓ నరేందర్రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మ కసిరెడ్డినారాయణరెడ్డి, దేవాదయ శాఖ సూపరింటెండెంట్ భాస్కర్, ధర్మకర్తలు ఆలేటి బలరాం, అల్వా గోపాల్రెడ్డి, వెంకటేష్, వాకిటి సంజీవరెడ్డి, మాజీ ఎంపీటీసీ బొమ్మగాని బస్వయ్యగౌడ్, శ్రీనివాస్రెడ్డి, వీరారెడ్డి, రామకృష్ణారెడ్డి, రాంకొండల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి
సాక్షి,యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూర్ మున్సిపాలిటీలకు సంబంధించి భువనగిరి మండలంలోని దివ్యబాల విద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్స్ను అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్స్, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు, టేబుళ్ల అమరిక, సిబ్బంది నియామకాలు వంటి అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించాలన్నారు. ప్రతి టేబుల్ వద్ద అంజర్వర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అభ్యర్థులు, ఏజెంట్లకు తాగునీరు, ప్రాథమిక వైద్య సదుపాయాలు కల్పించాలని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడు అంచల భద్రత కల్పించాలని, అనుమతి ఉన్నవారికి మాత్రమే ప్రవేశం ఇవ్వాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా నిషేధించబడినట్లు స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేసి ఫలితాలను సమయానికి ప్రకటించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. -
రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక
బొమ్మలరామారం: మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో బుధవారం జిల్లా స్థాయి షూటింగ్ బాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ఎంపికై నట్లు పీడీ నర్సింహ తెలిపారు. ఈ నెల 13, 14, 15వ తేదీల్లో నిర్వహించనున్న 45వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఐలయ్య, జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మోత్కూరు యాదయ్య, స్థానిక హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వరలక్ష్మి, విజయభారతి, బండి నవీన్ పాల్గొన్నారు. మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులురామగిరి(నల్లగొండ) : మహా శివరాత్రి పండుగ సందర్భంగా శైవ క్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ఈ నెల 14, 15 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుపుతోందని ఆర్ఎం కె.జానిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవరకొండ డిపో నుంచి శ్రీశైలం, కోదాడ డిపో నుంచి ముక్త్యాల, మేళ్లచెర్వు, హుజుర్నగర్ నుంచి మేళ్లచెర్వుకు, మిర్యాలగూడ డిపో నుంచి వాడపల్లి, సోమప్ప, సత్రశాలకు బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. సూర్యాపేట డిపో నుంచి శ్రీశైలం, కోటప్పకొండ, నల్లగొండ డిపో నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతామని వెల్లడించారు. యాదగిరీశుడికి విశేష పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం విశేష పూజలు కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు విశేషంగా అభిషేకం జరిపించారు. శ్రీస్వామి అమ్మవార్లకు సహస్రనామార్చన పూజలు చేశారు. ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు నిర్వహించారు. ఇక.. సాయంత్రం జోడు సేవను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. దాడులకు పాల్పడితే గుణపాఠం తప్పదుమిర్యాలగూడ : అధికార బలంతో కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని తగిన గుణపాఠం చెబుతామని మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి హెచ్చరించారు. బుధవారం మిర్యాలగూడలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 29వ వార్డులో ఎన్నికల సమయం ముసిగిన తరువాత మిత్రపక్షాల అభ్యర్థికి చెందిన ఏజెంట్లు మస్తాన్, జమీల్, చాంద్పాషాపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జావిద్, ఆయన అనుచరులు దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని అన్నారు. -
ఆహ్లాదకరమైన వాతావరణానికే మోడల్ పోలింగ్ కేంద్రాలు
మిర్యాలగూడలో ఘర్షణలు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం మిర్యాలగూడలోని పలు వార్డులు రణరంగాన్ని తలపించాయి. - 8లోసాక్షి,యాదాద్రి : ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం పోచంపల్లి మున్సిపాలిటీ, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెంలో, భువనగిరి బీచ్ మహల్లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని కొత్త గుండ్లపల్లి, ఆలేరు మున్సిపాలిటీలోని గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. పోలింగ్ సిబ్బంది సమయపాలనతో విధులు నిర్వహించాలని, ఎన్నికల నియమాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. పచ్చదనంపై అవగాహనకే.. భూదాన్పోచంపల్లి: పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు జిల్లాలో వి నూత్నంగా మున్సిపాలిటీకి ఒక ఎకో ఫ్రెండ్లీ మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. బుధవారం భూదాన్పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీతావానిగూడెంలో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన వెంట మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వర్రావు తదితరులున్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
ఎంజీయూ ప్రాజెక్ట్కు రాష్ట్రస్థాయి బహుమతి
నల్లగొండ టూటౌన్ : ఎంజీ యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్(సీఎస్ఈ) విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్కు రాష్ట్రస్థాయిలో ఉత్తమంగా గుర్తింపు లభించించిందని సీఎస్ఈ విభాగం అధిపతి ఎం.జయంతి తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన అన్వేషణ 2026 రాష్ట్ర స్థాయి ప్రాజెక్టుల ప్రదర్శనలో ఎంజీయూ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం విద్యార్థులు రూపొందించిన స్మార్ట్ ఫేస్ రికగ్నైజేషన్ను ప్రదర్శించారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా ఎంపికై నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రాజెక్ట్ను రూపొందించి ప్రదర్శించిన విద్యార్థులు రాహుల్, సౌమ్యన్ను యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మంగళవారం అభినందించారు. -
ఓటు వేసేందుకు వస్తూ వ్యక్తి మృతి
హుజూర్నగర్ : ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఒంగోలు నుంచి వస్తూ వ్యక్తి మృతి చెందినదిన ఘటన ఏపీలోని ఒంగోలు జిల్లా చీరాల వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని యర్రగుట్టకు చెందిన గునగంటి నాగేశ్వరరావు (40) బతుకుదెరువు కోసం ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు వెళ్లాడు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సోమవారం ఒంగోలు నుంచి రైలులో బయలు దేరాడు. రాత్రి చీరాల వద్ద శవమై కనిపించాడు. ప్రమాదవశాత్తు రైలునుంచి జారిపడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే పోలీసులు గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. నాగేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
తెలంగాణలోకి చేరుకున్న దమ్మ పాదయాత్ర
నాగార్జునసాగర్ : కర్ణాటక రాష్ట్రంలోని కలబురగలో ఈ నెల 1న ప్రారంభమైన దమ్మ పాదయాత్ర సోమవారం తెలంగాణలోని మడిగి ప్రాంతానికి చేరుకొని అక్కడి నుంచి మంగళవారం బుచ్చినెల్లికి చేరుకుంది. నాగార్జునసాగర్లోని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఈ పాదయాత్రలో పాల్గొనే వారు ఈ నెల 18న హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో బుద్ధవిగ్రహాన్ని సందర్శించి అనంతరం మహాబోధి బుద్ధ విహార్కు చేరుకొని 19న అక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. మార్చి 1న నాగార్జునసాగర్కు చేరుకొని రెండో తేదీన నాగార్జునసాగర్ మ్యూజియాన్ని సందర్శించి, 3న బుద్ధవనంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నట్లు వివరించారు. ఈ పాదయాత్రలో యాత్ర సంఘా ప్రాజెక్ట్ డైరెక్టర్ సొంగషాక్ కోవిడో, థాయిలాండ్ బౌద్ధ భిక్షువులు, గగన్మాలిక్ ఫౌండేషన్ అధ్యక్షుడు గగన్ మాలిక్, కేకే రాజా, మూర్తి, సిద్ధోజి, బుద్ధవనం ఆర్ట్స్ ప్రమోషన్ మేనేజర్ శ్యాంసుందర్రావు, కిషోర్ ఉన్నారు. -
నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది
గుర్రంపోడు: రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లినవె దంపతులను ఆస్పత్రికి తరలించిన 108 సిబ్బంది.. క్షతగాత్రుల వద్ద లభించిన రూ.లక్షన్నర నగదును వారి బంధువులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. వివరాలు.. హైదరాబాద్లోని ఉప్పల్లో నివాసముంటున్న ఓర్సు రాంబాబు, నాగమణి దంపతులు సోమవారం కారులో పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేటలో బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి తిరిగి వారి స్వగ్రామమైన కనగల్ మండలం కురంపల్లికి వెళ్తుండగా.. మార్గమధ్యలో గుర్రంపోడు మండలం జూనూతల గ్రామ స్టేజీ వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాంబాబు, నాగమణి దంపతులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వాహనదారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న 108 ఈఎంటీ వెలుగు సత్యనారాయణ, పైలెట్ మారేపల్లి వెంకటేశ్వర్లు క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా క్షతగాత్రుల వద్ద ఉన్న రూ.లక్షన్నర నగదును మంగళవారం రాంబాబు బంధువైన అంజికి ఆస్పత్రిలో అందించి నిజాయితీ చాటుకున్నారు. -
పెద్దదేవులపల్లి వద్ద పుల్లయ్య మృతదేహం లభ్యం
త్రిపురారం : నిడమనూరు మండలంలోని ముకుందాపురం వద్ద సాగర్ ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో గల్లంతైన త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామానికి చెందిన తల్లం పుల్లయ్య మృతదేహం మంగళవారం పెద్దదేవులపల్లి రిజర్వాయర్లో లభ్యమైంది. రెండు రోజుల క్రితమే పోలీసులు కారును కాల్వలో నుంచి బయటకు తీయగా.. అందులో పుల్లయ్య భార్య పద్మ మృతదేహం మాత్రమే లభ్యమైంది. పుల్లయ్య ఆచూకీ లభించలేదు. దీంతో నిడమనూరు పోలీసులు ప్రత్యేక బోటులో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి ఎడమ కాల్వతో పాటు పెద్దదేవులపల్లి రిజర్వాయర్లో గాలింపు చర్యలు చేపట్టగా.. పెద్దదేవులపల్లి రిజర్వాయర్లో పులయ్య మృతదేహన్ని గుర్తించి బయటకు తీశారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అనంతరం బంధువులు గ్రామంలో పుల్లయ్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఎన్జీ కళాశాల అధ్యాపకుడికి అరుదైన గౌరవం
రామగిరి(నల్లగొండ), నకిరేకల్: అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ, తెలుగు పద సంపద సంయుక్తంగా అంతర్జాతీయ తెలుగు భాష సభ నిర్వహించారు. ఈ సభలో నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామ వాసి, నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల తెలుగు అధ్యాపకుడు టంగుటూరి సైదులు పాల్గొని తెలుగు పద్య వైభవం–జీవన పరమార్ధం అనే అంశంపై పత్ర సమర్పణ చేశారు. సమాజంలో అంతరించిపోతున్న మానవ విలువలు, నేటి తరానికి తెలుగు సాహిత్య అవకశ్యకత గురించి సైదులు సభలో ప్రసంగించారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య సాగి కమలాకరశర్మ, తెలుగు పద సంపద అధ్యక్షుడు మూర్తి రేమిళ్ల, తెలుగు విశ్వ విద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఆచార్య టి. గౌరీశంకర్ ఆయనకు మెమొంటో, ధ్రువపత్రం అందజేశారు. టంగుటూరి సైదులును ఎన్జీ కళాశాల తెలుగు ఇన్చార్జి వెల్దండి శ్రీధర్, అధ్యాపకులు అభినందించారు. ఫ అంతర్జాతీయ తెలుగు భాష సభలో పాల్గొని పత్ర సమర్పణ చేసిన టంగుటూరి సైదులు -
చిన్నారి ఊపిరి తీసిన బాటిల్ మూత
భూదాన్పోచంపల్లి: థమ్సప్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కొని ఊపిరాడక చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన భూదాన్పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రియాల గ్రామానికి చెందిన బందారపు శ్రీకాంత్గౌడ్, నాగరాణి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె భవ్యశ్రీ(18 నెలలు) ఉన్నారు. శ్రీకాంత్గౌడ్ గుజరాత్లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. నాగరాణి తన అత్తతో కలిసి ఇంద్రియాలలో ఉంటుంది. సోమవారం మధ్యాహ్నం నాగరాణి తన కుమార్తె భవ్యశ్రీకి ఆడుకోవడానికి ఆట వస్తువులు ఇచ్చి బయట దుస్తులు ఉతుకుతోంది. భవ్యశ్రీ ఆడుకుంటూ కిందపడి ఉన్న థమ్సప్ మూతను నోట్లో పెట్టుకోగా.. గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మృతిచెందింది. బట్టలు ఉతికిన తర్వాత నాగరాణి ఇంట్లోకి వచ్చి చూడగా కుమార్తె భవ్యశ్రీ ఉలుకు పలుకు లేకుండా ఉండటం చూసి ఆందోళన చెంది వెంటనే బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు నిర్ధారించారు. కళ్ల ముందే ఆడుకుంటున్న భవ్యశ్రీ మృతిచెందడంతో తల్లి నాగరాణి, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఫ గొంతులో ఇరుక్కొని మృతి -
చిల్లేపల్లి రేషన్ డీలర్పై కేసు నమోదు
నేరేడుచర్ల : నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలోని రేషన్ దుకాణంపై మంగళవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. బియ్యం నిల్వల్లో తేడాలు రావడంతో రేషన్ డీలర్ రవిగుప్తాపై కేసు నమోదు చేశారు. ఈ సంద్భంగా విజిలెన్ప్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నల్లగొండ విభాగం సీఐ దశరథ, సివిల్ సప్లయ్ రెవెన్యూ అధికారి ప్రమోద్ మాట్లాడుతూ.. చిల్లేపల్లి గ్రామంలోని రేషన్ షాపులో 46.96 క్వింటాళ్ల బియ్యం నిల్వలు ఉండాల్సి ఉండగా.. 36.67 క్వింటాళ్ల బియ్యం మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు రేషన్ డీలర్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా నేరేడుచర్ల మండలంలోని బొడలదిన్నె, సోమారం గ్రామాల్లోని రేషన్ దుకాణాలను కూడా తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. -
యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.4.03కోట్లు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం రూ.4,03,02,821 వచ్చినట్లు అధికారులు తెలి పారు. స్వామి వారి హుండీల్లో 49 రోజులలో భక్తులు వేసిన నగదు, నగలను మంగళవారం కొండకు దిగువన సత్యనారా యణస్వామి వ్రత మండపంలో ఈఓ భవానీశంకర్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి సమక్షంలో అధికారులు, సి బ్బంది లెక్కించారు. లెక్కింపులో నగదు రూ.4,03, 02,821, మిశ్రమ బంగారం 136 గ్రాములు, మిశ్రమ వెండి 3.600 కిలోలు వచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. వీటితో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ, డాలర్లు కూడా వచ్చినట్లు తెలిపారు. -
ఉద్యోగ విరమణ సాయం ఇంకెప్పుడు?
అడ్డగూడూరు : అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలుగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన వారికి సర్కారు నుంచి వచ్చే బెనిఫిట్స్ అందక నిరుత్సాహానికి గురువుతున్నారు. వృద్ధాప్యంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కొందరికి ఈ సాయం ఉపయోగడుతుందని ఆశించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులకు పలు మార్లు వినతిపత్రాలు ఇచ్చినా , ధర్నాలు చేస్తున్నా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయం పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ జారీ చేసినా అమలుకాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాయం పెంచుతూ జీఓ జారీ చేసినా.. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్య సంరక్షణలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర కీలకం. గత ప్రభుత్వ హయాంలో రిటైర్మెంట్ పొందిన టీచర్కు లక్ష రూపాయలు, ఆయాలకు రూ.50 వేలు ఇస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 65 ఏళ్లకు ఉద్యోగ విరమణ పొందే విధానాన్ని 2024 ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక టీచర్కు రూ.2 లక్షలు, ఆయాకు రూ . లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని ప్రకటించి గతేడాది మే నెలలో జీఓ జారీ చేసింది. 65 ఏళ్లలోపు స్వచ్ఛందంగా విరమణ చేస్తే వారికీ ఇది వర్తింపజేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు అమలు చేయడం లేదు. కుటుంబాలు గడవక.. జిల్లాలో 2024 ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్లు నిండిన వారి వివరాలు అందించాలని ప్రభుత్వం కోరడంతో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులు పంపించారు. ఇప్పటివరకు జిల్లాలో ఉద్యోగ విరమణ పొందిన 20మంది టీచర్లు, 109 మంది ఆయాలు ఉన్నారు. వీరిలో కొందరు అనారోగ్యంతో సమతమవుతున్నారు. అటు ఉద్యోగం లేక ఇటు బెనిఫిట్స్ అందక, పింఛన్లేక కొందరు కుటుంబం గడవక ఆర్థికభారంతో ఇతరులపై ఆధారపడుతున్నారు. నేను 42 ఏళ్లపాటు అంగన్వాడీ టీచర్గా పనిచేశాను. 2024 జూలైలో రిటైర్మెంట్ పొందాను. రూ.2లక్షలు వసాయని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. వృద్ధాప్యంలో ఆరోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం స్పందించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలి. – పుష్పమ్మ, అంగన్వాడీ రిటైర్డ్ టీచర్, ఆజీంపేట ఫ రెండేళ్లు కావొస్తున్నా అందని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫ 20 మంది రిటైర్డ్ అంగన్వాడీ టీచర్లు, 109 మంది ఆయాలకు నిరీక్షణ ఫ వృద్ధాప్యంలో ఆర్థికభారంతో సతమతం -
ఆరు మున్సిపాలిటీల్లోని 102 వార్డులకు నేడే పోలింగ్
తెలంగాణలోకి దమ్మపాదయాత్ర కర్ణాటక రాష్ట్రంలోని కలబురగలో ప్రారంభమైన దమ్మ పాదయాత్ర తెలంగాణలోని బుచ్చినెల్లికి చేరుకుంది. హుండీ ఆదాయం రూ.4.03కోట్లు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం రూ.4,03,02,821 వచ్చినట్లు అధికారులు తెలిపారు. బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026- IIలోసాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో గల 104 వార్డుల్లో రెండు వార్డులు ఏకగ్రీవం కాగా 102 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,32,711 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 212 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో మంగళవారం సాయంత్రానికి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్కు పీఓలు, ఏపీఓలు, ఇతర పోలింగ్ సిబ్బంది 424 మంది, 20 శాతం రిజర్వును కలుపుకొని 1,020 మందిని నియమించారు. 212 బ్యాలెట్ బాక్సులను కేటాయించగా.. మరో 237 బాక్సులను రిజర్వులో ఉంచారు. పోటీలో 353 మంది భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కూరు మున్సిపాలిటీల్లో 353 మంది పోటీలో ఉన్నారు. యాదగిరిగుట్ట పదవ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి అవుల మమత, ఇండిపెండెంట్ అభ్యర్థి స్వప్నలు పోటీ నుంచి ఉపసంహరించుకోగా కాంగ్రెస్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చౌటుప్పల్లో 17 వ వార్డులో చింతల సాయిలు ఏకగ్రీవం అయ్యారు. భువనగిరిలో అత్యధికంగా 128 మంది పోటీ పడుతున్నారు. అత్యల్పంగా యాదగిరిగుట్టలో 38 మంది పోటీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 99 మంది అభ్యర్థులు, బీజేపీ 91, బీఆర్ఎస్ 90 మంది, ఇతరులు 73 మంది పోటీలో ఉన్నారు. ఊహకందని విధంగా అభ్యర్థుల ఖర్చు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్శించేందుకు అన్ని రకాల ప్రలోభాలకు గురిచేస్తున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ రేసులో ఉన్న వారు తమ ఖర్చుతోపాటు పార్టీ అభ్యర్థుల ఖర్చులు భరిస్తున్నారు. దీంతో వారి ఖర్చు రూ.కోటిపైనే దాటుతోంది. ఒక్కో వార్డులో 1000 నుంచి 1400 వరకు ఓట్లు ఉన్నాయి. 90 శాతం మంది ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. అంతేకాకుండా చీరలు, వెండి భరిణేలు, నాణాలు, ప్రెషర్ కుక్కర్లు వంటి కానుకలు పంపిణీ చేశారు. ఓటర్లు కూడా అభ్యర్థులు ఇచ్చే తాయిలాలు అడిగి మరీ తీసుకుంటున్నారు. భువనగిరిలో ఓ ప్రఽతిపక్ష పార్టీ అభ్యర్థులు ఓటర్లకు చీర సారె అందజేస్తున్నారు. ఓటర్ల ఇంటికి వారిని పీటలపై కూర్చోపెట్టి బొట్టుపెట్టి కాళ్లు మొక్కుతున్నారు. మహిళలకు చీరలు, పురుషులకు మద్యం బాటిల్తో పాటు నగదు అందజేసి ఓటు అభ్యర్థిస్తున్నారు. రూ.20వేలు పలుకుతున్న ఓటు ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లోని గట్టి పోటీ ఉన్న వార్డుల్లో ఒక్కో ఓటుకు రూ.20వేలు ఇస్తున్నట్లు తెలిసింది. చైర్మన్, వైస్ చైర్మన్ సీటుపై కన్నేసిన వారి వార్డుల్లో డబ్బు పంపిణీ తారాస్థాయికి చేరింది. చౌటుప్పల్లో ఓ అభ్యర్థి ఇచ్చిన డబ్బుల కంటే అధికంగా ఇస్తామని ప్రత్యర్థిగా ఉన్న మరో అభ్యర్థి చెబుతున్నారు. అయితే పలు వార్డుల్లో డబ్బులు ఇంకా పంచడంలేదని కొందరు ఓటర్లు అభ్యర్థులకు ఫోన్లు సైతం చేస్తుండడం గమనార్హం. క్రాస్ ఓటింగ్ భయం కాంగ్రెస్ పార్టీని క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది. జిల్లాలోని అతి పెద్ద మున్సిపాలిటీ అయిన భువనగిరిలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఓట్లు క్రాస్ అయ్యే అవకాశం ఉంది. తాము గెలువలేని చోట అధికార కాంగ్రెస్ను ఓడించేందుకు పరస్పరం ఓట్లు బదిలీ చేసుకునే విధంగా బీజేపీ, బీఆర్ఎస్ల మధ్యన లోపాయకారి అవగాహన ఉన్నట్లు చర్చ జరుగుతోంది. చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులను ఓడించేందుకు సొంత పార్టీల్లోనే వెన్నుపోట్లు జరుగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. టెన్షన్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగింది. ఓటర్ల నాడి దొరకడం లేదని ఓ అభ్యర్థి వాపోయాడు. పార్టీలకతీతంగా అభ్యర్థులు ఇస్తున్న డబ్బులు తీసుకుంటున్న ఓటరు తీర్పు ఏవిధంగా ఉంటుందో నన్న భయం వారిని వెంటాడుతోంది. ఫ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఫ 212 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు ఫ భువనగిరిలో అత్యధికంగా 128 మంది, అత్యల్పంగా యాదగిరిగుట్టలో 38 మంది పోటీ ఫ ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,32,711 మంది ఓటర్లు మున్సిపాలిటీలు వార్డులు పీఎస్లు ఓటర్లు బ్యాలెట్ బాక్సులు ఆలేరు 12 24 13632 58 భువనగిరి 35 72 47831 140 చౌటుప్పల్ 20 40 27216 98 మోత్కూర్ 12 26 14383 64 పోచంపల్లి 13 26 15827 31 యాదగిరిగుట్ట 12 24 13822 58 మొత్తం 104 212 1,32,711 449 -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
ఆలేరు: ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆలేరు బాలుర ఉన్నత పాఠశాలలోని 7, 12 వార్డులకు చెందిన పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. అక్కడ సౌకర్యాలను పరిశీలించారు. ఈసందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. మున్సిపల్ పోలింగ్కు పకడ్బందీ పోలీసు బందోబస్తు చేశామన్నారు. ఆరు మున్సిపాలిటీల్లో 36 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఆర్మ్డ్ బలగాలను నియమించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, ప్రత్యేక బలగాలు బందోబస్తు నిర్వహిస్తామన్నారు. ఎస్పీ వెంట ఏసీపీ శ్రీనివాస్నాయుడు, సీఐ యాలాద్రి, ఎస్ఐ వినయ్ ఉన్నారు. సెల్ఫోన్లు అనుమతించొద్దుమోత్కూరు : మున్సిపల్ ఎన్నికలలో పోలింగ్ కేంద్రాలకు సెల్ఫోన్లు అనుమతించొద్దని అదనపు కలెక్టర్ ఎం.భాస్కర్రావు అన్నారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించి పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి గుర్రం సురేష్, మున్సిపల్ కమిషనర్ కె.సతీష్కుమార్, తహసిల్దార్ జ్యోతి, ఎంపీడీవో బాలాజీనాయక్, ఎంపీవో పైళ్ల జనార్దన్రెడ్డి, మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్, పంచాయతీరాజ్ డెప్యూటీ ఈఈ మంగులాల్ ఉన్నారు. ఆర్థిక అక్షరాస్యత వాల్పోస్టర్ ఆవిష్కరణ భువనగిరిటౌన్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల – 2026 వాల్పోస్టర్లను కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కరరావు మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివ రామ కృష్ణ, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు యూరియా కోసం రైతుల నిరసనవలిగొండ : యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. మంగళవారం వలిగొండ మండల కేంద్రంలోని వివిధ దుకాణాల్లో యూరియా నిల్వలు ఉన్నాయని రెడ్లరేపాక, దాసిరెడ్డిగూడెం, వలిగొండతోపాటు వివిధ గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం మండల కేంద్రానికి చేరుకున్నారు. ఈలోపే యూరియా నిల్వలు లేవని తెలియడంతో రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ పెట్టి నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతులను సముదాయించి ధర్నా విరమింపజేశారు. స్వరగిరీశుడికి సూర్యప్రభ వాహనసేవభువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం ఆలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి ఉదయం సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అళ్వార్ తిరునగరి ఎంమేరు మనార్ జీయర్ మఠం శ్రీరంగరామానుజ జీయర్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆయనకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు స్వాగతం పలికారు. -
బీబీనగర్లో వాకథాన్
భువనగిరి(బీబీనగర్): ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా మంగళవారం బీబీనగర్లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో శ్రీకేవైసీ సురక్షిత బ్యాంకింగ్కు మీ మొదటి అడుగుశ్రీ అనే అంశంపై వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేవైసీ ప్రాముఖ్యతతో పాటు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్బీఎం ఏజీఎం లక్ష్మీశ్రావ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ శివరామకృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జకిరోద్దిన్, డీఆర్డీఓ సెర్ప్ డీపీఎం వెంకటేశం, ఏపీఎం మీనా, వివిధ బ్యాంకుల మేనేజర్లు, సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
నిష్పక్షపాతంగా పనిచేయాలి
ఫ కలెక్టర్ హనుమంతరావు భూదాన్పోచంపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో అధికారులంతా సజావుగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ప్రిసైడింగ్ అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. స్వస్తిక్ గుర్తు, సీల్ వేసే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాలన్నారు. ఓటర్లందరూ ఓటరు స్లిప్తో పాటు ఏదేని గుర్తింపుకార్డు తీసుకురావాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. కలెక్టర్ వెంట ఎన్నికల కోఆర్డినేటర్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, ఎంపీడీఓ రాపర్తి భాస్కర్, ఎంఆర్ఐ గుత్తా వెంకట్రెడ్డి పాల్గొన్నారు. లక్కారంలో ఎన్నికల సామగ్రి పంపిణీ పరిశీలన చౌటుప్పల్ : మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ హనుమంతరావు సందర్శించి ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డీఓ సాల్వేరు సూరజ్కుమార్, మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామ్రెడ్డి ఉన్నారు. -
మత్తు పదార్థాలకు బానిస కావొద్దు
యాదగిరిగుట్ట: మత్తు పదార్థాలకు బానిస కావొద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత అన్నారు. మాదక ద్రవ్య నిషేధ చట్టాలు, చెడు ప్రభావం అంశాలపై యాదగిరిగుట్ట పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, యాదాద్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మత్తుపదార్థాల నిషేధ చట్టం పగడ్బందీగా అమలు అవుతుందన్నారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వాడకం చాప కింద నీరులా ఎక్కువ అవుతుందని, వాటి బారిన పడడానికి వ్యాపారులు అనేక రకాలుగా మభ్యపెడుతున్నారన్నారు. ఎవరైనా నేరం చేస్తే తీవ్రమైన శిక్షలే కాకుండా, ఫైన్ కూడా అధిక మొత్తంలో ఉంటుందని తెలిపారు. న్యాయవిజ్ఞాన సదస్సులో యాదాద్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు శ్రీహరి, పెంట రమేష్, మీడియేషన్ న్యాయవాది రాజిరెడ్డి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బొమ్మ వెంకటేష్, న్యాయ సహాయ న్యాయవాది సాయి శ్రీనివాస్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు రాధాకృష్ణ, దీపిక, వేణుకుమార్, కళాశాల ఎన్ఎస్ఎస్ ఇన్చార్జ్ ఉపేందర్, లెక్చరర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత -
సబ్బండ వర్గాల అభివృద్ధే ధ్యేయం
ఫ ప్రభుత్వ విప్బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట: సబ్బండ వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచే స్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురబోతుందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ చైర్మన్ పీఠాలను కాంగ్రెస్ దక్కించుకుంటుందని పేర్కొన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలంతా ఆగమయ్యారని, ప్రజా పాలనలో ప్రజలంతా సంతోషంగా గడుపుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందిస్తూ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు ప్రజా పాలనపై ప్రజలకు ఉన్న గెలుపే నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, వడ్డీ లేని రుణాలను అందజేయడంతో పాటు ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేసిందని తెలిపారు. ప్రభుత్వాన్ని అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదుఫ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతయాదగిరిగుట్ట: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆలేరు మాజీ ఎమ్మె ల్యే గొంగిడి సునీత మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. యాదగిరిగుట్ట, ఆలేరు మున్సి పాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలువనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోమని ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. కేసీఆర్ పాలన ఒక స్వర్ణ యుగం లాంటిదని, మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలంటే.. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ సైనికులుగా బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు దొంగ హామీలను ఇస్తున్నారని, ప్రజలెవరూ వాటిని నమ్మొద్దని తెలిపారు. ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి చేశామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధిని విస్మరించిందని పేర్కొన్నారు. ఓటర్లు అంతా ఆలోచించి, ప్రజలను మభ్యపెడుతూ, ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. -
పీక్ డిమాండ్లోనే ‘యాదాద్రి’ పవర్
సాక్షి, హైదరాబాద్: వేసవి విద్యుత్ డిమాండ్ సమయంలోనే యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేసే వీలుందని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (టీజీ జెన్కో) స్పష్టం చేసింది. మిగతా రోజుల్లో విద్యుత్ విక్రయాలు కొంత కష్టమేనని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)కి తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, విద్యుత్ ధరపై జెన్కో ఇటీవల ఈఆర్సీ ముందు అనుమతి కోసం నివేదిక సమర్పించింది. మెగావాట్కు రూ. 9.5 కోట్ల మేర నిర్మాణ ఖర్చయిందని.. దీనివల్ల యూనిట్ విద్యుత్ను రూ. 7పైనే విక్రయించాల్సి ఉంటుందని వివరించింది. ఈ మేరకు 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణ వ్యయం పెరగడానికి గల కారణాలను వివరించింది. అయితే జెన్కో ఉత్పత్తి వ్యయం పిటిషన్పై ఈఆర్సీ అనేక అనుబంధ ప్రశ్నలు వేసింది.కొన్ని అనవసర ఖర్చులను కలపడంపై వివరణ ఇవ్వాలని కోరింది. దీని తర్వాతే టారిఫ్ ఆర్డర్ ఇచ్చే వీలుంది. మరోవైపు యాదాద్రి థర్మల్ విద్యుత్ నిర్మాణ వ్యయంపై పలు విద్యుత్రంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సివిల్ పనుల్లో చేసిన ఖర్చు, నాణ్యతా ప్రమాణాలపై సందేహాలు లేవనెత్తారు. హైపవర్ మార్కెట్కు బ్రేక్ఈ ఏడాది వేసవిలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజుకు 300 మిలియన్ యూనిట్ల మేర ఉండొచ్చని అంచనా వేశారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ యూనిట్ రూ. 2.50 వరకూ లభిస్తోంది. అయితే, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ మాత్రమే సోలార్ విద్యుత్ లభిస్తోంది. రాత్రి 11 నుంచి ఉదయం 4 గంటల మధ్య ఐదు గంటల పాటు విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధర యూనిట్కు రూ. 10 వరకూ ఉంటుంది. ఈ సమయంలో జెన్కో యాదాద్రి విద్యుత్ యూనిట్ రూ. 7కు లభిస్తుంది. కాబట్టి ఈ ఐదు గంటలు యాదాద్రి విద్యుత్ ఉత్పత్తికి ఢోకా ఉండదని ఈఆర్సీ ఎదుట జెన్కో పేర్కొంది. 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 95 మిలియన్ యూనిట్ల వరకు ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. వేసవి సమయంలో ఉత్పత్తి ద్వారానే యాదాద్రి నిర్వాహణ, రుణంపై వడ్డీ తీరుతుందని జెన్కో చెబుతోంది. అయితే నిర్మాణం సందర్భంగా చేపట్టిన సివిల్ ఖర్చులను సమగ్రంగా పరిశీలించాలని ఈఆర్సీ భావిస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
భూదాన్పోచంపల్లి : బైక్పై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి భూదాన్ పోచంపల్లి మండల కేంద్రం శివారులో జరిగింది. ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కొంగరి శేఖర్(38) కొంతకాలంగా హైదరాబాద్లో నివాసముంటూ సమీప గ్రామాల్లో మార్బుల్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం మార్బుల్ పని మీద పోచంపల్లికి వచ్చిన అతడు పని ముగించుకొని రాత్రి బైక్పై తిరిగి ఇంటికి వెళ్తుండగా.. పోచంపల్లి మండల కేంద్రం శివారులో పోచంపల్లి–కొత్తగూడెం రహదారిలో శ్రీమిత్ర వెంచర్ సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. శేఖర్ బైక్ పైనుంచి కిందపడటంతో తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
సెల్ఫోన్కు అనుమతి లేదు
భువనగిరిటౌన్ : ఓటు వేసేందుకు వెళ్లే వారు సెల్ఫోన్ను బయట ఉన్న అధికారికి ఇచ్చి వెళ్లాలి. ఒక వేళ సెల్ఫోన్ తీసుకెళ్లి ఓటు వేస్తూ సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తే నేరంగా పరిగణిస్తారు. ఓటు వేస్తూ సెల్ఫీ తీసినట్లు గుర్తిస్తే అధికారులు వెంటనే అతడిని బయటకు పంపిస్తారు. వేసిన ఓటును 17– ఏలో నమోదు చేస్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో సదరు వ్యక్తి వేసిన ఓటు పరిగణలోకి తీసుకోరు. రూల్ నంబర్ 49– ఎన్ ప్రకారం అంధులైన ఓటర్లు ఓటు వేయ డానికి 18 ఏళ్లుకు పైగా ఉన్న సహాయకుడిని వెంట తీసుకొని వెళ్లవచ్చు. అతడి ఓటును బహిరంగ పర్చనని సహాయకుడు నిబంధన–10లో ధ్రువీకరించాల్సి ఉంటుంది. -
అచ్చం వైఎస్సార్ లాగే..
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఐనాల శ్రీనివాస్ సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వేషధారణతో జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. ఆయన అచ్చం వైఎస్సార్ హావ భావాలు ప్రదర్శిస్తుండడంతో జూనియర్ వైఎస్సార్గా పేరుపొందాడు. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ కాంగ్రెస్ మీటింగ్లు, సభలు జరిగినా ఆయన పాల్గొంటూ ఉంటాడు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలలో సూర్యాపేట పట్టణంలోని పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ వైఎస్సార్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. -
వార్డు సమస్యలను గుర్తించాలి
సూర్యాపేట టౌన్ : మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఆయా వార్డులలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీలివ్వాలని సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక నాయకులు కోరారు. వేదిక రూపొందించిన కరపత్రాన్ని సోమవారం జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట వారు ఆవిష్కరించారు. అవినీతి, అక్రమాలను రూపుమాపడానికి, సమాజ మార్పు కోసం పాటుపడాలని సూచించారు. ప్రజలు ఈ కరపత్రాన్ని వార్డు నుంచి పోటీ చేసే వారికి అందించి అందుకు సంబంధించిన హామీలు పొందాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎల్.భద్రయ్య, కరీం, సుభాని, ఆవుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు దొంగల రిమాండ్
భువనగిరి: ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సోమవారం భువనగిరి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను భువనగిరి డీఎస్పీ రవీందర్ విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన బోదాసు యాదగిరి, కొమిరె శ్రీను భువనగిరి పరసర ప్రాంతాల్లోని ఆలయాల్లో కొంతకాలంగా రాత్రివేళ దొంగతనాలకు పాల్పడుతున్నారు. సుమారు 5 ఆలయాల్లో చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి సోమవారం వారిద్దరిని పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి నుంచి రూ.1.50లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితులిద్దరిపై సిద్దిపేట జిల్లాలో పలు చోరీ కేసులు ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. గతంలో వారు జైలుకు కూడా వెళ్లి వచ్చారని వివరించారు. విలేకరుల సమావేశంలో సీఐ చంద్రబాబు, ఎస్ఐ అనిల్కుమార్ పాల్గొన్నారు. -
సాగర్ కాల్వలో కొనసాగుతున్న గాలింపు
నిడమనూరు : మండలంలోని ముకుందాపురం వద్ద సాగర్ కాల్వలోకి కారు దూసుకెళ్లడంతో గల్లంతైన తల్లం పుల్లయ్య ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అతడి ఆచూకీ కోసం సోమవారం సాయంత్రం వరకు రెవెన్యూ అధికారులు, నిడమనూరు పోలీసులు, పుల్లయ్య కుటుంబ సభ్యులు విస్తృతంగా గాలించారు. ప్రత్యేక బోటులో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన జరిగిన స్థలం నుంచి త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రిజర్వాయర్ వరకు ఎడమ కాల్వ తూముల వద్ద వెతుకుతున్నారు. గాలింపు చర్యలను నిడమనూరు తహసీల్దార్ జంగాల కృష్ణయ్య, హాలియా సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ ఉప్పు సురేష్, ముకుందాపురం సర్పంచ్ సలికంటి పద్మాసత్యం పర్యవేక్షించారు. లభ్యంకాని పుల్లయ్య ఆచూకీ -
సిద్ధమవుతున్న పోలింగ్ కేంద్రాలు
భూదాన్పోచంపల్లి: మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ఒక్కరోజే గడువు ఉండటంతో అధికారులు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. పోచంపల్లి మున్సి పాలిటీలోని జడ్పీహెచ్ఎస్, సీతావానిగూడెం, నారాయణగిరి, ముక్తాపూర్, రేవనపల్లి ప్రాథమిక పాఠశాలలో మొత్తం 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలుగా వినియోగించే గదులను శుభ్రం చేస్తున్నారు. ఓటర్లకు బ్యాలెట్ పేపర్లోని గుర్తులు స్పష్టంగా కన్పించేలా అన్ని పోలింగ్ కేంద్రాలలోని కంపార్ట్మెంట్ పైన లైట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి తెలిపారు. -
మున్సిపల్ బరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి
మిర్యాలగూడ: రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే దివంగత మల్లు స్వరాజ్యం మనవరాలు మల్లు మధులత మిర్యాలగూడ మున్సిపాలిటీలో 17వ వార్డు నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తోంది. మల్లు స్వరాజ్యం కుమారుడు మల్లు గౌతమ్రెడ్డి కోడలు అయిన మధులత సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలిపెట్టి ప్రజా సేవ చేసేందుకు ఎన్నికల బరిలో నిలబడ్డారు. తన అమ్మమ్మ మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. రాజకీయ పార్టీలు సైతం యువతకు తగిన ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలని, తనను గెలిపిస్తే 17వ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఆమె చెప్పారు. -
వైద్యం చేస్తానని.. పుస్తెలతాడు అపహరణ
భూదాన్పోచంపల్లి: సంతానం లేని వారికి వైద్యం చేస్తానని నమ్మించిన గుర్తుతెలియని వ్యక్తి మహిళ నుంచి 4 తులాల బంగారు పుస్తెలతాడు అపహరించాడు. ఈ ఘటన సోమవారం ఉదయం భూదాన్పోచంపల్లి పట్టణంలోని గాంధీనగర్లో జరిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్కు చెందిన వంగూరి ప్రణీత, రాజ్కుమార్ దంపతులకు వివాహమై ఐదేళ్లవుతున్నా సంతానం కలగకపోవడంతో వైద్యులతో చికిత్స తీసుకుంటున్నారు. బైక్పై హెల్మెట్ ధరించిన గుర్తుతెలియని వ్యక్తి సోమవారం రాజ్కుమార్ ఇంటి వద్దకు వచ్చి సంతానం లేని వారికి కేరళ ఆయుర్వేద వైద్యం చేస్తామని నమ్మించాడు. ఇందుకు రూ.12వేలు ఖర్చు అవుతుందని చెప్పాడు. ఇది నమ్మిన రాజ్కుమార్ దంపతులు రూ.6వేలు ఇస్తామని చెప్పారు. ఈ మేరక సదరు వ్యక్తి మొదట రాజ్కుమార్ ఒంటికి నూనె లాంటి పదార్థాన్ని పూసి అతడిని స్నానం చేసి రమ్మని చెప్పాడు. ఆ తర్వాత ప్రణీతకు కూడా మెడ భాగంలో నూనె పూస్తూ పుస్తెలతాడును తీయమని చెప్పడంతో ఆమె తీసి మంచం పైన పెట్టింది. అనంతరం ఆమెను కూడా స్నానం చేసి రమ్మని చెప్పాడు. ప్రణీత స్నానానికి వెళ్లగానే మంచంపై ఉంచిన పుస్తెలతాడు సదరు వ్యక్తి తీసుకొని అక్కడ నుంచి ఉడాయించాడు. ప్రణీత స్నానం చేసి వచ్చి చూడగా ఆ వ్యక్తి లేడు, పుస్తెలతాడు కన్పించలేదు. వెంటనే తేరుకొని భర్త రాజ్కుమార్ ఆమె చుట్టుపక్కల ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ భాస్కర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. దుండగుడు అంతకుముందు వైద్యం చేస్తామని చెప్పి ఇదే కాలనీకి చెందిన మరో వ్యక్తితో మాట్లాడిన మొబైల్ నంబర్ను పరిశీలించగా ట్రూ కాలర్లో అతడి పేరు వెంకటేశ్వర్రావు అని, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాగా వస్తుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉంటే సంతానం లేనివారికి వైద్యం చేస్తామంటూ ఇటీవల పోచంపల్లిలో పలువురి వద్ద వేల రూపాయలు వసూలు చేసి ఉడాయించినట్లు తెలిసింది. -
ఆడపిల్లలకు వరాల జల్లు
చిట్యాల : మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. చిట్యాల మున్సిపాలిటీలోని పలు వార్డులోని పోటీచేస్తున్న కౌన్సిలర్ ఆభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఆడపిల్లలకు పెద్ద ఎత్తున నజరానాలు ప్రకటించారు. 9వ వార్డులో ఆడపిల్ల పెళ్లి చేస్తే రూ.10,116, ఆడపిల్ల పుడితే రూ.5,116 అందిస్తానని ఆ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆగు అశోక్ తరఫున మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రకటించారు. 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు ఎన్నికల ప్రచారంలో ఆడపిల్ల పుడితే రూ.11,116, ఆడపిల్ల పెళ్లికి రూ.15,116 అందజేస్తామని హామీ ఇచ్చారు. అదే వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిర్రబోయిన సమతా శ్రీకాంత్ తన వార్డులో ఆడపిల్లపు పుట్టిన, ఆడపిల్ల పెళ్లి చేసినా రూ.10,116 అందిస్తానని హామీనిచ్చారు. 10వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిమ్మనగోటి శ్రీను వార్డు ప్రజలు శుభకార్యాలు జరుపుకొంటే ఫంక్షన్హాల్ను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అదే వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిలివేరు శేఖర్ తరఫున ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకుడు మన్నెం సైదులు వార్డులో అడపిల్ల పెళ్లికి రూ.10వేలు అందిస్తామని హామీ ఇచ్చాడు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 7వ వార్డు కౌన్సిలర్గా గెలిచి మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసిన కూరెళ్ల లింగస్వామి తన వార్డులో ఆడపిల్ల పెళ్లికి రూ.10,116 ఇస్తూ వస్తున్నాడు. ప్రస్తుత ఎన్నికల్లో అదే వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లింగస్వామి భార్య జ్యోతి ఆడపిల్ల పెళ్లికి రూ.10,116 నజరానా ఇస్తామని ప్రకటించారు.ఫ మున్సిపల్ అభ్యర్థుల హామీలు -
పారదర్శకంగా పోలింగ్ ప్రక్రియ
సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ర్యాంపులు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ సురేష్, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి మోత్కూరు : మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు కోరారు. మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను సోమవారం పరిశీలించారు. ఆయన వెంట ఎన్నికల ప్రత్యేక అధికారి గుర్రం సురేష్, మున్సిపల్ కమిషనర్ కె.సతీష్కుమార్, తహసీల్దార్ పి.జ్యోతి, ఎంపీడీఓ బాలాజీనాయక్, ఎంపీఓ పైళ్ల జనార్దన్రెడ్డి, పీఆర్ ఈఈ మంగులాల్, కమిషనర్ కె.సతీష్కుమార్, మేనేజర్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి భువనగిరిటౌన్ : ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హనుమంత రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. వెబ్కాస్టింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు ఆలేరు: పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. సోమవారం ఆలేరు మున్సిపాలిటీని సందర్శించారు. ఆయన వెంట తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ సత్యాంజనేయప్రసాద్, వెంకటేష్, తిరుపతిరెడ్డి, జగన్మోహన్ పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
11న సెలవు
యాదగిరిగుట్ట: ఈనెల 11న పోలింగ్ రోజు స్థానిక సెలవు గా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు వెల్లడించారు. సోమవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బ్యాలెట్ బాక్సులను పరిశీలించి మాట్లాడారు. ఆ రోజు ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు సాధారణ సెలవు, షాపులు, సంస్థలు, ఫ్యాక్టరీల్లో పని చేస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు కల్పిస్తున్నట్లు తెలిపారు.ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థల భవనాలకు ఈనెల 10వ తేదీన పోలింగ్కు ముందు రోజు, 11వ తేదీన పోలింగ్ రోజు సెలవులు ప్రకటించినట్లు వివరించారు. 13న ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కోసం వినియోగించే స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. -
ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలి
భువనగిరిటౌన్ : ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో భద్రపరచిన పోలింగ్ మెటీరియల్ను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయనున్న బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని సిద్ధంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, మేనేజర్ నరేశ్రెడ్డి, డీఈ కొండల్రావు, సిబ్బంది పాల్గొన్నారు. బాధ్యతగా కౌంటింగ్ నిర్వహించాలి సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో కౌంటింగ్ సిబ్బందికి ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి సిబ్బంది ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిచాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణా రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి సత్యనారాయణ,మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. భువనగిరి మండలంలో దివ్య బాల స్కూల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ , రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పరిశీలించారు. యాప్లో యూరియా బుక్ చేసుకోవాలిగుండాల: రైతులు ఫర్టిలైజర్ యాప్లో యూరియా బుక్ చేసి కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి కోరారు. సోమవారం గుండాలలో ఎరువుల దుకాణాలను తనిఖీచేశారు. స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడారు. జిల్లాలో ఉన్న రైతులందరికీ సరిపడా యూరియా ఉందని, ఎవరూ ఆందోళన చెంద వద్దన్నారు. యూరియా అమ్మకాలలో ఎటువంటి ఇబ్బందులు కలిగించ కూడదని డీలర్లు, సొసైటీ నిర్వాహకులను ఆదేశించారు. యాప్లో యూరియా బుక్ చేసుకోలేని రైతులకు ఏఈఓలు అందుబాటులో చేయించాలని సూచించారు. ఆయన వెంట ఆలేరు ఏడీఏ శ్రీని వాస్, మండల వ్యవసాయ అధికారి సూరజ్కుమార్, ఏఈఓ క్రాంతి, సిబ్బంది పాల్గొన్నారు. ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలిరామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు అందించే ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని రామన్నపేట ఏఎస్సీడీఓ ఆర్.భిక్షం కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి చదివే ఎస్సీ బాలురకు ప్రభుత్వం సంవత్సరానికి రూ. 1000, బాలికలకు రూ .1500 చొప్పున ఉపకార వేతనం అందిస్తుందని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 9, 10 తరగతులు చదివే బాలబాలికలకు రాజీవ్ విద్యాదీవెన కింద ఏడాదికి రూ .3500 చొప్పున చెల్లిస్తుందని వివరించారు. కేంద్రీయ విద్యాలయంలో ప్రేరణ ఉత్సవ్భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని కేంద్రీయ విద్యాలయంలో సోమవారం ప్రేరణ ఉత్సవ్–26 సందర్భంగా జిల్లా స్థాయి పోటీలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన సుమారు 50 మంది విద్యార్థులు వివిధ అంశాలలో నిర్వహించిన కవితలు, పాటలు, చిత్రలేఖనం, వ్యాసరచన వంటి పోటీల్లో ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ చంద్రమౌళి మాట్లాడారు. ప్రేరణ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వెయ్యి మందితో నిఘా
ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇక అభ్యర్థులు ఎవరు కూడా ప్రచారం నిర్వహించకూడదు. సెల్ఫోన్లో కూడా ఎన్నికల ప్రచారం చేయవద్దు. నిబంధనలు పాటించాలి. ఉల్లంఘించి ప్రచారం నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదైతే అభ్యర్థిత్వం కోల్పోతారు. సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు సైలెన్స్డేస్గా పరిగణించాలి. ఈ సమయంలో ఓటర్లు కానివారు, స్థానికేతరులు వార్డుల్లో సంచరించకూడదు. ఉచితాలు, బహుమతులు, డబ్బు మద్యం లాంటి వాటితో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తప్పవు. సాక్షి, యాదాద్రి : ‘జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కూరు మున్సిపాలిటీలకు ఈ నెల 11న నిర్వహించే ఎన్నికలకు వెయ్యి మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. పోలింగ్, కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గట్టి నిఘా ఉంచాం. ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవడానికి పటిష్ట చర్యలు తీసుకున్నాం’ అని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను సోమవారం ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఆరు మున్సిపాలిటీల్లోని 102 వార్డుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నాం. పోలింగ్ నిర్వహణకు ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశాం. అదనపు ఎస్పీ, డీస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఫోర్స్ అనుక్షణం అప్రమత్తంగా పనిచేస్తుంది. మున్సిపాలిటీల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. 102 వార్డుల్లోని 208 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనుండగా 51 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. డీఎస్పీ స్థాయి అధికారి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారిగా ఉంటారు. ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ విధులు నిర్వర్తిస్తుంది. ప్రతి మున్సిపాలిటీలో ఫ్లయింగ్ స్క్వాడ్ విధులు నిర్వహిస్తుంది. ప్రతి మున్సిపాలిటీలో స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీమ్స్ ఉంటాయి. ప్రతి మున్సిపాలిటీకి ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీం ఉంది. ఎన్నికలను జిల్లా ఎలక్షన్ సెల్ ద్వారా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాం. బందోబస్తు నిర్వహణ మొదలుకుని ఎన్నికల సామగ్రికి భద్రత కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వీటిని జిల్లా పోలీస్ కార్యాలయంలోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశాం. వీటి ద్వారా నిత్యం పర్యవేక్షణ ఉంటుంది. గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడ్డ వారిని గుర్తించి 73 మందిని ముందస్తుగా బైండోవర్ చేశాం. ఎవరైనా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి వారిని హామీ పూచీకత్తు నగదు రూ.5 లక్షల వరకు జరిమానాగా విధిస్తాం. లైసెన్స్ కలిగిన 5 ఆయుధాలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నాం. 29 కేసుల్లో రూ.2.57 లక్షల విలువైన 357 లీటర్ల మద్యం సీజ్ చేశాం. భువనగిరిటౌన్, పోచంపల్లిలో రూ.5.90 లక్షల నగదును సీజ్ చేశాం. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన విషయంలో ఒక కేసు నమోదు చేశాం ఎన్నికల సంఘం సూచించిన నియమ నిబంధనల ప్రకారం ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికల సామగ్రికి పటిష్ట భద్రత కల్పిస్తాం. భువనగిరి దివ్యబాల పాఠశాలలో పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు భద్ర పరుస్తాం. ఆర్ముడ్ పోలీసుల పహారాలో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నాం. అలాగే ఎన్నికల సామగ్రి తరలింపులో ఎన్నికల నిర్వహణ అధికారులతోపాటు రూట్ మొబైల్ సిబ్బంది భద్రతగా ఉంటారు. ఫ ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు ఫ స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి ఫ ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి ఫ ఎస్పీ అక్షాంశ్యాదవ్కేటాయించిన సిబ్బంది అదనపు ఎస్పీలు 01 డీఎస్పీలు 04 ఇన్స్పెక్టర్లు 11 సబ్ ఇన్స్పెక్టర్లు 37 స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ 06 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ 06 ఏఆర్ ఫోర్స్ 213 ఇతర సిబ్బంది 600 -
రాజకీయాలను శాసించే రోజు వస్తుంది
చౌటుప్పల్ : భవిష్యత్లో రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి మునుగోడు నుంచే ఉంటుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాయంత్రం పట్టణంలో కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. తాను మొండోడినని, ఎవరికీ విననని చెప్పారు. తనను చూస్తే మంచిమంచోళ్లే భయడుతున్నారన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఇంకా వందమార్లు పోటీ చేసినా గెలవడన్నారు. కూసుకుంట్ల అప్పటి సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లేందుకు గజగజ వణికేవాడన్నారు. అదే తాను ఒక్క ఫోన్ చేస్తే సీఎం వెంటనే లైన్లోకి వస్తాడన్నారు. తాము దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి ప్రియ శిష్యులమని ప్రజలకు మాట ఇస్తే తప్పబోమని, మడమ తిప్పబోమని స్పష్టం చేశారు. బతికినంతకాలం వైఎస్సార్ మాదిరిగా బతుకుతానని తెలిపారు. సమావేశంలో పీసీసీ ఽఅధికార ప్రతినిధి సంధ్యారెడ్డి, ప్రధానకార్యదర్శి కసుబ శ్రీనివాస్రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కై లాష్, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి, పబ్బు రాజుగౌడ్, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ ప్రజలను కోరారు.చౌటుప్పల్ పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఓటు వేయండి
యాదగిరిగుట్ట: అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని సినీ హీరో సుమన్ కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పెలిమెల్లి లావణ్య శ్రీధర్ గౌడ్ కు మద్దతుగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి ఆయన ప్రచారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో సుమన్ మాట్లాడారు. గత పదిహేళ్లుగా ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. మరో మూడేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని.. యాదగిరిగుట్ట పట్టణం, వార్డులు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెలిమెల్లి లావణ్య భర్త పెలిమెల్లి శ్రీధర్ గౌడ్ తనకు వీర అభిమాని అని, 30 ఏళ్లుగా శ్రీధర్ యాదగిరిగుట్ట పట్టణంలో ఎన్నో సామాజిక, స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. పెలిమెల్లి లావణ్యకు ప్రజలు మద్దతుగా నిలిచి , ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ ప్రచారంలో ప్రొడ్యూసర్ జైహింద్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు భిక్షపతి గౌడ్, గుడ్ల వరలక్ష్మి, గుండు జ్యోతి పాల్గొన్నారు. ఫ సినీ నటుడు సుమన్ -
వాడవాడకు.. గడప గడపకు..
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఎన్నికల సామగ్రి పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలేరు పట్టణంలోని ఎన్నికల సామగ్రిని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు అందజేయనున్నారు. భువగిరి మున్సిపాలిటీకి సంబంధించిన సామగ్రి పంపిణీని భువనగిరిలోని దివ్యబాల విద్యాలయం, ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో ఏర్పాటు చేయగా, చౌటుప్పల్ మున్సిపాలిటీలో, సాన్ జాన్ విద్యానికేతన్ లక్కారం, మోత్కూర్లో వైజే గార్డెన్స్లో, పోచంపల్లి మున్సిపాలిటీలో బాలాజీ గార్డెన్స్లో, యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి సంబంధించి ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల సామగ్రిని అందజేయనున్నారు.సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ప్రచార మైకులు మూగబోయాయి. చివరి రోజు అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ తమకే ఓటు వేయాలని కోరారు. ప్రధాన పార్టీల నేతలు, రోడ్షోలు, ర్యాలీలు, కార్నర్ మీటింగ్లతో హోరెత్తించారు. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రలోభాలకు తెరలేపారు. ఈ నెల 11న భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, మోత్కూరు, పోచంపల్లి మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనుంది. ప్రముఖుల ప్రచారం యాదగిరిగుట్టలో సినీహీరో సుమన్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి, చౌటుప్పల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే మందుల సామేల్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఆలేరులో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు సోమవారం ప్రచా రాన్ని హోరెత్తించారు. తమ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ప్రలోభాల ఎర ప్రచారం ముగిసిన వెంటనే అభ్యర్థులు ఓటర్లకు డబ్బు పంపిణీని ప్రారంభించారు. కాంగ్రెస్. బీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా ప్రలోభాల ఎర వేస్తున్నాయి. భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు సగటున ఒక్క ఓటుకు రూ. 6వేల నుంచి రూ. 15 వేల వరకు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మద్యం, డబ్బులు, చీరలు, వెండి కుంకుమ బరిణెలు, బియ్యం, చికెన్, మటన్, మద్యం పంపిణీని ప్రారంభించారు. ఓటర్లుకు భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ● భువనగిరి మున్సిపాలిటీలో బొమ్మాయిపల్లి వార్డులో ఓ అభ్యర్థి ఇంటింటికీ జర్మన్ సిల్వర్ కుంకుమ కాయలు పంచుతున్నాడు. అన్ని వార్డుల్లో మద్యంబాటిళ్లు పంచుతున్నారు. రూ. 3 వేలనుంచి రూ. 5 వేల వరకు పంపిణీ చేస్తున్నారు. భువనగిరిలోని ఓ వార్డులో చీరల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బ్యాంకు నుంచి తెచ్చిన కొత్త 10, 20, 50 రూపాయల నోట్లను కార్యకర్తలకు ఇచ్చారు. వాటిని తీసుకుని క్లాత్ షోరూంకు వెళితే చీరలు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. ● ఆలేరులో జనరల్, రిజర్వుడ్ వార్డుల్లో అభ్యర్థులు ఒక్క ఓటుకు రూ. 4వేల నుంచి రూ. 5 వేల వరకు పంచుతున్నారు. చైర్మన్ సీటుపై కన్నేసిన వార్డులో నేటి వరకు ఓటు రికార్డు ధర పలుకనుంది. అయితే ఒకరు పంచిన డబ్బుల కంటే మరొ కరు అదనంగా పంచేందుకు ప్లాన్చేశారు. మద్యం, చీరలు, బియ్యం, ప్రెషర్ కుక్కర్లు అదనం. ● చౌటుప్పల్లో ఇప్పటికే మద్యం పంపిణీ పూర్తి అయ్యింది. 2,3, 19 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు ఓటకు రూ. 5 వేలు పంచుతున్నారు. వీరికంటే అదనంగా పంచే యోచనలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఉన్నాయి. మహిళా ఓటర్లకు చీరలు,కూల్ డ్రింక్స్ పంచుతున్నారు. ● పోచంపల్లిలో చైర్మన్ అభ్యర్థి పోటీ చేస్తున్న వార్డులో రూ. 5 వేల నగదు, చీరలు, మద్యం, కూల్ డ్రింక్స్ పంచేందుకు సిద్ధమయ్యారు. మున్సిపాలిటీలు 6 వార్డులు 102 పోలింగ్ కేంద్రాలు 208 బ్యాలెట్ బ్యాక్స్లు 449 ఓటర్లు 1,32,711 పురుషులు 64,926 మహిళలు 67,767 ఇతరులు 18 బరిలో ఉన్న అభ్యర్ధులు 353 ఏకగ్రీవం 2 వార్డులుఫ వారం రోజులుగా హోరెత్తిన ప్రచారం ఫ సోమవారంతో సమాప్తం ఫ నేడు పోలింగ్ సామగ్రి పంపిణీ ఫ ఏర్పాట్లు చేసిన అధికారులు -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
సాక్షి, యాదాద్రి : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఇంటర్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు వార్షిక పరీక్షలకు 28 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ లక్ష్మీ నారాయణ, భువనగిరి ఆర్డీఓ కృష్ణా రెడ్డి,జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి , జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, జిల్లా అసిస్టెంట్ ట్రెజరీ అధికారి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎవరి వ్యూహం వారిదే..
సాక్షి, యాదాద్రి : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం ముగియనుంది. పోలింగ్కు సమయం దగ్గర పడుతుండడంతో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ముఖ్యనాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చైర్ పర్సన్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ ముఖ్యనేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ● మోత్కూర్ మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ పోటీలో ఉన్నప్పటికీ ఇతర పార్టీల గెలుపు ఓటములపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. శనివారం రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్యే మందుల సామేల్ తమ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థులు, కోఆర్డినేటర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కడెం రామచంద్రయ్య ప్రచారం చేస్తున్నారు. ● చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 20 వార్డుల్లో కాంగ్రెస్, బీజేపీలు సొంతంగానే పోటీ చేస్తుండగా బీఆర్ఎస్, సీపీఎంలు పొత్తుపెట్టుకున్నాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ అభ్యర్థుల తరపున ప్రచార చేశారు. బీఆర్ఎస్, సీపీఎం తరఫున సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్రెడ్డి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరఫున ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్ రెడ్డిలు ప్రచారం చేస్తున్నారు. ● భువనగిరి మున్సిపాలిటీలో 35 స్థానాలకు ముక్కోణపు పోటీ నడుస్తోంది. కొన్ని వార్డులో కాంగ్రెస్, బీజేపీలు నువ్వానేనా అన్నట్లు ఉంది. మరికొన్ని వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లు ముఖాముఖి తలపడుతున్నాయి. కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుండగా. బీఆర్ఎస్ సీపీఎం, సీపీఐల పొత్తుతో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ స్వతంత్రంగానే పోటీ చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు చైర్మన్ అభ్యర్థిగా ఎవరి పేరు ఇంకా ప్రకటించలేదు. మెజార్టీ స్థానాలు గెలిచిన తర్వాత చైర్మన్ను ఎన్నుకుంటామని పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. మంత్రిసీతక్క, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డిలు విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ మిత్ర పక్షాల తరపున మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరపున రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్గౌడ్, పాశం భాస్కర్, గూడూరు నారాయణరెడ్డి, సమన్వయ కర్తలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ● ఆలేరు మున్సిపాలిటీలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. చైర్పర్సన్ స్థానాన్ని చేజిక్కించుకుంటామని కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరికి వారే ధీమాతో ఉన్నాయి. మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థుల తరపున పడాల శ్రీనివాస్ ప్రచారం చేస్తున్నారు. ఫ కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీ ఫ భువనగిరిలో ముక్కోణపు పోటీ ఫ నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం ఫ పోచంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు 13 వార్డుల్లో పోటీపడుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇరు పార్టీలకు చెందిన చైర్మన్ అభ్యర్థులైన తడక వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నుంచి గుండు మధు 12వ వార్డ్ నుంచి బరిలోకి దిగారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్ని వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు మున్సిపల్ కౌన్సిలర్ సీట్లను ఒకటి, రెండు అటు, ఇటుగా పంచుకోనున్నాయి. కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి పదవ వార్డులో ఏక గ్రీవమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఏడు ఎనిమిది వార్డుల్లో అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఇటీవల మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గుట్ట పట్టణంలోని అన్ని వార్డులలో పర్యటించి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా తమ అభ్యర్థులను గెలిపించాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇటీవల రాజ్యసభ సభ్యులు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. -
ఇసుక దందాను అరికట్టాలి
ఆలేరురూరల్ : ఆలేరు మండలం సాయిగూడెం పరిధిలోని వాగులో నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో వ్యవసాయ బావులు, బోర్లు ఎండిపోతున్నాయని, వేసవిలో సాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక దందాను అడ్డుకున్న గ్రామానికి చెందిన పుట్ట పవన్పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. పోలీసులను వివరణ కోరగా.. పుట్ట పవన్ వ్యవసాయ బావి వద్ద నుంచి ట్రాక్టర్లో బొడ్డు మల్లేష్ ఇసుక తరలిస్తుండగా పవన్ అడ్డుకున్నాడని.. వాగ్వాదం చోటుచేసుకుందనేది వాస్తవమని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. -
మున్సిపాలిటీల్లో నేటి నుంచి డ్రైడే
సాక్షి,యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో డ్రై డే ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు ఆదివారం తెలిపారు. 9వ తేదీ(సోమవారం) సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ పోలింగ్ ప్రక్రియ మూసే వరకు, తిరిగి 13వ తేదీ ఓట్ల లెక్కింపు రోజున ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ పూర్తయ్యే వరకు మున్సి పాలిటీల పరిధిలో డ్రై డే గా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ఆయా మున్సిపాలిటీల పరిధిలో గల మద్యం దుకా ణాలు, రిటైల్ షాప్స్, బార్లు, కల్లు దుకాణాలు అన్ని మూసి ఉంచాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటుమోత్కూరు : ఎన్నికల విధుల్లో పాల్గొనే వారి కోసం మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ కె.సతీష్కుమార్ ఆదివారం తెలిపారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన ఓటరు జాబితా, గుర్తింపు పత్రాలు, విధి నిర్వహణ పత్రాలను జత పరుస్తూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. తహసీల్దార్ పి.జ్యోతి, ఎంపీడీఓ డి.బాలాజీ, రాజకీయ ప్రతినిధులు వనం శాంతికుమార్, బి.యాదగిరి తదితరులున్నారు. యాదగిరీశుడికి బంగారు వాహనాలు బహూకరణయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఉప్పల అశోక్, కుటుంబ సభ్యులు రాగిపై బంగారు తాపడం చేసిన వాహన సేవలను ఆలయ ఈఓ భవానీ శంకర్కు అందజేశారు. ఆదివారం ఉప్పల అశోక్, కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ముఖ మండపంలో రాగిపై బంగారు తాపడం చేసిన హనుమంత, గజ వాహనాలను అందజేశారు. అదేవిధంగా ఆండాళ్ అమ్మవారికి మకర తోరణం బహుకరించారు. వీటి విలువ సుమారు రూ.15,00,000 ఉంటుందని వెల్లడించారు. -
ఇంటర్నల్ తనిఖీలు
భువనగిరి: టెన్త్ విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల పరిశీలన ప్రక్రియను ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సబ్జెక్టుకు 100 మార్కుల్లో 20 మార్కులు ఇంటర్నల్ కింద కేటాయిస్తారు. ఈ మార్కుల పరిశీలన కోసం ప్రత్యేక బృందాలు పాఠశాలలను సందర్శించి పరిశీలించనున్నారు. 21 బృందాలు ఏర్పాటు పదో తరగతి ఇంటర్నల్ మార్కుల పరిశీలన కోసం జిల్లాలో మొత్తం 21 బృందాలు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున ఉంటారు. వీరిలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడితో పాటు లాంగ్వేజ్ ఉపాధ్యాయుడు, నాన్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ సభ్యులుగా ఉంటారు. వీరికి కేటాయించిన పాఠశాలల్లో విద్యార్థులకు మార్కులు సక్రమంగా వేశారా లేదా అక్రమాలకు పాల్పడ్డారా లేదా అనే విషయాలను పరిశీలిస్తారు. జిల్లాలో 8891 మంది విద్యార్థులు జిల్లాలో పదో తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 265 వరకు ఉన్నాయి. ఇందులో 2025–26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 8891 మంది ఉన్నారు. వీరిలో 163 ప్రభుత్వ పాఠశాలల్లో 5063, వివిధ రకాల 31 గురుకులాల్లో 1187, 71 ప్రైవేట్ పాఠశాలల్లో 2641 మంది విద్యార్థులున్నారు. ఆయా విద్యార్థులకు సంబంధించి మార్కులను పరిశీలించనున్నారు. ప్రైవేట్ పాఠశాలలు కుమ్మకై 20 ఇంటర్నర్ మార్కులు వేస్తున్నారనే ఆరోపణలు నేపథ్యంలో ఈసారి పరిశీలన పక్కాగా చేసేందుకు చర్యలు చేపట్టారు. ఫ టెన్త్ ఇంటర్నల్ మార్కుల పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఫ 12 నుంచి 17 వరకు కొనసాగనున్న ప్రక్రియ ఫ ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున నియామకంపదో తరగతి ఇంటర్నర్ మార్కుల పరిశీలన పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. మార్కులు సక్రమంగా వేశారా లేదా అనేది ప్రత్యేక బృందాలు పరిశీలిస్తారు. ఇష్టానుసారంగా మార్కులు వేసినట్లు పరిశీలనలో తేలితే చర్యలు తప్పవు. మార్కుల పరిశీలన అనంతరం వాటిని ఆన్లైన్లో నమోదు చేయాలి. – సత్యనారాయణ, డీఈఓ -
బీఆర్ఎస్ దొంగ హామీలను నమ్మొద్దు
ఫ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క భువనగిరిటౌన్ : కేసీఆర్ పదేళ్ల పాలనలో మున్సిపాలిటీలకు మంచి నీరు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైన బీఆర్ఎస్ నాయకులు, మళ్లీ దొంగ హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం భువనగిరి పట్టణంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా ఆర్థిక ఇబ్బందులతో సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రజా సంక్షేమం కోసం హామీలు ఇవ్వని పథకాలు కూడా అమలు చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి తన శాఖ నుంచి అధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు దొంగ హామీలతో మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారని, ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలి మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేయని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, పట్టణాల్లో కూడా కాంగ్రెస్కు ఓటు వేయాలన్నారు. ఎమ్మెల్యే కుంభంఅనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హెచ్ఎండీఏ నిధులు సీఎం రేవంత్రెడ్డి కేటాయింపు చేసినట్లు తెలిపారు. భువనగిరి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే రోడ్డు విస్తరణ, చౌరస్తాల అభివృద్ధితో పాటు, సీసీ రోడ్లు వేయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవైస్చిస్తీ, కుంభం కీర్తిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, చల్లగురుగుల కృష్ణవేణి రఘుబాబు, బెండె స్వరూపలాల్రాజ్, గుర్రాల సంతోష శ్రీనివాస్, తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, పోలిశెట్టి అనిల్కుమార్, సూదగాని సరితరాజు, నాయకులు పాల్గొన్నారు. -
ఫ గిరిప్రదక్షిణ
నేటి సమాజానికి రచయితలు అవసరం రామగిరి(నల్లగొండ) : నేటి సమాజానికి రచయితలు అవసరమని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. నల్లగొండ పట్టణంలోని టీఎస్యూటీఎఫ్ భవనంలో ఆదివారం నిర్వహించిన భూతం విమల స్మారక జాతీయ పురస్కార అవార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రచయిత్రి స్వర్ణ కిలారికి రూ.5116, జ్ఞాపికను అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో గురుతరమైన బాధ్యత రచయితలదని, కవులు రచయితలు నిరంతరం సామాజిక సమస్యలపై స్పందిస్తూ తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపర్చాల్సిన అవసరం ఉందన్నారు. రచయిత భూతం ముత్యాలు సతీమణి విమల స్మారకార్థం పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఒక రచయితకు పురస్కారాన్ని ప్రధానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సభ అధ్యక్షుడు తండు కృష్ణకౌండిన్య, అవార్డు కమిటీ చైర్మన్ భూతం ముత్యాలు, ఆచార్య బన్న ఐలయ్య, డాక్టర్ జివి రత్నాకర్, మునాసు వెంకట్, మేరెడ్డి యాదగిరిరెడ్డి, పగడాల నాగేందర్, సిద్ధాంతి యాదగిరి, నిమ్మ బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మున్సిపాలిటీలోని 4, 6, 8వ వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని అన్ని వార్డుల సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని అన్నారు. 12 వార్డుల్లో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలన్నారు. రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. ప్రజా పాలనలో ప్రతి నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాలతో పాటు మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఇప్పటికే యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 10వ వార్డు ఏకగ్రీవమైందని, మిగిలిన 10 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో సీపీఐ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రజల్లో తమకు వస్తున్న ఆధరణ చూసి ఓర్వలేక ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ప్రజలు అంటున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
సాక్షి ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట టెంపుల్ రన్..
సాక్షి,యాదగిరిగుట్ట: సాక్షి మీడియా గ్రూప్, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యాదగిరిగుట్ట టెంపుల్ రన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఆఫ్ మారథాన్, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల విభాగాల్లో పోటీలు నిర్వహించగా, భారీ సంఖ్యలో అథ్లెట్స్ పాల్గొన్నారు.యాదగిరిగుట్ట టెంపుల్ రన్కు ప్రముఖ రియల్ఎస్టేట్ సంస్థ అవంతికా కన్స్ట్రక్షన్ ప్రధాన స్పాన్సర్గా నిలిచింది. ఇప్పటికే హైదరాబాద్తో పాటు పలు ప్రముఖ నగరాల్లో ఎన్నో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులను విజయవంతంగా అభివృద్ధి చేసిన అవంతికా కన్ స్ట్రక్షన్ సమాజంలో ఆరోగ్యాన్ని, సంపదను సమానంగా పెంపొందించడమే లక్ష్యంగా నడుం బిగించింది. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట టెంపుల్ రన్కు ప్రధాన స్పాన్సర్గా ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా అవంతికా కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ యన్నం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ‘సమాజంలో ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ, సంపదను పెంపొందించడమే మా ముఖ్య ఉద్దేశ్యం. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కొనసాగిస్తాం’ అని హామీ ఇచ్చారు.యాదగిరిగుట్ట టెంపుల్ రన్ 2026 కేవలం ఒక రన్ మాత్రమే కాదు, ఇది ఆరోగ్యాన్ని,ఆధ్యాత్మికతను, సమాజాన్ని కలిపే ఒక వేదికగా నిలిచింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక స్ఫూర్తిదాయక యాత్రగా మారిందని నిర్వాహకులు కొనియాడారు. 10 కిలోమీటర్ల విభాగంలో విజేతలుపురుషుల ఓపెన్ కేటగిరీ: విజయ్ నెహ్రామహిళల ఓపెన్ కేటగిరీ: సాక్షి పలోజ్పురుషుల 45 సంవత్సరాల కేటగిరీ: వెంకట్మహిళల 45 సంవత్సరాల కేటగిరీ: పద్మఆఫ్ మారథాన్ విభాగంలో విజేతలుపురుషుల కేటగిరీ: మంచికంటి లింగన్నమహిళల కేటగిరీ: గడ్డం రాజేశ్వరీ యాదవ్పురుషుల 45 సంవత్సరాల కేటగిరీ: రవీందర్ ఎడ్లమహిళల 45 సంవత్సరాల కేటగిరీ: అనీ పార్హీఈ కార్యక్రమం ద్వారా ఫిట్నెస్పై అవగాహన పెంచడమే లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు. యాదగిరిగుట్ట ఆలయ పరిసరాల్లో నిర్వహించిన ఈ పరుగుల పోటీలు భక్తులు, యువతలో విశేష ఉత్సాహాన్ని నింపాయి. విజేతలకు నిర్వాహకులు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. -
ట్రాక్టర్ పైనుంచి పడి చిన్నారి మృతి
తిప్పర్తి : ట్రాక్టర్పై తండ్రి ఇంటి నుంచి వెళ్తుండగా.. తాను వస్తానని రెండేళ్ల కుమార్తె మారం చేసింది. దీంతో ఆమెను తండ్రి ట్రాక్టర్పై ఎక్కించుకుని కొద్దిదూరం తిప్పేందుకు తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆ చిన్నారి ట్రాక్టర్ పైనుంచి కిందపడి మృతిచెందింది. ఈ ఘటన తిప్పర్తి మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన కొల్లు సైదులు, అశ్విని దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. శనివారం సైదులు తన ట్రాక్టర్పై యూరియా బస్తాలు వేసుకురావడానికి వెళ్తుండగా.. తానూ వస్తానని పెద్ద కుమార్తె మనస్విని(2) మారం చేయడంతో ఆమెను కూడా ట్రాక్టర్పై ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ట్రాక్టర్ను ముందుకు కదిలించడంతో మనస్విని ట్రాక్టర్ పైనుంచి రోడ్డుపై పడిపోయింది. బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతిచెందింది. ఆడుతూ పాడుతూ ఇంట్లో తిరిగే చిన్నారి మృతిచెందడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిమర్రిగూడ : భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటుందని మనస్తాపంతో ఉరేసుకున్న వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. వివరాలు.. మర్రిగూడ మండలం వెంకేపల్లితండాకు చెందిన జటావత్ బాలాజీ(35) భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుండడంతో మనస్తాపానికి గురైన బాలాజీ నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఉరేసుకున్నాడు. అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి తమ్ముడు సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మర్రిగూడ ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
నవాబు నుంచి మాన్యం చెల్క
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న మాన్యం చెల్క ప్రాంతం మాన్యం బావిగా రికార్డులలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నీటి కరువు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో అప్పటి భూ స్వామి ఇక్కడ బావి తవ్వించాడు. దాంతో పాటు పేదలకు కొంత భూమిని కూడా దానం చేశాడు. భూస్వామి ఇచ్చిన భూమిలో ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని మాన్యం బావిగా పిలవడం మొదలు పెట్టారు. దాంతో పాటు నిజాం పాలకుల్లో ఐదవ రాజైన అఫ్జల్ ఉద్దౌలా తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. చాలా మంది వైద్యులు వైద్యం అందించినా తగ్గలేదు. దాంతో నల్లగొండ పట్టణంలోని ప్రముఖ వైద్యుడు కన్నయ్య వద్దకు వచ్చాడు. ఆయన అందించిన వైద్యంతో జబ్బు నయమైంది. దీనికి కృతజ్ఞతగా ప్రస్తుత మాన్యం చెల్క ప్రాంతాన్ని వైద్యుడికి ఇనాంగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి మాన్యం చెల్క అని పేరు వచ్చింది. -
నేడు గుట్టలో టెంపుల్ రన్
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పరిధిలోని టెంపుల్ సిటీ(పెద్దగుట్ట)పై ఆదివారం టెంపుల్ రన్ నిర్వహించనున్నారు. సాక్షి మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం అవంతిక కన్స్ట్రక్షన్స్ సౌజన్యంతో ఆదివారం ఉదయం 6గంటలకు టెంపుల్ సిటీపై ప్రారంభమవుతుందని తెలంగాణ రన్నర్స్ అధ్యక్షుడు సోమ జగన్మోహన్రెడ్డి, సాక్షి సర్క్యులేషన్ డీజీఎం సతీష్ తెలిపారు. శనివారం టెంపుల్ సిటీ, ప్రెసిడెన్షియల్ సూట్, మల్లాపురం గ్రామానికి వెళ్లే ప్రాంతాలను వారు పరిశీలించి మాట్లాడుతూ.. ఆరోగ్యంపై ప్రజలను చైతన్యం చేసేందుకు 21.1కే, 10కే, 5కే విభాగాల్లో ఈ రన్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రన్నర్స్ ఉదయం 5.30గంటలకే టెంపుల్ సిటీ పైకి చేరుకోవాలన్నారు. ఇప్పటికే 800 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి టీషర్టులు అందజేశామన్నారు. -
ఓటరు వాయిస్
నిస్వార్థ సేవ చేసేవారికే నా ఓటు సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట మున్సిపాలిటీలో ఈసారి నాకు కొత్తగా ఓటు హక్కు వచ్చింది. మొట్టమొదటి ఓటును నిస్వార్థ చేసి మా వార్డును అభివృద్ధి పథంలో తీసుకెళ్లే అభ్యర్థికే వేస్తాను. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని సరైన నాయకుడికి ఓటు వేస్తాను. – అంతటి యోగేశ్వర్, సూర్యాపేట సూర్యాపేట అర్బన్ : ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి బాధ్యత కూడా. సరైన నాయకుడిని ఎన్నుకుంటేనే అభివృద్ధికి సహకరించినట్లవుతుంది. నచ్చిన, సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఒక్క ఓటు ద్వారానే లభిస్తుంది. ఈసారి నాకు ఓటు హక్కు రావడంతో మా కాలనీని అభివృద్ధి చేసే నాయకుడికే ఓటు వేయాలనుకుంటున్నాను. – యాతాకుల భవిత, సూర్యాపేట రామగిరి(నల్లగొండ): మున్సిపల్ ఎన్నికల్లో యు వత ఓట్లు ఎంతో కీలకంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు యువతను ఆకర్షించడానికి అనేక హామీలు ఇస్తున్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. యువత కూడా ఆలో చించి తమకు సేవ చేసే వారికే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించుకోవాలి. – ఎండీ అమాన్, విద్యార్థి, నల్లగొండ రామగిరి(నల్లగొండ): నల్లగొండ నగరం అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకం. యువ ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి చేసేవారికే ఓటు వేయాలి. పెద్దవాళ్లకు కూడా తమ వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి యువ ఓటర్లు వివరించి నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి. ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. – ఎస్. చందన, విద్యార్థి, నల్లగొండ అభ్యర్థి వ్యక్తిత్వానికి ఓటు భువనగిరిటౌన్ : ప్రస్తుత మున్సిపాలిటీ ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నమ్మకమైన, పనులు చేసే అభ్యర్థినికి ఓటు వేయాలని ఆలోచిస్తున్నా. రాజకీయ పార్టీలను చూసి కాకుండా వ్యక్తిగతంగా అభ్యర్థి మంచివాడా లేదా అని చూసి ఓటు వేస్తాను. నూతన ఓటర్లు ఎవరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం చేయొద్దు. – లింగాల శివాణి, భువనగిరి -
ఎన్నికలు తెచ్చిన ఉపాధి
భువనగిరి, నల్లగొండ టూటౌన్ : మున్సిపల్ ఎన్నికలు పేదలకు, కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అభ్యర్థులు ఖర్చుకు వెనకాడకుండా నిత్యం తమ వెంట వందల మంది జనాన్ని తిప్పుకుంటూ వార్డుల్లో బలప్రదర్శన నిర్వహిస్తున్నారు. డప్పు కళాకారులు, కోలాటం ఆడేవారు ర్యాలీల్లో ముందుంటున్నారు. దాంతో పాటు ఆటోలు, వాహనాల్లో స్పీకర్లు పెట్టి తమ కోసమే రూపొందించిన పాటలతో మరీ ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థి వెంట వందల మంది ఉంటే ఇక అతడి గెలుపు పక్కా అనే ప్రచారం జరగాలనే వ్యూహంతో కొందరు అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తున్నారు. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన పేదలను తమ వెంట తిప్పుకుంటున్నారు. రోజులో ఒక పూట వెంట తిరిగితే భోజనంతో పాటు రూ.250, రెండు పూటలు తిరిగితే భోజనంతో పాటు రూ.500 ఇస్తున్నారు. అభ్యర్థుల వెంట జనం లేకపోతే ఓడిపోతారనే ప్రచారం చేస్తారనే భయంతో అభ్యర్థులు రోజు ఐదు వందలకు పైగానే మందిని తమ వెంట తిప్పుకుంటూ కాలనీల్లో హంగామా చేస్తున్నారు ఎన్నికల సందర్బంగా కారు, ఆటోలకు సైతం గిరాకీ ఏర్పడుతోంది. బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు నాయకులు కార్యకర్తలను ఆయా వార్డుల్లో తీసుకెళ్లడానికి వాహనానలు వినియోగిస్తున్నారు. వాహనాలకు ఫ్లెక్సీలు, మైకులు ఏర్పాటు చేసి గల్లీల్లో తిప్పుతున్నారు. దాంతో ప్రైవేటు వాహనదారులకు డిమాండ్ పెరిగింది. పట్టణాల్లో మైక్ ద్వారా ప్రచారానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. దాంతో అభ్యర్థులు తమ పేరు, పార్టీతో ప్రత్యేకమైన పాటను రూపొందించుకొని, సింగర్తో పాడించుకొని కాలనీల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ పాటలు సామాజిక మాధ్యమాలతో పాటు ఆటోలకు మైక్ బిగించి కాలనీలల్లో గల్లీ, గల్లీ తిప్పుతున్నారు. ఒక్కో పాటకు రూ.10 వేల నుంచి రూ.16 వేల వరకు గాయకులకు చెల్లించినట్లు తెలిసింది. దీని ద్వారా గాయకులకు ఉపాధి లభిస్తోంది. సభలు, సమావేశాలు, ప్రచారానికి వేళ్లేటప్పుడు నాయకులు, కార్యకర్తలు ఉదయం అల్పహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. దాంతో పట్టణాలలో హోటల్స్కు గిరాకీ పెరిగింది. కొందరు క్యాటరింగ్, హోటల్స్ వారికి ఆర్డర్స్ ఇస్తూ కోరిన చోటుకు పార్సిల్స్ కట్టి తీసుకెళ్తున్నారు. మరి కొందరు ఏకంగా హోటల్స్తో ముందుగానే కాంట్రాక్ట్ మాట్లాడుకొని కార్యకర్తలకు టోకెన్లు అందిస్తున్నారు. దాంతో అన్ని హోటళ్లు ఆర్డర్లతో యమ బిజీగా మారాయి. -
పేదలకు ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దే
మోత్కూరు : గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని, ప్రస్తుత రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రూ.70 వేల ఉద్యోగాలు, 4.5 లక్షల ఇళ్లు పేదలకు ఇచ్చిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి డి.సీతక్క అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో శనివారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభలో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి మహిళలకు పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో దోచుకొని దాచుకున్న సొమ్ము పంపకాలలో తేడాలతోనే కేసీఆర్ కుటుంబం కొట్లాడుకుంటుందన్నారు. మున్సిపాలిటీలలో కాంగ్రెస్కు పట్టం కడితే అభివృద్ధి మరింత వేగంగా పరుగులు పెడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సి పల్ ఎన్నికల ఇన్చార్జి బొజ్జ సంధ్యారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, మండల, పట్టణ అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, రామచంద్రు గౌడ్, మహిళ అధ్యక్షులు ముద్దం జయశ్రీ పాల్గొన్నారు. ఫ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
మళ్లీ కాంగ్రెస్దే అధికారం
భూదాన్పోచంపల్లి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుందని, మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెసేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శని వారం రాత్రి భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలోని 5వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యేకు సీఎం రేవంత్రెడ్డితో ఎంతో సాన్నిహిత్యం ఉందని, ఆ చొరవతోనే సీఎం ఆదేశాలతో తాను భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు తాగునీటి పైప్లైన్ కోసం రూ.210 కోట్ల మంజూరు చేశానని గుర్తు చేశారు. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, మున్సిపల్ చైర్మన్ పదవి కూడా కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి రెట్టింపు అవుతుందన్నారు. అభివృద్ధిపథంలో ముందుకు పోవాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి తడక వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు బాత్క శంకర్యాదవ్, నల్ల నాగేశ్వర్, సూరెపల్లి రాధిక రమేశ్, కుడికాల రాంనర్సింహ, కొయ్యడ రజినిశ్రీను, గంజి జయమ్మగణేశ్, మంగళపల్లి లావణ్యరమేశ్, భోగ భానుమతి విష్ణు, దేవరాయ కుమార్, రావుల జంగయ్య, గుండ్ల నవనీత, ఎల్లస్వామి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్, మండల అధ్యక్షుడు పాక మల్లేశ్, డీసీసీ ఉపాధ్యక్షుడు రాఘవరెడ్డి, సామ మధుసూధన్రెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, సుధారాణి, మమత, కుక్క దానయ్య తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
కౌంటింగ్ కేంద్రంలో వసతులు కల్పించాలి
సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో అన్నిరకాల వతసులు కల్పించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి పరిధిలోని దివ్యబాల స్కూల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని శనివారం జిల్లా ఎస్పీ అక్షాంశ్యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలన్నారు. వారి వెంట భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం, అధికారులు ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఓటు వేసేందుకు ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సోమవారం ప్రజావాణి రద్దుభువనగిరిటౌన్ : మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున భువనగిరి కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్టు కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విషయాన్ని ప్రజలు గమనించి ఎవరు కూడా కలెక్టరేట్కు రావొద్దని సూచించారు. కలెక్టర్ హనుమంతరావు -
ప్రజా సమస్యలపై పోరాడే వారిని గెలిపించాలి
భువనగిరిటౌన్, చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, ఆలేరు: నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, భువనగిరి, మునుగోడు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం భువనగిరి పట్టణంలో 6వ వార్డు సీపీఎం అభ్యర్థి కొలుపుల వివేకానంద విజయాన్ని కాక్షిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. అలాగే చౌటుప్పల్లోని పలు వార్డుల్లో బీఆర్ఎస్, సీపీఎం మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాలని జాన్వెస్లీ.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. భూదాన్పోచంపల్లిలోని 4వ వార్డులో సీపీఎం అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరి తరఫున జాన్వెస్లీ ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఆలేరు మున్సిపాలిటీలో 4వ వార్డు సీపీఎం అభ్యర్థి భాగ్యలక్ష్మిని గెలిపించాలని ప్రచారం, కార్నర్ మీటిగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చోట్లలో జాన్వెస్లీ మాట్లాడుతూ చౌటుప్పల్లో బీఆర్ఎస్, సీపీఎం మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించాలన్నారు. పోచంపల్లి, ఆలేరులో సీపీఎం అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు, మద్యం తదితర ప్రలోభాలతో రాజకీయాలు చేసే నాయకులు ప్రజాసేవ చేయలేరని, అలాంటి వారికి ఓటెయ్యొద్దని, ప్రజల పక్షాన పోరాడే వారిని కౌన్సిలర్లుగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. భువనగిరి, చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, ఆలేరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారాల్లో సీపీఎం, బీఆర్ఎస్ నాయకులు ఎండి జహంగీర్, బట్టుపల్లి అనురాధ, మాయ కృష్ణ, దాసరి పాండు, గడ్డం వెంకటేష్, లౌడియారాజ్, ఏవీ.కిరణ్, కొలుపుల అమరేందర్, ఎనబోయిన ఆంజనేయులు, తుమ్మల పాండు, ముల్కలపల్లి సత్యనారాయణ, గంటెపాక భిక్షపతి, నీలశ్రీనివాస్, గద్దె నరసింహ, బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి చింతల వెంకటేశ్వర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, నాయకులు బొమ్మిరెడ్డి వెంకట్రెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి, గంగదేవి సైదులు, కొండమడుగు నర్సింహ, గుడూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శి కోట రాంచంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం, ఇక్బాల్, మొరిగాడి రమేష్, మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ భువనగిరి, చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, ఆలేరు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం -
కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి
మోత్కూరు : మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ అన్నారు. మోత్కూరు మున్సిపల్ పోరులో బీఆర్ఎస్, సీపీఎం మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ శనివారం పట్టణంలో నిర్వహించిన ర్యాలీ, కార్నర్ సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను, నాయకులను బెదిరిస్తూ భయబ్రాతులకు గురిచేస్తున్న అధికార పార్టీ నాయకులు, పోలీసులు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే.. కౌన్సిలర్ టిక్కెట్లు అమ్ముకున్నారని సొంతపార్టీ వారే విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మోత్కూరు మున్సిపాలిటీపై తిరిగి బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి నేవూరి ధర్మేంధర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు తీపిరెడ్డి మేఘారెడ్డి, కొణతం యాకూబ్రెడ్డి, చిప్పలపల్లి మహేంద్రనాథ్, బీఆర్ఎస్, సీపీఎం నాయకులు బయ్యని పిచ్చయ్య, ఉప్పనబోయిన రమేష్, జంగ శ్రీను, గజ్జి మల్లేష్, కూరపాటి రమేష్, మాటూరి బాలరాజు, బొల్లు యాదగిరి, గుండు వెంకటనర్సు, రాచకొండ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ -
అక్రిడిటేషన్ కార్డులకు 9 నుంచి దరఖాస్తులు
భువనగిరిటౌన్ : జర్నలిస్టులకు 2026–28 సంవత్సరానికి గాను అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఈనెల 9వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల కాల పరిమితి గడువు ఈ నెల 28వ తేదీతో ముగియనున్నందున అర్హత కలిగిన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌరసంబంధాల అధికారికి సమర్పించాలని సూచించారు. యాజమాన్యాల ద్వారా పంపిన జాబితాల్లో పేర్లున్న జర్నలిస్టులు సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్సైట్ http://ipr.telangana.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.నేటి నుంచి యాప్ ద్వారా యూరియాభువనగిరి టౌన్ : రైతులకు అవసరమైన యూరియాను నేటి నుంచి ఫర్టిలైజర్ యాప్లో బుక్ చేసుకుని ఆన్లైన్ విధానంలో పొందాలని జిల్లా వ్యవసాయ అధికారి రమాణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టా భూ యజమానులు, నాన్ పట్టా రైతులు, కౌలు రైతులు యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్లలో ఫర్టిలైజర్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని తమకు కేటాయించిన కోటా యూరియాను బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. రైతులు తాము సాగుచేసే పంటల విస్తీర్ణం ఒకసారి నమోదు చేశాక మార్చేందుకు వీలు ఉండదని పేర్కొన్నారు. యువర్ బుకింగ్ 24 గంటల పాటు మాత్రమే ఆక్టివ్గా ఉంటుందని తెలిపారు. రైతులకు యూరియా బుకింగ్ విషయంలో ఇబ్బందులు ఎదురైతే స్థానిక ఏఈఓల సహాయాన్ని తీసుకోవాలని సూచించారు. ఆకట్టుకున్న ‘కూచిపూడి’భువనగిరి : మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం హైదరాబాద్కు చెందిన నాట్య గురువు తొండపు భవాని శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో కళాకారిణులు అక్షర, ఖ్యాతి, ప్రణవి, ధరణి, శాన్వి, నందిత, శివాని తదితరులు పాల్గొన్నారు. పశువైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలిగుండాల : పశువైద్య సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలని జిల్లా పశు వైద్య, పశు సంవర్థక శాఖ అధికారి పి.జానయ్య సూచించారు. శనివారం ఆయన గుండాల పశు వైద్యశాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఇటీవల మండలంలో పులి సంచరించిన నేపథ్యంలో మూగ జీవాలపై ఏమైనా దాడి చేసిందా అని సిబ్బందిని అడిగి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయనవెంట డాక్టర్ యాకూబ్, గోపాల మిత్ర గోవిందు, సిబ్బంది ఉన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థుల సందర్శనభూదాన్పోచంపల్లి : ఇక్కత్ పరిశ్రమ తీరుతెన్నులను తెలుసుకునేందుకు శనివారం మధ్యప్రదేశ్లోని మాధవ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ గ్వాలియర్కు చెందిన 40 మంది ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు పోచంపల్లిని సందర్శించారు. టూరిజం పార్కును సందర్శించి అక్కడ మగ్గాలు, మగ్గాలపై తయారవుతున్న ఇక్కత్, చేనేత వస్త్రాల తయారీ విధానాలు, నూలు, వస్త్రోత్పత్తుల మార్కెటింగ్ విధానాలు, చేనేత డిజైన్లను పరిశీలించారు. స్టడీ టూర్లో భాగంగా చేనేతలకు అంతర్జాతీయంగా పేర్గాంచిన పోచంపల్లి క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చామని ఫ్యాకల్టీ అశ్విని తెలిపారు. -
‘ఇందిరమ్మ’కు ఉపాధి అనుసంధానం
ఆలేరు రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఇటీవల ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసింది. బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు చేసింది. దీంతో లబ్ధిదారులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం చెల్లించే రూ.5లక్షల బిల్లు విషయంలో ఉపాధి హామీ పథకాన్ని భాగస్వామ్యం చేసింది. పాత నిబంధన ప్రకారం లబ్ధిదారులకు పునాది, బేస్మెట్ లెవల్ పూర్తయితే మొదటి విడతగా రూ.లక్ష, గోడలు స్లాబ్ లెవల్ వరకు అయితే రెండో దశగా మరో రూ.లక్ష, మూడో విడతలో స్లాబ్ పూర్తయితే రూ.2 లక్షలు, నాలుగో విడతగా ఇంటి నిర్మాణం పూర్తయితే రూ.లక్షతో కలిపి మొత్తం రూ.5లక్షలను లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. మారిన నిబంధనల ప్రకారం..ఇందిరమ్మ బిల్లుల చెల్లింపు విషయంలో ప్రభుత్వం మారిన నిబంధనల ప్రకారం లబ్ధిదారులు స్లాబ్ నిర్మాణం పూర్తిచేస్తే రూ.1.40 లక్షలు చెల్లించనుంది. మరో రూ.60 వేలు ఉపాధి హామీ పథకం నుంచి చెల్లిస్తారు. దీనికి పట్టణాల్లో అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై), గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రధానమంత్రి గ్రామీణ యోజన(పీఎంజీవై)ను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఉపాధి హామీ కింద ఇళ్ల నిర్మాణ పనులు చేసుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఉపాధి పనులను మినహాయించి లబ్ధిదారుల ఖాతాల్లో ఇకపై నాలుగు విడతల్లో ప్రభుత్వం రూ.4.40 లక్షలను చెల్లించనుంది.రూ.60 వేల చెల్లింపు ఇలా.. గ్రామీణ ప్రాంతాల్లో 90 పనిదినాలకు రోజుకు రూ.300 చొప్పున రూ.27 వేలతోపాటు రూ.12 వేలు వ్యక్తిగత మరుగుదొడ్లు పేరిట మొత్తం రూ.39 వేలు చెల్లించనున్నారు. మరో రూ.21 వేలు ప్రధామంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద వస్తాయి. పట్టణాల్లో ఇయితే మొత్తం రూ.60 వేలు ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద చెల్లిస్తారు. జిల్లాకు 7,325 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 274 ఇందిరమ్మ ఇళ్లు పూర్తికాగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు స్లాబ్ లెవల్ పూర్తయి రూ.2లక్షల చెల్లింపులు జరిగిన ఇళ్లకు ఉపాధి హామీ పనుల భాగస్వామ్యం లేదు. ఇలాంటి వాటికి తదుపరి చెల్లించే బిల్లుల్లో మళ్లీ పనులు చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మారిన నిబంధనలతో బిల్లులు ఎప్పుడు అందేది సందిగ్ధంగా మారిందని లబ్ధిదారులు వాపోతున్నారు. బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలకు గాను నేరుగా ఇచ్చేది రూ.4.40 లక్షలే.. పట్టణ, గ్రామీణ ఆవాస్ యోజన కింద రూ.60 వేలు ఈ నిధులు ఉపాధి హామీ పథకం నుంచి చెల్లించాలని నిర్ణయంజిల్లాలో ఇందిరమ్మ పథకం ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. ప్రభుత్వ నిబంధన ప్రకారం లబ్ధిదారులకు దశల వారీగా బిల్లుల చెల్లిస్తున్నాం. ఇంటి నిర్మాణాల్లో ఉపాధి హామీ పనుల గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. లబ్ధిదారులందరూ ప్రభుత్వ నిబంధన ప్రకారమే ఇంటి నిర్మాణం చేపట్టాలి. – ఎం.శ్రీరాములు, హౌసింగ్ డీఈ -
పవర్లూమ్ కార్మికులకు త్రిఫ్టు పథకాన్ని కొనసాగించాలి
రాజాపేట : పవర్లూమ్ కార్మికులకు త్రిప్టు పథకాన్ని కొనసాగించాలని కోరుతూ రాజా పేట మండలంలోని రఘునాథపురం గ్రామానికి చెందిన పద్మశాలీ సంఘం నాయకులు గురువారం హైదరాబాద్లో చేనేత జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్కు వినతిపత్రం అందజేశారు. గత 10 నెలల క్రితం ముగిసిన త్రిఫ్టు పథకాన్ని పునరుద్ధరించాలని వారు కోరారు. చేనేత కార్మికుల మాదిరిగానే పవర్లూమ్ కార్మికులకు కూడా త్రిఫ్టు పథకాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో మరమగ్గాలకు 750 యూనిట్ల విద్యు త్ ఉచితంగా అందజేస్తున్నట్లు తెలంగాణ లోనూ చేనేతలకు 200 యూని ట్లు, పవర్లూమ్ పరిశ్రమకు 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందజేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్కుమార్, నాయకులు సామల భాస్కర్, రేగొండ వెంకటేశం, గొట్టిపాముల సిద్దిరాములు, గోలి కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోం
రామన్నపేట: వైద్యాధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోబోమని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ హెచ్చరించారు. గురువారం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్యసేవలు, మందులు, డైట్, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఓపీ విభాగం, ఫార్మసీ, రిజిష్టర్లు, మెడిసిన్ స్టాకును పరిశీలించారు. అటెండెన్స్ రిజిష్టర్ను పరిశీలించి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ముగ్గురు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. కాన్పుల సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రిస్థాయిని వంద పడకలకు పెంచాలని, నూతన భవనాలు నిర్మించాలని స్థానిక నేతలు కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. ఆయన వెంట డీసీహెచ్ఎస్ చిన్నానాయక్, వైద్యులు స్వాతీబాయి, నవీన్సింగ్, మాధవాచారి, దేవేందర్, సుమంగలి, హెడ్నర్సు సువర్ణ, సోలీ, జ్యోతి ఉన్నారు.ఫ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ ఫ విధులకు డుమ్మాకొట్టిన ముగ్గురు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు -
9, 10 తేదీల్లో జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు
భువనగిరి: ఈ నెల 9,10 తేదీల్లో సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ధనుంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9న స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మైదానంలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, చెస్, క్యారమ్, ఇండోర్స్టేడియంలో తైక్వాండో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. 10న అథ్లెటిక్స్ పోటీలతో పాటు ఇండోర్ స్టేడియంలో బాక్సింగ్, కిక్బాక్సింగ్, స్విమ్మింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గ స్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు మాత్రమే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనాలని సూచించారు. యాదగిరీశుడి సన్నిధిలో నిత్యకల్యాణంయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం నిత్య కల్యాణ వేడుకను ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం అంతరాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేశారు. ఇక ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. చిన్నమేడారం హుండీల లెక్కింపురాజాపేట : రాజాపేట మండలంలోని చిన్నమేడారం జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు గురువారం చేపట్టారు. రూ.5.80 లక్షల నగదు సమకూరగా.. దర్శనాలు, తలనీలాలు, బెల్లం, వివిధ షాపులకు వేసిన వేలం పాటలో రూ.9 లక్షలు వచినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, జాతర నిర్వహణ ఖర్చులు రూ.12 లక్షలు అయినట్లు వెల్లడించారు. క్రీడలతో మానసికోల్లాసంఆలేరురూరల్ : క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి కందుల సత్యనారాయణ అన్నారు. గురువారం మండలంలోని కొలనుపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతిరోజు సాధన చేస్తే జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగవొచ్చని తెలిపారు. కాగా, ఈ పోటీల్లో సుమారు 650 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మి, హెచ్ఎం వేణుగోపాల్, సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ, ఉప సర్పంచ్ గొట్ట జితేందర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న యూరియా అడ్డగింత ఆత్మకూరు(ఎం): ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలోని పీఏసీఎస్ నుంచి యూరియా బస్తాలను అక్రమంగా తరలిస్తుండగా రైతులు గమనించి గురువారం అడ్డుకున్నారు. గురువారం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని పీఏసీఎస్కు యూరియా లోడు వచ్చింది. అంతకు ముందే సోమవారం యూరియా కావాల్సిన రైతులు 200 మంది తమ పేర్లను లిస్టులో రాయించుకున్నారు. అయితే లిస్టులో పేర్లు రాయించుకోని ముగ్గురు రైతులు 30 యూరియా బస్తాలను ట్రాక్టర్ ద్వారా తరలిస్తుండగా రైతులు గమనించి నిలదీశారు. దీంతో వారు ట్రాక్టర్లోని 30 యూరియా బస్తాలను అన్లోడ్ చేసి వెళ్లిపోయారు. థంబ్ వేయకుండానే యూరియా బస్తాలను ఎందుకు ఇచ్చారని రైతులు పీఏసీఎస్ సిబ్బందిని నిలదీశారు. ఈ విషయమై సీఈఓ యాస కిరణ్రెడ్డిను వివరణ కోరగా ఆరుగురు రైతులు కలిసి ఒక ట్రాక్టర్ తెచ్చుకుని యూరియా బస్తాలను తీసుకెళ్లినట్లు తెలిపారు. -
వరి సాగు 80 శాతం
యాసంగిలో రైతులు ఎక్కువగా వరి సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి వరకు 80 శాతం మేర వరిసాగు పూర్తయ్యింది. మరో 15 రోజుల్లో వరి నాట్లు పూర్తి కానున్నాయి. వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భువనగిరి: యాసంగి సీజన్లో వరి అంచనాకు మించి సాగుకానుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇప్పటి వరకు 80 శాతం మేర వరి నాట్లు పూర్తయ్యాయి. మరో 15రోజుల్లో ఇంకా 20 శాతం సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి వర్షాలు అధికంగా కురువడంతో చెరువులు, కుంటలు జల కళను సంతరించుకున్నాయి. భూగర్భ జలం పెరగడంతో రైతులు ఆరుతడి పంటలకు బదులు వరి సాగువైపు మొగ్గుచూపుతున్నారు. కూలీల కొరత వల్ల వరి నాట్లు వేయడంలో జాప్యం అవుతోంది. దీనితోడు కొంత మంది రైతులు కొత్తగా భూ జల మట్టం అధికంగా ఉండటం వల్ల వరి సాగు చేయడం ప్రారంబించారు. 3.30లక్షల ఎకరాల వరకు సాగవుతుందని.. గత యాసంగితో పోలిస్తే ప్రస్తుతం సీజన్లో వరి సాగు గణనీయంగా పెరగనుంది. గత అక్టోబర్, నవంబర్ మాసాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. అలాగే ఇటీవల వానాకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు వేగంగా నిర్వహించడం.. రైతులకు చెల్లింపులు త్వరగా చేయడం తదితర కారణాలతో వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో రైతుల ఽవిక్రయించుకున్న ధాన్యానికి డబ్బుల చెల్లింపుల్లో కలెక్టర్, సివిల్ సప్లఈస్ , డీఎస్ఓ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గత సీజన్లో 2.86 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ సారి 3.12 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 3.02 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తి అయ్యాయి. ఇంకా రాజాపేట, పోచంపల్లి, ఆలేరు మండలాల పరిధిలో వరి నాట్లు కొనసాగుతున్నాయి. మరో 15 రోజుల పాటు వరి సాగు పనులు కొనసాగే అవకాశం ఉంది. దీంతో వరి సాగు 3.25 లక్షల ఎకరాల నుంచి 3.35 లక్షల ఎకరాల వరకు అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఫ ఇప్పటికే 3లక్షల ఎకరాల్లో వరినాట్లు ఫ మరో 15 రోజుల్లో నాట్లు పూర్తయ్యే అవకాశం ఫ అంచనాకు మించి సాగుకానున్నట్లు భావిస్తున్న అధికారులుయాసంగి సాగు వివరాలు. (లక్షల ఎకరాల్లో..) సంవత్సరం సాగు విస్తీర్ణం 2023 2.80 2024 2.86 2025 3.02 (ఇప్పటి వరకుసాగు) -
నేటి నుంచి పోల్ చిట్టీల పంపిణీ
మున్సిపాలిటీలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్ల నియామకంభువనగిరిటౌన్ : ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే పోల్ చిట్టీలే ప్రధానం. ఓటరు జాబితాలో పేరున్నప్పటికీ పోల్ చిట్టీ అందకపోతే ఓటు వేసేందుకు కొందరు ఓటర్లు విముఖత చూపుతుంటారు. అక్షరాస్యుల నుంచి నిరక్షరాస్యుల వరకు పోల్ చిట్టీలతోనే కేంద్రాలకు వెళ్లడం పరిపాటిగా మారింది. గతంలో ప్రధాన పార్టీల కార్యకర్తలు పంపిణీ చేసేవారు. ఓటింగ్ శాతం పెంచాలనే లక్ష్యంతో.. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం భువనగిరి మున్సిపాలిటీలో బీఎల్ఓలు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. పోల్ చిట్టీల పంపిణీపై భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, తహాసిల్దార్ అంజిరెడ్డి, మేనేజర్ నరేష్రెడ్డిలు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 104 వార్డుల్లో జిల్లా వ్యాప్తంగా 6 మున్సిపాలిటీల పరిధిలో 104 వార్డుల్లో ఫొటో ఓటరు ఫోల్ చిట్టీల పంపిణీకి శుక్రవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. బీఎల్ఓలు, వార్డు అధికారులు, సిబ్బంది ఆయా వార్డుల్లో పోలింగ్ కేంద్రాల వారీగా బృందాలుగా ఏర్పడి పంపిణీకి సన్నద్ధమవుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నచ్చిన అభ్యర్థిని కౌన్సిలర్గా ఎన్నుకోవచ్చు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల సంఘం.. వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల్లో అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో పోల్ చిట్టీలు పంచుతూ ఓటింగ్ శాతం పెంచేలా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది. ఇంకా నాలుగు రోజులే గడువు ఉండడంతో ప్రధాన పార్టీల నాయకులు తమ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ర్యాలీలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అభ్యర్థులు.. ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తూ ఓటు వేయాలంటూ కోరుతున్నారు. అభివృద్ధి మంత్రం.. మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ విప్, డీసీసీఅధ్యక్షుడు బీర్ల ఐలయ్య ఆలేరు, యాదగిరిగుట్టలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను వింటున్నారు. ఆలేరులో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇస్తున్నారు. ఐలయ్యతో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ శోభారాణి ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు తెస్తానని ప్రజలకు హామి ఇస్తున్నారు. భువనగిరి, పోచంపల్లి మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. భువనగిరిని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. చౌట్పుల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రోడ్ షో నిర్వహించారు. మోత్కూరులో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం మున్సిపాలిటీలను అభివృద్ధి చేయకుండా విస్మరించిందని ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ.. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, ఆలేరులో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునిత, బూడిద భిక్షమయ్యగౌడ్, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్రెడ్డి, మోత్కూరులో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్, చౌటుప్పల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, నాయకులు చింతల వెంకటేశ్వర్రెడ్డిలు ప్రచారం ముమ్మరం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు, తాము చేసిన అభివృద్ధిని ప్రచారంలో ఓటర్లకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. చాపకింద నీరులా.. భువనగిరి, చౌటుప్పల్, ఆలేరుతోపాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ బీజేపీ చాపకింద నీరులా ప్రచా రాన్ని కొనసాగిస్తోంది. తమ పార్టీ అభ్యర్థుల తరఫున జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, నాయకుడు పడాల శ్రీనివాస్ , పార్టీ ఎన్నికల ఇన్చార్జిలు ప్రచారం ముమ్మరం చేశారు.సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అవసరమైన సమన్వయం సాధించేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కోఆర్డినేటర్లను నియమించింది. ఒక్కో మున్సిపాలిటీకి ఒకరిద్దరు చొప్పున కోఆర్డినేటర్లను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ నియమించారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేటర్గా ఎంఆర్జీ వినోద్రెడ్డిని నియమించారు. చండూరు మున్సిపాలిటీకి పీసరి మహిపాల్రెడ్డి, హాలియాకు నాగసీతారాములు, దేవరకొండకు కొట్నాల తిరుపతి నియమితులయ్యారు. మిర్యాలగూడ మున్సిపాలిటీకి కుందూరు రఘువీర్రెడ్డి, పొట్ల నాగేశ్వర్రావు, నందికొండ మున్సిపాలిటీకి మద్ది శ్రీనివాస్రెడ్డి, హుజూర్నగర్కు నూతి శ్రీకాంత్గౌడ్, నేరేడుచర్లకు ముత్తినేని వీరయ్య, కోదాడకు ఇ.సుబ్బారావు, సూర్యాపేటకు కోటింరెడ్డి వినయ్రెడ్డి, భువనగిరికి ఎం.పరమేశ్వర్రెడ్డి, చౌటుప్పల్కు కస్బ శ్రీనివాసరావు, పోంచపల్లికి కె.శ్రీకాంత్యాదవ్, తిరుమలగిరికి కె.రవళిరెడ్డి, మోత్కూరుకు బొజ్జ సంధ్యారెడ్డి, ఆలేరుకు జి.శశికళయాదవ్రెడ్డి, యాదగిరిగుట్టకు ఎం.సత్యనారాయణగౌడ్, చిట్యా లకు గౌరిసతీష్ను నియమించారు.ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ పార్టీ గుర్తులు, ఇండిపెండెంట్లు తమకు కేటాయించిన గుర్తులతో ప్రచారం ముమ్మరం చేశారు. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార, ప్రతిపక్ష అభ్యర్థులు ప్రచారంలో ఢీ అంటే ఢీ అన్నట్లు గా దూసుకుపోతున్నారు. ఉదయం, సాయంత్రం తమ అనుచరులతో కలిసి వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇల్లిల్లు తిరుగుతూ తమ ఎన్నికల మేనిఫెస్టోను పంచుతున్నారు. సమస్యలను పరిష్కరించడానికి తమను ఆశీర్వదించాలని వేడుకుంటున్నారు. కుల సంఘాలు, యువత, మహిళా సంఘాలను కలిసి తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులు ఒక్కో ఇంటికి నాలుగైదు సార్లు వెళ్లి కలిసి ఓటు అభ్యర్థించారు. ప్రచార వాహనాలు ఏర్పాటు చేసి వార్డుల్లో తిప్పుతున్నారు. ఫ మున్సిపల్ వార్డుల్లో దూసుకెళ్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఫ ఓటు వేయాలని వినతి ఫ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫ ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల ప్రచారం ఫ ఇంటింటికీ తిరిగి అందజేయనున్న బీఎల్ఓలు మున్సిపాలిటీ ఓటర్లు భువనగిరి 57,840 మోత్కూరు 14,416 ఆలేరు 13,670 యాదగిరిగుట్ట 13,817 చౌటుప్పల్ 27,216 పోచంపల్లి 15,839 మొత్తం 1,42,798 -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గుండాల: పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ మోత్కూరు సెక్షన్ ఆఫీసర్ కె.ఎల్లేష్ సూచించారు. గురువారం గుండాల మండలం వెల్మజాల గ్రామంలో రైతులు పడకంటి నరేందర్, పడకంటి శ్రీను, జోలం పాండు వ్యవసాయ భూమిలో పులి సంచరించినట్లు గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులు పాద ముద్రలను పరిశీలించారు. ఇవి పులిపాదముద్రలే అని నిర్ధారించారు. ఈ సందర్భంగా ఎలేష్ మాట్లాడుతూ రైతులు ఎవరూ రాత్రి వేళల్లో ఒంటరిగా వ్యవసాయ బావుల వద్దకు వెళ్ల వద్దన్నారు. పశువులు, గొర్రెలు, మేకలను ఇళ్ల వద్దకు తెచ్చుకోవాలని సూచించారు. ఆయన వెంట ఫారెస్ట్ అధికారి పి.శ్రీనివాస్, సర్పంచ్ కుర్మిళ్ల కవితశ్రీనివాస్, మాజీ సర్పంచ్ దాస ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు. పల్లెల్లో డప్పు చాటింపు ఆత్మకూరు(ఎం): చుట్టు పక్కల మండలాల్లో పులి సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి ఆత్మకూర్(ఎం) మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్లు దండోరా వేయించారు. పోతిరెడ్డిపల్లి, పారుపల్లి, పల్లెపహాడ్, రహీంఖాన్ పేట, కొరటి కల్, టి. రేపాక, ఉప్పలపహాడ్ తదితర గ్రామాల్లో బుధవారం రాత్రి డప్పు చాటింపు చేశారు. దీంతో వ్యవసాయ బావుల వద్ద నుంచి పశువులను తోలుకెళ్లి ఇళ్లవద్దనే కట్టేశారు. గ్రామాలకు దూరంగా ఉన్న పాఠశాలకు కాలినడకన, సైకిళ్లపై విద్యార్థులు వెళ్లడంలేదు. అవగాహన కల్పిస్తున్న అధికారులు ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి, పల్లెపహాడ్లో భువనగిరి అటవీ శాఖ అధికారులు గురువారం పర్యటించారు. పులి అడుగుల జాడ కోసం పలు మామిడి తోటలు, పొలాలను పరిశీలించారు. అనంతరం ప్రజలకు అవగాహన కల్పించారు. ఫారెస్టు అధికారులు డి. మోహన్ బాబు, కె. మల్లేష్, జి. లక్ష్మణ్ మాట్లాడుతూ రైతులు ఒంటరిగా వ్యవసాయ పనులకు వెళ్లొద్దని, సాయంత్రం 5లోపు పనులు ముగించుకుని ఇంటికి రావాలని సూచించారు. మా అబ్బాయి ఎల్లబోయిన చరణ్ కొరటికల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. గ్రామం నుంచి స్కూల్ రెండు కిలో మీటర్ల దూరం ఉంటుంది. రోజూ సైకిల్పై వెళ్లేవాడు. పులి సంచరిస్తున్నట్లు తెలియడంతో పాఠశాలకు పంపించడంలేదు. – ఎల్లబోయిన శ్రీశైలం, పోతిరెడ్డిపల్లి. ఫ ఫారెస్ట్ అధికారుల సూచన -
బీఆర్ఎస్ అభ్యర్థులను టార్గెట్ చేస్తున్న ఎమ్మెల్యే
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దౌర్జన్యాలు చేస్తున్నారని.. బీఆర్ఎస్ అభ్యర్థులను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్రెడ్డి ఆరోపించారు. విప్ ఐలయ్య ఆదేశాలతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కంసాని కీర్తి ఇంట్లోకి మంగళవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి, భయాందోళనకు గురిచేసిన విషయం తెలుసుకున్న గొంగిడి సునిత బుధవారం ఉదయం అభ్యర్థిని కలిసి వివరాలు తెలుసుకొని, ఈ అంశంపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థులను బ్లాక్మెయిలింగ్ చేయడంతో పాటు మానసికంగా టార్చర్ చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించి విరమించుకునేలా చేస్తున్నారన్నారు. అర్ధరాత్రిదాటిన తరువాత అభ్యర్థి కీర్తి స్వామిల ఇంట్లోకి పోలీసులమని గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి క్షుణ్ణంగా తనిఖీ చేసి, స్వామి ఎక్కడున్నాడు ఆయన కావాలని భయబ్రాంతులకు గురి చేశారన్నారు. 11వ వార్డులో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వాహకుడిని ఐలయ్య బెదిరింపులకు పాల్పడి పోటీ నుంచి తప్పించారన్నారు. మైనార్టీ వర్గానికి చెందిన సయ్యద్ బాబాను సైతం పోటీలో ఉండొద్దని, ప్రచారం చేయొద్దని ఫోన్లు చేసి ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపించారు. 10వ వార్డులో బీఆర్ఎస్ తరఫున నిలిచిన ఆవుల మమత సాయి యాదవ్కు రూ.3కోట్లు ఇచ్చి, భయపెట్టి నామినేషన్ విత్డ్రా చేయించారని చర్చ జరుగుతోందన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, మండల జనరల్ సెక్రటరీ కసావు శ్రీనివాస్గౌడ్, బాహుపేట సర్పంచ్ కవిడే మహేందర్, బండ సిద్దులు, లింగం యాదవ్, కంసాని స్వామి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్రెడ్డి -
సంక్షేమానికే మీ ఓటు
మిర్యాలగూడ : కాంగ్రెస్ పాలనలో పేదలు, గిరిజనులు, మహిళలు, విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సంక్షేమానికి పట్టం కట్టేలా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. బుధవారం మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు.. కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా మారాలన్నారు. కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో లక్షలాది మందికి రేషన్కార్డులు అందించి, ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఇచ్చి పేదలకు కడుపు నిండా అన్నం పెడుతున్నామన్నారు. మిర్యాలగూడ ప్రాంతం ఆసియా ఖండంలోనే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పేరుగాంచిందని అన్నారు. ఇక్కడ అధునాతన రైస్ మిల్లులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సన్న వడ్లను మద్దతు ధరకు కొని.. బోనస్ రూ.500 ఇస్తున్నామన్నారు. 25.35లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతుభరోసా కింద ఎకరాకు రూ.6 వేలు ఇస్తున్నామని.. త్వరలో మరో రూ.9వేల కోట్లను విడుదల చేసి రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తామన్నారు. రూ.22,500 కోట్లతో ఇళ్ల నిర్మాణం వైఎస్సార్ హయాంలో 25లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించారని, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని పదేండ్లలో ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం రూ.22,500 కోట్లతో నియోజకవర్గానికి 3500 ఇళ్లను పేదలకు ఇచ్చిందన్నారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతమని, ఈ సమస్య పరిష్కారానికి ప్రాజెక్టులు కట్టించామన్నారు. 3.60 లక్షల ఎకరాలకు నీరు అందించే ఎస్ఎల్బీసీని నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు భయపడరు జానారెడ్డి నమ్మి భాస్కర్రావును ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలను ఆయన మోసం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వాపస్ తీసుకోవాలని భాస్కర్రావు బెదిరిస్తున్నారని.. ‘మా అభ్యర్థులను బెదిరిస్తే భాస్కర్రావు.. నీకు చింతపండు అవుతుంది’ అని హెచ్చరించారు. ఆయన బెదిరింపులకు కాంగ్రెస్ కార్యకర్తలు భయపడరని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలన్నారు. సర్పంచ్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులు అందరూ మనోళ్లే ఉన్నారని.. కౌన్సిలర్లు వేరే వాళ్లు ఉంటే పనిచేయరని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఫ రూ.17,472 కోట్లతో పట్టణాలను అభివృద్ధి చేస్తున్నాం ఫ సన్నబియ్యంతో పేదల కడుపు నింపుతున్నాం ఫ ఎస్ఎల్బీసీని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎండబెట్టింది ఫ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి -
కార్యకర్తలు వీరోచితంగా పోరాడారు
– మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్ద మనుషులు, ఎమ్మెల్యే ఎంత ఇబ్బంది పెట్టినా ఇక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు వీరోచిత పోరాటం చేశారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం సాగర్ ఆయకట్టు కింద ఉందని, 90శాతం రైతులు ఇక్కడ వరి పండిస్తారని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. ప్రస్తుత వానాకాలం సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం 12లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో నెల్లికల్లు, వీర్లపాలెం, దున్నపోతులగండి, తోపుచర్ల, కేశవాపురం లిఫ్టులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. కృష్ణా బేసిన్ నుంచి ఎక్కువ నీళ్లు తీసుకుని రైతులకు అందిస్తున్నామన్నారు. -
మిర్యాలగూడకు అధిక నిధులు ఇవ్వాలి
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మిర్యాలగూడలో ఆసియాలోనే పెద్ద రైస్ ఇండస్ట్రీ ఉందని.. ఈ ప్రాంతానికి అధిక నిధులు ఇవ్వాలని రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మహిళలకు రుణాలు అందించి కోటీశ్వరులను చేసిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. మిర్యాలగూడ పెద్ద పట్టణమని ఇక్కడి ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అమరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని.. సోనియాగాంధీ తెలంగాణ దేవత అన్నారు. కాంగ్రెస్ మరో 20 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. -
ప్రతి అంశంపై నిశిత పరిశీలన అవసరం
సాక్షి, యాదాద్రి : ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రతి అంశంపై నిశిత పరిశీలన అవసరమని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్ మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పోలింగ్కు ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకొని పోలింగ్ సామగ్రి సరిగ్గా అందిందా లేదా అన్నది పరిశీలించాలన్నారు. అనంతరం పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా మాక్ పోలింగ్ నిర్వహించారా లేదా అన్నది పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను చూసుకోవాలన్నారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు అన్ని అంశాలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు వాటిని జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లు నర్సిరెడ్డి, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు. నిధులు వినియోగించుకోవాలి పీఎంశ్రీ నిధులను పాఠశాలలకు తప్పక వినియోగించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో మినీమీటింగ్ హాల్లో పీఎం శ్రీ పాఠశాలల నిధుల వినియోగంపై ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎంశ్రీ పథకం పరిధిలో ఉన్న పాఠశాలల్లో యోగా , సైన్స్, గణిత ప్రయోగాలకు అవసరమున్న పరికరాల కొనుగోలు, విద్యార్థులకు విజ్ఞాన, పరిశ్రమల అవగాహన పర్యటనలు, కళలు–హస్తకళల వంటి సహపాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాల నిర్వహణకు మంజూరైన నిధులను వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, ట్రెజరీ అధికారి మోహన్, అదనపు సాంఘిక సంక్షేమ అధికారి, మండల విద్యాధికారులు, పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సెక్టోరియల్ అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ భాస్కర్రావు -
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
భువనగిరి(బీబీనగర్): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏపాల సత్యనారాయణ తెలిపారు. బుధవారం బీబీనగర్ మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సంఘం జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో సంఘం ముందంజలో ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పి. శ్రీకాంత్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అంబటి హరిశివకుమార్, కోశాధికారి కల్లు రమేష్రెడ్డి, గడ్డం జ్ఞానప్రకాష్రెడ్డి, కోల్పుల రమేష్, రచ్చ ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. -
శారాజీపేటలో ఆవుపై పులి దాడి
ఫ ఆందోళన చెందుతున్న ప్రజలు ఫ అప్రమత్తంగా ఉండాలంటున్న అటవీశాఖ అధికారులు ఆలేరురూరల్: ఆలేరు మండలం శారాజీపేట గ్రామ శివారులోని దూడల శ్రీధర్కు చెందిన ఓ ఆవుపై మంగళవారం రాత్రి పులి దాడి చేసి చంపింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంఘటనా స్థలాన్ని జిల్లా అటవీశాఖ ఫ్లయింగ్స్క్వాడ్ బాబ్జీరావు, డీఎఫ్ఓ సుధాకర్రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పులి చుట్టు పక్కల పది పదిహేను కిలోమీటర్ల పరిధిలోనే సంచరిస్తోందన్నారు. పులిని పట్టుకోవడానికి రెండు యానిమల్ ట్రాకర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. థర్మల్ డ్రోన్ల సహాయంతో పులి జాడను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. టైగర్ మానిటరింగ్ టీం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు. నాలుగు బోన్లు ఏర్పాటు పులి సంచారం నేపథ్యంలో మేకను ఎరగా పెట్టి ఇప్పటి వరకు 4 బోన్లు, 20 సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. శారాజీపేటలో ఆవును చంపిన పులి అడుగు జాడలు గొలనుకొండ గ్రామం శివారు వరకు ఉన్నట్లు గుర్తించామన్నారు. థర్మల్ డ్రోన్ల సహాయంతో చుట్టపక్కల ప్రాంతాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇంకెప్పుడు పట్టుకుంటారు? మూడు వారాలకుపైగా పులి సంచరిస్తుంటే ఇంకెప్పుడు పట్టుకుంటారని శారాజీపేటలో అధికారులను స్థానికులు నిలదీశారు. బావుల వద్దకు వెళ్లడానికి జంకుతున్నామని, పనులు చేసుకోలేకపోతున్నామని, ఎక్కడ నుంచి ఎటువైపు వస్తుందోనని ఆందోళన చెందుతున్నామని చెప్పారు.పల్లెల్లో డప్పు చాటింపురాజాపేట : పులి సంచారం నేపథ్యంలో రాజాపేట మండలంలోని రేణికుంట, రాజాపేట తదితర గ్రామాల్లో సర్పంచ్లు బుధవారం ఉదయం డప్పు చాటింపు వేయించారు. పులి సంచరిస్తుందని, ప్రజలు తెల్లవారిన తరువాతే గ్రామాలు దాటి సాయంత్రం 6 గంటలలోపే ఇంటికి చేరాలని సూచించారు. రైతులు వ్యవసాయ పొలాల వద్దకు చప్పుడు చేస్తూ కర్రలు పట్టుకొని గుంపులుగా వెళ్లాలన్నారు. పొలాల చుట్టూ కరెండు తీగలు, ఉచ్చులు పెట్టొద్దని అలా పెట్టి పులి మరణానికి కారణం అయితే జైలు పాలు అవుతారని హెచ్చరించారు. -
కాంగ్రెస్ విజయం ఖాయం
ఆలేరు: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆలేరులో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయాలు డబ్బుల మయమయ్యాయని తాను ఎమ్మెల్యేగా మళ్లీ పోటీ చేసే ఆలోచన లేదని..భవిష్యత్లో దేవుడు,కాలం ఏం నిర్ణయిస్తుందో చెప్పలేనన్నారు.ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. గొంగిడిపై ప్రభుత్వ విప్ ఫైర్ అభ్యర్థులను బెదిరిస్తున్నట్టు డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి చేసిన ఆరోపణలను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఖండించారు. యాదగిరిగుట్టలో ఆరుగురు, ఆలేరులో ఆరుగురు బీఆర్ఎస్ అభ్యర్థులు తనతో టచ్లో ఉన్నట్టు, ఇంటికి వచ్చినట్టు సీసీ ఫుటేజీ ఉందన్నారు. తనకు జూబ్లీహిల్స్లో రూ.40కోట్ల ప్రాపర్టీ ఉన్నట్టు నిరూపిస్తే ఆలేరు ప్రజలకు రాసిస్తానని స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర మహిళా అభివృద్ధి సహకార సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, బ్లాక్ అధ్యక్షుడు యాదగిరిగౌడ్, పట్టణ అధ్యక్షులు ఇజాజ్, సాగర్రెడ్డి, విజయ్కుమార్, జైనొద్దీన్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.ఫ నాకు ఎమ్మెల్యేగా పోటీచేసే ఆలోచనలేదు ఫ బీఆర్ఎస్కు ఎందుకు ఓటేయాలో ఆలోచించాలి ఫ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరగాలి
రామన్నపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సురక్షితమైన సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలని జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్) డాక్టర్ చిన్నానాయక్ సూచించారు. బుధవారం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలోని వార్డులను సందర్శించారు. ఓపీ విభాగంలో ప్రజలకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బందితో వేర్వేరుగా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఆయన వెంట డాక్టర్లు బి.వీరన్న, రజని, స్వాతీబాయి, మాధవాచారి, నవీన్సింగ్, వీణ, సుమంగలి, హెడ్నర్సులు సువర్ణ, సోలీ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్కు నిధులు మంజూరు చేయాలి యాదగిరిగుట్ట : ఎస్సీ కార్పొరేషన్కు రూ.12కోట్ల నిధులు మంజూరు చేసి, దళితులకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఔటర్ రింగ్ రోడ్డుకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించి, దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. మాదిగలకు సంబంధించిన అసైన్డ్ భూములను అమ్ముకునే విధంగా చట్టం చేసి, భూ భారతీ ద్వారా పట్టా పాస్ బుక్కులు మంజూరు చేయాలని కోరారు. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని కేటాయించి, రూ.5 కోట్లతో వసతి గృహాలు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను కోరారు. యాదగిరి ఆలయంలో మాదిగలకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. సదస్సులో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్, మంచాల యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీసాల ఉప్పలయ్య, యువసేన రాష్ట్ర అధ్యక్షుడు కూరేళ్ల రమేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, బూసి మహేశ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. పాల బిల్లులు చెల్లించాలిభువనగిరిటౌన్ : పెండింగ్లో ఉన్న పాల బిల్లలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాల శీతలీకరణ కేంద్రం వద్ద పాల సంఘం చైర్మన్లు బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాల బిల్లులు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వెంకట్రెడ్డి, భిక్షపతి, కోటేష్, నర్సింహులు, విజయ్, గౌరయ్య ఉన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి
– జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేదల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. కార్పొరేట్ స్థాయిలో ఎల్కేజీ నుంచి ఉన్నత స్థాయి విద్య అన్ని వర్గాల పిల్లలకు అందించేలా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వాలన్నారు. -
అది రాయల్ బెంగాల్ 'టైగర్'!
సాక్షి, యాదాద్రి/హైదరాబాద్: ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజలకు, అటవీ శాఖ అధికా రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పులి.. రాయల్ బెంగాల్ టైగర్గా అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ పులి ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికి సుమారు 600 కిలోమీటర్లు ప్రయాణం చేసినట్టు అధికారులు భావిస్తున్నారు. మంచిర్యాల, కామా రెడ్డి, సిద్దిపేట నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ప్రవేశించింది. పెద్ద పులి ఇప్పటి వరకు మనుషులకు ఎక్కడా ఎలాంటి హాని తలపెట్టలేదు. ఆకలి తీర్చుకోవడానికి పశువులను చంపి తింటోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మండలం శారాజిపేట గ్రామంలో మంగళవారం రాత్రి ఒక ఆవును పులి చంపేసింది. పులిని సురక్షితంగా బంధించడానికి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్, దత్తాయపల్లి, బసంతాపూర్, శ్రీనివాస్పురం, శారాజిపేటల్లో బోన్లు ఏర్పాటు చేశారు. పులి సంచారాన్ని గుర్తించడానికి డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. అయితే గుట్టల్లో పొదలు అడ్డుగా వస్తున్నాయి. మత్తు ప్రయోగంతో పులిని బంధించే అవకాశం ఉంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. పెద్దపులి కదలికలు అర్థం కావడం లేదని అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ కల్యాణ్ బాబ్జీరాం చెప్పారు. రోజూ రాత్రి 10 నుంచి 15 కిలోమీటర్లు తిరుగుతోందన్నారు. శాటిలైట్ సెర్చింగ్ కోసం కేంద్రం నుంచి అనుమతి రావాలని పేర్కొన్నారు.పులి కదలికలపై నిరంతర అప్రమత్తతసిద్దిపేట జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దుల్లో రెండు వారాలుగా పెద్దపులి సంచారంపై అటవీ శాఖ అప్రమత్తమైంది. జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ) మార్గదర్శకాలకు అనుగుణంగా పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి (పీసీసీఎఫ్) డాక్టర్ సి.సువర్ణ అధ్యక్షతన బుధవారం అత్యున్నత స్థాయి సమీక్ష జరిగింది. ఇటీవల జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీలను అటవీ శాఖ ఏర్పాటు చేసింది. తాజా సమావేశంలో పులి కదలికలపై నిరంతర సమీక్షలు చేపట్టి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను పీసీసీఎఫ్ సువర్ణ ఆదేశించారు. పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ) సభ్యురాలు హరిణి వేణుగోపాల్, వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) ప్రతినిధులు రమేష్, హైటికోస్ (హైదరాబాద్ కన్సర్వేషన్ సొసైటీ) సభ్యుడు ఇమ్రాన్ సిద్దిక్, పుణేకు చెందిన రెస్క్యూ బృందం నిపుణులు సభ్యులుగా ఉన్నారు. -
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కనుమరుగు
ఫ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి భువనగిరి : రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని గంజ్ ఏరియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం దోచుకోవడం తప్ప పదేళ్ల కాలంలో చేసిందేమీ లేదన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీల్లో అభ్యర్థులు కూడా కరువయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ ఒక్క హామీని నేరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు పంపకాల కోసం రోడ్డు ఎక్కుతున్నారని, గతంలో దోచుకున్న సొమ్ము కోసం బీఆర్ఎస్ పార్టీలో పంచాయితీ నడుస్తోందని ఎద్దేవా చేశారు. భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న పథకాలను గడపగడపకు తీసుకెళ్లి ప్రతిఒక్కరికి వివరించాలన్నారు. ఈ సందర్భంగా భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులతో పరిచయవేదిక ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్, మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, నాయకులు నర్ల నర్సింగ్రావు, సుర్వి శ్రీనివాస్, పడమటి జగన్మోహన్రెడ్డి, చందుపట్ల వెంకటేశ్వరరావు, చందా మహేందర్ గుప్తా, యాదిరెడ్డి, రత్నపురం శ్రీశైలం, రాళ్లబండి కృష్ణచారి, సత్యలక్ష్మీ, రాము, కుమార్ తదితరులు పాల్గొన్నారు -
కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదు
నల్లగొండ : ‘తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వీరులే తెలంగాణ జాతిపితలు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదు’ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు డివిజన్లలో ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదన్నారు. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కృష్ణయ్యతో పాటు ఎంతో మంది ఆత్మబలిదానం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆ అమరులే తెలంగాణ జాతిపితలు కావాలి కానీ కేసీఆర్ జాతిపిత ఎలా అవుతాడని ప్రశ్నించారు. ‘కేసీఆర్ రాజీనామా చేసి మళ్లీ పోటీ చేశాడు కానీ నేను మాత్రం మంత్రి పదవికి రాజీనామా చేసిన.. సోనియాగాంధీ నాకు మంత్రి పదవి ఇస్తానన్నా కూడా తెలంగాణ వచ్చిన తర్వాతే మంత్రి పదవి తీసుకుంటాను’ అని చెప్పినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్లో ఉండి మా ప్రభుత్వం పైనే తెలంగాణ కోసం పోట్లాడినం. ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు.. తెలంగాణ క్రెడిట్ అంతా సోనియాగాందిదే అని అన్నారు. తెలంగాణతో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని, ప్రజలకు జరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో 90 మున్సిపల్ చైర్మన్లు, కాంగ్రెస్ గెలుచుకుంటుందని, 5 కార్పొరేషన్లను కూడా కాంగ్రెస్ కై వసం చేసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. అందులో నల్ల గొండ మేయర్ స్థానం ఉంటుందన్నారు. నల్లగొండలోని పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బొడ్రాయి చైర్మన్ కందుల నిర్మలమ్మ గౌడ్ ఇంట్లో టీ తాగుతున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డిఫ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారే జాతిపితలు ఫ తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ సోనియాదే.. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
ఏజ్ జస్ట్ ఎ నంబర్
ఫ మున్సిపల్ బరిలో ముగ్గురు వృద్ధులు మోత్కూరు : మోత్కూరు మున్సిపల్ ఎన్నికల్లో యువకులకు ధీటుగా వృద్ధులూ బరిలో నిలిచారు. కొండగడప గ్రామంలోని 4వ వార్డు నుంచి దొంతరబోయిన భారతమ్మ 78 ఏళ్ల వయసులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2వ వార్డులో మర్రి మరియమ్మ(74) బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఒకటో వార్డులో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మోత్కూరు బ్రహ్మాచారి (68) బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పోటీలో 23ఏళ్ల యవతి మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన బద్దం నిశిత (23) 5వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇంటర్ చదువుకున్న ఆమె ప్రస్తుతం గృహిణిగా ఉన్నారు. -
నిందలు వేస్తే సహించేది లేదు
హయత్నగర్: మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి హయాంలో జరిగిన అవకతవకల కారణంగానే మదర్ డెయిరీకి అప్పుల భారం పెరిగిందని, అవినీతి వాళ్లు చేసి తమపై నిందలు వేస్తే సహించేది లేదని మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను తప్ప ఎవరూ మదర్ డెయిరీని నడపరాదని జితేందర్రెడ్డి కుట్ర చేస్తున్నారని, ప్రభుత్వం నుంచి రూ.35 కోట్లు తెస్తానని చెప్పి రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఆయన చేసిన ఆరోపణలు నిరూపిస్తేనే సర్వసభ్య సమావేశం పెడతానని, ఎవరి సమక్షంలో విచారిస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో గేదెలు, దాణా కొనుగోలుకు ఇన్సెంటివ్లకు ఇచ్చిన సబ్సిడీల్లోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. జితేందర్రెడ్డి హయాంలో జరిగిన అవినీతిపై నిపుణుల కమిటీతో విచారణ జరిపిస్తానని, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలతో వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి ప్రభుత్వం నుంచి సహాయం కోరుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు నర్సింహారెడ్డి, పాండు, రాంరెడ్డి, జంగయ్య, లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల వాగ్వాదం రెండు నెలలకు పైగా జీతాలు ఇవ్వడం లేదని మదర్ డెయిరీ ఉద్యోగులు మంగళవారం చైర్మన్, డైరెక్టర్లతో వాగ్వాదానికి దిగారు. పాలు వస్తున్నాయి, పని చేస్తున్నాం, డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు జీతాలు చెల్లిస్తానని చైర్మన్ హామీ ఇచ్చినా ఉద్యోగులు ఆందోళన కొనసాగించారు. ఫ మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి -
వీరి ఎన్నిక ఏకగ్రీవం
కోదాడలో ముగ్గురు కోదాడ : కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడు వార్డులు ఏకగ్రీవ మయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ 11వ వార్డు నుంచి మొత్తం 9 మంది నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా దేవరపల్లి మళ్లీశ్వరి మినహా మిగతా 8 మంది అభ్యర్థులు మంగళవారం తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. 21వ వార్డు నుంచి నలుగురు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కట్టెబోయిన జ్యోతి మినహా మిగిలిన ముగ్గురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 31వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎర్నేని కుసుమతో పాటు మరో 8 మంది నామినేషన్ దాఖలు చేశారు. కుసుమ మినహా మిగతావారు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కోదాడ మున్సిపాలిటీలో ముగ్గురు మహిళా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇదే మొదటి సారి. -
అన్నదమ్ముల సవాల్
భూదాన్పోచంపల్లి : పోచంపల్లి మున్సిపల్ ఎన్నికల బరిలో అన్నదమ్ములిద్దరూ ఒకే వార్డు నుంచి బరిలో నిలిచారు. 5వ వార్డు బీసీ జనరల్కు రిజర్వు అయ్యింది. దీంతో గతంలో ఇదే వార్డు నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచి మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసిన బాతుక లింగస్వామియాదవ్ ఈసారి కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. లింగస్వామికి సొంత తమ్ముడైన బాతుక శంకర్యాదవ్ను ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని 5వ వార్డు నుంచే పోటీ చేయిస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ పోటీ పడుతుండటంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. -
బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి
యాదగిరిగుట్ట: పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏడు రోజుల పాటు వైభవంగా కొనసాగిన వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం అష్టో త్తర శతఘటాభిషేకంతో ముగి శాయి. ఉదయం ఆలయంలో నిత్యారాధనల అనంతరం మూలవరులకు, ఉత్సవమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. తొలుత ఆలయ ప్రధాన మండపంలో 108 కలశాలను ఒకే చోట పెట్టి పూజించారు. అనంతరం కలశాల ఎదురుగా హోమం నిర్వహించి పూర్ణాహుతి చేపట్టారు. అనంతరం స్వామి పంచామృతాలను భక్తులకు తీర్థంగా ఇచ్చారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ఈఓ భవానీశంకర్, ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అధికారులు, వేద పారాయణికులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రద్దు చేసిన నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమం వంటి పూజలు బుధవారం పునఃప్రారంభం కానున్నాయి. ఫ పాతగుట్టలో నేటి నుంచి నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమం తిరిగి ప్రారంభం -
అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీకి 2020లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో 16వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి వెన్రెడ్డి రాజు గెలుపొంది మొదటి చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కాగా.. 16వ వార్డు బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో వెన్రెడ్డి రాజు తన భార్య వెన్రెడ్డి సంధ్యను ఎన్నికల బరిలోకి దింపారు. నాడు వెన్రెడ్డి రాజు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందగా.. ఈసారి ఆయన భార్య సంధ్య కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. -
లిఫ్ట్ అడిగి.. క్యాబ్ డ్రైవర్పై కత్తితో దాడి
చిట్యాల : క్యాబ్ డ్రైవర్ను లిఫ్ట్ అడిగిన గుర్తుతెలియని వ్యక్తి కొద్దిదూరం వెళ్లిన తర్వాత కత్తితో డ్రైవర్పై దాడి చేశాడు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణ శివారులో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. నల్లగొండకు చెందిన షేక్ ఇమ్రాన్ అలీ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి నల్లగొండ నుంచి హైదరాబాద్కు బయల్దేరాడు. మార్గమధ్యలో నార్కట్పల్లి– చిట్యాల మధ్యలో ఓ హోటల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ అడగడంతో అతడిని కారులో ఎక్కించుకున్నాడు. కారు చిట్యాల శివారులోకి రాగానే సదరు గుర్తుతెలియని వ్యక్తి కత్తితో ఇమ్రాన్ అలీపై దాడి చేయడంతో అతడి పొట్టలో రెండు చోట్ల కత్తిపోట్లు తగిలాయి. అనంతరం ఇమ్రాన్ అలీ వద్ద ఉన్న నగదు, సెల్ఫోన్ను లాక్కొనేందుకు ప్రయత్నించగా.. అతడు కేకలు వేయడంతో సదరు వ్యక్తి కారులోంచి దిగి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న చిట్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇమ్రాన్ అలీని అంబులెన్స్లో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుండగుడు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా దాడికి గురైన ఇమ్రాన్ అలీపై గతంలో పలు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన దారి దోపిడీలో భాగంగా జరిగిందా లేదా పాత కక్షలతో ఇమ్రాన్ అలీపై దాడికి తెగబడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ స్థాయి మౌంటెన్ బైకింగ్ చాంపియన్షిప్కు ఎంపికతుర్కపల్లి: తుర్కపల్లి మండలం చౌక్లతండా గ్రామానికి చెందిన భూక్య నిఖిల్ ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు అరుణాచల్ప్రదేశ్లో జరగనున్న జాతీయ స్థాయి మౌంటెన్ బైకింగ్(ఎంటీబీ) చాంపియన్షిప్కు ఎంపికయ్యాడు. నిఖిల్ కొన్ని సంవత్సరాలుగా సైక్లింగ్లో చురుకుగా పాల్గొంటూ జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావును నిఖిల్ కలిసి పోటీల్లో పాల్గొనడానికి అవసరమైన సహకారం అందించాలని వినతి పత్రం అందజేశాడు. -
టికెట్ వచ్చిందో రాలేదో తెలియక..
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపల్ 48వ వార్డు జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున పందిరి అనిత, మెరుగు అభిభి నామినేషన్ వేశారు. అయితే ఇద్దరికీ కాంగ్రెస్ బీ ఫాం ఇచ్చారంటూ పుకార్లు రావడంతో పందిరి అనిత మంగళవారం కొద్దిసేపు నామినేషన్ సెంటర్ వద్ద హల్చల్ చేసింది. తనకు టికెట్ వచ్చిందో రాలేదో తెలియాలని పట్టుబట్టి నిరసన వ్యక్తం చేసింది. సుమారు గంటకు పైగా నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే లిస్ట్లో తన పేరు వచ్చే వరకు తాను అక్కడే ఉంటానంటూ భిష్మించింది. చివరికి 48వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె పేరు ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
గెలుపు గుర్రాలకే బీఆర్ఎస్ టికెట్లు
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట మున్సిపాలిటీలో గెలుపు గుర్రాలకే కౌన్సిలర్ టికెట్లు ఇచ్చామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పేందుకు పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారని, మహానగరాలకు దీటుగా సూర్యాపేటను తీర్చిదిద్దామన్నారు. పరిశుభ్రంగా ఉన్న సూర్యాపేట పట్టణాన్ని కాంగ్రెస్ పాలకులు రెండేళ్లలో ఆగం చేశారని, 2014కు ముందు.. తర్వాత అన్న రీతిలో సూర్యాపేటలో అభివృద్ధి జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారమే సూర్యాపేటను జిల్లాగా మార్చుకున్నామని, మెడికల్ కాలేజ్, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, మహాప్రస్థానం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, రోడ్లు, సెంట్రల్ లైటింగ్, ట్యాంక్ బండ్, బోటింగ్, పార్కులతో ఆహ్లాదాన్ని పెంచామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని, వచ్చిన నిధులను వాపస్ పంపిన దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ దేనన్నారు. భారీ మెజార్టీతో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
మళ్లీ పులి దాడి కలకలం
రాజాపేట : మళ్లీ పులి సంచారం కలకలం రేపింది. రాజాపేట మండలంలో పులి తిరిగిన ఆనవాళ్లు కన్పించడం, ఒక లేగదూడను చంపడం ఆందోళన కలిగిస్తోంది. గత నెల17న బేగంపేట గ్రామంలో పులి అడుగులను గుర్తించిన విషయం విదితమే. తాజాగా సోమవారం రాత్రి బసంతపురంలో కట్కూరి రమేష్ వ్యవసాయ బావి వద్ద లేగదూడపై దాడి చేసి చంపింది. అక్కడి నుంచి నెమిల మధిర గ్రామం పిట్టలగూడెం శివారులో, లక్ష్మక్కపల్లి గ్రామ సర్పంచ్ ఇండ్ల రాజయ్య వ్యవసాయ పొలంలో పులి అడుగు జాడలను ప్రజలు గుర్తించి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఫారెస్టు అధికారులు బసంతపురంలో పులి దాడిచేసి చంపిన లేగదూడను, పిట్టలగూడెం, లక్ష్మక్కపల్లి గ్రామాల్లోని వ్యవసాయ పొలాల్లో రైతులు గుర్తించిన పులి అడుగుల ఆనవాళ్లను యాదాద్రి, సిద్దిపేట జిల్లాల ఫారెస్టు అధికారులు సుధాకర్రెడ్డి, పద్మజ.. డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె. రమేష్ నాయక్, డి. శ్రీను, బీట్ ఆఫీసర్లు స్వామి, కిషోర్, శేఖర్రెడ్డి, లిఖిత, సెక్షన్ ఆఫీసర్లు మల్లేశం, జి లక్ష్మణ్లు యానిమల్ ట్రాకర్స్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. శ్రీనివాస్పురంలో పులి పాద ముద్రలు ఆలేరురూరల్: ఆలేరు మండలం శ్రీనివాస్పురంలో దడిగోని వ్యవసాయ బావి వద్ద పులి పాదముద్రలను స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వచ్చి పరిశీలించి అవి పులి అడుగులేనని నిర్ధారించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్ మాట్లాడుతూ పులిని పట్టుకునేందుకు నాలుగైదు రోజులుగా టైగర్ మానిటరింగ్ టీమ్తో కలిసి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట అటవీశాఖ అధికారులు, ఆలేరు సీఐ యాలాద్రి, పోలీసులు ఉన్నారు. పులిని బంధించేందుకు ప్రత్యేక చర్యలు రాజాపేట : పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో బంధించేందుకు అన్నిరకాల చర్యలు చేపడుతున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. రాజాపేట మండలం బసంతపురం గ్రామంలో పులి దాడి చేసి లేగదూడను చంపిన ప్రాంతాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఫారెస్టు అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పులిని పట్టుకోవడానికి ధర్మల్ డ్రోన్ ఉపయోగించి పులి సంచరిస్తున్న ప్రదేశాలను వీడియో తీయడం, ట్రాప్ కెమెరా, బోన్ల ఏర్పాటు వంటి అంశాలను అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అడవి ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకూడదని, వ్యవసాయ పనుల నిమిత్తం గుంపులుగా వెళ్లాలని సూచించారు. రాత్రి వేళలో పశువులను బయటికి వదలవద్దని పశువుల పాకలో వెలుతురు ఉండేలా చూసుకోవాలన్నారు. పులి కనిపించినట్లు గమనించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా స్థానిక గ్రామ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రదీప్కుమార్, ఎంపీడీఓ నాగవేణి, ఆర్ఐ నర్సింహులు, గ్రామ సర్పంచ్ మెండు రత్నమాల, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్ ఉన్నారు.బసంతపురంలో పులి దాడితో మృతి చెందిన లేగదూడను పరిశీలిస్తున్న అధికారులులక్ష్మక్కపల్లి గ్రామంలో పులి పాదముద్రఫ రాజాపేట మండలం బసంతపురంలో లేగదూడపై దాడి ఫ మరో మూడు గ్రామాల్లో అడుగు జాడలు -
కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోంది
యాదగిరిగుట్ట: మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తోందని, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఆవుల మమతకు రూ.3కోట్లు ఇచ్చి నామినేషన్ విత్ డ్రా చేయించారని బీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆవుల మమత నామినేషన్ ఉపసంహరించేందుకు నగదు ఇచ్చారని, ఇతర బీఆర్ఎస్ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పట్టణమంతా తిరుగుతూ బీర్ల ఐలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ ఐలయ్యకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులకు ఫోన్లు చేయడంతో పాటు ఆయన అనుచరులను ఇళ్లకు పంపించి నగదు ఆశ చూపుతున్నారన్నారు. 11వ వార్డు అభ్యర్థి సయ్యద్ బాబా, 12వ వార్డు అభ్యర్థి కంసానీ కీర్తి స్వామి, 5వ వార్డు అభ్యర్థి మానుపాటి పరుశరాములును బెదిరింపులకు పాల్పడ్డారని, నామినేషన్ ఉసంహరించుకోవాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. 11వ వార్డు అభ్యర్థికి కాంగ్రెస్కు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ ఫోన్ చేసి విత్ డ్రా చేసుకుంటే నగదు ఇప్పుడే మాట్లాడి అప్పగిస్తామని ఆఫర్ చేసినా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి డబ్బులకు లొంగలేదన్నారు. యాదగిరిగుట్ట పట్టణ ఓటర్లు ఆలోచించి నిజాయితీగా అభివృద్ధి చేసే బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరారు. కాగా.. నమ్మిన వ్యక్తులే పార్టీకి ద్రోహం చేస్తున్నారని ప్రెస్మీట్ సమయంలో గొంగిడి మహేందర్రెడ్డి కంటతడి పెడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, మండల సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్, పట్టణ జనరల్ సెక్రటరీ పాపట్ల నరహరి, నాయకులు ఇమ్మడి రాంరెడ్డి, తోటకూరి బీరయ్య, గంగసాని నవీన్కుమార్, శారాజీ రాజేష్, కవిడే మహేందర్, నర్సింహగౌడ్, వెంకటేష్గౌడ్, రమేష్, దావూద్, కరుణాకర్, సతీష్రాజ్ తదితరులున్నారు. ఫ బీఆర్ఎస్ అభ్యర్థికి రూ.3కోట్లు ఇచ్చి నామినేషన్ ఉపసంహరింపజేశారు ఫ బీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మహేందర్రెడ్డి ఆరోపణ -
ఇక.. సమరమే!
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలతో పాటు సీపీఎం, సీపీఐ, టీఆర్పీల నుంచి ఆశావహులు సమయం ఎక్కువ లేకపోవడంతో మొదటగా నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం ఆయా పార్టీల వద్దకు వెళ్లి.. ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీ సర్వేలతో అభ్యర్థులను గుర్తించగా.. బీఆర్ఎస్, బీజేపీలు సైతం గెలిచే అభ్యర్థుల కోసం వేచిచూశారు. ఈ క్రమంలోనే రాజకీయ సమీకరణలు, ఆర్థిక, ప్రజాబలం తదితర కోణాల్లో అభ్యర్థులను ఆయా పార్టీలు తేల్చాయి. సోమవారం అభ్యర్థులను ప్రకటించి.. మంగళవారం బీఫాంలు అందించారు. దీంతో మున్సిపల్ కార్యాలయాలు నామినేషన్లు ఉపసంహరించుకునే అభ్యర్థులతో పాటు బీఫాంలు సమర్పించే వారితో రద్దీగా మారాయి. సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లెక్క తేలింది. మంగళవారం సాయంత్రం వరకు నాటకీయ పరిణామాల మధ్య ఉపసంహరణలు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 104 వార్డుల్లో రెండు ఏకగ్రీవం కాగా 353 మంది బరిలో నిలిచారు. అత్యధికంగా భువనగిరిలో 128 మంది, అత్యల్పంగా యాదగిరిగుట్టలో 38 మంది పోటీలో ఉన్నారు. అభ్యర్థులు ఎవరో తేలడంతో ఇక ప్రచారం ఊపందుకోనుంది. 104 వార్డులకు రెండు ఏకగ్రీవం జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు మున్సిపాలిటీల్లోని 104 వార్డులకు జనవరి 29న ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరించారు. మూడు రోజుల్లో ఆశావహుల నుంచి మొత్తం 841 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా పార్టీలు తమకే టికెట్ ఇస్తాయని ఆశించినా.. పలు సమీకరణలతో సాధ్యం కాలేదు. దీంతో బుజ్జగింపుల పర్వం కొనసాగింది. ఈ నేపథ్యంలో మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి అవకాశం కావడంతో నేతల హామీలు, ప్రలోభాలు, బుజ్జగింపులు, బెదరింపులు... ఇలా అన్నిరకాల ప్రయత్నాలతో దిగివచ్చి మున్సిపల్ కార్యాలయాలకు క్యూకట్టి మధ్యాహ్నం మూడు గంటల లోగా నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సాయంత్రం అధికారులు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధుల జాబితాలను వెల్లడించారు. చౌటుప్పల్, యాదగిరిగుట్టలో ఒక్కో వార్డు చొప్పున ఏకీగ్రీవం కాగా ఇక 102 వార్డులకు 353 మంది బరిలోనిలిచారు. వీటికి ఈనెల 11న పోలింగ్ జరగనుంది. బుజ్జగింపులు.. అలకలు.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణాల్లో రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా సోమవారం ఒక్కో పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుండగా.. అప్పటి వరకు తమకే టికెట్ రానుందని ఆశించిన వారు నిరాశకు గురై అలకబూనారు. వీరిని బుజ్జగించేందుకు నేతలు రంగంలోకి దిగి కొన్నిచోట్ల ఎలాంటి వివాదాలు లేకుండా సద్దుమణిగేలా మంతనాలు చేశారు. నామినేషన్న్ దాఖలు చేసిన కొందరు తగ్గేది లేదని తేల్చి చెప్పి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. యాదగిరిగుట్ట, చౌటుప్పల్లో తమ పార్టీ అభ్యర్థులను కొనుగోలు చేశారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఊపందుకోనున్న ప్రచారం.. మున్సిపల్ బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారు కావడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. పార్టీల గుర్తులే అభ్యర్థులకు రానుండడంతో ఓటర్ల వద్దకు క్యూకట్టనున్నారు. రాత్రింబవళ్లు ఓటర్లను కలిసేలా అభ్యర్థులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఎక్కువ సమయం లేకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లోనూ ప్రచారం చేయనున్నారు. తమ వార్డు పరిధిలో ఉన్న ఓటర్ల జాడను తెలుసుకునే పనిలో పడ్డారు. మద్యం పార్టీలు మొదలయ్యాయి. బరిలో 353 మంది ఫ అత్యధికంగా భువనగిరిలో 128 మంది, అత్యల్పంగా యాదగిరిగుట్టలో 38 మంది ఫ ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఫ 104 వార్డుల్లో చౌటుప్పల్, యాదగిరిగుట్టలో ఒక్కో వార్డు చొప్పున ఏకగ్రీవం మున్సిపాలిటీ వార్డులు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు మొత్తం ఆలేరు 12 12 12 12 04 40 భువనగిరి 35 34 30 31 33 128 చౌటుప్పల్ 20 19 14 14 11 58 మోత్కూరు 12 11 11 12 15 49 పోచంపల్లి 13 13 13 11 03 40 యాదగిరిగుట్ట 12 10 10 11 07 38 మొత్తం 104 99 90 91 73 353 -
నాటకీయ పరిణామాల మధ్య చౌటుప్పల్ 17వ వార్డు ఏకగ్రీవం
చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు మంగళవారం నాటకీయ పరిణామాల మధ్య ఏకగ్రీవమైంది. వార్డుకు కాంగ్రెస్ నుంచి చింతల సాయిలు భార్య ఉమామహేశ్వరి, పస్తం గంగరాములు భార్య మల్లమ్మ టికెట్ ఆశించారు. పార్టీ అధిష్టానం పస్తం మల్లమ్మను అభ్యర్థిగా ఖరారు చేసింది. దాంతో అలక బూనిన చింతల ఉమామహేశ్వరి ఒక సెట్ నామినేషన్ కాంగ్రెస్ తరఫున, మరో సెట్ బీఆర్ఎస్ తరఫున దాఖలు చేసింది. కాంగ్రెస్ పార్టీ మల్లమ్మను అభ్యర్థిగా ప్రకటించడంతో మూడు రోజుల క్రితం ఉమా మహేశ్వరి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరింది. ఈ వార్డు నుంచి నామినేషన్ వేసిన మిగతా వారు ఉపసంహరించుకోగా మంగళవారం నాటికి ఇద్దరే మిగిలారు. బీఫామ్ సమర్పించే క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చింతల ఉమామహేశ్వరికి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ అందించింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెకే బీఫామ్ అందింది. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకుల వ్యూహాన్ని బీఆర్ఎస్ నాయకులు పసిగట్టలేక పోయారు. కాంగ్రెస్ నాయకుల వ్యూహం ప్రకారం బీఫామ్ సమర్పించే సమయంలో మల్లమ్మ నేరుగా ఆర్వో వద్దకు వెళ్లి తన నామినేషన్ ఉపసంహరించుకుంది. దాంతో ఉమామహేశ్వరి ఒక్కరే మిగలడంతో అధికారులు ఆమె ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. విషయాన్ని పసిగట్టిన బీఆర్ఎస్ నాయకులు ఆర్వో కార్యాలయంలోకి వెళ్లి ఆయనతో వాగ్వాదానికి దిగారు. అదే క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు సైతం ఎదురు దాడి చేశారు. 13వ వార్డును సైతం ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన తొర్పునూరి నర్సింహగౌడ్తో నామినేషన్ ఉపసంహరింపజేశారు. మరో ఇద్దరి చేత ఉపసంహరింపజేసేందుకు యత్నించగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి వారిని తన వాహనంలో తీసుకొని వెళ్లిపోయారు. -
ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకం
భువనగిరి: ఎన్నికల నిర్వహణంలో అధికారుల పాత్రకీలకమైందని అదనపు కలెక్టర్ భాస్కర్రావు పేర్కొన్నారు. మంగళవారం భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో పీవో, ఏపీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ విషయంలో పీవోలు, ఏపీవోలకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని టీ యాప్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, పీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి భూదాన్పోచంపల్లి: ప్రణాళికాబద్ధంగా చదువుకొని పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జినుకల శ్యామ్సుందర్ సూచించారు. మంగళవారం భూదాన్పోచంపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల ప్రోగ్రెస్ను పరిశీలించి చదువులో వెనుకబడిన విద్యార్థినుల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలను చదువులో మరింత ప్రోత్సహించాలని సూచించారు. వారి ఆర్థిక, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకొని పౌష్టికాహారం అందించాలని కోరుతూ రూ.1000ల నగదును అందజేశారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యాదగిరీశుడి సేవలో విజయేంద్ర ప్రసాద్యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ప్రముఖ రచయిత, దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభువును దర్శించుకొని ప్రత్యేక పూ జలు చేశారు. అనంతరం విజయేంద్ర ప్రసాద్కు అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఈఓ భవానీశంకర్ లడ్డూ ప్రసాదం అందించారు. నీటి ఎద్దడి ఏర్పడకుండా చూడాలియాదగిరిగుట్ట రూరల్ : గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడకుండా చూడాలని జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కరుణాకర్ సూచించారు. మిషన్ భగీరథ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మండలంలోని చొల్లేరు గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. రానున్న వేసవిలో గ్రామాల్లో నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటర్ ట్యాంకులను నెలలో మూడు సార్లు బ్లీచింగ్తో శుభ్రం చేయాలన్నారు. పైప్లైన్లకు లీకేజీలు ఉంటే సరి చేయాలని సూచించారు. తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అంతకు ముందు గ్రామ పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఇంట్రా ఏఈఈ ప్రజ్ఞ, గ్రిడ్ ఏఈఈ గణేశ్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, సర్పంచ్ చిన్నం మమత, సిబ్బంది ఉన్నారు. -
టీశాట్ పాఠం.. ఉత్తమ ఫలితాలకు ఊతం
భువనగిరి: పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) టీ శాట్ ద్వారా ప్రత్యేకంగా పాఠాలను ప్రసారం చేసే కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టింది. ఇది ఈనెల 5వ తేదీరకు కొనసాగనుంది. ఇప్పటికే జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు 200 సైకిళ్లను అందజేస్తామని ఇప్పటికే కలెక్టర్ హనుమంతరావు ప్రకటించారు. ఉదయం 9.30 నుంచి సాయంత్ర 4.30 వరకు.. టీ శాట్ ద్వారా రోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రసారమయ్యే కార్యక్రమంలో ప్రత్యేక పాఠాలను విషయ నిపుణులు బోధిస్తారు. విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే భౌతిక, జీవశాస్త్రం, ఇంగ్లిష్, హిందీ, బోధన పూర్తి కాగా ఈ నెల 4వ తేదీన గణితం, తెలుగు, సాంఘిక శాస్త్రం, ఉర్దూ భాషలో గణిత, భౌతిక, జీవ శాస్త్రం, సాంఘిక శాస్త్రాల పై పాఠాలు ప్రసారం చేయనున్నారు. 180 పాఠశాలల్లో.. జిల్లా వ్యాప్తంగా 180 ప్రభుత్వ పాఠాశాలలు ఉండగా వీటిలో 2025–26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు 5464 మంది ఉన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో టెన్త్లో ఉత్తమ ఫలితాలు సాదించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా కలెక్టర్ విద్యాశాఖ సమన్వయంతో వినూత్న కార్యక్రమాలను అమలుచేశారు. దీంతో గత సంవత్సరం పదో తరగతి ఫలితాలలో రాష్ట్రంలో జిల్లా 7వ స్థానంలో నిలిచింది. 2025–26 సంవత్సరానికి గత సంవత్సరం కంటే రాష్ట్రంలో వచ్చిన స్థానాన్ని మరింతగా మెరుగుపర్చుకునేందుకు తాజాగా జట్టు అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీనికి తోడు ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో పాఠశాలల్లో టీశాట్ ద్వారా ప్రసారం చేస్తున్న పాఠాలతో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదం కానున్నాయి. జిల్లాలో గతంలో సాధించిన ఉత్తమ ఫలితాల వివరాలు సంవత్సరం శాతం రాష్ట్రంలో స్థానం 2021–22 93.61 13 2022–23 80.97 23 2023–24 90.44 25 2024–25 97.80 7 పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. అలాగే ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో టీ శాట్ ద్వారా ప్రత్యేకంగా పాఠాలు ప్రసారం చేస్తుండడం వల్ల విద్యార్థుల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – కె సత్యనారాయణ, డీఈఓ ఫ పదో తరగతి విద్యార్థులకు టీశాట్ ద్వారా పాఠాల ప్రసారం ప్రారంభం ఫ 5వ తేదీ వరకు నిర్వహణ ఫ 5,464 మంది విద్యార్థులకు ప్రయోజనం -
యాదాద్రికి ఎంఎంటీఎస్
సాక్షి, హైదరాబాద్: లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి రైలుమార్గం సుగమం కానుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రికి ఎంఎంటీఎస్ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆరీ్వఎన్ఎల్) టెండర్లు దక్కించుకుంది. ఇప్పటికే రాయగిరి వరకు భూసేకరణ పూర్తి కావడంతో త్వరలో పనులను ప్రారంభించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారి ఒకరు తెలిపారు. రెండున్నరేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైల్వేశాఖ సొంత నిధులతో రాయగిరి వరకు సుమారు 33 కి.మీ. నిర్మాణానికి రూ.430 కోట్లకు పైగా వ్యయం కానున్నట్లు అంచనా. ఎంఎంటీఎస్ రైళ్లు వినియోగంలోకి వస్తే సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి, ఘట్కేసర్ మీదుగా రాయగిరికి చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో యాదాద్రికి వెళ్లవచ్చు. నగర వాసులకు ఉపయుక్తం.. ప్రస్తుతం నగరవాసులు ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాల్లోనే యాదాద్రికి రాకపోకలు సాగిస్తున్నారు. రైల్వే సదుపాయం అందుబాటులో లేకపోవడంతో నగరవాసులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సైతం రోడ్డు మార్గంలోనే వెళుతున్నారు. అప్పట్లో యాదా ద్రి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే ఎంఎంటీఎస్ రెండో దశను పొడిగించాలని ప్రతి పాదించారు. ఈ మేరకు 2015లోనే క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి ప్రణాళికలను సిద్ధం చేసినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రమైన జాప్యం నెలకొంది. సుమారు 9 ఏళ్లపాటు పెండింగ్లో ఉంది. చివరకు రైల్వేశాఖ స్వయంగా నిర్మించాలని నిర్ణయించడంతో భూసేకరణతో పాటు, నిర్మాణ సంస్థల ఎంపిక తదితర పనుల్లో పురోగతి చోటుచేసుకుంది. అన్ని వైపుల నుంచీ.. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలో ఎక్కడి నుంచైనా నేరుగా యాదాద్రికి చేరుకొనే సదుపాయం లభిస్తుంది. పటాన్చెరు, తెల్లాపూర్, లింగంపల్లి, ఉందానగర్, మేడ్చల్ తదితర నగర శివారు ప్రాంతాల నుంచి కూడా ఎంఎంటీఎస్ రైళ్లలో రాయగిరికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరో 4 కి.మీ రోడ్డు మార్గంలో యాద్రాద్రికి వెళ్లవచ్చు. -
అమ్మో.. పులి
సాక్షి, యాదాద్రి: పులి సంచారం యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత నెల 16న జిల్లాలోని రాజాపేట మండలం బేగంపేట– తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు బయటపడ్డాయి. రాత్రి వేళ పులి ఆవులు, దూడలు, మేకలపై దాడులు చేసి తింటోంది. అటవీ శాఖ అధికారులు పులి సంచారంపై దృష్టి పెట్టినప్పటికీ దాన్ని బంధించలేకపోతున్నారు. పశువులను మేపడానికి అడవికి వెళ్లినవారు, వ్యవసాయ పనులకు వెళ్లిన వారు సాయంత్రం 4 గంటలకే పనులు ముగించుకుని ఇంటికి వస్తున్నారు. పులి మహారాష్ట్రలోని తిప్పేశ్వర వన్యప్రాణి అభయారణ్యం నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు మీదుగా ఆడ పులి తోడు కోసం మగ పులి బయలుదేరి జిల్లాకు చేరింది. జనవరి 16న భువనగిరి జిల్లా రాజాపేట, తుర్కపల్లి, అటవీ ప్రాంతంలో ఉన్న గుట్టల్లోంచి బయటకువచ్చి వ్యవసాయ బావుల వద్ద ఉన్న పశువులను చంపి తింటోంది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో పులి ఆవును చంపి తింటున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఫిబ్రవరి 1, 2 తేదీలో జిల్లాకు పొరుగునే ఉన్న సిద్దిపేట జిల్లా జగ్దేవ్పూర్ వైపు వెళ్లింది. దీంతో అటవీ శాఖ అధికారులు పులి తిరిగి వెళ్లిపోయిందని, రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు. అయితే, మంగళవారం రాత్రి రాజాపేట మండలంలో పులి దాడితో మళ్లీ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పెద్దగా అటవీ ప్రాంతంలేని ఆలేరు మండలం శ్రీనివాసపురంలో పులి అడుగులను గుర్తించారు. దీంతో పులి పొరుగునే ఉన్న జనగామ జిల్లాకు వెళ్లి ఉంటుందన్న అంచనా వేస్తున్నారు. అటవీశాఖ ముమ్మర చర్యలుపులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు మూడు బోన్లను ఏర్పాటు చేసి, వాటిలో మేకలను ఎరగా ఉంచారు. అలాగే 25 ట్రాప్ కెమెరాలు, థర్మల్ డ్రోన్ కెమెరాల సహాయంతో పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. యానిమల్ ట్రాకింగ్ బృందం పులి జాడలను నిరంతరం గమనిస్తోంది. రాత్రివేళల్లో బయటకు వెళ్లవద్దని, ఒంటరిగా అడవులు, బావుల వద్దకు వెళ్లకూడదని అటవీశాఖ అధికారులు ప్రజలకు సూచించారు.రాత్రిళ్లు గస్తీ తిరుగుతున్నాం... మా గ్రామానికి చెందిన మూడు పశువులను పులి చంపేసింది. అటవీ శాఖ అధికారుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గుంపులుగా బావుల వద్దకు వెళ్లి పనులు త్వరగా ముగించుకుని వస్తున్నాం. యువకులు రాత్రివేళ గస్తీ తిరుగుతున్నారు. అధికారులు పులిని త్వరగా బంధించి ప్రజలకు రక్షణ కల్పించాలి. –జెర్రిపోతుల కర్ణాకర్, సర్పంచ్, దత్తాయపల్లిపులి దాడిలో ఆవు మృతితాంసి: పులి దాడిలో ఆవు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో చోటుచేసుకుంది. పిప్పల్కోటి గ్రామంలోని రైతు విఠల్కు చెందిన ఆవు మేత కోసం సోమవారం పంట చేల వైపు వెళ్లింది. రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో రైతు పంట చేల వద్ద మంగళవారం ఉదయం గాలించగా ఆవు కళేబరం కనిపించింది. పులి దాడి చేసి హతమార్చినట్టుగా గుర్తించిన స్థానిక రైతులు, గ్రామస్తులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఎఫ్ఆర్వో గులాబ్సింగ్ సెక్షన్ అధికారి అహ్మద్ఖాన్ను అప్రమత్తం చేశారు. ఆయన బీట్ అధికారి సాయికుమార్తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆనవాళ్లను పరిశీలించి పులి దాడిగా నిర్ధారించారు. పెన్గంగా పరీవాహక ప్రాంతాల్లో పులి సంచారం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్వో స్థానికులకు సూచించారు. పులి కదలికల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సిబ్బంది ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. బాధిత రైతుకు పరిహారం అందేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో అటవీశాఖ సిబ్బంది, యానిమల్ ట్రాకర్స్ ఉన్నారు. -
ఎట్టకేలకు అంత్యక్రియలు పూర్తి
నల్గొండ జిల్లా : మండలంలోని కేతేపల్లి గ్రామంలో జరిగిన ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో మృతిచెందిన మమత, ఆమె చిన్ని కుమారుడు అద్విక్ అంత్యక్రియలు ఎట్టకేలకు సోమవారం రార్రి పూర్తయ్యాయి. ఈ కేసులో నిందితురాలైన సుజాత సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి గ్రామానికి చెందిన కుందేలు నగేష్తో అదే గ్రామానికి చెందిన సుజాత వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. నగేష్ భార్య మమతకు ఈ విషయం తెలిసి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పెద్దమనుషుల సమక్షంలో నగేష్, సుజాతను పిలిపించి పంచాయితీ పెట్టి సర్ది చెప్పారు. అప్పటి నుంచి నగేష్ సుజాతతో మాట్లాడటం మానేశాడు. దీంతో ఎలాగైనా నగేస్ భార్య మమతను చంపాలని సూజాత నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సుజాత జనవరి 31న గ్రామంలోని కిరాణ దుకాణంలో ఒక బాటిల్లో పెట్రోల్ తీసుకొని ఇంటి వద్దకు వెళ్లింది. పెట్రోల్తో పాటు ఒక సంచిలో కత్తి, కారంపొడి తీసుకొని నగేష్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంటి ముందు చిన్న కుమారుడు అద్విక్ పాలు పడుతున్న మమతపై సుజాత పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో మమత, ఆమె చిన్న కుమారుడు అద్విక్ మృతిచెందారు. నిందితురాలు సుజాత సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి చేసిన నేరం అంగీకరించి లొంగిపోగా.. ఆమెను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన..మమత తరఫు బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. మమత వివాహ సమయంలో కట్నం కింద ఇచ్చిన రూ.8లక్షల నగదు, 10 తులాల బంగారం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు గంటల పాటు ఆందోళన చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు కోరారు. భూమి రిజిస్ట్రేషన్..నగేష్ తల్లిదండ్రుల వద్ద ఉన్న నాలుగు ఎకరాల భూమిని మృతురాలు మమత పెద్ద కుమారుడు సాత్విక్ పేరిట ఆమె తరఫు బంధులు దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించారు. గార్డియన్గా మమత తండ్రి, తల్లిని పెట్టారు. అదేవిధంగా కట్నం కింద ఇచ్చిన రూ.8లక్షల నగదు, 10 తులాల బంగారంను మమత పెద్ద కుమారుడి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు పెద్ద మనుషుల మధ్య ఒప్పందం కుదరడంతో సోమవారం రాత్రి మమత, ఆమె చిన్న కుమారు అద్విక్ మృతదేహాలను బంధువులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కేతేపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
కుమారుడి యాదిలో.. ప్రజా సేవలోకి
సూర్యాపేటటౌన్ : తన కుమారుడు కల్నల్ సంతోష్బాబు దేశ సేవలో ప్రాణాలర్పించాడని, కుమారుడి జ్ఞాపకాలతో ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలని సూర్యాపేట మున్సిపాలిటీలో 44వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్నానని సంతోష్బాబు తల్లి బిక్కుమళ్ల మంజుల తెలిపారు. సోమవారం ఆమె ‘సాక్షి’తో పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే..2020లో గల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో నా కుమారుడు కల్నల్ సంతోష్బాబు వీర మరణం పొందాడు. అలాంటి మహానుభావుడి తల్లినైనందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. నా కుమారుడు మృతిచెందిన సమయంలో అప్పటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీష్రెడ్డి మా కుటుంబానికి ఎంతో అండగా నిలిచారు. కేసీఆర్పై ఉన్న మమకారం, ఆయన చేసిన గొప్ప అభివృద్ధి పనులకు ఆకర్షితురాలినై బీఆర్ఎస్ నుంచి 44వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. గెలుస్తాననే నమ్మకం ఉంది..ప్రస్తుతం ప్రచారం సైతం నిర్వహిస్తున్నాను. వార్డులో నాకు మంచి స్పందన వస్తుంది. నేను తప్పకుండా గెలుస్తానని వార్డు ప్రజలు చెబుతున్నారు. నాకు బీఆర్ఎస్ నుంచి పూర్తి సహకారం ఉంది. అదేవిధంగా నా భర్త ఉపేందర్తో పాటు కుటుంబ సభ్యులు సైతం పోటీ చేసేందుకు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. కౌన్సిలర్గా గెలిపిస్తే 44వ వార్డులో ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తా. -
వీడని పులి భయం
తుర్కపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం పులి.. ఈ పేరు వింటేనే ప్రజలు వణికి పోతున్నారు. రెండు వారాలుగా తుర్కపల్లి మండల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఎప్పుడు ఏ ప్రాంతానికి వస్తుందో, ఎవరి మూగజీవాలపై దాడి చేస్తుందో అంతుచిక్కని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. రైతులు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పులి సంచారం నేపథ్యంలో తుర్కపల్లి మండలంలోని ప్రభావిత గ్రామాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. తుర్కపల్లి: పులి సంచారం తుర్కపల్లి మండల పరిధిలోని అటవీ ప్రాంత పరిసర గ్రామాల్లో కలకలం రేపుతోంది. పశువులపై దాడి చేసి చంపుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈనెల 17న తుర్కపల్లి మండలంలోని ఇబ్రహీంపురం గ్రామ శివారులో పులి సంచరించినట్టు ఆనవాళ్లు గుర్తించారు. అదేరోజు గ్రామంలో మాటూరి కృష్ణకు చెందిన లేగ దూడపై దాడి చేసి చంపింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పక్కపక్క పొలాల రైతులు కలిసి కర్రలు పట్టుకొని ఉదయం వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి సాయంత్రం 4గంటల లోపే ఇళ్లకు చేరుకుంటున్నారు. బావులు, రహదారుల వెంట ఏదైనా అలికిడి జరిగినట్లు సమాచారం వస్తే వెంటనే సుమారు 20 మంది యువకులు కలిసి కర్రలతో వెళ్లి చూసివస్తున్నారు. ఊరి బయట పహారా ఈనెల 20, 21 తేదీల్లో దత్తాయిపల్లి శివారులో రైతు గొట్టి శ్రీశైలానికి చెందిన లేగదూడతో పాటు రెండు ఆవులను చంపింది. పులిసంచరిస్తోంది.. బావుల వద్దకు వెళ్లవద్దని గ్రామంలో సర్పంచ్ కరుణాకర్ టాంటాం వేయించాడు. అడవులకు దగ్గరగా ఉన్న బావుల వద్దకు ఐదారుగురు రైతులు కలిసి వెళ్తున్నారు. రైతులు బావుల వద్దకు వెళ్ల కుండా సాయంత్రం 5గంటల నుంచి ఆరు గంటల వరకు గ్రామ సమీపంలోని రహదారి వెంట సర్పంచ్, యువకులు పహారా కాస్తున్నారు. అటవీ అధికారులు రోజూ వచ్చి పర్యవేక్షణ చేస్తున్నారు. మధ్యాహ్నం 3గంటలైతే బయటికి రాని జనం తిరుమలపురంలో నాలుగు రోజుల క్రితం ఐనాల మహేందర్రెడ్డి బావి వద్ద పులి పాదముద్రలు గుర్తించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి పులి కాలిగుర్తులే అని నిర్ధారించారు. అస్మాయికుంటు గుట్టల్లో పులి ఉండొచ్చని తిరుమలపురం, శ్రీనివాసపురం, కొండాపురంలలో అధికారులు టాంటాం వేయించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు మధ్యాహ్నం 3గంటలు అయ్యిందంటే ఎవరూ ఇళ్లనుంచి బయటి రావడంలేదు. పశువులను పొలాల నుంచి ఇళ్ల వద్దకే తీసుకొస్తున్నారు. ఫ ఇప్పటికే పులి దాడిలో రెండేసి ఆవులు, లేగదూడల మృతి ఫ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న జనం ఫ ఐదారుగురు కలిసి పొలాల వద్దకు వెళ్తున్న రైతులు ఫ సాయంత్రం అయ్యిందంటే గడపదాటని వైనం -
కమణీయం.. పూర్వగిరీశుడి కల్యాణం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవాన్ని అర్చకులు వైభవంగా జరిపించారు. గజవాహనంపై స్వామివారిని, ప్రత్యేక పల్లకీపై శ్రీలక్ష్మి అమ్మవారిని అధిష్ఠించి ఆలయ పురవీధుల్లో ఊరేగిస్తూ కల్యాణ మండపానికి తీసుకొచ్చి కల్యాణ తంతు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ, ఆలయాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం హనుమంత వాహనంపై... బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 8గంటలకు నిత్య ప్రబంధ పారాయణములు, నిత్య హవనములు, మూల, మూర్తిమంత్ర అనుష్టానములు, హవనం పూజలు జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవారికి తిరుమంజన మహోత్సవం నిర్వహించారు. కల్యాణమూర్తులైన లక్ష్మీనరసింహస్వామి, అమ్మవారిని ఆలయ పుర వీధుల్లో హనుమంత వాహనంపై ఊరేగించారు. ఆస్థాన మండపంలో హనుమంత వాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. నేడు రథోత్సవం.. ఆదివారం ఉదయం 8గంటలకు హవనం పూజలు నిర్వహిస్తారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. రాత్రి 8గంటలకు రథోత్సవం జరిపించనున్నారు. ఫ హనుమంత వాహనంపై స్వామి ఊరేగింపు ఫ నేడు దివ్య విమాన రథోత్సవం -
దేశంలో మొదటగా ‘పేట’లోనే..
సూర్యాపేట : తడి, పొడి చెత్తను వేరు చేసి సేకరించే వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టిన సూర్యాపేట మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2004లో దేశంలోనే ఉత్తమ మున్సిపాలిటీ అవార్డును అందుకుంది. సూర్యాపేటలో అనుసరించిన ఈ విధానాన్ని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని మున్సి పాలిటీల్లో అమలు చేస్తున్నారు. వివిధ విభా గాల్లో ఉత్తమ పనితీరు ప్రదర్శించడంతో మరో మూడు జాతీయ అవార్డులు అందుకుంది. సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో వినూత్న విధానాలు అమలు చేస్తూ దేశవ్యాప్తంగా ఖ్యాతిని ఆర్జించింది. దేశంలో ఏ మున్సిపాలిటీ అమలు చేయని విధంగా తడి, పొడి చెత్త విధానాన్ని మొదటి సారిగా సూర్యాపేటలో అమలు చేశారు. దాంతో పాటు దానిని పకడ్బందీగా నిర్వహించడం, సేకరించిన చెత్తను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతానికి తరలించడం వంటి చర్యల ద్వారా ఈ విధానం జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షించింది. దాంతో పాటు సుప్రీం కోర్టు కూడా మున్సిపాలిటీ కృషిని ప్రసంసించింది. జుట్టుకొండ సత్యనారాయణ రెండు పర్యాయాలు (1995– 2000, 2000–2005 వరకు) బీజేపీ కౌన్సిలర్గా గెలిచిన టీడీపీ మద్దతుతో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా పని చేశారు. ఆయన రెండో సారి చైర్మన్గా ఎన్నికై న సమయంలో దేశంలో ఎన్డీయే ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. విదేశాల్లో జరుగుతున్న పట్టణాభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు 2వేల సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లతో కూడిన బృందాన్ని ఽథాయిలాండ్, సింగపూర్, బ్యాంకాక్, ఇండోనేషియాకు పంపించింది. ఈ బృందం 15 రోజుల పాటు పర్యటించింది. దాంతో పాటు ట్రాన్స్పోర్ట్, ట్రాఫిక్, డ్రింకింగ్ వాటర్, పట్టణ ప్రగతిని పరిశీలించేందుకు 2002లో చైనా, హంకాంగ్, థాయిలాండ్ దేశాలకు బృందాన్ని పంపించింది. ఈ రెండుసార్లు కూడా సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా ఉన్న జుట్టుకొండ సత్యనారాయణకు అవకాశం దక్కింది. వివిధ దేశాల్లో పట్టణాభివృద్ధిని పరిశీలించి వచ్చిన జుట్టుకొండ సత్యనారాయణ సూర్యాపేట మున్సిపాలిటీని పరిశుభ్రంగా మార్చేందుకు చెత్త సేకరణ చేయాలని నిర్ణయించారు. అందులోనూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి వీధులను పరిశుభ్రంగా ఉంచాలని నిర్ణయించారు. అందులో భాగంగా అప్పట్లో రూ.50 లక్షల నిధులతో 8 ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. అప్పటికి మున్సిపాలిటీలో ఉన్న 100 మంది రెగ్యులర్ సిబ్బందితో పాటు మరో 150 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించారు. వీతో పట్ణణంలోని ప్రతి వీధికి, ప్రతి ఇంటికీ ట్రాక్టర్లో తిరుగుతూ విజిల్ వేస్తూ మరీ తడి, పొడి చెత్తలను సేకరించారు. ఇందుకోసం ప్రతి ఇంటికి రెండు రకాల చెత్త బుట్టలను పంపిణీ చేశారు. దాంతో పాటు పచ్చదనం, పరిశుభ్రత వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఈ విధానాన్ని అమలు చేసిన సూర్యాపేట మున్సిపాలిటీకి 2004లో జాతీయ ఉత్తమ మున్సిపాలిటీ అవార్డు దక్కింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి చేతుల మీదుగా అప్పటి కమిషనర్ ఖాదర్సాబ్ అవార్డును అందుకున్నారు. తడి, పొడి చెత్త విధానంలో సూర్యాపేట మున్సిపాలిటీ చేస్తున్న కృషి దేశవ్యాప్తంగా పేరు తీసుకొచ్చింది. సుప్రీం కోర్టు కూడా నూతన పారిశుద్ధ్య విధానం బాగుందని, సూర్యాపేట దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ప్రసంశించింది. దేశంలోని అన్ని మున్సిపాలిటీలు ఇదే విధానాన్ని అమలు చేసి పరిశుభ్రతను పాటించేలా చూడాలని సూచించింది. దాంతో ఉమ్మడి రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మున్సిపాలిటీల బృందాలు సూర్యాపేటకు వచ్చి ఇక్కడ అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేశాయి. ఒక సంవత్సర కాలంలోనూ సుమారు 200 బృందాలు సూర్యాపేటలో పర్యటించాయి. ఫ ఆనాటి చైర్మన్ జుట్టుకొండ వినూత్న ఆలోచన ఫ 2004లో మున్సిపాలిటీకి జాతీయ పురస్కారం ఫ సూర్యాపేటను సందర్శించిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులు -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. శనివారం ఉదయాన్నే ఆలయాన్ని తీసిన అర్చకులు సుప్రఽభాతం, ఆరాధన నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ మూర్తులకు నిజాభిషేకం జరిపించి, అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు నిర్వహించి, అనంతరం గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు భక్తుల నడుమన చేపట్టారు. ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు అష్టోత్తర, సువర్ణ పుష్పార్చన పూజలు చేశారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. రాత్రికి శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి ద్వార బంధనం చేశారు. -
నేటి ప్రజావాణి రద్దు
భువనగిరిటౌన్ : మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలు గమనించి వివిధ సమస్యల పై అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్కు రావొద్దని సూచించారు. దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తుల ఆహ్వానం భువనగిరిటౌన్ : దివ్యాంగుల ఉపకరణాల కోసం 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని అర్హులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె. నరసింహారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు గడువును వచ్చె నెల 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఓబీ ఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖా స్తులు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య రక్షణకు టీకా భువనగిరి: జిల్లా వ్యాప్తంగా వైద్యులు, సిబ్బందికి ఆరోగ్య రక్షణ కోసం హెపటైటిస్బీ టీకాకు సంబంధించి మొదటి డోసు శనివారం వేశారు. హెపటైటిస్ వ్యాది ఎక్కువగా సాధారణ ప్రజలకంటే వైద్యసేవలందించే వారికే సోకే అవకాశం ఉంటుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్యులు, సిబ్బందికి హెపటైటిస్ టీకా అందించేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 21ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 143 సబ్ సెంటర్లలో పనిచేస్తున్న 642 మంది హెల్కేర్ వర్కర్స్కు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో హెపటైటిస్ టీకాకు సంబందించి మొదటి డోసు ఇచ్చారు. పూర్వ విద్యార్థుల సహకారం అభినందనీయంమోటకొండూర్ : పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకారం అందించడం అభినందనీయమని డీఈఓ సత్యనారాయణ పేర్కొన్నారు. మోటకొండూర్ మండలంలోని చాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 130వ వార్షికోత్సవాన్ని స్థానిక స్కూల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆర్థిక సహకారంతో ఎలక్ట్రిక్ కేబుల్, బోర్ మోటార్, కంప్యూటర్, కళావేదిక నిర్మాణం, బెంచీలు, ప్రొజెక్టర్, పాఠశాలకు రంగులతో చిత్రాలు వేయించి కొత్త శోభను తీసుకువచ్చారు. అనంతరం ఉపాధ్యాయులకు, పూర్వ విద్యార్థులకు శాలువాలు మెమొంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మోర బాలగంగాధర్రెడ్డి, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ ఎండీ టీవి చౌదరి, ఎస్ఐ అశోక్, జెక్క రోషిరెడ్డి, బేతి వెంకటేశ్వర్లు, సిగ విజయ్ గౌడ్, గ్రామసర్పంచ్ ఆకుల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సమగ్ర విచారణ చేయాలని సీఎంకు లేఖయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఉద్యోగులు, అధికారుల అవినీతిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ తెలిపారు. ఇటీవల యాదగిరి క్షేత్రంలో జరిగిన బంగారు, వెండి డాలర్ల అపహరణపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ యాదగిరిగుట్ట పట్టణంలోని వైకుంఠద్వారం వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, నాయకులు ఈశ్వర్రెడ్డి, ఉస్మాన్ షరీఫ్, సీస శ్రీనివాస్, మల్లయ్య, జానీ, శ్రీశైలం, నగేష్, అనిల్ తదితరులున్నారు. -
ఒప్పించడం తలనొప్పే!
సాక్షి యాదాద్రి : నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బుజ్జగింపుల పర్వానికి రాజకీయ పార్టీలు తెరలేపాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పెద్ద సంఖ్యలో ఆశావహులు పోటీకి దిగారు. కచ్చితంగా బరిలో ఉంటామని స్పష్టం చేయడం.. పార్టీల నేతలకు సమస్యగా మారింది. బీఫాం ఎవరికి ఇవ్వాలి.. ఎవరిని పోటీ నుంచి తప్పించాలో అర్థకాని పరిస్థితి నెలకొంది. టికెట్లు లభించని వారిని సముదాయించి పార్టీ అభ్యర్థికి ప్రచారం చేసేలా ఒప్పించడం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే అన్నిచోట్లా అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం చేస్తున్నాయి. ● చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు. ఆశావహులు మాత్రం నామినేషన్లు వేశారు. పార్టీ సమన్వయ కర్త చింతల వెంకటేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిలు అభ్యర్థులను ఎంపిక చేయడంలో తలమునకలయ్యారు. కాంగ్రెస్ నుంచి అన్ని వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మూడు, నాలుగు వార్డులు మినహా మిగతా వార్డుల్లో స్పష్టత లేదు. బీజేపీ నుంచి సైతం వార్డుల్లో నామినేషన్లు వేశారు. ఈ పార్టీలోనూ మూడు, నాలుగు స్థానాలు మినహా మిగతా వార్డుల్లో స్పష్టత రావాల్సి ఉంది. ● ఆలేరు మొత్తం 12 వార్డులకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాయి. ఏ పార్టీలోనూ రెబల్స్ బెడద లేకుండా అభ్యర్థులను ప్రకటించారు. వారందరూ నామినేషన్లు దాఖలు చేశారు. బీసీ మహిళకు రిజర్వ్ అయినందున చైర్ పర్సన్ అభ్యర్థులను ఏ పార్టీ కూడా ప్రకటించలేదు. అయితే డమ్మీ అభ్యర్థులు వేసిన నామినేషన్లు ఉపసంహరణ కావాల్సి ఉంది. ● భూదాన్ పోచంపల్లి ´ù^èl…-ç³-ÍÏ Ð]l¬°Þ´ë-Ísîæ-ÌZ 13 ÐéÆý‡$z-ÌSMýS$ M>…{VðS-‹Ü ´ëÈt 9 ÐéÆý‡$z-ÌSMýS$ A¿ýæÅ-Æý‡$¦-ÌS¯]l$ A«¨M>Ç-MýS…-V> {ç³MýS-sìæ…_…¨. Ñ$VýS-™é ¯éË$VýS$ Ý릯éÌSMýS$ M>…{VðS-‹Ü ´ëÈtMìS ^ðl…¨¯]l C§ýlªÆý‡$, Ð]l¬VýS$YÆý‡$ ¯éÑ$¯ól-çÙ¯ŒS ÐólÔ>-Æý‡$.️ ½BÆŠ‡-G‹Ü ´ëÈt ¯]l$…_ A¿ýæÅ-Æý‡$¦-ÌS¯]l$ GÐ]l-ǰ MýS*yé A«¨M>Ç-MýS…-V> {ç³MýS-sìæ…^èl-MýS-´ù-Ð]l-yýl…-™ø JMöPMýSP ÐéÆý‡$z ¯]l$…_ BÔ>-çßæ$-Ë$ C§ýlªÆý‡$, Ð]l¬VýS$Y-Æó‡íÜ ¯éÑ$¯ól-çÙ¯]l$Ï §éQË$ ^ólÔ>Æý‡$. Ð]l$Ç Mö…§ýlÆý‡$ JMýSsìæ MýS…sôæ GMýS$PÐ]l ÐéÆý‡$z-ÌZÏ ¯éÑ$¯ól-çÙ¯ŒS ÐólÔ>Æý‡$. GÐðl$ÃÌôæÅ MýS$…¿ýæ… A°ÌŒæ-MýS$-Ð]l*-ÆŠ‡-Æð‡yìlz, Ð]l*i GÐðl$ÃÌôæÅ Oò³âýæÏ ÔóæQÆŠ‡-Æð‡yìlz ™èlÐ]l$ A¿ýæÅ-Æý‡$¦ÌS {ç³MýS-r¯]l-ÌZ Ð]lNÅà™èlÃ-MýS…-V> Ð]lÅÐ]l-çßæ-ÇçÜ$¢-¯é²Æý‡$. ● యాదగిరిగుట్ట మున్సిపాలిటిలో కాంగ్రెస్ , సీపీఐ పొత్తులు పెట్టుకున్నాయి. దీంతో 11 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో సీపీఐ అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్ 10 వార్డుల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా రెండు వార్డుల్లో ప్రకటించాల్సి ఉంది. బీజేపీ 10 వార్డుల్లో నామినేషన్లు వేసినప్పటికీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐలకు చెందిన అభ్యర్థులు ఎక్కడా రెబల్స్గా నామినేషన్లు వేయలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా 10వ వార్డులో పోటీ చేస్తున్న గుండ్లపల్లి వాణి భరత్గౌడ్ను ప్రకటించారు. ఇక బీఆర్ఎస్, బీజేపీలు చైర్మన్ అభ్యర్థులను ప్రకటించలేదు. ఫ మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నామినేషన్లు ఫ బరిలోనే ఉంటామంటున్న ఆశావహులు ఫ నచ్చజెప్పే పనిలో నాయకులు ఫ భవిష్యత్లో న్యాయం చేస్తామంటూ హామీలు భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 32 మంది అభ్యర్థులను ప్రకటించింది. అసమ్మతి నేతలతో కలిపి 91 అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్లు వేశారు. అసమ్మతి లేకుండా చేయడానికి ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి చర్చలు జరుపుతున్నారు. బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి 35 వార్డులకు అభ్యర్థులను ప్రకటించారు. బీఆర్ఎస్, సీపీఎం, సీపీఎం కలిసి పోటీ చేస్తున్నాయి. ప్రతి వార్డుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున 82 మంది నామినేషన్లు వేశారు. బీజేపీ నుంచి 77 మంది నామినేషన్ వేశారు. కాగా ఇప్పటి వరకు ఏ పార్టీ అభ్యర్థికి బీ ఫాం ఇవ్వలేదు. పోటీలో ఉన్న రెబల్స్ ను బుజ్జగించే పనిలో ఉన్నారు. రెండు నామినేషన్ల తిరస్కరణభువనగిరి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పరిశీలన శనివారం ముగిసింది. ఆరు మున్సిపాలిటీల్లో 786 నామినేషన్లు దాఖలు కాగా అందులో భువనగిరిలో రెండు తిరస్కరణకు గురయ్యాయి. 545 మంది అభ్యర్థులకు చెందిన 784 నామినేషన్ల సవ్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మోత్కూర్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. 12 వార్డులకు107 నామినేషన్లు వేశారు. చైర్మన్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో వివిధ పార్టీల ముఖ్యనేతలు వైస్ చైర్మన్ కోసం పోటాపోటీగా నామినేషన్లు వేశారు. చైర్మన్ అభ్యర్థిని ప్రకటించక పోయినా బీసీ, జనరల్ అభ్యర్థులు వైస్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలని చూస్తున్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ .. పార్టీ నేతలతో మాట్లాడి బుజ్జగిస్తున్నారు. కాంగ్రెస్లో టికెట్ దక్కని రెబల్స్ను తమపార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ ముందుగా అభ్యర్థుల పేర్లు ప్రకటించకుండా జాగ్రత్త పడుతోంది. టికెట్ రాని వారు బీఆర్ఎస్, లేదా ఇండిపెండెంట్గా రంగంలోకిదిగే అవకాశం ఉందని అధికార పార్టీ అనుమానిస్తోంది. విత్ డ్రా తర్వాత చివరి క్షణంలో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. -
హైస్పీడ్ ఉంటుందా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాలోని కీలక రైల్వే ప్రాజెక్టులకు ఏ మేరకు నిధులు వస్తాయో నేడు తేలనుంది. ఆదివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఏటా బడ్జెట్ సమయంలో జిల్లాకు కావాల్సిన రైల్వే లైన్లు, రైళ్ల విస్తరణకు ఉమ్మడి జిల్లా ఎంపీలు విజ్ఞప్తులు చేస్తున్నా కేటాయింపులు పెద్దగా ఉండటం లేదు. ఈ సారైనా ఎంతమేర ప్రయోజనం చేకూరుతుందో అన్న అంచనాల్లో ప్రజలు ఉన్నారు. శంషాబాద్ నుంచి విశాఖపట్నం హైస్పీడ్ రైల్వే కారిడార్కు కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రిలిమినరీ ఇంజనీరింగ్ ట్రాఫిక్ (పెట్) సర్వేను నిర్వహించింది. ఇది ఆచరణలోకి వస్తే గంటకు 220 కిలోమీటర్ల వేగంతో నడిచే హైస్పీడ్ రైల్ శంషాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా విశాఖపట్నానికి దాదాపు 4 గంటల్లో చేరుతుంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు రైల్వే కనెక్టివిటీ లేని వివిధ ప్రాంతాలకు రైల్వే సౌకర్యం ఏర్పడనుంది. ఒకలైన్ శంషాబాద్ నుంచి గట్టుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, నకిరేకల్, సూర్యాపేట జిలా కేంద్రం, కోదాడ, జగ్గయ్యపేట, విజయవాడ మీదుగా విశాఖపట్టణం చేరనుండగా, మరొక లైన్ విశాఖపట్టణం నుంచి విజయవాడ, జగ్గయ్యపేట, సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల మీదుగా కర్నూల్కు చేరేలా రైల్వే లైన్కు సర్వే చేపట్టింది. అయితే ఈ బడ్జెట్లో దానికి సంబంధించిన పనులకు నిధులను కేటాయించస్తుందా? లేదా? నేడు తేలనుంది. హైదరాబాద్ – విజయవాడ మధ్యలో జాతీయ రహదారి వెంట రైల్ ప్రతిపాదనలకు కూడా ఏళ్లుగా మోక్షం లభించడం లేదు. గతంలో నల్లగొండ ఎంపీగా పని చేసిన మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి పలుమార్లు కేంద్రానికి, రైల్వే బోర్డుకు, దక్షిణ మధ్య రైల్వేకు దీనిపై లేఖలు రాశారు. ఆ తరువాత వచ్చిన ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి కూడా జాతీయ రహదారి వెంట రైల్ మార్గం కావాలని కేంద్రాన్ని కోరారు. దీనికి సంబంధించిన సర్వేకు ఈసారైనా చర్యలు చేపడతారా? లేదా? చూడాల్సిందే. ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్–2లో 33 కిలోమీటర్ల పొడవునా విస్తరించేందుకు చర్యలు చేపట్టినా ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. వాటికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. అలాగే ఎంఎంటీఎస్ను జనగామ వరకు పొడగించాలనే డిమాండ్పై ఇప్పటికై నా స్పందిస్తుందా? లేదా అన్నది తేలాల్సి ఉంది. సికింద్రాబాద్ – యాదాద్రి–కాజిపేట మధ్య 3వ, 4వ లైన్లు 2026 జనవరిలో నోటిఫై అయ్యాయి. కానీ వాటికి సంబంధించిన పనులు ముందుకు సాగడం లేదు. వాటికి సంబంధించిన చర్యలు చేపట్టాల్సి ఉంది.ఫ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు వచ్చేనా.. ఫ జాతీయ రహదారి వెంట రైలు కూత పెట్టేదెన్నడో ఫ కలగానే శంషాబాద్–విశాఖపట్నం హైస్పీడ్ రైల్ యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు రైల్వే ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఎంఎంటీఎస్ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు వెంట రైల్కు ఏ మేరకు నిధులు ఇస్తుందో చూడాలి. 392 కిలోమీటర్ల పొడవునా యాదాద్రి భువనగిరి సహా పలు జిల్లాలను కలిపే ఈ రైల్వే లైన్ అంచనా ఖర్చు రూ.12,408 – రూ.24,000 కోట్లు. ప్రస్తుతం ఫైనల్ లొకేషన్ సర్వే, లిడార్ సర్వేలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి కేంద్రం ఎలాంటి నిర్ణయం వెలువరించబోతుందన్నది నేడు తేలనుంది. ఇప్పటికే డోర్నకల్ నుంచి గద్వాల వరకు కొత్త రైల్వే లైన్కు పైనల్ లొకేషన్ సర్వేకు (ఎఫ్ఎల్ఎస్) రైల్వే బోర్డు గతంలో ఆమోదం తెలిపింది. సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా 296 కిలోమీటర్ల పొడవున డోర్నకల్– గద్వాల మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కోసం ఎఫ్ఎల్ఎస్ చేపట్టేందుకు గతంలో రూ.7.40 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. తప్ప విడుదల కాలేదు. ఇక మాచర్ల – నల్లగొండకు 92 కిలో మీటర్ల కొత్త రైల్వే లైన్ను రూ.458.26 కోట్లతో చేపట్టేందుకు ఎప్పుడో ఆమోదించిన కేంద్రం 2023 బడ్జెట్లో రూ.35.35 కోట్లు కేటాయించింది. అందులో రూ.11.30 లక్షలు ఖర్చు చేసింది. ఆ తరువాత నిధులు ఇవ్వలేదు. -
పులి దాడిలో రెండు ఆవులు, లేగ దూడ చనిపోయాయి
గ్రామ శివారులో పశువులను మేపుతుండగా పులి వచ్చి పశువులపై దాడి చేసింది. లేగ దూడను చంపింది. పులిని చూసి ఊళ్లోకి పరుగెత్తాను. నాతోపాటు మా రెండు ఆవులు అటవీ పాంత్రంలోకి పరుగులు తీశాయి. వాటిని కూడా పులే చంపి తిన్నదని అధికారులు సమాచారం ఇచ్చారు. – గొట్టి శ్రీశైలం, రైతు, దత్తాయిపల్లి, తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తుండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులిని బంధించేందుకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. పులి ఎక్కడెక్కడ తిరుగుతుందో అటవీ శాఖ గుర్తించి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి. – సర్పంచ్ జేరిపోతుల కరుణాకర్, దత్తాయపల్లి


