Yadadri
-
సులభంగా నేర్చుకోవచ్చు
భువనగిరి : మండలంలోని తుక్కాపురం ప్రాథమిక పాఠశాలలో ఏఐ ఆధారిత బోధన కార్యక్రమాన్ని శనివారం జిల్లా సెక్టోరియల్ అధికారి పెసరు లింగారెడ్డి ప్రారంభించారు. ఏఐ బోధనతో వెనుకబడిన విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందన్నారు. రాయడం, చదవడం సులభంగా నేర్చుకోచ్చన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ఏఐ ఆధారిత బోధన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈవిధానం చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడు రాఘవరెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపోధ్యాయుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు సదానంద, జనార్దన్, బ్రహ్మచారి, బుచ్చిరెడ్డి, లక్ష్మణ్బాబు, పద్మ, సునీత పాల్గొన్నారు. -
‘కృత్రిమ మేధ’ తో విషయ పరిజ్ఞానం
బీబీనగర్: విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంపొందింపజేసే విధంగా జ్ఞాపక శక్తితో కూడిన విద్యను అందించాలని కలెక్టర్ హనుమంతరావు ఉపాధ్యాయులకు సూచించారు. బీబీనగర్ మండలం జమీలాపేట జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్–ఏఐ)తో కూడిన బోధన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కంప్యూటర్ ద్వారా ఆర్టిఫీషి యల్ ఇంటిలిజెన్స్ తీరును పరిశీలించారు. విద్యార్థులు గణిత శాస్త్రంలో ప్రగతిని సాధించేందుకు ఉపయోగిస్తున్న ఏఐ టెక్నాలజీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం రాయరావుపేట నుంచి నెమురగొముల వైపు ప్రవహిస్తున్న అండర్గ్రౌండ్ డ్రెయినేజీని పరిశీలించారు.ఇరు గ్రామాల మధ్య సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. కలెక్టర్ హనుమంతరావు -
వృథా అరికట్టకపోతే కటకటే!
సాక్షి, యాదాద్రి : భానుడు రోజురోజుకూ మండిపోతున్నాడు. భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో మంచినీటి ఎద్దడి తరుముకొస్తోంది. మిషన్ భగీరథ నీరు డిమాండ్కు అనుగుణంగా సప్లయ్ కాకపోగా.. వచ్చే నీటిలోనూ కొంతమేర లీకేజీలు, సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పుడు వృథా అవుతోంది. ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించిన యంత్రాంగం.. జిల్లాలోని 17 మండలాల్లో నీటి సరఫరా స్థితిగతులను పరిగణలోకి తీసుకుని సమస్యను అధిగమించేందుకు యాక్షన్ప్లాన్ రూపొందించింది. అవసరమైన చోట ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకోవాలని, ట్యాంకర్ల దారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా నీటి వృథాను అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలకు ఉపక్రమించింది. 719 ఆవాసాలకు భగీరథ నీరుజిల్లాలోని 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలోని 719 అవాసాలకు మిషన్ భగీరథ సరఫరా జరుగుతుంది. ఇందులో 512 ఆవాసాలకు హైదారాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా, 131 ఆవాసాలకు అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, 69 గ్రామాలకు నల్లగొండ ఉదయసముద్రం నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. డిమాండ్కు అనుగుణంగా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 14 ఎంఎల్డీలు, ఉదయ సముద్రం నుంచి 10.8 ఎంఎల్డీల నీరు ప్రతి రోజూ సరఫరా జరుగుతోంది. ఇక హైదారాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా నిత్యం 80.51 ఎంఎల్డీల నీరు రావాల్సి ఉండగా కొద్ది రోజులుగా 47.75 ఎంఎల్డీలు మాత్రమే వస్తుంది. నల్లా కనెక్షన్లు, ట్యాంకులు ఇలా..జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 1,221 ట్యాంకులు, 353 చేతిపంపులు, 33 బావుల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మొత్తం 1,56,147 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా 642 ఇళ్లకు నల్లాలు లేకపోవడంతో వాటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డెక్కుతున్న జనంనీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో జనం ఆందోళనకు దిగుతున్నారు. భువనగిరి మండలం హన్మాపురంలో నీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు ఇటీవల రోడ్డెక్కారు. అదే విధంగా వడపర్తి గ్రామస్తులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. 167 ఆవాసాల్లో ముప్పు వేసవిలో నీటి ముప్పును గ్రహించిన మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ విభాగం అధికారులు ఫిబ్రవరిలోనే క్షేత్రస్థాయిలో సర్వే చేసి నీటి ఎద్దడి పొంచి ఉన్న ప్రాంతాలను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 167 ఆవాసాల్లో ముప్పు ఉందని అంచనా వేశారు. ఈ మేరకు ముందస్తుగానే ప్రత్యామ్నా చర్యలు చేపట్టారు. పుట్టగూడెం, మల్లాపూర్, చాకంపల్లి, ధర్మోజిగూడెం, దేశ్ముఖ్, ఎం,తుర్కపల్లి, జనగాం, శ్రీనివాసపురం గ్రామాల్లో ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకున్నారు. అవసరాన్ని బట్టి మరికొన్ని బోర్లను అద్దెకు తీసుకోనున్నారు. వేసవి ప్రారంభంతోనే తాగునీటి ఎద్దడి డిమాండ్ మేరకు సరఫరా కాని మిషన్ భగీరథ జలాలు పైపులైన్ లీకేజీలు, సాంకేతిక సమస్యలు పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ రూపొందించిన యంత్రాంగం అవసరమైన చోట అద్దెబోర్లు, అదనపు పైపులైన్ల ఏర్పాటు ట్యాంకర్లతో సరఫరా చేయాలని నిర్ణయంనీటిని వృథా చేయొద్దు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా డిమాండ్కు అనుగుణంగా నీటి సరఫరా జరగడం లేదు. రోజూ వచ్చే నీటిలో దాదాపు సగానికి తగ్గాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తుతోంది. సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. అవసరమైన ప్రాంతాల్లో అద్దె బోర్లు తీసుకుంటున్నాం. అదనపు పైప్లైన్లు వేస్తున్నాం. నీటిని వృథాగా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. – కరుణాకర్, మిషన్ భగీరథ ఈఈఅప్రమత్తంగా ఉండాలి బీబీనగర్ : తాగునీటి సరఫరా విషయంలో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ శోభారాణి సూచించారు. బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామంలో ఆమె శనివారం పర్యటించారు. గ్రామంలో తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. నిరుపయోగంగా ఉన్న బోర్లను పరిశీలించారు. ప్రతి ఇంటికీ నీటి స్వచ్ఛమైన నీటి సరఫరా జరగాలన్నారు. ఆమె వెంట ఏంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రవికిరణ్, పంచాయతీ కార్యదర్శి బాలలక్ష్మి ఉన్నారు. -
ఫిర్యాదు చేస్తే పది రోజుల్లోనే పరిష్కారం
భువనగిరి : ఇంటి పన్ను ఎక్కువగా వస్తుందా.. పన్నుల విధింపులో లోపాలున్నాయా.. ఒకే ఇంటికి రెండు నంబర్లు ఉన్నాయా.. ఇలాంటి సమస్యలు పరిష్కరించేందుకు మున్సిపల్ యంత్రాంగం రెవెన్యూ మేళాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. ఈనెలాఖరు వరకు మేళాలు కొనసాగనున్నాయి. ఎక్కువగా ఉన్న సమస్యలు ఇవీ.. జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూర్, భూదాన్పోచంపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 37,126 నిర్మాణాలు ఉన్నాయి. ప్రధానంగా ఆస్తిపన్ను ఎక్కువగా వస్తుందని, తప్పుడు కొలతలు, ఒకే ఇంటికి రెండు నంబర్లు, ఇంటి నంబర్ ఆన్లైన్లో నమోదు కాకపోవడం, యజమాని పేరు మార్పిడి, నివాస గృహాలకు వాణిజ్య పన్ను రావడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు రివిజన్ పిటిషన్లూ పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు అన్ని మున్సిపాలిటీల్లో రెవెన్యూ మేళాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సోమ, గురువారాల్లో మార్చి 31వ తేదీ వరకు మేళాలు నిర్వహించనున్నారు. వాటిలో దరఖాస్తు చేసుకుంటే సమస్యను పరిష్కరిస్తారు. మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు టోల్ ఫ్రీ నంబర్ను కూడా అందుబాటులో ఉంచారు.సద్వినియోగం చేసుకోవాలి ఆస్తి పన్ను, నీటి పన్ను చెల్లింపు, మదింపునకు సంబంధించి సమస్యలు ఉంటే రెవెన్యూ మేళాలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తాం. ప్రతి సోమ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారులు అందుబాటు ఉంటారు. రెవెన్యూ మేళాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – రామలింగం, భువనగిరి మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీల్లో రెవెన్యూ మేళాలు ప్రతి సోమ, గురువారాల్లో ఉదయం 10నుంచి ఒంటి గంట వరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ సందేహాల నివృత్తికి సంప్రదించాల్సిన నంబర్ 63042 34141ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి సమస్య పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు అందకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా జతపర్చాల్సి ఉంటుంది. డోర్ నంబర్ కోసం : అసెస్మెంట్ కాపీ పేరు మార్పునకు: మ్యుటేషన్ కాపీ లేదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇల్లు తీసేసినట్టయితే ఇంటి పన్ను రద్దు కోసం: ఫొటో, చివరిగా చెల్లించిన ఇంటి పన్ను రశీదు ఇంటి పన్ను ఎక్కువ వచ్చినట్లయితే : అసెస్మెంట్ కాపీ, ఇంటి ఫొటో, సంబంధిత డాక్యుమెంట్ డబుల్ అసెస్మెంట్ : ఇంటి నిర్మాణ అ నుమతి,అసెస్మెంట్ నంబర్, మొదటగా చెల్లించిన ఇంటి పన్ను రశీదు.నిర్మాణాలు ఇలా.. మున్సిపాలిటీ నిర్మాణాలు భువనగిరి 14,245చౌటుప్పల్ 6,675ఆలేరు 4,124యాదగిరిటుట్ట 4,354పోచంపల్లి 3,879మోత్కూర్ 3,849 -
ఇంటర్ పరీక్షలకు 4,590 మంది హాజరు
భువనగిరి : ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన ద్వితీయ సంవత్సరం గణితం జువాలజీ, హిస్టరీ పరీక్షలకు 4,730 మందికి గాను 4,590 మంది హాజరయ్యారు. 140 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. పోరుబాటతో ప్రజా సమస్యలు వెలుగులోకి..యాదగిరిగుట్ట: సీపీఎం చేపట్టిన పోరుబాట కార్యక్రమంతో ప్రజా సమస్యలు వెలుగులోకి వస్తున్నాయని జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో శని వారం నిర్వహించిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కార్ పదేళ్లలో ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని విమర్శించారు. హామీల్లో ఒకటి, రెండు తప్ప ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయన్నారు. పోరుబాటలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈనెల 27, 28, 29 తేదీల్లో తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల ముట్టడి, ఏప్రిల్ రెండవ వారంలో కలెక్టరేట్ ఎదుట 48 గంటల మహాధర్నా నిర్వహిస్తామన్నారు. అంతకుముందు పోరుబాట కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు కల్లూరి మల్లేశం, బబ్బూరి పోశెట్టి, గడ్డం వెంకటేష్, పెద్దకందుకూరు మాజీ సర్పంచ్ భీమగాని రాములు, బీమగాని మాధవి, మండల కమిటీ సభ్యులు కాలే స్వామి తదితరులు పాల్గొన్నారు. రూ.2వేల కోట్లు కేటాయిస్తేనే ప్రయోజనంమోత్కూరు : రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి రూ.2 వేల కోట్లు కేటాయించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మోత్కూరులో జరిగిన చేనేత కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్రిఫ్టు, చేనేత భరోసా పథకాలను ప్రకటించినా ఇప్పటి వరకు కార్యాచరణ రూపొందించలేదన్నారు. గత ప్రభుత్వం చేనేత సహకార సంఘాలను నిర్వీర్యం చేసిందని, కాంగ్రెస్ సర్కార్ కూడా అదే బాటలో నడుస్తుందన్నారు. చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ అప్పు మాఫీ చేయాలని, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోచం కన్నయ్య మాట్లాడుతూ స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చీరలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ, వాటిని నేసే బాధ్యత పవర్లూమ్ యజమానులకు అప్పగించిందన్నారు. సమావేశంలో చేనేత సంఘం నాయకులు వంగరి రాములు, చుంచు లక్ష్మయ్య, వేముల నర్సయ్య, శ్రీనివాస్, దోర్నాల మత్స్యగిరి, జెల్ది సోమయ్య, పెండెం రాజారామ్, ఏలూరి మత్స్యగిరి, పోచం రాము, వాసు పాల్గొన్నారు. జియో ట్యాగ్ నంబర్లు కేటాయించాలని వినతిభువనగిరిటౌన్: జియో ట్యాగింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న చేనేత కార్మికులకు వెంటనే నంబర్లు కేటాయించాలని కోరుతూ చేనేత కార్మిక సంఘం సభ్యలు శనివారం చేనేత, జౌళీ శాఖ ఏడీకి వినతిపత్రం అందజేశారు. జియో ట్యాగింగ్ కోసం జిల్లాలో సుమారు 2వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, నంబర్ కేటాయించకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే జియోట్యాగ్ నంబర్ తప్పనిసరి చేసిందన్నారు.అనంతరం ఏడీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసికంటి లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత బిడ్డలదే
చౌటుప్పల్ : తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను పొందడమే కాదు.. వారి సంరక్షణ, పోషణ బాధ్యత బిడ్డలదేనని సీనియర్ సిటిజన్, తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ ట్రిబ్యునల్ చైర్మన్ వెల్మ శేఖర్రెడ్డి పేర్కొన్నారు. చౌటుప్పల్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన బాధితుల నుంచి అందిన ఫిర్యాదులపై శనివారం ట్రిబ్యునల్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. ఇరుపక్షాలను పిలిపించి వారి వాదనలు విన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తల్లిదండ్రులంటే ఆస్తులు సంపాదించే వరకే అనుకోవడం దుర్మార్గమన్నారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను అనుభవిస్తూ వారి మంచిచెడులను మాత్రంపట్టించుకోకపోవడం సరైందికాదన్నారు. ఆస్తులను తమ పేర రాయించుకుని, తల్లిదండ్రులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే కఠిన తీర్పులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని, లేనిపక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి వస్తుందన్నారు. తల్లిదండ్రులు ట్రిబ్యునల్కు వచ్చి ఫిర్యాదు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ట్రిబ్యునల్ సభ్యుడు, సీనియర్ న్యాయవాది ముత్యాల సత్తిరెడ్డి, సెక్షన్ ఇంచార్జి అధికారి సురేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్, సంరక్షణ, పోషణ ట్రిబ్యునల్ చైర్మన్ శేఖర్రెడ్డి -
ఫీజు బకాయిలు చెల్లించకపోతే పరీక్షలు బంద్
మోత్కూరు : రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు వెంటనే ఫీజు బకాయిలు చెల్లంచాలని, లేనిపక్షంలో వార్షిక పరీక్షలు నిర్వహించబోమని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షుడు మారం నాగిరెడ్డి హెచ్చరించారు. సంఘం కార్యదర్శి ఎం.సైదారావు, ఉపాధ్యక్షుడు సీహెచ్ సత్యంగౌడ్తో కలిసి శనివారం మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, ఎగ్జామ్ కంట్రోలర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోత్కూరులో విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయవద్దని, ఆర్టీఎఫ్ ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తుందని గత, ప్రస్తుత ప్రభుత్వాలు చెప్పాయని గుర్తు చేశారు. కానీ, నెలల తరబడి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి కళాశాలలు నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నామని చెప్పారు. ఫీజు బకాయిలు చెల్లించకపోతే 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించలేమని స్పష్టం చేశారు. -
యాదగిరి క్షేత్రంలో ఘనంగా హోలి సేవ
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం హోలి సేవ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీస్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం పడమటి రాజగోపురం ఎదుట గల వేంచేపు మండపంలో అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేసి, పారాయణం పఠించారు. ప్రధానార్చాకులు హోలి సేవ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం ఉత్సవ మూర్తులపై రంగులు చల్లారు. ఆ తరువాత భక్తులు పరస్పరం రంగులు చల్లుకున్నారు. ఈ వేడుకలో ఆలయ అనువంశిక ధర్మకర్త, ఆచార్యులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. -
ఏప్రిల్ 20నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
భువనగిరి : సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి కి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని శుక్రవారం సబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్ ప్రశ్న పత్రాలు నేడు మండలాలకు చేరవేత భువనగిరి : పదో తరగతి పరీక్షలకు సంబంధించి సెట్ వన్ ప్రశ్న పత్రాలు శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరాయి. వీటిని శనివారం మండల కేంద్రాలకు తరలించనున్నట్లు డీఈఓ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 8,631 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. నేత్రపర్వం.. ఊంజల్ సేవోత్సవం యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం జరిపించారు. ఆండాళ్దేవికి ఇష్టమైన నాధ స్వరాన్ని వినిపించారు. ఇక ప్రధానాలయంలో నూ సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివా రిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలు, ప్రతిష్టా అలంకార మూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం సుదర్శన హక్షమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం తదితర పూజలు నిర్వహించారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి భూదాన్పోచంపల్లి : రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకు కూడా రూ.2లక్షల లోపు రుణాలు మాఫీ చేయాలని చేనేత జన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కర్నాటి పురుషోత్తం ప్రభుత్వాన్ని కోరారు. చేనేత కార్మికుల్లోనూ చాలా మంది నిరుపేదలు ఉన్నారని, నేత వృత్తిపైనే వారి కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయన్నారు. నేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రుణాలు చెల్లించలేకపోతున్నారని, వడ్డీలు పెరిగిపోయినట్లు తెలిపారు. చాలా మంది కార్మికులు రూ,లక్షకు పైగా బకాయి పడ్డారని వారందరికీ రూ.2లక్షల లోపు మాఫీ చేయాలని పేర్కొన్నారు. రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేసినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులకు ఆర్థిక భారం నుంచి విముక్తి లభించనుందన్నారు. ఐఈఆర్పీలను క్రమబద్ధీకరించాలి నాగారం: రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు విద్యాబోధన చేస్తున్న ఐఈఆర్పీ(ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్)లను సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రెగ్యూలరైజ్ చేయాలని ఐఈఆర్పీల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పెండెం శ్రీనివాస్ కోరారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2023–24 లెక్కల ప్రకా రం 81వేల మంది దివ్యాంగ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదై ఉన్నారని, వీరికి 790 మంది ఉపాధ్యాయులు 19 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నారని తెలిపారు. -
జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఏర్పాటు చేయాలి
పండ్లు, నిత్యావసరాలు మొదలుకొని బంగారం వరకు వినియోగదారులు మోసపోతున్నారు. నిత్యం తాగే పాలు సైతం కల్తీ జరుగుతున్నాయి. నాసిరకం ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఫుడ్ సేఫ్టీతో పాటు డ్రగ్ ఇన్స్పెక్టర్, తూనికలు కొలతల శాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తుండాలి. వినియోగదారుల పరిరక్షణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. భువనగిరిలో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఏర్పాటు చేయాలి. –కొడారి వెంకటేశ్, వినియోగదారుల సంఘం ప్రతినిధి ● -
కృత్రిమమేధతో బోధన
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నేటి నుంచి అమలు 20 నిమిషాల వ్యవధిలో పాఠం ప్రత్యేక సాఫ్ట్వేర్తో విద్యార్థులను ఆకట్టుకునేలా ఏఐ బోధన అందిస్తారు. ఎంపిక చేసిన 3 నుంచి 5 తరగతుల విద్యార్థులను అయిదుగురికి ఒక బ్యాచ్ ఏర్పాటు చేస్తారు. ఒక్కో బ్యాచ్కు తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలు బోధిస్తారు. ఆ విద్యార్థి అర్థం చేసుకుంటున్నాడా, లేదా అని ఏఐ గుర్తించి అర్థం కాకపోతే సరళమైన మార్గంలో బోధిస్తుంది. అర్థం అయ్యిందంటే మరికొంత మెరుగైన పద్ధతిలో బోధన అందిస్తుంది. ఇలా ప్రతి విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను మదింపు చేయడంతో పాటు, గతంతో పోలిస్తే పురోగతి ఎలా ఉందో పరిశీలించి ఆయా విద్యార్థులపై ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తారు. జిల్లాలోని ఏడు మండలాల్లో తొమ్మిది పాఠశాలలు ఎంపిక చదువులో వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక తరగతులు ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం కొత్త కార్యక్రమం ఇప్పటికే టీచర్లకు శిక్షణ పూర్తిభువనగిరి: సర్కారు బడుల్లో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ) సాయంతో విద్యార్థులను ఆకట్టుకునేలా, సులభ రీతిలో వినూత్న బోధన చేయనుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో శనివారం నుంచి పాఠ్యాంశాలు బోధించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 7 మండలాల నుంచి 9 పాఠశాలలు ఎంపికయ్యాయి. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో మెరుగైన ఫలితాలు రావడంతో ఏఐ విధానాన్ని మిగతా అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. నిపుణులైన ఉపాధ్యాయులకు శిక్షణ ఏఐ బోధనకు ప్రతి జిల్లాలోనూ కొన్ని పాఠశాలలను గుర్తించి ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో బోధించేందుకు నిపుణులైన ఉపాధ్యాయులు, జిల్లా సమన్వయ అధికారులకు ఈనెల 11న రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. కాగా జిల్లా కేంద్రంలో ఈనెల 12న సంబంధిత ఎంఈఓలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, పాఠశాల ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఏఐ బోధనపై శిక్షణ కూడా ఇచ్చారు. ఎంపికై న పాఠశాలల్లో శనివారం నుంచి ఏఐ బోధన ప్రారంభంకానుంది. మెరుగైన సామర్థ్యాల సాధనకు.. ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో మౌలిక భాష, సంఖ్యా జ్ఞానం అభ్యసనతోపాటు గణితంలో చతుర్విద ప్రక్రియల్లోనూ ఆశించిన స్థాయి సామర్థ్యాలు సాధించకపోవడంతో విద్యలో వెనుకబాటుకు గురవుతున్నారు. పలు రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ సాయంతో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన సామర్థ్యాల సాధనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. చదవడం, రాయడం సులభంగా అలవడుతుంది చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఏఐ బోధన ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా పాఠశాలలో మూడు రకాల విద్యార్థులు ఉంటారు. ఇందులో మూడో రకం విద్యార్థులకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు చేసే బోధనకు అదనంగా ఏఐ బోధన ఉంటుంది. దీని వల్ల విద్యార్థికి చదవడం, రాయడం సులభంగా అలవడుతుంది. కంప్యూటర్ స్క్రీన్పై ఏఐ బోదన రోజూ 20 నిమిషాలు ఉంటుంది. –సత్యనారాయణ, డీఈఓ ఎంపికై న పాఠశాలలు ఇవీ..ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ భోదనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో తొమ్మిది ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో చౌటుప్పల్ మండలంలోని జైకేసారం, దేవలమ్మనాగారం, యాదగిరిగుట్ట మండలంలో పెద్దకందుకూరు, చొల్లేరు, ఆలేరు మండలంలో కొల్లూరు, మోటకొండూరు మండలంలో ముత్తిరెడ్డిగూడెం, భువనగిరి మండలంలో తుక్కాపురం, బీబీనగర్ మండలంలో జమిలాపేట, రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం పాఠశాలలు ఉన్నాయి. -
కొనేదాంట్లో కొట్టేస్తున్నారు!
వస్తు విక్రయాల్లో మోసం ఫ వేయింగ్ మిషన్లలో తేడాలు ఫ నాణ్యతకూ తిలోదకాలు ఫ కనిపించని కల్తీతో ప్రజారోగ్యానికి ముప్పు ఫ తనిఖీలకు దూరంగా అఽధికారులు ఫ వినియోగదారులకు ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియని దుస్థితి ఫ నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం భువనగిరి పట్టణంలో కొందరు వ్యక్తులు మొబైల్ వాహనంపై ఉల్లిగడ్డ కొనుగోలు చేశారు. అనుమానం రావడంతో వేరే షాప్కు వెళ్లి కాంటా వేశారు. ఐదు కిలోల బ్యాగులో 200 గ్రామాలు, పది కిలోల బస్తాలో 500 గ్రాముల వరకు తక్కువ వచ్చింది. వ్యాపారి కోసం చూడగా అప్పటికే అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఎర్ర ఉల్లిగడ్డ కిలో రూ.35, తెల్ల ఉల్లిగడ్డ రూ. 30 ఉంది. మోటకొండూరుకు చెందిన లోడే పుష్పమ్మ భువనగిరిలోని ఓ బంగారం షాపులో 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం కొనుగోలు చేసింది. స్వగ్రామంలోని స్వర్ణకారుని వద్ద చెవి కమ్మలు చేయించుకుంది. ఆ తరువాత మరో స్వర్ణకారుడి వద్ద పాత కమ్మలనే కొత్త డిజైన్తో తయారు చేయించుకుంది. కొంతకాలం తరువాత బంగారం కొనుగోలు చేయడానికి హైదరాబాద్లోని ఓ జ్యువెలరీ షోరూమ్కు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. చెవి కమ్మలను తూకం వేయించగా 18 క్యారెట్లే ఉంది. -
గ్రూప్స్లో మెరిశారు
రామన్నపేట: రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన సిలువేరు సురేష్ శుక్రవారం విడుదలైన గ్రూపు– 3 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించాడు. అదేవిధంగా ఈనెల 11న ప్రకటించిన గ్రూపు– 2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకు పొందాడు. గతంలో గ్రూపు– 4 పరీక్షల్లో విజయం సాధించి ప్రస్తుతం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్– 1 సాధించడమే తన లక్ష్యమని సురేష్ పేర్కొంటున్నాడు. గ్రూప్– 2, 3, 4 సాధించిన నారాయణపురం వాసి చిలుకూరు: మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన బూర భిక్షం కుమారుడు సతీష్ ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 206వ ర్యాంక్ సాధించాడు. తాజాగా విడుదలైన గ్రూప్– 3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 318 ర్యాంక్ సాధించాడు. 2023లో రైల్వేలో జాబ్ వచ్చింది. ఆ ఉద్యోగానికి వెళ్లకుండా గ్రూప్స్కు సన్నద్ధమయ్యాడు. కాగా.. 2024లో గ్రూప్– 4లో ఉద్యోగం సాధించి ప్రస్తుతం సూర్యాపేట కలెక్టరేట్లో సివిల్ సప్లయ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. పరీక్ష రాస్తే విజయమే మోత్కూరు: మోత్కూరుకు చెందిన గుర్రం సాయికృష్ణారెడ్డి ఇటీవల విడుదలైన గ్రూప్– 1 ఫలితాల్లో 900 మార్కులకు గాను 446 మార్కులు సాధించాడు. గ్రూపు–2 ఫలితాల్లో స్టేట్ 11వ ర్యాంకు సాధించాడు. అదేవిధంగా గ్రూపు– 3 ఫలితాల్లో స్టేట్ 29వ ర్యాంకు సాధించాడు. గ్రూపు–4 ఫలితాల్లోనూ జిల్లా మొదటి ర్యాంకు సాధించాడు. సాయికృష్ణారెడ్డి వరుస విజయాల పట్ల ఆయన తల్లిదండ్రులు మోహన్రెడ్డి, స్వరాజ్యం, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శిగా చేస్తూనే.. పెద్దఅడిశర్లపల్లి: మండలంలోని అజ్మాపురం గ్రామానికి చెందిన గడిగ బాలకృష్ణ గ్రూప్– 3 ఫలితాల్లో 285 మార్కులతో 381వ ర్యాంకు సాధించాడు. గ్రూప్– 1లో 400 మార్కులు సాధించగా, గ్రూప్– 2లో 371 మార్కులతో 442వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం చిట్యాల మండలం తాళ్లవెల్లంల గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. చిల్పకుంట్ల వాసికి 91వ ర్యాంకు నూతనకల్: గ్రూప్– 3 పరీక్ష ఫలితాల్లో నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన మందడి శ్యాంసుందర్రెడ్డి రాష్ట్ర స్థాయిలో 91వ ర్యాంకు సాధించాడు. అదేవిధంగా గ్రూప్– 2 పరీక్ష ఫలితాల్లో 400మార్కులు సాధించి రాష్ట్రస్థాయి 63వ ర్యాంకు సాధించాడు. గతంలో వీఆర్ఓ ఫరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం సూర్యాపేట సోషల్ వెల్ఫేర్లో విధులు నిర్వహిస్తున్నాడు. రెండు పరీక్షల్లోనూ కానిస్టేబుల్ ప్రతిభ గుర్రంపోడు: గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన మంటిపల్లి శంకర్ ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో 674 ర్యాంకు సాధించాడు. తాజాగా విడుదలైన గ్రూప్ – 3 ఫలితాల్లో 165 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం సంస్ధాన్ నారాయణపురం పోలీసు స్టేషన్లో సివిల్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్– 3లో స్టేట్ 211వ ర్యాంక్ ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): ఆత్మకూరు మండలం గట్టిగల్లు గ్రామానికి చెందిన కోన లింగయ్య– పద్మల మొదటి కుమారుడు కోన సతీష్ శుక్రవారం విడుదల చేసిన గ్రూప్ – 3 ఫలితాల్లో స్టేట్ 211 ర్యాంక్ సాధించాడు. గత ఎనిమిదేళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ గ్రూప్స్కు సన్నద్ధమయ్యాడు. గత సెప్టెంబర్లో విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో సెలక్ట్ అయ్యాడు. గ్రూప్– 2లో 427వ ర్యాంకు, గ్రూప్– 3లో 700 ర్యాంకుభువనగిరి: గ్రూప్– 3 ఫలితాల్లో భువనగిరి మండలం పెంచికల్పహాడ్ గ్రామానికి చెందిన అనూష రాష్ట్రస్థాయిలో 700వ ర్యాంకు సాధించింది. గ్రూప్– 2లో రాష్ట్ర స్థాయిలో 427వ ర్యాంకు సాధించగా.. జోన్లో ఉమెన్ విభాగంలో 4వ ర్యాంకు సాధించింది. గతంలో ఎకై ్సజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగానికి ఎంపిక కాగా అందులో చేరలేదు. గ్రూపు– 4లో ర్యాంకు సాధించి ప్రస్తుతం కలెక్టరేట్లోని రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తోంది. -
శాశ్వత మరమ్మతులు జరిగేనా!
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్వే మరమ్మతులు ఈ ఏడాది కూడా జరిగేలా లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరుసగా ఏడు సంవత్సరాలు మరమ్మతులకు నోచుకోలేదు. స్పిల్వేపై చాలా లోతుగా గుంతలు పడడంతో లోపలివైపు నుంచి నీటిజాలు రావడం మొదలైంది. 2014 నుంచి 2021 సంవత్సరం వరకు స్పిల్వే మరమ్మతులకు నోచుకోలేదు. స్పిల్వే మరమ్మతుల ఆవశ్యకతపై నిపుణుల హెచ్చరికల మేరకు 2022 సంవత్సరం జులైలో స్పిల్వే మరమ్మతు పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఎట్టకేలకు 2023లో మరమ్మతులు చేశారు. ఆ సంవత్సరం వరదలు రాకపోవడంతో డిసెంబర్ వరకు పనులు కొనసాగాయి. అయితే, 2024లో సాగర్ ప్రాజెక్టుకు వరద ఎక్కువ రావడంతో అత్యధిక రోజులు గేట్లు ఎత్తారు. దీంతో స్పిల్వే నీటి వత్తిడికి కోతకు గురై మళ్లీ గుంతలుపడ్డాయి. ఎప్పటిలాగే స్పిల్వేపై పెద్దపెద్ద క్యావిటీ(గుంతలు)లు ఏర్పడ్డాయి. వాటికి మరమ్మతులు చేసేందుకు టెండర్లు పిలిచి సంబంధిత సంస్థలకు పనులు అప్పగించాల్సి ఉంది. దీనిపై జనవరి 6న భారీ నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించి స్పిల్వే మరమ్మతులు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు జారీచేశారు. శాశ్వత మరమ్మతులకు పలు సంస్థలతో సంప్రదింపులు స్పిల్వే శాశ్వత ప్రాతిపదిక మరమ్మతులు చేసేందుకు అంతర్జాతీయ సంస్థలతో సాగునీటిశాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవలే రూర్కేలా ఐఐటీ వారు సర్వే నిర్వహించారు. వీరే కాకుండా మరో సంస్థ కూడా స్పిల్వేను సందర్శించింది. శాశ్వత మరమ్మతులు చేయడం సాధ్యం కాకున్నా.. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసేందుకు కనీసం శాశ్వత ఏర్పాట్లు చేయడానికై నా సలహాలు ఇవ్వాలని కోరారు. దీంతో స్పిల్వే దిగువ భాగాన కదిలే క్రేన్లను ఏర్పాటు చేసి దాని నుండి సులభంగా మరమ్మతులు చేసేందుకు క్వావిటీల కొలతలు తీసేందుకు వీలవుతుంది. అలాగే స్టీల్ రాడ్స్, కాంక్రీట్ పైకి పంపడానికి సులభమవుతుందనే అంచనాలకు వచ్చినట్లు సమాచారం. అందుకుగాను క్రేన్లను ఏర్పాటు చేసేందుకు అంచనాలు త యారికీ సంస్థల సంప్రదింపులకు టెండర్ల ఆహ్వానానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎలక్ట్రికల్ పనులకు టెండర్లు సాగర్డ్యాం ఎడమవైపు గల మెయిన్ కంట్రోల్ప్యానల్ ఎలక్ట్రికల్ పనులను నీటిపారుదల శాఖ సర్కిల్ నుంచి ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లకు ఈ నెల 3న ప్రకటన చేశారు. ప్యానల్బోర్డులు పాతవి తొలగించి కొత్తవి కేబుల్తో పాటు మరికొన్ని విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్వే ఫ సాగర్ స్పిల్వేకు ప్రతిసారి తాత్కాలిక పనులే చేస్తున్న ప్రభుత్వాలు ఫ శాశ్వత ప్రాతిపదికన మరమ్మతుల కోసం పలు సంస్థలతో అధ్యయనం ఫ ఈ యేడాది తాత్కాలిక మరమ్మతులకు కూడా ఇప్పటి వరకు కార్యాచరణ లేదు ఫ గత సంవత్సరం అత్యధిక వరదలతో స్పిల్వేపై మళ్లీ గుంతలు నేటి నుంచి మొదలు కానున్న క్రస్ట్గేట్ల నిర్వహణ పనులు ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలోనే జలాశయంలోని నీరు స్పిల్వే దిగువకు వెళ్లింది. దీంతో శనివారం నుంచి క్రస్ట్గేట్ల నిర్వహణ పనులు మొదలు పెట్టనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. డ్యాం సాధారణ నిర్వహణ పనులకుగాను రూ.40లక్షలు ఖర్చవుతాయని అంచనాలను పంపినట్లు తెలిపారు. గ్యాలరీలలోని నీటిని పంప్చేయడంతో పాటు చిన్నచిన్న పనులు చేయడం, సీసీ కెమెరాల మెయింటెనెన్స్, కుడి, ఎడమ కాల్వల గేట్స్ నిర్వహణకు గ్రీజింగ్, రబ్బరు సీళ్లు అమర్చడం, నట్బోల్ట్స్ బిగింపు తదితర పనులు చేస్తారు. అలాగే స్పిల్వే దిగువ భాగాన గల బకెట్ పోర్షన్లో నీటిని డీవాటరింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
యాదగిరి ఆలయ మాడవీధిలో జర్మనీ టెంట్
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ఉత్తర మాడ వీధిలో జర్మనీ టెంట్ ఏర్పాటు చేశారు. వేసవిలో శ్రీస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు నీడ కల్పించేందుకు ఈ టెంట్ను బిగించారు. గతేడాది వేసవిలో సైతం ఈ టెంట్ను ఏర్పాటు చేసి, భక్తులకు ఎండ నుంచి ఉపశమనం కల్పించారు. ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో భక్తులు ఆలయ మాడ వీధిలో నడిచేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆలయాధికారులు జర్మనీ టెంట్ను ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలుకేతేపల్లి: కేతేపల్లి మండలంలోని ఉప్పలపహాడ్ వద్ద 65 నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం డీసీఎంను కారు వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరుకు చెందిన వడ్లపూడి రవికిరణ్ హైదరాబాద్లోని కూకట్పల్లిలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం విజయవాడ నుంచి కారులో హైదరాబాద్కు బయలుదేరాడు. మార్గమధ్యంలో మండలంలోని ఉప్పలపహాడ్ బస్బే సమీపంలో యూటర్స్ తీసుకుంటున్న డీసీఎంను కారు వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈప్రమాదంలో కారు నడుపుతున్న రవికిరణ్కు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేతేపల్లి ఎస్ఐ శివతేజ తెలిపారు. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిర్యాలగూడ రూరల్ ఎస్సై లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. యాద్గార్పల్లి గ్రామానికి చెందిన సికిని యాదగిరి(59) గ్రామంలో బార్బర్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి ఇద్దరు భార్యలుండగా మొదటి భార్య చనిపోవడంతో మద్యానికి బానిస అయ్యాడు. గతంలో ఆమె హోళీ రోజే మృతిచెందడంతో ఆమెను గుర్తు చేసుకుని మనస్తాపం చెందిన యాదగిరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్ రూమ్లోని ఇనుప చువ్వకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు రూరల్ పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండవ భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యందేవరకొండ: దేవరకొండ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దేవరకొండ సీఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకా రం.. గురువారం రాత్రి 12గంటల సమయంలో ఓ వ్యక్తి చనిపోయి ఉన్నాడని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి సుమారు 45సంవత్సరాలు ఉంటా యని తెలిపారు. చామనఛాయ రంగు, ఎత్తు 5.7 అంగుళాలు, అతని దగ్గర లభ్యమైన ఓటర్కార్డుపై అమిత్పహాన్, వెస్ట్ బెంగాల్ అని ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. -
వినియోగదారుడా మేలుకో..
ఫ ఈ– కామర్స్ అనుచిత వ్యాపార విధానాల కట్టడికి ఈ చట్టంలో నిబంధనల రూపకల్పన ఫ తప్పుదారి పట్టించే ప్రకటనలు వెలువరించిన తయారీదారులు, అమ్మకందారులకు జరిమానా ఫ నేడు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంవస్తువుల కల్తీ, నాణ్యతలేమి సమస్యల పరిష్కారానికి రాజదండంలా వినియోగదారుల రక్షణ చట్టం రామగిరి(నల్లగొండ): వినియోగదారుల వివాదాల పరిష్కారానికి భారత ప్రభుత్వం 1986లో వినియోగదారుల ఫోరం చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులకు వస్తు లోపం, సేవా లోపం తలెత్తితే ఈ చట్టం పరిష్కారం చూపుతుంది. ఈ సేవలు మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టం– 2019ను తీసుకువచ్చింది. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు, మధ్యవర్తిత్వం, ఉత్పత్తి బాధ్యత, తయారీదారులకు శిక్షలు, కల్తీ వస్తువుల అమ్మకం లాంటి విషయాల్లో అనేక నిబంధనలను ఈ చట్టంలో పొందుపరిచారు. ఇది వినియోగదారుల హక్కులను కాపాడటానికి, అమలు చేయడానికి పనిచేస్తుంది. హక్కుల ఉల్లంఘన జరిగినా, అనుచిత వ్యాపార విధానాలు అవలంబించినట్లు తెలిసినా, తప్పుదారి పట్టించే ప్రకటనలు వెలువరించినా.. వాటిపై దర్యాప్తు జరిపి వాటి తయారీదారులు, అమ్మకందారులు, ప్రకటనల ప్రచురణ, ప్రసారకర్తలకు జరిమానాలు విధిస్తుంది. మెడికల్, ఇన్సూరెన్స్, అగ్రిమెంట్, విద్యుత్ ప్రమాదాలు, నాసిరకం విత్తనాలు, చిట్ఫండ్, ఎమ్మార్పీ కంటే ఎక్కువ విక్రయించినా, వస్తువుల నాణ్యత వంటి సమస్యలు తలెత్తినా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించవచ్చు. ఈ–కామర్స్ వేదికల అనుచిత వ్యాపార విధానాలు అవలంబించకుండా అడ్డుకోవడానికి కూడా చట్టంలో నిబంధనలు పొందుపరిచారు. పరిష్కారం సులభతరం వినియోగదారుల వివాదాలను సులభంగా పరిష్కరించేందుకు కొత్త చట్టం ప్రాధాన్యమిచ్చింది. ఫిర్యాదులను ఆన్లైన్లోనూ దాఖలు చేయొచ్చు. వినియోగదారులు తన నివాస ప్రాంతంలోని కమిషన్కు కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఒకవేళ ఫిర్యాదును 21 రోజుల్లోగా ఆమోదించినట్లు చెప్పకపోతే దానంతట అదే ఆమోదించబడినట్లుగా భావిస్తారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారణ జరుపుతారు. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ నిబంధనల ప్రకారం రూ.5లక్షల లోపు కేసులు దాఖలు చేయడానికి ఎలాంటి రుసుము ఉండదు. వినియోగదారుల హక్కులు ● జీవితం మరియు ఆస్తికి ప్రమాదకరమైన వస్తువులు, ఉత్పత్తుల సేవల అమ్మకాల నుంచి వినియోగదారులు రక్షణ పొందే హక్కు. ● అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నుంచి వినియోగదారుడిని రక్షించడానికి, వస్తువులు, ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత, పరిమాణం, శక్తి, స్వచ్ఛత, ప్రామాణికం, ధరల గురించి తెలియజేసే హక్కు. ● భరోసా పొందే హక్కు ● వినడానికి, వినియోగదారుల ప్రయోజనాలకు తగిన వేదిక వద్ద తగిన పరిశీలన లభిస్తుందని హామీ ఇచ్చే హక్కు. ● నిర్బంధ వాణిజ్య పద్ధతులు లేదా వినియోగదారుల అనాలోచిత దోపిడీకి వ్యతిరేకంగా పరిష్కారాన్ని కోరే హక్కు. ● వినియోగదారుల అవగాహన హక్కు. కేసుల వివరాలు (2020–2025) సంవత్సరం నమోదైన పరిష్కారమైనవి పెండింగ్ కేసులు 2020 81 78 3 2021 107 100 7 2022 100 88 12 2023 124 80 44 2024 157 29 128 2025 13 – 13 -
ప్రజల్లో చైతన్యం కలగాలి
వినియోగదారుల కమిషన్ చాలా శక్తివంతమైంది. చట్టంపై ప్రజల్లో చైతన్యం రావాలి. ఏ వస్తువైనా కొని నష్టపోతే తమను సంప్రదించవచ్చు. విమాన సేవలు, బ్యాంక్, బోర్డింగ్, కొరియర్, చిట్ ఫండ్, ఎడ్యుకేషన్ సంస్థలు, విద్యుత్ సమస్యలు, మెడికల్, ఇన్సూరెన్స్, గ్యాస్, పోస్టల్, రైల్వే, ఆర్టీసి, టెలిఫోన్, బోర్వెల్, కోల్డ్ స్టోరేజీ వీటిలో ఎలాంటి సమస్యలు కలిగినా వినియోగదారుల కమిషన్ సత్వర న్యాయం చేస్తుంది. జిల్లా వినియోగదారుల కమిషన్లో రూ.50 లక్షల వరకు ఫిర్యాదులు పరిష్కరించబడతాయి. ఆ పై రాష్ట్ర కమిషన్ను సంప్రదించాల్సి ఉంటుంది. – మామిడి క్రిష్టోఫర్, వినియోగదారుల కమిషన్ చైర్మన్ -
ఎస్సై దూషించాడని మహిళ ఆత్మహత్యాయత్నం
చివ్వెంల(సూర్యాపేట): ఎస్సై తనను అసభ్య పదజాలంతో దూషించాడని మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. వల్లాల జానకిరాములు తన కుటుంబ సభ్యులతో కలిసి గత 50 సంవత్సరాలుగా కుడకుడ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి పక్కన ఉన్న అతని బంధువులు వల్లాల రాములు, వల్లాల నరేష్, వల్లాల సురేష్, కొత్త సైదులు, కొత్త శైలజలకు గత కొంతకాలంగా ప్రహరీ విషయంలో వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో ఈనెల 7న స్థానిక పోలీస్ స్టేషన్లో ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో పోలీసులు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలని చెప్పారు. పెద్ద మనుషులు ఈనెల 15కు వాయిదా వేశారు. ఈక్రమంలో జానకిరాములు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అతడిని 13వ తేదీన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ఆ సమయంలో భార్య రమణమ్మ మాత్రమే ఇంట్లో ఉంది. చివ్వెంల ఎస్ఐ మహేశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి మధ్య ప్రహరీ కట్టిస్తుండగా, గమనించిన రమణమ్మ ఇంట్లోంచి బయటకు వచ్చింది. వాయిదా ఉండగా ఎందుకు గోడ కట్టిస్తున్నారని ప్రశ్నించింది. దీంతో ఎస్సై తనను అసభ్య పదజాలంతో దూషించాడని రమణమ్మ ఆరోపించింది. మనస్తాపంతో గురై 14న ఇంట్లో ఉన్న స్లీపింగ్, యాంటి బయోటిక్, పెయిన్ కిల్లర్ మందులు వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన ఇంటి పక్కవారు ఆమెను సూర్యాపేటలోని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతోంది. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఈ విషయంపై ఎస్ఐ మహేశ్వర్ను వివరణ కోరగా.. రమణమ్మ ఇంటి పక్కన ఉన్న కొత్త సైదులు.. తన ఇంటిపై వల్లాల శివరామకృష్ణ అనే వ్యక్తి వేట కొడవలితో దాడి చేసి భయాబ్రాంతులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు చేశాడని తెలిపారు. విచారణ కోసం వెళ్లి తిరిగి వచ్చానని, అక్కడ ఎవరిని ఏమి అనలేదని పేర్కొన్నారు. కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారని ఎస్ఐ తెలిపారు. -
12 నెలలుగా పైసా ఇవ్వలేదు!
‘ఉపాధి’ కార్యాలయాలకు నిలిచిపోయిన నిధులు గ్రాంట్ విడుదల చేయాలి 2022 ఆర్థిక సంవత్సరం వరకు పనిదినాలతో పనిలేకుండా ఖర్చు చేసిన బిల్లులను ప్రభుత్వం చెల్లించేది. 2023 ఆర్థిక సంవత్సరం నుంచి స్లాబ్ విధానం తీసుకువచ్చారు. మూడునెలలకు ఒకసారి విడుదల చేయవలసిన గ్రాంట్ 12 నెలలుగా పెండింగ్లో ఉన్నది. చేతినుంచి విద్యుత్, స్టేషనరీ, రిపేర్లు, నీటి బిల్లులు చెల్లించవలసి వస్తుంది. ప్రభుత్వం స్పందించి నిర్వహణ గ్రాంట్స్ను పూర్తిగా విడుదల చేయాలి. –శ్రీలక్ష్మి, ఏపీఓల సంఘం జిల్లా అధ్యక్షురాలు రామన్నపేట : ఉపాధిహామీ కార్యాలయాల నిర్వహణ భారంగా మారింది. ఏడాది కాలంగా ప్రభుత్వం నిధులు విధిల్చకపోవడంతో ఏపీఓలు అవస్థలు పడుతున్నారు. విద్యుత్, నెట్ బిల్లులు, స్టేషనరీ కొనుగోలు తదితర అవసరాలకు చేతినుంచి ఖర్చు చేస్తున్నారు. 2024 ఏప్రిల్ నుంచి పెండింగ్ ప్రతి మండల కేంద్రంలో భారత్ నిర్మాణ్ రాజీవ్గాంధీ సేవాకేంద్రం పేరుతో ప్రభుత్వం ఉపాధిహామీ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణకు పనిదినాల ప్రాతిపదికన ఏటా మూడు స్లాబ్లుగా నిధులు విడుదల చేస్తుంది. 2 లక్షలలోపు పనిదినాలు పూర్తయిన మండలానికి రూ 65వేలు, 2 లక్షల నుంచ ఇ 3లక్షల పనిదినాలు పూర్తయితే రూ.85వేలు, 3 లక్షలకు పైగా పనిదినాలు రూ.లక్ష చొప్పున చెల్లిస్తుంది. వీటిని ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేస్తుంది. చివరిసారి 2024 మార్చినెల వరకు నిధులు వచ్చాయి. 2024 ఏప్రిల్ నుంచి నిర్వహణ గ్రాంట్ పెండింగ్లో ఉన్నది. ఏపీఓలపై నిర్వహణ భారం ప్రభుత్వం ఇచ్చే నిర్వహణ గ్రాంట్ను విద్యుత్, నెట్ బిల్లులు, స్కావెంజర్ చార్జీలు చెల్లించాలి. కంప్యూటర్లు, ఫ్యాన్లు, ఇతర ఫర్నిచర్ చెడిపోతే మరమ్మతులు చేయించాలి.కంప్యూటర్ల నిర్వహణకు అవసరమైన క్యాట్రేజీ, స్టేషనరీ కొనుగోలు చేయాలి. స్వాతంత్య్ర, గణతంత్ర, రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహించాలి.శానిటేషన్ నిర్వహణకు అవసరమైన వస్తువులను సమకూర్చుకోవాలి. 12 నెలలకు సంబంధించిన గ్రాంట్ పెండింగ్లో ఉంది. పైగా ఉపాధి ఉద్యోగులకు మూడునెలలుగా వేతనాలు రావడం లేదు. దీంతో తమ కుటుంబ బాధ్యతలతో పాటు, కార్యాలయాల నిర్వహణ ఉద్యోగులకు తలకుమించిన భారంగా మారింది. ఫ భారంగా మారిన నిర్వహణ ఫ విద్యుత్, నెట్ బిల్లులు, స్టేషనరీకి సొంత డబ్బులు ఖర్చు చేస్తున్న ఏపీఓలు -
సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
భూదాన్పోచంపల్లి : సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం భూదాన్పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద, మండల వైద్యాధికారిణి శ్రీవాణి, వైద్య సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొపారు. మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అదే విధంగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో గర్భిణులతో మాట్లాడారు. పౌష్టికాహారం ఆవశ్యకత, ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ పోతారెడ్డి, చౌటుప్పల్ డివిజన్ హెల్త్ ఎడ్యుకేటర్ వసంత, సూపర్వైజర్ అరుంధతి, లక్ష్మణ్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారుఫ డీఎంహెచ్ఓ మనోహర్ -
మండలిలో మనది అగ్రస్థానం
‘బ్యూటీ’ఫుల్ ఉపాధి పట్టణాలకే పరిమితమైన బూటీపార్లర్లు గ్రామాల్లోనూ వెలుస్తున్నాయి. బ్యూటీషియన్ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది. నేడే హోలీ- 9లోయాదగిరిగుట్ట: హోలీ పండుగను పురస్కరించుకొని గురువారం రాత్రి యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో కాముడి దహనం ఘనంగా నిర్వహించారు. పూజలు చేసిన అనంతరం కర్రలన్నింటినీ ఒక చోట పేర్చి దహనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది సంప్రదాయ రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. -
17లోగా సీఎంఆర్ అప్పగించండి
సాక్షి,యాదాద్రి : 2023–24 యాసంగి సీజన్కు సంబంధించి కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను ఈనెల 17లోగా ప్రభుత్వానికి అందజేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. గురువారం తన చాంబర్లో మిల్లర్లు, అధికారులతో సమావేశమై సీఎంఆర్పై సమీక్షించారు. 96 శాతం సీఎంఆర్ పూర్తయ్యిందని, నాలుగు శాతం మా త్రమే పెండింగ్ ఉన్నందున గడువులోపు పూర్తి చేసి జిల్లాను ముందంజలో ఉంచాలని కోరారు. ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని ఎవరైనా దుర్విని యోగం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పూర్తిస్థాయిలో సీఎంఆర్ అప్పగించని మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు చేయబోమని చెప్పారు. సమావేశంలో మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మార్త వెంకటేశం, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి ఊపు
పరిధి పెంపు..శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025సాక్షి, యాదాద్రి : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అఽథారిటీ(హెచ్ఎండీఏ) పరిధి మరింత పెరిగింది. రీజినల్ రింగ్ రోడ్డు ఆవల రెండు కిలో మీటర్ల దూరం వరకు విస్తరించనుంది. రీజినల్ రింగ్ రోడ్డు వరకు సమగ్రాభివృద్ధి, భవిష్యత్ అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని 162 గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. ఇందుకు సంబంధించిన మాస్టర్ప్లాన్ రూపకల్పనకు అధికారులు కసరత్తు ప్రారంభించారు సెమీ అర్బన్ ఏరియాగా.. హెచ్ఎండీఏ పరిధిని మరింత విస్తరించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న జీహెచ్ఎంసీ పరిధిని కోర్ అర్బన్ సిటీగా, ఔటర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్ ఏరియాగా నిర్ధారించింది. కాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రస్తుతం భువనగిరి, బీబీనగర్, భూదాన్పోచంపల్లి, చౌటుప్పల్, బొమ్మలరామారం మండలాల వరకు హెచ్ఎండీఏ పరిధి ఉంది. భవిష్యత్ అవసరాల నేపథ్యంలో దీన్ని రీజినల్ రింగ్ రోడ్డు ఆవలి దాకా పెంచారు. దీంతో కొత్తగా తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, వలిగొండ, సంస్థాన్నారాయణపురం మండలాల్లోని పలు గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్ హైదరాబాద్గా పరిగణించనున్నారు. దీని పరిధిలోకి మొత్తం 162 గ్రామాలు రానున్నాయి. అనేక ప్రయోజనాలు హెచ్ఎండీఏ పరిధి పెరగడం ద్వారా జిల్లాకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. శాటిలైట్ టౌన్షిప్లు, అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు సమకూరనున్నాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. యాదాద్రి జిల్లా మీదుగా ఇప్పటికే రెండు జాతీయ రహదారులు (65, 163), రెండు రైల్వే మార్గాలు (సికింద్రాబాద్–ఖాజీపేట, బీబీనగర్– నడికుడి) ఉన్నాయి. కొత్తగా గౌరెల్లి – భద్రాద్రి కొత్తగూడెం వరకు జాతీయ రహదారి నిర్మాణంలో ఉండగా.. సంగారెడ్డి – భువనగిరి వయా చౌటుప్పల్, కంది వరకు మరో నేషనల్ హైవే 161 ఏఏ పనులు ప్రారంభం కానున్నాయి. న్యూస్రీల్హెచ్ఎండీఏ పరిధి పెంచుతూ ఉత్తర్వులు ఫ రీజినల్ రింగ్ రోడ్డు ఆవల రెండు కిలో మీటర్ల వరకు.. ఫ ఔటర్ నుంచి ‘రీజినల్’ వరకు సెమీ అర్బన్గా గుర్తింపు ఫ దీని పరిధిలోకి మొత్తం 162 గ్రామాలు ఫ సమగ్ర అభివృద్ధి, భవిష్యత్ అవసరాల దృష్ట్యా నిర్ణయం ఫ మాస్టర్ప్లాన్ రూపకల్పనకు సన్నాహాలు కొత్తగా కలిపే గ్రామాలు ఇవీ.. సంస్థాన్నారాయణపురం మండలంలోని చిల్లాపురం, చిమిర్యాల, గుడ్డిమల్కాపురం, జనగామ, కంకణాలగూడెం, కొత్తగూడెం, కోతులాపురం, మహ్మదాబాద్, నారాయణపురం, పుట్టపాక, రాచకొండ, సర్వేల్, వాయిలపల్లి తుర్కపల్లి మండలంలో చినలక్ష్మాపురం, దత్తాయిపల్లి, ధర్మారం, గంధమల్ల, గోపాలపురం, ఇబ్రహీంపురం, కోమటికుంట, కోనాపురం, కొండాపురం, మాదాపురం, మల్కాపురం, తుర్కపల్లి, ముల్కలపల్లి, నాగాయపల్లి, పల్లెపహాడ్, రుస్తాపురం, శ్రీనివాసపురం, తిరుమలాపురం, వాసాలమర్రి, వీరారెడ్డిపల్లి, వేలుపల్లి, వెంకటాపురం. వలిగొండ మండలం గోకారం, కంచనపల్లి, పహిల్వాన్పురం, పొద్దటూరు, రెడ్లరేపాక, సంగెం, టేకులసోమవారం, వర్కట్పల్లి యాదగిరిగుట్ట మండలంలో జంగంపల్లి రాజాపేట మండలంలో బేగంపేట, చల్లూరు -
సబ్జైలును సందర్శించిన డీఐజీ
భువనగిరిటౌన్ : జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్ గురువారం భువనగిరిలోని సబ్ జైలును సందర్శించారు. ఖైదీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. భోజనం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. వంటలు రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకువచ్చేందుకు ప్రభుత్వం వివిధ రకాల పథకాలు తీసుకువస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంతోమంది క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారని, అటువంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు రికార్డులను పరి శీలించారు. ఆయన వెంట సబ్జైలర్ నెహ్రూ ఉన్నారు. గ్రూప్–2 ర్యాంకర్కు కలెక్టర్ అభినందన మోత్కూరు : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రూపు–2 ఫలితాల్లో మోత్కూరుకు చెందిన గుర్రం సాయికృష్ణారెడ్డి రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకు సాధించారు. గురువారం కలెక్టర్ను కలువగా అభినందించి శాలువాతో సత్కరించారు. సాయికృష్ణారెడ్డి గ్రూపు–4లో జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు సాధించి ప్రస్తుతం కలెక్టరేట్లోని రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. సాయికృష్ణారెడ్డిని అభినందించిన వారిలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఏఓ జగన్, ఉపాధిహామీ పథకం అంబుడ్స్మెన్ మందడి ఉపేందర్రెడ్డి ఉన్నారు. ఇంటర్ పరీక్షలకు 5,467 మంది హాజరు భువనగిరి : ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గురువారం జరిగి న ప్రథమ సంవత్సరం గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్షలకు 5,777 మంది విద్యార్థులకు గాను 5,467 మంది హాజరయ్యారు. 310 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. ఫిజియోథెరపిస్టుల నుంచి దరఖాస్తుల ఆహ్వానంభువనగిరి : అడ్డగూడూరు, బొమ్మలరామారం, తుర్కపల్లి, మోటకొండూరు, రామన్నపేట, వలిగొండలోని భవిత కేంద్రాల్లో విద్యార్థులకు ఫిజియోథెరపీ సేవలు అందించడానికి అర్హత కలిగిన ఫిజియెథెరపిస్టుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బ్యాచ్లర్ ఆఫ్ ఫిజియోథెరపీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 17 సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు. బీబీనగర్ కానిస్టేబుల్కు ఉమెన్ లెజెండ్ అవార్డు బీబీనగర్ : బీబీనగర్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న వై.అరుణ సూపర్ ఉమెన్ లెజెండ్ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని రవీంద్రభారతిలో శ్రీకొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు అవార్డు ప్రదానం చేశారు. టెన్త్ ప్రశ్న పత్రాలు వచ్చాయ్ భువనగిరిటౌన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్న పత్రాలు గురువారం జిల్లా కేంద్రానికి చేరాయి. కార్గో బస్సులో కలెక్టరేట్కు వచ్చిన ప్రశ్నపత్రాలను అధికారులు పరిశీలించి గదిలో భద్రపరిచి సీల్ వేశారు. శుక్రవారం (నేడు) అన్ని మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లకు బందోబస్తు మధ్య ప్రశ్నపత్రాలను పంపనున్నారు. పరీక్ష ప్రారంభం కావడానికి కొద్ది సమయం ముందు ప్రశ్న పత్రాలను పోలీస్ స్టేషన్ నుంచి పరీక్ష కేంద్రాలకు తరలిస్తారు. -
స్వర్ణగిరీశుడికి తిరుప్పావడ సేవ
భువనగిరి: పట్టణంలోని స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం స్వామివారికి తిరుప్పావడ సేవ నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్య కల్యాణం, సాయంత్రం స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. వేకువజామును సుప్రభాత సేవతో స్వామి, అమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రధానాలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి వెండి జోడు సేవలను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. రాత్రి స్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిమిర్యాలగూడ టౌన్: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మ య్య తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెం గ్రామానికి చెందిన మారేపల్లి సైదులు(60) బుధవారం మిర్యాలగూడ మండలం శ్రీనివాస్నగర్ సమీపంలో గల ఫంక్షన్హాల్లో తన బంధువుల వివాహానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో జడ్జర్ల–కోదాడ హైవేపై రోడ్డు దాటుతుండగా తుంగపాడు నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న బైక్ సైదులును ఢీకొట్టింది. దీంతో అతడి తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ సాయంతో స్థానికులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అదే రోజు రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమార్తె సట్టు నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రైలు ఎక్కుతుండగా జారిపడిన ప్రయాణికుడుఫ రక్షించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిభువనగిరి: రైలు ఎక్కే క్రమంలో జారిపడిన వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) సిబ్బంది రక్షించారు. ఈ ఘటన బుధవారం రాత్రి భువనగిరి రైల్వే స్టేషన్లో జరిగింది. భువనగిరి ఆర్పీఎఫ్ ఎస్ఐ కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బాజిరెడ్డి జగదీష్ అనే ప్రయాణికుడు నిజామాబాద్కు వెళ్లేందుకు బుధవారం రాత్రి భువనగిరి రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకున్నాడు. రాత్రి 8.22 గంటలకు తిరుపతి నుంచి ఆదిలాబాద్కు వెళ్తున్న కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు భువనగిరికి చేరుకుంది. రాత్రి 8.23 గంటలకు స్టేషన్ నుంచి రైలు కదలగా.. జగదీష్ రైలు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్ఫాం మధ్యలో జారిపడ్డాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ హెడ్కానిస్టేబుల్ బాలాజీ గమనించి జగదీష్ను బయటకు లాగాడు. దీంతో అతడికి ఎటువంటి గాయాలు కాలేదు. -
బైక్ను ఢీకొట్టిన ట్రాక్టర్.. వ్యక్తి మృతి
కోదాడరూరల్ : బైక్పై వెళ్తున్న వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని గుడిబండ శివారులో గురువారం జరిగింది. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం శాంతినగర్కు చెందిన తల్లోజు దుర్గాచారి(29) కోదాడ పట్టణంలోని హిందూజా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పనిలో భాగంగా గురువారం బైక్పై కోదాడ నుంచి మేళ్లచెర్వు వెళ్తుండగా కోదాడ మండలం గుడిబండ గ్రామ శివారులో కాపుగల్లు క్రాస్రోడ్లో వేగంగా వస్తున్న ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గాచారికి తీవ్రగాయాలు కాగా స్థానికులు 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారులో నగదు చోరీ నేరేడుచర్ల: కారులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.2.50లక్షలు చోరీ చేశారు. ఈ సంఘటన గురువారం నేరేడుచర్లలో చోటు చేసుకుంది. పట్టణంలోని జాన్పహాడ్ రోడ్డులో గల గంగోత్రి ఆస్పత్రి ఎండీ కనకపూడి మహేష్ తన కారును ఆస్పత్రి ఎదుట నిలిపాడు. బ్యాంకులో నగదు వేసేందుకుగాను కారులో రూ.3లక్షలు ఉన్న బ్యాగును ఉంచి ఆస్పత్రి లోపలికి వెళ్లాడు. తిరిగి మహేష్ వచ్చేసరికి బ్యాగులో రూ.50వేలు మాత్రమే ఉన్నాయి. మిగతా రూ.2.50లక్షలు చోరీకి గురయ్యాయి. దీంతో నేరేడుచర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గిరిజన రైతులకు నాబార్డు చేయూత
దేవరకొండ: నాబార్డు(నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) గిరిజన రైతులకు అండగా నిలుస్తోంది. నాబార్డు మంజూరు చేస్తున్న నిధులతో గిరిజన రైతులు జలసంరక్షణ పనులతో పాటు వివిధ రకాల పంటలు సాగు చేస్తూ ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. దేవరకొండ మండల పరిధిలోని ధర్మతండా, సపావట్తండా, గొల్లపల్లి, వెంకట్తండాను ఐదేళ్ల కిత్రం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నాబార్డు డబ్ల్యూడీఎఫ్ (వాటర్షెడ్ డెవలప్మెంట్ ఫండ్) ఆయా గ్రామాల్లో భూ అభివృద్ధి పనులు చేపట్టింది. తద్వారా ఇక్కడ ఏర్పాటైన వాటర్షెడ్ కమిటీలు రైతుల కోసం వివిధ పనులకు సబ్సిడీలు మంజూరు చేస్తూనే తండాల వాసుల ఉపాధి కల్పనకు కూడా బాటలు వేశాయి. నాలుగు గ్రామాల్లో చేపట్టిన పనులు.. ● నాబార్డు ఎంపిక చేసిన ధర్మతండా, సపావట్తండా, గొల్లపల్లి, వెంకట్తండాల్లో అర్హులైన రైతుల పొలాల్లో మొదటగా లోతట్టు ప్రాంతాల్లో నీరు వృథాగా పోకుండా రాతి కట్టడం, ఫాంపాండ్స్, సంకెన్ పిట్స్, వరద కట్టల నిర్మాణాలు చేపట్టారు. ● నీటి నిల్వలు తగ్గకుండా చూడడం, బోరు రీచార్జ్ కావడం వంటి జలసంరక్షణ పనులు చేశారు. ● ఈ నాలుగు తండాల్లోని 1,100 హెక్టార్ల భూములకు సంబంధించి అర్హులైన రైతులను ఎంపిక చేసి నాబార్డు సహకారంతో యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ(ఏఆర్డీఎస్) ఆధ్వర్యంలో స్ప్రింక్లర్లు, పైపులు, డ్రిప్లు అందించారు. ● దొండ సాగుకు పందిళ్ల ఏర్పాటు, రైతుల పొలాలకు పైప్లైన్ వంటి పనులు చేపట్టి ప్రోత్సహించారు. ● నిధుల విషయంలో రైతుల వాటా 30శాతం ఉండగా నాబార్డు 70శాతం నిధులు మంజూరు చేసింది. ● మొత్తంగా ఐదేళ్లలో గిరిజన రైతుల పొలాల్లో అభివృద్ధి పనులకు నాబార్డు రూ.80లక్షలు మంజూరు చేసింది. దీంతో గిరిజనులు వివిధ పంటలతో పాటు కూరగాయల సాగు చేస్తూ కొంతమేర ఆర్థిక స్వావలంబన సాధించారు. ఫ దేవరకొండ మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో డబ్ల్యూడీఎఫ్ నిధులతో భూ అభివృద్ధి పనులు ఫ ఏఆర్డీఎస్ ఆధ్వర్యంలో రైతులకు స్ప్రింక్లర్లు, పైప్లు, డ్రిప్లు అందజేత ఫ ఉపాధికి బాటలు వేస్తున్న వాటర్షెడ్ కమిటీలు -
ఖేలో ఇండియా పోటీలకు అవకాశం కల్పించాలి
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఖేలో ఇండియా, జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు అవకాశం కల్పించాలని కోరుతూ గురువారం హైదరాబాద్లో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలదేవికి ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ హరీష్కుమార్ నేతృత్వంలో వినతి పత్రం అందజేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో క్రీడా ప్రాంగణాలను జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. క్రీడా ప్రాంగణాల ప్రత్యక్ష పరిశీలన కోసం ఎంజీ యూనివర్సిటీని సందర్శించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట స్పోర్ట్స్ బోర్డ్ సభ్యులు ప్రొఫెసర్ సోమలింగం, శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ రమావత్ మురళి తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక బజార్లు ఏర్పాటు
శాలిగౌరారం: ప్రజలకు నాణ్యమైన ఇసుకను సరసమైన ధరలకు అందించేందుకు మైనింగ్శాఖ ఆధ్వర్యంలో ఇసుక బజార్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీజీఎంబీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్కుమార్ అన్నారు. శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామ సమీపంలో మూసీ నది ఒడ్డున ఉన్న ప్రభుత్వ ఇసుక రీచ్ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మూసీ నది నుంచి ఇసుక రవాణా, ఇసుక స్టాక్ పాయింట్, వేబ్రిడ్జిలను పరిశీలించారు. మూసీ ప్రాజెక్టులోని ఇసుకను నిర్ణీత సమయంలో వెలికితీసి స్టాక్ పాయింట్కు తరలించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు, ఇసుక బజార్లకు ఇసుక రవాణా చేసే వాహనాలు ఇసుక స్టాక్పాయింట్ వద్ద వేచిచూడకుండా త్వరితగతిన లోడింగ్ జరిగేలా యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత రీచ్ నిర్వాహకులకు సూచించారు. ఇసుక వాహనాలను తూకం వేసే వేబ్రిడ్జిని పరిశీలించారు. వేబ్రిడ్జిలో ఏర్పడిన రిపేర్లను తక్షణమే సరిచేసి ఇబ్బందులు తలెత్తకుండా చడాలని సిబ్బందికి సూచించారు. తూకం కోసం ఇసుక వాహనాలు వేచిచూడకుండా అదనంగా మరో వేబ్రిడ్జిని ఏర్పాటు చేయాలని సంబంధిత ఉన్నతాధికారులకు సూచించారు. ఇసుక వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన ఇసుకను అందించేందుకు ప్రభుత్వం హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్మెట్, బౌరంపేట్, వట్టినాగులపల్లిలో ఇసుక స్టాక్పాయింట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుందన్నారు. ఆయా ఇసుక బజార్లను ఈ నెల 15న ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఇసుక రీచ్ల నుంచి ఇసుక బజార్లకు ఇసుకను తరలించి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇసుకను విక్రయించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట మైనింగ్శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ జాకోబ్, అసిస్టెంట్ జియాలజిస్ట్ బాలు, సూపర్వైజర్ మహిపాల్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ సుశీల్కుమార్ -
హోలి.. కావాలి ఆనందాల కేళి
రామగిరి(నల్లగొండ): హోలి పండుగ అనగానే అందరిలో ఉత్సాహం వస్తుంది. చిన్న నుంచి పెద్దల వరకు హుషారుగా రంగులు చల్లుకుంటారు. హోలి పండుగ రోజు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే విషాదాలకు తావులేకుండా ఆనందాలు నిండుతాయి. రసాయన రంగులతో చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతిలో లభించే పదార్ధాలతో తయారుచేసిన రంగులను వినియోగించితే మంచి జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రసాయనిక రంగుల్లో అల్యూమినియం బ్రొమైడ్, లెడ్ ఆకై ్సడ్, మెర్క్యూరీ సల్ఫైడ్, కాపర్ సల్ఫైడ్ వంటివి ఉంటాయని, వీటి వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఒకవేళ కంట్లో పడితే చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. సహజ రంగులతో మేలు... ప్రకృతిలో లభించే పువ్వులు, ఆకులతో రంగులను తయారు చేసుకుంటే శరీరానికి ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మోదుగు పువ్వు, గోగు పువ్వులను నీటిలో మరిగించడంతో రంగు ద్రావణంగా మారుతుంది. ఇలాంటివి చల్లుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మాయిశ్చరైజర్ రుద్దుకోవాలి హోలి ఆడటానికి ముందు చర్మానికి మాయిశ్చరైజర్ వాడాలి. తద్వారా రసాయన రంగులు శరీరానికి అంటుకోవు. చర్మం మొత్తం కప్పిఉండేలా దుస్తులు ధరించాలి. పెదవులు, కళ్ల చుట్టూ పెట్రోలియం జెల్లి రాసుకోవాలి. ఆర్గానిక్ రంగులు వాడితే ఉత్తమం. హోలి పూర్తయిన తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. చర్మంపై ఇరిటేషన్ అనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. – సీహెచ్. వెంకటకృష్ణ, చర్మవ్యాధి వైద్యుడు జాగ్రత్తలు తప్పనిసరి హోలి పండుగ రోజు రంగులు కంట్లో పడే ప్రమాదం ఉంటుంది. తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. కాంటాక్ట్ లెన్స్ వాడే వారు వాటిని తీసి హోలి ఆడాలి. కంట్లో రంగులు పడకుండా అద్దాలు వాడాలి. లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వాడాలి. ఒకవేళ కంట్లో రంగులు పడితే చల్లని నీటితో జాగ్రత్తగా శుభ్రం చేయాలి. కళ్లలో మంటగా అనిపిస్తే కంటి డాక్టర్ను సంప్రదించాలి. – డాక్టర్ తాటిపల్లి ప్రనూషరితేష్, కంటి వైద్యురాలు ఫ కళ్లలో, చర్మంపై రంగులు పడకుండా జాగ్రత్తలు వహించాలి ఫ రసాయనిక రంగులతో ఆరోగ్యానికి ముప్పంటున్న వైద్య నిపుణులు ఫ సహజమైన రంగులు వాడితే మేలు అని సూచన -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
మిర్యాలగూడ అర్బన్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మిర్యాలగూడ పట్టణంలోని శరణ్య గ్రీన్ హోమ్స్లో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. టూ టౌన్ సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన బిశ్వజిత్ చక్రబోటి(44) గత కొద్ది రోజులుగా బెల్ కంపెనీ గెస్ట్ హౌజ్లో సర్వర్గా పని చేస్తున్నాడు. అప్పుల బాధతో మనస్తాపం చెంది గెస్ట్ హౌజ్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. భూవివాదం కేసులో వ్యక్తికి జైలు, జరిమానాభువనగిరి: భూ వివాదం కేసులో వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ భువనగిరిలోని అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి గురువారం తీర్పు వెల్లడించారు. భువనగిరి మండలంలోని బొల్లెపల్లి గ్రామానికి చెందిన జిట్టా శ్రీనివాస్రెడ్డికి అదే గ్రామానికి చెందిన వనం రమేష్, అతని సోదరుడు వనం సుమన్ల మధ్య భూ పంపకాల విషయంలో వివాదాలు నెలకొన్నాయి. ఈక్రమంలో వారు 2020 మే 18న శ్రీనివాస్రెడ్డిపై దాడికి పాల్పడారు. దీంతో ఆయన భువనగిరి రూరల్పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన అప్పటి ఎస్సై శంకరయ్య విచారణ చేసి కోర్టుకు పంపించారు. కేసు కోర్టులో విచారణలో ఉండగానే వనం సుమన్ 2022లో అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. గురువారం భువనగిరిలోని అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి విచారణ చేసి వనం రమేష్కు సంవత్సరం జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు భువనగిరి ఎస్సై సంతోష్కుమార్ తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ మృతి మునుగోడు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం కచలాపురం గ్రామానికి చెందిన జంగ సుజాత(42) తల్లి చీకటిమామిడి గ్రామంలో ఉంటుంది. తన తల్లికి జ్వరం వస్తుండడంతో బుధవారం సుజాత తన కుమారుడితో కలిసి బైక్పై తల్లిని మునుగోడులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకుని తిరిగి చీకటిమామిడికి వెళ్తున్నారు. మార్గమధ్యలో మునుగోడు మండల కేంద్రం పరిధిలోని పత్తి మిల్లు వద్ద గేదెకు ఢీకొట్టి ముగ్గురు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో సుజాత తలకు తీవ్రంగా గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. లారీని ఢీకొట్టిన టిప్పర్.. డ్రైవర్కు గాయాలు హుజూర్నగర్: ముందు వెళ్తున్న లారీని మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్కు గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం హుజూర్నగర్ పట్టణంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు నుంచి హుజూర్నగర్ వైపు మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ హుజూర్నగర్ పట్టణ పరిధిలోకి రాగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో టిప్పర్ డ్రైవర్ కొండా వర్మ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ముత్తయ్య తెలిపారు. గొర్రెల మంద పైకి దూసుకెళ్లిన లారీపాలకవీడు: వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి గొర్రెల మంద పైకి దూసుకెళ్లడంతో 8 గొర్రెలు మృతిచెందాయి. ఈ ఘటన గురువారం పాలకవీడు మండల కేంద్రం సమీపంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకవీడు మండలం నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మలిగిరెడ్డి అంజిరెడ్డి గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే గురువారం కూడా గొర్రెలను మేపడానికి తోలుకెళ్తుండగా.. పాలకవీడు మండల కేంద్రం సమీపంలో లారీ అదుపుతప్పి గొర్రెల మంద పైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 8 గొర్రెలు మృతిచెందాయి. మరికొన్ని గొర్రెలకు గాయాలయ్యాయి. సుమారు రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. పోలీసులు ఘటనా స్దలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జూదరుల అరెస్ట్అనంతగిరి: మండల పరిధిలోని ఖానాపురం శివారులో పేకాట ఆడుతున్న వారిని అనంతగిరి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ నవీన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపురం గ్రామ శివారులో కొందరు పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఖానాపురం గ్రామానికి చెందిన ఐదుగురు పేకాట ఆడుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి నుంచి రూ.1430 నగదు. రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
భూసారాన్ని కాపాడుకుంటేనే అధిక దిగుబడులు
త్రిపురారం: పంటల సాగులో విచ్చలవిడిగా రసాయన మందులు వాడుతుండడంతో భూసారం దెబ్బతింటుందని, భూసారాన్ని కాపాడుకుంటేనే అధిక దిగుబడులతో సాధించవచ్చని త్రిపురారం మండంలోని కంపాసాగర్లో గల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రోగాం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు అన్నారు. గురువారం కంపాసాగర్ కేవీకేలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రైతులకు కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. వరితో పాటు వివిధ రకాల పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు కేవీకే శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. భూమిలోని పోషకాలు మొక్కలకు సమపాలల్లో అందాలంటే సేంద్రియ ఎరువులను వినియోగించుకోవాలన్నారు. చీడపీడల నివారణకు అన్నిరకాల మందులను కలిపి పిచికారీ చేయడం వల్ల పంట నష్టపోవాల్సి వస్తుందన్నారు. వరి పొలంలో యూరియాతో పాటు పొటాష్ వేసుకోవడం వల్ల చీడపీడలను తట్టుకునే శక్తి పెరుతుతుందన్నారు. ప్రస్తుతం వరి పైరులో అగ్గితెగులు, కాండం కుళ్లు తెగులు, సుడిదోమను గమనించామని శాస్త్రవేత్తల సలహాలతో పురుగు మందులు సకాలంలో పిచికారీ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త లింగయ్య, సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్, సస్యరక్షణ శాస్త్రవేత్త రాములమ్మ, యంగ్ ప్రొఫెషనల్స్, కేవీకే సిబ్బంది పాల్గొన్నారు. ఫ కేవీకే కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు ఫ కేవీకేలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు కిసాన్ మేళా -
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా..
ఉద్యోగపరంగా పబ్లిక్ సర్వీస్ చేయాలనే లక్ష్యంతో గ్రూపు పరీక్షలకు సన్నద్ధమై రాశానని, గ్రూపు–2 స్టేట్ 11వ ర్యాంకర్ యాదాద్రి భువనగిరి జిల్లా (yadadri bhuvanagiri district) మోత్కూరుకు చెందిన గుర్రం సాయికృష్ణారెడ్డి తన మనోగతాన్ని వెల్లడించారు. మోత్కూరుకు చెందిన గుర్రం మోహన్రెడ్డి స్వరాజ్యం దంపతులకు సాయికృష్ణారెడ్డి, సాయి సుప్రియ సంతానం. సామాన్య రైతు కుటుంబం. మోత్కూరులో కిరాణం దుకాణం నిర్వహిస్తున్నారు.మోత్కూరులోని సేక్రెడ్ హార్ట్ హైస్కూల్లో పదవ తరగతి వరకు, హైదరాబాద్ (Hyderabad) కొత్తపేట నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్లో ఎంపీసీ పూర్తి చేశారు. అనురాగ్ యూనివర్సిటీలో బీటెక్, సీఈసీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. గ్రూప్–2 ఫలితాల్లో 600 మార్కులకు గాను 422.91 ర్యాంకు సాధించి స్టేట్ లెవల్ 11వ ర్యాంకు పొందారు.సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ పోస్టులు సాధించాలన్నదే నా లక్ష్యం. హైదరాబాద్లోని అశోక్నగర్లో 4 సంవత్సరాలు హాస్టల్లో ఉంటూ స్టడీ హాల్కు వెళ్లి ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సొంతంగా గ్రూపు పరీక్షలకు సిద్ధమై రాశాను. మా పెద్ద తాత మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేసి ప్రజాసేవ చేసిన గుర్రం యాదగిరిరెడ్డి (Gurram Yadagiri Reddy) స్ఫూర్తితో నేను రాజకీయాలు కాకుండా ఉద్యోగం ద్వారా పబ్లిక్ సేవ చేయాలనే లక్ష్యంతో గ్రూపు పరీక్షలు రాస్తున్నాను. రూ.4 లక్షల ప్యాకేజీ జీతం సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని ప్రభుత్వ ఉద్యోగం కోసం వచ్చాను. ఇందులో ప్రధానంగా నా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. ప్రభుత్వ ఉద్యోగమే చేయాలని అమ్మానాన్న పట్టుబట్టారు.చదవండి: అలా.. ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాగ్రూప్–4 ఫలితాల్లో జిల్లా మొదటి ర్యాంకు సాధించాను. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాను. మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. గ్రూప్–3 పరీక్ష కూడా రాశాను. త్వరలో ఆ ఫలితాలు కూడా రానున్నాయి. మా చెల్లెలు సాయి సుప్రియ గ్రూపు–4 లో ర్యాంకు సాధించి మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తోంది’అని తెలిపారు. -
ప్రణయ్ కేసు తీర్పు మార్పునకు నాంది కావాలి
రామగిరి(నల్లగొండ) : మిర్యాలగూడలో జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు సుదీర్ఘ విచారణ అనంతరం నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ నెల 10వ తేదీన ఒకరికి మరణశిక్ష, మిగతా వారికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. ఈ హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్థంగా కోర్టులో సమర్పించడంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ పాత్ర కీలకం. ఈ కేసు విచారణ జరిగిన తీరును బుధవారం ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. కేసు ఎందుకు వాదించాల్సి వచ్చింది? కేసు జరుగుతున్న సమయంలో సాక్ష్యాధారాలు ఎలా సేకరించారు? తదితర వివరాలను ఆయన వెల్లడించారు. 2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ హత్య జరిగింది. నిందితులపై కేసు నమోదు కావడం కోర్టులో హాజరు పరిచారు. నిందితులు బెయిల్పై విడుదల అయ్యారు. దీంతో ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యర్థన మేరకు అప్పటి కలెక్టర్ వి.చంద్రశేఖర్ 2019డిసెంబర్ 2న ఈ కేసుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించారు. అప్పటికే పీడీ యాక్ట్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చిన మారుతీరావు తన కూతురు అమృతవర్షిణిని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఆయన బెయిల్ రద్దు చేయాలని అమృత కోర్టులో పిటిషన్ వేసింది. ఆ తర్వాత మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2020లో చార్జిషీట్ ఈ కేసులో 2020డిసెంబర్ 20న కోర్టు చార్జిషీట్ నమోదు అయింది. ప్రణయ్ తండ్రి బాలస్వామి, భార్య అమృతవర్షిణి, తల్లి ప్రేమలత స్టేట్మెంట్, 20 రోజుల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. కోవిడ్ తర్వాత కేసు విచారణలో కొంత జాప్యం జరిగింది. 2022జూలై 26న జడ్జి బి.తిరుపతి బాధ్యతలు తీసుకున్నాక నిందితులతో పాటు సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేశారు. 2024 జూలైలో జడ్జిగా ఎన్.రోజారమణి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సమయంలో కేసు విచారణ వేగంగా కొనసాగింది. కేసులో కోర్టుకు 102 మంది సాక్షుల పేర్లను సమర్పించగా 78 మంది సాక్షులను విచారించారు. 293 పేజీల డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించాం. పరువు హత్యలు ఆగాలి.. ఈ కేసులో 472 పేజీల రాత పూర్వక వాదనలను, ఏడు సుప్రీం కోర్టు జడ్జిమెంట్లను కోర్టుకు సమర్పించా. 523 పేజీలతో కోర్టు తీర్పు ఇచ్చింది. డిఫెన్స్ న్యాయవాదుల వాదనలను సమర్థంగా తిప్పికొట్టి అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించడంతో నిందితులకు కఠినశిక్షలు పడ్డాయి. ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తమిళనాడు రాష్ట్రంలోని పలు పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. అనేక డిబేట్లు జరుగుతున్నాయి. న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగింది. కుల హత్యలకు పాల్పడే వారికి ఈ తీర్పు కనువిప్పునిస్తుంది. ఇప్పటికీ కుల పరమైన దాడులు, హత్యలు జరుగుతున్నాయి. అవన్నీ ఈ తీర్పుతో ఆగాలి. ఫ ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యర్థనతో స్పెషల్ పీపీగా నియమించారు ఫ ఈ కేసులో 472 పేజీల రాత పూర్వక వాదనలు కోర్టుకు సమర్పించా ఫ ఏడు సుప్రీం కోర్టు జడ్జిమెంట్లను అందజేశా ఫ కుట్రలన్నీ కోర్టులో నిరూపణయ్యాయి ‘సాక్షి’తో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ -
40.3 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత
ఫ బొమ్మలరామారంలో ఎల్లో అలర్ట్ జారీ భువనగిరిటౌన్: వారం రోజుల క్రితం వరకు మామూలుగానే ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు 36 నుంచి 37 డిగ్రీలున్న ఉష్ణోగ్రత 40.3 డిగ్రీలకు చేరడంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బొమ్మలారామారం మండలంలో బుధవారం 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. కాగా.. రాజాపేటలో 39.1, నారాయణపురంలో 38.7, ఆలేరులో 38.5, అడ్డగూడూరులో 38.4, గుండాలలో 38.3, చౌటుప్పల్లో 38.2, బీబీనగర్లో 38.1, మోత్కూర్లో 38, తుర్కపల్లిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెనూ ప్రకారం ఆహారం అందించాలిభువనగిరి: మెనూ ప్రకారం ఆహారం అందించడంతో పాటు నాణ్యత ప్రమాణాలను పాటించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం వద్ద ఎస్టీ బాలికల కళాశాల హాస్టల్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏకాగ్రతతో చదువుకుని ఉన్నత విలువలతో తమ లక్ష్యాలను సాధించాలన్నారు. పుస్తకాలను చదివే అలవాటును పెంచుకోవాలన్నారు. హాస్ట ళ్లలో మెనూ పాటించకపోతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు వంట గదిని పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందజేశారు. ఇంగ్లిష్ టు తెలుగు డిక్షనరీలను పంపిణీ చేశారు. రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలి భువనగిరిటౌన్: బ్యాంకు, వ్యవసాయ శాఖ సమన్వయంతో రైతులకు రుణ మార్పు, తక్కువ వడ్డీ సదుపాయంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి మాధవిలత అన్నారు. బుధవారం లీడ్ బ్యాంక్ మేనేజర్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, వ్యవసాయ అధికారి గోపాల్తో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి, రామన్నపేట, రాజాపేటలోని రైతువేదికల్లో వ్యవసాయ న్యాయ సేవా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. న్యాయ సహాయం, సలహాలు న్యాయ సేవా సంస్థల ద్వారా అందించటం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ శివరామకృష్ణ ఉన్నారు. టెండర్ డబ్బులు చెల్లించిన వారికే ధాన్యం ఫ గూగుల్ మీట్లో మిల్లర్లతో అదనపు కలెక్టర్ వీరారెడ్డి సాక్షి,యాదాద్రి: 2022– 23 సంవత్సరానికి టెండర్ ధాన్యం డబ్బులు పూర్తిగా చెల్లించిన మిల్లర్లకే యాసంగి ధాన్యం కేటాయింపులు ఉంటాయని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. బుధవారం జిల్లాలోని రైస్ మిల్లర్లు, అధికారులతో గూగుల్ మీట్ ద్వారా మాట్లాడారు. 10 మంది మిల్లర్లు ఇంకా టెండర్ ధాన్యం డబ్బులు చెల్లించలేదన్నారు. కొన్ని మిల్లుల్లో 2024–25 వానాకాలం ధాన్యం నిల్వ లు లేవని సమాచారం ఉందని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎంఆర్ డెలివరీ వేగవంతం చేయడానికి ప్రతి ఒక్క మిల్లర్ కమిషనర్ ఆదేశాలను పాటించాలన్నారు. బియ్యం సరఫరా పూర్తి చేయని మిల్ల ర్లకు ధాన్యం కేటాయింపులు చేయబోమని తెలిపారు. మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని లక్ష్మీనర్సింహ అగ్రో ఇండస్ట్రీస్ ముక్తాపూర్, ఎల్ఎన్ ఆగ్రోస్ గుండాల మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఇప్పటినుంచి జిల్లా లో ఎనిమిది తనిఖీ బృందాలు ఏర్పాటుచేసి ఒక్కో కమిటీ 6 మిల్లులను చెక్ చేసి నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలన్నారు. సమావేశంలో జిల్లా రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి రానీయొద్దు
భువనగిరిటౌన్: వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ గంగాధర్ ఆదేశించారు. బుధవారం భువనగిరిలోని జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ ప్లానింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ నీరు క్రమం తప్పకుండా సరఫరా అయ్యేలా చూడాలన్నారు. గత సంవత్సరం నీటి ఎద్దడి ఎదుర్కొన్న గ్రామాల్లో సమస్య పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో వెంటనే బోర్లకు మరమ్మతులు, ఫ్లషింగ్ చేయించాలని ఆదేశించారు. నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే స్థానికంగా నీటి సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. జెడ్పీ సీఈఓ శోభరాణి మాట్లాడుతూ.. 2025–26కు సంబంధించి 15 వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర కమిషన్ సిఫార్సు మేరకు రూ.2,16,91,520 నిధులు కేటాయింపు చేసినట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ గంగాధర్ అన్నారు. వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన వాల్పోస్టర్ను బుధవారం జెడ్పీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా వైద్య, విద్య, డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, వ్యవసాయ పశుసంవర్ధక, పబ్లిక్ వర్క్స్, పర్యావరణ, కాలుష్య నివారణ, మున్సిపల్ కమిషనర్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కూడళ్ల వద్ద, పార్కుల వంటి స్థలాల్లో చలివేంద్రాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసి తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ, వైద్యాధికారి, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ గంగాధర్ -
ప్రభుత్వం కరుణించేనా!
సాక్షి, యాదాద్రి: ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు లేక పలు పెండింగ్ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. రీజినల్ రింగ్ రోడ్డు, ఎంఎంటీఎస్, గౌరెల్లి– కొత్తగూడెం జాతీయ రహదారి, మూసీ కాలువల ఆధునీకరణ, బస్వాపురం రిజర్వాయర్ బాఽధితులకు నష్ట పరిహారం, గంధమల్ల రిజర్వాయర్, రోడ్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, టూరిజం సర్క్యూట్కు నిధులు లేక నిలిచిపోయాయి. ఈనెల 19న చేపట్టే వార్షిక బడ్జెట్ సమావేశాల్లోనైనా ఈసారి నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. మూసీకాలువల ఆధునీకరణకు విడుదల కాని నిధులు సాగు నీటి అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం మూసీ కాలువల ఆధునీకరణకు నిధులు కేటాయించింది. ఉమ్మడి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల రైతులకు అదనపు సాగు నీరందించేందుకు కాలువలను మంజూరు చేశారు. ప్రధానంగా బునాదిగాని, పిల్లాయపల్లి, ధర్మారెడ్డి కాలువలను ఆధునీకరించడానికి గత సంవత్సరం ప్రభుత్వం జీవో జారీ చేసింది. పిల్లాయిపల్లి కాలువకు రూ.86.22 కోట్లు,ధర్మారెడ్డికాలువకు రూ.123.98 కోట్లు, బునాదిగాని కాలువకు రూ.266కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా ఆమోదం తెలిపింది. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ముంపు బాఽధితులకు అందని నష్ట పరిహారం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పరిహారం రాలేదు. బీఎన్ తిమ్మాపూర్ నిర్వాసితులకు రూ.109 కోట్లు పరిహారం ఇవ్వాలి. డిసెంబర్లో ముంపు నిర్వాసితులకు రూ.50 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. అయితే పూర్తి స్థాయిలో పరిహారం రాకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. ముందుగా తక్కువ పరిహారం లభించే వారికి ఇవ్వాలని నిర్ణయం కూడా చేశారు. ఈలోపు కాలయాపన కావడంతో రూ.50 కోట్లను ఇతర ప నులకు మళ్లించారు. పరిహారం కోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. దీంతోపాటు భూసేకరణ కు మరో రూ.200 కోట్లు అవసరం ఉన్నాయి. పరి హారం చెల్లిస్తే తప్ప రిజర్వాయర్లో నీటిని నిల్వచేసే పరిస్థితి లేదు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు జిల్లాకు మంజూరు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 55 నియోజకవర్గాలకు సూళ్లను మంజూరు చేసిన ప్రభుత్వం భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు ఒక్కటి కూడా కేటాయించలేదు. రోడ్లకు నిధుల మంజూరు ఏదీ? జిల్లాలోని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల్లో రోడ్లు మంజూరు చేశారు. పలు రోడ్లకు శిలాఫలకాలను కూడా వేశారు. అయితే నిధుల లేమితో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. ఆలేరు– కొలనుపాక రోడ్డుపై బ్రిడ్జిలు, మూసీ కాలువలపై బ్రిడ్జిలు, రాయిగిరి– మోత్కూరు రోడ్డు, చిట్యాల – భువనగిరి రోడ్డు వెడల్పు పనులు ఇలా జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల విలువ చేసే రోడ్ల పనులు నిధులు లేక నిలిచిపోయాయి. గంధమల్లకు నిధులు వచ్చేనా గంధమల్ల రిజర్వాయర్కు ఇటీవల జరిగిన కేబినెట్లో ఆమోదం లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఈ రిజర్వాయర్కు నిధుల కొరత ఉంది. సామర్థ్యం తగ్గించి నిర్మించడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే నిధులు కేటాయిస్తే తప్ప పనులు ప్రారంభం కావు. టూరిజం సర్క్యూట్కు నిధులు అవసరం భువనగిరి, కొలనుపాక, యాదగిరిగుట్ట, భూదాన్పోచంపల్లి, రాయిగిరి ఇలా పలు చోట్ల టూరిజం అభివృద్ధికి నిధుల అవసరం ఉంది. ప్రపంచ టూరిజం గ్రామంగా పోచంపల్లిని మూడేళ్ల క్రితం గుర్తించారు. కానీ నిధులు కేటాయించక ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఫ నిధుల లేమితో ముందుకు సాగని పెండింగ్ ప్రాజెక్టులు ఫ పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగాని కాల్వలకు విడుదల కాని నిధులు ఫ బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు అందని పరిహారం ఫ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లోనైనా నిధులు కేటాయించాలని జిల్లా ప్రజల వేడుకోలుప్రధాన సమస్యలపై ప్రస్తావిస్తా నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. గంధమల్ల, రోడ్లు, అభివృద్ధి పనుల కోసం నిధులు కావాలని సీఎంను కలిసి ఇప్పటికే విజ్ఞప్తి చేశా. బడ్జెట్లో నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. – బీర్ల ఐలయ్య, ప్రభుత్వ విప్, నిధులు మంజూరు చేయాలని కోరుతా భువనగిరి నియోజకవర్గంలో సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు కావాల్సి ఉంది. మూసీ కాలువల ఆధునీకరణ, బస్వాపూర్ రిజర్వాయర్కు నిధులు కావాలి. యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయాలి. అదేవిధంగా టూరిజం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతాను. – అనిల్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే , భువనగిరి భూసేకరణకు నిధుల కొరత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్రోడ్డు, ఎంఎంటీఎస్, గౌరెల్లి– కొత్తగూడెం జాతీయ రహదారి 330ఏ ల భూ సేకరణ నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ పూర్తి చేస్తే కేంద్రం పనులను చేపడుతుంది. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్రెడ్డి భూసేకరణచేయాలని రాష్ట్రాన్నికోరారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం భూ సేకరణ కు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. బడ్జెట్లో నిధులు కేటాయిస్తే ఈ ప్రాజెక్టులు ముందుకు కదిలే అవకాశం ఉంది. -
లక్ష్యం దిశగా అడుగులు
వంద శాతం వసూలు చేస్తాం వంద శాతం పన్ను వసూలు లక్ష్యం దిశగా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పన్ను చెల్లింపుతో గ్రామాల అభివృద్ధి కోసం ఏ విధంగా ఉపయోగిస్తారో వివరిస్తున్నాం. మొండి బకాయిదారుల నుంచి కూడా పన్ను వసూలు చేస్తున్నాం. – సునంద. జిల్లా పంచాయతీ అధికారి భువనగిరిటౌన్: జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లోని పంచాయతీ విభాగం పన్నుల వసూళ్లలో దూకుడు ప్రదర్శిస్తోంది. 2024– 25 ఆర్థిక సంవత్సరం పూర్తికి మరో 20 రోజులు మిగిలి ఉంది. ఇప్పటికి దాదాపు 79 శాతం పన్నుల వసూళ్లు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి లక్ష్యానికి చేరుకునేందుకు పన్ను వసూళ్లను ముమ్మరం చేశారు. 11 మండలాల్లో 80శాతానికి పైగా వసూళ్లు జిల్లా వ్యాప్తంగా 17 మండలాలకు 11 మండలాల్లో 80శాతం పైగా పన్ను వసూలు చేశారు. నారాయణపురం మండలం 91శాతం, ఆత్మకూర్లో 88 శాతం, పోచంపల్లిలో 85శాతం వసూలు చేయగా.. బీబీనగర్, ఆలేరు, రామన్నపేట, మోత్కూర్ మండలాలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. పన్ను వసూళ్లలో వెనుకబడ్డ మండలాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి లక్ష్య సాధనకు కృషి చేయాలని అధికారులు, సిబ్బందికి సూచిస్తున్నారు. వెనుకబడ్డ గ్రామాలను గుర్తించి గ్రామాల వారీగా పురోగతి తెలుసుకొని, తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. మార్చి నెలాఖరు నాటికి లక్ష్యాన్ని సాధించేలా పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అవసరమైతే జిల్లాస్థాయి అధికారులు సైతం గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి పన్ను చెల్లిస్తే కలిగే లాభాలను ప్రజలకు వివరిస్తున్నారు. జిల్లాలో 428 గ్రామ పంచాయతీలు ఉండగా 2,03232 నివాసాలు ఉన్నాయి. మండలాల వారీగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (పన్నుల డిమాండ్) ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. జిల్లా మొత్తంలో ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 16,95,85,230 వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రూ. 13,47,30,773 వసూలు చేయగా, రూ. 3,38,49,457 వసూలు చేయాల్సి ఉంది. అంటే ఇంకా 21 శాతం వసూలు చేయాలి. ఫ గ్రామాల్లో 79 శాతం పన్ను వసూళ్లు ఫ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 16,95,85,230 వసూలు చేయాలని లక్ష్యం ఫ ఇప్పటివరకు రూ. 13,47,30,773 వసూలు ఫ స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పంచాయతీ అధికారులు -
ప్రభుత్వ పాఠశాలలకు ‘పీఎం శ్రీ’ వరం
ఒక్కో పాఠశాలకు మంజూరయ్యే నిధులు ఇలా.. 250 మంది విద్యార్థుల లోపు రూ.75వేలు 250 మంది విద్యార్థులకు పైన రూ.1లక్ష సీసీ కెమెరాలకు రూ.50వేలు వార్షిక వేడుకలకు రూ.50వేలు కరాటే శిక్షణకు రూ.30వేలు ఎక్స్ప్లోరల్ విజిట్ ఒక్కో విద్యార్థికి రూ.500 క్షేత్రస్థాయి అధ్యయనం ఒక్కొక్కరికి రూ.500 హరిత కార్యక్రమాలకు. రూ 500 దినపత్రికలకు రూ.12వేలు సమీప పాఠశాలల అధ్యయనం రూ.20వేలు బాలికల చైతన్యానికి రూ.5వేలు సైన్స్ సర్కిల్ ఏర్పాటుకు రూ.15వేలు మ్యాథ్స్ సర్కిల్స్ ఏర్పాటుకు రూ.15వేలు రామన్నపేట : విద్యారంగంలో మార్పులు తీసుకురావడం, మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకంతో అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య, అభ్యసన అనుభవాలను అందిస్తున్నారు. విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించేందుకు విజ్ఞానయాత్రలకు తీసుకెళ్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్నాయి. కాగా.. పీఎం శ్రీ పథకాన్ని కేంద్రం గతేడాది ప్రారంభించింది. మొదటి దశలో ఎంపికై న స్కూళ్లు ఇవీ.. తొలి విడతలో జిల్లానుంచి 17 పాఠశాలలకు చోటు దక్కింది. ఇందులో ఆలేరు, కొలనుపాక, ఆత్మకూరు(ఎం), బస్వాపూర్, బీబీనగర్, చీకటిమామిడి, దండుమల్కాపురం, జూలూరు, రాజాపేట, వెల్లంకి, యాదగిరిగుట్ట (బాలికల) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, గుండాల, ఎం.తుర్కపల్లి, సంస్థాన్నారాయణపురం, భూదాన్పోచంపల్లి మోడల్స్కూ ళ్లు, భువనగిరి బాలుర సాంఘిక సంక్షేమ గురుకులం, చౌటుప్పల బాలికల గురుకుల పాఠశాల ఉన్నాయి. రెండవ విడతలో.. రెండో విడతలో 8 పాఠశాలలు ఎంపికయ్యాయి. వాటిలో కోటమర్తి ఎంపీపీఎస్, ఆలేరులోని బాలికల గురుకులం, భువనగిరిలోని గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మోటకొండూరు మండలం చాడ ఎంపీపీఎస్, మోత్కూరు మండలం పాలడుగు ఎంపీయూపీఎస్, వలిగొండ మండలం ఎం.తుర్కపల్లి ఎంపీయూపీఎస్, మల్లాపూర్ ఎంపీపీఎస్, పోచంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. నిధులను వీటికి ఖర్చు చేస్తారు పథకానికి ఎంపికై న పాఠశాలలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు 60:40 శాతం నిష్పత్తిలో నిధులు మంజూరు చేస్తాయి. ఈ నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రయోగశాలలు, ల్యాబ్లలో పరికరాలను సమకూర్చడం, విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్స్, ఎక్స్ప్లోరర్ విజిట్కు తీసుకు వెళ్లడం, వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన వారితో తరగతులను నిర్వహణ, బాలికల ఆత్మరక్షణకు శిక్షణ ఇప్పించడం, బాలికల సాధికారిత క్లబ్ల ఏర్పాటు చేస్తారు. ఎంపికై న పాఠశాలకు ఐదేళ్ల కాలానికి విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.2కోట్ల వరకు ప్రభుత్వాలు ఖర్చు చేస్తాయి. ఇప్పటి వరకు ఎంపికై న పాఠశాలల ఖాతాల్లో రూ.2.50 కోట్లు జమ అయ్యాయి. ఫ అత్యున్నత ప్రమాణాలతో బోధన ఫ విజ్ఞానం పెంపొందించేందుకు ఫీల్డ్ విజిట్ ఫ రెండు విడతల్లో 25 పాఠశాలల ఎంపిక ఫ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిధులు విడుదల ఎక్స్ప్లోరర్, ఫీల్డ్ విజిట్లతో ఎంతో మేలు కలుగుతుంది ఎక్స్ప్లోరర్ విజిట్లో భాగంగా రామప్ప దేవాలయం, కాకతీయుల కళాతోరణం, లక్నవరం, పాకాల చెరువులను సందర్శించాం. భువనగిరి సమీపంలోని వ్యవసాయక్షేత్రానికికు వెళ్లి పంటల సాగుపై అధ్యయనం చేశాం. తరగతి గదుల్లో బోధనకు, క్షేత్ర పర్యనలు తోడవడం వల్ల వివిధ అంశాలపై అవగాహన పెరిగింది. ఫీల్డ్ విజట్లతో ఎంతో మేలు జరుగుతుంది. – విద్య, పదవ తరగతి విద్యార్థి పాఠశాలల బలోపేతానికి దోహదం ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం గ్రామీణ ప్రాంత పాఠశాలల బలోపేతానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి దోహదపడుతుంది. ఎక్స్ప్లోరర్, ఫీల్డ్ విజిట్ల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన పీఎం శ్రీ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా చూస్తున్నాం. – సురేందర్రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, వెల్లంకి -
రూ. 309 కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదనలు
నల్లగొండ టూటౌన్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మరిన్ని కోర్సులు ప్రవేశపెట్టడానికి, అదనపు భవనాల నిర్మాణం, అధ్యాపకుల నియామకంతో పాటు ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.309.65 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు విద్యాధరరెడ్డి, మృణాళిని, శోభారాణి బృందం బుధవారం ఎంజీయూను సందర్శించి పలు భవనాలను, సదుపాయాలను పరిశీలించారు. పానగల్ క్యాంపస్ను సందర్శించి అక్కడ ఇంజనీరింగ్ కళాశాల, స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు వీసీ తన చాంబర్లో అభివృద్ధి ప్రతిపాదనలను, యూనివర్సిటీ స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఎంఏ గవర్నర్స్ అండ్ పబ్లిక్ పాలసీ, ఎంఏ డెవలప్మెంట్ స్టడీస్, బీఫార్మసీ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వీసీ తెలిపారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తామని ప్రొఫెసర్ల బృందానికి వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, ఓఎస్డీ కొప్పుల అంజిరెడ్డి, డెవలప్మెంట్ డైరెక్టర్ ఆవుల రవి, దోమల రమేష్, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై. ప్రశాంతి, ప్రిన్సిపాల్స్ సుధారాణి, కె. ప్రేమ్సాగర్, హరీష్కుమార్, సీఓఈ ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ ఎంజీయూలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరిన్ని కోర్సులు ఫ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఫ యూనివర్సిటీని సందర్శించిన ఉన్నత విద్యామండలి ప్రొఫెసర్ల బృందం -
బుద్ధవనం నిర్మాణం అద్భుతం
నాగార్జునసాగర్: బుద్ధవనం నిర్మాణం అద్భుతంగా ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని బుధవారం ఆయన కమిన్ సభ్యులతో కలిసి సందర్శించారు. లాంచీలో ప్రయాణించారు. బుద్ధవనంలో బుద్ధుని పాదుకల వద్ద పుష్పాంజలి ఘటించారు. సాగర్ డ్యాం, జలవిద్యుదుత్పాదన కేంద్రం, బుద్ధచరిత వనం, జాతక వనం, స్థూప వనం, మహాస్థూపం, స్థూపం అంతర్భాగంలో గల అష్టబుద్ధులను సందర్శించారు. బుద్ధవనాన్ని ప్రతిఒక్కరు సందర్శించాలని అన్నారు. వీరికి పర్యాటక శాఖ గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశేషానలు వివరించారు. ఆయన వెంట కమిషన్ సభ్యులు కుసురం నీలాదేవి, రాంబాబునాయక్, లక్ష్మీనారాయణ, శంకర్, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, నల్లగొండ జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ పీడీ కోటేశ్వర్రావు, స్థానిక ఎస్ఐ సంపత్గౌడ్, ఆర్ఐ దండ శ్రీనివాస్రెడ్డి, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి బలవన్మరణం
చిట్యాల: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో జరిగింది. బుధవారం ఎస్ఐ ఎన్. ధర్మా తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకాపర్తి గ్రామానికి చెందిన ఆలకుంట్ల రాజు(27) తన భార్య సద్గుణ, ఇద్దరు పిల్లలతో కలిసి కొతకాలంగా హైదరాబాద్లోని బోరబండలో నివాసముంటున్నాడు. అక్కడ డ్రిల్లింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం పెద్దకాపర్తి గ్రామంలో జరిగిన తిరుమలనాథస్వామి కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు కుటుంబంతో కలిసి వచ్చాడు. సోమవారం తిరిగి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వెళ్లాడు. మంగళవారం మళ్లీ పెద్దకాపర్తి గ్రామానికి వచ్చిన రాజు గ్రామంలోని తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రి పది గంటల సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి మృతుడి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. రాజు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని అతడి భార్య సద్గుణ బుధవారం ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
సాగర్ను సందర్శించిన విదేశీ మీడియా ప్రతినిధులు
నాగార్జునసాగర్: విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సహకారంతో హైదరాబాద్లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మీడియా మేనేజ్మెంట్పై ఈ నెల 15వ తేదీ వరకు ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్స్ కార్పొరేషన్(ఐటీఈసీ) వారు వివిధ దేశాల మీడియా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా నేపాల్, శ్రీలంక, గయానా, టాంజానియా, సూరినామ్ తదితర దేశాలకు చెందిన 28 మంది మీడియా ప్రతినిధులు బుధవారం నాగార్జునసాగర్కు వచ్చారు. సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం లాంచీలో నాగార్జుకొండకు వెళ్లి అక్కడ మ్యూజియంను, బుద్ధవనంలోని జాతకవనం, స్థూపపార్కు, తపోవనం తదితర ప్రాంతాలను సందర్శించారు. వీరి వెంట మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. -
కష్టపడ్డారు.. ‘గ్రూప్స్’ సాధించారు
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పలువురు గ్రూప్–2 ఫలితాల్లో సత్తా చాటి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కలకోవ వాసికి 29వ ర్యాంకు మునగాల: గ్రూప్–2 ఫలితాల్లో మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన గుండు లక్ష్మణ్వర్మ రాష్ట్రస్థాయిలో 29వ ర్యాంకు సాధించారు. గతంలో చైన్నెలో ఆదాయ పన్ను శాఖలో పనిచేసిన ఆయన.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు సాధించి కోదాడ ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పుడు గ్రూప్–2 ఫలితాల్లో 29వ ర్యాంకు సాధించాడు. ఇటుకులపహాడ్ వాసికి 60వ ర్యాంకు శాలిగౌరారం: మండలంలోని ఇటుకులపహాడ్ గ్రామానికి చెందిన రచ్చ శ్రీనివాస్–తిరుమలేశ్వరి దంపతుల కుమారుడు రచ్చ పవన్కుమార్ గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 60వ ర్యాంకు సాధించాడు. గతంలో టీసీఎస్ కంపెనీలో రూ.3.40లక్షల వార్షిక ప్యాకేజీతో సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేసిన అతడు గత డిసెంబర్లో ప్రకటించిన గ్రూప్–4 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించి పీఏపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగం చేస్తూనే గ్రూప్స్కు ప్రిపేరైన పవన్కుమార్ ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో 434 మార్కులు సాధించగా.. గ్రూప్–2లో 60వ ర్యాంకు సాధించారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఆన్లైన్, యూట్యూబ్లో క్లాస్లు విని ప్రిపేరయ్యాని, సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని పవన్కుమార్ పేర్కొన్నారు. 80వ ర్యాంకు సాధించిన డిండి మండల వాసి.. డిండి: డిండి మండలం రుద్రాయగుడెం గ్రామానికి చెందిన పోనుగోటి వినయ్రావు గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 80వ ర్యాంకు సాధించారు. వినోద్రావుకు ప్రభుత్వ ఉధ్యోగం రావడం పట్ల గ్రామస్తులు అభినందనలు తెలిపారు. 135వ ర్యాంక్ సాధించిన రాజశేఖర్రెడ్డి హుజూర్నగర్ (చింతలపాలెం): చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన గంగిరెడ్డి రాజశేఖర్రెడ్డి గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 135వ ర్యాంకు సాధించారు. ఆయన 2018లో సివిల్ కానిస్టేబుల్గా ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్లోని జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన పెద్ద తమ్ముడు గోవిందరెడ్డి 2020లో అంబర్పేట్లోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఎస్ఐగా, చిన్న తమ్ముడు విజయ్భాస్కర్రెడ్డి హైదరాబాద్లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కీతవారిగూడెం వాసికి 301వ ర్యాంకు.. గరిడేపల్లి: గ్రూప్–2ఫలితాల్లో గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన గుండు అనిల్కుమార్ రాష్ట్రస్థాయిలో 301వ ర్యాంకు సాధించాడు. అనిల్కుమార్ ప్రస్తుతం పులిచింతల పవర్హౌజ్లో జేఏఓగా పనిచేస్తున్నాడు. తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శనం, స్నేహితుల సహాయమే కారణమని ఆయన పేర్కొన్నారు. బురుగులతండా వాసికి 512వ ర్యాంకు.. నేరేడుచర్ల: నేరేడుచర్ల మండలం బురుగులతండాకు చెందిన మాలోతు తేజ మంగళవారం వెలువడిన గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జనరల్ కేటగిరీలో 512 ర్యాంకు.. ఎస్టీ కేటగిరీలో 20వ ర్యాంకు సాధించాడు. మారుమూల గిరిజన తండాకు చెందిన తేజ గతంలో రైల్వే శాఖలో రెండు ఉద్యోగాలు సాధించాడు. అనంతరం స్టాఫ్ సెలక్షన్ కమిషన్–కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఎంపికై ప్రస్తుతం కేరళలో ఉద్యోగం చేస్తూనే గ్రూప్–2కు ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంకు సాధించాడు. గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపిక గుర్రంపోడు: గుర్రంపోడు మండలం జిన్నాయిచింత గ్రామానికి చెందిన ముడుసు శ్రీకాంత్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి పట్టుదలతో చదివి గ్రూప్–1 ఫలితాల్లో 600 మార్కులకు గాను 475 మార్కులు సాధించాడు. తన ర్యాంకును బట్టి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వస్తుందన్న ఆశాభావాన్ని శ్రీకాంత్ వ్యక్తం చేశారు. ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయన పాఠశాల స్ధాయిలో గురువులు నేర్పిన క్రమశిక్షణతోనే ఈ స్ధాయికి ఎదిగానని చెప్పారు. -
అన్న ప్రసాదానికి రూ.5లక్షల విరాళం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులను నిత్యాన్న ప్రసా దం అందించేందుకు గాను హైదరాబాద్లోని బంజారాహిల్స్కు చెందిన కర్నాటి రమేష్, శ్రీదేవి దంపతులు రూ.5లక్షల విరాళం ప్రకటించారు. బుధవారం స్వామి వారిని దర్శించుకున్న రమేష్, శ్రీదేవి దంపతులు ఈఓ భాస్కర్రావును కలిసి రూ.5లక్షల చెక్కు అందజేశారు. రామన్నపేటలో ఆరు రైళ్లను ఆపాలి ఫ భువనగిరి ఎంపీ కిరణ్కుమార్రెడ్డి రామన్నపేట: ఐదేళ్ల క్రితం కరోనా లాక్డౌన్ సమయంలో రామన్నపేట రైల్వే స్టేషన్లో ఆగకుండా రద్దు చేసిన ఆరు రైళ్లను తిరిగి ఆపాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి లోక్సభలో ప్రస్తావించారు. బుధవారం లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. రామన్నపేట మండలంలో యాభై వేలకు పైగా జనాభా నివసిస్తున్నారని, ఇక్కడ డిగ్రీ కళాశాల, కమ్యూనిటీ హెల్త్సెంటర్, సబ్ కోర్టుతో పాటు అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని, ఇక్కడ రైల్వే స్టేషన్ ద్వారా నిత్యం రైళ్లను ఆశ్రయిస్తుంటారని ప్రస్తావించారు. ప్రజల సౌకర్యార్ధం రామన్నపేట రైల్వే స్టేషన్లో నారాయణాద్రి, ఫలక్నుమా, చైన్నె, శబరి, డెల్టా ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు కాచిగూడ–మిర్యాలగూడ మధ్య నడిచే డెమో రైళ్లను ఆపాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరారు. హైనా దాడిలో లేగ దూడ మృతిచండూరు (గట్టుప్పల్): హైనా దాడి చేయడంతో లేగ దూడ మృతిచెందింది. ఈ ఘటన గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. అంతంపేట గ్రామానికి చెందిన భీమనపల్లి యాదయ్య తన వ్యవసాయ భూమిలో వేసిన కొట్టంలో మంగళవారం రాత్రి లేగ దూడతో పాటు మరికొన్ని మూగజీవాలను కట్టేసి రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం కొట్టం వద్దకు వచ్చి చూసేసరికి లేగ దూడ మృతిచెంది కనిపించింది. హైనా దాడి చేయడంతో లేగ దూడ మృతిచెందిందని బాధిత రైతు పేర్కొన్నాడు. ఘటన జరిగిన ప్రాంతం గుట్టకు దగ్గరగా ఉండటంతో అక్కడ హైనాలు కనిపిస్తుంటాయని రైతులు చెబుతున్నారు. ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యనకిరేకల్: నకిరేకల్ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో బుధవారం మధ్యాహ్నం ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లికి చెందిన ఉరే సతీష్కు సూర్యాపేటకు చెందిన సాయిసుధ(29)తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. సతీష్కు ఇటీవల కేతేపల్లి మండలంలోని మూసీ గురుకుల పాఠశాలలో పీఈటీగా ఉద్యోగం వచ్చింది. దీంతో సతీష్ తన భార్య సాయిసుధ, కుమార్తె, కుమారుడితో కలిసి రెండు నెలల క్రితం నకిరేకల్లోని డాక్టర్స్ కాలనీలో అద్దె ఇంట్లో దిగారు. రోజుమాదిరిగా బుధవారం కూడా సతీష్ పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం 3గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. పై అంతస్తులో ఉంటున్న తన పోర్షన్లోకి వెళ్లి తలుపు తీసేసరికి తన భార్య సాయిసుధ గదిలోని వెంటిలేటర్కు చీరతో ఉరేసుకుని కనిపించింది. వెంటనే సతీష్ తన అత్తమామలకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి సాయిసుధ మతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
రిటైర్డ్ ఉద్యోగిని బ్లాక్మెయిల్ చేసి..
మిర్యాలగూడ అర్బన్: అటవీశాఖ రిటైర్డ్ ఉద్యోగిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు నిందితులను మిర్యాలగూడ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి(సాగర్) మండలం గట్టుమీదితండాకు చెందిన ఆంగోతు గణేష్, ఎల్లాపురం తండాకు చెందిన కుర్ర శంకర్ వరసకు బావబావర్దులు. గణేష్కు మిర్యాలగూడకు చెందిన అటవీశాఖ రిటైర్డ్ ఉద్యోగి పరిచయమయ్యాడు. సదరు రిటైర్డ్ ఉద్యోగి వృద్ధాప్యంలో తనకు కేర్ టేకర్గా గణేష్కు పెట్టుకున్నాడు. అయితే రిటైర్డ్ ఉద్యోగి వద్ద ఉన్న డబ్బులను కాజేయాలని గణేష్ పథకం రచించాడు. ఎలాగైనా అతడి పరువుకు నష్టం కలిగించి బెదిరించి డబ్బులు గుంజాలని గణేష్ అనుకున్నాడు. 2022 జూన్ 11న అటవీశాఖ రిటైర్డ్ ఉద్యోగి, గణేష్ పని నిమిత్తం సూర్యాపేటకు వెళ్లారు. పథకం ప్రకారం రిటైర్డ్ ఉద్యోగికి గణేష్ ఎక్కువగా మద్యం తాగించాడు. అతడు స్పృహతప్పిన తర్వాత గుర్తుతెలియని మహిళకు డబ్బు ఆశచూపి సదరు రిటైర్డ్ ఉద్యోగితో ఆమెను కలిపి అసభ్యంగా ఫొటోలు, వీడియోలు తీశాడు. కొద్దిరోజుల తర్వాత ఆ ఫొటోలు వీడియోలు రిటైర్డ్ ఉద్యోగికి పంపిన గణేష్ డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో 2022 నుంచి 2024 వరకు 19 ప్రామిసరీ నోట్లపై సంతకాలు పెట్టించుకున్నాడు. ఆ ప్రామిసరీ నోట్లను రిటైర్డ్ ఉద్యోగి కుమార్తె, అల్లుడికి చూపించి అసలు వడ్డీతో కలిసి రూ.46 లక్షలు తీసుకున్నాడు. గణేష్కు అతడి భార్య, బావమరిదికి శంకర్ సహకరించడంతో మళ్లీ బ్లాక్మెయిల్ చేయసాగాడు. దీంతో బాధితుడు రూ.2.55లక్షలు ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. అయినా వారి వేధింపులు ఆగకపోవడంతో చివరకు కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. దీంతో బాధితుడి కుటుం సభ్యులు మిర్యాలగూడ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం గణేష్, అతడి బావమరిది శంకర్ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారు, 4.5 తులాల బంగారం (ముత్తూట్ ఫైనాన్స్లో ఉంది), స్మార్ట్ఫోన్, 10 ఒరిజనల్ ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. గణేష్పై విజయపురి టౌన్, తిరుమలగిరి(సాగర్), వాడపల్లి పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు ఉన్నాయని, పదేపదే నేరాలకు పాల్పడుతున్న అతడిపై రౌడీషీట్ తెరుస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ టూటౌన్ సీఐ నాగార్జున, ఎస్ఐలు డి. హరీష్రెడ్డి, బి. రాంబాబు, కానిస్టేబుళ్లు పి. బాలకృష్ట, కళ్యాణ్, అక్బర్, రామకృష్ణ, రమేష్నాయక్, సూర తదితరులు పాల్గొన్నారు. ఫ డబ్బులు వసూలు చేసిన ఇద్దరు నిందితుల అరెస్ట్ -
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
దేవరకొండ: రెండు తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరితో పాటు వారికి సహకరిస్తున్న మరో వ్యక్తిని దేవరకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను దేవరకొండ ఏఎస్పీ మౌనిక బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్ జాఫర్ అలియాస్ అహ్మద్, అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ మోసీన్ అపార్ట్మెంట్లను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతుంటారు. వీరిద్దరు ఎంత దూరమైనా స్కూటీపై ప్రయాణం చేస్తూ చోరీలు చేస్తుంటారు. దేవరకొండ పట్టణంలోని మీనాక్షి ప్లాజా అపార్ట్మెంట్లో నివాసముంటున్న శీలా వాసు గత నెల 19న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వెళ్లారు. అప్పటికే దేవరకొండ పట్టణానికి వచ్చిన షేక్ అబ్దుల్ జాఫర్, మహ్మద్ మోసీన్ కలిసి వాసు ఇంటికి తాళాలు వేసి ఉండడాన్ని గమనించి తాళాలు పగులగొట్టి 20 తులాల బంగారం, రూ.10వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాలతో కేసును ఛాలెంజ్గా తీసుకున్న దేవరకొండ పోలీసులు ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించారు. ఈ నెల 11న షేక్ అబ్దుల్ జాఫర్, మహ్మద్ మోసీన్ మళ్లీ దేవరకొండకు బస్సులో వచ్చారు. వారు అనుమానాస్పదంగా కన్పించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని ఏఎస్పీ తెలిపారు. వీరిద్దరు ఏపీలోని విశాఖపట్నం, కర్నూల్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. వీరు దొంగిలించిన బంగారాన్ని పాతబస్తీకి చెందిన మహ్మద్ ఫసికి అప్పగిస్తారని.. ఆ బంగారాన్ని విక్రయించగా వచ్చిన నగదును పంచుకుంటారని ఏఎస్పీ తెలిపారు. వారి నుంచి 20 తులాల బంగారం స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. జాఫర్పై 70 కేసులున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన దేవరకొండ సీఐ నర్సింహులు, ఎస్లు అజ్మీరా రమేష్, నారాయణరెడ్డి, కోటేష్, కానిస్టేబుళ్లు హేమునాయక్, తిరుపతి, చాంద్పాషా, సతీష్, అంజి, ఇమ్రాన్, సోమ్లా, సింహాద్రిని ఏఎస్పీ అభినందించారు. ఫ 20 తులాల బంగారం స్వాధీనం ఫ వివరాలు వెల్లడించిన దేవరకొండ ఏఎస్పీ మౌనిక -
న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగింది
రామగిరి(నల్లగొండ): ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పుతో ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసిన దర్శనం నర్సింహను కమిషన్ సభ్యులు నల్లగొండ కలెక్టరేట్లో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. ప్రణయ్ హత్య కేసులో ప్రాసిక్యూటర్, పోలీసులు సమష్టిగా పనిచేసి తీర్పు రావడండలో కీలకంగా వ్యవహరించారన్నారు. ఈ కేసులో దోషులు కరడుకట్టిన నేర చరిత్ర ఉన్నవారు ఉన్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్కు రక్షణను కొనసాగించాలని పోలీసులకు సూచించారు. ఈ తీర్పుతో బలహీన వర్గాలకు న్యాయవ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతందనే నమ్మకం వచ్చిందన్నారు. ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా ప్రాసిక్యూషన్ కొనసాగిందని అభినందించారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాంబాబు, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ పాల్గొన్నారు. ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఫ ప్రణయ్ హత్య కేసు వాదించిన పీపీ దర్శనం నర్సింహకు సన్మానం -
గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్ట్
సూర్యాపేటటౌన్: గంజాయి తరలిస్తున్న ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నర్సింహ విలేకరులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు చెందిన మల్లెడ వెంకటవంశీ, గోకులముడి ఆనంద్ ఆంధ్రా, ఒడిశా సరిహద్దు నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న చిన్న పాకెట్ల రూపంలో మార్చి హైదరాబాద్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరిద్దరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలానికి చెందిన చొరగుడి తేజతో కలిసి విజయవాడ నుంచి హైదరాబాద్కు బస్సులో గంజాయి తరలిస్తూ.. మార్గమధ్యలో కోదాడ శివారులోని దుర్గాపురం ఎక్స్ రోడ్డు వద్ద బస్సు దిగి రోడ్డు పక్కన మామిడి తోటలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు చెందిన ఉమ్మడిశెట్టి సంపత్ కుమార్, హేమన్ నర్సింహ సాయి, పాలపర్తి కృష్ణచైతన్య, నాగ వీరభాస్కర్రావుకు గంజాయి ఇస్తుండగా.. పక్కా సమాచారం మేరకు సోమవారం కోదాడ టౌన్ ఎస్ఐ సైదులు తన సిబ్బందితో వెళ్లి వారిని పట్టుకున్నారు. చొరగుడి తేజ, సంపత్ కుమార్, కృష్ణచైతన్య, నాగ వీరభాస్కర్రావు, హేమన్ నర్సింహ సాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. మల్లెడ వెంకట వంశీ, గోకులముడి ఆనంద్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. పరారీలో ఉన్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు. నిందితుల నుంచి 9.860 కిలోల గంజాయి, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వర్రావు, కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ పరారీలో మరో ఇద్దరు ఫ 9.860 కిలోల గంజాయి స్వాధీనం -
పోలీస్ స్టేషన్లో యువకుడి ఆత్మహత్యాయత్నం
తుంగతుర్తి: కేసు విచారణ నిమిత్తం స్టేషన్కు రావాలని పోలీసులు ఫోన్ చేయడంతో భయపడిన యువకుడు పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి జరిగింది. స్థానిక ఎస్ఐ రుద్రకాంత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి నాగయ్యకు అడ్డగూడూరు మండలం లక్ష్మిదేవికాల్వ గ్రామానికి చెందిన యువతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా.. నాగయ్య భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో భార్యను కాపురానికి రమ్మని పిలవడానికి సోమవారం నాగయ్య అత్తవారి ఇంటికి వెళ్లగా.. మాటామాట పెరిగి ఘర్షణ జరిగింది. దీంతో అత్తింటివారు అతడిపై చేయి చేసుకున్నారు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అడ్డగూడూరు పోలీస్ స్టేషన్కు రావాలని పోలీసులు ఫోన్ చేయడంతో భయపడి నాగయ్య తుంగతుర్తి పోలీస్ స్టేషన్కు చేరుకొని ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడికి తుంగతుర్తి ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. నాగయ్య ఆరోగ్యం కుదుటపడ్డాక పోలీస్ స్టేషన్కు రావాలని.. భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇస్తామని ఎస్ఐ తెలిపారు. -
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
మిర్యాలగూడ: మిర్యాలగూడ మండలం నందిపాడు, రవీందర్నగర్లోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ శాఖ సీఐ ఎస్కే గౌస్ మాట్లాడుతూ.. లక్ష్మీవెంకటేశ్వర ఫర్టిలైజర్స్, మిర్యాలగూడ రైతు ఆగ్రో సేవా కేంద్రంలో దాడులు నిర్వహించి కాలం చెల్లిన మందులను గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు దుకాణ యజమానులపై కేసు నమోదు చేశామన్నారు. నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహిస్తున్నామన్నారు. కొంతమంది రైతులను సైతం విచారించినట్లు తెలిపారు. ఆయన వెంట కానిస్టేబుల్ నర్సింహారెడ్డి, ఏఓ ధీరావత్ సైదానాయక్, ఏఈఓ షఫీ తదితరులు ఉన్నారు. -
గ్రూప్–2లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లావాసులు
మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రానికి చెందిన గుర్రం మోహన్రెడ్డి, స్వరాజ్యం దంపతుల కుమారుడు గుర్రం సాయికృష్ణారెడ్డి మంగళవారం ప్రకటరించిన గ్రూప్–2 ఫలితాల్లో 600 మార్కులకు గాను 422.91 మార్కులు సాధించి స్టేట్ 11వ ర్యాంకు సాధించాడు. గతంలో ప్రకటించిన గ్రూప్–4 ఫలితాల్లో జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా డు. సాయికృష్ణారెడ్డి చెల్లె సాయిసుప్రియ కూడా గ్రూప్–4లో మంచి ర్యాంకు సాధించి మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో వార్డ్ ఆఫీసర్గా పనిచేస్తోంది. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి గ్రూ ప్–2 ఉద్యోగానికి ఎంపికై న సాయికృష్ణారెడ్డిని గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అభినందించారు. సిరిపురం యువకుడికి రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకు రామన్నపేట: మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన సిలువేరు సత్తయ్య–మంగమ్మ దంపతుల చిన్న కుమారుడు సిలువేరు సురేష్ మంగళవారం గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకు సాధించాడు. సురేష్ 600 మార్కులకు గాను 411.865 మార్కులు సాధించాడు. బీటెక్ చదివిన సురేష్ మూడునెలల క్రితం గ్రూప్–4లో ఉత్తీర్ణుడై జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. అన్నదమ్ముల హవా.. పెన్పహాడ్: గ్రూప్–2 ఫలితాల్లో పెన్పహాడ్ మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన శ్రీరామ్ మధు రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు, అతడి తమ్ముడు శ్రీరామ్ నవీన్ 326వ ర్యాంకు సాధించారు. మధు 2014లో వీఆర్వోగా ఎంపికై ఇటీవల ప్రభుత్వం కల్పించిన పదోన్నతుల్లో అనంతగిరి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి తమ్ముడు నవీన్ 2020లో పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ గ్రూప్–2 పరీక్షలకు సన్నద్ధమై ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఉత్తమ ర్యాంకులు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 141వ ర్యాంకు సాధించిన వెలిదండ వాసిగరిడేపల్లి: మండల పరిధిలోని వెలిదండ గ్రామానికి చెందిన అనంత సుమన్ గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 141వ ర్యాంకు సాధించారు. 600 మార్కులకు గాను 387.75 మార్కులతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సుమన్ 2019 డీఎస్సీలో ఓపెన్ కేటగిరీలో ఎస్జీటీ ఉద్యోగాన్ని సాధించారు. వికారాబాద్ జిల్లా పోటుపల్లి మండలం నాగసానిపల్లిలో ఎస్జీటీగా పనిచేస్తూనే గ్రూప్–2 పరీక్ష రాసి 141వ ర్యాంకును సాధించాడు. సుమన్ను గ్రామస్తులు అభినందించారు. 130వ ర్యాంకు సాధించిన నాగులపాటి అన్నారం వాసిపెన్పహాడ్: మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన నాగార్జున గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 130వ ర్యాంకు సాధించారు. ఎంకాం పూర్తిచేసిన ప్రభుత్వ ఉద్యోగం సాధించిన నాగార్జునను గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అభినందించారు. గ్రూప్–1ఉద్యోగానికి ఎంపికైన గూడపూర్ యువకుడు నల్లగొండ టూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో మునుగోడు మండలం గూడపూర్ గ్రామానికి చెందిన నన్నూరు వెంకట్రామ్రెడ్డి, మంజుల దంపతుల కుమారుడు నన్నూరి మనోజ్కుమార్రెడ్డి 517 మార్కులు సాధించి టాప్ టెన్లో ఒకడిగా నిలిచాడు. టాప్ టెన్లో నిలిచిన మనోజ్కుమార్రెడ్డికి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం లభించే అవకాశం ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఏవియేషన్పై అవగాహన ఉండాలి
కోదాడ : విద్యార్థులకు ఏవియేషన్పై అవగాహన ఉండాలని, రానున్న రోజుల్లో ఏవియేషన్కు ఉజ్వల భవిష్యత్ ఉందని కోదాడకు చెందిన ఏవియేషన్ పైలెట్ ఉయ్యాల ఖ్యాతి అన్నారు. మంగళవారం కోదాడలోని తేజ టాలెంట్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తాను ఏవియేషన్లో శిక్షణ తీసుకొని 19 సంవత్సరాలకే పూర్తి స్థాయి పైలెట్గా మారానని తెలిపారు. దీని కోసం అవసరమైన ఏడురకాల లైసెన్స్లను పొందానని పేర్కొన్నారు. అమెరికా ఏవియేషన్లో తాను శిక్షణ పొందినట్లు తెలిపారు. బాలికలు కూడా ఈ రంగంలో రాణించవచ్చన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక సభ్యు డు జాఫర్, పాఠశాల డైరెక్టర్ జానకిరామయ్య, ప్రిన్సిపాల్ అప్పారావు, సోమానాయక్, రేణుక, సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత డిండి: ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని మంగళవారం సివిల్ సప్లయ్ అధికారులు పట్టుకున్నారు. దేవరకొండ డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లయ్(డీటీసీఎస్) హన్మంతు శ్రీనివాస్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన బోయిని రమేష్ రేషన్ లబ్ధిదారుల నుంచి ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యం కొనుగోలు చేసి తన ఇంట్లో నిల్వ ఉంచాడు. పక్కా సమాచారం మేరకు సివిల్ సప్లయ్ అధికారులు రమేష్ ఇంటిపై దాడి చేసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని స్థానిక రేషన్ డీలర్కు అప్పజెప్పామని డీటీసీఎస్ పేర్కొన్నారు. ఈ మేరకు రమేష్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతిమిర్యాలగూడ: గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం దామరచర్ల మండలం కొండ్రపోల్ పరిధిలో జరిగింది. వాడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండ్రపోల్కు చెందిన కుంకునూరి నర్సింహారావు(70) మంగళవారం ఉదయం వాకింగ్ నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ పరిధిలోని నార్కట్పల్లి–అద్దంకి రహదారి వెంట వాకింగ్ చేస్తుండగా.. మిర్యాలగూడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింహారావు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వాహనం ఆచూకీ కోసం రెండు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతినకిరేకల్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని వినాయక బంకెట్ హాల్ సమీపంలో షేక్ సయ్యద్(17) అనే యువకుడు తన తల్లి, అక్కతో కలిసి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. సయ్యద్ లావుగా ఉండటంతో రోజూ వ్యాయామం, వాకింగ్ చేస్తున్నాడు. అయితే సోమవారం రాత్రి షేక్ సయ్యద్ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి కాళ్లపై దెబ్బలు ఉండటంతో కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నకిరేకల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన జిల్లా వెంకటయ్య(54) ఈ నెల 8వ తేదీన బైక్పై నకిరేకల్కు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో తాటికల్ ఫ్లైఓవర్ వద్ద గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటయ్యను నల్లగొండ పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. -
చెత్తకుప్పలో ఆడ శిశువు మృతదేహం లభ్యం
యాదగిరిగుట్ట: చెత్తకుప్పలో ఆడ శిశువు మృతదేహం లభించింది. ఈ ఘటన యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన ఉన్న చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. మంగళవారం సాయంత్రం అటువైపు వెళ్తున్న వ్యక్తులు శిశువును గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూసేసరికి శిశువు మృతిచెందిందని పట్టణ సీఐ రమేష్ తెలిపారు. శిశువు మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. సమీపంలోని ఆస్పత్రుల్లో ప్రసవించిన వారి వివరాలను సేకరిస్తున్నామని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పురుగుల మందు తాగి కూలీ ఆత్మహత్యనకిరేకల్: ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన జటంగి లింగయ్య(45) నకిరేకల్కు వచ్చి కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న లింగయ్య సోమవారం రాత్రి స్థానిక వ్యవసాయ మార్కెట్ సమీపంలో పురుగుల మందు తాగాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి లింగయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు ధనుష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. ఫలితాలు వాయిదా వేయాలని ధర్నా నల్లగొండ టౌన్ : రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్–1, 2, 3, హాస్టల్ వెల్ఫేర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను వాయిదా వేయాలని కలెక్టరేట్ ఎదుట మంగళశారం ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఫలితాలు ప్రకటించడం వల్ల ఎస్సీ ఉప కులాలకు అన్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఇరిగి శ్రీశైలం, బోడ సునీల్, బకరం శ్రీనివాస్, గాదె రమేష్ పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైరు చోరీమునగాల: మండల కేంద్రం శివారులో గల ఎల్–33 ఎత్తిపోతల పథకం రెండవ స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైరును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. చోరీ జరిగినట్లు మంగళవారం గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. చోరీకి గురైన కాపర్ వైరు విలువ సుమారు రూ.4లక్షలకు పైగా ఉంటుందని తెలిసింది. -
కస్తాల శ్రవణ్ కుటుంబానికి అండగా ఉంటాం
హుజూర్నగర్: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కాంగ్రెస్ యువ నాయకుడు, హుజూర్నగర్ మున్సి పాలిటీ మాజీ కౌన్సిలర్ కస్తాల శ్రవణ్కుమార్ కుటంబానికి అండగా ఉంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్నగర్కు వచ్చిన మంత్రి శ్రవణ్కుమార్ ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయంపై పార్టీ జెండా కప్పి, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రవణ్కుమార్ కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి మాట్లాడారు. శ్రవణ్కుమార్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ కోసం పని చేశారని, మంచి వ్యక్తిత్వం కలిగిన ఆయన మనకు దూరం కావడం చాలా బాధాకరమని అన్నారు. శ్రవణ్కుమార్ కుటుంబానికి తనతో పాటు పార్టీ కూడా అండగా ఉంటుందని, వారి పిల్లల చదువుల ఖర్చుల బాధ్యత కూడా తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ నాయకులు తన్నీరు మల్లిఖార్జున్, యరగాని నాగన్న, సాముల శివారెడ్డి, దొంతగాని శ్రీనివాస్, కోతి సంపత్రెడ్డి, శివరాం యాదవ్, ఉపేందర్ తదితరులు ఉన్నారు. పాడె మోసిన మందకృష్ణ మాదిగ.. శ్రవణ్కుమార్ అంతిమ యాత్రలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొని పాడె మోశారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ నాయకులు చింతిర్యాల నాగయ్య, బాలచంద్రుడు, ఎం. వెంకటేశ్వర్లు, ఎం. శ్యాంసుందర్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా సీపీఐ నాయకులు యల్లావుల రాములు, గుండు వెంకటేశ్వర్లు, జడ శ్రీనివాస్, యల్లావుల రమేష్, సోమగాని కష్ణ, జక్కుల రమణ, సీపీఎం నాయకులు పల్లె వెంకట రెడ్డి, దుగ్గి బ్రహ్మం, వట్టెపు సైదులు, పి. హుస్సేన్, ఇందిరాల త్రివేణి, వీరస్వామి, వెంకటనారాయణ, ఓయూ జేఏసీ నాయకులు తదితరులు శ్రవణ్కుమార్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఫ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
తెలుగు శాఖకు విరాళం అందజేత
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో తెలుగు విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చే విద్యార్థులకు బంగారు పతకం అందించేందుకు గాను రిటైర్డ్ ప్రొఫెసర్లు ఇంద్రసేనారెడ్డి, ఎం. ఇంద్రారెడ్డి, కె. సత్యనారాయణరెడ్డి, కె. లింగారెడ్డి, కె. విజయేందర్రెడ్డి రూ.3లక్షల చెక్కును మంగళవారం యూనివర్సిటీలో వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్కు అందజేశారు. అదేవిధంగా ప్రతి ఏటా స్మారక ఉపన్యాసానికి మరో రూ.6లక్షల విరాళం అందించారు. ఈ విరాళాలను బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ప్రతి సంవత్సరం బంగారు పతకం, స్మారక ఉపన్యాసం కోసం వెచ్చిస్తామని వైస్ చాన్స్లర్ తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, రిటైర్ట్ రిజిస్ట్రార్ నరేందర్రెడ్డి, ప్రొఫెసర్లు అంజిరెడ్డి, ఆకుల రవి, డాక్టర్ ఉపేందర్రెడ్డి, డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి, డాక్టర్ హరీష్కుమార్ పాల్గొన్నారు. -
ఉన్నత విద్యా ప్రమాణాలు పాటించాలి
నల్లగొండ టూటౌన్: విద్యాసంస్థలు ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తూ ముందుకుసాగాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీయూలో మంగళవారం నిర్వహించిన బీఈడీ కళాశాలల అకడమిక్ సమావేశంలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బీఈడీ కళాశాలల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలకు విద్యా ప్రమాణాలు మెరుగుపరచుటకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల హాజరుకు సంబంధించి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వై. ప్రశాంతి, డిప్యూటీ డైరెక్టర్ జయంతి, అమరేందర్, వివిధ బీఈడీ కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. ఫ మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో గవర్నర్
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కొనసాగుతున్న శ్రీస్వామి అమ్మవార్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్టా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.శ్రీస్వామిని దర్శించుకున్న గవర్నర్కు ముఖ మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ భాస్కర్రావు.. శ్రీస్వామి వారి లడ్డూ ప్రసాదంతో పాటు శ్రీనృసింహస్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్తర మాడవీధిలోని యాగశాలలో నిర్వహించిన మహా పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఆయన వెంట కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి తదితరులున్నారు. యాదగిరి క్షేత్రంలో వైభవంగా శ్రీచక్ర తీర్థంయాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమానుసారం కొనసాగుతున్నాయి. ఆలయంలో సోమవారం ఉదయం నిత్యపూజలు చేసిన ఆచార్యులు ప్రథమ ప్రాకారంలోని ఉత్తర దిశలో ఏర్పాటు చేసిన యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం శ్రీచక్ర ఆళ్వారుడికి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి, ఆలయ మాడ వీధుల్లో ఊరేగించి విష్ణు పుష్కరిణిలో శ్రీచక్ర తీర్థ స్నానం చేపట్టారు.ఈ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. రాత్రి ఆలయంలో శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను ఆగమశాస్త్రం ప్రకారం జరిపించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో ఉదయం అష్టిత్తర శతఘటాభిõÙకం రాత్రి శృంగార డోలోత్సవం నిర్వహిస్తారు. శృంగార డోలోత్సవంతో 11 రోజుల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. -
పంటలు ఎండిపోకుండా చూడండి : కలెక్టర్
సాక్షి,యాదాద్రి : పంటలు ఎండిపోకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగునీటిపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడెక్కడ పంటలు ఎండిపోతున్నాయో గుర్తించి అక్కడ ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలకు తావుండొద్దు సాక్షి,యాదాద్రి : అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ఆర్డీఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం అయ్యారు. లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, శేఖర్రెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్ తదితరులు పాల్గొన్నారు. నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలిరామన్నపేట : పదవ తరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా సిద్ధం కావాలని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ విద్యార్థులకు సూచించారు. సోమవారం జనంపల్లి బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు సూ చనలు చేశారు. ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలన్నారు. అనంతరం సుమధుర ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టే నిర్మాణాల కోసం స్థలాలను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. ఆతరువాత ఇస్కిళ్ల గ్రామంలో గుండా సత్తయ్య మెమోరియల్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. ఆయనవెంట ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ లాల్బహదూర్, డీఈ యూసుఫ్, ప్రిన్సిపాల్ ఎస్. రాజా, సుమధుర ఫౌండేషన్ ప్రతినిధులు జీవన, అశ్రిత, ఉపాధ్యాయులు ఉన్నారు. -
ఆరున్నరేళ్లకు.. అంతిమతీర్పు
పకడ్బందీగా దర్యాప్తు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రణయ్ హత్య కేసును పోలీసు యంత్రాంగం పకడ్బందీగా దర్యాప్తు చేసింది. కేసు విచారణ, పక్కాగా సాక్ష్యాల సేకరణ, వాటి అథెంటికేషన్ విషయంలో అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో పోలీసు బృందాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాయి. తమిళనాడులో శంకరన్ హత్య కేసు తరహాలో ప్రణయ్ హత్య కేసు విచారణ జరిగింది. తమిళనాడులో కులాంతర వివాహం చేసుకున్న శంకరన్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. అక్కడ ఆయన హత్యకు గురయ్యాడు. ఆ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తమిళనాడు పోలీసులు నిందితులకు కఠిన శిక్ష పడేలా పక్కాగా విచారణ జరిపారు. అందుకే ప్రణయ్ హత్య తరువాత అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో పోలీసు అధికారుల బృందం అక్కడికి వెళ్లి ఆ కేసును కూడా పరిశీలించింది. ప్రణయ్ హత్య కేసులోనూ నిందితులు తప్పించుకోకుండా, సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా, సాంకేతిక పద్ధతుల్లో వాటిని భద్రపరిచారు. ముఖ్యంగా హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, బ్లడ్ శాంపిల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్ల్లో పరీక్ష చేయించారు. అంతేకాదు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రణయ్ హత్యకు ముందు నిందితులు ఏయే ప్రాంతాల్లో సంచరించారు.. ఎవరెవరు కలుసుకొని ప్లాన్ చేశారు.. అనే వివరాలు సేకరించి అన్ని ఆధారాలను కోర్టులో సమర్పించారు. ఈ కేసులో ఎలాంటి అవకతవకలకు, అనుమానాలకు తావులేకుండా నేరం రుజువయ్యేలా సేకరించిన అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. తద్వారానే సుభాష్ కుమార్ శర్మకు అప్పట్లో బెయిల్ రాలేదు. కేసు విచారణ తుది తీర్పులో సుభాష్ శర్మకు ఉరి శిక్ష, మిగిలిన వాళ్లకు జీవిత ఖైదు పడిందని, తద్వారా బాధితులకు సత్వర న్యాయం జరిగిందని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రణయ్ హత్య కేసులో కరుడుగట్టిన నేరస్తుడు అజ్గర్ అలీఫ ప్రధాన పాత్రధారి అబ్దుల్బారి ఫ సుభాష్కుమార్ శర్మను తీసుకొచ్చింది బారీనే ఫ 1,600 పేజీల్లో చార్జిషీట్ రూపొందించి కోర్టులో సమర్పించిన పోలీసులు -
నేత్రపర్వంగా మహాపూర్ణాహుతి, పుష్పయాగం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరాయి. సోమవారం మహాపూర్ణాహుతి, శ్రీచక్రతీర్థం, పుష్పయాగం, దేవతలకు వీడ్కోలు పర్వాలను నేత్రపర్వంగా చేపట్టారు. ఉదయం యాగశాలలో నిర్వహించిన మహా పూర్ణాహుతి వేడుక సందర్భంగా.. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన దేవతలను సుగంధద్రవ్యాలతో ఆరాధించి, పట్టు వస్త్రాలతో ఆవాహన చేసి నెయ్యితో అగ్ని భగవానుడికి సమర్పించారు. విశ్వశాంతి కోసం మహా పూర్ణాహుతి నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ఈ వేడుకలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని పూజలు నిర్వహించారు. కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీచక్రతీర్థం : మహావిష్ణువు ఆయుధమైన శ్రీచక్ర ఆళ్వారుడికి మధ్యాహ్నం ఒంటి గంటకు పూజలు చేసిన అనంతరం విష్ణు పుష్కరిణిలో శ్రీచక్రతీర్థం వేడుక వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను.. శ్రీచక్ర ఆళ్వారునికి అలంకరించి ప్రత్యేక పల్ల కిపై అధిష్టింపజేసి పూజలు చేశారు. ఆ తరువాత ఆలయ మాడ వీధుల్లో ఊరేగిస్తూ విష్ణు పుష్కరిణికి వేంచేసి శ్రీచక్రస్నానం వేడుక పూర్తి చేశారు. దేవతలకు వీడ్కోలు సాయంత్రం నిత్యరాధనల అనంతరం దేవతోద్వాసన, శ్రీపుష్పయాగం, దోపు ఉత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో దోఽషాలు జరిగితే తొలగించేందుకు ప్రా యశ్చిత్తంగా పుష్పయాగం చేపట్టారు. ఇక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన దేవతలను తిరిగి స్వస్థలానికి పంపించే వేడుక దేవతోద్వాసన అని అర్చకులు పేర్కొన్నారు. శ్రీస్వామి వారికి అత్యంత ప్రీతికరమైన వేడుక దోపు మహోత్సవం.ఫ మహా పూర్ణాహుతిలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఫ తుది అంకానికి చేరిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు -
ప్రదక్షిణలే.. పరిష్కారమేదీ?
ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం 282 అర్జీలు పెండింగ్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో 2024 జూన్ 10నుంచి 2025 జనవరి 16వ తేదీ వరకు 900 అర్జీలు వచ్చాయి. ఇందులో 618 పరిష్కారానికి నోచుకోగా ఇంకా 282 అర్జీలు వివిధ కారణాలతో పెండింగ్ ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 102 దరఖాస్తులు భువనగిరి ఆర్డీఓ, 27 మోటకొండూరు, 20 యాదగిరిగుట్ట, 15 గుండాల పరిధిలో ఉన్నాయి. ఫ వివిధ కారణాలతో కాలయాపన ఫ పదేపదే కలెక్టరేట్ మెట్లు ఎక్కుతున్న బాధితులు ఫ భూ సమస్యలు, రేషన్ కార్డులు, ఇళ్లు, పింఛన్ల కోసం ఎక్కువగా విన్నపాలు సాక్షి, యాదాద్రి : ‘అడ్డగూడూరు మండలం చిర్రగూడూరుకు చెందిన నిమ్మల రాముకు మూడేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. కుడికాలు, కుడిచేయి చచ్చు పడ్డాయి. పింఛన్కోసం రెండేళ్ల క్రితం కలెక్టరేట్కు వచ్చి ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నాడు. మంజూరు కాకపోవడంతో ఆ తరువాత పలుమార్లు వినతులు అందజేశాడు. సోమవారం కూడా స్వగ్రామం నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్కు భార్య, తండ్రితో కలిసి వచ్చి వినతిపత్రం అందజేశాడు. 60 ఏళ్లుగా తమ వ్యవసాయ బావుల వద్దకు ఉన్న బాటను కొందరు వ్యక్తులు ఆక్రమించారని, న్యాయం చేయాలని వలిగొండ మండలం వెల్వర్తి గ్రామానికి చెందిన ఐలమ్మ, సుగుణమ్మలు ప్రజావాణిలో కొంతకాలం క్రితం వినతులు అందజేశారు. రెవెన్యూ అధికారులను పంపి సమస్యను పరిష్కరిస్తామని అప్పట్లో ఉన్నతాధికారి వారితో చెప్పారు. ఆతరువాత ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో మరోసారి ప్రజావాణికి వచ్చి అర్జీలు అందజేశారు. ఇలా.. ఒక సమస్యతో వచ్చిన వారే పదేపదే తిరిగి వస్తూ విన్నవించుకుంటున్నారు. వినతిపత్రాలు తీసుకునే సమయంలో అధికారులు హామీలైతే ఇస్తున్నారు. కానీ, సమస్య అలాగే ఉండిపోతోంది. కలెక్టరేట్కు ప్రదక్షిణలు చేయడమే తప్ప.. సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ చాలా మంది బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా విన్నపాల్లో అధికంగా భూసమస్యలు, రేషన్కార్డులు, ఇళ్లు, పింఛన్లకు సంబంధించినవే ఉంటున్నాయి. నెల రోజుల తరువాత ప్రజావాణి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో నిలిచిపోయిన ప్రజావాణి తిరిగి సోమవారం ప్రారంభమైంది. నెల రోజుల తరువాత ప్రజావాణి కార్యక్రమాన్ని పునరుద్ధరించడంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి విన్నపాలు అందజేశారు. మొత్తం 60 అర్జీలు రాగా అందులో 40 వినతులు భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. ఐదు గ్రామీణాభివృద్ధి, 4 మున్సిపల్, 2 చేనేత, 2 పంచాయతీరాజ్కు సంబంధించినవి ఉన్నాయి. మత్స్య, వ్యవసాయ, శిశు సంక్షేమం, మార్కెటింగ్, విద్యుత్, వైద్యశాఖకు సంబంధించిన వినతులు ఒక్కోటి చ వచ్చాయి. అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్, జెడ్పీ సీఈఓ శోభారాణి తదితరులు వినతులు స్వీకరించారు. సోమవారం వచ్చిన వినతుల్లో కొన్ని.. ● రోడ్డు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. 30 ఫీట్ల రోడ్డును 10 ఫీట్ల మేర ఆక్రమించారని, దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. వెంటనే విచారణ జరిపించి న్యాయం చేయాలని విన్నవించారు. ● గుండాల మండలానికి దేవాదుల నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని కోరుతూ వె ల్మజాల గ్రామానికి చెందిన రాజయ్య వేడుకున్నారు. తా ను ఐదు ఎకరాల్లో వరి సాగు చేశానని, రూ.లక్షల వరకు పెట్టుబడి పెట్టానని, భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు సరిగా పోయడం లేదన్నారు. దీంతో ఇప్పటికే కొంత పొలం ఎండి పోయిందన్నారు. గుండాల మండలంలో చాలా మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని, దేవాదుల నుంచి గోదావరి జలాలను విడుదల చేస్తే తప్ప.. పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదన్నారు. అలాగే ఎండిన పంటలు ఎకరానికి రూ.25వేల చొప్పున పరిహారం చెల్లించాలని విన్నవించారు. బోర్లు ఎండిపోతున్నాయి.. ఇసుక రవాణాను అడ్డుకోండి రాజాపేట మండలం రేణికుంట, బేగంపేట వాగుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, వెంటనే అడ్డుకోవాలని ఆయా గ్రామాలకు చెందిన రైతులు, నాయకులు ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఇసుక తరలించడం వల్ల వాగు పరీవాహకంలో బోర్లు ఎండిపోతున్నాయని, నీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకునేందుకువెళ్లిన రైతులపై దాడి చేస్తున్నారని పే ర్కొన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి స్పందిస్తూ ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, సీసీ రోడ్లకు మాత్రమే ఇసుక రవాణాకు పర్మిషన్ ఉందని, ఇసుక రవాణాను అడ్డుకోవాలని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు. -
వైద్య విద్యార్థులకు సామాజిక దృక్పథం ఉండాలి
బీబీనగర్: వైద్య వృత్తి చాలా ప్రధానమైనదని, వైద్య విద్యార్థులు సామాజిక దృక్పథంతో ఉంటూ రోగుల పట్ల ప్రేమను కలిగి ఉండాలని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్, పద్మభూషన్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్రెడ్డి సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో సోమవారం రాత్రి నిర్వహించిన వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిమ్స్లోని విద్యార్థులకు చాలా చక్కటి భవిష్యత్త్ ఉందన్నారు. వరల్డ్లోనే బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాల బెస్ట్గా నిలుస్తుందన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నాయన్నారు. ఐదేళ్లలోనే అబ్బురపరిచే విధంగా భవనాల నిర్మాణాలు జరగడం సంతోషదాయకమని అన్నారు. రోగులతో సాన్నిహిత్యం కలిగి ఉండాలని సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ బాటియా మాట్లాడుతూ.. ఎయిమ్స్లోని ఔట్పేషెంట్ విభాగం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 11లక్షల మంది వైద్య సేవలు పొందారని, 34రకాల వైద్య విభాగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం ఎయిమ్స్ పురోగతిపై ముద్రించిన మ్యాగ్జిన్ను డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ఆవిష్కరించడంతో పాటు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జలలీమ్, రాహుల్నారంగ్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్రెడ్డి -
పిల్లల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి
సూర్యాపేట: పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారి ప్రవర్తన, నడవడికను గమనిస్తూ.. తప్పడగులు వేస్తున్నారని తెలిస్తే దండించకుండా ఏది చేడు, ఏది మంచి అనే విషయాన్ని వారు గ్రహించే విధంగా అవగాహన కల్పించాలి. వివిధ రంగాల్లో విజయం సాధించిన వారి గూర్చి పిల్లలకు వివరించాలి. పిల్లలతో స్నేహంగా మెలగాలి, పిల్లల సెల్ఫోన్ను గమనిస్తూ ఉండాలి. తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే అంశాలకు దూరంగా ఉంచాలి. పిల్లలు ఎప్పుడు బిజీగా ఉండే విధంగా చదువుతో పాటు వ్యాయామం, డ్యాన్స్, చిత్రలేఖనం వంటి వాటిని నేర్పించాలి. – బొల్లెద్దు వెంకటరత్నం, న్యాయవాది -
ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలు మృతి
మునుగోడు: గొర్రెలను మేపేందుకు వెళ్తున్న వృద్ధురాలిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతిచెందింది. ఈ ఘటన సోమవారం మునుగోడు మండల కేంద్రం శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం కచలాపురం గ్రామానికి చెందిన చిరగోని బాలమ్మ(58) మునుగోడులో నివాసముంటున్న తన కుమారుడు వద్ద ఉంటూ గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తోంది. రోజుమాదిరిగా సోమవారం ఉదయం 10 గంటల సమయంలో గొర్రెలను మేతకు తోలుకుని వెళ్తుండగా.. మునుగోడు మండల కేంద్రం శివారు కమ్మగూడెం సమీపంలోని చొల్లేడు రోడ్డులో అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఆమె ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతురాలి కుమారుడు చిరగోని లింగస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు. అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతిభువనగిరి: భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురం గ్రామంలో ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన పిన్నం నర్సింహ(63)కు తన వ్యవసాయం బావి వద్ద భూమి విషయమై, పైపులైన్ ద్వారా నీరు తరలించే విషయమై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో గొడవులు జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం కూడా బావి వద్ద గొడవ జరగుతుండగా.. గ్రామస్తులు గమనించి నర్సింహ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. రాత్రి 9గంటల సమయంలో నర్సింహ కుటుంబ సభ్యులు బావి వద్దకు వెళ్లగా.. అతడు అక్కడ ఉన్న మంచంపై స్పృహతప్పి పడిపోయి ఉన్నాడు. వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా.. అప్పటికే మృతిచెందినట్లు 108 వాహన సిబ్బంది తెలిపారు. మృతుడి కుమార్తె మానస ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంతోష్కుమార్ తెలిపారు. అప్పుల బాధతో కౌలు రైతు బలవన్మరణం రామన్నపేట: అప్పుల బాధతో కౌలు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో జరిగింది. సిరిపురం గ్రామానికి మోటె నర్సింహ(50) కొన్నేళ్లుగా గ్రామశివారులో పద్నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. వానాకాలంలో వరితో పాటు పత్తి సాగు చేశాడు. ప్రస్తుత యాసంగిలో వరి సాగు చేశాడు. బోర్లు ఎండిపోవడంతో సగానికి పైగా వరి పొలం ఎండిపోయింది. వ్యవసాయ పెట్టుబడుల కోసం చేసిన అప్పులు పెరుగుతుండడంతో కొద్దిరోజులుగా ఆందోళన చెందసాగాడు. సోమవారం ఉదయం స్థానిక శివాలయానికి వెళ్లి పూజలు చేశాడు. అనంతరం పొలం చూడడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పెట్టుబడి కోసం చేసిన అప్పుల ఎలా తీర్చాలో తెలియక ఆందోళనకు గురై పురుగులమందు తాగాడు. అనంతరం ఇంటికి తిరిగివచ్చి మంచంపై పడుకొని వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు గమనించి చుట్టుపక్కల వారి సహాయంతో 108 వాహనంలో రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నర్సింహ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
గ్రూప్–1 ఉద్యోగాలకు ముగ్గురు అర్హత
తిరుమలగిరి(నాగార్జునసాగర్): రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–1 మెయిన్స్ ప్రొవిజినల్ మార్కులు సోమవారం విడుదల చేయగా.. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం బోయగూడెం గ్రామానికి చెందిన మందడి నాగార్జునరెడ్డి, అల్లి కీర్తన ఉద్యోగాలకు అర్హత సాధించారు. మందడి నాగార్జునరెడ్డి 2006 డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతూనే గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యారు. 2011లో అసిస్టెంట్ ట్రైబేల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఎంపికై కొద్దికాలం పనిచేసిన తర్వాత అదే ఏడాదిలో విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. నాగార్జునరెడ్డి ప్రస్తుతం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ తహసీల్దార్గా కొనసాగుతూనే గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యి 488 మార్కులతో అర్హత సాధించారు. మొదటి ప్రయత్నంలోనే విజయం..బోయగూడెం గ్రామానికే చెందిన అల్లి నాగమణి, పెద్దిరాజు దంపతుల కుమార్తె అల్లి కీర్తన మొదటి ప్రయత్నంలోనే తన కలను సాకారం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్–4 ఫలితాల్లో ఆమె జూనియర్ అసిస్టెంట్గా ఎంపికై ంది. గ్రూప్–1 ఉద్యోగానికి 468.5 మార్కులతో అర్హత సాధించింది. గుండెపురి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండెపురి పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న భూక్య సందీప్ 468.5 మార్కులతో గ్రూప్–1కు అర్హత సాధించారు. -
విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని కల్గిఉండేలా తీర్చిదిద్దాలి
సూర్యాపేట: తల్లిదండ్రులు తమ పిల్లలు చిన్నప్పటి నుంచే ఒక లక్ష్యం కలిగి ఉండేలా తీర్చిదిద్దాలి. హైస్కూల్ విద్య నుంచే తమ కుటంబ నేపథ్యం, వారి స్థాయిని పిల్లలకు తెలిసేలా చేయాలి. సమాజంలో ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి. లక్ష్యం మీదనే ఫోకస్ చేసేలా, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండేలా చూడాలి. వివిధ రంగాల్లో ప్రావీణ్యం సాధించే వారు ఏవిధంగా సెల్ఫోన్, టీవీలకు దూరంగా ఉంటున్నారో వివరించాలి. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. – తల్లమల్ల హుస్సేన్, పూర్వపు ప్రభుత్వ న్యాయవాది, సూర్యాపేట -
పిల్లల ప్రవర్తనను గమనించాలి
నల్లగొండ టౌన్: పిల్లల ప్రవర్తనను గమనించాలి. చదువుతో పాటు వారు ఏమి చేస్తున్నారు... ఎక్కడికి వెళుతున్నారు.. ఎలాంటి స్నేహం చేస్తున్నారు అనే దాన్ని ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాలి. ఒకవేళ ప్రేమలో పడితే వారి కుటుంబ నేపథ్యం, వారి స్థితిగతులు తెలుసుకోవాలి. అన్ని సక్రమంగా ఉంటే పిల్లల అభిప్రాయాన్ని అంగీకరించాలి. లేకపోతే వారు తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి కుటుంబ నేపథ్యమైతే ప్రేమ వివాహాలను అంగీకరించడంలో తప్పులేదు. – పనస కాశయ్యగౌడ్, గుండ్లపల్లి, నల్లగొండ -
జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహించాలి
నల్లగొండ టౌన్ : తల్లిదండ్రులు పిల్ల ల ప్రేమను ప్రోత్సహించొద్దు. ముందుగా తమ పిల్లలను సక్రమంగా చదువుకుని జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహించాలి. ఒకవేళ ప్రేమ వివాహం చేసుకున్నా చంపడం, దాడులు చేయడం, కేసులపాలు కావడం మంచి పద్ధతి కాదు. ప్రతిష్టకు పోయి వారి భవిష్యత్ను నాశనం చేసుకోవద్దు. సామరస్యంగా రెండు కుటుంబాలు కలిసి సమస్య పరిష్కరించుకుంటే మంచిది. పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని వారిని సరైన మార్గంలో పయనించేలా దిశా నిర్దేశం చేయాలి. వారి ప్రవర్తనలో మార్పు వస్తే వెంటనే గమనించి వారు సరైన రీతిలో ఉండేలా తల్లిదండ్రులు సూచనలు చేయాలి. – డాక్టర్ సుబ్బారావు, మానసిక వైద్య నిపుణుడు, నల్లగొండ -
నిరుద్యోగ యువతే టార్గెట్..
సూర్యాపేట టౌన్ : నిరుద్యోగ యువతను టార్గెట్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.లక్షల్లో వసూలు చేసి మోసం చేసిన నకిలీ డీఎస్పీని సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ కేసు వివరాలను ఎస్పీ కె. నర్సింహ విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో నకిలీ డీఎస్పీ అవతారమెత్తాడు. తాను డీఎస్పీ అని చెప్పుకుంటూ పలువురిని పరిచయం చేసుకొని అమాయకులైన నిరుద్యోగ యువతకు పోలీస్, సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తూ బురిడీ కొట్టించాడు. కోదాడలో ఒక అమ్మాయికి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె వద్ద రూ.36లక్షలు వసూలు చేశాడు. అదేవిధంగా ఏపీలోని మార్టూర్కు చెందిన వ్యక్తికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని, గురజాలకు చెందిన మరో వ్యక్తికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని పరారీలో ఉన్నాడు. కోదాడకు చెందిన అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సూర్యాపేట పట్టణ పోలీసులు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీగ్రాండ్ హోటల్ వద్ద శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద రూ.18లక్షల నగదు, ఒక కారు, పోలీస్ యూనిఫాం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుడిపై గతలంలో పలు కేసులు ఉండగా.. 2022లో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చి మళ్లీ అదే పనిచేస్తున్నట్టు ఎస్పీ చెప్పారు. ఈ కేసును ఛేదించిన సూర్యాపేట పట్టణ సీఐ పీవీ రాఘవులు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వర్రావు, డీఎస్పీ రవి, పట్టణ సీఐ పీవీ రాఘవులు పాల్గొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి బురిడీ కొట్టించిన నకిలీ డీఎస్పీ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు -
కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ
తీర్పులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీరు భేష్ ప్రణయ్ హత్య అనంతరం తండ్రి బాలస్వామి మిర్యాలగూడ వన్టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యర్థన మేరకు కేసు వాదించేందుకు దర్శనం నరసింహను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పబ్లిక్ ప్రోసిక్యూటర్ బలమైన సాక్షాధారాలు సేకరించారు. నిందితుల ఫోన్కాల్ డేటా, లోకేషన్, సీసీ టీవి ఫుటేజీలను సేకరించి.. 472 పేజీల లిఖిత పూర్వక రిపోర్టును కోర్టుకు సమర్పించారు.● ఏ2 సుభాష్కుమార్శర్మకు మరణశిక్ష ● ఏ3 నుంచి ఏ8 వరకు ఆరుగురికి జీవితఖైదు ● తీర్పుకోసం భారీగా తరలివచ్చిన ప్రజాసంఘాల నాయకులు ● కన్నీటి పర్యంతమైన నిందితుల కుటుంబీకులు ● కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తురామగిరి(నల్లగొండ): సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో తుదితీర్పు నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి నల్లగొండ కోర్టు వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ కేసు నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు, రెండవ అదనపు జడ్జి ఎన్.రోజారమణి సోమవారం అంతిమ తీర్పు వెల్లడించారు. సెప్టెంబర్ 14, 2018న ప్రణయ్ హత్యకు గురికాగా.. అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ విచారణ జరిపి హత్య కేసులో ప్రమేయం ఉన్న 8 మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ హత్య కేసులో అన్ని సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించారు. నరసింహ వాదనలతో ఏకీభవించిన నల్లగొండ ఎస్సీ, ఎస్టీ రెండవ అనదపు జడ్జి ఎన్.రోజారమణి ఏ2 సుభాష్కుమార్శర్మకు ఉరిశిక్షతో పాటు రూ.15 వేల జరిమానా లేదా 4 నెలల జైలు శిక్ష, మిగిలిన ఆరుగురు ఏ3 అజ్గర్అలీ, ఏ4 మహ్మద్ అబ్దుల్బారీ, ఏ5 అబ్దుల్ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్కుమార్, ఏ7 సముద్రాల శివ, ఏ8 ఎంఏ.నిజాంకు జీవిత ఖైదు రూ.10 వేల జరిమాన లేదా 4 నెలల జైలుశిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ఏ1 నిందితుడు అమృవర్షిణి తండ్రి తిరునగరు మారుతీరావు 2020 మార్చి 8న ఆత్మహత్య చేసుకోగా.. అజ్గర్అలీని అహ్మదాబాద్ సబర్మతి జైలుకు, శుభాష్కుమార్శర్మను చర్లపల్లి జైలుకు తరలించారు. మిగిలిన ఐదుగురు నిందితులకు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నల్లగొండ జిల్లా జైలుకు తరలించారు. ఈ తీర్పుతో ప్రణయ్ కుటుంబ సభ్యులు, పలువురు ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. భారీగా తరలిన వచ్చిన ప్రజా సంఘాలు, ప్రజలు.. ప్రణయ్ హత్య కేసు తీర్పు సోమవారం వెలువడుతుందన్న విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులతో పాటు సామాన్య ప్రజలు నల్లగొండ కోర్టు వద్దకు భారీగా తరలివచ్చారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టినప్పటి నుంచి తీర్పు ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా వేచిచూశారు. నిందితుల కుటుంబాల కన్నీటి పర్యంతం.. హత్య కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురికి శిక్ష పడింది. దీంతో నిందితుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కోర్టు ఆవరణలో తిరునగరు శ్రవణ్కుమార్ కూతురు శృతి బోరున విలపించింది. తన తండ్రికి ఎలాంటి నేరం చేయలేదని అయినప్పటికీ శిక్ష పడిందంటూ కన్నీరు పెట్టుకుంది. వీరితో పాటు మిగతా నిందితుల కుటుంబ సభ్యులు కూడా కోర్టు వద్ద, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో వారితో మాట్లాడుతూ, అనంతరం వాహనంలో తరలిస్తున్న క్రమంలో కన్నీరు పెట్టుకున్నారు. కోర్టు ప్రాంగంలో పోలీసుల భారీ బందోబస్తు.. ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు నేపథ్యంలో నల్లగొండ కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు లోపలికి ఎవరినీ రానివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. న్యాయవాదులు, సిబ్బందిని, కుటుంబ సభ్యులను మాత్రమే కోర్టు లోపలికి అనుమతించారు. -
పిల్లల కోరిక మన్నించి వివాహాలు చేయాలి
మిర్యాలగూడ: పిల్లలు ప్రేమించుకుంటే తల్లిదండ్రులు వారి కోరికను మన్నించి పెళ్లిళ్లకు అనుమతించాలి. కులం, పరువు ప్రతిష్టలు అనే అహంకారంతో హత్యలకు పాల్పడితే చట్టాల నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని గుర్తించించాలి. చట్ట ప్రకారం మేజర్లు అయితే పిల్లలు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించింది. అంబేద్కర్ స్ఫూర్తితో కులరహిత సమాజం వైపు అడుగులు వేయాలి. పిల్లలు కూడా సినిమా, టీవీల ప్రభావంలో ఆకర్షణలకు లోనై అదే ప్రేమ అనుకొని తల్లిదండ్రులను శత్రువులుగా చూసే వైఖరిని మానుకోవాలి. తల్లిదండ్రులను ఒప్పించి పెద్దలను మెప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయాలి. – కస్తూరి ప్రభాకర్, సామాజికవేత్త, మిర్యాలగూడ -
పగలు భగభగ.. రాత్రి గజగజ
భువనగిరి టౌన్ : జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉదయం 9 నుంచే ఎండతీవ్రత పెరుగుతోంది. తిరిగి సాయంత్రం 6గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. దీంతో పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. శుక్రవారం భూదాన్పోచంపల్లి మండలంలో గరిష్ట ఉష్ణోగ్రత 39.1 డిగ్రీలు నమోదు కాగా, బొమ్మలరామారంలో కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు పడిపోయింది. గడిచిన పది రోజులుగా వాతావరణంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో జనం అనారోగ్యం బారిన పడుతున్నారు. -
టీటీడీ తరహాలోనే.. గుట్టకు పాలకమండలి
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకమండలి త్వరలో ఏర్పాటు కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు తరహాలోనే గుట్ట పాలకమండలి ఉండాలన్నది సీఎం అభిప్రాయం. అందుకు అనుగుణంగానే పాలకమండలి ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఇకనుంచి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దేవస్థానం ఉంటుంది. దేవాదాయ శాఖ ఆజమాయిషీ ఉండదు. దేవస్థానం ఈఓ, ఉద్యోగుల నియామకాలు, బదిలీలు ప్రభుత్వ పరిధిలోనే జరగనున్నాయి. ఆలయ కార్యనిర్వహణ అధికారిగా ఐఏఎస్ అధికారి లేదా అదనపు కమిషనర్ క్యాడర్ స్థాయి అధికారి ఉంటారు. 17 ఏళ్లుగా అధికారుల పాలనలో కొనసాగుతున్న దేవస్థానం ప్రజాప్రతినిధుల చేతుల్లోకి రానుంది. పాలకమండలిలో ఉండేది వీరే.. చైర్మన్, 10 మంది సభ్యులతో పాలకమండలి ఏర్పాటు కానుంది. ఇందులో ఒకరు వంశపారంపర్య ధర్మకర్త కాగా మిగతా తొమ్మిది మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీరితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఆలయ ఈఓ, వైటీడీఏ వైస్ చైర్మన్, ఆలయ స్థానాచార్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు రూపొందించిన నోట్కు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దేవాదాయశాఖ చట్టం–1987లోని చాప్టర్ 14 కింద యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని చేర్చినట్లు సమాచారం. పాలకమండలిలో చోటు కోసం ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. -
నయన మనోహరం.. నృసింహుడి కల్యాణం
యాదగిరిగుట్ట : యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనరసింహుడి తిరుకల్యాణోత్సవం శనివారం రాత్రి వైభవంగా సాగింది. పట్టువస్త్రాలు, వజ్రవైడూర్యాలు, బంగారు ఆభరణాలతో పెళ్లికొడుకుగా ముస్తాబైన శ్రీస్వామివారు గజవాహనంపై, నవ వధువుగా శ్రీలక్ష్మీదేవి దివ్య అలంకార శోభితమై ప్రత్యేక పల్లకిలో 8.30గంటలకు ఊరేగింపుగా బయలుదేరి ఉత్తర మాడవీఽఽధిలో ఏర్పాటు చేసిన కల్యాణవేదికపైకి చేరుకున్నారు. కల్యాణ వేదికపై శ్రీస్వామి, అమ్మవారిని ఎదురెదురుగా అధిష్టింపజేసిన అర్చకులు.. కల్యాణానికి శ్రీకారం చుట్టారు. అర్చకబృందం, వేదపండితులు, పారాయణీకులు వేదమంత్రాలు, పారాయణాలు పఠిస్తుండగా ప్రధానా ర్చకులు శ్రీస్వామివారికి జంజరాధారణ (యజ్ఞోపవీతం)గావించారు. 10.44 గంటలకు జీలకర్ర బెల్లం ధరించారు. 10.50 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, సన్నాయిమేళాలు మోగుతుండగా, భక్తులు జయజయద్వానాల మధ్య మాంగల్యధారణ గావించి, ఆతరువాత ముత్యాల తలంబ్రాల వేడుక నిర్వహించారు. పట్టువస్త్రాలు సమర్పించిన బీర్ల అయిలయ్య, ఎంపీ కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య , ఎంపీ కిరణ్కుమార్రెడ్డి స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే టీటీడీ, పోచంపల్లి పద్మశాలీ మహాజన సంఘం వారు తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను అర్చకులు స్వామి, అమ్మవారికి సమర్పించారు. కల్యాణంలో దేవాదాయ శాఖ కమి షనర్ శ్రీధర్, కలెక్టర్ హనుమంతరావు దంపతులు, జిల్లా జడ్జి జయరాజు, ఈఓ భాస్కర్రావు, అనువంశి ధర్మకర్త నరసింహమూర్తి, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉదయం శ్రీరాముడిగా దర్శనమిచ్చిన నృసింహుడు ఉదయం స్వామివారిని శ్రీరాముడి అలంకారంలో హనుమంత వాహనంపై ఊరేగించారు. ఫ యాదగిరిగుట్టలో వైభవంగా శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణం బ్రహ్మోత్సవాల్లో నేడు ఆదివారం ఉదయం శ్రీస్వామి వారు శ్రీమహావిష్ణు అలంకారంతో గరుడవాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారు. -
పంటలకు సాగునీరివ్వడంలో ప్రభుత్వం విఫలం
భువనగిరి : సాగునీరు అందక జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శనివారం భువనగిరి మండలంలోని వడపర్తి, హన్మాపురం, మన్నెవారిపంపు, బండసోమారం, చందుపట్ల, నాగిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ఎండిన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రణాళిక లేకుండా బస్వాపురం రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేయటం వల్ల భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయడం లేదన్నారు. మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలిస్తూ బస్వాపురం నీటిని విడుదల చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కేసీఆర్ పాలనలోనే రైతులు ఇబ్బంది లేకుండా ఉన్నారని, సమృద్ధిగా సాగునీరు అందిందన్నారు.పంటలకు నీరందించడంలో స్థానిక ఎమ్మెల్యే సైతం విఫలమయ్యారని మండిపడ్డారు. ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పాడి రైతులకు బిల్లులు చెల్లించాలని కోరారు. వడపర్తిలో పొలం ఎండిపోయి కంటతడి పెట్టిన మహిళను పైళ్ల శేఖర్రెడ్డి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జనగాం పాండు, మాజీ జెడ్పీటీసీ బీరు మల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ అంజనేయులు, నాయకులు ర్యాకల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, పాండు, శ్రీనివాస్రెడ్డి, ప్రభాకర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి -
లోక్ అదాలత్లో 24,861 కేసులు పరిష్కారం
భువనగిరిటౌన్ : జాతీయ లోక్ అదాలత్లో భాగంగా శనివారం జిల్లాలోని అన్ని కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్లలో 24,861 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో సివిల్ 12, క్రిమినల్ 2,231, ప్రిలిటిగేషన్ 27, ఇ–చలానా 22,591 కేసులు ఉన్నాయి. భువనగిరి కోర్టులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు లోక్అదాలత్ను ప్రారంభించారు. రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ పంచాక్షరి లోక్ అదాలత్ను పర్యవేక్షించి మాట్లాడారు. రాజీమార్గంతో కేసులు పరిష్కరించుకోవడం వల్ల శాంతియుత వాతావరణం ఏర్పడడంతో పాటు మానవ సంబంధాలు మెరుగుపడుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాధవిలత, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్యామ్సుందర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కవిత, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గంధమల్లకు లైన్ క్లియర్
ఆమోదం తెలిపిన రాష్ట్ర క్యాబినెట్ ఫ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 1.41 టీఎంసీలకు కుదింపు ఫ 1,144 ఎకరాలకు తగ్గనున్న భూ సేకరణ ఫ గంధమల్ల, వీరారెడ్డిపల్లి, ఆవాస గ్రామాలకు తప్పనున్న ముంపు ముప్పు ఫ యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి ఏర్పాటుకూ ఆమోదం సాక్షి, యాదాద్రి : జిల్లాలోని తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామ సమీపంలో ప్రతిపాదించిన గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జలాశయం నిల్వ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీలకు కుదిస్తూ ఇదివరకే నిర్ణయం తీసుకోగా అధికారికంగా ఆమోదించింది. సుమారు 65 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ఆరేళ్ల తరువాత పట్టాలెక్కనుండడంతో ఆలేరు నియోజకవర్గ ప్రజలు, రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. దీంతో పాటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. గంధమల్ల రిజర్వాయర్ స్వరూపం ఇదీ.. కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగంలో భాగంగా ప్యాకేజీ–15లో తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువును రిజర్వాయర్గా మార్చాలని గత ప్రభుత్వం 2017లో ప్రతిపాదించింది. కానీ, వివిధ కారణాల వల్ల రిజర్వాయర్ ఆరేళ్లుగా హోల్డ్లో ఉంది. 9.36 టీఎంసీల నిలువ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని తొలుత నిర్ణయించారు. ఇందుకోసం 4,027 ఎకరాలు అవసరమని, భూములను రైతుల నుంచి, అటవీభూములు సేకరించాలని, నష్టపరిహారం కింద రూ.379 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని నిర్ణయించారు. అయితే గంధమల్ల, వీరారెడ్డి గ్రామాల పరిధిలో పెద్ద ఎత్తున ఆవాసాలు ముంపునకు గురవుతుండడంతో ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో 2018లో రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.28 టీఎంసీలకు కుదించడంతో వీరారెడ్డిపల్లితో పాటు మరికొన్ని ఆవాస గ్రామాలు బయటపడ్డాయి. ఆతరువాత భూ సేకరణ 2,423 ఎకరాలకు తగ్గింది. అయినా ముంపు గ్రామాల ప్రజలు ఆందోళలు ఆపకపోవడంతో రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీలకు కుదించాలని అధికారికంగా నిర్ణయించారు. దీనివల్ల గంధమల్లతో పాటు పలు ఆవాస గ్రామాలు ముంపునుంచి బయటపడనున్నాయి. అంతేకాకుండా భూ సేకరణ 1,144 ఎకరాలకు తగ్గనుంది. ప్రారంభంలో రిజర్వాయర్ నిర్మాణాన్ని రూ.860 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించగా.. నీటి నిలువ సామర్థ్యాన్ని తగ్గించడం ద్వారా రూ.575 కోట్లకు తగ్గింది. రిజర్వాయర్ నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదమద్ర వేసినందున.. పనులు ప్రారంభించడమే మిగిలింది. -
10వ తేదీ నుంచి ‘ప్రజావాణి’ పునరుద్ధరణ
భువనగిరి టౌన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 10వ తేదీనుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశామని, కోడ్ ముగిసినందున తిరిగి పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని, సమస్యలు ఉంటే ప్రజావాణికి వచ్చి వినతులు అందజేయాలని సూచించారు. లక్ష సంతకాల సేకరణ ప్రారంభం భువనగిరి టౌన్ : వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో శనివారం భువనగిరిలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వివిధ రాజకీయ పదవుల్లో దివ్యాంగులను నామినేట్ చేయడానికి వీలుగా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది దివ్యాంగుల నుంచి సంతకాలు సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే భువనగిరి నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్, జిల్లా అధ్యక్షుడు సుర్పంగ ప్రకాష్, కోశాధికారి కొత్త లలిత పాల్గొన్నారు. డీసీపీకి ఘనంగా వీడ్కోలుభువనగిరి : బదిలీపై కామారెడ్డి జిల్లా ఎస్పీగా వెళ్తున్న డీసీపీ రాజేశ్చంద్రకు శనివారం పోలీ సులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది ఇరువైపులా నిల్చొని పూలవర్షం కురిపించారు. డీసీపీతో కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి రామన్నపేట : విష్ణుకుండినుల రాజధానిగా వెలుగొందిన ఇంద్రపాలనగరంను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం ఆధ్వర్యంలో ఇంద్రపాలనగరంలో పర్యటించారు. పెద్దచెరువు సమీపంలో ఆసిప్నహర్ కాలువ వంతెన, తూములను పరిశీలించారు. 120 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనలు, తూములకు మరమ్మతులు చేయించి రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఆసిఫ్నహర్ కాలువ ఆధునీకరణకు నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జెల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశంసభ్యులు మీర్ఖాజా, గన్నెబోయిన శ్రీనివాస్, కొంగరి నర్సింహ, కంఠేశ్వర్ రమేష్, రాధారపు మల్లేశం, బోనగిరి శ్రీనివాస్, కొమ్మగాని అశోక్, నాగు నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
పాల బిల్లులు చెల్లించాలని ధర్నా
ఆత్మకూరు(ఎం) : మదర్ డెయిరీ, విజయ డెయిరీలు బకాయి బిల్లుల చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూర్(ఎం) మండలంలోని కూరెళ్ల పాల కేంద్రం ఎదుట శనివారం పాడి రైతులు ధర్నా చేశారు. రెండు డెయిరీల నుంచి రూ.85 కోట్లు రావాల్సి ఉందని, నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడం వల్ల పాడిపరిశ్రమ నిర్వహణ ఇబ్బందికరంగా మారిందన్నారు. పాడి పరిశ్రమను ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. దేశీయ పాలను కాకుండా విదేశాలనుంచి కేంద్రం పాలను దిగుమతి చేసుకోవడం వల్ల పాడి రైతులు నస్టాలు చవిచూడాల్సి వస్తుందన్నారు. ఈనెల 10లోగా బిల్లులు చెల్లించని పక్షంలో 11వ తేదీన కలెక్టరేట్ ఎదుట జిల్లాలోని పాడి రైతులంతా కలిసి ధర్నా చేయనున్నట్లు వెల్లడించారు. ధర్నాలో వేముల భిక్షం, రైతులు తుమ్మలగూడెం యాదయ్య, నార్కట్పల్లి మల్లయ్య, మొరుగాని శ్రీనువాస్, కన్నెబోయిన శంకరయ్య, జోగు కుమార్, బాషబోయిన నరేష్, ఎండి షకీల్, మారుపాక పరుశరాములు, ఐలమ్మ, సోమక్క అండాలు పాల్గొన్నారు. -
పాతర్లపహాడ్లో విషాదఛాయలు
ఫ ఏపీలోని నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన అక్క, తమ్ముడు మృతి నెల్లూరు క్రైం, ఆత్మకూర్(ఎస్): ఏపీలోని నెల్లూరు పట్టణంలోని శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన అక్క, తమ్ముడు మృతిచెందారు. దీంతో పాతర్లపహాడ్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన మోహనంది మల్లయ్య, నాగమణి దంపతులకు నిషిత (22), కార్తీక్ (20) సంతానం. మల్లయ్య సూర్యాపేటలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తూ కుమార్తెను బీటెక్, కుమారుడిని డిప్లొమా చదివిస్తున్నాడు. ఇటీవల నిషిత సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందడంతో మొక్కు చెల్లించుకునేందుకు కుటుంబంతా కలిసి తిరుపతికి వెళ్లారు. ఈ నెల 6న తిరుమలకు వెళ్లిన వారు.. దర్శనానంతరం తిరిగి తమ ఊరెళ్లేందుకు తిరుపతికి శుక్రవారం అర్ధరాత్రి చేరుకున్నారు. రైల్వేస్టేషన్కు బయల్దేరగా మార్గమధ్యలో ఇన్నోవా కారు డ్రైవర్ కలిసి తాను విజయవాడకు వెళ్తున్నానని చెప్పారు. దీంతో వీరు కారులో బయల్దేరారు. మార్గమధ్యలో నెల్లూరు పట్టణంలోని భగత్సింగ్ కాలనీ జంక్షన్ వద్దకు రాగానే కారు డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ను ఢీకొని ఆపై లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నిషిత, కార్తీక్ అక్కడికక్కడే మృతిచెందగా, వారి తల్లిదండ్రులు, కారు డ్రైవర్ శివరామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో హాస్పిటల్కు తరలించారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను జీజీహెచ్ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యమైన మహిళ ఆచూకీ లభ్యంఫ కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు మద్దిరాల: నెలరోజుల క్రితం అదృశ్యమైన మద్దిరాల మండలంలోని కుంటపల్లి గ్రామానికి చెందిన ఆశ వర్కర్ కుందూరు వసంత ఆచూకీ శనివారం లభ్యమైంది. ఎస్ఐ వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. వసంత నల్లగొండ సమీపంలో కిందపడడంతో ఆమె తలకు గాయామై మతిస్థిమితం కోల్పోయింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. ఆమె ఎలాంటి వివరాలు చెప్పలేని స్థితిలో ఉండడంతో నల్లగొండలోని ఓ ఆశ్రమంలో ఉంచారు. ఇటీవల అక్కడి పోలీసులు సమాచారం అందించడంతో ఆమెను కుందూరు వసంతగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు శనివారం అప్పజెప్పినట్లు ఎస్ఐ తెలిపారు. వసంత ఆచూకీ కనిపెట్టిన పోలీసులకు, ఆశ్రమ నిర్వాహకులకు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
మహిళా సంక్షేమానికి పెద్దపీట
ఫ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని ఓ హోటల్లో జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 150కి పెరిగితే ఉంటే అందులో 50 మంది మహిళలే ఎమ్మెల్యేలుగా ఉంటారన్నారు. మహిళా బిల్లు కూడా త్వరలో అమలవుతుందని పేర్కొన్నారు. బీసీ కుల గణనతో 42శాతం బీసీలకు రిజర్వేషన్ వర్తిస్తుందని అన్నారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఉచిత బస్సు సౌకర్యం, మహిళా సంఘాలకు క్యాంటీన్ల నిర్వహణ వంటి అవకాశాలు కాంగ్రెస్ ప్రభుత్వ కల్పించిందన్నారు. త్వరలో 1000 కొత్త ఆర్టీసీ బస్సుల మెయింటెనెన్స్ను మహిళా సంఘాలకు అప్పగిస్తామన్నారు. జిల్లాలోని మహిళా సంఘాలకు 50 బస్సులను కేటాయించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గోపగాని మాధవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, రూ.500కే సిలిండర్ అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ మాజీ ప్రజాప్రతినిధులను, మహిళా కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, వంగూరి లక్ష్మయ్య, మహిళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బ రూపఅశోక్సుందర్, రాష్ట్ర కార్యదర్శి ఎస్కే జాను, పట్టణ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కందిమల్ల నాగమణిరెడ్డి, జిల్లా కార్యదర్శి లలిత, సదాలక్ష్మి, సంకు ధనలక్ష్మి, విజయలక్ష్మి, కంచర్ల మాధవి, జూలకంటి ధనలక్ష్మి, సూరెడ్డి సరస్వతి, స్వరూప రెడ్డి సౌజన్య, సుకన్య, నిర్మలాదేవి, సువర్ణ, పద్మలు పాల్గొన్నారు. -
కుటుంబ పోషణలో భర్తకు తోడుగా..
ఆత్మకూర్ (ఎస్): కుటుంబ పోషణలో భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకు గాను ఊరూరా మోటార్ సైకిల్పై తిరిగి కూరగాయలు అమ్ముతూ ఆదర్శంగా నిలుస్తోంది మాసారపు సుగుణమ్మ. ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామానికి చెందిన మాసారపు సుగుణమ్మ, స్వామి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. చిన్న అమ్మాయి మానసిక వికలాంగురాలు. వీరికి వ్యవసాయ భూమి లేకపోవడంతో భర్త స్వామి సూర్యాపేట నుంచి కూరగాయలు హోల్సేల్గా తెచ్చి గ్రామంలో వీధి వీధి తిరుగుతూ అమ్ముతున్నాడు. అతనొక్కడి సంపాదనపై ఆధారపడి కుటుంబ పోషణ ఇబ్బందిగా మారడంతో సుగుణమ్మ అదే గ్రామంలో గంప నెత్తినెత్తుకొని కూరగాయలు అమ్మేది. ఈ క్రమంలో ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లు చేశారు. అయితే సుగుణమ్మకు మోకాళ్లు, మెడ నొప్పులు రావడంతో కూరగాయల గంప నెత్తినెత్తుకొని తిరగడం ఇబ్బందిగా మారడంతో సైకిల్పై చుట్టుపక్కల గ్రామాలు వెళ్లి కూరగాయలు అమ్మేది. సైకిల్పై తిరగడం కూడా ఇబ్బందిగా ఉంటుండటంతో వారి కుమార్తె ఎనిమిది నెలల క్రితం టీవీఎస్ ఎక్సెల్ బైకులు కొనిచ్చింది. ఈ మోటార్ సైకిల్కు మూడు చక్రాలు అమర్చారు. దీంతో సుగుణమ్మ కూరగాయలను ఈ బండిపై పెట్టుకొని నెమ్మికల్తో పాటు 7, 8 కిలోమీటర్ల దూరం దాకా వెళ్లి వ్యాపారాన్ని కొనసాగించి కుటుంబ పోషణలో భర్తకు తోడుగా నిలుస్తోంది. ఇలా భార్యాభర్తలు కూరగాయలు విక్రయించి రోజుకు రూ.800 నుంచి రూ.1000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించుకోవడం సంతోషంగా ఉందని సుగుణమ్మ తెలిపింది. ఫ ఊరూరా తిరిగి మోటార్ సైకిల్పై కూరగాయలు అమ్ముతున్న భార్య -
అడవిని హరిస్తున్న అగ్నికీలలు
నాగార్జునసాగర్: సాగర్ జలాశయం తీరం వెంట గల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ బఫర్ జోన్లో వారానికి రెండు చోట్ల మంటలు చెలరేగుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అగ్నిప్రమాదాలు ఆగడం లేదు. గత కొన్నేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. గత వారం రెండ్లు సార్లు కృష్ణా నది తీరంలో జమ్మనకోట ప్రాంతంలో రాత్రివేళ అడవికి నిప్పంటుకుంది. వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు దగ్గరలో గల తండావాసుల సహకారంతో చెట్ల కొమ్మలతో మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఒకసారి సుమారు 8 నుంచి 10ఎకరాల మేర, రెండోసారి 2 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కాలిపోయింది. అటవీ ప్రాంతంలో రాలిపోయిన ఆకులతో పాటు చిన్న చిన్న చెట్లు తగలబడ్డాయి. రెండేళ్ల క్రితం కూడా దయ్యాలగండి సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో అధికారులు సకాలంలో స్పందించి ఆర్పివేశారు. అదేవిధంగా నల్లమల అటవీ ప్రాంతంలో నాగాలారం ప్రాంతంలో మూడేళ్ల క్రితం మంటలు అంటుకోని 100 ఎకరాల మేర అడవి తగలబడింది. అటవీ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు.. అటవీ ప్రాంతాల్లోకి బయటి వ్యక్తులు, పశువుల కాపరులు ప్రవేశించడంపై నిషేధం విధించినట్లు అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. అడవుల్లో చెట్ల ఆకులు రాలడంతో పాటు వేసవిలో ఎండలు మండుతున్న దృష్ట్యా నల్లమల, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోని గ్రామాల్లో కళాజాతతో ప్రచారం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నల్లగొండ–మహబూబ్నగర్ జిల్లాల మధ్యన కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో 2,166 చదరపు కిలోమీటర్ల మేర అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ విస్తరించి ఉంది. ఫిబ్రవరి నుంచి మే నెల వరకు ఆకురాలే సమయం కావడంతో తరచూ ఇక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. దీంతో అడవిలో నివసించే జంతువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. తీసుకోవాల్సిన చర్యలు అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తుగానే అటవీ ప్రాంత శివారులో నివసించే ప్రజలకు అవగాహన కల్పించాలి. అడవిలోకి వేసవిలో జీవాలను, పశువులను రాకుండా చూడాలి. అగ్గిపెట్టె, కిరోసిన్, పెట్రోల్ లాంటి వాటిని అడవిలోకి తీసుకురాకుండా నిషేధించాలి. అడవిలో ఆకులు రాలే చోట ట్రంచులు ఏర్పాటు చేయాలి. చెక్డ్యాంలు నిర్మించి నీరు నిల్వ ఉండేలా చూడాలి. అవసరమైన సమయంలో ఆ నీటిని మంటలార్పేందుకు వాడుకునేలా చర్యలు తీసుకోవాలి. ఎత్తైన వాచ్టవర్లు ఏర్పాటు చేసి వేసవిలో మనుషులు అడవిలోకి రాకుండా గమనించాలి. ఫ నల్లమల, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ బఫర్ జోన్లో చెలరేగుతున్న మంటలు ఫ ప్రతీ వారం ఎక్కడో ఒకచోట తగలబడుతున్న అటవీ ప్రాంతం ఫ అడవిలో జీవాలను మేపడం నిషేధించిన అటవీ శాఖ అధికారులు అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం అటవీ ప్రాంతంలో తరచూ మంటలు లేచే ప్రాంతాలను గుర్తించి ఫైర్ ట్రస్సింగ్ లైన్లు కొట్టించాం. బఫర్ జోన్లో రహదారులకు ఇరువైపులా కంపచెట్లు తొలగించాం. చాలా చోట్ల ఫైర్వాల్స్ కూడా ఏర్పాటు చేశాం. అటవీ శివారు గ్రామాల్లో బేస్ క్యాంప్ హెల్పర్లు 24గంటలు కాపలాగా ఉంటారు. ఈ వేసవిలో జీవాలు అడవిలోకి వెళ్లకుండా నిషేధించాం. శివారు తండాలు, గ్రామాల ప్రజలకు అగ్నిప్రమాదాలు సంభవించకుండా అవగాహన కల్పిస్తున్నాం. – రాఘవేందర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, నాగార్జునసాగర్ -
తాగునీటి సమస్య రావొద్దు
నల్లగొండ : ‘వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య రావొద్దు.. అధికారులు మనసు పెట్టి పనిచేయాలి.. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి’ అని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శనివారం నల్లగొండలోని ఉదయాదిత్య భవన్లో సాగు, తాగునీరు, విద్యుత్పై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో సాగు, తాగునీరు, విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ వేసవిలో తాగు, సాగు నీరు, విద్యుత్ ఇబ్బందులు ఏర్పడకుండా ఫిబ్రవరిలో సమావేశం నిర్వహించుకోవాల్సి ఉన్నా ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైందన్నారు. ఈ మూడు శాఖలకు చెందిన పైస్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఇందులో పోలీస్, రెవెన్యూ అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు. వేసవిలో ఏర్పడే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్ల వద్ద కొంత నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యేల వద్ద కూడా నిధులు అందుబాటులో ఉంచేలా ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను కృష్ణాలో అనుసంధానం చేసే ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. డీఆర్సీ సమావేశాలు నిర్వహించుకునే విషయంలో కూడా అధికారులు దృష్టి సారించాలి. ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై సంబంధిత అదికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లు వీటిపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. కాల్వల నిర్వహణ సరిగా లేదు : గుత్తా శాసనమండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వల నిర్వహణ సరిగా లేదన్నారు. ఏఎమ్మార్పీ కాల్వ లైనింగ్ చేపట్టాలన్నారు. కాల్వల్లో రైతులు పెద్ద మోటార్లు వేసి నీరును లాగడం వల్ల చివరి భూములకు నీరు అందడం లేదన్నారు. విద్యుత్ కనెక్షన్ల మంజూరులో అధికారులు ఆచితూచి వ్యవహరించాలని సూచించారు.ఫ అధికారులు మనసు పెట్టి పనిచేయాలి ఫ సమస్య తలెత్తితే తక్షణమే పరిష్కరించండి ఫ కలెక్టర్ల వద్ద నిధులు ఉంచుతాం ఫ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు లో ఓల్టేజీ సమస్య పరిష్కరించాలి – మంత్రి కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ వేసవిలో తాగునీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పంట చేతికి వచ్చే దశలో ఉన్నాయని.. ఎకరం పొలం కూడా ఎండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినప్పటికీ విద్యుత్ లోడ్ పెరిగి లోవోల్టేజీ సమస్య ఉత్పన్నమవుతోందని.. ఆ సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. కలెక్టర్లు తాగునీటిపై దృష్టి సారించాలని, ప్రతి పంచాయతీకి రూ.15 వేల వరకు అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్డీఎఫ్ నిధుల నుంచి తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, తేజస్ నందులాల్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిలాల్, సీఈ అజయ్కుమార్, ఆర్డబ్ల్యూఎస్ సీఈ వెంకటేశ్వర్లు, నల్లగొండ ఎస్పీ శరత్చంద్రపవార్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. -
అమృత్ మహోత్సవ్లో చేనేత కళాకారులు
‘ఇక్కత్’ను పరిశీలించిన రాష్ట్రపతి భూదాన్పోచంపల్లి: రాష్ట్రపతి భవన్లో అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ నుంచి ఏర్పాటు చేసిన హస్తకళల ఎగ్జిబిషన్ను శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ ఉప ముఖ్యమంతి భట్టి విక్రమార్క సందర్శించారు. పోచంపల్లికి చెందిన రాష్ట్ర ఉత్తమ అవార్డు గ్రహీత ఎన్నం మాధవిశివకుమార్ ఏర్పాటు చేసిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను వారు పరిశీలించారు. కళాత్మకమైన ఇక్కత్ డిజైన్లు, నాణ్యత, పోచంపల్లి ఇక్కత్కు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపును తెలుసుకొని రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారని చేనేత కళాకారిణి ఎన్నం మాధవి శివకుమార్ తెలిపారు. సంస్థాన్ నారాయణపురం: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో శనివారం నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం తరఫున సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన చేనేత కళాకారులు గూడ శ్రీను, ఆయన కుమారుడు పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత ప్రాచీన కళ తేలియారూమాల్ వస్త్రం రూపొందించడాన్ని గూడ శ్రీను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చూపించారు. వారిని రాష్ట్రపతి అభినందించినారు. కార్యక్రమంలో కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిజాసింగ్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సిరిపురం చేనేత వస్త్రాల ప్రదర్శన రామన్నపేట: మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన కళాభారతి హ్యాండ్లూమ్ హ్యాండ్క్రాఫ్ట్ ప్రొడ్యూసర్ కంపెనీకి చెందిన జెల్ల సత్యనారాయణ, జెల్ల శ్రీనాథం పోచంపల్లి పట్టుచీరలు, మెర్స్రైజుడ్ చీరలు, బెడ్షీట్లు, డ్రెస్ మెటీరియల్, చున్నీలను రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్టాల్ను సందర్శించి సత్యనారాయణ, శ్రీనాథంను అభినందించారు. -
కుటుంబ కలహాలతో ఉరేసుకొని ఆత్మహత్య
అడ్డగూడూరు: కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. శనివారం ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కోటమర్తి గ్రామానికి చెందిన నిమ్మల సతీష్(35)కు తొమ్మిదేళ్ల క్రితం తిరుమలగిరి మండలం గూడెపురి గ్రామానికి చెందిన స్వప్నతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. తనకు కుమారుడు పుట్టలేదని సతీష్ తాగి వచ్చి తరచూ భార్య స్వప్నతో గొడవపడుతుండేవాడు. ఈ నెల 5వ తేదీన సైతం స్వప్నతో గొడవపడి కొట్టడంతో ఆమె తన కుమార్తెలను తీసుకుని తల్లిగారింటికి వెళ్లింది. మరుసటి రోజు స్వప్న తల్లి కుమార్తెను తీసుకుని కోటమర్తికి వచ్చి అల్లుడికి నచ్చజెప్పింది. శుక్రవారం రాత్రి సతీష్, స్వప్న, ఇద్దరు పిల్లలు ఒక గదిలో, స్వప్న తల్లి మరో గదిలో నిద్రించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో సతీష్ బెడ్షీట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున స్వప్న తల్లి ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా.. సతీష్ ఉరికి వేలాడుతుండటం గమనించి బిగ్గరగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి అప్పటికే సతీష్ మృతిచెందాడు. మృతుడి భార్య స్వప్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
వేసవి సన్నద్ధతపై నేడు సమీక్ష
సాక్షి,యాదాద్రి : వేసవిలో మంచినీటి ఎద్దడి, విద్యుత్ సమస్య పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్, అదనపు కలెక్టర్లు, విద్యుత్, మిషన్ భగీరథ, ఇరిగేషన్ అధికారులు హాజరుకానున్నారు. పూర్తి సమాచారంతో నివేదికలు సిద్ధం చేసుకుని రావాలని ఆయా శాఖల అధికారులకు ఉన్నతస్థాయి ఆదేశాలు అందాయి. ఇంగ్లిష్ పేపర్–1కు 6,104 మంది హాజరు భువనగిరి : ఇంటర్మీడియట్ పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా కొనసాగాయి. శుక్రవారం జరిగిన ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షకు 6,411 మంది విద్యార్థులకు 6,104 మంది హాజరయ్యారు. 307 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విభా గంలో 4,757 మందికి ,4628 మంది హాజరు కాగా.. 129 మంది గైర్హాజరయ్యారు. ఓకేషనల్ విభాగంలో 1,654 మందికి గాను 1,476 మంది పరీక్ష రాశారు. 178 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. పరీక్ష కేంద్రాలను డీఐఈఓతో పాటు పలువురు అధికారులు తనిఖీ చేశారు. -
సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక వ్యూహం
అడ్డగూడూరు : శాంతిభద్రల పరిరక్షణతో పాటు సైబర్నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక వ్యూహం రూపొందిస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు. శుక్రవారం అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ను ఆయన డీసీపీ రాజేశ్చంద్రతో కలిసి తనిఖీ చేశారు. నూతన భవనం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విజిబుల్ పోలీసింగ్, సైకిల్ పెట్రోలింగ్ ద్వారా ప్రజలకు మరింత చేరువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సైబర్నేరాలు, రోడ్డు సేఫ్టీ, మహిళల భద్రత వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేషన్లో రికార్డులు, కేసుల దర్యాప్తు, పురోగతి, సీసీటీవీల నిర్వహణపై సమీక్షించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు. రూ.1.52 కోట్ల వ్యయంతోప్రత్యేక వసతులతో కూడిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ నిర్మిస్తామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజేశ్చంద్ర, ఏసీపీ మధుసూదన్రెడ్డి, రామన్న పేట సీఐ వెంకటేశ్వర్లు, అడ్డగూడూరు, మోత్కూర్,అత్మకూరు ఎస్ఐలు నాగరాజు, నాగరాజు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.ఫ రాచకొండ సీపీ సుధీర్బాబు ఫ అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ తనిఖీ -
జగన్మోహినిగా వెలిగి.. ఎదుర్కోలుకు కదిలి
శ్రీస్వామి, అమ్మవారిని ఊరేగింపుగా ఎదుర్కోలు మండపానికి తోడ్కొని వెళ్తున్న అర్చకులు, ఆలయ అధికారులు.. చిత్రంలో పట్టువస్త్రాలతో కలెక్టర్ దంపతులు, ఈఓయాదగిరిగుట్ట: యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో ఎదుర్కోలు మహోత్సవం శుక్రవారం రాత్రి వేదపండితుల మంత్రోచ్ఛరణలతో వీనులవిందుగా సాగింది. పట్టువస్త్రాలు, బంగారు ఆభరణలతో అలంకరించిన శ్రీస్వామివారిని అశ్వవాహనంపై, అమ్మవారిని ముత్యాల పల్లకిపై అధిష్టింపజేసి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం తూర్పురాజగోపురం ఎదుట మాడ వీధిలో స్వామి వారిని పశ్చిమ ముఖంగా, అమ్మవారిని తూర్పుముఖంగా అధిష్టింపజేశారు. ఆలయ ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు, అర్చకులు, ఇతర అధికారులు శ్రీస్వామి, అమ్మవారి తరఫున విడిపోయి పెద్దలుగా వ్యవహరించారు. ఇరువురి గుణగణాలు, ఆదాయం, వ్యయం, కట్నకానులకపై వివరించారు. అనంతరం తిరుకల్యాణ మహోత్సవానికి ముహూర్తం నిర్ణయించారు. అంతకుముందు ఉదయం శ్రీలక్ష్మీనరసింహుడు జగన్మోహిని అలంకారంలో ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నేడు తిరుకల్యాణోత్సవం లక్ష్మీసమేత నారసింహుడు శనివారం ఉదయం రామాలంకారంలో హనుమంత సేవపై దర్శనమిస్తారు. రాత్రి 8.30 గంటలకు గజవాహన సేవపై కల్యాణమండపానికి బయలుదేరుతారు. 10 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
మద్యంపై.. మహిళల సమరం
బెల్టు దుకాణాలు బంద్ చేయించిన అతివలు ఎక్కడమ్మా నువ్వు లేనిది.. ఏమిటీ నువ్వు చెయ్యలేనిది. మహిళలు ఏకమైతే సాధించలేనిది ఏమీ లేదు. గ్రామాల్లో మద్యం మహమ్మారికి యువత బానిస కావడం, కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నం కావడంతో ఆ ఊళ్లలో మహిళలు కొంగు నడుముకు చుట్టారు. మద్యం మహమ్మారిని పారదోలాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో నిర్వహించే బెల్ట్ దుకాణాలపై సమరం సాగించారు. మద్యం అమ్మకాలను అడ్డుకుని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు చిట్యాల మండలం ఏపూరు, రాజాపేట మండలం పాముకుంట మహిళలు. – చిట్యాల, రాజాపేటనెలరోజులుగా మద్యం అమ్మడం లేదు మా గ్రామంలో పదిహేనుకు పైగా బెల్ట్ దుకాణాల్లో మద్యం అమ్మేవారు. గ్రామంలోని యువతతో పాటు పెద్దవారు సైతం మద్యానికి బానిసై ఆర్థికంగా.. ఆరోగ్య పరంగా నష్టపోతున్నారు. ఇటీవల మద్యం మత్తులో ఓ యువకుడు మృతిచెందాడు. వెంటనే గ్రామంలో బెల్ట్ దుకాణాలను అరికట్టాలని మహిళలమంతా కలిసి ర్యాలీ నిర్వహించాం. మద్యం అమ్మితే జరిమానా విధించాలని తీర్మాణించాం. నెల రోజులుగా గ్రామంలోని బెల్ట్ దుకాణాలను తొలగించారు. మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. – బొంగు శ్రీలత, మహిళా సంఘం ప్రధానకార్యదర్శి, ఏపూరు ఫ మద్యం అమ్మకాలు జరిపితే జరిమానా విధించాలని నిర్ణయం ఫ ఆదర్శంగా నిలుస్తున్న చిట్యాల మండలం ఏపూరు, రాజాపేట మండలం పాముకుంటచిట్యాల మండలం ఏపూరు గ్రామం జాతీయ రహదారికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో 1950 మందికిపైగా జనాభా ఉంది. ఈ గ్రామానికి చెందిన పురుషులు ఎక్కువగా డ్రైవర్లుగా, కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామంలో పదిహేనుకుపైగా బెల్టుషాపులు ఉన్నాయి. వీటిలో అన్ని రకాల బ్రాండ్లకు చెందిన మద్యం లభిస్తుంది. దీంతో ఆ గ్రామంలోని యువకులతో పాటు చుట్టుపక్కల పరిశ్రమల్లో పనిచేసే వందలాది మంది కార్మికులు సైతం ఇక్కడ విచ్చలవిడిగా మద్యం సేవిస్తుంటారు. ఆ గ్రామానికి చెందిన పలువురు మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలలు పోగొట్టుకున్నారు. మరికొందరు చేసిన పనిచేసిన డబ్బులను మద్యానికి ఖర్చు చేస్తూ కుటుంబాలను పట్టించుకోవటం లేదు. దీంతో ఆ గ్రామ మహిళలంతా ఏకమై మద్యం మహమ్మారిని పారదోలాలని నడుం బిగించారు. మద్యంపై యుద్ధం మొదలైంది ఇలా.. ఏపూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు (20) ఫిబ్రవరి 12న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ యువకుడి మృతికి మద్యం మహమ్మారే కారణమని భావించారు. ఆ యువకుడు మృతి చెందిన రోజే గ్రామంలో మద్యపానం నిషేధానికి నడుం బిగించారు. ఆ గ్రామంలోని మహిళ సంఘం అధ్యక్షురాలు వలిగొండ సునీత, ప్రధానకార్యదర్శి బొంగు శ్రీలత, వీబీకే బండ అనురాధ ఆధ్వర్యంలో మహిళలంతా ఏకమై బెల్ట్ దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద సమావేశమై నిరసన తెలిపారు. గ్రామంలో బెల్ట్ దుకాణాల వద్దకు వెళ్లి మద్యం అమ్మొదని హెచ్చరించారు. గ్రామంలో బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తే రూ.లక్ష, మద్యం తాగిన వారికి రూ.20 వేలు జరిమానా.. మద్యం అమ్మినవారి సమాచారం అందిస్తే రూ.10 వేల ప్రోత్సాహకం అందజేస్తామని తీర్మాణించారు. ఆ రోజు నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. -
వేలంపాటను అడ్డుకొని..
రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామంలో మూకుమ్మడిగా మద్యపాన నిషేధం పాటిస్తున్నారు. గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా బెల్టుషాపులు నడుస్తుండటంతో వృద్ధులు, యువకులు, పేదలు మద్యానికి బానిసై.. సంపాదించిందల్లా మద్యానికి ఖర్చు చేస్తునారు. అంతే కాకుండా గ్రామంలో బెల్టుషాపుల నిర్వాహణ కోసం ఇటీవల వేలం పాట నిర్వహించారు. దీంతో గ్రామంలోని కొంతమంది మహిళలు గ్రామస్తులతో కలిసి గ్రామంలో ఎలాంటి బెల్టుషాపులు నిర్వహించొద్దని, మద్యం విక్రయించచొద్దని మూకుమ్మడి నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. అప్పట్లో సారాపై పోరాటం పాముకుంట గ్రామంలో 2010–11 సమయంలో సారా ఏరులైపారేది. కూలినాలి చేసి వచ్చిన డబ్బంతా తాగుడుకే పోయేది. ఆ సమయంలో కుటుంబ పెద్దలను కోల్పోయి చాలా కుటుంబాలు వీధిన పడ్డాయి. దీంతో గ్రామానికి చెందిన మహిళలు ఏకమై సారా విక్రయ కేంద్రాలపై దాడిచేసి సామగ్రిని గ్రామం నడిబొడ్డున దహనం చేశారు. నా తర్వాత ప్రభుత్వం సారా విక్రయాన్ని నియంత్రించడంతో ఏడాదిపాటు గ్రామంలో సారా, మధ్యం విక్రయాలు జరగలేదు. -
యాదాద్రి భువనగిరి
అక్కడ.. ఇక్కడ కాదు.. ఎక్కడైనా వివక్షే!శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025సమాజంలో సగభాగమైన మహిళలు ఇంటా బయట ఇంకా వివక్షను ఎదుర్కొంటున్నారు. ఆధునిక సమాజంలోనూ పురాతన పోకడలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సాక్షి’ ఉమ్మడి జిల్లాలోని ఏడు ముఖ్య పట్టణాల్లో మహిళల ఇబ్బందులపై నిర్వహించిన సర్వేలో పలు విషయాలు వెలుగుచూశాయి. 18 నుంచి 50 సంవత్సరాల వయస్సున్న 200 మంది మహిళలను సర్వే చేయగా.. ఇప్పటికీ ఇంట్లో ఆడ, మగ వివక్షను ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. –సాక్షి నెట్వర్క్ఫ ఆడ మగ వివక్ష ఇంట్లో కూడా ఉంది ఫ బయట ప్రదేశాలకన్నా ఆఫీస్, కళాశాలల్లోనే ఎక్కువ ఇబ్బంది -
మహిళలు, విద్యార్థినుల భద్రతకు షీటీంలు
మహిళా పోలీస్ స్టేషన్ సీఐ అర్జునయ్య సాక్షి యాదాద్రి : మహిళలు, విద్యార్థినుల భద్రతకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యమిస్తోంది. ఇందుకోసం జిల్లాలో మూడు షీటీంలు ఏర్పాటు చేశాం. సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేయడానికి టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశాం.. అని భువనగిరి మహిళా పోలీసు స్టేషన్ సీఐ అర్జునయ్య తెలిపారు. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తాగుడుకు బానిసలై.. భర్తలు మద్యానికి, ఆన్లైన్ బెట్టింగ్కు బానిసలై భార్యలను వేధింపులకు గురిచేస్తున్న సంఘటనలు పేద, ఽమధ్య తరగతి కుటుంబాల్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అదనపు కట్నం కావాలని కొందరు, బెట్టింగ్లో నష్టపోయి మరికొందరు.. పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు. మాటవినకపోతే వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మహిళలు న్యాయంకోసం పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. అధికంగా గృహహింస కేసులే.. మహిళలు, విద్యార్థినులకు సంబంధించి 2023లో 1,118 ఫిర్యాదులు రాగా 128 కేసులు, 2024లో 999 ఫిర్యాదులు రాగా 111 కేసులు నమోదయ్యాయి. 2025 మార్చి 5వ తేదీ నాటికి 150 ఫిర్యాదులు రాగా 23 కేసులు నమోదు చేశాం. ఇందులో గృహహింసకు సంబంధించినవే అధికంగా ఉన్నాయి. దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. షీటీంలతో నిరంతర నిఘా మహిళలు, విద్యార్థునులకు షీటీంలు అండగా ఉంటున్నాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు తదితర ప్రాంతాల్లో మఫ్టీలో ఉంటూ నిఘా ఉంచుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మూడు షీటీంలు పనిచేస్తున్నాయి. 100 కు డయల్ చేయండి 87126 62762 షీటీం నంబర్ -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
సాక్షి,యాదాద్రి : మహిళలు అన్ని రంగాల్లో రాణించి సాధికారత సాధించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. చదువుతో పాటు ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్వావలంబన తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఒక మహిళ ఉన్నతస్థాయిలో ఉంటే కుటుంబానికి, సమాజానికి ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ మహిళలు సాధికారత సాధించడం వల్ల సమాజం, కుటుంబం అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ నేటి సమాజాంలో మహిళలు విద్య, విజ్ఞానంతో ముందుకెళ్తుండడం అభినందనీయమన్నారు. జేఏసీ చైర్మన్ ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో తమ సహాయ సహకారం ఉంటుందన్నారు. అనంతరం ఆటలపోటీల్లో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే కలెక్టరేట్లో పని చేస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. కార్యక్రమంలో కలక్టరేట్ ఏఓ జగన్మోహన్ప్రసాద్, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఈఓ సత్యనారాయణ, టీజీఓ జనరల్ సెక్రటరీ కవిత, సెక్రటరీ ఖదీర్, నాన్ గెజిటెడ్ ట్రెజరర్ శ్రీకాంత్, శ్రీనివాస్, చైతన్య, జిల్లా కోశాధికారి సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
అసమానతలు అంతరించాలి
మహిళా చైతన్యంలో పత్రికల పాత్ర కీలకంకథనాలు పరిశీలిస్తూ.. సూచనలు చేస్తూ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక పేజీలు, కథనాలను జడ్జి బి.దీప్తి పరిశీలించారు. మహిళలపై ప్రత్యేకంగా రూపొందించిన కథనాలను చూసి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం కోసం మహిళలు పోరాడిన కథనాలను ప్రశంసించారు. పత్రికలు మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేలా.. చైతన్యం కలిగించే కథనాలు అందించాలన్నారు. బాధిత మహిళలకు అండగా ఉండాలని సూచించారు. న్యాయ సహాయం అందిస్తాం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా బాధితులకు న్యాయ సహాయం అందిస్తున్నామని జడ్జి దీప్తి తెలిపారు. అందరికీ సమాన న్యాయం దక్కాలనేది తమ సంస్థ లక్ష్యమన్నారు. న్యాయపరంగా వెనుకబడిన వారికి అండగా న్యాయ సేవాధికార సంస్థ చేయూతనిస్తోందని.. ఇప్పటికే అనేక న్యాయ చైతన్య సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపర్చామన్నారు. ఇరువర్గాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరించి సత్వర న్యాయం అందేలా సహకరిస్తామన్నారు. న్యాయ సహాయం పొందాలనుకునే వారు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాని సూచించారు. నల్లగొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి బి.దీప్తివివక్షను రూపుమాపితేనే అద్భుత సమాజం బాధిత మహిళలకు అండగా ఉండాలి మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్గా విధులు రామగిరి(నల్లగొండ) : సమాజంలో కొన్నిచోట్ల ఇంకా లింగ వివక్ష కనిపిస్తోందని అది రూపుమాపితేనే అద్భుత సమాజం ఆవిష్కృతమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.దీప్తి పేర్కొన్నారు. పత్రికలు మహిళలను చైతన్య పరిచేలా కథనాలను ప్రచురించాలని సూచించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ‘సాక్షి’ యూని ట్ కార్యాలయంలో ఆమె గెస్ట్ ఎడిటర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ ప్రత్యేక కథనాలపై చర్చించి పలు సూచనలు చేశారు. ధైర్యంగా నిలబడాలి మహిళలు సమస్యలకు కుంగిపోకుండా ధైర్యంగా నిలబడాలని జడ్జి దీప్తి సూచించారు. మహిళా సాధికారత జరిగినప్పుడే సమాజంలోని అసమానతలు తొలగిపోతాయన్నారు. మహిళలను తక్కువ చేసి చూడకుండా సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో భాగస్వామ్యం కల్పిస్తే వారి సమస్యలను వారే పరిష్కరించుకోగలగుతారని పేర్కొన్నారు. బాధ్యతల విషయంలో మహిళలను వేరు చేసి చూడొద్దన్నారు. ఉద్యోగం చేసే మహిళలను కొందరు కుటుంబాన్ని, ఉద్యోగాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావని అడుగుతారని.. అదే ప్రశ్న మగవారిని మాత్రం అడగరని ఇది సరి కాదన్నారు. సమాజంలో మహిళలపై వివక్షను రూపుమాపితేనే మహిళలు స్వేచ్ఛాయుత ప్రయాణానికి అడుగులు పడతాయన్నారు. -
ఉత్తమ ఫలితాలకు ఏకాగ్రత అవసరం
రాజాపేట: విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం రాజాపేట మండలం బొందుగుల గ్రామంలోని ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించే ప్రీఫైనల్ పరీక్షలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రిలో డ్రైడే సానిటేషన్ నిర్వహించాలని ఎండీఓకు సూచించారు. రాజాపేట ఆస్పత్రికి వచ్చిన గర్భిణిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్సత్రికి తరలిస్తే అక్కడి సిబ్బంది ప్రవర్తించిన తీరుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
భూదాన్పోచంపల్లిలో త్రిఫ్ట్ సర్వే
భూదాన్పోచంపల్లి: పట్టణ కేంద్రంలో గురువారం చేనేత జౌళిశాఖ అధికారులు నేతన్న పొదుపు పథకం(త్రిఫ్ట్) కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల క్షేత్రస్థాయి సర్వే చేపట్టారు. ఆయా కాలనీల్లో చేనేత కార్మికుల గృహాలకు వెళ్లి మగ్గాలు నేస్తున్నారా.. అనుబంధ కార్మికులు ఏయే పనులు చేస్తున్నారని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా డీఓ మాట్లాడుతూ.. నేతన్న పొదుపు పథకానికి పోచంపల్లిలో మగ్గం నేసే కార్మికులు, అనుబంధ కార్మికులు కలిపి మొత్తం 3180 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. గత రెండు రోజులుగా ఇంటింటా తిరిగి 1480 దరఖాస్తులకు సంబంధించి సర్వే పూర్తి చేశామన్నారు. మరో మూడు రోజుల్లో మిగిలిన లబ్ధిదారుల సర్వే పూర్తి చేయనున్నట్లు చెప్పారు. నిజమైన కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందజేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే క్షేత్ర స్థాయి సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన డీఓ, ఏడీఓలు, సీడీలు పాల్గొన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి భువనగిరిటౌన్ : గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ అవైస్ ఉర్ రెహమాన్ చిస్తి అన్నారు. గురువారం భువనగిరి పట్టణ కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగులు సమయపాలన పాటించాలన్నారు. గ్రామపంచాయతీల నుంచి గ్రంథాలయ సెస్ వసూలు చేయాలని తెలిపారు. గ్రంథాలయాల్లో నూతన సభ్యులను చేర్పించాలని పేర్కొన్నారు. మోత్కూరు, బొమ్మలరామారం శాఖ గ్రంథాలయాలకు నూతన ఫర్నిచర్ కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అన్ని గ్రంథాలయాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. ప్రతి గ్రంథాలయంలో ఆన్ డిమాండ్ రిజిస్టర్ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో గ్రంథపాలకులు, ఉద్యోగులు, పార్ట్ టైం వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి
చౌటుప్పల్: 2035నాటికి చౌటుప్పల్ పట్టణంలో 2లక్షల మంది నివాసం ఉండనున్నారని, అందుకే భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అధికారులకు సూచించారు. మున్సిపాలిటీలో నెలకొన్న వివిధ సమస్యలు, వాటి పరిష్కారంతోపాటు అభివృద్ధిపై గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ప్రభుత్వ స్థలాలను గుర్తించాలన్నారు. పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను ప్రథమ ప్రాధ్యాన్యతగా విస్తరించాలని తెలిపారు. 100, 80, 50ఫీట్ల వెడల్పుతో రోడ్లు ఉండాలని చెప్పారు. చిన్నకొండూర్ రోడ్డు 80, వలిగొండ రోడ్డు, తంగడపల్లి రోడ్డు 100 ఫీట్లుగా ఉండాలన్నారు. సర్వీస్రోడ్లు శాసీ్త్రయంగా నిర్మాణం జరగాలని సూచించారు. ఊర చెరువు అలుగు, వరదనీరు సాఫీగా దిగువకు వెళ్లేందుకు అవసరమైన కాలువ కోసం ప్రణాళికలు రూపొందించాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికార యంత్రాంగం అభివృద్ధి పనుల ప్రణాళికలు రూపొందించాలని, అందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి తీసుకువచ్చే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఈఈ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ నర్సింహారెడ్డి, డీఈ మనోహర, అధికారులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు అరెస్ట్
వేములపల్లి(మాడ్గులపల్లి): వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన అతడి భార్యతో పాటు మరో ఇద్దరిని గురువారం మాడ్గులపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామానికి చెందిన నక్క వెంకన్న, సరిత భార్యాభర్తలు. వీరికి 14 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో మనస్పర్ధలు రావడంతో సరిత భర్త వెంకన్నకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో వెంకన్న పలుమార్లు సరితను కాపురానికి రావాలని అడిగగా ఆమె రాకపోవడమే కాకుండా కుక్కడం గ్రామానికి చెందిన ఊరుబిండు మల్లయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్త వెంకన్నను ఇబ్బందులకు గురిచేశారు. సరిత మేనమామ మన్నెం శ్రీను సైతం ఆమెకు సహకరించడంతో మనస్తాపానికి గురైన వెంకన్న గత నెల 22న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య సరిత, ఊరుబిండు మల్లయ్య, మన్నెం శ్రీను వేధింపుల కారణంగానే తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెంకన్న సూసైడ్ లెటర్ సైతం రాశాడు. మృతుడి తండ్రి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం వెంకన్న భార్య సరితతో పాటు మల్లయ్య, శ్రీనును అరెస్ట్ చేసి మిర్యాలగూడ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు వారికి 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. -
గోవర్ధనగిరిధారిగా లక్ష్మీనారసింహుడు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతున్నాయి. ఆలయంలో గురువారం ఉదయం నిత్య పూజలు చేపట్టారు. అనంతరం అలంకార సేవను ఆలయ తిరు మాడ వీధిలో ఊరేగించారు. అదేవిధంగా ఉదయం శ్రీనృసింహస్వామి వారిని గోవర్ధనగిరిధారి అలంకర సేవలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో ఆచార్యులు, రుత్వికులు, పారాయణీకులు ప్రబంధ పారాయణం, మూలమంత్ర జపములు, నిత్యారాధనలు కొనసాగించారు. రాత్రి సమయంలో శ్రీస్వామి వారు ఉగ్రనారసింహుడిగా సింహ వాహనంపై విహరించారు. వేడుకల్లో ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు, అధికారులు, పారాయణీకులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీస్వామి వారిని జగన్మోహిని అలంకార సేవలో ఊరేగిస్తారు. అదేవిధంగా రాత్రి సమయంలో ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ అర్చకులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ వైభవంగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు ఫ నేడు ఎదుర్కోలు ఉత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న అర్చకులు -
అర్హత లేకున్నా వైద్యం!
దాడులు చేస్తున్నాం ప్రైవేట్ ఆస్పత్రుల్లో అర్హత లేకుండా వైద్యం అందిస్తున్నట్లు గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటున్నాం. తాజాగా యాదగిరిగుట్ట, తుర్కపల్లి వంటి మండలాల్లో దాడులు నిర్వహించి అర్హత లేకున్నా వైద్య సేవలందిస్తున్నట్లు గుర్తించాం. అర్హత, అనుమతి లేకుండా ఆస్పత్రులను నిర్వహిస్తే డీఆర్ఏ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటాం. – మనోహర్, డీఎంహెచ్ఓ భువనగిరి: జిల్లాలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో చాలా వరకు అర్హత లేకున్నా వైద్య సేవలందిస్తున్నాయి. తాజాగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో దాడులు చేసి అర్హత లేని వారిని గుర్తించారు. ఈ నెల 5న యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం మండల పరిధిలో పలు ఆస్పత్రుల్లో దాడులు నిర్వహించి సీజ్ చేశారు. కానీ సీజ్ చేసిన రెండు, మూడు నెలలకే ఆస్పత్రులకు చెందిన యాజమాన్యాలు తిరిగి యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారిపై వైద్యశాఖ అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. జిల్లాలో సుమారు 160 వరకు అనుమతి పొందిన ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ప్రైవేట్ ఆస్పత్రి ఏర్పాటు చేసుకునేందుకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు అర్హులుగా ఉంటారు. వీరి పేరుమీదనే రిజిస్ట్రేషన్ చేసుకుని అనుమతి పొందాలి. వారే వైద్య సేవలందించాలి. థియేటర్ అసిస్టెంట్ కోర్సు చేసిన వారే ఆపరేషన్ థియేటర్లో పనిచేయాలి. అనుమతి పొందిన సంఖ్య మేరకు పడకలను ఏర్పాటు చేసుకోవాలి. ఎంఎల్టీ కోర్సు పూర్తిచేసిన వారినే ల్యాబ్లో నియమించుకోవాలి. అర్హత గల పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కాకుండా మరొకరు వైద్య సేవలందిస్తున్నారు. అర్హత గల పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్ అసిస్టెంట్లను నియమించుకోవడం లేదు. ఏ ఆస్పత్రి ఎదుట సర్వీస్ చార్జీల పట్టికను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. తుర్కపల్లి, మాదాపూర్ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో అర్హత లేని వారు వైద్య చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా బొమ్మలరామారం, మోత్కూర్, తుర్కపల్లి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో లింగ నిర్ధారణ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పలు ఆస్పత్రుల్లో అర్హత లేని వారు సైతం ప్రసవాలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇదే మాదిరిగా జిల్లాలో చాలా వరకు ఇలాంటి పరిస్థితి నెలకొంది. కేవలం దాడులు మాత్రమే కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఫ రిజిస్ట్రేషన్ ఒకరి పేరు మీద.. వైద్యం చేసేది మరొకరు ఫ ఆస్పత్రులను గుర్తించి సీజ్ చేసిన వైద్యశాఖ అధికారులు ఫ మూడు నెలలు తిరగకుండానే తిరిగి యథావిధిగా కొనసాగిస్తున్న యాజమాన్యాలు ఫ శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు -
నష్టాల పాలు
పాడి రైతులు..ఫ బ్రహ్మోత్సవాల్లో అంజలిశుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025సాక్షి, యాదాద్రి: పాడి రైతులకు రెండు నెలలుగా పాల బిల్లులు రాక అరిగోస పడుతున్నారు. మదర్ డెయిరీ, కరీంనగర్ డెయిరీ, విజయ డెయిరీ ఇలా పలు డెయిరీల్లో పాలు పోస్తున్న రైతులకు సకాలంలో బిల్లులు అందడం లేదు. రెండు నెలలుగా మదర్ డెయిరీలోనే సుమారు రూ. 24కోట్ల పాల బిల్లులు నిలిచిపోయాయి. పాలబిల్లులు సకాలంలో రాక రైతులు మదర్డెయిరీని వదిలి విజయ డెయిరీ, ఇతర ప్రైవేట్ డెయిరీలలో పాలు పోస్తున్నారు. గత సంవత్సరం 24 వేల మంది పాడి రైతులు 80 వేల లీటర్ల పాలు పోస్తే, ప్రస్తుతం 22 వేల మంది రైతులు 60 వేల లీటర్ల పాలు పోస్తున్నారు. ప్రస్తుతం మదర్ డెయిరీ సుమారు 80 వేల లీటర్ల పాలు విక్రయిస్తోంది. మదర్ డెయిరీ రైతులకు నాలుగు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. డిసెంబర్ 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఐదు బిల్లులు రైతుల ఖాతాల్లో రూ.20 కోట్లు జమ చేయాల్సి ఉంది. బిల్లులు రాక పెరుగుతున్న అప్పులు పాడి పశువులకు ఇచ్చే పల్లీచెక్క, మక్కపిండి, పత్తిచెక్క, తవుడు, కాల్షియం, నాణ్యమైన గడ్డి ధరలు, పెంపకం, వైద్యం, కూలీల ఖర్చులు పెరిగాయి. దీంతో అప్పు చేసి తెచ్చిన పాడి పశువులను రైతులు కోతకు విక్రయిస్తున్నారు. మదర్డెయిరీ క్రమం తప్పకుండా బిల్లులు ఇస్తే పెట్టుబడులు పోను గిట్టుబాటు అయ్యేదని రైతులు పేర్కొంటున్నారు. కొన్ని పాల సంఘాలు మాత్రం తమ రైతులకు ఒకటి, రెండు నెలల బిల్లులు సొసైటీల వాటాధనం నుంచి చెల్లిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ విజయ డెయిరీకి సంబంధించి రెండు నెలలుగా నాలుగు బిల్లులు సుమారు రూ.3.20కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ప్రతిరోజు సుమారు 15 వేల లీటర్ల పాలను 1800 మంది రైతులు పోస్తున్నారు. లీటరు పాలపై ఇచ్చే రూ.4 ప్రోత్సాహకం మదర్, విజయ డెయిరీల్లో రావడం లేదు. ఫ మదర్ డెయిరీలో రెండు నెలలుగా నిలిచిపోయిన సుమారు రూ.24కోట్ల పాల బిల్లులు ఫ విజయ డెయిరీ, ఇతర ప్రైవేట్ డెయిరీలను ఆశ్రయిస్తున్న రైతులు మదర్ డెయిరీలో పాలశీతలీకరణ కేంద్రాలు 24 పాల సొసైటీలు 435 పాలు పోసే రైతుల సంఖ్య సుమారు 22వేలు రోజువారీగా వస్తున్న పాలు 60వేల లీటర్లు మదర్ డెయిరీ విక్రయిస్తున్న పాలు 80వేల లీటర్లు ప్రైవేట్గా డెయిరీ కొనుగోలు చేస్తున్న పాలు 20వేల లీటర్లు మదర్డెయిరీకి సంబంధించి పాల ఉత్పత్తి దారులు, పోస్తున్న పాలు సంవత్సరం పాలఉత్పత్తి పోస్తున్న దారుల సంఖ్య పాలు (లీటర్లలో) 2020 32,000 1,00,000 2021 30,000 56,000 2022 27,500 55,000 2023 25,500 57,000 2024 24,000 80,000 2025 22,000 60,000 -
నేడు ఎస్ఆర్టీఆర్ఐలో జాబ్మేళా
భూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లి మండలం జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ(ఎస్ఆర్టీఆర్ఐ)లో శుక్రవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీ్త్రలకు రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల, కొంగరకలాన్లోని ప్రముఖ మొబైల్ కంపెనీలలో, పురుషులకు ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ప్రముఖ ఏసీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. పదో తరగతి, ఆపై చదివిన వారు అర్హులని అన్నారు. ఎంపికై న సీ్త్ర, పురుషులకు రూ.14,500 నుంచి రూ.16,500 జీతం, ఉచిత బస్సు, భోజన సదుపాయం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని, ఆసక్తి కల్గిన వారు విద్యార్హతల సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. వివరాలకు 994846111, 7540084221ను సంప్రదించాలని సూచించారు. -
అమ్మ భాష తప్పనిసరి
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మాతృభాష సబ్జెక్టు (తెలుగు) తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.- 8లోపెట్టుబడి పెట్టలేక పాడి పశువులను అమ్ముకున్నా గత రెండు నెలలుగా పాల బిల్లులు చెల్లించడం లేదు. దీంతో పశువులకు దాణా, పశుగ్రాసం అప్పులు చేసి కొనాల్సి వస్తుంది. పెట్టుబడి పెట్టలేక ఇప్పటికే నాకు ఉన్న నాలుగు పశువుల్లో రెండు పశువులను విక్రయించాను. పాడి రైతులకు బిల్లులు చెల్లించే విషయంలో ఆలస్యం చేయడం సరైనది కాదు. పాలకవర్గం స్పందించి ప్రతి 15 రోజులకు ఒకసారి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. – కాకల్ల ఉప్పలయ్య, పాడి రైతు, రాజాపేట నష్టాలతో సర్దుబాటు కావడంలేదు తీవ్రమైన ఆర్థిక నష్టాలతో రైతులకు పాల బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. డిసెంబర్ నెల రెండో బిల్లు నుంచి రూ.20 కోట్ల పాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. బ్యాంకు వడ్డీలు, ఉద్యోగుల జీతాలు, మెయింటెనెన్స్ భారంగా మారింది. ప్రతినెలా వస్తున్న నష్టాలను తగ్గించే చర్యలు ప్రారంభించాం. వీలైనంత త్వరగా రైతులకు పెండింగ్లో ఉన్న పాల బిల్లులు చెల్లిస్తాం. డెయిరీ ఉద్యోగులకు కూడా జనవరి నెల సగం జీతమే ఇచ్చాం. – గుడిపాటి మధుసూదన్న్రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ -
క్రీడాశిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు
భువనగిరి: జిల్లాలో 2025 సంవత్సరానికిగాను వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 1వ తేదీ నుంచి 31 వరకు 12 నుంచి 14 సంవత్సరాల గల బాలబాలికలకు వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు సీనియర్ క్రీడాకారులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. సీనియర్ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు వారి ప్రగతికి సంబంధించి ధ్రువపత్రాలు జత చేయాలని తెలిపారు. ఏదైనా ఒక క్రీడలో మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు దరఖాస్తులను జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈ నెల 17వ తేదీలోపు సమర్పించాలని, వివరాలకు 83099 92451 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
10న అప్రెంటిస్షిప్ మేళా
నల్లగొండ: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ఉత్తీర్ణులైన అన్ని ట్రేడ్ల అభ్యర్థులకు ఈ నెల 10న నల్లగొండలోని ప్రభుత్వ ఐటీఐ (పాత) కళాశాలలో అప్రెంటిస్షిప్ చేసేందుకు ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎ.నర్సింహాచారి తెలిపారు. అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు. కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థలో ఉద్యోగాల భర్తీకి సంస్థ చైర్మన్ ఎం.నాగరాజు గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఖాళీగా ఉన్న టైపిస్ట్/అసిస్టెంట్(2) పోస్టులకు మార్చి 7 నుంచి 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. -
యాదగిరిగుట్ట క్షేత్రంలో యూపీ సీఎం సురక్ష టీం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం సురక్ష టీంకు చెందిన పోలీసు బృందం గురువారం సందర్శించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటీఏ)లో శిక్షణ తీసుకుంటున్న యూపీ సురక్ష టీంకు చెందిన 51 మంది పోలీసు బృందం.. ఆలయాల్లో భద్రత, సీఎంతో పాటు ప్రముఖులు ఆలయాలను సందర్శించిన సమయాల్లో ఎలా వ్యవహరించాలనే అంశాలపై శిక్షణలో భాగంగా యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చి పరిశీలించారు. ప్రముఖులు వచ్చిన సమయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనాలకు ఎలా పంపించాలి, ఆలయ పరిసరాల్లో ప్రముఖులు పర్యటిస్తున్న సందర్భంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, బందోబస్తు విషయంలో ఏవిధమైన చర్యలు తీసుకోవాలనే అంశాలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం సురక్ష టీంకు వివరించినట్లు సీనియర్ ఆర్ఎస్ఐ శివలాల్ తెలిపారు. వీరి వెంట అధికారులు సాయికుమార్, గణేష్, శంకర్రెడ్డి ఉన్నారు. -
రూ.2వేల కోట్లకు చేరువలో రుణాల పంపిణీ
నల్లగొండ టౌన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రుణాల పంపిణీ రూ.2వేల కోట్లకు చేరుకుందని బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీసీసీబీలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.580కోట్ల బంగారు రుణాలు, రూ.571 కోట్ల పంట రుణాలు, రూ.405 కోట్ల మార్టిగేజ్ రుణాలు, రూ.379 కోట్ల దీర్ఘకాలిక రుణాలు అందించినట్లు తెలిపారు. బ్యాంకు వ్యాపారం రూ.3వేల కోట్లకు చేరువలో ఉండగా, రూ.50 కోట్ల లాభాల దిశలో డీసీసీబీ పయనిస్తుందన్నారు. రైతుల ప్రయోజనాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలను సులభతరం చేశామని, పౌల్ట్రీ రుణాల చెల్లింపు కాల పరిమితిని పెంచామన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద అదనపు రుణాలను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో సీఈఓ శంకర్రావు, డైరెక్టర్లు లింగం యాదవ్, పాశం సంపత్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సైదయ్య, కోడి సుష్మ తదితరులు పాలొగన్నారు. ఫ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి -
విశ్వ ఉనికి రహస్యం భౌతికమే
ఫ ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కవి కిషోర్ నల్లగొండ టూటౌన్: విశ్వ ఉనికి రహస్యం భౌతికమే అని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కవి కిషోర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సైన్స్ విభాగం ప్రిన్సిపాల్ ప్రేమ్సాగర్ అధ్యక్షతన నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవం కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థి వైజ్ఞానిక దృష్టిని అలవర్చుకొని జీవన విధానములో అన్వయించుకోవాలన్నారు. సమాజంలో ఎదురయ్యే అనేక సవాళ్లకు సైన్స్ ద్వారా పరిష్కార మార్గాలను కనుగొనాలన్నారు. విశ్వ రహస్యాలను శాస్త్రవేత్తలు ఇప్పటికీ కేవలం 30 శాతం మాత్రమే విశ్లేషించగలిగారని అన్నారు. మానవుల్లో కొంత శాతం మేర జంతువుల జన్యులతో పోలిన జన్యువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని వివరించారు. మానవ స్వభావాలు అనేకం జన్యు ప్రేరేపితంగా ఉన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్రెడ్డి, అన్నపూర్ణ, దోమల రమేష్, కళ్యాణి, రూప, రామచందర్గౌడ్, జ్యోతి, శివరాం పాల్గొన్నారు. -
నిందితుడికి 31 ఏళ్లు జైలు శిక్ష
ఫ బాలికపై అత్యాచారం కేసులో తీర్పు వెలువరించిన సూర్యాపేట జిల్లా కోర్టు చివ్వెంల(సూర్యాపేట): బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 31 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.30వేల జరిమానా విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి ఎం. శ్యామ్శ్రీ గురువారం తీర్పు వెలువరించారు. ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త చనిపోవడంతో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడిని పోషించుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన గుంజ వెంకన్న అప్పుడప్పుడు సదరు మహిళ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆమె చిన్న కుమార్తైపె అతడి కన్నుపడింది. బాలికపై పలుమార్లు వెంకన్న అత్యాచారానికి పాల్పడ్డాడు. 2021 మార్చి 31న బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి ఆమెకు గర్భస్రావ మాత్రలు ఇచ్చాడు. అదే రోజు మళ్లీ అత్యాచారం చేశాడు. బాలికకు కడుపునొప్పి రావడంతో హాస్పిటల్కు తీకెళ్తుండగా మార్గమధ్యలో కడుపునొప్పి ఎక్కువై కడుపులోంచి పిండం బయటపడింది. బాలికను తల్లి నిలదీయగా.. గుంజ వెంకన్న తనపై అత్యాచారం చేస్తున్నాడని విషయం చెప్పింది. బాలికకు చికిత్స చేయించిన అనంతరం 2021 ఏప్రిల్ 2న ఆమె తల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటి డీఎస్పీ మోహన్కుమార్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాకి రాంరెడ్డి వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడికి 31 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.30 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అదేవిధంగా బాలికకు రూ.5లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్కు లైజన్ ఆఫీసర్ గంపల శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సహకరించారు. -
రాష్ట్రపతి భవన్లో చండూరు చేనేత వస్త్రాల ప్రదర్శన
చండూరు: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో చండూరుకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత గంజి యాదగిరి, జాతీయ మెరిట్ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. బుధవారం రాత్రి తాము తయారుచేసిన చేనేత వస్త్రాలను ప్రదర్శించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు వివరించారు. అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి తెలంగాణ నుంచి ఎంపికై న 20 మందిలో తాము ఉండడం, రాష్ట్రపతి భవనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉందని గంజి యాదగిరి, చిలుకూరి శ్రీనివాసులు పేర్కొన్నారు. -
నృసింహుడి సన్నిధిలో సాంస్కృతిక వైభవం
యాదగిరిగుట్ట, భూదాన్పోచంపల్లి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు సరికొత్త వైభవాన్ని సంతరించుకున్నాయి. గురువారం ఉదయం భూదాన్పోచంపల్లికి చెందిన శ్రీపుండరీక భక్త సేవా సమాజం, యాదగిరిగుట్టకు చెందిన శ్రీభాగ్యలక్ష్మీ మహిళ భజన మండలిచే భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆస్థాన మంగళ వాయిద్యం, ఆస్థాన వైధిక ప్రార్థన చేపట్టారు. ఆ తర్వాత హైదరాబాద్కు చెందిన ఏకే శ్రీనివాసాచార్యులు భగవత్ భక్తులు, వారిని భగవానుడు రక్షించిన విధానంపై ఉపన్యాసం చేశారు. ఏపీలోని తాడేపల్లిగూడేనికి చెందిన ముదపాక బాలసుందరం భగవతార్చే విరాటపర్వం అనే హరికథా గానం చేశారు. మధ్యాహ్నాం హైదరాబాద్లోని స్మరణ డ్యాన్స్ అకాడమీ బృందంచే నిర్వహించిన భరతనాట్యం ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. హైదరాబాద్కు చెందిన మహతి ఆర్ట్స్, వింజమూరి లక్ష్మీ బృందం, దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఫైన్ ఆర్ట్స్ బృందంచే భక్తి సంగీతం నిర్వహించారు. సాయంత్రం సుముఖి నృత్యాలయం వరలక్ష్మీ బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన కొనసాగింది. తిరుమల తిరుపతి ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో సాయంత్రం అన్నమాచార్య సంకీర్తన విభావరి నిర్వహించారు. -
అగ్నివీర్ ఇండియన్ నేవీ ఉద్యోగాలకు ఎంపిక
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామయ్య డిఫెన్స్ అకాడమీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అగ్నివీర్ ఇండియన్ నేవీ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అకాడమీలో మొదటి సంవత్సరం డిఫెన్స్ కోర్సు చదువుతున్న మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఎన్. అభిషేక్, సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రానికి చెందిన కె. ప్రదీప్ జూలై నెలలో నిర్వహించిన ఇండియన్ నేవీ అగ్నివీర్ సీనియర్ సెకండరీ జాతీయస్థాయి పరీక్షలో ప్రతిభ చాటి ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగం సాధించిన విద్యార్థులను అకాడమీ డైరెక్టర్ రామయ్య, శ్రీనివాస్, అధ్యాపకులు నగేష్, బొమ్ము శంకర్ అభినందించారు. పాడి ఆవులు విక్రయిస్తామని టోకరాఫ వాట్సాప్లో ఆవుల ఫొటోలు పెట్టి రూ.85,500 కొట్టేసిన దుండగుడు భువనగిరి: వాట్సాప్లో ఫొటో పెట్టిన ఆవులను కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి రూ.85వేలు పంపి మోసపోయాడు. ఈ ఘటన భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్కు ఈ నెల 5వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి పాడి ఆవుల ఫొటోలు పెట్టి వాటిని అమ్ముతామని చెప్పాడు. వాట్సాప్లో పెట్టిన ఆవులలో మూడు మాత్రమే ఎంపిక చేసుకుని ఫోన్పే ద్వారా రూ.1,05,000 పంపాలని సూచించాడు. గుర్తుతెలియని వ్యక్తి చెప్పిన మాటలు నమ్మిన ముత్తిరెడ్డిగూడెం వాసి మూడు ఆవులను ఎంపిక చేసుకుని ఫోన్ పే ద్వారా రూ.85,500 పంపాడు. డబ్బులు పూర్తిగా పంపితేనే ఆవులను పంపిస్తామని చెప్పడంతో తాను మోసపోయినట్లు గ్రహించి 1930 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. గుర్తుతెలియని వ్యక్తులు గేదెలు, ఆవులను అమ్ముతామని ఫోన్ చేస్తే నమ్మవద్దని ఎస్ఐ సంతోష్కుమార్ సూచించారు. ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్పై విచారణ వేగవంతం ఫ నిందితులను పట్టుకునేందుకు మధ్యప్రదేశ్కు వెళ్లిన నకిరేకల్ పోలీసులు నకిరేకల్: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరించిన కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఎమ్మెల్యేకు వచ్చిన ఫోన్ నంబర్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి విమానంలో నకిరేకల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ లచ్చిరెడ్డి తమ సిబ్బందితో కలిసి మధ్యప్రదేశ్కు పయనయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కారు ఢీకొని యువకుడు మృతిబీబీనగర్: బైక్పై వెళ్తున్న యువకుడిని ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి బీబీనగర్ మండలం నాగిరెడ్డిపల్లికి వెళ్లే దారిలో జరిగింది. సీఐ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన పెరుమాండ్ల సూర్యప్రసాద్(24) బుధవారం అర్ధరాత్రి 12గంటల సమయంలో బీబీనగర్ నుంచి బైక్పై బ్రహ్మణపల్లికి వెళ్తుండగా.. నాగిరెడ్డిపల్లికి వెళ్లే దారిలో హిందుస్థాన్ శానిటరీ వేర్ పరిశ్రమ గోడౌన్ సమీపంలో ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సూర్యప్రసాద్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి సోదరుడు భానుచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
నల్లగొండ, నల్లగొండ టౌన్: నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం కిడ్నాపైన మూడేళ్ల బాలుడి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. నకిరేకల్లో కిడ్నాపర్ని పట్టుకొని అతడి చెర నుంచి బాలుడిని విడిపించి గురువారం తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని లైన్వాడకు చెందిన షమీమున్సీసా, హైమద్ దంపతులకు ఇద్దరు సంతానం. వీరు గత మూడేళ్లుగా నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో వాటర్ ట్యాంక్ కింద నివాసముంటూ అక్కడే ఏర్పాటు చేసిన రూ.5 భోజనం తింటూ జీవనం సాగిస్తున్నారు. నార్కట్పల్లి మండల కేంద్రానికి చెందిన సీతారాములు చెల్లెలికి ముగ్గురు కుమార్తెలు కాగా.. మగ పిల్లలు లేరని ఆమె బాధపడుతుండడంతో చూడలేక సీతారాములు వారం క్రితం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి అక్కడ ఏ ఆధారం లేకుండా జీవనం సాగిస్తున్న హైమద్ కుటుంబాన్ని చూశాడు. వారితో పరిచయం పెంచుకొని వారి కుమారుడిని మంగళవారం రాత్రి కిడ్నాప్ చేసి నకరేకల్లో ఉంటున్న తన చెల్లెలికి అప్పగించాడు. తమ కుమారుడు కనిపించకపోవడంతో హైమద్ దంపతులు నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీసు బృందాలు రెండు రోజులుగా గాలించి సీతారాములు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడు నకరేకల్లో ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నారు. గురువారం అతడిని అరెస్ట్ చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.ఫ రెండు రోజుల క్రితం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాపైన బాలుడు ఫ మూడు ప్రత్యేక పోలీస్ బృందాలతో గాలింపు ఫ నకిరేకల్లో కిడ్నాపర్ని పట్టుకుని బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు -
ఉరేసుకుని యువకుడి బలవన్మరణం
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ పిల్లి లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం వాడపల్లి గ్రామానికి చెందిన గంధం అరుణ్కుమార్(26) దామరచర్ల మండల కేంద్రంలోని నాగకృష్ణ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. ఈ నెల 1వ తేదీన పెట్రోల్ బంక్కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. ఆ రోజు బంక్లో డబుల్ డ్యూటీ చేసిన అరుణ్కుమార్ ఆ తర్వాత కనిపించకుండాపోయాడు. రెండు రోజుల పాటు డ్యూటీకి రాకపోవడంతో బంక్ నిర్వాహకులు అరుణ్కుమార్ ఇంటికి వెళ్లి ఆరా తీశారు. అంతేకాకుండా పెట్రోల్ బంక్లో డబ్బుల లెక్కల్లో తేడా రావడంతో వాడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద యువకుడు ఉరేసుకుని మృతిచెందినట్లు గురువారం ఉదయం పోలీసులు వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు షేర్ చేయడంతో.. ఆ మృతదేహం అరుణ్కుమార్దిగా గుర్తించిన అతడి స్నేహితులు వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడి సెల్ఫోన్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు గంధం వెంకయ్య ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునప్నట్లు ఎస్ఐ తెలిపాడు. అరుణ్కుమార్ ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి ఆర్థిక ఇబ్బందులు అధికమవ్వడంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహంతో ఆందోళన.. అరుణ్కుమార్ ఆత్మహత్యకు పెట్రోల్ బంక్ యాజమానే కారణమంటూ అతడి కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో గురువారం దామరచర్ల మండల కేంద్రంలోని నాగకృష్ణ ెపెట్రోల్ బంక్ వద్ద అద్దంకి–నార్కట్పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. బంక్ యాజమాని తమ కుమారుడిని ఇబ్బందులకు గురిచేయడం వలనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న వాడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆదోళనను విరమింపజేశారు. -
అమ్మ భాష తప్పనిసరి
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం విద్యార్థులు మాతృభాషపై పట్టు కోల్పోతున్నారు. కొంత మంది విద్యార్థులు తెలుగు వ్యాక్యాలు రాయలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో మాతృ భాష అయిన తెలుగును కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. – రాజు, తెలుగు ఉపాధ్యాయుడు, తిరుమలగిరి తిరుమలగిరి (తుంగతుర్తి): అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మాతృభాష (తెలుగు) సబ్జెక్టు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో సీబీఎస్ఈతో పాటు ఇతర సిలబస్ను అమలు చేస్తూ మాతృభాషను పక్కన పెడుతున్నారు. దీంతో విద్యార్థులు మాతృభాషపై పట్టు కోల్పోవడమే కాదు కనీసం చదవడం కూడా రావడం లేదని గ్రహించిన ఎన్సీఈఆర్టీ తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా బోధించేలా చేయాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది. అధిక మార్కుల కోసం..ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మినహా చాలా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును బోధించడం లేదు. సీబీఎస్ఈ, ఐబీహెచ్ఈ తదితర సిలబస్ను అమలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలు భాష ఎంపిక స్థానంలో విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలా సంస్కృతం, అరబిక్ బోధిస్తున్నారు. దీంతో తెలుగులో భావ వ్యక్తీకరణ, సృజనాత్మకతను కోల్పోతున్నట్లు భాషాభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ముందు తొమ్మిదవ తరగతికి.. ఇప్పటి వరకు ఉన్నత తరగతులకు తెలుగు పాఠ్యాంశాలు అమలు చేయని పాఠశాలలకు తప్పనిసరిగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతికి, 2026–27 నుంచి 10వ తరగతికి అమలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు బోధించాల్సిందే.. ఎన్సీఈఆర్టీ ఆదేశాలతో ప్రభుత్వ నిర్ణయం -
పరీక్షలు సరిగా రాయలేకపోతున్నానని..
కోదాడ రూరల్: పరీక్షలు సరిగా రాయలేకపోతున్నాననే మనస్తాపంతో ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండకు చెందిన బచ్చలకూర శంకర్ కుమార్తె నవ్య పెన్పహాడ్ మండలం అనాజిపురంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న నవ్య.. ఇంటి వద్ద నుంచే బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ మొదటి పరీక్షకు హాజరై తిరిగి వచ్చింది. జ్వరంతో పరీక్షలు సరిగ్గా రాయలేకపోతున్నాని మనస్తాపం చెందిన నవ్య గురువారం ఇంట్లో చీరతో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి చూసేసరికి మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్రెడ్డి తెలిపారు. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య -
ఉండ్రుగొండ గుట్టల్లో చెలరేగిన మంటలు
ఫ భయాందోళనలో స్థానిక గ్రామాల ప్రజలు చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం ఉండ్రుగొండ శివారులోని గుట్టల్లో గురువారం మంటలు చెలరేగాయి. దీంతో గుట్టలకు సమీపంలో ఉన్న ఉండ్రుగొండ, దురాజ్పల్లి, వల్లభాపురం, మహ్మదాపురం, ఇమాంపేట తదితర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు ప్రమాదం జరిగిన స్థలం పక్కనే హెచ్పీ పెట్రోల్ బంక్ ఉండటంతో బిక్కుబిక్కుమంటున్నారు. స్థానిక గ్రామాల ప్రజలు అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి వెళ్లిన ఫైర్ సిబ్బంది మంటలు తీవ్రంగా ఉండడంతో రాత్రివేళ చేసేదేమీ లేక వెనుదిరిగి వచ్చారు. ఈ విషయమై ఫారెస్ట్ రేంజ్ అధికారి కిరణ్కుమార్ను వివరణ కోరగా.. పశువుల కాపరులు చుట్ట లేదా బీడీలు తాగి పడేయడంతో ఎండిన ఆకులకు నిప్పు అంటుకొని మంటలు చెలరేగి ఉండవచ్చని పేర్కొన్నారు. అగ్నిమాక సిబ్బంది మంటలు వచ్చే ప్రదేశానికి వెళ్లేందుకు వీలుకావడం లేదన్నారు. -
ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యారోగ్యశాఖ తనిఖీలు
యాదగిరిగుట్ట: తుర్కపల్లి మండలం, యాదగిరిగుట్ట పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో బుధవారం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తుర్కపల్లి మండల కేంద్రంలోని ఆర్కే ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేకపోవడం, ఆపరేషన్ థియేటర్ అపరిశుభ్రంగా ఉండడం, సిజేరియన్లు అధికంగా జరగడాన్ని అధికారులు గుర్తించారు. అదే విధంగా తుర్కపల్లిలోని నక్షత్ర ఆస్పత్రి, మాదాపూర్లోని శివసాయి, సాయిజ్యోతి క్లినిక్లో ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ –2010 ప్రకారం నమోదు చేసుకున్న వైద్యులు కాకుండా ఎంబీబీఎస్ డాక్టర్లు సేవలందిస్తున్నట్లు గుర్తించారు. దీంతో పాటు యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీసాయి ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఎంబీబీఎస్ వైద్యుడికి బదులుగా అర్హతలేని వ్యక్తి సేవలు అందజేస్తున్నట్లు గుర్తించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ తెలిపారు.ఐదు ఆస్పత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు, ల్యాబ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్ల (అల్లోపతి, ఆయూష్) నిర్వాహకులకు ఈనెల 11వ తేదీన బ్లిష్మెంట్ యాక్ట్– 2010 పై అవగాహన కల్పించనున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. -
మహిళా చట్టాలపై అవగాహన అవసరం
భువనగిరి : మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉంటే అవే వారిని కాపాడుతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి, జడ్జి మాధవిలత పేర్కొన్నారు. బుధవారం భువనగిరిలోని మాస్ నర్సింగ్ స్కూల్లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. చట్ట పరమైన హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండటంతో పాటు అన్ని రంగాల్లో మహిళలు రాణించి సాధికారత సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ స్కూల్ డైరెక్టర్ మాధవరెడ్డి, అధ్యాపకులు స్వాతి తదితరులు పాల్గొన్నారు. హెడ్ కానిస్టేబుల్కు రివార్డు సాక్షి, యాదాద్రి : ఆలిండియా పోలీస్డ్యూటీ మీట్–2025లో గోల్డ్ మెడల్ సాధించిన ఆలేరు పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ యాదగిరిని బుధవారం రాచకొండ సీపీ సుధీర్బాబు రివార్డుతో సత్కరించారు. జార్ఖండ్లోని రాంచీలో ఫిబ్రవరి 10నుంచి 16వ తేదీ వరకు జరిగిన ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్లో సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్విస్టిగేషన్ విభాగంలో యాదగిరి ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించారు. కమిషనరేట్కు ఎక్కువ మెడల్స్ వచ్చేవిధంగా ప్రతిభావంతులకు శిక్షణ ఇవ్వాలని యాదగిరికి సీపీ సూచించారు. ప్రజాచైతన్య యాత్రలను విజయవంతం చేయండి రామన్నపేట: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం రామన్నపేట మండలంలో ఈ నెల 23నుంచి 28వ తేదీ వరకు ప్రజాచైతన్య యాత్ర చేపట్టనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ తెలిపారు. రామన్నపేటలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రామన్నపేట మండలంలోని 24 గ్రామాల్లో ఆరు రోజు పాటు135 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసి సమస్యలపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. రామన్నపేట శాసనసభ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని, ఆస్పత్రిని వండ పడకలకు పెంచాలని, అంబుజా సిమెంట్ పరిశ్రమను రద్దు చేయాలని, ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాల్వ లను ఆధునీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పైల్ల అశయ్య, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మేక అశోక్రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్, బల్లూరి అంజయ్య, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
తొలిరోజు 6,289 మంది హాజరు
భువనగిరి : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతమైన వాతావరణలో ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం తెలుగు, ఊర్దూ, హిందీ, సంస్కృతం పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,613 మంది విద్యార్థులకు గాను 6,289 మంది హాజరయ్యారు. 324 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ తెలిపారు. కాగా ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష జరిగింది. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. నిర్దేశిత సమయానికి అరగంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి ఐదు నిమిషాలు అలస్యంగా వచ్చినా కేంద్రంలోకి అనుమతిచ్చారు. దీంతో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఊరట కలిగింది. పలు పరీక్ష కేంద్రాలను డీఐఈఓ తనిఖీ చేశారు.ఫ ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
సాక్షి,యాదాద్రి : మహిళలు అన్ని రంగాల్లో రాణించి తమ కాళ్లపై తాము నిలబడే ప్రయత్నం చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్ ఆవరణలో మహిళా ఉద్యోగులకు ఆటలపోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. మహిళలు తలచుకుంటే ఏదైనా అవలీలగా సాధించగలరని పేర్కొన్నారు. క్రీడల వల్ల మానసికోల్లాసం, శారీరక ధృడత్వం చేకూరుతుందన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ మహిళలు ఉద్యోగులు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తుండాలని, దీనివల్ల మానసిక ఒత్తిడి తొలగిపోయి విధులపై ఏకాగ్రత ఉంటుందన్నారు. ఈనెల 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు క్రీడా పోటీలు ఉంటాయని జిల్లా యువజన, క్రీడల శాఖ జిల్లా అధికారి ధనంజనేయులు తెలిపారు. టెన్నికాయిట్, షటిల్, చెస్, క్యారమ్స్, స్కిప్పింగ్, లెమన్ అండ్ స్పూన్, స్పీడ్ వాక్, రన్నింగ్, మ్యూజికల్ బాల్, గ్లాస్ పిరమిడ్ , సింగింగ్ –మ్యూజికల్ చైర్ పోటీలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ప సీఈఓ శోభారాణి, యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ భాస్కర్రావు, జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ ఉపేందర్రెడ్డి, రాష్ట్ర గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్, సెక్రటరీ దశరథరెడ్డి,తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
134 మంది కార్యదర్శులకు మెమోలు
నల్లగొండ: పంచాయతీ కార్యదర్శులకు సర్వీస్ బ్రేక్ తప్పేలా కనిపించడం లేదు. నల్లగొండ జిల్లాలో పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆ శాఖ జిల్లా అధికారి అనుమతి లేకుండా సెలవుపై వెళ్లడంతో 134 మందికి చార్జి మెమోలు అందజేశారు. గతంలోనూ 109 మందికి నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా నెలల తరబడి చార్జి మెమోలు అందుకున్న వారు ఎలాంటి అనుమతి లేకుండా సెలవుపై వెళ్లారు. వారంతా వివిధ రకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వెళ్లారు. తిరిగి విదుల్లో జాయిన్ అయ్యేందుకు రాగా 109 మంది కార్యదర్శుల సెలవుల సర్వీస్ కాలాన్ని కట్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి గతంలో పనిచేసిన ప్రాంతాల నుంచి బదిలీ చేశారు. దీంతో కార్యదర్శులంతా కలెక్టర్ను కలిసి మొరపెట్టుకున్నారు. వీరిని వాస్తవంగా సస్పెండ్ చేయాలి కానీ, మానవతా దృక్పథంతో సెలవు కాలానికి సంబంధించిన సర్వీస్ను రద్దు చేసి వేతనాన్ని కట్ చేసేలా ఉత్తర్వులు జారీ చేసి విధుల్లోకి తీసుకున్నారు. తాజాగా చార్జి మెమోలు అందుకున్న వారిని త్వరలో విచారించేదుకు అధికారిని నియమించునున్నట్టు తెలిసింది. -
పిల్లలతో కలిసి మహిళ అదృశ్యం
కనగల్: వైవాహిక జీవితంలో గొడవల కారణంగా మనస్తాపం చెంది తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైన మహిళ ఆచూకీని అర్ధగంటలో కనగల్ పోలీసులు కనిపెట్టారు. నల్లగొండ మండలం జి. చెన్నారం గ్రామానికి చెందిన కాలం నాగజ్యోతి వైవాహిక జీవితంలో గొడవల కారణంగా జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. జ్యోతి భర్త, తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం సాయంత్రం కనగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ విష్ణుమూర్తి పోలీసులను రెండు టీంలుగా విభజించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో నాగజ్యోతి అన్న మొబైల్కు కొత్త నంబర్ నుంచి నాగజ్యోతి ఫోన్ చేసి శ్రీనేను చనిపోతున్నాను. నా గురించి ఎవరూ వెతకొద్దు, నేను పిల్లల్ని తీసుకొని చనిపోతున్నానుశ్రీ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఈ విషయం ఆమె అన్న వెంటనే కనగల్ పోలీసులకు చెప్పడంతో ఆ నంబర్ను ట్రేస్ చేసి నాగజ్యోతి హైదరాబాద్లో ఉందని నిర్ధారించుకొని హయత్నగర్ పోలీసుల సహకారంతో నాగజ్యోతి ఆచూకీని అరగంటలో కనిపెట్టి ఆమెను క్షేమంగా వారి బంధువులకు హయత్నగర్లో అప్పగించారు. నాగజ్యోతి బంధువులు కనగల్ ఎస్ఐ విష్ణుమూర్తి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా అర్ధగంటలో ఆచూకీ కనిపెట్టిన పోలీసులు -
హనీట్రాప్తో విలవిల!
న్యూడ్ కాల్స్తో సైబర్నేరగాళ్ల మోసం ఆలేరుకు చెందిన ఓ యువకునికి గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ లిఫ్టు చేయడంతో యువతి హిందీలో మాట్లాడుతూ న్యూడ్గా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. కొద్దిసేపటి తర్వాత ఫోన్ కట్ అయ్యింది. వెంటనే మరో కాల్ వచ్చింది. నీవు న్యూడ్కాల్ చూశావని ఆ వీడియో నాదగ్గర ఉంది, వెంటనే డబ్బులు ఇవ్వకపోతే వీడియో నీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపిస్తానని బెదిరించింది. దీంతో యువకుడు భయాందోళన చెంది పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు యువతినుంచి వచ్చిన నంబర్ను బ్లాక్ చేశారు. ఫ రూ.లక్షల్లో డిమాండ్ ఫ పరువుపోతుందని అడిగినంత సమర్పించుకుంటున్న బాధితులు ఫ కొందరు పోలీసులకు ఫిర్యాదు ఫ వెలుగురాని కేసులు అనేకం ఫ తాజాగా నకిరేకల్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్తో కలకలం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను న్యూడ్ కాల్తో సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్లు సైబర్ మోసగాళ్ల నంబర్ను బ్లాక్ చేసి విచారణ ప్రారంభించారు. సాక్షి, యాదాద్రి : ఇటీవల జిల్లాలోని ఓ మాజీ ప్రజాప్రతినిధి మొబైల్కు హాయ్ అని మెసేజ్ వచ్చింది.. అది సైబర్ నేరగాళ్ల కాల్ అని తెలియక సదరు వ్యక్తి వెంటనే రిప్లై ఇచ్చాడు. అదే నంబర్నుంచి ఓ అందమైన యువతి వీడియో కాల్.. అందులో నగ్నంగా కనిపిస్తూ మాటల్లోకి దింపింది. యువతి మాయమాటలు నమ్మి ప్రజాప్రతినిధి కూడా న్యూడ్లా కనిపించేశాడు. ఇంకేముంది ఆ దృశ్యాన్ని యువతి స్క్రీన్షాట్ తీసి అతనికి సెల్ఫోన్కు పంపించి డబ్బులు పంపాలంటూ డిమాండ్ చేసింది. లేకపోతే వీడియోనూ వైరల్ చేస్తానని బెదిరించింది. పరువుపోతుందన్న భయంతో యువతి అడిగినంత డబ్బును మాజీ ప్రజాప్రతినిధి సమర్పించుకున్నాడు. అయినా వేధింపులు ఆగకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.. హానీట్రాప్ ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. ఎంతోమందిని సైబర్కేటుగాళ్లు నిలువెల్లా దోచుకుంటున్నారు. రోజుకో రకంగా మోసం మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు వెనకాడడం లేదు. రోజుకో రకమైన మోసానికి తెరలేపుతున్నారు. ఫేక్ కాల్స్ చేస్తూ లేదా వీడియో కాల్స్చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. యువత, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. ఇలా అనిన వర్గాల వ్యక్తులు మోసపోయిన వారిలో ఉంటున్నారు.సెల్ఫోన్ వాట్సాప్ను సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకుంటున్నారు. అందమైన యువతుల డీపీ ఫొటోలున్న నంబర్ నుంచి హాయ్ అని మెసేజ్ పంపుతున్నారు. కొందరు స్పందించి రిపై్ౖల ఇస్తున్నారు. చాటింగ్ చేస్తున్న క్రమంలో న్యూడ్ కాల్స్ వస్తున్నాయి. న్యూడకాల్స్ చూస్తున్నారే తప్ప.. సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడుతున్నామన్న విషయం గ్రహించడం లేదు. సైబర్ నేరగాళ్లు న్యూడ్ కాల్స్ను రికార్డు చేసి బెదిరిస్తున్నారు. మరికొందరు ఫేస్బుక్కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతారు. అందమైన యువతి ఫొటోతో వచ్చిన రిక్వెస్ట్ను ఓకే చెబుతున్నారు. దీంతో సదరు వ్యక్తికి సంబంఽధించిన ఫ్రెండ్స్, బంధువులు, కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ల వారికి తెలిసిపోతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫాంల నుంచి నంబర్లు సేకరించి వారి న్యూడ్ కాల్ వీడియోను పంపిస్తామని, యూ ట్యూబ్లో అప్లోడ్ చేస్తానని, బంధువులకు పంపిస్తానని బెదిరింపులకు దిగుతున్నారు. సదరు వ్యక్తికి చెందిన ఒకరిద్దరికి న్యూడ్కాల్ క్లిప్లు పంపించి బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో విషయం అందరికి తెలిస్తే పరువుపోతుందన్న భయంతో చాలామంది సైబర్నేరగాళ్లకు డబ్బులు సమర్పించుకుని లబోదిబోమంటున్నారు. పరువు పోతుందన్న భయంతో పోలీస్లను ఆశ్రయించడంలేదు. కాగా ఎక్కువ కాల్స్ మధ్యప్రదేశ్ పేరుతో వస్తున్నా. రాజస్థాన్కు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. -
అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలి
భానుపురి (సూర్యాపేట): జిల్లాలో రైతులు పండించిన అన్నిరకాల పంటలకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జిల్లా కన్వీనర్లు మల్లు నాగార్జున్రెడ్డి, మండారి డేవిడ్ కుమార్, షేక్ నజీర్, నల్లడ మాధవరెడ్డి, నారాబోయిన వెంకట యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాత రుణాలు రద్దుచేసి కొత్త రుణాలు ఇవ్వాలన్నారు. నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. రైతులందరికీ రుణమాఫీ అమలు చేసి రైతుభరోసా అందించాలని కోరారు. ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందించి నూతనకల్, మద్దిరాల, ఆత్మకూరు, చివ్వెంల, మోతె, పెన్ పహాడ్, మునగాల, నడిగూడెం మండలాల రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వరికుప్పల వెంకన్న, బొడ్డు శంకర్, దండ వెంకటరెడ్డి, మట్టిపల్లి సైదులు, ములకలపల్లి రాములు, పోటు లక్ష్మయ్య, పల్లె వెంకటరెడ్డి, కరీం, కందాల శంకర్ రెడ్డి, మేకల కనకారావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘సిరిపురం’ పర్సన్ ఇన్చార్జ్గా రామేశ్వరం
రామన్నపేట: మండలంలోని సిరిపురం చేనేత సహకార సంఘం పర్సన్ ఇన్చార్జ్గా అప్పం రామేశ్వరం, పాలకవర్గ సభ్యులకు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు బుధవారం రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా చేనేత జౌళిశాఖ ఇన్చార్జ్ సహాయ సంచాలకురాలు పద్మ నియామక పత్రాలు అందజేశారు. సిరిపురం సొసైటీ ఉమ్మడి జిల్లాలోనే బెడ్షీట్లు, డ్రెస్ మెటీరియల్ ఉత్పత్తిలో పేరుగాంచింది. జిల్లాలో పదవీకాలం ముగిసిన మిగతా సొసైటీల చైర్మన్లకు పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించగా, 2018లో కొంతమంది ఫిర్యాదు మేరకు సిరిపురం సొసైటీ బాధ్యతలను చేనేత జౌళిశాఖ డెవలప్మెంట్ అధికారికి అప్పగించారు. తాజా ఉత్తర్వుల మేరకు సిరిపురం చేనేత సహకార సంఘం పర్సన్ ఇన్చార్జ్గా అప్పం రామేశ్వరం మరియు పాలకవర్గ సభ్యులు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉత్తర్వులు అందుకున్న వారిలో పర్సన్ ఇన్ర్జ్ అప్పం రామేశ్వరం, ఉపాధ్యక్షురాలు రాపోలు లక్ష్మమ్మ, ప్రధాన కార్యదర్శి జెల్ల లక్ష్మీనారాయణ, కోశాధికారి ఏలె నరసింహ, కార్యవర్గ సభ్యులు రాపోలు రమేష్, గుండు రాజు, రాపోలు పాపయ్య, సంగిశెట్టి వెంకటమ్మ, అప్పం శ్రీను, రాపోలు శ్రవణ్కుమార్ ఉన్నారు. -
ప్రశాంతత కోసం బుద్ధవనాన్ని సందర్శించాలి
నాగార్జునసాగర్: జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ప్రతిఒక్కరూ బుద్ధవనాన్ని సందర్శించాలని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యదర్శి ఆర్కే మిశ్రా అన్నారు. నల్లగొండ జిల్లాలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వచ్చిన ఆయన బుధవారం నాగార్జునసాగర్ తీరంలోని బుద్ధవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనంలోని బుద్ధుడి పాదాల చెంత పుష్పాంజలి ఘటించారు. అనంతరం బుద్ధచరిత వనం, ధ్యానవనం, స్థూపవనం తదితర ప్రాంతాలను సందర్శించారు. మహాస్థూపంలోని అష్టబుద్ధుల వద్ద ధ్యానం చేశారు. అనంతరం నాగార్జునసాగర్ డ్యాంను సందర్శించారు. ఆయనకు బుద్ధవనం చరిత్ర గురించి గైడ్ సత్యనారాయణ వివరించారు. వారి వెంట డీఆర్డీఏ ఏపీడీ శేఖర్రెడ్డి, పెద్దవూర మండల తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐ దండ శ్రీనివాస్రెడ్డితో పాటు ఆపద మిత్ర ప్రోగ్రాం శిక్షకులు తదితరులు ఉన్నారు.ఫ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యదర్శి ఆర్కే మిశ్రా -
పొన్నవాహనంపై నృసింహుడి విహారం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం స్వామివారు మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనిమిచ్చారు. ఉదయం ప్రధానాలయంలో నిత్యారాధలు నిర్వహించిన అనంతరం నిత్యకల్యాణ మండపంలో స్వామివారిని మురళీకృష్ణుడిగా తీర్చిదిద్ది ప్రత్యేక పల్లకిపై అధిష్టింపజేశారు. అనంతరం అలంకార సేవకు అర్చకులు హారతినిచ్చి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తరువాత భాజాభజంత్రీలు, సన్నాయి మేళాల మధ్య మురళీకృష్ణుడికి రాగాలాపన చేశారు. సాయంత్రం ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు పూర్తిచేసిన అనంతరం శ్రీస్వామి వారిని పొన్న వాహనసేవపై ఊరేగించారు. ఆచార్యులు, యజ్ఞాచార్యలు, అర్చక బృందం వేద మంత్రాలు, పారాయణాలు పఠిస్తుండగా శ్రీస్వామివారు పొన్నవాహనంపై విహరించారు. భక్తులు పొన్నవాహనసేవలో పాల్గొని పులకించారు. పొన్న వృక్షమును దేవ వృక్షముగా పురాణాలు పేర్కొంటున్నాయి. దీనికే కల్ప వృక్షమని అంటారని అర్చకులు తెలిపారు. ఈ వేడుకల్లో ఈఓ భాస్కర్రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, డీఈఓ దోర్భల భాస్కర్శర్మ, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం గోవర్ధనగిరిధారి అలంకారం, రాత్రి సింహ వాహన సేవ ఉంటుంది. -
‘పెద్దగట్టు’ హుండీ ఆదాయం లెక్కింపు
చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని లింగమంతులస్వామి(పెద్దగట్టు) ఆలయ హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లెక్కించారు. పెద్దగట్టు జాతర ఫిభ్రవరి 20వ తేదీన ముగియగా.. ఫిభ్రవరి 21 నుంచి మార్చి 5 వరకు వచ్చిన హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. 13 రోజులకు గాను రూ.5.24 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె. భాస్కర్, ఇన్స్పెక్టర్ బి. సుమతి, ఆలయ కమిటీ చైర్మన్ పోలేబోయిన నర్సయ్యయాదవ్, ఈఓ కుశలయ్య, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. హుజూర్నగర్లో వింత జంతువు ప్రత్యక్షంహుజూర్నగర్: హుజూర్నగర్లో బుధవారం వింత జంతువు ప్రత్యక్షమైంది. పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో నివాసముంటున్న రఫీ ఇంట్లో మామిడి చెట్టుపై నల్లని వింత జంతువు కనిపించడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నరసింహారావు వచ్చి ఆ జంతువును పరిశీలించి దానిని సీవీఎట్ క్యాట్గా పిలుస్తారని చెప్పారు. ఇది మనుషులకు హాని చేయదని, అడవుల్లోనే రాత్రివేళ ఎక్కువగా సంచరిస్తుందని పేర్కొన్నారు. 200 టేకు చెట్లు దగ్ధంఆత్మకూరు(ఎం): గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో టేకు చెట్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండలం రాయిపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. రాయిపల్లి గ్రామానికి చెందిన జెట్ట శ్రీనివాస్ వ్యవసాయ భూమిలో సుమారు 350 టేకు చెట్ల ఉన్నాయి. ఈ టేకు చెట్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 200 చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మోత్కూరు నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. సుమారు రూ.2.50లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు పేర్కొన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
వైద్యానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత
కనగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం కనగల్ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి మీడియాతో మంత్రి మాట్లాడారు. కనగల్ పీహెచ్సీలో కంటి పరీక్షలు చేసే గ్లూకోమా సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అర్హులైన వారికి గడచిన 15 నెలల్లోనే రూ.1600 కోట్ల ఎల్ఓసీలను అందించామని, పేద ప్రజలు వైద్యం కోసం వస్తే 24 గంటలు ఎల్ఓసీలను అందజేస్తున్నామని అన్నారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రులకు ఎల్ఓసీ ఇచ్చే బదులుగా ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అన్నిరకాల సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. హైదరాబాదులో 4 టిమ్స్ హాస్పిటళ్లను ఆర్అండ్బీ ద్వారా నిర్మిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ ఎంజీఎంను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.2600 కోట్లతో హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, పాత భవనం అలాగే కొనసాగుతుందని తెలిపారు. వచ్చేవారం దేవరకొండ నియోజకవర్గంలో గ్లూకోమా కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. నల్లగొండ ఆస్పత్రిలో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ను ఈ నెలాఖరుకు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఇతర ప్రాంతాలలో డిప్యూటేషన్పై పనిచేస్తున్న 59 మంది డాక్టర్లను వెనక్కి పిలిపిస్తున్నామన్నారు. పేద ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారానే వైద్య సేవలు అందిస్తామన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. పైలెట్ పద్ధతిన కనగల్ పీహెచ్సీలో గ్లూకోమా సెంటర్ను ప్రారంభించామని తెలిపారు. కనగల్తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ గ్లూకోమా కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక మోడల్ పీహెచ్సీని తీర్చిదిద్దుతామని తెలిపారు. తన ప్రసవం కూడా ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరిగిందని ఆమె పేర్కొన్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
‘ఉపాధి’లో 266 రకాల పనులు
ఆలేరు రూరల్: జాతీయ ఉపాధిహామీ పథకంలో కూలీలకు పనికల్పించేందేకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. మొత్తం 266 రకాల పనులు చేపట్ట డమే లక్ష్యంగా అంచనాలు రూపొందించారు. ఏప్రిల్ 1నుంచి కొత్తగా గుర్తించిన పనులను ప్రారంభించి 2026 మార్చి 31వ తేదీన పూర్తి చేయనున్నారు. సీజన్కు అనుగుణంగా పనులు గ్రామసభల్లో గుర్తించిన ఉపాధిహామీ పనులు సీజన్కు అనుగుణంగా ఉంటాయి. ఈసారి నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా చెరువులు, కాలువలు, కుంటల్లో పూడికతీత, పిచ్చిమొక్కలు, పొదలను తొలగించి శుభ్రం చేయడం, భూముల అభివృద్ధి, నీటి కుంటల నిర్మాణం ఎక్కువగా చేపట్టనున్నారు. అదే విధంగా పొలాల వద్దకు రోడ్ల అనుసంధానం, వ్యక్తిగత మరుగుదొడ్లు, హరితహారం మొక్కలకు కంచెలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఉపాధిహామీ కూలీల వివరాలు జిల్లాలోని 17 మండలాల్లో 428 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జాబ్ కార్డులు 1,43,205 కాగా యాక్టివ్ జాబ్ కార్డులు 93,848 ఉన్నాయి. కూలీలు 1,37,475 మంది ఉండగా 25,49,676 పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. దినసరి కూలి రూ.302 చెల్లించనున్నారు. మొత్తం రూ.32.40 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఆత్మీయభరోసాతో పెరగనున్న కూలీలు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయభరోసా పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లిస్తుంది. దీంతో ఉపాధిహామీ పనుల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు.అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు కార్యాచరణ రూపొందించారు. 2025–26 సంవత్సరానికి కార్యాచరణ ఫ 25,49,676 పని దినాలు ఫ రూ.32.40 కోట్ల బడ్జెట్ ఫ గ్రామసభల ద్వారా పనుల గుర్తింపు ఫ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు వంద రోజులు పని కల్పిస్తాం 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధిహామీ పథకంలో చేపట్టే పనులకు సంబంధించి కార్యాచరణ రూపొందించాం. పనులను గుర్తించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నాం. ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వద్ద కూలీలు పెద్ద సంఖ్యలో ఉపాధి పనుల్లో పాల్గొనే అవకాశం ఉంది. అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. –నాగిరెడ్డి, డీఆర్డీఓ -
‘సిరిపురం’ పర్సన్ ఇన్చార్జ్గా రామేశ్వరం
రామన్నపేట: మండలంలోని సిరిపురం చేనేత సహకార సంఘం పర్సన్ ఇన్చార్జ్గా అప్పం రామేశ్వరం, పాలకవర్గ సభ్యులకు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు బుధవారం రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా చేనేత జౌళిశాఖ ఇన్చార్జ్ సహాయ సంచాలకురాలు పద్మ నియామక పత్రాలు అందజేశారు. సిరిపురం సొసైటీ ఉమ్మడి జిల్లాలోనే బెడ్షీట్లు, డ్రెస్ మెటీరియల్ ఉత్పత్తిలో పేరుగాంచింది. జిల్లాలో పదవీకాలం ముగిసిన మిగతా సొసైటీల చైర్మన్లకు పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించగా, 2018లో కొంతమంది ఫిర్యాదు మేరకు సిరిపురం సొసైటీ బాధ్యతలను చేనేత జౌళిశాఖ డెవలప్మెంట్ అధికారికి అప్పగించారు. తాజా ఉత్తర్వుల మేరకు సిరిపురం చేనేత సహకార సంఘం పర్సన్ ఇన్చార్జ్గా అప్పం రామేశ్వరం మరియు పాలకవర్గ సభ్యులు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉత్తర్వులు అందుకున్న వారిలో పర్సన్ ఇన్ర్జ్ అప్పం రామేశ్వరం, ఉపాధ్యక్షురాలు రాపోలు లక్ష్మమ్మ, ప్రధాన కార్యదర్శి జెల్ల లక్ష్మీనారాయణ, కోశాధికారి ఏలె నరసింహ, కార్యవర్గ సభ్యులు రాపోలు రమేష్, గుండు రాజు, రాపోలు పాపయ్య, సంగిశెట్టి వెంకటమ్మ, అప్పం శ్రీను, రాపోలు శ్రవణ్కుమార్ ఉన్నారు. -
పిల్లలతో కలిసి మహిళ అదృశ్యం
కనగల్: వైవాహిక జీవితంలో గొడవల కారణంగా మనస్తాపం చెంది తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైన మహిళ ఆచూకీని అర్ధగంటలో కనగల్ పోలీసులు కనిపెట్టారు. నల్లగొండ మండలం జి. చెన్నారం గ్రామానికి చెందిన కాలం నాగజ్యోతి వైవాహిక జీవితంలో గొడవల కారణంగా జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. జ్యోతి భర్త, తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం సాయంత్రం కనగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ విష్ణుమూర్తి పోలీసులను రెండు టీంలుగా విభజించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో నాగజ్యోతి అన్న మొబైల్కు కొత్త నంబర్ నుంచి నాగజ్యోతి ఫోన్ చేసి శ్రీనేను చనిపోతున్నాను. నా గురించి ఎవరూ వెతకొద్దు, నేను పిల్లల్ని తీసుకొని చనిపోతున్నానుశ్రీ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఈ విషయం ఆమె అన్న వెంటనే కనగల్ పోలీసులకు చెప్పడంతో ఆ నంబర్ను ట్రేస్ చేసి నాగజ్యోతి హైదరాబాద్లో ఉందని నిర్ధారించుకొని హయత్నగర్ పోలీసుల సహకారంతో నాగజ్యోతి ఆచూకీని అరగంటలో కనిపెట్టి ఆమెను క్షేమంగా వారి బంధువులకు హయత్నగర్లో అప్పగించారు. నాగజ్యోతి బంధువులు కనగల్ ఎస్ఐ విష్ణుమూర్తి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా అర్ధగంటలో ఆచూకీ కనిపెట్టిన పోలీసులు -
సైబర్ నేరాలను ఎదుర్కోవడంపై అవగాహన
నల్లగొండ: సైబర్ నేరాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. సైబర్ నేరాలపై నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్, సైబర్ స్టాకింగ్, వర్క్ ఫ్రం హోం పేరుతో మనల్ని ఆకర్షితులను చేస్తూంటారని, కొన్నిసార్లు భయభ్రాంతులకు గురిచేస్తూ మన నుంచి డబ్బులు కాజేస్తారని అన్నారు. సైబర్ క్రైంలో డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే సైబర్ 1930కి నంబర్ కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అనంతరం సమీప పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని తెలిపారు. సోషల్ మీడియా వాడకం సరైన పద్ధతిలో ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టుకోవద్దన్నారు. ఇంటర్నెట్ అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలన్నారు. విద్యార్థినులు వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడం మంచిదని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్కు స్పందించవద్దని, విద్యార్థులు బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం సైబర్ నేరాలు, మోసాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి , నల్లగొండ వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ సైదులు, రియాజ్, మోక్షిత్, ఫారూక్, మెడికల్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫ సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ -
బస్సులో పోగొట్టుకున్న పర్సు అప్పగింత
దేవరకొండ: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న పర్సును డ్రైవర్, కండక్టర్ గుర్తించి తిరిగి అతడికి అప్పగించారు. దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం హైదరాబాద్ నుంచి దేవరకొండకు వస్తుంది. ఈ బస్సులోని ప్రయాణికుడు ఒకరు పర్సు బస్సులోనే మర్చిపోయి కొండమల్లేపల్లిలో దిగిపోయాడు. బస్సులో పర్సును గుర్తించిన కండక్టర్ బుచ్చిరెడ్డి, డ్రైవర్ భోజ్య దేవరకొండ డిపో అధికారులకు అందజేశారు. పర్సులోని వివరాల ఆధారంగా పర్సు పోగొట్టుకున్న ప్రయాణికుడిని గుర్తించి అతడికి తిరిగి పర్సు అప్పగించారు. ఆ పర్సులో రూ.14,500 నగదు ఉన్నట్లు తెలిపారు. నిజాయితీ చాటుకున్న బస్సు డ్రైవర్, కండక్టర్ను ఆరీస్టీ అధికారులు అభినందించారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
భువనగిరి: మండలంలోని పగిడిపల్లి గ్రామ పరిధిలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పగిడిపల్లి పరిధిలోని పాత కలెక్టరేట్ భవనం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భువనగిరి ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గత వారం రోజులుగా మృతుడు భిక్షాటన చేస్తూ సంచరిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, వివరాలు తెలిసిన వారు 8712662472, 8712662733 నంబర్లను సంప్రదించాలని ఎస్ఐ సంతోష్కుమార్ సూచించారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య మోత్కూరు: మానసికస్థితి సరిగ్గా లేని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మోత్కూరు పట్టణ శివారులో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు పట్టణ పరిధిలోని అంగడిబజార్కు చెందిన బీసు లింగస్వామి(55) మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడికి మానసికస్థితి సరిగ్గా ఉండటంలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన బుధవారం మోత్కూరు పట్టణ శివారులో మోదుగుచెట్టుకు కేబుల్ వైరుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య బీసు సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి. నాగరాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. భర్తపై రోకలిబండతో భార్య దాడిచౌటుప్పల్: భర్తపై భార్య రోకలిబండతో దాడి చేసింది. ఈ ఘటన బుధవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామానికి చెందిన దుర్గం శ్రీనివాస్–సునీతలు దంపతుల మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 15రోజుల క్రితం కూడా భర్తతో గొడవ జరగడంతో సునీత చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెంలోని తన తల్లిగారింటికి వెళ్లింది. ఈ సమస్యపై మాట్లాడేందుకు గాను చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో నివాసముంటున్న సునీత సోదరుడు వీరేశం ఇంటి వద్దకు రావాలని శ్రీనివాస్కు సూచించారు. ఈ క్రమంలో బుధవారం శ్రీనివాస్ చౌటుప్పల్కు వచ్చాడు. మాట్లాడుకునే క్రమంలో మాటామాట పెరగడంతో ఇంట్లో ఉన్న రోకలిబండతో సునీత తన భర్త శ్రీనివాస్పై దాడి చేసింది. ఈ దాడిలో గాయపడిన శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ పేర్కొన్నారు. బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతినాంపల్లి: బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం నాంపల్లి మండలం స్వాములవారి లింగోటం శివారులో జరిగింది. నాంపల్లి మండల కేంద్రానికి చెందిన పూల రవి(33) మర్రిగూడ మండలం వట్టిపల్లి లో నిమ్మ తోట కౌలుకు తీసుకున్నాడు. బుధవారం రాత్రి తోటలో పని ముగించుకొని తన భార్యతో కలిసి బైక్పై నాంపల్లికి వస్తుండగా.. స్వాములవారి లింగోటం శివారులో మూలమలుపు వద్ద అదుపుతప్పి కిందపడిపోయారు. రవి తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం మాల్కు తరలించారు. రవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండకు తరలించారు. మృతుడికి ఒక కుమారుడు, కుమారై ఉన్నారు. -
యాదాద్రి భువనగిరి
ఇఫ్తార్ 6–29 (గురువారం సాశ్రీశ్రీ) సహర్ 5–08 (శుక్రవారం ఉశ్రీశ్రీ)ప్రారంభానికి నోచుకోని పీహెచ్సీ బీబీనగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం పనులు పూర్తై నెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. 7- 9లోగురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025బుద్ధవనాన్ని సందర్శించాలి జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ప్రతిఒక్కరూ బుద్ధవనాన్ని సందర్శించాలని ఆర్కే మిశ్రా పేర్కొన్నారు.- 8లో -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
సాక్షి, యాదాద్రి : వివిధ పథకాలకు సంబంధించి ఆదేశించి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. మండల పరిషత్, పంచాయతీ అధికారులతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంజనీరింగ్ కన్సల్టెంట్, ఉపాధిహామీ పథకం, నర్సరీ, ప్లాంటేషన్ సర్వైవల్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్షించారు. నర్సరీల్లో మొక్కల సంరక్షణకు షెడ్ నెట్ల ఏర్పాటు, రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కల సంరక్షణకు నీరందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదే విధంగా ఉపాధిహామీ పథకంలో ఎక్కువ మందిని భాగస్వామ్యం చేసి గడువులోపు పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించార. పనులను ఫొటో తీసి పంపాలని సూచించారు. టెలీకాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్, డీఆర్డీఓ నాగిరెడ్డి పాల్గొన్నారు., సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
విత్తనాలు మార్చకుండా అవగాహన కల్పించాలి
త్రిపురారం: వరి విత్తనాలను ప్రతిసారి మార్చాల్సిన అవసరం లేదని, రైతులు తమ పొలంలోనే పండించిన వరి ధాన్యాన్ని విత్తనాలుగా వినియోగించుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పించాలని హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో గల ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్(ఈఈఐ) ప్రొఫెసర్ డాక్టర్ మధుబాబు అన్నారు. బుధవారం త్రిపురారం మండలంలోని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రంలో శాసీ్త్రయ సలహా మండలి, జిల్లా స్థాయి సమన్వయ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2024–25 సంవత్సరంలో శాస్త్రవేత్తలు వ్యసాయంలో రైతులకు అందించిన సలహాలు సూచనలు, అదేవిధంగా 2025–26వ సంవత్సరంలో అందించే సేవలపై శాస్త్రవేత్తలు సమీక్ష చేశారు. కేవీకే కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. మేలైన యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించేందుకు గాను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. స్థిరమైన వరి ఉత్పత్తికి నేరుగా విత్తే పద్ధతి, ప్రకృతి వ్యవసాయం, బేకరీ ఉత్పత్తులు, వర్మీ కంపోస్ట్, కూరగాయల సాగు, కోళ్లు, గొర్రెల పెంపకం, వాటర్ మేనేజ్మెంట్, మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ వంటి వాటిపై శిక్షణ ఇచ్చామన్నారు. చీడపీడల నివారణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పర్యటించి రైతులకు పలు సలహాలు, సూచనలు అందజేసినట్లు పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ మధుబాబు మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుకు అవసరమయ్యే వాటిపై నూతన ప్రయోగాలు చేయాలన్నారు. అనుభవం ఉన్న రైతుల ద్వారా సమాచారాన్ని సేకరించి ఇతర రైతులను ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయంలో రైతులు అధిక దిగుబడులు సాధించడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందుండాలన్నారు. ఈ ఏడాది రైతులకు అందించాల్సిన సేవలపై ముందస్తుగా ప్రణాళిక ఉండాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం హెడ్ అనిల్, ఏడీఆర్ సుధాకర్, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ చంద్రశేఖర్, రాములమ్మ, హాహలియా ఏడీఏ రవీందర్, ఉద్యానవన అధికారి మురళి, పలువురు మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ మధుబాబు -
దండంపెడతా సారూ.. అమ్ముకోనియ్యండి!
భువనగిరిటౌన్ : మీకు దండం పెడుతా.. అమ్ముకోనియ్యండి.. బత్తాయిల వ్యాపారమే జీవనాధారం.. ఇబ్బందులకు గురి చేయకండి.. అని ఓ మహిళా రైతు ట్రాఫిక్ పోలీసులను వేడుకుంది. ఈ సంఘటన బుధవారం భువనగిరిలోని బాబుజగ్జీన్రాం చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. భువనగిరి, రామన్నపేట, వలిగొండతో పాటు వివిధ మండలాల రైతులు తాము పండించిన పండ్లు, బతాయిలు, నిమ్మకాయలను కొన్నేళ్లుగా బాబుజగ్జీవన్రాం చౌరస్తాలో విక్రయిస్తున్నారు. బుధవారం ట్రాఫిక్ పోలీసులు వచ్చి ట్రాఫిక్జామ్ అవుతుందని, తొలగించాలని హెచ్చరించారు. ఈ క్రమంలో ఓ మహిళా రైతు కలగజేసుకుని బతుకుదెరువు దెబ్బతీయొద్దని ట్రాఫిక్ పోలీసును వేడుకుంది. -
బీజేపీపై రాజకీయ పోరాటం చేయాలి
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరం ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని, సొరంగమార్గం తవ్వేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వం తీరు ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సొరంగం పనులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. మిర్యాలగూడ అర్బన్: రాష్ట్రానికి ప్రమాదకరంగా మారబోతున్న బీజేపీ విధానాలను ఎండగట్టడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విఫలమయ్యాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాయమాటలతో, మతోన్మాదంతో ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలుపొందాలని బీజేపీ చూస్తోందని, దీనికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేక పోతోందని విమర్శించారు. భవిష్యత్తులో బీజేపీపై రాజకీయ యుద్ధం జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాజస్తాన్లో ఓ చిన్న కేసు విషంలో పోలీసులు అర్ధరాత్రి ఇంట్లో చొరబడి ఆరునెలల చిన్నారి చావుకు కారణం అయ్యారని, ముస్లిం వ్యతిరేకంగా పాలన చేయడమే ఆ పార్టీ లక్ష్యమన్నారు. రేవంత్రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేడం లేదని విమర్శించారు. కేవలం బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ పైనే ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 50శాతం రిజర్వేషన్ దాటవద్దని సుప్రీంకోర్టు చెపుతున్నా.. పార్లమెంట్లో బీసీ కులగణన ఆమోదం పొందదనే దృష్టితోనే బీసీ కులగణన చేసినట్లు చెప్పుకుంటున్నారని అన్నారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ నాటకమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఖమ్మం, నల్లగొండ జిల్లాల కార్యదర్శులు నూనె నాగేశ్వర్రావు, తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, డబ్బికార్ మల్లేష్, సయ్యద్ హశం, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, ఎండీ సలీం, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, మల్లయ్య, అరుణ, పల్లా భిక్షం తదితరులు పాల్గొన్నారు. బీజేపీ విధానాలను ఎండగట్టడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం -
కొనసాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బుధవారం హైదరాబాద్లోని కార్వాన్కు చెందిన శ్రీవిశ్వాంజనేయ భక్త సమాజం, యాదగిరిగుట్టలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహిళా భజన మండలి, వేల్పుపల్లి శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్కు చెందిన మసన చెన్నప్ప ఆధ్వర్యంలో ఉపనిషత్ వైభవంపై ఉపన్యాసం చేశారు. హాలియాకు చెందిన చేబ్రోలు నారాయణదాసు సమక్షంలో సుభద్రా పరిణయం హరికథ గానం చేశారు. స్వరరాగ ఆర్ట్స్ ఆకాడమీ ఆధ్వర్యంలో భక్తి సంగీతం, మెరుగు రాఘవేంద్రచే తబలా వాయిద్యం చేపట్టారు. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రముఖ జానపద, సినీ నేపథ్య గాయని తేలు విజయ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమం కొనసాగింది. ఇక పలువులు కళాకారులు కూచిపూడి, భరత నాట్యం, సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. -
అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలి
భానుపురి (సూర్యాపేట): జిల్లాలో రైతులు పండించిన అన్నిరకాల పంటలకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జిల్లా కన్వీనర్లు మల్లు నాగార్జున్రెడ్డి, మండారి డేవిడ్ కుమార్, షేక్ నజీర్, నల్లడ మాధవరెడ్డి, నారాబోయిన వెంకట యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాత రుణాలు రద్దుచేసి కొత్త రుణాలు ఇవ్వాలన్నారు. నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. రైతులందరికీ రుణమాఫీ అమలు చేసి రైతుభరోసా అందించాలని కోరారు. ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందించి నూతనకల్, మద్దిరాల, ఆత్మకూరు, చివ్వెంల, మోతె, పెన్ పహాడ్, మునగాల, నడిగూడెం మండలాల రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వరికుప్పల వెంకన్న, బొడ్డు శంకర్, దండ వెంకటరెడ్డి, మట్టిపల్లి సైదులు, ములకలపల్లి రాములు, పోటు లక్ష్మయ్య, పల్లె వెంకటరెడ్డి, కరీం, కందాల శంకర్ రెడ్డి, మేకల కనకారావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
భూ పంపిణీ చేయాలని ధర్నా
భువనగిరిటౌన్ : ఆలేరు మండలం కొలనుపాకలో సర్వే నంబర్లో 8లో గల రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అర్హులైన పేదలకు పంపినీ చేయాలని కోరుతూ సీపీఎ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. గ్రామంలో ఎంతోమది నిరుపేదలు ఉన్నారని, వారికి ప్రభుత్వ భూమిని పంపిణీ చేయాలని ఎప్పటినుంచో అధికారులను కోరుతున్నా స్పందించడం లేదన్నారు. అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికై నా అధికారులు స్పందించాలని కోరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చెక్క వెంకటేష్, కనకయ్య, పొన్నబోయిన రవి, గిరబోయిన సామి, పోతు ప్రవీణ్, మోతే భవాని పాల్గొన్నారు. -
ఓటరునాడి పట్టలే..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ– టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందగా, టీఎస్ యూటీఎఫ్ తమ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. సంఘం పోరాట పటిమ తమ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిని గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నా.. అనుకూల ఫలితాన్ని సాధించలేకపోయింది. ఇక పీఆర్టీయూ–టీఎస్ గతంలో కోల్పోయిన తమ స్థానాన్ని ఈసారి దక్కించుకోగలిగింది. ఉపాధ్యాయుల్లో పెద్ద సంఘంగా పేర్కొనే పీఆర్టీయూ ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి పింగిలి శ్రీపాల్రెడ్డిని గెలిపించుకొని తమ పాత స్థానాన్ని పదిలం చేసుకోగలిగింది. సొంత నియోజకవర్గం కాకపోయినా ఈ ఎన్నికల్లో బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి గట్టిగా పోరాడి ఓడారు. బీసీ నినాదంతో ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన పూల రవీందర్ ఆశించిన ఫలితం రాబట్టలేకపోయారు. ఇక, బీజేపీ అనుకున్నంత స్థాయిలో తమ బలాన్ని టీచర్లలో పెంచుకోలేకపోయింది. దీంతో ఆ పార్టీ తరఫున బరిలో దిగిన పులి సరోత్తంరెడ్డికి ఆశాభంగం తప్పలేదు. ఎక్కడ పొరపాటు జరిగింది.. ఈ ఎన్నికల్లో టీఎస్ యూటీఎఫ్ రెండో స్థానానికి పడిపోవడంపై ఆ యూనియన్ ఆలోచనల్లో పడింది. గెలుస్తామని ధీమాతో ఉన్నా అంచనాలు ఎక్కడ తారుమారయ్యాయి.. ఓటమికి కారణాలేంటనే విశ్లేషణ చేసుకుంటోంది. 2019 ఎన్నికలో గెలుపొందిన తాము ఈసారి ఎందుకు ఓడిపోయామనే చర్చ యూటీఎఫ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. యూనియన్కు ఉన్న సంప్రదాయ ఓట్లు అలాగే ఉన్నాయని, అవి తమ అభ్యర్థికే పడ్డాయని, అయితే తటస్థంగా ఉండే టీచర్ల ఓట్లు మాత్రం హర్షవర్దన్రెడ్డికి వేశారని అంచనా వేస్తోంది. హర్షవర్ధన్ పోటీలో ఉండటం వల్లే తమకు రావాల్సిన ఓట్లకు గండిపడి, రెండోస్థానానికి పడిపోవాల్సి వచ్చిందని భావిస్తోంది. డబ్బు, మద్యం పంపిణీ ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో పని చేసిందన్న విశ్లేషణ యూటీఎఫ్ వర్గాల్లో సాగుతోంది. గట్టి పోటీ ఇచ్చిన హర్షవర్ధన్రెడ్డి.. ఉపాధ్యాయ ఎన్నికల్లో గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి టీచర్స్ జేఏసీలోని సంఘాల మద్దతులో బరిలో దిగి చివరి వరకు పోరాడారు. ఓడిపోయినా.. గణనీయమైన ఓట్ల సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక సీఎం రేవంత్రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం వల్ల పండిట్, పీఈటీ పదోన్నతులు, ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు ఇప్పించడం వంటి విధాన నిర్ణయాల్లో హర్షవర్ధన్రెడ్డి కీలక ప్రాత పోషించిన అంశం టీచర్లలోకి బలంగానే వెళ్లింది. హర్షవర్ధన్ స్థానికేతరుడనే ప్రత్యర్థుల ప్రచారం కూడా ఆయనకు ప్రతికూలంగా మారింది. అయినప్పటికీ యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి, హర్షవర్ధన్ మధ్య వ్యత్యాసం 500లోపు ఓట్లు మాత్రమే ఉండడం గమనార్హం. పూల రవీందర్ ఎలిమినేట్ కావడానికి ముందు 16వ రౌండ్ ముగిసే వరకు నర్సిరెడ్డికి 5,660 ఓట్లు ఉండగా, హర్షవర్ధన్రెడ్డికి 5,309, శ్రీపాల్రెడ్డికి 7,673 ఓట్లు ఉన్నాయి. నర్సిరెడ్డి, హర్షవర్ధన్రెడ్డి మధ్య వ్యత్యాసం 351 ఓట్లే. రవీందర్ ఎలిమినేషన్ తరువాత కూడా అదే పరిస్థితి కొనసాగింది. దీంతో హర్షవర్ధన్రెడ్డి మూడో స్థానానికి వెళ్లాల్సి వచ్చింది. ఇద్దరికి ప్రచారం చేయడమే దెబ్బకొట్టిందా? ఈ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ అనుకున్న మేర ప్రభావం చూపలేకపోయారు. బీసీ వాదంతో, బీసీ సంఘాల మద్దతులో బరిలోకి దిగినా, అది పూర్తిగా ఫలించ లేదు. ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒకే ఎన్నికలో ఇద్దరు బీసీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని చెప్పడం మైనస్గా మారిందనే చర్చ సాగుతోంది. ఎవరో ఒకరిని గెలిపించాలని కోరితే ఆ ఒక్కరికి ఓట్లు పడేవని, రవీందర్తోపాటు సుందర్రాజుకు ఓట్లు వేయాలని సూచించడంతో బీసీ ఓట్లు చీలిపోయాయన్న చర్చ సాగుతోంది. ఫ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన టీఎస్ యూటీఎఫ్ ఫ పాత స్థానాన్ని దక్కించుకున్న పీఆర్టీయూ–టీఎస్ ఫ సొంత నియోజకవర్గం కాకున్నా గట్టి పోటీ ఇచ్చిన హర్షవర్ధన్ రెడ్డి ఫ టీచర్లలో బలాన్ని పెంచుకోలేకపోయిన బీజేపీ -
ఈపాస్ ద్వారానే యూరియా అమ్మకాలు జరగాలి
ఆలేరురూరల్: ఎరువుల దుకాణాల్లో ప్రతిరోజు యూరియా అమ్మకాలు ఈపాస్ మిషన్ ద్వారానే జరగాలని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ అన్నారు. మంగళవారం ఆలేరు పట్టణంలో ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. యాసంగి సీజన్కు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. మొత్తం 101 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట ఏఓ శ్రీనివాస్, ఏఈఓ నాగార్జున, సాకెర, శివకుమార్ తదితరులున్నారు.