Yadadri
-
క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కృషి
నకిరేకల్: క్రీడాకారుల్లో క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామంలో మూడు రోజుల పాటు జరగనున్న 47వ తెలంగాణ హ్యాండ్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి 450 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. తన వంతుగా క్రీడాకారుల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ మాట్లాడుతూ.. ఇక్కడ ప్రతిభ చూపిన క్రీడాకారులను రెండు జట్లుగా ఎంపిక చేసి ఈనెల 18 నుంచి బీహార్లోని నవాడలో జరిగే జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు పంపించనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి, హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉస్మాన్, పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, ఏవీఎం విద్యాసంస్థల అధినేత కందాల పాపిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నకిరేకంటి ఏసుపాదం, స్థానిక పాఠశాల హెచ్ఎం కర్ర వీరారెడ్డి, స్థానిక పాల కేంద్రం చైర్మన్ చింతల ముత్తయ్య పాల్గొన్నారు. ఫ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఫ మంగళపల్లిలో ప్రారంభమైన రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలు ఫ ఉమ్మడి 10 జిల్లాల నుంచి హాజరైన 450 మంది క్రీడాకారులు -
బాస్కెట్బాల్ భారత జట్టుకు మిర్యాలగూడ వాసి
మిర్యాలగూడ: బాస్కెట్బాల్ అండర్–16 భారత జట్టుకు మిర్యాలగూడ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త జొన్నలగడ్డ వెంకట్రెడ్డి కుమార్తె విహారెడ్డి ఎంపికై ంది. జూన్ 10 నుంచి మాల్దీవ్స్లో జరిగే ఏషియన్ గేమ్స్లో నిర్వహించే బాస్కెట్బాల్ టోర్నమెంట్లో భారత జట్టు తరుపున విహారెడ్డి పాల్గొననుంది. తెలంగాణ నుంచి మొట్టమొదటిసారిగా జాతీయ జట్టుకు ఎంపికై న విహారెడ్డిని మిర్యాలగూడకు చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు. రాష్ట్రానికి పేరు ప్రఖ్యా తలు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
లారీని ఢీకొట్టిన బస్సు
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ స్టేజీ సమీపంలో హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్తో పాటు బస్సులో ఉన్న ఓ ప్రయాణికురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కందుకూరు నుంచి శివాంజలి ప్రైవేట్ ట్రావెల్ బస్సు 34 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు బయలుదేరింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ సమీపంలోకి వచ్చే సరికి జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఓ ట్రాలీ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రకాశం జిల్లా జిరుగుమల్లి మండలం చిర్రిపాడు గ్రామానికి చెందిన బస్సు డ్రైవర్ కొండల్రావు(42) బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. డ్రైవర్ వెనుక సీటులో కూర్చున్న ప్రకాశం జిల్లా పొన్నులూరు మండలం పరుచూరివారిపాలెం గ్రామానికి చెందిన దండిబోమిన గోవిందమ్మ(47)కు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలు గోవిందమ్మకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారిద్దరితో కలిసి హైదరాబాద్లో బంధువుల ఇంటి వద్ద ఫంక్షన్ ఉండడంతో కుందుకూరు నుంచి బస్సులో వెళ్తోంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు బస్సు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 34 మంది ఉండగా అందులో 18మందికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన పోకూరు భుజంగరావు, చేగూర్తి మండలం బొస్రపల్లికి చెందిన బండారి వినోద్, గుర్బసాల సుజాత, జనుగుపల్లి మండలం పాల్వాయి గ్రామానికి చెందిన వంజ అంకమ్మ, బీమకుర్తి మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన పులి సన్ని, వల్లెటిపాలెం మండలం నందలపర్ గ్రామానికి చెందిన సుశీల, పోకూరు గ్రామానికి చెందిన పల్లపు శివమ్మ, భూపాలపురం గ్రామానికి చెందిన ప్రగాడ శ్రీనివాసులు, చండి అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన బచ్చు మల్యాద్రి, సుజాత నగర్కు చెందిన యనమల మమత, వల్లెటిపాలెం మండలం చిన్నమ్మపాలెం గ్రామానికి చెందిన దేవిళ్ల జయమ్మ, దేవిళ్ల మల్లేశ్వరి, నెల్లూరు జిల్లా కందుకూరు మండల కేంద్రానికి చెందిన యనమల మమత, లింగసముద్రం మండలం తూమగుంట గ్రామానికి చెందిన మీటినేని విజయ,ఉలువపాడు మండలం రామాయపట్నం గ్రామానికి చెందిన అప్పనగిరి సురేష్, అప్పనగిరి జ్యోతి, కొత్తపట్నం మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన నాయుడు వెంకయ్య, నాయుడు రజని గాయపడినవారిలో ఉన్నారు. వీరిలో కొంతమందిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రి, మరికొంత మందిని హైదరాబాద్లోని ఉస్మానియా, హయత్నగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన డ్రైవర్ కొండల్రావు, ప్రయాణికురాలు గోవిందమ్మ మృతదేహాలకు చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. ఈ ప్రమాదంపై మృతురాలు గోవిందమ్మ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. బస్సు ప్రమాద సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఫ బస్సు డ్రైవర్, మహిళా ప్రయాణికురాలు మృతి ఫ 18మందికి గాయాలు ఫ చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద ఘటన -
మృత్యువులోనూ వీడని బంధం
రామన్నపేట: వారిద్దరు దంపతులు. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. భర్త ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య క్యాన్సర్ బారిన పడడంతో భర్త మానసికంగా కుంగిపోయాడు. భర్త చనిపోయిన పోయిన కొద్ది గంటల వ్యవధిలోనే భార్య కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో చోటుచేసుకున్న ఘటన అందరినీ కలచివేసింది. ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన రేపాక సునీత(41)కు చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన గుర్రం నర్సింహ(45)తో సుమారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి ఇంద్రపాలనగరంలోనే అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు. వారి కుమార్తె అమ్ములు స్థానిక జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి, కుమారుడు శివ 8వ తరగతి చదువుతున్నాడు. నర్సింహ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గిరాకీలు లేక నర్సింహ రోజువారీ కూలీపనులకు వెళ్తూ వచ్చే ఆదాయంతో బతుకు బండిని లాగుతున్నాడు. ఈక్రమంలో భార్య సునీత రెండేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడింది. హైదరాబాద్లో చికిత్స పొందుతోంది. రెండురోజుల క్రితం సునీత తన తల్లితో కలిసి హైదరాబాద్ వెళ్లి వైద్యం నిమిత్తం ఓ ఆస్పత్రిలో చేరింది. రోజు మాదిరిగానే కూలీపనులకు వెళ్లి వచ్చిన నర్సింహ మంగళవారం రాత్రి ఇంట్లో పడుకున్నాడు. బుధవారం తెల్లవారుఝామున చాతిలో నొప్పి రావడంతో తలువుతీసి పక్కింటి వాళ్లను లేపే ప్రయత్నం చేశాడు. వీలుకాక పోవడంతో తన స్నేహితుడికి ఫోన్చేసి తన పరిస్థితిని తెలిపాడు. అతను తన పొరుగువారితో వచ్చి గోడదూకి ఇంట్లోకి ప్రవేశించాడు. చికిత్స నిమిత్తం కారులో భువనగిరి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నర్సింహ మృతి చెందినట్లు తెలిపారు. నర్సింహ మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చిన కొద్దిసేపటికే ఆస్పత్రి నుంచి సునీత చనిపోయినట్లు సమాచారం వచ్చింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. భార్య సునీత అనారోగ్యం పాలైనప్పటి నుంచి నర్సింహ మానసికంగా కుంగిపోయాడని గ్రామస్తులు తెలిపారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలు అమ్ములు, శివ అనాథలయ్యారు. గంటల వ్యవధిలోనే దంపతుల మృతి ఫ చాతి నొప్పితో బాధపడుతూ మృతిచెందిన భర్త, క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతూ భార్య మృతి -
పేలిన ఆర్టీసీ బస్సు టైర్లు
ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలంలోని తుక్కాపురం స్టేజీ వద్ద బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ సెమి లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి ఆత్మకూరు(ఎం)మీదుగా మోత్కూరు వైపు వెళ్తుంది. మండలంలోని తుక్కాపురం స్టేజి వద్దకు వెళ్లగానే బస్సు వెనుక భాగంలోని రెండు టైర్లు పేలిపోయాయి. డ్రైవర్ బస్సును చాకచక్యంతో అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని మరో బస్సులో పంపించారు. ఫ డ్రైవర్ బస్సును అదుపు చేయడంతో తప్పిన ప్రమాదం -
కారును ఢీకొన్న మరో కారు
చౌటుప్పల్ : కారును మరో కారు ఢీకొంది. ప్రమాదానికి గురైన కారును వెనకాల నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో యువతి మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఎలిమినేటి మాధవరెడ్డి బీఈడీ కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సంస్థకు చెందిన ముగ్గురు ఉద్యోగులు మార్కెటింగ్లో భాగంగా చౌటుప్పల్కు ఆల్టో కారులో వచ్చారు. పలు వెంచర్లను సందర్శించి ప్లాట్ల కొనుగోలు చేసే వారిని కలిశారు. అనంతరం మార్కెటింగ్ అంశాలపై చర్చించేందుకు మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలోని ఓ ప్రముఖ పరిశ్రమకు కారులో వెళ్తున్నారు. బీఈడీ కళాశాల దాటాక రెండు లారీలు రోడ్డుకు సమాంతరంగా వెళ్తున్నాయి. అదే సమయంలో ఆల్టో కారును డ్రైవింగ్ చేస్తున్న మార్కెటింగ్ ఉద్యోగి మిథిలేష్ కొంత ఎడమవైపుకు తిప్పే క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఇండికా కారు వీరి కారును ఢీకొట్టింది. దీంతో ఆల్టో కారు ముందున్న లారీని ఢీకొంది. అదేవిధంగా ఆ కార్ల వెనకాలే వచ్చిన విజయవాడ వైపునకు వెళ్తున్న ఉల్లిగడ్డల లోడు లారీ ఆల్టో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆల్టో కారులో వెనుక సీట్లో కూర్చున్న హైదరాబాద్లోని బోయినపల్లికి చెందిన మార్కెటింగ్ ఉద్యోగి శ్రావణి (29) అక్కడికక్కడే మృతిచెందింది. కారు ముందు సీట్లో కూర్చున్న నాగోల్కు చెందిన శ్రీనివాస్రావు, కారు డ్రైవింగ్ చేస్తున్న మిథిలేష్కు గాయాలయ్యాయి. శ్రీనివాస్రావును చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ఇండికా కారులో ప్రయాణిస్తున్న నల్లగొండ జిల్లా కట్టంగూరుకు చెందిన యాదగిరి(35), రేణుక(30), ధరణి(13), వేణుతేజ(14), మణిభార్గవి(13)కు సైతం గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కారులో ఇరుక్కున్న శ్రావణి మృతదేహాన్ని బయటకు తీసి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. ఫ ప్రమాదానికి గురైన కారును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ ఫ ప్రమాదంలో యువతి మృతి -
ఇక్కత్ కళా నైపుణ్యం భేష్
భూదాన్పోచంపల్లి: ఇక్కత్ కళా నైఫుణ్యాలు భేషుగ్గా ఉన్నాయని ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్ విద్యార్థుల బృందం కొనియాడారు. హైదరాబాద్లోని రూట్స్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కళాశాలకు చెందిన 30 మంది విద్యార్థులు బుధవారం భూదాన్పోచంపల్లిలో పర్యటించారు. చేనేత గృహాలు, స్థానిక రూరల్ టూరిజం పార్కును సందర్శించారు. నూలు, రంగుల అద్దకం, చిటికి కట్టడం, టైఅండ్డై విధానం, మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలను పరిశీలించారు. ఇక్కత్ డిజైన్లను చూసి చేనేత కళాకారుల నైపుణ్యాలను కొనియాడారు. కాలేజీ ఫ్యాకల్టీ మోహనశ్రీ మాట్లాడుతూ.. స్టడీ టూర్లో భాగంగా ఇక్కత్కు ప్రసిద్ధి చెందిన పోచంపల్లికి వచ్చినట్లు చెప్పారు. నేటి ఫ్యాషన్ రంగానికి, ఇంటీరియర్కు పోచంపల్లి ఇక్కత్వస్త్రాలు ఎంతో అనువుగా ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ హబీబీ పడాల, ఫ్యాకల్టీ కావ్య, ఉష, అంకిత, విద్యార్థులు పాల్గొన్నారు.ఫ పోచంపల్లిని సందర్శించిన ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు -
అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
చౌటుప్పల్ రూరల్: అక్రమంగా కబేళాకు తరలిస్తున్న పశువులను చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద బుధవారం పోలీసులు పట్టుకున్నారు. జనగాంలోని నవాబ్ మార్కెట్లో 5 ఎద్దులను కొనుగోలు చేసి హైదరాబాద్లోని తుక్కుగూడకు తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాయి. ఈమేరకు పశువులను రవాణా చేస్తున్న పహడిషరీఫ్కు చెందిన ఎండీ ఉమర్, సూర్యాపేటలోని జేజేనగర్కు చెందిన ఎండీ మజాయిద్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నర్సిరెడ్డి తెలిపారు. గడ్డిమోపుల కింద ఆవులను తరలిస్తుండగా.. భువనగిరిటౌన్ : ఎండు గడ్డిమోపుల కింద ఆవులను దాచి రవాణా చేస్తుండగా బుధవారం భువనగిరిలో భజరంగ్ దళ్ నాయకులు పట్టుకున్నారు. రవాణా ట్రక్కు వాహనంలో అడుగున 17 ఆవులను కట్టివేసి పైన ఎండుగడ్డి మోపులను పేర్చి ఆంధ్రప్రదేశ్ రంపచోడవరం నుంచి హైదరాబాద్కు అక్రమ రవాణా చేస్తున్నట్లు గోరక్షకులకు సమాచారం వచ్చింది. భజరంగ్ దళ్ జిల్లా, పట్టణ కన్వీనర్లు బింగి భరత్, నవీన్ తదితరులు బైకులపై ఆవులను అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని వెంటాడి స్థానిక సింగన్నగూడెం చౌరస్తాలో పట్టుకున్నారు. అనంతరం పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పట్టణ ఎస్సై లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి ఆవులను రాజాపేట మండలం చల్లూరు గోశాలకు తరలించారు. వాహనాన్ని సీజ్ చేసి యజమాని రాజు పత్లావత్, డ్రైవర్ మధు, క్లీనర్ కుమార్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
కారు బైక్ ఢీ.. యువకుడికి గాయాలు
ఆలేరురూరల్: కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో యువకుడికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆలేరు మండలంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన బింగి దామోదర్ పనినిమిత్తం ఆలేరుకు వచ్చి తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. కొలనుపాక వాగు వద్దకు రాగానే బచ్చనపేట నుంచి కారు ఆలేరుకు వెళ్తుండగా రెండు వాహనాలు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న దామోదర్కు గాయాలయ్యాయి, అతడిని స్థానికులు వరంగల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆలేరు పోలీసులను సంప్రదించగా.. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
30ఏళ్ల కల సాకారం కాబోతోంది
సాక్షి, యాదాద్రి: ఆలేరు నియోజకవర్గ ప్రజల 30ఏళ్ల కలను సీఎం రేవంత్రెడ్డి సాకారం చేయబోతున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలం తిర్మలాపురం వద్ద 6వ తేదీన నిర్వహించనున్న సీఎం బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం వారు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రూ.1,500 కోట్లతో ఆలేరు నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి 6న శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రధానంగా గంధమల్ల రిజర్వాయర్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, యాదాద్రి మెడికల్ కళాశాల, వేద పాఠశాల, ధాన్యం గోదాములు, మోటకొండూరులో పోలీస్ స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయ భవనాలకు భూమి పూజ చేస్తారన్నారు. అదేవిధంగా పలు రోడ్లు, కొలనుపాక, పొట్టి మర్రివద్ద హైలెవల్ బ్రిడ్జిలకు శంకుస్థాపన చేస్తారన్నారు. గంధమల రిజర్వాయర్తో ఆలేరు ప్రాంతం సస్యశ్యామలం కానుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలేరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఆలేరుకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. మూసీ ప్రక్షాళనతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణీతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. సీఎం బహిరంగ సభకు రైతులు, యువకులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. గంధమల్ల రిజర్వాయర్తో ఆలేరు సస్యశ్యామలం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి -
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
నాగారం: రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై నాగారం బంగ్లా పరిధిలోని విజయనగర్ కాలనీ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం మండల పరిధిలోని పసునూర్ గ్రామానికి చెందిన కడారి శ్రీను(45) కొంతకాలంగా హైదరాబాద్లోని బీఎన్రెడ్డి కాలనీలో నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం నాగారం మండలం డి. కొత్తపల్లి గ్రామంలో గంగదేవమ్మ పండుగ చేయడంతో తన బంధువైన బీసు నర్సయ్య ఇంటికి వచ్చాడు. రాత్రి 1:30 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్కు వెళ్లేందుకు నడుచుకుంటూ నాగారం వైపు వస్తుండగా.. మార్గమధ్యలో నాగారం బంగ్లా పరిధిలోని విజయనగర్ కాలనీ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మంగళవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి పెద్ద కుమారుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఐలయ్య తెలిపారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఆలేరు: తాళం వేసిన ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారు. ఈ ఘటన ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం సీఐ కొండల్రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న సీఆర్పీఎఫ్ హెడ్కానిస్టేబుల్ తాటికాయల రమేష్ తన కుటుంబంతో కలిసి ఈ నెల 1వ తేదీన ఇంటికి తాళం వేసి హైదరాబాద్కు వెళ్లాడు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు అదేరోజు రాత్రి రమేష్ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలోని ఏడు తులాల బంగారు, 60 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.2లక్షల నగదును ఎత్తుకెళ్లారు. పక్కింట్లోనే ఉంటున్న రమేష్ తల్లి సోమవారం ఉదయం రమేష్ ఇంటి తలుపు తెరిచి ఉండటాన్ని గమనించి వెంటనే కొడుకుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. రమేష్ ఇంటికి వచ్చి చూసి చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్నాయుడు, సీఐ కొండల్రావు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. రమేష్ భార్య దీపకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.● 7 తులాల బంగారు, 60తులాల వెండి ఆభరణాలు, రూ.2లక్షల నగదు అపహరణ -
బైక్ అదుపుతప్పి హెడ్కానిస్టేబుల్ మృతి
కనగల్: విధి నిర్వహణలో భాగంగా బైక్పై వెళ్తూ అదుపుతప్పి కిందపడి హెడ్కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ ఘటన కనగల్ మండలం దర్వేశిపురం సమీపంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ పి. విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ పోలీస్ స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న బొల్లేపల్లి సైదులు(47) విధి నిర్వహణలో భాగంగా మంగళవారం ఉదయం జి. చెన్నారం గ్రామంలో పిటిషన్ ఎంకై ్వరీ పూర్తిచేసి తిరిగి బైక్పై పోలీస్ స్టేషన్కు వస్తుండగా.. మార్గమధ్యలో దర్వేశిపురం గ్రామ సమీపంలోని జీఎల్ గార్డెన్స్ వద్ద బైక్ అదుపుతప్పడంతో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. మరో కానిస్టేబుల్ రవీందర్రెడ్డి గమనించి సైదులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, 108 వాహనంలో సైదులును నల్లగొండ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గేదెను ఢీకొని..గరిడేపల్లి: బైక్పై వెళ్తున్న యువకుడు గేదెను ఢీకొట్టి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామ శివారులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదండరాంపురం గ్రామానికి చెందిన మచ్చ మహేష్(32) పని నిమిత్తం సోమవారం మఠంపల్లి మండలంలో పెదవీడు గ్రామంలో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. రాత్రి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామ శివారులోని రైస్ మిల్లు వద్ద గేదెను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సందీప్ తలకు తీవ్ర గాయాలై స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు అతడిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలుతుంగతుర్తి: తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటన తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. గానుగుబండ గ్రామానికి చెందిన గీత కార్మికుడు పంజాల సోమయ్య రోజుమాదిరిగా సోమవారం సాయంత్రం గ్రామ పరిధిలో తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి జారి కిందపడ్డాడు. దీంతో అతడి నడుము, వెన్నుపూస, చెయ్యి విరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సోమయ్యను ఆస్పత్రిలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గుండగాని రాములుగౌడ్, గుండగాని కిరణ్గౌడ్ పరామర్శించారు. జూదరులు అరెస్ట్తిరుమలగిరి(నాగార్జునసాగర్): పేకాట ఆడుతున్న నలుగురు జూదరులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ వీరశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రంలోని సందీప్ ఫాస్ట్పుడ్ సెంటర్లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా.. రంగుండ్ల గ్రామానికి చెందిన ఆంగోతు శ్రవణ్, ఆంగోతు సందీప్, మేరావత్ దస్రూ, ఆంగోతు కిషన్ పట్టుబడ్డారు. వారి నుంచి రూ.4270 నగదు, నాలుగు సెల్ఫోన్లు, మూడు బైక్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మిర్యాలగూడ మండలంలో.. మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ శివారులోని రాజీవ్ నగర్ గుబ్లీ కాలనీలో పేకాట ఆడుతున్న 8 మందిని సోమవారం రాత్రి మిర్యాలగూడ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7600 నగదు, మూడు సెల్ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
దాతలూ.. సాయం చేయరూ..
మర్రిగూడ: కూలీ పనులు చేసుకుంటూ ఉన్నంతలో తృప్తిగా బతుకుతున్న ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. కుమారుడికి తలసేమియా వ్యాధి సోకడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం స్థితిగతులు చిన్నాభిన్నమయ్యాయి. వివరాలు.. మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన బల్లెం అబ్బయ్య, స్వరూప దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు బల్లెం ప్రణయ్ గతేడాది వినాయక నిమజ్జనం రోజు నీరసించడంతో తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా తలసేమియా వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. తలసేమియా సోకిన రోగికి 15 రోజులకొకసారి కొత్త రక్తం ఎక్కించాలి. ప్రణయ్కి తలసేమియా వ్యాధి సోకినట్లు తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు వైద్య పరీక్షలు, మందులు 70 ప్యాకెట్ల రక్తం ఎక్కించినందుకుగాను రూ.5లక్షల వరకు ఖర్చు చేశారు. బైక్, బంగారం అమ్మి.. కూలీ పనులకు వెళ్తే వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో అబ్బయ్య తన బైక్, స్వరూప తన బంగారాన్ని అమ్మి మరీ ప్రణయ్కి వైద్యం చేయించారు. గ్రామానికి చెందిన పలువురు రూ.లక్ష వరకు, సమీప బంధువులు రూ.50వేల వరకు ఆర్ధికసాయం అందజేశారు. అంతేకాకుండా అప్పులు తెచ్చి కూడా తెచ్చారు. ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేకపోవడంతో కిరాయి ఇంట్లో నివాసముంటున్నారు. దాతలు దయతలిస్తేనే... హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో ప్రణయ్కి వైద్య సేవలు అందుతున్నప్పటికీ.. సమయానికి రక్తం, మందులు లభించకపోవడంతో ప్రైవేట్గా కొనుగోలు చేయాల్సి వస్తుందని అబ్బయ్య, స్వరూప వాపోతున్నారు. ఆపరేషన్కు రూ.25లక్షలు అవసరమని అందులో రూ.20లక్షలు ప్రభుత్వం సహకరిస్తే.. మరో రూ.5లక్షల కోసం దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. దయార్ధ హృదయులు సాయం చేసి తమ కుమారుడి ప్రాణాలు కాపాడాలని అబ్బయ్య, స్వరూప కోరుతున్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న 11ఏళ్ల బాలుడు రూ.5లక్షల వరకు ఖర్చు చేసిన తల్లిదండ్రులు ఆపరేషన్కు రూ.25లక్షలు అవసరం -
జాతీయ బీచ్ కబడ్డీ పోటీలకు అంపైర్గా వీరస్వామి
గరిడేపల్లి: ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం బీచ్లో 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న 12వ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు టెక్నికల్ ఆఫీషియల్(అంపైర్)గా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొంపెల్లి వీరస్వామి ఎంపికై నట్లు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేశం ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మహేందర్రెడ్డి తెలిపారు. వీరస్వామి గతంలో 49వ జూనియర్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో, వివిధ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రెఫరీగా వ్యవహరించినట్లు వారు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో నలుగురికి జైలుశిక్షకోదాడరూరల్: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన నలుగురికి ఒకరోజు జైలుశిక్ష విధిస్తూ కోదాడ కోర్టు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సత్యనారాయణ మంగళవారం తీర్పు వెలువరించారు. కోదాడ పట్టణ సీఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్రోడ్, రంగా థియేటర్ సెంటర్లో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఐదుగురు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని మంగళవాంర కోదాడ కోర్టులో హాజరుపర్చగా నలుగురికి ఒకరోజు జైలు శిక్షతో పాటు ఐదుగురికి రూ.2వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చినట్లు సీఐ తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో మినీ సర్వీస్ బ్యాంకు దగ్ధంపెద్దవూర: మండల కేంద్రంలోని మినీ సర్వీస్ బ్యాంకు మంగళవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. పులిచర్ల ఎస్బీఐ బ్యాంకు ఆధ్వర్యంలో ఎస్బీఐ వినియోగదారుల కోసం పెద్దవూర మండల కేంద్రంలోని శ్రీకోదండరామాలయం సమీపంలో మినీ సర్వీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం అందులో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వ్యాపించాయి. దీంతో ఫ్రిడ్జ్, రెండు కంప్యూటర్లు, లాప్ట్యాప్లు, ప్రింటర్లు, కౌంటర్, నాలుగు కుర్చీలు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పక్కనే డబ్బాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లు నిర్వాహకుడు చిట్టిమల్ల సరేష్ తెలిపారు. -
డాక్టర్ ఆఫ్ సోషల్ వర్కర్ అవార్డుకు ఎంపిక
చౌటుప్పల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పంతంగి లక్ష్మణ్రావు(పీఎల్ఎన్ రావు)కు డాక్టర్ ఆఫ్ సోషల్ వర్కర్–2025 అవార్డు లభించింది. జర్మనీ దేశానికి చెందిన యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ మంగళవారం ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేసింది. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పలు అంశాలను ఎంపిక చేసి ఆయా అంశాల్లో వ్యక్తులు, సంస్థలు అందిస్తున్న సేవలను గుర్తించి వారికి అవార్డులను అందజేస్తున్నారు. అందులో భాగంగా దక్షిణ భారతదేశ స్థాయిలో తమిళనాడు రాష్ట్రంలోని ఊటీలో గత మూడు రోజులుగా ప్రత్యేక సదస్సు నిర్వహించారు. అందులో భాగంగా గత 20 ఏళ్లుగా పర్యావరణంపై అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యం చేయడంతో పాటు పలు సామాజిక అంశాలపై కూడా పనిచేస్తున్న లక్ష్మణ్రావు సేవలను గుర్తించిన ఆ సంస్థ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు యూనివర్సిటీ ప్రతినిధులు ఆయనకు మంగళవారం ఊటీలో అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్రావు మాట్లాడుతూ.. పర్యావరణ హితం కోరుతూ గత ఇరవై ఏళ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు. -
పోగొట్టుకున్న సెల్ఫోన్ బాధితుడికి అప్పగింత
దేవరకొండ: దేవరకొండ ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం ప్రయాణికుడు పోగొట్టుకున్న సెల్ఫోన్ను ఆర్టీసీ అధికారులు తిరిగి అతడికి అప్పగించారు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన సుబ్బారావు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దేవరకొండకు వచ్చాడు. అక్కడ పని ముగించుకుని నల్లగొండకు వెళ్లేందుకు గాను దేవరకొండ బస్టాండ్లో బస్సు ఎక్కాడు. ఈ క్రమంలో తన రూ.30వేల విలువైన సెల్ఫోన్ను పోగొట్టుకున్నాడు. దేవరకొండ బస్టాండ్లో స్వీపర్గా పనిచేస్తున్న ముత్తమ్మకు ఆ ఫోన్ దొరకడంతో ఆమె డిపో అధికారులకు అందించింది. డిపో అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు ఫోన్ నంబర్ ఆధారంగా వివరాలు సేకరించి సుబ్బారావుకు సెల్ఫోన్ అప్పగించారు. నిజాయితీ చాటుకున్న ముత్తమ్మను ఆర్టీసీ అధికారులు అభినందించారు. -
యూట్యూబ్లో చూసి నకిలీ విత్తనాల తయారీ
సూర్యాపేటటౌన్: యూట్యూబ్లో చూసి నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను సూర్యాపేట సీసీఎస్ పోలీసులు, తిరుమలగిరి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి రూ.4.62లక్షల విలువ గల 308 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, విత్తనాల తయారీకి ఉపయోగించే మిషన్, ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన సింగారపు యాదగిరిస్వామి తిరుమలగిరి శివారులో భూమి కౌలుకు తీసుకొని పత్తి పంట సాగుచేశాడు. ఆశించినంత దిగుబడి రాకపోవడంతో తాను పండించిన పత్తి నుంచి గింజలు వేరు చేసి, యూట్యూబ్లో చూసి పత్తి విత్తనాలు తయారుచేసే మిషన్ను కొనుగోలు చేసి నకిలీ పత్తి విత్తనాలను తయారు చేయడం ప్రారంభించాడు. మొదట 308 కేజీల నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసి ప్యాకింగ్ చేశాడు. వాటిని తనకు పరిచయం ఉన్న నందపురం గ్రామానికి చెందిన నవీన్, చిర్రగూడూరుకు చెందిన సోమనారాయణకు కిలోకు రూ.1500 చొప్పున 10 కిలోలు విక్రయించాడు. వారిద్దరు కలిసి స్థానిక రైతులకు అధిక ధరకు ఈ నకిలీ పత్తి విత్తనాలు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. దీంతో మళ్లీ పత్తి విత్తనాలు కావాలని యాదగిరిస్వామిని కోరడంతో.. నవీన్కు 50 కిలోలు, సోమనారాయణకు 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలు విక్రయించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సూర్యాపేట సీసీఎస్ పోలీసులు, తిరుమలగిరి పోలీసులు యాదగిరి స్వామి కౌలుకు తీసుకున్న భూమిలో తనిఖీలు చేయగా.. నకిలీ పత్తి విత్తనాలు తయారుచేస్తూ పట్టుబడ్డాడు. అతడి నుంచి నకిలీ విత్తనాలు తయారుచేసే యంత్రం, విత్తనాల నిగారింపునకు ఉపయోగించే రంగులు, ముడిసరుకుతో పాటు 308 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. యాదగిరి స్వామి ఇచ్చిన సమాచారం మేరకు.. అతడి వద్ద విత్తనాలు కొన్న నవీన్, సోమనారాయణను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నకిలీ విత్తనాల తయారుచేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో నకిలీ విత్తనాలను గుర్తించేందుకు టాస్క్ఫోర్స్ టీం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నకిలీ విత్తనాలు తయారుచేసే వారి గురించి సమాచారం ఇస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ముగ్గురి అరెస్ట్.. రిమాండ్కు తరలింపు రూ.4.62 లక్షల విలువైన 308కేజీల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ -
నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి
భూదాన్పోచంపల్లి: వానాకాలం పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) గోపాల్ అన్నారు. మంగళవారం భూదాన్పోచంపల్లి మండలం భీమనపల్లి రైతువేదికలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు విత్తన కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం‘ కార్యక్రమంలో భాగంగా రైతులకు కేఎన్ఎం 1638 వరి, ఎంజీజీ 385 పెసర విత్తన కిట్లను అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ నీలిమ, మండల వ్యవసాయాధికారిణి ఎ.శైలజ, ఏఈఓలు శ్వేత, ప్రియాంక, స్వప్న, నరేశ్, రాజేశ్, క్రాంతి, పవిత్రన్, రైతులు పాల్గొన్నారు.ఫ జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ -
150 బస్సులు.. ఫిట్లెస్
ఫ సామర్థ్య పరీక్షలు పూర్తయినవి 198 ఫ స్కూళ్ల పునఃప్రారంభానికి దగ్గర పడుతున్న గడువు ఫ నిబంధనల ప్రకారం ముందస్తు పరీక్షలు తప్పనిసరి ఫ ఆసక్తి చూపని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు భువనగిరి : ఈ విద్యాసంవత్సరం పునఃప్రారంభానికి సమయం దగ్గరపడుతున్నా జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సులకు ఫిట్నెస్ (సామర్థ్య) పరీక్షలు చేయించుకునేందుకు యాజమాన్యాలు ఆసక్తి చూపడంలేదు. నిబంధనల ప్రకారం విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే బడి బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించి ఆర్టీఏ కార్యాలయం నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందాల్సి ఉంది. అయితే జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన బస్సులు 370 వరకు ఉన్నాయి. ఇందులో 15 ఏళ్ల కాల పరిమితి దాడిన వాటితోపాటు తుక్కు కింద వెళ్లినవి దాదాపు 22 బస్సుల వరకు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం జిల్లాలో ఇప్పటి వరకు 198 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. ఇంకా 150 వరకు బస్సులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించుకోలేదు. ఈ నెల 12న స్కూళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించుకోవడానికి ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉంది. గతేడాది పరీక్షలు లేకుండానే.. గత ఏడాది ఫిట్నెస్ పరీక్షలు చేయించకుండానే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు బస్సులను నడిపినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఈ సారైనా అధికారులు దృష్టిసారించి బడి బస్సులన్నింటికీ ఫిట్నెస్ పరీక్షలు చేయించి బడి బస్సులు ప్రమాదాల బారిన పడకుండా చూడాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇవీ..నిబంధనలు.. ● 15 ఏళ్ల కాలపరిమితి నిండిన బస్సుల్లో విద్యార్థులను రవాణా చేయడానికి వీల్లేదు. ● ప్రతి వాహనం (ప్రతి బడి బస్సు) పూర్తి కండీషన్లో ఉన్నట్టు ఆర్టీఏ అధికారులు ధ్రువీకరించాలి. ● విద్యాసంస్థ పేరు, పూర్తి చిరునామా, ఫోన్ నంబర్ బస్సు ఎడమవైపు ముందు భాగంలో కనిపించేలా ఉండాలి. ● ప్రతి విద్యాసంస్థ బస్సు, ఇతర వాహనం నడిపే వ్యక్తికి ప్రతి మూడు నెలలకు ఒక్కసారి బీపీ, కంటి, మధుమేహం వంటి పరీక్షలు చేయించుకోవాలి. ● వాహనం నడిపే డ్రైవర్కు ఐదు ఏళ్ల అనుభం ఉండాలి. ● బస్సుకు అత్యవసర ద్వారం ఉండాలి. ● ప్రతి వాహనంలో మంటలార్పే పరికరాలు తప్పనిసరిగా ఉండాలి. ● విద్యార్థులు బస్సును ఎక్కడం, దిగడం వంటి దృశ్యాలు డ్రైవర్కు కనిపించేలా అద్దం ఏర్పాటు చేసుకోవాలి. ● ప్రతి బస్సులో అటెండర్, విద్యార్థులు పట్టిక ఉండాలి. ● విద్యార్థులు పుస్తకాలను పెట్టుకోవడానికి ప్రత్యేకంగా విభాగాలు ఏర్పాటు చేయాలి.ఫిట్నెస్ పరీక్షలు లేకుంటే సీజ్ చేస్తాం విద్యాసంస్థలు ప్రారంభం నాటికి బడి బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. గడువు ముగిసిన తర్వాత పరీక్షలకు రాని బస్సులు విద్యార్థులతో రోడ్డెక్కితే సీజ్ చేస్తాం. చట్టప్రకారం కేసులు నమోదు చేస్తాం. ఇప్పటి వరకు ఎన్ని బస్సులు పరీక్షలకు వచ్చాయి..ఎన్ని రాలేదో మా వద్ద వివరాలు ఉన్నాయి. – సాయికృష్ణ, జిల్లా రవాణాశాఖ అధికారి -
దొడ్డిదారిలో.. దొడ్డుబియ్యం
ఆలేరులో రూ.10 లక్షల విలువైన బియ్యం మాయం దొడ్డుబియ్యం నిల్వలు 1,632 మెట్రిక్ టన్నులు అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఎంఎల్ఎస్ పాయింట్లు, బఫర్ గోదాములు, రేషన్ దుకాణాల్లో మొత్తం 1,632 మెట్రిక్ టన్నుల దొడ్డుబియ్యం నిల్వలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీతో దొడ్డు బియ్యానికి డిమాండ్ పెరిగింది. ప్రధానంగా హోటళ్లలో దోశలు పోయడానికి గతంలో రేషన్ బియ్యాన్ని వాడే వారు. ఇదే క్రమంలో అవే బియ్యం అక్కడక్కడ లభిస్తుండడంతో వ్యాపారులు చాటుమాటుగా కొనుగోలు చేస్తున్నారు. ఆలేరు ఎంఎల్ఎస్ పాయింట్లో దొడ్డుబియ్యం అమ్ముకున్న విషయం ఇటీవల బయటపడింది. రూ.10 లక్షల విలువ చేసే బియ్యాన్ని సదరు గోదాము ఇన్చార్జ్, డాటా ఎంట్రీ ఆపరేటర్ వేర్వేరుగా ఎవరికి వారే బ్లాక్ మార్కెట్కు తరలించి అమ్ముకున్నారు. అయితే గోదాము ఇన్చార్జ్ ఇటీవల బదిలీ అయితే ఆయన స్థానంలో మరో అధికారికి బాధ్యతలు అప్పగించారు. కొత్తగా వచ్చిన అధికారి బియ్యం నిల్వల్లో తేడాను గుర్తించి డీఎంకు తెలిపారు. దీంతో అధికారులు విచారణ ప్రారంభించారు. అయితే అక్రమాలకు పాల్పడిన అధికారి బదిలీ కావడం, ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో దొడ్డుబియ్యం జాడ దొరకలేదు. దీంతో దొడ్డు బియ్యాన్ని అమ్ముకున్నట్టు తేలింది. ఇలాంటి ఘటనలు అక్కడక్కడా జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ అధికారుల విచారణలో వెలుగు చూసిన వాస్తవం ఫ పలు చోట్ల పక్కదారి పడుతున్న దొడ్డుబియ్యం ఫ రేషన్ దుకాణాల్లో భారీగా నిల్వలు ఫ సన్నబియ్యం నిల్వకు స్థలంలేక ఇబ్బందులు -
నేడు ఆలేరు ముసాయిదా ఓటరు జాబితా
సాక్షి, యాదాద్రి : ఆలేరు మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితా బుధవారం విడుదల కానుంది. మున్సిపాలిటీలోని 2వ వార్డు సాయిగూడెం గ్రామ పంచాయతీగా మారింది. దీంతో 800కుపైగా ఓట్లు తగ్గాయి. నూతన ముసాయిదా ప్రకారం మొత్తం పన్నెండు వార్డుల్లో 13,526 ఓట్లు మున్సిపాలిటీలో ఉండగా ఆరు వార్డుల్లో గతంలో ఉన్న ఓట్లు తగ్గగా, మరో ఆరు వార్డుల్లో స్వల్పంగా పెరిగాయి. విభజనపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 11 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 12 నుంచి 16 వరకు అభ్యంతరాలు పరిశీలించి, 21న వార్డుల విభజనపై తుది నోటిఫికేషన్ జారీ కానుంది. క్షేత్రపాలకుడికి క్షీరాభిషేకంయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరంతోపాటు పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చన జరిపించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా జరిగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవలు వంటి పూజలు కొనసాగాయి. క్షయ రహిత జిల్లాగా మారుద్దాంతుర్కపల్లి : జిల్లాను క్షయ వ్యాధి రహితంగా మార్చేందుకు ఆరోగ్య సిబ్బంది, ఆశావర్కర్లు అంకితభావంతో పనిచేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ అన్నారు. క్షయ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తుర్కపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం మొబైల్ టీబీ డయాగ్నోస్టిక్ వాహనం ద్వారా వైద్యసేవలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో టీబీతో బాధపడుతున్న వారిని గుర్తించి తక్షణ చికిత్స, మందులు అందించాలన్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయిశోభ, డాక్టర్ రుచిరా, సీహెచ్ఓ రాజయ్య, ఎంపీహెచ్ఏ సునిల్కుమార్, పీహెచ్ఎన్ బిస్మిల్లా, ఎంఏ జానిపాష, ఆశావర్కర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించాలిభువనగిరి : జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు పేరు ముందు ఒలింపియాడ్, టెక్నో, జేఈఈ, ఐఐటీ, కోచింగ్, స్పెషల్ క్లాసులు వంటి పదాలను నమోదు చేయకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని డీఈఓ సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కామన్బోర్డు జారీ చేసిన ప్రశ్న పత్రాలు మాత్రమే ఉపయోగించాలని పేర్కొన్నారు. విద్యార్థుల రవాణాకు ఉపయోగించే బస్సులు, ఆటోలు పూర్తిగా ఫిట్నెస్ ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలని తెలిపారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులతోనే బోధన చేయించాలని, ఉపాధ్యాయుల పేర్లు, ఫొటో, వివరాలతో కూడిన పట్టికను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ని బంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల భాగస్వామ్యంతో నాణ్యమైన విద్యనల్లగొండ టూటౌన్ : విద్యార్థుల భాగస్వామ్యంతోనే నాణ్యమైన విద్య అందించడం, సంస్కరణలు అమలు చేయడం సాధ్యమవుతుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేసవికాలం సెలవులు జూన్ 1వ తేదీతో ముగిసినందున, విద్యార్థులంతా తిరిగి యూనివర్సిటీలో తరగతులకు హాజరు కావాలని సూచించారు. యూనివర్సిటీలోని నాలుగు కళాశాలల్లో తరగతులు, వసతి గృహాలు ప్రారంభమయ్యాయని వీసీ తెలిపారు. -
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
తుర్కపల్లి : భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ హనుమంతురావు అన్నారు. మంగళవారం తుర్కపల్లి మండలం నాగాయిపల్లి, గోపాలపురం గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలపురంలో సదస్సును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులను వచ్చిన దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడారు. అనంతరం తిరుమలాపురం గ్రామంలో ఈనెల 6న జరగనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దేశ్యానాయక్, డీటీ కల్పన, అర్ఐ జహంగీర్, రఘురామారావు, సర్వేయర్ శ్రీనివాస్, పుండరీకం, చరణ్ సింగ్, తేజశ్విని, కార్యదర్శ బాలరాజు, నాయకులు ధనావత్ శంకర్నాయక్, చాడ భాస్కర్రెడ్డి, కోమటిరెడ్డి భాస్కర్రెడ్డి, సోన్నాయిల రఘు, రైతులు, మాన్సింగ్, రహిమత్ షరీష్, పెద్దులు, మెరుగు కృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
భువనగిరిటౌన్ : ఇందిరమ్మ పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణంతోపాటు మండలంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన 1,200 మంది లబ్ధిదారులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఏకే ప్యాలెస్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కరరావుతో కలిసి ప్రొసీడింగ్ కాపీలను అందజేసి మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో హామీలు తప్ప అమలు చేసింది శూన్యమని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వకుడా నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు అవి కూలిపోయే దశలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ఇళ్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ పడుతుందన్నారు. ఇళ్ల లబ్ధిదారులు ఈ నెల 9వ తేదీలోపు ముగ్గు పోసుకు భూమిపూజ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బేస్మెంట్ పూర్తి చేసుకున్న వెంటనే ప్రభుత్వం మీ ఖాతాల్లో లక్ష రూపాయలు జమ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తీ, ఎస్సీ కార్పొరేషన్ శ్యామ్సుందర్, హౌసింగ్ పీడీ విజయ్సింగ్, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ఫ భువనగిరిలో కలెక్టర్తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత -
సీఎం పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
సాక్షి, యాదాద్రి : జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి ఈ నెల 6న సీఎం రేవంత్రెడ్డి వస్తున్న సందర్భంగా అధికారులు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మంగళవారం భవనగిరి కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలన్నారు. పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఉండాలన్నారు. అగ్నిమాపక పరికరాలు, సేవలను అందుబాటులో ఉంచాలని, అవసరమైన వైద్య ఏర్పాట్లు చేయాలని అగ్నిమాపక, ఆరోగ్య శాఖలకు సూచించారు. అలాగే వివిధ శాఖలు చేయాలని పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
ఆలయ భద్రత కట్టుదిట్టం చేయాలి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ అన్నారు. ఇటీవల ఆలయ ప్రసాద విక్రయశాలలోని గోదాములో చింతపండు దొంగతనం జరిగిన నేపథ్యంలో మంగళవారం ఆయన ప్రధానాలయంతో పాటు ఆలయ క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, మాఽఢ వీధిల్లో పర్యటించి, ఎస్పీఎఫ్, హోంగార్డుల పనితీరును పరిశీలించారు. పలు వివరాలను ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన వెంట అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, సిటీ సెక్యూరిటీ టీమ్ అడిషనల్ డీసీపీ వినోద్కుమార్, ఏసీపీ శ్రీనివాస్నాయుడు, టౌన్ సీఐ బి.భాస్కర్, రూరల్ సీఐ శంకర్గౌడ్, సీఎస్డబ్ల్యూ రిజర్వ్ ఇన్స్స్పెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, డీఈవో భాస్కర్, ఆలయాధికారులు దయాకర్రెడ్డి, రామారావు, శ్రీనివాస్రెడ్డి, సిటీ సెక్యూరిటీ టీమ్ అధికారులు ఉన్నారు. ఫ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ -
యాదగిరిగుట్ట క్షేత్రానికి భద్రత ఏది?
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. శ్రీస్వామివారికి కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఇటీవల జరిగిన చింతపండు దొంగతనం వెలుగుచూడటంతో ఆలయ భద్రతలో ఉన్న డొల్లతనం భయట పడింది. కొండపైన కమాండ్ కంట్రోల్ కార్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ సిబ్బంది, పరికరాలు లేకపోవడంతో అలంకార ప్రాయంగా మిగిలింది. యాదగిరి క్షేత్రం అభి వృద్ధి తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది. రాష్ట్ర పతి, ప్రధాని వంటి ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న ప్రముఖులతోపాటు ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, ఇటీవల విశ్వం నలుమూ లల నుంచి అందగత్తెలు వచ్చారు. ఇలా ఒకరే మిటి వివిధ స్థాయిల్లోని సెలబ్రిటీలు వస్తు న్నారు. వీరి భద్రత కోసం ఎప్పటికప్పుడు ఇతర ప్రాంతాల నుంచి పోలీసులను తీసుకు వచ్చే కంటే స్థానికంగా ఆర్మ్డ్ఫోర్స్ను సిద్ధగా ఉంచాలని గతంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా గుర్తించిన గుట్ట క్షేత్రం భద్రతకు ప్రత్యేక భద్రతా ప్రణాళికను రూపొందించారు. దేశ విదేశాల నుంచి వీవీఐ పీలు, వీఐపీలు వచ్చిన ప్రతిసారీ భద్రత కో సం రాచకొండ కమిషనరేట్ నుంచి నలు మూలల నుంచి సిబ్బందిని రప్పిస్తున్నారు. సిబ్బంది లేరు..యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం బాధ్యతలను చూడటానికి ఏసీపీ స్థాయిలో అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ డివిజన్ ఏర్పాటు చేశారు. ఏసీపీని నియమించినా.. పూర్తిస్థాయి సిబ్బంది లేరు. కొండపైన అప్హిల్ పోలీస్ స్టేషన్, సీసీఎస్, మహిళా పోలీస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ప్రస్తుతం ఉన్న యాదగిరిగుట్ట పీఎస్తోపాటు మరో పీఎస్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. వీటికి స్టేషన్ హౌస్ అధికారులుగా ఇన్స్పెక్టర్లు ఉంటారు. దీంతోపాటు మొత్తంగా ఎస్సైలు ,ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు మొత్తంగా 300 మంది వరకు అదనంగా సిబ్బంది అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సాయుధ దళం ఏర్పాటు చేయాలని..బ్రహ్మోత్సవాల సమయంలో వీవీఐపీలు గుట్టకు వచ్చినప్పుడు రక్షణ బాధ్యతలను చూడటానికి సాయుధ దళాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రిజర్వ్పోలీస్, ఆక్టోపస్ గ్రేహౌండ్స్ పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. 25 మందితో ఆక్టోపస్ పోలీస్ దళం ఉంటుందని అప్పటి డీజీపీ మహేందర్రెడ్డి వెల్లడించారు. ఇంకా అది కార్యరూపం దాల్చలేదు. 30 ఎకరాల స్థలం కేటాయింపు దేవాలయ అభివృద్ధికి కేటాయించిన భూమిలోనే 30 ఎకరాల స్థలం యాదాద్రి ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం కేటాయించారు. ఆ స్థలాన్ని చదును చేసి వదిలేశారు. నిధులు మంజూరు కాకపోవడంతో ఎలాంటి నిర్మా ణాలూ చేపట్టడం లేదు. ఇందులోనే ప్రధాన కార్యాలయాలు, పరేడ్ గ్రౌండ్, శిక్షణా కేంద్రం క్వార్టర్లు నిర్మించాలి. భద్రతకు ఏదీ ప్రాధాన్యం? ఆలయంతో పాటు భక్తుల భద్ర తకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సీసీ కెమెరాల నిఘాలో శాంతిభద్రతల పర్యవేక్షణ ఉండాలి. వైటీడీఏ (యాదా ద్రి ఆలయ అభివృద్ధి బోర్డు) స్వయంగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి. వీఐపీల తాకిడి ఎక్కువ గా ఉంటుంది. భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. దీనికి అనుగుణంగా పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉండాలి. 100 నుంచి 150 మంది సాయుధ పోలీసులు నిత్యం అందుబాటులో ఉండాలి. దాని కోసం రాచకొండ పోలీసు కమిషనరేట్కు చెందిన ఏఆర్ హెడ్క్వార్టర్ను యాదగిరి గుట్టలోనే ఏర్పాటు చేయాలి. ఏసీపీ కార్యాలయం, టెంపుల్ సిటీకి ప్రత్యేకంగా పోలీస్స్టేషన్ మంజూరు చేసి వదిలేశారు. -
జేఈఈ అడ్వాన్స్డ్లో ‘జయ’ విద్యార్థుల ప్రతిభ
సూర్యాపేటటౌన్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ జూనియర్ కళాశాల విద్యార్థులు సోమవారం విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. కళాశాలకు చెందిన జి. తేజశ్రీ 1505వ ర్యాంకు, సీహెచ్. హన్షిత శ్రీ 2040, జె. మేఘన 2146, టి. అమూల్య 4877, బి.లాస్య 5766, డి. జగదీష్రాజు 8076 ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. ఆయా కేటగిరీల్లో 13 మంది విద్యార్థులు ఐఐటీలతో పాటు జాతీయ స్థాయి కళాశాలల్లో సీట్లు సాధించే అవకాశం ఉందని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్తో పాటు డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు. -
షిర్డీ వెళ్లొస్తూ మృత్యు ఒడిలోకి..
● కారులో మంటలు చెలరేగడంతో సజీవ దహనమైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నల్లగొండ, మాడ్గులపల్లి: షిర్డీ వెళ్లి తిరిగి వస్తుండగా కారులో మంటలు చెలరేగి ప్రభుత్వ ఉపాధ్యాయుడు సజీవ దహనమయ్యాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని ఏచూరి గార్డెన్స్ సమీపంలో నివాసముంటున్న పెంటవల్లి సురేష్కుమార్(48) తన స్నేహితుడితో కలిసి కారులో షిర్డీకి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఆదివారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని ఉమ్నాబాద్ జిల్లా వద్దకు రాగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్తో పాటు సురేష్కుమార్ స్నేహితుడు క్షేమంగా బయటపడగా.. సురేష్కుమార్ మాత్రం మంటల్లో కాలి సజీవ దహనమయ్యాడు. సురేష్కుమార్ నల్ల గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చెర్వుపల్లి జెడ్పీహెచ్ఎస్లో భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అతడి భార్య జ్యోతి వైద్యశాఖలో ఎక్స్రే టెక్నీషిన్గా పనిచేస్తోంది. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారిద్దరు ఇద్దరు డాక్టర్లే కాగా.. కుమార్తె వివాహం అయ్యింది. సురేష్ నల్లగొండలో ఉంటుండగా.. జ్యోతి తన పిల్లలతో కలిసి హైదరాబాద్లో ఉంటోంది. సురేష్ అంత్యక్రియలు సోమవారం నల్లగొండలో నిర్వహించారు. టిప్పర్ను ఢీకొట్టిన బైక్● కుమారుడు మృతి, తండ్రికి తీవ్ర గాయాలుమర్కూక్(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందగా, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములర్తి గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. ములుగు ఎస్ఐ దామోదర్ కథనం మేరకు.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కొండారెడ్డిచెరువు గ్రామానికి చెందిన కర్రె కనకయ్య(33), కుమారుడు కర్రె జీవన్ (13) ఇద్దరూ వ్యాపారం నిమిత్తం కూరగాయలు కొనుగోలు చేసేందుకు బైక్పై ములుగు మండలంలోని వంటిమామిడి మార్కెట్కు వచ్చారు. కూరగాయలు కొనుగోలు చేసుకొని తిరిగి వెళ్తుండగా మండలంలోని పాములపర్తి గ్రామ శివారులో ముందు వెళ్తున్న టిప్పర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే 108 అంబులెన్స్లో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే జీవన్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కనకయ్యను మెరుగైన వైద్యం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
చోరీ జరిగిన ఏటీఎంను పరిశీలించిన ఎస్పీ
హుజూర్నగర్: హుజూర్నగర్ పట్టణంలో చోరీ జరిగిన ఎస్బీఐ ఏటీఎంను సోమవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన దొంగతనం జరిగిన తీరు, కేసు దర్యాప్తు వివరాలను సీఐ చరమంద రాజును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పట్టణంలోకి సీసీ కెమెరాలు పరిశీలించి చోరీకి పాల్పడిన వారిని వెంటనే గుర్తించాలని పోలీసులకు సూచించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత నెల బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి ఏటీఎంలు, బ్యాంకుల వద్ద సెక్యూరిటీని, సీసీ కెమెరాలను బలోపేతం చేసుకోవాలని సూచించినట్లు గుర్తుచేశారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం నార్కట్పల్లి: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం నార్కట్పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం పామనగుండ్ల గ్రామానికి చెందిన చెరుకు మహేష్(24) ద్విచక్ర వాహనంపై నార్కట్పల్లిలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చాడు. కూరగాయలు తీసుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. నార్కట్పల్లి మండల కేంద్రంలోని చైతన్య ఆస్పత్రి ఎదుట మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో మహేష్ పక్కనే ఉన్న డివైడర్కు ఢీకొనడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆటో ఢీకొని వృద్ధుడు మృతి మోత్కూరు: ఆటో ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండలం కమ్మగూడేనికి చెందిన తిప్పబత్తిని రాజయ్య(63) సోమవారం పాటిమట్ల గ్రామంలోని స్కూల్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా.. మోత్కూరు నుంచి వస్తున్న ఆటో పల్టీ కొట్టి రాజయ్యను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజయ్యకు తీవ్రగాయాలయ్యాయి. అతడిని భువనగిరి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. చెన్నాయిపాలెం విద్యార్థికి 238వ ర్యాంకుమఠంపల్లి: మండలంలోని చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన భూక్యా రవీందర్, సీతమ్మ దంపతుల కుమారుడు కోటేష్ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఎస్టీ కేటగిరీలో 238వ ర్యాంకు సాధించాడు. మారుమూల గిరిజన తండాకు చెందిన కోటేష్ అత్యుత్తమ ర్యాంకు సాధించడంతో గ్రామ పెద్దలు అభినందించారు. -
నాణ్యమైన విత్తనాలతో దిగుబడి పెంచుకోవచ్చు
హుజూర్నగర్: నాణ్యమైన విత్తనాలు వాడటం వల్ల దిగుబడిని పెంచుకోవచ్చని ఏరువాక కేంద్రం నల్లగొండ జిల్లా శాస్త్రవేత్త రాజా మధుశేఖర్ అన్నారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హుజూర్నగర్లోని వ్యవసాయ కార్యాలయం వద్ద ఏఎంసీ చైర్పర్సన్ రాధికాఅరుణ్కుమార్ అధ్యక్షతన ‘నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజా మధుశేఖర్ పాల్గొని మాట్లాడుతూ.. విత్తనాల ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. నాణ్యమైన విత్తనాలు వాడితే పది నుంచి పదిహేను శాతం దిగుబడులు పెంచుకోవచ్చని ఆయన సూచించారు. అనంతరం రైతులకు విత్తన కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ రవి, ఏఓ స్వర్ణ, పీఏసీఎస్ చైర్మన్ జక్కుల నరేందర్ పాల్గొన్నారు. -
గురితప్పని లక్ష ్యం
సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన దేప విప్లవరెడ్డి, రాజ్యం దంపతుల కుమారుడు కాంత్రికుమార్ భారత ఆర్చరీ జట్టుకు కోచ్గా ఎంపికయ్యారు. చిన్నప్పడే క్రాంతికుమార్లోని ప్రతిభను గుర్తించిన అతడి తల్లిదండ్రులు 4వ తరగతిలోనే హైదారాబాద్లోని హకీంపేటలో గల తెలంగాణ స్పోర్ట్స్ పాఠశాలలో చేర్పించారు. అక్కడ పనిచేస్తున్న ఆర్చరీ కోచ్ డాక్టర్ రవిశేఖర్ ప్రోత్సాహంతో క్రాంతికుమార్ ఆర్చరీ క్రీడలో పట్టు సాధించారు. అక్కడే బీఏ పూర్తిచేసి, హైదరాబాద్లోని నిజాం కళాశాలలో పీజీ పూర్తిచేశారు. ఆ తర్వాత కలకత్తాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో ఆర్చరీ కోచ్గా డిప్లొ మా పూర్తిచేశారు. 2024లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఆర్చరీ కోచ్గా ఉద్యోగం రావడంతో హర్యానాలోని సోనిపట్ల ప్రాంతంలో కోచ్గా ఉద్యోగంలో చేరారు. ఇటీవల మహరాష్ట్రలో నిర్వహించిన జాతీయ ఆర్చరీ జట్టు కోచ్ ఎంపికలో పాల్గొని ఈ నెల 15 నుంచి 20 వరకు సింగపూర్లో జరిగే ఆసియా కప్లో భారత ఆర్చరీ జట్టుకు కోచ్గా ఎంపికయ్యారు. క్రాంతికుమార్కు ఆర్చరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి అరవింద్, కోశాధికారి సత్యప్రసాద్, నల్ల గొండ జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి, ప్రధాన కార్యదర్శి తునిక విజయసాగర్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కామినేని, మాజీ ప్రధాన కార్యదర్శి ఈగ సంజీవరెడ్డి, కోశాధికారి పుట్ట శంకరయ్య అభినందనలు తెలిపారు. భారత ఆర్చరీ జట్టు కోచ్గా పుట్టపాక వాసి క్రాంతికుమార్ చిన్నప్పుడే అతడిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రులునిరంతరం ప్రోత్సహించారు నాలోని ప్రతిభను చిన్పప్పుడే నా తల్లింద్రడులు గుర్తించి స్పోర్ట్స్ పాఠశాలలో చేర్పించారు. నా గురువు డాక్టర్ రవిశేఖర్ నన్ను ఎంతో ప్రోత్సహించారు. రవిశేఖర్ సార్, నా తల్లిందండ్రుల ప్రోత్సాహమే నేను జాతీయ జట్టు కోచ్గా ఎంపికవ్వడానికి దోహదపడింది. భారత్ జట్టు విజయం సాధించేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతా. – దేప క్రాంతికుమార్ -
‘పది’లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సైకిళ్లు
భువనగిరి టౌన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 67 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సైకిళ్లు ఇస్తామని పరీక్షలకు ముందు కలెక్టర్ హనుమంతరావు ప్రకటించిన విషయం తెలిసిందే. సైకిళ్లను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, సీఎస్ఆర్ నిర్మాణ సంస్థ సహకారంతో సమకూర్చారు. డీఈఓకు సన్మానం టెన్త్ ఫలితాల్లో జిల్లాను రాష్ట్ర స్థాయిలో 7వ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన డీఈఓ సత్యనారాయణను శాసన మండలి చైర్మన్ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు పాల్గొన్నారు. -
మినీ శిల్పారామంతో భక్తులకు ఆహ్లాదం
భువనగిరి : యాదగిరి క్షేత్రానికి వచ్చే భక్తులు సేదదీరేందుకు మినీ శిల్పారామం ఎంతో అనువుగా ఉంటుందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. భువనగిరి మండలం రాయగిరి చెరువు వద్ద ఏర్పాటు చేసిన మినీ శిల్పారామాన్ని సోమవారం ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ శిల్పారామం తరహాలో మినీ శిల్పారామం ఉందన్నారు. చేనేత, హస్తకళాకారులకు సైతం తాము తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకునేందుకు మినీ శిల్పారామం మంచి వేదిక కానుందన్నారు. స్టాళ్లలో ఏర్పాటు చేసే చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేతను ప్రోత్సహించాలని సదర్శకులను కోరారు. అనంతరం బోటులో ప్ర యాణించారు. అదే విధంగా సురభి కళాకారుల ప్రదర్శనలు, చేనేత, హస్తకళల స్టాళ్లను తిలకించారు. ఈ కార్యక్రమంలో మినీ శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్రావు, నాయకులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య -
రిజిస్ట్రేషన్కు ఇక నిరీక్షణ ఉండదు
20 నిమిషాల్లోనే ముగిసింది యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సోమవారం ఉదయం స్లాట్ బుక్ చేశా. 20 నిమిషాల వ్యవధిలోనే క్రయవిక్రయదారుల సంతకాలు, ఫొటోలు, వేలిముద్రలు తీసుకోని రిజిస్ట్రేషన్ పూర్తి చేసి డాక్యుమెంట్ ఇచ్చారు. గతంలో ఒకటి, రెండు రోజులు వేచి చూడాల్సి వచ్చేది. నూతన విధానంతో సమయం ఆదా అయింది. –గణేష్, కొనుగోలుదారుడు, హైదరాబాద్ ఒకే రోజు స్లాట్ బుక్, రిజిస్ట్రేషన్ ఇల్లు మార్టిగేజ్ కోసం సోమవారం స్లాట్ బుక్ చేసుకున్నా ఇదే రోజు రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. డాక్యుమెంట్ తరువాత వెంటనే ఓటీపీ వచ్చింది. మొత్తం ప్రక్రియ 15నిమిషాల లోపే ముగిసింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. గతంలో రోజంతా నిరీక్షించినా రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు. వివిధ సమస్యల వద్ద కనీసం రెండు, మూడు రోజులైన పట్టేది. నూతన విధానం బాగుంది. –ఎర్రవెల్లి నాగేశ్వర్, కొండగడప, మోత్కూరు మండలంసబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు ప్రారంభంఫ నూతన విధానంతో సాఫీగా సాగిన ప్రక్రియ ఫ తొలి రోజు 44 రిజిస్ట్రేషన్లు ఫ 20 నిమిషాల వ్యవధిలోనే పూర్తి యాదగిరిగుట్ట, మోత్కూరు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ సేవలు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులోకి వచ్చాయి. మొదటి రోజు సోమవారం నాలుగు కార్యాలయాల్లో 44 రిజిస్ట్రేషన్లు స్లాట్ బుకింగ్ ద్వారా జరిగాయి. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ పూర్తికావడంతో పాటు డాక్యుమెంట్ సైతం చేతికొచ్చింది. నూతన విధానం ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ తొందరగా పూర్తవడంతో క్రయ, విక్రయదారులు సంతోషం వ్యక్తం చేశారు. స్లాట్ బుక్తో జరిగిన రిజిస్ట్రేషన్లు ఇలా.. యాదగిరిగుట్టలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 23 స్లాట్ బుక్ కాగా 23 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. మోత్కూరులో 6 రిజిస్ట్రేషన్లు కాగా ఇందులో మూడు సేల్ డీడ్, మూడు మార్టిగేజ్ డీడ్లు ఉన్నాయి. రామన్నపేటలో 3, బీబీనగర్లో 12 రిజిస్ట్రేషన్లు జరిగాయి. తప్పనున్న ఇబ్బందులు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్, దస్తావేజుల కోసం గతంలో రోజంతా సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడేది. క్రయవిక్రయదారులు గంటల తరబడి వేచిచూడకుండా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఎలాంటి సమస్కా తలెత్తలేదు నూతన విధానం ద్వారా మొదటి రోజు రిజిస్ట్రేషన్లు విజయవంతంగా పూర్తిచేశాం. ఎటువంటి సమస్య తలెత్తలేదు. గతంలో కంటే స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ తొందరగా పూర్తికావడంతో క్రయవిక్రయదారులు సంతోషం వ్యక్తం చేశారు. గుట్టలో తొలి రోజు 23 స్లాట్లకు 23 రిజిస్ట్రేషన్లు సమస్య రాకుండా పూర్తి చేశాం. –వెంకట్రెడ్డి, యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ -
త్యాగాల ఫలమే తెలంగాణ
యాదగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ యాదగిరి క్షేత్రానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం సుమారు 35 వేల మంది దర్శించుకున్నారు. వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.- IIIలోమంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025- IIలోఅన్ని వర్గాల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కలసికట్టుగా సాగుదాం. నిరంతరం శ్రమించి యాదాద్రి భువనగిరి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుపుదాం. – శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ●అమరుల ఆశయ సాధనకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన ఫ తెలంగాణను ప్రపంచస్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిరంతర కృషి ఫ సమన్వయంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుదాం ఫ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఫ కలెక్టరేట్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సాక్షి, యాదాద్రి: ఎన్నో ఏళ్ల పోరాటాలు, ఎంతోమంది త్యాగాల ఫలితంగానే స్వరాష్ట్ర కల సాకారమైందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. అనేక దశల్లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. వారి ఆశయ సాధనకు అనుగుణంగా ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రపంచస్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్రెడ్డి నిరంతర కృషి చేస్తున్నారని తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి, మహనీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న,కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ అక్షాంశ్ యాదవ్, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావుతో కలిసి పోలీసుల ఫ్లాగ్ మార్చ్ తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతిపై ప్రసంగించారు. ప్రసంగంలోని ప్రధాన అంశాలు ఇవీ.. ● మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు కోటి 30 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రూ.65.92 కోట్ల విలువగల ఉచిత ప్రయాణం. ● జిల్లాలో 1,25,910 మందికి గ్యాస్ సిలిండర్లు అందజేసి రూ.17.05 కోట్ల సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. ● ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో 17 పెలట్ గ్రామాల్లో 762 మందికి ఇళ్లు మంజూరు. రెండో విడతలో 8,191 మందిని ఎంపిక. ● భూసమస్యల పరిష్కారం కోసం భూ భారతి చట్టం తీసుకువచ్చాం. జిల్లాలో ఆత్మకూర్ (ఎం) మండలాని పైలట్ మండలంగా తీసుకొని రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. నేటి(మంగళవారం) నుంచి జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సుల నిర్వహణ. ● రైతుభరోసా పథకం కింద మొత్తం 1,88,526 మంది రైతులకు లబ్ధి. రూ.174.11 కోట్లు వారి ఖాతాల్లో జమ. ● యాసంగిలో 375 కొనుగోలు కేంద్రాల ద్వారా 39,846 మంది రైతుల నుంచి 3,51,361 మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేశాం. రూ.739 కోట్లు రైతుల ఖాతాల్లో జమ. ● 515 రేషన్ షాపుల ద్వారా 2,18,963 కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. ఈ ఏడాది మార్చి నుంచి నేటివరకు 1,915 నూతన కార్డులు మంజూరు. ● ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లు మంజూరు. ● బునాదిగాని , పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల ఆధునీకరణ పనులు ప్రారంభం. ● వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, కల్లుగీత, చేనేత, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు మొత్తం 99,402 మందికి నెలకు రూ. 24.88 కోట్ల పింఛన్. ● 10వ తరగతిలో గతంలో ఎన్నడూ లేని విధంవీ విద్యా సంవత్సరం ఉత్తమ ఫలితాల సాధన. రాష్ట్ర స్థాయిలో జిల్లా ఏడవ స్థానం. ● 428 గ్రామ పంచాయతీల్లోని 719 గ్రామీణ ఆవాసాలు, ఆరు మున్సిపాలిటీల్లో 1,56,147 ఇళ్లకు నల్లాల ద్వారా గ్రామీణ నీటి సరఫరా పఽథకం ద్వారా తాగునీటి సరఫరా. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు పూర్తిస్థాయిలో మిషన్ భగీరథ నీరు అందించేందుకు రూ.210 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ● 6,771 చేనేత మగ్గాలు, 2,240 మర మగ్గాలకు జియో ట్యాగింగ్. నేతన్నకు బీమా పథకంలో 10,686 మంది చేనేత కార్మికులను చేర్పించాం. ● ఆలేరు పట్టణంలో రూ.11 కోట్ల వ్యయంతో రైల్వే అండర్ బ్రిడ్జి పనులు. ● నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా 16,676 సీసీ కెమెరాలు ఏర్పాటు.ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకల్లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రేఖ, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, ఉద్యోగుల జేఏసీ నాయకుడు మందడి ఉపేందర్రెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ ప్రసాద్తో పాటు జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు. 6న గంధమల్లకు శంకుస్థాపన ఆలేరు నియోజకవర్గ ప్రజల ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గంధమల్ల ప్రాజెక్టు పనులకు ఈనెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 1.41 టీఎంసీల సామర్థ్యంతో ముంపు లేకుండా రూ.571 కోట్ల వ్యయంతో రిజర్వాయర్ నిర్మిస్తున్నాం. ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలో 56 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. 50 చెరువులను నింపడానికి వీలవుతుందన్నారు. గౌరవ వందనం చేస్తున్న పోలీసులున్యూస్రీల్తెలంగాణ రైజింగ్ విజన్తో ముందుకు తెలంగాణ రైజింగ్–2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రైజింగ్ విజన్లో ప్రముఖంగా పేదల సంక్షేమం, సమగ్రపాలసీల రూపకల్పన, ప్రపంచస్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తుందని గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. -
ఒక్క రోజే 90 వేల మంది!
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట చరిత్రలోనే తొలిసారిగా శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని ఆదివారం రికార్డు స్థాయిలో 90 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా ఆలయానికి తరలిచ్చారు. వేకువజాము నుంచే దైవ దర్శనానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం మొదలవడంతో ఆలయ పరిసరాలు, క్యూలు, ప్రసాద విక్రయశాల, బస్టాండ్, కల్యాణకట్ట, సత్యనారాయణస్వామి వ్రత మండపం, మెట్ల దారి కిక్కిరిసిపోయింది.స్వామి వారి ధర్మ దర్శనానికి 4 గంటలకుపైగా సమయం పట్టగా వీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. ఆదివారం రాత్రి ఆలయాన్ని మూసేసే వరకు దర్శనం కోసం క్యూలో భక్తులు నిల్చున్నారు. ఉదయం వేకువజామున 4:30 గంటల నుంచి రాత్రి 7:45 గంటల వరకు 87 వేల మందికిపైగా భక్తులు యాదగిరీశుని దర్శించుకోగా రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సుమారు 3,500 మందికిపైగానే భక్తులు దర్శించుకున్నారు. వివిధ పూజలతో ఆలయానికి నిత్యాదాయం రూ.79.51 లక్షలు వచ్చినట్లు ఈఓ వెంకట్రావ్ వెల్లడించారు.పలువురు భక్తులకు అస్వస్థత.. దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో ధర్మ దర్శనం క్యూలో, వీఐపీ క్యూ మార్గంలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. గంటల తరబడి నిల్చోలేక సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆలయ సిబ్బంది, భక్తుల కుటుంబ సభ్యులు కొండపైనే ఉన్న ఆస్పత్రికి బ్యాటరీ వాహనాల్లో తరలించి చికిత్స అందించారు. చిన్నపిల్లలతో వచ్చిన తల్లులు సైతం క్యూలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచి్చంది. దీంతో పరిస్థితిని అధికారుల ద్వారా తెలుసుకొని ఈఓ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం వేళ ఒక్కసారిగా భక్తుల రాక పెరిగే సరికి కొండపైన బస్టాండ్, వీఐపీ పార్కింగ్, శివాలయానికి వెళ్లేదారుల్లో వాహనాలు పూర్తిగా నిండిపోయాయి. ఒక దశలో టికెట్లు ఇచ్చే ప్రక్రియను అధికారులు నిలిపేసి కొండ కిందనే వాహనాలు పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టారు. -
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది
ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ తేదీ: 28–05–2024 ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం తేదీ : 31–05–2025 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 21–06–2025 ప్రత్యేక అవసరాలు గల, స్పోర్ట్స్, ఎన్సీసీ విద్యార్థులకు చివరి తేదీ : 25–07–2025 ఎంపిక జాబితా ప్రకటన : 04–07–2025 మొదటి విడత కౌన్సిలింగ్ : 07–07–2025పెద్దవూర: రాష్ట్రంలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం(ఆర్టీయూకేటీ) పరిధిలోని బాసర, మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. బాసర ట్రిపుల్ ఐటీలో 1500, ఈ యేడాది ప్రారంభం కానున్న మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీలో 180 సీట్లు కేటాయించారు. ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సులో చేరేందుకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. ప్రవేశ అర్హతలు2025లో నిర్వహించిన ఎస్ఎస్సీ, తత్సమాన పరీక్షల్లో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలలో రెగ్యులర్గా ఉత్తీర్ణులై ఉండాలి. 31–12–2024 నాటికి 18 ఏళ్లు నిండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు. బాసర ట్రిపుల్ ఐటీలో మొత్తం 1500 సీట్లకు గాను 85శాతం సీట్లు రాష్ట్ర వాసులకే కేటాయించారు. మిగతా 15శాతం సీట్లు ఓపెన్ కేటగిరిలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. రిజర్వేషన్లు ఇలా..ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 6శాతం,బీసీ–ఏ 7శాతం, బీసీ–బీ 10శాతం, బీసీ–సీ 1 శాతం, బీసీ–డీ 7శాతం, బీసీ–ఈ 4శాతం, ప్రత్యేక కేటగిరీలో దివ్యాంగులకు 3శాతం, ఈడబ్ల్యూఎస్ 10 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2శాతం, ఎన్సీసీ విద్యార్థులకు 1శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5శాతం భర్తీ చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కాకుండా వేరే రాష్ట్రాల వారికి, భారతీయ ఫౌరసత్వం కలిగిన అంతర్జాతీయ విద్యార్థులకు, గల్ప్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్ల లకు అదనపు సీట్లు కేటాయిస్తారు. అన్ని విభాగాల్లో బాలికలకు 33.33శాతం ప్రవేశాల్లో రిజర్వేషన్ పాటిస్తారు. విద్యార్థులు మీసేవా, పీఎస్ ఆన్లైన్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.450, ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.500, ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు రూ.1500 లు, ఎన్ఆర్ఐ అభ్యర్థులు 100 యూఎస్ డాలర్లు ప్రవేశ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. సెంటర్ సర్వీస్ చార్జీ కింద మరో రూ.25లు వసూలు చేయనున్నారు. ప్రవేశ విధానం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వం, నాన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇతర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వెనుకబాటు సూచిక కింద 4శాతం మార్కులు(ప్రతి సబ్జెక్టుకు 4 మార్కులు మొత్తం 24 మార్కులు) విద్యార్థికి వచ్చిన పదో తరగతి మార్కులకు జత కలిపి ప్రవేశాల్లో ప్రాధాన్యత కల్పిస్తారు. సీట్ల కేటాయింపు సందర్భంలో సమాన మార్కులు వస్తే అభ్యర్థులకు సబ్జెక్టు వారీగా వచ్చిన మార్కులకు ప్రాధాన్యత ఇస్తారు. మొదట గణితం, తర్వాత జనరల్ సైన్స్, ఆ తర్వాత ఇంగ్లిష్, ఆ తర్వాత సోషల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే ఫస్ట్ లాంగ్వేజ్లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. గ్రేడ్ పాయింట్లు సమానమైతే విద్యార్థి పుట్టిన తేదీ ప్రకారం పెద్ద వయస్సు ఉన్నవారికి అవకాశం ఇస్తారు. ఇవి సమానంగా ఉంటే హాల్ టికెట్ నంబర్ను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. కౌన్సిలింగ్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలు దరఖాస్తు చేసుకున్న సమయంలో పేర్కొన్న పత్రాలన్నింటిని కౌన్సిలింగ్కు వచ్చే సమయంలో దగ్గర ఉంచుకోవాలి. ఆన్లైన్ ధరఖాస్తు ఫారం ప్రింట్ అవుట్, దరఖాస్తు చేసుకున్న రశీదు, ఆధార్ కార్డు, పదో తరగతి హాల్ టికెట్, మార్కుల షీటు, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రాలు, వికలాంగులైతే వైకల్య ధ్రువీకరణ పత్రం, సైనికోద్యోగుల పిల్లలు సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువపత్రం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులైతే సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువపత్రాలు సమర్పించాలి. కౌన్సిలింగ్కు ఎంపికై న విద్యార్థుల జాబితా యూనివర్సిటీ వెబ్సైట్ www.rgukt.ac.in లేదా www.admissions. rgukt.ac.in లో ప్రదర్శించనున్నారు.30హెచ్ఎల్ఏ201,202 బాసర, మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీల్లో 2025–26లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ జూలై 4న ఎంపిక జాబితా ఈ ఏడాది నుంచే ప్రారంభంకానున్న మహబూబ్నగర్ ట్రిపుల్ఐటీలో 180 సీట్లు కేటాయింపు -
కల్తీ ఇంజన్ ఆయిల్ వ్యాపారి అరెస్టు
సూర్యాపేటటౌన్ : కల్తీ ఇంజన్ ఆయిల్ తయారు చేసే వ్యాపారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం సూర్యాపేటలోని జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ నరసింహ వెల్లడించారు. శుక్రవారం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద సీసీఎస్, కోదాడ రూరల్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా కల్తీ ఇంజన్ ఆయిల్ బాటిల్స్తో వ్యాపారి పట్టుబడ్డాడు. అతడిని విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన కాకాని నాగ వెంకటేశ్వరరావుగా గుర్తించారు. అతడు విజయవాడలోని ఓ ఇంజన్ ఆయిల్ కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేశాడు. ఇంజన్ ఆయిల్ తయారీలో అనుభవం ఉన్న నాగ వెంకటేశ్వరరావు సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. ఈక్రమంలో కలకత్తా నుంచి ప్రముఖ కంపెనీలకు చెందిన ఆయిల్ డబ్బాల స్టిక్కర్లు, లేబుల్స్, ప్లాస్టిక్ టిన్స్ తెప్పించాడు. విజయవాడలో దొరికే మడ్డి ఆయిల్ ఫిల్టర్ చేసే వారి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి విజయవాడలో తన ఇంటి వద్దనే లీటర్ ప్లాస్టిక్ బాటిల్స్లో నింపి స్టిక్కర్లు అతికించి లీటర్ రూ.200 చొప్పున బైక్ మెకానిక్లకు విక్రయించడం ప్రారంభించాడు. 2007లో విజయవాడలోని తన ఇంటిలో కల్తీ ఇంజన్ ఆయిల్ను బాటిల్స్లో నింపుతుండగా విజయవాడ వన్ టౌన్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశాడు. రెండు రోజులు విజయవాడ జైల్లో ఉన్నాడు. తర్వాత వ్యాపారం బంద్ చేశారు. మళ్లీ కల్తీ ఇంజన్ ఆయిల్ తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయిల్ బాటిల్స్ను కారులో వేసుకుని నేరేడుచర్ల, మిర్యాలగూడ బైక్ మెకానిక్లకు అమ్ముతున్నాడు. శుక్రవారం ఉదయం కారులో కల్తీ ఇంజన్ ఆయిల్ బాటిల్స్తో రామాపురం క్రాస్ రోడ్డు వద్దకు వస్తుండగా సూర్యాపేట సీసీఎస్ పోలీసులు, కోదాడ రూరల్ పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. అతడి నుంచి రూ.2లక్షల విలువైన ఆయిల్తోపాటు, కారును స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సీసీఎస్ సీఐ శివ, సిబ్బంది, కోదాడ రూరల్ సీఐ రజితరెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, కోదాడ రూరల్ సీఐ రజితరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడి నుంచి రూ.2లక్షల విలువైన కల్తీ ఆయిల్తోపాటు, కారు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ -
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం
సూర్యాపేట అర్బన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలో బూర వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆపరేషన్ కగార్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, మావోయిస్టులతో చర్చలు జరిపి ఆపరేషన్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలతో పాటు ఇందిర ఇళ్లు ఇవ్వాలన్నారు. జూన్ 8న సీపీఐ జిల్లా మహాసభలను జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్న చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు ఎల్లవుల రాములు, ఉస్తెల నారాయణరెడ్డి, ధూళిపాల ధనుంజయ నాయుడు, మేకల శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, మండవ వెంకటేశ్వర్లు, ఎల్లంల యాదగిరి, పోకల వెంకటేశ్వర్లు, హనుమంతరావు, గుండు వెంకటేశ్వర్లు, దేవరం మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి -
వ్యవసాయంలో ఆధునికతను జోడించాలి
కోదాడరూరల్ : వ్యవసాయంలో ఆధునికతను జోడించి రైతు సాధికారత సాధించడమే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత కృషి సంకల్ప అభియాన్ లక్ష్యమని భారత వరి పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ మానస తెలిపారు. శుక్రవారం కోదాడ మండల పరిధిలోని గణపవరం, చిమిర్యాలలో కేవీకే గడ్డిపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వానాకాలం సాగులో సుస్థిరమైన సాగు పద్ధతులు, శాసీ్త్రయతపై రైతులకు అవగాహన కలిగించారు. పంటల ఉత్పత్తి, నేల ఆరోగ్యం, వనరుల నిర్వహణ మెరుగుపరచడంపై రైతులు దృష్టి సారించాలన్నారు. భూసార పరీక్షల ఆధారంగా కావాల్సిన మోతాదులో మాత్రమే ఎరువులు, మందులను వినియోగించాలన్నారు. నేరుగా వరి విత్తనాలు విత్తే విధానంపై రైతులు అవగాహన పెంచుకొని తక్కువ శ్రమ, పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించాలని కోరారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు కిరణ్, ఎంఏఓ రజిని, ఏఈఓ ఝూన్సీ, మహేష్, డాక్టర్ కవిరాజు రైతులు సీతరాంరెడ్డి, సత్యనారాయణ, నరసింహరావు, నారపురెడ్డి, వెంకటేశ్వరరావు, గోపిరెడ్డి, రాములు, కన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యువకుడిపై దాడి.. కేసు నమోదు
గరిడేపల్లి: దారివ్వమని అడిగినందుకు యువకుడిపై దాడి చేసిన ఘటనలో శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండల పరిధిలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన దుపాటి మోహన్ హుజూర్నగర్ పట్టణంలో డిగ్రీ పరీక్షలు రాసి తిరిగి బైక్పై ఇంటికి వస్తున్నాడు. మార్గమధ్యంలో గ్రామానికి చెందిన మామిడి రమేష్ ఇంటి ముందుకురాగానే మండలంలోని రాయినిగూడెం గ్రామానికి చెందిన సిద్ధు, హుజూర్నగర్ పట్టణానికి చెందిన సంపత్, జీవన్, నరేష్, మాధవరాయినిగూడెం గ్రామానికి చెందిన కాటబోయిన విష్ణు, నిమ్మల విష్ణు మరికొంత మంది యువకులు డీజే పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. వారిని దారి ఇవ్వమని అడిగినందుకు మోహన్పై దాడి చేసి గాయపర్చారు. ఈమేరకు మోహన్ తల్లి దుపాటి నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శుక్రవారం తెలిపారు.డీజే నిర్వాహకుడిపై కేసుగరిడేపల్లి: మండల పరిధిలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన గణేష్ వివాహం సందర్భంగా అనుమతి లేకుండా డీజే పెట్టినందుకు డీజే నిర్వాహకుడు, వాహనం సీజ్ చేసినట్లు ఎస్ఐ చలిగంటి నరేష్ శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి కాల్వపల్లి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా చనగాని నర్సింహరావు అనుమతి లేకుండా డీజే నిర్వహిస్తుండడంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.వంట గ్యాస్ పైపు లీకేజీసంస్థాన్ నారాయణపురం: మండల కేంద్రంలో శుక్రవారం ఇంటిలో వంట గ్యాస్ పైపు లీకేజీ కావడంతో మంటలు అంటుకున్నాయి. మండల కేంద్రానికి చెందిన కర్నాటి పాండు ఇంట్లో కుటుంబసభ్యులు వంట చేస్తుండగా స్టౌవ్కు ఉన్న పైపు వద్ద గ్యాస్ లీకేజీ అయి మంటలు వచ్చాయి. అందోళన చెంది బస్తాలు కప్పడంతో బస్తాకు మంటలు అంటుకుని పొగ అలుముకుంది. పోలీసులు, ఫైర్ స్టేషన్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. తడి బస్తాలు కప్పి మంటలు ఆర్పివేశారు. రెగ్యులేటర్ ఆఫ్ చేసి, సిలిండర్ను ఇంటి నుంచి బయటకు తీసుకురావడంతో ప్రమాదం తప్పింది.విద్యుదాఘాతంతో యువకుడి మృతిమఠంపల్లి: మండలంలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన గోపిశెట్టి లక్ష్మీనారాయణ(28) శుక్రవారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనారాయణ స్థానికంగా మిషన్ భగీరథ మంచినీటి సరఫరా విభాగంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గ్రామ పరిధిలో గల తన వ్యవసాయ పొలంలో నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. విద్యుత్ మోటార్ ఆన్ చేస్తే పనిచేయలేదు. ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని భావించి ట్రాన్స్ఫార్మర్ను పరిశీలిస్తుండగా.. ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ వైరు తగిలి షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్యా, ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మఠంపల్లి పోలీసులు తెలిపారు. -
భద్రతా లోపం ఏమీ లేదు
● ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ప్రసాద తయారీ కేంద్రం నుంచి చింతపండు దొంగతనం జరిగిన ఘటనలో ఎస్పీఎఫ్ పోలీసుల భద్రతా లోపం ఏమీ లేదని, ఆలయ పరిసరాల్లో ఎస్పీఎఫ్, హోంగార్డులతో పటిష్ట బందోబస్తు ఉందని ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు అన్నారు. యాదగిరి కొండపైన శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగతనం జరిగిన రోజు రాత్రి 8.20గంటలకు ఇద్దరు వ్యక్తులు ఓ కారులో వచ్చారని, అర్ధరాత్రి 2గంటల తరువాత కారును శివాలయం సమీపంలోని ప్రసాదం టిక్కెట్ కౌంటర్ సమీపంలో పార్కింగ్ చేశారన్నారు. ఆ సమయంలోనే చింతపండు బస్తాలను కారులో పెట్టారని, ఈ క్రమంలో పెట్రోలింగ్ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు తప్పించుకునే ప్రయత్నం చేశారని, వెంటనే అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఇద్దరిని పట్టుకొని విచారించగా చింతపండు దొంగతనం చేసినట్లు తెలిపారన్నారు. దొంగలను పట్టుకున్నది భద్రతా సిబ్బందేనని, ఇందులో భద్రత లోపం ఏమీ లేదన్నారు. సమావేశంలో ఎస్పీఎఫ్ ఎస్ఐ అనిల్, ఏఎస్ఐ మాణిక్ప్రభు ఉన్నారు. తాటి చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతివలిగొండ : ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన వలిగొండ మండలంలోని వెల్వర్తిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెల్వర్తికి చెందిన గీత కార్మికుడు కొమ్మగాని వెంకటేశం (48) శుక్రవారం కల్లు గీయటానికి తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు జారి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. పక్క పొలంలోని రైతు ప్రమాదాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు ఘటనా స్థలానికి వెళ్లి 108 అంబులెన్స్లో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగంధర్ తెలిపారు. -
గంజాయి సాగుచేస్తున్న నలుగురి అరెస్ట్
పెద్దఅడిశర్లపల్లి: గంజాయి సాగుచేస్తున్న నలుగురు వ్యక్తులను గుడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద గుడిపల్లి పోలీస్ స్టేషన్లో దేవరకొండ ఏఎస్పీ మౌనిక విలేకరులకు వెల్లడించారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మట్టూరు గ్రామానికి చెందిన దెరగుంల సింగరావు కొండమల్లేపల్లిలో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల గ్రామ శివారులో గల నాగిళ్ల పాండరయ్య వ్యవసాయ భూమిని పిల్లిగుంటతండాకు చెందిన ఇస్లావత్ చందూతో కలిసి సింగరావు కౌలుకు తీసుకున్నారు. పండ్ల వ్యాపారంలో భాగంగా సింగరావుకు నాంపల్లి మండలం బండతిమ్మాపురం గ్రామానికి చెందిన కొత్తగొల్ల శ్రీను పరిచయమయ్యాడు. సింగరావుకు శ్రీను కొన్ని గంజాయి విత్తనాలు ఇచ్చి వాటి మొక్కలుగా పెంచి ఇస్తే డబ్బులు ఇస్తానని చెప్పడంతో కౌలుకు తీసుకున్న భూమిలో సింగరావు గంజాయి విత్తనాలు నాటాడు. అవి మొక్కలుగా పెరిగిన తర్వాత శ్రీనుకు ఇచ్చాడు. శ్రీను రూ.5 వేలు సింగరావుకు ఇవ్వగా అందులో నుంచి రూ.2 వేలు చందూకు ఇచ్చాడు. శ్రీనుతో పాటు రేవల్లి గ్రామానికి చెందిన వంగూరి శివ కలిసి గంజాయి మొక్కలను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. ఇదే క్రమంలో శ్రీను తిరిగి సింగరావుకు 30 గంజాయి విత్తనాలు ఇవ్వగా చందూతో కలిసి కౌలుకు తీసుకున్న భూమిలో నాటారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తన సిబ్బందితో కలిసి సింగరావు కౌలుకు తీసుకున్న వ్యవసాయ భూమిపై దాడి చేసి 30 గంజాయి మొక్కలు, బైక్, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. సింగరావుతో పాటు చందూ, శ్రీను, శివను అరెస్ట్ చేశారు. నిందితులను పట్టుకున్న కొండమల్లేపల్లి ఇన్చార్జి సీఐ రాజు, గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు, కొండమల్లేపల్లి ఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బంది గురువారెడ్డి, హట్టి, ఏడుకొండల్, రామకృష్ణ, శివ, మౌనిక, రవి, యాదగిరి, లింగయ్య, ఆనంద్ను ఏఎస్పీ అభినందించారు. 30 గంజాయి మొక్కలు, బైక్, 4 సెల్ఫోన్లు స్వాధీనం -
పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్: పెట్రోల్ బంకులను టార్గెట్గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని నాగార్జునసాగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన అనాల శివ పెట్రోల్ బంకుల్లోకి వెళ్లి, తన బంధువులు ఆస్పత్రిలో ఉన్నారని.. డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి తన ఏటీఎం కార్డుతో స్వైపింగ్ మిషన్ ద్వారా పెట్రోల్ బంకు అకౌంట్కు డబ్బులు పంపి నగదును తీసుకునేవాడు. ఈ తర్వాత స్వైపింగ్ కార్డు ద్వారా వైడ్ అనే ఆప్షన్తో తాను పంపిన డబ్బులను తిరిగి తన అకౌంట్కే పంపించుకునేవాడు. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో మోసాలకు పాల్పడ్డాడు. ఈ నెల 16వ తేదీన నాగార్జునసాగర్లో హైవే పక్కన ఉన్న భారత్ పెట్రోల్ బంక్కు వెళ్లి తనకు డబ్బులు అవసరం ఉన్నాయని స్వైపింగ్ చేసి డబ్బులు తీసుకుని తిరిగి స్వైపింగ్ ద్వారా వైడ్ అనే ఆప్షన్తో తన అకౌంట్కు డబ్బులు పంపించుకున్నాడు. ఈ మోసాన్ని గుర్తించిన బంకు యజమాని బొమ్మిడి బ్రహ్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ బి. శ్రీనునాయక్ గురువారం నాగార్జునసాగర్ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన అనాల శివ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా అతడిని పోలీసులు వెంబడించి పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. నిందుతుడి నుంచి రూ.2లక్షల నగదు, బైక్,, 6 ఏటీఎం కార్డులు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో నాగార్జునసాగర్ సీఐ బి. శ్రీనునాయక్, ఎస్ఐ ఎస్. సంపత్, కానిస్టేబుళ్లు రామకోటి, జావేద్, సురేష్, సతీష్, వెంకన్న, సతీష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రూ.2లక్షల నగదు, బైక్, 6 ఏటీఎం కార్డులు స్వాధీనం -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మేళ్లచెరువు: బైక్పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన గురువారం మేళ్లచెరువు మండల పరిధిలోని కందిబండ గ్రామ సమీపంలో జరిగింది. ఎస్ఐ పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన నాగులు(45) పని నిమిత్తం బైక్పై గురువారం మేళ్లచెరువుకు వస్తుండగా.. కందిబండ సమీపంలో గుర్తుతెలియని వాహనం అతడి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగులును స్థానికులు 108 వాహనంలో కోదాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య రహీనాబేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో.. రామన్నపేట: ఇంట్లో సంపు మోటారు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతిచెందింది. ఈ ఘటన గురువారం రామన్నపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన అనిత(33)కు రామన్నపేటకు చెందిన జూకంటి మహేష్తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. మహేష్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అనిత గురువారం ఉదయం ఇంట్లో నీటి సంపు మోటారును ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. మృతురాలి భర్త మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి. మల్లయ్య తెలిపారు. పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేతచౌటుప్పల్: అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని గురువారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడలోని పశువుల సంత నుంచి కొనుగోలు చేసిన ఐదు గోవులు, ఆరు ఎద్దులను ప్రత్యేక వాహనంలో హైదరాబాద్కు తరలిస్తుండగా.. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని తంగడపల్లి క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. కోదాడకు చెందిన వాహన డ్రైవర్ షేక్ అషీమ్, కొండ వీరకృష్ణ, కుంబజాడ సాయిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. పట్టుబడిన గోవులు, ఎద్దులను గోశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. మునగాలలో.. మునగాల: అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని గురువారం ఉదయం విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై మునగాల మండలం మొద్దులచెరువు గ్రామ స్టేజీ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ బి. ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మొద్దులచెరువు గ్రామ స్టేజీ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. కోదాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనంలో రెండు ఎద్దులు, ఆరు ఆవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి హైదరాబాద్లోని జియాగూడ గోశాలకు తరలించామన్నారు. కోదాడ పట్టణానికి చెందిన షేక్ ఖాజామోయినుద్దీన్, వాహన డ్రైవర్ అనిల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
గొర్రెలకు పొంచి ఉన్న చిటుకు వ్యాధి ముప్పు
త్రిపురారం: గొర్రెలకు సోకే వ్యాధుల్లో చిటుకు వ్యాధి అత్యంత ప్రమాదకరమైంది. ఈ వ్యాధిని నెత్తి పిడుగు, గడ్డి రోగం, పాటు రోగం వంటి పేర్లతో పిలుస్తుంటారు. గొర్రెలు తొలకరి వర్షాలకు మొలిచిన గడ్డిని ఎక్కువగా తినడం వల్ల చిటుకు వ్యాధి సోకుతుంది. బలిష్టంగా పెరిగి యుక్త వయసులో ఉన్న గొర్రెలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేత కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లె గొర్రెల్లో ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి నివారణకు గొర్రెల పెంపకందారులు సకాలంలో జాగ్రత్తలు పాటిస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చని త్రిపురారం మండల పశువైద్యాధికారి నాగేందర్ సూచిస్తున్నారు. తొలకరిలో లేత గడ్డి తినడం వలన.. తొలకరి వర్షాలకు పొలాలు, గట్లపై పెరిగిన లేత గడ్డిని గొర్రెలు ఇష్టంగా తింటాయి. తద్వారా క్లాస్రీడీయం ఫర్ ఫ్రిస్జర్స్ టైప్–డీ రకం సూక్ష్మజీవులు జీవాల పేగుల్లో గాలి లేని వాతావరణంలో అభివృద్ధి చెందుతాయి. ఈ సూక్ష్మజీవులు వదిలిన విష పదార్థాలు చిటుకు వ్యాధికి కారణమవుతాయి. మే నెల ఆఖరు నుంచి జూలై నెల మధ్యలో ఈ వ్యాధి ఎక్కువగా గొర్రెలకు సోకుతుంది. ఈ వ్యాధి సోకిన గొర్రెలు ఎగిరి కిందపడి కాళ్లు గిలగిల కొట్టుకుంటూ, పళ్లు కొరుకుతూ బిగుసుపోయి ప్రాణాలు కోల్పోతాయి. వ్యాధి సోకిన జీవాలు మేత మేకపోవడం, నెమరు వేయకపోవడం, తలలు వాల్చి ముడుచుకొని ఒకే చోట నిలబడతాయి. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స చేయించాలి. నివారణ మార్గాలు జీవాలకు ప్రతి యేటా ఏప్రిల్, మే నెల మధ్యలో వ్యాధి నిరోధక టీకా (మల్టీకాంపోనెంట్ ఈటీ వ్యాక్సిన్) తప్పనిసరిగా వేయించాలి. రెండో విడత అక్టోబర్, నవంబర్ నెలల్లో వేయించాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని పశు వైద్యులను సంప్రదించాలి. తొలకరి వర్షాలకు మొలిచిన, వాడిపోయిన గడ్డిని జీవాలు మేయకుండా జాగ్రత్తలు పాటించాలి. గొర్రెలను ఉదయం కొంచెం ఆలస్యంగా మేతకు తీసుకెళ్లాలి. మధ్యాహ్నం చెట్ల కింద కాస్త విశ్రాంతి తీసుకునే విధంగా చూడాలి. సాయంత్రం ఎక్కువ సేపు పొలంలో ఉండకుండా దొడ్లలోకి తీసుకెళ్లాలి. వ్యాధి సోకిన గొర్రెలను మందలకు దూరంగా ఉంచాలి. ఇలాంటి జాగ్రత్తలతో చిటుకు వ్యాధి సోకకుండా చూసుకోవడంతో పాటు వ్యాధి బారిన పడిన జీవాలను కాపాడుకోవచ్చు. ముందస్తుగానే ఎంట్రో టాక్సీనియా టీకా వేయించాలి త్రిపురారం మండల పశువైద్యాధికారి నాగేందర్ సూచన -
ఉపాధి పనుల్లో విద్యావంతులు
పలువురు మాజీ ప్రజాప్రతినిధులు సైతం కరువు పనికి.. డిగ్రీలు, పీజీలు చేసిన విద్యావంతులతో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు సైతం ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఖాళీ సమయాల్లో, మరికొందరు ఉన్నత ఉద్యోగాలు రాక పలుగు, పార పట్టుకుంటున్నారు. మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీపీలు సైతం లాభాపేక్ష లేకుండా రాజకీయాలు చేసి ఇప్పుడు కుటుంబ పోషణ కోసం ఉపాధి కూలీలుగా మారారు. చదువుల ఖర్చు కోసం.. అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహడ్ గ్రామానికి చెందిన మచ్చ వాణి డీఎంఎఫ్టీ నర్సింగ్ పూర్తి చేసింది. ప్రస్తుతం గ్రామంలో జరిగే ఉపాధి పనులకు ప్రతిరోజు వెళ్తోంది. చదువుల ఖర్చు వెళ్లదీసుకోవడానికి ఉపాధి పనులకు వెళుతున్నట్లు ఆమె పేర్కొంది. ఖాళీ సమయాల్లో ఉపాధి పనులకు వెళ్లి ఆ తర్వాత చదువుకుంటున్నట్లు ఆమె చెప్పారు.పీజీ ఎగ్జామ్కు సన్నద్ధమవుతూ..తిప్పర్తి: తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని నూకలవారిగూడేనికి చెందిన తండు సైదులు డిగ్రీ పూర్తిచేసి గ్రూప్స్కు పరీక్షలు రాశాడు. పీజీ చేసేందుకు సన్నద్ధమవుతూ ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాడు. ఈ సీజన్లో వారం పాటు పనులకు వెళ్లాడు. గత సీజన్ మొత్తం ఉపాధి హామీ పనులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూనే.. అర్వపల్లి: ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తూనే వేసవి సెలవుల్లో ప్రతిరోజు ఉపాధి పనికి వెళ్తున్నారు జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని కాసర్లపహడ్ గ్రామానికి చెందిన మట్టిపల్లి సతీష్, ఎంఎస్సీ పూర్తిచేశారు. ఉదయం వేళ ఉపాధి పనికి వెళ్లి ఆ తర్వాత ఇతర పనులు చేసుకుంటానని సతీష్ పేర్కొన్నారు. -
చెన్నకేశ్వరస్వామి దేవాలయంలో చోరీ
భూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్లో గల చెన్నకేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గుండ్ల రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి చెన్నకేశ్వరస్వామి ఆలయం గేటుకు వేసిన తాళంతో పాటు గర్భగుడి తాళాలను పగులగొట్టి లోనికి వెళ్లి హుండీలోని నగదుకు ఎత్తుకెళ్లారు. హుండీని ఆలయ సమీపంలోని ఓ రైతు పొలంలో పడేశారు. గురువారం ఉదయం కారింగు బాలయ్య గుడిని శుభ్రం చేసేందుకు వెళ్లగా.. ఆలయం గేటుకు వేసిన తాళాలు పగులగొట్టి ఉండటం గమనించి గ్రామస్తులకు సమచారం ఇచ్చాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఇన్చార్జి ఎస్ఐ జగన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. హుండీలో సుమారు రూ.50వేల నగదు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇదే దేవాలయంలో గతంలో కూడా దొంగలు చోరీకి పాల్పడి అమ్మవారి మెడలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మాడ్గులపల్లి: రోడ్డు ప్రమాదంలో తీవ్రగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. ఎస్ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం తోపుచర్ల గ్రామానికి చెందిన బొప్పని సుధాకర్(42) హైదరాబాద్లో ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం తోపుచర్ల నుంచి కుక్కడం గ్రామానికి బైక్పై వెళ్తుండగా.. కుక్కడం గ్రామ శివారులో బైక్ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుధాకర్ను స్థానికులు మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఈ నెల 19న హైదరాబాద్కు తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్యమాడ్గులపల్లి, నల్లగొండ: ఆర్థిక ఇబ్బందుల కారణంగా జీవితంపై విరక్తితో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలం సిలార్మియాగూడేనికి చెందిన రాయి మహేందర్ (21) ప్రైవేట్ ఫైనాన్స్లో పనిచేస్తున్నాడు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా జీవితంపై విరక్తి చెందిన మహేందర్ గురువారం కొత్తగూడెం గ్రామ శివారులో గుంటూరు నుంచి వికారాబాద్ వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించగా.. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మహేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే ఎస్ఐ బి. రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైల్లో నుంచి జారిపడి..నల్లగొండ: నల్లగొండ–శ్రీరాంపురం రైల్వే స్టేషన్ల మధ్యన సుమారు 45ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి గురువారం రైలు నుంచి జారిపడి మృతిచెందినట్లు రైల్వే ఎస్ఐ బి. రామకృష్ణ తెలిపారు. మృతుడు తెలుపు రంగు టీషర్టు, నీలం రంగు బనియన్, నలుపు రంగు నిక్కర్ ధరించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658595 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు.వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాతం సేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభేషికం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఆ తరువాత గజవాహన సేవ, స్వామి, అమ్మవారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ అష్టోత్తర తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం వేళ వెండి జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
బడిబాటతో విద్యార్థుల సంఖ్య పెంచాలి
సాక్షి,యాదాద్రి : బడిబాట కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి కోరారు. గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశమై జూన్ 6నుంచి నిర్వహించే బడిబాట కార్యక్రమంపై సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విషయం, డిజిటల్ బోధన, సుశిక్షితులై ఉపాధ్యాయులు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఇతర సౌకర్యాలను తల్లిదండ్రులకు తెలియజేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీపీఓ సునంద, డీఎంహెచ్ఓ మనోహర్, సంక్షేమ అధికారులు నరసింహారావు, యాదయ్య, వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి -
వంద రోజుల్లో సమస్యల పరిష్కారం
భువనగిరిటౌన్ : మున్సిపాలిటీల అభివృద్ధిపై యంత్రాంగం దృష్టి సారించింది. ఇందుకోసం యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది. ముఖ్యంగా పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, స్వచ్ఛతపై ఇంటింటి ప్రచారం, పార్కులను అభివృద్ధి చేయటం, శిథిల భవనాలను గుర్తించి యజమానులకు నోటీసులు జారీ, వైద్యశిబిరాల నిర్వహణ తదితర సమస్యలపై అధికారులు ఫోకస్ పెట్టారు. గుర్తించిన సమస్యలను రోజు వారీ కార్యక్రమాల ద్వారా వంద రోజుల్లో పరిష్కరించనున్నారు. జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉండగా అన్ని చోట్ల జూన్ 2నుంచి కార్యాచరణ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్ర మాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేయనున్నారు.రోజువారీ కార్యక్రమాలు ఇలా..● వరద కాల్వల్లో పూడికతీత● మొక్కలు నాటడానికి స్థలాల గుర్తించడం● మొక్కల సేకరణ, నర్సరీలో నిల్వలపై పరిశీలన● భువన్ సర్వేకోసం వార్డులవారీగా అధికారుల నియామకం● ఆస్తిపన్ను సమాచారాన్ని వేరు చేయడం● మంచినీటి కుళాయి కనెక్షన్ల నవీకరణ● ఆస్తుల మార్పిడికి సంబంధించిన ధ్రువపత్రాల సేకరణ● వైద్యారోగ్య శిబిరాల నిర్వహణకు వైద్యులతో సంప్రదింపులు● టెండర్లు పిలిచి పార్కులను మరింత అభివృద్ధి చేయటం● విభాగాలకు అప్పగించిన పనులకు సంబంధించి ఉద్యోగులకు అంతర్గత సర్క్యులర్లు జారీ.● చేపట్టిన పనులు రోజువారీగా పర్యవేక్షణ, నివేదికలు ఇచ్చేందుకు వార్డుల వారీగా అధికారుల నియామకం.● స్వచ్ఛతపై ఇంటింటి ప్రచారం, అందుకు అవసరమయ్యే వాహనాలు, సిబ్బంది, సామగ్రి సమకూర్చుకోవడం● వీధి వ్యాపారుల తాత్కాలిక కమిటీల ఏర్పాటు● వ్యాపార, వాణిజ్య సముదాయాలను గుర్తించి నమోదు చేస్తారు.● కొత్తగా స్వయం సహాయక సంఘాలఏర్పాటు● ఇందిరా, మహిళా శక్తి మిషన కింద అర్హత కలిగిన సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు ప్రణాళికల రూపకల్పన● ఇందిరా, మహిళా శక్తి క్యాంటీన్ల ప్రారంభానికి కార్యాచరణమున్సిపాలిటీ వార్డులుభువనగిరి 35మోత్కూర్ 12ఆలేరు 12పోచంపల్లి 13చౌటుప్పల్ 20యాదిరిగుట్ట 12 -
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
సాక్షి యాదాద్రి : సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. జూన్ 6న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో గురువారం ఆయన కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. ఏచిన్న సమస్య తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. సమావేశంలో పోలీస్, రెవెన్యూ, డీఆర్డీఓ, పంచాయతీరాజ్, రవాణా, విద్యుత్, వైద్య, ట్రాఫిక్, మిషన్ భగీరథ, సివిల్ సప్లయ్, వ్యవసాయ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. లింగనిర్థారణకు పాల్పడితే క్రిమినల్ కేసులు భువనగిరి : లింగ నిర్థారణకు పాల్పడితే చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఎంహెచ్ఓ మనోహర్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 57 స్కానింగ్ సెంటర్ల అనుమతులు ఉండగా ప్రస్తుతం 41 పని చేస్తున్నాయని తెలిపారు. మార్చిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 41 స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. లింగ నిష్పత్తిని తగ్గించేందుకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో సదస్సులు నిర్వహించి పీసీ, పీఎన్డీటీ చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో పీసీ అండ్ పీఎన్డీటీ కమిటీ సభ్యులు డాక్టర్ యశోద, డాక్టర్ మాలతి, కవిత, అరుంధతి, జిల్లా ప్రజా సంబంధాల అధికారి సౌజన్య, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రమీళ, సార్స్ ఎన్జీళో ప్రతినిధి శివలింగం, నాగరాజు, అంజయ్య, వసంతికుమారి పాల్గొన్నారు. నేషనల్ ఇన్నోవేటివ్ అవార్డుకు ఎంపిక రామన్నపేట: మండలంలోని మునిపంపుల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుక్కడపు రమేష్ నేషనల్ ఇన్నోవేటివ్ శిక్షారత్న అవార్డుకు ఎంపికయ్యాడు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఏర్పడిన ఈ సంస్థ వినూత్న పద్ధతులతో బోధన చేసిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఏటా అవార్డులు ప్రదానం చేస్తుంది. 2024–25 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ నుంచి నలుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇందులో కుక్కడపు రమేష్ కూడా ఉన్నారు. రహేష్ వలిగొండ మండలం పహిల్వాన్పురం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించిన డీఎంఈఏ భువనగిరి: జిల్లా కేంద్ర ఆస్పత్రిని గురువారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అకాడమీ(డీఎంఈఏ) డాక్టర్ శివరాంప్రసాద్ సందర్శించారు. ఓపీ విభాగాలు, క్యాజువాలిటీ విభాగం, వార్డులు, మార్చురీ గదితో పాటు ఆస్పత్రి పై భాగంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రోగులకు అందజేస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణం కోసం ఇంకా స్థలం కేటాయింపు జరగలేదన్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, వైద్యులు ఉన్నారు. మీజిల్స్ వైరల్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడాలిమోటకొండూర్: మీజిల్స్ వైరల్ జబ్బు వ్యాప్తి చెందకుండా వెంటనే గుర్తించి అరికట్టాలని డబ్ల్యూహెచ్ఓ సర్వేలైన్ మెడికల్ అధికారి హజహర్ సూచించారు. గురువారం మోటకొండూరులోని పీహెచ్సీని సందర్శించి మీజిల్స్ వ్యాధిపై ఆరా తీశారు. మీజిల్స్ వైరస్ సోకినవారికి అధిక జ్వరం, దగ్గు, జలుబు, నోరులో చిన్నచిన్న తెల్లమచ్చలు వస్తాయన్నారు. -
విత్తన ఎంపికే కీలకం
సాక్షి, యాదాద్రి: పంట ఏదైనా విత్తన ఎంపికే కీలకం. నాణ్యత, చీడపీడలను తట్టుకునే గుణం కలిగి, అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను ఎంచుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ) గోపాల్ రైతులకు సూచించారు. గురువారం శ్రీసాక్షిశ్రీఫోన్ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనిల్కుమార్, మధుశేఖర్తో కలిసి పాల్గొన్నారు. పంటల సాగులో సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. విత్తనాల కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, లైసెన్డ్ డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా రశీదు పొందాలని సూచించారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశంతో ముందస్తుగానే వర్షాలు కురుస్తున్నాయని, ఇవి సాగుకు అనుకూలమే అయినప్పటికీ ఇప్పుడే విత్తనాలు విత్తవద్దన్నారు. భూమిలో వేడిమికి విత్తనాలు మాడిపోయే ప్రమాదం ఉందని, భారీ వర్షం కురిసిన తరువాత విత్తుకుంటే మంచింది. జూన్ 15 వరకు విత్తనాలు విత్తుకోవచ్చు. ప్రశ్న : వరిలో కలుపు నివారణకు ఏ మందులు వేయాలి? – వేణుగోపాల్రెడ్డి, వంగాలడీఏఓ : కలుపు నివారణకు ముందస్తుగా బుటాక్లోర్, బుటాక్లోర్, 2,4 డీఈఈ మిశ్రమం, అనిలోఫోస్ వాడాలి. కలుపు అధికంగా ఉన్నప్పుడు 2,4–డి సోడియం సాల్ట్ 80 శాతం పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. గడ్డి జాతి మొక్కల నివారణకు సైహాలోఫాప్ బుటైల్, వెడల్పు పత్రాలు కలిగిన కలుపు మొక్కల నివారణకు బిస్పైరిబాక్ సోడియం వాడవచ్చు. ప్రశ్న: వరిలో కొత్త రకం వంగడాలు వచ్చాయా? – పాండురెడ్డి, భూదాన్పోచంపల్లి డీఏఓ: ఆర్ఎన్ఆర్ధన్ 75, భాగ్యనగర్ సోనా వంగడాలను ఆచార్య జయశంకర్ వ్యవసాయ విద్యాలయం రూపొందించింది. భాగ్యనగర్ సోనా మధ్యస్థ సన్నరకం వంగడాలకు మంచి డిమాండ్ ఉంది. ఎకరాకు 68 బస్తాల దిగుబడి వస్తుంది. ఇంకా మార్కెట్లోకి ఇంకా రాలేదు. ప్రశ్న: హైబ్రిడ్ గ్రేడ్–ఏ, గ్రేడ్–బి వరి సాగు చేస్తాం. కొనుగోలు సమయంలో గ్రేడ్–బిగా పరిగణిస్తున్నారు. – నర్సిరెడ్డి, భూదాన్పోచంపల్లిజవాబు: ఏ విత్తనం సాగు చేస్తే అదే రకం వస్తుంది. కోత సమయంలో వేర్వేరుగా నూర్పిడి చేయాలి. ప్రశ్న: బీపీటీ విత్తనాలు ఎప్పుడు పోసుకోవాలి? – లింగయ్య, గుండాలడీఏఓ: బీపీటీ నారు పోసుకోవడానికి ప్రస్తుతం అనువైన సమయం. ప్రశ్న: పెసర, పల్లి కిట్లు ఎప్పుడొస్తాయి? – వెంకటేశం, బ్రాహ్మణపల్లి డీఏఓ: త్వరలో వచ్చే అవకాశం ఉంది. రాగానే రైతులకు సమాచారం ఇస్తాం. ప్రశ్న: విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రశీదు ఇవ్వడం లేదు. – కొండల్, యాదగిరిగుట్టడీఏఓ: రశీదు ఇవ్వకుంటే అధికారులకు సమచారం ఇవ్వాలి. హెచ్టీ విత్తనాలు విక్రయించినా, రైతులు కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరం. ప్రశ్న: నాణ్యమైన విత్తనాలు ఎక్కడ అందుబాటులో ఉంటాయి? – కొడారి వెంకటేఽశం జిల్లా వినియోగ దారుల సంఘం అధ్యక్షుడు డీఏఓ: లైసెన్స్డ్ డీలర్ల వద్ద మాత్రమే నాణ్యమైన విత్తనాలు లభిస్తాయి. నకిలీ విత్తనాలు కొనుగోలు చేయవద్దని ఇప్పటికే రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నాసిరకం విత్తనాలను విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: కుసుమ పంట వేయాలనుకుంటున్న. ఏ సీజన్లో సాగు చేయాలి. –పైళ్ల యాదిరెడ్డి, ముషిపట్ల డీఏఓ: కుసుమ పంట రబీలో సాగు చేయాలి. చలి వాతావరణానికి మంచి దిగుబడి వస్తుంది. వానాకాలంలో కూడా వేయొచ్చు. అయితే చేలో నిరుల నిల్వ ఉండకుండా చూడాలి. ఎర్ర చెల్క నేలలు అనుకూలం. ప్రశ్న: అల్లం సీడ్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా సాగు చేయాలి? –సోమిరెడ్డి, సుద్దాలడీఏఓ: జహీరాబాద్, నిజామాబాద్లో అల్లం కొమ్ములు లభిస్తాయి. భూమిని దున్నిత తర్వాత ముందుగా కాల్వల పొదలు చేయాలి. అరు నెలల పంటకాలం. హెచ్టీ కాటన్ సీడ్ వేయొద్దు మూసీ ఆయకట్టుకు కొత్త రకం వంగడాలు సరైన వర్షాలు కురిసిన తరువాతే విత్తనాలు వేయాలి ‘సాక్షి’ ఫోన్ ఇన్లో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, శాస్త్రవేత్తలు అనిల్కుమార్, మధుశేఖర్ పంటల సాగులో రైతులకు సలహాలు, సూచనలు, సందేహాల నివృత్తిప్రశ్న: వేర్వేరు ప్రాంతాల్లో భూమి ఉంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ కావడం లేదు.– కొల్లోజు సోమనర్సింహాచారి, రామన్నపేట, సతీష్, మోత్కూరుడీఏఓ: వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూములు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కావడం లేదని మా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక అందజేసాం. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది. రైతు సంక్షేమ పథకాలు వర్తింపచేయడం కోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇందులో నమోదైతేనే పథకాలు అందుతాయి. రైతులందరై ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎటువంటి సమస్య ఎదురైనా వెంటనే వ్యవసాయ అధికారుల దృష్టికి తేవాలి.ప్రశ్న: మూసీ ఆయకట్టులో తాలు, నూక ఎక్కువగా వస్తుంది. ఎలా అధిగమించాలి! –పక్కీర్ యాదవరెడ్డి, నర్సిరెడ్డి, మరికొందరు రైతులు, పోచంపల్లి మండలం డీఏఓ: జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఆర్ఎన్ఆర్–29325, ఆర్ఎన్ ఆర్ –28361, జేజీఎల్–28369 వంటి దొడ్డు రకం వరి వంగడాలను అభివృద్ధి చేసింది. ఇవి పొట్టిరకం విత్తనాలు. ఈ వంగడాలు సాగు చేస్తూ లాభసాటిగా ఉంటుంది. ఎకరాకు 32 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రశ్న: పత్తిలో హైబ్రిడ్ రకాలు వస్తున్నాయి. ఏరకం సీడ్ వేయాలి? – భూదాన్పోచంపల్లి, రాజాపేట రైతులు డీఏఓ: నిషేధిత హెచ్టీ పత్తి సీడ్ తప్పా ఏవైనా విత్తుకోవచ్చు. ముఖ్యంగా ఎల్బీనగర్ నుంచి తీసుకువచ్చే హెచ్టీకాటన్ విత్తనాలు ఎట్టి పరిస్థితిలో వేయొద్దు. లైసెన్స్డ్ డీలర్ల వద్ద మాత్రమే సీడ్ కొనుగోలు చేయాలి. తప్పనిసరిగా రశీదు పొంది పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలి. దిగుబడి రాకపోతే పరిహారం పొందటానికి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో రశీదు తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది. పత్తి విత్తనాలపై ప్రభుత్వ ఎలాంటి రాయితీ ఇవ్వలేదు. -
ఇక్కత్ వస్త్రాలు మా మనసు దోచాయి..
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు తమ మనసును దోచాయని ఆఫ్రికన్ దేశాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లు కొనియాడారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికన్ దేశాలకు చెందిన 30 మంది సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు బుధవారం పోచంపల్లిని సందర్శించారు. స్థానిక టూరిజం పార్కు, కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్తో పాటు చేనేత వస్త్రాలను తయారీని పరిశీలించారు. మగ్గం నేసి, రాట్నం వడికి సందడి చేశారు. ఇక్కత్ వస్త్రాలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా సమాచార అసిస్టెంట్ డైరెక్టర్ మామిండ్ల దశరథ మాట్లాడుతూ.. మన సంస్కృతి సంప్రదాయాలు, కళలు, ప్రజల ఆచార వ్యవహారాలు తెలుసుకునేందుకు ఆఫ్రికన్ దేశాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లు ఇక్కడికి వచ్చారని తెలిపారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, చౌటుప్పల్ రూరల్ సీఐ రాములు, డీపీఆర్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇండియా మూలాలు మరువలేదు – యోవానీ నాయుడు, దక్షిణాఫ్రికా క్రియేటర్ మా నాన్న తెలుగు వారు, మా అమ్మ తమిళనాడుకు చెందినవారు. మా పూర్వీకులు శతాబ్దాల క్రితం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. భౌతికంగా ఇండియాకు దూరమైనా ఇక్కడి మూలాలు మరువలేదు. నాకు తెలుగు, తమిళం రాకున్నా భారత సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తున్నాను. పోచంపల్లిని సందర్శించిన ఆఫ్రికన్ దేశాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లు -
సంక్షేమ పాలనలో కేసీఆర్ను మించినోడు లేడు
సూర్యాపేటటౌన్: ప్రజా సంక్షేమ పాలనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మించినోడు లేడని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోటాయన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసి మాట్లాడారు. కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రపంచంలోనే మరెక్కడా లేవని అన్నారు. హామీ ఇవ్వని పథకాలును కూడా ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్దేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ కేసీఆర్ పథకాలే తప్ప కొత్తగా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. సీఎం రిలీఫ్ ఫండ్ను అందరికీ చేరువ చేసింది కేసీఆరేనన్నారు. రైతు భరోసా కాదు.. నేడు వ్యవసాయానికే భరోసా లేకుండాపోయిందన్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయామని ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి -
సీఎం చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం
నడిగూడెం: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 100శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని బాబూ జగ్జీవన్రాం సంక్షేమ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి ఉత్తమ పురస్కారం అందుకున్నారు. నారమ్మగూడెం వాసికి ప్రోత్సాహక బహుమతినిడమనూరు: అథ్లెటిక్స్లో రాణిస్తున్న నిడమనూరు మండలం నారమ్మగూడేనికి చెందిన ఎక్కలూరి నక్షత్రారెడ్డి సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతి అందుకుంది. డిండి ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నక్షత్రారెడ్డి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో బంగారు పతకం, సీఎం కప్లో 400 మీటర్ల పరుగుపందెంలో తృతీయ స్థానం, సూర్యాపేటలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో ప్రథమ స్థానం సాధించింది. నక్షత్రారెడ్డిని నారమ్మగూడెం మాజీ సర్పంచ్ దుబ్బాకుల రాంరెడ్డి, స్థానిక నాయకులు తులసీరెడ్డి, గోవింద్రెడ్డి, కొండా శ్రీనివాస్రెడ్డి తదితరులు అభినందించారు. -
బాలుడిని అకారణంగా కొట్టిన కానిస్టేబుల్
ఆత్మకూరు(ఎం): బాలుడిని పోలీస్ కానిస్టేబుల్ అకారణంగా కొట్టిన ఘటన ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన మజ్జిగ ప్రవీణ్ 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం తమ వ్యవసాయ బావి వద్ద గొర్రెలను మేపుతున్న తన తల్లి విజయకు భోజనం తీసుకుని వెళ్లాడు. వారి భూమి పక్కనే 18 ఎకరాలను ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న లింగంనాయక్ కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. తల్లికి భోజనం తీసుకెళ్లిన ప్రవీణ్కు దాహం వేయడంతో లింగంనాయక్కు భూమిలోని బోరు మోటారు ఆన్ చేసి బాటిల్లో నీళ్లు పట్టుకున్నాడు. అక్కడే మేత మేస్తున్న గొర్రెలు కూడా నీళ్లు తాగడానికి లబీడు పొలంలోకి వచ్చాయి. ఇది గమనించిన లింగంనాయక్ ఆగ్రహంతో ప్రవీణ్ను కర్రతో చితకబాదాడు. ప్రవీణ్ తల్లి విజయ అడ్డురాగా ఆమైపె కూడా దాడి చేశాడు. దీంతో వారు కానిస్టేబుల్ లింగంనాయక్పై అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇంతవరకు లింగంనాయక్పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రవీణ్ తండ్రి కనకయ్య, తల్లి విజయ ఆరోపిస్తున్నారు. గాయపడిన ప్రవీణ్ను బుధవారం మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పోతగాని మల్లేశంగౌడ్ పరామర్శించారు. కానిస్టేబుల్ లింగంనాయక్పై చర్యలు తీసుకోవాలని కుర్మ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంమై ఎస్ఐ ఎస్. కృష్ణయ్యను వివరణ కోరగా.. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, విచారణ అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేస్తామని తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాలుడి తల్లిదండ్రులు -
సరిహద్దు దాటొస్తున్న ఇసుక
మిర్యాలగూడ: ఆంధ్రాలో ఉచిత ఇసుక పథకం అమలవుతుండడంతో దానిని ఆసరాగా చేసుకున్న కొందరు దళారులు అక్కడి నుంచి ఇసుకను అక్రమంగా తెలంగాణకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాలో ఓ ప్రజాప్రతినిధి కీలకంగా ఉండడంతో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. రాత్రివేళ లారీల్లో పరిమితికి మించి ఇసుకను తరలిస్తూ ఖాళీ ప్రదేశాల్లో డంప్ చేసి అవసరమైన సమయాల్లో లక్షలు ఆర్జిస్తున్నారు. లారీలు, టిప్పర్లల్లోనే ఇసుక తరలింపు.. తెలంగాణలో ఇసుక డిమాండ్ ఎక్కువగా ఉండడంతో దాన్ని కొందరు వ్యాపారంగా మలుచుకున్నారు. తమకున్న లారీలు, టిప్పర్ల ద్వారా ఏపీ నుంచి అక్రమంగా ఇసుకను మిర్యాలగూడకు తీసుకొచ్చి ఖాళీ స్థలాల్లో డంప్ చేసి అవసరమైన సమయంలో రెట్టింపు ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన ఇసుక వాహనం పేరిట ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. అలా చేస్తే ఇసుక డెలివరీ చేయడానికి చాలా రోజుల సమయం పడుతుండడంతో అవసరమైన వారు ఈ ఇసుక వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రూ.3970కు వచ్చే ట్రాక్టర్ ఇసుక ఆఫ్లైన్లో మాత్రం రూ.5000 నుంచి రూ.7వేలకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో ఏపీ నుంచి టిప్పర్లు, లారీల నుంచి ఇసుకను ఇక్కడకు తీసుకొస్తున్నారు. ఒక్కొక్క లారీలో 30టన్నులు, టిప్పర్లో 35టన్నుల ఇసుక పడుతుంది. కానీ వ్యాపారులు ఒక్కొక్క లారీలో 40 నుంచి 50టన్నులు, టిప్పర్లో 40 నుంచి 60 టన్నుల చొప్పున పరిమితికి మించి ఇసుకను తీసుకొస్తున్నారు. నామమాత్రంగా కేసులు నమోదు.. ప్రధానంగా రాష్ట్ర సరిహద్దులో నిఘా లేకపోవడంతో ఈ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. అంతేకాకుండా కృష్ణా నది సరిహద్దు గ్రామాల నుంచి అక్రమంగా పెద్దఎత్తున ఇసుక రవాణా సాగుతోంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీలను పోలీసులు పట్టుకుంటున్నా నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారే తప్ప.. నియంత్రించేందుకు చర్యలు చేపట్టడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసులు కూడా నమోదు చేస్తున్నారా లేదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. ఆంధ్రా నుంచి మిర్యాలగూడకు లారీల్లో అక్రమంగా తీసుకొచ్చి ఖాళీ స్థలాల్లో డంప్ రాత్రివేళ కొనసాగుతున్న దందాఅక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆంధ్రా ప్రాంతం నుంచి కూడా ఇసుక రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందిస్తే పట్టుకోని కేసులను నమోదుచేస్తాం. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. – రాజశేఖర్రాజు, డీఎస్పీ, మిర్యాలగూడపట్టుబడుతున్నా ఆగని దందా మిర్యాలగూడ పట్టణంలో ఇసుక అక్రమ రవాణా అరికట్టడంలో పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రతిరోజు లారీల కొద్ది ఇసుక మిర్యాలగూడకు తరలివస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. నెల రోజుల క్రితం వంగమర్తి నుంచి మిర్యాలగూడకు ఇసుకతో తరలివస్తున్న మూడు టిప్పర్లను రామచంద్రగూడెం వైజంక్షన్ వద్ద పట్టుకున్నారు. స్థానిక ఇసుక లారీ యజమానులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టుకుని కేసు నమోదు చేశారు. 20 రోజుల క్రితం హనుమాన్పేట వద్ద ఆంధ్రాకు చెందిన ఓ ఇసుక లారీని పట్టుకున్నారు. ఆ విషయంలో పోలీసులు లోతుగా విచారణ చేయగా మిర్యాలగూడకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి చెందిన ఐదు లారీలు నడుస్తున్నాయని తెలియడంతో విస్తుపోయారు. ఆ ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకు కేసు నమోదు చేయకుండానే వదిలేసినట్లు సమాచారం. తాజాగా మంగళవారం మిర్యాలగూడ పట్టణ శివారులోని రైల్వేట్రాక్ వద్ద ఓ ఇసుక లారీని స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఆ లారీ ఈ నెల 22న పర్మిట్ పొంది ఉంది. కానీ అందులో ఇసుక మాత్రం 27టన్నులకు గాను 56టన్నులు ఉంది. పరిమితికి మించి ఇసుక ఉండడంతో పాటు స్థానికంగా ఇసుకను డంప్ చేసి అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మిర్యాలగూడ టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
బావిలో పడిన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడడంతో డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం ఆత్మకూర్(ఎస్) మండలం రామన్నగూడెం గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్) మండలం బోరింగ్తండాకు చెందిన బానోత్ రమేష్(38) నూతనకల్ మండలం గుండ్ల సింగారం గ్రామానికి చెందిన బండారి శ్రీనివాస్ వద్ద మూడేళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బండారి శ్రీనివాస్ కర్ర వ్యాపారంతో పాటు బొగ్గు బట్టీ నడిపిస్తున్నాడు. ఇటీవల రామన్నగూడెం గ్రామానికి చెందిన భూరెడ్డి రాంరెడ్డి చెలకలో పలు రకాల చెట్లను బండారి శ్రీనివాస్ కొనుగోలు చేయగా.. వాటిని బొగ్గు బట్టీకి తీసుకెళ్లడానికి బుధవారం ఉదయం ఆరుగురు కూలీలతో పాటు రమేష్ ట్రాక్టర్లో అక్కడకు వెళ్లారు. కూలీలు చెట్లను కోస్తుండడంతో రమేష్ ట్రాక్టర్ను పక్కకు పెడుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి దాదాపు 100 మీటర్ల దూరంలో గల బొర్రాజ మల్లయ్యకు చెందిన వ్యవసాయ బావిలో పడిపోయింది. బావి తోతుగా, నీళ్లు ఎక్కువగా ఉండటంతో ట్రాక్టర్తో పాటు రమేష్ పూర్తిగా బావిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు మోటార్ల సహాయంతో బావిలోని నీటిని బయటకు తొలగించి రమేష్ మృతదేహాన్ని, ట్రాక్టర్ను బయటకు తీశారు. మృతుడికి ఇద్దరు భార్య, కుమారులు ఉన్నారు. మృతుడి భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ జానకిరాములు తెలిపారు. పోస్టుమార్టం మృతదేహాన్ని నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.పూర్వ విద్యార్థుల సమ్మేళనం రోజునే.. బానోత్ రమేష్ ఆత్మకూర్(ఎస్) మండలం ఇస్తాలపురం పాఠశాలలో 2003లో పదో తరగతి పూర్తి చేయగా.. మిత్రులందరూ కలిసి బుధవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. చిన్ననాటి మిత్రులందరినీ కలుసుకోవాలని తొందరగా పని ముగించుకొస్తానని ఇంటి వద్ద చెప్పి వెళ్లిన రమేష్ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులతో పాటు పదో తరగతి మిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి
మద్దిరాల: తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మి కుడు మృతిచెందాడు. ఈ ఘటన మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలుమల్ల గ్రామానికి చెందిన గీత కార్మికుడు తునికి వెంకన్న రోజుమాదిరిగానే బుధవారం ఉదయం తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య తునికి లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ ఎం.వీరన్న తెలిపారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కనగల్, రామగిరి(నల్లగొండ): బైక్పై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి చెట్టును ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ మండలం జి. చెన్నారం గ్రామ స్టేజీ వద్ద బుధవారం చోటు చేసుకుంది. కనగల్ ఎస్ఐ పి. విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం ముశంపల్లికి చెందిన తవుడోజు వెంకటాచారి(45) నల్లగొండ పట్టణంలోని శాంతినగర్లో నివాసముంటున్నాడు. మర్రిగూడ బైపాస్లోని ఓ లాడ్జిలో మేనేజర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన మేనకోడలి వివాహ పత్రికలు పంచేందుకు బుధవారం బైక్పై కనగల్ మండలం దర్వేశిపురం వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా జి. చెన్నారం గ్రామ స్టేజీ వద్ద బైక్ అదుపుతప్పడంతో రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటాచారి అక్కడికక్కడే మృతిచెందాడు. సమచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. డివైడర్ను ఢీకొని..వేములపల్లి: రోడ్డు డివైడర్ను ఢీకొని కారు బోల్తా పడడంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన వేములపల్లి మండల శివారులో నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన నామిరెడ్డి అరవింద్రెడ్డి (25) తన కారులో రాత్రి హైదరాబాద్కు బయల్దేరాడు. మార్గమధ్యలో వేములపల్లి మండలం శెట్టిపాలెం శివారులోని చిత్రపరక వాగు సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అరవింద్రెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో అరవింద్రెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
ప్రసాద తయారీ కేంద్రంలో చింతపండు చోరీ
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట పైన చింతపండు బస్తాలను ఆలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దొంగతనానికి పాల్పడిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. యాదగిరిగుట్ట పైన ఉన్న ప్రసాదాల తయారీ కేంద్రానికి సంబంధించిన గోదాం నుంచి మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు 9 చింతపండు బస్తాలను (సుమారు 3క్వింటాళ్లు) గోదాంలో ఉన్న కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తీసుకొచ్చారు. ఈ బస్తాలను కారులో పెట్టి కొండ కిందకు తరలించే ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడంతో ఇద్దరు వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు పట్టుకున్నారు. వారిద్దరు ప్రసాద విక్రయశాల విభాగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది సీహెచ్. గణేష్, పులిహోర మిషన్ ఆపరేటర్ పి. మధుగా గుర్తించి యాదగిరిగుట్ట పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షోకాజ్ నోటీసులు జారీచేసిన ఈఓ..చింతపండు బస్తాలు దొంగతనం జరిగిన విషయంపై ఈఓ ఎస్. వెంకట్రావ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ప్రసాదాల తయారీ గుమాస్తా పులెపాక నవీన్, పర్యవేక్షకుడు సత్యనారాయణకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పేర్లు చెప్పొద్దని భయపెడుతున్నారుచింతపండు దొంగతనంలో తమ పేర్లు చెప్పొద్దని అవుట్సోర్సింగ్ ఉద్యోగులైన మధు, గణేష్ను కొందరు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వారి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఆలయానికి చెందిన పంతుళ్లు క్రిష్ణమాచార్యులు (కన్నయ్య), సంతోష్ ప్రసాద విక్రయశాల విభాగం నుంచి చింతపండు తీసుకరమ్మని మధు, గణేష్కు సూచించారని వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమ పేర్లు చెప్పొద్దని రఘు అనే ఉన్నతాధికారి భరోసా ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. పర్యవేక్షణ లోపం.. చింతపండు బస్తాలను తీసుకెళ్లడానికి కొండపైకి వెళ్లిన కారును ఏ విధంగా పైకి అనుమతించారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారు ఎవరి రిఫరెన్స్తో కొండ పైకి వెళ్లిందనే విషయం ఆలయ అధికారులు చెప్పడం లేదు. అదేవిధంగా ప్రసాద విక్రయశాల విభాగంలో విలువైన సామగ్రి ఉన్నా తాళాలు లేకపోవడం ఆలయ అధికారుల నిర్లక్ష్యం, భద్రతా లోపం స్పష్టంగా కనబడుతోంది. యాదగిరిగుట ్టఆలయం నుంచి కొండ కిందకు కారులో బస్తాలు తీసుకెళ్తుండగా ఇద్దరిని పట్టుకున్న పోలీసులు నిందితులు ఆలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా గుర్తింపు -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఇద్దరు దుర్మరణం
దేవరకొండ: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన బుధవారం దేవరకొండ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలానికి చెందిన ఈడమోని శ్రీశైలం(44), అదే జిల్లా ఊరుకొండ మండలం రాచాలపల్లి గ్రామానికి చెందిన ఈరెటి బచ్చయ్య(40) వరుసకు బంధువులు. శ్రీశైలం, బచ్చయ్య వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరిద్దరు కలిసి పశువులను కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంపై మంగళవారం మిర్యాలగూడకు వచ్చారు. త్రిపురారం వద్ద వారికి అవసరమైన పశువులను కొనుగోలు చేశారు. రాత్రి కావడంతో అక్కడే బసచేసి బుధవారం ఉదయం స్వగ్రామాలకు బయల్దేరారు. ఉదయం 7గంటల ప్రాంతంలో దేవరకొండ పట్టణంలోని మనోజ్ థియేటర్ సమీపంలోకి రాగానే కొండమల్లేపల్లి నుంచి ఐరన్ లోడ్తో కల్వకుర్తి వైపు వెళ్తున్న లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీశైలం, బచ్చయ్య తీవ్రంగా గాయపడ్డారు. శ్రీశైలం అక్కడికక్కడే మృతిచెందగా.. బచ్చయ్యను చికిత్స నిమిత్తం నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దేవరకొండ సీఐ నర్సింహులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు శ్రీశైలం కుమారుడు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన డీసీఎం ● బస్సు క్లీనర్ మృతి నకిరేకల్: ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ మృతిచెందాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణ శివారులోని పద్మానగర్ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మీస్ ట్రావెల్స్కు చెందిన బస్సు ఛత్తీస్గడ్లోని జగదల్పూర్ నుంచి హైదరాబాద్కు మంగళవారం రాత్రి 8గంటలకు బయల్దేరింది. బుధవారం తెల్లవారుజామన 5.30గంటల సమీపంలో నకిరేకల్ పట్టణంలోని పద్మానగర్ జంక్షన్ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ఇద్దరు ప్రయాణికులను దింపేందుకు డ్రైవర్ బస్సును ఆపాడు. ఛత్తీస్గడ్లోని బిలీసాపూర్కు చెందిన బస్సు క్లీనర్ చరణ్దాస్(36) బస్సు వెనుక డిక్కీలో ఉన్న లగేజీని తీస్తుండగా.. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరణ్దాస్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో అతడిని నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నార్కట్పల్లిలోని కామినేని వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. బస్సు డ్రైవర్ రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రిష్ణాచారి తెలిపారు. పోస్టమార్టం అనంతరం చరణ్దాస్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఎంజీయూ డిగ్రీ బ్యాక్లాగ్ ఫలితాలు విడుదలనల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో గతంలో డిగ్రీ అభ్యసించి ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు చిట్టచివరిగా అవకాశం కల్పించి మార్చి, ఏప్రిల్ నెలల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసినట్లు ఎంజీయూ సీఈఓ ఉపేందర్రెడ్డి తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. -
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
భువనగిరిటౌన్ : కలెక్టరేట్ ఆవరణలో జూన్ 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంత రావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, డీఆర్డీఓ నాగిరెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ ప్రసాద్ పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం అమలుపై సమీక్షరాజీవ్ యువ వికాసం అమలుపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు హైదరాబాద్లోని సచివాలయం నుంచి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ యవ వికాసం పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలను అధికారులకు వివరించారు. కలెక్టర్ హనుమంత రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి పాల్గొన్నారు. -
మానవ అక్రమ రవాణాను అరికడదాం
● డీఈఓ సత్యనారాయణ భువనగిరి : మానవ అక్రమ రవాణాను నిరోధించడం అందరి బాధ్యత అని డీఈఓ సత్యనారాయణ అన్నారు. మానవ అక్రమ రవాణాపై బుధవారం ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో జిల్లాలోని కేజీబీవీ, మోడల్, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 2,920 మంది యువతులను అక్రమ రవాణా నుంచి కాపాడినట్లు చెప్పారు. ప్రమాదకర సమయాల్లో 1930 నంబర్కు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ శ్రీనివాస్ చారి, జాయింట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మంజరి, కోర్సు కో ఆర్డినేటర్ యేమియా, ప్రజ్వల ఎస్పీఎం చంద్రయ్య, ఎన్జీఓ కో ఆర్డినేటర్ శ్రావ్య శృతి, చెన్న కేశవులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరీశుడికి నిత్యపూజలు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం నిత్య పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలను అర్పించారు. ఆలయ ప్రాకార మండపాల్లో నిత్యకల్యాణం, శ్రీ సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, బ్రహ్మోత్సవం నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన చేపట్టారు. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలినల్లగొండ: కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సంక్షేమ పథకాలు సామాన్యులు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ డీఆర్డీఓ శేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని సురక్ష బీమా పథకం కింద ఖాతాదారుడు సంవత్సరానికి రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. ఖాతాదారులు 18 నుంచి 70 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలని తెలిపారు. ప్రధాని జీవన జ్యోతి బీమా పథకం కింద ఖాతాదారుడు సంవత్సరానికి రూ.436 చెల్లిస్తే ఏడాది కాలానికి గాను రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. -
రుణ లక్ష్యం రూ.6,660.15కోట్లు
సాక్షి, యాదాద్రి : 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ హనుమంతరావు బుధవారం విడుదల చేశారు. కలెక్టరేట్లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో రూ.6,660.15 కోట్ల అంచనాతో రుణ ప్రణాళిక రూపొందించారు. రూ.5,334.80 కోట్లు (80.10%) ప్రాధాన్యత రంగాలకు కేటాయించగా, రూ.1,325.35 కోట్లు ఇతర రంగాలకు కేటాయించారు. వ్యవసాయ రంగానికి రూ.4,284.41కోట్లు (మొత్తం ప్రణాళికలో 64.31%), ఇందులో పంట రుణాలు: రూ. 2,391.28 కోట్లు, వ్యవసాయ టర్మ్ లోన్లు రూ. 1,599.67 కోట్లు ఉన్నాయి. సూక్ష్మ, చిన్న – మధ్య తరహా పరిశ్రమలకు రూ.902.67 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ. 147.72 కోట్లు కేటాయించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నందున బ్యాంకు అధికారులు రైతులకు సకాలంలో రుణాలు అందించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్ సుందర్, బీసీ వెల్ఫేర్ అధికారి యాదయ్య, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం రవీందర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివరామకృష్ణ, ఆర్బీఐ ఏజీఎం లక్ష్మీశ్రావ్య, నాబార్డ్ ఏజీఎం వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వీధి వా్యపారులకు క్రెడిట్ కార్డులు
భువనగిరి: వీధి వ్యాపారులకు ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో కరోనా పరిస్థితుల అనంతరం కేంద్ర ప్రభుత్వం 2020 జూన్లో ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి యోజన) పథకాన్ని తీసుకువచ్చింది. మూడు విడతల్లో వ్యాపారులకు తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా స్వల్పకాలిక రుణాలు అందజేసింది. ఐదేళ్లు పూర్తి కావడంతో ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేసింది. అయితే రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన వారికి కొత్తగా క్రెడిట్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 9119 మంది వీధి వ్యాపారులుజిల్లా వ్యాప్తంగా భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో 9,119 మంది వీధి వ్యాపారులు ఉన్నట్లు గుర్తించారు. ఎంపిక చేసిన వ్యాపారులకు మొదటి విడత కింద రూ.10వేలు, రెండో విడత కింద రూ. 20వేలు, మూడో విడతలో రూ.50వేల చొప్పున రుణాలు అందజేశారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో గుర్తించిన వీధి వ్యాపారుల్లో 7,168 మంది లబ్ధిదారులకు రూ.20.09కోట్ల రుణాలు మంజూరు చేశారు. సకాలంలో చెల్లించిన వారికి ఉపయోగం ఎక్కువ వేతనంతో ఉద్యోగంతో పాటు సిబిల్ స్కోర్ ఉన్న వారికే బ్యాంకులు క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తాయి. కానీ వీధి వ్యాపారులకు ఎలాంటి నిబంధన లేకుండానే రూ.30వేల నుంచి రూ.50వేల పరిమితితో కార్డులు అందజేయనున్నారు. ఈ పథకంలో భాగంలో గతంలో మూడు విడతల్లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన వ్యాపారులనే ఎంపిక చేయనున్నారు. క్రెడిట్ కార్డులు పొందిన వారు అవసరం వచ్చినప్పుడు బ్యాంకులో నగదును డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అవసరమైన వస్తువులను ఈ కార్డు ద్వారా కొనుగోలు చేసి వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. బిల్లు వచ్చాక నిర్ణీత కాలవ్యవధిలో చెల్లిస్తే వడ్డీ ఉండదు. పీఎం స్వనిధి యోజన కింద రుణాలు తీసుకుని చెల్లించిన వారికి అందజేత లబ్ధిపొందనున్న 7,168 మంది వీధి వ్యాపారులుఇంకా ఆదేశాలు రాలేదు గతంలో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన వీధి వ్యాపారులకు క్రెడిట్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియపై ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. గతంలో రుణాలు తీసుకుని క్రమం తప్పకుండా చెల్లించిన వారికి ప్రయోజనం ఉంటుంది. – రమేష్బాబు మెప్మా పీడీరుణాలు పొందిన వారి వివరాలు (రూ. కోట్లలో) విడత వీధి వ్యాపారులు పంపిణీ మొదటి 7,168 7.16 రెండో 4,134 8.26మూడవ 1,133 5.66 -
వలస జీవుల వివరాల సేకరణ
ఆలేరు: జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వ్యాపారం, వాణిజ్య పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు ఇతర రాష్ట్రాలకు చెందిన వందలాది మంది వలస వస్తున్నారు. వ్యాపార నిమిత్తం కొందరు, జీవనోపాధి కోసం మరికొందరు వచ్చి వివిధ ప్రాంతాల్లో తిష్ట వేస్తున్నారు. కొందరు సరైన పత్రాలు లేకుండా ఇక్కడ ఉంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో భద్రతా అంశాల పరంగా పోలీసులు అలాంటి వారిపై దృష్టి సారించారు. ఈ మేరకు బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కేరళ, తమిళనాడు ఇతర రాష్ట్రాలకు చెందిన వలస జీవులు జిల్లాలో ఎంతమంది ఉన్నారనే కోణంలో కూపీ లాగుతున్నారు. వారి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. వివరాల సేకరణకు ఇదొక కారణంభారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జిల్లాలో రోహింగ్యాలు ఎవరైనా ఉన్నారా? అనే సందేహాల్లో భాగంగా అధికారులకు ఫిర్యాదులు వెళ్లడం కూడా పోలీసుల వివరాల సేకరణకు ఒక కారణమని తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని భువనగిరి, యాదాద్రి, చౌటుప్పల్ పోలీసు డివిజన్లలో 19 పోలీస్స్టేషన్లు ఉండగా.. ఆయా ఠాణాల పరిధిలో ఏయే రాష్ట్రాలకు చెందిన వారు ఎంతమంది ఉంటున్నారనే వివరాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు. వివరాల నిర్ధారణఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల ఆధార్కార్డు, సెల్నంబర్లు తదితర పూర్తి సమాచారం పోలీసులు సేకరిస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా వారు వాస్తవానికి అదే రాష్ట్రానికి చెందిన వారేనా? ఆధార్కార్డు ఒరిజినలా.. కాదా? అని పోలీసులు నిర్ధారించుకుంటున్నారు. వారు ప్రధానంగా ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు. ఎంత మంది ఇక్కడికి వచ్చారు. స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారా.. ఎన్ని నెలలకు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లి, మళ్లీ ఎప్పుడు తిరిగి వస్తున్నారు. ఎంత కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే తదుపరి చర్యలపై పోలీసులు దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. సేఫ్ అండ్ సెక్యూరిటీ కోసమే.. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నది నిజమే. జవాబుదారీతనంతోపాటు సేఫ్ అండ్ సెక్యూరిటీలో భాగంగా ఈ వివరాలు సేకరిస్తున్నాం. సున్నితమైన ఘటనలు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, లేదా ఎవరైనా మృతి చెందినప్పుడు వారి గురించి అవసరమైన అదనపు సమాచారం తెలుసుకోవడానికి ఈ వివరాలు దోహదపడతాయి. – ఆక్షాంశ్యాదవ్, డీసీపీ, భువనగిరి జిల్లాలో ఇతర రాష్ట్రాల వారి వివరాలపై ఆరా తీస్తున్న పోలీసు యంత్రాంగం ఆధార్కార్డు, సెల్నంబర్ల సమాచారం సేకరణ -
కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయాలి
భువనగిరిటౌన్ : రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేయాలని, కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరిలోని ఓ హాటల్లో భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ పాలనను తలపించే విధంగా సీఎం రేవంతర్రెడ్డి పాలన కనిపిస్తుందన్నారు. ఆరు గ్యారంటీ పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ సిద్ధాంతమన్నారు. పార్టీ నిర్మాణంలో క్షేత్ర స్థాయి నుంచి సామాజిక న్యాయం పాటించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దామన్నారు. జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యాచరణలో భాగంగా మండల స్థాయి నుంచి పీసీసీ దాకా కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు అగ్రనాయకత్వం రూట్ మ్యాప్ను ఖరారు చేసిందని తెలిపారు. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే మహిళలు, యువతకు పదవుల్లో పెద్దపీట వేయాలని అధిష్ఠానం నిర్ణయించిందన్నారు. ఇకపై పార్టీ కమిటీలే అన్ని నిర్ణయాల్లో కీలకపాత్ర వహిస్తాయన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్లపాటు సైనికుల్లా పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిందన్నారు. కాగా.. పార్టీ మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు మాత్రమే మాట్లాడుతున్నారని, తమకు కూడా అవకాశం ఇవ్వాలని పలువురు కార్యాకర్తలు ఆందోళన చేశారు. వారిని సముదాయించడంతో సద్దిమణిగింది. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవైస్చిస్తీ, సంస్థాగత ఎన్నికల కోఆర్డినేటర్లు ధనవంతి, డాక్టర్ పులి అనిల్, టీపీసీసీ సభ్యులు తంగళ్లపల్లి రవికుమార్, వివిధ మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి -
జిల్లా వ్యవసాయాధికారితో నేడు ఫోన్ ఇన్
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు ఈసారి వర్షాలు ముందుగానే కురుస్తున్నందున ఆరుద్ర కార్తె కంటే ముందే పంటల సాగుకు సన్నద్ధం కావచ్చా.. పత్తి తదితర మెట్టపంటలు ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది. వానాకాలం వరినార్లు పోసుకునేందుకు అనువైన సమయం ఎప్పుడు.. విత్తనాల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. నకిలీ విత్తనాలను ఎలా గుర్తుపట్టాలి.. తదితర సమాచారం రైతులు తెలుసుకునేందుకు జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ గురువారం ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. రైతన్నలు నేరుగా వ్యవసాయాధికారికి ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.తేది. 29.05.2025 (గురువారం) సమయం : ఉదయం 10.00 నుంచి 11.00 గంటల వరకుడయల్ చేయాల్సిన ఫోన్ నంబర్ : 89777 56419 -
మోసాలకు పాల్పడుతున్న యువతి అరెస్టు!
మిర్యాలగూడ అర్బన్: తాను డాక్టర్, ఐఏఎస్ అధికారిని అంటూ డబ్బున్న యువకులను గుర్తించి మోసాలకు పాల్పడుతున్న యువతిని మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. మిర్యాలగూడ మండలం లావుడితండాకు చెందిన ఓ యువతి కొంత కాలంగా డబ్బున్న యువకులను బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఆమెపై మలక్పేట, చైతన్యపురి, ఉప్పల్, నల్లగొండ టూటౌన్, మిర్యాలగూడ వన్టౌన్, నార్కట్పల్లి పోలీస్స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజుల క్రితం యువతి మర్డర్ అంటూ హైదరాబాద్లోని ఓ డీఎస్పీకి, మిర్యాలగూడ సబ్డివిజన్ పరిధిలో ఓ సీఐకి ఫోన్చేసి స్వీచ్ ఆఫ్ చేసినట్లు తెలిసింది. గత సంవత్సరం ఓ వైద్యుడిని బెదిరించి అతడి నుంచి రూ.5లక్షలు వసూలు చేసి ఉడాయించినట్లు సమాచారం. ఇటీవల ఓ యువకుడిని డబ్బులు డిమాండ్ చేయడంతోపాటు డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని బెదిరించడంతో సదరు యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యువతి బాగోతం వెలుగుచూడటంతో నివ్వెరపోయారు. యువతిని అరెస్టు చేసిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా రిమాండ్ చేసినట్లు తెలిసింది. -
పరిహారం.. ఎంతిదా్దం?
గంధమల్ల చెరువు తుర్కపల్లి : గంధమల్ల రిజర్వాయర్ భూసేకరణకు క్షేత్రస్థాయిలో అధికారులు కసరత్తు చేపట్టారు. రైతులకు పరిహారం చెల్లింపు, అడ్డంకులను అధిగమించడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా జలాశయంలో భూములు కోల్పోతున్న రైతులతో రెండు దఫాలుగా సమావేశమై చర్చలు జరిపారు. తొలుత ఆర్డీఓ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం కాగా... ఆ తరువాత అదనపు కలెక్టర్ వీరారెడ్డి(రెవెన్యూ) సమావేశం నిర్వహించి వారి అభిప్రాయా లు సేకరించారు. రైతుల డిమాండ్ ఇదీ.. భూ నిర్వాసితులతో అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఈనెల 22న కలెక్టరేట్లో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి దాదాపు 100 మంది రైతులు హాజరై పరిహారంపై తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఎంతోకాలంగా భూమిని నమ్ముకుని బతుకుతున్నామని, వ్యవసాయమే జీవనాధారమన్నారు. రిజర్వాయర్కు తాము వ్యతిరేకం కాదని, అయితే తమకు న్యాయపరమైన పరిహారం చెల్లించాలని కోరారు. రీజినల్ రింగ్ రోడ్డు బాధితులకు ఎకరాకు రూ.45 లక్షల నుంచి రూ.47 లక్షల వరకు పరిహారం ఖరారు చేశారని, తమకూ అంతే ఇవ్వాలన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు విధానాన్నే తమ విషయంలోనూ కచ్చితంగా అనుసరించాలని విన్నవించారు. మరోసారి రైతులతో సమావేశం భూ నిర్వాసితుల అభిప్రాయాలకు సంబంధించిన నివేదికను అదనపు కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు.తదుపరి ఆదేశాలు వచ్చిన అనంతరం మరోసారి రైతులతో సమావేశం కానున్నారు. వచ్చే నెల 6వ తేదీలోపు పరిహారం విషయాన్ని కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి జీవనాధారమైన భూములు రిజర్వాయర్లో పోతున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు బాధితులకు ఇచ్చిన మాదిరిగా మాకు ఎకరానికి రూ.47లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలి. అంతేకాకుండా భూములు కోల్పోతున్న ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. పరిహారం విషయంలో వివక్ష చూపకుండా అందరికీ సమానంగా న్యాయం జరగాలి. –కుంభం సత్తయ్య, భూ నిర్వాసితుడు మూడింతలు ఎక్కువ చెల్లించాలి రీజినల్ రింగ్ రోడ్డు రైతులకు ఇచ్చిన విధంగానే గంధమల్ల రైతులకు మూడింతల రేటుతో పరిహారం చెల్లించాలి. భూములు పోవడం వల్ల తాము జీవనాధారం కోల్పోతున్నామన్న విషయం ప్రభుత్వ గుర్తించాలి. భూములు విలువ బహిరంగ మార్కెట్లో రూ.లక్షల్లో ఉంది. భూ విలువకు తగిన రీతిలో అంచనా వేసి పరిహారం చెల్లించాలి. –గడిపే ఇస్తారి, భూ నిర్వాసితుడు జీవనాధారం కోల్పోతున్నాం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూములు తీసుకోవడం మంచి ఉద్దేశానికే కావచ్చు. కానీ, దశాబ్దాలుగా ఆ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నాం. భూములు పోవడం వల్ల జీవనాధారం కోల్పోతున్నామని ప్రభుత్వం గ్రహించాలి. నిర్వాసితులందరికీ సమానంగా న్యాయం జరగాలి. పరిహారం విషయంలో తేడా వస్తే పోరాటం చేస్తాం. –జక్కుల వెంకటేశం, భూ నిర్వాసితుడు ‘గంధమల్ల’ భూ సేకరణకు కసరత్తు ఫ రెండు దఫాలు రైతులతో సమావేశం, అభిప్రాయ సేకరణ ఫ ఎకరాకు రూ.45 లక్షల నుంచి రూ.47లక్షలు అడుగుతున్న నిర్వాసితులు ఫ ప్రభుత్వానికి నివేదిక అందజేసిన అధికారులు ఫ జూన్ 6లోగా మరోసారి సమావేశం 1028.83 ఎకరాలు.. గంధమల్ల రిజర్వాయర్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో సుమారు 60 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదిలక్ష్యం. 1.41 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. రూ.575.55 కోట్లు మంజూరు చేసింది. ప్రాజెక్టు నిర్మాణం 1028.83 ఎకరాల భూసేకరణ అవసరం. ఇందులో గంధమల్ల గ్రామ రెవెన్యూ పరిధిలో 619.34 ఎకరాలు, వీరారెడ్డిపల్లిలో 212.34 ఎకరాలు, కట్ట చుట్టూ 147.15 ఎకరాలు సేకరించాల్సి ఉంది. -
సర్వేయర్లకు ఫీల్డ్ ట్రాకింగ్ కీలకం
భువనగిరిటౌన్ : సర్వేయర్లకు ఫీల్డ్ ట్రాకింగ్ చాలా కీలకమని, రకరకాల భూములు సర్వే చేయాల్సి ఉంటుందని, శిక్షణ ద్వారా ఆయా అంశాలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. భువనగిరి పట్టణంలోని వెన్నెల కళాశాలలో సర్వే, ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ తరగతులు ఏర్పాటు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు సోమవారం కలెక్టర్ శిక్షణ తరగుతలకు హాజరై సర్వేయర్లుకు పలు సూచనలు చేశారు. సర్వేకు సంబంధించి 35 సెక్షన్లు ఉంటాయని, వాటిపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. భూమిని సర్వే చేసేటప్పుడు కొన్ని మెళకువలు పాటిస్తే సర్వే సులభంగా చేయవచ్చన్నారు. అనంతరం సర్వేయర్లకు మెటీరియల్ అందజేశారు. శిక్షణలో 198 మంది పాల్గొన్నారు. వీరిని 10 బ్యాచ్లుగా చేసి శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసంపై సమీక్ష రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్ హనుమంతరావు సోమవారం జూమ్ మీటింగ్ నిర్వహించి సమీక్షించారు. నిరుద్యోగ యువతను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, అందుకోసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. యూనిట్ల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని పే ర్కొన్నారు. జూమ్ మీటింగ్లో డీఆర్డీఓ నాగిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, బీసీ సంక్షేమ అధికారి యాదయ్య, ఎంపీడీఓలు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
రక్తం అందేలా.. ప్రాణాలు నిలిపేలా
భువనగిరి: జిల్లా కేంద్రం భువనగిరిలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు కానుంది. ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రక్తనిధి కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భవన నిర్మాణం కోసం అవసరమైన స్థలం కోసం సంస్థ సభ్యులు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. రూ. 5 నుంచి రూ.7 కోట్లతో నిర్మాణం అధికారులు స్థలం కేటాయిస్తే బ్లడ్ బ్యాంక్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేందుకు రెడ్క్రాస్ సంస్థ సిద్ధంగా ఉంది. రూ.5 నుంచి రూ.7 కోట్ల అంచనా వ్యయంతో జీ ప్లస్ టూ భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో ల్యాబ్ ఏర్పాటుతో పాటు సిబ్బంది, ఐదు వాహనాలు, పరికరాలు, మిషన్లు, సాంకేతిక పరమైన వసతులు సమకూర్చనున్నారు. అలాగే రూ. 2 కోట్లతో తలసేమియా రోగుల కోసం ప్రత్యే వార్డు ఏర్పాటు చేయనున్నారు. తొలగనున్న ఇబ్బందులు హైదరాబాద్కు సమీపంలో ఉన్న భువనగిరిలో బ్లడ్ బ్యాంకు లేదు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సరపడా రక్తనిల్వలు ఉండవు. అసరమైనప్పుడు రక్తం కోసం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా మీదుగా హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్ –విజయవాడ జాతీయ రహదారులు వెళ్తున్నాయి. వీటితో పాటు సిద్ధిపేట, మేదక్, జనగాం, మేడ్చల్, కరీంనగర్ వంటి జిల్లాకు వేళ్లే లింక్ రోడ్లు ఉన్నాయి. ఈ రహదారులపై నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల తీవ్రత అధికంగా ఉన్నప్పుడు రక్తం అవసరమైతే జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడం వల్ల హైదరాబాద్కు రెఫర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు రెడ్ క్రాస్ సంస్థ సంకల్పించింది. అందబాటులోకి వస్తే రక్తనిధి సమస్య తొలగనుంది. రోడ్డు ప్రమాద క్షతగాత్రులతోపాటు తలసేమియా రోగులకు అవసరమైన రక్తం అందుబాటులో ఉండనుంది. బ్లడ్ బ్యాంకు నుంచి రక్తాన్ని ఉచితంగా అందజేయనున్నారు. బ్లడ్ బ్యాంకు నిర్మాణం జరిగితే వరంగల్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల ప్రజలుకు సైతం ఉపయోగంగా ఉంటుంది. స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అధునాత సౌకర్యాలతో బ్లడ్ బ్యాంక్ భవనాన్ని నిర్మించేందుకు రెడ్క్రాస్ జిల్లా శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం 1,500 నుంచి 2వేల గజాల వరకు స్థలం అవసరం అవుతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. రెడ్క్రాస్సంస్థ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి రెండు రోజుల క్రితం స్థలాన్ని పరిశీలించారు. ఇది ఫైనల్ కాని పక్షంలో బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని సంస్థ సభ్యులు కోరుతున్నారు. భువనగిరిలో బ్లడ్ బ్యాంకుకు అనుమతి ఫ రూ.7 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ఫ రెడ్క్రాస్ ఆధ్వర్యంలో సన్నాహాలు ఫ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్థలం గుర్తింపు ఫ బస్టాండ్ సమీపంలోనూ పరిశీలించి ఫైనల్ చేయనున్న అధికారులుసంవత్సరంలోగా పూర్తి బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. దాతలు కూడా ముందుకు వస్తున్నారు. వారి సహకారంతో అధునాతన వసతులతో భువనం నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాం. భవన నిర్మాణం కోసం 1,500 నుంచి 2వేల గజాల వరకు స్థలం అవసరం ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న ప్రభుత్వం స్థలంలో లేదా బస్టాండ్కు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో గాని కేటాయించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు విజ్ఞప్తి చేశాం. –దిడ్డి బాలాజీ, రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ -
అధికంగా భూ సమస్యలే..!
వర్ష సూచనభువనగిరిటౌన్ : నైరుతి రుతుపవనాల ఆగమనంతో జిల్లాలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షంతో పాటు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇప్పటికే ధాన్యం సేకరణ తుది దశకు చేరగా.. నిల్వలున్న చోట ఒకటి, రెండు రోజుల్లో పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలిభువనగిరి : వానాకాలం సమీపిస్తున్నందున సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య సిబ్బందికి డీఎంహెచ్ఓ మనోహర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ హాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం మలేరియా, డెంగీ, చికెన్గున్యా, మెదడువాపు, ఫైలేరియా వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ప్రతి శుక్రవారం ఫ్రై డే డ్రైడేగా పాటించాలని పేర్కొన్నారు.100 శాతం ఇమ్యూనైజేషన్ జరగాలని ఆదేశించారు. ఈనెల 31న పోగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మత్తు పదార్థాల వల్ల అనార్థలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సాయిశోభ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ యశోధ, డాక్టర్ వీణ, డిప్యూటి డెమో అంజయ్య, హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ, సాయిరెడ్డి పాల్గొన్నారు. ఇండోనేషియా సదస్సులో డీసీసీబీ చైర్మన్నల్లగొండ అగ్రికల్చర్: ఇండోనేషియాలోని బాలిలో బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా, రీజనల్ పాలసీ ఫోరం 78వ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సులో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకులు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సహకార బ్యాంకుల ద్వారా రైతులకు అందజేస్తున్న రుణాలు, అభివృద్ధి తదితర అంశాలను సదస్సులో వివరించారు. అదే విధంగా వ్యవసాయ రంగంలో వేస్టేజీ, పొల్యూషన్ లేకుండా వనరులను వినియోగించుకునే విధానం, ఇండోనేషియాలో వ్యవసాయ రంగం అభివృద్ధికి అవలంభిస్తున్న విధానాలపై అధ్యయనం చేశారు. ఈ సదస్సులో అన్ని జిల్లాల సహకార బ్యాంకుల చైర్మన్లు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎప్పటిలాగే భూ సమస్యలపైనే అధికంగా అర్జీలు వచ్చాయి. మొత్తం 40 దరఖాస్తులు రాగా అందులో 20 వరు భూ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ హనుమంతరావు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటికి సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ప్రసాద్, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీపీఓ సునందతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ● జిల్లా కేంద్రంలోని బాలసదనంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు కొడారి వెంకటేష్ కలెక్టర్కు విన్నవించారు. ● రసాయన పరిశ్రమ విడుదల చేసే వ్యర్థాలతో నీరు, గాలి కలుషితమై భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని బీబీనగర్ మండలం మహాదేవపూర్లోని వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్ శివారెడ్డి, ప్రభాకర్, స్వామిరెడ్డి, ఆంజనేయులు, పద్మారెడ్డి, కరుణాకర్రెడ్డి, అఖిల్, రాములు ఫిర్యాదు చేశారు. ● 14 ఎకరాల భూమి సర్వే కోసం చాలానా కట్టి నాలుగేళ్లు అవుతుందని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మోటకొండూరు మండలం సింగారం గ్రామానికి చెందిన పన్నాల అనూష ఫిర్యాదు చేశారు. ● ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా ముగ్గు పోయడానికి ఎవ్వరూ రావడం లేదని భూదాన్పోచంపల్లి మండలం జిబ్లక్పల్లి గ్రామినికి చెందిన సయ్యద్ సుల్తానా, ఆమె భర్త చాంద్పాషా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. స్లాట్ బుక్ చేసి మూడు నెలలవుతుంది రోడ్డు ప్రమాదంలో తీ వ్రంగా గాయపడటంతో నా కాలు పూర్తిగా తొలగించారు. సదరం సర్టి ఫికెట్ కోసం మూడు నెలల క్రితం మీసేవలో స్లాట్ బుక్ చేసుకున్నా. ఇప్పటి వరకు పరీక్షలకు పిలవలేదు. మాది నిరుపేద కుటుంబం. పింఛన్ వస్తే ఆసరా అవుతుంది. పింఛన్ రావాలంటే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. ధ్రువీకరణ పత్రం అందేలా చూడాలి. –కొడతల శ్రీధర్, కాటేపల్లి, మోటకొండూరు మండలం ఫ ప్రజావాణికి 40 దరఖాస్తులు ఫ వినతులను స్వీకరించిన కలెక్టర్, ఉన్నతాధికారులు -
విద్యలో సమూల మార్పులు రావాలి
నకిరేకల్: విద్యలో మార్పులు రావాలని, ధనవంతుల పిల్లలు, పేదల పిల్లలు ఒకే బడిలో చదువుకోవాలన్నాదే తమ వేదిక లక్ష్యమని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ప్రభుత్వ బడులు నిలబడాలి.. చదువుల్లో అంతరాలు పోవాలనే నినాదంతో తెలంగాణ పౌర స్పందన వేదిక ఽఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార జాతా సోమవారం నకిరేకల్కు చేరుకుంది. ఈ జాతకు స్థానిక టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్య తీవ్ర సంక్షోభంలో ఉందని, సమూల మార్పులతో తగిన చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ బడులు నిలబడతాయని, లేకుంటే నాలుగైదు ఏళ్లలో మెజార్టీ బడులు విద్యార్థులు చేరక మూత పడిపోయే ప్రమాదం ఉందన్నారు. అందుకే ప్రజార జాత చేపట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ ప్రతినిధులు తాటిపాముల నర్సింహమూర్తి, ఆర్.రాకేష్కుమార్, పి.జయసాగర్, కే.శ్రీనివాస్, రవికుమార్, ఆర్.వెంకన్న, ప్రజా సంఘాల నాయకులు ఎర్పుల తాజేశ్వర్, అంజిరెడ్డి, ప్రకాష్రావు, వంటెపాక వెంకటేశ్వర్లు, వంటెపాక కృష్ణ, నాగమణి, ఇందిర, రవీందర్ తదతరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి -
నకిలీ ఇక్కత్ డిజైన్లను అరికట్టాలి
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ నకిలీ డిజైన్లను అరికట్టాలని కోరుతూ సోమవారం టై అండ్డై అసోసియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్ హైదరాబాద్లో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్రామ్ మాన్జీని కలిసి విన్నవించారు. హైదరాబాద్లోని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోచంపల్లి నుంచి భారత లవకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచంపల్లి చేనేత పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, చేనేత వ్యాపారులకు వ్యాపార స్థాపనకు ఆర్థిక సహకారం అందించాలని కేంద్రమంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయనను సన్మానించారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి బొమ్మలరామారం: చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన బొమ్మలరామారం మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిల్లిగుండ్లతండాకు చెందిన దీరావత్ భాస్కర్ (35) అతడి భార్య లావణ్యతో కలసి గ్రామాల్లో ఆటోలో తిరుగుతూ ఉల్లిగడ్డ, ఎండు మిర్చి, అల్లం వెల్లుల్లి అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో వ్యాపారం సరిగా నడవక ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో భాస్కర్ మానసిక వేదనకు గురయ్యాడు. ఆటోలో వ్యాపారం నిమిత్తం ఆదివారం సిరిసిల్ల ప్రాంతానికి వెళ్లిన భాస్కర్ స్వగ్రామమైన పిల్లిగుండ్లతండాకు తిరిగి వచ్చాడు. మధ్యాహ్నం ఓ వ్యవసాయ బావి వద్ద గడ్డిమందు తాగి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న భాస్కర్ను గమనించి భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై నాగభూషణంచారి తెలిపారు. -
సాయినాథుడి ఆలయం ముస్తాబు
చింతపల్లి: చింతపల్లిలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం వార్షికోత్సవాలకు ముస్తాబవుతోంది. మంగళవారం ఉదయం మంగళ వాయిద్య సుంఘోషణ, గణపతి ప్రార్థన, గోపూజ నిర్వహించి ఉత్సవాలకు అంకురారోహణ చేయనున్నారు. బుధవారం గావ్యాంత పూజ, వాస్తు పూజ, వాస్తు హోమం జరిపించనున్నారు. గురువారం ఉత్సవాలను ముక్కామల పీఠాధిపతి శ్రీధర స్వామి, చండీ ఉపాసకులు బ్రహ్మశ్రీ కొడకండ్ల రామశరణ్ శర్మ, శైవాగమ ప్రతిష్టాచార్య శానకొండ శివ కిరణ్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ● నేటి నుంచి మూడు రోజుల పాటు ఆలయ వార్షికోత్సవాలు -
పంట వ్యర్థాలు.. భూమికి సారం
త్రిపురారం : పొలాల్లో వరి కోతలు పూర్తయిన తరువాత రైతులు పంట వ్యర్థాలకు రైతులు నిప్పు పెట్టి కాల్చివేస్తున్నారు. దీంతో వాతావరణంలో కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వానాకాలం, వేసవి కాలంలో వరి కొయ్యలను పొలాల్లోనే కాల్చుతుండడంతో పల్లెల్లో సైతం వాతావరణం కాలుష్యంగా మారుతోంది. పంటలకు సంబంధించిన వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో నేలలో ఉండే పంటలకు మేలు చేసే కీటకాలు, సూక్ష్మజీవులు నశిస్తాయి. రైతులు పంట అవశేషాలను భూమిలో కలియ దున్ని పంటలు సాగు చేస్తే భూసారం పెరిగి పెట్టుబడుల ఖర్చులు తగ్గడంతో పాటు పంటల దిగుబడి పెరిగి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చు. వ్యర్థాలు భూమిలో కలియ దున్నడం వల్ల కలిగే లాభాలు సాధారణంగా పంటల కోతల అనంతరం వ్యర్థాలు పొలాల్లో మిగులుతాయి. వరి కోతల తరువాత గడ్డి, వరి కొయ్యలు, ఇతర పంటల్లో అడుగున ఉండే మొక్కల భాగాలు పొలంలోనే ఉంటాయి. వాటిని కాల్చకుండా భూమిలో కలియదున్నడం వల్ల అవి మట్టిలో కలిసిపోయి సేంద్రియ ఎరువుగా మారి భూసారం మరింత పెరుగుతుంది. నత్రజని, భాస్వరం, సూక్ష్మ పోషకాలు వృద్ధి చెందుతాయి. దీంతో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చు. సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. రైతులు పొలాల్లో పంటల వ్యర్థాలతో పాటుగా ఇతర వ్యర్థాలు కాల్చడం వల్ల వాతావరణంలోకి కార్బన్ డై ఆకై ్సడ్, మిథేన్, కార్బన్ మోనాకై ్సడ్, విష వాయువులు విడుదలవుతాయి. వ్యర్థాలను భూమిల్లో కలియ దున్నడం వల్ల భూమికి మేలు చేసే కీటకాలు, సూక్ష్మ జీవులను కాపాడుకోవచ్చు. వాన పాములు వృద్ధి చెంది భూమికి మేలు చేస్తాయి. గడ్డి, కొయ్యలకు ఇలా చేయాలి ● పొలాన్ని రోటవేటర్తో కలియ దున్నాలి. అప్పుడే వరి కొయ్యలు చిన్నచిన్న ముక్కలుగా మారుతాయి. ● దుక్కికి నీళ్లు పెట్టి ఎకరాకు 100 గ్రాముల సింగిల్ సూపర్ పాస్పేట్ వేసి 15 నుంచి 20 రోజులు పొలాన్ని నానబెట్టాలి. ● కొయ్యలు పూర్తిగా కుళ్లిపోయి సేంద్రియ ఎరువుగా మారే విధంగా సమయమివ్వాలి. భూమి సారవంతంగా ఉండే విధంగా చూసుకోవాలి పంటల సాగులో దిగుబడులు పెరగాలంటే ప్రతి రైతు నేలను కాపాడుకోవాలి. వ్యర్థాలను కాల్చడం వల్ల భూమికి మేలు చేసే సూక్ష్మ జీవులు నశిస్తాయి. దీంతో పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయి. చీడపీడల ఉధృతి సైతం పెరుగుతుంది. నేల పరిరక్షణతో పాటు వాతావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం. – శ్రీనివాస రావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, కంపాసాగర్ కలియ దున్నితే బహుళ ప్రయోజనం -
పీఏసీఎస్ చైర్మన్ను పదవి నుంచి తొలగించాలి
గరిడేపల్లి: మండల పరిధిలోని రాయినిగూడెం పీఏసీఎస్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సోమవారం సంఘం పరిధిలోని రైతులు అఖిలపక్షం ఆధ్వర్యంలో కీతవారిగూడెంలోని సంఘం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధిలో రాయినిగూడెం సంఘం రెండో స్థానంలో ఉందని, అలాంటి సంఘాన్ని చైర్మన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో నేడు నష్టాల పాలైందని విమర్శించారు. రాయినిగూడెం సొసైటీ ఉప విభాగమైన వెలిదండ సొసైటీలో ప్రహరీ నిర్మాణం చేపట్టి రూ. 6.65లక్షలు డ్రా చేశారని, కేవలం రూ.70వేలతో ప్రహరీ నిర్మించి చేతులు దులుపుకున్నారన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న చైర్మన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సంఘం సీఈఓ కనకయ్య మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారని చైర్మన్పై విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించారన్నారు. ధర్నాలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పోటు లక్ష్మయ్య, వివిధ పార్టీల నాయకులు, పెండెం వీరస్వామి, మేకల కనకారావు, బాలకృష్ణ, రాపోలు నవీన్, కామళ్ల నవీన్, గడ్డం అనిల్, మాశెట్టి అంజయ్య, బాదే నరసయ్య, గుంటి వెంకటేశ్వర్లు, గండు మల్లయ్య, కామల్ల ఆంథోని, ప్రసాద్, అంజయ్య, రవి, సోమయ్య, శ్రీను, భిక్షం, రాంబాబు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కీతవారిగూడెంలోని సంఘం కార్యాలయం ఎదుట రైతుల ధర్నా -
చిట్టితల్లికి పెద్దకష్టం
భూదాన్పోచంపల్లి: 14 నెలల చిన్నారికి పెద్ద కష్టమొచ్చింది. జువైనల్ మైలో మోనోసైటిక్ లుకేమియా అనే క్యాన్సర్తో బాధపడుతోంది. తల్లిదండ్రులు కన్నబిడ్డను కాపాడుకోవడానికి ఆర్థిక స్థోమత లేక తల్లడిల్లుతున్నారు. దాతల ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. భూదాన్పోచంపల్లి మండలం వంకమామిడి గ్రామానికి చెందిన షేక్ జమాల్కు మొదటి సంతానంగా షేక్ ఐరా జన్మించింది. ఆరు నెలల క్రితం చిన్నారికి తీవ్ర జ్వరం వచ్చింది. ఆస్పత్రుల్లో చూపించినా తగ్గలేదు. ఈ క్రమంలో కడుపు ఉబ్బి పాలు తాగడానికి ఇబ్బంది పడింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపిస్తే గ్యాస్ ట్రబు ల్ అని మందులు ఇచ్చి పంపించారు. కానీ చిన్నారి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో బీబీనగర్ ఎయిమ్స్ వైద్యుల సలహా మేరకు నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే నెలరోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ లేదని ఎముక మజ్జ టెస్టులు చేయగా రిపోర్టు నార్మల్గా వచ్చింది. దీంతో డాక్టర్లు మందులు రాసి పంపించారు. ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థత ఐరాకు ఉన్నట్టుండి మూత్రవిసర్జన ఆగిపోయి, కడుపు ఉబ్బి తీవ్ర అస్వస్థతకు గురైంది. తల్లిదండ్రులు నెల రోజుల క్రితం బీబీనగర్ ఎయిమ్స్లోని ఐసీయూలో చేర్పించారు. పరీక్షలు చేయగా చిన్నారికి జువైనల్ మైలో మోనోసైటిక్ ల్యుకేమియా అనే క్యాన్సర్ వచ్చిందని డాక్టర్లు నిర్ధారించారు. కాలేయం, ప్లీహానికి కూడా వాపు వచ్చిందని, చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. కీమోథెరపి చేయాలని, అవసరమైతే ఎముక మజ్జ మార్పిడి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు రూ.లక్షల్లో ఖర్చు అవుతుందని తెలిపారు. కూలీనాలీ చేసుకొని జీవనం సాగించే జమాల్ కుటుంబం తన బిడ్డను మెరుగైన చికిత్స చేయించుకోవడానికి ఆర్థిక స్థోమతలేక ఇబ్బంది పడుతున్నాడు. గత ఆరు నెలలుగా బిడ్డను కాపాడుకోవడానికి ఆస్పత్రుల చుట్టూ తిరిగి ఇప్పటికే రూ.2 లక్షల వరకు ఖర్చు చేశాడు. ప్రస్తుతం ఐరా బీబీనగర్లోని ఎయిమ్స్లోని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అత్యవసర చికిత్స పొందుతోంది. చిన్నారికి రెండు మూడు రోజుల కొకసారి రక్తం, ప్లేట్లెట్లు ఎక్కించాల్సి వస్తుందని మందులు, టెస్టులకు వేలల్లో ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆపన్నహస్తం అందించి ఆదుకోవాలని, సాయం చేసే దాతలు 76750 88204 నంబర్కు ఫోన్పే చేయాలని కోరుతున్నారు. క్యాన్సర్తో పోరాడుతున్న 14 నెలల చిన్నారి చికిత్స చేయించే ఆర్థికస్థోమత లేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు ఆదుకోవాలని వేడుకోలు -
పక్షం రోజుల్లోనే దంపతుల మృతి
చౌటుప్పల్ రూరల్: పక్షం రోజుల్లోనే ఇద్దరు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. ఈ సంఘటన సోమవారం చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన గోశిక భాస్కర్(42)కు ఇదే గ్రామానికి చెందిన పాలాది నవ్యతో 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు సుభాష్(8), మహాలక్ష్మి(6) ఉన్నారు. భాస్కర్ ఇంటి వద్దే చేనేత కార్మికుడిగా పని చేస్తుండగా నవ్య భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. కరోనా తర్వాత చేనేత పని కుంటుపడడంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీంతో భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవ జరుగుతూ ఉండేది. ఈ క్రమంలో ఈనెల 13న నవ్య చేనేత రంగుల్లో వాడే రసాయనం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై నవ్య సోదరుడు పాలాది రాఘవేంద్ర తన సోదరి మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి తోడు భార్య చనిపోవడానికి భర్తే కారణమని భార్య మేనమామ మిగతా బంధవులు పదేపదే అనడంతో భాస్కర్ మనోవేదనకు గురయ్యాడు. మరోవైపు భార్య సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించి భాస్కర్పై కేసు నమోదు చేశారు. ఈక్రమంలో భాస్కర్ ఆదివారం అర్ధరాత్రి చేనేత రంగుల్లో కలిపే రసాయనాన్ని తాగి నిద్రపోయాడు. సోమవారం ఉదయమై భాస్కర్ నిద్ర లేవకపోవడంతో తల్లి నిద్ర లేపగా అప్పటికే భాస్కర్ మృతి చెంది ఉన్నాడు. భాస్కర్ను వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలున్న పాలాది రాఘవేంద్ర, శ్రీనాథ్, సతీష్, సత్యనారాయణ, భాగమ్మలపై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. ఆర్థిక సమస్యలతో భార్యాభర్తల మధ్య వివాదాలు ఈనెల 13న ఆత్మహత్య చేసుకున్న భార్య మనస్థాపంతో చేనేత రంగుల్లో కలిపే రసాయనం తాగి భర్త బలవన్మరణం అనాథలైన ఇద్దరు చిన్నారులు -
రైతుల సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారు
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): రాష్ట్రంలో రైతుల సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారని, ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరి దోపిడీ వాళ్లదే అన్నట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆరోపించారు. సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని ఏపూరు గ్రామంలో ఐకేపీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఐకేపీ కేంద్రాల్లో రైతులు ధాన్యం తీసుకువచ్చి 60 రోజులు దాటుతున్నా కాంటాలు కాకపోవడం దారుణమన్నారు. రుతుపవనాలు వచ్చి దుక్కులు దున్నాల్సిన రైతులు ప్రతిరోజు ధాన్యం కుప్పల వద్ద కాపలా కాయాల్సి వస్తోందన్నారు. కాంటా అయిన తర్వాత కూడా మిల్లులో నిర్వాహకులు రైతులతో బేరమాడుతున్నారని, చివరికి రైతులు దళారుల కాళ్లు పట్టుకునే దుస్థితి దాపురించిందని, ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అని దుయ్యబట్టారు. ఐకేపీ కేంద్రాల్లో ప్రతిగింజనూ ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ నాయకత్వంలో చంద్రబాబు ఆడించినట్లు రేవంత్ ఆడుతున్నాడని, నదుల నీళ్లు దోపిడీకి గురవుతున్నా నోరు మెదపడం లేదని ఆరోపించారు. బనకచర్లతో గోదారి దోపిడీకి మరో కుట్ర జరుగుతోందని, మన జలాలను కాపాడుకునేందుకు రేవంత్ మొద్దునిద్ర వీడాలన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేమని కేసీఆర్ నాయకత్వంలో మరో ఉద్యమం తప్పదన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ ఉన్నారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
సాగులో విత్తన ఎంపికకు ప్రాధాన్యమివ్వాలి
నిడమనూరు : సాగర్ ఆయకట్టులో పండే వరికి ఎంతో డిమాండ్ ఉందని, దానికి అనుగుణంగా మేలైన వరి విత్తనాలను ఎంపిక చేసుకోవాలని వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త లింగయ్య సూచించారు. సోమవారం నిడమనూరు మండలంలోని శాఖాపురంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగులో సన్నాహకంగా వ్యవసాయ శాస్త్రవేత్తలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం అనుబంధ వరి పరిశోధన క్షేత్రం పలు కొత్త రకాల వంగడాలను, నిరంతరం స్థానిక వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా యాజమాన్య పద్ధతులపై పరిశోధనలు చేస్తుందని తెలిపారు. రైతులకు అందుబాటులో మేలైన వరి విత్తనాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కంపాసాగర్ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన సన్నరకాలు కేపీఎస్ –6251, కేపీఎస్ –2874 వంటి రకాలతోపాటు, కేఎన్ఎం–1639, ఆర్ ఎన్ఆర్–1508, జేజేలు–27356 సన్నరకాలతో పాటు దొడ్డు ధాన్యం కేఎన్ఎం–118. జేజేఎల్–24423 రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయకట్టులో నిరంతరం వరి సాగుతో భూముల్లో సారం కోల్పోయి, చౌడు బారుతున్నాయని దీని నిరోధానికి పచ్చిరొట్ట, జీలుగ దుక్కిలో వేసి, నాటే ముందు కలియదున్నాలని శాస్త్రవేత్త లింగయ్య సూచించారు. శాస్త్రవేత్త వి శ్రీధర్ మాట్లాడుతూ వరి సాగులో యాజమాన్య పద్ధతులు వివరించి, నాటు ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తే పెసర్లు సాగు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి మునికృష్ణయ్య, వ్యవసాయ విస్తరణ అధికారి విజయచంద్ర, పశు వైద్యాధికారి సుధాకర్ నాయక్, రైతులు మాజీ సర్పంచ్ ఇరుగుల వెంకట్ రెడ్డి, బొజ్జ లాజర్ సీహెచ్ సూర్యానారాయణ, బారెడ్డి ప్రతాప్ రెడ్డి, రాముడు, వెంకటయ్య పాల్గొన్నారు. కంపాసాగర్ వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త లింగయ్య -
జాన్పహాడ్ దర్గా వద్ద అగ్నిప్రమాదం
పాలకవీడు: మండల పరిధిలోని జాన్పహాడ్ దర్గా వద్ద సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదవశాత్తు దుకాణాలకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు గమనించి మంటలు ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్రి ప్రమాదం జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. నాలుగు దుకాణాల్లో సుమారు రూ.5లక్షల విలువగల సామగ్రి మంటల్లో కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. డివైడర్ ఢీకొని వ్యక్తి మృతినార్కట్పల్లి: డివైడర్ను బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి నార్కట్పల్లి మండల పరిధిలోని కామినేని ఆస్పత్రి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాండ్ర గ్రామానికి చెందిన ఎరుపుల ఉపేందర్ (31) అంబులెన్స్ వాహనం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు వారీగా కామినేని ఆస్పత్రి వద్ద వాహనం నిలిపి, బైక్పై వస్తున్నాడు. ఈ క్రమంలో డివైడర్ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. కోనేరులో మునిగి బాలిక మృతియాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి విచ్చేసిన భక్తుల్లో, నీటి గుండంలో మునిగి బాలిక మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. హైదరాబాద్కు చెందిన ఆవీర్ (7) అనే బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి, యాదగిరిగుట్టకు ఆదివారం వచ్చింది. ఈ క్రమంలో గుండంలో స్నానం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. వెంటనే బాలికను, యాదగిరిగుట్టలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, ఆ తర్వాత భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నీళ్లు మింగడంతో బాలిక మృతి చెందిందని నిర్ధారించారు. మోసాలకు పాల్పడుతున్న యువతి అరెస్టు!● ఐఏఎస్ అంటూ డబ్బున్న యువకులకు వలపు వల ● బ్లాక్మెయిల్ చేసి రూ.లక్షల్లో వసూలు మిర్యాలగూడ అర్బన్: తాను డాక్టర్, ఐఏఎస్ అధికారిని అంటూ డబ్బున్న యువకులను గుర్తించి మోసాలకు పాల్పడుతున్న యువతిని మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. మిర్యాలగూడ మండలం లావుడితండాకు చెందిన ఓ యువతి కొంత కాలంగా డబ్బున్న యువకులను బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఆమైపె మలక్పేట, చైతన్యపురి, ఉప్పల్, నల్లగొండ టూటౌన్, మిర్యాలగూడ వన్టౌన్, నార్కట్పల్లి పోలీస్స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజుల క్రితం యువతి మర్డర్ అంటూ హైదరాబాద్లోని ఓ డీఎస్పీకి, మిర్యాలగూడ సబ్డివిజన్ పరిధిలో ఓ సీఐకి ఫోన్చేసి స్వీచ్ ఆఫ్ చేసినట్లు తెలిసింది. గత సంవత్సరం ఓ వైద్యుడిని బెదిరించి అతడి నుంచి రూ.5లక్షలు వసూలు చేసి ఉడాయించినట్లు సమాచారం. ఇటీవల ఓ యువకుడిని డబ్బులు డిమాండ్ చేయడంతోపాటు డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని బెదిరించడంతో సదరు యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యువతి బాగోతం వెలుగుచూడటంతో నివ్వెరపోయారు. యువతిని అరెస్టు చేసిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా రిమాండ్ చేసినట్లు తెలిసింది. -
రైతు ప్రయోజనాలే లక్ష్యం
వారికి ఆర్థికంగా లబ్ధిచేకూర్చేలా ప్రణాళికలు పెద్ద ఎత్తున రుణ సదుపాయం, జీవన ప్రమాణాలు పెంచేలా నిర్ణయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యం రూ.1100 కోట్లు గతేడాది కంటే రూ.483 కోట్ల అదనపు రుణాలు ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘ఉమ్మడి జిల్లాలో రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా బ్యాంకు కార్యకలాపాలు విస్తృతం చేశాం. సహకార వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు రైతులకు ఆర్థిక సహాయం అందించడం, గ్రామీ ణాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడతున్నాం’ అని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (2025–26)రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు వారికి బ్యాంకు రుణ పరిమితి పెంచినట్లు తెలిపారు. డీసీసీబీ 107 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఉమ్మడి జిల్లాలో 108 సహకార సంఘాల ద్వారా రైతులకు సేవలందిస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంకు ఆధ్వర్యంలో గత ఆర్థిక సంవత్సరం చేపట్టిన కార్యక్రమాలు, ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు. -
ఒకేసారి మూడు నెలల రేషన్
జూన్, జూలై, ఆగస్టు కోటా బియ్యం వచ్చే నెలలోనే పంపిణీఫ వర్షాకాలంలో వరదల ముప్పు ఫ ఉత్తరాదిలో అధికంగా గోధుమ దిగుబడి.. గోదాములన్నీ ఫుల్లు ఫ ఖాళీ చేయడానికి సమయం పట్టే అవకాశం ఫ ఒకేసారి బియ్యం సరఫరా చేయాలని కేంద్ర నిర్ణయం సాక్షి, యాదాద్రి: మూడు నెలల రేషన్ ముందస్తుగానే అందనునుంది. జూన్, జూలై, ఆగస్టు నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు జూన్ 1 నుంచి 30వ తేదీలోపు పంపిణీ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మూడు నెలల కాల వ్యవధికి జిల్లాకు అవసరమైన 13,517.796 మెట్రిక్ టన్నుల బియ్యం జిల్లాకు కేటాయించగా.. స్టాక్ పా యింట్ల నుంచి రేషన్ షాపులకు తరలిస్తున్నారు. వర్షాకాలంలో వరదలు, ఉత్తరాదిన గోదాములు నిండుగా ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్, నల్లగొండ నుంచి సన్నబియ్యం యాదాద్రి భువనగిరి జిల్లాలో సన్న బియ్యం సాగు నామమాత్రంగా ఉంది. దీంతో పొరుగున ఉన్న జనగామ, వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి కేటాయించారు. ప్రస్తుతం జిల్లాలో 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయి. మిగతా బియ్యాన్ని పొరుగు జిల్లాల నుంచి సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 2,18,963 రేష్న్ కార్డులు ఉన్నాయి. ఇందులో 13,688 అంత్యోదయ కార్డులకు 38,479 యూనిట్లు, 2,05,275 ఆహారభద్రత కార్డులకు 6,71,142 యూనిట్లు ఉన్నాయి. వీటికి ప్రతినెలా సుమారు 4,400 మెట్రిక్ టన్నులు బియ్యం అవసరం ఉంటాయి. ఇలా మూడు నెలలకు 13,517.7696 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించారు. జూన్ నెల నుంచి మరికొన్ని రేషన్కార్డులు, బియ్యం యూనిట్లు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో 515 రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేయనున్నారు. మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయనుండటంతో బయోమెట్రిక్ యంత్రాల్లో సాఫ్ట్వేర్ను కూడా అప్డేట్ చేశారు.కారణాలివీ.. వర్షాకాలంలో వరదలు, ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకుని తిండిగింజల నిల్వ, రవాణాలో అంతరాయం తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో మూడు మాసాలకు సంబంధించి రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరభారత దేశంలో ఈసారి గోధుమ దిగుబడి అధికంగా వచ్చింది. దీంతో అక్కడ గోదాములన్నీ ఫుల్లుగా ఉన్నాయి. అలాగే తెలంగాణలోనూ ఎఫ్సీఐ గోదాములు ధాన్యంతో నిండిపోయాయి. బియ్యం నిల్వ చేసేందుకు ఖాళీ స్థలం లేకపోవడం వల్ల మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించిందని అధికారులు చెబుతున్నారు. -
బాగు చేస్తేనే భూగర్భ జలం వృద్ధి!
మోటకొండూర్: వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలు పెంపొందించేందుకు గత ప్రభుత్వ హయాంలో బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్డ్యాంలు అలంకారప్రాయంగా మారాయి. మొత్తం ఎనిమిది వరకు చెక్డ్యాంలు నిర్మించగా అందులో కొన్ని చోట్ల పూడుకుపోయాయి. మరికొన్ని చెట్ల శిథిలావస్థకు చేరాయి. పూడుకుపోయిన చోట ఐదారు వేల రూపాయలు వెచ్చిస్తే అవి ఉపయోగంలోకి వచ్చే అవకాశం ఉన్నా వాటిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అందుకు నిదర్శనం మోటకొండూర్ మండలం కొండపూర్లో బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్డ్యాం. దీన్ని 2017లో రూ.82.74లక్షల వ్యయంతో నిర్మించారు. నీళ్లు ఎక్కువగా నిలవకపోవడంతో రైతుల విజ్ఞప్తి మేరుకు చెక్డ్యాం ఎత్తు సిమెంట్ పట్టితో మరో ఫీటు పెంచారు. అయితే, ఈఏడాది వానాకాలంలో వచ్చిన వరదలకు సిమెంట్ పట్టి కొట్టుకుపోయింది. దాంతో చెక్డ్యాంలో నీరు నిలిచే పరిస్థితి లేకుండాపోయింది. వేసవిలోనే చెక్డ్యాంలను పరిశీలించి అవసరమైన వాటికి మరమ్మతులు చేయాల్సి ఉండగా అధికారులు గాలికొదిలేశారు. ఫ చెక్డ్యాంల నిర్వహణ గాలికి ఫ శిథిలమై, పూడుకుపోయినా పట్టని అధికారులు ఫ రూ.కోట్లు వెచ్చించినా నిష్ప్రయోజనం -
వ్యక్తిగత, హౌసింగ్, వ్యాపార రుణాలు
మరో ఆరు కొత్త బ్రాంచ్లు ఉమ్మడి జిల్లాలోని తిప్పర్తి, ఆత్మకూర్, గరిడేపల్లి, నారాయణపూర్, దామరచర్లలో కొత్త బ్రాంచీల ఏర్పాటుకు ఇప్పటికే ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. వాటిని త్వరలో ప్రారంభిస్తాం. ఈ ఆర్ధిక సంవత్సరంలో మరో 6 కొత్త బ్రాంచీల ఏర్పాటుకు ఆర్బీఐకి ప్రతిపాదనలను పంపించాం. మిర్యాలగూడ, శాలిగౌరారం, పెద్దవూర, మోతె, చిలుకూరు, నాంపల్లిలో వాటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు గతంలో హౌసింగ్ లోన్లు ఇవ్వలేదు. మా పాలకవర్గం బాధ్యతలు చేపట్టాకే గృహ నిర్మాణ రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాం. గరిష్టంగా రూ.35 లక్షల వరకు హౌసింగ్ లోన్ ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.5 లక్షల వరకు వ్యక్తిగత, బిజినెస్ రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాం. అలాగే ఫిష్, డెయిరీ, పౌల్ట్రీ తదితర రంగాలకు 35 శాతం సబ్సిడీతో రుణాలను ఇస్తాం. గొర్రెలు, నాటుకోళ్ల్ల పెంపకానికి రుణ సదుపాయం కల్పిస్తున్నాం. కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా తమ బ్రాంచీల పరిధిలో అక్షరాస్యత కేంద్రాలను ఏర్పాటు చేశాం. వాటిల్లో ప్రజలకు ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది మార్చి 31వ తేదీవరకు 310 గ్రామాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించాం. -
చదువుల దివ్వె.. సాయిమేఘన
ఫ టెన్త్, పాలిసెట్, టీజీఆర్జేసీలో రాష్ట్రస్థాయి ర్యాంకులు రాజాపేట : పవర్లూమ్ నడుపుకుంటూ కూతురును చదివిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. వారి ఆశయాలకు అనుగుణంగానే విద్యనభ్యసిస్తూ ప్రతిభ కనబరుస్తోంది కూతురు. టెన్త్, టీజీఆర్జేసీ, పాలిసెట్.. ఇలా అన్నింటిలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది రాజాపేట మండలం రఘునాథపురానికి చెందిన గొట్టిపాముల సాయిమేఘన. ఇటీవల విడదలైన పాలిసెట్ ఫలితాల్లో సాయిమేఘన ఎంపీసీ విభాగంలో 24, ఎంబైపీసీలో 15వ ర్యాంక్ సాధించింది. టీజీఆర్జేసీలోనూ 22వ ర్యాంక్ కై వసం చేసుకుంది. గ్రామానికి చెందిన గొట్టిపాముల శ్రీనివాస్–శ్రీలత పవర్లూమ్ నడిపిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. పెద్ద కుమార్తె సాయిమేఘన 1నుంచి 4 వరకు స్థానిక ప్రాథమిక పాఠశాలలో, 5నుంచి 7వరకు బీబీనగర్లోని బీసీ గురుకులం, 8నుంచి 10వ తరగతి వరకు పటాన్చెర్వులోని ముత్తంగి ఎస్ఓయూ గురుకులంలో విద్యనభ్యసించింది. టెన్త్లో 7వ ర్యాంక్ : పదవ తరగతి పరీక్ష ఫలి తాల్లోనూ 582 మార్కులు సాధించి రాష్టస్థాయిలో 7వ ర్యాంకు సాధించింది. టెన్త్, పాలిసెట్, టీజీ ఆర్జేసీలో ఉత్తమ ర్యాంకులు సాధించిన సాయిమేఘనను పలువురు అభినందించారు. -
బీఆర్ఎస్ పాలనలోనే కులవృత్తులకు ప్రాధాన్యం
భువనగిరి: బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కులవృత్తులకు ప్రాధాన్యం దక్కిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. భువనగిరి మండలంలోని నందనం గ్రామంలో ఏర్పాటు చేసిన నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరు లతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.7 కోట్ల వ్యయంతో నందనంలో నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్రాన్ని ప్రారంభించాలనుకున్న సమయంలోనే ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయిందన్నారు. నీరా కేంద్రాలను వ్యాపార కేంద్రాలుగా చూడవద్దన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్బండ్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నీరా కేంద్రాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వమే వాటిని నిర్వహణ బాధ్యతలు చేపట్టాల న్నారు. బీఆర్ఎస్ సర్కార్ అన్ని కుల వృత్తులకు ప్రాధాన్యమిచ్చిందని, అందులో భాగంగానే కల్లుగీత కార్మికులను ప్రోత్సహించేందుకు అప్పటి ఎమ్మెల్యే శేఖర్రెడ్డి కోరిక మేరకు నందనంలో నీరా ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. నందనంలోని నీరా ఉత్పత్తుల కేంద్రానికి బొమ్మగాని ధర్మభిక్షం పేరు పెట్టి జూన్ 2వ తేదీలోపు ప్రారంభించాలన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి తక్షణమే నీరా కేంద్రాన్ని సందర్శించి ప్రారంభానికి చర్యలు తీసుకోవా లని కోరారు. రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ ప్రభు త్వమేనని, కులవృత్తులు నిర్వీర్యం కాకుండా చూ స్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక పారిశ్రామిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్, నాయకులు లక్ష్మీనారాయణ, మొగుళ్ల శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల, పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు జనగాం పాండు, ఏవీ కిరణ్కుమార్, ప్రకాష్, పడమటి మమత, తుమ్మల వెంకట్రెడ్డి, కడమంచి ప్రభాకర్, రాఘవేందర్రెడ్డి, రమేష్గౌడ్, మట్ట ధనుంజయ్యగౌడ్, ర్యాకల శ్రీని వాస్, నగేష్, వెంకటేశ్వర్లతో పాటు పలువురు గీత కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఫ నందనంలోని నీరా ఉత్పత్తుల కేంద్రం పరిశీలన -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన సంగపాక నరేష్(30) ఇటీవల బైక్పై హైదరాబాద్కు వెళ్తుండగా.. భువనగిరి సమీపంలోని ఎల్లమ్మ గుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కారు ఢీకొని.. భువనగిరి: హైదరాబాద్కు చెందిన సంగపాక నవీన్(31) ఈ నెల 15న భువనగిరిలోని తన స్నేహితుడి జన్మదిన వేడుకలకు హాజరయ్యేందుకు బైక్పై వచ్చాడు. వేడుకల అనంతరం తిరిగి హైదరాబాద్కు వెళ్తుండగా.. భువనగిరి మండలం అనంతారం గ్రామ పరిధిలో గల ప్లైఓవర్పై కారు వేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవీన్ను స్థానికులు భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి, అక్కడి నుంచి మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం నిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. మృతుడి బంధువు బట్టు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు తెలిపారు. తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు.. చౌటుప్పల్: ప్రమాదవ శాత్తు తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగడపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు చెరుకు సత్తయ్య(54) రోజువారి మాదిరిగానే ఆదివారం ఉదయం సైతం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా మోకు జారడంతో జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని పొలాల వద్ద ఉన్న వ్యక్తులు చౌటుప్పల్లోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి సత్తయ్య మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. పిడుగుపాటుతో ఏడు మేకపోతులు మృతిమేళ్లచెరువు: మేళ్లచెరువు మండలంలోని కందిబండ గ్రామ శివారులో ఆదివారం పిడుగుపడి ఏడు మేకపోతులు మృతిచెందాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన సుంకరబోయిన చినసైదులు ఆదివారం తన గొర్రెలతో పాటు వేరే వారికి చెందిన మేకపోతులను మేపుకుంటూ కందిబండ గ్రామ శివారులోకి వెళ్లాడు. మధ్యాహ్నం 3గంటల సమయంలో వర్షం రావడంతో మేకపోతులు స్థానిక పొలాల్లోని తాటిచెట్ల కిందకు వెళ్లాయి. ఈ సమయంలో ఓ తాటిచెట్టుపై పిడుగుపడడంతో దాని కింద ఉన్న ఏడు మేకపోతులు మృతిచెందాయి. హనుమంతుకు చెందిన 2 మేకపోతులు, పోశం అచ్చిరెడ్డికి చెందిన ఒకటి, సుంకరబోయిన చినసైదులుకు చెందిన 4 మేకపోతులు మృతిచెందాయి. వాటి విలువ సుమారు రూ.2లక్షలకు పైగా ఉంటుందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
ప్రైవేట్ అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం
కోదాడ: కోదాడ పట్టణంలోని వివిధ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 1988–2025 వరకు పనిచేసిన ప్రైవేట్ అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కోదాడ సమీపంలోని కొమరబండ వై జంక్షన్ వద్ద నిర్వహించారు. గడిచిన 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నవారు, ఇతర వృత్తుల్లోకి మారిన అధ్యాపకులు ఒక్కచోట చేరి తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ఎస్కే చాంద్పాషా, బూర సైదయ్యగౌడ్, మారం వెంకటరెడ్డి, సుధాకర్రెడ్డి, చందా శ్రీనివాసరావు, రామనర్సయ్య, సనత్కుమార్, నర్సిరెడ్డి, నరేందర్, బడుగుల సైదులు, శేకు రమేష్, నరసింహారావు, వెంకటేశ్వరరెడ్డి, వెంకన్న, దొడ్డా శ్రీధర్, బిక్ష్మాచారి, సనత్కుమార్, శ్యాంసుందర్రెడ్డి, కృష్ణప్రసాద్, ఉపేందర్, వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ పరిసరాలు, మాడ వీధులు, క్యూలైన్లు, ప్రసాదం, విక్రయశాల, కల్యాణ కట్ట, లక్ష్మీపుష్కరిణి ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు. ధర్మదర్శనానికి రెండున్నర గంటలు, వీఐపీ దర్శనానికి 30 నిమిషాలు పట్టిందని భక్తులు తెలిపారు. ఉదయం సాయంత్రం బ్రేక్ దర్శనాల సమయంలో మధ్యాహ్నం ఆరగింపు సమయంలో క్యూలైన్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వామివారిని 30వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి నిత్యాదాయం రూ.74,33,486 సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు. సంప్రదాయరీతిలో నిత్య పూజలులక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం నిత్యపూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వయంభూలకు సుప్రభాత సేవ చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఆరాధన, నిజాభిషేకం, అర్చన చేశారు. ఆలయ ముఖ మండపాల్లో సువర్ణ పుష్పార్చన అష్టోత్తరం, ప్రాకార మండపంలో శ్రీ సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, వేద ఆశీర్వచనం, తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు జోడు సేవలను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. రాత్రి శయనోత్సవం జరిపించి, ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. -
మిస్ వరల్డ్ వేదికపై పోచంపల్లి ఇక్కత్
భూదాన్పోచంపల్లి: మిస్ వరల్డ్ వేదికపై పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు మరోసారి తళుక్కుమన్నాయి. శనివారం హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో జరిగిన వరల్డ్ ఫ్యాషన్ ఫినాలేలో అమెరికా, కరేబియన్ దేశాలకు చెందిన అందాల భామలు పోచంపల్లి ఇక్కత్తో పాటు గద్వాల్, గొల్లభామ చేనేత వస్త్రాలతో రూపొందించిన అధునాతన ఫ్యాషన్ వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ చేసి అలరించారు. మన సంస్కృతి ఉట్టిపడేలా నూతన డిజైన్లతో ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్చనా కొచ్చర్ ఇండో వెస్ట్రన్ కలగలిపి ఫ్యాషన్ వస్త్రాలను రూపొందించారు. రెండు రౌండ్లలో జరిగిన మిస్ వరల్డ్ టాప్ మోడల్ ఫ్యాషన్ షోలో 108 మంది అందాల భామలు పాల్గొన్నారు. మొదటి రౌండ్లో మిస్ వరల్డ్ పోటీదారులు ర్యాంప్ వాక్ చేసి పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో మెరిశారు. మిస్ ఇండియా నందిని గుప్తా ఎరుపురంగు గాగ్రా వస్త్రాలతో తళుక్కుమన్నారు. యూరప్ ఖండానికి చెందిన వివిధ దేశాల భామలు గొల్లభామ చేనేత చీరలు ధరించి మెప్పించారు. కాగా ఫ్యాషన్ ఫినాలే న్యాయనిర్ణేతలు సైతం తెలంగాణ సంప్రదాయ వస్త్రాల డిజైన్లు చూసి ప్రశంసలు కురిపించారు. తెలంగాణ చేనేత వస్త్రాల ద్వారానే ఏషియా–ఓషియానా విభాగంలో మన మిస్ఇండియా నందిని గుప్తా టాప్ మోడల్ ఫైనల్ టైటిల్ను సాధించడం విశేషం. మిస్ వరల్డ్ పోటీల వేదిక ద్వారా చేనేత వస్త్రాలకు ప్రచారం పెరిగి మార్కెటింగ్ అవకాశాలు, ఆదరణ పెరిగే అవకాశం ఉందని చేనేత వర్గాలు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ నెల 15న పోచంపల్లిలోని టూరిజం పార్కులోని హంపి థియేటర్లో నిర్వహించిన ఇక్కత్ ర్యాంప్ వాక్కు మిస్ వరల్డ్ పోటీదారులు తిలకించడం ద్వారా అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చింది. మిస్ వరల్డ్ పోటీదారులు చేనేత వస్త్రాలనే ధరించి తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. దీంతో కూడా చేనేత వస్త్రాలకు తగిన ప్రాచుర్యం లభించింది. ఫ ఇక్కత్ వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్ చేసిన అందాల భామలు ఫ అందర్జాతీయంగా పోచంపల్లికి గుర్తింపు వచ్చిందంటున్న చేనేత కళాకారులు -
చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు
బొమ్మలరామారం: బొమ్మలరామారం మండలంలోని మర్యాల గ్రామంలో గల హనుమాండ్ల చెరువులో నుంచి కొందరు అక్రమార్కులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువు నుంచి రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా మట్టిని తరలించడంతో పాటు ఎఫ్టీఎల్ పరిధిలో గల భూములను పొలాలుగా మారుస్తున్నారు. కొందరు నాయకుల అండదండలతో అక్రమ మట్టి రవాణా సాగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ తతంగంపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు తీసుకున్న చర్యలు శూన్యమని పలువురు ఆరోపిస్తున్నారు. ఆందోళనలో మత్స్యకారులు.. హనుమాండ్ల చెరువులో మట్టి తవ్వకాలు జరుగుతుండడంతో స్థానిక మత్స్య కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇష్టానుసారంగా చెరువులో మట్టిని తవ్వడంతో పాటు ఎఫ్టీఎల్ని పూడ్చివేతతో చెరువు విస్తీర్ణం తగ్గుతుందని వారు వాపోతున్నారు. మట్టి తవ్వకాలతో చెరువులో గోతులు ఏర్పడి నీరు నిలువదంటున్నారు. ఫ నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్టీఎల్ పూడ్చివేత ఫ ఆందోళన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు -
చెస్ పోటీలతో విద్యార్థుల్లో మేధోశక్తి పెరుగుతుంది
సూర్యాపేట: చెస్ పోటీలతో విద్యార్థుల్లో మేధోశక్తి పెంపొందుతుందని సూర్యాపేట జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు గండూరి కృపాకర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఉమ్మడి జిల్లాస్థాయిలో బాలబాలికలకు(అండర్–11, 17 విభాగాల్లో) చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి షీల్డ్లు, మెమొంటోలను గండూరి కృపాకర్ అందజేసి మాట్లాడారు. గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు శ్రీసాయికుమార్, సంయుక్త కార్యదర్శి గడ్డం లింగారెడ్డి, కోశాధికారి వెంకట మురళి, బాణాల వెంకటేశ్వర్లు, మాద రమేష్, ఎస్. మురళి, భిక్షం, సందీప్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. మూసీ నదికి పెరిగిన వరదఅర్వపల్లి: హైదరాబాద్తో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జాజిరెడ్డిగూడెం శివారులోని మూసీ నదికి వరద పెరిగింది. దీంతో మూసీ నది నీటితో కళకళలాడుతోంది. మూసీ పరీవాహక గ్రామాల్లోని వ్యవసాయ బోర్లలో నీళ్లు పెరగడంతో వానాకాలం సీజన్కు సాగునీటి కొరత తీరనుంది. -
కొంపల్లి గ్రామానికి వచ్చిన సీఎం సతీమణి
మునుగోడు: మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామానికి ఆదివారం సీఎం రేవంత్రెడ్డి సతీమణి గీత వచ్చారు. తమ సమీప బంధువు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెదిర మధుసూదన్రెడ్డి దశ దినకర్మకు సీఎం సతీమణి గీత, ఆమె తల్లిదండ్రులు సూదిని పద్మారెడ్డి, పారిజాత హాజరై మధుసూదన్రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో పాటు రాష్ట్ర లోకాయుక్త చైర్మన్ జస్టిస్ రాజశేఖర్రెడ్డి, నిజమాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కై లాస్నేత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు హాజరై మధుసూదన్రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఫ సమీప బంధువు దశదినకర్మలో పాల్గొన్న గీత -
పర్యాటకులకు రక్షణ కల్పించడంలో కేంద్రం విఫలం
ఆలేరు: కశ్మీర్లో పర్యాటకులకు రక్షణ కల్పిచండంలో కేంద్ర ప్రభుత్వ పూర్తిగా వైఫల్యం చెందిందని ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) జాతీయ నాయకురాలు వి. సంధ్య ఆరోపించారు. పహల్గాం ఘటన, ఆపరేషన్ సింధూర్లో దాగిన నిజాలు, ఆపరేషన్ కగార్ను ఆపాలనే అంశాలపై ఆదివారం ఆలేరు పట్టణంలో జరిగిన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. పహల్గాంలో పర్యాటకులను చంపిన ఉగ్రవాదులు దేశం దాటి వెళ్తుంటే రక్షణ శాఖ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ వల్ల పాలకవర్గాలకు ప్రయోజనం తప్ప.. ప్రజలకు, భారత్, పాకిస్తాన్ దేశాలకు ఏమీ లాభం లేదన్నారు. మనకంటే ముందే ఆపరేషన్ సింధూర్ ఆగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం మన దేశ ఆత్మగౌరవాన్ని అమెరికా ముందు తాకట్టు పెట్టడం కాదా అని ప్రశ్నించారు. ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని అన్నారు. చర్చలకు సిద్ధమని ప్రకటించిన మావోయిస్టు పార్టీలతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. మావోయిస్టుల పేరుతో గిరిజనులు, ఆదివాసులను చంపడాన్ని ఆపాలన్నారు. మోదీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సిద్ధం కావాలని సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి, సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి ఆర్. జనార్దన్, సీపీఐ జిల్లా కార్యదర్శులు గోద శ్రీరాములు, జహంగీర్, జిల్లా నాయకులు మామిడాల సోమయ్య, ఆర్. సీత తదితరులు పాల్గొన్నారు. ఫ మావోయిస్టు పార్టీలతో చర్చలు జరపాలి ఫ పీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్య -
గురుకులాలు పేద విద్యార్థులకు వరం
మోత్కూరు: పేద విద్యార్థులకు గురుకులాలు వరంలాంటివని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. గురుకులాల్లో చదివిన మలావత్ పూర్ణ, సాధనాల ఆనంద్ 2014 మే 25న ఎవరెస్ట్ శిఖరం ఎక్కి ప్రపంచ రికార్డు సృష్టించడంతో ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా స్వేరో నెట్వర్క్ ఆధ్వర్యంలో మోత్కూరు జెడ్పీహెచ్ఎస్లో విక్టరీ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని జెడ్పీహెచ్ఎస్లు, మోడల్ స్కూళ్లు, గురుకులాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివి ప్రథమ, ద్వితీయ ర్యాంకులు పొందిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. తహసీల్దార్ మందుల నర్సయ్య పంపించిన ఇంగ్లిష్ డిక్షనరీలను సన్మానం పొందిన విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన సమయంలో గురుకులాలను ఎంతో అభివృద్ధి చేశారని, విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చారని పేర్కొన్నారు. స్వేరో నెట్వర్క్ జిల్లా కమిటీ అధ్యక్షుడు ఎర్రవెల్లి నర్సయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ అన్నెపు వెంకట్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు తొర్ర ఉప్పలయ్య, కనుకు రాజు, గజ్జెల్లి మహేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఫ రెడ్క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి -
విత్తన శుద్ధితో తెగుళ్ల నివారణ సులభం
పెద్దవూర: వివిధ పంటల్లో తొలి దశలో విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లు, రసం పీల్చే పురుగులను నియంత్రించడానికి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలని పెద్దవూర మండల వ్యవసాయశాఖ అధికారి పి. సందీప్కుమార్ సూచిస్తున్నారు. విత్తన శుద్దితో మొలక శాతం పెరగడంతో పాటు తొలుత 30 రోజుల వరకు పంట ఆరోగ్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వివిధ పంటల సాగులో విత్తన శుద్ది ఎలా చేయాలో ఆయన వివరించారు. ● వరి: కితో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజమ్ మందును కలిపి 24 గంటల తర్వాత నారు మడిలో చల్లుకోవాలి. దుంప నారు మడులకు అయితే లీటరు నీటికి 1గ్రాము కార్బండిజమ్ మందును కలిపి ఈ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టాలి. మండె కట్టి మొలకెత్తిన విత్తనాన్ని నారుమడిలో చల్లుకోవాలి. ● సోయాబీన్: కిలో విత్తనాలకు 2 గ్రాముల థైరమ్+1 గ్రాము కార్బండిజమ్ కలిపి, 1.5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్తో విత్తన శుద్ధి చేయాలి. చివరగా విత్తే గంట ముందు 10 కిలోల విత్తనాలకు 200 గ్రాముల రైజోబియం జపానీకం కల్చర్ను నీరు, జిగురుతో పట్టించి నీడలో ఆరబెట్టాలి. ● జొన్న: కిలో విత్తనానికి 3 గ్రాముల థెరమ్ లేదా కాప్టాన్ మందును కలిపి శుద్ధి చేయాలి. మొవ్వ ఈగ నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల థమోమిఽథాక్సమ్ మందును కలపాలి. ● మొక్కజొన్న: కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెట్ లేదా థెరమ్ లేదా కాప్టాన్తో శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. ● కంది: కందిలో విత్తనం ద్వారా సంక్రమించే ఎండు తెగులును నివారించడానికి తెగులును తట్టుకునే రకాలను సాగు చేయడంతో పాటు 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడే కలిపి శుద్ధి చేసుకోవాలి. ● పత్తి: పత్తిలో రసంపీల్చు పురుగుల తాకిడి ఎక్కువ. బీటీ పత్తిని పండిస్తున్న రైతులు కూడా పిండి నల్లి, నులి పురుగులతో ఇబ్బందులు పడుతున్నారు. వీటి నివారణకు కిలో విత్తనానికి తగినంత జిగురు కలిపి 9 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్ లేక 5 గ్రాముల థయోమిథాక్సమ్ 70డబ్ల్యూపీఎస్. 2 గ్రాముల కార్బండిజమ్తో విత్తన శుద్ధి చేయాలి. మిరప: మిరప విత్తన శుద్ధి చేయడానికి మొదట విత్తనాలను 15–20 నిమిషాల పాటు గోరు వెచ్చని నీటిలో నానబెట్టాలి. తర్వాత ఒక లీటరు నీటిలో 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ను కరిగించి ఆ ద్రావణంలో విత్తనాలను 15–20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఫ పెద్దవూర మండల వ్యవసాయాధికారి సందీప్కుమార్ పసుపు: పసుపు పంటను దుంప వేరు కుళ్లు, ఆకుపచ్చ తెగుళ్ల నుంచి కాపాడుకునేందుకు లీటరు నీటికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 3 గ్రాముల మెటలాక్సీస్ ఎంజెడ్ కలిపి ఆ ద్రావణంలో 40 నిమిషాల సేపు కొమ్ములను ఉంచాలి. అనంతరం నీడలో ఆరబెట్టాలి. పసుపు కొమ్ము/విత్తనాలకు పొలుసు పురుగు ఆశిస్తే శిలీంధ్రనాశినితో పాటు లీటరు నీటికి 5 మిల్లీ లీటర్ల మలాథియాన్, 2 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపి నీడలో ఆరబెట్టి నీరు మార్చి 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడే కలిపిన ద్రావణంలో ముంచి కొమ్ములను నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. -
కన్నెకంటికి లీడర్ అవార్డుతో సన్మానం
రామన్నపేట: రామన్నపేట మండలం మునిపంపుల మాజీ ఎంపీటీసీ సభ్యుడు, సింగిల్ విండో డైరెక్టర్ కన్నెకంటి వెంకటేశ్వరాచారిని హైదరాబాద్లోని విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వారు లీడర్ అవార్డుతో సన్మానించారు. ఆదివారం హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయనను సన్మానించారు. రాజకీయాల్లో విశ్వకర్మల భాగస్వామ్యం పెంపొందించడమే లక్ష్యంగా 14 రాష్ట్రాలకు చెందిన 410మంది విశ్వకర్మ ప్రతినిధులను సన్మానించినట్లు వెంకటేశ్వరాచారి తెలిపారు. -
మహిళా సంఘాలకు కొత్త సారథులు
ఆలేరురూరల్ : మహిళా స్వయం సహాయక సంఘాలకు కొత్త సారథులు వచ్చారు. జిల్లాలో 14,900 సంఘాలు, 16మండల సమాఖ్యలను సెర్ప్ రూపొందించిన నూతన బైలా ద్వారా ఎన్నుకున్నారు. వలిగొండ మండల సమాఖ్య నూతన కార్యవర్గ ఎన్నిక ఈనెల 26న జరగనుంది. ఇక జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి ఎంపిక జూన్ 6వ తేదీన నిర్వహించనున్నారు. మూడు స్థాయిల్లో సంఘాలు జిల్లా, గ్రామ, మండల స్థాయిలో స్వయం సహాయక సంఘాలు పని చేస్తున్నాయి. గ్రామస్థాయిలో ఒక్కో స్వయం సహాయక బృందానికి ఇద్దరు లీడర్లు, పాలకవర్గ సభ్యులు, గ్రామ సమాఖ్యకు అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారితో కార్యవర్గం ఉంటుంది. ఇదే తరహాలో మండల, జిల్లా సమాఖ్యలు ఉంటాయి. వీటికి ఇప్పటికే ఎన్నికలు నిర్వహించి కొత్త లీడర్లను ఎన్నుకున్నారు. ఎన్నికల నిర్వహణకు ఏపీఎం, సీసీలకు ఇతర సిబ్బందికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.శిక్షణ పొందిన సిబ్బంది గ్రామస్థాయిలో కొత్త లీడర్ల ఎన్నికపై గ్రామైక్య సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. ఎన్నిక ఈ విధంగా నిర్వహించారు ప్రతి స్వయం సహాయక సంఘం(ఎస్ఎచ్జీ)లో 10 నుంచి 15 మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్షురాళ్ల ఎన్నికకు నిబంధనల ప్రకారం ఆసక్తి ఉన్న సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఏకగ్రీవంగా, చేతులు పైకెత్తడం, చీటీలు రాసి మద్దతు ప్రకటించడం వంటి మూడు పద్ధతులను అవలంభించారు. వీటిలో ఒక విధానం ద్వారా అధ్యక్ష, ఉపాధ్యక్షురాళ్ల్లను ఎన్నుకున్నారు. గ్రామంలోని స్వయం సహాయం సంఘాల సభ్యుల్లో ఒకరిని గ్రామ సమాఖ్య అధ్యక్షురాలిగా, గ్రామ సంఘాల అధ్యక్షుల నుంచి ఒకరిని మండల సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. మండల సమాఖ్య అధ్యక్షురాలి నుంచి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిని ఎన్నుకో నున్నారు. జిల్లా అధ్యక్షురాలి ఎంపికతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. రుణాల సద్వినియోగంలో వారే కీలకం ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుంటున్న స్వయం సహాయక సంఘాల సభ్యులు అర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. చిరువ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు పొదుపు పాఠాలు అలవర్చుకుంటున్నారు. ప్రతి నెలా తప్పనిసరిగా వాయిదాల పద్ధతిన సీ్త్రనిధి రుణాలను బ్యాంక్లో జమ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో అధ్యక్ష, ఉపాధ్యక్షురాళ్లు పాత్ర ఎంతో కీలకమైనదిగా చెప్పవచ్చు. పదవీకాలం మూడేళ్లు నూతన కార్యవర్గాల పదవీకాలం మూడు సంవత్సరాలు ఉంటుంది. తుది దశకు ప్రక్రియ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘా లకు కొత్త సారథులను ఎన్నుకునేందుకు పది రోజుల క్రితం మొదలైన ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరింది. 14,900 సంఘాలకు, 16 మండల సమాఖ్యలకు గాను ఇప్పటికే నూతన లీడర్లను ఎన్నుకున్నారు. జూన్ 6వ తేదీతో ప్ర క్రియ పూర్తికానుంది. అనంతరం నూతన కార్యవర్గాలకు శిక్షణ ఇవ్వనున్నారు. పొదుపు, బ్యాంకు రుణాలు పొందడం, కిస్తులు చెల్లించడంపై అవగాహన కల్పిస్తారు. ఫ 14,900 సంఘాలు, 16 మండల సమాఖ్యలకు ఎన్నికలు పూర్తి ఫ జూన్ 6న జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి ఎంపికవీఓలు 562మండల సమాఖ్యలు 17మహిళా సంఘాలు 14,900మొత్తం సభ్యులు 1,51,876పారదర్శకంగా ఎన్నికలు జిల్లాలోని మహిళా స్వయం సహాయ సంఘాలకు ఎన్నికలు జరిగే ప్రక్రియ కొనసాగుతుంది. ఈనెలాఖరుకు ఎన్నికలు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే గ్రామ స్థాయిలో పూర్తికాగా, మండల అధ్యక్షురాళ్ల ఎన్నిక చివరి దశకు వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. –పాశికంటి మల్లేశం, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ -
పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయండి
భువనగిరిటౌన్ : గ్రామాల్లో పెండింగ్ అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి డీపీఓలు, జెడ్పీ సీఈఓలతో వీ డియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనుల ప్రగతిపై సమీక్షించారు. నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ, డీపీఓ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పెండింగ్ పనులు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీపీఓ సునంద, డీఆర్డీఓ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల తనిఖీ రాజాపేట: మండలంలోని బొందుగుల గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం డీఎంహెచ్ఓ మనోహర్ తనిఖీ చేశారు. రోగులు, గర్భిణుల నమోదు రికార్డులు, మందుల స్టాక్ను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందజేసి ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలని వైద్యసిబ్బందికి సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు పెంచాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంఎల్హెచ్పీ మానస, ఏఎన్ఎం అలేఖ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఉన్నారు. యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట పీహెచ్సీ, వంగపల్లిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను డీఎంహెచ్ఓ సందర్శించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే ,డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వృత్యంతర శిక్షణతో బోధన మెరుగుయాదగిరిగుట్ట: ఉపాధ్యాయులు బోధన నైపు ణ్యాలు మెరుగుపరుచుకునేందుకు వృత్యంతర శిక్షణ దోహదపడుతుందని డీఈఓ సత్యనారా యణ పేర్కొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా, ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు నిర్వహి స్తున్న వృత్యంతర శిక్షణ తరగతులను శుక్రవా రం ఆయన సందర్శించారు. ప్రస్తుత పరిస్థితు ఉపాధ్యాయులకు అన్ని సబ్జెక్టులతో పాటు డిజిటల్ బోధన పట్ల శిక్షన ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు బలపడుతాయన్నారు. వృత్యంతర శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో అమలు పర్చాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ శిబిరం కోర్స్ ఇంచార్జ్, ఎంఈఓ యామిని, రిసోర్స్ పర్సన్లు నాగలింగం, బాలలక్ష్మి, నాగమణి, బాలసుబ్రహ్మణ్యం, మనోహర్, అరవింద రాయుడు, వెంకటేష్, కొండల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెర్ప్ ఉద్యోగుల బదిలీలు?ఫ జిల్లాలో 70 మంది సిబ్బంది సాక్షి యాదాద్రి : పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో బదిలీలకు రంగం సిద్ధమైంది. నిబంధనల ప్రకారం 30 శాతం ఉద్యోగులను మాత్రమే బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ, వంద శాతం బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎంత మంది ఉన్నారు, ఏ ప్రాతిపదికన బదిలీ చేయాలి.. తదితర అంశాలపై శనివా రం సెర్ప్ ఉన్నతాధికారులు రాష్ట్రస్థాయిలో యూనియన్ నాయకులతో సమావేశమై చర్చించనున్నట్లు తెలిసింది. కాగా కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగులు ఇలా.. జిల్లా సెర్ప్లో మొత్తం 70 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో ఏపీఎంలు 23, డీపీఎంలు నలుగురు, సీసీలు 43 మంది ఉన్నారు. వీరంతా బదిలీల పరిధిలోకి రానున్నారు. జూన్ 1వ తేదీనుంచి బదిలీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చాలా ఏళ్ల తరువాత బదిలీలు జరుగుతుండడంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
రైతులకు రూ.550 కోట్లు చెల్లించాం
భూదాన్పోచంపల్లి: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే బిల్లులు వస్తున్నాయని, ఇప్పటివరకు రూ.550 కోట్లు జమ అయ్యాయని, మరో రూ.30 కోట్లు చెల్లిస్తే వందశాతం పూర్తవుతాయని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. శుక్రవారం భూదాన్పోచంపల్లి మండలంలోని జూలూరు, ముక్తాపూర్, రేవనపల్లి, శివారెడ్డిగూడెం, జిబ్లక్పల్లి, దంతూర్ గ్రామాల్నోఇ కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కుప్పలను పరిశీలించారు. ఎంత ధాన్యం కాంటా చేశారు, కేంద్రాల్లో ఎంత నిల్వ ఉందని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మిల్లుల వద్ద అన్లోడ్ ఆలస్యమవుతుందని తెలుసుకుని లారీ యజమానులు, మిల్లర్లతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వర్ష సూచన ఉన్నందున కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హమాలీలు, కాంటాలు, లారీలను పెంచుకొని ఈ నెల 27 వరకు కొనుగోళ్లు పూర్తయ్యేలా చూడాలన్నారు. 370 కొనుగోలు కేంద్రాలకు 110 సెంటర్లలో ధాన్యం సేకరణ పూర్తయినట్లు వెల్లడించారు. 10 పెద్ద సెంటర్లు మినహా జిల్లాలోని మిగతా అన్ని కేంద్రాల్లో నాలుగు రోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతాయని చెప్పారు. ఇప్పటి వరకు 2.83లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మరో 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో సివిల్సప్లై జిల్లా అధికారిణి రోజా, జిల్లా మేనేజర్ హరికృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ బాలమణి, ఎంఆర్ఐ గుత్తా వెంకట్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి శైలజ, ఏపీఎం నీరజ, ఏఈఓ నరేశ్, జూలూరు పీఏసీఎస్ చైర్మన్ అందెల లింగంయాదవ్, పోచంపల్లి పీఏసీఎస్ సీఈఓ సద్దుపల్లి బాల్రెడ్డి ఉన్నారు.ఫ 27లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి ఫ కలెక్టర్ హనుమంతరావు -
నిధుల్లేక.. పనులు పట్టాలెక్కక..
తొమ్మిదేళ్లుగా కదలని ఎంఎంటీఎస్ సాక్షి, యాదాద్రి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతోంది. ప్రధానంగా హైదరాబాద్ నుంచి నిత్యం వేలాది భక్తులు వస్తుంటారు. కానీ, సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో స్వామి సన్నిధికి చేరుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. భక్తుల సౌకర్యార్థం ఘట్కేసర్ నుంచి యాదాద్రి(రాయగిరి) రైల్వే స్టేషన్ వరకు తొమ్మిదేళ్ల క్రితం ఎంఎంటీఎస్ మంజూరైనా నేటికీ పట్టాలెక్కలేదు. రూ.400 కోట్లతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన ప్రకటనతో ఎంఎంటీఎస్పై ఆశలు చిగురిస్తున్నాయి. 2016లో మంజూరు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణం తరువాత భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని భావించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంఎంటీఎస్ను ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు పొడిగించాలని ప్రధాని మోదీని కోరారు. అలాగే రాయగిరి స్టేషన్ పేరును యాదాద్రి స్టేషన్గా మార్చాలని విన్నవించగా మోదీ ఆమోదించారు. యాదాద్రి రైల్వే స్టేషన్ వరకు 2016లో ఎంఎంటీఎస్ ప్రాజెక్టు మంజూరైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా మోక్షం కలగలేదు. భూసేకరణ చేయకపోవడంతో పాటు రాష్ట్రం తన వాటా నిధులు కేటాయించడం లేదని కేంద్రం.. పూర్తి నిధులతో కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్రం వాదులాడుకుంటూ వచ్చాయి. ఫలితంగా ఎంఎంటీఎస్ జిల్లా ప్రజలకు కలగానే మిగిలింది. ఘట్కేసర్ వద్ద ఆగిన రెండో దశ పనులు ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ఘట్కేసర్ వద్దకు వచ్చి ఆగిపోయాయి. భూసేకరణతో పాటు నిధుల కొరత పనుల జాప్యానికి కారణంగా మారింది. రూ.400 కోట్లతో త్వరలోనే ఎంఎంటీఎస్ పనులను పట్టాలెక్కిస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ప్రకటించారు. గురువారం హైదరాబాద్లోని బేగంపేట రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈసందర్భంగా స్టేషన్ ప్రాంగణంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కిషన్రెడ్డ్డి యాదాద్రి ఎంఎంటీఎస్పై ప్రకటన చేశారు.ఫ యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి భారీగా పెరిగిన భక్తులు ఫ సాధారణ ప్రయాణికులూ వేలల్లో.. ఫ రవాణాపరంగా అవస్థలు ఫ రూ.400కోట్లతో పనులు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటన ఫ ప్రాజెక్టుపై చిగురిస్తున్న ఆశలు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది ఘట్కేసర్ నుంచి యాదాద్రి రైల్వే స్టేషన్ వరకు ఎంఎంటీఎస్ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణకోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి నిత్యం 50వేల నుంచి లక్ష మంది వరకు హైదరాబాద్ వెళ్లొస్తుంటారు. వీరిలో యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చే భక్తులే సగానికి పైగా ఉంటారు.వీరి ప్రయాణ సౌలభ్యం కోసం ఎంఎంటీఎస్ ఎంతో అవసరం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తుంది. –ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఎంఎంటీఎస్ అవసరం తప్పనిసరి యాదగిరిగుట్ట క్షేత్రానికి పెరుగుతున్న భక్తులు, ఇతర ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా జిల్లాకు ఎంఎంటీఎస్ అవసరం తప్పనిసరిగా మారింది. ప్రాజెక్టు పూర్తయితే ప్రత్యేక లైన్ ద్వారా ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. దీంతో హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరికి సికింద్రాబాద్ నుంచి గంట వ్యవధిలోనే చేరుకోవచ్చు. సికింద్రాబాద్ – ఖాజీపేట సెక్షన్లో భువనగిరి, బీబీనగర్, ఆలేరు స్టేషన్ల మధ్య నుంచి ప్రతి రోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు, వ్యాపారులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, రోజు కూలీలు, యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చే వేలాది మంది యాత్రికులు ఎంఎంటీఎస్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా బీబీనగర్ ఎయిమ్స్కు వచ్చే రోగులకు సౌకర్యవంతంగా ఉంటుంది. -
కాంగ్రెస్.. పదవుల రేస్
సాక్షి, యాదాద్రి: అధికార కాంగ్రెస్లో సంస్థాగత ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. పట్టణ, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవుల కోసం పెద్ద సంఖ్యలో నాయకులు పోటీ పడుతున్నారు. ఎవరికి వారు ఎమ్మెల్యేలు, అధిష్టానం వద్ద లాబీయింగ్ చేసుకుంటున్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈనెల 30 లోగా నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి కమిటీలకు ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. ఆలేరు, తుంగతుర్తిలో సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. భువనగిరి, మునుగోడులో పెండింగ్లో ఉన్నాయి. ఆలేరు నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి ఆలేరు నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు, రెండు పట్టణ కమిటీలకు అధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంది. ఇందులో యాదగిరిగుట్ట పట్టణం, యాదగిరిగుట్ట మండలం, తుర్కపల్లి మండల అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మూడు చోట్ల అధ్యక్షులను నియమించే నిర్ణయాన్ని స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు వదిలేశారు. ఎమ్మెల్యే ఎవరిని నియమించినా తామంతా అంగీకరిస్తామని డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, పీసీసీ పరిశీలకుల సమక్షంలో జరిగిన సమావేశంలో నాయకులు స్పష్టం చేశారు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు ఎవ్వరూ పేర్లు ఇవ్వకపోవడంతో ఆ మూడు చోట్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక బొమ్మలరామారంలో 22, గుండాల 22 మంది, ఆలేరు పట్టణం, ఆలేరు మండలం, మోటకొండూరు, ఆత్మకూర్ (ఎం, రాజాపేటలో పదులసంఖ్యలో అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. తుంగతుర్తిలో పదుల సంఖ్యలో దరఖాస్తులు తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి మోత్కూరు, అడ్డగూడూరు మండలాల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఈనెల 10వ తేదీన సమావేశం ఏర్పాటు చేశారు. కానీ, గొడవ చోటు చేసుకోవడంతో దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడింది. గురువారం మరోసారి సమావేశం నిర్వహించారు. అడ్డగూడూరు, మోత్కూరు మండలాల నుంచి ఆరుగురు చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. మోత్కూరు పట్టణ అధ్యక్ష పదవికోసం 10 మంది దరఖాస్తులు అందజేశారు. బ్లాక్ కాంగ్రెస్ పదవులకు భారీగానే.. భువనగిరి, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల్లోని ఐదు బ్లాక్ కాంగ్రెస్ స్థానాలు ఉన్నాయి. అలేరు, యాదగిరిగుట్ట, భువనగిరి, భూదాన్పోచంపల్లి, చౌటుప్పల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవుల కోసం పెద్ద సంఖ్యలో నాయకులు పోటీపడుతున్నారు. గ్రామ, వార్డు కమిటీలపై ప్రత్యేక దృష్టి మండల, పట్టణ కమిటీలకు అధ్యక్షులను ఎన్నుకున్న తర్వాత గ్రామ శాఖలు, పట్టణాల్లో వార్డు కమిటీలకు అధ్యక్షులను, కార్యవర్గాలను ఎన్నుకోనున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామ, వార్డు కమిటీలకు ప్రాధాన్యం ఏర్పడింది. సారధ్య బాధ్యతల కోసం యువత ఎక్కువగా పోటీ పడుతోంది. నూతనంగా ఎన్నికై న మండల, పట్టణ అధ్యక్షులు గ్రామ, వార్డుల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి అశావహుల పేర్లను తీసుకుంటారు. ఇక్కడ కూడా ఏకగ్రీవమైన వారితో పాటు పోటీపడుతున్న నాయకుల పేర్లను పీసీపీకి పంపిస్తారు. ఆసక్తిరేపుతున్న పార్టీసంస్థాగత ఎన్నికలు ఫ పట్టణ, మండల, బ్లాక్ కమిటీ అధ్యక్ష పదవులకు తీవ్ర పోటీ ఫ ఆలేరు, తుంగతుర్తిలో దరఖాస్తుల స్వీకరణ ఫ పలు చోట్ల 20 మందికి పైగా ఆశావహులు ఫ ఎమ్మెల్యేల వద్ద లాబీయింగ్భువనగిరి, మునుగోడు ఆలస్యం భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో పూర్తి చేస్తామని డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. శనివారం నుంచి భువనగిరి లేదా మునుగోడు నియోజకవర్గంలో మండలం, పట్టణవాల వారీగా సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. కాగా భువనగిరి, భూదాన్పోచంపల్లి, చౌటుప్పల్ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లో పెద్ద సంఖ్యలో నాయకులు పోటీ పడుతున్నారు. జోరుగా ప్రయత్నాలు పదవుల కోసం నేతల ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఎమ్మెల్యేల అండదండలు ఉన్నవారికి పదవులు దక్కే అవకాశం ఉండటంతో వారి వద్దకు చక్కర్లు కొడుతున్నారు. కాగా ఆశావహుల్లో కొత్తగా చేరిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాగా కూడా పదవులు ఆశిస్తూ తమ గాడ్ఫాదర్లను ఆశ్రయిస్తున్నారు. కాగా దరఖాస్తుల్లో ప్రతిపాదించిన పేర్లను పీసీసీ ఫైనల్ చేయనుంది. -
పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత
మునగాల : మండల శివారులో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున కోదాడ నుంచి హైదరాబాద్కు ఓ వాహనంలో పశువులను తరలిస్తుండగా మండల పోలీసులు తనిఖీలు నిర్వహించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ నుంచి టీఎస్ 29 టీ 3458 నంబర్ గల అశోక్ లేలాండ్ వాహనంలో పది పశువులు (8ఆడ, రెండు మగ)ను హైదరాబాద్లోని కబేళాకు తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి వాహానాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. కాగా కోదాడ పట్టణానికి చెందిన వేముల అనిల్, వాహనం డ్రైవర్ షేక్ అసీఫ్, క్లీనర్ సయ్యద్బాబులపై కేసు నమోదు చేసి పట్టుబడిన పశువులను హైదరాబాద్లోని జియాగూడ గోశాలకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రేమించిన యువతి వివాహమైందని..
భువనగిరి: ప్రేమించిన యువతి వివాహమైందని మనస్తాపానికి గురైన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన భువనగిరి మండలంలోని తుక్కాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాసాల అయిలయ్య, భాగ్యమ్మ కుమారుడు మధు(23) రోజుమాదిరిగా ఈ నెల 22న రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. తల్లి భాగ్యమ్మ ఉదయం లేచి ఇంట్లో గదులను శుభ్రం చేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలో మధు నిద్రించే గది తలుపు తెరిచింది. కుమారుడు ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని కనిపించాడు. స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రేమించిన యువతి వివాహం కావడంతోపాటు, అప్పులు ఎక్కవ అయ్యాయనే బాధతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు తెలిపారు. ఫ మనస్తాపంతో ఉరేసుకున్న యువకుడు -
అదుపుతప్పి కారు బోల్తా
బీబీనగర్: దైవ దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా కారు అదుపు తప్పి బోల్తా కొట్టడడంతో ఒకరు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం బీబీనగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్కు చెందిన చేగూరి రామస్వామిగౌడ్(60), లక్ష్మి దంపతులు, వారి కోడళ్లు భూమిక, మనీషతోపాటు వీరి పిల్లలైన అక్షిత్, అక్షయ్, శ్రీయాంక, సహస్రలతో కలిసి గురువారం సాయంత్రం కారులో యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీ నర్సింహ స్వామి దర్శనానికి వచ్చారు. శుక్రవారం ఉదయం స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి మొయినాబాద్కు బయలుదేరారు. బీబీనగర్కు రాగానే జాతీయ రహదారిపై గల ఫ్లైఓవర్ సమీపంలో కారు అదుపు తప్పి సర్వీస్ రోడ్డుపైకి పల్టీ కొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసం కాగా అందులో ఉన్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను బయటకు తీశారు. నేషనల్ హైవే అంబులెన్స్లో వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా రామస్వామి, లక్ష్మితోపాటు, మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రామస్వామి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ప్రమాదానికి గురైన కారులో నలుగురు ఐదేళ్లలోపు చిన్నారులే ఉన్నారు. బైక్ను తుఫాన్ ఢీకొట్టడంతో ఒకరు మృతి యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. నల్లగొండ జిల్లా చందంపేటకు చెందిన కృష్ణ(32) గురువారం అర్ధరాత్రి బైక్పై రంగారెడ్డి జిల్లా యాచారం నుంచి మాల్ వైపు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో చింతపట్ల గేట్ వద్ద తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో కృష్ణకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. ఫ ఒకరు మృతి.. ఏడుగురికి తీవ్రగాయాలు ఫ దైవ దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఘటనస్వర్ణగిరి క్షేత్రంలో తిరువీధి ఉత్సవసేవ భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం సాయంత్రం తిరువీధి ఉత్సవసేవ వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, సహస్రనామార్చన సేవ, సుదర్శన నరసింహ హవనం, నిత్య కల్యాణ మహోత్సవం, మధ్యాహ్నం సుమారు 3వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ, పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన సేవ జరిపించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
గ్రూప్–2 ఉద్యోగానికి మల్లాపురం వాసి ఎంపిక
పెద్దఅడిశర్లపల్లి : పెద్దఅడిశర్లపల్లి మండలం మల్లాపురం గ్రామానికి చెందిన నారాయణదాసు హరిబాబు గ్రూప్– 2 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఉస్మానియా క్యాంపస్లో ఎల్ఎల్బీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఈయన గ్రూప్ – 2 పరీక్ష రాసి 606 ర్యాంక్ సాధించాడు. దీంతో మండలవాసులు హరిబాబుకు అభినందనలు తెలిపారు. ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలుగుండాల : ఎదురుదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు గాయాలపాలైన సంఘటన గుండాల మండలంలోని సుద్దాల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల గ్రామానికి చెందిన అల్తాఫ్ సుద్దాల గ్రామం వైపు బైక్పై వెళ్తుండగా.. సుద్దాల గ్రామానికి చెందిన గూడ వెంకటేష్ వ్యవసాయ బావి నుంచి వస్తూ సబ్ స్టేషన్ ఆవరణలో ఎదురెదురుగా ఢీకొన్నారు. ఇద్దరిని 108 వాహనంలో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ సైదులు తెలిపారు. ఎడ్లబండిని ఢీకొని యువకుడు మృతిమునుగోడు: ఎద్దులబండిని ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన శుక్రవారం మునుగోడులో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మునుగోడు పట్టణానికి చెందిన పందుల నర్సింహ(26) ఇళ్లకు పెయిటింగ్ వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం చీకటిమామిడి గ్రామానికి తన బైక్పై వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో ఎడ్ల బండిని బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి తల్లి ధనమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు. -
రాజకీయ కక్షతోనే కేసీఆర్కు నోటీసులు
నార్కట్పల్లి: ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకోవడం చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేక పోతోందని, రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. శుక్రవారం నార్కట్పల్లి పట్టణ కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్కు వచ్చిన మిస్ వరల్డ్ పోటీదారులు రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని గుర్తు చేశారని తెలిపారు. తెలంగాణ దివాలా తీసి వేలకోట్ల రూపాయలు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రోజురోజుకు కుమ్ములాటలు బయటికి వస్తున్నాయన్నారు. 30 శాతం పర్సంటేజీ ఇవ్వనిదే సొంత ప్రభుత్వంలో పనులు కావడం లేదని సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యే బట్టబయలు చేశారన్నారు. ఇచ్చిన హామీలు నెరవెర్చలేక పరిపాలన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు రేవంత్రెడ్డి కాళేశ్వరం కమిషన్ నోటీసు కుట్రలకు తెరలేపుతున్నారని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లు ఇప్పటి వరకు 40 శాతం కూడా జరగలేదని, కేంద్రాల వద్ద కుప్పలు వానకు తడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బైరెడ్డి కరుణాకర్రెడ్డి, యానాల అశోక్రెడ్డి, కొండూరు శంకర్, తరాల బలరాం, జ్యోతి బలరాం, కోటిరెడ్డి, సుధీర్, సతీష్, దుబ్బ మధు, సత్తిరెడ్డి, ప్రకాష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
చౌటుప్పల్ : పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండల పరిధిలోని అల్లాపురం గ్రామానికి చెందిన గూడూరు బుచ్చిరెడ్డి (59), పక్కీరు అల్వాల్రెడ్డి పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో తాళ్లసింగారం క్రాస్రోడ్డు సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్లో జరుగుతున్న తమ గ్రామస్తుడి వివాహానికి హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈక్రమంలో బాలాజీ దేవాలయం దాటిన తర్వాత వలిగొండ వైపు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న అల్వాల్రెడ్డి, వెనుక కూర్చున్న బుచ్చిరెడ్డి ఎగిరి రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో ట్యాంకర్ బుచ్చిరెడ్డి పైనుంచి వెళ్లడంతో శరీర భాగాలు ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. అల్వాల్రెడ్డికి గాయాలుకాగా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. భార్యతో గొడవపడి ఆత్మహత్యాయత్నం ఫ కాపాడిన పోలీసులు అర్వపల్లి: మండల పరిధిలోని అడివెంల గ్రామానికి చెందిన రాయపర్తి హరీష్ పది రోజుల కిందట తన భార్య మౌనికతో గొడవపడ్డాడు. ఆమె పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని పురుగుల మందు డబ్బాతో శుక్రవారం గ్రామ శివారులోని గుట్ట ఎక్కి తన బంధువులకు వీడియోకాల్ చేసి చెప్పాడు. దీంతో అతడి బంధువులు, గ్రామస్తులు గుట్ట వద్ద వెతకగా ఆచూకీ దొరకకపోవడంతో 100నంబర్కు డయల్ చేశారు. అర్వపల్లి ఎస్ఐ బాలకృష్ణ, పోలీస్ సిబ్బంది పసుపులేటి సైదులు, మణికుమార్లు గుట్ట వద్దకు వెళ్లి ఫోన్ లొకేషన్ ఆధారంగా వెతికి హరీష్ను పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకుని బంధువులకు అప్పగించారు. హరీష్ ప్రాణాలు కాపాడిన పోలీసులకు బంధువులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుదాఘాతానికి గురై ఐదు గేదెలు మృతిరామన్నపేట: విద్యుదాఘాతానికి గురై ఐదు పాడి గేదెలు మృతి చెందాయి. ఈ సంఘటన శుక్రవారం రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శోభనాద్రిపురం గ్రామానికి చెందిన జక్కిలి ఐలయ్యకు చెందిన మూడు పాడిగేదెలు, జక్కిలి పద్మ, పోలేపల్లి సత్తయ్యలకు చెందిన ఒక్కో గేదె గ్రామశివారులోని పెసరు అనంతరెడ్డికి చెందిన పొలంలో మేత మేస్తుండగా తెగిపడి ఉన్న విద్యుత్తీగ వాటికి తగిలింది. దీంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాయి. ఒక్కో గేదె విలువ రూ 1.50లక్షల వరకు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
విరుల సాగుతో సిరులు
భువనగిరిటౌన్ : పూల సాగు చేస్తున్న మహిళా రైతుకు సిరులు కురుపిస్తోంది. ఆధ్యాత్మిక ప్రాంతం కావడంతో ఇటు మహిళా రైతుకు, అటు వ్యాపారులకూ లాభాల పంట పండుతోంది. భువనగిరి మండలంలోని కూనూరు గ్రామంలో మహిళా రైతు పాశం రాజామణి తనకున్న పది గుంటల విస్తీర్ణంలో పూల సాగు చేపట్టింది. సాధారణ పంటలతో పాటుగా పూల సాగుపై మక్కువ చూపింది. కనకాంబరం, మల్లె, బొండు మల్లె, జాజిమల్లె పూల తోట వేసింది. ప్రతిరోజు రూ.3వేల వరకూ వస్తాయని చెబుతోంది. తనతో పాటు మరో ఐదుగురికి ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొంటుంది. సొంత వ్యాపారం చేద్దామనుకున్న ప్రయత్నంలోనే పూల తోట సాగు తన భర్త కూలీ పనికి పోవడం ఇష్టం లేకపోవడంతో పాశం రాజామణి సొంత వ్యాపారం పెట్టే ఆలోచనలో భాగంగా విజయవాడ నుంచి కేవలం 10 పూల మొక్కలు తెచ్చి పెట్టింది. వచ్చిన పూలు అమ్మగా కొంత ఆదాయం రావడంతో మరికొన్ని మొక్కలు తెప్పించి తమకున్న పది గుంటల భూమిలో నాటారు. ప్రస్తుతం 250 మొక్కలు వరకు సాగు చేస్తోంది. ఇందులో బొడ్డుమల్లె, సన్నజాజి, మరికొన్ని కనకాంబరాల మొక్కలు ఉన్నాయి. అంతేకాకుండా పూలదండలు అల్లుతున్న మహిళలకు కిలో రూ. 120నుంచి రూ.200ల వరకు ఇస్తుండడంతో వారికి ఉపాధి దొరుకుతోంది. చిరు వ్యాపారులు భువనగిరి, యాదగిరిగుట్టతో పాటు, వివిధ పెళ్లిల సీజన్లో అర్డర్లపై పంపిస్తోంది. పూల సాగుతో అధిక లాభాలు సీజన్లో పూల సాగుతో మంచి లాభాలు వస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. ఈ సాగుతో వచ్చే ఆదాయంతో నా ముగ్గురు కుమారులను ఉన్నత చదువులు చదివించాను. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరో ఎకరంలో సైతం పూల తోట సాగు చేస్తా. – పాశం రాజామణి, కూనూరు, భువనగిరి మండలం ఫ పూల తోట సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు ఫ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఫ మరో ఐదుగురికి ఉపాధి చూపుతున్న కూనూరు గ్రామానికి చెందిన రాజామణి -
నాడు సాగు భూమి.. నేడు ఆధ్యాత్మిక వాడ
యాదగిరిగుట్ట: ఒకప్పుడు పచ్చని పంటలతో కనిపించే ప్రాంతమంతా నేడు ఆధ్యాత్మిక వాడగా రూపుదిద్దుకుంది. యాదగిరి కొండకు దిగువన 2016కంటే ముందు పంట పొలాలతో ఉండేది. ఇప్పుడు యాదగిరి క్షేత్ర అభివృద్ధిలో భాగంగా భక్తుల కోసం ఆధ్యాత్మిక భవనాలు నిర్మించారు. ప్రస్తుతం కొండకు దిగువన ఉత్తర దిశలో శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, లక్ష్మీ పుష్కరిణి, దీక్షా పరుల మండపం, కల్యాణ కట్ట, ఆర్టీసీ బస్టాండ్, సెంట్రల్ పార్కింగ్, ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణాలు చేశారు. చెట్లను, గుట్టలను, పొలాలను తొలగించి పెద్ద రోడ్లు వేసి ఆకుపచ్చని అందం సంతరించుకునేలా మొక్కలు నాటారు. ఒకప్పుడు పచ్చని పొలాలు, చెట్లతో ఉన్న ఆ ప్రాంతమంతా ఇప్పుడు ఆధ్యాత్మిక వాడగా రూపుదిద్దుకుంది. -
వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన నిందితుడి అరెస్ట్
ఆత్మకూరు (ఎస్): వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి గురువారం కోర్టులో హాజరపర్చారు. వివరాలు.. ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూరి గ్రామానికి చెందిన రావుల నరేష్ ప్రేయసికి అదే గ్రామానికి చెందిన కారింగుల లింగయ్య లేనిపోని మాటలు చెప్పడంతో ఆమె నరేష్ దూరం పెడుతూ వచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన నరేష్ తన చావుకు కారింగుల లింగయ్యే కారణమని సెల్ఫీ వీడియో తీసి గత నెల 27న మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలంలో పురుగుల మందు తాగాడు. అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. అదే నెల 28వ తేదీన మృతి చెందాడు. ఈ ఘటనపై సిరోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా.. ఈ నెల 14న కేసును ఆత్మకూరు(ఎస్) పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ దర్యాప్తు చేసి నరేష్ ఆత్మహత్యకు కారణమైన కారింగుల లింగయ్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. సీఐకి ఆత్మకూర్ ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ సహకరించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యనార్కట్పల్లి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం నార్కట్పల్లి మండలంలోని గోపలాయపల్లి వేణుగోపాలస్వామి ఆలయ సమీపంలో జరిగింది. ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి మండలం చౌటబావి గ్రామానికి చెందిన ఏనాల వెంకట్రెడ్డి(36) చిట్యాలలో క్రేన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గురువారం అతడు గోపలాయపల్లి వేణుగోపాలస్వామి దేవాలయం సమీపంలో పురుగుల మందు తాగి తన తమ్ముడికి ఫోన్ చేశాడు. తన పిల్లలను మంచిగా చూసుకో అని చెప్పి.. గోపలాయపల్లి గుట్టపై తాను పురుగుల మందు తాగి చనిపోతున్నానంటూ తమ్ముడికి చెప్పాడు. వెంటనే వెంకట్రెడ్డి సోదరుడు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
బీబీనగర్ ఎయిమ్స్లో సాంకేతిక సమస్యలు
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలకు వైద్య కోసం వచ్చిన రోగులు గురువారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓపీ రిజిస్ట్రేషన్ విభాగంలోని కంప్యూటర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పేషెంట్లు గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు. దీంతో ఓపీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వేచి ఉండక తప్పలేదు, స్థానికులు క్యూలైన్లో నిలిబడలేక తిరిగి వెళ్లిపోయారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకొని రోగులకు సకాలంలో ఓపీ రిజిస్ట్రేషన్ జరిగేలా ఎయిమ్స్ అధికారులు చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పనిచేయని కంప్యూటర్లు ఓపీ రిజిస్ట్రేషన్ వద్ద రోగుల ఇబ్బందులు -
లింగ నిర్ధారణ పరీక్షల కలకలం
నకిరేకల్: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినా కూడా కొందరు డబ్బులకు కక్కుర్తి పడి గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా నకిరేకల్ పట్టణంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. నకిరేకల్లోని ఓ స్కానింగ్ సెంటర్లో ఇటీవల లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకున్న మహిళ ఆ తర్వాత సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్ చేయించుకుని తీవ్ర రక్తస్రావంతో మృతిచెందింది. ఈ బాగోతం బయటపడడంతో సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు తన ఇంటికి తాళం వేసి పరార్ కావడం నకిరేకల్ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సూర్యాపేట జిల్లా మోతె గ్రామానికి చెందిన అనూష నకిరేకల్లోని ఓ స్కానింగ్ సెంటర్ లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకుంది. తనకు అప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మూడోసారి కూడా స్కానింగ్లో ఆడశిశువు అనే తెలియడంతో మూడు రోజుల క్రితం సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్ చేయించుకుంది. తీవ్ర రక్తస్తావం కావడంతో ఆమె మృతిచెందింది. ఈ విషయం బయటకు పొక్కడంతో అనూష భర్త నగేష్.. తన భార్య మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అబార్షన్ చేసిన ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేసి సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా పోలీసుల ఆదేశాల మేరకు గురువారం నకిరేకల్ సీఐ రాజశేఖర్ తన సిబ్బందితో కలిసి నకిరేకల్లోని సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడి ఇంటికి వెళ్లగా.. అప్పటికే అతడు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. చాలాకాలంగా కొనసాగుతున్న దందా.. నకిరేకల్లో స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్న వ్యక్తి గతంలో తన భార్యతో కలిసి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్గా పనిచేశాడు. ఆ సమయంలో సదరు వ్యక్తి భార్య లింగ నిర్ధారణ పరీక్షలపై మంచి అవగాహన పెంచుకుంది. స్కానింగ్ సమాచారం గర్భిణులకు తెలిపి వారి నుంచి సొమ్ము తీసుకుంది. ఈ విషయం తెలిసిన ఆ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ వారిద్దరిని బయటకు పంపించారు. ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదై కాగా.. సదరు వ్యక్తి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. జైలు నుంచి వచ్చాక తన ఇంట్లోనే స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకుని అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. వీరికి దాదాపు 5 నుంచి 8 మంది ఏజెంట్లు ఉన్నట్లు తెలిసింది. నెలకు 15 నుంచి 20 రోజుల పాటు గుట్టుచప్పుడు కాకుండా స్కానింగ్ చేస్తున్నారు. ప్రతిరోజు 10 నుంచి 15 మంది వరకు గర్భిణులకు పరీక్షలు చేసి ఒక్కొక్కరి నుంచి తమ ఏజెంట్ల ద్వారా రూ.35 వేలకు బేరం కుదుర్చుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. తన భార్యతో స్కానింగ్ చేయించి అదే రూమ్లో దేవుళ్ల ఫొటోలు చూపించి కోడ్ రూపంలో గర్భవతి వెంట వచ్చిన బంధువులకు తెలియజేస్తారు. నకిరేకల్లో నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సూర్యాపేట జిల్లాకు చెందిన మహిళ మృతితో వెలుగుచూసిన దందా -
నేను హెల్మెట్ ధరించి ఉంటే మీతో ఉండేవాన్ని..
చిట్యాల: హెల్మెట్ ధరించకపోవటంతో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి తలకు తీవ్రగాయాలై మృతి చెందాడు. అతడి దశదినకర్మ రోజున కుటుంబ సభ్యులు రూపొందించిన పోస్టర్ పలువురిని కంటతడి పెట్టిస్తోంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన అంతటి అజయ్కుమార్గౌడ్(26) ఓ ఫార్మసీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఈ నెల 18న అజయ్కుమార్గౌడ్ బైక్పై వలిగొండలో వివాహానికి హాజరై రాత్రి సమయంలో తిరుగు పయనమయ్యాడు. వలిగొండ మండలం ప్రొద్దుటూరు గ్రామ పరిధిలోకి రాగానే అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి కాల్వలో పడిపోవటంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం నిర్వహించిన అజయ్కుమార్గౌడ్ దశదినకర్మ కార్యక్రమంలో.. ‘నేను హెల్మెట్ ధరించి ఉంటే ఈ రోజు మీ అందరితో కలిసి ఉండేవాడిని.. బైక్ నడిపే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలి’ అంటూ అజయ్కుమార్గౌడ్ మాట్లాడినట్లుగా కుటుంబ సభ్యులు గ్రామంలోని రెండు చోట్లు పోస్టర్లు ఏర్పాటు చేశారు. -
మిర్యాలగూడలో చిరు వ్యాపారుల రాస్తారోకో
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డులో తోపుడు బండ్లను తొలగించడంతో తమకు న్యాయం చేయాలంటూ గురువారం చిరు వ్యాపారుల జడ్చర్ల–కోదాడ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. పండ్లను హైవేపై పోసి సుమారు గంట పాటు రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వాహనాలను మళ్లించారు. చిరు వ్యాపారులు మాత్రం ఎమ్మెల్యే, కమిషనర్ రావాలంటూ నినాదాలు చేశారు. మిర్యాలగూడ వన్ టౌన్, టూ టౌన్, రూరల్ సీఐలు మోతీరాం, జె. సోమనర్సయ్య, పీఎన్డీ ప్రసాద్, ఎస్ఐలు రాంబాబు, సైదిరెడ్డి, మల్లికంటి లక్ష్మయ్య, ఏఎస్ఐ చంద్రయ్య బందోబస్తు నిర్వహించారు. తహసీల్దార్ సంతోష్ కిరణ్, మున్సిపల్ డీఈఈ వెంకన్న వారికి నచ్చజెప్పినా రాస్తారోకో విరమించలేదు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు మాట్లాడుతూ.. తాము చాలా ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, రోడ్డు పక్కన పెట్టుకున్న తోపుడు బండ్లను తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసేంత వరకు ఆందోళనను విరమించేదిలేదన్నారు. కనీసం ఫుట్పాత్ పైన అయినా బండ్లు ఏర్పాటు చేసుకుంటామన్నారు. మాజీ కౌన్సిలర్లు జావీద్, ఆలగడప గిరిధర్, జానీ వచ్చి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించుకుందామని చెప్పడంతో ఆందోళన విరమించారు. తోపుడు బండ్లు తొలగించడంతో కోదాడ–జడ్చర్ల హైవేపై ఆందోళన -
ఇంగ్లిష్ సబ్జెక్ట్ క్రెడిట్స్ తగ్గింపు సరికాదు
రామగిరి(నల్లగొండ): రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో ఇంగ్లిష్ సబ్జెక్ట్కు కేటాయించిన 20 క్రెడిట్స్ను 12కు తగ్గించాలనే ప్రతిపాదన సరికాదని, ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి విరమించుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) ఇంగ్లిష్ విభాగం అధ్యాపకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంజీయూ ఇంగ్లిష్ విభాగం అధిపతి అరుణప్రియ అధ్యక్షతన జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇంగ్లిష్ అధ్యాపకులతో అత్యవసర సమావేశం నిర్వహించి, ఈ అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చేసిన తీర్మానాన్ని ఎంజీయూ వైస్ చాన్స్లర్ అల్తాఫ్ హుస్సేన్, డీన్ కె. అంజిరెడ్డికి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రెడిట్స్ తగ్గించే నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇంగ్లిష్ భాష ప్రాధాన్యతను గుర్తించి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటే, రాష్ట్రంలో మాత్రం ఇంగ్లిష్ భాషకు ప్రాధాన్యత తగ్గించేలా ఉన్నత విద్యామండలి ఏకపక్ష నిర్ణయాలు సరికాదన్నారు. ఒకవైపు రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ డిగ్రీ విద్యార్థులకు వివిధ నైపుణ్యాలను నేర్పిస్తామంటూ, మరోపక్క ఇంగ్లిష్కు ప్రాధాన్యత తగ్గించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ఇంగ్లిష్ అధ్యాపకులు ఈ. రాంరెడ్డి, చైతన్య, సుధ, చిలుముల సుధాకర్, హరికృష్ణ, వెంకట్, ప్రభాకర్, రేణుక తదితరులు పాల్గొన్నారు. -
పెరుగుతున్న మూసీ ప్రాజెక్టు నీటి మట్టం
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం 636.50 అడుగులకు చేరుకుంది. హైదరాబాద్తో పాటు మూసీ పరీవాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు మూసీలోకి గురువారం 540 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా గురువారం సాంత్రానికి 636.50 అడుగులకు చేరుకుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీ నాటికి ప్రాజెక్టులో నీటిమట్టం 622 అడుగుల కనిష్ఠ స్థాయికి పడిపోగా, గత 50 రోజుల్లో దాదాపు 15 అడుగుల మేర నీరు ప్రాజెక్టులోకి చేరింది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.43 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వేసవి కాలంలోనే ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతుండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 636.50 అడుగులకు చేరిన నీరు -
పచ్చిరొట్ట.. పైరుకు బలం
గుర్రంపోడు: వచ్చే వానాకాలం సీజన్లో ప్రధాన పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగను పొలాల్లో సాగు చేసుకుని భూమిలో కర్బన సేంద్రియం పెంచుకోవాలని గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి సూచిస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువుల వలన కలిగే ప్రయోజనాలు ఆయన మాటల్లోనే.. ● పచ్చిరొట్ట సాగుకు ఇదే అనువైన సమయం సాధారణంగా వానాకాలం తొలకరి వర్షాలకు పచ్చిరొట్ట పంటలు సాగు చేసుకుని పూత దశలో కలియదున్నడం వల్ల సేంద్రియ ఎరువులా పనిచేసి ప్రధాన పంటకు బలానిస్తుంది. భూమిలో సేంద్రియ కర్బనం తక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మూడు శాతం పైగా సేంద్రియ కర్బనం ఉండగా, మన దేశంలో ఒక్క శాతానికి మించి ఉండటం లేదు. ఏదో ఒక రకంగా భూమిలో సేంద్రియ కర్బనం పెంచేందుకు పచ్చిరొట్ట పంటలు సాగు చేసుకోవాలి. మే రెండో పక్షం నుంచి నుంచి జులై రెండో పక్షం వరకు రైతులు ఏ పంటలు వేయరు కాబట్టి ఇటువంటి సమయంలో పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగ, పిల్లి పెసర లాంటి పంటలు సాగు చేసుకుంటే ఎకరాకు పది టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. ఈ పంటలు పూత దశలో నేలలో కలియదున్నడం ద్వారా ఎకరాకు 25 నుంచి 35 కిలోల నత్రజని, ఐదు కిలోల పొటాష్ లభ్యమవుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు జనుము, జీలుగ సాగు చేసుకునేలా వ్యవసాయ శాఖ రాయితీపై జనుము, జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తుంది. జీలుగ విత్తనాలను వ్యవసాయశాఖ రాయితీపై 30 కిలోల బస్తా రూ.2137కు, జనుము 40 కేజీల బస్తా రూ.2510కు పంపిణీ చేస్తోంది. ● మాగాణుల్లో..మాగాణి భూములు జీలుగ సాగు చేసుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుంది. దుక్కిని బాగా దున్నుకుని ఎకరాకు 20 కిలోల జీలుగ విత్తనాలు వేసుకోవాలి. పూత దశలో కలియదన్నడం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. వరి నాటు వేసే నాటికి జీలుగ కలియదున్నడం వల్ల రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. 45 రోజులు మించకుండా జీలుగను నీళ్లు పెట్టి కలియదున్నాలి.పండ్ల తోటల్లో ..పండ్ల తోటల్లో జనుము పంట సాగు చేసుకోవడం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. పండ్ల మొక్కలు కాపునకు వచ్చేంత వరకు అంతరంగా జనుమును సాగు చేసి పూత వచ్చే సమయంలో కలియదున్నాలి. ఎకరాకు 15 కిలోల జనుము విత్తనాలు సరిపోతాయి. పండ్ల తోటలు ఏపుగా ఎదగడానికి పచ్చిరొట్ట ఎరువు ఎంతగానో దోహదపడుతుంది. భూమిలో సేంద్రియ కర్బనం పెరిగి పండ్ల మొక్కలు తెగుళ్ల బారిన పడకుంగా ఉంటాయి. రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల జరిగే నష్టాన్ని పచ్చిరొట్ట ఎరువు ద్వారా తక్కువ ఖర్చుతో భర్తీ చేయవచ్చు. పండ్ల తోటల్లో జనుము సాగు వల్ల కలుపు మొక్కల సమస్య ఉండదు. పచ్చిరొట్టను పండ్ల తోటల పాదుల్లో వేసి మట్టితో కప్పి వేయాలి. పచ్చిరొట్ట ఎరువుగానే కాకుండా పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుంది. -
ఫ మూసీకి వరద ప్రవాహం
టెన్త్లో ఫెయిలైన విద్యార్థుల దత్తత భువనగిరి : పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నట్లు డీఈఓ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటలో తెలిపారు. విద్యార్థి తప్పిన సబ్జెక్ట్ల్లో సంబంధిత ఉపాధ్యాయులు వారిని దత్తత తీసుకుని ప్రతి రోజూ ఆన్లైన్లో విషయ బోధన, ప్రధానమైన అంశాల గురించి వివరిస్తారని వెల్లడించారు. ఎప్పటికప్పుడు జూమ్ మీటింగ్ల ద్వారా హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ఎంఈఓలు తగు సూచనలు చేస్తారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలో ఉన్నప్పటికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. -
యాదాద్రి భువనగిరి
34°/26°బిల్లులు రావు.. పనులు సాగవు రుద్రవెల్లి– జూలూరు మధ్య మూసీపై నిర్మిస్తున్న వంతెన పనులు పదేళ్లు కావొస్తున్న పూర్తి కావడం లేదు. 7గరిష్టం/కనిష్టంవాతావరణం మేఘావృతమై ఉంటుంది. ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.- 9లోశుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025ఎయిమ్స్లో సాంకేతిక సమస్యలు బీబీనగర్ ఎయిమ్స్లోని ఓపీ విభాగం కంప్యూటర్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రోగులకు నిరీక్షణ తప్పలేదు.- 8లో -
తరలని ధాన్యం.. తడిపిన వర్షం
భువనగిరిటౌన్ : జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఆరబెట్టిన ధాన్యంతో పాటు కాంటా వేసి మిల్లులకు తరలించడానికి సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు తడిసిముద్దయ్యాయి. ఆరబెట్టుకునే అవకాశం కూడా లేకుండా వెనువెంటనే వర్షాలు కురుస్తుండటం రైతులను తీవ్రనష్టాలకు గురి చేస్తున్నాయి. రాగల ఐదురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురి సే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు వర్షపాతం యాదగిరిగుట్టలో 50, వలిగొండ 45, బొమ్మలరామారం 44, మోటకొండూరు 39, రాజాపేట 32, భువనగిరి 32, తుర్కపల్లి 29, ఆత్మకూర్ 27, ఆలేరు 27, భూదాన్పోచంపల్లి 21, మోత్కూరు మండలంలో 16 మి.మీ వర్షపాతం నమోదైంది.ఫ ధాన్యం ఎగుమతిలో జాప్యం ఫ అకాల వర్షాలకు తడుస్తున్న వడ్లు ఫ నష్టపోతున్న రైతులు -
న్యాయమైన పరిహారం చెల్లిస్తాం
భువనగిరిటౌన్ : గంధమల్ల రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం న్యా యమైన పరిహారం అందజేస్తుందని, ఆందోళన చెందవద్దని అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్లో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి గంధమల్ల రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 14 మంది రైతులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఎంతోకాలంగా భూమిని నమ్ముకుని బతుకుతున్నామని, వ్యవసాయమే తమకు జీవనాధారం అన్నారు. తాము రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకం కాదని, కాకపోతే భూములకు బహిరంగ మార్కెట్లో చాలా విలువ ఉందని, న్యాయమైన పరిహారం చెల్లించాలని కోరారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందవద్దని, తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. -
పత్తి రైతుపై విత్తన భారం!
సంస్థాన్ నారాయణపురం: పత్తి విత్తనాల ధర మళ్లీ పెరిగింది. గతేడాది రూ.864 ఉన్న ప్యాకెట్ ధర రూ.37 పెరిగి రూ.901కి చేరింది. ఫలితంగా ఏటా పెరిగిపోతున్న ఖర్చులతో సేద్యం భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీటీ పత్తి విత్తనాల రేట్లు మూడేళ్లుగా పెరుగుతూ వస్తున్నాయి. మూడేళ్లుగా పెరుగుతున్న రేట్లు 2022లో పత్తి విత్తనాల ప్యాకెట్ (450 గ్రా) ధర రూ.767 ఉండగా 2023లో రూ.43 పెరిగి రూ.810కి చేరింది. 2024లో రూ.853కు పెరిగింది. ప్రస్తుతం 901కి చేరింది. ఏటా విత్తన రేట్లు పెరుగుతుండడంతో కొనుగోలు చేయడం రైతులకు తలకుమించిన భారంగా మారింది. 2.30లక్షల ప్యాకెట్ల విత్తనాలు అవసరం వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 1.15లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానుందని, ఇందుకు గాను 2.30లక్షల ప్యాకెట్ల విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ, చాలా మంది రై తులు ఎకరానికి రెండుమూడు ప్యాకెట్ల వరకు వి త్తనాలు విత్తుతుంటారు. మొలకెత్తకపోతే అదనంగా మ రికొన్ని ప్యాకెట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన పెరిగిన ధరలతో జిల్లా రైతులపై సు మారు రూ.1.30 కోట్లు అదనపుభారం పడనుంది. ముందుస్తుగానే విత్తనాల కొనుగోలు గత ఏడాది కంపెనీ, బ్రాండెడ్ విత్తనాల కొరత ఏర్పడింది. దీంతో చాలా మంది రైతులు ఎమ్మార్పీ రేటు కంటే ఎక్కువ చెల్లించి తక్కువ నాణ్యత కల్గిన విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఈసారి చాలా మంది రైతులు ముందస్తుగానే విత్తనాలు కొనుగోలు చేశారు. హైదరాబాద్, నల్లగొండ, చౌటుప్పల్, భువనగిరి మునుగోడు, చండూరు, మిర్యాలగూడ, దామరచర్ల, మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ తదితర ప్రాంతాల్లో పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ప్యాకెట్పై రూ.37 పెంపు ఫ రూ.864 నుంచి రూ.901కి చేరిన ధర ఫ జిల్లా రైతులపై రూ.1.30 కోట్ల భారం ఫ 1.15 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా ఫ 2.30 లక్షల ప్యాకెట్ల సీడ్ అవసరం పత్తి సాగు పెరిగే అవకాశం ఈసారి పత్తి సాగు పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. 1.15లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసినప్పటికీ, మరో 20వేల ఎకరాల్లో సాగు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నెల 25నుంచి రోహిణి కార్తె ప్రవేశిస్తుడటం, ముందుస్తుగానే రుతుపవనాలు రానున్నాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. వర్షం కురుస్తుందన్న అశాభావంతో కొంతమంది రైతులు ఇప్పటికే విత్తనాలు విత్తారు. రాయితీ ఇవ్వాలి ఏటేటా పత్తి విత్తనాల రేట్లు పెరుగుతుండడం రైతులకు సేద్యం భారంగా మారుతోంది. ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. విత్తన ధరల పెంపుతో ఆర్థిక భారం పడుతుంది. రైతులను ప్రోత్సహించడానికి పత్తి విత్తనాలను రాయితీపై విక్రయించాలి. లేనిపక్షంలో నష్టాలపాలవుతాం. –ఐతరాజు యాదయ్య, రైతు, సంస్థాన్ నారాయణపురం -
నెలాఖరులోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి
భూదాన్పోచంపల్లి: ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం సా యంత్రం భూదాన్పోచంపల్లి మండలంలోని జూలూరు పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. రుతుపవనాల ఆగమనంతో వర్షాలు పడనున్న నేపథ్యంలో కాంటాలు, హమాలీలను పెంచుకొని ఈ నెల 25లోపు కొనుగోళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఆర్ఐలు వెంకట్రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. పెరిగిన మద్యం ధరలుఅమల్లోకి.. భువనగిరిటౌన్ : {糿¶æ$-™èlÓ… ò³…_¯]l Ð]l$§ýlÅ… Æó‡r$Ï AÐ]l$-ÌZÏMìS Ð]l^éaƇ$$. ÑïÜP, {»ê…© M>ÓÆý‡t-ÆŠ‡-Oò³ Æý‡*.10, B‹œ »êsìæ-ÌŒæ Æý‡*.20, çœ#ÌŒæ »êsìæ-ÌŒæ-Oò³ Æý‡*.40 ^ö糚¯]l ò³…^èl$™èl* {糿¶æ$-™èlÓ… D¯ðlÌS 18¯]l E™èl¢-Æý‡$Ó-Ë$ gêÈ ^ólíܯ]l ÑçÙĶæ$… ™ðlÍíÜ…§ól. M>V> ´ë™èl ÝëtMŠS E…yýl-yýl…-™ø 20Ð]l ™ól© Ð]lÆý‡MýS$ ´ë™èl «§ýlÆý‡-ÌSMýS$ Ð]l$§ýlÅ… Ñ{MýS-Ƈ$$…^èl-V>.. Mö™èl¢ Æó‡r$Ï º$«§ýl-ÐéÆý‡… ¯]l$…_ AÐ]l$-ÌZÏMìS Ð]l^éaƇ$$. పారిశుద్ధ్యాన్నినిర్లక్ష్యం చేయొద్దుసంస్థాన్నారాయణపురం: మండలంలోని గుడిమల్కాపురం, కోతులాపురం, మల్లారెడ్డిగూడెం, కంకణాలగూడెం, సర్వేల్ గ్రామాల్లో బుధవారం డీపీఓ సునంద పర్యటించారు. పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. కంపోస్ట్ ఎరువు తయారీ విధానంపై కార్యదర్శులకు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్త వేరు చేసి కంపోస్ట్ ఎరువును తయారు చేయించాలని వారికి సూచించారు. ప్లాస్టిక్ కవర్ల నిర్మూలనుకు ప్రజలు సహకరించాలని కోరారు. అమె వెంట డీఎల్పీఓ ప్రతాప్నాయక్, ఎంపీఓ నర్సింహరావు తదితరలు పాల్గొన్నారు. రెవెన్యూ చట్టాలపై అవగాహన అవసరం భువనగిరిటౌన్ : రెవెన్యూ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఉద్యోగ సంఘాల జేఏసీ మందడి ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ చట్టాలపై బుధవారం భువనగిరిలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గత రెవెన్యూ చట్టాల్లో ప్రభుత్వం పలు మార్పులు తీసుకువచ్చిందన్నారు. ఒక్కో సెక్షన్లో అనేక విభాగాలున్నాయని, వాటి గురించి ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములు, గ్రామ కంఠంపై ఆయన వివరించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ధరణికోట భగత్, హైదరాబాద్ తహసీల్దార్ గోవర్దన్, కౌశిక్, శ్రీనివాస్, బాలకష్ణ, సురేష్ పాల్గొన్నారు. -
గత పాలకుల తీరుతో రాష్ట్రానికి అన్యాయం
హుజూర్నగర్: కృష్ణానది జలాల పంపకాల విషయంలో గత పాలకుల తీరుతో పదేళ్లు తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్పై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిందన్నారు. తెలుగు రాష్ట్రాలకు 811 టీఎంసీలు కేటాయించగా ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు(66 శాతం), తెలంగాణకు 299 టీఎంసీలు (34శాతం) అని జరిగిన లిఖిత పూర్వక ఒప్పందాన్ని గత పాలకులు అంగీకరించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని రాజీవ్గాంఽధీ, ఎంబీసీ, నక్కగూడెం ఎత్తిపోతల పథకాల పనుల పురోగతిపై బుధవారం చింతలపాలెంలోని అంజలి సిమెంట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్తో కలిసి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రిగా నేను, న్యాయకోవిదుల, నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకొని కృష్ణా జలాల పంపకంలో 70 శాతం తెలంగాణకు తీసుకొచ్చేలా ట్రిబ్యునల్ పునఃసమీక్షించేలా చేశామన్నారు. తమ ప్రభుత్వం ట్రిబ్యునల్తో పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తపోతల పథకానికి కృష్ణా జలాలలో నీరు కేటాయించలేదని, తాము వచ్చాక నీటి కేటాయింపు కోసం పట్టుబట్టి పోరాడుతున్నామని మంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుమీద పెద్ద ఎత్తున నిధులు వృథా చేశారని, లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు కూడా వారి హయాంలోనే కూలిపోయిందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.38,000 కోట్లతో మొదలుపెట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారని, అది పూర్తి చేస్తే బాగుండేదన్నారు. దానిని రద్దు చేసి కాళేశ్వరం పేరుతో అంచనాలు పెంచి అప్పలు తెచ్చి లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మంత్రి ఉత్తమ్ అన్నారు. కృష్ణానదిపై నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యే విధంగా సీఎంతో కలిసి సమీక్షించినట్లు ఆయన తెలిపారు. కృష్ణా జలాల్లో వాటా పెంపునకు ట్రిబ్యునల్తో పోరాడుతున్నాం నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
ఫేక్ మనీ ట్రాన్స్ఫర్ యాప్తో మోసం
గరిడేపల్లి: గరిడేపల్లి మండలం అబ్బిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఓ యువకుడు ఫేక్ మనీట్రాన్స్ఫర్ యాప్ ద్వారా డబ్బులు పంపిస్తూ దొరికిపోయాడు. బుధవారం గరిడేపల్లిలోని ఓ వైన్స్లో మద్యం తీసుకున్న అతడు రూ.1200 ట్రాన్స్ఫర్ చేసినట్లు చూపించగా.. మెసేజ్ వచ్చినా డబ్బులు అకౌంట్లో జమకాకపోవడంతో అనుమానంతో యువకుడిని వైన్ షాప్ యాజమాని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. దీనిపై పోలీసులు విచారణ చేసి ఇది చైన్ సిస్టంతో కూడుకున్న మోసంగా అనుమానిస్తున్నారు. యువకుడి సెల్ఫోన్, యాప్ మూలాలు, ఇతర వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఏడుగురి వ్యక్తుల రిమాండ్ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలంలోని మొరిపిరాల గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులను రిమాండ్ చేసినట్లు ఏసీపీ పి. మధుసూదన్రెడ్డి బుధవారం పేర్కొన్నారు. భర్త, అత్తమామల వేధింపులు తాళలేక మొరిపిరాల గ్రామానికి చెందిన కటిక సంధ్య ఈ నెల 18న ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంధ్య ఆత్మహత్యకు కారకులైన వారిని గుర్తించి రిమాండ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. రిమాండ్ చేసిన వారిలో సంధ్య భర్త కటికె కృష్ణ, అత్త మారెమ్మ, మామ రాములుతో పాటు శివగణేష్, శ్రీను, రమ్య, వాణి ఉన్నట్లు పేర్కొన్నారు. కృష్ణా నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యంహుజూర్నగర్: కృష్ణా నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మండలం చింత్రియాల గామానికి చెందిన బంగారు పార్వతీశంచారి(40) మంగళవారం సాయంత్రం పాత కిష్టాపురం గ్రామ పరిధిలో కృష్ణా నది పాయలో ఉన్న గేదెలను తోలేందుకు నదిలో ఈదుకుంటూ వెళ్లి గల్లంతయ్యాడు. అతడి ఆచూకీ కోసం పడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య లావణ్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ప్రొబెషనరీ ఎస్ఐ అజయ్కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలుచౌటుప్పల్: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలయ్యాయి. లింగోజిగూడెం గ్రామానికి చెందిన మందోరి మహేష్ ద్విచక్ర వాహనంపై చౌటుప్పల్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై గల అండర్పాస్ బ్రిడ్జిపై ముందు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుకనే వస్తున్న మహేష్ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహేష్కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్కు తరలించారు. మహేష్ అన్న సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
ఒకదానికొకటి ఢీకొన్న ట్రావెల్స్ బస్సులు, కంటెయినర్
చౌటుప్పల్ రూరల్: హైవేపై ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో దాని వెనుకనే వస్తున్న మరో రెండు బస్సులు, కంటెయినర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజీ సమీపంలో బుధవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయాణికులతో వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం గ్రామ పరిధిలోకి రాగానే విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక నుంచే వస్తున్న రమణ ట్రావెల్స్ బస్సు, ఆ వెనుకనే వస్తున్న కంటెయినర్, కంటెయినర్ను వెనుక నుంచి మరో ట్రావెల్స్ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. హైవేపై హైదరాబాద్ వైపు ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. రెండు బస్సులు పాక్షికంగా ధ్వంసం క్షేమంగా బయటపడిన ప్రయాణికులు -
వాగా.. డంపింగ్ యార్డా
ఆలేరు: ఆలేరు వాగు ఆనవాళ్లు కోల్పోతోంది. చెత్త డంపింగ్ చేయడం ద్వారా వాగు జలాలు కలుషితం అవుతున్నాయి. వాగులో చెత్త డంపింగ్ను నిలిపివేసి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోజూ 3 టన్నుల చెత్త తరలింపు మున్సిపాలిటీలో 12 వార్డుల నుంచి రోజూ సుమా రు మూడు టన్నుల చెత్త, ఇతర వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. మున్సిపల్ వాహనాలతో పాటు ప్రైవేట్ వాహనాల్లో చెత్తను సేకరించి వాగులో, దాని పరిసరాల్లో డంప్ చేస్తున్నారు. తడి, పొడి చెత్తతో పాటు మటన్, చికెన్ షాపుల నుంచి వచ్చే వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, పాత బట్టలు.. ఇలా మొత్తం వాగులో డంపింగ్చేస్తున్నారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో వాగు ఆనవాళ్లు కోల్పోతోంది. అంతేకాకుండా నిరంతరం పందులు సంచరిస్తుడటంతో జనాలు వాగునీటిని వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. దుర్గమ్మ గుడి నుంచి కొలనుపాకకు వెళ్లే రోడ్డు మార్గంలో దుర్వాసన వస్తుండటంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సాయిగూడెం శివారులో రెండెకరాలు కేటాయింపు ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని సాయిగూడెం శివారులో మూడేళ్ల క్రితం చెత్త డంపింగ్ యార్డుకు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు కేటాయించారు. అయితే స్థానికులు, రైతుల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో డంపింగ్యార్డు ఏర్పాటుకు బ్రేక్ పడింది. మరోచోట స్థలం ఎంపికకు అధికారులు య త్నించకపోవడంతో డంపింగ్ యార్డు ఏర్పాటులో జాప్యం జరుగుతుందనే వాదనలు ఉన్నాయి.ఆలేరు పెద్ద వాగులో గుట్టలుగా వ్యర్థాలు ఫ సాయిగూడెం శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటుకు స్థలం కేటాయింపు ఫ స్థానికుల నుంచి అభ్యంతరం రావడంతో పనులకు బ్రేక్ -
‘ఇస్రో’ శిక్షణ తరగతులకు ఎంపిక
కోదాడ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జూన్ 23 నుంచి 27 వరకు రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానంపై నిర్వహించనున్న శిక్షణ తరగతులకు కోదాడ పట్టణంలోని తేజ విద్యాలయంకు చెందిన పదో తరగతి విద్యార్థులు ఏసిరెడ్డి శ్రీవల్లి, తూనుగంట్ల సమజ్ఞ ఎంపికయ్యారు. వీరికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహడ్రూన్లో గల ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ కార్యాలయంలో శిక్షణ ఉంటుందని పాఠశాల ప్రిన్సిపాల్ ఉస్తేల రమాసోమిరెడ్డి బుధవారం తెలిపారు. ఎంపికై న విద్యార్థులను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. అధ్యాపకుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానంసంస్థాన్ నారాయణపురం: మండలంలోని సర్వేల్ గురుకుల కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. సతీష్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంగ్లిష్ మాధ్యమంలో గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రంతో పాటు సంస్కృతం సబ్జెక్టులు బోధించడానికి ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99899 51824 నంబర్ను సంప్రదించాలన్నారు. వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీచౌటుప్పల్ రూరల్: గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాక్కోని పారిపోయారు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైతాపురం గ్రామానికి చెందిన గోపనబోయిన యశోద దండుమల్కాపురం గ్రామంలో తమ బంధువుల వెళ్లి వస్తుండగా.. ఖైతాపురం గ్రామంలోకి రాగానే వర్షం పడింది. దీంతో ఆమె గ్రామ చౌరస్తాలో ఉన్న ఓ ఇంటి వద్ద కూర్చుంది. వర్షం తగ్గిన తర్వాత ఇంటికి వెళ్తుండగా.. బైక్పై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వెనుక నుంచి వచ్చి ఆమె మెడలోని తులంన్నర బంగారు గొలుసు లాక్కోని పరారయ్యారు. వెంటనే యశోద కేకలు వేయడంతో గ్రామస్తులు బైక్పై పారిపోతున్న వ్యక్తులను పట్టుకునే ప్రయత్నం చేయగా, వారు దొరకకుండా హైదరాబాద్ వైపు పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. పిడుగు పడి మహిళా రైతు మృతిరామగిరి(నల్లగొండ): నల్లగొండ మండలం అప్పాజిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని బంటుగూడెంలో బుధవారం మధ్యాహ్నం పిడుగుపడి మహిళా రైతు మృతిచెందింది. బంటుగూడేనికి చెందిన జాల బిక్షపమ్మ(46) తన వ్యవసాయ బావి వద్ద నిమ్మ తోటలో పనిచేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. ఈ సమయంలో ఆమైపె పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిడుగుపాటుకు ఇతర కూలీలు భయాందోళనకు గురయ్యారు. -
పంట మార్పిడితో అధిక దిగుబడులు
● మిపర, క్యాబేజీ పంటలకు ఆశించే లద్దె పురుగుల తాకిడి తగ్గాలంటే జొన్న, వరి, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు, వంటి ఆరుతడి పంటలతో పంట మార్పిడి చేయాలి. ● వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాల ఆధారంగా పంట మార్పిడి చేయాలి. ● భూసార పరీక్షల ఆధారంగా పంటలకు ఎరువులు వేయడం ఉత్తమం. త్రిపురారం : ప్రతి సీజన్లో ఒకే పంట కాకుండా పంట మార్పిడి చేయడం వల్ల భూసారం పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం కంపాసాగర్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసరావు సూచిస్తున్నారు. ఒకే పంటను ఏళ్ల తరబడి సాగు చేయడం ద్వారా చీడపీడల తాకిడి అధికమవుతుందని, భూమి నిస్సారంగా మారుతుందని చెబుతున్నారు. పంట మార్పిడిపై సలహాలు సూచనలు ఆయన మాటల్లోనే.. ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి పంట మార్పిడి చేయాలంటే అంతకు ముందు సాగు చేసిన పంటకు భిన్నంగా పంటను ఎంచుకోవాలి. కొన్ని పంటల వేరు వ్యవస్థ నేలలోని పొరల నుంచి పోషకాలను ఎక్కువగా గ్రహిస్తాయి. పోషకాలను ఎక్కువగా గ్రహించే నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్క జొన్న పంటలకు బదులుగా భూమికి పోషకాలు సమకూర్చే అపరాల పంటలను సాగు చేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. అపరాల పంటలు కరువు పరిస్థితులను తట్టుకోవడంతోపాటు ఆకులు రాలడం వల్ల భూమికి సేంద్రియ పదార్థాలు అందుతాయి. రాలిన ఆకులను నేలలో కలియదున్నడం వల్ల భూమి సారవంతంగా మారుతుంది. నల్ల రేగడి నేలల్లో సోయా చిక్కుడు వేసుకోవడం వల్ల పైరు కోత సమయానికి ఆకులు పూర్తిగా రాలుతాయి. దీనివల్ల ఒక్కటి నుంచి రెండు టన్నుల సేంద్రీయ పదార్థం లభిస్తుంది. పంట మార్పిడి ఇలా చేసుకోవచ్చు.. ● వరి పంటను వరుసగా సాగు చేయకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలు కూడా సాగు చేసుకోవచ్చు. ● పొద్దు తిరుగుడు పంటను సాగు చేసే వారు జొన్న, సజ్జ, కొర్రలు వంటి చిరు ధాన్యపు పంటలను లేదా కంది, శనగ, మినుము వంటి అపరాల పైర్లు లేదా వేరుశనగతో పంట మార్పిడి చేసుకోవచ్చు. ● వానాకాలంలో వేరుశనగ వేసుకునే రైతులు తరువాత వచ్చే యాసంగిలో మొక్కజొన్న పంట వేసుకుంటే పైరుకు కొంత నత్రజని ఎరువు లభిస్తుంది. ● కంది, శనగ పంటలను వరుసగా సాగు చేస్తే కాయ తొలుచు పురుగు అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పురుగులు తక్కువగా ఆశించే జొన్న, నువ్వులు, మినుము, సోయా చిక్కుడు, ఉలవ, మెట్ట వరి పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. ● వరితో పంట మార్పిడి చేసుకుంటే వేరు శనగ పైరుకు నులిపురుగుల బెడద తగ్గుతుంది. ● వంగ తోట వేసుకునే రైతులు కాలీఫ్లవర్తో పంట మార్పిడి చేసుకుంటే పంటకు ఎండు తెగులు సోకదు. ● టమాట, ఆవాలు, బంతి ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేస్తే నులిపురుగుల ఉధృతి తగ్గుతుంది. ● దోస, కాకర, గుమ్మడి పొట్లకాయ, బీర, బూడిద, గుమ్మడి, దొండ వంటి తీగ జాతి కూరగాయల పంటలను వరి పైరుతో పంట మార్పిడి చేసుకోవచ్చు. ● ఉల్లి సాగు చేసేవారు ధాన్యపు పంటలలో పంట మార్పిడి చేసుకోవచ్చు. ● ఒక్కసారి పసుపు పంట సాగు చేసిన వారు రెండేళ్ల పాటు ఆ భూమిలో మరోసారి పసుపు సాగు చేయకూడదు. ఒకవేళ సాగు చేస్తే చీడపీడల ఉధృతి పెరిగి దిగుబడులు తగ్గుతాయి. పసుసు పంట తర్వాత వరి, మొక్క జొన్న వేసుకుంటే నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది. కంపాసాగర్ కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు సూచనలు -
ఇంటికొక రక్తదాత తయారు కావాలి
మోత్కూరు: రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, ఇంటికొక రక్తదాత తయారుకావాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. మోత్కూరు మండలం పాటిమట్లలో మాతృదేవోభవ–పితృదేవోభవ సంస్థ 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రక్తదాతల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. మాతృదేవోభవ–పితృదేవోభవ సంస్థ అధ్యక్షుడు కురుమేటి నవీన్ బాల్యంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయి, వారి జ్ఞాపకార్ధం ఈ సంస్థను ఏర్పాటు చేసి వృద్ధులు, వితంతువులు, అనాథలు, పేదలు, నిరుపేదలకు సేవ చేయడం అభినందనీయమన్నారు. కురుమేటి నవీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న, గీత కార్మిక సంఘం ఆలిండియా అధ్యక్షుడు కప్పల రవికుమార్గౌడ్, తెలంగాణ నర్సింగ్ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కురుమేటి గోవర్ధన్, ఇండియన్ రెడ్క్రాస్ జిల్లా అధ్యక్షుడు గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, ఉపాధ్యాయుడు ముక్కాముల లింగమల్లు, జనయేత్రి ఫౌండేషన్ అధ్యక్షుడు మునీర్ అహ్మద్ షరీఫ్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రక్తదాతలు పాల్గొన్నారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ -
గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలు లభ్యం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పట్టణ సీఐ బి. భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట పట్టణంలోని రింగ్ రోడ్డు సమీపంలో గల పార్కింగ్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40ఏళ్లు ఉంటాయని, అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని సీఐ తెలిపారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లుపేర్కొన్నారు. మోత్కూరులో.. మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం స్థానికులు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు కొద్దిరోజులుగా భిక్షం ఎత్తుకుంటూ బస్టాండ్ సమీపంలో సంచరిస్తున్నాడని స్థానికులు పేర్కొన్నారు. మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ డి. నాగరాజు తెలిపారు. -
జీపీఓల పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు
సాక్షి,యాదాద్రి : ఈ నెల 25న జరగబోయే గ్రామ పాలన అధికారు(జీపీఓ)ల రాత పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. బుధవారం భువనగిరిలోని వెన్నెల కాలేజీలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. మాస్ కాపీయింగ్ ఆస్కారం ఉండవద్దని, పరీక్ష సమయంలో 144 సెక్షన్ అమలు చేయా లని, జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ కృష్ణారెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ప్రసాద్ ఉన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
మండుటెండల నుంచి ఉపశమనం
భువనగిరిటౌన్ : ఆవర్తన ద్రోణి ప్రభావంతో జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాతావరణం చల్లబడింది. దాదాపు అన్ని మండలాల్లో 41 డిగ్రీల లోపే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలో 41, వలిగొండలో 41, మోటకొండూరు మండలంలో 32 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణం చల్లడటంతో ప్రజలు ఉపశమనం పొందారు. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని 40నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. ఈ క్రమంలో జిల్లాకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. రోహిణి కార్తెకు ముందే వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలేరు: ఆలేరు పట్టణంలో భారీ కురిసింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులకు గుర య్యారు. రైల్వేగేట్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం తీసి గుంతల్లో వర్షపు నీరు చేరింది. అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగి కరెంట్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆత్మకూరు(ఎం) : మండలంలో సుమారు గంట సేపు భారీ వర్షం పడింది. రైతులు ముందు జాగ్రత్తగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులపై టార్ఫాలిన్ పట్టాలు కప్పి ఉంచడంతో నష్టం తప్పింది. వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని త్వరగా కొను గోలు చేయాలని రైతులు అధికారులను కోరారు. మోత్కూరు: పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి మోత్కూరులో రోడ్లు జలమయం అయ్యాయి. యాదగిరిగుట్ట : పట్టణంలో రెండు గంటల పాటు మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారులపై నీరు ప్రవహించింది. అంతే కాకుండా యాదగిరి క్షేత్రానికి వచ్చిన భక్తులు టెంట్ కింద, ప్రాకార మండపాల కిందికి చేరారు. యాద గిరికొండపై ఎండ, ఉక్కపోతతో అవస్థలు పడ్డ ప్రజానీకం ఉపశమనం పొందారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం వలిగొండ : మండలంలో బుధవారం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. వర్కట్పల్లి, గోకారం, సంగెం, నాగా రం, వెల్వర్తి కేంద్రాల్లో లారీలు రాకపోవడం వల్ల తూకం వేసిన ధాన్యం పాక్షికంగా తడిసింది. ఏదుళ్లగూడెంలో రైతు కొలను సంధ్యకు చెందిన సుమారు 1,376 బస్తాల ధాన్యం రవాణా చేసే లోపే వర్షానికి తడిసిపోయింది. వర్కట్పల్లిలో కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ వీరారెడ్డి, సివిల్ సప్లై మేనేజర్ హరికృష్ణ సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని మిల్లులకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఆందోళన చెందవద్దని రైతులకు అదనపు కలెక్టర్ భరోసా ఇచ్చారు. కాంటా వేసిన ధాన్యాన్ని ఏరోజుకారోజు మిల్లులకు ఎగుమతి చేయాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట తహసీల్దార్ దథరథ ఉన్నారు. అదే విధంగా పలు చోట్ల ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఫ జిల్లాలో మోస్తరు వర్షాలు ఫ చల్లబడ్డ వాతావరణం బుధవారం నమోదైన వర్షపాతం (మి.మీ) మండలం వర్షపాతం యాదగిరిగుట్ట 41వలిగొండ 41మోటకొండూరు 32ఆత్మకూర్ 26రాజాపేట 23ఆలేరు 21భువనగిరి 20బొమ్మలరామారం 19మోత్కూరు 15తుర్కపల్లి 13అడ్డగూడూరు 13పోచంపల్లి 11గుండాల 06బీబీనగర్ 05చౌటుప్పల్ 04నారాయణపురం 03 -
కమిటీల ఎన్నికపై వీడని ఉత్కంఠ
ఆలేరు: కాంగ్రెస్ నూతన కమిటీల ఏర్పాటులో ఉత్కంఠ వీడటం లేదు. ఒక వైపు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబు తున్నా.. మరోవైపు సదరు నేతలు పోటీకి సై అంటున్నారు. దాంతో కొత్త కమిటీల అధ్యక్షుల ఎంపిక జిల్లా నాయకత్వానికి కత్తిమీద సాములా మారింది. బుధవారం ఆలేరు పట్టణంలోని ఇందిరా కాంగ్రెస్ భవన్లో డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, పార్టీ పరిశీలకులు డాక్టర్ అనిల్ ఆధ్వర్యంలో ఆలేరు పట్టణం, మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపికకు నేతల నుంచి దరఖాస్తుల స్వీకరణ సమావేశం జరి గింది. కానీ, పట్టణ, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవుల కోసం పోటీ అధికంగా ఉండటంతో దరఖాస్తుల స్వీకరణపై స్పష్టత రాలేదు. తీర్మానం ఇలా.. సమావేశం రసాభస కాకుండా కమిటీల ఎంపికలో ఎమ్మెల్యే నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని నేతలతో చేతులు ఎత్తి తీర్మానం చేశారు. ఈ సందర్భంలో సీనియర్ నాయకుడు నీలం వెంకటస్వామి మాట్లాడుతూ పదవి కోసం సదరు నేతలు పోటీలో ఉన్నట్టు మరి ఎమ్మెల్యేకు ఎలా తెలుస్తోందని ప్రస్తావించారు. జోక్యం చేసుకున్న డీసీసీ అధ్యక్షుడు బరిలో నిలిచే నేతలు నేరుగా ఎమ్మెల్యేను కలిసి తమ అభ్యర్థనలు చేసుకోవాలని సూచించారు. ఇదే విధంగా 2017 తరువాత పార్టీలో చేరిన నేతలు పార్టీ పదవికి పోటీ చేయడానికి అనర్హులని ఆయన స్పష్టం చేశారు. తాను 2017 తరువాతనే కాంగ్రెస్లో చేరినప్పటికీ సిన్సియర్గా సేవ చేస్తున్నాను.. తనకు పార్టీ పదవుల్లో అవకాశం కల్పించాలని నాయకుడు విజేందర్రెడ్డి అడుగగా..ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళతానని సంజీవరెడ్డి సమాధానం ఇచ్చారు. పీసీసీ సూచనలు, పార్టీ పరిశీలకులు, ఎమ్మెల్యే తుది పరి శీలన తరువాత కమిటీ అధ్యక్షుల నియామకం ఉంటుందని చెప్పారు. సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా కమిటీల ఏర్పాటుకు యత్నిస్తున్నట్టు చెప్పారు. పార్టీ నిబంధనలు ఉల్లంఽఘించే నేతలపై సీరియస్ చర్యలు ఉంటాయని డీసీసీ అధ్యక్షుడు హెచ్చరించారు. టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, నాయకులు శ్రీ నివాస్రెడ్డి, ఇజాజ్, ఎంఎస్ విజయ్కుమార్, సాగర్ రెడ్డి, వెంకటేశ్వరాజు, వెంకటస్వామి మండలాల నాయకులు, మాజీ ప్రజాపతినిధులు పాల్గొన్నారు. పదుల సంఖ్యలో ఆశావహులు పదవుల కోసం పదుల సంఖ్యలో నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే వీరంతా ప్రభుత్వ విప్ అయిలయ్యను కలిశారు. కమిటీలను ఏకగ్రీవం చేయాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తుండగా, పోటీ తీవ్రంగా ఉండటంతో తలనొప్పిగా మారింది.కాంగ్రెస్లో సంస్థాగత పదవుల కోసం తీవ్ర పోటీ ఫ నాయకత్వానికి కత్తిమీద సాములా ఎంపిక ఫ ఆలేరు పట్టణ, మండల, బ్లాక్ కమిటీలకు దరఖాస్తుల స్వీకరణపై రాని స్పష్టత అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటా: సంజీవరెడ్డి డీసీసీ అధ్యక్షుడి నియామక అంశం అధిష్టానం చూసుకుంటుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా తనను డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించాలా, వద్దా? అనేది అధి ష్టానం నిర్ణయిస్తుందన్నారు. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమన్నారు. ఈనెలాఖరునాటికి జిల్లా వ్యాప్తంగా గ్రామ, మండల, బ్లాక్స్థాయి కాంగ్రెస్ నూతన కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు చెప్పారు. నేతలకు పార్టీ పదవులు లేదా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏదో ఒకటే అవకాశం ఉంటుందన్నారు. ఒకరికి రెండు పదవులు అసాధ్యమన్నారు. ఒకవేళ పార్టీ పదవిలో ఉండి, ఎన్నికల్లో పోటీకి నేతలకు అనివార్యమైతే పార్టీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
చౌటుప్పల్ రూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ సంచులను తయారు చేస్తున్న రమణీ ఇండస్ట్రీస్ను సోమవారం బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ సందర్శించారు. డీఆర్డీఓ శాస్త్రవేత్తలు అందించిన సాంకేతిక సహకారంతో రమణి, డాక్టర్ ప్రసాద్లు నెలకొల్పిన రమణీ ఇండస్ట్రీస్లో బయో డిగ్రేడబుల్ సంచుల తయారీని పరిశీలించారు. ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బఝె డిగ్రేడబుల్ సంచులను ప్రపంచం అంతటికీ ఎగుమతి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక సేవా దృక్పథంతో బ్యాగులు తయారు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం టిప్ కార్యాలయానికి వెళ్లి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో చేపడుతున్న పరిశ్రమల వివరాలు తెలుసుకున్నారు. టిప్ మేనేజర్ శ్రీకాంత్.. పార్క్ అభివృద్ధిని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి వివరించారు. ఇండస్ట్రియల్ పార్క్ పక్కనే ఉన్న టెక్స్టైల్ పార్క్లో తయారవుతున్న వస్త్రాల తయారీ విధానాన్ని చూశారు. మిమీ క్రాఫ్ట్స్ హస్తకళల కేంద్రాన్ని పరిశీలించారు. మిమీ క్రాఫ్ట్స్ నిర్వాహకులు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారేత్ విన్ ఓవెన్ ను శాలువాతో సన్మానించారు. బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ దండుమల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లోని రమణీ ఇండస్ట్రీస్ సందర్శన -
కారు బీభత్సం.. యువకుడి మృతి
నార్కట్పల్లి: కారు అదుపుతప్పి మూడు ద్విచక్ర వాహనాలు, మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ఆర్. శృతుత్రెడ్డి, అతడి భార్య శ్రావణిరెడ్డి, అత్త వసంత కలిసి సోమవారం గుంటూరు నుంచి కారులో హైదరాబాద్కు వెళ్తున్నారు. మార్గమధ్యలో నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం వద్దకు రాగానే ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టారు. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న నార్కట్పల్లి మండలం అక్కెనపల్లి గ్రామానికి చెందిన అక్కెనపల్లి సునీల్(33) అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం కారు అదుపుతప్పి రహదారి పక్కనే నిలిపి ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలతో పాటు మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న శృతుత్రెడ్డి, అతడి భార్య, అత్తకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న నార్కట్పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులతో పాటు సునీల్ మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పైళ్లెన మూడు నెలలకే..అక్కెనపల్లి గ్రామానికి చెందిన సునీల్ అదే గ్రామానికి చెందిన యువతిని మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. నల్లగొండలో భార్యతో కలిసి నివాసముంటూ అక్కడే ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. సోమవారం గ్రామంలో బియ్యం తీసుకొచ్చేందుకు గాను తన స్నేహితుడి స్కూటీని తీసుకుని స్వగ్రామం బయల్దేరగా.. మార్గమధ్యలో కారు ఢీకొట్టడంతో మృతిచెందాడు. మూడు ద్విచక్ర వాహనాలు, కారు ధ్వంసం నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం వద్ద ఘటన -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
నల్లగొండ: ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను నకిరేకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి సోమవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని వీటీకాలనీలో ఒంటరిగా నివాసముంటున్న నాగులవంచ లక్ష్మమ్మ ఇంటికి ఈ నెల 17న ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆమైపె దాడి చేసి, చేతులు కట్టేసి 3 తులాల బంగారు పుస్తెలతాడు, 4 రోల్డ్ గోల్డ్ గాజులు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆదివారం సాయంత్రం నకిరేకల్ పట్టణంలోని తిప్పర్తి ఫ్లైఓవర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి యాక్టీవాపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా వారిని పట్టుకుని పట్టుకుని విచారించగా వారి వద్ద పుస్తెలతాడు దొరికింది. లక్ష్మమ్మపై దాడి చేసి చోరీ చేసింది తామేనని నిందితులు సత్యారం కృష్ణ అలియాస్ కృష్ణమూర్తి, మామిడి బాలకృష్ణ ఒప్పుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు మల్లం నర్సింహ, ముష్టి వెంకటేశ్ కూడా ఈ చోరీలో పాలుపంచుకున్నారని డీఎస్పీ తెలిపారు. సత్యారం కృష్ణ మీద 31 కేసులు, మామిడి బాలకృష్ణపై 13 కేసులు, ముష్టి వెంకటేశ్పై ఒక కేసు ఉన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. మల్లం నర్సింహ, మామిడి బాలకృష్ణ ఆరు నెలల క్రితం దొంగతనం కేసులో అరైస్టె చంచల్గూడ జైలులో కలిశారని, ఆ సమయంలో ఒంటరిగా ఉన్న మహిళలపై దాడి చేసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ రాజశేఖర్, ఎస్ఐలు లచ్చిరెడ్డి, సైదులు, సాయిప్రశాంత్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రమేష్, సునీల్, కె. రవి పాల్గొన్నారు. లారీని ఢీకొని గాయాలునాగారం: సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై నాగారం బంగ్లా సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్ మండలం ఇస్తాలపురం గ్రామానికి చెందిన మున్న ప్రవీణ్ బైక్పై తిరుమలగిరి వైపు వెళ్తున్నాడు. నాగారం బంగ్లా సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పడంతో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రవీణ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఏఎమ్మార్పీ కాలువలో పడి వృద్ధురాలి గల్లంతు
పెద్దఅడిశర్లపల్లి: ప్రమాదవశాత్తు ఏఎమ్మార్పీ ప్రధాన కాలువలో పడి వృద్ధురాలు గల్లంతయ్యింది. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలో సోమవారం చోటు చేసుకుంది. గుడిపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఓర్సు వెంకటమ్మ(60) సోమవారం పెద్దఅడిశర్లపల్లి మండలం వడ్డరిగూడెంలో ఉంటున్న తన కుమార్తె వద్దకు వచ్చి అక్కంపల్లి రిజర్వాయర్ కట్టపై నడుచుకుంటూ వెళ్తూ ఏకేబీఆర్ హెడ్ రెగ్యూలేటర్ వద్ద గల ఏఎమ్మార్పీ ప్రధాన కాలువలో నీరు తాగేందుకు ప్రయత్నిస్తూ కాలువలో జారిపడి కొట్టుకుపోయింది. స్థానికులు గమనించి గుడిపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ నర్సింహులు ఘటనా స్థలానికి చేరుకొని నీటి విడుదలను నిలిపివేసి గాలింపు చర్యలు చేపట్టినా ఆమె ఆచూకీ లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బైక్ అదుపుతప్పి కాలువలో పడి.. వలిగొండ: బైక్ అదుపుతప్పి కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వలిగొండ మండలంలోని ఎదుళ్లగూడెం గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన అంతటి అజయ్కుమార్(26) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం వలిగొండ మండలం పొద్దుటూరులోని తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. తిరుగు ప్రయాణంలో ఏదులగూడెం సమీపంలో బైక్ అదుపుతప్పి కాలువలో పడి మృతిచెందాడు. వెనుక నుంచి వస్తున్న వ్యక్తి ప్రమాదాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి వెళ్లి పోస్టుమార్టం నిమిత్తం అజయ్కుమార్ మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
భువనగిరిటౌన్: భువనగిరి పట్టణంలో సోమవారం మధ్యాహ్నం తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని వసుంధర థియేటర్ ఎదురుగా నివాసముంటున్న ఆమిల్ రాకేష్ సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తులు రాకేష్ ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువాల్లో దాచిన రూ.2.60లక్షల నగదు, తులం బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గేటు, ఇంటి దర్వాజా తీసి ఉండటం గమనించిన పక్కంటి వారు లోనికి వెళ్లి చూడగా కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడం, బీరువాలు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు గ్రహించి రాకేష్కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ లక్ష్మీనారాయణ ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణంతిప్పర్తి: తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మృతిచెందింది. సోమవారం తిప్పర్తి ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్కు చెందిన కల్లేపల్లి శ్రీనివాసరాజు, అతడి భార్య పుణ్యలక్ష్మి (54), మరదలు తిరుమలరాజు సుజాత కలిసి ఆదివారం సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా నాగండ్ల గ్రామానికి వెళ్తుండగా.. తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పుణ్యలక్ష్మి బలమైన గాయాలయ్యాయి. శ్రీనివాస్రాజు, సుజాతలకు స్వల్ప గాయాలయ్యాయి. పుణ్యలక్ష్మిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. మృతురాలి భర్త శ్రీనివాసరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపారు. హత్య కేసులో నిందితులపై పీడీ యాక్ట్ నమోదు నూతనకల్: నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన మెంచు చక్రయ్య హత్య కేసులో ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి హైదరాబాద్లోని చంచల్గూడ జైలుకు తరలించినట్లు సీఐ నర్సింహారావు సోమవారం తెలిపారు. మార్చి 17న మెంచు చక్రయ్య హత్య జరగగా.. ఈ కేసులో ప్రధాన నింధితులైన కనకటి వెంకన్న అలియాస్ వెంకటేశ్వర్లు, కనకటి శ్రావణ్పై పీడీ యాక్ట్ నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు. కనకటి వెంకన్నపై 11 క్రిమినల్ కేసులు, కనకటి శ్రావణ్పై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని, వారు మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడకూడదనే ఉద్దేశంతో పీడీ యాక్ట్ నమోదు చేసి సూర్యాపేట సబ్ జైలు నుంచి హైదరాబాద్లోని చంచల్గూడ జైలుకు తరలించినట్లు తెలిపారు. యాదగిరి స్థానాచార్యులుగా ‘నల్లంథీఘల్’● అదనపు బాధ్యతలు అప్పగింతయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధానార్చకుడిగా విధులు నిర్వహిస్తున్న నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులకు స్థానాచార్యులుగా దేవాదాయశాఖ అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించారు. గత కొన్నేళ్లుగా ఆలయ స్థానాచార్యుల పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఆ స్థానాచార్యుల పోస్టును ఆలయ ప్రధానార్చకుడిగా విధులు నిర్వహిస్తున్న నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులకు అదనంగా బాధ్యతలను అప్పగిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయంలో పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా పూజల్లో స్థానాచార్యులు కీలకంగా బాధ్యతలు నిర్వహించనున్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్యాణాన్ని కమనీయంగా జరిపించారు. అదేవిధంగా క్షేత్రంలోని శివాలయంలో శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక చైర్మన్ చెన్నూరు విజయ్కుమార్, ఈఓ, అర్చకులు పాల్గొన్నారు. -
ఇంటి పెద్ద.. మంచానికే పరిమితం
● భర్త కిడ్నీలు చెడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో భార్య ● కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు రూ.11 లక్షలు అవసరం ● ఇప్పటికే వైద్యం కోసం రూ.20 లక్షలు ఖర్చు ● దాతల సాయం కోసం ఎదురుచూపులుకనగల్: కుటుంబాన్ని పోషించాల్సిన ఇంటి పెద్ద రెండు కిడ్నీలు చెడిపోయాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు రూ.11లక్షలు అవసరమని వైద్యులు చెప్పడంతో ఆ పేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. దాతలు సాయం చేసి తన భర్తను కాపాడాలని భార్య వేడుకుంటోంది. వివరాలు.. కనగల్ మండల కేంద్రానికి చెందిన రావుల ఉపేందర్(34) రెండు కిడ్నీలు ఐదేళ్ల క్రితం చెడిపోయాయి. వైద్యం కోసం అప్పులు చేయడంతో పాటు తమకున్న అర ఎకరం భూమి అమ్మి రూ.20లక్షలు ఖర్చు చేశారు. ఉపేందర్ బీఈడీ వరకు చదివి కిడ్నీ వ్యాధితో మంచానికే పరిమితం కావడంతో అతడి భార్య స్రవంతి కూలీ పనులకు వెళ్లి మరీ కుటుంబాన్ని పోషిస్తోంది. వీరికి 7వ తరగతి చదివే కుమార్తె ఉంది. ఉన్న భూమి మొత్తం అమ్మినా.. గత మూడున్నర ఏళ్లుగా రూ.8లక్షల వరకు అప్పులు తెచ్చి మరీ ఉపేందర్కు వైద్యం చేయిస్తున్నారు. ఏడాదిన్నర నుంచి వారానికి రెండు సార్లు నల్లగొండ పట్టణానికి వచ్చి డయాలసిస్ చేయించుకుంటున్నాడు. దీని కోసం ఉన్న అర ఎకరం భూమి అమ్మితే రూ.12లక్షలు వచ్చాయి. ఇప్పటి వరకు రూ.20లక్షలు ఖర్చు చేశామని, ఇక తమ వద్ద ఎలాంటి ఆస్తులు లేవని ఉపేందర్ భార్య స్రవంతి కన్నీటి పర్యంతమవుతోంది.కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చిన మేనమామ..ఉపేందర్ అవస్థను చూసి సంధ్య తండ్రి (ఉపేందర్ మేనమామ) తన కిడ్నీని అల్లుడిని ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ 23న హైదరాబాద్లోని స్టార్ ఆస్పత్రిలో జరగనుంది. చేతిలో చిల్లిగవ్వ లేదని దాతలు ఆదుకోవాలని ఉపేందర్ భార్య స్రవంతి వేడుకుంటోంది. -
రైతులను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
చిట్యాల: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. చిట్యాలలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొచ్చి ఇరవై రోజులు దాటినా కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి కొర్రీలు పెడుతూ రైస్ మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. భూ భారతి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అధికారులు బిజీగా ఉండి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్టించుకోవటం ఆరోపించారు. రైతులు నుంచి కొనుగోలు చేసిన సన్నధాన్యానికి బోనస్ ఇవ్వకుండా, కాంగ్రెస్ నేతలు పక్క రాష్ట్రాల నుంచి సన్నధాన్యం తీసుకొచ్చి బోనస్ కోసం ఇక్కడి కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించటం లేదని, ఇచ్చిన హామీలను అమలు చేయటంలో అధికార పార్టీ విఫలమైందని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అవుల అయిలయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రుద్రారపు భిక్షం, మాజీ సర్పంచ్ సుంకరి యాదగిరిగౌడ్, మాజీ ఉప సర్పంచ్ బాతరాజు రవీందర్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొలను వెంకటేష్గౌడ్, జిట్ట శేఖర్ పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
బావిలో దూకిన వివాహిత మృతదేహం లభ్యం
ఆత్మకూరు(ఎం): భర్త, అత్తంటి వారి వేధింపులు తాళలేక ఆదివారం రాత్రి వ్యవసాయ బావిలో దూకిన వివాహిత మృతదేహం సోమవారం తెల్ల వారుజామున లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన సంధ్యకు ఆత్మకూరు(ఎం) మండలం మొరిపిరాల గ్రామానికి కటికె కృష్ణతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. భర్త కృష్ణ, అత్తమామలు మారెమ్మ, రాములు, బావ శ్రీను, తోటి కోడలు రమ్య వేధిస్తుండడంతో జీవతంపై విరక్తి చెందిన సంధ్య ఆదివారం సాయంత్రం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో సిద్దాపురం రోడ్డు పక్కన వ్యవసాయ బావిలో దూకింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో ఫైర్ సిబ్బంది సహాయంతో నీటిని బయటకు తోడించగా.. సోమవారం తెల్లవారుజామున సంధ్య మృతదేహం లభ్యమైంది. సంధ్య ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన వారిని శిక్షించే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తీసుకెళ్లనివ్వమని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. రామన్నపేట సీఐ ఎన్. వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన..సంధ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దోషులను పోలీసులు కాపాడుతున్నారని ఆరోపించారు. ఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ నోట్లో రాసిన విధంగా సంధ్య భర్త కృష్ణ, అత్తమామలు మారెమ్మ, రాములు, బావ శ్రీను, తోటికోడలు రమ్యతో పాటు వారికి సహకరించిన శివనాగేష్, వాణి, రేణుక, స్వాతి, నాగమణి, మాలతిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రామన్నపేట సీఐ ఎన్. వెంకటేశ్వరావు తెలిపారు. పోలీస్ స్టేషన్ వద్ద అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా వలిగొండ, మోత్కూరు, గుండాల, అడ్డగూడూరు పోలీసులచే బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు స్పందించి ఉంటే మా బిడ్డ బ్రతికేది..తమ కుమార్తైపె భర్త, అత్తమామలు, బావ, తోటికోడలు కలిసి అన్యాయంగా దొంగతనం కేసు పెట్టారని సంధ్య తల్లిదండ్రులు కెమిడి బైరయ్య, జయలక్ష్మి ఆరోపించారు. దొంగతనం కేసులో పోలీసులు కూడా తనను వేధిస్తున్నారని ఎన్నోసార్లు సంధ్య తమకు ఫోన్ చేసి చెప్పిందని వారు పేర్కొన్నారు. పోలీసులు స్పందించి న్యాయం చేసి ఉంటే తమ బిడ్డ బ్రతికేదని బోరున విలపించారు. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన