Yadadri
-
తెలంగాణలో బర్డ్ఫ్లూ కలకలం.. 40వేల కోళ్ల మృతి
భూదాన్పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ పరిధిలో బర్డ్ఫ్లూ కలకలం రేగింది. గ్రామంలోని పిట్ట సుదర్శన్రెడ్డికి చెందిన పౌల్ట్రీఫామ్లో.. ఈ నెల 12న 500 కోళ్లు మృతి చెందాయి. దీనిపై సుదర్శన్రెడ్డి ఇచి్చన సమాచారం మేరకు పశువైద్యాధికారులు.. చనిపోయిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు పంపించారు. వారు వాటిని మధ్యప్రదేశ్, భోపాల్లోని హై సెక్యూరిటీ వీబీఆర్ఐ ల్యాబ్కు పంపించారు. అక్కడ నమూనాలను పరీక్షించగా కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారణయ్యింది. దీంతో శుక్రవారం జిల్లా పశుసంవర్థక, వైద్య, రెవెన్యూ, పోలీస్శాఖ అధికారులు ఆ పౌల్ట్రీఫామ్ను సందర్శించారు. అక్కడ పశు వైద్యాధికారులు, సిబ్బంది మొత్తం 32 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లుగా ఏర్పడి.. పీపీఈ కిట్లు ధరించి.. ఫాంలోని 40వేల కోళ్లను చంపి మూటగట్టి సమీపంలో గుంతతీసి పూడ్చిపెట్టారు. సుమారు 19 వేల గుడ్లను సైతం పూడ్చారు. దీనిపై యాదాద్రి జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ జానయ్య విలేకరులతో మాట్లాడుతూ.. ఫాంలోని 90 టన్నుల ఫీడ్తో పాటు కోళ్ల పెంటను సైతం దహనం చేస్తామని తెలిపారు. కోళ్లఫాం నుంచి కిలోమీటర్ పరిధిలో పూర్తి స్థాయిలో శానిటేషన్ చేస్తామని తెలిపారు. మూడు నెలల వరకు పౌల్ట్రీ ఫామ్ను సీజ్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల తరువాతే తిరిగి పౌల్ట్రీఫామ్ను నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దోతిగూడెంలో బర్డ్ఫ్లూ వల్ల ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని కోరారు. -
నెత్తిన బండరాళ్లతో దివ్యాంగుల నిరసన
ఆత్మకూర్(ఎస్): బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించలేదని నిరసిస్తూ శుక్రవారం ఆత్మకూర్ (ఎస్) మండలం కందగట్ల గ్రామంలో భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులు బండరాళ్లను నెత్తిన పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్ద రాజేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30 లక్షల మంది అంగవైకల్యంతో బాధపడుతున్నారని, వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. దివ్యాంగులకు రూ.6000 పెన్షన్ ఇస్తామని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పి నేటికీ అమలు చేయలేదన్నారు. నిరసన కార్యక్రమంలో గోగుల శేఖర్రెడ్డి, గుడిపల్లి సుమతి, తలారి సహదేవుడు, ఆకారపు వెంకన్న, వంటెపాక ముత్తయ్య, ఆరూరి బాబు, మేకల వెంకన్న, గుమ్మడవెల్లి ఆంజనేయులు, లింగయ్య, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి
దేవరకొండ: గుర్తు తెలియని వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. దేవరకొండ, కొండమల్లేపల్లి మండలాల్లో జరిగిన ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. దేవరకొండ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామపంచాయతీ బద్యానాయక్ తండాకు చెందిన నేనావత్ చిరంజీవి(23) హైదరాబాద్లో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల గ్రామానికి వచ్చిన చిరంజీవి గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై దేవరకొండ నుంచి స్వగ్రామమైన బద్యానాయక్ తండాకు వెళ్తున్నాడు. ఈక్రమంలో కల్వకుర్తి నుంచి దేవరకొండ వైపు వస్తున్న గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహులు తెలిపారు. కొండమల్లేపల్లిలో.. కొండమల్లేపల్లి: పెద్దఅడిశర్లపల్లి మండలంలోని మల్లాపురం గ్రామానికి చెందిన నారాయణదాసు శ్రీనయ్య(53) కొండమల్లేపల్లి పట్టణంలోని విద్యుత్ కేంద్రంలో లైన్మన్గా విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. మండలంలోని కొల్ముంతలపహాడ్ గేటు సమీపంలో యూటర్న్ తీసుకునే క్రమంలో దేవరకొండ నుంచి కొండమల్లేపల్లి వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రమైన గాయాలు కావడంతో శ్రీనయ్యను చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించి కొండమల్లేపల్లి ఏఈ దేవుజ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఎంజీయూలో భౌతిక శాస్త్ర ప్రయోగశాల ప్రారంభం
ఫ ఎంజీయూ వైస్ చాన్స్లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో భౌతిక శాస్త్ర ప్రయోగశాలను శుక్రవారం వైస్ చాన్స్లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భౌతిక శాస్త్రం విభాగంలో మెరుగైన పరిశోధనలకు అనుగుణంగా ల్యాబ్ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రపంచానికి ప్రయోజనం చేకూరే నాణ్యమైన పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు ఆ దిశగా తమ ప్రయత్నాలు చేసి సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ అల్వాల రవి, ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ్సాగర్, సైన్స్ డీన్ ప్రొఫెసర్ వసంత, సోషల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, డాక్టర్ కొప్పుల సత్తిరెడ్డి, భిక్షమయ్య, రమేష్, డాక్టర్ శాంతకుమారి, ఆదిరెడ్డి, వీరస్వామి, రూప తదితరులు పాల్గొన్నారు. -
పోచంపల్లిలో ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు
రియల్ఎస్టేట్ సంస్థపై కేసు నమోదు చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం తుఫ్రాన్పేట గ్రామంలో ప్రభుత్వ భూమిని తమ లేఅవుట్లో చూపించి ప్లాట్లు అమ్ముతున్న ఓ ప్రముఖ రియల్ఎస్టేట్ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ వివరాలు వెల్లడించారు. గతంలో ఓ రియల్ ఎస్టేట్ 1991 డీటీసీపీ లేఅవుట్ చేసి ప్రభుత్వ భూమిని కూడా వెంచర్ లేఅవుట్లో చూపించిదని, ప్రస్తుతం ఇదే వెంచర్ను మరో సంస్థ సంస్థ డెవలప్ చేసి ప్రభుత్వ భూమిని లేఅవుట్లో చూపించి ప్లాట్లు విక్రయిస్తోందని, దీనిపై చౌటుప్పల్ తహసీల్దార్ హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
పరీక్షా సమయంలో తెరిచి ఉంచిన జీరాక్స్ సెంటర్లు
శాలిగౌరారం: శాలిగౌరారం మండల కేంద్రంలో శుక్రవారం పదో తరగతి పరీక్షా సమయంలో జీరాక్స్ సెంటర్లు, మీసేవా కేంద్రాలు తెరిచే ఉన్నాయి. విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలో సమీపంలో 144 సెక్షన్ అమలు ఉంటుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా జీరాక్స్ సెంటర్ల నిర్వాహకులు షాపులను తెరిచే ఉంచారు. పోలీసులు ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. లీక్ అయిన ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో శాలిగౌరారానికి చెందిన కొంత మంది యువకులు సమీపంలోని జీరాక్స్ సెంటర్లలో జవాబు పత్రాలను జీరాక్స్ తీసుకుని పరీక్షా కేంద్రంలోనికి పంపించేందుకు తీవ్రంగా యత్నించినట్లు స్థానికులు పేర్కొన్నారు.ఫ ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు -
బీఆర్ఎస్ రజతోత్సవ సభను సక్సెస్ చేయాలి
సాక్షి, యాదాద్రి: హన్మకొండలో వచ్చేనెలలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పార్టీ శ్రేణులను పెద్దఎత్తున తరలించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ మాజీ ఎమ్మెల్యేలకు సూచించారు. శుక్రవారం ఎర్రవెళ్లిలోని ఫాం హౌస్లో కేసీఆర్ను సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి, ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్కుమార్లు కలిశారు. ఈసందర్భంగా హన్మకొండకు దగ్గరలో ఉన్న జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ కోసం చర్చించారు. నియోజకవర్గాల వారీగా చేపట్టే జన సమీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ వారికి దిశా నిర్దేశం చేశారు. వేడుకలకు ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి పదివేల మంది వరకు పార్టీ శ్రేణులను తరలివస్తారని కేసీఆర్కు వివరించారు. ఫ ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ శ్రేణులను తరలించాలని మాజీ సీఎం కేసీఆర్ సూచన ఫ ఎర్రవెళ్లి ఫాం హౌస్లో ఆయనను కలిసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు -
లైంగిక వేధింపుల కేసులో ఇద్దరు అరెస్ట్
హుజూర్నగర్: యువతిని లైంగికంగా వేధించిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. శుక్రవారం సీఐ చరమంద రాజు ఎస్ఐ ముత్తయ్యతో కలిసి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. హుజూర్నగర్లోని స్వామి రోజా, ఆమె ప్రియుడు నూకతొట్టి ప్రమోద్ కుమార్, మరొక వ్యక్తి లచ్చిమళ్ల హరీష్ కలిసి ఈనెల 18న ఒక యువతిని బలవంతంగా కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రమోద్, హరీష్లు యువతిని లైంగికంగా వేధించారు. వారి నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులైన నూకతోట్టి ప్రమోద్ కుమార్, స్వామి రోజాను పట్టణంలో వారు తమ ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. వారిని అరెస్ట్ చేసి కారు, రెండు సెల్ఫోన్లు, ఒక బాండ్ పేపర్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు లచ్చిమళ్ల హరీష్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. ప్రమోద్ కుమార్పై హుజూర్నగర్, మఠంపల్లి, గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదైనట్లు తెలిపారు. సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపడుదాం
సంస్థాన్ నారాయణపురం : ప్రతి నీటిబొట్టు వృథాకాకుండా భూమిలోకి ఒడిసిపడుదామని, అందుకోసం నీటి ప్రవాహానికి అడ్డుకట్టలు వేద్దామని అదనపు కలెక్టర్ వీరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన పథకంలో భాగంగా వాటర్షెడ్ పనులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శుక్రవారం సంస్థాన్నారాయణపురం మండలం పుట్టపాక, జనగాం గ్రామాల్లో వాటర్షెడ్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పుట్టపాకలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చెక్డ్యాంలు, పర్యుక్యూలేషన్ ట్యాంకులు, ఇంకుడుగుంతలు నిర్మించడం ద్వారా నీరు వృథాగా పోకుండా భూమిలోకి ఇంకుతుందన్నారు. రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంభించి తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించాలన్నారు. జిల్లాలోనే సంస్థాన్ నారాయణపురం మండలంలో 22 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయినట్లు తెలిపారు. జనగాం వాటర్షెడ్ ప్రాజెక్టు కింద వ్యవసాయ పరికరాల కొనుగోలు కోసం రూ.1.41కోట్లు మంజురైనట్లు తెలిపారు. జనగాంలో వాటర్షెడ్ను ప్రారంభించారు. అంతకుముందు ఆయా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. నీటి పొదుపుపై కళకారులు, విద్యార్థులు నిర్వహించిన ఆటా–పాట కార్యక్రమం అలరించింది. అదే విధంగా మహిళల సంఘాలు ఏర్పాటు చేసిన చేనేత మొగ్గం, బుట్టల అల్లికలును పరిశిలించినారు. పధకంలో భాగంగా ఏర్పాటు చేసిన పుట్టపాకలో బస్ షెల్టర్ను ప్రారంభించారు. వివిధ సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆటవీ ఆధికారి పద్మజారాణి, భూగర్భగనుల శాఖ జిల్లా ఆధికారి జ్యోతికుమార్, వాటర్షెడ్ సంయుక్త కమిషనర్ నర్సింహులు, డీఆర్డీఓ పీడీ నాగిరెడ్డి, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ ప్రమోద్కుమార్, ఎంపీఓ నర్సింహులు, ఏపీఎం యాదయ్య, ఏపీఓ ప్రశాంతి, గ్రామ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి -
ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్న మిస్వరల్డ్ పోటీదారులు
ఇటీవలే యాదగిరి క్షేత్రాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా ఇటీవల యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని మిస్ వరల్డ్ –2024 క్రిస్టినా పిస్కోవా సందర్శించారు. ఆలయం అద్భుతమని కొనియాడారు. వాస్తు శిల్పం, ప్రశాంతమైన పరిసరాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం యాదగిరి క్షేత్రాన్ని తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశమని ఆమె పేర్కొన్నారు. ఆమె ప్రకటనతో మే 15న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందెగత్తెలంతా యాదగిరి క్షేత్ర సందర్శనకు వచ్చి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందనున్నారు. ఫ మే 12న నాగార్జునసాగర్కు, 15న పోచంపల్లి, యాదగిరిగుట్టకు రానున్న ప్రపంచ సుందరీమణులు ఫ ఇక్కడి ప్రాంతాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా తెలంగాణ పర్యాటకశాఖ ప్రణాళికవిజయ విహార్లో విడిది ప్రపంచదేశాల బౌద్ధులను ఆకర్షించేందుకు నాగార్జునసాగర్లోని కృష్ణానది తీరంలోని బుద్దవనాన్ని ప్రపంచ అందెగత్తెలు మే 12న సందర్శనున్నారు. బౌద్దుల చరిత్ర, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని వారు తెలుసుకోనున్నారు. వారికి ఇక్కడి బౌద్ధసంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా గుర్తింపు దక్కేలా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మిస్వరల్డ్ పోటీదారులు సాగర్లో ఇక్కడ విడిది చేయడానికి గాను విజయవిహార్లోని గదులను ఆధునీకరిస్తున్నారు. రూ.5 కోట్ల వ్యయంతో అన్ని హంగులు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆయా పనులు ప్రారంభించారు. వారి విడిదికి సకల హంగులు కల్పిస్తూ.. విజయ విహార్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ, నల్లగొండ కలెక్టర్, ఉన్నతాధికారులు నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 18న యాదగిరి క్షేత్రంలో క్రిస్టినా పిస్కోవా మే 15వ తేదీనే అందాల భామలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడ గడపనున్నారు. వారు 15వ తేదీన హైదరాబాద్ నుంచి నేరుగా యాదగిరికొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్కు చేరుకుని.. అక్కడి నుంచి యాదగిరి క్షేత్రానికి వస్తారు. విష్ణు పుష్కరిణిలో సంకల్ప పూజలు చేసి, ప్రధానాలయం సమీపంలో ఉన్న అఖండ దీపారాధన పూజల్లో పాల్గొంటారు. శ్రీస్వామి వారి దర్శనం తర్వాత ప్రధానాలయ పునః నిర్మాణాన్ని మిస్ వరల్డ్ పోటీ దారులు పరిశీలించి, ఇక్కడే ఒక డాక్యుమెంటరీ సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. మిస్ వరల్డ్ పోటీదారులతో యాదగిరిక్షేత్ర వైభవం ప్రపంచ స్థాయికి వెళ్లనుంది. ఆధ్యాత్మిక నగరికి.. -
తొలి రోజు 8,616 మంది హాజరు
భువనగిరి : పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతమైన వాతావరణంలో మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో 8,627 మంది విద్యార్థులకు గాను 8,616 మంది హాజరయ్యారు.11 మంది గైర్హాజరయ్యారు. భువనగిరిలోని గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రాన్ని కలెక్టర్ హనుమంతరావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గౌతమ్ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను డీఈఓ సత్యనారాయణ తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు కాగా అరగంట ముందుగానే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. -
బీబీనగర్ తహసీల్దార్ సస్పెన్షన్
బీబీనగర్: క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించకుండా పాస్పుస్తకాలు జారీ చేసిన తహసీల్దార్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. బీబీనగర్ మండలం పడమటిసోమారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 242, 254ల మధ్యలో గల కొన్ని సర్వే నంబర్లకు చెందిన భూములను కొన్నేళ్ల క్రితం ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేసింది. వెంచర్లు చేసి ప్లాట్లు విక్రయించింది. అయితే కొనుగోలు చేసిన భూములను రియల్ ఎస్టేట్ సంస్థ మ్యూటేషన్ చేసుకోలేదు. ఆ స్థలంపై కన్నేసిన కొందరు నాయకులు రియల్ ఎస్టేట్కు సంస్థకు భూములు విక్రయించిన వారిని ప్రలోభపెట్టారు. కొంత డబ్బు ముట్టజెప్పి మరలా ఆ భూములను వారి పేరున మార్చేందుకు దరఖాస్తు చేయించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు రావడంతో.. వెంచర్లలోని కొంతభాగంలో ఉన్న ప్లాట్లను చెడగొట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యం ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు. తహసీల్దార్ క్షేత్రస్థాయికి వెళ్లి భూములను పరిశీలించకుండానే దరఖాస్తుదారులకు పాస్పుస్తకాలు జారీచేసినట్లు విచారణలో తేలింది. అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం తహసీల్దార్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఫ భూములను పరిశీలించకుండానే పాస్పుస్తకాలు జారీ ఫ కలెక్టర్కు రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యం ఫిర్యాదు ఫ విచారణలో వాస్తవమని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు -
మహిళా చట్టాలపై అవగాహన తప్పనిసరి
భువనగిరి : మహిళా చట్టాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, జడ్జి మాధవీలత సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని శుక్రవారం సార్ప్ సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ ప్రమీల ఆధ్వర్యంలో భువనగిరిలోని పశు సంవర్థక శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు జరిగితే టోల్ప్రీ నంబర్ 181 ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం సఖి కేంద్రాల సీఏలు లావణ్య, రేణుకను సన్మానించారు ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ బండారు జయశ్రీ, భువనగిరి బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు విజ య, సార్ప్ సంస్థ సిబ్బంది సరిత, కృష్ణవేణి, శ్రీని వాస్రావు, రాజేష్, శోభ, స్వరూప పాల్గొన్నారు. ఫ జిల్లా న్యాయమూర్తి మాధవీలత -
పనులు ప్రారంభమయ్యేనా
బీబీనగర్ పెద్దచెరువు ట్యాంక్బండ్ పనులకు శంకుస్థాపన చేసి 18 నెలలు గడిచినా పనుల్లో కదలిక లేదు.అన్ని వర్గాలకు అనుకూలం రాష్ట్ర బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుందని, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందని మంత్రి వెంకటర్రెడ్డి అన్నారు.- IIIలో- IIలోటీఎస్ ఐపాస్ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి పరిశ్రమలు ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఐదో స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా నిలువగా, నల్లగొండ 12వ స్థానంలో నిలిచింది. సూర్యాపేట 23వ స్థానంలో నిలిచింది. యాదాద్రి జిల్లాలో 1032 పరిశ్రమలు ఏర్పాటు ద్వారా రూ.5598 కోట్ల పెట్టుబడులు రాగా, 34,876 మందికి ఉపాధి లభించింది. నల్లగొండ జిల్లాలో 693 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.4344 కోట్ల పెట్టుబడులు రాగా, 17,220 మందికి ఉపాధి లభించింది. సూర్యాపేట జిల్లాలో 330 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.5207 కోట్ల పెట్టుబడులు లభించగా, 10,439 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఒక్క సంవత్సరంలోనే..2024–25 ఆర్థిక సంవత్సరంలో యాదాద్రి జిల్లాలో 93 కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాగా రూ.222 కోట్ల పెట్టుబడులు వచ్చి 1666 మందికి ఉపాది లభించింది. నల్లగొండలో 56 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.955 కోట్ల పెట్టుబడులు రాగా, 2053 మందికి ఉపాధి లభించింది. సూర్యాపేట జిల్లాలో 26 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.67 కోట్లు రాగా, 516 మందికి ఉపాధి లభించింది. విద్యుత్ కనెక్షన్లలో టాప్ పరిశ్రమల ద్వారా యాదాద్రికి రూ.5598 కోట్ల పెట్టుబడులు -
ఎగుమతుల్లో ఆరో స్థానంలో యాదాద్రి జిల్లా
సరుకుల ఎగుమతుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఆరో స్థానంలో నిలువగా, మెదక్ ఏడో స్థానంలో, నల్లగొండ 8వ స్థానంలో నిలిచింది. 41.42 శాతం ఎగుమతులతో మొదటి స్థానంలో రంగారెడ్డి, 17.60 శాతంతో రెండో స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల నిలిచాయి. 15.42 శాతం ఎగుమతులతో సంగారెడ్డి మూడో స్థానంలో, 13.51 శాతంతో హైదరాబాద్ నాలుగో స్థానంలో, 2.82 శాతంతో మహబూబ్నగర్ ఐదో స్థానంలో నిలిచాయి. 2.04 శాతంతో యాదాద్రి భువనగిరి ఆరో స్థానంలో నిలువగా, 1.38 శాతంతో మెదక్ ఏడో స్థానంలో, 1.07 శాతం ఎగుమతులతో నల్లగొండ 8వ స్థానంలో నిలిచింది. రాష్ట్రం నుంచి అయ్యే ఎగుమతుల్లో ఈ జిల్లాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఆలేరురూరల్ : జిల్లాలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. గురువారం ఆలేరు ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నమూనాను చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు నెలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని, నాణ్యతలో తేడా రావద్దని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులంతా సకాలంలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా వారికి తోడ్పాటునందించాలని పేర్కొన్నారు. బేస్మెంట్ లెవల్ పూర్తయిన తరువాత రూ.లక్ష, పైకప్పుకు రూ.లక్ష, స్లాబ్కు రూ.2లక్షలు మొత్తం రూ.5లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఇల్లు మంజూరుకాని వారు ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడం ప్రభుత్వం లక్ష్యమన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సంహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, హౌజింగ్ అధికారి శ్రీరాములు, తహసీల్దార్ అంజిరెడ్డి, ఎంపీడీఓ సత్యాంజనేప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.ఫ ప్రభుత్వ విప్ బీర్లఅయిలయ్య -
టెన్త్ పరీక్షలకు అంతా సిద్ధం
భువనగిరి : పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు ఉంటాయి. 50 కేంద్రాల్లో 8,632 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. సందేహాల నివృత్తికి సెల్ నంబర్ 90107 72080 ఏర్పాటు చేశారు. పరీక్షల కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందే చేరుకోవాలని అధి కారులు సూచిస్తున్నారు. భువనగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లను పరీక్షల రాష్ట్ర పరిశీలకులు రమణకుమార్ పరిశీలించారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఆమె వెంట డీఈఓ సత్యనారాయణ, ఏసీజీఈ రఘురాంరెడ్డి, ఎంఈఓ నాగవర్థన్రెడ్డి, సీఎస్, డీఓలు ఉన్నారు. విద్యార్థులూ.. ఆల్ ది బెస్ట్ భువనగిరి : పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు కలెక్టర్ హనుమంతరావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కచ్చితంగా పాస్ అవుతాం మని పాజిటివ్ ఆలోచనతో పరీక్షలు రాయాలని, ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని సూచించారు. అదే విధంగా డీఈఓ సత్యనారాయణతో కలిసి ఎంఈఓలు, సీఎస్, డీఓలతో జూమ్ మీటింగ్ నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలన్నారు. -
కేసీఆర్ లేకపోతే తెలంగాణే లేదు
సూర్యాపేటటౌన్ : ‘కేసీఆర్.. పార్టీ పెట్టి సునామీ సృష్టించారు... కేసీఆరే లేకపోతే తెలంగాణ లేదు.. ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న వారికి ఆ పదవులే రాకపోయేవి’ అని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించే బహిరంగ సభ విజయవంతానికి గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, మరో వైపు చంద్రబాబు లాంటి వారి సవాళ్ల మధ్య కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం సాహసం చేసి పార్టీ పెట్టారన్నారు. 14 ఏళ్లు సుదీర్ఘపోరాటం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. కేసీఆర్ మోకాలు ఎత్తుకు కూడా సరిపోని వాళ్లు ఆయన గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి నల్ల గొండ జిల్లాలో 2.5లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే.. ఇప్పుడు ఇక్కడ నీళ్ల మంత్రి ఉన్నా చుక్కనీరు తేలేకపోతున్నారని, దీంతో పంటలు ఎండిపోయి రైతులు గోసపడుతున్నారన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగితే ఒక మంత్రి పోయి చాపల కూర చేయించుకొని తింటున్నాడని విమర్శించారు. స్పీకర్ పదవికి కుల, మత పట్టింపులు ఉండవని, స్పీకర్ పదవి అంటే బీఆర్ఎస్కు ఎంతో గౌరవమని, ప్రసాద్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో తమ పాత్ర కూడా ఉందన్నారు. శాసనసభ మన అందరిదీ అన్న జగదీష్రెడ్డిని సస్పెండ్ చేశారని, గాంధీభవన్ లెక్క సభను నడుపుతున్నారని అన్న అక్బరుద్దీన్ ఒవైసీ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు ఒక్కొక్క గ్రామం నుంచి బండ్లు కట్టుకుని తరలిరావాలని కోరారు. ఈ సభ చూస్తే కాంగ్రెస్, బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలన్నారు. వరంగల్ బహిరంగ సభ తర్వాత వెంటనే సభ్యత్వ నమోదుతోపాటు గ్రామ మండల కమిటీలు ఏర్పాటు చేసుకుందామన్నారు. ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాలు చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఏడాదిని పోరాట నామ సంవత్సరంగా పిలుచుకుందామని అన్నారు. దేశానికి కేసీఆరే దిక్సూచి: జగదీష్రెడ్డి దేశానికి దిక్సూచిలా కేసీఆర్ నిలుస్తారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వెనుకబాటును చూసి చలించి గులాబీ జెండా ఎత్తారని, ఒక్కడిగా బయలుదేరి నేడు సముద్రంలా మారారని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం వెనుకబాటుకు గురవుతోందని, ఇక్కడ ఆయన శిష్యుడు రేవంత్ అదే బాటలో పయనిస్తున్నాడని ఆరోపించారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, బొల్లం మల్లయ్య యాదవ్, కంచర్ల భూపాల్రెడ్డి, భాస్కరరావు, రవీంద్రకుమార్, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, చింతల వెంకటేశ్వర్రెడ్డి, చెరుకు సుధాకర్ పాల్గొన్నారు.ఫ 14 ఏళ్లు పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించారు ఫ బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి జిల్లాలో 2.50లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చాం ఫ ఇప్పుడు ఇక్కడ నీళ్ల మంత్రి ఉన్నా చుక్క నీరు తేలేకపోతుండు ఫ సూర్యాపేటలో జరిగిన సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ వరంగల్ సభకు భారీగా తరలిరావాలని పిలుపు -
నేడు వాటర్షెడ్ యాత్ర
సంస్థాన్ నారాయణపురం : నీటి సంరక్షణ పనులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధిహామీ పథకం ద్వారా అమలయ్యే వాటర్షెడ్ పనులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. శుక్రవారం సంస్థాన్నారాయణపురం మండలంలోని పుట్టపాక, జనగాం గ్రామాల్లో వాటర్షెడ్ యాత్ర చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, వాటర్షెడ్ ఏర్పాటు ప్రతిపాదిత ప్రాంతాలను వారు పరిశీలించారు. వారి వెంట ఎంపీడీఓ ప్రమోద్కుమార్, సత్యం తదితరులు ఉన్నారు. ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’తో ప్రజాధనం ఆదా ఆలేరురూరల్ : రాష్ట్రాల్లో తరుచూ జరుగుతున్న ఎన్నికల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, ఒకే దేశం ఒకే ఎన్నికతో ఆదా అవుతుందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్గౌడ్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’పై గురువారం ఆలేరులోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యలయంలో ఆయన మాట్లాడారు. పలుమార్లు ఎన్నికలు జరగడం వల్ల సామన్యులు ఆర్థిక భారంతో పోటీ చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే మరింత పురోగతి సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆలేరు మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు బోగ శ్రీనివాస్, మండల కన్వీనర్ బైరి మహేందర్, అమరేందర్, శంకర్, ప్రశాంత్, సుధగాని సురేష్, కంతి రవి, రాజు, వెంకటేష్, శ్రీను, కిషన్, సందీప్, సారయ్య తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం భువనగిరిటౌన్ : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రస్థాయి అవార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తుందని చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు ఇందిర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వృత్తి నైపుణ్యత, ప్రత్యేకతల ఆధారంగా అవార్డుకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఏప్రిల్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరచిన అర్చకులు.. శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. నేడు ఉపకరణాల పంపిణీ భువనగిరి : జిల్లాలో గుర్తించిన దివ్యాంగులైన చిన్నారులకు శుక్రవారం ఉపకరణాలు పంపిణీ చేయనున్నట్లు డీఈఓ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర శిక్ష, ఆర్టిఫీషియాల్ లింబ్స్ కార్పొరేషన్ ఇండియా సంయుక్తంగా గత సంవత్సరం ఆగస్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో వైకల్య పరీక్షలు నిర్వహించి 159 మంది చిన్నారులను అర్హులుగా గుర్తించారు. భువనగిరిలోని బాగాయత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని పెన్షనర్స్ భవనంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఉపకరణాలు పంపిణీ చేస్తామన్నారు. -
ఎగుమతుల్లో ఆరో స్థానంలో యాదాద్రి జిల్లా
సరుకుల ఎగుమతుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఆరో స్థానంలో నిలువగా, మెదక్ ఏడో స్థానంలో, నల్లగొండ 8వ స్థానంలో నిలిచింది. 41.42 శాతం ఎగుమతులతో మొదటి స్థానంలో రంగారెడ్డి, 17.60 శాతంతో రెండో స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల నిలిచాయి. 15.42 శాతం ఎగుమతులతో సంగారెడ్డి మూడో స్థానంలో, 13.51 శాతంతో హైదరాబాద్ నాలుగో స్థానంలో, 2.82 శాతంతో మహబూబ్నగర్ ఐదో స్థానంలో నిలిచాయి. 2.04 శాతంతో యాదాద్రి భువనగిరి ఆరో స్థానంలో నిలువగా, 1.38 శాతంతో మెదక్ ఏడో స్థానంలో, 1.07 శాతం ఎగుమతులతో నల్లగొండ 8వ స్థానంలో నిలిచింది. రాష్ట్రం నుంచి అయ్యే ఎగుమతుల్లో ఈ జిల్లాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. -
లాంగెస్ట్ రోడ్ నెట్వర్క్లో రెండో స్థానంలో నల్లగొండ
రాష్ట్రంలో అత్యధిక దూరం రోడ్ నెట్వర్క్ కలిగిన జిల్లాల్లో రంగారెడ్డి ప్రథమ స్థానంలో ఉండగా, నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,11,775.56 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉండగా, రంగారెడ్డిలో 7,932.14 కిలోమీటర్లు ఉంది. నల్లగొండలో 7,766.92 కిలోమీటర్లు ఉంది. కీలకమైన రోడ్డు డెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో నల్లగొండను ఒకటిగా తీసుకుంది. లతీఫ్ సాహెబ్ గుట్ట – బ్రహ్మంగారిమఠం, శివాలయం వరకు రూ.140 ఘాట్ రోడ్డును నిర్మించబోతోంది. రూ.236 కోట్లతో యాదాద్రి థర్మల్ పవర్స్టేషన్ నుంచి నార్కట్పల్లి అద్దంకి హైవేకు లింక్ చేస్తూ సీసీరోడ్డు వేస్తోంది. -
బోరు మోటార్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్ట్
గుర్రంపోడు: వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్లు, కరెంట్ తీగలను చోరీ చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను గుర్రంపోడు పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఎస్ఐ పసుపులేటి మధు నిందితుల వివరాలను విలేకరులకు వెల్లడించారు. గుర్రంపోడు మండలం చామలేడు గ్రామానికి చెందిన దోటి సైదులు, దోటి శంకర్, దోటి అశోక్ జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల వీరు గుర్రంపోడు మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్లు, కరెంట్ తీగలు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. గురువారం ఆరెగూడెం బస్ స్టేజీ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. సైదులు, శంకర్, అశోక్ కలిసి బైక్పై కరెంట్ తీగలు తీసుకుని వెళ్తుండగా.. వారిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి నుంచి నాలుగు మోటార్లు, 80 మీటర్ల మోటారు కేబుల్ వైరును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలం
నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుందని, బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెద్దపీట వేయగా అందులో నల్లగొండ జిల్లానే ముందుందన్నారు. గతంలో ధాన్యం దిగుమతిలో నల్లగొండ జిల్లా ముందుందని.. ఈసారి ఆయకట్టు సాగు పెరిగిందని, దీని ద్వారా దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. బ్రాహ్మణవెల్లెంలకు బడ్జెట్లో కేటాయింపులు రెండింతలు పెంచారన్నారు. కాల్వ పనులు పూర్తిచేసేందుకు రూ.37 కోట్లు విడుదల చేశామన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులను సంతోషంగా ప్రారంభించామని, కానీ అనుకోని ప్రమాదం జరిగి 8 మంది చనిపోవడం బాధాకరమన్నారు. అయినప్పటికి ఆ ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని వాటికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బడ్జెట్లో నిధులు కేటాయించారని పేర్కొన్నారు. అదేవిధంగా పాఠశాల విద్యకు బడ్జెట్లో రూ.11వేల కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో 58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య అందించనున్నట్లు పేర్కొన్నారు. వృత్తి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నల్లగొండలో రూ.75 కోట్లతో నిర్మించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ) ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. 12వేల కి.మీ. మేర రోడ్ల నిర్మాణం.. ఆర్అండ్బీ శాఖ నుంచి రూ.5099కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 12వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి వచ్చే నెల టెండర్లు పిలువబోతున్నామని మంత్రి తెలిపారు. నూతన హైకోర్టు భవనం, ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మిస్తున్నామన్నారు. రైతులకు రూ.2400 కోట్లు రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని, తాము ఆ ప్రభుత్వం కట్టిన ఇళ్లలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇవ్వడంతో పాటు మరో 3500 ఇల్లు మంజూరు చేశామన్నారు. వేసవిలో శ్కా ఎకరం కూడా ఎండకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ పాల్గొన్నారు. ఫ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో అధిక కేటాయింపులు ఫ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తిచేస్తాం ఫ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
రేషన్ బియ్యం పట్టివేత
వలిగొండ: అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని వలిగొండ పోలీసులు గురువారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం కంచనపల్లి గ్రామ పరిధిలోని ఓ ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేసినట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. తుర్కపల్లి మండలం బిలయ్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్కాపురం గ్రామానికి చెందిన గుగులోతు రాములు తక్కువ ధరకు రేషన్ లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యం సేకరించి నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ యుగంధర్ తెలిపారు. యువతి అదృశ్యం త్రిపురారం: నిడమనూరు మండలం తుమ్మడం గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైనట్లు గురువారం నిడమనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ గోపాల్రావు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మడం గ్రామానికి చెందిన కొప్పుల మంజు హైదరాబాద్లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. నెల రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన ఆమె ఇంటి వద్దనే ఉంటోంది. బుధవారం మధ్యాహ్నం సమయంలో మంజు తల్లి లక్ష్మమ్మ ఇంట్లో నిద్రించింది. ఆమె నిద్రలేచి చూసేసరికి మంజు కనిపించలేదు. చుట్టుపక్కల బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వెతికినా మంజు ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం మంజు తండ్రి శ్రీనివాస్ నిడమనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కార్యదర్శికి గాయాలు నార్కట్పల్లి: బైక్పై వెళ్తున్న పంచాయతీ కార్యదర్శిని గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గురువారం మహాత్మాగాంధీ యూనివర్సిటీ సమీపంలో జరిగింది. నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రవిశంకర్ గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు నల్లగొండ నుంచి ఎల్లారెడ్డిగూడేనికి బైక్పై వెళ్తుండగా.. మహాత్మాగాంధీ యూనివర్సిటీ సమీపంలో వెనుక నుంచి గుర్తుతెలియని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం రవిశంకర్ను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బైక్ ఢీకొని.. అడ్డగూడూరు: సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో గాయపడ్డాడు. ఈ ఘటన గురువారం అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు శివారులో జరిగింది. చిర్రగూడూరు గ్రామానికి చెందిన బెల్గం సోమయ్య గురువారం సాయంత్రం వ్యవసాయ బావి వద్ద నుంచి సైకిల్పై ఇంటికి వస్తుండగా.. కోటమర్తి గ్రామానికి చెందిన సతీష్ బైక్పై వెళ్తూ చిర్రగూడూరు గ్రామ శివారులో సైకిల్ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సోమయ్య కాలు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని సూర్యాపేటలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. -
వేసవిలో ఆకుకూరల సాగు– మెళకువలు
కలుపు నివారణ : అన్ని ఆకుకూరల పంటల్లో కలుపు నివారణకు పెండిమిథాలిన్ ఎకరాకు 1.2 లీటర్లు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 14 గంటల్లో పిచికారీ చేసి, 30 రోజుల వరకు కలుపు నివారించవచ్చు. సస్యరక్షణ : ఆకుకూరలను కూరగా వాడతారు కనుక వీలైనంత వరకు పురుగు మందులను వాడకపోవడమే మంచింది. వేప సంబంధిత పురుగు మందులను మాత్రమే వాడాలి. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పురుగుల నివారణకు మలాథియాన్ 2మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్ల నివారణకు లీటరు నీటికి కార్బెండాజిమ్ 1గ్రాము లేదా మ్యాంకోజెబ్ 2.5గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నడిగూడెం: ఆకుకూరల్లో మానవ శరీరానికి అవసరమైన ఎన్నో పోషక పదార్ధాలు లభిస్తాయి. ప్రతిరోజు ఆహారంలో ఆకుకూరలను తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వేసవిలో ఆకుకూరలు సాగుచేస్తే లాభాలు బాగుంటాయని హార్టికల్చర్ కన్సల్టెంట్ సుందరి సురేష్ చెబుతున్నారు. ఫ వేసవిలో సాధారణంగా అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. వేడిగాలుల వలన భూమిలోని తేమ ఆవిరై మొక్కలు వాడిపోతాయి. ఒకవేళ నీరున్నా విద్యుత్ కొరత, లోఓల్టేజీ సమస్యల వలన కూడా నీటిని సక్రమంగా అందించలేకపోవచ్చు. అయితే కొద్దిపాటి మెళకువలు పాటించి వేసవి ఆకు కూరల సాగుతో అధిక లాభాలు పొందవచ్చు. వేసవిలో సాగునీటి సమస్య ఉంటుంది కాబట్టి తేమ నిలుపుకోగల్గిన బరువైన నల్ల భూములు ఆకుకూరల సాగుకు అనుకూలంగా ఉంటాయి. నీటి వసతి ఉంటే ఎర్రనేలలు, ఇసుక నేలలు ఎంపిక చేసుకోవాలి. ఆకుకూర మడులకు తుంపర్ల పద్ధతిలో నీటిని అందిస్తే ఎండ తీవ్రత నుంచి ఆకుకూరలను కాపాడి అధిక దిగుబడులు సాధించవచ్చు. అనువైన రకాలు : వేసవి సాగుకు తోటకూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, గోంగూర, అనువైనవి. తోటకూర : ఆర్.ఎస్.ఎ–1, అర్కాసుగుణ, పూసాకీర్తి, అర్కఅరుణ, ఎరుపు, పాలకూర : ఆల్గ్రీన్, పూసా జ్యోతి, పూసాపాలక్, మెంతికూర : పూసా ఎర్లీబంచింగ్, లాంసెలక్షన్–1, కొత్తిమీర : సాధన ,స్వాతి, గోంగూర : ఆంగ్రో–12, లోకల్, ఎర్ర గోంగూర రకాలను ఎంపిక చేసుకోవచ్చు. విత్తే విధానం : తోటకూర : 900–1000 గ్రాముల విత్తనం 10కిలోల ఇసుకతో కలిపి ఒత్తుగా చల్లాలి. ఎకరాకు 20కిలోల నత్రజని, 20కిలోల భాస్వరం, 20కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేయాలి. కోత, కత్తిరింపు తర్వాత ఎకరాకు 10కిలోల నత్రజని అందించే ఎరువును వేసి నీరుపెట్టాలి. పాలకూర : ఎకరాకు 12–15కిలోల విత్తనం, వరుసకు వరుసకు మధ్యన 12సెం.మీ, మొక్కకు మొక్కకు మధ్య 10సెం.మీ. ఎడంతో విత్తుకోవాలి. ఎకరాకు 10కిలోల నత్రజని, 10కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేయాలి. మెంతికూర : ఇసుక, మురుగు నీటి వసతి ఉన్న ఒండ్రు నేలలు మెంతికూర పండించేందుకు అనుకూలం. 10–12కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాన్ని వెదజల్లవచ్చు లేదా వరుసలలో నాటవచ్చు. విత్తే ముందు విత్తనాన్ని నీటిలో నానబెట్టి వెదజల్లాలి. ఎకరాకు 10కిలోల నత్రజని, 20కిలోల భాస్వరం, 20కిలోల పొటాష్నిచ్చే ఎరువులు వేయాలి. కొత్తిమీర : మురుగు నీటి సౌకర్యం కలిగిన బంకనేలలు అనుకూలం. విత్తే ముందు గింజలను రెండు బద్దలుగా చేయాలి. విత్తనాన్ని వెదజల్లడం లేదా వరుసలలో వేయాలి. ఎకరాకు 5–6కిలోల విత్తనాన్ని 15సెం.మీ. ఎడంతో విత్తుకోవాలి. ఎకరాకు 4కిలోల నత్రజని, 10కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులు వేయాలి. గోంగూర : ఎకరాకు 6–8కిలోల విత్తనాన్ని 60సెం.మీ. ఎడంగా తయారు చేసుకున్న బోదెలో 30సెం.మీ. దూరంలో వరుసలో విత్తుకోవాలి. ఎకరాకు 6కిలోల నత్రజని, 8కిలోల భాస్వరం, 8కిలోల పొటాష్నిచ్చే ఎరువులు వేసుకోవాలి. నీటి యాజమాన్యం : ఆకుకూర విత్తనాలు విత్తిన వెంటనే నీరు పెట్టాలి. మళ్లీ మూడోరోజు నీరు పెట్టి నేల స్వభావాన్ని బట్టి తేలిక నేలలో 5–6 రోజుల వ్యవధిలో, బరువు నేలలో 8–10 రోజులకు ఒకసారి నీటి తడివ్వాలి. తోటకూర విత్తిన తర్వాత నెమ్మదిగా నీటిని పారించాలి. లేకపోతే నీటితో విత్తనం కొట్టుకపోయి మొలకశాతం తగ్గుతుంది. ఆకుకూరల్లో దిగుబడి ముఖ్యంగా వేసవిలో నీటి యాజమాన్యంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతి కోత తర్వాత పైపాటు ఎరువులు చల్లి నీరు పెట్టాలి. ఎరువుల యాజమాన్యం : బాగా దుక్కి చేసిన నేలలో ఆఖరి దుక్కిలో ఎకరాకు 10–15 టన్నుల పశువుల ఎరువు 200 కిలోల వేప పిండి వేసి కలియదున్నాలి. వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు వాటితో పాటు జీవన ఎరువులు వాడితే మంచి ఫలితం ఉంటుంది. సేంద్రియ ఎరువులు వాడకం వలన నేల గుల్లబారి ఎక్కువ రోజులు తేమ నిల్వ ఉంటుంది. రెండు వరుసల మధ్య వరిగడ్డి, వేరుశనగ పొట్టు ఎండుటాకులు పరిస్తే నేలలో తేమ సంరక్షించబడును. ఆకు దిగుబడి పెంచడానికి 2శాతం యూరియా (20 గ్రాములు లీటరు నీటికి) జిబ్బరెల్లిక్ ఆమ్లం 50మి.గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల ఆకుకూరల్లో ఆకు దిగుబడి పెరుగుతుంది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. -
ఆరోగ్య సంరక్షణపై ఎయిమ్స్లో వర్క్షాప్
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో ఆరోగ్య సంరక్షణ నిపుణుల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడానికి గురువారం వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్ను ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా ప్రారంభించి మాట్లాడారు. రోగుల ఆరోగ్య సంరక్షణ, ఆస్పత్రి నిర్వహణలో కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వైద్యుల్లో ఒత్తిడి తగ్గించేలా వర్క్షాప్లో కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీన్ రాహుల్ నారంగ్, వైద్యులు జాన్ అశోక్, బిపిన్ వర్గీస్, ప్రొఫెసర్ రేణుకాదేవి, లత, మాలతీష్, సురేష్మునుస్వామి తదితరులు పాల్గొన్నారు. -
సమాజంలో చైతన్యమే లక్ష్యంగా రావిరాల రచనలు
చిట్యాల: సమాజంలో చైత్యనం కల్గించటమే లక్ష్యంగా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన తొలి తరం కవి రావిరాల బుచ్చయ్య కవిత్వం, రచనలు సాగాయని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. దివంగత రావిరాల బుచ్చయ్య రచించిన చైతన్య బావుటా, విముక్తి పథంలో గ్రంథాలను హైదరాబాద్లోని మౌలాలి రైల్వే ఇనిస్టిట్యూట్లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రావిరాల బుచ్చయ్య కడదాక సైద్ధాంతిక నిబద్ధత కల్గిన కవిగా ఉన్నారన్నారు. తెలంగాణ సాహితీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఆనందాచారి, పర్యావరణవేత్త ఎదుల్ల అంజిరెడ్డి, సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్, ప్రధాన కార్యదర్శి సాగర్ల సత్తయ్య, వట్టిమర్తి గ్రామ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నర్రా లవేందర్రెడ్డి, నర్రా భాస్కర్రెడ్డి, బూరుగు గోపికృష్ణ, రాజారామ్మోహన్రాయ్, డాక్టర్ రాపోలు రామకృష్ణ, రావిరాల బుచ్చయ్య కుటుంబ సభ్యులు రావిరాల సుమతి, సమత, మమత, కిషన్, రమాకాంత్, హారిక పాల్గొన్నారు. -
నాగార్జునసాగర్ డ్యాంను సందర్శించిన సీఈ
నాగార్జునసాగర్: సాగర్ డ్యాం ఎడమ వైపున బుధవారం సాయంత్రం ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని గడ్డి పూర్తిగా తగలబడింది. నష్టాన్ని అంచనా వేసేందుకు గురువారం నల్లగొండ జిల్లా చీఫ్ ఇంజనీర్ అజయ్కుమార్, సాగర్ డ్యాం సర్కిల్ ఈఈ శ్రీధర్రావు, ఈఈ మల్లికార్జున్రావు, ఇంజనీర్లు అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాను నిలిపి వేశామని, లైన్లు కలిపితే ఏ మేరకు నష్టం జరిగిందో తెలుస్తుందన్నారు. సీసీ కెమెరాల కేబుల్స్ కాలిపోయాయని, తిరిగి కేబుల్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతినల్లగొండ: రైలులో నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గురువారం చిట్యాల రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. నల్లగొండ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి. రామకృష్ణ తెలిపిన ప్రకారం.. సుమారు 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి రామన్నపేట వైపు రైలులో వస్తూ చిట్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. నల్ల గొండ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ నవీన్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే 87126 58595 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. దొంగ అరెస్ట్రామగిరి (నల్లగొండ): చోరీలకు పాల్పడుతున్న దొంగను నల్లగొండ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి గురువారం విలేకరులకు వెల్లడించారు. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో చర్లపల్లి సెంటర్లో రూరల్ పోలీసులు గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా.. స్కూటీపై అనుమానస్పదంగా వెళ్తున్న బత్తుల విజయ్చందర్ను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడుతున్న అంగీకరించాడు. అతడి వద్ద నుంచి 5తులాల బంగారు ఆభరణాలు, రూ.20వేల నగదు, స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
ఫ స్కాన్ చెయ్.. కల్లు తాగెయ్..!
ప్రస్తుతం ఏ వస్తువు కొన్నా డిజిటల్ చెల్లింపులు తప్పని పరిస్థితిగా మారింది. డిజిటల్ చెల్లింపులను దృష్టిలో పెట్టుకుని శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన నిమ్మల రాములు అనే కల్లుగీత కార్మికుడు తన కల్లు అడ్డా వద్ద ఫోన్పే స్కానర్ను ఏర్పాటు చేసుకొని కల్లు విక్రయిస్తున్నాడు. కల్లు తాగేందుకు వచ్చేవారిలో ఎక్కువ మంది.. ఫోన్పే, గూగుల్పే ఉందా అని అడుగుతున్నారని, అవేవీ నా వద్ద లేవని చెప్పడంతో కల్లు గిరాకీ దెబ్బతింటుందని, దీంతో స్కానర్ను ఏర్పాటు చేసుకున్నానని రాములు చెప్పాడు. – శాలిగౌరారం -
విద్యుదాఘాతంతో రైతు మృతి
పెద్దవూర: చేపల చెరువు వద్ద విద్యుత్ మోటారు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన పెద్దవూర మండలం నాయినివానికుంటతండాలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాయినివానికుంటతండాకు చెందిన రమావత్ కృష్ణ(36) తన వ్యవసాయ భూమిలో చేపల చెరువు తవ్వించి చేపలు పెంచుతున్నాడు. చేపల చెరువులో నీరు పెట్టడానికి గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లాడు. విద్యుత్ మోటారు ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై చెరువులో పడిపోయాడు. ఎనిమిది గంటలైనా కృష్ణ ఇంటికి రాకపోవడం, ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో అతడి భార్య జ్యోతి చేపల చెరువు వద్దకు వెళ్లి చూడగా.. కృష్ణ తల నీటిలో మునిగి ఉండటంతో తండాలోని కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన్ ద్వారా విషయం చెప్పింది. తండావాసులు చెరువు వద్దకు చేరుకుని కృష్ణను బయటకు తీసి చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్లోని కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే కృష్ణ మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. -
వ్యాపారంలో నష్టం.. ‘రియల్’ వ్యాపారి ఆత్మహత్య
హుజూర్నగర్: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టం రావడంతో మనస్తాపానికి గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి హుజూర్నగర్ పట్టణ కేంద్రంలో జరిగింది. గురువారం స్థానిక ఎస్ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నిమిషకవి సుబ్బారావు(45) బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రించాడు. అర్ధరాత్రి సమయంలో సుబ్బారావు భార్య ఉమామహేశ్వరి నిద్ర లేచి చూసేసరికి భర్త కనిపించలేదు. దీంతో అతడి కోసం చుట్టుపక్కల మొత్తం వెతికింది. అయినా ఆచూకీ లభించకపోవడంతో వారి ఇంటి పైకి వెళ్లి చూడగా స్లాబ్ ఎలివేషన్కి చున్నీతో సుబ్బారావు ఉరేసుకుని కనిపించాడు. రియల్ఎస్టేట్ వ్యాపారంలో నష్టం రావడంతో మనస్తాపం చెందిన తన భర్త సుబ్బారావు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఉమామహేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
కట్టుదిట్టమైన ఏర్పాట్లు పరీక్షలు సజావుగా జరిగేలా, మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. సమస్యలు ఉంటే తేలియజేయడానికి, సందేహాలు నివృత్తి చేసుకోవడానికి కంట్రోల్ రూం నంబర్ 9010772080 అందుబాటులో ఉండనుంది. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు 50, డిపార్టమెంటల్ ఆఫీసర్లు 50, ఇన్విజిలేటర్లు 556, ఫ్లయింగ్ స్క్వాడ్ 3 టీంలను ఏర్పాట్లు చేశారు. డీఈఓ సత్యనారాయణ బుధవారం ఎంఈవోలు, సీఎస్, డీఓలతో జూమ్ మీటింగ్ నిర్వహించి పరీక్షల సందర్భంగా తీసుకోవాల్సి న జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. భువనగిరి : పదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో 8,632 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరితో పాటు 188 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. క్యూ ఆర్ కోడ్తో బుక్లెట్ క్యూఆర్ కోడ్తో ముద్రించిన 24 పేజీలతో సన్నని లైన్లతో కూడిన బుక్లెట్ ఇవ్వనున్నారు. గతంలో వైట్ పేపర్లు ఇవ్వడం వల్ల సమాధానాలు రాయడంలో గందరగోళం నెలకొనేది. కొందరు క్రాస్గా రాసేవారు. దీంతో పాటు అదనపు పేపర్లు తీసుకున్న వారు సీరియల్ ప్రకారం లేకుండా దారం కట్టేవారు.దీని వల్ల పేపర్ మూల్యాంకనం చేసే క్రమంలో ఇబ్బందులు ఎదరై మార్కులు తక్కువగా వచ్చేవి. ఇటువంటి సమస్యలను అధిగమించేందుకు లైన్లతో కూడిన బుక్లెట్ ఇవ్వనున్నారు. అలాగే ప్రశ్న పత్రంపై క్యూ ఆర్కోడ్తో పాటు సీరియల్ నంబర్ ప్రతి పేజీపై ముద్రిస్తారు. ఈసారి ఏడు పరీక్షలు గతంలో పదో తరగతి విద్యార్థులకు 11పేపర్లు ఉండేవి. ఈ సంవత్సరం నుంచి ఏడు పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఫిజికల్స్ సైన్స్, బయోలజీ పేపర్లను వేర్వేరు రోజుల్లో నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలు ఒక్కో పేపర్ గంటన్నర వ్యవధిలో రాయాల్సి ఉంటుంది. ఒక్కోటి 40 మార్కుల చొప్పున 80 మార్కులకు పరీక్ష రాయాలి. మరో 20 మార్కులు ఇంటర్నల్ మార్కుల నుంచి తీసుకుంటారు. ఫ జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాలు ఫ హాజరుకానున్న 8,632 మంది విద్యార్థులు ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఫ క్యూ ఆర్ కోడ్తో ప్రశ్న పత్రాలు గంట ముందే చేరుకోవాలి విద్యార్థులకు నిర్దేశిత సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఐదు నిమిషాలు గ్రేస్ పీరియడ్ అవకాశం కల్పించారు. స్మార్ట్ వాచ్, సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు కేంద్రంలోకి అనుమతి లేదు. ఒత్తిడికి లోనవకుండా విద్యార్థులకు పరీక్ష రాయలి. స్కూల్ యూనిఫాం ధరించి పరీక్షలకు హాజరుకావద్దు. –సత్యనారాయణ, డీఈఓ -
ఆహారభద్రత నియమాలు తప్పనిసరి
భువనగిరిటౌన్ : వ్యాపారులు తప్పనిసరిగా ఆహారభద్రత నియమాలు పాటించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. తూకాలు, నాణ్యత విషయంలో కొనుగోలుదారులను వ్యాపారులు మోసం చేస్తున్న తీరుపై ‘కొనేదాంట్లో–– కొట్టేస్తున్నారు’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపార సముదాయాల్లో ఆహార భద్రతా నియమాలు అమలయ్యే చర్యలు తీసుకోవాలని సూచించారు. హోటళ్లు, బేకరీలు, స్వీట్ హౌజ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లతో పాటు పాఠశాలల్లో విద్యార్థులకు అందజేసే భోజనం విషయంలో నాణ్యత ఉండాలని, అందుకోసం తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. లైసెన్స్ పొందిన పొందిన ఆహార పదార్థాలనే ప్రజలకు విక్రయించేలా చూడాలన్నారు. ఫుడ్ అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధ్యక్షతన అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, డీఎంహెచ్ఓ మనోహర్, జిల్లా అధికారులతో కలిసి జిల్లాస్థాయి ఫుడ్ సేఫ్టీ అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి, డాక్టర్ సుమన్ కళ్యాణ్, బీసీ వెల్ఫేర్ అధికారి యాదయ్య, వ్యవసాయ అధికారి గోపాల్, డిప్యూటీ సివిల్ సప్లై అధికారులు రోజా రాణి తదితరులు పాల్గొన్నారు.ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి -
బిల్లు ఆమోదంపై సంబరాలు
అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. - IIIలో- IIలోనారసింహుడికి నిత్యారాధనలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సంప్రదాయ పూజలు ఆగమ శాస్త్రం ప్రకారం కొనసాగాయి. వేకువజామున ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో శ్రీస్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు అభిషేకం, అర్చన చేశారు. ఇక ప్రధానాలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు, ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం చేసి ఆలయద్వారబంధనం చేశారు. -
ఏడుగురు డిప్యూటీ తహసీల్దార్లకు పోస్టింగ్
భువనగిరి టౌన్ : జిల్లాలో ఏడుగురు డిప్యూటీ తహసీల్దార్లకు పోస్టింగ్ ఇస్తూ కలెక్టర్ హనుమంతరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎండీ సిరాజుద్దీన్ను జిల్లా సరఫరాల శాఖ డీటీగా నియమించి భువనగిరి ఆర్డీఓ కార్యాలయానికి డిప్యూటేషన్పై పంపారు. పున్న శివకుమార్ను కలెక్టరేట్లో, దున్న లింగస్వామిని బొమ్మలరామారం, ఎం.ఉపేందర్ మోత్కూరు, జనగాం శైలజను రామన్నపేట డీటీలుగా బదిలీ చేశారు. అదే విధంగా ఉయ్యాల కవితను ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ (లోకల్బాడీలో) యూనిట్ 2కు, శివగణేష్ను ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్(లోకల్బాడీ) యూనిట్ 1కు కేటాయించారు. పీఓడబ్ల్యూ జిల్లా నూతన కమిటీ ఎన్నిక ఆలేరు రూరల్: ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) జిల్లా నూతన కమిటీని బుధవారం ఆలేరులోని సీపీఐఎంఎల్ ఎన్డీఆర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా పంగ వరలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా కొత్తపేట విజయ, కార్యదర్శిగా కోలా అనిత, సహాయ కార్యదర్శి పంగ సరిత, కోశాధికారిగా వస్పరి స్వరూప, కార్యవర్గ సభ్యులుగా గట్టికొప్పుల అంజమ్మ, మడూరి లక్ష్మి, జన్నె లక్ష్మిని ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర కన్వీనర్ పంగ వరలక్ష్మి, రాష్ట్ర నాయకురాలు జంగిటి సుభాషిణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పి.జయ, ఆర్.బాలమ్మ, పద్మ, కె.జ్యోతి, స్రవంతి, అనూసూర్య, భాగ్య పాల్గొన్నారు. మోత్కూరు తహసీల్దార్పై కలెక్టర్కు ఫిర్యాదు భువనగిరి, మోత్కూర్: తమ భూములను అక్రమంగా ఇతరులకు పట్టా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ మోత్కూరు తహసీల్దార్ రాంప్రసాద్పై పలువురు రైతులు బుధవారం కలెక్టర్ హనుమంతరావుకు ఫిర్యాదు చేశారు. 15 మంది రైతులు మోత్కూరు పట్టణంలో 38 గుంటల భూమి కొనుగోలు చేశారు. పక్కనే ఉన్న మరో వ్యక్తి భూమికి సంబంధించి కూడా అదే సర్వే నంబర్ కావడంతో కొంతకాలంగా వివాదం నెలకొంది. కాగా డబ్బులు ఆశించి 38 గంటలు సదరు వ్యక్తికి పట్టా చేసే ప్రయత్నం చేస్తున్నారని, తహసీల్దార్ తమకు నోటీసులు కూడా జారీ చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. కలెక్టర్ స్పందిస్తూ ప్రక్రియ నిలిపివేయాలంటూ తహసీల్దార్ను ఆదేశించారు. అంతకుముందు బాధితులు తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సుధగాని ముత్యాలు, అవిశెట్టి బాలరాములు, లొడంగి లక్ష్మి, పెండం భారతమ్మ, జోగు రామచంద్రయ్య, దునక ప్రభాకర్, హాజారి చంద్రరావు, ముక్కలమల అంజమ్మ, కాపుగంటి ధనలక్ష్మి, కొండయ్య, అవిలిమల్లు పాల్గొన్నారు. నేడు సూర్యాపేటకు కేటీఆర్ రాక సూర్యాపేట టౌన్: వరంగల్లో ఏప్రిల్ 27న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ బహిరంగ సభ విజయవంతానికై గురువారం సూర్యాపేటలో ఆ పార్టీ జిల్లా ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకోసం సూర్యాపేటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బహిరంగ సభ విజయవంతంతోపాటు జిల్లాలో సాగు, తాగునీటి సమస్యపై చర్చించనున్నట్టు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య నేతలంతా విధిగా హాజరు కావాలని కోరారు. దరఖాస్తుల ఆహ్వానం నల్లగొండ టూటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో చేనేత కార్మికులకు ఇవ్వనున్న అవార్డులకు అర్హత కలిగినవారు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేతజౌళి శాఖ ఏడీ ద్వారక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత డిజైన్ వృత్తిలో పనిచేస్తున్న వారికి అవార్డు ఇస్తారని పేర్కొన్నారు. ఎంపికై న వారికి రూ.10 వేల నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేస్తారని తెలిపారు. -
భూసేకరణలో వేగం పెంచండి
సాక్షి,యాదాద్రి : బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లు, పిలాయిపల్లి కాలువతో పాటు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలసి సర్వే ల్యాండ్ రికార్డ్స్, సర్వేయర్లు, నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి భూ సేకరణపై సమీక్షించారు. భూ సేకరణ జాప్యం కాకుండా చూడాలన్నారు. సర్వే ల్యాండ్ కింద పెండింగ్ ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి జగన్నాథరావు, నీటి పారుదల శాఖ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
నారాయణపురం ఎస్సీ హాస్టల్లో కలెక్టర్ రాత్రి బస
సంస్థాన్ నారాయణపురం : నెలలో ఒక రోజు నిర్వహిస్తున్న హాస్టల్ బస కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ హనుమంతరావు బుధవారం రాత్రి సంస్థాన్నారాయణపురంంలోని ఎస్సీ హాస్టల్లో నిద్రించారు. పదో తరగతి విద్యార్థులతో పరీక్షలకు ఎలా సన్నద్ధం అవుతున్నారని ప్రశ్నించారు. ఒత్తిడి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, నిర్దేశిత సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థికి పదో తరగతి మైలు రాయి అని, ఉత్తీర్ణులైతే విజయానికి తొలి మెట్టు అవుతుందన్నారు. మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులు, గురువులకు, జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. అంతకుముందు విద్యార్థులకు వండిన భోజనాన్ని రుచి చూశారు. అదే విధంగా వంట గది, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని వార్డెన్కు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ ప్రమోద్కుమార్ ఉన్నారు. -
అమోదయోగ్యమైన బడ్జెట్
రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీ పథకాలకు దాదాపు రూ.56వేల కోట్లకు పైగా నిధులు వెచించారు. మూసీ కాలువలకు ప్రాధాన్యం ఇచ్చారు. బునాదిగాని కాలువకు రూ.266 కోట్ల పాలనామోదం కూడా లభించింది. నిరుద్యోగ యువతకు యువ వికాసం పథకం వరంగా మారనుంది. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే మూసీ పునరుజ్జీవానికి రూ.17వేల కోట్లు కేటాయించడం హర్షణీయం. –కుంభం అనిల్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి అంతా అంకెల గారడీ బడ్జెట్ అంకెల గారిడీగా ఉంది. గత ఏడాది వ్యవసాయ రంగానికి రూ 49 వేల కోట్లు కేటా యించగా, ఈసారి రూ.24,439 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. ఇంత తక్కువ బడ్జెట్తో వ్యవసాయ రంగానికి ఏ విధంగా మేలు జరుగుతుంది. 50లక్షల కుటుంబాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా 25 లక్షలకు మించడం లేదు. సబ్సిడీ గ్యాస్ సగం కుటుంబాలకే అందుతుంది. రైతుభరోసా విషయంలో రైతులను మోసం చేశారు. ఆరు గ్యారంటీలు అటకెక్కాయి. –అశోక్గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జిల్లాకు అరకొర నిధులే.. జిల్లాకు అరకొరగా నిధులు కేటాయించారు. బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్లతో పాటు మూసీ ప్రక్షాళనకు సమగ్రమైన నిధుల కేటాయింపు లేదు. మూసీ కాలువలకు నిధులు కేటాయించడం ఊరట కలిగించింది. భువనగిరిలో డిగ్రీ, పేజీ కళాశాలలు, చౌటుప్పల్ ప్రాంతంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు ప్రస్తావనే లేదు. –ఎండీ జహంగీర్, సీపీఎం జిల్లా కార్యదర్శి -
సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత
అంతరిక్ష యాత్రలో ఎంతో ధైర్యం ప్రదర్శించిన సునీత విలియమ్స్ నేటి యువతకు ఆదర్శం. గతేడాది సెప్టెంబర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లిన ఆమె తొమ్మిది నెలల అనంతరం తిరిగి బుధవారం తెల్లవారుజామున భూమి మీదకు వచ్చింది. అంతరిక్ష ప్రయాణాల శాసీ్త్రయ పురోగతి కోసం ఎన్నో పరిశోధనలు చేసిన ఆమె భారతీయ సంతతికి చెందినవారు కావడంతో యావత్ దేశం జేజేలు పలుకుతోంది. ఐఎస్ఎస్కు వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చిన సునీతపై పలువురి ప్రముఖుల అభిప్రాయాలు. – నల్లగొండ టూటౌన్, సూర్యాపేట టౌన్ఫ అంతరిక్షవాసం నుంచి భూమి మీదకు వచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఫ వ్యోమగామిగా ఎన్నో విజయాలు ఆమె సొంతం ఫ తొమ్మిది నెలల తర్వాత క్షేమంగా తిరిగి రావడంతో అంతటా సంబరాలు ఖగోళ పరిశోధకురాలిగా సాధించిన విజయం ఒక భారతీయ అమెరికన్ వ్యోమగామిగా సునీత విలియమ్స్ ఖగోళ పరిశోధకురాలిగా 195 రోజుల 15 గంటల 40 నిమిషాల్లో సాధించిన విజయమిది. తన అంతరిక్ష ప్రయాణం శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్ గణిత రంగాల్లో ఉన్నవారికి ప్రేరణ కలిగిస్తుంది. ఆమె వారసత్వం భవిష్యత్ తరాలకు గొప్ప మార్గదర్శకంగా నిలువనుంది. – సీహెచ్. రమేష్, పీజీ సెక్షన్ కోఆర్డినేటర్, ఎంజీయూ ఆమె విజయాలు ఎందరికో స్ఫూర్తి సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్ర నుంచి క్షేమంగా తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సైన్స్ గురించి తెలుసుకోవాలనే ఆమె పట్టుదల ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చింది. భవిష్యత్లో శాస్త్రవేత్తలు కావాలనుకునే వారికి సునీతా విలియమ్స్ సాధించిన విజయాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. – డాక్టర్ ఎన్. భిక్షమయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎంజీయూ అంతరిక్ష యాత్రలు.. ఆమెకే సొంతం వ్యోమనౌకలో సాంకేతిక లోపంతో తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ ఎట్టకేలకు భూమిని చేరడం అద్భుత ఘట్టం. అంతరిక్ష విజయాలు ఆమెకే సొంతం. తన ఆరోగాన్ని సైతం లెక్క చేయకుండా ఆత్మవిశ్వాసంతో అంతరిక్షంలో పరిశోధనలు చేసి తిరిగి రావడం విజయానికి ప్రతీక. – ఎస్. ఆదిరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎంజీయూ భారతదేశానికే గర్వకారణం సునీత విలియమ్స్ అన్ని అడ్డంకులను అధిగమించి భూమి పైకి తిరిగిరావడం భారతదేశానికి గర్వకారణం. ఆమె అంతరిక్ష విజయాలు భారత సంస్కృతి పట్ల ఆమెకున్న అనుబంధాన్ని తెలియజేస్తాయి. గణేష్ విగ్రహాన్ని సైతం ఆమె అంతరిక్షానికి తీసుకెళ్లడం భారతీయులకు ఆనందాన్ని ఇచ్చింది. – డాక్టర్ కె. సత్తిరెడ్డి, ఫిజిక్స్ డిపార్ట్మెంట్, ఎంజీయూ ఎంతో గర్వంగా ఉంది సునీత విలియన్స్ భారత సంతతికి చెందిన మహిళ కావడం గర్వంగా ఉంది. ఒక మహిళ 286 రోజులు అంతరిక్షంలో గడపడం అసాధారణం. ఆమె మహిళలందరికీ గర్వకారణం. ఆమె త్వరగా కోసుకొని మామూలు స్థితికి రావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆమె భవిష్యత్తులో వ్యోమగామి కావాలనుకునే వారికి ఆదర్శంగా నిలిచారు. – ఎం. శ్రీనివాస్రెడ్డి, ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ భావి భారత శాస్త్రవేత్తలకు ఆదర్శంతొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుని భూమి మీదికి తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ భావిభారత శాస్త్రవేత్తలకు ఎంతో ఆదర్శం. అంతరిక్ష పరిశోధన పైన ఆసక్తి కలిగినటువంటి మహిళలకు ఆమె సాహసం ఎంతో స్పూర్తినిస్తుంది. – అంకతి వెంకన్న, ఫిజిక్స్ టీచర్, ఉన్నత పాఠశాల, సూర్యాపేట ఆమె ప్రయాణం చరిత్రలో నిలిచిపోతుందిసునీత విలియమ్స్ అంతరిక్షం ప్రయాణం చరిత్రలో నిలిచిపోతుంది. సుదీర్ఘ కాలం పాటు అంతరిక్షంలో ఆమె చేసిన పరిశోధనలు మానవ జాతికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. ఆమె భూమి పైకి తిరిగి రావడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన కృషి ప్రశంసనీయం. – సుదర్శన్రెడ్డి, ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలి అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యల కారణంగా తొమ్మిది నెలల పాటు స్పేస్లో ఉండిపోయినా చెదరని ఆత్మ విశ్వాసంతో సునీత విలియమ్స్ తిరిగి భూమి మీదకు రావడం గొప్ప విజయాన్నే భావించాలి. అంతరిక్ష పరిశోధకురాలిగా సునీత విలియమ్స్ సాధించిన విజయాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలి. – వీరస్వామి, ప్రొఫెసర్, ఎంజీయూ సునిత విలియమ్స్ తిరుగులేని మహిళ అంతరిక్ష వాసం నుంచి సునీత విలియమ్స్ తిరిగి రావడం గొప్ప విజయం. రష్యా వ్యోమగామి పాలికోవ్ 437 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో అంతరిక్షంలో తిరగగా, సునీత మాత్రం ఒకేచోట తొమ్మిది నెలలు ఉండి పరిశోధనలు చేసి తిరుగులేని మహిళా వ్యోమగామిగా ఖ్యాతిగడించింది. యువత సునీత విలియమ్స్ స్ఫూర్తితో ముందడుగు వేయాలి. – ఖాజా అల్తాఫ్ హుస్సేన్, వైస్ చాన్స్లర్, ఎంజీయూ -
నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం
నూతనకల్: నూతనకల్ మండలం మిర్యాల గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మెంచు చక్రయ్యగౌడ్ హత్యకు కారకులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీ జోన్–2 ఐజీ సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన మిర్యాల గ్రామాన్ని సందర్శించి మృతుడి భార్య జయమ్మ, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. చక్రయ్యగౌడ్ హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకున్న వారిపై దర్యాప్తు చేసి శిక్ష పడేలా చూస్తామన్నారు. అదే గ్రామానికి చెందిన కనకటి వెంకన్న భూమి క్రయవిక్రయాల సమయంలో కల్గించే ఇబ్బందులను కూడా బాధితులు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. కనకటి వెంకన్న అగాయిత్యాలకు సహకరించే ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామన్నారు. దర్యాప్తులో పోలీసులు అలసత్వం వహిస్తే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ విషయమై కొంత మంది పోలీసు అధికారులకు మెమోలు జారీ చేశామని తెలియజేశారు. గ్రామస్తులు శాంతియుతంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని కోరారు. చక్రయ్యగౌడ్ హత్యలో ప్రధానంగా అల్లుళ్లు కనకటి వెంకన్న, కనకటి ఉప్పలయ్య, కనకటి లింగయ్య ఉన్నారని, వీరికి సహకరించిన మరో 16మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 9మందిని అదుపులోకి తీసుకున్నామని, మిగతా నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆయన వెంట సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ, ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ రవి, సీఐ శ్రీనివాస్నాయక్, నాగభూషణం, రఘువీర్, ఎస్ఐ మహేంద్రనాథ్ ఉన్నారు. ఫ మల్టీ జోన్–2 ఐజీ సత్యనారాయణ ఫ హత్యకు గురైన చక్రయ్యగౌడ్ కుటుంబ సభ్యుల నుంచి వివరాల సేకరణ -
శాసీ్త్రయ పద్ధతుల్లో పశుగ్రాసం సాగు భేష్
పాల దిగుబడి ఎక్కువేపశుగ్రాసాల సాగుకు తక్కువ శ్రమ, పెట్టుబడి అవసరం అవుతుంది. విత్తనాలు నాటిన కొద్ది రోజుల్లోనే పశుగ్రాసం కోతకు వస్తుంది. పచ్చి మేత రుచికరంగా ఉండటం వలన పశువులు ఇష్టంగా తింటాయి. సులభంగా జీర్ణం చేసుకుంటాయి. పచ్చి మేత వలన పాల దిగుబడులు 25శాతం వరకు పెరుగుతుంది. పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. దాణా అవసరం లేకుండా కేవలం పచ్చి మేత ద్వారా 5 నుంచి 6 లీటర్ల పాల దిగుబడి సాధించవచ్చు. పచ్చి మేతలో కాల్షియం, భాస్వరం వంటి మాంసకృత్తులతో పాటు ఏ, డీ, ఈ విటమిన్లు, పిండి, కొవ్వు పదార్ధాలు అధికంగా ఉంటాయి. నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చు. పెద్దవూర: పశుగ్రాసం అంటే రైతులకు గుర్తుకొచ్చేది జొన్న, వరి, సజ్జ తదితర తృణధాన్యాలు. వీటిలో పశువులకు కావాల్సిన పోషకాలు లభించవు. పైగా వీటికి ఖర్చు అధికం. శాసీ్త్రయ పద్ధతిలో నాణ్యమైన పశుగ్రాసం అందిస్తే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. అధిక పాల ఉత్పత్తి సాధించవచ్చు. పశుగ్రాసం సాగు ఖర్చు తగ్గించవచ్చు. డెయిరీ ఫాంల నిర్వహణ వ్యయంలో 70శాతం వరకు పశువుల మేతకే సరిపోతుంది. అందువల్ల మేత ఖర్చును తగ్గిస్తే అంతమేరకు లాభాలు పెంచుకునే అవకాశం ఉంది. అలాగే పాలశీతలీకరణ అధికారులు పాలు సప్లయ్ చేసే రైతులకు 50 శాతం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు అందిస్తారు. పశుసంవర్థక అధికారులు సైతం 50శాతం రాయితీపై విత్తనాలు ఇవ్వనున్నారు. పశువుల కాపరులు వీటిని సద్వినియోగం చేసుకుని పశుగ్రాసం సాగు చేస్తే గడ్డి కొరత తీరుతుందని పెద్దవూర మండల పశువైద్యాధికారి డాక్టర్ నులక నాగార్జున్రెడ్డి సూచించారు. పశుగ్రాసం సాగు విధానం ● పశుగ్రాసం విత్తనాల్లో ప్రధానమైనవి సూపర్ నైపర్, కో–1, కో–2, ఎస్ఎస్జీ–825 రకాలు. ● 85శాతం వరకు పచ్చిమేతను ఈ రకాల ద్వారా తీర్చుకోవచ్చు. ● ఒకసారి నాటితే నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు దిగుబడులు పొందవచ్చు. ● జనవరి నుంచి ఆగస్టు నెల వరకు ఈ పశుగ్రాసం విత్తనాలు విత్తుకోవచ్చు. ● అన్నిరకాల నేలల్లో సాగు చేసుకోవచ్చును. ఆమ్ల గుణాలు గల నేలల్లో అధిక దిగుబడి ఉంటుంది. ● పశుగ్రాసాల సాగుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించలేని వారు తోటలు, కూరగాయ పంటల్లో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ● ఎకరాకు 16 నుంచి 20 కిలోల విత్తనం అవసరం. మిశ్రమ పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. ● దుక్కిలో 4 నుంచి 5 టన్నుల కంపోస్టు ఎరువు, 22 కిలోల యూరియా, 16 నుంచి 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. ● విత్తిన 45 రోజుల తర్వాత ఎకరాకు 22 కిలోల యూరియా వేయాలి. ఎకరానికి 20 టన్నుల దిగుబడి వస్తుంది. ● అధిక విస్తీర్ణంలో సాగుచేసి సైలే జీ లేదా ఎండుగడ్డి రూపంలో నిల్వ చేసి వాడుకోవచ్చు. -
వేసవిలో వణ్యప్రాణుల రక్షణకు చర్యలు
సాసర్ పిట్లలో నీటిని నింపుతున్నాం వేసవిలోఅడవి జంతువుల సంరక్షణకు గాను సాసర్ పిట్లలో నీటిని నింపుతున్నాం. అంతేకాకుండా వేసవిలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా అన్నిచర్యలు తీసుకుంటున్నాం. అటవీ శివారు గ్రామాల్లో బేస్ క్యాంప్ హెల్పర్లు 24గంటలు కాపలాగా ఉంటారు. స్వచ్ఛంద సంస్థలు సైతం అడవుల సంరక్షణ బాధ్యతను తీసుకోవాలి. – రాఘవేందర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, నాగార్జునసాగర్నాగార్జునసాగర్: వేసవిలో తాగునీటికై వణ్యప్రాణులు మైదాన ప్రాంతాలకు వస్తున్న నేపథ్యంలో వాటి రక్షణకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని నాగార్జునసాగర్ డివిజన్ అటవీ అధికారులు పలు చర్యలు చేపట్టారు. గత ఆరునెలలుగా వర్షాలు లేక అటవీ ప్రాంతంలోని వాగులు, వంకలు, నీటి జాలు గుంతలన్నీ వట్టిపోయాయి. దీంతో అడవి జంతువులకు తాగునీరు దొరకడం కష్టంగా మారింది. వాటి దాహాన్ని తీర్చేందుకు అటవీ ప్రాంతంలో గతంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన సాసర్ పిట్లలో(నీటి తొట్లు) అటవీ శాఖ అధికారులు నీటిని నింపుతున్నారు. నెల్లికల్లు ఫారెస్ట్లోనే 25 సాసర్ పిట్లు ఏర్పాటు చేశారు. ఆ తొట్లలో వాతావరణాన్ని బట్టి 15రోజులకోమారు ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. ఆ నీటితోనే జంతువులు, పక్షులు దాహార్తిని తీర్చుకుంటున్నాయి. నీటి తోట్ల పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కూడా అమర్చారు. నీరు తాగేందుకు వచ్చే పక్షులు, జంతువుల చిత్రాలు కెమెరాల్లో నమోదవుతున్నాయి. ఆ కెమెరాల నుంచి ఫొటోలను డంప్ చేసుకుని వాటి బాగోగులను, ఆరోగ్య పరిస్థితులను అంచనా వేస్తున్నారు. జంతు గణనకు కూడా ఇది తోడ్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా అడవిలో మనుబోతులు, ఎలుగుబంట్లు, నెమళ్లు, నక్కలు, కుక్కలు, దుప్పులు తదితర జంతువులు అత్యధిక సంఖ్యలో ఉండగా.. అవి వేటగాళ్ల ఉచ్చులు, వలలకు చిక్కకుండా వాచర్లు కాపాడుతున్నారు. ఫ నాగార్జునసాగర్ అటవీ ప్రాంతంలో సాసర్ పిట్లలో నీటిని నింపుతున్న ఫారెస్ట్ అధికారులు ఫ సీసీ కెమెరాలతో జంతువులు, పక్షుల కదలికలు నమోదు -
విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి
గరిడేపల్లి: పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన వ్యవసాయ కూలీ విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పొనుగోడు గ్రామానికి చెందిన నేలపట్ల సైదులు(32) బుధవారం తాను జీతం ఉంటున్న కటకం గోపయ్య పొలం వద్ద వరి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. అక్కడ తెగి పడి ఉన్న ఎల్టీ లైన్ చూసుకోకపోవడంతో వైరు కాళ్లకు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అన్న గురుమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చలిగంటి నరేష్ తెలిపారు. గోడ దూకుతుండగా.. మిర్యాలగూడ టౌన్: చెట్టు కొమ్మ పట్టుకొని గోడ దూకుతుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ శివారు జంకుతండా సమీపంలోని ఇండస్ట్రీయల్ ఏరియాకు చెందిన చింతపల్లి పవన్కళ్యాణ్(19) బుధవారం తన మిత్రుడు పూజ దుర్గాతో కలిసి ఇండస్ట్రీల్ ఏరియాలోని ఆర్ఎస్ గోదాంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వారిద్దరు చెట్టు కొమ్మ పట్టుకొని గోడ దూకే ప్రయత్నం చేశారు. దీంతో పక్కనే ఉన్న 33 కేవీ విద్యుత్ లైన్కు చెట్టు తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో పవన్కళ్యాణ్ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన దుర్గా పరిస్థితి విషమంగా ఉండటంతో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. -
బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్పై దాడి
చిట్యాల: చెప్పిన చోట బస్సు ఆపలేదని ప్రయాణికుడు ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి చేశాడు. ఈ ఘటన చిట్యాలలో బుధవారం రాత్రి జరిగింది. నల్లగొండ ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్డినరీ బస్సు భువనగిరి నుంచి నల్లగొండకు వెళ్తోంది. ఇద్దరు ప్రయాణికులు చిట్యాలకు వెళ్లేందుకు గాను రామన్నపేటలో బస్సు ఎక్కారు. వారు రామన్నపేట–చిట్యాల మధ్యలో బస్సు నిలపాలని డ్రైవర్ను కోరారు. చిట్యాలకు వెళ్లేందుకు ఎక్కిన ప్రయాణికులు మధ్యలో బస్సు ఆపమనడంతో డ్రైవర్ శ్రీనివాస్ బస్సు ఆపలేదు. దీంతో బస్సు చిట్యాలకు వచ్చిన తర్వాత ఆ ఇద్దరు ప్రయాణికులు డ్రైవర్పై దాడి చేశారు. డ్రైవర్ శ్రీనివాస్ చిట్యాల పోలీస్ స్టేషన్ వద్ద బస్సు నిలిపి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం నిలిపివేసిన బస్సులోని ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపివేశారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యమిర్యాలగూడ అర్బన్: కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో జరిగింది. బుధవారం మిర్యాలగూడ టూటౌన్ సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో నివాసముంటున్న ముడావత్ నాగు(35)కు, అతడి భార్య ప్రియ మధ్య మనస్పర్ధలు రావడంతో కొద్దిరోజులుగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి 9:30 గంటల సమయంలో ప్రియ తన కుమార్తెను ట్యూషన్ నుంచి తీసుకురావడానికి వెళ్లగా.. ఇంట్లోనే ఉన్న నాగు లోపలి నుంచి గడియ పెట్టుకుని చీరతో ఉరేసుకున్నాడు. ట్యూషన్ నుంచి కుమార్తెను తీసుకుని ఇంటికి వచ్చిన ప్రియ నాగు ఉరికి వేలాడుతుండటం గమనించి ఇంటి పక్కన వారిని పిలిచి తలుపులు పగులకొట్టి అంబులెన్స్లో మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే నాగు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న నాగు తల్లిదండ్రులు ఆస్పత్రికి వచ్చి తమ కుమారుడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కోడలు ప్రియ, ఆమె అక్క విజయ, బావ సైదాపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తండ్రి పంతులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగార్జున తెలిపారు. జామాయిల్ తోట దగ్ధంరాజాపేట: మండలంలోని బొందుగుల గ్రామంలో బుధవారం రైతు బొందుగుల వెంకట్రెడ్డికి చెందిన జామాయిల్ తోట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. చుట్టుపక్కల రైతులు గమనించి అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. 40 ఎకరాల జామాయిల్ తోటలో సుమారు 30 ఎకరాలు దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. మట్టపల్లిలో నిత్య కల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని బుధవారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఎదుర్కోళ్ల మహోత్సవం అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ తలంబ్రాలు వైభవంగా జరిపించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరీశుడి సేవలో మిస్ వరల్డ్
యాదగిరిగుట్ట/ సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని 2024 మిస్ వరల్డ్ (ప్రపంచ సుందరి) క్రిస్టినా పిష్కోవా మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఈవో భాస్కర్రావు ఆమెకు స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూ ప్రతిష్టాలంకార మూర్తులను పిష్కోవా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలో ఉత్సవమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన, అస్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. శ్రీస్వామిని దర్శించుకున్న పిష్కోవాకు ఈవో భాస్కర్రావు లడ్డూ ప్రసాదంతో పాటు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అంతకు ముందు ప్రధానాలయానికి ఈశాన్య దిశలో ఉన్న అఖండ జ్యోతి వద్ద, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆమె పూజలు చేశారు. ఆలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని తెలిపారు. కాగా ప్రపంచ సుందరి క్రిస్టినా పిష్కోవా సంప్రదాయ రీతిలో చీరకట్టులో రావడం అందరినీ ఆకర్షించింది. యాదగిరిగుట్టకు ప్రపంచస్థాయిలో ప్రాచుర్యం త్వరలో హైదరాబాద్లో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీల ప్రమోషన్ కార్యక్రమం ప్రారంభమైంది. మంగళవారం యాదాద్రిని క్రిస్టినా పిష్కోవా సందర్శించారు. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ప్రపంచంలో ఆమె సందర్శించిన ప్రాంతాలను డాక్యుమెంటరీ చేస్తున్నారు. తద్వారా ఈ దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం దక్కుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆమె సందర్శించిన ప్రాంతాల డాక్యుమెంటరీని మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ప్రదర్శిస్తారు. నూతన టూరిజం పాలసీలో భాగంగా గుర్తించిన ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఈ జాబితాలో యాదగిరిగుట్ట, భువనగిరి కోట, బస్వాపూర్ రిజర్వాయర్, కొలనుపాక దేవాలయం, మహాదేవపురం ఉన్నాయి. -
రోడ్డు ప్రమాదంలో వలస కూలీ దుర్మరణం
మిర్యాలగూడ టౌన్: ఆటోను లారీ ఢీకొనడంతో వలస కూలీ మృతిచెందాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్ సమీపంలో మంగళవారం జరిగింది. రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన కృష్ణకుమార్(22) మిర్యాలగూడకు వలస వచ్చి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. మంగళవారం అతడు మిర్యాలగూడ నుంచి అడవిదేవులపల్లి వైపు ఆటోలో వెళ్తున్నాడు. మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్ సమీపంలో గల సాంబశివ రైస్ మిల్లు వద్ద జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణకుమార్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటో డ్రైవర్ అంజనేయులు, అతడి భార్య మాధవి, కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునిమృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
తండ్రి, కొడుకు జీవచ్ఛవంలా..!
మోత్కూరు: వేర్వేరు ప్రమాదాల్లో గాయపడి తండ్రి, కుమారుడు మంచానికే పరిమితమయ్యారు. చిన్న కుమారుడు కుటుంబ పోషణ కోసం పెయింటర్గా పనిచేస్తున్నాడు. భర్త, కుమారుడి పరిస్థితి చూడలేక, పూట గడవక ఆ ఇల్లాలు పడుతున్న వేదన వర్ణనాతీతం. కుటుంబ భారం మోయలేక, నెలవారీ వైద్య ఖర్చులు భరించలేక కన్నీరుమున్నీరవుతోంది. మోత్కూ రు మున్సిపల్ కేంద్రంలోని గాంధీనగర్కు చెందిన వేముల పరశురాములుది నిరుపేద దళిత కుటుంబం. అతడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు అనిల్, సునీల్, కుమార్తె, వద్ధాప్యంలో ఉన్న తల్లి రామనర్సమ్మ ఉన్నారు. పరశురాములు మోత్కూరు పట్టణంలోని ఓ రైస్ మిల్లులో 25 ఏళ్లుగా హమాలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. భార్య లక్ష్మి కూలీ పనులకు వెళ్తోంది. భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తే వచ్చిన కొద్దిపాటి డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ కుమారులను చదివిస్తూ పెద్ద చేశారు. పెద్ద కుమారుడు వేముల అనిల్ ఇంటర్మీడియట్ వరకు చదివి సెంట్రింగ్ వర్కర్గా పనిచేస్తున్నాడు. సెంట్రింగ్ పనిలో భాగంగా సుమారు ఆరేళ్ల క్రితం అనిల్ మోత్కూరు పట్టణంలో ఓ బిల్డింగ్కు సెంట్రింగ్ డబ్బాలు ఇప్పుతుండగా ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి కిందపడటంతో వెన్నుముక విరిగిపోయింది. కాళ్లు, చేతులు, నడుము సక్రమంగా పనిచేయలేకపోవడంతో పాటు కనీసం కూర్చోరాకపోవడంతో తల్లిదండ్రులు వైద్యం కోసం హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి వెన్నపూస విరిగిపోయిందని చెప్పారు. అప్పటికే రూ.1.80 లక్షలు వైద్యానికి ఖర్చు చేశారు. 15 రోజులకు ఒకసారి, నెలకు నాలుగేళ్ల పాటు వెన్నముక నరాలకు సంబంధించిన ఇంజెక్షన్లు ఇప్పించాలని డాక్టర్లు చెప్పారు. ఒక్క ఇంజక్షన్ ఖరీదు సుమారు రూ.25వేలు ఉంటుందని, మందులకు రూ.10వేలు ఖర్చవుతుందని అన్నారు. అంత డబ్బు వెచ్చించలేక కుమారుడిని ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అనిల్ ఇంటి వద్ద మంచానికే పరిమితమయ్యారు. తల్లే దగ్గరుండి అన్ని సపర్యలు చేస్తుంది. పెద్ద కుమారుడు మంచానికే పరిమితం కావడంతో ఖర్చులు పెరగడంతో పరశురాములు హైదరాబాద్లోని ఉప్పల్ ప్రాంతానికి వెళ్లి అడ్డా కూలీగా పనిచేయడం ప్రారంభించాడు. కొద్దిరోజుల తర్వాత పరశురాములు ఓ రోజు పని ముగించుకొని రాత్రి వేళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పరశురాములును సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మెడ నరాలు దెబ్బతిన్నాయని చెప్పారు. దీంతో మెడ నరాలకు ఆపరేషన్ చేయించారు. అయినప్పటికీ బలమైన గాయాలు కావడంతో స్పర్శ రాకపోవచ్చని, కోలుకోవడం కష్టమేనని వైద్యులు తేల్చారు. పరశురాములు కూడా శరీరం స్పర్శ కోల్పోయి మంచానికే పరిమితమయ్యారు. కళ్లెదుటే భర్త, కుమారుడు మంచానికే పరిమితమై జీవచ్ఛవంలా మారడంతో లక్ష్మి రోజువారి కూలీ పనులు మాని వారికి సపర్యలు చేస్తుంది. వద్ధాప్యంలో ఉన్న తన అత్తకు కూడా సేవలు చేస్తోంది. ఎలాగోలా 4 సంవత్సరాల క్రితం అతికష్టం మీద కుమార్తెకు వివాహం చేసి అత్తారింటికి పంపారు.మా కుటుంబాన్ని ఆదుకోండి నా పెద్ద కుమారుడు, భర్త మంచానికే పరిమితమయ్యారు. కదలలేరు, మెదలలేరు. సంపాదించిందే కాకుండా అప్పులు తెచ్చి వైద్యానికి సుమారు రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేశాం. ఉండే ఇల్లు తప్ప అమ్ముకోవడానికి గుంట భూమి లేదు. దాతలు ఎవరైనా మా కుటుంబాన్ని ఆదుకోండయ్యా. – వేముల లక్ష్మి మంచానికే పరిమితం సెంట్రింగ్ పనికి వెళ్లి బిల్డింగ్ పైనుంచి జారిపడ్డ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మెడ నరాలు తెగి చచ్చుబడిన తండ్రి శరీరం కుటుంబ పోషణ కోసం పెయింటర్గా పనిచేస్తున్న చిన్న కుమారుడు దాతల సాయం కోసం ఎదురుచూపుచిన్న కుమారుడిపై కుటుంబ భారం పరశురాములు, లక్ష్మి దంపతుల చిన్న కుమారుడు సునీల్ డిగ్రీ వరకు చదివాడు. కుటుంబ పరిస్థితి దుర్భరంగా మారడంతో పెయింటర్గా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. ప్రతిరోజు కుటుంబం గడవడానికి అతడి సంపాదన సరిపోక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తండ్రి, అన్న మందుల ఖర్చుల కోసం నెలకు సుమారు రూ.25 వేలకు పైగా వెచ్చిస్తున్నాడు. డబ్బుల భారం పెరిగిపోవడంతో ఇటీవల మందులను కొనుగోలు చేయడం ఆపేశారు. ప్రస్తుతం ఆ కుటుంబం దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడుతూ.. దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. -
క్రిమిసంహారక మందు పిచికారీ చేసిన రైతుకు అస్వస్థత
● ఆస్పత్రికి తరలిస్తుండగా మృతినాగారం: వరి పొలానికి క్రిమిసంహారక మందు పిచికారీ చేసి అస్వస్థతకు గురై యువ రైతు మృతిచెందాడు. ఈ ఘటన నాగారం మండలం ఈటూరు గ్రామంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈటూరు గ్రామానికి చెందిన కొమ్ము మహేశ్(31) మూడు రోజుల క్రితం తన వరి పొలానికి దోమ కాటు మందు పిచికారీ చేశాడు. ఈ క్రమంలో మందు అతడి శరీరంపై పడడంతో అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం అతడిని సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సోమవారం రాత్రి హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
పోచంపల్లిని సందర్శించిన ఛత్తీస్గఢ్ విద్యార్థులు
భూదాన్పోచంపల్లి: ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో గల అమిటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు అభ్యసిస్తున్న 15మంది విద్యార్థులు మంగళవారం భూదాన్పోచంపల్లిని సందర్శించారు. మాస్టర్ వీవర్ అంకం మురళి, కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్ను సందర్శించి అక్కడ దారం నుంచి వస్త్రం తయారయ్యే ప్రక్రియలన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించారు. నూలు ఎక్కడ నుంచి దిగుమతి చేసుకుంటారని, ఏ రకమైన రంగులు, రసాయనాలను వినియోగిస్తారని, టై అండ్ డై విధానం, సాంప్రదాయ డిజైన్లు, మగ్గాలపై నేస్తున్న ఇక్కత్ వస్త్రాలు, మార్కెటింగ్, చేనేత కళాకారులకు లభిస్తున్న ఉపాధి తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్లో కోకూన్ నుంచి దారం తీసే విధానం, ట్విస్టింగ్ యూనిట్, మగ్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దీక్షిక మాట్లాడుతూ.. తమ యూనివర్సిటీలోని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు సిలబస్లో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల ప్రాముఖ్యత గురించి ఉందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రాక్టికల్ ఎక్స్ప్లోరల్ విజిట్లో భాగంగా ఇక్కడికి వచ్చామని తెలిపారు. ఇక్కడ సంప్రదాయ వస్త్రాలు, ఇక్కత్ డిజైన్లు చూసి విద్యార్థులంతా మురిసిపోయారని అన్నారు. పోచంపల్లి పర్యటనతో మంచి ప్రాక్టికల్ అనుభవం లభించిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీరి వెంట గైడ్ పాంటా, రచ్చ సురేశ్ తదితరులు ఉన్నారు. -
రైలు కింద పడి ఆత్మహత్య
నల్లగొండ, తిప్పర్తి: ఆర్థిక ఇబ్బందులో మనస్థాపానికి గురైన వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తిప్పర్తి మండలం రాయినిగూడెం సమీ పంలో సోమవారం రాత్రి జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండలం చిన్నమాదారం గ్రామానికి చెందిన వట్టికోట ఎల్లేష్(37) నల్ల గొండ పట్టణంలోని ఓ రెస్టారెంట్లో సప్లయర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య శ్రీలత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఎల్లేష్ మనస్థాపానికి గురై సోమవారం రాత్రి తిప్పర్తి మండలం రాయినిగూడెం గ్రామ సమీపంలో రైలు పట్టాలపై సికింద్రాబాద్ వైపు వెళ్తున్న వందేభారత్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం నల్లగొండ రైల్వే స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. కుటుంబ సమస్యలతో బంగారం వ్యాపారి.. నకిరేకల్: కుటుంబ సమస్యలతో బంగారం వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణానికి చెందిన షేక్ అబ్బాస్ తన కూమారుడు శంషుద్దీన్(39)తో కలిసి స్థానిక మసీదు సమీపంలో బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్లారు. ఇంట్లో కుటుంబ సమస్యలతో శంషుద్దీన్ గొడవపడి తిరిగి షాపు వద్దకు వచ్చాడు. రాత్రి 12.30 గంటల సమయంలో శంషుద్దీన్ షాపులో బంగారం పాలిష్ చేసే లిక్విడ్ తాగాడు. కూమారుడు ఇంటికి రాలేదని తండ్రి అబ్బాస్ షాపు వద్దకు వచ్చి చూసేసరికి శంషుద్దీన్ అపస్మాకర స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అతడిని నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. మంగళవారం మృతుడి తండ్రి అబ్బాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లచ్చిరెడ్డి తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి మునుగోడు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మునుగోడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందిన బోయపల్లి రామచంద్రం(58) సోమవారం సాయంత్రం స్వగ్రామం నుంచి బైక్పై మునుగోడుకు వచ్చి తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలో మునుగోడు మండల కేంద్రం శివారులోని మంగళ్లదొడ్లగూడెం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరబాద్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
జాతీయ స్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపిక
చిట్యాల: చిట్యాల పట్టణంలోని గ్రీన్ గ్రోవ్ స్కూల్కు చెందిన ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీల్లో పందిరి సహస్ర లక్ష్మి, మహ్మద్ ముబాసిర్ అలీ, స్టాండ్ బై విభాగంలో పోకల ప్రీతిజెస్సి ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 28, 29, 30వ తేదీల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాయ్ జిల్లాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఎంపికై న విద్యార్థులను మంగళవారం పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్రెడ్డి, ఏఓ పోలా గోవర్ధన్, పీఈటీ గంగాపురం రాము అభినందించారు. -
సీపీఎస్ విధానం రద్దుకు కృషిచేస్తా
సూర్యాపేట: ఉపాధ్యాయ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సీపీఎస్ రద్దు చేసేందుకు కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట మండలం పిల్లలమర్రి శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేశారని, పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు, పీఆర్సీ అమలుచేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని కృషిచేస్తానన్నారు. ఈ ఎండాకాలం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. తన గెలుపు కోసం కృషిచేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్రెడ్డి మాట్లాడుతూ.. పీఆర్టీయూ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తంగేళ్ల జితేందర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల నరేష్, మాజీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొలికొండ కోటయ్య, పప్పుల వీరబాబు, రాష్ట్ర నాయకులు కందుకూరి శివశంకర్, గుగులోతు తావూరియా, కట్కూరు మధుసూదన్ రెడ్డి, గోదాసు దయాకర్, మేకల రాజశేఖర్, అల్లాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పింగిలి శ్రీపాల్రెడ్డి -
వేసవిలో నాటుకోళ్ల పెంపకంలో జాగ్రత్తలు
చికిత్స, నివారణ చర్యలు ఇలా.. ఈ వ్యాధి సోకితే కిలో బరువుగల కోడికి బ్యూటినోరెట్ 150 మిల్లీ గ్రాములు, డైక్లోరోఫెన్ 200 గ్రాములు దాణాలో ఇవ్వాలి. మెబెండజోల్ పౌడర్ వంద కోళ్లకు 10 మి.గ్రా. చొప్పున దాణాలో ఇవ్వాలి. ఫెన్బెండజోల్ మరియు ఫ్రాజీక్వాంటాల్ వంటి ఇతర మందులను కూడా వాడవచ్చు. అలాగే కోళ్లు పెంచే ప్రాంతాలలో కీటకాలు వ్యాప్తి చెందకుండా డెల్టామెత్రిన్ అనే మందు ద్రావణాన్ని నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేకపోతే ఫినాల్, సైథియాన్ వంటి క్రిమిసంహారక మందులను నీటిలో కలిపి కోళ్ల షెడ్డు లోపల చుట్టుపక్కల పిచికారీ చేయాలి.పెద్దవూర: గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి ఇంట్లో నాటుకోళ్లను పెంచుతారు. అంతేకాకుండా ఇటీవలి కాలంలో చాలామంది బాయిలర్ కోళ్ల కంటే నాటుకోళ్లను తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో చాలామంది నాటుకోళ్లను కూడా ఫాంలలో పెంచుతున్నారు. అయితే ఏటేటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈసారి ఏప్రిల్, మే నెలలలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వేసవిలో కోళ్లకు బద్దె పురుగు వ్యాధి ప్రభలే అవకాశం ఉందని, ఈ వ్యాధి సోకకుండా కోళ్లఫారం యజమానులు, పెరటి కోళ్ల పెయజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దవూర మండల పశువైద్యాధికారి పిట్టల చంద్రబాబు సూచిస్తున్నారు. ● బద్దె పురుగు నేపథ్యం..బద్దె పురుగు వంటి అంతర పరాన్న జీవులు కోళ్ల పేగుల్లో నివసిస్తూ వాటి పోషక పదార్థాలను సుష్టిగా హరించి వేస్తూ, జీవాల్లో ఉత్పాదక శక్తిని తగ్గిస్తాయి. చివరకు వాటిని బలహీనపరిచి పెరుగుదల లేకుండా చేస్తాయి. బద్దె పురుగు తెల్లగా సన్నటి రిబ్బన్ లాంటి శరీర సౌష్టవం కల్గి ఉంటాయి. ● వ్యాధి సంక్రమించు విధానం..కొన్ని రకాల చీమలు, ఈగలు, మిడతలు, పేడ పురుగు, నేలపై తిరిగే నత్తలు కోడి పెంటలోని బద్దె పురుగుల గుడ్లను తినడంతో వాటి లార్వా ఈ కీటకాల్లో పెరుగుతుంది. కోళ్లు ఈ కీటకాలను తిన్నప్పుడు లార్వా పేగుల్లో పెరిగి బద్దె పురుగులా మారుతుంది. చిన్న వయస్సు కోళ్లకు ఎక్కువగా ఈ బద్దె పురుగు వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి సోకిన కోళ్ల కాళ్లలో నిస్సత్తువ, పెరుగుదల లేకపోవడం, ఎక్కువ నీరు తాగడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అతి చిన్న బద్దె పురుగులు పేగు గోడలలోనికి చొచ్చుకొని పోవడంతో రక్తస్రావం కలిగి కోళ్లు చనిపోతుంటాయి. మరికొన్ని పేగులపై చిన్న చిన్న గడ్డలు ఏర్పరుస్తాయి. బద్దె పురుగులు ఎక్కువ సంఖ్యలో ఉండి పేగులలో ఆహార కదలికకు అడ్డుపడడమేకాక, వాటి ఒత్తిడితో పేగులు బద్దలై కోళ్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ పురుగుల వలన రోగనిరోధక శక్తి తగ్గి ఇతర వ్యాధుల టీకాలు వేసినా సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ● రోగ నిర్ధారణ ఇలా..కోళ్ల గుంపులో ఎదుగుదల లేకున్నా, గుడ్ల ఉత్పత్తి తగ్గినా బద్దె పురుగు వ్యాధి ఉందని గ్రహించాలి. కోడి పెంటలో బద్దె పురుగుల శరీర ఖండాలు బియ్యపు గింజల్లాగా కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణకు ఒక కోడిని కోసి అందులోని ప్రేగులను చూస్తే బద్దె పురుగులు కనిపిస్తాయి. పెద్దవూర మండల పశువైద్యాధికారి చంద్రబాబు సూచనలు -
పాలకుల చేతగానితనంతోనే ఈ దుస్థితి
పెన్పహాడ్: రాష్ట్రంలో పాలకుల చేతగానితనంతోనే పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. పొలాలు ఎండిపోయి రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ఆయన మంగళవారం పెన్పహాడ్ మండల పరిధిలోని దుబ్బతండా, రత్యాతండాల్లో ఎండిపోయిన వరి చేలను పరిశీలించారు. ఎండిపోయిన పంటకు ఎకరాకు రూ.35వేలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కన్నెపల్లి పంప్హౌస్ వద్ద ఒక బటన్ నొక్కితే సూర్యాపేట జిల్లాకు నీళ్లు వస్తాయని తెలిపారు. ప్రభుత్వం మూర్ఖంగా ఆలోచిస్తుందన్నారు. ప్రభుత్వ కక్షపూరిత వైఖరి కారణంగానే సూర్యాపేటలో పంటలు ఎండిపోతున్నాయన్నారు. సూర్యాపేట జిల్లాలోనే 60వేల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయాయని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి, ఇరిగేషన్ మంత్రికి నీళ్లు ఇవ్వాలన్న సోయి ఉండాలన్నారు. నీళ్లు ఇస్తామని చెప్తేనే రైతులు సాగు చేశారని ఆయన పేర్కొన్నారు. రైతు సమస్యలపై ప్రశ్నిస్తే, వాస్తవాలు మాట్లాడితే తనని అకారణంగా బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. ఎవరు ప్రశ్నించినా.. వారిపైన కేసులు పెట్టడం, నిర్బంధించడం, భయపెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు. రేవంత్రెడ్డి ఒక్కసారి రైతుల వద్దకు వచ్చి చూస్తే.. రైతులు మీ బట్టలుడదీసి కొడతారన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి తమ కళ్ల ముందే పంటల ఎండిపోతుంటే రైతులు తల్లడిల్లుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తమకు అప్పగిస్తే మూడే మూడు రోజుల్లో రైతుల పొలాలకు నీళ్లు ఇచ్చి చూపిస్తామని, అలా చేసే దమ్ముందా సీఎం రేవంత్రెడ్డి అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. జగదీష్రెడ్డి వెంట బీఆర్ఎస్ నాయకులు నెమ్మాది భిక్షం, దొంగరి యుగేంధర్, వెన్న సీతారాంరెడ్డి, తూముల ఇంద్రసేనారావు, మిర్యాల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. పంటలు ఎండిపోతుండడంతో రైతులు విలపిస్తున్నారు మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
సూర్యాపేట జిల్లా సాక్షి ఫొటోగ్రాఫర్కు అవార్డు
సూర్యాపేట: తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2018, 2024 సంత్సరాలకు గాను బెస్ట్ న్యూస్ పిక్చర్ అవార్డుకు ఎంపిక పోటీలు నిర్వహించగా.. సూర్యాపేట సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ అనమాల యాకయ్య 2018కి గాను బెస్ట్ న్యూస్ పిక్చర్ అవార్డుకు ఎంపికయ్యారు. సోమవారం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో యాకయ్య గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులమీదుగా అవార్డు, నగదు పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
16గంటలు పాటలు పాడి రికార్డు
మోత్కూరు : మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని సుందరయ్య కాలనీకి చెందిన చింత గణేష్ కుమారుడు చింత వెంకటేష్ మూడు అంతర్జాతీయ రికార్డులు సాధించాడు. ఆదివారం హైదరాబాద్లోని హయత్నగర్లో నిర్వహించిన గాన లహరి కార్యక్రమంలో వెంకటేష్ పాల్గొని 16 గంటల పాటు నిర్విరామంగా పాటలు పాడి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, రాయల్ సక్సెస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించాడు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియన్ చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్గౌడ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ కోఆర్డినేటర్ ఎం. హారిక, రాయల్ సక్సెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ రవికుమార్, ఎస్పీ నిర్మల, త్రినాథరావు, అరుణ తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
మేళ్లచెరువు: బైక్పై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి రోడ్డు పక్కకు రాగా లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం మేళ్లచెరువు మండల కేంద్రంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన పెద్దారపు అంజి(27) పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. పని నిమిత్తం అంజి సోమవారం బైక్పై మేళ్లచెరువు మండలకేంద్రానికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మేళ్లచెరువు మండల కేంద్రంలోని హోండా షోరూం సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కకు రాగా.. మేళ్లచెరువు నుంచి కోదాడ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అంజి రోడ్డుపై పడిపోగా అతడి పైనుంచి లారీ వెళ్లడంతో తల పలిగి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి ఏడాది క్రితమే వివాహం జరిగినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. లారీ మైహోం పరిశ్రమకు చెందినది కావడంతో మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలని మైహోం పరిశ్రమ గేటు ఎదుట సోమవారం రాత్రి వరకు నిరసన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వలస కూలీకి తీవ్ర గాయాలు.. చౌటుప్పల్ రూరల్: రోడ్డు దాటుతున్న వలస కూలీని లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ స్టేజీ వద్ద ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని దంతెవాడకు చెందిన చన్నం సురేష్(19) చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని ఓ పరిశ్రమలో కూలీగా పని చేయడానికి రెండు వారాల క్రితం వచ్చాడు. పరిశ్రమలో కూలీ పని లేకపోవడంతో తిరిగి ఛత్తీస్గడ్ రాష్ట్రానికి వెళ్లడానికి ఆదివారం రాత్రి దండుమల్కాపురం గ్రామ స్టేజీ వద్ద విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి దాటుతుండగా.. విజయవాడ వైపు వెళ్తున్న లారీ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సురేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్లా యాదవరెడ్డి తెలిపారు. -
ఇఫ్తార్ విందుకు నిధులు విడుదల
నియోజకవర్గాల వారీగా నిధులు ఇలా.. నల్లగొండ రూ.5 లక్షలు మిర్యాలగూడ రూ.4 లక్షలు దేవరకొండ రూ.3 లక్షలు నాగార్జునసాగర్ రూ.3 లక్షలు నకిరేకల్ రూ.3 లక్షలు మునుగోడు రూ.3 లక్షలు కోదాడ రూ.4 లక్షలు సూర్యాపేట రూ.3 లక్షలు హుజూర్నగర్ రూ.3 లక్షలు తుంగత్తురి రూ.3 లక్షలు భువనగిరి రూ.3 లక్షలు ఆలేరు రూ.2 లక్షలుభువనగిరిటౌన్ : రంజాన్ పర్వదినం సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 నియోజకవర్గాలకు రూ.39లక్షలు విడుదల చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు రూ.39లక్షలు కేటాయిస్తూ ఉత్తర్వులు -
కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య
నూతనకల్: మండల పరిధిలోని మిర్యాల గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మెంచు చక్రయ్యగౌడ్(65) సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. డీఎస్పీ రవి తెలిపిన వివరాల ప్రకారం.. చక్రయ్యగౌడ్ సోమవారం తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి వస్తుండగా ముత్యాలమ్మ గుడి సమీపంలో కొంతమంది కాపుగాసి గొడ్డళ్లతో అతడి తల, చేతులు, కాళ్లపై దాడి చేసి పక్కనే రోడ్డు పక్కన గోతిలో పడేశారు. అటుగా వెళ్తున్న గొర్రెల కాపరులు గమనించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో 108 వాహనంలో చక్రయ్యగౌడ్ను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజకీయ ఆధిపత్యంతోనే హత్య జరిగినట్లు డీఎస్పీ తెలిపారు. మృతుడి కుమార్తె అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తుంగతుర్తి సీఐ శ్రీనునాయక్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాపుగాసి గొడ్డళ్లతో నరికిన గుర్తుతెలియని వ్యక్తులు -
హాస్టళ్లలో ఫిర్యాదుల పెట్టెలు
భువనగిరి టౌన్ : సంక్షేమ వసగతి గృహాలు, కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని చోట్ల ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయనున్నారు. హాస్టళ్లు, కేజీబీవీల్లో నెలకొన్న సమస్యలను విద్యార్థులు, తల్లిదండ్రులు కాగితంపై రాసి ఫిర్యాదుల పెట్టెలో వేయొచ్చు. కలెక్టర్ తనిఖీలు వచ్చిన ప్పుడు, వారంలో ఒకసారి పెట్టెనుతెరిచి అందులోని ఫిర్యాదులను బయటకు తీసి పరిష్కారం చూపుతారు. పెట్టుకు సంబంధించిన తాళాలు కలెక్టర్ వద్ద ఉంటాయని సమాచారం. కాగా కలెక్టరేట్లో 80 ఫిర్యాదుల పెట్టెలు సిద్ధంగా ఉన్నాయి. -
ఆరుపదులు దాటినా తగ్గని ఉత్సాహం
కోదాడ: ఆరుపదుల వయస్సు దాటినా వారిలో ఉత్సాహం ఉరకలేస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తమలోని క్రీడానైపుణ్యాన్ని బహిర్గతం చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. రెండు రోజులుగా కోదాడలో జరుగుతున్న రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి పోటీల్లో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు తమలోని క్రీడా ప్రతిభను చాటుతున్నారు. కోదాడ పబ్లిక్ క్లబ్ ఆవరణలో సోమవారం రెండో రోజు పలువురు రిటైర్డ్ ఉద్యోగులు టెన్నికాయిట్, షటిల్, క్యారమ్స్, చెస్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 33 జిల్లాల నుంచి 300 మంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, మంగళవారం సాయంత్రం బహుమతుల ప్రదానోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతరామయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్రెడ్డి, బొల్లు రాంబాబు, రిటైర్డ్ ఉద్యోగులు అక్కిరాజు వెంకట్రావ్, గాయం పట్టాభిరెడ్డి, వేనేపల్లి శ్రీనివాసరావు, విద్యాసాగర్, భ్రమరాంబ, రఘు, ఓరుగంటి రవి, గగ్గినపల్లి సుదర్శన్రెడ్డి, బాబురావు, మేకల వెంకటేశ్వరరావు, అరుణ పాల్గొన్నారు. కోదాడలో పోటాపోటీగా రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ఆత్మకూర్ (ఎస్): మండల పరిధిలోని పాతర్లపహాడ్ గ్రామ ంలో సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మహి ళ మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన గోగుల కవిత(30) సోమవారం ఉదయం ఇంట్లో అస్వస్థతకు గురై కిందపడిపోవడంతో భర్త సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ కుమార్తె మృతికి తన అల్లుడు గోగుల కమలాకర్, అతడి తండ్రి కారణమని మృతురాలి తండ్రి వెంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కమలాకర్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తన కుమార్తెను వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కమలాకర్, అతని తల్లిదండ్రులు తన కుమార్తెను కొట్టి చంపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ తెలి పారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
భరత్.. ఎలా చదువుతున్నావు
సంస్థాన్ నారాయణపురం : భరత్.. బాగున్నావా.. ఎలా చదువుతున్నావు.. పరీక్షలకు సన్నద్ధం అయ్యావా.. అని పదో తరగతి విద్యార్థి దేవరకొండ భరత్ను కలెక్టర్ హనుమంతరావు పలకరించారు. ‘విద్యార్థుల ఇంటి తలుపు తట్టి’ కార్యక్రమంలో భాగంగా సంస్థాన్నారాయణపురం మండలం కంకణాలగూడెం పంచాయతీ పరిధిలోని దేశ్యాతండాలో నివాసం ఉంటున్న దేవరకొండ భరత్ చంద్రచారి ఇంటిని సోమవారం ఉదయం 7గంటలకు కలెక్టర్ సందర్శించారు. భరత్ చంద్రచారి, అతని కుటుంబసభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. భరత్ చంద్రచారి నోట్ బుక్స్ను పరిశీలించారు. టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అయ్యావని అడిగారు. ఒత్తిడి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, నిర్దేశిత సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థికి పదో తరగతి మైలు రాయి అని, ఉత్తీర్ణులైతే విజయానికి తొలి మెట్టు అవుతుందన్నారు. అతనికి రూ.5వేల ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. భరత్ చంద్రచారి జీవితంలో స్థిరపడేవరకు తన సహకారం ఉంటుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ కృష్ణ ఉన్నారు. విద్యార్థుల ఇంటి తలుపు తట్ట్ఙే కార్యక్రమాన్ని గత నెలలో ఇక్కడి నుంచే కలెక్టర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.ఫ పరీక్షలకు సన్నద్ధం అయ్యావా.. ఫ దేశ్యతండాలోని టెన్త్ విద్యార్థి భరత్ ఇంటిని సందర్శించిన కలెక్టర్ ఫ నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం అందజేత -
ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి
కనగల్: మండలంలోని బుడుమర్లపల్లి గ్రామ శివారులో ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతిచెందాడు. కనగల్ ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపిన ప్రకారం.. కనగల్ మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన కడారి వెంకటేశం(45) ఆ గ్రామ మాజీ సర్పంచ్ పగిళ్ల యాదయ్య వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం గ్రామ వాగులో ఇసుకను లోడ్ చేసుకొని నల్లగొండకు తరలిస్తుండగా.. మార్గమధ్యలో బుడుమర్లపల్లి వద్ద ట్రాక్టర్ ట్రాలీ డోరు కొండి ఊడింది. ఇది గమనించిన వెంకటేశం మరో ట్రాక్టర్ డ్రైవర్ సాయంతో డోరును సరిచేస్తుండగా ట్రాక్టర్ ముందుకు కదిలింది. ట్రాక్టర్ను ఆపే ప్రయత్నంలో భాగంగా స్టీరింగ్ పట్టుకుని సీటులోకి ఎక్కుతుండగా వెంకటేశం కిందపడిపోయాడు. దీంతో ట్రాక్టర్ టైరు అతడి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి కుమారుడు శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్ల ధర్నా భువనగిరిటౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన 48 గంటల ధర్నా సోమవారం ప్రారంభించారు. ఈ సదర్భంగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్ల యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బూరుగు స్వప్న, సిలువేరు రమాకుమారి మాట్లాడుతూ ఐసీడీఎస్ పథకం అమల్లోకి వచ్చి 50 ఏళ్లు గడిచినా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలు పరిష్కారానికి నోచడం లేదన్నారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు చెల్లించాలని, పదవీ విరమణ ప్రయోజనాలు వర్తింపజేయాలని, పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం రూ.18వేలు ఇవ్వడంతో పాటు ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ఐసీడీఎస్కు నిధులు పెంచి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని కోరారు. పీఎంశ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను రద్దు చేయాలన్నారు. మంగళవారం కూడా ధర్నా కొనసాగిస్తామన్నారు. సోమవార రాత్రి ధర్నా శిబిరంలోనే అంగన్వాడీలు నిద్రించారు. కార్యక్రమంలో యూనియన్, సీఐటీయూ నాయకులు సిద్ధమ్మ, సునీత, వసంత, ఉమా, పద్మ, ప్రమీల, షాహిదా, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. -
అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన లారీ
కేతేపల్లి: విజయవాడ – హైదరాబాద్ రహదారిపై కేతేపల్లి మండల కేంద్రంలో సోమవారం లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్ళడంతో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన లారీ సోమవారం విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా.. కేతేపల్లిలోని ఎస్సీ కాలనీ సమీపంలోకి రాగానే లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్లు, ఇనుప బారికేడ్లకు ఢీకొని డ్రైనేజీ కాల్వపై ఆగిపోయింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన కొబ్బరి బొండాల దుకాణాన్ని ఢీకొట్టడంతో దుకాణం ధ్వంసమైంది. దుకాణ నిర్వాహకులు పక్కకు పరుగెత్తడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాహుల్ లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ను 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. లారీ ఇంజన్లో నుంచి పొగ, మంటలు రావటంతో అప్రమత్తమైన పోలీసులు నకిరేకల్ ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. డ్రైవర్ మద్యం మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. డ్రైవర్కు తీవ్ర గాయాలు -
యువ విజ్ఞాన కార్యక్రమంతో శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం
● ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి చదివే విద్యార్థులు అర్హులు ● ఆన్లైన్ దరఖాస్తులకు ఈ నెల 23 వరకు గడువు మార్చి 23 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. ఏప్రిల్ 7వ తేదీన తొలి జాబితాను విడుదల చేయనున్నారు. మే 18న ఇస్రో సూచించిన కేంద్రాల వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మే 19 నుంచి 30 వరకు 2 వారాల పాటు ఎంపికై న విద్యార్థులకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట–ఆంధ్రప్రదేశ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్–తెలంగాణ, విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్, తిరువనంతపురం–కేరళ, యుఆర్ రావు శాటిలైట్ సెంటర్, బెంగళూరు–కర్ణాటక, స్పేస్ అప్లికేషన్ సెంటర్, అహ్మదాబాద్–గుజరాత్, నార్త్–ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, షిల్లాంగ్–మేఘాలయ, ఐఐఆర్ఎస్, డెహ్రాడూన్–ఉత్తరాఖండ్లో ఎక్కడైనా ఒక చోట శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది. ఎంపికై న విద్యార్థితో పాటు వారి తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్ ఉపాధ్యాయుడికి కూడా ప్రయాణ ఖర్చులు ఇస్రో చెల్లిస్తుంది. మే 31న ముగింపు కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. ప్రధానంగా అంతరిక్షం, సాంకేతికత, అంతరిక్ష శాస్త్రంపై అవగాహన, అంతరిక్ష అనువర్తనాలపై ప్రాథమిక జ్ఞానం అందిస్తారు. అంతరిక్ష కేంద్రాల్లో ప్రయోగశాల సందర్శన అక్కడి ప్రముఖ శాస్త్రవేత్తలతో సమావేశం, ముఖాముఖి చర్చలు, రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఎంపిక తేదీలు -
వల్లభ డెయిరీ వద్ద ఉద్రిక్తత
చౌటుప్పల్ రూరల్ : చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం పరిధిలో గల వల్లభ డెయిరీ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. డెయిరీ పరిశ్రమ నుంచి విడుదల చేస్తున్న వ్యర్థ రసాయనాల వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమై పంటలు పండటం లేదని పది రోజులుగా తుప్రాన్పేట గ్రామస్తులు, రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో డెయిరీలో తనిఖీలు నిర్వహించడానికి కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు వస్తున్నారన్న సమాచారంతో గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా డెయిరీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో చౌటుప్పల్ మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. సమాచారం అందుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో డెయిరీ వద్దకు చేరుకున్నారు. పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం డెయిరీ సిబ్బందికి, తుప్రాన్పేట గ్రామస్తులతో మాట్లాడి సర్దిచెప్పారు. చౌటుప్పల్ సీపీ మన్మధకుమార్ ఆధ్వర్యంలో డెయిరీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ పీసీబీ అధికారులు వస్తున్నారని భారీగా చేరుకున్న తుప్రాన్పేట గ్రామస్తులు ఫ పరిశ్రమలోపలికి వెళ్తుండగా అడ్డుకున్న సిబ్బంది.. వాగ్వాదం, ఘర్షణ ఫ సొమ్మసిల్లి పడిపోయిన మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి నీటి శాంపిల్స్ సేకరణ తుప్రాన్పేట గ్రామస్తులు, మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి ఫిర్యాదు మేరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వల్లభ డెయిరీలో తనిఖీలు నిర్వహించారు. ట్రీట్మెంట్ ప్లాంట్ను పరిశీలించి నీటి శాంపిల్స్ను సేకరించారు. డెయిరీ పరిసరాల్లోని బోర్ల నీటిని కూడా పరిశీలించి శాంపిల్స్ తీసుకున్నారు. శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపనున్నట్లు పీసీబీ అధికారులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం
నేరేడుచర్ల: బైక్పై వెళ్తున్న బీటెక్ విద్యార్థి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ సమీపంలో సోమవారం జరిగింది. ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. పాలకీడు మండలం బెట్టెతండాకు చెందిన బండావత్ సందీప్(20) హైదరాబాద్లోని మహావీర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హోలి పండుగకు ఇంటికి వచ్చిన సందీప్ సోమవార నల్లగొండ జిల్లా హాలియాలో తన స్నేహితుడి వివాహానికి బైక్పై వెళ్తుండగా.. నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ సమీపంలో చెరువు మూలమలుపు వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సందీప్ను స్థానికులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తండ్రి బండావత్ శ్రీనునాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్ను తప్పించబోయి..రాజాపేట: బైక్పై వెళ్తున్న వ్యక్తి ట్రాక్టర్ను తప్పించబోయి అదుపుతప్పి కిందపడడంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి రాజాపేట మండలం జాల గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జాల గ్రామానికి చెందిన చెవిటి ప్రభాకర్(32) ఆదివారం రాత్రి తనపై బైక్పై జాల మైసమ్మ ఆలయం వద్దకు వెళ్లొస్తుండగా.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించబోయి అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ప్రభాకర్ తలకు తీవ్రగాయాలు కాగా.. భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పతికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య సంతోష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. రెండు బైక్లు ఢీకొని ఇద్దరు.. డిండి: ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొనడంతో ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన సోమవారం డిండి మండలం హజ్యతండా సమీపంలో జరిగింది. వివరాలు.. డిండి మండలం శేషాయికుంటకు చెందిన ఇంజమూరి సాయి(22) తవక్లాపూర్ నుంచి స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా.. కొత్తతండాకు చెందిన జటావత్ శక్రునాయక్(55) తన బైక్పై చెర్కుపల్లి నుంచి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో హజ్యతండా సమీపంలో రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాయి, శక్రునాయక్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టర్ నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రాజు తెలిపారు. -
విజయ విహార్ ఆవరణలో అగ్నిప్రమాదం
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్లోని విజయ విహార్ అతిథిగృహం ఆవరణలో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం విజయ విహార్ ఆవరణలో వివాహం జరిగింది. ఆ సమయంలో ఏర్పడిన చెత్తను తొలగించి ఒక దగ్గర చేర్చి సోమవారం సాయంత్రం తగలబెట్టారు. అందులో నుంచి గాలికి మండే విస్తరి ఒకటి లేచి ఆవరణలోని అటవీ ప్రాంతంలో భూమిపై ఎండిపోయిన గడ్డిపై పడడంతో మంటలు అంటుకొని కాలిపోయింది. పర్యాటక సంస్థ ఉద్యోగులు అతికష్టం మీద చెట్ల కొమ్మలతో, నీటితో మంటలను ఆర్పివేశారు. లేదంటే 10ఎకరాల మేర ఉన్న అటవీ ప్రాంతంతో పాటు ట్రాన్స్ఫార్మర్, పార్కులు తగలబడేవి. -
పంటలు ఎండటం ప్రభుత్వ వైఫల్యమే..
గుండాల : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రణాళిక లేదని, కాళేశ్వరం ద్వారా చెరువులు, కుంటలు నింపకపోవడం వల్లే నీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి విమర్శించారు. గుండాల మండలానికి నవాబు పేట రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలు విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పాదయాత్ర చేపట్టారు. మొదటి రోజు దేవాదుల కాల్వ వెంట వెల్మజాల గ్రామం వరకు పాదయాత్ర కొనసాగింది. బూర్జుబావి గ్రామ పరిధిలో ఎండిన వరి చేలను పరిశీలించారు. రైతు చెట్లపల్లి రాజయ్య ఏడు ఎకరాల్లో వరి సాగు చేయగా నీరందక ఆరు ఎకరాలు ఎండిపోయిందని ఆమె కాళ్లపై పడి విలపించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిహారం వచ్చేలా చూ డాలని వేడుకోగా అతన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు 33 మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తే నవాబుపేట రిజర్వాయర్ నిండి మండలానికి సాగు నీరు వచ్చేదన్నారు. గతంలో గుండాల మండలం సాగు నీటితో కళకళలాడేదని, నేడు పంటలు ఎండిపోయి ఎడారిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటాలు చేస్తామన్నారు. అనంతరం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎండీ ఖలీల్, నాయకులు బాల్రెడ్డి, కె.రాములు, సంగి బాలకష్ణ, బబ్బూరి సుధాకర్, మూగల శ్రీనివాస్, మాధవరెడ్డి, సోమన్న, దయాకర్, నాగరాజు, పూర్ణచంద్, సంగి బాలకొమురయ్య తదితరులు పాల్గొన్నారు.ఫ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఫ సాగు నీటికోసం పాదయాత్ర -
సగంలో ఆగిన సమీకృత
నాలుగేళ్లుగా పూర్తికాని నిర్మాణాలు ఫ నిధుల లేమితో అర్ధంతరంగా ఆపేసిన కాంట్రాక్టర్లు ఫ రోడ్ల పక్కనే కూరగాయలు, మాంసం విక్రయాలు స్లాబ్ దశలోనే.. ఆలేరు రూరల్ : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.2కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2022 మార్చిలో సిద్ధార్థ కన్సటక్షన్స్ వారు పనులు చేపట్టారు. మొత్తం 56 స్టాళ్లు కాగా కూరగాయలకు 26, నాన్వెజ్ 18, పండ్లు 8, పూల విక్రయాలకు నాలుగు కేటాయించారు. ప్రభుత్వం ఇచ్చిన నిధుల వరకు కాంట్రాక్టర్ స్లాబ్ వరకు నిర్మాణం చేసి వదిలేశారు. మిగతా పనులకు నిధులు విడుదల కాకపోవడంతో ఏడాదిన్నర కాలంగా పనులు నిలిచిపోయాయి. భువనగిరి : జిల్లా కేంద్రంలోని రహదారి బంగ్లా, ఆర్అండ్బీ ఆవరణలో రూ.8.70 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్ పనులు ప్రారంభించారు. 2022 అక్టోబర్ 2వ తేదీన అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మొత్తం 192 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో వెజ్ 85, నాన్ వెజ్ 45, పూలు, పండ్లకు 15, కిరాణ సామగ్రి విక్రయానికి 15, ఇతర అవసరాలకు 32 స్టాళ్లు కేటాయించారు. పనులు తుది దశకు చేరాయి. నిర్మాణాలకు పేయింటింగ్ కూడా వేశారు. విద్యుదీకరణ, మార్కెట్ ఆవరణలో సీసీ, రోడ్లు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా రూ.1.50 కోట్లు కావాలని ఇందుకోసం గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. మంజూరు కాకపోవడంతో మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రూ.89 లక్షలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కూరగాయలు, పండ్లు, మాంసం ఉత్పత్తులు ఒకే చోట అందుబాటులో ఉండేలా మున్సిపాలిటీల్లో చేపట్టిన సమీకృత మార్కెట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఏడాది లోపు పూర్తి చేయాలని అప్పట్లో నిర్ణయించినా పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయకపోవడంతో మధ్యలోనే ఆగిపోయాయి. ప్రభుత్వం నుంచి నిధులు వస్తేగానీ పనులు పూర్తయి అందుబాటులోకి తెచ్చే అవకాశం లేదు.గ్రౌండ్ ఫ్లోర్ కూడా దాటలేదు మోత్కూరు : పట్టణంలోని పశువుల అంగడి స్థలంలో ఎకరం నాలుగు గుంటల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం మొదట రూ.2కోట్లు మంజూరు కాగా, ఆ తరువాత మరో రూ.4 కోట్లకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. 2022 మే 5న అప్పటి ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ మార్కెట్ పనులకు శంకుస్థాపన చేశారు. జీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ టెండర్ ద్వారా పనులను దక్కించుకుంది. రెండు అంతస్తుల్లో భవనాన్ని నిర్మించాల్సి ఉండగా గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ దశలో పనులు నిలిచిపోయాయి. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు. మొత్తం 48 మడిగలు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో కూరగాయలకు 26, మాంసాహారం 14, పూలు, పండ్ల విక్రయాలకు 8 మడిగలు కేటాయించారు. మూడేళ్ల క్రితం పనులు నిలిచిపోయాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లాం నిధుల కొరత వల్ల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు సగంలో నిలిచిపోయింది వాస్తవమే. బిల్లు రాకపోవడం వల్లే పనులు నిలిపివేశామని కాంట్రాక్టర్ చెప్పాడు. ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మరోసారి వారికి వివరిస్తాం. –సతీష్కుమార్, మున్సిపల్ కమిషనర్, మోత్కూరు పోచంపల్లిలో అడుగే పడలే.. భూదాన్పోచంపల్లి : మున్సిపాలిటీకి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం రూ.3 కోట్లు మంజూరయ్యాయి. టెండర్లు సైతం పూర్తయ్యాయి. కానీ, అందుబాటులో ప్రభుత్వ స్థలం లేక మార్కెట్ నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. పట్టణ శివారులో నిరుపయోగంగా ఉన్న రెండు ఎకరాల ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని మార్కెట్ కోసం ప్రతిపాదించి అప్పటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. కానీ, మార్కెట్కు భూమి ఇవ్వడానికి ఆర్టీసీ అధికారులు మొదల్లో సుముఖత చూపలేదు. ఆ తరువాత కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ స్థలాన్ని వినియోగించుకొని అందుకు బదులుగా ఆర్టీసీకి జలాల్పురం పరిధిలోని సర్వే నంబర్ 80లో గల 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. కానీ, ఆర్టీసీ స్థలం అప్పగింత ప్రక్రియ పూర్తికాకపోవడంతో మార్కెట్ పనులు మొదలుకాలేదు. పిల్లర్లకే పరిమితం యాదగిరిగుట్ట : పట్టణంలోని అంగడిబజార్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం రూ.2 కోట్లు మంజరయ్యాయి. 2022 మార్చి 23న పనులు ప్రారంభించారు. 48 మడిగెలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కానీ, కాంట్రాక్టర్కు బిల్లులు రాకపోవడంతో పనులను పిల్లర్ల దశలోనే ఆపేశాడు. -
ఇంటర్ పరీక్షలకు 6,578 మంది హాజరు
భువనగిరి : ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా సోమవారం ప్రథమ సంవత్సరం ఫిజిక్స్, ఆర్థిక శాస్త్రం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 29 కేంద్రాల్లో 6,952 మంది విద్యార్థులకు గాను 6,578 మంది హాజరయ్యారు. 374 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. బాల్యానికి బలం.. బాలామృతం భువనగిరి : మండలంలోని అనంతారం, రాయగిరి పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల హాజరు రిజిస్టర్లు, బాలమృతం సరఫరాతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం బాలింతలు, గర్భిణులతో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రంలో సేవలు ఎలా అందుతున్నాయి.. సమస్యలున్నాయా, ఏమైనా మార్పులు చేయాలా.. అని అడిగారు. చిన్నారులకు బాలామృతం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు, ప్రాజెక్టు సీడీపీఓలు స్వరాజ్యం, శైలజ, రమ, సూపర్వైజర్లు, అంగన్ వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఆలేరు : పట్టణ పరిధిలోని బహద్దూర్పేట అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీమ్ తనిఖీ చేశారు. లబ్ధిదా రుల హాజరు రికార్డులను పరిశీలించారు. పోషకాహారం పంపిణీపై చర్చించారు. శివకేశవులకుసంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : శివకేశవులకు నిలయమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ఆధ్యాత్మిక పర్వాలు కొనసాగాయి. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో కొండపైన గల శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో రుద్రాభిషేకం, బిల్వార్చనలు, ముఖమండపంలో స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు.రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు. వేసవి వ్యాధులపై జాగ్రత్తభువనగిరి : వేసవి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ నివారణ చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ మనోహర్ వైద్యారోగ్య సిబ్బందికి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశా నోడల్ పర్సన్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజారోగ్య కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు. ప్రతి ఇంటిని సందర్శించి మచ్చలతో బాధపడే వారి వివరాలు సేకరించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. వడదెబ్బకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ యశోధ, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాయిశోభ, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రామకృష్ణ, వీఽణ,సుమన్ కళ్యాణ్, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. -
విన్నవించాం.. పరిష్కరించండి
మా భూములు కబ్జా చేశాడు యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి కారోబార్ శివరాత్రి నెహ్రూ ప్రజాపాలన పథకాల పేరిట తమతో సంతకాలు చేయించి భూమి కాజేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కలెక్టర్కు విన్నవించారు. సుమారు 15 ఎకరాల భూమిని తనతో పాటు, బంధువుల పేరుపై ధరణిలో ఎక్కించాడని, అందుకు యాదగిరిగుట్ట ఆర్ఐ సహకరించాడని ఆరోపించారు. అంతేకాకుండా భర్తలు చనిపోయిన వారికి మరణ ధ్రీవీకరణ పత్రాలు ఇస్తామని చెప్పి వారి భూమిని కూడా కబ్జా చేశారని వాపోయారు. సుమారు 30 మంది భూములను అక్రమంగా తనతో పాటు తమ బంధువుల పేరున మార్పిడి చేశారని తెలిపారు. స్పందించి కలెక్టర్.. విచారణ చేపట్టాలని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డిని ఆదేశించారు. సాక్షి, యాదాద్రి : కారోబార్ భూమి ఆక్రమించాడు, ధరణిలో పేరు మారలేదు, ‘మన ఊరు–మనబడి’ బిల్లులు ఇప్పించాలి, అప్పు తెచ్చి విద్యార్థులకు అల్పాహారం అందజేశాం.. ఇలా మరెన్నో సమస్యలపై బాధితులు కలెక్టరేట్ గడప తొక్కారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి వినతులు అందజేశారు. మొత్తం 60 వరకు అర్జీలు రాగా అత్యధికంగా భూ సమస్యలకు సంబంధించి 36 ఉన్నాయి. పంచాయతీరాజ్ 11, మున్సిపల్ 3, డీఆర్డీఓ 2, సివిల్ సప్లైస్ 2, దేవాదాయ 2, ఆర్అండ్బీ, సంక్షేమ, లేబర్, కోఆపరేటివ్ శాఖలకు సంబంధించి ఒక్కొకటి చొప్పున ఫిర్యాదులు వచ్చాయి. అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డితో కలిసి కలెక్టర్ హనుమంతరావు అర్జీలు స్వీకరించారు. సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రజావాణిలో వచ్చిన వినతులను పరిష్కరించాలని సూచించారు. ● జూలూరు పీఏసీఎస్ చైర్మన్, సీఈఓలు అక్రమాలకు పాల్పడ్డారని, విచారణలో కూడా రుజువు అయినందున వారిపై చర్యలు తీసుకోవాలని పీఏసీఎస్ డైరెక్టర్లు బాలకృష్ణారెడ్డి, రామిరెడ్డి కలెక్టర్కు విన్నవించారు. ఈ విషయంపై మార్చి 1వ తేదీన కూడా వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ● బొమ్మలరామారం మండలం సోలిపేట ఎంపీపీఎస్లో 2023 అక్టోబర్ 31నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు విద్యార్థులకు అల్పాహారం అందజేశామని, ఇందుకు సంబంధించి రూ.71,627 బిల్లు రావాలని చిత్తమ్మ, అండాలు కలెక్టర్కు తెలియజేశారు. ● రాయరావుపేటలోని 30, 31 సర్వే నంబర్ భూమిలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని, వెంటనే అడ్డుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. విషయం తెలిసినా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని, మట్టితవ్వకాలను నిలిపివేయాలని కోరారు.స్టేజీ దిగివచ్చి సమస్య ఆలకించి.. భువనగిరికి చెందిన దివ్యాంగుడు గోపాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పింఛన్ తీసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత పింఛన్ రావడం లేదు. పలుమార్లు కలెక్టరేట్కు వచ్చి వినతిపత్రాలు అందజేశాడు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో మరోమారు సోమవారం ప్రజావాణికి వచ్చి నేరుగా కలెక్టర్ను కలిశాడు. గోపాల్ను చూసిన కలెక్టర్.. తన సీటులోనుంచి లేచి అతని దగ్గరకు వచ్చాడు. వినతిపత్రం స్వీకరించి స్వయంగా సమస్య తెలుసుకున్నారు. బిల్లుల కోసం 16 నెలలుగా తిరుగుతున్నాం ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు–మన బడి కార్యక్రమం కింద రూ.49లక్షలతో పనులు చేపట్టానని, రూ.12లక్షలు వచ్చాయని, మిగతా బిల్లు రాలేదని ఆరె రాములు, నంద మహేందర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 16 నెలలుగా తిరుగుతున్నామని, బిల్లులు ఇప్పించాలని విన్నవించారు.ఫ ప్రజావాణిలో వినతుల వెల్లువ ఫ అత్యధికంగా భూ సమస్యలపైనే ఫ వినతులు స్వీకరించిన కలెక్టర్ -
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బదిలీ
సాక్షి, యాదాద్రి: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ బదిలీ అయ్యారు. హెచ్ఎండీఏ సెక్రటరీగా ఆయనను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది మార్చి 16న ఆయన అదనపు అదనపు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. సరిగ్గా సంవత్సరానికి ఆయన బదిలీ అయ్యారు. జిల్లాలో తాగు నీటి ఎద్దడి నివారణ, రానున్న స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు చర్యలు చేపట్టడంలో ఆయన సమర్థవంతంగా పనిచేశారు. మున్సిపాలిటీల వారీగా సమీక్షలు, మేళాలు నిర్వహించి వీలైనంత ఎక్కువ మందిని ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేలా సఫలీకృతం అయ్యారు. పాలనాపరంగా సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. కాగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బాధ్యతలను రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డికి అప్పగించారు. 39వ సారి రక్తదానంమోత్కూరు : మాతృదేవోభవ–పితృదేవోభవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కురుమేటి నవీన్ ఆదివారం 39వ సారి రక్తదానం చేశాడు. నార్కట్పల్లి కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సీహెచ్ లక్ష్మయ్య అనే పేషెంట్కు బి పాజిటివ్ రక్తం అవసరమైంది. మిర్యాలగూడ ఫ్రెండ్స్ ఫౌండేషన్ కార్యదర్శి లింగరాజు తానకు ఫోన్ చేయడంతో వెంటనే వెళ్లి రక్తదానం చేసినట్లు నవీన్ తెలిపారు. ఆపదలో ఉన్న వ్యక్తులకు తాను రక్తదానం చేస్తూ, తన మిత్రులతోనూ చేయిస్తున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, తద్వారా ప్రాణాపాయంలో ఉన్నవారి ప్రాణాలను కాపా డినవారం అవుతామన్నారు. ఒంటిపూట బడుల వేళల్లో మార్పులు భువనగిరి : ఒంటిపూట బడుల వేళల్లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ నరసింహారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటలకు మొదటి గంట, 8.05 గంటలకు రెండో గంటతో పాటు ప్రార్థన చేసి 8.15 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని మొదట ఆదేశాలు ఇచ్చింది. ఈ వేళల్లో స్వల్ప మార్పులు చేశారు. ఉదయం 7.45కు మొదటి గంట, 7.50కి రెండో గంటతో పాటు ప్రార్థన చేయాల్సి ఉంటుంది. 8 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు తరగతులు నిర్వహించిన తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు సవరించిన వేళలను అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ ఆదేశించారు. విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ యాజమాన్యాలు ఒంటిపూట బడులు నిర్వహించాలని సూచించారు. -
● వినయ్భానురెడ్డి యాదిలో..
బొమ్మలరామారం : మండల కేంద్రానికి చెందిన దివంగత లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్భానురెడ్డి ద్వితీయ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మలరామారంలోని గుడిబావి చౌరస్తా వద్ద ఉన్న వినయ్ భానురెడ్డి విగ్రహానికి ఆయన కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వినయ్ భానురెడ్డి సతీమణి స్పందనారెడ్డి, తల్లిదండ్రులు ఉప్పల నర్సింహారెడ్డి, విజయలక్ష్మి, దంతపల్లి వంశీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ రిజర్వేషన్ పెంచుతాం
తుంగతుర్తి: ఎస్సీ రిజర్వేషన్ శాతం పెంపునకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2026లో నిర్వహించనున్న జనాభా లెక్కల ప్రకారం కచ్చితంగా పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాలు, నీరుపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం తుంగతుర్తి లో జరిగిన కాంగ్రెస్స్ పార్టీ కృతజ్ఞత సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి హాజరై మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణే అని స్పష్టం చేశారు. చట్ట సభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో మూడు కీలక బిల్లులుఅసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. మొదటి బిల్లు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్, రెండో బిల్లు స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్, మూడో బిల్లు ఎస్సీల్లోని 15శాతం రిజర్వేషన్లను 59 ఎస్సీ ఉపకులాలకు పంచేలా ఉపకోటా నిర్ణయిస్తామన్నారు. ఈనెల 17న ఎస్సీ ఉప వర్గీకరణ బిల్లుపై, 18న బీసీ రిజర్వేషన్, కుల సర్వే అంశంపై ప్రభుత్వం చర్చలు జరపనుందన్నారు. నా నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని, న్యాయమూర్తి షమీమ్ అఖ్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ను నియమించడం ఇందుకు నిదర్శనమని వివరించారు. సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులందరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ కమిషన్ నివేదిక ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తోందని తెలిపారు. 1931 తర్వాత తెలంగాణలో మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి కుల ఆధారితంగా సామాజిక– ఆర్థిక సర్వే నిర్వహించిందని వివరించారు. ఈ సభలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్కుమార్రెడ్డి, రఘువీర్రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేలు, వేముల వీరేషం, లక్ష్మీకాంత్, ఎమ్మెల్సీ శంకర్నాయక్, రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ కిషన్రావు టీపీసీసీ సభ్యుడు గుడిపాటి నర్సయ్య, కడియం పరమేశ్వర్, గుడిపాటి సైదులు, దొంగరి గోవర్ధన్, గిరిధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.తుంగతుర్తి అభివృద్ధికి కృషి తుంగతుర్తి తన స్వస్థలమని, ఈ ప్రాంతాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, తుంగతుర్తికి ఎస్సారెస్పీ ఫేజ్–2, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. అంతేకాకుండా తుంగతుర్తికి గోదావరి, మూసీ నదుల నీటిని తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సభలో మంత్రులకు కాంగ్రెస్ కార్యకర్తలు గొర్రె పిల్లలు, గొంగళ్లు, డప్పులను బహూకరించి సన్మానించారు. రాష్ట్ర నీరుపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తుంగతుర్తిలో కాంగ్రెస్ కృతజ్ఞత బహిరంగ సభ హాజరైన ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు -
సిగ్నల్స్ రాక.. సేవలందక !
రాజాపేట : అంగన్వాడీ కేంద్రాల్లో సేవల పారదర్శకత కోసం ప్రభుత్వాలు రూపొందిస్తున్న ఆన్లైన్ యాప్లతో అవస్థలు తప్పడం లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఫేస్ అథెంటికేషన్ కాకపోవడం అంగన్వాడీ టీచర్లకు తలనొప్పిగా మారింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది.నెట్సిగ్నల్స్ అందకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని అంగన్వాడీ టీచర్లు అంటున్నారు. యాప్లో వీటిని నమోదు చేస్తారుఅంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, లబ్ధిదారుల హాజరు, పోషకాహారం పంపిణీలో పాదర్శకత కోసం ప్రభుత్వం పోషణ్ ట్రాకర్ యాప్ అమల్లోకి తెచ్చింది. ఈ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా లబ్ధిదారుల హాజరుతో పాటు వారి పేర్లు, పోషకాహారం పంపిణీ, రోజువారీ కార్యక్రమాల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు పోషకాహారం అందజేసేటప్పుడు ఫొటోలు తీసి యాప్లో డౌన్లోడ్ చేయాలి. కాగా అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ఇచ్చిన 2జీ ర్యామ్ ఫోన్లు పోషణ్ ట్రాకర్ యాప్కు సరిగా సపోర్టు చేయడం లేదు. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సిగ్నల్స్ సమస్య ఏర్పడుతుంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతల వివరాలతో పాటు పౌష్టికాహారం పంపిణీ వివరాలను ఏరోజుకారోజు యాప్లోనే నమోదు చేయాల్సి ఉంది. అయితే ఉదయం అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో యాప్ పని చేయకపోవడంతో రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. ఆ తరువాత సాయత్రం వేళలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను అప్లోడ్ చేయాల్సి వస్తుంది. లబ్ధిదారులు ..జిల్లాలో మోత్కూరు, రామన్నపేట, ఆలేరు, భువనగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 777 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వాటిలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు 29,732 మంది ఉన్నారు. పోషణ్ ట్రాకర్ యాప్కు నెట్వర్క్ సమస్య లబ్ధిదారుల ఫేస్ అథెంటికేషన్, పోషకాహారం వివరాల నమోదుకు ఇబ్బందులు యాప్లోనే నమోదు చేయాలని అధికారుల ఒత్తిడి సతమతమవుతున్న అంగన్వాడీ టీచర్లుఈకేవైసీకీ ఇబ్బందులే..ఈ కేవైసీ చేయాలంటే ఆధార్కు అనుసంధానం చేసిన ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. దానికి వచ్చిన ఓటీపీ నంబర్ ఆధారంగా ఈకేవైసీ చేస్తారు. కానీ, ఆధార్కు లింక్ చేసిన నంబర్ లేకపోవడం, మరోవైపు ఆధార్లో తప్పులు, అప్డేట్ చేయించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధి కారులేమో ఫేస్యాప్లో వివరాలు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయమార్గాలు చూపాలని అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వానికి కోరుతున్నారు.నెట్వర్క్ సరిగా లేదు అంగన్వాడీ టీచర్లకు నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం 2జీబీ ర్యామ్ ఫోన్లు ఇచ్చింది.ఈ ఫోన్లు పోషణ్ ట్రాక్ యాప్కు సరిగా సపోర్టు చేయడం లేదు. దీనికి తోడు నెట్ సిగ్నల్స్ అందకపోవడం, ఆధార్ అప్డేట్ లేకపోవడం వంటి సమస్యలతో యాప్లో వివరాలు నమోదు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నతాధికారులు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి. – బూర్గు స్వప్న, అంగన్వాడీ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు -
ఆహ్లాదం.. ఆకర్షణీయం
భువనగిరి : జిల్లా కేంద్రంలోని పెద్దచెరువు కొత్తరూపును సంతరించుకుంది. కట్టపై, దిగువన చేపడుతున్న సుందరీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి పరిసర గ్రామాల నుంచి నిత్యం వేలాది మంది వస్తుంటారు. యాదగిరీశుడి సన్నిధికి వెళ్లిన భక్తులు సైతం ఇక్కడ ఆగి సేదదీరుతుంటారు. వీరితో పాటు స్థానికులు ఆహ్లాదంగా గడిపేందుకు హెచ్ఎండీఏ నిధులు రూ.6.20 కోట్లతో కట్టపై కిలోమీటరు పొడవునా సుందరీకరకణ పనులకు ఏడాదిన్నర కిత్రం శ్రీకారం చుట్టారు. పనులు ఆగుతూ.. సాగుతూ ఎట్టకేలకు ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. 2023 ఆగస్టులో పనులు ప్రారంభంపెద్దచెరువు కట్ట సుందరీకరణ పనులను 2023 ఆగస్టులో రూ.6.20 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. ఇందులో గ్రీనరీకి రూ.1.20 కోట్లు, వివిధ నిర్మాణాలకు రూ. 5 కోట్లు కేటాయించారు. నాటిన మొక్కలు ఇవీ..గ్రీనరీలో భాగంగా ఆక్సీజన్ అందించే లెమన్, ఫౌంటేయిన్ గ్రాస్ మొక్కలు, సుందరంగా కనిపించేందుకు పీచ్ లిల్లీ, మిర్చి మేరి గోల్డ్, రాయల్ ఫామ్స్ చెట్లతో పాటు వివిధ ప్రాంతాల్లో కార్పొరేట్ గ్రాస్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వివిధ రంగులతో పూలు పూచే బోగన్ విల్లా, టెకోమా మొక్కలు, రెండు గజ్బోలు ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణాలు..మరుగుదొడ్లు, ప్రవేశద్వారం, రేలింగ్, కట్ట వెడల్పు, కట్ట బలోపేతం చేయడంతో పాటు రాతి కట్టడాలు చేస్తున్నారు. రూ.98 లక్షలతో కట్టపై భారీ జాతీయ పతాకం, భువనగిరి లవ్ చిహ్నం ఏ ర్పాటు చేశారు. ఆలాగే విద్యుత్దీపాలు, పార్కులు, వ్యూ పాయింట్, బోటింగ్ తదితర ఏర్పాట్లు జరుగుతున్నాయి.భువనగిరి పెద్దచెరువుకు పర్యాటక సొబగులు రూ.6,20 కోట్లతో సుందరీకరణ చివరి దశకు చేరిన పనులు త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లుసందర్శకులతో సందడిగా.. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి పక్కన పెద్ద చెరువు ఉంది. చెరువు నిండా నీరు ఉండడంతో పాటు ఆహ్లదం పంచే వివిధ రకాల మొక్కలు, గ్రీనరీ, నిర్మాణాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఉదయం వాకర్స్, సాయంత్రం స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చిన వారు చెరువు వద్ద ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ ఆటపాటలతో అనందంగా గడుపుతుండడంతో సందడి నెలకొంది. -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. వేకువజామున ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేశారు. ప్రధానాలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, సువర్ణ పుష్పార్చన, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడవీధిలో ఊరేగించారు. ఆయా వేడుక ల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు వసతులు కల్పించారు. -
‘రీజినల్’ అలైన్మెంట్ మార్పించండి
చౌటుప్పల్ : అశాసీ్త్రయమైన అలైన్మెంట్ వల్ల చౌటుప్పల్ మున్సిపాలిటీ రెండు ముక్కలు అవుతుందని, ఎంతోమంది ఆస్తులు కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని, ఎలాగైనా ఉత్తరభాగంలో రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పించాలని చౌటుప్పల్, భువనగిరి ప్రాంతాలకు చెందిన భూ నిర్వాసితులు కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని వేడుకున్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లో కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. నిబంధనలు పాటించకుండా అలైన్మెంట్ రూపొందించడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య నిబంధనల ప్రకారం 40కిలో మీటర్ల వ్యవధి ఉండాలని, కానీ, చౌటుప్పల్ ప్రాంతంలో కేవలం 28 కిలో మీటర్ల దూరంలోనే అలైన్మెంట్ రూపొందించి తమను రోడ్డుపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు, నివాస గృహాలు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటి వరకు 5 శాతం మంది నిర్వాసితులు కూడా అంగీకరింంచలేదన్నారు. ఇక్కడి పరిస్థితులను కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర మంతి నితిన్ గడ్డరీకి వివరించాలని కోరారు. మంత్రి స్పందిస్తూ మరోసారి కేంద్ర మంత్రి దగ్గరకు తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు భూ నిర్వాసితులు తెలిపారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్రెడ్డిని కూడా కలిసి సమస్య వివరించాలని నిర్వాసితులకు మంత్రి సూచించారు. మంత్రిని కలిసిన వారిలో భూనిర్వాసితుల ఐక్య వేదిక కన్వీనర్, చౌటుప్పల్ సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, నిర్వాసితులు దబ్బటి రాములు, సందగళ్ల మల్లేష్గౌడ్, బోరెం ప్రకాష్రెడ్డి, జాల వెంకటేష్, శ్రీశైలం, వల్లూరి బోవయ్య, దశరథ, బొమ్మిరెడ్డి ఉపేందర్రెడ్డి, పంకెర్ల యాదయ్య, చింతల సంజీవరెడ్డి, జాల జంగయ్య, మైసయ్య, అంజయ్య, రమేష్, పాండు, అనిల్, శ్రీనివాస్, జాల భార్గవి, గంగదేవి పార్వతమ్మ, చంద్రమ్మ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితుల వినతి -
సులభంగా నేర్చుకోవచ్చు
భువనగిరి : మండలంలోని తుక్కాపురం ప్రాథమిక పాఠశాలలో ఏఐ ఆధారిత బోధన కార్యక్రమాన్ని శనివారం జిల్లా సెక్టోరియల్ అధికారి పెసరు లింగారెడ్డి ప్రారంభించారు. ఏఐ బోధనతో వెనుకబడిన విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందన్నారు. రాయడం, చదవడం సులభంగా నేర్చుకోచ్చన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ఏఐ ఆధారిత బోధన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈవిధానం చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడు రాఘవరెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపోధ్యాయుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు సదానంద, జనార్దన్, బ్రహ్మచారి, బుచ్చిరెడ్డి, లక్ష్మణ్బాబు, పద్మ, సునీత పాల్గొన్నారు. -
‘కృత్రిమ మేధ’ తో విషయ పరిజ్ఞానం
బీబీనగర్: విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంపొందింపజేసే విధంగా జ్ఞాపక శక్తితో కూడిన విద్యను అందించాలని కలెక్టర్ హనుమంతరావు ఉపాధ్యాయులకు సూచించారు. బీబీనగర్ మండలం జమీలాపేట జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్–ఏఐ)తో కూడిన బోధన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కంప్యూటర్ ద్వారా ఆర్టిఫీషి యల్ ఇంటిలిజెన్స్ తీరును పరిశీలించారు. విద్యార్థులు గణిత శాస్త్రంలో ప్రగతిని సాధించేందుకు ఉపయోగిస్తున్న ఏఐ టెక్నాలజీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం రాయరావుపేట నుంచి నెమురగొముల వైపు ప్రవహిస్తున్న అండర్గ్రౌండ్ డ్రెయినేజీని పరిశీలించారు.ఇరు గ్రామాల మధ్య సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. కలెక్టర్ హనుమంతరావు -
వృథా అరికట్టకపోతే కటకటే!
సాక్షి, యాదాద్రి : భానుడు రోజురోజుకూ మండిపోతున్నాడు. భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో మంచినీటి ఎద్దడి తరుముకొస్తోంది. మిషన్ భగీరథ నీరు డిమాండ్కు అనుగుణంగా సప్లయ్ కాకపోగా.. వచ్చే నీటిలోనూ కొంతమేర లీకేజీలు, సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పుడు వృథా అవుతోంది. ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించిన యంత్రాంగం.. జిల్లాలోని 17 మండలాల్లో నీటి సరఫరా స్థితిగతులను పరిగణలోకి తీసుకుని సమస్యను అధిగమించేందుకు యాక్షన్ప్లాన్ రూపొందించింది. అవసరమైన చోట ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకోవాలని, ట్యాంకర్ల దారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా నీటి వృథాను అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలకు ఉపక్రమించింది. 719 ఆవాసాలకు భగీరథ నీరుజిల్లాలోని 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలోని 719 అవాసాలకు మిషన్ భగీరథ సరఫరా జరుగుతుంది. ఇందులో 512 ఆవాసాలకు హైదారాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా, 131 ఆవాసాలకు అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, 69 గ్రామాలకు నల్లగొండ ఉదయసముద్రం నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. డిమాండ్కు అనుగుణంగా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 14 ఎంఎల్డీలు, ఉదయ సముద్రం నుంచి 10.8 ఎంఎల్డీల నీరు ప్రతి రోజూ సరఫరా జరుగుతోంది. ఇక హైదారాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా నిత్యం 80.51 ఎంఎల్డీల నీరు రావాల్సి ఉండగా కొద్ది రోజులుగా 47.75 ఎంఎల్డీలు మాత్రమే వస్తుంది. నల్లా కనెక్షన్లు, ట్యాంకులు ఇలా..జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 1,221 ట్యాంకులు, 353 చేతిపంపులు, 33 బావుల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మొత్తం 1,56,147 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా 642 ఇళ్లకు నల్లాలు లేకపోవడంతో వాటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డెక్కుతున్న జనంనీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో జనం ఆందోళనకు దిగుతున్నారు. భువనగిరి మండలం హన్మాపురంలో నీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు ఇటీవల రోడ్డెక్కారు. అదే విధంగా వడపర్తి గ్రామస్తులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. 167 ఆవాసాల్లో ముప్పు వేసవిలో నీటి ముప్పును గ్రహించిన మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ విభాగం అధికారులు ఫిబ్రవరిలోనే క్షేత్రస్థాయిలో సర్వే చేసి నీటి ఎద్దడి పొంచి ఉన్న ప్రాంతాలను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 167 ఆవాసాల్లో ముప్పు ఉందని అంచనా వేశారు. ఈ మేరకు ముందస్తుగానే ప్రత్యామ్నా చర్యలు చేపట్టారు. పుట్టగూడెం, మల్లాపూర్, చాకంపల్లి, ధర్మోజిగూడెం, దేశ్ముఖ్, ఎం,తుర్కపల్లి, జనగాం, శ్రీనివాసపురం గ్రామాల్లో ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకున్నారు. అవసరాన్ని బట్టి మరికొన్ని బోర్లను అద్దెకు తీసుకోనున్నారు. వేసవి ప్రారంభంతోనే తాగునీటి ఎద్దడి డిమాండ్ మేరకు సరఫరా కాని మిషన్ భగీరథ జలాలు పైపులైన్ లీకేజీలు, సాంకేతిక సమస్యలు పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ రూపొందించిన యంత్రాంగం అవసరమైన చోట అద్దెబోర్లు, అదనపు పైపులైన్ల ఏర్పాటు ట్యాంకర్లతో సరఫరా చేయాలని నిర్ణయంనీటిని వృథా చేయొద్దు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా డిమాండ్కు అనుగుణంగా నీటి సరఫరా జరగడం లేదు. రోజూ వచ్చే నీటిలో దాదాపు సగానికి తగ్గాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తుతోంది. సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. అవసరమైన ప్రాంతాల్లో అద్దె బోర్లు తీసుకుంటున్నాం. అదనపు పైప్లైన్లు వేస్తున్నాం. నీటిని వృథాగా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. – కరుణాకర్, మిషన్ భగీరథ ఈఈఅప్రమత్తంగా ఉండాలి బీబీనగర్ : తాగునీటి సరఫరా విషయంలో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ శోభారాణి సూచించారు. బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామంలో ఆమె శనివారం పర్యటించారు. గ్రామంలో తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. నిరుపయోగంగా ఉన్న బోర్లను పరిశీలించారు. ప్రతి ఇంటికీ నీటి స్వచ్ఛమైన నీటి సరఫరా జరగాలన్నారు. ఆమె వెంట ఏంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రవికిరణ్, పంచాయతీ కార్యదర్శి బాలలక్ష్మి ఉన్నారు. -
ఫిర్యాదు చేస్తే పది రోజుల్లోనే పరిష్కారం
భువనగిరి : ఇంటి పన్ను ఎక్కువగా వస్తుందా.. పన్నుల విధింపులో లోపాలున్నాయా.. ఒకే ఇంటికి రెండు నంబర్లు ఉన్నాయా.. ఇలాంటి సమస్యలు పరిష్కరించేందుకు మున్సిపల్ యంత్రాంగం రెవెన్యూ మేళాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. ఈనెలాఖరు వరకు మేళాలు కొనసాగనున్నాయి. ఎక్కువగా ఉన్న సమస్యలు ఇవీ.. జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూర్, భూదాన్పోచంపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 37,126 నిర్మాణాలు ఉన్నాయి. ప్రధానంగా ఆస్తిపన్ను ఎక్కువగా వస్తుందని, తప్పుడు కొలతలు, ఒకే ఇంటికి రెండు నంబర్లు, ఇంటి నంబర్ ఆన్లైన్లో నమోదు కాకపోవడం, యజమాని పేరు మార్పిడి, నివాస గృహాలకు వాణిజ్య పన్ను రావడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు రివిజన్ పిటిషన్లూ పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు అన్ని మున్సిపాలిటీల్లో రెవెన్యూ మేళాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సోమ, గురువారాల్లో మార్చి 31వ తేదీ వరకు మేళాలు నిర్వహించనున్నారు. వాటిలో దరఖాస్తు చేసుకుంటే సమస్యను పరిష్కరిస్తారు. మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు టోల్ ఫ్రీ నంబర్ను కూడా అందుబాటులో ఉంచారు.సద్వినియోగం చేసుకోవాలి ఆస్తి పన్ను, నీటి పన్ను చెల్లింపు, మదింపునకు సంబంధించి సమస్యలు ఉంటే రెవెన్యూ మేళాలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తాం. ప్రతి సోమ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారులు అందుబాటు ఉంటారు. రెవెన్యూ మేళాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – రామలింగం, భువనగిరి మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీల్లో రెవెన్యూ మేళాలు ప్రతి సోమ, గురువారాల్లో ఉదయం 10నుంచి ఒంటి గంట వరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ సందేహాల నివృత్తికి సంప్రదించాల్సిన నంబర్ 63042 34141ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి సమస్య పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు అందకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా జతపర్చాల్సి ఉంటుంది. డోర్ నంబర్ కోసం : అసెస్మెంట్ కాపీ పేరు మార్పునకు: మ్యుటేషన్ కాపీ లేదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇల్లు తీసేసినట్టయితే ఇంటి పన్ను రద్దు కోసం: ఫొటో, చివరిగా చెల్లించిన ఇంటి పన్ను రశీదు ఇంటి పన్ను ఎక్కువ వచ్చినట్లయితే : అసెస్మెంట్ కాపీ, ఇంటి ఫొటో, సంబంధిత డాక్యుమెంట్ డబుల్ అసెస్మెంట్ : ఇంటి నిర్మాణ అ నుమతి,అసెస్మెంట్ నంబర్, మొదటగా చెల్లించిన ఇంటి పన్ను రశీదు.నిర్మాణాలు ఇలా.. మున్సిపాలిటీ నిర్మాణాలు భువనగిరి 14,245చౌటుప్పల్ 6,675ఆలేరు 4,124యాదగిరిటుట్ట 4,354పోచంపల్లి 3,879మోత్కూర్ 3,849 -
ఇంటర్ పరీక్షలకు 4,590 మంది హాజరు
భువనగిరి : ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన ద్వితీయ సంవత్సరం గణితం జువాలజీ, హిస్టరీ పరీక్షలకు 4,730 మందికి గాను 4,590 మంది హాజరయ్యారు. 140 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. పోరుబాటతో ప్రజా సమస్యలు వెలుగులోకి..యాదగిరిగుట్ట: సీపీఎం చేపట్టిన పోరుబాట కార్యక్రమంతో ప్రజా సమస్యలు వెలుగులోకి వస్తున్నాయని జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో శని వారం నిర్వహించిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కార్ పదేళ్లలో ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని విమర్శించారు. హామీల్లో ఒకటి, రెండు తప్ప ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయన్నారు. పోరుబాటలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈనెల 27, 28, 29 తేదీల్లో తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల ముట్టడి, ఏప్రిల్ రెండవ వారంలో కలెక్టరేట్ ఎదుట 48 గంటల మహాధర్నా నిర్వహిస్తామన్నారు. అంతకుముందు పోరుబాట కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు కల్లూరి మల్లేశం, బబ్బూరి పోశెట్టి, గడ్డం వెంకటేష్, పెద్దకందుకూరు మాజీ సర్పంచ్ భీమగాని రాములు, బీమగాని మాధవి, మండల కమిటీ సభ్యులు కాలే స్వామి తదితరులు పాల్గొన్నారు. రూ.2వేల కోట్లు కేటాయిస్తేనే ప్రయోజనంమోత్కూరు : రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి రూ.2 వేల కోట్లు కేటాయించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మోత్కూరులో జరిగిన చేనేత కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్రిఫ్టు, చేనేత భరోసా పథకాలను ప్రకటించినా ఇప్పటి వరకు కార్యాచరణ రూపొందించలేదన్నారు. గత ప్రభుత్వం చేనేత సహకార సంఘాలను నిర్వీర్యం చేసిందని, కాంగ్రెస్ సర్కార్ కూడా అదే బాటలో నడుస్తుందన్నారు. చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ అప్పు మాఫీ చేయాలని, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోచం కన్నయ్య మాట్లాడుతూ స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చీరలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ, వాటిని నేసే బాధ్యత పవర్లూమ్ యజమానులకు అప్పగించిందన్నారు. సమావేశంలో చేనేత సంఘం నాయకులు వంగరి రాములు, చుంచు లక్ష్మయ్య, వేముల నర్సయ్య, శ్రీనివాస్, దోర్నాల మత్స్యగిరి, జెల్ది సోమయ్య, పెండెం రాజారామ్, ఏలూరి మత్స్యగిరి, పోచం రాము, వాసు పాల్గొన్నారు. జియో ట్యాగ్ నంబర్లు కేటాయించాలని వినతిభువనగిరిటౌన్: జియో ట్యాగింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న చేనేత కార్మికులకు వెంటనే నంబర్లు కేటాయించాలని కోరుతూ చేనేత కార్మిక సంఘం సభ్యలు శనివారం చేనేత, జౌళీ శాఖ ఏడీకి వినతిపత్రం అందజేశారు. జియో ట్యాగింగ్ కోసం జిల్లాలో సుమారు 2వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, నంబర్ కేటాయించకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే జియోట్యాగ్ నంబర్ తప్పనిసరి చేసిందన్నారు.అనంతరం ఏడీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసికంటి లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత బిడ్డలదే
చౌటుప్పల్ : తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను పొందడమే కాదు.. వారి సంరక్షణ, పోషణ బాధ్యత బిడ్డలదేనని సీనియర్ సిటిజన్, తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ ట్రిబ్యునల్ చైర్మన్ వెల్మ శేఖర్రెడ్డి పేర్కొన్నారు. చౌటుప్పల్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన బాధితుల నుంచి అందిన ఫిర్యాదులపై శనివారం ట్రిబ్యునల్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. ఇరుపక్షాలను పిలిపించి వారి వాదనలు విన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తల్లిదండ్రులంటే ఆస్తులు సంపాదించే వరకే అనుకోవడం దుర్మార్గమన్నారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను అనుభవిస్తూ వారి మంచిచెడులను మాత్రంపట్టించుకోకపోవడం సరైందికాదన్నారు. ఆస్తులను తమ పేర రాయించుకుని, తల్లిదండ్రులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే కఠిన తీర్పులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని, లేనిపక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి వస్తుందన్నారు. తల్లిదండ్రులు ట్రిబ్యునల్కు వచ్చి ఫిర్యాదు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ట్రిబ్యునల్ సభ్యుడు, సీనియర్ న్యాయవాది ముత్యాల సత్తిరెడ్డి, సెక్షన్ ఇంచార్జి అధికారి సురేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్, సంరక్షణ, పోషణ ట్రిబ్యునల్ చైర్మన్ శేఖర్రెడ్డి -
ఫీజు బకాయిలు చెల్లించకపోతే పరీక్షలు బంద్
మోత్కూరు : రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు వెంటనే ఫీజు బకాయిలు చెల్లంచాలని, లేనిపక్షంలో వార్షిక పరీక్షలు నిర్వహించబోమని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షుడు మారం నాగిరెడ్డి హెచ్చరించారు. సంఘం కార్యదర్శి ఎం.సైదారావు, ఉపాధ్యక్షుడు సీహెచ్ సత్యంగౌడ్తో కలిసి శనివారం మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, ఎగ్జామ్ కంట్రోలర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోత్కూరులో విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయవద్దని, ఆర్టీఎఫ్ ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తుందని గత, ప్రస్తుత ప్రభుత్వాలు చెప్పాయని గుర్తు చేశారు. కానీ, నెలల తరబడి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి కళాశాలలు నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నామని చెప్పారు. ఫీజు బకాయిలు చెల్లించకపోతే 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించలేమని స్పష్టం చేశారు. -
యాదగిరి క్షేత్రంలో ఘనంగా హోలి సేవ
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం హోలి సేవ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీస్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం పడమటి రాజగోపురం ఎదుట గల వేంచేపు మండపంలో అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేసి, పారాయణం పఠించారు. ప్రధానార్చాకులు హోలి సేవ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం ఉత్సవ మూర్తులపై రంగులు చల్లారు. ఆ తరువాత భక్తులు పరస్పరం రంగులు చల్లుకున్నారు. ఈ వేడుకలో ఆలయ అనువంశిక ధర్మకర్త, ఆచార్యులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. -
ఏప్రిల్ 20నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
భువనగిరి : సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి కి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని శుక్రవారం సబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్ ప్రశ్న పత్రాలు నేడు మండలాలకు చేరవేత భువనగిరి : పదో తరగతి పరీక్షలకు సంబంధించి సెట్ వన్ ప్రశ్న పత్రాలు శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరాయి. వీటిని శనివారం మండల కేంద్రాలకు తరలించనున్నట్లు డీఈఓ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 8,631 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. నేత్రపర్వం.. ఊంజల్ సేవోత్సవం యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం జరిపించారు. ఆండాళ్దేవికి ఇష్టమైన నాధ స్వరాన్ని వినిపించారు. ఇక ప్రధానాలయంలో నూ సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివా రిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలు, ప్రతిష్టా అలంకార మూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం సుదర్శన హక్షమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం తదితర పూజలు నిర్వహించారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి భూదాన్పోచంపల్లి : రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకు కూడా రూ.2లక్షల లోపు రుణాలు మాఫీ చేయాలని చేనేత జన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కర్నాటి పురుషోత్తం ప్రభుత్వాన్ని కోరారు. చేనేత కార్మికుల్లోనూ చాలా మంది నిరుపేదలు ఉన్నారని, నేత వృత్తిపైనే వారి కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయన్నారు. నేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రుణాలు చెల్లించలేకపోతున్నారని, వడ్డీలు పెరిగిపోయినట్లు తెలిపారు. చాలా మంది కార్మికులు రూ,లక్షకు పైగా బకాయి పడ్డారని వారందరికీ రూ.2లక్షల లోపు మాఫీ చేయాలని పేర్కొన్నారు. రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేసినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులకు ఆర్థిక భారం నుంచి విముక్తి లభించనుందన్నారు. ఐఈఆర్పీలను క్రమబద్ధీకరించాలి నాగారం: రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు విద్యాబోధన చేస్తున్న ఐఈఆర్పీ(ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్)లను సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రెగ్యూలరైజ్ చేయాలని ఐఈఆర్పీల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పెండెం శ్రీనివాస్ కోరారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2023–24 లెక్కల ప్రకా రం 81వేల మంది దివ్యాంగ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదై ఉన్నారని, వీరికి 790 మంది ఉపాధ్యాయులు 19 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నారని తెలిపారు. -
జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఏర్పాటు చేయాలి
పండ్లు, నిత్యావసరాలు మొదలుకొని బంగారం వరకు వినియోగదారులు మోసపోతున్నారు. నిత్యం తాగే పాలు సైతం కల్తీ జరుగుతున్నాయి. నాసిరకం ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఫుడ్ సేఫ్టీతో పాటు డ్రగ్ ఇన్స్పెక్టర్, తూనికలు కొలతల శాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తుండాలి. వినియోగదారుల పరిరక్షణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. భువనగిరిలో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఏర్పాటు చేయాలి. –కొడారి వెంకటేశ్, వినియోగదారుల సంఘం ప్రతినిధి ● -
కృత్రిమమేధతో బోధన
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నేటి నుంచి అమలు 20 నిమిషాల వ్యవధిలో పాఠం ప్రత్యేక సాఫ్ట్వేర్తో విద్యార్థులను ఆకట్టుకునేలా ఏఐ బోధన అందిస్తారు. ఎంపిక చేసిన 3 నుంచి 5 తరగతుల విద్యార్థులను అయిదుగురికి ఒక బ్యాచ్ ఏర్పాటు చేస్తారు. ఒక్కో బ్యాచ్కు తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలు బోధిస్తారు. ఆ విద్యార్థి అర్థం చేసుకుంటున్నాడా, లేదా అని ఏఐ గుర్తించి అర్థం కాకపోతే సరళమైన మార్గంలో బోధిస్తుంది. అర్థం అయ్యిందంటే మరికొంత మెరుగైన పద్ధతిలో బోధన అందిస్తుంది. ఇలా ప్రతి విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను మదింపు చేయడంతో పాటు, గతంతో పోలిస్తే పురోగతి ఎలా ఉందో పరిశీలించి ఆయా విద్యార్థులపై ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తారు. జిల్లాలోని ఏడు మండలాల్లో తొమ్మిది పాఠశాలలు ఎంపిక చదువులో వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక తరగతులు ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం కొత్త కార్యక్రమం ఇప్పటికే టీచర్లకు శిక్షణ పూర్తిభువనగిరి: సర్కారు బడుల్లో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ) సాయంతో విద్యార్థులను ఆకట్టుకునేలా, సులభ రీతిలో వినూత్న బోధన చేయనుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో శనివారం నుంచి పాఠ్యాంశాలు బోధించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 7 మండలాల నుంచి 9 పాఠశాలలు ఎంపికయ్యాయి. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో మెరుగైన ఫలితాలు రావడంతో ఏఐ విధానాన్ని మిగతా అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. నిపుణులైన ఉపాధ్యాయులకు శిక్షణ ఏఐ బోధనకు ప్రతి జిల్లాలోనూ కొన్ని పాఠశాలలను గుర్తించి ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో బోధించేందుకు నిపుణులైన ఉపాధ్యాయులు, జిల్లా సమన్వయ అధికారులకు ఈనెల 11న రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. కాగా జిల్లా కేంద్రంలో ఈనెల 12న సంబంధిత ఎంఈఓలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, పాఠశాల ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఏఐ బోధనపై శిక్షణ కూడా ఇచ్చారు. ఎంపికై న పాఠశాలల్లో శనివారం నుంచి ఏఐ బోధన ప్రారంభంకానుంది. మెరుగైన సామర్థ్యాల సాధనకు.. ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో మౌలిక భాష, సంఖ్యా జ్ఞానం అభ్యసనతోపాటు గణితంలో చతుర్విద ప్రక్రియల్లోనూ ఆశించిన స్థాయి సామర్థ్యాలు సాధించకపోవడంతో విద్యలో వెనుకబాటుకు గురవుతున్నారు. పలు రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ సాయంతో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన సామర్థ్యాల సాధనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. చదవడం, రాయడం సులభంగా అలవడుతుంది చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఏఐ బోధన ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా పాఠశాలలో మూడు రకాల విద్యార్థులు ఉంటారు. ఇందులో మూడో రకం విద్యార్థులకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు చేసే బోధనకు అదనంగా ఏఐ బోధన ఉంటుంది. దీని వల్ల విద్యార్థికి చదవడం, రాయడం సులభంగా అలవడుతుంది. కంప్యూటర్ స్క్రీన్పై ఏఐ బోదన రోజూ 20 నిమిషాలు ఉంటుంది. –సత్యనారాయణ, డీఈఓ ఎంపికై న పాఠశాలలు ఇవీ..ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ భోదనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో తొమ్మిది ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో చౌటుప్పల్ మండలంలోని జైకేసారం, దేవలమ్మనాగారం, యాదగిరిగుట్ట మండలంలో పెద్దకందుకూరు, చొల్లేరు, ఆలేరు మండలంలో కొల్లూరు, మోటకొండూరు మండలంలో ముత్తిరెడ్డిగూడెం, భువనగిరి మండలంలో తుక్కాపురం, బీబీనగర్ మండలంలో జమిలాపేట, రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం పాఠశాలలు ఉన్నాయి. -
కొనేదాంట్లో కొట్టేస్తున్నారు!
వస్తు విక్రయాల్లో మోసం ఫ వేయింగ్ మిషన్లలో తేడాలు ఫ నాణ్యతకూ తిలోదకాలు ఫ కనిపించని కల్తీతో ప్రజారోగ్యానికి ముప్పు ఫ తనిఖీలకు దూరంగా అఽధికారులు ఫ వినియోగదారులకు ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియని దుస్థితి ఫ నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం భువనగిరి పట్టణంలో కొందరు వ్యక్తులు మొబైల్ వాహనంపై ఉల్లిగడ్డ కొనుగోలు చేశారు. అనుమానం రావడంతో వేరే షాప్కు వెళ్లి కాంటా వేశారు. ఐదు కిలోల బ్యాగులో 200 గ్రామాలు, పది కిలోల బస్తాలో 500 గ్రాముల వరకు తక్కువ వచ్చింది. వ్యాపారి కోసం చూడగా అప్పటికే అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఎర్ర ఉల్లిగడ్డ కిలో రూ.35, తెల్ల ఉల్లిగడ్డ రూ. 30 ఉంది. మోటకొండూరుకు చెందిన లోడే పుష్పమ్మ భువనగిరిలోని ఓ బంగారం షాపులో 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం కొనుగోలు చేసింది. స్వగ్రామంలోని స్వర్ణకారుని వద్ద చెవి కమ్మలు చేయించుకుంది. ఆ తరువాత మరో స్వర్ణకారుడి వద్ద పాత కమ్మలనే కొత్త డిజైన్తో తయారు చేయించుకుంది. కొంతకాలం తరువాత బంగారం కొనుగోలు చేయడానికి హైదరాబాద్లోని ఓ జ్యువెలరీ షోరూమ్కు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. చెవి కమ్మలను తూకం వేయించగా 18 క్యారెట్లే ఉంది. -
గ్రూప్స్లో మెరిశారు
రామన్నపేట: రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన సిలువేరు సురేష్ శుక్రవారం విడుదలైన గ్రూపు– 3 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించాడు. అదేవిధంగా ఈనెల 11న ప్రకటించిన గ్రూపు– 2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకు పొందాడు. గతంలో గ్రూపు– 4 పరీక్షల్లో విజయం సాధించి ప్రస్తుతం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్– 1 సాధించడమే తన లక్ష్యమని సురేష్ పేర్కొంటున్నాడు. గ్రూప్– 2, 3, 4 సాధించిన నారాయణపురం వాసి చిలుకూరు: మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన బూర భిక్షం కుమారుడు సతీష్ ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 206వ ర్యాంక్ సాధించాడు. తాజాగా విడుదలైన గ్రూప్– 3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 318 ర్యాంక్ సాధించాడు. 2023లో రైల్వేలో జాబ్ వచ్చింది. ఆ ఉద్యోగానికి వెళ్లకుండా గ్రూప్స్కు సన్నద్ధమయ్యాడు. కాగా.. 2024లో గ్రూప్– 4లో ఉద్యోగం సాధించి ప్రస్తుతం సూర్యాపేట కలెక్టరేట్లో సివిల్ సప్లయ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. పరీక్ష రాస్తే విజయమే మోత్కూరు: మోత్కూరుకు చెందిన గుర్రం సాయికృష్ణారెడ్డి ఇటీవల విడుదలైన గ్రూప్– 1 ఫలితాల్లో 900 మార్కులకు గాను 446 మార్కులు సాధించాడు. గ్రూపు–2 ఫలితాల్లో స్టేట్ 11వ ర్యాంకు సాధించాడు. అదేవిధంగా గ్రూపు– 3 ఫలితాల్లో స్టేట్ 29వ ర్యాంకు సాధించాడు. గ్రూపు–4 ఫలితాల్లోనూ జిల్లా మొదటి ర్యాంకు సాధించాడు. సాయికృష్ణారెడ్డి వరుస విజయాల పట్ల ఆయన తల్లిదండ్రులు మోహన్రెడ్డి, స్వరాజ్యం, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శిగా చేస్తూనే.. పెద్దఅడిశర్లపల్లి: మండలంలోని అజ్మాపురం గ్రామానికి చెందిన గడిగ బాలకృష్ణ గ్రూప్– 3 ఫలితాల్లో 285 మార్కులతో 381వ ర్యాంకు సాధించాడు. గ్రూప్– 1లో 400 మార్కులు సాధించగా, గ్రూప్– 2లో 371 మార్కులతో 442వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం చిట్యాల మండలం తాళ్లవెల్లంల గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. చిల్పకుంట్ల వాసికి 91వ ర్యాంకు నూతనకల్: గ్రూప్– 3 పరీక్ష ఫలితాల్లో నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన మందడి శ్యాంసుందర్రెడ్డి రాష్ట్ర స్థాయిలో 91వ ర్యాంకు సాధించాడు. అదేవిధంగా గ్రూప్– 2 పరీక్ష ఫలితాల్లో 400మార్కులు సాధించి రాష్ట్రస్థాయి 63వ ర్యాంకు సాధించాడు. గతంలో వీఆర్ఓ ఫరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం సూర్యాపేట సోషల్ వెల్ఫేర్లో విధులు నిర్వహిస్తున్నాడు. రెండు పరీక్షల్లోనూ కానిస్టేబుల్ ప్రతిభ గుర్రంపోడు: గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన మంటిపల్లి శంకర్ ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో 674 ర్యాంకు సాధించాడు. తాజాగా విడుదలైన గ్రూప్ – 3 ఫలితాల్లో 165 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం సంస్ధాన్ నారాయణపురం పోలీసు స్టేషన్లో సివిల్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్– 3లో స్టేట్ 211వ ర్యాంక్ ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): ఆత్మకూరు మండలం గట్టిగల్లు గ్రామానికి చెందిన కోన లింగయ్య– పద్మల మొదటి కుమారుడు కోన సతీష్ శుక్రవారం విడుదల చేసిన గ్రూప్ – 3 ఫలితాల్లో స్టేట్ 211 ర్యాంక్ సాధించాడు. గత ఎనిమిదేళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ గ్రూప్స్కు సన్నద్ధమయ్యాడు. గత సెప్టెంబర్లో విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో సెలక్ట్ అయ్యాడు. గ్రూప్– 2లో 427వ ర్యాంకు, గ్రూప్– 3లో 700 ర్యాంకుభువనగిరి: గ్రూప్– 3 ఫలితాల్లో భువనగిరి మండలం పెంచికల్పహాడ్ గ్రామానికి చెందిన అనూష రాష్ట్రస్థాయిలో 700వ ర్యాంకు సాధించింది. గ్రూప్– 2లో రాష్ట్ర స్థాయిలో 427వ ర్యాంకు సాధించగా.. జోన్లో ఉమెన్ విభాగంలో 4వ ర్యాంకు సాధించింది. గతంలో ఎకై ్సజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగానికి ఎంపిక కాగా అందులో చేరలేదు. గ్రూపు– 4లో ర్యాంకు సాధించి ప్రస్తుతం కలెక్టరేట్లోని రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తోంది. -
శాశ్వత మరమ్మతులు జరిగేనా!
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్వే మరమ్మతులు ఈ ఏడాది కూడా జరిగేలా లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరుసగా ఏడు సంవత్సరాలు మరమ్మతులకు నోచుకోలేదు. స్పిల్వేపై చాలా లోతుగా గుంతలు పడడంతో లోపలివైపు నుంచి నీటిజాలు రావడం మొదలైంది. 2014 నుంచి 2021 సంవత్సరం వరకు స్పిల్వే మరమ్మతులకు నోచుకోలేదు. స్పిల్వే మరమ్మతుల ఆవశ్యకతపై నిపుణుల హెచ్చరికల మేరకు 2022 సంవత్సరం జులైలో స్పిల్వే మరమ్మతు పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఎట్టకేలకు 2023లో మరమ్మతులు చేశారు. ఆ సంవత్సరం వరదలు రాకపోవడంతో డిసెంబర్ వరకు పనులు కొనసాగాయి. అయితే, 2024లో సాగర్ ప్రాజెక్టుకు వరద ఎక్కువ రావడంతో అత్యధిక రోజులు గేట్లు ఎత్తారు. దీంతో స్పిల్వే నీటి వత్తిడికి కోతకు గురై మళ్లీ గుంతలుపడ్డాయి. ఎప్పటిలాగే స్పిల్వేపై పెద్దపెద్ద క్యావిటీ(గుంతలు)లు ఏర్పడ్డాయి. వాటికి మరమ్మతులు చేసేందుకు టెండర్లు పిలిచి సంబంధిత సంస్థలకు పనులు అప్పగించాల్సి ఉంది. దీనిపై జనవరి 6న భారీ నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించి స్పిల్వే మరమ్మతులు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు జారీచేశారు. శాశ్వత మరమ్మతులకు పలు సంస్థలతో సంప్రదింపులు స్పిల్వే శాశ్వత ప్రాతిపదిక మరమ్మతులు చేసేందుకు అంతర్జాతీయ సంస్థలతో సాగునీటిశాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవలే రూర్కేలా ఐఐటీ వారు సర్వే నిర్వహించారు. వీరే కాకుండా మరో సంస్థ కూడా స్పిల్వేను సందర్శించింది. శాశ్వత మరమ్మతులు చేయడం సాధ్యం కాకున్నా.. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసేందుకు కనీసం శాశ్వత ఏర్పాట్లు చేయడానికై నా సలహాలు ఇవ్వాలని కోరారు. దీంతో స్పిల్వే దిగువ భాగాన కదిలే క్రేన్లను ఏర్పాటు చేసి దాని నుండి సులభంగా మరమ్మతులు చేసేందుకు క్వావిటీల కొలతలు తీసేందుకు వీలవుతుంది. అలాగే స్టీల్ రాడ్స్, కాంక్రీట్ పైకి పంపడానికి సులభమవుతుందనే అంచనాలకు వచ్చినట్లు సమాచారం. అందుకుగాను క్రేన్లను ఏర్పాటు చేసేందుకు అంచనాలు త యారికీ సంస్థల సంప్రదింపులకు టెండర్ల ఆహ్వానానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎలక్ట్రికల్ పనులకు టెండర్లు సాగర్డ్యాం ఎడమవైపు గల మెయిన్ కంట్రోల్ప్యానల్ ఎలక్ట్రికల్ పనులను నీటిపారుదల శాఖ సర్కిల్ నుంచి ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లకు ఈ నెల 3న ప్రకటన చేశారు. ప్యానల్బోర్డులు పాతవి తొలగించి కొత్తవి కేబుల్తో పాటు మరికొన్ని విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్వే ఫ సాగర్ స్పిల్వేకు ప్రతిసారి తాత్కాలిక పనులే చేస్తున్న ప్రభుత్వాలు ఫ శాశ్వత ప్రాతిపదికన మరమ్మతుల కోసం పలు సంస్థలతో అధ్యయనం ఫ ఈ యేడాది తాత్కాలిక మరమ్మతులకు కూడా ఇప్పటి వరకు కార్యాచరణ లేదు ఫ గత సంవత్సరం అత్యధిక వరదలతో స్పిల్వేపై మళ్లీ గుంతలు నేటి నుంచి మొదలు కానున్న క్రస్ట్గేట్ల నిర్వహణ పనులు ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలోనే జలాశయంలోని నీరు స్పిల్వే దిగువకు వెళ్లింది. దీంతో శనివారం నుంచి క్రస్ట్గేట్ల నిర్వహణ పనులు మొదలు పెట్టనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. డ్యాం సాధారణ నిర్వహణ పనులకుగాను రూ.40లక్షలు ఖర్చవుతాయని అంచనాలను పంపినట్లు తెలిపారు. గ్యాలరీలలోని నీటిని పంప్చేయడంతో పాటు చిన్నచిన్న పనులు చేయడం, సీసీ కెమెరాల మెయింటెనెన్స్, కుడి, ఎడమ కాల్వల గేట్స్ నిర్వహణకు గ్రీజింగ్, రబ్బరు సీళ్లు అమర్చడం, నట్బోల్ట్స్ బిగింపు తదితర పనులు చేస్తారు. అలాగే స్పిల్వే దిగువ భాగాన గల బకెట్ పోర్షన్లో నీటిని డీవాటరింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
యాదగిరి ఆలయ మాడవీధిలో జర్మనీ టెంట్
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ఉత్తర మాడ వీధిలో జర్మనీ టెంట్ ఏర్పాటు చేశారు. వేసవిలో శ్రీస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు నీడ కల్పించేందుకు ఈ టెంట్ను బిగించారు. గతేడాది వేసవిలో సైతం ఈ టెంట్ను ఏర్పాటు చేసి, భక్తులకు ఎండ నుంచి ఉపశమనం కల్పించారు. ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో భక్తులు ఆలయ మాడ వీధిలో నడిచేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆలయాధికారులు జర్మనీ టెంట్ను ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలుకేతేపల్లి: కేతేపల్లి మండలంలోని ఉప్పలపహాడ్ వద్ద 65 నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం డీసీఎంను కారు వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరుకు చెందిన వడ్లపూడి రవికిరణ్ హైదరాబాద్లోని కూకట్పల్లిలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం విజయవాడ నుంచి కారులో హైదరాబాద్కు బయలుదేరాడు. మార్గమధ్యంలో మండలంలోని ఉప్పలపహాడ్ బస్బే సమీపంలో యూటర్స్ తీసుకుంటున్న డీసీఎంను కారు వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈప్రమాదంలో కారు నడుపుతున్న రవికిరణ్కు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేతేపల్లి ఎస్ఐ శివతేజ తెలిపారు. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిర్యాలగూడ రూరల్ ఎస్సై లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. యాద్గార్పల్లి గ్రామానికి చెందిన సికిని యాదగిరి(59) గ్రామంలో బార్బర్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి ఇద్దరు భార్యలుండగా మొదటి భార్య చనిపోవడంతో మద్యానికి బానిస అయ్యాడు. గతంలో ఆమె హోళీ రోజే మృతిచెందడంతో ఆమెను గుర్తు చేసుకుని మనస్తాపం చెందిన యాదగిరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్ రూమ్లోని ఇనుప చువ్వకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు రూరల్ పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండవ భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యందేవరకొండ: దేవరకొండ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దేవరకొండ సీఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకా రం.. గురువారం రాత్రి 12గంటల సమయంలో ఓ వ్యక్తి చనిపోయి ఉన్నాడని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి సుమారు 45సంవత్సరాలు ఉంటా యని తెలిపారు. చామనఛాయ రంగు, ఎత్తు 5.7 అంగుళాలు, అతని దగ్గర లభ్యమైన ఓటర్కార్డుపై అమిత్పహాన్, వెస్ట్ బెంగాల్ అని ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. -
వినియోగదారుడా మేలుకో..
ఫ ఈ– కామర్స్ అనుచిత వ్యాపార విధానాల కట్టడికి ఈ చట్టంలో నిబంధనల రూపకల్పన ఫ తప్పుదారి పట్టించే ప్రకటనలు వెలువరించిన తయారీదారులు, అమ్మకందారులకు జరిమానా ఫ నేడు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంవస్తువుల కల్తీ, నాణ్యతలేమి సమస్యల పరిష్కారానికి రాజదండంలా వినియోగదారుల రక్షణ చట్టం రామగిరి(నల్లగొండ): వినియోగదారుల వివాదాల పరిష్కారానికి భారత ప్రభుత్వం 1986లో వినియోగదారుల ఫోరం చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులకు వస్తు లోపం, సేవా లోపం తలెత్తితే ఈ చట్టం పరిష్కారం చూపుతుంది. ఈ సేవలు మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టం– 2019ను తీసుకువచ్చింది. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు, మధ్యవర్తిత్వం, ఉత్పత్తి బాధ్యత, తయారీదారులకు శిక్షలు, కల్తీ వస్తువుల అమ్మకం లాంటి విషయాల్లో అనేక నిబంధనలను ఈ చట్టంలో పొందుపరిచారు. ఇది వినియోగదారుల హక్కులను కాపాడటానికి, అమలు చేయడానికి పనిచేస్తుంది. హక్కుల ఉల్లంఘన జరిగినా, అనుచిత వ్యాపార విధానాలు అవలంబించినట్లు తెలిసినా, తప్పుదారి పట్టించే ప్రకటనలు వెలువరించినా.. వాటిపై దర్యాప్తు జరిపి వాటి తయారీదారులు, అమ్మకందారులు, ప్రకటనల ప్రచురణ, ప్రసారకర్తలకు జరిమానాలు విధిస్తుంది. మెడికల్, ఇన్సూరెన్స్, అగ్రిమెంట్, విద్యుత్ ప్రమాదాలు, నాసిరకం విత్తనాలు, చిట్ఫండ్, ఎమ్మార్పీ కంటే ఎక్కువ విక్రయించినా, వస్తువుల నాణ్యత వంటి సమస్యలు తలెత్తినా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించవచ్చు. ఈ–కామర్స్ వేదికల అనుచిత వ్యాపార విధానాలు అవలంబించకుండా అడ్డుకోవడానికి కూడా చట్టంలో నిబంధనలు పొందుపరిచారు. పరిష్కారం సులభతరం వినియోగదారుల వివాదాలను సులభంగా పరిష్కరించేందుకు కొత్త చట్టం ప్రాధాన్యమిచ్చింది. ఫిర్యాదులను ఆన్లైన్లోనూ దాఖలు చేయొచ్చు. వినియోగదారులు తన నివాస ప్రాంతంలోని కమిషన్కు కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఒకవేళ ఫిర్యాదును 21 రోజుల్లోగా ఆమోదించినట్లు చెప్పకపోతే దానంతట అదే ఆమోదించబడినట్లుగా భావిస్తారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారణ జరుపుతారు. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ నిబంధనల ప్రకారం రూ.5లక్షల లోపు కేసులు దాఖలు చేయడానికి ఎలాంటి రుసుము ఉండదు. వినియోగదారుల హక్కులు ● జీవితం మరియు ఆస్తికి ప్రమాదకరమైన వస్తువులు, ఉత్పత్తుల సేవల అమ్మకాల నుంచి వినియోగదారులు రక్షణ పొందే హక్కు. ● అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నుంచి వినియోగదారుడిని రక్షించడానికి, వస్తువులు, ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత, పరిమాణం, శక్తి, స్వచ్ఛత, ప్రామాణికం, ధరల గురించి తెలియజేసే హక్కు. ● భరోసా పొందే హక్కు ● వినడానికి, వినియోగదారుల ప్రయోజనాలకు తగిన వేదిక వద్ద తగిన పరిశీలన లభిస్తుందని హామీ ఇచ్చే హక్కు. ● నిర్బంధ వాణిజ్య పద్ధతులు లేదా వినియోగదారుల అనాలోచిత దోపిడీకి వ్యతిరేకంగా పరిష్కారాన్ని కోరే హక్కు. ● వినియోగదారుల అవగాహన హక్కు. కేసుల వివరాలు (2020–2025) సంవత్సరం నమోదైన పరిష్కారమైనవి పెండింగ్ కేసులు 2020 81 78 3 2021 107 100 7 2022 100 88 12 2023 124 80 44 2024 157 29 128 2025 13 – 13 -
ప్రజల్లో చైతన్యం కలగాలి
వినియోగదారుల కమిషన్ చాలా శక్తివంతమైంది. చట్టంపై ప్రజల్లో చైతన్యం రావాలి. ఏ వస్తువైనా కొని నష్టపోతే తమను సంప్రదించవచ్చు. విమాన సేవలు, బ్యాంక్, బోర్డింగ్, కొరియర్, చిట్ ఫండ్, ఎడ్యుకేషన్ సంస్థలు, విద్యుత్ సమస్యలు, మెడికల్, ఇన్సూరెన్స్, గ్యాస్, పోస్టల్, రైల్వే, ఆర్టీసి, టెలిఫోన్, బోర్వెల్, కోల్డ్ స్టోరేజీ వీటిలో ఎలాంటి సమస్యలు కలిగినా వినియోగదారుల కమిషన్ సత్వర న్యాయం చేస్తుంది. జిల్లా వినియోగదారుల కమిషన్లో రూ.50 లక్షల వరకు ఫిర్యాదులు పరిష్కరించబడతాయి. ఆ పై రాష్ట్ర కమిషన్ను సంప్రదించాల్సి ఉంటుంది. – మామిడి క్రిష్టోఫర్, వినియోగదారుల కమిషన్ చైర్మన్ -
ఎస్సై దూషించాడని మహిళ ఆత్మహత్యాయత్నం
చివ్వెంల(సూర్యాపేట): ఎస్సై తనను అసభ్య పదజాలంతో దూషించాడని మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. వల్లాల జానకిరాములు తన కుటుంబ సభ్యులతో కలిసి గత 50 సంవత్సరాలుగా కుడకుడ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి పక్కన ఉన్న అతని బంధువులు వల్లాల రాములు, వల్లాల నరేష్, వల్లాల సురేష్, కొత్త సైదులు, కొత్త శైలజలకు గత కొంతకాలంగా ప్రహరీ విషయంలో వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో ఈనెల 7న స్థానిక పోలీస్ స్టేషన్లో ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో పోలీసులు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలని చెప్పారు. పెద్ద మనుషులు ఈనెల 15కు వాయిదా వేశారు. ఈక్రమంలో జానకిరాములు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అతడిని 13వ తేదీన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ఆ సమయంలో భార్య రమణమ్మ మాత్రమే ఇంట్లో ఉంది. చివ్వెంల ఎస్ఐ మహేశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి మధ్య ప్రహరీ కట్టిస్తుండగా, గమనించిన రమణమ్మ ఇంట్లోంచి బయటకు వచ్చింది. వాయిదా ఉండగా ఎందుకు గోడ కట్టిస్తున్నారని ప్రశ్నించింది. దీంతో ఎస్సై తనను అసభ్య పదజాలంతో దూషించాడని రమణమ్మ ఆరోపించింది. మనస్తాపంతో గురై 14న ఇంట్లో ఉన్న స్లీపింగ్, యాంటి బయోటిక్, పెయిన్ కిల్లర్ మందులు వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన ఇంటి పక్కవారు ఆమెను సూర్యాపేటలోని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతోంది. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఈ విషయంపై ఎస్ఐ మహేశ్వర్ను వివరణ కోరగా.. రమణమ్మ ఇంటి పక్కన ఉన్న కొత్త సైదులు.. తన ఇంటిపై వల్లాల శివరామకృష్ణ అనే వ్యక్తి వేట కొడవలితో దాడి చేసి భయాబ్రాంతులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు చేశాడని తెలిపారు. విచారణ కోసం వెళ్లి తిరిగి వచ్చానని, అక్కడ ఎవరిని ఏమి అనలేదని పేర్కొన్నారు. కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారని ఎస్ఐ తెలిపారు. -
12 నెలలుగా పైసా ఇవ్వలేదు!
‘ఉపాధి’ కార్యాలయాలకు నిలిచిపోయిన నిధులు గ్రాంట్ విడుదల చేయాలి 2022 ఆర్థిక సంవత్సరం వరకు పనిదినాలతో పనిలేకుండా ఖర్చు చేసిన బిల్లులను ప్రభుత్వం చెల్లించేది. 2023 ఆర్థిక సంవత్సరం నుంచి స్లాబ్ విధానం తీసుకువచ్చారు. మూడునెలలకు ఒకసారి విడుదల చేయవలసిన గ్రాంట్ 12 నెలలుగా పెండింగ్లో ఉన్నది. చేతినుంచి విద్యుత్, స్టేషనరీ, రిపేర్లు, నీటి బిల్లులు చెల్లించవలసి వస్తుంది. ప్రభుత్వం స్పందించి నిర్వహణ గ్రాంట్స్ను పూర్తిగా విడుదల చేయాలి. –శ్రీలక్ష్మి, ఏపీఓల సంఘం జిల్లా అధ్యక్షురాలు రామన్నపేట : ఉపాధిహామీ కార్యాలయాల నిర్వహణ భారంగా మారింది. ఏడాది కాలంగా ప్రభుత్వం నిధులు విధిల్చకపోవడంతో ఏపీఓలు అవస్థలు పడుతున్నారు. విద్యుత్, నెట్ బిల్లులు, స్టేషనరీ కొనుగోలు తదితర అవసరాలకు చేతినుంచి ఖర్చు చేస్తున్నారు. 2024 ఏప్రిల్ నుంచి పెండింగ్ ప్రతి మండల కేంద్రంలో భారత్ నిర్మాణ్ రాజీవ్గాంధీ సేవాకేంద్రం పేరుతో ప్రభుత్వం ఉపాధిహామీ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణకు పనిదినాల ప్రాతిపదికన ఏటా మూడు స్లాబ్లుగా నిధులు విడుదల చేస్తుంది. 2 లక్షలలోపు పనిదినాలు పూర్తయిన మండలానికి రూ 65వేలు, 2 లక్షల నుంచ ఇ 3లక్షల పనిదినాలు పూర్తయితే రూ.85వేలు, 3 లక్షలకు పైగా పనిదినాలు రూ.లక్ష చొప్పున చెల్లిస్తుంది. వీటిని ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేస్తుంది. చివరిసారి 2024 మార్చినెల వరకు నిధులు వచ్చాయి. 2024 ఏప్రిల్ నుంచి నిర్వహణ గ్రాంట్ పెండింగ్లో ఉన్నది. ఏపీఓలపై నిర్వహణ భారం ప్రభుత్వం ఇచ్చే నిర్వహణ గ్రాంట్ను విద్యుత్, నెట్ బిల్లులు, స్కావెంజర్ చార్జీలు చెల్లించాలి. కంప్యూటర్లు, ఫ్యాన్లు, ఇతర ఫర్నిచర్ చెడిపోతే మరమ్మతులు చేయించాలి.కంప్యూటర్ల నిర్వహణకు అవసరమైన క్యాట్రేజీ, స్టేషనరీ కొనుగోలు చేయాలి. స్వాతంత్య్ర, గణతంత్ర, రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహించాలి.శానిటేషన్ నిర్వహణకు అవసరమైన వస్తువులను సమకూర్చుకోవాలి. 12 నెలలకు సంబంధించిన గ్రాంట్ పెండింగ్లో ఉంది. పైగా ఉపాధి ఉద్యోగులకు మూడునెలలుగా వేతనాలు రావడం లేదు. దీంతో తమ కుటుంబ బాధ్యతలతో పాటు, కార్యాలయాల నిర్వహణ ఉద్యోగులకు తలకుమించిన భారంగా మారింది. ఫ భారంగా మారిన నిర్వహణ ఫ విద్యుత్, నెట్ బిల్లులు, స్టేషనరీకి సొంత డబ్బులు ఖర్చు చేస్తున్న ఏపీఓలు -
సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
భూదాన్పోచంపల్లి : సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం భూదాన్పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద, మండల వైద్యాధికారిణి శ్రీవాణి, వైద్య సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొపారు. మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అదే విధంగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో గర్భిణులతో మాట్లాడారు. పౌష్టికాహారం ఆవశ్యకత, ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ పోతారెడ్డి, చౌటుప్పల్ డివిజన్ హెల్త్ ఎడ్యుకేటర్ వసంత, సూపర్వైజర్ అరుంధతి, లక్ష్మణ్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారుఫ డీఎంహెచ్ఓ మనోహర్ -
మండలిలో మనది అగ్రస్థానం
‘బ్యూటీ’ఫుల్ ఉపాధి పట్టణాలకే పరిమితమైన బూటీపార్లర్లు గ్రామాల్లోనూ వెలుస్తున్నాయి. బ్యూటీషియన్ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది. నేడే హోలీ- 9లోయాదగిరిగుట్ట: హోలీ పండుగను పురస్కరించుకొని గురువారం రాత్రి యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో కాముడి దహనం ఘనంగా నిర్వహించారు. పూజలు చేసిన అనంతరం కర్రలన్నింటినీ ఒక చోట పేర్చి దహనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది సంప్రదాయ రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. -
17లోగా సీఎంఆర్ అప్పగించండి
సాక్షి,యాదాద్రి : 2023–24 యాసంగి సీజన్కు సంబంధించి కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను ఈనెల 17లోగా ప్రభుత్వానికి అందజేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. గురువారం తన చాంబర్లో మిల్లర్లు, అధికారులతో సమావేశమై సీఎంఆర్పై సమీక్షించారు. 96 శాతం సీఎంఆర్ పూర్తయ్యిందని, నాలుగు శాతం మా త్రమే పెండింగ్ ఉన్నందున గడువులోపు పూర్తి చేసి జిల్లాను ముందంజలో ఉంచాలని కోరారు. ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని ఎవరైనా దుర్విని యోగం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పూర్తిస్థాయిలో సీఎంఆర్ అప్పగించని మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు చేయబోమని చెప్పారు. సమావేశంలో మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మార్త వెంకటేశం, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి ఊపు
పరిధి పెంపు..శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025సాక్షి, యాదాద్రి : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అఽథారిటీ(హెచ్ఎండీఏ) పరిధి మరింత పెరిగింది. రీజినల్ రింగ్ రోడ్డు ఆవల రెండు కిలో మీటర్ల దూరం వరకు విస్తరించనుంది. రీజినల్ రింగ్ రోడ్డు వరకు సమగ్రాభివృద్ధి, భవిష్యత్ అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని 162 గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. ఇందుకు సంబంధించిన మాస్టర్ప్లాన్ రూపకల్పనకు అధికారులు కసరత్తు ప్రారంభించారు సెమీ అర్బన్ ఏరియాగా.. హెచ్ఎండీఏ పరిధిని మరింత విస్తరించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న జీహెచ్ఎంసీ పరిధిని కోర్ అర్బన్ సిటీగా, ఔటర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్ ఏరియాగా నిర్ధారించింది. కాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రస్తుతం భువనగిరి, బీబీనగర్, భూదాన్పోచంపల్లి, చౌటుప్పల్, బొమ్మలరామారం మండలాల వరకు హెచ్ఎండీఏ పరిధి ఉంది. భవిష్యత్ అవసరాల నేపథ్యంలో దీన్ని రీజినల్ రింగ్ రోడ్డు ఆవలి దాకా పెంచారు. దీంతో కొత్తగా తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, వలిగొండ, సంస్థాన్నారాయణపురం మండలాల్లోని పలు గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్ హైదరాబాద్గా పరిగణించనున్నారు. దీని పరిధిలోకి మొత్తం 162 గ్రామాలు రానున్నాయి. అనేక ప్రయోజనాలు హెచ్ఎండీఏ పరిధి పెరగడం ద్వారా జిల్లాకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. శాటిలైట్ టౌన్షిప్లు, అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు సమకూరనున్నాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. యాదాద్రి జిల్లా మీదుగా ఇప్పటికే రెండు జాతీయ రహదారులు (65, 163), రెండు రైల్వే మార్గాలు (సికింద్రాబాద్–ఖాజీపేట, బీబీనగర్– నడికుడి) ఉన్నాయి. కొత్తగా గౌరెల్లి – భద్రాద్రి కొత్తగూడెం వరకు జాతీయ రహదారి నిర్మాణంలో ఉండగా.. సంగారెడ్డి – భువనగిరి వయా చౌటుప్పల్, కంది వరకు మరో నేషనల్ హైవే 161 ఏఏ పనులు ప్రారంభం కానున్నాయి. న్యూస్రీల్హెచ్ఎండీఏ పరిధి పెంచుతూ ఉత్తర్వులు ఫ రీజినల్ రింగ్ రోడ్డు ఆవల రెండు కిలో మీటర్ల వరకు.. ఫ ఔటర్ నుంచి ‘రీజినల్’ వరకు సెమీ అర్బన్గా గుర్తింపు ఫ దీని పరిధిలోకి మొత్తం 162 గ్రామాలు ఫ సమగ్ర అభివృద్ధి, భవిష్యత్ అవసరాల దృష్ట్యా నిర్ణయం ఫ మాస్టర్ప్లాన్ రూపకల్పనకు సన్నాహాలు కొత్తగా కలిపే గ్రామాలు ఇవీ.. సంస్థాన్నారాయణపురం మండలంలోని చిల్లాపురం, చిమిర్యాల, గుడ్డిమల్కాపురం, జనగామ, కంకణాలగూడెం, కొత్తగూడెం, కోతులాపురం, మహ్మదాబాద్, నారాయణపురం, పుట్టపాక, రాచకొండ, సర్వేల్, వాయిలపల్లి తుర్కపల్లి మండలంలో చినలక్ష్మాపురం, దత్తాయిపల్లి, ధర్మారం, గంధమల్ల, గోపాలపురం, ఇబ్రహీంపురం, కోమటికుంట, కోనాపురం, కొండాపురం, మాదాపురం, మల్కాపురం, తుర్కపల్లి, ముల్కలపల్లి, నాగాయపల్లి, పల్లెపహాడ్, రుస్తాపురం, శ్రీనివాసపురం, తిరుమలాపురం, వాసాలమర్రి, వీరారెడ్డిపల్లి, వేలుపల్లి, వెంకటాపురం. వలిగొండ మండలం గోకారం, కంచనపల్లి, పహిల్వాన్పురం, పొద్దటూరు, రెడ్లరేపాక, సంగెం, టేకులసోమవారం, వర్కట్పల్లి యాదగిరిగుట్ట మండలంలో జంగంపల్లి రాజాపేట మండలంలో బేగంపేట, చల్లూరు -
సబ్జైలును సందర్శించిన డీఐజీ
భువనగిరిటౌన్ : జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్ గురువారం భువనగిరిలోని సబ్ జైలును సందర్శించారు. ఖైదీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. భోజనం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. వంటలు రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకువచ్చేందుకు ప్రభుత్వం వివిధ రకాల పథకాలు తీసుకువస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంతోమంది క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారని, అటువంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు రికార్డులను పరి శీలించారు. ఆయన వెంట సబ్జైలర్ నెహ్రూ ఉన్నారు. గ్రూప్–2 ర్యాంకర్కు కలెక్టర్ అభినందన మోత్కూరు : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రూపు–2 ఫలితాల్లో మోత్కూరుకు చెందిన గుర్రం సాయికృష్ణారెడ్డి రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకు సాధించారు. గురువారం కలెక్టర్ను కలువగా అభినందించి శాలువాతో సత్కరించారు. సాయికృష్ణారెడ్డి గ్రూపు–4లో జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు సాధించి ప్రస్తుతం కలెక్టరేట్లోని రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. సాయికృష్ణారెడ్డిని అభినందించిన వారిలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఏఓ జగన్, ఉపాధిహామీ పథకం అంబుడ్స్మెన్ మందడి ఉపేందర్రెడ్డి ఉన్నారు. ఇంటర్ పరీక్షలకు 5,467 మంది హాజరు భువనగిరి : ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గురువారం జరిగి న ప్రథమ సంవత్సరం గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్షలకు 5,777 మంది విద్యార్థులకు గాను 5,467 మంది హాజరయ్యారు. 310 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. ఫిజియోథెరపిస్టుల నుంచి దరఖాస్తుల ఆహ్వానంభువనగిరి : అడ్డగూడూరు, బొమ్మలరామారం, తుర్కపల్లి, మోటకొండూరు, రామన్నపేట, వలిగొండలోని భవిత కేంద్రాల్లో విద్యార్థులకు ఫిజియోథెరపీ సేవలు అందించడానికి అర్హత కలిగిన ఫిజియెథెరపిస్టుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బ్యాచ్లర్ ఆఫ్ ఫిజియోథెరపీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 17 సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు. బీబీనగర్ కానిస్టేబుల్కు ఉమెన్ లెజెండ్ అవార్డు బీబీనగర్ : బీబీనగర్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న వై.అరుణ సూపర్ ఉమెన్ లెజెండ్ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని రవీంద్రభారతిలో శ్రీకొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు అవార్డు ప్రదానం చేశారు. టెన్త్ ప్రశ్న పత్రాలు వచ్చాయ్ భువనగిరిటౌన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్న పత్రాలు గురువారం జిల్లా కేంద్రానికి చేరాయి. కార్గో బస్సులో కలెక్టరేట్కు వచ్చిన ప్రశ్నపత్రాలను అధికారులు పరిశీలించి గదిలో భద్రపరిచి సీల్ వేశారు. శుక్రవారం (నేడు) అన్ని మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లకు బందోబస్తు మధ్య ప్రశ్నపత్రాలను పంపనున్నారు. పరీక్ష ప్రారంభం కావడానికి కొద్ది సమయం ముందు ప్రశ్న పత్రాలను పోలీస్ స్టేషన్ నుంచి పరీక్ష కేంద్రాలకు తరలిస్తారు. -
స్వర్ణగిరీశుడికి తిరుప్పావడ సేవ
భువనగిరి: పట్టణంలోని స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం స్వామివారికి తిరుప్పావడ సేవ నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్య కల్యాణం, సాయంత్రం స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. వేకువజామును సుప్రభాత సేవతో స్వామి, అమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రధానాలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి వెండి జోడు సేవలను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. రాత్రి స్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిమిర్యాలగూడ టౌన్: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మ య్య తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెం గ్రామానికి చెందిన మారేపల్లి సైదులు(60) బుధవారం మిర్యాలగూడ మండలం శ్రీనివాస్నగర్ సమీపంలో గల ఫంక్షన్హాల్లో తన బంధువుల వివాహానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో జడ్జర్ల–కోదాడ హైవేపై రోడ్డు దాటుతుండగా తుంగపాడు నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న బైక్ సైదులును ఢీకొట్టింది. దీంతో అతడి తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ సాయంతో స్థానికులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అదే రోజు రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమార్తె సట్టు నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రైలు ఎక్కుతుండగా జారిపడిన ప్రయాణికుడుఫ రక్షించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిభువనగిరి: రైలు ఎక్కే క్రమంలో జారిపడిన వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) సిబ్బంది రక్షించారు. ఈ ఘటన బుధవారం రాత్రి భువనగిరి రైల్వే స్టేషన్లో జరిగింది. భువనగిరి ఆర్పీఎఫ్ ఎస్ఐ కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బాజిరెడ్డి జగదీష్ అనే ప్రయాణికుడు నిజామాబాద్కు వెళ్లేందుకు బుధవారం రాత్రి భువనగిరి రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకున్నాడు. రాత్రి 8.22 గంటలకు తిరుపతి నుంచి ఆదిలాబాద్కు వెళ్తున్న కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు భువనగిరికి చేరుకుంది. రాత్రి 8.23 గంటలకు స్టేషన్ నుంచి రైలు కదలగా.. జగదీష్ రైలు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్ఫాం మధ్యలో జారిపడ్డాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ హెడ్కానిస్టేబుల్ బాలాజీ గమనించి జగదీష్ను బయటకు లాగాడు. దీంతో అతడికి ఎటువంటి గాయాలు కాలేదు. -
బైక్ను ఢీకొట్టిన ట్రాక్టర్.. వ్యక్తి మృతి
కోదాడరూరల్ : బైక్పై వెళ్తున్న వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని గుడిబండ శివారులో గురువారం జరిగింది. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం శాంతినగర్కు చెందిన తల్లోజు దుర్గాచారి(29) కోదాడ పట్టణంలోని హిందూజా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పనిలో భాగంగా గురువారం బైక్పై కోదాడ నుంచి మేళ్లచెర్వు వెళ్తుండగా కోదాడ మండలం గుడిబండ గ్రామ శివారులో కాపుగల్లు క్రాస్రోడ్లో వేగంగా వస్తున్న ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గాచారికి తీవ్రగాయాలు కాగా స్థానికులు 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారులో నగదు చోరీ నేరేడుచర్ల: కారులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.2.50లక్షలు చోరీ చేశారు. ఈ సంఘటన గురువారం నేరేడుచర్లలో చోటు చేసుకుంది. పట్టణంలోని జాన్పహాడ్ రోడ్డులో గల గంగోత్రి ఆస్పత్రి ఎండీ కనకపూడి మహేష్ తన కారును ఆస్పత్రి ఎదుట నిలిపాడు. బ్యాంకులో నగదు వేసేందుకుగాను కారులో రూ.3లక్షలు ఉన్న బ్యాగును ఉంచి ఆస్పత్రి లోపలికి వెళ్లాడు. తిరిగి మహేష్ వచ్చేసరికి బ్యాగులో రూ.50వేలు మాత్రమే ఉన్నాయి. మిగతా రూ.2.50లక్షలు చోరీకి గురయ్యాయి. దీంతో నేరేడుచర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గిరిజన రైతులకు నాబార్డు చేయూత
దేవరకొండ: నాబార్డు(నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) గిరిజన రైతులకు అండగా నిలుస్తోంది. నాబార్డు మంజూరు చేస్తున్న నిధులతో గిరిజన రైతులు జలసంరక్షణ పనులతో పాటు వివిధ రకాల పంటలు సాగు చేస్తూ ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. దేవరకొండ మండల పరిధిలోని ధర్మతండా, సపావట్తండా, గొల్లపల్లి, వెంకట్తండాను ఐదేళ్ల కిత్రం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నాబార్డు డబ్ల్యూడీఎఫ్ (వాటర్షెడ్ డెవలప్మెంట్ ఫండ్) ఆయా గ్రామాల్లో భూ అభివృద్ధి పనులు చేపట్టింది. తద్వారా ఇక్కడ ఏర్పాటైన వాటర్షెడ్ కమిటీలు రైతుల కోసం వివిధ పనులకు సబ్సిడీలు మంజూరు చేస్తూనే తండాల వాసుల ఉపాధి కల్పనకు కూడా బాటలు వేశాయి. నాలుగు గ్రామాల్లో చేపట్టిన పనులు.. ● నాబార్డు ఎంపిక చేసిన ధర్మతండా, సపావట్తండా, గొల్లపల్లి, వెంకట్తండాల్లో అర్హులైన రైతుల పొలాల్లో మొదటగా లోతట్టు ప్రాంతాల్లో నీరు వృథాగా పోకుండా రాతి కట్టడం, ఫాంపాండ్స్, సంకెన్ పిట్స్, వరద కట్టల నిర్మాణాలు చేపట్టారు. ● నీటి నిల్వలు తగ్గకుండా చూడడం, బోరు రీచార్జ్ కావడం వంటి జలసంరక్షణ పనులు చేశారు. ● ఈ నాలుగు తండాల్లోని 1,100 హెక్టార్ల భూములకు సంబంధించి అర్హులైన రైతులను ఎంపిక చేసి నాబార్డు సహకారంతో యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ(ఏఆర్డీఎస్) ఆధ్వర్యంలో స్ప్రింక్లర్లు, పైపులు, డ్రిప్లు అందించారు. ● దొండ సాగుకు పందిళ్ల ఏర్పాటు, రైతుల పొలాలకు పైప్లైన్ వంటి పనులు చేపట్టి ప్రోత్సహించారు. ● నిధుల విషయంలో రైతుల వాటా 30శాతం ఉండగా నాబార్డు 70శాతం నిధులు మంజూరు చేసింది. ● మొత్తంగా ఐదేళ్లలో గిరిజన రైతుల పొలాల్లో అభివృద్ధి పనులకు నాబార్డు రూ.80లక్షలు మంజూరు చేసింది. దీంతో గిరిజనులు వివిధ పంటలతో పాటు కూరగాయల సాగు చేస్తూ కొంతమేర ఆర్థిక స్వావలంబన సాధించారు. ఫ దేవరకొండ మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో డబ్ల్యూడీఎఫ్ నిధులతో భూ అభివృద్ధి పనులు ఫ ఏఆర్డీఎస్ ఆధ్వర్యంలో రైతులకు స్ప్రింక్లర్లు, పైప్లు, డ్రిప్లు అందజేత ఫ ఉపాధికి బాటలు వేస్తున్న వాటర్షెడ్ కమిటీలు -
ఖేలో ఇండియా పోటీలకు అవకాశం కల్పించాలి
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఖేలో ఇండియా, జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు అవకాశం కల్పించాలని కోరుతూ గురువారం హైదరాబాద్లో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలదేవికి ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ హరీష్కుమార్ నేతృత్వంలో వినతి పత్రం అందజేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో క్రీడా ప్రాంగణాలను జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. క్రీడా ప్రాంగణాల ప్రత్యక్ష పరిశీలన కోసం ఎంజీ యూనివర్సిటీని సందర్శించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట స్పోర్ట్స్ బోర్డ్ సభ్యులు ప్రొఫెసర్ సోమలింగం, శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ రమావత్ మురళి తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక బజార్లు ఏర్పాటు
శాలిగౌరారం: ప్రజలకు నాణ్యమైన ఇసుకను సరసమైన ధరలకు అందించేందుకు మైనింగ్శాఖ ఆధ్వర్యంలో ఇసుక బజార్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీజీఎంబీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్కుమార్ అన్నారు. శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామ సమీపంలో మూసీ నది ఒడ్డున ఉన్న ప్రభుత్వ ఇసుక రీచ్ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మూసీ నది నుంచి ఇసుక రవాణా, ఇసుక స్టాక్ పాయింట్, వేబ్రిడ్జిలను పరిశీలించారు. మూసీ ప్రాజెక్టులోని ఇసుకను నిర్ణీత సమయంలో వెలికితీసి స్టాక్ పాయింట్కు తరలించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు, ఇసుక బజార్లకు ఇసుక రవాణా చేసే వాహనాలు ఇసుక స్టాక్పాయింట్ వద్ద వేచిచూడకుండా త్వరితగతిన లోడింగ్ జరిగేలా యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత రీచ్ నిర్వాహకులకు సూచించారు. ఇసుక వాహనాలను తూకం వేసే వేబ్రిడ్జిని పరిశీలించారు. వేబ్రిడ్జిలో ఏర్పడిన రిపేర్లను తక్షణమే సరిచేసి ఇబ్బందులు తలెత్తకుండా చడాలని సిబ్బందికి సూచించారు. తూకం కోసం ఇసుక వాహనాలు వేచిచూడకుండా అదనంగా మరో వేబ్రిడ్జిని ఏర్పాటు చేయాలని సంబంధిత ఉన్నతాధికారులకు సూచించారు. ఇసుక వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన ఇసుకను అందించేందుకు ప్రభుత్వం హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్మెట్, బౌరంపేట్, వట్టినాగులపల్లిలో ఇసుక స్టాక్పాయింట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుందన్నారు. ఆయా ఇసుక బజార్లను ఈ నెల 15న ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఇసుక రీచ్ల నుంచి ఇసుక బజార్లకు ఇసుకను తరలించి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇసుకను విక్రయించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట మైనింగ్శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ జాకోబ్, అసిస్టెంట్ జియాలజిస్ట్ బాలు, సూపర్వైజర్ మహిపాల్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ సుశీల్కుమార్ -
హోలి.. కావాలి ఆనందాల కేళి
రామగిరి(నల్లగొండ): హోలి పండుగ అనగానే అందరిలో ఉత్సాహం వస్తుంది. చిన్న నుంచి పెద్దల వరకు హుషారుగా రంగులు చల్లుకుంటారు. హోలి పండుగ రోజు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే విషాదాలకు తావులేకుండా ఆనందాలు నిండుతాయి. రసాయన రంగులతో చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతిలో లభించే పదార్ధాలతో తయారుచేసిన రంగులను వినియోగించితే మంచి జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రసాయనిక రంగుల్లో అల్యూమినియం బ్రొమైడ్, లెడ్ ఆకై ్సడ్, మెర్క్యూరీ సల్ఫైడ్, కాపర్ సల్ఫైడ్ వంటివి ఉంటాయని, వీటి వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఒకవేళ కంట్లో పడితే చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. సహజ రంగులతో మేలు... ప్రకృతిలో లభించే పువ్వులు, ఆకులతో రంగులను తయారు చేసుకుంటే శరీరానికి ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మోదుగు పువ్వు, గోగు పువ్వులను నీటిలో మరిగించడంతో రంగు ద్రావణంగా మారుతుంది. ఇలాంటివి చల్లుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మాయిశ్చరైజర్ రుద్దుకోవాలి హోలి ఆడటానికి ముందు చర్మానికి మాయిశ్చరైజర్ వాడాలి. తద్వారా రసాయన రంగులు శరీరానికి అంటుకోవు. చర్మం మొత్తం కప్పిఉండేలా దుస్తులు ధరించాలి. పెదవులు, కళ్ల చుట్టూ పెట్రోలియం జెల్లి రాసుకోవాలి. ఆర్గానిక్ రంగులు వాడితే ఉత్తమం. హోలి పూర్తయిన తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. చర్మంపై ఇరిటేషన్ అనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. – సీహెచ్. వెంకటకృష్ణ, చర్మవ్యాధి వైద్యుడు జాగ్రత్తలు తప్పనిసరి హోలి పండుగ రోజు రంగులు కంట్లో పడే ప్రమాదం ఉంటుంది. తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. కాంటాక్ట్ లెన్స్ వాడే వారు వాటిని తీసి హోలి ఆడాలి. కంట్లో రంగులు పడకుండా అద్దాలు వాడాలి. లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వాడాలి. ఒకవేళ కంట్లో రంగులు పడితే చల్లని నీటితో జాగ్రత్తగా శుభ్రం చేయాలి. కళ్లలో మంటగా అనిపిస్తే కంటి డాక్టర్ను సంప్రదించాలి. – డాక్టర్ తాటిపల్లి ప్రనూషరితేష్, కంటి వైద్యురాలు ఫ కళ్లలో, చర్మంపై రంగులు పడకుండా జాగ్రత్తలు వహించాలి ఫ రసాయనిక రంగులతో ఆరోగ్యానికి ముప్పంటున్న వైద్య నిపుణులు ఫ సహజమైన రంగులు వాడితే మేలు అని సూచన -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
మిర్యాలగూడ అర్బన్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మిర్యాలగూడ పట్టణంలోని శరణ్య గ్రీన్ హోమ్స్లో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. టూ టౌన్ సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన బిశ్వజిత్ చక్రబోటి(44) గత కొద్ది రోజులుగా బెల్ కంపెనీ గెస్ట్ హౌజ్లో సర్వర్గా పని చేస్తున్నాడు. అప్పుల బాధతో మనస్తాపం చెంది గెస్ట్ హౌజ్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. భూవివాదం కేసులో వ్యక్తికి జైలు, జరిమానాభువనగిరి: భూ వివాదం కేసులో వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ భువనగిరిలోని అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి గురువారం తీర్పు వెల్లడించారు. భువనగిరి మండలంలోని బొల్లెపల్లి గ్రామానికి చెందిన జిట్టా శ్రీనివాస్రెడ్డికి అదే గ్రామానికి చెందిన వనం రమేష్, అతని సోదరుడు వనం సుమన్ల మధ్య భూ పంపకాల విషయంలో వివాదాలు నెలకొన్నాయి. ఈక్రమంలో వారు 2020 మే 18న శ్రీనివాస్రెడ్డిపై దాడికి పాల్పడారు. దీంతో ఆయన భువనగిరి రూరల్పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన అప్పటి ఎస్సై శంకరయ్య విచారణ చేసి కోర్టుకు పంపించారు. కేసు కోర్టులో విచారణలో ఉండగానే వనం సుమన్ 2022లో అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. గురువారం భువనగిరిలోని అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి విచారణ చేసి వనం రమేష్కు సంవత్సరం జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు భువనగిరి ఎస్సై సంతోష్కుమార్ తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ మృతి మునుగోడు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం కచలాపురం గ్రామానికి చెందిన జంగ సుజాత(42) తల్లి చీకటిమామిడి గ్రామంలో ఉంటుంది. తన తల్లికి జ్వరం వస్తుండడంతో బుధవారం సుజాత తన కుమారుడితో కలిసి బైక్పై తల్లిని మునుగోడులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకుని తిరిగి చీకటిమామిడికి వెళ్తున్నారు. మార్గమధ్యలో మునుగోడు మండల కేంద్రం పరిధిలోని పత్తి మిల్లు వద్ద గేదెకు ఢీకొట్టి ముగ్గురు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో సుజాత తలకు తీవ్రంగా గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. లారీని ఢీకొట్టిన టిప్పర్.. డ్రైవర్కు గాయాలు హుజూర్నగర్: ముందు వెళ్తున్న లారీని మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్కు గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం హుజూర్నగర్ పట్టణంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు నుంచి హుజూర్నగర్ వైపు మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ హుజూర్నగర్ పట్టణ పరిధిలోకి రాగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో టిప్పర్ డ్రైవర్ కొండా వర్మ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ముత్తయ్య తెలిపారు. గొర్రెల మంద పైకి దూసుకెళ్లిన లారీపాలకవీడు: వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి గొర్రెల మంద పైకి దూసుకెళ్లడంతో 8 గొర్రెలు మృతిచెందాయి. ఈ ఘటన గురువారం పాలకవీడు మండల కేంద్రం సమీపంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకవీడు మండలం నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మలిగిరెడ్డి అంజిరెడ్డి గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే గురువారం కూడా గొర్రెలను మేపడానికి తోలుకెళ్తుండగా.. పాలకవీడు మండల కేంద్రం సమీపంలో లారీ అదుపుతప్పి గొర్రెల మంద పైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 8 గొర్రెలు మృతిచెందాయి. మరికొన్ని గొర్రెలకు గాయాలయ్యాయి. సుమారు రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. పోలీసులు ఘటనా స్దలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జూదరుల అరెస్ట్అనంతగిరి: మండల పరిధిలోని ఖానాపురం శివారులో పేకాట ఆడుతున్న వారిని అనంతగిరి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ నవీన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపురం గ్రామ శివారులో కొందరు పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఖానాపురం గ్రామానికి చెందిన ఐదుగురు పేకాట ఆడుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి నుంచి రూ.1430 నగదు. రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
భూసారాన్ని కాపాడుకుంటేనే అధిక దిగుబడులు
త్రిపురారం: పంటల సాగులో విచ్చలవిడిగా రసాయన మందులు వాడుతుండడంతో భూసారం దెబ్బతింటుందని, భూసారాన్ని కాపాడుకుంటేనే అధిక దిగుబడులతో సాధించవచ్చని త్రిపురారం మండంలోని కంపాసాగర్లో గల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రోగాం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు అన్నారు. గురువారం కంపాసాగర్ కేవీకేలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రైతులకు కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. వరితో పాటు వివిధ రకాల పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు కేవీకే శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. భూమిలోని పోషకాలు మొక్కలకు సమపాలల్లో అందాలంటే సేంద్రియ ఎరువులను వినియోగించుకోవాలన్నారు. చీడపీడల నివారణకు అన్నిరకాల మందులను కలిపి పిచికారీ చేయడం వల్ల పంట నష్టపోవాల్సి వస్తుందన్నారు. వరి పొలంలో యూరియాతో పాటు పొటాష్ వేసుకోవడం వల్ల చీడపీడలను తట్టుకునే శక్తి పెరుతుతుందన్నారు. ప్రస్తుతం వరి పైరులో అగ్గితెగులు, కాండం కుళ్లు తెగులు, సుడిదోమను గమనించామని శాస్త్రవేత్తల సలహాలతో పురుగు మందులు సకాలంలో పిచికారీ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త లింగయ్య, సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్, సస్యరక్షణ శాస్త్రవేత్త రాములమ్మ, యంగ్ ప్రొఫెషనల్స్, కేవీకే సిబ్బంది పాల్గొన్నారు. ఫ కేవీకే కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు ఫ కేవీకేలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు కిసాన్ మేళా -
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా..
ఉద్యోగపరంగా పబ్లిక్ సర్వీస్ చేయాలనే లక్ష్యంతో గ్రూపు పరీక్షలకు సన్నద్ధమై రాశానని, గ్రూపు–2 స్టేట్ 11వ ర్యాంకర్ యాదాద్రి భువనగిరి జిల్లా (yadadri bhuvanagiri district) మోత్కూరుకు చెందిన గుర్రం సాయికృష్ణారెడ్డి తన మనోగతాన్ని వెల్లడించారు. మోత్కూరుకు చెందిన గుర్రం మోహన్రెడ్డి స్వరాజ్యం దంపతులకు సాయికృష్ణారెడ్డి, సాయి సుప్రియ సంతానం. సామాన్య రైతు కుటుంబం. మోత్కూరులో కిరాణం దుకాణం నిర్వహిస్తున్నారు.మోత్కూరులోని సేక్రెడ్ హార్ట్ హైస్కూల్లో పదవ తరగతి వరకు, హైదరాబాద్ (Hyderabad) కొత్తపేట నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్లో ఎంపీసీ పూర్తి చేశారు. అనురాగ్ యూనివర్సిటీలో బీటెక్, సీఈసీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. గ్రూప్–2 ఫలితాల్లో 600 మార్కులకు గాను 422.91 ర్యాంకు సాధించి స్టేట్ లెవల్ 11వ ర్యాంకు పొందారు.సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ పోస్టులు సాధించాలన్నదే నా లక్ష్యం. హైదరాబాద్లోని అశోక్నగర్లో 4 సంవత్సరాలు హాస్టల్లో ఉంటూ స్టడీ హాల్కు వెళ్లి ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సొంతంగా గ్రూపు పరీక్షలకు సిద్ధమై రాశాను. మా పెద్ద తాత మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేసి ప్రజాసేవ చేసిన గుర్రం యాదగిరిరెడ్డి (Gurram Yadagiri Reddy) స్ఫూర్తితో నేను రాజకీయాలు కాకుండా ఉద్యోగం ద్వారా పబ్లిక్ సేవ చేయాలనే లక్ష్యంతో గ్రూపు పరీక్షలు రాస్తున్నాను. రూ.4 లక్షల ప్యాకేజీ జీతం సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని ప్రభుత్వ ఉద్యోగం కోసం వచ్చాను. ఇందులో ప్రధానంగా నా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. ప్రభుత్వ ఉద్యోగమే చేయాలని అమ్మానాన్న పట్టుబట్టారు.చదవండి: అలా.. ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాగ్రూప్–4 ఫలితాల్లో జిల్లా మొదటి ర్యాంకు సాధించాను. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాను. మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. గ్రూప్–3 పరీక్ష కూడా రాశాను. త్వరలో ఆ ఫలితాలు కూడా రానున్నాయి. మా చెల్లెలు సాయి సుప్రియ గ్రూపు–4 లో ర్యాంకు సాధించి మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తోంది’అని తెలిపారు. -
ప్రణయ్ కేసు తీర్పు మార్పునకు నాంది కావాలి
రామగిరి(నల్లగొండ) : మిర్యాలగూడలో జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు సుదీర్ఘ విచారణ అనంతరం నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ నెల 10వ తేదీన ఒకరికి మరణశిక్ష, మిగతా వారికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. ఈ హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్థంగా కోర్టులో సమర్పించడంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ పాత్ర కీలకం. ఈ కేసు విచారణ జరిగిన తీరును బుధవారం ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. కేసు ఎందుకు వాదించాల్సి వచ్చింది? కేసు జరుగుతున్న సమయంలో సాక్ష్యాధారాలు ఎలా సేకరించారు? తదితర వివరాలను ఆయన వెల్లడించారు. 2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ హత్య జరిగింది. నిందితులపై కేసు నమోదు కావడం కోర్టులో హాజరు పరిచారు. నిందితులు బెయిల్పై విడుదల అయ్యారు. దీంతో ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యర్థన మేరకు అప్పటి కలెక్టర్ వి.చంద్రశేఖర్ 2019డిసెంబర్ 2న ఈ కేసుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించారు. అప్పటికే పీడీ యాక్ట్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చిన మారుతీరావు తన కూతురు అమృతవర్షిణిని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఆయన బెయిల్ రద్దు చేయాలని అమృత కోర్టులో పిటిషన్ వేసింది. ఆ తర్వాత మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2020లో చార్జిషీట్ ఈ కేసులో 2020డిసెంబర్ 20న కోర్టు చార్జిషీట్ నమోదు అయింది. ప్రణయ్ తండ్రి బాలస్వామి, భార్య అమృతవర్షిణి, తల్లి ప్రేమలత స్టేట్మెంట్, 20 రోజుల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. కోవిడ్ తర్వాత కేసు విచారణలో కొంత జాప్యం జరిగింది. 2022జూలై 26న జడ్జి బి.తిరుపతి బాధ్యతలు తీసుకున్నాక నిందితులతో పాటు సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేశారు. 2024 జూలైలో జడ్జిగా ఎన్.రోజారమణి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సమయంలో కేసు విచారణ వేగంగా కొనసాగింది. కేసులో కోర్టుకు 102 మంది సాక్షుల పేర్లను సమర్పించగా 78 మంది సాక్షులను విచారించారు. 293 పేజీల డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించాం. పరువు హత్యలు ఆగాలి.. ఈ కేసులో 472 పేజీల రాత పూర్వక వాదనలను, ఏడు సుప్రీం కోర్టు జడ్జిమెంట్లను కోర్టుకు సమర్పించా. 523 పేజీలతో కోర్టు తీర్పు ఇచ్చింది. డిఫెన్స్ న్యాయవాదుల వాదనలను సమర్థంగా తిప్పికొట్టి అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించడంతో నిందితులకు కఠినశిక్షలు పడ్డాయి. ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తమిళనాడు రాష్ట్రంలోని పలు పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. అనేక డిబేట్లు జరుగుతున్నాయి. న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగింది. కుల హత్యలకు పాల్పడే వారికి ఈ తీర్పు కనువిప్పునిస్తుంది. ఇప్పటికీ కుల పరమైన దాడులు, హత్యలు జరుగుతున్నాయి. అవన్నీ ఈ తీర్పుతో ఆగాలి. ఫ ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యర్థనతో స్పెషల్ పీపీగా నియమించారు ఫ ఈ కేసులో 472 పేజీల రాత పూర్వక వాదనలు కోర్టుకు సమర్పించా ఫ ఏడు సుప్రీం కోర్టు జడ్జిమెంట్లను అందజేశా ఫ కుట్రలన్నీ కోర్టులో నిరూపణయ్యాయి ‘సాక్షి’తో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ -
40.3 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత
ఫ బొమ్మలరామారంలో ఎల్లో అలర్ట్ జారీ భువనగిరిటౌన్: వారం రోజుల క్రితం వరకు మామూలుగానే ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు 36 నుంచి 37 డిగ్రీలున్న ఉష్ణోగ్రత 40.3 డిగ్రీలకు చేరడంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బొమ్మలారామారం మండలంలో బుధవారం 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. కాగా.. రాజాపేటలో 39.1, నారాయణపురంలో 38.7, ఆలేరులో 38.5, అడ్డగూడూరులో 38.4, గుండాలలో 38.3, చౌటుప్పల్లో 38.2, బీబీనగర్లో 38.1, మోత్కూర్లో 38, తుర్కపల్లిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెనూ ప్రకారం ఆహారం అందించాలిభువనగిరి: మెనూ ప్రకారం ఆహారం అందించడంతో పాటు నాణ్యత ప్రమాణాలను పాటించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం వద్ద ఎస్టీ బాలికల కళాశాల హాస్టల్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏకాగ్రతతో చదువుకుని ఉన్నత విలువలతో తమ లక్ష్యాలను సాధించాలన్నారు. పుస్తకాలను చదివే అలవాటును పెంచుకోవాలన్నారు. హాస్ట ళ్లలో మెనూ పాటించకపోతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు వంట గదిని పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందజేశారు. ఇంగ్లిష్ టు తెలుగు డిక్షనరీలను పంపిణీ చేశారు. రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలి భువనగిరిటౌన్: బ్యాంకు, వ్యవసాయ శాఖ సమన్వయంతో రైతులకు రుణ మార్పు, తక్కువ వడ్డీ సదుపాయంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి మాధవిలత అన్నారు. బుధవారం లీడ్ బ్యాంక్ మేనేజర్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, వ్యవసాయ అధికారి గోపాల్తో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి, రామన్నపేట, రాజాపేటలోని రైతువేదికల్లో వ్యవసాయ న్యాయ సేవా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. న్యాయ సహాయం, సలహాలు న్యాయ సేవా సంస్థల ద్వారా అందించటం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ శివరామకృష్ణ ఉన్నారు. టెండర్ డబ్బులు చెల్లించిన వారికే ధాన్యం ఫ గూగుల్ మీట్లో మిల్లర్లతో అదనపు కలెక్టర్ వీరారెడ్డి సాక్షి,యాదాద్రి: 2022– 23 సంవత్సరానికి టెండర్ ధాన్యం డబ్బులు పూర్తిగా చెల్లించిన మిల్లర్లకే యాసంగి ధాన్యం కేటాయింపులు ఉంటాయని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. బుధవారం జిల్లాలోని రైస్ మిల్లర్లు, అధికారులతో గూగుల్ మీట్ ద్వారా మాట్లాడారు. 10 మంది మిల్లర్లు ఇంకా టెండర్ ధాన్యం డబ్బులు చెల్లించలేదన్నారు. కొన్ని మిల్లుల్లో 2024–25 వానాకాలం ధాన్యం నిల్వ లు లేవని సమాచారం ఉందని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎంఆర్ డెలివరీ వేగవంతం చేయడానికి ప్రతి ఒక్క మిల్లర్ కమిషనర్ ఆదేశాలను పాటించాలన్నారు. బియ్యం సరఫరా పూర్తి చేయని మిల్ల ర్లకు ధాన్యం కేటాయింపులు చేయబోమని తెలిపారు. మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని లక్ష్మీనర్సింహ అగ్రో ఇండస్ట్రీస్ ముక్తాపూర్, ఎల్ఎన్ ఆగ్రోస్ గుండాల మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఇప్పటినుంచి జిల్లా లో ఎనిమిది తనిఖీ బృందాలు ఏర్పాటుచేసి ఒక్కో కమిటీ 6 మిల్లులను చెక్ చేసి నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలన్నారు. సమావేశంలో జిల్లా రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి రానీయొద్దు
భువనగిరిటౌన్: వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ గంగాధర్ ఆదేశించారు. బుధవారం భువనగిరిలోని జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ ప్లానింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ నీరు క్రమం తప్పకుండా సరఫరా అయ్యేలా చూడాలన్నారు. గత సంవత్సరం నీటి ఎద్దడి ఎదుర్కొన్న గ్రామాల్లో సమస్య పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో వెంటనే బోర్లకు మరమ్మతులు, ఫ్లషింగ్ చేయించాలని ఆదేశించారు. నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే స్థానికంగా నీటి సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. జెడ్పీ సీఈఓ శోభరాణి మాట్లాడుతూ.. 2025–26కు సంబంధించి 15 వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర కమిషన్ సిఫార్సు మేరకు రూ.2,16,91,520 నిధులు కేటాయింపు చేసినట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ గంగాధర్ అన్నారు. వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన వాల్పోస్టర్ను బుధవారం జెడ్పీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా వైద్య, విద్య, డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, వ్యవసాయ పశుసంవర్ధక, పబ్లిక్ వర్క్స్, పర్యావరణ, కాలుష్య నివారణ, మున్సిపల్ కమిషనర్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కూడళ్ల వద్ద, పార్కుల వంటి స్థలాల్లో చలివేంద్రాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసి తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ, వైద్యాధికారి, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ గంగాధర్ -
ప్రభుత్వం కరుణించేనా!
సాక్షి, యాదాద్రి: ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు లేక పలు పెండింగ్ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. రీజినల్ రింగ్ రోడ్డు, ఎంఎంటీఎస్, గౌరెల్లి– కొత్తగూడెం జాతీయ రహదారి, మూసీ కాలువల ఆధునీకరణ, బస్వాపురం రిజర్వాయర్ బాఽధితులకు నష్ట పరిహారం, గంధమల్ల రిజర్వాయర్, రోడ్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, టూరిజం సర్క్యూట్కు నిధులు లేక నిలిచిపోయాయి. ఈనెల 19న చేపట్టే వార్షిక బడ్జెట్ సమావేశాల్లోనైనా ఈసారి నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. మూసీకాలువల ఆధునీకరణకు విడుదల కాని నిధులు సాగు నీటి అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం మూసీ కాలువల ఆధునీకరణకు నిధులు కేటాయించింది. ఉమ్మడి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల రైతులకు అదనపు సాగు నీరందించేందుకు కాలువలను మంజూరు చేశారు. ప్రధానంగా బునాదిగాని, పిల్లాయపల్లి, ధర్మారెడ్డి కాలువలను ఆధునీకరించడానికి గత సంవత్సరం ప్రభుత్వం జీవో జారీ చేసింది. పిల్లాయిపల్లి కాలువకు రూ.86.22 కోట్లు,ధర్మారెడ్డికాలువకు రూ.123.98 కోట్లు, బునాదిగాని కాలువకు రూ.266కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా ఆమోదం తెలిపింది. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ముంపు బాఽధితులకు అందని నష్ట పరిహారం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పరిహారం రాలేదు. బీఎన్ తిమ్మాపూర్ నిర్వాసితులకు రూ.109 కోట్లు పరిహారం ఇవ్వాలి. డిసెంబర్లో ముంపు నిర్వాసితులకు రూ.50 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. అయితే పూర్తి స్థాయిలో పరిహారం రాకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. ముందుగా తక్కువ పరిహారం లభించే వారికి ఇవ్వాలని నిర్ణయం కూడా చేశారు. ఈలోపు కాలయాపన కావడంతో రూ.50 కోట్లను ఇతర ప నులకు మళ్లించారు. పరిహారం కోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. దీంతోపాటు భూసేకరణ కు మరో రూ.200 కోట్లు అవసరం ఉన్నాయి. పరి హారం చెల్లిస్తే తప్ప రిజర్వాయర్లో నీటిని నిల్వచేసే పరిస్థితి లేదు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు జిల్లాకు మంజూరు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 55 నియోజకవర్గాలకు సూళ్లను మంజూరు చేసిన ప్రభుత్వం భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు ఒక్కటి కూడా కేటాయించలేదు. రోడ్లకు నిధుల మంజూరు ఏదీ? జిల్లాలోని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల్లో రోడ్లు మంజూరు చేశారు. పలు రోడ్లకు శిలాఫలకాలను కూడా వేశారు. అయితే నిధుల లేమితో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. ఆలేరు– కొలనుపాక రోడ్డుపై బ్రిడ్జిలు, మూసీ కాలువలపై బ్రిడ్జిలు, రాయిగిరి– మోత్కూరు రోడ్డు, చిట్యాల – భువనగిరి రోడ్డు వెడల్పు పనులు ఇలా జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల విలువ చేసే రోడ్ల పనులు నిధులు లేక నిలిచిపోయాయి. గంధమల్లకు నిధులు వచ్చేనా గంధమల్ల రిజర్వాయర్కు ఇటీవల జరిగిన కేబినెట్లో ఆమోదం లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఈ రిజర్వాయర్కు నిధుల కొరత ఉంది. సామర్థ్యం తగ్గించి నిర్మించడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే నిధులు కేటాయిస్తే తప్ప పనులు ప్రారంభం కావు. టూరిజం సర్క్యూట్కు నిధులు అవసరం భువనగిరి, కొలనుపాక, యాదగిరిగుట్ట, భూదాన్పోచంపల్లి, రాయిగిరి ఇలా పలు చోట్ల టూరిజం అభివృద్ధికి నిధుల అవసరం ఉంది. ప్రపంచ టూరిజం గ్రామంగా పోచంపల్లిని మూడేళ్ల క్రితం గుర్తించారు. కానీ నిధులు కేటాయించక ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఫ నిధుల లేమితో ముందుకు సాగని పెండింగ్ ప్రాజెక్టులు ఫ పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగాని కాల్వలకు విడుదల కాని నిధులు ఫ బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు అందని పరిహారం ఫ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లోనైనా నిధులు కేటాయించాలని జిల్లా ప్రజల వేడుకోలుప్రధాన సమస్యలపై ప్రస్తావిస్తా నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. గంధమల్ల, రోడ్లు, అభివృద్ధి పనుల కోసం నిధులు కావాలని సీఎంను కలిసి ఇప్పటికే విజ్ఞప్తి చేశా. బడ్జెట్లో నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. – బీర్ల ఐలయ్య, ప్రభుత్వ విప్, నిధులు మంజూరు చేయాలని కోరుతా భువనగిరి నియోజకవర్గంలో సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు కావాల్సి ఉంది. మూసీ కాలువల ఆధునీకరణ, బస్వాపూర్ రిజర్వాయర్కు నిధులు కావాలి. యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయాలి. అదేవిధంగా టూరిజం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతాను. – అనిల్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే , భువనగిరి భూసేకరణకు నిధుల కొరత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్రోడ్డు, ఎంఎంటీఎస్, గౌరెల్లి– కొత్తగూడెం జాతీయ రహదారి 330ఏ ల భూ సేకరణ నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ పూర్తి చేస్తే కేంద్రం పనులను చేపడుతుంది. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్రెడ్డి భూసేకరణచేయాలని రాష్ట్రాన్నికోరారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం భూ సేకరణ కు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. బడ్జెట్లో నిధులు కేటాయిస్తే ఈ ప్రాజెక్టులు ముందుకు కదిలే అవకాశం ఉంది. -
లక్ష్యం దిశగా అడుగులు
వంద శాతం వసూలు చేస్తాం వంద శాతం పన్ను వసూలు లక్ష్యం దిశగా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పన్ను చెల్లింపుతో గ్రామాల అభివృద్ధి కోసం ఏ విధంగా ఉపయోగిస్తారో వివరిస్తున్నాం. మొండి బకాయిదారుల నుంచి కూడా పన్ను వసూలు చేస్తున్నాం. – సునంద. జిల్లా పంచాయతీ అధికారి భువనగిరిటౌన్: జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లోని పంచాయతీ విభాగం పన్నుల వసూళ్లలో దూకుడు ప్రదర్శిస్తోంది. 2024– 25 ఆర్థిక సంవత్సరం పూర్తికి మరో 20 రోజులు మిగిలి ఉంది. ఇప్పటికి దాదాపు 79 శాతం పన్నుల వసూళ్లు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి లక్ష్యానికి చేరుకునేందుకు పన్ను వసూళ్లను ముమ్మరం చేశారు. 11 మండలాల్లో 80శాతానికి పైగా వసూళ్లు జిల్లా వ్యాప్తంగా 17 మండలాలకు 11 మండలాల్లో 80శాతం పైగా పన్ను వసూలు చేశారు. నారాయణపురం మండలం 91శాతం, ఆత్మకూర్లో 88 శాతం, పోచంపల్లిలో 85శాతం వసూలు చేయగా.. బీబీనగర్, ఆలేరు, రామన్నపేట, మోత్కూర్ మండలాలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. పన్ను వసూళ్లలో వెనుకబడ్డ మండలాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి లక్ష్య సాధనకు కృషి చేయాలని అధికారులు, సిబ్బందికి సూచిస్తున్నారు. వెనుకబడ్డ గ్రామాలను గుర్తించి గ్రామాల వారీగా పురోగతి తెలుసుకొని, తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. మార్చి నెలాఖరు నాటికి లక్ష్యాన్ని సాధించేలా పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అవసరమైతే జిల్లాస్థాయి అధికారులు సైతం గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి పన్ను చెల్లిస్తే కలిగే లాభాలను ప్రజలకు వివరిస్తున్నారు. జిల్లాలో 428 గ్రామ పంచాయతీలు ఉండగా 2,03232 నివాసాలు ఉన్నాయి. మండలాల వారీగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (పన్నుల డిమాండ్) ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. జిల్లా మొత్తంలో ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 16,95,85,230 వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రూ. 13,47,30,773 వసూలు చేయగా, రూ. 3,38,49,457 వసూలు చేయాల్సి ఉంది. అంటే ఇంకా 21 శాతం వసూలు చేయాలి. ఫ గ్రామాల్లో 79 శాతం పన్ను వసూళ్లు ఫ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 16,95,85,230 వసూలు చేయాలని లక్ష్యం ఫ ఇప్పటివరకు రూ. 13,47,30,773 వసూలు ఫ స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పంచాయతీ అధికారులు -
ప్రభుత్వ పాఠశాలలకు ‘పీఎం శ్రీ’ వరం
ఒక్కో పాఠశాలకు మంజూరయ్యే నిధులు ఇలా.. 250 మంది విద్యార్థుల లోపు రూ.75వేలు 250 మంది విద్యార్థులకు పైన రూ.1లక్ష సీసీ కెమెరాలకు రూ.50వేలు వార్షిక వేడుకలకు రూ.50వేలు కరాటే శిక్షణకు రూ.30వేలు ఎక్స్ప్లోరల్ విజిట్ ఒక్కో విద్యార్థికి రూ.500 క్షేత్రస్థాయి అధ్యయనం ఒక్కొక్కరికి రూ.500 హరిత కార్యక్రమాలకు. రూ 500 దినపత్రికలకు రూ.12వేలు సమీప పాఠశాలల అధ్యయనం రూ.20వేలు బాలికల చైతన్యానికి రూ.5వేలు సైన్స్ సర్కిల్ ఏర్పాటుకు రూ.15వేలు మ్యాథ్స్ సర్కిల్స్ ఏర్పాటుకు రూ.15వేలు రామన్నపేట : విద్యారంగంలో మార్పులు తీసుకురావడం, మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకంతో అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య, అభ్యసన అనుభవాలను అందిస్తున్నారు. విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించేందుకు విజ్ఞానయాత్రలకు తీసుకెళ్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్నాయి. కాగా.. పీఎం శ్రీ పథకాన్ని కేంద్రం గతేడాది ప్రారంభించింది. మొదటి దశలో ఎంపికై న స్కూళ్లు ఇవీ.. తొలి విడతలో జిల్లానుంచి 17 పాఠశాలలకు చోటు దక్కింది. ఇందులో ఆలేరు, కొలనుపాక, ఆత్మకూరు(ఎం), బస్వాపూర్, బీబీనగర్, చీకటిమామిడి, దండుమల్కాపురం, జూలూరు, రాజాపేట, వెల్లంకి, యాదగిరిగుట్ట (బాలికల) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, గుండాల, ఎం.తుర్కపల్లి, సంస్థాన్నారాయణపురం, భూదాన్పోచంపల్లి మోడల్స్కూ ళ్లు, భువనగిరి బాలుర సాంఘిక సంక్షేమ గురుకులం, చౌటుప్పల బాలికల గురుకుల పాఠశాల ఉన్నాయి. రెండవ విడతలో.. రెండో విడతలో 8 పాఠశాలలు ఎంపికయ్యాయి. వాటిలో కోటమర్తి ఎంపీపీఎస్, ఆలేరులోని బాలికల గురుకులం, భువనగిరిలోని గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మోటకొండూరు మండలం చాడ ఎంపీపీఎస్, మోత్కూరు మండలం పాలడుగు ఎంపీయూపీఎస్, వలిగొండ మండలం ఎం.తుర్కపల్లి ఎంపీయూపీఎస్, మల్లాపూర్ ఎంపీపీఎస్, పోచంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. నిధులను వీటికి ఖర్చు చేస్తారు పథకానికి ఎంపికై న పాఠశాలలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు 60:40 శాతం నిష్పత్తిలో నిధులు మంజూరు చేస్తాయి. ఈ నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రయోగశాలలు, ల్యాబ్లలో పరికరాలను సమకూర్చడం, విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్స్, ఎక్స్ప్లోరర్ విజిట్కు తీసుకు వెళ్లడం, వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన వారితో తరగతులను నిర్వహణ, బాలికల ఆత్మరక్షణకు శిక్షణ ఇప్పించడం, బాలికల సాధికారిత క్లబ్ల ఏర్పాటు చేస్తారు. ఎంపికై న పాఠశాలకు ఐదేళ్ల కాలానికి విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.2కోట్ల వరకు ప్రభుత్వాలు ఖర్చు చేస్తాయి. ఇప్పటి వరకు ఎంపికై న పాఠశాలల ఖాతాల్లో రూ.2.50 కోట్లు జమ అయ్యాయి. ఫ అత్యున్నత ప్రమాణాలతో బోధన ఫ విజ్ఞానం పెంపొందించేందుకు ఫీల్డ్ విజిట్ ఫ రెండు విడతల్లో 25 పాఠశాలల ఎంపిక ఫ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిధులు విడుదల ఎక్స్ప్లోరర్, ఫీల్డ్ విజిట్లతో ఎంతో మేలు కలుగుతుంది ఎక్స్ప్లోరర్ విజిట్లో భాగంగా రామప్ప దేవాలయం, కాకతీయుల కళాతోరణం, లక్నవరం, పాకాల చెరువులను సందర్శించాం. భువనగిరి సమీపంలోని వ్యవసాయక్షేత్రానికికు వెళ్లి పంటల సాగుపై అధ్యయనం చేశాం. తరగతి గదుల్లో బోధనకు, క్షేత్ర పర్యనలు తోడవడం వల్ల వివిధ అంశాలపై అవగాహన పెరిగింది. ఫీల్డ్ విజట్లతో ఎంతో మేలు జరుగుతుంది. – విద్య, పదవ తరగతి విద్యార్థి పాఠశాలల బలోపేతానికి దోహదం ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం గ్రామీణ ప్రాంత పాఠశాలల బలోపేతానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి దోహదపడుతుంది. ఎక్స్ప్లోరర్, ఫీల్డ్ విజిట్ల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన పీఎం శ్రీ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా చూస్తున్నాం. – సురేందర్రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, వెల్లంకి -
రూ. 309 కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదనలు
నల్లగొండ టూటౌన్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మరిన్ని కోర్సులు ప్రవేశపెట్టడానికి, అదనపు భవనాల నిర్మాణం, అధ్యాపకుల నియామకంతో పాటు ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.309.65 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు విద్యాధరరెడ్డి, మృణాళిని, శోభారాణి బృందం బుధవారం ఎంజీయూను సందర్శించి పలు భవనాలను, సదుపాయాలను పరిశీలించారు. పానగల్ క్యాంపస్ను సందర్శించి అక్కడ ఇంజనీరింగ్ కళాశాల, స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు వీసీ తన చాంబర్లో అభివృద్ధి ప్రతిపాదనలను, యూనివర్సిటీ స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఎంఏ గవర్నర్స్ అండ్ పబ్లిక్ పాలసీ, ఎంఏ డెవలప్మెంట్ స్టడీస్, బీఫార్మసీ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వీసీ తెలిపారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తామని ప్రొఫెసర్ల బృందానికి వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, ఓఎస్డీ కొప్పుల అంజిరెడ్డి, డెవలప్మెంట్ డైరెక్టర్ ఆవుల రవి, దోమల రమేష్, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై. ప్రశాంతి, ప్రిన్సిపాల్స్ సుధారాణి, కె. ప్రేమ్సాగర్, హరీష్కుమార్, సీఓఈ ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ ఎంజీయూలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరిన్ని కోర్సులు ఫ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఫ యూనివర్సిటీని సందర్శించిన ఉన్నత విద్యామండలి ప్రొఫెసర్ల బృందం -
బుద్ధవనం నిర్మాణం అద్భుతం
నాగార్జునసాగర్: బుద్ధవనం నిర్మాణం అద్భుతంగా ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని బుధవారం ఆయన కమిన్ సభ్యులతో కలిసి సందర్శించారు. లాంచీలో ప్రయాణించారు. బుద్ధవనంలో బుద్ధుని పాదుకల వద్ద పుష్పాంజలి ఘటించారు. సాగర్ డ్యాం, జలవిద్యుదుత్పాదన కేంద్రం, బుద్ధచరిత వనం, జాతక వనం, స్థూప వనం, మహాస్థూపం, స్థూపం అంతర్భాగంలో గల అష్టబుద్ధులను సందర్శించారు. బుద్ధవనాన్ని ప్రతిఒక్కరు సందర్శించాలని అన్నారు. వీరికి పర్యాటక శాఖ గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశేషానలు వివరించారు. ఆయన వెంట కమిషన్ సభ్యులు కుసురం నీలాదేవి, రాంబాబునాయక్, లక్ష్మీనారాయణ, శంకర్, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, నల్లగొండ జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ పీడీ కోటేశ్వర్రావు, స్థానిక ఎస్ఐ సంపత్గౌడ్, ఆర్ఐ దండ శ్రీనివాస్రెడ్డి, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి బలవన్మరణం
చిట్యాల: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో జరిగింది. బుధవారం ఎస్ఐ ఎన్. ధర్మా తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకాపర్తి గ్రామానికి చెందిన ఆలకుంట్ల రాజు(27) తన భార్య సద్గుణ, ఇద్దరు పిల్లలతో కలిసి కొతకాలంగా హైదరాబాద్లోని బోరబండలో నివాసముంటున్నాడు. అక్కడ డ్రిల్లింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం పెద్దకాపర్తి గ్రామంలో జరిగిన తిరుమలనాథస్వామి కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు కుటుంబంతో కలిసి వచ్చాడు. సోమవారం తిరిగి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వెళ్లాడు. మంగళవారం మళ్లీ పెద్దకాపర్తి గ్రామానికి వచ్చిన రాజు గ్రామంలోని తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రి పది గంటల సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి మృతుడి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. రాజు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని అతడి భార్య సద్గుణ బుధవారం ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
సాగర్ను సందర్శించిన విదేశీ మీడియా ప్రతినిధులు
నాగార్జునసాగర్: విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సహకారంతో హైదరాబాద్లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మీడియా మేనేజ్మెంట్పై ఈ నెల 15వ తేదీ వరకు ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్స్ కార్పొరేషన్(ఐటీఈసీ) వారు వివిధ దేశాల మీడియా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా నేపాల్, శ్రీలంక, గయానా, టాంజానియా, సూరినామ్ తదితర దేశాలకు చెందిన 28 మంది మీడియా ప్రతినిధులు బుధవారం నాగార్జునసాగర్కు వచ్చారు. సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం లాంచీలో నాగార్జుకొండకు వెళ్లి అక్కడ మ్యూజియంను, బుద్ధవనంలోని జాతకవనం, స్థూపపార్కు, తపోవనం తదితర ప్రాంతాలను సందర్శించారు. వీరి వెంట మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. -
కష్టపడ్డారు.. ‘గ్రూప్స్’ సాధించారు
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పలువురు గ్రూప్–2 ఫలితాల్లో సత్తా చాటి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కలకోవ వాసికి 29వ ర్యాంకు మునగాల: గ్రూప్–2 ఫలితాల్లో మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన గుండు లక్ష్మణ్వర్మ రాష్ట్రస్థాయిలో 29వ ర్యాంకు సాధించారు. గతంలో చైన్నెలో ఆదాయ పన్ను శాఖలో పనిచేసిన ఆయన.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు సాధించి కోదాడ ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పుడు గ్రూప్–2 ఫలితాల్లో 29వ ర్యాంకు సాధించాడు. ఇటుకులపహాడ్ వాసికి 60వ ర్యాంకు శాలిగౌరారం: మండలంలోని ఇటుకులపహాడ్ గ్రామానికి చెందిన రచ్చ శ్రీనివాస్–తిరుమలేశ్వరి దంపతుల కుమారుడు రచ్చ పవన్కుమార్ గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 60వ ర్యాంకు సాధించాడు. గతంలో టీసీఎస్ కంపెనీలో రూ.3.40లక్షల వార్షిక ప్యాకేజీతో సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేసిన అతడు గత డిసెంబర్లో ప్రకటించిన గ్రూప్–4 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించి పీఏపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగం చేస్తూనే గ్రూప్స్కు ప్రిపేరైన పవన్కుమార్ ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో 434 మార్కులు సాధించగా.. గ్రూప్–2లో 60వ ర్యాంకు సాధించారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఆన్లైన్, యూట్యూబ్లో క్లాస్లు విని ప్రిపేరయ్యాని, సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని పవన్కుమార్ పేర్కొన్నారు. 80వ ర్యాంకు సాధించిన డిండి మండల వాసి.. డిండి: డిండి మండలం రుద్రాయగుడెం గ్రామానికి చెందిన పోనుగోటి వినయ్రావు గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 80వ ర్యాంకు సాధించారు. వినోద్రావుకు ప్రభుత్వ ఉధ్యోగం రావడం పట్ల గ్రామస్తులు అభినందనలు తెలిపారు. 135వ ర్యాంక్ సాధించిన రాజశేఖర్రెడ్డి హుజూర్నగర్ (చింతలపాలెం): చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన గంగిరెడ్డి రాజశేఖర్రెడ్డి గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 135వ ర్యాంకు సాధించారు. ఆయన 2018లో సివిల్ కానిస్టేబుల్గా ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్లోని జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన పెద్ద తమ్ముడు గోవిందరెడ్డి 2020లో అంబర్పేట్లోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఎస్ఐగా, చిన్న తమ్ముడు విజయ్భాస్కర్రెడ్డి హైదరాబాద్లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కీతవారిగూడెం వాసికి 301వ ర్యాంకు.. గరిడేపల్లి: గ్రూప్–2ఫలితాల్లో గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన గుండు అనిల్కుమార్ రాష్ట్రస్థాయిలో 301వ ర్యాంకు సాధించాడు. అనిల్కుమార్ ప్రస్తుతం పులిచింతల పవర్హౌజ్లో జేఏఓగా పనిచేస్తున్నాడు. తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శనం, స్నేహితుల సహాయమే కారణమని ఆయన పేర్కొన్నారు. బురుగులతండా వాసికి 512వ ర్యాంకు.. నేరేడుచర్ల: నేరేడుచర్ల మండలం బురుగులతండాకు చెందిన మాలోతు తేజ మంగళవారం వెలువడిన గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జనరల్ కేటగిరీలో 512 ర్యాంకు.. ఎస్టీ కేటగిరీలో 20వ ర్యాంకు సాధించాడు. మారుమూల గిరిజన తండాకు చెందిన తేజ గతంలో రైల్వే శాఖలో రెండు ఉద్యోగాలు సాధించాడు. అనంతరం స్టాఫ్ సెలక్షన్ కమిషన్–కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఎంపికై ప్రస్తుతం కేరళలో ఉద్యోగం చేస్తూనే గ్రూప్–2కు ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంకు సాధించాడు. గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపిక గుర్రంపోడు: గుర్రంపోడు మండలం జిన్నాయిచింత గ్రామానికి చెందిన ముడుసు శ్రీకాంత్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి పట్టుదలతో చదివి గ్రూప్–1 ఫలితాల్లో 600 మార్కులకు గాను 475 మార్కులు సాధించాడు. తన ర్యాంకును బట్టి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వస్తుందన్న ఆశాభావాన్ని శ్రీకాంత్ వ్యక్తం చేశారు. ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయన పాఠశాల స్ధాయిలో గురువులు నేర్పిన క్రమశిక్షణతోనే ఈ స్ధాయికి ఎదిగానని చెప్పారు. -
అన్న ప్రసాదానికి రూ.5లక్షల విరాళం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులను నిత్యాన్న ప్రసా దం అందించేందుకు గాను హైదరాబాద్లోని బంజారాహిల్స్కు చెందిన కర్నాటి రమేష్, శ్రీదేవి దంపతులు రూ.5లక్షల విరాళం ప్రకటించారు. బుధవారం స్వామి వారిని దర్శించుకున్న రమేష్, శ్రీదేవి దంపతులు ఈఓ భాస్కర్రావును కలిసి రూ.5లక్షల చెక్కు అందజేశారు. రామన్నపేటలో ఆరు రైళ్లను ఆపాలి ఫ భువనగిరి ఎంపీ కిరణ్కుమార్రెడ్డి రామన్నపేట: ఐదేళ్ల క్రితం కరోనా లాక్డౌన్ సమయంలో రామన్నపేట రైల్వే స్టేషన్లో ఆగకుండా రద్దు చేసిన ఆరు రైళ్లను తిరిగి ఆపాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి లోక్సభలో ప్రస్తావించారు. బుధవారం లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. రామన్నపేట మండలంలో యాభై వేలకు పైగా జనాభా నివసిస్తున్నారని, ఇక్కడ డిగ్రీ కళాశాల, కమ్యూనిటీ హెల్త్సెంటర్, సబ్ కోర్టుతో పాటు అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని, ఇక్కడ రైల్వే స్టేషన్ ద్వారా నిత్యం రైళ్లను ఆశ్రయిస్తుంటారని ప్రస్తావించారు. ప్రజల సౌకర్యార్ధం రామన్నపేట రైల్వే స్టేషన్లో నారాయణాద్రి, ఫలక్నుమా, చైన్నె, శబరి, డెల్టా ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు కాచిగూడ–మిర్యాలగూడ మధ్య నడిచే డెమో రైళ్లను ఆపాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరారు. హైనా దాడిలో లేగ దూడ మృతిచండూరు (గట్టుప్పల్): హైనా దాడి చేయడంతో లేగ దూడ మృతిచెందింది. ఈ ఘటన గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. అంతంపేట గ్రామానికి చెందిన భీమనపల్లి యాదయ్య తన వ్యవసాయ భూమిలో వేసిన కొట్టంలో మంగళవారం రాత్రి లేగ దూడతో పాటు మరికొన్ని మూగజీవాలను కట్టేసి రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం కొట్టం వద్దకు వచ్చి చూసేసరికి లేగ దూడ మృతిచెంది కనిపించింది. హైనా దాడి చేయడంతో లేగ దూడ మృతిచెందిందని బాధిత రైతు పేర్కొన్నాడు. ఘటన జరిగిన ప్రాంతం గుట్టకు దగ్గరగా ఉండటంతో అక్కడ హైనాలు కనిపిస్తుంటాయని రైతులు చెబుతున్నారు. ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యనకిరేకల్: నకిరేకల్ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో బుధవారం మధ్యాహ్నం ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లికి చెందిన ఉరే సతీష్కు సూర్యాపేటకు చెందిన సాయిసుధ(29)తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. సతీష్కు ఇటీవల కేతేపల్లి మండలంలోని మూసీ గురుకుల పాఠశాలలో పీఈటీగా ఉద్యోగం వచ్చింది. దీంతో సతీష్ తన భార్య సాయిసుధ, కుమార్తె, కుమారుడితో కలిసి రెండు నెలల క్రితం నకిరేకల్లోని డాక్టర్స్ కాలనీలో అద్దె ఇంట్లో దిగారు. రోజుమాదిరిగా బుధవారం కూడా సతీష్ పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం 3గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. పై అంతస్తులో ఉంటున్న తన పోర్షన్లోకి వెళ్లి తలుపు తీసేసరికి తన భార్య సాయిసుధ గదిలోని వెంటిలేటర్కు చీరతో ఉరేసుకుని కనిపించింది. వెంటనే సతీష్ తన అత్తమామలకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి సాయిసుధ మతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
రిటైర్డ్ ఉద్యోగిని బ్లాక్మెయిల్ చేసి..
మిర్యాలగూడ అర్బన్: అటవీశాఖ రిటైర్డ్ ఉద్యోగిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు నిందితులను మిర్యాలగూడ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి(సాగర్) మండలం గట్టుమీదితండాకు చెందిన ఆంగోతు గణేష్, ఎల్లాపురం తండాకు చెందిన కుర్ర శంకర్ వరసకు బావబావర్దులు. గణేష్కు మిర్యాలగూడకు చెందిన అటవీశాఖ రిటైర్డ్ ఉద్యోగి పరిచయమయ్యాడు. సదరు రిటైర్డ్ ఉద్యోగి వృద్ధాప్యంలో తనకు కేర్ టేకర్గా గణేష్కు పెట్టుకున్నాడు. అయితే రిటైర్డ్ ఉద్యోగి వద్ద ఉన్న డబ్బులను కాజేయాలని గణేష్ పథకం రచించాడు. ఎలాగైనా అతడి పరువుకు నష్టం కలిగించి బెదిరించి డబ్బులు గుంజాలని గణేష్ అనుకున్నాడు. 2022 జూన్ 11న అటవీశాఖ రిటైర్డ్ ఉద్యోగి, గణేష్ పని నిమిత్తం సూర్యాపేటకు వెళ్లారు. పథకం ప్రకారం రిటైర్డ్ ఉద్యోగికి గణేష్ ఎక్కువగా మద్యం తాగించాడు. అతడు స్పృహతప్పిన తర్వాత గుర్తుతెలియని మహిళకు డబ్బు ఆశచూపి సదరు రిటైర్డ్ ఉద్యోగితో ఆమెను కలిపి అసభ్యంగా ఫొటోలు, వీడియోలు తీశాడు. కొద్దిరోజుల తర్వాత ఆ ఫొటోలు వీడియోలు రిటైర్డ్ ఉద్యోగికి పంపిన గణేష్ డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో 2022 నుంచి 2024 వరకు 19 ప్రామిసరీ నోట్లపై సంతకాలు పెట్టించుకున్నాడు. ఆ ప్రామిసరీ నోట్లను రిటైర్డ్ ఉద్యోగి కుమార్తె, అల్లుడికి చూపించి అసలు వడ్డీతో కలిసి రూ.46 లక్షలు తీసుకున్నాడు. గణేష్కు అతడి భార్య, బావమరిదికి శంకర్ సహకరించడంతో మళ్లీ బ్లాక్మెయిల్ చేయసాగాడు. దీంతో బాధితుడు రూ.2.55లక్షలు ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. అయినా వారి వేధింపులు ఆగకపోవడంతో చివరకు కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. దీంతో బాధితుడి కుటుం సభ్యులు మిర్యాలగూడ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం గణేష్, అతడి బావమరిది శంకర్ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారు, 4.5 తులాల బంగారం (ముత్తూట్ ఫైనాన్స్లో ఉంది), స్మార్ట్ఫోన్, 10 ఒరిజనల్ ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. గణేష్పై విజయపురి టౌన్, తిరుమలగిరి(సాగర్), వాడపల్లి పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు ఉన్నాయని, పదేపదే నేరాలకు పాల్పడుతున్న అతడిపై రౌడీషీట్ తెరుస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ టూటౌన్ సీఐ నాగార్జున, ఎస్ఐలు డి. హరీష్రెడ్డి, బి. రాంబాబు, కానిస్టేబుళ్లు పి. బాలకృష్ట, కళ్యాణ్, అక్బర్, రామకృష్ణ, రమేష్నాయక్, సూర తదితరులు పాల్గొన్నారు. ఫ డబ్బులు వసూలు చేసిన ఇద్దరు నిందితుల అరెస్ట్ -
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
దేవరకొండ: రెండు తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరితో పాటు వారికి సహకరిస్తున్న మరో వ్యక్తిని దేవరకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను దేవరకొండ ఏఎస్పీ మౌనిక బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్ జాఫర్ అలియాస్ అహ్మద్, అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ మోసీన్ అపార్ట్మెంట్లను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతుంటారు. వీరిద్దరు ఎంత దూరమైనా స్కూటీపై ప్రయాణం చేస్తూ చోరీలు చేస్తుంటారు. దేవరకొండ పట్టణంలోని మీనాక్షి ప్లాజా అపార్ట్మెంట్లో నివాసముంటున్న శీలా వాసు గత నెల 19న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వెళ్లారు. అప్పటికే దేవరకొండ పట్టణానికి వచ్చిన షేక్ అబ్దుల్ జాఫర్, మహ్మద్ మోసీన్ కలిసి వాసు ఇంటికి తాళాలు వేసి ఉండడాన్ని గమనించి తాళాలు పగులగొట్టి 20 తులాల బంగారం, రూ.10వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాలతో కేసును ఛాలెంజ్గా తీసుకున్న దేవరకొండ పోలీసులు ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించారు. ఈ నెల 11న షేక్ అబ్దుల్ జాఫర్, మహ్మద్ మోసీన్ మళ్లీ దేవరకొండకు బస్సులో వచ్చారు. వారు అనుమానాస్పదంగా కన్పించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని ఏఎస్పీ తెలిపారు. వీరిద్దరు ఏపీలోని విశాఖపట్నం, కర్నూల్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. వీరు దొంగిలించిన బంగారాన్ని పాతబస్తీకి చెందిన మహ్మద్ ఫసికి అప్పగిస్తారని.. ఆ బంగారాన్ని విక్రయించగా వచ్చిన నగదును పంచుకుంటారని ఏఎస్పీ తెలిపారు. వారి నుంచి 20 తులాల బంగారం స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. జాఫర్పై 70 కేసులున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన దేవరకొండ సీఐ నర్సింహులు, ఎస్లు అజ్మీరా రమేష్, నారాయణరెడ్డి, కోటేష్, కానిస్టేబుళ్లు హేమునాయక్, తిరుపతి, చాంద్పాషా, సతీష్, అంజి, ఇమ్రాన్, సోమ్లా, సింహాద్రిని ఏఎస్పీ అభినందించారు. ఫ 20 తులాల బంగారం స్వాధీనం ఫ వివరాలు వెల్లడించిన దేవరకొండ ఏఎస్పీ మౌనిక -
న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగింది
రామగిరి(నల్లగొండ): ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పుతో ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసిన దర్శనం నర్సింహను కమిషన్ సభ్యులు నల్లగొండ కలెక్టరేట్లో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. ప్రణయ్ హత్య కేసులో ప్రాసిక్యూటర్, పోలీసులు సమష్టిగా పనిచేసి తీర్పు రావడండలో కీలకంగా వ్యవహరించారన్నారు. ఈ కేసులో దోషులు కరడుకట్టిన నేర చరిత్ర ఉన్నవారు ఉన్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్కు రక్షణను కొనసాగించాలని పోలీసులకు సూచించారు. ఈ తీర్పుతో బలహీన వర్గాలకు న్యాయవ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతందనే నమ్మకం వచ్చిందన్నారు. ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా ప్రాసిక్యూషన్ కొనసాగిందని అభినందించారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాంబాబు, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ పాల్గొన్నారు. ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఫ ప్రణయ్ హత్య కేసు వాదించిన పీపీ దర్శనం నర్సింహకు సన్మానం -
గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్ట్
సూర్యాపేటటౌన్: గంజాయి తరలిస్తున్న ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నర్సింహ విలేకరులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు చెందిన మల్లెడ వెంకటవంశీ, గోకులముడి ఆనంద్ ఆంధ్రా, ఒడిశా సరిహద్దు నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న చిన్న పాకెట్ల రూపంలో మార్చి హైదరాబాద్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరిద్దరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలానికి చెందిన చొరగుడి తేజతో కలిసి విజయవాడ నుంచి హైదరాబాద్కు బస్సులో గంజాయి తరలిస్తూ.. మార్గమధ్యలో కోదాడ శివారులోని దుర్గాపురం ఎక్స్ రోడ్డు వద్ద బస్సు దిగి రోడ్డు పక్కన మామిడి తోటలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు చెందిన ఉమ్మడిశెట్టి సంపత్ కుమార్, హేమన్ నర్సింహ సాయి, పాలపర్తి కృష్ణచైతన్య, నాగ వీరభాస్కర్రావుకు గంజాయి ఇస్తుండగా.. పక్కా సమాచారం మేరకు సోమవారం కోదాడ టౌన్ ఎస్ఐ సైదులు తన సిబ్బందితో వెళ్లి వారిని పట్టుకున్నారు. చొరగుడి తేజ, సంపత్ కుమార్, కృష్ణచైతన్య, నాగ వీరభాస్కర్రావు, హేమన్ నర్సింహ సాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. మల్లెడ వెంకట వంశీ, గోకులముడి ఆనంద్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. పరారీలో ఉన్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు. నిందితుల నుంచి 9.860 కిలోల గంజాయి, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వర్రావు, కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ పరారీలో మరో ఇద్దరు ఫ 9.860 కిలోల గంజాయి స్వాధీనం -
పోలీస్ స్టేషన్లో యువకుడి ఆత్మహత్యాయత్నం
తుంగతుర్తి: కేసు విచారణ నిమిత్తం స్టేషన్కు రావాలని పోలీసులు ఫోన్ చేయడంతో భయపడిన యువకుడు పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి జరిగింది. స్థానిక ఎస్ఐ రుద్రకాంత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి నాగయ్యకు అడ్డగూడూరు మండలం లక్ష్మిదేవికాల్వ గ్రామానికి చెందిన యువతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా.. నాగయ్య భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో భార్యను కాపురానికి రమ్మని పిలవడానికి సోమవారం నాగయ్య అత్తవారి ఇంటికి వెళ్లగా.. మాటామాట పెరిగి ఘర్షణ జరిగింది. దీంతో అత్తింటివారు అతడిపై చేయి చేసుకున్నారు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అడ్డగూడూరు పోలీస్ స్టేషన్కు రావాలని పోలీసులు ఫోన్ చేయడంతో భయపడి నాగయ్య తుంగతుర్తి పోలీస్ స్టేషన్కు చేరుకొని ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడికి తుంగతుర్తి ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. నాగయ్య ఆరోగ్యం కుదుటపడ్డాక పోలీస్ స్టేషన్కు రావాలని.. భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇస్తామని ఎస్ఐ తెలిపారు. -
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
మిర్యాలగూడ: మిర్యాలగూడ మండలం నందిపాడు, రవీందర్నగర్లోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ శాఖ సీఐ ఎస్కే గౌస్ మాట్లాడుతూ.. లక్ష్మీవెంకటేశ్వర ఫర్టిలైజర్స్, మిర్యాలగూడ రైతు ఆగ్రో సేవా కేంద్రంలో దాడులు నిర్వహించి కాలం చెల్లిన మందులను గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు దుకాణ యజమానులపై కేసు నమోదు చేశామన్నారు. నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహిస్తున్నామన్నారు. కొంతమంది రైతులను సైతం విచారించినట్లు తెలిపారు. ఆయన వెంట కానిస్టేబుల్ నర్సింహారెడ్డి, ఏఓ ధీరావత్ సైదానాయక్, ఏఈఓ షఫీ తదితరులు ఉన్నారు. -
గ్రూప్–2లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లావాసులు
మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రానికి చెందిన గుర్రం మోహన్రెడ్డి, స్వరాజ్యం దంపతుల కుమారుడు గుర్రం సాయికృష్ణారెడ్డి మంగళవారం ప్రకటరించిన గ్రూప్–2 ఫలితాల్లో 600 మార్కులకు గాను 422.91 మార్కులు సాధించి స్టేట్ 11వ ర్యాంకు సాధించాడు. గతంలో ప్రకటించిన గ్రూప్–4 ఫలితాల్లో జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా డు. సాయికృష్ణారెడ్డి చెల్లె సాయిసుప్రియ కూడా గ్రూప్–4లో మంచి ర్యాంకు సాధించి మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో వార్డ్ ఆఫీసర్గా పనిచేస్తోంది. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి గ్రూ ప్–2 ఉద్యోగానికి ఎంపికై న సాయికృష్ణారెడ్డిని గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అభినందించారు. సిరిపురం యువకుడికి రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకు రామన్నపేట: మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన సిలువేరు సత్తయ్య–మంగమ్మ దంపతుల చిన్న కుమారుడు సిలువేరు సురేష్ మంగళవారం గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకు సాధించాడు. సురేష్ 600 మార్కులకు గాను 411.865 మార్కులు సాధించాడు. బీటెక్ చదివిన సురేష్ మూడునెలల క్రితం గ్రూప్–4లో ఉత్తీర్ణుడై జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. అన్నదమ్ముల హవా.. పెన్పహాడ్: గ్రూప్–2 ఫలితాల్లో పెన్పహాడ్ మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన శ్రీరామ్ మధు రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు, అతడి తమ్ముడు శ్రీరామ్ నవీన్ 326వ ర్యాంకు సాధించారు. మధు 2014లో వీఆర్వోగా ఎంపికై ఇటీవల ప్రభుత్వం కల్పించిన పదోన్నతుల్లో అనంతగిరి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి తమ్ముడు నవీన్ 2020లో పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ గ్రూప్–2 పరీక్షలకు సన్నద్ధమై ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఉత్తమ ర్యాంకులు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 141వ ర్యాంకు సాధించిన వెలిదండ వాసిగరిడేపల్లి: మండల పరిధిలోని వెలిదండ గ్రామానికి చెందిన అనంత సుమన్ గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 141వ ర్యాంకు సాధించారు. 600 మార్కులకు గాను 387.75 మార్కులతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సుమన్ 2019 డీఎస్సీలో ఓపెన్ కేటగిరీలో ఎస్జీటీ ఉద్యోగాన్ని సాధించారు. వికారాబాద్ జిల్లా పోటుపల్లి మండలం నాగసానిపల్లిలో ఎస్జీటీగా పనిచేస్తూనే గ్రూప్–2 పరీక్ష రాసి 141వ ర్యాంకును సాధించాడు. సుమన్ను గ్రామస్తులు అభినందించారు. 130వ ర్యాంకు సాధించిన నాగులపాటి అన్నారం వాసిపెన్పహాడ్: మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన నాగార్జున గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 130వ ర్యాంకు సాధించారు. ఎంకాం పూర్తిచేసిన ప్రభుత్వ ఉద్యోగం సాధించిన నాగార్జునను గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అభినందించారు. గ్రూప్–1ఉద్యోగానికి ఎంపికైన గూడపూర్ యువకుడు నల్లగొండ టూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో మునుగోడు మండలం గూడపూర్ గ్రామానికి చెందిన నన్నూరు వెంకట్రామ్రెడ్డి, మంజుల దంపతుల కుమారుడు నన్నూరి మనోజ్కుమార్రెడ్డి 517 మార్కులు సాధించి టాప్ టెన్లో ఒకడిగా నిలిచాడు. టాప్ టెన్లో నిలిచిన మనోజ్కుమార్రెడ్డికి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం లభించే అవకాశం ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఏవియేషన్పై అవగాహన ఉండాలి
కోదాడ : విద్యార్థులకు ఏవియేషన్పై అవగాహన ఉండాలని, రానున్న రోజుల్లో ఏవియేషన్కు ఉజ్వల భవిష్యత్ ఉందని కోదాడకు చెందిన ఏవియేషన్ పైలెట్ ఉయ్యాల ఖ్యాతి అన్నారు. మంగళవారం కోదాడలోని తేజ టాలెంట్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తాను ఏవియేషన్లో శిక్షణ తీసుకొని 19 సంవత్సరాలకే పూర్తి స్థాయి పైలెట్గా మారానని తెలిపారు. దీని కోసం అవసరమైన ఏడురకాల లైసెన్స్లను పొందానని పేర్కొన్నారు. అమెరికా ఏవియేషన్లో తాను శిక్షణ పొందినట్లు తెలిపారు. బాలికలు కూడా ఈ రంగంలో రాణించవచ్చన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక సభ్యు డు జాఫర్, పాఠశాల డైరెక్టర్ జానకిరామయ్య, ప్రిన్సిపాల్ అప్పారావు, సోమానాయక్, రేణుక, సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత డిండి: ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని మంగళవారం సివిల్ సప్లయ్ అధికారులు పట్టుకున్నారు. దేవరకొండ డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లయ్(డీటీసీఎస్) హన్మంతు శ్రీనివాస్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన బోయిని రమేష్ రేషన్ లబ్ధిదారుల నుంచి ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యం కొనుగోలు చేసి తన ఇంట్లో నిల్వ ఉంచాడు. పక్కా సమాచారం మేరకు సివిల్ సప్లయ్ అధికారులు రమేష్ ఇంటిపై దాడి చేసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని స్థానిక రేషన్ డీలర్కు అప్పజెప్పామని డీటీసీఎస్ పేర్కొన్నారు. ఈ మేరకు రమేష్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతిమిర్యాలగూడ: గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం దామరచర్ల మండలం కొండ్రపోల్ పరిధిలో జరిగింది. వాడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండ్రపోల్కు చెందిన కుంకునూరి నర్సింహారావు(70) మంగళవారం ఉదయం వాకింగ్ నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ పరిధిలోని నార్కట్పల్లి–అద్దంకి రహదారి వెంట వాకింగ్ చేస్తుండగా.. మిర్యాలగూడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింహారావు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వాహనం ఆచూకీ కోసం రెండు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతినకిరేకల్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని వినాయక బంకెట్ హాల్ సమీపంలో షేక్ సయ్యద్(17) అనే యువకుడు తన తల్లి, అక్కతో కలిసి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. సయ్యద్ లావుగా ఉండటంతో రోజూ వ్యాయామం, వాకింగ్ చేస్తున్నాడు. అయితే సోమవారం రాత్రి షేక్ సయ్యద్ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి కాళ్లపై దెబ్బలు ఉండటంతో కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నకిరేకల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన జిల్లా వెంకటయ్య(54) ఈ నెల 8వ తేదీన బైక్పై నకిరేకల్కు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో తాటికల్ ఫ్లైఓవర్ వద్ద గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటయ్యను నల్లగొండ పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. -
చెత్తకుప్పలో ఆడ శిశువు మృతదేహం లభ్యం
యాదగిరిగుట్ట: చెత్తకుప్పలో ఆడ శిశువు మృతదేహం లభించింది. ఈ ఘటన యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన ఉన్న చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. మంగళవారం సాయంత్రం అటువైపు వెళ్తున్న వ్యక్తులు శిశువును గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూసేసరికి శిశువు మృతిచెందిందని పట్టణ సీఐ రమేష్ తెలిపారు. శిశువు మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. సమీపంలోని ఆస్పత్రుల్లో ప్రసవించిన వారి వివరాలను సేకరిస్తున్నామని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పురుగుల మందు తాగి కూలీ ఆత్మహత్యనకిరేకల్: ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన జటంగి లింగయ్య(45) నకిరేకల్కు వచ్చి కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న లింగయ్య సోమవారం రాత్రి స్థానిక వ్యవసాయ మార్కెట్ సమీపంలో పురుగుల మందు తాగాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి లింగయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు ధనుష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. ఫలితాలు వాయిదా వేయాలని ధర్నా నల్లగొండ టౌన్ : రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్–1, 2, 3, హాస్టల్ వెల్ఫేర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను వాయిదా వేయాలని కలెక్టరేట్ ఎదుట మంగళశారం ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఫలితాలు ప్రకటించడం వల్ల ఎస్సీ ఉప కులాలకు అన్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఇరిగి శ్రీశైలం, బోడ సునీల్, బకరం శ్రీనివాస్, గాదె రమేష్ పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైరు చోరీమునగాల: మండల కేంద్రం శివారులో గల ఎల్–33 ఎత్తిపోతల పథకం రెండవ స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైరును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. చోరీ జరిగినట్లు మంగళవారం గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. చోరీకి గురైన కాపర్ వైరు విలువ సుమారు రూ.4లక్షలకు పైగా ఉంటుందని తెలిసింది. -
కస్తాల శ్రవణ్ కుటుంబానికి అండగా ఉంటాం
హుజూర్నగర్: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కాంగ్రెస్ యువ నాయకుడు, హుజూర్నగర్ మున్సి పాలిటీ మాజీ కౌన్సిలర్ కస్తాల శ్రవణ్కుమార్ కుటంబానికి అండగా ఉంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్నగర్కు వచ్చిన మంత్రి శ్రవణ్కుమార్ ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయంపై పార్టీ జెండా కప్పి, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రవణ్కుమార్ కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి మాట్లాడారు. శ్రవణ్కుమార్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ కోసం పని చేశారని, మంచి వ్యక్తిత్వం కలిగిన ఆయన మనకు దూరం కావడం చాలా బాధాకరమని అన్నారు. శ్రవణ్కుమార్ కుటుంబానికి తనతో పాటు పార్టీ కూడా అండగా ఉంటుందని, వారి పిల్లల చదువుల ఖర్చుల బాధ్యత కూడా తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ నాయకులు తన్నీరు మల్లిఖార్జున్, యరగాని నాగన్న, సాముల శివారెడ్డి, దొంతగాని శ్రీనివాస్, కోతి సంపత్రెడ్డి, శివరాం యాదవ్, ఉపేందర్ తదితరులు ఉన్నారు. పాడె మోసిన మందకృష్ణ మాదిగ.. శ్రవణ్కుమార్ అంతిమ యాత్రలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొని పాడె మోశారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ నాయకులు చింతిర్యాల నాగయ్య, బాలచంద్రుడు, ఎం. వెంకటేశ్వర్లు, ఎం. శ్యాంసుందర్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా సీపీఐ నాయకులు యల్లావుల రాములు, గుండు వెంకటేశ్వర్లు, జడ శ్రీనివాస్, యల్లావుల రమేష్, సోమగాని కష్ణ, జక్కుల రమణ, సీపీఎం నాయకులు పల్లె వెంకట రెడ్డి, దుగ్గి బ్రహ్మం, వట్టెపు సైదులు, పి. హుస్సేన్, ఇందిరాల త్రివేణి, వీరస్వామి, వెంకటనారాయణ, ఓయూ జేఏసీ నాయకులు తదితరులు శ్రవణ్కుమార్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఫ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
తెలుగు శాఖకు విరాళం అందజేత
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో తెలుగు విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చే విద్యార్థులకు బంగారు పతకం అందించేందుకు గాను రిటైర్డ్ ప్రొఫెసర్లు ఇంద్రసేనారెడ్డి, ఎం. ఇంద్రారెడ్డి, కె. సత్యనారాయణరెడ్డి, కె. లింగారెడ్డి, కె. విజయేందర్రెడ్డి రూ.3లక్షల చెక్కును మంగళవారం యూనివర్సిటీలో వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్కు అందజేశారు. అదేవిధంగా ప్రతి ఏటా స్మారక ఉపన్యాసానికి మరో రూ.6లక్షల విరాళం అందించారు. ఈ విరాళాలను బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ప్రతి సంవత్సరం బంగారు పతకం, స్మారక ఉపన్యాసం కోసం వెచ్చిస్తామని వైస్ చాన్స్లర్ తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, రిటైర్ట్ రిజిస్ట్రార్ నరేందర్రెడ్డి, ప్రొఫెసర్లు అంజిరెడ్డి, ఆకుల రవి, డాక్టర్ ఉపేందర్రెడ్డి, డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి, డాక్టర్ హరీష్కుమార్ పాల్గొన్నారు. -
ఉన్నత విద్యా ప్రమాణాలు పాటించాలి
నల్లగొండ టూటౌన్: విద్యాసంస్థలు ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తూ ముందుకుసాగాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీయూలో మంగళవారం నిర్వహించిన బీఈడీ కళాశాలల అకడమిక్ సమావేశంలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బీఈడీ కళాశాలల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలకు విద్యా ప్రమాణాలు మెరుగుపరచుటకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల హాజరుకు సంబంధించి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వై. ప్రశాంతి, డిప్యూటీ డైరెక్టర్ జయంతి, అమరేందర్, వివిధ బీఈడీ కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. ఫ మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో గవర్నర్
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కొనసాగుతున్న శ్రీస్వామి అమ్మవార్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్టా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.శ్రీస్వామిని దర్శించుకున్న గవర్నర్కు ముఖ మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ భాస్కర్రావు.. శ్రీస్వామి వారి లడ్డూ ప్రసాదంతో పాటు శ్రీనృసింహస్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్తర మాడవీధిలోని యాగశాలలో నిర్వహించిన మహా పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఆయన వెంట కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి తదితరులున్నారు. యాదగిరి క్షేత్రంలో వైభవంగా శ్రీచక్ర తీర్థంయాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమానుసారం కొనసాగుతున్నాయి. ఆలయంలో సోమవారం ఉదయం నిత్యపూజలు చేసిన ఆచార్యులు ప్రథమ ప్రాకారంలోని ఉత్తర దిశలో ఏర్పాటు చేసిన యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం శ్రీచక్ర ఆళ్వారుడికి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి, ఆలయ మాడ వీధుల్లో ఊరేగించి విష్ణు పుష్కరిణిలో శ్రీచక్ర తీర్థ స్నానం చేపట్టారు.ఈ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. రాత్రి ఆలయంలో శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను ఆగమశాస్త్రం ప్రకారం జరిపించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో ఉదయం అష్టిత్తర శతఘటాభిõÙకం రాత్రి శృంగార డోలోత్సవం నిర్వహిస్తారు. శృంగార డోలోత్సవంతో 11 రోజుల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. -
పంటలు ఎండిపోకుండా చూడండి : కలెక్టర్
సాక్షి,యాదాద్రి : పంటలు ఎండిపోకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగునీటిపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడెక్కడ పంటలు ఎండిపోతున్నాయో గుర్తించి అక్కడ ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలకు తావుండొద్దు సాక్షి,యాదాద్రి : అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ఆర్డీఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం అయ్యారు. లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, శేఖర్రెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్ తదితరులు పాల్గొన్నారు. నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలిరామన్నపేట : పదవ తరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా సిద్ధం కావాలని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ విద్యార్థులకు సూచించారు. సోమవారం జనంపల్లి బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు సూ చనలు చేశారు. ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలన్నారు. అనంతరం సుమధుర ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టే నిర్మాణాల కోసం స్థలాలను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. ఆతరువాత ఇస్కిళ్ల గ్రామంలో గుండా సత్తయ్య మెమోరియల్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. ఆయనవెంట ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ లాల్బహదూర్, డీఈ యూసుఫ్, ప్రిన్సిపాల్ ఎస్. రాజా, సుమధుర ఫౌండేషన్ ప్రతినిధులు జీవన, అశ్రిత, ఉపాధ్యాయులు ఉన్నారు. -
ఆరున్నరేళ్లకు.. అంతిమతీర్పు
పకడ్బందీగా దర్యాప్తు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రణయ్ హత్య కేసును పోలీసు యంత్రాంగం పకడ్బందీగా దర్యాప్తు చేసింది. కేసు విచారణ, పక్కాగా సాక్ష్యాల సేకరణ, వాటి అథెంటికేషన్ విషయంలో అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో పోలీసు బృందాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాయి. తమిళనాడులో శంకరన్ హత్య కేసు తరహాలో ప్రణయ్ హత్య కేసు విచారణ జరిగింది. తమిళనాడులో కులాంతర వివాహం చేసుకున్న శంకరన్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. అక్కడ ఆయన హత్యకు గురయ్యాడు. ఆ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తమిళనాడు పోలీసులు నిందితులకు కఠిన శిక్ష పడేలా పక్కాగా విచారణ జరిపారు. అందుకే ప్రణయ్ హత్య తరువాత అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో పోలీసు అధికారుల బృందం అక్కడికి వెళ్లి ఆ కేసును కూడా పరిశీలించింది. ప్రణయ్ హత్య కేసులోనూ నిందితులు తప్పించుకోకుండా, సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా, సాంకేతిక పద్ధతుల్లో వాటిని భద్రపరిచారు. ముఖ్యంగా హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, బ్లడ్ శాంపిల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్ల్లో పరీక్ష చేయించారు. అంతేకాదు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రణయ్ హత్యకు ముందు నిందితులు ఏయే ప్రాంతాల్లో సంచరించారు.. ఎవరెవరు కలుసుకొని ప్లాన్ చేశారు.. అనే వివరాలు సేకరించి అన్ని ఆధారాలను కోర్టులో సమర్పించారు. ఈ కేసులో ఎలాంటి అవకతవకలకు, అనుమానాలకు తావులేకుండా నేరం రుజువయ్యేలా సేకరించిన అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. తద్వారానే సుభాష్ కుమార్ శర్మకు అప్పట్లో బెయిల్ రాలేదు. కేసు విచారణ తుది తీర్పులో సుభాష్ శర్మకు ఉరి శిక్ష, మిగిలిన వాళ్లకు జీవిత ఖైదు పడిందని, తద్వారా బాధితులకు సత్వర న్యాయం జరిగిందని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రణయ్ హత్య కేసులో కరుడుగట్టిన నేరస్తుడు అజ్గర్ అలీఫ ప్రధాన పాత్రధారి అబ్దుల్బారి ఫ సుభాష్కుమార్ శర్మను తీసుకొచ్చింది బారీనే ఫ 1,600 పేజీల్లో చార్జిషీట్ రూపొందించి కోర్టులో సమర్పించిన పోలీసులు -
నేత్రపర్వంగా మహాపూర్ణాహుతి, పుష్పయాగం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరాయి. సోమవారం మహాపూర్ణాహుతి, శ్రీచక్రతీర్థం, పుష్పయాగం, దేవతలకు వీడ్కోలు పర్వాలను నేత్రపర్వంగా చేపట్టారు. ఉదయం యాగశాలలో నిర్వహించిన మహా పూర్ణాహుతి వేడుక సందర్భంగా.. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన దేవతలను సుగంధద్రవ్యాలతో ఆరాధించి, పట్టు వస్త్రాలతో ఆవాహన చేసి నెయ్యితో అగ్ని భగవానుడికి సమర్పించారు. విశ్వశాంతి కోసం మహా పూర్ణాహుతి నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ఈ వేడుకలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని పూజలు నిర్వహించారు. కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీచక్రతీర్థం : మహావిష్ణువు ఆయుధమైన శ్రీచక్ర ఆళ్వారుడికి మధ్యాహ్నం ఒంటి గంటకు పూజలు చేసిన అనంతరం విష్ణు పుష్కరిణిలో శ్రీచక్రతీర్థం వేడుక వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను.. శ్రీచక్ర ఆళ్వారునికి అలంకరించి ప్రత్యేక పల్ల కిపై అధిష్టింపజేసి పూజలు చేశారు. ఆ తరువాత ఆలయ మాడ వీధుల్లో ఊరేగిస్తూ విష్ణు పుష్కరిణికి వేంచేసి శ్రీచక్రస్నానం వేడుక పూర్తి చేశారు. దేవతలకు వీడ్కోలు సాయంత్రం నిత్యరాధనల అనంతరం దేవతోద్వాసన, శ్రీపుష్పయాగం, దోపు ఉత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో దోఽషాలు జరిగితే తొలగించేందుకు ప్రా యశ్చిత్తంగా పుష్పయాగం చేపట్టారు. ఇక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన దేవతలను తిరిగి స్వస్థలానికి పంపించే వేడుక దేవతోద్వాసన అని అర్చకులు పేర్కొన్నారు. శ్రీస్వామి వారికి అత్యంత ప్రీతికరమైన వేడుక దోపు మహోత్సవం.ఫ మహా పూర్ణాహుతిలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఫ తుది అంకానికి చేరిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు -
ప్రదక్షిణలే.. పరిష్కారమేదీ?
ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం 282 అర్జీలు పెండింగ్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో 2024 జూన్ 10నుంచి 2025 జనవరి 16వ తేదీ వరకు 900 అర్జీలు వచ్చాయి. ఇందులో 618 పరిష్కారానికి నోచుకోగా ఇంకా 282 అర్జీలు వివిధ కారణాలతో పెండింగ్ ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 102 దరఖాస్తులు భువనగిరి ఆర్డీఓ, 27 మోటకొండూరు, 20 యాదగిరిగుట్ట, 15 గుండాల పరిధిలో ఉన్నాయి. ఫ వివిధ కారణాలతో కాలయాపన ఫ పదేపదే కలెక్టరేట్ మెట్లు ఎక్కుతున్న బాధితులు ఫ భూ సమస్యలు, రేషన్ కార్డులు, ఇళ్లు, పింఛన్ల కోసం ఎక్కువగా విన్నపాలు సాక్షి, యాదాద్రి : ‘అడ్డగూడూరు మండలం చిర్రగూడూరుకు చెందిన నిమ్మల రాముకు మూడేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. కుడికాలు, కుడిచేయి చచ్చు పడ్డాయి. పింఛన్కోసం రెండేళ్ల క్రితం కలెక్టరేట్కు వచ్చి ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నాడు. మంజూరు కాకపోవడంతో ఆ తరువాత పలుమార్లు వినతులు అందజేశాడు. సోమవారం కూడా స్వగ్రామం నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్కు భార్య, తండ్రితో కలిసి వచ్చి వినతిపత్రం అందజేశాడు. 60 ఏళ్లుగా తమ వ్యవసాయ బావుల వద్దకు ఉన్న బాటను కొందరు వ్యక్తులు ఆక్రమించారని, న్యాయం చేయాలని వలిగొండ మండలం వెల్వర్తి గ్రామానికి చెందిన ఐలమ్మ, సుగుణమ్మలు ప్రజావాణిలో కొంతకాలం క్రితం వినతులు అందజేశారు. రెవెన్యూ అధికారులను పంపి సమస్యను పరిష్కరిస్తామని అప్పట్లో ఉన్నతాధికారి వారితో చెప్పారు. ఆతరువాత ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో మరోసారి ప్రజావాణికి వచ్చి అర్జీలు అందజేశారు. ఇలా.. ఒక సమస్యతో వచ్చిన వారే పదేపదే తిరిగి వస్తూ విన్నవించుకుంటున్నారు. వినతిపత్రాలు తీసుకునే సమయంలో అధికారులు హామీలైతే ఇస్తున్నారు. కానీ, సమస్య అలాగే ఉండిపోతోంది. కలెక్టరేట్కు ప్రదక్షిణలు చేయడమే తప్ప.. సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ చాలా మంది బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా విన్నపాల్లో అధికంగా భూసమస్యలు, రేషన్కార్డులు, ఇళ్లు, పింఛన్లకు సంబంధించినవే ఉంటున్నాయి. నెల రోజుల తరువాత ప్రజావాణి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో నిలిచిపోయిన ప్రజావాణి తిరిగి సోమవారం ప్రారంభమైంది. నెల రోజుల తరువాత ప్రజావాణి కార్యక్రమాన్ని పునరుద్ధరించడంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి విన్నపాలు అందజేశారు. మొత్తం 60 అర్జీలు రాగా అందులో 40 వినతులు భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. ఐదు గ్రామీణాభివృద్ధి, 4 మున్సిపల్, 2 చేనేత, 2 పంచాయతీరాజ్కు సంబంధించినవి ఉన్నాయి. మత్స్య, వ్యవసాయ, శిశు సంక్షేమం, మార్కెటింగ్, విద్యుత్, వైద్యశాఖకు సంబంధించిన వినతులు ఒక్కోటి చ వచ్చాయి. అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్, జెడ్పీ సీఈఓ శోభారాణి తదితరులు వినతులు స్వీకరించారు. సోమవారం వచ్చిన వినతుల్లో కొన్ని.. ● రోడ్డు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. 30 ఫీట్ల రోడ్డును 10 ఫీట్ల మేర ఆక్రమించారని, దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. వెంటనే విచారణ జరిపించి న్యాయం చేయాలని విన్నవించారు. ● గుండాల మండలానికి దేవాదుల నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని కోరుతూ వె ల్మజాల గ్రామానికి చెందిన రాజయ్య వేడుకున్నారు. తా ను ఐదు ఎకరాల్లో వరి సాగు చేశానని, రూ.లక్షల వరకు పెట్టుబడి పెట్టానని, భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు సరిగా పోయడం లేదన్నారు. దీంతో ఇప్పటికే కొంత పొలం ఎండి పోయిందన్నారు. గుండాల మండలంలో చాలా మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని, దేవాదుల నుంచి గోదావరి జలాలను విడుదల చేస్తే తప్ప.. పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదన్నారు. అలాగే ఎండిన పంటలు ఎకరానికి రూ.25వేల చొప్పున పరిహారం చెల్లించాలని విన్నవించారు. బోర్లు ఎండిపోతున్నాయి.. ఇసుక రవాణాను అడ్డుకోండి రాజాపేట మండలం రేణికుంట, బేగంపేట వాగుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, వెంటనే అడ్డుకోవాలని ఆయా గ్రామాలకు చెందిన రైతులు, నాయకులు ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఇసుక తరలించడం వల్ల వాగు పరీవాహకంలో బోర్లు ఎండిపోతున్నాయని, నీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకునేందుకువెళ్లిన రైతులపై దాడి చేస్తున్నారని పే ర్కొన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి స్పందిస్తూ ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, సీసీ రోడ్లకు మాత్రమే ఇసుక రవాణాకు పర్మిషన్ ఉందని, ఇసుక రవాణాను అడ్డుకోవాలని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు. -
వైద్య విద్యార్థులకు సామాజిక దృక్పథం ఉండాలి
బీబీనగర్: వైద్య వృత్తి చాలా ప్రధానమైనదని, వైద్య విద్యార్థులు సామాజిక దృక్పథంతో ఉంటూ రోగుల పట్ల ప్రేమను కలిగి ఉండాలని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్, పద్మభూషన్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్రెడ్డి సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో సోమవారం రాత్రి నిర్వహించిన వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిమ్స్లోని విద్యార్థులకు చాలా చక్కటి భవిష్యత్త్ ఉందన్నారు. వరల్డ్లోనే బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాల బెస్ట్గా నిలుస్తుందన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నాయన్నారు. ఐదేళ్లలోనే అబ్బురపరిచే విధంగా భవనాల నిర్మాణాలు జరగడం సంతోషదాయకమని అన్నారు. రోగులతో సాన్నిహిత్యం కలిగి ఉండాలని సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ బాటియా మాట్లాడుతూ.. ఎయిమ్స్లోని ఔట్పేషెంట్ విభాగం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 11లక్షల మంది వైద్య సేవలు పొందారని, 34రకాల వైద్య విభాగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం ఎయిమ్స్ పురోగతిపై ముద్రించిన మ్యాగ్జిన్ను డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ఆవిష్కరించడంతో పాటు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జలలీమ్, రాహుల్నారంగ్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్రెడ్డి -
గ్రూప్–1 ఉద్యోగాలకు ముగ్గురు అర్హత
తిరుమలగిరి(నాగార్జునసాగర్): రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–1 మెయిన్స్ ప్రొవిజినల్ మార్కులు సోమవారం విడుదల చేయగా.. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం బోయగూడెం గ్రామానికి చెందిన మందడి నాగార్జునరెడ్డి, అల్లి కీర్తన ఉద్యోగాలకు అర్హత సాధించారు. మందడి నాగార్జునరెడ్డి 2006 డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతూనే గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యారు. 2011లో అసిస్టెంట్ ట్రైబేల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఎంపికై కొద్దికాలం పనిచేసిన తర్వాత అదే ఏడాదిలో విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. నాగార్జునరెడ్డి ప్రస్తుతం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ తహసీల్దార్గా కొనసాగుతూనే గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యి 488 మార్కులతో అర్హత సాధించారు. మొదటి ప్రయత్నంలోనే విజయం..బోయగూడెం గ్రామానికే చెందిన అల్లి నాగమణి, పెద్దిరాజు దంపతుల కుమార్తె అల్లి కీర్తన మొదటి ప్రయత్నంలోనే తన కలను సాకారం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్–4 ఫలితాల్లో ఆమె జూనియర్ అసిస్టెంట్గా ఎంపికై ంది. గ్రూప్–1 ఉద్యోగానికి 468.5 మార్కులతో అర్హత సాధించింది. గుండెపురి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండెపురి పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న భూక్య సందీప్ 468.5 మార్కులతో గ్రూప్–1కు అర్హత సాధించారు. -
విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని కల్గిఉండేలా తీర్చిదిద్దాలి
సూర్యాపేట: తల్లిదండ్రులు తమ పిల్లలు చిన్నప్పటి నుంచే ఒక లక్ష్యం కలిగి ఉండేలా తీర్చిదిద్దాలి. హైస్కూల్ విద్య నుంచే తమ కుటంబ నేపథ్యం, వారి స్థాయిని పిల్లలకు తెలిసేలా చేయాలి. సమాజంలో ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి. లక్ష్యం మీదనే ఫోకస్ చేసేలా, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండేలా చూడాలి. వివిధ రంగాల్లో ప్రావీణ్యం సాధించే వారు ఏవిధంగా సెల్ఫోన్, టీవీలకు దూరంగా ఉంటున్నారో వివరించాలి. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. – తల్లమల్ల హుస్సేన్, పూర్వపు ప్రభుత్వ న్యాయవాది, సూర్యాపేట -
జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహించాలి
నల్లగొండ టౌన్ : తల్లిదండ్రులు పిల్ల ల ప్రేమను ప్రోత్సహించొద్దు. ముందుగా తమ పిల్లలను సక్రమంగా చదువుకుని జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహించాలి. ఒకవేళ ప్రేమ వివాహం చేసుకున్నా చంపడం, దాడులు చేయడం, కేసులపాలు కావడం మంచి పద్ధతి కాదు. ప్రతిష్టకు పోయి వారి భవిష్యత్ను నాశనం చేసుకోవద్దు. సామరస్యంగా రెండు కుటుంబాలు కలిసి సమస్య పరిష్కరించుకుంటే మంచిది. పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని వారిని సరైన మార్గంలో పయనించేలా దిశా నిర్దేశం చేయాలి. వారి ప్రవర్తనలో మార్పు వస్తే వెంటనే గమనించి వారు సరైన రీతిలో ఉండేలా తల్లిదండ్రులు సూచనలు చేయాలి. – డాక్టర్ సుబ్బారావు, మానసిక వైద్య నిపుణుడు, నల్లగొండ -
నిరుద్యోగ యువతే టార్గెట్..
సూర్యాపేట టౌన్ : నిరుద్యోగ యువతను టార్గెట్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.లక్షల్లో వసూలు చేసి మోసం చేసిన నకిలీ డీఎస్పీని సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ కేసు వివరాలను ఎస్పీ కె. నర్సింహ విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో నకిలీ డీఎస్పీ అవతారమెత్తాడు. తాను డీఎస్పీ అని చెప్పుకుంటూ పలువురిని పరిచయం చేసుకొని అమాయకులైన నిరుద్యోగ యువతకు పోలీస్, సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తూ బురిడీ కొట్టించాడు. కోదాడలో ఒక అమ్మాయికి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె వద్ద రూ.36లక్షలు వసూలు చేశాడు. అదేవిధంగా ఏపీలోని మార్టూర్కు చెందిన వ్యక్తికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని, గురజాలకు చెందిన మరో వ్యక్తికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని పరారీలో ఉన్నాడు. కోదాడకు చెందిన అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సూర్యాపేట పట్టణ పోలీసులు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీగ్రాండ్ హోటల్ వద్ద శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద రూ.18లక్షల నగదు, ఒక కారు, పోలీస్ యూనిఫాం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుడిపై గతలంలో పలు కేసులు ఉండగా.. 2022లో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చి మళ్లీ అదే పనిచేస్తున్నట్టు ఎస్పీ చెప్పారు. ఈ కేసును ఛేదించిన సూర్యాపేట పట్టణ సీఐ పీవీ రాఘవులు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వర్రావు, డీఎస్పీ రవి, పట్టణ సీఐ పీవీ రాఘవులు పాల్గొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి బురిడీ కొట్టించిన నకిలీ డీఎస్పీ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు -
కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ
తీర్పులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీరు భేష్ ప్రణయ్ హత్య అనంతరం తండ్రి బాలస్వామి మిర్యాలగూడ వన్టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యర్థన మేరకు కేసు వాదించేందుకు దర్శనం నరసింహను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పబ్లిక్ ప్రోసిక్యూటర్ బలమైన సాక్షాధారాలు సేకరించారు. నిందితుల ఫోన్కాల్ డేటా, లోకేషన్, సీసీ టీవి ఫుటేజీలను సేకరించి.. 472 పేజీల లిఖిత పూర్వక రిపోర్టును కోర్టుకు సమర్పించారు.● ఏ2 సుభాష్కుమార్శర్మకు మరణశిక్ష ● ఏ3 నుంచి ఏ8 వరకు ఆరుగురికి జీవితఖైదు ● తీర్పుకోసం భారీగా తరలివచ్చిన ప్రజాసంఘాల నాయకులు ● కన్నీటి పర్యంతమైన నిందితుల కుటుంబీకులు ● కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తురామగిరి(నల్లగొండ): సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో తుదితీర్పు నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి నల్లగొండ కోర్టు వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ కేసు నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు, రెండవ అదనపు జడ్జి ఎన్.రోజారమణి సోమవారం అంతిమ తీర్పు వెల్లడించారు. సెప్టెంబర్ 14, 2018న ప్రణయ్ హత్యకు గురికాగా.. అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ విచారణ జరిపి హత్య కేసులో ప్రమేయం ఉన్న 8 మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ హత్య కేసులో అన్ని సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించారు. నరసింహ వాదనలతో ఏకీభవించిన నల్లగొండ ఎస్సీ, ఎస్టీ రెండవ అనదపు జడ్జి ఎన్.రోజారమణి ఏ2 సుభాష్కుమార్శర్మకు ఉరిశిక్షతో పాటు రూ.15 వేల జరిమానా లేదా 4 నెలల జైలు శిక్ష, మిగిలిన ఆరుగురు ఏ3 అజ్గర్అలీ, ఏ4 మహ్మద్ అబ్దుల్బారీ, ఏ5 అబ్దుల్ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్కుమార్, ఏ7 సముద్రాల శివ, ఏ8 ఎంఏ.నిజాంకు జీవిత ఖైదు రూ.10 వేల జరిమాన లేదా 4 నెలల జైలుశిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ఏ1 నిందితుడు అమృవర్షిణి తండ్రి తిరునగరు మారుతీరావు 2020 మార్చి 8న ఆత్మహత్య చేసుకోగా.. అజ్గర్అలీని అహ్మదాబాద్ సబర్మతి జైలుకు, శుభాష్కుమార్శర్మను చర్లపల్లి జైలుకు తరలించారు. మిగిలిన ఐదుగురు నిందితులకు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నల్లగొండ జిల్లా జైలుకు తరలించారు. ఈ తీర్పుతో ప్రణయ్ కుటుంబ సభ్యులు, పలువురు ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. భారీగా తరలిన వచ్చిన ప్రజా సంఘాలు, ప్రజలు.. ప్రణయ్ హత్య కేసు తీర్పు సోమవారం వెలువడుతుందన్న విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులతో పాటు సామాన్య ప్రజలు నల్లగొండ కోర్టు వద్దకు భారీగా తరలివచ్చారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టినప్పటి నుంచి తీర్పు ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా వేచిచూశారు. నిందితుల కుటుంబాల కన్నీటి పర్యంతం.. హత్య కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురికి శిక్ష పడింది. దీంతో నిందితుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కోర్టు ఆవరణలో తిరునగరు శ్రవణ్కుమార్ కూతురు శృతి బోరున విలపించింది. తన తండ్రికి ఎలాంటి నేరం చేయలేదని అయినప్పటికీ శిక్ష పడిందంటూ కన్నీరు పెట్టుకుంది. వీరితో పాటు మిగతా నిందితుల కుటుంబ సభ్యులు కూడా కోర్టు వద్ద, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో వారితో మాట్లాడుతూ, అనంతరం వాహనంలో తరలిస్తున్న క్రమంలో కన్నీరు పెట్టుకున్నారు. కోర్టు ప్రాంగంలో పోలీసుల భారీ బందోబస్తు.. ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు నేపథ్యంలో నల్లగొండ కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు లోపలికి ఎవరినీ రానివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. న్యాయవాదులు, సిబ్బందిని, కుటుంబ సభ్యులను మాత్రమే కోర్టు లోపలికి అనుమతించారు.