స్వర్ణగిరీశుడికి కల్పవృక్ష వాహన సేవ
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి ఆలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మాడ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. పెరంబుదూర్కు చెందిన శ్రీఎంబార్ రామానుజ జీయర్స్వామి బహ్మ్రోత్సవాలకు హాజరై భక్తులకు మంగళశాసనాలు అందజేశారు. అనంతరం పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రామారావు, అర్చకులు పాల్గొన్నారు.
కల్పవృక్ష వాహన సేవ నిర్వహిస్తున్న అర్చకులు


